breaking news
Delhi
-
రష్యా అధ్యక్షుడు పుతిన్కు ప్రధాని మోదీ ఫోన్.. ఎందుకంటే?
ఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. పుతిన్కు 73వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. భారత్-రష్యా మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు మోదీ మరోసారి పునరుద్ఘాటించారు. భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ను స్వాగతించడానికి ఎదురు చూస్తున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి తాజా పరిణామాలను మోదీకి పుతిన్ వివరించారు. ఈ సమస్యకు శాంతియుత పరిష్కారం కావాలన్న భారత స్థిరమైన వైఖరిని మోదీ గుర్తు చేశారు.పుతిన్ ఈ ఏడాది డిసెంబర్ ఐదారు తేదీలలో భారత్కు వచ్చి.. ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకునే అవకాశం ఉందని సమాచారం. రష్యా చమురు కొనుగోలుపై అమెరికా న్యూఢిల్లీపై శిక్షాత్మక సుంకాలను విధించిన దరిమిలా ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడుతున్న తరుణంలో పుతిన్, ప్రధాని మోదీల భేటీ కీలకంగా మారనుంది. రష్యా అధ్యక్షుడు ఇటీవల చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీని కలుసుకున్న సంగతి తెలిసిందే.మరోవైపు, భారత్తో వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నట్లు అధినేత పుతిన్ ఇటీవల స్పష్టమైన సంకేతాలిచ్చారు. భారత్ నుంచి వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాల దిగుమతులను భారీగా పెంచుకోవాలని, ఇందుకోసం ప్రత్యేక విధానం రూపొందించాలని రష్యా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. రష్యా నుంచి భారత ప్రభుత్వం భారీగా ముడిచమురు కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఇరుదేశాల మధ్య వాణిజ్య లోటు తగ్గిపోయి, వాణిజ్యంలో సమతూకం ఏర్పడేలా చర్యలు తీసుకోవడానికి పుతిన్ సిద్ధమయ్యారు. అందులో భాగంగానే భారత్ నుంచి దిగుమతులు పెంచాలని నిర్ణయించారు. గురువారం(అక్టోబర్ 2) వాల్డాయ్ ప్లీనరీలో పుతిన్ ప్రసంగించారు. ఈ ఏడాది డిసెంబర్లో ఇండియాలో పర్యటించబోతున్నానని, ఇందుకోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. తనకు మంచి మిత్రుడు, విశ్వసనీయ భాగస్వామి నరేంద్ర మోదీతో సమావేశం కాబోతున్నానని వెల్లడించారు.ప్రధాని మోదీపై పుతిన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన సమతూకం కలిగిన, తెలివైన నాయకుడు అని కొనియాడారు. భారతదేశ ప్రయోజనాల కోసం మోదీ నిరంతరం శ్రమిస్తుంటారని వ్యాఖ్యానించారు. మోదీ నేతృత్వంలో జాతీయవాద ప్రభుత్వం చక్కగా పనిచేస్తోందన్నారు. మోదీతో సమావేశమైనప్పుడు తాను ఎంతో సౌకర్యవంతంగా ఉన్నట్లు భావిస్తానని పేర్కొన్నారు. ఉక్రెయిన్కు సహకరించడం మానుకోవాలని అమెరికాను పుతిన్ హెచ్చరించారు. ఉక్రెయిన్కు దీర్ఘశ్రేణి క్షిపణులు సరఫరా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని తేల్చిచెప్పారు. -
ఆ బూటు విసిరింది నేను కాదు.. : రాజేష్ కిషోర్
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్పై షూతో దాడికి ప్రయత్నించిన(Shoe Attack On CJI BR Gavai) అడ్వొకేట్(సస్పెండెడ్) రాజేష్ కిషోర్(71).. నేషనల్ మీడియాలో హైలైట్ అయ్యారు. ఇప్పుడు వరుస బెట్టి మీడియా చానెల్స్కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో తన చర్యను సమర్థించుకుంటున్న ఆయన.. ఆ పని తాను చేయలేదంటూ వింత వాదన చేస్తున్నారు. ‘‘ఆ పని నేను చేయలేదు, దేవుడే చేశాడు. భారత ప్రధాన న్యాయమూర్తి సనాతన ధర్మాన్ని అవమానించారు. ఇది భగవంతుని ఆజ్ఞ, చర్యకు ప్రతిచర్య మాత్రమే’’ అని అంటున్నారు. అదే సమయంలో తనను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సస్పెండ్ చేయడాన్ని రాజేష్ కిషోర్(Rajesh Kishore) తీవ్రంగా తప్పుబడుతున్నారు. తన వాదన వినకుండానే చర్యలు తీసుకున్నారని, ఇది హద్దులు దాటడడమేనని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాపై మండిపడుతున్నారు. సీజేఐ గవాయ్పై షూ విసిరిన ఘటన సోమవారం(అక్టోబర్ 6వ తేదీన) సుప్రీం కోర్టులో కలకలం రేపింది. ఓ కేసు విచారణ జరుగుతున్న సమయంలో రాజేష్కిషోర్ తన షూ తీసి సీజేఐ మీదకు విసిరారు. అయితే షూ ఆయన ముందున్న టేబుల్ మీద పడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే తోటి లాయర్లు రాజేష్ను పట్టుకుని.. సిబ్బందికి అప్పగించారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు మూడు గంటలపాటు రాజేష్ను విచారించి వదిలేశారు. అయితే.. చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ సూచన మేరకు సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ కేసు నమోదుకు ముందుకు రాలేదు. అయితే.. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాత్రం రాజేష్పై తాత్కాలిక సస్పెన్షన్ విధించింది. జరిగిన దానికి 15రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.ఇదీ చదవండి: సీజేఐపై దాడి ఘటన: ప్రధాని మోదీ ఏమన్నారంటే.. -
ముందు హైకోర్టుకు వెళ్లండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టును కాదని నేరుగా తమ వద్దకు రావడాన్ని తప్పుబట్టింది. సరైన న్యాయ ప్రక్రియను పాటించాల్సిందేనంటూ, ముందు హైకోర్టుకు వెళ్లమని సూచించింది. పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు అనుమతించింది. ఇక్కడికి ఎందుకొచ్చారో చెప్పండి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన జీవోపై వంగా గోపాల్రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలి సిందే. కాగా ఈ అంశంపై అత్యవసర విచారణ జరపాలని ఆయన కోరారు. అయితే సోమవారం జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రాజ్యాంగంలోని ఆర్టీకల్ 32 కింద దాఖలు చేసిన రిట్ పిటిషన్ను విచారణకు స్వీకరించాలని కోరారు. ఈ అంశంపై ఇప్పటికే హైకోర్టులో రెండు కేసులు పెండింగ్లో ఉన్నాయని, మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానుండటంతో అత్యవసరంగా విచారించాలని అభ్యరి్థంచారు. ఆయన కేసు వివరాల్లోకి వెళ్ళకముందే, జస్టిస్ విక్రమ్నాథ్ ఆయన్ను అడ్డుకున్నారు. ‘ముందు మీరు ఆర్టీకల్ 32 కింద ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి?’అని సూటిగా ప్రశ్నించారు. అయినప్పటికీ ఆయన ధర్మాసనాన్ని ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయతి్నంచారు. తమ క్లయింట్ను ఇబ్బంది పెట్టేందుకే తెలంగాణ ప్రభుత్వం పని దినాల్లో చివరి రోజైన శుక్రవారం నాడు కీలకమైన సర్క్యులర్ జారీ చేసిందంటూ వాదించారు. తాము అత్యవసర విచారణ కోసం సాయంత్రం 6 గంటలకు హైకోర్టు న్యాయమూర్తి నివాసానికి కూడా వెళ్లా మని, కానీ అక్కడ ఉపశమనం లభించలేదని నివేదించారు. ఇక 9వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, ఇప్పుడు కోర్టు జోక్యం చేసుకోకపోతే తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. దీంతో జస్టిస్ విక్రమ్నాథ్ జోక్యం చేసుకున్నారు. తొలుత ఆ అడ్డంకిని దాటండి ‘ముందు మీరు ఆ అడ్డంకిని దాటండి, ఆ తర్వాతే కేసు యోగ్యతపై (మెరిట్స్) మేము వాదనలు వింటాం’అని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. హైకోర్టులో అనుకూలమైన ఉత్తర్వులు రానంత మాత్రాన, సుప్రీంకోర్టును ప్రత్యామ్నాయంగా వాడుకోవాలని చూడటాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. న్యాయవాదిని ఉద్దేశించి.. ’మీ క్లయింట్లకు మీరు సరైన సలహా ఇచ్చి ఉండాల్సింది..’అని జస్టిస్ విక్రమ్నాథ్ వ్యాఖ్యానించారు. పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టును ఆశ్రయి ంచేందుకు స్వేచ్ఛ ఇచ్చారు.ఈ పరిణామంతో తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు సిద్ధమైన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీకి ఆ అవసరం లేకుండా పోయింది. కాగా సుప్రీం నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వానికి తాత్కాలికంగా ఊరట లభించినట్టయ్యింది. సుప్రీంకోర్టులో పిటిషన్ నేపథ్యంలో సోమవారం ఏం జరుగుతుందో, కోర్టు ఏం చెబుతుందో, స్థానిక ఎన్నికలు జరుగుతాయో లేదో అనే ఉత్కంఠ నెలకొంది. సర్వోన్నత న్యాయస్థానం పిటిషన్ను విచారించేందుకు నిరాకరించడంతో ఇక ఈ నెల 8వ తేదీన హైకోర్టులో జరిగే విచారణ, తీర్పు కీలకంగా మారనుంది. -
కొండ చరియలు.. విరిగిపడుతున్నాయ్!
కొండచరియలు విరిగిపడి పలువురి మృతి.. నిలిచిపోయిన రాకపోకలు.. యాత్రికుల అష్టకష్టాలు.. ఇలాంటి వార్తలు ఇటీవల ఎక్కువగా చూస్తున్నాం. కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనల్లో ప్రాణ, ఆస్తి నష్టం భారీగానే జరుగుతోంది. అందుకే దేశవ్యాప్తంగా ముప్పు ఉండే ప్రాంతాలను గుర్తించడంతోపాటు నష్ట నివారణ చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. – సాక్షి, స్పెషల్ డెస్క్ పశ్చిమ బెంగాల్లోని మిరిక్, డార్జిలింగ్ హిల్స్లో కుండపోత వర్షాలకు కొండచరియలు విరిగిపడి అక్టోబరు 5న 20 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇళ్లు ధ్వంసమయ్యాయి. రహదారులు దెబ్బతిన్నాయి.⇒ ఆగస్టు నెలాఖరులో కురిసిన భారీ వర్షాలకు వైష్ణోదేవీ ఆలయ సమీపంలో కొండ చరియలు విరిగిపడి సుమారు 30 మంది మరణించారు. ⇒ జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్, హిమా చల్ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడితే కొండచరియలు విరిగి పడటం చాలాసహజం. ఆ సమయాల్లో ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతుంటారు. ⇒ 2024 జూలైలో కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు కూలిన ఘటనల్లో ఏకంగా 260కిపైగా చనిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.మ్యాపింగ్ చేసిన జీఎస్ఐకొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ఎతై ్తన కొండ ప్రాంతాలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) దేశవ్యాప్తంగా మ్యాపింగ్ చేసింది. 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 4.3 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ ముప్పు ప్రాంతాలు విస్తరించాయి.ముప్పును బట్టి..కొండచరియలు విరిగిపడే ముప్పు తీవ్రతను బట్టి తక్కువ, మధ్య, అధిక ప్రాంతాలుగా జీఎస్ఐ విభజించింది. ఇందులో 63 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అధిక ప్రమాద జోన్లో ఉందని తేలింది. అలాగే 1,26,000 చ.కి.మీ. మధ్యస్థంగా, 2,45,000 చ.కి.మీ. తక్కువ ప్రమాదం ఉన్న ప్రాంతంగా వెల్లడించింది. హిమాచల్ ప్ర దేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లద్దాఖ్.. అధిక ప్ర మాదాన్ని ఎదుర్కొంటున్న ప్రాంతాలుగా ప్రకటించింది.అధిక స్పష్టతతో..రిమోట్ సెన్సింగ్, క్షేత్రస్థాయి సిబ్బంది ఆధారంగా కొండచరియలు విరిగిపడ్డ 91,000 సంఘటనల సమాచారాన్ని జీఎస్ఐ సేకరించింది. 33,904 ఘటనలను ధ్రువీకరించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి గుర్తించిన 200 కీలక ప్రాంతాల్లో మరింత అధునాతన మీసో–స్కేల్ మ్యాపింగ్కు శ్రీకారం చుట్టింది. వీటిలో ఈ ఏడాది మార్చి నాటికి 160 ప్రాంతాల్లో మ్యాపింగ్ పూర్తిచేసింది. 2028లోగా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తారు. పెళుసైన కొండ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల ప్రణాళిక, జోనింగ్ నిబంధనలు, కమ్యూనిటీ భద్రతకు ఈ అధిక స్పష్టత కలిగిన మ్యాప్స్ ఎంతో ఉపయోగపడతాయి.ముందస్తు హెచ్చరికలుప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కొండచరియల ముప్పు అంచనా సామర్థ్యాలను పెంచుతోంది. వాతావరణ శాఖ, ఇతర సంస్థల సహకారంతో జీఎస్ఐ అభివృద్ధి చేసిన ‘ప్రాంతీయ కొండచరియల అంచనా వ్యవస్థ (ఆర్ఎల్ ఎఫ్ఎస్)’.. వర్షపాతం, వాతావరణ పరిస్థితుల ఆధారంగా ముందస్తు హెచ్చరికలను అందిస్తోంది. జీఎస్ఐ ఈ సంవత్సరం రుతుపవనాలు ప్రారంభం కాగానే ఎనిమిది రాష్ట్రాల్లోని 21 జిల్లాల్లో చేపట్టాల్సిన కార్యాచరణతోపాటు కొండచరియలు విరిగిపడే ముప్పు ఉందని హెచ్చరించింది. ఈ జాబితాలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, కర్ణాటక ఉన్నాయి.దేశంలో కొండచరియల ముప్పు తీవ్రతను బట్టి విస్తీర్ణ శాతంతక్కువ 56మధ్యస్థం 29అధికం 15 -
రెండు దశల్లో బిహార్ ఎన్నికలు
న్యూఢిల్లీ: బిహార్లో అసెంబ్లీ ఎన్నికల రణరంగానికి తెరలేచింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. కేంద్రం ఎన్నికల సంఘం సోమవారం ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్న ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ వెల్లడించారు. ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. మొత్తం 243 స్థానాలకు గాను.. మొదటి దశలో నవంబర్ 6న 121 స్థానాలకు, రెండో దశలో నవంబర్ 11న 122 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు వివరించారు. నవంబర్ 16 నాటికి మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనలో బిహార్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి(ఎంసీసీ) తక్షణమే అమల్లోకి వచి్చంది. నామినేషన్ల ప్రక్రియ మొదటి దశ పోలింగ్కు అక్టోబర్ 17న, రెండో దశ పోలింగ్కు అక్టోబర్ 20న ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో 7.43 కోట్ల మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఎస్ఐఆర్ను ఓటర్ల జాబితా శుద్ధీకరణగా జ్ఞానేశ్ కుమార్ అభివరి్ణంచారు. ఈ ప్రక్రియ ద్వారా దాదాపు 69 లక్షల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్లు చెప్పారు. అయితే, భారత పౌరసత్వం లేనికారణంగా ఎన్ని పేర్లు తొలగించారో ఆయన బయటపెట్టలేదు. మరణాలు, పౌరసత్వం లేకపోవడం, ఇతర రాష్ట్రాలకు శాశ్వతంగా వలస వెళ్లడం వంటి కారణాలతో పేర్లు తొలగించినట్లు స్పష్టంచేశారు. 8 అసెంబ్లీ స్థానాలకు వచ్చేనెల 11న ఉప ఎన్నికలు తెలంగాణ, రాజస్తాన్, పంజాబ్, జార్ఖండ్, ఒడిశా, మిజోరం తదితర రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. నవంబర్ 11న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నట్లు తెలిపింది. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ బిహార్ ఎన్నికలు అన్ని ఎన్నికలకు తల్లిలాంటివని జ్ఞానేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. బిహార్ ఎన్నికల్లో 17 సంస్కరణలు చేపడుతున్నామని, దేశవ్యాప్తంగా వీటిని అమలు చేస్తామని పునరుద్ఘాటించారు. దేశ ఎన్నికల చరిత్రలో బిహార్ ఎన్నికలు అత్యంత పారదర్శకంగా జరిగిన ఎన్నికల్లో ఒకటిగా రికార్డుకెక్కబోతున్నాయని చెప్పారు. ఓటర్ల జాబితా శుద్ధీకరణ విషయంలో మొత్తం దేశానికి బిహార్ ఒక మార్గం చూపిందని అన్నారు. రాజకీయ పారీ్టల విజ్ఞప్తి మేరకు.. బిహార్లో ఈవీఎంల చివరి రెండు రౌండ్ల కౌంటింగ్ కంటే ముందే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తిచేస్తామని వివరించారు. మహిళలు ఓటు వేసే సమయంలో బుర్ఖా లేదా తలపై ముసుగు ధరించవచ్చా? అని ప్రశ్నించగా, ఓటర్ల గుర్తింపును నిర్ధారించే విషయంలో మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేస్తామని జ్ఞానేశ్ కుమార్ బదులిచ్చారు. పోలింగ్ కేంద్రాల వద్ద అంగన్వాడీ కార్యకర్తలు విధుల్లో ఉంటారని, మహిళా ఓటర్ల గుర్తింపును వారు తనిఖీ చేస్తారని వెల్లడించారు. రాష్ట్రంలో 250 పోలింగ్ బూత్ల పరిధిలో పోలీసులు గుర్రాలపై పెట్రోలింగ్ నిర్వహిస్తారని తెలియజేశారు. 197 పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వర్తించే సిబ్బంది పడవలపై అక్కడికి చేరుకుంటారని చెప్పారు. ఎన్నికలకు సిద్ధం కావడం దగ్గర్నుంచి, ఓట్ల లెక్కింపు దాకా.. మొత్తం 17 సంస్కరణలు చేపట్టబోతున్నామని మరోసారి స్పష్టంచేశారు. ఇతర రాష్ట్రాల ఎన్నికల్లోనూ వీటిని అమలు చేస్తామన్నారు. తొలిసారిగా ‘ఈసీఐ నెట్’ ఎన్నికల్లో పారదర్శకతను మరింత పెంచడానికి ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మొట్టమొదటిసారిగా బిహార్ ఎన్నికల్లో ‘ఈసీఐ నెట్’ను ప్రవేశపెడుతోంది. ఎన్నికల సంఘానికి సంబంధించిన 40కిపైగా యాప్లను ఒకే వేదికపైకి తీసుకొస్తూ ఈసీఐ నెట్ను రూపొందించారు. ఇదొక డిజిటల్ ప్లాట్ఫామ్. ఇది ‘మదర్ ఆఫ్ ఆల్ యాప్స్’ అని చెబుతున్నారు. బూత్ లెవెల్ అధికారులు, చీఫ్ ఎలక్టోరల్ అధికారులు సహా ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది దీన్ని వినియోగించుకుంటారు. ఓటర్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్, రిపోర్టింగ్ తదితర పనులు దీనిద్వారా నిర్వహిస్తారు. ఫలితంగా వారిమధ్య సమన్వయం పెరుగుతుంది. ఎన్నికలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది. మొత్తానికి ఎన్నికల నిర్వహణ సులభంగా మారుతుంది. ఓటర్లు కూడా ఈ వేదికను వాడుకోవచ్చు. పోలింగ్ విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే యాప్ ద్వారానే ఫిర్యాదు చేయొచ్చు. కౌంటింగ్ స్టేటస్ తెలుసుకోవచ్చు. తొలుత బిహార్లో.. అనంతరం దేశమంతటా ఈసీఐ నెట్ను అందుబాటులోకి తీసుకురానున్నారు. -
సీజేఐపై దాడికి యత్నం.. ప్రధాని మోదీ ఆగ్రహం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ (CJI Justice BR Gavai)పై దాడి చేసేందుకు ఓ న్యాయవాది యత్నించాడు. ఈ ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. సీజేఐపై దాడికి యత్నించిన ఘటనను మోదీ ఖండించారు. ఈ మేరకు సోమవారం (అక్టోబర్6న) ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ‘భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్తో మాట్లాడాను. ఈ రోజు సుప్రీం కోర్ట్ ప్రాంగణంలో జరిగిన ఘటన ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురిచేసింది. మన సమాజంలో ఇలాంటి దారుణమైన చర్యలకు స్థానం లేదు. ఇది పూర్తిగా ఖండించదగిన చర్య. ఈ పరిస్థితిలో న్యాయమూర్తి గవాయ్ చూపిన శాంత స్వభావాన్ని నేను అభినందిస్తున్నాను. ఇది న్యాయ విలువల పట్ల ఆయన నిబద్ధతను, అలాగే మన రాజ్యాంగాన్ని బలపరిచేందుకు చేసిన ఆయన కృషిని ప్రతిబింబిస్తుంది’ అని పేర్కొన్నారు.Spoke to Chief Justice of India, Justice BR Gavai Ji. The attack on him earlier today in the Supreme Court premises has angered every Indian. There is no place for such reprehensible acts in our society. It is utterly condemnable. I appreciated the calm displayed by Justice…— Narendra Modi (@narendramodi) October 6, 2025 -
సుప్రీంకోర్టులో సీజేఐపై దాడి యత్నం కేసులో కీలక పరిణామం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్పై ఓ లాయర్ దాడికి ప్రయత్నించిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జస్టిస్ బీఆర్ గవాయ్పై దాడికి యత్నించిన లాయర్పై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చర్యలకు ఉపక్రమించింది. రాకేష్ కిషోర్ను విధుల నుంచి బహిష్కరించింది. న్యాయ వ్యవస్థను కాపాడాల్సిన లాయర్.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్పై దాడికి యత్నించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. సోమవవారం (అక్టోబర్6న) సుప్రీంకోర్టులో ఓ కేసుకు సంబంధించిన వాదనలు జరిగే సమయంలో లాయర్ రాకేష్ కిషోర్ జస్టిస్ బీఆర్ గవాయ్పై ‘షూ’ విసిరేసేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో తోటి లాయర్లు అప్రమత్తం కావడంతో కోర్టు భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన బార్ కౌన్సిల్.. న్యాయవాదిగా ప్రవర్తించాల్సిన నైతిక ప్రమాణాలను ఉల్లంఘించినందుకు రాకేష్ కిషోర్ను తక్షణమే సస్పెండ్ చేసింది.‘ఇది న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీసే చర్య. ఇటువంటి ప్రవర్తనను ఏ మాత్రం సహించం’ అని బార్ కౌన్సిల్ ప్రకటనలో పేర్కొంది.ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి.. అవసరమైతే శాశ్వతంగా లాయర్గా ప్రాక్టీస్ చేసే హక్కును రద్దు చేయొచ్చని బార్ కౌన్సిల్ సూచించింది. మరోవైపు, ఢిల్లీ పోలీస్ శాఖ కూడా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. -
బిహార్లో రెండు విడతల్లో ఎన్నికలు
సాక్షి,న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆసక్తిరేపుతోన్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రెండుదశల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఈ రోజు సాయంత్రం (అక్టోబరు 6న) 4 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ బిహార్ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల నవంబర్ 6న తొలిదశ ఎన్నికల పోలింగ్నవంబర్ 11 రెండోదశ ఎన్నికల పోలింగ్నవంబర్ 14న కౌంటింగ్ తొలిదశ ఎన్నికకు ఈ నెల 10న నోటిఫికేషన్ విడుదలబిహార్ అసెంబ్లీ స్థానాలు, ఓటర్ల వివరాలు బిహార్లో 243అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలుమొత్తం ఓటర్లు 7.42కోట్లు జూన్ 24నుంచి ఓటర్ల అభ్యంతరాలను స్వీకరించాంఆగస్టు 1న తుది జాబితా ప్రకటించాంనామినేషన్ల కంటే 10 రోజల ముందు వరకు ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవచ్చుబీహార్లోని 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నవంబర్ 22 నాటికి పూర్తవుతాయి. 22ఏళ్ల తర్వాత బిహార్లో ఓటర్ల జాబితాను పూర్తిస్థాయిలో సంస్కరించాం. 90వేల 712కేంద్రాల్లో ఎన్నికల పోలింగ్ 14లక్షల మంది కొత్త ఓటర్లు100ఏళ్లకు పైబడిన ఓటర్లు మొత్తం 14వేలఎన్నికల్లో 17 సంస్కరణలు బిహార్ ఎన్నికల నుంచి 17 కొత్త సంస్కరణలు తీసుకొచ్చాంప్రతి పోలింగ్ స్టేషన్లో ఓటర్ల సంఖ్యను 1,200కి పరిమితం చేశాంగతంలో నలుపు, తెలుపు రంగులో ఉండే సీరియల్ నంబర్ ఫాంట్ను వినియోగించాం. అభ్యర్థుల ఫోటోలు ఇప్పుడు రంగులో ఉంటాయి. -
సుప్రీంకోర్టు తీర్పు శుభపరిణామం: కాంగ్రెస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట దక్కింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు స్పందిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు శుభపరిణామం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. హైకోర్టులో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..‘సుప్రీంకోర్టు తీర్పు శుభ పరిణామం. 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఆపాలని సుప్రీంకోర్టులో వేసిన కేసును కోర్టు కొట్టి వేయడాన్ని స్వాగతిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో అన్ని రకాలుగా పోరాటాలు చేసి సాధిస్తాం. ఇప్పటికే ప్రభుత్వం మూడు చట్టాలు, ఒక ఆర్డినెన్స్ ఒక జీవో ఇచ్చి బీసీ రిజర్వేషన్లు అమలు చేసేందుకు కృషి చేసింది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్లు రిజర్వేషన్ల అమలు కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. ఎనిమిదో తేదీన హైకోర్టులో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నాము. బీసీలకు రాజకీయంగా 42 శాతం రిజర్వేషన్లు అమలు కోసం అన్ని వర్గాలు ప్రభుత్వానికి సహకరించాలి’ అని కోరారు.మరోవైపు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ..‘ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించాం. ఈ క్రమంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్ కొట్టేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం. రిజర్వేషన్ల కోసం జీవో కూడా విడుదల చేశాం’ అని చెప్పుకొచ్చారు. -
సీజేఐపై దాడికి లాయర్ యత్నం
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సుప్రీంకోర్టులో సోమవారం ఉదయం 11.35 గంటలకు ఓ కేసుపై విచారణ జరుగుతుండగానే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్పై ఓ న్యాయవాది బూటు విసిరేందుకు ప్రయతి్నంచడం తీవ్ర కలకలం సృష్టించింది. కోర్టుగదిలో విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై అడ్డుకోవడంతో ఆ బూటు జస్టిస్ గవాయ్ని తాకలేదు. సీజేఐపై దాడికి ప్రయతి్నంచిన లాయర్ను ఢిల్లీ మయూర్ విహార్కు చెందిన రాకేశ్ కిశోర్(71)గా గుర్తించారు. అతడిని కోర్టు గది నుంచి బలవంతంగా బయటకు తరలించారు. సనాతన ధర్మాన్ని కించపరిస్తే సహించబోనంటూ రాకేశ్ కిశోర్ నినాదాలు చేయడం గమనార్హం. త నపై జరిగిన దాడి యత్నంపై జస్టిస్ గవాయ్ స్పందించారు. ఇలాంటి ఘటనలు తనపై ఏమా త్రం ప్రభావం చూపబోవని తేల్చిచెప్పారు. దాడులకు భయపడే ప్రసక్తే లేదంటూ పరోక్షంగా స్పష్టంచేశా రు. దాడి యత్నం తర్వాత కూడా కేసుల విచారణ ను ఆయన యథాతథంగా కొనసాగించడం విశేషంఅసలేం జరిగింది? సుప్రీంకోర్టులో జస్టిస్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్తో కూడిన ధర్మాసనం వేర్వేరు కేసుపై విచారణ నిర్వహిస్తుండగా, అక్కడే ఉన్న లాయర్ రాకేశ్ కిశోర్ వారిద్దరూ కూర్చున్న వేదిక వద్దకు దూసుకొచ్చాడు. తన కాలికున్న బూటు తీసి న్యాయమూర్తులపైకి విసిరేందుకు ప్రయత్నించాడు. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది మధ్యలోనే అడ్డుకుని బయటకు లాక్కెళ్లారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. విష్ణు దేవుడి విగ్రహంపై వ్యాఖ్యల వివాదం మధ్యప్రదేశ్లోని ఖజురహోలో ఉన్న విష్ణు దేవుడి విగ్రహంపై దాఖలైన పి టిషన్ విషయంలో చేసిన వ్యాఖ్యలే జస్టిస్ గవాయ్పై దాడి యత్నానికి కారణం కావొచ్చని న్యాయవాద వర్గాలు భావిస్తున్నాయి. ఖజురహోలోని జవెరీ టెంపుల్ను మళ్లీ నిర్మించి, ఏడు అడుగుల విష్ణు దేవుడి విగ్రహాన్ని నెలకొల్పేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ జస్టిస్ గవాయ్ తిరస్కరించారు. ‘మీరు ఏం కోరుకుంటున్నారో వెళ్లి ఆ దేవుడినే అడగండి. విష్ణు దేవుడికి మీరు నిజమైన భక్తులైతే అక్కడికే వెళ్లి ప్రారి్థంచండి. కొంతసేపు ధ్యానం కూడా చేయండి’’ అని పిటిషనర్కు సూచించారు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.లాయర్పై సస్పెన్షన్ వేటు సాక్షాత్తూ సీజేఐపైనే బూటు విసిరేందుకు ప్రయత్నించిన లాయర్ రాకేశ్ కిశోర్పై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) తక్షణమే చర్యలు తీసుకుంది. అతడిపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. లెసెన్స్ను రద్దు చేసింది.రాజ్యాంగంపై దాడి: సోనియాజస్టిస్ గవాయ్పై బూటుతో దాడిచేసేందుకు ప్రయతి్నంచడాన్ని కాంగ్రెస్ సీని యర్ నేత సోనియా గాంధీ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన సిగ్గుచేటు, మతిలేని చర్య అని పేర్కొన్నారు. ఇది మన రాజ్యాంగంపై, న్యాయ వ్యవస్థపై దాడేనని వ్యాఖ్యానించారు. విద్వేషం, ఉన్మాదం మన సమాజం చుట్టూ ఆవరించుకొని ఉన్నాయని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మేరకు సోని యా ఒక ప్రకటన విడుదల చేశారు.జస్టిస్ గవాయ్కి ప్రధాని మోదీ ఫోన్ న్యూఢిల్లీ: జస్టిస్ బి.ఆర్.గవాయ్పైకి లాయర్ బూటు విసిరేందుకు ప్రయత్నించడాన్ని ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన ప్రతి ఒక్క భారతీయుడిని ఆగ్రహానికి గురి చేసిందని పేర్కొన్నారు. మన సమాజంలో ఇలాంటి అనుచిత ధోరణులకు స్థానం లేదని తేలి్చచెప్పారు. ఈ మేరకు మోదీ సోమవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. జస్టిస్ గవాయ్తో ఫోన్లో మాట్లాడానని పేర్కొన్నారు. లాయర్ చర్య పట్ల పూర్తి సంయమనం పాటించినందుకు జస్టిస్ గవాయ్ని ప్రశంసించానని వెల్లడించారు. న్యాయ వ్యవస్థ విలువలను, రాజ్యాంగ స్ఫూ ర్తిని బలోపేతం చేయడానికి ఆయన కట్టుబడి ఉన్నట్లు దీన్నిబట్టి స్పష్టమవుతోందని ప్రధాని ఉద్ఘాటించారు. ఇదీ చదవండి: పార్లమెంట్ కాదు.. రాజ్యాంగమే సర్వోన్నతం -
బీసీ రిజర్వేషన్లు.. తెలంగాణ సర్కార్కు సుప్రీంకోర్టులో ఊరట
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో(Supreme Court) ఊరట దక్కింది. తెలంగాణ స్థానిక ఎన్నికల్లో బీసీలకు(Telangana BC Reservations) 42 శాతం రిజర్వేషన్లను సవాల్ చేస్తూ వంగ గోపాల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఈ సందర్భంగా హైకోర్టుకు(Telangana High Court) వెళ్లి తేల్చుకోవాలని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం.. పిటిషనర్కు సూచించింది.తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంలో గోపాల్ రెడ్డి పిటిషన్పై విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించిందన్న పిటిషనర్ తరఫు లాయర్ వివరణ ఇచ్చారు. అనంతరం, ధర్మాసనం రిజర్వేషన్లపై హైకోర్టులో స్టే నిరాకరిస్తే ఇక్కడికి వస్తారా? అని ప్రశ్నించింది. ఈ క్రమంలో హైకోర్టుకే వెళ్లాలని ఆదేశించింది. దీంతో, పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్టు చెప్పడంతో తన పిటిషన్ను వెనక్కి తీసుకునేందుకు పిటిషనర్ తరఫు న్యాయవాది అంగీకరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. అంతకుముందు.. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో-9 అమలుపై స్టే ఇవ్వాలని పిటిషన్లో గోపాల్రెడ్డి విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్నాయని పిటిషన్లో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఇతర రిజర్వేషన్లు అన్నీ కలిపి కూడా 50 శాతం రిజర్వేషన్ దాటవద్దని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ప్రస్తావించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన సీలింగ్ను ఎత్తివేస్తూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఎస్సీలకు15 శాతం రిజర్వేషన్, ఎస్టీలకు 10 శాతం, బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ 42 శాతంతో కలుపుకుంటే మొత్తం రిజర్వేషన్లు 67 శాతం అవుతున్నదని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే జీవో 9ను తక్షణమే రద్దుచేయాలని కోరారు. ఇది ముమ్మాటికీ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285కు విరుద్ధమని పిటిషన్లో తెలిపారు. -
బీసీల రిజర్వేషన్లపై సస్పెన్స్.. ఢిల్లీలో మంత్రుల మంతనాలు
ఢిల్లీ: తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై(Telangana BC Reservations) అంశంపై నేడు సుప్రీంకోర్టులో(Supreme Court) విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఢిల్లీలో మంతనాలు జరుపుతున్నారు. న్యాయవాదులతో చర్చిస్తున్నారు. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు.తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Batti Vikramarka) ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున బీసీ రిజర్వేషన్ల కల్పన కోసం అభిషేక్ మనుసింఘ్వీతో వాదనలు వినిపిస్తాం. బీసీ రిజర్వేషన్ల కల్పనకు సుప్రీంకోర్టు అంగీకరిస్తుందని మాకు నమ్మకం ఉంది. ఇందిరా సహానీ కేసు తీర్పు ఆధారంగా తెలంగాణలో రిజర్వేషన్లు కల్పించవచ్చు. సీపెక్ సర్వే ద్వారా సమగ్రమైన జన గణన వివరాల ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తున్నాం. రిజర్వేషన్ల కల్పన కోసం హైకోర్టు, సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపిస్తుంది’ అని చెప్పుకొచ్చారు.బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) మాట్లాడుతూ..‘బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవద్దు. ఇతరుల రిజర్వేషన్లను మేము లాక్కోవడం లేదు. ఈ అంశంపై సుప్రీంకోర్టులో బలంగా వాదనలు వినిపిస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నదే మా ఉద్దేశం’ అని తెలిపారు. -
బీసీ రిజర్వేషన్లపై ఉత్కంఠ.. నేడు సుప్రీంకోర్టులో విచారణ
ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో(Supreme Court) తెలంగాణ స్థానిక ఎన్నికల్లో(Telangana Elections) బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పిటిషన్పై(BC Reservations) విచారణ జరగనుంది. వంగ గోపాల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ చేపట్టనుంది. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో-9 అమలుపై స్టే ఇవ్వాలని పిటిషన్లో గోపాల్రెడ్డి విజ్ఞప్తి చేశారు. వంగా గోపాల్రెడ్డి పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం విచారించనున్నది. గోపాల్రెడ్డి ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్నాయని పిటిషన్లో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఇతర రిజర్వేషన్లు అన్నీ కలిపి కూడా 50 శాతం రిజర్వేషన్ దాటవద్దని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ప్రస్తావించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన సీలింగ్ను ఎత్తివేస్తూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఎస్సీలకు15 శాతం రిజర్వేషన్, ఎస్టీలకు 10 శాతం, బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ 42 శాతంతో కలుపుకుంటే మొత్తం రిజర్వేషన్లు 67 శాతం అవుతున్నదని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే జీవో 9ను తక్షణమే రద్దుచేయాలని కోరారు. ఇది ముమ్మాటికీ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285కు విరుద్ధమని పిటిషన్లో తెలిపారు.ఇక, ఇప్పటికే హైకోర్టులో అదే అంశంపై పిటిషన్ విచారణలో ఉన్నందున హైకోర్టులో తేల్చుకోండని, అక్కడ తేలకపోతే ఇక్కడికి రావాలని సుప్రీంకోర్టు చెప్తుందా? లేదా ఇంకా ఏమైనా కీలక వ్యాఖ్యలు చేస్తుందా? అనే అంశంపై బీసీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. న్యాయంగా అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందేనని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.మరోవైపు.. ఈ ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు జారీచేసిన జీవోపై సుప్రీంకోర్టులో జరగనున్న విచారణపై ఉత్కంఠ నెలకొంది. ఈ జీవో చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఇటు అధికారులను, అటు పార్టీ నేతలను ఆదేశించారు. -
ఓటీటీ వీక్షకులు @ 60 కోట్లు
సకుటుంబ సపరివార సమేతంగా... టీవీ ముందు కూర్చుంటున్నారు. అది కేబుల్ కనెక్షన్ టీవీ కాదు.. ‘కనెక్టెడ్ టీవీ’. అందులో తమకు నచ్చిన సినిమా లేదా వెబ్ సిరీస్ లేదా షో చూస్తున్నారు. సంప్రదాయ టీవీ చానళ్లలో కాదు.. ఓటీటీ వేదికల్లో. ఇదే ఇప్పుడు ట్రెండ్. ఇది కరోనా తరవాత రికార్డు స్థాయిలో దేశమంతా పాకేసింది. దేశంలో ఓటీటీ చూస్తున్న ప్రేక్షకుల సంఖ్య రికార్డు స్థాయిలో 60 కోట్లకు ఎగబాకిందన్న అంచనాలే ఇందుకు నిదర్శనం. అంటే దేశ జనాభాలో 40 శాతానికిపైగా ఓటీటీలకు అలవాటుపడ్డారన్నమాట.టీవీ కొనాలంటే.. వందసార్లు ఆలోచించడం లేదు. హాల్లోకి సరిపోయే పెద్ద సైజు టీవీని.. అది కూడా స్మార్ట్ టీవీనే కొనేస్తున్నారు. ‘మార్డోర్ ఇంటెలిజెన్స్’ అంచనా ప్రకారం 2025లో దేశీయ స్మార్ట్ టీవీ మార్కెట్ విలువ 22.39 బిలియన్ డాలర్లు. 2023లో ఇది సుమారు 11 బిలియన్ డాలర్లే. స్మార్ట్ టీవీల కొనుగోళ్లు ఎంతలా పెరిగాయో చెప్పడానికి ఈ అంకెలే నిదర్శనం. అంత ఖరీదైన టీవీ కొన్నాక.. సాధారణ కేబుల్ టీవీ ఒక్కటే ఉంటే ఏం బాగుంటుంది? అందుకే, ఏదో ఒకటి లేదా అంతకుమించి ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసేసుకుంటున్నారు. అంతే, ఎంచక్కా ఇక సకుటుంబ సపరివార సమేతంగా సినిమాలు, వెబ్ సిరీస్లు, షోలు చూస్తున్నారు. దేశంలో ఇటీవలి కాలంలో ఈ ధోరణి పెరిగింది.కనెక్టెడ్ టీవీలో..: ఒకప్పుడు కేబుల్ టీవీ ప్రతి ఇంటా సర్వసాధారణంగా ఉండేది. ఇప్పుడు దాని స్థానాన్ని కనెక్టెడ్ టీవీ ఆక్రమిస్తోంది. కనెక్టెడ్ టీవీ అంటే ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యే టీవీ. ఇది మధ్య తరగతి, ఆపై స్థాయి కుటుంబాల్లో సర్వసాధారణం అయిపోయింది. మీడియా కన్సల్టింగ్ సంస్థ ఆర్మాక్స్ మీడియా ‘ఓటీటీ ఆడియన్స్ రిపోర్ట్ 2025’ ప్రకారం.. కనెక్టెడ్ టీవీ వీక్షకుల సంఖ్య 2024లో 6.97 కోట్లు మాత్రమే ఉండేది. 2025లో అది ఏకంగా 12.92 కోట్లకు పెరిగింది. అంటే.. దాదాపు రెట్టింపు అయిందన్నమాట.ఆకట్టుకునే కంటెంట్అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, జియో హాట్స్టార్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో విభిన్నమైన కంటెంట్తో వెబ్సిరీస్లు, సినిమాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కంటెంట్కు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ఆర్మాక్స్ అంచనా ప్రకారం.. దేశంలో ఓటీటీ వీక్షకుల (నెలలో కనీసం ఒక్కసారైనా ఓటీటీ వీడియో చూసినవారు) సంఖ్య 60 కోట్లకుపైనే. 2024తో పోలిస్తే ఇది దాదాపు 10 శాతం ఎక్కువ. దేశ జనాభాలో ఇది 40 శాతానికిపైనే. వీక్షకులు పెరగడంతో ఓటీటీల్లో దేశీయ భాషల్లో వచ్చే వెబ్సిరీస్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ఓటీటీల్లోనే విడుదల చేసే సినిమాలూ పెరుగుతున్నాయి. సెలవు రోజుల్లోనూ... రాత్రుళ్లు భోజన సమయాల్లోనూ కుటుంబ సభ్యులతో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, ఆహా, జీ5, సోనీ లివ్.. ఇలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో నచ్చిన సినిమా లేదా రియాలిటీ షో లేదా వెబ్సిరీస్ చూడటం సర్వసాధారణం అయిపోయింది.దేశంలో ఓటీటీ చందాదారుల సంఖ్య (సుమారుగా)⇒ జియో హాట్స్టార్ 30 కోట్లు⇒ అమెజాన్ ప్రైమ్ 2.8 కోట్లు⇒ నెట్ఫ్లిక్స్ 1.23 కోట్లుఆర్మాక్స్ మీడియా నివేదిక ప్రకారం.. 2025 జనవరి–జూన్ మధ్య ప్రసారమైన ఒరిజినల్స్లో వీక్షకులు అత్యధికంగా చూసినవి వెబ్ సిరీస్లే. వీక్షకుల పరంగా టాప్–50 ఒరిజినల్స్లో 80 శాతం వాటా వెబ్ సిరీస్లు కైవసం చేసుకోవడం విశేషం. ఆ తరవాతి స్థానంలో సినిమాలు, రియాలిటీ షోలు ఉన్నాయి. -
సన్ రైజ్ సెక్టార్గా మత్స్య రంగం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తూ, ’సన్రైజ్ సెక్టార్’గా మత్స్య రంగం శరవేగంగా అభివద్ధి చెందుతోందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 3 కోట్ల మందికి జీవనోపాధి కల్పిస్తూ, ప్రపంచ చేపల ఉత్పత్తిలో 8% వాటాతో భారత్ రెండో అతిపెద్ద దేశంగా నిలిచింది. 2015 నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యల ఫలితంగా ఈ రంగంలోకి రూ. 38,572 కోట్ల పెట్టుబడులు రాగా, 2023– 24లో మత్స్య ఉత్పత్తుల ఎగుమతులు రికార్డు స్థాయిలో రూ.60,524 కోట్లకు చేరాయి. ఏటా 8.74% వృద్ధి రేటుతో దూసుకెళ్తున్న ఈ రంగంలో సుస్థిర అభివద్ధిని సాధించేందుకు కేంద్రం నడుం బిగించింది. ఈ వృద్ధిని మరింత వేగవంతం చేసి, క్షేత్రస్థాయిలో మత్స్యకారులు, రైతులను భాగస్వాములను చేసేందుకు కేంద్ర మత్స్యశాఖ ఒక బహత్తర కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. కేంద్ర మత్స్యశాఖ కార్యదర్శి డాక్టర్ అభిలక్ష్ లిఖి నేతృత్వంలో 2025 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల పాటు దేశవ్యాప్తంగా వర్చువల్ సమావేశాలు నిర్వహించారు. 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 15,000 మందికి పైగా మత్స్యకారులు, ఆక్వా రైతులు, పరిశ్రమల ప్రతినిధులు ఇందులో పాల్గొని తమ అభిప్రాయాలను, సవాళ్లను నేరుగా ప్రభుత్వానికి నివేదించారు.క్షేత్రస్థాయిలో అందిన కీలక సూచనలుసమావేశాల్లో మత్స్యకారులు తమ కు అవసరమైన మద్దతుపై స్పష్టమైన సూచనలు చేశారు. నాణ్యమైన చేప పిల్లలు, తక్కువ ధరకే మేత, కోల్డ్ స్టోరే జీలు, రవాణా సౌకర్యాలు మెరుగుపర చాలని కోరారు. డ్రోన్లు, శాటిలైట్ టెక్నా లజీ వంటి ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తేవాలని, ప్రభుత్వం ఉచి తంగా అందించిన ట్రాన్స్పాండర్లు తమ భద్రతకు ఎంతగానో ఉపయోగపడుతు న్నాయని హర్షం వ్యక్తం చేశారు. ప్రత్యేక మార్కెట్లు, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని, సముద్రపు నాచు, అలంకార చేపల పెంపకం వంటి ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలను ప్రోత్సహించాలని కోరారు.రైతు కేంద్రంగానే మా విధానాలు: డాక్టర్ అభిలక్ష్ లిఖిఈ సందర్భంగా డాక్టర్ అభిలక్ష్ లిఖి మాట్లాడుతూ, ’మత్స్యకారులు, విధాన రూపకర్తల మధ్య ఈ సమావేశాలు బలమైన వారధిని నిర్మించాయి. క్షేత్రస్థాయి నుంచి అందిన ఈ సూచనలు ’వికసిత భారత్ 2047’లక్ష్యానికి అనుగుణంగా మా భవిష్యత్ ప్రణాళికలకు దిక్సూచిగా నిలుస్తాయి. ఈ రంగంలో వృద్ధి సమ్మిళితంగా, రైతు కేంద్రంగా ఉండేలా చూస్తాం’అని తెలిపారు. మొత్తంగా, భారీ పెట్టుబడులతో పాటు క్షేత్రస్థాయి భాగస్వామ్యంతో మత్స్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ ప్రణాళికతో ముందుకు సాగుతోంది. -
ప్రిలిమినరీ తర్వాత తాత్కాలిక జవాబు కీ
న్యూఢిల్లీ: ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన తర్వాత తాత్కాలిక జవాబు కీని ప్రచురించాలని నిర్ణయించినట్లు యూనియన్ పబ్లిక్ సరీ్వస్ కమిషన్.. సుప్రీంకోర్టుకు తెలియజేసింది. గత నెలలో అత్యున్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన అఫిడవిట్లో.. తుది ఫలితాల ప్రకటన తర్వాతే తుది జవాబు కీని ప్రచురిస్తామని కమిషన్ తెలిపింది. ఈ అఫిడవిట్ను సివిల్ సరీ్వసెస్ పరీక్షకు సంబంధించి.. పెండింగ్లో ఉన్న పిటిషన్లో దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో ఉన్న సమయంలో, కోర్టు నియమించిన అమికస్ క్యూరీ సూచనతో సహా వివిధ అంశాలపై తాము చర్చించామని యూపీఎస్సీ పేర్కొంది. ‘సమగ్ర చర్చల అనంతరం.. బాగా ఆలోచించాక ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన తర్వాత తాత్కాలిక జవాబు కీని ప్రచురించాలని కమిషన్ నిర్ణయించింది.. అని అడ్వకేట్ వర్ధమాన్ కౌశిక్ ద్వారా దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొంది. పరీక్షకు హాజరైన అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు లేదా ప్రాతినిధ్యాలు కోరతామని అందులో వివరించింది. అభ్యర్థులు తెలిపే ప్రతి అభ్యంతరం లేదా ప్రాతినిధ్యానికి మూడు ప్రామాణిక ఆధారాలను జత చేయాలని, అలా జత చేయని అభ్యంతరాలను ప్రారంభ దశలోనే తిరస్కరించాలని అఫిడవిట్లో తెలిపారు. ‘అయితే, సమర్పించిన ఆధారాలు ప్రామాణికమైనవా? కాదా? అనేది కమిషనే నిర్ణయిస్తుంది’.. అని కూడా అందులో స్పష్టం చేశారు. -
అందరూ కాలేరు జన నాయక్లు
న్యూఢిల్లీ: విజ్ఞానం, నైపుణ్యాలకు మన దేశంలో లోటు లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. మేధో సంపత్తి మన విలువైన ఆస్తి అని ఉద్ఘాటించారు. విజ్ఞానం, నైపుణ్యాలను దేశ ప్రగతికి ఉపయోగించుకోవాలని చెప్పారు. 21వ శతాబ్దంలో స్థానిక నైపుణ్యాలు, వనరులు, ప్రతిభ, విజ్ఞానానికి డిమాండ్ నానాటికీ పెరుగుతోందని అన్నారు. శనివారం రూ.62,000 కోట్లకుపైగా విలువైన యువత కేంద్రీకృత కార్యక్రమాలను ప్రధాని మోదీ ఢిల్లీలో వర్చువల్గా ప్రారంభించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బిహార్కు అనుసంధానమైన పథకాలు ఇందులో ఉన్నాయి. అలాగే రూ.60,000 కోట్లతో అమలు చేసే కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత ‘పీఎం–సేతు’ పథకానికి శ్రీకారం చుట్టారు. బిహార్ రాష్ట్రానికి సంబంధించిన మరికొన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 1,000 ప్రభుత్వ ఐటీఐలను హబ్ అండ్ స్పోక్ మోడల్గా అభివృద్ధి చేయబోతున్నారు. బిహార్లో జన నాయక్ కర్పూరీ ఠాకూర్ స్కిల్ యూనివర్సిటీని సైతం మోదీ ప్రారంభించారు. బిహార్లో రా్రïÙ్టయ జనతాదళ్(ఆర్జేడీ) ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విద్యావ్యవస్థ దిగజారిందని, వలసలు పెరిగిపోయాయని మండిపడ్డారు. నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మెరుగుపడిందని, రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని ప్రశంసించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాం«దీని ఆ పార్టీ కార్యకర్తలు ‘జన నాయక్’ అని పిలుస్తుండడాన్ని ప్రధానమంత్రి తప్పుపట్టారు. ఓబీసీ నేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ మాత్రమే ‘జన నాయక్’ అని తేల్చిచెప్పారు. ఆ గౌరవాన్ని దొంగిలించే కుట్రలు జరుగుతున్నాయని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని బిహార్ ప్రజలకు పిలుపునిచ్చారు. అందరూ జన నాయకులు కాలేరని రాహుల్ను ఎద్దేవా చేశారు. ఐటీఐలపై ప్రత్యేక దృష్టి ‘‘పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)లు పారిశ్రామిక విద్యకు అత్యంత కీలకం. ఇవి ఆత్మనిర్భర్ భారత్కు వర్క్షాప్లుగా పని చేస్తున్నాయి. ఐటీఐల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. 2014 వరకు దేశంలో 10,000 ఐటీఐలు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 15,000కు చేరుకుంది. పారిశ్రామిక నైపుణ్య అవసరాలను తీర్చేలా, రాబోయే పదేళ్లలో డిమాండ్ను తట్టుకొనేలా ఐటీఐ నెట్వర్క్ ఇప్పటినుంచే సన్నద్ధం కావాలి’’ అని ప్రధాని మోదీ సూచించారు. ప్రతి గ్రామంలోనూ పాఠశాల ‘‘బిహార్ పురోభివృద్ధి కోసం నితీశ్ కుమార్ ప్రభుత్వం ఎంతగానో శ్రమిస్తోంది. యువతకు గత 20 ఏళ్లలో ఇచ్చిన ఉద్యోగాల కంటే రాబోయే ఐదేళ్లలో అంతకు రెట్టింపు ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించింది. వేర్లకు చెదలు పట్టి ఎండిపోయిన చెట్టును బతికించడం కష్టం. ఇతర పార్టీల పాలనలో బిహార్ పరిస్థితి ఇలాగే ఉండేది. నితీశ్ కుమార్ పట్ల బిహార్ ప్రజలు విశ్వాసం ప్రదర్శించారు. ఆయన నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం బిహార్ను మళ్లీ దారిలో పెట్టడానికి ఉమ్మడిగా కృషి చేస్తోంది. రెండున్నర దశాబ్దాల క్రితంలో బిహార్లో విద్యా వ్యవస్థ ఎలా ఉండేదో ఇప్పటి తరానికి తెలియదు. తమ బిడ్డలు స్థానికంగానే చదువుకొని, ఉద్యోగం సంపాదించుకోవాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ, విపక్షాల పాలనలో లక్షలాది మంది బిహార్ను విడిచిపెట్టి బనారస్, ఢిల్లీ, ముంబై వంటి ప్రాంతాలకు వలసవెళ్లారు. వలసలకు అప్పడే బీజం పడింది. ఎన్డీయే సర్కార్ వచ్చిన తర్వాత బిహార్ ప్రజలు సొంత రాష్ట్రానికి తిరిగి రావడం ఆరంభమైంది’’ అని ప్రధానమంత్రి స్పష్టంచేశారు. -
‘స్థానిక’ రిజర్వేషన్లపై ప్రీంకోర్టులో సవాల్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించరాదన్న సర్వోన్నత న్యాయస్థానం తీర్పునకు ఇది విరుద్ధమని పేర్కొంటూ దాఖలు చేసిన ఈ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయనుందని, ఇది సుప్రీంకోర్టు నిర్దేశించిన 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఉల్లంఘించడమేనని వంగ గోపాల్రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో సెప్టెంబర్ 29న పిటిషన్ దాఖలు చేశారు.అంతేగాక స్థానిక ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులను గోపాల్రెడ్డి సవాల్ చేశారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఏ వర్గానికి కేటాయించే రిజర్వేషన్లు అయినా మొత్తం 50 శాతానికి మించకూడదని, కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ నిబంధనను అతిక్రమిస్తోందని పిటిషన్లో ఆయన ఆరోపించారు. ఈ పిటిషన్ను సోమవారం జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారించనుంది. దీంతో ఈ విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
‘మీరేం ఒంటరి కాదు..’ విజయ్కు దన్నుగా ఢిల్లీ పెద్దలు!
కరూర్ తొక్కిసలాట ఘటనలో కుట్ర కోణం ఉందంటూ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కగళం(TVK) మొదటి నుంచి ఆరోపిస్తోంది. అయితే మద్రాస్ హైకోర్టు మాత్రం కనీస ఆహారం, మంచి నీళ్ల సదుపాయం కల్పించలేని స్థితిలో ర్యాలీని ఎందుకు నిర్వహించారని, ఘటన తర్వాత అక్కడి నుంచి ఎందుకు పారిపోయారని.. ప్రశ్నలు గుప్పిస్తూనే ఆ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తరుణంలో..తమిళ రాజకీయాల్లో విజయ్ టీవీకే పార్టీ(Vijay TVK Party) మనుగడపై అనిశ్చితి నెలకొంది. ఘటనకు విజయ్, టీవీకే పూర్తి బాధ్యత అంటూ అధికార డీఎంకే విమర్శలతో తిట్టిపోస్తోంది. ఇటు సోషల్ మీడియాలోనూ విజయ్కు వ్యతిరేక క్యాంపెయిన్ నడుపుతూ.. ఈ వేడి చల్లారకుండా చూసుకుంటోంది. అయితే ఈ అనిశ్చితినే తమకు ఫ్లస్గా మల్చుకునేందుకు ఇటు జాతీయ పార్టీలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.తాజాగా బీజేపీకి చెందిన ఓ అగ్రనేత విజయ్తో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం(BJP Phone Call to TVK Vijay). ఒకవేళ అధికార డీఎంకే అన్యాయంగా గనుక లక్ష్యంగా చేసుకుంటే.. విజయ్ ఒంటరేం కాదని ఆ అగ్రనేత చెప్పినట్లు తెలుస్తోంది. డీఎంకే ఎలాంటి చర్యలకు ఉపక్రమించినా ఓర్పు పాటించాలని.. వ్యూహాత్మకంగా ఎదురు దాడి చేయమని ఆ ఢిల్లీ పెద్ద, విజయ్కు సూచించినట్లు సమాచారం. మరోవైపు.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇదివరకే విజయ్తో ఫోన్లో మాట్లాడారు. ఘటనకు సంబంధించి వివరాలను ఆయన ఆరా తీశారు. తద్వారా పరోక్షంగా విజయ్కు సానుభూతి ప్రకటించడంతో పాటు అండగా నిలబడతామని ఈ రెండు జాతీయ పార్టీలు సంకేతాలు అందించాయనేది స్పష్టమవుతోంది(Congress BJP Backs Vijay).కరూర్ ఘటనలో(Karur Stampede).. డీఎంకే పార్టీనే మెయిన్ టార్గెట్ చేసుకుని బీజేపీ విమర్శలతో విరుచుకుపడుతోంది. ఈ విషయంలో ప్రతిపక్ష అన్నాడీఎంకే కంటే దూకుడు ధోరణి ప్రదర్శించడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరిచింది. ఇక ఘటన తర్వాత.. ఆగమేఘాల మీద, అదీ మునుపెన్నడూ లేని రీతిలో తమ ఎంపీలను బృందంగా తమిళనాడుకు పంపింది. ఈ బృందం కరూర్ను పరిశీలించి.. బాధితులతో, ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడింది. టీవీకేతో పాటు డీఎంకే ప్రభుత్వం కూడా కరూర్ ఘటనకు బాధ్యత వహించాల్సిందేనని ఆ కమిటీ తేల్చి చెప్పింది. ఈ క్రమంలో ర్యాలీకి అనుమతి ఇవ్వడం, సరైన భధ్రత కల్పించకపోవడం లాంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించింది.ఇటు కాంగ్రెస్.. డీఎంకేతో పొత్తులో కారణంగా తటస్థ వైఖరి అవలంభిస్తోంది. అందుకే ఘటనపై అధికార, టీవీకే పార్టీల్లో ఎవరినీ నిందించడం లేదు. కేవలం సానుభూతి ప్రకటన, నష్టపరిహారం అందజేత లాంటివి మాత్రమే చేసింది. దీంతో ద్రవిడ పార్టీల డామినేషన్ను తట్టుకుని ఓటు బ్యాంకు పెంచుకునే ప్రయత్నాలు చేస్తోందా? అనే అనుమానాలకు తావిస్తోంది.అయితే.. బీజేపీ, కాంగ్రెస్లు చేస్తున్న ఈ ప్రయత్నాలు విజయ్కు ఉన్న భారీ ఫ్యాన్ బేస్ను ఆకర్షించే ప్రయత్నంగానే కనిపిస్తోందని అక్కడి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.సమీకరణం.. మారేనా?వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఒంటరిగానే టీవీకే వెళ్తుందని.. సింహం సింహమేనని, సింగిల్గా పోటీకి వెళ్తుందని.. డీఎంకే తమ రాజకీయ ప్రత్యర్థి అని, బీజేపీ సైద్ధాంతిక విరోధి అని.. తాను ఏ కూటమిలో భాగం కాదని, అయితే అధికార ఏర్పాటులో కలిసి వచ్చే పార్టీలకు భాగం ఇస్తానని విజయ్ ఇదివరకు ప్రకటించారు. అయితే కరూర్ ఘటన నేపథ్యంలో.. ఆ నిర్ణయం మారే అవకాశం లేకపోలేదు!.ఇప్పటికే విజయ్ తొక్కిసలాట ఘటనలో తనకు మద్దతు తెలిపిన జాతీయ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ సంగతేమోగానీ.. బీజేపీ+అన్నాడీఎంకే మాత్రం ఎలాగైనా విజయ్ను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేయొచ్చని, డీఎంకే వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని టీవీకే అధినేత కూడా అందుకు ఓకే చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే మాత్రం విజయ్ను నమ్ముకుని ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన చిన్న పార్టీలకు పెద్ద షాకే అని చెప్పొచ్చు.ఇదీ చదవండి: తమిళ రాజకీయాల తొక్కిసలాట -
13 పాక్ జెట్లు కూల్చేశాం
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్తో ప్రత్యర్థి దేశం పాకిస్తాన్కు చావుదెబ్బ తగిలిందని, భారీగా నష్టపోయిందని భారత వైమానిక దళం(ఐఏఎఫ్) ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ స్పష్టంచేశారు. ఈ ఆపరేషన్లో భాగంగా పాకిస్తాన్కు చెందిన 12 నుంచి 13 ఫైటర్ జెట్లు కూల్చివేశామని, ఇందులో అమెరికాలో తయారైన ఎఫ్–16 యుద్ధ విమానాలు, చైనాలో తయారైన జేఎఫ్–17 యుద్ధ విమానాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. భారత యుద్ధ విమానాలను పాక్ సైన్యం కూల్చివేసిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. అవన్నీ ‘మనోహరమైన కథలు’ అంటూ కొట్టిపారేశారు. శుక్రవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో అమర్ప్రీత్ సింగ్ మాట్లాడారు. పాకిస్తాన్ భూభాగంలోకి 300 కిలోమీటర్లకుపైగా చొచ్చుకెళ్లి మరీ దాడి చేశామని, మన వైమానిక దళం ఇప్పటిదాకా సాధించిన వాటిలో ఇది ‘లాంగెస్ట్ కిల్’ అని పేర్కొన్నారు. దూరంగా ఉన్న శత్రువును దెబ్బకొట్టామని, ఇది ఈ సంవత్సరానికే ‘హైలైట్’ అని అభివరి్ణంచారు. ఆపరేషన్ సిందూర్లో పాకిస్తాన్కు వాటిల్లిన నష్టంపై భారత వైమానిక దళం అధినేత స్పష్టమైన వివరాలు బయటపెట్టడం ఇదే మొదటిసారి. పాక్ గగనతలంలో కొన్ని, భూభాగంపై మరికొన్ని ఫైటర్జెట్లను ధ్వంసం చేశామని పేర్కొన్నారు. వీటిలో ఎఫ్–16లు, జేఎఫ్–17లతోపాటు ఒక నిఘా విమానం కూడా ఉందని వెల్లడించారు. పాక్ రాడార్ వ్యవస్థలు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు, రన్వేలు, హ్యాంగర్లపై అత్యంత కచి్చతత్వంలో కూడిన దాడులు చేశామన్నారు. నాలుగు ప్రాంతాల్లో పాక్ రాడార్లు, రెండుచోట్ల కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు, మూడు హ్యాంగర్లు, రెండు రన్వేలు, ఒక సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ సిస్టమ్ ధ్యంసమయ్యాయని వివరించారు. మే 10వ తేదీన పాకిస్తాన్కు ఊహించని నష్టం జరిగిందన్నారు. దాంతో దిక్కుతోచని పాక్ సైన్యం కాల్పుల విరమణ కోసం భారత్ను వేడుకుందని పేర్కొన్నారు. కాల్పులు తక్షణమే ఆపాలంటూ మనల్ని అభ్యరి్థంచే స్థాయికి పాకిస్తాన్ను తీసుకొచ్చామని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెషబాజ్ షరీఫ్ కొన్నిరోజుల క్రితం ఐక్యరాజ్యసమితిలో మాట్లాడుతూ... ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్కు చెందిన ఏడు యుద్ధ విమానాలు కూల్చివేశామని చెప్పుకొచ్చారు. కానీ, దానిపై ఎలాంటి సాక్ష్యాధారాలను ఆయన బయటపెట్టలేకపోయారు. దీనిపై అమర్ప్రీత్ సింగ్ స్పందించారు. 15 భారత యుద్ధ విమానాలు కూల్చామని కూడా పాక్ చెప్పుకోవచ్చని.. వారు అలాగే భావిస్తూ సంతోషపడనివ్వండి అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ‘సుదర్శన్ చక్ర’తో పటిష్ట రక్షణ ఆపరేషన్ సిందూర్తో మన వైమానిక దళం సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసొచి్చందని అమర్ప్రీత్ సింగ్ అన్నారు. రక్షణ రంగంలో స్వావలంబన సాధించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ‘సుదర్శన్ చక్ర’ పేరిట శత్రుదుర్భేద్యమైన గగనతల రక్షణ వ్యవస్థను రూపొందిస్తున్నామని వెల్లడించారు. 2035 నాటికి ఈ నూతన భద్రతా వ్యవస్థ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నట్లు చెప్పారు. ‘సుదర్శన్ చక్ర’ కోసం త్రివిధ దళాలు ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించాయని వివరించారు. దీనితో మన దేశంలోని కీలకమైన వ్యవస్థలకు పటిష్టమైన రక్షణ లభిస్తుందన్నారు. మరోసారి భారత్వైపు కన్నెత్తి చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పాకిస్తాన్ను హెచ్చరించారు. -
రెండేళ్ల లోపు పిల్లలకు దగ్గు సిరప్ వద్దు!
