breaking news
Delhi
-
రాజ్యాంగం మా రక్తం.. దాడి చేయడానికి మీరెవరు?: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: ఎన్డీయే సర్కార్పై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలకు దిగారు. లోక్సభ ఎన్నికలు రిగ్ అయ్యాయన్న ఆయన.. రఫేల్ డీల్లో ఎన్ఎస్ఏ-పీఎంవో కూడా జోక్యం చేసుకుంటాయని ఆరోపించారు. శనివారం ఢిల్లీలో జరిగిన వార్షిక లీగల్ కన్క్లేవ్లో ఆయన మాట్లాడారు. నిప్పుతో చెలగాటమాడుతున్నానని ప్రియాంక(రాహుల్ సోదరి) నాతో చెబుతోంది. అవును.. నేను నిప్పుతో చెలగాటమాడుతున్నాననే విషయం నాకు తెలుసని అన్నాను. ఆ ఆట ఆపనని కూడా చెప్పాను. పిరికి పందలను చూసి భయపడొద్దని నా కుటుంబం చెప్పింది. రాజ్యాంగం మా రక్తంలాంటిది. మా రక్తంపై దాడి చేయడానికి మీరేవరు? అని ఎన్డీయే సర్కార్పై రాహుల్ మండిపడ్డారు. దేశంలో ఈసీకి ఉనికి లేదు. ఎన్నికల వ్యవస్థ చచ్చిపోయిందన్నది సత్యం. లోక్సభ ఎన్నికలు రిగ్ అయ్యాయి. 10-15 సీట్లతో మోదీ ప్రధాని అయ్యారు. ఆ పదిహేను సీట్లు లేకుంటే వాళ్లకు అధికారం దక్కేది కాదు. ఈసీ అవకతవకలపై మా దగ్గర 100 శాతం ఆధారాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇవన్నీ బయటపెడతాం. రఫేల్ డీల్లో పీఎంవోతో పాటు ఎస్ఎస్ఏ డీల్ చేసుకుంటున్నాయి. దీనికి సంబంధించి మాకు డాక్యుమెంట్ దొరికింది’’ అని రాహుల్ అన్నారు.#WATCH | Delhi: At the Annual Legal Conclave- 2025, Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says, "We are going to prove to you in the coming few days how a Lok Sabha election can be rigged and was rigged..."He also says, "The truth is that the election system in India is… pic.twitter.com/F9Vfsf5uH1— ANI (@ANI) August 2, 2025 -
పార్లమెంట్లో ఆగని రగడ
న్యూఢిల్లీ: బిహార్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్)పై పార్లమెంట్లో ప్రతిపక్షాలు పదో రోజు సైతం యథావిధిగా ఆందోళన కొనసాగించాయి. దీనిపై వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఉభయసభల్లో నిరసనలు, నినాదాలతో హోరెత్తించాయి. దీంతో లోక్సభ, రాజ్యసభ పలుమార్లు వాయిదా పడ్డాయి. శాంతించాలని, సభా కార్యకలాపాలకు సహకరించాలని పదేపదే విజ్ఞప్తి చేసినా వారు వినిపించుకోకపోవడంతో ఉభయసభలను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు లోక్సభ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ప్రకటించారు. అంతకుముందు రాజ్యసభలో వెల్లోకి దూసుకొచ్చిన ప్రతిపక్ష సభ్యులను మార్షల్స్ అడ్డుకున్నారు. దీనిపై విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ను పారామిలటరీ దళం అదుపులోకి తీసుకుందని మండిపడ్డారు. మరోవైపు లోక్సభలో రిప్రజెంటేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇన్ అసెంబ్లీ కానిస్టిట్యూయెన్స్ ఆఫ్ ద స్టేట్ గోవా బిల్లు–2024, ఇండియన్ పోర్ట్స్ బిల్లు–2025, మర్చంట్ షిప్పింగ్ బిల్లు–2024ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. స్పీకర్ ఓం బిర్లాకు విపక్షాల లేఖ బిహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై తక్షణమే లోక్సభలో ప్రత్యేక చర్చ నిర్వహించాలని కోరుతూ స్పీకర్ ఓం బిర్లాకు ప్రతిపక్ష సభ్యులు లేఖ రాశారు. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ సవరణ ప్రక్రియ నిర్వహించడంపై వారు అనుమానాలు వ్యక్తంచేశారు. దేశంలో గతం ఇలాంటి పరిణామం ఎప్పుడూ జరగలేదని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం సంకేతాలిస్తోందని గుర్తుచేశారు. ఈ ప్రక్రియ ఉద్దేశం పట్ల సందేహాలున్నాయని వెల్లడించారు. స్పీకర్కు రాసిన లేఖపై రాహుల్ గాం«దీ(కాంగ్రెస్), టీఆర్ బాలు(డీఎంకే), సుప్రియా సూలే(ఎన్సీపీ), లాల్జీ వర్మ(సమాజ్వాదీ పార్టీ) తదితరులు సంతకాలు చేశారు. హరివంశ్కు మల్లికార్జున ఖర్గే లేఖ రాజ్యసభలో వెల్లో భద్రతా సిబ్బంది తమను అడ్డుకోవడం పట్ల విపక్ష నేత మల్లికార్జున ఖర్గే తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. అక్కడ సీఐఎస్ఎఫ్ సిబ్బంది కనిపించడం తమను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఈ మేరకు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్కు ఖర్గే శుక్రవారం లేఖ రాశారు. ప్రజాస్వామ్య పద్ధతితో నిరసన తెలిపే హక్కుకు కాలరాసే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. భవిష్యత్తులో సీఐఎస్ఎఫ్ సిబ్బంది రాజ్యసభ వెల్లోకి రాకుండా నియంత్రించాలని హరివంశ్ను కోరారు. పార్లమెంట్ ఉభయసభల లోపల భద్రతపై ప్రభుత్వానికి సంబంధం లేదని, అది సభాపతుల పరిధిలోని అంశమని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టంచేశారు. -
‘దేశం నుంచి పారిపోకుండా’.. అనిల్ అంబానీపై లుకౌట్ నోటీసులు
సాక్షి,న్యూఢిల్లీ: బ్యాంకుల రుణాల ఎగవేత కేసుల్లో రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లుకౌట్ నోటీసులు జారీ చేసింది. రూ.3,000 కోట్ల రుణ మోసం కేసుకు సంబంధించి ఈడీ శుక్రవారం (ఆగస్ట్1న) సర్క్యులర్ జారీ చేసింది.లుకౌట్ నోటీసులు కంటే ముందు బ్యాంకు రుణాల ఎగవేత కేసులో అనిల్ అంబానీకి ఈడీ సమన్లు పంపింది. ఆగస్టు 5న ఈడీ ముందుకు హాజరుకావాలని ఆదేశించింది. ఇప్పటికే అనిల్ అంబానీకి సంబంధించిన కంపెనీల్లో సోదాలు నిర్వహించి పలుచోట్ల కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీటిని పరిశీలించిన ఈడీ అనిల్ను ప్రశ్నించేందుకు తాజాగా సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈడీ విచారణ నుంచి తప్పించుకునే అవకాశం లేకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసింది. విమానాశ్రయాలు, ఓడరేవులు సహా అన్ని ఎంట్రీ,ఎగ్జిట్ పాయింట్లకు దీనిని పంపిస్తుంది. దేశం విడిచి వెళ్ళడానికి ప్రయత్నిస్తే అలాంటి నోటీసులు జారీ చేయబడిన వ్యక్తులను అదుపులోకి తీసుకోవాలని అధికారులను ఈడీ అధికారులు అప్రమత్తం చేస్తారు. రూ.3,000 కోట్ల రుణాలను 2017 నుంచి 2019 వరకు ఎస్ బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.3,000 కోట్ల రుణాలను అక్రమంగా దారి మళ్లించారనే ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. గ్రూప్ కంపెనీలకు రుణాలు ఇవ్వడానికి ముందు బ్యాంకు ప్రమోటర్లతో సంబంధం ఉన్న సంస్థలకు నిధులు బదిలీ అయ్యాయని ఈడీ అధికారులు తెలిపారు. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్హెచ్ఎఫ్ఎల్)కు సంబంధించిన విషయాలను ఈడీతో అధికారులు పంచుకున్నారు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.3,742.60 కోట్లుగా ఉన్న కార్పొరేట్ రుణ వితరణ 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.8,670.80 కోట్లకు పెరిగింది. ఎస్ బ్యాంక్ మాజీ ప్రమోటర్లకు సంబంధించిన లంచం కోణంలో కూడా విచారణ జరిపినట్లు ఈడీ తెలిపింది. -
ప్రైవేటీకరణ బాటలోనే విశాఖ స్టీల్ ప్లాంట్
ఢిల్లీ: విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి తాము వెనక్కి తగ్గే యోచనలో లేమనే విషయాన్ని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. 100 శాతం పెట్టబడుల ఉపసంహరణ ఉంటుందన్న క్యాబినెట్ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి వెల్లడించింది. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ‘విశాఖ స్టీల్ ప్లాంట్లో 100 శాతం పెట్టుబడుల ఉపసంహరణ చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. విశాఖ స్టీల్ ప్లాంట్న సెయిల్లో విలీనం చేసే ప్రతిపాదనలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఇప్పటివరకూ 1017 మంది ఉద్యోగులు వీఆర్ఎస్కు దరఖాస్తు చేశారు. ఆర్ఐఎన్ఎల్కు రూ. 11,140 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి గాను ఇప్పటివరకూ రూ. 984 కోట్లను విడుదల చేశాం’ అని మంత్రి తెలిపారు. -
కేఏ పాల్ పిటిషన్.. కేంద్ర, రాష్ట ప్రభుత్వాలకు ‘సుప్రీం’ నోటీసులు
ఢిల్లీ: బెట్టింగ్ యాప్లను నిషేధించాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. బెట్టింగ్ యాప్ల నిషేధంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఆగస్టు 18కి వాయిదా వేసింది. అయితే, గత విచారణలో కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చినా కౌంటర్ దాఖలు చేయకపోవడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.కేంద్రం వైఖరి తెలుసుకునేందుకు మరొక అవకాశం ఇస్తున్నామని సుప్రీంకోర్టు చెప్పింది. బెట్టింగ్ యాప్ల నిషేధంపై కేంద్రం సమర్థిస్తుందా?. వ్యతిరేకిస్తుందా? ఎలాంటి యంత్రాంగాన్నీ ఏర్పాటు చేస్తుందో చూద్దామంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణలో మధ్యంతర ఆదేశాలు ఇస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.సినిమా హీరోలు, సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్లను ఎండార్స్ చేయకుండా నిషేధం విధించేలా మద్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కేఏ పాల్ కోరారు. బెట్టింగ్ యాప్లు కారణంగా కోట్లాదిమంది యువకులు నష్టపోతున్నారని సుప్రీంకోర్టు దృష్టికి కేఏ పాల్ తీసుకువచ్చారు. -
సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక, షెడ్యూల్ ఇదే..
సాక్షి, న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల అయ్యింది. సెప్టెంబర్ 9వ తేదీన ఎన్నిక జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. జగ్దీప్ ధన్ఖడ్ అనూహ్య రాజీనామాతో ఈ పదవి ఖాళీ అయిన సంగతి తెలిసిందే.ఆగస్టు 7వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ కానుంది. నామినేషన్ల స్వీకరణకు ఆగస్టు 21వ తేదీ ఆఖరు. నామినేషన్ పరిశీలన 22వ తేదీన జరుగుతుంది. ఆగస్టు 25వ తేదీలోపు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. సెప్టెంబర్ 9వ తేదీన ఉదయం 10గం. నుంచి సాయంత్రం 5గం. దాకా పోలింగ్ జరుగుతుంది. అదే రోజు కౌంటింగ్ జరగనుంది.భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 ప్రకారం నిర్వహించబడే ఒక ప్రత్యేక ఎన్నిక. రాష్ట్రపతి ఎన్నికలతో పోలిస్తే కొంత భిన్నంగా ఉంటుంది. ఈ ఎన్నికలో ఎలక్టోరల్ కాలేజీ తరఫున లోక్సభ, రాజ్యసభకు ఎన్నికైన, నామినేట్ అయిన సభ్యులు మాత్రమే ఓటు వేస్తారు. రాష్ట్ర శాసనసభ సభ్యులకు ఓటు హక్కు ఉండదు.పరోక్ష ఓటింగ్ (Indirect Election).. ఏక బదిలీ ఓటు పద్ధతి.. ఓటర్లు ఎన్నికలో నిల్చున్న అభ్యర్థులను ప్రాధాన్యత క్రమంలో (1, 2, 3...) గుర్తిస్తారు. రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరుగుతుందిఅర్హతలుభారతీయ పౌరుడై ఉండాలికనీసం 35 సంవత్సరాల వయస్సురాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యే అర్హత ఉండాలిలాభదాయక పదవిలో ఉండకూడదురిటర్నింగ్ అధికారిగా.. లోక్సభ లేదంటే రాజ్యసభ సెక్రటరీ జనరల్ రొటేషన్ పద్ధతిలో నియమించబడతారునామినేషన్, పరిశీలన, ఉపసంహరణ, పోలింగ్, లెక్కింపు — మొత్తం ప్రక్రియను 32 రోజుల్లో పూర్తి చేయాలని ఆర్టికల్ 66 స్పష్టం చేస్తోంది. -
‘బనకచర్ల’ వెనక్కి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి–బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ ప్రభావ అంచనా అధ్యయనానికి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్) మంజూరు చేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను తిరస్కరించింది. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ అనిల్కుమార్ యాదవ్ గురువారం అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అంతర్రాష్ట్ర అంశాలపై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ అంశాన్ని కేంద్ర జల సంఘం పరిశీలించాలని నిపుణుల కమిటీకి సూచించింది. ఈ ఏడాది జూన్ 17న సమావేశమైన కమిటీ.. ప్రాజెక్టు ప్రతిపాదనను తిరిగి పంపించాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టును ప్రతిపాదించిన ఏపీ ప్రభుత్వం ముందుగా కేంద్ర జల సంఘాన్ని సంప్రదించి అవసరమైన అనుమతులు, క్లియరెన్సులతోపాటు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) పొందాలని సూచించింది. ఆ తర్వాతే టీఓఆర్ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. -
బఫూన్లకు బాస్ ట్రంప్
న్యూఢిల్లీ: రష్యాతో వాణిజ్యం చేస్తున్నదనేసాకు చూపుతూ భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు విధించడంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా మండిపడ్డారు. భారత ప్రభుత్వాన్ని వేధిస్తున్న ట్రంప్ను ఆయన ‘బఫూన్ ఇన్ చీఫ్’గా అభివర్ణించారు. ‘వైట్ హౌస్లోని బఫూర్ ఇన్ చీఫ్ నా దేశ ప్రభుత్వాన్ని వేధిస్తుండటం విచారం కలిగిస్తోంది. ఇలాంటి బెదిరింపులకు లొంగటానికి సామంత రాజ్యం కాదు.. భారత్ సార్వభౌమత్వం కలిగిన దేశం అని స్పష్టం చేశారు. అత్యధిక టారిఫ్లతో మన ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం వాటిల్లుతుందని ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ టారిఫ్ల పెంపుపై ప్రధాని మోదీ మౌనంగా ఉండటాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. మోదీ వైఖరి దారుణమన్నారు. -
సవరణపై సభా సమరం
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం బిహార్లో చేపట్టిన వివాదాస్పద ఓటర్ల జాబితా సమగ్ర సవరణ క్రతువును తక్షణం నిలిపివేయాలన్న విపక్షాల డిమాండ్లతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లిపోయాయి. గురువారం ఉదయం రాజ్యసభలో సభాకార్యకలాపాలు మొదలవగానే విపక్షసభ్యులు తమ డిమాండ్లను నినాదాల రూపంలో వినిపించారు. ఆపరేషన్ సిందూర్పై 16 గంటల చర్యకు ప్రధాని మోదీ ఎందుకు రాజ్యసభలో సమాధానం ఇవ్వలేదని విపక్ష సభ్యులు ప్రశ్నిస్తూ సభాకార్యకలాపాలను అడ్డుకున్నారు. బిహార్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను ఈసీ వెంటనే ఆపేయాలనీ విపక్ష సభ్యులు డిమాండ్చేశారు. దీంతో సభను సభాధ్యక్షుడు మధ్యా హ్నం 2 గంటలవరకు వాయిదావేశారు. తర్వాత సభ మొదలైనా మళ్లీ ఇదే విపక్షాల డిమాండ్ల పర్వం కొనసాగింది. వెంటనే ప్రధాని మోదీ సభకు వచ్చి ఆపరేషన్ సిందూర్పై సమాధానం ఇవ్వాలని విపక్ష సభ్యులు నినాదాలుచేశారు. ఈ సందర్భంగా రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే మాట్లాడేందుకు సభాధ్యక్షుడు సస్మిత్ పాత్రా అనుమతించారు. ‘‘ 2008లో ముంబై ఉగ్రదాడులపై నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో వివరణ ఇవ్వనప్పుడు నాట హోం మంత్రి వివరణ ఇచ్చారు. అంతేగానీ హోం మంత్రి అమిత్ షా లాగా ‘‘ నేనొక్కడినే మీ అందరినీ అదమాయించగలను. హ్యాండిల్ చేస్తాను’’ అని అందర్నీ తూలనాడలేదు. ఇప్పటికైనా ప్రధాని మోదీ సభకు వచ్చి మాట్లాడాలి’’ అని ఖర్గే డిమాండ్చేశారు. ఈయన మాటలకు విపక్షసభ్యులు గొంతు కలిపారు. దీంతో చేసేదిలేక సభను సాయంత్రం నాలుగున్నర గంటలదాకా వాయిదావేశారు. 4.30 గంటలకు సభ మొదలయ్యాక ట్రంప్ చేసిన ‘డెడ్ ఎకానమీ’ వ్యాఖ్యలకు వాణిజ్యమంత్రి గోయల్ ఘాటుగా స్పందిస్తూ ప్రకటనచేశారు. అయినాసరే విపక్షసభ్యులు తమ నినాదాలను ఆపకపోవడంతో చివరకు సభను శుక్రవారానికి వాయిదావేశారు. లోక్సభలోనూ అదే తీరు..లోక్సభలోనూ ఇవే దృశ్యాలు కనిపించాయి. లోక్సభ ఉదయం మొదలుకాగానే జీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా నైసార్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన శాస్త్రవేత్తలకు సభ అభినందించింది. తర్వాత వెంటనే బిహార్ అంశంపై విపక్ష సభ్యులు నినాదాలు మొదలెట్టారు. ‘‘ ఇలా నినాదాలు చేయడానికి మనల్ని ఓటర్లు ఓట్లేసి గెలిపించుకున్నారా? దయచేసి మీమీ సీట్లలో కూర్చోండి’’ అని లోక్సభ స్పీకర్ బిర్లా మందలించారు. అయినా విపక్షసభ్యులు వినిపించుకోలేదు. తొలుత రెండు గంటల దాకా సభ వాయిదాపడింది. తర్వాత ఇదే పునరావృతంకావడంతో అప్పుడు సభాధ్యక్ష స్థానంలో కూర్చన్న అవదేశ్ ప్రసాద్ సభను నాలుగు గంటలకువాయిదావేశారు. నాలుగు గంటలకు సభ మొదలవగానే మంత్రి పియూశ్ గోయల్ మాట్లాడారు. ఆ తర్వాత నినాదాలు కొనసాగడంతో స్పీకర్ బిర్లా సభను శుక్రవారానికి వాయిదావేశారు. -
ప్రజలతో సున్నితంగా వ్యవహరించండి
దియోగఢ్: వైద్యులను దేవుళ్లుగా భావించే ప్రజలతో సున్నితంగా వ్యవహరించాలని రాష్ట్రపతి ముర్ము వైద్య నిపుణులకు పిలుపునిచ్చారు. జార్ఖండ్లోని దియోగఢ్ ఎయిమ్స్లో గురువారం జరిగిన మొట్టమొదటి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముర్ము పాల్గొన్నారు. నైతిక విలువలను పాటిస్తూ రోగుల పట్ల సహానుభూతితో ప్రేమతో మెలగాలన్నారు. వారి జీవితాల్లో చీకట్లు తొలగించాలని కోరారు. ‘గిరిజనుల ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టే ఎయిమ్స్ దియోగఢ్ ఇప్పటికే ఉన్న ఐదింటితోపాటు మరిన్ని గ్రామాలను దత్తత తీసుకోవాలని సూచించారు. ఇతర ఎయిమ్స్లకు ఒక ఆదర్శంగా మారేందుకు కృష్టి చేయాలని కోరారు. గిరిజన ప్రాంతాల మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని, పిల్లలలో పోషకాహార లోపం సర్వసాధారణంగా మారిందని రాష్ట్రపతి తెలిపారు. ఈ నేపథ్యంలో వైద్యులు సామాజిక సేవపైనా దృష్టిసారించాలన్నారు. సుదూర గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు యాంటీ వీనమ్ ఔషధాలను డ్రోన్ల ద్వారా అందిస్తున్న దియోగఢ్ ఎయిమ్స్ను రాష్ట్రపతి ముర్ము ప్రశంసించారు. ఈ సంస్థతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందంటూ ఆమె..జార్ఖండ్ గవర్నర్ తాను వ్యవహరించిన సమయంలోనే ప్రధాని మోదీ 2018లో ఎయిమ్స్ దియోగఢ్కు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. రాష్ట్రపతి జార్ఖండ్లో రెండు రోజుల పర్యటనలో ఉన్నారు. శుక్రవారం ఐఐటీ ధన్బాద్ స్నాతకోత్సవంలో పాల్గొననున్నారు. -
దేశ ప్రయోజనాలను పరిరక్షిస్తాం
న్యూఢిల్లీ: అరడజను సార్లు అమెరికా, భారత ప్రతినిధులు భేటీ అయినా చర్చలు ఓ కొలిక్కిరాకపోవడంతో విసుగుచెందిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏకపక్షంగా, ఇష్టారీతిక విధించిన 25 శాతం దిగుమతి సుంకంపై భారతసర్కార్ పార్లమెంట్ సాక్షిగా స్పందించింది. భారతదేశ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తామని లోక్సభ, రాజ్యసభలో వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. నేటి నుంచి 25 శాతం టారిఫ్లతోపాటు పెనాల్టీలను భారత్పై మోపుతానని ట్రంప్ బుధవారం ప్రకటించిన నేపథ్యంలో గురువారం లోక్సభ, రాజ్యసభల్లో గోయల్ కీలక ప్రకటక చేశారు. ‘‘ హఠాత్తుగా ఏకపక్షంగా ట్రంప్ మనపై అదనపు టారిఫ్లను మోపారు. దీని దుష్ప్రభావాలపై విస్తృతస్తాయి అధ్యయనం చేస్తున్నాం. ఇందులోభాగంగా టారిఫ్ల భారం పడే రైతులు, ఎగుమతిదారులు, కార్మికులు, వ్యాపారులు, సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమలు, పలు పరిశ్రమల సమాఖ్యలు, సంఘాలతో మంతనాలు జరుపుతున్నాం. పెను ప్రభావం తాలూకు పరిణామాలపై విశ్లేషణ చేపడుతున్నాం. దేశ ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తున్నాం. పౌర ప్రయోజనాల పరిరక్షణకు పాటుపడతాం’’ అని గోయల్ అన్నారు. ‘‘ కేవలం దశాబ్దకాలంలోనే దుర్భల ఆర్థిక వ్యవస్థ నుంచి సుదృఢ ఆర్థికవ్యవస్థగా భారత్ అవతరించింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థగా భారత్ తయారైంది. 11వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థ ర్యాంక్ నుంచి టాప్–5 ర్యాంక్లోకి భారత్ ఎగబాకింది. మన కర్షకులు, కార్మికులు, సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పరిశ్రమల కృషి, మా ప్రభుత్వ పట్టుదల ఈ ప్రగతికి కారణం. భవిష్యత్తులో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం ఖాయం. ప్రపంచ తయారీరంగ హబ్గా భారత్ను తీర్చిదిద్దేందుకు గత దశాబ్దకాలంగా కృషిచేస్తున్నాం. మేక్ ఇన్ ఇండియా పథకం ద్వారా భారతీయ ఉత్పత్తుల గణనీయ పెరుగుదలకు పాటుపడ్డాం. నైపుణ్య మానవ వనరులు, యువత కారణంగానే భారతీయ పరిశ్రమల్లో పోటీతత్వం, నవకల్పనలు ఎక్కువయ్యాయి. గత 11 సంవత్సరాలుగా మన ఎగుమతులు పెరుగుతున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బ్రిటన్, ఆస్ట్రేలియాలతో భారత్ లాభదాయకమైన వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. రైతులు, భారత సాగు రంగం బాగు కోసం, ఆహార భద్రత కోసం ప్రభుత్వం పాటుపడుతోంది. ఇకమీదటా అదే పనిచేస్తాం. అమెరికా టారిఫ్ల అంశంలో భారత ప్రయోజనాలకు పణంగా పెట్టే ప్రసక్తే లేదు’’ అని గోయల్ వ్యాఖ్యానించారు.డెయిరీ విషయంలో మరింత అప్రమత్తంగా..డెయిరీ రంగానికి సంబంధించి ప్రభుత్వం ఇంతవరకూ ఏ దేశంతోనూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదర్చుకోలేదు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 70 కోట్ల జనాభా దేశ సాగురంగంపై ఆధారపడిన నేపథ్యంలో ఆహారభద్రత సంక్షోభంలో పడకుండా ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులోభాగంగానే ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకున్నా సాగురంగంపై ప్రతికూల ప్రభావం పడకుండా ప్రభుత్వం ఓ కంట కనిపెడుతోంది. 2021–25 వాణిజ్యగణాంకాల ప్రకారం భారత్కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. భారత్ నుంచి మొత్తం ఎగుమతుల్లో దాదాపు 18 శాతం ఎగుమతులు అమెరికాకే వెళ్తున్నాయి. -
Dharmasthala: ధర్మస్థళ మిస్టరీ ఉత్కంఠ.. వెలుగులోకి కీలక ఆధారాలు
సాక్షి,బెంగళూరు: కర్ణాటకలోని మంగళూరు దగ్గరలోని దక్షిణ కన్నడ జిల్లా పరిధిలోని ధర్మస్థళ సామూహిక ఖననం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మూడు రోజులుగా కొనసాగుతున్న తవ్వకాల్లో ఇవాళ మానవ అవశేషాలు బయటపడ్డాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్( స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) బృందం గత సోమవారం నుంచి తవ్వకాలు ప్రారంభించగా.. గురువారం ఆరవ స్థలంలో జరిపిన తవ్వకాల్లో మానవ అవశేషాలు (skeletal remains) వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకు ఈ కేసులో బయటపడిన తొలి ఆధారం ఇదే కావడం గమనార్హం.1995 నుంచి 2014 మధ్యకాలంలో ధర్మస్థళలో పనిచేశానని, మహిళలు, మైనర్లతో సహా అనేక మృతదేహాలను అక్కడ ఖననం చేశానని చెప్పిన మాజీ పారిశుధ్య కార్మికుడు చెప్పడం, ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేయడం తెలిసిందే. ఇప్పుడు కర్ణాటక ప్రజలతో ‘భీమ’ అని పిలుచుకుంటున్న పారిశుధ్య కార్మికుడు తెలిపిన 15 స్థావరాల వివరాల ఆధారంగా సిట్ ఇప్పటివరకు ఆరు ప్రదేశాల్లో తవ్వకాలు చేసింది. ఐదు ప్రదేశాల్లోనూ ఎలాంటి మానవ అవశేషాలు కనిపించలేదు. 👉ఇదీ చదవండి: ధర్మస్థళ కథేంటీ?అనూహ్యాంగా ఇవాళ నేత్రావతి నది స్నాన ఘట్టానికి అవతలి వైపు ఉన్న ఆరో ప్రాంతంలో తవ్వకాలు జరపగా మానవ అవశేషాలు బయటపడ్డాయి. వాటిని ఫోర్సెన్సిక్ బృందం స్వాధీనం చేసుకుంది. టెస్టులు నిర్వహించి మానవ అవశేషాలు ఎవరివో వెల్లడిస్తామని కర్ణాటక ప్రభుత్వం సామూహిక ఖననం కేసులో ఏర్పాటు ప్రత్యేక దర్యాప్తు బృందం తెలిపింది. సామూహిక ఖననం కేసులో ఆధారాల్ని సేకరించేందుకు ఎస్పీ జితేంద్ర కుమార్ దయామా, పుత్తూరు అసిస్టెంట్ కమిషనర్ స్టెల్లా వర్గీస్ సహా సిట్ అధికారులు సంఘటనా స్థలంలో ఉన్నారు. డాగ్ స్క్వాడ్ను కూడా మోహరించారు. ఇక గురువారం మానవ అవశేషాలు దొరికిన ప్రాంతం అంతా నీరు చేరింది. భూమిలోతు తవ్వేకొద్ది నీరు బయటపడుతోంది. ఆ నీటిని క్లియర్ చేయడానికి డీజిల్ పంపును ఉపయోగిస్తున్నారు. జేసీబీను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కోసం కర్ణాటక ప్రభుత్వం నలుగురు ఐపీఎస్ అధికారులతో కలసి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను జూలై 19న ఏర్పాటు చేసింది. వారు డా. ప్రణవ్ మహంతి ఐపీఎస్, ఎంఎన్ అనుచేత్ ఐపీఎస్, సౌమ్యలత ఐపీఎస్, జితేంద్ర కుమార్ దయామ ఐపీఎస్. వారికి మరో ఇరవై మంది పోలీసు సిబ్బందిని ఇచ్చింది.కాగా, కార్మికుడు చెప్పిన 15 ప్రదేశాల్లో ఎనిమిది నేత్రావతి నది ఒడ్డున, నాలుగు ప్రదేశాలు నదికి సమీపంలోని హైవే పక్కన ఉన్నాయి. 13వ స్థలం నేత్రావతిని ఆజుకురికి కలిపే రహదారిపై, మిగిలిన రెండు హైవే సమీపంలోని కన్యాడి ప్రాంతంలో ఉన్నాయి. -
ట్రంప్ చెప్పింది నిజమే.. మన ఆర్థిక వ్యవస్థ ఖతం
న్యూఢిల్లీ: తాము విధించిన టారిఫ్ల దెబ్బకు భారత్ ఆర్థిక వ్యవస్థ ఖతమేనంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సరైనవేనని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఆయన నిజమే చెప్పారన్నారు. ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మినహా దేశ ప్రజలందరికీ ఈ విషయం తెలుసు, మీకు తెలియదా అని ఆయన విలేకరులను ప్రశ్నించారు. రాహుల్ గురువారం పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో మీడియాతో మాట్లాడారు. ట్రంప్ చెప్పినట్లుగానే మన దేశం అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటుందని, అమెరికా అధ్యక్షుడు ఏది చెబితే అదే ప్రధాని మోదీ అదే చేస్తారంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్థికంగా, రక్షణపరంగా, విదేశాంగ విధానాల విషయంలోనూ దేశాన్ని నాశనం చేసి, ఒక్క అదానీకి మాత్రమే సాయం చేస్తోందంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వ విధానాల కారణంగా దేశంలోని అన్ని రకాల చిరు వ్యాపారాలు నాశనమై పోయాయని దుయ్యబట్టారు. ‘మనది అద్భుతమైన విదేశాంగ విధానం అంటూ విదేశాంగ మంత్రి అంటున్నారు. కానీ, ఒక వైపు అమెరికా బెదిరింపులకు పాల్పడుతోంది. మరోవైపు చైనా మన వెంటబడుతోంది. Yes, he is right. Everybody knows this except the Prime Minister and the Finance Minister. Everybody knows that the Indian economy is a dead economy. I am glad that President Trump has stated a fact.पूरी दुनिया जानती है- भारत की इकॉनमी 'Dead economy' है और BJP ने इकॉनमी को… pic.twitter.com/8VdjFN4uoV— Congress (@INCIndia) July 31, 2025 మన ప్రభుత్వం ప్రపంచ దేశాలకు దౌత్య ప్రతినిధులను పంపినా ఏ ఒక్క దేశం కూడా పాక్ చర్యలను ఖండించలేదు. వీరికి దేశాన్ని ఎలా నడపాలో తెలియదు. అంతటా గందరగోళమే’అని రాహుల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగళవారం లోక్సభలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగంపై రాహుల్ స్పందిస్తూ, ప్రధానమంత్రి తన ప్రసంగంలో ట్రంప్ పేరును గానీ, చైనాను గురించి గానీ ఒక్కమాట కూడా మాట్లాడలేదని గుర్తు చేశారు. ‘పాకిస్తాన్ ఉగ్ర చర్యలను ఏ దేశమూ ఖండించలేదన్న విషయాన్ని మోదీ చెప్పలేదు. పహల్గాం దాడి వెనుక ఉన్న పాక్ ఆర్మీ చీఫ్ మునీర్కు ట్రంప్ వైట్హౌస్లో విందు ఇచ్చారు. ఘన విజయం సాధించామంటూ వారిద్దరూ ప్రకటించారు. ఏమిటా విజయం?’అని రాహుల్ ప్రశ్నించారు. ‘భారత్, పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ తన వల్లేనంటూ ట్రంప్ 30 సార్లు ప్రకటించుకున్నారు. #WATCH | Delhi | Congress MP Rajeev Shukla says, "... Trump saying that the economies of India and Russia are dead, is wrong. The Indian economy is not dead. Economic reforms were made when PV Narasimha Rao and Manmohan Singh were there. Atal Bihari Vajpayee took those reforms… pic.twitter.com/UZ0lLvRzZY— ANI (@ANI) July 31, 2025భారత్ ఐదు విమానాలు నష్టపోయిందని చెప్పిన ట్రంప్..భారత్పై ఇప్పుడు 25 శాతం టారిఫ్లను ప్రకటించారు. దీనికి మోదీ సమాధానం ఇవ్వలేకపోయారు. ఎందుకని మీరు అడిగారా? ఇందుకు కారణం ఏమిటి? మోదీ ఎవరి కంట్రోల్లో ఉన్నారు?’అని రాహుల్ వాగ్బాణాలు సంధించారు. ‘భారత్–అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదురుతుంది. ప్రస్తుతం కొనసాగుతున్న చర్చల్లో అంతా ట్రంప్ చెప్పినట్లుగా జరుగుతుంది’అని రాహుల్ పేర్కొన్నారు. అనంతరం రాహుల్ ‘ఎక్స్’లో..‘భారత ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయింది. మోదీయే చంపేశారు. 1. అదానీ–మోదీ భాగస్వామ్యం. 2. నోట్ల రద్దు, లోపభూయిష్ట జీఎస్టీ. 3. విఫలమైన తయారీరంగం 4. నాశనమైన చిన్న పరిశ్రమలు 5. దోపీడీకి గురైన రైతులు. వీటన్నిటితోపాటు ఉద్యోగావకాశాలు కల్పించకుండా మోదీ దేశ యువత భవిష్యత్తును నాశనం చేశారు’అని రాహుల్ ఆరోపించారు. -
తెలంగాణ ‘ఫిరాయింపుల’ కేసులో కీలక తీర్పు వెల్లడించిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై సుప్రీం కోర్టు గురువారం కీలక తీర్పు వెల్లడించింది. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సిందేనని తెలంగాణ స్పీకర్ను ఆదేశించింది. గతంలో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. అలాగే.. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి(మూడు నెలలు) విధిస్తున్నట్లు పేర్కొంది.ఏళ్ల తరబడి ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్లు పెండింగ్లో ఉంచడం సరికాదన్న భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్.. ఆ పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సిందే అని తీర్పు వెల్లడించారు. అదే సమయంలో న్యాయస్థానమే వేటు వేయాలని పిటిషనర్లు చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది. ‘అపరేషన్ సక్సెస్.. పేషెంట్ డైడ్’ అనే సూత్రం వర్తించకూడదని వ్యాఖ్యానించింది. పార్టీ ఫిరాయింపులకు ఫుల్ స్టాప్ పెట్టే అంశంపై పార్లమెంట్ ఆలోచించాలి. న్యాయస్థానం విచారణ మొదలుపెట్టాకే.. ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. మేము జోక్యం చేసుకునేంత వరకు స్పీకర్ నోటీసులు ఇవ్వకపోవడం సమంజసం కాదు. పదో షెడ్యూల్ ఉద్దేశాలు నెరవేరుతున్నాయా ? లేదా అని ఆలోచించాలి. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేసే ఎత్తుగడలు మంచివి కావు అని సీజేఐ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. ఒకవేళ విచారణను పొడిగించడానికి ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తే.. స్పీకర్ తగు నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేశారాయన.2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై విజయం సాధించిన ఎమ్మెల్యేలు.. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్.. అటుపై అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిపై అనర్హత వేటు వేయాలని పలువురు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ ను కోరారు. అయినా, స్పీకర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవటంతో.. పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ న్యాయస్థానాలను ఆశ్రయించింది. హైకోర్టులో ఎదురుదెబ్బ టు సుప్రీం కోర్టు తీర్పు దాకా.. అనర్హత పిటిషన్ల టైం లైన్2024 ఏప్రిల్లో.. పార్టీ మారిన ఎమ్మెల్యేలు పది మందిని అనర్హులుగా ప్రకటించాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు09.09.2024.. నాలుగు వారాల్లో విచారణ షెడ్యూల్ ఇవ్వాలని స్పీకర్ కార్యాలయానికి జస్టిస్ బి విజయ్సేన్ రెడ్డి బెంచ్ ఆదేశం.22.11.2024.. హైకోర్టు డివిజన్ బెంచ్, సింగిల్ బెంచ్ ఆదేశాలను రద్దు చేస్తూ.. స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం.. రీజనబుల్ టైం కావాలంటూ వ్యాఖ్య. స్పీకర్కు షెడ్యూల్ ఖరారు చేయాల్సిన అవసరం లేదని స్పష్టీకరణజనవరి 2025.. హైకోర్డు డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన పిటిషనర్లు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్, వివేకానంద10.02.2025.. పార్టీల హక్కులు నిర్లక్ష్యం చేయబడకూడదు అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానిస్తూ.. స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన ‘రీజనబుల్ టైం’ అంటే ఎంత? అని ప్రశ్నించింది.18.02.2025.. సుప్రీం కోర్టు తదుపరి విచారణకు తేదీ నిర్ణయించింది, స్పీకర్ సమాధానం కోసం వేచి చూసింది.2025 మార్చి 4 – కోర్టు స్పీకర్, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.03.04.2025.. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్లపై వాదనలు ముగిశాయి. సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.31.07.2025.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్పీకర్కు కాలపరిమితి విధిస్తూ మరీ సుప్రీం కోర్టు తుది తీర్పు -
ఎమ్మెల్యేల ఫిరాయింపుపై సుప్రీం తుది తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో సుప్ర్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మూడు నెలల్లోగా ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్ అనే పరిస్థితిని అంగీకరించమని ధర్మాసనం స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ బి ఆర్. గవాయి ధర్మాసనం తీర్పు వెలువరిస్తూ.. తెలంగాణ హైకోర్టు తీర్పును కొట్టివేసింది.పదో షెడ్యూల్ కింద స్పీకర్కురాజ్యాంగ రక్షణ లేదు. ఎమ్మెల్యేలు ఈ ప్రక్రియను సాగదీసే ప్రయత్నం చేయొద్దు. పార్టీ ఫిరాయింపులకు ఫుల్ స్టాప్ పెట్టే అంశంపై పార్లమెంట్ ఆలోచించాలి. మేము జోక్యం చేసుకునేంత వరకు స్పీకర్ నోటీసులు ఇవ్వకపోవడం సమంజసం కాదు. పదో షెడ్యూల్ ఉద్దేశాలు నెరవేరుతున్నాయా ? లేదా అని ఆలోచించాలి. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేసే ఎత్తుగడలు మంచివి కాదు’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది.బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకునేలా గడువు విధించాలని బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, అరికే పూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్లు పార్టీ ఫిరాయించారు. -
అమర్నాథ్ యాత్ర తాత్కాలిక నిలిపివేత
శ్రీనగర్: పహల్గాం, బాల్తాల్ మార్గాల్లో అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. బుధవారం తెల్లవారుజామునుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముందు జాగ్రత్త చర్యగా నిలిపివేసినట్లు జమ్మూ కశశ్మీర్ డివిజనల్ కమిషనర్ విజయ్ కుమార్ బిధూరి తెలిపారు. రెండు మార్గాల్లోనూ కురుస్తున్న భారీ వర్షాలు బేస్ క్యాంపుల నుంచి యాత్రికుల రాకపోకలను ప్రభావితం చేశాయన్నారు.పరిస్థితి మెరుగుపడేవరకు బాల్తాల్, నున్వాన్ బేస్ క్యాంపుల వైపు ఎలాంటి రాకపోకలను అనుమతించబోని తెలిపారు. ఈ విషయంలో యాత్రికులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తామని అధికారులు వెల్లడించారు. పరిస్థితులు మెరుగుపడితే యాత్రను తిరిగి ప్రారంభించే విషయాలను కూడా యాత్రికులకు తెలియజేస్తామన్నారు. జూలై మూడో తేదీన ప్రారంభమైన ఈ యాత్ర ఆగస్టు 9వ తేదీతో ముగియనుంది.ఈ పవిత్ర వార్షిక యాత్ర కోసం ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు వస్తారు. యాత్రికులు రెండు మార్గాల్లో పుణ్య క్షేత్రానికి చేరుకుంటారు. ఒకటి 48 కిలోమీటర్ల పొడవైన పహల్గాం మార్గం కాగా, మరోటి నిటారుగా ఉన్న తక్కువ దూరమైన బాల్తాల్ మార్గం. ఈ ఏడాది ఇప్పటివరకు 3.93 లక్షల మంది యాత్రికులు అమర్నాథ్ను దర్శించుకున్నారు. -
ఆగస్టు 2న పీఎం కిసాన్ నిధుల విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద అందిస్తున్న నిధులను ఆగస్టు రెండో తేదీన విడుదల చేయనుంది. ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ నిధుల విడుదల కార్యక్రమం జరగనుంది. తద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 9.7 కోట్ల రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ.20,500 కోట్లకు పైగా నిధులను ప్రత్యక్ష బదిలీ విధానం ద్వారా జమ చేయనున్నారు. పీఎం కిసాన్ కింద ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మూడు విడతల్లో రూ.6,000 ఆర్ధిక సాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 19వ విడత నిధులను విడుదల చేశారు. 19వ విడతతో ఈ పథకం కింద ఇంతవరకు మొత్తంగా పంపిణీ చేసిన మొత్తం రూ.3.69 లక్షల కోట్లకు చేరగా 20వ విడత నిధులతో ఈ మొత్తం ఏకంగా రూ.3.89 లక్షల కోట్లను దాటనుంది. పంటల ఉత్పత్తిని పెంచడం, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం, ఉత్పత్తులకు న్యాయమైన ధరలను నిర్ధారించడం లక్ష్యంగా కేంద్రం ఈ నిధులను విడుదల చేస్తోంది. ఈ నిధుల విడుదల కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించే అంశమై వ్యవసాయ శాఖమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ బుధవారం అధికారులతో ఉన్నతస్ధాయి సమావేశం నిర్వహించారు. నిధుల విడుదలపై విస్తృత కార్యక్రమాలను నిర్వహించాలని, కృషి విజ్ణాన కేంద్రాలతో పాటు కృషి సఖీలు, డ్రోన్ దీదీలు, బ్యాంక్ సఖీ, పశు సఖీ, బీమా సఖీ గ్రామ పంచాయతీ సర్పంచ్లను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని ఆదేశించారు. ఫసల్ బీమా కింద రూ. 5 వేల కోట్ల బకాయిలు దేశ వ్యాప్తంగా సకాలంలో పరిహారం అందేలా అనేక చర్యలు తీసుకున్నప్పటికీ, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద బీమా సంస్థలు రైతులకు రూ.5,405 కోట్ల మొత్తాలను బకాయిపడ్డాయని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా చెప్పారు. బీమా కార్యక్రమంలో పాలుపంచుకున్న రాష్ట్ర ప్రభుత్వాలు, బీమా సంస్థల మధ్య వివాదాలు, బ్యాంకుల తప్పులు, ఆలస్యమైన బీమా ప్రతిపాదనలు, రాష్ట్రాలు సబ్సిడీ వాటాను ఆలస్యంగా విడుదల చేయడం వంటి కారణాలతో బకాయిలు పేరుకుపోయాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. -
భద్రతా ఉల్లంఘనల్లో ఎయిరిండియా సెంచరీ
న్యూఢిల్లీ: ప్రైవేట్ విమానయాన సంస్థ ఎయిరిండియాలో దాదాపు 100 భద్రతా ఉల్లంఘనలు జరిగాయని భారత విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించింది. ఎయిర్లైన్ గురుగ్రామ్ స్థావరంపై డీజీసీఏ ఈ నెల 1 నుంచి నాలుగువరకు ఆడిట్ నిర్వహించింది. కార్యకలాపాలు, విమాన షెడ్యూలింగ్, రోస్టరింగ్ మరియు ఇతర కీలక విధులను పరిశీలించింది. ఈ సందర్భంగా అనేక ఉల్లంఘనలు గుర్తించినట్లు డీజీసీఏ తెలిపింది. విమానయాన సంస్థ సిబ్బంది శిక్షణ, విధులు, విశ్రాంతి కాల నిబంధనలు, సిబ్బంది సామర్థ్యం, ఎయిర్ఫీల్డ్ అర్హత వంటి అంశాల్లో నిబంధనలు పాటించలేదని తేలింది. వీటిలో ఏడు ఉల్లంఘనలను లెవల్–1గా వర్గీకరించారు. ఇవి తక్షణ దిద్దుబాటు చర్య అవసరమయ్యే తీవ్రమైన భద్రతా ప్రమాదాలుగా తెలిపింది. అంతేకాదు.. మార్పులకు అఉగుణంగా బోయింగ్ 787, 777 పైలట్లకు ఎయిరిండియా శిక్షణ ఇవ్వలేదని గుర్తించినట్లు డీజీసీఏ వెల్లడించింది. ఎటువంటి దిద్దుబాటు చర్యలు తీసుకున్నారనే విషయంపై నివేదికను సమరి్పంచాలని ఎయిరిండియాను ఆదేశించింది. ఆడిట్ నివేదిక అందింది: ఎయిరిండియా డీజీసీఏ ఆడిట్ నివేదిక తమకు అందిందని ఎయిరిండియా ధ్రువీకరించింది. నిర్ణీత గడువులోగా స్పందిస్తామని తెలిపింది. ‘‘అన్ని విమానయాన సంస్థలకు ఆడిట్లు జరుగుతాయి. అందులో భాగంగానే ఎయిరిండియా వార్షిక డీజేసీ ఆడిట్ జూలైలో జరిగింది. ఇందులో కనుగొన్న విషయాలను మేం అంగీకరిస్తున్నాం. నిరీ్ణత సమయ వ్యవధిలోపు మా ప్రతిస్పందనను, తీసుకున్న దిద్దుబాటు చర్యలను డీజీసీఏకు సమరి్పస్తాం. ప్రయాణీకులు, సిబ్బంది భద్రతకు మా సంస్థ పూర్తిగా కట్టుబడి ఉంది’’అని ఎయిరిండియా ఒక ప్రకటనలో తెలిపింది. అహ్మదాబాద్ ప్రమాదం తరువాత.. జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్తున్న బోయింగ్ 787 డ్రీమ్లైనర్ కూలిపోయిన తర్వాత ఎయిర్లైన్పై తీవ్ర పరిశీలన జరిగిన నేపథ్యంలో ఆడిట్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ విమాన ప్రమాదంపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) ఈ నెలలో 15 పేజీల ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రెండు ఇంజన్లకు ఇంధన సరఫరా సెకన్ల వ్యవధిలో ఆగిపోయిందని తెలిపింది. రెండు ఇంధన స్విచ్లు కొన్ని సెకన్ల వ్యవధిలో ‘రన్’నుంచి ‘కటాఫ్’కు మారాయని నివేదిక పేర్కొంది. ‘ఎందుకు ఆపేసావు?’అని ఒక పైలట్.. మరో పైలట్ను అడగ్గా, తాను అలా చేయలేదని మరో పైలట్ బదులివ్వడం కాక్పిట్ వాయిస్ రికార్డర్లో రికార్డయ్యింది. -
ఎమ్మెల్యేల ఫిరాయింపుపై నేడు సుప్రీం తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో సుప్రీం కోర్టు గురువారం తుది తీర్పు వెలువరించనుంది. ఈ ఫిరాయింపుల కేసుపై చివరిసారిగా ఏప్రిల్ 3న జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టైన్ జార్జి మసీలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఇప్పుడు జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఈకేసుపై సీజే ధర్మాసనం కీలక తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించారని పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ సుప్రీం కోర్టులో జనవరి 15న స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.అదేరోజు ఎమ్మెల్యేలు పరిగి శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, టి.ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాం«దీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఎం.సంజయ్ కుమార్ పార్టీ ఫిరాయించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్, జగదీశ్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింత ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్ రిట్ పిటిషన్ వేశారు. ఆ తర్వాత వాదనలు జరుగుతుండగానే మార్చి 18న బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్ను ప్రతివాదిగా చేర్చారు. ఆ పిటిషన్లంటినీ కలిపి విచారించిన ధర్మాసనం ఏప్రిల్ 3న తీర్పును ఎనిమిది వారాలకు రిజర్వ్ చేసింది. ధర్మాసనంలో సీజేపాటు జస్టిస్ వినోద్ చంద్రన్ ఉన్నారు. -
TG: ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు.. ‘సుప్రీం’ తుది తీర్పు రేపే
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో రేపు(గురువారం) సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్రెడ్డి, కేపీ వివేకానంద సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్లపై ఇప్పటికే పలుమార్లు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఎమ్మెల్యేల అనర్హతపై రేపు(జులై 31) తుది తీర్పును వెలువరించనుంది. ఇరు పక్షాల వాదనలను విన్న సుప్రీంకోర్టు.. తీర్పును రిజర్వు చేసింది. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆ 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం రేపు తేలనుంది. ‘సుప్రీం’ తీర్పుపై ఆ ఎమ్మెల్యేలతో పాటు, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. రేపు ఉదయమే తీర్పు వచ్చే అవకాశముంది. -
భారత్పై అమెరికా సుంకాల మోత
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై సుంకాల మోత మోగించారు. భారత్పై 25శాతం సుంకాలే కాదు అదనంగా పెనాల్టీ విధించినట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై టారిఫ్ బాంబ్ పేల్చారు. అమెరికా కాలమాన ప్రకారం బుధవారం ఉదయం ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ఆట్వీట్లో భారత్పై టారిఫ్తో పాటు అదనంగా జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. ఈ సుంకం ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానుంది. భారత్ మాకు మిత్రుడే అయినప్పటికీ అత్యధిక దిగుమతి టారిఫ్లు, కఠినమైన ట్రేడ్ బారియర్లు ఉన్నాయని విమర్శించారు. భారత్.. రష్యా నుంచి భారీగా ఆయుధాలు, ఇంధనం కొనుగోలు చేస్తుంది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ నిర్ణయం హేయమైన చర్య’ అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్ మా స్నేహ దేశమే. కానీ వారు ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్లు విధిస్తున్న దేశాల్లో ఒకటి. రష్యా నుంచి ఆయుధాలు, ఇంధనం కొనుగోలు చేస్తున్నందుకు గాను 25శాతం టారిఫ్తో పాటు పెనాల్టీ కూడా చెల్లించాల్సిందేనని ట్రూత్ సోషల్ వేదికగా చేసిన ట్వీట్లో పేర్కొన్నారు. -
ఆపరేషన్ మహాదేవ్: పహల్గాం నిందితుల ప్లాన్ బెడిసి కొట్టి.. చివరికి
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్రం ఆపరేషన్ మహాదేవ్తో పహల్గాం ఉగ్రవాదుల్ని హతమార్చింది. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ప్రతీకారంతో భారత్ ఆపరేషన్ మహాదేవ్ పేరుతో మిలటరీ ఆపరేషన్ చేపట్టింది.వాళ్లను హతమార్చింది. అయితే, తాజాగా భారత సైనికులు ఆపరేషన్ మహాదేవ్కు సంబంధించి పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడింది సులేమాన్, అఫ్గానీ, జిబ్రాన్ ముగ్గురూ పాకిస్తాన్కు చెందిన లష్కరే తోయిబా (LeT) సభ్యులు. ఉగ్రదాడి తర్వాత నిందితులు శ్రీనగర్లో తలదాచుకుంటున్నారు. ఈ క్రమంలో ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ మహాదేవ్లో భాగంగా నిందితుల కమ్యూనికేషన్ ట్రాక్ చేసింది.శ్రీనగర్ సమీపంలోని లిడ్వాస్ ప్రాంతంలో స్థావరాల్ని గుర్తించింది.అయితే, ఉగ్రవాదులు ఆపత్కాలకంలో స్థావరాల నుంచి పారిపోయేందుకు ఎనిమిది కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సొరంగాన్ని భారత సైన్యం గుర్తించింది. ఆపరేషన్ మహాదేవ్ ప్రారంభం తర్వాత తప్పించుకునేందుకు వీలు లేకుండా ఉగ్రవాదులు ఏర్పాటు చేసుకున్న ఎనిమిది కిలోమీటర్ల మేర నీటితో నింపింది. ఆ తర్వాతే లిడ్వాస్ ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్న గుడారాలపై ఆకస్మికంగా బుల్లెట్ల వర్షం కురిపించింది. నిద్రపోతున్న పహల్గాం నిందితుల్ని మట్టుబెట్టింది. అనంతరం వారివద్ద నుంచి ఆయుధాలు,బుల్లెట్లను స్వాధీనం చేసుకుంది. ఆ బుల్లెట్లను.. పహల్గాంలో దాడికి ఉపయోగించిన బుల్లెట్లతో సరిపోల్చారు. ఉగ్రవాదుల మృతదేహాల వద్ద దొరికిన బుల్లెట్లు.. పహల్గాంలో మారణహోమం సృష్టించిన బుల్లెట్లతో 100శాతం సరిపోల్చినట్లు భారత సైన్యం నిర్ధారించింది. ఆపరేషన్ మహాదేవ్పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో మాట్లాడుతూ.. ‘ఈ ముగ్గురు ఉగ్రవాదులు పహల్గాం దాడికి బాధ్యులే అని శాస్త్రీయంగా నిర్ధారించాం. దేశం ముందు నిజాన్ని ఉంచేందుకు అన్ని ఆధారాలు సేకరించాం’అని స్పష్టం చేశారు. -
భారీగా తగ్గిన నక్సల్ హింస.. కారణం అదే!
