breaking news
Delhi
-
ముందు మీ ఇల్లు చక్కదిద్దుకోండి!
సాక్షి, న్యూఢిల్లీ: అహ్మదాబాద్ వేదికగా 2036 ఒలింపిక్స్ను నిర్వహించాలనుకున్న భారత్ ఆశలపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నీళ్లుచల్లింది. ఈ విషయంలో భారత్కు ‘కనువిప్పు’ కలిగే రీతిలో సుతిమెత్తగా మందలించింది. ముందు మీ ‘ఇంటి’ని చక్కదిద్దుకోవాలంటూ చురకలంటించింది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)లో సంస్థాగత పాలనా వైఫల్యాలు, లోపాలు, అవినీతి తాండవిస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో వాటిని సరిదిద్దుకోవాలంటూ హితవు పలికింది. అలాగే ఒలింపిక్స్లో భారత ఆటగాళ్ల పేలవ ప్రదర్శనలు, డోపింగ్లో వారు పట్టుబడుతున్న వ్యవహారాలపైనా దృష్టిసారించాలని సూచించింది. స్విట్జర్లాండ్లోని లుసానేలో ఇటీవల నిర్వహించిన సమావేశానికి హాజరైన గుజరాత్ హోం, క్రీడల మంత్రి హర్‡్ష సంఘ్వీ, ఒకప్పటి భారత పరుగుల రాణి, ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందానికి ఐఓసీ తేలి్చచెప్పింది. ఐఓసీతో చర్చల్లో పాల్గొన్న ఓ ఉన్నతాధికారిని ఉటంకిస్తూ ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికతోపాటు పలు ఆంగ్ల వార్తా వెబ్సైట్లు ఈ మేరకు కథనాలు ప్రచురించాయి. అయితే భవిష్యత్తులో విశ్వక్రీడల నిర్వహణ కోసం భారత్ తన ప్రయత్నాలను కొనసాగించొచ్చని ఐఓసీ సూచించింది. 2024లో జరిగిన పారిస్ ఒలింపిక్స్లో భారత్ రూ. 470 కోట్ల ఖర్చుచేసి 117 మంది క్రీడాకారులను పంపినప్పటికీ మనకు కేవలం 6 పతకాలే లభించాయి. దీనికితోడు స్పాన్సర్షిప్ ఒప్పందాలు, ఆర్థిక అవకతవకల ఆరోపణల నేపథ్యంలో ఐఓఏకు అందించే గ్రాంట్లను ఐఓసీ గతేడాది అక్టోబర్ నుంచి నిలిపేసింది. మరోవైపు ఐఓఏ సీఈవోగా రఘురాం అయ్యర్ నియామకంపై అంతర్గతంగా కుమ్ములాటలు నెలకొన్నాయి. కాగా, ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ 2023 నాటి గణాంకాల ప్రకారం డోపింగ్ కేసుల్లో అత్యధికం భారత్వే. అర్హతలు ఉన్నా ఇవేం వ్యాఖ్యలు.. భారత్లో ఒలింపిక్స్ నిర్వహించేందుకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఐవోసీ కావాలనే ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తోందని భారత ప్రతినిధి బృందం వ్యాఖ్యానిస్తోంది. భారత్లో వందలాది మంది క్రీడాకారులు ఒలింపిక్స్ కోసం ఎదురుచూస్తున్నారని.. వారంతా ప్రతిభావంతులేనని స్పష్టం చేస్తోంది. అంతర్జాతీయ క్రీడలకు ప్రాతినిధ్యం వహించే క్రమంలో మరింత పకడ్బందీ ఏర్పాట్లు చేసేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయాన్ని కూడా అంతర్జాతీయ కమిటీ దృష్టికి ఐవోఏ తీసికెళ్లినట్లు తెలిసింది. మరోసారి జరిగే సమావేశంలో ఈ అంశంపై తాము చర్చిస్తామని భారత కమిటీ పేర్కొంది. -
బీఐఎస్ గుర్తింపు లేని హెల్మెట్లు వాడొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరుగుతుండటంతో వాహనదారుల భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ద్విచక్ర వాహనదారుల భద్రత కోసం బీఐఎస్ గుర్తింపు గల ఐఎస్ఐ మార్క్ హెల్మెట్లు మాత్రమే వాడాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ స్పష్టంచేసింది. నాణ్యతలేని హెల్మెట్లు ప్రమాదాల సమయంలోరక్షణ కలి్పంచలేకపోవటంతో ప్రాణనష్టం పెరుగుతోందని తెలిపింది. దేశంలో ద్విచక్ర వాహనాల సంఖ్య ఇప్పటికే 21 కోట్లకు పైగా ఉంది. ఈ వాహనదారుల భద్రతకు నాణ్యమైన హెల్మెట్లు కీలకం. అందుకే 2021 నుంచే బీఐఎస్ ప్రమాణం ఐఎస్ 4151:2015 కింద ఐఎస్ఐ మార్క్ హెల్మెట్లు వాడటం తప్పనిసరి చేసింది. అయితే, రహదారుల పక్కన, స్థానిక మార్కెట్లలో నాణ్యత ప్రమాణాలు లేని హెల్మెట్లు అధికంగా విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 176 మందికే లైసెన్సులు హెల్మెట్ల నాణ్యత విషయంలో వినియోగదారుల వ్యవహారాల శాఖ కఠినంగా వ్వహరిస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో బీఐఎస్ 30కి పైగా సెర్చ్ అండ్ సీజ్ దాడులు నిర్వహించింది. ఒక్క ఢిల్లీ నగరంలోనే లైసెన్స్ లేకుండా నాణ్యత లేని హెల్మెట్లు తయారు చేస్తున్న 9 మంది తయారీదారుల నుంచి 2,500లకు పైగా హెల్మెట్లు స్వా«దీనం చేసుకుంది. 17 రిటైల్, రోడ్సైడ్ దుకాణాల్లో సుమారు 500 నాణ్యత లేని హెల్మెట్లు సీజ్ చేశారు. ప్రస్తుతం దేశంలో 176 మంది తయారీదారులకు మాత్రమే బీఐఎస్ నుంచి హెల్మెట్ల తయారీకి లైసెన్స్ ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా జిల్లాధికారులు, కలెక్టర్లు హెల్మెట్ల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టి, నిబంధనలు అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది. ఇప్పటికే చెన్నైలో ‘మానక్ మిత్ర’వలంటీర్ల ద్వారా ‘క్వాలిటీ కనెక్ట్’క్యాంపెయిన్ నిర్వహించి వినియోగదారులకు బీఐఎస్ గుర్తింపుపై ప్రచారం ప్రారంభించారు. ఈ ప్రచారాన్ని దేశవ్యాప్తం చేయాలని కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. -
భారత్ అభ్యర్థన.. నీరవ్ మోదీ కేసులో కీలక పరిణామం!
భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలను ఎగవేసి.. మోసం చేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ కేసుకు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నీరవ్ మోదీ సోదరుడు నేహల్ మోదీని అమెరికాలో అరెస్టు చేశారు. అతడిని అప్పగించాలన్న భారత దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలు అభ్యర్థించాయి. భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా అమెరికా అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం..నేహల్పై ఉన్న ప్రధాన ఆరోపణలు:పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కుంభకోణం కేసులో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయిమనీ లాండరింగ్ మరియు నేరపూరిత కుట్ర కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారునీరవ్ మోదీకి సంబంధించిన అక్రమ ఆస్తులను దాచడంలో, సాక్ష్యాలను నాశనం చేయడంలో నేహల్ పాత్ర ఉన్నట్లు భారత దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయిఇంకా, నేహల్ మోదీపై అమెరికాలోని ప్రముఖ డైమండ్ కంపెనీ LLD డైమండ్స్ను దాదాపు రూ.19 కోట్ల మేర మోసం చేసిన కేసు కూడా నమోదైంది. తప్పుడు ఒప్పందాల ద్వారా డైమండ్లను తీసుకుని, వాటిని స్వప్రయోజనాల కోసం అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.గుజరాత్కు చెందిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ(54) పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. దాదాపు ₹14,000 కోట్ల మోసానికి పాల్పడి 2018లో దేశం విడిచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన లండన్(యూకే)లో ఉన్నట్లు సమాచారం. దీంతో ఆయన అప్పగింత కోసం భారత్ అభ్యర్థించగా.. ఆ కేసు అక్కడి కోర్టులో విచారణ జరుగుతోంది. నేహల్ అరెస్టుతో నీరవ్ మోదీ కేసులో పురోగతి సాధించినట్లేనని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. -
ప్రభుత్వం, పోలీసులు ఏం చేస్తున్నారు?
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో ఎస్టీలపై జరుగుతున్న దాడులపట్ల జాతీయ ఎస్టీ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వరుస దాడులు జరుగుతుంటే పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం ఏం చేస్తున్నాయంటూ ప్రశ్నించింది. ప్రభుత్య వ్యవహారశైలి, పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఇటీవల తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి మండలం, ఎంపేడులో ఎస్టీల మీద జరిగిన దాడులపై వైఎస్సార్సీపీ అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి ఢిల్లీలోని జాతీయ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. అమాయకులపై దాడులు జరిగినా ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోవడంలేదని వారి దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను ఆమె కమిషన్కు అందచేశారు. దీనిపై కమిషన్ స్పందిస్తూ సంబంధిత కలెక్టర్, ఎస్పీలకు సమన్లు జారీచేసింది. తాము ఈనెల 8న విచారణ నిర్వహించనున్నామని, ఆ విచారణకు హాజరుకావాలని, లేనిపక్షంలో చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించింది. -
నేవీలో మొట్టమొదటి మహిళా ఫైటర్ ఫైలట్గా పునియా
న్యూఢిల్లీ: నావికా దళంలోని యుద్ధ విమానం మొట్టమొదటి మహిళా పైలట్గా సబ్ లెఫ్టినెంట్ ఆస్థా పునియా రికార్డు సృష్టించనున్నారు. నేవీలో మహిళా యుద్ధ విమాన పైలట్ల నూతన శకానికి ఆమె నాంది పలకనున్నారని అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ నెల 3న విశాఖపట్టణ తీరంలోని ఐఎన్ఎస్ డేగాపై సెకండ్ బేసిక్ హాక్ కన్వెర్షన్ కోర్సు స్నాతకోత్సవం జరిగింది. ఈ సందర్భంగా లెఫ్టినెంట్ అతుల్ ధుల్, సబ్ లెఫ్టినెంట్ పునియాకు ప్రతిష్టాత్మక ‘వింగ్స్ ఆఫ్ గోల్డ్’ అందుకున్నారు. దీంతో, నావికాదళ యుద్ధ విమానాలలోకి ప్రవేశించిన మొదటి మహిళగా సబ్ లెఫ్టినెంట్ ఆస్తా పూనియా నిలిచారు. త్వరలోనే ఆమె ఫైటర్ పైలట్గా శిక్షణను అందుకోనున్నారు. నేవీలో ఇప్పటికే మహిళా పైలట్లు, ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్స్గా పనిచేస్తున్నారు. -
దక్షిణాది మహిళకే బీజేపీ పగ్గాలు?
సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించాలనే సంకల్పానికి నిదర్శనంగా బీజేపీ చారిత్రక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. పార్టీ చరిత్రలో తొలిసారి అధ్యక్ష బాధ్యతలు ఒక మహిళకు అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్ష పగ్గాలు ఈసారి దక్షిణాదికి చెందిన మహిళా నేతకే దక్కుతాయని ఢిల్లీలో ఉహాగానాలు ఊపందుకున్నాయి. ఈ రేసులో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు ప్రముఖ మహిళా నేతలు ఉన్నారనే చర్చ జరుగుతోంది.వారిలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరోవైపు.. మహిళకు పార్టీ పగ్గాలు కట్టబెట్టేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కూడా ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం. ఏడాదిన్నర కాలంగా జాతీయ అధ్యక్షుడి ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠకు కొద్దిరోజుల్లో తెరదించేలా బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ముందంజలో నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) బీఎల్ సంతోష్ లను కలిశారు. కమలం పార్టీ అధ్యక్ష పీఠం కోసం జరుగుతున్న రేసులో ఆమె ముందువరుసలో ఉన్నారనే చర్చ మొదలైంది. సీనియర్ నేతగా, గతంలో రక్షణ మంత్రిగా పనిచేసిన అనుభం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆమెకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే దక్షిణాదిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి, క్షేత్రస్థాయిలో పార్టీని విస్తరించేందుకు వీలవుతుందని అధిష్టానం భావిస్తున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. రేసులో పురందేశ్వరి, వనతి శ్రీనివాసన్ నిర్మలా సీతారామన్ తర్వాత.. కేంద్ర మాజీ మంత్రి, ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేరు వినిపిస్తోంది. ఆమెకు పలు భాషల్లో ప్రావీణ్యం ఉంది. రాజకీయాల్లో ఎంతో అనుభవజ్ఞురాలు. అలాగే బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ పేరు కూడా ప్రచారంలో ఉంది. తమిళనాడుకు చెందిన ఆమె వృత్తిరీత్యా న్యాయవాది. ప్రస్తుతం కోయంబత్తూర్ సౌత్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో నటుడు, మక్కల్ నీది మయ్యం వ్యవస్థాపకుడు కమల్ హాసన్పై విజయం సాధించారు. 1993లో బీజేపీలో చేరిన నాటినుంచి ఎన్నో కీలక పదువులు చేపట్టారు.2020లో మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా, 2022లో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఈ స్థానానికి చేరుకున్న మొదటి తమిళనాటు మహిళా నేత వనతి. కాగా.. ఢిల్లీలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచారక్ల సమావేశాలు నిర్వహిస్తోంది. ఆర్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలె, బీజేపీ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) బీఎల్ సంతోష్ లు పాల్గొంటున్నారు. ఈ సమావేశాల్లో బీజేపీ కొత్త అధ్యక్ష ఎంపికపై తుది నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం. -
బీజేపీపై ఆర్ఎస్ఎస్ పట్టు బిగిస్తోందా?
దశాబ్దకాలంగా బీజేపీలో అప్రతిహత నిర్ణయాలు తీసుకున్న మోదీ - షా ద్వయం ఈ సారి మాత్రం ఆర్ఎస్ఎస్ ఆమోదంతోనే నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉత్పన్నమైంది. 2024 ఎన్నికల్లో బిజెపి సొంతంగా మెజారిటీ సాధించకపోవడంతో కమలదళంపై ఆర్ఎస్ఎస్ తిరిగి పట్టు బిగించడం ప్రారంభించింది. వచ్చే ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ సహకారం లేకపోతే పరిస్థితి భిన్నంగా ఉంటుందనే విషయాన్ని గమనించిన మోదీ-షా ద్వయం ఆర్ఎస్ఎస్తో సంప్రదింపులు, ఆమోదం తర్వాతే పార్టీ నియామాకాలకు ముందుకువెళుతున్నారు. అయితే బిజెపి జాతీయ అధ్యక్షుడి ఎంపికపై ఏకాభిప్రాయం రాకపోవడంతో దాదాపు ఏడాదిగా ఈ నియామకం పెండింగ్లో పడింది. అయితే ఎట్టకేలకు గత రెండువారాల నుంచి ఆర్ ఎస్ ఎస్ ఆమోదంతో రాష్ట్రాల అధ్యక్షుల నియామాకాలు జరిగాయి. దాదాపు తొమ్మిది రాష్ట్రాలకు నూతనంగా బిజెపి అధ్యక్షుల నియామకం. ఈ నియామాకాలన్నింటిలో స్పష్టంగా ఆర్ఎస్ఎస్ ముద్ర కనిపించింది. ప్రత్యేకించి రెండు తెలుగురాష్ట్రాలలో బిజెపి అధ్యక్షుల నియామకంలో ఆర్ఎస్ఎస్ తిరుగులేని తన ఆధిపత్యాన్ని నిరూపించింది. ఆర్ఎస్ఎస్, ఏబీవీపీలో సుదీర్ఘకాలం పనిచేసి ఆ తర్వాత బిజెపిలోకి ప్రవేశించిన మాజీ ఎమ్మెల్సీలు రాంచందర్రావు, పివిఎన్.మాధవ్కు పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ అధ్యక్ష పదవికోసం హేమాహేమీలు పోటీపడినా, రేసులో లేని రాంచందర్రావుకే నాయకత్వ పగ్గాలు అప్పగించారు. పార్టీలో విపరీతమైన గ్రూపు తగాదాల నేపథ్యంలో ఎవరికి పదవి అప్పగించినా, మరొకరు వారిని దెబ్బకొట్టే పరిస్థితి నెలకొనడంతో అందరినీ సమన్వయం చేసేందుకు సంస్థాగత నాయకుడిని సెలెక్ట్ చేసుకుంది.ఏ గ్రూపులలో లేకపోవడం, వివాదాలకు దూరంగా ఉండడం, సంఘ్ పరివార్ ఆశీస్సులు ఉండడం రాంచందర్రావుకు కలిసొచ్చింది. అలాగే పార్టీ వ్యవహారాలు తమ చేతిలోనే ఉండాలనే ఉద్దేశంతో సీనియర్లు కూడా రాంచందర్రావుకు మద్దతు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ సంఖ్యలో ఉన్న బీసీ, రాజకీయంగా, ఆర్థికంగా బలమైన రెడ్డి సామాజిక వర్గాల నుంచి ఎంపీలు అధ్యక్షపదవిని ఆశించినా, వారిని కాదని బ్రాహ్మణ వర్గాన్నే అధ్యక్ష పదవి వరించింది. ప్రతిపక్షంలో ఉండే ఏ పార్టీకైనా దూకుడుగా ఉండే నాయకుడు అవసరమనేది అభిప్రాయముంది. కానీ ఈసారి దూకుడు కంటే , గ్రూపిజం లేని వ్యక్తికే పగ్గాలు అప్పగించడం ద్వారా సిద్ధాంత నిబద్ధత, క్రమశిక్షణ, సమన్వయంతో పనిచేసేవారికే పెద్దపీట వేసింది. అన్ని గ్రూపుల మధ్య బ్యాలెన్స్ కోసమే ఈ నియామకం చేసినట్లుగా కనిపిస్తోంది.ఇటు ఆంధ్రప్రదేశ్లో సైతం మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్.మాధవ్కు బిజెపి సారథ్య బాధ్యతలు అప్పగించడంలో ఆర్ ఎస్ ఎస్ చక్రం తిప్పింది. మొన్నటిదాకా అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరి మరోసారి తనకు అధ్యక్ష పదవి పొడగించాలని కోరారు. అయితే అధ్యక్షురాలిగా పురంధేశ్వరి పార్టీ నిర్మాణం, పార్టీ కార్యక్రమాలు సరిగ్గా నిర్వహించలేదని అధిష్టానానికి నివేదికలందాయి. దాంతో ఆమెను కొనసాగించేందుకు అధిష్టానం అంగీకరించలేదు. ఆమె స్థానంలో ఆర్ఎస్ఎస్కు చెందిన మాధవ్ను నియమించడం ద్వారా సంస్థాగత నిర్మాణంపై వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఏపీలో అధ్యక్ష పదవికోసం పెద్దగా పోటీ లేనప్పటికీ వలస నేతలకు కాకుండా ఒరిజినల్ నేతలకే కీలక బాధ్యతలు ఇవ్వాలన్న ఆర్ఎస్ఎస్ అభిప్రాయం మేరకే మాధవ్ నియామకం జరిగింది. వలసనేతలకు ఎన్నికలలో టికెట్ ఇచ్చి రంగంలోకి దింపాలే తప్ప, పార్టీ కోర్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయడం వల్ల పెద్దగా లాభం లేదన్నది ఆర్ ఎస్ ఎస్ అభిప్రాయంగా ఉంది.గత పదేళ్ల నుంచి బిజెపిలో నియామకాలన్నీ దాదాపుగా నరేంద్రమోడీ, అమిత్షా ద్వయమే ఫైనల్ చేసేది. అన్ని నియామాకాల్లోనూ వారి మాటే నెగ్గేది. వరుసగా 2014, 2019 ఎన్నికల్లో బిజెపిని అధికారంలోకి తీసుకురావడంలో మోడీ-షా ద్వయం కీలకపాత్ర పోషించింది. దాంతో వారూ కోరుకున్నట్లుగానే ఆర్ ఎస్ ఎస్ సైతం బిజెపి నిర్ణయాల్లో జోక్యం చేసుకోకుండా వారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. అయితే ఒక్కసారిగా 2024లో పరిస్థితి మారిపోయింది. అబ్కీ బార్ చార్ సౌ పార్ ...ఈసారి 400 సీట్లు అనే గట్టి ప్రచారం చేసినా అది వర్కవుట్ కాలేదు. 2019లో వచ్చిన 304 సీట్ల నుంచి 2024కల్లా 240 సీట్లకు పడిపోవడంతో మోదీ-షా ద్వయం ప్రభ సన్నగిల్లడం మొదలైంది. మిత్రపక్షాల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, పార్టీలో మాత్రం మోడీ-షా నిర్ణయాలకు ఆర్ఎస్ఎస్ ఆమోదం తప్పనిసరిగా మారింది. దాని వల్లే బిజెపి అధ్యక్షుడు జెపి.నడ్డా పదవీకాలం ముగిసినా కొత్త అధ్యక్షుడి నియామకం ఎప్పటికప్పుడు వాయిదాపడుతూ వస్తోంది. జాతీయ అధ్యక్షుడి నియామకానికి దేశంలోని సగం రాష్ట్రాలలో బిజెపి అధ్యక్షుల నియామకం జరగాలనే నిబంధన ఉంది. దీనివల్లే నియామకం చేయడం లేదని బిజెపి అగ్రనేతలు బయటికి చెప్పుకున్నారు. కానీ అంతర్గతంగా మాత్రం కొత్త బిజెపి అధ్యక్షుడి నియామకంపై మోడీ-షా, ఆర్ఎస్ ఎస్ మధ్య ఏకాభిప్రాయం లేకపోవడమే ప్రధానకారణం. తమ ఆమోదం లేకుండా నియమిస్తే, రానున్న ఎన్నికల్లలో సహకారం ఉండదనిసంకేతాలిచ్చింది. ఇప్పటికే లోక్సబ ఎన్నికల్లో మెజారిటీ రాక, మిత్రపక్షాల బలంపై ఆధారపడిన మోడీ ప్రభుత్వం ఆర్ ఎస్ ఎస్ సహకారం కోల్పోతే పరిస్థితి మరింత జఠిలమవుతుంది. దాంతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ తొలిసారిగా నాగ్పూర్లోని ఆర్ ఎస్ ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి తన విధేయతను చాటారు. ఆ తర్వాత వరుసగా జరుగుతున్న అన్ని నియామాకాలు ఆర్ ఎస్ ఎస్ ఆమోదంతో కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర బిజెపి చీఫ్గా రవీంద్ర చవాన్, ఉత్తరాఖండ్ బిజెపి చీఫ్గా మహేంద్రభట్, హిమాచల్ప్రదేశ్ అధ్యక్షుడిగా రాజీవ్ బిందల్, మధ్యప్రదేశ్ అధ్యక్షుడిగా హేమంత్ ఖండేల్వాల్, పుదుచ్చేరికి రామలింగం, మిజోరాంకు కె.బెచువా, అండమాన్ నికోబార్కు అనిల్ తివారిని అధ్యక్షులుగా నియమించింది. వీరంతా ఆర్ఎస్ఎస్కు అత్యంత సన్నిహితులే. ఈ నియామకాల ద్వారా ఆర్ ఎస్ ఎస్ తిరిగి బిజెపి పై పట్టు బిగించినట్లయింది.సగం రాష్ట్రాలకు కొత్తగా అధ్యక్షులను నియమించిన నేపథ్యంలో బిజెపి రాజ్యాంగం ప్రకారం జాతీయ అధ్యక్షుడి నియామకానికి లైన్ క్లియరైంది. అయితే అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారనేదానిపై రకరకాల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కేంద్ర మంత్రులు శివరాజ్సింగ్ చౌహన్, ధర్మేంద్ర ప్రదాన్, మనోహర్లాల్ ఖట్టర్, భూపేంద్ర యాదవ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరంతా ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ నుంచే బిజెపిలోకి రాజకీయ ప్రవేశం చేసి వివిధ హోదాలలో కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో తొలిసారిగా అధ్యక్ష పదవి మహిళకు అప్పగించే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం కేంద్ర మంత్రులు నిర్మలాసీతారామన్, శోభా కరద్లాంజె, మహిళామోర్చా అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఆశ్చర్యకరమైన ఎంపికలు చేసే మోదీ-షా ద్వయం ఈసారి ఆర్ఎస్ఎస్తో సమన్వయంతో వెళ్లాల్సి ఉంది. ఈ విషయంలో ఏకాభిప్రాయం సాధించాల్సి ఉంది. దాదాపు ఏడాదికి పైగా జాతీయ అధ్యక్షుడి నియామకంపై అనిశ్చితి కొనసాగుతోంది. బిజెపి అగ్రనాయకత్వం- ఆర్ ఎస్ ఎస్ మధ్య ఏకాభిప్రాయం లేని కారణంగానే ఆలస్యమయ్యింది. అయితే ఢిల్లీలో జరుగుతున్న ఆర్ ఎస్ ఎస్ ప్రాంత ప్రచారక్ల సమావేశం తర్వాత దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈసారి సంఘ్ సంపూర్ణ ఆశీస్సులున్న వ్యక్తికే పార్టీ జాతీయ అధ్యక్ష పగ్గాలు అందబోతున్నాయి-వెంకటేష్ నాగిళ్ల, డిప్యూటీ ఇన్ పుట్ ఎడిటర్, సాక్షి టీవీ ఢిల్లీ -
శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదంలో కీలక పరిణామం
లక్నో: శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. షాహీ మసీదును వివాదాస్పద కట్టడంగా పరిగణించాలన్న అభ్యర్థనను అలహాబాద్ హైకోర్టు(ఉత్తర ప్రదేశ్) శుక్రవారం కొట్టేసింది. మథురలో శ్రీకృష్ణ జన్మభూమి నేపథ్యంగా సాగుతున్న కేసులో భాగంగా.. ఈ పిటిషన్ సైతం దాఖలైంది.షాహీ ఈద్గా అక్రమ కట్టడమని, కాబట్టి వివాదాస్పద స్థలంగా ప్రకటించాలని, ఈ కేసు విచారణ ముగిసే దాకా కోర్టు రికార్డుల్లో అలాగే ప్రస్తావించేలా కోర్టు సిబ్బందిని ఆదేశించాలని హిందూ సంఘాల తరఫున మహేంద్ర ప్రతాప్ సింగ్ ఈ పిటిషన్ వేశారు. అయితే ముస్లిం సంఘాల తరఫు లాయర్ ఈ అభ్యర్థనపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న జస్టిస్ మనోహర్ నారాయణ్ మిశ్రా నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ఈ పిటిషన్ను కొట్టేసింది.శ్రీకృష్ణ జన్మభూమి, షాహీ ఈద్గా మసీదు కేసులో వివిధ హిందూ సంఘాలు కోర్టులో పదుల సంఖ్యలో పిటిషన్లు దాఖలు చేశాయి. ఆ పిటిషన్లో శ్రీకృష్ణ జన్మభూమి, షాహీ ఈద్గా మసీదు కేసులో,కోర్టు పత్రాల్లో భవిష్యత్ విచారణలలో షాహీ ఈద్గా మసీదు అనే పదాన్ని ఉపయోగించకుండా, దాని స్థానంలో వివాదాస్పద నిర్మాణం అనే పదాన్ని ఉపయోగించేలా ఆదేశించమని పేర్కొన్నారు. ఇదే పిటిషన్లపై కోర్టు ఇవాళ విచారణ చేపట్టంది. తదుపరి విచారణ ఆగస్టు 2కి వాయిదా వేసింది. #WATCH | Prayagraj, Uttar Pradesh: On Allahabad High Court dismissing an application seeking to substitute the term 'Shahi Idgah Mosque' with 'disputed structure,' Advocate Saurabh Tiwari says, "The High Court has rejected the application of considering it as the disputed… pic.twitter.com/uXy4TXyvZi— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 4, 2025 -
ఏపీలో దాడులు.. అల్లూరి కలెక్టర్, ఎస్పీకి ఎస్టీ కమిషన్ నోటీసులు
సాక్షి, ఢిల్లీ: ఏపీలో దాడులపై జాతీయ ఎస్టీ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అల్లూరి జిల్లా కలెక్టర్, ఎస్పీకి జాతీయ ఎస్టీ కమిషన్ సమన్లు జారీ చేసింది. కమిషన్ ఎదుట హాజరు కావాలని సమన్లలో ఆదేశించింది.శ్రీకాకుళం జిల్లాలో ఎస్టీలపై దాడి ఘటనను జాతీయ ఎస్టీ కమిషన్ సీరియస్గా తీసుకుంది. జిల్లాలో గిరిజన కుటుంబాలపై దాడి కేసులో అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ , ఎస్పీకి ఎస్టీ కమిషన్ సమన్లు జారీ చేసింది. ఈనెల ఎనిమిదో తేదీన తమ ముందు హాజరు కావాలని కమిషన్ ఆదేశించింది. తమ ముందు హాజరు కాకుంటే కలెక్టర్, ఎస్పీపై రాజ్యాంగంలోని ఆర్టికల్ 338ఏ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇక, శ్రీకాకుళం జిల్లా ఎంపేడు గ్రామంలో ఎస్టీలపై జరిగిన దాడిపై జాతీయ ఎస్టీ కమిషన్కు ఎంపీ డాక్టర్ గుమ్మ తనుజారాణి ఫిర్యాదు చేశారు. -
ఇవిగో సాక్ష్యాలు..!
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గతేడాది ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంలు) పనితీరులో మాయాజాలం.. ఈవీఎంలలో పోలైన ఓట్లకు (ఫారం–17 ప్రకారం), లెక్కించిన ఓట్లకు (ఫారం–20 ప్రకారం) మధ్య భారీ వ్యత్యాసం ఉండటం.. అదే రోజు రాత్రి ఈసీ తొలుత ప్రకటించిన పోలింగ్ శాతానికీ, ఆ తర్వాత నాలుగు రోజులు గడిచాక ప్రకటించిన శాతానికి మధ్య దేశంలోనే అత్యధికంగా భారీ తేడా ఉండటం.. తొలుత ప్రకటించిన దానితో పోలిస్తే అనూహ్యంగా పోలింగ్ ఏకంగా 12.54 శాతం పెరగడం.. దీనివల్ల సగటున ఒక్కో శాసనసభ స్థానంలో 28 వేల ఓట్లు, లోక్సభ స్థానం పరిధిలో 1.96 లక్షల ఓట్లు పెరగడం.. అంతిమంగా ఇది 87 శాసనసభ స్థానాల పరిధిలో గెలుపోటములను నిర్దేశించడం.. తదితర అంశాలపై వైఎస్సార్సీపీ నేతల బృందం కేంద్ర ఎన్నికల సంఘానికి (సీఈసీ) ఫిర్యాదు చేసింది. పలు నియోజకవర్గాల్లో ఈవీఎంల పనితీరు అనుమానాస్పదంగా ఉందన్న అంశాన్ని సాక్ష్యాధారాలతో సీఈసీ ముందుంచింది. ఈవీఎంల పనితీరుపై సర్వత్రా అనుమానాలు రేకెత్తుతున్న నేపథ్యంలో వాటిని పక్కనపెట్టి బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ను సీఈసీ దృష్టికి గట్టిగా తీసుకొచ్చింది. 2024 ఎన్నికల్లో ఈవీఎంల పనితీరుకు సంబంధించి సాంకేతిక అంశాలు, కొన్ని పోలింగ్ బూత్లలో చోటుచేసుకున్న అసంబద్ధ వ్యవహారాలపై వైఎస్సార్సీపీ గతంలోనే సీఈసీకి ఫిర్యాదుచేసింది. ఈ నేపథ్యంలో దీనిపై వివరణ ఇచ్చేందుకు గురువారం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ప్రధాన ఎన్నికల అధికారి (సీఈసీ) జ్ఞానేశ్కుమార్, కమిషనర్లు వివేక్ జోషి, సుఖ్బీర్ సింగ్ సంధు నిర్వహించిన సమావేశానికి వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, లోక్సభ పక్షనేత పి.మిథున్రెడ్డి, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ హాజరయ్యారు. సుమారు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అనంతరం మిథున్రెడ్డి, చంద్రశేఖర్తో కలిసి వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు.ఈవీఎం, వీవీ ప్యాట్లను పోల్చి చూడాలి2024 ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంల తీరుపై అనేక అనుమానాలున్నందున వాటిని నివృత్తి చేయాలని కోరాం. ఈవీఎంలు, వీవీ ప్యాట్ల ఓట్లను పోల్చి చూడాలని కోరాం. ఇందుకు ఫీజు కింద నిర్ణీత రుసుము కూడా ఇప్పటికే చెల్లించాం. బ్యాటరీ చార్జింగ్ విషయంలో కూడా ఈవీఎంలపై అనేక సందేహాలున్నాయి. పోలింగ్ పూర్తయ్యాక 80 శాతం ఉంటే.. 40 రోజుల తర్వాత కౌంటింగ్ సమయంలో 98 శాతం చార్జింగ్ ఉన్న సందర్భాలు కనిపించాయి. సాయంత్రం 6 గంటల తర్వాత చాలాచోట్ల పోలింగ్ శాతం పెరిగింది. నాలుగు కోట్ల ఓట్లలో 51 లక్షల ఓట్లు సాయంత్రం ఆరు గంటల తర్వాతే పోలయ్యాయి. వీటిపై అనేక అనుమానాలున్నాయని, విచారణ జరిపించాలని సీఈసీని కోరాం. అయితే, వీవీ ప్యాట్లను కంపారిజన్ చేయడం కుదరదని చెప్పారు. అవి రీ చార్జబుల్ బ్యాటరీలు కావడం వల్ల చార్జింగ్ పెరగడం, తగ్గడం అంటూ జరగదని చెబుతున్నారు.రాయచోటి ఓ ఉదాహరణ..2014–19 కంటే గతేడాది ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగిన విషయాన్ని సీఈసీకి వివరించాం. రాయచోటి నియోజకవర్గం దీనికి ఉదాహరణ అని చెప్పాం. దీనిపై ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది. ఎక్కువ శాతం పోలింగ్ అంశంపై నియోజకవర్గం డేటా తెప్పించుకుని పరిశీలిస్తామని చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల పెరుగుదలపై మావద్ద ఉన్న ఆధారాలను ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్కుమార్కు అందించాం. దీనిపై ఈసీ సానుకూలంగా స్పందిస్తూ.. ఓటర్ల జాబితా విషయంలో త్వరలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ప్రత్యేక విస్తృత సవరణ) చేపడతామని హామీ ఇచ్చింది.మీడియాతో మాట్లాడుతున్న వైవీ సుబ్బారెడ్డి. పక్కన పి.మిథున్రెడ్డి, బెల్లాన చంద్రశేఖర్ హిందూపురం ఓటింగ్ సరళిలో వ్యత్యాసాలు..ఈవీఎంలపై సాంకేతికతపరంగా ఉన్న సందేహాలను ఈసీకి వివరించాం. మేం ఓడిపోయాం కదా అని నేరం ఎవరిపైనా మోపట్లేదు. అందుకే ప్రత్యేకంగా హిందూపురం నియోజకవర్గంలో జరిగిన అవకతవకలను సీఈసీ ముందుంచాం. హిందూపురం నియోజకవర్గం పోలింగ్ బూత్ నెంబర్–157, 28లలో వైఎస్సార్సీపీ పార్లమెంట్ అభ్యర్థికి 472 ఓట్లు పోలవ్వగా, అదే బూత్లో అసెంబ్లీ అభ్యర్థికి కేవలం ఒకే ఒక్క ఓటు పోలైన విషయాన్ని సీఈసీ దృష్టికి తీసుకెళ్లాం. ఇక కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థికి ఒక ఓటు రాగా, అసెంబ్లీ అభ్యర్థికి 464 ఓట్లు వచ్చాయి. టీడీపీ పార్లమెంట్ అభ్యర్థికి 8 ఓట్లు పోలవ్వగా, అసెంబ్లీ అభ్యర్థికి 95 ఓట్లు వచ్చిన విషయాన్ని ఆధారాలతో సహా సీఈసీ ముందుంచాం. ఓటింగ్ సరళిలో ఇన్ని తేడాలు రావడం మా అనుమానాలకు కారణం. దీనిపై క్షుణ్ణంగా విచారణ చేపట్టాలని కోరాం. దీంతో.. బిహార్ తరహాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించేందుకు సీఈసీ జ్ఞానేశ్కుమార్ అంగీకరించారు.బ్యాలెట్తోనే ఎన్నికలు జరపాలి..ప్రస్తుత పరిస్థితుల్లో ఈవీఎంలను, వీవీ ప్యాట్లను విశ్వసించేందుకు ఏమాత్రం ఆస్కారం లేనందున బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ డిమాండ్ను కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియచేశాం. అమెరికా, జర్మనీ, యూరప్ దేశాల్లో సైతం బ్యాలెట్తోనే ఎన్నికలు జరుగుతున్న విషయాన్ని వారికి గుర్తు చేశాం. బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరిగితే ఎన్నికల ప్రక్రియపై విశ్వసనీయత, పారదర్శకత ఉంటుందని వివరించాం. వీవీ ప్యాట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ లెక్కించబోమని.. ఆయా పోలింగ్ బూత్లకు సంబంధించి సీసీ ఫుటేజీలను కూడా ఇచ్చేది లేదని సీఈసీ చెప్పింది.ఎన్నికల ప్రక్రియ బలోపేతం: ఈసీఎన్నికల ప్రక్రియను బలోపేతం చేయడంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. జాతీయ, ప్రాంతీయ పార్టీల అధ్యక్షులు తమ అభిప్రాయాలు, అభ్యంతరాలను ప్రత్యక్షంగా కమిషన్ దృష్టికి తేవాలనే ఉద్దేశంతోనే వైఎస్సార్సీపీ బృందంతో చర్చలు జరిపినట్లు సీఈసీ తెలిపింది. ఈమేరకు ఎన్నికల ప్రక్రియను మరింత పటిష్టం చేసేందుకే వివిధ రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు గురువారం వైఎస్సార్సీపీ నేతలతో భేటీ అనంతరం సీఈసీ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేసింది. రాజకీయ పార్టీలతో నిర్మాణాత్మక చర్చలు అవసరమని ఈసీ పేర్కొంది. -
కొనసాగుతున్న జడ్జీల ఎంపిక ప్రక్రియ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని హైకోర్టుల్లో ఖాళీగా ఉన్న జడ్జీ పోస్ట్లను భర్తీ చేసేందుకు సుప్రీంకోర్టు కొలీజియం తన ఎంపిక విధానాన్ని మరింతగా కఠినతరం చేసింది. అనధికారిక వర్గాల సమాచారం ప్రకారం జూలై ఒకటో తేదీ నుంచి రెండు రోజుల్లో 54 మంది అభ్యర్థులతో ముఖాముఖి సమావేశమై వారి సమగ్ర వివరాలను కొలీజియం పరిశీలించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్లతో కూడిన కోలీజియం జూలై 1, 2 తేదీల్లో అభ్యర్థులతో విస్తృతంగా ఇంటర్వ్యూలు నిర్వహించింది. మొదటి రోజున 20 మందితో, రెండో రోజున 34 మందితో సమావేశమైంది. అభ్యర్థుల పనితీరు, బయోడేటా, అనుభవం వంటి అంశాలపై అరగంటపాటు ప్రశ్నలు సంధిస్తూ క్షుణ్ణంగా పరిశీలించింది. ఇప్పటివరకు ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వ నివేదికలు, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) రిపోర్టులు, అలాగే సంబంధిత హైకోర్టులకు చెందిన సుప్రీంకోర్టు జడ్జిల అభిప్రాయాలపైనే ఆధారపడుతూ నియామకాలు జరిగేవి. కొలీజియం ఇప్పటికే చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వంతో సిఫారసుల ఆమోదంలో ఆలస్యాలు రావడం వల్ల సమస్యలు ఎదుర్కొంటోంది. కొంతమంది అభ్యర్థులు వీలైనంతకాలం ఎదురు చూడలేక తమ అభ్యర్థిత్వం వెనక్కి తీసుకోవడం కూడా జరిగిపోయింది. అయితే ఇటీవల జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో లభించిన అప్రకటిత నగదు కేసు, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు వంటి పరిణామాల నేపథ్యంలో కొలీజియం ఈసారి తన పరిశీలనను కఠినతరం చేసింది. ఇందులో భాగంగా, జిల్లా న్యాయవ్యవస్థ నుంచి వచ్చే అభ్యర్థుల కోసం ఒక రోజు, బార్ అభ్యర్థుల కోసం మరొక రోజు కేటాయించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 హైకోర్టుల్లో 371 ఖాళీలుండగా ఇందులో తెలంగాణ హైకోర్టులో 16, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 8 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. -
బిహార్లో ఒంటరి పోరు
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ గురువారం విపక్ష ఇండియా కూటమికి ఝలక్ ఇచ్చే కీలక ప్రకటన చేశారు. వచ్చే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికలకు ఉద్దేశించింది మాత్రమేనని పేర్కొన్నారు. ‘ఆప్ బిహార్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుంది. ఇండియా కూటమి లోక్సభ ఎన్నికలకు మాత్ర మే. ఇప్పుడు కాంగ్రెస్తో పొత్తు లేదు. పొత్తు ఉంటే కాంగ్రెస్ పార్టీ గుజరాత్లోని విశావదర్ ఉప ఎన్నికలో ఎందుకు పోటీ చేసింది. కాంగ్రెస్ కేవలం ఆప్ను ఓడించేందుకు పోటీ చేసింది. ఆప్ను ఓడించేందుకు, ఓట్లను తగ్గించేందుకు కాంగ్రెస్ను బీజేపీ పంపింది’అని అహ్మదాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. బిహార్లో ఆప్ తన ఎన్నికల అరంగేట్రం కోసం సన్నాహాలు మొదలుపెట్టిందన్నారు. తమ నిర్ణయం ఆ రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలను సవాల్ చేయడానికి ఒక ప్రణాళికాబద్ధమైన చర్యగా అభివరి్ణంచారు. అదే సమయంలో గుజరాత్లో ఆప్ రాజకీయ గెలుపుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘గుజరాత్లో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదు. అయినప్పటికీ బీజేపీ పదేపదే గెలుస్తోంది. దీనికి కారణం అక్కడ బలమైన ప్రత్యామ్నా యం లేకపోవడమే. కాంగ్రెస్ పార్టీ బీజేపీ జేబులో ఉంది. ఒకవిధంగా బీజేపీని గెలిపించే కాంట్రాక్ట్ను కాంగ్రెస్ తీసుకుంది. ప్రజలు కాంగ్రెస్ను నమ్మరు. కాంగ్రెస్కు ఓటేస్తే గెలవరని, గెలిచినా బీజేపీలోకి వెళ్తారని ప్రజలకు తెలుసు. అందుకే ఆప్ను ప్రజలు ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. గుజరాత్ను మొదటి 30 ఏళ్లు కాంగ్రెస్, తర్వాత 30 ఏళ్లు బీజేపీ పాలించాయి. ఇప్పుడు ఆప్కు అవకాశం వస్తుంది’అని పేర్కొన్నారు. కాంగ్రెస్కు దెబ్బేఇండియా కూటమిలోని కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు ప్రధానంగా యాదవులు, ముస్లింలు, దళితుల ఓట్లపైనే ఆధారపడ్డాయి. కాంగ్రెస్ ఎక్కువగా పట్టణ, దళిత నియోజకవర్గాల్లో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఆప్ సైతం ఈ ఓట్లపైనే దృష్టి పెట్టే అవకాశముంది. విద్య, ఆరోగ్యం, విద్యుత్ వంటి అంశాలపై బిహార్లో ప్రజల వద్దకు వెళ్తామని, పట్టణ పేదలు, గ్రామీణుల ప్రజలను చేరుకునేలా తమ వ్యూహం ఉంటుందని కేజ్రీవాల్ ఇదివరకే ప్రకటించారు. ఆప్ నిజంగా అదే వ్యూహంతో ముందుకెళితే ఇండియా కూటమి ఓట్లకు భారీగా గండి పడే అవకాశాలున్నాయి. గడిచిన లోక్సభ ఎన్నికల్లో బిహార్లో ఇండియా కూటమి 9 స్థానాలను గెలుచుకుంది. ఆప్ పోటీలో నిలిస్తే కాంగ్రెస్, ఆర్జేడీ ఓట్ల వాటాను దెబ్బతీసే అవకాశాలున్నాయి. ఇది పరోక్షంగా ఎన్డీఏకు ప్రయోజనం చేకూర్చనుంది. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 52 శాతం, ఇండియా కూటమి 42 శాతం ఓట్లను సాధించాయి. ఇప్పుడు ఆప్ పోటీలో ఉంటే ఇండియా కూటమికు నష్టం జరిగే అవకాశం ఉంది. సంక్లిష్టమైన కుల సమీకరణాలు, బలమైన ప్రాంతాయ పార్టీల ఆధిపత్యం ఉండే బిహార్ రాజకీయాల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయాలనే ఆప్ నిర్ణయం ఇండియా కూటమికి నష్టం కలిగించేదేనని రాజకీయ విశ్లేషకులు సైతం లెక్కలు వేస్తున్నారు. ఆప్ కనీసంగా 5–10శాతం ఓట్లు సాధించినా, అది ఎన్డీఏకే కలిసొస్తుందని అంటున్నారు. ఈ ఓట్ల శాతం రాష్ట్రంలో దీర్ఘకాలిక ప్రత్యామ్నాయంగా తనను ప్రకటించుకునేందుకు ఆప్కు దోహదపడుతుందని భావిస్తున్నారు. -
57వ అంతస్తు నుంచి దూకి ప్రముఖ నటి కుమారుడు ఆత్మహత్య
ముంబై: చదువు ప్రముఖ నటి కుమారుడి ప్రాణం తీసినట్లు తెలుస్తోంది. ట్యూషన్కు వెళ్లే విషయంలో తల్లితో వాగ్వాదం జరిగింది. అనంతరం ఆమె కుమారుడు 57వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల సమాచారం మేరకు .. ముంబైలో జరిగిన ఈ విషాదకర ఘటన బుధవారం ముంబైలోని కాందివలి వెస్ట్ ప్రాంతంలోని సీ బ్రూక్ అనే హైరైజ్ అపార్ట్మెంట్లో జరిగింది. నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో నటి కుమారుడు 14 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాలుడి ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. ట్యూషన్కు వెళ్లే విషయంలో నటితో ఆమె కుమారుడు గొడవ పడ్డాడు. వాగ్వాదం జరిగిన తర్వాత బాలుడు 57వ అంతస్తు నుంచి దూకినట్టు అనుమానిస్తున్నారు. ఈ దుర్ఘటనను పోలీసులు ప్రాథమికంగా బాలుడిది ఆత్మహత్యగా భావిస్తున్నారు. ఎటువంటి అనుమానాస్పద అంశాలు లేవని తెలిపారు. ప్రముఖ నటి ఎవరు అనేది పోలీసులు గోప్యంగా ఉంచారు. అయితే, ఆ నటి భర్తతో విడాకులు తీసుకుందని, కుమారుడితో కలిసి అపార్ట్మెంట్లో నివసిస్తున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి మానసిక స్థితి, పాఠశాల వాతావరణం, కుటుంబ పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు. ట్యూషన్ క్లాస్పై ఒత్తిడి కారణమై ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా,సదరు నటి పలు హిందీ, గుజరాతీ సీరియళ్లలో నటించిన ఆమె పాపులర్ అయ్యారు. -
ప్రజాగ్రహం దెబ్బకు తలొగ్గిన ఢిల్లీ ప్రభుత్వం
సాక్షి,ఢిల్లీ: ప్రజాగ్రహంతో ఢిల్లీ ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది. ఇటీవల ప్రకటించిన ‘ఎండ్ ఆఫ్ లైఫ్’ (EOL) వెహికల్ పాలసీపై తీవ్ర విమర్శల నేపథ్యంలో.. పాత వాహనాలపై నిషేధంపై నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. ప్రజలు నష్టపోకుండా.. ప్రయోజనం చేకూరేలా కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తామంటూ స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.వాహనం వయస్సు ఆధారంగా కాకుండా వాతావరణం కాలుష్యం చేసే వాహనాలపై మాత్రమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా తెలిపారు. వాహనాల కాలుష్యం విషయంలో యజమానులకు ముందస్తు సమాచారం ఇచ్చేలా వ్యవస్థను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ఈ విధానం ఢిల్లీతో పాటు ఇతర ఎన్సీఆర్ ప్రాంతాల్లోనూ అమలు చేయాలన్న అభిప్రాయాన్ని ప్రభుత్వం వ్యక్తం చేసింది.క్వాలిటీ ఎయిర్ మేనేజ్మెంట్ నుంచి తదుపరి మార్గదర్శకాలు వచ్చే వరకు పాలసీ అమలును నిలిపి వేయనుంది. ఇది వాహన యజమానులకు తాత్కాలిక ఊరట కలిగించినా, కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం కొత్త మార్గాలు అన్వేషిస్తోంది. Delhi Environment Minister Manjinder Singh Sirsa writes to the Commission for Air Quality Management to place on hold the enforcement of Direction No. 89, which mandates the denial of fuel to End-of-Life (EOL) vehicles in Delhi"We urge the Commission to put the implementation… pic.twitter.com/mgg1Ymdaes— ANI (@ANI) July 3, 2025 -
F-35 Row: రిపేర్ కుదరదు, ఇక మిగిలింది ఒక్కటే ఆప్షన్!
అత్యవసర పరిస్థితులతో కేరళలో దిగిన యూకే యుద్ధ విమానం ఎఫ్ 35(F-35 fighter) ఎపిసోడ్ మరో మలుపు తిరిగింది. 20 రోజుల తర్వాత మరమ్మత్తుల విషయంలో యూకే నిపుణులు చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. దీంతో మిగిలిన ఒకే ఒక్క ఆప్షన్నే పరిశీలిస్తున్నట్లు సమాచారం.బ్రిటన్కు చెందిన HMS Queen Elizabeth నౌకాదళ విమాన వాహక నౌక ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో మిషన్లో పాల్గొంది. జూన్ 14వ తేదీన ఈ నౌక నుంచి ఎగిరిన ఎఫ్ 35 ఫైటర్ జెట్ మిలిటరీ కార్గో ఎయిర్క్రాఫ్ట్.. తిరువంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. తొలుత సాంకేతిక సమస్యగా భావించిన నిపుణులు.. త్వరగతినే ఇది రిపేర్ అవుతుందని భావించారు. అయితే.. ఇంధనం తక్కువగా ఉండడం, ప్రతికూల వాతావరణం కారణంగానే ఇది ల్యాండ్ అయ్యిందని తర్వాతే తేలింది. ఈలోపు.. ల్యాండింగ్ అనంతరం హైడ్రాలిక్ స్నాగ్ అనే లోపం తలెత్తడంతో అది గాల్లోకి లేవలేదు. అప్పటి నుంచి CISF సిబ్బంది విమానానికి నిరంతర భద్రత కల్పించారు. అలాగే భారత వైమానిక దళం (IAF) లాజిస్టికల్ సహాయం అందిస్తూ వచ్చింది. ఈలోపు.. సుమారు 40 మంది బ్రిటిష్ ఇంజనీర్లు మరమ్మతుల కోసం కేరళకు వచ్చారు. కానీ సమస్య పరిష్కారం కాకపోవడంతో విమానాన్ని విడదీసి ఆ భాగాల్ని తరలించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇన్నిరోజులకుగానూ.. విమానం పార్కింగ్, హ్యాంగర్ ఛార్జీలను చెల్లించాలని UK ప్రభుత్వం నిర్ణయించింది. భారత వైమానిక దళం, నౌకాదళం, తిరువనంతపురం విమానాశ్రయ అధికారుల సహకారానికి UK హై కమిషన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.మీమ్స్ వైరల్తిరువనంతపురంలో నిలిచిపోయిన బ్రిటన్ ఎఫ్-35బీ యుద్ధ విమానం గురించి సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అయ్యాయి. OLXలో 4 కోట్లకే అమ్మకానికి! అని ఓ యూజర్ చమత్కరించారు. ఇది స్టెల్త్ కాదు... స్టక్! అంటూ మరో వ్యక్తి పోస్ట్ చేశారు. బ్రిటన్ టెక్నాలజీ.. చివరకు భారతీయ భూభాగంలో ఓడింది అంటూ ఓ మీమ్ దేశభక్తి టచ్తో వైరల్ అయ్యింది. ఇది ఫైటర్ జెట్ కాదు... పార్కింగ్ జెట్ అంటూ మరో యూజర్ ఎద్దేవా చేశారు. ఇది టూమచ్ గురూ.. F-35B స్టెల్త్ యుద్ధ విమానం.. ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధ విమానాల్లో ఒకటి. ఇది షార్ట్ టేకాఫ్ & వర్టికల్ ల్యాండింగ్ సామర్థ్యం కలిగి ఉంది. ఇలాంటి అత్యాధునికమైన విమానాలను ఇప్పటిదాకా అమెరికా, UK, ఇజ్రాయెల్ వంటి దేశాలే వినియోగిస్తున్నాయి. అమెరికాకు చెందిన సంస్థ Lockheed Martin Corporation F-35B స్టెల్త్ యుద్ధ విమానాలను తయారు చేస్తోంది. F-35B (Short Takeoff and Vertical Landing version) ధర సుమారుగా $135.8 మిలియన్ డాలర్లు అంటే దాదాపు ₹1,170 కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ విమానంలో ఇంజిన్, ఆయుధ వ్యవస్థలు, స్టెల్త్ టెక్నాలజీ, అధునాతన సెన్సార్లు కూడా ఉంటాయి. ఇంజిన్ ఖర్చు మాత్రమే సుమారుగా $19.7 మిలియన్ (₹169 కోట్లు) వరకు ఉంటుంది. ఒక్క గంట ఎగరడానికి సుమారుగా $38,000 (₹32.88 లక్షలు) ఖర్చవుతుంది. F-35B యొక్క వార్షిక నిర్వహణ ఖర్చు సుమారుగా $6.8 మిలియన్ (₹58.8 కోట్లు) ఉంటుంది. అంతెందుకు.. ఈ జెట్లో వాడే హెల్మెట్ ధర $400,000 (₹3.4 కోట్లు). అంటే ఒక్క హెల్మెట్ ఒక లగ్జరీ కారు ధరతో సమానమన్నమాట. అంతేకాదు.. విమానాన్ని నడిపేందుకు ప్రత్యేక శిక్షణ అవసరం. ఇది కూడా ఖరీదైనదే.పార్కింగ్ ఫీజు ఎంత చెల్లిస్తారంటే.. తిరువనంతపురం ఎయిర్పోర్టును వినియోగించుకున్నందుకు అధికారికంగా యూకే ప్రభుత్వం ఎంత పార్కింగ్ ఛార్జీలు చెల్లింస్తుంది అనే వివరాలు బయటకు రాలేదు. అయితే అది లక్షల్లోనే ఉండే అవకాశం ఉంది. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో పార్కింగ్, భద్రత, హ్యాంగర్ ఛార్జీలు కలిపి రోజుకు ₹2–3 లక్షలు వరకు ఉండొచ్చని విమానాశ్రయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 20 రోజుల పాటు విమానం అక్కడే నిలిచిన నేపథ్యంలో, మొత్తం ఖర్చు ₹40–60 లక్షలు, అంతకంటే ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. -
ఆ హక్కు ఆయనది మాత్రమే.. దలైలామా వారసుడి ఎంపికపై భారత్ స్పందన
దలైలామా 90వ పుట్టినరోజు వేడుకలకు ధర్మశాల ముస్తాబయ్యింది. మెక్లియోడ్గంజ్లోని ప్రధాన ఆలయమైన సుగ్లగ్ఖాంగ్లో వేడుకలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు భారత ప్రభుత్వం తరఫున హాజరు కాబోతున్నారు. తాజాగా.. దలైలామా వారసత్వం ఎంపికపై చర్చ నడుస్తుండడంతో ఆయన స్పందించారు. న్యూఢిల్లీ: తన వారసుడి ఎంపిక ప్రక్రియ పూర్తిగా ప్రస్తుత దలైలామా చేతుల్లోనే ఉంటుందని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు గురువారం ప్రకటించారు. టిబెట్ను గుప్పిట పెట్టుకోవడానికి తమ అదుపులో ఉండే వ్యక్తిని దలైలామా వారసుడిగా ఎంపిక చేయాలని చైనా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దలైలామాదే అంతిమ నిర్ణయమని కిరణ్ రిజిజు అన్నారు. ‘‘15వ దలైలామా ఎంపిక ప్రక్రియ పూర్తిగా ప్రస్తుత దలైలామా చేతుల్లోనే ఉంటుంది. దలైలామా వారసుడిని నిర్ణయించే అధికారం టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడు తప్ప మరెవరికీ లేదు. దలైలామా స్థానం టిబెటన్లకు మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులందరికీ అత్యంత ముఖ్యమైనది. తన వారసుడిని నిర్ణయించే హక్కు దలైలామాకే ఉంది’’ అని కిరణ్ రిజిజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.కొత్త దలైలామాను తామే ఎన్నుకుంటామంటూ చైనా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై 14వ దలైలామా టెన్జిన్ గ్యాట్సో బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దలైలామా ఎంపిక 600 సంవత్సరాలుగా బౌద్ధ సంప్రదాయాల ఆధారంగానే జరుగుతోందని, తాను ఏర్పాటు చేసిన గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్ తదుపరి దలైలామా ఎంపిక ప్రక్రియను చేపడుతుందని, ఇందులో ఎవరి జోక్యం ఉండబోదని కుండబద్ధలు కొట్టారు. దలైలామా తన వారసుడు చైనా వెలుపల జన్మించాలని, బీజింగ్ నుంచి ఎంపిక చేసిన వ్యక్తిని ఎవరినైనా తిరస్కరించాలని ఆయన సూచించారు. అయితే చైనా 14వ దలైలామా ప్రకటనపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. టిబెట్ చైనాకి చెందిన భూమిగా పేర్కొంటూ.. దలైలామా ఎంపికపై తమకే హక్కు ఉందని డ్రాగన్ వాదిస్తోంది. దలైలామా, పాంచెన్ లామా, ఇతర ప్రముఖ బౌద్ధ గురువుల ఎంపిక తప్పనిసరిగా 'గోల్డెన్ అర్న్' పద్ధతిలో.. అదీ చైనా ప్రభుత్వ ఆమోదంతోనే జరగాలి అని చైనా విదేశాంగ ప్రతినిధి మావో నింగ్ తెలిపారు. ఈ పద్ధతి 18వ శతాబ్దంలో చింగ్ వంశాధిపతి ప్రవేశపెట్టిన విధానమని పేర్కొన్న ఆమె.. చైనా ప్రభుత్వం మత స్వేచ్ఛకు కట్టుబడి ఉందని, అలాగని మత సంబంధిత వ్యవహారాలపై నియంత్రణలు, బౌద్ధ గురువుల నియామకాల కోసం ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి అని ఆమె గుర్తు చేశారు.దలైలామా (Dalai Lama) వారసుడి (successor) ఎంపికను బీజింగ్ ఆమోదించాలన్న చైనా (China) డిమాండ్పై అమెరికా ఇప్పటికే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇందుకోసం ఆ దేశ పార్లమెంట్లో ఓ ప్రత్యేక చట్టాన్ని కూడా చేసింది. వారసత్వంలో జోక్యం చేసుకోవడం మానేయాలని, మత స్వేచ్ఛను గౌరవించాలని చైనాను కోరుతూనే ఉంటుందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు తాజాగా తెలిపారు. ఇప్పుడు భారత్ కూడా ఆ జాబితాలో చేరింది. 14వ దలైలామా ఎంపిక తర్వాత.. టిబెటన్ సంప్రదాయంలో.. ఒక సీనియర్ బౌద్ధ సన్యాసి ఆత్మ అతని మరణం తర్వాత ఒక చిన్నారి శరీరంలోకి ప్రవేశించి.. పునర్జన్మ పొందుతుందని నమ్ముతారు. జూలై 6, 1935న టిబెట్ క్వింఘై ప్రావిన్స్లోని ఒక రైతు కుటుంబంలో జన్మించిన టెన్జిన్ గ్యాట్సోను.. రెండేళ్ల వయసులో 14వ దలైలామా గుర్తించారు. అయితే కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ నేతృత్వంలోని చైనా దళాలు టిబెట్ను ఆక్రమించుకున్నాయి. 1959లో టిబెట్ ధైవభూమి లాసాలో తిరుగుబాటు విఫలం తర్వాత వెయ్యి మందికిపైగా బౌద్ధ సన్యాసులతో దలైలామా భారత్కు శరణార్ధిగా వచ్చి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. -
రామ్దేవ్ పతంజలికి డాబర్ దెబ్బ
బాబా రాందేవ్ నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద్ సంస్థకు ఢిల్లీ హైకోర్టులో గట్టి దెబ్బ తగిలింది. డాబర్ చ్యవన్ప్రాష్(Chyawanprash)ను లక్ష్యంగా చేసుకుని పతంజలి ప్రసారం చేస్తున్న సెటైరిక్ యాడ్ను తక్షణమే నిలిపివేయాలని ఉన్నతన్యాయస్థానం గురువారం ఆదేశించింది. న్యూఢిల్లీ: చ్యవన్ప్రాష్ను తాము మాత్రమే ఆయుర్వేద గుణాలకు అనుగుణంగా తయారు చేస్తున్నామని, డాబర్(Dabur)లాంటి కంపెనీలు సాదాసీదాగా తయరు చేసి మార్కెట్లోకి వదులుతున్నారని పతంజలి గత కొంతకాలంగా ప్రచారం చేసుకుంటోంది. దీనిపై డాబర్ కంపెనీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తమ కంపెనీకి చెందిన పాపులర్ ప్రొడక్టుపై పతంజలి తప్పుడు ప్రచారం చేస్తోందని, తక్షణమే ఆ ప్రచారాన్ని నిలిపివేసేలా ఆదేశించాలని డాబర్ కంపెనీ పిటిషన్లో పేర్కొంది. అంతేకాదు.. తమ బ్రాండ్ ప్రతిష్ట దెబ్బతినేలా వ్యవహరించినందుకుగానూ రూ.2 కోట్ల పరిహారం పతంజలి నుంచి ఇప్పించాలని డాబర్ కోరింది. మార్గదర్శకాలకు అనుగుణంగా తాము ఉత్పత్తులు తయారు చేస్తున్నామని, ఇలాంటి ప్రకటనలు వినియోగదారులను తప్పుడు దారి పట్టించేలా ఉన్నాయంటూ పేర్కొంది. ‘‘మా(డాబర్) చ్యవన్ప్రాష్లో 40 మూలికలు ఉన్నాయని, కాబట్టి ఇది సర్వసాధారణమైందని పతంజలి ప్రచారం చేస్తోంది. అలాగే.. పతంజలి ప్రకటనల్లో తమ ఉత్పత్తిలో 51కు పైగా ఔషధ మూలికలు ఉన్నాయని చెప్పినా, వాస్తవానికి 47 మాత్రమే ఉన్నాయి. అంతేకాకుండా, పతంజలి ఉత్పత్తిలో మెర్క్యురీ వాడుతున్నారని, ఇది పిల్లలకు హానికరం’’ అని డాబర్ తన పిటిషన్లో ప్రస్తావించింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన జడ్జి మినీ పుష్కర్ణా యాడ్ నిలిపివేయాలని ఆదేశిస్తూ మద్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పిటిషన్పై తదుపరి విచారణ జులై 14వ తేదీన జరగనుంది. చ్యవన్ప్రాష్ (Chyawanprash) అనేది ఆయుర్వేద లేహ్యం. ఇది శరీరానికి బలం, రోగనిరోధక శక్తి, ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు వాడే ఔషధ గుణాలు కలిగిన మిశ్రమం. ఆరోగ్యాన్ని పునరుద్ధరించేందుకు చ్యవన్ ఋషి అనే మహర్షి ఈ లేహ్యాన్ని తయారు చేసినట్లు పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. -
ఈసీతో వైఎస్సార్సీపీ నేతల భేటీ.. చివరి గంటలో పోలింగ్ శాతంపై చర్చ..
సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్సీపీ నేతల బృందం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది. ఈ సందర్భంగా గతంలో ఈవీఎంల పనితీరుపై ఎన్నికల కమిషన్కు వైఎస్సార్సీపీ బృందం ఫిర్యాదు చేసింది. దీంతో, ఈ అంశాలపై వివరణ ఇచ్చేందకు వైఎస్సార్సీపీని ఈసీ ఆహ్వానించింది. దీంతో, ఈసీ దృష్టికి పలు కీలక అంశాలను తీసుకెళ్లినట్టు పార్టీ నేతలు తెలిపారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ బెల్లాన్న చంద్రశేఖర్, పార్టీ నేత లోకేష్ రెడ్డిల బృందం గురువారం ఉదయం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా గత ఎన్నికల్లో చివరి గంటల్లో అకస్మాత్తుగా పోలింగ్ శాతం పెరగడం, అసాధారణంగా ఓటర్లు పెరగడం తదితర అంశాలను ఈసీ దృష్టికి నేతల బృందం తీసుకెళ్లింది. అనంతరం, వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘ఎన్నికల్లో అసాధారణంగా ఓటర్లు పెరగడంపై ఈసీకి ఫిర్యాదు చేశాం. ఈవీఎంలపై ఉన్న టెక్నికల్ అనుమానాలపై ఈసీకి వివరించాం. గత ఎన్నికల్లో చివరి గంటలో పోలింగ్ శాతంపై వివరణ కోరాం. కేంద్ర ఎన్నికల సంఘం మమ్మల్ని ఆహ్వానించింది. ఓటర్ లిస్టు, పోలింగ్ సరళి తదితరంశాలపై చర్చలు జరిగాయి. 2024 ఎన్నికల్లో ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంల ఓట్లకు, వీవీప్యాట్లను పోల్చి చూడాలని చెప్పాం. ఈవీఎంలలో బ్యాటరీలపైన కూడా సందేహాలు ఉన్నాయి. ఏపీలో సాయంత్రం 6 గంటల తర్వాత ఎక్కువ నియోజకవర్గాలలో పోలింగ్ శాతం పెరిగింది. ఆరు తర్వాత జరిగిన పోలింగ్లో దాదాపు 50 లక్షలు ఓట్లు పోలయ్యాయి. దీనిపై ఎంక్వైరీ చేయాలి.విజయనగరం పార్లమెంట్ ఎన్నికలలో ఈవీఎం ఓట్లు, వీవీప్యాట్ కంపారిజన్ చేయమని కోరాము. కానీ, వీవీప్యాట్ల కంపారిజన్ చేయమని ఈసీ తెగేసి చెప్పింది. సీసీ టీవీ ఫుటేజ్ విడుదల చేయాలని అడిగితే నిరాకరించారు. ఈ వ్యవహారంలో పారదర్శకత లేదు. అందుకే బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరగాలి. రాయచోటిలో ఓటర్ల సంఖ్య చాలా పెరిగింది. బీహార్ తరహాలో ఏపీలో కూడా స్పెషల్ ఇంటెన్సిఫై రివిజన్ చేయాలని కోరాము. దానికి ఈసీ ఒప్పుకుంది. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం 38వ పోలింగ్ బూత్లో అసెంబ్లీ, పార్లమెంట్కు భిన్నమైన పోలింగ్ నమోదు అయ్యింది. వచ్చే ఎన్నికలు బ్యాలెట్ విధానంలో జరగాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాలెట్ విధానం అమల్లో ఉంది. ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు జరగాలి’ అని చెప్పుకొచ్చారు. -
Ahmedabad: ఎయిరిండియా విమానం ప్రమాదానికి కారణం ఏంటంటే?
సాక్షి,ఢిల్లీ: భారత విమానయాన చరిత్రలో ఘోర విషాదంగా నిలిచిన అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదానికి గల కారణాలు వెలుగులోకి వచ్చినట్లు బ్లూబెర్గ్ నివేదించింది. విమాన దుర్ఘటనకు కారణం రెండు ఇంజిన్లు విఫలం కావడం వల్లేనని ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న నిపుణులు భావిస్తున్నారు. కాబట్టే విమాన సిబ్బంది ప్రమాదాన్ని నిరోధించే ప్రయత్నాలు చేసినా అది సాధ్యం కాలేదని, తద్వారా అపార ప్రాణ నష్టానికి దారి తీసినట్లు తెలుస్తోంది. విమానంలో అత్యవసర విద్యుత్ సరఫరా కోసం ఉపయోగించే రామ్ ఎయిర్ టర్బైన్ (RAT) యాక్టివేషన్ యాక్టివేట్ కావడం వల్ల విమానంలో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా విఫలం కావడం వల్లేనని తేలింది. కానీ,సాధారణ లోపాల వల్ల ప్రమాదం జరగలేదని తేటతేల్లమైంది. వీటితో పాటు విమాన ప్రమాదానికి గల కారణాల్ని రాబట్టేందుకు ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్ (CVR) డేటాను విశ్లేషిస్తున్నారు. ఇది ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను వెల్లడించనుంది.జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే ఓ వైద్య కళాశాల వసతిగృహంపై కూలిపోయింది. ఈ విషాదకర ఘటనలో 241 మంది ప్రయాణికులు మృతిచెందగా.. 19 మంది స్థానికులు ప్రాణాలు కోల్పోయారు. విమానంలోని ఒకేఒక వ్యక్తి మృత్యుంజయుడిగా ప్రాణాలతో భయటపడ్డాడు. -
ఆకస్మిక మరణాలపై కేంద్రం కీలక ప్రకటన
గుండె సంబంధిత సమస్యలతో.. వయసుతో నిమిత్తం లేకుండా మృత్యువాత పడుతున్న ఉదంతాలు రోజుకోటి చొప్పున చూస్తున్నాం. ప్రత్యేకించి ఆరోగ్యంగా ఉన్నవాళ్లు ఎలాంటి లక్షణాలు లేకుండానే కుప్పకూలిపోతున్నారు. అయితే కరోనా కాలం నుంచే ఇవి ఎక్కువగా నమోదు అవుతుండడంతో.. వైరస్-వ్యాక్సిన్లకు ముడిపెడుతున్నారు చాలామంది. ఈ తరుణంలో.. హఠాన్మరణాలకు గల కారణాలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది.వ్యాక్సిన్ల కారణంగానే ఈ మరణాలు సంభవిస్తున్నాయని ఇటీవల ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం తీవ్ర చర్చనీయాంశమైంది. అంతేకాదు ఈ అంశంపై విచారణ జరపడానికి ఓ కమిటీ కూడా ఏర్పాటు చేశారాయన. మరీ ముఖ్యంగా 20 నుంచి 50 ఏళ్ల వయసులోపు వాళ్లు ఉన్నట్లుండి మరణించడం కలవరపెడుతోందని అన్నారాయన. అయితే గుండె సంబంధిత హఠాన్మరణాలకు.. కోవిడ్ టీకాలతో ఎలాంటి సంబంధం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా స్పష్టంచేసింది. ఈ మేరకు పలు అధ్యయనాలకు సంబంధించిన సమాచారాన్ని సైతం వెల్లడించింది. ఐసీఎంఆర్, ఎయిమ్స్ విస్తృతంగా నిర్వహించిన అధ్యయనాల ప్రకారం.. కోవిడ్ టీకాలు సురక్షితమైనవే. ఆకస్మిక మరణాలకు కింది విషయాలు కారణాలై ఉండొచ్చు.. జన్యుపరమైన లోపాలుజీవనశైలి (ధూమపానం, ఒత్తిడి, వ్యాయామపు అలవాట్లు)కోవిడ్ అనంతర ఆరోగ్య సమస్యలుఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలు.. అని పేర్కొంది #HealthForAll Extensive studies by @ICMRDELHI and AIIMS on sudden deaths among adults post COVID have conclusively established no linkage between COVID-19 vaccines and sudden deathsLifestyle and Pre-Existing Conditions identified as key factorshttps://t.co/QEN1X1PKfv— Ministry of Health (@MoHFW_INDIA) July 2, 2025టీకాలపై ఇలాంటి ఆరోపణలు ప్రజల్లో భయాందోళనలు కలిగించొచ్చు. విజ్ఞానపరమైన ఆధారాలు లేని వ్యాఖ్యలు ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఆధారాల ఆధారంగా ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో నెల వ్యవధిలో 20 మంది గుండె సంబంధిత సమస్యలతో హఠాత్తుగా చనిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో.. గుండె సంబంధిత మరణాలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ జిల్లా ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. రెండేళ్ల కాలంలో 507 గుండె పోటు కేసులు నమోదుకాగా.. అందులో 190 మంది మరణించారు. అయితే కోవిడ్ టీకాల త్వరిత ఆమోదం, పంపిణీ కూడా ఈ మరణాలకు కారణమై ఉండొచ్చు. ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటే.. తక్షణమే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలి అని ప్రజలకు సూచించారు. అలాగే.. ఈ మరణాలపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక నిపుణుల బృందంతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారాయన. In the past month alone, in just one district of Hassan, more than twenty people have died due to heart attacks. The government is taking this matter very seriously. To identify the exact cause of these series of deaths and to find solutions, a committee of experts has been…— Siddaramaiah (@siddaramaiah) July 1, 2025 అయితే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటనను తోసిపుచ్చింది. ఈ మేరకు అధ్యయనాల తాలుకా వివరాలను వెల్లడించింది. ICMR – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అధ్యయం.. 2023 మే–ఆగస్టు మధ్య 19 రాష్ట్రాల్లో 47 ఆసుపత్రుల్లో నిర్వహించారు. ఇందులో 18–45 ఏళ్ల మధ్య వయస్సు గల, ఆరోగ్యంగా కనిపించినప్పటికీ అకస్మాత్తుగా మరణించిన వ్యక్తులపై అధ్యయనం జరిపారు. అందులో కోవిడ్ టీకాలకు సంబంధం లేదని తేలింది. అలాగే.. ఢిల్లీ AIIMS అధ్యయనాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇందులో గుండెపోటు (Myocardial Infarction) ప్రధాన కారణంగా గుర్తించారు. పైగా జన్యుపరమైన లోపాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రాథమిక విశ్లేషణలో తేలింది. -
సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట.. కూటమి సర్కార్కు షాక్
సాక్షి, ఢిల్లీ: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. మైనింగ్ కేసులో వంశీ బెయిల్ రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు ఆసక్తి చూపలేదు. అనంతరం, తదుపరి విచారణ ఈనెల 16కు వాయిదా వేసింది.అయితే, మైనింగ్ కేసులో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. దీనిపై ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్బంగా వంశీ బెయిల్ రద్దు చేసేందుకు సుప్రీం కోర్టు ఆసక్తి చూపించలేదు. మైనింగ్ వాల్యూయేషన్పై నివేదిక ఇచ్చిన తర్వాత చూస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. చంద్రబాబు ప్రభుత్వం తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. తమ వాదన వినకుండా బెయిల్ ఇచ్చారని కోర్టుకు తెలిపారు. అక్రమ మైనింగ్ జరిగిందని చెప్పుకొచ్చారు. వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది. ఇక, అన్ని కేసుల్లో బెయిల్ వచ్చి ఈరోజు విడుదలవుతున్న నేపథ్యంలో వంశీని విడుదల కాకుండా చేసేందుకు టీడీపీ కుట్ర చేస్తోంది. అందులో భాగంగానే బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో కూటమి కేసులు పెట్టింది. -
రూ.లక్ష కోట్లతో పరిశోధనాభివృద్ధి పథకం
న్యూఢిల్లీ: దేశ ప్రగతిరథ వేగం పెరిగేందుకు నూతన ఆవిష్కరణలు ఎంతగానో దోహదపడతాయని భావిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరిశోధనాభివృద్ధిలో ప్రైవేట్రంగ పెట్టుబడులే లక్ష్యంగా ఏకంగా రూ.1 లక్ష కోట్ల మూల నిధితో రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్(ఆర్డీఐ) పథకానికి కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోద ముద్ర వేసింది. దేశ ఆర్థిక భద్రత, వ్యూహాత్మక అవసరాలు, మరింత స్వావలంభన ధ్యేయంగా పరిశోధనాభివృద్ధి, ఆవిష్కరణ పథకానికి విస్తృత స్తాయిలో నిధుల కేటాయింపునకు ప్రధాని మోదీ సారథ్యంలోని కేబినెట్ తుది ఆమోదం తెలిపింది. ఈ వివరాలను సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఢిల్లీలో మీడియాతో చెప్పారు.ఆర్డీఐ రంగంలో ప్రైవేట్ సంస్థలకు తక్కువ వడ్డీకి లేదా వడ్డీరహిత రుణాలను మంజూరుచేయడం, రీఫైనాన్సింగ్ సదుపాయాలు కల్పిస్తామని మంత్రి తెలిపారు. రుణాలు పొందడంలో ప్రైవేట్ సంస్థలు ఎదుర్కొంటున్న ప్రతిబంధకాలను తొలగిస్తూ వ్యూహాత్మక రంగాల్లో నూతన ఆవిష్కరణలు, కొత్త సాంకేతికతలను జోడించడం, పోటీతత్వాన్ని పెంచేలా పథకాన్ని రూపొందించామని మంత్రి చెప్పా రు. కీలక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చేలా చేపట్టబోయే నూతన ప్రాజెక్టులకు సాయ పడటం, అవసరమైన అధునాతన సాంకేతికత అందిపుచ్చుకోవడంలో దోహదపడటం, అందుకు కావాల్సిన రుణాల మంజూరు వేగవంతం చేయడం వంటివి ఈ పథకంలో కీలకమైన అంశాలని మంత్రి వివరించారు.ఆర్డీఐ పథకం అమలు, తీరు తెన్నులు, సమీక్ష బాధ్య తలను ప్రధాని మోదీ నేతృత్వంలోని అనుసంధాన్ జాతీయ పరిశోధనా ఫౌండేషన్ (ఏఎన్ ఆర్ఎఫ్) పాలక మండలి తీసుకుంటుంది. ఈ పథకం మార్గదర్శకాలు, రంగాల వారీగా చేపట్టాల్సిన ప్రాజెక్టులు, ఆయా ప్రాజెక్టులకు ఫండ్ మేనేజర్లుగా ఏఏ సంస్థలు వ్యవహరిస్తాయనే అంశాలపై కేబినెట్ కార్యదర్శి సారథ్యంలోని భిన్న మంత్రిత్వశాఖ కార్యదర్శుల బృందం నిర్ణయాలు తీసు కుంటుంది. ఈ పథకానికి నోడల్ విభాగంగా శాస్త్ర, సాంకేతిక శాఖ వ్యవహరిస్తుంది.ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకానికి రూ.1 లక్ష కోట్లుఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకానికి రూ.1.07 లక్షల కోట్లు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. భవిష్యనిధి సంస్థ అయిన ఈపీఎఫ్ఓ సారథ్యంలో కొనసాగే సామాజిక భద్రతా స్కీమ్ల ద్వారా వచ్చే రెండేళ్లలో 3.5 కోట్ల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా రూ.1.07 లక్షల కోట్లతో పథకాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. తొలిసారిగా ఉద్యోగంలో చేరిన ఉద్యోగులకు రెండు విడతల్లో గరిష్టంగా రూ.15,000 వరకు అదనపు భత్యం ఇస్తారు. వీళ్లకు రెండేళ్లపాటు సంస్థ నగదు ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. మరోవైపు, తమిళనాడులో 87వ నంబర్ జాతీయ రహదారిలో భాగంగా పరమ కుడి– రామనాథపురం మధ్యలో నాలుగు వరసల రోడ్డు నిర్మాణం కోసం కేంద్ర కేబినెట్ రూ.1,853 కోట్లు కేటాయించింది. ఈ మార్గంలో ట్రాఫిక్ విపరీతంగా పెరగడంతో 46.7 కిలోమీటర్ల పొడవునా రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించనున్నారు. -
సుప్రీంలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారిగా రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. అత్యున్నత న్యాయస్థానంలో ప్రత్యక్ష నియామకాలు, పదోన్నతుల్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్లు కల్పిస్తూ జూన్ 24న సర్క్యులర్ జారీ చేశారు. జూన్ 23 నుంచే రిజర్వేషన్ విధానం అమల్లోకి వచ్చినట్లు వెల్లడించారు. ఈ మేరకు మోడల్ రిజర్వేషన్ రోస్టర్, రిజిస్టర్ను సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. దీని ప్రకారం.. సుప్రీంకోర్టులో పదోన్నతుల్లో ఎస్సీ ఉద్యోగులకు 15 శాతం, ఎస్టీ ఉద్యోగులకు 7.5 శాతం కోటా కల్పిస్తారు.రిజిస్ట్రార్లు, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ లైబ్రేరియన్లు, జూనియర్ కోర్టు అసిస్టెంట్లు, చాంబర్ అటెండెంట్లు ఈ రిజర్వేషన్లకు అర్హులు. న్యాయమూర్తులకు ఇవి వర్తించవు. రిజర్వేషన్ విధానంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ స్పందించారు. ప్రభుత్వ సంస్థలు, వివిధ హైకోర్టుల్లో రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయని గుర్తుచేశారు. సుప్రీంకోర్టునూ అమల్లోకి తీసుకురావడం సరైన నిర్ణయమని అభిప్రాయడ్డారు. సుప్రీంకోర్టులో రెండో దళిత ప్రధాన న్యాయమూర్తిగా ఆయన రికార్డుకెక్కిన సంగతి తెలిసిందే. దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యం పెంచడానికి ఈ రిజర్వేషన్లు దోహదపడతాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. -
పక్షులకూ భూతాపం సెగలు
ఆచార వ్యవహారాలు, సంస్కృతికి పట్టు గొమ్మ ల్లాంటి పల్లెటూర్లలో ఉదయం వెచ్చటి సూర్య కిరణ కాంతులు ఎంతటి హాయి గొల్పుతాయో అక్కడి పక్షుల కిలకిలారావాలు అంతకంటే ఎక్కువగా మనల్ని మైమరపింపజేస్తాయి. ఎలాంటి బాదరబందీలేకుండా స్వేచ్ఛగా విహరించే అలాంటి పక్షిజాతులకు ఇప్పుడు మానవ తప్పిదాలు శాపంగా మారుతున్నాయి. శిలాజ ఇంధనాల విచ్చలవిడి వినియోగం, ఇష్టారీతిన సాగుతున్న మానవ కార్యకలాపాలు, పరిశ్రమల కాలుష్యం, అడవుల నరికివేత తదితరాలతో భూగోళం మండిపోతోంది. భూతాపోన్నతి ఏటికేడు పైకి పోతోంది తప్ప కిందకు దిగిరావట్లేదు.ఈ వాతావరణ మార్పుల దుష్ప్రభావాలు ఇప్పుడు పక్షులపై పడ్డాయి. అన్నెంపున్నెం ఎరుగని పక్షులను వాతావరణమార్పుల మాటున పరోక్షంగా మానవుడు చేజేతులా చంపేస్తున్నాడన్న కఠోర వాస్తవాలు తాజాగా వెలుగుచూశాయి. వాతావరణ మార్పుల కారణంగా 500కుపైగా పక్షిజాతులు త్వరగా అంతరించిపోయే ప్రమాదపుటంచునకు చేరుతున్నాయని తాజా అధ్యయనం ఒకటి కుండబద్దలు కొట్టింది. ఇంగ్లండ్లోని బెర్క్షైర్లోని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్ పరిశోధకులు చేసిన అధ్యయనం ప్రకారం అడవుల నరికివేత కారణంగా తమ సహజ ఆవాసాలను కోల్పోతున్న వందలాది పక్షిజాతులు వచ్చే వందేళ్లలో కనుమరుగవడం ఖాయమని పరిశోధకులు తేల్చిచెప్పారు. మూడు రెట్లు పెరిగిన ముప్పుగతంలోనూ వ్యాధులు ప్రబలడం, సహజావరణంలో ఆహారం, అస్తిత్వం కోసం పోటీ, కొత్త ప్రాంతాలకు వలసలు.. ఇలా పలు కారణాల కారణంగా కొన్ని పక్షిజాతులు అంతర్థానమయ్యాయి. అయితే 1500 సంవత్సరం నుంచి చూస్తే నాడు అంతరించిపోయిన పక్షిజాతుల కంటే ఇప్పుడు వాతావరణ మార్పులు, అడవుల నరికివేత కారణాలతో అంతర్థానమవుతున్న పక్షిజాతుల సంఖ్య మూడు రెట్లు ఎక్కువగా ఉందని పరిశోధకులు ఆందోళన వ్యక్తంచేశారు. సంబంధిత పరిశోధనా తాలూకు వివరాలు ‘నేచర్ ఎకోలజీ అండ్ ఎవల్యూషన్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి.ఒంటె మెడ గొడుగు పక్షి, హెల్మెటెడ్ హార్న్బిల్ వంటి ప్రఖ్యాత పక్షిజాతులు సైతం అంతరించిపోయే ప్రమాదముంది. ‘‘ ఇప్పటికే పరిస్థితి చేయిదాటి పోయిందనే చెప్పాలి. అడవుల నరికివేత, వేటను ఆపడంతోపాటు వాతావరణ మార్పులకు అడ్డుకట్టవేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇప్పుడు మరింతగా శ్రమించాల్సి ఉంది. ప్రత్యేకంగా ఈ జాతి పక్షులను పెంచి వీటి సంతతిని వృద్ధి చేయాలి. బ్రీడింగ్ విధానాలను అమలుచేయాలి’’ అని పరిశోధనలో కీలక రచయిత కెర్రీ స్టీవార్ట్ వ్యాఖ్యానించారు. విస్తృతస్థాయిలో పరిశోధనవాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావం ఏఏ జాతి పక్షులపై అత్యధికంగా ఉందనేది నిర్ధారించుకునేందుకు పరిశోధకులు పెద్ద కసరత్తే చేశారు. అంతరించిపోయే ప్రమాదమున్న శిలీంధ్రాలు, మొక్కలు, జంతువులు, పక్షుల జాబితాను తెప్పించి అందులోని 10,000కుపైగా పక్షిజాతులపై సమగ్రస్థాయిలో అధ్యయనం చేశారు. ముఖ్యంగా వాతావరణ మార్పు ప్రభావాలకు లోనయ్యే పెద్ద రెక్కల పక్షులపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. పెద్ద రెక్కల పక్షులు ఎక్కువగా వేటగాళ్ల బారిన పడుతున్నాయి. ఈ పక్షులుండే అటవీ ప్రాంతాలు సైతం గనుల తవ్వకం, నూతన పరిశ్రమల ఏర్పాటు వంటి కారణాలతో కనుమరు గవుతు న్నాయి. ‘‘ ఆధునిక ప్రపంచంలో పక్షిజాతుల అంతర్థానం అనేది మరో అతిపెద్ద ముప్పు.అరుదైన, అంతర్థానమవుతున్న పక్షిజాతుల సంరక్షణ ఇప్పుడు తక్షణావసరం’’ అని స్టీవార్ట్ అన్నారు. ‘‘ అడవి బాగుండాలంటే పక్షులు ఉండాలి. పక్షులు అడవికి ఎంతో మేలుచేస్తాయి. వందల వేల రకాల చెట్ల పళ్లను తిని గింజలను విస్తారంగా పడేస్తాయి. తద్వారా అడవి అంతటా అన్ని రకాల మొక్కలు పుట్టుకొస్తాయి. రోజు లెక్కలేనన్ని కీటకాలను తిని పురుగుల అతి బెడదను నివారిస్తాయి. ఆకుల్ని, పూతను తిని చెట్లను నాశనంచేసే చిన్న కీటకాలను పక్షులు వేటాడి ఆయా ప్రాంతాల్లో చెట్లను పరోక్షంగా కాపాడతాయి. చిన్న పక్షులు చెట్ల పరపరాగ సంపర్కానికీ దోహదపడి పూత, కాతకు కారణమవుతాయి.అడవిలో ఆహారచక్రం సవ్యంగా ముందుకు సాగాలన్నా పక్షులు ఉండాల్సిందే. ఇంతటి కీలకమైన వందలాది పక్షిజాతులు కనుమరుగైతే జరిగే జీవావరణ నష్టాన్ని పూడ్చడం అసాధ్యం. అందుకే తక్షణం అడవుల అనవసర నరికివేతకు స్వస్తి పలకాలి. వేటగాళ్ల ఆగడాలను అడ్డుకోవాలి. అరుదైన పక్షులను ప్రత్యేకంగా పెంచి వాటి సంతతిని వృద్ధి చెందించాలి’’ అని పరిశోధనలో మరో సీనియర్ రచయిత్రి, ప్రొఫెసర్ మాన్యులా గోంజాల్వెజ్ సారెజ్ చెప్పారు. -
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. నేషనల్ స్పోర్ట్స్ పాలసీకి గ్రీన్సిగ్నల్
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జాతీయ క్రీడా విధానానికి కేంద్ర మంత్రి వర్గం పచ్చజెండా ఊపింది. దేశంలోని క్రీడా రంగాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించిన కేంద్రం.. కొత్త క్రీడా విధానానికి ఆమోదం తెలిపింది. ఉపాధి లింక్డ్ ప్రోత్సాహక పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.ఉత్పాదక రంగంలో ఉద్యోగకల్పన ప్రోత్సహించేందుకు కొత్త పథకం తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా రాబోయే రెండేళ్లలో 3.5 కోట్ల ఉద్యోగాల సృష్టికి ప్రోత్సాహకం ఇవ్వనుంది. ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 99,446 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. ఆగస్టు 1, 2025 నుంచి జూలై 31, 2027 వరకు సృష్టించే కొత్త ఉద్యోగాలకు ఈ పథకం వర్తిస్తుంది. కొత్తగా ఉద్యోగం కల్పిస్తే 15 వేల రూపాయల ప్రోత్సాహం ఇవ్వనుంది.ఈపీఎఫ్ రెండు వాయిదాలలో కేంద్ర ప్రభుత్వం చెల్లించనుంది. లక్ష రూపాయల లోపు జీతం వచ్చే ఉద్యోగులకు వర్తించనుంది. కొత్తగా ఉద్యోగం ఇచ్చిన కంపెనీలకు ప్రతినెల 3 వేల రూపాయల చొప్పున రెండు సంవత్సరాల పాటు ప్రభుత్వం చెల్లించనుంది. పరిశోధనాభివృద్ధి, ఆవిష్కరణ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ పథకం కోసం లక్ష కోట్ల రూపాయలు కేంద్రం ఖర్చు చేయనుంది. ఆర్అండ్డి రంగంలో ప్రైవేట్ రంగం పెట్టుబడులను ప్రోత్సహించడానికి తక్కువ లేదంటే.. 0 వడ్డీరేట్లతో దీర్ఘకాలిక ఫైనాన్స్న ప్రభుత్వం ఇవ్వనుంది. తమిళనాడు పారమాకుడి-రామంతపురం సెక్షన్ మధ్య నాలుగు లైన్ల జాతీయ రహదారి నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 1,853 కోట్ల రూపాయలు కేంద్రం ఖర్చు చేయనుంది. -
బుద్ధుడిపై వియత్నాం ప్రజల్లో భక్తి, ఆప్యాయత ఉన్నాయి
సాక్షి, న్యూఢిల్లీ/విజయపురి సౌత్: ప్రపంచ పర్యాటక బౌద్ధ కేంద్రమైన నాగార్జునకొండలోని భగవాన్ బుద్ధుని పవిత్ర అవశేషాలను దర్శనం చేసుకునేందుకు వీలు కలి్పంచినందుకు వియత్నాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సందేశాల ద్వారా కృతజ్ఞతలు చెబుతున్నారని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. మొదట భగవాన్ బుద్ధుని పవిత్ర అవశేషాలు రాష్ట్రంలోని పల్నాడు జిల్లా నాగార్జున కొండలో కనుగొన్నట్టు తెలిపారు.ఈ ప్రదేశానికి బౌద్ధ మతంతో లోతైన సంబంధం ఉందన్నారు. ఒకప్పుడు శ్రీలంక, చైనా వంటి సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు ఈ ప్రదేశానికి వచ్చి సందర్శించే వారని మోదీ వివరించారు. ఆదివారం జరిగిన మన్ కీ బాత్ 123వ ఎపిసోడ్లో మోదీ ప్రసంగించారు. వియత్నాం ప్రజలు పంపించిన సందేశాలలో ప్రతి పంక్తిలో భక్తి, ఆప్యాయత ఉన్నాయన్నారు. బుద్ధుని పవిత్ర అవశేషాలను దర్శనం చేసుకునేందుకు వీలు కల్పించినందుకు వారు భారతదేశానికి తమ కృతజ్ఞతను వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. ఆదివాసీ విద్యార్థులు భేష్ ‘పదేళ్ల క్రితం ప్రారంభమైన అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం గొప్పగా మారుతోంది. విశాఖపట్నంలో జరిగిన యోగా దినోత్సవంలో చాలా ఆకర్షణీయమైన చిత్రాలను మనం చూశాం. బీచ్లో 3 లక్షల మంది యోగా చేయడం.. యోగాపై వారికున్న అంకితభావాన్ని గుర్తు చేస్తోంది’ అని మన్ కీ బాత్లో మోదీ గుర్తు చేసుకున్నారు. దేశ ప్రజలంతా అంతర్జాతీయ యోగా దినోత్సవం జ్ఞాపకాలతో నిండి ఉండాలని ఆకాంక్షించారు.ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘విశాఖ నుంచే మరో అద్భుతమైన దృశ్యం వెలువడింది. రెండు వేలకు పైగా ఆదివాసీ విద్యార్థులు 108 నిమిషాల పాటు సూర్య నమస్కారాలు చేశారు. వారికి యోగాపై ఎంత క్రమశిక్షణ, ఎంత అంకితభావం ఉందో మీరే ఊహించుకోండి. మన నావికాదళ నౌకలపై కూడా యోగా గొప్పతనం కనిపించింది’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. -
ప్రయాణానికి 8 గంటల ముందే రిజర్వేషన్ చార్ట్
న్యూఢిల్లీ: రైలు ప్రయాణికులకు శుభవార్త. రైలు బయలుదేరడానికి 8 గంటల ముందే రిజర్వేషన్ చార్ట్ సిద్ధం చేయాలని నిర్ణయించినట్లు రైల్వే శాఖ ఆదివారం వెల్లడించింది. ప్రస్తుతం 4 గంటల ముందు రిజర్వేషన్ చార్ట్ ప్రకటిస్తున్నారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం ఇకపై 8 గంటల ముందే చార్ట్ విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ప్రయాణం విషయంలో గందరగోళానికి తెరపడనుంది.రిజర్వేషన్ ఖరారు అయ్యిందో లేదో 8 గంటల ముందే తెలిసిపోతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవచ్చు. ముఖ్యంగా వెయిటింగ్ లిస్టు ప్రయాణిలకు లబ్ధి చేకూరనుంది. టికెట్ బుకింగ్ వ్యవస్థలో చేపట్టాల్సిన సంస్కరణపై రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇటీవల సమీక్ష నిర్వహించారు. టికెటింగ్ వ్యవస్థ పూర్తి పారదర్శ కంగా, ప్రభావవంతంగా, ప్రయాణికులకు సౌలభ్యంగా ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగానే రిజర్వేషన్ చార్ట్ను ప్రయాణానికి 8 గంటల ముందు ప్రకటించాలని నిర్ణయించారు. ఈ విధానాన్ని దశల వారీగా అమల్లోకి తీసుకొస్తారు. -
దేశమంతటా రుతుపవనాలు
న్యూఢిల్లీ: నైరుతీ రుతుపవనాలు ఈ సీజన్లో తొమ్మిది రోజులు ముందుగానే దేశమంతటా విస్తరించాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఆదివారం తెలిపింది. సాధారణంగా జూన్ ఒకటిన కేరళ మీదుగా దేశంలోకి ప్రవేశించే రుతుపవనాలు జూలై 8వ తేదీనాటికి దేశవ్యాప్తంగా విస్తరిస్తా యని పేర్కొంది. ఈసారి మాత్రం ముందుగానే ప్రవేశించడంతోపాటు విస్తరించాయంది. 2020లో జూన్ 26వ తేదీకల్లా దేశమంతటా రుతు పవనాల విస్తరణ పూర్తయిందని గుర్తు చేసింది. ఆదివారం దేశ రాజధాని ఢిల్లీతోపాటు రాజస్తాన్, పశ్చిమ యూపీ, హరియాణాల్లో వ్యాపించాయని వివరించింది.వచ్చే వారం రోజుల్లో దేశంలోని వాయవ్య, మధ్య, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని స్పష్టం చేసింది. అరేబియా సముద్రం, బంగాళాఖాతం మీదుగా బలమైన అల్పపీడన వ్యవస్థల మద్దతుతో, రుతుపవనాలు వేగంగా ముందుకు సాగాయని తెలిపింది..అయితే, మే 29 నుంచి జూన్ 16 వరకు దాదాపు 18 రోజుల పాటు రుతు పవనాల కదలికలో స్తబ్దత ఏర్పడిందని పేర్కొంది. జూన్–సెప్టెంబర్ మధ్య ఈసారి సాధారణానికి మించి వర్షాలు కురిసే అవకాశాలున్నాయంది.ఉత్తరాఖండ్లో కుంభవృష్టి..ఇద్దరు మృతిఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో ఆదివారం ఉదయం కురిసిన కుంభవృష్టి నిర్మాణ కార్మికులిద్దర్ని బలి తీసుకుంది. మరో ఏడుగురు గల్లంతయ్యారు. యమునోత్రి జాతీయ రహదారి పక్కన ఓ హోటల్ నిర్మాణం పక్కనే కార్మికులు తాత్కాలిక నివాసాల్లో ఉంటున్నారు. భారీ వర్షంతో కొండచరియలు విరిగి ఈ నివాసాలపై పడ్డాయి. ఈ ఘటనలో ఘటనలో ఇద్దరు చనిపోయారు.గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చేపట్టాయి. హైవే దెబ్బతినడంతో ఛార్ ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. హిమాచల్ ప్రదేశ్లోనూ కుంభవృష్టి కారణంగా సిమ్లా–కల్కా రైలు మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. జార్ఖండ్లోని ఈస్ట్ సింగ్భుమ్ జిల్లాలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. పండర్సోలిలోని ప్రైవేటు స్కూల్ ఆవరణలోకి వరద చేరడంతో లోపల కనీసం 162 మంది విద్యార్థులు చిక్కుబడిపోయారు. -
ఎమర్జెన్సీ యోధులు చిరస్మరణీయులు
న్యూఢిల్లీ: దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన వ్యక్తులు రాజ్యాంగాన్ని హత్య చేయడంతోపాటు న్యాయ వ్యవస్థను చెరబట్టారని, కీలుబొమ్మను చేసి ఆడించారని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఎమర్జెన్సీ పేరిట అప్పటి ప్రభుత్వం ప్రజలను వేధింపులకు గురి చేసిందని, లెక్కలేనన్ని అఘాయిత్యాలు జరిగాయని ఆరోపించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం సాగించిన నాయకులు చిరస్మరణీయులని చెప్పారు. రాజ్యాంగ పరిరక్షణ విషయంలో వారి పోరాటమే మనకు స్ఫూర్తి అని ఉద్ఘాటించారు. ఆదివారం 123వ ‘మన్కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.ప్రజల భాగస్వామ్యం, వారి సమ్మిళిత శక్తితో ఎలాంటి సంక్షోభాలనైనా ఎదుర్కోవచ్చని అన్నారు. కొన్ని ఆడియో రికార్డులను ప్రధానమంత్రి వినిపించారు. సంక్షోభం అంటే ఎంత భయకరంగా ఉంటుందో వీటిద్వారా తెలుస్తుందని అన్నారు. ఎమర్జెన్సీ తర్వాత ప్రధానమంత్రిగా పనిచేసిన మొరార్జీ దేశాయ్ మాట్లాడిన ఆడియో, ఎమర్జెన్సీ దారుణాల గురించి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయ్, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ మాట్లాడిన ఆడియోలు ఇందులో ఉన్నాయి. నాటి దారుణాలు మరవలేం ‘‘ఇందిర హయాంలో ప్రజలపై దమనకాండ కొన్ని సంవత్సరాలపాటు నిరంతరాయంగా కొనసాగింది. ఎమర్జెన్సీ ప్రకటించిన తర్వాత రెండేళ్లపాటు మరింత తీవ్రంగా మారింది. ప్రజల హక్కులను హరించారు. స్వాతంత్య్రపు హక్కును అణచివేశారు. వార్తాపత్రికలపై కఠిన ఆంక్షలు విధించారు. కోర్టులను సైతం వదల్లేదు. వాటికి అధికారాలు లేకుండా చేశారు. లక్ష మందికిపైగా జనాన్ని జైళ్లలో పెట్టారు. అక్షరాలా రాక్షస పాలన సాగించారు’’ అని మొరార్జీ దేశాయ్ మాట్లాడిన ఆడియోలో వినిపించింది. 1975 నుంచి 1977 దాకా 21 నెలలపాటు ప్రజలను చిత్రహింసలకు గురి చేశారని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. అప్పటి దారుణాలను ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు.జార్జి ఫెర్నాండెజ్ చేతులకు సంకెళ్లు వేశారని, మీసా చట్టం కింద వేలాది మందిని నిర్బంధించి, వారిపట్ల అమానవీయంగా ప్రవర్తించారని గుర్తుచేశారు. కానీ, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేశారని, చివరకు విజయం సాధించారని చెప్పారు. ఎమర్జెన్సీ విధించినవారికి గట్టిగా బుద్ధి చెప్పారని అన్నారు. ఎమర్జెన్సీకి 50 ఏళ్లయిన సందర్భంగా ఇటీవల ‘సంవిధాన్ హత్య దివస్’ జరుపుకున్నామని మోదీ తెలిపారు. 1977 ఎన్నికల్లో ఇందిరా గాంధీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత వాజ్పేయ్ ఏం మాట్లాడారంటే.. ‘‘దేశంలో ఇప్పుడు జరిగిన దాన్ని కేవలం ఎన్నికలు అనలేం. ఇదొక శాంతియుత విప్లవం. ప్రజా వెల్లువ ప్రజాస్వామ్య హంతకులను కుర్చీ నుంచి కూలదోసింది. వారిని చెత్తబుట్టలోకి విసిరేసింది’’ దీనిపై మోదీ స్పందిస్తూ.. అత్యవసర పరిస్థితిని ఎదిరించి పోరాడిన వారిని మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలని చెప్పారు.ట్రకోమా రహిత దేశంగా భారత్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ‘ట్రకోమా’ రహిత దేశంగా భారత్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిందని ప్రధాన మోదీ అన్నారు. ఇందుకోసం కృషి చేసినవారికి అభినందనలు తెలియజేశారు. అస్సాంలోని బోడోలాండ్ ఫుట్బాల్ క్రీడాకారులుకు కేంద్రంగా మారిందని హర్షం వ్యక్తంచేశారు. మేఘాలయాలో ఎరీ సిల్క్కు భౌగోళిక గుర్తింపు(జీఐ) ట్యాగ్ లభించిందని ప్రత్యేకంగా ప్రస్తావించారు. పట్టు పరుగులను చంపకుండా అక్కడ వ్రస్తాలు తయారు చేస్తున్నారని ప్రధాని వెల్లడించారు. -
2026 ఏప్రిల్ 1 నుంచి తొలిదశ జనగణన
న్యూఢిల్లీ: దేశ చరిత్రలో 16వ జన గణన, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 8వ జన గణనకు రంగం సిద్ధమవుతోంది. 2026 ఏప్రిల్ 1 నుంచి జన గణన అధికారికంగా ప్రారంభం కానుంది. జనాభా లెక్కల సేకరణ వీలుగా పరిపాలనా యూనిట్ల సరిహద్దుల్లో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటే ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీలోగా ప్రతిపాదించాలని కేంద్రం సూచించింది. జన గణన ప్రక్రియకు మార్పులు చేసిన పరిపాలనా యూనిట్లను పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించింది. డిసెంబర్ 31న సరిహద్దులు ఖరారు చేస్తామన్నారు.ఈ మేరకు రిజి్రస్టార్ జనరల్, సెన్సెస్ కమిషనర్ ఆఫ్ ఇండియా మృత్యుంజయ్ నారాయణ్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, పట్టణాలను ఏకరూప ఎన్యూమరేషన్ బ్లాక్లుగా విభజించనున్నట్లు తెలిపారు. ఒక్కో బ్లాక్కు ఒక ఎన్యూమరేటన్ను నియమిస్తారు. జనాభా లెక్కల సేకరణలో పొరపాట్లు జరగకుండా వీరు చర్యలు తీసుకుంటారని వివరించారు. 3 నెలల్లోగా జన గణన పూర్తిచేయాల్సి ఉంటుంది.2027 మార్చి 1వ తేదీ లోగా రెండు దశల్లో జనాభా లెక్కల సేకరణ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి దశలో హౌజ్లిస్టింగ్ ఆపరేషన్, రెండో దశలో పాపులేషన్ ఎన్యూమరేషన్ నిర్వహిస్తారు. హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ 2026 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఈసారి జన గణనతోపాటు కుల గణన కూడా చేపట్టనున్నారు. ఎన్యూమరేషన్ బ్లాక్లు ఖరారైన తర్వాత పరిపాలనా యూనిట్ల సరిహద్దుల్లో మార్పులు చేయడానికి వీలుండదు. దేశంలో చివరిసారిగా 2011లో జన గణన జరిగింది. మళ్లీ 16 ఏళ్ల తర్వాత.. 2027లో జరగబోతోంది. -
సిలికాన్ లేకుండానే కంప్యూటర్
న్యూఢిల్లీ: సెమీకండక్టర్ టెక్నాలజీలో రారాజుగా వెలుగొందుతున్న సిలికాన్ మూలకానికి ఉన్న ప్రాభవం భవిష్యత్తులో తగ్గిపోనుందని తాజా పరిశోధన ఒకటి స్పష్టంచేస్తోంది. ఆధునిక ఎలక్ట్రానిక్, సాంకేతిక ప్రపంచానికి ప్రాణాధారంగా నిలుస్తున్న స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లలో సిలికాన్ మూలకం అత్యంత కీలకం. ఈ మూలకం లేకుండా ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువు పురుడుపోసుకోదన్న వాదనను బద్దలుకొడుతూ అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ పరిశోధనా బృందం ప్రపంచంలోనే తొలిసారిగా సిలికాన్రహిత కంప్యూటర్ను అభివృద్ధిచేసింది. గత అర్ధశతాబ్దకాలంతో పోలిస్తే నేటి కంప్యూటర్ల పరిమాణం తగ్గడానికి, స్మార్ట్ఫోన్లు, విద్యుత్ వాహనాల సర్క్యూట్లలో సిలికాన్ అత్యంత ప్రధానమైన మూలకం.అలాంటి సిలికాన్ లేకుండానే ‘కాంప్లిమెటరీ మెటల్ –ఆక్సైడ్ సెమీకండక్టర్’ కంప్యూటర్ను తయారుచేశామని వర్సిటీ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ పరిశోధనా తాలూకు వివరాలు ‘నేచర్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి. తక్కువ పరిమాణంలో విద్యుత్తో వినియోగించుకుంటూ అత్యంత పల్చటి, వేగవంతమైన ఎలక్ట్రానిక్స్ తయారీకి ఈ ద్విమితీయ వస్తువులు బాటలు వేస్తాయని పరిశోధకులు చెప్పారు. సర్క్యూట్లో ట్రాన్సిస్టర్లు ముఖ్యమైనవి. ఈ ట్రాన్సిస్టర్లను అత్యంత శుద్ధమైన సిలికాన్తో తయారుచేస్తారు. అయితే తాజా పెన్సిల్వేనియా వర్సిటీ పరిశోధకులు సిలికాన్కు బదులుగా ఎన్–టైప్ ట్రాన్సిస్టర్ కోసం మాలిబ్డినమ్ డైసల్ఫైడ్, పీ–టైప్ టాన్సిస్టర్ కోసం టంగ్స్టన్ డైసెలినైడ్ను ఉపయోగించారు. సారథ్యం వహించిన భారతీయుడుఈ పరిశోధనకు పెన్సిల్వేనియా వర్సిటీలోని ఇంజనీరింగ్ సైన్స్, మెకానిక్స్ విభాగ ప్రొఫెసర్, భారతీయ మూలాలున్న సప్తర్షి దాస్ సారథ్యం వహించారు. ఈయన నేతృత్వంలోని బృందం తాజాగా ప్రాథమిక స్థాయిలో కాంప్లిమెంటరీ మెటల్–ఆక్సైడ్ సెమీకండక్టర్ (సీఎంఓఎస్)కంప్యూటర్ను తయారు చేసింది. ‘‘ సిలికాన్ పాడైతే ఆ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ సామర్థ్యం కూడా దెబ్బతింటుంది. అదే ఈ ద్విమితీయ వస్తువులతో తయారైన సర్క్యూట్.. విద్యుత్ ప్రవాహాన్ని స్థిరీకరిస్తుంది. దాంతో సర్క్యూట్ ఎక్కువకాలం మన్నుతుంది. ఎలక్ట్రానిక్ సర్క్యూట్ రంగంలో ఇదొక మైలురాయి.భవిష్యత్తులో సిలికాన్రహిత సర్క్యూట్ల తయారీకి ఇది బాటలువేస్తుంది’’ అని సప్తర్షి దాస్ వివరించారు. మెటల్–ఆర్గానిక్ కెమికల్ వేపర్ డిపోజీషన్(ఎంఓసీవీడీ) విధానంలో అత్యంత పల్చని పొరల మీద మాలిబ్డినమ్ డైసల్ఫైడ్, టంగ్స్టన్ డైసెలినైడ్ పరుచుకునేలా చేస్తారు. తద్వారా ఈ వినూత్న ట్రాన్సిస్టర్లను తయారుచేశారు. రెండు అంగుళాల పొరమీద సైతం ఈ ట్రాన్సిసర్ను అభివృద్ధిచేయొచ్చు. ఈ కంప్యూటర్ అత్యంత తక్కువ కరెంట్ను ఉపయోగించుకుంటూ 25 కిలోహెడ్జ్ సామర్థ్యంతో పనిచేస్తుందని పరిశోధనలో కీలకపాత్ర పోషించిన డాక్టోరల్ విద్యార్థి, భారతీయ మూలాలున్న సుభీర్ ఘోష్ చెప్పారు. ఈ ప్రాథమిక స్థాయి కంప్యూటర్ ప్రస్తు తానికి సింపుల్ లాజిక్ ఆపరేషన్స్ను సమర్థవంతంగా పూర్తిచేయగలదు.భవిష్యత్తు అంతా 2డీదే‘‘మీరొక బహుళ అంతస్తుల భవనం కట్టాలంటే పటిష్టమైన ఇటుకలను వాడతారు. కానీ ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న నూతన సాంకేతికతను ఉపయోగించి పటిష్టమైన పల్చటి పేపర్లతోనూ నిర్మాణం పూర్తిచేయొచ్చు. పల్చని, వేగవంతమైన ట్రాన్సిస్టర్లతో కంప్యూటర్నూ రూపొందించవచ్చు’’ అని సప్తర్షి వ్యాఖ్యానించారు. సిలికాన్ సాంకేతికత గత 80 ఏళ్లుగా సరైన అభివృద్ధికి నోచుకోలేదు. కానీ 2డీ టెక్నాలజీ 2010లో మొదలైనా వెనువెంటనే అభివృద్ధిచెందుతోంది. భవిష్యత్తు అంతా 2డీ టెక్నాలజీదే’’ అని పరిశోధకులు చెప్పారు. ఈ పరిశోధనకు అమెరికా నేషనల్ సైన్స్ ఫౌండేషన్, ది ఆర్మీ రీసెర్చ్ ఆఫీస్, నేవీ రీసెర్చ్ ఆఫీస్లు సైతం ఆర్థికసాయం అందిస్తున్నాయి. -
మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
అహ్మదాబాద్ ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదం తర్వాత ప్రయాణికులు హడలెత్తిపోతుండగా.. వరుసగా అదే సంస్థకు చెందిన విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో వామ్మో ఎయిరిండియా అనాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. టోక్యో-ఢిల్లీ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తగా.. కోల్కతా ఎయిర్పోర్టులో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.టోక్యో హనేడా ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సమస్య కారణంగా కోల్కతాకు మళ్లించారు. ఢిల్లీకి వస్తున్న AI 357 బోయింగ్ విమానంలో ప్రయాణికులు, సిబ్బంది.. క్యాబిన్లో ఉష్ణోగ్రత పెరగడాన్ని గుర్తించారు. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విమానాన్ని కోల్కతాలో ల్యాండ్ చేశారు.విమానం కోల్కతాలో సురక్షితంగా ల్యాండ్ అయిందని ఎయిర్ ఇండియా ప్రకటించింది. విమానంలో సాంకేతిక తనిఖీలు జరుగుతున్నాయని పేర్కొంది. కోల్కతాలోని గ్రౌండ్ సిబ్బంది.. ప్రయాణీకులకు సహాయం చేస్తున్నారని.. వీలైనంత త్వరగా వారిని ఢిల్లీకి తీసుకెళ్లడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది. -
డీపీఆర్లో స్పష్టత లేదు
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ రెండో దశలోని కొన్ని కీలక అంశాలపై తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పష్టత కొరవడినందునే ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)లో ప్రాజెక్ట్కు సంబంధించిన చాలా అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాధానాలు రావాల్సి ఉందని, ఇవి లేకుండా ప్రాజెక్ట్కు అనుమతులు ఇవ్వడం సాధ్యం కాదని చెబుతున్నాయి.ముఖ్యంగా ఎల్ అండ్ టీ సంస్థ నెట్వర్క్పై ఉమ్మడి స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవై) ట్రైన్లు నడిపే ఏర్పాట్లు ఎలా ఉంటాయి? ఎల్ అండ్ టీ నెట్వర్క్పై నడిస్తే విద్యుత్తు టారిఫ్, రవాణా చార్జీలు ఎంత ఉంటాయి? అనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రం క్లారిటీ కోరుతు న్నట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిన తర్వాత అనుమతులు ఇవ్వటంపై ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇటీవలే మెట్రో ఫేజ్–2 డీపీఆర్ను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఏఎంఆర్ఎల్) కేంద్రానికి సమర్పించింది. అయితే, పుణే మెట్రోకు అనుమతిచ్చిన కేంద్రం.. హైదరాబాద్ మెట్రోపై మాత్రం నోరు మెదపలేదు. డీపీఆర్లో స్పష్టత లేకుండా ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే అవకాశం లేదని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. కేంద్రం లేవదీసిన కొన్ని ప్రశ్నలు..» మొత్తం 76.4 కి.మీ. నిడివితో 5 కారిడార్లతో రూ.2,269 కోట్ల ఖర్చుతో హైదరాబాద్ మెట్రో ఫేజ్–2ను నిర్మించేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. కొత్త లైన్లు, ఇప్పటికే ఉన్న లైన్లపై రైళ్లను సమన్వయంతో నడుపుతామని డీపీఆర్లో ప్రస్తావించారు. అయితే, ఎల్ అండ్ టీ నెట్వర్క్పై ఉమ్మడి ఎస్పీవై ట్రైన్లు నడిపే ఏర్పాట్లు ఎలా ఉంటాయన్నది స్పష్టంగా పేర్కొనలేదు. » 50:50 ఎస్పీవై ట్రైన్లు ఎల్అండ్టీ నెట్ వర్క్పై నడిస్తే విద్యుత్తు టారిఫ్, రవాణా చార్జీలు ఎంత ఉంటాయనేది స్పష్టంగా తెలియాలి. ఇలాంటి సేవల వల్ల ఎల్ అండ్ టీకి పరోక్షంగా లాభం కలుగుతోంది. కానీ, ఎస్పీవై మాత్రం ఆ ఖర్చులు చెల్లించాల్సి ఉంటుంది. » ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో కారిడార్లపై మూడు కార్ ట్రైన్లు నడుస్తున్నాయి. రోజుకు సుమారు 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ట్రైన్లు చాలక కిక్కిరిసిపోతున్నాయి. ఎల్ అండ్ టీ సంస్థ అదనపు బోగీలు, ట్రైన్లను అందుబాటులోకి తేవాల్సి ఉంది. కానీ, డీపీఆర్లో దీనిపై స్పష్టత లేదు. ప్రభుత్వం ఈ విషయంపై ఎల్ అండ్ టీతో చర్చించిందా? అనే విషయంలోనూ స్పష్టత లేదు.» జూన్ 3వ తేదీ తర్వాత మంత్రిత్వ శాఖ నిర్వహించిన సమావేశంలో ఎల్ అండ్ టీ మెట్రో రైలు ఎండీ పాల్గొన్నారు. ఖర్చు పంచుకోవడం, ఆపరేషనల్ అంశాలపై ఇంకా అంగీకారం లేదు. ఫేజ్–2 అమలయ్యాక ప్రభుత్వ సంస్థతో లాభాలు పంచుకోలేం అని ఆయన స్పష్టంగా తెలిపారు అని కేంద్రం పేర్కొంది. -
Kolkata: లా విద్యార్థిని అత్యాచారం కేసులో నాలుగో నిందితుడు అరెస్ట్
కోల్కతా: సంచలనం సృష్టించిన పశ్చిమ బెంగాల్ లా ఫస్ట్ ఇయర్ విద్యార్థినిపై జరిగిన అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ దారుణంలో ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేయగా.. విద్యార్థినిపై దారుణం జరిగిన తర్వాత కూడా ఆమెను వేధించిన కాలేజీ క్యాంపస్ సెక్యూరిటీ గార్డు పినాకి బెనర్జీని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు అధికార తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగంలో కీలకంగా వ్యవహరించడంతో ఈ ఘటన రాజకీయ విమర్శలకు దారి తీసింది. కోల్కతాలోని కస్బా ప్రాంత న్యాయ కళాశాలలో జూన్ 25న రాత్రి మొదటి సంవత్సరం లా చదువుతున్న 24 ఏళ్ల విద్యార్థినిపై కాలేజీ క్యాంపస్లోనే అత్యాచారం జరిగింది. జూలై 16న జరగనున్న సెమిస్టర్ పరీక్షల కోసం పరీక్షా ఫారాలను పూర్తి చేసేందుకు బుధవారం కాలేజీ క్యాంపస్కు వచ్చింది. విద్యార్థి సంఘం గదిలో కూర్చుని పత్రాలు నింపుతుండగా అధికార తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన ఛాత్ర పరిషత్ (టీఎంసీపీ) జిల్లా ప్రధాన కార్యదర్శి మోనోజిత్ మిశ్రా (31) అక్కడికి వచ్చాడు. ఆమెతోపాటు మరో ఆరుగురు విద్యార్థులను కూర్చోబెట్టి టీఎంసీపీ గురించి, తన అధికారాల గురించి మాట్లాడాడు. బాధితురాలిని కళాశాల విద్యార్థిని విభాగం కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించాడు.సాయంత్రం దాకా ఆమెను ఒక్కదాన్నే ఆ గదిలో కూర్చోమని చెప్పాడు. అనంతరం జరిగిన పరిణామాలను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. ‘‘మోనోజిత్ గదిలోకి వచ్చి, ఉన్నట్టుండి తనను పెళ్లి చేసుకోవాలంటూ ప్రతిపాదించాడు. దాంతో విస్తుపోయా. ఇంకొకరితో ప్రేమలో ఉన్నానంటూ అందుకు నిరాకరించా. దాంతో ఒక్కసారిగా ఆగ్రహించాడు. కాలేజీ మెయిన్ గేట్కు తాళం వేయాల్సిందిగా అక్కడి వారిని ఆదేశించాడు. నన్ను పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డు రూంలోకి బలవంతంగా లాక్కెళ్లాడు.మా కాలేజీలో ఫస్టియర్ చదువుతున్న జయీబ్ అహ్మద్ (19), ప్రమీద్ ముఖర్జీ (20)తో కలిసి నాపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తప్పించుకోవడానికి ప్రయ త్నిస్తే అడ్డుకుని చేయిచేసుకున్నాడు. బాయ్ఫ్రెండ్ ఉన్నాడని, వదిలేయాలని కాళ్లు పట్టుకుని బతిమాలినా కనికరించలేదు. ఈ దారుణాన్ని జయీబ్, ప్రమీద్ ఫోన్లలో చిత్రీకరించారు. ఆ వీడియోను నా బంధుమిత్రులకు పంపుతామని బెదిరించారు. కాలేజీ గార్డు కూడా నన్ను కాపాడేందుకు ప్రయత్నించలేదు. బుధవారం రాత్రి 7.30 నుంచి 10.50 మధ్య ఈ దారుణం జరిగింది. దీని గురించి ఎవరికైనా చెబితే దారుణ పరిణామాలుంటాయని మోనోజిత్ బెదిరించాడు.నా బోయ్ఫ్రెండ్కు హాని తలపెడతామని, తల్లితండ్రులను తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని భయపెట్టాడు’’ అని వాపోయింది. ‘‘క్రూరమైన లైంగిక దాడిలో తీవ్రంగా గాయపడ్డా. ఒక దశలో శ్వాస కూడా అందలేదు. ఆస్పత్రికి తీసుకెళ్లమని ప్రాధేయపడ్డా మోనోజిత్ పట్టించుకోలేదు. పైగా హాకీ స్టిక్ చూపించి, కొడతానని బెదిరిస్తూ వెళ్లిపోయాడు’’ అని వివరించింది. ‘‘ప్రధాన నిందితునికి మిగతా ఇద్దరు సహకరించారు. -