న్యూఢిల్లీ: రెండేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్నారులకు దగ్గు, జలుబు మందులను సూచించవద్దని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఒక అడ్వైజరీ జారీ చేసింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో దగ్గు సిరప్ తాగి 11 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) ఈ మేరకు శుక్రవారం స్పందించింది. చిన్నారులకు దగ్గు సిరప్ సిఫారసు చేసే విషయంలో వైద్యులు జాగ్రత్తగా ఉండాలని కోరింది. సాధారణంగా ఐదేళ్లలోపు పిల్లలకు దగ్గు సిరప్లను సిఫారసు చేయవద్దని కోరింది. ఆపై వయస్సుండే చిన్నారులకు కూడా సరైన మోతాదు, నిర్ణీత కాలావధి, వైద్యుల సరైన పర్యవేక్షణ వంటి అంశాల ఆధారంగానే ప్రిస్క్రైబ్ చేయాలంది. అదేవిధంగా, వైద్యుల సలహాలను తీసుకోకుండా యథేచ్ఛగా దగ్గు సిరప్ను వాడరాదని తల్లిదండ్రులను కోరింది. ఈ విషయంలో వీరికి సరైన అవగాహన కల్పించాలని వైద్యులను కోరింది. ‘పిల్లల్లో దగ్గు సంబంధ వ్యాధులు వాటంతటవే లేదా ఔషధాలతో పనిలేకుండానే చాలావరకు తగ్గిపోతాయి. తగినంత హైడ్రేషన్, విశ్రాంతి, సహాయక చర్యల ద్వారా ఇటువంటి వాటిని తగ్గించుకోవచ్చు’అని అది పేర్కొంది. అదే సమయంలో, సరైన ప్రమాణాలను పాటిస్తూ తయారైన ఉత్పత్తులను వాడాలని ఆరోగ్య విభాగాలు, ఆస్ప త్రులకు సూచించింది. ప్రభుత్వ వైద్యసంస్థలతో ్చపాటు అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు తమ అడ్వైజరీని పాటించేలా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరింది.సిరప్లలో కల్తీ సత్యదూరందగ్గు మందు తాగిన అనంతరం కిడ్నీలు ఫెయిలై మధ్యప్రదేశ్లోని ఛింద్వారా జిల్లాలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల సంఖ్య 9కి చేరిందని డీజీహెచ్ఎస్ తెలిపింది. అదేవిధంగా, పొరుగు నున్న రాజస్తాన్లో సికార్లో సంభవించిన ఓ మరణం దగ్గు మందు తాగడంతో అవయవాలు ఫెయిలై సంభవించినట్లు అధికారులు గుర్తించారు. చనిపోయిన 9 మంది చిన్నారుల్లో కనీసం ఐదుగురు కోల్డ్రెఫ్, ఒకరు నెక్స్ట్రో సిరప్ తాగినట్లు తేల్చారు. వైరల్ జ్వరాల కేసుల విషయంలో ప్రైవేట్ ఆస్పత్రుల డాక్టర్లు అప్రమత్తంగా ఉండాలని డీజీహెచ్ఎస్ తెలిపింది. ఇటువంటి కేసులను తీసుకోవద్దని, గుర్తించిన వెంటనే నేరుగా ప్రభుత్వ ఆస్పత్రులకు పంపించాలని కోరింది. అదేవిధంగా, డెక్స్ట్రో మెథోర్ఫాన్ హైడ్రోబ్రోమైడ్ సిరప్లతో తీవ్ర అనారోగ్యం బారినపడుతున్న ఘటనల నేపథ్యంలో రాజస్తాన్లో ఈ సిరప్ వాడినట్లుగా గుర్తించిన 1,420 చిన్నారులను పరిశీలనలో ఉంచామంది. అయితే, చిన్నారుల మరణాలకు దగ్గు మందు కల్తీయే కారణమన్న ఆరోపణలకు తగు ఆధారాలు లేవని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కిడ్నీలు ఫెయిలయ్యేందుకు అవకాశమున్న డైఇథలీన్ గ్లైకాల్(డీఈజీ) లేదా ఇథిలీన్ గ్లైకాల్(ఈజీ) రసాయనాలు ఈ దగ్గు సిరప్లలో లేవని శాంపిళ్ల పరీక్షల్లో తేలినట్లు స్పష్టం చేసింది. సిరప్లలో కల్తీ జరిగిందన్న ఆరోపణలు నిరాధారాలంటూ కొట్టిపారేసింది. ప్రజలకు సూచనలుచిన్నారులకు దగ్గు వచ్చినప్పుడు తక్షణమే డాక్టర్ను సంప్రదించాలి.OTC (ఓవర్ ది కౌంటర్) దగ్గు మందులు దయచేసి వాడకూడదు.సహజ చికిత్సలు (తేనె, తులసి, గోరువెచ్చని నీరు) డాక్టర్ సూచనతో మాత్రమే వాడాలి.ఈ మార్గదర్శకాలు పిల్లల ఆరోగ్యాన్ని కాపాడేందుకు తీసుకున్న కీలక చర్యలు. మీ ఇంట్లో చిన్నారులు ఉంటే, దగ్గు మందుల వాడకంపై అత్యంత జాగ్రత్తగా వ్యవహరించండి.ఇదీ చదవండి: అమెరికా-పాక్లు! నాకు నువ్వు.. నీకు నేను! -
మరోసారి రెచ్చగొడితే ఆపరేషన్ సిందూర్ 2.0
జైపూర్: భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. భారత్కు వ్యతిరేకంగా ఇప్పటిదాకా సాగించిన ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదాన్ని ఇకనైనా ఆపాలని, లేకపోతే ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండదని తేల్చిచెప్పారు. భారత్పైకి ఉగ్రవాదులను ఎగదోస్తే పాకిస్తాన్ అనే దేశం ఇకపై చరిత్రలో మాత్రమే మిగిలిపోతుందని స్పష్టంచేశారు. తమను మరోసారి రెచ్చగొడితే ఆపరేషన్ సిందూర్ 2.0 ప్రారంభిస్తామని ఉద్ఘాటించారు. ఆపరేషన్ సిందూర్ 1.0లో చూపించిన సహనం, సంయమనాన్ని ఈసారి చూపించబోమని పేర్కొన్నారు. జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం రాజస్తాన్లోని అనూప్గఢ్లో ఆర్మీ పోస్టును సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రపంచ చరిత్రలో స్థానాన్ని, భౌగోళిక ఉనికిని కాపాడుకోవాలా? వద్దా? అనేది పాకిస్తాన్ చేతుల్లోనే ఉందన్నారు. ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదాన్ని ఆపాల్సిందేనని పాకిస్తాన్కు తేల్చిచెప్పారు. లేకపోతే ఆ దేశమే ప్రమాదంలో పడుతుందన్నారు. ఈసారి బలంగా దెబ్బకొడతామని అన్నారు. త్వరలో మరో అవకాశం రావొచ్చు ఎలాంటి పరిణామాలు ఎదురైనా సరే దీటుగా తిప్పికొట్టడానికి సర్వసన్నద్ధంగా ఉండాలని భారత సైనిక దళాలకు జనరల్ ఉపేంద్ర ద్వివేది సూచించారు. ‘మీ శక్తి సామర్థ్యాలు ప్రదర్శించడానికి త్వరలో మరో అవకాశం రావొచ్చు. అందుకే ఇప్పటినుంచే పూర్తి సన్నాహాలతో సిద్ధంగా ఉండండి. ఆల్ ద బెస్ట్’ అని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ ఆగలేదని, కేవలం విరామం మాత్రమే ఇచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ పలుమార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్పై మరోసారి దాడికి దిగితే ఆపరేషన్ సిందూర్ వెంటనే ప్రారంభమవుతుందని పాకిస్తాన్ను ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పాక్ దుస్సాహసానికి పాల్పడితే ఆపరేషన్ సిందూర్ 2.0 ఉంటుందని జనరల్ ఉపేంద్ర ద్వివేది ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పహల్గాంలో ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ ఏడాది మే 7వ తేదీన ఆపరేషన్ సిందూర్ను చేపట్టింది. పాక్ ఉగ్రవాద స్థావరాలు, శిక్షణ కేంద్రాలు, ఎయిర్బేస్లపై నాలుగు రోజులపాటు విరుచుకుపడింది. క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 100 మందికిపైగా పాక్ ఉగ్రవాదులు హతమయ్యారు. ముష్కరుల మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. ఇదీ చదవండి:ఆపరేషన్ సిందూర్పై ఆసక్తికర విషయాలు బయటపెట్టిన ఐఏఎఫ్ చీఫ్ -
భారత రక్షణ రంగంలో సరికొత్త పాఠాలు
న్యూఢిల్లీ: భారతదేశ రక్షణ రంగంలో స్వయం సమృద్ధిని సాధించేందుకు మరో కీలక అడుగు పడింది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (AICTE), ఇండియన్ డిఫెన్స్ మాన్యుఫాక్చరర్స్ సంఘం (SIDM) సంయుక్తంగా డిఫెన్స్ టెక్నాలజీలో మైనర్ డిగ్రీ కోసం మోడల్ కరికులమ్ను విడుదల చేశాయి. ఈ కొత్త విద్యా కార్యక్రమం ద్వారా ఇంజినీరింగ్ విద్యార్థులకు విమానయాన, నావికా వ్యవస్థలు, సైబర్ సెక్యూరిటీ, అధునాతన పదార్థాలు వంటి రక్షణ రంగానికి సంబంధించిన ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ప్రముఖ శాస్త్రవేత్త, డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ జీ సతీష్రెడ్డి నేతృత్వంలో ఈ కరికులమ్ తయారైంది. ఈ కరికులమ్ ప్రకారం.. ఉన్నత రక్షణ సాంకేతికతలపై ప్రత్యేక మాడ్యూల్స్, అలాగే పరిశ్రమలతో భాగస్వామ్యం ద్వారా ప్రాక్టికల్ శిక్షణ అందిస్తారు. తద్వారా విద్యా వ్యవస్థ, పరిశ్రమల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించి, రక్షణ రంగానికి అవసరమైన నైపుణ్యాలు కలిగిన యువతను తయారు చేయడం లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. -
ఆపరేషన్ సిందూర్పై ఆసక్తికర విషయాలు బయటపెట్టిన ఐఏఎఫ్ చీఫ్
ఢిల్లీ: చర్రితలో నిలిచిపోయేలా ఆపరేషన్ సిందూర్ చేపట్టామని ఎయిర్ఫోర్స్ చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ తెలిపారు. 300 కి.మీ దూరంలోని లక్ష్యాలు ఛేదించామని తెలిపారు. ఆపరేషన్ సిందూర్పై ఆసక్తికర విషయాలు బయపెట్టిన ఐఏఎఫ్ చీఫ్.. భారత యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయన్న పాకిస్తాన్ ఆర్మీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు. ఉగ్రవాదులను మట్టుబెట్టడం చరిత్రాత్మకమని.. ఆపరేషన్ సిందూర్ భవిష్యత్ పోరాటాలకు స్ఫూర్తినిస్తుందన్నారు.‘‘ఆపరేషన్ సిందూర్లో పాకిస్తాన్ను చావు దెబ్బ తీశాం. పాకిస్తాన్కు చెందిన 5 పైటర్ జెట్స్ను ధ్వంసం చేశాం. దెబ్బతిన్న పాక్ ఫైటర్ జెట్స్లో ఎఫ్-16 ఉన్నాయి. మన అమ్ములపొదిలోని అస్త్రాలన్నీ గేమ్ ఛేంజర్లే. ఆపరేషన్ సిందూర్ సమయంలో సైన్యానికి కేంద్రం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. పాక్కు చెందిన అవాక్ విమానాన్ని ధ్వంసం చేశాం...మే 10న యుద్ధ విరామానికి కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం కాదు.. పాకిస్తానే భారత్ను శాంతికి అభ్యర్థించిందని ఏపీ సింగ్ స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా, పాక్, ఆ దేశ ఆక్రమిత కశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేసింది. భారత్ శక్తి ఏంటో ప్రపంచానికి తెలిసింది’ అని ఐఏఎఫ్ చీఫ్ వెల్లడించారు. -
దుర్గమ్మ నిమజ్జనోత్సవంలో పెను విషాదం.. 11 మంది మృతి
భోపాల్: మధ్యప్రదేశ్లో విషాదం చోటు చేసుకుంది. దుర్గమ్మ నిమజ్జనోత్సవంలో 11మంది ప్రాణాలు కోల్పోయారు. దుర్గమ్మను నిమజ్జనానికి తీసుకెళ్తుండగా ట్రాక్టర్ చెరువులోకి దూసుకెళ్లింది. మధ్యప్రదేశ్లోని ఖండ్వా జిల్లాలో దుర్గమ్మ నిమజ్జనోత్సవం విషాదంగా మారింది. గురువారం జరిగిన ఈ దుర్ఘటనలో ట్రాక్టర్ చెరువులోకి దూసుకెళ్లి 11 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 20 నుంచి 25 మంది భక్తులు ఉన్నట్లు సమాచారం. పోలీసులు, రెస్క్యూ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. VIDEO | Madhya Pradesh: At least nine devotees died after a tractor-trolley carrying idols of Goddess Durga for immersion on Vijayadashmi plunged into a lake in Khandwa district.#Khandwa #DurgaPuja2025 (Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/ipqVplGJus— Press Trust of India (@PTI_News) October 2, 2025ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దుర్ఘటన ఖండ్వా జిల్లా అర్దాలా గ్రామం సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుర్గమ్మ విగ్రహ నిమజ్జనం కోసం చెరువుపై తాత్కాలిక వంతెనపై ఆపి ఉంచిన ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడటంతో అందులో ఉన్న వారందరూ నీటిలో మునిగిపోయారు. గురువారం సాయంత్రం 5:00 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. జేసీబీ సహాయంతో వెంటనే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 6:00 గంటల సమయానికి 11 మృతదేహాలను వెలికి తీశారు. బాధితులను పంధానా ఆసుపత్రికి తరలించడానికి సంఘటనా స్థలంలో పది అంబులెన్స్లను మోహరించారు. జిల్లా కలెక్టర్ రిషబ్ గుప్తా, పోలీసు సూపరింటెండెంట్ మనోజ్ కుమార్ రాయ్ సంఘటన స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రాణాలతో బయటపడిన ముగ్గురు పిల్లలను చికిత్స కోసం ఖాండ్వా ఆసుపత్రికి తరలించారు. -
ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు ప్రధాని మోదీ ఫోన్
ఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ‘‘నేను ఖర్గేతో మాట్లాడాను. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నాను. అలాగే ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఆయన త్వరగా కోలుకోవాలని, దీర్ఘాయుష్షు పొందాలని ప్రార్థిస్తున్నాను’’ అంటూ ప్రధాని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారుకాగా, మల్లికార్జున ఖర్గేకు బుధవారం రాత్రి బెంగళూరు ఆస్పత్రి వైద్యులు పేస్మేకర్ను అమర్చారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బెంగళూరు వచ్చిన ఆయన శ్వాసలో ఇబ్బంది, జ్వరం రావడంతో మంగళవారం సాయంత్రం ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో చేర్పించారు.Spoke to Kharge Ji. Enquired about his health and wished him a speedy recovery. Praying for his continued well-being and long life.@kharge— Narendra Modi (@narendramodi) October 2, 2025తనయుడు, రాష్ట్ర ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే సోషల్ మీడియా లో..‘వయో సంబంధ సమస్యలు, శ్వాస సంబంధ సమస్యలతో ఖర్గే ఇబ్బంది పడుతున్నారు. వీటిని సరిచేసేందుకు పేస్మేకర్ అమర్చాలని వైద్యులు సలహా ఇచ్చారు’అని తెలిపారు. ఖర్గేకు బుధవారం రాత్రి వైద్యులు స్వల్ప శస్త్రచికిత్స జరిపి పేస్మేకర్ను విజయవంతంగా అమర్చారు. ఆయన ఆరోగ్యం బాగుందని, గురువారం డిశ్చార్జి అవుతారని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. -
తల్లిదండ్రులకు శుభవార్త.. దేశవ్యాప్తంగా 57 కొత్త కేంద్రీయ విద్యాలయాలు
న్యూఢిల్లీ, సాక్షి: తల్లిదండ్రులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. దేశవ్యాప్తంగా 57 కొత్త కేంద్రీయ విద్యాలయాలను (కేవీ) స్థాపించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ స్కూళ్ల నిర్మాణానికి కేంద్రం రూ. 5,863 కోట్లు కేటాయించింది.ఇందుకోసం రూ.5863కోట్లు కేటాయించనుంది. వాటిల్లో ఏడు కేంద్రియ విద్యాలయాల నిర్మాణం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో..మిగిలిన 50 కేవీ స్కూల్స్ వివిధ రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అందుబాటులోకి రానున్నాయి.తాజాగా కేంద్రం ప్రకటించిన 57కేవీ స్కూల్స్లలో ఇప్పటివరకు కేంద్రీయ విద్యాలయం లేని 20 జిల్లాల్లో కేంద్రం స్థాపించనుంది. మిగిలిన 14 అభివృద్ధి చెందాల్సిన (Aspirational) జిల్లాల్లో, నాలుగు ఎల్బ్ల్యూఈ (Left Wing Extremism) అంటే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో, మిగిలిన ఐదు విద్యాలయాలు ఈశాన్య రాష్ట్రాలు (NER),పర్వత ప్రాంతాల్లో అందుబాటులోకి తెచ్చేలా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ అధికారికంగా ప్రకటించారు. ఈ కొత్త కేంద్రియ విద్యాలయాలు 17 రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల్లో స్థాపించనుంది. దీంతో పాటు కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంచింది. 57 నూతన కేంద్రీయ విద్యాలయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆత్మ నిర్భర భారత్ కింద పప్పు దినుసుల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి కోసం రూ. 11,440 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ మొత్తాన్ని క్వాలిటీ సీడ్స్, ట్రైనింగ్, మౌలిక వసతుల పెంపు, పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం పెంపు , ధర స్థిరీకరణ నిధి తదితర అంశాలపై కేంద్రం ఖర్చు చేయనుంది. రబీ సీజన్లో పంటలకు మద్దతు ధర కోసం రూ. 84,263 కోట్ల రూపాయలు కేటాయింపు. గోధుమకు రూ.2,585 రూపాయలు, బార్లీ రూ. 2150, శనగపప్పు రూ.5875, ఎర్ర పప్పు రూ.7000, ఆవాలు రూ. 6200, కుసుమ రూ. 6540 కేటాయించింది. కలియ బోర్ నుంచి నుమాలీఘర్ సెక్షన్ మధ్య జాతీయ రహదారి నిర్మాణానికి రూ.6957 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపింది. బయో మెడికల్ రీసెర్చ్ కెరీర్ ప్రోగ్రాం ఫేజ్ 3 కి ఆమోదం తెలిపిన కేంద్ర క్యాబినెట్.. ఈ ప్రాజెక్టులో 1500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. వందేమాతరం గేయం 150 సంవత్సరాల ఉత్సవాలకు క్యాబినెట్ ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. -
కేంద్ర ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన ర్లకు కేంద్రంలోని మోదీ సర్కారు విజయదశమిని పురస్కరించుకుని కీలక ప్రకటనలు చేసింది. వారికి ప్రతినెలా చెల్లించే కరువు భత్యాన్ని (డీఏ) 3 శాతం పెంచే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నేషనల్ మీడియా సెంటర్లో కేంద్ర కేబినెట్ నిర్ణయాలను సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ‘కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ పే, పింఛన్లపై చెల్లిస్తున్న డీఏ 55 శాతం నుంచి 58 శాతానికి పెరగనుంది. ఈ ఏడాది జూలై 1 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలల డీఏ బకాయిలను అక్టోబర్ వేతనాలతో దీపావళి కంటే ముందే అందిస్తాం. ఈ నిర్ణయంతో దేశంలోని 49.2 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.7 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుంది. డీఏ పెంపు వల్ల కేంద్రంపై ఏటా అదనంగా రూ.10,083 కోట్ల భారం పడుతుంది. 8వ వేతన సంఘం సిఫారసులు 2026 జనవరి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది’అని వెల్లడించారు.తెలుగు రాష్ట్రాలకు చెరో నాలుగుదేశవ్యాప్తంగా 57 కొత్త కేంద్రీయ విద్యాలయా(కేవీ)లను స్థాపించేందుకు కేంద్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపిందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. కేవీల నిర్మాణానికి రూ.5,863 కోట్లు కేటాయించింది. ఇప్పటి వరకు కేంద్రీయ విద్యాలయాలు లేని జిల్లాలు, అభివృద్ధి చెందాల్సిన జిల్లాలు, మావోయిస్టు ప్రభావిత జిల్లాలు, కొండ పాలిత రాష్ట్రాల్లో ఏర్పాటవుతాయన్నారు. కేంద్రం కేటాయించిన కేవీల్లో తెలంగాణ రాష్ట్రానికి నాలుగు, ఏపీకి నాలుగు ఉన్నాయని కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, రామ్మోహన్ నాయుడు చెప్పారు.పంటలకు మద్దతు ధర పెంపు పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్రం రైతులకు ఊరట కల్పించింది. రబీ పంటల ఉత్పత్తి అంచనా 297 లక్షల టన్నులు కాగా, వీటికి మద్దతు ధర కోసం రూ.84,263 కోట్లు కేటాయించింది. గోధుమ పంట కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ని రూ.160 పెంచాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దీంతో, 2026–27లో గోధుమల ఎంఎస్పీ క్వింటాలుకు రూ.2,585కు చేరుకోనుంది. దేశీయ ఉత్పత్తి పెంపు, రైతుల ఆదాయం పెంపునకు ఇది ఎంతో తోడ్పడుతుందని పేర్కొన్నారు. బార్లీ ఎంఎస్పీ రూ.170 పెంపుతో క్వింటాలు రూ.2,150, అదేవిధంగా, శనగపప్పు రూ.5,875, ఎర్ర పప్పు(మసూరి) రూ.7,000, ఆవాలు రూ.6,200, కుసుమపువ్వు రూ. 6,540 చొప్పున కొనుగోళ్లు జరపాల్సి ఉంటుంది. ఎంఎస్పీ అత్యధికంగా కుసుమలకు క్వింటాలుకు రూ.600 మేర పెంచింది.వందేమాతరం 150 ఏళ్ల వేడుకజాతీయ గీతం వందేమాతరంనకు 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్సవాలను నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. బంకించంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరం గీతాన్ని జాతీయ గీతంగా రాజ్యాంగ సభ గుర్తించింది. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ఈ గీతం ప్రముఖ పాత్ర పోషించిందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. దేశ స్వాతంత్య్ర పోరాటం గురించి యువతకు ఆసక్తి కలిగించేలా కార్యక్రమాలుంటాయన్నారు. వీటితోపాటు బయో మెడికల్ రీసెర్చ్ కెరీర్ ప్రోగ్రాం ఫేజ్–3కి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులో రూ.1,500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. -
సోనమ్ను వేటాడుతున్నారు
న్యూఢిల్లీ: కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్కు రాష్ట్ర హోదా కోసం పోరాటం చేస్తున్న తన భర్తను కేంద్ర ప్రభుత్వం వేటాడుతోందని, అందులో భాగంగానే ఆయనపై దేశద్రోహ చట్టం (ఎన్ఎస్ఏ) కింద తప్పుడు కేసులు పెట్టారని ఆయన సతీమణి గీతాంజలి ఆంగ్మో ఆరోపించారు. సోనమ్ వాంగ్చుక్పై నమోదుచేసిన కేసులపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని ప్రభుత్వ అధికారులకు సవాల్ చేశారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘వాంగ్చుక్తో ఇప్పటివరకు నన్ను మాట్లాడనివ్వలేదు. ఆయనపై మోపిన అభియోగాలకు సంబంధించిన పత్రాలు కూడా అధికారులు నాకు ఇవ్వలేదు. నన్ను కూడా దాదాపు గృహనిర్బంధంలో పెట్టినట్లుగా పరిస్థితులు కల్పించారు. వాంగ్చుక్పై ఎన్ఎస్ఏ ప్రయోగించాల్సిన అవసరం లేదు. అధికారులు ఒకేవైపు మాట్లాడుతున్నారు. ఒకరకంగా ఆయనను వేటాడుతున్నారు. ఆయన దేశద్రోహి అయితే భారత ప్రభుత్వం ఆయనకు ఎందుకు అనేక అవార్డులు ఇచ్చింది? లడక్కు రాష్ట్రహోదా ఇవ్వాలని, దానిని రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చాలని సోనమ్ వాంగ్చుక్ నేతృత్వంలో జరుగుతున్న ఉద్యమాన్ని బలహీనపర్చేందుకే ఇదంతా చేస్తున్నారు’అని గీతాంజలి ఆరోపించారు. లద్దాఖ్కు రాష్ట్రహోదా కోసం ఈ నెల 24న లేహ్లో నిర్వహించిన నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారి నలుగురు వ్యక్తులు చనిపోయిన విషయం తెలిసిందే. ఉద్యమకారులను వాంగ్చుక్ రెచ్చగొట్టడం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తూ పోలీసులు ఆయనను అరెస్టు చేసి రాజస్థాన్లోని జో«ద్పూర్ జైల్లో నిర్బంధించారు. వాంగ్చుక్ చుట్టూ కుట్ర సోనమ్వాంగ్చుక్ కార్యకలాపాలపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తేలా పనిగట్టుకొని కొందరు ప్రచారం చేస్తున్నారని గీతాంజలి ఆరోపించారు. ‘మా సంస్థ హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ లెరి్నంగ్ (హెచ్ఐఏఎల్)కు సంబంధించిన అన్ని పత్రాలను సీబీఐ, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అందించాం. అయినా ఆయన కార్యకలాపాలపై అనుమానాలు రేకెత్తించేలా ప్రచారం జరుగుతోంది. వాంగ్చుక్కు మెగసెసె అవార్డు రావటంపై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ అవార్డును తీసుకోవటం తప్పు అన్నట్లుగా ఎందుకు మాట్లాడుతున్నారు? దాదాపు 60 మంది భారతీయులకు మెగసెసె వచ్చింది. వారిలో 20 మందికి భారత ప్రభుత్వం పద్మ అవార్డులు కూడా ఇచ్చింది. అంటే భారత ప్రభుత్వం దేశద్రోహులకు పద్మ అవార్డులు ఇచ్చిందా?’అని నిలదీశారు. లద్దాఖ్లో పాకిస్తాన్ జాతీయులు ప్రవేశించటం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టంచేశారు. ‘లద్దాఖ్లో పాకిస్తానీలు ఉన్నట్లు వాళ్లు (అధికారులు) గుర్తిస్తే.. పొరుగు దేశం వాళ్లను మనదేశంలోకి అక్రమంగా ఎందుకు రానిచ్చారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది వాంగ్చుక్ కాదు. కేంద్ర హోంశాఖ. 24న హింస జరుగుతున్నప్పుడు వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్షలో ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుందో కూడా ఆయనకు తెలియదు. ఆ ఘటనకు లద్దాఖ్ అధికార యంత్రాంగం బాధ్యత వహించాలి’అని స్పష్టంచేశారు. గత ఏడేళ్లలో వాంగ్చుక్ పరిశోధనల వల్ల ప్రజలకు ఎంతో మేలు జరిగిందని గీతాంజలి తెలిపారు. ‘హెచ్ఐఏఎల్ పరిశోధనల ద్వారా ఆవిష్కరించిన సౌరశక్తితో వెచ్చగా ఉండే భవనాలు, ఐస్ స్తూపం ప్రాజెక్టులకు కేంద్రం అవార్డులు కూడా ఇచ్చింది. గత ఏడేళ్లలో 1,80,000 చదరపు అడుగుల సోలార్ హీటెడ్ భవనాలు నిర్మించారు. వాటివల్ల నెలకు 4,000 టన్నుల కార్బన్ ఆదా అవుతోంది. ఈ సాంకేతికత ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇలాంటి పనులను మెచ్చుకోకపోతే దేశం విశ్వగురు ఎలా అవుతుంది?’అని ప్రశ్నించారు. -
లండన్లో గాంధీ విగ్రహం ధ్వంసం.. తీవ్రంగా స్పందించిన భారత్
లండన్: లండన్లో మహాత్మాగాంధీ (Mahatma Gandhi) విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. లండన్లోని టావిస్టాక్ స్వ్కేర్లో ఉన్న గాంధీ విగ్రహంపై నల్ల రంగుతో విద్వేష పూరిత వ్యాఖ్యలు రాశారు. మహాత్ముని జయంతికి మూడు రోజుల ముందు జరిగిన ఈ ఘటనపై అక్కడి భారత రాయబార కార్యాలయం తీవ్రంగా ఖండించింది. ఈ పిచ్చి రాతలను సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించింది. అహింస వారసత్వంపై జరిగిన దాడిగా పేర్కొంది.మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం పాటు తీవ్రంగా ఖడిస్తున్నామని భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా వెల్లడించింది. మహాత్ముని జయంతి (అక్టోబర్ 2)ని ప్రతి ఏడాది అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.కాగా, ప్రముఖ కళాకారిణి ఫ్రెడ్డా బ్రిలియంట్ రూపొందించిన గాంధీజీ కాంస్య విగ్రహాన్ని లండన్లోని టావిస్టాక్ స్క్వేర్లోని యూనివర్సిటీ కాలేజ్ సమీపంలో 1968లో ప్రతిష్ఠించారు. విగ్రహ ధ్వంసం గురించి స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చారు. విగ్రహాన్ని తిరిగి పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు.@HCI_London is deeply saddened and strongly condemns the shameful act of vandalism of the statue of Mahatma Gandhi at Tavistock Square in London. This is not just vandalism, but a violent attack on the idea of nonviolence, three days before the international day of nonviolence,…— India in the UK (@HCI_London) September 29, 2025 -
నేడు బిహార్ ఓటరు తుది జాబితా
న్యూఢిల్లీ: బిహార్ తుది ఓటరు జాబితా మంగళవారం విడుదల చేయనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దీంతో, వచ్చే వారంలో ఈసీ బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే అవకాశముందని భావిస్తున్నారు. దాదాపు 22 ఏళ్ల తర్వాత ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ముగియడంతో ఓటరు జాబితా ఫైనల్ లిస్ట్ను ఈసీ ఆన్లైన్లో ఉంచేందుకు ఏర్పాట్లు చేసింది.ఆగస్ట్ ఒకటో తేదీన విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో 7.24 కోట్ల ఓటర్లున్నారు. ఇలా ఉండగా, ఈసీ బృందం అక్టోబర్ 4, 5వ తేదీల్లో పట్నాకు వెళ్లి ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష జరపనుంది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశముందని సమాచారం. మొదటి దశ పోలింగ్ ఛట్ పండుగ తర్వాత అక్టోబర్ ఆఖర్లో ఉండొచ్చని భావిస్తున్నారు. ఎన్నికల పరిశీలకుల నియామకం కసరత్తు అక్టోబర్ 3వ తేదీకల్లా ముగియనుందని చెబుతున్నారు. బిహార్ అసెంబ్లీ ప్రస్తుత గడువు నవంబర్ 22వ తేదీతో ముగియనుంది. గత అసెంబ్లీ ఎన్నికలు మూడు విడతల్లో జరిగాయి. -
నూతన సుపరిపాలన
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను(జీఎస్టీ) సంస్కరణలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొట్టిపారేశారు. ప్రతిరోజూ అబద్ధాలు చెబుతూ, తమపై రాళ్లు విసురుతూ కాలం గడపడం తప్ప విపక్షాలకు ఇంకేమీ తెలియదని ఎద్దేవా చేశారు. ఈ సంస్కరణలతో ప్రతి కుటుంబానికి ఎంతో లబ్ధి చేకూరుతుందని వివరించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ పాలనలో రూ.లక్ష ఖర్చు చేస్తే అందులో పన్నుల కింద రూ.25000 చెల్లించాల్సి వచ్చేదని, ఇప్పుడు రూ.5 వేలు చెల్లిస్తే సరిపోతుందని వెల్లడించారు. అంటే ప్రతి రూ.లక్ష ఖర్చుపై రూ.20,000 చొప్పున ఆదా అయినట్లేనని స్పష్టంచేశారు.సుపరిపాలనలో నూతన మోడల్కు శ్రీకారం చుట్టామని స్పష్టంచేశారు. ప్రధాని మోదీ సోమవారం ఢిల్లీ బీజేపీ శాఖ నూతన ప్రధాన కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణల ఫలాలు ప్రజలకు చేరేలా చూడాలని బీజేపీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.కాంగ్రెస్ పార్టీ పాలనలోని హిమాచల్ ప్రదేశ్లో ధరలు తగ్గించడం లేదని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రూ.2 లక్షల దాకా ఆదాయంపై పన్ను ఉండేదని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.12 లక్షల దాకా ఆదాయంపై పన్ను తొలగించామని, జీఎస్టీలో సంస్కరణలు తీసుకొచ్చామని, దీనివల్ల దేశ ప్రజలకు ప్రతిఏటా రూ.2.5 లక్షల కోట్లు ఆదా అవుతాయని పునరుద్ఘాటించారు. కుంభకోణాల రహిత భారత్ ఎన్డీయే ప్రభుత్వం దేశానికి నూతన ‘సుశాసన్ మోడల్’ను ఇచి్చందని ప్రధాని మోదీ వివరించారు. అభివృద్ధితోపాటు దేశ రక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. కుంభకోణాల నుంచి దేశానికి విముక్తి కలి్పంచామని, అవినీతిపై నిర్ణయాత్మక యుద్ధం చేసేలా ఆత్మవిశ్వాసం పెంచామని వెల్లడించారు. స్వదేశీ ఉత్పత్తుల ప్రాధాన్యతను మరోసారి ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్వదేశీ ఉత్పత్తులను విక్రయించేలా, కొనుగోలు చేసి ఉపయోగించుకొనేలా వ్యాపారులను, ప్రజలను ప్రోత్సహించాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీజేపీ కార్యాలయాలు మాకు దేవాలయాలు బీజేపీకి అధికారం ముఖ్యం కాదని, ప్రజాసేవే పరమావధి అని ప్రధానమంత్రి మోదీ వ్యాఖ్యానించారు. బీజేపీ కార్యాలయాలు తమకు దేవాలయాలతో సమానమని చెప్పారు. ఇక్కడికి వచ్చే ప్రజల సమస్యలు తెలుసుకోవాలని, వాటి పరిష్కారానికి కృషి చేయాలని బీజేపీ కార్యకర్తలకు సూచించారు. ప్రజలను, వారి ఆకాంక్షలను అనుసంధానించే వేదికలుగా బీజేపీ ఆఫీసులు పనిచేస్తాయని పేర్కొన్నారు.దక్షిణ భారత శైలిలో బీజేపీ ఆఫీసుఢిల్లీలోని డీడీయూ మార్గ్లో ఐదు అంతుస్తుల భవనంలో బీజేపీ నగర నూతన కార్యాలయం ఏర్పాటైంది. దక్షిణ భారత శైలిలో ఆధునిక వసతులతో నిర్మించారు. ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ ఆఫీసు పండిట్ పంత్ మార్గ్లో ఉంది. దీపావళి నాటికి కొత్త భవనంలోకి మారనుంది. 825 చదరపు మీటర్ల స్థలంలో పర్యావరణ హితంగా ఈ బిల్డింగ్ నిర్మించారు. ఇందులో 200 మంది కూర్చోవడానికి వీలైన ఆడిటోరియంతోపాటు గ్రంథాలయం కూడా ఉంది. శాశ్వత భవనం లేకపోవడంతో ఢిల్లీ బీజేపీ విభాగం చాలా భవనాల్లోకి మారాల్చి వచి్చంది. అనే ప్రయత్నాల తర్వాత శాశ్వత భవనం సమకూరడం పట్ల ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంతోషం వ్యక్తంచేశారు. -
ఇప్పుడంతా గంటలు, సెకన్ల యుద్ధాలే
న్యూఢిల్లీ: ఆధునిక సాంకేతిక యుగంలో యుద్ధరీతి పూర్తిగా మారిపోయిందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. సంఘర్షణలు జరిగే విధానాన్ని శాటిలైట్లు, డ్రోన్లు, సెన్సార్లు సమూలంగా మార్చేశాయని అన్నారు. నెలల తరబడి యుద్ధాలు కొనసాగే రోజులు ఎప్పుడో పోయాయని తెలిపారు. శత్రుదేశాలతో సాయుధ పోరాటానికి గంటలు, సెకన్లలోనే తెరపడే పరిస్థితి వచ్చిందని స్పష్టంచేశారు. సోమవారం ఢిల్లీలో ఇండియన్ కోస్ట్గార్డ్(ఐసీజీ) కమాండర్ల 42వ సదస్సులో రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు.మారుతున్న కాలంలో కొత్తగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే గుర్తించడానికి, విధి నిర్వహణలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చేర్చడానికి రోడ్మ్యాప్ సిద్ధం చేయాలని ఐసీజీ అధికారులకు సూచించారు. సైబర్, ఎల్రక్టానిక్ యుద్ధరీతి అనేది ఇక ఎంతమాత్రం ఊహాత్మకం కాదని, అది వాస్తవ రూపం దాల్చిందని గుర్తుచేశారు. మన దేశానికి పెనుముప్పుగా మారిన సైబర్, ఎలక్ట్రానిక్ యుద్ధాలను ఎదుర్కోవడానికి ఎల్లవేళలా సర్వసన్నద్ధంగా ఉండాలని స్పష్టంచేశారు.ఒక దేశం మరో దేశంలోని వ్యవస్థలను నాశనం చేయాలని భావిస్తే శక్తివంతమైన క్షిపణులు ప్రయోగించాల్సిన అవసరం లేదని.. కంప్యూటర్లను హ్యాకింగ్ చేస్తే చాలని అన్నారు. సైబర్ దాడులు, ఎల్రక్టానిక్ జామింగ్తో అల్లకల్లోలం సృష్టించవచ్చని తేల్చిచెప్పారు. ఇలాంటి అంతర్జాల దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, శిక్షణను, రక్షణ పరికరాలను ఆధునీకరించాలని ఐసీజీకి సూచించారు. నిఘా వ్యవస్థలను పటిష్టం చేసుకోవాలన్నారు. సైబర్ దాడులను క్షణాల వ్యవధిలోనే తిప్పికొట్టాలంటే కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. సంప్రదాయ విధానాలు సరిపోవు అండమాన్ నికోబార్ దీవులు, లక్షదీ్వప్ను కూ డా కలుపుకొంటే భారత్కు 7,500 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. తీరప్రాంత భద్రత విషయంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పారు. వీటిని అరికట్టాలంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ, సుశిక్షితులైన సిబ్బంది, పటిష్టమైన నిఘా వ్యవస్థ అత్యవసరమని ఉద్ఘాటించారు. సముద్ర తీర ముప్పు కూడా ఆధునికతను సంతరించుకుందని వివరించారు.ఓడల్లో అక్రమ రవాణా, సముద్ర దొంగల గురించి గతంలో మాట్లాడుకున్నామని గుర్తుచేశారు. ఇప్పుడంతా జీపీఎస్ స్ఫూపింగ్, రిమోట్తో నియంత్రించే పడవలు, ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థ, డ్రోన్లు, శాటిలైట్ ఫోన్లు, డార్క్వెబ్ వంటి వాటితో నేరాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఉగ్రవాద సంస్థలు సైతం ఆధునిక టెక్నాలజీని వాడుకుంటున్నాయని రాజ్నాథ్ సింగ్ ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పుడు సముద్ర తీర ముప్పును ఎదిరించాలంటే సంప్రదాయ విధానాలు ఎంతమాత్రం సరిపోవన్నారు. -
50 రోజులు.. 15 హోటళ్లు.. ఢిల్లీ బాబా కేసులో షాకింగ్ విషయాలు
ఢిల్లీ: బాబా చైతన్యానంద సరస్వతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీలోని ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన 17 మంది విద్యార్థినులను వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బాబా చైతన్యానంద.. పోలీసులను తప్పించుకునేందుకు 50 రోజులు పరారీలో ఉండగా.. ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆగ్రాలోని ఓ హోటల్లో బస చేసిన అతడిని ఆదివారం(సెప్టెంబర్ 28) తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. 50 రోజుల పాటు సీసీటీవీలకు చిక్కకుండా పరారీలో ఉన్న ఢిల్లీ బాబా గురించి షాకింగ్ విషయాలు పోలీసులు వెల్లడించారు.పోలీసుల కళ్లలో పడకుండా ట్యాక్సీల్లో ప్రయాణిస్తూ, చౌక హోటళ్లలో బస చేస్తూ బృందావన్, ఆగ్రా, మధుర తదితర ప్రాంతాల్లో తిరిగారు. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆయన 50 రోజుల్లో 15 హోటళ్లను మార్చాడు. సీసీటీవీ కెమెరాలు లేని చౌక హోటళ్లలోనే అతను బస చేసేవాడని పోలీసులు తెలిపారు. బాబాకు సహకరించిన ఆయన సహాయకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.కాగా, బాబా చైతన్యానంద సరస్వతి నుంచి పోలీసులు ఒక ఐపాడ్, మూడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక ఫోన్లో ఢిల్లీలోని విద్యాసంస్థ క్యాంపస్, హాస్టల్లోని సీసీటీవీ ఫుటేజీని యాక్సెస్ చేసే సౌకర్యం ఉండటం పోలీసులు గుర్తించారు. ఈ ఫోన్ ద్వారానే విద్యార్థినుల కదలికలను చైతన్యానంద గమనించేవాడని తెలిపారు.చైతన్యానంద వద్ద ఐక్యరాజ్యసమితి రాయబారిని, బ్రిక్స్ కమిషన్ సభ్యుడని చెప్పుకుంటూ ముద్రించిన రకరకాల నకిలీ విజిటింగ్ కార్డులు ఇతడి వద్ద స్వాధీనం చేసుకున్నారు. ఆగ్రా హోటల్లో ఈ నెల 27వ తేదీన సాయంత్రం 4 గంటలకు పార్థసారథి అనే పేరుతో చైతన్యానంద గది తీసుకున్నాడన్నారు. వేర్వేరు పేర్లతో ఇతడు తీసుకున్న రూ.8 కోట్ల బ్యాంకు అకౌంట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లను పోలీసులు స్తంభింపజేశారు.ఢిల్లీలోని మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్కు గతంలో చైర్మన్గా ఉన్న చైతన్యానంద మహిళా విద్యార్థినులను రాత్రి వేళ గత క్వార్టర్కు పిలిపించుకునే వాడు. రాత్రిళ్లు వారికి అసభ్యకర సందేశాలను పంపించేవాడు. తన ఫోన్లో వారి కదలికలను గమనించేవాడు. కేసు నమోదైనట్లు తెలిసిన తర్వాత బ్యాంకు నుంచి రూ.50 లక్షలను విత్డ్రా చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.సుమారు 16 మంది పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఇతడి బారిన 16 నుంచి 20 మంది విద్యార్థినులు పడ్డారన్నారు. వీరందరి స్టేట్మెంట్లు పోలీసులు రికార్డు చేశారని తెలిపారు. పోలీసుల విచారణకు సహకరించడం లేదని, ఐపాడ్, ఐక్లౌడ్ పాస్వర్డులను వెల్లడించడం లేదని ఆరోపించారు. అయితే, పోలీసులు తనను వేధించేందుకే కస్టడీ కోరుతున్నారని, నిజంగా తనతో ప్రమాదముంటే జ్యుడీషియల్ కస్టడీకి పంపించాలని చైతన్యానంద తరపు లాయర్ వాదించారు. వాదనలు విన్న డ్యూటీ మేజిస్ట్రేట్ రవి ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు. -
ఢిల్లీలోని 300 స్కూళ్లు, సంస్థలకు బాంబు బెదిరింపు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని 300కు పైగా స్కూళ్లు, సంస్థలతోపాటు పలు విమా నాశ్రయాలకు ఆదివారం బాంబు బెదిరింపులు వచ్చాయి. సంబంధిత విభాగాలు, భద్రతా సిబ్బంది అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేవని, బెదిరింపులు వట్టివేనని తేల్చారు. ఇంతకుముందు హెచ్చరికలు పంపిన ’Terrorizers111’ అనే గ్రూప్ నుంచే తాజా ఈమెయిల్ హెచ్చరికలు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఆదివారం ఉదయం 6.08 గంటల సమయంలో ఇవి ఢిల్లీలోని విమానాశ్రయంతోపాటు పలు స్కూళ్లు, ఇతర సంస్థలకు అందాయి. ‘మీ భవనం చుట్టూ బాంబులు అమర్చాం. 24 గంటల్లోగా స్పందిస్తారా విధ్వంసాన్ని ఎదుర్కొంటారా’అని అందులో ఉంది. ఢిల్లీలోని ద్వారకాలో ఉన్న సీఆర్పీఎఫ్ పబ్లిక్ స్కూల్, కుతుబ్ మినార్ వద్దనున్న సర్వోదయ విద్యాలయకు ఇలాంటి బెదిరింపే అందిందని పోలీసులు తెలిపారు. ఇటీవల కాలంలో ఢిల్లీలోని పలు సంస్థలకు బాంబు హెచ్చరికలు అందుతుండటం, అవన్నీ వట్టిదేనని అధికారులు సోదాల అనంతరం ప్రకటిస్తుండటం తెల్సిందే. -
కాల్పుల విరమణ కుదరదు
న్యూఢిల్లీ: మావోయిస్టులతో కాల్పుల విరమణ ప్రతిపాదనను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరస్కరించారు. వారిపై దాడుల ఆపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ‘ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్’ను నిలిపివేయాలని, కాల్పుల విరమణకు తాము సిద్ధంగా ఉన్నామని మావోయిస్టులు 15 రోజుల క్రితం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. దీనిపై అమిత్ షా ప్రతిస్పందించారు. వారు ఆయుధాలు వదిలేసి లొంగిపోతామంటే కచ్చితంగా స్వాగతిస్తామని అన్నారు. ఆయుధాలు విడిచిపెట్టిన వారిపై భద్రతా బలగాలు ఒక్క తూటా కూడా పేల్చబోవని స్పష్టంచేశారు. మావోయిస్టుల ప్రతిపాదనపై అమిత్ షా మాట్లాడడం ఇదే మొదటిసారి. ఆదివారం జరిగిన ‘నక్సల్ ముక్త్ భారత్’ సదస్సులో అమిత్ షా ప్రసంగించారు. ఆయుధం చేతపట్టిన తీవ్రవాదులపై కాల్పులు ఆపాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టంచేశారు. కాల్పుల విరమణ ఉండదని అన్నారు. నిజంగా లొంగిపోవాలని కోరుకుంటే కాల్పుల విరమణతో సంబంధం లేదని సూచించారు. ఇటీవలి కాలంలో మావోయిస్టుల పేరుతో రకరకాల లేఖలు విడుదల చేస్తూ ప్రజలను గందరగోళ పరుస్తున్నారని ఆక్షేపించారు. కాల్పుల విరమణతో సంబంధం లేకుండా లొంగిపోవచ్చని పేర్కొన్నారు. లొంగిపోయే మావోయిస్టులకు రెడ్ కార్పెట్తో స్వాగతం పలుకుతామని, ఆకర్శణీయమైన పునరావాస ప్యాకేజీ ఇస్తామని వెల్లడించారు. అభివృద్ధిని అడ్డుకుంటున్న రెడ్ టెర్రర్ దేశంలో వామపక్ష తీవ్రవాదానికి కమ్యూనిస్టు పార్టీలు సైద్ధాంతిక మద్దతు ఇస్తున్నాయని అమిత్ షా ఆరోపించారు. ప్రభుత్వాలు దేశ అభివృద్ధిపై దృష్టి పెట్టకపోవడం వల్లే మావోయిస్టులు పుట్టుకొస్తున్నారంటూ కమ్యూనిస్టులు చేస్తున్న వాదనను ఖండించారు. నిజానికి మావోయిస్టుల హింసాకాండ కారణంగానే అభివృద్ధి ఫలాలు దేశంలో కొన్ని ప్రాంతాలకు దశాబ్దాలుగా చేరడం లేదని ఆరోపించారు. అభివృద్ధిని రెడ్ టెర్రర్ అడ్డుకుంటోందని మండిపడ్డారు. నక్సలైట్లు హత్యలు చేయకుండా, హింసకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకుంటే నక్సలిజం అంతమవుతుందని కొందరు చెబుతున్నారని, అందులో ఎంతమాత్రం వాస్తవం లేదని ఉద్ఘాటించారు. సమాజంలోని వ్యక్తులు తెరపైకి తీసుకొచి్చన సిద్ధాంతం వల్లనే నక్సలిజం పెరిగిందని గుర్తుచేశారు.నక్సల్స్ బాధితుల హక్కుల సంగతేమిటి? వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ నాటికి నక్సలిజం నుంచి దేశానికి విముక్తి కల్పిస్తామని అమిత్ షా ప్రకటించారు. ఆయుధాలతో అడవుల్లో సంచరిస్తున్న వ్యక్తులకు గిరిజనుల బతుకుల గురించి ఎలాంటి పట్టింపు లేదని ఆక్షేపించారు. దేశ ప్రజలు ఇప్పటికే తిరస్కరించిన వామపక్ష సిద్ధాంతాన్ని బతికించుకోవడానికి మావోయిస్టులు ఆరాటపడుతున్నారని ఎద్దేవా చేశారు. నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ను వెంటనే ఆపాలంటూ సీపీఐ, సీపీఎం లేఖలు రాయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. నక్సల్స్ బాధితుల హక్కుల గురించి వీరు ఎందుకు మాట్లాడడం లేదని మండిపడ్డారు. 1960వ దశకం నుంచి వామపక్ష తీవ్రవాదం వల్ల ప్రాణాలు కోల్పోయినవారికి అమిత్ షా నివాళులరి్పంచారు. పశుపతినాథ్ నుంచి తిరుపతి దాకా అంటూ నక్సలైట్లు జపం చేస్తున్నారని, అది చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. జమ్మూకశీ్మర్ను కాపాడాలన్న లక్ష్యంతో ఆరి్టకల్ 370ని రద్దుచేశామని, ఆ తర్వాత అక్కడ భద్రతా సిబ్బంది మరణాలు 65 శాతం, సాధారణ పౌరుల మరణాలు 77 శాతం తగ్గిపోయాయని అమిత్ షా స్పష్టంచేశారు. -
అమెరికాకు వెళ్లాలా?
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక.. ‘డాలర్ డ్రీమ్స్’కి బ్రేకులు పడటం మొదలయ్యాయి. కొత్తగా పెట్టిన హెచ్–1బీ వీసా ‘లక్ష డాలర్ల’ నిబంధన.. పెద్ద స్పీడ్ బ్రేకర్ అంటున్నారు నిపుణులు. ఇప్పటికే అమెరికాకు వెళ్లే భారతీయుల సంఖ్య ఈ ఏడాది గణనీయంగా తగ్గింది. 2024 మొదటి 8 నెలలతో పోలిస్తే.. 2025లో ఆగస్టు వరకు అమెరికా వెళ్లిన వారి సంఖ్య 4.3 శాతం తగ్గింది. ప్రత్యేకించి ఆగస్టులో ఇది ఏకంగా 14.8 శాతం తగ్గింది. గతంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా ఈ సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉంది.అమెరికా అంతర్జాతీయ వాణిజ్య విభాగం (యూఎస్ ఐటీఏ) గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది మొదటి 8 నెలల్లో... విద్యార్థి వీసాపై అమెరికా వెళ్లిన భారతీయులు 1,77,435. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 26.1 శాతం తక్కువ. ఇక పర్యాటక వీసాల మీద వెళ్లినవారు 9.98 లక్షలు. గతేడాది మొదటి 8 నెలలతో పోలిస్తే ఇది 2.7 శాతం తక్కువ.ఏయే వీసా మీద ఎంతమంది?ప్రత్యేకించి విద్యార్థి వీసా మీద అమెరికా వెళ్లే వారి సంఖ్య.. 2024 ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో 44.5 శాతం తగ్గిపోయింది. పర్యాటక, విద్యార్థి వీసాలపై వెళ్లినవాళ్లు తగ్గడంతో మొత్తం సంఖ్యలోనూ భారీ తగ్గుదల నమోదయింది. యూకే తరవాత మనమేయూఎస్ ఐటీఏ గణాంకాల ప్రకారం.. గత రెండేళ్లలో ఆగస్టు నెలలో అమెరికాకు వచ్చిన విదేశీ విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే.. ఈ ఏడాది ఆగస్టులో వీరి సంఖ్య భారీగా తగ్గిపోయింది. 2025లో ఆగస్టు వరకు చూస్తే.. యూకే తరవాత అమెరికాను అత్యధికంగా సందర్శించింది భారతీయులే. ఈ ఏడాది మొదటి 8 నెలల్లోమొత్తం 14.87 లక్షల మంది అమెరికాకు వెళ్లారు. 2024 జనవరి – ఆగస్టుతో పోలిస్తే ఇది 4.3 శాతం తక్కువ.ఈ ఏడాది తగ్గుతుందా?భారత ప్రభుత్వ బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ గణాంకాల ప్రకారం.. అమెరికాకు వెళ్తున్న భారతీయుల సంఖ్య 2022 నుంచి భారీగా పెరుగుతోంది. కానీ, ఈ ఏడాది గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయి. అమెరికా ఆర్థిక సంవత్సరం అక్టోబరు 1న ప్రారంభమై సెప్టెంబరు 30న ముగుస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరం 11 నెలల్లో యూఎస్ వెళ్లిన మొత్తం భారతీయులు సుమారు 19.4 లక్షలు. గతేడాది సెప్టెంబర్లో 1.81 లక్షల మంది వెళ్లారు. ఈసారి సెప్టెంబరులో ఈ సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం సంఖ్య 21 లక్షలు దాటకపోవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. -
కాంకేర్ జిల్లాలో ఎన్కౌంటర్
ఛత్తీస్గఢ్: కాంకేర్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది.ఆదివారం భద్రతగా బలగాలకు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు దుర్మరణం చెందారు. భద్రతా బలగాలు,మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. -
పండుగలకు స్వదేశీ శోభ
సాక్షి, న్యూఢిల్లీ: స్వదేశీ ఉత్పత్తులతో పండుగలకు కొత్త శోభ తీసుకురావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. స్వదేశీ స్ఫూర్తితో యువత ముందడుగు వేయాలని, స్థానిక ఉత్పత్తులనే కొనుగోలు చేసి ‘వోకల్ ఫర్ లోకల్’ ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలవాలని కోరారు. ఆదివారం ‘మన్ కీ బాత్’ 126వ ఎపిసోడ్లో ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి రేడియోలో ప్రసంగించారు. రానున్న పండుగల వేళ స్వదేశీ వస్తువులనే ఉపయోగించుకోవాలని సూచించారు. స్వాతంత్య్ర సమరయోధుడు షహీద్ భగత్ సింగ్, గానకోకిల లతా మంగేష్కర్లకు వారి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు. అలాగే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) సేవలను ప్రధానమంత్రి కొనియాడారు. మోదీ ప్రసంగం ఆయన మాటల్లోనే... ‘వోకల్ ఫర్ లోకల్’కు పెద్దపీట అన్ని రంగాల్లో మనం స్వయం సమృద్ధి సాధించాలి. ఆత్మనిర్భరతే మన మంత్రం. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క ఖాదీ ఉత్పత్తి అయినా కొనుగోలు చేసి ధరించాలి. ఇది స్వదేశీ ఉత్పత్తి అని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకోవాలి. గత 11 ఏళ్లలో ఖాదీ ఉత్పత్తుల అమ్మకాలు గణనీయంగా పెరగడం మన ఆత్మనిర్భరతకు నిదర్శనం. యువ పారిశ్రామికవేత్తలు సంప్రదాయ నైపుణ్యాలకు ఆధునికతను జోడించి అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఛట్ మహాపర్వ్కు అంతర్జాతీయ గుర్తింపు! రాబోయే ఛట్ పూజ, విజయదశమి, దీపావళి పండుగల సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కోల్కతా దుర్గా పూజ మాదిరిగా ఛట్ మహాపర్వ్ను కూడా యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్పించేందుకు ప్రభుత్వం ప్రయతి్నస్తోంది. తద్వారా ఈ పండుగకు అంతర్జాతీయ గుర్తింపు లభించనుంది. పండుగల సమయంలో ప్రతి ఒక్కరూ కేవలం స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేయాలి. తద్వారా స్థానిక చేతివృత్తుల వారికి, పారిశ్రామికవేత్తలకు చేయూతనివ్వాలి. భగత్సింగ్, లతా మంగేష్కర్కు నివాళులు ఈ రోజు ఇద్దరు గొప్ప వ్యక్తుల జయంతి. ఒకరు షహీద్ భగత్ సింగ్, మరొకరు మనందరి ప్రియమైన లతా దీదీ. భగత్ సింగ్ గుండెనిబ్బరం, ధైర్యసాహసాలు, దేశభక్తి మన యువతకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే. ఉరిశిక్షకు ముందు కూడా తనను, తన సహచరులను యుద్ధ ఖైదీలుగా పరిగణించి, తుపాకీతో కాల్చి చంపాలని బ్రిటిష్ వారికి లేఖ రాయడం భగత్సింగ్ అకుంఠిత ధైర్యానికి నిదర్శనం. లతా మంగేష్కర్ పాటలు భారతీయ సంస్కృతి, సంగీతానికి జీవనాడి. దేశభక్తి గీతాలతో ప్రజల్లో ఆమె ఎంతో స్ఫూర్తిని రగిలించారు. సంఘ్ వందేళ్ల ప్రయాణం స్ఫూర్తిదాయకం రానున్న విజయదశమి నాటికి రా్రïÙ్టయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)ను స్థాపించి 100 ఏళ్లు పూర్తి కానుండడం చాలా ప్రత్యేకం. నిస్వార్థ సేవ, క్రమశిక్షణ సంఘ్ అసలైన బలాలు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు దేశమే ప్రథమం. దేశ సేవకే వారు తొలి ప్రాధాన్యం ఇస్తారు. సంఘ్ వందేళ్ల ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం’’ అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. Sharing this month's #MannKiBaat. Do hear!https://t.co/oKMc16cIzt— Narendra Modi (@narendramodi) September 28, 2025సాహస నారీమణుల సముద్ర యానం భారత నౌకాదళానికి చెందిన ఇద్దరు సాహస మహిళా ఆఫీసర్లతో ప్రధానమంత్రి ఫోన్లో మాట్లాడారు. లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా, లెఫ్టినెంట్ కమాండర్ రూప.. వీరిద్దరూ తెరచాప పడవపై సముద్రంలో ఎనిమిది నెలల పాటు ఏకధాటిగా 47,500 కిలోమీటర్లు ప్రయాణించి ప్రపంచాన్ని చుట్టివచ్చారు. ‘నావిక సాగర్ పరిక్రమ’ యాత్రను విజయవంతంగా పూర్తిచేశారు. ‘‘ఈ యాత్ర మా జీవితాలను మార్చేసింది. 238 రోజుల పాటు మేమిద్దరమే పడవలో ఉన్నాం. మూడు అంతస్తుల భవనం అంత ఎత్తున ఎగసిపడే అలలను, అంటార్కిటికా వద్ద 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతను, గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను తట్టుకున్నాం’’ అని వారు తమ అనుభవాలను మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలతో పంచుకున్నారు. వారి సాహసాన్ని, టీమ్వర్క్ను ప్రధానమంత్రి అభినందించారు. -
ఢిల్లీ సీఎంతో కలిసి బతుకమ్మ ఆడిన ఉపాసన
మెగా హీరో రామ్చరణ్ సతీమణి, బిజినెస్ ఉమెన్ ఉపాసన (Upasana Konidela) బతుకమ్మ ఆడారు. తెలంగాణ పండుగను దేశరాజధాని ఢిల్లీలో సెలబ్రేట్ చేసుకున్నారు. ఢిల్లీలోని ఓ కళాశాలలో శనివారం (సెప్టెంబర్ 27న) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేఖా గుప్తతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సీజన్లో నా మొదటి బతుకమ్మను రేఖాగారితో జరుపుకున్నాను అంటూ అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో షేర్ చేశారు. కాలేజీ స్టూడెంట్స్తో బతుకమ్మఇందులో ఉపాసన, రేఖా గుప్త.. కాలేజీ విద్యార్థులతో కలిసి అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు కొడుతూ ఆడారు. పండుగ వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న సీఎం రేఖా.. ఆయా ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. బతుకమ్మ అంటే పూల పండగ మాత్రమే కాదు. మాతృత్వం, జీవితం, ప్రకృతిని సెలబ్రేట్ చేసుకోవడం..మాతో కలిసి బతుకుమ్మ జరుపుకున్నందుకు థాంక్స్ఢిల్లీలో ఉన్న తెలుగువారు ఈ నగర అభివృద్ధిలోనూ భాగమయ్యారు. తమ సంస్కృతికి కొత్తరంగులు అద్దారు. ఈ పండగ సందర్భంగా.. మనందరం మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలని, వాటిని తర్వాతి తరాలకు అందివ్వాలని ప్రతిజ్ఞ చేద్దాం అని పిలుపునిచ్చారు. ఈ పోస్ట్కు ఉపాసన స్పందిస్తూ.. రేఖా గుప్తాగారు మీరు అద్భుతమైన ముఖ్యమంత్రి. తెలంగాణ సంస్కృతిని సెలబ్రేట్ చేస్తూ, బతుకమ్మ పండగను మాతో కలిసి జరుపుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Rekha Gupta (@officialrekhagupta) Rekha Gupta ji you are an amazing CM. Thank you for embracing our Telangana culture and celebrating Bathukamma Panduga with us. Jai Hind. 🙏❤️ https://t.co/wY7xGYp9DS— Upasana Konidela (@upasanakonidela) September 27, 2025చదవండి: నేనేం తప్పు చేశానని..? డార్క్ రూమ్లో కూర్చుని ఏడ్చా: తమన్ -
ఢిల్లీ బాబా ఆగ్రాలో అరెస్ట్
న్యూఢిల్లీ/ఆగ్రా: ఢిల్లీలోని ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన 17 మంది విద్యార్థినులను వేధించిన ఆరోపణలను ఎదుర్కొంటున్న బాబా చైతన్యానంద సరస్వతి(62) జాడను ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు కనిపెట్టారు. ఆగ్రాలోని ఓ హోటల్లో బస చేసిన అతడిని ఆదివారం వేకువజామున అరెస్ట్ చేశారు. అతడి నుంచి ఒక ఐపాడ్, మూడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక ఫోన్లో ఢిల్లీలోని విద్యాసంస్థ క్యాంపస్, హాస్టల్లోని సీసీటీవీ ఫుటేజీని యాక్సెస్ చేసే సౌకర్యం ఉండటం గమనార్హం. ఈ ఫోన్ ద్వారానే విద్యార్థినుల కదలికలను చైతన్యానంద గమనించేవాడని పోలీసులు తెలిపారు. ప్రధానమంత్రి కార్యాలయంలో తనకు పరిచయస్తులున్నారని చెప్పుకుంటూ చైతన్యానంద, అతడి శిష్యులు అరెస్టుల నుంచి తప్పించుకుంటున్నారని పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. కేసు నమోదు కావడంతో అరెస్ట్ భయంతో ఆగస్ట్ 4వ తేదీన ఢిల్లీని దొంగచాటుగా వదిలిన చైతన్యానంద, ఇతడి శిష్యులు పోలీసుల కళ్లలో పడకుండా ట్యాక్సీల్లో ప్రయాణిస్తూ, చౌక హోటళ్లలో బస చేస్తూ బృందావన్, ఆగ్రా, మథుర తదితర ప్రాంతాల్లో తిరుగుతున్నారన్నారు. చైతన్యానంద వద్ద ఐక్యరాజ్యసమితి రాయబారిని, బ్రిక్స్ కమిషన్ సభ్యుడని చెప్పుకుంటూ ముద్రించిన రకరకాల నకిలీ విజిటింగ్ కార్డులు ఇతడి వద్ద స్వాధీనం చేసుకున్నారు. ఆగ్రా హోటల్లో ఈ నెల 27వ తేదీన సాయంత్రం 4 గంటలకు పార్థసారథి అనే పేరుతో చైతన్యానంద గది తీసుకున్నాడన్నారు. వేర్వేరు పేర్లతో ఇతడు తీసుకున్న రూ.8 కోట్ల బ్యాంకు అకౌంట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లను పోలీసులు స్తంభింపజేశారు. ఢిల్లీలోని మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్కు గతంలో చైర్మన్గా ఉన్న చైతన్యానంద మహిళా విద్యార్థినులను రాత్రి వేళ గత క్వార్టర్కు పిలిపించుకునే వాడు. రాత్రిళ్లు వారికి అసభ్యకర సందేశాలను పంపించేవాడు. తన ఫోన్లో వారి కదలికలను గమనించేవాడు. కేసు నమోదైనట్లు తెలిసిన తర్వాత బ్యాంకు నుంచి రూ.50 లక్షలను విత్డ్రా చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.ఐదు రోజుల పోలీస్ కస్టడీచైతన్యానంద సరస్వతిని ఢిల్లీ కోర్టు ఆదివారం ఐదు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. చైతన్యానంద పలువురు విద్యార్థినులను వేధించాడని, తన కోరిక తీర్చాలని ఒత్తిడి చేసేవాడని పలువురు బాధితులకు పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో ఆరోపించారు. విద్యార్థినుల బాత్రూంలలోనూ ఇతడు సీసీటీవీ కెమెరాలను అమర్చాడని బాధితుల తరఫు లాయర్లు ఆరోపించారు. సుమారు 16 మంది పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఇతడి బారిన 16 నుంచి 20 మంది విద్యార్థినులు పడ్డారన్నారు. వీరందరి స్టేట్మెంట్లు పోలీసులు రికార్డు చేశారని తెలిపారు. పోలీసుల విచారణకు సహకరించడం లేదని, ఐపాడ్, ఐక్లౌడ్ పాస్వర్డులను వెల్లడించడం లేదని ఆరోపించారు. అయితే, పోలీసులు తనను వేధించేందుకే కస్టడీ కోరుతున్నారని, నిజంగా తనతో ప్రమాదముంటే జ్యుడీషియల్ కస్టడీకి పంపించాలని చైతన్యానంద తరపు లాయర్ వాదించారు. వాదనలు విన్న డ్యూటీ మేజిస్ట్రేట్ రవి ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు. -
వాంగ్చుక్కు పాక్తో సంబంధాలు.. పక్కా ఆధారాలున్నాయి: డీజీపీ
లేహ్: లద్దాఖ్ పర్యావరణ ఉద్యమకారుడు, సామాజికవేత్త సోనమ్ వాంగ్చుక్ను పోలీసులు నిన్న(సెప్టెంబర్ 26 శుక్రవారం) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. లద్దాఖ్ రాజధాని లేహ్లో జరిగిన హింసాకాండలో నలుగురు మరణించగా, 70 మంది గాయపడ్డారు. యువతను రెచ్చగొట్టి హింసను ప్రేరేపించాడన్న కారణంతో జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద డీజీపీ ఎస్.డి.సింగ్ జమ్వాల్ ఆధ్వర్యంలో సోనమ్ వాంగ్చుక్ను ఆయన సొంత గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు.ఇదిలా ఉండగా.. సోనమ్ వాంగ్చుక్కు పాకిస్థాన్తో సంబంధాలున్నాయంటూ లద్దాఖ్ డీజీపీ ఎస్డీ సింగ్ జామ్వాల్ శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో సంచలన ప్రకటన చేశారు. పాక్తో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలిందన్న డీజీపీ.. పొరుగు దేశం బంగ్లాదేశ్ను కూడా ఆయన సందర్శించినట్లు లద్దాఖ్ డీజీపీ వెల్లడించారు. ఓ పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారితో వాంగ్చుక్కు సంబంధాలున్నాయని పేర్కొన్న డీజీపీ.. తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయంటూ స్పష్టం చేశారు. పాక్లో జరిగిన ఓ కార్యక్రమానికి కూడా వాంగ్చుక్ హాజరైనట్లు తేలిందన్నారు.కాగా, లద్దాఖ్లో అశాంతి, ఉద్రిక్తతలకు వాంగ్చుక్ కారణమంటూ కేంద్ర హోంశాఖ ఆరోపించిన సంగతి తెలిసిందే. అరబ్ వసంతం, నేపాల్ జెన్–జెడ్ ఉద్యమాల గురించి యువతకు నూరిపోస్తూ, వారిని రెచ్చగొట్టేలా ప్రకటనలు చేస్తూ హింసను ప్రేరేపిస్తున్నారని మండిపడింది. అయితే, కేంద్ర ప్రభుత్వం తనపై చేసిన ఆరోపణలను వాంగ్చుక్ ఖండించారు. హింస వెనుక తన ప్రమేయం లేదని తేల్చిచెప్పారు. -
10, 12 తరగతులకు ఎన్సీఈఆర్టీ జాతీయ స్థాయి సర్టిఫికెట్లు
న్యూఢిల్లీ: జాతీయ విద్యా పరిశోధన శిక్షణామండలి(ఎన్సీఈఆర్టీ)ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా బోర్డులకు సమానంగా వర్తించే 10, 12వ తరగతుల సర్టిఫికెట్లను జారీ చేయనుంది. ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలకు, ప్రభుత్వ ఉద్యోగాల ఎంపికకు ఇది ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు తెలిపారు. కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోని పాఠశాల విద్య, సాక్షరతా విభాగం ఈమేరకు ఈ–గెజిట్లో నోటిఫికేషన్ ప్రచురించింది. 10, 12వ తరగతుల సర్టిఫికెట్లను జారీ చేసే బాధ్యతను అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (ఏఐయూ)కు అప్పగిస్తూ 2021 నవంబర్ 15వ తేదీన జారీ చేసిన నోటిఫికేషన్ను ఇది భర్తీ చేయనుంది. జాతీయ విద్యా విధానం–2020 ప్రకారమే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, చట్ట ప్రకారం ఏర్పాటైన ప్రైవేట్ భారతీయ స్కూల్ బోర్డులకు ఈ విధానం వర్తిస్తుందని తెలిపింది. ఎన్సీఈఆర్టీ జారీ చేసిన సర్టిఫికెట్లను దేశవ్యాప్తంగా ఒకే రీతిలో పరిగణిస్తారు. దేశంలోని స్కూళ్లలో విద్యార్థుల వలసలు సజావుగా సాగటానికి ఇది తోడ్పడుతుందని ఎన్సీఈఆర్టీ స్పష్టం చేసింది. -
నాటో చీఫ్ వ్యాఖ్యలను ఖండించిన భారత్
న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై రష్యా వ్యూహం గురించి భారత ప్రధాని నరేంద్ర మోదీ.. రష్యా అధినేత పుతిన్కు ఫోన్చేసి ఆరా తీశారంటూ నాటో సెక్రెటరీ జనరల్ మార్క్ రుటే చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్ జైస్వాల్ శుక్రవారం ఖండించారు. రుటే వ్యాఖ్యలు ఆధారరహితం అని తేల్చిచెప్పారు. రష్యా నుంచి ముడి చమురు కొంటున్నందుకు భారత ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీగా టారిఫ్లు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ విషయంలో రష్యా వ్యూహం పట్ల మోదీ ఆసక్తి కనబర్చారని, ఇటీవల పుతిన్కు ఫోన్ చేసి ఆరా తీశారని మార్క్ రుటే చెప్పడం సంచలనం సృష్టించింది. జరగని సంభాషణ జరిగినట్లు మార్క్ రుటే ప్రకటించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని రణ«దీర్ జైస్వాల్ అన్నారు. ఆధారాలు లేకుండా మాట్లాడొద్దని రుటేకు హితవు పలికారు. ఉక్రెయిన్పై రష్యా వ్యూహం గురించి మోదీ తెలుసుకోలేదని స్పష్టంచేశారు. రష్యా నుంచి ముడి చమురు కొంటూనే ఉంటామని ఉద్ఘాటించారు. ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలు వద్దని సూచించారు. రష్యా నుంచి పశ్చిమ దేశాలు కూడా ముడి చమురు కొంటున్నాయని రణ«దీర్ జైస్వాల్ పరోక్షంగా గుర్తుచేశారు. -
లద్దాఖ్ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ అరెస్ట్
ఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ) లద్దాఖ్లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఉద్యమకారుడు, పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్చుక్ (Sonam Wangchuk)ను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం లద్దాఖ్లో జరిగిన అల్లర్లకు కారణం వాంగ్చుక్గా కారణంగా భావిస్తూ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. హింసను రెచ్చగొట్టినట్టు వాంగ్చుక్పై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో వాంగ్చుక్ ఎన్జీవో లైసెన్స్ను సైతం కేంద్రం రద్దు చేసింది.కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. ఆయన స్థాపించినస్వచ్ఛంద సంస్థ( SECMOL)కు విదేశీ నిధులు స్వీకరించే హక్కును కూడా రద్దు చేసింది. అరెస్టుకు ముందు వాంగ్చుక్ వ్యాఖ్యానిస్తూ.. ఈ ఉద్యమం కోసం అరెస్టయితే సంతోషంగా స్వీకరిస్తానన్నారు. లద్దాఖ్ రాష్ట్ర హక్కుల కోసం ప్రజలు చేపట్టిన నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారడంతో ప్రభుత్వం కర్ఫ్యూ విధించించిన సంగతి తెలిసిందే. దీంతో వాంగ్చుక్.. తాను చేపట్టిన రెండు వారాల దీక్షను కూడా ఆయన ముగించిన సంగతి తెలిసిందే.లద్దాఖ్కు తక్షణమే రాష్ట్ర హోదా కల్పించాలని, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగపరమైన భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ రాజధాని లేహ్లో జనం బుధవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా హింస ప్రజ్వరిల్లింది. ఆందోళనకారులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. బీజేపీ కార్యాలయానికి నిప్పుపెట్టారు. సీఆర్పీఎఫ్ వ్యాన్ సహా పలు వాహనాలను దహనం చేశారు. వీధుల్లో విధ్వంసం సృష్టించారు.ఇళ్లు, దుకాణాలపై దాడులకు దిగారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. లాఠీలకు పనిచెప్పారు. ఈ ఘటనలో నలుగురు మరణించారు. 70 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో పదుల సంఖ్యలో పోలీసులు సైతం ఉన్నారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం లద్దాఖ్లో కర్ఫ్యూ విధించింది. ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడొద్దని ఆదేశించింది. నిరసన ప్రదర్శనలు, ర్యాలీలకు అనుమతి లేదని, జనం ఇళ్ల నుంచి బయటకు రావొద్దని స్పష్టంచేసింది. పోలీసుల కాల్పుల్లో నలుగురు మరణించినట్లు ఆందోళనకారులు ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే వారు కాల్పులు జరిపినట్లు మండిపడ్డారు. -
తిరుమల లడ్డూ కేసు.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: తిరుమల లడ్డూ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ కేసులో సీబీఐ పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. తిరుమల లడ్డు కేసులో సిట్ పనిచేయడం ఆపేసిందా? అంటూ సీజేఐ ప్రశ్నించారు. ‘‘సిట్ వేరొక అధికారికి అధికారాలు బదలాయించకూడదా?. చిన్నప్పన్నను ఇంటరాగేషన్లో వేధిస్తే ఫిర్యాదు చేయొచ్చు కదా’’ అంటూ సీజేఐ వ్యాఖ్యానించారు.చిన్నప్పన్నకు సిట్లో లేని అధికారి నోటీసు ఇవ్వడం సుప్రీంకోర్టు ఆదేశాలను అతిక్రమించడమేనని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ సవాల్ చేసింది. జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం.. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించింది. ఏపీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. -
MiG-21: అల్విదా.. ఓ అద్భుతమా!