న్యూఢిల్లీ: 2010వ సంవత్సరంతో పోలిస్తే 2024 నాటికి దేశంలో నక్సల్ హింసకు సంబంధించిన ఘటనలు 81 శాతం, పౌరులు, భద్రతా బలగాల మరణాలు 85 శాతం వరకు తగ్గుముఖం పట్టాయని కేంద్రం తెలిపింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ (Nityanand Rai) మంగళవారం లోక్సభలో ఒక ప్రశ్నకు ఈ మేరకు రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. 2013లో వామపక్ష తీవ్రవాద ప్రభావం దేశంలోని 126 జిల్లాల్లో ఉండగా 2025 ఏప్రిల్ నాటికి 18 జిల్లాలకు మాత్రమే పరిమితమైందని వివరించారు.ఈ సమస్యను రూపుమాపేందుకే 2015లో ‘నేషనల్ పాలసీ అండ్ యాక్షన్ ప్లాన్’ తీసుకొచ్చామన్నారు. లొంగిపోయిన ఉన్నత కేడర్ వామపక్ష తీవ్రవాదులకు రూ.5 లక్షల చొప్పున, ఇతర కేడర్ల వారికి రూ.2.5 లక్షల చొప్పున పునరావాస ప్యాకేజీ కింద అందజేస్తున్నామన్నారు. ఆయుధాలతో లొంగిపోయిన వారికి మూడేళ్లపాటు నెల వారీ స్టయిఫెండ్ (stipend) రూ.10వేలతో పాటు ఇతర ప్రోత్సాహకాలను అందజేస్తున్నామని వివరించారు. రైళ్లు ఢీకొని ఐదేళ్లలో 81 ఏనుగులు మృతి దేశంలో రైళ్లు ఢీకొన్న ఘటనల్లో ఐదేళ్ల వ్యవధిలో 81 ఏనుగులు (Elephants) మృత్యువాత పడ్డట్లు కేంద్ర అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్థన్ సింగ్ తెలిపారు. 2019– 24 మధ్య కాలంలో ఈ ఘటనలు జరిగాయని లోక్సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రైల్వే ట్రాక్లపై ఏనుగులు మరణాలను నివారించడానికి పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ అనేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.ఏనుగుల ఆవాస ప్రాంతాల్లో వేగ పరిమితులు, భూకంప సెన్సార్ ఆధారిత ఏనుగుల గుర్తింపు వంటి పైల్ ప్రాజెక్టులు, అండర్ పాస్ల నిర్మాణం, ర్యాంప్లు, ఫెన్సింగ్లు వంటివి చేపట్టినట్లు పేర్కొన్నారు. గుర్తించిన 127 రైల్వే స్ట్రెచ్లలో క్షేత్ర సర్వేల తర్వాత ఏనుగులు, ఇతర వన్యప్రాణులను రైళ్లు ఢీకొనే ఘటనలు తగ్గినట్లు కేంద్ర సహాయ మంత్రి కీర్తి వర్థన్ సింగ్ (Kirti Vardhan Singh) తెలిపారు.చదవండి: ఆపరేషన్ సిందూర్ను ఆపాలని ఏ దేశాధినేతా చెప్పలేదు -
కాల్పుల విరమణకు పాక్ అడుక్కుంది: జై శంకర్
కాల్పుల విరమణలో ఏ దేశం మధ్యవర్తిత్వం వహించలేదని భారత విదేశాంగ మంత్రి జై శంకర్ పార్లమెంట్ వేదికగా మరోసారి స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్పై చర్చలో భాగంగా బుధవారం రాజ్యసభలో ఆయన ప్రసంగించారు. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని.. అందుకే పాక్తో సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేశామని వ్యాఖ్యానించారాయన. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రపంచానికి తెలియజేశాం. పాక్లోని ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ‘సిందూర్’ పేరిట చేపట్టిన ఆపరేషన్తో ధ్వంసం చేసింది. కాల్పుల విరమణకు పాకిస్థాన్ అడుక్కుంది. అంతేగానీ కాల్పుల విరమణలో ఏ దేశం మధ్యవర్తిత్వం వహించలేదు అని అన్నారాయన. ఆపరేషన్ సిందూర్ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఎలాంటి సంభాషణలు జరగలేదని జై శంకర్ వివరించారు. ఆ సమయంలో చాలా దేశాలు దౌత్యానికి ముందుకొచ్చాయి. కానీ, జోక్యం సరికాదని ఆయా దేశాలకు చెప్పాం అని జైశంకర్ అన్నారు. ‘‘వాళ్లకు(ప్రతిపక్షాలకు) ఒక్కటే చెప్పదల్చుకున్నా.. ఏప్రిల్ 22 నుంచి జూన్ 16 మధ్య ఆ ఇద్దరు నేతలకు ఒక్క ఫోన్ కాల్ సంభాషణ జరగలేదు’’ అని స్పష్టం చేశారాయన. మే 9వ తేదీన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. పాక్ నుంచి దాడులు జరగవచ్చని హెచ్చరించారాయన. అయితే అలాంటి పరిస్థితి వస్తే భారత్ నుంచి ప్రతిఘటన తీవ్రంగా ఉంటుందని మోదీ వాన్స్తో చెప్పారు. ఆర్థికల్ 370, సింధూ జలాల ఒప్పందం.. నెహ్రూ పాలనలో జరిగిన ఈ తప్పిదాలను మోదీ సర్కార్ ఇప్పుడు సరిదిద్దుతోంది. ఉగ్రవాదాన్ని గ్లోబల్ ఎజెండాలో చేర్చడం ప్రధాని మోదీ వల్లే సాధ్యమైంది అని జైశంకర్ అన్నారు. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని.. అందుకే పాక్తో సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేశామని, పాక్ ఉగ్రవాదాన్ని విడిచిపెట్టేదాకా ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని స్పష్టం చేశారారయన. -
సీఎం రేవంత్కు సుప్రీంకోర్టులో ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: గోపన్పల్లి భూ వివాదం కేసులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా ఎన్.పెద్దిరాజు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ట్రాన్స్ఫర్ పిటిషన్ను మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మౌసుమి భట్టాచార్యపై అసంబద్ధ ఆరోపణలు చేసినందుకు పిటిషనర్ పెద్దిరాజు, అతని తరఫు న్యాయవాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.వారిపై కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు ప్రారంభించకూడదో ఆగస్టు 11న తదుపరి విచారణ సందర్భంగా వ్యక్తిగతంగా హాజరై సమాధానం ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. ‘న్యాయమూర్తులను ఇబ్బందికర స్థితిలోకి నెట్టేలా ఎవరైనా ఆరోపణలు చేయడం మేము సహించం. ఇలాంటి వ్యవహారాలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇలాంటి చర్యలతో న్యాయవ్యవస్థ పరువు పోతుంది. అలాంటి వ్యాఖ్యలపై కఠినంగా వ్యవహరించాలి.ఇక్కడ మేము న్యాయవాదులను కూడా రక్షించాలనే ఉద్దేశంతో ఉన్నాం’అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. రేవంత్ రెడ్డికి అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఇతర న్యాయస్థానానికి బదిలీ చేయాలంటూ పెద్దిరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును రద్దుచేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆరోపణలు చేస్తూ పెద్దిరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. క్షమాపణలతో తప్పించుకోలేరు విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫున న్యాయవాది రితేష్ పాటిల్ ట్రాన్స్ఫర్ పిటిషన్ను వెనక్కు తీసుకుంటామని సుప్రీంకోర్టును కోరారు. అయితే ధర్మాసనం నిరాకరించింది. ‘ఇది కేవలం లిటిగెంట్ తప్పు మాత్రమే కాదు, అలాంటి వ్యాఖ్యలపై సంతకం చేసిన న్యాయవాది కూడా కోర్టు ధిక్కారానికి బాధ్యత వహించాలి. ‘మీరంతా మొదట న్యాయమూర్తిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు సమరి్పంచండి. అవి నిజాయితీగా ఉన్నాయో లేదో చూస్తాం. అంతేతప్ప, మీరు పిటిషన్ వెనక్కు తీసుకుంటామంటే క్షమించలేం’అని ధర్మాసనం స్పష్టం చేసింది. రేవంత్ రెడ్డి తరఫున సీనియర్ అడ్వొకేట్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. అసలు ఏం జరిగిందంటే.. గోపన్పల్లిలో సర్వే నంబర్ 127లోని సొసైటీకి సంబంధించిన భూమిని ఆక్రమించడంతోపాటు నిర్మాణాలను జేసీబీతో కూల్చేశారంటూ గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో 2016లో కేసు నమోదైంది. పెద్దిరాజు ఫిర్యాదు మేరకు.. ఏ–1గా కొండల్ రెడ్డి (రేవంత్ రెడ్డి సోదరుడు), ఏ–2గా ఈ.లక్ష్మయ్య, ఏ–3గా రేవంత్ రెడ్డిని చేర్చారు. ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టులో విచారణలో ఉన్న ఈ కేసును కొట్టేయాలని రేవంత్ 2020లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.దీనిపై హైకోర్టులో వాదనలు విన్న జడ్జి జస్టిస్ మౌషుమీ భట్టాచార్య ధర్మాసనం.. రేవంత్ రెడ్డి ఘటనా స్థలంలో లేరనే విషయాన్ని ఫిర్యాదుదారు సైతం అంగీకరించారని పేర్కొంది. తాను లేను కాబట్టి తనపై కేసు కొట్టేయాలని అడుగుతున్నారని, మిగతా వారిపై కేసుకొట్టేయాలని అడగటం లేదని వ్యాఖ్యానించింది. రేవంత్రెడ్డి ఆదేశాలమేరకే దూషించాడనే ఆరోపణలకు ఆధారాలు లేవని తెలిపింది. ఈ క్రమంలో జూలై 18న రేవంత్పై నమోదైన కేసును కొట్టేసింది. -
ఆ ముగ్గురూ పహల్గాం ముష్కరులే
న్యూఢిల్లీ: వేలాది మంది విచారణ. అనుమా నితులపై నిరంతర నిఘా. ఆశ్రయమిచ్చిన వారి నిర్బంధం. గత ఏప్రిల్ 22న పహల్గాంలో పాశవిక దాడికి పాల్పడి 26 మంది అమాయక పర్యాట కులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల కోసం ‘ఆపరేషన్ మహదేవ్’లో భాగంగా భద్రతా దళాలు నెలల తరబడి వేటాడిన తీరిది. శాటిలైట్ ఫోన్ సిగ్నల్స్ సాయంతో ఆనుపానులు చిక్కడంతో ఎట్టకేలకు వారి పాపం పండింది. సోమవారం జమ్మూ కశ్మీర్లో భద్రతా దళాల చేతుల్లో హతమ య్యారు. ఆ ముగ్గురూ పహల్గాం దాడిలో పాల్గొన్న ముష్కరు లేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. వారిని గుర్తించేందుకే నెలల సమయం పట్టిందని వెల్ల డించారు. సాంకేతికత, మానవ నిఘా సాయంతో ఉగ్రవాదులను కదలి కలను కనిపెట్ట గలిగినట్టు వివరించారు. ఆపరేషన్ సిందూర్పై మంగళవా రం లోక్సభలో ప్రత్యేక చర్చలో ఆ యన ప్రసంగించారు. ఆ పాశవిక దాడితో గాయ పడ్డ దేశ ప్రజల హృద యాలకు సాంత్వన చేకూ ర్చిన ఆపరేషన్ మహదేవ్ తాలూకు వివరాలను సభకు వెల్లడించారు. హతులైన ముగ్గురిని సులే మాన్ అలియాస్ ఫైజల్, అఫ్గాన్, జిబ్రాన్గా గుర్తించారు. వారంతా ఏ గ్రేడ్ ఉగ్రవాదులేనని తెలిపారు. సైన్యం తాలూకు 4 పారా మిలిటరీ బలగాలు, సీఆర్పీఎఫ్ జవాన్లు, జమ్మూ కశ్మీర్ పోలీసులు కలసి కట్టుగా ఆపరేషన్లో పాలుపంచుకున్నట్టు వివరించారు. పహల్గాం దాడికి పాల్పడ్డ ముష్కరులను ఏరివేసి జాతికి ఊరట కల్పించామని చెప్పారు. ‘‘ఇంత మంచి వార్త విని అధికార పక్షంతో పాటు విపక్షాలు ఆనందిస్తాయని ఆశించా. కానీ వారి ముఖాలన్నీ కళతప్పి కనిపిస్తున్నాయి’’ అంటూ ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ తప్పిదమే ‘పాక్’!ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమవుతూ వస్తోందని అమిత్ షా ఎద్దేవా చేశారు. దేశ సమస్యలన్నింటికీ కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమంటూ తూర్పారబట్టారు. పాక్ ఆక్రమిత భూభాగాలను స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన అవకాశాలన్నింటినీ కాంగ్రెస్ ఎప్పటికప్పుడు కాలదన్నుతూ వచ్చిందని ఆరోపణలు గుప్పించారు. అలాంటి పార్టీకి మోదీ ప్రభుత్వం పాక్పై పూర్తిస్థాయిలో నిర్ణాయక చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించే నైతిక అర్హత కూడా లేదన్నారు. పహల్గాం దాడిలో పాక్కు క్లీన్చిట్ ఇచ్చేందుకు ఎక్కడ లేని ఉత్సాహమూ చూపిన చరిత్ర ఆ పార్టీది అంటూ మండిపడ్డారు. పహల్గాం దాడికి పాల్పడింది స్థానిక ఉగ్రవాదులే కావచ్చని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ హోం మంత్రి పి.చిదంబరం ఇటీవల కూడా వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. పీఓకేను స్వాధీనం చేసుకునే అవకాశం చేతికందిన వేళ సైనిక చర్యను కేంద్రం నిలిపేసిందా అంటూ కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగొయ్ సభలో ప్రశ్నించడంపై అమిత్ షా మండిపడ్డారు. ‘‘వాళ్లు ఏం నిరూపించాలని అనుకుంటున్నారు? ఎవరిని కాపాడాలనుకుంటున్నారు? ఇదంతా పాక్ను కాపాడేందుకు స్పష్టమైన కుట్రే’’ అంటూ తూర్పారబట్టారు. స్వాతంత్య్రం వచ్చిన వేళ దేశ విభజనను కాంగ్రెస్ వ్యతిరేకించి ఉంటే జమ్మూ కశ్మీర్లో అసలు ఉగ్ర భూతం జడలు విప్పేదే కాదన్నారు. ఉగ్రవాదానికి పాక్ తల్లివేరుగా మారిందంటూ దుయ్యబట్టారు. ఆ దేశం ఏర్పాటును కాంగ్రెస్ తాలూకు తప్పిదంగా అభివర్ణించారు. పాక్కు బుద్ధి చెప్పేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్నీ కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే జారవిడిచిందని ఆరోపించారు. ‘‘1948లో పాక్ ఆక్రమిత కశ్మీర్ను మన సైన్యం పూర్తిగా విముక్తం చేసే సమయంలో నాటి కాంగ్రెస్ ప్రధాని నెహ్రూ ఏకపక్షంగా కాల్పుల విమరణ ప్రకటించారు. 1962 యుద్ధం వేళ అస్సాంను చైనా దఖలు పరుస్తున్నట్టు బాహాటంగా ప్రకటన చేశారు. పైగా ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వ హోదా అవకాశాన్నీ కాలదన్నారు. 1971లో 90,000 మంది పాక్ సైనికులు భారత్కు లొంగిపోయారు. ఆ సంఖ్య నాటి పాక్ సైన్యంలో ఏకంగా 42 శాతం. అంతేగాక 15 వేల చదరపు కి.మీ. పాక్ భూభాగం కూడా మన అదుపులోకి వచ్చింది. అయినా పీఓకేను వెనక్కు తీసుకునేందుకు నాటి కాంగ్రెస్ ప్రధాని ఇందిరాగాంధీ ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. సరికదా, ఆ యుద్ధంలో స్వాధీనం చేసుకున్న పాక్ భూభాగాన్ని కూడా పువ్వుల్లో పెట్టి వెనక్కిచ్చారు. ఇలాంటి చరిత్ర ఉన్నవాళ్లు, పహల్గాం దాడికి పాల్పడ్డవారిని ఎందుకు పారిపోనిచ్చారని నన్ను అడుగుతున్నారు. వారిని తుదముట్టించడం ద్వారా ఈ ప్రశ్నకు నా తరఫున భద్రతా దళాలే బదులిచ్చాయి. 1986లో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాక్కు పారిపోయింది కూడా కాంగ్రెస్ ప్రధాని రాజీవ్ హయాంలోనే. 1993లో ఉగ్రవాదులు సయీద్ సలాహుద్దీన్, టైగర్ మెమన్, అనీస్ ఇబ్రహీం కస్కర్, 2007లో రియాజ్ భత్కల్, 2010లో ఇక్బాల్ భత్కల్ దేశం వీడి పారిపోయినప్పుడు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెసే. వీళ్లందరినీ ఎందుకు పారిపోనిచ్చారో విపక్ష నేత రాహుల్గాంధీ నుంచి తెలుసుకోవాలని అనుకుంటున్నా’’ అని అన్నారు. -
సిందూర్ ఆపాలని ఏ దేశాధినేతా చెప్పలేదు
న్యూఢిల్లీ: నిఘా వైఫల్యం కారణంగా పహల్గాంలో అత్యంత పాశవిక దాడి జరిగిందని, ఆపరేషన్ సిందూర్తో భారత్ సాధించిన కీలక విజయాలేంటో చెప్పాలంటూ విపక్షాల డిమాండ్ల మధ్య లోక్సభలో ప్రధాని మోదీ సూటిగా సమాధానమిచ్చారు. ఆపరేషన్ సిందూర్పై 16 గంటల ప్రత్యేక చర్చకు సమాధానంగా ప్రధాని మోదీ వివరణ ఇస్తూనే గత కాంగ్రెస్ ప్రభుత్వాలు, విపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. భారత్, పాక్ పరస్పర సైనిక చర్యలు పరిసమాప్తం కావడానికి తానే ముఖ్యకారణమని ఇప్పటికే పాతికసార్లు ఢంకా భజాయించిన ట్రంప్ మాటల్లో రవ్వంతైనా నిజంలేదని స్పష్టంచేశారు. ఉగ్రవాదాన్ని కాళ్లకింద నలిపేసేటప్పుడు ప్రపంచంలో ఏ దేశం వారించినా ఊరుకునేది లేదని వ్యాఖ్యానించారు. సిందూర్ తక్షణం ఆపేయాలని ప్రపంచంలో ఏ దేశ నేతా తమకు చెప్పలేదని మోదీ స్పష్టం చేశారు. 102 నిమిషాల ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..విజయోత్సవంలో ప్రసంగిస్తున్నా..‘‘ఉగ్రవాదానికి కుంభస్థలం వంటి పాక్లోని ఉగ్రస్థావరాలను మనం నేలమట్టంచేసినందుకు ఈరోజు పార్లమెంట్లో విజయోత్సవం జరుపుకుంటున్నట్లు అనిపిస్తోంది. భారత వాణిని ప్రపంచానికి వినిపించేందుకు, భారత్ అంటే ఎంటో అందరికీ మరోసారి చాటిచెప్పేందుకే మాట్లాడుతున్నా. సిందూర్ వేళ నాపై నమ్మకం ఉంచిన ప్రజలందరికీ రుణపడిపోయా. ఉగ్రవాదానికి తల్లివేరు వంటి పాక్కు ఆపరేషన్ సిందూర్తో అసాధారణరీతిలో గుణపాఠం చెప్పాం. ఆ భీకర దాడుల నుంచి పాక్ ఇంకా కోలుకోలేదు. దాడులు మళ్లీ జరగొచ్చని వాళ్లు ఇప్పటికీ భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఆపరేష్ సిందూర్ అమలుకోసం మేం సైనిక బలగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం. పహల్గాం దుశ్చర్యకు దీటుగా బదులిస్తూ పాక్ నడిబొడ్డున క్షిపణుల వర్షం కురిపించాం. కేవలం 22 నిమిషాల్లో భిన్న ప్రాంతాల్లోని కీలక ఉగ్రస్థావరాలను నేలమట్టంచేశాం. అణు బెదిరింపులు మన దగ్గర పనిచేయవని పాక్ను గట్టిగానే హెచ్చరించాం. మన దాడుల ధాటికి పాక్ వైమానిక స్థావరాలు సర్వనా శనమై ఇప్పటికీ అలాగే ఐసీయూలో ఉన్నాయి’’.ఆత్మనిర్భరతను ప్రపంచం కళ్లారా చూసింది‘‘ఆపరేషన్ సిందూర్లో బ్రహ్మోస్ వంటి స్వదేశీ క్షిపణులుసహా సొంత డ్రోన్ల వినియోగంతో భారత్ సాధించిన స్వావలంభన, ఆత్మనిర్భరతను ప్రపంచం కళ్లారా చూసింది. అమాయకులను ఉగ్రదా డులతో బలితీసుకుంటే ఎలాంటి స్పందనా ఉండదని ఇన్నాళ్లూ ఉగ్రదాడుల సూత్రధారులు భావించారు. ఇకపై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే భారత్ దండయాత్ర చేయగలదని ఆపరేషన్ సిందూర్తో ఉగ్రవాదులక బాగా తెలిసొచ్చింది. ఆపరేషన్ సిందూర్ నుంచి సింధు దాకా భారత్ భిన్నకోణాల్లో ప్రతీకార చర్యలు చేపట్టింది. భవిష్య త్తులో తోకజాడిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పాక్కు బోధపడింది. ఉగ్రపోషకులు, పాక్ పాలకులు ఒక్కరే అనే భావనతోనే భారత్ ముందుకెళ్తోంది. ఉగ్రవాదంపై పోరులో భాగంగా ఆపరేషన్ సిందూర్ మొదలెడితే ప్రపంచంలో మూడు దేశాలు తప్ప ఏ దేశమూ భారత్కు అడ్డుచెప్పలేదు. పాక్కు ఆ మూడుదేశాలే మద్దతు పలికాయి. ఇలా ప్రపంచదేశాలన్నీ భార త్కు అండగా నిలిస్తే కాంగ్రెస్ మాత్రం మన సైనికుల వీరత్వానికి సలామ్ చేయలేదు. పాకిస్థా న్ను కాంగ్రెస్ వెనకేసుకురావడం దౌర్భా గ్యం. గతంలో సర్జికల్ దాడులు చేసినప్పుడూ కాంగ్రెస్ ఇదే పాట పాడింది’’.నిమిషాల్లో నాశనం చేశాం‘‘పాక్ నడిబొడ్డున, ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రస్థా వరాలపై మన బలగాలు మేలో మెరుపుదాడులు చేశాయి. నిమిషాల్లోనే మీ స్థావరాలను సమాధులుగా మార్చగలమని పాక్కు నిరూపించాం. తొలుత ఉగ్రస్థావరాలను మన బలగాలు ధ్వసంచేశాయి. ఉగ్రవాదులకు సాయంగా పాక్ బలగాలు ప్రతిదాడులకు సిద్ధపడడంతోనే వాళ్ల వైమానిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపించి కోలుకోలేని దెబ్బతీశాం. దీంతో పాక్ కాళ్లబేరానికి వచ్చింది. పాక్ డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్(డీజీఎంఓ) నుంచి ఫోన్ వచ్చింది. ఇంతకుమించి దాడులు చేస్తే ఇప్పట్లో కోలుకోలేమని ప్రాధేయపడ్డారు. అందుకే సిందూర్కు ముగింపు పలికాం. ఆపరేషన్ను ఆపడానికి ఇదే ఏకైక కారణం. అంతేగానీ ప్రపంచంలో మరే దేశాధినేత కారణంగానో సిందూర్ ఆగలేదు. ఆపాలని ఎవరూ మాకు చెప్పలేదు. మే 9వ తేదీ రాత్రి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పదేపదే నాకు ఫోన్ చేశారు. అప్పటికే త్రివిధ దళాధిపతులతో భేటీలో బిజీగా ఉన్నాను. భేటీ తర్వాత నేనే ఫోన్కాల్ చేసి మాట్లాడా. పాక్ దాడి చేయబోతోందని ఉప్పందించారు. ఎలాంటి దాడినైనా అడ్డుకోగలమని ఆయనకు స్పష్టంచేశా. దాడికి ప్రతిదాడి దారుణంగా ఉంటుందని చెప్పా. బుల్లెట్లకు బాంబులతో సమాధానం చెప్తామన్నా. ఎన్నో విషయల్లో భారత్ స్వావలంభన సాధిస్తోంది. కాంగ్రెస్ మాత్రం చాలా అంశాలను ఎత్తిచూపేందుకు పాక్ పేరును మధ్యలోకి లాక్కొస్తోంది. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు పరోక్షంగా పాక్ అజెండాను ప్రకటించే అధికారిక ప్రతినిధులుగా తయార య్యా రు. గతంలో మేం సర్జికల్ దాడులుచేస్తే కాంగ్రెస్ వాళ్లు ఆధారాలు కావాలన్నారు. ఆనాడు పైలట్ అభి నందన్ పాక్ బలగాలకు దొరికిపోతే ఎలా విడిపించుకొస్తారో చూస్తామని మాట్లాడారు. తీరా మేం తీసుకొచ్చాక ఇదే కాంగ్రెస్ నేతలు నోరుమూశారు. ఉగ్రవాదులకు జరిగిన భారీ నష్టాన్ని చూసి అక్కడ పాక్ మాత్రమే కాదు ఇక్కడ భారత్లోనూ కొందరు ఏడుస్తున్నారు’’ అని మోదీ ఎద్దేవా చేశారు.విశ్వశాంతికి ఇది అవసరం‘‘విశ్వశాంతి సాధనలో ఆయుధ సంపత్తితో తులతూగడం కూడా ముఖ్యమే. అందుకే రక్షణరంగంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి ద్వారాలు తెరిచాం. ఇప్పడు వందకు పైగా అంకురసంస్థలు రక్షణరంగంలో కృషిచేస్తున్నాయి. కొన్ని సంస్తలను మహిళలు ముందుండి నడిపిస్తున్నారు. ఇలాంటి జాతీయ భద్రతా ముందుచూపు కాంగ్రెస్కు గతంలోలేదు. ఇకమీదట కూడా రాదు. పాక్ ఆక్రమిత కశ్మీర్ను ఇప్పటికీ భారత్ ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయిందన్న ప్రశ్నకంటే ముందు అసలు అదెలా మన చేయిజారిందనే ప్రశ్న వేసుకోవాలి. విశాల కశ్మీరం చేజారడానికి కారకులెవరు? నెహ్రూ హయాం నుంచి మొదలుపెడితే గత కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన ఘోర పరిపాలనా తప్పిదాల కారణంగానే భారత్ ఇప్పటికీ ఉగ్రదాడులు, ఇతర గాయాలతో బాధపడుతోంది’’ అని అన్నారు.వేయి క్షిపణులు ప్రయోగిస్తే అన్నింటినీ గాల్లోనే కూల్చేశాం‘‘భారత గగనతల రక్షణ వ్యవస్థల సత్తాను చూసి ప్రపంచదేశాలు నివ్వెరపోయాయి. సిందూర్కు ప్రతిగా పాక్ 1,000కిపైగా క్షిపణులను ప్రయోగిస్తే మన గగనతల రక్షణవ్యవస్థలు వాటన్నింటినీ గాల్లోనే పేల్చేశాయి. అదంపూర్ వైమానికస్థావరం నాశనమైందని పాక్ కారుకూతలు కూస్తే తెల్లారే అక్కడికెళ్లి అది నిక్షేపంగా ఉందని ప్రపంచానికి చాటిచెప్పా. భారత సైనిక సత్తాను దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్ నమ్మకపోవడం దారుణం. మన రక్షణ మంత్రి, విదేశాంగ మంత్రి, హోం మంత్రులు చెప్పిన మాటలకూ కాంగ్రెస్ విలువ ఇవ్వట్లేదు. పాక్ రిమోట్ కంట్రోల్తో కాంగ్రెస్ పనిచేస్తుందేమో. కొందరు కాంగ్రెస్ యువనేత (రాహుల్)లు ఆపరేషన్ సిందూర్ను తమాషాగా కొట్టిపారేశారు. మన సైనికుల అద్భుత విజయాన్ని చూసి కాంగ్రెస్ నేతలు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. లోక్సభలో ప్రత్యేక చర్చ మొదలైన నాడే ఆపరేషన్ మహదేవ్లో పహల్గాం ముష్కరులు ఎలా చనిపోయారని ప్రశ్నిస్తున్నారు. జాడ కనిపెట్టి ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి వారాలు, తేదీలు చూడాలా?’’ అని మోదీ ఆగ్రహంవ్యక్తం చేశారు.సిందూ నదీజలాల ఒప్పందం నెహ్రూ పాపమే‘‘మన నదీజలాలపై ప్రపంచబ్యాంక్ అజమాÆ ‡ుుషీ చేసేలా నెహ్రూ ప్రభుత్వం ఘోర తప్పుడు నిర్ణయం తీసుకుంది. భారతనేలపై పారే సిందూ నదీజలాల్లో 80 శాతం వాటా పాక్కు ఆయనే ధారాదత్తంచేశారు. ఇంతటి జనాభా ఉన్నప్పటికీ మనకు 20 శాతం మాత్రమే హక్కులు దఖలుపడ్డాయి. మన భారతీయ రైతుల నీటికష్టాలు నెహ్రూకు పట్టలేదు. నీళ్లివ్వడంతోపాటు నెహ్రూ పాక్కు నిధులు కూడా ఇచ్చారు. సిందూ నదీజలాలపై డ్యామ్లు కట్టుకునేందుకు నెహ్రూ ప్రభుత్వం పాక్కు ఆర్థికసాయం చేసింది. సిందూ నదీజలాల ఒప్పందంలో నెహ్రూ చేసిన భారీ తప్పిదాలను తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలూ సరిచేయలేదు. మేం వచ్చాకే ఆ తప్పులను సవరించాం. ఉగ్రదాడులతో భారతీయుల రక్తం పారేలా చేస్తున్నారు. అందుకే సిందూ నదీజలాల ఒప్పందం నుంచి వైదొలిగాం. నీళ్లు, రక్తం కలిసి ప్రవహించబోవని స్పష్టంచేశాం. ఆపరేషన్ సిందూర్ ముగిసిపోలేదు. పాక్ మళ్లీ కుయుక్తులతో పేట్రేగిపోతే సిందూర్ మళ్లీ మొదలవుతుంది’’ అని మోదీ స్పష్టం చేశారు. -
ఆస్పత్రి ఏసీ గదిలో డాక్టర్ మొద్దు నిద్ర.. ఓ వ్యక్తి ప్రాణం తీసింది
లక్నో: ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అప్రమత్తమైన స్థానికులు బాధితుణ్ణి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి సిబ్బంది స్ట్రెచర్పై ఆస్పత్రి వార్డుకు తరలించారు. అసలే ఓడుతున్న రక్తం.. భరించ లేని నొప్పిని తాళలేక గుండెలవిసేలా కేకలు వేస్తున్నాడు. కేకలు విన్న వైద్యులు హుటాహుటీన వచ్చి ట్రీట్మెంట్ అందించి ఉంటే.. బాధితుడు బ్రతికేవాడు. కానీ అలా జరగలేదు. ఏసీ గదిలో హాయిగా నిద్రపోయారు. ఫలితంగా సకాలంలో వైద్యం అందక క్షతగాత్రుడు ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తరప్రదేశ్ మీరట్లో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సునీల్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అత్యవసర చికిత్స నిమిత్తం లాలా లజపత్ రాయ్ మెమోరియల్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. విధుల్లో ఉన్న ఇద్దరు జూనియర్ డాక్టర్లు నిర్లక్క్ష్యంగా వ్యవహరించారు. విధుల్లో మొద్దు నిద్రపోవడంతో క్షతగాత్రుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియో దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. ఆ వీడియోలో బాధితుడు అత్యవసర వార్డులో స్ట్రెచర్పై ఆహాకారాలు చేస్తుండగా.. కుర్చీలో కూర్చుని జూనియర్ డాక్టర్లు భూపేశ్ కుమార్ రాయ్, అనికేత్ నిద్రపోతుండడాన్ని గమనించవచ్చు.వీడియోలో ఓ డాక్టర్ ఏసీ ముందు కాళ్లు టేబుల్ మీద పెట్టుకుని నిద్రపోతుండగా.. నిద్ర పోతున్న డాక్టర్ ముందు ప్రిస్క్రిప్షన్ పట్టుకుని చంకలో చంటి పిల్లాడితో ఉన్న ఓ తల్లి అతడిని నిద్రలేపే ప్రయత్నం చేస్తుంది. గంటల తరబడి ఎవరూ పట్టించుకోకపోవడంతో స్ట్రెచర్పై నొప్పితో, రక్తస్రావంతో బాధపడుతూ సునీల్ మరణించాడు. ఈ ఘటనపై లాలా లజపతిరాయ్ మెమోరియల్ (LLRM) మెడికల్ కాలేజీ ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు.ఈ సంఘటన జరిగిన సమయంలో డ్యూటీ-ఇన్చార్జ్ డాక్టర్ శశాంక్ జిందాల్ ఆసుపత్రిలో లేరు. పరిస్థితి గురించి తెలుసుకున్న తర్వాత తాను తిరిగి వెళ్లి ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్, కాస్ట్ ఇచ్చానని చెప్పాడు. అయితే, మరుసటి రోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో సునీల్ మరణించాడు. రోగిని తీసుకువచ్చినప్పటికే పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్ జిందాల్ చెప్పడంపై బాధితుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరట్ జిల్లా మేజిస్ట్రేట్ను వివరణాత్మక విచారణ నిర్వహించాలని కోరారు. ఘటనపై ప్రభుత్వం వైద్యులను విధుల నుంచి తొలగించింది. मेरठ के पश्चिमी यूपी के सबसे बड़े मेडिकल सेंटर #LLRM मेडिकल कॉलेज मेंहादसे में घायल सुनील को आधी रात को इमरजेंसी में लाया गया।वो तड़पता रहा, मदद मांगता रहा,लेकिन डॉक्टर सोते रहे।इलाज न मिलने से सुनील की जान चली गई। pic.twitter.com/cmDI0YVnG3— B_L Bairwa (@BSSVERMA) July 28, 2025 -
ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపేయడానికి ముహూర్తం కావాలా ఏంటి?: మోదీ
సాక్షి,న్యూఢిల్లీ: రాహుల్ గాంధీకి ప్రధాని మోదీ కౌంటర్ ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపుతో భారత్-పాక్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ ఇతర ఎంపీలు చేస్తున్న వ్యాఖ్యలపై ప్రధాని మోదీ లోక్సభలో మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ను ఆపమని ఏ ప్రపంచాది నేతలు చెప్పలేదని స్పష్టం చేశారు. మంగళవారం లోక్సభలో ఆపరేషన్ సిందూర్పై కొనసాగుతున్న చర్చలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్పై లోక్సభలో జరుగుతున్న చర్చపై మోదీ మాట్లాడుతూ.. ఈ వర్షాకాల సమావేశాలు భారత్ విజయోత్సవానికి నిదర్శనం. ఆపరేషన్ సిందూర్ విజయానికి ప్రతీకగా విజయ్ ఉత్సవ్. మన సైనికులు ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపారు. ఆపరేషన్ సిందూర్ను దేశం మొత్తం విజయోత్సవాలు చేసుకుంటోంది. ఉగ్రస్థావరాలను మనసైన్యం నేలమట్టం చేసింది.140కోట్ల మంది భారతీయులు నాపై నమ్మకం ఉంచారు. సైన్యం వెనుక దేశ ఉంది. మతం కోణంలో పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. శత్రువుకు ఊహకు అందని విధంగా శిక్ష విధించాం. సైనికులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం.పాక్ బిత్తర పోయింది ‘పహల్గాం ఉగ్రదాడికి ప్రతీ కారం తీర్చుకుంటామని చెప్పాం.. చేసి చూపించాం. పాక్లోకి చొచ్చుకెళ్లి ఉగ్రస్థావరాల్ని ధ్వంసం చేశాం. పాక్లోని ఉగ్రవాదుల హెడ్ క్వార్టర్స్ను కూల్చేశాం. కలుగులో దాక్కున్న ముష్కరులకు పొగపెట్టిమరీ మట్టిలో కలిపాం. పథకం ప్రకారం ఆపరేషన్ సిందూర్. భారత్ ప్రతీకార చర్యలను చూసి పాక్ బిత్తర పోయింది. ఆపరేషన్ సిందూర్ ముందు పాక్ తేలిపోయింది.ఆపరేషన్ సిందూర్ ముందుకు బ్లాక్ మెయిల్స్ పనిచేయవని చూపించాం’ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్కు హెడ్లైనే గతి56 ఇంచ్ల చెస్ట్ ప్రధాని ఎక్కడా అంటూ కాంగ్రెస్ నాపై విమర్శలు చేసింది. పహల్గాం ఉగ్రదాడి విషయంలో కాంగ్రెస్ రాజకీయాలు చేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత కాంగ్రెస్ నన్ను విమర్శించడమే పనిగా పెట్టుకుంది. ప్రపంచం మొత్తం కాంగ్రెస్ను కాదు.. దేశాన్ని సపోర్ట్ చేసింది. కాంగ్రెస్ హెడ్లైన్స్లో ఉండొచ్చు కానీ.. ప్రజల హృదయాల్లో నిలవలేదు. మాస్టర్ మైండ్కు నిద్ర కరువైందిఉగ్రవాదానికి ఊతం ఇస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పాక్కు బదులిచ్చాం.మనం చేసిన దాడులనుంచి పాక్ ఎయిర్ బేస్లు ఇంకా కోలుకోలేదు. ఆపరేషన్ సిందూర్లో మన ఎయిర్ఫోర్స్ 100శాతం విజయం సాధించాయి. సిందూ నుంచి సిందూర్ వరకు పరాక్రమాన్ని ప్రదర్శించాం. ఆపరేషన్ సిందూర్ తర్వాత మాస్టర్ మైండ్కు నిద్ర కరువైంది. పాక్ ప్రాధేయపడిందిఉగ్రవాదులతో పాకిస్తాన్ బంధం బహిరంగ రహస్యమే. ఉగ్రవాదాన్ని అణిచి వేయడమే భారత్ లక్క్ష్యం. మన మిస్సైల్స్ పాక్ మూల మూలల్లోకి చొచ్చుకుని వెళ్లాయి. మనం ఆపరేషన్ సిందూర్తో స్పందిస్తామని పాక్ కలలో కూడా ఊహించలేదు. ఆపరేషన్ సిందూర్తో సైనికులు పాక్ ఉగ్రవాదుల్ని చీల్చి చెండాడారు. ఇక చాలు అంటూ డీజీఎంవో సమావేశంలో పాక్ ప్రాధేయపడింది. మన దాడులతో పాక్ కాళ్ల బేరానికి వచ్చింది. దయచేసి ఇంక దాడులు ఆపండి అంటూ ప్రాధేయపడింది."प्रहाराय सन्निहिताः, जयाय प्रशिक्षिताः"Ready to Strike, Trained to Win.#IndianArmy pic.twitter.com/M9CA9dv1Xx— ADG PI - INDIAN ARMY (@adgpi) May 6, 2025 ఆపరేషన్ సిందూర్: ట్రంప్ ప్రమేయం లేదుఆపరేషన్ సిందూర్ను ఆపమని ఏ ప్రపంచాది నేతలు మాకు ఫోన్ చేయలేదు. మే9న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాకు ఫోన్ చేశారు.నేను బిజీగా ఉన్నాను. వాన్స్ చాలాసార్లు నాకు ఫోన్ చేశారు. పాక్ భారత్పై భారీ ఎత్తున మిస్సైళ్లతో దాడి చేయబోతోందని వాన్స్ నాకు చెప్పాడు. పాక్ దాడి చేస్తే తిప్పి కొడతామని చెప్పాను. పాక్ మూల్యం చెల్లించుకోక తప్పలేదు. ఆపరేషన్ సిందూర్ ఆన్లోనే ఉంది. పాక్ అజెండాను ఇంపోర్ట్ చేసుకునే పనిలో కాంగ్రెస్ ఉంది. ఆపరేషన్ సిందూర్ దాడి తాలూకా ఫొటోలు కావాలని కాంగ్రెస్ అడుగుతోంది. పాక్ మళ్లీ దుస్సహానికి పాల్పడితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మన దేశ సామర్ధ్యాలపై కాంగ్రెస్కు నమ్మకం లేదుఅధమ్ పూర్ బేస్పై దాడి అంటూ పాక్ అసత్య ప్రచారాలు చేసింది. ఆ మరుసటి రోజే నేను అక్కడి వెళ్లి మన సైనికుల్ని అభినందించారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ దేశాన్నిపాలించింది. కానీ మనదేశ సామర్ధ్యాలపై కాంగ్రెస్కు నమ్మకం లేదు. పాక్ తప్పుడు వార్తల్ని కాంగ్రెస్ నేతలు ఇక్కడ ప్రచారం చేశారు. ఒక్క పాక్ మిసైల్ కూడా భారత్ను టచ్ చేయలేదు. ముమూర్తం కావాలా ఏంటి?ఆపరేషన్ మహాదేవ్పై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఆపరేషన్లో భాగంగా భారత్ సైనికులు పహల్గాం ఉగ్రవాదుల్ని హతమార్చింది. నిన్న టెర్రరిస్టులను ఎందుకు చంపారని విపక్షాలు అడిగాయి. ఎన్నిగంటలు ఆపరేషన్ మహాదేవ్ చేపట్టారని అఖిలేష్ యాదవ్ అడిగారు. ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడానికి ఏమైనా ముమూర్తం కావాలా?కాంగ్రెస్ను పీవోకేను కోల్పోయాంకాంగ్రెస్ విధానం వల్ల పీవోకే విషయంలో భారత్ మూల్యం చెల్లించుకుంటోంది. కాంగ్రెస్ హయాంలో భారత్ పీవోకేని కోల్పోయింది. కాంగ్రెస్ వల్లే పీవోకే మనకు కాకుండా పోయింది.నెహ్రూ చేసిన తప్పులకు భారత్ ఇప్పటికీ మూల్యం చెల్లిస్తోంది.కాంగ్రెస్ వల్ల 33వేల చదరపు అడుగుల భూభాగాన్ని భారత్ కోల్పోయింది. కచ్చతీవును శ్రీలంకకు ఇందిర గిఫ్ట్గా ఇచ్చింది. పీవోకేను ఎప్పుడు వెనక్కి తెస్తారని అడుగుతున్నారు. పాక్కు నీళ్లు అప్పగించి భారత్లో సంకటస్థితి సృష్టించారు. సింధూ ఒప్పందం లేకుండా భారీ ప్రాజెక్ట్లు వచ్చేవి. నీళ్లు కాదు.. కాలువలు తవ్వేందుకు నెహ్రూ పాక్కు నిధులిచ్చారు. నెహ్రూ పాక్ అనుకూల విధానాలతో నిధి మనది.. నీళ్లు మనది పెత్తనం వాళ్లదా. నీళ్ల వివాదాల పరిష్కార బాధ్యతల్ని నెహ్రూ వరల్డ్ బ్యాంక్కు అప్పగించారు. -
మన సైనికుల్ని యుద్ధానికి పంపి.. వారి చేతులు కట్టేశారు: రాహుల్
న్యూఢిల్లీ: ఆపరేషన్ సింధూర్ అంశానికి సంబంధించి పార్లమెంట్లో వాడివేడి మాటల యుద్ధం జరుగుతోంది. ఆపరేషన్ సింధూర్ చర్చలో భాగంగా ఈరోజు(మంగళవారం, జూలై 29) కాంగ్రెస్ అటు రాజ్యసభ, ఇటు లోక్సభ వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీలు తమ మాటలతో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడగా, ఏఐసీసీ సీనియర్ నేత రాహుల్ గాంధీ సైతం ఆపరేషన్ సిందూర్పై ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. లోక్సభలో ఆయన మాట్లాడుతూ.. మన సైనికుల్ని యుద్ధానికి పంపి వారి చేతుల్ని కేంద్ర ప్రభుత్వం కట్టేసిందని మండిపడ్డారు. అందుకే మన యుద్ధ విమానాలు కూలాయన్నారు. రాహుల్ ప్రసంగిస్తూ.. ‘ భారత్-పాక్ల యుద్ధాన్ని ఆపానని ట్రంప్ ఇప్పటికి 29 సార్లు చెప్పారు. ట్రంప్ అబద్ధాలు చెబుతున్నప్పుడు మోదీ తిరిగి ఎందుకు ప్రశ్నించడం లేదు?, ఇందిరాగాంధీ ప్రదర్శించిన ధైర్య సాహసాల్లో 50 శాతం కూడా మోదీ చూపించలేదు.భారత సైన్యం ఎటువంటి తప్పు చేయలేదు. తప్పంతా కేంద్ర ప్రభుత్వానిదే. పహల్గామ్ సూత్రధారి పాక్ ఆర్మీ చీఫ్ మునీర్. మరి ట్రంప్తో కలిసి మునీర్ లంచ్ చేస్తారు. ఆయన్ని ట్రంప్ ఆహ్వానిస్తారు. ట్రంప్-మునీర్ల లంచ్ విషయాన్ని మోదీ ఎందకు ఖండించలేదు?, జై శంకర్ విదేశాంగ విధానం ఫెయిల్ అయ్యింది’ అని రాహుల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇదీ చదవండి: ఆహ్వానం లేకుండా పాక్కు వెళ్లింది ఎవరు? సీజ్ ఫైర్ నిర్ణయం ఎవరిది? -
ఆహ్వానం లేకుండా పాక్కు వెళ్లింది ఎవరు? సీజ్ ఫైర్ నిర్ణయం ఎవరిది?
పహల్గాం ఘటన.. పూర్తిగా భద్రతా వైఫల్యమేనని, పైగా అసత్య ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో మండిపడింది. ఆపరేషన్ సిందూర్పై చర్చలో భాగంగా.. ఇటు లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా, అటు రాజ్యసభలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆపరేషన్ సిందూర్పై లోక్సభలో రెండో రోజు చర్చలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ పాల్గొని ప్రసంగించారు. పర్యాటక ప్రాంతంలో భద్రత లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ కేంద్రంపై ఆమె విమర్శలు గుప్పించారు. ‘‘ఈ అంశంపై రక్షణ శాఖ మంత్రి గంటసేపు మాట్లాడారు. అధికార కూటమి ఎంపీలు కూడా మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్, ఉగ్రవాదంపై పోరు, జాతీయ భద్రత, చరిత్ర.. ఇలా అంశాలన్నింటిపై మాట్లాడారు. కానీ, ఒక్క విషయాన్ని వదిలేశారు. అసలు ఆ దాడి ఎందుకు?.. ఎలా జరిగింది? అనేది.. ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలో కుటుంబ సభ్యుల కళ్లెదుటే 26 మంది చంపారు. అసలు ఆ ఉగ్రదాడి ఎందుకు.. ఎలా జరిగిందో మాత్రం కేంద్రం చెప్పడం లేదు. #WATCH | In Lok Sabha, Congress MP Priyanka Gandhi Vadra says, "... Yesterday, the Defence Minister spoke for an hour, during which he spoke about terrorism, protecting the country, and also gave a history lesson. But one thing was left out- How did this attack happen?..." pic.twitter.com/as9gAbNCjr— ANI (@ANI) July 29, 2025కశ్మీర్లో ఉగ్రవాదం ముగిసిన అంకమని, అక్కడ పర్యటించాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి. కానీ.. జరిగింది మరొకటి. శుభం ద్వివేదీకి వివాహమై ఆరు నెలలే అయ్యింది. ఏప్రిల్ 22వ తేదీన అందరు పర్యాటకుల్లాగే ఆ జంట విహారంలో మునిగిపోయింది. సరిగ్గా అదే సమయంలో అడవుల్లో నుంచి వచ్చిన ఉగ్రవాదులు వాళ్లపై తెగబడ్డారు. భార్య కళ్ల ముందే శుభంను చంపేశారు. గంట వ్యవధిలో మరో 25 మందిని చంపేశారు. శుభం భార్య ఐశన్య ఓ మాట చెప్పింది.. నా కళ్ల ముందే నా ప్రపంచం చీకటి అయ్యింది. ఘటన సమయంలో అక్కడ ఒక్క భద్రతా సిబ్బంది లేరు. ఈ దేశం, ఈ ప్రభుత్వం మమ్మల్ని.. మా భద్రతను గాలికి వదిలేసింది అని. ఆమె అడిగిందే నేనూ అడుగుతున్నా.. ప్రతీరోజు 1,000 నుంచి 1,500 మంది పర్యటించే ఆ ప్రాంతంలో ఒక్క సైనికుడు కూడా కాపలాగా ఎందుకు లేడు?. వాళ్లు ప్రభుత్వాన్ని నమ్మి అక్కడికి వెళ్తే.. ఈ ప్రభుత్వం దేవుడ్ని మీద భారం వేసి వాళ్లను అలా వదిలేసిందా?. ఉగ్రదాడికి రక్షణమంత్రి, ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యత వహించారా? రాజీనామా చేశారా?. అసలు పౌరుల ప్రాణాలకు బాధ్యత ఎవరిది?. ప్రధానిదా?, హోం మంత్రిదా?, రక్షణ మంత్రిదా? ఎవరిది??సెక్యూరిటీ మాట అటుంచి కనీసం ప్రాథమిక చికిత్స అందించే ఏర్పాట్లు కూడా చేయలేకపోయారు?. ఇది నిఘా సంస్థ వైఫల్యం కాదా?.. అంటూ ప్రియాంక గాంధీ మండిపడ్డారు. ఆర్మీనో, కేంద్రమో ఈ నిర్ణయం తీసుకోలేదు. అసలు సీజ్ ఫైర్ ప్రకటన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎలా చేస్తారు?. పాక్ భారత్ కాల్పుల విరమణ ఒప్పందం అసలు ఎలా జరిగింది?. దీనికి ప్రధాని మోదీ సమాధానం చెప్పాల్సిందే అని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. ఇటు రాజ్యసభలోనూ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే కేంద్రంపై విరుచుకుపడ్డారు. ‘‘పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ప్రపంచం మొత్తం చూసింది. తమ తండ్రి తమ కళ్ల ముందే చనిపోవడం చిన్న పిల్లలు చూశారు. అసలు పర్యాటక ప్రాంతంలోకి టెస్టులు ఎలా వచ్చారు?. పహల్గాం ఉగ్రదాడి ముమ్మాటికీ భద్రతా వైఫల్యమే. దాడి జరగకుండా కేంద్రం ఎందుకు ఆపలేకపోయింది?. ఇంటెలిజెన్స్ వైఫల్యానికి బాధ్యులెవరు?. .. పహల్గాం ఘటనలో సంబంధం లేని అంశాలను లేవనెత్తుతున్నారు. పాకిస్తాన్కు విపక్షాలు మద్దతు ఇస్తున్నాయని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అసత్య ప్రచారాలతో ప్రజలను ఎక్కువ కాలం మభ్యపెట్టలేరు. కాంగ్రెస్ దేశాన్ని నిర్మించిన పార్టీ. ఆ పార్టీకి చాలా చరిత్ర ఉంది. మేం ఎప్పుడూ పాక్కు సపోర్ట్ చేయలేదు. ఆహ్వానించకుండా పాక్కు వెళ్లడం సిగ్గుచేటు. మాపై నిందలు వేస్తూ.. పాక్ నేతలను కౌగిలించుకుంటారు. మీరు తప్పు చేసి మాపై అసత్య ప్రచారాలు చేస్తారా?. ఇదేనా మీ దేశ భక్తి. #WATCH | Discussion on Operation Sindoor | Rajya Sabha LoP Mallikarjun Kharge says, "...We attended the meeting (all-party), but you went to Bihar for election campaigning. Is that your patriotism?...He should have been in the House today and heard us. If you do not have the… pic.twitter.com/XrcPafJoNp— ANI (@ANI) July 29, 2025కాంగ్రెస్ను నిందిస్తూ ఎంత కాలం బతుకాలనుకుంటున్నారు?. దేశ భద్రత కంటే రాజకీయాలే ఎక్కువ అయ్యాయా? పహల్గాం ఘటన తర్వాత జరిగిన ఆల్ పార్టీ మీటింగ్లో ప్రధాని ఎందుకు లేరు?. బీహార్ ఎన్నికల ప్రచారంలో ఎలా పాల్గొన్నారు?. ప్రధానికి దేశ భద్రత కంటే ఎన్నికల ర్యాలీలే ఎక్కువయ్యాయా?. దేశ భద్రత కంటే రాజకీయాలే ఎక్కువయ్యాయా?’’ అని ఖర్గే ధ్వజమెత్తారు.ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్-భారత్ కాల్పుల విరమణను భారత విదేశాంగ శాఖ మంత్రో, ప్రధానినో, లేకుంటే రక్షణ మంత్రినో ప్రకటించలేదు. ఎక్కడో వాషింగ్టన్ నుంచి ట్రంప్ ప్రకటించారు. కాల్పుల విమరణ తన విజయమేనని ట్రంప్ ఇప్పటిదాకా 29సార్లు ప్రకటించుకున్నారు. ఈ నా ప్రసంగం ముగిసేలోపు ఆయన మరోసారి ప్రకటించుకుంటే 30వ సారి అవుతుంది. అయినా ఆ నిజాన్ని కేంద్రం ఎందుకు ఒప్పుకోవడం లేదు అని ఖర్గే ఎద్దేవా చేశారు. -
డింపుల్ యాదవ్పై అనుచిత వ్యాఖ్యలు.. ఎన్డీయే ఎంపీల ఆందోళన
న్యూఢిల్లీ/లక్నో: సమాజ్వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్పై ముస్లిం మత బోధకుడు అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. అధికార ఎన్డీయే ఎంపీలు పార్లమెంట్ కాంప్లెక్స్ వద్ద సోమవారం దీనిపై నిరసన తెలిపారు. ఈ వ్యవహారంపై సమాజ్వాదీ పార్టీతోపాటు ప్రతిపక్షం మౌనంగా ఉండటమేంటని ప్రశ్నించారు.ఓ మసీదులో ఇటీవల జరిగిన సమావేశానికి ఎంపీ డింపుల్ యాదవ్ (Dimple Yadav) చీర ధరించి వెళ్లడంపై మౌలానా సాజిద్ రషీద్ అనే బోధకుడు ఎస్పీకి చెందిన ఇక్రా హసన్ అనే ఎంపీతో పోల్చుతూ టీవీలో చర్చా కార్యక్రమం సమయంలో చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తమైంది. ఎంపీలు బీజేపీకి చెందిన బాన్సురీ స్వరాజ్, కాంగ్రెస్కు చెందిన రేణుకా చౌదరి సైతం ఖండించారు. పార్లమెంట్ కాంప్లెక్స్ వద్ద చేపట్టిన నిరసనలో పలువురు ఎన్డీఏ మహిళా ఎంపీలు కూడా పాల్గొన్నారు. చదవండి: డ్రెస్ కోడ్ వివాదం.. స్పందించిన డింపుల్ యాదవ్ -
సుప్రీం కోర్టులో రేవంత్రెడ్డికి ఊరట.. పెద్దిరాజుపై సీజేఐ ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. గోపనపల్లి ప్రైవేట్ భూ వివాదం కేసులో రేవంత్కి వ్యతిరేకంగా, ఎన్ పెద్దిరాజు దాఖలు చేసిన ట్రాన్స్ఫర్ పిటిషన్ను చీఫ్ జస్టిస్ బెంచ్ సోమవారం డిస్మిస్ చేసింది. అదే సమయంలో.. పిటిషన్లో హైకోర్టు సిట్టింగ్ జడ్జిపై పిటిషనర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయాన్ని గమనించిన సీజేఐ ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది. పిటిషన్ రాసిన న్యాయవాది, సంతకం పెట్టిన ఏవోఆర్పై చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు జడ్జిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని హెచ్చరిస్తూనే.. పెద్దిరాజు, ఆయన అడ్వకేట్ రితేష్ పాటిల్, ఏవోఆర్కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణకు పిటిషనర్ పెద్దిరాజు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే.. పిటిషనర్ తరఫు న్యాయవాది రితీష్ పాటిల్ క్షమాపణ కోరుతూ.. కేసు విత్ డ్రా చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ తరుణంలో కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలియజేయాలంటూ నోటీసులు సీజేఐ గవాయ్ నోటీసులు జారీ చేశారు. ఈ అంశంపై తదుపరి విచారణ ఆగస్టు 11కు వాయిదా వేశారు.ఏం జరిగిందంటే.. గోపన్పల్లి గ్రామం సర్వే నంబర్ 127లోని సొసైటీకి సంబంధించిన భూమిని ఆక్రమించడంతో పాటు నిర్మాణాలను జేసీబీతో కూల్చేశారంటూ గచ్చిబౌలి పీఎస్లో 2016లో కేసు నమోదైంది. పెద్దిరాజు ఫిర్యాదు మేరకు.. ఈ కేసులో ఏ-1గా కొండల్ రెడ్డి(రేవంత్ సోదరుడు), ఏ-2గా ఈ.లక్ష్మయ్య, ఏ-3గా రేవంత్ రెడ్డిని చేర్చారు. ఎల్బీ నగర్లోని రంగారెడ్డి జిల్లా ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టులో విచారణలో ఉన్న ఈ కేసును కొట్టేయాలని రేవంత్ రెడ్డి 2020లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. వాదనలు విన్న జస్టిస్ మౌషమీ భట్టాచార్య ధర్మాసనం.. రేవంత్ రెడ్డి ఘటనా స్థలంలో లేరనే విషయాన్ని ఫిర్యాదుదారు సైతం అంగీకరించారని పేర్కొంది. తాను లేను కాబట్టి తనపై కేసు కొట్టేయాలని అడుగుతున్నారని, మిగతా వారిపై కేసుకొట్టేయాలని అడగటం లేదని వ్యాఖ్యానించింది. రేవంత్రెడ్డి ఆదేశాలమేరకే దూషించారనే ఆరోపిస్తున్నా ఆధారాలు లేవని తెలిపింది. ఇదే భూమికి సంబంధించి ఇదే ఆరోపణలతో గచ్చిబౌలి పీఎస్లో 2014లో సైతం కేసు నమోదైందని, నిందితులు-సొసైటీకి మధ్య సివిల్ వివాదమని తేలడంతో తప్పుడు కేసుగా మూసేశారని గుర్తుచేసింది. దీనిపై ఫిర్యాదుదారు పెద్దిరాజు మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించగా.. కోర్టు దాన్ని కొట్టేసిందని, దానిపై క్రిమినల్ రివిజన్ పెండింగ్లో ఉందని పేర్కొంది. ఈ క్రమంలో.. జులై 18వ తేదీన రేవంత్రెడ్డిపై నమోదు అయిన కేసును కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది. -
చిదంబరం అడిగిన ప్రూఫ్ ఇదిగో: అమిత్షా
ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్పై లోక్సభలో రెండో రోజు చర్చ సాగుతోంది. ఆపరేషన్ మహాదేవ్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. పాక్ రెచ్చిపోయి సరిహద్దులో హిందూ ఆలయాలు, సామాన్యులను టార్గెట్ చేసిందని.. ఆపరేషన్ మహాదేవ్తో పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టామని ఆయన వెల్లడించారు.పహల్గామ్లో కుటుంబ సభ్యుల ముందే చంపేశారు. టెర్రరిస్టులు ఉగ్రదాడి తర్వాత పాక్ వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ సరిహద్దు దాటేందుకు అవకాశం ఇవ్వలేదు. నిన్న జమ్మూకశ్మీర్లో ఆపరేషన్ మహాదేవ్ జరిగింది. ఆపరేషన్ మహాదేవ్లో సులేమాన్ మూసా హతమయ్యాడు. ముగ్గురిలో ఒకరు ఎల్ఈటీ ఉగ్రవాది సులేమాన్గా గుర్తించాం. ఈ సులేమాన్ పహల్గాం ఉగ్రదాడి కీలక సూత్రధారి’’ అని అమిత్ షా పేర్కొన్నారు.‘‘చిదంబరం ప్రూప్ ఏంటి అని అడుగుతున్నారు. ఆపరేషన్ మహాదేవ్లో హతమైన ముగ్గురు పాక్కు చెందిన వారు. ఉగ్రవాదులు దగ్గర పాక్లో తయారైన చాకెట్లు దొరికాయి. ఆ ముగ్గురి ఉగ్రవాదుల ఓటర్ వివరాలూ ఉన్నాయి. చిదంబరం పాక్కు క్లీన్చిట్ ఎందుకుఇచ్చారు?’’ అంటూ అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు.పహల్గామ్ టెర్రిస్టులను మట్టుబెడితే విపక్షాలు సంతోషిస్తాయని అనుకున్నా.. కానీ చూస్తుంటే విపక్షాలు హ్యాపీగా లేవనిపిస్తోంది. పాక్ను రక్షిస్తే చిదంబరానికి వస్తుంది? అంటూ అమిత్షా మండిపడ్డారు.కమ్యూనికేషన్ డివైజ్ను ట్రాక్ చేయడంద్వారా ఉగ్రగుట్టును పసిగట్టాయి. జమ్మూకశ్మీర్ ోలీసులు, సీఆర్పీఎఫ్, పారామిలటరీ కలిసి ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఇది మోదీ సర్కార్ ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు. యూపీఏ హయాంలో తప్పించుకున్న ఉగ్రవాదులను హతమార్చాం. ఉగ్రవాదులు ప్రాణాలతో దేశం వెళ్లరని ఆ మరుసటి రోజే చెప్పాం’’ అని అమిత్షా గుర్తు చేశారు. -
‘భారత్ మాటే వినిపిస్తా..’ కాంగ్రెస్లో మరో ముసలం!
శశిథరూర్ ఎపిసోడ్ కొనసాగుతుండగానే.. కాంగ్రెస్ పార్టీలో మరో ముసలం తెర మీదకు వచ్చింది. సీనియర్ నేత, ఎంపీ మనీశ్ తివారీ ఓ క్రిప్టిక్ పోస్టును తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది ఆపరేషన్ సిందూర్ నేపథ్యంతోనే కావడం గమనార్హం. ఆపరేషన్ సిందూర్ చర్చకు శశిథరూర్తో పాటు మనీశ్ తివారీని కాంగ్రెస్ పార్టీ దూరం పెట్టిందంటూ నిన్నంతా చర్చ నడిచిన సంగతి తెలిసిందే. అయితే.. భారతీయుడిగా భారత్ మాటే చెబుతానని ఎక్స్లో పోస్టు చేశారాయన. మరోవైపు.. ప్రభుత్వానికి అనుకూలంగా థరూర్, తివారీ మాట్లాడతారనే ఆపరేషన్ సిందూర్ చర్చకు కాంగ్రెస్ దూరంగా ఉంచిందా? అనే కథనం తాలుకా కట్టింగ్ను షేర్ చేశారు. దానికి.. ప్రేమే జీవన మూర్తి అయిన దేశం.. ఈ దేశ గీతాలను నేను ఆలపిస్తాను.. నేను భారత్లో నివసించే ఒక భారతీయుడిని.. భారత్ మాటలు నేనే వినిపిస్తాను అంటూ అలనాటి బాలీవుడ్ చిత్రం ఉపకార్లోని దేశభక్తి పాట సాహిత్యాన్ని పోస్ట్ చేశారాయన.है प्रीत जहां की रीत सदा मैं गीत वहां के गाता हूं भारत का रहने वाला हूं भारत की बात सुनाता हूंHai preet jahaan ki reet sada Main geet wahaan ke gaata hoon Bharat ka rehne waala hoonBharat ki baat sunata hoon - Jai Hind pic.twitter.com/tP5VjiH2aD— Manish Tewari (@ManishTewari) July 29, 2025 కాంగ్రెస్లో మనీష్ తివారి ట్వీట్ కలకలం రేపుతోంది. శశిథరూర్తో పాటే గతంలో ఆపరేషన్ సింధూర్ పై కాంగ్రెస్ వైఖరికి భిన్నంగా అభిప్రాయం వ్యక్తం చేశారీయన. ఈ నేపథ్యంలో.. కాంగ్రెస్ వైఖరికి అనుగుణంగా లోక్ సభలో మాట్లాడేందుకు ఈ ఇద్దరూ నిరాకరించినట్లు సమాచారం. -
నిమిష ప్రియ మరణశిక్ష రద్దు కాలేదు: కేంద్రం
కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్లో మరణశిక్ష రద్దు అయ్యిందన్న కథనాలను కేంద్ర విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. ఆమె మరణశిక్ష రద్దు వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలిపింది. తన సహచర భాగస్వామిని హత్య చేసిన అభియోగాల మీద ఆమెకు ఈ శిక్ష పడిన సంగతి తెలిసిందే.కేరళకు చెందిన ప్రముఖ మత గురువు, సున్నీ నేత కాంతాపురం ఏపీ అబుబాకర్ ముస్లియార్ కార్యాయలం నుంచి ఆమెకు మరణశిక్ష తప్పిందనే ప్రకటన వెలువడింది. యెమెన్ రాజధాని సనాలోని ఓ జైలులో ఖైదీకి ఉన్న నిమిషకు.. హౌతీ మిలిటరీ ప్రభుత్వం నుంచి ఊరట లభించిందని తెలిపింది. అయితే ఆ ప్రకటనపై ఎలాంటి అధికారిక సమాచారం లేదంటూ కేంద్రం కాసేపటి కిందట స్పష్టత ఇచ్చింది. నిమిష ప్రియ కేసులో వ్యక్తిగతంగా చేసే ప్రకటనలతో సంబంధం లేదని.. అక్కడి అధికారులు ఇంతవరకు ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదని కేంద్ర విదేశాంగ శాఖ తాజాగా తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలతో ప్రముఖ వెబ్సైట్ హిందూ ఓ కథనం ఇచ్చింది.#Government denies claim of #NimishaPriya's #deathpenalty being revoked: Sources https://t.co/sNMZ3AhC9S #WeRIndia pic.twitter.com/PszX95Kbz1— Werindia (@werindia) July 29, 2025సనాలో అత్యున్నత సమావేశం తర్వాత.. సోమవారం అర్ధరాత్రి అబూబకర్ ముస్లియార్ కార్యాలయం మరణశిక్ష రద్దు అంటూ ప్రకటన చేసింది. ఈ భేటీలో ఉత్తర యెమెన్ అధికారులు, అంతర్జాతీయ దౌత్య ప్రతినిధులు పాల్గొన్నట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దుకోసం భారత గ్రాండ్ ముఫ్తీ విజ్ఞప్తి మేరకు యెమెన్లోని సూఫీ ముఖ్య పండితుడు అయిన షేక్ హబీబ్ ఒమర్ బిన్ హఫీజ్ ఒక బృందాన్ని చర్చల కోసం నియమించారు. మరోవైపు అబుబాకర్ ముస్లియార్ ఉత్తర యెమెన్ ప్రభుత్వంతో పాటు అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వం జరిపారు.అబుబాకర్ ప్రకటనను యెమెన్లోని యాక్షన్ కౌన్సిల్ ఫర్ తలాల్ మహదీస్ జస్టిస్ ప్రతినిధి సర్హాన్ షంశాన్ అల్ విశ్వాబి ధ్రువీకరించారు. మత పండితుల బలమైన చొరవతోనే నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు అయినట్లు పేర్కొన్నారు. అయితే.. ఇప్పుడు ట్విస్ట్ ఇస్తూ కేంద్రం ఇప్పుడు ఆ ప్రకటనను తోసిపుచ్చడం గమనార్హం. మరణించిన యెమెన్ పౌరుడు తలాల్ మహదీ కుటుంబ సభ్యులతో చర్చల అనంతరమే స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. భారత్ పలుమార్లు కోరడంతో జులై 16న అమలు కావాల్సిన మరణశిక్షను వాయిదా పడింది. అప్పటి నుంచి యెమెన్ అధికారులతో భారత ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.2008లో కుటుంబ ఆర్థిక అవసరాల కోసం యెమెన్ వెళ్లిందామె. 2011లో భారత్కు వచ్చి వివాహం చేసుకుంది. ఈ జంటకు ఓ పాప పుట్టింది. ఆ తర్వాత ఆమె మళ్లీ యెమెన వెళ్లింది. అక్కడి చట్టాల ప్రకారం.. తలాబ్ అబ్దో మహ్దీ అనే వ్యక్తితో కలిసి క్లినిక్ తెరిచింది. అయితే తలాబ్ తనను వేధించాడంటూ ఆమె 2016లో పోలీసులను ఆశ్రయించింది. అయినా ప్రయోజనం లేకపోవడంతో తలాబ్ వద్ద చిక్కుకున్న తన పాస్పోర్టును దొంగలించేందుకు అతనికి మత్తుమందిచ్చింది. ఓవర్డోస్ కావడంతో అతను మరణించాడు. శవాన్ని ఓ వాటర్ ట్యాంకర్లో పడేసి పారిపోయే క్రమంలో పోలీసులకు చిక్కింది. అయితే తన వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మహ్దీని హత్య చేసిన నేరంలో నిమిషా ప్రియాకు మరణశిక్ష పడింది. 2020లో ట్రయల్ కోర్టు, 2023లో సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ శిక్షను ఖరారు చేశాయి. ఆమె శిక్షను రద్దు చేయించేందుకు కుటుంబం చేస్తున్న ప్రయత్నాలను ఫలించి.. మరణశిక్ష తాత్కాలికంగా వాయిదా పడింది. -
అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం..
ఢిల్లీ: అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవత్ర 6.2 గా నమోదైంది. అర్ధరాత్రి (జులై 29) రాత్రి 12:11 గంటల సమయంలో ఒక్కసారిగా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. స్థానిక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాంప్బెల్ బే నుంచి 62 కి.మీ. పశ్చిమ-నైరుతి దిశలో, భూమి ఉపరితలం నుండి 10 కి.మీ. లోతులో భూకంపం సంభవించినట్లు ఎన్సీఎస్ వెల్లడించింది. అయితే దీని వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.హిందూ మహాసముద్రంలో, అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించిన అధికారులు.. దీని కేంద్రం ఇండోనేషియాలోని ఆషే ప్రావిన్స్లోని సబాంగ్కు పశ్చిమ-వాయువ్య దిశలో 259 కి.మీ దూరంలో ఉన్నట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. -
తండ్రి తెచ్చిన కొత్త బిందె.. చిన్నారి ప్రాణం మీదకు తెచ్చింది..
భువనేశ్వర్: తండ్రి తెచ్చిన కొత్త బిందె ఓ చిన్నారి ప్రాణం మీదకు తెచ్చింది. సరదాగా ఆడుకుంటుండగా మూడేళ్ల చిన్నారి తల బిందెలో ఇర్కుకుపోయింది. బిందెలో ఇరుక్కున్న తలను బయటకు తీయడం అసాధ్యం కావడంతో ఊపిరి ఆగినంత పనైంది. చివరికి ఏమైందంటేఒడిశాలో మల్కాన్గిరి జిల్లా కొరుకొండ గ్రామానికి చెందిన ప్రదీప్ బిశ్వాస్ కొత్త బిందె కొని ఇంటికి తెచ్చాడు. నాన్న తెచ్చిన బిందెతో ఆడుతుండగా తన్మయ్ తల అందులో ఇరుక్కుపోయింది.కుటుంబ సభ్యులు ప్రయత్నించినా తల బయటకు తీయలేకపోయారు.బిందెలో ఇరుక్కున్న బాలుడుడిని మల్కాన్గిరి ఫైర్ స్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడ ఫైర్ సిబ్బంది హైడ్రాలిక్ కాంబి టూల్ ఉపయోగించారు. చాలా జాగ్రత్తగా బిందెను కట్టర్తో తొలగించారు. చిన్నారిని సురక్షితంగా బయటకు తీసారు. ఈ సమయంలో ప్రజలు హరిబోల్,జై జగన్నాథ్ అంటూ నినాదాలు చేశారు. ఫైర్ సిబ్బంది ధైర్యంగా, నైపుణ్యంగా వ్యవహరించినందుకు వారిని అభినందించారు. -
‘అంతా నా ఇష్టం’.. రాహుల్తో శశిథరూర్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. లోక్సభలో కొనసాగుతున్న ఆపరేషన్ సిందూర్పై పార్టీ తీసుకున్న లైన్కు అనుగుణంగా మాట్లాడలేనని.. తాను మొదటి నుంచి ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందనే మాటకు కట్టుబడి ఉన్నట్లు రాహుల్ గాంధీకి శశిథరూర్ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. లోక్సభలో ఆపరేషన్ సిందూర్పై చర్చ కొనసాగుతున్న తరుణంలో ప్రభుత్వంపై విమర్శలు చేసేలా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా ఆ పార్టీ ఎంపీలకు దిశా నిర్ధేశం చేసింది. ఎంపీ శశి థరూర్ను సైతం పార్టీ లైన్కు కట్టుబడి ఉండాలని ఆదేశించింది.అయితే, శశి థరూర్ మాత్రం ఒప్పుకోలేదు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందనే తన అభిప్రాయాన్ని మార్చలేనని శశిథరూర్ పార్టీ పెద్దలకు స్పష్టం చేశారు. పార్టీ పెద్దలు ప్రభుత్వంపై విమర్శలు చేయమని కోరినప్పుడు.. ఆయన మౌనం (మౌనవ్రత్)వహించారు. ఈ క్రమంలో పార్లమెంటులోకి వచ్చే సమయంలో ఆపరేషన్ సిందూర్పై మీడియా ప్రశ్నలకు శశిథరూర్ మౌనవ్రత్, మౌనవ్రత్ అని అంటూ లోపలికి వెళ్లారు. అంతకు ముందు లోక్ సభలో ఆపరేషన్ సిందూర్పై చర్చలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరుతూ శశిథరూర్.. పార్టీ కార్యాలయంలో రాహుల్గాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాహుల్ గాంధీ వద్ద పార్టీ తీసుకున్న నిర్ణయంపై శశిథరూర్ విభేదించినట్లు సమాచారం. కాబట్టే పార్టీ పెద్దలు లోక్ సభలో శశిథరూర్కు మాట్లాడేందుకు అనుమతి ఇవ్వలేదు.తాజా పరిణామంతో శశి థరూర్ తన స్వతంత్ర అభిప్రాయాన్ని నిలబెట్టుకుంటూ, పార్టీకి ఇబ్బందికర పరిస్థితిని కలిగిస్తున్నారంటూ కాంగ్రెస్ హస్తిన పెద్దలు గుసగుసలాడుతున్నట్లు టాక్ నడుస్తోంది. "Maunvrat, maunvrat..."😂😂😂.@ShashiTharoor destroys CONgress without saying anything. 🔥 pic.twitter.com/qi1wbLTgWi— BhikuMhatre (@MumbaichaDon) July 28, 2025 -
భూమ్మీద దేన్నైనా ఫోర్జరీ చేస్తారు కదా?: ఈసీకి ‘సుప్రీం’ ప్రశ్న
బీహార్ ఓటరు జాబితా సవరణలో.. ఆధార్ కార్డుకు పౌరసత్వ గుర్తింపుకార్డుల జాబితా నుంచి మినహాయింపు ఇవ్వడాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం మరోసారి తీవ్రంగా పరిగణించింది. ఆధార్తో పాటు ఓటర్ ఐడీ ఎలక్టోరల్ ఫొటో ఐడెంటిటీ కార్డు(EPIC)ని చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్ల కింద పరిగణించాల్సిందేనని కేంద్ర ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది.బీహార్ ఓటర్ లిస్ట్ రివిజన్లో భాగంగా ఆధార్ను గుర్తింపుకార్డుగా ఈసీ పరిగణించడం లేదు. తద్వారా ఓట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది. సోమవారం విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత ధర్మాసనం ఈసీని ఉద్దేశించి కీలక వ్యాఖ్య చేసింది. ‘‘భూమ్మీద దేనినైనా ఫోర్జరీ చేస్తారు కదా?’’ అని కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరాలపై సూటిగా ప్రశ్నను సంధించింది. ఈ క్రమంలో..ఆధార్ను తిరస్కరిస్తూ.. బీహార్ ఓటర్ల రివిజన్ ప్రక్రియలో ఓట్లను తొలగిస్తూ వస్తోంది ఎన్నికల సంఘం. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. జులై 10వ తేదీ నాటి విచారణ సందర్భంగా బీహార్ ఓటర్ లిస్ట్ రివిజన్ సబబేనన్న సుప్రీం ధర్మాసనం.. అదే సమయంలో ఆధార్, ఎపిక్, రేషన్ కార్డులనూ పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని ఈసీకి స్పష్టం చేసింది. అయితే.. ఇవాళ్టి వాదనల సందర్భంగా ఆధార్ను ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్గా పరిగణించడం కుదరదని, రేషన్ కార్డులు నకిలీవి సృష్టించే అవకాశం లేకపోలేదని.. కాబట్టి వాటి మీద ఆధారపడలేమని ఈసీ వాదనలు వినిపించింది. అలాగే ఓటర్ నమోదు ప్రక్రియలో ఆధార్ను కేవలం ఐడెంటిటీ ఫ్రూఫ్గా మాత్రమే పరిగణిస్తామని పేర్కొంది.దీనిపై సుప్రీం కోర్టు స్పందించింది. ఈ భూమ్మీద ఏ డాక్యుమెంట్ను ఫోర్జరీ చేయలేరో చెప్పాలంటూ ఈసీని ప్రశ్నించింది. ఓటర్ నమోదు సమయంలో ఆధార్ ప్రస్తావన ఉంటున్నప్పటికీ.. ఓటరు జాబితా గుర్తింపు కోసం ఎందుకు పరిగణించడం లేదని మరోసారి నిలదీసింది. ఈ క్రమంలో.. ఆధార్, ఎపిక్ని బీహార్ ఓటర్ రోల్ రివిజిన్కు చేర్చాలంటూ ఆదేశించింది.ఎన్నికల సంఘం (EC) జాబితాలోని ఏదీ నిర్ణయాత్మక పత్రం కాదు కదా. ఆధార్, ఎపిక్ విషయాల్లో మీరు ఎత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటే గనుక రేపు మీరు అంగీకరించిన ఇతర పత్రాలు కూడా ఫోర్జరీ జరిగితే.. దాన్ని నిరోధించే వ్యవస్థ ఎక్కడ? అని ఈసీకి ప్రశ్న ఎదురైంది. అదే సమయంలో.. ఆగస్టు 1వ తేదీన ఈసీ ప్రచురించబోయే బీహార్ ఓటర్ల డ్రాఫ్ట్ లిస్ట్పై మధ్యంతర స్టే విధించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది గోపాల్ శంకర్నారాయణన్ కోరారు. అయితే.. రేపటి విచారణలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని బెంచ్ స్పష్టం చేసింది. -
ఆపరేషన్ సిందూర్ అద్భుతం : వైఎస్ అవినాష్
సాక్షి,న్యూఢిల్లీ: జాతీయ భద్రతకు కేంద్రం తీసుకునే అన్ని చర్యలకు వైఎస్సార్సీపీ మద్దతిస్తుందని ఆ పార్టీ ఎంపీ వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. లోక్సభలో అపరేషన్ సిందూర్పై జరిగిన చర్చలో వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది. పాకిస్తాన్ చర్యలకు జవాబు దారి చేయాలి. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి హకీమ్ స్వయంగా పాశ్చాత్య దేశాల కోసం ఉగ్రవాదులకు మద్దతిస్తున్నామని చెప్పాడు. వైఎస్సార్సీపీ జమ్మూ కాశ్మీర్ పౌరులకు సంఘీభావం ప్రకటిస్తోంది. అనేక సంవత్సరాల అస్థిర పరిస్థితుల మధ్య మళ్లీ ప్రజాస్వామ్యం పునరుద్ధరణ జరుగుతోంది. పహల్గాం దాడితో ఈ ప్రయత్నాలకు కొంత దెబ్బ తగిలింది. ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా నిర్వహించారు. ఆపరేషన్ సిందూర్ అద్భుతంగా నిర్వహించిన భారత ఆర్మీని వైఎస్సార్సీపీ అభినందిస్తోంది. ఈ ఆపరేషన్ భారత రక్షణ సామర్థ్యానికి ఒక ప్రతీక. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగానే ఆపరేషన్ సిందూర్ నిర్వహించారు. అత్యంత ఖచ్చితత్వంతో సైనిక బలగాలు పాకిస్తాన్లోని ఉగ్రస్తావరాలను ధ్వంసం చేశాయి. అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడి కేవలం ఉగ్రస్థావరాలపైనే దాడి జరిగింది. అరగంటలోపే మొత్తం ఆపరేషన్ పూర్తి చేశారు. డ్రోన్ సిస్టంలతో వ్యూహాత్మక లక్ష్యాలపై దాడులు విజయవంతంగా పూర్తి చేసింది. సంఖ్యాత్మక బలం కంటే సాంకేతికత ముఖ్యమని ఆపరేషన్ సిందూర్ చాటి చెప్పింది. సరిహద్దుల్లో నిరంతరం అప్రమత్తతతో సన్నద్ధంగా ఉండడం కీలకం. జాతీయ సార్వభౌమత్వాన్ని రక్షించడానికి రక్షణ బడ్జెట్ను పెంచడం మంచిదేనన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సిందూర్ చర్చలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్పహల్గాం దాడి జరిగిన రోజు, కాల్పుల విరమణ జరిగిన రోజు ప్రధాని నరేంద్ర మోదీకి, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు మధ్య ఎలాంటి ఫోన్ కాల్ సంభాషణ జరగలేదు. కాల్పుల విరమణకు తానే కారణమన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటనను తోసి పుచ్చారు.ఆపరేషన్ సింధూర్ దాడి తర్వాత పాకిస్తాన్ కాల్పుల విరమణకు ప్రతిపాదన చేసింది. స్వయంగా పాకిస్తాన్ డీజీఎంఓ కాల్ చేసి కాల్పుల విరమణ చేయాలని అడిగారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను సృష్టించినది నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ హయాంలోనే చైనాకు కాశ్మీర్ భూభాగం ధారా దత్తం చేశారు. కాంగ్రెస్ హయాంలోనే పాకిస్తాన్ చైనా కారిడార్ ఒప్పందాలు జరిగాయి.ఎంపీ గౌరవ్ గొగోయ్ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాక్పై భారత్ కాల్పుల విమరణకు ఎందుకు అంగీకరించిందో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కాకుండా ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని లోక్సభలో కాంగ్రెస్ లోక్సభ ఎంపీ గౌరవ్ గొగోయ్ డిమాండ్ చేశారు. భారత్-పాక్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగేలా ఇరు దేశాలపై తాను ఒత్తిడి చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 26సార్లు పాకిస్తాన్లను కాల్పుల విరమణకు బలవంతం చేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 26 సార్లు మాట్లాడారు. దీని వెనుక ఉన్న నిజం మాకు తెలుసుకోవాని అనుకుంటున్నాను అని వ్యాఖ్యానించారు. పాక్కు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఆర్థిక సహాయం అందించకుండా భారత్ ఎందుకు ఆపలేకపోయిందని ప్రశ్నించారు. పహల్గాం ఘటన జరిగి నెలలు గడుస్తున్నా.. ఉగ్రవాదుల్ని మట్టుబెట్టకపోవడం,పాక్కు బుద్ధి చెప్పామంటూనే ఆపరేషన్ సిందూర్ను ఆపేయడం వంటి అంశాలపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ధీటుగా బదులిచ్చారు. ‘ఆపరేషన్ సిందూర్ ఆగలేదు.. గ్యాప్ ఇచ్చాం అంతే. పాక్, పాక్ ఆక్రమిత ఉగ్రవాదుల ఏరివేతే లక్క్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్తో దాయాది దేశం మన కాళ్ల బేరానికి వచ్చింది. భారత్ సైనికులు సింహాలు. దేశ రక్షణ సంబంధించిన అంశాలపై ప్రశ్నలు వేసే విషయంలో జాగ్రతగా ఉండాలి’ అంటూ ప్రతిపక్షాలకు రాజ్నాథ్ సూచించారు. ప్రజా సమస్యలకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలను ప్రభుత్వానికి అడగడం ప్రతిపక్షం పని. కొన్నిసార్లు, మన విమానాలను ఎన్ని కూల్చివేసారని మన ప్రతిపక్ష సభ్యులు అడుగుతూనే ఉంటారు. కానీ మన దళాలు ఎన్ని పాకిస్తాన్ విమానాలను కూల్చివేశామని వారు ఎప్పుడూ అడగరు. మీరు ప్రశ్నలు అడగాలనుకుంటే, ఈ ఆపరేషన్లో మన సైనికుల్లో ఎవరికైనా హాని జరిగిందా అని అడగండి? ఇలాంటి ప్రశ్నలకు మీ వద్ద సమాధానం ఉందా? లేదు’ అని అన్నారు.సోమవారం (జులై 28)లోక్సభలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆపరేషన్ సిందూర్పై రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడి హేయమైన చర్య.ఆపరేషన్ సిందూర్ పేరుతో సైనిక చర్య ప్రారంభించాం.ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచానికి సత్తా చూపించాం.పహల్గాం ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మతం పేరు అడిగి మరి పర్యాటకుల్ని కాల్చి చంపారు మన ఆడబిడ్డలకు జరిగిన అన్యాయంపై ఊరుకునేది లేదు. పాక్,పీవోకేలోని పాక్ ఉగ్రవాదుల శిబిరాలపై దాడులు చేశాం. భారత సైన్యం వ్యూహాత్మకంగా ఉగ్రవాదుల శిబిరాలపై దాడి చేసింది. పాకిస్తాన్లో తొమ్మిది ఉగ్ర శిబిరాలపై దాడులు చేశాం. 100మందికిపైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాం.హిబ్జుల్,లష్కరే తోయిబా ఉగ్రశిబిరాల్ని నేలమట్టం చేశాం.టెర్రరిస్టుల ఇళ్లలోకి చొచ్చుకెళ్లీ మరి 22 నిమిషాల్లో వారి స్థావరాల్ని ధ్వంసం చేశాం.పాక్ ఉగ్రస్థావరాలపై దాడి జరిపిన తర్వాత ఆదేశ డీజీఎంవోకు సమాచారం అందించాం.పాక్ డ్రోన్లను భారత్ వాయిసేన కూల్చేసింది. పాక్లో సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దాడి చేశాం.ఆపరేషన్ సిందూర్లో పాల్గొన్న సైన్యానికి నా సెల్యూట్.పాక్ దాడుల్లో భారత ఆయుధ సంపత్తికి ఎలాంటి నష్టం జరగలేదు.భారత నౌకా దళం కూడా పాక్కు గట్టిగా బుద్ధి చెప్పింది.పాక్ను ఆక్రమించుకోవడం ఆపరేషన్ సిందూర్ లక్ష్యం కాదు.తమ దేశంపై దాడులు వెంటనే ఆపాలని పాక్ కోరింది.మన దాడులతో పాక్ మన కాళ్ల బేరానికి వచ్చింది. ఆపరేషన్ సిందూర్ ముగియలేదు..గ్యాప్ ఇచ్చాం. ఆపరేషన్ సిందూర్ ఆపాలని మాపై ఎలాంటి ఒత్తిడి లేదు.బాధితులపై జరిగిన అన్యాయంపై ప్రతీకారం తీర్చుకున్నాం’ అని స్పష్టం చేశారు. -
థరూర్ మౌన వ్రత్.. తప్పించారా? తప్పుకున్నారా?
పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అంశంపై ఇవాళ పార్లమెంట్ లోక్సభలో చర్చ జరగాల్సి ఉంది. ఈ తరుణంలో పార్లమెంట్ ఆవరణలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ సీనియర నేత రేణుకా చౌదరి మీడియాతో మాట్లాడుతున్న వేళ.. శశిథరూర్ కారు దిగి పార్లమెంట్ లోపలికి వడివడిగా అడుగేశారు. ఆ సమయంలో.. మీ పార్టీ తరఫున మాట్లాడే అవకాశం మీకు ఇస్తారా? అనే ప్రశ్న ఆయనకు ఎదురైంది. దానికి ఆయన ‘మౌన వ్రత్.. మౌన వ్రత్’ అంటూ ముందుకు వెళ్లారు. అయితే కాస్త ముందుకు వెళ్లగానే ఆయన రేణుకా చౌదరిని గమనించారు. వెనక్కి వచ్చి మీడియాతో మాట్లాడుతున్న ఆమెను ఆప్యాయంగా పలకరించారు. వారిద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణ తాలుకా వీడియో వైరల్ అవుతోంది. ఆ సమయంలో రేణుకా చౌదరి.. ఆయనకు అన్ని విధాల ఆ అర్హత ఉందని వ్యాఖ్యానించడం గమనార్హం.#WATCH | Delhi | Lok Sabha to discuss Operation Sindoor today, Congress MP Shashi Tharoor says, "Maunvrat, maunvrat..." pic.twitter.com/YVOwS7jpk5— ANI (@ANI) July 28, 2025Interesting moment in #Parliament:On @NDTV’s question about whether he’ll speak today, @ShashiTharoor walked in silently.@RenukaCCongress, standing nearby, remarked: “He has every right to speak.”Then, interestingly asked him: “Why didn’t you invite me to the mango party?” pic.twitter.com/dkBb590z1W— AISHVARYA JAIN (@aishvaryjain) July 28, 2025ఆపరేషన్ సిందూర్పై చర్చకు మొత్తం 16 గంటల సమయం కేటాయించారు. ఇందులో కాంగ్రెస్కు 2గంటల సమయమే ఉంది. అయితే కాంగ్రెస్ తరఫున ఈ చర్చలో పాల్గొనబోయే లిస్ట్లో థరూర్ పేరు లేదు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ ఉగ్రవాదంపై ప్రపంచానికి వివరించేందుకు ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత ప్రభుత్వం ఎంపీల బృందాలను వివిధ దేశాలకు విదేశాలకు పంపించింది. అమెరికాకు వెళ్లిన ఎంపీల బృందానికి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నాయకత్వం వహించారు. అటువంటి శశిథరూర్ పేరు డిబెట్ లో మాట్లాడే వారి జాబితాలో లేకపోవడం రాజకీయంగా చర్చకు దారి తీసింది.2020 నుంచి కాంగ్రెస్ అధిష్టానంతో శశిథరూర్కు గ్యాప్ ఏర్పడింది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల సమయంలోనూ ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. ఒకానొక దశలో ఆయన తిరువనంతపురం నుంచి పోటీ చేయరనే చర్చ సైతం నడిచింది. అయితే ఆయన అక్కడి నుంచే పోటీ చేసి నెగ్గారు కూడా. అయితే.. ఆపరేషన్ సిందూర్ పరిణామాల తర్వాత.. శశిథరూర్తో కాంగ్రెస్ గ్యాప్ మరింత పెరిగింది. మోదీ ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తుతూ.. పార్టీ లైన్కు భిన్నంగా వ్యవహరిస్తున్న శశిథరూర్ అధిష్టానం అసలు పట్టించుకోవడమే మానేసింది. ఈ తరుణంలో ఇవాళ్టి వరుస పరిణామాలు ఆసక్తికర చర్చకు దారి తీశాయి. -
ఆపరేషన్ మహదేవ్ పహల్గాం ఉగ్రదాడి మాస్టర్మైండ్ హతం
శ్రీనగర్: ‘పహల్గాం’ గాయానికి ప్రతీకారం మొదలైంది. దేశమంతటా ఆగ్రహావేశాలు రగిల్చిన ఆ దాడికి పాల్పడ్డ ఉగ్ర ముష్కరులకు కౌంట్డౌన్ మొదలైంది. పహల్గాం దాడి సూత్రధారి అయిన ఉగ్ర ముష్కరుడు హషీం మూసా అలియాస్ సులేమాన్ అలియాస్ ఆసిఫ్ను భద్రతా దళాలు సోమవారం మట్టుబెట్టాయి. జమ్మూ కశ్మీర్లో శ్రీనగర్ శివార్లలోని అటవీ ప్రాంతంలో ‘ఆపరేషన్ మహదేవ్’ పేరిట జరిపిన భీకర ఎన్కౌంటర్లో సులేమాన్తో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను ఎలైట్ పారా కమెండో దళాలు కాల్చిపారేశాయి. వారిని జిబ్రాన్, హంజా అఫ్గానీగా గుర్తించారు. జిబ్రాన్ గతేడాది సోనామార్గ్లో టన్నెల్ ప్రాజెక్టు పనులు చేస్తున్న సిబ్బందిని పొట్టన పెట్టుకున్న ఉగ్ర ముఠా సభ్యుడని అధికార వర్గాలు వెల్లడించాయి. ఎన్కౌంటర్ ప్రాంతం నుంచి ఒక ఎం4 కార్బైన్, రెండు ఏకే రైఫిళ్లు, మందుగుండు, గ్రెనేడ్లు తదితరాలు స్వాధీనం చేసుకున్నా రు. ముష్కరుల మృత దేహాలను బలగాలు స్థానిక పోలీసులకు అప్పగించాయి. ఈ ముష్కరులకు సన్ని హితులైన మరో ఉగ్ర ముఠా సభ్యులు సైతం ఎన్కౌంటర్ ప్రాంతానికి సమీపంలోనే నక్కినట్టు బలగాలకు సమాచారం అందింది. దాంతో సమీప ప్రాంతాలన్నింటినీ దిగ్బంధించి జల్లెడ పడు తున్నారు. ‘ఆపరేషన్ మహదేవ్’ ఇంకా ముమ్మరంగా కొనసాగుతున్నట్టు సైనిక, స్థానిక పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి. ఇందుకోసం భారీ సంఖ్యలో అదనపు బలగాలను మోహరించారు. సై న్యం, భద్రతా బలగాలు, కశ్మీర్ పోలీసు విభాగ సి బ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నా రు. ఆపరేషన్ మహదేవ్ ఇప్పట్లో ముగి యబోదని కశ్మీర్ జోన్ ఐజీ వీకే బిద్రీ స్పష్టం చేశారు..కునుకు తీస్తుండగానే...హషీం మూసా. అలియాస్ అబూ సులేమాన్. అలియాస్ ఆసిఫ్. పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ లష్కరే తయిబా టాప్ కమాండర్. పహల్గాం ఉగ్ర దాడి సూత్రధారి. ఆపరేషన్ మహదేవ్లో మన బలగాలు మట్టుబెట్టిన ముగ్గురు ముష్కరుల్లో అతి ముఖ్యుడు. అయితే ఇంతటి విజయం అంత తేలిగ్గా ఏమీ లభించలేదు. ఇందుకోసం సైన్యం అవిశ్రాంతంగా శ్రమించింది. సీఆర్పీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీస్తో కలిసి ఏకంగా 14 రోజుల పాటు కలిసికట్టుగా, నిర్విరామంగా వేట సాగించింది. చివరికి శ్రీనగర్ శివార్లలోని అటవీ ప్రాంతంలో మూసా ముఠా ఆనుపానులు కనిపెట్టి ముప్పేట దాడి చేసింది. రెప్పపాటులో దాని కథ ముగించింది. జమ్మూ కశ్మీర్లోని లిడ్వాస్ ప్రాంతంలోని చినార్ కార్ప్స్ సైనిక విభాగం ఈ ఆపరేషన్ను ఆద్యంతం పర్యవేక్షించింది. అనంతరం ఘటనా స్థలిలో తీసిన డ్రోన్ ఫుటేజీని విడుదల చేసింది. అందులో ముగ్గురు ముష్కరుల మృతదేహాలు కనిపిస్తున్నాయి. వీరంతా లష్కరే, పాక్కే చెందిన మరో ఉగ్ర ముఠా జైషే మహ్మద్కు చెందిన ఉగ్రవాదులేనని తేలింది. పహల్గాం ఉగ్ర దాడి తమ పనేనని లష్కరే ప్రకటించుకోవడం తెలిసిందే. ఈ ముగ్గురిలో ముఖ్యుడైన మూసా దాడి సమయంలో తీరిగ్గా కునుకు తీస్తూ ఉండటం ఈ ఉదంతం మొత్తంలో కొసమెరుపు!అలా ఉచ్చు బిగించారు...నిజానికి ఆపరేషన్ మహదేవ్ రెండు రోజులుగా కొనసాగుతోంది. దట్టమైన దాచిగాం అడవుల లోతట్టు ప్రాంతం నుంచి అందని అనుమానాస్పద సిగ్నల్స్, కమ్యూనికేషన్తో బలగాలు అప్రమత్తమ య్యాయి. వాటి ఆధారంగానే అనుమానితుల జాడను కనిపెట్టగలిగాయి. ఆ వెంటనే సైనిక బృందాలు, ప్రత్యేక బలగాలు (ఎలైట్ ఫోర్సెస్) రంగంలోకి దిగి రెండు రోజులుగా పరిసరాలను జల్లెడ పడుతూ వచ్చాయి. ఆ క్రమంలో ఒక చెట్టు కింద తాత్కాలిక గుడారంలో విశ్రమిస్తున్న ముగ్గురు ఉగ్రవాదులను యాదృచ్చికంగా గుర్తించాయి. దాడిని ఏ మాత్రమూ ఊహించని ముష్కరులు టెంట్లో తీరిగ్గా కునుకు తీస్తూ కనిపించారు. సైనికులు వెంటనే తూటాల వర్షం కురిపించి వారిని హత మార్చారు. ఆపరేషన్ను పర్యవేక్షించిన అత్యున్నత స్థాయి అధికారి ఒకరు ఈ మేరకు ధ్రువీకరించారు.రూపం మార్చుకున్న మూసాఎట్టి పరిస్థితుల్లోనూ భద్రతా దళాలకు చిక్కొద్దనే ఉద్దేశంతో మూసా తన రూపాన్ని వీలైనంతగా మార్చుకున్నట్టు నిఘా వర్గాలు తెలిపాయి. ఆ క్రమంలో అతడు భారీగా బరువు కోల్పోయాడన్నారు. పహల్గాం దాడిలో పాల్గొంది ఈ ఉగ్రవాదులే.. మూసా(కుడివైపు చివర)అలాగే.. ఈ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు సైన్యం ప్రకటించింది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ను తెలియజేస్తామని ఎక్స్ ద్వారా తెలియజేసింది. నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో ములనార్, హర్వాన్ ప్రాంతాల్లో కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. మరిన్ని బలగాలు ఆ ప్రాంతానికి చేరుకుంటున్నట్లు సమాచారం. OP MAHADEVContact established in General Area Lidwas. Operation in progress.#Kashmir@adgpi@NorthernComd_IA pic.twitter.com/xSjEegVxra— Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) July 28, 2025 -
Live: ఆపరేషన్ సిందూర్పై చర్చ.. విపక్షాలపై రాజ్నాథ్ సెటైర్లు
Parliament Monsoon Session Liveభారత సైనికులు సింహాలు : రాజ్నాథ్ సింగ్పహల్గాం ఉగ్రదాడి హేయమైన చర్యఆపరేషన్ సిందూర్ పేరుతో సైనిక చర్య ప్రారంభించాంఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచానికి సత్తా చూపించాం. పహల్గాం ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారుమతం పేరు అడిగి మరి పర్యాటకుల్ని కాల్చి చపంపారుమన ఆడబిడ్డలకు జరిగిన అన్యాయంపై ఉరుకునేది లేదుపాక్,పీవోకేలోని పాక్ ఉగ్రవాదుల శిబిరాలపై దాడులు చేశాంభారత సైన్యం వ్యూహాత్మకంగా ఉగ్రవాదుల శిబిరాలపై దాడి చేసిందిపాకిస్తాన్లో తొమ్మిది ఉగ్రశిబిరాలపై దాడులు చేశాం100మందికిపైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాంహిబ్జుల్,లష్కరే తోయిబా ఉగ్రశిబిరాల్ని నేలమట్టం చేశాంటెర్రరిస్టుల ఇళ్లలోకి చొచ్చుకెళ్లీ మరి 22 నిమిషాల్లో వారి స్థావరాల్ని ధ్వంసం చేశాంపాక్ ఉగ్రస్థావరాలపై దాడి జరిపిన తర్వాత ఆదేశ డీజీఎంవోకు సమాచారం అందించాం పాక్ డ్రోన్లను భారత్ వాయిసేన కూల్చేసిందిపాక్లో సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దాడి చేశాంఆపరేషన్ సిందూర్లో పాల్గొన్న సైన్యానికి నా సెల్యూట్ పాక్ దాడుల్లో భారత ఆయుధ సంపత్తికి ఎలాంటి నష్టం జరగలేదుభారత నౌకా దళం కూడా పాక్కు గట్టిగా బుద్ధి చెప్పిందిపాక్ను ఆక్రమించుకోవడం ఆపరేషన్ సిందూర్ లక్ష్యం కాదుతమ దేశంపై దాడులు వెంటనే ఆపాలని పాక్ కోరిందిమనదాడులతో పాక్ మన కాళ్ల బేరానికి వచ్చింది.ఆపరేషన్ సిందూర్ ముగియలేదు.. గ్యాప్ ఇచ్చాంఆపరేషన్ సిందూర్ ఆపాలని మాపై ఎలాంటి ఒత్తిడి లేదుబాధితులపై జరిగిన అన్యాయంపై ప్రతీకారం తీర్చుకున్నాంప్రతి పక్షాలపై రాజ్నాథ్ సెటైర్లుపరీక్ష రాసేటప్పుడు ఎలా రాస్తున్నాం అన్నది మాత్రమే చూడాలి. పెన్సిల్ విరిగిందా,అరిగిందా అన్నది చూడకూడదుపాక్ ఆర్మీ,ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదుల్ని హతమార్చాంపాక్ న్యూక్లియర్ బెదిరింపులకు భారత్ లెక్క చేయలేదుఎటుచూసుకున్నా.. పాక్ మనతో సమమానం కాదుప్రతిపకక్షాలు భారత సైనికుల సత్తాను ప్రశ్నించడం సరికాదుభారత సైనికులు సింహాలుభారత్ దాడులకు పాక్ తట్టుకోలేకపోయిందిదేశ రక్షణ విషయంలో ఆచితూచి ప్రశ్నలు వేయాలి లోక్సభలో ఆపరేషన్ సిందూర్పై చర్చప్రారంభమైన పార్లమెంట్లోక్సభలో ఆపరేషన్ సిందూర్పై మొదలైన చర్చచర్చ ప్రారంభించిన కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ప్రతిపక్షాలు పారిపోతున్నాయ్: పీయూష్ గోయల్ఆపరేషన్ సిందూర్పై లోక్సభలో జరగాల్సిన చర్చబీహార్ ఓటర్ల జాబితా అంశంతో ఉభయ సభల్ని అడ్డుకుంటున్న విపక్షాలుమూడుసార్లు వాయిదా పడ్డ సభలువిపక్షాల తీరుపై కేంద్రం ఫైర్ఆపరేషన్ సింధూర్ చర్చ నుంచి పారిపోతున్నారంటూ ఎద్దేవా చేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్భారత సైన్యం సాధించిన విజయాన్ని అగౌరవపరుస్తున్నారంటూ పీయూష్ వ్యాఖ్యమూడోసారి లోక్సభ వాయిదాఆపరేషన్ సిందూర్కు ముందు లోక్సభలో గందరగోళంవిపక్షాల ఆందోళనతో లోక్సభ మరోసారి వాయిదామధ్యాహ్నాం 2గం. దాకా వాయిదా వేసిన స్పీకర్ ఓం బిర్లాఇవాళ మూడోసారి పడ్డ వాయిదాఆపరేషన్ సిందూర్పై మాట్లాడేది వీళ్లేబీజేపీ తరపున.. రాజ్నాథ్ సింగ్బజ్యంత్ పాండాఎస్ జైశంకర్తేజస్వి సూర్యసంజయ్ జైశ్వాల్అనురాగ్ ఠాకూర్కమల్జీత్ షెరావత్కాంగ్రెస్ నుంచిగౌరవ్ గోగోయ్ప్రియాంక గాంధీ వాద్రాదీపేంద్ర హుడాపరిణితీ షిండేసప్తగిరి ఉలాకాబిజేంద్ర ఒలాఇతరులులావు కృష్ణదేవరాయ(టీడీపీ)హరీష్ బాలయోగి(టీడీపీ)రామశంకర్ రాజ్భర్(ఎస్పీ)చోటేలాల్(ఎస్పీ)కల్యాణ్ బెనర్జీ(ఏఐటీసీ)సయోని ఘోష్(ఏఐటీసీ)కే ఫ్రాన్సిస్ జార్జ్(కేరళ కాంగ్రెస్)ఏ రాజా(డీఎంకే)కనిమొళి(డీఎంకే)అమూర్కాలే(ఎన్సీపీ ఎస్పీ)సుప్రియా సూలే (ఎన్సీపీ ఎస్పీ) ఆపరేషన్ సిందూర్పై.. లోక్సభలో చర్చ ప్రారంభించనున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ఆపరేషన్ సిందూర్పై.. కాంగ్రెస్కు 2గంటల సమయంసాయంత్రం 4.30. గం. ప్రాంతంలో ప్రియాంక వాద్రా గాంధీ ప్రసంగించే ఛాన్స్సాయంత్రం ఏడున్నర గంటలకు మాట్లాడనున్న విదేశాంగ మంత్రి జైరాం రమేష్రాత్రి 10గం. దాకా సాగనున్న ఆపరేషన్ సిందూర్ చర్చలోక్సభ మళ్లీ వాయిదాఆపరేషన్ సిందూర్పై చర్చకు ముందు లోక్సభలో విపక్షాల ఆందోళనబీహార్ ఓటర్ జాబితా సవరణపై చర్చకు పట్టులోక్ సభ వెల్లో విపక్షాల ఆందోళనబీఏసీ మీటింగ్లో ప్రతిపక్ష నేతలంతా ఆపరేషన్ సిందూర్పై చర్చకు ఒప్పుకున్నారు: స్పీకర్ ఓం బిర్లాఇప్పుడు ఆందోళన ఎందుకు చేస్తున్నారు?: స్పీకర్ ఓం బిర్లాఆందోళన చేస్తే ఆపరేషన్ సిందూర్పై చర్చ ఎలా జరుగుతుంది?: స్పీకర్ ఓం బిర్లావాయిదా వేసిన స్పీకర్ ఓం బిర్లాలోకసభ 1గం. వరకు వాయిదాఅటు రాజ్యసభలోనూ విపక్షాల ఆందోళనరాజ్యసభ 2.గం వరకు వాయిదాఆపరేషన్ సిందూర్పై చర్చఅధికార, ప్రతిపక్షాలకు స్పీకర్ ఓంబిర్లా విజ్ఞప్తివిపక్షాల తీవ్ర ఆందోళనచర్చ ప్రారంభించనున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్మొత్తం 16 గం. పాటు జరగనున్న చర్చప్రభుత్వం తరఫున మాట్లాడనున్న కేంద్ర మంత్రులుచర్చలో చివరగా ప్రధాని మోదీ మాట్లాడే అవకాశంకాంగ్రెస్ నుంచి చర్చను ప్రారంభించనున్న గౌరవ్ గగోయ్కాంగ్రెస్కు 2 గంటల సమయంప్రారంభమైన లోక్సభమరికాసేపట్లో ఆపరేషన్ సిందూర్పై చర్చపార్లమెంట్లో 16 గంటలపాటు కొనసాగనున్న చర్చఇవాళ, రేపు లోక్సభలో చర్చ నడిచే అవకాశంరేపు రాజ్యసభలో చర్చ జరిగే చాన్స్లోక్సభలో ఆపరేషన్సిందూర్పై చర్చను ప్రారంభించనున్న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్దేశ జాతయ భద్రతకు హాని కలిగించేలా, పహల్గాం బాధితులు నొచ్చుకునేలా మాట్లాడొద్దని ప్రతిపక్షాలకు కేంద్ర మంత్రి కిరెన రిజిజు విజ్ఞప్తిపార్లమెంట్ ప్రారంభం.. ఉభయ సభలు వాయిదాపార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభంవాయిదా తీర్మానాలపై విపక్షాల పట్టుస్పీకర్ చైర్లో ఎంపీ కృష్ణప్రసాద్ తెన్నేటీఉభయ సభల్లో ఆందోళనల నడుమ.. వాయిదా వేసిన స్పీకర్, చైర్మన్12గం. ప్రారంభం కానున్న ఉభయ సభలు మరికాసేపట్లో లోక్సభలో ఆపరేషన్సిందూర్పై చర్చచర్చను ప్రారంభించనున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్దాడికి పాల్పడిన ముష్కరులను పట్టుకోకపోవడంపై ప్రశ్నించనున్న విపక్షాలుఉగ్రవాద శిబిరాలను నాశనం చేసిన భారత సైన్యంఆపరేషన్ సిందూర్ను మద్యలోనే నిలిపివేయడంపై ప్రతిపక్షాల అభ్యంతరందౌత్యం తన ప్రమేయం ఉందన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వంపైనా ప్రశ్నించే అవకాశంశశిథరూర్ .. గప్చుప్పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్.. చర్చ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చర్చకు దూరంగా ఉండనున్నట్లు సమాచారం. ఈ మేరకు పార్టీ వర్గాలు ఈ ప్రకటన చేశాయి. ఒకవేళ ఆయన గనుక చర్చలో పాల్గొంటే మాత్రం అది పార్టీ లక్ష్మణరేఖ దాటినట్లే కానుంది.పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా.. ఐదో రోజు సెషన్ ప్రారంభమైంది. ప్రతిపక్షాల ఆందోళనల నడుమ ఉభయ సభలు గత నాలుగు రోజులుగా సజావుగా సాగని సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పహల్గాం ఉగ్ర దాడి, ఆపరేషన్ సిందూర్పై చర్చించేందుకు ఎన్డీయే ప్రభుత్వం సిద్ధమని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చర్చతో ఇవాళ సభ వేడెక్కే అవకాశం కనిపిస్తోంది.దేశాన్ని అవమానించొద్దు: రిజిజుఆపరేషన్ సిందూర్పై చర్చవేళ.. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు ప్రతిపక్షాలకు ఓ విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్లో దేశ హుందాతనం, గౌరవాన్ని కాపాడాలి. విపక్షాలు పాక్ భాష వాడొద్దు. దేశ గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించొద్దు. సైన్యాన్ని కించపరిచేలా మాట్లాడొద్దు అని కోరారు. రావణుడు లక్ష్మణ రేఖ దాటాడు కాబట్టే లంకా దహనం అయ్యింది. పాక్ ఉగ్రవాదులు సరిహద్దు దాటారు కాబట్టే వాళ్ల ఉగ్రవాద శిబిరాలు నాశనం అయ్యాయంటూ రిజిజు ట్వీట్ఉగ్రవాదులు మన దేశం వారేనన్న కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంఇన్నిరోజులు జాతీయ దర్యాప్తు సంస్థ ఏం చేసిందని ప్రశ్నపాక్ నుంచి ఉగ్రవాదులు వచ్చారనడానికి ఆధారాల్లేవ్ఇప్పటిదాకా ఉగ్రవాదుల జాడ ఎందుకు తెలుసుకోలేకపోయారని ప్రశ్నచిదంబరం వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరాలుచిదంబరాన్ని వెనకేసుకొస్తున్న కాంగ్రెస్ ఆయన అడిగినదాంట్లో తప్పేంటి? అని బీజేపీకి కాంగ్రెస్ ఎంపీల ప్రశ్నలోక్సభలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆపరేషన్ సిందూర్పై చర్చను ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీతో పాటు విదేశాంగ మంత్రి జైశంకర్ పాల్గొంటారని తెలుస్తోంది. విపక్షాల తరఫున ప్రసంగించే నేతల వివరాలపై స్పష్టత లేదు. అయితే కాంగ్రెస్ తరఫున ఎంపీ ప్రియాంక గాంధీ, మరికొందరు ఎంపీలు ప్రసంగిస్తారని సమాచారం. చర్చకు మొత్తం 16 గంటల సమయం కేటాయించారు. ఏప్రిల్ 25వ తేదీన.. జమ్ము కశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహల్గాం బైసరన్ లోయలో 26 మంది టూరిస్టులను ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) సంస్థ ఘటనకు తామే బాధ్యులమని ప్రకటించింది. అయితే ఇప్పటిదాకా ఆ ఉగ్రవాదుల భరతం పట్టకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని కాంగ్రెస్ సహా విపక్షాలు విమర్శిస్తున్నాయి. అదే సమయంలో ఓవైపు.. పాక్కు బుద్ధి చెప్పేందుకేనని కేంద్రం చెప్పిన ఆపరేషన్ సిందూర్ను అర్దంతరంగా ఆపేయడం పైనా మండిపడ్డాయి. మరోవైపు.. తన వల్లే కాల్పుల విరమణ జరిగిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటన భారతదేశ విదేశాంగ విధానం వైఫల్యమని మండిపడుతున్నాయి. అయితే ట్రంప్ జోక్యాన్ని ఖండించిన భారత ప్రభుత్వం.. పహల్గాం దాడికి ప్రతిస్పందనగానే ఆపరేషన్ సింధూర్ చేపట్టామని, ఆ ఆపరేషన్ విజయవంతంపైనా పార్లమెంట్లో చర్చిస్తామని చెబుతోంది. అటు రేపు రాజ్యసభలో ఆపరేషన్ సిందూరపై చర్చ జరగనుంది. -
అతివలను.. నిలువనివ్వని కొలువు
దేశంలోని కార్మిక, నైపుణ్య (బ్లూ, గ్రే కాలర్) ఉద్యోగాలు చేస్తున్న మహిళల్లో సగం మందికి పైగా.. ఉద్యోగంలో చేరిన ఏడాది లోపే తమ ఉద్యోగాన్ని విడిచిపెట్టే ఆలోచనలో ఉంటున్నారని స్త్రీ సాధికార సంస్థ ‘ఉదయతి ఫౌండేషన్’, ఐటీ కంపెనీలకు ఉద్యోగులను సమకూర్చే ‘క్వెస్ కార్ప్’ కలిసి రూపొందించిన తాజా నివేదికలో వెల్లడైంది. రౌండేళ్లకు పైగా తమ ఉద్యోగాల్లో నిలదొక్కుకోగలిగిన మహిళల్లో ఉద్యోగం మానేయాలన్న తలంపు 3 శాతం మాత్రమే ఉండగా, ఒక ఏడాది కంటే తక్కువ కాలం ఉద్యోగం చేస్తున్న వారిలో ఇది 52 శాతంగా ఉందని నివేదిక తెలిపింది. ఉద్యోగంలో చేరిన కొత్తల్లో ఇంటా బయటా మహిళలు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిని ఈ ధోరణి తెలియజేస్తోందని నివేదిక పేర్కొంది.జీతం పెంచితే మళ్లీ వస్తాం..: 54 శాతం మంది మహిళలు తమ ఆదాయం ఏమంత సంతృప్తికరంగా లేదని చెప్పగా, వారిలో 80 శాతం మంది నెలకు రూ. 2,000 కంటే తక్కువ ఆదా చేయగలుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మెరుగైన జీతం ఉంటే మహిళలు ఉద్యోగం మానేయాలన్న భావనలో ఉండేవారు కాదని సర్వే చెబుతోంది. రూ. 20,000 కంటే ఎక్కువ సంపాదించే మహిళలు ఉద్యోగం మానేసే అవకాశం 21 శాతం తక్కువగా ఉండగా, పని మానేసి వెళ్లిన వారిలో 42 శాతం మంది తమకు మెుగైన వేతనాలు ఇస్తామంటే తిరిగి ఉద్యోగంలో చేరుతామని చెప్పినట్లు నివేదిక తెలిపింది.రిటైల్, వస్తు ఉత్పత్తి, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా వంటి రంగాలలో ప్రస్తుతం పని చేస్తున్న 10,000 మంది, గతంలో పనిచేసిన 1,500 మంది మహిళా కార్మిక ఉద్యోగులపై ఉదయతి, క్వెస్ కార్ప్ సర్వే నిర్వహించి ‘స్టేట్ ఆఫ్ ఉమెన్ ఇన్ ది బ్లూ–గ్రే కాలర్ వర్క్ఫోర్స్ 2025’ అనే పేరుతో ఈ నివేదికను రూపొందించాయి. తక్కువ జీతం, సదుపాయంగా లేని రోజువారీ ప్రయాణం, భద్రతా సమస్యలు, ఉద్యోగంలో ఎదుగుదలకు పరిమిత అవకాశాలు, అన్ని కలిసి మహిళా కార్మిక ఉద్యోగులు తమకు తాముగా ఉద్యోగం మానేసే పరిస్థితులను కల్పిస్తున్నాయని సర్వే స్పష్టం చేసింది. సురక్షితం కాని రాకపోకలు..: ప్రస్తుత మహిళా ఉద్యోగుల్లో 57 శాతం మంది నివాస స్థలానికి, పని ప్రదేశానికి మధ్య సజావైన రవాణా సదుపాయం లేక ఇబ్బంది పడుతున్నామని చెప్పారట. 11 శాతం మంది తమ ప్రయాణ మార్గంలో, ముఖ్యంగా రాత్రి షిఫ్ట్లలో సురక్షితంగా లేమని భావిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. చాలామంది హాస్టళ్లపై ఆధారపడతారు కానీ, ప్రయాణాల్లో మళ్లీ అదే భయం, అదే అభద్రత. ఉద్యోగం వదిలిపెట్టిన ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు, ఇంటికి దగ్గరగా ఉద్యోగావకాశం వస్తే తిరిగి ఉద్యోగానికి వెళ్తామని చెప్పారు.పని ప్రదేశంలో మహిళల భద్రత కూడా ఆందోళనకరంగానే ఉంది. 22 శాతం మంది మహిళలు పనిలో తాము సురక్షితంగా లేమని భావిస్తున్నారట. 28 శాతం మహిళలు.. ఎక్కువ గంటలు, కష్టతరమైన పరిస్థితుల వల్లే తాము ఉద్యోగం మానేశామని చెప్పారు. వారిలో మూడింట ఒక వంతు మంది తమకు ఒత్తిడిని తట్టుకునే శక్తి లేకపోవటమే కారణమన్నారు.67 శాతం మానేశారు⇒ బ్లూ–గ్రే ఉద్యోగాలలో ఉన్న ఎంట్రీ–లెవల్ మహిళల్లో సగం మంది ఒక సంవత్సరం లోపే ఉద్యోగ విరమణ చేయాలన్న ఆలోచనకు వచ్చేస్తున్నారు.⇒ 2020–21లో 16 శాతంగా ఉన్న బ్లూ–గ్రే కాలర్ ఉద్యోగాలలో మహిళల వాటా 2023–24లో 19 శాతానికి పెరిగినప్పటికీ, ‘పీరియాడిక్ లేబర్ ఫోర్స్’ సర్వే ప్రకారం, గత ఆరు నెలల్లో అనేక ప్రతిబంధకాల కారణంగా 67 శాతం మంది మహిళలు ఉద్యోగాలు మానేసి వెళ్లిపోయారు.ఆ 5 కీలకం⇒ మహిళల్ని ఉద్యోగం మానేయకుండా ఆపగలవని నివేదిక గుర్తించిన 5 అంశాలు...⇒ మెరుగైన వేతనం సురక్షితమైన ప్రయాణ సదుపాయం⇒ అనువుగా మార్చిన కార్యాలయ మౌలిక సదుపాయాలు⇒ స్పష్టమైన వృద్ధి అవకాశాలు⇒ అందరినీ కలుపుకొనిపోయే కార్యాలయ సంస్కృతిమహిళలు సామర్థ్యం లేకపోవడం వల్ల ఉద్యోగం మాని వెళ్లిపోవడం లేదు. వారికి తగినట్లుగా మనమింకా మౌలిక సదుపాయాలను కల్పించడం లేదు. వారి నుంచి అత్యుత్తమ ఫలితాలను సాధించటానికి అనువుగా పని ప్రదేశాలను మలుచుకోవడం లేదు. అందుకే వాళ్లు మధ్యలోనే ఉద్యోగం మానేస్తున్నారు– పూజా గోయల్, ఉదయతి ఫౌండేషన్ వ్యవస్థాపక సీఈఓఎదిగే అవకాశాలు అస్పష్టం..: కెరీర్లో ఎదుగుదలకు సంబంధించి స్పష్టమైన దారేదీ కనిపించక ఉద్యోగాన్ని వదిలేశామని 21 శాతం మంది మహిళలు తెలిపారు. ముఖ్యంగా బీ.ఎఫ్.ఎస్.ఐ. (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా) టెలికం రంగాల్లో ఎదుగుదల అవకాశాలు అస్పష్టంగా ఉన్నప్పుడు ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఆ ఉద్యోగంలో పనిచేసిన పోస్ట్ గ్రాడ్యుయేట్లలో ఉద్యోగ విరమణ చేసే అవకాశం మూడు రెట్లు ఎక్కువగా ఉందని డేటా తెలిపింది. అయినప్పటికీ 11 శాతం మంది మహిళలు అదనపు నైపుణ్యాలలో శిక్షణ పొంది ఉద్యోగాలలో కొనసాగుతున్నారు. -
‘సిందూర్’తో సత్తా చాటాం
గంగైకొండ చోళపురం: భారతదేశ శక్తి సామర్థ్యాలు ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచానికి తెలిసొచ్చాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాదులకు, మన శత్రువులకు సురక్షిత స్థానం అంటూ ఎక్కడా లేదన్న నిజాన్ని నిరూపించామని చెప్పారు. మన సార్వభౌమత్వంపై దాడి జరిగితే ప్రతిస్పందన ఎంత భీకరంగా ఉంటుందో అందరికీ తెలిసిపోయిందని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ దేశ ప్రజలకు నూతన ఆత్మవిశ్వాసాన్ని కలిగించిందని స్పష్టంచేశారు. ఆదివారం తమిళనాడులోని గంగైకొండ చోళపురంలో చొళరాజు రాజేంద్ర చోళ–1 జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ‘ఆది తిరువత్తిరై’ పేరిట నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రసంగించారు. రాజరాజ చోళ, ఆయన కుమారుడు రాజేంద్ర చోళ–1 చక్రవర్తుల పేర్లు మన దేశ గుర్తింపునకు పర్యాయపదాలు అని కొనియాడారు. వారు మనందరికీ గర్వకారణమని చెప్పారు. తమిళనాడులో భారీ ఎత్తున వారి విగ్రహాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మన చరిత్రకు అవి దర్పణాలు అవుతాయని నరేంద్ర మోదీ అన్నారు. సాధారణంగా ప్రజాస్వామ్యం గురించి ప్రస్తావనకు వచ్చినప్పుడు యూకేలోని మాగ్నాకార్టా గురించి మాట్లాడుతుంటారని, నిజానికి వెయ్యి సంవత్సరాల క్రితమే చోళుల పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థ అమల్లో ఉందని గుర్తుచేశారు. బృహదీశ్వర ఆలయంలో పూజలు గంగైకొండ చోళపురంలో చోళ రాజులు నిర్మించిన బృహదీశ్వర ఆలయాన్ని ప్రధాని మోదీ దర్శించుకున్నారు. ఆర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మోదీ సంప్రదాయ వస్త్రాలు ధరించి, పవిత్ర జలంలో కూడిన కలశం చేతబూని ఆలయంలోకి ప్రవేశించారు. గర్భాలయంలో పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపారాధన చేశారు. అనంతరం భారత పురావస్తు సర్వే విభాగం నిర్వహించిన ప్రదర్శనను తిలకించారు. అంతకముందు గంగైకొండ చోళపురంలో ప్రధాని మోదీ రోడ్ షోలో పాల్గొన్నారు. రహదారికి ఇరువైపులా జనం బారులు తీరి ఆయనకు స్వాగతం పలికారు. 3 కిలోమీటర్ల మేర జరిగిన ఈ రోడ్ షోలో బీజేపీ, ఏఐఏడీఎంకే పార్టీల జెండాలు రెపరెపలాడాయి. ప్రధానితో పళని స్వామి భేటీ తమిళనాడు పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీతో శనివారం రాత్రి ఏఐఏడీఎంకే ప్రధా న కార్యదర్శి, తమిళనాడు మాజీ సీఎం పళని స్వామి సమావేశమయ్యారు. తిరుచిరాపల్లి ఎయిర్పోర్ట్లో ఈ భేటీ జరిగింది. తమిళనాడులో బీజేపీ, ఏఐఏడీఎంకే మధ్య పొత్తు కుదిరిన తర్వాత మోదీ, పళనిస్వామి కలుసుకోవడం ఇదే మొదటిసారి. రాబోయే అసెంబ్లీ ఎ న్నికలపై వారు చర్చించుకున్నట్లు సమాచారందివంగత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆదివారం ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. గొప్ప దార్శనికుడిగా, శాస్త్రవేత్తగా, గురువుగా, దేశభక్తుడిగా కలాం చిరస్మరణీయులు అని మోదీ కొనియాడారు. దేశాన్ని అభివృద్ధి చేసుకొనే దిశగా కలాం ఆలోచనలు, ఆశయాలు యువతకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని స్పష్టంచేశారు. కలాంకు మోదీ నివాళులు -
పహల్గాం దాడి, సిందూర్పై నేడు పార్లమెంటులో చర్చ
న్యూఢిల్లీ: వారం రోజులపాటు అంతరాయాల మధ్య నడిచిన పార్లమెంటు వర్షకాల సమావేశాల్లో నేటి నుంచి ఉత్కంఠభరితమైన చర్చ జరగనుంది. పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్పై తలపడేందుకు ఉభయ సభల్లోని అధికార, ప్రతిపక్ష కూటములు సిద్ధమయ్యాయి. జాతీయ భద్రత, విదేశాంగ విధానం వంటి కీలక అంశాలు కావడంతో మాట్లాడేందుకు ఇరు పక్షాల అగ్ర నేతలు సిద్ధమవుతున్నారు. అధికార పక్షం నుంచి హోంమంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి తమ వైఖరిని స్పష్టం చేయనున్నారు. మంత్రులు అనురాగ్ ఠాకూర్, సుధాంషు త్రివేది, నిషికాంత్ దూబేలతోపాటు.. ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రపంచ దేశాలకు తమ వాదనను వినిపించిన ఎన్డీయే సభ్యులు సైతం మాట్లాడతారు. ఇక ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, సమాజ్వాదీ పార్టీ అఖిలేశ్ యాదవ్తో పాటు, ఇతర కీలక నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదనలు వినిపించే అవకాశం ఉంది. భారత్–పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తానే తగ్గించానని, కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం తానే వహించానంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పదేపదే వ్యాఖ్యానించారు. దీనిని విదేశాంగశాఖ తోసిపుచ్చినా.. ట్రంప్ అవే వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం వైఖరిని ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. ఇక, ప్రధాని మోదీ మౌనం వహించడంపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం విమర్శలు గుప్పించారు. మరోవైపు... కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మాత్రం ఉగ్రవాద దాడి తర్వాత ప్రభుత్వం తీసుకున్న ప్రతి చర్యను పొగడ్తలతో ముంచెత్తారు. దీంతో పార్టీతో ఆయన సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే విదేశాలకు వెళ్లిన బృందాల్లో ఒక బృందానికి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు జరిగే చర్చలో ప్రతిపక్షం నుంచి ఆయన మాట్లాడతారా? లేదా? అనే సంశయం నెలకొంది. విప్ జారీ చేసిన కాంగ్రెస్ ఆపరేషన్ సిందూర్పై సోమవారం నుంచి పార్లమెంట్లో చర్చ జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ లోక్సభ ఎంపీలకు విప్ జారీ చేసింది. వరుసగా మూడు రోజులపాటు తప్పనిసరిగా పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాలని ఆదేశించింది. ఆపరేషన్ సిందూర్పై పార్లమెంట్ దిగువ సభలో వాడీవేడిగా చర్చ జరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఈ అంశంపై పార్లమెంట్లో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ఎస్.జైశంకర్ మాట్లాడుతారని తెలుస్తోంది. ప్రధాని మోదీ సైతం సభలో సమాధానం చెబుతారని సమాచారం. -
భూమి.. వేగంగా తిరుగుతోంది!
ఈ మధ్య భూమి వేగంగా తిరుగుతోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. భూభ్రమణం వల్లనే పగలు, రాత్రి ఏర్పడతాయి. అంటే వేగం ప్రభావం కాలం మీదా పడుతుంది. టైమ్ ఆధారంగా పనిచేసే కంప్యూటర్లు, జీపీఎస్ శాటిలైట్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, స్టాక్ మార్కెట్ల వంటి ఆర్థిక వ్యవస్థలు.. అన్నీ ప్రభావితమవుతాయి. అంటే.. సుదీర్ఘకాలంలో మానవాళికి ఓ అకాల సమస్య సవాలు విసరనుందా?ఈ ఏడాది వేసవిలో భూమి చాలా వేగంగా తిరిగింది. ఫలితంగా రోజు వేగంగా గడిచిపోతోంది. జూలై 10.. ఈ ఏడాదిలో అత్యంత పొట్టి రోజు. రోజుకు ఉండాల్సినవి 24 గంటలు. కానీ ఇంటర్నేషనల్ ఎర్త్ రొటేషన్ అండ్ రిఫరెన్స్ సిస్టమ్స్ సర్వీస్, యూఎస్ నేవల్ అబ్జర్వేటరీల వంటి వాటి ప్రకారం ఆ రోజున 1.36 మిల్లీ సెకన్లు (0.00136 సెకన్లు) తక్కువయ్యాయి. జూలై 22, ఆగస్టు 5న కూడా ఇలాంటి పొట్టి రోజులే నమోదు కానున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వరుసగా 1.34, 1.25 మిల్లీ సెకన్లు ఈ రెండు రోజుల్లో లోటు పడతాయట.86,400 సెకన్లకు అటూ ఇటుగా..భూమి తనచుట్టూ తాను తిరగడానికి 24 గంటలు లేదా 86,400 సెకన్ల సమయం పడుతుందని మనం చదువుకున్నాం. కానీ, చంద్రుడి గురుత్వాకర్షణ, భూ కేంద్రంలో మార్పుల ప్రభావం.. వీటన్నింటివల్ల కచ్చితంగా 86,400 సెకన్లు ఉండదు. కాస్త అటూ ఇటుగా ఉంటుంది. స్వల్పకాలంలో దీని ప్రభావం మనపై పెద్దగా కనిపించదు కాబట్టి మనకు తెలియదు.అణు గడియారాలుసమయాన్ని అత్యంత కచ్చితంగా కొలిచేందుకు రూపొందించినవే అణుగడియారాలు. ప్రతి అణువుకు ఒక నిర్దిష్ట పౌనఃపున్యం (ఫ్రీక్వెన్సీ) ఉంటుంది. ఈ పౌనఃపున్యం ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. అణు గడియారాలు ఈ పౌనఃపున్యాన్ని ఉపయోగించి సమయాన్ని కొలుస్తాయి. ఈ సమయాన్నే కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్ (యూటీసీ) అని పిలుస్తారు. ఇది దాదాపు 450 అణు గడియారాలపై ఆధారపడి ఉంటుంది. ఇది సమయపాలనకు ప్రపంచ ప్రమాణం, అలాగే మన ఫోన్ లు, కంప్యూటర్లు అన్నింటిలోనూ పొందుపరిచిన సమయం కూడా ఇదే.1972 నుంచి.. 1972 నుంచి భూమి భ్రమణ వేగం బాగా తగ్గింది. అణు గడియారాలతో పోలిస్తే.. ఈ సమయం తక్కువ కావడంతో యూటీసీకి ‘లీప్ సెకన్’ను జోడించాలని ఇంటర్నేషనల్ ఎర్త్ రొటేషన్ అండ్ రిఫరెన్స్ సిస్టమ్స్ సర్వీస్ ఆదేశించింది. దీన్ని పాజిటివ్ లీప్ సెకన్ అని పిలుస్తారు. చెప్పాలంటే ఇది లీప్ ఇయర్ లాంటిది. 1972 జూన్ 30 నుంచి మొత్తం ఇలా 27 లీప్ సెకన్లను యూటీసీకి అదనంగా జోడించారు. కానీ, 2016 డిసెంబర్ 31 తరవాత మాత్రం ఒక్కటి కూడా అదనంగా చేరలేదు.ఎందుకు ఈ వేగం?డంకన్ ఆగ్నూ అగ్నూ అంచనాల ప్రకారం.. చంద్రుడు, సముద్ర అలల కారణంగా భూభ్రమణంలో అత్యంత స్వల్ప కాల మార్పులు సంభవిస్తున్నాయి. చంద్రుడు భూమధ్యరేఖకు పైన ఉంటే భూమి నెమ్మదిగా తిరుగుతోంది. వేసవిలో భూమి కాస్త వేగంగా తిరుగుతుంది.వాతావరణ మార్పులు కూడా లీప్ సెకన్కు కారణమవుతున్నాయి. గత ఏడాది ‘నేచర్’జర్నల్లో ప్రచురితమైన ఆగ్నూ అధ్యయనం ప్రకారం.. అంటార్కిటికా, గ్రీన్ల్యాండ్లలోని మంచు కరిగి సముద్రాల్లోకి కలిసి, సముద్ర మట్టాలు పెరిగి భూభ్రమణ వేగం తగ్గుతోంది. మంచు కరగడం భూమి అక్షంలో కూడా మార్పులకు కారణమవుతోందని స్విట్జర్లాండ్కు చెందిన ప్రముఖ ప్రొఫెసర్ బెనెడిక్ట్ సోజా పరిశోధనలో తేలింది. ‘సాధారణంగా చంద్రుడు భూభ్రమణాన్ని ఇంతవరకు ప్రభావితం చేస్తున్నాడు. కానీ, ఈ శతాబ్దం చివరి నాటికి.. భూమిపై గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలు భారీగా పెరిగి అవి భూభ్రమణ వేగాన్ని ప్రభావితం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు’ అంటున్నారు సోజా.లీప్ సెకన్కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్ – యూటీసీ నుంచి ఒక సెకను తీసేస్తే నెగటివ్ లీప్ సెకండ్ అంటారు. పాజిటివ్ లీప్ సెకన్ అంటే యూటీసీకి ఒక సెకన్ను జోడిస్తారు. భూభ్రమణ వేగం పెరిగినప్పుడు నెగటివ్ లీప్ సెకన్ అవసరమవుతుంది. దీనివల్ల ఒక రోజు 86,400 సెకన్ల కంటే కొంచెం తక్కువగా ఉంటుంది.సాధారణంగా సమయాన్ని గంటలు, నిమిషాలు, సెకన్లలో చెప్తాం. ఉదాహరణకు.. 23:59:59 తరవాత.. 00:00:00 వస్తుంది. కానీ పాజిటివ్ లీప్ సెకన్ ఉంటే..23:59:59, 23:59:60 తరవాత 00:00:00 వస్తుంది. అదే నెగటివ్ లీప్ సెకన్ అయితే... 23:59:57, 23:59:58 తరవాత 00:00:00 వస్తుంది.1949లో మొట్టమొదటి అణు గడియారం తయారైనప్పటి నుంచి చూస్తే 2024 జూలై 5ను శాస్త్రవేత్తలు అతి పొట్టి రోజుగా గుర్తించారు. ఈ రోజున 24 గంటల కంటే 1.66 మిల్లీసెకన్లు తక్కువ నమోదయ్యాయి.లీప్ సెకన్ ప్రభావం?టెలికమ్యూనికేషన్ వ్యవస్థలు, కంప్యూటర్లు, ఆర్థిక లావాదేవీలు, ఎలక్ట్రిక్ గ్రిడ్లు, జీపీఎస్ శాటిలైట్లు వంటి అనేక వ్యవస్థలు సమయంపై ఆధారపడి పనిచేస్తాయి. ఇంతవరకు ఇవి పాజిటివ్ లీప్ సెకన్నే చూశాయి. నెగటివ్ లీప్ సెకన్ వల్ల ఇవి ఎలా ప్రభావితమవుతాయో చెప్పడం కష్టం అంటున్నారు శాస్త్రవేత్తలు.ఉంచాలా.. తీసేయాలా?⇒ ‘లీప్ సెకన్ అనేది మనం సృష్టించింది. ఈ లీప్ సెకన్ పద్ధతినే తీసేస్తే గొడవ ఉండదు కదా’ అని వాదించేవారు లేకపోలేదు.⇒ ‘గడియారంలోంచి మనం తీసేయగలం. కానీ, భూభ్రమణంలో వచ్చే మార్పులను చెరిపేయలేం. సుదీర్ఘకాలంలో మానవాళిపై వాటి ప్రభావాన్ని తుడిచేయలేం. భూమి నెమ్మదిగానో వేగంగానో తిరుగుతోందని.. అందుకు భూతాపం వంటివి కారణమవుతున్నాయని తెలుసుకునేందుకు.. ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ఉండాల్సిందే’ అని గట్టిగా వాదిస్తున్నవారూ ఉన్నారు. -
అంతరిక్షంపై చిన్నారుల్లో అమితాసక్తి
సాక్షి, న్యూఢిల్లీ: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర విజయవంతం కావడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. అంతరిక్షంపై చిన్నారుల్లో ఆసక్తి నానాటికీ పెరుగుతోందని చెప్పారు. అంతరిక్ష రంగంలో 200కుపైగా స్టార్టప్ కంపెనీలు ఏర్పాటయ్యాయని తెలిపారు. ఆయన ఆదివారం 124వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘ఆత్మనిర్భర్ భారత్’కు అతిపెద్ద ఆధారం ‘వోకల్ ఫర్ లోకల్’ అని పునరుద్ఘాటించారు. ‘2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్’ అనే లక్ష్య సాధన కోసం కృషి చేస్తున్నామని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. గత కొన్ని వారాల్లో క్రీడలు, సైన్స్, సాంస్కృతికం తదితర రంగాల్లో ఎన్నో ఘనతలు నమోదయ్యాయని, అవి ప్రతి భారతీయుడికీ గర్వకారణమని చెప్పారు.శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్రతో దేశమంతా పులకించిపోయిందని, ఆయన క్షేమంగా తిరిగి వచ్చాక గర్వంతో ఉప్పొంగిపోయిందని, ప్రతి హృదయం సంతోషంతో నిండిపోయిందని వ్యాఖ్యానించారు. 2023 ఆగస్టులో చంద్రయాన్–3 ప్రయోగం విజయవంతమైనప్పుడు భారతీయులు ఎంతగానో గర్వించారని గుర్తుచేశారు. చిన్నారుల్లో సైన్స్, అంతరిక్షం పట్ల ఆసక్తి పెరిగిందని, చంద్రుడిపైకి చేరుకుంటామని చెబుతున్నారని వెల్లడించారు. స్పేస్ సైంటిస్ట్ కావాలన్న ఆలోచన వారిలో నాటు కుందని, ఇదొక శుభ పరిణామమని ఉద్ఘాటించారు. ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే... ఒలింపియాడ్లో మన విద్యార్థుల ఘనత ‘‘చిన్నారుల్లో నూతన ఆవిష్కరణ పట్ల ఉత్సాహం పెంచడానికి ఇన్సై్పర్–మానక్ అభియాన్ ప్రారంభించాం. ఒక్కో పాఠశాల నుంచి ఐదుగురిని ఎంపిక చేశాం. లక్షలాది మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో చేరారు. చంద్రయాన్–3 తర్వాత వారి సంఖ్య రెట్టింపయ్యింది. స్పేస్ స్టార్టప్లు ఐదేళ్ల క్రితం కేవలం 50 ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 200 దాటేసింది. 21వ శతాబ్దంలో నూతన శక్తితో సైన్స్ పురోగమిస్తోంది. కొన్ని రోజుల క్రితం ఇంటర్నేషనల్ కెమిస్ట్రీ ఒలింపియాడ్లో మన విద్యార్థులు దేవేశ్ పంకజ్, సందీప్ కుచీ, దేవదత్ ప్రియదర్శి, ఉజ్వల్ కేసరి పతకాలు గెలుచుకున్నారు. దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారు. ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ లో మన విద్యార్థులు ఆరు పతకాలు సాధించారు. విప్లవాల మాసం ఆగస్టు ఆగస్టు రాబోతోంది. ఆగస్టు అంటే విప్లవాల మాసం. 18 ఏళ్ల స్వాతంత్య్ర సమర యోధుడు ఖుదిరాం బోస్ను ఆగస్టులోనే బ్రిటిష్ పాలకులు ఉరి తీశారు. లోకమాన్య బాల గంగాధర్ తిలక్ ఆగస్టు 1న మరణించారు. ఆగస్టు 8న గాంధీ నాయకత్వంలో క్విట్ఇండియా ఉద్యమం మొదలైంది. ఆగస్టు 15న మనకు స్వాతంత్య్రం వచ్చింది. దేశ విభజన కూడా ఇదే నెలలో జరిగింది. ప్రతిఏటా ఆగస్టు 14వ తేదీని ‘విభజన అకృత్యాల సంస్మరణ దినం’గా నిర్వహించుకుంటున్నాం. 1905 ఆగస్టు 7న స్వదేశీ ఉద్యమం ఆరంభమైంది. స్వదేశీ ఉత్పత్తులు వాడాలన్న పిలుపునకు అప్పటి ప్రజలు స్పందించారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఏటా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం నిర్వహిస్తున్నాం. In the 124th episode of Mann Ki Baat, Prime Minister Narendra Modi says, "In Mann Ki Baat, once again, we will talk about the successes of the country, the achievements of the countrymen. Recently, there was a lot of discussion in the country about the return of Shubhanshu Shukla… pic.twitter.com/WcVQa0fXOG— ANI (@ANI) July 27, 2025అదే మనందరి సంకల్పం మన దేశం మరింత అభివృద్ధి చెందాలంటే స్థానిక ఉత్పత్తులు విరివిగా ఉపయోగించాలి. మన దేశంలో తయారైన వస్తువులే విక్రయించాలి. అవే కొనుక్కోవాలి. అదే మనందరి సంకల్పం కావాలి. ఎందుకంటే వాటి తయారీ కోసం మనం స్వేదం చిందించాం. కొన్నిసార్లు కొన్ని విషయాలు కొందరికి అసాధ్యంగా కనిపిస్తాయి. కానీ, మనమంతా ఒక్కటై పని చేస్తే అసాధ్యాలే సుసాధ్యాలవుతాయి. అందుకు తగిన ఉదాహరణ స్వచ్ఛ భారత్ మిషన్. ఈ కార్యక్రమానికి 11 ఏళ్లు పూర్తి కాబోతున్నాయి. ఇదొక ప్రజా ఉద్యమంగా మారింది. స్వచ్ఛతను ప్రజలు తమ బాధ్యతగా భావిస్తున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ అవసరం ఇప్పటికీ ఉంది. 4,500 పట్టణాలు, నగరాలు ఇందులో భాగమయ్యాయి. 15 కోట్ల మందికిపైగా జనం పాలుపంచుకున్నారు. ఇది సాధారణ విషయం కాదు. ఒడిశాలో మాజీ నక్సలైట్ల విజయాలు స్ఫూర్తిదాయకం జార్ఖండ్లోని గుమ్లా జిల్లాలో మాజీ నక్సలైట్లు చేపల పెంపకంలో అద్భుత విజయాలు సాధిస్తున్నారు. హింసను వీడి మత్స్య రంగంలో ప్రవేశించారు. క్లిష్టమైన పరిస్థితుల్లోనూ అభివృద్ధి దీపం వెలిగించవచ్చని నిరూపించారు. కొన్నిసార్లు దట్టమైన చీకటి నుంచే ప్రకాశవంతమైన వెలుగు ఉద్భవిస్తుంది. గతంలో తుపాకులు పట్టుకొన్న నక్సలైట్లు ఇప్పుడు వలలు చేతబూని చేపల వేట సాగిస్తున్నారు. చక్కటి ఆదాయం పొందుతూ బతుకులు మార్చుకుంటున్నారు. ఈ విజయ గాథలు అందరికీ స్ఫూర్తిదాయకం. -
ఈసీ పక్షపాత అంపైరింగ్: రాహుల్
ఆనంద్: ఎన్నికల సంఘం పక్షపాత వైఖరి ప్రదర్శిస్తోందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. పక్షపాత ఎంపైర్గా పనిచేస్తోందని క్రికెట్ పరిభాషలో మండిపడ్డారు. 2017లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడానికి ఎన్నికల సంఘమే కారణమని విమర్శించారు. అప్పట్లో తప్పుడు ఓటర్ల జాబితాను ఈసీ రూపొందించిందని ఆక్షేపించారు. క్రికెట్లో మనం తప్పులు చేయకపోయినా పదేపదే ఔట్ అవుతున్నామంటే అందుకు అంపైర్ పక్షపాత వైఖరే కారణమవుతుందని చెప్పారు. శనివారం గుజరాత్లోని ఆనంద్ పట్టణంలో ‘సంఘటన్ సుజన్ అభియాన్’లో రాహుల్ పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల శిక్షణా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. దేశాన్ని ఒక దేవాలయంగా అభివర్ణించారు. అక్కడికి ఎవరైనా వచ్చి ప్రార్థనలు, పూజలు చేసుకోవచ్చని చెప్పారు. కానీ, ప్రసాదం ఎవరికి దక్కాలన్నది బీజేపీ–ఆర్ఎస్ఎస్ నిర్ణయిస్తున్నాయని ఆక్షేపించారు. గుజరాత్లో అధికార బీజేపీని కచి్చతంగా ఓడించాలని, అందుకోసం ఇప్పటి నుంచే కృషి చేయాలని కాంగ్రెస్ నాయకులకు పిలుపునిచ్చారు. గుజరాత్లో ఆ పార్టీని మట్టికరిపిస్తే కాంగ్రెస్కు ఇక తిరుగుండదని తేల్చిచెప్పారు. బీజేపీని గుజరాత్లో ఓడిస్తే ఎక్కడైనా ఓడించడం సులభమేనని సూచించారు. ‘మిషన్ 2027’రోడ్మ్యాప్పై ఈ కార్యక్రమంలో చర్చించారు. -
ఏపీలో 14 డే కేర్ క్యాన్సర్ కేంద్రాలు
సాక్షి, న్యూఢిల్లీ: క్యాన్సర్ మహమ్మారి నుంచి రోగులను రక్షించేందుకు విస్తృత సేవలందిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. ఇందుకోసం దేశంలో డే కేర్ క్యాన్సర్ కేంద్రాల విస్తరణకు శ్రీకారం చుట్టినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను దేశంలో 200కు పైగా డే కేర్ క్యాన్సర్ కేంద్రాల స్థాపనకు కేంద్రం ఆమోదం తెలిపినట్టు పేర్కొంది. ఏపీలో 14 డే కేర్ కేంద్రాల స్థాపనకు ఆమోదించినట్టు లోక్సభ ప్రశ్నోత్తరాల్లో ఆ శాఖ సహాయ మంత్రి ప్రతాపరావు జాదవ్ చెప్పారు. ఏపీలో అనంతపురం, కర్నూలు, ప్రకాశం, కృష్ణా, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు, నంద్యాల, విజయనగరం, అన్నమయ్య, పల్నాడు, కాకినాడ, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. వైద్య విద్యను మెరుగుపరిచేందుకు పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు ఆ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పాటిల్ చెప్పారు. పీఎంఎస్ఎస్వై పథకం కింద 19 ఎయిమ్స్లలో యూజీ కోర్సులూ ప్రారంభించామని, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్ల సంఖ్యను పెంచినట్టు తెలిపారు. యూజీ సీట్లు 51,348 నుంచి 1,15,900కి, పీజీ సీట్లు 31,185 నుంచి 74,306కు పెరిగినట్టు వెల్లడించారు. కాగా, ‘ఆయుష్మాన్ భారత్–ప్ర«దాన మంత్రి జన్ ఆరోగ్య యోజన’(ఏబీ–పీఎంజేఏవై) కింద ఇప్పటి వరకు 41 కోట్ల ఆయుష్మాన్ కార్డులు సృష్టించినట్లు సహాయ మంత్రి ప్రతాపరావు జాదవ్ తెలిపారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు, ఎన్హెచ్ఎం కింద 10.18 కోట్ల మంది మహిళలకు గర్భాశయ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇది మంత్రిత్వ శాఖలో ప్రధాన మైలురాయిగా అభివరి్ణంచింది. -
అపురూపాలు.. మళ్లీ మన చెంతకు!
ఇతర దేశాల్లో ఉండిపోయిన మన పురాతన వస్తువులను రప్పించడంలో కేంద్ర ప్రభుత్వం వేగం పెంచింది. వివిధ దేశాలకు తరలి వెళ్లిన ఈ అపురూప కళాఖండాలను.. సాంస్కృతిక వారసత్వాన్ని తిరిగి పొందడం, జాతీయ గౌరవాన్ని పునరుద్ధరించడం లక్ష్యంగా తిరిగి సొంతం చేసుకుంటోంది. వీటిని సంరక్షించడం, అధ్యయనం కోసం అందుబాటులో ఉండేలా చూడటం కూడా ఈ ప్రయత్నాల ముఖ్య ఉద్దేశం.⇒ సీతా రామ లక్ష్మణుల లోహ విగ్రహాలను 2020లో యూకే నుంచి తెప్పించగలిగాం.⇒ సంతానలక్ష్మి విగ్రహం... 2021లో అమెరికా నుంచి తిరిగి రప్పించగలిగాం.⇒ మహిషాసుర మర్దిని విగ్రహాన్ని 2022లో ఆస్ట్రేలియా నుంచి తీసుకురాగలిగాం.⇒ సూర్య భగవానుడి రాతి శిల్పాన్ని 2023లో యూకే నుంచి సాధించుకున్నాం.13 మాత్రమే..2021 అక్టోబరులో అమెరికా సుమారు 15 మిలియన్ డాలర్ల విలువైన 248 అపురూప దేవీ దేవతా విగ్రహాలు, పురాతన వస్తువులను మనదేశానికి అప్పగించింది. ‘ప్రపంచంలోని ఏ మ్యూజియం కూడా అనైతికంగా సంపాదించిన ఏ కళాకృతిని కలిగి ఉండకూడదు. స్వాతంత్య్రానికి ముందు, తరువాత విగ్రహాలను మన దేశం నుంచి అనైతిక రీతిలో బయటకు తీసుకెళ్లారు. ప్రపంచవ్యాప్తంగా భారత ఖ్యాతి పెరుగుతున్నందున వివిధ దేశాలు మన వారసత్వాన్ని తిరిగి ఇవ్వడం ప్రారంభించాయి’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యల ఫలితంగా ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ, థాయ్లాండ్, యూకే, యూఎస్ఏ నుంచి భారీ ఎత్తున పురాతన వస్తువులను స్వాధీనం చేసుకుంది. 2014 నుంచి ఇప్పటివరకు మొత్తం 640 పురాతన వస్తువులు భారత్కు తిరిగి వచ్చాయి. 1947 నుంచి 2014 మధ్య కేవలం 13 పురాతన వస్తువులను మాత్రమే మన దేశం స్వాధీనం చేసుకోగలిగింది.⇒ ఇలా.. 2020–24 మధ్య 610 పురాతన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో అమెరికా నుంచి వెనక్కి వచ్చినవే ఎక్కువ కావడం గమనార్హం. సగం వస్తువులను దౌత్య మార్గాల ద్వారా భారత్ తిరిగి అందుకుంది. ఈ భారతీయ కళాఖండాలు, వాటి పునరుద్ధరణ గురించి అవగాహన పెంచడానికి ప్రభుత్వం పలు కార్యక్రమాలు, ప్రదర్శనలు, వర్క్షాప్లను నిర్వహిస్తోంది. భారత పురావస్తు శాఖ తన అధికార పరిధిలోని రక్షిత స్మారక చిహ్నాలు, ప్రదేశాలు, మ్యూజియాలలో దొంగతనానికి గురైన వస్తువుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందుపరుస్తోంది.సాంస్కృతిక వారసత్వాన్ని తిరిగి పొందడంవలసవాద కాలంలో భారత్ నుంచి అనేక కళాఖండాలు తరలిపోయాయి. తరువాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజియాలు, ప్రైవేట్ సేకరణ సంస్థలకు విక్రయం లేదా బహుమతిగా చేరాయి. ఈ వస్తువులను తిరిగి పొందడం జాతీయ గుర్తింపు, గౌరవంగా భారత్ భావిస్తోంది. అలాగే వలసవాద పాలనలో భారతీయ కళాఖండాలను క్రమబద్ధంగా దోచుకోవడం దేశ చరిత్రపై ఒక మచ్చను మిగిల్చింది. ఈ వస్తువులను తిరిగి పొందడం చారిత్రక అన్యాయాలను సరిదిద్దడానికి, ఎదుర్కొన్న సాంస్కృతిక నష్టాలను గుర్తించడానికి సహాయపడుతుంది.అక్రమ రవాణాను అరికట్టడంపురాతన వస్తువుల అక్రమ వ్యాపారాన్ని కొందరు లాభదాయకంగా మల్చుకున్నారు. దొంగిలించిన కళాఖండాలను తిరిగి పొందడం, చట్టపరమైన చట్రాలను బలోపేతం చేయడం ద్వారా భారత్ ఈ వ్యాపారంపై ఉక్కుపాదం మోపేందుకు చురుకుగా పనిచేస్తోంది.సంరక్షణ–పరిశోధనరికవరీ తరువాత ఈ కళాఖండాలను మ్యూజియాలు, ఇతర సంస్థలలో భద్రపరుస్తున్నారు. అక్కడ వాటిని సంరక్షణ, అధ్యయనంతోపాటు ప్రజల సందర్శన కోసం అందుబాటులో ఉంచుతున్నారు.అంతర్జాతీయ సహకారందొంగతనానికి గురైన కళాఖండాలను దౌత్య మార్గాలు, ఒప్పందాల ద్వారా స్వదేశానికి తిరిగి రప్పించడానికి భారత్ ఇతర దేశాలతో, ముఖ్యంగా అమెరికాతో చురుగ్గా వ్యవహరిస్తోంది. -
TUWJ ఢిల్లీ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమం కోసం దశాబ్ద కాలానికి పైగా పనిచేస్తున్న TUWJ ఢిల్లీ విభాగానికి నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఢిల్లీ TUWJ అధ్యక్షుడిగా నాగిళ్ల వెంకటేష్(సాక్షి టీవీ ),ప్రధాన కార్యదర్శిగా మేకా గోపికృష్ణ (టివి9),ఉపాధ్యక్షులుగా వంగా తిరుపతి(వెలుగు),పబ్బా సురేష్, కోశాధికారిగా రాజు కొన్నోజు(ఎన్టీవీ) కార్యదర్శులుగా రాజ్ కుమార్ గుజరాతి(సాక్షి), కామరాజు,లింగా రెడ్డి (టి న్యూస్), నాగరాజు(వి6) , కార్యవర్గ సభ్యులుగా పిల్లి రాజేందర్ (ఆంధ్ర ప్రభ ) సలహా దారులుగా సతీష్ ముక్కాముల(ఏ బి ఎన్ టీవీ ), డి. విజయ్ కుమార్, రాష్ట్ర కమిటి సభ్యులుగా రాజశేఖర్ రెడ్డి (సాక్షి ),శిరీష్ రెడ్డి(మహా న్యూస్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.TUWJ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ , IJU కార్యవర్గ సభ్యులు అవ్వారి భాస్కర్ ,కోశాధికారి యోగానంద,రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తిరుపతి నాయక్ సమక్షంలో నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది.ఈ సందర్భంగా TUWJ యూనియన్ ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ నూతన కార్యవర్గాన్ని అభినందించారు. ఢిల్లీ TUWJ అమలుచేస్తున్న పది లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకం రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచిందని అన్నారు. రాష్ట్రంలో అర్హతగల జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రకటించిన 10 కోట్లను విడుదల చేస్తామని సీఎంఇచ్చినహామీని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. -
తల్లా? పెళ్లామా?
తల్లా? పెళ్లామా? అనే పరిస్థితిలో.. ఎవరి మాటకు విలువ ఇవ్వాలో తెలియక మదనపడే వాళ్లే మన మధ్యే కనిపిస్తుంటారు. అయితే అలాంటి మానసిక సంఘర్షణలో నలిగిపోతున్న ఓ వ్యక్తికి.. భారత సర్వోన్నత న్యాయస్థానం హితబోధ చేసింది.ఆ భార్యభర్తలిద్దరూ.. మనస్పర్థలతో దూరంగా ఉంటున్నారు. భర్త అమెరికాలో ఉండగా.. పెద్ద కూతురు అతని తల్లి(నాన్నమ్మ) దగ్గర, మైనర్ కొడుకు మాత్రం భార్యతో ఉంటున్నాడు. ఈ తరుణంలో కలిసి ఉండడం కుదరని భావించిన ఆ జంట కోర్టును ఆశ్రయించింది. శుక్రవారం.. జస్టిస్ బీవీ నాగరత్న, కేవీ విశ్వనాథన్ ఈ పిటిషన్ను విచారించారు. ఈ క్రమంలో వర్చువల్ విచారణకు హాజరైన ఆ దంపతులు ధర్మాసనం సమక్షంలోనే వాదులాడుకున్నారు.తనపై తన భార్య తప్పుడు క్రిమినల్ కేసు పెట్టిందని ఆ భర్త, తన భర్త తనను పట్టించుకోవడం మానేశాడని ఆ భార్య పరస్పరం ఆరోపించుకున్నారు. ఈ తరుణంలో బెంచ్ జోక్యం చేసుకుంది.మధ్యవర్తిత్వం ద్వారా మాట్లాడుకుని పిల్లల కోసం కలిసి జీవించాలని ధర్మాసనం ఆ జంటకు సూచించింది. అయితే పదే పదే ఆ వ్యక్తి తన తల్లి ప్రస్తావన తీసుకురావడాన్ని గమనించిన జస్టిస్ నాగరత్న.. కుటుంబాల్లో గొడవలు భార్యల మాటల్ని భర్తలు పెడచెవిన పెట్టినప్పుడే మొదలవుతాయని వ్యాఖ్యానించారు.‘‘తమ మాట కంటే తల్లుల మాటకు భర్తలు ఎక్కువ విలువ ఇచ్చినప్పుడే అసలు సమస్య మొదలవుతుంది. అలాగని తల్లిని పక్కనపెట్టాలని మేం అనడం లేదు. భార్యలు చెప్పేది కూడా వినాలి. భర్తలు భార్యల భావాల్ని గౌరవించాల్సిందే’’ అని జస్టిస్ నాగరత్న అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో భర్త తన కుమారుడిని చూడలేదని చెప్పడంతో, కోర్టు ఆ భార్య తీరును తప్పుబట్టింది. ఒక పిల్లవాడు తన తండ్రి, సోదరిని చూడకుండా ఉండడం సరికాదని అభిప్రాయపడింది. మధ్యవర్తిత్వ సమయంలోనైనా ఆ పిల్లాడి చూపించాలని, పిల్లల శ్రేయస్సు కోసం సమస్యలు పరిష్కరించుకుని కలిసి జీవించాలని మరోసారి ఆ జంటకు సూచిస్తూ కేసు వాయిదా వేసింది.మరో కేసులో.. విభేదాలను పక్కనపెట్టి ముందుకు సాగండని ఓ జంటకు సుప్రీం కోర్టు సూచించింది. భార్య, ఆమె తల్లిదండ్రులు తనను వేధిస్తున్నారని బాలాకోట్ దాడుల్లో పాల్గొన్న యుద్ధ విమాన పైలట్ ఒకరు కోర్టును ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదుతో తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కోరారాయన. అయితే.. జీవితం అంటే ప్రతీకారం తీర్చుకోవడం కాదని, సర్దుకుపోయి ముందుకు సాగాలని ఆ జంటకు ధర్మాసనం సూచించింది. -
మోదీ టూర్ల ఖర్చు రూ. 362 కోట్లు!