ఐరాస సాయం తిరస్కరించిన భారత్
న్యూఢిల్లీ: ఎయిరిండియా విమాన ప్రమాద దర్యాప్తులో సాయం చేస్తామన్న ఐక్యరాజ్యసమితి విమానయాన దర్యాప్తు సంస్థ ప్రతిపాదనను భారత్ తిరస్కరించింది. కీలకమైన బ్లాక్ బాక్స్ డేటాను విశ్లేషించడంలో జాప్యం జరుగుతోందని భద్రతా నిపుణులు అంటుండటం తెలిసిందే. జూన్ 13న స్వాధీనం చేసుకున్న కంబైన్డ్ బ్లాక్ బాక్స్ యూనిట్ స్థితి, జూన్ 16న దొరికిన కాక్పిట్ వాయిస్ రికార్డర్తో సహా దర్యాప్తు గురించి సమాచారం లేకపోవడాన్ని వారు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో దర్యాప్తులో సాయం చేసేందుకు ఐరాస సంస్థ ముందుకొచ్చింది. భారత్లో ఉన్న తమ అధికారికి పరిశీలకుడి హోదా ఇవ్వాలని కోరింది. అందుకు భారత్ తిరస్కరించింది. 2014లో మలేషియా విమాన ప్రమాదం, 2020లో ఉక్రేనియా జెట్లైనర్ కూలిపోయిన ఘటనల్లో దర్యాప్తులకు సాయపడేందుకు ఆ దేశౠల విజ్ఞప్తి మేరకు అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ పరిశోధకులను నియమించింది. ప్రమాదం జరిగిన రెండు వారాల తర్వాత దర్యాప్తు అధికారులు ఫ్లైట్ రికార్డర్ డేటాను డౌన్లోడ్ చేసుకున్నట్టు పౌర విమానయాన శాఖ గురువారం తెలిపింది. -
పెళ్లికి నిరాకరించిందని.. కాలేజీలోనే లా విద్యార్థినిపై గ్యాంగ్రేప్
కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్కతాలో ఆర్జీకర్ ఆస్పత్రిలో (rg kar medical college and hospital) జూనియర్ వైద్యురాలి ఘటన మరువకముందే.. మరో దారుణం వెలుగులోకి వచ్చింది. పెళ్లికి నిరాకరించిందనే అకారణంగా లా కాలేజీలో (Calcutta Law College) న్యాయవిద్యను అభ్యసిస్తున్న లా విద్యార్థినిపై ముగ్గురు విద్యార్థులు దారుణానికి ఒడిగట్టారు. కాలేజీ క్యాంపస్లోని సెక్యూరిటీ గార్డు రూమ్లో నిందితులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో ఈ దుర్ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. బాధితురాలు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు లా కాలేజీ పూర్వ విద్యార్థి కాగా.. మరో ఇద్దరు పూర్వ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. Kolkata Law student gang-raped inside college campusDo not repost @ravish_journo will get angry if news go viral. pic.twitter.com/Q8sqXyeCmt— Lala (@FabulasGuy) June 27, 2025కోల్కతా పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దక్షిణ కోల్కతాలోని కస్బా ప్రాంతంలోని సౌత్ కోల్కతా లా కాలేజీలో జూన్ 25 రాత్రి 7.30 నుంచి 10.30 సమయంలో కాలేజీ క్యాంపస్లోనే లా విద్యార్థినిపై ముగ్గురు నిందితులు గ్యాంగ్రేప్ జరిగినట్లు తెలిపారు. వారిలో ఒకరు మోనోజిత్ మిశ్రా (31) ఆ కాలేజీకి కాలేజీకి అధికార పార్టీ తృణముల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం యూనిట్ ప్రెసిడెంట్గా పనిచేశారు. టీఎంసీ నేతలతో మిశ్రా సన్నిహితంగా ఉన్న ఫొటోలు సైతం వెలుగులోకి రావడంతో రాజకీయ దుమారం చెలరేగింది. మిగిలిన ఇద్దరు ప్రస్తుతం అదే కాలేజీలో లా చదువుతున్న జైబ్ అహ్మద్ (19), ప్రమిత్ ముఖర్జీ (20)గా గుర్తించారు. కాళ్లమీద పడ్డా కనికరించని నిందితులుబాధిత విద్యార్థిని ఘటన జరిగిన బుధవారం మధ్యాహ్నం 12గంటల సమయంలో పరీక్షకు సంబంధించిన ఫారాలను ఫిల్ చేసేందుకు వచ్చారు. ఆ సమయంలో కాలేజీ యూనియన్ రూమ్ లోపల కూర్చున్నారు. అప్పుడే నిందితుడు ఆదేశాలతో గుర్తు తెలియని వ్యక్తులు కాలేజీ మెయిన్ గేటు కాలేజీకి తాళం వేశారు. తరువాత క్యాంపస్లోని సెక్యూరిటీ గార్డు రూమ్లో అత్యాచారం చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘ముగ్గురిలో నిందితుల్లో ఒకరైన మిశ్రా నన్ను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడు. దీంతో ఇప్పటికే నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పా. అంతే మిశ్రా కోపంతో రగిలిపోయాడు. నన్ను ఓ రూమ్లోకి నెట్టి తాళం వేశాడు. నన్ను,నా స్నేహితుడిని చంపేస్తామని, నా తల్లిదండ్రుల్ని అరెస్ట్ చేయిస్తానని బెదిరించాడు.దారుణం జరుగుతుండా వీడియోలు తీసివద్దని మిశ్రా కాళ్లమీద పడ్డా కనికరించలేదు. గార్డ్ రూమ్కి బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేశారు. దారుణం జరిగే సమయంలో నిందితులు వీడియోలు తీశారు. సహకరించపోతే ఆ వీడియోలను లీక్ చేస్తామని బెదిరించారు. తప్పించుకునేందుకు ప్రయత్నించగా నిందితులు హాకీ స్టిక్తో దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయ’ని బాధితురాలి ఫిర్యాదుతో కస్బా పోలీసులు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధితురాలికి ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించి, ఫోరెన్సిక్ పరీక్షల కోసం సంఘటన స్థలాన్ని భద్రపరిచారు.నిందితులకు ఐదురోజుల పోలీస్ కస్టడీజూన్ 26న తల్బాగన్ క్రాసింగ్లోని సిద్ధార్థ శంకర్ రాయ్ శిశు ఉద్యాన్ సమీపంలో మోనోజిత్ మిశ్రా, జైబ్ అహ్మద్లను అరెస్టు చేయగా, జూన్ 27 తెల్లవారుజామున ప్రమిత్ ముఖర్జీని అతని నివాసంలో అరెస్టు చేశారు. ముగ్గురి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను గురువారం అలీపోర్ కోర్టులోని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. పద్నాలుగు రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే తదుపరి దర్యాప్తు కోసం కోర్టు ముగ్గురినీ ఐదు రోజుల పోలీసు కస్టడీకి మంజూరు చేసింది. పెల్లుబికుతున్న ఆగ్రహావేశాలు గతేడాది ఆగస్టులో కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలి ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. లా విద్యార్థిని ఘటన వెలుగులోకి రావడంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో మహిళల భద్రతపై ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. లా కాలేజీలో దుర్ఘటనలో నిందితుల్లో ఒకరు తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగంలో కీలక నేతగా వ్యవహరించడంతో అక్కడ రాజకీయ దుమారం చెలరేగింది. ఈ సంఘటనపై అధికార టీఎంసీపై ప్రతిపక్ష బీజేపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు.స్పందించిన టీఎంసీఈ తరుణంలో లా విద్యార్థినిపై జరిగిన ఘటన నిజంగా సిగ్గుచేటు.అయినప్పటికీ, కాలేజీలు, విద్యాసంస్థలలో పోలీసులను మోహరించడం సాధ్యం కాదు’ అని తృణమూల్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ అన్నారు. మహిళా సహోద్యోగులను రక్షించడం పురుష సహోద్యోగుల విధి. కొంతమంది వికృత పురుషులు ఇలాంటి నేరాలు చేస్తారు. ఈ వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మహిళలు సైతం ఈ తరహా నిందితులపై పోరాడాలి. అది ప్రభుత్వ కళాశాల అయినా.. కళాశాల పరిపాలనపై విభాగంపై చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసులే బాధ్యత వహించాలిఈ సంఘటనపై ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ దారుణానికి పోలీసులే బాధ్యత వహించాలి. కోల్కతాలోని మొత్తం పోలీసులను దిఘా (రథ యాత్రలో)కి పాల్గొన్నారు. కోల్కతా పోలీసులు అక్కడ ఏం చేస్తున్నారు? మమతా బెనర్జీ ముఖ్యమంత్రి కొనసాగే హక్కులేదని మండిపడ్డారు. কলকাতার কসবা ল' কলেজ ক্যাম্পাসের মধ্যে এক তরুণীর উপর নৃশংস গণধর্ষণের ঘটনায় আমি স্তম্ভিত। এই জঘন্য অপরাধের সঙ্গে জড়িত তিনজন অভিযুক্তের মধ্যে মূল মাথা হিসেবে চিহ্নিত হয়েছে তৃণমূল ছাত্র পরিষদের প্রভাবশালী নেতা মনোজিৎ মিশ্র (৩১)। পুলিশ তাকে গতকাল সন্ধ্যায় তালবাগান ক্রসিংয়ের কাছে… pic.twitter.com/ishPpC7Iui— Suvendu Adhikari (@SuvenduWB) June 27, 2025 బాధితురాలికి అండగా బీజేపీమరో బీజేపీ నేత అమిత్ మాల్వియా ఈ సంఘటనను భయంకరమైనదని అభివర్ణించారు. ఈ నేరాన్ని ఒక మాజీ విద్యార్థి,ఇద్దరు కళాశాల సిబ్బంది, ఒక టీఎంసీ సభ్యుడు సైతం ఉన్నాడని ఆరోపించారు. ఆర్జీ కార్ ఆసుపత్రి సంఘటనను ప్రస్తావిస్తూ..పశ్చిమ బెంగాల్లో మహిళలపై నేరాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. బాధితురాలి కుటుంబానికి బీజేపీ అండగా నిలుస్తోందని, నిందితులందరికీ శిక్ష పడేలా చూడాలని అన్నారు. 🔴 RAPE IN A REPUTED LAW COLLEGE IN KOLKATA BY A TMC LEADERAnother shameful chapter has been added to Bengal’s collapsing law and order under TMC rule.▶️ A female student of a prestigious law college in South Kolkata was brutally gang-raped—not in some dark alley, but right… pic.twitter.com/PFVpEOR7Mj— Amit Malviya (@amitmalviya) June 27, 2025 -
అహ్మదాబాద్ విమాన ప్రమాదం కేసులో కీలక పురోగతి
న్యూఢిల్లీ: అహ్మదాబాద్(గుజరాత్) విమాన ప్రమాదం కేసులో అధికారులు కీలక పురోగతి సాధించారు. అత్యంత ముఖ్యంగా భావిస్తున్నబ్లాక్బాక్స్(Air India Black Box) నుంచి డేటాను సేకరించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినట్లు ఆంగ్ల మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి.బ్లాక్బాక్స్లో ముందు భాగంలో ఉండే క్రాష్ ప్రొటెక్షన్ మాడ్యూల్ డాటాను అధికారులు గురువారం రికవరీ చేశారు. ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(AAIB) ల్యాబ్లో ఆ డాటాను విశ్లేషిస్తున్నట్లు ఆ కథనాలు వెల్లడించాయి. అలాగే.. కాక్పిట్ వాయిస్ రికార్డర్స్, ఫ్లైట్ డాటా రికార్డర్స్ నుంచి డాటా సేకరించే పనిలో ఉన్నారట. విచారణ కొనసాగుతోందని ప్రభుత్వం వెల్లడించింది.జూన్ 12వ తేదీన బోయింగ్ సంస్థకు చెందిన డ్రీమ్లైనర్ విమానం(ఏఐ 171 సర్వీస్) ప్రమాదంలో నేలను తాకగానే పేలిపోయి.. కాలి బూడిదైన సంగతి తెలిసిందే. అయితే ఘటన జరిగిన 28 గంటల తర్వాత శకలాల నుంచి బాక్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రమాదం ధాటికి అందులో ఓ పార్ట్ పైభాగం బాగా దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో..బ్లాక్బాక్స్ను డీకోడ్ చేసేందుకు అమెరికాకు పంపించబోతున్నట్లు తొలుత ప్రచారం జరిగింది. అయితే టెక్నికల్, సెక్యూరిటీ అంశాలను పరిశీలించాకే బ్లాక్బాక్స్ను ఎక్కడికి పంపించాలనే విషయాన్ని ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) మాత్రమే నిర్ణయిస్తుందని కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆప్షన్లను పరిశీలించిన ఏఏఐబీ.. ఇక్కడే దానిని విశ్లేషిస్తున్నట్లు సమాచారం.బ్లాక్బాక్స్తో..డిజిటల్ ఫ్లైట్ డాటా రికార్డర్(DFDR), కాక్పిట్ వాయిస్ రికార్డర్(CVR)లను కలిపి బ్లాక్బాక్స్గా వ్యవస్తారు. పేరుకు బ్లాక్బాక్స్ అనే కానీ.. ప్రమాదం తర్వాత శకలాల నుంచి సేకరణ కోసం సులువుగా బ్రైట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది అది. ఇక ఇందులో.. ఇప్పుడొస్తున్న సీవీఆర్లు 25 గంటలపాటు కాక్పిట్ సంభాషణలను నమోదు చేయగలవు. 2021లో తీసుకొచ్చిన నిబంధనే అందుకు కారణం. కానీ, ప్రమాదానికి గురైన బోయింగ్ 787 విమానం అంతకు ముందు మోడల్. ఇందులో కేవలం రెండున్నర గంటల రికార్డును మాత్రమే రికార్డుచేయగలదు. ఇక ఏడీఆర్.. విమానం వేగాన్ని, నియంత్రణ క్షణాలు తదితరాలను నమోదు చేస్తుంది. బ్లాక్బాక్స్లోని డాటాను ఇంజినీరింగ్ ఫార్మట్లోకి మార్చిన తర్వాతే సమాచారాన్ని సేకరించడానికి వీలవుతుంది. సేకరణ టైంలో ఏదైనా పొరపాటు దొర్లితే.. డాటా మొత్తం కనిపించకుండా పోతుంది(ఎరేస్ అవుతుంది).జూన్ 12వ తేదీ మధ్యాహ్నాం.. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో విమానంలో ఉన్న 241 మంది(సిబ్బందితో కలిపి), జనావాసాలపై విమానం కూలి పేలిపోవడంతో మరో 34 మంది స్థానికులు మరణించారు. -
సైబర్ క్రైమ్ కాలర్ ట్యూన్ నిలిపివేత
‘‘సోషల్ మీడియా లేదా తెలియని గ్రూప్స్ నుంచి పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి. అవి సైబర్ నేరగాళ్లు, మీ సేవింగ్స్ ఖాళీ చేసే పన్నాగాలు కావొచ్చు.’’ అంటూ కొద్దిసెకన్లపాటే వచ్చి వాయిస్ వాడేవాళ్లను ఎంత ఇరిటేట్ చేసిందో తెలియంది కాదు. అయితే ఇకపై ఆ గొంతు వినపించదు. అవును..న్యూఢిల్లీ: సైబర్ క్రైమ్ అవగాహన కాలర్ ట్యూన్ను నేటి నుంచి (జూన్ 26, 2025) అధికారికంగా ఆపేశారు. అటు హిందీ భాషలో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ వాయిస్తో వినిపించిన సందేశాన్ని రావడం లేదు. ప్రజలను సైబర్ మోసాల గురించి హెచ్చరించేందుకు ప్రతి ఫోన్ కాల్కు ముందు ఈ సందేశం వినిపించేది. ఈ కాలర్ ట్యూన్ కేంద్ర ప్రభుత్వ అవగాహన కార్యక్రమంలో భాగంగా రూపొందించబడింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కేవలం మూడు నెలల కాలపరిమితితో ఈ ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఈ క్యాంపెయిన్లో టెలికామ్ కంపెనీలు భాగం అయ్యాయి. ఆయా భాషల్లో పలువురితో డబ్బింగ్ చెప్పించి.. వాయిస్ మెసేజ్లను వదిలాయి. అలా.. అన్ని భాషల్లో రోజులో 8 నుంచి 10 సార్లు వాయిస్ వినిపించాయి. తెలుగులో మిర్చి అమృత వాయిస్ ఇచ్చినట్లు ఆ మధ్య ఓ వీడియో కూడా వైరల్ అయ్యింది. అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజ నటుడి వాయిస్ను ఈ క్యాంపెయిన్లో భాగం చేశారు. View this post on Instagram A post shared by Amritha Pasumarthi (@mirchi_amritha)అయితే.. అత్యవసర పరిస్థితుల్లో కాల్ ఆలస్యం అవుతోంది అనే కారణంతో చాలా మంది వినియోగదారులు అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి కూడా. మరోవైపు.. సోషల్ మీడియాలో ట్రోలింగ్కు కూడా అమితాబ్ బచ్చన్ గురయ్యారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. ప్రభుత్వం చెప్పిందే చేశానని, ఏమైనా చెప్పదల్చుకుంటే సర్కార్కే చెప్పాలంటూ బచ్చన్ సాబ్ అసహనం వ్యక్తం చేశారు. ఈలోపే ప్రభుత్వం ఆ క్యాంపెయిన్ను ముగించడం గమనార్హం. అంతకు ముందు.. కరోనా కాలర్ ట్యూన్ విషయంలోనూ బిగ్బీపై ఇలాంటి విమర్శలే వచ్చాయి. -
పార్లమెంట్ కాదు.. రాజ్యాంగమే సర్వోన్నతం
మన దేశంలో కొంతమంది పార్లమెంటే సుప్రీం అని అంటారు. కానీ, నావరకైతే రాజ్యాంగమే దేశానికి సర్వోన్నతం అని భారత ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయ్(CJI BR Gavai) అన్నారు. పార్లమెంట్కు రాజ్యాంగాన్ని సవరణ చేసే అధికారం మాత్రమే ఉందన్న ఆయన.. రాజ్యాంగపు మౌలిక నిర్మాణాన్ని మార్చే హక్కు ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం తన స్వస్థలం అమరావతి(మహారాష్ట్ర)లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కొంత మంది దేశానికి పార్లమెంటే అత్యున్నతమైందని భావిస్తారు. కానీ, నా వరకైతే న్యాయ(judiciary), శాసన(legislature), కార్యనిర్వాహక (executive) వ్యవస్థల్లో ఏదీ గొప్పది కాదు. రాజ్యాంగమే సర్వోన్నతం. ఎందుకంటే..పార్లమెంట్కు రాజ్యాంగంలో సవరణలు చేసే హక్కు మాత్రమే ఉంది. కానీ, మౌలిక నిర్మాణాన్ని మార్చే హక్కు మాత్రం లేదు’’ అని అన్నారాయన.జడ్జి ఎలా ఉండాలంటే..ఒక న్యాయమూర్తి కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదేశాలు ఇవ్వడం వల్ల స్వతంత్రుడు అవ్వలేడు. తాము కేవలం అధికారం ఉన్నవాళ్లం అని మాత్రమే కాకుండా, పౌర హక్కులు, రాజ్యాంగ విలువలను సంరక్షించాల్సిన బాధ్యతగల వాళ్లమని న్యాయమూర్తులు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ప్రజలు తమ తీర్పుల గురించి ఏమనుకుంటారో? ఎలా స్పందిస్తారో? అనే విషయాలపై ప్రభావితం కాకూడదు. స్వతంత్రంగా ఆలోచించాలి. ప్రజలు ఏమంటారన్నది నిర్ణయ ప్రక్రియలో భాగం కావాల్సిన అవసరం లేదు.బుల్డోజర్ జస్టిస్ తీర్పు గురించి..నా పని గురించి నా తీర్పులతోనే మాట్లాడుకునేలా చేస్తాను. రాజ్యాంగంలో స్థిరపరిచిన మూల హక్కుల పట్ల గౌరవంగా నిలబడతా. ఈ సందర్భంగా.. బుల్డోజర్ జస్టిస్ తీర్పును(కిందటి ఏడాది నవంబర్ 13న ఇచ్చిన తీర్పును) ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ప్రజలకు ఆశ్రయం (నివాసం) హక్కు అత్యున్నతమైనది అని పేర్కొన్నారాయన.భారత సుప్రీంకోర్టు బుల్డోజర్ జస్టిస్పై 2024 నవంబర్ 13న కీలక తీర్పు వెల్లడించింది. నేరారోపణలు ఉన్న వ్యక్తుల ఇళ్లను విచారణ లేకుండానే కూల్చడం చట్ట విరుద్ధం అని జస్టిస్ బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్లతో కూడిన బెంచ్ స్పష్టం చేసిందిఆర్కిటెక్ట్ కావాలనుకున్నా..అలాగే.. తన బాల్యంలో జరిగిన సంఘటనలను ఆయన గుర్తుచేసుకున్నారు. తాను నిజానికి ఆర్కిటెక్ట్ అవ్వాలనుకున్నప్పటికీ, తన తండ్రి మాత్రం న్యాయవాదిగా అవ్వాలని ఆకాంక్షించారని గవాయ్ చెప్పారు. నిజానికి నా తండ్రికి కూడా న్యాయవాది అవ్వాలన్న ఆశ ఉండేది. కానీ ఆయన స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని అరెస్టు కావడంతో అది సాధ్యపడలేదు’’ అని తెలిపారాయన. గవాయ్ తండ్రి సూర్యభాన్ గవాయ్ అంబేద్కర్వాదిగా రాజకీయాల్లో రాణించారు. బిహార్, సిక్కిం, కేరళ రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేశారు కూడా.రాజ్యాంగంపై బీఆర్ గవాయ్ చేసిన తాజా వ్యాఖ్యలు భారత ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ ప్రాముఖ్యతను, పార్లమెంట్ సహా అన్ని వ్యవస్థలు రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
వైరల్ వీడియో: యువతులపై చేయి చేసుకున్న మహిళా కానిస్టేబుల్!
ముంబై: ముగ్గురు యువతులు బైక్పై త్రిబుల్ రైడింగ్ చేసూకుంటూ వెళుతున్నారు. స్కూటీని వేగంగా, ప్రమాదకరంగా మలుపులు తిప్పుతూ డ్రైవ్ చేస్తున్నారు. ఆ సమయంలో తన కుమార్తెను ట్యూషన్ కాలేజీకి తీసుకెళ్తున్న ఓ మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ వారిని ఆపి, తల్లిలా మందలించింది. కానీ వెరసి మహిళా కానిస్టేబుల్పై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ అమ్మాయిల విషయంలో తాను చేసింది తప్పేనంటూ బహిరంగంగా క్షమాపణాలు చెప్పాల్సి వచ్చింది. ఇంతకి ఏం జరిగిందంటే?మహరాష్ట్ర లాతూర్ సిటీలో ట్రాఫిక్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న ప్రణిత ముస్నే.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి ఇష్టారీతిని త్రిబుల్ రైడింగ్ చేస్తున్న యువతులపై చేయి చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోమవారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.రెనాపూర్ నాకా వద్ద చిత్రీకరించిన ఈ వీడియోలో.. కానిస్టేబుల్ ప్రణిత ముస్నే యువతులను మాటలతో దూషిస్తూ, చివరికి వారిలో ఒకరిని చెంపదెబ్బ కొడుతూ కనిపించారు. ట్రిపుల్ రైడింగ్ చేయడం చట్టవిరుద్ధమని ఆమె పేర్కొన్నారు.తర్వాత మీడియాతో మాట్లాడిన కానిస్టేబుల్ మాట్లాడుతూ.. నా కుమార్తెలను ట్యూషన్కు వదిలి విధులకు వెళ్తున్న సమయంలో, ముగ్గురు యువతులు స్కూటర్పై ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారని గమనించాను. వారిని ఆపి జాగ్రత్తగా వెళ్లమని చెప్పాను. కానీ వారు 'నీ పని చూసుకో' అంటూ స్పందించారు. అందుకే వారిని వెంబడించి ఆపాను. ఆ సమయంలో నేను తల్లిలా స్పందించాను, కానిస్టేబుల్గా కాదు.అయితే, ఆమె అసభ్యంగా మాట్లాడడంపై విమర్శలు వెల్లువెత్తాయి. నెటిజన్లు సైతం ఆమె మాట్లాడిన తీరుపై విమర్శలు గుప్పించారు. చట్టం ప్రకారం.. యువతులపై చేయిచేసుకునే హక్కు లేదని ట్వీట్లు కూడా పెట్టారు. ఇలా ఆమె తీరు వివాదంగా మారింది. చివరికి ఆమె క్షమాపణలు చెప్పేందుకు దారి తీసింది. ‘నేను వాడిన భాష తప్పు. దానికి నేను క్షమాపణ చెబుతున్నాను. కానీ నా ఉద్దేశం తప్పు కాదు’అని ఆమె స్పష్టం చేశారు.లాతూర్ పోలీస్ అధికారులు ఈ ఘటనపై ఇంకా స్పందించలేదు. Lady Traffic Constable Abuses, Beats Three Young Girls For Triple-Seat Riding In Latur pic.twitter.com/juTK3okkLg— ExtraOrdinary (@Extreo_) June 24, 2025 -
శశి థరూర్... ఈసారి ఫ్రెంచ్లో!
కీవ్: తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఇంగ్లీషు భాషా ప్రావీణ్యం గురించి కొత్తగా చెప్పేందుకు ఏమీ లేదు కానీ.. ఆయన ఫ్రెంచ్లోనూ అదరగొట్టగలరని మాత్రం తాజాగా స్పష్టమైంది. అది కూడా రష్యా దౌత్యవేత్తతో మాట్లాడుతూ! విషయం ఏమిటంటే...పహల్గామ్ దాడి తరువాత దాయాది దేశం పాకిస్థాన్పై భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ప్రపంచదేశాలకు వివరించే పార్లమెంటరీ బృందానికి శశి థరూర్ నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బృందం ప్రస్తుతం మాస్కోలో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా రష్యాలోని లిబరల్ డెమొక్రటిక్ పార్టీ అధ్యక్షుడు లియోనిడ్ స్లట్స్కీతో థరూర్ బృందం సమావేశమైంది. భారత్ హస్తకళల వైభవాన్ని చాటే ఒక జ్ఞాపికను రష్యా దౌత్యవేత్తకు అందించిన థరూర్.. ప్రతిగా ఆయన అందించిన అరుదైన పెన్నును స్వీకరించారు.‘‘రాతగాడికి పెన్ను బహుమానంగా ఇవ్వడం సంతోషాన్నిచ్చింది’’ అని వ్యాఖ్యానించారు. ఆ తరువాత ఇరువురి మధ్య చర్చలు ఉగ్రవాదం.. నివారణ చర్యలు.. రషా ఏం చేస్తోందన్న అంశాలపైకి మళ్లింది.. ఈ సందర్భంగా లియోనిడ్ స్లట్స్కీ మాట్లాడుతూ.. ‘‘రష్యా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో బహుముఖ వ్యూహం అనుసరిస్తోంది. ఇందులో భాగంగా ఏటా సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే ఆరుసార్లు ఈ సమావేశాలు జరిగాయి. వచ్చే ఏడాది ఏడో సమావేశం నిర్వహిస్తున్నాం. పాకిస్థాన్తోపాటు ఇతర దేశాలను ఆహ్వానిస్తున్నాం’’ అని అన్నారు.పాకిస్థాన్ పేరు వినపడగానే స్పందించిన శశిథరూర్ భారత దౌత్యవేత్తల అంతర్జాతీయతను గుర్తు చేసేలా ఫ్రెంచ్లో స్లట్స్కీకి సమాధానమిచ్చారు. ‘‘పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయమిచ్చే దేశం’’ అని గుర్తు చేశారు. తద్వారా రష్యాతోపాటు యూరోపియన్ దేశాల దౌత్యవేత్తలకు భారత్ ఉద్దేశాలను స్పష్టం చేసినట్టు అయ్యింది. అయితే థరూర్ వ్యాఖ్యలను విన్న స్లట్స్కీ పాకిస్థాన్ను ఆహ్వానించడాన్ని సమర్థించుకున్నారు.అది వేరే విషయం!Shashi Tharoor takes on Pakistan in fluent French pic.twitter.com/2H7lbg1pxE— Shashank Mattoo (@MattooShashank) June 25, 2025 -
ఒట్టి చేతులతో చిరుతపై పోరాటం .. యువకుడి ధైర్యానికి నెటిజన్ల షాక్!
లక్నో: తన ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించిన చిరుతపులిపై ఓ యువకుడి ఒంటి చేత్తో పోరాడాడు. ఎలాంటి ఆయుధాలు లేకుండా చిరుతపులిపై తిరగబడ్డాడు. ఆపత్కాలంలో తెగువ, ధైర్య సాహాసానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచిన ఆ వ్యక్తి పేరు మిహిలాల్ గౌతమ్ (33). అతనిది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. చిరుతపులిపై పోరాటం చేసిన ఘటన లఖ్మీపూర్ ఖేరిలోని జుగనూపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. అటవి శాఖ అధికారుల సమాచారం మేరకు.. మిహిలాల్ గౌతమ్ది ఇర్ధారి పూర్వా అనే గ్రామం.ఇటుక బట్టీల్లో పనిచేసేందుకు గౌతమ్తో పాటు మరికొందరు సోమవారం జుగనూపూర్ గ్రామానికి వచ్చారు.ఇటుక బట్టీల్లో పని ప్రారంభించేందుకు గౌతమ్తో పాటు ఇతర కార్మికులకు కలిసి ఇటుకుల్ని వేడి చేసే కొలిమి ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. సరిగ్గా అదే సమయంలో అక్కడే సేదతీరుతున్న చిరుతపులి కార్మికులపై దాడి చేసేందుకు ఒక్క ఉదుటున మీద పడింది.ఒట్టి చేతుల్ని ఆయుధాలుగా మార్చిదాడి చేస్తున్న చిరుతపులిని భయపడకుండా, గందరగోళానికి గురవుకుండా గౌతమ్ తన ఒట్టి చేతుల్నే ఆయుధాలుగా మార్చి దానిని నిలురించే ప్రయత్నం చేశాడు. ఏ మాత్రం బెదరకుండా చిరుతపై ఎదురు దాడికి దిగాడు. ఆ ప్రయత్నాలు సఫలమయ్యాయి. గౌతమ్ బలాబలాల ముందు చిరుత తేలిపోయింది. అప్రమత్తమైన సహచర కార్మికులు గ్రామస్తుల సాయంతో చిరుత నుంచి గౌతమ్ను రక్షించే ప్రయత్నం చేశారు. చేతికి దొరికిన వస్తువుల్ని చిరుతపైకి విసిరేస్తూ చిరుతను భయబ్రాంతులకు గురిచేసేందుకు యత్నించారు. ఆ ప్రయత్నంలో చిరుత భయపడి స్థానిక అరటితోటల్లోకి పారిపోయింది. "फिल्मों में देखा होगा हीरो शेर से लड़ता है... लेकिन ये रियल है!"लखीमपुर-खीरी के धौरहरा की बबुरी गांव से चौंकाने वाला वीडियोयहां एक ईंट भट्टे में घुस आया तेंदुआ और सामने था एक युवक... न डर, न भागा — सीधा भिड़ गया! तेंदुए ने झपट्टा मारा, युवक ने डटकर मुकाबला कियागांववालों ने… pic.twitter.com/rd0FiBFEGY— आदित्य तिवारी / Aditya Tiwari (@aditytiwarilive) June 24, 2025 అధికారులపై చిరుత దాడిచిరుతపులి దాడిపై స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ ప్రయత్నంలో అధికారులపై చిరుత దాడికి దిగింది. ఈ దాడిలో ఫారెస్ట్ రేంజ్ రాజేష్ కుమార్ దీక్షిత్,రేంజర్ నిరూపేంద్ర చతుర్వేది, పోలీస్ అధికారి రామ్ సంజీవన్,స్థానిక గ్రామస్తుడు ఇక్బాల్కు గాయాలయ్యాయి. అత్యవసర చికిత్స నిమిత్తం తొలిసారి దాడికి చేసిన మిహిలాల్ గౌతమ్తో పాటు ఇక్బాల్ ఖాన్ ,ఫారెస్ట్ రేంజర్ రాజేష్ కుమార్ లక్ష్మీపూర్ ఆస్పత్రికి, రేంజర్ చతుర్వేది, పోలీస్ కానిస్టేబుల్ రామ్ సంజీవన్లను తాలూకా ఆస్పత్రికి తరలించారు. వైద్య చికిత్స అనంతరం బాధితులు ఆస్పత్రి నుంచి డిశార్జ్ అయినట్లు అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు.ఈ ఘటన తర్వాత అంటే మంగళవారం అదనపు పోలీసు సిబ్బందితో కలిసి అటవీ శాఖ, పోలీస్ శాఖ జాయింట్ ఆపరేషన్ను నిర్వహించాయి. అరటితోటల్లోనే ఉన్న చిరుత పులిని బంధించాయి. -
CBSE: ఇక ఏడాదికి రెండుసార్లు పదో తరగతి పరీక్షలు
సాక్షి,ఢిల్లీ: విద్యా వ్యవస్థలో కీలక మార్పులు చేసేందుకు కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ (ఎన్ఈపీ) భాగంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏడాది నుంచి రెండుసార్లు (twice a year) పది పరీక్షలు నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఏడాదిలో రెండుసార్లు పదో తరగతి పరీక్షల నిర్వహణకు బోర్డు ఆమోదం తెలిపింది. బోర్డు నిర్ణయంతో సీబీఎస్ఈ విధానంలో 10వ తరగతి (CBSE Class 10 board exams) చదివే విద్యార్థులు వచ్చే ఏడాది అంటే 2026 నుంచి బోర్డు పరీక్షలను ఏడాదిలో రెండుసార్లు రాయాల్సి ఉంటుంది. ఇందులో తొలి దఫా పరీక్షలు ఫిబ్రవరిలో రెండో విడత పరీక్షలు మేలో జరుగుతాయని సీబీఎస్ఈ కంట్రోలర్ సన్యాం భరద్వాజ్ తెలిపారు. దీనికి అనుగుణంగా తొలి విడత పదో తరగతి పరీక్షలను బోర్డు తప్పనిసరి చేసింది. రెండో విడత పదో తరగతి పరీక్షలను ఆప్షనల్గా పెట్టింది. రెండు విడతల్లో మంచి స్కోర్ను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. రెండు దశలకు సంబంధించిన ఫలితాలు వరుసగా ఏప్రిల్, జూన్లో ప్రకటించనున్నట్లు అధికారులు వెల్లడించారు.సీబీఎస్ఈ (CBSE) తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం, విద్యార్థులు సైన్స్, మ్యాథ్స్, సోషల్ సైన్స్, లాంగ్వేజ్ సబ్జెక్ట్స్లలో ఏదైనా మూడు విభాగాలలో తక్కువ మార్కులు వచ్చినా, వారు మళ్లీ పరీక్ష రాసుకునే అవకాశం కల్పించారు. తద్వారా విద్యార్థులకు ఒత్తిడి తగ్గించి, వారి అసలు సామర్థ్యాన్ని మెరుగ్గా చూపించేందుకు సహాయ పడనుట్లు తెలిపారు. -
ఖర్గే చురకలు.. శశిథరూర్ కౌంటర్!
కాంగ్రెస్ అధిష్టానంతో సీనియర్ నేత శశిథరూర్కు ఉన్న విభేదాలు ఇవాళ మరోసారి అధికారికంగా బయటపడ్డాయి. శశిథరూర్ను ఉద్దేశించి కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా.. కాసేపటికే థరూర్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నాకు ఇంగ్లీష్ చదవడం అంత బాగా రాదు. కానీ, శశిథరూర్ భాష చాలా బాగుంటుంది. అందుకే ఆయన ఇంకా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఉన్నారు. మేము మాకు వచ్చిన భాషలో ‘‘దేశమే ముందు(మా తొలి ప్రాధాన్యం) అంటాం’’. భారత సైన్యానికి మద్దతుగా విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. ఆపరేషన్ సిందూర్ కోసం ఐక్యంగా నిలబడ్డాం. కానీ కొంతమంది ‘‘మోదీనే ముందు.. ఆ తర్వాతే దేశం అంటారు. అలాంటప్పుడు మేమేం చేయాలి?’’ అని నవ్వుతూ అన్నారాయన. మోదీని ప్రశంసించినందుకు థరూర్పై చర్యలు ఉంటాయా? అని ఎదురైన ప్రశ్నకు.. ఆ వ్యాఖ్యలకు పార్టీ దూరంగా ఉంటుందని, చర్యలు తీసుకునే ఉద్దేశమేదీ లేదని అన్నారు. అదే సమయంలో పార్టీ ఐక్యతే అధిష్టానానికి ముఖ్యం అని ఖర్గే పేర్కొన్నారు. #WATCH | #Congress President #MallikarjunKharge says #ShashiTharoor’s strong language skills earned him a spot in the party's working committee and emphasizes that the entire opposition stands united in support of the #IndianArmy.@kharge @ShashiTharoor pic.twitter.com/kiJLpcwE8K— The Federal (@TheFederal_News) June 25, 2025మరోవైపు.. ఖర్గే ఈ వ్యాఖ్యలు చేసిన కాసేపటికే తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ తన ట్విటర్లో ఓ పోస్ట్ ఉంచారు. ‘‘ఎగరడానికి ఎవరి అనుమతి అక్కర్లేదు. రెక్కలు నీవి.. ఆకాశం ఎవరి సొంతం కాదు’’ అంటూ ఓ పోస్ట్ను ఉంచారాయన. దీంతో ఇది ఖర్గేకు సెటైరే అంటూ ఆయన కామెంట్ సెక్షన్లో చర్చ నడుస్తోంది. pic.twitter.com/dNkwZb721E— Shashi Tharoor (@ShashiTharoor) June 25, 20252020 – G-23 లేఖ దగ్గరి నుంచి శశిథరూర్కు, అధిష్టానం మధ్య గ్యాప్ మొదలైంది. థరూర్ సహా 23 మంది సీనియర్ నేతలు ‘కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం, స్థిరమైన నాయకత్వం’ కోరుతూ లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది సోనియా గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా(మరీ ముఖ్యంగా అప్పటి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ..) తిరుగుబాటు లాగా భావించారంతా. ఆపై 2022లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల సమయంలో ఇది మరోసారి బయటపడింది. శశిథరూర్ మల్లికార్జున ఖర్గేకు వ్యతిరేకంగా అధ్యక్ష పదవికి పోటీ చేశారు. ఖర్గే గెలిచినా, థరూర్కు 1,000కి పైగా ఓట్లు వచ్చాయి. అయితే పార్టీలో అంతర్గతంగా థరూర్కు మద్దతు ఉన్నట్లు ఈ ఎన్నిక సూచించింది.2023–24.. శశిథరూర్ ఈ మధ్యకాలంలో తరచూ పార్టీ లైన్కు భిన్నంగా మాట్లాడారు. మరీ ముఖ్యంగా విదేశాంగ విధానాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో కలకలం రేపాయి. కొన్ని సందర్భాల్లో ఆయన ప్రధానమంత్రి మోదీని ప్రశంసించడం పార్టీ నేతల్లో అసంతృప్తికి దారి తీసింది. అదే సమయంలో థరూర్ అభిప్రాయాల ఆధారంగానే కాంగ్రెస్పైకి బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది.2025.. ఆపరేషన్ సిందూర్ తర్వాత కాంగ్రెస్కే షాకిస్తూ ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ను అఖిలపక్ష బృందంలో ఎంపిక చేసింది బీజేపీ. పలు దేశాల సమావేశాల్లో థరూర్ మోదీ నాయకత్వంపై ప్రశ్నలు గుప్పించారు. ఇది ఆయన కొందరు కాంగ్రెస్ నేతలతో సోషల్ మీడియా వేదికగా వాగ్వాదానికి కారణమైంది. విదేశాల నుంచి తిరిగి వచ్చాక పార్టీ అధిష్టానంతో విభేదాలున్నాయని అంగీకరిస్తూనే.. అవి నాలుగు గోడల మధ్య చర్చించుకునే విషయమని కేరళలో స్పష్టం చేశారు. ఆపై ది హిందూ కోసం ఆయన రాసిన ఓ కథనం.. ప్రధాని మోదీ శక్తి, చురుకుదనం భారతదేశానికి ప్రధాన ఆస్తి అంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్కు మరింత ఆగ్రహం తెప్పించాయి. అయితే ఇవేవీ తాను బీజేపీలో చేరతాననే సంకేతాలు మాత్రం కాదని శశిథరూర్ తాజాగా స్పష్టత ఇచ్చారు. -
ఢిల్లీ మెట్రో స్టేషన్ వద్ద అగ్ని ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రిఠాలా మెట్రోస్టేషన్ సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. ఢిల్లీలోని రిఠాలా మెట్రోస్టేషన్ సమీపంలో ఉన్న పాలిథీన్ ఫ్యాక్టరీలో మంగళవారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. రాత్రి నుంచి మంటల చెలరేగుతూనే ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని 16 ఫైరింజన్లతో మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు.#WATCH | Delhi: 3 people died and three were injured after a fire broke out in a polythene factory near the Rithala metro station yesterday at around 7.30 pm, say Delhi police The search operation is still going on.(Morning visuals from the spot) pic.twitter.com/RmMXSE0nef— ANI (@ANI) June 25, 2025 -
రైల్వే చార్జీల్లో స్వల్ప పెరుగుదల!
న్యూఢిల్లీ: రైల్వే చార్జీలు త్వరలో నామమాత్రంగా పెరిగే అవకాశముంది. మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీ తరగతికి కిలోమీటర్కు ఒక పైసా, ఏసీ ప్రయాణాలకు 2 పైసల చొప్పున పెంచే ప్రతిపాదన ఉన్నట్టు రైల్వే శాఖ వర్గాలు వెల్లడించాయి. బోర్డు ఆమోదం లభిస్తే జూలై 1 నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తుందని తెలిపాయి.‘‘2020, 2013ల్లో చేసిన పెంపుతో పోలిస్తే ఇది సగమే. అంతేగాక రోజువారీ ప్రయాణికుల ప్రయోజనాల దృష్ట్యా సబర్బన్, నెలవారీ, సీజన్ పాసుల చార్జీలు పెంచబోవడం బోదు. ఆర్డినరీ సెకండ్ క్లాస్ టికెట్ల ధరలు కూడా 500 కి.మీ. దాకా పెరగబోవు. ఆ తర్వాత కి.మీ.కి అర పైసా చొప్పున పెంచే ప్రతిపాదన ఉంది’’ అని పేర్కొన్నాయి. -
ఉగ్రవాదంపై ఉక్కుపాదమే: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఉగ్రవాదంపై భారత్ ఉక్కుపాదం మోపుతుందని ఆపరేషన్ సిందూర్తో మరోసారి ప్రపంచానికి చాటామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పాక్పై పోరులో మేకిన్ ఇండియా ఆయుధాలు సత్తా చాటాయని గుర్తు చేశారు. జాతి ప్రయోజనాల పరిరక్షణకు ఎలాంటి చర్యలకైనా తమ సర్కారు వెనకాడే సమస్యే ఉండబోదని స్పష్టం చేశారు. ఆధ్యాత్మికవేత్త, సామాజిక సంస్కర్త నారాయణగురు, మహాత్మాగాంధీ మధ్య చరిత్రాత్మక సంభాషణకు వందేళ్లయిన సందర్భంగా సోమవారం జరిగిన ఓ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు.బలోపేతమైన భారత్ కోసం వాళ్లు కన్న కలలను నిజం చేసే దిశగా సాగుతున్నట్టు చెప్పారు. ‘‘11 ఏళ్ల క్రితం వరకూ దేశాన్ని పాలించిన వారి హయాంలో కోట్లాది ప్రజలు అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొ న్నారు. మా పాలనలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 11 ఏళ్లుగా దేశం సామాజికంగా, ఆర్థికంగా అత్యంత బలోపే తమవుతూ వస్తోంది. రక్షణ రంగంలో స్వావలంబన సాధిస్తోంది. భారత్ తయారు చేసే ఆయుధాలు ప్రపంచమంతటా జెండా ఎగరేసే రోజులు ఎంతో దూరం లేవు’’ అని ధీమా వెలిబుచ్చారు. -
నేడు నింగిలోకి యాక్సియం–4
న్యూఢిల్లీ: భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా తదితర వ్యోమగాములతో కూడిన యాక్సియం–4 ప్రైవేట్ మిషన్ ప్రయోగం నేడు చేపట్టనున్నట్లు నాసా తెలిపింది. స్పేస్ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా బుధవారం మధ్యాహ్నం 12 గంటల కు ఈ ప్రయోగం చేపట్టనున్నారు.పెగ్గీ వాట్సన్ క మాండర్గా వ్యవహరించే మిషన్లో శుక్లా పైలట్గా ఉంటారు. వాస్తవానికి ఈ మిషన్ ప్రయో గం మే 29వ తేదీనే చేపట్టాల్సి ఉంది. సాంకేతిక కారణాలు, అననుకూల వాతావరణ పరిస్థి తుల నేపథ్యంలో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. -
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. మొత్తం మరణాల సంఖ్యను ప్రకటించిన ప్రభుత్వం
గాంధీనగర్: అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్లైనర్ ప్రమాదంలో 275 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 241 మంది విమానంలో ఉండగా.. 34 ఎయిరిండియా విమానం ఢీ కొట్టిన బీజే మెడికల్ కాలేజీ క్యాంపస్కు చెందిన వారు ఉన్నారని మంగళవారం (జూన్ 24న)గుజరాత్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారికంగా ప్రకటించింది.జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్లాల్సిన విమానం అహ్మాదాబాద్లోని బీజే మెడికల్ కాలేజీ భవనాన్ని ఢీ కొట్టింది. దుర్ఘటనలో మొతత్తం మరణాల సంఖ్యను ప్రభుత్వం ధ్రువీకరించలేదు. ప్రమాదం తీవ్రతతో ఘటనా స్థలంలో భౌతికకాయాల్ని గుర్తించడం వైద్యులకు కష్టంగా మారింది.దీంతో వైద్యులు బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన డీఎన్ఏను ఘటనా స్థలంలో లభ్యమైన మృతదేహాలతో పోల్చి చూస్తున్నారు. మృతదేహాల్ని వారిక కుటుంబ సభ్యులకు అందిస్తున్నారు. కొన్ని మృతదేహాల డీఎన్ఏ గుర్తింపు ఇంకా పురోగతిలో ఉందని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. భారత విమానయాన చరిత్రలో అత్యంత విషాదంఅహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా ప్రమాదం భారత విమానయాన చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటనగా నిలిచింది. జూన్ 12న, లండన్కు బయలుదేరిన AI-171 బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సర్దార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో కుప్పకూలింది.ప్రమాదం ఎలా జరిగింది?- విమానం టేకాఫ్ అయిన 30 సెకన్లలోనే పైలట్ మేడే కాల్ ఇచ్చారు.- విమానం 625 అడుగుల ఎత్తుకు చేరుకున్న తర్వాత ఒక్కసారిగా 475 అడుగుల వేగంతో కిందకు పడిపోయింది.- విమానం మేఘాణి నగర్ ప్రాంతంలోని జనావాసాలపై కూలి, బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ను ఢీకొట్టింది.- ప్రమాద సమయంలో విమానంలో 241 మంది ప్రయాణికులు ఉండగా, నేలపై ఉన్న 34 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు.కారణాలు ఏమిటి?- ప్రాథమికంగా హైడ్రాలిక్ సిస్టమ్ వైఫల్యం అనుమానంగా భావిస్తున్నారు.- బోయింగ్ 787-8 మోడల్ గతంలోనూ సాంకేతిక లోపాలతో వార్తల్లో నిలిచింది- బ్లాక్ బాక్స్ను స్వాధీనం చేసుకుని విశ్లేషణ జరుపుతున్నారు.ఒకే ఒక్కడు ఎలా బతికాడు?విశ్వకుమార్ రమేష్ అనే ప్రయాణికుడు మాత్రమే ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. అతను ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర 11A సీటులో కూర్చొన్నాడు. విమానం కూలిన సమయంలో అతని సీటు విరిగిపడి బయటకు పడిపోయింది. శిథిలాల మధ్య నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
ప్రియుడితో కయ్యం.. ప్రేమ పిచ్చి దెయ్యం.. జైలు పాలైన వైనం
చెన్నై: నేటి తరం యువత ప్రేమ, వ్యామోహంతో క్షణికావేశంలో నిండు జీవితాల్ని చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. మేఘాలయాలో సోనమ్ రఘువంశీ, అనంతరంపురంలో శిరీష,హైదరాబాద్ జీడిమెట్ల తేజశ్రీ.. తాజాగా చెన్నైకి చెందిన రెనే జోషిల్డా. ఇలాంటివి రోజుకు ఎన్నో కథలు.. వ్యథలు.చెన్నైలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన రెనే జోషిల్డా డెలాయిట్లో సీనియర్ రోబోటిక్స్లో కన్సల్టెంట్గా పనిచేస్తోంది. ఓ ప్రాజెక్ట్ సందర్భంగా బెంగళూరులో డివిజ్ ప్రభాకర్ అనే సహోద్యోగితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది. అయితే, ప్రేమ,దోమ ఇష్టం లేని ప్రభాకర్.. రెనే జోషిల్డా ప్రతిపాదనను తిరస్కరించాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మరొకరిని వివాహం చేసుకున్నాడు. దీంతో ఆమె మనసు ముక్కలైంది. దీంతో డివిజ్ ప్రభాకర్ఫై ప్రతీకారానికి దిగింది. ప్రేమ పిచ్చితో అతగాడికి మనశాంతి లేకుండా చేద్దామని ప్లాన్ చేసింది. బాంబు బెదిరింపులతో దేశవ్యాప్తంగా అలజడిఅ తర్వాత డివిజ్ ప్రభాకర్ పేరుతో నకిలీ ఈమెయిల్ ఐడీలు క్రియేట్ చేసింది. దేశంలో పలు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ స్కూల్స్,ఆస్పత్రులు, స్టేడియంలకు బాంబు బెదిరింపులు పంపింది. ఒక్క అహ్మదాబాద్లోనే 21 ప్రదేశాలకు బెదిరింపులు పంపింది. మోతేరా నరేంద్ర మోదీ స్టేడియం, సర్కేజ్లోని జెనీవా లిబరల్ స్కూల్, సివిల్ హాస్పిటల్ వంటి ప్రదేశాలు ఇందులో ఉన్నాయి. ఇలా మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, బీహార్, తెలంగాణ, పంజాబ్, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో ఈ బెదిరింపులు కలకలం రేపాయి.రీసెంట్గా ఎయిరిండియా విమాన ప్రమాదం జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్లే ఎయిరిండియా విమానం టేకాఫ్ తర్వాత కూలిపోయింది. ఈ ప్రమాదంలో 274 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానం బీజే మెడికల్ కాలేజ్ క్యాంపస్ భవనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదం తర్వాత బీజే మెడికల్ కాలేజీకి ఓ బెదిరింపు మెయిల్ వచ్చింది. అందులో ‘మీకు మా దెబ్బ రుచి చూపించాం. మేమే విమానాన్ని కూల్చాం. ఇప్పుడు మీకు అర్థమైందేమో’ అని పేర్కొంది. ఈ బెదిరింపు మెయిల్ను రెనే జోషిల్డా పంపినట్లు పోలీసులు గుర్తించారు.ఒక చిన్న తప్పిదమే ఆమెను పట్టించేసింది టెక్నాలజీలో నిపుణురాలైన రెనే జోషిల్డా టోర్ బ్రౌజర్, డార్క్ వెబ్, వర్చువల్ నంబర్లను ఉపయోగించి తన డిజిటల్ ట్రేస్ను దాచింది. కానీ ఆరు నెలల క్రితం ఆమె ఓ చిన్న తప్పు చేసింది. అదే ఆమెను పట్టించేసింది. ఒకసారి తన ఒరిజినల్ ఐపీ నెంబర్ నుంచి ఫేక్ ఈమెయిల్స్ను ఓపెన్ చేసింది. బెదిరింపు కాల్స్తో అప్రమత్తమైన సైబర్ పోలీసులు రెనే జోషిల్డా ఐపీ అడ్రస్ను గుర్తించారు. అమెను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు. -
Operation Sindhu: ఏపీ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు
సాక్షి, న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందులో భాగంగా.. ఇరాన్ నుంచి స్వస్థలానికి భారతీయుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా ఢిల్లీ చేరుకున్న విమానంలో ఐదుగురు ఏపీ విద్యార్థులు కూడా ఉన్నారు. వీళ్లంతా కెర్మన్ మెడికల్ యూనివర్సిటీలో చదువుతున్నారు. అయితే.. ఏపీ ప్రభుత్వం తమను ఏమాత్రం పట్టించుకోలేదని చెబుతున్నారు వాళ్లు. ‘‘నాలుగు రోజుల నుంచి ఇరాన్ నుంచి భారతీయుల తరలింపు కార్యక్రమం కొనసాగుతోంది. మమ్మల్ని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా ఢిల్లీకి తీసుకువచ్చింది. ఢిల్లీ నుంచి స్వయంగా మేమే మా ఖర్చులతో నంద్యాలకు వెళ్తున్నాం. మిగతా వాళ్లకు వాళ్ల వాళ్ల రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి. కానీ, ఏపీ ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సాయం అందలేదు. మాకు ఫ్లైట్ టికెట్స్ ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం చేసినట్టుగా, ఏపీ ప్రభుత్వం కూడా చేస్తే బాగుండేది.. .. మేము ఉన్న ప్రాంతంలో యుద్ధం ప్రభావం లేదు. అయినా ముందు జాగ్రత్త చర్యగా కాలేజీ యాజమాన్యం సెలవులు ఇచ్చింది. ప్రస్తుతం ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నాం. యుద్ధం రావడం వల్ల సెమిస్టర్ పరీక్షలు ఆగిపోయాయి. కాలేజీ యాజమాన్యం పిలిస్తే మళ్లీ వెంటనే ఇరాన్ వెళతాం అని నంద్యాలకు చెందిన నరేందర్, నారాయణలు తెలిపారు. ఆపరేషన్ సిందు గురించి.. ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ ఇది. మొదటి దశలో.. జూన్ 19న 110 మంది భారతీయ విద్యార్థులతో కూడిన ప్రత్యేక విమానం ఢిల్లీకి చేరింది. వీరిలో 90 మంది జమ్మూ కశ్మీర్కు చెందినవారు. రెండో దశలో జూన్ 21న మరో 310 మంది భారతీయులు ఇరాన్ నుంచి తరలించబడ్డారు. ఈ విమానం ఢిల్లీలో సాయంత్రం 4:30కి ల్యాండ్ అయింది. మొత్తం ఇప్పటివరకు: 827 మందిని భారత్కు సురక్షితంగా తీసుకువచ్చినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.ఆపరేషన్ సిందు కోసం.. ఇరాన్ ప్రభుత్వం భారత పౌర విమానాల రాకపోకల కోసం తమ గగనతలాన్ని ప్రత్యేకంగా తెరిచింది. ఈ ఆపరేషన్లో రోడ్డుమార్గం ద్వారా అర్మేనియాకు తరలించి, అక్కడి నుంచి విమానాల ద్వారా భారత్కు తీసుకురావడం వంటి వ్యూహాత్మక చర్యలు కూడా తీసుకున్నారు.యుద్ధం ఇలా.. జూన్ 13వ తేదీన ఇరాన్ నుంచి ప్రపంచానికి అణు ముప్పు ఉందని చెబుతూ ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట దాడులకు దిగింది ఇజ్రాయెల్. ప్రతిగా ఇరాన్ సైతం మిస్సైల్స్తో ఇజ్రాయెల్పై దాడులు జరిపింది. చివరకు.. ట్రంప్ మధ్యవర్తిత్వంలో ఇరుదేశాలు మంగళవారం (జూన్24న) కాల్పుల విరమణకు అంగీకరించాయి. దీంతో పశ్చిమాసియా యుద్ధం ముగిసింది. -
పోయి చెప్పులు కుట్టుకో!