ఢిల్లీ: భారత వాయు సేనలో 62 ఏళ్ల పాటు సేవలు అందించిన తురుపుముక్క మిగ్-21కు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది. శుక్రవారం చండీగఢ్లోని వాయుసేన కేంద్రం వేదికగా జరిగిన కార్యక్రమంలో ఐఏఎఫ్ చీఫ్ ఏపీ సింగ్ సహా ఆరుగురు స్క్వాడ్రన్ లీడర్లు చివరిసారి పార్టీ నిర్వహించారు. ‘అద్భుతమైన ఎగిరే యంత్రంగా’.. మిగ్–21కు భారత రక్షణ రంగంలో పేరుంది. ఈ యుద్ధ విమానం 1963లో భారత వైమానిక దళంలోకి తొలిసారిగా ప్రవేశించింది. ఈ ఆరు దశాబ్దాల కాలంలో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) తన యుద్ధ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి.. 870కి పైగా మిగ్–21 విమానాలను రష్యా(పూర్వపు సోవియట్ యూనియన్) కొనుగోలు చేసింది. #WATCH | Chandigarh | MiG-21s receive a water gun salute as they decommission after 63 years in service. pic.twitter.com/cPWLHBDdzs— ANI (@ANI) September 26, 2025 VIDEO | MiG 21 Farewell: Surya Kiran aerobatics team of the IAF showcases spectacular manoeuvres during the farewell ceremony being held at the Chandigarh Air Force Station. #IAFHistory #MiG21 (Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/fsmn2ertjb— Press Trust of India (@PTI_News) September 26, 2025తక్కువ ఖర్చుతో.. బలమైన యుద్ధ సామర్థ్యం కలిగిన విమానాలుగా వీటికి పేరుంది. 1965, 1971 పాకిస్తాన్తో జరిగిన యుద్ధాల్లో మిగ్–21 విమానాలు పోషించిన పాత్ర అమోఘం. 1999 కార్గిల్ యుద్ధంలో, 2019 బాలాకోట్ వైమానిక దాడుల్లోనూ ఇది కీలక పాత్ర పోషించింది. గురువారం(సెప్టెంబర్ 25) అది తన చివరిసేవలు అందించింది. గాలిలో యుద్ధ గుర్రంలా పనిచేసిన ఈ విమానం, దాని భద్రతా ప్రమాణాల్లోనూ వార్తల్లో నిలవడం విశేషం. అందుకే కొందరు దీన్ని ‘ఎగురుతున్న శవపేటిక’.. అని కూడా అభివర్ణించేవారు కూడా. శుక్రవారం జరిగిన వీడ్కోలు కార్యక్రమానికి కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్, సీడీఎస్ జనరల్ అనిల్ చౌహన్, సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది, నావికాదళ అధిపతి అడ్మిరల్ దినేశ్ కె. త్రిపాఠి తదితరులు హాజరయ్యారు. సూర్య కిరణ్ ఎరోబెటిక్స్ బృందంతో పాటు స్క్వాడ్రన్ లీడర్ ప్రియాశర్మ ఈ ఈవెంట్కు స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచారు. -
ఓటుకు నోటు కేసు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రాజకీయ ప్రకంపలు సృష్టించిన ఓటుకు నోటు కేసు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో జెరూసలెం మత్తయ్య(Jerusalem Mattaiah) పాత్రపై దర్యాప్తు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ పిటిషన్పై నేడు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్(Justice BR Gavai) ధర్మాసనం తీర్పు వెల్లడించనుంది. 2015 ఓటుకు నోటు కేసులో మత్తయ్య ఏ4గా ఉన్నారు. అయితే ఈ కేసు నుంచి ఆయన పేరును క్వాష్ చేస్తూ ఉమ్మడి హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. అయితే ఈ కేసులో మత్తయ్యను దర్యాప్తు చేయాల్సి ఉందని పేర్కొంటూ తెలంగాణ సర్కార్ ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కానీ, ఈ కేసులో(Vote For Cash Case) అసలు సూత్రధారి చంద్రబాబు అని, ఆయన పైనే దర్యాప్తు జరపాలని మత్తయ్య అంటున్నారు. ఈ మేరకు ఆయన సుప్రీం కోర్టుకు ఓ లేఖ కూడా రాశారు.2015లో ఓటుకు నోటు కేసులో అప్పటి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి అరెస్ట్ కావడం సంచలనం సృష్టించింది. ఆనాడు ఆంగ్లో ఇండియన్ కోటాలో ఎమ్మెల్యేగా ఉన్నఎల్విస్ స్టీఫెన్సన్కు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు కోసం డబ్బు ఆఫర్ చేసినట్లు వీడియో ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. చంద్రబాబు ఆదేశాల మేరకే ఇదంతా జరిగిందన్న ప్రచారమూ ఒకటి ఉంది. ఈ కేసులో నేరానికి ప్రరేపితుడిగా(abettor)గా జెరూసలెం మత్తయ్య పేరును చేర్చారు. అయితే అప్పటి ఉమ్మడి హైకోర్టులో ఆయన పిటిషన్ వేయగా.. ఊరట దక్కింది. 2017లో తెలంగాణ ప్రభుత్వం, స్టీఫెన్సన్లు ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగానే.. తీర్పు వెలువడే వేళ ‘అంతా చంద్రబాబే చేశాడు’ అంటూ మత్తయ్య సంచలన ప్రకటన చేశారు. ఏసీబీ, తెలంగాణ ప్రభుత్వం ఈ కేసులో తనను బలిపశువును చేస్తున్నారంటూ అందులో తన ఆవేదన వ్యక్తం చేశారాయన. ఇదీ చదవండి: ఓటుకు నోటు కేసులో లోకేష్ పాత్ర.. సంచలన వ్యాఖ్యలు -
నూతన తేజస్సు
న్యూఢిల్లీ: భారత వైమానిక దళం(ఐఏఎఫ్) మరింత శక్తివంతంగా మారనుంది. అత్యాధు నిక యుద్ధ విమానాల రాకతో ఐఏఎఫ్ కొత్త తేజస్సును సంతరించుకోనుంది. ఏకంగా 97 తేజస్ ఎంకే–1ఏ తేలికపాటి యుద్ధ విమా నాల(ఎల్సీఏ) కొనుగోలుకు హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)తో భార త రక్షణ శాఖ గురువారం ఒప్పందం కుదు ర్చుకుంది. ఈ ఒప్పందం విలువ పన్నులు మినహా రూ.62,370 కోట్లు.తేజస్ యుద్ధ విమానాల కొనుగోలుకు ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ నెల రోజుల క్రితమే గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఒప్పందం ప్రకారం.. 2027–28 నుంచి యుద్ధ విమానాల అప్పగింత ప్రారంభమవు తుంది. ఆరేళ్లలోగా మొత్తం విమానాలను రక్షణ శాఖకు హెచ్ఏఎల్ అప్పగించాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. ఇందులో 68 ఫైటర్ జెట్లు, 29 ట్విన్ సీటర్ విమానాలు ఉన్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించాయి.ఏటా 11,750 మందికి ఉద్యోగాలు, ఉపాధి ప్రభుత్వ రంగంలోని హెచ్ఏఎల్తో ఇలాంటి భారీ ఒప్పందం కుదుర్చుకోవడం ఇది రెండోసారి. 2021 ఫిబ్రవరిలో రూ.48,000 కోట్లతో 83 తేజస్ ఎంకే–1ఏ ఫైటర్ జెట్ల కొనుగోలు కోసం హెచ్ఏఎల్తో రక్షణ శాఖ ఒప్పందం చేసుకుంది. 2021 కంటే ఈసారి తయారు చేయబోతున్న ఫైటర్ జెట్లు మరింత ఆధునికమైనవి. ఇందులో 64 శాతం దేశీయ పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానమే ఉంటుంది. అదనంగా 67 పరికరాలు చేర్చ బోతున్నారు. దేశీయంగా అభివృద్ధి చేసిన అడ్వాన్స్డ్ సిస్టమ్స్ను చేర్చనున్నారు. ప్రతి ఏటా ప్రత్యక్షంగా, పరోక్షంగా 11,750 మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తా యని అంచనా. మొత్తం ఆరేళ్లపాటు ఒప్పందం అమల్లో ఉంటుంది. ఆత్మనిర్భర్ లక్ష్యాని కి ఇదొక ప్రతీక అని అధికార వర్గాలు అభి వర్ణించాయి. ఆరు దశాబ్దాలకుపైగా సేవ లందించిన మిగ్–21 యుద్ధ విమానాలకు వీడ్కోలు పలుకుతూ వాటి స్థానంలో తేజస్ ఎంకే–1ఏ ఫైటర్ జెట్లను ప్రవేశపెట్టబో తున్నారు. నేడు మిగ్–21 జెట్లకు వీడ్కోలుఘనమైన చరిత్ర కలిగిన మిగ్–21 యుద్ధ విమానాలకు వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది. శుక్రవారం బైబై చెప్పబో తున్నారు. చండీగఢ్లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వేదిక కానుంది. -
జీఎస్టీ సంస్కరణలు ఆగవు..!
గ్రేటర్ నోయిడా/న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను(జీఎస్టీ)లో సంస్కరణలు ఇకపైనా కొనసాగుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రజలపై పన్నుల భారం మరింత తగ్గుతుందని, దేశ ఆర్థిక వ్యవస్థ బలం పుంజుకుంటుందని అన్నారు. జీఎస్టీలో నిర్మాణాత్మక సంస్కరణలు దేశ ఆర్థిక రంగానికి కొత్త రెక్కలు తొడుగుతున్నాయని వ్యాఖ్యానించారు. సంస్కరణల విషయంలో బలమైన సంకల్ప శక్తి మనకు ఉందని ఉద్ఘాటించారు. దేశంలో ప్రజాస్వామ్య, రాజకీయ స్థిరత్వం కొనసాగుతుండడం సానుకూల అంశాలని వివరించారు.గురువారం ఉత్తరప్రదేశ్లో ఇంటర్నేషనల్ ట్రేడ్ షో–2025ను మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తమ ప్రభుత్వం పన్నుల భారాన్ని క్రమంగా తగ్గిస్తోందని, ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తోందని అన్నారు. జీఓస్టీలో ఇటీవలే కొత్త సంస్కరణలు తీసుకొచ్చామని, దీనివల్ల దేశ ప్రజలకు ఈ ఏడాది రూ.రెండున్నర లక్షల కోట్ల మేర లబ్ధి చేకూరుతుందని వివరించారు. నేడు దేశమంతా ‘జీఎస్టీ ఆదా ఉత్సవాన్ని’ గర్వంగా నిర్వహించుకుంటోందని వ్యాఖ్యానించారు. ఇది ఇక్కడితో ఆగదని, ప్రజల ఆశీస్సులతో జీఎస్టీలో మరిన్ని సంస్కరణలు తీసుకొస్తామని తేల్చిచెప్పారు. ప్రధాని మోదీ ఇంకా ఏం చెప్పారంటే... అవరోధాలే మనకు కొత్త దారులు ‘‘గత ప్రభుత్వాలు పాలనలో విఫలమయ్యాయి. అప్పటి నిర్వాకాలను కప్పిపుచ్చుకోవడానికి మా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ పాలనలో సామాన్య ప్రజలపై విపరీతంగా పన్నులు విధించారు. ట్యాక్స్ లూటీ జరిగింది. ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. 2047 నాటికి ‘పూర్తిగా అభివృద్ధి చెందిన భారత్’ మన లక్ష్యం. ఆ దిశగానే దేశం పరుగులు తీస్తోంది. అంతర్జాతీయంగా పలు సవాళ్లు, అవరోధాలు ఉన్నప్పటికీ మన దేశం ఆకర్శణీయమైన ప్రగతి సాధిస్తోంది. అవరోధాలు మనకు అడ్డంకి కాదు. అవే మనకు కొత్త దారులు చూపిస్తున్నాయి.రాబోయే దశాబ్దాల కోసం ఇప్పుడే బలమైన పునాది వేస్తున్నాం. మన సంకల్పం ఆత్మనిర్భర్ భారత్. మన అవసరాలు తీర్చుకోవడానికి ఇతరులపై ఆధారపడడం కంటే నిస్సహాయత ఇంకేమైనా ఉంటుందా? రోజురోజుకీ మారుతున్న నేటి ప్రపంచంలో ఇతర దేశాలపై ఆధారపడితే అభివృద్ధి విషయంలో మనం రాజీపడాల్సి వస్తుంది. అందుకే మనం స్వయం సమృద్ధి సాధించాలి. మనం వాడుకొనే ప్రతి వస్తువూ ఇక్కడే తయారు కావాలి. మేడ్ ఇన్ ఇండియా సరుకులే మనం కొనుగోలు చేయాలి. రష్యాతో స్నేహబంధం బలోపేతం రష్యాతో మన స్నేహబంధం కాలపరీక్షకు నిలిచింది. రెండు దేశాల మధ్య రక్షణ సహకారం అవిచి్ఛన్నంగా కొనసాగుతోంది. ఈసారి ఇంటర్నేషనల్ ట్రేడ్ షోలో రష్యా సైతం భాగస్వామి. ఈ కార్యక్రమం ద్వారా రష్యాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటాం. రష్యా భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీలో ఏకే–203 రైఫిళ్ల తయారీ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఉత్తరప్రదేశ్లో డిఫెన్స్ కారిడార్ను అభివృద్ధి చేస్తున్నాం.ఇక్కడ బ్రహ్మోస్ క్షిపణులు, ఆయుధ వ్యవస్థల తయారీ ఇప్పటికే ప్రారంభమైంది. దేశంలో స్వావలంబనను బలోపేతం చేసే విధానాలు రూపొందించాలని వ్యాపారులు, వాణిజ్యవేత్తలు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలను కోరుతున్నా. సైనిక దళాలకు అవసరమైన ఆయుధాలు, రక్షణ వ్యవస్థల కోసం విదేశాలపై ఆధారపడడం తగ్గించుకోవాలి. మనకు కావాల్సినవి మన దేశంలోనే తయారు చేసుకుందాం. సైన్యం వాడుకొనే వస్తువులు, ఆయుధాలపై మేడ్ ఇన్ ఇండియా ముద్ర ఉండాల్సిందే’’ అని ప్రధాని మోదీ వివరించారు. ఆహార శుద్ధి రంగంలో పెట్టుబడులు పెట్టండిభారత ఆహార శుద్ధి రంగంలో పెట్టుబడులు పెట్టా లని అంతర్జాతీయ సంస్థలను ఆహ్వానిస్తున్నట్లు మోదీ చెప్పారు. దేశంలో ఈ రంగంలో వ్యాపారాభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. గత పదేళ్లుగా తమ ప్రభుత్వం ఆహార శుద్ధి రంగాన్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. ఉత్పత్తి అనుసంధాన పథకాలు ప్రవేశపెట్టామని, మెగా ఫుడ్ పార్కులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వీటివల్ల ఆహార శుద్ధి సామర్థ్యం 20 రెట్లు పెరిగిందని, ఎగుమతులు రెండు రెట్లు పెరిగాయని ఉద్ఘాటించారు. గురువారం ఢిల్లీలో ‘వరల్డ్ ఫుడ్ ఇండియా’ నాలుగో ఎడిషన్ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. శుద్ధి చేసిన ఆహారాన్ని నిల్వ చేయడానికి పర్యావరణహిత బయో డిగ్రేడబుల్ ప్యాకేజింగ్ తయారీలో సైతం పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరారు. విద్యుత్ ఉత్పత్తి అత్యవసరం విద్యుత్ ఉత్పత్తి ప్రాధాన్యతను గత కాంగ్రెస్ ప్రభుత్వాలు విస్మరించాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. 21వ శతాబ్దంలో ఏ దేశమైనా వేగంగా ప్రగతి సాధించాలంటే విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవడం అత్యవసరమని స్పష్టంచేశారు. గురువారం రాజస్తాన్లోని బనస్వర జిల్లాలో ఆయన పర్యటించారు. రూ.1.22 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఇందులో రూ.42,000 కోట్లతో నిర్మించనున్న అణు విద్యుత్ ప్రాజెక్టు కూడా ఉంది. ఈ సందర్భంగా బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు.కాంగ్రెస్ పాలనలో విచ్చలవిడిగా విద్యుత్ ఉండేదని, గ్రామాల్లో కనీసం ఐదు గంటలు కూడా కరెంటు సరఫరా అయ్యేది కాదని చెప్పారు. తగినంత విద్యుత్ లేకపోవడంతో కొత్త పరిశ్రమలు ఏర్పాటు కాలేదన్నారు. తమ ప్రభుత్వం వచి్చన తర్వాత విద్యుత్ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు. నేడు దేశవ్యాప్తంగా ప్రతి గ్రామానికీ విద్యుత్ సరఫరా అవుతోందని, ప్రజల జీవనం సులభతరంగా మారిందని అన్నారు. క్లీన్ ఎనర్జీలో ముందంజలో ఉన్న దేశాలు విజయవంతమైన దేశాలుగా కీర్తినందుకుంటాయని స్పష్టంచేశారు. బనస్వర జిల్లాలో ‘పీఎం–కుసుమ్’ పథకం లబ్ధిదారులతో ప్రధాని మోదీ సంభాషించారు. రైతుల అనుభవాలు అడిగి తెలుసుకున్నారు. నేడు బిహార్ పథకం ప్రారంభం బిహార్కు సంబంధించిన ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన’ను మోదీ శుక్రవారం ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద 75 లక్షల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లోకి రూ.10,000 చొప్పున బదిలీ చేస్తారు. మొత్తం రూ.7,500 కోట్లు విడుదల చేయబోతున్నారు. మహిళల సాధికారత, స్వావలంబనే లక్ష్యమని బిహార్ ప్రభుత్వం వెల్లడించింది. -
కాంగ్రెస్, బీఆర్ఎస్కు బీజేపీ ఫోబియా
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు బీజేపీ ఫోబి యా పట్టుకుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. సీఎంతో సహా ప్రతి ఒక్కరు బీజేపీపై ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కలిసి పనిచేశారని, ప దవులు పంచుకున్నారని గుర్తు చేశారు. అలాంటి వారు బీజేపీకి నీతులు, కథలు చెప్పాల్సిన పనిలేదన్నారు. కాశేళ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని సీబీఐ పరిశీలిస్తోందని, త్వర లో నిర్ణయం తీసుకుంటుందన్నారు. గురువారం ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. రాష్ట్రంలో పలు జాతీయ రహదారులు అభివృద్ధి, విస్తరణ పనులపై ఆయనతో చర్చించారు. అనంతరం తన నివాసంలో కిషన్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. 26 ప్రాజెక్టులు డీపీఆర్ స్టేజ్లో ఉన్నాయని.. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత.. ఎప్పుడు ప్రాజెక్టులు పూర్తవుతాయనే వివరాలు వెల్లడిస్తామన్నారు. రేవంత్ వ్యవహారం సరిగాలేదు.. ‘మెట్రో విస్తరణ విషయంలో సీఎం రేవంత్రెడ్డి వ్యవహారశైలిని సమంజసంగా లేదు. ప్రజాప్రతినిధిగా తెలంగాణ రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు రావాలని, ప్రజలకు మేలు జరగాలని కోరుకునే వ్యక్తుల్లో ముందు వరుసలో నేనుంటాను. నేను కానీ, కేంద్రం కానీ మెట్రో రాకుండా అడ్డుకోవడం లేదు. రీజినల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ మెట్రో విషయంలో అందరికంటే ముందే మేం చురుగ్గా వ్యవహరించాం. ట్రిపుల్ ఆర్కు ముందుగానే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. మెట్రో విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఆర్థిక సంస్థలు రుణాలు ఇస్తున్నప్పుడు చాలా విషయాలపై స్పష్టత కావాలని అడుగుతాయి. మెట్రో ఇప్పటికే నష్టాల్లో నడుస్తోంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. దీన్ని వారే తేల్చుకోవాలి. మెట్రో విషయంలో అన్ని రకాలుగా మా సహకారం ఉంటుంది’అని కిషన్రెడ్డి తెలిపారు. రూ.30,425 కోట్లతో 1,174 కిలోమీటర్లకుపైగా జాతీయ రహదారులు ‘కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఈ సంవత్సరం.. కొత్తగా 767 కిలోమీటర్ల మేర రూ.29,555 కోట్లు విలువైన వివిధ జాతీయ రహదారుల ప్రాజెక్టులను చేపట్టనుంది. దీనికి అదనంగా ఈ సంవత్సరం సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఐఆర్ఎఫ్) కూడా మంజూరయ్యాయి. తెలంగాణలో 422 కిలోమీటర్ల సీఐఆర్ఎఫ్ రోడ్డుకు రూ.868 కోట్లతో పనులు ప్రారంభం కానున్నాయి. మొత్తం కలిపి 1,174 కిలోమీటర్లకు గానూ.. రూ.30,425 కోట్ల విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టుల పనులు తెలంగాణలో ప్రారంభమవుతాయి. హైదరాబాద్–శ్రీశైలం రోడ్డు మార్గంలో భక్తులు, పర్యాటకుల సౌకర్యం కోసం.. 4లేన్ ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వే చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. హైదరాబాద్, కల్వకుర్తి మధ్యలో 4లేన్ కావాలని అడిగాం. దానిపై నిర్ణయం తీసుకుంటామని గడ్కరీ చెప్పారు’అని కిషన్రెడ్డి పేర్కొన్నారు. -
కేటీఆర్ అరెస్ట్ తప్పదు.. కవిత పంచాయతీ వేరే అంశం: టీపీసీసీ చీఫ్
సాక్షి, ఢిల్లీ: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీదే విజయమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు. సర్వేలో ఎవరు ముందుంటే వారికే సీటు అని క్లారిటీ ఇచ్చారు. కల్వకుంట్ల కవితది ఆస్తుల పంచాయతీ.. ఆమెకు ప్రజల్లో ఏం ఇమేజ్ ఉందని ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ అరెస్ట్ తప్పదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో మీడియా చిట్చాట్లో మాట్లాడుతూ..‘తెలంగాణలో ఏడాది కాలంలో ఎంతో పని చేశాం. గాంధీ భవన్లో మంత్రుల ముఖాముఖి కార్యక్రమం బాగా జరుగుతోంది. సంక్షేమం, అభివృద్ధి చేస్తున్నాం. జూబ్లీహిల్స్లో సామాజికవర్గం కాకుండా గెలుపు లక్ష్యం. నియోజకవర్గంలో సర్వేలు జరుగుతున్నాయి. సర్వేల్లో ఎవరు ముందుంటే వారికే టికెట్ దక్కుతుంది. అక్టోబర్ నాలుగో తేదీన 22 మంది అబ్జర్వర్లు తెలంగాణలో పర్యటిస్తారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ నాయకులకు చిత్తశుద్ది ఉంటే ఒక్కరోజులో బీసీ బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపొచ్చు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపైన సీబీఐ విచారణ జరిపితే బాగుంటుంది.కవితది ఆస్తుల పంచాయతీ. కాంగ్రెస్తో కవితకు ఏంటి సంబంధం. కవితకు ప్రజల్లో ఏం ఇమేజ్ ఉంది?. దోపిడీ చేసిన వారిని ప్రజలు ఎందుకు ఆదరిస్తారు. ఫోన్ ట్యాపింగ్ పెద్ద కేసు, అందరి వాయిస్లు రికార్డు చేశారు. నాది, రేవంత్ రెడ్డిది రెండున్నర ఏళ్ల నుంచి గత ప్రభుత్వం రికార్డు చేసింది. నేను వాడిన జియో సిమ్ కార్డు నెంబర్ జియో సంస్థకు గత ప్రభుత్వం ఇచ్చింది. జియో సంస్థకు రాసిన లేఖ కూడా దొరికింది. ఫోన్ ట్యాపింగ్ చేసి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచింది. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ అరెస్ట్ తప్పదు. క్లియర్ ఆధారాలు ఉన్నాయి’ అని చెప్పుకొచ్చారు. -
భారత్కు కొత్త అస్త్రం
సాక్షి, న్యూఢిల్లీ: భారత రక్షణ వ్యవస్థ అరుదైన ఘనత సాధించింది. అగ్ని ప్రైమ్ (Agni-Prime) క్షిపణి ప్రయోగాన్నివిజయవంతంగా పూర్తి చేసుకుంది. రైల్వే నెట్వర్క్ నుంచి సైతం ప్రయోగించగలడం ఈ క్షిపణి ప్రత్యేకత. రైలు ఆధారిత మొబైల్ లాంఛర్ వ్యవస్థ నుంచి క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం ఉదయం వెల్లడించారు. ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐల్యాండ్ నుంచి ఈ క్షిపణి ప్రయోగం జరిగింది. డీఆర్డీవో, Strategic Forces Command (SFC), భారత సైన్యం సంయుక్తంగా ఈ ప్రయోగం నిర్వహించాయి. దాదాపు 2,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని చేధించేలా ఈ అడ్వాన్స్డ్ అగ్ని క్షిపణిని రూపొందించినట్లు రక్షణ శాఖ చెబుతోంది. రైలు నెట్వర్క్పై ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండానే ఈ క్షిపణిని ప్రయోగించవచ్చని చెబుతోంది. ‘‘ఈ ప్రయోగం భారతదేశాన్ని అత్యాధునిక క్షిపణి వ్యవస్థలు కలిగిన దేశాల వర్గంలో నిలిపింది. ఈ సందర్భంగా డీఆర్డీవ, ఎస్ఎఫ్సీ, సైన్యానికి అభినందలు’’ అని రాజ్నాథ్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. India has carried out the successful launch of Intermediate Range Agni-Prime Missile from a Rail based Mobile launcher system. This next generation missile is designed to cover a range up to 2000 km and is equipped with various advanced features. The first-of-its-kind launch… pic.twitter.com/00GpGSNOeE— Rajnath Singh (@rajnathsingh) September 25, 2025 -
లేహ్ పరిణామాలు.. కేంద్రం సంచలన ఆరోపణలు
రాష్ట్ర హోదా, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ అమలు కోరుతూ గత కొంతకాలంగా కేంద్రపాలిత ప్రాంతం లడాఖ్లో జరుగుతున్న ఆందోళనలు.. ఒక్కసారిగా హింసాత్మక మలుపు తిరిగాయి. సోమవారం లేహ్లో నిరసనకారులకు, పోలీసులకు మధ్య చోటు చేసుకున్న ఘర్షణల్లో నలుగురు మృతి చెందగా.. 70 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ హింసకు ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ను బాధ్యుడిగా చేస్తూ కేంద్రం సంచలన ఆరోపణలకు దిగింది. ఎంతో మంది నేతలు సోనమ్ వాంగ్చుక్ను(Sonam Wangchuk) కలిసి నిరాహార దీక్షను విరమించమని కోరారు. అయినా ఆయన మొండిగా ముందుకు వెళ్లారు. అరబ్ స్ప్రింగ్ ఉద్యమం, నేపాల్లో తాజాగా జరిగిన Gen Z నిరసనలను ప్రస్తావిస్తూ అక్కడి ప్రజలను రెచ్చగొట్టారు. ఆయన ప్రసంగాల వల్లే రెచ్చిపోయిన కొందరు యువకులు బీజేపీ కార్యాలయంపై దాడి సహా పలు విధ్వంసాలకు పాల్పడ్డారు. లడాఖ్ యువతను ఉద్దేశపూర్వకంగానే తప్పుదోవ పట్టించారని, సంకుచిత రాజకీయాలకు.. వ్యక్తిగత లబ్ధికి వాళ్లు బలయ్యారని, కేంద్రం మాత్రం అక్కడి యువత సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొంది. అంతేకాదు.. ఈ హింస సహజంగా జరగలేదని.. కావాలని ప్రేరేపించారని, ఒక వ్యూహం ప్రకారం పక్కా ప్రణాళికాబద్ధంగానే జరిగిందని సంచలన ఆరోపణలు చేసింది కేంద్రం. ఈ ఘటనలపై ఇప్పటికే కొన్ని కీలక వర్గాలు సేకరించినట్లు చెబుతున్న కేంద్ర హోం శాఖ వర్గాలు.. అత్యున్నత దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేశాయి. 👉బుధవారం సాయంత్రం కల్లా లేహ్లో పరిస్థితి అదుపులోకి వచ్చిందని.. శాంతి భద్రతలను పునరుద్ధరించేందుకు కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని.. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొంది. లడాఖ్లో ప్రజల ఆకాంక్షలు తీర్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపింది. అయితే.. .. ‘ఇది లడాఖ్కు, నాకు వ్యక్తిగతంగా అత్యంత దుఃఖదాయకమైన రోజు. గత ఐదేళ్లుగా మేము శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నాం. కానీ ఈ రోజు హింస జరిగింది, ఇది మా శాంతి సందేశాన్ని విఫలమయ్యేలా చేసింది. మా యువత ప్రాణాలు కోల్పోతే దీక్షకు అర్థం ఉండదు. అందుకే దీక్షను వెంటనే విరమిస్తున్నాను’ అని సోనమ్ వాంగ్చుక్ ప్రకటించారు. అదే సమయంలో.. కేంద్రం చేసిన ఈ ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.👉తన ఈ ఉద్యమం వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని, లడాఖ్ ప్రజల హక్కుల కోసం మాత్రమేనని సోనమ్ వాంగ్చుక్ స్పష్టం చేశారు. నేపాల్ Gen Z ఉద్యమాన్ని ప్రస్తావించడం.. కేవలం ఇక్కడి జనాల్లో చైతన్యాన్ని పెంచేందుకు మాత్రమేనని, అది హింసకు ప్రేరణ ఇవ్వడం ఏమాత్రం కాదని అన్నారాయన. ఇప్పటిదాకా ఈ ఉద్యమం పూర్తిగా శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగానే సాగిందని గుర్తు చేశారు. లడాఖ్ హక్కుల విషయంలో కేంద్రంలోని బీజేపీ యూటర్న్, నిరుద్యోగ సమస్య.. ఈ పరిస్థితికి కారణమని విమర్శించారు. ‘‘ప్రభుత్వం ఇకనైనా మా శాంతి సందేశాన్ని వినాలి. పోలీసులు నిరసకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించడం ఆపాలి. శాంతి నిరసనలే మా మార్గం. హింస వల్ల మా లక్ష్యం దూరమవుతుంది. యువత కూడా కవ్వింపు చర్యలను మానాలి. ఇది మన ఉద్యమానికి హాని చేస్తుంది’’ అని పిలుపు ఇచ్చారాయన.సోనం వాంగ్చుక్ ఒక ప్రముఖ సామాజిక కార్యకర్త, విద్యావేత్త & పర్యావరణ పరిరక్షకుడు. ఆయన సెక్మోల్ (Students' Educational and Cultural Movement of Ladakh) అనే సంస్థను స్థాపించి సంప్రదాయ విద్యా విధానాలకు భిన్నంగా పిల్లలకు అనుభవాధారిత(ప్రాక్టికల్స్) విద్యను బోధించేవారాయన. తద్వారా విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. సోనం వాంగ్చుక్ విధానాల నుంచి ఇన్స్పిరేషన్తో.. 2009లో దర్శకుడు రాజ్కుమార్ హీరాణీ ‘త్రీ ఇడియట్స్’లో అమీర్ ఖాన్ ‘రాంచో’ పాత్రను రూపొందించారు. అంతేకాదు.. వినూత్న విద్యా విధానాలు, పర్యావరణ పరిరక్షణ, లడాఖ్ ప్రజల అభివృద్ధికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆసియా ప్రతిష్టాత్మక అవార్డు రామన్ మెగసెసే ఆయనకు దక్కింది కూడా.👉అయితే.. లడాఖ్కు రాష్ట్రహోదా కల్పించాలని, అలాగే ఆరవ షెడ్యూల్ (Sixth Schedule) అమలు చేయాలని సోనమ్ వాంగ్చ్క్ తన దీక్షను సెప్టెంబర్ 10, 2025న ప్రారంభించారు. పదిహేను రోజుల తర్వాత.. లడాఖ్లోని లేహ్ జిల్లా కేంద్రంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో దీక్షను మధ్యలోనే విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఆరవ షెడ్యూల్.. అనేది త్రిపుర, మేఘాలయ, మిజోరం మరియు అస్సాం రాష్ట్రాల్లోని గిరిజనుల పాలనకు ప్రత్యేకంగా రూపొందించబడిన రాజ్యాంగ అధికార పరిమితులు(Provision). ఆరవ షెడ్యూల్ అమలుతో గిరిజన ప్రాంతాలకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. భారత రాజ్యాంగంలోని Article 244 ప్రకారం.. స్థానిక స్వయం పాలన, భాష.. సంస్కృతి.. సంప్రదాయల రక్షణ, ప్రత్యేక న్యాయవ్యవస్థ, ఆర్థిక స్వాతంత్రం, విద్యా..ఉద్యోగాల్లో రిజర్వేషన్లు లభిస్తాయి. దీంతో లడాఖ్లోనూ దీనిని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఎపెక్స్ బాడీ లేహ్(LAB.. రాజకీయ సంఘాల సమ్మేళనం), కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్(KDA) గత నాలుగేళ్లుగా ఉద్యమిస్తున్నాయి. సోమవారం లేహ్లో చోటు చేసుసున్న హింసాత్మక ఘటనల్లో 50 మంది భద్రతా సిబ్బంది కూడా గాయపడ్డారు. కేంద్రం ఇప్పటికే అక్టోబర్ 6న లాబ్, కేడీఏ ప్రతినిధులతో హై పవర్డ్ కమిటీ సమావేశం నిర్వహించేందుకు సిద్ధంగా ఉందని తెలిపింది. గతంలో కూడా చర్చలకు ప్రయత్నించినప్పటికీ, సానుకూల స్పందన రాలేదని బుధవారం రాత్రి వెలువరించిన ప్రకటనలో పేర్కొంది. ఇదీ చదవండి: 'ఐ లవ్ మహ్మద్'పై కశ్మీర్ సీఎం స్పందన -
ఫిబ్రవరి 17 నుంచి సీబీఎస్ఈ పరీక్షలు
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలను నిర్వహించనున్నట్లు సీబీఎస్ఈ తెలిపింది. కీలకమైన ఈ పరీక్షలకు తాత్కాలిక టైమ్ టేబుల్ను బుధవారం ప్రకటించింది. ఒకే విద్యాసంవత్సరంలో పదో తరగతికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న తర్వాత సీబీఎస్ఈ నిర్వహించబోయే మొదటి పరీక్ష ఇదే కావడం గమనార్హం. పరీక్షల మొదటి ఎడిషన్ 2026 ఫిబ్రవరి 17 నుంచి మార్చి 6వ తేదీ వరకు, రెండో ఎడిషన్ షెడ్యూల్ మే 15 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు ఉంటుందని సీబీఎస్ఈ పరీక్షల కంట్రోలర్ సన్యమ్ భరద్వాజ్ చెప్పారు. -
లేహ్ లద్దాక్లో తీవ్ర ఉద్రిక్తత.. కేంద్రం సంచలన నిర్ణయం
ఢిల్లీ: లద్దాఖ్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ క్రమంలో నలుగురు మృతిచెందగా, 50 మందికిపైగా గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. లద్దాఖ్కు రాష్ట్ర హోదా ఇవ్వాలంటూ విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. లేహ్ నగరంలో ఆందోళన కారులు బీజేపీ కార్యాలయాన్ని తగలబెట్టారు. పోలీసులతో ఘర్షణకు దిగారు. పెద్ద సంఖ్యలో యువత నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ క్రమంలో నిరసనలపై కేంద్రం బ్యాన్ విధించింది. ఎలాంటి ఆందోళనలకు అనుమతి లేదని కేంద్రం స్పష్టం చేసింది.హింస చెలరేగడంతో లద్దాఖ్ ఉద్యమకారుడు, విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ తన 15 రోజుల దీక్ష విరమించారు. లద్దాఖ్కు రాష్ట్ర హోదా కోరుతూ జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో ఆయన దీక్షను ముగించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో నగరంలో ఆంక్షలు విధించారు. వాంగ్చుక్ మాట్లాడుతూ.. ఇది ‘జెన్-జెడ్ విప్లవం’గా అభివర్ణించారు. లద్దాఖ్ను 6వ షెడ్యూల్ కింద చేర్చాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ప్రదర్శనలపై నిషేధం విధించిన ప్రభుత్వం.. శాంతి భద్రతల దృష్ట్యా ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడే సమావేశాలు, ర్యాలీలపై నిషేధం విధించింది. ముందుగా అనుమతి లేకుండా ఎలాంటి ప్రకటనలు చేయరాదని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.జమ్మూకశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ను 2019 ఆగస్టులో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడంతో.. రాష్ట్ర హోదా, 6వ షెడ్యూల్ అమలు కోసం డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర హోదా, రాజ్యాంగపరమైన భద్రతలు కల్పించాలన్న డిమాండ్తో ఆందోళనకారులు లేహ్ రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు.#WATCH | Leh, Ladakh: Security heightened in Leh amid a protest by the people of Ladakh demanding statehood and the inclusion of Ladakh under the Sixth Schedule pic.twitter.com/dBIYbVPMwo— ANI (@ANI) September 24, 2025 -
Diwali Gift: రైల్వే ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్
న్యూఢిల్లీ: దసరా, దీపావళి పండుగల సందర్భంగా 10,91,146 మందికి పైగా రైల్వే ఉద్యోగులకు రూ. 1,865.68 కోట్ల ఉత్పాదకత సంబంధిత బోనస్ (PLB) చెల్లింపునకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమోదించారు. దీనిని దీపావళి కానుకగా రైల్వే ఉద్యోగులకు అందించనున్నారు.ఇది భారతీయ రైల్వేలోని 10.91 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చనుంది. ఇందుకోసం 2024-25 సంవత్సరానికి రూ. 1,866 కోట్ల భారాన్ని ప్రభుత్వం మోయనుంది. కేంద్ర మంత్రివర్గం గత ఏడాది అక్టోబర్ మూడున 11.72 లక్షలకు పైగా రైల్వే ఉద్యోగులకు ఉత్పాదకత-సంబంధిత బోనస్ చెల్లింపును ఆమోదించింది. రైల్వే సిబ్బంది పనితీరుకు గుర్తింపుగా 10,91,146 మంది ఉద్యోగులకు 78 రోజుల పనితీరు ఆధారిత బోనస్ (పీఎల్బీ) రూ.1,865.68 కోట్ల చెల్లింపునకు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.అర్హులైన రైల్వే ఉద్యోగులకు (Railway Employees) ఏటా దుర్గా పూజ/దసరా సెలవులకు ముందు పీఎల్బీని చెల్లిస్తారు. ఈ సంవత్సరం కూడా దాదాపు 10.91 లక్షల మంది నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సమానమైన పీఎల్బీ మొత్తాన్ని చెల్లించనున్నారు. రైల్వేల పనితీరు మెరుగుపడేలా కృషి చేసిన ఉద్యోగులకు ప్రేరణనిచ్చే ప్రోత్సాహకంగా పీఎల్బీ ఉపయోగపడనుంది. అర్హత కలిగిన ప్రతి రైల్వే ఉద్యోగికి 78 రోజుల వేతనానికి సమానమైన పీఎల్బీ కింద చెల్లించే గరిష్ట మొత్తం రూ.17,951. ఈ మొత్తాన్ని ట్రాక్ మెయింటెయినర్లు, లోకో పైలట్లు, రైలు గార్డులు, స్టేషన్ మాస్టర్లు, సూపర్వైజర్లు, సాంకేతిక నిపుణులు, సహాయకులు, పాయింట్స్ మన్, మినిస్టీరియల్ సిబ్బంది, ఇతర గ్రూప్- సి సిబ్బంది వంటి వివిధ కేటగిరీల్లోని రైల్వే సిబ్బందికి చెల్లిస్తారు. 2024-25లో రైల్వేలు రికార్డు స్థాయిలో 1,614.90 మిలియన్ టన్నుల సరుకును లోడ్ చేయడంతోపాటు దాదాపు 7.3 బిలియన్ల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి.వీటికి కూడా క్యాబినెట్ ఆమోదంపరిశోధనల ప్రోత్సాహానికి 2,277 కోట్ల రూపాయల కేటాయింపులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సిఎస్ఐఆర్ (CSIR) పథకం కింద మానవ వనరుల అభివృద్ధికి ప్రోత్సాహం కల్పించనున్నట్లు ప్రకటించింది. రీసెర్చ్ ఫెలోషిప్ లకు ప్రోత్సాహం అందించనున్నట్లు తెలిపింది. అత్యుత్తమ పరిశోధనలకు గుర్తింపు, ప్రమోషన్ అందించేలా క్యాబినెట్ ఒక పథకానికి రూపకల్పన చేసింది. -
లేహ్ లద్దాక్లో హైటెన్షన్.. బీజేపీ కార్యాలయానికి నిప్పు
ఢిల్లీ: లద్దాఖ్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. లద్దాఖ్కు రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. బీజేపీ కార్యాలయానికి నిప్పు పెట్టడంతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. లేహ్లోని బీజేపీ కార్యాలయంతో పాటు పోలీసు వాహనాలకు కూడా ఆందోళనకారులు నిప్పు అంటించారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో దీంతో బాష్పవాయువు ప్రయోగించి పోలీసులు.. నిరసనకారులను చెదరగొట్టారు.నలుగురి మృతి..నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. రాష్ట్ర హోదా, 6వ షెడ్యూల్ అమలు కోసం డిమాండ్ చేస్తున్న నిరసనకారులు.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే ఆందోళన చేస్తున్నామంటున్నారు. నగరంలో ఉద్రిక్తంగా మారిన నిరసనల నేపథ్యంలో నలుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. పలువురు గాయపడినట్లు తెలిపారు.#WATCH | Leh, Ladakh: BJP Office in Leh set on fire during a massive protest by the people of Ladakh demanding statehoothe d and the inclusion of Ladakh under the Sixth Schedule turned into clashes with Police. https://t.co/yQTyrMUK7q pic.twitter.com/x4VqkV8tdd— ANI (@ANI) September 24, 2025జమ్మూకశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ను 2019 ఆగస్టులో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడంతో.. రాష్ట్ర హోదా, 6వ షెడ్యూల్ అమలు కోసం డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర హోదా, రాజ్యాంగపరమైన భద్రతలు కల్పించాలన్న డిమాండ్తో ఆందోళనకారులు లేహ్ రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. -
పరారీలో ‘గలీజు’ బాబా చైతన్యానంద సరస్వతి
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో బాబా స్వామి చైతన్యానంద సరస్వతి(స్వామి పార్థసారథి)(Swami Chaitanyananda Saraswati)విద్యార్థినులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. విద్యార్థినులు తమ ఫిర్యాదులో బాబాపై సంచలన ఆరోపణలు చేశారు. దీంతో, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. కాగా, ప్రస్తుతం చైతన్యానంద సరస్వతి పరారీలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన స్వామి చైతన్యానంద సరస్వతి(స్వామి పార్థసారథి) ఢిల్లీలోని వసంత్కుంజ్( Vasant Kunj) ప్రాంతంలో శ్రీ శారద ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్ డైరెక్టర్గా ఉన్నారు. గత 12 ఏళ్లుగా ఆయన ఇక్కడే ఉంటున్నాడు. ఆర్థికంగా బలహీనవర్గాలకు చెందిన వారంతా ఉపకార వేతనాలతో ఈ విద్యాసంస్థలో చదువుకుంటున్నారు. అయితే, చైతన్యానంద సరస్వతి తమతో అసభ్య పదజాలాన్ని వాడుతూ దుర్భాషలాడటం, సందేశాలు పంపడమే కాకుండా లైంగికంగా వేధింపులకు గురిచేశాడని విద్యార్థినులు ఆరోపించారు.విద్యా సంస్థలో ఉన్న 32 మంది విద్యార్థుల్లో 17 మంది ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన చెప్పినట్టుగా నడుచుకోవాలని ఇతర మహిళా అధ్యాపకులు, ఇతర సిబ్బంది కూడా ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఆశ్రమంలో పనిచేసే వార్డెన్లే తమను నిందితుడికి పరిచయం చేశారని వాపోయారు. ఈ వాంగ్మూలాల ఆధారంగా తాము కేసు నమోదు చేశామని పోలీసు ఉన్నతాధికారి అమిత్ గోయల్ వెల్లడించారు. ఇక, ఈ వ్యవహారంలో సీసీటీవీ ఫుటేజీని కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్టు తెలిపారు. నిందితుడు ఉండే ప్రాంతంతో సహా బాధితులు పేర్కొన్న స్థలాల్లో తనిఖీలు చేశారు.ఇది కూడా చదవండి: యూపీలో సరికొత్త అధ్యాయం.. ఉమెన్ పోలీసింగ్ పవర్ ఇది..కాగా, విద్యార్థినుల ఫిర్యాదు తర్వాత చైతన్యానంద సర్వసతి కనిపించడం లేదు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని, చివరిగా అతడి లొకేషన్ను ఆగ్రా సమీపంలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అలాగే విద్యాసంస్థకు చెందిన బేస్మెంట్లో ఒక కారు గుర్తించిన పోలీసులు.. దానికి ఉన్నది నకిలీ నంబర్ ప్లేట్ అని వెల్లడించారు. ఇక, ఆయనపై ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు. 2009లో మోసం, లైంగిక వేధింపు కేసు నమోదైంది. 2016లో వసంత్ కుంజ్ ప్రాంతంలోని ఒక మహిళ కూడా ఈ తరహా వేధింపుల పైనే ఫిర్యాదు చేయడం గమనార్హం. -
మాకు దక్కాల్సిన వాటా 763 టీఎంసీలు: ఉత్తమ్
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు న్యాయంగా 763 టీఎంసీలు దక్కాలని, ఈ వాటాను రాబట్టుకునేలా జస్టిస్ బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదనలు వినిపిస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి చెప్పారు. కృష్ణా బేసిన్లో తెలంగాణలోని పరీవాహక ప్రాంతం, కరువు ప్రాంతాలు, జనాభా ప్రాతిపదికన వాటాలు ఇవ్వాలని కోరుతున్నట్లు వెల్లడించారు. ‘కృష్ణా నదీ జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్–2 ఉమ్మడి రాష్ట్రానికి మొత్తంగా 1,050 టీఎంసీల నీటిని కేటాయించింది. ఇందులో 75 శాతం డిపెండబులిటీ ఆధారంగా 811 టీఎంసీలు, 65 శాతం డిపెండబులిటీలో 49 టీఎంసీలు, సగటు ప్రవాహాల్లో 145 టీఎంసీలతోపాటు గోదావరి మళ్లింపు జల్లాల్లో 45 టీఎంసీలు కలిపి మొత్తంగా 1050 టీఎంసీలు కేటాయించింది. ఇందులో 70శాతం నీటిని తెలంగాణకు కేటాయించాలని కోరుతున్నాం. అందులో 75శాతం డిపెండబులిటీ కింద 555 టీఎంసీలు, 65 శాతం డిపెండబులిటీ కింద 43 టీఎంసీలు, సగటు ప్రవాహాల కింద 120, గోదావరి మళ్లింపు జల్లాల్లో 45 టీఎంసీలు కలిపి మొత్తంగా 763 టీఎంసీలు కోరుతున్నాం’అని ఉత్తమ్ తెలిపారు. మంగళవారం మొదలైన ట్రిబ్యునల్ విచారణకు మంత్రి స్వయంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఏపీకి జరిగిన 811 టీఎంసీలను ఎక్కువగా బేసిన్ బయట ఉన్నవాటికే కేటాయించారని, ఈ నీటిని తెలంగాణలోని కరువు పీడిత ప్రాంతాలకు అందించేలా న్యాయం చేయాలని ట్రిబ్యునల్ను కోరుతున్నామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు ఇవ్వాలని లిఖిత పూర్వకంగా రాసిచ్చారని, ఈ అన్యాయాన్ని సవరించాలని తాము కోరుతున్నామని చెప్పారు. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా దక్కే వరకు పోరాడుతూనే ఉంటామన్నారు. ఆల్మట్టిపై సుప్రీంలో కొట్లాడతాం కర్ణాటక నిర్ణయించిన ఆల్మట్టి ఎత్తు పెంపును సైతం తాము అడ్డుకుంటామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ విషయమై త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఏపీలో టీడీపీ, మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా నీటి వాటాల విషయంలో తెలంగాణ రాజీపడదని, ఎవరితోనైనా కొట్లాడతామని స్పష్టం చేశారు. -
ప్రజారోగ్య విప్లవం ఆయుష్మాన్ భారత్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ పథకానికి ఏడేళ్లు పూర్తయ్యాయి. ప్రజారోగ్య రంగంలో ఈ పథకం ఒక విప్లవం అని ప్రధాని నరేంద్ర మోదీ అభివరి్ణంచారు. భవిష్యత్తు అవసరాలను ముందే ఊహించి ఆయుష్మాన్ భారత్ను తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య చికిత్సలను చౌకగా అందించడమే లక్ష్యమని వివరించారు. దీనివల్ల ఆర్థిక భారం తగ్గుతోందని, ఎంతో వెసులుబాటు లభిస్తోందని అన్నారు. దేశ పౌరులు గౌరవప్రదమైన జీవితం కొనసాగించడానికి ఆయుష్మాన్ భారత్ తోడ్పడుతున్నట్లు హర్షం వ్యక్తంచేశారు. నిధుల వ్యయంతోపాటు సాంకేతిక పరిజ్ఞానంతో మానవాభివృద్ధిలో మనం సాధిస్తున్న ప్రగతికి ఇదొక ప్రతీక అని ఉద్ఘాటించారు. దేశవ్యాప్తంగా 55 కోట్ల మందికిపైగా ప్రజలు ఈ పథకం పరిధిలోకి వచ్చారని తెలిపారు. ఇప్పటిదాకా 42 కోట్లకుపైగా ఆయుష్మాన్ కార్డులు జారీ చేశామని పేర్కొన్నారు. ఈ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భరోసా పథకంగా మారిందని స్పష్టంచేశారు. ఆయుష్మాన్ భారత్ అమలుతో ప్రజారోగ్య రంగంలో ప్రభుత్వం చేస్తున్న ఖర్చు 29 శాతం నుంచి 48 శాతానికి పెరిగిందని వెల్లడించారు. అదేసమయంలో ఆరోగ్య సంరక్షణ కోసం ప్రజలు చేస్తున్న 63 శాతం నుంచి 39 శాతానికి తగ్గిపోయినట్లు ప్రధానమంత్రి తెలియజేశారు. ఆర్థిక భారం నుంచి లక్షలాది కుటుంబాలకు ఉపశమనం లభించిందని పేర్కొన్నారు. అనారోగ్యం పాలైతే ఆయుష్మాన్ భారత్ ఆదుకుంటోందని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకం 2018 సెపె్టంబర్ 23న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద పేదలతోపాటు 70 ఏళ్లు దాటిన వృద్ధులకు రూ.5 లక్షల వార్షిక ఆరోగ్య బీమాను కేంద్ర ప్రభుత్వం అందజేస్తోంది. ఆయుష్మాన్ భారత్ స్కీమ్తో ప్రతిఏటా ఆ రు కోట్లకుపైగా కుటుంబాలు పేదరికంలోకి జారిపోకుండా లబ్ధి పొందుతున్నాయని కేంద్రం వెల్లడించింది. -
చేసిందంతా చంద్రబాబే
సాక్షి, న్యూఢిల్లీ: ‘అంతా ఏపీ సీఎం చంద్రబాబే చేశారు.. ఓటుకు కోట్లు కేసులో అతనూ కీలక నిందితుడే. నన్ను స్టీఫెన్సన్ వద్దకు పంపడంలో రేవంత్తోపాటు ఆయనదీ కీలకపాత్ర. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పారీ్టకి ఓటేసేలా ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ఒప్పించాలని బలవంతం చేశారు. రూ. 5 కోట్లు ఆశ చూపాలని చెప్పా రు. కేసు నమోదయ్యాక పోలీసులకు దొరకకుండా నన్ను లోకేశ్ విజయవాడ తరలించారు. అత ని సన్నిహితుల సహకారంతో ఆరేడు నెలలు నిర్బంధించారు. ఈ కేసులో బాబు, లోకేశ్, ఏబీ వెంకటేశ్వరరావు సహా మరికొందరిని నిందితులుగా చేర్చి.. విచారణ చేపట్టాలి’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్కి నిందితుడు మత్తయ్య లేఖ రాశారు. చంద్రబాబు, లోకేశ్.. ఈ కేసులో చేసిన దారుణాలను వివరించారు. మంగళవారం ఆ లేఖను ఢిల్లీలోని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రిజిస్ట్రార్ (ఇన్వార్డ్)కు అందజేశారు. సుప్రీంకోర్టు లేదా మరేదైనా హైకోర్టులో కేసు విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. 17 అంశాలతో రాసిన లేఖలో ఆయన పేర్కొన్న వివరాల మేరకు.. చంద్రబాబు, రేవంత్లే పంపారు.. ‘ఓటుకు కోట్లు వ్యవహారంలోకి ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్లే నన్ను పంపారు. తీర్పును ప్రకటించే ముందు మరో సారి కేసుకు సంబంధించి పూర్తి వివరాలను క్షుణ్ణంగా చదవాలని కోరుతున్నా. కేసులో నా ప్రమేయంతోపాటు నేరానికి ప్రోత్సహించిన చంద్రబాబు, అతని కుమారుడు, మంత్రి లోకేశ్ ను కూడా నిందితులుగా చేర్చాలి. ఈ వ్యవహారంలో టీడీపీ నేతలు, పోలీసు అధికారులు, జడ్జీలు, న్యాయవాదులు, వారికి సహక రించిన ప్రతి ఒక్కరినీ నాతోపాటు సమగ్రంగా విచారించాలి. ఏసీబీ పోలీసుల దర్యాప్తులో అధికారిక సాక్ష్యాలు, చంద్రబాబు మాట్లాడిన రికార్డు.. దీని ఫోరెన్సిక్ నివేదిక, రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ రూ. 50 లక్షల నగదుపై దర్యాప్తు జరగాలి. చంద్రబాబు, రేవంత్ ప్రోద్బలంతోనే సెబాస్టియన్ను ఒప్పించా. 2016లో జరిగిన మహానాడులో చంద్రబాబు, రేవంత్లు నన్ను పిలిపించి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై మాట్లాడారు. టీడీపీ అభ్యరి్థకి ఓటు వేసేలా రూ. 5 కోట్లకు నాటి టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ఒప్పించాలన్నారు. ఈ వ్యవహారంలో నన్ను ప్రోత్సహించి, నాతో నేరం చేయించిన చంద్రబాబు, రేవంత్తోపాటు భాగ స్వాములైన వారందరిపై దర్యాప్తు చేసేలా ఆదేశాలు జారీ చేయండి’ అని మత్తయ్య విజ్ఞప్తి చేశారు. రేవంత్ను సీఎంగా తప్పించండి.. ‘ఈ కేసు విచారణ సజావుగా సాగి, నిజానిజాలు బయటకు రావాలంటే రేవంత్ను ముఖ్యమంత్రి హోదా నుంచి తప్పించాలి. నాతో సహా, నిందితులందరినీ విచారించేలా మళ్లీ విచారణకు ఆదేశించాలి. రేవంత్, వేం నరేందర్రెడ్డి, వేం కీర్తన్, ఉదయ్సింహా తదితరులు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో అధికార పదవుల్లో ఉన్నారు. వారు ఏసీబీ అధికారులను ప్రభావితం చేసే అవకాశమే ఎక్కువ. కేసులో వారి పాత్ర లేకుండా చేసేలా ఒత్తిడి తెస్తారు. దర్యాప్తులో వారి ప్రమేయం ఉండకుండా, తప్పుదోవ పట్టకుండా, ఏసీబీ అధికారులను ప్రభావితం చేయకుండా ఉండాలంటే.. ముందుగా వారిని పదవుల నుంచి తప్పించాలి. విచారణ ముగిసేదాకా పదవులకు దూరంగా ఉండేలా ఉత్తర్వులు జారీ చేయాలి. అంతేకాదు, ఈ కేసు సుప్రీంకోర్టు లేదా ఏపీ, తెలంగాణేతర హైకోర్టులకు బదిలీ చేసి విచారణ చేపట్టాలి’ అని మత్తయ్య కోరారు. లోకేశ్, అతని సన్నిహితులే నిర్బంధించారు ఈ కేసు నమోదైనప్పుడు తెలంగాణ పోలీసులకు నన్ను దొరకకుండా చేసేందుకు ప్రస్తుత ఏపీ మంత్రి నారా లోకేశ్ విశ్వప్రయత్నం చేశారు. ఆయన సన్నిహితులు కిలారి రాజేశ్, రేవంత్ అనుచరుడు జిమ్మీ బాబు, మరికొందరు కారులో నిర్బంధించారు. బలవంతంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు. ఆ సమయంలో కాళ్లూ, చేతులూ కట్టేయడంతోపాటు ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియకుండా ఉండేందుకు కళ్లకు గంతలు కట్టారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో సుమారు ఆరేడు నెలలు అజ్ఞాతంలో ఉంచారు. నా భార్య, పిల్లలకు, తల్లిదండ్రులకు చూపించకుండా.. నా కుటుంబానికి దూరం చేశారు. ఏపీలోని పలు ప్రదేశాల్లో చీకటి గదిలో బంధించి, అడవుల్లో తిప్పుతూ అప్పటి పోలీసులు, లోకేశ్ సన్నిహితులు తీవ్ర వేధింపులకు గురిచేశారు. నేను ఎక్కడికీ వెళ్లకుండా కాపలాగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఇంటెలిజెన్స్ నాటి అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, అప్పటి డీజీపీ, టాస్్కఫోర్స్ బృందాలు, కృష్ణా జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా సహకరించారు. వారందర్నీ నిందితులుగా చేర్చి, విచారించాలి. విజయవాడలోని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్పై ఫోన్ ట్యాపింగ్ కేసులో నాతో బలవంతంగా ఫిర్యాదు చేయించారు. 164 స్టేట్మెంట్పై బలవంతంగా సంతకం పెట్టించారు. వందకు పైగా తెల్ల కాగితాలపై బలవంతంగా సంతకాలు చేయించున్నారు. నా భార్యకు నామినేటెడ్ పదవి ఇస్తామని, అమరావతిలో ఇల్లు, వ్యాపారాభివృద్ధికి సహకరిస్తామని, పిల్లల చదువు, భవిష్యత్కు సహకరిస్తామని నమ్మించారు. అలా 164 స్టేట్మెంట్పై సంతకం చేయించారు. టీడీపీ న్యాయవాదులు కనకమెడల, దమ్మలపాటి, మరికొందరు ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాదులు వారికి సహకరించారు. లోకేశ్ టీం, టీడీ జనార్ధన్, చంద్రబాబు పీఏ శ్రీనివాస్, కేబినెట్ మంత్రులు, అందరినీ ఈ కేసులో నిందితులుగా చేర్చి పూర్తిగా విచారణ చేయాలి. నేను ఈ లేఖలో పేర్కొన్న విషయాలన్నీ హైకోర్టులో లేదా సుప్రీంకోర్టు విచారణలో ప్రత్యక్షంగా చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా. నాలుగేళ్ల క్రితం సుప్రీంకోర్టులో ‘‘పార్టీ ఇన్ పర్సన్’’గా పిటిషన్ వేశా. ఒక బాధ్యతగల పౌరుడిగా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఓటుకు కోట్లు కేసు నిందితుడిగా ఉన్నాను. చేసిన తప్పుకు సిగ్గుపడి పశ్చాత్తాపపడుతున్నా. తప్పు తెలుసుకొని నిజాలు చెప్పి ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నా. నన్ను అప్రూవర్గా అనుమతించండి’ అంటూ మత్తయ్య సీజేఐని అభ్యరి్థంచారు. -
డిజిటల్ అరెస్ట్తో రూ. 23 కోట్లు దోచేశారు.. నా జీవితం మీ అందరికీ హెచ్చరిక..!
తాము ఆఫీసర్లమని చెబుతూ డిజిటల్ అరెస్ట్ స్కామ్లు ఇటీవల కాలంలో మరింత పెరిగిపోయాయి. ఇప్పటికే డిజిటల్ అరెస్ట్ బారిన పడి కోట్లలో పోగోట్టుకున్నవారు అనేక మందిఉండగా, అతిపెద్ద డిజిటల్ అరెస్ట్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలో వెలుగుచూసిన ఈ ఘటనలో ఓ వృద్ధుడు రూ. 23 కోట్లును పోగొట్టుకున్నాడు. సౌత్ ఢిల్లీలోని గుల్మోహర్ పార్క్లో నివసించే రిటైర్డ్ బ్యాంకర్, 75 ఏళ్ల వృద్ధుడు నరేష్ మల్హోత్రాను ఏకంగా నెలకు పైగా డిజిటల్ అరెస్ట్ చేశారు. దాంతో ఆయన జీవితాంత పొదుపు చేసుకున్న రూ. 23 కోట్లను దోచేసుకున్నారు. నరేష్ మల్హోత్రాకు సౌత్ ఢిల్లీలోని గుల్మోహర్ పార్క్ ఒక భవనం ఉంది. అందులో ఒంటరిగా నివసిస్తున్నాడు. ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసేసి ఒంటరిగా జీవిస్తున్నారు. మరో ఇద్దరు కుమారులు విడివిడిగా నివసిస్తున్నారు. ఆయనకు నలుగురు మనవరాళ్ళు కూడా ఉన్నారు. అతని భార్య చనిపోవడంతో ఒంటరిగానే ఉంటున్నారు. అయితే ఆయన శస్త్రచికిత్స చేయించుకుని జూలై 4న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆగస్టు 1వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఎయిర్టెల్ మెయిన్ ఆఫీస్ పేరుతో ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది కూడా ఆ ఫోన్ కాల్ను మహిళ చేసింది. తన ల్యాండ్లైన్ నంబర్ హ్యాక్ చేశారని, ఆధార్ నంబర్ను ఉపయోగించి ముంబైలో ఒక నంబర్ తీసుకున్నట్లు తెలిపింది. తన ఆధార్ నంబర్ను ఉపయోగించి బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేశారని, ఈ ఖాతాల ద్వారా పుల్వామా కేసులో ఉగ్రవాదులకు ₹1,300 కోట్ల నిధులు సమకూర్చారని ఆ ఫోన్ చేసిన మహిళ తెలిపింది. దీనిలో భాగంగా ఎన్ఐఏ చట్టం అరెస్ట్ చేస్తామని నరేష్ మల్హోత్రాను భయపెట్టింది. మీ ఆస్తిని స్వాధీనం చేసుకుంటారు. మేము మిమ్మల్ని ముంబై పోలీస్ ప్రధాన కార్యాలయానికి కనెక్ట్ చేస్తున్నామని తెలిపింది. అనంతరం ఆ వృద్ధుడికి ఓ వీడియో కాల్ వచ్చింది. ఈ క్రమంలోనే నరేష్ మల్హోత్రాకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు, తదితర వివరాలు దోచేసింది ఆ మహిళ. తరువాత నరేష్ మల్హోత్రాపై నకిలీ చార్జిషీట్ తయారు చేసి పంపారు. ప్రతి రెండు గంటలకు తనను విచారిస్తామని ఆమె చెప్పింది. ఇది సీక్రెట్స్ యాక్ట్. మీరు ఎవరితోనూ మాట్లాడకూడదు. మీరు ఎవరితోనైనా మాట్లాడితే, మనీలాండరింగ్ నిరోధక ఆరోపణల కింద మిమ్మల్ని అరెస్టు చేస్తారని అని బెదిరించారు. ఇలా నెల రోజుల పాటు డిజిటల్ అరెస్ట్ చేశారు. ఈడీ, సీబీఐ, సుప్రీంకోర్టు , ఆర్బీఐ పేర్లను వాడుకుంటూ నెలరోజుల్లో రూ. 23 కోట్లు దోచేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది భారత దేశంలో అతిపెద్ది డిజిటల్ అరెస్ట్. ఈ డబ్బు విదేశాలకు వెళ్లినట్లు గుర్తించారు. అయితే రూ. 12.11 కోట్లను మాత్రం పోలీసులు సీజ్ చేశారు.నా జీవితం మీ అందరికీ హెచ్చరికఅయితే తాను దాచుకున్న డబ్బును ఇలా కొట్టేయడంపై నరేష్ మల్హాత్రా కన్నీటి పర్యంతమవుతున్నారు. తనకు ఈ వయసులో ఇలా జరగడం నిజంగా దురదృష్టమేనని, ఇది మిగతా అందరికీ ఒక హెచ్చరిక, మేలుకొలుపు అవుతుందన్నారు. తాను డిజిటల్ అరెస్ట్ మోసగాళ్లను నమ్మిన కారణంగానే ఇలా జరిగిందని, ఎవరూ కూడా తనలా మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు నరేష్ మల్హాత్రా. -
మీ నేత విగ్రహాల కోసం ప్రజాధనమా?
సాక్షి, ఢిల్లీ: ‘‘మీ నేతలను కీర్తించేందుకు ప్రజాధనాన్ని ఎలా వినియోగిస్తారు’’ అంటూ.. తమిళనాడు డీఎంకే ప్రభుత్వాన్ని(DMK Government) సుప్రీం కోర్టు నిలదీసింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహం(Karunanidhi Statue) ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేయగా.. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిధులను కరుణానిధి విగ్రహం కోసం ఉపయోగించడంపై సుప్రీం కోర్టు(Supreme Court Karunanidhi Statue) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో.. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్లతోకూడిన ధర్మాసం తమిళనాడు ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది. ‘‘అసలు విగ్రహ ఏర్పాటునకు ప్రభుత్వ నిధులను ఎందుకు ఉపయోగించాలి?. మీ మాజీ నేతలను కీర్తించడానికి ప్రభుత్వ నిధులను ఎందుకు ఖర్చు చేయాలి?’’ అని ప్రశ్నలు గుప్పించింది. ఈ క్రమంలో.. గతంలో మద్రాస్ హైకోర్టు(Madras High Court) ఇచ్చిన ఉత్తర్వును సమర్థిస్తూ ప్రభుత్వ పిటిషన్ను కొట్టేసింది. అలాగే.. రాష్ట్ర ప్రభుత్వం తన అభ్యర్థనను ఉపసంహరించుకుని మళ్లీ హైకోర్టునే ఆశ్రయించాలని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసిందితిరునల్వేలి జిల్లాలోని వల్లియూర్ డైలీ వెజిటబుల్ మార్కెట్ ప్రధాన రహదారిలో ఉన్న పబ్లిక్ ఆర్చ్ ప్రవేశ ద్వారం వద్ద దివంగత నేత కరుణానిధి కాంస్య విగ్రహం, నేమ్ బోర్డును ఏర్పాటు చేయాలని తమిళనాడు ప్రభుత్వం భావించింది. అయితే.. అది ప్రభుత్వ స్థలం. పైగా గతంలో హైకోర్టు ఈ తరహా నిర్మాణాలపై కఠినమైన మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వానికి కోర్టుల పర్మిషన్ అవసరం పడింది. అందుకే.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. అయితే.. పబ్లిక్ ప్లేసుల్లో విగ్రహాలు, నేమ్ బోర్డులు వంటి నిర్మాణాలతో ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రజలకు అసౌకర్యం, పైగా భద్రతాపరమైన సమస్యలు తలెత్తవచ్చని అభిప్రాయపడుతూ మద్రాస్ హైకోర్టు నిరాకరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. అయితే అక్కడా డీఎంకే ప్రభుత్వానికి చుక్కెదురైంది. ‘‘ప్రభుత్వ నిధులు ప్రజల అవసరాలకు ఉపయోగించాలి.. వ్యక్తిగత కీర్తి కోసం కాదు. పబ్లిక్ ప్లేస్లో విగ్రహాలు ట్రాఫిక్, భద్రత, ప్రజా అసౌకర్యానికి దారితీయవచ్చు. ప్రజల హక్కులను రక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే’’ అని ఇటు హైకోర్టు, ఆ తీర్పును సమర్థిస్తూ సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదీ చదవండి: పరువు నష్టం కేసులు.. ఇక ఆ టైం వచ్చింది! -
పరువు నష్టం నేరం కాదు: సుప్రీం కోర్టు వ్యాఖ్య
న్యూఢిల్లీ: పరువు నష్టం కేసుల(Defamation Cases)ను నేరరహి తంగా చూడాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు ‘ది వైర్’అనే ఆన్లైన్ పబ్లికేషన్ సంస్థపై పరువు నష్టం కేసు వేశారు(The Wire Defamation Case). ఈ మేరకు మేజిస్ట్రేట్ కోర్టు ది వైర్కు సమన్లు జారీ చేయగా, ఢిల్లీ హైకోర్టు దానిని సమర్థించింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ‘ది వైర్’వేసిన పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా జస్టిస్ ఎంఎం సుందరేశ్(Justice MM Sundaresh).. ‘ఇటువంటి ఆరోపణలు ఎదుర్కోవడం నేరం కాదని నిర్థారించాల్సిన సమయం వచ్చింది’ అంటూ వ్యాఖ్యానించారు. ది వైర్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ దీనిని సమర్థిస్తూ సంబంధిత చట్టంలో సంస్కరణలను చేపట్టాల్సిన అవసర ముందన్నారు. భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ) లోని సెక్షన్ 499 ప్రకారం పరువునష్టం కలిగించడం నేరం కాగా, దీనినే భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్) కూడా సెక్షన్ 356గా కొనసాగించింది. అయితే, న్యాయ మూర్తి సుందరేశ్ వ్యాఖ్యలు 2016లో సుబ్రమణ్య స్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు(Supreme Court) తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. పరువు నష్టం చట్టంలోని నిబంధనలకు రాజ్యాంగబద్థత ఉందని అప్పటి తీర్పులో సుప్రీంకోర్టు సమర్థించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే, గౌరవం పొందే ప్రాథమిక హక్కు కిందకు ఇది వస్తుందని తెలిపింది. ఇదీ చదవండి: కొందరు జడ్జిలు సరిగా పని చేయట్లేదు! -
కేంద్ర హోంమంత్రి అమిత్షా, సీజేఐకి ఎంపీ గురుమూర్తి లేఖ
ఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్ గవాయికి వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి లేఖ రాశారు. తిరుమల పరకామణి వివాదంపై సీబీఐతో దర్యాప్తు జరపాలని అమిత్ షాను గురుమూర్తి కోరారు. పరకామణి వివాదంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్ గవాయికి విజ్ఞప్తి చేశారు.‘‘పరకామణి వివాదానికి ఏపీ సర్కార్ రాజకీయ రంగు పులుముతోంది. వెంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలతో ఆటలాడుతోంది. 100 కోట్ల హిందువుల విశ్వాసాలతో చెలగాటమాడటం దారుణం. వివాదంపై పారదర్శక, నిష్పక్షపాత దర్యాప్తు అవసరం. మతాన్ని రాజకీయాల కోసం వాడుకోవడం రాజ్యాంగ విరుద్ధం. ఈ అంశంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి. జ్యూడిషియల్ విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలి’’ అని సుప్రీంకోర్టుకు రాసిన లేఖలో గురుమూర్తి పేర్కొన్నారు.‘‘రాజకీయ ప్రతీకారం కోసం తిరుమల పరకామణి వివాదాన్ని టీడీపీ ప్రభుత్వం వాడుకుంటుంది. ఏపీ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోంది. దేవాలయ ప్రతిష్టను మంటగలిపేందుకు విమర్శలు చేస్తున్నారు. భక్తుల విశ్వాసాలతో ఆటలాడుతున్నారు. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలి. నిష్పక్షపాత పారదర్శక విచారణతోనే సత్యం బయటపడుతుంది. రాజకీయ దురుద్దేశాలకు చెక్ పడుతుంది. ఈ అంశంపై సీబీఐ దర్యాప్తు జరిపి భక్తుల విశ్వాసాలను కాపాడాలి’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో గురుమూర్తి విజ్ఞప్తి చేశారు. -
జీఎస్టీ పొదుపు ఉత్సవం మొదలైంది
న్యూఢిల్లీ: తగ్గిన జీఎస్టీ పన్నుల కారణంగా దేశవ్యాప్తంగా మార్కెట్లు మొదలు ఇంటి ముంగిళ్ల దాకా ప్రజలకు ఖర్చులు తగ్గి పొదుపు ఉత్సవం మొదలైందని ప్రధాని మోదీ ఆనందం వ్యక్తంచేశారు. నగదు ఆదా ఉత్సవం ప్రతి ఒక్కరి ఇంట్లో పండుగ శోభను మోసుకొచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. శరన్నవరాత్రి ఉత్సవాల తొలి రోజునే జీఎస్టీ తగ్గుముఖం పట్టిందని, ఇది శుభసూచకమంటూ దేశ ప్రజలకు మోదీ సోమవారం బహిరంగ లేఖ రాశారు. ‘‘షాపింగ్ చేసే వాళ్లకు ఇది నిజంగా పండుగే. అన్ని మార్కెట్లలో, అందరి ఇళ్లలో నగదు ఆదా ఉత్సవం ఆరంభమైంది. నవ శకం జీఎస్టీ సంస్కరణలు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. సెపె్టంబర్ 22 నుంచి జీఎస్టీ సంస్కరణలు పొదుపు పెంచడంతోపాటు రైతులు, మహిళలు, యువత, పేదలు, మధ్య తరగతి, వ్యాపారులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల దాకా సమాజంలోని ప్రతి ఒక్క వర్గానికి ప్రయోజనం చేకూరుస్తున్నాయి. ఈ శుభతరుణంలో అందరం ఆత్మ నిర్భరత పథంలో కలిసి నడుద్దాం. 2047 ఏడాదికల్లా వికసిత్ భారత్ ఉమ్మడి లక్ష్యాన్ని సాధిద్దాం. ఈ సంవత్సరం పండుగల సీజన్ కొత్త సంతోషాలను మోసుకొచ్చింది. తగ్గిన జీఎస్టీతో ప్రజలు డబుల్ బొనాంజాను ఒడిసిపట్టారు. జీఎస్టీ సంస్కరణలు అద్భుతమైన ప్రగతికి, పెట్టుబడులకు బాటలు వేయనున్నాయి. దీంతో దేశంలోని ప్రతి రాష్ట్రం, ప్రాంతం అభివృద్ధిలో దూసుకుపోనుంది’’ అని మోదీ ఆ లేఖలో అభిలషించారు. పన్ను రహితం లేదా 5 శాతం ‘‘ఆహారం, ఔషధాలు, సబ్బులు, టూత్పేస్ట్, బీమా ఇలా మరెన్నో వస్తూత్పత్తులు ఇప్పుడు పన్నురహితంగా లేదా కేవలం 5 శాతం జీఎస్టీ శ్లాబులో అందుబాటులోకి వచ్చాయి. గతంలో 12 శాతం శ్లాబులో ఉన్న ఎన్నో ఉత్పత్తులు ఇప్పుడు 5 శాతం శ్లాబులోకి దిగొచ్చాయి. ఇవి ‘శ్లాబులు మారడానికి ముందు, ఆ తర్వాత రేట్లు’ అంటూ వ్యాపారులు తమ దుకాణాల ముందు బోర్డ్లు తగిలించడం చూస్తుంటే మనసుకు ఎంతో సంతోషంగా ఉంది. రూ.12 లక్షల వార్షికాదాయంపై సున్నా పన్నును అమలుచేసి మధ్యతరగతి ప్రజల చేతుల్లో నగదు నిలిచేలా చేశాం. ఇప్పుడు తగ్గిన జీఎస్టీ రేట్లు, అమలవుతున్న జీరో ఐటీ ట్యాక్స్తో ప్రజలకు రూ.2.5 లక్షల కోట్ల సొమ్ము ఆదా అయింది. దీంతో చిన్న ఇల్లు కట్టుకోవడం, కొత్త వాహనం కొనుక్కోవడం, గృహోపకరణాలు కొనుగోలుచేయడం, కుటుంబంతో కలిసి సరదాగా బయట భోజనం చేయడం వంటి ఆనందాలెన్నో సాకారమవుతున్నాయి’’ అని మోదీ ఆనందం వ్యక్తంచేశారు. This festive season, let's celebrate the 'GST Bachat Utsav'! Lower GST rates mean more savings for every household and greater ease for businesses. pic.twitter.com/QOUGWXrC3d— Narendra Modi (@narendramodi) September 22, 2025‘చిరు’వ్యాపారుల పెద్ద పండుగ ‘‘సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు జీఎస్టీ తగ్గింపుతో పండుగ కాంతుల్లో వెలిగిపోతున్నాయి. సులభతర వ్యాపారానికి అనువైన వాతావరణం నెలకొంది. తక్కువ ట్యాక్స్లు, తక్కువ ధరలు, అనువైన నిబంధనల కారణంగా వ్యాపారం ఊపందుకోనుంది. వ్యాపారాభివృద్ధి అవకాశాలు మెరుగయ్యాయి. స్థానిక ఉత్పత్తుల విస్తృతి పెరగనుంది. ఇది ఆత్మనిర్భర్ భారత్ దిశగా పెద్ద అడుగు’’ అని అన్నారు. కవరేజీ కమాల్ తగ్గిన జీఎస్టీతో ప్రజల కొనుగోళ్లు పెరగనున్నాయని, పౌరుల్లో హర్షాతిరేకాలు మిన్నంటాయంటూ సోమవారం పలు ప్రధాన హిందీ, ఇంగ్లిష్ దినపత్రికల్లో వచ్చిన కథనాలు, ప్రధాన వార్తలను ప్రధాని ప్రస్తావించారు. ‘తక్కువ ధరలు, ఎక్కువ ఆనందాలు’ అనే క్యాప్షన్ పెట్టి మోదీ పలు న్యూస్పేపర్ల ఫ్రంట్ పేజీలను తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. తగ్గిన జీఎస్టీతో వినియోగదారులకు భారీ ప్రయోజనం చేకూరనుందంటూ దైనిక్ భాస్కర్, దైనిక్ జాగరణ్, ఎన్బీటీ, హిందుస్తాన్, హరిభూమి, రాష్ట్రీయ సహారా సహా పలు ప్రధాన ఆంగ్ల పత్రికల తొలి పేజీ క్లిప్పింగ్లను మోదీ షేర్ చేశారు. -
నా రీల్స్ చూడటం తగ్గించండి సారూ.. ఢిల్లీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
ఢిల్లీ: తన రీల్స్ చూడటం ఆపండంటూ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwalపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా(Rekha Gupta) వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఈవీఎంల(EVMs)పై రేఖా గుప్తా మాట్లాడుతున్నట్లుగా ఓ ఎడిటెడ్ వీడియోను సామాజిక మాధ్యమంలో నిన్న(ఆదివారం) కేజ్రీవాల్ షేర్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన రేఖా గుప్తా.. తన వీడియోలు, రీల్స్ చూడటం తగ్గించి.. తన సొంత పార్టీపై దృష్టి పెట్టాలంటూ కేజ్రీవాల్కు చురకలు అంటించారు.ఎలక్ట్రిక్ బస్ డిపోకు శంకుస్థాపన చేసిన రేఖాగుప్తా.. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ.. "నేను కేజ్రీవాల్కు ఒకటి చెప్పాలనుకుంటున్నాను.. దయ చేసి నా వీడియోలు, ఇంటర్వ్యూలు, రీల్స్ చూడటం తగ్గించండి’’ అంటూ హితవు పలికారు. కేజ్రీవాల్ పంజాబ్ ప్రజలపై దృష్టి పెట్టాలి. అత్యంత ఘోరమైన వరద విపత్తును ఎదుర్కొన్న ఆ రాష్ట్రంలో బాధితులను ఆయన ఎప్పుడూ పరామర్శించలేదంటూ ఆమె విమర్శలు గుప్పించారు.ఇదీ చదవండి: బీహార్లో మూడు దశల్లో ఎన్నికలు.. ఎప్పుడంటే?‘‘ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలను వక్రీకరించినందుకు మీరు సిగ్గుపడాలి. మీరు 11 సంవత్సరాలు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు ఢిల్లీ అభివృద్ధిపై దృష్టి సారించి ఉంటే, ప్రజలు బాధలుపడేవారు కాదంటూ కేజ్రీవాల్పై రేఖాగుప్తా ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీపై కూడా ఢిల్లీ సీఎం తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. ‘‘కాంగ్రెస్ గెలిస్తే అది ప్రజల తీర్పు, మేము గెలిస్తే ఈవీఎంలు హ్యాక్ అయ్యాయా? ఈ ఫార్ములా ఎక్కడ రాసుంది? అంటూ ఆమె ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే’’ అంటూ రేఖా గుప్తా మండిపడ్డారు.दिल्ली की सीएम ये क्या कह रही हैं … pic.twitter.com/ZEf8RQVuzE— Arvind Kejriwal (@ArvindKejriwal) September 21, 2025 -
దురదృష్టకరం.. బాధ్యతారాహిత్యం!
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద నివేదికలోని కొన్ని అంశాలు ముందుగానే లీకవడం ‘దురదృష్టకరం, బాధ్యతారాహిత్యం’అంటూ సుప్రీంకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఫలితంగా ఘోర ప్రమాదానికి పైలట్ల తప్పిదాలే కారణమంటూ జూన్ 12వ తేదీన మీడియా చిలువలుపలువలుగా కథనాలు వచ్చాయని తెలిపింది. ప్రమాదంపై స్వతంత్ర, నిష్పాక్షిక సత్వర విచారణ చేపట్టాలని, బాధితుల వ్యక్తిగత గోప్యత, మర్యాదలకు భంగం కల్గించరాదని పేర్కొంటూ సోమవారం జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్ల ధర్మాసనం కేంద్ర ప్రభుత్వంతోపాటు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)కు నోటీసులు జారీ చేసింది. జూలై 12వ తేదీన ఎయిర్క్రాఫ్ట్ యాసిడెంట్ ఇన్వెసి ్టగేషన్ బ్యూరో(ఏఏఐబీ) ప్రాథమిక నివేదికలోని కొన్ని ఎంపిక చేసిన అంశాలను బహిర్గతం చేయడం దురదృష్టకరం, బాధ్యతారాహిత్యంగా అభివర్ణించింది. దీనిని ప్రత్యర్థి వైమానిక సంస్థలు స్వార్థానికి వాడుకునే ప్రమాదముందని తెలిపింది. సేఫ్టీ మ్యాటర్స్ ఫౌండేషన్ అనే సంస్థ తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలను వినిపించారు. ప్రాథమిక నివేదికలోని పైలట్ల తప్పిదముందని ఆరోపించే కేవలం ఒకే ఒక వాక్యం వల్లనే ప్రపంచవ్యాప్తంగా మీడియాలో కథనాలు వచ్చాయన్నారు. మిగతా అంశాలన్నీ మరుగున పడిపోయాయన్నారు. విషాదం చోటుచేసుకుని 100 రోజులు దాటినా ఇప్పటికీ అసలు కారణాలు వెల్లడి కాలేదని చెప్పారు. పైపెచ్చు, విచారణ కమిటీలోని ఐదుగురిలో ముగ్గురు డీజీసీఏకు చెందిన వారే ఉండటంతో నివేదికపై అనుమానాలకు తావిచ్చే అవకాశముందని తెలిపారు. విమానం ఫ్లైట్ డేటా రికార్డర్ను వెల్లడిస్తే ఘటనకు దారితీసిన కారణాలపై స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు. స్పందించిన ధర్మాసనం... స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తునకు డిమాండ్ చేయడం సబబుగానే ఉన్నా, ఫ్లైట్ డేటా రికార్డర్ సమాచారాన్ని డిమాండ్ చేయడం మాత్రం ప్రశ్నార్థకమని వ్యాఖ్యానించింది. ఫ్లైట్ డేటా రికార్డర్ వెల్లడైతే పరస్పర విరుద్ధ కథనాలు వచ్చే ప్రమాదముందని పేర్కొంది. ‘ఇటువంటి సందర్భాల్లో దర్యాప్తు పూర్తి అయ్యే వరకు నివేదికలోని అన్ని అంశాలను పూర్తి స్థాయిలో గోప్యంగా ఉంచాల్సిన అవసరముంది. అప్పటి వరకు మేం ఎదురుచూస్తాం’అని ధర్మాసనం తెలిపింది. ప్రమాదంపై కేంద్రం ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిటీ నివేదికలోని కొన్ని అంశాలను లీకవడంతో పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందంటూ వైమానిక రంగ నిపుణుడు కెప్టెన్ అమిత్ సింగ్ సారథ్యంలోని సేఫ్టీ మ్యాటర్స్ ఫౌండేషన్ సంస్థ ఈ పిటిషన్ వేసింది. ఫ్యూయల్ కటాఫ్ స్విఛ్లను ‘రన్’నుంచి ‘కటాఫ్’కు మార్చడం వల్లే ప్రమాదం జరిగిందని, ఇది పైలట్ తప్పిదమేనంటూ ఏఏఐబీ ప్రాథమిక నివేదికలోని కొన్ని అంశాలు జూలై 12వ తేదీన బయటకు రావడం తెల్సిందే. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్య
సాక్షి, ఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ కేసులో సోమవారం విచారణ సందర్భంగా.. సుప్రీం కోర్టు సిట్కు కీలక వ్యాఖ్య చేసింది. దర్యాప్తునకు ప్రభాకర్ రావు సహకరించడం లేదంటూ తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లడంపై కోర్టు స్పందించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 ప్రభాకర్ రావుకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను రద్దు చేయాలంటూ సిట్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం విచారణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ‘‘ప్రభాకర్ రావు సిట్ దర్యాప్తుకు సహకరించడం లేదు. ఫోన్ డివైస్లలో డాటా ఫార్మట్ చేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉండగానే ఫోన్ డివైస్లో సమాచారం ధ్వంసం చేశారని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL) నివేదిక కూడా ఇచ్చింది. జర్నలిస్టులు, జడ్జిల ఫోన్లను కూడా ఆయన టాప్ చేశారు. ప్రభుత్వ ఫోన్లో పాస్వర్డ్ సైతం చెప్పడం లేదు. ఈ తరుణంలో ఆయనకు అరెస్టు నుంచి కల్పించిన రక్షణను తొలగించాలి’’ అని విజ్ఞప్తి చేశారు. దీనికి ప్రభాకర్రావు తరఫు న్యాయవాది దామా శేషాద్రి నాయుడు స్పందిస్తూ.. ఇప్పటికే తన క్లయింట్ చాలాసార్లు సిట్ విచారణకు హాజరయ్యాని.. సహకరించడం లేదన్నదాంట్లో వాస్తవం లేదని అన్నారు. ఈ తరుణంలో ప్రభుత్వ ఆరోపణలపై స్పందించేందుకు రెండు వారాల సమయం కోరారాయన. దీంతో.. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 8వ తేదీకి వాయిదా వేసింది సుప్రీం కోర్టు. తదుపరి విచారణ దాకా ఆయనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని చెబుతూ.. మధ్యంతర ఊరటను పొడిగించింది. అలాగే విచారణకు సహకరించాల్సిందేనని ప్రభాకర్రావుకు కోర్టు స్పష్టం చేసింది. అదే సమయంలో.. ఇంటరాగేట్ చేసి ఆయన నుంచి సమాచారం రాబట్టాలని సిట్కు సూచించింది. -
దేశవ్యాప్తంగా వినియోగదారులకు ఊరట.. అమల్లోకి వచ్చిన జీఎస్టీ 2.0
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వినియోగదారులకు భారీ ఊరట కలిగిస్తూ.. జీఎస్టీ 2.0 సోమవారం అమల్లోకి వచ్చింది. నూతన శ్లాబ్ రేట్ల విధానం ద్వారా పన్ను శ్లాబ్లు సరళతరం కావడంతో.. ఇవాళ్టి నుంచి 375 రకాల వస్తువులపై ధరలు తగ్గనున్నాయి. ఇందులో మెడిసిన్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, వాహనాలు, సిమెంట్ ప్రధానంగా ఉన్నాయి.వంటగది సరకులు, ఎలక్ట్రానిక్స్, మందులు, వైద్య పరికరాలు, వాహనాలు, వ్యక్తిగత జీవిత- ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియం ధరలు తగ్గాయి. ఎఫ్ఎంసీజీ, వాహన, ఎలక్ట్రానిక్స్, డెయిరీ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను నేటి నుంచి తగ్గిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. మందులు, నిత్యావసరాల ప్యాక్లపై కొత్త ధరలు ముద్రించకున్నా.. విక్రయాల్లో మాత్రం తక్కువ ధరలు అమలు కావాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ తగ్గింపు వల్ల వ్యవస్థలోకి రూ.2 లక్షల కోట్ల నగదు వస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. ఈ తగ్గింపులు మధ్య తరగతి కుటుంబాలకు నెలవారీ ఖర్చుల్లో గణనీయమైన ఊరట లభించొచ్చు. అదే సమయంలో పండుగలపూట సాధారణంగానే డిస్కౌంట్లు ప్రకటించే కంపెనీల నిర్ణయంతో వినియోగదారులకు మరింత ఊరట దక్కే అవకాశం ఉంది. జీఎస్టీ 2.0లో ప్రధానంగా తగ్గినవి ఇవే:ఔషధాలు & వైద్య పరికరాలు36 జీవన రక్షక ఔషధాలపై జీరో జీఎస్టీసాధారణ మందులు 12% నుంచి 5%కి తగ్గింపుడయాగ్నస్టిక్ కిట్స్, గ్లూకోమీటర్లు – 5% GSTనిర్మాణ సామగ్రిసిమెంట్ – 28% నుంచి 18%కి తగ్గింపు ఎలక్ట్రానిక్స్ & గృహోపకరణాలు (18% GST)టీవీలు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు, డిష్వాషర్లు32 ఇంచుల కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న టీవీ రేట్లే తగ్గనున్నాయి రూ.2,500-85,000 తగ్గనున్న టీవీల ధరలువాహనాలుచిన్న కార్లు (1200cc లోపు) – 28% నుంచి 18%ద్విచక్ర వాహనాలు – 18% GSTమారుతి, టాటా, హ్యుందాయ్ వంటి కంపెనీల కార్లు లక్షల రూపాయల వరకు చౌకయ్యాయిద్విచక్ర వాహనాల ధరలు రూ.18,800 వరకు, కార్ల ధరలను రూ.4.48 లక్షల వరకు తగ్గిస్తున్నట్లు ఇప్పటికే కంపెనీలు ప్రకటించాయి. సేవలుజిమ్, యోగా సెంటర్లు, సెలూన్లు, హెల్త్ క్లబ్లు – 5% GSTరూ.7500 - అంతకంటే తక్కువ అద్దె కలిగిన హోటల్ గదులపై జీఎస్టీని 12% నుంచి 5 శాతానికి తగ్గింపు.. రూ.525 వరకు ఆదా. జీఎస్టీ తగ్గింపుతో పాటు ఇన్పుట్ క్రెడిట్ ట్యాక్స్ (ఐటీసీ) లేకుండా తగ్గించడం ఇందుకు కారణం. దినసరి వినియోగ వస్తువులు (5% GST)• టూత్పేస్ట్, సబ్బులు, షాంపూలు• హేర్ ఆయిల్, షేవింగ్ క్రీమ్, టాల్కం పౌడర్• బిస్కెట్లు, నంకీన్, జామ్, కెచప్, జ్యూస్• ప్యాకేజ్డ్ ఫుడ్స్, డైరీ ప్రొడక్టులు (నెయ్యి, పనీరూ, బటర్)• డ్రై ఫ్రూట్స్, ఐస్ క్రీమ్స్• సైకిల్స్, స్టేషనరీ, నోట్బుక్స్• చపాతీ, రొటీ, పరాటా, పిజ్జా బ్రెడ్అయితే హానికర ఉత్పత్తులపై మాత్రం జీఎస్టీ 28% నుంచి 40 శాతానికి పెరిగింది. అంటే సిగరెట్లు, గుట్కాలు తదిరాలు. - చక్కెర కలిగిన లేదా ఫ్లేవర్ కలిగిన నాన్-అల్కహాలిక్ బీవరేజెస్, విలాసవంతమైన హైఎండ్ కార్లు (350cc పైగా బైకులు, 1200cc పెట్రోల్ కార్లు, 500ccపైన డీజీల్ కార్లు, 4 మీటర్ల కంటే పొడవున్న కార్లు, ఎస్యూవీలు), హెలికాప్టర్లు, యాచ్లు, ఆన్లైన్ గేమింగ్ & బెట్టింగ్ ప్లాట్ఫారమ్లు, గేమింగ్ యాప్స్ (రియల్ మనీ గేమ్స్), కోల్, లిగ్నైట్, పీట్ (Coal products), డైమండ్స్.. ప్రెషస్ స్టోన్స్ ఇలా విలాసవంతమైన వస్తువులకు జీఎస్టీ పెరిగింది. జీఎస్టీ అంటే Goods and Services Tax. ఇది ఒక ఏకీకృత పన్ను విధానం, అంటే దేశవ్యాప్తంగా అన్ని రకాల పన్నులను కలిపి ఒకే పన్నుగా వసూలు చేసే విధానం. 2017లో ఇది అమల్లోకి వచ్చింది. అయితే.. జీఎస్టీ 2.0లో గతంలో ఉన్న నాలుగు శ్లాబ్లను నుంచి రెండుకు తగ్గించింది కేంద్రం. అందులో ఉన్న 12, 28 శాతం శ్లాబ్లను తొలగించింది కేంద్రం. దీంతో ఇకపై జీఎస్టీలో 5, 18 శాతం శ్లాబ్లే కొనసాగనున్నాయి. అదే సమయంలో నిత్యావసరాలపై 5 శాతం జీఎస్టీ విధించాలని నిర్ణయించింది. 12 శాతంలో ఉండే 99 శాతం వస్తువులపై 5 శాతం జీఎస్టీ, 28 శాతం ఉండే 99 శాతం వస్తువులపై 18 శాతం జీఎస్టీ విధిస్తారు. తాజా సవరణలతో.. ఒకే పన్ను-ఒకే విధానం లక్ష్యాన్ని మరింత సమర్థవంతంగా అమలు కావొచ్చని కేంద్రం ఆశిస్తోంది. -
మధ్యవర్తిత్వానికి జాప్యం జాఢ్యం
న్యూఢిల్లీ: మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారం కూడా ఆలస్యమవుతోందని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. కేసుల పరిష్కారానికి ఒకప్పుడు సత్వరమైన ప్రత్యామ్నాయంగా ఉన్న మధ్యవర్తిత్వానికి నేడు మితిమీరిన వాయిదాల జాఢ్యం అంటుకుందని వ్యాఖ్యానించారు. మధ్యవర్తిత్వం అంశంలో ప్రపంచంలోనే ప్రముఖంగా నిలవాలని భావిస్తున్న భారత్ కేవలం తీర్పుల సంఖ్యతోనే కాదు, ఆ తీర్పుల్లో తార్కికమైన ప్రమాణాలను, నిష్పాక్షికతను ప్రతిబింబించాలన్నారు. మధ్యవర్తిత్వ తీర్పుల్లో జాప్యాన్ని నివారించేందుకు ఇరుపక్షాలు కట్టుబడి ఉండాల్సిన నమూనా విధివిధానాలు వంటి సంస్థాగత పద్ధతులను అవలంబించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. వాయిదాలను కఠినంగా నియంత్రించడం ఈ సమస్యకు ఒక పరిష్కారమని తెలిపారు. మధ్యవర్తిత్వ విధాన సమగ్రతను కాపాడేందుకు క్రమశిక్షణ ఎంతో అవసరమని జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. వాణిజ్య వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వ విధానం నేడు వెన్నెముకగా మారిందని చెప్పారు. -
జీఎస్టీ సంస్కరణలతో ఆత్మనిర్భరత: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: తదుపరి తరం వస్తు సేవల పన్ను(జీఎస్టీ) సంస్కరణలతో దేశవ్యాప్తంగా అభివృద్ధి వేగం పుంజుకోనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ సాధన దిశగా ఇది అతిపెద్ద, కీలకమైన అడుగు అని అభివర్ణించారు. దేశ సౌభాగ్యం కోసం స్వదేశీ ఉత్పత్తులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. జీఎస్టీ సంస్కరణలు సోమవారం నుంచే అమల్లోకి రాబోతున్నాయని, నిత్యావసరాల ధరలు తగ్గుతాయని, పేద, మధ్య తరగతి ప్రజలకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. నవరాత్రులను పురస్కరించుకొని ప్రధాని మోదీ ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘స్వదేశీ’ ఉద్యమం దేశ స్వాతంత్య్ర పోరాటానికి కొత్త శక్తిని ఇచి్చందని గుర్తుచేశారు. ప్రజలంతా స్వదేశీ ఉత్పత్తులు ఉపయోగించుకుంటే దేశ ఆర్థిక ప్రగతికి నూతన బలం చేకూరుతుందని వెల్లడించారు. దేశంలో ప్రతి ఇంటినీ స్వదేశీకి ప్రతీకగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రతి దుకాణాన్నీ స్వదేశీ వస్తువులతో అలంకరించాలని పిలుపునిచ్చారు. రూ.12 లక్షల దాకా ఆదాయంపై ఇప్పటికే పన్ను మినహాయింపు ఇచ్చామని, ఇప్పుడు జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చామని, ఈ రెండూ దేశ పౌరులకు ‘డబుల్ బోనాంజా’ అని స్పష్టంచేశారు. దీనివల్ల ఖర్చులు తగ్గి, డబ్బులు ఆదా చేయడం పెరుగుతుందని, తద్వారా ప్రజలు వారి కలలు నిజం చేసుకోవడానికి అవకాశం దక్కుతుందని వ్యాఖ్యానించారు. రెండు కీలక నిర్ణయాల వల్ల ప్రజలకు రూ.2.5 లక్షల కోట్లు ఆదా అవుతాయని వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే..నాగరిక్ దేవో భవ ‘‘మన దేశం స్వావలంబన సాధించాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి. పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని రాష్ట్రాలు కల్పించాలి. తయారీ రంగాన్ని మరింతగా ప్రోత్సహించాలి. ప్రజలు ‘మేన్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులు విస్తృతంగా ఉపయోగించాలి. స్వదేశీ ఉత్పతుల కొనుగోలు, విక్రయం మన ధ్యేయం కావాలి. మన దేశంలో తయారైన వస్తువులు, సరుకులే వాడుకుంటున్నామని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకోవాలి. అప్పుడు మన దేశం ప్రగతి పథంలో పరుగులు తీస్తుంది. నాగరిక్ దేవో భవ(ప్రజలే దేవుళ్లు) అనేదే మా విధానం. ప్రజలకు మేలు చేయాలన్న తలంపుతోనే జీఎస్టీ సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. ఈ నిర్ణయంతో కీలకమైన నిత్యావసర వస్తువులు, సేవల ధరలు తగ్గుతాయి. నిర్మాణం, ఆరోగ్య రంగంలోనూ ఖర్చులు తగ్గిపోతాయి. సోమవారం నుంచి ‘జీఎస్టీ సేవింగ్స్ ఫెస్టివల్’ ప్రారంభం కానుంది. ప్రతి కుటుంబానికీ సంతోషం తీసుకొస్తుంది. ఆత్మనిర్భర్ భారత్ కోసం ఈ నవరాత్రుల్లో తొలి రోజు దేశం కీలకమైన అడుగు వేయబోతోంది. మీకు ఇష్టమైన వస్తువులు తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. పేదలు, మధ్య తరగతి, యువత, రైతులు, మహిళలు, వ్యాపారులు, దుకాణదారులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందుతారు. దేశంలో సులభతర వాణిజ్యం ఊపందుకుంటుంది. భారీగా పెట్టుబడులు వస్తాయి’’ అని మోదీ చెప్పారు. బెంగళూరు నుంచి హైదరాబాద్కు.. ‘‘2017లో జీఎస్టీ సంస్కరణలు ఆరంభించాం. చరిత్ర లిఖించడానికి అప్పుడే అడుగు పడింది. ఒకే దేశం–ఒకే పన్ను అనే స్వప్నాన్ని జీఎస్టీ నిజం చేసింది. గతంలో రకరకాల పన్నులు, సుంకాల వల్ల వ్యాపారులకు, వినియోగదారులకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యేవి. పన్నుల భారాన్ని వ్యాపారులు జనంపైనే వేసేవారు. జీఎస్టీతో ఆ కష్టాలకు చరమగీతం పాడేశాం. 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఓ విదేశీ పత్రికలో వార్త చదివా. బెంగళూరు నుంచి 570 కిలోమీటర్ల దూరంలోని హైదరాబాద్కు సరుకులు చేరవేయడం ఓ కంపెనీకి పెద్ద సవాలుగా మారిందని అందులో రాశారు. పలు రకాల పన్నులు చెల్లించాల్సి వస్తోందని పేర్కొన్నారు. దానికి బదులు తొలుత యూరప్కు, అక్కడి నుంచి హైదరాబాద్కు చేర్చడమే సులభమని ప్రస్తావించారు. అందుకే పన్నులపరంగా అవరోధాలు తొలగించాలని నిర్ణయించాం. అన్ని రాష్ట్రాలు, భాగస్వామ్య పక్షాలతో చర్చించి, జీఎస్టీని తీసుకొచ్చాం’’ అని ప్రధాన మంత్రి ‘మోదీ వివరించారు. ఇకనుంచి 5, 18% శ్లాబ్లే.. ‘సంస్కరణలతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ) సైతం ప్రయోజనం పొందుతాయి. మేన్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు పూర్వ వైభవం తీసుకురావాలని ఎంఎస్ఎంఈలను కోరుతున్నా. స్వావలంబన భారత్ నిర్మాణంలో ఎంఎస్ఎంఈలదే కీలక పాత్ర. సాధ్యమైనంత ఎక్కువగా మన దేశంలోనే వస్తువులు ఉత్పత్తి చేయాలి. మనం ఉపయోగించుకుంటున్న వస్తువు ఎక్కడ తయారైందో ప్రజలు తెలుసుకోవాలి. నిత్యం వాడుతున్న దువ్వెన ఎక్కడ తయారు చేశారో కూడా చాలామందికి తెలియదు. విదేశీ వస్తువులకు ప్రాధాన్యం వేయడం సరైంది కాదు. ఇకపై స్వదేశీ ఉత్పత్తులకే పెద్దపీట వేద్దాం. తగ్గిన జీఎస్టీ రేట్ల ప్రయోజనం ప్రజలకు దక్కేలా పరిశ్రమ వర్గాలు చొరవ చూపుతుండడం సంతోషంగా ఉంది. ఇకనుంచి 5 శాతం, 18 శాతం ట్యాక్స్ శ్లాబ్లే ఉంటాయి. గతంలో 12 శాతం పన్ను శ్లాబ్లో ఉన్న 99 శాతం వస్తువులను 5 శాతం పన్ను శ్లాబ్లోకి తీసుకొచ్చాం. ఫలితంగా వాటి ధరలు గణనీయంగా తగ్గిపోతాయి’ అని మోదీ అన్నారు. -
జీఎస్టీ సంస్కరణలతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో మేలు: ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: రేపటి (సెప్టెంబర్ 22) నుంచి కొత్త జీఎస్టీ శ్లాబులు అమల్లోకి రానున్న విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ జీఎస్టీ సంస్కరణలతో పేద, మధ్య తరగతి ప్రజల ఆదాయం మిగులుతుందన్నారు ప్రధాని మోదీ. జీఎస్టీ 2.0పై ఆదివారం ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు.మోదీ తన ప్రసంగంలో ‘రేపటి నుంచి జీఎస్టీ సంస్కరణలు అమలవుతున్నాయి. జీఎస్టీ సంస్కరణలతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో ఆదాయం మిగులుతుంది. జీఎస్టీ సంస్కరణలతో దేశంలో అందరికి మేలు జరుగుతోంది. జీఎస్టీ సంస్కరణలో భారత వృద్ధి రేటు మరింత పెరుగుతోంది. 2017లో జీఎస్టీ అద్యాయం మొదలైంది. అంతకుముందు ఎన్నోరకాల పన్నులు ఉండేవి.అంతకుముందు ఎన్నోరకాల పన్నులు ఉండేవి. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లాలన్నా పన్నులు కట్టాల్సి వచ్చేది. గతంలో బెంగళూరులో వస్తువులు హైదరాబాద్కు వచ్చి అమ్ముకోవాలంటే ఎంతో కష్టంగా ఉండేది. గతంలో టోల్,ట్యాక్స్లతో కంపెనీలు ఇబ్బంది పడేవి. ఆ ప్రభావం వినియోగదారులపై పడేది.2024లో గెలిచిన తర్వాత జీఎస్టీలపై ప్రాధాన్యం ఇచ్చాం. జీఎస్టీ సంస్కరణలతో అన్నీ వర్గాలతో మాట్లాడాం. వన్ నేషన్ - వన్ ట్యాక్స్ కలలను సాకారం చేశాం. జీఎస్టీ సంస్కరణలతో దేశం మరింత బలపడుతుంది. రూ.12లక్షల వరకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇచ్చాం.ఈ చర్యలతో మధ్య తరగతి జీవితాల్లో ఎంతో మార్పు వచ్చింది. అన్నీ రంగాల్లో సంస్కరణలు వస్తుంటాయి. కొత్త జీఎస్టీతో వస్తువుల ధరలు మరింత తగ్గుతాయి. కొన్నింటిపై పూర్తి మినహాయింపు ఉంటుంది. కొత్తజీఎస్టీతో పేద మధ్య తరగతి ప్రజలకు డబుల్ బోనంజా. నాగరిక దేవోభవన అనే నినాదంలో ముందుకు వెళ్తున్నాం. ఆత్మ నిర్భర్ భారత్ దిశగా అడుగులు వేస్తున్నాం. టీవీ,ఫ్రిజ్,ఇంటి నిర్మాణంపై ఖర్చు తగ్గుతుంది’అని తెలిపారు. My address to the nation. https://t.co/OmgbHSmhsi— Narendra Modi (@narendramodi) September 21, 2025 -
‘ట్రంప్ H1B బాంబ్’పై భారత్ స్పందన
భారత్పై 50 శాతం సుంకాలతో టారిఫ్ బాంబ్ పేల్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా H1B వీసా ఫీజు పెంపు నిర్ణయంతో మరో బాంబ్ పేల్చిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై తాజాగా భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు శనివారం భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ..భారతీయ ఐటీ ఉద్యోగులు, అమెరికాలో పనిచేస్తున్న వలస కార్మికులు, విద్యార్థులపై ఈ నిర్ణయం ఆర్థిక-మానవీయ ఒత్తిడిని కలిగించే అవకాశం లేకపోలేదు అని పేర్కొంది. అమెరికా హెచ్-1బీ వీసాలకు సంబంధించి కొత్త నిబంధనలను పరిశీలిస్తున్నట్లు.. అధ్యయంన చేస్తున్నట్లు భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది. అంతేకాదు..నిపుణుల రాకపోకల వల్ల ప్రతిభావంతుల మార్పిడి (skilled talent exchange)తో ఇంతకాలం ఇరు దేశాలకూ పరస్పల లబ్ధి చేకూరింది. ఆర్థిక వృద్ధి, సాంకేతిక అభివృద్ధికి కీలకంగా ఉంటూ వచ్చిందని, కాబట్టి ఈ నిర్ణయం ఇరుదేశాలనూ ప్రభావితం చేసే అంశమేనని పేర్కొంది. అగ్రరాజ్యం నిర్ణయంతో ఎన్నో కుటుంబాలకు ఇబ్బందులు ఎదురవుతాయని అభిప్రాయపడింది. మానవీయ కోణంలో పరిశీలించి ఈ సమస్యపై చర్చించి పరిష్కారం కనుగొనాలని ఆశిస్తున్నట్లు తెలిపింది. 90వ దశకంలో ఇతర దేశాల నుంచి స్కిల్ ఉన్న ఉద్యోగులను అమెరికాకు రప్పించే ఉద్దేంతో హెచ్-1బీ వీసా తెచ్చారు. వీటిని మూడు నుంచి ఆరేళ్ల మధ్య కాలానికి మంజూరు చేయడం ప్రారంభించింది. అప్పటి నుంచి అక్కడి టెక్ కంపెనీలు విదేశీ నిపుణులను ఈ వీసా ద్వారా రప్పించుకుంటున్నాయి. ప్రస్తుతం.. హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది. తొలుత లాటరీ దరఖాస్తుకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి. చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తాయి. అలా.. అక్కడ ఎంతో మంది ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు కూడా. అయితే.. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా (H1-B)పై కీలక నిర్ణయం తీసుకున్నారు. వీటి దరఖాస్తులపై ఏడాది అడ్మినిస్ట్రేషన్ ఫీజును ఏకంగా లక్ష డాలర్లుగా(రూ. 88 లక్షలకు పైగా) నిర్ణయిస్తూ ఉత్తర్వుపై సంతకం చేశారు. ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి అంతేసి చెల్లించాల్సి వస్తుంది. 2024 లెక్కల ప్రకారం.. హెచ్-1బీ వీసా దారుల్లో ఇండియా 71 శాతం వాటా కలిగి ఉండగా, చైనా 11.7 శాతం వాటా కలిగి ఉంది. దీంతో కొత్త హెచ్1బీ వీసా విధానం ఈ రెండు దేశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. -
రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తగ్గిన వాటర్ బాటిల్ ధర
భారతీయ రైల్వేస్ తన ప్రయాణికులకు కాస్త ఉపశమనం కలిగించింది. వాటర్ బాటిల్ ధరను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. జీఎస్టీ ప్రభావంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తగ్గించిన ఈ ధరలు సోమవారం(సెప్టెంబర్ 22) తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.రైల్వే మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన ప్రకటనలో.. F(C) డైరెక్టరేట్ అంగీకారంతో తాగునీటి బాటిళ్ల గరిష్ట చిల్లర ధర (MRP) తగ్గించబడింది. ఈ ధరలు రైల్వే స్టేషన్లు, రైళ్లలో అమ్మకానికి వర్తిస్తాయి. ప్రయాణికులకు తక్కువ ధరలో నాణ్యమైన తాగునీరు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.రైల్ నీర్ లీటర్ బాటిల్ ధరను తగ్గించినట్లు ప్రకటించింది. ఇంతకు ముందు అది 15 రూపాయలు ఉండగా.. ఇప్పుడు దానిని 14 రూపాయలుగా మార్చింది. అలాగే.. అర లీటర్ బాటిల్ ధరను రూ.10 నుంచి రూ.9కి తగ్గించినట్లు తెలిపింది. రైల్ నీర్ అనేది ప్రభుత్వ నియంత్రణలో.. ఐఆర్సీటీసీ ద్వారా సరఫరా అవుతోంది. అయితే ఇతర బ్రాండ్లు మాత్రం మార్కెట్ ఆధారంగా రేట్లకే అమ్ముతుంటాయి. అయితే.. GST कम किये जाने का सीधा लाभ उपभोक्ताओं को पहुंचाने के उद्देश्य से रेल नीर का अधिकतम बिक्री मूल्य 1 लीटर के लिए ₹15 से कम करके 14 रुपए और आधा लीटर के लिए ₹10 से कम करके ₹9 करने का निर्णय लिया गया है। @IRCTCofficial #NextGenGST pic.twitter.com/GcMV8NQRrm— Ministry of Railways (@RailMinIndia) September 20, 2025రైల్ నీర్ మాత్రమే కాదు.. ఇతర బ్రాండ్ల వాటర్ బాటిల్స్ను రైళ్లలో, రైల్వే స్టేషన్లలో ఎమ్మార్పీ (బాటిల్పై ఉన్న రేటు కంటే ఎక్కువ) అమ్మితే అది నేరమే. వాటర్ బాటిల్స్ మాత్రమే కాదు.. ఇతర ప్రొడక్టులకూ ఇది వర్తిస్తుంది. ఈ వ్యవహారాన్ని తేలికగా తీసుకోవాల్సిన అవసరం లేదు. నిమిషాల్లోనే ఫిర్యాదు చేసే వీలు ఉంది. లీగల్ మెట్రాలజీ యాక్ట్(2009 ప్రకారం).. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధర వసూలు చేయడం నేరం. దీనిపై వినియోగదారుల రక్షణ కట్టం కింద ప్రయాణికులు ఫిర్యాదు చేయొచ్చు. ఇందుకోసం రైల్వే శాఖ IRCTC, Rail Madad వంటివి అందుబాటులో ఉన్నాయి. రైల్ మదద్ యాప్గానీ, వెబ్గానీ(https://railmadad.indianrailways.gov.in) లింక్ ఓపెన్ చేసి ఓవర్ చార్జింగ్ ఆఫ్ వాటర్ బాటిల్ “Overcharging of water bottle” అని అంశాన్ని ఎంచుకుని వివరాలు నమోదు చేయండి. అదే ఐఆర్సీటీసీలో అయితే వెబ్సైట్(https://www.irctc.com) కంప్లయింట్ సెక్షన్లో ఫిర్యాదు నమోదు చేయొచ్చు. ఈ మార్గాలే కాదు.. COMPLAIN అని టైప్ చేసి ఫిర్యాదును పొందుపరిచి అని 139 నెంబర్కూ మెసేజ్ పంపొచ్చు. ఈ ఫిర్యాదులో.. స్టేషన్ పేరు / రైలు నంబర్, తేదీ, సమయం, అమ్మిన వ్యక్తి పేరు (అందుబాటులో ఉంటే), బాటిల్ ధర.. వసూలు చేసిన ధర, మీ టికెట్ వివరాలు (కంపల్సరీ ఏం కాదు) పొందుపర్చాలి. లేకుంటే నేరుగా స్టేషన్ మాస్టర్, కమర్షియల్ ఇన్చార్జ్, లేదంటే టికెట్ చెక్ చేసే సిబ్బంది కూడా ఫిర్యాదు చేయొచ్చు. అలాగే బిల్ లేకుండా అధిక ధర వసూలు చేసినా వెంటనే అధికారులకు తెలియజేయొచ్చు. -
ఢిల్లీ వర్సిటీ ఏబీవీపీదే!
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూని యన్ (డీయూఎస్యూ) ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ మద్దతు గల ఏబీవీపీ అభ్యర్థి ఆర్యన్ మాన్ అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారు. ఏడేళ్ల విరామం తర్వాత గత ఏడాది ఈ స్థానాన్ని గెలుచుకున్న ఎన్ఎస్యూఐ నుంచి అధ్యక్ష పదవిని ఏబీవీపీ చేజిక్కించుకోవడం విశేషం. ఏబీవీపీ అభ్యర్థి ఆర్యన్ మాన్, కాంగ్రెస్ అనుబంధ ఎన్ఎస్యూఐ అభ్యర్థి జోస్లిన్ నందిత చౌదరిపై 16,196 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆర్యన్ మాన్కు 28,841 ఓట్లు రాగా, ఎన్ఎస్యూఐ అభ్యర్థి జోస్లిన్కు 12,645 ఓట్లు వచ్చాయి. మొత్తం నాలుగు స్థానాలకు గాను.. ఏబీవీపీ అధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులను గెలుచుకుంది. అయితే ఉపాధ్యక్ష పదవిని కోల్పోయింది. ఏబీవీపీకి చెందిన కునాల్ చౌదరి, దీపికా ఝా.. కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులకు ఎన్నికయ్యారు, కాగా ఎన్ఎస్యూఐకి చెందిన రాహుల్ ఝాన్స్లా ఉపాధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారు. స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ), ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ)లు ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయాయి. ఈ ఎన్నికల్లో తమ సంస్థ బాగా పోరాడిందని ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షుడు వరుణ్ చౌదరి ఎక్స్లో పోస్టు చేశారు. ఏబీవీపీకి వ్యతిరేకంగానే కాకుండా.. ఢిల్లీ పాలన యంత్రాంగం, ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వాలు, ఆర్ఎస్ఎస్–బీజేపీ, ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా కూడా తాము పోరాడినట్లు స్పష్టం చేశారు. వేలాది మంది ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు తమకు గట్టి మద్దతుగా నిలిచారని, తమ అభ్యర్థులు బాగా పోరాడారని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ ప్యానెల్ నుంచి ఉపాధ్యక్షునిగా ఎన్నికైన రాహుల్ ఝాన్స్లా, గెలిచిన ఇతర ఆఫీస్ బేరర్లకు శుభాకాంక్షలు తెలిపారు. గెలుపోటములతో సంబంధం లేకుండా ఎన్ఎస్యూఐ ఎల్లప్పుడూ సామాన్య విద్యార్థుల సమస్యల పరిష్కారానికి, ఢిల్లీ యూనివర్సిటీ పరిరక్షణకు పోరాడుతుందని స్పష్టం చేశారు. తాము మరింత బలపడతామని ధీమా వ్యక్తం చేశారు. 2024లో జరిగిన డీయూఎస్యూ ఎన్నికలలో, ఎన్ఎస్యూఐ ఏడేళ్ల విరామం తర్వాత అధ్యక్ష పదవిని, సంయుక్త కార్యదర్శి పదవిని గెలుచుకుంది. ఏబీవీపీ ఉపాధ్యక్ష పదవిని కైవసం చేసుకొని, కార్యదర్శి స్థానాన్ని నిలుపుకొని విద్యార్థి సంఘ ఎన్నికల్లో తన ఉనికిని చాటుకుంది. గురువారం జరిగిన ఈ ఎన్నికల్లో దాదాపు 40 శాతం పోలింగ్ నమోదైంది. -
ప్రజలను ప్రభుత్వం ఎలా విభజించి చూడగలదు?
న్యూఢిల్లీ: ఈ నెల 22న అట్టహాసంగా మొదలయ్యే మైసూరు దసరా ఉత్సవాలకు బుకర్ ప్రైజ్ విజేత బాను ముష్తాక్ను కర్నాటక ప్రభుత్వం ఆహ్వానించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ‘ఇది ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమం. ప్రభుత్వం ప్రజలను ఏ, బీ, సీ అంటూ ఎలా విభజించి చూడగలదు? మన రాజ్యాంగ పీఠిక ఏం చెబుతోంది?’అంటూ శుక్రవారం విచారణ సందర్భంగా జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం పిటిషనర్ను ప్రశ్నించింది. బాను ముష్తాక్ చేతుల మీదుగా దసరా ఉత్సవాలను ప్రారంభించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను ఈ నెల 15వ తేదీన కర్ణాటక హైకోర్టు కొట్టివేయడం తెల్సిందే. ఈ సందర్భంగా హైకోర్టు.. 2017 దసరా ఉత్సవాల వేదికపై డాక్టర్ నిస్సార్ అహ్మద్తో పిటిషనర్లలో ఒకరు వేదికను పంచుకోవడాన్ని ప్రస్తావించింది. ఇదే విషయాన్ని సుప్రీం ధర్మాసనం గుర్తు చేస్తూ.. ఇది నిజమా? కాదా? అని ప్రశ్నించింది. అయితే, ఉత్సవాలను ప్రారంభించడం, పూజల్లో పాల్గొనడమనే రెండు అంశాలున్నాయంటూ పిటిషనర్ తరఫు లాయర్ పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా రాజ్యాంగంలోని ఆరి్టకల్ 25 ప్రకారం మత స్వేచ్ఛకు భంగం కలుగుతోందని తెలిపారు. అలాంటప్పుడు, 2017లో భంగం కలగలేదా అని ధర్మాసనం ప్రశ్నించగా కలగలేదని లాయర్ బదులిచ్చారు. కర్నాటక ప్రభుత్వ నిర్ణయం పూర్తిగా రాజకీయపరమైందని ఆరోపించారు. గతంలో బాను ముష్తాక్ మత వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. వాదనల అనంతరం ధర్మాసనం పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.తీర్పును స్వాగతించిన సీఎం సిద్ధరామయ్య మైసూరు దసరా ఉత్సవాలకు బాను ముష్తాక్ను ఆహ్వానించాలన్న తమ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేయడంపై కర్నాటక సీఎం సిద్ధరామయ్య హర్షం వ్యక్తం చేశారు. మైసూరు దసరా ఉత్సవాలను మత కోణంలో చూడరాదన్నారు. అందరినీ కలుపుకుని పోయేందుకే ప్రభుత్వం ఈ ఉత్సవాలను నిర్వహిస్తోందని ఎక్స్లో తెలిపారు. -
‘సాక్షి’పై ప్రభుత్వ కక్ష సాధింపు తగదు
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న దాడి, ప్రత్యేకించి ‘సాక్షి’ మీడియా సంస్థను లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులపై జాతీయ స్థాయిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏపీలో ‘సాక్షి’ మీడియా సంస్థతోపాటు జర్నలిస్టుల పట్ల పోలీసుల వ్యవహారశైలిపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా (ఈజీఐ) తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శుక్రవారం ఎడిటర్స్ గిల్డ్ ఒక ఘాటు లేఖ రాసింది. ‘సాక్షి’పై కక్ష సాధింపు చర్యలను తక్షణమే నిలిపివేయాలని, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎడిటర్స్ గిల్డ్ అధ్యక్షుడు అనంత్ నాథ్, ప్రధాన కార్యదర్శి రూబెన్ బెనర్జీ, కోశాధికారి కె.వి. ప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు.ఒక్క పత్రికపైనే ఎందుకు?ఒక రాజకీయ నాయకుడు నిర్వహించిన విలేకరుల సమావేశాన్ని ప్రచురించినందుకు ఇతర మీడియా సంస్థలను వదిలిపెట్టి, కేవలం ‘సాక్షి’పై మాత్రమే క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని ఎడిటర్స్ గిల్డ్ తీవ్రంగా తప్పుబట్టింది. ఇది పక్షపాత వైఖరికి నిదర్శనమని, నేర చట్టాలను ఎంపిక చేసుకుని ప్రయోగించడం పోలీసుల అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని పేర్కొంది. ఇది సాధారణ జర్నలిజంలో భాగమే అయినప్పటికీ, ‘సాక్షి’ని మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం వెనుక ప్రభుత్వ కుట్ర స్పష్టంగా కనిపిస్తోందని అభిప్రాయపడింది.వేధింపులు ఆపండి పత్రికలను అనవసరమైన, కక్ష సాధింపు ఫిర్యాదులతో వేధించకూడదని ఎడిటర్స్ గిల్డ్ హితవు పలికింది. పోలీసుల ప్రవర్తన నిష్పక్షపాతంగా, వృత్తిపరంగా ఉండాలని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసే సంస్థలను భయపెట్టేలా ఉండకూడదని స్పష్టంచేసింది. ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తున్న జర్నలిస్టులను అణచివేయడానికి, భయపెట్టడానికి క్రిమినల్ చట్టాలను ఆయుధాలుగా వాడటం రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది. తక్షణమే ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుని, రాష్ట్రంలో పత్రికలు నిర్భయంగా విధులను నిర్వర్తించే వాతావరణాన్ని కల్పించాలని ఎడిటర్స్ గిల్డ్ డిమాండ్ చేసింది.సాక్షి ఎడిటర్, పాత్రికేయులపై అక్రమ కేసులు పత్రికా స్వేచ్చపై దాడే: ఐజేయూ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, పాత్రికేయులపై కేసులు నమోదు చేయడం పత్రికా స్వేచ్ఛపై దాడే అని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్(ఐజేయూ) తీవ్రంగా విమర్శించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులతోనే సాక్షి దినపత్రిక, పాత్రికేయులను వేధిస్తోందని ఐజేయూ ప్రధాన కార్యదర్శి బల్విందర్సింగ్ జమ్ము శుక్రవారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు. సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి నివాసంలో పోలీసులు ఇటీవల తనిఖీలు చేయడం, ఆయనకు నోటీసులు జారీ చేయడం పత్రికా స్వేచ్ఛపై ముప్పేట దాడి చేయడమేనని ఆయన దుయ్యబట్టారు. సాక్షి ఎడిటర్, పాత్రికేయులను భయపెట్టేందుకే పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పత్రికలను నియంత్రించాలని ఏ ప్రభుత్వం భావించకూడదన్నారు. పత్రికల్లో ప్రచురితమైన వార్తలు, కథనాలపై అభ్యంతరం ఉంటే న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని బల్విందర్సింగ్ స్పష్టంచేశారు. కానీ, పత్రికలపై అక్రమ కేసులు నమోదు చేయడం పత్రికా స్వేచ్చను హరించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి చర్యలను ఐజేయూ ఏమాత్రం ఆమోదించదని స్పష్టంచేశారు. -
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో పెట్టుబడులు పెట్టి రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. పెట్టుబడిదారులకు మద్దతుగా నిలుస్తామని.. పెట్టుబడులకు పూర్తి భద్రత ఉంటుందని భరోసా ఇచ్చారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొత్త నగరం ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని గొప్పగా నిర్మిస్తున్నామని తెలిపారు. భావితరాలకు అవకాశాలు సృష్టించడమే తమ ఆలోచన అన్నారు. దేశంలోనే కొత్త రాష్ట్రమైన తెలంగాణ, హైదరాబాద్కు గొప్ప చరిత్ర ఉందని చెప్పారు.శుక్రవారం ఢిల్లీలోని హోటల్ తాజ్ ప్యాలెస్లో పబ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (పీఏఎఫ్ఐ) 12వ వార్షిక సదస్సుకు రేవంత్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ ఏడాది డిసెంబర్ 9న ఆవిష్కరించనున్న ‘తెలంగాణ రైజింగ్–2047’విజన్ డాక్యుమెంట్లో పొందుపరిచిన అంశాల గురించి సీఎం రేవంత్ పారిశ్రామికవేత్తలకు వివరించారు. అలాగే 30 వేల ఎకరాల్లో నిర్మించనున్న భారత్ ఫ్యూచర్ సిటీ ఉద్దేశాలతోపాటు ఇటీవల ఏర్పాటు చేసిన స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ గురించి తెలియజేశారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, రీజినల్ రింగ్ రోడ్డు ఏర్పాటు లక్ష్యాల గురించి వివరించారు. తెలంగాణలో ‘ట్రంప్’ను ప్రజలు పక్కనబెట్టారు... ‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలతో అమెరికాకే ఎక్కువగా నష్టం. ట్రంప్ ఒకరోజు ప్రధాని మోదీని స్నేహితునిగా అభివర్ణిస్తారు. మరో రోజు అడ్డగోలుగా సుంకాలు వేస్తారు. తెలంగాణలో ఒక ట్రంప్ (మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి) ఉండేవాడు. ఆయన్ను తెలంగాణ ప్రజలు పక్కనపెట్టారు. రాత్రి వచి్చన ఆలోచనను తెల్లారే అమలు చేయడం సాధ్యం కాదు’అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. న్యూజెర్సీ గవర్నర్తో భేటీ... ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ డి.మర్ఫీతో భేటీ అయ్యారు. విద్య, గ్రీన్ ఎనర్జీ, ఎంటర్టైన్మెంట్ (సినిమా రంగం), మౌలిక వసతులు (మెట్రో... పట్టణ రవాణా), మూసీ రివర్ ఫ్రంట్ తదితర అంశాల గురించి ఆయనకు తెలియజేశారు. తెలంగాణ రైజింగ్–2047 సాధనలో తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. ఐటీ, ఫార్మా రంగంలో తెలంగాణ రాష్ట్రం ప్రాధాన్యాన్ని సీఎం తెలియజేశారు. న్యూజెర్సీ రైల్ అథారిటీ ద్వారా హైదరాబాద్ పట్టణ, ప్రజారవాణా రంగాలకు, తెలంగాణ రైజింగ్–2047 లక్ష్యానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని సీఎం రేవంత్కు మర్ఫీ హామీ ఇచ్చారు. దావోస్కు రావాలని సీఎంకు డబ్ల్యూఈఎఫ్ చీఫ్ ఆహా్వనం.. వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) అధ్యక్షుడు బోర్డ్ బ్రేండేతోనూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విడిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రైజింగ్–2047కు మద్దతిస్తామని సీఎంకు తెలియజేశారు. వచ్చే ఏడాది దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సుకు విచ్చేయాలని రేవంత్ను ఆహా్వనించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసే విషయమై చర్చించేందుకు త్వరలో హైదరాబాద్కు వస్తానని హామీ ఇచ్చారు.ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకొచి్చన అమెజాన్అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ (పబ్లిక్ పాలసీ) చేతన్ కృష్ణస్వామితో సీఎం రేవంత్రెడ్డి సమావేశమై పలు అంశాలపై చర్చించారు. తెలంగాణలో మహిళా పారిశ్రామికవేత్తలు వారి ఉత్పత్తులను ‘కళాకార్’కార్యక్రమం కింద మార్కెటింగ్ చేసుకొనేందుకు ప్రోత్సహిస్తామని ఈ సందర్భంగా చేతన్ హామీ ఇచ్చారు. అలాగే హైదరాబాద్లో గిగ్ వర్కర్ల కోసం 100 విశ్రాంతి కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్నారు. తెలంగాణకు చెందిన చిన్న, మధ్యతరహా సంస్థల విక్రయదారులు వారి ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసుకొనే విషయంలో తోడ్పాటు అందిస్తామన్నారు. మరోవైపు గోద్రెజ్ సంస్థ ప్రతినిధులతోనూ సీఎం భేటీ అయ్యారు. ఈ భేటీలో జెర్సీ క్రీమ్ బ్రాండ్ కింద రూ. 200 కోట్లకుపైగా పెట్టుబడితో కొత్త డెయిరీ ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు గోద్రెజ్ ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేశారు. -
లంబాడీల ఎస్టీ హోదాపై సుప్రీంలో విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: బంజారా, లంబాడీ, సుగాలీ కులాలను షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) జాబితాలో చేర్చడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. జస్టిస్ జె.కె. మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ పిటిషన్లపై విచారణ జరిపింది.పిటిషనర్లు పోడియం బాలరాజు, మోడి యం శ్రీనివాసరావు సహా మరో ఇద్దరి తరఫున సీనియర్ న్యాయవాది పరమేశ్వరన్తో పాటు న్యాయవాదులు అల్లంకి రమేశ్, ఉండవల్లి అరుణ్ కుమార్, ఆర్.మమత వాదనలు వినిపించారు. లంబాడీ, సుగాలీ, బంజారాలను ఎస్టీ జాబితాలో చేర్చడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 342కు పూర్తిగా విరుద్ధమని వారు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అసలైన ఆదివాసీ తెగలతో పోలిస్తే ఈ వర్గాలు ఇప్పటికే ఆర్థికంగా, సామాజికంగాఅభివృద్ధి చెందాయని పిటిషన్లో పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం, ఈ అంశంపై ఇప్పటికే పెండింగ్లో ఉన్న ప్రధాన పిటిషన్లతో ఈ వ్యాజ్యాలను జత చేయా లని ఆదేశిస్తూ, విచారణను వాయిదా వేసింది. -
నీటి వినియోగ లెక్కల్లేవ్
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా, గోదావరి నదుల్లో ఏ ప్రాజెక్టు కింద ఎంత నీటిని వినియోగిస్తున్నామన్న లెక్కలు ప్రభుత్వం వద్ద లేవని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. గోదావరి జలాల్లో రాష్ట్రానికి 968 టీఎంసీల నీటి కేటాయింపులున్నా అందులో ఎంత నీటిని వాడుతున్నామన్న దానిపై స్పష్టత కొరవడిందన్నారు. శుక్రవారం ఢిల్లీలో వివిధ అంశాలపై సీఎం రేవంత్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఇందులో భాగంగా నీటి వినియోగ లెక్కల గురించి ఆయన వివరించారు. ‘గోదావరిలోని 968 టీఎంసీల నీటి కేటాయింపుల్లో ఎన్ని టీఎంసీల నీటిని రాష్ట్రం వాడుకుంటోందో ఎవరికీ తెలియదు. ఏ ప్రాజెక్టు కింద ఎంత నీటిని వాడుతున్నదీ.. ఎంత ఆయటక్టుకు నీళ్లిస్తున్నదీ తెలియకుండా గత ప్రభుత్వం అంతా గందరగోళం చేసింది. ఒక ప్రాజెక్టు ఆయకట్టును ఇంకో ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టులో కలిపి చూపించింది. దీంతో ఏ ప్రాజెక్టు కింద ఎంత ఆయకట్టు ఉందో, ఎంత నీటిని వినియోగిస్తున్నామో రాష్ట్రం వద్ద లెక్కల్లేవు. అందుకే ఆ లెక్కలు తయారు చేయాలని అధికారులను ఆదేశించాం. అది పూర్తయితేనే తెలంగాణకు మిగిలిన నీటి వాటా ఎంతో తెలుస్తుంది.ఆ మిగిలిన నీటి వాటాను వినియోగించుకునేలా తుమ్మిడిహెట్టి వంటి ప్రాజెక్టులను చేపడతాం’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణంపై మహారాష్ట్రకు వెళ్లి అక్కడి ప్రభుత్వంతో చర్చిస్తామని తెలిపారు. ఇక కృష్ణాలోనూ పరీవాహకం ఆధారంగా 904 టీఎంసీలను కోరుతున్నామని.. అందులో నికర, వరద, మిగులు జలాలన్నీ కలిపి ఉన్నాయని సీఎం వివరించారు. ‘కాళేశ్వరం’పై సీబీఐ విచారణకు జాప్యం ఎందుకు? కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం సీబీఐని కోరినా కేంద్రం ఎందుకు జాప్యం చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రశ్నించారు. ‘కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణకు ఇస్తే 48 గంటల్లో తేలుస్తామని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి గతంలో ప్రకటించారు. కానీ ఇంతకాలం అవుతున్నా కనీసం ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయట్లేదు? ప్రాజెక్టు లోపాల్లో కుట్రదారులెవరో తేల్చాల్సి ఉన్నా, సమగ్ర విచారణ జరగాల్సి ఉన్నా కేంద్రం ఎందుకు జాప్యం చేస్తోంది? విచారణ జరగకుండా కేటీఆర్ ఆపుతుంటే దానికి కిషన్రెడ్డి సహకరిస్తున్నారు. వాళ్లిద్దరి మధ్య అంత అవినాభావ సంబంధం ఉంది’అని సీఎం ఆరోపించారు. హైకోర్టు చెప్పినట్లుగా ఈ నెలాఖరులోగా ‘స్థానికం’కష్టసాధ్యం.. స్థానిక సంస్థల ఎన్నికలను హైకోర్టు విధించిన ఈ నెల 30లోగా నిర్వహించడం కష్టసాధ్యమని.. దీనిపై ఎలా ముందుకెళ్లాలో న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. ‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన మూడు బిల్లులను రాష్ట్రపతి ఆమోదానికి పంపాం. బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్ 90 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ అధికారం సుప్రీంకు ఉందా? అని రాష్ట్రపతి సుప్రీంకు రెఫరెన్స్ ఇచి్చంది. ఆ రెఫరెన్స్పై సుప్రీం తీర్పు రిజర్వ్ చేసింది. ఆ తీర్పు వచ్చే వరకు స్థానిక సంస్థలపై నిరీక్షిస్తాం. ఆ తర్వాతే తదుపరి కార్యాచరణ చేపడతాం’అని సీఎం రేవంత్ తెలిపారు. కేసీఆర్, ఎల్ అండ్ టీ తప్పులకు ప్రజలపై భారమా? హైదరాబాద్ మెట్రో విస్తరణలో ఎల్ అండ్ టీ సంస్థ తీరును ముఖ్యమంత్రి తప్పుపట్టారు. మెట్రో విస్తరణకు ఎల్ అండ్ టీ సహకరించాలని.. లేకపోతే ప్రభుత్వపరంగా ఏం చేయాలో ఆలోచిస్తామన్నారు. ‘మెట్రో విస్తరణలో భాగంగా 76 కి.మీ. కనెక్టివిటీ జరగాలి. ఇది పూర్తి కావాలంటే ఎల్ అండ్ టీతో ఒప్పందం చేసుకోవాలని కేంద్రం షరతు పెడుతోంది. కానీ మెట్రోతో మాకు నష్టాలు వస్తున్నందున కొత్త పనులు చేయలేమని ఎల్ అండ్ టీ అంటోంది. కేసీఆర్, ఎల్ అండ్ టీ చేసిన తప్పిదాలు, భూసేకరణలో జాప్యం వల్ల రూ. 13 వేల కోట్లుగా ఉన్న అంచనా వ్యయం కాస్తా రూ. 20 వేల కోట్లకు పెరిగింది. వాళ్లు చేసిన తప్పిదాలకు రాష్ట్ర ప్రజలు భారం భరించాలా? ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఎల్ అండ్ టీ డిక్టేట్ చేయజాలదు’అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ కోసమే యూరియా డ్రామా... రాష్ట్రానికి సరిపడా యూరియా ఇవ్వకుండా కేంద్రం రాష్ట్రంపై కక్ష సాధిస్తోందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. ‘రాష్ట్రానికి సీజన్లో 9.8 లక్షల టన్నుల యూరియా అవసరం ఉంది. కానీ 2 లక్షల టన్నుల యూరియాను కేంద్రం సరైన సమయానికి సరఫరా చేయలేదు. ఈ విషయంలో బీఆర్ఎస్కు తిరిగి జీవం పోసేలా బీజేపీ డ్రామాలాడింది. ఇదే అదునుగా బీఆర్ఎస్ ప్రజల్లో యూరియా లేదని ఒక అస్థిరతను సృష్టించడం.. రైతులు ఎక్కువగా కొనుగోళ్లు చేయడంతో సమస్య పెద్దదైంది. బీఆర్ఎస్ను నిలబెట్టేందుకు కేంద్రం రైతులకు నష్టం చేస్తోంది’అని సీఎం ఆరోపించారు. కండువాలు కప్పితే పార్టీ మారినట్లు కాదు.. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీం తీర్పునకు అనుగుణంగా నడుచుకోవాలని స్పీకర్కు సూచించినట్లు ముఖ్యమంత్రి వివరించారు. అయితే పార్టీ కండువాలు కప్పుకున్నంత మాత్రాన ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు కాదన్నారు. ‘కండువా కప్పినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదు. నేను ఈరోజు ఎంతో మందికి కండువాలు కప్పాను. వారికి కప్పిన కండువా ఏదో వారికే తెలియదు. ఎవరి ఇంటికి వెళ్తే ఏం భోజనం పెడతారో ముందే తెలియదు కదా? బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల జీతాల్లోంచి ప్రతి నెలా రూ. 5 వేలు ఆ పార్టీ ఫండ్కు వెళ్తున్నాయి. తమ పారీ్టకి 37 మంది ఎమ్మెల్యేల బలం ఉంది కాబట్టి ఆ మేరకు సమయం కేటాయించాలని అసెంబ్లీలో హరీశ్రావు ఆన్ రికార్డుగా చెప్పారుగా’అని సీఎం గుర్తుచేశారు. బీఆర్ఎస్లో ఆస్తుల గొడవతో కాంగ్రెస్కు సంబంధం లేదు.. బీఆర్ఎస్లో కవిత ముసలం పుట్టిందని సీఎం అన్నారు. వేలాది మందిని పొట్టన పెట్టుకున్న పాపం ఊరికే పోదు కదా? అంటూ కేసీఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు, సంతోష్రావులు కలిసి కవితపై మూకుమ్మడిగా దండయాత్ర చేస్తున్నారని.. అయితే ఈ ఆస్తుల గొడవతో తమ పారీ్టకి సంబంధం లేదన్నారు. మావోలతో చర్చించాలి.. కేంద్రం మావోయిస్టులతో చర్చలు జరిపేందుకు ముందుకు రావాలని సీఎం రేవంత్ సూచించారు. ఉగ్రవాదులతోపాటు దాయాది దేశమైన పాకిస్తాన్తో చర్చలు జరుపుతున్న కేంద్రం.. మావోయిస్టులతో చర్చిస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. వాళ్లూ ఈ దేశ ప్రజలే కదా.. మన అక్కాతమ్ముళ్లే కదా అని పేర్కొన్నారు. -
ఈసీ కీలక నిర్ణయం.. 474 పొలిటికల్ పార్టీల గుర్తింపు రద్దు
ఢిల్లీ: దేశవ్యాప్తంగా 474 రిజిస్టర్ పొలిటికల్ పార్టీల గుర్తింపును కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. వరుసగా ఆరేళ్ల పాటు పోటీ చేయకపోవడంతో రిజిస్టర్డ్ పార్టీల జాబితా నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రక్రియ ప్రక్షాళనలో భాగంగా గుర్తింపులేని పార్టీలపై ఈసీఐ దృష్టి పెట్టింది. మొదటి విడతలో 334 రిజిస్టర్డ్ పార్టీలను రద్దు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. తాజాగా 474 పార్టీల గుర్తింపు రద్దు చేసింది.దీంతో ఇప్పటివరకు మొత్తం 808 రిజిస్టర్ పార్టీల గుర్తింపును ఈసీఐ రద్దు చేసింది. మరో 359 పార్టీల గుర్తింపు రద్దు చేసే ప్రక్రియలో ఈసీఐ ఉన్నట్లు సమాచారం. తాజాగా ఏపీలో 17, తెలంగాణలో 9 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు చేసింది. ఇప్పటివరకు 2520 గుర్తింపు లేని రిజిస్టర్ రాజకీయ పార్టీలు ఉండగా, తాజా తొలగింపుతో ఈ సంఖ్య 2046కు తగ్గిందని ఎన్నికల సంఘం వెల్లడించింది. ప్రస్తుతం ఆరు జాతీయ పార్టీలు, 67 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని పేర్కొంది. -
కేసీఆర్ ఫ్యామిలీపై రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: కేసీఆర్ కుటుంబంలో ముసలం పుట్టిందని.. నలుగురు కలిసి మహిళను అణిచివేస్తున్నారంటూ సీఎం రేవంత్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ జరిపారు. కేసీఆర్ కుటుంబంలో అధికారం, ఆస్తి పంచాయతీ నడుస్తుంది.. కవితను బయటకు వెళ్లగొట్టింది కేసీఆర్, కేటీఆర్ హరీష్ రావు, సంతోషే.. వారి కుటుంబ పంచాయితీతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. కవిత కాంగ్రెస్లో చేరుతానంటే వ్యతిరేకిస్తానన్న రేవంత్.. కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు సామాజికంగా బహిష్కరించారన్నారు.‘‘ఫోన్ ట్యాపింగ్ కేసు హైకోర్టులో ఉంది. లేకుంటే ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా సీబీఐకి ఇచ్చేవాళ్లం. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తును కిషన్రెడ్డి ఆపుతున్నారు. కేటీఆర్ చెప్పినట్టే కిషన్రెడ్డి చేస్తున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు వేయకపోవడమే నిదర్శనం. కిషన్రెడ్డికి సొంత ఆలోచనలు ఉండవు. కేటీఆర్ నుంచే కిషన్రెడ్డి సలహాలు తీసుకుంటారు. సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే అన్ని వివరాలు ఇస్తాం. కమిషన్ నివేదిక సీబీఐకి ఒక పునాదిలా ఉపయోగపడుతుంది’’ అని రేవంత్ చెప్పుకొచ్చారు. -
సుప్రీంకోర్టులో వరవరరావుకు చుక్కెదురు
సాక్షి, న్యూఢిల్లీ: విరసం నేత వరవరరావు(84)కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. చికిత్స విషయంలో ఆయన వేసిన ఓ పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం కొట్టేసింది. భీమా కోరేగావ్ కేసులో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద అరెస్టైన ఆయన.. కోర్టు షరతులతో ముంబైలో ఉండిపోవాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే..వయోభారం, అనారోగ్య కారణాల నేపథ్యంలో హైదరాబాద్లో చికిత్స తీసుకునేందుకు అనుమతి కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ముంబైలో చికిత్సకు అధిక ఖర్చు అవుతోందని.. హైదరాబాదులో తమ బంధువులు డాక్టర్లైన నేపథ్యంలో అక్కడ చికిత్స పొందేందుకు అనుమతించాలని ఆయన పిటిషన్లో అభ్యర్థించారు. కానీ కోర్టు ఆ అభ్యర్థను తిరస్కరిస్తూ పిటిషన్ కొట్టేసింది. భీమా కోరేగావ్ హింస కేసులో పూణే పోలీసులు వరవరరావును ఉపా చట్టం కింద 2018 ఆగస్టు 28వ తేదీన అరెస్ట్ చేసి తలోజా జైలు(మహారాష్ట్ర)కు తరలించారు. ఆపై నెలలోపే సుప్రీం కోర్టు ఆదేశాలతో హైదరాబాద్లోని నివాసానికి తరలించి గృహనిర్బంధం చేశారు. మరో రెండు నెలల తర్వాత కోర్టు అనుమతితో తిరిగి తలోజా జైలుకు తరలించారు. అయితే..2020 జులైలో ఆయనకు జైలు కరోనా సోకడంతో వరవరరావుకు ఆరోగ్య సమస్యలు తీవ్రతరం అయ్యాయి. ఈ తరుణంలో.. మహారాష్ట్ర హైకోర్టు 2021 ఫ్రిబవరిలో మెడికల్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో షరతుల మీద ఆయన ముంబైలో అద్దె నివాసంలో ఉన్నారు. అటుపై 2022లో సుప్రీం కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ.. ముంబై విడిచి వెళ్లకూడదని ఆదేశించింది. అప్పటి నుంచి ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. -
భారత్కు గుడ్న్యూస్.. టారిఫ్పై డొనాల్డ్ ట్రంప్ యూటర్న్?!
న్యూఢిల్లీ: భారత్పై 50శాతం టారిఫ్ విధింపు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. నవంబర్ 30 తర్వాత భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వస్తువులపై అందుబాటులోకి రానున్న 50శాతం టారిఫ్లో 25 శాతం పెనాల్టీ టారిఫ్ను రద్దు చేయనున్నట్లు సమాచారంరష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తుందని.. ఫలితంగా ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగుతోందంటూ భారత్పై ట్రంప్ టారిఫ్తో పాటు పెనాల్టీ టారిఫ్ 25శాతం విధించారు. ఆ పెనాల్టీ టారిఫ్ విషయంలో భారత్-అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయని, ఆ చర్చలు సఫలమై.. పెనాల్టీ టారిఫ్ను తొలగించే అవకాశం ఉందంటూ కేంద్ర చీఫ్ ఎకనమిక్స్ అడ్వైజర్ (సీఈఏ)వీ అనంత నాగేశ్వరన్ కీలక వ్యాఖ్యలు చేశారు.గురువారం కోల్కతా మర్చంట్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎంసీసీఐ)సమావేశంలో వీ. అనంత నాగేశ్వరన్ మాట్లాడారు. మనదేశం నుంచి ఎగుమతయ్యే పలు ఉత్పత్తులపై 25శాతం ప్రతీకార సుంకం చెల్లించడంతో పాటు పెనాల్టీ కింద మరో 25శాతం.. మొత్తంగా 50శాతం టారిఫ్ చెల్లించేందుకు సిద్ధపడ్డాం. కానీ ఇకపై మనకు ఆ అవసరం ఉండదని నేను భావిస్తున్నాను.25 శాతం పెనాల్టీ సుంకానికి భౌగోళిక రాజకీయ పరిస్థితులు కారణం. కానీ గత రెండు వారాలలో జరిగిన పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటే నవంబర్ 30 తర్వాత 25శాతం జరిమానా సుంకం ఉండదని నేను నమ్ముతున్నాను. రాబోయే రెండు నెలల్లో ప్రతీకార సుంకంతో పాటు జరిమానా పరస్పర సుంకాలపై పరిష్కారం లభిస్తోందన్నారు. ఈ వ్యాఖ్యలతో భారత్పై టారిఫ్ల విషయంలో ట్రంప్ యూటర్న్ తీసుకునే అవకాశం ఉందంటూ ఆర్ధిక నిపుణుల అంచనా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 1977లో రూపొందించిన ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్స్ పవర్ యాక్ట్ (ఐఈఈపీఏ) చట్టాన్ని ప్రస్తావిస్తూ, విదేశీ అత్యవసర పరిస్థితుల సమయంలో ఆర్థిక నియంత్రణలు, శిక్షలు విధించేందుకు ఈ చట్టాన్ని ఉపయోగించారు. ఈ చట్టం ఆధారంగా మనదేశంపై మొదట 25శాతం టారిఫ్లు విధించగా, ఇప్పుడు వాటిని 50శాతానికి పెంచారు. -
శబరిమలలో గ్లోబల్ అయ్యప్ప కాన్క్లేవ్.. షెడ్యూల్ ఇదే
తిరువనంతపురం: కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయం అభివృద్ధిపై సీఎం పినరయి విజయన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంబా తీరంలో ప్రపంచ అయ్యప్ప భక్తుల సంగమాన్ని ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. శనివారం (సెప్టెంబర్ 20) జరగనున్న ఈ కార్యక్రమానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని కేరళ దేవాదాయశాఖ మంత్రి వి.ఎన్. వాసవన్ తెలిపారు. ఈ మహా సంగమంలో వివిధ దేశాల నుంచి సుమారు 3000 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. విరాళాలుగా వచ్చిన రూ.7కోట్లతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వాసవన్ చెప్పారు. ఈ కాంక్లేవ్లో కేరళ ప్రభుత్వం శబరిమల అభివృద్ధి ప్రణాళికలో భాగంగా రూ. 1300 కోట్ల మాస్టర్ ప్లాన్ను అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ బోర్డు (KIIFB) ద్వారా నిర్మాణ పనులు వేగవంతం చేయాలని నిర్ణయించింది. వీటితో పాటు ప్రపంచ అయ్యప్ప భక్తుల సంగమం శబరిమల అభివృద్ధి, ఆచార సంప్రదాయాల పరిరక్షణ,భక్తుల సౌకర్యాల మెరుగుదల వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి. -
రాహుల్ ఆరోపణలపై ఈసీ రియాక్షన్.. పటాకులే పేలాయంటూ సెటైర్లు
న్యూఢిల్లీ: ఓట్ల చోరీ పేరిట కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేసిన సంచలన ఆరోపణలపై కేంద్ర ఎన్నికల స్పందించింది. ఆన్లైన్లో ఓట్లు ఎవరూ తొలగించలేరని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అదే సమయంలో మరోవైపు.. బీజేపీ సైతం ఆయన చేసిన ఆరోపణలపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది.రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు నిరాధారం.. అవాస్తవం. సంబంధిత వ్యక్తికి సమాచారం ఇవ్వకుండా ఏ ఒక్కరి ఓటునూ తొలగించడం లేదు అని ఈసీ స్పష్టం చేసింది. అదే సమయంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓట్ల తొలగింపు ప్రయత్నాలను మాత్రం అంగీకరించింది. ‘‘ ఆ సమయంలో కర్ణాటకలోని ఆలంద్ శాసనసభ నియోజకవర్గంలో ఓటర్లను తొలగించేందుకు కొన్ని విఫలయత్నాలు జరిగాయి. ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ఎన్నికల సంఘం స్వయంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరిపింది’’ అని పేర్కొంది.మరోవైపు రాహుల్ గాంధీ చేసిన ఓట్ల దొంగతనం.. నకిలీ ఓట్ల చేర్పు ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఆయన బాంబు పేలలేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ భారత్ను బంగ్లాదేశ్, నేపాల్ లాంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు అని మండిపడ్డారు. ‘‘ఎన్నికల నిర్వహణ కోసం ఈసీ నిష్పక్షపాతంగా పనిచేస్తోంది. కానీ రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తూ.. ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ సుమారు 90 ఎన్నికల్లో ఓడిపోయింది. ఆ వైరాగ్యంతోనే ఆయన అసత్య ఆరోపణలు చేస్తున్నారు అని ఠాకూర్ విమర్శించారు. హైడ్రోజన్ బాంబ్ పేలుస్తానన్న రాహుల్.. చివరికి పటాకులతోనే సరిపెట్టారు. ఆరోపణలే ఆయన రాజకీయ ఆభరణంగా మారాయి. కోర్టులు క్షమాపణలు కోరడం, మందలించడం ఆయనకు అలవాటైపోయింది అని అనురాగ్ ఠాకూర్ ఎద్దేవా చేశారు.ఇదీ చదవండి: ఓట్ల దొంగలకు రక్షగా.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్పై సంచలన ఆరోపణలు -
ఓట్ల దొంగలకు రక్షగా.. సీఈసీపై రాహుల్ సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘంపై మరోసారి సంచలన ఆరోపణలకు దిగారు. ఓట్ల దొంగతనం ఒక పథకం ప్రకారమే జరుగుతోందని.. ఆ దొంగలను రక్షించే ప్రయత్నంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఉన్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం న్యూఢిల్లీలోని ఇందిరా భవన్ ఆడిటోరియంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి పట్టున్న ప్రాంతాల నుంచి ఓట్లను తొలగించారని.. రాష్ట్రం వెలుపలి నుంచి నకిలీ లాగిన్లు, ఫోన్ నంబర్లను ఉపయోగించి ఓటర్ ఐడీలను తొలగించినట్లు వ్యాఖ్యానించారు. సాఫ్ట్వేర్ను వినియోగించి కేంద్రీకృత పద్ధతిలో ఈ చర్యలకు పాల్పడినట్లు ఆరోపించారు. 100 శాతం ఆధారాలున్నాయ్ఓట్ల చోరీ గురించి ఈసీ నుంచి మాకు సమాచారం వస్తోంది. చాలా చోట్ల మైనారిటీలు, ఆదివాసీల ఓట్లను తొలగిస్తున్నారు. ఇప్పటికే ఉద్దేశపూర్వకంగానే లక్షల ఓట్లను తొలగించారు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ పెద్ద ఎత్తున ఓట్లు తొలగించారు. కర్ణాటక ఓటర్లకు లింక్ చేసిన ఫోన్ నెంబర్లన్నీ తప్పుడువే. కాంగ్రెస్కు బలమున్న ప్రాంతాల్లోనే ఓట్ల తొలగింపు జరిగింది. ఓట్లను తొలగించేందుకు కొందరు వ్యవస్థను హైజాక్ చేస్తున్నారు. ఫేక్ లాగిన్తో కాంగ్రెస్ సానుభూతి ఓట్లను తొలగించారు. ఇవన్నీ ఆరోపణలు కాదు.. పక్కా ఆధారాలతో చెబుతున్నా.. సీఈసీపై సంచలన ఆరోపణలుఎన్నికల సంఘం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నవారిని కాపాడుతోంది. అధికారులకు తెలియకుండా జాబితా నుంచి ఓట్లు ఎలా పోతాయి?. కేవలం కాంగ్రెస్ ఓటర్లే టార్గెట్గా ఇదంతా నడుస్తోంది. కర్ణాటక సీఐడీ ఓట్ల తొలగింపు వివరాలు 18సార్లు అడిగినా ఈసీ స్పందించడం లేదు. మాకు ఓట్ల తొలగింపు ఐడీల వివరాలు, ఓటీపీలు కావాలి. వారం లోగా సీఐడీ అడిగిన వివరాలు అందించాలి. ఓట్ల దొంగలను రక్షిస్తూ.. కర్ణాటక అలంద్లో గోదాబాయ్ పేరుతో 18 ఓట్లు తొలగించారు . మహారాష్ట్ర రాజురా నియోజకవర్గంలో 6,851 ఫేక్ ఓట్లు కలిపారు. కర్ణాటక, యూపీ, మహారాష్ట్ర, హర్యానాలో ఒకే రీతిలో ఓట్ల తొలగింపు జరిగింది. సెంట్రలైజ్డ్ వ్యవస్థ ద్వారా పథకం ప్రకారం రాష్ట్ర ఎన్నికల్లో ఓట్లు డిలీట్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యవస్థ ఆ పని చేయడం లేదు. ఓట్ల దొంగలను సీఈసీ రక్షిస్తోంది. అందుకే ప్రతిపక్ష నేతగా నేను ప్రజల ముందు ఉంచుతున్నాఓటు చోరీ అనేది ప్రజాస్వామ్యంపై అణుబాంబ్ లాంటిది. కానీ ఇప్పుడు హైడ్రోజన్ బాంబ్ పేలబోతోంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నవాళ్లను ఈసీ కాపాడుతోంది. ఓట్లు చోరీ చేస్తున్న వారిని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రక్షిస్తున్నారు. అన్నింటికీ మా దగ్గర ఆధారాలన్నాయ్. ఎన్నికల వ్యవస్థలో అక్రమాలను కోర్టులు పరిశీలించాలి. ఓట్ల చోరీపై న్యాయ వ్యవస్థ దృష్టి సారించాలి అని రాహుల్ గాంధీ కోరారు. ఈ క్రమంలో ఆధారాల పేరిట పలువురు ఓటర్లతో మాట్లాడించిన ఆయన, ఓట్ల అవకతవకల పేరిట జరిగిన అంశాలనూ మీడియా ముందు ప్రవేశపెట్టారు. VIDEO | Delhi: During a press conference, Congress MP Rahul Gandhi (@RahulGandhi) shows 'evidence' of alleged vote theft in Karnataka, claiming that the theft happened specifically on the booths where Congress was winning.He further claimed that a fake login was created in the… pic.twitter.com/k9uSw4boLG— Press Trust of India (@PTI_News) September 18, 2025 LIVE: Special press briefing by LoP Shri @RahulGandhi at Indira Bhawan | New Delhi. https://t.co/BfcSQU0LTd— Congress (@INCIndia) September 18, 2025 -
‘‘ఆ దేవుడినే అడగండి..’’ సీజేఐ వ్యాఖ్యలపై దుమారం
న్యూఢిల్లీ: ధ్వంసమైన ఏడడుగుల విష్ణుమూర్తి విగ్రహాన్ని పునరుద్ధరించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ క్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆ వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకోవాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు.మధ్యప్రదేశ్లోని ఛాతర్పూర్జిల్లాలోని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన ప్రఖ్యాత ఖజురహో ఆలయ సముదాయంలోని జవారీ ఆలయంలో విష్ణుమూర్తి విగ్రహం ధ్వంసమైంది. ఈ విగ్రహాన్ని పక్కనబెట్టి కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించేలా ఆదేశాలు ఇవ్వాలని(Khajuraho Vishnu idol case) రాకేశ్ దలాల్ అనే వ్యక్తి ఈ పిల్ వేశారు. ఈ పిల్ స్వీకరణ అంశాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రనల్ ధర్మాసనం పరిశీలించింది. ‘‘ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదు. పబ్లిసిటీ ప్రయోజన వ్యాజ్యం. ఇందులో మేం చేసేది ఏం లేదు. భారత పురతత్వ విభాగం(ఏఎస్ఐ) పరిధిలో ఆలయం ఉంది. వాళ్లనే అభ్యర్థించండి. లేదంటే మీరెలాగూ విష్ణుమూర్తికి పరమభక్తుడిని అని చెబుతున్నారుగా. ఆయననే వేడుకోండి. శైవత్వానికి మీరు వ్యతిరేకులు కాకపోతే అదే ఖజురహోలో అతిపెద్ద శివలింగం ఉంది. అక్కడ కూడా మీరు విన్నవించుకోవచ్చు. విగ్రహ పునరుద్ధరణ, పునర్నిర్మాణంపై ఏఎస్ఐ తుది నిర్ణయం తీసుకుంటుంది’’ అని వ్యాఖ్యానించారు. అయితే తీర్పు సందర్భంగా సీజేఐ జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఒక వర్గం మనోభావాలు దెబ్బ తీసేలా ఆయన మాట్లాడారంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అంతేకాదు.. ఆయన్ని అభిశంసించాలంటూ కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. వినీత్ జిందాల్ అనే న్యాయవాది సీజేఐ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో భారత రాష్ట్రపతికి, సుప్రీం కోర్ట్కు ఆయన ఓ లేఖ రాశారు. ప్రతి మత విశ్వాసానికి గౌరవం ఇవ్వాలి అని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. సత్యం సింగ్ రాజ్పుత్ అనే మరో న్యాయవాది జస్టిస్ బీఆర్ గవాయ్కు బహిరంగ లేఖ రాశారు. విష్ణుమూర్తి భక్తుడిగా ఆయన వ్యాఖ్యలు నన్ను వ్యక్తిగతంగా బాధించాయి. కాబట్టి వెంటనే ఆయన వాటిని ఉపసంహరించుకోవాలి అని లేఖలో డిమాండ్ చేశారు. ప్రస్తుతం సీజేఐ వ్యాఖ్యలపై న్యాయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. -
చొరబాటుదారుల కోసం కాంగ్రెస్ యాత్రలా?
న్యూఢిల్లీ: విపక్ష కాంగ్రెస్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిప్పులు చెరిగారు. చొరబాటుదారులను రక్షించడమే లక్ష్యంగా ఆ పార్టీ యాత్రలు చేస్తోందని మండిపడ్డారు. చొరబాటుదారుల ఓట్లతో ఎన్నికల్లో నెగ్గాలని కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ప్రధాని మోదీ 75వ జన్మదినం సందర్భంగా బుధవారం ఢిల్లీలోని త్యాగరాజ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో 17 ప్రజా సంక్షేమ పథకాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ తీరును తప్పుపట్టారు. దేశ పౌరులపై కాంగ్రెస్కు, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాం«దీకి ఏమాత్రం విశ్వాసం లేదని విమర్శించారు. అందుకే చొరబాటుదారులకు అండగా నిలుస్తున్నారని, వారిని ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఓటర్ల జాబితాల్లో చొరబాటుదారులు ఎప్పటికీ ఉండాలన్నదే కాంగ్రెస్ విధానమని ఆక్షేపించారు. మనదేశంలోకి అక్రమంగా వలస వచ్చిన వారికి ఓట్లు హక్కు ఇవ్వాలని డిమాండ్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికల్లో నెగ్గడానికి అక్రమ వలసదారులకు అండగా నిలుస్తారా? ఇదెక్కడి చోద్యం అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ విజయాలను ప్రజలు మర్చిపోలేరుదేశంలో ఓటర్ల జాబితాల ప్రక్షాళన కోసం ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియకు బీజేపీ మద్దతు ఇస్తున్నట్లు అమిత్ షా స్పష్టంచేశారు. బిహార్లో కాంగ్రెస్ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్రపై విమర్శలు గుప్పించారు. ఓటర్ల జాబితా నుంచి చొరబాటుదారుల పేర్లను తొలగిస్తే తప్పేమిటని అన్నారు. దేశ సరిహద్దులను మోదీ ప్రభుత్వం కాపాడుతోందని చెప్పారు. మన సరిహద్దులను అతిక్రమించాలని చూసిన శత్రువులపై సర్జికల్, వైమానిక దాడులు చేసినట్లు గుర్తుచేశారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్తాన్కు తగిన గుణపాఠం నేర్పామని వ్యాఖ్యానించారు. మోదీ నాయకత్వంలో 2027 నాటికి మన దేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్వవస్థగా మారడం ఖాయమని అమిత్ షా ధీమా వ్యక్తంచేశారు. ఇకపై స్వదేశీ ఉత్పత్తులు ఉపయోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం ఇప్పటిదాకా ఎన్నో విజయాలు సాధించిందని, దేశ ప్రజలు వాటిని ఎప్పటికీ మర్చిపోలేరని వెల్లడించారు. మోదీ పాలనలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి లభించిందని గుర్తుచేశారు. -
కొందరు రైతులనైనా జైలుకు పంపండి
సాక్షి, న్యూఢిల్లీ: పంట వ్యర్థాలను తగలబెడుతూ వాయుకాలుష్యానికి కారణమవుతున్న రైతులను ఎందుకు అరెస్ట్ చేయట్లేదని పంజాబ్ ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం నిలదీసింది. కొందరు రైతులను కటకటాల వెనక్కి నెడితేనే ఇతర రైతుల్లో భయం ఉంటుందని, వ్యర్థాలను తగలబెట్టే రైతులకు గట్టి సందేశం ఇచ్చిన వాళ్లమవుతామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఉత్తరప్రదేశ్, హరియాణా, రాజస్తాన్, పంజాబ్లలో రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్లలో పోస్టుల భర్తీకి సంబంధించిన అంశాన్ని సుమోటోగా స్వీకరించి విచారించిన సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ల ధర్మాసనం పై విధంగా స్పందించింది. ‘రైతులు నిజంగా ప్రత్యేకమైనవాళ్లే. వాళ్ల కారణంగానే మనం ఆహారం తినగల్గుతున్నాం. అంతమాత్రాన మనం పర్యావరణాన్ని కాపాడకుండా మౌనంగా కూర్చోలేం కదా. పంట వ్యర్థాలను తగలబెడుతున్న రైతులను శిక్షించే సెక్షన్లు ఉన్నాయి కదా? వాయుకాలుష్యంతో పర్యావరణానికి హాని తలపెడుతున్న కొందరు రైతులను అరెస్ట్చేస్తేనే మిగతా వాళ్లకు గట్టి సందేశం వెళుతుంది. తప్పు చేసిన రైతులను శిక్షించేందుకు చట్టంలో నిబంధనలు ఉన్నాయని మీకు తెలియదా? పర్యావ రణాన్ని కాపాడాలనే సత్సంకల్పం మీకు ఉంటే రైతులను అరెస్ట్చేయడానికి ఎందుకు జంకుతున్నారు?’’ అని న్యాయస్థానం నిలదీసింది. ‘‘పంట వ్యర్థ్యాలను జీవఇంధనంగా ఉపయోగంచవచ్చన్న వార్తలను మేం కూడా వార్తాపత్రికల్లో చదివాం. ఇలా సద్వినియోగం చేసుకోండి అని మేం పదేపదే చెప్పలేం’’ అని సీజేఐ గవాయ్ అసహనం వ్యక్తంచేశారు. ‘సీఏక్యూఎం, సీపీసీబీల్లో పోస్ట్లను మూడు నెలల్లోపు భర్తీచేయండి. పదోన్నతి పోస్ట్లను ఆరు నెలల్లోపు భర్తీచేయండి’ అని కోర్టు ఆదేశించింది. రైతులు కథలు చెబుతున్నారుఈ కేసులో పంజాబ్లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది రాహుల్ మెహ్రా, అమికస్ క్యూరీ(కోర్టు సహాయకురాలు)గా అపరంజిత హాజరయ్యారు. గతేడాదితో పోల్చితే పంట వ్యర్థాల దహనం తగ్గుముఖం పట్టిందని మెహ్రా న్యాయస్థానానికి తెలిపారు. ఈ ఏడాది వ్యర్థాల దహనాలను మరింతగా అడ్డుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ వాదనలతో అమికస్ క్యూరీ అపరంజిత విభేదించారు. రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టకుండా ఉండటానికి ప్రభుత్వం రైతులకు నగదు ప్రోత్సాహకాలు, ఇతర పరికరాలు అందిస్తున్నప్పటికీ పెద్దగా మార్పు లేదని ఆమె న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఉపగ్రహాలు తమ పంటపొలాల మీదుగా వెళ్లిన సమయాల్లో పంట వ్యర్థాలకు నిప్పు పెట్టొద్దని వ్యవసాయశాఖ అధికారులే తమకు ఉప్పందించారని రైతులు అవే కథలు మళ్లీ మళ్లీ చెబుతున్నారని ఆమె కోర్టుకు వివరించారు. పంట వ్యర్థాల దహనంపై 2018లోనే సుప్రీంకోర్టు విస్తృతమైన ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. అయినప్పటికీ మరోసారి రాష్ట్ర ప్రభుత్వాలు నిస్సహాయ స్థితిలో కోర్టు ముందు నిలిచాయని వ్యాఖ్యానించారు.లేదంటే మేమే నిర్ణయం తీసుకుంటాం‘పర్యావరణానికి నష్టం కలిగించే రైతులపై చర్యలు తీసుకోవాలి. ఒక వేళ కఠిన చర్యలు తీసుకోవడానికి మీకు మనసురాకపోతే ఆ విషయాన్ని అయినా లిఖితపూర్వకంగా మాకు తెలపండి. మీరు ఒక నిర్ణయం తీసుకోండి. లేకుంటే మేమే తుది నిర్ణయం తీసుకుంటాం’’ అని సీజేఐ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ముందుగా అరెస్టులు, చర్యలు తీసుకున్నాం. కానీ వీరిలో హెక్టార్ సాగుభూమి ఉన్న రైతులే ఎక్కువ. వీళ్లను జైల్లో పెడితే, వీళ్లపై ఆధారపడిన కుటుంబాల పరిస్థితి ఏంటి? గడిచిన సంవత్సరాల్లో పంట వ్యర్థాలకు నిప్పు పెట్టిన ఘటనలు 77,000 జరిగితే అవి ఏకంగా 10,000 స్థాయికి దిగొచ్చాయి’ అని రాహుల్ మెహ్రా కోర్టుకు నివేదించారు. దీనిపై సీజేఐ స్పందించారు. ‘ఎప్పట్లాగా రోటీన్గా రైతులకు సూచనలు చేయడం మానేసి ఈసారి అరెస్టులు, జైలుకు పంపడానికి కూడా మేం వెనకాడము అనే గట్టి సందేశాన్ని ఇవ్వండి. వచ్చే పంటకాలంలోపు పొలాల్లో వ్యర్థాలు పర్యావరణహితంగా తొలగించాలి’ అని ఆయా రాష్ట్రాలకు సీజేఐ సూచించారు. -
హీరోయిన్ దిశా పటానీ ఇంటిపై కాల్పులు.. నిందితుల ఎన్కౌంటర్
సాక్షి,న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ ఇంటిపై కాల్పుల ఘటన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దిశాపఠానీ ఇంటిపైకి కాల్పులకు తెగబడ్డ నిందితుల్ని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ప్రముఖ అంతర్జాతీయ నేరస్థుల ముఠా సభ్యులైన ఈ ఇద్దరిని ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో పోలీసులు ఎన్కౌంటర్ చేశారు.సెప్టెంబర్ 12న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీ నగర సివిల్ లైన్స్ ఏరియాలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఆ రోజు తెల్లవారు జామున సరిగ్గా 3.45 నిమిషాలకు గోల్డీ బ్రార్, రోహిత్ గోదారా ముఠాకు చెందిన రవీంద్ర, అరుణ్లు ఈ కాల్పులు జరిపారు. అయితే, ఈ కాల్పుల ఘటనను యూపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. నిందితులు ఎక్కడున్నా వారిని పట్టుకుని తీరుతామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హామీ ఇచ్చారు.ఆ మరుసటి రోజే ఘాజియాబాద్లోని ట్రోనికా సిటీలో ఎస్టీఎఫ్ నోయిడా యూనిట్, ఢిల్లీ పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకునే క్రమంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వారు మృతి చెందారు. సంఘటనా స్థలం నుంచి తుపాకీ,బుల్లెట్స్ను స్వాధీనం చేసుకున్నట్లు లా అండ్ ఆర్డర్ అదనపు డైరెక్టర్ జనరల్ (ఎడిజి) అమితాబ్ యష్ తెలిపారు. ఇటీవల,దిశా పటానీ సోదరి,మాజీ ఆర్మీ అధికారిణి ఖుష్బూ పటానీ ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారనే కారణంతో కాల్పులు జరిపారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని గోల్డీ బ్రార్ గ్యాంగ్ ప్రకటించింది. -
కన్నీళ్లకే కన్నీరొచ్చె..
ఈ ఫొటో చూడగానే అర్థమయ్యే ఉంటుంది ఇదో విషాద సందర్భమని. స్నేహితుడి లాంటి భర్తకు చివరిసారిగా భార్య కన్నీటి వీడ్కోలు చెబుతున్న విషాద ఘట్టమిది. ఊహించని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పెనిమిటి చివరి చూపు కోసం స్ట్రెచర్పై వచ్చింది ఆమె. మరో స్ట్రెచర్పై నిర్జీవంగా ఉన్న భర్తను చూసి బోరున విలపించింది. రెండు రోజుల క్రితం వరకు తనతో ఎంతో సంతోషంగా గడిపిన భర్త.. శాశ్వతంగా తిరిగిరాడన్న బాధతో ఆమె పడిన వేదనకు అక్కడున్నారంతా కదిలిపోయారు. ఢిల్లీ ద్వారక ప్రాంతంలోని వెంకటేశ్వర్ ఆస్పత్రి మంగళవారం మధ్యాహ్నం ఈ విషాద ఘట్టానికి వేదికయింది. ఢిల్లీ బీఎండబ్ల్యూ కారు ప్రమాదంలో (Delhi BMW Accident) ప్రాణాలు కోల్పోయిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ నవజ్యోత్ సింగ్ అంత్యక్రియలు మంగళవారం నాడు ముగిశాయి. ఇదే దుర్ఘటనలో ఆయన భార్య సందీప్ కౌర్ తీవ్రంగా గాయపడి చిక్సిత పొందుతున్నారు. అంత్యక్రియలకు ముందు నవజ్యోత్ పార్థీవదేహాన్ని చివరి చూపు కోసం సందీప్ కౌర్ ఉన్న ఆస్పత్రికి తీసుకొచ్చారు. లేవలేని స్థితిలో ఉన్న ఆమె.. స్ట్రెచర్పై నుంచే తన చేతులతో భర్త ముఖాన్ని తడిమి కడసారిగా కన్నీటి వీడ్కోలు చెప్పింది. తన కొడులిద్దరి పుట్టినరోజు నాడే భర్తకు చివరి వీడ్కోలు చెప్పాల్సిరావడంతో ఆమె బాధ వర్ణణాతీతం.గురుద్వారా, లంచ్.. విషాదంటీచర్గా పనిచేస్తున్న సందీప్ కౌర్ (Sandeep Kaur) తన భర్తతో కలిసి బైకుపై ఆదివారం బయటకు వెళ్లారు. ఆ రోజు ఉదయం సెంట్రల్ ఢిల్లీలోని బంగ్లా సాహిబ్ గురుద్వారాను సందర్శించిన తర్వాత ఆర్కే పురంలోని కర్ణాటక భవన్లో భోజనం చేశారు. అక్కడి నుంచి ప్రతాప్ నగర్లోని తమ ఇంటికి వెళుతుండగా బీఎండబ్ల్యూ కారు వారి బైక్ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వారిద్దరినీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే నవజ్యోత్ చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు. అయితే దగ్గరలో కాకుండా 19 కిలోమీటర్ల దూరంలోని ఆస్పత్రి తీసుకెళ్లడంతోనే తన భర్త మరణించారని సందీప్ కౌర్ ఆరోపించారు. ప్రమాదం జరిగిన తర్వాత 40 నిమిషాలు ప్రయాణించి జీటీబీ నగర్లో ఉన్న న్యూలైఫ్ ఆస్పత్రికి వీరిని తరలించారు.అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారుకొడుకు మరణంతో నవజ్యోత్ తల్లి గుర్పాల్ కౌర్ శోకసంద్రంలో ముగినిపోయారు. తన కుమారుడిని అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారని కన్నీరుమున్నీరుగా విలపించారు. తన కోడలు కూడా తీవ్రంగా గాయపడి ఇంకా ఆస్పత్రిలో ఉందని వాపోయారు. ప్రమాదస్థలికి దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లి ఉంటే తన తండ్రి బతికివుండేవారని నవజ్యోత్ కుమారుడు నవనూర్ సింగ్ అన్నాడు. తన తల్లికి కూడా తీవ్ర గాయాలయినట్టు వైద్యులు చెప్పారని, హెల్మెట్ (Helmet) ధరించినప్పటికీ తలకు గాయమైందని బాధ పడ్డాడు.కొడుకుల పుట్టినరోజు నాడే..నవజ్యోత్ సింగ్ (52) మరణంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సహోద్యోగులు విషాదంలో మునిగిపోయారు. నవజ్యోత్ మరణం ఆయన కుటుంబానికే కాదు, దేశానికి లోటని సహోద్యోగులు అన్నారు. ఆయన ఇద్దరు కొడుకుల పుట్టినరోజు నాడే నవజ్యోత్ అంత్యక్రియలు జరపాల్సి రావడం విషాదమని ఆవేదన చెందారు. నవజ్యోత్ అంత్యక్రియలు మంగళవారం బేరి వాలా బాగ్ శ్మశానవాటికలో జరిగాయి. అంతకుముందు ఉత్తర ఢిల్లీలోని ప్రతాప్ నగర్ నుంచి బేరి వాలా బాగ్ శ్మశానవాటిక సాగిన అంతిమయాత్రలో నవజ్యోత్ సింగ్ కుటుంబ సభ్యులు, బంధువులు, సహచరులు పాల్గొన్నారు.కావాలని చేయలేదు..నిర్లక్ష్యంగా కారు నడిపి నవజ్యోత్ సింగ్ (Navjot Singh) మరణానికి కారణమైన నిందితురాలు గగన్ప్రీత్ కౌర్, ఆమె భర్త పరీక్షిత్ మక్కర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాద సమయంలో వారిద్దరి పిల్లలు కూడా కారులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వారి కారును స్వాధీనం చేసుకున్నామని.. ప్రమాదంలో కౌర్, ఆమె భర్తకు స్వల్ప గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేరినట్టు స్థానికి డీసీపీ చెప్పారు. కాగా, సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన గగన్ప్రీత్ను పోలీసులు అరెస్ట్ చేసి, 2 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. తాను కావాలని యాక్సిడెంట్ చేయలేదని, ప్రమాదవశాత్తు జరిగిపోయిందని పోలీసులతో ఆమె చెప్పినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు భయాందోళనకు గురయ్యానని, అందుకే తనకు తెలిసిన ఆస్పత్రికి తీసుకెళ్లినట్టు వెల్లడించింది. కోవిడ్ సమయంలో తన పిల్లలు అక్కడే చికిత్స పొందారని తెలిపారు.చదవండి: టికెట్ బుకింగ్.. రైల్వేశాఖ కొత్త రిజర్వేషన్ విధానంఎఫ్ఐఆర్లో ఏముంది?ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో రింగ్ రోడ్లో నవజ్యోత్ సింగ్ మోటార్ సైకిల్ను బీఎండబ్ల్యూ కారు (BMW Car) ఢీకొట్టడంతో ఆయన మృతి చెందారు. ఆయన భార్య సందీప్ కౌర్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గురుగ్రామ్ నివాసి గగన్ప్రీత్ కౌర్, ఆమె భర్త పరీక్షిత్ మక్కర్, వారి ఇద్దరు పిల్లలు, పనిమనిషి ప్రమాద సమయంలో కారులోనే ఉన్నారు. పరీక్షిత్కు స్వల్ప గాయాలయ్యాయి. గగన్ప్రీత్పై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 281 (బహిరంగ మార్గంలో వేగంగా వాహనం నడపడం), 125B (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు ముప్పు కలిగించే చర్యలు), 105 (హత్యతో సమానం కాని నేరపూరిత హత్య), 238 (నేరానికి సంబంధించిన సాక్ష్యాలను అదృశ్యం చేయడం లేదా నేరస్థుడిని తప్పించడానికి తప్పుడు సమాచారం ఇవ్వడం) కింద కేసు నమోదు చేశారు. -
ఈవీఎం బ్యాలెట్పై కలర్ ఫొటోలు
పట్నా: బిహార్లో చేపట్టిన ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్) అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో శాసనసభ ఎన్నికల్లో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నడుంబిగించింది. ఎల్రక్టానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం) బ్యాలెట్ పేపర్ లేఔట్లో ఆధునిక మార్పులు తేనున్నట్లు ఈసీ ప్రకటించింది. గతంలో ఈవీఎం లేఔట్పై అభ్యర్థుల ఫొటోలు నలుపు,తెలుపు రంగులో ఉండేవి. కొందరి ఫొటోలైతే అస్సలు ముద్రించకపోయేవాళ్లు. ఇకపై కలర్ ఫొటోలను ముద్రించి ఓటర్లు సులభంగా తమ అభ్యర్థులను గుర్తించే వెసులుబాటు కల్పించనున్నారు. ఫొటో కోసం కేటాయించిన మొత్తం ప్రదేశంలో ముప్పావువంతు సైజులో ఫొటో పెద్దగా కని్పంచనుంది. దీంతో కంటి సమస్యలున్న ఓటర్లు సైతం తమ అభ్యర్థి ముఖాన్ని స్పష్టంగా చూశాకే ఓటేసే అవకాశమొచ్చింది. కొత్తగా వచ్చిన మార్పులేంటి? → అభ్యర్థి సీరియల్ నంబర్తోపాటు ‘ఎవరికి ఓటు వేయబోము(నన్ ఆఫ్ ది ఎబో–నోటా) అనే ఆప్షన్ సైతం పెద్ద సైజులో ఉండనుంది. → అంతర్జాతీయ భారతీయ అంకెల విధానమైన లక్షలు, కోట్లు వంటి వాటిని సైతం ఉపయోగించనున్నారు. ఈ అంకెలను 30 నంబర్ ఫాంట్సైజులో ముద్రిస్తారు. → స్పష్టంగా కనిపించేందుకు మందంగా బోల్డ్లో ప్రింట్చేస్తారు. → అభ్యర్థుల అందరి పేర్లు ఒకే పరిమాణంలో కన్పించేలా ఒకే నంబర్ ఫాంట్ సైజును ఉపయోగించనున్నారు. నోటాకు సైతం ఇదే వర్తించనుంది. లిపి(ఫాంట్) రకాలు వేర్వేరుకాకుండా ఒకే రకం ఫాంట్ను వాడనున్నారు → చదరపు మీటర్కు 70 గ్రాముల బరువు ఉండే 70 జీఎస్ఎం గ్రేడ్ పేపర్ను ఈవీఎం బ్యాలెట్ పేపర్ ముద్రణ కోసం ఉపయోగిస్తారు. శాసనసభ ఎన్నికల కోసం ప్రత్యేకంగా గులాబీరంగు పేపర్ను ఉపయోగిస్తారు. అందులోనూ పింక్, రెడ్, గ్రీన్లను ప్రత్యేకంగా వాడనున్నారు. → బిహార్లోనే తొలిసారిగా ఈ కొత్త నిబంధనలను అమల్లోకి తెస్తున్నారు. -
రాహుల్ గాంధీపై షాషిద్ అఫ్రిది ప్రశంసలు
ఇస్లామాబాద్: పాక్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై ప్రశంసల వర్షం కురిపించారు. రాహుల్గాంధీ తన చర్చల ద్వారా అందరిని ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. వాళ్లు మాత్రం (బీజేపీని ఉద్దేశిస్తూ).. మరో ఇజ్రాయెల్గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉన్న ఒక్క ఇజ్రాయెల్ సరిపోదా? అని దుయ్యబట్టారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత ఆసియాకప్లో భారత్-పాక్లు తలపడ్డాయి. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లకు హ్యాండ్షేక్ ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేశారు. దీంతో పాక్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లు సంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించారని వారిపై తగు చర్యలు తీసుకోవాలంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో పాటు పాక్ ప్రస్తుత ఆటగాళ్లు,మాజీ ఆటగాళ్లు భారత్పై విమర్శలు గుప్పిస్తున్నారు.ఈ క్రమంలో పాకిస్తాన్ మీడియా సంస్థ సామ్మాటీవీ ఆసియాకప్పై నిర్వహించిన ప్యానల్ డిస్కషన్లో షాహిద్ అఫ్రిది పాల్గొన్నారు. రాహుల్ గాంధీ మాత్రం పాజిటివ్ మైండ్సెట్ కలిగిన నాయకుడు. సమస్యల పరిష్కారం కోసం సంభాషణే మార్గమని ఆయన నమ్ముతారు. కానీ బీజేపీ మాత్రం ఘర్షణ, విభజన వైపు మొగ్గుచూపుతుంది. ఇప్పటికే ప్రపంచంలో ఒక ఇజ్రాయెల్ ఉంది. అది మత, భూభాగ, రాజకీయ వివాదాలతో నిండిన దేశం. మరొక ఇజ్రాయెల్ను సృష్టించాలన్నదే మీ ఉద్దేశమా? అని ప్రశ్నిస్తూ ఒక ఇజ్రాయెల్ చాలదా? ఇంకొకటి కావాలా?’ అంటూ షాహిద్ అఫ్రిది వ్యాఖ్యానించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోను అస్త్రంగా పలువురు బీజేపీ నేతలు రాహుల్గాంధీపై దుమ్మెత్తిపోస్తున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి.. ఎక్స్ వేదికగా.. రాహుల్ గాంధీకి ఇప్పుడు కొత్త ఫ్యాన్బాయ్ దొరికాడు. అవమానానికి గురైన పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ! అంటూ పేర్కొన్నారు. మరో బీజేపీ నేత షెహ్జాద్ పూనావాలా కూడా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు.ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమీ లేదు. భారత్ను ద్వేషించే ప్రతి ఒక్కరూ రాహుల్ గాంధీ. కాంగ్రెస్లో మిత్రులను కనుగొంటారు. జార్జ్ సోరస్ నుంచి షాహిద్ అఫ్రిదీ వరకు... ఐఎస్సీ అంటే ‘ఇస్లామాబాద్ నేషనల్ కాంగ్రెస్’ అని దుయ్యబట్టారు. 🚨This is Fear From Indian Army & Leadership.Operation Sindoor they will never forget. pic.twitter.com/p77IwsCSiz— Lt Colonel Vikas Gurjar 🇮🇳 (@Ltcolonelvikas) September 16, 2025 -
Train Ticket: రైల్వే శాఖ కొత్త రిజర్వేషన్ విధానం
రైలు ప్రయాణికులకు అలర్ట్. ఆన్లైన్లో టిక్కెట్ బుక్ చేసుకునే వారికి రైల్వే శాఖ కొత్త నిబంధన అమల్లోకి తెస్తుంది. న్యూఢిల్లీ: జనరల్ టిక్కెట్ల రిజర్వేషన్కు బుక్కింగ్స్ మొదలైన మొదటి 15 నిమిషాలను ఆధార్ ధ్రువీకరణ ఉన్న యూజర్లను మాత్రమే అనుమతిస్తామని రైల్వే శాఖ తెలిపింది. రైలు ఏదైనా బుక్కింగ్స్ ప్రారంభమైన మొదటి 15 నిమిషాల్లో ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్ లేదా యాప్ ద్వారా రిజర్వేషన్ చేయించుకునే టిక్కెట్లకు ఇది వర్తిస్తుందని స్పష్టత నిచ్చింది. పదిహేను నిమిషాల తర్వాత మాత్రమే అధీకృత ఏజెంట్లు టిక్కెట్లు రిజర్వేషన్ తీసుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది.‘ఉదాహరణకు ఒక రైలు ఒకటో తేదీ ఉదయం 10 గంటలకు బయలుదేరనుంది. ఆ రైలుకు రిజర్వేషన్లు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైతే, మొదటి 15 నిమిషాలు ఆధార్ ధ్రువీకరణ ఉన్న వారికే రిజర్వేషన్ చేసుకునే అవకాశముంటుంది’అని వివరించింది. ఇప్పటి వరకు తత్కాల్ (Tatkal) రిజర్వేషన్లకు మాత్రమే ఈ నిబంధన ఉండేది.రిజర్వేషన్ విధానం ప్రయోజనాలు సాధారణ వినియోగదారునికి కూడా అందేందుకు, దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు కొత్త విధానాన్ని తీసుకువచ్చినట్లు రైల్వే శాఖ సోమవారం ఒక సర్క్యులర్లో వివరించింది. కౌంటర్లో టిక్కెట్లు బుక్ చేసుకునే ఏజెంట్లకు ప్రస్తుతమున్న మొదటి 10 నిమిషాల నియంత్రణ కొనసాగుతుందని కూడా స్పష్టం చేసింది. చదవండి: జేఈఈ లేకుండానే.. ఐఐటీలో సీటు! -
‘ఆపరేషన్ సిందూర్’ దెబ్బ.. మసూద్ అజార్ కుటుంబం ముక్కలైంది.. వీడియో వైరల్
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్లో జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబం తునాతునకలైనట్లు పాకిస్తాన్ జైషే మహమ్మద్ కమాండర్ ఓ బహిరంగ సభలో వ్యాఖ్యానించారు.తాజాగా, పాకిస్తాన్లో జరిగిన ఓ సమావేశంలోని వీడియో వైరల్గా మారింది. ఆ వీడియోలో జైషే కమాండర్ మసూద్ ఇలియాస్ కాశ్మీరీ భారత బలగాలు వారి రహస్య స్థావరంలోకి చొరబడి వారిపై ఎలా దాడి చేశాయో వివరించాడు. ఉర్దూలో కాశ్మీరీ మాట్లాడుతూ.. ‘ఉగ్రవాదాన్ని స్వీకరించి, ఈ దేశ సరిహద్దులను కాపాడటం కోసం మేము ఢిల్లీ, కాబూల్, కాందహార్లతో పోరాడాం. సర్వస్వం త్యాగం చేశాం. కానీ మే 7న బహవల్పూర్లో భారత బలగాలు మౌలానా మసూద్ అజార్ కుటుంబాన్ని ముక్కలు చేశాయి’ అని ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడాడు. జమ్మూకశ్మీర్లో మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన పహల్గాంలోని బైసారన్ ప్రాంతంలో ఏప్రిల్ 22 మధ్యాహ్నం పర్యాటకులపై ఉగ్ర ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 26మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, పహల్గాం ఉగ్రదాడికి భారత్ బదులు తీర్చుకుంది. లష్కరే తోయిబా, జైషే ఉగ్రముఠాలే లక్ష్యంగా వాటి స్థావరాలపై బాంబులతో విరుచుకుపడింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో జరిపిన మెరుపుదాడులతో ఈ ఉగ్రసంస్థలకు గట్టి దెబ్బ తగిలింది. ముఖ్యంగా బహవల్పూర్లోని జైషే ప్రధాన కేంద్రాన్ని నేలమట్టం చేసింది. ఆపరేషన్ సిందూర్తో జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబంలోని 10 మందితో పాటు అతడి మరో నలుగురు అనుచరులు మృతి చెందారు. వారితో పాటు జైషే నెంబర్-2గా ఉన్న ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్, మౌలానా అమర్ ఇతరుల కుటుంబసభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. దాదాపు 600 మంది ఉగ్రవాదుల ఇళ్లు కూడా ఈ క్యాంపస్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆపరేషన్ సిందూర్ దెబ్బకు బహవల్పూర్లోని జైషే ఉగ్రస్థావరాలు చిన్నాభిన్నమయ్యాయి. వాటిని పునర్నిర్మించుకునేందుకు పాక్ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారీ ఎత్తున నిధులు కూడా కేటాయించింది.ఈ క్రమంలో ఆపరేషన్ సిందూర్లో భారత బలగాలు పీవోకే, పాకిస్తాన్లో ఎంతటి బీభత్సం సృష్టించాయో జైషే కమాండర్ మసూద్ ఇలియాస్ కాశ్మీరీ వివరించడం చర్చాంశనీయంగా మారింది. 🚨 #Exclusive 🇵🇰👺Jaish-e-Mohamad top commander Masood ilyas kashmiri admits that On 7th May his leader Masood Azhar's family was torn into pieces in Bahawalpur attack by Indian forces. Look at the number of gun-wielding security personnel in the background. According to ISPR… pic.twitter.com/OLls70lpFy— OsintTV 📺 (@OsintTV) September 16, 2025 Markaz Subhan Allah, Bahawalpur (Punjab, Pakistan) was the headquarters of Jaish-e-Mohammad. This facility was a key hub for orchestrating terror operations, including the Pulwama attack on Feb 14, 2019. The perpetrators of the bombing were trained at this very site. Demolished. pic.twitter.com/zNhcMylVxW— Amit Malviya (@amitmalviya) May 7, 2025 4th Month Anniversary of Operation Sindoor. Enjoy Guys pic.twitter.com/fJAL3vQvsh— rae (@ChillamChilli) September 7, 2025 -
వివేకా కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: వివేకా హత్య కేసులో నిందితుల బెయిల్ రద్దుపై తాము జోక్యం చేసుకోం అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో నిందితుల బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది.ఈ కేసులో తదుపరి దర్యాప్తు అంశంపై ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ముగిసిందని అడిషనల్ సొలిసిటర్ జనరల్.. సుప్రీంకోర్టుకు తెలిపారు. తదుపరి దర్యాప్తు అంశంపై కోర్టుదే నిర్ణయం అని ఏఎస్జీ తెలిపారు.‘‘దర్యాప్తు చేయాలన్న పిటిషనర్ వాదనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘మీరు బస్ మిస్సయ్యారు.. ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలైంది. ఆ దశలోనే ఈ అంశాలు చెప్పాలి కదా?. దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఈ అంశాలన్నీ ట్రయల్ కోర్టులో ఎందుకు చెప్పలేదు?. ఇలాగే పిటిషన్లు వేస్తూ వెళ్తే ట్రయల్ రన్ పూర్తి కావడానికి దశాబ్దం పడుతుంది. ఈ దశలో మేం చేసేది ఏం లేదు’’ అంటూ కోర్టు వ్యాఖ్యానించింది. కాగా, గత నెలలో వివేకా హత్య కేసులో దర్యాప్తు పూర్తయిందని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ‘ఈ కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమని సీబీఐ భావిస్తోందా.. రాష్ట్ర ప్రభుత్వం కడప సెషన్స్ కోర్టులో దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టుపై సీబీఐ అభిప్రాయమేంటి.. కేసు ట్రయల్, తదుపరి దర్యాప్తు ఏక కాలంలో కొనసాగించే అవకాశం ఉందా..’అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆదేశించింది.ఈ నేపథ్యంలో గత నెల ఆగస్టు5న మరోసారి జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టగా.. వివేకా హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు పూర్తయిందని సుప్రీం కోర్టుకు సీబీఐ వివరించింది.ఇవాళ(మంగళవారం) ఈ కేసులో నిందితుల బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. నిందితుల బెయిల్ రద్దుపై తాము జోక్యం చేసుకోలేమని.. తదుపరి దర్యాప్తు అంశంపై ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని పేర్కొంది. -
నలుగురిలో ఒకరు ట్యూషన్కు!
పాఠశాల విద్యార్థుల్లో దాదాపు నలుగురిలో ఒకరు ఇప్పుడు ట్యూషన్లు లేదా ప్రైవేట్ కోచింగ్ మీద ఆధారపడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఈ ధోరణి మరింత ఎక్కువగా ఉంది. ట్యూషన్ల కోసం ఏటా ప్రతి విద్యార్థిపై చేస్తున్న సగటు వ్యయం గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో దాదాపు రెండింతలు అధికంగా ఉండడం గమనార్హం. – సాక్షి, స్పెషల్ డెస్క్జాతీయ నమూనా సర్వే (ఎన్స్ ఎస్ఎస్) 80వ రౌండ్ కింద కేంద్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్–జూన్ మధ్య విద్యపై సమగ్ర సర్వే చేపట్టింది. అడ్మిషన్ల విషయంలో గ్రామీణ భారతంలో ప్రభుత్వ పాఠశాలలదే పైచేయిగా ఉందని సర్వే తేల్చింది. పట్టణ ప్రాంత కుటుంబాలు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చేర్పించేందుకే మొగ్గు చూపుతున్నాయి అంతేకాదు మార్కుల వేటలో భాగంగా తమ పిల్లలను ట్యూషన్లకూ పంపిస్తున్నాయి.ట్యూషన్ల కోసం వ్యయంప్రస్తుత విద్యా సంవత్సరంలో దేశంలో 27 శాతం మంది విద్యార్థులు ప్రైవేట్ కోచింగ్ తీసుకుంటున్నారు. ప్రాంతాలవారీగా చూస్తే పట్టణాల్లో 30.7%, గ్రామీణ భారత్లో 25.5% మంది ప్రైవేట్ కోచింగ్పై ఆధారపడ్డారు. దేశంలో సగటున ఒక్కో విద్యార్థి ట్యూషన్స్ కోసం రూ.2,409 వెచ్చిస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో కోచింగ్ కోసం సగటు ఖర్చు రూ.1,793 కాగా, పట్టణాల్లో రూ.3,988 అవుతున్నట్టు అంచనా. ఇంటర్ స్థాయిలో పట్టణ కుటుంబాలు కోచింగ్ కోసం ఒక్కో విద్యార్థికి రూ.9,950 ఖర్చు చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇది రూ.4,548.పట్టణాల్లో ప్రైవేట్ విద్యకు..గ్రామీణ ప్రాంతాల్లో మూడింట రెండొంతుల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. 33.9% మంది ప్రైవేట్, ఇతర సంస్థలలో చదువుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో కేవలం 30.1% మంది విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. దాదాపు 70% మంది ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుకుంటున్నారు. మొత్తంగా దేశ సగటు చూ స్తే.. అడ్మిషన్లలో 55.9% వాటా ప్రభుత్వ పాఠశాలలదేనని సర్వే పేర్కొంది.పట్టణ ప్రాంతాల్లో అధికంప్రభుత్వ పాఠశాలల్లో ఫీజులు ఉండవు. కానీ, ట్యూషన్లు, ర వాణా, స్టేషనరీ, ఇతర ఖర్చులు పెరిగాయి. ప్రైవేటులో అయితే వీటికి ఫీజు, యూనిఫాం వంటివి అదనంగా చేరతాయి. దీంతో ప్రతి విద్యా ర్థికి అవుతున్న వార్షిక వ్యయం రూ.23,470గా సర్వే అంచనా వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది రూ.8,382గా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో అయితే.. పట్టణ ప్రాంత విద్యార్థికి రూ.4,128, గ్రామీణ ప్రాంతాల్లో రూ.2,639 ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వేతర పాఠశాలల విషయంలో ఇది.. పట్టణప్రాంతాల్లో రూ.31,782, గ్రామీణ ప్రాంతాల్లో 19,554గా ఉంది. పట్టణ ప్రాంతాల్లో ఫీజుల కోసం చేస్తున్న సగటు వార్షిక వ్యయం రూ.15,143 కాగా, గ్రామీణ ప్రాంతాల్లో ఇది రూ.3,979.⇒ ఇంటర్మీడియెట్ చదువుతున్న విద్యార్థుల విషయంలో దేశంలో 37% మంది ప్రైవేట్ కోచింగ్కు సై అంటున్నారు. పట్టణాల్లోని ఇంటర్ స్టూడెంట్స్లో 44.6 మంది ట్యూషన్లకు వెళ్తున్నారు.⇒ ప్రైవేట్ ట్యూషన్స్ కోసం దేశంలో ఇంటర్మీడియెట్ విద్యార్థులు సగటున ఏటా రూ.6,384 ఖర్చు పెడుతున్నారు. ⇒ కోచింగ్ సంస్థలు చెల్లించిన వస్తు, సేవల పన్ను 2019–20లో రూ.2,240 కోట్లు. 2023–24కి వచ్చేసరికి ఇది రూ.5,517 కోట్లకు చేరింది.⇒ కోచింగ్ కోసం అమ్మాయిల కంటే అబ్బాయిలు కొంచెం ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. సగటున ఏటా అమ్మాయిలు రూ.2,227, అబ్బాయిలు రూ.2,572 వ్యయం చేస్తున్నట్టు సర్వే పేర్కొంది. -
చట్టవిరుద్ధం అని తేలితే పక్కన పడేస్తాం: సుప్రీం
న్యూఢిల్లీ: బిహార్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియ ఏమాత్రం చట్టవిరుద్ధంగా అనిపించినా మొత్తం ప్రక్రియను పక్కన పడేస్తామని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది. ఎస్ఐఆర్ చట్టవిరుద్ధంగా చేపడుతున్నారంటూ దాఖలైన పిటిషన్లపై సోమవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చీల ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని హెచ్చరించింది. ‘‘ రాజ్యాంగబద్ధ సంస్థగా ఎలక్షన్ కమిషన్ ప్రతి పనినీ చట్టప్రకారమే నిర్వర్తిస్తుందని మేం మొదట్నుంచీ భావిస్తున్నాం. అయితే కొత్తగా చేపట్టిన ఎస్ఐఆర్ ఏ దశలోనైనా చట్టవిరుద్ధమని తేలితే మొత్తం విధానాన్ని రద్దుచేస్తాం. ఇప్పటికిప్పుడే ఎస్ఐఆర్పై తుది నిర్ణయానికి రాబోం. కేసులో చివరి వాదోపవాదనలను అక్టోబర్ ఏడోతేదీన ఆలకిస్తాం. ఈ కేసులో మేం ఇచ్చే తుది తీర్పు బిహార్కు మాత్రమేకాదు యావత్భారతదేశానికి వర్తిస్తుంది. ప్రస్తుతానికి ఎస్ఐఆర్లాంటి ప్రక్రియను ఇతర రాష్ట్రాల్లో ఈసీ చేపట్టినా మేం అడ్డుచెప్పబోం. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ అమలుపై అభ్యంతరాలు ఉంటే పిటిషనర్లు తమ వాదనలను అక్టోబర్ ఏడో తేదీన వినిపించుకోవచ్చు. అక్టోబర్ ఏడున కేసు విచారణ ఉండబోతోంది ఆలోపే అంటే సెప్టెంబర్ 30వ తేదీన బిహార్ ఓటర్ల తుది జాబితా ముద్రణ ఉండబోతోంది. ఈ తేదీకి కేసు విచారణకు ఎలాంటి సంబంధం లేదు. ఆ తుది జాబితాలో ఏవైనా చట్టవిరుద్ధత కనిపిస్తే ఎస్ఐఆర్ ప్రక్రియను అప్పడైనా రద్దుచేస్తాం’’ అని కోర్టు స్పష్టంచేసింది. ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది, పిటిషన్ వేసిన అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదించారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఎస్ఐఆర్ చేపట్టేందుకు ఈసీ సన్నాహాలు చేస్తోందని, ఈ విషయంలో ఈసీని అడ్డుకోవాలని న్యాయవాది గోపాల్ వాదించారు. ‘‘ అసలు ఈ విధానంలో చట్టబద్ధతను ఇంకా తేల్చాల్సి ఉంది. రాజ్యాంగంలో ఇలాంటి విధానం నియమనిబంధనలను పరిశీలించాల్సి ఉంది. ఆలోపే ఇతర రాష్ట్రాల్లో ప్రక్రియను ఆపాలని ఈసీకి ఆదేశాలు ఇవ్వలేం’’ అని ధర్మాసనం స్పష్టంచేసింది. దేశవ్యాప్త ఎస్ఐఆర్పై ఈసీ మరింత ముందుకు వెళ్లేలోపే ఈసీని నిలువరించాలని కాంగ్రెస్సహా పలు విపక్ష పార్టీల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్సిబల్ కోర్టును కోరారు. చట్టాన్ని తుంగలోతొక్కి ఈసీ తన సొంత నిర్ణయాలను అమలుచేస్తోందని రాష్ట్రీయ జనతాదళ్ తరఫున సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ వాదించారు. ‘‘జాబితాలో తప్పులుంటే 24 గంటల్లోపు వెబ్సైట్లో అభ్యంతరాలను అప్లోడ్చేయాలని ఈసీ చెబుతోంది. ఇది చాలా కష్టమైన పని’’ అని ఆయన వాదించారు. -
వక్ఫ్ సవరణ చట్టం: ఐదేళ్ల నిబంధన కుదరదు
న్యూఢిల్లీ: అత్యంత వివాదాస్పదంగా తయారైన వక్ఫ్(సవరణ) చట్టం–2025 విషయంలో సర్వోన్నత న్యాయస్థానం సోమవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. చట్టంలోని ఒక ముఖ్యమైన నిబంధనపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్ల ధర్మాసనం 128 పేజీల మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఒక వ్యక్తి తన ఆస్తిని వక్ఫ్ కోసం దానంగా ఇవ్వడం వంటికి చేయాలంటే కనీసం గత ఐదేళ్లుగా ఇస్లాంను ఆచరిస్తూ ఉండాలన్న నిబంధనపై అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ మేరకు వక్ఫ్(సవరణ) చట్టంలోని సంబంధిత నిబంధనపై స్టే విధించింది. ‘‘ ఐదేళ్లుగా ఇస్లామ్ను పాటించాలి అనే నిబంధనలో స్పష్టత కరువైంది. సంపూర్ణ నిర్వచనంతో, సమగ్రస్థాయిలో ఈ అంశంపై స్పష్టత వచ్చేలా నిబంధనలు తయారుచేసేవరకు ఈ ప్రొవిజన్ అమలును నిలిపేస్తున్నాం. ఏదైనా చట్టం రాజ్యాంగబద్ధంగా ఉందనే భావిస్తాం. కేవలం అరుదైన కేసుల్లో అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే జోక్యం చేసుకోవడం సబబు. వక్ఫ్ చట్టంలోని అన్ని నిబంధనల అమలుపై స్టే విధించాలన్న వాదనల్లో పసలేదు. అందుకే మొత్తం చట్టంపై స్టే విధించట్లేము. అయితే ఇరుపక్షాల వాదనలు విన్నాక రెండువైపులా సమతుల న్యాయం దక్కాలని చూస్తున్నాం. అందుకే వక్ఫ్ ఆస్తుల స్థితిని కలెక్టర్ మార్చే అధికారం అమలుకాకుండా స్టే విధిస్తున్నాం. అలాగే వక్ఫ్ బోర్డ్లలో ముస్లిమేతర సభ్యుల అంశంపై కలెక్టర్ నిర్ణయాలు తీసుకోకుండా స్టే విధిస్తున్నాం’’ అని ధర్మాసనం పేర్కొంది. మరోవైపు, ‘‘చాన్నాళ్లుగా వక్ఫ్ భూమిగా చెలామణి అయినంతమాత్రాన అది వక్ఫ్ భూమి కాబోదు. ప్రభుత్వ భూమి అయినాకూడా వక్ఫ్ ఆస్తిగా చెలామణిలో ఉన్నంత మాత్రాన అది వక్ఫ్ ఆస్తికాబోదు. వక్ఫ్ బై యూజర్ నిబంధన తొలగింపు సబబే’’ అని ధర్మాసనం మోదీ సర్కార్ చర్యను సమరి్థంచడం గమనార్హం. నాలుగు.. మూడుకు మించకూడదు ‘‘ కేంద్ర వక్ఫ్ మండలిలో ముస్లిమేతర సభ్యుల సంఖ్య నాలుగుకు మించకూడదు. మొత్తం సభ్యుల సంఖ్య 20 దాటకూడదు. అలాగే రాష్ట్రాల్లో వక్ఫ్ బోర్డ్లలో ముస్లిమేతర సభ్యుల సంఖ్య మూడుకు మించకూడదు. మొత్తం సభ్యుల సంఖ్య 11 దాటకూడదు. కనీసం ఐదేళ్లుగా ఒక వ్యక్తి ఇస్లాంను ఆచరిస్తున్నట్లు నిర్ధారించే కచ్చితమైన నిబంధనావళిని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించేదాకా ‘వక్ఫ్కు ఆస్తి ఇవ్వాలంటే ఐదేళ్లుగా ఇస్లాంను పాటించాలి’ అనే సెక్షన్3 లోని (ట) క్లాజుపై స్టే విధిస్తున్నాం. సంబంధిత అధికారి తన నివేదికను సమరి్పంచేదాకా ఏదైనా ఆస్తి ‘వక్ఫ్ ఆస్తి’ అని కొత్తగా ప్రకటించడానికి వీల్లేదు. ఏదైనా ఆస్తి ఒకవేళ ప్రభుత్వ ఆస్తి అయి ఉండవచ్చని ఆ అధికారి భావిస్తే ఆ మేరకు రెవిన్యూ రికార్డుల్లో సవరణ చేయొచ్చు, ఈ అంశాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలి అనే నిబంధనలపైనా స్టే విధిస్తున్నాం’’ అని ధర్మాసనం పేర్కొంది. ‘‘వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 3సీ కింద వక్ఫ్ ఆస్తిగా ప్రకటించని సందర్భంలో, ట్రిబ్యునల్ ఆదేశంతో సవరణ చట్టంలోని సెక్షన్ 83ని అమలుచేసి సందర్భంలో, హైకోర్టు తదుపరి ఆదేశం కోసం వేచి ఉన్న సందర్భాల్లో అలాంటి ఆస్తులను ఇక వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించకూడదు, రెవెన్యూ రికార్డుల్లో నమోదుచేయకూడదు’’ అని నిబంధనలపైనా స్టే విధిస్తున్నాం’’అని కోర్టు స్పష్టంచేసింది. వివాదాస్పద ఆస్తి ఎవరికి చెందుతుంది అనేది ట్రిబ్యునళ్లు, హైకోర్టుల్లో తేలేదాకా ఆ ఆస్తులపై మూడో పక్షానికి హక్కులు దఖలుపర్చకూడదు అని కోర్టు ఆదేశించింది. ముస్లింల వర్గానికి ఎక్స్–అఫీషియో కార్యదర్శిగా సేవలందించే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియామానికి బాటలు వేసే సెక్షన్ 23పై కోర్టు ఎలాంటి స్టే విధించలేదు. చట్టంలో పేర్కొన్న ప్రకారం వక్ఫ్ అనేది ముస్లింలు ఇచ్చే విరాళం, దానం. తమ భూములు, స్థిరాస్థులను దాతృత్వ, మత సంబంధ కార్యక్రమాల కోసం దానం(వక్ఫ్)గా ఇవ్వొచ్చు. ఈ భూముల్లో మసీదులు, పాఠశాలలు, ఆస్పత్రులు, ప్రజాసంస్థలు ఏర్పాటుచేసుకోవచ్చు. వక్ఫ్గా మారిన ఆస్తిని ఇతరులకు విక్రయించకూడదు, ఇంకొకరికి బహుమతిగా ఇవ్వకూడదు, వారసత్వంగా పొందకూడదు, ఆక్రమించకూడదు. వక్ఫ్ బై యూజర్ తొలగింపులో వివాదం లేదు ‘‘ పెద్ద మొత్తంలో ప్రభుత్వభూములు ఆక్రమణకు గురై చాన్నాళ్లుగా వక్ఫ్ వినియోగంలో ఉన్నాయి. నిరాటంకంగా వక్ఫ్ అ«దీనంలో ఉంటే అవి వక్ఫ్ బై యూజర్ నిబంధన ప్రకారం వక్ఫ్ ఆస్తులుగా మారుతున్నాయి. ఇది తప్పు అని భావించి ఈ నిబంధనను ప్రభుత్వం తొలగించింది. ఈ తొలగింపులో ఎలాంటి వివాదం లేదు’’ అని సీజేఐ జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు.స్వాగతించిన కాంగ్రెస్ ‘‘కీలక సెక్షన్లను నిలుపుదల చేస్తూ కోర్టు ఇచి్చన తీర్పును స్వాగతిస్తున్నాం. ఈ ఉత్తర్వు రాజ్యాంగ విలువలైన న్యాయం, సమానత్వ, సౌభ్రాతృత్వం గెలుపునకు నిదర్శనం. వాస్తవిక వక్ఫ్ చట్టాన్ని కాలరాస్తూ మోదీ సర్కార్ తీసుకొచి్చన తప్పుడు సవరణలను తొలగించేలా తుది తీర్పు వెలువడుతుందని ఆశిస్తున్నాం’’ అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ‘ఎక్స్’లో ఒక పోస్ట్చేశారు. ‘‘ భారత్లో ఎప్పుడూ సద్దుమణిగిన అంశాలను మోదీ సర్కార్ ఎగదోస్తోంది. విద్వేషాలను పెంచేందుకు ఈ విభజన చట్టాన్ని బుల్డోజర్లా తీసుకొచి్చంది’’ అని అన్నారు. చాలావరకు ఆమోదించినట్లే: బీజేపీ‘‘మేం తెచి్చన సవరణలను కోర్టు ఆమోదించింది. మొత్తం చట్టంపై స్టే విధించాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టంచేసింది. అంటే మెజారిటీ చట్టం చట్టబద్ధంగా ఉందని కోర్టే స్పష్టంచేసినట్లయింది. వక్ఫ్ బై యూజర్ మాటున ఇకపై వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూముల ఆక్రమణ అనేది ఇకపై ఆగుతుంది. కోర్టు నిర్ణయాలను మేం కూడా స్వాగతిస్తున్నాం’’ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నళిన్ కోహ్లీ చెప్పారు. మధ్యంతర ఉత్తర్వులోని కీలకాంశాలు → ఐదేళ్లుగా ఇస్లాంను పాటిస్తున్న వ్యక్తి మాత్రమే వక్ఫ్(దానం) ఇవ్వాలన్న సెక్షన్ 3(1)(ట)ను నిలుపుదల చేసింది→ ఐదేళ్లుగా ఇస్లాంలో కొనసాగుతున్నారో లేదో తేల్చే నిబంధనలు రూపొందేదాకా సెక్షన్ 3(1)(ట)పై స్టే అమలు→ సంబంధిత ఆఫీసర్ నివేదించాడన్న ఒకే ఒక్క కారణంగా వక్ఫ్ ఆస్తిని వక్ఫ్కాని ఆస్తిగా పనిగణించకూడదు→ అలాంటి నివేదికలను ఆధారంగా చేసుకుని వక్ఫ్ రికార్డులతోపాటు ప్రభుత్వ రెవెన్యూ రికార్డుల్లో సవరణలు చేయకూడదు→ హైకోర్టు ఆదేశాల మేరకు వివాదాస్పద ఆస్తులపై సెక్షన్ 83 కింద వక్ఫ్ ట్రిబ్యునళ్లు ఇచ్చే నిర్ణయాలు అమలయ్యేలోపు వక్ఫ్ బోర్డ్లు ఎలాంటి ఆస్తులను తమ ఆస్తులుగా, తమవికాని ఆస్తులుగా ప్రకటించకూడదు→ సీఈవోగా నియమించబోయే వ్యక్తిని వీలైనంత వరకు ముస్లిం వర్గం నుంచే ఎంపికచేయాలి→ ఇవన్నీ మధ్యంతర ఉత్తర్వులే. ఈ ఉత్తర్వులు ఇచి్చనంత మాత్రాన సవరణ చట్టం చట్టబద్ధతపై తమ తమ వాదనలను ఇరుపక్షాలు వాదించే అవకాశం లేదని భావించకూడదు.ముస్లిం సంస్థల హర్షం వక్ఫ్ సవరణచట్టంలో ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న కీలక నిబంధనల అమలుపై కోర్టు స్టే విధంచడంతో ముస్లిం సంఘాలు ఆనందం వ్యక్తంచేశాయి. తుది తీర్పు సైతం ముస్లింలకు అనుకూలంగా రావాలని ఆశాభావం వ్యక్తంచేశాయి. ‘‘ ఈ మధ్యంతర ఉత్తర్వులను స్వాగతిస్తున్నాం’’ అని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్(ఏఐఎంపీఎల్బీ) ఒక ప్రకటనలో పేర్కొంది. కొన్ని నిబంధనలకు బదులు మొత్తం సవరణ చట్టాన్నే రద్దుచేయాలని ఆలిండియా షియా పర్సనల్ లా బోర్డ్(ఏఐఎస్పీఎల్బీ) ఆశాభావం వ్యక్తంచేసింది. ‘‘ఐదేళ్లుగా ఇస్లాంను పాటిస్తేనే వక్ఫ్ అనే నిబంధనపై స్టే విధించడం పెద్ద ఊరట. ఇక వక్ఫ్ బోర్డ్లో ముస్లిమేతర సభ్యుని అంశం అలాగే ఉండిపోయింది’’అని ఏఐఎంపీఎల్బీ కార్యనిర్వాహక సభ్యుడు ఖలీద్ రషీద్ ఫరాంగీ మహాలీ అన్నారు. -
పెన్షన్కు సర్వీస్ బ్రేక్ అడ్డంకి కాదు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు బదిలీ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు సుప్రీంకోర్టులో పాక్షిక ఊరట లభించింది. ఉద్యోగంలో చేరడంలో పరిపాలన పరంగా జరిగిన జాప్యం వల్ల ఏర్పడిన సర్వీస్ అంతరాయాన్ని(సర్వీస్ బ్రేక్) పెన్షన్ ప్రయోజనాల కోసం పరిగణనలోకి తీసుకోవాలని, వారి సర్వీసును నిరంతరంగానే భావించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, పనిచేయని ఆ కాలానికి కూడా పూర్తి జీతం చెల్లించాలన్న ఉద్యోగుల అభ్యర్థనను మాత్రం తోసిపుచ్చింది. ‘నో వర్క్–నో పే’ అనే సూత్రం వర్తిస్తుందని తేల్చిచెబుతూ వారి పిటిషన్ను కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఎస్.వి.ఎన్.భట్టిలతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. పనిచేయని కాలానికి జీతం ఇవ్వాలనే నిబంధన లేదు..2014లో రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో 58 ఏళ్లకు పదవీ విరమణ చేసిన కొందరు ఉద్యోగులను.. ఏపీలో 60 ఏళ్ల పదవీ విరమణ వయసు ఉన్నందున తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. అయితే, తెలంగాణ నుంచి రిలీవ్ అవ్వడానికి, ఏపీలో పోస్టింగ్ ఇవ్వడానికి మధ్య.. కొన్ని నెలల నుంచి ఏడాదికి పైగా సమయం పట్టింది. ఈ కాలాన్ని సర్వీసుగా పరిగణించి పూర్తి జీతం చెల్లించాలని ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.పనిచేయని కాలానికి కూడా జీతం చెల్లించడానికి చట్టంలో ఎలాంటి నిబంధన లేదని.. అందువల్ల ఆ డిమాండ్కు చట్టపరమైన బలం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఉద్యోగుల తప్పు లేకుండా జరిగిన పరిపాలన జాప్యం వల్ల.. వారి పెన్షన్ ప్రయోజనాలకు నష్టం వాటిల్లకూడదని అభిప్రాయపడింది. ఆ ఖాళీ సమయాన్ని కూడా పెన్షన్ లెక్కింపు కోసం పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. తద్వారా వారి 60 ఏళ్ల సర్వీస్కు గాను పూర్తి పెన్షన్ ప్రయోజనాలు పొందుతారని పేర్కొంది. అయితే ఈ ప్రయోజనం పొందాలంటే.. తాము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆ ఖాళీ సమయంలో ఉద్యోగులు ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చి ఉండాలని కోర్టు వ్యాఖ్యానించింది. -
‘సాక్షి’పై కక్ష... పత్రికా స్వేచ్ఛపై దాడే!
సాక్షి, న్యూఢిల్లీ: ‘సాక్షి’ దినపత్రికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, ఈ ధోరణి పత్రికా స్వేచ్ఛపై దాడి అని ప్రెస్క్లబ్ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఖండించింది. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్య్రపు హక్కును అణచివేయడానికి ఏపీ ప్రభుత్వం క్రిమినల్ చట్టాలను ఆయుధంగా వాడుకుంటోందనేందుకు ఇది ఒక నిలువెత్తు నిదర్శనం అని అభిప్రాయపడింది. అధికారంలో ఉన్నవారికి అసౌకర్యం కలిగించే వార్తలు రాసినందుకు దేశవ్యాప్తంగా జర్నలిస్టులపై ఒకటికి రెండు కేసులు నమోదు చేసే ఆందోళనకర సంస్కృతి కొనసాగుతోందని పేర్కొంది.‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, పాత్రికేయులపై కేసుల నమోదు కూడా ఇందులో భాగమేనని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు గౌతమ్ లహిరి, ప్రధాన కార్యదర్శి నీరజ్ ఠాకూర్ సోమవారం ఢిల్లీలో ప్రకటన విడుదల చేశారు. ‘‘సాధారణ వార్తలు రాసినందుకే ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, జర్నలిస్టులపై కేసులు బనాయించి, వ్యవస్థాగతంగా వేధిస్తున్నారు.ఏపీలోని వేర్వేరు జిల్లాల్లో భారతీయ న్యాయ సంహిత కింద 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ప్రతిపక్ష పార్టీ నేత నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ వార్తను ప్రచురించినందుకే రెండు స్టేషన్లలో రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అదే వార్తను ఇతర పత్రికలు, మీడియా సంస్థలు సైతం ఇచ్చాయి. కేవలం ‘సాక్షి‘ని మాత్రమే లక్ష్యంగా చేసుకుని వేధించడం కక్షసాధింపు అని స్పష్టంగా కనిపిస్తోంది. ఎఫ్ఐఆర్లను పరిశీలించిన తర్వాత, పత్రిక సంపాదకవర్గంపై క్రిమినల్ చట్టాలను అసంబద్ధంగా, ఎంపిక చేసినట్లుగా ప్రయోగించారని అర్థమవుతోంది’’ అని తెలిపారు. ⇒ ప్రభుత్వం నమోదు చేసిన కేసుల్లో ‘సాక్షి’ జర్నలిస్టులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మధ్యంతర రక్షణ కల్పించడాన్ని గమనించామని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వార్తలు రాసిన జర్నలిస్టులను వేధించకుండా... పోలీసులను కట్టడి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా విజ్ఞప్తి చేసింది. సంపాదకీయపరమైన వివాదాలను సివిల్ చట్టాల ద్వారా పరిష్కరించుకోవాలి కానీ, క్రిమినల్ చట్టాల ద్వారా కాదని తాము విశ్వసిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ విషయంలో సీఎం చంద్రబాబు తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. -
ఏసీ కోచ్లో యువతి స్మోకింగ్.. ‘నా డబ్బుతో కొనుక్కున్న సిగరెట్.. మీకెందుకంత బాధ?’
సాక్షి,విశాఖపట్నం: విశాఖపట్నం-గాంధీధామ్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (20803)లో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో.. ఏసీ కోచ్లో ఓ యువతి సిగరెట్ తాగుతూ ఇతర ప్రయాణికులతో వాగ్వాదానికి దిగింది. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట్లో చక్కెర్లు కొడుతున్నాయి. ఇక ఆ వీడియోను పరిశీలిస్తే.. యువతి సిగరెట్ తాగుతుండగా.. ఓ యువకుడు ఆమెను ప్రశ్నిస్తూ వీడియో తీస్తుంటారు. ‘ఏం చేస్తున్నారు మీరిక్కడ? ట్రైన్ లోపల ఎందుకు సిగరెట్ తాగుతున్నారు? ఇది ఏసీ కోచ్ మీకు కనిపించడం లేదా? అని ప్రశ్నిస్తాడు. దీంతో వీడియో తీస్తున్నారని గమనించిన ఆ ప్రయాణికురాలు.. యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు నన్నెందుకు వీడియో తీస్తున్నారు. వెంటనే డిలీట్ చేయండి అంటూ బెదిరింపులకు దిగింది. అందుకు ఆ యువకుడు ఒప్పుకోకపోవడంతో.. నీకెందుకు బ్రదర్.. ఇది నీ ట్రైన్ కాదు కదా ప్రశ్నించింది. ఓ చేతిలో సిగరెట్ పట్టుకుని.. ఈ సిగరెట్ను నా సొంత డబ్బుతో కొనుక్కొని తాగుతున్నా మీకెందుకు అని మరింత గట్టిగా కేకలు వేసింది. కేకలు విన్న తోటి ప్రయాణికులు ..యువతిని ట్రైన్లో సిగరెట్ తాగడం ఆపాలని కోరారు. అయితే ఆమె వారి మాటలను పట్టించుకోకుండా.. ఇది మీ ట్రైన్ కాదు కదా, మీకు ఎందుకు బాధ? అని కసురుకుంది. నేను లోపలికి వెళ్లను. నా వీడియో ఎందుకు డిలీట్ చేయడం లేదు? అని ప్రశ్నించింది. అందుకు తోటి ప్రయాణికులకు చిర్రెత్తడంతో యువతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసేది లేక చివరికి ఆమె తన బెర్త్కి వెళ్లి ఇప్పుడు పోలీసులను పిలవండి అంటూ సవాల్ విసిరింది. ఈ వీడియో ఎప్పుడు రికార్డ్ చేశారో తెలియాల్సి ఉండగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై రైల్వే శాఖ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. सिगरेट पीने की तलब, बेईज्जत करवा देती हैं. वायरल वीडियो में चलती ट्रेन में इस तरह धूम्रपान करेगी तो सामने वाला आपकी करतूतों को दिखाएगा?@RailMinIndia pic.twitter.com/mXHxy0715s— Tushar Rai (@tusharcrai) September 15, 2025 -
పక్కనే ఆస్పత్రి ఉండగా.. 19 కిలోమీటర్ల దూరం ఎందుకు తీసుకెళ్లినట్లు!
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల విభాగంలో డిప్యూటీ సెక్రటరీ నవ్జ్యోత్సింగ్ (52) రోడ్డు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నవ్జ్యోత్సింగ్ మరణానికి కారణమైన నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఘటనకు సంబంధించిన ఆధారాల్ని ధ్వంసం చేసినందుకు గుర్గావ్ పోలీసులు నిందితులపై అదనపు కేసులు నమోదు చేశారు.ఆదివారం ఢిల్లీ కంటోన్మెంట్ మెట్రోస్టేషన్ సమీపంలో గగన్ప్రీత్ (38),పరిషిత్ మాక్కాడ్(40)లు ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూకారు.. గురుద్వార్ దర్శనం చేసుకుని ఇంటికి వెళ్తున్న నవ్జ్యోత్సింగ్, అతని భార్య సందీప్కౌర్ ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవ్జ్యోత్సింగ్ మరణించగా.. సందీప్కౌర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే గగన్ ప్రీత్ బీఎండబ్ల్యూకారు తమని ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించే క్రమంలో ఢీకొట్టినట్లు సందీప్కౌర్ పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. నిందితులు నన్ను,నా భర్త నవజోత్ సింగ్ను ఓ వ్యానులో ఆస్పత్రికి తరలించారు. ఆ వ్యానులో ఉన్న నేను మమ్మల్ని సమీప ఆస్పత్రికి తరలించమని నిందితుల్ని ప్రాధేయపడ్డ.. కానీ వాళ్లు మాత్రం మమ్మల్ని ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి 19కిలోమీటర్ల దూరంలో ఉన్న జీటీబీ నగర్ న్యూలైఫ్ ఆస్పత్రికి తరలించారు. ఫలితంగా నా భర్త వ్యాన్లోనే ప్రాణాలు కోల్పోయారని కన్నీరు మున్నీరుగా విలపించారు. బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ప్రధాన నిందితురాలు గగన్ప్రీత్ తండ్రి సదరు న్యూలైఫ్ ఆస్పత్రికి సహయజమాని అని నిర్ధారించుకున్నారు. దీంతో కేసును కప్పిపుచ్చే ప్రయత్నం జరిగిందా అన్న కోణంలో ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు సందీప్కౌర్కు ట్రీట్మెంట్ ఇచ్చిన రిపోర్టుతో పాటు కారు ప్రమాదంలో నిందితులకు కఠిన శిక్ష పడేందుకు ఉపయోగపడే ఆధారాలను తారుమారు చేసే ప్రయత్నంలో న్యూలైఫ్ ఆసుపత్రికి తీసుకువచ్చారని అనుమానించారు.ఇదే అంశంపై స్పష్టత ఇవ్వాలంటూ ఆస్పత్రి ప్రతినిధుల్ని పోలీసులు ప్రశ్నించారు. ట్రీట్మెంట్ విషయంలో సదరు ఆస్పత్రి వైద్యులు,యాజమాన్యం ప్రొటొకాల్ పాటించామని చెప్పాయి. కానీ రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశానికి కూతవేటు దూరంలో ఆస్పత్రి ఉంచుకొని.. 19కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యూలైఫ్ ఆస్పత్రికే ఎందుకు తరలించారు అనే అంశంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
వంతారాకు ఊరట
అనంత్ అంబానీ (Anant Ambani) స్థాపించిన వంతారా (Vantara) సంస్థకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. నిబంధనలకు అనుగుణంగా వంతారాకు ఆలయ ఏనుగుల (Elephants)ను తరలిస్తే.. అందులో ఎలాంటి తప్పూ లేదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ క్రమంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏనుగుల తరలింపుపై సంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించింది.గుజరాత్ జామ్నగర్లోని వంతారా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి ఏనుగుల తరలింపును సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరిపింది. ఈ క్రమంలో ఈ విషయంపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా వంతారాకు క్లీన్చిట్ ఇచ్చినట్లు జస్టిస్ పంకజ్ మిథల్, జస్టిస్ పీబీ వరాలేలతో కూడిన ధర్మాసనం గుర్తు చేసింది. ఏనుగుల తరలింపులో తప్పులేమీ లేదు, నిబంధనల ప్రకారం జరిగితే సరే. ఏనుగులు బాధపడుతున్నాయ్ అని చెప్పినప్పుడు.. దానికి ఆధారాలేమిటో కూడా పిటిషనర్ చూపించాలి కదా. ఇది దేశ గర్వంగా భావించే విషయం. కాబట్టి దీన్ని తక్కువ చేయకండి. పిటిషన్లో పేర్కొన్న ఆరోపణలు అస్పష్టమైనవిగా కనిపిస్తున్నాయి. విచారణ కొనసాగించాలంటే, పిటిషనర్లు తమ వాదనలను స్పష్టంగా, ఆధారాలతో సమర్పించాల్సిన అవసరం ఉంది అని కోర్టు అభిప్రాయపడింది.ఈ క్రమంలో.. వంతారాలో బందీలుగా ఉన్న ఏనుగులను వాటి యజమానులకు తిరిగి ఇవ్వడానికి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ జయసుకిన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను అస్పష్టమైనదిగా న్యాయస్థానం తోసిపుచ్చింది. వంతారాపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఇచ్చిన నివేదికను పరిశీలించిన అనంతరం ఈవిషయంపై వివరణాత్మక ఉత్తర్వులు జారీ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. వంతారాలో చట్టాలను పాటించట్లేదని.. విదేశాలు, వివిధ రాష్ట్రాల నుంచి ఏనుగులను అక్రమంగా తీసుకువస్తున్నారని ఆరోపిస్తూ.. ఇటీవల పలు వన్యప్రాణుల సంరక్షణ సంస్థలు సుప్రీంకోర్టు (Supreme Court)లో పిల్ దాఖలు చేశాయి. దీనిపై దర్యాప్తు చేయడానికి ఇటీవల సుప్రీంకోర్టు జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ.. వంతారా సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలు, వన్యప్రాణుల సంక్షేమం, ఆర్థిక పారదర్శకత వంటి అంశాల్లో సవ్యంగా ఉందంటూ నివేదికను ఇచ్చింది. ఆ నివేదికను సర్వోన్నత న్యాయస్థానం ఆమోదించింది కూడా. అయితే ఇదంతా బయటి దేశాల నుంచి జరుగుతున్న కుట్ర అని, భారత్ చేస్తున్న మంచి పనులపై జంతువుల వేటను అనుమతించే దేశాలు ఈవిధంగా అభ్యంతరాలు లేవనెత్తుతున్నాయని.. ఈ విషయంలో దర్యాప్తునకు తాము అన్నివిధాలా సిట్కు సహకరిస్తామని వంతారా తరఫు న్యాయవాది మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. -
ఢిల్లీలో దారుణంగా తిట్టుకున్న ఎంపీ శబరి, సీఎం అడిషనల్ సెక్రటరీ!
సాక్షి, విజయవాడ: ఏరికోరి సీఎం చంద్రబాబు నియమించుకున్న ఐఏఎస్ అధికారితో టీడీపీ నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మాటల యుద్ధానికి దిగారు. ఒకరికొకరు తిట్టుకోవడంతో పాటు పరస్పరం ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో నడుస్తున్న ఈ పంచాయితీ హాట్ టాపిక్గా మారింది. టీడీపీ ఎంపీ శబరి వెర్సస్ సీఎంవో కార్యదర్శి కార్తికేయ మిశ్రా ఢిల్లీలో దారుణంగా తిట్టుకున్నారు. ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం రోజే జరిగిన ఈ వాగ్వాదం వివరాలు ఇలా ఉన్నాయి.. ‘‘ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం కోసం వచ్చిన సీఎం చంద్రబాబును కలిసేందుకు ఎంపీ శబరి ఎదురు చూడసాగారు. ఆ సమయంలో ఆమెను సీఎం అడిషనల్ సెక్రటరీ కార్తికేయ మిశ్రా‘‘సీఎం బాగా బిజీగా ఉన్నారు’’ అని చెప్పి అనుమతించలేదు. అప్పటిదాకా పడిగాపులు పడ్డ ఆమె ఆ సమాధానంతో ఒక్కసారిగా ఊగిపోయారు. ‘‘నేనొక ఎంపీని.. నాతో ఇలాగేనా మాట్లాడేది’’ అని గట్టిగా అరిచారు. దీనికి ఆయన ‘‘నీలా ఎవరూ నాతో ఇప్పటిదాకా ఇలా మాట్లాడలేదు’’ అంటూ మండిపడ్డారు. ఆ ఏకవచనం పిలుపుతో మరింత రగిలిపోయిన శబరి.. తనతో మర్యాదగా ప్రవర్తించాలంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆ వివాదం మరింత ముదరకుండా.. కొందరు ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. కట్ చేస్తే.. తాజాగా ఆమె మంత్రి నారా లోకేష్కు ఈ వ్యవహారంపై పిర్యాదు చేశారు. లోకేష్కు అత్యంత సన్నిహితుడిగా కార్తీకేయ మిశ్రాకు పేరుంది. ఈ క్రమంలోనే ఆయన్ని కావాలనే చంద్రబాబుకి అదనపు కార్యదర్శిగా నియమించుకున్నారు. అయితే తాజా వివాదం నేపథ్యంలో.. సీఎంవో సీనియర్ అధికారి ఒకరి చేత విచారణకు ఆదేశించినట్లు సమాచారం. -
వక్ఫ్ చట్టంపై స్టేకి సుప్రీం కోర్టు నిరాకరణ, కానీ..
వక్ఫ్ (సవరణ) చట్టం Waqf (Amendment) Act, 2025పై దేశసర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర తీర్పును వెలువరించింది. చట్టం అమలుపై(అన్ని ప్రొవిజనల్స్)పై స్టే విధించేందుకు నిరాకరిస్తూనే.. చట్టంలో కీలక ప్రొవిజన్స్ను నిలిపివేస్తూ సోమవారం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బీఆర్ గవాయ్ ధర్మాసనం ఆదేశాలను జారీ చేసింది. ఇందులో.. ప్రధానంగా ఐదేళ్లు ఇస్లాం మతం ఆచరిస్తేనే వక్ఫ్ చేయాలన్న సెక్షన్ కూడా ఉంది. కనీసం ఐదేళ్లపాటు ఇస్లాంను అనుసరించిన వ్యక్తి మాత్రమే ఆస్తిని వక్ఫ్ చేయడానికి అవకాశం ఉంటుందన్న దానిని నిలిపివేసింది. ఒక వ్యక్తి ఇస్లాంను అనుసరిస్తున్నట్లు నిర్ణయించేలా నిబంధనలు తయారుచేసేవరకు ఇది అమల్లో ఉండదని చెప్పింది. అదే సమయంలో వక్ఫ్(సవరణ)చట్టం-2025పై మొత్తంగా స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కొన్ని సెక్షన్లకు మాత్రం కొంత రక్షణ అవసరమని వ్యాఖ్యానించింది. వక్ఫ్ బోర్డులో ముస్లిం సభ్యుల సంఖ్య కచ్చితంగా మెజార్టీలో ఉండాలని కోర్టు పేర్కొంది. బోర్డ్ లేదా కౌన్సిల్లో అత్యధికంగా ముగ్గురు లేదా నలుగురు ముస్లిమేతర సభ్యులు ఉండాలని చెప్పింది. ఇక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ముస్లిమే ఉండటం మంచిదని పేర్కొంది.మధ్యంతర ఆదేశాల్లో హైలైట్స్వక్ఫ్ ఆస్తులా ? కావా ? అన్నది కోర్టులే నిర్ణయిస్తాయిప్రభుత్వ ఆస్తులను వక్ఫ్ ఆక్రమించిందా? లేదా? అనే అంశంపై నిర్ణయించే అధికారం అధికారులకు కట్టబెట్టిన సెక్షన్ పై స్టే ఐదేళ్లు ఇస్లాం మతం ఆచరిస్తేనే వక్ఫ్ చేయాలన్న సెక్షన్ పై స్టేఈ అంశంపై ప్రభుత్వం తగిన నిబంధనలు రూపొందించే వరకు స్టే విధించిన సుప్రీంవక్ఫ్ ఆస్తుల డీనోటిఫికేషన్: కోర్టు ఈ అంశంపై తాత్కాలికంగా ప్రభుత్వ చర్యలకు పరిమితి విధించింది. ఇప్పటికే వక్ఫ్గా గుర్తించబడిన ఆస్తుల స్థితిని తక్షణంగా మార్చకూడదని సూచించింది.వక్ఫ్ బోర్డుల సభ్యత్వం: ముస్లిమేతరుల నియామకంపై అభ్యంతరాలు ఉన్నా.. కోర్టు తాత్కాలిక స్టే ఇవ్వలేదు. కానీ ఈ అంశంపై వివరణాత్మక విచారణ అవసరమని పేర్కొంది.సెంట్రల్ వక్ఫ్ బోర్డులో నలుగురికి మించి ముస్లిమేతరులను నియమించవద్దుస్టేట్ వక్ఫ్ బోర్డులో ముగ్గురికి మించి ముస్లిమేతరులను నియమించవద్దుకలెక్టర్ విచారణ ద్వారా ప్రభుత్వ భూమిగా గుర్తింపు: ఈ నిబంధనపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని కోర్టు సూచించింది. ఆ అధికారం కలెక్టరలకు లేదని.. ట్రిబ్యూనల్స్కే ఉందని స్టే విధించింది. ఇది ఆస్తుల హక్కులపై ప్రభావం చూపే అంశంగా పేర్కొంది.సెక్షన్ 3r - ఇస్లాం ఆచరిస్తూ 5 సంవత్సరాలు కావాలి. నియమాలు రూపొందించకపోతే, అది యాదృచ్ఛిక అధికార వినియోగానికి దారి తీస్తుంది.సెక్షన్ 2(c) నిబంధన - వక్ఫ్ ఆస్తి, వక్ఫ్ ఆస్తిగా పరిగణించబడదు.సెక్షన్ 3C - రెవిన్యూ రికార్డుల్లో సవాలు చేస్తూ కలెక్టర్కు హక్కులు నిర్ణయించే అధికారం ఇవ్వడం, అధికార విభజనకు విరుద్ధం. తుది తీర్పు వచ్చే వరకు ఆస్తుల హక్కులు ప్రభావితం కావు. హక్కు నిర్ణయించకముందు, వక్ఫ్ కూడా ఆస్తి నుండి తొలగించబడదు.సెక్షన్ 23 - ఎక్స్ ఆఫీషియో అధికారి ముస్లిం సమాజానికి చెందినవారే కావాలి.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ చట్టం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ కేసు ఏప్రిల్లో పార్లమెంట్ ఈ బిల్లును క్లియర్ చేసిన గంటల్లోనే సుప్రీంకోర్టుకు చేరింది. ఈ చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ 72 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలు కాగా.. వీటన్నింటిని ఒక్కటిగా కలిపి కోర్టు విచారణ జరిపి మధ్యంతర ఆదేశాలిచ్చింది. ఈ తీర్పు చట్టాన్ని నిలిపివేయకుండా.. కీలకాంశాలపై పరిమితి విధిస్తూ సమగ్ర విచారణకు మార్గం వేసింది. అంతకు ముందు..ఈ పిటిషన్లను సీజేఐ(పూర్వపు) జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం మే 5న విచారణ చేపట్టి, తదుపరి విచారణను మే 15కి వాయిదా వేసింది. ఆపై జస్టిస్ ఖన్నా మే 13న పదవీ విరమణ చేయడంతో.. తదుపరి సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం విచారణ జరిపింది. వాదనలు పూర్తి కావడంతో మే 22వ తేదీన తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ ఆ తీర్పును ద్విసభ్య ధర్మాసనం వెల్లడించింది. అయితే ఇది మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే. రాజ్యాంగబద్ధతపై పూర్తి విచారణ ఇంకా జరగాల్సి ఉంది.వాదనలు.. వక్ఫ్ అనేది మతపరమైన అవసరం కాదు, ఇది చారిటబుల్ కాన్సెప్ట్ అని కేంద్రం వాదించింది. అయితే పిటిషనర్లు ఈ చట్టాన్ని అన్యాయమైనది, అసంవిధానమైనది, ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసిందని అభిప్రాయపడ్డారు. ఈ తరుణంలో కోర్టు.. చట్టానికి రాజ్యాంగబద్ధత ఉందని కేంద్రం చెప్పిందని, కాబట్టి పూర్తి స్టే ఇవ్వడం అనవసరం అని అభిప్రాయపడుతూ కీలక అంశాలపై మాత్రం స్టే విధించింది. -
‘సిక్’ అని మెసేజ్ చేసిన 10 నిమిషాలకే..
న్యూఢిల్లీ: హఠాత్తుగా ఒంట్లో బాగోలేదంటూ ఉన్నతాధికారికి స్మార్ట్ఫోన్లో సందేశం పంపిన పది నిమిషాలకే ఆ ఉద్యోగి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. 40 ఏళ్లకే ఓ ఉద్యోగి నూరేళ్లు నిండిన విషాద ఘటన తాలూకు వివరాలను పైఅధికారి కేవీ అయ్యర్ ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. ‘‘నా కింది ఉద్యోగి శంకర్ నుంచి ఉదయం 8.37 గంటలకు ఒక మెసేజ్ వచ్చింది.భయంకరమైన వెన్నునొప్పి కారణంగా ఈరోజు ఆఫీస్కు రాలేకపోతున్నా, ఒక రోజు సెలవు ఇవ్వండి అని అందులో ఉంది. సరే విశ్రాంతి తీసుకో అని సమాధానం ఇచ్చా. ఆ తర్వాత కేవలం 10 నిమిషాలకే కుప్పకూలి శంకర్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. కొద్దిసేపటి తర్వాత నాకొక ఫోన్కాల్ వచ్చింది. శంకర్ చనిపోయాడని అవతలి వ్యక్తి చెబితే నమ్మలేకపోయా. వెంటనే మరో ఉద్యోగికి ఫోన్చేసి ఆరాతీశా.10 నిమిషాలకే చనిపోయాడని వాళ్లు కూడా చెప్పడంతో నిశ్ఛేష్డుడినయ్యా. వెంటనే శంకర్ ఇంటి అడ్రస్ కనుక్కుని పరుగున వెళ్లా. కానీ అతనిక లేడని తెల్సి దుఃఖంలో మునిగిపోయా. శంకర్ ఆరేళ్లుగా మా ఆఫీస్లోనే పచిచేస్తున్నాడు. వయసు కేవలం 40 ఏళ్లు. పెళ్లయింది. వాళ్లకొక పసి పిల్లాడు ఉన్నాడు. అతనికి ధూమపానం, మద్యపానం వంటి చెడు అలవాట్లు లేవు. మరునిమిషం ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేం. చుట్టూ ఉన్న వాళ్లతో హాయిగా ఉండండి. చివరిదాకా జీవితాన్ని ఆస్వాదించండి’’ అని అన్నారు. -
అస్సాంలో భూకంపం
దిస్పూర్: అస్సాంలో భూకంపం సంభవించింది. ఆదివారం అస్సాంలో 5.71 తీవ్రతతో భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. 10 కి.మీ (6.21 మైళ్ళు) లోతులో భూకంపం సంభవించిందని జీఎఫ్జెడ్ తెలిపింది.అస్సాంలోని గౌహతిలో సాయంత్రం 4:41 గంటలకు 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూ ప్రకంపనలు ఉత్తర బెంగాల్,పొరుగున ఉన్న భూటాన్ వరకు సంభవించాయి. భూకంపం కారణంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టంపై సమాచారం తెలియాల్సి ఉంది. తూర్పు హిమాలయ సింటాక్సిస్లో యురేషియన్, సుండా ప్లేట్ల కలయిక వద్ద అస్సాం ఉంది. కాబట్టే అస్సాంలో తరుచూ భూకంపాలు సంభవిస్తుంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా, సెప్టెంబర్ 2న అస్సాంలోని సోనిత్పూర్లో 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. కొన్ని రోజుల తర్వాత ఇవాళ మరోసారి భూమి కంపించడం గమనార్హం. -
‘నేను శివభక్తుణ్ని.. ఆ విషాన్ని నేను హరించేస్తా’
దిస్పూర్: తనపై,తన తల్లి హీరాబెన్పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న కాంగ్రెస్పై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను శివభక్తుణ్ని.. కాంగ్రెస్ విమర్శల విషాన్ని హరించేస్తా’అని స్పష్టం చేశారు. ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ అసోంలో దరంగ్ జిల్లాలో ఆదివారం వేలకోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. ‘నేను ఇలా మాట్లాడితే మోదీ మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని కాంగ్రెస్ విమర్శలు చేస్తుంది. నన్ను ఎంత దూషించినా పట్టించుకోను. ఎందుకంటే నేను శివుని భక్తుడిని.. విమర్శల విషాన్ని హరించేస్తా. నా రిమోట్ కంట్రోల్ వాళ్లేకానీ దేశ ప్రజలపై దాడి చేస్తే మాత్రం మౌనంగా ఉండను. ప్రజలే నా దేవుళ్లు. నా బాధను వాళ్ల ముందు వ్యక్తం చేయకపోతే .. ఎవరి ముందు చేస్తాను. అందుకే వాళ్లే నా యజమానులు, నా దేవతలు, నా రిమోట్ కంట్రోల్. నాకు వేరే రిమోట్ కంట్రోల్ లేదు’ అని స్పష్టం చేశారు.చర్చకు దారితీసిన మోదీ రిమోట్ కంట్రోల్ వ్యాఖ్యలు అయితే, అస్సాం సభలో ప్రధాని మోదీ మరోసారి‘రిమోట్ కంట్రోల్’ వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ రిమోట్ కంట్రోల్ చేశారని మోదీ ఆరోపించారు. అలాగే, ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గాంధీ కుటుంబం రిమోట్ కంట్రోల్లో ఉన్నారని కూడా విమర్శించారు.2019లో ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రముఖ అస్సామీ సంగీత కళాకారుడు భూపెన్ హజారికాకు భారతరత్న అవార్డ్తో సత్కరించింది. ఆ అవార్డుపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే విమర్శలు గుప్పించారు. మోదీ గాయకులకు, నర్తకులకు అవార్డు ఇస్తున్నారు’ అని ఎద్దేవా చేశారు. అప్పట్లో తాను చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో ఖర్గే క్షమాపణలు చెప్పారు. ఖర్గే.. భూపెన్ హాజారికాను ఉద్దేశిస్తూ చేసిన విమర్శలను రాష్ట్ర సీఎం హిమంత బిశ్వశర్మ తనతో ప్రస్తావించినట్లు మోదీ తాజాగా సభలో గుర్తు చేశారు. అవును.. ఖర్గే అనుచితంగా మాట్లాడారుఅవును. భారత ప్రభుత్వం ఈ దేశపు ముద్దుబిడ్డ అస్సాం గర్వకారణం భూపేన్ హజారికాను భారతరత్నతో సత్కరించిన రోజున కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అనుచిత వ్యాఖ్యలు చేశారు. మోదీ ఈ అవార్డును ‘గాయకులు, నృత్యకారులకు’ఇచ్చారని అన్నారంటూ అస్సాం సభలో మోదీ గుర్తు చేస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో.. బీజేపీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి చర్చించారు. ఇటీవల రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్రలో మోదీని, మోదీ తల్లిని కొందరు దూషించినట్లుగా ఓ వీడియోను విడుదల చేసింది. ఆ సమయంలో ఆ వీడియోపై ..మోదీ స్పందిస్తూ.. కాంగ్రెస్ తన తల్లి హీరాబెన్ను రాజకీయాల్లోకి లాగడం సరైందికాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా బీహార్ కాంగ్రెస్ విభాగం సోషల్ మీడియాలో ఓ ఏఐ వీడియోను పోస్టు చేసింది. ఆ వీడియోను మోదీ, తల్లి హీరాబెన్ను ఉద్దేశించి ఉండటం తీవ్ర దుమారం రేగింది. కాంగ్రెస్ తనని వ్యక్తిగత హననం చేయడంపై ఇవాళ అస్సాంలో మోదీ స్పందించారు. -
విమానం టేకాఫ్ విఫలం.. తప్పిన పెను ప్రమాదం..
లక్నో: లక్నో ఎయిర్ పోర్టులో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తృటిలో తప్పింది. లక్నో-ఢిల్లీలో ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. రన్వేపై వేగం అందుకున్న తర్వాత విమానం టేకాఫ్ విఫలమైంది. అతి కష్టంపై పైలట్.. విమానాన్ని రన్ వే ముగిసే ముందు నిలిపివేశారు. విమానంలో ఎంపీ డింపుల్ యాదవ్తో పాటు 151 మంది ప్యాసింజర్లు ఉన్నారు.శనివారం ఉదయం ఈ సంఘటన జరిగింది. ఇండిగో ఎయిర్లైన్స్ విమానం 6ఈ-2111 టేకాఫ్ కోసం సిద్ధమైంది. ఈ విమానం సాధారణంగా లక్నో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉదయం 10:30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:30 గంటలకు ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంది. రన్వేకు చేరుకుని ప్రయాణికులు విమానం ఎక్కారు. టేకాఫ్కు ముందు ఇంజిన్లు శక్తిని పుంజుకోవడంతో విమానం ఒకేసారి పైకి లేస్తుంది. కానీ, ఢిల్లీకి వెళ్లాల్సిన ఈ విమానం సాంకేతిక సమస్య కారణంగా టేకాఫ్ కాలేదు. . ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.ఈ విమానంలో సమాజ్ వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్తో పాటు గోండా ఎస్పీ నాయకుడు సూరజ్ సింగ్ తాము లక్నో నుంచి ఢిల్లీకి వెళ్తున్నామని వారు ఈ సంఘటనను సోషల్ మీడియాలో కూడా పంచుకున్నారు. వేగంగా వెళ్తున్న విమానం ఒక్కసారిగా ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయానికి గురయ్యారు. ప్రయాణికులను మరో విమానంలో ఢిల్లీకి తరలించారు. ఇండిగో ఎయిర్లైన్స్ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. -
విషాదం.. 13వ అంతస్తు నుంచి దూకి తల్లీకొడుకు ఆత్మహత్య
ఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో విషాదం చోటుచేసుకుంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న కుమారుడితో కలిసి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. సాక్షి చావ్లా(37) తన భర్త దర్పణ్ చావ్లా, కొడుకు దక్ష్(11)తో కలిసి గ్రేటర్ నోయిడాలోని ఏస్ సిటీలో నివసిస్తున్నారు. కుమారుడు పదేళ్లుగా మానసిక అనారోగ్యంతో బాధపడటంతో చికిత్స చేయిస్తున్నారు. కుమారుడి అనారోగ్యంపై చావ్లా తీవ్ర ఆందోళన పడేది.ఈ క్రమంలో తన కుమారుడి బాధ చూసి తట్టుకోలేక ఆ తల్లి తన కొడుకుతో కలిసి 13వ అంతస్తు ఫ్లాట్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. చార్టర్డ్ అకౌంటెంట్ అయిన దర్పణ్ చావ్లా ఈ విషాద ఘటన జరిగినప్పుడు ఇంట్లోనే ఉన్నారు. అతను మరొక గదిలో ఉన్న సమయంలో కేక వినిపించిందని, బాల్కనీకి చేరుకోగానే తన భార్య, కొడుకు కింద పడి ఉన్నారని ఆయన పోలీసులకు తెలిపారు. 'క్షమించండి' అంటూ భర్తకు రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు."మేము ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం.. క్షమించండి. ఇకపై మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మేము కోరుకోవడం లేదు. మా వల్ల మీ జీవితం నాశనం కాకూడదు. మా చావుకు ఎవరూ బాధ్యులు కారు" అంటూ ఆమె సూసైడ్ నోట్లో రాసింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మానసిక ఒత్తిడి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. -
ఢిల్లీలో వరుస బాంబు బెదిరింపుల కలకలం
ఢిల్లీ: నగరంలో వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా, తాజ్ ప్యాలెస్కు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీ హైకోర్టులో బాంబు ఉందంటూ నిన్న(శుక్రవారం) బెదిరింపు మెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పలు బెంచ్ల న్యాయమూర్తులు.. కోర్టు కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేశారు. ఆ ఘటనను మరువక ముందే మధ్యాహ్నం బాంబే హైకోర్టుకు కూడా మెయిల్ వచ్చింది. ఆర్డీఎక్స్ అమర్చామని.. బాంబులతో కోర్టును పేల్చేస్తామని హెచ్చరించారు. వరుస ఘటనలతో పోలీసులు అలర్ట్ అయ్యారు.అయితే, ఈ ఘటనల్లో కూడా అవి ఆకతాయిలు చేసిన బెదిరింపు మెయిల్లు అని పోలీసుల విచారణలో తేలింది. భద్రతా సిబ్బంది బాంబ్ స్క్వాడ్స్తో తనిఖీలు నిర్వహించగా ఎలాంటి బాంబులు లభ్యం కాలేదు. ఇవాళ ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్కు కూడా బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఎలాంటి బాంబు దొరకలేదు. ఇది కూడా ఆకతాయిలు చేసిన మెయిలేనని ఢిల్లీ పోలీసులు తేల్చారు.#WATCH | Taj Palace Hotel in Delhi received a bomb threat mail. Nothing was found; it has been declared a hoax: Delhi Police pic.twitter.com/OPDEZVnDlH— ANI (@ANI) September 13, 2025 -
షోరూంలో కారు బొక్కాబోర్లా.. స్పందించిన యువతి
నిమ్మకాయ తొక్కించబోయి.. ఓ మహిళా కొత్త కారును ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ నర్మన్ విహార్లోని మహీంద్రా షోరూమ్లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో రూ.27 లక్షల విలువైన థార్ వాహనమూ(Thar Rox SUV) నాశనమైంది. అది మీడియా.. అంతకు మించి సోషల్ మీడియా దృష్టిని ఈ ఘటన ఆకర్షించింది. దీంతో ఆ కారును పడేసిన మాని పవార్ స్పందించింది. ఘజియాబాద్ ఇందిరాపురం ప్రాంతానికి చెందిన మాని పరివార్(29) తన భర్త ప్రదీప్తో కలిసి కొత్త కారు కోసం ఢిల్లీ నిర్మాణ్ విహార్కు వచ్చింది. అక్కడి శివ ఆటో కార్ మహీంద్రా షోరూంలో కారు కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లాలనుకుంది. అయితే.. కారును నిమ్మకాయ తొక్కించి షోరూమ్ ఫస్ట ఫ్లోర్ నుంచి కిందకు తీసుకురావాలని ప్రయత్నించింది. ఈలోపు.. పొరపాటును ఎక్సలేటర్ను బలంగా తొక్కడంతో హఠాత్తుగా కారు ముందుకు దూసుకెళ్లింది. షోరూం ఫస్ట్ఫ్లోర్ అద్దాలు బద్దలు కొట్టుకుని సినిమాలో యాక్షన్ సీన్ మాది 15 అడుగుల ఎత్తు ఎగిరి నేల మీద బొక్కబోర్లా పడిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ప్రమాదం తర్వాత వీడియో వైరల్ అయ్యింది, అందులో కారు తలకిందుగా రోడ్డుపై పడిపోయిన దృశ్యం కనిపించింది. అయితే.. సోషల్ మీడియాలో మాత్రం మరోలా ప్రచారం జరిగింది. ఈ ఘటనలో మాని పవార్ సహా భర్త, షోరూమ్ సిబ్బంది గాయపడ్డారని కొందరు, ఆమె ముఖం, ముక్కు పగిలిపోయానని మరికొందరు.. లేదు ఆమె చనిపోయిందంటూ ఇంకొందరు కథనాలు, పోస్టులు ఇచ్చారు. దీంతో మాని పవార్ స్పందించారు. నేను బతికే ఉన్నాను. దయచేసి ఫేక్ వీడియోలు పంచుకోవడం ఆపండి అంటూ వీడియో సందేశం ఉంచారామె. ఘటన సమయంలో కారులో నాతో పాటు షోరూమ్ సేల్స్మన్ వికాస్, కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. కారు అధిక ఇంజిన్తో పని చేస్తోందని అప్పటికే సేల్స్మన్ మాకు చెప్పారు. నిమ్మకాయల్ని తొక్కించే పూజ సమయంలో పొరపాటుగా ఎక్స్లేటర్ తొక్కడం వల్లే జరిగింది. షోరూమ్ గ్లాస్ బద్దలు కొట్టుకుని మరీ కిందపడిపోయింది. అదృష్టవశాత్తూ ఎయిర్బాగ్స్ తెరుచుకోవడం వల్ల మాకేం కాలేదు. సిబ్బంది సాయంతో పగిలిన ముందు భాగం నుంచి అంతా బయటకు వచ్చాం. ఫస్ట్ ఎయిడ్ తర్వాత ఇంటికి వచ్చేశాం. మేం క్షేమంగానే ఉన్నాం. పుకార్లను, వెటకారాలను దయచేసి ఆపండి. ఈ వీడియో చేయడం వెనుక ఉద్దేశం ఇదే’’ అని అన్నారామె. View this post on Instagram A post shared by 🌸 (@___maanniiiiii) -
21ఏళ్లకే బీర్ తాగొచ్చు..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇకపై 21 సంవత్సరాలున్న యువత బీరు తాగేందుకు అర్హులవుతారు. ఆబ్కారీ చట్టం ప్రకారం ఢిల్లీ మినహా దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 25 ఏళ్లున్న వారికి మాత్రమే బీరు తాగేందుకు అనుమమతి ఉంది. తాజాగా ఈ రూల్ను మార్చి కొత్త మద్యం విధానాన్ని తెచ్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 21 ఏళ్ల వయస్సు వారిని బీరు తాగేందుకు అనుతించడం వల్ల వీరంతా శివారులోని గురుగ్రామ్, నోయిడా, ఘాజియాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లి అక్రమంగా మద్యం తాగడాన్ని నిరోధించవచ్చని భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం సంబంధిత వర్గాలు నిపుణులతో చర్చలు జరుపుతోంది. నాలుగైదు నెలల్లో కొత్త మద్యం విధానాన్ని తీసుకువచ్చే అవకాశం ఉంది. కొత్త విధానం ఎలా ఉండొచ్చు..? ప్రస్తుతం ఉన్న మద్యం విధానం ప్రకారం ప్రభుత్వ ఆదాయం ఏడాదికి రూ.12 వేల కోట్ల నుంచి రూ.13వేల కోట్ల వరకు ఉండాలి. కానీ, రూ.7 వేల కోట్ల నుంచి రూ.8 వేల కోట్లు మాత్రమే వస్తోంది. కొత్త విధానం ద్వారా ఆదాయాన్ని బాగా పెంచుకోవడమే ఢిల్లీ ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ప్రైవేటు మద్యం దుకాణాలను కూడా తెరవాలని యోచిస్తోంది. బ్రాండెడ్ మద్యం కొరతను నివారించడంపైనా దృష్టి సారించింది. బ్రాండెడ్ మద్యం కొరత కారణంగా నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్)లో జరుగుతున్న రూ.5 వేల కోట్ల నుంచి రూ.7000 కోట్ల లావాదేవీలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది. ఈ ఆదాయం ప్రధానంగా శివారులోని గురుగ్రామ్, నోయిడా, గాజియాబాద్ వంటి ప్రాంతాలకు వెళుతోంది. నివాస ప్రాంతాలు మినహా షాపింగ్ మాల్స్ తదితర వ్యాపార సముదాయాల్లో మద్యం షాపులను తెరవనున్నారు. కొత్త మద్యం పాలసీ పూర్తిగా ప్రభుత్వం, లేదా ప్రభుత్వం–ప్రైవేట్, లేదా పూర్తిస్థాయి ప్రైవేట్ అనే మూడు మోడళ్లపై చర్చిస్తోంది. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రైవేట్ మద్యం దుకాణాలకు అనుమతిచ్చి విమర్శల పాలైంది. ఆ తర్వాత వాటిని మూసివేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త లిక్కర్ పాలసీపై పూరి్థస్థాయి చర్చల తర్వాతే ప్రభుత్వం తుది నిర్ణయం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. -
బాణసంచాపై దేశవ్యాప్త నిషేధం ఉండాలి
న్యూఢిల్లీ: బాణసంచా వినియోగంపై దేశ రాజధాని ఢిల్లీ(ఎన్సీఆర్)లో మాత్రమే ప్రత్యేకంగా నిషేధం ఎందుకు విధించాలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఢిల్లీలోని కొందరు ధనవంతులు మాత్రమే స్వచ్ఛమైన గాలికి అర్హులా? దేశంలోని ప్రజలంతా స్వచ్ఛమైన గాలి పీల్చుకునేందుకు అర్హులేనని పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)జస్టిస్ బీఆర్ గవాయ్ సారథ్యంలోని ధర్మాసనం శుక్రవారం దేశ రాజధాని ప్రాంతంలో బాణసంచా వినియోగాన్ని నియంత్రించాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టింది. ‘ఎన్సీఆర్ పరిధిలోని నగరాల్లో ప్రజలకు మాత్రమే పరిశుభ్రమైన గాలికి అర్హులా? మిగతా నగరాల్లోని పౌరులకు ఎందుకు కారు? ఇక్కడ ఎలాంటి విధానముందో దేశవ్యాప్తంగానూ అదే ఉండాలి. ఉన్నత పౌరులుంటున్నారనే కారణంతో ఢిల్లీకి ప్రత్యేకంగా ఒక విధానాన్ని రూపొందించలేం. గత శీతాకాలంలో అమృతసర్ వెళ్లాను. గాలి కాలుష్యం అక్కడ ఢిల్లీ కంటే దారుణంగా ఉంది. బాణసంచాపై నిషేధమే విధించాల్సి వస్తే, అది దేశమంతటా ఉండాలి’అని సీజేఐ పేర్కొన్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు గ్రీన్ క్రాకర్స్ను తక్కువ రసాయనాలను వినియోగించి రూపొందించే విధానంపై నేషనల్ ఎని్వరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(నీరి) కసత్తు చేస్తోందని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం బాణసంచా తయారీ, విక్రయాల లైసెన్సులపై యథాతథ పరిస్థితిని కొనసాగించాలని పేర్కొన్న ధర్మాసనం..తదుపరి విచారణను 22వ తేదీకి వాయిదా వేసింది. -
రాజకీయాల్లో వారసులదే రాజ్యం!
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రజాస్వామ్యంలో కుటుంబ రాజకీయాలు బలంగా పాతుకుపోయాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలలో ప్రతి ఐదుగురిలో ఒకరు (21%) రాజకీయ కుటుంబాల నుంచి వచి్చనవారేనని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫారŠమ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్ల్యూ) సమగ్ర విశ్లేషణలో తేటతెల్లమైంది. దేశవ్యాప్తంగా మొత్తం 5,204 మంది ప్రజాప్రతినిధులపై విశ్లేషణ చేయగా, వీరిలో 1,107 మంది వారసత్వ నేపథ్యం ఉన్నవారే కావడం గమనార్హం. లోక్సభలో ఈ ప్రభావం అత్యధికంగా 31 శాతంగా ఉంది. ముఖ్యంగా, మహిళా ప్రజాప్రతినిధుల్లో ఈ ధోరణి రెట్టింపు కన్నా ఎక్కువగా ఉంది. దాదాపు సగం మంది (47%) వారసత్వంగానే రాజకీయాల్లోకి అడుగుపెట్టారని నివేదిక వెల్లడించింది. వారసత్వ రాజకీయాల వాటాలో ఆంధ్రప్రదేశ్ (34%) దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రాల వారీగా తీరిదే.. దేశంలోని రాష్ట్రాలను పరిశీలిస్తే, సంఖ్యాపరంగా ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 141 మంది (23%) ప్రజాప్రతినిధులు రాజకీయ కుటుంబాలకు చెందినవారు ఉన్నారు. అయితే, మొత్తం ప్రజాప్రతినిధుల్లో వారసుల శాతం పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ (34%) మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ ప్రతి ముగ్గురిలో ఒకరికి పైగా వారసులే కావడం గమనార్హం. ఆ తర్వాత మహారాష్ట్ర (32%), కర్ణాటక (29%) ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో విశ్లేషించిన 255 మంది ప్రజాప్రతినిధులలో 86 మంది (34%) వారసులే. మహారాష్ట్రలో 403 మందిలో 129 మంది (32%), కర్ణాటకలో 326 మందిలో 94 మంది (29%), తెలంగాణ మహిళా ప్రజాప్రతినిధులలో 64% మంది వారసత్వ నేపథ్యం కలవారేనని వెల్లడైంది.మహిళల ప్రాతినిధ్యంలో అసమానతలు: రాజకీయాల్లోకి మహిళల ప్రవేశానికి కుటుంబ నేపథ్యం ఒక ముఖ్యమైన మార్గంగా మారుతోందని ఈ నివేదికలోని గణాంకాలు పేర్కొన్నాయి. మొత్తం మహిళా ప్రజాప్రతినిధులలో 47% మంది వారసత్వ నేపథ్యం ఉన్నవారే. పురుషులలో ఈ సంఖ్య కేవలం 18% మాత్రమే. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో 69% మహిళా ప్రతినిధులు, తెలంగాణలో 64% మంది వారసులే కావడం గమనార్హం. రాష్ట్రాల అసెంబ్లీల (20%) కన్నా లోక్సభలో (31%) వారసత్వ ప్రభావం ఎక్కువగా ఉంది. జాతీయ రాజకీయాలపై కుటుంబాల పట్టు బిగుస్తున్నట్లు ఇది సూచిస్తోంది. పారీ్టలలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోవడం, ‘గెలుపు గుర్రం’అనే అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం, డబ్బు, కండబలం వంటివి వారసత్వ రాజకీయాలకు కారణమవుతున్నాయి. భారతీయ సమాజంలో కుటుంబ సంప్రదాయాలకు ఉన్న ప్రాధాన్యత కూడా వారసులను ఓటర్లు ఆమోదించడానికి ఒక కారణంగా నిలుస్తోంది. -
విశ్వపరిశోధనాలయాలు
భారత్లో ఆవిష్కరణల వేగం పుంజుకొంది. దానికి తగ్గట్టుగా మేధో సంపత్తి హక్కుల (ఐపీ) కోసం దరఖాస్తులూ వెల్లువెత్తుతున్నాయి. రెండు దశాబ్దాల క్రితం దేశంలో దాఖలైన పేటెంట్లలో భారతీయ సంస్థల వాటా 20% కంటే తక్కువ. 2023కి వచ్చేసరికి ముఖచిత్రం మారిపోయింది. మొత్తం పేటెంట్ ఫైలింగ్స్లో ఏకంగా 57 శాతం వాటాతో మన సంస్థలు సత్తా చాటాయి. దరఖాస్తుల్లో దేశీయ యూనివర్సిటీలు ముందంజలో ఉండడం విశేషం. – సాక్షి, స్పెషల్ డెస్క్సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే స్థాయి నుండి సృష్టికర్తగా మారడానికి మనదేశం క్రమంగా అడుగులేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాజ్యసభలో వెల్లడించిన వివరాల ప్రకారం.. 2014–15లో భారతీయుల నుంచి వచ్చిన పేటెంట్ దరఖాస్తులు 12,071 కాగా, 2023–24 నాటికి ఇది 51,574కు పెరగడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. అలాగే, అప్పట్లో పేటెంట్ల మంజూరు కేవలం 684 కాగా, పదేళ్లలో 25,082కు పెరిగింది. పేటెంట్ నియమాలకు సవరణలతో నిర్దిష్ట గ్రూప్స్నకు వేగంగా పరీక్షలు, గడువు కాలాన్ని సరళీకృతం చేయడం.. విద్యా సంస్థలు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లకు దరఖాస్తు రుసుములను 80% తగ్గించడం.. ఫైలింగ్, సమాచారం పూర్తిగా డిజిటలైజేషన్ వంటి సంస్కరణలకు దారితీశాయి.యూనివర్సిటీల సత్తాపేటెంట్ దాఖలు, టెక్నాలజీ బదిలీ, మేధోసంపత్తి హక్కు ల (ఐపీ) ద్వారా ఆదాయ సముపార్జన వంటి అంశాల్లో అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులకు సహాయం చేయడానికి ప్రత్యేక ఐపీ సెల్స్ను, చట్టపరమైన సహాయ విభాగాలను ఏర్పాటు చేయడం ద్వారా విశ్వవిద్యాల యాలు కూడా ముందంజలో ఉన్నాయి. ఉన్నత విద్యా సంస్థలలో మేధోసంపత్తి హక్కులపై అవగాహన కోసం ప్రభుత్వం 2020లో ‘కపిల’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అలాగే 2016లో నీతి ఆయోగ్ ప్రారంభించిన అటల్ ఇన్నోవేషన్ మిషన్ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా కేంద్రాల్లో సమస్య పరిష్కార నైపుణ్యాలు, వ్యవస్థాపకతను పెంపొందిస్తోంది. 2021 సెప్టెంబరు నుంచి పేటెంట్ దరఖాస్తు రుసుము గణనీయంగా తగ్గడం యూనివర్సిటీల్లో జోష్ నింపింది. ఐఐటీ మద్రాస్ 2022లో 156 పేటెంట్లను అందుకోగా.. ఏడాదిలో ఈ సంఖ్య 300కి చేరింది. ఐఐటీ బాంబే 2023–24లో 421 పేటెంట్లతో దేశంలో అగ్రస్థానంలో ఉంది.⇒ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారత్ 2020లో 48వ స్థానం నుంచి 2024లో 39వ స్థానానికి ఎగబాకింది. ⇒ భారత్లో పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ)కి చేస్తున్న వ్యయం ప్రస్తుతం జీడీపీలో 0.67% మాత్రమే. ఇది యూఎస్లో 3.5%, చైనాలో 2.5%. ⇒ విద్యా సంస్థల పేటెంట్ అప్లికేషన్స్సంవత్సరం భారత్ విదేశీ2021–22 7,405 962022–23 19,155 2752023–24 23,306 237పెరిగిన వేగంరెండేళ్లలో దాఖలైన దాదాపు 80% పేటెంట్లు ఇప్పటికీ నమోదు కోసం వేచి ఉన్నాయి. అయితే 2000ల ప్రారంభంలో ఒక్కో పేటెంట్ మంజూరుకు 8–10 సంవత్సరాలు పట్టింది. 2020లో చాలావరకు 2–3 ఏళ్లలోపే అయిపోయాయి. కొన్ని దరఖాస్తు చేసిన ఏడాదిలోనే మంజూరయ్యాయి.వ్యక్తులూ.. విద్యాసంస్థలూ..2000లో వచ్చిన మొత్తం పేటెంట్ దరఖాస్తుల్లో కంపెనీలవి 43 శాతం కాగా, 2023 నాటికి ఇది 17 శాతానికి తగ్గింది. ఇదే సమయంలో వ్యక్తుల దరఖాస్తులు 10 నుంచి 32 శాతానికి పెరిగాయి. 2010లో 20 శాతంలోపే ఉన్న విద్యాసంస్థల వాటా.. ఇప్పుడు ఏకంగా 43 శాతానికి ఎగబాకింది. 2023–24లో దేశీయ సంస్థలు, వ్యక్తుల వంటి వారు పెట్టుకున్న మొత్తం పేటెంట్ దరఖాస్తులు 51,574 కాగా మంజూరైనవి 25,079. ఇందులో..⇒ 2010 నుంచి 2025 సెప్టెంబరు 11 వరకు ఫైల్చేసిన పేటెంట్లు 9,32,693⇒ వీటిలో భారతీయులు దరఖాస్తు చేసినవి 3,83,073⇒ మొత్తం దరఖాస్తుల్లో మంజూరైనవి 3,20,807⇒ వీటిలో భారతీయులవి 70,088 -
‘మీరు కొంచెం మసాలా యాడ్ చేశారు’.. కంగనా రనౌత్కు సుప్రీంకోర్టు చీవాట్లు
సాక్షి,న్యూఢిల్లీ: సినీ నటి, బీజేపీ ఎంపీ కంగనా రౌనత్కు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. రైతు చట్టాల ఆందోళనపై మీరు రీట్వీట్ మాత్రమే చేయలేదు. కొంచెం మసాలా యాడ్ చేశారని మండిపడింది. 2020-21లో రైతు చట్టాలకు సంబంధించిన ఆందోళన సమయంలో కంగనారౌనత్ ఓ మహిళా రైతును ఉద్దేశిస్తూ రీట్వీట్ చేశారు. ఆ రీట్వీట్ వివాదాస్పదమైంది. దీంతో మహిళా రైతు కంగనారౌనత్పై పరువు నష్టం దావా వేశారు. తాజాగా, పంజాబ్ రాష్ట్రం బాథిండా కోర్టులో తనపై నమోదైన పరువు నష్టం దావా కేసును కొట్టి వేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ఆ పిటిషన్పై దేశ అత్యున్నత న్యాయ స్థానం ఇవాళ విచారణ చేపట్టింది. విచారణలో కంగనాపై నమోదైన కేసును కొట్టివేసేందుకు న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. అంతేకాదు.. మహిళ రైతు గురించి మీరు ట్వీట్లు మాత్రమే కాదు మసాల్ యాడ్ చేశారు’అని వ్యాఖ్యానించింది. దీంతో ఆమె తరఫు న్యాయవాది పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు.2020-21 దేశ రాజధాని ఢిల్లీ రైతు చట్టాల్ని వ్యతిరేకిస్తూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో మరో ప్రాంతంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది. అయితే, రైతులు చేపట్టిన ఆందోళనలో పాల్గొన్న మహీందర్ కౌర్.. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పాల్గొన్న బిల్కిస్ బానో ఇద్దరూ ఒకటేనంటూ తాను చేసిన పోస్టును కంగనా రీట్వీట్ చేశారు. ఆ రీట్వీట్పై మహీందర్ కౌర్ కోర్టును ఆశ్రయించారు. ఆ కేసునే కొట్టేయొమని కంగాన న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తున్నారు. కంగనా ఇప్పటికే పంజాబ్ హర్యానా హైకోర్టును ఆశ్రయించినా.. అక్కడ కూడా ఆమెకు ఊరట లభించలేదు. ఇప్పుడు సుప్రీం కోర్టు సూచన మేరకు ఆమె ట్రయల్ కోర్టులోనే న్యాయపరమైన పరిష్కారం కోసం ప్రయత్నించాల్సి ఉంటుంది. -
ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపులు
ఢిల్లీ: ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపులు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో పలు బెంచ్ల న్యాయమూర్తులు.. కోర్టు కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేశారు. హైకోర్టు ప్రాంగణం ఖాళీ చేయాలని న్యాయవాదులకు భద్రతా సిబ్బంది సూచించారు. బెదిరింపు మెయిల్తో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. హైకోర్టు ఆవరణలో మూడు ప్రదేశాల్లో ఆర్డీఎక్స్ అమర్చామని.. పాక్తో ఐసిస్తో సంబంధాలున్నట్లు మెయిల్లో ప్రస్తావించారు.గత నెలలో కూడా పలు స్కూళ్లకు బాంబు బెదిరింపు ఫోన్కాల్స్, మెయిల్స్ రావడంతో అప్రమత్తమైన అధికారులు తనిఖీలు చేపట్టిన సంగతివ తెలిసిందే. ఈమెయిల్స్ వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు సైబర్ ఫోరెన్సిక్ దర్యాప్తు చేపడుతున్నారు. ఈ క్రమంలో.. అంతర్జాతీయ IP అడ్రస్లు, వర్చువల్ ప్రాక్సీలు వాడుతున్నట్లు గుర్తించారు. స్కూల్స్, కోర్టులు, గవర్నమెంట్ ఆఫీసులు, బహిరంగ ప్రాంతాలు, ఆఖరికి విమానాల్లోనూ బాంబు ఉందంటూ బెదిరింపులు ఎక్కువగా వస్తున్నాయి. -
భారత ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం
సాక్షి, న్యూఢిల్లీ: భారత దేశపు 15వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం చేశారు. శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు, కేంద్ర మంత్రులు పలువురు ఎన్డీయే కూటమి సీఎంలు, మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులు, జగ్దీప్ ధన్ఖడ్ సహా మాజీ ఉపరాష్ట్రపతులూ పాల్గొన్నారు.ఉప రాష్ట్రపతి ఎన్నికకు ఈ నెల 9న జరిగిన పోలింగ్లో ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ తన సమీప ప్రత్యర్థి జస్టిస్ బి.సుదర్శన్రెడ్డిపై 152 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎన్నిక లాంఛనాలన్నీ పూర్తి కావడంతో గురువారం మహారాష్ట్ర గవర్నర్ పదవికి సీపీ రాధాకృష్ణన్ రాజీనామా చేశారు. ఓటమి తర్వాత జస్టిస్ సుదర్శన్రెడ్డి రాధాకృష్ణన్ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.సీపీ రాధాకృష్ణన్ పూర్తి పేరు చంద్రపురం పొన్ను స్వామి రాధాకృష్ణన్. 1957 అక్టోబరు 20న తమిళనాడులోని తిరుప్పూర్లో ఆయన జన్మించారు. కాంగ్రెస్ సానుభూతిపరులైన వ్యవసాయ కుటుంబంలో ఈయన జన్మించారు. పదహారో ఏట నుంచి ఆర్ఎస్ఎస్, జన్సంఘ్లతో కలిసి పనిచేశారు. సామాజికంగా, ఆర్థికంగా బలమైన కొంగు వెల్లాలర్ (గౌండర్) సామాజికవర్గం నుంచి వచ్చిన ఆయన బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ చేశారు. 1998 లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులోని కోయంబత్తూరు స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా 1.5 లక్షల ఆధిక్యంతో విజయం సాధించారు. 1999 ఎన్నికల్లో అక్కడినుంచే నెగ్గారు. వాజ్పేయీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే 2000లో రాధాకృష్ణన్ కేంద్రమంత్రి కావాల్సి ఉంది. మరో సీనియర్ నేత పొన్ రాధాకృష్ణన్ అప్పట్లో ఆ అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. ఇద్దరి పేర్లూ ఒకటే కావడంతో అలాంటి పొరపాటు జరిగిందని చెబుతారు. ఇక.. 1996లో తమిళనాడు బీజేపీ కార్యదర్శిగా పనిచేశారు. 2004 నుంచి 2007 వరకు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014, 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. అయినప్పటికీ పార్టీలో ‘తమిళనాడు మోదీ’గా ఈయన పేరుపొందారు. ఆపై.. రాధాకృష్ణన్ 2023 ఫిబ్రవరి 12న జార్ఖండ్ గవర్నర్గా నియమితులయ్యారు. కొన్నాళ్లు తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు చేపట్టారు. 2024 జులై 27 నుంచి మహారాష్ట్ర గవర్నర్గా ఉండి.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నెగ్గడంతో ఆ హోదాకు రాజీనామా చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆర్.వెంకటరామన్ల తర్వాత తమిళనాడు నుంచి ఉపరాష్ట్రపతి పీఠాన్ని అధిరోహించిన మూడోవ్యక్తిగా, దక్షిణాది నుంచి ఏడో వ్యక్తిగా రికార్డులకెక్కారు. ఉపరాష్ట్రపతిగా ఆయన పదవీకాలం 2030 వరకు ఉంటుంది. -
కొండలను చీలుస్తూ.. లోయలను దాటుతూ..
ఐజోల్ నుంచి సాక్షి ప్రతినిధి గౌరీభట్ల నరసింహమూర్తి: ఎత్తయిన కొండలు, ఒకటి కాదు రెండు కాదు వందలు.. ఆ వెంటనే అగాధాలను తలపించే లోయలు... కొండలను చీలుస్తూ పరుగులెత్తే నదులు.. ఇలాంటి ప్రాంతాల్లో నడకదారి నిర్మాణం కూడా కష్టమే. ఇది ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మిజోరం భౌగోళిక పరిస్థితి. ఆ రాష్ట్ర రాజధాని నగరమైన ఐజోల్లో భారీ భవనాలు కూడా చాలినంత స్థలం లేక కొండ అంచుల్లో కొంతమేర అగాధంలోకి వేలాడుతున్నట్టు పిల్లర్లపై నిర్మించి ఉంటాయి. నడకదారి నిర్మాణం కూడా కనాకష్టంగా ఉన్న ఆ ప్రాంతంలో ఇప్పుడు దాదాపు 52 కి.మీ.మేర రైల్వే లైన్ నిర్మితమైంది. ఆ రైల్వే ప్రాజెక్టును ప్రతిపాదించటమే ఓ సాహసం. అలాంటిది 11 ఏళ్ల కఠోర శ్రమతో ఇంజినీర్లు అద్భుతాన్ని చేసి చూపారు. ప్రపంచంలోనే అతి కష్టమైన రైల్వే ప్రాజెక్టుల్లో ఒకటిగా ఇప్పుడది రికార్డుల్లోకెక్కింది. దాన్నిశనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేస్తున్నారు. కొత్తగా నిర్మించిన రైలు కారిడార్ నిడివి 51.38 కి.మీ. కానీ, దీని నిర్మాణానికి అయిన వ్యయం రూ.8,071కోట్లు. అంటే కి.మీ.కు రూ.157 కోట్లు అన్నమాట. సాధారణంగా రైల్వే లైన్ల నిర్మాణంలో కి.మీ.కు అయ్యే ఖర్చు రూ.13 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు ఉంటుంది. కానీ, ఇక్కడ వ్యయం అంతకంటే పది రెట్లు ఎక్కువగా ఉండటం ఓ రికార్డు. వంతెనలు, సొరంగాలు... ఈ కారిడార్ నిర్మాణంలో 153 వంతెనలు, 45 సొరంగాలను నిర్మించాల్సి రావటమే భారీ వ్యయానికి కారణం. ఒకదానిని ఆనుకుని ఒకటిగా ఈ ప్రాంతంలో భారీ కొండలుంటాయి. ఆ కొండలను తొలిస్తే తప్ప రైలు కారిడార్ నిర్మాణం సాధ్యం కాదు. దీంతో 45 కొండలను తొలుస్తూ సొరంగాలు నిర్మించారు. రెండు కొండల మధ్య అగాధంలా లోయలున్నందున, సొరంగాలకు సమాంతరంగా వంతెనలు నిర్మించి దానిమీదుగా ట్రాక్ ఏర్పాటు చేశారు. సొరంగాలలో మూడో దాని నిడివి 1.9 కి.మీ. కావటం విశేషం. అలా మొత్తం సొరంగాల నిడివి 15.88 కి.మీ.గా ఉంది.అంటే మొత్తం రైలు కారిడార్లో 31 శాతం నిడివి సొరంగాలతోనే ఉందన్నమాట. ఇక 153 వంతెనల్లో 55 వంతెనలు అతి భారీవి. వాటిల్లో 97వ నంబర్ వంతెన పొడవు 742 మీటర్లు కాగా, దానికి నిర్మించిన స్తంభాల ఎత్తు 114 మీటర్లు. మరో 88 వంతెనలు కాస్త చిన్నవి. 10 ఆర్యూబీలు, ఆర్ఓబీలు కూడా ఉన్నాయి. ఇలా మొత్తం వంతెనల నిడివి కలిపితే 11.76 కి.మీ. మొత్తం కారిడార్ నిడివిలో వీటి వాటా 23 శాతం. అంటే 54 శాతం రైల్వే లైను వంతెనలు, సొరంగాలతోనే ఉంటుందన్నమాట. ఐజోల్కు భాగ్యం ⇒ దేశంలోని ఏడు ఈశాన్య రాష్ట్రాలకు గాను సిక్కింలో అసలు రైల్వే లైనే లేదు. ఆరు రాష్ట్రాల్లో పాక్షికంగా ఉన్నప్పటికీ, మిజోరం, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్ రాజధానులకు రైల్వే కనెక్టివిటీ లేదు. ఇంతకాలం తర్వాత మిజోరం రాజధాని ఐజోల్కు ఆ భాగ్యం దక్కబోతోంది. మిగతా మూడు రాష్ట్రాల రాజధానులను రైల్వేతో జోడించే కసరత్తు జరుగుతోంది. ⇒ ఐజోల్కు 20 కి.మీ. దూరంలో ఉన్న సాయిరంగ్ స్టేషన్ నుంచి ఇక నాలుగు రైళ్లు నడవనున్నాయి. ఇందులో రాజధాని ఎక్స్ప్రెస్ వారానికి ఒక రోజు ఢిల్లీకి, కోల్కతాకు వారంలో మూడు రోజులు నడిచే మరో ఎక్స్ప్రెస్, అస్సాం రాజధాని గువాహటికి నిత్యం ఓ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభం కానున్నాయి. సాయిరంగ్ స్టేషన్ నుంచి మయన్మార్ దేశ సరిహద్దు 223 కి.మీ. దూరంలో ఉంటుంది. ⇒ ప్రకృతి రమణీయతకు నెలవైన ఆ ప్రాంతానికి రైలు కనెక్టివిటీతో పర్యాటకుల సంఖ్య భారీగా పెరగనుంది. పరిశ్రమలు కూడా రానున్నాయి. ప్రస్తుతం రోడ్డు మార్గాన సరుకుల రవాణా కూడా అతి కష్టంగా ఉన్నందున, ఆ రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు అధికం. ఇప్పుడు రైలు మార్గాన సరుకు రవాణా సులభతరం కానున్నందున ధరలు దిగివచ్చి సామాన్యులకు ఊరట కలిగే అవకాశం ఉంది. -
ఖిలాఫత్ ఉగ్ర మాడ్యూల్ బట్టబయలు
న్యూఢిల్లీ: పాకిస్తాన్తో లింకులున్న ఉగ్ర మాడ్యూల్ ఒక దానిని ఢిల్లీ పోలీసులు బట్టబ యలు చేశారు. వేర్వేరు రాష్ట్రాల్లో దాడులు జరిపి ఇందుకు సంబంధించి ఐదుగురిని అరె స్ట్ చేశారు. పాకిస్తాన్ హ్యాండ్లర్ ద్వారా వీరు ఆన్లైన్లో యువతను ఉగ్ర ఊబిలోకి లాగు తున్నారు. కొంత భూభాగాన్ని స్వాధీనం చేసు కుని ఖిలాఫత్ జోన్గా ప్రకటించడం ద్వారా భారత్లో జిహాద్ను ప్రారంభించాలన్నది వీరి ప్రణాళిక అని అదనపు పోలీస్ కమిషనర్ (స్పె షల్ సెల్) ప్రమోద్ కుష్వాహా మీడియాకు తెలి పారు. ఘజ్వా–ఇ–హింద్ (భారత్పై దాడి) నినాదంతో దేశవ్యాప్తంగా హింసాత్మక కార్యక లాపాలకు పాల్పడేందుకు వీరు ప్రయత్నిస్తు న్నారన్నారు. పట్టుబడిన వారిలో రాంచీకి చెందిన అషర్ దానిష్ అలియాస్ అష్రార్ ఖురే షి(23), ముంబైకి చెందిన అఫ్తాబ్ ఖురేషి, సుఫియాన్ అబూబకర్లు, తెలంగాణకు చెందిన మహ్మద్ హుజైఫా, మధ్యప్రదేశ్కు చెందిన కమ్రాన్ ఖురేషి ఉన్నారు. వీరితోపాటు మరో ఆరుగురిని అదుపులోకి తీసుకుని, విచారిస్తు న్నట్లు వివరించారు. ఈ మాడ్యూల్కు డానిష్ సారథ్యం వహిస్తూ పాకిస్తాన్లోని హ్యాండ్లర్ తరఫున కార్యకలాపాలు సాగిస్తున్నాడు. ఈ హ్యాండ్లకు సీఈవో, గజ్బా, ప్రొఫెసర్ అనే సంకేత నామం ఉందని ఏసీపీ కుష్వాహా చెప్పారు. సోషల్ మీడియా చాట్ల ద్వారా పాక్ హ్యాండ్లర్ వీరికి మందు పాతరల డిజైన్లు, తయారీలో సలహాలిస్తున్నాడు. గత ఆరు నెలలుగా వీరి కార్యకలాపాలపై కన్నేసి ఉంచామని, ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో అఫ్తాబ్, సుఫియాన్లను మొదటగా అరెస్ట్ చేశామన్నారు. మేవాడ్కు చెందిన వ్యక్తి నుంచి ఆయుధాలను కొనుగోలు చేసేందుకు వచ్చి వీరు పట్టుబడ్డారని తెలిపారు. వీరి మరికొంత మందిని కూడా చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వివరించారు. ఐఈడీలను తయారు చేసేందుకు అవసరమైన వివిధ రకాల సామగ్రి, రసాయనాలను స్వాధీనం చేసుకుని, విశ్లేషణ కోసం ల్యాబ్కు పంపించినట్లు చెప్పారు. ఖిలాఫత్ గతంలో పట్టుబడిన ఉగ్ర మాడ్యూల్లతో సంబంధం లేకుండా కొత్తగా ఏర్పాటైన గ్రూపుగా పేర్కొన్నారు. ఖిలాఫత్ జోన్కు అవసరమైన భూమి కొనుగోలు కోసం వీరు నిధుల సేకరణలో బిజీగా ఉన్నారన్నారు. -
నకిలీ పత్రంతో లబ్ధి పొందితేనే చీటింగ్
సాక్షి, న్యూఢిల్లీ: మోసం (చీటింగ్) కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. నకిలీ (ఫోర్జరీ) పత్రాలను సమర్పించినప్పటికీ, కేవలం ఆ పత్రాల వల్లే ఎదుటి వ్యక్తి మోసపోయి, దానిద్వారా నిందితుడు ఏదైనా భౌతిక ప్రయోజనం పొందితేనే ఐపీసీ సెక్షన్ 420 కింద చీటింగ్ కేసు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఫోర్జరీ పత్రానికి, పొందిన ప్రయోజనానికి మధ్య ప్రత్యక్ష సంబంధం (ప్రేరేపణ) లేనప్పుడు దానిని మోసంగా పరిగణించలేమని తేల్చిచెప్పింది. కళాశాల గుర్తింపు కోసం నకిలీ ఫైర్ ఎన్వోసీ సమర్పించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యాసంస్థ అధినేత జూపల్లి లక్ష్మీకాంతరెడ్డిపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టేసింది. జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ జాయ్మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.అసలు కేసు..: జూపల్లి లక్ష్మీకాంతరెడ్డి జె.వి.ఆర్.ఆర్.ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున నంద్యాలలో కళాశాల నిర్వహిస్తున్నారు. కళాశాల గుర్తింపునకు ఆయన విద్యాశాఖకు నకిలీ ఫైర్ సేఫ్టీ ఎన్వోసీని సమర్పించారని జిల్లా ఫైర్ ఆఫీసర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆయనపై ఐపీసీ సెక్షన్ 420 కింద చార్జిషీట్ దాఖలు చేశారు. ఆయన ఈ కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించగా ఊరట లభించలేదు. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక అంశాలను ప్రస్తావించింది. ‘చీటింగ్ నేరం రుజువు కావాలంటే కొన్ని ప్రధానమైన అంశాలు ఉండాలి.తప్పుడు పత్రం చూపి ఎదుటివారిని నమ్మించి, మోసపూరితంగా వారిని ప్రేరేపించి, వారినుంచి ఏదైనా ఆస్తిని పొందడం లేదా వారికి నష్టం కలిగించడం జరగాలి..’ అని జస్టిస్ నాగరత్న ధర్మాసనం పేర్కొంది. ‘నేషనల్ బిల్డింగ్ కోడ్–2016 ప్రకారం 15 మీటర్ల లోపు ఎత్తున్న విద్యాసంస్థల భవనాలకు ఫైర్ సేఫ్టీ ఎన్వోసీ తప్పనిసరి కాదు. ఇదే విషయాన్ని గతంలో హైకోర్టు కూడా స్పష్టం చేసింది. చట్టప్రకారం అవసరం లేని ఒక పత్రాన్ని పిటిషనర్ నకిలీది సమర్పించినప్పటికీ, ఆ పత్రం ప్రేరణతో విద్యాశాఖ గుర్తింపు ఇవ్వలేదు.ఆ ఎన్వోసీ లేకపోయినా ఆయనకు చట్టప్రకారమే గుర్తింపు లభిస్తుంది. కాబట్టి ఇక్కడ పిటిషనర్కు అక్రమ లాభం గానీ, విద్యాశాఖకు నష్టం గానీ జరగలేదు. తప్పుడు పత్రానికి, పొందిన ప్రయోజనానికి మధ్య బలమైన సంబంధం లేనప్పుడు, చీటింగ్ నేరానికి అవసరమైన కీలకమైన అంశం సంతృప్తి చెందనట్లే..’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మోసపూరిత ఉద్దేశం లేనందున ఫోర్జరీకి సంబంధించిన సెక్షన్లు 468, 471 కూడా వర్తించవని చెబుతూ పిటిషనర్పై కేసును ధర్మాసనం కొట్టేసింది. -
రాజ్యాంగానికి కాపలాదారులం
న్యూఢిల్లీ: రాజ్యాంగానికి తాము కాపలాదారులమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. గవర్నర్లు విధులు నిర్వర్తించడంలో విఫలమైతే తాము నిశ్శబ్దంగా చూస్తూ కూర్చోవాలా? అని ప్రశ్నించింది. పార్లమెంట్, రాష్ట్రాల శాసనసభల్లో ఆమోదించిన బిల్లులకు సమ్మతి తెలియజేసే విషయంలో రాష్ట్రపతి/గవర్నర్లకు గడువు నిర్దేశించే అధికారం న్యాయస్థానాలకు ఉందా? అనే అంశంపై సుప్రీంకోర్టు ధర్మాసనం తమ తీర్పును రిజర్వ్ చేసింది. ఈ వ్యవహారంపై 10 రోజులపాటు కొనసాగిన విచారణ గురువారం ముగిసింది. తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి, డీఎంకే ప్రభుత్వం మధ్య తలెత్తిన వివాదంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు పార్లమెంట్ లేదా శాసనసభల నుంచి వచ్చిన బిల్లులపై రాష్ట్రపతి/గవర్నర్లు మూడు నెలల్లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఈ ఏడాది ఏప్రిల్ 8న తీర్పు వెలువరించింది. దీనిపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సందేహాలు లేవనెత్తారు. రాజ్యాంగబద్ధమైన అత్యున్నత పదవుల్లో ఉన్న రాష్ట్రపతి/గవర్నర్లకు గడువు విధించే అధికారం కోర్టులకు ఉందా? అని ప్రశ్నించారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని సూచించారు. కోర్టును ప్రశ్నించడానికి ఆర్టికల్ 143(1) కింద తనకున్న అధికారాలను వాడుకున్నారు. సుప్రీంకోర్టుకు మొత్తం 14 ప్రశ్నలు సంధించారు. బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో రాజ్యాంగంలోని ఆరి్టకల్ 200, 201 కింద రాష్ట్రపతి/గవర్నర్లకు ఉన్న అధికారాలపై అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి రిఫరెన్స్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆగస్టు 19వ తేదీన ప్రత్యేక విచారణ ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల తరఫున సీనియర్ లాయర్లు వాదించారు. వ్యతిరేకించిన విపక్ష పాలిత రాష్ట్రాలు రాష్ట్రపతి రిఫరెన్స్ను విపక్ష పాలిత తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, కర్ణాటక, తెలంగాణ, పంజాబ్, హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వాలు వ్యతిరేకించాయి. అసెంబ్లీలో ఆమోదించి పంపించిన బిల్లులపై రాష్ట్రపతి/గవర్నర్లు నిర్ణీత గడువులోగా సమ్మతి తెలియజేయడమో లేక వెనక్కి పంపించడమో జరగాల్సిందేనని పేర్కొన్నాయి. బిల్లులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉద్దేశపూర్వకంగా దీర్ఘకాలం పెండింగ్లో పెట్టడం సరైంది కాదని స్పష్టంచేశాయి. రాష్ట్రపతి రిఫరెన్స్ను తిరస్కరించాలని ధర్మాసనాన్ని కోరాయి. కానీ, రాష్ట్రపతి అభ్యంతరాలను బీజేపీ పాలిత మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, గోవా, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు సమరి్థంచాయి. కేరళ, తమిళనాడు ప్రభుత్వాల తరఫున కె.కె.వేణుగోపాల్, కపిల్ సిబల్ సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు. రాష్ట్రపతి అభ్యంతరాలను వ్యతిరేకించారు. ఏప్రిల్ 8న ఇచ్చిన తీర్పుతోపాటు గతంలో ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. గడువు నిర్దేశించే అధికారం కోర్టులకు ఉందని తేల్చిచెప్పారు. ఆ అధికారం కోర్టులకు లేదు: తుషార్ మెహతా రాజ్యాంగం ప్రకారం.. వేర్వేరు వ్యవస్థలకు వేర్వేరు ప్రత్యేక అధికారాలు ఉంటాయని తుషార్ మెహతా గురువారం ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రపతి/గవర్నర్లకు రాజ్యాంగం ప్రత్యేక అధికారాలు ఇచ్చిందని, రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణంలో అదొక భాగమని స్పష్టంచేశారు. గవర్నర్ల విచక్షణాధికారాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని పేర్కొన్నారు. వారికి టైమ్లైన్ విధించే అధికారం కోర్టులకు లేదని స్పష్టంచేశారు. దీనిపై సీజేఐ జస్టిస్ గవాయ్ స్పందించారు. ‘‘రాజ్యాంగానికి మేము కాపలాదారులం. రాజ్యాంగం ప్రకారం వేర్వేరు వ్యవస్థలకు వేర్వేరు అధికారాలు ఉంటాయన్న విషయం నిజమే. న్యాయ వ్యవస్థ కూడా తనకున్న అధికారాలతో చురుగ్గా వ్యవహరిస్తోంది. అదేసమయంలో జ్యుడీíÙయల్ టెర్రరిజం, అడ్వెంచరిజం ఉండాలని మేము చెప్పడం లేదు. కానీ, ప్రజాస్వామ్యంలో ఒక వ్యవస్థ సక్రమంగా విధులు నిర్వర్తించడంలో విఫలమైతే రాజ్యాంగ కాపలాదార్లు ని్రష్కియాత్మకంగా ఉండిపోవాలా? అధికారాలు ఉపయోగించుకోకుండా చూస్తూ కూర్చోవాలా?’’అని ప్రశ్నించారు. దీనిపై తుషార్ మెహతా బదులిచ్చారు. కేవలం కోర్టులే కాకుండా శాసన(లెజిస్లేచర్), కార్యనిర్వాహక వర్గం(ఎగ్జిక్యూటివ్) కూడా ప్రజల ప్రాథమిక హక్కులకు కాపలాదారులేనని స్పష్టంచేశారు. ఒక వ్యవస్థ అధికారాల్లో మరో వ్యవస్థ జోక్యం చేసుకోవడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ నిర్మాణాన్ని ఉల్లంఘించేలా ఎవరూ వ్యవరించకూడదని చెప్పారు. మంత్రిమండలి సలహా ప్రకారమే గవర్నర్ నడుచుకోవాలన్న వాదనను తుషార్ మెహతా ఖండించారు. భారతదేశంలో తాము అంతర్భాగం కాదంటూ ఏదైనా ఒక రాష్ట్ర అసెంబ్లీలో బిల్లును ఆమోదిస్తే దానికి కూడా గవర్నర్ సమ్మతి తెలియజేయాలా? అని ప్రశ్నించారు. అలాంటి సందర్భాల్లో బిల్లును పెండింగ్లో పెట్టడం తప్ప గవర్నర్కు మరో మార్గం ఉండదన్నారు. -
ట్రాన్స్జెండర్ల గొప్ప మనసు.. పంజాబ్ వరద బాధితులకు భారీ విరాళం
ఆగ్రా: సామాజిక సేవకు లింగ భేదం అడ్డుకాదని మరోసారి నిరూపించే సంఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా నగరంలో ట్రాన్స్జెండర్లు తమ ఉదారతను చాటుకున్నారు. పంజాబ్ రాష్ట్రంలో ఇటీవల సంభవించిన భారీ వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు రూ.25 లక్షల ఆర్థిక సహాయాన్ని పంపించారు.ఈ సహాయాన్ని సమీకరించేందుకు ఆగ్రాలోని ట్రాన్స్జెండర్ సంఘాలు ప్రత్యేకంగా సమావేశమయ్యాయి.మనదేశంలో కష్టాల్లో ఎవరున్నా సరే మానవత్వం చూపించాల నినాదంతో తమ ఆదాయంతో పాటు దాతల నుంచి విరాళాలు సేకరించారు. ఆ మొత్తంగా వచ్చిన మొత్తాన్ని పంజాబ్కు పంపించారు. आगरा में किन्नरों ने 25 लाख रुपए इकट्ठा करके बाढ़ पीड़ितों को मदद भिजवाई है pic.twitter.com/rEPuXEw5uQ— Birendra Kumar Yadav (@BirendraYdvSP) September 11, 2025 ఆగ్రాలోని ఫతేహాబాద్ రోడ్డులో 'ఆల్ ఇండియా కిన్నార్ సమాజ్ కాన్ఫరెన్స్' జరుగుతోంది. దేశవ్యాప్తంగా దాదాపు పది వేల మంది ట్రాన్స్జెండర్ల ఇందులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వరద బాధితుల కోసం విరాళాలు సేకరించింది. ఇతర ట్రాన్స్జెండర్ల నుంచి నుండి వచ్చిన విరాళాలు 25 లక్షల రూపాయలుగా చెబుతున్నారు. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ పంజాబ్ వరద బాధితుల కోసం డబ్బును విరాళంగా ఇచ్చిన తర్వాత బిడ్లు వేసింది. కొందరు రూ.50,000 విరాళంగా ఇవ్వగా ..మరికొందరు రూ.లక్ష వరకు విరాళం ఇచ్చారు. అత్యధిక విరాళం గోరఖ్పూర్ నుండి వచ్చింది. -
భారత ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్.. రేపే ప్రమాణస్వీకారం
ఢిల్లీ: ఇటీవల జరిగిన భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. శుక్రవారం ఉదయం (సెప్టెంబర్ 12) ఉదయం 9.30గంటలకు సీపీ రాధాకృష్ణన్ భారత 15వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈవారం జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించారు. సీపీ రాధాకృష్ణన్ 152 ఓట్ల తేడాతో ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్రెడ్డిపై గెలుపొందారు. సీపీ రాధాకృష్ణన్కు 452 ఓట్లు రాగా, సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి,. ఫలితంగా భారత 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలో 15 ఓట్లు చెల్లలేదు 98.2 శాతం పొలింగ్ నమోదైంది.ఈ ఎన్నికకు గాను 767 మంది ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పార్లమెంటు భవనంలోని ‘ఎఫ్-101 వసుధ’లో జరిగిన పోలింగ్లో బ్యాటెట్ పత్రాలనే ఉపయోగించారు. రెండో ప్రాధాన్యత ఓటు ఉండటం వల్ల ఈవీఎంలను వాడలేదు. పార్లమెంటు ఉభయసభల సభ్యుల సంఖ్య 788 కాగా ఏడు స్థానాలు ఖాళీ కావడం వల్ల ప్రస్తుతం 781 మందే ఉన్నారు. అయితే పోలింగుకు దూరంగా బీఆర్ఎస్ (4రాజ్యసభ), బీజేడీ(7), శిరోమణి అకాలీదల్(3) దూరంగా ఉన్నాయి. దాంతో 767 మందే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్డీయేకి 425 మంది సభ్యుల బలం.. ఇతరుల మద్దతు కలిపితే ఆ సంఖ్య మరింత పెరిగింది. ఇక ఇండియా కూటమికి 314 మంది ఎంపీల మద్దతు !మాత్రమే ఉంది. మంగళవారం సాయంత్రం ఐదు గంటల వరకూ పోలింగ్ జరగ్గా, అటు తర్వాత ఓట్ల లెక్కింపు జరిగింది. -
దేశవ్యాప్తంగా ఐదుగురు ఉగ్రవాదులు అరెస్ట్
ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఐదుగురు ఉగ్రవాదులను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఢిల్లీ, మధ్యప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణలో టెర్రరిస్టులను అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలోని బోధనలో ఒకరిని అరెస్ట్ చేశారు. పాక్ హ్యాండ్లర్లతో కలసి టెర్రరిస్టులు దాడులకు కుట్రలు పన్నుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అరెస్ట్ అయినవారిలో కెమికల్ బాంబుల తయారీ ఎక్స్పర్ట్ డానిష్ ఉన్నాడు. భారీ టెర్రర్ మాడ్యుల్ను ఢిల్లీ పోలీసులు గుట్టురట్టు చేశారు.దేశవ్యాప్తంగా దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది. గత రెండు రోజులుగా దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో టెర్రరిస్టులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. టెర్రరిస్టుల నుంచి భారీగా తుపాకీలు, బుల్లెట్లు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.ముంబైకి చెందిన అఫ్తాబ్, అబు సుఫియాన్లను ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో అరెస్టు చేశారు. ఆషర్ డానిష్ను రాంచీలో, కమ్రాన్ ఖురేషీని మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్లో, హుజైఫ్ యెమెన్ను తెలంగాణలో అరెస్టు చేశారు. ఈ ఉగ్రవాదులు పాకిస్తాన్లోని తమ హ్యాండ్లర్లతో సోషల్ మీడియా ద్వారా నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నారని అధికారులు వెల్లడించారు. #WATCH | Delhi Police Special Cell busted a Pan-India terror module and arrested five terrorists identified as Ashhar Danish, Sufiyan Abubakar Khan, Aaftab Ansari, Huzaifa Yaman and Kamran Qureshi A large quantity of materials and precursors for making IED have been seized from… https://t.co/uAcHkQ8r58 pic.twitter.com/zoCOqCkCJK— ANI (@ANI) September 11, 2025 -
బాబోయ్.. ఎయిరిండియా విమానాల్లో ఉక్కపోత!
దాదాపు 200 మందికిపైగా ప్రయాణికులు. ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో.. రెండుగంటల పాటు ఎదురు చూడాల్సి వచ్చింది. అయితే ప్రయాణికులకు కలిగిన అంతరాయంపై ఎయిరిండియా ప్రకటన చేసినా.. చేయకపోయినా.. అది ఏసీ వల్లే అనే విషయం ఇప్పుడు బయటకు వచ్చేసింది. బుధవారం రాత్రి ఢిల్లీ నుంచి సింగపూర్ వెళ్లాల్సిన విమానంలో ఏసీ పని చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.పీటీఐ కథనం ప్రకారం.. బోయింగ్ 787-9 డ్రీమ్లైనర్ ఎయిర్క్రాఫ్ట్ రాత్రి 11గం. సమయంలో సింగపూర్కు బయల్దేరాల్సి ఉంది. ఇంతలో సాంకేతిక సమస్య తలెత్తిందని అనౌన్స్మెంట్ చేశారు. అయితే.. రెండు గంటలు గడిచినా మరమ్మత్తులు కాలేదు. ఆపై ఎలాంటి వివరణ ఇవ్వకుండా ప్రయాణికులను సిబ్బంది కిందకు దించేశారు. ఈ ఘటనపై ఎయిరిండియా ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అయితే.. సోషల్ మీడియాలో కొన్ని దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఏసీ పని చేయకపోవడంతో ప్యాసింజర్లు మ్యాగజైన్లు, న్యూస్పేపర్లతో విసురుకుంటున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. ఇదిలా ఉంటే.. ఎయిరిండియా విమానాల్లో ఈ తరహా ఘటనలు ఈ మధ్యకాలంలోనే చోటు చేసుకున్నాయి. Now after suffering without AC for around 2 hrs, passengers of Delhi-Singapore @airindia flight being deplaned suspecting a technical glitch. Pathetic service @airindia @DGCAIndia @moneycontrolcom https://t.co/omaceiKZ41 pic.twitter.com/MOccbgH4JT— Ashish Mishra (@AshishM1885) September 10, 2025ఢిల్లీ–సింగపూర్ విమానం (AI2380) – సెప్టెంబర్ 10, 2025(తాజా ఘటన)బోయింగ్ 787-9 డ్రీమ్లైనర్ విమానంలో విద్యుత్ సరఫరాలో లోపంతో పని చేయని ఏసీలు!200 మందికి పైగా ప్రయాణికులు రెండు గంటల పాటు ఎదురు చూశాక.. చివరికి విమానం నుంచి దిగమన్నారుఢిల్లీ–పాట్నా విమానం – మే 19, 2025తీవ్ర వేడిలో AC పనిచేయకపోవడంతో ప్రయాణికులు పేపర్లు, మ్యాగజైన్లు ఉపయోగించి గాలి తీసుకునే ప్రయత్నంరిషి మిశ్రా అనే నేత ఓ వీడియో షేర్ చేసి విమానయాన మంత్రిత్వ శాఖను ప్రశ్నించారుఅహ్మదాబాద్–లండన్ విమానం (AI171) – జూన్ 12, 2025ఈ విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే.. విమానం క్రాష్కి ముందు ప్రయాణికులు AC పనిచేయడం లేదని ఫిర్యాదు చేశారుTV స్క్రీన్లు, లైట్లు, సిబ్బందిని పిలిచే crew call buttons కూడా పనిచేయలేదని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ఎయిర్ ఇండియా CEO ఏమన్నారంటే..వరుసగా ఈ తరహా ఘటనలు జరగడంపై కాంప్బెల్ విల్సన్ (Campbell Wilson) స్పందిస్తూ.. ఎయిరిండియాకు ఉన్న విమానాల సంఖ్య, సిబ్బంది, సంస్థ పరిమాణాన్ని బట్టి చూస్తే.. ఇలాంటి సమస్యలు తలెత్తడం సాధారణమే. అయినప్పటికీ ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా మా వంతు ప్రయత్నాలు చేస్తున్నాం. -
గాంధీ సరోవర్కు ‘రక్షణ’ భూములివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ‘గాంధీ సరోవర్’ప్రాజెక్టు కోసం రక్షణ శాఖకు చెందిన భూములను బదలాయించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. జాతీయ సమైక్యత, గాంధేయ విలువల స్ఫూర్తిని చాటేలా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు కేంద్రం సంపూర్ణ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సీఎం భేటీ అయ్యారు. 98.20 ఎకరాలు కేటాయించండి మూసీ, ఈసా నదుల సంగమ స్థలిలో గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ‘గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ’నిర్మించ తలపెట్టామని, ఇందుకు గాను అక్కడున్న 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కోరారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టులో గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసే నాలెడ్జ్ హబ్, ధ్యాన గ్రామం, చేనేత ప్రచార కేంద్రం, మ్యూజియం, శాంతి విగ్రహం వంటివి ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ల్యాండ్ స్కేపింగ్, ఘాట్లు, ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే వినోద ప్రదేశాలను కూడా అభివృద్ధి చేస్తామని రేవంత్ చెప్పారు. దీనిపై రాజ్నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కాగా ఈ సమావేశంలో ఎంపీలు పోరిక బలరాం నాయక్, కడియం కావ్య, చామల కిరణ్కుమార్ రెడ్డి, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి, కేంద్ర ప్రాజెక్టులు, పథకాల సమన్వయకర్త డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు. -
మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నాం
న్యూఢిల్లీ: బలహీన ప్రజాస్వామ్య పునాదులపై నిర్మితమైన రాజ్యాలు కుప్పకూలుతున్నాయని, బలీయమైన మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నామని ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యానించింది. శాసనసభల ఆమోదం పొంది తమ వద్దకు వచి్చన బిల్లులను నిరీ్ణత కాలపరిమితిలోపు గవర్నర్లు, రాష్ట్రపతి నిర్ణయాలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు గతంలో తీర్పునిచ్చింది. దీనిపై సుప్రీంకోర్టును రాష్ట్రపతి అభిప్రాయం కోరిన అంశంలో వాదోపవాదనలు జరుగుతున్న కేసు విచారణ సందర్భంగా బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ సారథ్యంలోని రాజ్యాంగ ధర్మాసనం పైవ్యాఖ్యలు చేసింది. ‘‘పౌరులు ప్రభావితమయ్యే అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకునేముందు సుప్రీంకోర్టును రాష్ట్రపతి సలహాలు కోరవచ్చు అని మన భారత రాజ్యాంగం ఉద్భోదిస్తోంది. ఇలాంటి సమగ్రతను సంతరించుకున్న మన రాజ్యాంగాన్ని చూసి గరి్వస్తున్నాం. పొరుగుదేశాల్లో ఏం జరుగుతుందో చూడండి. నేపాల్లో ఇప్పుడు ఎలాంటి దారుణ పరిస్థితి ఉందో మనందరం చూస్తూనే ఉన్నాం’’అని సీజేఐ గవాయ్ అన్నారు. బంగ్లాదేశ్లోనూ అదే పరిస్థితులు ఉన్నాయని మరో న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్నాథ్ గుర్తుచేశారు. ధర్మాసనంలో జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ ఎ.ఎస్.చందూర్కర్ సైతం సభ్యులుగా ఉన్నారు.నేపాల్లో.. తమ వద్ద గడువులోపు సమగ్రస్థాయిలో రిజిస్ట్రేషన్ చేసుకోలేదన్న సాకుతో సోషల్ మీడియా యాప్లపై పూర్తిస్థాయి నిషేధం విధించి నేపాల్ ప్రభుత్వం విద్యార్థుల నుంచి తీవ్రస్థాయిలో ప్రతిఘటనను ఎదుర్కొంది. చివరకు ప్రధాని ఓలీ తన పాలనావైఫల్యాన్ని అంగీకరిస్తూ గద్దె దిగారు. అయినాసరే జెన్ జెడ్, ఇతర విద్యార్థి సంఘాల ఆందోళన ఆగకపోగా మరింత హింసాత్మకంగా మారి చివరకు 30 మంది ప్రాణాలను బలిగొంది. పార్లమెంట్, దేశాధ్యక్షుని కార్యాలయం, ప్రధాని నివాసం, సుప్రీంకోర్టు భవనం, ప్రధాన రాజకీయ పారీ్టల హెడ్ఆఫీస్లు, సీనియర్ నేతల ఇళ్లు, మీడియా కార్యాలయాలు ఇలా దేశంలోని కీలక భవంతులన్నీ ఆందోళనకారుల తగలబెట్టారు. కొన్నింటిని ధ్వంసంచేశారు. మాజీ ప్రధాని షేర్బహదూర్ దేవ్బా ఇంటిని చుట్టుముట్టి దేవ్బా, భార్య అర్జు రాణాలపై దాడిచేశారు. ప్రజల ఆస్తుల విధ్వంసం యథేచ్చగా సాగింది. బంగ్లాదేశ్లో.. భారత్కు తూర్పు వైపున్న మరో పొరుగుదేశం బంగ్లాదేశ్ సైతం ఉద్యమ సెగకు బలైంది. 1971 విమోచన ఉద్యమకారుల వారసులకు సివిల్సరీ్వసెస్ ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కలి్పంచడంతో అక్కడి నిరుద్యోగ యువతలో ఆగ్రహం కట్టలుతెంచుకుంది. అది హఠాత్తుగా గత ఏడాది జులైలో మహోగ్రరూపం దాల్చి దేశవ్యాప్తంగా అల్లర్లు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం చేతులెత్తేసింది. చివరకు దేశ మహిళా ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రాణభయంతో రాజధాని ఢాకాను వీడి ఢిల్లీకి చేరుకున్నారు. అప్పట్నుంచి ఆమె ఢిల్లీలోనే తలదాచుకుంటున్నారు. నోబెల్ గ్రహీత మొహమ్మద్ యూనుస్ ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగుతున్నా అది సుస్థిర పాలనను అందివ్వలేక ఆపసోపాలు పడుతోంది. -
ఇక దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) చేపట్టేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. అక్టోబర్ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ ఎలక్టోరల్ అధికారులతో(సీఈఓ) కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు బుధవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. వర్క్షాప్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రారంభించాలన్న ప్రతిపాదనకు ఈ భేటీలో ఆమోదముద్ర వేశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బిహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను పూర్తిచేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. అర్హులైన ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారని, అనర్హుల పేర్లు చేరుస్తున్నారని మండిపడుతున్నాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ నెగ్గడానికి ఎస్ఐఆర్ పేరిట కుట్రలు సాగిస్తున్నారని బీజేపీ కూటమిపై ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని, వారి హక్కులను కాలరాస్తున్నారని విమర్శిస్తున్నాయి. విపక్షాల అభ్యంతరాలను లెక్కచేయకుండా ఎన్నికల సంఘం ముందుకెళ్తోంది. ఇక దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్కు సిద్ధమవుతుండడం గమనార్హం. ధ్రువపత్రాల జాబితా సిద్ధం చేయండి బిహార్ ఎన్నికలు ముగియకముందే దేశమంతటా ఎస్ఐఆర్పై ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. బుధవారం జరిగిన వర్క్షాప్లో సీఈఓల అభిప్రాయాలను కేంద్ర ఎన్నికల సంఘం సేకరించింది. ఎస్ఐఆర్కు ఎప్పటిలోగా సిద్ధం కాగలరని ప్రశ్నించగా.. సెపె్టంబర్లో ఏర్పాట్లు క్షేత్రస్థాయిలో పూర్తిచేస్తామని, అక్టోబర్ నుంచి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభించగలమని చాలామంది సీఈఓలు బదులిచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఎస్ఐఆర్కు సంబంధించిన వనరులు, సన్నాహాలపై మూడున్నర గంటలపాటు ప్రజంటేషన్ ఇచ్చారు. ఓటర్ల అర్హతను తేల్చడానికి అవసరమైన ధ్రువపత్రాల జాబితాను సిద్ధం చేయాలని సీఈఓలను ఆదేశించారు. స్థానికంగా ఆమోదించే, సులభంగా లభించే ధ్రువపత్రాలను పరిగణనలోకి తీసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. స్పష్టమైన సమగ్ర ఓటర్ల జాబితా కోసమే.. ఎస్ఐఆర్ వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని ఎన్నికల సంఘం ఇప్పటికే తేల్చిచెప్పింది. పారదర్శకమైన, అత్యంత కచి్చతత్వంతో కూడిన ఓటర్ల జాబితాను రూపొందించడమే అసలు లక్ష్యమని వెల్లడించింది. మరణించివారి పేర్లను, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారి పేర్లను, డూప్లికేట్ ఎంట్రీలను, దేశ పౌరులను కానివారి పేర్లను తొలగించడానికే ఓటర్ల జాబి తా ప్రత్యేక సమగ్ర సవరణకు శ్రీకారం చుట్టినట్లు స్పష్టం చేసింది. అర్హులైన ఓటర్ల పేర్లను జాబితాలో చేర్చనున్నట్లు పేర్కొంది. ఓటు వేసేందుకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేర్లను ఇందులో చేర్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. సమగ్రమైన, స్పష్టమైన ఓటర్ల జాబితాను రూపొందించాలంటే ఎస్ఐఆర్ తప్పనిసరి అని ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. ఇదిలా ఉండగా, 2026లో అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. సవరించిన ఓటర్ల జాబితాలతోనే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. -
బీహార్పై వరాల జల్లు.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బీహార్లో ముకామ- ముంగర్ మధ్య 82 కిలోమీటర్ల హైవే నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.బక్సర్ బగ్లాపూర్ కారిడార్లో కేంద్ర ప్రభుత్వం నిర్మించనున్న 84 కిలోమీటర్ల జాతీయ రహదారికి రూ.4447 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. దీంతో పాటు బీహార్లోని భాగల్పూర్ డంకా రాంపూర్ రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 177 కిలోమీటర్ల రైల్వే డబ్లింగ్ పనులకు రూ.3,169 కోట్ల రూపాయల్ని కేంద్రం ఖర్చు చేయనుంది. -
కొత్తకారుతో నిమ్మకాయల్ని తొక్కించబోయి..
కొత్తగా కారు కొన్నాక కొందరు పూజలు చేయించి నిమ్మకాయలు తొక్కించి బండిని ముందుకు తీసుకెళ్లడం చూస్తుంటాం. అయితే అలాంటి ప్రయత్నాన్ని షోరూమ్లోనే చేయబోయింది ఓ మహిళ. పొరపాటు జరగడంతో 27 లక్షల విలువ చేసే కొత్తకారు యాక్షన్ సినిమాలో మాదిరి అద్దాలు బద్దలు కొట్టుకుని ఫస్ట్ ఫ్లోర్ నుంచి భూమ్మీద బొక్కబొర్లాపడిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఘజియాబాద్ ఇందిరాపురం ప్రాంతానికి చెందిన మాని పరివార్ అనే మహిళ తన భర్త ప్రదీప్తో కలిసి కొత్త కారు కోసం ఢిల్లీ నిర్మాణ్ విహార్కు వచ్చింది. అక్కడి శివ ఆటో కార్ మహీంద్రా షోరూంలో కారు కొనుగోలు చేసి ఇంటికి తీకెళ్లాలనుకుంది. అయితే.. కారును నిమ్మకాయ తొక్కించి బయటకు తేవాలనుకుంది. ఈలోపు.. పొరపాటును ఎక్సలేటర్ను బలంగా తొక్కడంతో హఠాత్తుగా కారు ముందుకు దూసుకెళ్లింది. షోరూం ఫస్ట్ఫ్లోర్ అద్దాలు బద్దలు కొట్టుకుని సినిమాలో యాక్షన్ సీన్ మాది 15 అడుగుల ఎత్తు ఎగిరి నేల మీద బొక్కబోర్లా పడిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఆ కారు ధర రూ. 27 లక్షలుగా తెలుస్తోంది. दिल्ली के निर्माण विहार में स्थित महिंद्र शोरूम से महिला ने 27 लाख की थार खरीदी और शोरूम में ही पूजापाठ की, महिला को कार का पहिया नींबू पर चढ़ाना था लेकिन महिला ने ज्यादा एक्सीलेटर दिया और कार बिल्डिंग को तोड़ते हुए 15 फीट नीचे गिर गई#delhi #thar #viralvideo #laxminagar pic.twitter.com/oGgAvDkeZg— Live Viral Breaking News (@LVBNewsOfficial) September 9, 2025అయితే మరికొన్ని మీడియా చానెల్స్ మాత్రం మరోలా కథనాలు ఇస్తున్నాయి. షోరూం సిబ్బంది ఆ భార్యభర్తలకు డెమో ఇచ్చే టైంలో ప్రమాదం జరిగిందనిప్రసారం చేస్తున్నాయి. డెమో ఇచ్చే టైంలో ఆ సిబ్బంది కారు ఇంజిన్ ఆన్ చేశాడని, హఠాత్తుగా ఆ మహిళ ఎక్సలేటర్ తొక్కడంతో కారు బయటకు దూసుకొచ్చిందన్నది ఆ కథనం సారాంశం. ఏదిఏమైనా.. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో పలువురు వ్యంగ్యంగా స్పందిస్తుననారు. దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందించాలంటూ పలువురు నెటిజన్లు కోరుతుండడం గమనార్హం. -
బంగారం బుల్లెట్ ర్యాలీ!
న్యూఢిల్లీ: కనకం ‘ల’కారం దాటినా తగ్గేదేలే అంటూ కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తోంది! కొన్నిరోజులుగా రూ. లక్షపైనే కదలాడుతున్న పుత్తడి ఒక్కసారిగా మళ్లీ హైజంప్ చేసింది. బంగారం ధర మంగళవారం బుల్లెట్లా దూసుకెళ్లింది. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత పసిడి 10 గ్రాముల రేటు ఏకంగా రూ. 5,080 పెరిగి రూ. 1,12,750 స్థాయికి చేరింది. దేశీయంగా బంగారానికి ఇది మరో కొత్త ఆల్టైమ్ గరిష్ట స్థాయి. అంతేకాదు.. ఒకేరోజు పసిడి ఇంతలా పెరగడం కూడా ఇదే తొలిసారి కావడం గమనార్హం. వెండి ధర సైతం కిలోకు రూ. 2,800 లాభపడటంతో రూ. 1,28,800 స్థాయిని తాకింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం 3,698 డాలర్ల వద్ద సరికొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. ‘బంగారం మరో రికార్డు స్థాయిని చేరింది. ఈ ఏడాది ఎప్పటికప్పుడు కొత్త గరిష్టాలు నమోదు చేస్తూ అంతర్జాతీయ మార్కెట్లో 35 శాతం పెరిగింది. సెంట్రల్ బ్యాంక్ల నుంచి బలమైన డిమాండ్కు తోడు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లోకి పెట్టుబడుల రాక, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోత అంచనాలు.. బంగారం, వెండిలో రికార్డు బ్రేకింగ్ ర్యాలీకి కారణమవుతున్నాయి’అని హెచ్డీఎఫ్సీ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతుండటం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ వార్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయన్న ఆందోళనలు సైతం సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే బంగారం ధరలకు మద్దతుగా నిలుస్తున్నట్టు గాంధీ వివరించారు. -
స్వచ్ఛత పెర'గాలి'
కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ప్రకటించిన ’స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ ర్యాంకులు–2025’లో తెలుగు రాష్ట్రాలకు చెందిన నగరాలు మిశ్రమ ఫలితాలను సాధించాయి. దేశవ్యాప్తంగా గాలి నాణ్యత ఆధారంగా ప్రకటించిన ఈ ర్యాంకుల్లో, 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల కేటగిరీలో ఆంధ్రప్రదేశ్లో విజయవాడ 13వ ర్యాంకు, విశాఖపట్నం 17వ ర్యాంకు సాధించాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ 22వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. ఎప్పటిలాగే మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరం దేశంలోనే అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. 3 నుంచి 10 లక్షల జనాభా కేటగిరీలో ఏపీలోని గుంటూరు నగరం జాతీయ స్థాయిలో 6వ ర్యాంకు సాధించింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈ ర్యాంకులను ప్రకటించారు. జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం (ఎన్సీఏపీ) కింద దేశంలోని 130 నగరాల్లో గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు చేపట్టిన చర్యల ఆధారంగా ఈ ర్యాంకులను కేటాయించారు. – సాక్షి, న్యూఢిల్లీకేటగిరీల వారీగా తెలుగు రాష్ట్రాల్లోని నగరాలు, పట్టణాల స్థానాలు ఇవీ.. కేటగిరీ–1 (10 లక్షలకు పైగా జనాభా): ఈ విభాగంలో విజయవాడ 13వ ర్యాంకును, విశాఖపట్నం 17వ ర్యాంకును సాధించాయి. తెలంగాణ నుంచి హైదరాబాద్ నగరం 22వ స్థానంలో నిలిచింది.కేటగిరీ–2 (3 నుంచి 10 లక్షల జనాభా): ఈ కేటగిరీలో గుంటూరు 6వ ర్యాంకుతో మెరుగైన ప్రదర్శన కనబరిచింది. రాజమండ్రి 12, నెల్లూరు 18, కడప 23, కర్నూలు 29, అనంతపురం 35 ర్యాంకులు పొందాయి.కేటగిరీ–3 (3 లక్షల లోపు జనాభా): ఈ విభాగంలో ఆంధ్రప్రదేశ్ నుంచి విజయనగరం 8, శ్రీకాకుళం 16, ఒంగోలు 21, చిత్తూరు 29, ఏలూరు 31 ర్యాంకులు సాధించాయి. తెలంగాణ నుంచి నల్గొండ 13వ ర్యాంకులో, సంగారెడ్డి 17వ ర్యాంకులో నిలిచాయి.జాతీయ స్థాయిలో విజేతలు 10 లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాల్లో ఇండోర్ మొదటి స్థానంలో నిలవగా, జబల్పూర్ రెండో ర్యాంకు సాధించింది. ఆ తర్వాత ఆగ్రా, సూరత్ మూడోస్థానంలో నిలిచాయి. 3 నుంచి 10 లక్షల జనాభా కేటగిరీలో అమరావతి (మహారాష్ట్ర) మొదటి ర్యాంకు సాధించగా, 3 లక్షలలోపు జనాభా ఉన్న నగరాల్లో దేవాస్ (మధ్యప్రదేశ్) అగ్రస్థానంలో నిలిచింది. గాలి నాణ్యతను మెరుగుపరచడంలో ఈ నగరాలు తీసుకుంటున్న చర్యలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. -
ఆర్ఎస్ఎస్ కార్యకర్త నుంచి ఉపరాష్ట్రపతి దాకా..
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో మొదలైన ప్రస్థానం.. ద్రవిడ గడ్డపై కమలం జెండాను రెపరెపలాడించిన పోరాటం.. గవర్నర్గా రాజ్యాంగబద్ధ పాలనకు అందించిన సహకారం.. వెరసి అంతిమంగా చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ను భారత ఉపరాష్ట్రపతిని చేశాయి. తమిళనాడులోని ఒక సామాన్య ఆర్ఎస్ఎస్ కార్యకర్త నుంచి ఉపరాష్ట్రపతి వరకు సీపీ రాధాకృష్ణన్ సాగించిన సుదీర్ఘ రాజకీయ యాత్ర మంగళవారం విజయతీరాలకు చేరింది. పార్టీ సిద్ధాంతాలే శ్వాసగా, గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ అధిష్టానం అప్పగించిన ప్రతి బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించిన నాయకుడికి దక్కిన అత్యున్నత గౌరవం ఇది. రాధాకృష్ణన్ నియామకం కేవలం ఒక వ్యక్తికి దక్కిన పదవిగా కాకుండా బీజేపీ భవిష్యత్ రాజకీయ వ్యూహాలకు ముఖ్యంగా ‘మిషన్ సౌత్’కు అద్దం పడుతోంది. రాధాకృష్ణన్ ఎంపిక వెనుక కమలదళం రాజకీయ, సామాజిక, వ్యూహాత్మక కోణాలు దాగిఉన్నాయి. సిద్ధాంత పునాదులు.. సంఘ్లో శిక్షణ తమిళనాడులోని తిరుప్పూరులో 1957 అక్టోబర్ 20న జన్మించిన రాధాకృష్ణన్.. చిన్నతనం నుంచే ఆర్ఎస్ఎస్ భావజాలానికి ఆకర్షితులై పూర్తిస్థాయి కార్యకర్తగా మారారు. జాతీయవాద రాజకీయాలకు ఆదరణ లేని తమిళనాట.. ద్రవిడ ఉద్యమమే ఊపిరిగా సాగే సామాజిక వాతావరణంలో.. రాధాకృష్ణన్ తన 16వ ఏటనే ఆర్ఎస్ఎస్లో చేరారు. అది ఆయన జీవితాన్ని, రాజకీయ భవిష్యత్తును నిర్దేశించిన కీలక మలుపు. అప్పటి నుంచే జాతీయవాదం, హిందూత్వం, క్రమశిక్షణ, దేశ సేవ వంటి సంఘ్ మౌలిక సిద్ధాంతాలు ఆయనలో బలంగా నాటుకుపోయాయి. పార్టీ నిర్మాణం, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవడం, సైద్ధాంతిక స్పష్టత వంటి లక్షణాలను ఆయన అక్కడే అలవర్చుకున్నారు. 1974లో నాటి జనసంఘ్ తమిళనాడు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీకి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. 1980లో బీజేపీ ఆవిర్భావంతో లాంఛనంగా అందులో చేరి నాటి అగ్రనేత అటల్ బిహారీ వాజ్పేయికి అనుచరుడిగా మారారు. ఈ పునాదే ఆయన్ను తర్వాతి రాజకీయ జీవితంలో ఎదురైన ఎన్నో సవాళ్లను తట్టుకొనేలా చేసింది. ద్రవిడ కోటలో సంచలనం.. రాధాకృష్ణన్ రాజకీయ ప్రస్థానంలో 1998, 1999 కోయంబత్తూరు లోక్సభ విజయాలు అత్యంత కీలకమైనవి. 1998 ఎన్నికలకు కొన్నిరోజుల ముందు కోయంబత్తూరులో ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ‘అల్–ఉమ్మా’జరిపిన వరుస బాంబు పేలుళ్లతో నగరం దద్దరిల్లింది. ఈ ఘటన జరిగినప్పుడు అధి కారంలో ఉన్న డీఎంకేపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, అభద్రతాభావం ఆందోళన రేకెత్తించింది. ఈ వాతావరణంలో దేశభక్తి, హిందూ రక్షణ నినాదాలతో బీజేపీ బరిలోకి దిగింది. రాధాకృష్ణన్ను జాతీయవాదానికి ప్రతీకగా చూసిన ప్రజలు ముఖ్యంగా హిందూ ఓటర్లు ఏకతాటిపైకి వచ్చి ఆయనకు పట్టంకట్టారు. ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి సవాల్ విసురుతూ ఒక జాతీయ పార్టీ అభ్యర్థి అక్కడ గెలవడం సంచలనం సృష్టించింది. 1999లోనూ అదే ఊపును కొనసాగించి రెండోసారి గెలవడం ద్వారా అది గాలివాటు విజయం కాదని ఆయన నిరూపించారు.దక్షిణాదిపై గురి రాధాకృష్ణన్ అభ్యర్థిత్వం వెనుక బీజేపీ స్పష్టమైన రాజకీయ ప్రణాళిక కనిపిస్తుంది. దక్షిణాదిలో పార్టీ విస్తరణపై దృష్టిపెట్టిన కమలదళం.. తమిళనాడుకు చెందిన వ్యక్తిని, అందులోనూ బలమైన హిందూత్వ నేపథ్యం ఉన్న నాయకుడిని ఉప రాష్ట్రపతిని చేయ డం ద్వారా దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు, కార్యకర్తలకు ఒక సందేశం పంపినట్లయింది. ఈ పరిణా మం భవిష్యత్తులో పొత్తులు, పార్టీ విస్తరణకు మార్గం సుగమం చేయనుంది.వివాదరహిత, సౌమ్య ముద్ర గవర్నర్గా రాధాకృష్ణన్ పనితీరు వివాదరహితంగా ఉంది. ఇప్పుడు రాజ్యసభ చైర్మన్గా, ప్రతిపక్షాలు బలంగా ఉన్న సభను నడిపించడానికి ఆయన సౌమ్య స్వభావం, రాజ్యాంగ పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడతాయి. ఇది వ్యూహాత్మకంగా సరైన ఎంపిక. రాధాకృష్ణన్ ప్రస్థానం ఒక వ్యక్తి విజయగాథ మాత్రమే కాదు.. ఇది ఆధునిక బీజేపీ రాజకీయాలకు ప్రతిబింబం. సైద్ధాంతిక నిబద్ధత, సంస్థాగత విధేయత, వ్యూహాత్మక రాజకీయ ప్రయోజనం.. ఈ మూడు అంశాలనూ సమన్వయం చేస్తూ బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం. పార్టీయే శాశ్వతం.. ఓడినా చెదరని పట్టుదల రెండుసార్లు ఎంపీగా గెలిచినప్పటికీ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో రాధాకృష్ణన్ ఓట మిని చవిచూశారు. అయినా ఆయన నిరాశ చెందలేదు. అధికారం లేనప్పుడే అసలైన నాయకత్వ పటిమ బయటపడుతుందన్న ట్లుగా ఆయన పార్టీ నిర్మాణానికే సమయాన్ని కేటాయించారు. 2004–07 మధ్య తమిళ నాడు బీజేపీ అధ్యక్షుడిగా ఆ రాష్ట్రంలో పార్టీకి సంస్థాగత రూపాన్ని ఇవ్వడానికి తీవ్రంగా శ్రమించారు. బూత్స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం, కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడంపై దృష్టిపెట్టారు. నదుల అనుసంధానం, ఉగ్రవాద నిర్మూలన, ఉమ్మడి పౌరస్మృతి అమలు, డ్రగ్స్రహిత రాష్ట్రం తదితర డిమాండ్లతో 93 రోజులపాటు సుమారు 19 వేల కి.మీ. మేర ఆయన రథయాత్ర చేపట్టారు. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో ఓడిన రాధాకృష్ణన్.. పదవులున్నా లేకున్నా పార్టీని, సిద్ధాంతాన్ని అంటిపెట్టుకొనే ఉన్నారు. ఈ లక్షణమే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వంటి అగ్రనేతల దృష్టిలో ఆయ న్ను ప్రత్యేకంగా నిలబెట్టింది. 2023 ఫిబ్రవరిలో కేంద్రం ఆయన్ను జార్ఖండ్ గవర్నర్గా నియమించింది. ఆ తర్వాత నాటి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజీనామాతో తెలంగాణ గవర్నర్గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు చేపట్టారు. 2024 జూలైలో మహారాష్ట్ర గవర్నర్గా నియమితులయ్యారు. ఈ ఏడాది జూలైలో అప్పటి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఆకస్మిక రాజీనామాతో బీజేపీ అధినాయకత్వం రాధాకృష్ణన్ ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలిపింది. -
దేశంలోకి రెండేళ్లలో రూ.800 కోట్ల దొంగ బంగారం
న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దుగా ఉన్న వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) ద్వారా గడిచిన రెండేళ్ల కాలంలో కనీసం టన్ను బరువైన రూ.800 కోట్ల బంగారంలో దేశంలోకి దొంగచాటుగా వచ్చింది. 2023, 2024 సంవత్సరాల్లో టిబెటన్లు, చైనీయులే ఈ బంగారాన్ని స్మగ్లింగ్ చేశారు. గతేడాది జూలైలో లద్దాఖ్లో ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) దళం 108 కిలోల విదేశీ బంగారం కడ్డీలను పట్టుకున్న నేపథ్యంలో ఫెమా చట్టం కింద కేసు నమోదు చేసి, ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేపట్టినట్లు మంగళవారం ఈడీ వర్గాలు తెలిపాయి.చైనాతో మనకున్న 3,488 కిలోమీటర్ల పొడవైన ఎల్ఏసీ రక్షణ బాధ్యతలను ఐటీబీపీయే చూసుకుంటుంది. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీలోని ఐదు ప్రాంతాలు, లద్దాఖ్లో ఒక చోట మంగళవారం తనిఖీలు చేపట్టామని ఈడీ వివరించింది. దొంగతనంగా తీసుకువచ్చిన బంగారానికి సంబంధించిన చెల్లింపులన్నీ క్రిప్టోకరెన్సీ ద్వారానే పూర్తయినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) తెలిపింది. పట్టుబడిన 108 కిలోల విదేశీ బంగారాన్ని చైనాకు చెందిన భు చుమ్చుమ్ అనే వ్యక్తి భారత్లోని టెండు తాషికి ఎల్ఏసీ ద్వారా పంపాడని డీఆర్ఐ వివరించింది. ఇందుకు సంబంధించి 10 మందిని అదుపులోకి తీసుకున్నామంది. -
మా తండ్రి ఆస్తుల్లో వాటా ఇవ్వాలి
న్యూఢిల్లీ: తమ తండ్రి దివంగత సంజయ్ కపూర్ ఆస్తుల్లో వాటా కోసం బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ కుమార్తె, కుమారుడు న్యాయ పోరాటం ప్రారంభించారు. తండ్రి ఆస్తుల్లో తమకు రావాల్సిన వాటా దక్కేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మంగళవారం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై బుధవారం విచారణ జరిగే అవకాశం ఉంది. సంజయ్ కపూర్కు రూ.30,000 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు సమాచారం. మరణానికి ముందు ఈ ఏడాది మార్చి 21వ తేదీన ఆయన రాసినట్లు చెబుతున్న విల్లు నకిలీదని కరిష్మా కపూర్ కుమార్తె, కుమారుడు ఆరో పించారు.ఆస్తులు మొత్తం కొట్టేయడానికి తమ సవతి తల్లి ప్రియా కపూర్(ప్రియా సచ్దేవ్) కుట్ర చేస్తోందని పేర్కొన్నారు. తన వ్యక్తిగత ఎస్టేట్ మొత్తం ప్రియా కపూర్ కు దక్కేలా సంజయ్ కపూర్ విల్లు రాసినట్లు సమాచారం. అయితే, ఆ విల్లును కుట్ర పూరితంగా సృష్టించారని, అది నిజమైన విల్లు కాదని కరిష్మా కపూర్ కుమార్తె, కుమారుడు తేల్చిచెప్పారు. దాని గురించి తమ తండ్రి సంజయ్ కపూర్ కానీ, సవతి తల్లి ప్రియా కపూర్ కానీ గతంలో ఎన్నడూ చెప్పలేదని వెల్లడించారు. ఇప్పుడు ప్రియా కపూర్ దురుద్దేశంతోనే హఠాత్తుగా నకిలీ విల్లును తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు. సంజయ్ కపూర్కు సంబంధించిన ఆస్తుల వివరాలన్నీ బయటపెట్టేలా ప్రియా కపూర్ను ఆదేశించాలని హైకోర్టును కోరారు. ఏమిటీ వివాదం? ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ కపూర్ తొలుత నందితాను వివాహం చేసుకున్నారు. 1996 నుంచి 2000 సంవత్సరం దాకా వారు కలిసున్నారు. విడాకుల తర్వాత సంజయ్ కపూర్ 2003లో కరిష్మా కపూర్తో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వారికి ఇద్దరు పిల్లలు సమైరా, కియాన్ ఉన్నారు. 2016లో అభిప్రాయభేదాల వల్ల సంజయ్ కపూర్, కరిష్మా విడిపోయారు. అనంతరం 2017 ప్రియా సచ్దేవ్ను సంజయ్ పెళ్లాడారు. సంజయ్ కపూర్ ఈ ఏడాది జూన్ 12న హఠాత్తుగా మృతిచెందిన సంగతి తెలిసిందే. లండన్లో పోలో ఆడుతుండగా గొంతులోకి తేనెటీగ దూసుకెళ్లింది.దాంతో ఆయన గుండెపోటుకు గురై కన్నుమూశారు. తన కుమారుడి మరణంపై అనుమానాలున్నాయని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని సంజయ్ తల్లి రాణి కపూర్ యూకే ప్రభుత్వాన్ని కోరారు. సంజయ్ మరణం తర్వాత ఆయన ఆస్తులపై వివాదం మొదలైంది. రెండో భార్య సంతానం, మూడో భార్య మధ్య పోరాటం సాగుతోంది. మరోవైపు ఇన్నాళ్లూ ప్రియా సచ్దేవ్గానే ఉన్న మూడో భార్య ఇటీవలే తన పేరును ప్రియా కపూర్గా మార్చుకోవడం గమనార్హం. అంతేకాకుండా తన అత్త రాణి కపూర్పై ఒత్తిడి తెచ్చి కొన్ని రకాల పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నట్లు ప్రియా కపూర్పై ఆరోపణలు వస్తున్నాయి. -
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
ధర్మశాల/చండీగఢ్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. నీట మునిగిన పంట పొలాలు, ధ్వంసమైన ఇళ్లు, రహదారులను స్వయంగా పరిశీలించారు. బాధితులతో మాట్లాడారు. భారీ వర్షాలు, వరదలకు తోడు కొండచరియలు విరిగిపడడంతో తీవ్రంగా నష్టపోయిన హిమాచల్ ప్రదేశ్కు తక్షణ సాయం కింద రూ.1,500 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వరదల్లో మృతిచెందినవారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం ఇస్తామని వెల్లడించారు.హిమాచల్ ప్రదేశ్లో ఏరియల్ సర్వే అనంతరం కాంగ్రా పట్టణంలో ప్రధాని మోదీ సమీక్షా సమావేశం నిర్వహించారు. సహాయ పునరావాస చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి సుఖ్వీందర్సింగ్ సుఖూ పాల్గొన్నారు. వరద బాధితులు సైతం హాజరై తమ గోడు వినిపించారు. తమను ఆదుకోవాలని ప్రధాని మోదీని వేడుకున్నారు. కచ్చితంగా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. వరదల్లో దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. ధ్వంసమైన ఇళ్లను ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పునరి్నరి్మంచాలని సూచించారు. రాష్ట్రంలో ఈ ఏడాది జూన్ 20 నుంచి సెపె్టంబర్ 8 దాకా వరదలు, కొండచరియల కారణంగా ఏకంగా 370 మంది మృతిచెందారు. పంజాబ్లో సహాయక చర్యలపై ఆరా ప్రధాని మోదీ హిమాచల్ ప్రదేశ్లో పర్యటన అనంతరం పంజాబ్కు చేరుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. హెలికాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. బాధితులను కలిసి మాట్లాడారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని, ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతోనూ మాట్లాడారు. సహాయక చర్యలపై ఆరా తీశారు. గురుదాస్పూర్లో సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. పంజాబ్కు తక్షణ సాయం కింద రూ.1,600 కోట్లు అందజేస్తామని ప్రకటించారు. భారీ వర్షాలతోపాటు సట్లెజ్, బియాస్, రావి నదులు ఉప్పొంగి ప్రవహించడంతో పంజాబ్లో భారీ నష్టం వాటిల్లింది. 51 మంది మరణించారు. 1.84 లక్షల హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. రూ.13,000 కోట్ల నష్టం జరిగినట్లు ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. రూ.20,000 కోట్ల సహాయ ప్యాకేజీ ప్రకటించాలని ప్రధాని మోదీని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది.చిన్నారి నీతికతో మోదీ హిమాచల్ప్రదేశ్లోని కాంగ్రాలో సమీక్షా సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ 14 నెలల చిన్నారి నీతికను ఎత్తుకొని బుజ్జగించారు. ప్రకృతి విలయం వల్ల అనాథగా మారిన నీతిక దీనగాథ విని ఆయన చలించిపోయారు. హిమాచల్ప్రదేశ్లో మండీ జిల్లాలోని తల్వార గ్రామంలో జూన్ 30న రాత్రిపూట హఠాత్తుగా భారీ వర్షం కురిసింది. గ్రామంపై కొండ చరియలు విరుచుకుపడ్డాయి. ఓ ఇంట్లో రమేశ్ కుమార్(31), రాధాదేవి(24) దంపతులు తమ కమార్తె నీతికతోపాటు తల్లి పూనమ్దేవితో కలిసి నిద్రిస్తున్నారు. ఇంట్లోకి బురద చొచ్చుకొచ్చింది.నీతికను వంట గదిలో పడుకోబెట్టి బురదను తొలగించేందుకు ముగ్గురూ ప్రయత్నించారు. ఇంతలో భారీ కొండచరియ ఆ ఇంటిపైకి దూసుకొచ్చింది. వంట గది మినహా ఆ ముగ్గురున్న గది నేలమట్టమైంది. రమేశ్ కుమార్, రాధాదేవి, పూనమ్దేవి బురదతోపాటు కొట్టుకుపోయి మృత్యువాత పడ్డారు. వంట గదికి నష్టం జరగకపోవడంతో నీతిక ప్రాణాలతో బయటపడింది. ఆ సమయంలో నీతిక వయసు 11 నెలలే. నీతికను హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వం ‘చైల్డ్ ఆఫ్ ద స్టేట్’గా ప్రకటించింది. ఆమె చదువుతోపాటు జీవనానికి అయ్యే ఖర్చులు భరిస్తామని ప్రకటించింది. -
ఆగ్రహ జ్వాలలు
కాఠ్మండు/న్యూఢిల్లీ: సోషల్ మీడియా యాప్లపై నిషేధంతోపాటు విద్యార్థులు, యువత సోమవారం మొదలెట్టిన ఆందోళనలు మెరుపువేగంతో నేపాల్ను చుట్టేసి దేశాన్ని సంక్షోభ కుంపట్లోకి నెట్టేశాయి. సామాజిక మాధ్యమాల సేవలను పునరుద్ధరిస్తున్నామని కేపీ శర్మ ఓలీ సారథ్యంలోని ప్రభుత్వం కొద్ది గంటల్లోనే స్పష్టంచేసినా అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. రాజధాని కాఠ్మండు మొదలు దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు, యువత తమ నిరసనజ్వాలలను మరింతగా ఎగదోస్తూ ఏకంగా పార్లమెంట్ భవనానికి నిప్పు పెట్టారు. మంగళవారం ఆందోళనలను అణచివేసేందుకు పోలీసులు, సైన్యం రంగంలోకి దిగాయి. కాళీమతిలో పోలీస్సర్కిల్కు నిప్పుపెట్టి అధికారులపై దాడి చేయడంతో పోలీసులు కాల్పులు జరిపారు.దీంతో ఇద్దరు చనిపోయారు. దీంతో కాల్పులు, పరస్పర ఘర్షణ ఘటనల్లో మరణాల సంఖ్య మంగళవారానికి 22కు పెరిగింది. 300 మందికిపైగా గాయపడ్డారు. కట్టలు తెంచుకున్న యువాగ్రహాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ మంగళవారం తన పదవికి రాజీనామాచేశారు. భద్రంగా ఇంటి నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు నేపాల్ ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్దెల్ను బతిమాలుకున్నట్లు వార్తలొచ్చాయి.ఆందోళనకారుల నిరసన కార్యక్రమం అదుపుతప్పి మాజీ ప్రధానమంత్రి, తాజా మంత్రులపై భౌతికదాడులదాకా వెళ్లింది. ప్రధాని ఓలీకి చెందిన భక్తపూర్లోని బాల్కోట్ నివాసాన్ని ఆందోళనకారులు తగులబెట్టారు. మాజీ ప్రధానమంత్రి ఝలనాథ్ ఖనాల్ ఇంటికి ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈ మంటల్లో చిక్కుకుని ఆయన భార్య రాజ్యలక్ష్మీ చిత్రకార్ తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన ఆమెను సమీప కీర్తిపూర్ బర్న్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఎటు చూసినా ఆస్తుల విధ్వంసం, వినాశనంతో నేపాల్ నిలువెల్లా రక్తమోడింది. దుకాణాల లూటీలు, పౌరుల భయాందోళనల నడుమ ప్రధాని రాజీనామాతో ఎట్టకేలకు సైన్యం పూర్తస్థాయిలో రంగంలోకి దిగి శాంతభద్రతల పరిరక్షణ బాధ్యతలను తన చేతుల్లోకి తీసుకుంది. పరిస్థితులను తమకు అనుకూలంగా మల్చుకుని ప్రజల ఆస్తులను ధ్వంసంచేస్తూ లూటీలకు తెగించిన వాళ్ల అంతుచూస్తామని ఆర్మీ చీఫ్ హెచ్చరించారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతి, రాజకీయ వారసత్వం, సంపన్న, ఉన్నతస్థాయి వర్గాల ఆధిప్యంపై ఇప్పటికే విసిగిపోయిన యువత తాజాగా సామాజికమాధ్యమాలపై హఠాత్తుక నిషేధం విధించడంతో వాళ్లలో ఆగ్రహం పెల్లుబికి మహోద్యమంగా మారడంతో దేశ భవిష్యత్తు ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైంది. పెల్లుబికిన ఆగ్రహం పరిస్థితిని మరింతగా కట్టుతప్పొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం కర్ఫ్యూను విధించింది. అయినాసరే వేలాదిమంది విద్యార్థులు, యువత ‘జెన్ జెడ్’కూటమిగా ఏర్పడి రాజధాని కాఠ్మండు మొదలు పట్టణాలదాకా విధ్వంసానికి తెగించారు. మాజీ ప్రధానమంత్రులు మొదలు తాజా కేబినెట్ మంత్రులు, కీలక నేతల దాకా ముఖ్యమైన వ్యక్తుల ఇళ్లకు నిప్పంటించారు. ప్రధాన రాజకీయ పార్టీల ప్రధాన కార్యాలయాలనూ ధ్వంసంచేశారు. కనిపించిన ప్రతి ఒక్క రాజకీయ నేతను చితకబాదారు. దేశాధ్యక్షుడు రాంచంద్ర పౌదెల్, మాజీ ప్రధాని పుష్పకమల్ దహాల్(ప్రచండ), ప్రస్తుత కమ్యూనికేషన్స్ మంత్రి పృథ్వీ సుబ్బా గురుంగ్, మాజీ హోం మంత్రి రమేశ్ లఖ్హార్, మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బాల ఇళ్లను నాశనంచేశారు. ఆందోళనలు కాఠ్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్నీ తాకాయి. దీంతో ముందుజాగ్రత్తగా అంతర్జాతీయ విమానసర్వీసులను రద్దుచేసి ఎయిర్పోర్ట్ను అధికారులు తాత్కాలికంగా మూసేశారు. ఎటుచూసినా విధ్వంసమే ఆందోళనలను ఏ దశలోనూ అడ్డుకోలేక పోలీసులు చేతులెత్తేయడంతో విద్యార్థులు, నిరసనకారుల విధ్వంసకాండ ఆకాశమే హద్దుగా సాగింది. పార్లమెంట్, దేశాధ్యక్షుని కార్యాలయం, ప్రధాని నివాసం, సుప్రీంకోర్టు భవనం, ప్రధాన రాజకీయ పార్టీల హెడ్ఆఫీస్లు, సీనియర్ నేతల ఇళ్లు, మీడియా కార్యాలయాలు ఇలా ప్రతి దేశంలోని కీలక భవంతులన్నీ ఆందోళనకారుల ఆగ్రహజ్వాలల బారినపడ్డాయి. డల్లూ ఏరియాలోని మాజీ ప్రదాని ఝలానాథ్ నివాసానికి నిప్పుపెట్టారు. కపన్ ప్రాంతంలోని నేపాలీ కాంగ్రెస్ నేత ఇంటిని తగులబెట్టారు.సింఘదర్బార్లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం భవనానికీ నిప్పుపెట్టారు. మహరాజ్గంజ్లోని అధ్యక్షకార్యాలయం, బలూవతార్లో ప్రధాని అధికారి నివాసం సైతం నిప్పురవ్వల వర్షంలో కాలిపోయాయి. టిన్కునేలో కాంతిపూర్ టెలివిజన్ ఆఫీస్ను ధ్వంసంచేశారు. బుద్ధనీలకంఠ ప్రాంతంలోని మాజీ ప్రధాని షేర్బహదూర్ దేవ్బా ఇంట్లో చొరబడి దేవ్బా, భార్య అర్జూ రాణాలను రక్తంకారేలా కొట్టారు. దీంతో ప్రాణభయంతో ఆయన పచ్చికబయళ్లకు పరుగులుపెట్టారు. విషయం తెల్సుకుని సైన్యం రంగంలోకి దిగి ఆయనను నిరసనకారుల బారినుంచి కాపాడింది.దేవ్బా కుమారుడు జైబీర్కు చెందిన కాఠ్మండులో హిల్టన్ ఐదునక్షత్రాల హోటల్కు, అర్జూకు చెందిన ఖుమల్తార్లోని ఉలెన్స్ పాఠశాలకు, తోఖాలో మాజీ ప్రధాని బాబూరామ్ భట్టారాయ్ ఇంటికి నిప్పుపెట్టారు. ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ పౌదెల్ను వీధిలో పరుగెత్తించిమరీ చితక్కొట్టారు. వెనక నుంచి ఆయన్ను ఒకతను వీపుమీద ఎగిరి తన్నుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. గోశాల, లూభూ, కాళీమతి పోలీస్పోస్ట్లకూ నిరసనకారులు నిప్పుపెట్టారు. కలాంకీ, కాళీమతి, తహచల్, బనేశ్వర్, నైకాప్, ఛియాసల్, ఛపగావ్, థేచో ఇలా ప్రతి ప్రాంతంలో పెను విధ్వంసం సృష్టించారు.టైర్లు తగలబెట్టి రోడ్లపై రాకపోకలను నిలిపేశారు. కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యాలయ భవనం ఎక్కి పార్టీ జెండాను చింపేశారు. పోఖ్రా పట్టణంలో ఆందోళనకారులు కారాగారం గోడలు బద్దలుకొట్టారు. దీంతో జైలులోని 900 మంది ఖైదీలు బయటకు పరుగులుతీశారు. కాఠ్మండూలోని నఖూ జైలుకూ ఇదే గతి పట్టింది. దీంతో ఇక్కడి ఖైదీలు విడుదలయ్యారు. వీరిలో మాజీ హోం మంత్రి రవి లమీచ్ఛానే సైతం ఉన్నారు. ఇదే అదనుగా కొన్ని అల్లరిమూకలు దుకాణాలను లూటీ చేశాయి. దిగిపోవాలని డిమాండ్ చేసి దింపేశారుమంగళవారం ఉదయం ప్రధాని కేపీ శర్మ ఓలీ కార్యాలయాన్ని చుట్టుముట్టిన వందలాది మంది ఆందోళనకారులు తర్వాత లోపలికి చొరబడి శర్మను వెంటనే గద్దె దిగాలని మొండిపట్టుపట్టారు. ‘‘కేపీ దొంగ, దేశాన్ని వీడిపో’’అంటూ పెద్దగా నినాదాలు చేశారు. తప్పని పరిస్థితుల్లో వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు దేశాధ్యక్షుడు రాంచంద్రకు లేఖ రాశారు. ‘‘నేపాల్ అసాధారణ పరిస్థితులను ఎదుర్కొంటోంది. పరిస్థితి కుదుటపడేందుకు రాజ్యాంగబద్ధంగా, రాజకీయంగా తగు పరిష్కారం కనుగొనేందుకు వీలుగా ప్రధాని పదవి నుంచి వైదొలుగుతున్నా’’అని 73 ఏళ్ల సీనియర్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్(యునిఫైడ్ మార్కిస్ట్–లెనినిస్ట్) నేత శర్మ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.వెంటనే రాజీనామాను అధ్యక్షుడు ఆమోదించారు. అయితే నూతన మంత్రివర్గం ఏర్పడేదాకా ఆయనే ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతారని దేశాధ్యక్షుడు చెప్పారు. నేపాల్ కాంగ్రెస్ పార్టీ అండతో గత ఏడాది జూలైలో శర్మ నాలుగోసారి ప్రధాని పదవిని చేపట్టడం తెల్సిందే. శర్మ దిగిపోవాలని నేపాల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్వి గగన్ థాపా సైతం అంతకుముందే డిమాండ్చేశారు. చైనాతో సత్సంబంధాలు కొనసాగించే శర్మీ తరచూ భారతవ్యతిరేక విధానాలను అవలంభించే నేతగా అప్రతిష్ట మూటగట్టుకున్నారు. గత షెడ్యూల్ ప్రకారం ఈనెలలోనే భారత్లో పర్యటించాల్సి ఉండగా ఆలోపే పదవీసన్యాసం చేశారు. అయితే శర్మ దేశాన్ని వీడి దుబాయ్కు వెళ్లనున్నారని, ఆయన కోసం రన్వే మీద హిమాలయ ఎయిర్లైన్స్ విమానాన్ని సిద్ధంగా ఉంచారని వార్తలొచ్చాయి. అగ్నికి ఆహుతవుతున్న ప్రధాని ఇల్లు బాణసంచా కాల్చి.. పారిపోకుండా ఆపి.. నేపాల్ నుంచి పారిపోయేందుకు నేతలకు హెలికాప్టర్ సేవలను అందిస్తోందన్న పుకార్లతో సిమ్రిక్ ఎయిర్లైన్స్ భవంతిని ఆందోళనకారులు తగలబెట్టారు. భైసేపతి మంత్రుల క్వార్టర్స్ నుంచి మంత్రులు విదేశాలకు హెలికాప్టర్లలో పారిపోతున్నారన్న వార్తలతో విద్యార్థులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఎయిర్పోర్ట్ రన్వేల సమీపంలో బాణసంచా, రాకెట్లు కాల్చారు. దీంతో ఆకాశంలో పొగచూరింది. డ్రోన్లు ఎగరేసి, పౌర లేజర్లైట్లు రన్వే వైపు ప్రసరింపజేసి విమాన రాకపోకలను అడ్డుకోవాలని ప్రజలకు ఆందోళనకారులు సోషల్మీడియా వేదికగా పిలుపునిచ్చారు. అయితే అప్పటికే కొన్ని హెలికాప్టర్లు అక్కడి నుంచి వెళ్లిపోయాయని వార్తలొచ్చాయి. కొందరు మంత్రులు, వీవీఐపీలు ఆర్మీ బ్యారెక్లలో తలదాచుకున్నారు. పార్లమెంట్ను రద్దుచేయండి: బాలెన్ షా యువతలో విపరీతమైన ఆదరణ ఉన్న కాఠ్మండు నగర మేయర్, 35 ఏళ్ల బాలేంద్ర షా మాత్రం వెంటనే పార్లమెంట్ను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ‘‘నిరసనకారులు శాంతించాలి. విద్యార్థి బృందాలు తక్షణం ఆర్మీ చీఫ్తో చర్చలకు సంసిద్ధమవ్వాలి. అంతకుముందే పార్లమెంట్ను రద్దుచేయాలి’’అని అన్నారు. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని, తాము ఎంపీలుగా రాజీనామా చేస్తామని రా్రïÙ్టయ స్వతంత్ర పార్టీకి చెందిన 21 మంది ఎంపీలు ప్రకటించారు. ఉద్యమానికి తమ పూర్తి మద్దతు తెలిపారు. తాను సైతం రాజీనామా చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ప్రదీప్ యాదవ్ చెప్పారు. చర్చించుకుందాం.. రండి ఆందోళనను విడనాటి చర్చలకు రావాలని జెన్ జెడ్ విద్యార్థి, యువలోకానికి దేశాధ్యక్షుడు రాంచంద్ర పౌదెల్ పిలుపునిచ్చారు. శాంతి, సుస్థిరతకు అందరం పాటుపడుతున్నామంటూ నేపాల్ ఆర్మీ చీఫ్ అశోక్రాజ్ సిగ్దెల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏక్ నారాయణ్ ఆర్యల్, హోం సెక్రటరీ గోకర్ణ దవాదీ, సాయుధ పోలీసు బలగాల చీఫ్ రాజు ఆర్యల్, ఐజీ చంద్ర కుబేర్, జాతీయ దర్యాప్తు విభాగ సారథి హుత్రాజ్ థాపా సంతకాలు చేసి ఒక సంయుక్త ప్రకటన విడుదలచేశారు.అయితే 26 సోషల్మీడియా సైట్ల పునరుద్దరణతోపాటు వాక్ స్వాతంత్య్రం, ప్రభుత్వ ఉద్యోగుల్లాగా రాజకీయనేతలకూ రిటైర్మెంట్ వయసును ప్రకటించాలని పలు డిమాండ్లను యువత ప్రభుత్వం ముందుంచింది. మంత్రులు, ఉన్నతవర్గాల కుటుంబాలే సకల సౌకర్యాలను పొందుతున్నాయని ఉద్యమకారులు సోషల్మీడియాలో ప్రచారాన్ని మొదలెట్టారు. పరిస్థితిని చక్కదిద్ది ప్రభుత్వం, ఆర్మీ దేశంలో మళ్లీ శాంతిని నెలకొల్పాలని నేపాల్లోని ఆ్రస్టేలియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జపాన్, ద.కొరియా, బ్రిటన్, అమెరికా రాయబార కార్యాలయాలు సంయుక్త ప్రకటనలో అభ్యర్థించాయి. ఉద్యమాలు శాంతియుతంగా సాగాలని హింసాత్మక పథం పనికిరాదని ఐక్యరాజ్య సమితి సైతం హితవు పలికింది. -
కొత్త ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ 15వ ఉపరాష్ట్రపతిగా బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్డీఏ) తరఫున పోటీ చేసిన చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి పక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్రెడ్డిపై ఆయన ఘన విజయం సాధించారు. రాధాకృష్ణన్ 452 ఓట్లు సాధించగా జస్టిస్ సుదర్శన్రెడ్డి 300 ఓట్లు పొందారు. దీంతో 152 ఓట్ల తేడాతో రాధాకృష్ణన్ గెలుపొందినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ మంగళవారం రాత్రి ప్రకటించారు. దీంతో రాధాకృష్ణన్ త్వరలోనే ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేపట్టనున్నారు. తమిళనాడు నుంచి ఈ పదవిని అధిష్టించిన సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆర్.వెంకట్రామన్ల తర్వాత మూడో నాయకుడిగా సీపీ రాధాకృష్ణన్ చరిత్రకెక్కారు. ఘన విజయం... ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ నూతన పార్లమెంట్ భవనంలోని ‘వసుధ ఎఫ్–101’లో మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. ఈ పోలింగ్లో మొత్తంగా 767 మంది ఎంపీలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో 6, లోక్సభలో ఒక ఖాళీ స్థానాన్ని పక్కనబెడితే లోక్సభలో 542 మంది, రాజ్యసభలో 239 మంది కలిపి 781 మంది ఎంపీలు ఓటింగ్లో పాల్గొనాల్సి ఉంది. అయితే ముందే ప్రకటించినట్లుగా బీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎంపీలు, ఏడుగురు బీజేడీ ఎంపీలతోపాటు శిరోమణి అకాలీదళ్ ఎంపీ ఒకరు, స్వతంత్ర ఎంపీ సరబ్జీత్సింగ్ ఖల్సా ఓటింగ్కు దూరంగా ఉన్నారు. దీంతో మొత్తంగా 767 (98.2 శాతం) ఓట్లు పోలయ్యాయి. విజయానికి అవసరమైన ఓట్లను 377గా నిర్ణయించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఓట్లను లెక్కించి రాత్రి 7:30 గంటలకు ఫలితాన్ని ప్రకటించారు. మొత్తం పోలైన 767 ఓట్లలో చెల్లని ఓట్లు 15 ఉండగా మిగిలిన 752 ఓట్లలో రాధాకృష్ణన్కు 452 మొదటి ప్రాధాన్యతా ఓట్లు లభించాయని.. జస్టిస్ బి.సుదర్శన్రెడ్డికి 300 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి పీసీ మోదీ ప్రకటించారు. అనుకున్నట్లే క్రాస్ ఓటింగ్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అందరూ ఊహించినట్లే క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలిసింది. ఇండియా కూటమిలోని పక్షాలు, తమకు మద్దతుగా వచ్చిన ఆప్ సహా ఇతర చిన్నాచితక పార్టీలతో కలిసి కాంగ్రెస్ కనీసం 324 ఓట్లు వస్తాయని అంచనా వేసింది. పోలింగ్ జరుగుతున్న సమయంలోనే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ‘ప్రతిపక్షాలు ఐక్యంగా నిలబడ్డాయి. కూటమికి చెందిన 315 మంది ఎంపీల్లో అందరూ ఓటింగ్ కోసం హాజరయ్యారు’అని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. అయితే కాంగ్రెస్ పేర్కొన్నట్లుగానే 15 ఓట్లు క్రాస్ ఓటింగ్ అయ్యాయి. దీంతోపాటు చెల్లని ఓట్లు సైతం ఇండియా కూటమి పక్షాలవేనని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే 20–25 ఓట్లు ఎన్డీఏ అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. మరోవైపు రాధాకృష్ణన్కు ఎన్డీయే కూటమిలోని 427 మంది ఎంపీల మద్దతు ఉందని బీజేపీ కాగితంపై లెక్కలేసుకోగా పోలింగ్లో మాత్రం అంతకన్నా ఎక్కువగానే ఓట్లు లభించాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ నేతృత్వంలో నిర్వహించిన సమర్థవంతమైన ఫ్లోర్ మేనేజ్మెంట్ కారణంగా ఎన్డీయే సునాయాశ విజయం సాధించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్డీఏ కూటమి పక్షాలకు రెండ్రోజులపాటు నిర్వహించిన శిక్షణా తరగతులు, మిత్రపక్షాలతో సమన్వయం, పోలింగ్కు ముందు ప్రాంతాలవారీగా ఎంపీలతో సమన్వయం రాధాకృష్ణన్ గెలుపునకు దోహదం చేసిందని చెబుతున్నారు. మిన్నంటిన సంబరాలు.. సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించిన వెంటనే బీజేపీలో సంబరాలు మొదలయ్యాయి. కేంద్ర మంత్రి ప్రల్హాద్ జోషి నివాసం ముందు తమిళనాడు సంప్రదాయాలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. సీపీ రాధాకృష్ణన్కు బీజేపీ ఎంపీలతోపాటు ఆయనకు మద్దతిచ్చిన పక్షాల ఎంపీలు శుభాకంక్షలు తెలిపారు. రాష్ట్రపతి, ప్రధాని, అమిత్ షా, ఖర్గే శుభాకాంక్షలు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర అమిత్ షా సహా పలువురు శుభాకాంక్షలు తెలుపుతూ ‘ఎక్స్’లో పోస్ట్లు చేశారు. ‘ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన రాధాకృష్ణన్కు అభినందనలు. ప్రజాజీవితంలో దశబ్దాల గొప్ప అనుభవం, దేశ పురోగతికి గణనీయంగా దోహడపతుంది. విజయవంతమైన, ప్రభావవంతమైన పదవీకాలం కోసం మీకు ఇవే నా శుభాకాంక్షలు’అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తన సందేశాన్ని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘రాధాకృష్ణన్కు ఎంపీగా, వివిధ రాష్ట్రాల గవర్నర్గా గొప్ప అనుభవం ఉంది. ఆయన పార్లమెంటరీ జోక్యాలు ఎల్లప్పుడూ చురుకైనవి. గవర్నర్గా పదవీకాలంలో, సాధారణ పౌరులు ఎదుర్కొన్న సవాళ్లను పరిష్కరించడంపై దృష్టి పెట్టారు. ఈ అనుభవాలు ఆయనకు శాసన, రాజ్యాంగ విషయాలపై అపార జ్ఞానం ఉందని నిర్ధారించాయి. ఆయన స్ఫూర్తిదాయకమైన ఉపరాష్ట్రపతి అవుతారని నాకు నమ్మకం ఉంది‘ప్రధాని మోదీ పేర్కొన్నారు. రాధాకృష్ణన్ నాయకత్వ లక్షణాలను, పరిపాలనపై ఆయనకున్న లోతైన జ్ఞానాన్ని అమిత్ షా ప్రశంసించారు. రాధాకృష్ణన్ అనుభవం, అట్టడుగు స్థాయి నేపథ్యం దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, అణగారిన వర్గాలకు సేవ చేయడానికి సహాయపడతాయని షా విశ్వాసం వ్యక్తం చేశారు. ఎగువ సభ సంరక్షకుడిగా ఆయన కొత్త పాత్రలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి పెదవివిప్పని జగ్దీప్ ధన్ఖడ్.. సీపీ రాధాకృష్ణన్ విజయం నేపథ్యంలో తొలిసారి స్పందించారు. ప్రజాజీవితంలో రాధాకృష్ణన్కు ఉన్న అపార అనుభవంతో ఉపరాష్ట్రపతి కార్యాలయం మరింత ఖ్యాతిని పొందుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు రాధాకృష్ణన్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకు లేఖ రాశారు. ఒత్తిళ్లకు లొంగరని ఆశిస్తున్నాం: ఖర్గే ‘ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్కు శుభాకాంక్షలు. ఇండియా కూటమి అభ్యర్థి బి.సుదర్శన్రెడ్డి పోరాటానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. రాధాకృష్ణన్ పార్లమెంటరీ సంప్రదాయాల అత్యున్నత నైతికతను నిలబెట్టుకుంటారని, ప్రతిపక్షాలకు గౌరవాన్ని ఇస్తారని, ఒత్తిళ్లకు లొంగరని ఆశిస్తున్నా. వర్షాకాల సమావేశాల్లో జగదీప్ ధన్ఖడ్ అకస్మాత్తుగా రాజీనామా చేశారు, ఇది ఎందుకు అనేది ఎప్పటికీ వివరించలేం. రాజ్యాంగ స్థానాలపట్ల గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉంది’అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. -
ఆ వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం: కేటీఆర్
గత పదేళ్లుగా బీజేపీకి బలంగా మద్దతు ఇచ్చిన రెండు పార్టీలు ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటింగ్కు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. ఇది రాబోయే రాజకీయ దిశకు సంకేతమా? అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ట్వీట్ చేశారు. దీనికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఘాటుగా స్పందించారు. జైరాం జీ, మీ అహంకార భావం.. అధికారం మీద అధిక హక్కు ఉన్నట్టు భావించడం వల్లే కాంగ్రెస్ పార్టీ సమకాలీన రాజకీయాల్లో విఫలమైంది. ‘మీతో లేకపోతే వారితో’ అనే వాదన దేశం రెండు ధృవాలుగా ఉందన్నట్టుగా చూపించే అర్థహీనమైన వాదన. మేము కాంగ్రెస్కో, బీజేపీ బీ-టీమ్ కూడా కాదు. మేము తెలంగాణ ప్రజల ఏ-టీమ్.దయచేసి మీ వైఫల్యాలపై దృష్టి పెట్టండి, మమ్మల్ని వదిలేయండి అని ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారాయన.ఉపరాష్ట్రపతి ఎన్నికలో బీఆర్ఎస్, ఒడిశా బీజేడీలు ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. ఈ వ్యవహారాన్నే ప్రస్తావిస్తూ జైరాం రమేష్.. ఓటింగ్కు దూరంగా ఉండే పార్టీలు బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లే అని అన్నారు. అందుకే కేటీఆర్ ఇలా స్పందించారు. Two parties who have stood with the BJP staunchly over the past decade in Parliament have decided to abstain in the Vice Presidential election tomorrow. The shape of things to come?— Jairam Ramesh (@Jairam_Ramesh) September 8, 2025Jairam Ji, This sense of entitlement and arrogance is what made Congress fail in contemporary politics ‘Either you are with us or else you’re with them’ claim is a silly argument posturing as if the nation is bipolarWe are neither B-team of Congress or BJPWe are the A-team… https://t.co/xrIvSE7AeZ— KTR (@KTRBRS) September 9, 2025 -
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో వైఎస్సార్సీపీ ఎంపీల భేటీ
ఢిల్లీ: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో వైఎస్సార్సీపీ ఎంపీలు భేటీ అయ్యారు. తన నివాసానికి వైఎస్సార్సీపీ ఎంపీలను పీయూష్ ఆహ్వానించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, లోక్సభ పక్ష నేత పీవీ మిథున్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, మేడా రఘునాథ్రెడ్డి.. కేంద్రమంత్రితో భేటీ అయ్యారు.కాగా, ఆరోగ్య కారణాలరీత్యా జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన ఈ పదవికి ఇవాళ (మంగళవారం) ఎన్నికలు జరుగుతున్నాయి. పార్లమెంటు భవనంలో పోలింగ్ ప్రక్రియ సాగుతోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పక్షాల అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్రెడ్డి మధ్య ముఖాముఖి పోటీ జరగనుంది. అభ్యర్థులిద్దరూ తమకు మద్దతు కోరుతూ ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు వీలుగా ఆయా పార్టీలు సోమవారం వేర్వేరుగా మాక్ పోలింగ్ను నిర్వహించాయి. ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ఓటింగ్ మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. పార్లమెంట్ హౌస్ వసుధలోని రూమ్ నంబర్ ఎఫ్–101లో పోలింగ్ జరుగుతోంది. 6 గంటలకు కౌంటింగ్ అనంతరం ఫలితం వెల్లడి కానుంది. ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉన్న రాజ్యసభ, లోక్సభ సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. రాజ్యసభకు ఎన్నికైన 233 మంది సభ్యులు (ప్రస్తుతం ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి), రాజ్యసభకు నామినేటెడ్ అయిన 12 మంది, లోక్సభ ఎంపీలు 543 మంది (ప్రస్తుతం ఒక స్థానం ఖాళీగా ఉంది) ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉన్నారు. -
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్ ఘన విజయం
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఘన విజయంఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఘన విజయం452 ఓట్లు సాధించిన సిపి రాధాకృష్ణ98.2 పోలింగ్ శాతం నమోదుచెల్లని ఓట్లు 15ఉపరాష్ట్రపతి ఎన్నిక.. ముగిసిన పోలింగ్ ఉపరాష్ట్రపతి ఎన్నిక.. ముగిసిన పోలింగ్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున మహారాష్ట్ర గవర్నర్ సీ.పీ. రాధాకృష్ణన్ప్రతిపక్ష ఇండియా కూటమి తరఫున మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి పోటీఇందుకోసం పార్లమెంట్ భవనంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ సాయంత్రం 6 గంటల తర్వాత ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు ఫలితాలు ఈ రాత్రి ప్రకటించబడే అవకాశం ఉంది.ఓటింగ్కు దూరంగా ఉన్న పార్టీలుబీఆర్ఎస్, బీజేడీ,శిరోమణి అకాలీ దళ్లు ఓటింగ్కు దూరం వీరి నిర్ణయం వల్ల తగ్గిన ఓటింగ్ కానీ ఎన్డీఏకు స్పష్టమైన ఆధిక్యం ఉందని అంచనాఓటేసిన లోక్సభ స్పీకర్ఉపరాష్ట్రపతి ఎన్నిక.. కొనసాగుతున్న పోలింగ్ఓటేసిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లాఇది బీజేపీకి ఎదురుదెబ్బే: సంజయ్ రౌత్ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్కు బీఆర్ఎస్, బీజేడీ, అకాలీదళ్ దూరంఈ మూడు బీజేపీతో గతంలో అంటకాగిన పార్టీలేనన్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్ఇప్పుడు దూరంగా ఉండడం ఆ పార్టీకి ఎదురుదెబ్బేనని వ్యాఖ్య96 శాతం పోలింగ్ నమోదుకొనసాగుతున్న ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్3గం. దాకా 96 శాతం పోలింగ్ నమోదు5 గం. దాకా జరగనున్న పోలింగ్6గం. కౌంటింగ్ మొదలు7.45గం. కి ఫలితం వెల్లడిఇండియా కూటమి వైపే ఒవైసీఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బీ సుదర్శన్రెడ్డిసుదర్శన్రెడ్డికి మద్దతు ప్రకటించిన ఎంఐఎంహైదరాబాద్వాసి, గౌరవనీయుడైన న్యాయకోవిదుడికి మద్దతంటూ ఒవైసీ ట్వీట్ఓటు హక్కు వినియోగించుకున్న ఒవైసీవిజయంపై ఎన్డీయే ధీమాఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్రాత్రికల్లా వెలువడనున్న ఫలితంసంఖ్యా బలం దృష్ట్యా.. విజయంపై ఎన్డీయే ధీమాముందస్తుగా.. విందు ఏర్పాట్లలో ముమ్మరంకేంద్ర మంత్రి ప్రహ్లాద్ ఇంట ఎన్టీయే కూటమి కీలక నేతలకు విందు ఏర్పాట్లుఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్సార్సీపీ ఎంపీలుఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసిన వైఎస్సార్సీపీ ఎంపీలుఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్కి మద్దతు ప్రకటించిన వైఎస్సార్సీపీపోలింగ్కు దూరంగా మరో పార్టీఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా శిరోమణి అకాలీదల్పార్లమెంట్లో ఎస్ఏడీ సంఖ్యా బలం.. మూడుఈ ఎన్నికలకు దూరంగా ఉంటామని ఇప్పటికే ప్రకటించిన బీజేడీ, బీఆర్ఎస్ఓటు హక్కు వినియోగించుకోనున్న 769 మంది ఎంపీలుకొనసాగుతున్న ఉపరాష్ట్రపతి పోలింగ్ఒక్కొక్కరుగా ఓటు వేస్తున్న ఎంపీలుసాయంత్రం 6గంటల తర్వాత వెలువడనున్న ఫలితాలుతొలి ఓటు వేసిన ప్రధాని మోదీఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభంతొలి ఓటు వేసిన ప్రధాని మోదీఅనంతరం.. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, జేపీ నడ్డా, మల్లికార్జున ఖర్గే తదితరులుఓటింగ్ వేళ ప్రత్యేక ఆకర్షణగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ఓటేశాక.. మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయిన రాహుల్ గాంధీసాయంత్రం ఐదు గంటల దాకా జరగనున్న పోలింగ్ఎంపీలకు గులాబీ రంగు బ్యాలెట్ పత్రాలు పంపిణీ నో విప్.. తమకు నచ్చిన అభ్యర్థికి ప్రాధాన్యం ప్రకారం ఓట్లేయనున్న ఎంపీలు నచ్చిన అభ్యర్థి పేరుకు ఎదురుగా గడిలో 1 అంకెతదుపరి ప్రాధాన్యం ఇచ్చే అభ్యర్థి పేరు ఎదుటనున్న గడిలో 2 అంకె ఎన్నికల సంఘం సమకూర్చే పెన్నుతోనే మార్కింగ్ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధంమరికాసేపట్లో పార్లమెంటు భవనంలోని ‘ఎఫ్-101 వసుధ’లో ప్రారంభం కానున్న పోలింగ్ 6 గంటలకు ఓట్ల లెక్కింపు రాత్రికి విజేతను ప్రకటించే అవకాశంఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్రెడ్డిల మధ్య పోరుమద్దతు ఇలా.. పార్లమెంటు ఉభయసభల సభ్యుల సంఖ్య 788 ఏడు స్థానాలు ఖాళీ కావడం వల్ల ప్రస్తుతం 781 మందే పోలింగుకు దూరంగా బీఆర్ఎస్ (4 రాజ్యసభ), బీజేడీ(7) లెక్క ప్రకారం.. 386 ఓట్లు దక్కించుకున్నవారు విజేతబలాబలాలు.. ఎన్డీయేకి 425 మంది సభ్యుల బలం.. ఇతరుల మద్దతు కలిపితే ఆ సంఖ్య 438కి మించే అవకాశం ఇండియా కూటమికి 314 మంది ఎంపీల మద్దతు ! ఏదైనా అద్భుతం జరిగితే తప్పా.. ఎన్డీయే అభ్యర్థి గెలుపు లాంఛనమే! బ్యాలెట్ ఓటింగ్రహస్య బ్యాలెట్ విధానంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రాధాన్య ఓట్లు వేసే పద్ధతి కావడం వల్ల బ్యాలెట్లనే వాడకం. ఈవీఎంలలో ఈ సదుపాయం లేదు.తమ ప్రాధాన్యం ప్రకారం ఆయా అభ్యర్థులకు ఓట్లేయనున్న ఎంపీలు అభ్యర్థులిద్దరికీ సమానంగా ఓట్లువస్తే అప్పుడు మాత్రమే రెండో ప్రాధాన్య ఓట్లను పరిగణనలో తీసుకుంటారు.నచ్చిన అభ్యర్థికే ఓటింగ్తమ సభ్యులకు విప్ జారీచేయకూడదని పార్టీలకు ఎన్నికలసంఘం స్పష్టీకరణ. ఎంపీలు తమకు నచ్చిన అభ్యర్థికి ఓటేసే అవకాశం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోటాపోటీగా ప్రచారం చేసిన ఎన్డీయే, ఇండియా కూటమి అభ్యర్థులు గత రెండ్రోజులుగా ఎంపీలందర్నీ ఢిల్లీకి రప్పించి ఓటింగుకు సమాయత్తం చేసిన ఇరు కూటములుఇప్పటికే ముగిసిన నమూనా(మాక్) పోలింగ్ గతంలో.. ఫస్ట్ టైం.. 2022 ఎన్నికల్లో ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక ఓట్లేసిన 725 మంది ఎంపీలు ఎన్డీయే అభ్యర్థి జగదీప్ ధన్ఖడ్కు 528 (74.37%), ప్రతిపక్ష కాంగ్రెస్ అభ్యర్థి మార్గరెట్ ఆళ్వాకు 182 (25.63%) దక్కిన ఓట్లు 15 ఓట్లు చెల్లలేదు. 55 మంది ఓటింగుకు గైర్హాజరు 2025 ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ.. తగ్గిన ఎన్డీయే సంఖ్యాబలం -
ఓ ప్రత్యేక ప్రక్రియ
సాక్షి, న్యూఢిల్లీ: కేవలం పార్లమెంటు సభ్యులు మాత్రమే పాల్గొనే ఉప రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ అత్యంత ప్రత్యేకమైనది. ’నైష్పత్తిక ప్రాతినిధ్య విధానం’లో ’ఏక బదిలీ ఓటు’ పద్ధతి ద్వారా ఉప రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. అంటే ప్రతి ఎంపీ బ్యాలెట్ పత్రంపై ఉన్న అభ్యర్థులకు తమ ప్రాధాన్యత క్రమాన్ని కేటాయించాల్సి ఉంటుంది. బ్యాలెట్ పత్రాలపై ఇద్దరు అభ్యర్థుల పేర్లు ఉంటాయి. ఎంపీలు తమకు ఇష్టమైన అభ్యర్థి పేరు పక్కన ’1’ అని రాయడం ద్వారా తమ మొదటి ప్రాధాన్యతను సూచించాలి. ఈ అంకెను భారతీయ సంఖ్యలలో, రోమన్ సంఖ్యలలో లేదా ఏదైనా భారతీయ భాషలోని సంఖ్యలలో రాయవచ్చు, కానీ అక్షర రూపంలో రాయకూడదు. సంక్లిష్టమైన లెక్కింపులు ఉండవు ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్రపతి ఎన్నికల్లా ఓటు విలువలో సంక్లిష్టమైన లెక్కింపులు ఉండవు. ఈ ఎన్నికల్లో పాల్గొనే ప్రతి ఎంపీ ఓటు విలువ ’ఒకటి’ (1) గానే పరిగణిస్తారు. గెలవడానికి అభ్యర్థి మొత్తం చెల్లుబాటైన ఓట్లలో 50% కంటే ఎక్కువగా (కోటా) మొదటి ప్రాధాన్యత ఓట్లను సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ మొదటి రౌండ్లో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోతే, తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని పోటీ నుంచి తొలగించి, వారి రెండవ ప్రాధాన్యత ఓట్లను మిగతా అభ్యర్థులకు బదిలీ చేస్తారు. పోటీ ఉంటేనే పోలింగ్ భారత రాజ్యాంగం ప్రకారం, ఉప రాష్ట్రపతి పదవీకాలం ఐదేళ్లు. ప్రస్తుత ఉప రాష్ట్రపతి పదవీకాలం ముగిసేలోపు కొత్తవారిని ఎన్నుకోవడం రాజ్యాంగ బద్ధమైన విధి. ఒకవేళ అధికార, విపక్ష కూటముల మధ్య ఏకాభిప్రాయం కుదిరి, ఒక్కరే అభ్యర్థి బరిలో ఉంటే ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. కానీ ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పుడు విజేతను నిర్ణయించడానికి పోలింగ్ తప్పనిసరి. రహస్య పద్ధతిలో ఎందుకు? ఉప రాష్ట్రపతి ఎన్నికను రహస్య బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించడానికి బలమైన రాజ్యాంగ పరమైన కారణాలు ఉన్నాయి. ఎంపీలు ఎలాంటి ఒత్తిడికి, ప్రలోభాలకు, పార్టీ విప్లకు లొంగకుండా తమ అంతరాత్మ ప్రబోధం మేరకు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు ఇది వీలు కలి్పస్తుంది. రాజకీయాలకు అతీతంగా సభ్యులు తమ ప్రతినిధిని ఎన్నుకోవాలన్నదే రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశం. ఓటు వేసిన తర్వాత బ్యాలెట్ పత్రాన్ని పార్టీ ఏజెంట్లతో సహా ఎవరికీ చూపించడానికి వీల్లేదు. -
గుర్తింపు కార్డుగా ఆధార్
న్యూఢిల్లీ: బిహార్లో ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్) అంశంలో ఆధార్ గుర్తింపు కోసం పోరాడుతున్న విపక్ష పార్టీలకు అనుకూలంగా సర్వోన్నత న్యాయస్థానంలో ఉత్తర్వులొచ్చాయి. ఎస్ఐఆర్ ప్రక్రియలో గుర్తింపు కార్డ్గా ఆధార్నూ పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగీ్చల సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం సూచించింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ధృవీకరణ పత్రాల జాబితాలో 12వ గుర్తింపు డాక్యుమెంట్గా ఆధార్ను పరిగణించాలని ఈసీని న్యాయస్థానం ఆదేశించింది. ‘‘బిహార్ కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటర్ గుర్తింపు విషయంలో ఆధార్నూ అనుమతించండి. అయితే ఆ ఆధార్ అనేది పౌరసత్వ గుర్తింపునకు రుజువుగా భావించాలని మేం చెప్పట్లేదు. ఎస్ఐఆర్లో ఇకపై ఆధార్ను సైతం అంగీకరిస్తున్నట్లు స్పష్టంగా పేర్కొంటూ రాష్ట్ర ఎన్నికల అధికారులకు మీరు అవసరమైన ఆదేశాలను జారీచేయండి. మా ఆదేశాలను సెపె్టంబర్ 9వ తేదీలోపు అమలుచేయండి’’అని ధర్మాసనం ఈసీని ఆదేశించింది. ‘‘అక్రమ వలసదారుల పేర్లు ఓటర్ల జాబితాలో కలపాలని ఎవరూ కోరుకోరు. కేవలం నిజమైన భారతీయ పౌరులను మాత్రమే ఓటు వేసేందుకు అనుమతించాలి. తప్పుడు డాక్యుమెంట్లను సమర్పించిన వారిని గుర్తించి ఓటర్ల జాబితా నుంచి తొలగించాలి’’అని కోర్టు వ్యాఖ్యానించింది. ఓటర్ల ఆధార్ కార్డ్ను ఎందుకు ఆమోదించట్లేదో సంజాయిషీ ఇవ్వాలని గతంలో ఆదేశించిన నేపథ్యంలో ఈసీ ఇచ్చిన వివరణను కోర్టు సోమవారం ఆలకించింది. ఈ సందర్భంగా ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది వాదించారు. ‘‘ముసాయిదా జాబితాలోని 7.24 కోట్ల మంది ఓటర్లలో 99.6 శాతం మంది తమ పేర్లు తుది ఓటర్ల జాబితాలో చేర్చాలంటూ సంబంధిత డాక్యుమెంట్లను ఇప్పటికే సమర్పించారు. ఇక 12వ ధృవీకరణ పత్రంగా ఆధార్ను అనుమతించాలంటూ పలువురు పిటిషన్లు ఇచ్చారు. అయితే ఇందులో ఆధార్ను ఒక రుజువుగా అంగీకరిస్తామని ఈసీ గతంలోనే పేర్కొంది. అయినాసరే ఆధార్ను కచ్చితంగా 12వ ధ్రువీకరణ పత్రంగా చేర్చాలని కోరడంలో అర్థంలేదు’’అని ఆయన వాదించారు. దీంతో ధర్మాసనం జోక్యంచేసుకుంది. ‘‘ప్రజాప్రతినిధుల చట్టం–1950లోని 23(4) సెక్షన్, ఆధార్ చట్టం–2016లోని నియమ,నిబంధనల ప్రకారమే ఓటరు గుర్తింపు కోసం ఆధార్ను పరిగణించవచ్చని నిర్ధారించాం. అయితే ఆధార్ అనేది పౌరసత్వాన్ని రుజువుచేయబోదు’’అని ధర్మాసనం స్పష్టంచేసింది.ఎస్ఐఆర్పై తగ్గుతున్న నమ్మకం! ‘‘ఎస్ఐఆర్ క్రతువుపై పిటిషన్దారులు, విపక్షాల్లో నమ్మకం తగ్గుతున్నట్లుగా తోస్తోంది. ఈ నమ్మకాన్ని నిలబెట్టేందుకు రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థ రంగంలోకి దిగాలి. రాజకీయ పార్టీలు, ఓటర్లకు పారాలీగల్ వలంటీర్లు సాయపడాలి. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, మార్పులు చేర్పులపై చేసే దరఖాస్తుల విషయంలో వలంటీర్లు సాయం అందించాలి’’అని కోర్టు ఆదేశించింది. తుది ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 30వ తేదీన ముద్రించనున్నారు. ఈసీ సిగ్గుపడాలి: కాంగ్రెస్ సుప్రీంకోర్టు ఎన్నిసార్లు ఆదేశించినా ఆధార్ను ధృవీకరణ జాబితాలో చేర్చకుండా నిర్లక్ష్యవైఖరిని అవలంభిస్తున్న ఈసీ సిగ్గుపడాలని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి(కమ్యూనికేషన్స్) జైరాం రమేశ్ సోమవారం తన సామాజికమాధ్యమ ‘ఎక్స్’ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘ఓటర్ల నమోదుకోసం ఆధార్నూ గుర్తింపు పత్రంగా పరిగణించాలని కోర్టు ఇప్పటికి మూడుసార్లు ఆదేశించింది. అయినా కోర్టు ఆదేశాలను ఈసీ పెడచెవినపెట్టింది. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ఈసీ ఈ విషయంలో సిగ్గుపడాలి. విపక్ష రాజకీయ పార్టీలు నియమించిన బూత్ లెవల్ ఏజెంట్లనూ ఈసీ గుర్తించట్లేదు. ఇవన్నీ ఈసీ సారథి సొంత నిర్ణయాల్లా కనిపిస్తున్నాయి. ఇలాంటి ప్రజాస్వామ్య వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్కుమార్ను, కేంద్ర ఎన్నికల సంఘాన్ని చరిత్ర క్షమించదు’’అని ఆయన అన్నారు. -
నేడే ఉప రాష్ట్రపతి ఎన్నిక
సాక్షి, న్యూఢిల్లీ: దేశ తదుపరి ఉప రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు అన్ని ఏర్పాట్లూ చేసింది. ఆరోగ్య కారణాలరీత్యా జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన ఈ పదవికి మంగళవారం ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంటు భవనంలో పోలింగ్ ప్రక్రియ సాగనుండగా.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పక్షాల అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్రెడ్డి మధ్య ముఖాముఖి పోటీ జరగనుంది. అభ్యర్థులిద్దరూ తమకు మద్దతు కోరుతూ ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు వీలుగా ఆయా పార్టీలు సోమవారం వేర్వేరుగా మాక్ పోలింగ్ను నిర్వహించాయి. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ఓటింగ్ మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. పార్లమెంట్ హౌస్ వసుధలోని రూమ్ నంబర్ ఎఫ్–101లో పోలింగ్ జరగనుంది. 6 గంటలకు కౌంటింగ్ అనంతరం ఫలితం వెల్లడి కానుంది. ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉన్న రాజ్యసభ, లోక్సభ సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. రాజ్యసభకు ఎన్నికైన 233 మంది సభ్యులు (ప్రస్తుతం ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి), రాజ్యసభకు నామినేటెడ్ అయిన 12 మంది, లోక్సభ ఎంపీలు 543 మంది (ప్రస్తుతం ఒక స్థానం ఖాళీగా ఉంది) ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉన్నారు. ఎన్డీఏకు సొంతంగా 422 మంది సభ్యుల బలం ఎలక్టోరల్ కాలేజీలోని బలాబలాల పరంగా చూస్తే ఎన్డీఏకు స్పష్టమైన మెజార్టీ ఉంది. ఎలక్టోరల్ కాలేజీలో ఖాళీలను కూడా పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 781 మంది సభ్యులున్నారు. ప్రస్తుతం 542 మంది సభ్యులున్న లోక్సభలో ఎన్డీఏ కూటమికి 293 మంది సభ్యుల బలం ఉంది. ఇక 239 మంది సభ్యులున్న రాజ్యసభలో పాలక కూటమికి 129 మంది సభ్యుల మద్దతు ఉంది. విజయానికి అవసరమైన ఓట్లు 391 కాగా, ఎన్డీఏకు సొంతంగానే 422 మంది సభ్యుల బలం ఉంది. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం తమ 11 మంది సభ్యుల మద్దతు ఎన్డీఏ అభ్యర్థికి ప్రకటించడంతో ఆ సంఖ్య 433కి చేరనుంది. ఇక విపక్ష ఇండియా కూటమికి రెండుసభల్లో కలిపి 311 ఓట్లు ఉండగా, ఈ కూటమికి ఆప్ మద్దతు ప్రకటించింది. దీంతో కూటమి బలం 320 మాత్రమే దాటుతోంది. అయితే రహస్య బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఈ ఎన్నికలో ఎంపీలు తమ పార్టీల విప్ను పాటించాల్సిన అవసరం లేదు. అన్ని పార్టీల మాక్ పోలింగ్.. పార్టీల బలాబలాలపై ఇరు పక్షాలకు స్పష్టత ఉన్నప్పటికీ ఓట్లు చెల్లుబాటు కాకుండా పోవడంపై ఆందోళన, క్రాస్ ఓటింగ్ భయం రెండు కూటముల్లోనూ కనిపిస్తోంది. 2022 ఎన్నికల్లో 15 ఓట్లు చెల్లకుండా పోవడంతో ఈసారి పార్టీలు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ఇందులో భాగంగా బీజేపీ తమ ఎంపీల కోసం ఆది, సోమవారాల్లో ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించగా, కాంగ్రెస్ పార్టీ పాత పార్లమెంట్ భవనం సెంట్రల్హాల్లో మాక్ పోలింగ్ ద్వారా తమ ఎంపీలకు ఓటింగ్ విధానంపై అవగాహన కల్పించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విపక్ష ఎంపీలకు విందు ఇచ్చారు. సంవిధాన్ సదన్లో జరిగిన సమావేశంలో ఖర్గేతో పాటు సోనియాగాం«దీ, శరద్పవార్, టీఆర్ బాలు, అఖిలేశ్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ సైతం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి నివాసంలో ఎంపీలతో మాక్ పోలింగ్ నిర్వహించింది. ఎన్డీఏ ఎంపీలతో మోదీ సమావేశం మంగళవారం ప్రధాని మోదీ ఎన్డీయే ఎంపీలనుద్దేశించి మాట్లాడారు. అనంతరం..‘రాధాకృష్ణన్ అద్భుతమైన ఉప రాష్ట్రపతి అవుతారని ప్రజలు విశ్వసిస్తున్నారు..’అంటూ ‘ఎక్స్’లో ఒక పోస్టు చేశారు. కోయంబత్తూరు నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన రాధాకృష్ణన్ను ఎన్డీఏ మచ్చలేని నేతగా అభివరి్ణస్తోంది. రాజకీయ, పాలనాపరమైన ఆయన విశేష అనుభవం..రాజ్యసభ చైర్మన్గా విధులు నిర్వర్తించేందుకు ఉపకరిస్తుందని పేర్కొంటోంది. ఇక విపక్షాల అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్రెడ్డి 2011లో సుప్రీంకోర్టులో పదవీ విరమణ పొందారు. నల్లధనం, సల్వాజుడుం తదితర కేసుల్లో కీలక తీర్పులు వెలువరించారు.బీఆర్ఎస్, బీజేడీ దూరంరెండు కూటములకు సమాన దూరాన్ని పాటిస్తూ వస్తున్న బీఆర్ఎస్, బీజేడీలు ప్రస్తుత ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. ఈ ఎన్నికల్లో తటస్థంగా ఉంటామని ఇప్పటికే ప్రకటించాయి. ప్రస్తుతం రాజ్యసభలో బీఆర్ఎస్కు నలుగురు, బీజేడీకి ఏడుగురు సభ్యుల బలం ఉంది.