న్యూఢిల్లీ: ఐదేళ్లలో రూ.362 కోట్లు ఖర్చు అంటే.. ఇదేదో ప్రాజెక్టుకు అనుకునేరు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల ఖర్చు. 2021 నుంచి 2025 మధ్య ఆయన విదేశీ పర్యటనలకోసం అక్షరాలా రూ.362కోట్లు ఖర్చయ్యాయి. ఒక్క 2025లోనే ఆయన పర్యటనలకోసం రూ.67కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఇందులో.. అమెరికా, ఫ్రాన్స్ ఉన్నతస్థాయి పర్యటనలు సహా ఐదు పర్యటనలు న్నాయి. రాజ్యసభలో తృణమూల్ ఎంపీ డెరెక్ ఓబ్రియన్ అడిగిన ప్రశ్నకు సమా« దానంగా విదేశాంగ శాఖ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఈ వివరాలను రాజ్యసభకు అందించారు. ఈ డేటా ప్రకారం, 2025లో ప్రధాని పర్యటనల్లో అత్యంత ఖరీదైనది ఫ్రాన్స్ పర్యటన. దీనికి రూ. 25 కోట్లకు పైగా.. ఆ తర్వాత అమెరికా పర్యటనకు రూ. 16 కోట్లకు పైగా ఖర్చయింది. మారిషస్, సైప్రస్, కెనడా దేశాల అదనపు సందర్శనల ఖర్చులు ఇంకా వీటికి కలపలేదు. ఇక 2024 లో రష్యా, ఉక్రెయిన్తో సహా 16 దేశాల్లో పర్యటించడానికి రూ.109 కోట్లు ఖర్చు చేశారు. 2023లో దాదాపు రూ.93 కోట్లు, 2022లో రూ.55.82 కోట్లు, 2021లో రూ.36 కోట్లు ఖర్చు చేశారు. 2021లో అమెరికా పర్యటనకే రూ.19 కోట్లకు పైగా ఖర్చయింది. ఇవి కేవలం పర్యటనలకే పరిమితం కాకుండా.. పర్యటనలకు సంబంధించిన ప్రకటనలు, ప్రసార ఖర్చుల వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. -
వీసాల ఆలస్యాన్ని పట్టించుకోండి
న్యూఢిల్లీ: అమెరికా విద్యార్థి వీసాల జారీలో జరుగుతున్న అసాధారణ జాప్యాన్ని ఆ దేశ ఉన్నతాధికార వర్గాల దృష్టికి కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్లింది. కొంతకాలంగా విద్యార్థి వీసా దరఖాస్తుల స్క్రీనింగ్ తదితరాలను అమెరికా కఠినతరం చేయడం తెలిసిందే. దాంతో వీసా అపాయింట్మెంట్లు పొందడమే విద్యార్థులకు చాలా కష్టంగా మారిపోయింది. ఫలితంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖ అమెరికా విదేశాంగ శాఖ వర్గాలతో, ఢిల్లీలోని ఆ దేశ దౌత్య కార్యాలయంతో దీనిపై లోతుగా చర్చించింది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్సింగ్ ఈ మేరకు వెల్లడించారు. భారత విద్యార్థుల ఆందోళనలను ఎప్పటికప్పుడు అమెరికా దృష్టికి తీసుకెళ్తున్నట్టు ఆయన వివరించారు. శుక్రవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఈ మేరకు లిఖిత సమాధానమిచ్చారు. అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించేవారు తదితరులను దేశంలోకి ప్రవేశించకుండా నిరోధించేందుకు అన్నిరకాల చర్యలూ తీకుంటున్నట్టు జూన్ 18న విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసిందని మంత్రి గుర్తు చేశారు. అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అత్యధిక సంఖ్యలో ఉండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికి వీసాల జారీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి 14 మంది భారతీయ అమెరికన్ చట్టసభ సభ్యుల బృందం కూడా కృషి చేస్తోంది. దెబోరా రాస్ వీరికి నేతృత్వం వహిస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థలో భారత విద్యార్థుల వాటా ఏటా 900 కోట్ల డాలర్ల మేరకు ఉంటుందని ఆమె అన్నారు. అంతేగాక పరిశోధనలు, ఇన్నొవేషన్లలో వారిది కీలక పాత్ర గుర్తు చేశారు. కొత్త వీసాల జారీని ఆపేయాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా కాన్సులేట్లన్నింటినీ ట్రంప్ సర్కారు గత మేలో ఆదేశించడం తెలిసిందే. రెండు నెలల విరామం తర్వాత ఎట్టకేలకు విద్యార్థి వీసాల ప్రాసెసింగ్ గత నెల మొదలైంది. కొత్త నిర్దేశకాల ప్రకారం వీసా దరఖాస్తుదారుల ఆన్లైన్ కార్యకలాపాలు, సోషల్ మీడియా ఖాతాల తనిఖీ (వెట్టింగ్)ను అమెరికా పెద్ద ఎత్తున చేపట్టింది. ఇందుకు వీలుగా సోషల్ ఖాతాల వివరాలను పబ్లిగ్గా అందుబాటులో ఉంచాల్సిందిగా ఆశావహులందరికీ సూచించింది.అక్రమ వలసలపై... అమెరికాలోకి అక్రమ వలసలు, మనుషుల అక్రమ రవాణా కట్టడిలో ఆ దేశ ప్రభుత్వంతో నిరంతరం టచ్లో ఉన్నట్టు మరో ప్రశ్నకు సమాధానంగా కీర్తివర్ధన్ సింగ్ రాజ్యసభకు వివరించారు. వాటికి పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ–మైగ్రేట్ పోర్టల్, సోషల్ మీడియా హ్యాండిళ్లు తదితరాల ద్వారా ఈ విషయంలో విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు అడ్వైజరీలు జారీ చేస్తున్నట్టు చెప్పారు. -
జువెనైల్ జస్టిస్ బోర్డుకు వెళ్లండి..!
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తాజాగా ఓ అరుదైన కేసును విచారించింది. ఈ కేసులో నిందితుడు 1988లో ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష సైతం అనుభవించాడు. 2024లో ఇందుకు సంబంధించి దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు నిలిపివేసింది. నిందితుడు సుప్రీంకోర్టుకు వెళ్లాడు. నేరానికి పాల్పడినట్లు చెబుతున్న సమయంలో తన వయస్సు 16 ఏళ్లేనంటూ రుజువులు చూపాడు. దీంతో, అతడిని తిరిగి జువెనైల్ జస్టిస్ బోర్డుకు వెళ్లాలని సుప్రీంకోర్టు ఆదేశించడం గమనార్హం. రాజస్తాన్కు చెందిన ఓ వ్యక్తి 1988లో ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విచారించిన కోర్టు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అతడు రాజస్తాన్ హైకోర్టులో సవాల్ చేయగా శిక్షను నిలుపుదల చేస్తూ 2024లో ఆదేశాలిచ్చింది. అనంతరం నిందితుడు సుప్రీంకోర్టుకు వెళ్లాడు. ఘటన జరిగిన సమయంలో తన వయస్సు 16 ఏళ్లు మాత్రమేనంటూ అతడు స్కూలు రికార్డులను రుజువులుగా చూపాడు. 1972 జూలై ఒకటో తేదీ పుట్టిన తేదీ అయినందున నేరానికి పాల్పడినప్పటికి తనింకా మైనర్నే అంటూ వాదించాడు. ఈ నెల 23న కేసు విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ మసీహ్ల ధర్మాసనం..వైద్య పరీక్షలు, బాధితురాలు, సాకు‡్ష్యల వాంగ్మూలాలు సరిగ్గానే ఉన్నాయని పేర్కొంది. అయితే, నిందితుడు అందజేసిన ధ్రువీకరణ పత్రాల ఆధారంగా అతడు మైనరేనని నిర్థారణయిందని పేర్కొంది. ఇన్నేళ్ల తర్వాత అతడిని మైనర్గా పేర్కొనడం సరికాంటూ రాజస్తాన్ ప్రభుత్వ న్యాయవాది వాదించగా చట్ట ప్రకారం సరైందేనని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో తగు ఆదేశాల కోసం అజ్మీర్లోని జువెనైల్ జస్టిస్ బోర్డును ఆశ్రయించాలని పిటిషనర్కు సూచించింది. నిబంధనల ప్రకారం జువెనైల్ జస్టిస్ బోర్డు దోషిని గరిష్టంగా మూడేళ్లపాటు ప్రత్యేక షెల్టర్కు పంపించే అవకాశముంది.జువెనైల్ జస్టిస్ చట్టం ఏం చెబుతోంది? జువెనైల్ జస్టిస్(కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్)చట్టం–2015 ప్రకారం నేరం జరిగినప్పటికి ఆ వ్యక్తి వయస్సు 18 ఏళ్లు లోపు ఉండాలి. ఈ కేసుల్లో నిందితులను జువెనైల్ జస్టిస్ బోర్డులే విచారించాలి. సాధారణ కోర్టులు కాదు. వీరికి జీవిత కారాగారం, మరణ శిక్ష వంటివి విధించరాదు. ఈ చట్టంలోని సెక్షన్ 18ని అనుసరించి దోషులుగా తేలిన వారిని కౌన్సెలింగ్ చేయడం లేదా గరిష్టంగా మూడేళ్లపాటు జువెనైల్ హోంలో ఉంచడం వంటి చర్యలు చేపట్టవచ్చు. అయితే, నేరం జరిగిన సమయంలో అమల్లో ఉన్న జువెనైల్ జస్టిస్ చట్టం–1986ను అనుసరించి 16 ఏళ్లలోపు వారిని బాలురనీ, బాలికలైతే 18 ఏళ్లుగా నిర్వచించారు. 2015 చట్టం ప్రకారం సుప్రీంకోర్టు బాలబాలికల వయస్సును సమానంగా 18 ఏళ్లుగా నిర్ణయించింది. నిందితుడి ప్రస్తుత వయస్సు, గడిచిన సమయంతో సంబంధం లేకుండా బాల నేరస్థుల వాదనలు చెల్లుబాటు అవుతాయని తాజా కేసు తెలియజేస్తోంది. తీవ్రమైన నేరాల కేసుల్లో సైతం బాల నేరస్తులను భిన్నంగా చూడాలనే సూత్రానికి ఇది బలం చేకూరుస్తోంది. -
లోక్సభలోనే అభిశంసన చర్యలు
న్యూఢిల్లీ: అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే తీర్మానాన్ని మాత్రమే లోక్సభలో చర్చకు స్వీకరించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఆ తర్వాత ఆయనపై విచారణ కోసం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తారని తెలిపాయి. జస్టిస్ వర్మ అవినీతికి పాల్పడినట్లు కమిటీ విచారణలో తేలితే అభిశంసన ప్రక్రియ ప్రారంభిస్తారని పేర్కొన్నాయి. జస్టిస్ వర్మ అభిశంసన కోసం రాజ్యసభలో ఇప్పటికే విపక్ష ‘ఇండియా’ కూటమి ఒక తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ తీర్మానాన్ని అప్పటి ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ స్వీకరించడం వివాదాస్పదంగా మారింది. చివరకు అదే ఆయన పదవికి ఎసరుపెట్టింది. రాజ్యసభలో ప్రతిపక్షాల తీర్మానాన్ని ప్రభుత్వం పూర్తిగా పక్కనపెట్టబోతున్నట్లు తెలిసింది. జస్టిస్ వర్మ విషయంలో తామే పైచేయి సాధించాలని అధికార బీజేపీ నిర్ణయించుకుంది. ఆయనను పార్లమెంట్లో అభిశంసించడం ద్వారా న్యాయ వ్యవస్థలో అవినీతిని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమన్న సంకేతాలను ఇవ్వదలిచింది. అంతేకాకుండా న్యాయ వ్యవస్థ కంటే పార్లమెంటే అత్యున్నతం అని తేల్చిచెప్పాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. -
డీలిమిటేషన్ పిటిషన్ కొట్టివేత
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచేలా నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్)కు కేంద్రాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. శుక్రవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ‘ఈ పిటిషన్లో చట్టబద్ధత ఏదీ కనబడలేదు. అందుకే దీన్ని డిస్మిస్ చేస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. 2014 నాటి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26ను అమలు చేయాలని... దాని ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచేందుకు డీలిమిటేషన్ ప్రక్రియను కేంద్రం ప్రారంభించేలా ఆదేశించాలని ప్రొఫెసర్ కె. పురుషోత్తంరెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు.కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన జమ్మూ–కశ్మీర్లో నియోజకవర్గాల పునర్వీభజన కోసం నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం.. ఇదే విషయంలో ఏపీ, తెలంగాణను మినహాయించడం వివక్షేనని.. ఇది రాజ్యాంగ విరుద్ధమని పురుషోత్తంరెడ్డి పేర్కొన్నారు. అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం మాత్రం జమ్మూ–కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం కోసం జారీ చేసిన నియోజకవర్గాల పునర్వీభజన నోటిఫికేషన్ నుంచి ఏపీ, తెలంగాణను మినహాయించడం రాజ్యాంగబద్ధమేనని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 (3)కి లోబడే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ఉందని, దాని ప్రకారం 2026 తర్వాత నిర్వహించే తొలి జనాభా లెక్కల అనంతరమే నియోజకవర్గాల పునర్వీభజన ప్రక్రియను చేపట్టడం సాధ్యమవుతుందని తేల్చిచెప్పింది. అనుమతిస్తే ఇక పిటిషన్ల వరద: సుప్రీం ధర్మాసనం జమ్మూ–కశ్మీర్లో ఇప్పటికే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడంపై పిటిషనర్ చేసిన వివక్ష వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు మధ్య నియోజకవర్గాల పునర్విభజనలో వర్తించే నిబంధనలు వేర్వేరుగా ఉన్నాయని, అందుకే జమ్మూకశ్మీర్కు జారీ చేసిన నోటిఫికేషన్ను రాష్ట్రాల పరిస్థితులతో సరిపోల్చడం తగదని వ్యాఖ్యానించింది. ఇలాంటి విజ్ఞప్తులను స్వీకరిస్తే దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇలాంటి పిటిషన్లు వరదలా కోర్టులను ముంచెత్తే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. అలాంటి పరిణామాలకు తాము తలవంచలేమని జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం స్పష్టం చేసింది. -
ఐదోరోజూ అదే తీరు
న్యూఢిల్లీ: పార్లమెంట్లో వర్షాకాల సమావేశాల్లో గందరగోళానికి ఇంకా తెరపడలేదు. విపక్ష సభ్యు లు ఆందోళనలు, నిరసనలు, నినాదాల కారణంగా వరుసగా ఐదో రోజు శుక్రవారం సైతం ఉభయ సభలు స్తంభించాయి. పలుమార్లు వాయిదా పడ్డాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల సంఘం ప్రారంభించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై విపక్షాలు మండిపడ్డాయి. దీనిపై పార్లమెంట్లో వెంటనే చర్చించాలని, కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశాయి. నినాదాలతో హోరెత్తించాయి. ప్రతిపక్షాల ఆగ్రహావేశాల వల్ల పరిస్థితి చెయ్యి దాటిపోతుండడంతో లోక్సభ, రాజ్యసభను సోమవారానికి వాయిదా వేస్తుతన్నట్లు సభాపతులు ప్రకటించారు. చెప్పుకోదగ్గ కార్యకలాపాలేవీ జరగకుండానే వర్షాకాల సమావేశాల్లో తొలివారం ముగిసిపోవడం గమనార్హం. లోక్సభలో నినాదాల హోరు లోక్సభ శుక్రవారం ఉదయం ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు ప్రారంభించారు. స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. దీనిపై చర్చకు విపక్ష సభ్యులు అడ్డుతగిలారు. చేసేది లేక స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. విపక్ష ఎంపీలు వెల్లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. ఓటర్ల జాబితా సవరణపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, విపక్షాలు సహకరించాలని స్పీకర్ స్థానంలో ఉన్న జగదాంబికా పాల్ కోరారు. అయినా విపక్ష సభ్యులు వినిపించుకోలేదు. ఇప్పడే చర్చ ప్రారంభించాలని తేల్చిచెప్పారు. వారిపై జగదాంబికా పాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల సమస్యలపై చర్చించాల్సి సభలో ఈ అలజడి ఏమిటని ప్రశ్నించారు. దీనివల్ల ఎవరికీ ఉపయోగం ఉండదని అన్నారు. సభ వాయిదా పడేలా చేయడం గొప్ప విషయం కాదని హితవు పలికారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగకపోతే దేశమే నష్టపోతుందని చెప్పారు. చర్చించాల్సిన బిల్లులు చాలా ఉన్నాయని, సహకరించాలని ప్రతిపక్షాలను కోరారు. గోవాలో ఎస్టీలకు అసెంబ్లీ స్థానాలు కేటాయించేందుకు ఉద్దేశించిన కీలకమైన బిల్లుపై చర్చిద్దామని న్యాయశాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ చెప్పారు. అయినా విపక్షాల తీరులో మార్పు రాలేదు. దీంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు జగదాంబికా పాల్ ప్రకటించారు. ‘కార్గిల్ విజయ్ దివస్’ నేపథ్యంలో కార్గిల్ అమర వీరులకు లోక్సభలో నివాళులర్పించారు. ఎంపీలంతా కొంతసేపు మౌనం పాటించారు. ‘ఓటు చోరీ బంద్ కరో’ పార్లమెంట్ ఎగువ సభలోనూ విపక్షాల ఆందోళన యథాతథంగా కొనసాగింది. వివిధ అంశాలపై రూల్ 267 కింద చర్చను కోరుతూ విపక్షాలు ఇచ్చిన 28 నోటీసులను తిరస్కరిస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ చెప్పారు. బిహార్లో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ అంశాన్ని ప్రతిపక్ష ఎంపీలు లేవనెత్తారు. దీనిపై సభలో తక్షణమే చర్చించాలని పట్టుబట్టారు. ఉదయం రాజ్యసభ మొదలైన వెంటనే నినాదాలు మిన్నంటడడంతో రఘువంశ్ సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్పై బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ సమాధానం ఇస్తుండగా ప్రతిపక్ష ఎంపీలు బిగ్గరగా కేకలు వేశారు. బిహార్లో ఓటర్ల జాబితా సవరణను ఆపాలని డిమాండ్ చేశారు. ‘ఓటు చోరీ బంద్ కరో’ అంటూ నినదించారు. కొందరు ఎంపీలు వెల్లోకి ప్రవేశించారు. వెనక్కి వెళ్లిపోవాలని, సభకు సహకరించాలని సభాపతి స్థానంలో ఉన్న బీజేపీ ఎంపీ ఘన్శ్యామ్ తివారీ పదేపదే విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోలేదు. దాంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ఘన్శ్యామ్ తివారీ ప్రకటించారు. కమల్ హాసన్ ప్రమాణం ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం(ఎంఎన్పీ) పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ శుక్రవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు డీఎంకే నాయకులు రాజాత్తి, ఎస్.ఆర్.శివలింగం, పి.విల్సన్ సైతం ఎగువ సభ సభ్యులుగా ప్రమాణం చేశారు. విపక్షాల నిరసన బిహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్)ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ విపక్ష ‘ఇండియా’ కూటమి ఎంపీలు పా ర్లమెంట్ ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించారు. మకరద్వారం మెట్లపై వినూ త్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ అని రాసి ఉ న్న పత్రాలను చించివేసి, చెత్తకుండీలో విసి రేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నా రు. ఎస్ఐఆర్పై పార్లమెంట్లో చర్చించాలని తేల్చిచెప్పారు. సభకు సహకరించడానికి విపక్షాల అంగీకారం నిరసనలు, నినాదాలు పక్కనపెట్టి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇకపై సజావుగా సాగేందుకు సహకరిస్తామని ప్రతిపక్ష నేతలు చెప్పారు. వర్షాకాల సమావేశాల్లో నిత్యం గందరగోళ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం అన్ని పార్టీల సీనియర్ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సభా కార్యకలాపాలకు సహకరించాలని కోరగా, ప్రతిపక్ష నాయకులు అందుకు అంగీకరించినట్లు పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. సోమవారం నుంచి నిర్మాణాత్మక చర్చలు సాగిద్దామని స్పీకర్ సూచించారు. ప్రజలకు మేలు కలిగేలా సభలో అర్థవంతమైన చర్చలు జరగాలన్నదే తన ఉద్దేశమని ఆయన వివరించారు. ఆపరేషన్ సిందూర్పై సోమవారం పార్లమెంట్లో చర్చ ప్రారంభం కానుంది. -
ఓబీసీల కోసం ప్రత్యేక ప్రణాళిక
సాక్షి, న్యూఢిల్లీ: ఓబీసీల అభ్యున్నతి, సంక్షేమం కోసం కొత్త పథకాలు తీసుకురావాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరినట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. వెనుకబడిన వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందజేయడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమన్నారు. ఓబీసీలను అభ్యున్నతి వైపు ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై పార్టీ ఆధ్వర్యంలో ఒక నక్షా (ప్రణాళిక) సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. విభజించి పాలించడమే మోదీ ప్రభుత్వ విధానమని దుయ్యబట్టారు. తాను బీసీనని చెప్పుకుంటున్న ప్రధాని మోదీ గడచిన 11 ఏళ్లలో ఓబీసీల కోసం చేసిందేమీ లేదని విమర్శించారు. శుక్రవారం ఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో ఏఐసీసీ ఓబీసీ విభాగం నిర్వహించిన ‘భాగీదారీ న్యాయ సమ్మేళనం’లో ఆయన మాట్లాడారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ విషం లాంటివి.. ‘తెలంగాణలో ప్రతి సామాజిక వర్గానికి సంబంధించి ఒక నివేదిక తయారు చేశారు. కర్ణాటకలో కూడా చేస్తున్నారు. దాని ఆధారంగా వారికి పథకాలు రూపొందిచాలని ముఖ్యమంత్రులకు సూచించాం. సంక్షేమ ఫలాలు అందేలా చూడాలని కోరాం. తెలంగాణ, కర్ణాటక సర్వేల్లో అగ్రకులాలకు చెందినవారు 5, 10 శాతం ఉన్నారని తెలుస్తోంది. వీళ్లే ప్రభుత్వాల ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎందుకంటే వీళ్ల దగ్గర విద్య, మానసిక బలం ఉంది. ఆర్ఎస్ఎస్, బీజేపీ విషం లాంటివి. ఆ విషాన్ని ఒక్కసారి రుచి చూద్దామనుకుంటే చనిపోతారు. ఓబీసీ కులగణన చేయాలని మొట్ట మొదటిసారిగా రాహుల్గాంధీ చెప్పారు. గతంలో ఎవరూ చెప్పలేదు. అలాంటి రాహుల్గాం«దీకి మద్దతిస్తారా? లేక దేశాన్ని ముక్కలు చేసేవారికా? ఆలోచించుకోవాలి..’అని ఖర్గే అన్నారు. మోదీ అబద్ధాలకు సర్దార్ ‘బీసీ అయిన నన్ను కాంగ్రెస్ వాళ్లు వేధిస్తున్నారని ప్రధాని మోదీ పదే పదే అంటున్నారు. మేము కాదు.. మోదీయే అందరినీ వేధిస్తున్నారు. అందరినీ మట్టిలో కలిపేసి ఆయన ఒక్కడే సజీవంగా ఉండాలనుకుంటున్నారు. మోదీజీ ఎప్పడూ అబద్ధాలే చెబుతారు. ఆయన అబద్ధాలకు సర్దార్. పార్లమెంటులో కూడా అసత్యాలు చెబుతారు. అబద్ధాలు చెప్పే ప్రధాని దేశం, సమాజానికి మంచి చేయలేరు..’అని ఖర్గే ధ్వజమెత్తారు. ఓబీసీ వర్గాలను రక్షించుకోవడంలో వెనుకబడ్డా: రాహుల్గాంధీ ఓబీసీ వర్గాన్ని రక్షించే విషయంలో నేను వెనుకబడ్డా. మీ సమస్యలను ఆ సమయంలో నేను లోతుగా అవగాహన చేసుకోలేదు. 10, 15 ఏళ్ల ముందు దళితులు, ఆదివాసీల సమస్యలను అర్థం చేసుకోగలిగా. కానీ ఓబీసీల సమస్యలను లోతుగా అర్థం చేసుకోలేకపోయా. ఇది కాంగ్రెస్ పార్టీ తప్పు కాదు.. కచి్చతంగా నా తప్పే. ఆ సమయంలోనే కులగణన చేయించి ఉంటే..ఇప్పడు నేను చేయించాలనుకున్నట్లుగా ఉండేది కాదు. ఓబీసీల కోసం ముందుగా నేను చేయలేకపోయిన పనిని ఇప్పుడు రెట్టింపు వేగంతో చేయబోతున్నా..’అని లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ తెలిపారు. తెలంగాణ సర్కారు వద్ద ఉన్న డేటాకు తిరుగులేదు.. ‘తెలంగాణలో చేసిన కులగణన ఒక రాజకీయ భూకంపం. అది దేశ రాజకీయాలను కుదిపేసింది. దాని తర్వాత పరిణామాలు ఇంకా మీరు చూడలేదు. గతంలో ఒకసారి సునామీ వచ్చింది. రెండు మూడు గంటల తర్వాత దాని ప్రభావం కనిపించింది. అదే తెలంగాణలోనూ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం చేతుల్లో ఉన్న డేటాకు దేశంలో ఎక్కడా ఎదురులేదు. ఆ డేటా ఆధారంగా తెలంగాణలోని మొత్తం కార్పొరేట్ సంస్థల్లో ఎంతమంది ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు ఉన్నారనేది ఒక్క నిమిషంలోనే చెప్పవచ్చు.అయితే తెలంగాణలో కార్పొరేట్లలో ఎంతమంది ఓబీసీ యజమానులు, దళిత యజమానులు ఉన్నారు? అక్కడ లక్షలు, కోట్ల రూపాయల ప్యాకేజీలు లభిస్తాయి. కానీ ఓబీసీలకు ఎంత ప్యాకేజీ లభిస్తోందని అడిగితే..నేను జీరో అంటాను. అక్కడ దళితులు, ఓబీసీలు, ఆదివాసీల్లో ఎవ్వరికీ ఇలాంటి ప్యాకేజీలు దక్కడం లేదు. దేశంలో దళితులు, ఆదివాసీలు, ఓబీసీలే కూలీ పనిచేస్తారు..’అని రాహుల్ పేర్కొన్నారు. ఉత్పాదక శక్తికి గౌరవం దక్కాలి ‘ఏ దేశాన్ని అయినా నడిపించేది ఉత్పదక శక్తే. అలాంటి శక్తికి దేశం ఏం ఇస్తోంది? రోడ్లు, భవనాలు, కాలేజీలు, ఆసుపత్రులు, ఆలయాలు నిర్మించేది మీరే. ఈ పని కోసం దేశం మీకు ఏం ఇస్తోంది? నేను ఏదైనా అనుకుంటే అది సాధించే వరకు ఊరుకోను. కులగణన ఒక్కటే కాదు.. ఉత్పాదక శక్తికి దేశంలో గౌరవం దక్కాలన్నదే నా లక్ష్యం. దేశ ఉత్పాదక శక్తి చరిత్రను ఆర్ఎస్ఎస్, బీజేపీలు కలిసి చెరిపేసే ప్రయత్నం చేశాయి. పాఠ్య పుస్తకాల్లో ఓబీసీల చరిత్ర ఎక్కడుంది? దేశంలో 55, 60 శాతం ఉన్న ఓబీసీల చరిత్రను కావాలనే చెరిపేశారు.ఎప్పుడైతే మీరు మీ చరిత్ర తెలుసుకుంటారో ఆ రోజు ఆర్ఎస్ఎస్ మీ శత్రువు అని తెలుసుకుంటారు. మా ప్రభుత్వాలు ఉన్నచోట ముందుగా కులగణన ఎక్స్రే, ఎంఆర్ఐ చేస్తాం. ఓబీసీలు ఎంతమంది ఉన్నారు? ఎక్కడున్నారు? భాగస్వామ్యం ఎంత? అనేది తేలుతుంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే కాదు.. జాతీయ స్థాయిలో కుల గణన, 50 శాతం అడ్డుగోడలు పడగొతాం..’అని కాంగ్రెస్ అగ్రనేత చెప్పారు. ఇంగ్లిష్తో డబుల్ బ్యారెల్ ప్రోగ్రెస్ ‘చదువు ఉన్నవారు వేగంగా అభివృద్ధి చెందుతారని తెలంగాణ సర్వేలో తెలిసింది. విద్యతో పాటు మీ దగ్గర ఇంగ్లిష్ ఉంటే డబుల్ బ్యారెల్ ప్రోగ్రెస్ ఉంటుందని తేలింది. ఇంగ్లిష్ను దేశం నుంచి తొలగించేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. ప్రాంతీయ భాషలు ఎంతో అవసరం. కానీ దాంతో పాటు ఇంగ్లిష్ కూడా అవసరం. అందుకే మా మూడో నినాదం ప్రైవేట్ విద్యా విధానంలో దళితులకు, ఆదివాసీ, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించడమే..’అని రాహుల్ చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, ఎంపీలు అనిల్కుమార్ యాదవ్, సురేష్ షెట్కార్, బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య, రాజస్తాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లోట్, ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ భగేల్ తదితరులు పాల్గొన్నారు. -
చివరి మజిలీ వీలునామా!
ముందుచూపునకు నిదర్శనం వీలునామా. కుటుంబ ఆస్తులు, అప్పుల పంపకాలు.. నేత్రదానం.. ఇంకా చెప్పాలంటే ‘దేహదానం’పై అంతా బాగున్నప్పుడే వీలునామా రాసిపెట్టుకునే ఆనవాయితీ తెలిసిందే. ఈ కోవలోకి ఒక సరికొత్త వీలునామా వచ్చి చేరింది. అదే తన ‘ఆఖరి చికిత్స’ ఎలా ఉండాలనుకుంటున్నారో స్పష్టంగా ముందే రాసుకునే వీలునామా! కోర్టు మార్గదర్శకాల వెలుగులో మొగ్గ తొడిగిన ఆధునిక వ్యవస్థ. దీన్ని చట్టబద్ధంగా నమోదు చెయ్యటంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ముంబైలో ఓ ప్రైవేటు క్లినిక్ ప్రతి శనివారం ప్రత్యేక ఓపీ సేవలందించటం కూడా ప్రారంభించింది. దేశంలోనే తొలి ‘లివింగ్ విల్’ పుట్టు పూర్వోత్తరాలు చదవండి!ఆధునిక వైద్య సదుపాయాలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. మంచాన పడిన దాదాపు ప్రతి మనిషీ పెద్దాసుపత్రి ఐసీయూలోనే అంతిమ శ్వాస విడుస్తున్న పరిస్థితి నెలకొంది. కురువృద్ధులకైనా ఐసీయూ చికిత్సల అనివార్యత ఓ ఆనవాయితీగా స్థిరపడుతున్న సంధి కాలం ఇది. ఈ స్థితిలో ‘ఆఖరు మజిలీలో అనవసర ఆర్భాటపు చికిత్సలు, ఆస్తుల్ని కరిగించే కొండంత అప్పుల వేదన మన కుటుంబాలకు అవసరమా?’ అని కొందరు ఆలోచనాపరులు ప్రశ్నిస్తున్నారు.తమకు మటుకు అటువంటి చివరి మజిలీ వీడుకోలు వద్దని, భీష్ముడిలా గౌరవంగా సహజ మరణం పొందే అవకాశాన్ని ఇవ్వాలని వీలునామాలు రాస్తున్నారు. ముంబై వాసులు కొందరు ఇలా వినూత్న వీలునామాలు రాయటమే కాదు, కోర్టు్ట సాయంతో ఈ సజీవమైన వీలునామా (లివింగ్ విల్)కు చట్టబద్ధతను సంతరింపజేశారు. ఈ కోవలో ముందు నడిచిన వ్యక్తి 55 ఏళ్ల సీనియర్ గైనకాలజిస్టు డాక్టర్ నిఖిల్ దాతర్.లివింగ్ విల్ అంటే?మనిషి ఎంత కూడబెట్టాడన్నది కాదు.. ఎంత సుఖంగా కన్నుమూశాడన్నది ముఖ్యం అంటారు పెద్దలు. ఈ ఆలోచన నుంచి పుట్టిందే లివింగ్ విల్ భావన. నయంకాని రోగాలతో మంచాన పడి, నిర్ణయం తీసుకోలేని స్థితిలో కటుంబ సభ్యులు మరణం ముంగిట ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు ఏ నిర్ణయం తీసుకోవాలనే సంకట స్థితిని ఎదుర్కోకుండా ‘లివింగ్ విల్’ స్పష్టత ఇస్తుంది.సహజంగా మరణించాల్సిన చివరి క్షణాల్లో ఐసీయూ, వెంటిలేటర్ వంటి చికిత్సలు చేయించాలా వద్దా అనేది ముందే రాసి పెట్టుకోవటానికి వ్యక్తులకు ఈ వీలునామా దోహదపడుతుంది. అందువల్ల ఈ వీలునామాకు ‘అడ్వాన్స్ మెడికల్ డైరెక్టివ్స్’ అనే పేరొచ్చింది. ప్రాణ రక్షణకు ఇక చేయగలిగిందేమీ లేని విషమ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఐసీయూలో వెంటిలేటర్ పెట్టడం వంటి పనులు చెయ్యనక్కరలేదని ముందే రాసుకోవటమే ఈ వీలునామా పరమార్థం.ఇందులో ఏముంటుంది?ఆఖరి మజిలీ చికిత్సలు ఏవిధంగా ఉండాలన్న అంశంపై రాసుకునే వీలునామా గురించి సుప్రీంకోర్టు 2018లో ఒక తీర్పులో పేర్కొంది. దాని ప్రకారం.. 18 ఏళ్లు నిండిన ఇద్దర్ని (ఒకరు కుటుంబ సభ్యులు, మరొకరు స్నేహితులు లేదా సహోద్యోగి) లివింగ్ విల్లో నామినీలుగా పేర్కొనాలి. ఆ వ్యక్తికి అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఆయన కోరిన విధంగా వీరు అమలు చేయించాలి.మెకానికల్ వెంటిలేషన్, ఫీడింగ్ ట్యూబులు, సీపీఆర్, డయాలసిస్ చెయ్యాలా? పాలియేటివ్ కేర్ లేదా పెయిన్ రిలీఫ్ కేర్ మాత్రమే చెయ్యాలా? అనేది స్పష్టంగా విల్లో రాయాలని నిర్దేశించింది. ఈ నేపథ్యంలో లివింగ్ విల్ నిబంధనల విషయంలో 2023లో సర్వోన్నత న్యాయస్థానం కొన్ని సడలింపులు ఇచ్చింది. ఆ తర్వాత, డాక్టర్ నిఖిల్ ముసాయిదా లివింగ్ విల్ను రూపొందించారు.మున్సిపల్ అధికారులే...వీలునామాలు రాస్తారు సరే.. వీటిని ఏ అధికారి ఎక్కడ నమోదు చేస్తారు? అవసరం వచ్చినప్పుడు ఎలా వెలికితీస్తారు? అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఈ అంశాలపై స్పష్టత కోసం డా. నిఖిల్.. బాంబే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దాంతో, లివింగ్ విల్లను మున్సిపల్ అధికారులు ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత తొలి లివింగ్ విల్ను డాక్టర్ నిఖిల్ నమోదు చేసుకున్నారు. బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)లోని వార్డుల్లో మెడికల్ ఆఫీసర్లు, అసిస్టెంట్ హెల్త్ ఆఫీసర్ల వద్ద ఇప్పటికి 40 మంది తమ లివింగ్ విల్లను రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 50 నుంచి 80 ఏళ్ల వయస్కులు ఉన్నారు. వీటిని బీఎంసీ వెబ్సైట్లో భద్రపరుస్తున్నారు. త్వరలో ఆన్లైన్లో కూడా వీటిని నమోదు చేసుకునే ఏర్పాట్లు చేస్తున్నట్లు బీఎంసీ అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ డా. భూపేంద్ర పాటిల్ తెలిపారు.అనవసరమైన హింస ఎందుకు?‘నా స్నేహితుడు జబ్బుపడి సొంత వారిని కూడా గుర్తుపట్టలేని స్థితికి చేరుకున్నారు. అతన్ని ఐసీయూలో చేర్చిన కుటుంబ సభ్యులు సుమారు రూ.50 లక్షలు ఖర్చు పెట్టారు. చివరికి మనిషి దక్క లేదు. పైగా, బతికినా అతను సొంత మనుషులను కూడా గుర్తుపట్టలేని స్థితి. అలాంటప్పుడు ఐసీయూలో వైద్యం చేయించటం ఎందుకు? ఆర్థికంగా, మానసికంగా అనవసరమైన హింస పడటం ఎందుకు?’ అని ముంబైకి చెందిన 60 ఏళ్ల చార్టర్డ్ అకౌంటెంట్ ప్రఫుల్ పురానిక్ అంటున్నారు. అందుకే తనకైతే ట్యూబులు వేయటం, ఐసీయూలో చికిత్స వద్దే వద్దు.. గౌరవంగా వెళ్లిపోనిస్తే చాలు అంటూ లివింగ్ విల్లో ఆయన పేర్కొన్నారు.తొలి లివింగ్ విల్ క్లినిక్ముంబైలోని పి.డి. హిందూజ ఆసుపత్రి దేశంలోనే తొలి లివింగ్ విల్ క్లినిక్ను ప్రారంభించింది. ఆసక్తి కల వారికి అవగాహన కల్పించేందుకు వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి శనివారం రెండు గంటల పాటు ఈ క్లినిక్లో అవుట్ పేషంట్ సేవలు అందిస్తున్నారు. లివింగ్ విల్ రాసే వ్యక్తికి లేదా కుటుంబ సభ్యులకు నియమ నిబంధనలు ఏమిటి, ఏయే డాక్యుమెంట్లు అవసరమవుతాయి, అమలు తీరు తెన్నులను వివరించటం వంటి సేవలు అందిస్తున్నారు.అనేక దేశాల్లో ఉన్నదే..చట్టబద్ధమైన రీతిలో లివింగ్ విల్ రాయటం అనే ప్రక్రియ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, కొలంబియా, డెన్మార్క్, ఐర్లాండ్, లక్సెంబర్గ్, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో అమల్లో ఉంది. చాలా దేశాల్లో దీనికి చట్టబద్ధత ఉంది. -
అదో పనికిరాని సర్వే
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే పనికి రానిదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. ప్రభుత్వం చెబుతున్న 42 శాతం రిజర్వేషన్లతో నిజమైన బీసీలు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల విషయంలో డొంకతిరుగుడు ప్రచారంతో సీఎం రేవంత్రెడ్డి, ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీలు బీసీలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీలో కిషన్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. తాము రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రాజ్యాంగబద్ధమైనవి కాకుండా ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేస్తామని స్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీ తూతూమంత్రంగా చేసినట్టు తాము దేశవ్యాప్తంగా చేపట్టబోయే కులగణన ఉండదన్నారు. రాజ్యాంగబద్ధమైన కులగణన చేసి, భవిష్యత్లో బీసీలకు న్యాయం చేస్తామని చెప్పారు. 42 శాతం రిజర్వేషన్ల పేరుతో ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన షబ్బీర్ అలీ, అజారుద్దీన్ వంటి వారికోసమే రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటున్నారని ఆరోపించారు. కన్వర్టెడ్ బీసీ అంటూ ప్రధాని మోదీని సీఎం రేవంత్ హేళన చేయడాన్ని ఆక్షేపించారు. మిడిమిడి జ్ఞానంతో సీఎం స్థానంలో ఉండి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.1972లో లంబాడీలను ఎస్టీల్లో చేర్చారు అంటే వారు కూడా కన్వర్టెడ్ ఎస్టీలా అంటూ ప్రశ్నించారు. 1994లో కాంగ్రెస్ పార్టీ గుజరాత్లో అధికారంలో ఉన్నప్పుడు మండల్ కమిషన్ నివేదిక ప్రకారమే మోదీ కులాన్ని బీసీల్లో చేర్చారని గుర్తు చేశారు. రాజీవ్గాంధీ ఏ సామాజికవర్గానికి చెందిన వారో సీఎం రేవంత్ చెప్పాలన్నారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల ప్రకారం పెంచిన రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కిషన్రెడ్డి డిమాండ్ చేశారు.వేరేవారికి నీతులు చెప్పే రేవంత్రెడ్డి ముందు సీఎం పదవికి రాజీనామా చేసి బీసీని ముఖ్యమంత్రిని చేయాలని సవాల్ విసిరారు. మెట్రో విషయంలో రేవంత్రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ట్రైపార్టీ అగ్రిమెంట్ జరగాలన్న అవగాహన కూడా లేకుండా మాట్లాడుతున్నారని, మెట్రోకు వందశాతం కేంద్రం సహకరిస్తుందని స్పష్టం చేశారు. ఉపరాష్ట్రపతి పదవి దత్తాత్రేయకు ఇవ్వాలన్న డిమాండ్ను స్వాగతిస్తున్నామన్నారు. -
భారత్లో తొలి హైడ్రోజన్ కోచ్ పరీక్ష విజయవంతం
దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ కోచ్ను విజయవంతంగా పరీక్షించి.. భారతీయ రైల్వే చరిత్ర సృష్టించింది. ఈ వీడియోను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే ఈ రైళ్లు.. కాలుష్యాన్ని తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. పర్యావరణానికి హానికరం కాని, స్వచ్ఛమైన ఇంధన వనరుల వైపు భారత్ అడుగులు వేస్తోంది. ఇది భారతీయ రైల్వేను మరింత టెక్నాలజీ పరంగా అభివృద్ధి చేయడంతో ముందడుగు పడింది.ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావడం.. భారత్ని హైడ్రోజన్ ఆధారిత రైల్వే సాంకేతికతలో ప్రపంచదేశాల సరసన అగ్రగామిగా నిలబెడుతుందని అశ్విని వైష్ణవ్ ట్వీట్ చేశారు. భారత్ 1,200 HP హైడ్రోజన్ రైలును అభివృద్ధి చేసింది. ఇది దేశీయ రవాణా రంగానికి ఒక కీలక మైలురాయి’’అని ఆయన పేర్కొన్నారు. మొత్తం హైడ్రోజన్-పవర్డ్ కోచ్ (డ్రైవింగ్ పవర్ కార్) చెన్నైలోని ఐసీఎఫ్ వద్ద విజయవంతంగా పరీక్షించబడిందన్నారు.First Hydrogen powered coach (Driving Power Car) successfully tested at ICF, Chennai.India is developing 1,200 HP Hydrogen train. This will place India among the leaders in Hydrogen powered train technology. pic.twitter.com/2tDClkGBx0— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) July 25, 2025 హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ పథకంలో భాగంగా 35 హైడ్రోజన్ రైళ్లను తయారు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ రైళ్లను దేశ వ్యాప్తంగా హెరిటేజ్, హిల్ స్టేషన్లలో నడపాలని భావిస్తోంది. భారతీయ రైల్వే ఇప్పటికే ఉన్న డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (DEMU)ను హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్తో నడిచే విధంగా చేసే పైలట్ ప్రాజెక్ట్ను కూడా రైల్వేశాఖ చేపట్టింది. -
ఆపరేషన్ సిందూర్ ఆన్లోనే ఉంది: సీడీఎస్
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడిలో తర్వాత పాకిస్తాన్లో ఉగ్రస్ధావరాలే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అనేది ఇంకా ఆన్లోనే ఉందని సీడీఎస్(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్) జనరల్ అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు. ఈరోజు(శుక్రవారం జూలై 25) ఢిల్లీలో జరిగిన డిఫెన్స్ సెమినార్కు హాజరైన అనిల్ చౌహాన్ మాట్లాడుతూ..ఆపరేషన్ సిందూర్ అనేది అవసరమైన సందర్భంలో మళ్లీ జూలు విదల్చడానికి ఇంకా సిద్ధంగానే ఉందన్నారు.అది నిరంతరం నేర్చుకునే ప్రక్రియఇక భారతదేశ యుద్ధ సామర్థ్యం గురించి ఆయన పలు కీలక విషయాలను చెప్పుకొచ్చారు. యుద్ధ సంసిద్ధత అనేది చాలా హైలెవెల్లో ఉండాలన్నారు. యుద్ధ సామర్థ్యాన్ని పెంపుదించుకోవడానికి ప్రతి గడియా, ప్రతి నిమిషం కూడా చాలా అవసరమన్నారు. అటు సస్త్ర(యుద్ధం) ఇటు శాస్త్రం(జ్ఞానం) అనేవి మిలటరీకి 24x7, 365 రోజులు చాలా కీలకమన్నారు.మూడు స్థాయిల్లో మాస్టర్ కావాలి..యుద్ధ రంగంలోకి దిగే సైనికుడు న్రధానంగా మూడు స్థాయిల్లో మాస్టర్ కావాల్సిన అసవరం ఉందన్నారు. అందులో , నిర్ధిషమైన ప్రణాళిక, వ్యూహాత్మకత, కార్యాచరణ, అనేవి యుద్ధ రంగంలో ప్రధాన భూమిక పోషిస్తాయన్నారు. వీటిలో ప్రతీ సైనికులు ఆరితేరి ఉండాలన్నారు. ఇది ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ముందకు సాగడమే తప్ప ఇందులో షార్ట్ కట్స్ అంటూ ఏమీ ఉండవన్నారు. ప్రస్తుత రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం యొక్క నిరంతర పురోగతి ద్వారా మనం అపూర్వమైన వేగాన్ని చూస్తున్నామని, దాన్ని అందిపుచ్చకుంటూ ముందుకు సాగితేనే యుద్ధంలో పైచేయి సాధిస్తామన్నారు. కాగా, ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అసువులు బాసారు. కశ్మీర్ పర్యాటక ప్రాంతాల్నిచూడటానికి వెళ్లిన పర్యాటకులు ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్సోయారు. ఈ క్రమంలోనేఆపరేషన్ సిందూర్ను భారత్ చేపట్టింది.మే 7వ తేదీన భారత్ చేపట్టిన ఈఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్ ఉనికిలో లేకుండా పోయే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది.ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాక్ అతాలకుతలమైంది. భారత్ దాడుల్ని తిప్పి కొట్టలేక ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కాస్త దారికొచ్చింది.ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లోకి చొచ్చుకుపోయిని భారత ఆర్మీ బలగాలు అక్కడ కీలక ఉగ్రస్థావరాలను చిన్నాభిన్నం చేశారు. సుమారు వందమందికి పైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడం ఒకటైతే, ఉగ్రస్థావరాలు ఉన్న చోటల్లా భారత్ చేసిన దాడులకు పాకిస్తాన్ ఊపిరి తీసుకోలేకపోయింది. అలాగే పాక్ ఆర్మీ క్యాంపుల్ని కూడా భారత్ టార్గెట్ చేసి పైచేయి సాధించింది. భారత్ దాడులకు గుక్క తిప్పులేకపోయిన పాకిస్తాన్.. మే 10వ తేదీన కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చింది. పాకిస్తాన్ మిలటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్.. భారత్ ఆర్మీకి ఫోన్ చేసి కాల్పుల విరమణ ఒప్పందానికి తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు.. అదే సమయంలో పాకిస్తాన్ మళ్లీ ఎటువంటి దుస్సాహసానికి పాల్పడ్డాఆపరేషన్ సిందూర్ ఆన్లోనే ఉందని గట్టి హెచ్చరికల నడుమ కాల్పుల విరమణకు అంగీకరించింది భారత్. -
అది నా తప్పే.. ఇప్పుడు సరిదిద్దుతున్నాం: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: తెలంగాణ కులగణనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ప్రశంసలు గుప్పించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కులగణన చేయలేకపోయామని, అది ముమ్మాటికీ తన తప్పిదమేనని అన్నారాయన. శుక్రవారం ఢిల్లీ టాల్కటోరా ఇండోర్ స్టేడియంలో జరిగిన భాగిదారి న్యాయ సమ్మేళన్ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. నేను 2004 నుంచి రాజకీయాల్లో ఉన్నాను... ఇప్పుడు వెనక్కి చూసినప్పుడు, ఓ తప్పు చేశానని అర్థమవుతోంది. నేను ఓబీసీల హక్కులను రక్షించాల్సిన విధంగా రక్షించలేదు. అప్పట్లో మీ(ఓబీసీలనుద్దేశించి..) సమస్యలు లోతుగా అర్థం చేసుకోలేకపోయాను.... మీ చరిత్రను, మీ సమస్యలను కొంచెం అయినా ముందే తెలుసుకుని ఉండినట్లైతే, అప్పటికే కుల గణాంకాలు (Caste Census) నిర్వహించేవాడిని. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కులగణన ప్రభావం అర్థం చేసుకోలేకపోయాం. ఇది కాంగ్రెస్ పార్టీ తప్పు కాదు.. ముమ్మాటికీ నా తప్పు. ఇప్పుడు ఆ తప్పును సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని అన్నారాయన. ఓబీసీల చరిత్ర గురించి ఎవరైనా రాశారా?. పెద్ద పెద్ద వ్యాపారవేత్తల పేర్లు బయటికి తీయండి. అందులో ఒక్కరైనా ఓబీసీ ఉన్నారా? అదానీ ఒబీసీనా?. ఇంగ్లీష్ను వ్యతిరేకించేవారు తమ పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారు? అని ప్రశ్నించారాయన. తెలంగాణ కులగణన దేశానికే రోల్ మోడల్ అని పేర్కొన్న రాహుల్.. దేశవ్యాప్తంగా కులగణన జరగాల్సిందేనని ఉద్ఘాటించారు.#WATCH | Delhi: At Congress' 'Bhagidari Nyay Sammelan', Lok Sabha LoP Rahul Gandhi says, "I have been in politics since 2004...When I look back, I can see that I made a mistake. I didn't protect the OBCs like I should have...It was because I could not understand your issues in… pic.twitter.com/uink9xyKFJ— ANI (@ANI) July 25, 2025మోదీపై రాహుల్ విసుర్లుఇదే వేదికగా.. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, దేశ ప్రధాని నరేంద్ర మోదీపై విసుర్లు గుప్పించారు. ‘‘మోదీకి అంత సీన్ లేదు. ఆయనదంతా బిల్డప్పు మాత్రమే. అంత శక్తేం ఆయనకు లేదు. అవసరంగా అంత ప్రాధాన్యం ఇస్తున్నారు అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మోదీతో రెండు,మూడుసార్లు భేటీ అయ్యాక.. ఆయనేం పెద్ద సమస్య కాదని అర్ధమైందని రాహుల్ అన్నారు. దేశంలో దళితులు, బీసీలు, గిరిజనులు, మైనారిటీలు 90 శాతం ఉన్నారు. కానీ,బడ్జెట్ హల్వా తయారీలో ఈ వర్గాలకు చెందిన ఎవరికీ ప్రాధాన్యం ఉండదు. ఆ హల్వా తయారీకి ఈ వర్గాలే కారణం. కానీ, తినడానికి మాత్రం వీళ్లు అర్హులు కారా?’’ అని కేంద్రాన్ని రాహుల్ ప్రశ్నించారు. -
ప్రభుత్వ అధికారుల అక్రమాల పుట్టపగులుతోంది.. తవ్వే కొద్దీ డబ్బే డబ్బు
భువనేశ్వర్: అవినీతికి పాల్పడుతున్న అటవీశాఖ అధికారుల్ని విజిలెన్స్ అధికారులు ఆట కట్టిస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు అటవీ శాఖ అధికారుల ఇళ్లలో విజిలెన్స్ శాఖ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఓ అధికారికి 116 ఫ్లాట్లు గుర్తించగా.. మరో అధికారి ఇంట్లో తవ్వే కొద్దీ నోట్ల కట్టలు, గోల్డ్ కాయిన్లు, ఇతర బంగారు ఆభరణాలు వెలుగులోకి వచ్చాయి. సదరు అధికారుల ఇళ్లల్లో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్లో విజిలెన్స్ అధికారులు శుక్రవారం ఆరో ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేశారు. ఈ సోదాల్లో అటవీశాఖ డిప్యూటీ రేంజర్ రామ చంద్ర నాయక్ నివాసంలో ఆదాయానికి మించిన రూ.1.44 కోట్ల క్యాష్ను స్వాధీనం చేసుకున్నారు. ఆయనకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ ఆస్మిక తనిఖీలు చేపట్టారు అధికారులు.తనిఖీల్లో జయపూర్లోని ఆయన ఫ్లాట్లో రహస్య గదిలో దాచిన రూ. 1.44 కోట్ల నగదు, 4 బంగారు బిస్కెట్లు, 16 బంగారు నాణేలు (ప్రతి నాణెం 10 గ్రాములు),6 ప్రాంతాల్లోని జయపూర్, భువనేశ్వర్లోని ఆయన నివాసాలు, బంధువుల ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. కాగా, ఈ దాడుల్లో ఆరుగురు డీఎస్పీలు, ఐదుగురు ఇన్స్పెక్టర్లు, తొమ్మిదిమంది ఏఎస్ఐలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. కరెన్సీ కౌంటింగ్ మెషీన్లు ఉపయోగించి నగదు లెక్కింపు కొనసాగుతోంది.ఈ దాడికి ముందు మరో అటవీ శాఖ అధికారి నివాసాల్లో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సదరు అధికారికి 119కి పైగా ప్లాట్లు ఉన్నట్లు తేలింది. -
కాంగ్రెస్ది పనికి రాని సర్వే.. రేవంత్వి పిల్లి మొగ్గలు: కిషన్రెడ్డి
ఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ పనికిరాని సర్వే చేసిందని ఆరోపించారు కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. 75 ఏళ్ల చరిత్రలో కాంగ్రెస్ ఏనాడు బీసీ జనగణన చేయలేదు. బీసీలను కాంగ్రెస్ మభ్యపెడుతోంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. బీసీని ప్రధానిని చేసిన ఘటన బీజేపీది అంటూ చెప్పుకొచ్చారు.కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘దేశానికి అత్యధిక కాలం పని చేసిన రెండో ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. బీసీలను కాంగ్రెస్ మభ్య పెడుతోంది. 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం అమలు చేయడంలో ఫెయిల్ అయ్యింది. బీసీల్లో ముస్లింలను కలపడం వల్ల బీసీ వర్గాలకి అన్యాయం జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీసీ సీట్లలో ముస్లింలకు పోటీ చేసే అవకాశం కల్పిస్తున్నారు. కాంగ్రెస్ ప్రతిపాదించిన 42 శాతం రిజర్వేషన్లలో పది శాతం ముస్లింలకు ఇవ్వడం వల్ల నిజమైన బీసీలకు నష్టం జరుగుతుంది. 75 ఏళ్ల చరిత్రలో కాంగ్రెస్ ఏనాడు బీసీ జనగణన చేయలేదు. కాంగ్రెస్ పనికిరాని సర్వే చేసింది.బీసీలలో ముస్లింలను కలిపేలా కేంద్రం కుల గణన ఉండదు. బీసీలకు న్యాయం చేసేలా కుల గణన ఉంటుంది. కాంగ్రెస్ ఏనాడు బీసీ సీఎం, బీసీని ప్రధానిని చేయలేదు. బీసీని ప్రధానిని చేసిన చరిత్ర బీజేపీది. మోదీ కన్వర్టెడ్ బీసీ ఎలా అవుతారు?. కాంగ్రెస్ హయంలోనే మండల కమిషన్ ద్వారా మోదీ కులాన్ని బీసీల్లో చేర్చాలి. బీసీల్లో చేర్చినపుడు కనీసం మోదీ ఎమ్మెల్యే కూడా కాదు. రేవంత్ రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అనేక కులాలు బీసీల్లో కలిశాయి. లంబాడాలను కూడా కన్వర్టెడ్ ఎస్టీ అంటారా?.తెలంగాణలో ఎన్నికలొస్తే కాంగ్రెస్ ఓటమి ఖాయం. కాంగ్రెస్ పాలిత మూడు రాష్ట్రాల లో ఎన్నికలు ఎప్పుడొచ్చినా వారి ఓటమి ఖాయం. రాహుల్ గాంధీది ఏ సామాజిక వర్గమో చెప్పాలి. ఎన్నికైన ప్రధాని మోదీపై అవాకులూ చెవాకులూ పేలడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. 42శాతం రిజర్వేషన్లు బీసీలకు మాత్రమే ఇవ్వాలి. తొమ్మిదో షెడ్యూల్లో పెట్టేందుకు మాకు అభ్యంతరం లేదు కానీ చట్టానికి లోబడి ఉండాలి. మేము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేస్తాం. మెట్రో విషయంలో రాష్ట్రానికి పూర్తిగా సహకరిస్తాను. ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పిల్లి మొగ్గలు వేస్తున్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
ఉల్లూ, ఏఎల్టీటీ సహా 25 యాప్లపై బ్యాన్
అశ్లీల కంటెంట్ను కట్టడి చేసే క్రమంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అభ్యంతర కంటెంట్ను ప్రొత్సహిస్తున్న ఉల్లూ, ఏఎల్టీటీ సహా 25 వీడియో యాప్లు, వెబ్సైట్ల మీద నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.పోర్నోగ్రఫిక్ సహా అభ్యంతకర కంటెంట్ను ప్రదర్శిస్తున్న క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే.. ఆయా యాప్ల, వెబ్సైట్ల లింకులను ప్రజలకు అందుబాటులో ఉంచకుండా బ్యాన్ చేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్(ISPs)కు ఆదేశాలు జారీ చేసింది.భారత్లో పోర్న్సైట్లపై నిషేధం అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రత్యామ్నాయ మార్గాల్లో కోట్ల మంది ఆ సైట్లను వీక్షిస్తున్నారు. అయితే.. కఠిన చట్టాలు లేకపోవడంతో కొన్ని యాప్లు అధికారికంగానే పోర్న్, సాఫ్ట్ పోర్న్ను ప్రొత్సహిస్తూ వస్తున్నాయి. ఇందులో ఉల్లూ, ఏల్టీటీ(ఏక్తాకపూర్కు చెందిన బాలాజీ టెలిఫిలింస్కు చెందిన యాప్, అశ్లీలంతో పాటు సాదారణ సినిమాలూ అందిస్తోంది) తదితరాలు ప్రముఖంగా ఉన్నాయి. ఈ ప్లాట్ఫారమ్లు డబ్బులు తీసుకుని ఇంతకాలం యూజర్లకు అశ్లీల కంటెంట్ విచ్చలవిడిగా అందిస్తూ వచ్చాయి.అయితే రాను రాను.. ఈ వ్యవహారం మరింత ముదిరిపోయింది. ఏకంగా పోర్న్ కంటెంట్ ఇదే తరహా యాప్ల ద్వారా ప్రమోట్ అయ్యింది. ఇది హద్దులు దాటి ‘ఎక్స్’(ట్విటర్) లాంటి పాపులర్ ఓపెన్ మాధ్యమానికి కూడా చేరడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ తరుణంలో కేంద్రం నిషేధం విధించడం గమనార్హం. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.తాజా నిషేధిత జాబితాలో.. ఉల్లూ, ఏఎల్టీటీ, బిగ్ షాట్స్ యాప్, దేశీఫ్లెక్స్, బూమెక్స్, నవరసా లైట్, గులాబ్ యాప్, కంగన్ యాప్, బుల్ యాప్, జల్వా యాప్, వావ్ ఎంటర్టైన్మెంట్, లుక్ ఎంటర్టైన్మెంట్, హిట్ప్రైమ్, ఫెనియో, షో ఎక్స్, సోల్ టాకీస్, అడ్డా టీవీ, హాట్ఎక్స్ వీఐపీ, హల్చల్ యాప్, మూడ్ఎక్స్, నియోన్ ఎక్స్ వీఐపీ, ఫూగీ, మోజ్ఫ్లిక్స్, ట్రిఫ్లిక్స్ తదితరాలు ఉన్నాయి.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 సెక్షన్ 67, 67 ఏ.. లాగే భారత న్యాయ సంహిత సెక్షన్ 294, మహిళలను అభ్యంతరకరంగా చూపించడం(The Indecent Representation of Women (Prohibition) Act, 1986 సెక్షన్ 4).. ఉల్లంఘనల కింద ఈ యాప్లను నిషేధిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. -
ఏపీ, తెలంగాణలో డీలిమిటేషన్ ఇప్పట్లో కుదరదు: సుప్రీంకోర్టు
సాక్షి, ఢిల్లీ: ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెంచాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. రాజ్యాంగం పరిధికి లోబడే ఏపీ విభజన చట్టం సెక్షన్లు ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి ధర్మాసనం తీర్పును వెలువరించింది.ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలలో డీలిమిటేషన్ చేయాలని సుప్రీంకోర్టులో ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పిటిషనర్.. జమ్ముకశ్మీర్లో డీలిమిటేషన్ చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్లను ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఆయన పిటిషన్ను కొట్టివేసింది.రాజ్యాంగంలోని ఆర్టికల్ 170కి లోబడి మాత్రమే ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 26 ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్-26ను ప్రత్యేకంగా వేరుగా చూడలేం. ఆర్టికల్ 170 ప్రకారం 2026 తర్వాత అందుబాటులోకి వచ్చే జనాభా లెక్కల ప్రకారమే డీలిమిటేషన్ ఉంటుంది. రాజ్యాంగం పరిధికి లోబడే ఏపీ విభజన చట్టం సెక్షన్లు ఉంటాయని సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. రాజ్యాంగం పరిధిలోనే డీలిమిటేషన్ జరగాలి. లేకుంటే ఇలాంటి డిమాండ్లకు వరద గేట్లు ఎత్తినట్లే అవుతుంది. జమ్ముకశ్మీర్తో పాటు ఏపీ, తెలంగాణ డీలిమిటేషన్ను కలిపి చూడలేం అని స్పష్టం చేసింది. -
రికార్డు బద్ధలు కొట్టిన ప్రధాని మోదీ
భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన ఘనత సాధించారు. వరుసగా అత్యధిక కాలం ప్రధానిగా సేవలందించిన జాబితాలో ఇందిరా గాంధీ రికార్డును బద్ధలు కొట్టారు. భారత దేశంలో వరుసగా సుదీర్ఘకాలం ప్రధాని పదవిలో కొనసాగిన ఘనత.. జవహార్ లాల్ నెహ్రూది. ఆయన అత్యధిక కాలం (6,130 రోజులు) ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత రికార్డు ఇందిరా గాంధీ(4,077 రోజులు) పేరిట ఆ ఘనత ఉండేది. తాజాగా ఆ రికార్డును నరేంద్ర మోదీ బ్రేక్ చేశారు.శుక్రవారం(జులై 25)తో నరేంద్ర మోదీ భారత దేశ ప్రధానిగా 4,078 రోజులు పూర్తి చేసుకున్నారు. దీంతో ఇందిరాగాంధీ రికార్డును అధిగమించినట్లైంది. అలాగే.. భారత్కు సుదీర్ఘకాలంగా ప్రధాని పదవిలో కొనసాగిన రెండో వ్యక్తి ఘనతకు సొంతం చేసుకున్నారు. అంతేకాదు..స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జన్మించిన వ్యక్తిగా, రెండు దఫాలు ప్రధాని పదవీ కాలం పూర్తి చేసుకున్న వ్యక్తి.. మోదీనే. అలాగే.. కాంగ్రెస్యేతర ప్రధానిగా, హిందీయేతర రాష్ట్ర వ్యక్తిగానూ మోదీ నిలిచారు. మోదీ 2014 మే 26న మొదటిసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.2019లో రెండవసారి, 2024లో మూడవసారి పదవిలోకి వచ్చారు.నరేంద్ర మోదీ ఇప్పటివరకు (జూలై 25, 2025 వరకు) భారతదేశ ప్రధానమంత్రిగా 4,078 రోజులు పాలన అందించారు.ఇప్పటిదాకా మొత్తం కాలం 11 సంవత్సరాలు, 1 నెల, 29 రోజులుఫలితంగా వరుసగా భారత ప్రధానిగా చేసిన ఇందిరా గాంధీ రికార్డును అధిగమించి, భారతదేశంలో రెండవ అత్యధిక కాలం సేవలందించిన ప్రధానిగా మోదీ నిలిచారు.ఇందిరా గాంధీ భారతదేశ ప్రధానమంత్రిగా రెండు విడతలలో సేవలందించారు:మొదటిసారి పదవీకాలం.. 24 జనవరి 1966 నుండి 24 మార్చి 1977, 11 సంవత్సరాలు, 2 నెలలురెండోసారి పదవీకాలం14 జనవరి 1980 నుండి 31 అక్టోబర్ 1984 (ఆమె హత్యకు ముందు వరకు) 4 సంవత్సరాలు, 9 నెలలు, 17 రోజులుమొత్తం పదవీ కాలం15 సంవత్సరాలు, 11 నెలలు, 17 రోజులుదేశానికి స్వాతంత్య్రంచ్చినప్పటి నుంచి నెహ్రూ ఆ పదవిలో కొనసాగారు. జవహర్లాల్ నెహ్రూ భారతదేశపు మొదటి ప్రధానమంత్రిగా 15 ఆగస్టు 1947న పదవీ బాధ్యతలు స్వీకరించి, 27 మే 1964న ఆయన మరణించేవరకు పదవిలో కొనసాగారు. అంటే.. మొత్తం 16 సంవత్సరాల 286 రోజులు ఆ పదవిలో ఉన్నారన్నమాట. ఇది భారత ప్రధానమంత్రిగా ఇప్పటివరకు అత్యధిక కాలం సేవలందించిన రికార్డు నెహ్రూదే. -
వన్యప్రాణులకు ప్రత్యేక సంరక్షణ చర్యలు
సాక్షి, న్యూఢిల్లీ: గతంతో పోలిస్తే దేశంలో ప్రస్తుతం పులులు, సింహాలు, ఏనుగుల సంఖ్య పెరుగుతున్నట్లు కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 3,682 పులులు, 891 సింహాలు, 30,711 ఏనుగులు ఉన్నట్లు రాజ్యసభలో కేంద్ర అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ వెల్లడించారు. వీటి సంరక్షణకు కేంద్రం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జాతీయ పులుల సంరక్షణ సంస్థ రాష్ట్రాలతో కలిసి నాలుగేళ్లకోసారి అఖిల భారత పులుల అంచనా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దీని ఆధారంగా..2018లో 2,967 పులుల జనాభా ఉండగా, 2022లో 3,682కు పెరిగిందన్నారు. గుజరాత్ రాష్ట్రం నిర్వహించిన 16వ సింహాల సంఖ్య అంచనా ప్రకారం 2020లో 674 సింహాలు ఉన్నట్లు అంచనా వేయగా.. 2025లో 891 సింహాలు ఉన్నట్లు గుర్తించారని పేర్కొన్నారు. ఇక ఏనుగుల సంఖ్య అంచనా 2017లో పూర్తి అయినట్లు చెప్పారు. 2017లో ఏనుగులు 29,964 ఉన్నట్లు తెలిపారు.పులుల సంరక్షణకు 58 నిల్వల ఏర్పాటు..వన్యప్రాణులను, వాటి ఆవాసాలను సంరక్షించేందుకు 1972 వన్యప్రాణుల(రక్షణ) చట్టంలోని నిబంధనల ప్రకారం దేశవ్యాప్తంగా వన్యప్రాణుల ఆవాసాలను కవర్ చేసే ఉద్యానవనాలు, అభయారణ్యాల వంటి రక్షిత ప్రాంతాల నెట్వర్క్ సృష్టించినట్లు కీర్తివర్ధన్ చెప్పారు. దేశంలో దాదాపు 2.5శాతం భౌగోళిక ప్రాంతంలో పులులు నివాసం ఉంటున్నట్లు కేంద్ర సహాయ మంత్రి వెల్లడించారు. వీటి సంరక్షణ కోసం 58 పులుల నిల్వలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక సింహాల విషయంలో గుజరాత్లోని బర్దాలో రెండవ నివాసాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.ఆసియా సింహాల ఆవాస అవసరాలను తీర్చేందుకు గుజరాత్ రాష్ట్రంలో ఆవాస మెరుగుదల పనులు, కారిడార్ అభివృద్ధి, రక్షిత ప్రాంతాల వెలుపల గడ్డి భూముల మెరుగుదల పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఏనుగుల సంరక్షణ కోసం 14 ఏనుగుల శ్రేణి రాష్ట్రాలలో 33 ఏనుగుల నిల్వలు స్థాపించినట్లు వివరించారు. వన్యప్రాణుల దాడుల్లో గాయపడిన, మరణించిన బాధితులకు ‘వన్యప్రాణుల ఆవాసాల అభివృద్ధి’, ‘ప్రాజెక్ట్ టైగర్ అండ్ ఎలిఫెంట్’ కింద నష్టపరిహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. శాశ్వత వైకల్యం లేదా మరణించిన వారికి రూ.10లక్షల నష్టపరిహారాన్ని 24గంటల్లో అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కెమెరాల ద్వారా లెక్కింపు..టైగర్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ ప్రారంభమైన రోజుల్లో పులుల సంఖ్యను అంచనా వేసేందుకు ఉపయోగించిన పద్ధతులు అశాస్త్రీయమైనవిగా తేలాయి. ఒక పులిని పలుమార్లు లెక్కించడం వల్ల పులుల సంఖ్యలో తప్పులు వచ్చాయి. ఆ తర్వాత పులుల పాదముద్రల ఆధారంగా లెక్కించేవారు. వాటితోనూ పులుల సంఖ్యను కచ్చితంగా అంచనా వేయడం సాధ్యం కాదని అధికారులు గ్రహించారు. అనంతరం పులులను లెక్కించే అత్యాధునిక పద్ధతి ‘కెమెరా డ్రాప్’ అందుబాటులోకి వచ్చింది. పులుల సంచారం ఉన్న ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటు చేసి, వాటిలో రికార్డు అయిన పులుల ఫొటోల ఆధారంగా వాటి సంఖ్యను లెక్కిస్తున్నారు. ఆ ఫొటోల్లో కనిపిస్తున్న పులుల చర్మంపై ఉన్న చారలను గుర్తించేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తున్నారు. మనిషి వేలిముద్రల లాగే పులి చర్మంపై ఉండే చారలు కూడా వేర్వేరుగా ఉంటాయి. ఏ రెండు పులులకు ఒకే విధంగా చారలు ఉండవు. ఇది ఒక పులిని రెండోసారి లెక్కించకుండా ఉపయోగపడుతుంది. ఈ అత్యాధునిక ‘కెమెరా డ్రాప్’ ద్వారా పులులను లెక్కిస్తున్నారు. -
పార్లమెంటులో పోరాడండి
సాక్షి, న్యూఢిల్లీ: రాహుల్గాంధీ హామీ మేరకు తమ ప్రభు త్వం కుల గణన చేసి, ఆ మేరకు బీసీలకు 42 శాతం రిజ ర్వేషన్లు కల్పించే బిల్లులను శాసనసభలో ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఆ బిల్లులను లోక్సభ, రాజ్యసభల్లో ఆమోదింపజేసేందుకు రాహుల్గాం«దీ, ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ ఎంపీలు పోరాడాలని విజ్ఞప్తి చేశారు. తాను, తన మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలందరం జంతర్మంతర్ వద్ద పోరాడతామని చెప్పారు. తెలంగాణలో తమ ప్రభుత్వం ఇంటింటికీ తిరిగి ప్రజల స్వీయ ధ్రువీకరణ పత్రంతో సేకరించిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కుల సర్వే దేశానికే రోల్మోడల్ అని అన్నారు.ఈ సర్వేకు సంబంధించిన 88 కోట్ల పేజీల డేటా తమ వద్ద ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు, విద్యా, ఉపాధి రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభలో ఆమోదించిన బిల్లులపై..ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో గురువారం సాయంత్రం పార్టీ ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన సందర్భంగా సీఎం మాట్లాడారు. రాహుల్ హామీ మేరకు రాష్ట్రంలో కులగణన ‘భారత్ జోడో యాత్రలో రాహుల్గాంధీ కుల గణనకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2024, ఫిబ్రవరి 4వ తేదీన ఈ మేరకు సర్వేను ప్రారంభించి 2025, ఫిబ్రవరి 5న అంటే ఏడాది కాలంలోనే పూర్తి చేశాం. అందుకే ఫిబ్రవరి 4ను తెలంగాణలో సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. కులగణన చేపట్టే సమయంలో అనేకమంది అగ్ర కులాల నాయకులు నా వద్దకు వచ్చి అభ్యంతరాలు, సందేహాలు వ్యక్తం చేశారు. కాలనుగుణంగా మార్పులకు అవకాశం ఇవ్వాలని నేను వారికి సూచించా. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 60 ఏళ్ల పాటు పోరాటాలు జరిగాయి. అనేక మంది అమరులయ్యారు. కానీ 2009, డిసెంబర్ 9న ప్రకటన చేయడంతో పాటు తెలంగాణ ఇచ్చి తెలంగాణ ప్రజల కలను సోనియాగాంధీ నెరవేర్చారు. అదే తెలంగాణలో కుల గణనపై రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని మా ప్రభుత్వం నెరవేర్చింది..’ అని రేవంత్రెడ్డి చెప్పారు. గాంధీ కుటుంబం ఇచ్చిన మాట నిలుపుకుంటుంది ‘బీజేపీ నాయకులు చెప్పినవి ఏవీ చేయరు. గాంధీ కుటుంబం చెప్పిన ప్రతి మాటను నిలుపుకుంటుంది. కుల గణనకు సంబంధించి మా ప్రభుత్వం 56 ప్రశ్నలతో ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తి వద్దకు వెళ్లి సమాచారం సేకరించింది. సర్వే ప్రకారం తెలంగాణలో బీసీలు 56.36 శాతం ఉన్నారు. 3.9 శాతం మంది తమది ఏ కులం కాదని ప్రకటించుకున్నారు. ఇది తెలంగాణలో సరికొత్త పరిణామం. వీరంతా ఎవరని.. సర్వే, స్వతంత్ర నిపుణుల బృందాలు పరిశీలించాయి. వాళ్లంతా ఇంగ్లీష్ అభ్యసించిన ఉన్నత విద్యావంతులని తేలింది. ఈ సర్వే ప్రకారమే మేము బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక బిల్లు, విద్యా, ఉపాధి అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మరో బిల్లు ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించాం..’ ముఖ్యమంత్రి తెలిపారు. మోదీ లీగల్లీ కన్వెర్డెడ్ బీసీ.. ‘బీజేపీ తొలి నుంచి బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లీగల్లీ కన్వెర్టెడ్ బీసీ. మేము కుల గణన చేపట్టబోమని రాజ్నాథ్ సింగ్ పార్లమెంటులో చెప్పారు. రైతుల నల్ల చట్టాల విషయంలో రాహుల్ గాంధీ గళం విప్పిన తర్వాత మోదీ వాటిని రద్దు చేసి క్షమాపణ చెప్పారు. ఇప్పుడు రాహుల్గాంధీ మాట మేరకు తెలంగాణ ప్రభుత్వం కులగణన చేపట్టిన తర్వాత కేంద్రం కుల గణనకు అంగీకరించింది. ఇదంతా రాహుల్ గాంధీ ఘనతే. మేము చేపట్టిన సర్వే దేశానికి రోల్ మోడల్. ఇది తెలంగాణ మోడల్. నేను దీనిని ‘రేర్’ (ఆర్ఏఆర్ఈ) మోడల్ అంటున్నా. ఆర్ఏఆర్ఈ..అంటే ఏమిటో నేను త్వరలో వివరిస్తా..’ అని రేవంత్ అన్నారు. సోనియాగాంధీ లేఖ నాకు నోబెల్, ఆస్కార్ లాంటిది ‘కుల సర్వే, బీసీ బిల్లుల ఆమోదంపై హర్షం వ్యక్తం చేస్తూ సోనియాగాంధీ స్వహస్తాలతో నాకు లేఖ రాశారు. ఆ లేఖ నాకు నోబెల్, ఆస్కార్, జీవితకాల సాఫల్య పురస్కారాలతో సమానం. నేను ఈ స్థానంలో ఉన్నా లేకున్నా ఆ లేఖ నాకు ప్రత్యేకంగా మిగిలిపోతుంది..’ అంటూ సీఎం భావోద్వేగానికి గురయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి పవర్పాయింట్ ప్రజంటేషన్ బీసీ రిజర్వేషన్లపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పార్టీ ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చి ప్రసంగించారు. మహేశ్గౌడ్ కార్యక్రమ సంధానకర్తగా వ్యవహరించారు. సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేశ్, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, కాంగ్రెస్ పార్టీ లోక్సభ, రాజ్యసభ ఎంపీలు, స్వతంత్ర నిపుణుల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఖర్గే, రాహుల్తో సీఎం బృందం భేటీ గురువారం ఉదయం ఖర్గే నివాసంలో ఆయనతో పాటు, రాహుల్ గాం«దీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో కులగణన సర్వే ప్రక్రియ, శాసనసభలో బిల్లుల ఆమోదం, పార్లమెంట్లో వాటిని ఆమోదింప జేయడంపై చర్చించారు. -
‘ఇండియా’ కూటమి ఉమ్మడి అభ్యర్థి!