న్యూఢిల్లీ: ప్రైవేట్ విమానాయాన సంస్థ ఇండిగోలో పై కుల వివక్ష పూరిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురిపై అట్రాసిటీ కేసు నమోదైంది. ఆఫీసులో తన కుమారుడిపై ముగ్గురు సహోద్యోగులు దుర్భాషలాడారని బాధితుడు శరణ్కుమార్ తండ్రి అశోక్కుమార్ తెలిపారు. కాక్పిట్లో కూర్చో వడానికి, విమానం నడపడానికి అర్హతలేదని, వెళ్లి చెప్పులు కుట్టుకోవాలంటూ తన కొడుకును అవ మాన పరిచారని ఆయన పేర్కొన్నారు. బాధితుని తండ్రి ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ విషయం సోమ వారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఇండిగోలో పనిచేస్తున్న శరణ్కుమార్ వేతనంలో అనధికార కోతలు విధించారు. ఎలాంటి కారణం లేకుండా సిక్లీవ్స్ను తగ్గించారు. సిబ్బంది ప్రయాణం, ఏసీఎమ్ సౌకర్యాలను రద్దు చేశారు. చివరకు రాజీనామా చేయాలంటూ లేఖ జారీ చేశారు. దీంతో ఆయన దిద్దుబాటు శిక్షణ పొందవలసి వచ్చింది. అయితే.. దీనిపై ప్రశ్నించినందుకు సహచరులు తపస్ డే, మనీష్ సహానీ, రాహుల్ పాటిల్లు శరణ్కుమార్పై కుల వివక్షపూరిత వ్యాఖ్యలు చేశారు. ‘మా ముందు కూర్చుని, మ మ్మల్ని వివరణ అడిగే ధైర్యం ఉందా? ఈ భవనంలో వాచ్మన్గా ఉండే అర్హత కూడా లేని నువ్వు వివరణ అడుగుతున్నావా? మీరు విమానం నడపడానికి అర్హులు కాదు.తిరిగి వెళ్లి చెప్పులు కుట్టండి. మీరు షూ తుడవడానికి కూడా పనికి రారు’ అంటూ అవమా నించారు. ఈ విషయాన్ని ఇండిగో ఎయిర్లైన్స్ సీఈఓ, ఎథిక్స్ కమిటీకి నివేదించినప్పటికీ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో.. శరణ్ తండ్రి అశోక్కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సహోద్యోగులు నిరంతరం తన కుమారుడిని లక్ష్యంగా చేసుకుని వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. తన కొడుకును అవమానించే ఉద్దేశంతోనే కులం గురించి స్పష్టంగా ప్రస్తావించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అతని ఫిర్యాదు ఆధారంగా, ముగ్గురు నిందితులపై షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నివారణ) చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
ఎయిరిండియా కీలక నిర్ణయం.. గల్ఫ్ మీదుగా వెళ్లే విమానాలు రద్దు
గల్ఫ్ దేశాల్లో సైరెన్లు మోగుతున్నాయి. గల్ఫ్ మీదుగా వెళ్లే విమాన సర్వీసులను ఎయిరిండియా రద్దు చేసింది. ఖతార్లోని అమెరికా ఎయిర్బేస్పై ఇరాన్ క్షిపణి దాడుల నేపథ్యంలో గల్ఫ్ మీదుగా వెళ్లే విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. యూరప్, ఉత్తర అమెరికాలోని తూర్పు తీర ప్రాంతాలకు సర్వీసులను ఎయిర్ ఇండియా నిలిపివేసింది.మరోవైపు, ఖతార్లోని భారతీయులు ఇళ్లలోనే ఉండాలని ఇండియన్ ఎంబసీ సూచించింది. ఖతార్ అధికారుల మార్గదర్శకాలను పాటించాలని భారత్ తెలిపింది. కాగా, ఇరాన్ దాడులను తిప్పికొట్టినట్లు ఖతార్ రక్షణ శాఖ ప్రకటించింది. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నా ఖతార్.. ఇతర దేశాల పౌరుల భద్రతకు ముప్పులేదని తెలిపింది. దేశ భద్రత విషయంలో వెనక్కి తగ్గబోమని ఖతార్ స్పష్టం చేసింది.కీలక అణుక్షేత్రంపై భారీ బాంబులేసి వినాశనం సృష్టించిన అగ్రరాజ్యంపై ఇరాన్ యుద్ధాగ్రహంతో దూసుకెళ్లింది. తన క్షిపణులకు పనిచెప్పింది. ఖతార్లోని అమెరికా వైమానికస్థావంపై సోమవారం రాత్రి క్షిపణులతో విరుచుకుపడింది. కువైట్, ఇరాక్, బమ్రెయిన్లోని అమెరికా సైనిక, వైమానిక స్థావరాలపైనా దాడిచేసినట్లు వార్తలొచ్చాయి. మరోవైపు పలు దేశాల్లోని స్థావరాలపై ఇరాన్ క్షిపణులు దూసుకొస్తుండటంతో సమీప దేశాలు అప్రమత్తమయ్యాయి. తమ గగనతలాలను మూసేశాయి. తమ పైనా యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు కువైట్, ఖతార్, బహ్రెయిన్ ప్రకటించాయి. -
ఒంటరి తల్లుల సంతానానికి ఓబీసీ సర్టిఫికెట్
న్యూఢిల్లీ: ఒంటరి తల్లుల పిల్లలకు ఓబీసీ(ఇతర వెనుకబడిన కులాల)సర్టిఫికెట్ల జారీకి సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇందుకు సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు తెలిపింది. తద్వారా తండ్రి వైపు నుంచి ధ్రువీకరణ పత్రాల అవ సరం లేకుండానే వీటిని మంజూరు చేసేందుకు అవ కాశం ఏర్పడనుంది. ‘ఒంటరి తల్లుల పిల్లలకు ఓబీసీ సర్టిఫికెట్ జారీకి సంబంధించిన చాలా ముఖ్యమైన అంశమిది. ఒంటరి తల్లి ఓబీసీకి చెందిన వారైతే ఆమె కుల ధ్రువీకరణ ఆధారంగా ఆమె పిల్లలకూ ఓబీసీ సర్టిఫికెట్ జారీ చేయాలని పిటిషనర్ కోరుతు న్నారు. ప్రస్తుతమున్న మార్గదర్శకాల ప్రకా రం తండ్రి, లేదా రక్త సంబంధీకులు ఓబీసీకి చెందిన వారైతేనే ఆ పిల్లలకు ఓబీసీ సర్టిఫికెట్ అందజేస్తున్నా రు. దీని వల్ల ఒంటరి తల్లులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు’అని సోమవారం విచారణ సందర్భంగా జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం పేర్కొంది. ‘ఈ అంశం చాలా ముఖ్యమైంది. కొన్ని అంశాలను పరిష్కరించిన తర్వాత మార్గదర్శకాలను జారీ చేస్తాం’అని జస్టిస్ విశ్వనాథన్ వాదనల సందర్భంగా పేర్కొన్నారు. ‘విడాకులు తీసుకున్న ఒక మహిళ పిల్లల ఓబీసీ కులధ్రువీకరణ పత్రం కోసం మాజీ భర్త వద్దకు ఎలా వెళ్లగలదు?’అని ఆయన ప్రశ్నించారు. ఈ పిటిషన్పై ఈ ఏడాది ఫ్రిబవరిలో విచారణ చేపట్టిన ధర్మాసనం కేంద్రానికి, ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సోమవారం విచారణ సందర్భంగా అదనపు సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున వాదనలు వినిపించారు. 2012 నాటి రమేశ్భాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఉదహరించారు. ఒంటరి తల్లుల పిల్లలకు ఓబీసీ సర్టిఫికెట్ల జారీకి సంబంధించిన మార్గదర్శకాలను వెలువ రించాలని విన్నవించారు. ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణను జూలై 22వ తేదీకి వాయిదా వేసింది. -
జాతీయ రహదారులు రక్తసిక్తం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజలను గమ్యస్థానాలకు చేర్చాల్సిన రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. రోడ్లపై నిత్యం పలువురు ప్రాణాలను కోల్పోతుండగా, మరికొందరు గాయపడి మంచాలకు పరిమితమవుతున్నారు. దేశంలోని జాతీయ రహదారులపై 2023లో దాదాపు 2,300 మంది మృత్యువాత పడ్డట్లు జాతీయ రహదారుల డేటా తెలుపుతోంది. 522 కిలోమీటర్ల పొడవు ఉన్న ఎన్హెచ్–48పై గుజరాత్లో 763 మంది మృతి చెందారు.ఆ ఏడాదిలో దేశంలో ఎక్కువమంది మృతిచెందింది గుజరాత్లోనే. 266 కిలోమీటర్ల ఎన్హెచ్–44పై హరియాణాలో 715మంది మృతి చెందారు. ఇక 154 కిలోమీటర్ల ఎన్హెచ్–65పై ఆంధ్రప్రదేశ్లో 213 మంది దుర్మరణం చెందారు. దేశంలోని పది జాతీయ రహదారుల్లో మృతిచెందిన వారి డేటా ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. కేవలం 21మంది మృతిచెందిన రాష్ట్రంగా పుదుచ్చేరి నిలిచింది. ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ.. ఫలితం కనిపించడం లేదు. త్వరితగతిన గమ్యానికి చేరుకోవాలనే లక్ష్యంతో జాతీయ రహదారులపై వేగంగా ప్రయాణిస్తున్న కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నట్టు కేంద్రం గుర్తించింది. -
అధిక బరువును మోస్తున్న భారత్
సాక్షి, న్యూఢిల్లీ: భారత్లో స్థూలకాలయం పెను సమస్యగా మారుతోంది. దేశవ్యాప్తంగా ప్రజలను అధిక బరువు, ఊబకాయం పట్టిపీడిస్తున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ రీసెర్చ్(ఎన్సీఐసీపీఆర్) సంయుక్తంగా నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. ప్రతి ఐదు కుటుంబాల్లో ఒక కుటుంబంలోని వయోజనులంతా అధిక బరువుతో బాధపడుతున్నట్లు అధ్యయనంలో తేలింది. దాదాపు 20 శాతం కుటుంబాలకు అధిక బరువు సమస్యగా పరిణమించింది. 10 శాతం మంది స్థూలకాయంతో జీవితాన్ని నెట్టుకొస్తున్నారని అధ్యయనం నివేదించింది. మణిపూర్, కేరళ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం వంటి రాష్ట్రాల్లోని 30శాతం కంటే ఎక్కువ కుటుంబాల్లో దాదాపు పెద్దలందరూ అధిక బరువుతో ఉన్నారు. తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రతి ఐదింట రెండు కుటుంబాల్లో పెద్దలు ఊబకాయంతో బాధపడుతున్నారు. ఇటీవల తమిళనాడు హెల్త్ జర్నల్లో సంబంధిత అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. దక్షిణాది రాష్ట్రాలు, పట్టణ ప్రాంతాల్లో అధిక బరువు, ఊబకాయం సమస్యల వివరాలను అధ్యయనం వెల్లడించింది. సంపన్న ప్రాంతాలలో ముఖ్యంగా షెడ్యూల్డ్ తెగ వర్గాలలో 12.2 శాతం వరకు ఊబకాయంతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని అధ్యయనం పేర్కొంది. పట్టణ కుటుంబాల్లో దాదాపు 15 శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంఖ్య 8 శాతంగా నమోదైంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక సహా దక్షిణ రాష్ట్రాలు స్థూలకాయానికి సంబంధించి హాట్స్పాట్లుగా అవతరించాయి. పట్టణ ప్రాంతాల్లో 30 శాతం కంటే ఎక్కువ పెద్దలు అధిక బరువు కలిగి ఉన్నారని అధ్యయనంలో గుర్తించారు. తమిళనాడులో 24.4 శాతం, పంజాబ్లో 23.5 శాతం కుటుంబాల్లోని పెద్దలు అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు. దేశంలో అత్యధికంగా పుదుచ్చేరిలోని 25.2 శాతం కుటుంబాల్లో పెద్దలందరిలో ఊబకాయం పెద్ద విపత్తుగా తయారైంది. ధనిక వర్గాలు, నగర ప్రాంతాలు, ఆధునిక జీవన విధానం ఉన్న రాష్ట్రాలు ఎక్కువ ఒబెసిటీ, అధిక బరువు సమస్యకు ప్రభావితమవుతున్నాయి. ఈ ధోరణి మారుతున్న జీవనశైలికి కారణమని అధ్యయనం పేర్కొంది. ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వినియోగం ఎక్కువగా ఉండడం, ఆహార శైలి మార్పు, శారీరక శ్రమ లేకపోవడం, ఆధునిక జీవనశైలి వంటి అంశాలు అధిక బరువు, ఊబకాయానికి ప్రధాన హేతువులవుతున్నాయి. ప్రతీ నాలుగు ధనవంతుల కుటుంబాల్లో ఒక కుటుంబంలోని వారందరినీ అధిక బరువు సమస్య వేధిస్తోంది. దేశంలోని 17.3 శాతం సంపన్న కుటుంబాల్లో ఊబకాయం ఇబ్బంది పెడుతోంది. షెడ్యూల్డ్ జాతుల (ఎస్టీ) వారిలో ఊబకాయం అత్యల్పంగా 4.2 శాతం మాత్రమే నమోదైంది. -
మేఘాలయ హనీమూన్ హత్య కేసులో సిట్ కీలక పురోగతి
షిల్లాంగ్: మేఘాలయ హనీమూన్ హత్య కేసులో సిట్ అధికారుల దర్యాప్తులో పురోగతి సాధించారు. పెళ్లైన 11 రోజులకే తన భర్త రాజా రఘు వంశీ హత్య కేసులో సోనమ్ రఘువంశీ పాటు ఇతర నిందితుల సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సిట్ దర్యాప్తులో సోనమ్కు సహకరించిన ప్లాటు యజమానిని అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలు సోనమ్ రఘువంశీ తన భర్త రాజా రఘువంశీని హత్య చేసిన తర్వాత నిందితులు ఇండోర్లో ఓ ప్లాటును అద్దెకు తీసుకున్నారు. ఆ ఫ్లాట్ యజమాని ఓ ఇన్ఫ్రాస్టక్చర్ కంపెనీ యజమాని లోకేంద్ర తోమర్. అయితే, సోనమ్ ఉండేందుకు అద్దె ఇల్లు చూపించిన ప్రాపర్టీ డీలర్ సలోమ్ జేమ్స్ను పోలీసులు ప్రశ్నించడంతో లోకేంద్ర తోమర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇక పోలీసుల దర్యాప్తులో సోనమ్ అద్దెకు ఉన్న ఇంటి నుంచి కంట్రీ మేడ్ పిస్టల్, ఆమె ఫోన్, రాజా నగలు, ఐదు లక్షల రూపాయల నగదును తీసుకెళ్లాడని పోలీసులు అనుమానిస్తున్నారు.అంతేకాదు, జేమ్స్ చెప్పిన వివరాల మేరకు.. సోనమ్ పోలీసులకు లొంగిపోయిన కొద్ది సేపటికే తోమర్.. జేమ్స్కు ఫోన్ చేశారు. సోనమ్ అద్దెకు ఉన్న ప్లాట్లో ఓ బ్యాగ్ ఉందని, వెంటనే దాన్ని తీసేయాలని కోరాడు. కానీ జేమ్స్ ఆ బ్యాగ్ను తీయించలేదు. అందుకే తమర్ ఆ బ్యాగ్ను తీసుకున్నాడు.తన ఫ్లాట్ సమీపంలోని కార్ షోరూమ్లోని సీసీటీవీ ఫుటేజ్ను తొలగించేందుకు ప్రయత్నించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. తోమర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఇండోర్లో అతని ఆచూకీ కోసం పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారని వర్గాలు తెలిపాయి. Just take a look at this wedding video of Sonam and Raja Raghuvanshi and you will agree that Sonam was clearly not happy with this marriage. Raja Raghuvanshi would have been alive if Sonam had said No to the marriage. She had the courage to hire contract killers but didn't had… pic.twitter.com/NbHlQQWzXK— Incognito (@Incognito_qfs) June 9, 2025 -
బుగ్గమఠం భూములపై ‘సుప్రీం’ స్టేటస్ కో ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: బుగ్గమఠం భూములపై సుప్రీం కోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. మరోసారి.. రెండు వారాలపాటు యధాతధ స్థితి కొనసాగించాలని స్పష్టం చేసింది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ వ్యవహారంపై పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ఫై ఇవాళ విచారణ జరిగింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న జస్టిస్ కేవీ విశ్వనాధన్, జస్టిస్ ఎన్ కె సింగ్ ధర్మాసనం.. సింగిల్ జడ్జి ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో బుగ్గ మఠం భూములపై రెండు వారాలపాటు స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశిస్తూనే..చట్ట ప్రకారం ఏపీ హైకోర్టు తగిన ఆదేశాలు జారీ చేయాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. -
కలిసి పనిచేస్తేనే లాభం!
న్యూఢిల్లీ: పొరుగు దేశాలతో సంబంధాలు ఎల్లప్పుడూ సజావుగా సాగాలని ఆశించకూడదని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. పాలకులతో సంబంధం లేకుండా సంబంధాల్లో స్థిరత్వాన్ని నిర్మించడానికి తమ ప్రభుత్వం ప్రయతి్నంచిందని నొక్కి చెప్పారు. అందుకు శ్రీలంక, మాల్దీవులను ఆయన ఉదహరించారు. అక్కడ నాయకత్వం మారినప్పటికీ ద్వైపాక్షిక సంబంధాలు స్థిరంగా ఉన్నాయన్నారు. ఏ దేశంతోనైనా పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పుడు చేతులెత్తేయకూడదన్నారు. భారత్తో కలిసి పనిచేయడం ఇతర దేశాలకే లాభిస్తుందని, లేదంటే వారే నష్టపోతారని వ్యాఖ్యానించారు. అయితే ఈ విషయాన్ని గ్రహించడానికి కొన్ని దేశాలకు ఎక్కువ సమయం పడుతుందన్నారు. సైన్యం చేతుల్లో అధికారం, భారత్పై శత్రుత్వంతో ఉన్న పాకిస్తాన్ ఇందుకు మినహాయింపని, ఒక్క పాక్ను పక్కనపెడితే.. దౌత్యం అన్ని చోట్లా వర్తిస్తుందన్నారు. డీడీ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లింక్ను తన ఎక్స్ హ్యాండిల్లో శనివారం రాత్రి ఆయన పోస్టు చేశారు. దాదాపు గంటసేపు జరిగిన సంభాషణలో దౌత్యసంబంధాలపై అనేక విషయాలను జైశంకర్ పంచుకున్నారు. చైనాతో చాలా సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని, వాటిని ఎదుర్కోవడానికి మన సామర్థ్యాలను పెంచుకోవాల్సి వచ్చిందని తెలిపారు. జూన్ 2020లో గాల్వన్ లోయ ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు గణనీయంగా దెబ్బతిన్నాయి. అయితే.. గత దశాబ్దాల్లో మన సరిహద్దు మౌలిక సదుపాయాలను పూర్తిగా విస్మరించడం వల్లే ఈ గందరగోళ పరిస్థితి వచ్చింన్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం సరిహద్దు మౌలిక సదుపాయాలపై నిర్మించడం వల్ల పరిస్థితి మారిపోయిందని, మన దేశ ప్రయోజనాలను కాపాడుకోగలుగుతున్నామని జైశంకర్ తెలిపారు. గత 11 ఏళ్లలో భారత్ పొరుగు దేశాలతో సంబంధాలను మరింతగా పెంచుకుందని, గల్ఫ్ దేశాలకు చేరువైందని, ఆసియాన్, ఇండో–పసిఫిక్ ప్రాంతాలతో సంబంధాలను మరింతగా బలోపేతం చేసుకుందని చెప్పారు. మోదీ ప్రభుత్వం హయాంలో పాకిస్తాన్ పట్ల భారతదేశ విధానం మారిపోయిందని, 2016 ఉరి సర్జికల్ స్ట్రైక్, 2019 బాలకోట్ వైమానిక దాడులను ఆయన ప్రస్తావించారు. ఆర్టికల్ 370 రద్దు, భారత్ ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను విస్తృత వ్యూహంలో భాగాలుగా చూడాలని జైశంకర్ చెప్పారు. ప్రధాని మోదీని ‘మన కాలపు నాయకుడు’గా జైశంకర్ అభివరి్ణంచారు. ప్రజల మానసిక స్థితి మారిందని, ప్రజల ఆత్మవిశ్వాసానికి’ప్రధాని మోదీ నిదర్శనమని మంత్రి నొక్కి చెప్పారు. -
ఇజ్రాయెల్,అమెరికా విరుచుకు పడుతున్న వేళ.. ఇరాన్కు ప్రధాని మోదీ ఫోన్ కాల్!
సాక్షి,ఢిల్లీ: ఇరాన్పై ఇజ్రాయెల్,అమెరికా దాడులకు తెగబడుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరు దేశాలు శాంతి నెలకొల్పేలా చర్చలు జరపాలంటూ భారత ప్రధాని మోదీ (Narendra Modi) ఇరాన్ అధ్యక్షుడితో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్తో (Masoud Pezeshkian) ఫోన్లో మాట్లాడారు. ఈమేరకు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ‘ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్తో నేను మాట్లాడాను. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా జరుపుతున్న దాడుల గురించి చర్చించాం. ఈ దాడులపై ఆందోళన వ్యక్తం చేశాం. ప్రాంతీయంగా శాంతి, భద్రత, స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించడానికి, తక్షణ ఉద్రిక్తతలను తగ్గించడం, శాంతి చర్చలు జరపాలని చెప్పినట్లు ’ పేర్కొన్నారు. Spoke with President of Iran @drpezeshkian. We discussed in detail about the current situation. Expressed deep concern at the recent escalations. Reiterated our call for immediate de-escalation, dialogue and diplomacy as the way forward and for early restoration of regional…— Narendra Modi (@narendramodi) June 22, 2025సుదీర్ఘకాలం నుంచి ఇరాన్తో పాటు ఇరాన్ మద్దతిస్తున్న హమాస్, హెజ్బొల్లా వంటి మిలిటెంట్లు గ్రూపులు ఇజ్రాయెల్పై దాడులకు తెగబడుతున్నాయి. ఈ దాడులు తన భద్రతకు ముప్పుగా భావిస్తోంది. అందుకే ఇజ్రాయెల్ హమాస్, హెజ్బొల్లాతో పాటు ఇరాన్పై దాడుల్ని తీవ్రతరం చేసింది.ఇరాన్పై అమెరికా ఎందుకు దాడులు చేస్తోంది?ఈ ఇరు దేశాల యుద్ధంలో ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో అమెరికా సైన్యం శనివారం (జూన్ 21, 2025న) ఇరాన్లోని మూడు ప్రధాన అణు కేంద్రాలపై వైమానిక దాడులు చేసింది. ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ అనే అణు కేంద్రాలపై B-2 స్పిరిట్ బాంబర్లతో భారీ బాంబుల వర్షం కురిపించింది. ట్రంప్ సైతం ఈ దాడి విజయవంతమైందని పేర్కొన్నారు. ( ఫొటొ:ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా ప్రయోగించిన బీ-2 స్పిరిట్ బాంబార్స్), image source: (యూఎస్ఏ టుడే)ఈ దాడి ద్వారా అమెరికా అధికారికంగా యుద్ధంలోకి దిగినట్టయింది. ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేయకుండా అడ్డుకోవడమే ప్రధాన ఉద్దేశమని ట్రంప్ తెలిపారు. అయితే, ఈ చర్యపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇది యుద్ధాన్ని మరింత పెంచుతుందా లేక శాంతికి దారి తీస్తుందా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి నాంది కావొచ్చని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇరాన్పై ఇజ్రాయెల్ యుద్ధానికి కారణంఇరాన్ ప్రధానంగా హమాస్ (పాలస్తీనా), హెజ్బొల్లా (లెబనాన్) వంటి మిలిటెంట్ గ్రూపులకు ఆర్థిక సహాయం, ఆయుధాలు, శిక్షణ అందిస్తోంది. ఈ శిక్షణను ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ)లోని ఖుద్స్ ఫోర్స్ అనే విభాగం నిర్వహిస్తోంది.హమాస్: ఇజ్రాయెల్పై అక్టోబర్ 7,2023న జరిగిన దాడికి ముందు, హమాస్ మిలిటెంట్లు ఇరాన్లో శిక్షణ పొందినట్లు ఇజ్రాయెల్ ఆరోపించింది. వీరికి డబ్బు,ఆయుధాలు,సాంకేతిక సహాయం కూడా అందించినట్లు ఆరోపించింది. హెజ్ బొల్లా: ఇది లెబనాన్లో ఉన్న షియా మిలిటెంట్ గ్రూప్. దీనికి ఇరాన్ మద్దతు ఇస్తుంది. హెజ్ బొల్లాకు ఆయుధాలు, శిక్షణతో పాటు వ్యూహాత్మక సలహాలు సూచనలు ఇస్తోంది.అందకు హెజ్బొల్లా, హమాస్తో పాటు ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల్ని తీవ్రతరం చేసింది. హెజ్బొల్లా,హమాస్ గ్రూపుల్ని నిర్విర్యం చేసింది. ఆ రెండు గ్రూపులకు కీలకంగా వ్యవహరిస్తున్న టాప్ కమాండర్లను హతమార్చింది. ఇప్పుడు ఇరాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. -
10–15 ఏళ్లు దాటిన వాహనాలకు నో పెట్రోల్, నో డీజిల్..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రరూపం దాల్చుతున్న వాయు కాలుష్యం సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరో నిబంధనను అమల్లోకి తేనున్నాయి. పదేళ్లు దాటిన వాహనాలకు బంక్ల్లో డీజిల్, పెట్రోల్ నిరాకరించేలా ఆదేశాలు జారీ అయ్యాయి. పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలకు, 15 ఏళ్లు దాటిన పెట్రోల్తో నడిచే వాహనాలకు జూలై ఒకతో తేదీ నుంచి బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయవద్దంటూ మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఈ విధానం మిగతా ప్రాంతాల్లోనూ విడతల వారీగా అమల్లోకి రానుందని సమాచారం. ఇందులో భాగంగా వాహనాలను గుర్తించేందుకు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగి్నషన్ (ఏఎన్పీఆర్) కెమెరాల నెట్వర్క్ను ఢిల్లీలో ఉన్న 520 బంకుల్లో ఏర్పాటయ్యాయి. వాహన డేటాబేస్తో అనుసంధానించిన ఈ వ్యవస్థలు, పాతబడిన, నిబంధనలను పాటించని వాహనాలను అప్పటికప్పుడు గుర్తిస్తాయి. జూలై 1వ తేదీ నుంచి ఈ కెమెరాలు బంకుల్లోకి వచ్చే వాహనాలను గుర్తించి సిబ్బందిని అప్రమత్తం చేస్తాయి. వాహన రిజి్రస్టేషన్ నంబర్ సాయంతో ఇతర వివరాలను తక్షణమే క్రాస్ చెక్ చేస్తాయి. వాహనం ఈఎల్వీ(ఎండ్ ఆఫ్ లైఫ్ వెహికల్)గా గుర్తించినా లేదా చెల్లుబాటయ్యే పొల్యూషన్ సరి్టఫికెట్ లేకున్నా సిస్టమ్ ఆపరేటర్కు ఆడియో హెచ్చరికను జారీ చేస్తాయి. అక్టోబర్ 31 నుంచి గుర్గావ్, ఫరీదాబాద్, ఘాజియాబాద్, గౌతమ్ బుద్ధనగర్, సోనిపట్ ప్రాంతాల్లో ఈ విధానం అమల్లోకి వస్తుంది. ఇక వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఎన్సీఆర్ పరిధిలోని మిగిలిన ప్రాంతాల్లోనూ అమలులోకి రానుంది. ఢిల్లీలో 10–15 ఏళ్లు దాటిన వాహనాలు 62 లక్షల వరకు ఉన్నట్లు రవాణా శాఖ గుర్తించింది. -
మేకిన్ ఇండియాతో చైనాకే లాభం.. మనకు నష్టం
సాక్షి, న్యూఢిల్లీ: భారత్లో చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’తో మన దేశానికి ఎలాంటి లాభం లేకపోగా చైనాయే ఎక్కువగా లాభపడిందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో విపక్ష నేత రాహుల్గాంధీ తీవ్రంగా విమర్శించారు. 2014 తర్వాత భారత్లో తయారీ రంగం జీడీపీలో 14 శాతానికి పడిపోవడం, చైనా నుంచి దిగుమతులు రెట్టింపు కావడాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రధాని మోదీ నినాదాలు ఇవ్వడంలో మాస్టర్ అని.. పరిష్కారాలు చూపడంలో కాదని రాహుల్ ఎద్దేవా చేశారు. శనివారం రాహుల్ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ఖాతాలో ఒక పోస్ట్పెట్టారు. ‘మేక్ ఇన్ ఇండియా పరిశ్రమల బూమ్కి మోదీ సర్కార్ హామీ ఇచి్చంది. అయితే తయారీరంగం ఎందుకు చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయికి దిగజారింది? యువత అత్యధిక స్థాయిలో నిరుద్యోగాన్ని ఎదుర్కొంటోంది. చైనా నుంచి దిగుమతులు రెట్టింపయ్యాయి. నినాదాలు ఇచ్చే కళలో మోదీ విపరీతమైన నైపుణ్యం సాధించారు. కానీ పరిష్కారాలు చూపడంలో ఘోరంగా విఫలమయ్యారు’’అని రాహుల్ విమర్శించారు. అంతా అసెంబ్లింగ్ ఢిల్లీలో ప్రముఖమైన ఎల్రక్టానిక్స్ విక్రయ దుకాణ సముదాయం అయిన నెహ్రూ ప్లేస్ను రాహుల్ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి మొబైల్ రిపేర్ టెక్నీషియన్స్ అయిన సైఫ్, శివమ్లతో కొద్దిసేపు మాట్లాడారు. సంబంధిత వీడియోనూ ‘ఎక్స్’లో రాహుల్ షేర్చేశారు. ‘‘‘నిజం ఏంటంటే.. ఇతర దేశాల నుంచి విడిభాగాలను దిగుమతి చేసుకుంటున్నాం. వాటికి బిగించే అసెంబ్లింగ్ పనిచేస్తున్నాం. అంతేగానీ ఇక్కడ ఉత్పత్తిచేయట్లేము. అందుకే మన కారణంగా చైనా లాభపడుతోంది. చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్రక్టానిక్ మార్కెట్గా వెలుగొందుతోంది. ఇంతపెద్ద మార్కెట్ మరేచోటా లేదు. మనం ఐఫోన్ విడిభాగాలను దిగుమతిచేసుకుని అసెంబ్లింగ్ చేస్తున్నాం. ఇది అతికొద్ది మంది పారిశ్రామికవేత్తల కనుసన్నల్లో జరుగుతోంది. ఇకపై మనమే ఐఫోన్లను తయారుచేసే స్థాయికి ఎదుగుదాం. అప్పుడే ఈ పరిశ్రమ పురోగతి సాధిస్తుంది. ఇతర దేశాల వస్తువులకు భారత్ అనేది మార్కెట్గా ఉండకూడదు. స్థానికంగా ఉత్పత్తులను తయారుచేసి ఎగుమతి చేసే మార్కెట్గా భారత్ అవతరించాలి. ఇందుకోసం ప్రాథమికస్థాయిలోనే సంస్కరణలు రావాలి. లక్షల కొద్దీ తయారీదారులు తయారుకావాలి. ఇందుకు ఎంతో నిజాయతీతో కూడిన సంస్కరణలు, ఆర్థిక దన్ను అవసరం. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం(పీఎల్ఐ) ప్రయోజనాలనూ ప్రభుత్వం గుట్టుచప్పుడుకాకుండా నెమ్మదిగా ఉపసంహరించుకుంటోంది. ఇది కూడా ప్రభుత్వ వైఫల్యమే’అని రాహుల్ గాంధీ మండిపడ్డారు. విమర్శించిన బీజేపీ రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. ‘‘దేశంలో భారీ సంస్కరణలు, దేశ పురోగతిని అందరూ కళ్లారా చూస్తున్నారు ఒక్క రాహుల్ తప్ప. దేశ ప్రగతిని తక్కువ అంచనా వేయంలో రాహుల్ బిజీగా మారారు. భారత స్వావలంభనకు ఆపరేషన్ సిందూర్ తాజా తార్కాణం. చైనా తయారీ డ్రోన్లను భారత తయారీ డ్రోన్లు నేలకూల్చాయి’’అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ అన్నారు. -
ఆపరేషన్ సింధు: ఇరాన్ నుంచి మరో విమానం.. స్వదేశానికి 310 మంది భారతీయులు
ఢిల్లీ: ఆపరేషన్ సింధు కొనసాగుతోంది. ఇరాన్ నుంచి మరో 310 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. శనివారం సాయంత్రం 4:30 గంటలకు తరలింపు విమానం ఢిల్లీలో ల్యాండ్ అయ్యింది. ఇప్పటివరకు 827 మందిని భారత్కు తరలించినట్లు విదేశాంగశాఖ వెల్లడించింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న ఈ క్రమంలో ఇరాన్లో ఉన్న భారతీయులను సురక్షితంగా దేశానికి తిరిగి తీసుకువచ్చేందుకు భారత్ చర్యలు చేపట్టింది.కాగా, నిన్న (శుక్రవారం) రాత్రి 11.30 గంటలకు ఇరాన్ నుంచి 290 మంది భారతీయులతో కూడిన విమానం ఢిల్లీకి చేరుకుంది. గురువారం.. మొదటి దశలో 110 మంది పౌరులతో తరలింపు విమానం భారత్కు చేరిన విషయం తెలిసిందే. ఓవైపు యుద్ధం కొనసాగుతున్నాసరే ఇరాన్ భారత్కు అనుకూలంగా వ్యవహరించింది. పౌర విమానాల రాకపోకల కోసం గతంలో మూసేసిన గగనతలాన్ని భారత్ కోసం ప్రత్యేకంగా తెరిచింది. దీంతో ఇరాన్ నుంచి భారత్కు విమానాలు చేరుకుంటున్నాయి.యుద్ధం కారణంగా అక్కడి మష్హాద్ సిటీలో ఎక్కువ సంఖ్యలో భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆపరేషన్ సిందూలో భాగంగా భారతసర్కార్ ఇరాన్లోని కొందరు విద్యార్థులను రోడ్డుమార్గంలో అర్మేనియాకు తరలించి అక్కడి నుంచి విమానమార్గంలో స్వదేశానికి తీసుకొచ్చింది. ఇకపై నేరుగా ఇరాన్ ఎయిర్పోర్ట్ల నుంచే విమానాలు తిరుగు ప్రయాణం కానున్నాయి. -
రాహుల్ గాంధీ డిమాండ్ను తిరస్కరించిన ఈసీ
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్లలోని CCTV ఫుటేజ్ విడుదల చేయాలన్న డిమాండ్ను కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఓటర్ల గోప్యతా హక్కును పరిగణనలోకి తీసుకోవడంతో పాటు చట్టపరమైన ఆటంకాల కారణంగా వాటిని బహిరంగపర్చలేమని తేల్చి చెప్పింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సీసీ ఫుటేజీలు బహిరంగపర్చాలని ప్రతిపక్షాల డిమాండ్లు చేస్తున్న సంగతి తెలిసిందే. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పదే పదే డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇలా చేయడం ఓటర్ల గోప్యతకు భంగం కలిగించడమే అవుతుందని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. ఈసీ వర్గాలు ఏం చెప్పాయంటే.. ఓటర్ల గోప్యత: సీసీటీవీ ఫుటేజీ ఫుటేజ్ ద్వారా ఓటు వేసినవారిని, వేయని వారిని గుర్తించవచ్చు. తద్వారా వాళ్లపై వివక్ష లేదంటే బెదిరింపులకు పాల్పవచ్చు. చట్టపరమైన పరిమితులు: ఈ ఫుటేజ్ను బయట పెట్టడం ద్వారా.. ప్రజాప్రతినిధుల చట్టం (Representation of the People Act) ఉల్లంఘన అవుతుంది. పైగా ఓటు వేయడం.. ఓటు వేయకపోవడం వ్యక్తిగత హక్కు అని సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చింది. అంతర్గత వినియోగం మాత్రమే: ఈ వీడియోలు కేవలం అంతర్గత పర్యవేక్షణ కోసం మాత్రమే. ఒకవేళ కోర్టు ఆదేశిస్తే మాత్రమే వాటిని పంచుతాం. ఫుటేజ్ తొలగింపు: ఎన్నికల ఫలితాలపై 45 రోజుల్లోగా కోర్టులో పిటిషన్ దాఖలు కాకపోతే, ఆ తర్వాత వీడియో ఫుటేజ్ను తొలగించడం సాధారణ ప్రక్రియనే అని ఈసీ తెలిపింది కిందటి ఏడాది మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మయూతీ కూటమి ఘన విజయం సాధించింది. అయితే.. ఆ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని విపక్షాలు ఆరోపిస్తూ వస్తున్నాయి. అయితే ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని ఈసీ పదే పదే చెబుతూ వస్తోంది.కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ మధ్యే 2024 లోక్సభ ఎన్నికలు, మహారాష్ట్ర సహా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం కన్సాలిడేటెడ్, డిజిటల్ ఓటర్ రోల్స్ను ప్రచురించాలంటూ ఎన్నికల సంఘాన్ని కోరారు. అలాగే, మహారాష్ట్రలో ఎన్నికల రోజు సాయంత్రం 5 గంటల తర్వాత పోలింగ్ బూత్లలో రికార్డ్ అయిన అన్ని CCTV ఫుటేజ్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈసీ తాజాగా చేసిన ప్రకటనపై రాహుల్ గాంధీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇది ఎన్నికల ఫిక్సింగ్ అని.. ప్రజాస్వామ్యానికి ఇదొక విషమని పేర్కొంటూ ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు. -
DGCA సీరియస్.. ఎయిరిండియా నుంచి ముగ్గురి తొలగింపు
న్యూఢిల్లీ: ఎయిరిండియా (Air India) విమానయాన సంస్థపై పౌర విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఆగ్రహం వ్యక్తం చేసింది. అహ్మదాబాద్ ఘటన తర్వాత ఆ సంస్థ కార్యకలాపాలపై డీజీసీఏ క్షణ్ణంగా పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. శనివారం ఎయిరిండియాలో పనిచేస్తున్న ముగ్గురు సీనియర్ అధికారులను తక్షణమే తొలగించాలని ఆదేశించింది. ఇటీవల బెంగళూరు నుంచి లండన్ హీత్రోకు బయలుదేరిన రెండు విమానాలు(మే 16, 17వ తేదీల్లోని AI133 సర్వీస్).. గరిష్ట విమాన ప్రయాణ సమయ పరిమితి 10 గంటలు మించిపోయాయి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి డీజీసీఏ.. ఎయిరిండియాకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని ఏడు రోజుల గడువు విధించింది. అదే సమయంలో..నిబంధనలు సరిగా పాటించకపోవడం వల్లే ఎయిరిండియాకు చెందిన ముగ్గురు సిబ్బందిపై చర్యలకు డీజీసీఏ ఉప్రకమించింది. ఈ ముగ్గురు అధికారులు సిబ్బంది షెడ్యూల్, రోస్టర్ విధులు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. లైసెన్సింగ్, సర్వీసింగ్ లోపాలు ఉన్నా ఎయిరిండియా విమాన సిబ్బందిని షెడ్యూల్ చేయడంపై DGCA ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిర్లైన్స్ వెల్లడించిన విషయాల ఆధారంగా అలసత్వంగా వ్యవహరించిన అధికారులపై వేటు వేయాలని సిఫార్సు చేసింది. ‘‘నిబంధనలు పాటించకుండానే విమానాలను షెడ్యూల్ చేశారు. అంతేకాకుండా, వారు ఈ తప్పిదాలపై జవాబుదారీతనంతో వ్యవహరించలేదు. ఎలాంటి జాప్యం చేయకుండా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలి’’ అని డీజీసీఏ తన నోటీసుల్లో పేర్కొంది. ఈ క్రమంలో.. వెంటనే వారిపై అంతర్గత క్రమశిక్షణ చర్యలు ప్రారంభించాలని ఆదేశించింది. ముగ్గురు అధికారులపై తీసుకున్న చర్యలను 10 రోజులలోపు డీజీసీఏకి నివేదించాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది. అంతేకాకుండా వీరి స్థానంలో కొత్త అధికారులను నియమించాలని.. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు కొత్త వారినే కొనసాగించాలని తెలిపింది. విమాన సిబ్బంది క్రూ షెడ్యూల్, రోస్టరింగ్ పనులు నిర్వహిస్తున్న ముగ్గురు అధికారులు.. పైలెట్లకు తగిన లైసెన్సింగ్, రెస్ట్, తప్పనిసరి నిబంధనలను ఉల్లంఘించారన్నది డీజీసీఏ వాదన. ఐవోసీసీ అడిటింగ్లో ఈ విషయం బయటపడింది. అయితే ఇటీవలి అహ్మదాబాద్ ఘటన నేపథ్యంలోనే డీజీసీఏ చర్యలకు ఎయిరిండియాకు సిఫారసు చేసినట్లు స్పష్టం అవుతోంది. అంతేకాదు.. క్రూ షెడ్యూలింగ్ నిబంధనలు, లైసెన్సింగ్, ఫ్లైట్ టైం లిమిటేషన్స్ తదితర అంశాల్లో ఉల్లంఘనలకు పాల్పడితే ఇక నుంచి భారీ జరీమానాలు విధిస్తామని డీజీసీఏ హెచ్చరిస్తోంది కూడా. కాగా.. జూన్ 12వ తేదీ మధ్యాహ్నాం అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయల్దేరిన కొన్ని సెకన్లలోనే ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైంది. మొత్తం 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అది ఓ భవనంపై కూలి.. ముక్కలై.. పేలిపోయింది. వీరిలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరితో పాటు విమానం కూలినచోట మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంలో ఉన్న వైద్య విద్యార్థులు, పలువురు స్థానికులు కూడా కన్నుమూశారు. మొత్తంగా ఈ దుర్ఘటనలో ఇప్పటిదాకా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 278కి చేరింది. మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి, వారి కుటుంబీకులకు అందజేసే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. -
ఇంద్రావతికి కట్టడి!
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలకు జీవనాడిగా ఉన్న గోదావరి నదికి ప్రాణహిత తర్వాత ప్రధాన ఉప నది అయిన ఇంద్రావతి నీటిని పూర్తిగా కట్టడి చేసేలా ఛత్తీస్గఢ్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇంద్రావతిలో లభ్యతగా ఉన్న నీటిలో మెజా రిటీ జలాలను వినియోగించుకునేలా బోద్ఘాట్ బహుళార్థక సాధక ప్రాజెక్టుకు అంకురార్పణ చేస్తోంది. ఇటీవలే ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సైతం అనుమతినిచ్చిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ప్రకటించారు. ఇంద్రావతి నీటినే నమ్ముకొని తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులు చేపడుతుండటం గమనార్హం. కాగా ప్రస్తుతం ఛత్తీస్గఢ్ తెరపైకి తెచ్చిన ఈ ప్రాజెక్టుతో దిగువ గోదావరిలో జలాల లభ్యత తగ్గిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఛత్తీస్గఢ్ వినియోగించని జలాలనే ఆధారంగా చేసుకుని కేంద్రం గోదావరి–కావేరి అనుసంధానాన్ని తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఎగువ నీళ్లకు ఎగువనే అడ్డుకట్ట.. ఇంద్రావతిలో ప్రతి ఏటా సుమారు 600–800 టీఎంసీల మేర లభ్యత ఉంటుందని కేంద్రం లెక్కలు చెబుతున్నాయి. ఇది ఛత్తీస్గఢ్లో 264 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మేడిగడ్డ దిగువన, సమ్మక్క–సారక్క బరాజ్ ఎగువన గోదావరిలో కలుస్తుంది. దంతెవాడ, బీజాపూర్, సుక్మా, బస్తర్, కాంకేర్ జిల్లాల గుండా ప్రవహిస్తుంది. ఆయా జిల్లాలన్నీ తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దుల్లోనే ఉన్నాయి. ఇంద్రావతి నీళ్లు కలిశాకే గోదావరి దిగువన ప్రవాహాలు మరింత ఉధృతంగా ఉంటాయి. కాగా ఇంద్రావతి నది గోదావరిలో కలిసే ప్రాంతానికి దిగువన, గరిష్ట నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ.. దేవాదుల (38 టీఎంసీలు), సీతారామ (70 టీఎంసీలు), సమ్మక్క–సారక్క (50 టీఎంసీలు మొత్తంగా 158 టీఎంసీలు) ప్రాజెక్టులు చేపట్టింది. ఇక ఏపీలో పోలవరం ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. ఇలావుండగా ఇంద్రావతిలో లభ్యత నీటిని ఛత్తీస్గఢ్ పూర్తిస్థాయిలో వినియోగించుకోలేక పోవడంతో.. ఈ నీటిని మిగులు జలాలుగా గుర్తించిన కేంద్రం.. నదుల అనుసంధాన ప్రతిపాదనలు చేసింది. ఇంద్రావతి బేసిన్లో ఛత్తీస్గఢ్ (అప్పటి మధ్యప్రదేశ్)కు గోదావరి ట్రిబ్యునల్ కేటాయించిన నీటిలో వాడుకోని 141.4 టీఎంసీలకు మరో 106 టీఎంసీల వరద జలాలను జతచేసి మొత్తం 247 టీఎంసీలను ఇచ్చంపల్లి–నాగార్జునసాగర్–సోమశిల మీదుగా కావేరి గ్రాండ్ ఆనకట్ట వరకు తరలించేలా నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్డబ్ల్యూడీఏ) తొలుత ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే గోదావరిలో మిగులు, వరద జలాల నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చేవరకు అనుసంధానం పక్కన పెట్టాలని తెలంగాణ, ఏపీలు డిమాండ్ చేస్తూ వచ్చాయి. దీంతో తొలిదశ కింద ఛత్తీస్గఢ్ కోటాలో వాడుకోని 141.3 టీఎంసీలనే గోదావరి–కావేరి అనుసంధానంలో భాగంగా ఇచ్చంపల్లి నుంచి నీటిని తరలించేలా ఎన్డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. ఆవిరి, ప్రవాహ నష్టాలు పోను ఏపీకి 41.8, తెలంగాణకు 42.6, తమిళనాడు 38.6, పుదుచ్చేరికి 2.2, కర్ణాటకకు 9.8 టీఎంసీలు ప్రతిపాదించింది. దీనిపై ఛత్తీస్గఢ్ సర్కార్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. చెప్పినట్టే చేస్తున్న ఛత్తీస్గఢ్ తమకు హక్కుగా సంక్రమించిన నీటిని తరలించుకు పోతామంటే ఒప్పుకునేది లేదని, భవిష్యత్తులో ఈ నీటిని వినియోగించుకునేలా తాము ప్రాజెక్టులు చేపడతామని ఛత్తీస్గఢ్ తెగేసి చెప్పింది. ఈ క్రమంలోనే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం బోద్ఘాట్ ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్రం ముందుంచింది. ఈ ప్రాజెక్టు కింద ఇందావ్రతి నీటిని ఒడిసిపట్టేలా రూ.29 వేల కోట్లతో బోద్ఘాట్ ఆనకట్టని, అదనంగా మరో రూ.20 వేల కోట్లతో మహానది–ఇంద్రావతి లింక్ను చేపట్టనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 300 మెగావాట్ల విద్యుదుత్పత్తితో పాటు దంతెవాడ, సుక్మా, బీజాపూర్ జిల్లాల్లోని 359 గ్రామాల పరిధిలోని 3.78 లక్షల హెక్టార్లకు (9.45 లక్షల ఎకరాలకు) సాగునీటిని అందించాలని నిర్ణయించింది. అదనంగా తాగు, పారిశ్రామిక అవసరాలకు నీటిని ఇచ్చేలా ప్రణాళికలు ఉన్నాయి. గోదావరి–కావేరి అనుసంధానం కూడా ప్రశ్నార్థకమే..! ఇంద్రావతి మెజారిటీ జలాలను ఛత్తీస్గఢ్ వినియోగించుకునే పక్షంలో గోదావరి నుంచి తెలంగాణ, ఏపీ ప్రాజెక్టులకు నీటి లభ్యత తగ్గడం ఖాయమని నీటి పారుదల నిపుణులు అంటున్నారు. అలాగే కేంద్రం ప్రతిపాదిస్తున్న నదుల అనుసంధానం కూడా ప్రశ్నార్థకంగా మారుతుందని చెబుతున్నారు. కాగా దీనిపై తెలుగు రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. -
సోనమ్ మేఘాలయా హనీమూన్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్..
షిల్లాంగ్: సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్యకేసు మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేసే కొద్దీ ప్రతి సంఘటన ఒక్కో క్లైమాక్స్ను తలపిస్తోంది.తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం.. పెళ్లైన పదకొండు రోజులకే సోనమ్ రఘువంశీ తన భర్త రాజా రఘువంశీకి ఇష్టం లేకపోయినా హనీమూన్ పేరిట మేఘాలయాకు తీసుకెళ్లి, ముందస్తు ప్లాన్ ప్రకారం.. సుపారీ కిల్లర్ల సాయంతో హత్య చేయించిన విషయం తెలిసిందే. హత్య అనంతరం, మేఘాలయా నుంచి తన పుట్టినిల్లు ఉత్తరప్రదేశ్ వచ్చేందుకు సోనమ్ రఘువంశీ బురఖా ధరించి సుమారు వెయ్యి కిలోమీటర్ల ప్రయాణం చేసింది. ప్రయాణం సమయంలో కనీసం ఎక్కడా తినకుండా నిర్విరామంగా ప్రయాణించినట్లు పోలీసుల విచారణలో ఆమెను బోర్డర్ దాటించిన వెహికల్ డ్రైవర్ చెప్పాడు.రాజా రఘువంశీ కేసును మేఘాలయ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్ పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో భాగంగా ఇండోర్లో సోనమ్ రఘువంశీని ఉత్తర్ప్రదేశ్కు తీసుకొచ్చిన కారు డ్రైవర్లు మోహిత్,పియూష్లను అదుపులోకి తీసుకున్నారు. ట్రావెల్ ఏజెన్సీలో పనిచేసిన మోహిత్ను పోలీసులు విచారించారు.సోనమ్ ప్రియుడు రాజ్ కుశ్వాహా ‘జూన్ 8 మేఘాలయా నుంచి ఉత్తర ప్రదేశ్కు చేర్చేందుకు తీసుకెళ్లేందుకు ఎర్టిగో మాట్లాడుకున్నారు. రాజ్ సూచన మేరకు మోహిత్, పియూష్ ఆమెను తీసుకెళ్లారు. ప్రయాణం నిమిత్తం నన్ను(మోహిత్),పియూష్ని పనిలోకి తీసుకున్నారు. అప్పటికే మేఘాలయ సోహ్రాలోని ఓ లోయలో కుళ్ళిన రాజా రఘువంశీ రాజ్ మృతదేహాం లభ్యమై ఏడు రోజులవుతుంది.ఇక ఎర్టిగోలో మా ప్రయాణం ప్రారంభమైంది. సోనం బుర్ఖాలో మారువేషంలో ఉంది. మేం ఏదైనా తినాలని రోడ్డు పక్కన కారు ఆపినా అందుకు ఒప్పుకోలేదు. ఇలా మేఘాలయ నుండి వారణాసికి వెయ్యి కిలోమీటర్ల ప్రయాణం జరిగింది. ఇప్పుడు ఇదే విషయంపై పోలీసులు సోనంను ప్రశ్నిస్తున్నారు. హత్య కేసు నుంచి తప్పించుకునేందుకే ఇన్ని వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించిందా? తాజా పరిణామంతో రాజా రఘువంశీ హత్యలో కూడా ఆమె ప్రమేయం ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
పక్షి ఢీ కొట్టడంతో ఎయిరిండియా విమాన సర్వీస్ రద్దు!
న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానాలు.. ఆ మాటకొస్తే మిగతా సంస్థల విమానాలు కూడా రకరకాల కారణాలతో వరుసగా వార్తల్లో నిలుస్తున్నాయి. సాంకేతిక సమస్యలతో ప్రయాణికుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. తాజాగా.. పక్షికి ఢీ కొట్టడంతో ఏకంగా ఎయిరిండియా విమాన సర్వీసును రద్దు చేయాల్సి వచ్చింది.శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి పుణే (మహారాష్ట్ర)కు ఎయిరిండియా AI2470 విమానం చేరుకుంది. విమానం ల్యాండ్ అయిన తర్వాత నిర్వహించిన తనిఖీల్లో విమానాన్ని పక్షి ఢీ కొట్టినట్లు గుర్తించారు. దీంతో ఇంజనీరింగ్ టీంను రంగంలోకి దింపి విస్తృత తనిఖీలు జరిపింది. ఆపై ఆ విమాన సర్వీసును తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది.#AirIndia Pune-bound flight from Delhi suffers a bird hit, forcing the airline to cancel its return journey.Read more ⬇️https://t.co/kzYUgPcSiW— NDTV Profit (@NDTVProfitIndia) June 20, 2025✈️ జరిగింది ఇదే..జూన్ 20వ తేదీ.. ఉదయం 5:31కి ఢిల్లీ నుంచి ఏఐ2470 విమానం బయలుదేరి, 7:14కి పుణేలో ల్యాండ్ అయింది.ల్యాండింగ్ తర్వాత నిర్వహించిన తనిఖీల్లో పక్షి ఢీకొన్నట్లు గుర్తించారు.దీంతో, అదే విమానంతో తిరిగి ఢిల్లీకి వెళ్లాల్సిన AI-2470 ఫ్లైట్ను రద్దు చేశారు.🛠️ తీసుకున్న చర్యలువిమానాన్ని గ్రౌండ్ చేశాక.. ఇంజినీరింగ్ బృందం విస్తృత తనిఖీలు నిర్వహించింది.ప్రయాణికుల కోసం వసతి ఏర్పాట్లు, పూర్తి రీఫండ్లు లేదంటే ఉచిత రీషెడ్యూలింగ్ అందిస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటనప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు కూడా అందిస్తామని తెలిపిన ఎయిరిండియా. 🔍 జూన్ 12వ తేదీన లండన్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం.. అహ్మదాబాద్లో ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులతో పాటు కింద ఉన్న మరో 38 మంది మరణించారు. ఈ ప్రమాద నేపథ్యంలో.. ఎయిరిండియా బోయింగ్ 787, 777 విమానాలపై విస్తృత తనిఖీలు జరుగుతున్నాయి. -
Shashi Tharoor: కాంగ్రెస్-శశిథరూర్ విభేదాల్లో ట్విస్ట్
తిరువనంతపురం: కాంగ్రెస్ వర్సెస్ ఆ పార్టీ కేరళ ఎంపీ శశి థరూర్ మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. అందుకు నీలంబూర్ బై పోల్ ఎలక్షన్ ప్రచారం వేదికగా మారింది. మలయాళ సినీ ప్రముఖుడు ఆర్యదన్ షౌకత్ నీలంబూర్ బై ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున పోటీ చేశారు. ఆ ఎన్నిక కోసం కేరళ కాంగ్రెస్ యూనిట్ స్టార్ క్యాంపెయినర్ జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో ఎంపీ శశిథరూర్ పేరు సైతం ఉందని కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్ చెబుతున్నారు.కానీ స్టార్ క్యాంపెయినర్ జాబితా గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని ఎంపీ శశిథరూర్ చెప్పడం విశేషం. పార్టీ నుంచి నాకు ఎలాంటి ఆహ్వానం అందలేదు. ఎవరూ అడిగింది లేదు. ఎన్నికల ప్రచారం, స్టార్ క్యాంపెయినర్ జాబితా గురించి నాకు ఫోన్ చేసింది లేదు. అయినప్పటికీ, ఆర్యధన్ షౌకత్ తరుఫున పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సమయంలో ఎక్కువ భాగం విదేశాలలో అధికారిక దౌత్య పర్యటనలో ఉన్నాను’ అని చెప్పారు. అయితే, శశిథరూర్ పై వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే సన్నీ జోసెఫ్ ఘాటుగా స్పందించారు. ‘నీలంబూర్ ఉప ఎన్నికలో భాగంగా ఆర్యదన్ షౌకత్ తరుఫున ప్రచారం చేసేందుకు స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేశాం. ఆ జాబితాను ఎన్నికల కమిషన్కు సమర్పించాం. శశిథరూర్ ఆయన ఎక్కడుంటారో ఎవరికి తెలియదు. ఎక్కువ శాతం విదేశాల్లో తిరుగుతుంటారు. లేదంటే ఢిల్లీలో ఉంటారు. కేరళ ఎప్పుడు వస్తారో తెలియదు. ఇంతకంటే నేను ఎక్కువ ఏం చెప్పలేనని ముగించారు. గురువారం శశిథరూర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి తనకు మధ్య విభేదాలు ఉన్నాయన్న విషయాన్ని అంగీకరించారు. ఆ విభేదాలేంటి? అనే అంశాన్ని దాట వేశారు.పహల్గాం ఉగ్రదాడి అనంతరం సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్కు భారత్ బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రపంచ దేశాల ఎదుట పాక్ను దోషిగా నిలబెట్టేలా కేంద్రం అఖిలపక్ష బృందాన్ని ఏర్పాటు చేసింది. అందులో అనూహ్యంగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్కు స్థానం కల్పించింది. నాటి నుంచి కాంగ్రెస్-ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ మధ్య విభేదాలు నెలకొన్నాయి. ముఖ్యంగా కేంద్రం ఏర్పాటు చేసిన అఖిలపక్ష బృందం విదేశీ పర్యటన సమయంలో శశిథరూర్ ప్రధాని మోదీని ఆకాశానికెత్తారు. మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం సర్జికల్ స్ట్రయిక్స్ జరిపిందంటూ ప్రశంసలు కురిపించారు. శశిథరూర్ చేసిన ఆ వ్యాఖ్యలే కాంగ్రెస్ అధిష్టానానికి మింగుడు పడడం లేదు. అంతర్ఘతంగా శశిథరూర్ను తీరును పార్టీ పెద్దల ఎదుట తప్పుబట్టినట్లు సమాచారం. తాజాగా, కేరళలో జరిగిన ఉప ఎన్నికకు శశిథరూర్కు ఎటువంటి ఆహ్వానం అందకపోవడం గమనార్హం."I wasn't invited by party (for Nilambur by-election campaign). Yes, there are some differences b/w me & leadership. Those can be sorted out in closed-door conversations. So far, no one has reached out to me. When nation needs my service, I am always ready."- .@ShashiTharoor pic.twitter.com/NPzj89NJdr— BhikuMhatre (@MumbaichaDon) June 19, 2025 -
అవినీతి అధికారుల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవడమా?: సుప్రీం కోర్టు
అవినీతి కేసులో శిక్షలు పడ్డ ప్రభుత్వాధికారుల నిర్దోషిత్వం పైకోర్టుల్లో రుజువు అయ్యేదాకా తిరిగి విధుల్లోకి తీసుకోవడం సరికాదని దేశసర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇది ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయడం అవుతుందన్న సుప్రీం కోర్టు.. ఇలాంటి చర్యలు నిజాయితీపరులైన అధికారులను అవమానించడమే అవుతుందంటూ తీవ్ర వ్యాఖ్యలే చేసింది.కేసు ఏంటంటే.. గుజరాత్లోని ఒక రైల్వే ఇన్స్పెక్టర్ లంచం తీసుకున్నాడన్న కేసులో ట్రయల్ కోర్టు రెండు సంవత్సరాల శిక్ష విధించింది. అయితే దీనిపై ఆయన అప్పీల్కు వెళ్లగా.. గుజరాత్ హైకోర్టు ఆ శిక్షను సస్పెండ్ చేస్తూ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే తన శిక్షను పూర్తిగా రద్దు చేయాలని స్టే కోరుతూ సదరు ఇన్స్పెక్టర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.పిటిషనర్ వాదనలు.. నేను లంచం తీసుకున్నట్లు ఎక్కడా ఆధారాలు చూపించలేకపోయారు. అయినా కింది కోర్టు మా వాదనలను పట్టించుకోకుండా శిక్ష వేసింది. ఉన్నత న్యాయస్థానం నాకు ఊరట ఇచ్చినప్పటికి శిక్షను రద్దు చేయలేదు. కాబట్టి నా శిక్షపై స్టే విధించి.. నన్ను తిరిగి విధుల్లోకి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వండి.సుప్రీం కోర్టు(Supreme Court) ఏం చెప్పిందంటే.. గురువారం జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ప్రసన్న బీ వరాలేలతో కూడిన బెంచ్ ఆ రైల్వే ఇన్స్పెక్టర్ పిటిషన్పై విచారణ జరిపింది. ఈ క్రమంలో ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘ప్రజల నమ్మకమే పాలనా వ్యవస్థకు మూలాధారం. అవినీతికి లోనైన ప్రభుత్వ అధికారిని అన్ని న్యాయ ప్రక్రియలు పూర్తయ్యే వరకు ఉద్యోగంలోకి తిరిగి అనుమతించడం ఆ నమ్మకాన్నే దెబ్బతీస్తుంది. కోర్టులో దోషులుగా తేలిన అధికారులను.. తిరిగి విధుల్లోకి తీసుకోవడం వ్యవస్థ మూలాలను బలహీనపరుస్తుంది. పైగా ఇలాంటి చర్యలు.. నిజాయితీ పరులైన అధికారులను అవమానించడమే అవుతుంది అని బెంచ్ వ్యాఖ్యానించింది.ఈ క్రమంలో.. కేసీ సరీన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు తీర్పును ప్రస్తావించింది. ‘‘ఒక ప్రభుత్వ అధికారి అవినీతి కేసులో దోషిగా తేలితే.. పైకోర్టుల్లో అతను నిర్దోషిగా తేలేంతవరకు విధుల్లోకి తీసుకోకూడదు. ఒకవేళ అతని/ఆమె అప్పీల్ పెండింగ్లో ఉన్నాసరే.. ఉద్యోగంలోకి తిరిగి అనుమతించకూడదు’’ అని ఈ కేసులో తీర్పు ఇచ్చింది. -
ఎయిరిండియా ఘటన: బ్లాక్బాక్స్ ఎపిసోడ్లో ట్విస్టులు
279 మంది ప్రాణాలు బలిగొన్న అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఈ ప్రమాదంలో కీలకంగా భావిస్తున్న విమానపు బ్లాక్బాక్స్(Air India Black Box) తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. దీంతో డాటా సేకరణ కష్టతరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఓ జాతీయ మీడియా సంస్థ ఎక్స్క్లూజివ్గా కథనం ప్రచురించింది.జూన్ 12వ తేదీన బోయింగ్ సంస్థకు చెందిన డ్రీమ్లైనర్ విమానం(ఏఐ 171 సర్వీస్) ప్రమాదంలో నేలను తాకగానే పేలిపోయి.. కాలి బూడిదైన సంగతి తెలిసిందే. అయితే ఘటన జరిగిన 28 గంటల తర్వాత శకలాల నుంచి బాక్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రమాదం ధాటికి అందులో ఓ పార్ట్ పైభాగం బాగా దెబ్బతిన్నట్లు అధికారులు ఇప్పుడు గుర్తించారు. ఇదిలా ఉంటే.. బ్లాక్బాక్స్ను డీకోడ్ చేసేందుకు అమెరికాకు పంపించబోతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని కేంద్రం గురువారం తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. దానిని టెక్నికల్, సెక్యూరిటీ అంశాలను పరిశీలించాకే బ్లాక్బాక్స్ను ఎక్కడికి పంపించాలనే విషయాన్ని ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) మాత్రమే నిర్ణయిస్తుందని కేంద్రం స్పష్టత ఇచ్చింది. అయితే..డిజిటల్ ఫ్లైట్ డాటా రికార్డర్(DFDR), కాక్పిట్ వాయిస్ రికార్డర్(CVR)లను కలిపి బ్లాక్బాక్స్గా వ్యవస్తారు. పేరుకు బ్లాక్బాక్స్ అనే కానీ.. ప్రమాదం తర్వాత శకలాల నుంచి సేకరణ కోసం సులువుగా బ్రైట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది అది. ఇక ఇందులో.. ఇప్పుడొస్తున్న సీవీఆర్లు 25 గంటలపాటు కాక్పిట్ సంభాషణలను నమోదు చేయగలవు. 2021లో తీసుకొచ్చిన నిబంధనే అందుకు కారణం. కానీ, ప్రమాదానికి గురైన బోయింగ్ 787 విమానం అంతకు ముందు మోడల్. ఇందులో కేవలం రెండున్నర గంటల రికార్డును మాత్రమే రికార్డుచేయగలదు. ఇక ఏడీఆర్.. విమానం వేగాన్ని, నియంత్రణ క్షణాలు తదితరాలను నమోదు చేస్తుంది. బ్లాక్బాక్స్లోని డాటాను ఇంజినీరింగ్ ఫార్మట్లోకి మార్చిన తర్వాతే సమాచారాన్ని సేకరించడానికి వీలవుతుంది. సేకరణ టైంలో ఏదైనా పొరపాటు దొర్లితే.. డాటా మొత్తం కనిపించకుండా పోతుంది(ఎరేస్ అవుతుంది).AAIB ముందు ఆప్షన్లు ఇవేలక్నోలోని హాల్(HAL) సెంటర్కు పంపడంఅమెరికాలోని ఎన్టీఎస్బీకి (National Transportation Safety Board) జాతీయ రవాణా భద్రతా సంస్థకి పంపడంయూకే లేదంటే సింగపూర్లోని సివిల్ ఏవియేషన్ అథారిటీకి పంపడంబ్లాక్బాక్స్లో ఓ పార్ట్ పైభాగం బాగా దెబ్బతిందని.. ఇక్కడ దానిని రికవరీ చేసే ప్రయత్నం ఫలించకపోవచ్చని ఏఏఐబీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అడ్వాన్స్డ్ డాటా రికవరీ కోసం దానిని అమెరికాకే పంపించే యోచనలో ఏఏఐబీ ఉన్నట్లు సదరు కథనం వెల్లడించింది.ఇదీ చదవండి👉: దక్షిణ కొరియా విమాన ప్రమాద ఘటనలో బ్లాక్బాక్స్ ట్విస్ట్! -
భారీ సంఖ్యలో ఎయిరిండియా విమానాలు రద్దు
ఢిల్లీ: భారీ సంఖ్యలో విమాన సర్వీసులను ఎయిరిండియా రద్దు అయ్యాయి. నిర్వహణ సమస్యల వల్ల 8 విమానాలను రద్దు చేసింది. 4 అంతర్జాతీయ, 4 దేశీయ విమానాలు రద్దయ్యాయి. ప్రయాణికులకు పూర్తి రీఫండ్, ఉచిత రీషెడ్యూలింగ్ అవకాశం కల్పిస్తునట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది.రద్దయిన విమానాలు:AI906 (దుబాయ్–చెన్నై)AI308 (ఢిల్లీ–మెల్బోర్న్)AI309 (మెల్బోర్న్–ఢిల్లీ)AI2204 (దుబాయ్–హైదరాబాద్)రద్దయిన డొమెస్టిక్ విమానాలుAI874 (పుణె–ఢిల్లీ)AI456 (అహ్మదాబాద్–ఢిల్లీ)AI2872 (హైదరాబాద్–ముంబై)AI571 (చెన్నై–ముంబై)కాగా, జూన్ 21 నుంచి జూలై 15 వరకు మూడు విదేశీ మార్గాల్లో విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేయనున్నట్లు ఎయిరిండియా కీలక ప్రకటన చేసింది. మరో 16 అంతర్జాతీయ మార్గాల్లో సర్వీసులను తగ్గించనున్నట్లు వెల్లడించింది. జూన్ 12న అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం తర్వాత అంతరాయాలతో సతమతమవుతున్న ఎయిరిండియా.. షెడ్యూళ్లలో స్థిరత్వం తీసుకురావడం, ప్రయాణికులకు చివరి నిమిషంలో కలిగే అసౌకర్యాన్ని తగ్గించడమే లక్ష్యమని పేర్కొంది. ప్రయాణికుల్లో విశ్వాసం పెంపొందించేందుకు బోయింగ్ 787, బోయింగ్ 777 విమానాలకు అదనపు భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ఈ క్రమంలోనే తమ వైడ్-బాడీ విమానాల అంతర్జాతీయ సర్వీసులను సుమారు 15 శాతం మేర తాత్కాలికంగా తగ్గించాలని ఇప్పటికే ఆ సంస్థ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ సర్దుబాట్లు జూన్ 21 నుంచి జూలై 15 వరకు అమల్లో ఉంటాయని ఎయిరిండియా వెల్లడించింది.ఢిల్లీ-నైరోబి, అమృత్సర్-లండన్ (గాట్విక్), గోవా (మోపా)-లండన్ (గాట్విక్) మార్గాల్లో జూలై 15 వరకు విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఢిల్లీ-నైరోబి రూట్లో వారానికి నాలుగు విమానాలు నడుస్తుండగా, అమృత్సర్-లండన్ (గాట్విక్), గోవా (మోపా)-లండన్ (గాట్విక్) మార్గాల్లో వారానికి మూడు చొప్పున విమానాలు నడుపుతున్నట్లు ఎయిరిండియా పేర్కొంది.అలాగే.. ఉత్తర అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, తూర్పు ఆసియాలోని నగరాలకు కలిపే 16 అంతర్జాతీయ రూట్లలో కూడా విమానా సర్వీసులను తగ్గించారు. ఉత్తర అమెరికాలో ఢిల్లీ-టొరంటో, ఢిల్లీ-వాంకోవర్, ఢిల్లీ-శాన్ ఫ్రాన్సిస్కో, ఢిల్లీ-చికాగో, ఢిల్లీ-వాషింగ్టన్ రూట్లలో సర్వీసులను తగ్గించారు.యూరప్లో ఢిల్లీ-లండన్ హీత్రో, బెంగళూరు-లండన్ హీత్రో, అమృత్సర్-బర్మింగ్హామ్, ఢిల్లీ-బర్మింగ్హామ్, ఢిల్లీ-పారిస్, ఢిల్లీ-మిలన్, ఢిల్లీ-కోపెన్హాగన్, ఢిల్లీ-వియన్నా, ఢిల్లీ-ఆమ్స్టర్డామ్ మార్గాల్లో కూడా విమానాల సర్వీసులను కుదించారు. అలాగే, ఢిల్లీ-మెల్బోర్న్, ఢిల్లీ-సిడ్నీ, ఢిల్లీ-టోక్యో హనేడా, ఢిల్లీ-సియోల్ (ఇంచియాన్) మార్గాల్లో కూడా సర్వీసులను తగ్గించారు.ఇదిలా ఉండగా, విమాన సర్వీసుల కుదింపుపై ఎయిరిండియా సీఈవో ప్రయాణికులకు వివరణ ఇచ్చారు. "విమాన ప్రయాణానికి ముందు భద్రతా తనిఖీలను కఠినతరం చేయడం, మధ్యప్రాచ్యంలో గగనతల మార్గాల మూసివేత వల్ల ప్రయాణ సమయం పెరగడం వంటి కారణాలతో ఈ కుదింపులు చేశాం" అని ఆయన తెలిపారు. ప్రయాణికులకు ఆయన ఎయిరిండియా తరఫున ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. -
మా ఎమ్మెల్యేల పనితీరు అస్సలు బాలేదు: నారా లోకేశ్
సాక్షి, న్యూఢిల్లీ: ‘మా పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల పనితీరు, వ్యవహారశైలి అస్సలు బాలేదు. నియోజకవర్గాల ప్రజల నుంచి మాకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలా ఫిర్యాదు వచ్చిన ప్రతి ఎమ్మెల్యే పనితీరుపై సమీక్షిస్తున్నాం. వారి పద్ధతి మార్చుకోవాలని హెచ్చరిస్తున్నాం’ అని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీకి వచ్చిన లోకేశ్.. ఎంపిక చేసుకున్న మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేశారు. ‘నాతో సహా మా పార్టీలోని ప్రతి ఒక్క ఎమ్మెల్యే పనితీరుపై రివ్యూ జరుగుతోంది. కొందరు ఎమ్మెల్యేల పనితీరు, మాట తీరు, వ్యవహారశైలిపై మా వాళ్ల నుంచి కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. ఆ ఎమ్మెల్యేలను పిలిచి పనితీరు మార్చుకోవాలని హెచ్చరిస్తున్నాం. ఇందుకు మూడు నెలల సమయం ఇస్తున్నాం.’’ అని లోకేశ్ అన్నారు. బ్రిటన్ మాజీ ప్రధానితో లోకేశ్ భేటీ ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యావ్యవస్థలో ఏఐ టూల్స్ వినియోగం కోసం టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ ఛేంజ్ ద్వారా సహకారం అందించాలని బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ను మంత్రి నారా లోకేశ్ కోరారు. గురువారం ఢిల్లీలో టోనీ బ్లెయిర్తో లోకేశ్ భేటీ అయ్యారు. రాష్ట్రప్రభుత్వం, టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ మధ్య ఒప్పందం కుదిరినట్లు లోకేశ్ ‘ఎక్స్’లో తెలిపారు. అమరావతిలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సహకారం అందించాలని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయను కోరినట్లు లోకేశ్ వెల్లడించారు. -
కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయని.. సినిమాను, స్టాండప్ కామెడీని ఆపలేం
న్యూఢిల్లీ: కమల్ హాసన్ స్టారర్ ‘థగ్ లైఫ్’సినిమా విడుదలను అడ్డుకునే వారిపై గట్టి చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు గురువారం కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయనే కారణంతో సినిమా, స్టాండప్ కామెడీ లేదా కవితా గోష్టి వంటి వాటిని ఆపలేమని స్పష్టం చేసింది. ‘మన దేశంలో మనోభావాలను దెబ్బతీసే ఘటనలకు ముగింపు కనిపించడం లేదు. స్టాండప్ కమెడియన్ ఏదో అంటే మనోభావాలు దెబ్బతిన్నాయని, విధ్వంసం, నిరసనలకు దిగుతున్నారు. ఎటు వెళ్తున్నాం మనం? ఏంటి దీనర్థం? నిరసనలు చేపట్టారనే కారణంతో సినిమా, స్టాండప్ కామెడీ షో, కవితా గోష్టి వంటి వాటిని ఆపేయాలా?’అంటూ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ మన్మోహన్ల ధర్మాసనం తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించింది. కమల్ హాసన్ వ్యాఖ్యల నేపథ్యంలో విడుదల ఆగిన ‘థగ్ లైఫ్’ను కర్ణాటకలో ప్రదర్శించేందుకు ఆదేశాలివ్వాలంటూ మహేశ్ రెడ్డి వేసిన పిల్పై గురువారం ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్రంలోని థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శన సమయంలో తగు భద్రత కల్పిస్తామంటూ కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన హామీకి ధర్మాసనం అంగీకరించింది. ఏ వ్యక్తి గానీ, సమూహం గానీ సినిమా ప్రదర్శనకు అవరోధం కల్పించినా, నష్టపరిచినా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయానికి ఇంతటితో ముగింపు పలుకుతున్నామంది. తమిళం నుంచి కన్నడ పుట్టిందంటూ చేసిన వ్యాఖ్యలకు గాను క్షమాపణ చెప్పాలంటూ కమల్ హాసన్ను కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్(కేఎఫ్సీసీ) కోరడంపై ధర్మాసనం..‘దీనికి మేం అస్సలు అంగీకరించం. ఒక అభిప్రాయం కారణంగా సినిమాను అడ్డుకుంటారా? స్టాండప్ కామెడీని, కవితా పఠాన్ని ఆపేస్తారా?’అని ప్రశ్నించింది. అయితే, తమకు కొన్ని సమూహాల నుంచి బెదిరింపులు వచ్చినందునే కమల్ను క్షమాపణ చెప్పాలని ఒక లేఖ ద్వారానే కోరామని, అంతే తప్ప కమల్ను బెదిరించలేదని కేఎఫ్సీసీ వివరించింది. బెదిరింపుల విషయాన్ని పోలీసుల దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదని కేఎఫ్సీసీని ధర్మాసనం ప్రశ్నించింది. సినిమా విడుదల చేస్తే తీవ్ర పరిణామాలుంటాయంటూ వచ్చిన బెదిరింపుల విషయం తెలపగా కేఎఫ్సీసీ స్పందించలేదని మహేశ్ రెడ్డి తర ఫు లాయర్ తెలిపారు. బెదిరించిన వారిపై చర్యలు తప్పక తీసుకుంటామని రాష్ట్ర ప్రభు త్వ లాయర్ హామీ ఇచ్చారు. కన్నడ సాహిత్య పరిషత్ తరఫున సీనియర్ న్యాయవాది సంజయ్ నూలి వాదనలు వినిపించారు. కమల్ వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్రంలో కన్నడిగుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. కమల్ క్షమాపణ చెబితేనే రాష్ట్రంలో ఆ సినిమా ప్రదర్శన వీలవుతుందని, లేకుంటే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ‘అంటే..థగ్ లైఫ్ అనధికార బ్యాన్ను, థియేటర్లను బుగ్గిపాలు చేసేందుకు మీరు మద్దతిస్తున్నారా?’అని ధర్మాసనం ప్రశ్నించింది. ‘క్షమాపణ చెప్పడం ఏమిటి? చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోలేరు. మనోభావాలు గాయపడితే పరువునష్టం కేసు వేయండి..!’అని ధర్మాసనం పేర్కొంది. హింసకు పాల్పడే వారిని తాము ప్రోత్సహించమంటూ కన్నడ సంస్థ తరఫు లాయర్ పేర్కొనగా ‘సినిమా విడుదలను కూడా మీరు అడ్డుకోరాదు’అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. -
నేడు విశాఖకు ప్రధాని రాక
సాక్షి, న్యూఢిల్లీ/మహారాణిపేట: ప్రధాని మోదీ శుక్రవారం విశాఖ రానున్నారు. భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 6.40 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఆఫీసర్స్ మెస్కు వెళతారు. రాత్రి అక్కడే బస చేస్తారు. శనివారం ఉదయం 6.25కు రోడ్డు మార్గం ద్వారా ఆర్కే బీచ్కు చేరుకుంటారు. 6.30 నుంచి 7.50 వరకు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా యోగా విన్యాసాల్లో పాల్గొంటారు. 7.50కు బయల్దేరి రోడ్డు మార్గం ద్వారా ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఆఫీసర్స్ మెస్కు వెళతారు. ఉదయం 8.15 నుంచి 11.15 వరకు ప్రధాని ప్రొగ్రామ్ రిజర్వ్లో ఉంది. మళ్లీ 11.25కు ఐఎన్ఎస్ సర్కార్ పెరేడ్ గ్రౌండ్ నుంచి హెలికాప్టర్లో విశాఖ విమానాశ్రయానికి చేరుకుని 11.50 గంటలకు ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ బయలుదేరతారు. -
54 ఉన్నత విద్యాసంస్థలకు గ్లోబల్ గుర్తింపు
సాక్షి. న్యూఢిల్లీ: విద్యారంగంలో భారత్ మరో మైలురాయిని అందుకుంది. క్యూఎస్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్–2026లో మన దేశానికి చెందిన 54 ఉన్నత విద్యాసంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఈ రంగంలో ఇప్పటివరకు భారత్ అందుకున్న అతిపెద్ద గ్లోబల్ రికార్డు ఇది. లండన్కు చెందిన గ్లోబల్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనలిటిక్స్ సంస్థ క్వాక్క్వరెల్లీ సిమండ్స్ (క్యూఎస్) గురువారం విడుదల చేసిన వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్–2026 జాబితాలో ప్రపంచంలోని 1,500కి పైగా అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఈ ర్యాంకింగ్ కోసం అకడెమిక్ ప్రతిష్ట, ఫ్యాకల్టీ–సూ్టడెంట్ నిష్పత్తి, రీసెర్చ్ ప్రభావం, అంతర్జాతీయ విద్యార్థుల భాగస్వామ్యం, గ్రాడ్యుయేట్ల ఉద్యోగావకాశాలు వంటి తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. వరుసగా 14వ సంవత్సరం ‘ఎంఐటీ’టాప్.. అమెరికా కేంబ్రిడ్జిలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) ప్రపంచంలోని ఉత్తమ విశ్వవిద్యాలయంగా వరుసగా 14వ సంవత్సరం కూడా తొలి ర్యాంకు పొందింది. తరువాత.. ఇంపీరియల్ కాలేజ్ లండన్ రెండో స్థానంలో, అమెరికాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం మూడవ స్థానంలో ఉన్నాయి. జాబితాలో 192 విద్యాసంస్థలతో అత్యధిక ప్రాతినిధ్యం వహించే దేశంగా అమెరికా ఉంది. గత సంవత్సరం నుండి దాదాపు 500 విశ్వవిద్యాలయాలు తమ పనితీరును మెరుగుపరుచుకున్నాయి. వీటిలో మలేసియాలోని సన్వే యూనివర్సిటీ 120 స్థానాలకు పైగా తన ర్యాంకును మెరుగుపరుచుకుంది. భారత్లో ఐఐటీ–ఢిల్లీ టాప్.. ఇక ఈ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో చోటు దక్కించుకున్న భారత్లోని 54 ఉన్నత విద్యాసంస్థల్లో 65.5 స్కోర్తో ఐఐటీ–ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. ఇది ప్రపంచవ్యాప్తంగా 2025లో 150, 2024లో 197 ర్యాంకు నుంచి ఈ ఏడాది ప్రపంచంలో 123వ స్థానానికి చేరుకుంది. అకడమిక్ రెప్యుటేషన్లో 142వ స్థానంలో, ఫ్యాకలీ్టకి సైటేషన్స్లో 86వ స్థానంలో నిలిచింది. దేశంలోని ఇతర ఐఐటీలు, ప్రధాన వ ర్సిటీలూ ప్రభావవంతమైన ప్రదర్శన చేశాయి. ఐఐటీ హైదరాబాద్కు 664వ ర్యాంకు, వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నా లజీ (విట్)కు 691వ ర్యాంకు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు 801–850 మధ్య ర్యాంకు, ఉస్మానియా యూనివర్సిటీ 1,201–1,400 మధ్య ర్యాంకులో నిలిచింది. అలాగే, ఐదు భారతీయ విశ్వవిద్యాలయాలు ఎంప్లాయర్ రెప్యుటేషన్ కోసం పోటీపడి ప్రపంచవ్యాప్తంగా టాప్–100లో స్థా నం సంపాదించాయి. అంతేకాక.. సగటున 43.7 స్కోరుతో 8 భారతీయ విద్యాసంస్థలు పరిశోధన ప్రభావం పరంగా సైటేషన్స్ ఫర్ ఫ్యాకల్టీలో టాప్–100లో స్థానం సంపాదించాయి. ఇక 2025లో ఉత్తమ భారతీయ విశ్వవిద్యాలయంగా ర్యాంకు పొంది గతేడాది 118వ స్థానంలో ఉన్న ఐఐటీ బాంబే, ఈ సంవత్సరం 129వ స్థానానికి పడిపోయింది. ఐఐటీ మద్రాస్ గతేడాదితో పోలిస్తే 47 స్థానాలు ఎగబాకి 180వ స్థానానికి చేరుకుంది. ఐఐటీ ఖరగ్పూర్ (215), ఐఐఎస్సీ బెంగళూరు (219), ఢిల్లీ వర్సిటీ (328).. ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ (851–900), బిట్స్ పిలాని (668) వంటివి కూడా తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నాయి. ప్రపంచంలో భారత్కు 4వ స్థానం.. ఇదిలా ఉంటే.. ఈ సంవత్సరం భారత్ నుంచి ఎనిమిది కొత్త విద్యాసంస్థలు మొదటిసారిగా ర్యాంకింగ్స్లో చోటు దక్కించుకున్నాయి. దీంతో జాబితాలో చోటు దక్కించుకున్న మొత్తం భారతీయ విద్యా సంస్థల సంఖ్య 54కి చేరుకుంది. అమెరికా (192), యూకే (90), చైనా (72) తర్వాత నాలుగో స్థానంలో భారత్ నిలిచింది. ఈ సంవత్సరం మరే దేశ విద్యా సంస్థలు కూడా ఇంత ఎక్కువ సంఖ్యలో క్యూఎస్ ర్యాంకింగ్స్లో చోటు దక్కించుకోలేదు. ఇక ఈ ఏడాది ఎనిమిది కొత్త విద్యా సంస్థలకు ర్యాంకులతో భారత్ తొలిస్థానంలో ఉండగా.. జోర్డాన్, అజర్బైజాన్ దేశాలు ఆరు కొత్త సంస్థలతో రెండో స్థానంలో ఉన్నాయి. ప్రధాని, కేంద్రమంత్రి హర్షం.. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ–2026 ర్యాంకింగ్స్లో భారత్ సాధించిన మైలురాయిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్లు హర్షం వ్యక్తంచేశారు. ఈ ర్యాంకింగ్స్ మన విద్యా రంగానికి గొప్ప కీర్తిని తెస్తున్నాయని.. దేశ యువత ప్రయోజనం కోసం పరిశోధన, ఆవిష్కరణ, పర్యావరణ వ్యవస్థలను మరింతగా పెంచడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ గురువారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. అలాగే, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ‘ఎక్స్’వేదికగా స్పందిస్తూ.. ‘2014లో కేవలం 11 భారత విద్యాసంస్థలు మాత్రమే ఈ ర్యాంకింగ్స్లో చోటు దక్కించుకోగా, ఇప్పుడా సంఖ్య అయిదింతలు పెరిగి 54కి చేరింది. ఇది ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత దశాబ్దంలో అమలుచేసిన విద్యా సంస్కరణల ఫలితం. అలాగే, నూతన విద్యా విధానం (ఎన్పీఈ)–2020 వల్ల ఇది సాధ్యమైంది. రికార్డు స్థాయిలో 54 సంస్థలు ఆ ర్యాంకింగ్స్లో చోటు దక్కించుకోవడం భారత విద్యావ్యవస్థలో సంభవించిన మార్పు, పురోగతికి నిదర్శనం. ఇది ఒక మార్పు మాత్రమే కాదు–ఒక విద్యా విప్లవం’అని తెలిపారు. -
బనకచర్లను అడ్డుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి–బనకచర్ల ప్రాజెక్టు ప్రీఫీజబిలిటీ నివేదికను తిరస్కరించాలని కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి విజ్ఞప్తి చేశారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్–1980 (జీడబ్ల్యూడీటీ), ఏపీ పునర్విభజన చట్టం–2014లకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని చెప్పారు. ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో జల్శక్తి మంత్రి పాటిల్, ఆ శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, ఇతర ఉన్నతాధికారులతో రేవంత్, ఉత్తమ్తోపాటు ఎంపీలు మల్లురవి, రఘువీర్ రెడ్డి, నీటి పారుదల శాఖ కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ గురువారం సమావేశమయ్యారు. బనకచర్ల అనుమతుల విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ, పర్యావరణ శాఖ వ్యవహరిస్తున్న తీరుతో తెలంగాణ ప్రజలు, రైతుల్లో ఆందోళన నెలకొందని వివరించారు. గోదావరి వరద జలాల ఆధారంగా బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదిస్తున్నామని ఏపీ చెబుతోందని.. జీడబ్ల్యూడీటీ–1980లో వరద జలాలు, మిగులు జలాల ప్రస్తావనే లేదన్నారు. 2014 ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా నూతన ప్రాజెక్ట్ నిర్మించాలనుకుంటే ముందు ఆ నదీ యాజమాన్య బోర్డు, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), జల్శక్తి మంత్రి అధ్యక్షతన రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండే అపెక్స్ కౌన్సిల్లో చర్చించి అనుమతి పొందాలని, అయితే బనకచర్ల విషయంలో ఏపీ వీటన్నింటిని ఉల్లంఘిస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, జల్శక్తి శాఖ తక్షణమే జోక్యం చేసుకొని బనకచర్ల ప్రాజెక్ట్ ముందుకెళ్లకుండా చూడాలని రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కోరారు.వరద నిజమైతే ఇచ్చంపల్లి–సాగర్ అనుసంధానంపై చర్చిద్దాంసీడబ్ల్యూసీ పరిధిలోని సాంకేతిక సలహా మండలి నుంచి అనుమతులు పొందకుండానే వరద జలాల పేరుతో పోలవరం కింద పురుషోత్తపట్నం, వెంకటనగరం, పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల పథకాలను ఏపీ చేపట్టిందని కేంద్ర మంత్రి పాటిల్కు రేవంత్, ఉత్తమ్ వివరించారు. గోదావరి అవార్డు ప్రకారం పోలవరం డిజైన్లు మార్పు చేసిందని, పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా పనులు చేపడుతోందని, తాము అభ్యంతరాలు లేవనెత్తినా పనులు కొనసాగిస్తూనే ఉందని చెప్పారు. గోదావరిలో వరద జలాలున్నాయని నిజంగా ఏపీ భావిస్తుంటే పోలవరం–బనకచర్లకు బదులు, కేంద్రం నిధులు ఇచ్చే ఇచ్చంపల్లి–నాగార్జున సాగర్ అనుసంధానం ద్వారా పెన్నా బేసిన్కు నీళ్లు తీసుకెళ్లే విషయంలో చర్చకు తాము సిద్ధమని చెప్పారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో తాము ఎట్టిపరిస్థితుల్లో రాజీపడబోమని, అన్ని వేదికల ద్వారా సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తామని తెలిపారు. కేంద్రం స్పందన సానుకూలంగా లేకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని సీఎం స్పష్టం చేశారు.1,500 టీఎంసీలను వాడుకునేలా..» తెలంగాణకు గోదావరి నదిలో 1,000 టీఎంసీలు, కృష్ణా నదిలో 500 టీఎంసీలు మొత్తంగా 1,500 టీఎంసీల నీటి వినియోగానికి కేంద్ర జల్శక్తి శాఖ, ఏపీ నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) జారీ చేయాలని, దానికి కేంద్రం ఆమోదం తెలపాలని సీఆర్ పాటిల్కు రేవంత్ విజ్ఞప్తి చేశారు. 1500 టీఎంసీల నీటితో కోటి న్నర ఎకరాలకు నీరు అందుతుందని, ఆ తర్వాత ఏపీ చేపట్టే ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియను పరిశీ లిస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు.» ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులకు అనుమతు ల ప్రక్రియలో సత్వరం స్పందిస్తూ తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో మాత్రం అలసత్వం ప్రదర్శించడం తగదని సీఎం రేవంత్ అన్నారు. ఈ వైఖరితో ఇరు రాష్ట్రాల మధ్య అపోహలు, ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయన్నా రు. పాలమూరు–రంగారెడ్డి, సమ్మక్క–సారక్క, తుమ్మిడి హెట్టి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులతోపాటు అన్ని రకా ల అనుమతులు వెంటనే మంజూరు చేయాలని కోరారు.» గంగా, యమునా నదుల ప్రక్షాళనకు నిధులిచ్చినట్లే మూసీ పునరుజ్జీవానికి నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రి పాటిల్కు రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
15 రోజుల్లో ఓటరు గుర్తింపు కార్డు..
న్యూఢిల్లీ: ఎలక్టర్ ఫొటో ఐడెంటిటీ కార్డు(ఎపిక్)ను ఓటర్లకు చేరవేసే విషయంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. 15 రోజుల్లోగానే ఈ కార్డులు సంబంధిత ఓటర్లకు చేరేలా చర్యలు తీసుకోనున్నట్లు బుధవారం వెల్లడించింది. ప్రస్తుతం ఈ కార్డుల డెలివరీకి నెల రోజులకుపైగా సమయం పడుతోంది. ఇప్పుడు ఈ సమయం సగానికి తగ్గిపోనుంది. ఇందుకోసం నూతన ప్రామాణిక నియమావళిని ఎన్నికల సంఘం రూపొందించింది. కొత్తగా ఓటర్గా పేరు నమోదు చేసుకున్న తర్వాత లేదా ప్రస్తుతం ఉన్న కార్డులో మార్పులు చేర్పులు చేసుకున్న తర్వాత 15 రోజుల్లోగా నూతన ఫొటో గుర్తింపు కార్డు ఓటర్లకు అందనుంది. ఓటరు గుర్తింపు కార్డు కోసం ఆన్లైన్లో ఇలా దరఖాస్తు చేసుకోండి.1. ముందుగా voters.eci.gov.in వైబ్సైట్ ఓపెన్ చేయాలి.2. న్యూ రిజిస్ట్రేషన్ ఫర్ జనరల్ ఎలక్టర్స్లో 'ఫిల్ ఫామ్ 6'పై క్లిక్ చేయండి.3. ఫిల్ ఫామ్ 6పై క్లిక్ చేయగానే లాగిన్ అడుగుతుంది.4. కొత్త యూజర్లు మొబైల్ నంబర్, ఇమెయిల్ ID, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.5. తర్వాత మీ మొబైల్కు ఓటీపీ వస్తుంది. 6. మీ పేరు, పాస్వర్డ్ ఎంటర్ చేసి OTPని నమోదు చేయండి.7. ఇప్పుడు ఫిల్ ఫామ్ 6పై క్లిక్ చేస్తే.. లింక్ ఓపెన్ అవుటుంది.8. ఫామ్ 6లో మీ రాష్ట్రం, జిల్లా, నియోజవర్గం వివరాలు నమోదు చేయాలి. 9. మీ పూర్తి పేరు వివరాలతో పాటు పాస్పోర్ట్ ఫొటో అప్లోడ్ చేయాలి.10. ఫోన్, ఆధార్ నంబరు, జెండర్, పెట్టినతేదీ, చిరునామాలతో పాటు సంబంధిత పత్రాలు అప్లోడ్ చేయాలి.ఈ వివరాలు అన్ని నమోదు చేసిన తర్వాత దరఖాస్తును ప్రివ్యూలో చూసుకోవాలి. అన్ని వివరాలు కరెక్టుగా ఉన్నాయని భావిస్తే సబ్మిట్ చేయాలి. 15 రోజుల్లోగానే ఎలక్టర్ ఫొటో ఐడెంటిటీ కార్డు మీరు పొందుతారు. చదవండి: ఐటీ ఉద్యోగుల నెత్తిన మరో పిడుగు? -
ఇంగ్లీషులో మాట్లాడేవారు సిగ్గుపడే రోజులొస్తాయ్: అమిత్ షా
ఢిల్లీ: మన దేశ భాషలే మన సంస్కృతికి రత్నాలని.. భాషలు మనుగడలో లేకుంటే నిజమైన భారతీయులుగా ఉండలేమంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నొక్కి చెప్పారు. మాజీ సివిల్ సర్వెంట్ ఐఏఎస్ అశుతోష్ అగ్నిహోత్రి రచించిన ‘మెయిన్ బూంద్ స్వయం, ఖుద్ సాగర్ హూన్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.భారతీయ భాషలు దేశ గుర్తింపుకు ఆత్మ వంటివన్న అమిత్ షా.. భారతదేశ భాషా వారసత్వాన్ని తిరిగి పొంది, మాతృభాషల పట్ల గర్వంతో ప్రపంచానికి నాయకత్వం వహించాల్సిన సమయం వచ్చిందన్నారు. ఈ దేశంలో ఇంగ్లీష్ మాట్లాడేవారు త్వరలోనే సిగ్గుపడతారు.. అటువంటి సమాజం ఏర్పడటం ఎంతో దూరంలో లేదు. దృఢ సంకల్పం ఉన్నవారు మాత్రమే మార్పు తీసుకురాగలరు. మన దేశ భాషలు మన సంస్కృతికి రత్నాలు అని నేను నమ్ముతున్నాను.’’ అంటూ అమిత్ షా చెప్పుకొచ్చారు.మన దేశాన్ని, మన సంస్కృతి, చరిత్ర, మతాన్ని అర్థం చేసుకోవడానికి ఏవిదేశీ భాష కూడా సరిపోదని అమిత్ షా వ్యాఖ్యానించారు. పూర్తి భారతదేశ ఆలోచనను విదేశీ భాషల ద్వారా ఊహించలేం. ఈ యుద్ధం ఎంత కష్టమో నాకు పూర్తిగా తెలుసు, కానీ భారత సమాజం దానిని గెలుస్తుందని కూడా నాకు పూర్తిగా నమ్మకం ఉంది. మరోసారి ఆత్మగౌరవంతో, మన దేశాన్ని మన స్వంత భాషలలో నడుపుతాం. ప్రపంచాన్ని కూడా నడిపిస్తాం’’ అని అన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూపొందించిన 'పంచ ప్రాణ్' (ఐదు ప్రతిజ్ఞలు) గురించి వివరిస్తూ.. ఈ ఐదు ప్రతిజ్ఞలు దేశంలోని 130 కోట్ల మంది ప్రజల సంకల్పంగా మారాయని అమిత్ షా అన్నారు. అమృత్ కాల్ కోసం మోదీ జీ 'పంచ ప్రాణ్' (ఐదు ప్రతిజ్ఞలు)కు పునాది వేశారు. 2047 నాటికి మనం శిఖరాగ్రంలో ఉంటామని.. ఈ ప్రయాణంలో మన భాషలు ప్రధాన పాత్ర పోషిస్తాయి" అని అమిత్ షా చెప్పారు. -
న్యాయమూర్తి ఇంట్లో కాలిన నోట్ల కట్టలు.. జస్టిస్ యశ్వంత్ వర్మకు భారీ ఎదురుదెబ్బ
సాక్షి,ఢిల్లీ: హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మకు (justice yashwant varma) భారీ ఎదురుదెబ్బ తగలనున్నట్లు తెలుస్తోంది. కాలిన నోట్ల కట్టల వ్యహారంలో జస్టిస్ యశ్వంత్ వర్మను విధుల నుంచి తొలగించాలని సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ అత్యున్నత న్యాయస్థానానికి సిఫార్స్ చేసినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది మార్చి నెలలో జస్టిస్ వర్మ అధికారిక నివాసంలో వెలుగులోకి వచ్చిన రూ.500 నోట్ల కట్టల వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు త్రిసభ్య కమిటీని నియమించింది. తాజాగా త్రిసభ్య కమిటీ విచారణ పూర్తి చేసి రిపోర్టును సుప్రీంకోర్టుకు అందించింది. స్టోరూంలో వెలుగులోకి వచ్చిన కరెన్సీ నోట్ల ఏపీసోడ్లో జస్టిస్ వర్మ, అతని కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని గుర్తించింది. ఇదే వ్యవహారంలో జస్టిస్ యశ్వంత్ వర్మను విధుల నుంచి తొలగించాలని సుప్రీంకోర్టుకు సిఫార్సు చేసినట్లు పలు జాతీయ మీడియా కథనాలు హైలెట్ చేశాయి. సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ 55 మంది సాక్షులను విచారించి, జస్టిస్ వర్మ వాంగ్మూలాన్ని రికార్డు చేసి, మొత్తం 64 పేజీల నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికను మొదటగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి అందజేసింది. నివేదికలో కీలకమైన విషయాలను పరిశీలిస్తే..త్రిసభ్య విచారణ కమిటీ తన నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది.పేజీ 60లో: “ 30 తుగ్లక్ క్రెసెంట్లో ఉన్న స్టో రూమ్లో భారీ ఎత్తున నగదు ఉన్నట్లు గుర్తించాం. నగదు ఉన్న ప్రదేశం ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వర్మ అధికారిక నివాసం…” పేజీ 59లో: “... స్టోరుమ్లోకి వెళ్లేందుకు జస్టిస్ వర్మ, ఆయన కుటుంబ సభ్యులకే ఉన్నది. ఎవరు అనుమతి లేకుండా లోపలికి వెళ్లలేరు. మా విచారణలో తేలింది.”మార్చి 14న జరిగిన అగ్ని ప్రమాదంలో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్న సమయంలో స్టోరూంలో పూర్తిగా కాలిన నోట్లు వెలుగులోకి వచ్చాయి. ఓ సాక్షి చెప్పిన ప్రకారం.. “లోపలికి వెళ్లగానే ఏటు వైపు చూసినా, రూ.500 నోట్ల కట్టలు నేలపై పడి ఉన్నాయి. ఇది నా జీవితంలో నేను చూసిన పెద్ద మొత్తంలో నగదు అని సదరు వ్యక్తి త్రిసభ్య కమిటీకి చెప్పారు. కమిటీ నివేదిక ప్రకారం, ఇంత పెద్దమొత్తంలో స్టోరూంలో లభ్యమవ్వడంపై అనేక అనుమానాలున్నాయి. జస్టిస్ వర్మ, అతని కుటుంబ సభ్యుల ప్రమేయం లేకుండా అక్కడ ఉంచడం అసంభవం’ అని నివేదికలో ప్రస్తావించింది.జస్టిస్ వర్మ కుమార్తె దియా వర్మ, ప్రైవేట్ సెక్రటరీ రాజీందర్ కార్కీలను కూడా కమిటీ విచారించింది. విచారణలో ఈ ఇద్దరూ స్టోరూంలో నగదు ఉన్న విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని అగ్నిమాపక సిబ్బందిని కోరినట్లు తేలింది.దీంతో పాటు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ కుమార్ చేసిన ఆరోపణలు, దర్యాప్తులో తేలిన అంశాల ప్రకారం, జస్టిస్ వర్మను తొలగించే ప్రక్రియ ప్రారంభించేందుకు తగిన ఆధారాలు ఉన్నాయి’ అని కమిటీ తేల్చింది.దేశంలో ఇప్పటి వరకు ఏ న్యాయమూర్తికి వ్యతిరేకంగా అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టలేదు. సుప్రీం త్రిసభ్య కమిటీ సిఫార్సుతో జస్టిస్ యశ్వంత్ వర్మకు వ్యతిరేకంగా అభిశంసన తీర్మానం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఇదే విషయంపై పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జస్టిస్ వర్మ మాత్రం కాలిన నోట్ల కట్టల గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని, నిరుపయోగంగా ఉండే స్టోరూంలో ఇతరులు సైతం ప్రవేశించే అవకాశం ఉందని వాదిస్తున్నారు. సుప్రీం నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యులు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీగా నగదు దొరికిన ఘటనపై సమగ్ర విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా త్రిసభ్య కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీలో పంజాబ్, హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్ నాగ్, హిమాచల్ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.ఎస్.సంధావాలియా, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అనూ శివరామన్ను సభ్యులుగా ఉన్నారు. -
Air India crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. దెబ్బతిన్న బ్లాక్ బాక్స్
సాక్షి,ఢిల్లీ: ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ (Air India Boeing 787-8 Dreamliner) విమాన ప్రమాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూన్ 12న గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదానికి గల కారణాల్ని వెలికి తీసే బ్లాక్ బాక్స్ దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.అయితే, అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి దెబ్బతిన్న బ్లాక్ బాక్స్ నుంచి వివరాల్ని సేకరించేందుకు కేంద్రం అమెరికాకు తరలించినట్లు సమాచారం. తాజా బ్లాక్ బాక్స్ పరిణామంపై కేంద్రం అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.ఏప్రిల్ 12న అహ్మదాబాద్ నుంచి ఎయిరిండియా 787 డ్రీమ్లైనర్ విమానం 242 మందితో లండన్ బయల్దేరింది. కానీ, ఆ విమానం నేల మీద నుంచి పైకి లేచిన కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఘోరమైన తప్పు ఏదో జరిగింది. విమానంలో తీవ్ర ఇబ్బంది తలెత్తింది. అందులో నుంచి ఒక మేడే కాల్ వెళ్లింది. అంతలోనే రద్దీగా ఉండే మేఘానీనగర్ బీజే మెడికల్ కాలేజీ ప్రధాన క్యాంపస్పై కప్పు మీద ఆ విమానం కూలిపోయి (air india crash video) అగ్ని గుండంలా మారింది. విమానంలోని మృత్యుంజయుడు విశ్వాస్ కుమార్ రమేష్ తప్ప మిగిలిన వారందరినీ అగ్ని దహించివేసింది. ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న వారితో పాటు బీజే మెడికల్ కాలేజీ క్యాంపస్లో బాధితుల్ని కలుపుకొని మొత్తం 270 మంది మరణించినట్లు తెలుస్తోంది.ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండడంతో వైద్యులు బాధిత కుటుంబ సభ్యుల డీఎన్ఏ ఆధారంగా మృతదేహాల్ని గుర్తిస్తున్నారు. ఘటనా స్థలంలో మృతదేహాలను డీఎన్ఏతో మ్యాచ్ చేసి చూస్తున్నారు. గుజరాత్ ప్రభుత్వ వైద్యులు మృతదేహాల్ని ఎనాలసిస్ చేసి మొత్తం 208 మృతదేహాల్ని గుర్తించారు. అలా ఇప్పటి వరకు (ఏప్రిల్ 18) ఉన్న సమాచారం ప్రకారం.. 170 మృతదేహాల్ని డీఎన్ఏతో గుర్తించారు. వారిలో యూకే, ఫోర్చుగల్,కెనడాతో పాటు ప్రమాదంలో మరణించిన మరో ఆరుగురు మృత దేహాల్ని వారి కుటుంబ సభ్యులకు అందించారు. -
ఢిల్లీలో మళ్లీ కరోనా కలకలం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ మళ్లీ తీవ్ర ప్రభావం చూపుతోంది. కరోనా కారణంగా బుధవారం 65 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. అతడు నోటి క్యాన్సర్, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఢిల్లీలో కరోనా కారణంగా 13 మంది మరణించగా, ప్రస్తుతం 620 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జూన్ 15న ఒక్కరోజే ముగ్గురు మరణించారు. వీరిలో 57 ఏళ్ల మహిళకు డయాబెటిస్, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నాయి. 57 ఏళ్ల పురుషుడికీ అదే రకమైన అనారోగ్య సమస్యలున్నాయి. మరణించిన 83 ఏళ్ల మహిళకు డయాబెటిస్, హైబీపీ, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఉంది. తగ్గుతున్న కేసుల సంఖ్య ఢిల్లీలో గత మూడు రోజులుగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్యలో కొంత తగ్గుదల కనిపిస్తోంది. యాక్టివ్ కేసులు తగ్గాయి. కొత్త కేసులు నమోదు కాలేదు. ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 212 మంది బాధితులు కోలుకున్నారు. ఢిల్లీలో ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటివరకు 1,960 కేసులు నమోదయ్యాయి. కాగా, దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల్లో ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. కొత్త వేరియంట్లు సాధారణంగా వేగంగా వ్యాపిస్తాయి. అయితే ఇవి గత వేరియంట్ల మాదిరిగా ప్రాణాంతకం కాకపోవచ్చని వైద్య నిపు ణులు చెబుతున్నారు. వృద్ధులు, గర్భిణులు, చిన్న పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారిలో కరోనా కొత్త వేరియంట్లతో ముప్పు అధికంగా ఉంటుంది. కేసుల పెరుగుదలపై భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు. మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, జన సమూహాల్లోకి వెళ్లకపోవడం వంటి జాగ్రత్తలు పాటిస్తే వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. -
‘కబుర్ల దేవత’ కేంద్ర బాల సాహిత్య పురస్కారం
ఢిల్లీ: బాల సాహిత్య, యువ పురస్కారాలను కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించింది. 24 భాషల్లో ఉత్తమ రచనలను ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. తెలుగు భాషకు సంబంధించి గంగిశెట్టి శివకుమార్ రచించిన 'కబుర్ల దేవత' (స్టోరీ) పుస్తకానికి కేంద్ర బాల సాహిత్య పురస్కారం లభించింది. సాహిత్య యువ పురస్కారానికి ప్రసాద్ సూరి రచించిన మైరావణ నవల ఎంపికైంది.భారతీయ భాషల్లో సాహిత్య రంగంలో పలు పుస్తకాలను ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు జ్యూరీ సభ్యులు సిఫారసు చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ నేతృత్వంలోని సాహిత్య అకాడమీ ఎగ్జిక్యూటివ్ బోర్డు అవార్డు గ్రహీతల వివరాలు వెల్లడించింది. ఈ ఏడాది డోగ్రీ భాషకు సంబంధించి యువ పురస్కారాన్ని ప్రకటించలేదు. 23 భాషల్లో ప్రచురితమైన పుస్తకాలకు మాత్రమే యువ పురస్కారాలను ప్రకటించింది. -
ఈ నేషనల్ హైవేలపై బీకేర్ఫుల్!