న్యూఢిల్లీ: జగదీప్ ధన్ఖడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవికి త్వరలో ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఎన్నికల సంఘం ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలో అధికార ఎన్డీయే అభ్యరి్థపై తమ ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని విపక్ష ‘ఇండియా’కూటమి నిర్ణయించినట్లు తెలిసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ పోటీ పడడమే సరైన వ్యూహమని భావిస్తున్నట్లు సమాచారం. ఫలితంతో సంబంధం లేకుండా అధికార కూటమికి బలమైన సందేశం ఇవ్వదలిచామని ఇండియా కూటమి నేతలు గురువారం వెల్లడించారు. పార్లమెంట్లో మొత్తం ఓట్లు 782 కాగా, ఉప రాష్ట్రపతి ఎన్నికలో నెగ్గాలంటే 392 ఓట్లు అవసరం. ప్రస్తుతం ఎన్డీయేకు 423 ఓట్ల బలం ఉంది. ఇండియా కూటమికి సానుకూలంగా 313 ఓట్లు ఉన్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికలో పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు పాల్గొంటారు. -
పార్లమెంట్లో రచ్చ రచ్చ
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వరుసగా నాలుగో రోజు గురువారం ఎలాంటి కార్యకలాపాలు చోటుచేసుకోలేదు. బిహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణతోపాటు కీలక అంశాలపై విపక్షాలు తమ డిమాండ్ల నుంచి వెనక్కి తగ్గలేదు. ఆయా అంశాలపై వెంటనే చర్చ ప్రారంభించాలని, ప్రభుత్వం స్పందించాలని తేలి్చచెప్పాయి. నిరసనలు, నినాదాలు యథావిధిగా కొనసాగించాయి. ఉభయ సభలకు అంతరాయం కలిగించాయి. దీంతో సభలను పలుమార్లు వాయిదా వేయాల్సి వచి్చంది. గురువారం ఉదయం లోక్సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు ప్రారంభించారు. వెల్లోకి దూసుకొచ్చి ప్లకార్డులు ప్రదర్శించారు. సభకు సహకరించాలని, వెనక్కి వెళ్లి సీట్లలో కూర్చోవాలని స్పీకర్ బిర్లా కోరినా వారు వినిపించుకోలేదు. సభకు అంతరాయం సరైన పద్ధతి కాదని స్పీకర్ హితవు పలికారు. సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత పరిస్థితిలో మార్పు రాలేదు. గోవా అసెంబ్లీలో ఎస్టీలకు సీట్ల కేటాయింపునకు సంబంధించిన బిల్లుపై చర్చలో పాల్గొనాలని స్పీకర్ స్థానంలో ఉన్న కృష్ణప్రసాద్æ విజ్ఞప్తి చేయగా, విపక్ష ఎంపీలు పట్టించుకోలేదు. ఎస్టీలకు సంబంధించిన బిల్లుపై చర్చకు అడ్డుపడడం పట్ల విపక్షాలపై న్యాయ శాఖ మంత్రి మేఘ్వాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అయినప్పటికీ నినాదాలు ఆగకపోవడంతో సభాపతి లోక్సభను శుక్రవారానికి వాయిదావేశారు. రాజ్యసభలోనూ గందరగోళం బిహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభలో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ఉదయం రాజ్యసభ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే వారు అలజడి సృష్టించడంతో సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత క్యారేజీ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్లుపై చర్చ మొదలైంది. దీనిపై ఏఐఏడీఎంకే నేత తంబిదురై మాట్లాడారు. ఇంతలో ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. వెల్లోకి చేరుకొని నినాదాలతో హోరెత్తించారు. తంబిదురై తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఆయోధ్యరామిరెడ్డి మాట్లాడారు. విపక్ష ఎంపీలు తమ నినాదాలు ఆపలేదు. సభలో వారి ప్రవర్తన పట్ల బీజేపీ ఎంపీ లక్ష్మీకాంత్ బాజ్పాయ్ అభ్యంతరం వ్యక్తంచేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని సభాపతి స్థానంలో ఉన్న భువనేశ్వర్ కలితాను కోరారు. ప్రతిపక్ష నేత ఖర్గేకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ విన్నవించారు. అందుకు సభాపతి అంగీకరింకపోవడంతో విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. దాంతో సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు సభాపతి పేర్కొన్నారు. పార్లమెంట్లో ప్రాంగణంలో నిరసన బిహార్లో ఓటర్ల జాబితా సవరణను వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యులు పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన తెలిపారు. ఓటు బందీని ఆపాలని ప్లకార్డులు ప్రదర్శించారు. సోనియా గాం«దీ, ప్రియాంకా గాంధీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విపక్షాలు ప్రదర్శించిన ప్లకార్డుల్లో లోక్తంత్ర బదులు లోక్తంతర్ అని రాసి ఉండడంతో బీజేపీ‡ నేత మాలవీయా వ్యంగ్యా్రస్తాలు విసిరారు. ఏది ఎలా రాయాలో తెలియనివారు ప్రజాస్వామ్యం గురించి పాఠాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. -
కేంద్రానిదే బాధ్యత: రాహుల్గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన కుల గణన సర్వే దేశానికే మార్గదర్శకమని, ఇందుకు సంబంధించి రాష్ట్రం తీసుకొచ్చిన బిల్లును ఆమోదించే బాధ్యత కేంద్రంపైనే ఉందని లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లపై కేంద్రానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బిల్లును ఆమోదించే విషయంలో జాప్యం చేయరాదని అన్నారు. దేశంలో సామాజిక న్యాయానికి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సర్వే మైలు రాయిగా నిలుస్తుందని కొనియాడారు. గురువారం ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయంలో తెలంగాణలో చేపట్టిన కుల గణన సర్వేపై ప్రభుత్వం ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో ఆయన పార్టీ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు. ఇదొక సామాజిక, ఆర్థిక, రాజకీయ పనిముట్టు ‘కుల గణన అనేది రేవంత్రెడ్డికి అంత సులువు కాదని భావించాం. సీఎంగా ఇది ఆయనకు ఇబ్బందికరమని అనుకున్నాం. ఆయన సామాజిక వర్గం ఆయనను సమర్థించదని భావించాం. కానీ రేవంత్రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు నేను ఆశించిన దానికంటే అద్భుతంగా పనిచేశారు. సరైన దృక్పథంతో సర్వేను పూర్తి చేశారు. బీజేపీ దీనిని ఇష్టపడినా, పడకున్నా.. దేశంలో కుల గణన చేపట్టేందుకు ఇది ఒక దిక్సూచిగా మారుతుంది. ఇది నాలుగు గోడల మధ్య చేయలేదు. తెలంగాణలోని లక్షల మంది ప్రజలు, అన్ని వర్గాలను 56 ప్రశ్నలు అడిగి సర్వే చేశారు. వేరే ఏ ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి సర్వే జరగలేదు. 21వ శతాబ్దపు సామాజిక, రాజకీయ, ఆర్థిక డేటా తెలంగాణ ప్రభుత్వం చేతుల్లో ఉంది. ఈ సర్వే వివరాల ఆధారంగానే కులం, విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇదొక సామాజిక, ఆర్థిక పనిముట్టు. బీజేపీకి ఇష్టం లేకపోయినా ఇదొక రాజకీయ పనిముట్టు..’ అని రాహుల్ అభివర్ణించారు. కుల గణనను కేంద్రం సరిగా చేయదు ‘ప్రస్తుతం 50 శాతం రిజర్వేషన్ల అడ్డుగోడను తొలగించే అవసరం వచ్చింది. కానీ దీనిని కేంద్రం విస్మరిస్తోంది. కుల గణన సర్వే వివరాల ఆధారంగా తెలంగాణలో జరిగే అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. హిందుత్వ పేరుతో స్థానిక రాజకీయాల్లో, ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్ల అడ్డుగోడ సామాజిక అభివృద్ధికి విఘాతంగా మారింది. ఈ అడ్డుగోడను తొలగించే విషయంపై నేను, రేవంత్రెడ్డి సహా కాంగ్రెస్ నేతలంతా బీజేపీపై ఒత్తిడి తెస్తున్నాం. మాకు తెలిసినంత వరకు కుల గణనను కేంద్రం సరైన రీతిలో నిర్వహిస్తుందని అనుకోవడం లేదు. వాళ్లు అలా చేయరు. ఓబీసీలు, దళితులు, ఆదివాసీల వాస్తవ పరిస్థితులు ఏంటో దేశ ప్రజలకు చెప్పాలన్న ఆలోచన కూడా వారికి లేదు. కులగణన వాస్తవాలు వారు ఎప్పుడు బయటకు వెల్లడిస్తారో అప్పుడు బీజేపీ భావజాలం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది..’ అని రాహుల్గాంధీ పేర్కొన్నారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇంగ్లీష్ వద్దా? ‘దేశాభివృద్ధికి డబ్బు, భూములు కాదు.. ఇంగ్లీష్ విద్యే మార్గం. తెలంగాణ కుల గణనలో ఈ విషయం స్పష్టంగా వెల్లడైంది. ఈ సర్వేకు ముందు భూములే విలువైనవని నేను కూడా అనుకునేవాడిని. కానీ ఇంగ్లీష్ ప్రాధాన్యమైన అంశం అని కుల గణన నిపుణుల కమిటీ చెప్పినప్పుడు ఆశ్చర్యం కలిగింది. ఇంగ్లీష్ అవసరం..అలాగని హిందీ, ఇతర ప్రాంతీయ భాషలు అక్కర్లేదని నేను చెప్పడం లేదు. ఏ బీజేపీ నేతను ప్రశ్నించినా ఇంగ్లీష్ వద్దంటారు. వారి పిల్లలు ఏ స్కూల్, కాలేజీలో చదువుతున్నారని ప్రశ్నిస్తే మాత్రం.. ఇంగ్లీష్ మీడియం అనే సమాధానమే వస్తుంది. మరి ఆ అవకాశాన్ని దేశంలోని వెనుకబడిన వర్గాలైన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు బీజేపీ నేతలు ఎందుకు ఇవ్వరు?..’ అని రాహుల్ నిలదీశారు. రేవంత్రెడ్డి తదితరులను అభినందిస్తున్నా.. ‘రాష్ట ప్రభుత్వం కులగణన తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపించింది. విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం అడ్డుగోడను తొలగించాలనుకుంటున్నట్లు అందులో పేర్కొంది. అయితే అందుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పకోవడం లేదు. దీనిని పార్లమెంటులో లేవనెత్తడమే మన కర్తవ్యం. రేవంత్రెడ్డి చేసిన దాన్ని మనం ప్రోత్సహించాలి. సర్వే నిర్వహించిన రేవంత్రెడ్డి, నిపుణుల కమిటీ, కాంగ్రెస్ నేతలను నేను అభినందిస్తున్నా. జరిగిన దానిని ఖర్గే పెద్దగా సమర్థించలేదు. అయినప్పటికీ ఆయనకు కూడా నా ధన్యవాదాలు..’ అని రాహుల్ అన్నారు. భవిష్యత్తు లేదనే కేంద్రం కులగణన నిర్ణయం: ఖర్గే ఓబీసీలను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు ఉండదని గమనించే దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణనలో కులగణనను భాగం చేయాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ‘భారత్ జోడో యాత్ర, సంవిధాన్ బచావ్ ర్యాలీల్లో రాహుల్గాం«దీకి ఓబీసీలంతా మద్దతు ఇచ్చారు. ‘జై బాపూ.. జై భీమ్.. జై సంవిధాన్’ అనే రాహుల్ నినాదంతో పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్కు లాభం జరిగింది. ఇది గమనించిన ఇతర పార్టీలు తమకు భవిష్యత్తు లేదని భావించి మన బాటలో నడుస్తున్నాయి. కేంద్రం తీసుకున్న జనగణనలో కులగణన నిర్ణయం అందుకు నిదర్శనం. కుల గణన సర్వే తెలంగాణ సాధించిన పెద్ద విజయం. ప్రభుత్వం చేసిన కుల గణన దేశానికి దిశానిర్దేశం చేసింది. కుల గణన చేపట్టడం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీసుకున్న సాహసోపేతమైన చర్య. రాజకీయంగా శక్తి లభించింది కాబట్టే రేవంత్రెడ్డి ఇది చేయగలిగారు. ఈ విషయాన్ని అన్ని రాష్ట్రాల్లోని ప్రతి బ్లాక్కు తీసుకెళ్లాలి. పీసీసీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, నేతలంతా ఈ బాధ్యత తీసుకోవాలి. అందరి ఎక్స్రే తీశారు కానీ.. ఈ సర్వేలో అంటరానివారే లేరని సీఎం, మంత్రులకు చెప్పాను. బీసీలు సామాజికంగా వెనుకబడ్డారు. కానీ దళితులు అంటరానివారిగా ఉన్నారు. అలా ఉన్నామని భావిస్తున్నారు. ఈ అంతరాన్ని చెరిపేయాలి. వీరిని ఒక్కతాటి పైకి తీసుకురావాలి. ఈ సర్వేలో భాగస్వామ్యం వహించిన వారందరికీ అభినందనలు. భారత్ జోడో యాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణలో కుల గణనను ప్రోత్సహించిన రాహుల్ గాందీని అభినందిస్తున్నా. రాహుల్ గాంధీ ఒత్తిడితోనే ప్రధాని మోదీ దేశ వ్యాప్త జన గణనలో కుల గణనను భాగం చేస్తూ దిగిరాక తప్పలేదు..’ అని ఖర్గే పేర్కొన్నారు. -
భారత్లోని అత్యంత సురక్షిత నగరాల జాబితా విడుదల
సాక్షి,న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత సురక్షిత నగరాల జాబితా విడుదలైంది. ఇటీవల విడుదలైన నంబియో క్రైమ్ ఇండెక్స్-2025 ప్రకారం.. అత్యంత సేఫ్టీ నగరాల జాబితాలో భారత్లోని పలు నగరాలు చోటు సంపాదించాయి. వాటిలో అహ్మదాబాద్ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది.ప్రపంచంలోనే అత్యంత సురక్షిత నగరాల సంఖ్య 385గా ఉంది. వీటిలో నంబియో సేఫ్టీ ఇండెక్స్ 68.6 శాతంతో అహ్మదాబాద్ 296 స్థానంతో భారత్ నుంచి తొలిస్థానం దక్కించుకుంది. అహ్మదాబాద్ తర్వాత జైపూర్, కోయంబత్తూరు , చెన్నై, పుణె, హైదరాబాద్, ముంబై, కోల్కతా, గురుగ్రామ్, బెంగళూరు, నోయిడా, ఢిల్లీలు ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత సురక్షిత నగరంఅబుదాబి (UAE) – 88.8 సేఫ్టీ ఇండెక్స్ స్కోర్తో తొమ్మిదవ సంవత్సరం వరుసగా టాప్లో ఉంది. ఈ ర్యాంకింగ్స్ నంబియో అనే గ్లోబల్ కక్రౌడ్ సోర్స్ డేటాబేస్ ఆధారంగా రూపొందించింది. ప్రజలు తమ నగరాల్లో నేరాలపై ఉన్న అభిప్రాయాలను, భద్రతా స్థాయిని,పోలీస్ స్పందనను పరిగణనలోకి తీసుకుని ఈ స్కోర్లు రూపొందిస్తారు. -
దూసుకొచ్చిన పాక్ డ్రోన్లు.. పేల్చిసిన భారత భద్రతా బలగాలు
అమృత్సర్: నార్కో-టెర్రర్ నెట్వర్క్లను పెంచిపోషిస్తున్న పాకిస్తాన్కు భారత భద్రతా బలగాలు షాకిచ్చాయి. పంజాబ్ సరిహద్దుల్లో వరుస ఆపరేషన్లు చేపట్టిన బీఎస్ఎఫ్ పాక్ నుంచి భారత్ వైపు వచ్చిన ఆరు డ్రోన్లను కూల్చేసింది. ఈ ఆపరేషన్లో మొత్తం ఆరు డ్రోన్లను అదుపులోకి తీసుకున్నారు. వాటిల్లో మూడు డ్రోన్లు ఏరియల్ ఫొటోగ్రఫీ,వీడియోల్ని తీసేందుకు ఉపయోగించే డీజీఐ మావిక్ డ్రోన్లు కాగా.. మరో మూడు డ్రోన్లలో మూడు పిస్టల్స్,వాటిల్లో బుల్లెట్లను నింపేందుకు వినియోగించే మ్యాగిజైన్ను,1.1 కేజీ హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్ఎఫ్ విభాగం అధికారికంగా ప్రకటించింది. అమృత్సర్ జిల్లాలోని మోధే గ్రామం వద్ద రాత్రి సమయంలో ఐదు డ్రోన్లను బీఎస్ఎఫ్ జవాన్లు టెక్నాలజీ సాయంతో వాటిని కూల్చేశారు. అక్కడ మూడు తుపాకులు, మూడు మ్యాగజైన్లు,హెరాయిన్ ఉన్న నాలుగు ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. టర్న్ టారన్ జిల్లాలోని డాల్ గ్రామం వద్ద పిస్టల్ భాగాలు, మ్యాగజైన్ను గుర్తించారు. అటారి గ్రామం వద్ద మరో డ్రోన్ను అడ్డుకుని రెండు మ్యాగజైన్లు స్వాధీనం చేసుకున్నారు. భారత భద్రతా బలగాలు చేపట్టిన ఈ ఆపరేషన్లు పాకిస్తాన్ ప్రేరిత నార్కో-టెర్రర్ నెట్వర్క్లపై గట్టి దెబ్బగా భావిస్తున్నారు. బీఎస్ఫ్, పంజాబ్ పోలీసుల సమన్వయంతో ఈ ఆపరేషన్లు జరిగాయి.కాగా, ఇలాంటి ఘటనలు సరిహద్దు భద్రతను మరింత కఠినంగా చేయాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి. -
తెలంగాణ కులగణనపై పార్టీ ఎంపీలకు సీఎం రేవంత్ పవర్ పాయింట్ ప్రజంటేషన్
సాక్షి,న్యూఢిల్లీ: తెలంగాణలో కుల గణనపై కాంగ్రెస్ ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి ఇస్తున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కొనసాగుతోంది. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్లో ప్రజెంటేషన్ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ప్రజెంటేషన్ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొన్నం, నిపుణుల కమిటీ సభ్యులు కంచె ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. -
నటుడు దర్శన్.. మళ్లీ జైలుకేనా?
కన్నడ అగ్రనటుడు దర్శన్ తూగుదీప బెయిల్ వ్యవహారంపై సుప్రీం కోర్టు మళ్లీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసులో న్యాయాధికారం దుర్వినియోగమైందంటూ తీవ్ర వ్యాఖ్యలే చేసింది. దర్శన్ బెయిల్ రద్దు పిటిషన్పై వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో నాలుగు నెలలపాటు జైలులో గడిపాడు నటుడు దర్శన్. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్తో ఉపశమనం పొందిన సంగతి తెలిసిందే. అయితే.. దర్శన్తో సహా మరో ఏడుగురి బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ కర్నాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. జస్టిస్ పార్థీవాలా, జస్టిస్ మహదేవన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్పై వాదనలు వింది. ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. ఈ కేసుకు సంబంధించి CCTV ఫుటేజ్, ఫోటోలు, రేణుకాస్వామిపై జరిగిన హింసకు సంబంధించిన ఆధారాలు చూపిస్తూ, బెయిల్ రద్దు అవసరం ఉందని లూథ్రా వాదించారు. ఇది అత్యంత క్రూరమైన హత్యగా పేర్కొంటూ, రేణుకాస్వామి శరీరంపై గాయాలు, అంగవైకల్యం, రక్తస్రావం వంటి అంశాలను వివరించారు. ఇక దర్శన్ తరఫున సీనియర్ లాయర్ కపిల్ సిబాల్, సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు. అయితే.. జులై 17నాటి విచారణ సందర్భంగా జస్టిస్ పార్థీవాలా దర్శన్ తరఫు లాయర్ కపిల్ సిబాలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘హైకోర్టు తీర్పు చదివితే, వాళ్లు నిందితులను ఎలా విడుదల చేయాలో చూస్తున్నట్టు ఉంది. ఈ కేసులో సుప్రీం కోర్టు ఎందుకు జోక్యం చేసుకోకూడదని భావిస్తున్నారో వివరించాంలి’’ అని సిబాల్ను కోరారు. దానికి కపిల్ సిబాల్ స్పందిస్తూ.. హైకోర్టు తీర్పును పక్కన పెట్టి, సాక్షుల స్టేట్మెంట్లను పరిశీలించాలంటూ కోరారు. ఈ తరుణంలో ఇవాళ్టి విచారణ సందర్భంగానూ సుప్రీం కోర్టు దర్శన్ బెయిల్పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇది న్యాయ అధికార వికృత వినియోగం అని వ్యాఖ్యానించింది. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించిన తెలిపిన బెంచ్.. పదిరోజుల్లో తీర్పు ఏంటన్నది వెల్లడిస్తామంది.కేసు ఏంటంటే..రేణుకాస్వామి అనే అభిమాని, దర్శన్ ప్రేయసి పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. 2024 జూన్లో దర్శన్, అతని సహచరులు రేణుకాస్వామిని అపహరించి, బెంగళూరులోని షెడ్లో మూడు రోజుల పాటు హింసించారు. అనంతరం అతని శవాన్ని డ్రెయిన్లో పడేశారు. ఈ కేసులో దర్శన, పవిత్రగౌడ, మరో 15 మంది అరెస్ట్ అయ్యారు. ఆపై వాళ్లు బెయిల్ మీద బయటకు వచ్చారు. 2024 డిసెంబర్ 13న కర్ణాటక హైకోర్టు దర్శన్కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. కర్ణాటక ప్రభుత్వం ఏడుగురి బెయిల్ రద్దు కోరుతూ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. అయితే విచారణలో దర్శన్కు హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై సర్వోన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చింది. ఒకవేళ సుప్రీం కోర్టులో బెయిల్ రద్దు అయితే, దర్శన్ మళ్లీ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. కేసు టైంలైన్2024 జూన్: రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ అరెస్ట్ అయ్యారు. 2024 సెప్టెంబర్ 21: అనారోగ్య కారణంగా బెయిల్ కోసం సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.2024 అక్టోబర్ 31: కర్ణాటక హైకోర్టు ఆరు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.2024 డిసెంబర్ 13: హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. -
ముంబై పేలుళ్ల కేసులో.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే
న్యూఢిల్లీ: ముంబై రైళ్లలో పేలుళ్ల కేసులో ఇటీవలే బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ కేసులో 12 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును గురువారం అత్యున్నత న్యాయస్థానం నిలిపేసింది. ప్రభుత్వ పిటిషన్పై వాదనలు విన్న చీఫ్ జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్.వి.అంజారియాలతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. నిర్దోషులుగా విడుదలైన 12 మందిని తిరిగి అరెస్ట్ చేయాలని చెప్పలేమంది. ‘ఈ కేసులో ప్రతివాదులందరినీ విడుదల చేశారు. మళ్లీ వారిని జైలుకు తీసుకొచ్చే ప్రశ్నే లేదు. అయితే, ఈ అభ్యంతరకరమైన తీర్పును మరే ఇతర కేసులలోనూ ఉదాహరణగా పరిగణించరాదు. హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తున్నాం’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం కింద ఉన్న ఇతర కేసులను హైకోర్టు తీర్పు ప్రభావితం చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొనడంతో సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 189 మంది ప్రాణాలు తీసిన 2006 ముంబై రైలు పేలుళ్ల కేసులో 12 మంది దోషులను నిర్దోషులుగా ప్రకటిస్తూ సోమవారం బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తూ మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును అత్యున్నత న్యాయస్థానం గురువారం విచారించింది.ముంబై పేలుళ్ల కేసు.. టైం లైన్2006 జూలై 11న ముంబై వెస్ట్రన్ రైల్వే లైన్లో 7 రైళ్లలో బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ దాడుల్లో 189 మంది మరణించగా, 827 మంది గాయపడ్డారు.2015లో ప్రత్యేక కోర్టు 5 మందికి మరణశిక్ష, 7 మందికి జీవిత ఖైదు విధించింది.జూలై 21, 2025.. హైకోర్టు విచారణలో ఆరోపణలు నిరూపించడంలో ప్రాసిక్యూషన్ పూర్తిగా విఫలమైంది అని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిల్ కిలోర్, జస్టిస్ శ్యామ్ చంద్రక్ పేర్కొన్నారు.కన్ఫెషన్ స్టేట్మెంట్లు, సాక్షుల వాంగ్మూలాలు, గుర్తింపు పరేడ్ వంటి ఆధారాలు నమ్మదగినవిగా లేవని కోర్టు అభిప్రాయపడింది.తీర్పు ప్రకారం, వారు ఇతర కేసుల్లో అవసరం లేకపోతే వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.జులై 24.. బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే -
చెప్పకుండా వచ్చి లేఖ ఇచ్చేసి...
సాక్షి, న్యూఢిల్లీ: అత్యంత వివాదాస్పదంగా, చర్చనీయాంశంగా మారిన జగదీప్ ధన్ఖడ్ రాజీనామా ఉదంతంలో కొత్త విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన రాజీనామా లేఖను అధికారుల ద్వారా పంపకుండా తానే స్వయంగా వెళ్లి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ధన్ఖడ్ అందజేశారు. సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో తన సామాజిక మాధ్యమ ఖాతా ‘ఎక్స్’లో ధన్ఖడ్ రాజీనామా అంశాన్ని బహిరంగంగా ప్రకటించారు. అయితే వాస్తవానికి అరగంట ముందే ఆయన ఎలాంటి ముందస్తు షెడ్యూల్ లేకుండానే నేరుగా రాష్ట్రపతిభవన్కు సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో వెళ్లారు. రాష్ట్రపతి ముర్ముతో ప్రత్యేకంగా భేటీ అయి తన రాజీనామా లేఖను అందజేశారు. తర్వాత వెనుతిరిగారు. ఆ తర్వాతే ‘ఎక్స్’లో రాజీనామా అంశాన్ని బయటపెట్టారు. ‘ఉపరాష్ట్రపతి ఎన్నిక’కు రంగం సిద్ధం ధన్ఖడ్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమైంది. ఎన్నిక షెడ్యూల్ను త్వరలోనే ప్రకటించనున్నట్లు ఈసీ తెలిపింది. అయితే, షెడ్యూల్కు ముందుగా పలు ముఖ్యమైన ప్రాథమిక కార్యకలాపాలు చేపట్టాల్సి ఉందని, ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమైనట్లు ఈసీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి లోక్సభ, రాజ్యసభలలోని ఎన్నుకోబడిన, నామినేట్ అయిన సభ్యులతో కూడిన ఓటర్ల జాబితా(ఎలక్టోరల్ కాలేజీ)ను సిద్ధం చేయనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికను నిర్వహించేందుకు రిటర్నింగ్ అధికారుల నియామకం చేపట్టనున్నారు. ఎన్నికైన సభ్యులతోపాటు నామినేటెడ్ సభ్యులకూ ఈ ఎన్నికల్లో ఓటేసేందుకు అర్హత ఉంటుంది. గత ఉపరాష్ట్రపతి ఎన్నికల వివరాలపై విశ్లేషణాత్మక నేపథ్య సమాచారం సేకరించి అన్ని పక్షాలకు అందుబాటులో ఉంచడంపై ఈసీ దృష్టి సారించనుంది. ఈ ఏర్పాట్లు పూర్తయ్యాక ఉపరాష్ట్రపతి ఎన్నికల తుది షెడ్యూల్ను త్వరలో ప్రకటించనున్నట్లు ఈసీ వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ డైరెక్టర్ పి.పవన్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మరో రెండేళ్ల పదవీకాలం ఉండగానే ధన్ఖడ్ తన పదవికి రాజీనామాచేయడం తెల్సిందే. అయితే కొత్తగా ఎన్నికయ్యే వ్యక్తి మిగిలిన ఆ రెండేళ్ల కాలానికికాకుండా పూర్తిగా వచ్చే ఐదేళ్లపాటు ఉపరాష్ట్రపతిగా సేవలందిస్తారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యత ఉంది. 543 స్థానాలున్న లోక్సభలో పశ్చిమబెంగాల్లోని బసీర్ఘాట్, 245 స్థానాలున్న రాజ్యసభలో పంజాబ్ నుంచి ఒక సీటు, జమ్మూకశ్మీర్ నుంచి నాలుగు సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ లెక్కన ప్రస్తుత సభ్యుల సంఖ్య 786కాగా అభ్యర్థి గెలవాలంటే కనీసం 394 ఓట్లు సాధించాలి. లోక్సభలో 542 మంది సభ్యులకుగాను ఎన్డీఏ కూటమికి 293 మంది సభ్యుల మద్దతుంది. రాజ్యసభలో 129 మంది ఎన్డీఏకు మద్దతిస్తున్నారు. మొత్తంగా చూస్తే అధికార కూటమికి 422 మంది సభ్యుల మద్దతుంది. దీంతో ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలుపు సునాయాసం కానుంది. ఆమోదం పొందకముందే అన్ని సర్దేసుకుంటూ.. న్యూఢిల్లీ: రాజీనామా చేయాలని శరవేగంగా నిర్ణయం తీసుకున్న జగదీప్ ధన్ఖడ్ అంతేవేగంగా తన అధికారిక నివాసం నుంచి ఖాళీచేసేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రపతి ముర్ముకు రాజీనామా లేఖ ఇచ్చేసి అధికారిక నివాసానికి రాగానే తనకు సంబంధించిన వస్తువులు, సామగ్రి ప్యాకింగ్ను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. సెంట్రల్ విస్టా పునర్అభివృద్ది ప్రాజెక్ట్లో భాగంగా ఉపరాష్ట్రపతి అధికారిక నివాసం కోసం మోదీ సర్కార్ అత్యంత అధునాతన, సౌకర్యవంతమైన ఇంటిని నిర్మించిన విషయం తెల్సిందే. ఇప్పటికే ఉపరాష్ట్రపతిగా రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించిన నేపథ్యంలో వీలైనంత త్వరగా ఆయన పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ సమీపంలోని చర్చ్ రోడ్ ఉపరాష్ట్రపతి అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉంది. అందుకే ఆ పనిని ఆయన ఇప్పటికే మొదలుపెట్టారు. గత ఏడాది ఏప్రిల్లో ఈ ఇంట్లోకి ఆయన మారారు. -
పట్టువీడని ప్రతిపక్షాలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభల్లో వరుసగా మూడో రోజు బుధవారం సైతం విపక్షాల ఆందోళనలు, నిరసనలు, నినాదాలు కొనసాగాయి. బిహార్లో అసెంబ్లీ ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, ఢిల్లీలో మురికివాడల కూల్చివేత, బెంగాలీ వలస కారి్మకుల పట్ల వివక్ష వంటి అంశాలపై వెంటనే చర్చ చేపట్టాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. సభకు సహకరించాలని కేంద్రం పదేపదే విజ్ఞప్తి చేసినా వినిపించుకోకపోవడంతో లోక్సభ, రాజ్యసభ పలుమార్లు వాయిదా పడ్డాయి. ఉభయ సభల్లో ఎలాంటి కార్యకలాపాలు జరగలేదు. బుధవారం ఉదయం లోక్సభ ప్రారంభమైన వెంటనే విపక్ష ఎంపీలు బిగ్గరగా నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. వెల్లోకి దూసుకొచ్చి ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నాయి. వారిపై స్పీకర్ ఓం బిర్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సభలో ఎంపీలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రజల ఆకాంక్షలను వెల్లడించాలి. ఇలా నిరసనలతో సభా కార్యక్రమాలను అడ్డుకోవడం సరైంది కాదు. ఇది పార్లమెంటరీ విధానం కాదు. ఎంపీల ప్రవర్తనను దేశమొత్తం గమనిస్తోంది. సభా మర్యాదను కాపాడండి. వీధుల్లో చేయాల్సిన ప్రదర్శనలు సభలో చేస్తున్నారు. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించే సభ్యులపై నిర్ణయాత్మక చర్య తీసుకోవాల్సి ఉంటుంది’’ అని హెచ్చరించారు. అయినా విపక్ష సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో సభ తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకు, తర్వాత మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో సభను స్పీకర్ గురువారానికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ అదే తీరు రాజ్యసభలోనూ అదే పరిస్థితి పునరావృతమైంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సహా పలు కీలక అంశాలపై చర్చకు ఇచి్చన వాయిదా తీర్మానాలను డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తిరస్కరించడంతో విపక్షాలు ఆందోళనకు దిగాయి. సభను సజావుగా కొనసాగించేందుకు సహకరించాలని కోరినా విపక్షాలు వినిపించుకోలేదు. దాంతో సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. మళ్లీ ప్రారంభమయ్యాక ప్రశ్నోత్తరాలు చేపట్టినా విపక్షాల ఆందోళన, నిరసనలతో 2 గంటల వరకు, తర్వాత గురువారానికి వాయిదా పడింది. నల్ల దుస్తులతో నిరసన తమ డిమాండ్లపై పార్లమెంట్లో చర్చ చేపట్టాల్సిందేనని తేల్చిచెబుతూ విపక్ష ‘ఇండియా’ కూటమి ఎంపీలు పార్లమెంట్ మకరద్వారం వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాం«దీ, ప్రియాంకా గాంధీ సహా కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, సమాజ్వాదీ పార్టీ, శివసేన(ఉద్ధవ్), జేఎంఎం, ఆర్జేడీ, వామపక్ష పారీ్టల ఎంపీలు పాల్గొన్నారు. ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి‘, ‘ఓటు బందీని ఆపండి‘ అంటూ నినాదాలతో హోరెత్తించారు. చాలామంది ఎంపీలు నల్ల దుస్తులు ధరించి నిరసన వ్యక్తంచేశారు. ఆపరేషన్ సిందూర్పై 28న ప్రత్యేక చర్చ ప్రతిపక్షాల డిమాండ్ మేరకు ‘ఆపరేషన్ సిందూర్’పై పార్లమెంట్లో ప్రత్యేక చర్చకు రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 28న లోక్సభలో, 29న రాజ్యసభలో చర్చ జరిగే అవకాశం ఉంది. దిగువ సభలో ఈ అంశంపై 16 గంటలపాటు చర్చ జరపడానికి ఈ నెల 21న జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. బుధవారం జరిగిన రాజ్యసభ బీఏసీ సమావేశంలోనూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆపరేషన్ సిందూర్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్తో జరిగిన ఘర్షణలో భారత సైన్యం దాదాపు ఆరు యుద్ధ విమానాలు కోల్పోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో వాస్తవాలు బహిర్గతం చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆపరేషన్ సిందూర్లో తొలుత లోక్సభలో సుదీర్ఘంగా చర్చ జరుగుతుందని, ఆ తర్వాత రాజ్యసభలో చర్చ ప్రారంభిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే, చర్చకు ప్రధాని మోదీ సమాధానం ఇస్తారా? లేదా? అనేదానిపై స్పష్టత ఇవ్వలేదు. బుధవారం విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లిన మోదీ ఈనెల 28వ తేదీ కల్లా స్వదేశానికి తిరిగివస్తారు. -
రాత్రికి రాత్రే అడవులపై బుల్డోజర్లు ఎందుకు?: సుప్రీంకోర్టు
రాత్రికి రాత్రి 30–40 బుల్డోజర్లను పెట్టి అడవుల్లో చెట్లను నరికించేయాల్సిన అవసరం ఏమొచ్చింది?. అభివృద్ధి కోసం అడవులను నరకడం సమంజసం కాదు. అడవులను సంరక్షించాలా? లేదా మీ అధికారులను జైలుకు పంపాలా? అనే దానిపై నిర్ణయం తీసుకోండి. ..: సీజేఐ జస్టిస్ గవాయ్ :.. సాక్షి, న్యూఢిల్లీ: రాత్రికి రాత్రి 30–40 బుల్డోజర్లను పెట్టి అడవుల్లో చెట్లను నరికించేసి సుస్థిర అభివృద్ది కోసమేనని సమర్థించుకోలేరని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఉన్న అటవీ భూమిని అంత అత్యావశ్యకంగా ధ్వంసం చేయాల్సిన అవసరం ఏమిటని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. అటవీ సంరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనంటూ సున్నితంగా హెచ్చరించారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలో జస్టిస్ కె.వినోద్ చంద్రన్, జస్టిస్ జోమలయ బాగ్చీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ, మేనక గురుస్వామి, బీ ద చేంజ్ వెల్ఫేర్ సొసైటీ తరపున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు, పి.మోహిత్రావు, మరో పిటిషనర్ తరపున ఎస్.నిరంజన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. తాజా నివేదికను దాఖలు చేశాం ప్రస్తుతం కంచ గచ్చిబౌలిలో అన్ని పనులను నిలిపివేసినట్లు ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ ధర్మాసనానికి తెలిపారు. అక్కడ ఎటువంటి పనులు జరగట్లేదని, కోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా పాటిస్తుందని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి సమగ్ర అంశాలతో కూడిన నివేదికను కోర్టులో దాఖలు చేశామన్నారు. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఈ అఫిడవిట్ను పరిశీలించేందుకు తమకు సమయం కావాలని అమికస్ క్యూరీ పరమేశ్వర్, దామా శేషాద్రి నాయుడు, పి.మోహిత్రావు, ఎస్.నిరంజన్ రెడ్డి ధర్మాసనాన్ని కోరారు. దీంతో వచ్చే వారం వాదనలు వింటామని జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. దీనిపై స్పందించిన... ప్రతివాదులు మరింత సమయం కావాలని కోరగా.. ఆగస్టు 13కు తదుపరి విచారణను వాయిదా వేశారు. పర్యావరణ అంశాలపై సుప్రీంకోర్టుకు సహాయం చేసేందుకు కేంద్ర సాధికారక కమిటీ (సీఈసీ) స్వయంగా ఆ ప్రదేశాన్ని సందర్శించి తమకు నివేదిక సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. మేం అడవులను కాపాడాం ‘సరే ప్రస్తుతానికైతే అటవీ భూమిని కాపాడారు కదా?’అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ధర్మాసనం అడిగింది. అది అటవీ భూమా.. కాదా?’అనే అంశంపై మరోసారి విచారణ జరగాల్సిన అవసరం ఉందని సింఘ్వీ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై జస్టిస్ గవాయ్ స్పందిస్తూ.. ‘ఏదేమైనా సరే ప్రస్తుతానికి ఆ స్థలంలో చెట్లు సంరక్షించబడ్డాయి. అభివృద్ధి కోసం అడవులను నరకడం అనేది సమంజసం కాదు. సుస్థిర అభివృద్ధిని నేను వ్యక్తిగతంగా సమర్థిస్తాను. అంటే దానర్థం రాత్రికిరాత్రి 30–40 బుల్డోజర్లను పెట్టి మొత్తం అడవిని ధ్వంసం చేయడాన్ని సమర్థిస్తానని మాత్రం కాదు’అని అన్నారు. అటవీ భూమిని కాపాడకపోతే అధికారులను అక్కడే టెంపరరీ జైలుకు పంపుతామని గతంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అడవులను సంరక్షించాలా లేదా మీ అధికారులను జైలుకు పంపాలా అనే దానిపై నిర్ణయం తీసుకోండి అని అని జస్టిస్ గవాయ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
కేంద్రం మెడలు వంచుతాం: సీఎం రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అమలుపై కేంద్రం మెడలు వంచి తీరుతామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఈ అంశంలో కేంద్రాన్ని ఒప్పించేలా కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు ఇండియా కూటమి పక్షాల నేతల మద్దతును సైతం కూడగడతామని చెప్పారు. తద్వారా ఒత్తిడి పెంచుతామని, ఒత్తిళ్లకు లొంగని పక్షంలో ప్రధాని మోదీని కుర్చీ దింపి, తమ నేతను కుర్చీలో కూర్చోబెట్టి బీసీ రిజర్వేషన్లను సాధించుకుంటామని అన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని తెలిపారు. ఉప రాష్ట్రపతి పదవి తెలంగాణకు ఇవ్వాలని, ఓబీసీ నేత బండారు దత్తాత్రేయకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ విచారణకు పిలిస్తే వెళ్తానని స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి బుధవారం రాష్ట్ర ఎంపీలతో కలిసి ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. రెండు బిల్లులు పంపించాం.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర సామాజిక, ఆర్థిక, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ కులగణన సర్వే పూర్తి చేసింది. అందులో వెల్లడైన వివరాల మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించాం. విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఆ మేరకు రిజర్వేషన్ల కోసం ఒకటి, స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్ల కోసం ఒకటి..ఇలా శాసనసభలో రెండు బిల్లులు చేసి కేంద్రానికి పంపించాం. ఈ విషయంలో సహకరించాలని, సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. కేంద్రం తాత్సారం చేస్తోంది.. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేసేలా వివిధ మార్గాల్లో ఒత్తిడి తెస్తున్నాం. అయితే కేంద్రం ఆమోదించకుండా తాత్సారం చేస్తోంది. గతంలో రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెస్తే, కాంగ్రెస్ అనేక పోరాటాలు చేసి వాటిని వెనక్కి తీసుకునేలా చేసింది. కులగణనను చేయబోమన్న కేంద్రాన్ని జనగణనలో కులగణనను భాగం చేసేలా ఒప్పించింది. అదే మాదిరి ఇప్పుడు కూడా కేంద్రం మెడలు వంచుతాం. మా అగ్రనేతలు రాహుల్గాం«దీ, మల్లికార్జున ఖర్గేలను కలిసి కేంద్రంపై ఒత్తిడి పెంచేలా చేయాలన్న ఉద్దేశంతో నేను, మా ఎంపీలు, మంత్రులు ఢిల్లీకి వచ్చాం. వారిని కలవడంతో పాటు కాంగ్రెస్ ఎంపీలందరినీ కలిసి రాష్ట్రంలో నిర్వహించిన సర్వే గురించి వివరిస్తాం. అలాగే ఇండియా కూటమిలోని ఇతర సభ్యులను కలుస్తాం. సహకరించాలని విజ్ఞప్తి చేస్తాం. గురువారం కాంగ్రెస్ ఎంపీలకు బీసీ రిజర్వేషన్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకురావాలని అంటున్నరు. అసలు అఖిల పక్షం ఎక్కడుంది? ప్రధాన ప్రతిపక్ష నేత నిద్రపోతున్నడు. ఆయన పిల్లలు కొట్లాడుకుంటున్నరు. తాను చెడిన కోతి వనమెల్లా చెరిచినట్లు వ్యవహరిస్తున్నారు. ఇంకేం అఖిలపక్షం. బీజేపీ రిజర్వేషన్లు వద్దంటోంది. ఎంఐఎం మద్దతిస్తోంది. బీజేపీది వితండ వాదం.. ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ వితండ వాదం చేస్తోంది. ఏకగ్రీవ తీర్మానానికి బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతిస్తే, కొత్త అధ్యక్షుడు రాంచందర్రావు మాత్రం వితండ వాదం చేస్తున్నారు. బీజేపీకి ఒకటి, కాంగ్రెస్కు మరొక రాజ్యాంగం లేదు. అంబేడ్కర్ రాజ్యాంగమే అందరికీ అమలవుతోంది. ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తే మద్దతు ఇస్తామని కిషన్రెడ్డి, బండి సంజయ్ అంటున్నారు. వాళ్లకు కనీస అవగాహన లేదు. గుజరాత్, యూపీ, మహారాష్ట్రల్లో ముస్లిం రిజర్వేషన్లు 50 ఏళ్లుగా కొనసాగుతున్నాయి. మీకు ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే ఈ మూడు రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్లు తొలగించిన తర్వాత తెలంగాణకు అలా సూచించండి. గుజరాత్లో ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్న అమిత్ షాను బీజేపీ నుంచి సస్పెండ్ చేస్తారా? మొండి, తొండి వాదనను పక్కనబెట్టాలి. బలహీన వర్గాలకు న్యాయం చేయాలి. వచ్చే ఎన్నికలు లిట్మస్ టెస్టువంటివి 2029 లోక్సభ ఎన్నికలు ఓబీసీ రిజర్వేషన్లకు లిట్మస్ టెస్ట్ వంటివి. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎక్కడా ఇవ్వలేదు. కేవలం వెనుకబాటుతనంలో ఉన్నవారికే రిజర్వేషన్ ఇస్తున్నాం. జస్టిస్ సుదర్శన్రెడ్డి ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన నివేదికను మొదట మంత్రివర్గంలో చర్చించి త్వరలో శాసనసభలో ప్రవేశపెడతాం. 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు తర్వాత మొత్తం 50 శాతం రిజర్వేషన్లే అనేది ఎప్పుడో పోయింది. కొందరు వితండవాదులు చేసే వాదనలకు కోర్టులే సమాధానం చెబుతాయి. మొదట రిజర్వేషన్లు అమలు అయిన తర్వాత సబ్ కేటగిరైజేషన్ గురించి ఎక్స్పర్ట్ కమిటీ చర్చిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసే విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోంది. తప్పులు సరిదిద్దుకోవాలంటే దత్తాత్రేయకు చాన్స్ ఇవ్వాలి ఉప రాష్ట్రపతి పదవి తెలంగాణకు ఇవ్వాలి. గతంలో వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయనను రాష్ట్రపతి చేసే అంశంపై చర్చ జరిగింది. ఆయనను ఢిల్లీ నుంచి వెనక్కి పంపించేశారు. తెలుగు మాట్లాడే ఆయనను ఘర్వాపసీ చేయించారు. ఆ తప్పును సరిదిద్దుకోవడానికి తెలంగాణ నేత, సౌమ్యుడైన బండారు దత్తాత్రేయకు ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వాలి. గవర్నర్గా ఆయన పదవీకాలం పూర్తయింది. గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయనను ఆ పదవి నుంచి తొలగించి కిషన్రెడ్డికి ఇచ్చారు. గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ను తొలగించారు. ఇప్పుడు ఆ పదవి బ్రాహ్మణుడైన ఎన్.రామచందర్రావుకు ఇచ్చారు. బీజేపీ తెలంగాణలోని ఓబీసీ నేతల గొంతు కోసింది. ఈ తప్పులన్నింటినీ క్షమించాలంటే దత్తాత్రేయకు ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వాలి. తెలంగాణ ప్రజల తరపున దత్తాత్రేయకు, ఓబీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నా. దత్తాత్రేయ అభ్యర్థిత్వానికి అందరి ఆమోదం ఉంటుంది. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మోదీ గౌరవించాలి. సొంత ఇంటివాళ్ల ఫోన్లే ట్యాప్ చేశారంట.. మీడియా సమావేశం అనంతరం రేవంత్రెడ్డి విలేకరులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్పై మాట్లాడారు. ‘ఫోన్ ట్యాపింగ్పై సిట్ విచారణ జరుగుతోంది. సొంత ఇంటివాళ్ల ఫోన్లే ట్యాప్ చేశారని తెలుస్తోంది. సొంతింటి వాళ్లవి చేసేకన్నా ఆత్మహత్య చేసుకోవడం నయం. నా ఫోన్ ట్యాప్ అయిందో? లేదో నాకు తెలియదు. నా ఫోన్ ట్యాప్ అయ్యుంటే నన్ను విచారణకు పిలిచివారు కదా. ఒకవేళ సిట్ విచారణకు పిలిస్తే కచ్చితంగా వెళతా. మా ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్లు చేసే ఉద్దేశం లేదు. దానివల్ల ఒనగూరేది లేదు. ఇది గత ఎన్నికల్లోనే రుజువైంది..’అని అన్నారు. నిబంధనల మేరకే సీఎం రమేశ్ కంపెనీకి కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీలో రోడ్ల కాంట్రాక్టు టెండర్ను బీజేపీ ఎంపీ సీఎం రమేశ్కు ఇవ్వడంపై ప్రశ్నించగా.. ‘రూ.1,600 కోట్ల ఈ–టెండర్ను నిబంధనల మేరకే వారి కంపెనీ దక్కించుకుంది. ఎల్అండ్టీ సైతం ఈ–టెండర్లో పాల్గొంది. నా మిత్రుడని ఈ టెండర్ కట్టబెట్టలేదు. ఓపెన్ టెండర్లోనే వారికి దక్కింది..’అని రేవంత్ వివరించారు. కంచ గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టి ఎక్కడా రుణాలు తీసుకోలేదని, కేవలం తెలంగాణ ప్రభుత్వ సావరిన్ బాండ్లను వేరే కంపెనీలు కొనుక్కున్నాయని స్పష్టం చేశారు. -
జగదీప్ ధన్ఖడ్కు అందే రిటైర్మెంట్ బెన్ఫిట్స్ ఇవే
సాక్షి,న్యూఢిల్లీ: గుండె సంబంధ యాంజియోప్లాస్టీ, అనారోగ్యం కారణంగా ఉపరాష్ట్రపతి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం జగదీప్ ధన్ఖడ్ ప్రకటించారు. ఈ క్రమంలో తన పదవికి రాజీనామా చేసిన తర్వాత పొందే రిటైర్మెంట్ ప్రయోజనాలేంటనే అంశంపై చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అందే రిటైర్మెంట్స్ బెన్ఫిట్స్ వివరాలు వెలుగులోకి వచ్చాయి.ప్రధాన ప్రయోజనాలుపెన్షన్: నెలకు రూ.2 లక్షలకు పైగా (ఉపరాష్ట్రపతి జీతం రూ.4 లక్షలు.అందులో 50 నుంచి 60శాతం పెన్షన్గా వస్తుంది)ప్రభుత్వ బంగ్లా: లూటెన్స్ ఢిల్లీలో టైప్ వీఐఐఐ బంగ్లాలో నివాసం ఉండొచ్చు. ఉచిత ప్రయాణం: రైలు,విమానాల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చువైద్య సేవలు: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం,వ్యక్తిగత డాక్టర్ కూడా అందుబాటులో ఉంటారుసిబ్బంది: ఇద్దరు వ్యక్తిగత సహాయకులు (PAs), భార్యకు ప్రైవేట్ సెక్రటరీఇతర సౌకర్యాలు: ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు, రెండు మొబైల్ ఫోన్లువిద్యుత్, నీటి బిల్లులు: ప్రభుత్వమే భరిస్తుంది. ఈ ప్రయోజనాలు ధన్ఖడ్ ఉపరాష్ట్ర పతి పదవిలో రెండేళ్లు పూర్తి చేసినందున వర్తిస్తాయి -
కేంద్రం మెడలు వంచుతాం: సీఎం రేవంత్
సాక్షి, ఢిల్లీ: చరిత్రాత్మక బీసీ కులగణన చేశామని.. దీని ఆధారంగా 42 శాతం రిజర్వేషన్లతో బీసీ బిల్లులు అసెంబ్లీలో ఆమోదించాము.. అయితే, కేంద్రం ఆమోదించకుండా ఆలస్యం చేస్తోందంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్రం మెడలు వంచి బీసీ రిజర్వేషన్లను సాధిస్తామంటూ తేల్చి చెప్పారు.‘‘తెలంగాణ కుల గణన దేశానికి ఒక రోల్ మోడల్.. ఒక దిక్సూచి. రిజర్వేషన్లపై బీజేపీది వితండ వాదం. బీజేపీకి ఒక రాజ్యాంగం, కాంగ్రెస్ ఒక రాజ్యాంగం దేశంలో లేదు. గుజరాత్, మహారాష్ట్ర, యూపీలలో ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ ఈ ప్రయత్నం చేస్తోంది’’ అని రేవంత్రెడ్డి ఆరోపించారు.‘‘డేటా ప్రైవసీ చట్టం వల్లే మేము కుల గణన లెక్కలు బయటపెట్టడం లేదు. తెలంగాణలో 3.9 శాతం మంది తమకు కులం లేదని డిక్లేర్ చేశారు. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికని మంత్రివర్గంలో చర్చించి శాసనసభలో పెడతాం. శాసనసభలో వివరాలు అడిగితే ఇస్తాం’’ అని రేవంత్రెడ్డి తెలిపారు. -
పడక సుఖం ఇవ్వని భర్తను..
భర్త తనను శారీరకంగా సంతృప్తిపర్చడం లేదన్న అసహనంతో ఓ భార్య పక్కదారి పట్టింది. భర్తను అడ్డుతొలగించుకునే ప్రయత్నంలో కట్టుకథ అల్లింది. కన్నీళ్లు పెట్టుకుంది. పోలీసులు ఊరుకుంటారా?.. తమదైన శైలిలో ప్రశ్నించేసరికి నిజం బయటపెట్టింది.జులై 20వ తేదీన నీహాల్ విహార్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఫర్జానా ఖాన్(29) అనే మహిళ తన భర్త మొహమ్మద్ షాహిద్(32)ను హతమార్చింది. ఆపై ఏం ఎరగనట్లు భర్త మృతదేహంతో ఆస్పత్రికి వెళ్లింది. తన భర్త ఆన్లైన్ రమ్మీలో డబ్బు పొగొట్టుకున్నాడని, అప్పుల బాధ భరించలేక కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడని కన్నీళ్లు పెట్టుకుంది.అయితే షాహిద్ అప్పటికే మరణించినట్లు నిర్ధారించిన వైద్యులు.. గాయాలపై అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు ఆమెను ప్రశ్నించారు. ఆమె మొబైల్ హిస్టరీని పరిశీలించిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.సల్పాస్ మందుతో హత్య చేయడం ఎలా?.. చాట్ హిస్టరీ డిలీట్ చేయడం ఎలా? అనే అంశాలను ఆమె సెర్చ్ చేసినట్లు ఉంది. వీటి ఆధారంగా ఆమెను ప్రశ్నించగా.. తానే నేరం చేసినట్లు ఒప్పుకుంది. భర్త తనను శారీరకంగా సంతృప్తిపర్చలేకపోతున్నాడని, ఈ క్రమంలోనే తాను మూడుసార్లు కత్తితో పొడిచి హతమార్చానని చెబుతోంది. అయితే ఆమె ఎవరితో, ఏం చాటింగ్ చేసిందనేది తేలాల్సి ఉంది. తాజా సమాచారం ప్రకారం.. ఆమె వరుసకు మరిది అయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. వరుసకు మరిది అయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. తన భర్తకు నిద్రమాత్రలిచ్చి, ఆపై కరెంట్ షాక్ పెట్టి హతమార్చింది. ప్రియుడితో జరిగిన చాటింగ్ బయటకు రావడంతో ఈ కేసు వెలుగు చూసింది. అందుకు సంబంధించిన కథనం కింది లింక్లో చదవండి.👇ఇదీ చదవండి: నా భర్త బతికే ఉన్నాడు.. నిద్ర వస్తోంది.. నువ్వు రా -
ఉనికే లేని దేశానికి ఉత్తుత్తి ఎంబసీ.. ఘరానా మోసగాడి అరెస్ట్
దేశ రాజధాని శివారు ప్రాంతమైన ఘాజియాబాద్లో కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. ఉనికే లేని ఓ దేశానికి ఉత్తుత్తి రాయబార కార్యాలయాన్ని సృష్టించిన ఓ మోసగాడు.. ఉద్యోగాలు, ఇతర దందాల పేరుతో లక్షలు గడించాడు. ఆ కేటుగాడి మోసానికి పోలీసులకే షాక్ కొట్టినంత పనైంది. హర్షవర్ధన్ జైన్.. ఘజియాబాద్లో విలాసవంతమైన రెండతస్తుల భవనం, లగ్జరీ కార్లతో రాయబారిగా బిల్డప్ ఇస్తూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. తాను ‘వెస్టార్కిటికా’(Westarctica) దేశపు రాయబారినని చెబుతూ దందాలు చేశాడు. జనాల్ని బాగా నమ్మించడానికి ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్లతో ఉన్న కార్లలో తిరగసాగాడు. వీటికి తోడు.. రాష్ట్రపతి, ప్రధాని, ఇతర రాజకీయ ప్రముఖులతో దిగిన ఫొటోలను(మార్ఫింగ్) ఆ ఆఫీస్లో ఉంచాడు. జూలై 22న ఉత్తరప్రదేశ్లోని స్పెషల్ టాస్క్ఫోర్స్ ఈ నకిలీ రాయబార కార్యాలయం గుర్తించింది. దీంతో ఆ భవనంపై దాడులు నిర్వహించగా.. అసలు విషయం బయపడింది. దీంతో హర్షవర్ధన్ జైన్ను అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ.44 లక్షల నగదు, విదేశీ కరెన్సీతో పాటు.. దౌత్య నంబర్ ప్లేట్లు ఉన్న 4 లగ్జరీ కార్లు, 12 మైక్రోనేషన్ల దౌత్య పాస్పోర్ట్లు, విదేశాంగ మంత్రిత్వ శాఖ స్టాంపులున్న పత్రాలు, 34 దేశాల స్టాంపులు, 18 దౌత్య నంబర్ ప్లేట్లను స్వాధీనం చేసుకున్నారు. హర్షవర్ధన్ జైన్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.మరో వైపు విదేశీ ఉద్యోగాల పేరుతో డబ్బు వసూలు చేస్తున్నాడని.. నకిలీ డిప్లొమాటిక్ పత్రాలు, ఫోటో మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 2011లో చట్ట విరుద్ధంగా శాటిలైట్ ఫోన్ కలిగి ఉన్నందుకు అతడిపై కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. హర్షవర్ధన్ జైన్ కార్యకలాపాలపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు.కొసమెరుపు.. వెస్టార్కిటికా నిజంగా దేశమా?.. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. అమెరికా నేవీ అధికారి ట్రావిస్ మెక్హెన్రీ 2001లో ‘వెస్టార్కిటికా’ను స్థాపించాడు. మంచు ఖండం అంటార్కిటికాలో 6.2 లక్షల చదరపు మైళ్ల విస్తీర్ణంలోని భూభాగాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాడు. ఇదొక మైక్రోనేషన్. అయితే లీగల్గా దీనిని ఏ దేశం గుర్తించలేదు. అలా దీనికి ఉనికి లేకుండా పోయింది. ఇలాంటి పేరును మన ఘరానా మోసగాడు వాడేసుకుని.. చివరకు కటకటాల పాలయ్యాడు. -
కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అవినాష్రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి బుధవారం కలిశారు. కడపలోని రాయచోటి రోడ్డులో ఊటుకూరు, ప్రకృతినగర్ తదితర ప్రాంతాల వాసుల రాకపోకలకు రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఆయా ప్రాంతాల ప్రజలు, విద్యార్థుల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని రైల్వే శాఖ దృష్టికి తీసుకొచ్చిన అవినాష్ రెడ్డి.. ఎల్సీ 122 వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి మంజూరు చేయాల్సిందిగా వినతించారు.చెన్నై- అహ్మదాబాద్ మధ్య నడిచే హంసఫర్ ఎక్స్ప్రెస్ను కడపలో స్టాపింగ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తిరుపతి - షిర్డీ మధ్య వారానికి ఒక రోజు మాత్రమే రైలు నడుస్తోందని.. అది కూడా మల్టీ చేంజ్ రూట్లుగా వెళ్లడం వల్ల 126 గంటల ప్రయాణ సమయం పడుతోందన్నారు. అదే తిరుపతి నుంచి షిర్డీకి నేరుగా ఒక రైలును ప్రతి రోజు నడపాలని కేంద్ర మంత్రిని వైఎస్ అవినాష్రెడ్డి కోరారు. తద్వార ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర భక్తులకు ఉపయోగంగా ఉంటుందని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. -
కంచ గచ్చిబౌలి కేసు.. సుప్రీం కోర్టు మరో వార్నింగ్
సాక్షి, ఢిల్లీ: వివాదాస్పద హెచ్సీయూ కంచ గచ్చిబౌలి కేసు విచారణలో భాగంగా.. అధికారులకు సుప్రీం కోర్టు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. అక్కడికక్కడే తాత్కాలిక జైళ్లను ఏర్పాటు చేసి అందులోకి అధికారులు పంపాల్సి ఉంటుందని భారత ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ బుధవారం హెచ్చరించారు. కంచ గచ్చిబౌలి కేసు విచారణ ఇవాళ సుప్రీం కోర్టులో జరిగింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ పరీశీలనకు సమయం కావాలని ప్రతివాదులు కోరారు. దీంతో రెండు వారాల సమయం ఇస్తూ.. తదుపరి విచారణను ఆగష్టు 13కి వాయిదా వేసింది. కోర్టు.. అయితే.. ప్రస్తుతం అడవిని కాపాడారు కదా? అని చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ తెలంగాణ ప్రభుత్వం తరఫున లాయర్లను ప్రశ్నించారు. దానికి ‘‘ప్రస్తుతానికి కంచ గచ్చిబౌలి భూముల్లో అన్ని పనులు ఆపేశాం’’ అని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది బదులిచ్చారు. అభివృద్ధి కోసం అడవులను నరకడం సమంజసం కాదు. రాత్రికి రాత్రి బుల్డోజర్ పెట్టి అడవిని తీసేద్దామనుకున్నారు. సుస్థిర అభివృద్ధి కోసం నేను అడ్వొకేట్ చేస్తున్నా. అడవిని కాపాడకుంటే... అధికారులను అక్కడే టెంపరరీ జైలుకు పంపుతాం అని హెచ్చరించారాయన. -
జస్టిస్ వర్మ కోసం టాప్ లాయర్లు.. విచారణకు సీజేఐ దూరం
జస్టిస్ యశ్వంత్ వర్మ నోట్ల కట్టల ఆరోపణల వ్యవహారంలో శరవేగంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు పార్లమెంట్లో ఆయన్ని అభిశంసించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు.. సుప్రీం కోర్టులో ఆయన వేసిన పిటిషన్పై ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్ విచారణ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ బుధవారం వైదొలిగారు. ఈ పిటిషన్ను విచారించేందుకు ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేయిస్తామని తెలిపారాయన. ‘‘బహుశా ఈ పిటిషన్ను నేను విచారణ చేయలేనుకుంటా. ఎందుకంటే.. జస్టిస్ సంజీవ్ ఖన్నా(మాజీ సీజేఐ) నేతృత్వంలో జరిగిన విచారణలో నేను భాగమయ్యాను. కాబట్టి దీన్ని వేరొక బెంచ్కు బదిలీ చేస్తా’’ అని పిటిషన్ తరఫు న్యాయవాది కపిల్ సిబాల్కు సీజేఐ స్పష్టం చేశారు. మార్చి 14వ తేదీన ఢిల్లీ హైకోర్టు జడ్జిగా విధులు నిర్వహించిన జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక బంగ్లాలో అగ్నిప్రమాదం సంభవించి.. కాలిన స్థితిలో నోట్ల కట్టలు కనిపించాయి. ‘న్యాయవ్యవస్థలో అవినీతి..’ అంటూ ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన సుప్రీం కోర్టు.. ఆయన్ని హుటాహుటిన అలహాబాద్ హైకోర్టుకు ట్రాన్స్ఫర్ చేసింది. అదే సమయంలో ఈ ఘటనపై దర్యాప్తునకు ముగ్గురు జడ్జిల కమిటీని ఏర్పాటు చేయించింది. ఆ కమిటీ తన నివేదికను అప్పటి చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నాకు అందించగా.. ఆయన దానిని లేఖ రూపంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మకు పంపారు. ఆ నివేదిక ప్రకారం.. జస్టిస్ యశ్వంత్ వర్మ అవినీతికి పాల్పడ్డారని, స్వచ్ఛందంగా రాజీనామాకు ఆయన అంగీకరించలేదని, కాబట్టి ఆయన్ని తొలగించాలని ఇన్-హౌజ్ కమిటీ సిఫార్సు చేసింది. అయితే తన వాదన వినకుండానే చర్యలు తీసుకుంటున్నారని సుప్రీం కోర్టులో జడ్జి యశ్వంత్ వర్మ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారణ చేపట్టాలని ఇవాళ(బుధవారం) ఆయన తరఫు లాయర్ కపిల్ సిబాల్ సీజేఐ బెంచ్ను కోరారు. జస్టిస్ వర్మ తరఫున కపిల్ సిబాల్తో పాటు ముకుల్ రోహత్గి, రాకేష్ ద్వివేది, సిద్ధార్థ్ లూథ్రాలాంటి టాప్ లాయర్లు వాదనలు వినిపిస్తుండడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఈ పార్లమెంట్ సెషన్లోనే ఆయనపై అభిశంసనకు చర్యలు నడుస్తున్నాయి. ఇలాంటి అభిశంసన తీర్మానం కోసం లోక్సభలో కనీసం 100 మంది, రాజ్యసభలో కనీసం 50 మంది సభ్యులు అభిశంసన నోటీసుపై సంతకం చేయాలి. అయితే జస్టిస్ వర్మ కేసులో ఇప్పటికే 145 మంది లోక్సభ సభ్యులు, 63 మంది రాజ్యసభ సభ్యులు ఇప్పటికే అభిశంసన నోటీసుపై సంతకం చేశారు. జడ్జి తొలగింపు కోసం భారత రాజ్యాంగంలోని 124, 217, 218 ఆర్టికల్స్ ప్రకారం నోటీసు దాఖలైంది. అయితే.. ఎంపీలు ఇచ్చిన అభిశంసన నోటీసును స్వీకరించిన కొన్ని గంటలకే రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి అయిన జగ్దీప్ ధన్ఖడ్ తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం.నెక్ట్స్ ఏంటంటే.. లోక్సభ స్పీకర్ , రాజ్యసభ ఛైర్మన్ సంయుక్తంగా ముగ్గురు సభ్యుల విచారణ కమిటీని నియమించనున్నారు. ఈ కమిటీలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఒకరు, ఓ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఓ ప్రఖ్యాత న్యాయవేత్త ఉంటారు. ఈ కమిటీకి నివేదిక సమర్పించడానికి మూడు నెలల గడువు ఇస్తారు. అయితే ఈ కమిటీ ముందు తన వాదనలు వినిపించేందుకు జస్టిస్ యశ్వంత్ వర్మకు అవకాశం(మూడుసార్లు) ఉంటుంది. గతంలో త్రీజడ్జి కమిటీ సమర్పించిన నివేదికతో పాటు జస్టిస్ వర్మ వాదనలు, సాక్ష్యాలను పరిశీలించాకే స్పెషల్ కమిటీ ఒక నివేదికను సమర్పిస్తుంది. ఈపై ఇరు సభల్లో ఆ నివేదికపై చర్చ జరిగాక.. అభిశంసన తీర్మానాన్నిప్రవేశపెడతారు. దానిని 2/3 మెజారిటీతో సభ్యులు ఆమోదించాక రాష్ట్రపతికి పంపిస్తారు. అప్పుడు ఆయన తొలగింపుపై రాష్ట్రపతి సంతకం చేసి ఉత్తర్వులు జారీ చేస్తారు. అయితే ప్రస్తుతం పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడుతున్నాయి. అదే సమయంలో ఆయన పిటిషన్ సుప్రీం కోర్టులో పెండింగ్లో ఉంది. ఆగష్టు 21వ తేదీతో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్నాయి. ఈ తరుణంలో ఆయన్ని తొలగించడం ఈ సెషన్లో సాధ్యం కాకపోవచ్చని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
మామిడి రైతుల నోట్లో మట్టి
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: మామిడి రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రాష్ట్రంలో ఉత్పత్తి అయిన మామిడిలో కేవలం 25 శాతానికే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం(ఎంఐఎస్) కింద ఆర్థిక మద్దతు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అందులోని వివరాలు.. ‘2025–26 మార్కెటింగ్ సీజన్కు ఎంఐఎస్ కింద తోతాపురి మామిడి ధర లోటు చెల్లింపునకు గరిష్ట పరిమితిని 1,62,500 టన్నులు(మొత్తం ఉత్పత్తిలో 25 శాతం)గా నిర్ధారించాం. క్వింటాకు కనీస మద్దతు ధరను రూ.1,490.73గా నిర్ణయించాం. తోతాపురి మామిడి రోజు వారీ అమ్మకం ధరను రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ/హార్టీకల్చర్/ సహకార విభాగాల ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ నిర్ణయిస్తుంది. కనీస మద్దతు ధర, అమ్మకపు ధర మధ్య వ్యత్యాసం గరిష్టంగా 25 శాతం ఎంఐపీ(క్వింటాకు రూ.372.68) ఉంటుంది. ఈ భారాన్ని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం 50-50 నిష్పత్తిలో పంచుకోవాలి. లోటు ధర చెల్లింపు ప్రయోజనాలు పొందేందుకు రైతులు తమ ఉత్పత్తి చెల్లుబాటయ్యే డాక్యుమెంట్లతో ఏపీఎంసీలు, మామిడి ప్రాసెసింగ్ యూనిట్లు, ర్యాంప్లలో విక్రయించాలి. వీటిని జిల్లా కలెక్టర్లు రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తులు, పశువుల మార్కెటింగ్ చట్టం–1966 ప్రకారం ప్రకటిస్తారు’ అని లేఖలో కేంద్రం స్పష్టం చేసింది. కర్ణాటకలోనే మేలు..రాష్ట్రంలో 6.50 లక్షల టన్నుల మామిడి ఉత్పత్తి కాగా.. ఇందులో 1.62 లక్షల టన్నుల కొనుగోలుకే ఆర్థిక మద్దతు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. ఇందులో కూడా కనీస మద్దతు ధర, అమ్మకపు ధర మధ్య వ్యత్యాసాన్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం చెరి సగం భరించాలని స్పష్టంగా పేర్కొంది. అంటే క్వింటాకు రూ.372.68ల్లో కేంద్రం రూ.186.34 మాత్రమే ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న చంద్రబాబు రాష్ట్ర రైతులకు న్యాయం చేయడంలో విఫలమయ్యారనడానికి ఇదే నిదర్శనం. తమ రాష్ట్ర మామిడి రైతులను ఆదుకోవాలని కర్ణాటకకు చెందిన కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి లేఖ రాయగా.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వెంటనే స్పందించి.. ఎలాంటి ఆంక్షలు లేకుండా క్వింటా మామిడికి రూ.1,616 ధర నిర్ణయించారు. అలాగే కర్ణాటకలో 2.50 లక్షల టన్నుల మామిడిని కొనుగోలుకు ఆర్థిక మద్దతు ఇచ్చేందుకు ఒప్పుకున్న కేంద్రం.. ఏపీలో కేవలం 1.62 లక్షల టన్నులకే అనుమతి ఇవ్వడం చంద్రబాబు ప్రభుత్వ అసమర్థతకు నిదర్శమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అది కూడా సీజన్ ముగింపు దశలో ఈ నిర్ణయం తీసుకోవడంపై మండిపడుతున్నారు. నెల రోజుల్లోపు అమ్ముకున్న రైతులకే వర్తింపు..‘రైతులు తమ మామిడి ఉత్పత్తులను ప్రభుత్వ గుర్తింపు పొందిన వ్యాపారులకే విక్రయించాలి. విక్రయం జరిగిన ప్రామాణికతను నోటిఫైడ్ మార్కెట్, మండీ లేదా ప్రాసెసింగ్ యూనిట్ల వద్ద నమోదు చేయాలి. వ్యాపారి పేరు కేంద్రం, రాష్ట్రం నోటిఫై చేసిన జాబితాలో ఉండాలి. వీటిని సంబంధిత జిల్లా కలెక్టర్ ధ్రువీకరించాలి. ఉద్యాన శాఖ అధికారుల వద్ద రైతులు తమ బ్యాంక్ ఖాతా వివరాలను సమర్పించాలి’ అని నిబంధనలు విధించారు. అంటే రైతు మార్కెట్లో విక్రయించడమే కాదు.. సరైన వ్యాపారి ద్వారా, సరైన కేంద్రంలో అమ్మాలి. లేదంటే పథకం వర్తించదని కేంద్రం స్పష్టం చేసింది. పైగా ఈ నెల 21 నుంచి నెల రోజుల్లోపు అమ్ముకున్న రైతులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని మెలిక పెట్టింది. వాస్తవానికి ఇప్పటికే చాలా మంది రైతులు పంటను అయినకాడికి తెగనమ్ముకొని తీవ్ర నష్టాల పాలయ్యారు. ఇక వందలాది మంది రైతులు గిటు్టబాటు ధర లేక వేలాది టన్నుల కాయలను రోడ్లపై పారబోశారు. మరికొందరు చెట్లకే కాయల్ని వదిలేయగా.. ఇంకొందరైతే చంద్రబాబు ప్రభుత్వ తీరుతో విసిగి వేసారి ఏకంగా తోటలనే నరికేశారు. -
రాష్ట్రపతికి గడువుపై మీరేమంటారు?
న్యూఢిల్లీ: అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలిపే విషయంలో రాష్ట్రపతికి కాల పరిమితి విధించడంపై సుప్రీంకోర్టు మంగళవారం కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 29వ తేదీలోగా సమాధానాలను అందజేయాలంటూ ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించింది.ఈ అంశంపై ఆగస్ట్లో విచారణ చేపడతామని వెల్లడించింది. రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలిపే విషయంలో రాష్ట్రపతి న్యాయస్థానాలు కాల పరిమితి విధించవచ్చా అంటూ మేలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సుప్రీంకోర్టుకు 14 ప్రశ్నలతో లేఖ రాయడం తెల్సిందే. పరిశీలన కోసం గవర్నర్లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి అవి అందిన నాటి నుంచి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఏప్రిల్లో జారీ చేసిన ఉత్తర్వులు సంచలనం రేపడం తెల్సిందే. -
అపాచీ ఆగయా
న్యూఢిల్లీ: భారత సైన్యంలో మైలురాయి లాంటి ఘట్టం చోటుచేసుకుంది. 15 నెలల నిరీక్షణకు తెరపడింది. అత్యాధునిక ఏహెచ్–64ఈ అపాచీ హెలికాప్టర్లు అమెరికా నుంచి భారత్కు చేరుకున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్లోని హిండన్ ఎయిర్బేస్లో అడుగుపెట్టాయి. మొదటి బ్యాచ్లో భాగంగా మూడు హెలికాప్టర్లను అమెరికా మిలటరీ సరుకు రవాణా విమానంలో మంగళవారం ఇండియాకు చేర్చారు. ఒప్పందం ప్రకారం 2024 మార్చి నెలలోనే రావాల్సి ఉండగా, సాంకేతిక కారణాలతో పలుమార్లు జాప్యం చోటుచేసుకుంది. ఏహెచ్–64ఈ అపాచీ హెలికాప్టర్లను అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ రూపొందించింది. ఎడారిని భ్రమింపజేసే రంగులో ఉన్న ఈ చాపర్లను రాజస్తాన్లోని జైపూర్లో మోహరించబోతున్నారు. ఇవి ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ మలీ్టరోల్ కాంబాట్ హెలికాప్టర్లు. ఎన్నెన్నో ప్రత్యేకతలున్నాయి. ఒప్పందం ప్రకారం బోయింగ్ సంస్థ మొత్తం ఆరింటిని సరఫరా చేయాల్సి ఉండగా, మిగతా మూడు హెలికాప్టర్లను ఈ ఏడాది ఆఖరు కల్లా అందించనుంది. ఇప్పటికే 22 ఈ–మోడల్ అపాచీలను బోయింగ్ కంపెనీ భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్) అందజేసింది. ఏహెచ్–64ఈ అపాచీలను సరఫరా చేయడం ఇదే మొదటిసారి. మొత్తం ఆరు హెలికాప్టర్ల కోసం భారత ప్రభుత్వం అమెరికా సర్కార్తోపాటు బోయింగ్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ రూ.4,168 కోట్లు. శత్రువులపై నిప్పుల వాన అపాచీ హెలికాప్టర్ల రాక పట్ల భారత సైన్యం హర్షం వ్యక్తంచేసింది. వీటితో సైనిక దళాల పోరాట సామర్థ్యం మరింత పెరుగుతుందని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ప్రధానంగా భారత్–పాకిస్తాన్ సరిహద్దుల్లో కీలక సైనిక ఆపరేషన్ల కోసం ఏహెచ్–64ఈ అపాచీలను ఉపయోగించబోతున్నారు. ఉగ్రవాదుల కార్యకాలపాలను కట్టడి చేయడంతో కీలక పాత్ర పోషించబోతున్నాయి. ముష్కరుల గుండెల్లో వణుకు పుట్టించడం తథ్యమని నిపుణులు అంటున్నారు. భూఉపరితలంతోపాటు ఆకాశంలో శత్రువుల ఉనికిని గుర్తించి, దాడి చేయడంలో అడ్వాన్స్డ్ టార్గెటింగ్ సిస్టమ్స్తో కూడిన ఈ హెలికాప్టర్లకు తిరుగులేదని చెబుతున్నారు. అమెరికా సైన్యంలో వీటి శక్తిసామర్థ్యాలు నిరూపితం కావడంతో కొనుగోలు చేసేందుకు ఎన్నో దేశాలు ఆసక్తి చూపుతున్నాయని బోయింగ్ సంస్థ తెలియజేసింది. ⇒ ఏహెచ్–64ఈ అపాచీ అటాక్ హెలికాప్టర్లలో తుపాకులు, రాకెట్లు, క్షిపణుల వంటి బహుళ ఆయుధాలు అమర్చారు. 30 ఎంఎం ఎం230 చైన్ గన్, 70 ఎంఎం హైడ్రా రాకెట్లు ఇందులో అంతర్భాగమే. తక్కువ దూరం, ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలపై సులువుగా దాడి చేయొచ్చు. ⇒ గంటకు 365 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. 480 కిలోమీటర్ల పరిధిలో పనిచేయగలవు. ఆటోమేటిక్ చైన్ గన్ నిమిషానికి 625 రౌండ్లు పేల్చగలదు. ⇒ ఇక ఏజీఎం–114 హెల్ఫైర్ క్షిపణులతో భూమిపై ఆరు కిలోమీటర్ల దూరంలోని సాయుధ వాహనాలు, యుద్ధ ట్యాంక్లను సైతం ధ్వంసం చేయొచ్చు. ⇒ గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే స్ట్రింగర్ మిస్సైళ్లు మరో ప్రత్యేకత. గాలిలో ప్రయాణిస్తుండగానే శత్రుదేశాల హెలికాప్టర్లు, మానవ రహిత వాహనాలను కూల్చేయవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే అపాచీలు శత్రువులపై నిప్పుల వర్షం కురిపించి, తుత్తునియలు చేయగలవు. ⇒ అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో పనిచేయడం మరో ప్రత్యేకత. పగలు, రాత్రి, వర్షంలో, దుమ్ములో, ధూళిలో, పొగలో... భౌగోళిక పరిస్థితులు ఎలా ఉన్నా ముందుకు దూసుకెళ్లి దాడి చేసేలా ఇందులో సెన్సార్లు, టార్గెటింగ్ వ్యవస్థలు ఉన్నాయి. ⇒ సంక్లిష్టమైన యుద్ధ వాతావరణాల్లోనూ సమర్థంగా పనిచేస్తాయి. దృఢమైన నిర్మాణం కావడంతో శత్రువుల దాడిని తట్టుకుంటాయి. చిన్నపాటి ఆయుధాలు ప్రయోగించినా ఏమాత్రం చెక్కుచెదిరే ప్రసక్తే ఉండదు. అపాచీలో ఇద్దరు ప్రయాణించవచ్చు. ఒకరు పైలట్గా వ్యవహరిస్తారు. మరొకరు ఆయుధ వ్యవస్థను నియంత్రిస్తారు. ⇒ అపాచీ హెలికాప్టర్లు అమెరికా సైన్యంలో గత 40 ఏళ్లుగా సేవలందిస్తున్నాయి. 1980వ దశకం తర్వాత కీలకమైన ఆపరేషన్లలో పాల్గొన్నాయి. విశ్వసనీయత, ప్రభావశీలతను నిరూపించుకున్నాయి. -
రెండో రోజూ అదే రగడ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభలు వరుసగా రెండో రోజు మంగళవారం సైతం అట్టుడికాయి. బిహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, ఆపరేషన్ సిందూర్ సహా పలు కీలక అంశాలపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలపై వెంటనే చర్చ ప్రారంభించాలని డిమాండ్ చేశాయి. ఆపరేషన్ సిందూర్ సహా అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం పదేపదే ప్రకటించినా విపక్షాలు వెనక్కి తగ్గలేదు. ఆయా అంశాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని తేచ్చిచెప్పాయి.మంగళవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో సమావేశమయ్యారు.కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ, డీఎంకే, నేషనల్ కాన్ఫరెన్స్ తదితర పార్టీల ఎంపీలు హాజరయ్యారు. బిహార్లో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణతోపాటు పహల్గాం ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సిందూర్, పాకిస్తాన్తో కాల్పుల విరమణ ప్రక్రియలో అమెరికా జోక్యం, నియోజకవర్గాల పునర్విభజన, దేశంలో దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు, మహిళలపై పెరుగుతున్న దౌర్జన్యాలు, అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన, మణిపూర్ హింసాకాండ తదితర అంశాలపై చర్చించారు. ప్రధాని మోదీ సభకు హాజరై, వీటిపై సమాధానం ఇచ్చేలా ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. విపక్షాల భేటీలో తీసుకున్న నిర్ణయాల మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై లోక్సభలో కాంగ్రెస్ ఎంపీలు గౌరవ్ గొగోయ్, మాణిక్కం ఠాగూర్, రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ వాయిదా తీర్మానాలు ఇచ్చారు. విపక్ష ఎంపీల తీరుపై లోక్సభ స్పీకర్ ఆగ్రహం లోక్సభ ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే విపక్షాలు ఆందోళనకు దిగాయి. బిహార్ ఓటర్ల జాబితా సవరణతోపాటు ప్రధాన అంశాలను ప్రస్తావిస్తూ ప్లకార్డులు ప్రదర్శించాయి. నినాదాలు చేస్తూ నిరసన కొనసాగించాయి. సభలో స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టారు. వ్యవసాయానికి సంబంధించిన కీలకమైన అంశాలు ఉన్నందు వీటిపై చర్చకు సహకరించాలని వ్యవసాయ మంత్రి శివరాజ్సింగ్ చౌహన్ ప్రతిపక్షాలను కోరారు. అయినప్పటికీ విపక్ష ఎంపీలు వెనక్కి తగ్గకుండా ఆందోళన కొనసాగించడంతో సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది.సభ పునఃప్రారంభమైన తర్వాత విపక్షాల ఆందోళన కొనసాగింది. స్పీకర్ స్థానంలో ఉన్న బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ స్పందిస్తూ... విపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. కేంద్ర మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ సైతం మాట్లాడారు. సభకు సహకరించాలని విపక్ష సభ్యులను కోరారు. అయినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో సభ తిరిగి 2 గంటల వరకు వాయిదా పడింది. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత కూడా విపక్ష సభ్యులు ఆందోళన విరమించలేదు. వారి వైఖరిని స్పీకర్ తప్పుపట్టారు.ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెల్లోకి దూసుకురావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చ జరగకుండా సభా సమయాన్ని వృథా చేస్తున్నారని మండిడ్డారు. విపక్షాలు నిరసన కొనసాగించడంతో సభ బుధవారానికి వాయిదా పడింది. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. వాయిదా తీర్మానం నోటీసులను డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ తిరస్కరించడం పట్ల విపక్షాలు నిరసన వ్యక్తంచేశాయి. సభ తొలుత 12 గంటలకు వరకు, తర్వాత మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేయడంతో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ఎగువ సభ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఓటర్ల హక్కులు కాలరాస్తున్నారు పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడిన తర్వాత విపక్ష ఎంపీలు పార్లమెంట్ మకరద్వారం మెట్లపై నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అఖిలేశ్ యాదవ్ పాల్గొన్నారు. బిహార్లో ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. -
రాజీపడలేకే.. రాజీనామా?
న్యూఢిల్లీ: గుండె సంబంధ యాంజియోప్లాస్టీ, అనారోగ్యం కారణంగా ఉపరాష్ట్రపతి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం జగదీప్ ధన్ఖడ్ ప్రకటించిన కొద్దిసేపటికే ఆయన నిజంగానే అంత అనారోగ్యంగా ఉన్నారా? లేదంటే మోదీ సర్కార్పై మరింత అసహనంతో రగిలిపోయారా?. ఆయనకు కోపం తెప్పించిన విషయమేంటి?. అందుకు స్పందనగా మోదీ సర్కార్ ఏం చేసింది? ఇలాంటి వరుస ప్రశ్నల పరంపర సోమవారం మొదలై గంటలు గడుస్తున్నకొద్దీ సందేహాలు, విశ్లేషణలు మరింత ఎక్కువయ్యాయి.కాలిన కరెన్సీ కట్టల ఉదంతంలో అభిశంసనను ఎదుర్కోబోతున్న అలహాబాద్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ పరోక్షంగా ధన్ఖడ్ పదవికి ఎసరుపెట్టారని మెజారిటీ విపక్ష పార్టీలు వాదిస్తున్నాయి. సాధారణంగానే న్యాయవ్యవస్థపై పదునైన విమర్శనాస్త్రాలు సంధించే ధన్ఖడ్ అరుదుగా వచ్చే జడ్జీల అభిశంసన అవకాశాన్ని తన హయాంలో విజయవంతంగా పూర్తిచేయాలన్న అత్యుత్సాహం చివరకు కేంద్రప్రభుత్వానికి కోపం తెప్పించిందని తెలుస్తోంది.మీ ఏకపక్ష నిర్ణయంపై తాము తీవ్ర అసంతృప్తితో ఉన్నామని తెలియజేప్పేందుకే పార్లమెంట్ వ్యవహారాల సలహా కమిటీ(బీఏసీ) భేటీకి రాజ్యసభ పక్షనేత జేపీ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజులు రాలేదని తెలుస్తోంది. దీనిపై ధన్ఖడ్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోయారని విశ్లేషణలు వెలువడ్డాయి. అన్ని విషయాల్లో ప్రభుత్వానికి మద్దతు పలికే తనను ఇలా కేంద్రప్రభుత్వం ఒకే ఒక్క అంశాన్ని సాకుగా చూపి అవమానించిందనే తీవ్ర అసహనంతో వెంటనే ఆయన రాజీనామాకు సిద్ధపడ్డారని తెలుస్తోంది. మధ్యాహ్నం 1 గంట నుంచి 4.30 మధ్యలోనే.. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 4.30 గంటల మధ్యలోనే ప్రభుత్వానికి, ఉపరాష్ట్రపతికి మధ్య సఖ్యత ఒక్కసారిగా, పూర్తిగా చెడిందని కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు జైరాం రమేశ్ ‘ఎక్స్’లో ఒక పోస్ట్చేశారు. ‘‘కీలక అంశాలపై చర్చించేందుకు సోమవారం మధ్యాహ్నం 12.30 నిమిషాలకు ధన్ఖడ్ సారథ్యంలో బీఏసీ భేటీ జరిగింది. ఈ భేటీకి నడ్డా, రిజిజు హాజరయ్యారు. మళ్లీ 4.30 గంటలకు సమావేశమవుదామని ధన్ఖడ్ చెప్పారు. ఆ సమయంలో భేటీకి నడ్డా, రిజిజు రాలేదు. కనీసం రావట్లేదని ధన్ఖడ్ సమాచారం ఇవ్వలేదు. దీంతో ఆయనకు పరువు పోయినంత పనైంది. దాంతో చేసేదిలేక భేటీని మంగళవారం మధ్యాహా్ననికి వాయిదావేసి ఆయన నిరుత్సాహంగా వెళ్లిపోయారు’’అని జైరాం వెల్లడించారు.ఖర్గేకు అవకాశం ఇవ్వడమూ మరో కారణమా? సోమవారం ఉదయం సభలో ప్రశ్నోత్తరాల గంట ముగిశాక రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే మాట్లాడేందుకు ధన్ఖడ్ అనుమతించారు. దీంతో ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాలపై కేంద్రప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శిస్తూ ఖర్గే ప్రసంగించారు. ఆపరేషన్సిందూర్పై వారం తర్వాత చర్చకు ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ ఖర్గేకు ముందే ఆ అంశంపై అవకాశమిచ్చి తమపై విమర్శలు గుప్పించే అవకాశం అనవసరంగా ఇచ్చారని ధన్ఖడ్పై మోదీ సర్కార్ గుర్రుగా ఉందని కొందరు బీజేపీ పార్లమెంట్ సభ్యులే చెప్పడం గమనార్హం.పుండుమీద కారం చల్లినట్లుగా ఖర్గే ప్రసంగించిన వెంటనే జడ్జి వర్మపై అభిశంసనకు సంబంధించి రాజ్యసభలో కేవలం విపక్ష సభ్యుల నోటీస్ను ధన్ఖడ్ ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నోటీస్పై అధికారకూటమి ఎంపీల సంతకాలు లేవు. అయినాసరే దానికి ధన్ఖడ్ ఆమోదముద్రవేయడం ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. ఇదే అంశంపై లోక్సభలో జడ్జిపై అభిశంసన తీర్మానాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సమయంలోనే ఆ నోటీస్కు రాజ్యసభ చైర్మన్ హోదాలో ధన్ఖడ్ ఆమోదం తెలపడాన్ని మోదీ సర్కార్ తీవ్ర అవమానంగా భావించినట్లు తెలుస్తోంది. విపక్షాల నోటీస్ ఆమోదంతో ఇకపై జరిగే అభిశంసన ప్రక్రియ మొత్తం విజయమంతా విపక్షాల ఖాతాలో పడిపోతుందన్న అక్కసు అధికారపక్షంలో పెరిగింది. దీని తర్వాతనే ఖర్గే, రిజిజులు బీఏసీ భేటీకి డుమ్మా కొట్టడం, ధన్ఖడ్ అసహనం వ్యక్తంచేయడం చకచకా జరిగిపోయాయని తెలుస్తోంది. అవమానించిన నడ్డా! రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే ప్రసంగిస్తుండగా నడ్డా ఉద్దేశపూర్వకంగా కల్పించుకున్నారు. అధ్యక్షస్థానంలో కూర్చున్న ధన్ఖడ్కు వేలు చూపిస్తూ.. ‘‘ఇక్కడ ఖర్గే మాట్లాడింది ఏదీ రికార్డింగ్లోకి వెళ్లదు. నేను ఏం మాట్లాడితే అది మాత్రమే రికార్డుల్లోకి వెళ్తుంది’’అని అన్నారు. ‘‘ఖర్గే ప్రసంగంవేళ నిష్పాక్షికంగా ధన్ఖడ్ సభ నడుపుతుంటే నడ్డా కల్పించుకున్నారు. అలా అవమానించడం ఆయన తట్టుకోలేకపోయారు.ఇది ఆకస్మిక నిర్ణయమేరాజీనామా లేఖలో పేర్కొన్న ‘అనారోగ్యం’కారణం కానేకాదని ఉపరాష్ట్రపతి సచివాలయం సైతం పరోక్షంగా ధ్రువీకరిస్తోంది. ఉపరాష్ట్రపతి జూలై 23వ తేదీన జైపూర్లో ఒకరోజు పర్యటన తాజాగా ఖరారైంది’’అని సోమవారం మధ్యాహ్నం 3.53 గంటలకు ఉపరాష్ట్రపతి సెక్రటేరియట్ ఒక ప్రకటనలో పేర్కొంది. మరికొన్ని గంటల్లో సొంత రా ష్ట్రపర్యటనకు సంసిద్ధమైన వ్యక్తి మదిలో రాజీనామా ఆలోచన ఉండదని, సోమ వా రం జరిగిన అనూహ్య పరిణామాలే ఆ యనను రాజీనామాకు ఉసిగొల్పాయని తెలుస్తోంది.ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా: మోదీన్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి పదవికి సోమవారం రాజీనామా చేసిన జగదీప్ ధన్ఖడ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘శ్రీ జగదీప్ ధన్ఖడ్జీకి భారత ఉపరాష్ట్రపతి సహా వివిధ హోదాల్లో మన దేశానికి సేవ చేయడానికి అనేక అవకాశాలు లభించాయి. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా’’ అని మోదీ ఎక్స్లో పేర్కొన్నారు. -
ఎయిరిండియా విమానంలో మంటలు
సాక్షి,న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిర్పోర్టులో కలకలం. ఎయిరిండియా విమానంలో మంటలు వ్యాపించాయి. మంగళవారం (జూలై 22) హాంకాంగ్ నుండి ఢిల్లీకి వచ్చిన ఎయిరిండియా విమానం ఏఐ 315 ఢిల్లీ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయ్యింది. ల్యాండింగ్ జరిగిన కొద్ది సేపటికే విమానం ఏపీయూలో (Auxiliary Power Unit)లో మంటలు చెలరేగాయి.ప్రమాదంతో అప్రమత్తమైన ఢిల్లీ ఎయిర్ పోర్టు సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఏపీయూ అనేది విమానాల్లో తోక భాగంలో గ్యాస్ టర్బైన్ ఇంజిన్లా పనిచేస్తుంది. విమానంలో లైట్లు, కంప్యూటర్లు, నావిగేషన్ వ్యవస్థలు మొదలైనవి ఈ ఏపీయూ వ్యవస్థ ద్వారా పని చేస్తాయి. విమానం ఇంజిన్ ప్రారంభం కావాలంటే తగినంత గాలి కావాలి. ఆ గాలిని ఈ ఏపీయూ అందిస్తోంది. అంతేకాదు కేబిన్లో ప్రయాణికులకు చల్లటి గాలిని అందించడంలో సహాయపడుతుంది. విమానానికి ఉన్న మెయిన్ ఇంజిన్ విఫలమైతే ఏపీయూ ద్వారా గాలి,కరెంట్ ఉత్పత్తి అవుతుంది. -
కాంగ్రెస్కు బిగ్ షాక్
సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్కు బిగ్ షాక్ తగిలింది. 2018-2019 సంవత్సరానికి గానూ రూ.199.5 కోట్ల ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ ఇన్కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యూనల్ను ఆశ్రయించింది. ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యూనల్ కాంగ్రెస్ విజ్ఞప్తిని తిరస్కరించింది. పన్ను మినహాయింపు ఇవ్వడం అంటే ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 13ఏను ఉల్లంఘించినట్లే అవుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు అందుకు గల కారణాల్ని ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యూనల్ ప్రస్తావించింది. కాంగ్రెస్ పార్టీ తన ఆదాయపు పన్ను రిటర్న్ను 2019 ఫిబ్రవరి 2న ఫైలింగ్ చేసింది. ఇది 2018 డిసెంబర్ 31 చివరి తేదీ లోపు చేయాల్సి ఉంటుంది. సెక్షన్ 139(1) ప్రకారం డ్యూ డేట్ కింద రాకపోవడం వల్ల, సెక్షన్ 13A ప్రకారం మినహాయింపు పొందలేకపోయింది.దీనికి తోడు పార్టీ ఇన్ కమ్ ట్యాక్స్ నియమాలకు విరుద్ధంగా నగదు విరాళాలు సేకరించింది. పార్టీ సేకరించిన రూ.14.49 లక్షల నగదులో విరాళాలు అందించిన దాత రూ.2వేల కంటే ఎక్కువ మొత్తంలో సమర్పించారు. తద్వారా సెక్షన్ 13A(డీ) నిబంధనలను ఉల్లంఘించింది.రాజకీయ పార్టీలు మినహాయింపులు పొందాలంటే కఠినమైన నిబంధనలు పాటించాలి. చారిటబుల్ ట్రస్టులుకి ఉన్న వెసులుబాటు రాజకీయ పార్టీలకు వర్తించదు. దీంతో తాజా ట్యాక్స్ ట్రిబ్యూనల్ నిర్ణయం కాంగ్రెస్కు ఎదుదెబ్బ తగిలినట్లైంది. -
కన్జ్యూమర్ ఈజ్ కింగ్.. క్యూఆర్ కోడ్ వివాదంపై సుప్రీం
సాక్షి,న్యూఢిల్లీ: కన్వర్ యాత్రికులు వెళ్లే మార్గాల్లోని తినుబండారాల షాపులు, ఇతర దుకాణదారులు తమ పేర్లు బోర్డులపై ప్రదర్శించాలంటూ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాల్ని రద్దు చేయాలంటూ జారీ చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయంపై తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. కన్వార్ యాత్ర కొనసాగుతున్న రూట్లలో షాపులు,దుకాణాల వివరాల్ని వెల్లడిస్తూ ప్రదర్శించే క్యూఆర్ కోడ్ వివాదంపై పిటిషనర్లు (అపూర్వానంద్ జా, మహువా మోయిత్రా తదితరులు) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విధానం మతపరమైన వివక్ష, అసమానత్వానికి దారి తీస్తోందని పిటిషన్లలో పేర్కొన్నారు. అయితే, ఈ పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్కే సింగ్లు క్యూఆర్కోడ్లను తొలగించాలనంటూ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టేందుకు తిరస్కరించారు. ఈ సందర్భంగా క్యూర్కోడ్ వివాదంపై సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.కన్జ్యూమర్ ఈజ్ కింగ్. వినియోగదారుడి ఏహోటల్లో ఏ వంటల్ని తయారు చేస్తున్నారు. గతంలో ఇదే హోటల్లో నాన్ వెజ్ను వడ్డించారా? అన్న విషయాలు తెలుసుకునే హక్కు ఉంది. అదే సమయంలో అయితే సదరు హోటల్ యజమానుల, ఉద్యోగుల వ్యక్తిగత వివరాలను బహిరంగంగా ప్రదర్శించాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. హోటల్ యాజమానులకు రిజిస్ట్రేషన్ తప్పని సరి చేసింది -
రాజీనామానే మంచిదనుకున్న ధన్ఖడ్!
జనతాదళ్, కాంగ్రెస్, బీజేపీలలో వివిధ పదవులు, బాధ్యలతో సుదీర్ఘ రాజకీయానుభవం సంపాదించుకున్న వ్యక్తి. పైగా ఓ రాష్ట్రానికి గవర్నర్గా పని చేసిన వ్యక్తి. అనూహ్యంగా తెర మీదకు తెచ్చి.. ‘రైతుబిడ్డ’గా ప్రమోట్ చేస్తూ మరీ ఉపరాష్ట్రపతి రేసులో నిలబెట్టి గెలిపించుకుంది ఎన్డీయే కూటమి. అలాంటిది బలవంతంగా ఆయన్ని పదవి నుంచి దించేశారా? లేకుంటే నిజంగానే ఆయన అనారోగ్య కారణాలతో రాజీనామా చేశారా?.. ఇతర కారణాలు ఉన్నాయా?.. దేశంలో ఇప్పుడు జగ్దీప్ ధన్ఖడ్ రాజీనామాపై రాజకీయ రచ్చ నడుస్తోంది. అకస్మాత్తుగా ఆయన ఉపరాష్ట్రపతి పదవికి ఎందుకు రాజీనామా చేశారు? అనే ప్రశ్న తలెత్తింది. లోక్సభ వర్షాకాల సమావేశాల్లో నవ్వుతూ కనిపించిన ఆయన.. గంటల వ్యవధిలోనే ఎందుకు రాజీనామా ప్రకటించారు?.. దానికి అంతే వేగంగా ఆమోద ముద్ర ఎందుకు, ఎలా పడింది?. పైగా ఎలాంటి వీడ్కోలు లేకుండానే(కనీసం ఫేర్వెల్ స్పీచ్ కూడా లేకుండా) ఆయన్ని సాగనంపడం.. పలు అనుమానాలకు తావిస్తోంది. ఇందుకు గత ఆరు నెలల పరిణామాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.👉ధన్ఖడ్(74)కు ఈ ఏడాది మార్చిలో ఛాతీ సంబంధమైన సమస్యలు రావడంతో ఎయిమ్స్లో చేరి చికిత్స తీసుకున్నారు. ఈ నెల 17వ తేదీన ఓ గార్డెన్ విజిటింగ్కు వెళ్లిన ఆయన హఠాత్తుగా కుప్పకూలి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలో ఆయన సతీమణితో పాటు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అక్కడే ఉన్నారు. దీంతో వైద్యుల సూచన మేరకే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని లేఖలో ధన్ఖడ్ తెలిపారు. అయితే.. ‘‘రాజీనామా వెనుక లోతైన కారణాలే ఉన్నాయి, ఆయన ఎందుకు రాజీనామా చేశారో ఆయనకే తెలుసు..’’ అంటూ కాంగ్రెస్ అగ్రనేతలు స్పందించడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. 👉పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా జరిగిన బీఏసీ సమావేశానికి బీజేపీ కీలక నేతలు జేపీ నడ్డా, కిరెన్ రిజిజ్జు గైర్హాజరు కావడం, ఆ సమావేశంలో ఈ అంశంపై ధన్ఖడ్ సీరియస్ అయ్యారని, ఆ తర్వాతే ఏదో జరిగిందని కాంగ్రెస్ వాదన. కానీ, జేపీ నడ్డా మాత్రం ముందస్తు సమాచారం ఇచ్చామని, కాంగ్రెస్ అనవసర రాజకీయం చేస్తోందని మండిపడుతున్నారు. ఆయన(ధన్ఖడ్) వ్యక్తిగత నిర్ణయానికి గౌరవం ఇవ్వాలని బీజేపీ నేత ఒకరు కూడా వ్యాఖ్యానించారు. అయితే.. कल दोपहर 12:30 बजे श्री जगदीप धनखड़ ने राज्यसभा की कार्य मंत्रणा समिति (BAC) की अध्यक्षता की। इस बैठक में सदन के नेता जेपी नड्डा और संसदीय कार्य मंत्री किरेन रिजिजू समेत ज़्यादातर सदस्य मौजूद थे। थोड़ी देर की चर्चा के बाद तय हुआ कि समिति की अगली बैठक शाम 4:30 बजे फिर से होगी।…— Jairam Ramesh (@Jairam_Ramesh) July 22, 2025👉ధన్ఖడ్ పక్షపాత ధోరణితో.. ఏకపక్షంగా సభను(రాజ్యసభ) నడుపుతున్నారంటూ ఆయన్ని అభిశంసించేందుకు ప్రతిపక్ష ఎంపీలు గతేడాది డిసెంబర్లో నోటీసులు ఇచ్చారు(ఆ నోటీసు తిరస్కరణకు గురైంది). ఆ ఎంపీలే ఇప్పుడు ధన్ఖడ్కు సానుభూతిగా స్టేట్మెంట్లు ఇస్తుండడం కొసమెరుపు. మరోవైపు.. బీజేపీ మాత్రం ధన్ఖడ్ రాజీనామా వ్యవహారానికి కాస్త దూరంగానే ఉంటోంది.👉గత ఆరు నెలలుగా ప్రభుత్వానికి, ధన్ఖడ్కి మధ్య గ్యాప్ నడుస్తున్న విషయాన్ని కొందరు ఎంపీలు ఇవాళ్టి పార్లమెంట్ సెషన్ సందర్భంగా బహిరంగంగానే చర్చించుకోవడం గమనార్హం. అయితే ప్రభుత్వం, ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ మధ్య మనస్పర్థలు నివురు గప్పిన నిప్పులా కొనసాగాయని.. గత కొంతకాలంగా అవి తారాస్థాయికి చేరాయన్నది ఆ ముచ్చట్ల సారాంశం. 👉అంతేకాదు.. ఈ ఆరు నెలల కాలంలో ఉపరాష్ట్రపతిగా ధన్ఖడ్ చేయాల్సిన విదేశీ పర్యటనలు రద్దవుతూ వచ్చాయి. పైగా ఉపరాష్ట్రపతి హోదాలో ధన్ఖడ్కు ప్రధాని నరేంద్ర మోదీకి మధ్య భేటీ జరిగి నెలలు కావొస్తున్నాయి(కాకుంటే రాజీనామా తర్వాత ఆయన ఆరోగ్యం బాగుండాలంటూ మోదీ ఓ ట్వీట్ మాత్రం చేశారు). ఈ పరిణామాలన్నీ ఏదో జరిగిందనే సంకేతాలనే అందిస్తున్నాయి. వీటికి తోడు బీజేపీ శ్రేణుల నుంచే కొన్ని గుసగుసలు బయటకు వచ్చి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. Shri Jagdeep Dhankhar Ji has got many opportunities to serve our country in various capacities, including as the Vice President of India. Wishing him good health.श्री जगदीप धनखड़ जी को भारत के उपराष्ट्रपति सहित कई भूमिकाओं में देश की सेवा करने का अवसर मिला है। मैं उनके उत्तम…— Narendra Modi (@narendramodi) July 22, 2025ఈ మనస్పర్థల కారణంగానే ఆయన్ని పదవి నుంచి తొలగించే ప్రయత్నాలు మొదలయ్యాయని, కొందరు బీజేపీ నేతలు ఈ విషయమై ధన్ఖడ్ అప్రమత్తం చేశారని చెప్పుకుంటున్నారు. అయితే అవమానకర రీతిలో పదవి కోల్పోవడం కంటే.. రాజీనామానే బెటర్ అనుకున్నారన్నది ఆ గుసగుసల సారాంశంగా పలు జాతీయ మీడియా చానెల్స్ కథనాలు ఇస్తున్నాయి. -
‘నెలకు రూ. కోటి భరణం’ కేసు ఏమైందంటే..
పద్దెనిమిది నెలల కాపురానికి రూ.12 కోట్ల విలువైన భరణం ఆశించిన భార్య సుప్రీంకోర్టులో భంగపడింది. ఆ మహిళ గొంతెమ్మ కోర్కెలకు చీఫ్ జస్టిస్ బి.ఆర్.గవాయి బ్రేకులేశారు. భర్త ఇవ్వజూపుతున్న ఫ్లాట్తో సరిపెట్టుకోవాలని, చదువుకున్నావు కాబట్టి ఉద్యోగంతో సొంత కాళ్లపై నిలబడే ప్రయత్నం చేయాలని చీఫ్ జస్టిస్ సుతిమెత్తగా ఆ మహిళను మందలించారు. వివరాలు ఇలా ఉన్నాయి..విడాకుల కోసం ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ బి.ఆర్.గవాయి మంగళవారం కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జస్టిస్ బి.ఆర్.గవాయి ఆ మహిళను ఉద్దేశించి వేసిన ప్రశ్నలు.. ఆ మహిళ ఇచ్చిన సమాధానాలు ఇలా ఉన్నాయి...చీఫ్ జస్టిస్: మీ డిమాండ్ (భరణం) ఏమిటి?మహిళ: ముంబైలోని అప్పులు, తనఖా ఇబ్బందుల్లేని ఇల్లు, మెయిన్టెన్స్ కోసం రూ.12 కోట్లు.చీఫ్ జస్టిస్: ‘‘... కానీ ఆ ఇల్లు కల్పతరులో ఉంది. ఒకానొక మంచి బిల్డర్ది. మీరేమో ఐటీ పర్సన్. ఎంబీఏ కూడా చేశారు. మీలాంటి వాళ్లకు డిమాండ్ ఉంది.. బెంగళూరు హైదరాబాద్లలో.. మీరెందుకు ఉద్యోగం చేయకూడదు?’’ ‘‘పెళ్లయిన తరువాత మీ దాంపత్యం 18 నెలలు సాగింది... ఇప్పుడు మీకు బీఎండబ్ల్యూ కూడా కావాలా?’’ పద్దెనిమిది నెలల వైవాహిక జీవితానికి నెలకొ రూ.కోటి చొప్పున కావాలా?’’మహిళ: కానీ అతడు బాగా ధనవంతుడు. నాకు స్కిజోఫ్రెనియా ఉందని, వివాహం రద్దు చేయాలని అతడే కోరాడు.సీనియర్ న్యాయవాది మాధవి దివాన్ (భర్త తరఫు న్యాయవాది): ఆమె కూడా ఉద్యోగం చేయాలి. అన్నీ ఇలా డిమాండ్ చేయడం సరికాదు.మహిళ: మైలార్డ్ నేను స్కిజోఫ్రెనియా బాధితురాలి మాదిరిగా కనిపిస్తున్నానా?చీఫ్ జస్టిస్: ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయండి. అయితే ఒకటి అర్థం చేసుకోండి. మీరు అతడి తండ్రి ఆస్తి కోరలేరు!కొంత సమయం తరువాత మంగళవారం బెంచ్ మళ్లీ విచారణ చేపట్టినప్పుడు...చీఫ్ జస్టిస్: ఆదాయపన్ను పత్రాలెక్కడ? మహిళ: ఇక్కడున్నాయి.సీనియర్ న్యాయవాది మాధవి దివాన్: అన్ని పత్రాల కాపీ ఇవ్వండి... చూశారా 2015- 16లో ఆదాయం ఎక్కువ ఉంది. అప్పట్లో అతడు ఉద్యోగం చేసేవాడు.చీఫ్ జస్టిస్: 2015 - 16లో ఆదాయం ఎంత?సీనియర్ న్యాయవాది మాధవి దివాన్: రెండు కోట్ల యాభై లక్షలు, కోటి బోనస్. ఇతర వ్యాపారాలు చేసినట్లు ఆరోపణలేవీ లేవు. దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. దీని గురించి మాట్లాడేందుకు ఏమీ లేదు. తాను (మహిళ) ఆక్రమించుకున్న ఫ్లాట్కు రెండు కార్ పార్కింగ్లు ఉన్నాయి. వాటి ద్వారా కూడా ఆదాయం వస్తుంది.చీఫ్ జస్టిస్: అవును అవును. ముంబైలో అన్ని రకాల ప్రదేశాలతో డబ్బు చేసుకోవచ్చు. సీనియర్ న్యాయవాది మాధవి దివాన్: తాను కోరుకుంటున్న బీఎండబ్ల్యూ కారు కూడా పదేళ్ల పాతది. ఎప్పుడో పాడుపడింది. చీఫ్ జస్టిస్: మీకు (మహిళను ఉద్దేశించి) తనఖా ఇబ్బందుల్లేని ఫ్లాట్ లభిస్తుంది అంతే. బాగా చదువుకున్నా ఉద్యోగం చేయకపోవడం మీ సొంత నిర్ణయం. కేసులో తీర్పు రిజర్వ్ చేస్తున్నాం.మహిళ: నా భర్త న్యాయవాదిని ప్రభావితం చేశారు...చీఫ్ జస్టిస్: ఎవరిని? మీకు లభిస్తున్న ఫ్లాట్తో సంతృప్తి పడితే మేలు. లేదంటే అతడు ఇవ్వజూపుతున్న రూ.నాలుగు కోట్లు తీసుకుని మంచి ఉద్యోగం చూసుకోండి.మహిళ: వారు నాపై ఎన్నో ఆరోపణలు చేశారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. నాకు ఏ ఉద్యోగం వస్తుంది?చీఫ్ జస్టిస్:... వాటన్నింటినీ మేము రద్దు చేస్తాం! మీరు అంతంత చదువులు చదువుకున్నారు. మీ కోసం మీరు అడుక్కోకూడదు. సొంతంగా సంపాదించుకుని తినాలి! మ్యాటర్ ఎండ్స్! ఆర్డర్స్ రిజర్వ్డ్!:::గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
ధన్ఖడ్ ఆరోగ్యం బాగుండాలి: ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి పదవికి జగ్దీప్ ధన్ఖడ్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఆమోదించారు. 74 ఏళ్ల ధన్ఖడ్ అనారోగ్య సమస్యల దృష్ట్యా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యవసానం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.మరోవైపు.. ధన్ఖడ్ రాజీనామాపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. జగదీప్ ధన్ఖడ్ మన దేశానికి వివిధ పదవుల్లో సేవలందించే అరుదైన అవకాశాలు పొందారు. ముఖ్యంగా భారత ఉపరాష్ట్రపతి హోదాలో. ఆయన ఆరోగ్యం బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని మోదీ ట్వీట్ చేశారు. Shri Jagdeep Dhankhar Ji has got many opportunities to serve our country in various capacities, including as the Vice President of India. Wishing him good health.श्री जगदीप धनखड़ जी को भारत के उपराष्ट्रपति सहित कई भूमिकाओं में देश की सेवा करने का अवसर मिला है। मैं उनके उत्तम…— Narendra Modi (@narendramodi) July 22, 2025పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం(జులై 21)న ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలిరోజు సమావేశాల్లో భాగంగా.. రాజ్యసభ చైర్మన్ హోదాలో ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ హుషారుగానే హాజరయ్యారు. పలువురు నేతలతో సాయంత్రం దాకా తన అధికారిక కార్యాలయంలో సమావేశం కూడా అయ్యారు. అయితే రాత్రి సమయంలో.. అదీ అనూహ్యంగా రాజీనామా ప్రకటన చేశారు.ఇదీ చదవండి: ధన్ఖడ్ రాజీనామా-బీజేపీ రియాక్షన్ ఇదే.. -
ధన్ఖడ్ రాజీనామా వెనుక ఏం జరిగింది?
సాక్షి, ఢిల్లీ: హస్తినలో ఇప్పుడు ఏ ఇద్దరు నేతలు కలుసుకున్నా ఉపరాష్ట్రపతి పదవికి జగ్దీప్ ధన్ఖడ్(74) చేసిన రాజీనామా గురించే మాట్లాడుకుంటున్నారు. ఆరోగ్య కారణాల రిత్యా తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించినప్పటికీ.. రాజీనామా వెనుక బలమైన రాజకీయ కారణాలే ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఫేర్వెల్ స్పీచ్, ఈవెంట్ లేకుండానే ఆయన నిష్క్రమించడం పలు కోణాల్లో చర్చకు కారణమైంది.ధన్ఖడ్ నిబంధనలు, ప్రోటోకాల్ పాటించే వ్యక్తి. నిన్న బీఏసీకి జేపీ నడ్డా, కిరెన్ రిజిజు ఉద్దేశపూర్వకంగానే రాలేదు. దీంతో ధన్ఖడ్ ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిన్న మధ్యాహ్నాం 1గం. నుంచి సాయంత్రం 4.30గం. మధ్య ఏదో జరిగింది అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఓ ట్వీట్ చేశారు. ధన్ఖడ్ రాజీనామాకు లోతైన కారణాలే ఉన్నాయని అంటున్నారాయన. ఇక ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ.. ‘‘ధన్ఖడ్ రాజీనామా ఆయన నిర్ణయం. ఆయన రాజీనామా ఎందుకు చేశారో ఆయనకే తెలుసు’’ అంటూ కామెంట్ చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిన్ననే(జులై 21) ప్రారంభం అయ్యాయి. రాజ్యసభకు చైర్మన్ హోదాలో ధన్ఖడ్ హాజయ్యారు. సభలో హుషారుగానూ కనిపించారు. అంతేకాదు.. సాయంత్రం ఆరు గంటల దాకా ఆయన్ని పలువురు నేతలు వెళ్లి కలిశారు. ఈలోపు అనూహ్యంగా.. రాత్రి 9:30గం. సమయంలో ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన చేశారు. జగ్దీప్కు ఈ మధ్యే గుండెకు సంబంధించిన చికిత్స తీసుకున్నారు. అనారోగ్య కారణంతోనే తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. భారత రాజ్యాంగంలోని తన ఆర్టికల్ 67 (ఏ) కింద రాజీనామా చేస్తున్నట్లు చెబుతూ.. ఆ లేఖను రాష్ట్రపతికి పంపించారు కూడా. 2022 ఆగస్టు 11న ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన ధన్ఖడ్.. మరో రెండేళ్ల పదవీకాలం ఉండగానే ఇలా రాజీనామా చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే.. ధన్ఖడ్ రాజీనామా వెనుక వ్యక్తిగతం కాదని.. రాజకీయ కారణాలే ఉన్నాయన్న చర్చ ప్రముఖంగా నడుస్తోంది. బీజేపీ ఈ అంశంపై ఇప్పటిదాకా స్పందించలేదు. అయితే బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే మాత్రం ప్రతిపక్షాల అనుమానాలపై మండిపడ్డారు. గతంలో ఆయన్ని అభిశంసించేందుకు(పదవి నుంచి తొలగించేందుకు) ప్రతిపక్షాలు చేసిన ప్రయత్నాలను గుర్తు చేసిన దుబే.. ఆయన ఆరోగ్యం దృష్ట్యా తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాలని కోరుతున్నారు. ప్రతిపక్షాలు ఈ అంశంలో డ్రామాలు ఆడడం ఆపాలని అంటున్నారు. మరోవైపు.. ఉద్దేశపూర్వకంగానే బీఏసీకి హాజరు కాలేదన్న కాంగ్రెస్ ఆరోపణలను జేపీ నడ్డా కొట్టిపారేశారు. తాను హాజరు కాలేకపోతున్నాననే సమాచారం ధన్ఖడ్కు ఇచ్చానని తెలిపారాయన. దాల్ మే కుచ్ కాలా హై రీతిలో.. ధన్ఖడ్ రాజీనామా వెనుక ఒత్తిళ్లు ఉన్నాయని మరికొందరు గుసగుసలాడుకుంటున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తికి ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చేందుకే ధన్ఖడ్తో బలవంతంగా రాజీనామా చేయించారని విపక్ష నేతల మధ్య చర్చ నడుస్తోంది.గతంలో.. మనదేశంలో ఉపరాష్ట్రపతి పదవికి మధ్యంతర రాజీనామాలు చాలా అరుదైనవే. వీవీ గిరి, ఆర్ వెంకట్రామన్, శంకర్ దయాళ్ శర్మ, కేఆర్ నారాయణన్లు ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. అయితే వీళ్లు రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. కానీ,భైరాన్సింగ్ షెకావత్ (2007):రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిభా పాటిల్ చేతిలో ఓటమి పాలయ్యాక రాజీనామా చేశారు.ఆయన రాజీనామాతో ఉపరాష్ట్రపతి పదవి 21 రోజుల పాటు ఖాళీగా ఉంది.జగదీప్ ధన్ఖడ్ (2025):ఇప్పుడు ఆకస్మికంగా రాజీనామా చేసి వార్తల్లోకి ఎక్కారుఆయన అనారోగ్య కారణాలు చూపించినప్పటికీ.. రాజకీయంగా వివిధ ఊహాగానాలు వెలువడుతున్నాయి.మరణంతో.. కృష్ణకాంత్ (2002): పదవిలో ఉండగానే మరణించిన ఏకైక ఉపరాష్ట్రపతి.e President Bhairon Singh Shekhawat resigned from the post on July 21, 2007, after being defeated in the presidential election against Congress-led UPA nominee Pratibha Patil. After Shekhawat's resignation, the vice president's post was vacant for 21 days, before Mohammad Hamid Ansari was elected to the position. Vice Presidents R Venkataraman, Shankar Dayal Sharma and K R Narayanan too had resigned from their posts, but after their election as the president. Krishan Kant was the only vice president to die in office. He passed away on July 27, 2002.https://www.deccanchronicle.com/nation/current-affairs/dhankhar-3rd-vice-president-to-quit-mid-term-1892942 -
పార్లమెంట్ రేపటికి వాయిదా
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 2025.. రెండోరోజు అప్డేట్స్పార్లమెంట్ రేపటికి వాయిదామద్యాహ్నాం 2 గం. తర్వాత తిరిగి ప్రారంభమైన ఉభయ సభలుఉభయ సభల్లో విపక్షాల ఆందోళనలుసభల్లో గందరగోళంతో రేపటికి వాయిదాఆపరేషన్ సిందూర్, తదితర అంశాలపై చర్చించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు నిరసనలు వ్యక్తం చేయడంతో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల వరకు లోక్సభ కార్యకలాపాలు వాయిదా పడ్డాయి. కాంగ్రెస్ సహా ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ, ఆపరేషన్ సిందూర్పై చర్చించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనలు చేయడంతో, దిగువ సభ కార్యకలాపాలలను తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. అయితే తిరిగి సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు నిరసనలు కొనసాగించడంతో, స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు.ప్రతిపక్ష పార్టీల ఆందోళనల మధ్య రాజ్యసభ కార్యకలాపాలు మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడ్డాయి. రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ సోమవారం రాత్రి ఆకస్మిక రాజీనామా చేయడంపై ప్రతిపక్ష సభ్యుల ఆందోళనల మధ్య ఎగువ సభ ఉదయం కార్యకలాపాలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. తరువాత కూడా నిరసనలు కొనసాగడంతో మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా వేశారు. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సమావేశాలకు అధ్యక్షత వహించారు. ధన్ఖడ్ రాజీనామా, బీహార్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ అంశాలపై చర్చ చేపట్టడానికి ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా నోటీసులను హరివంశ్ తిరస్కరించారు.పార్లమెంట్ ఉభయ సభలు వాయిదాపార్లమెంట్ ఉభయ సభలు మధ్యాహ్నాం 12గం. వరకు వాయిదాపప్రారంభమైన కాసేపటికే వాయిదా పడ్డ ఉభయ సభలువాయిదా తీర్మానాలపై చర్చించాలని విపక్షాల పట్టువిపక్షాల ఆందోళనతో ఉభయ సభలు వాయిదారాజ్యసభ వాయిదావిపక్ష సభ్యుల ఆందోళనతో రాజ్యసభలో గందరగోళంసభ వాయిదా ప్రకటనలోక్సభ వాయిదాస్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన ప్రారంభమైన లోక్సభప్రారంభమైన నిమిషాల్లోనే విపక్ష సభ్యుల ఆందోళనవాయిదా తీర్మానాలు చర్చించాలని పట్టుసభ్యుల ఆందోళన నడుమ సభ వాయిదా వేసిన స్పీకర్పార్లమెంట్ వర్షాకాల సమావేశాల రెండో రోజూ(మంగళవారం) ప్రారంభమయ్యాయి. అయితే ఉభయ సభల్లోనూ ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగడంతో గందరగోళం నెలకొంది. తొలిరోజున ప్రతిపక్షాలు.. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్పై చర్చకు డిమాండ్ చేయడంతో ఉభయ సభలు వాయిదా పడిన సంగతి తెలిసిందే.తొలిరోజు నిరసనల మధ్యనే రాజ్యసభ.. షిప్పింగ్ డాక్యుమెంటేషన్ చట్టాలను ఆధునీకరించే లాడింగ్ బిల్లును విజయవంతంగా ఆమోదించింది. ఈ బిల్లు లోక్సభలో ఇప్పటికే ఆమోదం పొందింది. ఈరోజు బీహార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) అంశాన్ని ఇండియా బ్లాక్ నేతలు లేవనెత్తనున్నారు. వారు ఉదయం 10 గంటలకు పార్లమెంట్లోని మకర్ ద్వార్ వద్ద నిరసన చేపట్టనున్నారు. సమావేశాల మొదటి రోజున.. హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ సిన్హాపై మోపిన అభిశంసనపై రాజ్యసభలో ప్రసంగించిన అనంతరం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ తన పదవికి రాజీనామా చేశారు. #WATCH | Delhi: On Impeachment Motion against Justice Yashwant Varma, IUML MP ET Mohammed Basheer says, "The impeachment on that issue is very important. Because of the dealings of that judge, the degradation of the Indian judiciary's status occurred... We have also submitted… pic.twitter.com/SG8uavtoau— ANI (@ANI) July 21, 2025జూలై 21న ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 21 వరకు జరగనున్నాయి. ఆగస్టు 12 నుండి ఆగస్టు 17 వరకు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల విరామం ఉంటుంది. ఆగస్టు 18న తిరిగి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా జస్టిస్ యశ్వంత్ వర్మపై మోపిన అభిశంసన తీర్మానంపై ఐయూఎంఎల్ ఎంపీ ఈటీ మహమ్మద్ బషీర్ మాట్లాడుతూ, ఈ అభిశంసన చాలా ముఖ్యమైనది. ఆ న్యాయమూర్తి వ్యవహారాల కారణంగా భారత న్యాయవ్యవస్థ స్థితి మరింత దిగజారింది. అందుకే తాము దీనిపై మెమోరాండంను స్పీకర్కు సమర్పించామన్నారు. ప్రభుత్వం దీనిపై స్పందిస్తుందని ఆశిస్తున్నామని బషీర్ పేర్కొన్నారు. -
సిగ్గుపడాల్సిన విషయం
న్యూఢిల్లీ: ఒడిశాలో 15 ఏళ్ల బాలిక దహనం దురదృష్టకరం, సిగ్గుపడాల్సిన విషయమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు సాధికారత, సురక్షితమైన వాతావరణాన్ని అందించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. ‘గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల బాలికలు, గృహిణులు, పిల్లల పరిస్థితి అత్యంత దుర్బలంగా ఉంది. వారిని శక్తివంతం చేయాలి. అందుకు మా ఈ ఆదేశాలు ఉపయోగపడాలి’అని ఆదేశించింది. వారి భద్రతకోసం కొన్ని స్వల్పకాలిక, దీర్ఘకాలిక కార్యక్రమాలను రూపొందించాల్సిన అవసరం ఉందని, తద్వారా తాలూకా స్థాయిలో నివసించే మహిళలకు అవగాహన, సాధికారత కలి్పంచవచ్చని ధర్మాసనం పేర్కొంది. తాలూకా స్థాయిలో మహిళలకు శిక్షణ ఇచ్చి పారా లీగల్ వలంటీర్లుగా నియమించవచ్చని, మహిళలకు వారి హక్కుల గురించి అవగాహన కలి్పంచడానికి అంగన్వాడీ కార్యకర్తల సహాయం కూడా తీసుకోవచ్చని ధర్మాసనం పేర్కొంది. మహిళలు, పిల్లలు, ట్రాన్స్పర్సన్లకు సురక్షితమైన వాతావరణం కోసం పాన్–ఇండియా మార్గదర్శకాలను రూపొందించడానికి ఆదేశాలు కోరుతూ గత సంవత్సరం డిసెంబర్ 16న దాఖలైన ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు అంగీకరించింది. దీనిపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మల్య బాగి్చలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఇది ప్రభుత్వాల వ్యతిరేక వ్యాజ్యం కాదని, మహిళల భద్రతకోసం కేంద్రం, అన్ని పారీ్టల నుంచి సూచనలు అవసరమని ధర్మాసనం పేర్కొంది. కేంద్రం తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి మాట్లాడుతూ, లైంగిక నేరస్థులను గుర్తించడానికి, సకాలంలో చర్యలు తీసుకోవడానికి బహిరంగ ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాలు, ఫేస్ స్కాన్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తుందని చెప్పారు. బాధలో ఉన్న మహిళలకు సహాయపడేలా ప్రతి జిల్లాలో వన్–స్టాప్ సెంటర్లు పనిచేస్తున్నాయని ఆమె అన్నారు. అయితే, వన్–స్టాప్ సెంటర్ తాలూకా స్థాయికి వెళ్లాల్సిన అవసరం ఉందని ధర్మాసనం సూచించింది. -
ఆయన నీకేమైనా ఫ్రెండా..? ఇప్పటికీ జస్టిస్ వర్మే..!
న్యూఢిల్లీ: నగదు కట్టల వివాదంపై జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ వేసిన పిటిషన్పై తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనిపై తగు సమయంలో విచారణ చేపడతామని స్పష్టం చేసింది. సోమవారం న్యాయవాది, పిటిషనర్ అయిన మాథ్యూస్ నెడుంపర తీరుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ చంద్రన్ల ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. జస్టిస్ యశ్వంత్ వర్మను కేవలం వర్మ అంటూ సంబోధించడమేంటని ప్రశ్నించింది. ఆయనేమైనా మీకు స్నేహితుడా? ఆయన ఇప్పటికీ జస్టిస్ వర్మనే. ఓ కోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు. ఎంతో సీనియర్ అయిన ఆయన్ను అలా ఎలా సంబోధిస్తారు? కాస్త మర్యాదగా వ్యవహరించండి’అంటూ హితవు పలికింది. ‘ఆయనకు అంత గౌరవం అవసరం లేదు. పిటిషన్పై విచారణ చేపట్టండి’అని నెడుంపర పేర్కొనగా మీరు మాకు ఆదేశాలివ్వక్కర్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ వర్మకు సంబంధించిన వివాదానికి సంబంధించి ఆయన ఏకంగా మూడు పిటిషన్లు వేయడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. విచారణ కోసం నెడుంపర పట్టుబట్టగా..పిటిషన్ను ఇప్పుడే కొట్టేయమంటారా?అని ప్రశ్నించింది. ‘కొట్టి వేయడం అసాధ్యం. ఎఫ్ఐఆర్ నమోద వ్వాల్సిందే. వర్మ కూడా అదొక్కటే కోరుతార నిపిస్తోంది. ఎఫ్ఐఆర్, దర్యాప్తు జరగాలి’అని సీజేఐ గవాయ్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు నియమించిన కమిటీ నివేదికను పక్కనబెట్టాలంటూ జస్టిస్ వర్మ ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం తెల్సిందే. -
కేంద్రం ప్రతిపక్షం గొంతు నొక్కేస్తోంది: రాహుల్
న్యూఢిల్లీ: ప్రతిపక్ష నాయకుడినైన తనను లోక్సభలో మాట్లాడనివ్వకుండా చేస్తూ బీజేపీ ప్రతిపక్షం గొంతును నొక్కేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ ఆరోపించారు. ప్రతిపక్ష నేతగా తనకు ప్రశ్నలు అడిగే హక్కు ఉందని ఆయన ఉద్ఘాటించారు. ప్రతిపక్షాలను అడ్డుకుంటూ, రక్షణ మంత్రి, ఇతర ట్రెజరీ బెంచ్ సభ్యులను మాత్రమే మాట్లాడటానికి అనుమతిస్తూ బీజేపీ కొత్త విధానం అనుసరిస్తోందని గాంధీ ఆరోపించారు. ప్రతిపక్షాలను కూడా అనుమతిస్తేనే అర్థమవంతమైన చర్చ జరుగుతుందని, మంత్రులు మాట్లాడినప్పుడు ప్రతిపక్షం వింటున్నప్పుడు, ప్రతిపక్షం మాట్లాడినప్పుడు ప్రభుత్వం వినాలని గుర్తు చేశారు. వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా సైతం ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. పార్లమెంటులో మాట్లాడేందుకు సభ్యులను అనుమతించాలన్నారు. ప్రభుత్వం నిజంగా చర్చ కోరుకుంటే.. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేందుకు ఒక్క నిమిషం కూడా ఎందుకు అనుమతించలేదని ప్రశ్నించారు. -
పార్లమెంటు సమావేశాలు తొలిరోజే దుమారం
న్యూఢిల్లీ: ధూర్తదేశం పాక్పై భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలు తొలిరోజే తీవ్రస్థాయి వాదోపవాదాలతో మొదలయ్యాయి. పహల్గాం ఉదంతంలో కేంద్ర నిఘా వర్గాల ఘోర వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ ఆపరేషన్ సిందూర్పై వెనువెంటనే చర్చ మొదలెట్టాలన్న విపక్షాల డిమాండ్లు ఓవైపు.. ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భం, కేసులను మోస్తున్న రాబర్డ్ వాద్రాపై అధికార పార్టీ ప్రతివిమర్శలతో తొలిరోజు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వేడెక్కాయి. బిహార్లో ఓటర్ల జాబితా విస్తృతస్థాయిలో సవరించడం, మణిపూర్లో జాతుల మధ్య వైరంపై అధికార, విపక్ష పార్టీల పరస్పర ఆరోపణలతో లోక్సభ, రాజ్యసభల్లో వాతావరణం ఓవైపు మరింత ఉద్రిక్తంగా మారినా.. కాలిన కరెన్సీ కట్టల వ్యవహారంలో అపకీర్తిని మూటగట్టుకున్న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన అంశంలో అంతా ఏకతాటి మీదకు రావడం విశేషం. అవినీతిమరకలు అంటుకున్న జడ్జీని న్యాయపీఠం నుంచి పక్కకు తప్పించే క్రతువులో పార్టీలకతీతంగా సభ్యులు ఒకేమాటపై నిలబడ్డ సందర్భానికీ పార్లమెంట్ వేదికైంది. తొలిరోజే నాలుగుసార్లు వాయిదాసోమవారం ఉదయం 11 గంటలకు ఉభయసభలు మొదలయ్యాయి. పహల్గాంలో అత్యంత పాశవికంగా ఉగ్రవాదులు చేసిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఇరు సభల్లో సభ్యులు నివాళులర్పించారు. అహ్మదాబాద్లో ఎయిర్ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో సజీవదహనమైన ప్రయాణికులకూ ఇరుసభల సభ్యులు నివాళిగా కొద్దిసేపు మౌనం పాటించారు. తర్వాత లోక్సభలో ప్రశ్నోత్తరాలను స్పీకర్ బిర్లా మొదలెట్టగానే విపక్ష సభ్యులు వెంటనే వెల్లోకి దూసుకొచ్చి ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఘోర నిఘా వైఫల్యం వల్లే పహల్గాం ఉదంతం చోటుచేసుకుందని, ఆపరేషన్ సిందూర్పై తక్షణం చర్చ జరపాలని డిమాండ్లుచేశారు. ఈ అంశంలో సభకు వచ్చి ప్రధాని మోదీ వివరణ ఇవ్వాలని సభ్యులు పట్టుబట్టారు. ‘‘ప్రశ్నోత్తరాల గంట ముగిశాకే మీకు మాట్లాడే అవకాశం ఇస్తా. క్వశ్చన్ అవర్ సజావుగా సాగనివ్వండి. మనల్ని ఎన్నుకున్న ప్రజల సమస్యలపై చర్చ జరగనివ్వండి. మీరు నినాదాలు ఇవ్వాలనుకుంటే బయటికెళ్లి ఇచ్చుకోండి’’ అని బిర్లా సూచించినా విపక్ష సభ్యులు వినిపించుకోలేదు. దీంతో సభను 12 గంటల దాకా వాయిదావేశారు. తర్వాత 12 గంటలకు సభ ఆరంభమైనా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. మీరు ఎత్తిచూపిన అంశాలపై సుదీర్ఘ చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అప్పటిదాకా ఓపిక పట్టాలని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ కోరారు. సభావ్యవహారాల సలహా కమిటీ(బీఏసీ) ఎదుట విపక్ష సభ్యులు తమ వాదనల్ని మధ్యాహ్నం 2.30గంటలకు వినిపించవచ్చని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సూచించారు. అయినా విపక్షసభ్యులు వినిపించుకోలేదు. దీంతో అప్పుడు సభాధ్యక్షపీఠంపై కూర్చున్న జగదాంబికా పాల్ సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదావేశారు. తర్వాత సభ మొదలైనా ఎలాంటి మార్పులేదు. అప్పటి స్పీకర్ స్థానంలో కూర్చున్న సంధ్యా రాయ్ సభను మధ్యాహ్నం నాలుగు గంటలకు వాయిదావేశారు. నాలుగు గంటలకు సభ సమావేశమైంది. అప్పుడు కూడా విపక్షసభ్యులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తమ నిరసనలతో సభను హోరెత్తించారు. ఇక చేసేదిలేక సభాధ్యక్ష స్థానంలో కూర్చున్న దిలీప్ సైకియా లోక్సభను మంగళవారానికి వాయిదావేశారు. ఇలా తొలిరోజే లోక్సభ నాలుగుసార్లు వాయిదాపడింది. రాజ్యసభ లోనూ ఇదే వాయిదా పర్వం కొనసాగింది. వచ్చే వారం సిందూర్పై చర్చపహల్గాంలో ఉగ్రదాది, ఆపరేషన్ సిందూర్, తదనంతర పరిణామాలపై విస్తృతస్థాయి చర్చకు కేంద్రప్రభుత్వం తన సమ్మతి తెలిపింది. వచ్చే వారం ఈ అంశాలపై సమగ్రస్థాయిలో లోక్సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్తున్న కారణంగా ఈవారం ఆయన పార్లమెంట్కు రాలేరని, వచ్చే వారం ఆయన సమక్షంలోనే పార్లమెంట్లో చర్చ జరుగుతుందని తెలుస్తోంది. పార్లమెంట్ వ్యవహారాల సలహా కమిటీ సమావేశంలో ప్రభుత్వ ప్రతినిధులు ఈ విషయాలను విపక్ష నేతలకు తెలియజేశారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు షిప్పింగ్ డాక్యుమెంట్ల సరళీకరణకు బాటలువేసే ‘ది బిల్స్ ఆఫ్ ల్యాడింగ్ బిల్లు– 2025’ కు రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లు మార్చిలోనే లోక్సభ ఆమోదం పొందింది. -
మెదడుకు కాస్త... బ్రేక్ ఇవ్వండి
గంటల తరబడి కూర్చొని చేసే పని వల్ల కూడా అలసిపోతాం. ఈ అలసటనే వైద్య పరిభాషలో ‘కాగ్నటివ్ ఫెటీగ్’ (మానసిక అలసట) అంటారు. ఇలాంటి అలసట.. ఉపయోగకరమైన పనులకన్నా.. అంతగా ప్రయోజనం లేని సులభమైన పనులను ఎంచుకునేలా మన మెదడును ప్రభావితం చేస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. దైనందిన నిర్ణయాలను నిష్ప్రయోజనమైన పనుల వైపు దారి మళ్లించే ఈ మానసిక అలసటను.. సుదీర్ఘమైన పనులు చేసేటప్పుడు విరామాలు తీసుకోవటం ద్వారా నివారించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఆఫీసు నుంచో లేదా బయట పని పూర్తిచేసుకునో ఇంటికి వచ్చాక.. అందరూ చేసేది కుర్చీలోనో మంచం మీదనో కాసేపు అలా నడుం వాల్చడం. అలాంటప్పుడు మరో ముఖ్యమైన పని చేయాలన్నా ఆలోచిస్తాం. కానీ, ఫోన్లో ఏవైనా సరదా అంశాలు లేదా టీవీలో ఏదైనా ప్రోగ్రామో చూడటం మాత్రం మనకు కష్టంగా అనిపించదు. ‘జర్నల్ ఆఫ్ న్యూరోసైన్స్’లో తాజాగా అచ్చయిన అధ్యయన వివరాలను బట్టి – తక్కువ ప్రయోజనాలను అందిస్తున్నవే అయినప్పటికీ, మనం ఇలా సులభమైన పనులనే ఎంచుకోవటానికి ప్రధాన కారణం.. ‘మానసిక అలసట’.తక్కువ లాభం.. ఎక్కువ లాభం!కష్టమైన పని, తేలికైన పని జట్లలోని వారిని.. వాళ్ల పని అనంతరం, ఎంపిక చేసుకోటానికి మళ్లీ రెండు రకాల పనులు ఇచ్చారు.1. తక్కువ డబ్బు వచ్చే సులభమైన పని.2. ఎక్కువ డబ్బు వచ్చే కష్టమైన పని.⇒ మానసికంగా అలసిపోయిన వారు.. తక్కువ డబ్బు వచ్చే సులభమైన పనిని ఎంచుకున్నారు. ⇒ మానసికంగా అలసిపోని వారు.. ఎక్కువ డబ్బు వచ్చే కష్టమైన పనిని ఎంపిక చేసుకున్నారు.ఎవరికి తేలికైనవి వారుప్రతి ఒక్కరికీ పని చేయడానికి వేర్వేరు సామర్థ్యాలు ఉంటాయి. ఒకరికి సులభంగా ఉండేది, మరొకరికి కష్టంగా అనిపించవచ్చు. అయినప్పటికీ ఎవరికి వారు ‘మానసిక అలసట’ తర్వాత తమకు సులభంగా ఉండే పనులను మాత్రమే ఎంచుకుంటారని ఈ అధ్యయనంలో ప్రధాన పరిశోధకుడు, జాన్స్ హాప్కిన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన విక్రమ్ చిబ్ అంటున్నారు. మానసిక అలసట మన దైనందిన నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తుందో అన్వేషించడానికి ఈ అధ్యయనం ఒక నమూనాను రూపొందించింది.తేలికైన, కష్టమైన పనులుఅధ్యయనం కోసం పరిశోధకులు ఆరోగ్యవంతులైన కొందరిని ఎంపిక చేసి, వారిని నిరంతర జ్ఞాపకశక్తి అవసరమైన పనిలో నియమించారు. ఒక స్క్రీన్పైన ఒకటి తర్వాత ఒకటిగా మెరుస్తున్న వేర్వేరు అక్షరాలపై దృష్టి పెట్టమని కోరారు. ఆ పనిని పరిశోధకులు ‘తేలికైన పని’, ‘కష్టమైన పని’ అని విభజించారు. తేలికైన పనిలో భాగంగా స్క్రీన్పైన మారుతున్న అక్షరాలలో అప్పటికి కనిపిస్తున్న అక్షరం, ఆ ముందు వచ్చి వెళ్లిన అక్షరంతో సరిపోలి ఉందో లేదో గుర్తుంచుకోవాలి.ఇక కష్టమైన పనిలో.. అప్పటికి వారు చూస్తున్న అక్షరం, ఆ ముందు చూసిన రెండు నుండి ఆరు అక్షరాల మధ్య స్క్రీన్పైకి వచ్చి వెళ్లిన అక్షరాలతో సరిపోలి ఉందో లేదో గుర్తుంచుకోవాలి. ఈ ప్రయోగంలో – కష్టమైన రెండో పనిని వరుసగా చేసినవారు తాము మానసికంగా చాలా అలసిపోయినట్లు తెలిపారు. తేలికైన పని చేసినవారిలో అలసట కనిపించలేదు.ఫంక్షనల్ ఎమ్మారై పట్టేసిందిఅధ్యయనంలో పాల్గొన్నవారు తమ పనులను ఎంపిక చేసుకుంటుండగా, పరిశోధకులు ఫంక్షనల్ మాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ (ఎఫ్–ఎంఆర్ఐ)ను ఉపయోగించి వారి మెదడులోని రసాయన చర్యల్ని నమోదు చేశారు. శరీరంలోకి పరికరాలను చొప్పించే అవసరం లేని ఈ ‘నాన్–ఇన్వేసివ్ టెక్నిక్’తో.. వాళ్లు ఒక పని చేస్తున్న సమయంలో మెదడులో చురుగ్గా ఉన్న ప్రాంతాలను గుర్తించారు.మానసికంగా అలసిపోయిన వారిలో – నుదుటి వెనుక ఉండే ‘డోర్సోలేటరల్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్’ ఏరియా క్రియాశీలం అవటాన్ని పరిశోధకులు కనుగొన్నారు. అలాగే, మానసిక అలసట తర్వాత పనులను, ఎంపికలను నిర్ణయించుకున్నప్పుడు మెదడులోని ‘రైట్ యాంటీరియర్ ఇన్సులా’ (ఇన్సులా) అనే ప్రదేశం క్రియాత్మకం అయి కనిపించింది. ఈ ప్రదేశం, ఒక పనిని ‘అది ప్రతిఫలానికి తగిన పనేనా?’ అనే దాన్ని నిర్ణయిస్తుంది.పనితీరు సామర్థ్యం తగ్గలేదు..ఈ అధ్యయనంలో పాల్గొన్నవారు ఒకదాని తర్వాత ఒకటి కష్టతరమైన పనులను చేస్తున్నప్పుడు తాము అలసిపోయినట్లు చెప్పినప్పటికీ వారి పనితీరు సామర్థ్యం కొంచెమైనా తగ్గలేదు. అంటే.. మానసిక అలసట అనేది పని అనంతరం విశ్రాంతినిచ్చే పనులను ఎంపిక చేసుకుంటున్నదే కానీ, అలసట కలిగిస్తున్న పనిని ఒళ్లు దాచుకోకుండా చేయటానికి మాత్రం అడ్డపడటం లేదన్నమాట.విరామాలతోనే నివారణ⇒ మన దైనందిన నిర్ణయాలను ప్రభావితం చేసే ఈ మానసిక అలసటనునివారించేందుకు ఒకే ఒక్క మార్గం.. కూర్చొని చేసే సుదీర్ఘమైన పనుల్లో తరచూ విరామాలు తీసుకుంటూ ఉండటమే అంటున్నారు డాక్టర్ చిబ్.⇒ అనేక నాడీ సంబంధిత, మానసిక పరిస్థితులలో మానసిక అలసట అనేది ఒక సాధారణ లక్షణం అని పరిశోధకులు చెబుతున్నారు.⇒ స్ట్రోక్ వచ్చినవారిలో, మల్టిపుల్ స్కె›్లరోసిస్, క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్, ఒత్తిడి, ఆందోళన, స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్న వారిలో ఎక్కువ మానసిక అలసట ఉన్నట్లు కూడా తాజా అధ్యయనం కనుగొంది.⇒ ‘ప్రయత్నించటం’, ‘నిర్ణయం తీసుకోవటం’ అనే వాటిని మెదడు ఏ విధంగా ప్రభావితం చేస్తోందో అర్థం చేసుకోవటానికి ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని అధ్యయనవేత్తలు భావిస్తున్నారు. -
విదేశీ విద్య @ రూ. 3,78,400 కోట్లు
భారతీయ కుటుంబాలు తమ పిల్లల విదేశీ విద్య కోసం 2024లో రూ.3,78,400 కోట్లు ఖర్చు చేశాయి. 2030 నాటికి ఇది రెండింతలు దాటి రూ.7,82,600 కోట్లకు చేరుతుందని లండన్ కు చెందిన పేమెంట్స్ కంపెనీ వైజ్, కన్సల్టింగ్ సంస్థ ‘రెడ్సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్’ నివేదిక వెల్లడించింది. భారతీయులు విదేశీ విద్య కోసం జరిపే చెల్లింపులపై బ్యాంకులు వసూలు చేసే మారకపు రేటు ఫీజు, రుసుములు గత ఏడాది రూ.1,700 కోట్లుగా నమోద య్యాయి. ఏటా రూ.30 లక్షలు పంపే ఒక సాధారణ కుటుంబం ఈ చార్జీల కింద రూ.60,000–75,000 కోల్పోవాల్సి వస్తోంది.రూ.75 వేల వరకు...భారతీయులు విదేశీ విద్య కోసం జరిపే చెల్లింపులపై బ్యాంకులు వసూలు చేసే మారకపు రేటు ఫీజు, రుసుములు గత ఏడాది రూ.1,700 కోట్లు నమోదయ్యాయి. ఆరేళ్లలో ఇది రూ.4,300 కోట్లకు చేరవచ్చని అంచనా. ఈ చెల్లింపులలో 95% పైగా సంప్రదాయ బ్యాంకింగ్ మార్గాల ద్వారా విదేశాలకు చేరుతున్నాయి. విదేశీ కరెన్సీలో చెల్లింపులు జరిపినందుకుగాను బ్యాంకింగ్ సంస్థలు విదేశీ మారకపు రేటుపై 3–3.5% చార్జీ వసూలు చేస్తున్నాయి. లావాదేవీ పూర్తి కావడానికి 2–5 రోజుల సమయం పడుతోంది. ఏటా తమ పిల్లల చదువుల కోసం రూ.30 లక్షలు పంపే ఒక సాధారణ కుటుంబం ఈ చార్జీల కింద రూ.60,000–75,000 కోల్పోవాల్సి వస్తోంది. ఈ మొత్తంతో కొన్ని రోజులపాటు విద్యార్థులు రోజువారీ ఖర్చులు వెళ్లదీయవచ్చు. లేదా అదనపు కోర్సులు చేసేందుకు వెచ్చించవచ్చు.యూఎస్లో అనిశ్చితితో..రిజర్వు బ్యాంకు లెక్కల ప్రకారం.. లిబరలైజ్డ్ రెమిటెన్ ్స స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద విదేశీ విద్య కోసం భారతీయులు విదేశాలకు పంపిన డబ్బు ఈ ఏప్రిల్లో రూ.1,410 కోట్లు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 21% తక్కువ. 2025 మొదటి నాలుగు నెలల్లో విదేశీ విద్యకు ఎల్ఆర్ఎస్ కింద చేసిన ఖర్చు మొత్తంగా 21% తగ్గి రూ.7,516 కోట్లకు చేరుకుంది. గత ఆగస్టు నుంచి ఏప్రిల్ వరకు.. తొమ్మిది నెలలుగా ఈ పథకం కింద విదేశాలకు పంపిన డబ్బు తగ్గుతూ వస్తోంది. ఇందుకు ప్రధాన కారణం అమెరికాలో అనిశ్చితి. ఎల్ఆర్ఎస్ కింద ప్రతి ఆర్థిక సంవత్సరంలో ప్రయాణం, విద్య, వైద్య చికిత్స, విదేశీ స్టాక్స్లో పెట్టుబడులు వంటి లావాదేవీల కోసం రూ.2.15 కోట్ల వరకు విదేశాలకు పంపడానికి ఆర్బీఐ అనుమతి ఇస్తోంది.ప్రపంచ సగటు 6.62%ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం 2024 జూలై–సెప్టెంబర్లో విదేశాలకు పంపే మొత్తంపై ఈ చార్జీల ప్రపంచ సగటు 6.62% ఉంది. అంతర్జాతీయ చెల్లింపులు చేయడానికి అయ్యే ఖర్చు మధ్యవర్తులు లేదా కరస్పాండెంట్ బ్యాంకుల సంఖ్యను బట్టి పెరుగుతుంది. రుసుములు, కార్యాచరణ జాప్యాలు ప్రతి దశలోనూ ఉంటాయి. ఈ ఖర్చులు, జాప్యాల వల్లే కేంద్ర బ్యాంకులు విదేశాలకు నగదు బదిలీ చేయడానికి డిజిటల్ కరెన్సీలకు శ్రీకారం చుట్టాయి.⇒ విదేశాల్లో ఉన్న పిల్లలకు గత ఏడాది విదేశీ విద్యకు అయిన వ్యయంలో నాలుగింట ఒక వంతు.. అంటే రూ.94,600 కోట్లను భారత్లోని కుటుంబ సభ్యులు బదిలీ చేశారు. మిగిలిన మొత్తాన్ని పార్ట్ టైమ్ ఉద్యోగాల ద్వారా సంపాదించిన మొత్తం, అలాగే ఉపకార వేతనాల ద్వారా విద్యార్థులు సమకూర్చుకున్నారు.⇒ ప్రస్తుతం 18 లక్షల పైచిలుకు భారతీయ విద్యార్థులు వివిధ దేశాల్లో విద్యనభ్యనిస్తున్నారు. ఏడాది క్రితం ఈ సంఖ్య 13 లక్షలు మాత్రమే.⇒ విద్యార్థుల ప్రాధాన్యతలో యూఎస్, కెనడా, యూకే టాప్–3లో నిలిచాయి.⇒ వివిధ దేశాల్లో చదువుతున్న మొత్తం విద్యార్థుల్లో భారతీయుల వాటా 30–35% ఉంది. దశాబ్దం క్రితం ఈ సంఖ్య 11% మాత్రమే.⇒ విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఆరేళ్లలో 25 లక్షలు దాటొచ్చు. -
ఉపరాష్ట్రపతి పదవికి ధన్ఖడ్ రాజీనామా
సాక్షి,న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన పదవీ కాలం మరో రెండేళ్ల ఉండగానే రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు సోమవారం (జులై 21) ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు.ఇటీవల తలెత్తిన అనారోగ్యం కారణంగా భారత ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నాట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన పదవీకాలంలో రాష్ట్రపతి, ప్రధాని, పార్లమెంట్ సభ్యుల నుంచి పొందిన మద్దతుకు ధన్ఖడ్ కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశం సాధించిన ఆర్థిక పురోగతి, అభివృద్ధి,ప్రపంచ స్థాయిలో ఎదుగుదలను చూశానని అన్నారు.కాగా, 2022 ఆగస్టు 11న ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. రాజ్యసభ ఛైర్మన్గా పార్లమెంటరీ వ్యవహారాల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించినందుకు ప్రశంసలు పొందారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్గా (2019–2022) పనిచేసిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వంతో తరచూ వివాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది మార్చిలో గుండె సంబంధిత సమస్యల కారణంగా ఎయిమ్స్లో చేరారు. తాజాగా, ఆనారోగ్య సమస్యల కారణంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 67 (ఏ) కింద తన పదవికి రాజీనామా చేశారు. -
రాజకీయ పోరాటాలతో మీకేం పని?.. ఈడీపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం
జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్పై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాజకీయ పోరాటం ఈడీ పని కాదని.. అది ముమ్మాటికీ అధికార దుర్వినియోగం కిందికి వస్తుందంటూ పేర్కొంది. కర్ణాటక ‘మూడా స్కాం’ కేసుతో పాటు.. లాయర్లకు ఈడీ సమన్లు జారీ చేసిన వ్యవహారాలను విచారించే క్రమంలో సుప్రీం కోర్టు ఈడీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యూఢిల్లీ: మూడా స్కాం కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతికి కర్ణాటక హైకోర్టు కల్పించిన ఉపశమనాన్ని ఈడీ సుప్రీం కోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ ఈడీపై తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టు సింగిల్ జడ్జి సమర్థించారని మీకు బాగా తెలుసు. అంటే ఈ కేసులో ఇప్పటికే రెండు స్థాయిల్లో న్యాయ నిర్ణయాలు వచ్చాయి. వాటిని తిరగరాయడానికి ఈడీ ప్రయత్నించడం అనవసరం. ఇది రాజకీయ ప్రమేయంలా అనిపిస్తోంది. రాజకీయాలు పోరాటాలు అనేది ప్రజల మధ్య జరగాలి. మీరు(ఈడీ) దానిని ఎందుకు ఉపయోగిస్తున్నారు? ప్రశ్నించారు. EDను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం సరికాదు.. అది ప్రజాస్వామ్యానికి హానికరం. ఈ వైరస్ను దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందనివ్వకండి అని సీజేఐ వ్యాఖ్యానించారు.Let political battles be fought among the electorate.. రాజకీయ పోరాటాలు ప్రజల మధ్య జరగాలి. రాజకీయ పార్టీల మధ్య ఉన్న విభేదాలు, ఆరోపణలు, విమర్శలు కోర్టుల ద్వారా కాదు, ఓటర్ల తీర్పు ద్వారా పరిష్కరించాలి. అలాంటిది ED (Enforcement Directorate) వంటి సంస్థలు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతున్నాయా?. కోర్టులను రాజకీయ వేదికలుగా ఉపయోగించకండి. ప్రజాస్వామ్యంలో ఓటర్లు మాత్రమే రాజకీయ నాయకుల భవితవ్యాన్ని నిర్ణయించాలి, న్యాయవ్యవస్థ కాదు.దురదృష్టవశాత్తూ.. మహారాష్ట్రలో ఈడీతో నాకు అనుభవం ఉంది. మాతో మీ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసేలా చేసుకోకండి అని చీఫ్ జస్టిస్ గవాయ్ హెచ్చరించారు. ఈ క్రమంలో అదనపు సోలిసిటర జనరల్ ఎస్వీ రాజు తమ పిటిషన్ను వెనక్కి తీసుకుంటామని ధర్మాసనానికి తెలిపారు. అదే సమయంలో.. భవిష్యత్తులో ఈ పిటిషన్ను ఇతర కేసుల్లో ఉదాహరించవద్దంటూ విజ్ఞప్తి చేశారాయన. దీంతో పిటిషన్ను కొట్టేస్తున్నట్లు సీజేఐ ప్రకటించారు. మరో కేసులో.. క్లయింట్లకు సలహాలు ఇస్తున్నారనే అభియోగాల కింద.. ఈడీ సీనియర్ అడ్వొకేట్లకు కొందరు సమన్లు జారీ చేసింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు .. ఇవాళ విచారణ చేపట్టింది. సుప్రీం కోర్టు బార్ అసోషియేషన్ తోపాటు మరికొన్ని లీగల్ బాడీస్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో.. చైనా, టర్కీలలో బార్ అసోషియేషన్లు రద్దైన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆందోళన వ్యక్తం చేశాయి. అదే సమయంలో మార్గదర్శకాలు జారీ చేయాలని కోరాయి. దీంతో.. న్యాయపరమైన సలహాలు ఇవ్వడం తప్పెలా అవుతుంది? అని ఈడీ తీరును సుప్రీం కోర్టు తప్పుబట్టింది. అయితే గుజరాత్లో ఓ హత్య కేసులో నిందితుడికి న్యాయవాది సలహా ఇవ్వడాన్ని ఈడీ ప్రముఖంగా ప్రస్తావించింది. ఈ వ్యవహారంలో ఈడీని నెగెటివ్గా చూపించే ప్రయత్నం జరుగుతోందంటూ సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. అయితే అది వేరే సందర్భమన్న సీజేఐ బెంచ్.. న్యాయవాదిని సమన్లు ఇవ్వాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలనే విషఁఆన్ని గుర్తు చేశారు. ఈ వ్యవహారంలో మార్గదర్శకాల రూపకల్పనకు అమీకస్ క్యూరీని నియమిస్తామంటూ వచ్చేవారానికి విచారణ వాయిదా వేసింది.మూడా (MUDA) కేసు నేపథ్యంకర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య B.M. పర్వతికి సంబంధించి మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) ద్వారా భూ కేటాయింపులపై అక్రమతల ఆరోపణలతో ప్రారంభమైంది. సుమారు 3.16 ఎకరాల భూమి పర్వతి పేరుతో ఉంది, ఇది MUDA ద్వారా డెనోటిఫై చేయబడిన తర్వాత రెసిడెన్షియల్ లేఅవుట్గా అభివృద్ధి చేయబడింది. MUDA ఈ భూమిని ఉపయోగించినందుకు పర్వతి 14 ప్లాట్లు (ప్రతి ఒక్కటి ₹2 కోట్ల విలువ) విజయనగర ప్రాంతంలో పొందారు. అయితే.. బీజేపీ, JD(S) వంటి ప్రతిపక్షాలు దీన్ని ₹4,000 కోట్ల స్కాంగా అభివర్ణించాయి. మూడా (MUDA) కేసు కోర్టు విచారణ టైం లైన్కర్ణాటక గవర్నర్ తావార్చంద్ గెహ్లాట్ 2024 ఆగస్టు 17న MUDA కేసులో ED విచారణకు అనుమతి ఇచ్చారు. తద్వారా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విచారణకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లైంది. ED తన Enforcement Case Information Report (ECIR) నమోదు చేసి, పర్వతి (CM భార్య) సహా ఇతరులపై ప్రీలిమినరీ విచారణ ప్రారంభించింది. ఆగస్టు 19, 2024👉 సీఎం సిద్ధరామయ్య గవర్నర్ ఆదేశాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.👉 ED విచారణకు అనుమతి ఇచ్చిన గవర్నర్ ఆదేశాన్ని రద్దు చేయాలని కోరారు.ఆగస్టు 29, 2024👉 హైకోర్టు ప్రత్యేక కోర్టును MUDA కేసులో తాత్కాలికంగా ఆదేశాలు ఇవ్వకుండా ఉండమని సూచించింది.👉 విచారణ తదుపరి తేదీకి వాయిదా వేసింది. సెప్టెంబర్ 12, 2024👉 హైకోర్టు విచారణ పూర్తిచేసి తీర్పును రిజర్వ్ చేసింది.👉 న్యాయమూర్తి M. నాగప్రసన్న రెండు పక్షాల వాదనలు ఆఖరి రోజులోనే ముగించాలని స్పష్టం చేశారు.సెప్టెంబర్ 24, 2024👉 కర్ణాటక హైకోర్టు సీఎం సిద్ధరామయ్య పిటిషన్ను తిరస్కరించింది.👉 గవర్నర్ అనుమతి చట్టబద్ధమైనదే అని తీర్పు ఇచ్చింది.2025 మార్చి 7కర్ణాటక హైకోర్టు సిద్ధరామయ్య సతీమణి B.M. పార్వతికి ఉపశమనంMUDA భూ కేటాయింపు కేసులో, ED జారీ చేసిన సమన్లను హైకోర్టు రద్దు చేసింది. న్యాయమూర్తి M. నాగప్రసన్న ఈ తీర్పును ఇచ్చారు, పార్వతి, మంత్రి బైరతి సురేష్ దాఖలు చేసిన పిటిషన్లను విచారించి, ED చర్యలు చట్టపరంగా నిలబడవని తేల్చారు. Money Laundering Act (PMLA) ప్రకారం, “proceeds of crime” అనే అంశం స్పష్టంగా లేకపోతే, ED విచారణ కొనసాగించలేదని కోర్టు అభిప్రాయపడింది. పార్వతి 14 ప్లాట్లు స్వచ్ఛందంగా తిరిగి అప్పగించడంతో, ఆర్థిక లాభం పొందలేదని కోర్టు గుర్తించింది. సమన్లు జారీ చేయడం చట్టబద్ధంగా కాదని తీర్పు ఇచ్చారు.జూలై 21, 2025👉 సుప్రీం కోర్టు ఈ కేసులో ED అప్పీల్ను తిరస్కరించింది.👉 “రాజకీయ పోరాటాలు ప్రజల మధ్య జరగాలి, కోర్టుల్లో కాదు” అని CJI BR గవాయ్ వ్యాఖ్యానించారు. -
మిథున్రెడ్డి అరెస్ట్.. వైఎస్సార్సీపీని దెబ్బ తీసేందుకే లిక్కర్ కేసు
వైయస్ఆర్సీపీని దెబ్బతీసి ఉద్దేశంతో లేని లిక్కర్ కేసును బనాయించారని ఆ పార్టీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి అంటున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభ నేపథ్యంలో ఢిల్లీలో సాక్షి ప్రతినిధితో ఆయన మాట్లాడారు. సాక్షి, ఢిల్లీ: ఏపీలో అక్రమ అరెస్టుల పరంపర కొనసాగుతోందని, లేని లిక్కర్ కేసును బనాయించి వైయస్ఆర్సీపీని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని ఆ పార్టీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. సోమవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభ నేపథ్యంలో సాక్షి ప్రతినిధితో ఆయన మాట్లాడారు. ఏపీలో అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. పార్లమెంటు సమావేశాల ఉన్నప్పటికీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం దారుణం. మద్యం విధానం పై చర్చకు మేము సిద్ధం. అలాగే.. 2014-2024 వరకు మద్యం విధానంపై కూడా చర్చించాలి. టీడీపీ హయాంలో ప్రైవేటు వ్యాపారులకు మద్యం లైసెన్స్ ఇచ్చి ఊరురా బెల్టు షాపులు పెట్టించారు. టీడీపీ హయాంలో పెద్ద సంఖ్యలో బెల్టు షాపులతో మద్యం ఏరులై పారింది. కానీ..మా ప్రభుత్వ హాయంలో పారదర్శకంగా ప్రభుత్వమే మద్యం దుకాణాల నిర్వహించి అమ్మకాలను తగ్గించింది. వైయస్సార్సీపీని దెబ్బతీసి ఉద్దేశంతో లేని లిక్కర్ కేసును బనాయించారు అని అన్నారాయన. ఏపీలో వైఎస్ జగన్కు తగిన భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రంలోని ఖనిజ సంపదను అప్పుల కోసం తాకట్టు పెడుతున్నారు. ఈ అంశాలన్నీ పార్లమెంటులో లేవనెత్తుతా అని తెలిపారు. ఇక.. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్కు కేంద్రం గట్టి బుద్ధి చెప్పిందన్న వైవీ సుబ్బారెడ్డి.. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు ఇచ్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు. -
ఈ పార్లమెంటు సమావేశాలు.. విజయోత్సవాలు
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలను జాతికి విజయోత్సవాలుగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ‘‘బాంబులు, తుపాకులు అవి పుట్టించే హింసపై ఎప్పటికీ రాజ్యాంగ స్ఫూర్తిదే పై చేయి. మా పాలనలో పదేపదే నిరూపితమవుతూ వస్తున్న వాస్తవమిది’’ అని మోదీ చెప్పారు. ఆపరేషన్ సిందూర్తో సహా విపక్షాలు లేవనెత్తదలచిన అన్ని అంశాలపైనా చర్చకు ప్రభుత్వం సిద్ధమంటూ సంకేతాలిచ్చారు. సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం ఉదయం పార్లమెంటు ఆవరణలో ప్రధాని మీడియాతో మాట్లాడారు. ‘‘ఇవి దేశానికి గర్వకారణంగా నిలవనున్న సమావేశాలు. విజయో త్సవాల వంటివి. మన సాయుధ బలగాల శక్తిసామర్థ్యాలను ప్రపంచమంతా అబ్బురపాటుతో వీక్షించింది. సైన్యం 100 శాతం కచ్చితత్వంతో లక్ష్యాలను సాధించి భారత పతాకను సమున్నతంగా ఎగురవేసింది’’ అని ఆపరేషన్ సిందూర్ను ఉద్దేశించి పేర్కొన్నారు. ‘‘ఆ ఘనతను అఖిలపక్ష బృందాలు దేశదేశాల్లో చాటాయి. ఆ పార్టీలకు, ఎంపీలకు నా అభినందనలు’’అన్నారు. సిందూర్ వేళ మేడిన్ ఇండియా ఆయుధాలు అద్భుతంగా సత్తా చాటి ప్రపంచం దృష్టిని ఆకర్షించాయని గుర్తు చేశారు.May the Monsoon Session of Parliament be productive and filled with enriching discussions that strengthen our democracy. https://t.co/Sj33JPUyHr— Narendra Modi (@narendramodi) July 21, 2025‘‘పహల్గాం ఉగ్ర దాడి ప్రపంచాన్నే షాక్కు గురి చేసింది. ఉగ్రవాదంపై పోరులో దేశాలన్నీ మరోసారి ఒక్కతాటిపైకి వచ్చేలా చేసింది. అంతేకాదు, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కూడా మన పతాక ఇటీవలే సగర్వంగా ఎగిరింది. దేశంలో నక్సలిజం ఆనవాలు లేకుండా పోతోంది. నక్సల్ హింసతో రెడ్ జోన్గా మారిన అనేకానేక ప్రాంతాలు కాస్తా అభివృద్ధికి నోచుకుని హరితవర్ణం పులుముకుంటున్నాయి. కొద్దిరోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో దేశ ఆర్థికానికి ఎనలేని ఊపు లభిస్తోంది. డ్యామ్లు మూడింతల జలకళతో పరవళ్లు తొక్కుతున్నాయి. గత పాలకుల హయాంలో రెండంకెల్లో కొనసాగిన ద్రవ్యోల్బణం మా పాలనలో దశాబ్దకాలంగా నేలకు దిగుతోంది. వృద్ధి చుక్కలు తాకుతోంది’’అంటూ తమ సర్కారు సాధించిన ప్రగతిని వివరించారు. ‘‘పార్టీలుగా ఎవరి అజెండా వారికి ఉండొచ్చు. కానీ ఆ విభేదాలకు అతీతంగా ఎంపీలంతా సభల్లో ఒకే గళం వినిపించడం ద్వారా పార్లమెంటు సమావేశాల స్ఫూర్తిని సాకారం చేస్తారని ఆశిస్తున్నా’’ అని విపక్షాలను ఉద్దేశించి పేర్కొన్నారు. -
నిద్రమాత్రలతో అతడికి ఏమీ కాలేదు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఓ మహిళ భర్తను చంపేందుకు చేసిన ప్రయత్నాలు తెలిసి పోలీసులే షాకయ్యారు. ఆమె సెల్ చాటింగ్ వివరాలు పోలీసులకు దొరికాయి. అందులో ఆమె..‘అతడికి ఆహారంలో చాలా నిద్రమాత్రలు కలిపి ఇచ్చాను. అయినా ఏమీ కాలేదు..బాగానే ఉన్నాడు. ఇప్పుడిక కరెంట్ షాకివ్వడమొక్కటే దారి. ఎంత సేపు షాకివ్వాలి?’అంటూ ప్రియుడిని సలహా అడిగింది. అందుకా ప్రియుడు..‘ముందుగా అతడి నోటిని, రెండు చేతులను టేప్తో కట్టేసి, ఆ తర్వాత కరెంట్ షాకివ్వాలి’అంటూ దారి చూపడం గమనార్హం. ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలోని ఉత్తమ్నగర్కు చెందిన కరణ్(36) భార్య సుశ్మిత, వరుసకు మరిది అయ్యే రాహుల్తో అక్రమ సంబంధం సాగిస్తోంది. వీరిద్దరూ కలిసి కరణ్ను చంపాలని ప్లాన్లు వేస్తున్నారు. ఈనెల 13వ తేదీన మాతా రూప్రాణీ హాస్పిటల్ నుంచి పోలీసులకు కరణ్ అనే వ్యక్తి విద్యుత్ షాక్తో చనిపోయినట్లు సమాచారం అందింది. కరణ్ కుటుంబీకులు తమకు సుశ్మితపై అనుమానం ఉందని, ఆమె రాహుల్తో సన్నిహితంగా ఉంటోందంటూ వివరించారు. పోలీసుల విచారణలో సుశ్మిత దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడించింది. ఈ నెల 12న రాత్రి సుశ్మిత సుమారు 15 నిద్రమాత్రలను కరణ్కు వడ్డించిన భోజనంలో కలిపినట్లు తెలిపింది. అయినా కరణ్ చనిపోలేదని రాహుల్కు తెలిపింది. అతడి సలహా మేరకు విద్యుత్షాక్కు గురిచేసింది. చనిపోయాడని నిర్థారించుకున్నాక సమీపంలోని అత్తమామల ఇంటికి వెళ్లి కరణ్ అపస్మారక స్థితిలో ఉన్నాడని తెలిపింది. అంతా కలిసి కరణ్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతడు అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు. మరణానికి కారణం కరెంట్ షాకని శవపరీక్షలో తేలింది. అదేవిధంగా, కరణ్ సోదరుడు సుశ్మిత–రాహుల్లు ఇన్స్టాలో చేసిన చాటింగ్ వివరాలను పోలీసులకు అందజేశాడు. -
టెక్ బదిలీ.. ఆదాయం భళీ!
దివ్యాంగులకు వరమైన జైపూర్ ఫుట్ సాంకేతికత.. వరదల సమయంలోనూ, వ్యవసాయంలోనూ.. ఇలా అనేక సందర్భాల్లో అక్కరకొచ్చే లైడార్ (లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్) టెక్నాలజీ.. మంటల నుంచి రక్షించే సెరామిక్ ఆధారిత పూత..ఇలాంటి ఎన్నో అద్భుతమైన సాంకేతికతలు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ – ఇస్రో తయారుచేసినవే. ఇవి దేశాభివృద్ధికి ఉపయోగపడేలా ఆ సాంకేతికతలను పారిశ్రామిక రంగానికి, స్టార్టప్లకు బదిలీ చేస్తూ ప్రైవేటు రంగాన్ని బలోపేతం చేయడంలోనూ తన వంతు పాత్ర పోషిస్తోంది ఇస్రో. ఒకపక్క దేశ రక్షణ, అభివృద్ధికి ప్రయోగాలు చేస్తూనే ఈ సాంకేతికత బదిలీ ద్వారా భారీగా ఆదాయాన్నీ ఆర్జిస్తోంది.ఇస్రో తన చిన్న ఉపగ్రహాల ప్రయోగ వాహన (ఎస్.ఎస్.ఎల్.వి.) సాంకేతిక పరిజ్ఞానాన్ని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్.ఎ.ఎల్.)కు రూ. 511 కోట్లకు బదిలీ చేసినట్లు ఇన్–స్పేస్ జూన్ నెలలో వెల్లడించింది. ఇస్రో తన లాంచ్ వెహికల్ టెక్నాలజీని పూర్తిస్థాయిలో ఒక పరిశ్రమకు బదిలీ చేయటం ఇదే మొదటిసారి. చిన్న ఉపగ్రహాల తయారీ, ప్రపంచ అంతరిక్ష ప్రయోగాలకు కేంద్ర బిందువుగా మారటం వంటి లక్ష్యాలతో పురోగమిస్తున్న భారతదేశ అంతరిక్ష కార్యక్రమంలో ఈ సాంకేతికతల బదిలీ వ్యూహాత్మకమైన మార్పును సూచిస్తోంది. ఇప్పటికే హెచ్.ఎ.ఎల్., ఎల్ అండ్ టీ సంస్థలు ఇస్రోతో కలిసి పి.ఎస్.ఎల్.వి. (పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్)ల తయారీలో సాంకేతిక భాగస్వాములు అయ్యాయి.సాంకేతికత బదిలీఅంతరిక్ష ప్రయోగ వాహనాల సాంకేతికతల్ని బదిలీ చేయటానికి చాలాకాలం ముందు నుంచే ఇస్రో పౌర సేవల వినియోగం కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేస్తోంది. 1970, 80లలోనే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, ఇస్రో శాటిలైట్ సెంటర్లు వైద్య రంగానికి తమ పరిజ్ఞానాన్ని ఇచ్చాయి. ఇస్రో మొదటి పౌర సంబంధ పరిజ్ఞాన బదిలీ ‘పాలియురేథేన్ ఫోమ్ టెక్నాలజీ’. రాకెట్ మోటార్లలో ఉపయోగించే ఈ సాంకేతికతను కృత్రిమ అవయవాల తయారీకి అందించింది. ‘జైపూర్ ఫుట్’ను అభివృద్ధి చేయటానికి ఈ పరిజ్ఞానమే తోడ్పడింది. ఇస్రో డేటా ప్రకారం.. 2020 ముందు వరకు 400కు పైగా సాంకేతికతలను దాదాపు 235 పరిశ్రమలకు బదిలీ చేసింది. టెలికంకు కూడా ఇస్రో యాంటెన్నాలకు, గ్రౌండ్ స్టేషన్లను సాంకేతిక పరిజ్ఞానం అందించింది. ఎక్స్ కిరణాలు మరింత ప్రభావవంతంగా ప్రసరించేలా చేసే బెరిలియం ఎక్స్రే ట్యూబులు, ఆహార పర్యవేక్షణ డేటా సేకరణ వ్యవస్థలు, సిలికా థర్మల్ కవచాల వంటి ఎన్నో సాంకేతికతలను ఇస్రో బదిలీ చేసింది.ఇన్–స్పేస్తో కొత్త యుగంఇన్–స్పేస్ ప్రారంభం, ఆ తర్వాత మారిన భారతీయ అంతరిక్ష విధానం.. సాంకేతిక బదిలీలకు ఊపునిచ్చాయి. అంతరిక్ష రంగంలో పనిచేసే ప్రభుత్వేతర సంస్థలను ప్రోత్సహించి, తత్సంబంధ ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో కేంద్రం 2020లో ఏర్పాటుచేసిందే ‘ఇన్ స్పేస్’. ఇది ఇప్పటివరకు 90కిపైగా సాంకేతికతల బదిలీలో కీలకపాత్ర పోషించింది. ఈ ఏడాది ఏప్రిల్లో కేంద్ర ప్రభుత్వం లోక్సభలో వెల్లడించిన వివరాల ప్రకారం.. 6 అంతరిక్ష సంబంధ స్టార్టప్లకు ఇన్ స్పేస్ గ్రాంట్లు కూడా ఇచ్చింది. దేశవ్యాప్తంగా సుమారు 330 పరిశ్రమలు, స్టార్టప్లు, ఎమ్ఎస్ఎమ్ఈలు ఇన్ స్పేస్తో కలిసి పనిచేస్తున్నాయి.విదేశాలపై ఆధారపడటం తగ్గింది ఇస్రో అభివృద్ధి చేసిన సాంకేతికతల తాజా బదిలీల్లో ముఖ్యమైనవి – జూలై 3న భారతీయ పరిశ్రమలకు అందిన 10 అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలు. ఇందులో కొన్ని ప్రధానమైనవి.. మంటల నుంచి రక్షించే సెరామిక్ ఆధారిత పూత, లేజర్ గైరోస్కోప్లు, సిరామిక్ సర్వో యాక్సిలెరోమీటర్లు, గ్రౌండ్ స్టేషన్ కార్యకలాపాలకు సంబంధించిన సాంకేతికతలు. ఉపగ్రహ ప్రయోగాలు, గ్రౌండ్ స్టేషన్ మౌలిక సదుపాయాలు, జియోస్పేషియల్ అప్లికేషన్ ల వంటి కీలక రంగాలలో విదేశీ సాంకేతికతలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు కూడా దేశీయ పరిశ్రమల భాగస్వామ్యానికి ఇస్రో ప్రాధాన్యం ఇస్తోంది. 2033 నాటికి 44 బిలియన్ డాలర్ల విలువైన అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను నిర్మించుకోవటంపై దృష్టి సారించింది. స్టార్టప్లకూ మార్గనిర్దేశనం చెన్నైకి చెందిన అగ్నికుల్ కాస్మోస్, హైదరాబాద్లోని స్కైరూట్ వంటి అంతరిక్ష సంబంధిత స్టార్టప్లు.. రాకెట్ల నిర్మాణంలో పనిచేస్తున్నాయి. అవి వాటి లాంచ్ ప్యాడ్లు శ్రీహరికోటలో నిర్మించుకోవడానికి ఇస్రో అనుమతిచ్చింది. అంతేకాకుండా ఆ స్టార్టప్లకు అవసరమైన మార్గనిర్దేశనం కూడా ఇస్రో చేస్తోంది. హెచ్.ఎ.ఎల్.కు సాంకేతికత బదిలీ, అగ్నికుల్ కాస్మోస్, స్కైరూట్ ఏరోస్పేస్ వంటి వాటితో భాగస్వామ్యం.. ఇలాంటి చర్యలతో భారతీయ అంతరిక్ష కార్యక్రమాల అభివృద్ధి వేగం పుంజుకుంటోందని ఇన్–స్పేస్ చైర్మన్ పవన్ గోయెంకా అంటున్నారు.న్యూ స్పేస్ ఇండియాఇస్రో, మన అంతరిక్ష విభాగం.. ఎన్నో ప్రయోగాలు చేస్తుంటాయి. ఎన్నో సాంకేతికతలను అభివృద్ధి చేస్తుంటాయి. ఆ ఫలాలను దేశంలోని పారిశ్రామిక రంగానికి అందజేసి.. అవి సాంకేతికతలో స్వయం సమృద్ధి సాధించాలి, పారిశ్రామిక అభివృద్ధి ద్వారా దేశాభివృద్ధి జరగాలన్నదే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) లక్ష్యం. ఇది ఇస్రో వాణిజ్య విభాగం. దీన్ని 2019లో ఏర్పాటుచేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజ్యసభలో కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం దీని ఆదాయార్జన..150కిపైగా ఒప్పందాలుఈ మార్చిలో కేంద్రం లోక్సభలో వెల్లడించిన వివరాల ప్రకారం.. 2024 డిసెంబర్ 31 నాటికి ప్రభుత్వేతర సంస్థలకు సాంకేతిక బదిలీకి ఇన్ స్పేస్ 75 ఒప్పందాలు చేసుకుంది. అలాగే ఎన్ఎస్ఐఎల్.. ఇస్రో సాంకేతికతలను భారతీయ పరిశ్రమలకు బదిలీ చేసేందుకు 78 ఒప్పందాలు కుదుర్చుకుంది. -
మలేరియా నివారణకు దేశీయ టీకా
న్యూఢిల్లీ: దోమకాటు ద్వారా సోకే మలేరి యా వ్యాధితో దేశ వ్యాప్తంగా ప్రతిఏటా వేలాది మంది మర ణిస్తున్నారు. ప్రాణాంతక మలేరియాను అరికట్టడానికి భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) దేశీయ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసింది. భువనేశ్వర్లోని రీజినల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్(ఎన్ఐఎంఆర్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీకి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ భాగస్వామ్యంతో ‘అడ్పాల్సి వ్యాక్స్’ పేరిట పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ టీకాను అభివృద్ధి చేసింది.మలేరియా వ్యతిరేక పోరాటంలో ఈ టీకా కీలక అస్త్రం అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇది రీకాంబినెంట్ మల్టీస్టేజ్ వ్యాక్సిన్ అని అంటున్నారు. ఇప్పటిదాకా నిర్వహించిన క్లినికల్ ప్రయోగాల్లో ఆశించిన ఫలితాలు లభించాయి. టీకా తీసుకున్న వారికి మలేరియా నుంచి పూర్తి రక్షణ లభించడంతోపాటు రోగ నిరోధక శక్తి తగ్గే ముప్పును ఇది గణనీయంగా నివారిస్తున్నట్లు తేలింది. మనుషుల్లో ప్లాస్మోడియం ఫాల్సిపరమ్ ఇన్ఫెక్షన్ను సమర్థంగా అడ్డుకుంటున్నట్లు వెల్లడయ్యింది. ‘అడ్పాల్సివ్యాక్స్’ తయారీ, విక్రయం కోసం అర్హత కలిగిన కంపెనీలకు లైసెన్స్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. ఆయా కంపెనీల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ(ఈఓఐ) దరఖాస్తులను ఆహ్వానించింది. -
22న అపాచీ హెలికాప్టర్ల రాక
న్యూఢిల్లీ: భారత సైన్యం అమ్ములపొదిలోకి అమెరికాకు చెందిన అత్యాధునిక అపాచీ ఏహెచ్–64ఈ అటాక్ హెలికాప్టర్లు చేరనున్నాయి. ఈ నెల 22న అవి సైన్యానికి అందబోతున్నాయి. ఈ ప్రక్రియ ఇప్పటికే 15 నెలలు ఆలస్యమైంది. మొదటి దశ హెలికాప్టర్లు అందించేందుకు ఏర్పాట్లు పూర్తయినట్లు అధికారులు చెప్పారు. మొదట మూడు హెలికాప్టర్లను మంగళవారం ఇండియన్ ఆర్మ్ కి చెందిన ఏవియేషన్ విభాగానికి అప్పగించబోతున్నారు.మొత్తం ఆరు హెలికాప్టర్ల కొనుగోలుకు 2020లో అమెరికాతో ఒప్పందం కుదిరింది. ఈ డీల్ విలువ 600 మిలియన్ డాలర్లు(రూ.5,171 కోట్లు). 2024 జూన్ నెలలో మొదటి దశ హెలికాప్టర్లను అప్పగించాల్సి ఉండగా, కొన్ని సాంకేతిక కారణాలతో జాప్యం జరిగింది. మొదటి దశ హెలికాప్టర్లు మంగళవారం రానుండగా, రెండో దశ హెలికాప్టర్లు ఈ ఏడాది ఆఖరు నాటికి రాబోతున్నాయి.అపాచీ ఏహెచ్–64ఈ హెలికాప్టర్లు భారత వైమానిక దళంలో కీలకం కాబోతున్నాయి. ఇవి శక్తివంతమైనవిగా పేరొందాయి. పాకిస్తాన్ సరిహద్దుల్లో వీటిని మోహరించబోతున్నారు. 2015లో కుదిరిన మరో ఒప్పందం కింద భారత సైన్యం ఇప్పటికే 22 అపాచీ హెలికాప్టర్లను సమకూర్చుకుంది. ఏహెచ్–64ఈ అటాక్ హెలికాప్టర్లు వాటి కంటే అత్యాధునికం అని చెబుతున్నారు. -
సిందూర్పై చర్చకు సై
ఆపరేషన్ సిందూర్ సహా జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత కలిగిన కీలకాంశాలపై పార్లమెంట్లో చర్చకు వెనుకంజ వేసే ప్రసక్తే లేదు. విపక్షాల ప్రశ్నలన్నింటికీ మేం సమాధానం ఇస్తాం. అయితే పార్టీలకు, కూటములకు వేర్వేరు సిద్ధాంతాలు ఉన్నప్పటికీ పార్లమెంట్ కార్యకలాపాలకు సహకరించాల్సిన బాధ్యత అన్ని పక్షాలపైనా ఉంది. విదేశీ పర్యటనలో ఉన్న రోజుల్లో మినహా మిగతా సమయంలో ప్రధాని మోదీ పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతారు. – కిరణ్ రిజిజు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి భారత్–పాక్ మధ్య యుద్ధం ఆపేశానంటూ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు, పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దుశ్చర్యకు దారితీసిన భద్రతా లోపాలు, బిహార్లో ఓటర్ల జాబితా సవరణపై ప్రధాని మోదీ స్పందించాలి. పొరుగు దేశాలతో విదేశాంగ విధానం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతుల కష్టాలు, దేశ ఆర్థిక వ్యవస్థ, మణిపూర్ అంశాలపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో చర్చించాలి. – గౌరవ్ గొగోయ్, కాంగ్రెస్ ఎంపీ సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఉగ్రవాదుల భరతం పట్టేందుకు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సహా కీలక అంశాలపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 21వ తేదీ వరకు కొనసాగుతాయి. పహల్గాం ఉగ్ర దాడి, ఆపరేషన్ సిందూర్, బిహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ తర్వాత జరుగుతున్న ఈ సమావేశాలు వాడీవేడీగా సాగే అవకాశం కనిపిస్తోంది. పార్లమెంట్ లేవనెత్తాల్సిన కీలక అంశాలపై విపక్షాలు కసరత్తు పూర్తిచేశాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమయ్యాయి. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనపై వర్షాకాల సమావేశాల్లో తీర్మానం ప్రవేశపెట్టబోతున్నారు. నిర్మాణాత్మక చర్చలకు సహకరించాలి వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు, ఉభయ సభల్లో నిర్మాణాత్మక చర్చలు జరిగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అధ్యక్షతన ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, అర్జున్రామ్ మేఘ్వాల్, మురుగన్తోపాటు కాంగ్రెస్ ఆర్జేడీ, జేడీ(యూ), సమాజ్వాదీ పార్టీ, వైఎస్సార్సీపీ, డీఎంకే, నేషనల్ కాన్ఫరెన్స్, టీఎంసీ, బీఆర్ఎస్, శివసేన(షిండే), ఆమ్ ఆద్మీ తదితర పార్టీల సభ్యులు హాజరయ్యారు. విపక్షాలు తమ ఎజెండాను ప్రస్తావించాయి. బిహార్లో అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, పహల్గాం ఉగ్రవాద దాడి, భారత్–పాక్ ఘర్షణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలను లేవనెత్తాయి. పొరుగు దేశాలతో విదేశాంగ విధానం, తాజా పరిస్థితులపై పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని డిమాండ్ చేశాయి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతుల కష్టాలు, దేశ ఆర్థిక వ్యవస్థ, మణిపూర్ అంశాలపై పూర్తిస్థాయిలో చర్చించాలని కోరాయి. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చ చేపట్టాలని డీఎంకే అభ్యర్థించింది. అఖిలపక్ష భేటీ అనంతరం కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ మీడియాతో మాట్లాడారు. భారత్–పాక్ మధ్య యుద్ధం ఆపేశానంటూ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు, పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దుశ్చర్యకు దారితీసిన భద్రతా లోపాలు, బిహార్లో ఓట్ల జాబితా సవరణపై ప్రధాని మోదీ మాట్లాడాలని కోరినట్లు తెలిపారు.అఖిలపక్ష భేటీ నుంచి వస్తున్న కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, జేపీ నడ్డా, ఎంపీలు జైరాం రమేశ్ తదితరులు కొత్త బిల్లులు వర్షాకాల సమావేశాల్లో కేంద్రం 8 కొత్త బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. మణిపూర్ వస్తువులు, సేవల పన్ను(సవరణ) బిల్లు, జన్ విశ్వాస్(నిబంధనల సవరణ) బిల్లు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(సవరణ) బిల్లు, పన్నుల చట్టాలు(సవరణ) బిల్లులతో పాటు జియోహెరిటేజ్ సైట్స్, జియో–రెలిక్స్(సంరక్షణ), జాతీయ క్రీడా పాలన బిల్లు, జాతీయ డోపింగ్ నిరోధక(సవరణ) బిల్లులను ప్రవేశపెట్టనుంది. మణిపూర్లో రాష్ట్రపతి పాలనను పొడిగించడానికి ప్రభుత్వం పార్లమెంట్ ఆమోదం కోరనుంది. వీటితోపాటు పెండింగ్లో ఉన్న సముద్ర వస్తువుల రవాణా బిల్లు, కోస్టల్ షిప్పింగ్ బిల్లు, మర్చంట్ షిప్పింగ్ బిల్లు, ఓడరేవుల బిల్లులపై చర్చించి, ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. చర్చకు వెనుకాడం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆపరేషన్ సిందూర్ సహా జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత కలిగిన కీలక అంశాలపై పార్లమెంట్లో చర్చకు వెనుకంజ వేసే ప్రసక్తే లేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. విపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇస్తామన్నారు. అఖిలపక్ష భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాలు ఎలాంటి అంతరాయాలు లేకుండా సజావుగా కొనసాగేందుకు అధికార, విపక్ష సభ్యులు కలిసికట్టుగా పని చేయాలన్నారు. వర్షాకాల సమావేశాలు ఫలవంతం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. పార్టీలకు, కూటములకు వేర్వేరు సిద్ధాంతాలు ఉన్నప్పటికీ పార్లమెంట్ కార్యకలాపాలకు సహకరించాల్సిన బాధ్యత అన్ని పక్షాలపైనా ఉందన్నారు. ఉభయ సభల్లో మాట్లాడేందుకు ఎక్కువ సమయం ఇవ్వాలని చిన్న పార్టీల ఎంపీలు కోరారని, అందుకోసం ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని రాజ్యసభ చైర్మన్, లోక్సభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. చిన్న ఎంపీలకు తగినంత సమయం ఇవ్వాలన్నదే తమ ఉద్దేశమని వివరించారు. విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు మినహా మిగతా సమయంలో ప్రధాని మోదీ పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతారని కిరణ్ రిజిజు వెల్లడించారు. విపక్షాలు లేవనెత్తే అంశాలపై సంబంధిత కేబినెట్ మంత్రులు సమాధానం ఇస్తారని స్పష్టంచేశారు. 17 బిల్లులు ప్రవేశపెట్టబోతున్నామని, వాటి వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. -
జస్టిస్ యశ్వంత్ వర్మ తొలగింపునకు ముహూర్తం ఖరారు?
సాక్షి,న్యూఢిల్లీ: కాలిన నోట్ల కట్టల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మకు పదవి నుంచి ఉద్వాసన పలికే సమయం ఆసన్నమైంది.రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల ప్రారంభానికి ఒక రోజు ముందే జస్టిస్ యశ్వంత్ వర్మను అభిశంసన ద్వారా తొలగించే ప్రక్రియపై 100 మంది పార్లమెంట్ సభ్యులు సంతకాలు పెట్టినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అధికారికంగా ప్రకటించారు.ఇంట్లో కాలిన నోట్ల కట్టలు.. విచారణకు సుప్రీంఈ ఏడాది మార్చి నెలలో జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో భారీ ఎత్తున కాలిన నోట్ల కట్టలు వెలుగులోకి వచ్చాయి. దీంతో జస్టిస్ వర్మపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదే అంశంపై సుప్రీం కోర్టు త్రిసభ్య కమిటీతో విచారణ చేపట్టింది. ఈ విచారణలో కాలిన నోట్ల కట్టలు జస్టిస్ యశ్వంత్ వర్మవేనన్న సాక్షులు,ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.అభిశంసన చర్యలువీటిని పరిగణలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం నియమించిన త్రిసభ్య కమిటీ సైతం జస్టిస్ వర్మను అభిశంసన ద్వారా తొలగించాలని సిఫారసు చేసింది. త్రిసభ్య కమిటీ నిర్ణయాన్ని తప్పుబట్టిన జస్టిస్వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కమిటీ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని అత్యున్నత న్యాయ స్థానంలో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే తనపై అభిశంసన చర్యలు ప్రారంభించాలంటూ అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా చేసిన సిఫార్సులను సైతం సవాలు చేశారు.త్రిసభ్య కమిటీ రిపోర్టుపై సవాలునోట్ల కట్టల వ్యవహారంలో తన వాదన పూర్తిగా వినకుండానే నివేదిక రూపొందించారని అంతర్గత ఎంక్వైరీ కమిటీ తీరును ఆయన తప్పుపట్టారు. ఈ దర్యాప్తులో లోపాలు ఉన్నాయని స్పష్టం చేశారు. తనకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలు కమిటీకి లభించలేదన్నారు.ఏకమైన అధికార,ప్రతి పక్షాలు తనను దోషిగా తేల్చాలన్న ముందస్తు వ్యూహంతోనే నివేదిక సిద్ధంగా చేశారని విమర్శించారు. తనపై దర్యాప్తు ప్రక్రియ మొత్తం రాజ్యాంగవిరుద్ధంగా సాగిందని, తన ప్రాథమిక హక్కులు ఉల్లంఘనకు గురయ్యాయని ఆందోళన వ్యక్తంచేశారు. నివేదికపై తాను అధికారికంగా స్పందించకముందే దాన్ని మీడియాకు లీక్ చేశానని, తన ప్రతిష్టను దెబ్బతీయాలన్న కుట్ర జరిగిందని జస్టిస్ వర్మ మండిపడ్డారు. అందుకే ఈ నివేదికను రద్దు చేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. అయినప్పటికీ జస్టిస్ వర్మపై అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టేందుకు అధికార,ప్రతి పక్షాలు ఏకమయ్యాయి. అభిశంసన తీర్మానం ద్వారాభారత రాజ్యాంగం ప్రకారం.. అవినీతి ఆరోపణల ఆధారంగా రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా మాత్రమే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని పదవి నుండి తొలగించవచ్చు.అటువంటి ఘటనల్లో అభిశంసన తీర్మానాన్ని రాజ్యసభలో కనీసం 50 మంది సభ్యుల మద్దతు లేదంటే లోక్సభలో కనీసం 100 మంది సభ్యుల మద్దతు ఉంటేనే ఆమోదిస్తారు. ఈ తీర్మానాన్ని ఆమోదించడానికి సభలోని మూడింట రెండు వంతుల ఎంపీల మద్దతు అవసరం.మంత్రి కిరణ్ రిజిజు ఏమన్నారంటే?ఇప్పుడు ఇదే పద్దతిలో జస్టిస్ వర్మ తొలగింపునకు అధికార,ప్రతిపక్ష లోక్ సభ,రాజ్య సభ సభ్యులు సంతకాలు పెట్టారు. న్యాయవ్యవస్థలో అవినీతి అనేది చాలా సున్నితమైన విషయం. ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా ఉన్నాయి. వర్షాకాల సమావేశంలో జస్టిస్ యశ్వంత్ వర్మపై ప్రభుత్వం అభిశంసన తీర్మానాన్ని ప్రవేశ పెట్టనున్నాం’ అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. అభిశంసన తీర్మానంలో అనూహ్య పరిణామంఈ అభిశంసన తీర్మానంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పార్లమెంటు సమావేశాల్లో బీజేపీ, కాంగ్రెస్లు పరస్పరం విభేదిస్తుంటాయి. కానీ న్యాయవ్యవస్థలో అవినీతి వంటి సున్నితమైన అంశంపై పార్టీలకు అతీతంగా స్పందించడం, ప్రజాస్వామ్యానికి మద్దతుగా నిలుస్తూ.. 100 మంది ఎంపీలు అభిశంసన తీర్మానంపై సంతకాలు చేయడం, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సహా 35 మంది కాంగ్రెస్ ఎంపీలు సైతం సంతాలు చేసినట్లు సమాచారం. -
ఏపీలో అధర్మ పాలన సాగుతోంది: వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి, ఢిల్లీ: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో కేంద్రం అఖిలపక్ష సమావేశం జరిగింది. వైఎస్సార్సీపీ తరఫున ఎంపీలు గురుమూర్తి, పిల్లి సుభాష్ చంద్రబోస్ హాజరయ్యారు. రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని కేంద్రం విజ్ఞప్తి చేశారు.ఏపీలో క్షీణిస్తున్న శాంతి భద్రతలు, వైఎస్సార్సీపీ నేతల అక్రమ అరెస్టుల అంశాన్ని పార్లమెంటు సమావేశాల్లో ఆ పార్టీ లేవనెత్తనుంది. రాష్ట్రంలోని ఖనిజ సంపదను అప్పుల కోసం ఏపీఎండీసీ తాకట్టు పెట్టడం, పోలవరం ఆలస్యం, రైతుల సమస్యలు.. ధాన్యం సేకరించకపోవడం గిట్టుబాటు ధరలు కల్పించకపోవడం, అమరావతిలో అవినీతి, సూపర్ సిక్స్ ఫెయిల్, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కరణ, మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ, ఏపీలో పెరుగుతున్న నిరుద్యోగం, నత్త నడకన ఇళ్ల నిర్మాణాలు, తిరుమలలో భద్రత లోపాలు తదితర అంశాలను వైఎస్సార్సీపీ ప్రస్తావించనుంది.అఖిలపక్ష సమావేశం అనంతరం వైఎస్సార్సీపీ రాజ్యసభ పక్షనేత పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో అధర్మ పాలన సాగుతోందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని.. అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ ఆయన దుయ్యబట్టారు. కార్యకర్తలను, నాయకులను అరెస్టు చేసి హింసిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఉనికి లేకుండా చేయడం కోసం అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ అంశాలన్నీ పార్లమెంటు దృష్టికి తీసుకెళ్తాం’’ అని బోస్ తెలిపారు.మామిడి, మిర్చి, పొగాకు రైతులకు కనీసం మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. 12 రూపాయలు మద్దతు ప్రకటించి నిస్సిగ్గుగా కేవలం ఐదు రూపాయలకే కొనుగోలు చేస్తున్నారు. మామిడి, మిర్చి, పొగాకు రైతుల సమస్యలు పార్లమెంటులో ప్రస్తావిస్తాం. రైతులకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఒక్కో రైతుకు 20 వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల్లో చెప్పిన.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. కౌలు రైతులకు సహాయం చేయడం లేదు. ఏపీలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించడం లేదు. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించిన టీడీపీ ఇప్పుడు విచ్చలవిడిగా అప్పులు చేస్తోంది’’ అని బోస్ మండిపడ్డారు. -
గవర్నర్ను క్షమాభిక్ష కోరవచ్చు
న్యూఢిల్లీ: కాబోయే భర్తను హత్య చేసిన కేసులో దోషిగా తేలిన కర్ణాటక మహిళ శుభాకు సుప్రీంకోర్టు భారీ ఊరట కల్పించింది. కర్ణాటక గవర్నర్ నుంచి క్షమాభిక్ష కొరేందుకు ఆమెకు అనుమతి ఇచ్చింది. సామాజిక పరిస్థితులు, ఒత్తిళ్ల కారణంగా మహిళలు కొన్ని సందర్భాల్లో నేరాలకు పాల్పడుతున్నారని న్యాయస్థానం పేర్కొంది. శుభా 20 ఏళ్ల వయసులో కాలేజీలో చదువుకుంటున్న సమయంలో నిశ్చితార్థం జరిగింది. ఈ పెళ్లి ఆమెకు ఎంతమాత్రం ఇష్టంలేదు. కుటుంబ సభ్యుల ఒత్తిడికి తలొగ్గాల్సి వచ్చింది. కాబోయే భర్తను హత్య చేస్తే తనకు ఈ పెళ్లి తప్పుతుందని భావించింది. తన మిత్రులైన అరుణ్ వర్మ, వెంకటేశ్, దినేశ్తో కలిసి అతడిని హత్య చేసింది. శుభాపై నేరం రుజువైంది. అయితే, బలవంతంగా పెళ్లి చేసేందుకు పెద్దలు ప్రయత్నించడంతో విధిలేని పరిస్థితుల్లో అతడిని చంపాల్సి వచ్చిందని శుభా మొరపెట్టుకుంది. గవర్నర్ను క్షమాభిక్ష కొరేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ అరవింద్ కుమార్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. శుభా వినతి పట్ల సానుకూలంగా స్పందించింది. -
ఏఐతో హోమ్వర్క్!
సాక్షి, స్పెషల్ డెస్క్: స్మార్ట్ఫోన్ దొరికిందంటే గంటల తరబడి గేమ్స్ ఆడే పిల్లలు మనచుట్టూనే ఉన్నారు. వినోదానికి గేమ్స్ మాత్రమే కాదు.. హోమ్వర్క్ కూడా పూర్తి చేసేందుకు స్మార్ట్ఫోన్ ఉపయోగిస్తున్నారు! అది కూడా ఆధునిక సాంకేతికత అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో!! అవును.. ప్రపంచవ్యాప్తంగా 58 శాతం విద్యార్థులు హోంవర్క్, అసైన్మెంట్స్, పాఠాలపై అవగాహన పెంచుకునేందుకు ఇప్పటికే ఏఐ ఉపయోగిస్తున్నారట. అన్నింటా మనం అన్నట్టు భారతీయ విద్యార్థులూ ఈ విషయంలో ముందున్నారు.మొత్తం 29 దేశాలు..‘అంతర్జాతీయ ఏఐ ప్రశంసా దినోత్సవం’సందర్భంగా ‘స్టూడెంట్స్ స్పీక్ ఆన్ ఏఐ’పేరుతో స్కిల్స్ ప్లాట్ఫామ్ ‘బ్రైట్చాంప్స్’ఒక నివేదికను విడుదల చేసింది. ఏఐ సాధించిన విజయాలు, మన జీవితాల్లో తెస్తున్న మంచి మార్పులకు గుర్తుగా ఏటా జూలై 16ను ‘అంతర్జాతీయ ఏఐ ప్రశంసా దినోత్సవం’గా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా.. పిల్లలు ఏఐతో మమేకమవుతున్న తీరును ఈ అధ్యయనం వెల్లడించింది. భారత్, అమెరికా, వియత్నాం, యూఏఈ సహా 29 దేశాల్లోని 1,425 మంది విద్యార్థులు ఈ సర్వేలో పాలుపంచుకున్నారు. ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్లో ఏఐని ఉపయోగిస్తున్న విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషం. విద్యార్థులు చాట్జీపీటీని అత్యధికంగా వినియోగిస్తున్నారు. తాము ఎప్పుడూ మోసం చేయడానికి ఏఐని ఉపయోగించలేదని భారత్లో 95 శాతం, ప్రపంచవ్యాప్తంగా 86 శాతం మంది విద్యార్థులు చెప్పడం గమనార్హం.‘ఏఐ చెప్తే నమ్మేయాలా?’మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఏఐ ఇచ్చే సమాధానాలను విద్యార్థులు గుడ్డిగా నమ్మడం లేదని ఈ సర్వే స్పష్టం చేసింది. దాదాపు 70 శాతానికిపైగా పిల్లలు ఏఐ ఇచ్చిన సమాధానాలతో సంతృప్తి చెందకుండా సరిచూస్తున్నారట. మరీ ముఖ్యమైన అంశం ఏంటంటే.. దాదాపు 80 శాతం పిల్లలు ఏఐ ఇచ్చిన సమాధానాలను పూర్తిగా నమ్మడం లేదు.పిల్లలు – ఏఐ⇒ 58% హోంవర్క్, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఏఐ ఉపయోగిస్తున్న విద్యార్థులు⇒ ఏఐని తరచూ వినియోగిస్తున్నభారతీయ విద్యార్థులు 63%⇒ 62% చాట్జీపీటీని అత్యధికంగా ఉపయోగిస్తున్నవారు⇒ మోసం చేయడానికి ఏఐని ఉపయోగించలేదు 86%⇒ 34% ఏఐ పని చేసే విధానం తెలిసిన పిల్లలు⇒ ఏఐని సద్వినియోగం చేసుకునేందుకు మార్గదర్శకత్వం కోరుతున్నవారు 56%⇒ 38% ఉద్యోగాలను ఏఐ ప్రభావితం చేస్తుందని ఆందోళన చెందుతున్నవారు⇒ ఇమేజ్, వీడియో.. ఏఐతో రూపొందిందా లేదా అన్నది తెలియనివారు 50%⇒ 70% పాఠశాలల్లో ఏఐ బోధించాలని కోరుతున్న విద్యార్థులు⇒ తమకున్న ఏఐ అవగాహనపట్ల నమ్మకంగా ఉన్నవారు 10%⇒ 29% ఏఐ ఇచ్చిన సమాధానాలను సరిచూడని పిల్లలు⇒ ఏఐ ఇచ్చిన తప్పుడు జవాబులను నమ్మినవారు 20% -
తోటపని.. పిల్లలకు మంచిదని!
దయ, ఓర్పు, బాధ్యత వంటి సుగుణాలు గాల్లోంచి వీచి పిల్లల్లో ప్రవేశించవు. తల్లి ఒడి నేర్పించాలి. తండ్రి తన భుజాల పైకి ఎక్కించుకుని లోకాన్ని చూపించాలి. గురువు చెప్పే గద్దింపు పాఠాలు నేర్వాలి. అప్పుడే బిడ్డ ఎదుగుతాడు. ఎదిగేకొద్దీ ఒదుగుతాడు. అయితే ఇల్లు, బడి మాత్రమే కాకుండా బిడ్డకు బుద్ధులు నేర్పే పాఠాల్లో మరో ముఖ్యమైనది ఒకటి ఉంది. అదే... తోట పని. తోటను చూస్తూ, తోటలో పని చేస్తూ పెరిగి పెద్దయిన పిల్లలు సాటి మనుషులకు చల్లని నీడ అవుతారని, మానవత్వానికి ఊడలు అవుతారని మనో వైజ్ఞానిక నిపుణులు చెబుతున్నారు.సూర్యుడికి, చెట్లకు, పక్షులకు దూరంగా ఇళ్లలోనే పెరిగి పెద్దయి ఒకేసారి బయటికి అడుగు పెట్టే పిల్లల్లో ప్రకృతి సహజ లక్షణాలైన నెమ్మది, ప్రశాంతత ఉండవు. జీవన నైపుణ్యాలు కనిపించవు. నలుగురిలో కలవటం, కలుపుకొని పోవడం తెలియవు అని సైకాలజిస్టులు చెబుతున్నారు. కెరీర్లో దూసుకుపోతుంటారు కానీ, జీవితంలో ఉన్నచోటే ఉండిపోతారు. అందుకే ఈ డిజిటల్ ప్రపంచపు రోబో పిల్లల్ని తోట పనికి పంపాలి. తోటపని పిల్లల్ని మలిచే కుమ్మరి వంటిది. పెద్దయ్యాక బతకటానికి లోకంలో ఎన్నో పనులు ఉంటాయి. కానీ ఎలా బతకాలో చిన్నతనంలోనే తోట పని నేర్పిస్తుంది.తోటపనిలోకి ఎలా దింపాలి?ఆటలా ఉంటే చాలు, పిల్లలు దేనికైనా ‘సై’ అంటారు. కనుక తోటపనిని కూడా వాళ్లకు ఆటలా నేర్పించాలి. ఇందుకు మీరూ వాళ్లతో కలిసి ఆటలోకి దిగాలి. వంటింటి నుంచే మీ ఆటను మొదలుపెట్టండి. టమాటాను కోసి, అందులోంచి కొన్ని విత్తనాలను తీసి, ఎండబెట్టి, ఒక చిన్న కుండీలో నాటండి. ‘ఆహారం ఏదీ నేరుగా ప్యాకెట్లలో వచ్చేయదు. గింజ వేయటానికి నేల, మొక్క మొలిచాక సూర్యరశ్మి కోసం సూర్యుడు, మొక్క ఫలించటానికి కొంత సమయం, అప్పటి వరకు వేచి ఉండటానికి మనకు సహనం అవసరం’ అని పిల్లలకు నేర్పించటానికి ఇదొక చక్కని మార్గం.ఒక మొక్కను అప్పగించండిపాత టీ కప్పులు, ప్లాస్టిక్ సీసాలు లేదా టిన్ డబ్బాలలో మట్టిని నింపి చిన్న చిన్న మొక్కలను నాటండి. ఆ కప్పులు లేదా డబ్బాలకు మీ పిల్లల చేత వారికి చేతనైనట్లుగా అందమైన పెయింట్స్ వేయించండి. లేదా స్టిక్కర్లతో అలంకరించనివ్వండి. అలా ఒక రీసైకిల్ పాట్ గార్డెన్ను తయారవనివ్వండి. అప్పుడు వారు ఆ మొక్కల్ని తమ సొంతమైనవిగా భావిస్తారు. మొక్కకు వారినే ఏదో ఒక పేరు పెట్టమని చెప్పండి. అలా వాటితో అనుబంధం ఏర్పడుతుంది. వాటి ఆలనా, పాలనను వారే ఇష్టంగా తీసుకుంటారు. రోజూ ఉదయం నిద్ర లేవగానే వెళ్లి ఆ మొక్కను పలకరిస్తారు. చిన్నతనంలో మొక్కలతో ఏర్పడిన బాంధవ్యమే, పెద్దయ్యాక సాటి మనుషులతోనూ ఏర్పడుతుంది.సేంద్రియ ఎరువు తయారీవంట గది వ్యర్థాలు, తోటలో రాలిపడిన ఆకులు, మట్టి.. వీటన్నిటినీ ఒక పారదర్శకమైన సీసాలో ఒకదానిపైన ఒకటి పొరలుగా వేసి అవన్నీ కుళ్లిపోయి సహజమైన ఎరువుగా ఎలా మారుతుందో పిల్లలకు చూపించవచ్చు. నిజంగా అదొక అద్భుతమైన ప్రయోగంగా, మారువేషంలో ఉన్న ఒక సైన్స్ పాఠంలా పిల్లలకు అనిపిస్తుంది.విత్తనం నాటితే ఓర్పు మొలుస్తుంది⇒ తోటపని అంటే కేవలం మొక్కల పాదుల్ని శుభ్రం చెయ్యటం, మొక్కలకు నీళ్లు పెట్టటం మాత్రమే కాదు.⇒ మట్టిని తవ్వటం అనేది శ్రమించటాన్ని నేర్పిస్తుంది.⇒ విత్తనాలను నాటడం అన్నది ఆశగా⇒ ఎదురుచూడటం అలవరుస్తుంది.⇒ ఎదురుచూడటం అంటే తొందరపడకపోవటం. ఓపికపట్టడం. జీవితానికి అత్యంత కీలకమైన ఈ లక్షణాలను తోటపని బాల్యంలోనే అలవరుస్తుంది.⇒ ఇక మొక్కలకు నీళ్లు పెట్టటం బాధ్యత అవుతుంది. నీళ్లు పెట్టడం మర్చిపోయి, మొక్కలు వాడిపోయినప్పుడు బాధ్యతను మరువకూడదని తెలిసివస్తుంది.ఎదిగే దశలు ఉత్తేజపరుస్తాయితోటపని చేసే క్రమంలో మొక్కలు ఎదగటంలోని దశలు పిల్లలను ఉత్తేజపరుస్తాయి. మొక్కలు పెరగటానికి, పవ్వులు పూయటానికి, కాయలు కాయటానికి సమయం పడుతుందని వారు గ్రహిస్తారు. స్వయంగా నాటి, నీళ్లు పోసి, సంరక్షించిన మొక్కలు పుష్పించినప్పుడు, కాయలూ పండ్లూ కాసినప్పుడు తామే ప్రకృతిని పెంచి పెద్ద చేసిన గొప్ప ఆత్మవిశ్వాసపు భావన పిల్లల్లో అంకురిస్తుంది. వారిపై వారికి నమ్మకాన్ని ఏర్పరుస్తుంది. తోటపనిలోని ఈ అనుభవాలన్నీ జీవితంలో మున్ముందు అక్కరకు వస్తాయి.సృజనాత్మకత, సాత్విక గుణాలు⇒ తోటపని ప్రకృతితో పిల్లలకు స్నేహబంధాన్ని ఏర్పరుస్తుంది. మొదట్లో భయపెట్టిన వానపాములు తరవాత నేస్తాలు అవుతాయి. వర్షం ఉత్సాహమై కురుస్తుంది.⇒ తూనీగలు మీదకొచ్చి వాలతాయి. సీతాకోక చిలుకలు తలపై ఎగురుతాయి.⇒ పక్షులన్నీ రాగాల కోయిలలే అవుతాయి. ఇవన్నీ పిల్లల్లో సృజనాత్మకతను, సాత్విక గుణాలను ప్రేరేపిస్తాయి. మున్ముందు జీవితంలో అలుముకునే నిరాశ, నిస్పృహలకు, అనిశ్చిత పరిస్థితులకు కూడా తోటపనే వైద్యం, చికిత్స నేర్పి పంపుతుంది.తోటపనితో ఏమేం తెలుస్తాయి?⇒ సమస్యలను ఎలా పరిష్కరించాలి?⇒ ప్రణాళికతో పనిచేయడం⇒ సమయం, వనరుల సద్వినియోగం⇒ లక్ష్యసాధన⇒ కష్టం విలువఏమేం పెరుగుతాయి?⇒ ఆత్మవిశ్వాసం⇒ ఆత్మగౌరవం⇒ ఓర్పు, సహనం⇒ బాధ్యత⇒ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు⇒ ఎలా చేస్తే పని విజయవంతమవుతుందన్న ఆలోచనా ధోరణి⇒ పర్యావరణ పరిరక్షణ స్పృహఏమేం తగ్గుతాయి?⇒ ఒత్తిడి, ఆందోళన⇒ కోపం, అసహనం⇒ ఒక పనిని గుడ్డిగా చేయడం⇒ మొక్కలను నరికేయడం/కొట్టేయడం -
భారత్లో టెస్లా బ్రాండ్ బాజా బారాత్!
విశాల భారతావని.. 140 కోట్లకుపైగా జనాభా. విభిన్న తరాలు.. ఖర్చుల్లో అంతరాలు. పది రూపాయలకూ వెనుకడుగు వేసే కస్టమరే కాదు.. బ్రాండ్ కోసం రూ.10 కోట్లకూ సై అనే వినియోగదార్లు ఉన్నారు. ఇలా ప్రీమియం ధర చెల్లించే కొనుగోలుదారులు ఉన్నారు కాబట్టే భారత్లో టెస్లా రేస్ ప్రారంభించింది. పైగా ప్రపంచవ్యాప్తంగా ఈ బ్రాండ్కు ప్రత్యేక స్థానం ఉంది. ‘బ్రాండ్స్’ అంటే భారతీయులకు మక్కువ. రూ.50 లక్షలకుపైగా విలువ చేసే లగ్జరీ కార్లు సగటున గంటకు ఆరు రోడ్డెక్కుతున్న మార్కెట్ మనది. ఇలాంటి మార్కెట్లో రిటైల్తో పరుగు మొదలుపెట్టిన ఈ అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం రానున్న రోజుల్లో తయారీ చేపట్టే అవకాశమూ లేకపోలేదు.ప్రస్తుతం బీఎండబ్ల్యూ నం.1భారత్లో ప్రీమియం కార్ల మార్కెట్ విభాగంలో 2024–25లో 51,406 యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. మెర్సిడెస్–బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఇప్పటికే దేశీయంగా బలమైన తయారీ, సర్వీస్ నెట్వర్క్ వ్యవస్థలను నిర్మించాయి. ప్యాసింజర్ వాహనాల (పీవీ) రంగంలో 2025 జూన్ నాటికి ఈవీల వాటా 4.5 శాతం మాత్రమే. లగ్జరీ పీవీల విభాగంలో ఈవీల వాటా 10 శాతం. ఇందులో బీఎండబ్ల్యూ 53 శాతం మార్కెట్ వాటాతో ఆధిపత్యం చెలాయిస్తోంది. 33 శాతం వాటాతో రెండో స్థానంలో మెర్సిడెస్–బెంజ్ పోటీపడుతోంది. టెస్లాకు ఇప్పటికే ఉన్న సవాళ్లకు తోడు ఈ సంస్థకు ప్రపంచ పోటీదారుగా ఉన్న చైనా దిగ్గజం బీవైడీ ఇండియాలో ఇప్పటికే అడుగుపెట్టింది. వియత్నాం కంపెనీ విన్ ఫాస్ట్ ఇక్కడ అడుగుపెట్టబోతోంది.పదేళ్ల నిరీక్షణ తర్వాత మనదేశంలోకి టెస్లా ఎంట్రీ ఇచ్చింది. తొలి ఎక్స్పీరియెన్స్ సెంటర్ను ముంబైలో ఆవిష్కరించింది. పూర్తిగా తయారైన కార్లకు దిగుమతి సుంకం భారత్లో 100 శాతం వరకు ఉంది. మనదేశంలో తయారీ చేపడితేనే ప్రయోజనాలు ఇస్తామని భారత్ స్పష్టం చేసింది. ఈ అంశాలే టెస్లా రాక ఆలస్యానికి కారణమయ్యాయి. మొత్తానికి పాలసీ అడ్డంకులు, సుంకాల సంక్లిష్టతలు, ఇతర బ్రాండ్లతో పోటీ, భౌగోళిక రాజకీయ ఒత్తిడి.. ఇవన్నీ అధిగమించి ఎట్టకేలకు అరంగేట్రం జరిగింది. దేశీయంగా తయారీ చేపట్టే అంశానికి కట్టుబడేముందు ఇక్కడి మార్కెట్ను పరీక్షిస్తామని టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ పలు సందర్భాల్లో పునరుద్ఘాటించారు. సుమారు రూ.60 లక్షల ధరతో తొలుత వై మోడల్ను టెస్లా ప్రవేశపెడుతోంది. ప్రపంచంలో అత్యధిక సుంకం ఉన్నది భారత్లోనే అని టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. అందువల్లే, ఇతర దేశాలతో పోలిస్తే టెస్లా కారు ధర మనదేశంలోనే ఎక్కువ.టెస్లానా మజాకా!యూఎస్, జర్మనీ, చైనాలో టెస్లాకు తయారీ కేంద్రాలున్నాయి. ఇవి ఏటా 25–30 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేయగలవు. 2019లో చైనాలో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 3.8 శాతం మాత్రమే. అదే ఏడాది డిసెంబర్లో టెస్లా మార్కెట్లోకి ప్రవేశించింది. అప్పటి నుంచి చైనాలో ఎలక్ట్రిక్ వాహనాల వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. 2024లో ఇది 24.6 శాతానికి చేరడంలో టెస్లా కీలకపాత్ర పోషించింది. ఆటో దిగ్గజాల మాదిరిగా కాకుండా ప్రకటనల విషయంలో టీవీలు, ఇతర మాధ్యమాలకు బదులు సెలబ్రిటీల ప్రభావం, నోటి మాటగా ప్రచారంపై టెస్లా ఆధారపడింది. ప్రీమియం, ప్రత్యేక బ్రాండ్గా కంపెనీ ఇమేజ్ను నిలబెట్టడంలో ఈ విధానం సహాయపడింది. నటుడు బ్రాడ్ పిట్, గూగుల్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్, ‘ఈబే’ మొదటి అధ్యక్షుడు జెఫ్ స్కోల్, షావొమీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ లే యూ.. ఇలా ఎందరో ప్రముఖులు టెస్లా కస్టమర్ల జాబితాలో ఉన్నారు.డెలివరీలు తగ్గాయ్అంతర్జాతీయంగా 2025 జనవరి–మార్చిలో టెస్లా డెలివరీలు 13% పడిపోయాయి. గడిచిన మూడేళ్లలో ఇది అత్యంత భారీ క్షీణత. పెరుగుతున్న ప్రపంచ పోటీ, నూతన మోడళ్ల రాక ముఖ్యంగా మోడల్–వై ఆలస్యం కావడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు సలహాదారుగా ఎలాన్ మస్క్ పాత్రపై పెరుగుతున్న వ్యతిరేకత వంటివి ఈ క్షీణతకు దారితీశాయి. ఒకప్పుడు టెస్లాకు బలమైన మార్కెట్లలో ఒకటైన చైనాలో సంస్థ ఈవీ వాటా 2025 మొదటి ఐదు నెలల్లో 7.6%కి పడిపోయింది. ఇది గత సంవత్సరం 10%, 2020లో గరిష్ట స్థాయిలో 15%గా నమోదైంది. బీవైడీ, షావొమీ వంటి ప్రత్యర్థులు ఫీచర్–రిచ్ మోడళ్లు, పోటీ ధరలతో సవాల్ విసిరి మార్కెట్ వాటాను పెంచుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా టెస్లా 2025 జనవరి–మార్చి కాలంలో 3,36,681 వాహనాలను విక్రయించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 3,86,810గా నమోదైంది. -
నువ్వు రా.. నా భర్త ఇంకా బతికే ఉన్నాడు!
వరుసకు మరిది అయ్యే వ్యక్తితో సంబంధం ఏర్పరుచుకున్న ఓ మహిళ.. తన భర్తను అతికిరాతకంగా కడతేర్చింది. ఈ ఘోరం బయటపడకుండా ఉండేందుకు కరెంట్ షాక్తో ప్రమాదత్తూ చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది. చంపడానికి ముందు ఆ ఇద్దరి మధ్య జరిగిన చాటింగ్.. ఆ మొత్తం ఘోరాన్ని బయటపెట్టింది. దేశ రాజధానిలో జరిగిన ఘోరం వివరాల్లోకి వెళ్తే..తన భర్త కరణ్ దేవ్(36) కరెంట్షాక్కు గురయ్యాడంటూ సుస్మిత ఈ నెల 13వ తేదీన ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి స్థానికుల సాయంతో తీసుకెళ్లింది. అయితే అప్పటికే అతను మరణించాడని వైద్యులు తెలిపారు. దీంతో.. పోస్టుమార్టం కూడా వద్దంటూ అంత్యక్రియల కోసం ఉత్తమ్ నగర్లోని ఇంటికి మృతదేహాన్ని తరలించింది. ఈలోపు..స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు.. అంత్యక్రియలను అడ్డుకున్నారు. మృతుడి వయసు, చనిపోయిన తీరుపైనా అనుమానాలతో అటాప్సీ కోసం కరణ్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈలోపు కరణ్ సోదరుడు కునాల్ పోలీసులకు ఓ షాకింగ్ విషయం తెలిపాడు.భర్త మృతిపై ఓ చానెల్తో మాట్లాడుతూ సుస్మిత కంటతడితన అన్న మరణం విషయంలో వదినతో పాటు తన కజిన్ రాహుల్ ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేశాడు. అంతేకాదు.. వాళ్లిద్దరి మధ్య జరిగిన ఇన్స్టాగ్రామ్ చాటింగ్ వివరాలను పోలీసులకు స్క్రీన్ షాట్ వీడియో రూపంలో అందించాడు. అందులో కరణ్ను ఎలా హత్య చేయాలని వాళ్లిద్దరూ చర్చించుకున్నారు.పోలీసులు తమ శైలిలో ప్రశ్నించగా.. ఆ ఇద్దరూ నిజం ఒప్పుకున్నారు. కరణ్ తరచూ హింసించే వాడని.. అదే సమయంలో రాహుల్ తనను ఓదార్చేవాడని.. అదే ఇద్దరి మధ్య అనైతిక బంధానికి దారి తీసినట్లు తేలింది. ఈ క్రమంలో కరణ్ అడ్డు తొలగించుకునేందుకు సుస్మిత-రాహుల్ నిర్ణయించుకున్నారు.జులై 13వ తేదీన రాత్రి భోజనంలో కరణ్కు అధిక మోతాదులో(15) నిద్రమాత్రలు ఇచ్చారు. ఆపై మత్తులోకి జారుకున్నాక ఇద్దరి మధ్య జరిగిన చాటింగ్ సారాంశం.. సుస్మిత: నిద్రమాత్రలు అన్నేసి వేసుకున్నాక చనిపోవడానికి ఎంత టైం పడుతుందో ఒకసారి నెట్లో చూడు. మూడు గంటలైంది తిని. వాంతి చేసుకోవడం లాంటి లక్షణాలేవీ కనిపించడం లేదు. ఇంకా చనిపోలేదు. ఏం చేయాలో త్వరగా చెప్పు.రాహుల్: అలాంటిదేం జరగకపోతే.. కరెంట్ షాక్ పెట్టుసుస్మిత: షాక్ ఇవ్వడానికి కట్టేయాలి కదా.. ఎలా?రాహుల్: టేప్తో కట్టేయ్సుస్మిత:నా భర్త ఊపిరి ఆగిపోలేదు.. ఇంకా బతికే ఉన్నాడు. నెమ్మదిగా శ్వాస పీలుస్తున్నాడు.రాహుల్: నీ దగ్గర ఉన్న అన్ని మాత్రలు వేసేయ్సుస్మిత: నోరు తెరవడానికి రావట్లేదు. నీళ్లు మాత్రమే తాగిపించడానికి వీలవుతోంది. నువ్వు రా.. ఇద్దరం కలిసి ఆ మందులేద్దాం. నాకు నిద్ర ముంచుకొస్తోందిమృతుడు కరణ్(ఎడమ వైపు).. చాటింగ్ వివరాలు (కుడివైపు)ఈ చాటింగ్ తర్వాత రాహుల్ ఇంటికి రాగా.. ఇద్దరూ కలిసి కరెంట్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విచారణలో మరిది రాహుల్తో కలిసి భర్తను చంపినట్లు సుస్మిత ఒప్పుకుంది. తన భర్త డబ్బుక కోసం తరచూ తనను హింసించేవాడని, కార్వాచౌత్ ముందు రోజు కూడా చితకబాదాడని ఆమె చెబుతోంది. నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పూర్తిస్థాయి పోస్టుమార్టం రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. #WATCH | दिल्ली के उत्तम नगर में 'करंट वाली साजिश' का खुलासा@vishalpandeyk | | https://t.co/smwhXUROiK#Delhi #Uttamnagar #Crime #ABPNews pic.twitter.com/ALtr9GjYrJ— ABP News (@ABPNews) July 19, 2025 -
బెట్టింగ్ యాప్ కేసులో గూగుల్, మెటాకు ఈడీ సమన్లు
బెట్టింగ్ యాప్ల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు ప్రదర్శిస్తోంది. మొన్నీమధ్యే 29 మంది సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లపై ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. టెక్ దిగ్గజ కంపెనీలు గూగుల్, మెటాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. గూగుల్, మెటా కంపెనీలు ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేస్తున్నాయన్నది ఈడీ అభియోగం. సదరు యాప్లు మనీలాండరింగ్, హవాలా లావాదేవీలలాంటి తీవ్రమైన ఆర్థిక నేరాలపై దర్యాప్తు ఎదుర్కొంటున్నాయి. అయితే అలాంటి యాప్లకు తమ పేజీల్లో స్లాట్లు కేటాయిస్తూ విపరీతంగా ప్రమోషన్లు నిర్వహిస్తున్నాయని ఈడీ అంటోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 21వ తేదీన విచారణకు రావాంటూ గూగుల్, మెటాలకు ఈడీ స్పష్టం చేసింది. ఈ పరిణామంపై ఆయా సంస్థల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
తప్పుడు కేసులు నాకేమీ కొత్త కాదు.. కూటమి టార్గెట్ అదే: మిథున్ రెడ్డి
సాక్షి, ఢిల్లీ: ఏపీలో మద్యం కేసులో ఎలాంటి ఆధారాలు లేవు.. రాజకీయ ఒత్తిడితోనే తనపై కేసు పెట్టారని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు. మద్యం కేసులో తన పాత్రపై ఆధారాలు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీలో ముఖ్యమైన నాయకులను జైల్లో పెట్టడమే టార్గెట్గా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఇదే సమయంలో సిట్ విచారణకు తాను హాజరు అవుతున్నట్టు మిథున్ రెడ్డి చెప్పారు. ఈ క్రమంలోనే మిథున్ రెడ్డి ఢిల్లీ నుంచి విజయవాడకు బయలుదేరారు.వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఢిల్లీలో సాక్షితో మాట్లాడుతూ..‘ఏపీలో కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయి. మద్యం కేసులో ఎలాంటి ఆధారాలు లేవు. ఈ కేసులో ఎలాంటి సీజర్లు లేవు, సాక్ష్యాలు లేవు. కేసులకు భయపడే ప్రసక్తి లేదు. భయపడే వ్యక్తిని అయితే రాజకీయాల్లోనే ఉండను. వీటన్నిటిని ధైర్యంగా ఎదుర్కొంటాను. ఈ కేసుల నుంచి బయటపడతాను. నా పాత్రపై ఆధారాలు ఉంటే చూపించండి. నా ఫోన్లు మీకు ఇస్తా.. దర్యాప్తునకు సహకరిస్తాను. సిట్ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. రాజకీయ ఒత్తిడితోనే నాపై కేసు పెట్టారు. ముందుగానే ఒక వ్యక్తిని జైల్లో వేయాలని నిర్ణయించుకుని.. ఆ తర్వాత దాని చుట్టూ కథ అల్లుతున్నారు. మద్యం కేసు టార్గెట్ కాదు..తమకు అనుకూలంగా ఉన్న వారిని నయానో.. భయానో ఒప్పించి స్టేట్మెంట్లు తీసుకుంటున్నారు. ఈ కేసులో ఎలాంటి సీజర్లు లేవు, సాక్ష్యాలు లేవు. నోటి మాటలతో ఇచ్చిన స్టేట్మెంట్లు ఇప్పించి కేసు నడుపుతున్నారు. ముఖ్యమైన నాయకులను జైల్లో పెట్టడమే టార్గెట్ గా కేసులు పెడుతున్నారు. మద్యం కేసు వారి టార్గెట్ కాదు. తమకు నచ్చని వారిని వేధించేందుకు రకరకాల కథలు అల్లుతున్నారు.. ఇదేమి కొత్తది కాదు. 2014-19 లోను నాపై తప్పుడు కేసులు పెట్టారు. నేనేదో దాడి చేశానని నాడు టీడీపీ హయాంలో కేసు పెట్టారు. నేను తప్పు చేయలేదని ఎంత చెప్పినా వినకుండా జైల్లో పెట్టారు. అప్పుడు తప్పుడు సాక్షాలు చెప్పిన వారంతా.. మళ్లీ కోర్టుకు వచ్చి అదంతా తప్పు అని చెప్పారు. దాంతో కోర్టు ఆ కేసును కొట్టివేసింది. మళ్లీ అదే తరహాలో ఇప్పుడు అరెస్టు చేస్తున్నారు. వీటన్నిటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానుఎవరినైనా అరెస్టు చేయాలనుకుంటే ముందుగా ఎల్లో మీడియాలో.. మాస్టర్ మైండ్ అని కట్టుకథలు అల్లుతున్నారు. గతంలో ఇతరులను మాస్టర్ మైండ్ అన్నారు.. ఇప్పుడు నన్ను మాస్టర్ మైండ్ అంటున్నారు.. రేపు ఇంకొకరిని పట్టుకొచ్చి అతన్ని మాస్టర్ మైండ్ అంటారు. ఏదో రకంగా మాపై బురద జల్లాలని చూస్తున్నారు. కొద్దిమంది అధికారులను తీసుకొచ్చి భయపెట్టి.. ఒప్పుకోకపోతే జైల్లో పెడతామని స్టేట్మెంట్లు తీసుకున్నారు. మేము ఎక్కడ కలిశామో ఆధారాలు చూపండి. నోటి మాటతో కేసు పెడతారా?. అధికారులను బెదిరించి మాకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు తీసుకున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఇదే అధికారులను బెదిరించి చెప్పించారని కోర్టులో చెబుతారు.. కేసు కొట్టివేస్తారు. గతంలో కూడా ఇలాగే నాపై తప్పుడు కేసు పెడితే కోర్టు కొట్టేసింది. ఈ కేసులో రేపు జరగబోయేది కూడా ఇదే. నోటి మాటలతో కథలు.. మద్యం కేసులో మొదట్లో 50వేల కోట్లు అన్నారు. ఆ తర్వాత 30,000 కోట్లు.. అటు తర్వాత 3000 కోట్లు అని అంటున్నారు. 3000 కోట్లు ఎక్కడ అంటే.. ఎలక్షన్లో ఖర్చు పెట్టారని చెబుతున్నారు. సిట్ చెప్పే కట్టు కథలు నమ్మదగినవి కాదు. ఎక్కడైనా డబ్బును సీజ్ చేశారా?. పెట్టుబడులు పెట్టారా?. ఇవన్నీ లేకుండా కేవలం నోటి మాటతో కథలు చెబుతున్నారు. అరెస్టు చేసి ఇబ్బంది పెట్టాలని లక్ష్యంతోనే ఈ కేసులు పెట్టారు.. ఈ కేసు ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. ఒక ఎంపీగా నా పాత్ర పార్లమెంటు నియోజకవర్గం వరకే పరిమితం. మద్యం విధానాల్లో నేను జోక్యం చేసుకోలేదు. పార్లమెంటులో చట్టాల రూపకల్పనలో చర్చల్లో పాల్గొనడమే మా పని. మరెక్కడ కూడా నేను జోక్యం చేసుకోలేదు. కేవలం కక్ష సాధింపులో భాగంగానే కేసులు బనాయించారు. ఈ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటాను. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్నింటికీ మేము రెడీగా ఉన్నాం. తప్పు చేయనంతవరకు భయపడాల్సిన పనిలేదు’ అని అన్నారు. -
కూటమి భేటీలకు మేమిక దూరం
సాక్షి, న్యూఢిల్లీ: వర్షాకాల పార్లమెంట్ సమావేశాల ముందు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి భారీ షాక్ తగిలింది. ఈ నెల 21 నుంచి మొదలయ్యే వర్షాకాల సమావేశాల్లో మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఇండియా పక్షాలు ఏర్పాటు చేసిన ఆన్లైన్ భేటీకి, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే శనివారం ఏర్పాటు చేసిన భేటీకి దూరంగా ఉండనున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ‘‘ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చామని మా పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఆ కూటమి కేవలం గత లోక్సభ ఎన్నికల దాకానేనని కూడా ఆయన అప్పుడే చెప్పారు. కనుక ఇండియా కూటమిలో ఆప్ ఇంకెంత మాత్రమూ భాగం కాదు. టీఎంసీ, డీఎంకే వంటి పార్టీలు మాకు మద్దతిస్తున్నందున పార్లమెంటులో వారితో అంశాలవారీగా సమన్వయాన్ని కొనసాగిస్తాం’ అని ఆప్ ఎంపీ సంజయ్సింగ్ తెలిపారు. బిహార్, యూపీ, పూర్వాంచల్లో బుల్డోజర్ రాజ్యం, ఢిల్లీలో పేదల ఇళ్ల కూల్చివేతలపై కేంద్రాన్ని ఆప్ నిలదీస్తుందన్నారు.కూటమి బలహీనంగత లోక్సభ ఎన్నికల అనంతరం హరియాణా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగా పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తుంటుందని భావించినా సీట్ల పంపకాల్లో విభేదాలతో అది జరగలేదు. ఆ తర్వాత పంజాబ్, గుజరాత్ ఉప ఎన్నికల్లో కూడా ఆప్ ఒంటరిగానే పోటీ చేసింది. గుజరాత్లో విశావదర్ ఉప ఎన్నికల్లో ఆప్ విజ యం తర్వాత కేజ్రీ వాల్ మాట్లాడుతూ, ఇండియా కూటమి కేవలం గతేడాది లోక్సభ ఎన్నికలకు ఉద్దేశించినది మాత్రమే నన్నారు. ‘‘ప్రస్తుతం కాంగ్రెస్తో పొత్తు లేదు. బిహార్ సహా అన్ని ఎన్నికల్లోనూ ఆప్ ఒంటరిగా పోటీ చేస్తుంది’’ అని ప్రకటించారు. దానిపై పార్టీ తాజాగా మరింత స్పష్టత ఇచ్చింది. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో విపక్షాల స్వరం నానాటికీ మరింత బలహీనపడుతోందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఆప్కు ప్రస్తుతం లోక్సభలో 3, రాజ్యసభలో 8 మంది ఎంపీలున్నారు. ఇండియా కూటమి నుంచి ఆ పార్టీ బయటకు రావడం విపక్ష ఐక్యతకు పెద్ద దెబ్బే కానుంది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, పాక్తో కాల్పుల విరమణలో అమెరికా జోక్యం, మనపై ఆ దేశ సుంకాలు, బిహార్లో ఈసీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి పలు అంశాలపై వర్షాకాల సమావేశాల్లో కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇలాంటి సమయంలో కీలక బిల్లులపై ఓటింగ్ జరిగే పక్షంలో ఆప్ లేకపోవడం ఇండియా కూటమికి సంఖ్యాపరంగా ఇబ్బందిగా మారనుంది. -
స్టాక్ మార్కెట్లో యూత్!
ఒకప్పుడు.. ‘స్టాక్ మార్కెట్తో మాకేంటి సంబంధం?’ అని సామాన్యుడు అనుకునేవాడు. కానీ, ఇప్పుడు అదే స్టాక్ మార్కెట్లో సామాన్యులు కూడా పెట్టుబడులు పెడుతున్నారు. ముఖ్యంగా, కోవిడ్, ఆ తరువాత జరిగిన అనేక పరిణామాలు.. ఇలా ఇందుకు కారణాలు అనేకం. ఫలితంగా ఇప్పుడు ఇన్టెస్టర్ల సంఖ్యలో ఏటా కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. దేశ జనాభాలో సుమారు 11.5 కోట్ల మంది జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్లో పెట్టుబడులు పెట్టారు. వీరిలో 30 ఏళ్లలోపు వారు 39 శాతం కాగా.. మహిళలు సుమారు 25 శాతం కావడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లోనూ మదుపరులు.. ముఖ్యంగా మహిళల సంఖ్య భారీగా పెరిగింది.బిహార్.. దేశంలోనే అత్యల్ప తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం. నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ (ఎన్ఎస్ఈ) వేదికగా బిహార్ ఇన్వెస్టర్ల సంఖ్య అయిదేళ్లలో దేశంలోనే అత్యధికంగా 678 శాతం పెరిగింది. మదుపరుల సంఖ్య 7 లక్షల నుంచి 52 లక్షలకు దూసుకెళ్లింది. బిహార్లోనే ఇలా ఉంటే మరి ఇతర రాష్ట్రాల్లో? అవును.. ఇతర రాష్ట్రాల్లోనూ మదుపరులు గణనీయంగా పెరిగారు. ఎన్ఎస్ఈలో మదుపరుల సంఖ్య 2014–15లో 1,79,60,000. ఈ ఏడాది మే నాటికి అది ఏకంగా 11,49,42,000కు చేరింది. అంటే పదేళ్లలో 540 శాతం పెరుగుదల! 5–6 నెలలకే కొత్తగా కోటి మంది ఇన్వెస్టర్లు వచ్చి చేరుతున్నారంటే స్టాక్ మార్కెట్ పట్ల ఆసక్తి ఏ స్థాయిలో పెరుగుతోందో అర్థం చేసుకోవచ్చు.సులభమైన షేర్ల లావాదేవీలు!స్మార్ట్ ఫోన్ సామాన్యుడికి చేరువైంది. ఆన్లైన్ ఆర్థిక లావాదేవీలు సులువయ్యాయి. ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే భయపడే రోజుల నుంచి.. ప్రతిరోజూ వేలూ, లక్షల రూపాయలను రకరకాల మార్గాల్లో పంపే పరిస్థితులు వచ్చాయి. డిజిటల్ అక్షరాస్యత గణనీయంగా పెరిగింది. మరోపక్క.. దేశీయ స్టాక్ మార్కెట్ కూడా రోజురోజుకూ కొత్త శిఖరాలను అధిరోహిస్తూ మదుపరులను ఊరిస్తోంది. తక్కువ సమయంలో, సులభమైన ఆదాయ మార్గంగా స్టాక్ మార్కెట్ అందరి దృష్టినీ ఆకర్షించింది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలంటే ఒకప్పుడు దరఖాస్తు ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉండేది.ఏ కంపెనీని ఎంచుకోవాలో సమాచారం తెలిసేది కాదు. ఇప్పుడు స్మార్ట్ఫోన్ ఉంటే చాలు! షేర్ల కదలిక కళ్ల ముందు కనపడుతోంది. సామాన్యులు సైతం అతి తక్కువగా.. అంటే రూ.100 పెట్టుబడితో స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టొచ్చు. పెట్టుబడి పెట్టడమే కాదు.. ఉపసంహరణ సైతం చాలా సులభం అయిపోయింది. ముఖ్యంగా రిటైల్ ట్రేడింగ్ను సులభతరం చేసే ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఎన్నో వచ్చాయి. కోవిడ్ సమయంలో చాలామందికి ఇంటి దగ్గర ఉంటూ ఆదాయార్జన మార్గంగా స్టాక్ మార్కెట్ను ఎంపిక చేసుకున్నారు. ఇలాంటి అనేక అంశాలు స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారుల సంఖ్య పెరగడానికి కారణమయ్యాయి.పెరిగిన మహిళా శక్తి!..: స్టాక్ మార్కెట్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుండడం విశేషం. మహిళా ఇన్వెస్టర్ల వాటా 2022–23లో 22.5 శాతం కాగా ఈ ఏడాది మే నాటికి 24.4 శాతానికి చేరింది. గోవాలో అత్యధికంగా మహిళా పెట్టుబడిదారులు 32.6 శాతం ఉన్నారు. దేశంలో మొత్తం ఇన్వెస్టర్ల పరంగా మహిళా ఇన్వెస్టర్ల అత్యధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. అక్కడ 28.4 శాతం ఉంటే , గుజరాత్లో 27.8 శాతం ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 23.4, తెలంగాణలో 24.9 శాతం మహిళలు ఉన్నారు.ఆ మూడు రాష్ట్రాలు..: ఒక కోటి మంది ఇన్వెస్టర్ల క్లబ్లో చేరిన మూడో రాష్ట్రంగా గుజరాత్ అవతరించింది. 1.86 కోట్లతో మహారాష్ట్ర, 1.31 కోట్లతో ఉత్తరప్రదేశ్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ప్రాంతాల వారీగా చూస్తే 4.2 కోట్లతో ఉత్తర భారత్ అగ్రస్థానంలో ఉంది. పశ్చిమ భారత్ 3.5 కోట్లు, దక్షిణాది 2.4 కోట్లు, తూర్పు భారత్లో 1.4 కోట్ల మంది ఇన్వెస్టర్లు ఉన్నారు. సంఖ్యా పరంగా ఏడాదిలో ఉత్తరాదిలో 24%, తూర్పు భారత్ 23%, దక్షిణాది 22%, పశ్చిమ భారత్లో 17% వృద్ధి నమోదైంది. మే నెలలో తోడైన కొత్త ఇన్వెస్టర్ల సంఖ్యలో దేశంలోని టాప్–10 జిల్లాల్లో రంగారెడ్డి (8), హైదరాబాద్ (10) చోటు దక్కించుకున్నాయి.దేశ వ్యాప్తంగా 11.5 కోట్ల మంది మదుపరులకు జూలై 14 నాటికి 22.87 కోట్లకుపైగా ట్రేడింగ్ అకౌంట్లు ఉన్నాయి. వీటిలో ఏపీ నుంచి 1.04 కోట్లకుపైగా ఉంటే, తెలంగాణలో 51.50 లక్షలకుపైగా ఉన్నాయి. -
‘తన బిడ్డకు హాని జరిగితేనే అసీం మునీర్కు మా బాధ అర్థమవుతుంది’
సాక్షి,న్యూఢిల్లీ: మేం పడుతున్న బాధ ఎలా ఉంటుందో ఆసిమ్ మునీర్కు ఇప్పుడు అర్ధం కాదు. తన బిడ్డలకు ఏదైనా హాని జరిగితే అప్పుడు అర్ధమవుతుంది. ఈ మాటలన్నది మరెవరో కాదు. పహల్గాంలో లష్కరే తోయిబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్(The Resistance Front)ఉగ్రవాదులు ప్రదర్శించిన అంతులేని ఉన్మాదంలో కోల్పోయిన తొలి ప్రాణం లెఫ్టినెంట్ వినయ్ నార్వాల్ (26)తండ్రి రాజేష్ఈ ఏడాది ఏప్రిల్ 22న ప్రకృతి అందాలతో అలరారే పచ్చిక బయళ్లపై ముష్కరులు సృష్టించిన నరమేధంలో 26మంది టూరిస్టులు మరణించగా.. వారిలో లెఫ్టినెంట్ వినయ్ నార్వాల్ ఒకరు.ఏప్రిల్ 16న వివాహం చేసుకున్న 26 ఏళ్ల లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్..కేవలం ఆరు రోజుల్లోనే జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఆ దుర్ఘటన జరిగిన సమయంలో ఆయన భార్య హిమాన్షీ నర్వాల్. భర్త పార్థివ దేహం పక్కన కూర్చుని రోదిస్తున్న దశ్యాలు దేశ ప్రజల్ని కంటతడి పెట్టించాయి.ఈ దారుణ ఘటన దేశ ప్రజల్ని తీవ్రంగా కలిచివేసింది.అయితే,పహల్గాంలో మారణ హోమం సృష్టించిన టీఆర్ఎఫ్పై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. పహల్గాం దాడికి బాధ్యత వహించిన టీఆర్ఎఫ్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.అమెరికా ప్రకటనపై లెఫ్టినెంట్ నర్వాల్ తండ్రి రాజేష్ నర్వాల్ మీడియాతో మాట్లాడారు.ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన తన కుమారుడు వినయ్ నార్వాల్ను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతరమయ్యారు. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కుమారుడు,కుమార్తెకు ఏదైనా హాని జరిగితే.. మేం పడుతున్న బాధ అర్థమవుతుంది.నా కొడుకు మరణంతో కుటుంబం మొత్తం మానసికంగా కృంగిపోయింది. నిద్రలేని రాత్రులు, మానసిక సమస్యలు వెంటాడుతున్నాయి. మానసికంగా అలసిపోయాం. రెండు మూడు గంటలకంటే ఎక్కువ నిద్రపోవడం లేదన్నారు..ఏదో బ్రతుకుతున్నాం అంటే బ్రతుకుతున్నాం’ అంటూ నిట్టూర్చారు. కాగా,పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్పై భారత్ ఆపరేషన్ సిందూర్ను చేపట్టింది. భారత్ చేపట్టిన ఈ ఆపరేషన్లో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫ్ఫరాబాద్, కోట్లి,బహావల్పూర్,రావలకోట్,చక్స్వారీ, భింబర్,నీలం వ్యాలీ,జెహ్లం చక్వాలపై దాడులు చేపట్టింది. ఈ దాడులతో పాక్ ఆర్ధికంగా,భారీ సంఖ్యలో ఉగ్రవాదులను కోల్పోయింది. -
బనకచర్ల గురించి చంద్రబాబు అతిగా మాట్లాడారు: సీపీఐ నారాయణ
సాక్షి, ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా బనకచర్ల ఎలా కడతారు? అని ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారాయన. శుక్రవారం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. బనకచర్ల అనేది ప్రస్తుత ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టు కాదు. మొదట పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయాలి. బనకచర్ల గురించి చంద్రబాబు అతిగా మాట్లాడారు. కాంట్రాక్టర్లు,రాష్ట్రం ,కేంద్రం కలిసి ప్రాజెక్టు కడతామని చెప్పారు. బనక చర్ల రూ.80 వేల కోట్ల ప్రాజెక్టు కాదు రూ.2 లక్షల కోట్ల ఖర్చు అవుతుంది. అసలు.. చంద్రబాబు బనకచర్ల గురించి మొదట తెలంగాణ ముఖ్యమంత్రితో మాట్లాడాల్సింది. అలా చేయకపోవడం వల్ల విమర్శలు వచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి వ్యతిరేకించారు. ప్రాజెక్టులు ఎప్పుడైనా వివాద రహితంగా కట్టుకోవాలి. నదుల్లో రెండు రాష్ట్రాల నీటి వాటాలు తేలాకనే నీటి ప్రాజెక్టులపై ముందుకు వెళ్ళాలి. అంతేగానీ నీళ్ళను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం.. తల్లిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడంతో సమానమే. కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి నీళ్లను అడ్డుకోవద్దు అని నారాయణ హితవు పలికారు. రేవంత్ గట్టొడుటీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తరువాత సెంటిమెంట్ ఎగిరిపోయింది. ఇప్పుడు సెంటిమెంట్లు లేవు. ప్రతి అంశంపై సెంటిమెంట్లతో రెచ్చగొట్టాలని చూస్తున్నారు. రేవంత్ తెలంగాణ సీఎం. ఆయన ఎన్నుకోబడిన నేత.. నామినేట్ చేయబడిన వ్యక్తి కాదు. తెలంగాణకి రేవంత్ అన్యాయం చేయలేదు. పొట్టివాడు గట్టి వాడు. అయితే.. రేవంత్ విమర్శిస్తూ రాజకీయాలు చేయడం మానుకోవాలి అని నారాయణ సూచించారు. -
భూమికి ఉద్యోగం కేసు.. లాలూకు చుక్కెదురు
న్యూఢిల్లీ: ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో(భూమికి ఉద్యోగం) ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్కు చుక్కెదురైంది. ఈ కేసులో ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్పై స్టే విధించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. అంతేకాదు.. ఈ కేసులో ట్రయల్ కోర్టు విచారణను నిలిపివేసేలా ఢిల్లీ హైకోర్టుకు ఆదేశాలివ్వాలన్న ఆయన అభ్యర్థననూ శుక్రవారం తోసిపుచ్చింది. దీంతో ఈ కేసులో విచారణ యధాతథంగా కొనసాగనుంది.ట్రయల్ కోర్టు విచారణపై స్టే విధించాని కోరుతూ లాలూ ప్రసాద్ ముందుగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. విచారణపై స్టే విధించడానికి ఎలాంటి కారణలూ లేవని తెలిపింది. ఆపై ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఇవాళ ఆయన పిటిషన్ను పరిశీలించిన సుప్రీం కోర్టు ద్విససభ్య ధర్మాసనం తోసిపుచ్చుతున్నట్లు వెల్లడించింది.యూపీఏ ప్రభుత్వ హయాంలో.. 2004 నుంచి 2009 మధ్య లాలూ రైల్వే మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో భారతీయ రైల్వే తరఫున మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో వెస్ట్ సెంట్రల్ జోన్లో గ్రూప్-డి ఉద్యోగాల నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు సీబీఐ 2022లో అభియోగాలు నమోదు చేసింది. అక్రమంగా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు లాలూ, అతని కుటుంబ సభ్యులకు భూములు బహుమతిగా ఇచ్చారని సీబీఐ అభియోగాలు మోపింది. ఇదే వ్యవహారంపై మనీలాండరింగ్ వ్యవహారం (PMLA) కింద కేసు నమోదు చేసిన ఈడీ.. లాలూ కుటుంబ సభ్యులకు చెందిన 25 చోట్ల సోదాలు జరిపింది. ఆ సమయంలో.. రూ.6 కోట్లకు పైగా ఆస్తులను అటాచ్ చేసింది.అయితే.. రాజకీయ దురుద్ధేశ్యంతోనే తనపై దాదాపు దశాబ్దన్నర తర్వాత కేసు నమోదు చేశారని లాలూ అంటున్నారు. -
20 స్కూల్స్కు బాంబు బెదిరింపులు.. టెన్షన్లో పేరెంట్స్
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పాఠశాలలకు వరుస బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. శుక్రవారం ఒక్కరోజే ఢిల్లీలో దాదాపు 20 స్కూల్స్కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో, అప్రమత్తమైన పోలీసులు, అధికారులు.. తనిఖీలు చేపట్టారు.వివరాల ప్రకారం.. ఢిల్లీలోని పాఠశాళలకు వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. శుక్రవారం ఉదయమే పశ్చిమ్ విహార్, రోహిణీ సెక్టార్-3లోని పలు పాఠశాలలతో సహా దాదాపు 20 స్కూల్స్ బాంబు బెదిరింపు మొయిల్స్ వచ్చాయి. దీంతో, వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. పలు పాఠశాల్లలో ఉన్న విద్యార్థులను బయటకు పంపించి.. తనిఖీలు చేశారు. ఆయా పాఠశాలల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కన్పించలేదని పోలీసులు వెల్లడించారు. ఇక, ఢిల్లీలో నాలుగు రోజుల వ్యవధిలో 30కిపైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ వారం మొదటి మూడు రోజుల్లో ఢిల్లీలోని 11 పాఠశాలలు, ఒక కళాశాలకు ఇలాంటి బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయి. దీంతో, స్కూల్ యాజమాన్యాలు, విద్యార్థులు, పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు.బీజేపీ సర్కార్పై మాజీ సీఎం ఫైర్.. దేశ రాజధాని వరుస బాంబు బెదిరింపుల విషయమై అధికార బీజేపీపై మాజీ ముఖ్యమంత్రి అతిషి.. ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థులకు భద్రత కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అతిషి ట్విట్టర్ వేదికగా.. ఈరోజు 20కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి!. పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న బాధను ఆలోచించండి. ఢిల్లీలోని నాలుగు పాలనా యంత్రాలను బీజేపీ నియంత్రిస్తుంది. ఇంకా మా పిల్లలకు ఎటువంటి భద్రతను అందించలేకపోయింది!. ఇది దిగ్భ్రాంతికరం! అని ఆగ్రహం వ్యక్తం చేశారు. VIDEO | More than 20 schools in Delhi on Friday received bomb threats, triggering panic among the students and their parents. Delhi Police and other quick-response authorities have launched search and evacuation operations, an official said. This is the fourth such day this week… pic.twitter.com/xmnlP3HquW— Press Trust of India (@PTI_News) July 18, 2025 -
కమిటీ నివేదికను రద్దు చేయండి..జస్టిస్ యశ్వంత్ వర్మ
న్యూఢిల్లీ: నోట్ల కట్టల విషయంలో అంతర్గత విచారణ కమిటీ నివేదికను సవాలు చేస్తూ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నివేదికను రద్దు చేయాలని కోరుతూ గురువారం రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే తనపై అభిశంసన చర్యలు ప్రారంభించాలంటూ అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా చేసిన సిఫార్సులను సైతం సవాలు చేశారు. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వాన్ని, సుప్రీంకోర్టును ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఎంక్వైరీ కమిటీ నివేదికను రద్దు చేయాలంటూ హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి ఒకరు సుప్రీంకోర్టును ఆశ్రయించడం అత్యంత అరుదైన ఘటన అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో జస్టిస్ వర్మపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఒకవైపు ఏర్పాట్లు జరుగుతుండగా, మరోవైపు ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. నోట్ల కట్టల వ్యవహారంలో తన వాదన పూర్తిగా వినకుండానే నివేదిక రూపొందించారని అంతర్గత ఎంక్వైరీ కమిటీ తీరును ఆయన తప్పుపట్టారు. ఈ దర్యాప్తులో లోపాలు ఉన్నాయని స్పష్టంచేశారు. తనకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలు కమిటీకి లభించలేదన్నారు. తనను దోషిగా తేల్చాలన్న ముందస్తు వ్యూహంతోనే నివేదిక సిద్ధంగా చేశారని విమర్శించారు. తనపై దర్యాప్తు ప్రక్రియ మొత్తం రాజ్యాంగవిరుద్ధంగా సాగిందని, తన ప్రాథమిక హక్కులు ఉల్లంఘనకు గురయ్యాయని ఆందోళన వ్యక్తంచేశారు. నివేదికపై తాను అధికారికంగా స్పందించకముందే దాన్ని మీడియాకు లీక్ చేశానని, తన ప్రతిష్టను దెబ్బతీయాలన్న కుట్ర జరిగిందని జస్టిస్ వర్మ మండిపడ్డారు. అందుకే ఈ నివేదికను రద్దు చేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. అభిశంసన తీర్మానం ప్రవేశపెడతాం: మేఘ్వాల్న్యూఢిల్లీ: అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన కోసం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తీర్మానం ప్రవేశపె ట్టనున్నట్లు న్యాయ శాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ శుక్రవారం వెల్లడించారు. దీనిపై నిర్ణయం తీసు కోవాల్సింది ఎంపీలేనని, ఇందులో ప్రభుత్వం పాత్ర ఏమీ ఉండదని తేల్చిచెప్పారు. సుప్రీంకోర్టు లేదా హై కోర్టు జడ్జిని పదవి నుంచి తొలగించే హక్కు పార్లమెంట్కు ఉందని గుర్తుచేశారు. అభిశంసన తీర్మానానికి లోక్సభలో కనీసం 100 మంది, రాజ్యసభలో కనీసం 50 మంది సభ్యుల మద్దతు అవసరమని అన్నారు. -
వాద్రాపై ఈడీ చార్జిషీట్
న్యూఢిల్లీ: వ్యాపారవేత్త, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అభియోగ పత్రాన్ని కోర్టులో సమరి్పంచింది. 2008లో గుర్గావ్లోని సెక్టార్ 83లో షికోహ్పూర్లో 3.53 ఎకరాల భూమి కొనుగోలు వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందంటూ చార్జ్షీటులో ఈడీ పేర్కొంది. ఆ భూమిని స్కై లైట్ హాస్పిటాలిటీ అనే కంపెనీ ఓంకారేశ్వర్ ప్రాపరీ్టస్ సంస్థ నుంచి కొనుగోలు చేసింది. చెల్లింపు చెక్కులను మరో కంపెనీకి స్కై లైట్ రియాలిటీ జారీ చేసింది. ఈ రెండు సంస్థలకు వాద్రా యజమానిగా ఉన్నాయి. ఇక సేల్ డీడ్సమయంలో ఈ కంపెనీ వద్ద కేవలం రూ.1 లక్ష నగదు ఉంటే రూ.7.5 కోట్ల పెట్టి భూమిని కొనుగోలు చేయగల్గిందని ఈడీ చార్జ్షీటులో ప్రస్తావించింది.మరుసటి రోజే ఆ భూమిని స్కైలైట్ హాస్పిటాలిటీ పేరిట మార్చేశారు. 24 గంటల్లోపే భూమి టైటిల్ను వాద్రా కంపెనీకి మార్చారు. ఈ ప్రక్రియకు సాధారణంగా కనీసం మూడు నెలలు పడుతుంది. ఒక నెల తర్వాత హరియాణాలో హుడా ప్రభుత్వం స్కైలైట్ హాస్పిటాలిటీకి దాదాపు 2.71 ఎరాల భూమిలో గృహనిర్మాణ ప్రాజెక్టు అభివృద్ధికి అనుమతులు వచ్చాయి. ఫలితంగా భూమి విలువ ఒక్కసారిగా అమాంతం పెరిగింది. 2008లో రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్ ఆ ప్లాట్ను రూ.58 కోట్లకు కొనుగోలు చేసింది. అంటే ఆ భూమి విలువ ఒకేసారి 700 శాతం పెరిగింది. డీఎల్ఎఫ్ రెండు మూడు దఫాలుగా వాద్రాకు నగుదు చెల్లింపులు జరిపింది. 2012లో ఈ భూమి వ్యవహారాన్ని బయటకు తెచ్చిన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అశోక్ ఖేమ్కాను అప్పటి ముఖ్యమంత్రి హుడా ఆదేశాల మేరకు వెంటనే బదిలీ చేయడానికి ప్రయత్నించి తరువాత రద్దు చేశారు. భూమి వ్యవహారంపై సమగ్రస్థాయిలో విచారణ జరిపిన ఖేమా ఆ భూమి మ్యూటేషన్ను రద్దు చేయడం అప్పట్లో వివాదాస్పదమైంది. ఈ సమస్యను పరిశీలించడానికి ముగ్గురు సీనియర్ ఐఏఎస్లతో ప్యానెల్ ఏర్పాటైంది. 2013లో హుడా ప్రభుత్వం వాద్రాకు, డీఎల్ఎఫ్కు క్లీన్ చిట్ ఇచ్చింది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ వ్యవహారంపై విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది. భూ ఒప్పందాల్లో హుడా, వాద్రాలు అక్రమాలకు పాల్పడినట్లు 2018లో ఆరోపణలు వచ్చాయి. అందులో ఈ 3.5 ఎకరాల భూమి కూడా ఉంది. తప్పుడు డిక్లరేషన్ ఆధారంగా భూమిని కొనుగోలు చేశారని ఆరోపిస్తూ గుర్గావ్ పోలీసులు 2018 సెపె్టంబర్ 2న ఎఫ్ఐఆర్ నేమోదు చేసి ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. -
సుప్రీంకోర్టు ఉత్తర్వు రివర్స్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణ యం తీసుకుంది. ఏడాది క్రితం తాము స్వయంగా ఇచ్చిన ఉత్తర్వునే మార్చేసింది. 13 ఏళ్ల బాలుడి మానసిక పరిస్థితిని, అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని అతడిని తల్లికే అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆ బాలుడిని తండ్రి కస్టడీకి అప్పగిస్తూ 2024 ఆగస్టులో ఇచ్చిన ఉత్తర్వును న్యాయస్థానం మార్చింది. కేరళకు చెందిన యువతి, యువకుడికి 2011లో వివాహం జరిగింది. వారికి 2012లో కుమారుడు జన్మించాడు. తర్వాత కాపురంలో విభేదాలు తలెత్తడంలో వేర్వేరుగా జీవిస్తున్నారు. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. కుమారుడు తల్లి వద్దే ఉండేలా, తండ్రి నెలకు రెండు రోజులు చూసేలా ఒప్పందం కుదిరింది. 2015లో వారికి విడాకులు మంజూరయ్యాయి. యువతి మళ్లీ పెళ్లిచేసుకుంది. ఆమెకు ఒక కుమారుడు జన్మించాడు. మొ దటి భర్త నాలుగేళ్లుగా ఆమె మొదటి కుమారుడిని చూడడానికి రాలేదు. తాను మలే షియా వెళ్లిపోతున్నానని, మొదటి బిడ్డను కూడా తీసుకెళ్తానని, ఇందుకు అంగీకరిస్తూ సంతకం చేయాలని మొదటి భర్తను 2019 లో కోరింది. అందుకు అతడు నిరాకరించా డు. ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తన బిడ్డను తనకే అప్పగించాలని కోరాడు. కానీ, బిడ్డను తల్లికే అప్పగిస్తూ 2022లో ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వు జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ మొదటి భర్త కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. హైకోర్టు అతడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. బిడ్డను తండ్రి కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ తల్లి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై గత ఏడాది విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కేరళ హైకోర్టు తీర్పును సమరి్థంచింది. కుమారుడు తండ్రి వద్దే ఉండొచ్చని ఉత్తర్వు జారీ చేసింది. దాంతో ఈ ఉత్వర్వును పునఃసమీక్షించాలని కోరుతూ తల్లి మరోసారి పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. గత ఏడాది ఇచ్చిన ఉత్తర్వును రివర్స్ చేస్తున్నట్లు తేల్చిచెప్పింది. కుమారుడు తల్లి కస్టడీలోనే ఉండొచ్చని తేల్చిచెప్పింది. ఈ సమయంలో అతడికి తల్లి అవసరం చాలా ఉందని అభిప్రాయపడింది. చిన్న వయసులో బిడ్డకు తల్లే అసలైన సంరక్షురాలు అని న్యాయస్థానం పేర్కొంది. -
సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు ఆమోదం తెలపండి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో సెమీకండక్లర్ ప్రాజెక్టులకు త్వరితగతిన ఆమోదం తెలపాలని కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నూతన ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణం, ప్రపంచ స్థాయి పరిశోధన, అభివద్ధి కేంద్రాలు తెలంగాణలో ఉన్నాయని తెలిపారు. అందువల్ల ప్రతిపాదిత అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజీ టెక్నాలజీస్ (ఏఎస్ఐపీ) ప్రాజెక్టు, మైక్రో ఎల్ఈడీ డిస్ప్లే ఫ్యాబ్ ప్రాజెక్టు క్రిస్టల్ మ్యాట్రిక్స్కు ఆమోదం తెలపాలని కోరారు.రెండురోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఢిల్లీ వచ్చిన సీఎం..గురువారం రైల్ భవన్లో అశ్వినీ వైష్ణవ్తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో హైటెక్ ఎల్రక్టానిక్స్ పార్క్ ఏర్పాటుకు ఈఎంసీ 2.0 పథకం కింద తెలంగాణ ఇచ్చిన వినతిని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రీజినల్ రింగు రోడ్డు సమీపంలో నూతన ఎల్రక్టానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ పార్క్ ఏర్పాటు చేయాలని కోరారు. రీజినల్ రింగు రైలుకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. సీఎం వినతులపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్ డ్రైపోర్టు–బందరు లైన్ మంజూరు చేయండి రాష్ట్రంలో రైల్వే అనుసంధానత పెంపు కోసం నూతన ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని అశ్వినీ వైష్ణవ్ను ముఖ్యమంత్రి కోరారు. హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డుకు సమాంతరంగా రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టును ప్రతిపాదించామని..ఇందుకు రైల్వే బోర్డు ఇప్పటికే ఫైనల్ లొకేషన్ సర్వేకు అనుమతి ఇచ్చిందని తెలిపారు. రూ.8 వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుకు త్వరగా అనుమతులు ఇవ్వాలని కోరారు. ‘రీజినల్ రింగ్ రైలుతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అనుసంధానత పెరగడంతో పాటు హైదరాబాద్ నగరంలోని ప్రధాన స్టేషన్లలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది..’అని చెప్పారు. హైదరాబాద్ డ్రైపోర్టు నుంచి బందరు ఓడ రేవుకు అనుసంధానంగా రైలుమార్గం మంజూరు చేయాలని కోరా రు. ఔషధాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫుడ్ ప్రాసెసింగ్ ఉ త్పత్తుల ఎగుమతులకు ఈ మార్గం దోహదపడుతుందన్నారు. కొత్త రైలు మార్గాలు మంజూరు చేయండి ఖాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు అంశాన్ని సీఎం రేవంత్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రంలో రైల్వే ఆపరేషన్లను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఖాజీపేట రైల్వే డివిజన్ అవసరమని తెలిపారు. ప్రయాణికులకు భద్రత, వేగవంతమైన సేవల కోసం దీనిని ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా తెలంగాణలో వివిధ ప్రాంతాల అనుసంధానత, పారిశ్రామిక, వ్యవసాయక ఎగుమతులు, దిగుమతుల కోసం.. వెనుకబడిన ప్రాంతాల అభివద్ధికి నూతన రైలు మార్గాలు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.వికారాబాద్–కృష్ణా (122 కి.మీ.–అంచనా వ్యయం రూ.2,677 కోట్లు) కల్వకుర్తి–మాచర్ల (100 కి.మీ.–అంచనా వ్యయం రూ.2 వేల కోట్లు), డోర్నకల్–గద్వాల (296 కి.మీ.–అంచనా వ్యయం రూ.6,512 కోట్లు), డోర్నకల్–మిర్యాలగూడ (97 కి.మీ.–అంచనా వ్యయం 2,184 కోట్లు) మార్గాలను వంద శాతం రైల్వే శాఖ వ్యయంతో మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర మంత్రులు శ్రీధర్బాబు, ఉత్తమ్కుమార్ రెడ్డి, ఎంపీలు పోరిక బలరాం నాయక్, చామల కిరణ్కుమార్ రెడ్డి, కుందూరు రఘువీర్ రెడ్డి, రామసహాయం రఘురాంరెడ్డి, సురేశ్ షెట్కార్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్కుమార్, ఆర్ అండ్ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, కేంద్ర ప్రభుత్వ పథకాల సమన్వయ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. -
ఏఐతో.. ముప్పు పొంచి ఉంది!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ప్రస్తుతం ప్రపంచమంతా మాట్లాడుకుంటున్న సాంకేతికత. ఏఐతో కొత్త అవకాశాలు రావడమే కాదు.. ప్రస్తుతం తాము పనిచేస్తున్న ఉద్యోగాలకు ముప్పు రానుందని అత్యధిక మంది నిపుణులు నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో నైపుణ్యాలను పెంచుకోవాలన్న కృతనిశ్చయం వారిలో కనిపిస్తోంది. మెషీన్ లెర్నింగ్, ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఎక్కువ శాతం మంది భావిస్తున్నారని ‘గ్రేట్ లెర్నింగ్’ సర్వేలో తేలింది.సాంకేతికతతో తమ ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని భావించే వారిలో 21 నుండి 28 సంవత్సరాల వయసు గల యువత (జనరేషన్ –జెడ్) అత్యధికంగా ఉండటం విశేషం. ముఖ్యంగా ఏఐ వల్ల తమ ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని 74% మంది జెన్ –జెడ్ తరం భావిస్తున్నారు. ప్రస్తుతం తాము పనిచేస్తున్న ఉద్యోగానికి ఢోకా లేదని 64 శాతం మంది ధీమాగా ఉన్నారు.45–60 సంవత్సరాల వయసు గల జనరేషన్ –ఎక్స్లో 56% మంది ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మొత్తంగా 69% మంది నిపుణులు తమ ఉద్యోగాలకు ఏఐ వల్ల ప్రమాదం ఉందని నమ్ముతున్నారు. ‘అప్స్కిల్లింగ్ ట్రెండ్స్ రిపోర్ట్ 2025–26’ పేరుతో ఎడ్టెక్ కంపెనీ ‘గ్రేట్ లెర్నింగ్’ దేశవ్యాప్తంగా విభిన్న రంగాలకు చెందిన 1,000 మందికిపైగా నిపుణులతో చేసిన సర్వేలో ఇలాంటి ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.నైపుణ్యం పెంచుకుంటాం..ఈ సంవత్సరం నైపుణ్యాలను పెంచుకోవాలని 81% మంది భావిస్తున్నారు. హైదరాబాద్లో ఈ సంఖ్య దేశంలోనే అత్యధికంగా 90 శాతం ఉంది. తమ కెరీర్లపై ఏఐ ప్రభావం సానుకూలంగా ఉంటుందని 78% మంది చెబుతున్నారు. ఈ ఏడాది 73% మంది నిపుణులు తమ ఉద్యోగాలను నిలుపుకోవడంపై నమ్మకంగా ఉన్నారు. 82% మంది చురుగ్గా కొత్త ఉద్యోగ అవకాశాలను అన్వేషిస్తున్నారు. ఇక 29–44 ఏళ్ల వయసున్న (మిలీనియల్స్) ఉద్యోగుల్లో 90 శాతం మంది నైపుణ్య విలువను గుర్తించారు. జెన్ –జెడ్ విషయంలో ఇది 79 శాతం. కానీ ఆఫీసు పని గంటల కారణంగా నూతన సాంకేతిక నైపుణ్యాలను సంపాదించడం అడ్డంకిగా మారిందని 37% మంది అంటున్నారు. కుటుంబ బాధ్యతలు, ఇంటి పని కారణంగా కొత్త కోర్సులు నేర్చుకోలేకపోతున్నామని 25 శాతం మహిళలు చెబుతుంటే.. ఇలా చెప్పిన పురుషులు 20 శాతం కావడం విశేషం.6 వారాల నుంచి ఆరు నెలలు..కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి జెన్ –ఏఐని ఉపయోగిస్తున్నట్లు 80% మంది నిపుణులు వెల్లడించారు. మెషీన్ లెర్నింగ్, ఏఐ విభాగాల్లో నైపుణ్యం పెంచుకుంటామని 44 శాతం మంది తెలిపారు. తమ పనిలో జెన్ –ఏఐని ‘ఎల్లప్పుడూ’ లేదా ’తరచుగా’ ఉపయోగిస్తామని 60% మంది చెబుతున్నారు. ఇక ఐటీ, ఐటీఈఎస్, బీపీఎం, టెలికం రంగాల్లో పనిచేస్తున్నవారిలో 91 శాతం మంది నైపుణ్యం మెరుగుపర్చుకోవడం ముఖ్యం అని తెలిపారు. 64% మంది నిపుణులు 6 వారాల నుంచి 6 నెలల నిడివిగల ప్రోగ్రామ్స్తో నైపుణ్యాన్ని పెంచుకోవాలని అనుకుంటున్నారు.జెన్ –జీ ప్రధానంగా స్వల్పకాలిక ప్రోగ్రామ్స్ను ఇష్టపడుతున్నారు. 50% మంది 6 వారాల కంటే తక్కువ లేదా 6 వారాల నుండి 3 నెలల మధ్య ఉన్న ప్రోగ్రామ్లను ఇష్టపడుతున్నారు. దేశీయ యూనివర్సిటీలు అందించే సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నామని 43 శాతం చెప్పగా.. అంతర్జాతీయ వర్సిటీల సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నామని 36 శాతం తెలిపారు. తల్లి/తండ్రిగా బాధ్యతలు నెరవేరుస్తున్న ఉద్యోగుల్లో 90% మంది నిపుణులు నైపుణ్యం పెంపుదల ముఖ్యమైనదని భావిస్తున్నారు. ఇతర (పెళ్లికాని లేదా పిల్లలు లేనివారు) నిపుణుల్లో ఈ సంఖ్య 76 శాతమే. -
రష్యన్ మహిళను వెతికి పట్టుకోండి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: భర్తతో విడాకుల కేసు పెండింగ్లో ఉన్న సమయంలో ‘కస్టడీ డీల్’లో ఉన్న ఐదేళ్ల పిల్లాడితో కనిపించకుండా పోయిన రష్యాకు చెందిన మహిళను వెంటనే వెతికి పట్టుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖను ఆదేశించింది సుప్రీంకోర్టు. కొన్నేళ్ల క్రితం రష్యాకు చెందిన మహిళ విక్టోరియా బసూను భారత్కు చెందిన సైకత్ బసూ వివాహం చేసుకోగా, ప్రస్తుతం వారి మధ్య విడాకుల కేసు ఢిల్లీ సాకేత్ కోర్టులో పెండింగ్లో ఉంది. ఈ సమయంలో విక్టోరియా బసూ కనిపించకుండా పరారైయినట్లు భర్త సైకత్ బసూ ఫిర్యాదు చేశాడు. తన భార్య పిల్లాడిని తీసుకుని పరారైనట్లు సైకత్.. సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీనిలో భాగంగా విచారణ చేపట్టిన ధర్మాసనం సదరు మహిళను వెంటనే పట్టుకోవాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో రష్యన్ మహిళ వెంట పెట్టుకుని తీసుకుని పోయిన ఆమె కుమారుడ్ని వెంటనే ట్రేస్ అవుట్ చేయాలని ఢిల్లీ పోలీసుల్ని ఆదేశించింది. ఇందులో ఎటువంటి జాప్యం లేకుండా త్వరతగతిన పిల్లాడి ఆచూకీని ఛేదించాలని స్పష్టం చేసింది. ఆపై పిల్లాడిని తండ్రి సైకేత్కు అప్పగించాలని ఆదేశాల్లో పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం.. పిల్లాడితో పాటు కనిపించకుండా పోయిన విక్టోరియా బసూ పాస్పోర్ట్ సీజ్ చేయాలని ఆదేశించింది. ఎయిర్పోర్ట్, నావీ పోర్ట్ల్లో అధికారులు ఆ మహిళపై ఓ కన్నేసి ఉంచాలని ఆదేశాల్లో పేర్కొంది ధర్మాసనం. అదే సమయంలో ఆమెపై లుకౌట్ నోటీసులు జారీ చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. విక్టోరియా బసూ ఎక్కడ ఉందో తెలియదంటూ ఆమె తరఫు న్యాయవాది తెలిపిన క్రమంలో.. సుప్రీంకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. ‘ ‘ఆమె ఎక్కడ ఉందో మీకు తెలుసు. మీరు మాతో ఆటలు ఆడాలనుకుంటున్నారా?, మీ దగ్గరికి మళ్లీ వస్తాం.. మీరు కాస్త ఆగండి’ అని జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ఆమెకు రష్యా ఎంబాసీ అధికారి సాయం చేశారు..తన భార్య పారిపోవడానికి భారత్లో ఉన్న రష్యన్ ఎంబసీ ప్రతినిధి సాయం చేశారని సైకేత్ కోర్టుకు తెలిపారు. విడాకుల కేసు ప్రోసిడింగ్స్లో ఉండగా ఢిల్లీలోని రష్యన్ ఎంబసీ నుంచి ఆమె పారిపోయిందని భర్త తెలిపారు. ఎంబసీ వెనుక గేటు నుంచి ఆమె వెళ్లిపోయిందని, రష్యన్ ఎంబసీ అధికారి ఆమెకు సాయం చేశారని భర్త ఆరోపిస్తున్నాడు. లగేజీ పట్టుకుని మరీ వెళ్లిన ఆమెను సదరు అధికారి పంపించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. రష్యన్ ఎంబాసీ అధికారి ఆమెకు సాయం చేయడం తాను చూశానన్నాడు. అ అధికారి ఇళ్లు సోదా చేయడానికి అనుమతి కోరండిరష్యన్ రాయబార కార్యాలయ అధికారితో సంబంధం ఉందని బాధిత భర్త చేసిన ఆరోపణను కూడా ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది; ఆమె గుర్తించబడకుండా భవనంలోకి ప్రవేశించడానికి సహాయం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి ఎవరు అనేది అస్పష్టంగా ంది. ఢిల్లీలోని ఈ అధికారి ఇంటిని సోదా చేయడానికి అనుమతి కోరాలని విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆదేశించింది సుప్రీంకోర్టు.విడాకుల కేసు పెండింగ్లో ఉన్న కారణంగా ఆ పిల్లాడు మూడు రోజులు తల్లి దగ్గర ఉండాలనేది కస్టడీ డీల్. దీనిలో భాగంగా మే 22వ తేదీన పిల్లాడిని తీసుకుంది. అదే తాను పిల్లాడిని చివరిసారి చూడటమని కోర్టుకు తెలిపాడు భర్త సైకేత్. భార్య విక్టోరియా బసూ.. జూలై 7 నుంచి పిల్లాడితో సహా కనిపించకుండా పోయిందని సైకేత్ బసూ కోర్టుకు తెలిపారు. -
హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు అసంతృప్తి.. దర్శన్కు లీగల్ షాక్
సాక్షి,న్యూఢిల్లీ: అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో ప్రముఖ నటుడు దర్శన్ తూగుదీపకు కర్ణాటక హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై గురువారం (జులై 17) సుప్రీంకోర్టు ఆగ్రహ వ్యక్తం చేసింది. రేణుకా స్వామి హత్యకేసులో కర్ణాటక హైకోర్టు దర్శన్కు గతేడాది బెయిల్ మంజూరు చేసింది. అయితే, దర్శన్కు బెయిల్ ఇచ్చే సమయంలో హైకోర్టు తగిన ఆధారాలు, కేసు తీవ్రత, బాధితుడి (రేణుకాస్వామి) హక్కులను సరిగ్గా పరిగణనలోకి తీసుకోలేదని భావించింది.గతేడాది ఏప్రిల్ నెలలో తన స్నేహితురాలు పవిత్ర గౌడకు సంబంధించిన అసభ్యకర ఫొటోలు పంపించాడన్న ఆరోపణల్లో రేణుకాస్వామిని దర్శన్, ఆయన స్నేహితురాలు పవిత్రగౌడలు దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో దర్శన్, పవిత్రగౌడ సహా 15మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ చేపట్టిన కోర్టు నిందితులకు జైలు శిక్ష విధించింది. ఇదే కేసులో దర్శన్, పవిత్రగౌడతో పాటు పలువురు నిందితులు కొన్ని నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు. అనంతరం, గతేడాది డిసెంబర్లో వీరికి కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.దర్శన్కు హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్పై సుప్రీం కోర్టు జస్టిస్ జేబీ పార్ధీవాలా, జస్టిస్ మహదేవన్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ చేపట్టించింది. ఈ సందర్భంగా..దర్శన్కు కర్ణాటక హైకోర్టు బెయిల్ ఇచ్చిన తీరును తప్పుబట్టింది.రేణుకాస్వామి హత్య కేసు విచారణ సందర్భంగా, దర్శన్ తరపున వాదనలు వినిపిస్తున్న ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్తో సుప్రీం కోర్టు ధర్మాసనం ఇలా అన్నది.‘రేణుకాస్వామి కేసులో దర్శన్కు బెయిల్ ఇచ్చిన కర్ణాటక హైకోర్టు తీర్పు.. న్యాయబద్ధంగా తీసుకోలేదనే అభిప్రాయం కలుగుతోంది. తగిన అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా, విచక్షణను సరిగ్గా అమలు చేయలేకపోయింది అనిపిస్తోంది. మిస్టర్ సిబల్..మీ అభిప్రాయం ఏమిటి?’అని అడిగింది.అందుకు కపిల్ సిబల్ అత్యున్నత న్యాయస్థానం, హైకోర్టు నిర్ణయాన్ని పక్కన పెట్టి సాక్షుల ఇచ్చిన స్టేట్మెంట్లపై దృష్టి పెట్టాలని కోరారు. కపిల్ సిబల్ విజ్ఞప్తిపై సుప్రీం ధర్మాసనం.. విచారణ తదుపరి మంగళవారానికి వాయిదా వేస్తున్నాం. హైకోర్టు తీర్పులో మేము ఎందుకు జోక్యం చేసుకోకూడదో వచ్చే విచారణలో మీరు వాదించండి. మీ వాదనల్ని మేం వినాలని అనుకుంటున్నామని తెలిపింది. Supreme Court hears Karnataka’s plea against bail granted to Kannada actor Darshan Thoogudeepa (Sri Darshan C). They are accused in the murder of a fan, Renukaswamy, allegedly triggered by derogatory messages the victim sent to actress Pavithra Gowda - Darshan’s alleged… pic.twitter.com/7Dw8eIL9vf— Bar and Bench (@barandbench) July 17, 2025 -
సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట
ఢిల్లీ: సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట లభించింది. మైనింగ్ కేసులో వంశీ ముందస్తు బెయిల్ రద్దు చేయాలన్న ఏపీ ప్రభుత్వ పిటిషన్ను హైకోర్టుకు సుప్రీం కోర్టు తిప్పి పంపించింది. అరెస్టు నుంచి రక్షణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్పై గురువారం.. సుప్రీంకోర్టు విచారణ జరిపింది.హైకోర్టు తమ వాదన వినకుండానే ముందస్తు బెయిల్ ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి వాదించారు. దాంతో కేసును ఏపీ హైకోర్టు మరోసారి విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అరెస్టు నుంచి రక్షణను సుప్రీంకోర్టు పొడిగించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. -
విమానం నుంచి ‘ప్యాన్ ప్యాన్ ప్యాన్’.. ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
ముంబైలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న ఇండిగో విమానాన్ని ముంబైలో అత్యవసర ల్యాండ్ చేసిన పైలట్.. ‘ప్యాన్ ప్యాన్ ప్యాన్’ అంటూ సంకేతమిచ్చారు. ప్రాణాపాయం ఏమీ లేదు కానీ.. అత్యవసర పరిస్థితుల్లో ల్యాండ్ కావాల్సి ఉందంటూ సంకేత భాషలో పైలట్ సందేశం పంపించారు.నిన్న(బుధవారం) ఉదయం ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి గోవా బయలేరిన ఇండిగో ఎయిర్బస్ ఏ320 నియో విమానంలో సమస్య తలెత్తింది. గాలిలో ఉండగా.. ఒక ఇంజిన్ పనిచేయకపోవడంతో పైలట్ ‘ప్యాన్.. ప్యాన్.. ప్యాన్’ సంకేత భాషలో సమాచారం ఇచ్చారు. దీంతో ఉదయం 9.53 గంటల ప్రాంతంలో విమానాన్ని అత్యవసరంగా ముంబైలో ల్యాండ్ చేశారు. విమానంలో 191 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు.ఈ ఘటనపై ఇండిగో సంస్థ స్పందిస్తూ.. సాంకేతికలోపం తలెత్తడంతో విమానాన్ని ముంబైకి దారి మళ్లించినట్ల పేర్కొంది. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది.కాగా, గత నెల ఇండిగో విమానం నుంచి ‘మేడే కాల్’తో ఒక్కసారిగా కలకలం రేగింది. గువహటి నుంచి చెన్నైకి వెళుతున్న విమానంలో ఈ ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. పెను ప్రమాదమే తప్పడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఇటీవల అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానం నుంచి ‘మేడే కాల్’ వచ్చిన సంగతి తెలిసిందే. ఎవరైనా పైలట్ నుంచి ఏటీసీకి మేడే కాల్ వచ్చిందంటే ఆ విమానం కూలిపోయే ప్రమాదంలో ఉందని అర్థం. వెంటనే ఏటీసీ అధికారులు అత్యవసరం కాని సేవలన్నింటినీ నిలిపేసి ఆ విమానాన్ని కాపాడేందుకు ప్రయత్నం మొదలు పెడతారు.సహాయం కోసం మేడే కాల్ ఇచ్చిన పైలట్ తన విమానం ఏ ప్రాంతంలో ఉంది? ఎంత ఎత్తులో ఉంది? ఎలాంటి ప్రమాదంలో ఉంది? విమానంలో ఎంతమంది ప్రయాణిస్తున్నారు అనే విషయాలు కూడా అందించాల్సి ఉంటుంది. దాన్ని బట్టి సహాయ చర్యలు ఎలా చేపట్టాలన్నది ఏటీసీ అధికారులు నిర్ణయిస్తారు. ఈ మేడే సిగ్నల్ను సాధారణంగా 121.5 మెగాహెడ్జ్, 243 మెగాహెడ్జ్లో పంపుతుంటారు. ఈ ఫ్రీక్వెన్సీలను ఏటీసీ అధికారులు అనుక్షణం పరిశీలిస్తుంటారు. -
వర్షాకాల సమావేశాల్లో 8 కొత్త బిల్లులు
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో 8 కొత్త బిల్లులు ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమయ్యింది. నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు, జియోహెరిటేజ్ సైట్స్, జియో రెలిక్స్(సంరక్షణ, నిర్వహణ) బిల్లు, మైన్స్ అండ్ మినరల్స్(అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు, నేషనల్ యాంటీ డోపింగ్(సవరణ) బిల్లు, మణి పూర్ వస్తువులు, సేవల పన్ను(సవరణ) బిల్లు వంటివి ఇందులో ఉన్నాయి. అలాగే ఇన్కం ట్యా క్స్–2025ను కూడా ప్రవేశపెట్టే అవకాశం కనిపి స్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 21వ తేదీ దాకా మొత్తం 21 రోజులపాటు జరుగు తాయి. రాఖీ పౌర్ణమి, స్వాతంత్య్ర దినో త్సవం సందర్భంగా రెండు రోజులు సెలువులు ప్రకటించారు. -
వచ్చే నెలలో మోదీ చైనా పర్యటన!
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ వచ్చే నెలలో చైనాలో పర్యటించబోతున్నారు. ఆగస్టు 31, సెపె్టంబర్ 1వ తేదీల్లో చైనాలోని తియాంజిన్ నగరంలో జరిగే షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటారని సమాచారం. 2020 జూన్లో జరిగిన భారత్, చైనా జవాన్ల భీకర ఘర్షణ తర్వాత మోదీ చైనాకు వెళ్తుండడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఆయన చివరిసారిగా 2019లో చైనాలో పర్యటించారు. గల్వాన్ లోయ ఘటన తర్వాత భారత్–చైనా ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించాయి. సంబంధాలు పునరుద్ధరించుకోవాలని ఇరుదేశాలు భావిస్తున్నాయి. ఈ విషయంలో మోదీ చైనా పర్యటన కీలకమైన ముందడుగు అవుతుందని దౌత్య నిపుణులు అంచనా వేస్తున్నారు. మోదీ చైనా పర్యటన సందర్భంగా చైనా అధినేత షీ జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది. చైనాలో ఎస్సీఓ సదస్సు నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా సభ్యదేశాల అధినేలతో మోదీ భేటీ అవుతారు. చైనా పర్యటన కంటే ముందు ప్రధానమంత్రి జపాన్లో పర్యటిస్తారని సమాచారం. మోదీ ప్రధానమంత్రి హోదాలో ఇప్పటిదాకా ఐదు సార్లు చైనాలో పర్యటించారు. దేశ విదేశాల్లో షీ జిన్పింగ్తో 18 సార్లు సమావేశమయ్యారు. మరోవైపు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ మంగళవారం చైనా అధినేత జిన్పింగ్తో భేటీ అయిన సంగతి తెలిసిందే. భారత్–చైనా సంబంధాలపై వారు చర్చించారు.