నేషనల్ హైవేలపై రయ్ అంటూ దూసుకుపోతున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. మన దేశంలో ఏటా రోడ్డు ప్రమాదాల్లో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షల్లో క్షతగాత్రులవుతున్నారు. సుదూర ప్రాంతాలను కలిపే జాతీయ రహదారులపైనా జరుగుతున్న యాక్సిడెంట్లు ఎంతో మందిని బలితీసుకుంటున్నాయి. 2022 కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం 4,61,312 రోడ్డు ప్రమాదాలు జరగ్గా.. నేషనల్ హైవేలపై 1,51,997 యాక్సిడెంట్లు చోటుచేసుకున్నాయి. అదే ఏడాది మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 1,68,491 మరణాలు నమోదయ్యాయి. జాతీయ రహదారులపై జరిగిన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 61,038.మోస్ట్ డేంజర్.. ఎన్హెచ్-44 అయితే జాతీయ రహదారుల్లో కొన్ని అత్యంత ప్రమాదకరంగా మారాయని సేవ్లైఫ్ ఫౌండేషన్ వెల్లడించింది. 2023 ప్రమాదాల గణాంకాల ప్రకారం 100 హైవేలకు ఈ సంస్థ ర్యాంకులు ఇచ్చినట్టు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) అధికారులు తెలిపారు. ఉత్తరాన శ్రీనగర్ నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు విస్తరించి, దేశంలోని అతి పొడవైన రహదారిగా గుర్తింపు పొందిన ఎన్హెచ్-44 అత్యంత ప్రమాదకరమైన హైవేగా తేలింది. హరియాణా, ఢిల్లీలో 44వ నంబరు జాతీయ రహదారిపై 2023లో జరిగిన ప్రమాదాల్లో ఎక్కువ మరణాలు సంభవించినట్టు వెల్లడైంది.కిలోమీటర్కు 3 మరణాలుఎన్హెచ్-44 హరియాణాలో 266 కిలోమీటర్లు విస్తర్తించి ఉంది. 2023లో ఈ రహదారిపై జరిగిన ప్రమాదాల్లో 715 మంది దుర్మరణం పాలయ్యారు. అంటే కిలోమీటర్కు మూడు మరణాలు సంభవించాయి. ఢిల్లీలో 30 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ హైవేపై 63 మంది మృత్యువాత పడ్డారు. కిలోమీటర్కు దాదాపు 2 మరణాలు నమోదయ్యాయి. ముకర్బా చౌక్- సంఘూ బోర్డర్, ఆశారాం- బహదూర్పూర్ డేంజర్ స్పాట్లగా గుర్తించారు. హరియాణా పరిధిలో 85 కిలోమీటర్ల మేర ఎన్హెచ్-48 విస్తరించివుంది. ఈ రూట్లో గుర్గావ్- రాజస్థాన్ బోర్డర్ను మూడో డేంజర్ జోన్గా పేర్కొంటున్నారు.చదవండి: 6 వారాల్లో 3 హెలికాప్టర్ ప్రమాదాలు.. ఏం జరుగుతోంది?జాతీయ రహదారులపై ఎక్కడెక్కడ ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయో గుర్తించి, వాటిని నివారించడానికి చేపట్టాల్సిన చర్యలు చేపట్టడానికి ఈ డేటా ఉపయోగపడుతుందని ఎన్హెచ్ఏఐ అధికారులు తెలిపారు. రక్షణ చర్యల కోసం హైవే బిల్డర్లు, ఆపరేటర్లను ఆదేశించడానికి ఈ గణాంకాలు దోహదపడతాయన్నారు. -
తమిళనాడు ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం.. ఏడీజీపీ జయరామ్కు ఊరట
న్యూఢిల్లీ: తమిళనాడు అడిషనల్ డీజీపీ హెచ్ఎం జయరామ్(HM Jayaram)కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఆయన అరెస్టు వ్యవహారంలో మద్రాస్ హైకోర్టు తీరుపై సుప్రీం కోర్టు కన్నెర్రజేసింది. కిడ్నాప్ కేసులో సరైన ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయాలని ఆదేశించడం ఏమేర సహేతకమని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. అదే సమయంలో ఆయనపై సస్పెన్షన్ను వేటును ఎత్తేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.మద్రాస్ హైకోర్టు(Madras HC) తన అరెస్ట్కు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ జయరామ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై బుధవారం జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిన్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా.. జయరామ్ తరఫు న్యాయవాది పలు అంశాలను ప్రస్తావించారు. తన క్లయింట్ జయరామ్ను అరెస్ట్ అయిన వెంటనే కస్టడీలోకి తీసుకున్నారని, సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ వేసిన 24 గంటల తర్వాతే విడుదల(జూన్ 17న) చేశారని బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం బెంచ్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఒక అధికారిని అయోమయమైన ఆధారాల ఆధారంగా అరెస్ట్ చేయమని చెప్పడం ఏంటి?. ఇది ఎటువంటి న్యాయ ప్రక్రియకు సరిపోతుంది?. ఇది పరిపాలనా వ్యవస్థపైనా ప్రభావం చూపించే అంశమే కదా. అధికారులపై ఇలాంటి చర్యలు మానసికంగా దెబ్బతీసేలా ఉంటాయి’’అని అభిప్రాయపడింది.అదే సమయంలో ఆయన్ని విధుల నుంచి సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వంపైనా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఆయన్ని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఏముంది?. విచారణకు సహకరిస్తున్నా కూడా చర్యలు తీసుకోవడం ఏంటి?.. సస్పెన్షన్ ఆదేశాలను తక్షణమే వెనక్కి తీసుకోండి.. అని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏడీజీపీ జయరామ్ అరెస్టు వ్యవహారం తమిళనాడులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తిరువళ్లూరు జిల్లా తిరువేలాంగాడు వద్ద బాలుడి కిడ్నాప్ కేసులో గత సోమవారం మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో పురట్చి భారతం పార్టీకి చెందిన కేవీ కుప్పం నియోజవకవర్గ ఎమ్మెల్యే జగన్మూర్తిపై కూడా ఆరోపణలున్నాయి. కోర్టు విచారణకు జయరామ్ హాజరు కాగా.. ఆ ప్రాంగణంలోనే ఆయన్ని అరెస్ట్ చేశారు. అరెస్టు అనంతరం ఏడీజీపీ జయరామన్ను హోంశాఖ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.విచారణ సమయంలో.. ఈ కిడ్నాప్ కేసులో ఎమ్మెల్యే, పోలీస్ ఉన్నతాధికారి తీరుపై మద్రాసు హైకోర్టు కన్నెర్ర చేసింది. ప్రజా ప్రతినిధులు న్యాయస్థానాలను (Kangaroo Courts)నడిపించడమేంటని? జగన్మూర్తికి తీవ్రంగా అక్షింతలు వేసింది.అలాగే.. ఏడీజీపీ జయరామన్ అరెస్టుకు ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు.. జగన్మూర్తి ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు.జరిగింది ఇదే.. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ధనుష్(22) అనే యువకుడ్ని ఓ యువతి వివాహం చేసుకుంది. ఆ యువకుడిని పట్టుకుని తన కూతురిని తిరిగి తనకు అప్పగించాలంటూ ఆమె తండ్రి వనరాజా మాజీ కానిస్టేబుల్ అయిన మహేశ్వరి సాయం కోరాడు. దీంతో ఆమె ఏడీజీపీ జయరామ్ను సంప్రదించింది. ఆపై ఆ పంచాయితీ పురట్చి భారతం పార్టీకి చెందిన కేవీ కుప్పం నియోజవకవర్గ ఎమ్మెల్యే జగన్మూర్తి చెంతకు చేరింది. ఈ క్రమంలో ధనుష్ కనిపించకపోవడంతో అతని 16 ఏళ్ల సోదరుడిని అమ్మాయి కుటుంబం కిడ్నాప్ చేశారు. అయితే ఈ కేసులో ఒత్తిళ్ల నేపథ్యంలో చివరకు ఆ బాలుడిని ఓ హెటల్ వద్ద వదిలేసి వెళ్లారు. అయితే ఆ బాలుడ్ని వదిలేసిన వాహనం ఏడీజీపీ జయరామ్ అధికారిక వాహనం కావడం, పైగా అందులో వనరాజా, మహేశ్వరి ఉండడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. -
ఎయిరిండియా రద్దుల పర్వం
న్యూఢిల్లీ/అహ్మదాబాద్/కోల్కతా: అహ్మదా బాద్ ఘోర ప్రమాదం తర్వాత డ్రీమ్లైనర్ రకం విమానాలతో కొనసాగుతున్న ఎయిర్ ఇండియా విమాన సర్వీసులకు ‘క్యాన్సిల్’ మచ్చ అంటుకుంది. మంగళవారం ఏడు ఎయిర్ఇండియా విమా నాలు రద్దుకాగా వాటిలో ఆరు విమానాలు డ్రీమ్ లైనర్ 787–8 రకానికి చెందినవి ఉండడం గమనార్హం. సాంకేతికలోపం సహా ఇతరత్రా కారణాలతో డ్రీమ్లైనర్లు గాల్లో చక్కర్లుకొట్టడం మానేసి పార్కింగ్ ప్రాంతానికే పరిమితమయ్యాయి. సాంకేతికలోపంతో..ఢిల్లీ నుంచి పారిస్కు వెళ్లాల్సిన డ్రీమ్లైనర్ విమానంలో సాంకేతికలోపం తలెత్తడంతో దానిని రద్దుచేశారు. ఇలాంటి మరో విమానం అందుబాటులో లేకపోవడంతో అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్లాల్సిన విమాన సర్వీస్ క్యాన్సిల్ అయింది. అహ్మదాబాద్ ఘటన తర్వాత ఎయిర్ఇండియా సంస్థ తన విమానాలను క్షణ్ణంగా తనిఖీలు చేశాక రాకపోకలకు పంపిస్తోంది. ఈ కారణంగానే ఎక్కువ విమానాలు క్యాన్సిలేషన్ బారినప డుతున్నాయని ఈ రంగ నిపుణులు చెబుతు న్నారు. మంగళవారం అధిక సంఖ్యలో విమానాలు రద్దవడంతో ప్రయాణికులు ఇబ్బందులుపడ్డారు.దీనిపై ఎయిర్ఇండియా స్పందించింది. ‘‘రద్దయిన విమాన ప్రయాణికులను హోటల్ వసతులు, లేదంటే టికెట్ క్యాన్సిలేషన్పై 100 శాతం రీఫండ్ లేదంటే తదుపరి రీషెడ్యూలింగ్కు వెసులుబాటు కల్పిస్తున్నాం’’ అని ఎయిర్ఇండియా మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. అహ్మదాబాద్ నుంచి ‘తొలి’విమానం రద్దుఅహ్మదాబాద్ దుర్ఘటన తర్వాత అదే ఎయిర్పోర్ట్ నుంచి మంగళవారం మధ్యాహ్నం 1.10 గంటలకు లండన్కు బయల్దేరి వెళ్లాల్సిన ఎయిర్ఇండియా వారి ఏఐ159 విమానం రద్దయింది. విమానప్రమాదం తర్వాత ఇక్కడి నుంచి వెళ్తున్న తొలి ఎయిర్ఇండియా అహ్మదాబాద్–లండన్ సర్వీస్ విమానం ఇదే. మరోవైపు ఢిల్లీ నుంచి ఫ్రాన్స్లోని పారిస్ ఛార్లెస్ డీ గాలే ఎయిర్పోర్ట్కు వెళ్లాల్సిన ఏఐ143 విమానం సైతం రద్దయింది.ఎయిరిండియా విమానంలో పనిచేయని ఇంజన్శాన్ఫ్రాన్సిస్కో నుంచి బయల్దేరి ముంబైకి రావాల్సిన ఎయిర్ఇండియా విమా నం సాంకేతిక లోపంతో కోల్కతాలో ఆగిపోయింది. దీంతో ఈ సర్వీసును రద్దు చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. 211 మంది ప్రయాణికులతో శాన్ఫ్రాన్సిస్కో నుంచి బయలుదేరిన బోయింగ్ 777–200ఎల్ఆర్ విమానం ముంబైకి చేరుకో వాల్సి ఉంది. శాన్ఫ్రాన్సిస్కో నుంచి వస్తూ పాకిస్తాన్ గగనతలం మీదుగా ముంబైకి చేరుకో వాల్సి ఉంటుంది.అయితే, పాక్ తన గగనతలాన్ని భారతీయ సర్వీసులకు మూసి వేసిన కారణంగా ఈ విమానం నేరుగా రావడం కుదర్లేదు. దాంతో చుట్టూతిరిగి తొలుత కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. రాత్రి 2 గంటల సమయంలో టేకాఫ్ తీసుకోవాల్సి ఉండగా ఒక ఇంజన్ మొరాయించింది. ఇంజనీర్లు మూడు గంటలపాటు శ్రమించినా ఫలితం లేకపోవడంతో ఆ సర్వీస్ను రద్దుచేశారు. కొందరిని ఇతర విమానాల్లో ముంబైకి పంపించారు.ఇండిగో విమానానికి బాంబు బెదిరింపుముంబై: మస్కట్–ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో, విమానాన్ని అధికారులు నాగ్పూర్లో అత్యవసరంగా ల్యాండ్ చేయించి, తనిఖీలు చేపట్టారు. బెదిరింపు వట్టిదేనని ధ్రువీకరించుకున్నాక విమానం తిరిగి గమ్యస్థానానికి చేరుకుంది. మస్కట్లో బయలు దేరిన ఈ విమానంలో 157 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం విమానం కోచిలో ల్యాండయ్యింది. తిరిగి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే విమానంలో బాంబు ఉందని బెదిరింపు మెయిల్ వచ్చింది. -
మేఘాలయ హనీమూన్ హత్య కేసులో మరో ట్విస్ట్
షిల్లాంగ్ : సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. పథకం ప్రకారం భర్త రాజా రఘు వంశీని చంపించిన భార్య సోనమ్ రఘువంశీని ఓ పదునైన ఆయుధం పోలీసులకు పట్టించింది. అయితే, ఈ హత్య చేసేందుకు ఒక్క ఆయుధం కాదని, మరో ఆయుధాన్ని వినియోగించినట్లు పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్లో గుర్తించారు.ఇక ఈ కేసు విచారించేందుకు ఏర్పాటైన సిట్ బృందం సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు నిందితుల్ని ఇవాళ (జూన్ 17) ఘటన జరిగిన సోహ్రాలోని వీ సావ్డాంగ్ జలపాత ప్రాంతానికి తీసుకెళ్లింది. ఈ సీన్ రీకన్స్ట్రక్షన్లో నిందితులు రాజా రఘువంశీని హతమార్చేందుకు రెండు మారణాయుధాల్ని వినియోగించినట్లు గుర్తించామని ఈస్ట్ కాశీ హిల్స్ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీస్ వివేక్ వివేక్ సియాం వెల్లడించారు.#WATCH राजा रघुवंशी हत्याकांड में क्राइम सीन रिक्रिएशन पर एसपी ईस्ट खासी हिल्स विवेक सियेम ने कहा, "हमने क्राइम सीन रिक्रिट किया कि आरोपियों ने यह कैसे किया होगा। हमने पार्किंग स्थल से शुरुआत की, जहां उन्होंने अपने स्कूटी वाहन रखी थी..हम व्यूपॉइंट पर गए और पता लगाया कि हत्या से… pic.twitter.com/U6xg1KOIIa— ANI_HindiNews (@AHindinews) June 17, 2025మరి మరో ఆయుధం ఎక్కడ?సీన్ రీకన్స్ట్రక్షన్లో హత్య జరిగిన రోజు నిందితులు ఎక్కడ ఏం చేశారు? ఏ ప్రాంతంలో ఉన్నారు? ఏం చేశారు? వంటి వివరాల్ని సేకరించాం. వాళ్లు చెప్పిన వివరాల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే హత్య కోసం రెండు ఆయుధాల్ని వినియోగించినట్లు తేలింది. ఇప్పటికే ఒక ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నాం. మరో ఆయుధం గురించి అన్వేషణ కొనసాగుతోందన్నారు. సోనమ్ సైగ.. రాజాపై విశాల్ కత్తితో దాడినిందితుల్ని మేం హత్య జరిగిన వ్యూపాయింట్కు తీసుకెళ్లాము. అక్కడ ఎవరి పొజిషన్ ఎలా ఉందో? ఎలా దాడి చేశారో? నిర్ధారించాం. నిజానికి, ఇద్దరు నిందితులు వేర్వేరు ఆయుధాల్ని ఉపయోగించారు. రెండో ఆయుధం కోసం వెతుకుతున్నాం. హత్య అనంతరం రాజా రఘువంశీని ఏ లోయలో పడేశారో అక్కడే ఆకాష్ తన చొక్కాను పడేశాడు. తన భర్త రాజా రఘువంశీని హత్య చేయమని సోనమ్ నిందితులకు సైగ చేసింది. ఆ సైగతో రాజా రఘువంశీనీ విశాల్ చౌహాన్ కత్తితో పొడిచాడు. ఆ తర్వాత రాజా నేలకొరిగాడు. రాజా హత్యను సోనమ్ కళ్లారా చూసింది‘సోనమ్ నేరాన్ని అంగీకరించింది. నేడు మేము క్రైం సీన్ను రిక్రియేట్ చేశాము. ఆమె ఎక్కడ నిల్చుంది? హత్యకేసులో ఆమె పాత్ర ఏమిటో గుర్తించాం. రాజాను ముగ్గురు వ్యక్తులు హత్య చేశారు. హత్యను అక్కడే నిల్చొని సోనమ్ కళ్లారా చూశారు. ఆమె తన ఫోన్ను ధ్వంసం చేసింది. ఇది ముందే ప్లాన్ ప్రకారం చేసిన హత్యే. హత్య అనంతరం ఆ ముగ్గురు రాజా శరీరాన్ని లోయలో పడేశారు’. వీరు హత్యకు వెయ్ సవ్దాంగ్ను ఎంచుకున్న కారణం అక్కడ ఎవ్వరూ ఉండరని. వీరందరు మేఘాలయకు రావడం ఇదే తొలిసారిమా టీమ్ ఇప్పటికే ఇండోర్లో ఉంది. కేసు నిమిత్తం మరికొందరిని విచారిస్తున్నారు’ అని చెప్పారు.పెళ్లైన 12రోజులకే భర్తను హత మార్చిన భార్యఏప్రిల్ 23న రాజా రఘువంశీ,సోనమ్ రఘువంశీల వివాహం జరిగింది.పెళ్లైన 12 రోజులకే ప్రియుడుతో కలిసి జీవించేందుకు సోనమ్ కుట్ర చేసింది. తన భర్త రాజ రఘవంశీ హత్య చేయాలనుకుంది. ఇందుకోసం సోనమ్ తన ప్రియుడు సాయంతో విశాల్ చౌహాన్,ఆనంద్ కుమార్,కాష్ రాజ్పుత్లకు సుపారీ ఇచ్చింది. ఒప్పందం ప్రకారం.. రాజా రఘువంశీని హతమార్చి తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలోని వీ సావ్డాంగ్ హిల్స్లో పడేశారు. జూన్ 2న దే జలపాతం వద్ద గుర్తు పట్టలేని విధంగా ఉన్న రాజ రఘువంశీ మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
Air India: 48 గంటల్లో 9 ఘటనలు.. డీజీసీఏ సీరియస్
న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానయాన సంస్థపై డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) చర్యలకు ఉపక్రమించింది. వరుసగా ఎయిర్క్రాఫ్ట్లలో సాంకేతిక లోపాలు బయటపడడం, విమానాలు రద్దు కావడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో మంగళవారం ఎయిరిండియాతో వర్చువల్ సమావేశం నిర్వహించింది.అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం దృష్ట్యా డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అన్ని బోయింగ్ 787 విమానాల్లో భద్రతా తనిఖీలు చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని ఎయిర్ ఇండియాకు రెండు వారాల గడువు విధిస్తూ డీజీసీఏ ఆదేశాలు ఇచ్చింది కూడా. అయితే.. ఈలోపే వరుసగా సాంకేతిక లోపాలతో ఘటనలు వెలుగులోకి వస్తుండడంతో డీజీసీఏ అప్రమత్తమైంది. గత 48 గంటల్లో 9 ఘటనలు చోటు చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ఈ క్రమంలోనే మంగళవారం ఎయిరిండియా ప్రతినిధులతో వర్చువల్ సమావేశం నిర్వహించింది. బోయింగ్ విమానాల్లో సాంకేతిక సమస్యలపై ప్రశ్నలు సంధిస్తూ.. ఎయిరిండియా ఇంజనీరింగ్ చీఫ్కు డీజీసీఏ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం ఒకేరోజు ఎయిరిండియాకు చెందిన మూడు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దుయ్యాయి. శాన్ఫ్రాన్సిస్కో-ముంబై, అహ్మదాబాద్-లండన్ సర్వీస్ రద్దు కాగా తాజాగా ఢిల్లీ-ప్యారిస్ సర్వీస్ కూడా రద్దు అయినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: అదే రూట్.. సాంకేతిక సమస్యతో మళ్లీ రద్దు -
అందుకే లండన్ విమానం రద్దు చేశాం: ఎయిరిండియా క్లారిటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానాలు హడలెత్తిస్తున్నాయి. అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత బయట పడుతున్న సాంకేతిక లోపాల ఘటనలు ‘వామ్మో.. ఎయిరిండియా’ అనేలా చేస్తున్నాయి. తాజాగా.. మంగళవారం మరో విమానంలో సాంకేతిక లోపం తలెత్తి రద్దయ్యిందనే వార్తలు రాగా.. ఎయిరిండియా అందులో నిజం లేదని వివరణ ఇచ్చుకుంది. ఆంగ్ల మీడియా సంస్థల కథనం ప్రకారం.. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే ఎయిరియిండియా విమానంలో సాంకేతిక సమస్య బయటపడింది. మధ్యాహ్నం 1.10 గంటలకు AI 159 బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్టు నుంచి లండన్కు బయల్దేరాల్సి ఉండగా.. పైలట్ టేకాఫ్ కంటే ముందు సాంకేతిక లోపం గుర్తించారు. దీంతో విమానంలోని 200 మంది ప్రయాణికులను దించేశారు. తొలుత సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసిన నిర్వాహకులు.. చివరకు ఫ్లైట్ సర్వీసును తాత్కాలికంగా రద్దు చేసినట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే.. జూన్ 12వ తేదీన ఇదే రూట్లో ప్రయాణించే ఎయిరింయా విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంతో ఏఐ 171 విమానాన్ని పూర్తిగా రద్దు చేసింది ఎయిరిండియా. దాని స్థానంలోనే AI 159 విమానానికి తీసుకు వచ్చింది. అయితే.. అనూహ్యంగా.. ఇవాళ ఆ విమానంలోనూ సాంకేతిక సమస్య తలెత్తడం.. టేకాఫ్కి ముందే ఆ సమస్యను గుర్తించడం.. చివరకు సర్వీస్ రద్దు కావడం జరిగిపోయాయి. విమాన రద్దు నిర్ణయంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఏఐ 159 విమాన రద్దుపై ఎయిరిండియా వివరణ ఇచ్చుకుంది. విమానం సిద్ధంగా లేకపోవడంతోనే రద్దు చేశామని స్పష్టత ఇచ్చింది. ప్రయాణికులకు హోటల్లో వసతు కల్పిస్తున్నామని, అడిగిన వారికి డబ్బులు సైతం వెనక్కి ఇస్తున్నామని, ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడబోమని ఎయిరిండియా ఒక ప్రకటనలో వెల్లడించింది. Air India crashed after taking off. The plane was seen struggling to gain altitude before crashing into a fire ball.. Over 200 people were on board..#AirIndiaCrash pic.twitter.com/xacH20AlSe— Sudhir Byaruhanga (@Sudhirntv) June 12, 2025 -
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
నాగపూర్: విమానాలకు బాంబు బెరిరింపు కాల్స్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. మంగళవారం ఉదయం కొచ్చి నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో నాగపూర్లో ఇండిగో ఫ్లైట్ అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. నాగపూర్లో ఇండిగో విమానాన్ని భద్రతా సిబ్బంది తనిఖీలు చేశారు. ప్రయాణీకులందరినీ సురక్షితంగా తరలించారు. ఈ బెదిరింపు ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.కాగా, అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన తర్వాత ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రెండు రోజుల క్రితం జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నుంచి హైదరాబాద్కు వస్తున్న విమానం బాంబు బెదిరింపుల నేపథ్యంలో యూటర్న్ తీసుకుంది. తిరిగి ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఎల్హెచ్752 విమానం స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం జర్మనీ నుంచి బయలుదేరింది. సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉంది.కానీ, ఆ విమానాన్ని లక్ష్యంగా చేసుకుని హైదరాబాద్ విమానాశ్రయానికి బాంబు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో ల్యాండింగ్కు నిరాకరించారు. భద్రతా దృష్ట్యా, విమానాన్ని తిరిగి బయల్దేరిన విమానాశ్రయానికి లేదా సమీపంలోని విమానాశ్రయానికి మళ్లించాలని సూచించారు. దీంతో.. లుఫ్తాన్సా విమానం తిరిగి ఫ్రాంక్ఫర్ట్కు చేరుకుంది. శుక్రవారం ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానం బాంబు బెదిరింపు కారణంగా థాయిలాండ్లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. -
ఆలస్యం చేయొద్దు.. తక్షణమే టెహ్రాన్ను వీడండి.. భారతీయులకు అడ్వైజరీ
టెహ్రాన్/న్యూఢిల్లీ: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నేపథ్యంలో భారతీయులకు(Indians In Iran) ఇండియన్ ఎంబసీ తాజాగా మంగళవారం మరోసారి అడ్వైజరీ జారీ చేసింది. టెహ్రాన్లోని భారతీయులంతా వెంటనే నగరాన్ని వీడి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించింది. ఇప్పటివరకు ఎంబసీని సంప్రదించని భారతీయులు.. తక్షణమే అధికారులతో మాట్లాడి తమ లొకేషన్లను షేర్ చేయాలని సూచించింది. ఈ క్రమంలో హెల్ప్ లైన్ నెంబర్లు +98 9010144557, +98 9128109115, +98 9128109109 లకు తమ వివరాలు తెలియజేయాలని కోరింది. ఇరాన్ రాజధాని నగరం టెహ్రాన్పై ఇజ్రాయెల్ సైన్యం డ్రోన్లు, మిస్సైల్స్తో విరుచుకుపడుతోంది. అమెరికా రాయబార కార్యాలయంతో పాటు పలు కార్యాలయాలను ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి.. ‘‘ఆలస్యం చేయకుండా నగరాన్ని వీడాలి’’ అంటూ భారతీయుల కోసం భారత రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుతం ఇరాన్లో సుమారు 10,000 మంది భారతీయులు ఉన్నట్లు ఒక అంచనా. వీళ్లలో 6,000 మందికి పైగా విద్యార్థులే ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడి భారతీయులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం సత్వర చర్యలు ప్రారంభించింది. విమాన మార్గం మూసేయడంతో.. ఇప్పటికే 100 మందితో కూడిన తొలి బృందాన్ని టెహ్రాన్ నుంచి భూమార్గం ద్వారా అర్మేనియాకు తరలించారు. అక్కడి నుంచి అజర్బైజాన్, తుర్కమెనిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ మీదుగా భారత్కు తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు.. భారత రాయబార కార్యాలయం విద్యార్థులకు కీలక సూచనలు జారీ చేసింది. ఎల్లప్పుడూ టచ్లో ఉండాలని, అధికారిక సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వాలని, అత్యవసర పరిస్థితుల్లో సహకరించాలని కోరింది. ఇదీ చదవండి: యుద్ధం ముగిసేది అప్పుడే.. ఇజ్రాయెల్ స్పష్టీకరణ -
సైప్రస్ అధ్యక్షుడికి మోదీ బహుమతులు
న్యూఢిల్లీ: సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్కు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం పలు బహమతులు అందజేశారు. చేతితో తయారు చేసిన కాశ్మీరీ సిల్క్ కార్పెట్తోపాటు ఆంధ్రప్రదేశ్ కళాకారులు రూపొందించిన వెండి పర్సును బహూకరించారు. ప్రధాని మోదీ విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి నేతలకు భారతీయ సంప్రదాయాలు, సంస్కృతిని చాటిచెప్పే బహమతులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.సైప్రస్ అధ్యక్షుడికి ఇచ్చిన కాశ్మీరీ సిల్క్ కార్పెట్కు ఎన్నో విశిష్టతలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. కాశ్మీర్ లోయలోని కళాకారులు శతాబ్దాల నాటి కుట్టు నైపుణ్యాలను ఉపయోగించి, దీన్ని తయారు చేశారని చెప్పారు. అసలు సిసలైన మల్బరీ పట్టు, సహజసిద్ధమైన రంగులు వాడినట్లు పేర్కొన్నారు.ఇక వెండి క్లచ్ పర్సు కూడా విలువైందేనని అన్నారు. సంప్రదాయ లోహపు పనితనం, ఆధునిక రీతులను మేళవించి దీన్ని రూపొందించినట్లు వెల్లడించారు. పర్సుపై ఉన్న పూల డిజైన్లు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కళాకారుల నైపుణ్యానికి ఇదొక నిదర్శనమని స్పష్టంచేశారు. -
రెండు దశల్లో జనగణన
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జనగణనకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖలోని భారత రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో దేశవ్యాప్తంగా జనగణన ప్రక్రియ ప్రారంభమైనట్లైంది. రెండు దశల్లో జరుగనున్న ఈ 16వ జనగణనలో భాగంగా కులగణన కూడా చేపట్టనున్నారు. చివరి జనగణన 2011లో జరిగింది. మళ్లీ 16 ఏళ్లకు, అంటే 2027 మార్చి 1 తేదీకి ఆ కసరత్తు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు. శీతాకాలంలో పూర్తిగా మంచుమయంగా మారే జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లడఖ్కు 2026 అక్టోబర్ 1ని రిఫరెన్స్ తేదీగా కేంద్రం పేర్కొంది. ఆ నాటికల్లా అక్కడ జన, కులగణన ప్రక్రియ పూర్తవుతుంది. మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2027 మార్చి 1కి పూర్తవుతుంది. ఈ మొత్తం జనాభా లెక్కల ప్రక్రియ దాదాపు 21 నెలల్లో పూర్తికానుంది. జనగణన రెండు దశల్లో జరగనుంది. మొదటి దశలో ఆవాస నమోదు కార్యక్రమం (హౌస్ లిస్టింగ్ ఆపరేషన్–హెచ్ఎల్ఓ) జరుగుతుంది. ప్రతి ఇంటి నివాస స్థితి, ఆస్తులు, సౌకర్యాలు తదితర వివరాలు సేకరిస్తారు. తరవాత, రెండో దశలో జనాభా నమోదు (పీఈ– పాపులేషన్ ఎన్యుమరేషన్) కార్యక్రమం చేపడతారు. ఇందులో ప్రతి ఇంటిలోని ప్రతి వ్యక్తి లెక్కలు, సామాజిక–ఆర్థిక, సాంస్కృతిక తదితర వివరాలు సేకరిస్తారు. జనగణన చట్టం, 1948 (అధ్యాయం 3) కింద లభించిన అధికారాల ద్వారా 2019 నాటి జనగణన నోటిఫికేషన్ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, అప్పటి వరకు అమలైన చర్యలు ఇకపై కూడా అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. దాదాపు 34 లక్షల మంది గణనదారులు, పర్యవేక్షకులు... దాదాపు 1.3 లక్షల జనాభా లెక్కల సిబ్బంది జనగణనలో భాగం కానున్నారు. వీరు మొబైల్ అప్లికేషన్లను ఉపయోగించి డిజిటల్ మా ర్గాల ద్వారా జగగణన నిర్వహిస్తారు. ప్రభుత్వం ప్రకటించే పోర్టళ్లు, యాప్ల ద్వారా ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకొనే అవకాశాన్ని ఇవ్వనున్నారు. ఈ భారీ కసరత్తుకు దాదాపు రూ. 13 వేల కోట్లు వ్యయం కానుంది. మహిళా బిల్లు, డీ లిమిటేషన్కు మార్గం సుగమం!జనగణనపై స్పష్టత వచ్చిన నేపథ్యంలో కీలకమైన మహిళా రిజర్వేషన్ బిల్లు, రాష్ట్రాల మధ్య ఉత్తర– దక్షిణ రగడకు దారితీసేలా ఉన్న నియోజకవర్గాల పునర్విభజనకు కూడా మార్గం సుగమం కానుంది. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మూడో వంతు స్థానాలను మహిళలకు ప్రత్యేకించే బిల్లుకు ఇప్పటికే ఆమోదం లభించడం తెలిసిందే.ఎన్సీఆర్ కూడా..2021లో కులగణనతో పా టే జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్సీఆర్)ను కూడా అప్డేట్ చేయాలని నిర్ణయించారు. తాజా కసరత్తులో దాన్ని చేపట్టేదీ లేనిదీ స్పష్టత ఇవ్వలేదు. అయితే ఎన్సీఆర్ను అప్డేట్ చేస్తారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.2011లోనూ కులగణన జరిగినా...2011 జనగణన సందర్భంగా కూడా కులగణన కసరత్తు జరిగింది. ఈ అంశాన్ని కేబినెట్ పరిశీలిస్తుందని 2010లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ లోక్సభలో ప్రకటించారు. చాలా పార్టీలు కులగణనకు డిమాండ్ చేశాయి. కానీ నాటి యూపీఏ ప్రభుత్వం కులగణ నకు బదులు ’సామాజిక, ఆర్థిక, కులగణన (ఎస్ఈసీసీ)’ పేరిట 2011లో సర్వే జరిపింది. అలా అప్పుడు కుల సంబంధిత గణాంకాలు సేకరించిన వాటిని ఎప్పుడూ వెల్లడించలేదు, ఉపయోగించలేదు. గత మూడేళ్లలో బిహార్, తెలంగాణ కులగణన జరిపాయి. మరికొన్ని రాష్ట్రాలు కూడా ఈ కసరత్తు చేసినా, ‘వాటిలో పారదర్శకత లోపించింది. కొన్ని సర్వేలు ఫక్తు రాజకీయ కోణం నుంచి, ప్రజల్లో అనుమానాలు రేకెత్తించే ఉద్దేశంతో జరిపారు‘ అని కేంద్రం పేర్కొంది.అక్టోబర్ నుంచే శిక్షణ→ జనగణన కసరత్తుకు ముందు ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లూ, ఇతర సిబ్బందికి సమగ్ర శిక్షణ ఇవ్వనున్నారు. ఇది వచ్చే అక్టోబర్ నుంచే మొదలవుతుంది.→ కేంద్రంలో అత్యున్నత స్థాయిలో కనీసం 100 మంది జాతీయ శిక్షకులు ఉంటారు. వారికి జనగణనతో పాటు ట్రైనర్ డెవలప్మెంట్ నైపుణ్యాలపై కూడా శిక్షణ ఇస్తారు.→ తర్వాత వారు దాదాపు 1,800 మంది మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇస్తారు.→ వీరు 45,000 పై చిలుకు క్షేత్రస్థాయి ట్రైనర్లకు శిక్షణ ఇస్తారు. వీరు అంతిమంగా కింది స్థాయి సిబ్బంది అయిన ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లూ, ఇతర సిబ్బందికి శిక్షణ ఇస్తారు.3 డజన్ల ప్రశ్నలుజన, కులగణనలో భాగంగా ప్రతి పౌరుడు 36 ప్రశ్నలకు బదులివ్వాల్సి ఉంటుంది. వాటిలో కొన్ని...→ టెలిఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నాయా?→ వాడుతున్న వాహనం→ ప్రధాన ఆహారం→ నీటి వనరులు→ ఎలాంటి ఇల్లు→ ఇంటి యజమాని మహిళనా?ఇవీ విశేషాలు→ జనగణన ప్రక్రియకు స్వీయ–గణన ఎంపిక ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.→ ఈసారి ప్రక్రియను డిజిటల్గా నిర్వహించనున్నారు.→ రాతకోతల అవసరం లేకుండా సిబ్బంది టాబ్ల ద్వారా సమాచారం నమోదు చేసుకుంటారు.→ సేకరణ, ప్రసారం నిల్వ సమయంలో డేటా భద్రతను నిర్ధారించడానికి చాలా కఠినమైన డేటా భద్రతా చర్యలు అమలు చేయనున్నారు.→ భారత రిజిస్ట్రార్ జనరల్ (ఓఆర్జీఐ) కార్యాలయం ఇప్పటికే సెల్ఫ్ ఎన్యూమరేషన్ (ఎస్ఈ) పోర్టల్ను అభివృద్ధి చేసింది.→ దీనిద్వారా వ్యక్తులు తమ ఇంటి సభ్యుల సమాచారాన్ని వీక్షించడానికి, అప్డేట్ చేయడానికి వీలవుతుంది.→ చివరగా 2011లో జరిగిన జనగణన ప్రకారం దేశ మొత్తం జనాభా 121.19 కోట్లు.→ వారిలో పురుషులు 62.372 కోట్లు (51.54 శాతం)→ స్త్రీలు 58.646 కోట్ల మంది (48.46 శాతం).+ 2021 జనగణనకు 2020లోనే సర్వం సిద్ధమైంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది.1931లో చివరి కులగణనస్వాతంత్య్రం అనంతరం దేశంలో కుల గణన చేపడుతుండటం ఇదే తొలిసారి. భారత్లో తొలి కులగణన 1881లో బ్రిటిష్ హయాంలో జరిగింది. అప్పుడు కుల గణన కూడా జరిపి డేటా విడుదల చేశారు. తర్వాత ప్రతి పదేళ్లకు ఒకసారి జనగణన జరిగింది. 1931 వరకు ప్రతి జనగణనలోనూ కులాలవారీ డేటా కూడా విడుదలయ్యింది. 1941 జనగణనలో కులాల వారీగా డేటా సేకరించినప్పటికీ ఆ గణాంకాలను విడుదల చేయలేదు. దేశంలో 2011 వరకు ఎటువంటి అంతరాయం లేకుండా జనగణన ప్రక్రియ కొనసాగింది. అయితే, కరోనా కారణంగా 2021లో విడుదల చేయాల్సిన జనాభా లెక్కలు వాయిదా పడ్డాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ప్రతి జనాభా గణనలోనూ, ప్రభుత్వం కేవలం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కుల ఆధారిత డేటాను మాత్రమే విడుదల చేసింది. 1931 తర్వాత ఇతర కులాలకు సంబంధించిన గణాంకాలను ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేయలేదు.→ ఇది మొత్తమ్మీద 16వ కులగణన. స్వాతంత్య్రం వచ్చాక 8వది.→ ఈసారి కులగణన కూడా జరపాలని గత ఏప్రిల్ 30న ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో జరిగిన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. -
విశ్వాస్ కుమార్ రమేష్ నిజంగా మృత్యుంజయుడే.. మరో వీడియోలో
గాంధీ నగర్: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృత్యుంజయుడిగా నిలిచిన ఏకైక వ్యక్తి విశ్వాస్ కుమార్ రమేష్కు చెందిన మరో వీడియో వైరల్గా మారింది. తాజాగా, వెలుగులోకి వచ్చిన వీడియోలో బీజే మెడికల్ కాలేజీ క్యాంపస్ బిల్డింగ్ను ఎయిరిండియా విమానం ఢీకొట్టడంతో అగ్నికిలలు ఎగిసిపడున్నాయి. ఆ ప్రాంతాన్ని పొగ కమ్మేసింది. ఏదో అద్భుతం జరిగినట్లుగా అగ్నికోళం బద్దలైనప్పుడు మంటలు ఏ విధంగా ఎగిసిపడతాయో.. ఆ విధంగా మంటలు ఎగిసిపడుతున్నా 11ఏ సీటులో కూర్చున్న రమేష్, బీజే మెడికల్ కాలేజ్ క్యాంపస్ నుండి బయటకు వస్తూ కనిపిస్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. అక్కడ ఉన్న ఒక వ్యక్తి అతన్ని గమనించి, అతని చెయ్యి పట్టుకుని ప్రమాదం స్థలం నుంచి దూరంగా తీసుకెళ్లాడు.జూన్ 12న అహ్మదాబాద్లోని బీజే మెడికల్ కాలేజీ క్యాంపస్ బిల్డింగ్ను ఎయిరిండియా బోయింగ్ 787 డ్రీమ్లైనర్ ఢీకొట్టింది. ఈపెను విషాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 242మందిలో మృత్యుంజయుడు ఒక్కడే సురక్షితంగా బయటపడ్డాడు.తాజా సమాచారం మేరకు ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న 241 మంది, మెడికల్ కాలేజీ క్యాంపస్ బాధితులతో కలుపుకొని మొత్తం 270 మంది మరణించినట్లు తెలుస్తోంది.ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడతో మృతదేహాల్ని గుర్తు పట్టలేని విధంగా ఉన్నాయి. బాధితుల కుటుంబ సభ్యుల డీఎన్ఏల ఆధారంగా మృతదేహాల్ని గుర్తిస్తున్నారు. Unbelievable! New video of lone survivor, Viswashkumar Ramesh has emerged, showing him walking out from the crash site.He is seen wearing a white t-shirt and holding his phone in left hand.#AirIndia #AhmedabadPlaneCrash pic.twitter.com/xV83t2yjGX— Ishani K (@IshaniKrishnaa) June 16, 2025 -
Air India: ఇంక ముందుకు వెళ్లడం మంచిది కాదు!
సాక్షి, న్యూఢిల్లీ: మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది!. మార్గం మధ్యలో ఈ విషయాన్ని పసిగట్టిన పైలట్.. వెంటనే అప్రమత్తం అయ్యారు. విమానాన్ని గమ్యస్థానానికి తీసుకురాకుండానే వెనక్కి తీసుకెళ్లి హాంకాంగ్లోనే ల్యాండ్ చేశారు. దీంతో పెను ప్రమాదమే తప్పింది. ఢిల్లీకి చెందిన ఎయిరిండియా విమానం ఏఐ 315 బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ ప్రయాణికులతో(ఎంత మంది అనేది తెలియాల్సి ఉంది) ఈ ఉదయం హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరింది. అయితే 90 నిమిషాల ప్రయాణం తర్వాత.. విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్ గుర్తించారు. 🇮🇳🇭🇰🛫🛬🇭🇰Air India 315 requested to stay closer to Hong Kong citing technical reasons before deciding to return to HKIA."We don't want to continue further". 🔊 via https://t.co/E8ftHE3i9y📽️ via @flightradar24 https://t.co/XJjqSO9Lll pic.twitter.com/qWq3iXuVRW— Aaron Busch (@tripperhead) June 16, 2025ఇంకా ముందుకు వెళ్లడం కుదరదు అని చెబుతూ.. వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు. చివరకు అక్కడే(హాంకాంగ్ ఎయిర్పోర్టులో) ల్యాండ్ చేశారు. విమానంలో హాంకాంగ్ నుంచి ఢిల్లీకి సుమారు 6గంటల ప్రయాణం పడుతుంది. పైలట్ మాటలకు సంబంధించిన ఆడియో ఒకటి వైరల్ అవుతోంది. 🇮🇳 🇭🇰 🛫 🛬 🇭🇰 Air India 315 from Hong Kong to Delhi diverted back to Hong Kong after takeoff on Monday.The plane departed 3hrs and 26 minutes delayed, then returned to Hong Kong roughly an hour after takeoff. The flight was on a 7 year old Boeing 787-8 Dreamliner. pic.twitter.com/kTNvlcfMFV— Aaron Busch (@tripperhead) June 16, 2025ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం టెక్నికల్ టీం సమస్యను గుర్తించే పనిలో ఉంది. ఈ ఘటనపైగానీ, విమానాన్ని రీషెడ్యూల్ చేయడంపైనగానీ ఎయిరిండియా ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం భారత్లో ఎయిరిండియాతో పాటు ఇండిగో విమానయాన సంస్థ బోయింగ్ 787 విమానాలను ఉపయోగిస్తోంది. 2025 గణాంకాల ప్రకారం.. ఎయిరిండియా 33 డ్రీమ్లైనర్ విమానాల్ని ఉపయోగిస్తోంది. అయితే జూన్ 12న జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఎయిరిండియా విమానయాన సంస్థ వరుస ఘటనలతో వార్తల్లో నిలుస్తోంది. ఆ కంపెనీ బోయింగ్ డ్రీమ్లైనర్ విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు బయటపడుతున్నాయి. అలాగే బాంబు బూచీ నేపథ్యంలోనే పలు విమానాల రాకపోకల్లో అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యాలతో.. అన్ని బోయింగ్ విమానాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిర్ణయించింది. -
కుప్పకూలిన హెలికాప్టర్
రుద్రప్రయాగ్/న్యూఢిల్లీ: భక్తిశ్రద్ధలతో చార్ధామ్ యాత్ర చేస్తున్న యాత్రికులను ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. ఆదివారం తెల్లవారుజామున హిమ సానువుల్లోని కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించుకుని తిరిగొస్తున్న భక్తులు హెలికాప్టర్ కూలి ప్రాణాలు కోల్పోయారు. గౌరీకుండ్ అడవుల్లో ఈ దారుణం జరిగింది. రుద్రప్రయాగ్ జిల్లా విపత్తు నిర్వహణ సంస్థ అధికారి నందన్ సింగ్ రజ్వార్ వివరాలను వెల్లడించారు. ఆర్యన్ ఏవియేషన్ సంస్థకు చెందిన బెల్ 407 హెలికాప్టర్ ఉదయం 5.19 గంటలకు కేదార్నాథ్ నుంచి గుప్తకాశీ బయల్దేరింది.కాసేపటికే కేదార్ఘాటీలో గౌరీకుండ్, త్రిజుగ్ నారాయణ్ ప్రాంతాల మధ్య అడవిలో కుప్పకూలింది. అందులోని ఏడుగురూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మహారాష్ట్రకు చెందిన జంట, వారి రెండేళ్ల పాప, పైలట్తో పాటు బద్రీనాథ్–కేదార్నాథ్ ఆలయ కమిటీ సభ్యుడు విక్రమ్ సింగ్ రావత్ కూడా ఉన్నారు. పైలట్ రాజ్వీర్ సింగ్ చౌహాన్ ఆర్మీలో 15 ఏళ్లపాటు పైలట్గా చేశారు.కేదార్నాథ్లో హెలికాప్టర్లు అటూ ఇటూ ఎత్తైన పర్వతాల మధ్య లోయ మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రతికూల వాతావరణం, మేఘావృతమైన పొగమంచు గుండా ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణించడం ప్రమాదానికి దారి తీసి ఉంటుందని భావిస్తున్నారు. మృతుల్లో మహారాష్ట్ర, రాజస్తాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలవారు.నెలన్నరలో ఐదో ప్రమాదంఏప్రిల్ 30న చార్ధామ్ యాత్ర మొదలైనప్పటి నుంచి హెలికాప్టర్లు కూలిపోవడం ఐదోసారి. ఈ నేపథ్యంలో చార్ధామ్ యాత్రలో హెలికాప్టర్ సేవలను రెండు రోజులు నిలిపేస్తున్నట్టు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఆర్యన్ ఏవియేషన్ సంస్థ హెలికాప్టర్ కార్యకలాపాలను తక్షణం నిలిపివేస్తూ డీజీసీఏ ఆదేశాలిచ్చింది. కేదార్నాథ్ లోయలో రాకపోకలు సాగించే అన్ని హెలికాప్టర్ల నాణ్యత, సామర్థ్యాలను తక్షణం సమీక్షించేందుకు అధికారులను పంపుతోంది.దుర్ఘటనపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) సమగ్ర దర్యాప్తు చేయనుంది. ‘‘ఇలాంటి ఘటనల్లో జవాబుదారీతనం పెంచాలి. దర్యాప్తు, భద్రతా ప్రమాణాల అంశంలో కేంద్ర, రాష్ట్రాలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి’’ అని కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ వాద్రా అన్నారు. -
జిప్లైన్ కేబుల్ తెగి 30 అడుగుల లోతులో కిందపడ్డ త్రిష..వీడియో వైరల్
ధర్మశాల: హిమాచల్ప్రదేశ్లోని మనాలిలో విహారయాత్రకు వెళ్లిన ఓ కుటుంబం విషాదం నెలకొంది. మనాలి అందాలను వీక్షించేందుకు జిప్లైన్ కేబుల్ ద్వారా వెళ్తున్న సమయంలో 10ఏళ్ల బాలిక 30 అడుగుల లోతులో పడింది. దీంతో ఆ బాలికకు తీవ్ర గాయాలయ్యాయి.జూన్ 8న నాగపూర్కు చెందిన ప్రపుల్లా బిజ్వే, అతని భార్య,కుమార్తె త్రిషా బిజ్వే కుటుంబం మనాలిలో ప్రకృతి అందాల్ని వీక్షించేందుకు వెళ్లింది. జూన్8న జిప్లైన్ కేబుల్ ద్వారా అటు వైపు నుంచి ఇటువైపుకు వచ్చే సమయంలో త్రిషా బిజ్వే మధ్యలోకి వచ్చిన తర్వాత అకస్మాత్తుగా కిందకు పడిపోయింది. జిప్లైన్ ఊడిపోయి 30 అడుగుల లోతులో పడిపోవడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. బాధిత కుటుంబం తెలిపిన ప్రకారం, అక్కడ సరైన భద్రతా ఏర్పాట్లు లేవు. ప్రమాదం జరిగిన వెంటనే ఎలాంటి సహయక చర్యలు అందలేదని తెలిపారు. త్రిషకు మనాలీలో ప్రాథమిక చికిత్స అందించి.. అనంతరం చండీగఢ్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె నాగ్పూర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.బిజ్వే కుటుంబం ఆ ప్రమాదం జరిగిన దృశ్యాలను మీడియాకు వెల్లడించారు. ఆ వీడియోలో జిప్లైన్ హార్నెస్ ఒక్కసారిగా తెగిన దృశ్యం కనిపిస్తుంది. ఈ దుర్ఘటనలో నిర్లక్క్ష్యం వహించిన జిప్లైన్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాంటి అడ్వెంచర్ టూరిజం సెంటర్లలో భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నారు.A 12-year-old girl from Maharashtra's Nagpur suffered severe injuries after she plunged 30 feet during a zipline ride in Manali, Himachal Pradesh.Trisha Bijwe fell while riding a zipline after the rope connected to her harness snapped. pic.twitter.com/P1QwnFyrQZ— The Siasat Daily (@TheSiasatDaily) June 15, 2025 -
‘అన్నదమ్ములు.. స్మార్ట్ సిటీ పేరుతో 70 వేల మందిని భలే మోసం చేశారు’
జైపూర్: ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో వాళ్లే మనల్ని మోసం చేస్తారనే నానుడిని ఈ ఇద్దరు అన్నదమ్ములు నిజం చేశారు. నమ్మకమే పెట్టుబడిగా బిజినెస్ను ప్రారంభించి అతి తక్కువ సమయంలో 70వేల మందిని ముంచారు. సుమారు 3వేల కోట్ల మేర టోపీ పెట్టారు.రాజస్థాన్ రాష్ట్రం సికార్ జిల్లాకు చెందిన సుభాష్ బిజరణి,రణవీర్ బిజరణిలు అన్నదమ్ములు. వారిలో సుభాష్ రిటైర్డ్ ఆర్మీ జవాన్. రణవీర్ ఏం చేసేవారని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక వీళ్లిద్దరికి రాత్రికిరాత్రే కోటీశ్వరులవ్వాలనే అత్యాస పుట్టింది. ఇందుకోసం ఏం చేయాలి? జనాల్ని ఎలా మోసం చేయాలో ప్లాన్ చేసుకున్నారు. ధొలేరా స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్పై కన్నుఅప్పుడే వీళ్లద్దరూ ప్రస్తుతం కేంద్రం,గుజారాత్ రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా దేశంలోని తొలిసారి నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీ ధొలేరా స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్పై కన్నుపడింది. అంతే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దొలేరా స్మార్ట్ సిటీకి ఏమాంత్రం సంబంధం లేని 110కిలోమీటర్ల దూరంలో ఉన్న అహ్మదాబాద్లో 2014లో ప్లాటును కొనుగోలు చేశారు. మీరు కూడా ధొలేరా స్మార్ట్ సిటీలో ప్లాటు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? ఇందుకోసం మా నెక్సా ఎవర్గ్రీన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టండి అంటూ ఓ డమ్మీ కంపెనీని ప్రారంభించారు.విలువైన బహుమతుల్ని ఎరగా వేసినెక్సా ఎవర్గ్రీన్ కంపెనీ పేరుతో కేంద్రం నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీ ధోలేరా స్మార్ట్ సిటీ ఒరిజినల్ ఫొటోలతో ప్రచారం చేశారు. దేశవ్యాప్తంగా 70,000 మందిని మోసం చేసి, ఏకంగా రూ.2,676 కోట్ల మేర డబ్బు వసూలు చేశారు. ధొలేరాలో ప్రాజెక్టులు ఉన్నాయంటూ ఫేక్ ఫొటోలు చూపిస్తూ, ప్రజలను బిల్డింగులు, ప్లాట్లు, హై రిటర్న్స్ పేరుతో ఆకర్షించారు. అంతేకాదు ఇతరులను రిఫర్ చేస్తే లాప్టాప్లు, బైకులు, కార్లు అంటూ బహుమతులు ఆశచూపించారు. రెఫరల్ ప్రోగ్రామ్ పేరిట లెవెల్ వైజ్ కమిషన్లు, ఆదాయం అంటూ కోట్ల రూపాయలను ప్రజల నుండి సేకరించారు. ఈ మొత్తం స్కామ్లో దాదాపు రూ.1,500 కోట్లు కమిషన్ల రూపంలో పంపిణీ చేశారు.ఆస్తుల్ని పోగేసి చివరికిఆ తర్వాత జనాల్ని మోసం చేయగా వచ్చిన వేల కోట్లతో లగ్జరీ కార్లు, హోటళ్లు, గోవాలో 25 రిసార్టులు, రాజస్థాన్లో మైన్స్ను కొనుగోలు చేశారు. మొత్తంగా రూ.250 కోట్లను నగదు రూపంలో తీసుకున్నారు. మిగిలిన డబ్బును 27 షెల్ కంపెనీలకు మళ్లించారు. చివరికి కంపెనీ బోర్డు తిప్పేశారు. పరారయ్యారు. కంపెనీ కార్యాలయాలు మూసివేయడంతో పెట్టుబడి దారుల్లో ఆందోళన మొదలైంది. రోజులు గడుస్తున్నా నిందితుల జాడ తెలియలేదు. తాము మోసపోయామని భావించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న జోధ్పూర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తాజాగా ఈడీ సైతం 25 చోట్ల సోదాలు నిర్వహించడంతో అన్నదమ్ములు భాగోతం వెలుగులోకి వచ్చింది. ధొలేరా స్మార్ట్ సిటీ ప్రాజెక్టుధొలేరా స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కేంద్రం, గుజరాత్ ప్రభుత్వం కలసి నిర్మిస్తున్నాయి. దేశంలోని మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీ. ఢిల్లీ కంటే రెండింతలు పెద్దది. ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం, అనేక విదేశీ కంపెనీల కార్యాలయాల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. 2042 నాటికి వినియోగంలోకి రానుంది. నిజమైన ధొలేరా ప్రాజెక్టును అడ్డుగా పెట్టుకొని వేల మందిని మోసం చేసిన ఈ స్కామ్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇక ముందుగా ఇలాంటి స్కామ్స్కు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
indrayani river bridge collapses: పూణెలో ఘోర ప్రమాదం
మహరాష్ట్ర: పూణెలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం మధ్యాహ్నం ఇంద్రాయణి నదిపై (indrayani river bridge collapses) పురాతన కూలిన వంతెన కూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. 25మంది గల్లంతయ్యారు.పోలీసుల సమాచారం మేరకు.. పుణె జిల్లాలోని మావళ్ తాలూకాలోని తలెగావ్ దాభాడే వద్ద విషాదం చోటు చేసుకుంది. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం కుండమళా వద్ద ఆదివారం మధ్యాహ్నం 3.30గంటల సమయంలో ఇంద్రాయణి నదిపై ఉన్న పాత బ్రిడ్జ్ ఆకస్మాత్తుగా కూలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు. 20 నుంచి 25మంది బ్రిడ్జి కింద ప్రవహిస్తున్న ఇంద్రాయణి నదిలో గల్లంతయ్యినట్లు తెలుస్తోంది.Pune: Many Tourists Feared Drowned After Old Bridge Collapses Over Indrayani River at Kund MalaRead in detail here: https://t.co/CuDeeJOuZo pic.twitter.com/7YKBkIJeCR— Punekar News (@punekarnews) June 15, 2025పర్యాటక ప్రాంతం కావడంతో వీక్షించేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున పర్యాటకులు తరలి వచ్చారు. అయితే, రెండు రోజులు పాటు భారీగా కురిసిన వర్షాలకు పురాతన బ్రిడ్జి నానింది. పర్యాటకులు రావడంతో బ్రిడ్జి కూలిపోయింది. బ్రిడ్జి కింద ప్రవహిస్తున్న ఇంద్రాయణి నదిలో జారీ పడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకు ఎన్డీఆర్ఫ్ బృందాలు బాధితుల కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. ఐదుగురు పర్యాటకుల్ని రక్షించారు. ఈ దుర్ఘటనతో పింప్రి-చించ్వడ్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని తలెగావ్ దాభాడే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అధికార యంత్రాంగం, స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. #Maval Bridge collapsed ,5 tourist feared to be dead.On weekend huge #ITcrowd visit these places we pray for everyones saftey . Morethan 25 are missing .30We hope govt should audit all tourist hot spot to ensure everyones saftey .#IndrayaniRiver #Kundamala #BridgeCollapse pic.twitter.com/IOU6XJj0Fy— Forum For IT Employees - FITE (@FITEMaharashtra) June 15, 2025 -
మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య
లక్నో: మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఉత్తర ప్రదేశ్ నుంచి కోల్కతా బయల్దేరాల్సిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో సిబ్బంది ప్రయాణాన్ని నిలిపివేశారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం.. ఆదివారం (జూన్15)న ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లోని హిండన్ విమానాశ్రయం నుంచి ఎయిరిండియాకు చెందిన ఎయిరిండియా (IX 1511) విమానం కోల్కతాకు బయల్దేరాల్సి ఉంది.అయితే,ఎయిర్పోర్టు నుంచి విమానం టేకాఫ్ అవ్వాల్సి ఉండగా.. సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలెట్ వెంటనే విమానాన్ని నిలిపివేశారు. సాంకేతిక లోపంపై సమాచారం అందుకున్న ఇంజినీర్లు విమానంలో తలెత్తిన సమస్యను పరిష్కరించే పనిలోపడ్డారు. ఫలితంగా, భద్రతా కారణాల దృష్ట్యా టేకాఫ్ వాయిదా పడింది. తిరిగి విమాన కార్యకలాపాలపై అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ విమానం కోసం పడిగాపులు కాస్తున్నారు. -
Air India plane crash: దొరికిన మాజీ సీఎం విజయ్ రూపానీ భౌతికఖాయం
గాంధీ నగర్: భారత విమానయాన రంగంలో అత్యంత ఘోర విషాదం నింపిన అహ్మదాబాద్ ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ (Air India plane crash) విమాన ప్రమాద మృతులు వివరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆదివారం ఒంటిగంట సమయంలో గుజరాత్ బీజేపీ సీనియర్ నేత మాజీ సీఎం విజయ్ రుపానీ (Vijay Rupani) భౌతికకాయాన్ని వైద్యులు గుర్తించారు. కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన డీఎన్ఏ ఆధారంగా రూపానీ భౌతికకాయాన్ని గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం భౌతికకాయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అందించే ఏర్పాట్లు ముమ్మరం చేశారు. రాజ్ కోట్లో రూపానీ అంత్యక్రియలు జరగనున్నాయి. జూన్ 12న సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన AI171 బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కూలిపోయింది. అందులో ఉన్న 242 మందిలో 241 మంది మరణించారు. మృతుల్లో 68 ఏళ్ల రూపానీ ఉన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్ది సెకన్లలోని కూలిపోయింది. విమానాశ్రయ రన్వే నుండి కేవలం ఒక కిలోమీటరు దూరంలో ఉన్న మేఘానీ నగరం ప్రాంతంలోని బీజే మెడికల్ కాలేజీ క్యాంపస్ భవనంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణికులు సహా, మెడికల్ కాలేజీలో భోజనం చేస్తున్న వైద్య విద్యార్థులు,డాక్టర్లు,క్యాంటిన్లో పనిచేస్తున్న సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.Confirmed: Former Gujarat CM Vijay Rupani lost his life in the tragic Air India crash in Ahmedabad on June 12.At around 11:10 AM today, his DNA matched with the recovered remains.A huge loss for Gujarat and the nation.#VijayRupani #AirIndiaCrash #Ahmedabad pic.twitter.com/KlKsoZAgIp— AISHVARYA JAIN (@aishvaryjain) June 15, 2025 -
ఉన్నత స్థాయి కమిటీ దర్యాప్తు
సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్ అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంపై హోం శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఉన్నత స్థాయి బృందం దర్యాప్తు చేస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. శనివారం ఎయిర్ సేఫ్టీపై ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం ఢిల్లీలోని ఉడాన్ భవన్లో మీడియాతో మంత్రి మాట్లాడారు. మీడియా సమావేశానికి ముందు అక్కడి వారంతా మృతులకు సంతాపసూచికగా ఒక నిమిషం మౌనం పాటించారు. ‘‘ఉన్నత స్థాయి బృందంలో హోంశాఖ కార్యదర్శి, పౌర విమానయాన శాఖ కార్యదర్శి, అహ్మదాబాద్ పోలీసు కమిషనర్, ఐబీ స్పెషల్ డైరెక్టర్ నియమించాం. అవసరమైతే మరి కొందరిని కమిటీలోకి తీసుకుంటాం. మూడు నెలల్లో ఈ కమిటీ నివేదిక అందిస్తుందని భావిస్తున్నాం’’అని మంత్రి తెలిపారు. విమాన ప్రమాదం జరిగిన తీరును వివరించారు. ఊహించని రీతిలో జరిగిన ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే గుజరాత్ ప్రభుత్వం, పౌరవిమానయాన శాఖ సంయుక్తంగా చర్యలు చేపట్టాయన్నారు. ‘‘బోయింగ్787–8 డ్రీమ్లైనర్ విమానంలోని బ్లాక్బాక్స్ శుక్రవారం సాయంత్రం దొరికింది. దానిని డీకోడ్ చేసి అందులోని సమాచారాన్ని సమగ్రస్థాయిలో విశ్లేషించిన తర్వాతే మీడియాకు అదనపు సమాచారం అందజేస్తాం. బోయింగ్ 787 సిరీస్ విమానాల భద్రతపై దర్యాప్తునకు ఆదేశించాం. ప్రస్తుతం బోయింగ్787 సిరీస్లో 33 విమానాలు ఉన్నాయి. వీటిలో ఏడు విమానాల భద్రతపై అధికారులతో సమీక్ష నిర్వహించా. ఈ సిరీస్ విమానాలను తరచూ తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించాం. ఉన్నత స్థాయి బృందం సోమవారం భేటీ అవుతుంది’’అని మంత్రి పేర్కొన్నారు. ఆ బాధ నాకూ తెలుసు.. ఈ విమాన ప్రమాదం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని రామ్మోహన్ అన్నారు. ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ‘రోడ్డు ప్రమాదంలో నా తండ్రిని కోల్పోయా.. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు’అని అన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి డీఎన్ఏ పరీక్షలు జరుగుతున్నాయని, మృతదేహాలను వీలైనంత తొందరగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేస్తామని కేంద్రమంత్రి తెలిపారు. -
ఎయిర్ ఇండియా ప్రమాదంపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు విమానయాన రంగంలో అనుభవం లేదు. రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న అంటూ వ్యాఖ్యలు చేశారు. భారత ప్రతిష్టను దృష్టిలో ఉంచుకుని రామ్మోహన్ నాయుడును తొలగించాలి అని అన్నారు.ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఢిల్లీలో సాక్షితో మాట్లాడుతూ..‘ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి. రామ్మోహన్ నాయుడుకు విమానాయన రంగంలో అనుభవం లేదు. ఒక గంట కూడా విమానయాన రంగం గురించి ఆయన చదవలేదు. రామ్మోహన్ నాయుడుతో వ్యక్తిగత గొడవలు లేవు. ఆయనకు ఇంకా కేబినెట్ పదవి రావాలని కోరుకుంటాను. కానీ, భారత ప్రతిష్టను దృష్టిలో ఉంచుకుని రామ్మోహన్ నాయుడును తొలగించాలి. ప్రధాన మంత్రిపై అనేక దేశాల నుంచి ఒత్తిడి రాక ముందే రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి.ప్రధాని మోదీ కూడా రిటైర్మెంట్ ప్రకటించాలి. ప్రధాని బాధ్యతను అమిత్ షా కు అప్పగించాలి. విమాన ప్రమాదం తరువాత ఎయిర్ ఇండియా సీఈఓ, విదేశాంగ మంత్రి రాజీనామా చేయకపోవడం ఆశ్చర్యంగా ఉంది. భారత ప్రతిష్ట కాపాడటం కోసం తప్పు చేసిన వారికి శిక్ష విధించాలి. జీ-7 సమ్మిట్లో విమాన ప్రమాదం ఏవిధంగా జరిగిందనేది చర్చ జరగనుంది. ముందస్తుగా ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరికలు ఉన్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ప్రధాని, విమానయాన శాఖ మంత్రి రాజీనామా చేయాలని సుబ్రమణ్య స్వామి డిమాండ్ చేశారు. అదానీ అభివృద్ధికి తీసుకోవడం, ఎయిర్ పోర్టు పక్కన భవనాలు ఉండటంతో ప్రమాదం జరిగిందంటున్నారు. దీనిపై విచారణ చేపట్టాలి’ అని కామెంట్స్ చేశారు. -
Updates: ఎయిరిండియా కీలక నిర్ణయం
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం ఘటనకు సంబంధించిన దర్యాప్తు వేగం పెరిగింది. డీజీసీఏతో పాటు దర్యాప్తు సంస్థలు ప్రమాద స్థలికి చేరుకుని పరిశీలనలు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో విమాన శకలాలను తొలగించకూడదని గుజరాత్ పోలీసులకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో క్లీనియంగ్ ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది.AI-171 విమానం నుంచి చివరి సందేశంవిమానంలో పవర్ కట్ అయిందని..కిందకి పడిపోతున్నట్టు మెసేజ్ఎయిర్ ఇండియా విమానం నుంచి ఏటీసీకి మేడే కాల్లో ఆడియోవిమానంలో పవర్ కోల్పోయామని ఏటీసీకి వెల్లడించిన కెప్టెన్ సుమిత్ సబర్వాల్ ఐదు సెకన్ల ఆడియో మేడే.. మేడే.. మేడే.. నో పవర్.. నో థ్రస్ట్.. గోయింగ్ డౌన్ అని చెప్పిన కెప్టెన్ సబర్వాల్ఏటీసీ వద్ద రికార్డయిన ఐదు సెకన్ల ఆడియోఎయిరిండియా కీలక నిర్ణయంఅహ్మాదాబాద్ విమాన ప్రమాద నేపథ్యంలో ఎయిరిండియా కీలక నిర్ణయంవిమానంలో ప్రయాణిస్తున్నన 241 మంది దుర్మరణంభవనంపై విమానం కూలి మెడికోలు, ఇతరులు మృతిమొత్తం మృతుల సంఖ్య 274ఇక నుంచి ఏఐ-171 విమాన సర్వీస్ నిలిపివేతదానికి బదులు ఎయిరిండియా- 159 విమానంఇక నుంచి లండన్కు వెళ్లనున్న ఏఐ-159 సర్వీస్ విమానం ప్రమాదంపై విచారణ జరుగుతోంది: రామ్మోహన్నాయుడుఅహ్మదాబాద్ విమాన ప్రమాదంపై పౌర విమానయాన శాఖ జరిపిన సమీక్ష వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడుపైలట్ మే డే కాల్ చేశారుఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే ప్రమాదం జరిగిందిఅహ్మదాబాద్ ఎయిర్పోర్టుకు రెండు కిలోమీటర్ల దూరంలోనే ప్రమాదం జరిగిందిరెస్క్యూ ఆపరేషన్కు గుజరాత్ ప్రభుత్వం పూర్తిగా సహకరించిందిబ్లాక్ బాక్స్ దొరికింది.. డీకోడ్ చేస్తున్నారుబ్లాక్ బాక్స్ విశ్లేషణ ద్వారా ఏం జరిగిందనేది తెలుస్తుందిహైలెవల్ కమిటీతో ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోందినివేదిక వచ్చాకే బాధ్యులపై చర్యలు ఉంటాయివిమాన ప్రమాదంపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది787 సిరీస్ను తరచూ తనిఖీలు చేయాలని ఆదేశాలిచ్చాండీఎన్ఏ పరీక్షలు పూర్తైన వెంటనే మృతదేహాలను బంధువులకు అప్పగిస్తాంపౌర విమానయాన శాఖ సమీక్ష వివరాలు వెల్లడిఎయిరిండియా విమాన ప్రమాదంపై పౌరవిమానయాన శాఖ సమీక్షవివరాలు వెల్లడించిన సివిల్ ఏవియేషన్ అధికారులుAircraft Accident Investigation Bureau (AAIB) దర్యాప్తు కొనసాగుతోందని తెలిపిన అధికారులువిమానం 650 అడుగుల ఎత్తు ఎగిరాక కూలిపోయిందిపైలట్ చివరిసారిగా మే డే కాల్ అన్నారుఆ తర్వాత ఎలాంటి సిగ్నల్ అందలేదుమూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించాంరంగంలోకి ఎన్ఐఏఅహ్మదాబాద్ విమాన ప్రమాద స్థలికి జాతీయ దర్యాప్తు సంస్థకుట్ర కోణం నేపథ్యంతో విచారణ జరుపుతున్న ఎన్ఐఏక్షుణ్ణంగా పరిశీలనలు జరుపుతున్న బృందంబోయింగ్ ట్రాజెడీ పాపం ఎవరిది?తనిఖీ, నిర్వహణ లోపమే కారణమా?డీజీసీఏ హెచ్చరికలను ఎయిరిండియా పట్టించుకోలేదా? వైమానిక ఇంధనం కలుషితం అయ్యిందా? ఎందుకు గాల్లో ఎగరలేక పోయింది? టేకాఫ్ సెట్టింగుల్లో లోపం, పైలట్ తప్పిదమే కారణం?ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అంతు చిక్కడం లేదా? దర్యాప్తులో తేలాల్సిన విషయాలెన్నోక్లిక్ చేయండి: రెండు ఇంజన్లు విఫలమవడం అత్యంత అసాధారణం! అహ్మదాబాద్ ప్రమాద ఘటన.. మరికాసేపట్లో పౌర విమానయాన శాఖ సమీక్షకీలకంగా డిజిటల్ ఆధారాలుఅహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తుభవన శిథిలాల నుంచి ఇప్పటికే బ్లాక్ బాక్స్ స్వాధీనంబ్లాక్ బాక్స్ విశ్లేషిస్తే ప్రమాదానికి స్పష్టమైన కారణాలు తెలిసే అవకాశండిజిటల్ వీడియో రికార్డర్ను స్వాధీనం చేసుకున్న గుజరాత్ ఏటీఎస్ ఫోరెన్సిక్స్ సైన్స్ ల్యాబ్కు డీవీఆర్ను పంపిన అధికారులుబోయింగ్ ట్రాజెడీ ఫైల్స్అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తుప్రాథమికంగా.. ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ కమిటీ దర్యాప్తుకేంద్రం తరఫున.. నిపుణులతో హైలెవల్ కమిటీ దర్యాప్తుడీజీసీఏ విచారణ కూడాభారత్లో బోయింగ్ విమానాల తనిఖీలుప్రత్యేక అడిటింగ్కు ఆదేశించిన కేంద్రం👉ప్రమాదంలో విమానంలో ఉన్నవాళ్లతో పాటు.. విమానం నేరుగా బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలడంతో అందులోని వాళ్లు కూడా మరణించారు. దర్యాప్తు నేపథ్యంలో మెడికల్ కాలేజీ భవనాన్ని అధికారులు ఖాళీ చేయించారు. 👉ఎయిరిండియా బోయింగ్ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య శనివారం ఉదయానికి 274కి చేరింది. 👉విమానంలో సిబ్బందితో సహా 242 మంది ఉండగా.. 241 మంది మరణించారు. విమానంలో ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడిన సంగతి తెలిసిందే. క్షతగాత్రుడు రమేష్ను ప్రధాని మోదీ సైతం పరామర్శించారు. 👉గురువారం మధ్యాహ్నాం ఎయిరిండియా బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానం (AI171) అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్టు నుంచి లండన్ గాట్విక్ వెళ్తుండగా.. టేకాఫ్ అయిన కొద్ది సెకన్లకే మెఘాని ప్రాంతంలో జనావాసాలపై కుప్పకూలిపోయింది. 👉మే డే కాల్ ఇచ్చిన పైలట్ ఆ వెంటనే విమానాన్ని క్రాష్ ల్యాండ్ చేశారు. ఆ ధాటికి విమానం భారీ శబ్దం చేస్తూ పేలిపోగా.. 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ధాటికి ప్రయాణికులు ఖాళీ మసైపోయారు. 👉ప్రయాణికులతో పాటు జనావాసాలపై కుప్పకూలడంతో మృతుల సంఖ్య మరింత పెరిగింది👉విమాన ప్రమాదం ఎందుకు జరిగిందనేదానిపై కొనసాగుతున్న విచారణ -
వెయ్యి డిగ్రీల వేడిలోనూ బ్లాక్ బాక్స్ భద్రం
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తులో బ్లాక్ బాక్స్, డిజిటల్ వీడియో రికార్డర్(డీవీడీ) అత్యంత కీలకం కాబోతున్నాయి. ఈ రెండింటిని దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విమానం పేలిపోయినప్పుడు అందులోని ఇంధనం కారణంగా ఏకంగా 1,000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వెలువడింది. విమానం మొత్తం మంటల్లో చిక్కుకుంది. మృతదేహాలు మసిబొగ్గులా మారాయంటే ప్రమాద తీవ్రతను అంచనా వేయొచ్చు. భారీ ఉష్ణోగ్రతలోనూ బ్లాక్ బాక్స్ సురక్షితంగా ఉంటుందని, అందులోని డేటా చెరిగిపోదని నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ బాక్స్లో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి. ఒకటి ఫ్లైట్ డేటా రికార్డర్(ఎఫ్డీఆర్), మరొకటి కాక్పిట్ వాయిస్ రికార్డర్(సీవీఆర్). ఎఫ్డీఆర్లో సాంకేతికపరమైన అంశాలు నిక్షిప్తమవుతాయి. అంటే విమానం ఎగురుతున్న ఎత్తు, వేగం, ఇంజన్ పనితీరును ఇది రికార్డు చేస్తుంది. కాక్పిట్లోని శబ్ధాలు, సంభాషణలు సీవీఆర్లో నమోదవుతాయి. టైటానియం లేదా స్టెయిన్లెస్ స్టీల్తో బ్లాక్బాక్స్ తయారు చేస్తారు. ఇది 1,100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతోపాటు అత్యధిక ఒత్తిడిని సైతం తట్టుకోగలదు. అంతేకాకుండా ఇది వాటర్ప్రూఫ్. నీటిలో 6 వేల మీటర్ల లోతున కూడా 30 రోజులపాటు భద్రంగా ఉంటుంది. నీటిలో దీని జాడ సులభంగా కనిపెట్టవచ్చు. అందులోని నుంచి సంకేతాలు వెలువడుతుంటాయి. డీవీఆర్ అనేది బ్లాక్బాక్స్ కంటే భిన్నమైనది. విమానంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీ ఇందులో ఉంటుంది. విమానం కాక్పిట్, కేబిన్లో ఈ కెమెరాలు ఏర్పాటు చేశారు. బ్లాక్ బాక్స్, డీవీఆర్ డేటాను ప్రత్యేక ల్యాబ్ల్లో ఫోరెన్సిక్ నిపుణులు విశ్లేషించబోతున్నారు. ఇందుకోసం ఢిల్లీలో ఇటీవలే డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్ ల్యాబ్ ప్రారంభించారు. దెబ్బతిన్న రికార్డర్లను మరమ్మతు చేసి, డేటాను వెలికితీసే సదుపాయం ఇక్కడ ఉంది. -
పార్లమెంట్ భేటీకి ముందే బీజేపీకి కొత్త అధ్యక్షుడు!
సాక్షి, న్యూఢిల్లీ: చాలాకాలంగా పెండింగ్లో ఉన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపికను వచ్చే నెల జరుగనున్న పార్లమెంట్ సమావేశాలకు ముందుగానే ముగించాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. జూలై 21న పార్లమెంట్ సమావేశాలు ఆరంభమయ్యే ముందునాటికే జాతీయ అధ్యక్షుడి ఎంపిక పూర్తి చేసేలా ఎన్నికల ప్రక్రియను వచ్చే వారంలో ప్రారంభించాలని పార్టీ యోచిస్తోంది. ఆగస్టు 15 నుంచి బిహార్ ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే అవకాశాల దృష్ట్యా, కొత్త అధ్యక్షుడి నేతృత్వంలోనే ఎన్నికలను ఎదుర్కొనే ఆలోచనలో ఉంది. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక పదేపదే వాయిదా పడుతూ వస్తుంది. మే నెలలోనే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని భావించినా ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో దీనిని వాయిదా వేశారు. అధ్యక్ష బరిలో నిలిపే అభ్యర్థుల పేర్లపైనా పరిశీలనలు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రధాన పోటీదారుల జాబితాలో కేంద్ర మంత్రులు శివరాజ్సింగ్ చౌహాన్, ధర్మేంద్ర ప్రధాన్, మనోహర్లాల్ ఖట్టర్, భూపేంద్ర యాదవ్, జి.కిషన్రెడ్డిలతో పాటు పార్టీ సీనియర్ నేతలు సునీల్ బన్సల్, బీఎల్ సంతోష్ తదితరులు ఉన్నారు. ఈ ఏడాది అక్టోబర్–నవంబర్లో బిహార్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. అంటే సెప్టెంబర్లోగా ఎన్డీఏ కూటమి పక్షాలతో సీట్ల పంపకాలు, పోటీ చేసే స్థానాలు, అభ్యర్థులపై ఓ అవగాహనకు రావాల్సి ఉంది. ఇది జరగాలంటే ఆగస్టు నుంచే బిహార్ ఎన్నికలపై ఆగస్టు నుంచే పూర్తి స్థాయి ఫోకస్ పెట్టాల్సి ఉంది. అయితే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు జరుగనున్నాయి. పార్టీ కీలక నేతంలతా సమావేశాల్లో బిజీగా ఉండే నేపథ్యంలో, సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే కొత్త అధ్యక్షుడిని ఎంపిక చే యాలని, అలా అయితేనే ఆయన సారథ్యంలో బిహార్ ఎన్నికలపై ముందుకు వెళ్లొచ్చనే భావనలో పార్టీ ఉంది. దీనికై ఈ నెల చివరి వారంలో అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టాల్సి ఉంది. పార్టీ నియమావళి ప్రకారం జాతీయ అధ్యక్షుడి ప్రకటనకు ముందే సగానికి పైగా రాష్ట్రాల్లో అధ్యక్షుల ఎంపికను పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ వంటిì చాలా రాష్ట్రాల్లో అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తి కాలేదు. వీరిని త్వరలోనే ప్రకటించే దిశగా ఇప్పటికే కీలక చర్చలు ముగిశాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీరి ప్రకటన ముగిసిన వెంటనే కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ మొదలయ్యే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొత్త అధ్యక్షుడి ఎన్నిక పూర్తయితే ఆయన మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. ఈ మూడేళ్ల కాలంలో యూపీ, పశ్చిమబెంగాల్, తమిళనాడు, పంజాబ్ వంటి కీలక రాష్ట్రాలతో పాటు మొత్తంగా 12 రాష్ట్రాల ఎన్నికలు ఈయన సారధ్యంలోనే జరుగుతాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు సైతం కొత్త అధ్యక్షుడి హాయంలోనే ఉండనున్నాయి. -
‘మా అమ్మ ఆచూకీ తెలిస్తే చెప్పండన్న’.. కూలిన ఎయిరిండియా విమానం కింద..
గాంధీ నగర్: ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ ఏఐ171 విమానం కుప్పకూలిన బీజే మెడికల్ కాలేజీలో హృదయ విదారక దృశ్యాలు మనసులను మెలిపెడుతున్నాయి. విమాన ప్రమాద సమయంలో బీజే మెడికల్ కాలేజీ బిల్డింగ్లో తన తల్లి శార్లాబెన్ ఠాకూర్, రెండేళ్ల కుమార్తె ఆధ్య ఉన్నారు. పెను విషాదంపై సమాచారం అందుకున్న బాధితుడు తన అమ్మ, కుమార్తెతో పాటు అక్క ఆచూకీ కోసం వెతుకుతున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి.ప్రమాదంలో చెల్లాచెదురైన ప్రయాణికుల మృత దేహాల్ని గుర్తిస్తున్న అధికారుల్ని.. తనని నవ మాసాలు కనిపెంచిన అమ్మ.. తాను కన్న కూతురు, అక్క చనిపోయారని ఓవైపు కీడు శంకిస్తున్నా ఆ బాధను పంటి బిగువున భరిస్తూ.. పొంగుకొస్తున్న దుఖాన్ని దిగమింగుకుంటూ బాధితుడు ..‘సార్ .. మా అమ్మ, కూతురు,అక్క ఎక్కడ ఉన్నారో.. ఏమో? వాళ్ల ఆచూకీ తెలిస్తే చెప్పండన్నా అంటూ అమాయకంగా.. బాధతో ప్రాధేయపడుతున్న దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టిస్తున్నాయి. బాధితుడి వేడుకోలుతో అధికారులు అతని తల్లి,కుమార్తె ఆచూకీ గుర్తించే పనిలో పడ్డారు.VIDEO | Ahmedabad air crash: Ravindra Thakore mourns the loss of his mother and daughter, who were working at the canteen of the medical college hostel on which the ill-fated aircraft crashed. He says, “I want the authorities to check inside the building. I want to go by myself.… pic.twitter.com/9b5FRVHJWr— Press Trust of India (@PTI_News) June 13, 2025 ఎయిరిండియా కుప్పకూలిన హాస్టల్ భవనాలు కింద వైద్య విద్యార్థులు, ఆస్పత్రి సిబ్బంది తదితరులు చిక్కుకున్నారు. బాధితుడి తల్లి బీజే మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థులకు, ప్రొఫెసర్లకు భోజనం వండేది. భోజనం, చపాతీలు, గుజరాతీ వంటలు చేయగా.. వాటిని, ఆమె కుమారుడు ప్రతీ రోజు కళాశాల క్యాంపస్లో డెలివరీ చేసేవాడు. తిరిగి బీజే మెడికల్ కాలేజీ హాస్టల్కు వచ్చేవారు. ఎప్పటిలాగే కుమార్తెను తన తల్లి దగ్గర వదిలేసి పక్కనే ఉన్న సివిల్ ఆస్పత్రిలో లంచ్ బాక్స్లు ఇచ్చేందుకు వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి ఈ ఘోరం జరిగింది. ఈ విషాదంపై శార్లాబెన్ కుమారుడు రవీ మాట్లాడుతూ.. విమాన ప్రమాదం జరిగిన సమయంలో సివిల్ హాస్పిటల్కు టిఫిన్ బాక్సులు అందించటానికి వెళ్లాను. ఎప్పటిలాగే ప్రతి రోజు భోజనం ఇచ్చినట్లుగా జూన్ 12న నేను మధ్యాహ్నం 1 గంటకు హాస్పిటల్ సిబ్బందికి, హాస్టల్కు భోజనం అందించడానికి వెళ్లాను. తిరిగి రావడంతో ఓ విమానం మెస్లో దూసుకొచ్చిందని విన్నాను. విమానం కూలిన ప్రదేశంలో మా అమ్మ కూర్చుంది. ఆ ప్రదేశం మొత్తం పూర్తిగా కాలిపోయింది. మా అమ్మ, కుమర్తె, అక్కడ ఉన్నారని కంటతడి పెడుతూ మీడియాతో మాట్లాడారు. గంటలు గడుస్తున్నాయి. వాళ్ల ఆచూకీ లభించలేదు. అయినప్పటికీ వారి ఆచూకీ గుర్తించేందుకు మరో 72 గంటలు వేచి చూడాలని చెప్పారని వాపోయారు. This Baby Girl and her mother both are missing from mess building since plane crash Guys I know her father personally Please Contact me through Comments if found 🙏🙏🙏 Ahmedabad Gujarat pic.twitter.com/oJLEn6nr77— DTS (@Sharma17_05) June 13, 2025ప్రమాదం జరిగిన ఒక రోజు తరువాత సివిల్ హాస్పిటల్లో వైద్యులు మరణించిన వ్యక్తుల కుటుంబ సభ్యుల నుండి డీఎన్ఏ నమూనాలు సేకరిస్తున్నారు. మరోవైపు జేబీ మెడికల్ కాలేజీ బిల్డింగ్లో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాల్ని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. బాధితుడు రవి చెప్పిన ప్రాంతం అంతా మనుషుల శరీర భాగాలు గుర్తు పట్టలేని విధంగా ఉన్నాయి. వాటిని గుర్తించేందుకు బాధితుల కుటుంబసభ్యుల డీఎన్ఏని సేకరిస్తున్నారు. బాధితుడి రవి కూడా తన వాళ్ల ఆచూకీ దొరుకుతుందేమోనని విషాదం నిండిన కళ్లతో ఎదురు చూస్తున్నాడు. -
ఎయిరిండియా పెను విషాదం.. డీజీసీఏ కీలక నిర్ణయం
సాక్షి,ఢిల్లీ: ఎయిరిండియా బోయింగ్ 787-8 విమాన ప్రమాదంతో భారత పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఎయిర్లైన్స్ డ్రీమ్లైనర్ విమానాల్లో తనిఖీలు చేపట్టాలని సూచించింది. ముఖ్యంగా బోయింగ్ విమానాల్లోని 787 విమానాల్ని పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. బోయింగ్ విమానాల్ని పరిశీలించిన వెంటనే నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. గురువారం గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ ఏఐ171 విమానం టేకాఫైన 39 సెకన్లలోనే కుప్పకూలింది. వందల మందిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన తర్వాతే డీజీసీఏ తక్షణ చర్యలకు ఉపక్రమించింది. In light of the AI-171 accident on 12.06.2025, DGCA issues directives to Air India to carry out additional maintenance actions on B787-8/9 aircraft equipped with Genx engines with immediate effect.@RamMNK @mohol_murlidhar @dgca pic.twitter.com/L8YCJ1FVVT— MoCA_GoI (@MoCA_GoI) June 13, 2025 -
ఎయిరిండియా విమాన ప్రమాదం.. సీసీ కెమెరాలో భయంకర దృశ్యాలు
సాక్షి,ఢిల్లీ: ఎయిరిండియా విమానం పెను ప్రమాదంలో మరో నలుగురు మెడికోలు మృతి చెందారు. రాకేష్,ఆర్యన్,మనవ్ జయ్ ప్రకాష్లు మరణించినట్లు అధికారులు ప్రకటించారు.దీంతో ఎయిరిండియా విమానం కూలడంతో బీజే మెడికల్ కాలేజీలో మరణాల సంఖ్య 28కి చేరింది. అయితే, ఈ ప్రమాదం జరిగే సమయంలో మెడికల్ కాలేజీ ముందున్న సీసీ కెమెరాలో భయంకరమైన దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి లండన్కు బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం గురవారం కుప్పకూలి మంటల్లో దగ్ధమైంది. ఎయిర్పోర్టు నుంచి మధ్యాహ్నం 1.38 గంటలకు టేకాఫ్ అయిన క్షణాల్లో అందరూ చూస్తుండగానే మేఘానీనగర్లో బీజే మెడికల్ కాలేజీ బిల్డింగ్పై కుప్పకూలింది. విమమానం కూలిపోవడంతో మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ అలుముకుంది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో ఒక్కరే బ్రతికారు.బీజే మెడికల్ కాలేజీ హాస్టల్లో 24మంది మృతి చెందారు. శుక్రవారం మధ్యాహ్నం మరో నలుగురు విద్యార్ధులు మరణించారు.మరోవైపు తాజాగా ఎయిరిండియా విమానం బీజేపీ మెడికల్ కాలేజీపై కూలిన సమయంలో దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆ దృశ్యాలు మెడికల్ కాలేజీ హాస్టల్ ముందు ఉన్న భవనం సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.ఆ సీసీ టీవీ ఫుటేజీల్లో విమానం కూలినప్పుడు విమాన శకలాలు చెల్లాచెదురుగా పడ్డాయి. అణు బీభత్సం ఎలా ఉంటుందో.. విమానం కూలే సమయంలో అంతే ప్రమాద స్థాయి కనిపించింది. దట్టంగా పొగ కమ్ముకుంది. స్థానికంగా పార్క్ చేసిన కార్లు ధ్వంసమయ్యాయి. ఆ ప్రాంతమంతా బీతావాహ పరిస్థితి నెలకొంది. ఇక హాస్టల్ భవనంపై విమానం కూలిపోవడంతో లోపల వైద్య విద్యార్థులు ప్రాణ భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు కలవర పెడుతున్నాయి. ఓ విద్యార్థి విమానం బిల్డింగ్పై పడడంతో ఎగిరిపడుతున్న విమాన శకలాలు, బిల్డింగ్ శకలాల నుంచి తనని తాను రక్షించుకునేందుకు హాస్టల్లో లోపల ఉన్న టేబుల్ కింద పరిగెత్తుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. -
ఎయిరిండియా ప్రమాదం.. దొరికిన బ్లాక్ బాక్స్
న్యూఢిల్లీ: అహ్మదాబాద్(గుజరాత్) ఎయిరిండియా విమాన ప్రమాద విచారణలో పురోగతి చోటు చేసుకుంది. ఘటనా స్థలం నుంచి బ్లాక్ బాక్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో మరిన్ని కీలక విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. అంతకు ముందు.. బ్లాక్బాక్స్ దొరికిందంటూ ప్రచారం జరగ్గా.. అధికారులు కొట్టిపారేసిన సంగతి తెలిసిందే.ఎయిరిండియా బోయింగ్ 787-8 విమానం కూలిన బీజే మెడికల్ కాలేజీ బిల్డింగ్పై ఆరంజె కలర్లో ఉన్న బ్లాక్ బాక్స్ లభ్యమైంది. ఏ171 బ్లాక్ బాక్స్ బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంనతరం, బ్లాక్ బాక్స్ను విశ్లేషించే పనిలో నిమగ్నమయ్యారు. కాగా, ఈ బ్లాక్ బాక్స్లో సీవీఆర్, ఎఫ్డీఆర్ భాగాలుంటాయి. వీటిల్లో విమాన డేటా రికార్డింగ్, వేగం, ఎత్తు గురించి తెలుసుకునే అవకాశం ఉంది. సీవీఆర్లో రికార్డయిన చివరి రెండు గంటల పైలెట్, కోపైలెట్ల మధ్య సంభాషణ వినొచ్చు. గురువారం మధ్యాహ్నాం లండన్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలి.. పేలిపోయింది. ఘటనలో విమానంలో ప్రయాణికులు, సిబ్బందితో పాటు జనావాసాలపై కూలి మరో 24 మంది మొత్తం 265 మంది మరణించారు. విమానంలోని ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదానికి కారణాలను తెలుసుకునేందుకు ఈ కేసును ప్రత్యే బృందం దర్యాప్తు జరుపుతోంది.ఇదీ చదవండి: బ్లాక్బాక్స్తో ఏం చేస్తారో తెలుసా? -
కొమ్మినేని కేసులో జరిగింది ఇదే..: పొన్నవోలు
సాక్షి, ఢిల్లీ: ఒక్క సాకుతో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును జైలుపాలు చేశారని.. ఎప్పటికైనా ధర్మం, న్యాయం గెలుస్తుందని.. ఈ కేసులో సరిగ్గా ఇదే జరిగిందని సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొమ్మినేని అరెస్ట్ అక్రమమని.. ఆయన్ని తక్షణమే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు.‘‘మూడేళ్ల లోపు శిక్ష కలిగిన సెక్షన్లకు ఎలా అరెస్టు చేస్తారు?. గెస్ట్ చేసే వ్యాఖ్యలకు యాంకర్ ఎలా బాధ్యత వహిస్తారు?. నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయడం అక్రమం. పాలక పక్షం మెప్పుకోసం పోలీసులు ప్రయత్నాలు మానుకోవాలి. సాక్షి మీడియా గొంతు నులమాలని చూస్తున్నారు. సాక్షి ఆఫీసులపైన దాడులకు దిగుతున్నారు. పోలీసులు కనీసం కేసులు పెట్టడం లేదు. ఈ అంశాలన్నీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చాం’’ అని పొన్నవోలు తెలిపారు. -
ఆ సీటులో ఉంటే భద్రమేనా?
అహ్మదాబాద్లో గురువారం మధ్యాహ్నం జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమాన ప్రమాదం నుంచి రమేశ్ విశ్వాస్ కుమార్ అనే ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. విమానంలో 11ఏ సీటులో కూర్చున్న రమేశ్ క్షేమంగా బయటపడ్డాడు. బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ విమానంలో ఈ సీటు ఎకానమీ క్లాస్ కేబిన్లో మొదటి వరుసలో ఉంటుంది. విమానంలో కుడి పక్కన రెక్కల కంటే రెండు వరుసల ముందు కిటికీ పక్కనే ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లడానికి ఉద్దేశించిన ఎమర్జెన్సీ డోరు వెనుకే 11ఏ సీటు ఏర్పాటు చేశారు. ఈ స్థానంలో కూర్చోవడం రమేశ్ ప్రాణాలతో బయటపడడానికి కారణమైనట్లు నిపుణులు చెబుతున్నారు. 11ఏ సీటు (Seat 11A) సురక్షితమని భావిస్తున్నారు.హాట్లైన్ నెంబర్మరోవైపు విమాన ప్రమాదంతోపాటు మృతులకు సంబంధించిన సమాచారం అందించడానికి ఎయిర్ ఇండియా సంస్థ 1800 5691 444 హాట్లైన్ నెంబర్ ఏర్పాటు చేసింది. విదేశీయుల కోసం +91 8062779200 నెంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.విమానం కొత్తదే! న్యూఢిల్లీ: అహ్మదాబాద్లో గురువారం కుప్పకూలిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానం మరీ పాతదేమీ కాదని ఏవియేషన్ అధికారులు తెలిపారు. ఈ విమానం 2013లో సేవలు ప్రారంభించిందని వెల్లడించారు. 12 సంవత్సరాల నుంచి ఇది వాణిజ్య సేవలు అందిస్తోంది. పౌర విమానయాన రంగంలో 12 సంవత్సరాలు అంటే దాదాపు కొత్త విమానం కిందే లెక్క అని నిపుణులు తెలిపారు. ఈ విమానం వీటీ–ఏఎన్బీ పేరుతో రిజిస్టర్ అయ్యింది. ఎయిర్ ఇండియా సంస్థ వద్ద ఉన్న బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ రకానికి చెందిన 27 విమానాల్లో ఇదీ ఒకటి. ఈ రకానికి చెందిన ఒక విమానం ప్రమాదంలో పూర్తిగా ధ్వంసం కావటం ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు. 2020లో కాసరగోడ్లో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం కూలిపోయిన ఘటన తర్వాత దేశంలో అతిపెద్ద విమాన ప్రమాదం కూడా ఇదే.చదవండి: నాన్నకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండానే.. -
కొమ్మినేనికి ఊరట.. విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశం
సాక్షి, ఢిల్లీ: ప్రముఖ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు(Kommineni Srinivasa Rao)కు భారీ ఊరట లభించింది. ఆయన్ని తక్షణమే విడుదల చేయాలంటూ శుక్రవారం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సాక్షి చానెల్ డిబేట్లో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై గుంటూరు తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే..కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అక్రమమంటూ దాఖలైన పిటిషన్ను ఇవాళ జస్టిస్ పీకే మిశ్రా, జస్టిన్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ‘‘టీవీ డిబేట్లో నవ్వినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా?. అలాగైతే కేసుల విచారణ సందర్భంగా మేమూ నవ్వుతుంటాం. వాక్ స్వాతంత్రాన్ని రక్షించాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. విశ్లేషకుడి వ్యాఖ్యలతో కొమ్మినేనికి ఏం సంబంధం?. ఆయన్ని వెంటనే విడుదల చేయండి. డిబేట్లను గౌరవప్రదంగా నిర్వహించాలి. విడుదల సందర్భంగా అవసరమైన షరతులను ట్రయల్ కోర్టు విధిస్తుంది’’ అని ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషన్లోని ముఖ్యాంశాలు:కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్టు చేశారు. మూడేళ్ల లోపు శిక్ష పడే నేరాలకు పోలీసులు ముందుగా 41 కింద నోటీసు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయి. నోటీసు ఇవ్వకుండానే అక్రమంగా అరెస్టు చేశారు. సుప్రీంకోర్టు తీర్పును పోలీసులు పాటించలేదు. కేఎస్సార్ లైవ్ షో లో గెస్ట్ చేసిన వ్యాఖ్యలకు.. యాంకర్ ఎలా బాధ్యత వహిస్తారు?. అలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దని గెస్ట్ను కేఎస్ఆర్ నియంత్రించారు . వాటిని సమర్థించలేదు. తెలంగాణలో అరెస్టు చేసి 331 కిలోమీటర్ల దూరంలో.. అదీ ఆంధ్రప్రదేశ్లో రిమాండ్ చేశారు. పైగా ట్రాన్సిట్ రిమాండ్ తీసుకోలేదు. కొమ్మినేని సీనియర్ జర్నలిస్టు. ఆయనకు ఎలాంటి నేర చరిత్ర లేదు.పైగా 70 ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజన్. కొమ్మినేని దర్యాప్తును తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. స్థానిక కోర్టులో కొమ్మినేని తరఫున న్యాయవాదిని అనుమతించలేదు. సహజ న్యాయ సూత్రాలకు ఇది విరుద్ధం . ఈ కేసులో పోలీసులు ప్రాథమిక హక్కు ఆర్టికల్ 19, 21 ,22(1)ను ఉల్లంఘించారు. ప్రజాస్వామ్య నాలుగో స్తంభమైన మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. వాక్ స్వాతంత్రానికి భంగం కలిగిస్తున్నారు. అక్రమ అరెస్టుతో ఆయన జీవించే హక్కుకు భంగం కలిగింది’’ అని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు కొమ్మినేనికి బెయిల్ మంజూరు చేస్తూ ఊరట ఇచ్చింది. -
పైలట్ సుమీత్: నాన్నకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండానే..
ఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. మాటలకందని పెను విషాదాన్ని నింపింది. భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటనగా మిగిలింది. తన తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండానే అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఎయిర్ ఇండియా పైలెట్ కెప్టెన్ సుమీత్ సబర్వాల్ మృతి చెందారు. కెప్టెన్ సుమీత్కు సంబంధించిన కుటుంబ విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని, పైలట్ ఉద్యోగం మానేసి చూసుకుంటానని కెప్టెన్ సుమీత్ సబర్వాల్ మాట ఇచ్చారు. కానీ ప్రమాదవశాత్తు తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండానే విమాన ప్రమాదంలో ఆయన మరణించారు. తండ్రికి మాట ఇచ్చిన విషయాన్ని బంధువులు తెలిపారు.లండన్కు విమాన ప్రయాణానికి ముందు కూడా సమీత్ తన తండ్రికి ఫోన్ చేశారు. "తాను లండన్ చేరుకున్న తర్వాత మీకు కాల్ చేస్తానని చెప్పాడు.. కానీ ఇంతలోనే తీవ్ర విషాదం జరిగిపోయింది. ముంబయిలోని పోవై ప్రాంతంలో సుమీత్ తండ్రి ఒంటరిగా ఉంటున్నారు. గతంలో ఆయన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్లో బాధ్యతలు నిర్వర్తించి రిటైర్ అయ్యారు.కాగా, అహ్మదాబాద్లో ఘోర ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా 787–8 డ్రీమ్లైనర్ విమానాన్ని నడిపిన పైలట్లకు సర్వీస్లో సుదీర్ఘ అనుభవం ఉన్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) తెలిపింది. ఈ విమానాన్ని ప్రధాన పైలట్ కెప్టెన్ సుమీత్ సబర్వాల్, కో పైలట్ క్లైవ్ కుందర్ నడిపారు. ప్రయాణీకుల విమానాలు నడపడంలో సుమీత్కు ఏకంగా 8,200 గంటల అనుభవం ఉంది. కో పైలట్ క్లైవ్కు 1,100 గంటల అనుభవం ఉంది. ఇద్దరికి కలిసి 9,300 గంటలపాటు వినిమానం నడిపిన అనుభవం ఉందని డిజిసిఎ వెల్లడించింది. -
ఘోర విషాదాలు
న్యూఢిల్లీ: అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం దేశ ప్రజలను ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. దేశంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదాల్లో ఇది కూడా ఒకటని చెబుతున్నారు. గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి. వందలాది మంది ప్రయాణికులు గమ్యస్థానం చేరకుండానే కన్నుమూశారు. చాలావరకు సాంకేతిక లోపాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులతోపాటు మానవ తప్పిదాలు సైతం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. → 2020 ఆగస్టు 7: కేరళలోని కోజికోడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు రన్వేపై ఎయిర్ ఇండియా 1344 విమానం ల్యాండవుతున్న సమయంలో అదుపు తప్పింది. పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. విమానం రెండు ముక్కలు కావడంతో అందులో ఉన్న 190 మంది ప్రయాణికుల్లో 21 మంది మృతిచెందారు. భారీ వర్షం, ప్రతికూల వాతావరణం కారణంగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు పైలట్లు సైతం ఉన్నారు. → 2010 మే 22: కర్ణాటకలోని మంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 737–800 విమానం ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పి లోయలో పడిపోయింది. విమానంలో వెంటనే మంటలు చెలరేగడంలో 158 మంది మరణించారు. ఇది టేబుల్టాప్ రన్వే కావడంతో విమానాన్ని ల్యాండింగ్ చేయడంలో పైలట్ తడబడినట్లు గుర్తించారు. → 2000 జూలై 17: బిహార్ రాజధాని పాటా్నలో అలయెన్స్ ఎయిర్ ఫ్లైట్ 7412 జనావాసాలపై కుప్పకూలింది. 60 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 55 మంది విమాన ప్రయాణికులు కాగా, ఐదుగురు ఇళ్లల్లోని నివాసితులు. → 1996 నవంబర్ 12: సౌదీ అరేబియా విమానం 763, కజకిస్తాన్ ఎయిర్లైన్స విమానం 1907 హరియాణాలోని చార్కీ దాద్రీ గగనతలంలో పరస్పరం ఢీకొని కుప్పకూలాయి. ఏకంగా 349 మంది మరణించారు. సమాచార మారి్పడిలో లోపం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. → 1990 ఫిబ్రవరి 14: ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 605 బెంగళూరు హెచ్ఏఎల్ ఎయిర్పోర్టులో ల్యాండయ్యే ముందు అదుపుతప్పింది. రన్వే పక్కన భూమిని ఢీకొని పక్కనే ఉన్న గోల్ఫ్ కోర్సులోకి దూసుకెళ్లింది. విమానంలో 146 మంది ఉండగా, వీరిలో 92 మంది మృతిచెందారు. → 1988 అక్టోబర్ 19: గుజరాత్లోని అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 113 ల్యాండింగ్ సమయంలో రన్వే పక్కన చెట్లను ఢీకొట్టింది. వెంటనే మంటలు చెలరేగడంతో 135 మంది ప్రయాణికులకు గాను 133 మంది విగత జీవులయ్యారు. పొగమంచు అధికంగా ఉండడం వల్ల రన్వే కనిపించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. → 1978 జనవరి 1: ముంబై నుంచి దుబాయ్కి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 855 అరేబియా సముద్రంలో కూలిపోయింది. విమానంలోని మొత్తం 213 మంది ప్రయాణికులు మరణించారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ దుర్ఘటన జరిగింది. → 1973 మే 31: ఢిల్లీ పాలమ్ ఎయిర్ఫోర్టులో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 440 ల్యాండింగ్ కంటే ముందు హైటెన్షన్ విద్యుత్ వైర్లను ఢీకొట్టింది. దాంతో అందులో మంటలు వ్యాపించడంతో 65 మందికిగాను 48 మంది ప్రయాణికులు బలయ్యారు. ప్రతికూల వాతావరణం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుంది. -
వైపరీత్యం..పెరుగుతోంది ప్రాణ నష్టం
దేశంలో వైపరీత్యాలు ఏటికేటికీ పెరుగుతున్నాయి. ఇవి ప్రాణ, ఆస్తి నష్టానికి కారణమవుతున్నాయి. భూకంపాలు, వరదలు, అకాల వర్షాలు, కొండ చరియలు విరిగిపడడం, సుడిగాలులు..ఇలా జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. పులి మీద పుట్రలా ప్రజా జీవనాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇందుకు తాజాగా భారత ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలే నిదర్శనం. సాక్షి, న్యూఢిల్లీః దేశంలో గత ఏడాది ప్రకృతి వైపరీత్యాల కారణంగా మానవ మరణాల సంఖ్య గణనీయంగా ఉందని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా విడుదల చేసిన ఎనీ్వస్టాట్స్ ఇండియా–2025 (పర్యావరణ గణాంకాలు) నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. వరదలు, పిడుగుపాట్లు, వడగాడ్పులు, భారీ వర్షాలు వంటి వైపరీత్యాలతో 2024–25 ఏడాదిలో దేశంలో ఏకంగా 3,080 మంది మరణించినట్లు తెలిపింది. 2013–14 ఏడాదిలో సంభవించిన మానవ మరణాల తర్వాత అత్యధిక మరణాలు గత ఏడాదే సంభవించినట్లు పేర్కొంది. నివేదికలో అంశాలివీ.. ⇒ గడిచిన 25ఏళ్లలో అంటే 2001–02 నుంచి చూస్తే అత్యధిక మరణాలు 2007–08లో 3,764, 2008–09లో 3,405, 2013–14లో 5,677 నమోదు కాగా, ఆ తర్వాత గత ఏడాదే అత్యధికంగా 3,080 మరణాలున్నాయి. ⇒ పశు మరణాల సంఖ్య మాత్రం గత ఏడాది గణనీయంగా తగ్గింది. అత్యధికంగా 2006–07లో 4,55,619 మరణించగా, 2023–24లో 1,19,683 గతేడాది 61,966 చనిపోయాయి. ⇒ ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఇళ్లు ›కూలడం వంటి నష్టాలు 2007–08లో ఏకంగా 35.27లక్షలుండగా, 2023–24లో 1.40లక్షలు, 2024–25లో మాత్రం 3.64లక్షలుగా ఉంది. ⇒ 2007–08లో 85.13లక్షల హెక్టార్లలో పంట నష్టం జరగ్గా, 2023–24లో 13.39లక్షల హెక్టార్లు, 2024–25లో 14.24 లక్షల హెక్టార్లుగా ఉంది. -
డీఎస్సీ పరీక్షపై స్టే ఇవ్వలేం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకానికి చేపట్టిన డీఎస్సీ–2025 పరీక్షను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. పరీక్ష ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనందున, తగిన న్యాయ సహాయానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్ పోసిన ఆనంద్సాయికి సుప్రీం కోర్టు ధర్మాసనం సూచించింది. ఎక్స్ సర్వీస్మెన్ రిజర్వేషన్ కోటాలో డీఎస్సీకి దరఖాస్తు చేసిన ఆనంద్ సాయి దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తులు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. డీఎస్సీలో 5.72 లక్షల మంది అభ్యర్థులు వివిధ షిఫ్టులలో వేర్వేరు ప్రశ్నపత్రాలతో పరీక్ష రాస్తారని, అనంతరం మార్కులు ‘నార్మలైజేషన్‘ పద్ధతిలో ఇవ్వడం అవాస్తవంగా, అన్యాయంగా ఉందని, ఇది అభ్యర్థుల హక్కులకు విఘాతం కలిగిస్తుందని పిటిషనర్ తరఫున అడ్వొకేట్ ఆన్ రికార్డ్ డా. చారు మాథూర్ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి. రాజు ఈ పిటిషన్ను తీవ్రంగా వ్యతిరేకించారు. లక్షల మంది అభ్యర్థులు ఇప్పటికే పరీక్షలు రాశారని చెప్పారు. పరీక్షలు ప్రారంభమయ్యాక వాటిని మధ్యలో నిలిపేయాలని కోర్టులు ఆదేశించలేవని జస్టిస్ మన్మోహన్ వ్యాఖ్యానించారు. ఈ అంశంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్ ఆనంద్సాయిని ధర్మాసనం ఆదేశించింది. -
ఇటీవలే పెళ్లి, భర్త కోసం లండన్కు నవ వధువు.. నిమిషాల్లో గాల్లో కలిసిన ప్రాణాలు
గాంధీనగర్: అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం ప్రయాణికుల కుటుంబాల్ని తీవ్ర విషాదాన్ని నింపింది. వారిలో నవ వధువు ఖుష్బూ రాజ్పురోహిత్ ఉన్నారు. ఆమె లండన్లో ఉంటున్న తన భర్తను కలిసేందుకు ఎయిరిండియా విమానంలో బయల్దేరారు. కానీ అంతలోనే అనుకోని విషాదం.. నిమిషాల వ్యవధిలోనే తన భర్తను కలవాలన్న ఆమె కలను చిదిమేసింది. ఖుష్బూ రాజస్థాన్లోని బాలోటరా జిల్లాలోని అరాబా గ్రామ వాసి ఖుష్బూ రాజ్పురోహిత్ . ఆమెకు ఇటీవల మన్ఫూల్ సింగ్తో వివాహం జరిగింది. వివాహం తర్వాత తొలిసారి లండన్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న భర్తను కలిసేందుకు అహ్మదాబాద్లో కూలిన ఎయిరిండియా విమానంలో బయల్దేరారు. ఈ ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోవడం కలచివేస్తోంది. విమాన ప్రమాదానికి ముందు ఎయిర్పోర్టులో ఖుష్బూ రాజ్ పురోహిత్ కుమార్తె తన తండ్రి మదన్ సింగ్తో దిగిన ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రిమ్లైనర్ విమానం టేకాఫ్ అయిన సెకన్ల వ్యవధిలో జనావాస్లాల్లో దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో రాజస్థాన్కు చెందిన 11 మంది ఈ విమానంలో ఉన్నారు. వారిలో ఇద్దరు యూకేలో చెఫ్గా పని చేయడానికి వెళ్తున్న పురుషులు , ఒక మార్బుల్ వ్యాపారి కుమారుడు, కుమార్తె ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.ఈ విమానంలో మొత్తం 242 మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో సిబ్బంది కూడా ఉన్నారు. ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, ఒక కెనడియన్ పౌరుడు, ఏడు పోర్చుగీస్ పౌరులు ఉన్నారు. మొత్తం ప్రయాణికుల్లో ఒక్కే ఒక్క ప్రయాణికుడు రమేష్ విశ్వాస్ కుమార్ మాత్రమే ప్రాణాలతో భయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే విమానం ఎమర్జెన్సీ గేటు నుంచి బయటకు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం, రమేష్కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. -
ఎయిరిండియా విమాన ప్రమాదంపై ప్రముఖుల తీవ్ర దిగ్భ్రాంతి
సాక్షి,ఢిల్లీ: గుజరాత్ అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి గురువారం లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ ఘోర ప్రమాదానికి గురైంది. ఘోర విమాన ప్రమాదంలో ఎయిరిండియా విమానంలోని 242 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఆ మరణాలపై కేంద్రం అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రమాదంపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.ప్రమాదం తనని కలిచి వేసిందన్న ప్రధాని మోదీ.. బాధిత కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.విమాన ప్రమాదంపై రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన హృదయ విదారకరమైంది.ప్రధాని మోదీ, భారత్కు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంఘీభావం. వీలైనంత ఎక్కువ మంది ప్రాణాలతో బయటపడాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు.విమాన ప్రమాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు విచారం వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో నా సహచరుడు ప్రధాని మోదీ, భారత ప్రజలకు అండగా నిలుస్తాం. 242 మంది పురుషులు, మహిళలు, పిల్లల ప్రాణాలను బలిగొన్న విషాదకరమైన ఎయిరిండియా ప్రమాదం గురించి తెలుసుకుని నేను బాధపడ్డాను’అని అన్నారు.ఈరోజు అహ్మదాబాద్లో జరిగిన అత్యంత విషాదకరమైన ఎయిరిండియా ప్రమాదం గురించి తెలుసుకుని షాక్ గురయ్యా. ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నా. బాధితుల కుటుంబాలకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ప్రాణాలతో బయటపడిన వారి వివరాల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం. ప్రమాదంలో అందరు సురక్షితంగా ఉండాలని భగవంతుణ్ని ప్రార్ధిస్తున్నాను’ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎక్స్ వేదికగా పోస్టు చేసింది. -
ఎయిరిండియా విమాన ప్రమాద మృతులకు ఎక్స్గ్రేషియా.. ప్రకటించిన టాటా గ్రూప్
ఢిల్లీ,సాక్షి: ఎయిరిండియా ప్రమాద మృతులకు టాటా గ్రూప్ రూ.కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి వ్యక్తి కుటుంబాలకు టాటా గ్రూప్ రూ. 1 కోటి అందిస్తున్నట్లు తెలిపింది. గాయపడిన బాధితులకు అయ్యే వైద్య ఖర్చులను భరిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో పాటు వారికి అవసరమైన సంరక్షణ, మద్దతు అందిస్తామన్నది. అదనంగా, ఎయిరిండియా విమానం కూలిన బీజే మెడికల్ హాస్టల్ను పుననిర్మిస్తామని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ నోట్ను విడుదల చేశారు. Tata Group will provide Rs 1 crore to the families of each person who has lost their life in this tragedy. We will also cover the medical expenses of those injured and ensure that they receive all necessary care and support. Additionally, we will provide support in the building… pic.twitter.com/jBPxfmo4at— Aditya Raj Kaul (@AdityaRajKaul) June 12, 2025 -
మృత్యుంజయుడు రమేశ్
అహ్మదాబాద్: రమేశ్ విశ్వాస్ కుమార్ బుచార్వాడ.. అత్యంత అదృష్టవంతుడంటే ఇతడే. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో.. ఏదో అద్భుతం జరిగినట్లుగా ప్రాణాలతో బయటపడ్డాడు. 38 ఏళ్ల రమేశ్ బ్రిటీష్ జాతీయుడు. తన సోదరుడితో కలిసి లండన్కు పయనమయ్యాడు. ఏఐ171 విమానంలో 11ఏ సీట్లో కూర్చున్నాడు. అత్యవసర ద్వారానికి వెనుకే ఈ సీటు ఉంది. విమానం నేలకూలి మంటల్లో చిక్కుకున్న తర్వాత రమేశ్ గాయాలతో బయటకు వస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. కొందరు వ్యక్తుల సాయంతో అంబులెన్స్ వద్దకు చేరుకున్నాడు. విమానంలోని ఇతర ప్రయాణికుల గురించి జనం అతడిని ఆరా తీశారు. చాలామంది రమేశ్ చుట్టూ గుమికూడారు. ప్రయాణికులంతా అక్కడే(ఘటనా స్థలంలో) ఉన్నారు అంటూ బలహీన స్వరంతో బదులిచ్చాడు. విమానం ఒక్కసారిగా పేలిపోయిందని, తన చుట్టూ శకలాలే కనిపించాయని చెప్పాడు. ప్రమాదం నుంచి బయటపడిన రమేశ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని అహ్మదాబాద్ పోలీసు కమిషనర్ జి.ఎస్.మాలిక్ తెలిపారు. (రమేష్ విశ్వకుమార్ కుమార్ ఎయిరిండియా విమానం టికెట్)ప్రయాణం వాయిదాతో బతికాడుఇదే విమానంలో వెళ్లాల్సిన శావ్జీభాయి తింబాడియా చివరి నిమిషంలో ప్రయాణం వాయిదా వేసుకోవడం అతడి పాలిట వరంగా మారింది. లండన్లో ఉంటున్న తన కుమారుడి వద్దకు వెళ్లడానికి ఆయన అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాడు. కుమారుడే విమానం టికెట్ బుక్ చేశాడు. విమానంలో సీటు కూడా తింబాడియాకు కేటాయించారు. కానీ, తింబాడియా చివరి నిమిషంలో మనసు మార్చుకున్నాడు. తన ప్రయాణాన్ని నాలుగు రోజులపాటు వాయిదా వేసుకున్నాడు. అదే ఆయన ప్రాణాన్ని కాపాడింది. గురువారం జరిగిన ప్రమాదం గురించి తెలిసి తింబాడియా దిగ్భ్రాంతి చెందాడు. భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడు. తాను నమ్మే దైవమైన స్వామి నారాయణ్కు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పాడు.Miracle amidst tragedy!!!Ramesh Vishwashkumar, seated on 11A, is the sole survivor of the Air India crash in Ahmedabad. He jumped out and walked away injured. He’s currently undergoing treatment at the hospital.#AhmedabadPlaneCrash #Ahmedabad pic.twitter.com/pWIHUD7kG5— Shivangi Thakur (@thakur_shivangi) June 12, 2025 -
Mayday Call: మేడే.. మేడే.. మేడే!
న్యూఢిల్లీ: విమాన ప్రమాదాలు జరిగిన ప్రతిసారి ఒక పదం ప్రధానంగా వినిపిస్తుంది. అదే ‘మేడే’. ఏదైనా పౌర విమానంలో అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఎయిర్పోర్టులోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) కేంద్రానికి సహాయం కోసం ఆ విమానం పైలట్ పంపే అభ్యర్థనే ఈ ‘మేడే’. పైలట్ మేడే.. మేడే.. మేడే అని మూడుసార్లు పలికి సిగ్నల్ పంపాడంటే విమానం అత్యంత ప్రమాదంలో ఉందని అర్థం. ఈ పదానికి అర్థమేంటి? దీనిని ఎప్పటి నుంచి వాడుతున్నారో తెలుసా..?105 ఏళ్ల క్రితం మాట..సివిల్ ఏవియేషన్ రంగంలో మేడే అనే పదాన్ని మొదట 1920లో వాడారు. లండన్లోని క్రోయ్డన్ విమానాశ్రయంలో రేడియో ఆఫీసర్గా పనిచేసిన ఫ్రెడరిక్ స్టాన్లీ మాక్ఫీల్డ్ ఈ పదాన్ని మొదట ఉపయోగించినట్లు రికార్డుల్లో ఉంది. ఇది ఫ్రెంచ్ పదమైన మైడెర్కు సమానార్ధకం. ఫ్రెంచ్లో మైడెర్ అంటే సహాయం చేయండి (హెల్ప్ మీ) అని అర్థం. 1923 నుంచి అంతర్జాతీయ రేడియో కమ్యూనికేషన్ వాడే పైలట్లు, సముద్రయానం చేసే మెరైన్ సిబ్బంది ఈ మేడే పదాన్ని వాడటం మొదలుపెట్టారు. అధికారికంగా మాత్రం సివిల్ ఏవియేషన్ రంగం 1927 నుంచి ఈ పదాన్ని స్వీకరించింది. అత్యవసర సమయాల్లో మేడేతోపాటు ఎస్ఓఎస్ పదాన్ని కూడా వాడుతుంటారు. కానీ, మేడే పదమే బాగా ప్రాచుర్యంలో ఉంది.మేడే కాల్ వస్తే ఏం జరుగుతుంది?ఎవరైనా పైలట్ నుంచి ఏటీసీకి మేడే కాల్ వచ్చిందంటే ఆ విమానం కూలిపోయే ప్రమాదంలో ఉందని అర్థం. వెంటనే ఏటీసీ అధికారులు అత్యవసరం కాని సేవలన్నింటినీ నిలిపేసి ఆ విమానాన్ని కాపాడేందుకు ప్రయత్నం మొదలు పెడతారు. సహాయం కోసం మేడే కాల్ ఇచ్చిన పైలట్ తన విమానం ఏ ప్రాంతంలో ఉంది? ఎంత ఎత్తులో ఉంది? ఎలాంటి ప్రమాదంలో ఉంది? విమానంలో ఎంతమంది ప్రయాణిస్తున్నారు అనే విషయాలు కూడా అందించాల్సి ఉంటుంది. దాన్ని బట్టి సహాయ చర్యలు ఎలా చేపట్టాలన్నది ఏటీసీ అధికారులు నిర్ణయిస్తారు. ఈ మేడే సిగ్నల్ను సాధారణంగా 121.5 మెగాహెడ్జ్, 243 మెగాహెడ్జ్లో పంపుతుంటారు. ఈ ఫ్రీక్వెన్సీలను ఏటీసీ అధికారులు అనుక్షణం పరిశీలిస్తుంటారు. -
కేంద్రం హెచ్చరికను పెడ చెవిన పెట్టి.. 242 మంది మృతికి ఎయిరిండియానే కారణమా?
గాంధీ నగర్: అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీతో సహా 242 మంది ప్రయాణికులు మరణించిన జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. మరణాలపై కేంద్రం అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ విమాన ప్రమాదానికి కారణం ఎయిరిండియా?నిర్లక్ష్యమేనని తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం కూలిన విమానం ఇప్పటికే గతంలో పలు మార్లు మొరాయించింది. గత డిసెంబర్లో ఇదే ఫ్లైట్లో పొగలు కమ్ముకున్నాయి. గతవారం ఇదే విమానం ప్యారిస్ వెళ్తుండగా మొరాయించడంతో పైలెట్ షార్జాలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. వరుస ఘటనలపై విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఎయిరిండియా విమానానికి హెచ్చరికలు జారీ చేసింది. అయినా పట్టించుకోలేదని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.గురువారం మధ్యాహ్నాం 1.38 నిమిషాలకు 242 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బందితో బోయింగ్ 787-7 డ్రీమ్ లైనర్ విమానం బయల్దేరింది. అయితే ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే.. 1.43ని. ప్రాంతంలో విమానం ప్రమాదానిక గురైంది. సుమారు 825 అడుగుల ఎత్తులో క్రాష్ ల్యాండ్ అయ్యింది. నేరుగా ఓ చెట్టును ఢీ కొట్టి జనావాసాలపై పడింది. ఆ సమయంలో భారీ పేలుడు సంభవించింది.ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే.. అదీ ఎయిర్పోర్ట్ పరిధిలోనే ప్రమాదానికి గురైనట్లు డీజీసీఏ ప్రకటించింది. విమానంలో ఉన్న మొత్తం 242 మంది మృతి చెందినట్లు సమాచారం. 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు,10 మంది విమాన సిబ్బంది మృత్యువాత పడ్డారు. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ దేశస్థులు ఉన్నారు. ఏడుగురు పోర్చుగీస్కు చెందిన వారు ఉండగా, ఒక కెనడా దేశస్థుడు ఉన్నారు. విమానంలో 217 మంది పెద్దలు, 11 మంది చిన్నారులు,ఇద్దరు పసిపిల్లలు ఉన్నారు. -
‘విమాన ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశం లేదు’: సీపీ
గాంధీ నగర్: అహ్మదాబాద్ ఎయిరిండియా ఘోర విమానం ప్రమాదంలో మరణాలపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విమాన ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశం లేదని అహ్మదాబాద్ సీపీ జీఎస్ మాలిక్ అసోసియేటెడ్ ప్రెస్తో మాట్లాడారు. విమానం జనావాసాల్లో కూలిపోవడంతో స్థానికులు మరణించినట్లు చెప్పారు. అయితే, ఆ మరణాలు సంఖ్య ఎంత అనేది స్పష్టత ఇవ్వలేదు. -
ఇది మాటల్లో చెప్పలేని హృదయ విదారక ఘటన: ప్రధాని మోదీ
ఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు విమాన ప్రమాదం జరిగిన వెంటనే హోంమంత్రి అమిత్ షా మాట్లాడిన ప్రధాని మోదీ.. ఈ ఘటన తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. The tragedy in Ahmedabad has stunned and saddened us. It is heartbreaking beyond words. In this sad hour, my thoughts are with everyone affected by it. Have been in touch with Ministers and authorities who are working to assist those affected.— Narendra Modi (@narendramodi) June 12, 2025ఇది మాటల్లో చెప్పలేని హృదయ విదారకర ఘటన అని మోదీ ట్వీట్ చేశారు. తాను ఎప్పటికప్పుడు పరిస్థితిన సమీక్షిస్తున్నానని,. బాధితులకు సహాయం చేస్తున్న మంత్రులు, అధికారులతో మాట్లాడుతున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతివిమాన ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విమాన ప్రమాద ఘటన తీవ్రంగా బాధించిందన్నారు. ఇది హృదయ విదారక ఘటన అని పేర్కొన్న ఆమె.. బాధితులు కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కష్ట సమయంలో వారికి దేశం అండగా నిలుస్తుందన్నారు. I am deeply distressed to learn about the tragic plane crash in Ahmedabad. It is a heart-rending disaster. My thoughts and prayers are with the affected people. The nation stands with them in this hour of indescribable grief.— President of India (@rashtrapatibhvn) June 12, 2025 కాగా, ఈ రోజు గురువారం(జూన్ 12) అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 100 మందిపైగా దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విమానంలో 242 మంది ప్రయాణికులున్నారు. ఇందులో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ దేశస్థులు ఉన్నారు. ఏడుగురు పోర్చుగీస్కు చెందిన వారు ఉండగా, ఒక కెనడా దేశస్థుడు ఉన్నారు. విమానంలో 217 మంది పెద్దలు, 11 మంది చిన్నారులు, ఇద్దరు పసిపిల్లలు ఉన్నారు. విమాన ప్రమాద ఘటన తర్వాత పలు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. :అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 100 మందికిపైగా మృతి? -
హాస్టల్పై కూలిన విమానం.. 20 మంది మెడికల్ స్టూడెంట్స్ మృతి!
గాంధీనగర్: గుజరాత్ అహ్మదాబాద్లోని ఘోర విషాదం చోటు చేసుకుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి గురువారం లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం 110 మంది ప్రయాణికులు మరణించినట్లు ప్రాథమిక సమాచారం.ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరని ఎయిరిండియా విమానం మేఘాని నగర్లోని బీజే ప్రభుత్వ వైద్య కళాశాల హాస్టల్ (BJ Medical College Hostel) భవనంపై విమానం కూలింది. ఈ విమాన ప్రమాదంలో 20మంది వైద్య విద్యార్థులు మరణించినట్లు తెలుస్తోంది. భోజనం సమయం కావడంతో హాస్టల్లోనే పీజీ వైద్య విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల మరణాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. Air India plane crashed directly on the BJ Medical College UG hostel mess in Meghani Nagar, Ahmedabad.#AirIndiaflight#ahmedabad#gujarat pic.twitter.com/mBAC7Psoys— RajawardhanReddy.Mule (@RajawardhanRed2) June 12, 2025 ⚡ As per initial reports the Air India plane crashed directly on the BJ Medical College UG hostel mess in Meghani Nagar, Ahmedabad. More details awaited pic.twitter.com/duJTCL1YTn— OSINT Updates (@OsintUpdates) June 12, 2025 #WATCH | Air India plane crash: "My son had gone to the hostel during lunch break, and the plane crashed there. My son is safe, and I have spoken to him. He jumped from the second floor, so he suffered some injuries,” says Ramila, who reached the civil hospital in Ahmedabad,… pic.twitter.com/MgMtvXBSou— ANI (@ANI) June 12, 2025 -
ఎయిరిండియా విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి
గాంధీ నగర్: గుజరాత్ రాష్ట్రం అహ్మాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. అహ్మాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ పెను విషాదంలో విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది ప్రయాణికులు మరణించినట్లు తెలుస్తోంది. వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నట్టు కేంద్ర మంత్రి, గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ అధికారికంగా ప్రకటించారు. (విమాన ప్రమాదానికి ముందు మాజీ సీఎం విజయ్ రూపానీని సెల్ఫీ తీసిన తోటి ప్రయాణికురాలు)ప్రమాదంపై ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రమాద బాధితుల్లో విజయ్ రూపానీ ఉన్నారు. ‘మా నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తన కుటుంబాన్ని కలవడానికి (లండన్) వెళ్తున్నారు. ఈ సంఘటనలో ఆయన కూడా బాధితుడే. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఇది బిజెపికి పెద్ద నష్టం’అంటూ సీఆర్ పాటిల్ విచారం వ్యక్తం చేశారు. VIDEO | Ahmedabad Plane Crash: Union Minister and Gujarat BJP president, CR Patil (@CRPaatil) confirms former Gujarat CM Vijay Rupani's demise. Speaking to reporters, he says, "Our leader and former Chief Minister, Vijay Rupani, was going (to London) to meet his family. He is… pic.twitter.com/5c1VIk8KIb— Press Trust of India (@PTI_News) June 12, 2025 పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం.. అహ్మదాబాద్లో కూలిన ఎయిరిండియా విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నట్లు తేలింది. ఆ విమాన ప్రయాణికుల జాబితాలో విజయ్ రూపానీ 12వ ప్రయాణికుడు. జెడ్ క్లాస్లో రూపానీ టికెట్ బుక్ చేసుకున్నారనే ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్లోని గాట్విక్ విమానాశ్రయానికి మధ్యాహ్నం 1:10 గంటలకు సర్వీస్ ఉంది. ఆ విమానం టేకాఫ్ అయిన రెండు నిమిషాలకు ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదం జరిగే సమయంలో విమానంలో సిబ్బందితో సహా మొత్తం 242 మంది ఉన్నారు. విమానంలో 242 మంది: డీజీసీఏఅహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానంలో 242 మంది ఉన్నారని సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) వెల్లడించింది. వీరిలో ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నట్టు తెలిపింది. కెప్టెన్ సుమీత్ సభర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ కూడా ప్రమాద సమయంలో విమానంలో ఉన్నారు.Ahmedabad Plane Crash: Video captured exact moment Air India's AI -171 passenger aircraft crashed near Meghnaninagar area earlier today.(Disclaimer: PTI can not verify the authenticity of the video)(Source: Third party) pic.twitter.com/qAK8aP6wGH— Press Trust of India (@PTI_News) June 12, 2025విమానంలో 169 మంది భారతీయులు, 53 మంత్రి బ్రిటన్, ఏడుగురు పోర్చుగీస్ జాతీయులతో పాటు ఒక కెనడా వాసి ఉన్నట్లు ఎయిరిండియా ఎక్స్ వేదికగా వెల్లడించింది.ప్రమాదానికి గురైన విమానం వైడ్బాడీ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్. దీనిలో 300మంది ప్రయాణించవచ్చు. సుదూర ప్రయాణం కావడంతో విమానంలో ఇంధనం కూడా భారీగా ఉండడంతో ప్రమాదం స్థాయి తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
ఢిల్లీలో బాబు డాబు
సాక్షి, న్యూఢిల్లీ: సరిగ్గా ఏడాది కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 20 సార్లు ఢిల్లీకి వచ్చారు. ప్రతిసారీ అభివృద్ధే అజెండా అంటూ ప్రచారం చేసుకుంటున్నా.. కొత్త అప్పులకు మద్దతు కోరడమే లక్ష్యంగా ఆయన పర్యటనలు సాగాయి. ఈ మేరకు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ పెద్దలను కలుస్తూ వచ్చారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాజధాని అమరావతిని ధ్వంసం చేసిందని విమర్శిస్తూ.. ఆ వంకతో కేంద్రం మద్దతుతో రూ.కోట్లు అప్పులు తెచ్చారు. అమరావతి పేరుతో ఇప్పటివరకు రూ.31 వేల కోట్లు తీసుకోవడం గమనార్హం. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ నుంచి రూ.15 వేల కోట్లు పొందారు. ఇవికాక బడ్జెటేతర అప్పులు రూ.19,410 కోట్లు. ఏడాదిలో భారీగా అప్పు చేయడంలోనే చంద్రబాబు తన మార్క్ చూపారు. ఇకప్రతిసారీ చంద్రబాబు ప్రత్యేక విమానంలోనే ఢిల్లీ వచ్చారు. దాదాపు 15–17 సార్లు రెండు రోజుల పాటు మకాం వేశారు.ఐదుసార్లు ప్రధాని మోదీని, ఆరుసార్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను, ఐదుసార్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు. పోలవరం ఎత్తు 41.15 మీటర్లకు తగ్గిస్తున్నట్లు కేంద్రం పేర్కొన్నా.. చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ఎన్డీఏ నేతలు ఎవరూ నోరు మెదపలేదు. పైగా దీనిని వ్యతిరేకించిన వైఎస్సార్సీపీ ఎంపీలపై కూటమి ఎంపీలు పార్లమెంట్లో వ్యక్తిగత దూషణలకు దిగారు. ఎత్తు తగ్గిస్తున్నట్లు కేంద్రం స్పష్టంగా ఉత్తర్వుల్లో పేర్కొందని మీడియా ప్రశ్నించినా... కూటమి నేతల నుంచి సమాధానం రాలేదు.మిర్చి రైతులకు మద్దతు ధర కల్పించడంలోనూ చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారు. ఈ విషయంలో ఒక్కోసారి ఒక్కోలా స్పందించారు. క్వింటాకు రూ.11,600 ఇవ్వాలని కేంద్రాన్ని కోరగా... రూ.10,025 కంటే రూపాయి కూడా ఎక్కువ ఇచ్చేది లేదని కేంద్రానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) తేల్చి చెప్పింది. అయినా మిర్చికి మద్దతు ధర లభించిందని, కేంద్ర మంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. ఏపీలో రేటు పెంచితే దేశం మొత్తం పెంచాల్సి వస్తుందని కేంద్రం చెప్పడంతో... చంద్రబాబు మళ్లీ ఈ విషయం ప్రస్తావించకపోవడం గమనార్హం. ఈ దోబూచులాటల కారణంగా మిర్చి రైతులకు రూ.8,827 కోట్లు నష్టం వాటిల్లింది.సంపద సృష్టిస్తానంటూ ఎన్నికల సమయంలో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆపై యూటర్న్ తీసుకున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన సీఐఐ సదస్సులో పారిశ్రామికవేత్తల ద్వారానే సంపద సృష్టి జరుగుతుందని, వారు పెట్టుబడులు పెడితే తద్వారా వచ్చిన ఆదాయంతో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించొచ్చు అని చెప్పుకొచ్చారు. -
ఎస్ఎల్బీసీ పనులపై ఎలక్ట్రో మ్యాగ్నటిక్ సర్వే
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ తవ్వకం పనులు తిరిగి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. టన్నెల్ ప్రాంతంలోని నేల స్వభావాన్ని కచ్చితంగా అంచనా వేసేందుకు ప్రత్యేక హెలికాప్టర్లతో ఎలక్ట్రో మ్యాగ్నటిక్ సర్వే చేయించాలని నిర్ణయించింది. అందుకోసం తక్కువ ఎత్తులో ఎగిరే సామర్థ్యం గల రక్షణ శాఖకు చెందిన రెండు హెలికాప్టర్లు వినియోగించనున్నారు. సర్వే పరికరాలను డెన్మార్క్ నుంచి ప్రత్యేకంగా తెప్పించనున్నారు. ఈ సర్వేపై బుధవారం నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఆ శాఖ కార్యదర్శి ప్రశాంత్ పాటిల్, సీఈ అజయ్కుమార్లు నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డైరెక్టర్ వీరేంద్ర తివారీ, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ డీజీగా పనిచేసిన హర్పాల్సింగ్, కల్నల్ పరీక్షిత్ మెహ్రాలతో విడివిడిగా భేటీ అయ్యారు. టన్నెల్ పునరుద్ధరణ, సర్వే, నిర్మాణ పనులపై వారితో చర్చించారు. సర్వే కోసం రెండు ప్రత్యేక హెలికాప్టర్లను ఇవ్వాలని కోరగా, రక్షణ శాఖ అధికారులు అంగీకరించినట్లు మంత్రి తెలిపారు. ఎలక్ట్రో మ్యాగ్నటిక్ పరికరాలతో జరిపే సర్వే భూ ఉపరితలం నుంచి ఒక కిలోమీటర్ లోతు వరకు నేల స్వభావంతో పాటు ఇతర సమాచారాన్ని అందిస్తుందని తెలిపారు. నేల స్వభావాన్ని తెలుసుకోవడం ద్వారా నిర్మాణ పనులు సులభతరం అవుతాయని పేర్కొన్నారు. జూలై 12న సర్వే మొదలై వారం రోజుల్లో పూర్తవుతుందని వెల్లడించారు. వచ్చే రెండేళ్లలో టన్నెల్ పనులను పూర్తిచేసి కృష్ణా జలాలను గ్రావిటీ ద్వారా నల్లగొండ జిల్లాకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. టన్నెల్ పనుల పూర్తికోసం కల్నల్ పరీక్షిత్ మెహ్రా డిప్యుటేషన్పై రెండేళ్లపాటు సాగునీటి శాఖలో స్పెషల్ సెక్రటరీ హోదాలో పనిచేస్తారని చెప్పారు. టన్నెల్ తవ్వకాల్లో అపార అనుభవం ఉన్న జనరల్ హర్పాల్ సింగ్ తెలంగాణ ప్రభుత్వానికి జీతం తీసుకోకుండా గౌరవ సలహాదారుగా సేవలు అందిస్తారని వివరించారు. -
యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్-2025 ఫలితాలు విడుదల
సాక్షి,ఢిల్లీ: యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. మే 25న యూపీఎస్సీ ప్రిలిమ్స్ సివిల్స్ పరీక్షలు జరగ్గా.. ఆ ఫలితాలు బుధవారం (జూన్11)న యూపీఎస్సీ విడుదల చేసింది. దీంతో పాటు యూపీఎస్సీ ఫారెస్ట్ ప్రిలిమ్స్ ఫలితాలూ అందుబాటులోకి వచ్చాయి. -
ఏసీ కూలింగ్ ఇకపై 20 డిగ్రీలే!
న్యూఢిల్లీ: ఏసీ లేనిదే నిద్రపట్టని వారు ఎందరో! కూలింగ్ను మాగ్జిమం పెట్టుకుని పడుకుంటే గానీ చాలామందికి రాత్రి తెల్లారదు. అలాంటి వారికి ఇది చేదువార్తే. ఏసీ కూలింగ్కు పరిమితి విధించాలని కేంద్రం తాజాగా నిర్ణయించింది. దానిప్రకారం కూలింగ్ను 20 డిగ్రీల కంటే తగ్గించడం, గరిష్టంగా 28 డిగ్రీల కంటే ఎక్కువ పెట్టుకోవడం కుదరదు. ఈ మేరకు ఏసీ ‘టెంపరేచర్ రేంజ్’ త్వరలో అమల్లోకి రానుంది. ప్రయోగాత్మకంగా ఈ చర్య చేపట్టాలని నిర్ణయించినట్టు కేంద్ర హౌజింగ్, పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ మంగళవారం ప్రకటించారు. తద్వారా మితిమీరిన కరెంటు వాడకానికి అడ్డుకట్ట పడుతుందని ఆశాభావం వెలిబుచ్చారు. ఈ నిబంధన ఇళ్లు, ఆఫీసులతో పాటు కార్లకు కూడా వర్తించనుంది. భారత్లో ప్రస్తుతం ఏసీల చల్లదనాన్ని 16 నుంచి 30 డిగ్రీల దాకా నియంత్రించుకోవచ్చు. -
‘డిప్యూటీ స్పీకర్ పదవి’పై ప్రధానికి మల్లికార్జున ఖర్గే లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభ డిప్యూటీ స్పీకర్ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్లీ లేవనెత్తింది. డిప్యూటీ స్పీకర్ పదవికి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ పదవిని ఖాళీగా ఉంచడం భారత ప్రజాస్వామ్య రాజకీయాలకు మంచి సంకేతం కాదని, ఇది రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమేనని కాంగ్రెస్ అధ్యక్షుడు అన్నారు. జూలై 21 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు ఖర్గే ఈ డిమాండ్ చేశారు.‘లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీకి సంబంధించిన ఆందోళనకరమైన విషయంపై మీ దృష్టిని ఆకర్షించడానికే నేను ఈ లేఖ రాస్తున్నాను’అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రధానికి రాసిన తన లేఖలో పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 93 లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇద్దరినీ ఎన్నుకోవడానికి వీలు కల్పిస్తుంది. రాజ్యాంగపరంగా, డిప్యూటీ స్పీకర్ లోక్సభ స్పీకర్ తర్వాత రెండవ అత్యున్నత ప్రిసైడింగ్ అధికారి. సంప్రదాయంగా లోక్సభ రెండవ లేదా మూడవ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ ఎన్నికవుతారని... లోక్సభలో కార్యనిర్వహణ, విధాన నియమాలలోని 8(1) నిబంధన ప్రకారం డిప్యూటీ స్పీకర్ ఎన్నిక తేదీని స్పీకర్ నిర్ణయిస్తారు అనేది ఒకే తేడా అని ఖర్గే తెలిపారు.మొదటి లోక్సభ నుంచి పదహారవ లోక్సభ వరకు ప్రతి సభలో ఒక డిప్యూటీ స్పీకర్ ఉన్నారని ఖర్గే అన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ సభ్యుల నుంచి డిప్యూటీ స్పీకర్ను నియమించడం ఒక ఆనవాయితీ అని... స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా, ఈ పదవి వరుసగా రెండు లోక్సభ పర్యాయాలు ఖాళీగా ఉందని ఖర్గే విమర్శించారు. పదిహేడవ లోక్సభలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కాలేదని.. ఇదే విధా నం పద్దెనిమిదవ లోక్సభలో కూడా కొనసాగుతోందన్నారు. ఇది భారతదేశ ప్రజాస్వామ్య రాజకీయాలకు మంచి సంకేతం కాదని.. ఇది రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమే అని ఖర్గే ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. అందువల్ల సభ సంప్రదాయాలను, పార్లమెంటు ప్రజాస్వామ్య విలువలను దృష్టిలో ఉంచుకుని, లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియను ఇక ఆలస్యం చేయకుండా ప్రారంభించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు కోరారు. -
అమ్ములపొదిలోకి తేజస్ 2.0
పాకిస్తాన్తో ఉద్రిక్తలు తారస్థాయికి చేరిన వేళ మన వైమానిక పాటవం మరింత బలోపేతం కానుంది. తేలికరకం యుద్ధ విమానం తేజస్ తాలూకు అత్యాధునిక ఎంకే1–ఏ వేరియంట్ ఈ నెలాఖరుకల్లా ఎయిర్ఫోర్స్ అమ్ములపొదిలోకి చేరనుంది. దశలవారీగా మొత్తం 83 విమానాలు సమకూరనున్నాయి. ఇజ్రాయెల్కు చెందిన అత్యాధునిక ఏఈఎస్ఏ (యాక్టివ్ ఎల్రక్టానికలీ స్కాన్డ్ అరే) రాడార్లతో వాటిని అత్యంత బలోపేతంగా తీర్చిదిద్దారు. ఇది ప్రపంచంలోనే అత్యంత మెరుగైన రాడార్ వ్యవస్థ.ఫలితంగా పాశ్చాత్య దేశాలకు చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలకు తీసిపోని సామర్థ్యం తేజస్ ఎంకే1–ఏ సొంతమైనట్టు జెరూసలేం పోస్ట్ వార్తా సంస్థ వెల్లడించింది. ఇవి గతేడాదే అందుబాటులోకి రావాల్సి ఉండగా కీలక విడిభాగాల సరఫరా తదితరాల్లో ఆలస్యం వల్ల జాప్యమైంది. కాలం చెల్లుతున్న మిగ్–21, జాగ్వార్ యుద్ధ విమానాలను పూర్తిగా తేజస్లతో భర్తీ చేయాలని కేంద్రం నిర్ణయించడం తెలిసిందే. ప్రస్తుతం తొలి తరానికి చెందిన 40 తేజస్ యుద్ధ విమానాలు సేవలందిస్తున్నాయి. వాయుసేన వద్ద ప్రస్తుతం 31 ఫైటర్ స్క్వాడ్రన్లు మాత్రమే ఉన్నాయి. వీలైనంత త్వరగా వాటిని కనీసం 42కు పెంచుకోవాలన్నది లక్ష్యం. ఒక్కో స్క్వాడ్రన్లో 16 నుంచి 20 దాకా యుద్ధ విమానాలుంటాయి. ఇవీ ప్రత్యేకతలు ⇒ తేజస్ ఎంకే1–ఏలో అమర్చిన అత్యాధునిక ఏఈఎస్ఏ రాడార్ వ్యవస్థను ఇజ్రాయెల్ ప్రభుత్వ రంగ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్కు చెందిన ఎల్టా సిస్టమ్స్ సంస్థ అభివృద్ధి చేసింది. ⇒ తేజస్లో అమర్చిన అధునాతన ఎల్రక్టానికల్ యుద్ధతంత్ర వ్యవస్థను కూడా ఎల్టాయే సరఫరా చేసింది. ⇒ ఇజ్రాయెల్కే చెందిన ఎల్బిట్ సిస్టమ్స్ రూపొందించిన అత్యాధునిక హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే ఘర్షణల వేళ పైలట్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ⇒ ఏఈఎస్ఏ వ్యవస్థ తదితరాలన్నింటినీ మేకిన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా ఇజ్రాయెల్ భాగస్వామ్యంతో భారత్లోనే తయారు చేశారు. ⇒ తేజస్ ఎంకే1–ఏకు ఇజ్రాయెల్ సమకూర్చిన పలు సాంకేతిక హంగులు ఆ దేశానికే చెందిన పలు యుద్ధవిమానాల్లో కూడా లేకపోవడం విశేషం. ⇒ రఫేల్ యుద్ధ విమానాల్లోని రాడార్ గైడెడ్ డెర్బీ క్షిపణులను తేజస్ఎంకే1–ఏకు అమర్చనున్నారు. ఫలితంగా దాని యుద్ధపాటవం ఎన్నో రెట్లు పెరగనుంది. ⇒ తేజస్ తాలూకు భావి వెర్షన్లు మరింత అధునాతనమైన కానార్డ్ వింగ్స్, ఎల్రక్టానిక్ తదితర వ్యవస్థలు, మరింత మెరుగైన రేంజ్ వంటివాటిని సంతరించుకోనున్నట్టు జెరూసలేం పోస్ట్ తెలిపింది. ⇒ తేజస్ మూడో వెర్షన్లను మరింత ఆధునీకరించేందుకు ప్రభుత్వ రంగ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నిత్యం శ్రమిస్తోంది. ⇒ ఈ నేపథ్యంలో వాటికి అవసరమైన అధునాతన సాంకేతిక వ్యవస్థల సరఫరా కాంట్రాక్టుల కోసం ఇజ్రాయెల్తో పాటు ఫ్రాన్స్, అమెరికా ఆయుధ కంపెనీలు పోటీపడుతున్నాయి. -
‘జాతీయ భద్రతా సలహా మండలి’సభ్యుడిగా సతీశ్ రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: డీఆర్డీఓ మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ జి.సతీశ్ రెడ్డిని జాతీయ భద్రతా మండలి సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నేతృత్వంలో ‘జాతీయ భద్రతా సలహా మండలి’లో సభ్యుడిగా మంగళవారం నుంచి రెండేళ్ల పాటు, అంటే 2027 జూన్ 9వ తేదీ వరకు సతీశ్రెడ్డి కొనసాగనున్నారు. ఈ మేరకు జాతీయ భద్రతా మండలి సచివాలయ డిప్యూటీ సెక్రటరీ పుష్పేందర్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు జిల్లాలోని మహిమలూరులో 1963 జూలై 1న జన్మించిన సతీశ్ రెడ్డి 1986లో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ లేబొరేటరీలో శాస్త్రవేత్తగా ఉద్యోగంలో చేరారు.ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్లో అనంతపురం జేఎన్టీయూ నుంచి పట్టభద్రుడయ్యారు. అనంతరం హైదరాబాద్ జేఎన్టీయూలో ఎంఎస్, పీహెచ్డీ పూర్తి చేశారు.పరిశోధనా సంస్థ ఇమారత్ (ఆర్సీఐ) డైరెక్టర్గా పనిచేశారు. ఈ కాలంలో ఐఆర్ సీకర్స్, ఇంటిగ్రేటెడ్ ఏవి యానిక్స్ మాడ్యూల్స్, ఇతర వినూత్న వ్యవస్థల అభి వృద్ధిని పర్య వేక్షించారు. 2015 లో రక్షణ మంత్రి సాంకేతిక సలహా దా రుగా నియమి తులయ్యారు.2018 ఆగస్టు లో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవల ప్మెంట్ ఆర్గనై జేషన్ (డీఆర్ డీవో) 13వ చైర్మన్గా నియమితులయ్యారు. క్షిపణులు, వ్యూహాత్మక వ్యవస్థల అభివృద్ధి డైరెక్టర్ జనరల్గా ఇండియన్ బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ ప్రోగ్రామ్ను పర్యవేక్షించారు. నాగ్, క్యూఆర్ఎస్ఏఎం, రుద్రమ్, దీర్ఘశ్రేణి గైడెడ్ బాంబ్ల అభివృద్ధిలో కీలక భూమిక పోషించారు. విజయవంతమైన పృథ్వీ డిఫెన్స్ వెహికిల్ తొలి పరీక్షను పర్యవేక్షించారు. 2018 నుంచి 2022 డీఆర్డీవో చైర్మన్గా సేవలందించారు. -
అఖిలపక్ష బృందాలకు ప్రధాని మోదీ ప్రశంస
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాలు, పాక్ ఉగ్రవాద విష సంస్కృతిని ప్రపంచదేశాల ఎదుట ప్రభావవంతంగా ఎండగట్టినందుకు అఖిలపక్ష బృందాలను ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. 50 మందికిపైగా సభ్యులతో ఏడు బృందాలుగా బయల్దేరి అత్యంతప్రధానమైన దేశాల్లో పర్యటించి పాక్ వైఖరిపై దునుమాడి తిరిగొచ్చిన అఖిలపక్ష సభ్యులను ప్రధాని మోదీ మంగళవారం సాయంత్రం ఢిల్లీలో 7, లోక్కళ్యాణ్మార్గ్లోని తన అధికార నివాసంలో కలిశారు. వారి విదేశీ పర్యటన వివరాలను స్వయంగా అడిగి తెల్సుకున్నారు.అంతర్జాతీయ వేదికపై భారత దృఢవైఖరిని, పాక్ దుష్టనీతిని అత్యంత ప్రభావవంతంగా తెలియజెప్పినందుకు వారందరినీ ప్రధాని ప్రశంసించారు. ఈ సందర్భంగా సభ్యులు తమ పర్యటన అనుభవాలు, విశేషాలను ప్రధానితో పంచుకున్నారు. ‘‘ ఉగ్రవాదాన్ని అంతంచేసి శాంతిస్థాపనకు భారత్చేస్తున్న కృషిని, భారత్పై పాక్ చిమ్ముతున్న ఉగ్రవిషాన్ని ప్రపంచదేశాలకు తెలియజేప్పేందుకు పర్యటనకు వెళ్లివచ్చిన అఖిలపక్ష బృందాలతో భేటీ అయ్యా. భారత వాణిని బలంగా వినిపించినందుకు మేమంతా ఎంతగానో గర్వపడుతున్నాం’’ అని తర్వాత మోదీ తన సామాజిక మాధ్యమ ఖాతా ‘ఎక్స్’లో ఒక పోస్ట్చేశారు.రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పాండా(బీజేపీ), శశిథరూర్(కాంగ్రెస్), కనిమొళి(డీఎంకే), శ్రీకాంత్ శిందే(శివసేన), సంజయ్ కుమార్ ఝా(జేడీయూ), సుప్రియా సూలే (ఎన్సీపీ–ఎస్పీ)ల సారథ్యంలోని ఏడు అఖిలపక్ష పార్లమెంటరీ బృందాలు 33 దేశాల రాజధాని నగరాలు, యురోపియన్ యూనియన్లో పర్యటించడం తెల్సిందే. భేటీలు సత్ఫలితాలనిచ్చాయి: శశిథరూర్ అమెరికాతోపాటు మరో నాలుగు దేశాల పర్యటనకు సారథ్యంవహించిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అంతకుముందు మీడియాతో మాట్లాడారు. ‘‘ భేటీ అద్భుతమైన సత్ఫలితాల నిచ్చింది. రాజకీయాలకు అతీతంగా ఎంపీలను పంపి భారత ఐక్యతను ప్రభుత్వం చాటింది. అందుకు తగ్గట్లే భేటీలన్నీ ఫలవంతమయ్యాయి. మా లక్ష్యం నెరవేరింది. పహల్గాం దాడి తర్వాత భారత్ ఎందుకు ఉగ్ర, పాక్ స్థావరాలపై దాడిచేసిందో బలంగా వినిపించాం. ఆయాదేశాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఉన్నతాధికారులు, మీడియా సైతం భారత్కు మద్దతు పలికారు’’ అని శశిథరూర్ అన్నారు.‘‘ ఉగ్రవాదం విషయంలో భారత దేశ ఐక్యతను చాటడంతోపాటు భారత వాణిని ప్రపంచదేశాలకు బలంగా వినిపించే లక్ష్యంతో ఈ బృందాలు 30కిపైగా దేశాల్లో పర్యటించాయి’’ అని తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదలచేసింది. ఇప్పటికే ఈ బృందాల కృషిని భారత విదేశాంగ శాఖ పొగిడింది. ఇప్పటికే ఈ బృందాలతో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ విడివిడిగా భేటీ అయ్యారు. అమెరికా, యూరప్, పశ్చిమాసియా, ఆఫ్రికా, ఆగ్నేయాసియాలో ఒక్కో బృందం పర్యటించింది. -
టీపీసీసీ జంబో కార్యవర్గం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)లో కొత్తగా 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శులను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఈ పదవుల్లో సామాజిక న్యాయానికి, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చింది. 27 మంది ఉపాధ్యక్షులలో బీసీలకు 8, ఎస్సీలకు 5, ఎస్టీలకు 2, ముస్లింలకు 3 పదవులు ఇచ్చారు. 67 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలకు ఇచ్చారు. అలాగే 69 ప్రధాన కార్యదర్శి పదవులలో బీసీలకు అత్యధికంగా 26, ఎస్సీలకు 9, ఎస్టీలకు 4, ముస్లింలకు 8 పదవులు ఇచ్చారు. ఇందులో 68 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పదవులు దక్కాయి.సోమవారం ఢిల్లీకి వచి్చన సీఎం ఎ.రేవంత్రెడ్డి ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో చర్చల అనంతరం కార్యవర్గ జాబితాను ఖరారు చేశారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమోదించిన జాబితాను సోమవారం రాత్రి పార్టీ విడుదల చేసింది. నల్లగొండ ఎంపీ రఘువీర్రెడ్డితోపాటు ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ పీసీసీ ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. 69 మంది ప్రధాన కార్యదర్శుల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, పరి్ణకారెడ్డి, డా.మట్ట రాగమయిలకు అవకాశం ఇచ్చారు. మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చోప చర్చలు మంత్రివర్గ విస్తరణలో కొత్తగా ముగ్గురు మంత్రులు అధికారం చేపట్టడంతో వారికి కేటాయించాల్సిన శాఖలపై కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. క్షేత్రస్థాయిలో ఉన్న అనుభవం దృష్టా వీరికి ఏయే శాఖలు కేటాయించాలన్న అంశంపై చర్చించారు. సీఎం వద్దే హోం, న్యాయ, మున్సిపల్, విద్య, మైనింగ్ వంటి కీలక శాఖలు ఉన్నందున వాటిని కొత్త మంత్రులకు కేటాయించే అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. అదే సమయంలో ఖాళీగా ఉన్న మరో మూడు స్థానాల్లో మంత్రులుగా ఎవరిని తీసుకోవాలన్న దానిపై చర్చించారు. మంత్రి పదవులు ఆశిస్తున్న సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ప్రేమ్సాగర్ రావు, మల్రెడ్డి రంగారెడ్డిలతో పాటు ఇద్దరు మైనార్టీ నేతల పేర్లపైనా చర్చ జరిగినట్లు సమాచారం. వీటితో పాటే చీఫ్ విప్, రెండు విప్ల పదవుల భర్తీపైన చర్చ జరిగింది. చీఫ్ విప్ పదవిని రెడ్డి లేదా వెలమ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేకు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారని తెలిసింది. టీపీసీసీ ఉపాధ్యక్షులు 1) టి.కుమార్ రావు 2) కె.రఘువీర్ రెడ్డి, ఎంపీ 3) నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్యే 4) డా. చిక్కుడు వంశీ కృష్ణ, ఎమ్మెల్యే 5) బల్మూర్ వెంకట్, ఎమ్మెల్సీ 6) బస్వరాజు సారయ్య, ఎమ్మెల్సీ 7) హనుమాండ్ల ఝాన్సీరెడ్డి 8) బండి రమేశ్ 9) కొండ్రు పుష్పలీల 10) కోట నీలిమ 11) బి. కైలాష్ కుమార్ 12) నమిండ్ల శ్రీనివాస్ 13) ఆత్రం సుగుణ 14) గాలి అనిల్ కుమార్ 15) చిట్ల సత్యనారాయణ 16) లకావత్ ధన్వంతి 17) ఎం. వేణుగౌడ్ 18) కోటంరెడ్డి వినయ్ రెడ్డి 19) కొండేటి మల్లయ్య 20) ఎం.ఏ.ఫహీమ్ (సంగారెడ్డి) 21) ఎస్. సురేష్ కుమార్ 22) బొంతు రామ్మోహన్ 23) అఫ్సర్ యూసుఫ్ జాహీ 24) ఎస్. జగదీశ్వర్ రావు 25) నవాబ్ ముజాహిద్ ఆలంఖాన్ 26) గుమ్ముల మోహన్ రెడ్డి 27) చిన్నపటాల సంగమేశ్వర్ పీసీసీ ప్రధాన కార్యదర్శులు 1) వెడ్మ బొజ్జు, ఎమ్మెల్యే 2) సీహెచ్ పరి్ణకా రెడ్డి, ఎమ్మెల్యే 3) డా.మట్ట రాగమయి, ఎమ్మెల్యే 4) సీహెచ్.రాంభూపాల్ 5) ఏ. సంజీవ్ ముదిరాజ్ 6) బొజ్జా సంధ్యా రెడ్డి 7) మల్లాది రాంరెడ్డి 8) అబ్దేశి సదాలక్ష్మి 9) ఎం. బేబి స్వర్ణ కుమారి 10) దారాసింగ్, తాండూరు 11) జి. శశికళా యాదవ రెడ్డి 12) ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి 13) ముహమ్మద్ అబ్దుల్ ఫహీమ్ 14) సంతోష్ కుమార్ రుద్ర 15) దుర్గం భాస్కర్ 16) ముహమ్మద్ ఖాజా ఫఖ్రుద్దీన్ 17) వి.జగదీశ్వర్ గౌడ్ 18) నరేశ్ జాదవ్ 19) అల్లం భాస్కర్ 20) డా. గిరిజ షెట్కార్ 21) కొప్పుల ప్రవీణ్ కుమార్ 22) ఏ. జంగా రెడ్డి 23) కస్బా శ్రీనివాస్ రావు 24) దుడ్డిల్ల శ్రీనివాస్ 25) బద్దం ఇంద్రకరణ్ రెడ్డి 26) చరగాని దయాకర్ 27) పీసారి మహిపాల్ రెడ్డి 28) గజ్జెల కాంతం 29) ఏడుపుగంటి సుబ్బా రావు 30) చకిలం రాజేశ్వర్రావు 31) ఎర్ల కొమరయ్య 32)డా.ఏ.రవిబాబు 33) నాగ సీతారాములు 34) సనెం శ్రీనివాస్ గౌడ్ 35) పృథ్వి చౌదరి వేణుల 36) అంబడి రాజేశ్వర్ 37) డి.డి.వెంకట్ రాజ్ 38) బొడ్డిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 39) పల్లె శ్రీనివాస్ గౌడ్ 40) మొహమ్మద్ సబీర్ అలీ 41) కట్ల రంగారావు 42) పి. శ్రీనివాస్ రెడ్డి 43) మడు సత్యనారాయణ గౌడ్ 44) టోపాజీ అనంత కిషన్ 45) వి. రామారావు గౌడ్ 46) అచ్యుత్ రమేష్ బాబు 47) పెద్దనొల్ల బాలమురళీ కృష్ణ (చిన్న) 48) ఎం. రాజీవ్ రెడ్డి 49) ఆదంరాజ్ దేకపాటి 50) షమీం ఆఘా 51) ఈ.వి.శ్రీనివాస్ రావు 52) మిథున్ రెడ్డి 53) అమొగోత్ వెంకటేశ్ పవార్ 54) రాయగిరి కల్పనా యాదవ్ 55) రాజేష్ కాశిపాక 56) రహమత్ హుస్సేన్ 57) పి. ప్రసన్న కుమార్ శర్మ 58) ముహమ్మద్ అసదుద్దీన్ 59) నందిమల్ల యాదయ్య ముదిరాజ్ 60) దైదా రవీందర్ 61) ఉప్పల శ్రీనివాస్ గుప్తా 62) గడ్డం చంద్రశేఖర్ రెడ్డి 63) జి. నాగభూషణం 64) ఉపేందర్ రెడ్డి 65) ధర్మారావు 66) నూతి సత్యనారాయణ గౌడ్ 67) దుర్గాప్రసాద్ 68) డా. సి. వేంకటగోవింద్ రావు 69) పెండ్లి శ్రీనివాసులు రెడ్డి -
ఐఈడీ పేలి ఏఎస్పీ ఆకాష్ రావు దుర్మరణం
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా బస్తర్లో దారుణం జరిగింది. భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి అడిషనల్ ఎస్పీ మరణించారు. మరో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. గత మే నెలలో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు సహా 27 మంది మృతి, ఆపరేషన్ కగార్ను నిరసిస్తూ ఆ పార్టీ జూన్10న దేశవ్యాప్తంగా బంద్ పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు మే 11 నుంచి ఆగస్టు 3 వరకు స్మారక సభలు నిర్వహించాలని తెలిపింది.భారత్ బంద్ పిలుపుతో మావోయిస్టులు ఎక్కువ ఉండే బస్తర్లో ఈరోజు తెల్లవారుజామున కొంటా-ఎర్రబోర్ రోడ్డులోని దొండ్రా గ్రామం సమీపంలో సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహించేందుకు అడిషనల్ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) ఆకాష్ రావు గిరిపుంజే, ఇతర పోలీసు సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహించేందుకు వెళ్లారు. అప్పటికే భద్రతా బలగాల్ని నిలువరించేందుకు సిద్ధంగా ఉన్న మావోయిస్టులు పెట్రోలింగ్ చేసేందుకు వచ్చిన ఏఎస్పీ ఆకాష్ రావు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఐఈడీతో పేల్చారు.ఈ ఘటనలో ఏఎస్పీతో పాటు ఇతర భద్రతా బలగాలు తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన రెస్క్యూ టీం గాయపడ్డ బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద స్థాయి తీవ్రంగా ఉండడంతో ఏఎస్పీని ఎయిర్లిఫ్ట్లో మరో ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఏఎస్పీ మృతి చెందారు. మిగిలిన భద్రతా బలగాల ఆరోగ్యం స్థిమితంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
ప్రాణం తీసిన ఫుట్బోర్డు ప్రయాణం
ముంబై: మహారాష్ట్రలోని థానే జిల్లాలో సోమవారం జరిగిన ప్రమాదంలో జీఆర్పీ కానిస్టేబుల్ సహా నలుగురు రైలు ప్రయాణికులు మరణించారు. మరో 9 మంది గాయపడ్డారు. ఉదయంపూట కిక్కిరిసిన రైళ్లలో నిర్లక్ష్యంగా ప్రయాణించడమే ఇందుకు కారణం. ముంబ్రా రైల్వే స్టేషన్సమీపంలో ఈ ఘటన జరిగింది. రెండు రైళ్లలో జనం కిక్కిరిసిపోయి ఉన్నారు. వీపులకు భారీ బ్యాగులు తగిలించుకొని డోర్ల వద్ద ఫుట్బోర్డులపై వేలాడుతూ ప్రయాణిస్తున్నారు. వీటిలో ఒక రైలు కాసారా వైపు, మరొకటి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వైపు వెళ్తోంది. ఈ రెండు రైళ్లు పక్కపక్కనున్న పట్టాలపై పరస్పరం వ్యతిరేక దిశలో వచ్చిన సమయంలో మూలమలుపు వద్ద ప్రయాణికుల బ్యాగులు పరస్పరం ఢీకొన్నాయి. దాంతో మొత్తం 13 మంది వెంటనే కిందపడిపోయారు. వీరిలో నలుగురు తీవ్రంగా గాయపడి మృతి చెందారని రైల్వే అధికారులు ప్రకటించారు. బాధితులను కేతన్ సరోజ్, రాహుల్ గుప్తా, మయూర్ షా, జీఆర్పీ కానిస్టేబుల్ విక్కీ ముఖ్యాద్గా గుర్తించారు. రైళ్లకు అటోమేటిక్ డోర్లు లేకపోవడం ప్రాణాంతకంగా మారిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో రైళ్లకు ఆటోమేటిక్ డోర్లు ఏర్పాటు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించినట్లు అధికారి దిలీప్ కుమార్ చెప్పారు. ప్రయాణికులు లోపలికి వెళ్లగానే డోర్లు వాటంతట ఆవే మూసుకుపోయేలా రైలు బోగీలను డిజైన్ చేయనున్నట్లు వెల్లడించారు. ముబ్రా రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేయాలని రైల్వే శాఖను కోరనట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం ఇవ్వనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. Maharashtra | Some passengers travelling towards CSMT fell from the train at Thane's Mumbra railway station. The reason for the accident is believed to be excessive crowd in the train. The railway administration and police have reached the spot. The injured are being taken… pic.twitter.com/UMBq41jcvm— ANI (@ANI) June 9, 2025 -
ఢిల్లీలో స్వల్ప భూకంపం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో శనివారం అర్థరాత్రి దాటాక స్వల్ప భూకంపం సంభవించింది. ఈ విషయం కాస్తంత ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. అర్థరాత్రి దాటాక 1.23 గంటలకు రిక్టర్ స్కేల్పై 2.3 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించింది. ఆగ్నేయ ఢిల్లీలో ఉపరితలం నుంచి 5 కిలోమీటర్ల లోతులో భూకంపకేంద్రాన్ని గుర్తించారు. భూమి కేవలం స్వల్పస్థాయిలో కంపించడంతో ఎలాంటి ఆస్తినష్టం సంభవించలేదు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టంచేశారు. ఈ ఏడాది ఢిల్లీ కేంద్రంగా భూకంపం రావడం ఇది రెండోసారి. ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం 5.36 గంటలకు రిక్టర్ స్కేల్పై 4 తీవ్రతతో భూమి కంపించింది. ప్రస్తుతం ఢిల్లీ నాలుగో జోన్లో ఉంది. ఇది దేశంలోని భూకంపాల ప్రభావాలకు లోనయ్యే రెండో తీవ్ర ప్రమాదజోన్. హిమాలయాల కింద పొరలు తరచూ ఢీకొనే జోన్కు ఢిల్లీ దగ్గర్లో ఉంది. అదీకాకుండా ఢిల్లీ నుంచి కేవలం 250 కిలోమీటర్ల దూరం నుంచే హిమాలయ శ్రేణి మొదలవుతుంది. ఢిల్లీ–హరిద్వార్, సోహ్నా, మహేంద్రగఢ్–డెహ్రాడూన్ ఫలకాలు సైతం తరచూ కదులుతూ ఢిల్లీని భూకంపాల జోన్లోకి నెట్టేస్తున్నాయి. దీంతో ఢిల్లీకి భూకంపాల ముప్పు ఎక్కువైంది. -
అనుమానాలుంటే హైకోర్టుకు వెళ్లండి
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి కొట్టిపారేసింది. అందుకు ఆస్కారమే లేదని పేర్కొంది. ‘‘ఎన్నికల ప్రక్రియపై అనుమానాలుంటే నేరుగా మాకు లేఖ రాయండి. బదులిస్తాం. అవకతవకలు జరిగినట్లు భావిస్తే హైకోర్టుకు వెళ్లొచ్చు. మహారాష్ట్ర పోలింగ్ కేంద్రాల సీసీటీవీ ఫుటేజీ కావాలంటూ పిటిషన్ దాఖలు చేయవచ్చు. అప్పుడు ఫుటేజీని న్యాయస్థానం క్షుణ్నంగా పరిశీలిస్తుంది’’ అని ఈసీ వర్గాలు ఆదివారం స్పష్టం చేశాయి. ఎన్నికల చట్టాల ప్రకారం ఎన్నికల సమగ్రత, ఓటర్ల గోప్యతను ఈసీ కచ్చితంగా పరిరక్షిస్తుందని తెలిపాయి. ఓటర్ల గోప్యతపై దాడి చేయాలనుకోవడం సరైంది కాదని సూచించాయి. మహారాష్ట్రలో ఓటర్ల జాబితాను తారుమారు చేశారంటూ రాహుల్ చేసిన ఆరోపణలను ఖండించాయి. కాంగ్రెస్ అభ్యర్థులు స్వయంగా నియమించిన బూత్స్థాయి ఏజెంట్లు, పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్లను రాహుల్ అనుమానిస్తున్నారని ఆక్షేపించాయి. అసెంబ్లీ ఎన్నికలపై అనుమానాలు నివృత్తి చేయడానికి గత నెల 15న కాంగ్రెస్ నేతలను ఆహ్వానిస్తే ఎవరూ రాలేదని పేర్కొన్నాయి. ఎన్నికల్లో ప్రతికూల తీర్పు వస్తే ఎన్నికల సంఘాన్ని తప్పుపట్టడం అసంబద్ధమని స్పష్టంచేశాయి.ప్రజాతీర్పు అపహాస్యం: ఫడ్నవీస్ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిందీ సమీక్ష చేసుకోకుండా ప్రజాతీర్పును రాహుల్ అపహాస్యం చేస్తున్నారని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్ను తిరస్కరించడాన్ని తట్టుకోలేక నిందలు వేస్తున్నారని ఆదివారం ఓ ఆంగ్ల పత్రికకు రాసిన వ్యాసంలో ఆరోపించారు. శనివారం రాహుల్ కూడా అదే పత్రికకు రాసిన వ్యాసంలో మహారాష్ట్ర ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ ఆరోపణలు చేయడం తెలిసిందే. ‘‘మ్రహారాష్ట్రలో భారీగా బోగస్ ఓటర్లను చేరి్పంచారని, సాయంత్రం ఓటింగ్ శాతం అకస్మాత్తుగా పెరిగిందని అనడం పెద్ద జోక్. యువ ఓటర్ల సంఖ్య పెరగడం మామూలే. క్యూ నుంచున్న వారిని సమయం ముగిసినా ఓటేసేందుకు అనుమతి స్తారని తెలియదా?’’ అని ప్రశ్నించారు. -
6,133కు కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉధృతి పెరుగుతూనే ఉంది. మొత్తం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 6,133కు చేరుకుంది. గత 48 గంటల్లో 769 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించింది. అలాగే గత 24 గంటల్లో ఆరుగురు బాధితులు మరణించినట్లు తెలియజేసింది. కేరళ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో అత్యధిక యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా కరోనా వల్ల 65 మందికిపైగా మంది మృతి చెందారు. కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా నిర్ధారణ పరీక్షలు, బాధితులకు వైద్య చికిత్స అందించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. -
ఢిల్లీ ఎయిర్పోర్టులో ఒక రన్వే మూసివేత
సాక్షి, న్యూఢిల్లీ: స్వల్ప మరమత్తులుసహా ఆధునీకరణ పనుల్లో భాగంగా దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 28/10 నంబర్ రన్వేను మూసివేయనున్నారు. దీంతో రోజూ కనీసం 200 విమానసర్వీసులు రద్దుకా నున్నాయి. ఇందులోభాగంగా 114 విమానసర్వీస్ లను క్యాన్సల్చేసి మరో 86 విమానాలను రీషెడ్యూల్ చేయనున్నారు. జూన్ 15వ తేదీ నుంచి మూడు నెలలపాటు అంటే సెప్టెంబర్ 15వ తేదీదాకా రన్వే పై ల్యాండింగ్, టేకాఫ్లను నిలిపివేయనున్నట్లు ఎయిర్పోర్ట్ నిర్వహణ సంస్థ అయిన ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(డీఐఏఎల్) శుక్రవారం ప్రకటించింది. కేటగిరీ(క్యాట్)3బీ ప్రమాణాలకు అనుగుణంగా రన్వేపై ఆధునిక మౌలిక వసతులను ఏర్పాటుచేయనున్నారు. గాల్లోంచి కిందకు దిగుతూ 15 మీటర్ల ఎత్తుకు చేరుకున్నాక కూడా విమాన పైలెట్కు మంచు, వర్షం వంటి పరిస్థితుల్లో రన్వే స్పష్టంగా కనబడకపోతే ల్యాండింగ్ చేయడం కష్టం. ఇలాంటి పరిస్థితుల్లోనూ ల్యాండింగ్ సాధ్యమయ్యేలా రన్వే వెంట అప్రోచ్, టచ్డౌన్ లైట్లు, అధునాతన సిగ్నల్, వాయిస్ ప్రాప్ట్ల వ్యవస్థలను ఏర్పాటుచేస్తారు. నెలల తరబడి ఏకధాటిగా ఒకే ప్రాంతంలో వందల విమానాల ల్యాండింగ్ కారణంగా దెబ్బతిన్న రన్వే ప్రాంతాన్ని పునరుద్ధరించనున్నారు. -
ఢిల్లీ సీఎం రేఖా గుప్తాను చంపేస్తానంటూ బెదిరింపులు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాను హత్య చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడిన శ్లోక్ త్రిపాఠి అలియాస్ శ్లోక్ తివారీ(30) అనే వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అతడు మద్యం మత్తులో బెదిరింపులకు దిగినట్లు గుర్తించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టి, ఘజియాబాద్లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. శ్లోక్ త్రిపాఠి ఎల్ఎల్బీ చదివాడు. యూపీలోని ఘజియాబాద్ కోర్టులో డాక్యుమెంట్ రైటర్గా పని చేస్తున్నాడు. 2020లో పెళ్లి చేసుకున్నాడు. గత ఏడాది భార్య అతడిని వదిలేసి, ఢిల్లీకి వెళ్లిపోయింది. భర్త తాగుడు వ్యసనం భరించలేక దూరంగా ఉంటోంది. మళ్లీ ఎలాగైనా భార్యతో కలిసి జీవించాలని శ్లోక్ త్రిపాఠి నిర్ణయించుకున్నాడు. ఆమె వినకపోవడంతో పోలీసుల సాయం తీసుకోవాలని భావించాడు. గురువారం, శుక్రవారం రాత్రిపూట చిత్తుగా మద్యం సేవించి, 112 ఎమర్జెన్సీ హెల్ప్లైన్ నెంబర్కు పదేపదే ఫోన్ చేశాడు. తన భార్యను తనతో కలపాలని పోలీసులను కోరాడు. వారు పట్టించుకోకపోవడంతో ఢిల్లీ ముఖ్యమంత్రిని రేఖా గుప్తాను చంపేస్తానంటూ హెచ్చరించాడు. దాంతో ఘజియాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ పోలీసులకు సమాచారం చేరవేశారు. ఇరు రాష్ట్రాల పోలీసులు అతడి కోసం ఉమ్మడిగా గాలింపు చర్యలు ప్రారంభించారు. ఘజియాబాద్లో అరెస్టు చేశారు. మరోవైపు సీఎం రేఖా గుప్తా భద్రతను మరింత పెంచారు. -
10 శాతం చికెన్ తెలంగాణదే
దేశంలో కోడి మాంసం (చికెన్) ఉత్పత్తిలో తెలంగాణ 5వ స్థానంలో నిలిచింది. 2023–24 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 50.19 లక్షల టన్నుల చికెన్ ఉత్పత్తి అయ్యింది. అందులోతెలంగాణలో 10 శాతం.. అంటే 5.10 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది. 7.56 లక్షల టన్నులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత పశ్చిమబెంగాల్ 6.75 లక్షల టన్నులు, హరియాణాలో 6.36 లక్షల టన్నులు, తమిళనాడులో 5.58 లక్షల టన్నుల చికెన్ ఉత్పత్తి అయ్యింది. కాగా, రాజస్తాన్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, గుజరాత్, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాల్లో చికెన్ వినియోగం అతి తక్కువగా ఉంది. ఇటీవల కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఎన్వీ స్టాట్స్ ఇండియా–2025 నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. – సాక్షి, న్యూఢిల్లీఏడాదిలో కోటి టన్నుల మాంసం దేశవ్యాప్తంగా 2023–24 సంవత్సరంలో అన్నిరకాల మాంసాలు కలిసి 1.02 కోట్ల టన్నుల ఉత్పత్తి జరిగింది. అందులో అత్యధికంగా చికెన్ ఉత్పత్తి ఉంది. ఆంధ్రప్రదేశ్లో 10.67 లక్షల టన్నులు, తెలంగాణలో 11.12 లక్షల టన్నుల మాంసం ఉత్పత్తి జరిగింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా 1.84 కోట్ల టన్నుల చేపల ఉత్పత్తి జరగ్గా, 51.58 లక్షల టన్నులతో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. 2015–16లో ఏపీలో చేపల ఉత్పత్తి 23.52 లక్షల టన్నులు మాత్రమే. అదే సమయంలో తెలంగాణలో 4.56 లక్షల టన్నులు చేపలు ఉత్పత్తి అయ్యాయి. స్వల్పంగా పెరిగిన సాగుభూమి దేశంలో 2019–20 సంవత్సరంలో మొత్తం 21.13 కోట్ల హెక్టార్లలో పంటలు పండగా, 2022–23 నాటికి స్వల్పంగా పెరిగి 21.93 కోట్ల హెక్టార్లకు పెరిగాయి. దేశంలో 2022–23లో సాగుయోగ్యం కాని భూమి 4.43 కోట్ల హెక్టార్లు ఉంది. 1996–97లో దేశంలో 7.60 కోట్ల హెక్టార్ల స్థూల నీటిపారుదల ప్రాంతం ఉండగా... 2022–23 నాటికి 12.22 కోట్ల హెక్టార్లకు పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో సాగుచేసిన మొత్తం భూమిలో 25,876 హెక్టార్లు సేంద్రియ ప్రాంతం ఉండగా, 37,801 హెక్టార్లు కన్వర్టెడ్ ప్రాంతం ఉంది. తెలంగాణలో మొత్తం సాగు చేసిన భూమిలో కేవలం 5,399 హెక్టార్లు సేంద్రియ ప్రాంతం, 79,465 హెక్టార్లు కన్వర్టెడ్ ప్రాంతం ఉందని సర్వేలో తేలింది. సర్వేలోని మరికొన్ని అంశాలు.. » 1950–51లో దేశంలో 10.11 కోట్ల హెక్టార్లలో ఆహార పంటలు సాగు చేయగా... 2023–24 నాటికి 13.21 కోట్ల హెక్టార్లకు పెరిగింది. ఇందులో అత్యధికంగా 10.43 కోట్ల హెక్టార్లలో తృణధాన్యాలు, చిరుధాన్యాల సా గు ఉంది. ఆ తర్వాత స్థానంలో 4.78 కోట్ల హెక్టార్లలో వరి సాగైంది. 137.8 మిలియన్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగింది. » దేశ భూభాగంలో 21.76% విస్తీర్ణంలో అడవులు వ్యాపించి ఉన్నా యి. 2015లో 7,64,566 చదరపు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం ఉండగా.. 2023 నాటికి 7,75,377 చ.కి.మీలకు పెరిగింది. అత్యధికంగా మధ్యప్రదేశ్లో 94,689 చ.కి.మీ. అటవీ ప్రాంతం ఉంది. » 2015 నుంచి 2023 వరకు ఆంధ్రప్రదేశ్లో 37,258 చ.కి.మీ.మేర మొత్తం అటవీ ప్రాంతం ఉండగా.. దట్టమైన అడవుల విస్తీర్ణం 26,006 చ.కి.మీ. నుంచి 30,084 చ.కి.మీ.లకు పెరిగింది. అదే సమయంలో తెలంగాణలో మొత్తం అటవీ ప్రాంతం 26,904 చ.కి.మీ. నుంచి 27,688 చ.కి.మీ.కు అటవీ ప్రాంతం పెరిగింది. దట్టమైన అటవీ విస్తీర్ణం 19,854 చ.కి.మీ. నుంచి 21,179 చ.కి.మీ.లకు విస్తరించింది. » దేశవ్యాప్తంగా హైడ్రో, థర్మల్, న్యూక్లియర్, పునరుత్పాదక శక్తి వనరుల ద్వారా 1947లో 4,073 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కాగా, 2023–24 నాటికి 17,34,375 గిగావాట్లకు పెరిగింది. ఇందులో అత్యధికంగా 13,26,549 గిగావాట్లు థర్మల్ విద్యుత్ ఉంది. -
Covid: 5 వేలు దాటిన కోవిడ్ కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా కోవిడ్-19 యాక్టివ్ కేసుల సంఖ్య 5 వేలు దాటింది. గత 24 గంటల్లో నాలుగు కోవిడ్ మరణాలు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాలతో ప్రకటించింది.నిన్న కోవిడ్ కేసుల సంఖ్య 4,866 ఉండగా.. గత 24 గంటల్లో 500 కేసులు కొత్తగా నమోదు అయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 5,364కి చేరింది. ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్లో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దేశం మొత్తం మీది కేరళలోనే ఏకంగా 1, 679 కేసులు నమోదు కావడం గమనార్హం. గత 24 గంటల్లోనే అక్కడ 192 కొత్త కేసులు బయటపడ్డాయి.తాజాగా నాలుగు కోవిడ్ మరణాలు సంభవించగా.. గత 24 గంటల్లో కేరళలో ఇద్దరు మరణించారు. పంజాబ్, కర్ణాటకలో ఒకరి చొప్పున కోవిడ్తో మరణించారు. అయితే.. వైరస్ ప్రభావం మునుపటి స్థాయి తీవ్రతతో లేదని.. జలుబు, జ్వరం, నొప్పులతో మూడు, నాలుగు రోజుల్లో పేషెంట్లు కోలుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. అయినప్పటికీ వృద్ధులు, పిల్లలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఫంక్షన్లలో తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు ప్రజలకు సూచిస్తున్నారు. ఇక కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లోని ఆస్పత్రుల్లో కరోనా ప్రత్యేక వార్డుల్లో పడకల సంఖ్య పెంచుతున్నారు. జులై 2024 నుంచి ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. సుమారు 73 దేశాల్లో 11 శాతం కేసుల పెరుగుదల కనిపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అయితే కరోనా వైరస్ ఒమిక్రాన్ ఎన్బీ.1.8.1 వేరియెంట్ వైరస్ వ్యాప్తికి కారణమని డబ్ల్యూహెచ్వో చెబుతోంది. -
జమ్మూ కశ్మీర్: చీనాబ్ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి తర్వాత తొలిసారిగా జమ్మూ కశ్మీర్లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ప్రపంచంలోనే అతి ఎత్తైన ఐకానిక్ చీనాబ్ రైల్వే బ్రిడ్జిని ఆయన ప్రారంభించారు.. చీనాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో ఆర్క్ బ్రిడ్జి నిర్మించారు. 1,315 మీటర్ల పొడవైన స్టీల్ బ్రిడ్జ్ ఒక ఇంజనీరింగ్ అద్భుతం. రైల్వే బ్రిడ్జిని ప్రధాని మోదీ శుక్రవారం.. జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో జమ్మూ కశ్మీర్ సీఎం ఓమర్ అబ్దుల్లా, రైల్వేమంత్రి అశ్విన్ వైష్ణవ్ పాల్గొన్నారు.ఈ క్రమంలో పలు అభివృద్ధి పథకాలను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. అలాగే కాట్రా- శ్రీనగర్ మధ్య వందే భారత్ ట్రైన్ను ఆయన ప్రారంభించారు. ఈ రైలు ప్రారంభంతో కాట్రా-శ్రీనగర్ మధ్య దూరం తగ్గనుంది. కేవలం మూడు గంటలోనే రైలు చేరుకుంటోంది. భారత్లో తొలిసారిగా రూపొందించిన కేబుల్ రైల్వే బ్రిడ్జి అంజి బ్రిడ్జిని మోదీ ప్రారంభించనున్నారు. 43,780 కోట్ల రూపాయల వ్యయంతో ఉదంపూర్ శ్రీనగర్ భారముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టు ప్రకటన ప్రధాని మోదీ చేయనున్నారు.సరిహద్దు ప్రాంతాలకు రోడ్డు కనెక్టివిటీ కోసం పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.350 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించనున్న శ్రీమాతా వైష్ణో దేవి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ప్రాజెక్ట్కు మోదీ శంకుస్థాపన చేయనున్నారు.#WATCH | J&K: Prime Minister Narendra Modi inspects Chenab Bridge. He will inaugurate the bridge shortly. Chenab Rail Bridge, situated at a height of 359 meters above the river, is the world's highest railway arch bridge. It is a 1,315-metre-long steel arch bridge engineered to… pic.twitter.com/IMf6tGOZH7— ANI (@ANI) June 6, 2025 -
ఫీజుల కోసం హింసిస్తారా?
న్యూఢిల్లీ: మంచి మార్కులొచ్చే విద్యార్థులను ఉచిత బోధన పేరుతో గద్దల్లా తన్నుకుపోయే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఫీజు సరిగా కట్టకపోతే కనీసం గేటు దాటి లోపలికి కూడా రానివ్వడం లేదంటూ ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఫీజు సవ్యంగా కట్టలేదన్న అక్కసుతో విద్యార్థులను బౌన్సర్లతో అడ్డుకోవడంపై మండిపడింది. విద్యాలయాల్లో ఇలాంటి పెడ ధోరణులను ఉపేక్షించే ప్రసక్తే లేదని జస్టిస్ సచిన్ దత్తా ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘ఫీజు వివాదాన్ని సాకుగా చూపి విద్యార్థులను స్కూల్లోకి అనుమతించకపోవడం, అందరి ఎదుటా అవహేళన చేయడం క్షమార్హం కాదు. విద్యాలయాల్లో ఇలాంటి సంస్కృతి కొనసాగేందుకు వీల్లేదు. ఫీజు కట్టాలని బౌన్సర్లను పెట్టి మరీ బెదిరించడం విద్యార్థులను తీవ్రస్థాయిలో వేధించడమే. ఇది చిన్నారుల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇది వారి ఆత్మస్తైర్యాన్ని దెబ్బతీయడమే’’ అని పేర్కొంది. ఫీజులు సరిగా చెల్లించలేదని దేశ రాజధానిలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 31 మంది విద్యార్థులను బౌన్సర్లను పెట్టి అడ్డుకుంటోందని, బెదిరిస్తోందని నమోదైన కేసును ధర్మాసనం గురువారం విచారించింది. ఫీజు కట్టలేదని విద్యార్థుల పేర్లను రికార్డుల నుంచి తొలగించి డిబార్ చేసిన యాజమాన్యం కోర్టు ఆగ్రహం నేపథ్యంలో వారిని తిరిగి చేర్చుకుంటామని విన్నవించింది. ఇకపై విద్యార్థులను తొలగించాలంటే నిబంధనల ప్రకారం తొలుత తల్లిదండ్రులకు ముందస్తు సమాచారమిచ్చి ఫీజు చెల్లింపుపై వారి వాదన విని్పంచేందుకు అవకాశం ఇవ్వాల్సిందేనని కోర్టు ఆదేశించింది. 2025–26 విద్యా సంవత్సరానికి పెంచిన ఫీజులో సగం చెల్లించాలని తల్లిదండ్రులకు సూచించింది. -
పేద ఖైదీలకు సాయపడండి
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్ధిక ఇబ్బందుల కారణంగా బెయిల్ పొందలేని, జైలు నుంచి విడుదల కాలేని పేద ఖైదీలకు ఉపశమనం కలిగించేందుకు ఉద్దేశించిన నిధులను రాష్ట్రాలు వినియోగించకపోవడంపై కేంద్ర హోం శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. 2023 మేలో కేంద్రం ప్రారంభించిన ‘పేద ఖైదీలకు మద్దతు’పథకానికి అర్హులైన ఖైదీలను గుర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపకపోవడాన్ని తప్పుపట్టింది. ఇప్పటికైనా జరిమానాలు, బెయిల్ పూచీకత్తు చెల్లించలేని కారణంగా కటకటాల్లోనే మగ్గుతున్న పేద ఖైదీలకు తోడ్పడాలని ఈ నెల 3న రాష్ట్రాలకు లేఖ రాసింది. ‘పేద ఖైదీలకు మద్దతు’పథకంలో భాగంగా రాష్ట్రాలు జిల్లాకొకటి చొప్పున కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పథకం అమలుకు నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) కేంద్ర నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ఈ సంస్థకు కేంద్రం ఏటా రూ.20 కోట్లు కేటాయిస్తుంది. జిల్లా సాధికార కమిటీ కేసును క్లియర్ చేస్తే ఖైదీకి రూ.25 వేల వరకు లభిస్తుంది. ఇంతకంటే ఎక్కువ మొత్తం ఉంటే, దానిని రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ కమిటీ నిర్ణయిస్తుంది. ఈ పథకా న్ని సరైన రీతిలో అమలు చేసి పేద ఖైదీలకు విముక్తి కల్పించడం ద్వారా వారిని జన జీవన స్రవంతిలో కలిసేందుకు సాయపడాలని కోరింది. అయితే, అవినీతి నిరోధక, మనీలాండరింగ్, డ్రగ్స్, ఉపా తదితర చట్టాల పరిధిలోకి వచ్చే నేరాలకు పాల్పడిన వారికి ఈ ప్రయోజనం వర్తించదని హోం శాఖ స్పష్టం చేసింది. -
కోర్టులో ఖైదీల మధ్య ఘర్షణ ఎపిసోడ్.. అండర్ ట్రయల్ ఖైదీ మృతి
ఢిల్లీ: కోర్టు లాకప్లోఖైదీల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ అమన్ అనే అండర్ ట్రయల్ ఖైదీ మృతి చెందాడు. ఢిల్లీలోని సాకేత్ కోర్టులో అండర్ ట్రయల్ ఖైదీ అమన్ను విచారణ నిమిత్తం హాజరుపరిచిన క్రమంలో తోటి ఖైదీలు హత్యాయత్నం చేశారు. రిమాండ్లో ఉన్న ఇద్దరు ఖైదీలు.. ఆ అండర్ ట్రయల్ ఖైదీని గొంతుకోసి తీవ్రంగా గాయపరిచారు. అయితే ఆ ఖైదీ ఈరోజు(గురువారం) మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ముగ్గురు తొలుత తిహార్ జైలు 8వ నెంబర్ గదిలో ఉంచారు. అయితే వీరిని బుధవారం విచారణకు ఢిల్లీ సాకేత్ కోర్టుకు హాజరు పరిచిన క్రమంలో అండర్ ట్రయల్ ఖైదీపై మిగతా ఇద్దరు ఖైదీలు దాడికి యత్నించారు. ఈ క్రమంలోనే అమన్ అనే ఖైదీ గొంతు కోశారు. దాంతో గాయపడిన అతన్ని దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించగా, ఈరోజు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అదికారులు చెప్పిన దాని ప్రకారం ఈ రెండు గ్రూపుల మధ్య కోర్టు లాకప్లోఏ తీవ్ర ఘర్షణ జరిగి అది ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసిందన్నారు. -
ఆ గురుద్వారా అలాగే ఉండనివ్వండి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని షాదారా ప్రాంతంలో ఉన్న గురుద్వారా స్థలం తమదేనని, దాన్ని తమకు అప్పగించాలని కోరుతూ ఢిల్లీ వక్ఫ్ బోర్డు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అక్కడ చాలా ఏళ్లుగా గురుద్వారా ఉంది కాబట్టి దాన్ని అలాగే ఉండనివ్వండి అని తేల్చిచెప్పింది. ఒకవేళ ఆ స్థలం మీదేనని మీరు భావిస్తే ఆ అభిప్రాయం మానుకోండి అని సూచించింది. షాదారా గురుద్వారా స్థలం ‘మసీదు తకియా బబ్బర్ షా’కు చెందుతుందని పేర్కొంటూ ఢిల్లీ వక్ఫ్ బోర్డు తొలుత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను తిరస్కరిస్తూ ఢిల్లీ హైకోర్టు 2010 సెపె్టంబర్లో ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ ఢిల్లీ వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సతీశ్చంద్ర శర్మతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఆ స్థలంలో గురుద్వారా చాలా ఏళ్లుగా ఉందని మీరే చెబుతున్నారు కాబట్టి దాన్ని అలాగే కొనసాగనివ్వాలని పిటిషనర్కు స్పష్టంచేసింది. పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు తెలియజేసింది. ఆ స్థలంలో 1947 నుంచి గురుద్వారా ఉన్నట్లు ఢిల్లీ హైకోర్టులో విచారణ సందర్భంగా ఓ సాక్షి చెప్పిన విషయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది.