breaking news
Delhi
-
హడలెత్తిన రైడ్.. వెంటపడ్డ వాహనాలు.. రెండు గంటల భయానక జర్నీ!
వెనకాలే వస్తున్న వాహనాలు.. చుట్టూ వింత చూపులు.. రాత్రి వేళ నిశ్శబ్దంగా ఉన్న ఢిల్లీ రోడ్లు.. స్కూటర్పై ఒంటరి ప్రయాణం.. వెనుక నుంచి వస్తున్న వాహనాలు.. చీకటిలో తనవైపు నిలిచిపోయిన చూపులు.. మొదట ఇదంతా ఓ సాధారణ రాత్రి రైడ్లానే అనిపించింది. కానీ కొన్ని నిమిషాలు గడిచేసరికి పరిస్థితి మారిపోయింది. ఒకటి తర్వాత మరొకటి ఎదురైన ఘటనలతో ఆ ప్రయాణం చివరకు భయానక అనుభవంగా మారింది.రాత్రివేళ మహిళలు ఎదుర్కొనే పరిస్థితులను స్వయంగా తెలుసుకోవాలనుకున్న ఓ కంటెంట్ క్రియేటర్ ఈ ప్రయోగం చేశాడు. BeJaintle పేరుతో ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ చేసే అతడు.. ఇంట్లోనే మహిళ మాదిరిగా కనిపించే మేకప్ వేసుకుని, డ్రెస్ ధరించి, తలకు దుపట్టా కప్పుకున్నాడు. ఆ తర్వాత స్కూటర్ తీసుకుని ఢిల్లీ రోడ్లపైకి బయలుదేరాడు.మొదట చూపులు.. ఆ తర్వాత వెంటపడటం!రోడ్డుపైకి వచ్చిన కొద్దిసేపటికే తనవైపు పలువురు చూస్తున్నారని క్రియేటర్ గుర్తించాడు. ఎక్కడికి వెళ్లినా ఆ చూపులు తనను వెంబడిస్తున్నట్లు అనిపించాయని అతడు వీడియోలో పేర్కొన్నాడు. ఒక దశలో ఇద్దరు వ్యక్తులు తనను గమనిస్తూ స్కూటర్ను అనుసరించారని అతడు ఆరోపించాడు. మొదట దూరంగా కనిపించిన వారు.. క్రమంగా తనకు దగ్గరగా రావడానికి ప్రయత్నించారని చెప్పాడు. మరో సందర్భంలో స్కూటర్ నడుపుతుండగానే ఓ వ్యక్తి తన దగ్గరకు వచ్చి మాట్లాడటం ప్రారంభించాడని తెలిపాడు.చీకటి రోడ్డుపై ఆటోలు.. అసలు టెన్షన్ అక్కడితో ఆగలేదు. ప్రయాణంలో రెండు ఆటోలు తన స్కూటర్ మార్గంలోకి పదేపదే వచ్చినట్లు క్రియేటర్ చెప్పాడు. ఓ ఆటో డ్రైవర్ తన స్నేహితులు వీడియో తీస్తున్నారని గుర్తించిన తర్వాత ఆగిపోయాడని అతడు తెలిపాడు. మరో డ్రైవర్ మాత్రం తన స్కూటర్ వైపు పలుమార్లు వాహనాన్ని మళ్లించినట్లు ఆరోపించాడు. ఆ వాహనం చివరకు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఊపిరి పీల్చుకున్నానని చెప్పాడు.‘ఇక చాలు..’ అంటూ ముగింపురెండు గంటలు గడిచేసరికి అతడి ఉత్సాహం మొత్తం భయంగా మారిపోయింది. పదేపదే ఎదురైన చూపులు, అనుసరిస్తున్నట్లు అనిపించిన వ్యక్తులు, తన దారిలోకి వస్తున్న వాహనాలతో తాను తీవ్ర అసౌకర్యానికి గురయ్యానని చెప్పాడు. గత రెండు గంటల్లో నాకు చాలా అసహ్యంగా అనిపించింది. ఆటోవాళ్లు, సైకిల్ వాళ్లు.. అందరూ చూస్తూనే ఉన్నారు. రాత్రివేళ అమ్మాయిలు ఒంటరిగా బయటకు రావడం నిజంగా సురక్షితం కాదనిపించింది అంటూ తన అనుభవాన్ని పంచుకున్నాడు. చివరకు ఆ ప్రయోగాన్ని మధ్యలోనే ఆపేశాడు. మహిళ వేషంలో చేసిన ఆ రాత్రి ప్రయాణం.. కేవలం సోషల్ మీడియా ప్రయోగంగా మొదలై, తనకు భయాన్ని మిగిల్చిన అనుభవంగా మారింది.ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. మహిళలు రాత్రివేళ ఒంటరిగా ప్రయాణించే సమయంలో ఎదుర్కొనే అవాంఛిత చూపులు, అనుసరణ, వేధింపులపై పలువురు స్పందించారు. అయితే ఒక్క వ్యక్తి చేసిన ఈ ప్రయోగాన్ని ఆధారంగా చేసుకుని ఢిల్లీలో మహిళల భద్రతపై విస్తృతమైన నిర్ధారణకు రావడం సరికాదని మరికొందరు అభిప్రాయపడ్డారు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. He Dressed as a Woman and Rode Through Delhi at Night. What He Experienced in 2 Hours Is Now Raising Questions About Women’s Safety.A Delhi-based content creator conducted a social experiment by dressing as a woman and riding a scooty through the capital after dark.His… pic.twitter.com/5eVM92jtLp— News Insider 24x7 (@newsinsider24x7) September 19, 2026ఇదీ చదవండి: గణేశ్ మండపం వద్ద కరెంట్ షాక్.. మహిళ, బాలిక మృతి -
ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. ప్రొఫెసర్పై కేసు
ముంబై: ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కుల వివక్ష, వేధింపులే తన కుమారుడి మరణానికి కారణమని సాహిల్ తండ్రి రవీంద్ర చక్రధర్ వాకోడే ఆరోపిస్తున్నారు.ఇటీవల ఐఐటీ బాంబే నిర్వహించిన పరీక్షల్లో విద్యార్థి సాహిల్ వాకోడే మొబైల్ ఫోన్ ఉపయోగించి, సమాధానాలు వెతికేందుకు ప్రశ్నాపత్రాన్ని చాట్జీపీటీలో అప్లోడ్ చేసి కాపీ కొడుతూ పట్టుబడ్డాడు. ఇన్విజిలేటర్కు దొరికిపోవడంతో మనస్తాపం చెంది అతను తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడని ఐఐటీ బాంబే అధికారికంగా ప్రకటించింది.అయితే, తన కుమారుడి మరణానికి కుల వేధింపులే కారణమని బాధిత విద్యార్థి తండ్రి పోలీసులను ఆశ్రయించారు. ఐఐటీ బాంబే డైరెక్టర్ ప్రొఫెసర్ శిరీష్ బి. కేదారే ఆదేశాల మేరకే ప్రొఫెసర్ సూర్యనారాయణన్ దూళ్ల తనను వేధించారని సాహిల్ తనతో చెప్పినట్లు ఆయన తండ్రి ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.మహారాష్ట్రలోని యవత్మాల్కు చెందిన సాహిల్, 12వ తరగతి వరకు అక్కడే చదువుకున్నాడు. ఆ తర్వాత ఐఐటీ బాంబేలో ప్రవేశం పొందాడు. కాలేజీ మొదటి సంవత్సరం సజావుగా సాగినప్పటికీ, రెండవ సంవత్సరంలో అతనికి సమస్యలు మొదలయ్యాయి. గత మూడు నెలలుగా సాహిల్ తీవ్రమైన మానసిక వేధింపులకు, కుల దూషణలకు గురయ్యాని వాకోడే ఆరోపించారు.సాహిల్ కాపీ కొడుతూ పట్టుబడిన పరీక్ష సమయంలో ఇన్విజిలేటర్గా వ్యవహరించిన ప్రొఫెసర్ సూర్యనారాయణన్ దూళ్ల పేరిట ఈ ఫిర్యాదును నమోదు చేశారు. డైరెక్టర్ శిరీష్ బి. కేదారే ఆదేశాల మేరకు ఆయన కులపరమైన దూషణలకు పాల్పడ్డారని ఆరోపించారు. తాను 'తక్కువ కులానికి' చెందినవాడిని కాబట్టి, తనపై సులభంగా తప్పుడు కేసు బనాయించగలనని ప్రొఫెసర్ దుల్లా బెదిరించినట్లు సాహిల్ తన తండ్రికి తెలిపినట్లు ఆరోపణలు ఉన్నాయి.తన కుమారుడు ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించినందుకు ప్రొఫెసర్ దుల్లాను బాధ్యుడిగా పేర్కొంటూ, ఆయనతో పాటు ఇతర ఉన్నతాధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వాకోడే డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఐఐటీ బాంబే ప్రొఫెసర్ సూర్యనారాయణన్ దూళ్లపై ఆత్మహత్యకు ప్రేరేపణ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ప్రొఫెసర్ రాజీనామాకు డిమాండ్మరోవైపు, క్యాంపస్లో ఎలాంటి కుల వివక్ష లేదని ఐఐటీ బాంబే డైరెక్టర్ ప్రొఫెసర్ శిరీష్ బి. కేదారే తీవ్రంగా ఖండించారు. సాహిల్ ఎప్పుడూ ఎస్సీ, ఎస్టీ సెల్కు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని కళాశాల వర్గాలు వెల్లడించాయి. ఈ ఉదంతం నేపథ్యంలో ఐఐటీ బాంబే విద్యార్థులు తీవ్ర ఆందోళనలు చేపట్టి, డైరెక్టర్, సంబంధిత ప్రొఫెసర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.సాహిల్ వాకోడే ఐఐటీలోని ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో ఎంఎస్సీ రెండవ సంవత్సరం విద్యార్థి. శుక్రవారం సాయంత్రం ఐఐటీ బాంబే పవాయ్ క్యాంపస్లోని తన హాస్టల్ గదిలో అతను విగతజీవిగా కనిపించాడు.ఐఐటీ బొంబాయి వివరాల ప్రకారం.. సాహిల్ ఆ రోజు అంతకుముందు పరీక్షా హాలులో మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ, సమాధానాల కోసం ప్రశ్నపత్రాన్ని చాట్జీపీటీలో అప్లోడ్ చేస్తూ పట్టుబడ్డాడు. అయినప్పటికీ, అతనిపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదని, బదులుగా అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి, అతని కెరీర్కు ఎలాంటి హాని జరగదని హామీ ఇచ్చామని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.ఇదీ చదవండి: ప్రాణం తీసిన చాట్జీపీటీ : ఐఐటీ బొంబాయి బెదిరింపులు? -
ఇక అప్పులపైనే ఆధారపడం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఇకపై కేవలం ప్రభుత్వ రుణాలపైనే ఆధారపడే పాత విధానానికి స్వస్తి పలుకుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. మౌలిక వసతుల కల్పనకు నిధులు సమకూర్చుకొనే విధానంలో కచ్చితమైన మార్పు రావాలని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఢిల్లీలో శనివారం జరిగిన ‘వికసిత్ భారత్ దిశగా దేశ ప్రయాణానికి ఆర్థిక వనరుల సమీకరణ’సదస్సులో తెలంగాణ నుంచి భట్టి విక్రమార్కతోపాటు రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్లు, ఇతర కీలక ప్రాజెక్టుల కోసం ఇకపై ప్రైవేటు పెట్టుబడులు, సంస్థాగత నిధులు, సావరిన్ ఫండ్స్ను భారీగా సమీకరించే నమూనా వైపు రాష్ట్రం దృష్టి సారిస్తోందని చెప్పారు. ప్రాజెక్టుల్లో పెట్టుబడిదారుల రిస్్కను తగ్గించడానికి, వయబిలిటీ గ్యాప్ పూడ్చడానికి ప్రభుత్వ నిధులను వ్యూహాత్మకంగా వినియోగిస్తామన్నారు. ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యాలు (పీపీపీ), గ్రీన్ బాండ్లు, బ్లెండెడ్ ఫైనాన్స్ మార్గాలను మరింత బలోపేతం చేస్తామని భట్టి వివరించారు. వికసిత్ భారత్లో తెలంగాణ కీలకం.. దేశాన్ని 2047 నాటికి అభివద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సాగుతున్న వికసిత్ భారత్ ప్రయాణంలో తెలంగాణ కీలక భూమిక పోషిస్తుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. 2025–26 నాటికి తెలంగాణ జీఎస్డీపీ రూ. 17.82 లక్షల కోట్లకు చేరిందన్నారు. ప్రస్తుత ధరల ప్రకారం ఇది 10.7 శాతం వృద్ధి అని.. స్థిర ధరల ప్రకారం వాస్తవ జీఎస్డీపీ వృద్ధి 8.5 శాతంగా అంచనా వేశామని తెలిపారు. రాష్ట్ర తలసరి ఆదాయం జాతీయ సగటు రూ. 2,19,575తో పోలిస్తే దాదాపు రెండింతలు ఎక్కువగా ఉండి రూ. 4,18,931కి చేరిందని భట్టి గుర్తుచేశారు. ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ వాటాను ప్రస్తుతం ఉన్న 5 శాతం నుంచి 10 శాతానికి పెంచడమే లక్ష్యమని వివరించారు. రాష్ట్ర సమతుల్య అభివృద్ధి కోసమే క్యూర్, ప్యూర్, రేర్ అనే ప్రత్యేక నమూనాను అమలు చేస్తున్నట్లు భట్టి వివరించారు. అలాగే దేశంలోనే తొలి నెట్–జీరో, ఏఐ ఆధారిత గ్రీన్ మెగాసిటీగా 30 వేల ఎకరాలకుపైగా విస్తీర్ణంలో భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నామని భట్టి వెల్లడించారు. యువతే తెలంగాణ అసలైన బలం... రాష్ట్ర యువతే తెలంగాణ అసలైన బలమని భట్టి పేర్కొన్నారు. ఉన్నత విద్యకు, పరిశ్రమల అవసరాలకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించేందుకు అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామన్నారు. సామాజిక భద్రత, మెరుగైన వైద్యం, మహిళా సాధికారతతో కూడిన సమ్మిళిత అభివృద్ధే రాష్ట్ర విధానమని భట్టి వివరించారు. -
మమతకు మరో బిగ్ షాక్! రెజీనగర్లోనూ అభ్యర్థి ఔట్
పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల వేళ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. చీలిక నేపథ్యంలో పార్టీ పేరు, గుర్తు ఇప్పటికే దూరం కాగా.. ఆ వెంటనే అభ్యర్థుల విషయంలోనూ షాకులు ఎదురవుతున్నాయి. నందిగ్రామ్లో మమత వర్గం ప్రకటించిన అభ్యర్థి అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకున్న మరుసటి రోజే.. ఇటు ఇవాళ రెజీనగర్ అభ్యర్థి రబీ ఉల్ ఆలమ్ చౌద్రీ కూడా తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు.రెజీనగర్లో మమతా బెనర్జీ వర్గం అనూహ్యంగా ఎంపిక చేసిన వ్యక్తి రబీ ఉల్ ఆలమ్ చౌద్రీ. ఆయనకు నియోజకవర్గంతో గట్టి రాజకీయ అనుబంధమే ఉంది. ఇక్కడి నుంచే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఆయన సొంతం. 2013లో తొలిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా రెజీనగర్ ఉప ఎన్నికలో విజయం సాధించారు. 2016లోనూ కాంగ్రెస్ తరఫున అదే స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్లో చేరి 2021లో టీఎంసీ అభ్యర్థిగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.అయితే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఆయనను రెజీనగర్ నుంచి కాకుండా బెల్డంగా నియోజకవర్గం నుంచి బరిలోకి దించింది. అక్కడ ఆయన ఓటమి చవిచూశారు. ఇప్పుడు ఉప ఎన్నికలో మళ్లీ తన పాత నియోజకవర్గంలోకి అడుగుపెట్టే అవకాశం వచ్చింది. దీంతో స్థానికంగా ఉన్న పరిచయం, గత రాజకీయ అనుభవం ఆయనకు కలిసొస్తాయని దీదీ భావించారు. అయితే అనూహ్యంగా ఆయన ఇప్పుడు తన నామినేషన్ను విత్డ్రా చేసుకుంటూ.. పోటీ నుంచి తప్పుకున్నారు. పార్టీకి ప్రస్తుతం అధికారిక గుర్తు లేకపోవడంతో పాటు, కార్యకర్తలు ప్రస్తుతం అధికార పార్టీ నుంచి, ప్రభుత్వ యంత్రాంగాల నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ‘‘చాలామంది పని కోసం నియోజకవర్గాన్ని విడిచి వలస వెళ్లారు. మిగిలినవారేమో పోలీసులకు భయపడి తన వెంట నిలబడలేమని చెబుతున్నారు. కార్యకర్తలే లేకుండా ఎన్నికల ప్రచారం, పోలింగ్ నిర్వహించడం సాధ్యం కాదనే ఉద్దేశంతోనే నా నామినేషన్ ఉపసంహరించుకుంటున్నా’’ అని రబీ ఉల్ చెప్పారు.నందిగ్రామ్లో మొదలైన కలకలంమమతా బెనర్జీ వర్గం నందిగ్రామ్ ఉప ఎన్నికకు సంచితా ప్రధాన్ డేను అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ఆమె సెప్టెంబర్ 18న తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. అంతకుముందు ఆమె ముఖ్యమంత్రి సువేందు అధికారిని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆమె ఎందుకు పోటీ నుంచి తప్పుకున్నారన్న దానిపై ఇప్పటికీ స్పష్టమైన అధికారిక వివరణ మాత్రం ఇవ్వలేదు. అయితే అభ్యర్థి తప్పుకోవడంతో మమత వర్గం నందిగ్రామ్లో కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్కు మద్దతు ప్రకటించింది. ఈ నిర్ణయం ఇండియా కూటమిని బలోపేతం చేయడానికి తీసుకున్నదని మమతా బెనర్జీ చెప్పారు. ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలనేది బీజేపీ కుట్ర అని ఆమె ఆరోపించారు. అయితే ఆ మద్దతు ప్రకటించిన కాసేపటికే మిలన్ను పాత హత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో నందిగ్రామ్ వ్యవహారం మరింత అనూహ్య మలుపులు తిరిగింది. రబీ ఉల్ ఆలమ్ చౌద్రీ(ఎడమ), సంచితా ప్రధాన్ డే(కుడి)ఇప్పుడు రేజీనగర్లోనూ..నందిగ్రామ్ పరిణామం నుంచి తేరుకోకముందే రెజీనగర్లోనూ మమత వర్గానికి చెందిన అభ్యర్థి రబీ ఉల్ ఆలమ్ చౌద్రీ పోటీ నుంచి తప్పుకోవడం తాజా పరిణామం. ఇక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థికే దీదీ మద్దతు ఇస్తారా? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. అసలు టీఎంసీలో ఏం జరుగుతోంది?బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓటమి తర్వాత.. కొనసాగుతున్న అంతర్గత పోరు కూడా కీలకంగా మారింది. మమతా బెనర్జీ వర్గం, రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గం పార్టీ పేరు, ఎన్నికల గుర్తుపై హక్కు కోసం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాయి. ఈ వివాదం నేపథ్యంలో ఎన్నికల సంఘం రెండు వర్గాలకు వేర్వేరు పేర్లు, గుర్తులు కేటాయించింది. మమత వర్గానికి ‘మమతా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్’ పేరుతో ‘ఫుట్బాల్ ప్లేయర్’ గుర్తును కేటాయించగా.. రితబ్రత వర్గానికి ‘డెమొక్రటిక్ తృణమూల్ కాంగ్రెస్’ పేరుతో ‘ఎన్వలప్’ గుర్తును కేటాయించింది. రెజీనగర్లో ముందే మొదలైన పోరురెజీనగర్ సీటుపై కూడా మమత వర్గం, తిరుగుబాటు వర్గం మధ్య పోటీ తీవ్రంగా ఉంది. రితబ్రత బెనర్జీ వర్గం సెప్టెంబర్ 14న రేజీనగర్కు సఫియుజ్జమాన్ షేక్ను అభ్యర్థిగా ప్రకటించింది. అంతకు ఒక్కరోజు ముందే.. మమత వర్గం రబీ ఉల్ ఆలమ్ చౌద్రీని రంగంలోకి దించింది. ఇప్పుడు మమత వర్గం అభ్యర్థి తప్పుకోవడంతో రెజీనగర్ పోరు కొత్త మలుపు తిరిగింది.నందిగ్రామ్లో ఎవరెవరు?నందిగ్రామ్ బైపోల్లో బీజేపీ తరఫున హసిరాణి రథ్ బరిలో ఉన్నారు. ఆమె గతంలో సువేందు అధికారి సహాయకుడిగా పనిచేసి.. హత్యకు గురైన చంద్రనాథ్ రథ్ తల్లి. కాంగ్రెస్ మిలన్ ప్రధాన్ను అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన అరెస్టై జైల్లో ఉన్నారు. వామపక్షాల తరఫున సీపీఐ నుంచి శాంతిగోపాల్ గిరి పోటీ చేస్తున్నారు. ఇక టీఎంసీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో రెండు వర్గాలు వేర్వేరుగా అభ్యర్థులను నిలబెట్టాయి. మమతా బెనర్జీ వర్గం సంచితా ప్రధాన్ దేను, రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ వర్గం మొహమ్మద్ ఎతేషాముల్ హక్ను బరిలోకి దించింది. అయితే సంచితా ప్రధాన్ దే తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవడంతో.. కాంగ్రెస్ అభ్యర్థికి మమత మద్దతు ప్రకటించారు. రెజీనగర్లో..ఇక్కడ బీజేపీ తరఫున ఆ పార్టీ ముర్షిదాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు శఖరవ్ సర్కార్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మొహమ్మద్ అబ్దుల్లాహిల్ కాఫీని అభ్యర్థిగా ప్రకటించింది. వామపక్షాల తరఫున సీపీఎం నుంచి సయ్యద్ అసద్ అలీ బరిలో ఉన్నారు. సీపీఎంతో సీట్ల సర్దుబాటుపై విభేదాలతో ఆర్ఎస్పీ కూడా ప్రత్యేకంగా బికాష్ చంద్ర మిశ్రాను పోటీకి దించింది.ఇక టీఎంసీ విషయానికి వస్తే.. మమతా బెనర్జీ వర్గం మాజీ ఎమ్మెల్యే రబీ ఉల్ ఆలమ్ చౌద్రీని, రితబ్రత బెనర్జీ వర్గం షేక్ సఫియుజ్జమాన్ను అభ్యర్థిగా ప్రకటింటించాయి. రబీ ఉల్ కూడా తాజాగా పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో రెండు నియోజకవర్గాల్లోనూ మమతా వర్గం ప్రకటించిన అభ్యర్థుల ఉపసంహరణ చర్చనీయాంశంగా మారింది.ఒకవైపు టీఎంసీ పేరు, గుర్తుపై వివాదం.. మరోవైపు నందిగ్రామ్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ.. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతు.. ఇప్పుడు రెజీనగర్ అభ్యర్థి కూడా పోటీ నుంచి తప్పుకోవడం.. ఇలా వరుస పరిణామాలతో బెంగాల్ ఉప ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఇదీ చదవండి: ఫిక్సింగ్లో భాగంగానే నందిగ్రామ్ డ్రామా! -
క్లాస్ పీకిన సుప్రీంకోర్టు.. వెనక్కి తగ్గని విజయ్ సర్కార్
హిందీ భాష విషయంలో తమ వైఖరిని మార్చుకోవాలంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనూ తమిళనాడు ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు భూమి కేటాయించబోమని పాఠశాల విద్యాశాఖ మంత్రి ఎ. రాజ్మోహన్ స్పష్టం చేశారు. అలాగే తమిళనాడు రెండు భాషల విధానానికే కట్టుబడి ఉంటుందని తెలిపారు.నవోదయ పాఠశాలల్లో మూడు భాషల విధానం అమలవుతుండటం, అందులో హిందీ ఉండటంపై తమిళనాడు విజయ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో ప్రతి జిల్లాలో కచ్చితంగా భూములు ఇవ్వాలన్న సుప్రీం కోర్టు గత ఆదేశాలను సమీక్షించాలంటూ పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. మైండ్ సెట్ మార్చుకోవాలంటూ తమిళనాడు ప్రభుత్వానికి చురకలు అంటించింది. అయితే హిందీకి తాము వ్యతిరేకం కాదని, తమిళానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నదే తమ విధానమని మంత్రి రాజ్మోహన్ అంటున్నారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు తుది తీర్పు కాదని, కేసు ఇంకా విచారణలోనే ఉందని పేర్కొన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై న్యాయనిపుణులతో సీఎం విజయ్ చర్చిస్తున్నట్లు సమాచారం.నవోదయ పాఠశాలల కోసం ప్రతి జిల్లాలో భూమిని గుర్తించాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాన్ని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 17న వెనక్కి తీసుకోలేదు. మరో మూడు నెలల గడువు ఇచ్చింది. కేంద్రం, రాష్ట్రం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. విచారణ సందర్భంగా జస్టిస్ బీవీ నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం.. తమిళనాడు హిందీపై తన ‘మైండ్సెట్’ మార్చుకోవాలని, రాష్ట్రంలో హిందీ బోధించకూడదనే వైఖరి ఉండకూడదని వ్యాఖ్యానించింది.ఈ పరిణామాల మధ్య తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ కూడా ప్రభుత్వ వైఖరికి మద్దతు తెలిపారు. రాష్ట్రానికి నవోదయ పాఠశాలలు అవసరం లేదని, ఇప్పటికే మోడల్, రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయని పేర్కొన్నారు. అవసరమైతే ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి నవోదయ పాఠశాలలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని సూచించారు. అదే సమయంలో హిందీకి తాము వ్యతిరేకం కాదని, హిందీని బలవంతంగా అమలు చేయడాన్నే వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.దీంతో తమిళనాడులో అధికార టీవీకే ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం డీఎంకే.. రాజకీయంగా పరస్పరం విభేదిస్తున్నప్పటికీ భాషా విధానం విషయంలో ఒకే వైఖరితో ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సుప్రీంకోర్టు సూచనలు, రాష్ట్ర ప్రభుత్వ పట్టుదల మధ్య ఈ వివాదం తదుపరి విచారణలో ఎలాంటి మలుపు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: బెంగాల్లో బీజేపీ సర్కార్.. మరీ ఇంత ఘోరమా? -
నందిగ్రామ్లో ఇంకో ట్విస్ట్.. ముదిరిన పొలిటికల్ వార్
పశ్చిమ బెంగాల్లోని నందిగ్రామ్ అసెంబ్లీ ఉపఎన్నికకు ముందు రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తొలుత తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అభ్యర్థి సాంచిత తన నామినేషన్ ఉపసంహరించుకోవడం.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్కు మమతా బెనర్జీ మద్దతు ప్రకటించడం తెలిసిందే. అయితే ఆపై కొద్ది గంటల్లోనే మిలన్ ప్రధాన్ అరెస్ట్ కావడం తీవ్ర రాజకీయ దుమారం రేపింది.నందిగ్రామ్లో మమతా బెనర్జీ వర్గం తరఫున బరిలో ఉన్న సాంచితా ప్రధాన్ డే శుక్రవారం తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. సీఎం సువేందు అధికారితో భేటీ నేపథ్యంలోనే ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ అనూహ్య పరిణాంపై మమతా బెనర్జీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తన వర్గం ఇక నందిగ్రామ్లో మరో అభ్యర్థిని నిలబెట్టబోదని ప్రకటించి.. కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేసిన మిలన్ ప్రధాన్కు మద్దతు తెలిపారు. ఇండియా కూటమిని బలోపేతం చేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. దీంతో కాంగ్రెస్ సైతం ఖుషీ అయ్యింది.అయితే మమతా మద్దతు ప్రకటించిన కొద్ది గంటల్లోనే మిలన్ ప్రధాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. 2007 నందిగ్రామ్ భూసేకరణ వ్యతిరేక ఉద్యమానికి సంబంధించిన పాత హత్య కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే ఆయనపై ఇప్పటికే పలు కేసులు, అరెస్టు వారెంట్ ఉన్నాయని చెబుతున్నారు.నందిగ్రామ్ సోనాచూరాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత మిలన్ ప్రధాన్. 2007 భూసేకరణ వ్యతిరేక ఉద్యమంలో భూమి ఉచ్చేద్ ప్రతిరోధ్ కమిటీతో కలిసి చురుకుగా పనిచేశారు. అప్పటి నుంచి నందిగ్రామ్ రాజకీయాల్లో కాంగ్రెస్ నేతగా కొనసాగుతున్నారు. ఉద్యమానికి సంబంధించిన పలు కేసుల్లో ఆయన పేరు నమోదైంది. తాజాగా ఆయనకు కాంగ్రెస్ నందిగ్రామ్ టికెట్ ఇచ్చింది. సరిగ్గా ఇదేసమయంలో.. పెండింగ్ వారెంట్ ఆధారంగా పోలీసులు అరెస్టు చేశారు.మిలన్ ప్రధాన్ను శుక్రవారం రాత్రి పుర్బా మేదినీపూర్లోని ఓ హోటల్ నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాత 2007 కేసులో పెండింగ్ వారెంట్ ఆధారంగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈరోజు (సెప్టెంబర్ 19) హల్దియా కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని పలు నివేదికలు పేర్కొన్నాయి. మరోవైపు.. ఈ అరెస్ట్ను రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. అన్ని పోలీస్ స్టేషన్ల ఎదుట ధర్నా చేపట్టాలని కేడర్కు పిలుపు ఇచ్చింది. అలాగే ‘నందిగ్రామ్ చలో’ కార్యక్రమాన్ని కూడా ప్రకటించింది.‘ఇది యాదృచ్ఛికం కాదు’..మిలన్ ప్రధాన్ అరెస్టుపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. దీనిని ‘ఓటు చోరీ’, ‘ఎన్నికల చోరీ’గా అభివర్ణించారు. బీజేపీ ఉపఎన్నికలోనూ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష అభ్యర్థిని లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. ప్రధానమంత్రి ‘మదర్ ఆఫ్ డెమొక్రసీ’ అని చెప్పుకుంటుంటే.. పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నాయని ఖర్గే వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా స్పందిస్తూ.. మిలన్ ప్రధాన్ అరెస్టు యాదృచ్ఛికం కాదని, ఇది రాజకీయ ప్రతీకార చర్య అని ఆరోపించారు. ఎన్నికల్లో ఓట్లు, ప్రభుత్వాలు, పార్టీలు దొంగిలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ భయపడబోదని, పోరాడుతుందని పేర్కొన్నారు.‘ఎందుకీ సమయంలోనే?’.. మమతా ప్రశ్నమమతా బెనర్జీ సైతం అరెస్టు సమయాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ అభ్యర్థికి తమ మద్దతు ప్రకటించిన కొద్ది నిమిషాల్లోనే మిలన్ ప్రధాన్ను అరెస్ట్ చేశారని ఆమె పేర్కొన్నారు. పాత కేసును ఇప్పుడు ఎందుకు బయటకు తీశారని ప్రశ్నించారు. బీజేపీ ‘రాజకీయ కక్ష సాధింపు’తో వ్యవహరిస్తోందని, ప్రతిపక్షాలను అణచివేసే ప్రయత్నం జరుగుతోందని మమతా ఆరోపించారు. ఎన్నికల సంఘం, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయంటూ కూడా ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.బీజేపీ ఏమంటోంది?మిలన్ ప్రధాన్ అరెస్టు రాజకీయ కక్షతో జరిగిందన్న ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. చట్ట ప్రకారమే పోలీసులు చర్యలు తీసుకున్నారని, అరెస్టుకు రాజకీయాలతో సంబంధం లేదని బీజేపీ పేర్కొంది. పాత కేసులో చట్టపరమైన ప్రక్రియలో భాగంగానే చర్య జరిగిందని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ టికెట్ను హసిరాణి రథ్కు ఇచ్చింది. తన దగ్గర వ్యక్తిగత సహాయకుడిగా పని చేసి.. దారుణ హత్యకు గురైన చంద్రనాథ్ తల్లి ఆవిడ. అందుకే సువేందు ఆమెకు టికెట్ ఇప్పించారు. దీంతో నందిగ్రామ్లో పోటీ ప్రధాన పార్టీల మధ్య మరింత ఉత్కంఠగా మారింది.రితబ్రత బెనర్జీ ఎదురుదాడిమరోవైపు టీఎంసీ రెబల్ వర్గానికి చెందిన రితబ్రత బెనర్జీ మాత్రం మమతా వర్గం తీరుపై ప్రశ్నలు లేవనెత్తారు. గత ఏడు రోజులుగా నందిగ్రామ్ను కాంగ్రెస్కు వదిలేసి.. రిజీనగర్లో పోటీ చేయాలనే ప్రయత్నాలు జరిగాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అందుకు అంగీకరించకపోవడంతో మమతా అసంతృప్తికి గురయ్యారని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత తమ వర్గం అభ్యర్థి అకస్మాత్తుగా నామినేషన్ ఉపసంహరించుకోవడం కూడా ఒక ‘ఫిక్స్’లో భాగమేనని ఆయన ఆరోపించారు. మమతా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించడాన్ని రితబ్రత బెనర్జీ ‘అసంతృప్తితో తీసుకున్న నిర్ణయం’గా అభివర్ణించారు.అసలు వివాదం ఇక్కడే..బెంగాల్ రాజకీయ చదరంగంలో విపక్షాలకు ఒకే ఒక్కరోజులో భారీ షాకిచ్చింది. పార్టీ చీలిక కారణంగా.. అక్టోబర్ 6న జరగాల్సిన నందిగ్రామ్, రిజీనగర్ ఉప ఎన్నికలకు ఈసీ నిర్ణయంతో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీకి పార్టీ పేరు, గుర్తు దూరం అయ్యాయి. ఆ వెంటనే నందిగ్రామ్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ, మమతా కాంగ్రెస్కు మద్దతు.. ఆ వెంటనే ఆ అభ్యర్థి అరెస్టు జరగడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఇదీ చదవండి: బలవంతంగా ఆయన్ని రిటైర్ చేశారా? -
ఎన్టీఏను తనిఖీ చేస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, సంస్కరణలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘నీట్’సహా పలు పరీక్షలు నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ప్రధాన కార్యాలయాన్ని తామే స్వయంగా తనిఖీ చేస్తామని తేల్చిచెప్పింది. పోటీ పరీక్షల సమగ్రతను పరిరక్షించేందుకు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ పురోగతి నివేదికను సమర్పించాలని ఆదేశించింది. జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. హైపవర్డ్ కమిటీతో సమన్వయం చేసుకుంటున్న కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ(డీఓపీటీ) జాయింట్ సెక్రెటరీ కమిటీ పురోగతిపై రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఆఫీసుకు వచ్చి చూస్తాం.. ఎన్టీఏలో కార్యాలయాన్ని సందర్శిస్తామని జస్టిస్ పీఎస్ నరసింహ తెలిపారు. ‘ఒకరోజు నేను, నా సోదర న్యాయమూర్తి జస్టిస్ అరాధేతో కలిసి ఎన్టీఏ ఆఫీసును సందర్శిస్తాం. వ్యవస్థ సరిగ్గా పని చేస్తోందా? లేదా? మానవ వనరులు సరిపడా ఉన్నాయా? లేదా? అన్నది మేమే స్వయంగా పరిశీలిస్తాం’’అని స్పష్టం చేశారు. ఢిల్లీలోని మింటో రోడ్లో ఉన్న ఎన్టీఏ కార్యాలయానికి వెళ్లి, ఆ వ్యవస్థ వాస్తవంగా ఎలా పనిచేస్తోందో పరిశీలించి, సిబ్బంది, ఇతర ఏర్పాట్లను అంచనా వేయనున్నట్లు తెలిపారు. సగం సిబ్బంది శాశ్వతంగా ఉండాలి ఎన్టీఏలో కనీసం సగం మంది (50 శాతం) సిబ్బంది శాశ్వత ప్రాతిపదికన ఉండాలని, అందరినీ ఇతర విభాగాల నుంచి డిప్యుటేషన్పై తీసుకురాకూడదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఇతర సంస్థలతో ఎన్టీఏకు ఉన్న సంబంధాలు, అవి పరస్పరం ఎలా సహకరించుకుంటున్నాయి, డేటా నిర్వహణ విధానం తదితర అంశాలను పరిశీలించాల్సి ఉందని తెలిపింది. ‘‘శాశ్వత వ్యవస్థ, శాశ్వత సిబ్బంది, శాశ్వత విభాగాలు ఉండాలి. డిçప్యుటేషన్ చాలా తక్కువగా ఉండాలి. అప్పుడే ఎన్టీఏకు ఒక శాశ్వత నిర్మాణం ఏర్పడుతుంది’’అని వెల్లడించింది. కాగితాలకే పరిమితం కాకూడదు నందన్ నిలేకని కమిటీ విస్తృత సంప్రదింపులు జరిపిందని, సెపె్టంబర్ నెలాఖరు నాటికి నివేదిక సమర్పించే అవకాశం ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ధర్మాసనం కమిటీ సిఫార్సులు కేవలం కాగితాలకే పరిమితం కాకూడదని, క్షేత్రస్థాయిలో మార్పులు తీసుకురావాలని సూచించింది. ‘‘గతంలో రాధాకృష్ణన్ కమిటీ వేశాం. ఇప్పుడు మన దగ్గర ఉన్నది కేవలం ఒక కమిటీ నివేదిక మాత్రమే. అది మరింత ముందుకు సాగాలి. నిపుణుల సలహాలను పరిగణనలోకి తీసుకోవాలి. సిఫార్సుల అమలు అత్యంత కీలకం’’అని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం నిబద్ధతతో ఉందని, సిఫార్సులను తప్పకుండా అమలు చేస్తుందని తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.కొత్త సంస్థను ఏర్పాటు చేయాలన్న పిటిషనర్లు నీట్–యూజీ ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో దాఖలైన పలు పిటిషన్లపై కోర్టు విచారణ చేపట్టింది. ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్(ఫైమా), యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్, ఆర్జేడీ ఎంపీ సుధాకర్ సింగ్, సామాజిక కార్యకర్త అనుభవ్ గార్గ్ తదితరులు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్టీఏ స్థానంలో పార్లమెంటరీ జవాబుదారీతనం ఉన్న నూతన స్వతంత్ర చట్టబద్ధమైన పరీక్షా సంస్థను ఏర్పాటు చేయాలని పిటిషనర్లు కోరారు. ప్రశ్నపత్రాల డిజిటల్ లాకింగ్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానానికి మారడం, అవకతవకలను గుర్తించేందుకు పరీక్షా కేంద్రాల వారీగా ఫలితాల ప్రచురణ వంటి డిమాండ్లను కోర్టు ముందుంచారు. సీబీటీ విధానంలోకి ఎలా మారాలో సూచిస్తూ ఫైమా తరపు న్యాయవాది తన్వీ దూబే ప్రత్యేకంగా ఒక అప్లికేషన్ దాఖలు చేశారు. అఫిడవిట్ దాఖలైన తర్వాత విచారణను కొనసాగిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పదేపదే జరుగుతున్న పేపర్ లీక్లను నివారించడానికి వ్యవస్థను సంస్థాగతంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. -
రాజ్యసభలో టీడీపీ ఎంపీల పరుష పదజాలం సరికాదు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: గత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో టీడీపీ ఎంపీలు సానా సతీష్ బాబు, చింతకాయల విజయ్ పరుష పదజాలం ఉపయోగించడంపై వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. వారి తీరు సరికాదని రాజ్యసభ చైర్మన్కు, ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. రాజ్యసభలో జూలై 30న పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అన్ఫెయిర్ మీన్స్ నిరోధక) సవరణ బిల్లు–2026పై చర్చ సందర్భంగా తాను ప్రసంగిస్తున్న సమయంలో సానా సతీష్ బాబు పదేపదే వైఎస్సార్సీపీని ఉద్దేశించి అభ్యంతరకర పదజాలం ఉపయోగించారని సుబ్బారెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలు అభ్యంతరకరంగానే కాకుండా బెదిరింపులకు గురిచేసే విధంగా ఉన్నాయని ప్రస్తావించారు. ‘నా ప్రసంగానికి అంతరాయం కలిగించి, ఆలోచనాక్రమాన్ని దెబ్బతీసి, నా వాదనను సమర్థంగా వినిపించకుండా చేయడమే సానా సతీష్ చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యల ఉద్దేశం’ అని వైవీ తెలిపారు. అలాగే, ఆగస్టు 5న సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లు–2026పై చర్చ సందర్భంగా మరో టీడీపీ సభ్యుడు చింతకాయల విజయ్ సభా నిబంధనలకు విరుద్ధంగా పరుష పదజాలం ఉపయోగించారని సుబ్బారెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.ఇది రాజ్యసభ నిబంధనలను ఉల్లంఘించడమేనని స్పష్టంచేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు సహజమే అయినప్పటికీ సభలో ఒక సభ్యుడు ప్రసంగిస్తున్నప్పుడు తోటి సభ్యులు ఎవరైనా అభ్యంతరకరమైన లేదా బెదిరింపు వ్యాఖ్యలు చేయకూడదని సుబ్బారెడ్డి తెలిపారు. అది రాజ్యసభ సభ్యుడి భావప్రకటనా హక్కుకు భంగం కలిగించడమేనని స్పష్టంచేశారు. పార్లమెంటరీ నైతికత, సభా మర్యాదల ఉల్లంఘనపై పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజ్యసభ చైర్మన్కు, ప్రివిలేజ్ కమిటీకి వేర్వేరుగా ఫిర్యాదులు అందజేశారు. -
గుండె.. 95 కిలో మీటర్లు.. 63 నిమిషాలు
హర్యానాలోని రోహ్తక్ నుంచి ఢిల్లీకి 95 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 63 నిమిషాల్లో అధిగమిస్తూ ఓ దాత గుండెను తరలించారు. అత్యవసర గుండె మార్పిడి కోసం గురువారం ఈ అవయవాన్ని షాలిమార్ బాగ్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రోహ్తక్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో రాత్రి 7.20 గంటలకు దాత గుండెను సేకరించారు.అనంతరం గుండెను వైద్య బృందం 7.40 గంటలకు ఆసుపత్రి నుంచి బయలుదేరింది. హర్యానా, ఢిల్లీ పోలీసుల సమన్వయంతో ఏర్పాటు చేసిన గ్రీన్ కారిడార్ ద్వారా అంబులెన్స్ ఎలాంటి అంతరాయం లేకుండా ప్రయాణించి.. రాత్రి 8.43 గంటలకు ఢిల్లీలోని షాలిమార్ బాగ్ ఫోర్టిస్ ఆసుపత్రికి చేరుకుంది. బి-పాజిటివ్ రక్తగ్రూప్ కలిగిన ఓ రోగికి గుండె అవసరమని ఉదయం 8.50 గంటలకు నేషనల్ ఆర్గన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ నెట్వర్క్ ద్వారా ఆసుపత్రికి సమాచారం అందింది.ఉదయం 9.55 గంటలకు ఫోర్టిస్ ఆసుపత్రి వైద్యులు గుండెకు సరిపడే గ్రహీతను గుర్తించారు. వైద్య బృందం మధ్యాహ్నం 2.49 గంటలకు ఢిల్లీ నుంచి రోహ్తక్కు బయలుదేరి.. సాయంత్రం 4.34 గంటలకు ఆసుపత్రికి చేరుకుంది. గుండె సేకరణ ప్రక్రియ పూర్తయిన అనంతరం గ్రీన్ కారిడార్ ద్వారా అవయవాన్ని తిరిగి ఢిల్లీకి తరలించారు.95 km. 63 minutes. One donor heart, transported from #PGIMS #Rohtak to #Fortis Hospital, #ShalimarBagh, through an interstate #GreenCorridor for an emergency #heart #transplant. Seamless coordination between #Haryana and #DelhiPolice helped make the life-saving journey possible,… pic.twitter.com/HDp6yDdxpg— Anuja Jaisswal (@AnujaJaiswalTOI) September 17, 202695 కిలోమీటర్ల అంతర్రాష్ట్ర మార్గంలో గ్రీన్ కారిడార్ను ఏర్పాటు చేసి గుండెను తరలించడం అంటే పోలీసు, వైద్య బృందాల మధ్య అసాధారణ స్థాయిలో సమన్వయం అవసరం. ఈ తరలింపులో ప్రతి నిమిషం కీలకం అని ఫోర్టిస్ ఆసుపత్రి షాలిమార్ బాగ్ వైస్ ప్రెసిడెంట్, ఫెసిలిటీ డైరెక్టర్ నవీన్ శర్మ తెలిపారు. అనంతరం దాత గుండెను ఆసుపత్రికి తీసుకెళ్లి.. అవయవ మార్పిడి శస్త్రచికిత్సకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: ‘పిట్బుల్’ బీభత్సం.. సీసీటీవీలో భయానక దృశ్యాలు -
బెంగాల్ ఉప ఎన్నికలు.. ఈసీ బిగ్ ట్విస్ట్
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్లో కొనసాగుతున్న అంతర్గత వివాదం కీలక మలుపు తిరిగింది. పార్టీ పేరు, ఎన్నికల గుర్తుపై ఎవరికీ హక్కు ఉందనే అంశంపై తుది నిర్ణయం తీసుకునే వరకు పార్టీ పేరు, ఎన్నికల గుర్తును ఉపయోగించకూడదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అక్టోబర్ 6న జరగనున్న నందిగ్రామ్, రెజీనగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈసీ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మమతా బెనర్జీ, అరూప్ రాయ్(రితబ్రత బెనర్జీ నేతృత్వంలో..) వర్గాలకు షాక్ తగిలినట్లైంది.ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ పేరుతో పాటు ఆ పార్టీకి కేటాయించిన పూలు-గడ్డి గుర్తును కూడా రెండు వర్గాలు ఉపయోగించకూడదని ఈసీ పేర్కొంది. ఉప ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీపై హక్కు వివాదాన్ని ఇప్పటికిప్పుడు పరిష్కరించడం సాధ్యం కాదని, అందువల్ల రెండు వర్గాలను సమాన స్థాయిలో ఉంచేందుకు ఈ మధ్యంతర నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.ఈ మేరకు రెండు వర్గాలు శుక్రవారం ఉదయం 11 గంటల్లోగా తమకు కావాల్సిన మూడు పేర్లు, మూడు ఉచిత ఎన్నికల గుర్తులను సూచించాలని ఈసీ ఆదేశించింది. వాటిలో నుంచి ఒక్కో వర్గానికి ఒక పేరు, ఒక గుర్తును కేటాయించనుంది. అవసరమైతే తమ కొత్త పేర్లలో ‘ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్’తో అనుబంధాన్ని సూచించుకునే అవకాశం కూడా రెండు వర్గాలకు ఉంటుందని ఈసీ తెలిపింది.టీఎంసీలో చీలికపై విచారణపార్టీ సంస్థాగత నియంత్రణపై మమతా బెనర్జీ వర్గం, అరూప్ రాయ్ నేతృత్వంలోని ప్రత్యర్థి వర్గం మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ రెండు వర్గాలూ తామే అసలైన తృణమూల్ కాంగ్రెస్ అని, పార్టీ పేరు, గుర్తు తమకే చెందాలని వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీ రెండు వర్గాలతో గురువారం మరోసారి విచారణ నిర్వహించింది. ఐదు రోజుల వ్యవధిలో ఇరు వర్గాలతో ఈసీ సమావేశం కావడం ఇది రెండోసారి.ఈ వివాదంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఈసీ పేర్కొంది. ఎన్నికల గుర్తుల (రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్) ఆర్డర్–1968లోని 15వ పేరా కింద పార్టీ అంతర్గత చీలికలు, గుర్తు–పేరు హక్కుల వివాదాలపై నిర్ణయం తీసుకునే అధికారం ఈసీకి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అంశంపై సమగ్ర నిర్ణయానికి మరింత విచారణ అవసరమని కమిషన్ అభిప్రాయపడింది.అక్టోబర్ 6న రెండు నియోజకవర్గాల్లో పోలింగ్పశ్చిమ బెంగాల్లోని నందిగ్రామ్, రెజీనగర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు అక్టోబర్ 6న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. ఈ రెండు వర్గాల అభ్యర్థులు ఇప్పటివరకు తృణమూల్ కాంగ్రెస్ అధికారిక గుర్తుతోనే బరిలోకి దిగారు. అయితే ఈసీ తాజా ఉత్తర్వులతో ఉప ఎన్నికల కోసం వారు కొత్త పేర్లు, కొత్త గుర్తులతో పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.పార్టీ పేరు, గుర్తుపై తుది హక్కు ఎవరికి దక్కాలన్న దానిపై ఈసీ విచారణ కొనసాగనుంది. ప్రస్తుతం జారీ చేసిన ఉత్తర్వులు ఉప ఎన్నికల ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న మధ్యంతర చర్య మాత్రమే. వివాదంపై తుది నిర్ణయం తర్వాత పార్టీ పేరు, గుర్తుకు సంబంధించి తదుపరి పరిస్థితి స్పష్టమయ్యే అవకాశం ఉంది.ఇదీ చదవండి: విజయ్ సర్కార్కు తలంటిన సుప్రీం కోర్టు -
‘మీ మైండ్ సెట్ మార్చుకోండి’.. విజయ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: తమిళనాడలో జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుపై జరుగుతున్న న్యాయపోరాటంలో సుప్రీంకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడ గడ్డపై హిందీ బోధించకూడదనే ధోరణి కుదరదని, రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.జవహర్ నవోదయ పాఠశాలల ఏర్పాటుకు ప్రతి జిల్లాలో భూమిని కేటాయించాలంటూ డిసెంబర్ 15, 2025న ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆగర్టిన్ జార్జ్ మాసిహ్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.ఈ సందర్భంగా ధర్మాసనం మాట్లాడుతూ.. కేంద్ర నిధులతో నడిచే నవోదయ పాఠశాలల ఏర్పాటును రాష్ట్రంలోని విద్యా వ్యవస్థకు ముప్పుగా భావించవద్దని సూచించింది. మీరు మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. తమిళనాడ నేలపై హిందీ నేర్పించబడదు అనడం సరికాదు" అని జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు. అలాగే కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర చర్చల ద్వారా ఈ భేదాభిప్రాయాలను పరిష్కరించుకోవాలని కోర్టు హితవు పలికింది.నవోదయ పాఠశాలల ఏర్పాటు కోసం ప్రతి జిల్లాలో భూమిని గుర్తించాలన్న డిసెంబర్ 2025 నాటి ఆదేశాలను వెనక్కి తీసుకునేందుకు కోర్టు నిరాకరించింది. అయితే, ఈ ఆదేశాలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి మరో మూడు నెలల సమయం మంజూరు చేసింది.తమిళనాడులో అమల్లో ఉన్న ద్విభాషా విధానానికి, నవోదయ పాఠశాలలు పాటించే త్రిభాషా విధానానికి (హిందీతో కలిపి) మధ్య ఉన్న వివాదంపై విచారణ జరిగింది.రాష్ట్ర ప్రభుత్వ తరఫున సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా వాదనలు వినిపిస్తూ.. తమ రాష్ట్ర విద్యా విధానానికి, రాజ్యాంగ అధికారాలకు విరుద్ధంగా కేంద్రం హిందీని రుద్దాలని చూస్తోందని తెలిపారు. తమిళం రెండవ భాషగా ఉండాలనే అంశాన్ని పరిశీలించవచ్చని ధర్మాసనం పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శులు ఈ అంశంపై చర్చలు జరపాలని సూచించిన కోర్టు, ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను డిసెంబర్ 14వ తేదీకి వాయిదా వేసింది. -
సీజేపీ సరికొత్త ఉద్యమం.. మోదీ పుట్టినరోజే ఎందుకు?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం రోజే కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలల పరిస్థితి, విద్యార్థుల సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ‘ఆదివాసీ స్కూల్ ఠీక్ కరో’ పేరుతో ఈ కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చింది. గురువారం తన స్వరాష్ట్రం మహారాష్ట్రలోని గడ్చిరోలి నుంచి సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఈ పోరాటాన్ని ప్రారంభించారు.ఆదివాసీ స్కూల్ ఠీక్ కరో (Adivasi School Thik Karo)లో భాగంగా.. గిరిజన ప్రాంతాల్లోని స్కూళ్లలో మౌలిక వసతులు, విద్యార్థుల భద్రత, వసతి పరిస్థితులను సీజేపీ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. పాఠశాలల్లో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని ప్రభుత్వం, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ఈ కార్యక్రమం ఉద్దేశమని దీప్కే తెలిపారు. ఇప్పటికే CJP దేశవ్యాప్తంగా స్కూల్ ఠీక్ కరో (School Thik Karo) పేరుతో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై కార్యక్రమాన్ని చేపట్టింది. దానికి కొనసాగింపుగానే గిరిజన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఈ ఉద్యమాన్ని చేపడుతున్నట్లు తెలిపింది.వందల మంది మృతి!గిరిజన విద్యార్థుల సమస్యలను ప్రస్తావిస్తూ దీప్కే.. సంచలన ఆరోపణలకు దిగారు. మహారాష్ట్రలో గత రెండేళ్లలో 590 మందికి పైగా గిరిజన విద్యార్థులు మరణించారని ఆయన పేర్కొన్నారు. పాముకాట్లు వంటి నివారించగల ప్రమాదాలతోనూ విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. అలాగే మధ్యప్రదేశ్లోని బాలాఘాట్లోనూ ఇటీవల గిరిజన విద్యార్థుల మరణాలు చోటుచేసుకున్నాయని తెలిపారు.ఏకలవ్య పాఠశాలలపైనా ప్రశ్నలుఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ల పరిస్థితిపైనా సీజేపీ ప్రశ్నలు లేవనెత్తుతోంది. దేశవ్యాప్తంగా మంజూరైన 720 పాఠశాలల్లో 477 పనిచేయడం లేదని దీప్కే ఆరోపించారు. గిరిజన విద్యార్థుల ఉన్నత విద్యలో ప్రవేశాలపైనా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.‘అన్ని ప్రభుత్వాలూ నిర్లక్ష్యం చేశాయి’గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలలను గత 80 ఏళ్లుగా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని దీప్కే ఆరోపించారు. పెద్ద నగరాల్లోని విద్యార్థులకు లభించే విద్యా సదుపాయాలు, భద్రత, నాణ్యమైన విద్య గిరిజన ప్రాంతాల పిల్లలకూ అందాలని అన్నారు. కేవలం ఆర్థిక వృద్ధి గణాంకాలు చెప్పడం సరిపోదని.. గ్రామీణ, గిరిజన ప్రాంతాల విద్యార్థులపై కూడా దృష్టి పెట్టాలని ప్రభుత్వాలను కోరారు.మోదీ బర్త్డే రోజే ఎందుకు?మోదీ జన్మదినం సెప్టెంబర్ 17నే సీజేపీ ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జెన్ జీ పోరాట వేదిక కావాలనే ఇలా చేసిందా? అని నెట్టింట చర్చ నడిచింది. అయితే ఇదేం ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని దీప్కే స్పష్టత ఇచ్చారు. ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారమే తాము ఉద్యమం మొదలుపెట్టామని అంటున్నారు.అంతకు ముందు.. ఆశుతోష్ రాంకా చేసిన ఓ పోస్ట్ మాత్రం తీవ్ర చర్చనీయాంశమైంది. దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో ఈ ఉదయం ‘ఆశీర్వాద్ కా దియా’ పేరుతో దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు ఇచ్చింది. అయితే ఇలా ఎందుకు అంటూ రాంకా ఓ ట్వీట్ చేశాడు. “గాయిస్.. చెప్పండి, దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో ఆశీర్వాద దీపం వెలిగించమని ఎందుకు చెప్పారు? ఎవరి పుట్టినరోజో చెప్పండి?” అంటూ వ్యంగ్యంగా పోస్టు చేశారు.बताओ कल देशभर के कॉलेज को सुबह सुबह आशीर्वाद का दीया जलाने के लिए क्यो बोला गया है guys?बताओ कल सारे काम छोड़कर देशभर के टीचर्स को किसकी भक्ति करने के लिए कहा गया है guys?बताओ कल किसका जन्मदिन है guys? pic.twitter.com/ZkLdESTaQt— Ashutosh Ranka (@AshutoshRanka) September 16, 2026ఇదీ చదవండి: మోదీ గుండె ధైర్యానికి ఇదే ఎగ్జాంపుల్ -
22-A భూములపై మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో 22-A భూముల వివాదం రాజకీయంగా వేడెక్కుతున్న వేళ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 22-A భూముల వ్యవహారంలో తప్పు కాంగ్రెస్ పార్టీది కాదని.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూ దోపిడీ జరిగిందని ఆరోపించారు. గత ప్రభుత్వ భూ వ్యవహారాలపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని చెప్పారు. ఈ అంశంపై జ్యుడీషియల్ ఎంక్వైరీ జరగాలా? లేదా? అనేది ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్ణయిస్తారని స్పష్టం చేశారు.టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ ఢిల్లీలో ఈ అంశంపై మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పోరాటాలు చేసిన వారు సర్వం కోల్పోతే.. కేసీఆర్ కుటుంబం మాత్రం భూములను కొల్లగొట్టిందని ఆరోపించారు. గత ప్రభుత్వ భూ వ్యవహారాలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విచారణకు ఆదేశించడం అభినందనీయమన్నారు. 22-A భూముల అంశంపై బీఆర్ఎస్ ఇప్పటికే జ్యుడీషియల్ విచారణకు డిమాండ్ చేస్తుండగా.. ప్రభుత్వం కూడా భూ వ్యవహారాలపై విచారణకు చర్యలు చేపట్టింది.కాగా, తన పదవీకాలానికి మరో ఏడాది సమయం ఉందని మహేశ్కుమార్ గౌడ్ తెలిపారు. మంత్రివర్గ విస్తరణ జరపాలా? వద్దా? అనేది ముఖ్యమంత్రి నిర్ణయిస్తారని అన్నారు. పార్టీలో పెండింగ్లో ఉన్న పదవుల భర్తీపై అధిష్టానంతో చర్చిస్తామని చెప్పారు. వీలైనంత త్వరగా డీసీసీ అధ్యక్షులను నియమిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలను పార్టీ అధిష్టానానికి వివరిస్తానని తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రెండేళ్లలో సంస్థాగతంగా సాధించిన పురోగతిని అధిష్టానం పెద్దలకు వివరించేందుకే ఢిల్లీకి వచ్చినట్లు చెప్పారు. గాంధీభవన్ నుంచి క్షేత్రస్థాయి వరకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేశామని పేర్కొన్నారు.ఇదిలా ఉండగా.. 22-A భూముల అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. 22-A జాబితాలో భూముల చేర్పుపై బీఆర్ఎస్ జ్యుడీషియల్ విచారణ కోరుతుండగా.. కాంగ్రెస్ గత ప్రభుత్వ హయాంలోని భూ వ్యవహారాలను ప్రస్తావిస్తోంది. దీంతో ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రధాన చర్చనీయాంశంగా మారింది.ఇదీ చదవండి: మా ఆస్తులపై అసెంబ్లీలో చర్చకు సిద్దం: కేటీఆర్ సవాల్ -
ట్రంప్ 100% టారిఫ్ బిల్లు: భారత్ రియాక్షన్ ఇదే..
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై భారీ సుంకాలు విధించేలా అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన బిల్లుపై భారత్ స్పందించింది. తమ వాణిజ్య, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇదే సమయంలో దేశ ఇంధన అవసరాలు, జాతీయ ప్రయోజనాలే తమ చమురు కొనుగోళ్లకు ప్రాతిపదిక అని మరోసారి తేల్చిచెప్పింది.అమెరికా ప్రతినిధుల సభ బుధవారం ‘లిండ్సే ఓ. గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ 2026’కు 262–159 ఓట్లతో ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ద్వారా రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు, సహజవాయువు కొనుగోలు చేసే దేశాలపై గరిష్టంగా 100 శాతం వరకు టారిఫ్లు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కల్పించారు. భారత్, చైనా వంటి దేశాలు దీని పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో ఆయన నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.భారత్ స్పందన.. బిల్లు ఆమోదం నేపథ్యంలో.. భారత విదేశాంగ శాఖ గురువారం స్పందించింది. తన వాణిజ్య, ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించుకునే విషయంలో స్పష్టమైన వైఖరితో ఉన్నట్లు తెలిపింది. రష్యా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేయడంపై భారత్ ఇప్పటికే తన విధానాన్ని పలుమార్లు వివరించిందని గుర్తు చేస్తోంది. దేశంలోని 140 కోట్లకుపైగా ప్రజల ఇంధన అవసరాలను తీర్చేందుకు వివిధ దేశాల నుంచి చమురు దిగుమతులు చేసుకుంటున్నామని పేర్కొంది. రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో అమెరికా ఒత్తిడి కొనసాగుతున్న నేపథ్యంలో.. భారత్ తన ఇంధన భద్రత, జాతీయ ప్రయోజనాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు స్పష్టం చేస్తోంది. అదే సమయంలో.. అమెరికా ప్రతినిధులతో గత కొన్ని నెలలుగా ఉన్నతస్థాయిలో ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయని విదేశాంగ శాఖ అంటోంది. ఈ బిల్లు వల్ల భారత్–అమెరికా ద్వైపాక్షిక సంబంధాలతో పాటు అంతర్జాతీయ ఇంధన మార్కెట్పై పడే ప్రభావాలను కూడా భారత ప్రభుత్వం ఇప్పటికే అమెరికా వర్గాలకు స్పష్టంగా వివరించిందని పేర్కొంది. అమెరికా చర్య వల్ల ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనేందుకు వాణిజ్య, పారిశ్రామిక సంస్థలతో కలిసి పనిచేస్తామని తెలిపింది.ట్రంప్ డెస్క్ మీద.. అమెరికా ప్రతినిధుల సభలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదం పొందింది. అయితే అంత మాత్రాన భారత్పై వెంటనే 100 శాతం టారిఫ్ అమల్లోకి వచ్చినట్లు కాదు. ఈ బిల్లు ఇప్పుడు అధ్యక్షుడు ట్రంప్ ఆమోదానికి వెళ్లనుంది. సంబంధిత చట్టానికి సంబంధించిన ఫైల్.. ట్రంప్ డెస్క్ వద్దకు వెళ్లినట్లు వైట్హౌజ్ వర్గాలు ధృవీకరించాయి. అయితే ఏ దేశంపై, ఎంత టారిఫ్ విధించాలి అనే అధికారం ఇప్పుడు అధ్యక్షుడి నిర్ణయంపై ఆధారపడి ఉంది. రష్యా ఆంక్షల బిల్లులో.. రష్యా చమురు, గ్యాస్ కొనుగోళ్లపై ఆంక్షలతో పాటు రష్యా ‘షాడో ఫ్లీట్’, ఆ దేశ నాయకత్వం(పుతిన్ సహా అక్కడి పలువురు అగ్రనేతలు), ఆర్థిక సంస్థలు, ఇంధన రంగంపైనా బిల్లు కఠిన చర్యలను ప్రతిపాదిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధానికి రష్యాకు లభిస్తున్న ఇంధన ఆదాయాన్ని పరిమితం చేయడమే అమెరికా చర్యల ప్రధాన ఉద్దేశంగా పేర్కొంటోంది. ఇక భారత్పై ఈ చట్టం ఎలా అమలవుతుంది? టారిఫ్ విధిస్తే ఎంత మేరకు ఉంటుంది? రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై దాని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది? అనే అంశాలు ట్రంప్ తదుపరి నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతానికైతే భారత్ మాత్రం తన ఇంధన భద్రత, వాణిజ్య ప్రయోజనాల పరిరక్షణకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.అమెరికా రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం.. 2026 జూలైలో ఉక్రెయిన్ పర్యటన ముగించుకుని అమెరికాకు తిరిగొచ్చిన మరుసటి రోజే మరణించారు. రష్యాపై కఠిన ఆంక్షలకు ఉద్దేశించిన ఈ బిల్లును ఆయనే ముందుకు తీసుకెళ్లడంతో.. ఆయన గౌరవార్థం ఈ బిల్లుకు ట్రంప్ ‘లిండ్సే ఓ. గ్రాహం’ పేరు పెట్టారు.ఇదీ చదవండి: ట్రంప్ రష్యా బిల్లు.. భారత్, చైనాపైనే ఎందుకు? -
జమ్ముకశ్మీర్ ఉధంపూర్లో భారీ ఎన్కౌంటర్.. ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లో ఉగ్ర కుట్ర భగ్నమైంది. ఉధంపూర్ జిల్లాలో బుధవారం అర్ధరాత్రి భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు హతమయ్యారు. వీరు పాకిస్థాన్కు చెందిన జైషే మహ్మద్ (JeM) ఉగ్ర సంస్థకు చెందినవారై ఉండొచ్చని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. సోహన్ ప్రాంతంలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై సమాచారం అందడంతో చేపట్టిన గాలింపు చర్యలు.. చివరకు భారీ ఎన్కౌంటర్కు దారితీశాయి.ఉధంపూర్లోని సోహన్ ప్రాంతంలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై సమాచారం అందడంతో భద్రతా బలగాలు భారీగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర కాల్పులు చోటుచేసుకున్నాయి. రాత్రంతా కొనసాగిన ఆపరేషన్ అనంతరం గురువారం తెల్లవారుజామున ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలను భద్రతా బలగాలు గుర్తించాయి. వారి వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.రాష్ట్రీయ రైఫిల్స్, పారా (స్పెషల్ ఫోర్సెస్), జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు.ప్రాథమిక సమాచారం మేరకు జైషే మహ్మద్తో సంబంధాలు ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు, వారి గుర్తింపు కోసం దర్యాప్తు కొనసాగుతోంది.Udhampur, Jammu and Kashmir: Security forces continued their operation in the Majalta area of Udhampur district following reports of suspicious movement in the forested Khubban/Brettal-Sowan belt pic.twitter.com/crzAKvev9h— IANS (@ians_india) September 17, 2026ఇటీవల జమ్మూకశ్మీర్లోని పలు ప్రాంతాల్లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెంచాయి. సెప్టెంబర్ 5న బుద్గాం జిల్లాలో పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా కమాండర్ యాసిర్ భద్రతా బలగాల కాల్పుల్లో హతమైనట్లు అధికారులు తెలిపారు. ఉధంపూర్లో తాజా ఎన్కౌంటర్ కూడా ఈ ప్రాంతంలో కొనసాగుతున్న ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో భాగంగా జరిగింది.ఇదీ చదవండి: రెడ్ లైన్గా మక్కా నగరం! ఎందుకో తెలుసా? -
మోదీ గుండె ధైర్యానికి ఇదిగో సాక్ష్యం!
నరేంద్ర మోదీ.. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న భారత ప్రధాని. స్వదేశంలోనే కాదు.. విదేశాల్లోనూ ఆయనకు అశేష అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలోనూ ఆయనకంటూ భారీ ఫాలోయింగ్ ఉంది. అలాంటిది ఇవాళ ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అయితే మోదీ చిన్ననాటి జీవితం గురించి కూడా ఎన్నో ఆసక్తికర విషయాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే వాటిలో ఓ ఘటన తెలిస్తే మాత్రం.. ఆయన ‘గుండె ధైర్యం’ ఏపాటిదో ఇట్టే అర్థమైపోతుంది. మోదీకి చిన్నతనంలో ఈత అంటే చాలా ఇష్టం ఉండేదట. ఉదయం కుటుంబ టీ దుకాణంలో పని చేసిన తర్వాత మోదీ వడ్నగర్లోని శర్మిష్ఠ సరస్సుకు వెళ్లేవారు. సరస్సు మధ్యలో ఉన్న ఆలయం వరకు ఈత కొట్టి, అక్కడి జెండాను తాకి తిరిగి ఒడ్డుకు వచ్చేవారు. ఇలా రోజుకు మూడుసార్లు చేసేవారు. అయితే ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలో ఆయనకు ఓ భయానక అనుభవం ఎదురైంది. ఈత కొడుతుండగా ఓ మొసలి ఆయన కాలిని బలంగా తాకింది. దీంతో తీవ్రంగా గాయపడి తొమ్మిది కుట్లు వేయించుకోవాల్సి వచ్చింది. ఆ దెబ్బతో వారం రోజులు ఆయన మంచానికే పరిమితం అయ్యారు. అయితే నెల తిరగకుండానే ఆయన మళ్లీ అదే సరస్సులో ఈతకు వెళ్లారట. ఈ విషయాన్ని మోదీ జీవితంపై వచ్చిన నరేంద్ర మోదీ: ది గేమ్ చేంజర్ అనే పుస్తకంలో జర్నలిస్ట్ సురేశ్ కే వర్మ ప్రస్తావించారు. అదే తొలిసారి కాదు!మోదీ చిన్ననాటికి సంబంధించిన మరో మొసలి కథ కూడా ప్రచారంలో ఉంది. ఓసారి సరస్సు ఒడ్డున ఓ మొసలి పిల్ల కనిపించడంతో దాన్ని ఆయన భుజాన వేసుకుని ఇంటికి తీసుకెళ్లారట. అది అడుగుకుపైగా పొడవు ఉందట. దాన్ని ఇంట్లోనే పెంచుకోవాలని మోదీ అనుకున్నప్పటికీ.. తల్లి హీరాబెన్ మాత్రం వద్దని చెప్పారట. వెంటనే దాన్ని ఆయన తిరిగి సరస్సులో వదిలేశారట. ఈ చిన్ననాటి జ్ఞాపకాన్ని మోదీ స్వయంగా కూడా 2019లో బేర్ గ్రిల్స్తో కలిసి పాల్గొన్న మ్యాన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమంలో గుర్తుచేసుకున్నారు. సాధారణ కుటుంబంలో, చిన్న ఇంటి నుంచి మొదలైన ఈ ప్రయాణం.. ఆ తర్వాత రాజకీయాల్లోకి మళ్లింది. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోదీ.. 2014లో తొలిసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2024 జూన్ 9న మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. రాజకీయ జీవితంలోనూ ఆయన తీసుకున్న పలు కీలక నిర్ణయాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. బాల్యంలో మొసలిని ఎదుర్కొన్న ఘటన కావొచ్చు.. తర్వాత పాలనలో తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు కావొచ్చు.. మోదీ జీవిత ప్రయాణంలో ధైర్యం, నిర్ణయాత్మకతకు సంబంధించిన అధ్యాయాలు చాలానే కనిపిస్తాయి. అయితే వాటన్నింటికీ చాలా ముందే.. వడ్నగర్లోని శర్మిష్ఠ సరస్సు దగ్గర ఓ బాలుడిగా ఎదుర్కొన్న ఆ మొసలి ఘటన మాత్రం ఆయన చిన్ననాటి జ్ఞాపకాల్లో ప్రత్యేకంగా నిలిచిపోయింది.ఇదీ చదవండి: మోదీని శ్రీ కృష్ణుడితో పోల్చేశాడే! -
యూపీఐ ‘ట్యాక్స్’ రచ్చ.. చిదంబరం పేరుతో రాహుల్కు కౌంటర్!
యూపీఐ లావాదేవీలపై కొత్తగా అమలు చేయనున్న మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విషయంలో రాజకీయ రగడ ముదురుతోంది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఛార్జీల విధానాన్ని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిని ఆయన ‘యూపీఐ ట్యాక్స్’గా అభివర్ణిస్తూ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం పేరును హైలైట్ చేస్తూ బీజేపీ తాజాగా కాంగ్రెస్పై ప్రశ్నలు సంధించింది.బీజేపీ వర్గాల ప్రకారం.. ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ యూపీఐకి సంబంధించి శ్రేణుల వారీగా (టైర్డ్) ఎండీఆర్/రెవెన్యూ విధానాన్ని తీసుకురావాలని సిఫార్సు చేసింది. ఈ కమిటీలో కాంగ్రెస్కు చెందిన పి. చిదంబరం(మాజీ ఆర్థిక మంత్రి), మనీష్ తివారీ, గౌరవ్ గొగోయ్, కిషోరీ లాల్, కే. గోపీనాథ్ కూడా సభ్యులుగా ఉన్నారు. ఆగస్టు 12న కమిటీ నివేదికను ఆమోదించిన సమావేశానికి వీరంతా హాజరయ్యారని, ప్రచురితమైన మినిట్స్లో ఎలాంటి అసమ్మతి నమోదు కాలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.దీంతో.. పార్లమెంటరీ కమిటీలో కాంగ్రెస్ ఎంపీలు ఉన్నప్పుడే యూపీఐకి స్థిరమైన రెవెన్యూ మోడల్ అవసరమని సిఫార్సు చేశారని, ఇప్పుడు రాహుల్ గాంధీ కొత్త ఎండీఆర్ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని బీజేపీ ప్రశ్నిస్తోంది.ఆ కమిటీ ఏం చెప్పిందంటే..యూపీఐ వ్యవస్థను దీర్ఘకాలికంగా ఆర్థికంగా నిలబెట్టేందుకు టైర్డ్ రెవెన్యూ మోడల్ అవసరమని కమిటీ పేర్కొంది. యూపీఐ వ్యవస్థకు ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన మొత్తం సుమారు రూ.2,000 కోట్లుగా ఉండగా.. పరిశ్రమ అంచనా వేసిన నిర్వహణ వ్యయం దాదాపు రూ.20,700 కోట్లుగా ఉందని కమిటీ ప్రస్తావించింది. తగిన రెవెన్యూ వ్యవస్థ లేకపోతే బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు ప్రభుత్వ ప్రోత్సాహకాలపై అధికంగా ఆధారపడాల్సి వస్తుందని, సైబర్ సెక్యూరిటీ, మోసాల నివారణ, నెట్వర్క్ మౌలిక వసతులపై పెట్టుబడులపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపింది.అసలు కొత్త ఛార్జీ ఎంత?కేంద్రం ప్రకటించిన ప్రస్తుత విధానం ప్రకారం అక్టోబర్ 15 నుంచి రూ.2,000కు మించిన కొన్ని మర్చంట్ యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ అమల్లోకి రానుంది. ఈ ఛార్జీని వ్యాపారుల నుంచి వసూలు చేస్తారు. రూ.75,000 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలకు గరిష్ఠంగా రూ.300గా పరిమితి ఉంటుంది. వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే సాధారణ యూపీఐ బదిలీలు ఈ ఛార్జీ పరిధిలోకి రావు.రైల్వేలు, టెలికాం, ఇన్సూరెన్స్, ఇంధనం, విద్యుత్, నీటి వంటి కొన్ని విభాగాల్లో రూ.2,000కు మించిన చెల్లింపులకు శాతం ఆధారిత ఎండీఆర్కు బదులుగా ఫ్లాట్ రూ.5 రుసుము ఉండనుంది. క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలకు 0.02 శాతం ఎండీఆర్, గరిష్ఠంగా రూ.300 పరిమితి ఉంటుంది.రాహుల్ గాంధీ ఏమంటున్నారు?ఈ కొత్త విధానాన్ని రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యూపీఐ ట్యాక్స్ వెనక అమెరికా ఒత్తిడి ఉందని ఆరోపించారు. అయితే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ఆరోపణను తిరస్కరించింది. యూపీఐ విధాన నిర్ణయాలు ఎలాంటి బయటి ఒత్తిళ్లతో తీసుకోలేదని స్పష్టం చేసింది. అలాగే కేంద్రం మరోవైపు ఎండీఆర్ అంటే పన్ను కాదని, వినియోగదారుల నుంచి ప్రభుత్వం లేదంటే ఎన్పీసీఐ నేరుగా వసూలు చేసే ఛార్జీ కూడా కాదని చెబుతోంది. పేమెంట్ వ్యవస్థలోని బ్యాంకులు, యాప్ ప్రొవైడర్లు తదితర భాగస్వాముల మధ్య ఈ రుసుము పంపిణీ అవుతుందని వివరిస్తోంది.ఇక రాజకీయంగా కొత్త చర్చ..ఇలా రాహుల్ గాంధీ కొత్త ఎండీఆర్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న వేళ.. అదే సమయంలో పార్లమెంటరీ కమిటీ గతంలో చేసిన టైర్డ్ రెవెన్యూ మోడల్ సిఫార్సును బీజేపీ తెరపైకి తీసుకొచ్చింది. కమిటీలో ఉన్న ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలు నివేదిక ఆమోద సమయంలో ఉన్నారని, ప్రచురితమైన మినిట్స్లో వారి అసమ్మతి నమోదు కాలేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసిన రెవెన్యూ మోడల్కు, ఇప్పుడు అమల్లోకి వస్తున్న ఎండీఆర్ విధానానికి ఉన్న తేడాలు ఏమిటన్నదే తాజా రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది.ఇదీ చదవండి: ఆన్లైన్ పేమెంట్లు చేస్తున్నారా?.. ఛార్జీలు కట్టాల్సిందేనా?! -
నేడే ప్రధాని మోదీ 76వ జన్మదినం
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు, ఆయన 25 ఏళ్ల ప్రజా సేవను పురస్కరించుకుని గురువారం దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడానికి బీజేపీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి. ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గుజరాత్లోని వాద్నగర్ నుంచి ఉత్తరప్రదేశ్లోని వారణాసి వరకు సాగే బైక్ ర్యాలీని ప్రారంభిస్తారు. అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉత్తరప్రదేశ్లో పర్యటిస్తారు. వారణాసి నుంచి వాద్నగర్ వరకు సాగే బైక్ ర్యాలీని ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ముఖ్యమంత్రులు సైతం హాజరుకాబోతున్నారు. వాద్నగర్ ప్రధానమంత్రి మోదీ జన్మస్థలం కాగా, ఆయన వారణాసి లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మోదీ జన్మదినాన్ని సేవా దినంగా నిర్వహించుకుంటున్న గురువారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తారు. అనంతరం మధ్యప్రదేశ్లోని ఇండోర్, ఉజ్జయినిలో వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే దేశవ్యాప్త స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు. ప్రధానమంత్రి ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం గురువారం సాయంత్రం వేళ దేశవ్యాప్తంగా 700కు పైగా ప్రాంతాల్లో ఆశీర్వాదం దీపం వెలిగించబోతున్నట్లు పేర్కొన్నారు. గురువారం ‘సేవా సంకల్ప్ అభియాన్’ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా నెల రోజులపాటు ప్రజా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. -
లంచం ఇవ్వడం నేరం కాదు
సాక్షి, న్యూఢిల్లీ: దశాబ్దం క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’కేసు విచారణ సుప్రీంకోర్టులో కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో తమపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్యా బాగ్చి, జస్టిస్ వి.మోహనతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా హాజరై వాదనలు వినిపించారు. చట్ట నిబంధనలు, ఏసీబీ దర్యాప్తు లోపాలను ఎత్తిచూపుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడం ఎమ్మెల్యే అధికారిక విధి కాదని, పాత చట్టం ప్రకారం ఈ కేసు నిలబడదని చెప్పారు. పాత చట్టం ప్రకారం అది నేరం కాదు.. : ఈ కేసు 2015 నాటిది కాబట్టి అప్పటి అవినీతి నిరోధక చట్టం (పీసీ) ప్రకారమే విచారించాలని లూథ్రా కోరారు. పాత చట్టంలోని సెక్షన్లు 7, 11 కేవలం లంచం తీసుకునే ప్రభుత్వ అధికారులకే వర్తిస్తాయని, సెక్షన్ 12 ప్రకారం లంచం ఇవ్వడం నేరం కాదని వాదించారు. ఐక్యరాజ్యసమితి అవినీతి వ్యతిరేక తీర్మానం మేరకు 2018లో వచ్చిన చట్ట సవరణల తర్వాతే లంచం ఇవ్వడాన్ని (కొత్త సెక్షన్ 8 కింద) ప్రత్యేక నేరంగా చేర్చారన్నారు. ఈ కేసుకు పాత చట్టం నిబంధనలే వర్తిస్తాయని, ఆ ప్రకారం లంచం ఇవ్వజూపడం నేరం కిందకు రాదన్నారు. రాజ్యాంగంలోని ఆరి్టకల్ 171 ప్రకారం ఈ ఎన్నికలు అసెంబ్లీ స్పీకర్ పరిధిలో కాకుండా కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో జరుగుతాయని చెప్పారు. ఇందులో స్థానిక సంస్థల ప్రతినిధులు, పట్టభద్రులతోపాటు ఎమ్మెల్యేలు సైతం ఓటరు (ఎలక్టోరేట్) పాత్రను మాత్రమే పోషిస్తారని తెలిపారు. దామాషా (సింగిల్ ట్రాన్స్ఫరబుల్) పద్ధతిలో జరిగే ఈ ఎన్నికల్లో ఓటు వేయడం ఎమ్మెల్యే ’ప్రజా విధి’లేదా ’అధికారిక విధి’కిందకు రాదని స్పష్టం చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన ‘సీతా సోరెన్’తీర్పు కేవలం సభా హక్కుల పరిరక్షణకు మాత్రమే పరిమితమని, ఈ కేసుకు ఆ తీర్పు వర్తించదని చెప్పారు. ఎమ్మెల్యే ’పబ్లిక్ సర్వెంట్’కాదా? ధర్మాసనం కలుగజేసుకుని.. ‘ఎమ్మెల్యే పబ్లిక్ సర్వెంట్ (ప్రజా సేవకుడు) కాదా? నామినేటెడ్ ఎమ్మెల్యే పరిస్థితి ఏమిటి?‘అని ప్రశ్నించింది. దీనికి లూథ్రా బదులిస్తూ.. పీసీ చట్టం వర్తించాలంటే వారు పబ్లిక్ సర్వెంట్ కావడంతో పాటు, వారు చేసే పని ’అధికారిక విధి’అయి ఉండాలన్నారు. కానీ, ఇక్కడ ఎమ్మెల్యే ఎక్స్–అఫీషియో హోదాలో ఓటరుగా మాత్రమే వ్యవహరిస్తారని, నామినేటెడ్ ఎమ్మెల్యేల పాత్ర కూడా అదేనని వివరించారు. వాదనల సందర్భంగా ఏసీబీ తీరును లూథ్రా తీవ్రంగా తప్పుబట్టారు. 2015 మే 28న అప్పటి నామినేటెడ్ ఎమ్మెల్యే (స్టీఫెన్ సన్) నేరుగా ఏసీబీ డీజీకి ఫిర్యాదు చేసినా కనీసం జనరల్ డైరీలో ఆ విషయాన్ని నమోదు చేయలేదన్నారు. ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా, కనీస ముందస్తు అనుమతులు తీసుకోకుండానే మే 31న వలపన్ని దాడులు చేశారని కోర్టుకు తెలిపారు. దాడులు పూర్తయిన తర్వాత ఆ రోజు రాత్రి 11 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, ముడుపులకు సంబంధించి ఎలాంటి ఒప్పందం జరగలేదన్నారు. అప్పట్లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీల మధ్య ఉన్న రాజకీయ వైరం, కక్షసాధింపుల్లో భాగంగానే ఈ కేసు నమోదైందని చెప్పారు. దర్యాప్తు లోపాల కారణంగానే ఈ కేసులో ఏ–4గా ఉన్న నిందితుడి (మత్తయ్య) కేసును గతంలో హైకోర్టు కొట్టివేసిందని, ఆ తీర్పు ఏ–1కు (రేవంత్ రెడ్డి) కూడా వర్తిస్తుందని లూథ్రా వాదించారు. దీంతో పిటిషనర్ల తరఫు వాదనలు ముగిశాయి. కాగా, విచారణ జరుగుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించాల్సిన సీనియర్ న్యాయవాది సుందరం అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ప్రభుత్వ వాదనలు వినేందుకు వీలుగా తదుపరి విచారణను ధర్మాసనం ఈనెల 30కి వాయిదా వేసింది. -
‘స్టార్టప్ స్టేట్’గా తెలంగాణ
సాక్షి, న్యూఢిల్లీ: ‘కొత్తగా ఏర్పడిన రాష్ట్రం నిలదొక్కుకోగలదా? అవసరమైన వనరులు, సంస్థలు, పరిపాలనా సామర్థ్యం తెలంగాణకు ఉన్నాయా? రాష్ట్ర ఏర్పాటు సమయంలో వ్యక్తమైన అనేక సందేహాలకు అభివృద్ధి, పరిపాలనా విధానాల ద్వారా సమాధానం ఇచ్చాం’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం అనేది దేశ అభివృద్ధికి సమాధానంగా ఉండటం గర్వంగా ఉందన్నారు. తెలంగాణను కేవలం కొత్త రాష్ట్రంగా కాకుండా ప్రజల కోసం విలువను సృష్టించే ‘స్టార్టప్ స్టేట్’గా తీర్చిదిద్దే ఆలోచనతో ముందుకు సాగి విజయం సాధించామన్నారు. బుధవారం హరియాణా రాష్ట్రం సోనిపట్లోని ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో నిర్వహించిన ‘పాలనలో నవకల్పన–ఒక స్టార్టప్ రాష్ట్రం కథ’అనే అంశంపై కేటీఆర్ సుదీర్ఘంగా ప్రసంగించారు. కొత్త రాష్ట్రం నిలబెట్టుకోగలదా? అన్నారు ‘తెలంగాణ ఏర్పడిన సమయంలో కొందరు ఈ రాష్ట్రం తనను తాను నిలబెట్టుకోగలదా? అని ప్రశ్నించారు. కొత్త పరిపాలనా వ్యవస్థను నిర్మించడం పెద్ద భారమని చెప్పారు. మేము మాత్రం అదే పరిస్థితిని కొత్త తరహా పాలనా సంస్కృతిని నిర్మించుకునే అవకాశంగా చూశాం. సందేహాలతో వాదించకుండా పనితీరుతో సమాధానం చెప్పడమే తెలంగాణ విధానంగా సాగింది’అంటూ కేటీఆర్ చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కథకు రెండు ప్రధాన కోణాలు ఉన్నాయని వివరించారు. ఒకటి నీరు, విద్యుత్, వ్యవసాయం వంటి ప్రాథమిక అవసరాల ద్వారా ప్రజలకు భరోసా కల్పించడం కాగా.. రెండోది స్టార్టప్లు, నైపుణ్యాలు, ఆవిష్కరణల ద్వారా కొత్త అవకాశాలను సృష్టించడం. వ్యవసాయ రంగంపై... వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పును కూడా ఈ అభివృద్ధి నమూనాకు ఉదాహరణగా కేటీఆర్ ప్రస్తావించారు. 2014–15లో తెలంగాణలో సుమారు 44.4 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి కాగా, 2023–24 నాటికి అది 168.8 లక్షల టన్నులకు పెరిగిందని తెలిపారు. ఆ ఏడాది దేశంలోనే అత్యధిక బియ్యం ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. అదే విధంగా ఇళ్లకు 24 గంటల తాగునీరు, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందించామన్నారు. ఇప్పుడు తెలంగాణ దేశంలోని అగ్ర రాష్ట్రాల సరసన నిలిచిందని, దశాబ్ద కాలంలో తలసరి ఆదాయం దాదాపు మూడు రెట్లు పెరిగిందని, జాతీయ సగటు కంటే ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోందని తెలిపారు. ఎకోసిస్టమ్ను నిర్మించాం ప్రాథమిక సదుపాయాలపై భరోసా ఏర్పడిన తర్వాత అవకాశాల ఎకోసిస్టమ్ను నిర్మించడంపై దృష్టి పెట్టామని కేటీఆర్ చెప్పారు. టీ–హబ్, డబ్ల్యూఈ–హబ్, టీ–వర్క్స్, టాస్క్ వంటి సంస్థలను ఒకదానికొకటి అనుసంధానమయ్యే విధంగా రూపొందించామని తెలిపారు. ఈ–ఎకోసిస్టమ్ ఫలితాలను వివరించేందుకు స్కైరూట్ను ఉదాహరణగా ప్రస్తావించారు. విక్రమ్–1 అంతరిక్షంలోకి చేరడం హైదరాబాద్ ఆవిష్కరణ నమూనాను ప్రపంచానికి పరిచయం చేసిందని, స్కైరూట్ ప్రస్తుతం భారత తొలి స్పేస్టెక్ యూనికార్న్గా హైదరాబాద్ నుంచి ప్రపంచ మార్కెట్ కోసం రాకెట్లు నిర్మిస్తోందని పేర్కొన్నారు. బీజేపీతో పొత్తు ఉండనే ఉండదు ప్రసంగం తర్వాత విద్యార్థులతో కేటీఆర్ ముఖాముఖీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి ‘2028 ఎన్నికల్లో మీరు బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా’? అంటూ ప్రశ్నించారు. దీనికి కేటీఆర్ బదులిస్తూ.. ‘మేం వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తుకోం. బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోం. తెలంగాణ ఏర్పడిన తర్వాత తాము ఏ పారీ్టతోనూ పొత్తు పెట్టుకోలేదు’అంటూ సమాధానమిచ్చారు. ‘డీలిమిటేషన్పై బీఆర్ఎస్ వైఖరి ఏమిటి’అని మరో విద్యార్థి ప్రశ్నించగా.. ‘దక్షిణాది రాష్ట్రాలకు ప్రస్తుతం లోక్సభలో 24 శాతం ప్రాతినిధ్యం ఉంది. మొత్తం లోక్సభ స్థానాల సంఖ్యను దేశవ్యాప్తంగా దామాషా ప్రకారం పెంచితే డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వడంలో మాకు సమస్య లేదు’అన్నారు. ఏఐ, సాంకేతిక పరివర్తనలపై ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ప్రతి పెద్ద సాంకేతిక మార్పు సమయంలోనూ ఆందోళనలు, సందేహాలు వ్యక్తమయ్యాయన్నారు. ఏఐ విషయంలోనూ అదే జరుగుతోందని, సాంకేతిక మార్పును స్వీకరించి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చెప్పారు. సమావేశం తర్వాత సెల్ఫీ అంటూ విద్యార్థులు పోటీపడటంతో ఆయన అందరికీ ఓపిగ్గా సెలీ్ఫలు ఇచ్చారు. -
అమెరికా పౌరులే టార్గెట్.. కాల్సెంటర్లపై ఈడీ మెరుపు దాడులు
అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని నకిలీ కాల్ సెంటర్ల ద్వారా భారీ మోసాలకు పాల్పడుతున్న నెట్వర్క్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గట్టి దెబ్బ కొట్టింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA)- 2002 లోని సెక్షన్ 17 కింద ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయ అధికారులు సెప్టెంబర్ 15న పటియాలా, పుణె, చండీగఢ్లోని నాలుగు కీలక ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. క్షేత్రస్థాయి పరిశీలన, పక్కా సమాచారం ఆధారంగా నిర్వహించిన ఈ సోదాల్లో అంతర్జాతీయ మోసాల ముఠా గుట్టు రట్టయింది.సోదాల సమయంలో ఈడీ అధికారులు పటియాలాలో రెండు, పుణెలో ఒకటి చొప్పున మొత్తం మూడు ప్రత్యక్ష (లైవ్) కాల్ సెంటర్లను గుర్తించారు. అధికారులు సోదాలు జరుపుతున్న సమయంలో ఈ సెంటర్లలో సుమారు 220 మంది ఉద్యోగులు విధుల్లో ఉండటం గమనార్హం. వర్క్ స్టేషన్లు, క్యూబికల్స్, కంప్యూటర్లు, హెడ్సెట్లు, వీఓఐపీ ఆధారిత సిస్టమ్లతో ఇవి నడుస్తున్నాయి. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది గుర్తింపు, వారికి అప్పగించిన బాధ్యతలు, వారిని వెనుక ఉండి నడిపిస్తున్న ప్రధాన సూత్రధారుల వివరాలను అధికారులు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.పటియాలా, పుణె కేంద్రాలుగా సాగుతున్న ఈ నకిలీ కాల్ సెంటర్ల ప్రతినిధులు అమెరికా పౌరులకు ఫోన్లు చేసి, వివిధ తప్పుడు కారణాలు చెబుతూ భయభ్రాంతులకు గురిచేసేవారు. వారి నుంచి పెద్ద ఎత్తున డబ్బులను చెల్లించేలా ప్రేరేపించి మోసాలకు పాల్పడేవారని ఈడీ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇలా అమెరికన్ డాలర్ల రూపంలో అక్రమంగా వసూలు చేసిన నిధులను భారతీయ కరెన్సీగా మార్చే ప్రక్రియను ఒక ముఠా నడిపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.చండీగఢ్లోని ఒక నివాస ప్రాంగణంలో జరిగిన సోదాల్లో ఈ మొత్తం దందాకు సంబంధించిన ప్రధాన నియంత్రణ వ్యవస్థ బయటపడింది. పటియాలాలోని కాల్ సెంటర్ల కార్యకలాపాలను సమన్వయం చేయడానికి, అమెరికా నుంచి వచ్చిన అక్రమ ఆదాయాన్ని స్థానిక కరెన్సీలోకి మార్చే ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షించడానికి ప్రధాన సూత్రధారి ఈ చండీగఢ్ కేంద్రాన్ని ఉపయోగిస్తున్నట్లు అధికారులు కనుగొన్నారు. అక్కడ నిధుల పంపిణీకి సంబంధించిన అనేక డిజిటల్ ఆధారాలు లభ్యమయ్యాయి.ఇదీ చదవండి: మోదీ ‘శ్రీకృష్ణుడు’, నేను సుధామ.. ప్రధాని ఫ్రెండ్ భావోద్వేగ లేఖ -
మోదీని కలిసిన వారం రోజుల్లోనే..
దశాబ్దాలుగా కొనసాగుతున్న భూవివాదం.. ఎన్నో ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా పరిష్కారం కాని సమస్య. పైగా ఆ వెనక బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారన్న ఆరోపణ. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితుల్లో బాల్య స్నేహితుడ్ని కలిసి.. సీబీఐ విచారణ జరిపించాలని ఆ పెద్దాయన కోరారు. అవతలి ఉంది మాములు వ్యక్తి కాదు.. అందుకే వారం తిరగ్గ ముందే ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగింది.ప్రధాని నరేంద్ర మోదీతో పాఠశాలలో కలిసి చదువుకున్న 81 ఏళ్ల అస్గర్ అలీ వోరా.. మహారాష్ట్రలోని భయందర్లో తన భూమి వివాదంపై సెప్టెంబర్ 8న మోదీని కలిశారు. ఇది జరిగిన.. వారం రోజుల్లోనే వివాదాస్పద స్థలంపై బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతా వెనక్కి తగ్గారు. భూమిపై తనకున్న స్వాధీనాన్ని వదులుకుంటున్నట్లు ప్రకటించడంతోపాటు, అక్కడ నిర్మాణానికి తీసుకున్న అనుమతులను కూడా సరెండర్ చేశారు. వోరాపై గతంలో ఇచ్చిన పోలీస్ ఫిర్యాదును సైతం ఉపసంహరించుకున్నారు.నాకేం తెలియదు: వోరామోదీతో చిన్నప్పుడు కలిసి చదువుకున్న వోరా.. ప్రస్తుతం ముంబై సమీపంలోని మీరా రోడ్లో నివసిస్తున్నారు. భయందర్ ఈస్ట్లోని నవ్ఘర్లో సుమారు 2,810 చదరపు మీటర్ల భూమిని 1989లో రిజిస్టర్డ్ ఒప్పందం ద్వారా కొనుగోలు చేశారు. తాను ఆ భూమిని ఎప్పుడూ విక్రయించలేదని, మరెవరికీ బదలాయించలేదని పేర్కొన్నారు.అయితే 2011లో తనకు తెలియకుండా భూమికి సంబంధించిన నకిలీ పత్రాలు సృష్టించి, ఆస్తిని రెండు భాగాలుగా విభజించినట్లు వోరా ఆరోపించారు. ఒక భాగాన్ని స్వయం బిల్డర్స్ పేరుతో, మరో భాగాన్ని నరేంద్ర మెహతాకు సంబంధించిన సెవెన్ ఎలెవన్ కన్స్ట్రక్షన్స్ పేరుతో చూపించినట్లు ఆయన పేర్కొన్నారు. తన భూమిపై నిర్మాణ అనుమతులు ఎలా ఇచ్చారనే అంశంపైనా అధికారులను ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని కూడా ఆయన కోరారు.15 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా..ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు దాదాపు 15 ఏళ్లుగా వివిధ ప్రభుత్వ విభాగాలను ఆశ్రయిస్తున్నానని వోరా తెలిపారు. 2015లో నకిలీ పత్రాలకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైందని, అయితే దర్యాప్తు నివేదిక చాలా ఆలస్యంగా వచ్చిందని ఆయన ఆరోపించారు. రెవెన్యూ, మున్సిపల్, పోలీసు విభాగాల అధికారులకు ఫిర్యాదులు చేసినా తగిన చర్యలు తీసుకోలేదని వోరా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 8న ప్రధాని మోదీని కలిసి తన సమస్యను వివరించారు. ఈ భేటీ అనంతరం మహారాష్ట్ర అధికార యంత్రాంగం కూడా ఈ వ్యవహారంపై దృష్టి సారించింది.మోదీ ఎఫెక్ట్.. సచివాలయంలో కీలక సమావేశంసెప్టెంబర్ 15న మహారాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి శ్రీకర్ పరదేశి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇందులో అస్గర్ అలీ వోరాతో పాటు ఎమ్మెల్యే నరేంద్ర మెహతా, మీరా-భయందర్ మున్సిపల్ కమిషనర్ రాధా బినోద్ శర్మ, టౌన్ ప్లానర్ పురుషోత్తమ్ షిండే పాల్గొన్నారు.ఈ సమావేశంలో నరేంద్ర మెహతా టౌన్ ప్లానింగ్ విభాగానికి లేఖ ఇచ్చారు. వివాదాస్పద భూమిపై తాను కలిగి ఉన్న స్వాధీనాన్ని వదులుకుంటున్నట్లు, ఆ స్థలానికి మంజూరైన నిర్మాణ అనుమతిని కూడా సరెండర్ చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. అయితే ఈ భూమిని తాను 2019లో మెర్విన్ ఫెర్నాండెజ్ అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు మెహతా తన లేఖలో తెలిపారు.ఫిర్యాదు కూడా ఉపసంహరణఇదే సమయంలో వోరాపై గతంలో తాను చేసిన పోలీస్ ఫిర్యాదును ఉపసంహరించుకుంటున్నట్లు మెహతా పోలీస్ కమిషనర్కు మరో లేఖ రాశారు. ఇరు వర్గాల మధ్య రాజీ కుదిరినందున ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నట్లు అందులో పేర్కొన్నారు. దీంతో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఈ భూవివాదానికి ఓ ఎండ్ కార్డ్ పడినట్లైంది.ఇదీ చదవండి: ఆ హిందుత్వ ఇన్ఫ్లుయెన్సర్కు ఊరట -
విద్యా సంస్థల నియంత్రణ... కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీస్
న్యూఢిల్లీ: పద్నాలుగేళ్ల లోపు పిల్లలకు మతపరమైన, సాధారణ విద్యనందించే సంస్థల నియంత్రణ విషయంలో ఆదేశాలు పాటించకపోవడంపై సుప్రీంకోర్టు మంగళవారం కేంద్ర విద్యాశాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. నాలుగువారాల్లోగా సమాధానమివ్వాలని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ శీల్నాగూలతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. విద్యాశాఖ కార్యదర్శి టి.కె.అనిల్కుమార్ తానిచ్చిన విజ్ఞప్తిపై ఎలాంటి చర్య తీసుకోకపోవడాన్ని అశ్వినికుమార్ ఉపాధ్యాయ్ అనే న్యాయవాది సవాలు చేయడంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వానికి తన విజ్ఞప్తిని సమర్పించాలని సుప్రీంకోర్టు మే 11వ తేదీ ఉపాధ్యాయ్కు సూచించిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. న్యాయవాది అశ్వినీ దూబే ద్వారా దాఖలైన ఈ పిటిషన్లో ‘‘14 ఏళ్ల లోపు పిల్లలకు మత సామరస్య, మతపరమైన సూచనలిచ్చే ప్రతి విద్యాసంస్థ రిజిస్టర్ అయ్యేలా, గుర్తింపు కలిగి ఉండేలా, పర్యవేక్షణ, నిఘాలకు అనుకూలంగా ఉండేలా కేంద్రం తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలి’’ అని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. రాజ్యాంగంలోని ఆర్టిక్ 21ఏ, ఆర్టిక్ 39(ఎఫ్), 45, 51–ఏ(కే)ల స్ఫూర్తితో ఈ చర్యలు తీసుకోవాలని కోరింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 మైనార్టీలకు ఎలాంటి ప్రత్యేక, అదనపు హక్కులు కల్పించవని, ఆర్టికల్ 19(1)(జీ) కింద ఉద్యోగం, వృత్తి, వ్యాపారం, వాణిజ్యాల్లో స్వేచ్ఛ మాత్రమే లభిస్తుందని పిటిషనర్ వాదించారు. ‘‘ఆర్టికల్ 30 అనేది ఆర్టికల్ 19 (1)(జీ) పునరుద్ఘాటన అని ప్రకటించాలని, దానిద్వారా ప్రత్యేక, అదనపు హక్కులు, ప్రయోజనాలు, ప్రత్యేతలు లభించవని ఆదేశించేలా చేయాలి’’ అని కోరింది. ‘‘పిల్లలు ఈ దేశానికి వెన్నెముక అని పిటిషనర్ గుర్తిస్తున్నారు. వారి లేత వయసు కారణంగా తొందరగా ప్రభావితమయ్యే అవకాశమూ ఉంది కాబట్టి ప్రభుత్వానికి వారిపట్ల ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశం. రిజిస్టర్ కాని విద్యా సంస్థలు దేశ భవిష్యత్తు అయిన పిల్లల మెదళ్లను తప్పుదోవ పట్టించేందుకు, నియంత్రించేందుకు అవకాశాలు ఉంటాయి’’ అని స్పష్టం చేసింది. ఉత్తరప్రదరేశ్ సరిహద్దు జిల్లాల్లో తాను విస్తృతంగా పర్యటించానని, అక్కడ రిజిస్టర్ కానీ, గుర్తింపులేని సంస్థలు అనేకం నడుస్తున్నాయని ఉపాధ్యాయ్ తన పిటిషన్లో తెలిపారు. ఎలాంటి పర్యవేక్షణ, నియంత్రణల్లేకుండా ఈ సంస్థలు లాభాలు దండుకుంటున్నాయని ఆరోపించారు. ఈ పిటిషన్పై స్పందించిన సుప్రీంకోర్టు మే నెల 11న కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని పిటిషనర్ను ఆదేశించింది. అయితే కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి ఈ అంశంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ ఉపాధ్యాయ్ మళ్లీ ఆశ్రయించడంతో అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. -
హిందుత్వ ఇన్ఫ్లుయెన్సర్కు మధ్యంతర బెయిల్!
న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నపత్రాల లీకేజీపై జంతర్మంతర్లో జరిగిన ఆందోళన సందర్భంగా ఒకవ్యక్తిపై దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న హిందుత్వ ఇన్ఫ్లుయెన్సర్ స్వతంత్ర భరద్వాజ్కు న్యూఢిల్లీ కోర్టు మంగళవారం మూడు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చినట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది. ఈ మూడు వారాల్లో స్వతంత్ర ప్రవర్తనను పరిశీలించిన తరువాత అతడి సాధారణ బెయిల్పై విచారణ చేపడతామని కోర్టు తెలిపిందని సమాచారం. ‘‘న్యాయస్థానం విశ్వాసానికి ఈ బెయిల్ ప్రతీక. అంతేకానీ అది అందరికీ చూపేలా ప్రదర్శించే ట్రోఫీ కాదు’’ అని న్యాయమూర్తి బెయిల్ ఇస్తూ స్పష్టం చేసినట్లు తెలిసింది. అత్యంత హీనాతిహీనమైన కేసులో బెయిల్ దక్కడంపై ఉత్సవాలు, ఊరేగింపులు జరపడం, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం సమాజం, శాంతి భద్రతలకు అంతగా సరిపోయే అంశం కాదని అన్ని పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న తరువాత, కస్టడీలో ఉన్న దాదాపు పదిరోజుల్లో భరద్వాజ్ ఆత్మపరిశీలన చేసుకుని ఉంటాడని భావిస్తున్నట్లు న్యాయమూర్రిత తన ఆదేశాల్లో స్పష్టం చేశారు. భరద్వాజ్ విచారణ కూడా పూర్తయిందని, అతడిపై మోపిన అభియోగాలకు ఏడేళ్ల వరకూ శిక్ష పడే అవకాశం ఉందని న్యాయమూర్తి తెలిపారు. అయితే ఈ కేసులో న్యాయస్థానం ఆందోళన ప్రధానంగా ఫిర్యాదుదారు, అతడి కుమార్తె మైనర్ బాలిక విషయంలో ఉందని, తగిన షరతులతో వారి భద్రతను కాపాడవచ్చునని వ్యాఖ్యానించింది. ‘‘బాధితుల రక్షణ, ఆర్టికల్ 21 కింద వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యతలను పూర్తి చేయండం రెండూ కఠినమైన షరతుల కింద అప్లికెంట్కు మధ్యంతర బెయిల్పై విడుదల చేయడం ద్వారా సాధ్యమవుతాయి’’ అని పేర్కొన్నారు. ఈ కాలంలో అతడి ప్రవర్తనను గమనించాలని, దాని ఆధారంగానే అతడి సాధారణ బెయిల్ విజ్ఞప్తిని పరిశీలిస్తామని స్పష్టం చేసింది. జూన్ 23 నాటి ఘటనకు సంబంధించిన ఏ నిర్ణయమైనా న్యాయస్థానాల్లో సాక్ష్యాల ఆధారంగా జరగాలని, బహిరంగంగా సోషల్ మీడియాలో కాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. భరద్వాజ్ను రూ.50 వేల వ్యక్తిగత బాండ్, అంతే మొత్తానికి ష్యూరిటీ, పలు షరతులతో మధ్యంతర బెయిల్పై విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. కేసు గురించి చర్చించడం, తనకు మద్దతుగా పోస్టులు పెట్టడం, లేదా ఫిర్యాదుదారుల కుటుంబానికి వ్యతిరేకంగా ఏ రకమైన మీడియాలోనూ వ్యాఖ్యలు చేయకపోవడం వంటివి మధ్యంతర బెయిల్కు పెట్టిన షరతుల్లో కొన్ని. బాధితుడిని, అతడి కుమార్తెను లేదా సాక్షులను సంప్రదించే ప్రయత్నం అసలు చేయకూడదు. సాక్ష్యాలను నాశనం చేసే ప్రయత్నం విదేశాలకు పారిపోయే యత్నమూ చేయకూడదు. విచారణకు సహకరించాలి. చిరునామా, ఫోన్ నెంబర్లను పోలీసులకు ఇవ్వడంతోపాటు మధ్యంతర బెయిల్ సమయం ముగిసిన తరువాత లొంగిపోవాలి. తదుపరి విచారణ అక్టోబరు ఆరవ తేదీ జరగనుంది. మంగళవారం నాటి బెయిల్ విచారణ ఇన్ కెమెరా జరిగిన విషయం తెలిసిందే. -
బార్బర్ ఉద్యోగాలకూ AI ఎసరు.. రోబోల చేతికి కటింగ్, షేవింగ్
సాక్షి,న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్ హర్ష్ గోయంకా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,ఆటోమేషన్ టెక్నాలజీ భవిష్యత్తులో కేవలం ఫ్యాక్టరీ ఉద్యోగాలనే కాకుండా, నైపుణ్యంపై ఆధారపడే సంప్రదాయ వృత్తులను కూడా ఎలా ప్రభావితం చేయవచ్చో ఈ ఉదంతం తెలియజేస్తోంది. ఓ క్షురకుడు (బార్బర్) తన పనిని చేస్తుండగా, అతడి కదలికలను రికార్డ్ చేసి విశ్లేషించేలా ఒక హైటెక్ సెటప్ను అమర్చినట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. సదరు యువకుడు క్షవరం చేస్తున్నప్పుడు అతని చేతుల కదలికలు, టైమింగ్, కచ్చితత్వాన్ని ఏఐకు శిక్షణ ఇచ్చే డేటాగా సేకరిస్తున్న దృశ్యాలు ఇందులో ఉన్నాయి. ఈ వీడియోను షేర్ చేస్తూ..దేశంలో ఏఐ శిక్షణ జరుగుతోంది! రాబోయే రోజుల్లో క్షురకుల ఉద్యోగాలు కూడా ప్రమాదంలో పడవచ్చు’అని హర్ష్ గోయంకా పేర్కొన్నారు. ఆ వీడియో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.క్షవరం చేసే సమయంలో రోబోట్లకు ముఖంపై బ్లేడ్లు అప్పగించడం ప్రమాదకరమని కొందరు సరదాగా కామెంట్ చేస్తున్నారు. స్థానిక క్షురకుల అనుభవం, వారి మనుషుల మధ్య ఉండే సంభాషణలు, హస్తకళ నైపుణ్యాన్ని ఏఐ ఎప్పటికీ భర్తీ చేయలేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే, టెక్నాలజీ వేగంగా మారుతున్న తీరు చూస్తుంటే భవిష్యత్తులో మానవ ప్రమేయం లేని సేవలు పెరిగే అవకాశం ఉందని ఈ సంఘటన మరోసారి రుజువు చేస్తోందని నిపుణులు అంటున్నారు.గతంలో మెహందీ పెట్టే యంత్రాలకు సంబంధించిన వీడియోను షేర్ చేసి మరికొన్ని ఉద్యోగాలు మాయం అంటూ గోయంకా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ షేవింగ్ ఏఐ వీడియో టెక్నాలజీ భవిష్యత్తుపై మరోసారి పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది. AI training going on India ! Even barbers job may soon be at risk 🙈 pic.twitter.com/99CAwj5m2h— Harsh Goenka (@hvgoenka) September 14, 2026 -
విమర్శలకు భయపడొద్దు.. సోషల్ మీడియాకు తలొగ్గొద్దు: సీజేఐ
న్యాయవ్యవస్థపై సోషల్ మీడియానో, ఇతర బయటి శక్తుల ప్రభావం ఉండకూడదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. అలాగని విమర్శలకు న్యాయవ్యవస్థను అతీతంగా ఉంచడం కూడా సరికాదని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో సోమవారం జరిగిన 6వ రామ్ జెఠ్మలానీ స్మారక ఉపన్యాసంలో ‘జస్టిస్ సీన్ టు బీ డన్: ట్రాన్స్పరెన్సీ అండ్ పబ్లిక్ ట్రస్ట్ యాజ్ పిల్లర్స్ ఆఫ్ ది లీగల్ సిస్టమ్’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు.న్యాయవ్యవస్థ విమర్శలకు అతీతం కాదని సీజేఐ సూర్యకాంత్ అన్నారు. కోర్టుల పనితీరుపై వచ్చే నిష్పాక్షిక, నిర్మాణాత్మక విమర్శలు న్యాయవ్యవస్థను మరింత మెరుగుపరచడానికి, జవాబుదారీతనాన్ని పెంచడానికి ఉపయోగపడతాయని చెప్పారు. ప్రజల విశ్వాసాన్ని పొందాలంటే కోర్టులు విమర్శలకు, పరిశీలనకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.కోర్టు తీర్పును మాత్రమే కాకుండా.. ఆ తీర్పు వెనుక ఉన్న కారణాలను కూడా ప్రజలు పరిశీలించే అవకాశం ఉండాలని పేర్కొన్నారు. తీర్పు ప్రకటించి, దాని వెనుక ఉన్న కారణాలను మాత్రం ప్రజలకు తెలియకుండా ఉంచితే దాన్ని పూర్తి పారదర్శకతగా చెప్పలేమన్నారు.సోషల్ మీడియా ప్రభావం మాత్రం వద్దు..అయితే పారదర్శకత పేరుతో కోర్టు వ్యవహారాలను సోషల్ మీడియా ప్రభావానికి వదిలేయకూడదని సీజేఐ హెచ్చరించారు. న్యాయస్థానాలపై బాహ్య ఒత్తిళ్లు, ప్రజాభిప్రాయ ప్రభావం ఉండకూడదని స్పష్టం చేశారు. మీడియా లేదంటే సోషల్ మీడియా తమ సొంత అభిప్రాయాలతో వ్యవహరించే పరిస్థితుల్లో.. న్యాయం జరగడమే కాకుండా అది నిష్పాక్షికంగా కనిపించేలా ఉండటం కూడా ముఖ్యమని వివరించారు.ప్రజల మెప్పు కాదు.. నమ్మకమే ముఖ్యంకోర్టులు ప్రజల మెప్పు పొందడం ద్వారా విశ్వాసాన్ని సంపాదించలేవని సీజేఐ అన్నారు. కేసులో ఓడిపోయిన వ్యక్తి సైతం.. తనకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పును ఇచ్చిన ప్రక్రియ న్యాయంగా జరిగిందని నమ్మినప్పుడే న్యాయవ్యవస్థపై నిజమైన విశ్వాసం ఏర్పడుతుందని చెప్పారు. ప్రజల ఆమోదం కంటే న్యాయ ప్రక్రియలోని నిష్పాక్షికతే కోర్టుల విశ్వసనీయతకు కీలకమన్నారు.న్యాయవేత్త టామ్ ఆర్. టైలర్ పరిశోధనలను ప్రస్తావిస్తూ.. కేసులో ఓడిపోయినా ప్రక్రియ న్యాయంగా జరిగిందని భావించే వ్యక్తులు న్యాయవ్యవస్థపై విశ్వాసాన్ని కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉంటుందని వివరించారు. గెలుపు కంటే న్యాయమైన ప్రక్రియే కోర్టులకు చట్టబద్ధత, విశ్వసనీయతను తెచ్చిపెడుతుందని అన్నారు.‘న్యాయం జరగాలి.. కనిపించాలి’‘జస్టిస్ ఈజ్ డన్’తో పాటు ‘జస్టిస్ సీన్ టు బీ డన్’ అనే సూత్రాన్ని కూడా సీజేఐ ప్రస్తావించారు. 1924లో ఇంగ్లండ్లోని ‘ఆర్ వర్సెస్ ససెక్స్ జస్టీసెస్’ కేసును ఉదాహరణగా తీసుకున్నారు. సంబంధిత కేసుతో అనుబంధం ఉన్న సంస్థలో కోర్టు క్లర్క్ పనిచేస్తున్న విషయం బయటపడటంతో.. అతను న్యాయమూర్తుల నిర్ణయాన్ని ప్రభావితం చేశాడనే ఆధారాలు లేకపోయినా, పక్షపాతానికి అవకాశం కనిపించిందనే కారణంతో తీర్పును రద్దు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. న్యాయం చేయడం మాత్రమే కాదు.. అది న్యాయంగా జరిగిందని ప్రజలకు కనిపించడమూ అంతే ముఖ్యమని అన్నారు.ప్రజా విశ్వాసమే న్యాయవ్యవస్థ బలంఅలెగ్జాండర్ హామిల్టన్ రాసిన ‘ది ఫెడరలిస్ట్ నంబర్ 78’ను కూడా సీజేఐ ప్రస్తావించారు. ప్రభుత్వంలోని ఇతర విభాగాలకు ఆర్థిక, బలప్రయోగ అధికారాలు ఉన్నప్పటికీ.. న్యాయవ్యవస్థకు ప్రధానంగా తీర్పు ఇచ్చే అధికారమే ఉందని చెప్పారు. ప్రజలు స్వచ్ఛందంగా కోర్టుల తీర్పులను గౌరవించడానికి కారణం.. న్యాయవ్యవస్థపై ఉన్న విశ్వాసమేనన్నారు.ఆ విశ్వాసం ఒక్కసారి సంపాదించుకుంటే సరిపోదని.. ప్రతి దశలోనూ దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని సూర్యకాంత్ పేర్కొన్నారు. ప్రజా విశ్వాసమే న్యాయవ్యవస్థకు అత్యంత విలువైన మూలధనమని చెప్పారు.సామాన్యుడికి న్యాయం చేరాలికోర్టు భవనం అందుబాటులో ఉండటం మాత్రమే న్యాయానికి ప్రాప్యత కాదని సీజేఐ అన్నారు. సామాన్య పౌరుడు న్యాయవ్యవస్థను చేరుకోగలగాలి, అక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకోగలగాలి, న్యాయం కోసం కోర్టును ఆశ్రయించడం తనకు మరో పోరాటంగా మారకూడదని చెప్పారు. ఈ సందర్భంగా ఈ-కోర్టుల ప్రాజెక్టు ద్వారా అమలవుతున్న పలు చర్యలను ప్రస్తావించారు. సింగిల్ సైన్-ఆన్ పోర్టల్, ఎలక్ట్రానిక్గా సమన్ల జారీ, జైలు-కోర్టు రికార్డుల అనుసంధానం వంటి చర్యలు న్యాయవ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నాయని వివరించారు. ఈ-సేవా కేంద్రాల మొబైల్ వాహనాల ద్వారా కోర్టు సేవలు, న్యాయ సహాయాన్ని ప్రజల వద్దకే తీసుకెళ్లే ప్రయత్నాలను కూడా ప్రస్తావించారు.ప్రముఖ న్యాయవాది, మాజీ కేంద్ర న్యాయశాఖ మంత్రి రామ్ జెఠ్మలానీ. దేశంలోనే అత్యంత పేరున్న న్యాయవాదుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన ఆయన.. ఎన్నో సంచలన కేసుల్లో వాదించారు. రామ్ జెఠ్మలానీ పారదర్శకత, జవాబుదారీతనం కోసం చేసిన కృషిని గుర్తుచేసిన సీజేఐ.. న్యాయవ్యవస్థలో పారదర్శకతను పునాదిగా చేసుకుని, ప్రజల విశ్వాసాన్ని నిరంతరం పెంపొందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. న్యాయం జరగడమే కాదు.. అది జరిగినట్లు ప్రజలకు కనిపించాలన్న సూత్రం న్యాయవ్యవస్థకు మార్గదర్శకంగా ఉండాలని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: విజయ్కు షాకిచ్చిన వామపక్షాలు -
కేంద్రం ఆగ్రహం.. భారత్లో కార్యకలాపాలపై మెటా కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కఠిన చర్యల నేపథ్యంలో ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ‘మెటా’ కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారుల లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులను నేరుగా పోలీసులకు సమాచారం అందించేందుకు అంగీకరించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.దేశంలో సోషల్ మీడియా సంస్థలు కార్యకలాపాలు నిర్వహించాలంటే చిన్నారుల ఆన్లైన్ భద్రత ప్రాథమిక సూత్రమని, ఇందులో ఎలాంటి రాజీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల మెటా యాజమాన్యంలోని ప్లాట్ఫామ్లలో చిన్నారుల లైంగిక వేధింపులు, దోపిడీకి సంబంధించిన కంటెంట్, ప్రకటనలు వస్తున్నట్లు వార్తలు రావడంతో కేంద్రం, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీవ్రంగా స్పందించాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం డిజిటల్ ప్లాట్ఫామ్లపై ఉక్కుపాదం మోపుతోంది.చిన్నారుల భద్రతకు సంబంధించిన విషయాలు, ముఖ్యంగా లైంగిక వేధింపుల కేసుల వివరాలను ఇకపై భారతీయ చట్ట అమలు సంస్థలకు అందించేందుకు మెటా అంగీకరించింది. ఆన్లైన్లో పిల్లల భద్రత అనేది ఏ సోషల్ మీడియా సంస్థకైనా అత్యంత ప్రాథమిక, అనివార్యమైన సూత్రమని ప్రభుత్వం తేల్చిచెప్పింది.ప్లాట్ఫామ్లలో హానికరమైన సమాచారాన్ని ముందస్తుగా గుర్తించి, ఎప్పటికప్పుడు తొలగించేందుకు చర్యలు తీసుకోని సంస్థలపై కఠిన చర్యలు ఉంటాయని కేంద్రం హెచ్చరించింది. సోషల్ మీడియా వేదికలను పిల్లలకు పూర్తిగా సురక్షితంగా మార్చే దిశగా మెటా తీసుకున్న ఈ నిర్ణయం ఒక కీలకమైన తొలి అడుగుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కూడా పిల్లల భద్రత కోసం ముందస్తు రక్షణ చర్యలు చేపట్టేలా ప్రభుత్వం నిరంతరం చర్చలు జరుపుతోంది. -
‘నాపై అంత జాలి ఉంటే..’ కల్యాణ్కు బైకర్ సియా కౌంటర్
రోడ్డుపై వెళ్తున్న ఓ యువతి బైక్ను కారు ఢీకొట్టడం.. ఆమె కిందపడిపోయినా వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోవడం.. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం.. గురుగ్రామ్లో జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. తనను కారు కావాలనే వెంబడించి ఢీకొట్టారని బైకర్ ‘రెబల్ వీల్స్ సియా’ ఆరోపిస్తుండగా.. నిందితుడి తరఫు న్యాయవాది మాత్రం తప్పంతా బైకర్లదేనని అంటున్నాడు.గురుగ్రామ్ గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై ఆదివారం ఈ ఘటన జరిగింది. సియా తన ఏప్రిలియా ఆర్ఎస్ 457 స్పోర్ట్స్ బైక్పై తోటి బైకర్లతో కలిసి వెళ్తోంది. ఆ సమయంలో తెల్లరంగు సెడాన్ తమను వెంబడించిందని ఆమె చెబుతోంది. కారులోని వారు తనకు దగ్గరగా వచ్చి ఇబ్బందికరంగా ప్రవర్తించారని, దూరంగా ఉండాలని తాను సూచించినా.. బైక్ను ఆపాలని సైగలు చేశారని ఆమె ఆరోపించింది. చివరకు కారు పక్క నుంచి వచ్చి తన బైక్ను ఢీకొట్టడంతో రోడ్డుపై పడిపోయానని తెలిపింది.‘నేను అక్కడికక్కడే చనిపోయేదాన్ని’ప్రమాదంపై తొలిసారి స్పందించిన సియా.. నిందితుడు కల్యాణ్ బైన్స్లా చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. ‘నాపై జాలిపడుతున్నానని చెబుతున్నారు. నిజంగా జాలిపడితే ప్రమాదం తర్వాత ఎందుకు ఆపలేదు?’ అని ప్రశ్నించింది. తనను కారు చాలా దూరం వెంబడించిందని చెబుతూ.. ‘నేను అక్కడికక్కడే చనిపోయేదాన్ని. ఎముకలు విరిగిపోయేంత తీవ్ర గాయాలు కూడా అయ్యుండొచ్చు’ అని పేర్కొంది.కారు తనను వెంబడించలేదన్న వాదనను కూడా ఆమె ఖండించింది. ‘నా జుట్టు కనిపించింది.. నా దగ్గరకు వచ్చారు.. ఆపాలని సైగ చేశారు. అలాంటప్పుడు బైక్పై మహిళ ఉందో లేదో తెలియదని ఎలా చెబుతారు?’ అని ప్రశ్నించింది. ప్రమాదానికి సంబంధించిన రెండు వీడియోల్లోనూ కారు తన బైక్ వైపు లేన్ మార్చి ఢీకొట్టిన దృశ్యాలు స్పష్టంగా ఉన్నాయని తెలిపింది.This isn't hit and run... it's hit and kill 🖐️Car No: HR 30Y 4949In Gurugram, first a female bike rider was harassed by 4 louts sitting in a Verna car, they made vulgar vulgar gestures When the girl stopped them from doing so and told them to leave, the beasts rammed her… pic.twitter.com/W1141MIGSJ— Ravi Pandey🇮🇳 (@ravipandey2643) September 14, 2026కొత్త వీడియో.. మరో కోణంలో ఢీకొట్టిన దృశ్యంఈ ఘటనకు సంబంధించి సియా వెనుకే వస్తున్న మరో బైకర్ రికార్డు చేసిన వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. అందులో కారు సియా బైక్ వైపు వచ్చి ఢీకొట్టినట్లు కనిపిస్తోంది. కారు తమను చాలా దగ్గరగా వెంబడించిందని, డ్రైవర్ కిటికీ దించి ఆపాలని సైగ చేశాడని ఆ బైకర్ ఆరోపించాడు. ప్రమాదం తర్వాత కారు వెళ్లిపోవడంతో తాను దాన్ని వెంబడించి డ్రైవర్ ముఖాన్ని కెమెరాలో రికార్డు చేశానని చెప్పాడు. ప్రమాదం కారణంగా సియాకు చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. అయితే రైడింగ్ గేర్ ధరించి ఉండటంతో తీవ్ర గాయాలు తప్పాయని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. బైక్ మాత్రం దెబ్బతింది.‘కారులో నలుగురు.. మద్యం మత్తులో ఉన్నారు’సియా సోదరుడు కూడా సంచలన ఆరోపణలు చేశాడు. ప్రమాదం జరిగిన వెంటనే తనకు సియా ఫోన్ చేసి.. ఎవరో కారుతో ఢీకొట్టి వెళ్లిపోయారని చెప్పిందన్నాడు. కారులో నలుగురు ఉన్నారని, వారంతా మద్యం మత్తులో ఉన్నట్లు కనిపించారని ఆమె చెప్పినట్లు వెల్లడించాడు. కారులోని వారు అసభ్యకరమైన సైగలు చేశారని కూడా ఆరోపించాడు. సియా తండ్రి ఈ ఘటనను సాధారణ ప్రమాదంగా చూడలేమని, ఇది హత్యాయత్నంగా భావిస్తున్నామని అన్నారు. రోడ్డుపై పెద్దగా ట్రాఫిక్ కూడా లేదని.. అలాంటి సమయంలో ఈ ప్రమాదం జరగడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు.‘తప్పంతా బైకర్లదే’.. నిందితుడి తరఫు వాదనగురుగ్రామ్ హిట్ అండ్ రన్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్యాణ్ బైన్స్లా బాడీబిల్డర్, జిమ్ ట్రైనర్. తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ‘ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్’, ‘ఇండియన్ రగ్బీ టీమ్ సభ్యుడు’గా రాసుకున్నాడు. హిట్ అండ్ రన్ కేసులో కల్యాణ్ బైన్స్లా తరఫు న్యాయవాది మాత్రం పూర్తిగా భిన్నమైన వాదన వినిపించారు. కారులో నలుగురు ఉన్నారని.. వారిలో బంధువులు కూడా ఉన్నారని చెప్పారు. బైకర్లు రోడ్డుపై అడ్డంకిగా మారుతున్నారని, వారి కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కారు ఫుట్పాత్ను తప్పించుకునే క్రమంలో కొంచెం ఎడమవైపు వెళ్లిందని.. అదే సమయంలో యువతి కుడివైపు రావడంతో ఢీకొట్టిందని న్యాయవాది చెప్పారు. ప్రమాదం తర్వాత ఆపకపోవడానికి కారణం అక్కడ గుమిగూడిన వారు దాడి చేస్తారనే భయమేనని, ఆ పరిస్థితుల్లో కారు వెళ్లిపోయిందని తెలిపారు. సియా సోషల్ మీడియాలో ఫాలోవర్లు, వ్యూస్ కోసం ఘటనను ప్రచారం చేస్తోందని కూడా ఆరోపించారు. ఆమె బైక్ వేగం గంటకు 140–170 కిలోమీటర్ల వరకు ఉందని వాదించారు.కారు ఎవరిది?ప్రమాదానికి ఉపయోగించిన కారు హరియాణాలోని పల్వాల్కు చెందిన మనీష్ పేరుతో రిజిస్టర్ అయి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే తాను ఆ సమయంలో కారులో లేనని మనీష్ స్పష్టం చేశాడు. తాను ఆర్మీలో పనిచేస్తున్నానని, ఘటన జరిగిన సమయంలో అసోంలో విధుల్లో ఉన్నానని చెప్పాడు. ఆదివారం తన కుటుంబానికి చెందిన కారును ఓ స్నేహితుడు తీసుకెళ్లాడని.. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిన తర్వాతే ప్రమాదం విషయం తనకు తెలిసిందని వివరించాడు.పోలీసుల దర్యాప్తుకల్యాణ్ బైన్స్లా మాత్రం తాను కావాలనే బైకర్ను ఢీకొట్టలేదని చెబుతున్నాడు. బైకర్ అధిక వేగంతో వెళ్తుండగా, తాను కారు మలుపు తిప్పే సమయంలో ఢీకొన్నట్లు అతడి వాదన. ప్రమాదం తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోవడానికి బైకర్ల గుంపు దాడి చేస్తుందనే భయమే కారణమని కూడా అతడి తరఫున వాదన వచ్చింది. అయితే మహిళా బైకర్ మాత్రం కారు తనను ఉద్దేశపూర్వకంగా వెంబడించి ఢీకొట్టిందని ఆరోపిస్తోంది. ఈ రెండు వాదనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గురుగ్రామ్ పోలీసులు ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వైరల్ వీడియోలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, కారు వివరాల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. అసలు ప్రమాదం ఎలా జరిగింది? కారు ఉద్దేశపూర్వకంగా బైక్ను ఢీకొట్టిందా? లేక ప్రమాదవశాత్తూ జరిగిందా? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.ఇదీ చదవండి: బీజేపీ బిగ్ విక్టరీ -
కేంద్ర మంత్రి నివాసంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు
సోమవారం వినాయక చవితి పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఢిల్లీలోని పీయూష్ గోయల్ ఇంటికి వెళ్లిన మోదీ గణపతి బప్పాను దర్శించుకున్నారు. అనంతరం హారతి ఇచ్చి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ గణేశుడి కృప అందరిపై ఉండాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. అనంతరం గణపతి బొప్ప మోరియా అని మోదీ తన నోటి వెంట పలికారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్ ఇంట్లో గణేషుడికి చేసిన పూజ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ స్వయంగా తన ‘ఎక్స్’లో పంచుకున్నారు. కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ప్రధాని మోదీ స్పందిస్తూ..‘‘నా తోటి పౌరులందరికీ హృదయపూర్వక గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. విఘ్న నివారకుని దర్శన పూజలకు సంబంధించిన ఈ పవిత్ర పండుగ ప్రతిఒక్కరి జీవితాల్లోకి నూతన శక్తిని, తాజా ఉత్సాహాన్ని నింపాలని కోరుకుంటున్నాను. ఆయన దివ్య ఆశీస్సులతో అన్ని ప్రయత్నాలు విజయవంతం కావాలని, దేశం నిరంతర ప్రగతి పథంలో ముందుకు సాగాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’’ అంటూ ముగించారు.VIDEO | Delhi: Prime Minister Narendra Modi participates in Ganesh Utsav at Union Minister Piyush Goyal’s residence.(Source: PM Modi's YT)(Full video available on PTI Videos - https://t.co/d8jp61yd2p) pic.twitter.com/l1kLZzNxBg— Press Trust of India (@PTI_News) September 14, 2026ఇదీ చదవండి: గురుగ్రామ్ ఘటన.. సియా కుటుంబం చెప్పిన మరో కోణం! -
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మేనేజర్ దిశ కేసులో సరికొత్త సంచలనం!
ముంబై: దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసులో అత్యంత సంచలన పరిణామం చోటు చేసుకుంది. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసుకు సంబంధించి అధికారికంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ ఎఫ్ఐఆర్లో మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రేలతో పాటు పలువురు ప్రముఖుల పేర్లు ఉండటం రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.దిశా మరణంపై ఆమె తండ్రి సతీష్ సాలియన్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన బాంబే హైకోర్టు.. గత నెల ఆగస్ట్ చివరి నాటికి వాదనలు పూర్తి చేసి సెప్టెంబర్ 3న కీలక తీర్పు వెలువరించింది. దాదాపు ఆరేళ్ల పాటు ముంబై పోలీసులు ఈ ఘటనను కేవలం ఆత్మహత్య లేదా ప్రమాదవశాత్తు అకస్మాత్తు మృతి (ADR - Accidental Death Report) కోణంలోనే దర్యాప్తు చేయడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.సమాధానాల కంటే ఎక్కువ ప్రశ్నలే ఎక్కువపోలీసుల దర్యాప్తు తీరు ‘సమాధానాల కంటే ఎక్కువ ప్రశ్నలను లేవనెత్తుతోందని’, విచారణలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. అంతేకాకుండా, దిశా మరణించి ఆరేళ్లు గడుస్తున్నా కుటుంబ సభ్యులకు పోస్ట్ మార్టం రిపోర్ట్, ఏడీఆర్ కాపీలను కూడా అందజేయలేదని హైకోర్టు తప్పుబట్టింది. ఈ కేసులోని అనేక అనుమానాలను పరిగణలోకి తీసుకుంటూ సమగ్ర దర్యాప్తు కోసం కేసును సీబీఐకి అప్పగిస్తూ వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.సీబీఐ ఎఫ్ఐఆర్లోని కీలక అంశాలు కోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు వేగవంతం చేసిన సీబీఐ.. గత వారం దిశా తండ్రి సతీష్ సాలియన్ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఆదిత్య ఠాక్రే తండ్రి, అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఇతరులు ఈ కుట్రలో, ఆ తర్వాత జరిగిన పరిణామాలను కప్పిపుచ్చడంలో కీలక పాత్ర పోషించారని ఎఫ్ఐఆర్ పేర్కొంది.కేసు పత్రాలు, ఫైళ్లు, ఇతర ప్రభుత్వ రికార్డులను ధ్వంసం చేయడం, అధికారిక రికార్డులను తారుమారు చేయడం, ప్రజాధనాన్ని, మానవ వనరులను, పోలీసు యంత్రాంగాన్ని చట్టవిరుద్ధమైన పనులకు, నేరస్థులను రక్షించడానికి దుర్వినియోగం చేశారని పేర్కొంటూ.. సంబంధిత ప్రభుత్వోద్యోగులు, పోలీసు అధికారులు కూడా ఈ విచారణకు బాధ్యులవుతారని సీబీఐ తేల్చిచెప్పింది.నాటి సీఎం,ఆయన కుమారుడికి చుట్టూ బిగుస్తున్న ఉచ్చుఎఫ్ఐఆర్లో శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే, నటులు డీనో మోరియో, సూరజ్ పంచోలి, సుశాంత్ సింగ్ రాజ్పుత్ ప్రియురాలు రియా చక్రవర్తి, అప్పటి ముంబై పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్, దిశా కాబోయే భర్తతో పాటు మరికొందరి పేర్లను ప్రస్తావించారు. దిశా అటాప్సీ(పోస్ట్మార్టం) రిపోర్టును ఆలస్యం చేశారని, కేసును తప్పుదోవ పట్టించేలా ప్రయత్నం చేసేందుకు అప్పటి సీఎం ఉద్ధవ్ ఠాక్రే, అప్పటి హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ పాత్రపై కూడా ఎఫ్ఐఆర్లో ఆరోపణలు గుప్పించారు. అలాగే ఆలస్యమైన పోస్ట్మార్టమ్కు సంబంధించిన వైద్యులు, సిబ్బంది పాత్రపై కూడా విచారణ జరగాల్సి ఉందని తెలిపారు.అకస్మిక మృతిగా కేసు నమోదు చేసి..2020 జూన్ 8న ముంబైలోని మాలాడ్ ప్రాంతంలో ఓ నివాస భవనం 14వ అంతస్తు నుంచి కింద పడి దిశా సాలియన్ ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత సరిగ్గా వారం రోజుల వ్యవధిలోనే (జూన్ 14న) ఆమె సహచరుడు, నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ బాంద్రాలోని తన ఫ్లాట్లో మృతి చెందడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.అప్పట్లో ముంబై పోలీసులు దిశా మృతి కేసుకు సంబంధించి కేవలం అకస్మిక మృతిగా నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. అయితే, తన కుమార్తెను ముందస్తు పథకం ప్రకారం గ్యాంగ్రేప్ చేసి హత్య చేశారని, దీని వెనుక పెద్దల ప్రమేయం ఉందని ఆరోపిస్తూ సతీష్ సాలియన్ గత ఏడాది బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం హైకోర్టు ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగడంతో ఈ కేసులో మునుముందు మరిన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
వెంబడించి మరీ.. లేడీ బైకర్పైకి కారు!
రోడ్డుపై ఓ లేడీ బైకర్ను కొందరు ఆకతాయిలు వెంబడించారు. తనను వెంబడించొద్దని.. దూరంగా ఉండాలని ఆమె వాళ్లకు సున్నితంగానే చెప్పింది. అయినా పట్టించుకోకుండా వెంటపడ్డారు. చివరకు కారుతో ఆమె బండిని ఢీకొట్టి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో ఆమె కింద పడిపోగా.. బైక్ కొద్దిదూరం ముందుకు వెళ్లింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.గురుగ్రామ్లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై ఆదివారం ఈ ఘటన జరిగినట్లు బాధిత బైకర్ సియా వెల్లడించింది. ఆమె తన బైకింగ్ గ్రూప్తో కలిసి ఏప్రిలియా ఆర్ఎస్ 457పై వెళ్తుండగా.. ఓ కారు వెనుక నుంచి వెంటపడటం మొదలుపెట్టిందని తెలిపింది. కారులో ఉన్నవారు దూకుడుగా ప్రవర్తించడంతో.. కొంత దూరం పాటించాలని తాను కోరినట్లు చెప్పింది. అయితే వారు బైక్ ఆపాలని చెప్పారని, మద్యం మత్తులో ఉన్నట్లుగా కనిపించారని తెలిపింది.కారు తనను పక్కకు రానివ్వకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించానని సియా తెలిపింది. వెనుక వస్తున్న తన స్నేహితుడు కూడా కారును అడ్డుకునేందుకు ప్రయత్నించాడని చెప్పింది. అయినప్పటికీ కారు డ్రైవర్ బైక్కు ముందుగా వచ్చి కట్ చేయడంతో ఢీకొట్టిందని ఆరోపించింది. దాంతో సియా బైక్పై నుంచి కిందపడిపోగా.. ఆమె స్పోర్ట్స్ బైక్ కొంత దూరం రోడ్డుపై ఈడ్చుకెళ్లింది.ఈ మొత్తం ఘటన ఆమె బైక్కు అమర్చిన యాక్షన్ కెమెరాలో రికార్డైంది. ప్రమాదం తర్వాత సియా స్నేహితుడు కారును వెంబడించి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆపేందుకు ప్రయత్నించాడు. డ్రైవర్ను ప్రశ్నించగా.. తన తప్పేమీ లేదంటూ అక్కడి నుంచి కారుతో వెళ్లిపోయినట్లు సియా తెలిపింది.ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన సియా.. గురుగ్రామ్ పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరింది. వాహనం నంబర్తో పాటు ఆర్సీ యజమాని వివరాలను కూడా వెల్లడించింది. వీడియో వైరల్ కావడంతో ఢిల్లీ, గురుగ్రామ్, హరియాణా పోలీసులను ట్యాగ్ చేస్తూ నెటిజన్లు నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.Caught on Cam: Gurugram Woman Biker Thrown Off Aprilia After Car Rams Her for Asking to Keep Distance#Gurugram - A woman motorcyclist in Gurugram has alleged that a car rammed into her sports bike and fled after she asked the driver to keep a distance. The incident, recorded on… pic.twitter.com/Mq3xdfq83o— Siraj Noorani (@sirajnoorani) September 14, 2026 -
శాకాహారం మంట!
న్యూఢిల్లీ: బ్రిక్స్ దేశాధినేతలతోపాటు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పెద్దసంఖ్యలో దౌత్యాధికారులకు ప్రధాని మోదీ శనివారం ఇచ్చిన విందులో కేవలం శాకాహార భోజనం వడ్డించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అసహనం వ్యక్తంచేశారు. అత్యధికశాతం భారతీయులు మాంసాహారులని తెల్సి కూడా మోదీ సర్కార్ కేవలం శాకాహారం వడ్డించడంలో ఆంతర్యమేంటని ఆయన నిలదీశారు. ఈమేరకు రాహుల్ ఆదివారం ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘గణాంకాలను మీకు గుర్తుచేస్తున్నా. 80 శాతం మంది భారతీయులు మాంసాహారులే. మరీ ముఖ్యంగా భారతీయ మాంసాహార వంటకాలు ఎంతో రుచికరంగా ఉంటాయి. నా చెల్లి చేసిన శాకాహార చిరుతిండి ఛోలే భటూరేలా మాంసాహారం ఎంతో పసందుగా ఉంటుంది. అలాంటప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్రిక్స్ సంబంధిత విందులో మాంసాహారాన్ని విస్మరించాల్సిన అవసరం ఏమొచ్చింది? ’’అని రాహుల్ మోదీ సర్కార్కు సూటి ప్రశ్న వేశారు. పోస్ట్తోపాటు తన సోదరి చేసిన చిరుతిండి ఫొటోను పోస్ట్చేశారు. నచ్చిన ఆహారం వడ్డించరా?: కాంగ్రెస్ భారత్తోపాటు విదేశాల్లోనూ మాంసాహార ప్రియులే అత్యధికమని, అలాంటి బ్రిక్స్ దేశాల నుంచి వచ్చిన విదేశీ అతిథులకు శాకాహారం బలవంతంగా వడ్డించాల్సిన అవసరం ఏముందని కాంగ్రెస్ పార్టీ మోదీ ప్రభుత్వ విధానాన్ని తప్పుబట్టింది. ‘‘బ్రిక్స్ సదస్సు ప్రాధాన్యత దృష్ట్యా ప్రపంచదేశాల అతిథులు ఈ కార్యక్రమానికి వచ్చి విందు ఆరగించారు. వీళ్లు ఏ ఆహారం తినాలో బీజేపీ ప్రభుత్వం నిర్ణయిస్తుందా? ఇప్పటికే భారతీయులు ఏం తినాలో బీజేపీ ఆదేశిస్తోంది. ఇక విదేశీయులకు శాకాహారాన్ని బలవంతంగా తినిపించడం ఎంతవరకు సబబు?’’అని కాంగ్రెస్ మీడియా విభాగ చీఫ్ పవన్ ఖేడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘చవులూరించే ఎంతో మాంసాహార వంటకాలకు భారత్ పెట్టిందిపేరు. వాటిని విదేశీ అతిథులు రుచి చూడకుండా చేసి భారతీయ ఆహార సంప్రదాయాలను దాచాలని చూస్తారా?’’అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ విందు మెనూను పోస్ట్చేసింది. సక్సెస్ను కాంగ్రెస్ సహించట్లేదు: బీజేపీ సదస్సు విజయవంతంకావడంతో కాంగ్రెస్ సహించట్లేదని, అందుకే అర్థంపర్థంలేకుండా ఆహారం గురించి విమర్శలుచేస్తోందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ అన్నారు. ‘‘సదస్సు గురించి వంకలుపెట్టడానికి ఏమీ లేదు. డిక్లరేషన్లో ఏకాభిప్రాయం సాధించి మోదీ సర్కార్ తన దక్షతను చాటింది. సదస్సు ఇలా విజయవంతంకావడం కాంగ్రెస్ సహించలేకపోతోంది. అందుకే విమర్శించడానికి మరే విషయాలు లేక చివరకు ఆహారం గురించి విమర్శలు చేస్తోంది’’అని భండారీ అన్నారు. ‘‘డిక్లరేషన్తో విజయం సాధించిన మోదీని రాహుల్ అభినందించాల్సిందిపోయి ఈ శాకాహారం, మాంసాహారం గోల ఏంటి?’’అని మరో బీజేపీ జాతీయ ప్రతినిధి తుహిన్ సిన్హా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పోస్ట్ చేసిన మెనూ (అన్నీ శాకాహారాలే) స్టార్టర్స్.. 1. ఖండ్వీ మిలే–ఫియులే(శనగపిండితో ఆవిరిపై ఉడికించి పలుచగా చేసిన రోల్స్) 2. మష్రూమ్ కబాబ్లు, షీర్మాల్ రొట్టెతో కలిపి ఖుంబ్ గలౌతీ మెయిన్ కోర్స్ 1. పనీర్ లబాబ్దార్ 2. హిమాలయాల్లో లభించే అరుదైన మోరెల్ మష్రూమ్లు, ఆస్పరాగస్, కుంకుమపువ్వు, ఎండుద్రాక్ష, బాదంతో చేసిన గుచ్చీ మారి్మక్ 3. క్యారెట్, గ్రీన్ బీన్స్ కూర 4. కందిపప్పు, టమాటాలతో చేసినకర్ణాటక తక్కలి బెల్లే చారు 5. చిరు ధాన్యాల పులావ్6. బీట్రూట్ రైతా 7. వివిధ రకాల భారతీయ బ్రెడ్లు తీపి పదార్థాలు1. పాత ఢిల్లీ ఫ్రూట్ క్రీమ్ 2. జిలేబీ 3. పాలు, బియ్యం, మల్బెర్రీ పండ్లు కలిపిన షాహ్తూత్ పాయసం -
ఏకపక్ష ఆంక్షలతో ప్రజలపై తీవ్ర ప్రభావం: పెజెష్కియాన్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక, వాణిజ్య వ్యవస్థలపై అధికంగా ఆధారపడితే వర్ధమాన ఆర్థిక వ్యవస్థలు రాజకీయ ఒడిదుడుకులకు గురయ్యే ప్రమాదం ఉందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ చెప్పారు. అందుకే బ్రిక్స్ కూటమి దేశాలు తమ జాతీయ కరెన్సీల్లో వాణిజ్యాన్ని విస్తరించుకోవాలని, సమ్మిళిత ప్రపంచ ఆర్థిక చట్రం దిశగా కృషి చేయాలని పేర్కొన్నారు. ఆదివారం బ్రిక్స్ సదస్సులో ఆయన మాట్లాడారు. పాశ్చాత్య దేశాలపై విమర్శలు గుప్పించారు. కొన్ని దేశాలు విధిస్తున్న ఏకపక్ష ఆంక్షలు ప్రపంచ ఆహార భద్రత, ప్రజల సంక్షేమంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని పరోక్షంగా అమెరికాపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బ్రిక్స్ కూటమి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల మధ్య సహకారానికి సంబంధించిన ఒక వేదిక స్థాయిని దాటేసి, నేడు మరింత సమతుల్యమైన, సమ్మిళితమైన ప్రపంచం కోసం పెరుగుతున్న ఆకాంక్షకు ప్రతీకగా మారిందని హర్షం వ్యక్తంచేశారు. అటువంటి ప్రపంచంలో ఏ ఒక్కరికీ ఇతరుల భవిష్యత్తును నిర్ణయించే హక్కు ఉండదని తేల్చిచెప్పారు. -
జిన్పింగ్ పంచ సూత్రావళి
న్యూఢిల్లీ: బ్రిక్స్ దేశాలు సమున్నతంగా ఎదిగేందుకు పంచ సూత్రావళిని పాటించాలంటూ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సరికొత్త సూచనలు చేశారు. కృత్రిమ మేధ, వాణిజ్యం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, స్మార్ట్ ఫ్యాక్టరీలు, సీనియర్ శాస్త్రవేత్తలతో అతిపెద్ద సమీకృత మార్కెట్ను బ్రిక్స్ దేశాలు సొంతంగా సృష్టించుకోవాలని జిన్పింగ్ అభిలషించారు. బ్రిక్స్ సదస్సు ముగింపు సమావేశంలో ఆదివారం జిన్పింగ్ మాట్లాడారు. ‘‘అభివృద్ధిచెందుతున్న మార్కెట్లు, గ్లోబల్ సౌత్ దేశాలతో బ్రిక్స్ సభ్య దేశాలు అనుసంధానం కావాలి. దీంతో మన సరకు రవాణా గొలుసులు పటిష్టమవుతాయి. తద్వారా భవిష్యత్తులో అతిపెద్ద సమీకృత మార్కెట్ను అవతరింపజేయవచ్చు. అందుకోసం మొదటగా బ్రిక్స్ ఏఐ ఓపెన్ సోర్స్ కమ్యూనిటీని ఏర్పాటుచేద్దాం. దీని ఏర్పాటుకు చైనా అన్ని రకాలుగా సహాయసహకారాలు అందిస్తుంది. లార్జ్ లాంగ్వేజ్ మోడళ్ల తయారీ, అభివృద్ధికి కృషిచేద్దాం. ఏఐ సెమినార్లు నిర్వహిద్దాం. శిక్షణా కోర్సులను అందుబాటులోకి తెద్దాం. అలా ఓపెన్ ఏఐ ఎకోసిస్టమ్ అందుబాటులోకి వస్తుంది. ఇక రెండోది వాణిజ్యం, పెట్టుబడులను సులభతరంచేసే వ్యవస్థను ఏర్పాటుచేయడం. ఇందుకోసం బ్రిక్స్ స్పెషల్ ఎకనమిక్ జోన్ భాగస్వామ్య వ్యవస్థను ఏర్పాటుచేద్దాం. దీని ద్వారా ఇంటెలిజెంట్ పోర్టల్, విధానాల రూపకల్పన, కొత్త పెట్టుబడులు, వ్యాపార అవకాశాలకు అనుగుణంగా వాతావరణం సృష్టించుకోవచ్చు. దీంతో బ్రిక్స్ దేశాల మధ్య వస్తుసేవలు, పెట్టుబడులు పరస్పరం సులభంగా బదిలీఅవుతాయి’’అని జిన్పింగ్ అన్నారు. ‘‘ఇక మూడోది. డిజిటల్ పరిశ్రమను బలోపేతంచేయడం. ఇందుకోసం డిజిటల్ నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వడం, కొత్త సాంకేతికతల మార్పిడి, వివిధ పరిశ్రమల మధ్య సమన్వయం, డిజిటల్ ఎకానమీ అభివృద్ధి కోసం కృషిజరగాలి’’అని జిన్పింగ్ చెప్పారు. ‘‘ఇక నాలుగోది స్మార్ట్ కర్మాగారాలను కొలువుతీర్చడం. రోబోటిక్స్, ఆటోమేషన్లతో తయారీరంగాన్ని ఆధునీకరించాలి. ఏఐ, డిజిటల్ సాంకేతికతలను వస్తూత్పత్తి కర్మాగారాల్లో పూర్తిస్థాయిలో ఉపయోగిస్తూ ఇంటెలిజెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ను సాకారంచేయాలి. అందుకు కావాల్సిన ప్రమాణాల రూపకల్పనలో చైనా కూడా భాగస్వామిగా ఉంటుంది. ఇంటెలిజెంట్ మ్యానుఫాక్చరింగ్లో పారదర్శకత, ఎప్పటికప్పుడు అప్డేట్ ముఖ్యం’’అని ఆయన అన్నారు. ‘‘ఇక ఐదోది ఇంజనీర్స్ సృష్టి కూటమి. యూత్ ఎక్సే్ఛంజ్ ప్రోగ్రామ్లో భాగంగా ప్రతిభావంతులైన యువతను బ్రిక్స్ దేశాల మధ్య సమన్వయంచేస్తూ కొత్త ఇంజనీర్లను తయారుచేద్దాం’’ అని జిన్పింగ్ పిలుపునిచ్చారు. -
బ్రిక్స్ ధాన్యం మార్కెట్ ఏర్పాటు చేద్దాం: పుతిన్
న్యూఢిల్లీ: నేటి ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంలో సమగ్రమైన విధానాన్ని అవలంభించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. కూటమి దేశాల మధ్య ధాన్యం(గ్రెయిన్) మార్కెట్ కోసం ఒక కొత్త బీమా యంత్రాంగాన్ని, సహకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఉక్రెయిన్పై యుద్ధం కారణంగా రష్యాపై పశ్చిమ దేశాలు కఠినమైన ఆంక్షలు విధించిన నేపథ్యంలో బ్రిక్స్ సభ్య దేశాలు, గ్లోబల్ సౌత్ దేశాల మధ్య ఆర్థిక వృద్ధికి సంబంధించిన కొత్త కార్యక్రమాలను కూడా ప్రతిపాదించారు. బ్రిక్స్ దేశాల కలిసి ఆర్థిక వృద్ధి కోసం ఒక ప్రత్యేక వేదికను ఏర్పాటు చేయాలని అన్నారు. మూలధనం, శ్రామిక శక్తి, సాంకేతికతల విషయంలో రష్యాకు స్వతంత్ర మార్గాలు ఉన్నాయని చెప్పారు. బయటి ఒత్తిళ్లతో సంబంధం లేకుండా కార్యకలాపాలు సాగించగలమని స్పష్టంచేశారు. ఆదివారం బ్రిక్స్ సదస్సులో పుతిన్ మాట్లాడారు. గ్లోబల్ సౌత్ దేశాలు మెరుగైన ప్రపంచ పాలనా విధానాన్ని ఉమ్మడిగా ముందుకు తీసుకెళ్లాలని, భద్రతాపరమైన సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కోవాలని స్పష్టంచేశారు. -
మోదీ థ్యాంక్స్
న్యూఢిల్లీ: బ్రిక్స్ శిఖ రాగ్ర సదస్సును ఫలప్రదంగా, ఫలితాల ఆధారితంగా మార్చినందుకు కూటమిలోని సభ్య దేశాల అధినేతలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు రెండు రోజులపాటు జరిగిన ఈ సదస్సుకు సంబంధించిన కీలక ఘట్టాలను ప్రతిబింబించే ఒక వీడియోను ఆదివారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. సదస్సు విజయవంతమైందని హర్షం వ్యక్తంచేశారు.శిఖరాగ్ర సమావేశంలో మోదీ చేసిన ప్రసంగంలోని కొంత భాగాన్ని కూడా ఇందులో చేర్చారు. బ్రిక్స్ సదస్సు ద్వారా భారత్ అన్ని రంగాల్లోనూ స్నేహం, భాగస్వామ్యం, సహకారాన్ని పెంపొందించుకుందని ఆయన పేర్కొన్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధినేత పుతిన్, ఇతర దేశాధినేతలు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును ముగించుకొని తమ స్వదేశానికి పయనమయ్యారు. జిన్పింగ్ అధికారులు, వ్యాపారవేత్తలతో కూడిన భారీ ప్రతినిధి బృందంతో కలిసి ఆయన శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. ఏడేళ్ల తర్వాత ఆయన భారతదేశాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి. రెండు రోజలపాటు తీరిక లేకుండా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రధాని మోదీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత్, చైనా మధ్య వాణిజ్య లోటును తగ్గించడం, ఉగ్రవాదం వంటి సవాళ్లను ఎదుర్కోవడం సహా పలు కీలక అంశాలపై చర్చించారు. అలాగే పుతిన్ శుక్రవారమే ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. -
సాంకేతికతను ఖనిజాలను అస్త్రాలుగా వాడుకోవద్దు
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సామాన్య ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ సవాళ్లను ఎదుర్కొని మానవాళి కోసం బ్రిక్స్ కూటమి ఉమ్మడిగా కృషి చేయాలని, సహకారం, సమ్మిళిత వృద్ధి ద్వారా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆదివారం బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆధునిక సాంకేతికతను, అరుదైన ఖనిజాలను కొన్ని దేశాలు స్వలాభం కోసం అస్త్రాలుగా మార్చుకోవడంపై∙ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రపంచదేశాల ఉమ్మడి పురోగతికి, శ్రేయస్సుకు ఆటంకం కలిగిస్తుందన్నారు. గ్లోబల్ సౌత్లోని అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతుకను వినడం, వారి అనుభవాలకు విలువ ఇవ్వడం, భాగస్వామ్యం ఏర్పర్చుకోవడం వల్ల అవి బ్రిక్స్ను ఎక్కువగా విశ్వసిస్తున్నాయని చెప్పారు. మన వైవిధ్యమే మన గుర్తింపు, మన సహకారమే మన స్ఫూర్తి, మన పురోగతి సకల మానవాళికి సేవగా మారాలని బ్రిక్స్ సభ్యదేశాలకు పిలుపునిచ్చారు. సమ్మిళిత ప్రపంచ వృద్ధిని ఆకాంక్షిస్తున్నాం అస్థిరమైన భౌగోళిక–రాజకీయ వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవడానికి బ్రిక్స్ దేశాల మధ్య సహకారం బలోపేతం కావడం అత్యంత కీలకమని ప్రధాని మోదీ నొక్కిచెప్పారు. కూటమికి భారత్ అధ్యక్షత వహించడం నిబ్బరం, ఆవిష్కరణ, సహకారం మరియు సుస్థిరత అనే నాలుగు స్తంభాలపై కేంద్రీకృతమై ఉందని తెలిపారు. ఈ నాలుగు మూలస్తంభాల ఆధారంగా బ్రిక్స్ ద్వారా సమ్మిళిత ప్రపంచ వృద్ధిని భారత్ ఆకాంక్షిస్తోందని వ్యాఖ్యానించారు. ఎందుకంటే కూటమిలో అభివృద్ధి చేసిన పరిష్కారాల ప్రయోజనాలు కేవలం భారత్కే పరిమితం కాకూడదని, గ్లోబల్ సౌత్ దేశాలకు సైతం అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు స్పష్టంచేశారు. కూటమిలో అందరి సహకారం, మద్దతుతో మన ఉమ్మడి దృక్పథాన్ని పరస్పర ప్రయోజనకరమైన సహకారంగా మార్చగలగడం సంతోషాన్నిస్తోందని మోదీ ఉద్ఘాటించారు. ఏ సంక్షోభమూ ఒకే ప్రాంతానికి కాదు నేడు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఘర్షణలు, ఉద్రిక్తతల కారణంగా సామాన్య ప్రజలే అధికంగా నష్టపోతున్నారని మోదీ గుర్తుచేశారు. మహమ్మారులు, వాతావరణ విపత్తులు, సరఫరా వ్యవస్థలో అంతరాయాల వంటివి నేటి పరస్పర అనుసంధానిత ప్రపంచంలో ఏ సంక్షోభమూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదని నిరూపించాయని తెలియజేశారు. అందుకే బ్రిక్స్ కూటమిలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. సవాళ్లను సకాలంలో గుర్తించడం, వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడం, తక్షణ చర్యలు చేపట్టడం ముఖ్యమని వివరించారు. అంటువ్యాధుల నివారణ, వాటిపై స్పందించేందుకు ‘బ్రిక్స్ సమగ్ర ముందస్తు హెచ్చరిక వ్యవస్థ’ను ఏర్పాటు చేయడానికి అంగీకరించామని అన్నారు. అలాగే విపత్తు నిర్వహణ కోసం ‘ముందస్తు హెచ్చరిక సమాచార అనుసంధాన మార్గదర్శకాలు’రూపొందించినట్లు తెలిపారు. సప్లై చైన్లను మరింత విశ్వసనీయంగా, దృఢంగా మార్చడానికి ‘బ్రిక్స్ లాజిస్టిక్స్ సప్లై చైన్ కోఆపరేసన్ ఫ్రేమ్వర్క్’ తోడ్పడుతుందని అన్నారు. ఆవిష్కరణల విభాగంలో బ్రిక్స్ ఇంక్యుబేటర్ నెట్వర్క్ మన స్టార్టప్లను, ఇంక్యుబేటర్లను ఒకదానితో ఒకటి అనుసంధానిస్తుందని వెల్లడించారు. ‘బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్’ను ప్రతిపాదించినట్లు స్పష్టంచేశారు. సాంకేతికతను, కీలక ఖనిజాలను ఆయుధాలుగా మార్చడం మన ఉమ్మడి పురోగతికి ఆటంకం కలిగిస్తుందన్నారు. అందుకే సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడంలో సమ్మిళితత్వానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు మోదీ చెప్పారు. ‘బ్రిక్స్ కనెక్ట్’తో ఉపాధి అవకాశాలు బ్రిక్స్ కూటమిలోని వివిధ వేదికల ద్వారా స్నేహం, భాగస్వామ్యం, సహకారాన్ని పెంపొందించినట్లు ప్రధాని వివరించారు. బ్రిక్స్ సహకారం కేవలం ప్రభుత్వాలకే పరిమితం కావడం సరైంది కాదన్నారు. పారిశ్రామికవేత్తలు, రైతులు, పరిశోధకులు, మహిళలు, యువత, సామాన్య పౌరులను ఇందులో క్రియాశీల భాగస్వాములుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ‘బ్రిక్స్ కనెక్ట్’ద్వారా నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు, పనిలో మహిళల భాగస్వామ్యం, సామాజిక భద్రత, సామర్థ్య పెంపుదల వంటి అంశాలను ప్రోత్సహించామని అన్నారు. చిన్న తరహా పరిశ్రమలను పరిజ్ఞానం, ఆర్థిక వనరులు, కొత్త మార్కెట్లతో అనుసంధానించేందుకు ‘బ్రిక్స్ ఎంఎస్ఎంఈ కోఆపరేషన్ పోర్టల్’ను ప్రారంభించామని వెల్లడించారు. మన నగరాల మధ్య ఉత్తమ విధానాల పరస్పర బదిలీని సులభతరం చేసేందుకు ‘బ్రిక్స్ అర్బన్ మొబిలిటీ హబ్’ను ఏర్పాటు చేశామన్నారు. భావి తరాల పట్ల అది మన బాధ్యత భారతీయ నాగరికతలో ప్రకృతికి కన్నతల్లి స్థానం ఉందని గుర్తుచేశారు. అభివృద్ధి, పర్యావరణం అనేవి ఒకదానికొకటి ప్రత్యామ్నాయాలు కాదని, అవి పరస్పర పూరకాలని శతాబ్దాలుగా విశ్వసిస్తున్నామని ఉద్ఘాటించారు. మానవాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ పట్ల కచ్చితంగా సమతుల్యత పాటించాలని తేల్చిచెప్పారు. భావి తరాల పట్ల అది మన బాధ్యత అని సూచించారు. ఆ దిశగా పలు అంశాల్లో తాము పురోగతి సాధించామన్నారు. స్మార్ట్ గ్రిడ్లు, ఇంధన నిల్వ కోసం ‘బ్రిక్స్ డిజిటల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను ఏర్పాటు చేశామని, ఇది స్వచ్ఛ ఇంధన వ్యవస్థలను మరింత విశ్వసనీయంగా, సమర్థవంతంగా మార్చడానికి, అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి దోహదపడుతుందని ప్రధాని చెప్పారు. -
తెలంగాణ కాంగ్రెస్కు కొత్త ఇన్చార్జి?
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) వ్యవహారాల ఇన్చార్జి మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఉన్నత చదువుల కోసం సుమారు 10 నెలల పాటు త్వరలో విదేశాలకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు కొత్త ఇన్చార్జిని నియమించే దిశగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కసరత్తు ప్రారంభించింది. త్వరలోనే ఈ మేరకు ప్రకటన చేసే అవకాశం ఉంది. దీపా దాస్మున్షీ స్థానంలో 2025 ఫిబ్రవరి 14న మీనాక్షి నటరాజన్ రాష్ట్ర బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఆమె విదేశాలకు వెళ్లనుండటం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతర రాజకీయ పరిణామాల దృష్ట్యా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండే సీనియర్ నేతకు బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే నామినేటెడ్ పదవులకు ఎంపిక, మంత్రివర్గ విస్తరణ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థుల జాబితా, ఇతర సంస్థాగత అంశాలతో క్షేత్రస్థాయి నివేదికను మీనాక్షి పార్టీ అధిష్టానానికి సమర్పించారని సమాచారం. అయితే ఆమె గైర్హాజరుతో పార్టీ కొత్త ఇన్చార్జి కోసం పలువురు సీనియర్ నాయకుల పేర్లను ఏఐసీసీ పరిశీలిస్తోంది. ప్రధానంగా ముకుల్ వాస్నిక్, శక్తిసిన్హ్ గోహిల్ పేర్లు రేసులో ముందున్నట్లు సమాచారం కాగా, వీరితో పాటు సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, అశోక్ గెహ్లాట్ పేర్లను కూడా ఏఐసీసీ పెద్దలు పరిశీలిస్తున్నారు. సంస్థాగత అనుభవశీలి ముకుల్ వాస్నిక్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేసిన ముకుల్ వాస్నిక్ పేరు ఇన్చార్జి రేసులో బలంగా వినిపిస్తోంది. ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. గతంలో కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. దశాబ్దాలుగా పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాలకు ఇన్చార్జిగా విజయవంతంగా పనిచేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్న వాస్నిక్, పారీ్టలో వివాదరహితుడిగా గుర్తింపు పొందారు. దక్షిణాది రాజకీయాలపై ఆయనకు మంచి అవగాహన ఉండటం, నాయకుల మధ్య సమన్వయం తీసుకురావడంలో నేర్పరి కావడం ఆయనకు కలిసొచ్చే అంశాలు. వ్యూహాల రూపకల్పనలో శక్తిసిన్హ్ గోహిల్ గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు శక్తిసిన్హ్ గోహిల్ పేరు కూడా అధిష్టానం పరిశీలనలో ఉంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేసిన గోహిల్కు చట్టసభలు, రాజ్యాంగపరమైన అంశాలపై పూర్తి పట్టు ఉంది. గతంలో గుజరాత్ ప్రభుత్వంలో ఆర్థిక, విద్యా శాఖల మంత్రిగా, శాసనసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఢిల్లీ, బిహార్ వ్యవహారాల ఇన్చార్జిగా పనిచేశారు. ఎన్నికల వ్యూహాల రూపకల్పనలో, క్షేత్రస్థాయి శ్రేణులను సమన్వయం చేయడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. రాష్ట్ర పరిస్థితులపై దిగ్విజయ్కు పట్టు రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా పనిచేసిన అపార అనుభవం ఉంది. రాష్ట్ర కాంగ్రెస్లోని మెజారిటీ సీనియర్ నాయకులతో ఆయనకు ప్రత్యక్ష పరిచయాలు ఉన్నాయి. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంపై పూర్తి అవగాహన ఉన్న నాయకుడు కావడంతో ఆయన వైపు కూడా అధిష్టానం మొగ్గుచూపే అవకాశం ఉంది. ఆయన 1993 నుంచి 2003 వరకు పదేళ్ల పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం ఉన్నారు. సమన్వయకర్తగా అశోక్ గెహ్లాట్ రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్.. రాజస్థాన్ రాష్ట్రానికి మూడు సార్లు (1998–2003, 2008–2013, 2018–2023) ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్ నేత. గతంలో కేంద్ర మంత్రిగా కూడా సేవలు అందించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా (సంస్థాగత వ్యవహారాలు) పనిచేసిన కాలంలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయడంలో కీలక పాత్ర పోషించారు. సంక్షోభ సమయాల్లో పార్టీని నడిపించగల వ్యూహకర్తగా ఆయనకు పేరుంది. అధికారంలో ఉన్న రాష్ట్రంలో ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం సాధించేందుకు గెహ్లాట్ లాంటి సీనియర్ నేత అవసరం ఉంటుందని పార్టీలోని ఒక వర్గం భావిస్తోంది. కాగా కొత్త ఇన్చార్జి ఎంపికపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ త్వరలోనే ఒక నిర్ణయానికి రానున్నట్లు సమాచారం. మీనాక్షి నటరాజన్ స్థానంలో ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారనే దానిపై త్వరలో ఏఐసీసీ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. -
బాల్యమిత్రుడికి ప్రధాని మోదీ అభయం.. కదిలిన యంత్రాంగం
ఢిల్లీ : తన 37 ఏళ్ల క్రితం నాటి భూవివాదాన్ని పరిష్కరించాలని అస్గర్ అలీ వోహ్రా (81) తన బాల్య మిత్రుడు ప్రధాని మోదీని కోరారు. అందుకు ప్రధాని మోదీ అభయమిచ్చారు.జాతీయ మీడియా కథనాల ప్రకారం.. గుజరాత్లోని వద్నగర్లో ప్రధాని మోదీతో కలిసి చదువుకున్న 81 ఏళ్ల అస్గర్ అలీ వోహ్రా తన భూ వివాదంపై జోక్యం చేసుకోవాలని ప్రధానిని అభ్యర్థించారు. మహారాష్ట్రలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ భూ వివాదంపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ఆయన కోరారు.మహారాష్ట్రలోని మీరా రోడ్ ప్రాంతానికి చెందిన అస్గర్ అలీ వోహ్రా (81) ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని నేరుగా కలిశారు. 1989లో ముంబై భాయందర్ ఈస్ట్ పరిధిలోని నవ్ఘర్ ప్రాంతంలో సుమారు 2,810 చదరపు మీటర్ల భూమిని తాను రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ద్వారా కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు.అయితే 2011లో ‘స్వయం బిల్డర్స్’, స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర మెహతాకు చెందిన ‘సెవెన్ ఎలెవన్ కన్ స్ట్రక్షన్’ సంస్థలు తన భూమిని కబ్జా చేశాయని వోహ్రా ఆరోపించారు. అసలు యజమానికి తెలియకుండా నకిలీ పత్రాలు సృష్టించి, ఆ భూమిని రెండు భాగాలుగా విభజించి ఆ రెండు సంస్థల పేరిట ఆక్రమించుకున్నారని ఆయన వాపోయారు.ఈ భూ వివాదానికి సంబంధించి 2015లోనే ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ, కేసు కోర్టులో పెండింగ్లో ఉంది. దశాబ్దాలుగా రెవెన్యూ శాఖ, మున్సిపల్ అధికారులు, పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగకపోవడంతో చివరికి ఆయన ప్రధాని మోదీని ఆశ్రయించారు. తన గోడు వెళ్లబోసుకున్న వోహ్రాకు ప్రధాని సానుకూలంగా స్పందించి అభయమిచ్చారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను రాష్ట్ర మంత్రి ప్రతాప్ సర్నాయక్ విడుదల చేయగా, ప్రధాని తన బాల్య స్నేహితుడికి తగిన న్యాయం అందేలా చూస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.ప్రధాని కార్యాలయ జోక్యంతో కదిలిన మున్సిపల్ యంత్రాంగం ఈ ఉదంతంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 16న ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక విచారణకు మున్సిపల్ అధికారులు సిద్ధమయ్యారు. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ‘సెవెన్ ఎలెవన్ కన్ స్ట్రక్షన్’, ‘స్వయం బిల్డర్స్’ ప్రతినిధులకు అధికారికంగా ఆదేశాలు జారీ చేశారు. -
బ్రిక్స్ వేదిక: పాటతో అదరగొట్టిన మలేషియా ప్రధాని
సాధారణంగా శిఖరాగ్ర సమావేశాలు అంటే.. అధికారిక ప్రసంగాలు, తీవ్రమైన చర్చలే ఉంటాయి. బ్రిక్స్ వేదికగా మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం తన గానంతో సందడి చేశారు. నిన్న(శనివారం) సాయంత్రం జరిగిన కార్యక్రమంలో అందరినీ అలరించేలా ఓ క్లాసిక్ బాలీవుడ్ పాటను పాడారు. 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరైన ఆయన.. డిన్నర్ కార్యక్రమంలో 1965 నాటి తీన్ దేవియాన్ సినిమాలోని కిషోర్ కుమార్ అమర ప్రేమ గీతం "ఖ్వాబ్ హో తుమ్ యా కోయ్ హకీకత్" పాటను పాడి ఉర్రూతలూగించారు.మజ్రూహ్ సుల్తాన్పురి రాసిన ఈ పాటను ఆలపించిన ప్రధాని అన్వర్ ఇబ్రహీం.. సభలోని అందరి దృష్టిని ఆకర్షించారు. దౌత్యం, రాజకీయాలతో నిండిన ఆ రాత్రిని వినోదంగా మార్చారు. అన్వర్ ఇబ్రహీం తన వీడియో క్లిప్ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ పాటను పాడేందుకు అనుమతి కోరుతున్నట్లు క్యాప్షన్ రాశారు. ఈ వీడియో వైరల్ కాగా నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. "సర్, మీరు చాలా బాగా పాడారు; భారత్లో మీకు అద్భుతమైన సమయం గడిచిందని ఆశిస్తున్నాను’’ అంటూ ఓ యూజర్ కామెంట్ సెక్షన్లో రాశారు."వావ్, మిస్టర్ అన్వర్ ఇంత మధురంగా పాడగలరని నాకు తెలియదు. చాలా బాగుంది. మలేషియాలో ఉంటున్న ఒక ప్రవాస భారతీయుడి నుంచి బోలెడన్ని ప్రేమపూర్వక శుభాకాంక్షలు అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. భారతీయ పాటలపై మలేషియా ప్రధాని తన అభిమానాన్ని చాటుకోవడం ఇదే మొదటిసారి కాదు. భారతీయ సినిమా, సంగీతం పట్ల అభిమానాన్ని గతంలో కూడా పంచుకున్నారు. భారత్లో పర్యటించిన సమయంలోనూ ఆయన మీడియా సమావేశంలో సరిగ్గా ఇదే కిషోర్ కుమార్ పాటనూ, ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖేష్ క్లాసిక్ పాట "దోస్త్ దోస్త్ నా రహా"ను కూడా ఆలపించారు.Guru mintak izin nyanyi kejap ok! pic.twitter.com/NzazFHV509— Anwar Ibrahim (@anwaribrahim) September 12, 2026కాగా, బిక్స్ సదస్సులో మలేషియా ప్రధాని.. ప్రపంచ సమస్యలు, ఆర్థిక సంబంధాలు, వాణిజ్య పద్ధతులపై చర్చించారు. భారత్-మలేషియా దేశాల మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశాలలో డిజిటల్ టెక్నాలజీ, పర్యాటకం వంటి రంగాలలో సహకారాన్ని మరింత విస్తరించడంపై ప్రధానంగా దృష్టి పెట్టారు. అలాగే ప్రధాని మోదీ ప్రపంచ స్థాయి గుర్తింపును కొనియాడారు.ఇదీ చదవండి: లాడెన్ హిట్లిస్ట్లో భారత్.. బయటపడ్డ సంచలన రహస్యాలు -
మోదీ విందుకు జిన్పింగ్ డుమ్మా.. ఏం జరిగింది?
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల సందర్భంగా షాకింగ్ పరిణామం చోటుచేసుకుంది. ఏడేళ్ల తర్వాత భారత్కు వచ్చిన చైనా అధ్యక్షుడు జిన్పింగ్.. ప్రధాని మోదీ ఇచ్చిన ప్రత్యేక విందుకు మాత్రం హాజరుకాలేదు. శనివారం జరిగిన బ్రిక్స్ సదస్సులో మోదీతో ద్వైపాక్షిక భేటీ నిర్వహించిన జిన్పింగ్.. రాత్రి జరిగిన గాలా డిన్నర్కు దూరంగా ఉండటం ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.కాగా, ప్రధాని మోదీ శనివారం బ్రిక్స్ దేశాల అధినేతలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల కోసం విందును ఏర్పాటు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా పలువురు నేతలు హాజరయ్యారు. అయితే జిన్పింగ్ మాత్రం విందుకు రాలేదు. ఆయన ఎందుకు హాజరుకాలేదన్న దానిపై అధికారికంగా ఎలాంటి కారణం వెల్లడికాలేదు. అయితే ఓ వర్గం సమాచారం ప్రకారం.. సదస్సు కార్యక్రమాల తర్వాత జిన్పింగ్ హోటల్కు వెళ్లి విశ్రాంతి తీసుకున్నట్లు తెలుస్తోంది.మరోవైపు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ కూడా విందుకు హాజరుకాలేదు. అయితే ఆయన సదస్సు కార్యక్రమాల్లో పాల్గొని స్వదేశానికి తిరిగి వెళ్లారు. జిన్పింగ్ గైర్హాజరుపై కారణం స్పష్టత లేకపోవడంతో ఆయన నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఏడేళ్ల తర్వాత భారత్లో అడుగుపెట్టిన జిన్పింగ్.. మోదీతో డిన్నర్కు దూరంగా ఉండటం ఆసక్తిని రేపుతోంది. అయితే ఇది కేవలం విశ్రాంతి కోసమేనా.. లేక మరేదైనా కారణమా అన్నది మాత్రం అధికారికంగా తేలాల్సి ఉంది.ఇదిలా ఉండగా.. నిన్న (సెప్టెంబర్ 12) మోదీ-జిన్పింగ్ మధ్య సుమారు 50 నిమిషాల పాటు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ప్రధానంగా సరిహద్దు వివాదం, వాణిజ్య లోటు, మార్కెట్ యాక్సెస్, సరఫరా చైన్, రవాణా-ప్రజల మధ్య సంబంధాలు ప్రస్తావనకు వచ్చాయి. ముఖ్యంగా సరిహద్దు విషయంలో న్యాయబద్ధమైన, సహేతుకమైన, పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం పనిచేయాలని ఇద్దరూ అంగీకరించారు. మోదీ ఇప్పటికే ఉన్న సరిహద్దు ఒప్పందాలు, అవగాహనలను గౌరవించాలని స్పష్టం చేశారు. ఇక ఆర్థిక అంశాల్లో భారత్-చైనా మధ్య వాణిజ్య అసమతుల్యతను తగ్గించడం, మార్కెట్ యాక్సెస్ను సులభతరం చేయడం, సప్లై చెయిన్ సమస్యలను పరిష్కరించడంపై చర్చ జరిగింది. రెండు దేశాల మధ్య విమానాలు, వీసాలు, కైలాస్ మానసరోవర్ యాత్ర వంటి సంబంధాలు కూడా క్రమంగా పునరుద్ధరిస్తున్నాయి.ఇదీ చదవండి: సముద్రం అడుగున బంగారు ఖజానా.. చైనా సంచలన అన్వేషణ! -
పీఎం మ్యూజియం, బ్రిక్స్ బజార్ను సందర్శించిన పెజెష్కియాన్ కుమార్తె
న్యూఢిల్లీ: బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్తోపాటు భారత్ మండపానికి విచ్చేసిన ఆయన కుమార్తె జహ్రా శనివారం ఢిల్లీలోని ‘ప్రధానమంత్రి మ్యూజియం’, బ్రిక్స్ బజార్లను సందర్శించారు. ప్రధానిమ్యూజియంలో ప్రజాస్వామ్య ఘనచరితను, భారతదేశ సాంస్కృతిక వారసత్వం తాలూకు విశేషాలను ఆమె తెల్సుకున్నారు. శిఖరాగ్ర సదస్సు జరిగే మండపానికి సమీపంలోని నేషనల్ క్రాఫ్స్ మ్యూజియంను సైతం ఆమె సందర్శించారు. అక్కడి బ్రిక్స్ బజార్లో ఆమె కలియతిరిగారు. చేతి వృత్తి కళాకారులు, సంప్రదాయక వస్తువుల విశేషాలను అడిగి తెల్సుకున్నారు. జహ్రా పెజెష్కియాన్ బ్రిక్స్ బజార్ను ఎంతో ఆసక్తిగా చూశారని ఆమెకు అక్కడ స్వాగతం పలికిన కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి చెప్పారు. బ్రిక్స్ బజార్లో బ్రెజిల్ మృణ్మయ పాత్రలు మొదలు బెలారస్లో విల్లో చెట్ల కొమ్మలతో అల్లిన కళాకృతులదాకా బ్రిక్స్ దేశాలకు చెందిన సంపద్రాయక వస్తువులను ప్రదర్శనకు ఉంచారు. తీన్ మూర్తి భవన్ కాంప్లెక్స్లోని మ్యూజియంను ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ జూనియర్ సతీమణి లీజా అరానేటా కూడా సందర్శించారు. -
బ్రిక్స్ ఎఫెక్ట్..! దేశ రాజధానిలో హోటళ్లకు ఫుల్ డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు హోటల్ పరిశ్రమకు భారీ డిమాండ్ను తీసుకొచ్చింది. ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు జరుగుతున్న ఈ సదస్సుకు వివిధ దేశాల అధినేతలు, దౌత్యవేత్తలు, మంత్రులు, ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో, ఢిల్లీ–ఎన్సీఆర్ పరిధిలో హోటల్ గదులకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. సుమారు 3 వేల గదులు బుక్కయినట్లు సమాచారం. హోటల్ గది అద్దెలు కూడా భారీగానే పెరిగాయి. రూ.80 వేల నుంచి రూ.2.3 లక్షల దాకాసాధారణ రోజుల్లో ఫైవ్స్టార్ హోటళ్లలో రూ.10వేల నుంచి రూ.18 వేల వరకు ఉండే లగ్జరీ హోటల్ గది అద్దె ప్రస్తుతం రూ.80 వేలు, అంతకంటే ఎక్కువకు చేరినట్లు హాస్పిటాలిటీ రంగ వర్గాలు వెల్లడించాయి. మరికొన్ని ఫైవ్స్టార్, సెవెన్ స్టార్ హోటళ్లలో రోజుకు రూ.18వేల నుంచి రూ.25 వేల వరకు అద్దె వసూలు చేసే హోటళ్లు ఇప్పుడు రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. హోటల్ ఐటీసీ మౌర్యాలో గదికి 11, 12వ తేదీల్లో కేవలం ఒకే ఒక్క రాత్రికిగాను ఏకంగా రూ.2.30 లక్షల బిల్లు వేయడం గమనార్హం. కొన్ని హోటళ్లలో గదులు పూర్తిగా బుక్ కాగా, మరికొన్ని చోట్ల గదులు అందుబాటులో లేకుండా పోయాయి. సదస్సు ముగిసిన తర్వాత కూడా కొంతకాలం ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని, దాదాపు సెప్టెంబర్ 20 వరకు టారిఫ్లు అధికంగానే ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. హోటల్ ‘ఐటీసీ మౌర్య’లో రష్యా అధ్యక్షుడు పుతిన్ బస చేస్తున్న క్రమంలో ఆయన దృష్టిని ఆకర్షించేందుకు వారం రోజుల ముందే దేశంలోని సంపన్న వర్గాలకు చెందిన వారు సైతం ఆ హోటల్లో ప్రైవేటు గదులను బుక్ చేసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ బస చేసిన తాజ్ ప్యాలెస్లోని గదులకూ డిమాండ్ ఆకాశాన్నంటింది.సెంట్రల్ ఢిల్లీకే పరిమితం కాని డిమాండ్బ్రిక్స్ శిఖరాగ్రం ప్రభావం కేవలం సెంట్రల్ ఢిల్లీలోని ఒబెరాయ్, తాజ్ ప్యాలెస్, లీలా ప్యాలెస్ వంటి ఫైవ్స్టార్ హోటళ్లకే పరిమితం కాలేదు. ఏరోసిటీ, గురుగ్రామ్, నోయిడా ప్రాంతాల్లోని హోటళ్లకూ భారీగా బుకింగ్స్ వచ్చాయి. అనేక హోటళ్లలో గదుల లభ్యత దాదాపు లేనట్లు సమాచారం. ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ సభ్యుడు రాజన్ సెహగల్ మాట్లాడుతూ.. బ్రిక్స్ సదస్సు భారత్ ఆతిథ్య, పర్యాటక రంగానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించే గొప్ప అవకాశమని అన్నారు. ప్రపంచ దేశాల అధినేతలు, భారీ ప్రతినిధి బృందాలతో భారత్కు వస్తున్నప్పుడు హోటళ్లలో డిమాండ్ పెరగడం సహజమేనని తెలిపారు. ల్యూటెన్స్ ఢిల్లీతో పాటు ఎన్సీఆర్లోని హోటళ్లు కూడా భారీ బుకింగ్స్తో కళకళలాడుతున్నాయని చెప్పారు.అధినేతల కోసం అత్యున్నత స్థాయి గదులుదేశాధినేతలు, మంత్రులు, సీనియర్ దౌత్యవేత్తలు, ఉన్నతాధికారులు సాధారణంగా హోటళ్లలో అత్యున్నత కేటగిరీ గదులనే ఎంచుకుంటారని కేంద్ర అధికారిక వర్గాలు చెబుతున్నాయి. దీంతో పరిమిత సంఖ్యలో ఉన్న ప్రీమియం గదులకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగి అద్దెలు భారీగా పెరిగాయి. భారత ఆతిథ్యానికి ప్రపంచ వేదికబ్రిక్స్ సదస్సు కేవలం హోటల్ రంగానికి వ్యాపార అవకాశాలను కల్పించడమే కాకుండా.. ప్రపంచానికి భారతీయ సంçస్కృతి, సంప్రదాయాలు, ఆహారం, సంగీతం, నృత్యాలు, ఆతిథ్యాన్ని పరిచయం చేసేందుకు గొప్ప అవకాశమని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. భారత్ ఇప్పటికే జీ20, ఏఐ సదస్సు వంటి అంతర్జాతీయ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిందని గుర్తుచేస్తూ.. బ్రిక్స్ సదస్సుతో కూడా దేశ పర్యాటక రంగానికి మరింత అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని అంటున్నాయి.ప్రాంతీయ వంటకాలు.. సాంస్కృతిక కార్యక్రమాలుబ్రిక్స్ ప్రతినిధులకు మన దేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతీ సంప్రదాయాలు, వంటకాలను పరిచయం చేస్తున్నట్లు ఢిల్లీ హోటల్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ చైర్మన్ మురళీమణి మీడియాకు తెలిపారు. దేశంలోని ప్రతి రాష్ట్రానికీ ప్రత్యేకమైన సంçస్కృతి, ఆహార వైవిధ్యం ఉందని, అందుకు అనుగుణంగా వివిధ రకాల వంటకాలను హోటళ్లలో అందిస్తున్నట్లు చెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. బడ్జెట్ హోటళ్లలోనూ ప్రాంతీయ వంటకాలను అందించేలా హోటల్ యాజమాన్యాలకు కేంద్రం ముందుగానే సూచనలు చేసినట్లు తెలిసింది. -
భారత్ ఇన్నోవేషన్కు ప్రపంచ దేశాలు ఫిదా
సాక్షి, న్యూఢిల్లీ: 18వ ‘బ్రిక్స్’శిఖరాగ్ర సద స్సు వేదికగా భారత్ తన సాంకేతిక, పరిశోధ నా, స్టార్టప్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. దేశంలోని ఉన్నత విద్యా సంస్థలు, పరిశోధనా కేంద్రాలు, స్టార్టప్లు, ల్యాబొరేట రీలు, రీసెర్చ్ పార్క్ల నుంచి వెలువడిన అత్యాధునిక డీప్టెక్ ఆవిష్కరణలను ఈ వేదికపై ప్రదర్శించారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్వయంతో ‘బ్రిక్స్’లో ప్రదర్శన ప్రపంచ దేశాలను ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనలో దేశానికి చెందిన 37 అత్యాధునిక డీప్టెక్ ఆవిష్కరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రజారోగ్యం, వైద్యం, పునరుత్పాదక ఇంధనం, సముద్ర సాంకేతికత, విద్యుత్ వాహనాలు, మాతా–శిశు ఆరో గ్యం వంటి విభిన్న రంగాలకు చెందిన సాంకేతిక పరిష్కారాలను ఇందులో ప్రదర్శించారు. వాటిలో ము ఖ్యంగా కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యవస్థ, నీటిపై ఏర్పాటు చేసే ఫ్లోటింగ్ సోలార్ పీవీ సాంకేతికత, మెరైన్ రోబోటిక్స్, అరుదైన ఖనిజాల అవసరం లేని రేర్ ఎర్త్ ఫ్రీ ఈ–పవర్ట్రెయిన్లు, ఏఐ ఆధారిత తల్లి– గర్భస్థ శిశువు ఆరోగ్య పర్యవేక్షణ వ్యవస్థ వంటి వినూత్న పరిష్కారాలను ప్రదర్శించారు. భారత్ ఉన్నత విద్యా వ్యవస్థలో రూపుదిద్దు కుంటున్న ఆవిష్కరణలకు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా కేంద్రం పే ర్కొంది. దేశంలోని స్టార్టప్లు, ఉన్నత విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలు, ప్రయోగ శాలలు, రీసెర్చ్ పార్క్లను ప్రపంచంలోని కార్పొరేట్ సంస్థలు, పెట్టుబడిదారులు, ఇంక్యుబేటర్లు, యాక్సిలరేటర్లు, విశ్వవిద్యాల యాలు, పరిశోధనా సంస్థలు, ప్రభుత్వాలు, విదేశాల్లోని భారతీయ పూర్వ విద్యార్థుల నెట్వర్క్తో అనుసంధానం చేయడానికి ఇది ఉపయోగపడనున్నట్లు వేదిక సందర్భంగా కేంద్రం పేర్కొంది. ఈ వేదిక ద్వారా భారత ఆవిష్కర్తలకు కేవలం తమ సాంకేతికతను ప్రదర్శించే అవకాశమే కాకుండా పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలు, వ్యాపార ఒప్పందాలు, అంతర్జాతీయ విపణిలోకి ప్రవేశం వంటి అవకాశాలు లభించనున్నాయి.‘బ్రిక్స్’ బిజినెస్ ఫోరంతో..శుక్ర, శనివారాల్లో జరిగిన ‘బ్రిక్స్’ బిజినెస్ ఫోరం కార్యక్రమంతో ఈ ప్రదర్శనను అను సంధానం చేశారు. దీంతో ‘బ్రిక్స్’ సభ్య దేశాలకు చెందిన సీఈఓలు, పెట్టుబడి దారులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపార ప్రముఖులు, పరిశ్రమ ప్రతినిధులతో భారతీయ స్టార్టప్లు నేరుగా పరిచయం ఏర్పరుచుకునే అవకాశం లభించింది. బిజినెస్–టు–బిజినెస్(బీ2బీ) సమావేశాలు, టెక్నాలజీ భాగస్వామ్యాలు, పెట్టుబడి చర్చలు, వ్యాపార సంబంధాల ఏర్పాటు అంశాలకు ఈ వేదిక దోహదపడిందని కేంద్రం పేర్కొంది. భారత్ 2026 ‘బ్రిక్స్’ అధ్యక్షతన నిర్దేశించిన ‘బిల్డింగ్ ఫర్ రెసిలియెన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టెయినబి లిటీ’ అనే థీమ్కు అనుగుణంగా ఈ ప్రదర్శనను నిర్వహించారు. బిక్స్ ఎడ్యుకేషన్ ట్రాక్లో గుర్తించిన ఐదు ప్రాధాన్య రంగాల్లో ఒకటైన ‘పరిశోధన, ఆవిష్కరణలు, స్టార్టప్ ఎకోసిస్టమ్లను బలోపేతం చేయడం’ లక్ష్యాన్ని ఈ ప్రదర్శన ముందుకు తీసుకెళ్తుందని కేంద్రం తెలిపింది. 2026లో భారత డీప్టెక్ స్టార్టప్ల కోసం నిర్వహిస్తున్న ప్రధాన ఎక్స్పోజిషన్లలో ఇది రెండోది. తొలి ‘భారత్ ఇన్నోవేట్స్’ కార్యక్రమాన్ని ఫ్రాన్స్లోని నీస్ నగరంలో జూన్ 14 నుంచి 16 వరకు నిర్వహించారు. తాజాగా బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఢిల్లీలో జరుగుతున్న ఈ రెండో ఎడిషన్ ద్వారా భారత ఆవిష్క రణలను ‘బ్రిక్స్’ దేశాల నాయకులు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, పరిశ్రమల దృష్టికి తీసికెళ్లడం గమనార్హం.ఆవిష్కర్తలతో విద్యాశాఖ మంత్రి ముచ్చటకేంద్ర విద్యా శాఖ మంత్రి ప్రల్హాద్ జోషి భారత్ మండపంలోని ఎక్స్ పోజిషన్ను సందర్శించి డీప్టెక్ స్టార్టప్లు, ఆవిష్కర్తలతో మాట్లా డారు. వివిధ రంగాల్లో భారతీయ యువ ఆవిష్కర్తలు రూపొందించిన అత్యాధునిక సాంకేతిక పరిష్కారాలను ఆయన పరిశీలించారు. భారత ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలోని డీప్టెక్ స్టార్టప్లకు అంతర్జాతీయ స్థాయి వేదిక లభిస్తోందని జోషి పేర్కొన్నారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనే ప్రపంచ నాయకుల ముందు భారతీయ స్టార్టప్లు తమ ప్రతిభ, సాంకేతిక సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు ఈ వేదిక ప్రత్యేక అవకాశాన్ని కల్పించిందని వ్యాఖ్యానించారు. -
స్నేహగీతం..!
న్యూఢిల్లీ: బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో అత్యంత విశేషమైన ఘట్టం చోటుచేసుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ తన కుడివైపున రష్యా అధ్యక్షుడు పుతిన్తో, ఎడమ వైపున చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో చేతులు కలిపి చిరునవ్వులు చిందించారు. ముగ్గురు నేతలు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. తామంతా ఐక్యంగా ముందుకు సాగుతున్నామని ప్రపంచానికి చాటిచెప్పారు. సరిహద్దు వివాదాలు, విభేదాలు ఉన్నప్పటికీ భారత్, చైనా మధ్య అనుబంధం చెక్కుచెదరలేదని మోదీ సంకేతాలిచ్చారు. శనివారం బ్రిక్స్ సదస్సు జరిగిన భారత్ మండపం వద్ద తీసిన ఈ చిత్రాన్ని ప్రధానమంత్రి ఇన్స్టా్రగామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ ఫొటోకు ‘కింగ్డమ్ బీజీఎం’అనే పాట నేపథ్య సంగీతంగా వినిపిస్తోంది. ముగ్గురు దేశాధినేతల స్నేహగీతం సదస్సు వేదిక వద్ద అందరినీ ఆకట్టుకుంది. ఆప్యాయతతో కూడిన ఈ క్షణం ప్రత్యేకంగా నిలిచింది. మోదీ సోషల్ మీడియాలో మరికొన్ని ఫొటోలను సైతం మోదీ పోస్ట్ చేశారు. పుతిన్, షీ జిన్పింగ్లతోపాటు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాతో దిగిన చిత్రాలున్నాయి. మరొక చిత్రంలో పుతిన్, షీ జిన్పింగ్, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోలతో మోదీ ఉత్సాహంగా చర్చిస్తూ కనిపించారు. -
రూల్స్ మనమే రూపొందించాలి
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వాణిజ్య ఘర్షణలు, భౌగోళిక రాజకీయ అస్థిరతలు పెరుగుతున్న నేపథ్యంలో గ్లోబల్ సౌత్ దేశాలు ‘నియమాలను రూపొందించేవిగా’మారాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. ప్రపంచ పాలనలో ప్రస్తుతం ఉన్న ‘విశేషాధికారాల పిరమిడ్’స్థానంలో ‘భాగస్వామ్య వేదిక’కావాలని తేల్చిచెప్పారు. రెండు రోజుల బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు శనివారం మధ్యాహ్నం ఢిల్లీలోని భారత్ మండపంలో అట్టహాసంగా మొదలైంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. బ్రిక్స్ చట్రం కింద ప్రపంచ పాలనా సంస్కరణల కోసం 10 పాయింట్ల రోడ్మ్యాప్ను ప్రతిపాదించారు. ప్రపంచ, ప్రాంతీయ సంక్షోభాల వల్ల అధిక ముప్పును ఎదుర్కొంటున్న నావికుల రక్షణ కోసం ‘సీఫేరర్స్ ఎమర్జెన్సీ సపోర్ట్ నెట్వర్క్’ఏర్పాటు చేయాలని చెప్పారు. బ్రిక్స్ సదస్సులో చైనా అధినేత షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం, ఇండోనేసియా ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంతో, అబూదాబీ యువరాజు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్–సిసీ తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది బ్రిక్స్కు భారత్ నేతృత్వం వహిస్తోంది. కీలకమైన ప్రపంచ సంస్థగా బ్రిక్స్ బ్రిక్స్ కూటమి ఒక కీలకమైన ప్రపంచ సంస్థగా ఆవిర్భవించిందని ప్రధాని మోదీ హర్షం వ్యక్తంచేశారు. తీవ్రమైన ప్రపంచ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి రాబోయే 20 ఏళ్లలో కూటమికి ఒక నూతన, ప్రతిష్టాత్మక ఎజెండా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రపంచ పాలనా వ్యవస్థ ఒక పిరమిడ్ను పోలి ఉందని చెప్పారు. అధికారం, నిర్ణయాధికారం పైస్థాయిలో కేంద్రీకృతమై ఉండగా, కింది స్థాయిలోని దేశాలు ఆ నిర్ణయాల ప్రభావానికి లోనవుతున్నాయి తప్ప వాటిని ప్రభావితం చేయలేకపోతున్నాయని వెల్లడించారు. నేడు ప్రపంచ సంక్షోభాలను ఎదుర్కోవడంలో ‘గ్లోబల్ సౌత్’ముందు వరుసలో ఉన్నప్పటికీ, నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం వెనుకంజలోనే ఉందన్నారు. అందుకే విశేషాధికారాల పిరమిడ్ స్థానంలో అన్ని దేశాలతో కూడిన భాగస్వామ్య వేదికను తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. ప్రతి దేశానికీ గళం వినిపించే అవకాశం ఉండాలన్నారు. ప్రతి ప్రయత్నానికీ మానవాళి అభివృద్ధే కేంద్ర బిందువుగా ఉండేలా చూడాలని తెలిపారు. ఉమ్మడిగా రోడ్మ్యాప్ మానవాళి సంక్షేమం కోసం బ్రిక్స్ కూటమి సంస్కరణ ప్రణాళికా చట్రం పరిధిలోనే ప్రపంచ పాలనా సంస్కరణల కోసం 10 అంశాలతో కూడిన రోడ్మ్యాప్ను ఉమ్మడిగా రూపొందించాలని మోదీ ప్రతిపాదించారు. తదుపరి శిఖరాగ్ర సమావేశం నాటికి ఈ రోడ్మ్యాప్ను ఖరారు చేయాలని పేర్కొన్నారు. ఈ విషయంలో మనం మూడు కీలక అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. ‘ప్రాతినిధ్యం, స్పందించే గుణం, నియమావళి రూపకల్పన’అవసరమని చెప్పారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలను ఇకపై వాయిదా వేయలేమని, దీనికి సంబంధించిన చర్చలను ఒక నిర్దిష్ట కాలపరిమితితో స్పష్టమైన ఫలితాల దిశగా ముందుకు తీసుకెళ్లాలని వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఆర్థిక సంస్థల్లో ఓటింగ్ అధికారం, నాయకత్వ స్థానాలు, విధానపరమైన ప్రాధాన్యతలు నేటి ఆర్థిక వాస్తవాలకు అనుగుణంగా ఉండాలన్నారు. ప్రపంచ ఆర్థిక వృద్ధిని ముందుకు నడిపించే దేశాలు ప్రపంచ ఆర్థిక పాలనను తీర్చిదిద్దడంలోనూ తగిన పాత్ర పోషించాలని సూచించారు. భవిష్యత్తులో ప్రపంచ నియమాలను నిర్ణయించడంలో సమాన భాగస్వామ్యాన్ని కల్పించడం అత్యంత కీలకమని తేల్చిచెప్పారు. కృత్రిమ మేధస్సు, సైబర్ స్పేస్, అంతరిక్షం, బయోటెక్నాలజీ, కీలక సాంకేతికతల వంటి రంగాలు భవిష్యత్తు అవకాశాలను తీర్చిదిద్దడమే కాకుండా, భవిష్యత్తు నియమాలను కూడా నిర్దేశిస్తున్నాయన్నారు. గ్లోబల్ సౌత్ దేశాలు ఇక కేవలం నియమాలను పాటించేవారి స్థాయిలో ఉండడానికి వీల్లేదన్నారు. నియమాలను రూపొందించే స్థాయికి ఎదగాలని స్పష్టంచేశారు. ఏకాభిప్రాయంతో ముందుకు సాగుతాం బ్రిక్స్ కూటమి ఎవరికీ వ్యతిరేకం కాదని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఈ ఏడాది బ్రిక్స్ 20వ వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని చెప్పారు. మానవ జీవితంలో 20 ఏళ్ల వయస్సు అనేది పరిపక్వత, బాధ్యతతో కూడిన ఒక కొత్త దశకు ఆరంభమని వ్యాఖ్యానించారు. బ్రిక్స్ కూడా పరిపక్వత సాధించే దశకు చేరుకుందని, ప్రపంచ వేదికపై క ప్రత్యేక గుర్తింపును సాధించిందని అన్నారు. తాము ఇతరుల ఆకాంక్షలను గౌరవిస్తామని, ఏకాభిప్రాయంతో ముందుకు సాగుతామని వివరించారు. ఎవరినో వ్యతిరేకించడం ద్వారా కాకుండా అందరినీ కలుపుకొని వెళ్లడం ద్వారా పురోగతి సాధించడానికి కృషి చేస్తామన్నారు. కూటమిలో మనకున్న ఐక్యతను, ఏకాభిప్రాయాన్ని ప్రపంచ వేదికపై ప్రత్యక్ష ఫలితాలుగా మార్చుకోవాలని సూచించారు. రాబోయే 20 ఏళ్లకు సంబంధించిన బలమైన ఎజెండాపై మనం కృషి చేయాలన్నారు. బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు ఏటా మారుతున్నప్పటికీ అది మన సంస్థాగత పురోగతికి ఆటంకం కలిగించకూడదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈరోజు ఆమోదించిన ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’మన ఉమ్మడి సంకల్పానికి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందన్నారు. ఈ తీర్మానాలను స్పష్టమైన ఫలితాలుగా మార్చడం మన బాధ్యత అని ఉద్బోధించారు. 10 పాయింట్ల రోడ్మ్యాప్ 1. నియమాలను పాటించేవారి నుంచి నియమాలను రూపొందించేవారిగా బ్రిక్స్ ఎదగడం 2. ప్రపంచ సంస్థల్లో సంస్కరణలు 3. బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారం బలోపేతం 4. కూటమి అధ్యక్షులు మారినప్పటికీ నిర్ణయాలు కొనసాగింపు 5. కూటమి నిర్ణయాల అమలుపై దృష్టి 6. వాణిజ్యం, పెట్టుబడులను ప్రోత్సహించడం 7. సాంకేతిక సహకారాన్ని మరింత విస్తరింపజేసుకోవడం 8. అభివృద్ధి భాగస్వామ్యాలను బలోపేతం చేయడం 9. గ్లోబల్ సౌత్కు మరింత ప్రాధాన్యత ఇవ్వడం 10. ప్రపంచ వేదికపై బ్రిక్స్ను మరింత సమర్థవంతంగా మార్చడం -
వడివడిగా ఆదిలాబాద్ ఎయిర్పోర్టు పనులు
సాక్షి, న్యూఢిల్లీ: రక్షణ, వాణిజ్యపరంగా అత్యంత వ్యూహాత్మకమైన ఆదిలాబాద్ విమానాశ్రయ ప్రాజెక్టు పనులను వేగంగా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు పురోగతిపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో శనివారం ఢిల్లీలో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ భేటీలో పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డితోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కిషన్రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రాజెక్టు అమలును పకడ్బందీగా, వేగవంతంగా పూర్తి చేసేందుకు రక్షణ శాఖ, పౌరవిమానయాన శాఖ, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక్కో నోడల్ అధికారిని వచ్చే వారంలోగా నియమించాలని సమావేశంలో నిర్ణయించారు. అలాగే ప్రాజెక్టు డీపీఆర్, మాస్టర్ ప్లాన్ రూపకల్పన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని తీర్మానించారు. ఉత్తర తెలంగాణలో పౌర విమానయాన మౌలిక వసతుల కల్పనతోపాటు ప్రాంతీయ వైమానిక అనుసంధాన మెరుగుదలకు ఈ ప్రాజెక్టు బాటలు వేస్తుందని కిషన్రెడ్డి పేర్కొన్నారు.రక్షణ శాఖ సంపూర్ణ సహకారం..దేశ రక్షణపరంగా వ్యూహాత్మక ప్రాంతమైన ఆదిలాబాద్లో జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్, ఎయిర్ఫోర్స్ స్టేషన్ అభివృద్ధికి రక్షణ శాఖ సిద్ధంగా ఉందని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన పూర్తి సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు ఉత్తర తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరే దిశగా కీలక ముందడుగు పడిందని కిషన్రెడ్డి తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 17న రక్షణ, పౌర విమానయాన శాఖల అధికారులు ఆదిలాబాద్ విమానాశ్రయ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్ కోసం 2.75 కిలోమీటర్ల పొడవైన రన్వే నిర్మాణం అవసరమని తేల్చారు. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ఫోర్స్ అధీనంలో 369.45 ఎకరాల భూమి అందుబాటులో ఉండటంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో 1,500 ఎకరాల భూసేకరణ చేయాలని అధికారులు నిర్ణయించారు. -
విషాదం.. విమానం ఎగరడానికి కొన్ని గంటల ముందే..
ఢిల్లీ: ఓ స్టార్ హోటల్ రూమ్లో ఎయిరిండియా పైలట్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన వసంత్ కుంజ్లో ఉన్న స్టార్ హోటల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం, ఫ్లైట్ కెప్టెన్గా పనిచేస్తున్న ఆ వ్యక్తి ది గ్రాండ్ హోటల్లోని తన గదిలో అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడిని సన్నీ అసల్దేకర్గా పోలీసులు గుర్తించారు.పైలట్ సెప్టెంబర్ 10న హోటల్లో చెక్-ఇన్ చేశారు. మరుసటి రోజు ఆయన ఫోన్ కాల్స్కు స్పందించకపోవడంతో ఆయన సోదరుడు హోటల్ మేనేజర్ను సంప్రదించాడు. దీంతో మేనేజర్ గదికి వెళ్లగా.. తలుపు లోపలి నుంచి లాక్ చేసి ఉంది. మాస్టర్ కీ సహాయంతో తలుపు తెరిచి చూడగా పైలట్ స్పందన లేకుండా కనిపించారు. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో ఆయనకు పోస్టుమార్టం నిర్వహించారు. మరణానికి కచ్చితమైన కారణం తెలియలేదు. పోస్ట్మార్టమ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.ఇవాళ (శనివారం) తెల్లవారుజామున విధులకు ఆయన హాజరు కావాల్సి ఉంది. ఢిల్లీ నుంచి సియోల్కు వెళ్లే విమానాన్ని నడపాల్సి ఉంది. గుండెపోటు కారణంగానే ఆయన మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నాయి. పైలట్ గతంలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో పనిచేశారు. కొద్ది నెలల క్రితమే ఎయిర్ ఇండియాకు మారారు.ఇదీ చదవండి: ‘రష్యా ప్రళయ విమానం’లో ఏముంది? -
చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ప్రధాని మోదీ భేటీ
ఢిల్లీ: చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. సరిహద్దు వివాదాలు, పెట్టుబడులు, ఇతర అంశాలపై చర్చించారు. ఏడేళ్ల తర్వాత భారత్కు వచ్చిన చైనా అధ్యక్షుడు జిన్పింగ్.. భారత్తో దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యం అవసరమన్నారు. అభివృద్ధి అంశాలపైన కలిసి పని చేయాలని.. తరచుగా సమావేశాలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ప్రపంచ శాంతికి భారత్ చైనా సంబంధాల బలోపేతం అవసరం. ఇండియా, చైనా దీర్ఘకాలిక సంబంధాలపైన దృష్టి సారించాలి. ప్రపంచశాంతికి భారత్- చైనా సంబంధాల బలోపేతం అవసరం. మన దేశాల బలబలలు అందరికీ తెలుసునని జిన్పింగ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. నిర్మాణాత్మక చర్చలకు సిద్ధమన్నారు. విస్తృతమైన అంశాల పైన ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్న మోదీ.. బ్రిక్స్ అధ్యక్షతకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.తొలి రోజు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ముగిసింది. ఢిల్లీ డిక్లరేషన్ను “బ్రిక్స్” శిఖరాగ్ర సదస్సు ఆమోదించింది. శాంతి చర్చలకు కట్టుబడి ఉన్నట్లు సంయుక్త ప్రకటన చేశాయి. యుద్ధాలు, ఘర్షణలు, సమస్యల మూలాలను పరిష్కరించాలన్న బ్రిక్స్ దేశాలు.. ఏకపక్షంగా సుంకాల విధింపు పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని బ్రిక్స్ దేశాల కూటమి పిలుపునిచ్చాయి.ఇదీ చదవండి: భారత్కు పుతిన్.. ‘రష్యా ప్రళయ విమానం’లో ఏముంది? -
భారత్కు పుతిన్.. ‘రష్యా ప్రళయ విమానం’లో ఏముంది?
ఒకేలా కనిపించే రెండు విమానాలు.. కానీ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ విమానంలో ఉన్నారో ఎవరికీ తెలియదు.. అత్యాధునిక భద్రతా వ్యవస్థలు.. రహస్య కమ్యూనికేషన్ టెక్నాలజీ, అత్యవసర పరిస్థితుల్లో మొబైల్ కమాండ్ సెంటర్గా మారే సామర్థ్యం.. ఇవన్నీ కలగలిసిన పుతిన్ ‘డూమ్స్డే ప్లేన్’ ఇప్పుడు భారత్లో హాట్ టాపిక్గా మారింది. బ్రిక్స్ సదస్సు కోసం పుతిన్ ఢిల్లీకి చేరుకోవడంతో అసలు ఈ ‘ఫ్లయింగ్ క్రెమ్లిన్’లో ఏముంది అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్లో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు శుక్రవారం తెల్లవారుజామున న్యూఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన సహకారం విస్తరణపై చర్చించారు. ప్రపంచంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన నాయకులలో ఒకరైన రష్యా అధ్యక్షుడు కఠిన భద్రతా ఏర్పాట్ల మధ్య విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన ప్రయాణించే విమాన శ్రేణిలో ఒకేలా ఉండే రెండు విమానాలు ఉంటాయి. వాటిలో ఒకటి 'డికాయ్'.. అత్యంత సురక్షితమైన ప్రత్యేక అధ్యక్ష విమానం('ఇల్యుషిన్ IL-96-300PU). దీనినే ఫ్లయింగ్ క్రెమ్లిన్ లేదా డూమ్స్డే ప్లేన్ అని కూడా పిలుస్తారు.రష్యా అధ్యక్షుడు ప్రయాణించేందుకు ఒకేలా ఉండే రెండు ఇల్యుషిన్ IL-96-300PU విమానాలను ఉపయోగిస్తారు. రష్యా అధ్యక్షుడు ఏ విమానంలో ఎక్కారనేది ఎవరికీ తెలియకుండా ఉండటానికి ఈ రెండు విమానాలు ఒకేసారి గాల్లోకి ఎగురుతాయి. మాస్కోకు ఈ డబుల్-షీల్డ్ భద్రత కొత్త వ్యూహం కాదు. అదనపు భద్రత కోసం పుతిన్ గతంలో కూడా ఇతర దేశాలకు ఇలాగే ప్రయాణించారు.1980లలో ఇల్యుషిన్ డిజైన్ బ్యూరో చేత అభివృద్ధి చేయబడిన ఈ విమానం.. రష్యా అధ్యక్షుడికి అత్యంత సురక్షితమైన కమాండ్ సెంటర్గా పనిచేస్తుంది. సుదూర ప్రాంతాలకు వెళ్లగల నాలుగు ఇంజిన్ల రష్యన్ విమానం ఇది. అత్యంత ప్రమాద పరిస్థితుల నుంచి రష్యా అగ్ర నాయకత్వాన్ని రక్షించేలా దీనిని రూపకల్పన చేశారు. సుదూర ప్రయాణాలు చేసే IL-96 ప్లాట్ఫారమ్పై నిర్మించిన ఈ "ఫ్లయింగ్ క్రెమ్లిన్"లో అవిాద్విగటెల్ PS-90A టర్బోఫాన్ ఇంజిన్లు ఉన్నాయి. ఇది ఒకేసారికీ సుమారు 11,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. దీనివల్ల సుదీర్ఘ ప్రయాణాలలో పదే పదే ఇంధనం నింపాల్సిన అవసరం ఉండదు. ఈ విమానం పొడవు 55.35 మీటర్లు కాగా.. దీని రెక్కల వెడల్పు 60.12 మీటర్లు. అధ్యక్షుడి ప్రయాణాలన్నింటినీ పర్యవేక్షించే రష్యా ప్రత్యేక విమాన స్క్యాడ్రన్ దీనిని నడుపుతుంది.జాతీయ అత్యవసర పరిస్థితుల్లో IL-96-300PU పూర్తి స్థాయి మొబైల్ కమాండ్ సెంటర్గా పనిచేయగలదు. ఇది ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సైనిక, నిఘా, ప్రభుత్వ నెట్వర్క్లను సురక్షితంగా సంప్రదించగల ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ వ్యవస్థలను కలిగి ఉంది. ఈ విమానంలో రాడార్-జామింగ్ సాంకేతికత ఉంది. అంతేకాకుండా ఇది అధునాతన రక్షణాత్మక వ్యవస్థలను కలిగి ఉంటుంది. అంతరాయం లేని, సురక్షితమైన సంభాషణను కొనసాగించడానికి శాటిలైట్ లింక్లు, రక్షిత రేడియో, డేటా ఛానెల్లను కూడా ఇది కలిగి ఉంది.భద్రతతో పాటు, ఈ "ఫ్లయింగ్ క్రెమ్లిన్" విలాసవంతంగా కూడా రూపుదిద్దుకుంది. ఇందులో బెడ్రూమ్లతో కూడిన ప్రైవేట్ ప్రెసిడెన్షియల్ సూట్, విలాసవంతమైన బాత్రూమ్లు, ప్రైవేట్ కిచెన్, డైనింగ్ ఏరియాలు, బోర్డ్రూమ్ సీటింగ్తో కూడిన పెద్ద సమావేశ మందిరం ఉన్నాయి. ఇవి కాకుండా ఈ విమానంలో బంగారంతో పూత పూసిన ఫిట్టింగ్లు, ఆకర్షణీయమైన కలప, ప్రీమియం లెదర్, అప్హోల్స్టరీ తదితర విలాసవంతమైన సదుపాయాలు ఉన్నాయి. ఇదీ చదవండి: జైలులో తనిఖీలు.. ఫోన్తో దొరికేసిన ప్రజ్వల్ రేవణ్ణ -
బ్రిక్స్ సదస్సు: భారత్లో అడుగుపెట్టిన జిన్పింగ్
సాక్షి, న్యూఢిల్లీ: బ్రిక్స్ శిఖరాగ సదస్సు-2026లో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు జీ జింగ్పిన్ ఢిల్లీకి చేరుకున్నారు. శనివారం ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న ఆయన భారత అధికారులు స్వాగతం పలికారు. బ్రిక్స్లో భాగంగా.. సాయంత్రం జిన్పింగ్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక భేటీ నిర్వహించనున్నారు. పాలమ్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయిన ఎయిర్ చైనా ప్రత్యేక విమానంలో జిన్పింగ్తో పాటు సుమారు 400 మందితో కూడిన భారీ బృందం భారత్కు వచ్చింది. భారత అధికారులు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలతో సాదర స్వాగతం పలికారు. మోదీతో జరిగే ద్వైపాక్షిక భేటీలో వాణిజ్యం, పెట్టుబడులు, ఇరు దేశాల సంబంధాల మెరుగుదలతో పాటు వాస్తవాధీన రేఖ (LAC) పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది.New Delhi: Chinese President Xi Jinping arrives in New Delhi to attend the 18th BRICS Summit https://t.co/jqG0LAC3Rw pic.twitter.com/QG6cB1BtXH— IANS (@ians_india) September 12, 2026గాల్వాన్ ఘటన నేపథ్యంలో.. దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత్కు రావడం గమనార్హం. ఆ భేటీలో ఇరు దేశాల మధ్య సంబంధాలు, పరస్పర సహకారం వంటి కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించే అవకాశం ఉంది. ఢిల్లీ భారత్ మండపం వేదికగా 18వ బ్రిక్స్ సదస్సు ఇవాళ మధ్యాహ్నాం 2గం.లకు ప్రారంభం కానుంది. ఇవాళ, రేపు ఆ సమావేశాలు జరగనున్నాయి. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ భారత్ పర్యటనకు ముందు బీజింగ్ కీలక సందేశం ఇచ్చింది. రెండు దేశాలు పరస్పర విశ్వాసాన్ని పెంచుకుని, సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని చైనా పేర్కొంది. భారత్–చైనా సంబంధాలు సుస్థిరంగా, ఆరోగ్యకరంగా అభివృద్ధి చెందడం ఇరు దేశాల ప్రయోజనాలకు మాత్రమే కాకుండా ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి కూడా కీలకమని స్పష్టం చేసింది.ఇటు చైనా, భారత్ కలిసి ముందుకు సాగాలని భావిస్తున్నట్లు భారత్లో చైనా రాయబారి షూ ఫెంగ్హాంగ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ మార్గదర్శకత్వంలో ఇరు దేశాలు పరస్పర విభేదాలను సరిగ్గా పరిష్కరించుకుంటూ.. సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఇరాన్ అధ్యక్షుడి చేతిలో చెయ్యేసి.. -
అడ్డంకులు అధిగమించి ముందడుగు
న్యూఢిల్లీ: ప్రపంచ వాణిజ్యం అంతరాయాలు లేకుండా కొనసాగాలంటే నౌకాయాన స్వేచ్ఛ, సురక్షిత సముద్ర మార్గాలు, నావికుల భద్రత అత్యవసరమని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. పెరుగుతున్న ఆర్థిక బలాన్ని భారీ పెట్టుబడులుగా, నూతన వ్యాపార సంబంధాలుగా మార్చుకోవాలని బ్రిక్స్ సభ్య దేశాలకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఢిల్లీలో ‘బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్’లో ఆయన ప్రసంగించారు. 10 ప్రధాన వాణిజ్య అవరోధాలను గుర్తించి తొలగించాలని చెప్పారు. ప్రతి సంవత్సరం 100 బ్రిక్స్ స్టార్టప్లను ఇతర సభ్య దేశాల మార్కెట్లలోకి విస్తరించాలని, అలాగే ఏటా 1,000 కొత్త వ్యాపార భాగస్వామ్యాలను నిర్మించాలని పేర్కొన్నారు. ఈ మూడు అంశాలపై మన పురోగతిని ప్రతి ఏటా సమీక్షించుకోవాలని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యపరమైన అడ్డంకులు పెరుగుతున్నాయని గుర్తుచేశారు. ఇలాంటి అడ్డంకులను అధిగమిస్తూ మన ఆర్థిక శక్తిని నూతన వ్యాపార అవకాశాలుగా మార్చుకోవాలని స్పష్టంచేశారు. నౌకాయాన స్వేచ్ఛకు, నావికుల భద్రతకు భారత్ మద్దతిస్తోందని తెలిపారు. బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాలు ప్రస్తుతం ప్రపంచ జనాభాలో దాదాపు సగం, ప్రపంచ జీడీపీలో 40 శాతం మరియు ప్రపంచ వాణిజ్యంలో నాలుగో వంతు కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయని మోదీ గుర్తుచేశారు. గత రెండు దశాబ్దాల్లో ప్రపంచ జీడీపీ సుమారు రెండున్నర రెట్లు వృద్ధి చెందగా, బ్రిక్స్ దేశాల ఉమ్మడి జీడీపీ మాత్రం నాలుగున్నర రెట్లు పెరిగిందని హర్షం వ్యక్తంచేశారు. ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్ ప్రపంచ వ్యాపారాలకు భారతదేశం చేసే ప్రతిపాదనలో మౌలిక సదుపాయాలు, వ్యూహాత్మక సాంకేతికతలను ప్రధానాంశంగా మోదీ పేర్కొన్నారు. రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు, విమానాశ్రయాల వేగవంతమైన విస్తరణతోపాటు నౌకా నిర్మాణం, సెమీకండక్టర్లు, క్వాంటమ్ టెక్నాలజీ, కీలక ఖనిజాలు, బయోటెక్నాలజీ రంగాల్లో నూతన సామర్థ్యాలను ప్రస్తావించారు. ‘మేక్ ఇన్ ఇండియా, ఇన్నోవేట్ విత్ ఇండియా, స్కేల్ ఫర్ వరల్డ్’అన్నారు. ప్రపంచ మార్కెట్లకు భారత్ ఒక తయారీ కేంద్రంగా, సాంకేతికత, ఆవిష్కరణల కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య మరింత లోతైన సహకారం కోసం భారతదేశ డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను ఒక వేదికగా ఉపయోగించుకోవాలని సూచించారు. బ్రిక్స్ దేశాలు తమ సొంత మార్కెట్లకు అనువైన డిజిటల్ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి భారతదేశ అనుభవాన్ని వాడుకోవచ్చని అన్నారు. ఇండియాలో 2 లక్షలకు పైగా స్టార్టప్లు, 120కి పైగా యూనికార్న్లు ఉన్నాయని గుర్తుచేశారు. ఇలాంటి ఆవిష్కరణలను ప్రపంచ మార్కెట్లకు తీసుకెళ్లడంలో బ్రిక్స్ సహాయపడాలని కోరారు. వాణిజ్య అనుసంధానం అనేది మరో ప్రధాన అంశమని చెప్పారు. 2014 నుంచి భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని వెల్లడించారు. వాణిజ్య అడ్డంకులను తగ్గించడం, వ్యాపార అవకాశాలను విస్తరించడంపై బ్రిక్స్ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి చెప్పారు. -
బ్రిక్స్ సదస్సుకు దేశాధినేతలు, విశిష్ట అతిథులు
న్యూఢిల్లీ: బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సదస్సుకు కూటమి దేశాల అధినేతలతోపాటు పలువురు విశిష్ట అతిథులు హాజరు కాబోతున్నారు. శనివారం నుంచి రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సులో చైనా అధినేత షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని మోదీ, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, ఈజిప్ట్ అధినేత అబ్దెల్ ఫతాహ్ ఎల్–సిసీ, ఇండోనేíసియా ప్రెసిడెంట్ ప్రబొవో సుబియాంతో, ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీ, మలేíసియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం, సౌదీ అరేబియా యువరాజు ఫైజల్ బిన్ ఫర్హాన్ అలీ సౌద్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) రాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, బ్రెజిల్ విదేశీ వ్యవహారాల మంత్రి మౌరో వియేరా పాల్గొనబోతున్నారు. అలాగే ఉగాండా ఉపాధ్యక్షురాలు జెస్సికా అలుపో, నైజీరియా ఉపాధ్యక్షుడు సెనేటర్ కాషిమ్ షెట్టిమా, క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగెజ్ పారిల్లా, బెలారస్ విదేశాంగ మంత్రి మాక్సిమ్ రిజెన్కోవ్, వియత్నాం ప్రధానమంత్రి లే మిన్ హంగ్ మరియు కజకిస్తాన్ అధ్యక్షుడు కాస్సిమ్–జోమార్ట్ టోకాయెవ్ సైతం హాజరు కాబోతున్నారు. బ్రిక్స్ కూటమిలో గత ఏడాది బెలారస్, బొలీవియా, కజకిస్తాన్, క్యూబా, మలేíసియా, నైజీరియా, థాయ్లాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, వియత్నాం భాగస్వామ్య దేశాలుగా మారాయి. -
మా మనసులు గాయపడ్డాయి
సాక్షి, న్యూఢిల్లీ: ‘నడిరోడ్డుపై.. పట్టపగలు అందరూ చూస్తుండగా మహిళా ప్రజాప్రతినిధుల చీరలను లాగారు. గొంతు నొక్కి హత్యాయత్నానికి పాల్పడ్డారు. తెలంగాణలో పోలీసులు మాపై అత్యంత క్రూరత్వంగా వ్యవహరించారు. ప్రజా సమస్యలపై పోరాడతామని మమ్మల్ని ప్రజలు చట్టసభలకు పంపారు. కానీ, ఈరోజు మాకు జరిగిన అన్యాయంపై మేం రోడ్డెక్కి న్యాయం కోసం, సమస్య పరిష్కారానికి పోరాడాల్సి వస్తుంది. ఆఖరకు ఢిల్లీ వరకూ వచ్చి మీకు మా బాధను చెప్పుకోవాల్సి వచి్చంది’అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి జాతీయ మహిళా కమిషన్ వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే.. ప్రజాప్రజానిధులను గాయపరుస్తూ ఆందోళనకు గురిచేస్తున్నారని జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ)కి ఫిర్యాదు చేశారు. తక్షణం స్పందించి మా సమస్యను పరిష్కరించాలని, తెలంగాణలో పోలీసుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని వారు రెండు కమిషన్లకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడి, పోలీసులు వ్యవహరించిన తీరుపై శుక్రవారం ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ కిశోర్ రహత్కర్, ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ వి.రామసుబ్రమణియన్లకు రాజ్యసభ ఫ్లోర్లీడర్ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు జగదీశ్రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎంపీ దామోదర్, మాజీమంత్రి సత్యవతి రాథోడ్, బీఆర్ఎస్ లీగల్ సెల్ బృందం నుంచి బీఎస్ ప్రసాద్, సోమా భరత్, లలితారెడ్డి తదితరులతో కలిసి వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. 100 గంటలు దాటినా ఎఫ్ఐఆర్ లేదు అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి సభకు వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. నల్ల దుస్తులు ధరించడాన్ని కారణంగా చూపారని, అయితే తమ దుస్తులపై ఎలాంటి అభ్యంతరకరమైన రాతలు లేవని స్పష్టం చేశారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల పురుష పోలీసులు వ్యవహరించిన తీరు అవమానకరంగా ఉందన్నారు. చీర, జుట్టు పట్టుకొని లాగారని, ఇతర ఎమ్మెల్యేలను కిందపడేసి తొక్కారన్నారు. ‘మా మనసులు గాయపడ్డాయి. మహిళలుగా మాకు అవమానం జరిగింది. శాసనసభ్యులుగా మా హక్కులకు భంగం కలిగింది’అని సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తమపై దాడి జరిగి 100 గంటలు దాటినా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని, తిరిగి తమపైనే కేసులు పెట్టడం రాజకీయ నాటకమని విమర్శించారు. ‘మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేయించి తిరిగి వారిపైనే కేసులు నమోదు చేయడం బాధాకరం. మహిళా ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా చీరలు లాగారు’అంటూ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. మహిళా ప్రజాప్రతినిధులను అడ్డుకునేందుకు మగ పోలీసుల్ని విధుల్లో పెట్టడం, మగ ప్రజాప్రతినిధులను అడ్డుకునేందుకు మహిళా పోలీసులను పెట్టి ప్రభుత్వం రాజకీయం చేసిందని మండిపడ్డారు. మాకు రాజకీయాలతో సంబంధం లేదు దాడికి గల వీడియోలు, ఫొటోలు, న్యూస్ క్లిప్పింగులన్నీ మహిళా కమిషన్, ఎన్హెచ్ఆర్సీకి మహిళా ప్రతినిధి బృందం అందచేసింది. వాటిని పరిశీలించిన మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ కిషోర్ రహత్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మాకు రాజకీయాలతో సంబంధం లేదు. అసెంబ్లీకి వెళుతున్న మహిళా ప్రజాప్రతినిధులను మగ పోలీసులు అడ్డుకోవడం ఏమిటి? చీర లాగడం, గొంతు నులమడం అన్నీ పరిశీలించాం. ఇది మేం అంత ఈజీగా వదిలిపెట్టే ఇష్యూ కాదని మాకు అర్థమైంది. తక్షణం డీజీపీ నుంచి వివరణ కోరతాం.. ఆ తర్వాత మేం తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటాం’అంటూ ఆమె భరోసా ఇచ్చారు. ‘ఈ తరహా ఘటనలు జరుగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఈ విషయంలో కమిషన్ ఏం చేస్తుంది? ఏం చేయాలి అనేది స్పష్టంగా ఉంటుంది. కచి్చతంగా చర్యలు అయితే తీసుకుంటాం’అంటూ ఎన్హెచ్ఆర్సీ తాత్కాలిక చైర్పర్సన్ విజయభారతి సయానీ భరోసా ఇచ్చారు. -
ఆందోళనకర పోషకాలపై మరింత స్పష్టత
న్యూఢిల్లీ: ఆహార పొట్లాల్లో (ప్యాకేజ్డ్ ఫుడ్) పోషకాల వివరాలతో కూడిన లేబుళ్లకు సంబంధించి మరింత స్పష్టతనివ్వాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్’ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ)ను ఆదేశించింది. దశలవారీగా ఆహార పొట్లాలపై లేబుళ్లు అతికించడాన్ని అమలు చేస్తామన్న ఎఫ్ఎస్ఎస్ఏఐ కొవ్వు, చక్కెర, ఉప్పు వంటి ‘‘ఆందోళనకరమైన పోషకాల’గురించి మరింత వివరణతో రావాలని జస్టిస్ జే.బి.పార్డీవాలా, జస్టిస్ కె.వినోద్ చంద్రన్లతో కూడిన బెంచ్ ఆదేశించింది. దేశంలో పిల్లలు అనారోగ్య ఆహారపు అలవాట్లకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసిన బెంచ్.. పోషకాలపై వారికి అవగాహన పెంచేందుకు పాఠశాలల్లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ‘‘బోధనాంశాలు, వర్క్షాపులు, కార్యక్రమాల ద్వారా ఆహారపు పొట్లాలపైని సమాచారాన్ని అర్థం చేసుకునేలా చేసేందుకు పాఠశాలలు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నాయో కేంద్రం నుంచి తెలుసుకోవాలని అనుకుంటున్నాం. ఆహారపు పొట్లాలపైని లేబుల్లు, పోషకాల సమాచారాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పోషకాలపై అవగాహనకు సంబంధించిన అంశాలు రెండింటిపై కేంద్రం స్పందించాలి’’అని బెంచ్ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 28న జరగనుంది. ‘త్రీఎస్ అండ్ అవర్ హెల్త్ సొసైటీ’అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతూ ఈ వ్యాఖ్యలు చేసింది. ఆహారపు పొట్లాలపై పోషకాలకు సంబంధించిన లేబుళ్లను తప్పనిసరిగా అతికించేలా కేంద్ర, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించాలని ఈ స్వచ్ఛంద సంస్థ తన పిటిషన్లో కోరింది. అయితే అసంతృప్త కొవ్వులు, చక్కెర, ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారపు పొట్లాల ముందుభాగంగా స్పష్టంగా కనిపించేలా లేబుళ్లను ఏర్పాటు చేయిస్తామని ఎఫ్ఎస్ఎస్ఏఐ గతంలోనే సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ అంశం అమలుకు సంబంధించి గత నెలలో ఒక అఫిడవిట్ దాఖలు చేసిన ఎఫ్ఎస్ఎస్ఏఐ లేబుళ్లను అతికించే ప్రక్రియను రెండు దశల్లో చేపడుతున్నట్లు తెలిపింది. అయితే ఈ రెండు దశలు ఎప్పుడు పూర్తి చేస్తారో తెలపాలని, వినియోగదారులు ఆమోదించేందుకు, కంపెనీలకు తగిన సమయం ఇచ్చేందుకు వేచి చూడటం సరికాదని స్పష్టం చేసింది. మరో పది రోజుల్లోగా ఏ దశను ఎప్పటిలోగా పూర్తి చేస్తారో తెలపాలని ఆదేశించింది. -
సివిక్ యాక్టివిస్ట్ సంతోష్ పండిట్ అరెస్ట్ వెనుక అసలు కథ ఇదే!
పుణె: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ప్రముఖ సివిక్ యాక్టివిస్ట్ సంతోష్ పండిట్ అరెస్ట్ ఉదంతం మహారాష్ట్రలో తీవ్ర చర్చనీయాంశమైంది. మహరాష్ట్ర మంత్రి చంద్రకాంత్ పాటిల్, మహిళా కార్పొరేటర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుల నేపథ్యంలో పుణె పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 3 తెల్లవారు జామున సుమారు ఒంటి గంట ప్రాంతంలో పుణె పోలీసులు కొత్రుడ్లోని ఆయన నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.పోలీసు కస్టడీ ముగిసిన తర్వాత సంతోష్ పండిట్ను కోర్టులో హాజరుపరచగా, విచారణ జరిపిన న్యాయస్థానం ఆయనకు 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. పుణె నగరంలో రోడ్ల దుస్థితి, ప్రమాదకర గుంతలు, వీఐపీ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతూ సంతోష్ పండిట్కు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. రాజకీయ నాయకులను, అధికారులను ప్రశ్నిస్తూ ఆయన చేసిన వీడియోలు వైరల్ అయిన వేళ, పోలీసులు అర్ధరాత్రి సమయంలో ఆయనను అరెస్ట్ చేయడం పట్ల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు, చర్చలు వెల్లువెత్తాయి. ప్రజా సమస్యలను ఎత్తిచూపుతున్న ఆయన గొంతును అణచివేసేందుకే ఈ అరెస్ట్ జరిగిందంటూ ఆయన మద్దతుదారులు ఆరోపిస్తుండగా.. చట్ట వ్యతిరేక, దూషణపూరిత వ్యాఖ్యలు చేయడం వల్లే చర్యలు తీసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.Pune civic activist Santosh Pandit was reportedly detained at midnight after complaints over videos criticizing potholes, civic issues, VIP culture, and politicians.FT- Muskan Lodhi#TheCSRJournal #PuneNews #CivicActivism #FreeSpeech pic.twitter.com/uWVDfSNeQS— The CSR Journal (@thecsrjournal) September 7, 2026 -
ప్రపంచ జీడీపీలో 40 శాతం బ్రిక్స్ దేశాలదే: మోదీ
ఢిల్లీ: ప్రపంచ జీడీపీలో 40 శాతం బ్రిక్స్ దేశాలదేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో ఆయన ప్రసంగిస్తూ.. బ్రిక్స్ 4 దేశాలతో మొదలై 21 దేశాలకు చేరిందన్నారు. ప్రపంచ జనాభాలో 50 శాతం బ్రిక్స్ దేశాలదే. బ్రిక్స్ కూటమి ప్రపంచంలో సగం జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తుంది, ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు భారత్ పరిష్కారం చూపిస్తుందన్నారు.బ్రిక్స్ జీడీపీ 4.5 శాతం పెరిగింది. సుస్థిరాభివృద్ధి, సహకారం, ఇన్నోవేషన్స్కి బ్రిక్స్ దేశాలు ఆలంబనగా నిలుస్తున్నాయి. రోడ్డు, రైళ్లు, ఎయిర్పోర్టుల వంటి మౌలిక సదుపాయాల్లో భారత్ వేగంగా విస్తరిస్తోందని మోదీ అన్నారు. -
‘ఉక్రెయిన్పై యుద్ధాన్ని ఆపండి’.. పుతిన్తో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ సంక్షోభానికి దౌత్యపరమైన చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమని భారత ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో జరిపిన ద్వైపాక్షిక సమావేశంలో ప్రధాని మోదీ యుద్ధాన్ని తక్షణమే ఆపి, శాంతి మార్గాన్ని ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇరు దేశాల మధ్య శాంతిని పునరుద్ధరించేందుకు భారత్ తన వంతు సహాయసహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్కు విచ్చేశారు. ఈ పర్యటనలో భాగంగా ఢిల్లీలోని ‘భారత్ మండపం’ వేదికగా ఇరు నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రష్యన్ భాషలోకి అనువదించిన ప్రముఖ తమిళ ప్రాచీన కావ్యమైన ‘తిరుక్కురళ్’ ప్రతిని పుతిన్కు ప్రత్యేక బహుమతిగా అందజేశారు. దాదాపు రెండు వేల ఏళ్ల నాటి ఈ గ్రంథంలోని మానవతా విలువలను మోదీ ఈ సందర్భంగా పుతిన్కు వివరించారు.రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధన, అంతరిక్ష రంగాల బలోపేతంపై ఇరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు.రష్యాలో జరగబోయే 24వ ఇండో-రష్యా వార్షిక శిఖరాగ్ర సమ్మిట్కు హాజరు కావాల్సిందిగా ప్రధాని మోదీని అధ్యక్షుడు పుతిన్ అధికారికంగా ఆహ్వానించగా.. ఆయన ఆ ఆహ్వానాన్ని స్వీకరించారు. దీనికి సంబంధించిన తుది తేదీలను దౌత్య అధికారులు త్వరలోనే ఖరారు చేయనున్నారు.👉ఇదీ చదవండి: ప్రధాని మోదీతో పుతిన్ భేటీ -
ప్రధాని మోదీతో రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ
ఢిల్లీ: రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్లో అడుగుపెట్టారు. 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యారు. భారత్ మండపంలో ఇవాళ(శుక్రవారం) ప్రధాని నరేంద్ర మోదీతో పుతిన్ భేటీ అయ్యారు. భారత్, రష్యా ద్వైపాక్షిక అంశాలపై చర్చ జరిపారు. కీలక రక్షణ ఒప్పందాలు, వ్యాపారం, వాణిజ్యం, భద్రత, ఎల్ఎన్జీ దిగుమతి, అధునాతన యుద్ధ విమానాల తయారీ సాంకేతికత బదిలీ తదితర అంశాలపై చర్చించారు. రెండు నెలల్లోనే రెండోసారి ఇరువురు నేతలు భేటీ అయ్యారు. పుతిన్కు మోదీ కానుకద్వైపాక్షిక భేటీలో పుతిన్కు రష్యన్ భాషలో అనువదించిన ఓ పుస్తకాన్ని ప్రధాని మోదీ కానుకగా అందించారు. తమిళ కవి తిరువళ్లువరు రచించిన ‘తిరుక్కురళ్’ పుస్తకాన్ని అందజేశారు. పుతిన్ మూడు రోజులపాటు ఇక్కడ పర్యటిస్తారు. వార్షిక బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ సర్వసభ్య సమావేశంలో ఆయన ప్రసంగించనున్నారు. కాగా, బ్రిక్స్ సదస్సుకు షీ జిన్పింగ్ హాజరు కాబోతున్నారని చైనా ప్రభుత్వ మీడియాతోపాటు భారత విదేశాంగ శాఖ నిర్ధారించింది.జిన్పింగ్ చివరిసారిగా 2019 అక్టోబర్లో భారత్లో పర్యటించారు. బ్రిక్స్–2026 శిఖరాగ్ర సదస్సుకు అంతా సిద్ధం అంటూ ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ సదస్సు జరిగే ‘భారత్ మండపం’దృశ్యాలు, ఏర్పాట్లతో కూడిన 30 సెకండ్ల వీడియో క్లిప్ను సైతం షేర్ చేశారు.ఇదీ చదవండి:బ్రిక్స్తో మనకు లాభాలున్నాయండోయ్..! -
బ్రిక్స్తో మనకు లాభాలున్నాయండోయ్..!
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుతో మన దేశానికి పెద్దగా ఒరిగేదేం లేదని.. ఒకవేళ నిజంగా ప్రయోజనం ఉంటే అదేంటో చెప్పాలని కేంద్రానికి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం సవాల్ విసిరారు. అయితే దీనికి బీజేపీ తీవ్రంగా స్పందించింది. అదే టైంలో.. కాంగ్రెస్ నుంచే కౌంటర్ రియాక్షన్ వచ్చింది. చిదంబరం వేసిన ప్రశ్నలకు సొంత పార్టీకే చెందిన మరో సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ బదులిచ్చారు. ఆ ప్రయోజనాలు ఇవేనంటూ వివరించారు. ఈ వేదిక భారత్ దౌత్యపరమైన ప్రభావాన్ని, ప్రపంచ దేశాలను ఒకే వేదికపైకి తీసుకురాగల సామర్థ్యాన్ని చాటుతుందని పేర్కొన్నారు.‘గ్లోబల్ సౌత్కు కీలక వేదిక’ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు ముందు మాట్లాడిన థరూర్.. గ్లోబల్ సౌత్కు బ్రిక్స్ ఒక ముఖ్యమైన వేదిక అని చెప్పారు. విస్తరించిన బ్రిక్స్లో 11 దేశాలు ఉన్నాయని, ఇవి ప్రపంచ జనాభాలో దాదాపు సగం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సుమారు 40 శాతం వాటాను కలిగి ఉన్నాయని వివరించారు. ఇలాంటి దేశాలను ఒకే వేదికపైకి తీసుకురావడం చిన్న విషయం కాదన్నారు.‘ప్రపంచ వేదికపై భారత్ దౌత్య బలం’బ్రిక్స్ సదస్సుకు పలువురు దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలు హాజరవుతుండటం భారత్కు ప్రతిష్టాత్మక విషయమని థరూర్ అన్నారు. ఇది ప్రపంచ వేదికపై భారత్ ‘డిప్లొమాటిక్ కన్వీనింగ్ పవర్’ను చూపిస్తుందని పేర్కొన్నారు. అయితే బ్రిక్స్లో అన్నీ సానుకూల అంశాలే లేవని కూడా స్పష్టం చేశారు.ఇదీ సవాల్.. ఏకాభిప్రాయం కష్టమే!విభిన్న దేశాలు, విభిన్న ప్రయోజనాలు ఉన్నందున కీలక అంతర్జాతీయ అంశాలపై ఏకాభిప్రాయం సాధించడం బ్రిక్స్లో పెద్ద సవాలని థరూర్ అన్నారు. మేలో జరిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఇరాన్-యూఏఈ మధ్య విభేదాల కారణంగా ఉమ్మడి ప్రకటన వెలువడలేదని గుర్తుచేశారు. దీంతో భారత్ చైర్ ప్రకటనతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తాజా సదస్సులోనూ అలాంటి పరిస్థితి వస్తే అది బ్రిక్స్ ఐక్యతపై ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉందన్నారు.చిదంబరం ఏమన్నారు?ఇటీవల చిదంబరం మాట్లాడుతూ.. గత రెండు, మూడు బ్రిక్స్ సదస్సుల నుంచి భారత్కు వచ్చిన స్పష్టమైన ప్రయోజనాలు తనకు కనిపించలేదన్నారు. బ్రిక్స్తో పాటు ఎస్సీఓ, జీ20, క్వాడ్లో భారత్ సభ్యుడిగా ఉన్నప్పటికీ.. వాటి నుంచి దేశానికి వస్తున్న స్పష్టమైన ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు.వాణిజ్య లోటుపైనా థరూర్ ఆందోళనమరోవైపు బ్రిక్స్ దేశాలతో భారత్ వాణిజ్యం పెరుగుతున్నప్పటికీ.. అది పూర్తిగా భారత్కు అనుకూలంగా లేదని థరూర్ అభిప్రాయపడ్డారు. బ్రిక్స్ దేశాలకు భారత్ ఎగుమతులు తగ్గుతుండగా.. దిగుమతులు పెరుగుతున్నాయని, ఇది ఆందోళన కలిగించే అంశమని చెప్పారు. అంటే బ్రిక్స్ వేదిక భారత్కు దౌత్యపరంగా ప్రాధాన్యమైనదే అయినప్పటికీ.. వాణిజ్యపరంగా మరింత సమతుల్యత సాధించాల్సిన అవసరం ఉందన్నది థరూర్ వ్యాఖ్యల సారాంశం.ఇదీ చదవండి: పార్టీ కంటే పిల్లనిచ్చిన మామే ఎక్కువయ్యాడా? -
పిల్లలు పుట్టడం లేదని టెస్టులకు వెళ్తే.. లోపల గర్భాశయం!
పెళ్లి తర్వాత పిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన ఓ 26 ఏళ్ల వ్యక్తికి.. వైద్య పరీక్షల్లో ఊహించని విషయం బయటపడింది. సాధారణంగా పురుషుల్లో ఉండని గర్భాశయం, ఫాలోపియన్ ట్యూబ్స్ వంటి అవయవాలు అతడి శరీరంలో ఉన్నట్లు వైద్య పరీక్షల్లో గుర్తించారు. అంతేకాదు.. రెండు వృషణాలు కూడా సాధారణ స్థానంలో లేకపోవడం వైద్యులను ఆశ్చర్యానికి గురిచేసింది.ఇన్ఫెర్టిలిటీకి కారణమేంటో తెలుసుకునేందుకు చేసిన పరీక్షలతో ఈ అరుదైన పరిస్థితి వెలుగులోకి వచ్చింది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అతడికి వీర్యంలో శుక్రకణాలు పూర్తిగా లేకపోవడం (అజూస్పెర్మియా) గుర్తించారు. ఆ తర్వాత చేసిన పరీక్షల్లో గర్భాశయంతోపాటు ఫాలోపియన్ ట్యూబ్స్ వంటి ముల్లెరియన్ నిర్మాణాలు ఉన్నట్లు తేలింది. దీనిని పెర్సిస్టెంట్ ముల్లెరియన్ డక్ట్ సిండ్రోమ్ (PMDS)గా నిర్ధారించారు.అసలు PMDS అంటే ఏమిటి?మగ శిశువు గర్భంలో అభివృద్ధి చెందుతున్నప్పుడు.. వృషణాల నుంచి ఉత్పత్తయ్యే యాంటీ-ముల్లెరియన్ హార్మోన్ (AMH) ప్రభావంతో ముల్లెరియన్ డక్ట్స్ అనే ప్రారంభ నిర్మాణాలు సాధారణంగా కనుమరుగవుతాయి. అయితే ఈ హార్మోన్ తగినంతగా ఉత్పత్తి కాకపోవడం లేదంటే దానికి శరీరం సరిగ్గా స్పందించకపోవడం వల్ల ఈ నిర్మాణాలు అలాగే ఉండిపోవచ్చు. దీంతో జన్యుపరంగా పురుషుడైన వ్యక్తిలో సాధారణ పురుష బాహ్య జననాంగాలు ఉన్నప్పటికీ.. శరీరం లోపల గర్భాశయం, ఫాలోపియన్ ట్యూబ్స్ వంటి అవయవాలు ఉండొచ్చు. ఈ అరుదైన పరిస్థితినే పెర్సిస్టెంట్ ముల్లెరియన్ డక్ట్ సిండ్రోమ్ అంటారు.పిల్లలు కలగకపోవడానికి కారణమేంటి?ఈ కేసులో ప్రధానంగా గుర్తించిన సమస్య.. వృషణాలు సాధారణ స్థానంలో లేకపోవడం. సాధారణంగా వృషణాలు శరీరం బయట ఉండే సంచిలో ఉంటాయి. అక్కడి ఉష్ణోగ్రత శరీరం లోపల కంటే కొంత తక్కువగా ఉంటుంది. శుక్రకణాల ఉత్పత్తికి ఈ పరిస్థితి అవసరం. అయితే వృషణాలు పొత్తికడుపులో లేదంటే గజ్జల ప్రాంతంలోని మార్గంలోనే ఉండిపోతే.. శుక్రకణాల ఉత్పత్తి దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితినే అన్డిసెండెడ్ టెస్టిస్ అంటారు. పీఎండీఎస్లో ఇది తరచుగా కనిపించే లక్షణాల్లో ఒకటి. అలాగని PMDS ఉన్న ప్రతి వ్యక్తికీ సంతానలేమి ఉంటుందని చెప్పలేం. వృషణాల పనితీరు, శుక్రకణాల ఉత్పత్తి, పునరుత్పత్తి వ్యవస్థ పనితీరు వంటి అంశాలపై సంతాన సామర్థ్యం ఆధారపడి ఉంటుంది.చికిత్స ఎలా ఉంటుంది?వీర్యంలో శుక్రకణాలు కనిపించని సందర్భాల్లో.. వృషణాల్లో శుక్రకణాలు ఉత్పత్తి అవుతున్నాయా? అనే విషయాన్ని వైద్యులు పరీక్షిస్తారు. అవసరమైతే వృషణాల నుంచి నేరుగా శుక్రకణాలను సేకరించే ప్రయత్నం చేస్తారు. శుక్రకణాలు లభిస్తే ఐవీఎఫ్, ఐసీఎస్ఐ వంటి సహాయక పునరుత్పత్తి విధానాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. కొన్ని కేసుల్లో వృషణాల పనితీరు సరిగా లేకపోతే.. ఇతర సంతానోత్పత్తి మార్గాలను కూడా వైద్యులు సూచించవచ్చు. పీఎండీఎస్ ఉన్న కొందరు పురుషుల్లో సంతానోత్పత్తి సాధ్యమేనని వైద్య కేసు నివేదికలు చెబుతున్నాయి. చాలా అరుదైన పరిస్థితిపీఎండీఎస్ చాలా అరుదైన వైద్య పరిస్థితి. కొందరిలో చిన్న వయసులోనే వృషణాలు కిందికి దిగకపోవడం లేదంటే గజ్జల్లో హెర్నియా వంటి సమస్యల కారణంగా ఇది బయటపడుతుంది. మరికొందరిలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు లేకపోవడంతో.. పెద్దయ్యే వరకు గుర్తించకపోవచ్చు. సంతానలేమి కోసం పరీక్షలు చేయించుకున్నప్పుడు అనుకోకుండా నిర్ధారణ అయ్యే సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే ఇలాంటి పరిస్థితిని కేవలం ‘వింత’గా చూడకుండా.. వృషణాల పనితీరు, హార్మోన్లు, జన్యు కారణాలు, పునరుత్పత్తి వ్యవస్థను పూర్తిగా పరిశీలించాల్సి ఉంటుంది. సరైన సమయంలో గుర్తిస్తే సంతానోత్పత్తి అవకాశాలను కాపాడేందుకు, భవిష్యత్ ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించేందుకు చికిత్సా మార్గాలను ఎంచుకోవచ్చు. ఇదీ చదవండి: ఫాస్ట్గా తింటున్నారా? అయితే ఇది మీకోసమే! -
భారత్లో అడుగుపెట్టిన పుతిన్.. నేడు మోదీతో కీలక భేటీ
ప్రతిష్టాత్మక 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ఢిల్లీ సిద్ధమైంది. భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ రెండు రోజుల సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం తెల్లవారుజామున న్యూఢిల్లీ చేరుకున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా బ్రిక్స్ సదస్సులో పాల్గొనడంతోపాటు ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు.రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఢిల్లీలో స్వాగతం పలికారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన 2022 తర్వాత రష్యా వెలుపల జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు ఆయన స్వయంగా హాజరవడం ఇదే తొలిసారి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిళ్లు పెరుగుతున్న సమయంలో ఆయన భారత్ పర్యటన సాగుతోంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం, హర్ముజ్ జలసంధిలో నెలకొన్న పరిస్థితులు, అమెరికా వాణిజ్య విధానాలు, సుంకాల ప్రభావం వంటి అంశాలు ఈసారి బ్రిక్స్ సదస్సులో కీలకంగా మారనున్నాయి.మోదీ–పుతిన్ భేటీలో కీలక అంశాలుపుతిన్ పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. రక్షణ, ఇంధనం, సాంకేతికత, ఔషధాలు, ప్రజల మధ్య సంబంధాలు వంటి రంగాల్లో సహకారాన్ని మరింత పెంచుకోవడంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడం ఈ భేటీలో ప్రధానంగా ఉండనుంది.President Putin arrives in New Delhi:Government Il-96 landed at the base of the air force of the Republic of Palam.(3:54 am, Delhi time)NEW DELHI, September 11. /TASS/. Russian President Vladimir Putin arrived in India, in the capital of which New Delhi the BRICS summit… https://t.co/K9ZBz6ZsHk pic.twitter.com/tnM4Q7pHIM— ⏳Towhee 🌏☮️ (@amborin) September 10, 2026రక్షణ రంగంలో బ్రహ్మోస్ క్షిపణి ఆధునికీకరణపై చర్చకు వచ్చే అవకాశం ఉంది. రష్యా నుంచి భారత్కు మిగిలిన ఎస్–400 వ్యవస్థల సరఫరా, సు–57 యుద్ధ విమానాల ప్రతిపాదిత సరఫరాపైనా చర్చలు జరగనున్నాయి. భారత్లో కొత్త సివిల్ న్యూక్లియర్ రియాక్టర్ల ఏర్పాటుపైనా ఇరు దేశాలు చర్చించనున్నట్లు సమాచారం.ఏడేళ్ల తర్వాత భారత్కు జిన్పింగ్పుతిన్ మాత్రమే కాదు బ్రిక్స్ సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కూడా హాజరుకానున్నారు. దాదాపు ఏడేళ్ల తర్వాత ఆయన భారత్లో పర్యటిస్తున్నారు. సరిహద్దు ఉద్రిక్తతల తర్వాత ఆయన భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి. సదస్సు సందర్భంగా ప్రధాని మోదీతో జిన్పింగ్ ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉంది. వాణిజ్యం, పెట్టుబడులతోపాటు ఇరు దేశాల సంబంధాలపై ఈ భేటీలో చర్చించే అవకాశముంది. సరిహద్దు ప్రాంతంలో పరిస్థితిని కూడా నేతలు సమీక్షించే అవకాశం ఉంది.పశ్చిమాసియా సంక్షోభం.. బ్రిక్స్కు సవాల్ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు బ్రిక్స్ సదస్సుకు కీలక సవాల్గా మారాయి. ముఖ్యంగా ఇరాన్, యూఏఈ మధ్య విభేదాల నేపథ్యంలో కూటమి ఉమ్మడి ప్రకటనపై ఏకాభిప్రాయం సాధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. హర్ముజ్ జలసంధిలో ఏర్పడిన సంక్షోభం అంతర్జాతీయ చమురు వాణిజ్యంపైనా ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ, ప్రాంతీయ పరిణామాలపై బ్రిక్స్ నేతలు చర్చించనున్నారు. ఇదే సమయంలో అమెరికా వాణిజ్య, సుంకాల విధానాలు కూడా బ్రిక్స్ దేశాలను ప్రభావితం చేస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడం, ప్రపంచ పాలనలో బహుపాక్షిక వ్యవస్థను బలోపేతం చేయడం వంటి అంశాలపై భారత్ తన అధ్యక్ష హోదాలో దృష్టి పెట్టనుంది.విస్తరించిన బ్రిక్స్.. పెరిగిన ప్రాధాన్యంబ్రిక్స్లో తొలుత బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు ఉండేవి. 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా సభ్యదేశాలుగా చేరాయి. 2025లో ఇండోనేసియా కూడా కూటమిలో చేరింది. బెలారస్, బొలీవియా, కజకిస్తాన్, క్యూబా, మలేసియా, నైజీరియా, థాయ్లాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, వియత్నాం భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి.ప్రపంచ జనాభాలో దాదాపు 49.5 శాతం, ప్రపంచ జీడీపీలో సుమారు 40 శాతం, ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 26 శాతానికి బ్రిక్స్ ప్రాతినిధ్యం వహిస్తోంది. వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, హైటెక్నాలజీతోపాటు ఆరోగ్యం, వ్యవసాయం, ఆహారం, ఇంధనం, విపత్తుల నిర్వహణ, సరఫరా వ్యవస్థల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవడం ఈ సదస్సు ప్రధాన అజెండాలో ఉంది.రెండు రోజులపాటు కీలక భేటీలుభారత్ నాలుగోసారి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది. శనివారం మధ్యాహ్నం 2.35 గంటలకు సదస్సు ప్రధాన కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. బ్రిక్స్ నేతలు రాజకీయాలు, భద్రత, ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక సహకారం, సాంస్కృతిక, మానవతా సంబంధాలపై చర్చిస్తారు. ఆదివారం విస్తృత సమావేశాలు నిర్వహించిన అనంతరం ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’ను విడుదల చేయడంతో సదస్సు ముగియనుంది.బ్రిక్స్ వేదికపై అధికారిక సమావేశాలతోపాటు నేతల మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చలపైనా ఆసక్తి నెలకొంది. పుతిన్తో మోదీ భేటీ, ఏడేళ్ల తర్వాత భారత్కు వచ్చిన జిన్పింగ్తో మోదీ సమావేశం, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్తో మోదీ చర్చలు ఈ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మొత్తంగా.. ఒకవైపు రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, మరోవైపు పశ్చిమాసియా సంక్షోభం, హర్ముజ్ పరిణామాలు, వాణిజ్య యుద్ధాల ప్రభావం వంటి కీలక అంతర్జాతీయ సవాళ్ల మధ్య ఢిల్లీలో బ్రిక్స్ సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో పుతిన్–మోదీ భేటీతోపాటు భారత్ వేదికగా జరిగే ఇతర ద్వైపాక్షిక చర్చలు కూడా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.ఇదీ చదవండి: మిస్టర్ సింగ్.. గెట్ అవుట్ ఫ్రమ్ మై మదర్ల్యాండ్ -
‘చైల్డ్ పోర్న్’ కట్టడికి చర్యలేవి?
సాక్షి, న్యూఢిల్లీ: ఆన్లైన్, సోషల్ మీడియా వేదికలపై చిన్నారులకు సంబంధించిన అసభ్యకర, అశ్లీల కంటెంట్ను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆన్లైన్లో పిల్లలకు రక్షణ కల్పించేలా కచ్చితమైన మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ ‘జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్’దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. కేంద్రంతో పాటు ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, న్యాయ మంత్రిత్వ శాఖలకు గురువారం నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనల ధర్మాసనం ఈ కేసును గురువారం విచారించింది. ఇంటర్నెట్ను వినియోగించే పిల్లలను రక్షించేందుకు ఇంటర్నెట్లో ఫైర్వాల్స్ ఏర్పాటు చేయడం అత్యవసరమని ధర్మాసనం స్పష్టం చేసింది. అశ్లీల కంటెంట్ నిరోధానికి కఠిన చట్టాలు ఉన్నప్పటికీ ఇంటర్నెట్ ప్లాట్ఫామ్లు ఆటోమేటెడ్ కంటెంట్–ఫిల్టరింగ్, వయో నిర్ధారణ యంత్రాంగాలను ఏర్పాటు చేయడంలో విఫలమయ్యాయని పిటిషనర్ కోర్టు దష్టికి తీసుకెళ్లారు. అల్గారిథమిక్ రికమండేషన్ల కారణంగా చిన్నపిల్లలు పదేపదే అసభ్య కంటెంట్ బారిన పడుతున్నారని వివరించారు. పోక్సో చట్టం కింద అశ్లీల కంటెంట్ను రిపోర్ట్ చేయని ఇంటర్నెట్ సంస్థలు, ఐటీ చట్టం కింద లభించే చట్టపరమైన రక్షణ కోల్పోతాయని 2024 నాటి తీర్పును పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది హెచ్ఎస్ ఫూల్కా కోర్టుకు గుర్తుచేశారు. ఆన్లైన్ వేదికల్లో ఉన్న అల్గారిథమిక్ ఆడిట్లు, అమలులో ఉన్న కంటెంట్ ఫిల్టరింగ్ ప్రొటోకాల్స్పై పూర్తి నివేదిక సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. -
రేపటి నుంచే బ్రిక్స్ సదస్సు
న్యూఢిల్లీ: భారత్ అతిథ్యం ఇవ్వనున్న ప్రతిష్టాత్మక బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు రాజధాని న్యూఢిల్లీలో ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. శనివారం, ఆదివారం జరిగే ఈ సదస్సుకు చైనా అధినేత షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో తదితరులు హాజరు కాబోతున్నారు. షీ జిన్పింగ్ భారత్లో అడుగుపెడుతుండడం ఏడేళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా పె రుగుతున్న ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, రష్యా–ఉక్రెయిన్ ఘర్షణ, పశ్చిమాసియా సంక్షోభం, అమెరికా విధిస్తున్న సుంకాల ప్రతికూల ప్రభావాలను ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న నేపథ్యంలో రెండు రోజుల బ్రిక్స్ సదస్సు ప్రాధాన్యం సంతరించుకుంది. తాజా పరిణామాలపై కూటమి సదస్సులో చర్చించబోతున్నారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలతో కూడిన బ్రిక్స్ కూటమిలో 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా సభ్యదేశాలుగా చేరాయి. 2025లో ఇండోనేసియా కూడా ఇందులో చేరింది. బెలారస్, బొలీవియా, కజకిస్తాన్, క్యూబా, మలేసియా, నైజీరియా, థాయ్లాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, వియత్నాం కూడా భాగస్వామ్య దేశాలుగా మారాయి. ప్రపంచ జనాభాలో దాదాపు 49.5 శాతం, ప్రపంచ జీడీపీలో 40 శాతం, ప్రపంచ వాణిజ్యంలో సుమారు 26 శాతానికి బ్రిక్స్ ప్రాతి నిధ్యం వహిస్తోంది. 11 ప్రధాన అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో బలమైన కూటమిగా ఆవిర్భవించింది. భారత్ బ్రిక్స్లో వ్యవస్థాపక సభ్య దేశం. 2012, 2016, 2021లో కూటమికి సారథ్యం వహించింది. ఇప్పుడు నాలుగోసారి అధ్యక్ష బాధ్యతలను చేపట్టింది. ఈసారి ‘సమ్మిళిత ప్రపంచ పాలన, బహుపాక్షికవాదాన్ని బలోపేతం చేయడం’అనే ఇతివృత్తంతో బ్రిక్స్ సదస్సు శనివారం మధ్యాహ్నం 2.35 గంటలకు ప్రారంభమవుతుంది. రాత్రి 7.30 గంటలకు ప్రధాని మోదీ ఏర్పాటు చేసే విందుతో మొదటి రోజు కార్యక్రమాలు ముగుస్తాయి. రెండో రోజు ఆదివారం పలు సమావేశాలు, చర్చలు జరుగుతాయి. ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’విడుదలతో సదస్సు ముగుస్తుంది. నేడే పుతిన్ రాక రష్యా అధినేత పుతిన్ శుక్రవారం తెల్లవారుజామున భారత్లో అడుగుపెట్టబోతున్నారు. ఆయన మూడు రోజులపాటు ఇక్కడ పర్యటిస్తారు. బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటారని రష్యా ప్రతినిధి యురీ ఉషకోవ్ తెలిపారు. శుక్రవారం వార్షిక బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ సర్వసభ్య సమావేశంలో పుతిన్ ప్రసంగించనున్నారు. మరోవైపు మధ్యాహ్నం 3.30 గంటలకు పుతిన్తో, సాయంత్రం 6.15 గంటలకు మసూద్ పెజెష్కియాన్తో ప్రధాని మోదీ భేటీ అవుతారు. జిన్పింగ్, మోదీ ప్రత్యేక భేటీ! ఢిల్లీలో జరిగే 18వ బ్రిక్స్ సదస్సుకు షీ జిన్పింగ్ హాజరు కాబోతున్నారని చైనా ప్రభుత్వ మీడియాతోపాటు భారత విదేశాంగ శాఖ గురువారం నిర్ధారించింది. సదస్సు సందర్భంగా శనివారం సాయంత్రం 6 గంటలకు జిన్పింగ్, నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సమావేశమవుతారని సమాచారం. జిన్పింగ్ భారత పర్యటన ఒక ఉన్నత స్థాయి దౌత్య కార్యక్రమంగా నిపుణులు అభివరి్ణస్తున్నారు. రెండు ఆసియా అగ్రరాజ్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను స్థిరీకరించడానికి జరుగుతున్న ప్రయత్నంగా పేర్కొంటున్నారు. జిన్పింగ్ చివరిసారిగా 2019 అక్టోబర్లో భారత్లో పర్యటించారు. బ్రిక్స్కు అంతా సిద్ధం: మోదీ బ్రిక్స్–2026 శిఖరాగ్ర సదస్సుకు అంతా సిద్ధం అంటూ ప్రధాని మోదీ గురువారం సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ సదస్సు జరిగే ‘భారత్ మండపం’దృశ్యాలు, ఏర్పాట్లతో కూడిన 30 సెకండ్ల వీడియో క్లిప్ను సైతం షేర్ చేశారు. -
వృద్ధుడి వీపుపైకి ఎక్కి కాలువ దాటిన ప్రభుత్వ ఉద్యోగి ..వీడియో వైరల్
భోపాల్: మధ్యప్రదేశ్ సిద్ధి జిల్లాలో ఓ ప్రభుత్వ అధికారి అహంకార పూరిత చర్య తీవ్ర విమర్శలకు దారితీసింది. తన బూట్లు తడవకుండా ఉండేందుకు ఒక రెవెన్యూ అధికారి (పట్వారీ) వృద్ధుడి వీపుపై కూర్చుని పిల్ల కాలువ దాటిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. సిద్ధి జిల్లాలోని మాతా గ్రామ పంచాయతీ పరిధిలో నివసించే లాల్వా కేవత్ (65) అనే వృద్ధుడి ఇల్లు, పంట పొలాలను పరిశీలించేందుకు నీలేష్ నామ్దేవ్ అనే పట్వారీ అక్కడికి వెళ్లారు. అయితే, అక్కడ కాలువను దాటే సమయంలో తన బూట్లు తడవకుండా ఉండేందుకు ఆ పట్వారీ వికృత ఆలోచనకు తెరతీశాడు. తనను వీపుపై ఎక్కించుకుంటేనే ఇంటి సర్వే చేస్తానని ఆ వృద్ధుడిని బెదిరించినట్లు తెలుస్తోంది.దీంతో చేసేది లేక ఆ వృద్ధుడు ఆ అధికారిని తన వీపుపై ఎక్కించుకుని నీటిలో నడుచుకుంటూ ఒడ్డుకు చేర్చాడు. ఈ అమానుష ఘటనను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్గా మారింది. ప్రభుత్వ అధికారై ఉండి ఒక వృద్ధుడి పట్ల ఇలా ప్రవర్తించడంపై స్థానికులు నెటిజన్లు, స్థానికులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఈ ఘటనపై తీవ్ర వ్యతిరేకత రావడంతో జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించింది. సిద్ధి కలెక్టర్,సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన అధికారులు, బాధ్యుడైన పట్వారీ నీలేష్ నామ్దేవ్ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సేవ చేయాలేకాని, ఇలా వృద్ధులతో అమానుషంగా ప్రవర్తిస్తే సహించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.यह सीधी जिले के पटवारी साहब ।जूते गंदे नहीं हो जाएं इसलिए एक बुजुर्ग के पीठ पर चढ़कर पानी से भरा गड्ढा पार किया pic.twitter.com/R2zDg0u6Z4— SanjayGupta_Journalist (@sanjaygupta1304) September 9, 2026 -
‘అమ్మనా కోడలా?’.. స్టెప్పులేస్తూ.. మామ ప్రాణం తీయించింది
లక్నో: ప్రముఖ వ్యాపారి వినీత్ మనోచా హత్య కేసులో కోడలు షాలు(30) దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సుఫారీ గ్యాంగ్ మనోచాను కత్తితో పొడుస్తున్న సమయంలో కోడలు షాలు బాలీవుడ్ ఓల్డ్ క్లాసిక్ పాటలకు డ్యాన్స్ చేస్తున్నట్లు తేలింది. సంబంధిత దృశ్యాలు వెలుగులోకి రాగా.. పోలీసులు విచారణలో కోడలు షాలు సైతం అంగీకరించింది. ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో సంచలనం సృష్టించిన ప్రముఖ వ్యాపారి వినీత్ మీనోచా హత్య కేసుకు సంబంధించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. రూ.40 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న కుటుంబ వ్యాపారంలో తగిన స్వేచ్ఛ లేకపోవడం, చిన్న ఖర్చులకు కూడా మామను అడగాల్సి రావడం, ఇంట్లో సీసీటీవీల ద్వారా తన కదలికలపై నిరంతరం నిఘా పెట్టడంపై కోడలు షాలు తీవ్ర కక్ష పెంచుకుంది. అర్ధరాత్రి వరకు పార్టీలకు వెళ్లనివ్వకపోవడం, ఆలస్యంగా రావడాన్ని ప్రశ్నించడమే ఈ దారుణానికి ప్రధాన కారణమని తేలింది.పోలీసులు నిందితుల కాల్ డీటెయిల్ రికార్డ్స్ పరిశీలించగా షాకింగ్ విషయాలు తెలిశాయి. హత్యకు ముందు కేవలం 21 రోజుల్లో మాజీ పనిమనిషి విశాల్ గౌతమ్తో కుటుంబ సభ్యులు విపరీతంగా సంప్రదింపులు జరిపారు. కోడలు షాలు సుమారు 30 సార్లు, ఆమె భర్త సుబ్రత్ సుమారు 300 సార్లు విశాల్తో ఫోన్లో మాట్లాడారు. మొత్తం కలిపి ఈ సంఖ్య 330కి చేరింది. హత్య జరిగిన రోజు ఒక్కరోజే ఉదయం నుంచి రాత్రి వరకు షాలు, విశాల్ మధ్య ఏకంగా 14 సార్లు ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు.జూలై 28న ఆలస్యంగా ఇంటికి వచ్చిన షాలు మామతో గొడవ పడిన తర్వాతే ఈ హత్యకు ప్లాన్ వేసింది. మాజీ పనిమనిషి విశాల్ గౌతమ్కు రూ.6 లక్షలకు సుపారీ ఇచ్చి, ముందుగా రూ.2 లక్షలు చెల్లించి డూప్లికేట్ తాళం చెవిని అందజేసింది. పథకం ప్రకారం హత్యకు గురైన రోజు షాలు, ఆమె భర్త తమ బిడ్డతో కలిసి కాన్పూర్లోని కాస్మోజిన్ లాంజ్లో జరిగిన పార్టీకి వెళ్లారు.అక్కడ షాలు తన స్నేహితులతో కలిసి బాలీవుడ్ పాటలకు స్టెప్పులెస్తోంది. మరోవైపు మామను ఎలా హత్య చేయాలో నిందితులకు గైడెన్సీ ఇచ్చింది. సరిగ్గా అదే సమయంలో విశాల్, మరో నిందితుడు రాజ్ కిషోర్ మందులు ఇవ్వడానికి వచ్చామంటూ సెక్యూరిటీ గార్డ్ను నమ్మి లోపలికి వెళ్లారు. 63 ఏళ్ల వినీత్ మీనోచాను కత్తితో పొడిచి చంపారు.పోలీసుల అరెస్టుఅర్ధరాత్రి 3 గంటలకు షాలు దంపతులు ఇంటికి తిరిగి వచ్చేసరికి వినీత్ మీనోచా రక్తపు మడుగులో పడి ఉన్నారు. సీసీటీవీ ఫుటేజ్లు, కాల్డేటా ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు, ఎన్కౌంటర్ తర్వాత నిందితులు విశాల్, రాజ్ కిషోర్లతో పాటు సూత్రధారైన కోడలు షాలును అరెస్టు చేశారు. మొదట అమాయకురాలిగా నటించినప్పటికీ, పోలీసుల విచారణలో షాలు తన నేరాన్ని అంగీకరించింది. -
దావూద్ ఇబ్రహీంను కాపాడింది అదృశ్య శక్తా?.. లేక మన పోలీసుల అతి తెలివా?
భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్లు.. ప్రపంచంలో ఏమూల దాగున్నా అజ్ఞాత వ్యక్తులు వారిని మట్టుబెడుతున్న ఘటనలను మనం చూస్తూనే ఉన్నాం..! ఇంకా చెప్పాలంటే.. భారత్కు వ్యతిరేకంగా కుట్రలు పన్నేవారు విదేశాల్లో తలదాచుకుంటున్నా.. బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. అయితే.. భారత్కు మోస్ట్ వాంటెడ్గా ఉన్న అండర్ వరల్డ్ డాన్.. దావూద్ ఇబ్రహీం విషయంలో ప్రభుత్వం ఎందుకు సఫలం కావడం లేదు? చిక్కడు.. దొరకడు అన్నట్లుగా తప్పించుకు తిరుగుతున్న దావూద్ను లేపేయడానికి రెండు దశాబ్దాల క్రితమే భారత్ స్కెచ్ వేసినా.. ఇలాంటి ఆపరేషన్లలో అత్యంత దురంధరుడిగా ఉన్న అజిత్ దోబాల్ వ్యూహం పన్నినా.. ముంబై పోలీసులు చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా.. ఆ ప్లాన్ ఫెయిల్ అయ్యిందంటే మీరు నమ్ముతారా?భారత గూఢచర్య సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్.. క్లుప్తంగా రా ఎన్నెన్నో ఆపరేషన్లు చేపట్టింది. అయితే.. దావూద్ ఇబ్రహీంను మాత్రం ఓ అదృశ్య శక్తి కాపాడిందని చెబుతుంటారు. రా ఆపరేషన్లలో దురంధరుడిగా పేరు తెచ్చుకున్న డైనమిక్ ఆఫీసర్ అజిత్ దోబాల్ 2005లో ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా ఉన్నారు. ఆయనే ‘ఆపరేషన్ దావూద్’కి స్కెచ్ వేశారు. ఈ పని చేసింది మాత్రం రా కాదు.. భారత ఇంటెలిజెన్స్ బ్యూరో అనే విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. అప్పటికే ఐక్య రాజ్య సమితి కూడా దావూద్ను డిసిగ్నేటెడ్ టెర్రరిస్టుగా గుర్తించింది. దాంతో.. పాక్లో ఉన్నంత కాలం దావూద్పై దాడులకు చాన్సే ఉండదు. అప్పుడే.. దావూద్ కూతురు మహరూఖ్ పెళ్లి విషయం దోబాల్కు తెలిసింది. క్రికెటర్ జావేద్ మియాందాద్ కుమారుడు జునైద్తో అదే ఏడాది జూలై 9న మక్కాలో నిఖా.. జూలై 13న దుబాయ్లోని గ్రాండ్ హయాత్ హోటల్లో రిసెప్షన్ అనే సమాచారం భారత్కు అందింది. దాన్ని చక్కటి అవకాశంగా మలచుకోవాలని దోబాల్ భావించారు.దావూద్ను మట్టుబెట్టడానికి భారత్ ముందు ఓ అడ్డంకి కనిపించింది. అయితే.. దుబాయ్లో ఆ ఆపరేషన్ను అధికారికంగా చేపట్టడం వల్ల సమస్యలను కొని తెచ్చుకోవడం తప్పదని దోబాల్ భావించారు. దీంతో.. అధికారిక ఆపరేషన్ మాదిరిగా కమాండోలను కాకుండా.. సంఘ విద్రోహక శక్తులనే పావులుగా వాడుకోవాలని నిర్ణయించారు. అప్పటికే దావూద్కు, అండర్ వరల్డ్ ప్రపంచాన్ని శాసించాలని ఉవ్విళ్లూరుతున్న ఛోటారాజన్కు మధ్య వివాదం ముదిరి పాకాన పడుతోంది. ఛోటారాజన్ను లేపేసేందుకు స్కెచ్లు కూడా వేశాడు. ఈ వైరాన్ని అనుకూలంగా మలచుకోవాలనుకున్న దోబాల్.. కాగల కార్యాన్ని గంధర్వులు తీర్చారనేలా ఛోటారాజన్ సాయంతో పనికానివ్వాలని పక్కా ప్లాన్ వేశారు. ఛోటారాజన్ అనుచరులు, షార్ప్ షూటర్లుగా పేరున్న విక్కీ మల్హోత్రా, ఫరీద్ తనాషాకు ఆ బాధ్యతలను అప్పగించారు.అనుకున్నదే తడవుగా విక్కీ, ఫరీద్లను దోబాల్ ఢిల్లీకి పిలిపించుకున్నారు. మూడు వారాలపాటు ఓ రహస్య ప్రదేశంలో ప్రత్యేక శిక్షణనిప్పించారు. ప్లాన్ ఎగ్జిక్యూషన్కు వారు సిద్ధమయ్యారనుకున్నాక.. ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో వాళ్లకు దోబాల్ బ్రీఫింగ్ ఇచ్చారు. వారిద్దరికీ సూడాన్ పాస్పోర్టులు ఇచ్చి.. విమానంలో బిజినెస్ క్లాస్ ప్రయాణానికి టికెట్లు అందజేశారు.తానొకటి తలిస్తే.. దైవమొకటి తలచిందన్నట్లు అజిత్ దోబాల్ స్కెచ్కు పెద్ద అడ్డంకి ఏర్పడింది. అదికూడా ముంబై పోలీసుల కారణంగా..! మరో ఐదు రోజుల్లో విక్కీ, ఫరీద్లను దుబాయ్ పంపించే ముందు.. ఆ ఫైవ్ స్టార్ హోటల్లో దోబాల్ వారిద్దరికీ తన స్కెచ్ గురించి చెబుతుండగా.. ‘టక్.. టక్.. టక్’ అంటూ హోటల్ గది తలుపులను బయటి నుంచి కొందరు వ్యక్తులు బాదారు. తలుపులు తెరిచిన దోబాల్ ఎదుట.. ముంబై డీసీపీ ధనుంజయ్ కమలాకర్, అతని టీమ్ కనిపించింది. వారు దోబాల్కు అరెస్టు వారెంట్ను చూపించి.. విక్కీ, ఫరీద్లను బెదిరింపు కేసుల్లో అరెస్టు చేయడానికి వచ్చినట్లు వివరించారు. దోబాల్ ఎంత నచ్చజెప్పినా.. కమలాకర్ వినలేదు. అది రహస్య ఆపరేషన్ కావడంతో.. దోబాల్ మరోమాట మాట్లడలేదు. ఫలితంగా.. వారిద్దరినీ అరెస్టు చేసి, తీసుకెళ్తున్నా.. మిన్నకుండిపోయారు.అయితే.. దావూద్ను కాపాడిన ఆ అదృశ్య శక్తి ఎవరనేది ఇప్పటికీ వెలుగులోకి రాలేదు. విక్కీ, ఫరీద్లను అరెస్టు చేసిన టీమ్లో ఉన్న మీరా చద్దా బోర్వంకర్ వంటివారు ఆ తర్వాతి కాలంలో ఇచ్చిన ఇంటర్వ్యూల్లో మాత్రం.. ‘‘ఇది రెండు సంస్థల మధ్య సమన్వయ లోపంతో జరిగిన తప్పిదం. ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. దావూద్ను రక్షించడానికి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. ఐబీ చీఫ్ మాకు కనీస సమాచారం ఇవ్వకపోవడం వల్లే.. ఈ గందరగోళం జరిగింది’’ అని పేర్కొనడం గమనార్హం..! దీనికి మీరేమంటారు..? దావూద్ను నిజంగానే అదృశ్య శక్తి కాపాడిందా?? కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఏది ఏమైనా.. ఓ అండర్ వరల్డ్ డాన్ను తుదముట్టించేందుకు భారత్కు వచ్చిన ఓ అద్భుతమైన అవకాశం మాత్రం కొద్దిలో చేజారింది. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్లీ మీ ముందుకు వస్తాను. -
ముంబై పేలుళ్ల కేసు.. అబూ సలేంకు సుప్రీంకోర్టు ఝలక్!
న్యూఢిల్లీ: ముంబై 1993 వరుస పేలుళ్ల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్ అబూ సలేం ముందస్తు విడుదలకు చేసిన ప్రయత్నానికి సుప్రీంకోర్టు చెక్ పెట్టింది. 25 ఏళ్ల జైలు శిక్షను ఇప్పటికే పూర్తి చేశానంటూ సలేం దాఖలు చేసిన పిటిషన్ను గురువారం అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం బాంబే హైకోర్టు ఏప్రిల్ 2026లో ఇచ్చిన తీర్పును సమర్థించింది.పోర్చుగల్ నుంచి భారత్కు అప్పగించే సమయంలో అక్కడి ప్రభుత్వానికి భారత్ ఇచ్చిన హామీని సలేం తన పిటిషన్లో ప్రధానంగా ప్రస్తావించాడు. తనను భారత్కు అప్పగిస్తే మరణశిక్ష విధించబోమని, అలాగే 25 ఏళ్లకు మించి జైలులో ఉంచబోమని 2002లో భారత్ హామీ ఇచ్చిందని పేర్కొన్నాడు. 2005 నవంబర్ 11న అతడిని పోర్చుగల్ నుంచి భారత్కు తీసుకొచ్చారు. తాను విచారణ ఖైదీగా గడిపిన కాలం, శిక్ష అనుభవించిన కాలం, మంచి ప్రవర్తనకు లభించిన రిమిషన్ అన్నింటినీ కలిపితే 2025 మార్చి 31 నాటికే 25 ఏళ్లు పూర్తయ్యాయని సలేం వాదించాడు. అందువల్ల ఇకపై తనను జైలులో ఉంచడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ ముందస్తు విడుదల కోరాడు.అయితే, ఈ వాదనను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. సలేం పిటిషన్ ముందుగానే దాఖలైందని, 25 ఏళ్ల వ్యవధి 2030లో పూర్తవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో సలేం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. గతంలో 2022లో ఇదే అంశంపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది. సలేం 25 ఏళ్ల జైలు కాలాన్ని పూర్తి చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అతడి ముందస్తు విడుదలను నిర్ధారించాలని పేర్కొన్నప్పటికీ.. అతడి శిక్షను కమ్యూట్ చేయడం లేదని స్పష్టం చేసింది. పోర్చుగల్లో పాస్పోర్టు మోసం కేసులో గడిపిన జైలు కాలాన్ని 25 ఏళ్ల వ్యవధిలో లెక్కించరాదని కూడా తేల్చింది.కాగా, అబూ సలేం 2002లో పోర్చుగల్లో అరెస్టయ్యాడు. 1993 ముంబై పేలుళ్ల కేసుతో పాటు మరో టాడా కేసులో అతడికి వరుసగా 2015, 2017లో జీవిత ఖైదు పడింది. ఈ నేపథ్యంలో 2025కే 25 ఏళ్లు పూర్తయ్యాయన్న అబూ సలేం వాదనను సుప్రీంకోర్టు తాజాగా తిరస్కరించడంతో.. తక్షణ విడుదలకు అతడి ప్రయత్నాలకు మరోసారి బ్రేక్ పడింది.ఇదీ చదవండి: తమిళనాడులో సంచలనం.. స్టాలిన్కు బంపరాఫర్ -
ఆత్మాహుతి దాడే
న్యూఢిల్లీ: భారత దేశ చారిత్రక కట్టడాల్లో ఎర్రకోటకు ప్రత్యేక స్థానముండటంతో ఉద్దేశపూర్వకంగానే అక్కడ పేలుళ్లకు పథక రచన చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ విచారణలో తేలింది. గత ఏడాది నవంబర్ పదో తేదీన ఎర్రకోట సమీపంలో పేలుడు ముమ్మాటికీ ఆత్మాహుతి దాడి అని ఎన్ఐఏ తేల్చిచెప్పింది. ఈ మేరకు ఎన్ఐఏ తాజాగా కోర్టుకు సమర్పించిన చార్జ్షిట్లో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. తొమ్మిది సంవత్సరాల క్రితం మాజీ హిజ్బుల్ మొజాహిదీన్ కమాండర్ జకీర్ రషీద్ భట్ స్థాపించిన అన్సార్ ఘజ్వత్–ఉల్–హింద్ ఉగ్రసంస్థను మళ్లీ క్రియాశీలకంగా మార్చేందుకు ఎర్రకోట ఆత్మాహుతి బాంబర్, వైద్యుడు ఉమర్ ఉన్ నబీ తీవ్రస్థాయిలో ప్రయత్నించాడు. ఆ సంస్థ(మాడ్యూల్)కు ఆపరేషనల్ ఇన్చార్జ్గా, మాస్టర్మైండ్గా మారాడు. చార్జ్షిట్లోని వివరాల ప్రకారం ఉమర్ ఎర్రకోట సమీపంలో ట్రాఫిక్లో తన ఐ20 కారు ఆగిపోయినప్పుడు అత్యంత శక్తివంత పేలుడు పదార్థం(ఐఈడీ) డిటోనేటర్ను ఉపయోగించి ఆత్మాహుతికి పాల్పడ్డాడు. దీంతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి హఠాత్తుగా జరిగిందికాదని, దాదాపు మూడేళ్లపాటు పక్కా ప్రణాళికతో దాడికి యత్నించారని ఎన్ఐఏ తెలిపింది. ఎర్రకోటను భారత గణతంత్ర రాజ్యాంగానికి ప్రతిబింబంగా భావిస్తుండటంతో అక్కడే పేలుళ్లు జరిపి అల్లకల్లోలం సృష్టించాలని ఉమర్ గతంలోనే నిర్ణయించుకున్నాడు. 2023లోనే పలుమార్లు ఉమర్, అతని మాడ్యూల్ సభ్యులు పలుమార్లు ఎర్రకోట పరిసరాల్లో రెక్కీ నిర్వహించారు. అయితే 2025 నవంబర్ నెలలోనే పేలుడు మాత్రం ముందే అనుకున్నది కాదని, శ్రీనగర్ తదితర నగరాల్లో మాడ్యూల్ సభ్యుల వరసబెట్టి అరెస్టులతో కంగారుపడిన ఉమర్ ఒంటరిగానైనా పేలుడు జరపాలని ఆఖరి నిమిషంలో నిర్ణయించుకుని కారుబాంబుతో పేల్చేసుకున్నాడని చార్జ్షిట్లో ఎన్ఐఏ పేర్కొంది. ట్రైఎసిటోన్ ట్రైపెరాక్సైడ్(టీఏటీపీ), అమ్మోనియం నైట్రేట్ల మిశ్రమంగా పేలుడుపదార్థాలతో నింపి కారును వెహికల్–బోర్న్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్(వీబీఐఈడీ)గా మార్చి కమాండ్ మెకానిజంతో పేల్చేశారు. అరేబియా ద్వీపకల్పంలోని అల్–ఖైదా ఉగ్రసంస్థ భారత్లో ఇస్లామిక్ రాజ్యస్థాపనే లక్ష్యంగా యువతను ఉగ్రవాదభావజాలంతో టెర్రరిజంలోకి దింపేందుకు, దాడులు చేసేందుకు ‘ఒంటరి మొజాహిదీన్ ఆత్మాహుతి బాంబర్గా మారడం ఎలా?’అనే మాన్యువల్ను తయారుచేసింది. దీనికి మతఛాందసవాద యువతలో విస్తృత ప్రచార కల్పించేందుకు దుస్సాహసంచేసిందని ఎన్ఐఏ పేర్కొంది. పేలుడు పదార్థాల తయారీ, ఆయుధాలను ఉపయోగించే తీరు, కోవర్ట్ ఆపరేషన్లు చేయడం, జట్టుగా ఉండకుండా ఒంటరిగా ఉంటూ దాడులుచేయడం, ఆత్మాహుతి దాడులకు పాల్పడటం వంటి అంశాలు ఈ డాక్యుమెంట్లో ఉన్నాయి. ‘జిహాద్ అంటే ఏమిటి?, జిహాద్కు ఉండాల్సిన అర్హతలు, జిహాద్లోని 21 లక్ష్యాలు, జిహాద్ ద్వారా చేయగల 39 రకాల సేవలు, జిహాద్లో ఎలా పాల్గొనాలి? జిహాద్కు మద్దతిచ్చేందుకు 44 మార్గాలు ఇలా పలు రకాల అంశాలు అందులో ఉన్నాయి. సాయుధ హింసను ప్రోత్సహించి తద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థలను పడగొట్టి జిహాద్ను మతపరమైన విధిగా ఎలా పాటించాలో అందులో పేర్కొన్నారు. అన్సార్ ఘజ్వత్–ఉల్–హింద్ మాడ్యూల్ సభ్యుల మధ్య సమావేశాలు ఏర్పాటుచేయడం, సిగ్నల్ వంటి ఎన్క్రిపె్టడ్ యాప్ల ద్వారా రహస్య మంతనాలు జరపడం, పేలుడు పదార్థాల తయారీకి ప్రమాదకర రసాయనాలను గంపగుత్తగా కొనుగోలుచేయడం, బాంబుల తయారీ, నిధుల సమీకరణ, యువతను ఉగ్రవాదంలోకి రావాలని ప్రోత్సహించడం వంటి నేరాలకు ఉమర్ పాల్పడినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. -
బీసీల ఉద్ధారకుడు వైఎస్ జగనే
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ‘ఉత్తరాంధ్రలో ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల్లో 60 నుంచి 70 శాతం మంది బీసీలే. వారి సంఖ్యను కలిపేసి రాష్ట్రంలో బీసీల నిష్పత్తిని చూపిస్తున్నారు. అసలు అన్ని కులాలకు కలిపి రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని సుప్రీంకోర్టులో 9 మంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును కప్పిపుచ్చి, ఒక్క బీసీలకే 34 శాతం రిజర్వేషన్లు కల్పించకుండానే కల్పించినట్లు మసిపూసి మారేడుకాయ చేయడం ఒక్క చంద్రబాబుకే చెల్లింది. ఆయన ముఖ్యమంత్రిగా దాదాపు 20 ఏళ్ల పాలనలో బీసీలకు ఎన్నికలకు ముందు తాయిలాలు తప్ప వారి అభివృద్ధికి చేసింది శూన్యం. ఎన్నికల్లో ఎలాంటి హామీ ఇవ్వకపోయినా బీసీల సర్వతోముఖాభివృద్ధి ఎలా చేయాలో చేసి చూపించింది వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే. బీసీల ఉద్ధారకుడు ఆయన మాత్రమే. బీసీల కోసం చంద్రబాబు చేసింది శూన్యం. టీడీపీ బీసీల పార్టీ అని చెప్పుకొనే నైతికహక్కు చంద్రబాబుకు లేనేలేదు’ అని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఆయన బుధవారం న్యూఢిల్లీలో ‘సాక్షి’తో మాట్లాడారు. బీసీల కృతజ్ఞత సభ అంటూ నర్సీపట్నంలో పుష్పాభిషేకాలు, క్షీరాభిషేకాలు చేయించుకున్నంత మాత్రాన బీసీల ఉద్ధారకులు అయిపోరని చంద్రబాబును ఎద్దేవా చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో, రాజకీయ సభల్లో ఇచ్చే హామీల కన్నా, అధికారంలోకి వచ్చాక బీసీలకు ఎలాంటి ప్రయోజనాలు కల్పించారనేదే ఒక పార్టీ తమది బీసీల పార్టీ అని చెప్పుకోవడానికి ప్రామాణికం అవుతుందని చెప్పారు. అలా చెప్పుకోదగిన ప్రయోజనమేదైనా చంద్రబాబు చేశారేమో చెప్పుకోగలరా? అని ప్రశ్నించారు. కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ఐదేళ్ల పాలనలో బీసీలకు ఏయే ప్రయోజనాలు కల్పించారో చెప్పడానికి అనేక నిదర్శనాలు ఉన్నాయన్నారు.చట్టసభల్లో బీసీలకు జగన్ పెద్దపీటవిభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో బీసీలకు చట్టసభల్లో పెద్దపీట వేసిన ఘనత ఒక్క వైఎస్ జగన్మోహన్రెడ్డికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కుతుందని చెప్పారు. ఒకేదఫా నలుగురు బీసీ నాయకులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు, ఆర్.కృష్ణయ్యలను రాజ్యసభకు పంపించారని గుర్తుచేశారు. అది చాలా గొప్ప విషయమన్నారు. చంద్రబాబు ఎప్పుడైనా ఆ స్థాయిలో బీసీలను రాజ్యసభకు పంపారా? అని ప్రశ్నించారు. ‘శాసనమండలిలో 2023లో 18 స్థానాలు ఖాళీ అయితే, 11 మంది బీసీ నాయకులకు ఎమ్మెల్సీలుగా జగన్మోహన్రెడ్డి అవకాశం కల్పించారు.మొత్తం 44 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల్లో 19 మంది బీసీ నాయకులే. గతంలో ఎప్పుడూ బీసీలకు అంత పెద్దసంఖ్యలో ప్రాతినిధ్యం కల్పించిన దాఖలాలు లేవు. 2024 ఎన్నికల్లో కూడా జగన్మోహన్రెడ్డి 25 లోక్సభ స్థానాలకుగాను 11 చోట్ల బీసీలకే టికెట్ ఇచ్చారు. 175 అసెంబ్లీ స్థానాలకుగాను 48 చోట్ల బీసీ అభ్యర్థులనే నిలబెట్టారు. మొత్తం బీసీలకు 59 సీట్లు అంటే దాదాపు చట్టసభల్లో 30 శాతం రిజర్వేషన్లు ఆయన చెప్పకుండానే ఇచ్చారు’ అని వివరించారు. ఇలా బీసీలకు చట్టసభల్లో అగ్రస్థానం కల్పించి, తమ అభిప్రాయాలను, నిర్ణయాలను గళమెత్తి చెప్పడానికి అవకాశం ఇచ్చిన వ్యక్తి, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని స్పష్టం చేశారు. చంద్రబాబు కేబినెట్లో బీసీ మంత్రులెందరు? తెలుగుదేశం పార్టీ విషయానికొస్తే పూర్వం ఎన్.టి.రామారావు బీసీ పట్ల కాస్త ఉదారంగా ఉండేవారని చెప్పారు. కానీ చంద్రబాబుకు మాత్రం ఎన్నికల్లో భారీ హామీలిచ్చి, అధికారంలోకి వచ్చాక వాటిని పక్కనబెట్టేసే చరిత్ర ఉందన్నారు. ఇప్పుడు చంద్రబాబు కేబినెట్లో ఎంతమంది బీసీలకు మంత్రి పదవులిచ్చారో చూస్తే అసలు విషయం అర్థమవుతుందని పేర్కొన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో 11 మంది బీసీలకు మంత్రి పదవులిచ్చారని గుర్తుచేశారు. బీసీల పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి ఏది? రాష్ట్రంలోని బీసీలకు ఏంకావాలో చూడాలనే చిత్తశుద్ధి చంద్రబాబుకు ఏనాడూ లేదని విమర్శించారు. ఉదాహరణకు బీసీల్లో ఒకరైన లక్షలాదిమంది మత్స్యకారులు సుదీర్ఘమైన సముద్రతీరం ఉన్న ఈ రాష్ట్రాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారంటే చంద్రబాబు తన 20 ఏళ్ల పాలనలో వారి అభివృద్ధికి ఏం చేసినట్లని ప్రశ్నించారు. వారికోసం ఒక్క ఫిషింగ్ హార్బర్ను కూడా నిర్మించలేదన్నారు. జగన్మోహన్రెడ్డి తన ఐదేళ్ల పాలనలో 8 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం తలపెట్టారని గుర్తుచేశారు. వాటిలో కొన్ని నిర్మాణం పూర్తికాగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయన్నారు. కొన్నింటిని చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆపేశారని విమర్శించారు. బీసీల విద్యకు జగన్ ప్రాధాన్యం తరతరాలుగా వ్యవసాయం, చేతివృత్తుల్లోనే ఉన్న బీసీలు పారిశ్రామికీకరణ తర్వాత దేశవ్యాప్తంగా తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో వారిని సామాజికంగా, ఆర్థికంగా ముందుకు తీసుకురావడానికి ఉన్న ఏకైక మార్గం విద్య మాత్రమేనన్నారు. కానీ చంద్రబాబు మాత్రం ప్రైవేట్ విద్యాసంస్థలకు పెద్దపీట వేస్తూ, పేద కుటుంబాల్లోని పిల్లలకు విద్యను దూరం చేసే పాలసీలనే అమలుచేస్తున్నారని విమర్శించారు. అందుకు భిన్నంగా గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో మాత్రమే పేద కుటుంబాల్లోని విద్యార్థులకు విద్యను చేరువచేసే ఫీజు రీయింబర్స్మెంట్, అమ్మ ఒడి వంటి సంక్షేమ పథకాలను చేపట్టారని గుర్తుచేశారు. వారి పేదరికం ఏరోజూ వారి చదువుకు అడ్డుకాకుండా చేయగలిగిన ఘనత వైఎస్ కుటుంబానికి దక్కుతుందన్నారు. చంద్రబాబు ఆ పథకాలను నీరుగారుస్తూ తిరోగమన విధానాలను అనుసరిస్తున్నారని విమర్శించారు. బీసీల అభివృద్ధి జగన్ పాలనతోనే తెలిసిందిఅంతవరకు బీసీలకు చిన్నచిన్న తాయిలాలతోనే చంద్రబాబు పాలన సాగిందని, జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల సంక్షేమానికి ఇంత చేయవచ్చా అని తెలిసిందని చెప్పారు. రాష్ట్రంలో గూడులేని నిరుపేదల్లో ఎక్కువమంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలేనన్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి 12 వేల ఎకరాలను సేకరించి, దాదాపు 30 లక్షలమంది మహిళలకు ఇచ్చిన ఇళ్లపట్టాల్లో ఎక్కువ లబ్దిపొందింది బీసీ సామాజికవర్గాలేనని చెప్పారు. మరి చంద్రబాబు గత రెండేళ్ల పాలనలో పేదవారి కోసం ఒక్క సెంటు భూమి అయినా సేకరించారా? అని ప్రశ్నించారు. ధనవంతులైన పారిశ్రామికవేత్తలకు మాత్రం రూపాయికి, పావలాకు ప్రభుత్వ భూములను ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. తాము పారిశ్రామికీకరణకు వ్యతిరేకం కాదని, కానీ భూపంపిణీ విధానమే సరైంది కాదని చెబుతున్నామని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలను కూడా వ్యాపార, వాణిజ్య, ఐటీ, పారిశ్రామికరంగాల్లో ప్రోత్సహించే చర్యలనే ఏ ప్రభుత్వమైనా చేపట్టాలన్నారు. ఆ పనిని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో జగన్మోహన్రెడ్డి చేసి చూపించారని చెప్పారు. అందుకే ఇప్పుడు రాష్ట్రంలో బీసీలే కాదు అన్ని సామాజికవర్గాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి జగన్మోహన్రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారనే మాట వినిపిస్తోందని తెలిపారు. ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తారుమళ్లీ ఇప్పుడు స్థానికసంస్థల ఎన్నికలు వస్తున్నాయనగానే చంద్రబాబుకు బీసీలు గుర్తుకొస్తున్నారని ధర్మాన ఎద్దేవా చేశారు. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టమైన తీర్పు ఇచ్చాక కూడా ఇంకా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అంటూ చంద్రబాబు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు మాయమాటలను మళ్లీ నమ్మే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరన్నారు. చంద్రబాబు గారడీ మాటలపై బీసీలను చైతన్యం చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సభలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తొలుత ఐదు రీజియన్ల వారీగా, తర్వాత దఫాలో 25 జిల్లా కేంద్రాల్లో, 175 నియోజవర్గాల వారీగా ఈ సభలు నిర్వహిస్తామని వివరించారు. బీసీలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏం జరిగిందీ, చంద్రబాబు పాలనలో ఏం మోసం జరిగిందీ వివరిస్తామన్నారు. ఏ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలో, బీసీల నుంచి ఎలాంటి డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టాలో నిర్ణయిస్తామని ధర్మాన ప్రసాదరావు చెప్పారు. -
తెలుగు రాష్ట్రాల్లో రెండు రైల్వే ప్రాజెక్టులు
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో రైల్వే కనెక్టివిటీకి ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) దేశవ్యాప్తంగా రూ.10,021 కోట్ల అంచనా వ్యయంతో ఐదు మల్టీట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ మొత్తంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 17 జిల్లాల మీదుగా ఐదు ప్రాజెక్టులు నిర్మించనున్నారు.ఇందులో భాగంగా ఏపీ పరిధిలో రేణిగుంట–అరక్కోణం మార్గంలో 77 కిలోమీటర్ల మేర మూడో, నాలుగో లైను పనులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ పనులను 2029–30 ఆర్థిక సంవత్సరం నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ ప్రాజెక్టులను పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కింద రూపొందించారు. తద్వారా ప్రజల రాకపోకలతో పాటు సరుకు రవాణా అత్యంత సులభతరం కానుంది. పనులు పూర్తయితే రైల్వే నెట్వర్క్ సామర్థ్యం పెరిగి రైళ్ల రద్దీ తగ్గుతుంది. ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలకు మహర్దశ ఈ రైల్వే లైన్ల విస్తరణ పనులతో ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలకు కనెక్టివిటీ మెరుగుపడనుంది. ఏపీలోని తిరుపతి, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయాలకు, తెలంగాణలోని యాదగిరి గుట్ట ఆలయానికి ప్రయాణికుల రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. మొత్తంగా ఐదు ప్రాజెక్టుల వల్ల సరుకు రవాణా సామర్థ్యం పెరగడంతోపాటు, ఇంధన ఆదాతో పాటు పర్యావరణానికి భారీ ప్రయోజనం కలగనుంది. వాతావరణంలోకి 42 కోట్ల కిలోల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయని, ఇది సుమారు 2 కోట్ల చెట్లను నాటడంతో సమానమని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. -
ఎఫ్ఐఆర్ నమోదు కాకుండానే కేసులో ఇరికించారా?
సాక్షి, న్యూఢిల్లీ: ఒక కేసులో అరెస్టు చేసి, అందులో ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాని మరో కేసులో ముద్దాయిగా చేర్చడంపై సుప్రీంకోర్టు తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. తెలంగాణ పోలీసుల దర్యాప్తు తీరును తప్పుబడుతూ దీనిని పూర్తిగా ’రివర్స్ ఇంజనీరింగ్’ కేసుగా అభివర్ణించింది. ఈ కేసులో 11 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న తెలంగాణకు చెందిన పులి ఓబులేసుకు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ విజయ్ బిష్ణోయ్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పులి ఓబులేసు దాఖలు చేసిన ఎస్ఎల్పీ (క్రిమినల్)పై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. పోలీసుల దర్యాప్తు తీరుపై ధర్మా సనం ప్రశ్నల వర్షం కురిపించింది. ‘మీరు అతడిని ఒక కేసులో అరెస్టు చేశారు. ఆ తర్వాత అతడు నేరం అంగీకరించాడని చెప్పి ఈ కేసులో ఇరికించారు. ఆ తర్వాతే ఫిర్యాదుదారుడిని సృష్టించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇదొక రివర్స్ ఇంజనీరింగ్ కేసు‘ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ట్రయల్ కోర్టు విధించే షరతులకు లోబడి పిటిషనర్ను బెయిల్పై విడుదల చేయాలని పేర్కొంది.అసలేం జరిగిందంటే...: 2014 నవంబర్ 19న హైదరాబాద్లో కేబీఆర్ పార్కు వద్ద ఆడి కారులో కూర్చున్న ఓ వ్యక్తి వద్దకు పులి ఓబులేసు తుపాకీతో వెళ్లి బెదిరించి డబ్బులు డిమాండ్ చేశాడు. బాధితుడు ప్రతిఘటించడంతో కారు అద్దంపై కాల్పులు జరిపాడు. బాధితుడి సోదరుడు అడ్డు కోగా, అతడిని కొరికి తుపాకీ వదిలేసి పరారయ్యాడు. విచారణ జరిపిన కింది కోర్టు.. కిడ్నాప్, హత్యాయత్నం, ఆయుధ చట్టం కింద నేరాలు రుజు వైనట్లు నిర్ధారించి జీవిత ఖైదు, కఠిన కారాగార శిక్షలు విధించింది. అయితే, బాధితుడిని కారు నుంచి మరో ప్రాంతానికి తరలించనందున కిడ్నాప్ సెక్షన్ వర్తించదంటూ జీవిత ఖైదును హైకోర్టు రద్దు చేసింది. అయితే, హత్యా యత్నం, ఆయుధ చట్టం కింద కింది కోర్టు విధించిన శిక్షలను మాత్రం సమర్థించింది. -
ముంచుకొస్తోంది ముప్పు.. భూతాపం భగ భగ!
వాతావరణ మార్పుల కారణంగా భూతాపం మునుపటి అంచనాల కంటే వేగంగా పెరిగే ముప్పు ఎక్కువగా ఉందా? త్వరలోనే నిర్దేశిత 1.5 డిగ్రీల సెల్సియస్ పరిమితిని దాటి 1.8 డిగ్రీల సెల్సియస్కు చేరిపోయే పెను ప్రమాదంలో భూగోళం కొట్టుమిట్టాడుతోందా? ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం (యూఎన్ఈపీ) నిస్సందేహంగా అవునంటోంది. అలాగని మరీ ఎక్కువ కాలం తర్వాతేమో అనుకునేరు, కాదు. రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే ఈ పరిమితి దాటిపోయే అవకాశం ఉందని తాజాగా విడుదల చేసిన ‘లిమిటింగ్ ఓవర్ షూట్’ (Limiting Overshoot) నివేదికలో యూఎన్ఈపీ ప్రపంచ దేశాలకు తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. అత్యంత ఆశాజనకమైన పరిస్థితుల్లో కూడా పారిశ్రామిక పూర్వపు స్థాయితో పోలిస్తే ఉష్ణోగ్రత పెరుగుదల 1.8 డిగ్రీల సెల్సియస్కు చేరుకోవచ్చని, ఇతర పరిస్థితుల్లో ఇది మరింత తీవ్రంగా ఉండవచ్చని తెలిపింది. మహాసముద్రాలపై తీవ్ర ప్రభావం వాతావరణంలోకి అతిగా విడుదలవుతున్న కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకోవటం వల్ల సముద్రాలు తీవ్ర ఆమ్లీకరణకు గురవుతున్నాయి. హిందూ మహాసముద్రంలో పెరుగుతున్న వేడి కారణంగా సముద్ర జీవుల ఆవాస పరిధి ఏకంగా 200 మీటర్ల మేర కుచించుకుపోతోంది. దీనివల్ల పగడపు దిబ్బలు, ఆయిస్టర్లు, క్లామ్స్, కొన్ని రకాల ప్లవకాలు తమ గూళ్లు, రక్షణ కవచాలను నిర్మించుకోలేక అంతరించిపోయే దశకు చేరుకుంటున్నాయి. భారత్తో పాటు చిన్న ద్వీప దేశాలు, లోతట్టు తీరప్రాంత నగరాలు సముద్ర మట్టాలు పెరగడం వల్ల ముంపు బారిన పడే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది. ఆర్కిటిక్ మహాసముద్రం పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. ఇతర సముద్రాల కంటే మూడు నుంచి నాలుగు రెట్లు వేగంగా ఆమ్లీకరణ చెందుతోంది.బలమైన సంకల్పం అవసరం పర్యావరణ బడ్జెట్ లోటును పరిమితం చేసేందుకు ప్రపంచ దేశాలు తీసుకోవాల్సిన తక్షణ చర్యలను ఈ నివేదిక సూచించింది. భారీ మంచు పలకలు కరిగిపోవటం, అమెజాన్ అడవులు క్షీణించటం, వాతావరణాన్ని నియంత్రించే ‘అట్లాంటిక్ మెరిడినల్ ఓవర్ టర్నింగ్ సర్క్యులేషన్’దెబ్బతినటం వంటి కోలుకోలేని నష్టాలు వాటిల్లకుండా తక్షణ చర్యలు చేపట్టాలని నివేదిక కీలక సూచనలు చేసింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఉద్గారాలను మీథేన్ సహా హరితగృహ వాయువుల ఉద్గారాలను తక్షణమే తగ్గించి నెట్జీరో స్థాయికి చేర్చాలని పాలకులకు పిలుపునిచ్చింది. బలమైన రాజకీయ సంకల్పం, అంతర్జాతీయ సహకారం, న్యాయమైన ఆర్థిక వనరులు సమకూరిస్తేనే ఈ పర్యావరణ ముప్పు నుంచి భూగోళాన్ని రక్షించుకోగలమని యూఎన్ఈపీ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: నీటి కొరతతో సౌదీ అరేబియా ఏం చేసిందో తెలుసా?ముంచుకొస్తున్న విపత్తులేమిటి? ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల మార్కును దాటిన తర్వాత ఉష్ణోగ్రతలో పెరిగే ఏ కొంచెం మార్పయినా పెను ముప్పులను తెచ్చిపెడుతుందని యూఎన్ఈపీ నివేదిక తీవ్రంగా హెచ్చరించింది. దీనివల్ల ఏమవుతుంది? తీవ్రమైన ప్రతికూల వాతావరణ పరిస్థితులు, తుపాన్లు, కరువులు పెరుగుతాయి. పర్యావరణ వ్యవస్థల విధ్వంసం తీవ్రమవుతుంది. చిన్న ద్వీప దేశాలు, లోతట్టు తీరప్రాంత నగరాలు సముద్రంలో మునిగిపోయే ముప్పు పెరుగుతుంది. మానవ ఆరోగ్యం, ఆహార భద్రత, నీటి సరఫరా, మౌలిక వసతులు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. – సాక్షి, స్పెషల్ డెస్క్ -
చక్కెర కేజీ రూ.140!
పండుగ సీజన్లో చక్కెర ధరల మంట ప్రజల్ని బెంబేలెత్తిస్తోంది. భారత్లోనూ కిలో పంచదార రూ.62.57కు చేరి.. గత నెలతో పోలిస్తే 27 శాతం అధికంగా ఉంది. ఇదే సమయంలో పొరుగున నేపాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. దసరా, తిహార్ పండుగలు సమీపిస్తుండటంతో డిమాండ్ పెరగడం, దిగుమతి వ్యయాలు అధికం కావడంతో కిలో పంచదార ధర ఏకంగా రూ.140కు చేరింది.కాఠ్మాండులోని సిగల్ ప్రాంతంలో పంచదార ధరలు భారీ స్థాయిలో పెరిగాయి. రెండు వారాల క్రితం ఇదే పంచదార రూ.115కే లభించింది. ఇటు భక్తపూర్లోని గట్టాఘర్లో కిలో ధర రూ.130గా ఉంది. ఇలా ఏరియాలను బట్టి.. కిలోకు రూ.20 నుంచి రూ.30 వరకు వ్యాపారులు పెంచేస్తున్నారు. నేపాల్ రిటైల్ ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పవిత్ర బజ్రాచార్య మాట్లాడుతూ.. హోల్సేల్ వ్యాపారులు నెల రోజుల్లో కిలో పంచదార ధరను రూ.125 వరకు పెంచారని తెలిపారు. దిగుమతి ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారని పేర్కొన్నారు. అయితే ధరల పెరుగుదలకు రిటైలర్లే కారణమనే వాదనను ఆయన ఖండించారు.సర్కారీ దుకాణాల్లో ఎంతంటే..మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థ సాల్ట్ ట్రేడింగ్ కార్పొరేషన్ (STC) దుకాణాల్లో మాత్రం కిలో పంచదార రూ.105కే విక్రయిస్తున్నారు. అయితే సరఫరాలో అంతరాయం కారణంగా ఒక్కో వినియోగదారుడికి విక్రయించే పరిమితిని ఆరు కిలోల నుంచి రెండు కిలోలకు తగ్గించారు. ప్రభుత్వ దుకాణాలు, బహిరంగ మార్కెట్ ధరల మధ్య భారీ వ్యత్యాసం ఉండటం చర్చనీయాంశంగా మారింది. పండుగల వేళ పంచదారకు డిమాండ్ పెరుగుతుందని తెలిసినా కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కెట్లో పంచదార అందుబాటులో ఉన్నప్పటికీ అధిక ధరకు విక్రయించడం వినియోగదారులకు అన్యాయమని వ్యాపార సంఘాల ప్రతినిధులు అంటున్నారు.25 వేల టన్నుల దిగుమతికి అనుమతిధరలను అదుపులోకి తెచ్చేందుకు నేపాల్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సాల్ట్ ట్రేడింగ్ కార్పొరేషన్ 25 వేల టన్నుల పంచదారను కేవలం ఒక శాతం కస్టమ్స్ సుంకంతో దిగుమతి చేసుకునేందుకు కేబినెట్ అనుమతించింది. ఈ సరుకు చేరే వరకు దేశీయ చక్కెర కర్మాగారాల నుంచి సుమారు 15 వేల టన్నుల పంచదారను ఎస్టీసీ, ఫుడ్ మేనేజ్మెంట్ అండ్ ట్రేడింగ్ కంపెనీ ద్వారా విక్రయించాలని నిర్ణయించింది.అదే సమయంలో భారత్ నుంచి పంచదార దిగుమతి చేసుకునేందుకు STC చర్యలు ప్రారంభించింది. భారత్ సరఫరాకు సుముఖత వ్యక్తం చేయడంతో త్వరలో నేపాల్లో ధరలు తగ్గే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏటా 2.5 లక్షల టన్నుల అవసరంనేపాల్లో ఏడాదికి సుమారు 2.5 లక్షల టన్నుల పంచదార అవసరం కాగా.. దేశీయంగా గరిష్ఠంగా 1.9 లక్షల టన్నుల వరకు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ప్రస్తుతం దేశీయ చెరకు క్రషింగ్ సీజన్ ముగిసింది. తదుపరి సీజన్ డిసెంబరులో ప్రారంభం కానుంది. దీంతో అప్పటివరకు దిగుమతులపైనే నేపాల్ ఎక్కువగా ఆధారపడాల్సి ఉంది. ఇప్పటికే ఎస్టీసీ దేశీయ ఉత్పత్తిదారుల నుంచి సుమారు 600 టన్నుల పంచదార కొనుగోలు చేసింది. రవాణా మార్గాల్లో అంతరాయాల కారణంగా గతంలో సరఫరాకు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో పండుగల డిమాండ్ పెరగకముందే తగినంత నిల్వలు సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.భారత్ సరఫరాపైనే ఆశలుమరోవైపు నేపాల్ పంచదార అవసరాల్లో భారత్ కీలకంగా మారింది. దేశీయ ఉత్పత్తి అవసరాలకు సరిపోకపోవడంతో దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే సరఫరాపైనే నేపాల్ మార్కెట్ వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. ఇప్పటికే 2,500 టన్నుల పంచదార నేపాల్కు చేరే ప్రక్రియలో ఉండగా.. మరో 2,500 టన్నుల దిగుమతికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారత్లో ఉత్పత్తి, దేశీయ డిమాండ్, ఎగుమతి విధానాలు ఎలా ఉంటాయన్నదానిపై కూడా నేపాల్ పంచదార ధరలు ఆధారపడనున్నాయి. భారత్పైనా ధరల ఒత్తిడిమరోవైపు భారత్లోనూ పంచదార రంగం కీలక దశలో ఉంది. దేశీయ ఉత్పత్తి, ఎగుమతులు, పండుగల సీజన్లో పెరిగే డిమాండ్ నేపథ్యంలో సరఫరా–ధరలపై మార్కెట్ వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి. ఇలాంటి సమయంలో నేపాల్ భారత్ నుంచి దిగుమతులపై ఆధారపడటం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్లో సరఫరా పరిస్థితి, ఎగుమతి విధానాలు నేపాల్లో పంచదార ధరలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. పండుగల డిమాండ్ నేపథ్యంలో రెండు దేశాల్లోనూ పంచదార ధరల పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.ఇదీ చదవండి: ‘అదొక పనికిరానిది..’ ఇరాన్కు అమెరికా కౌంటర్ -
ఢిల్లీ మాజీ చీఫ్ సెక్రటరీ ఆత్మహత్మ, సూసైడ్ నోట్
ఢిల్లీ మాజీ ప్రధాన కార్యదర్శి, 74 ఏళ్ల రాకేష్ మెహతా (Rakesh Mehta) నోయిడాలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. 1975 బ్యాచ్ IAS అధికారి అయిన మెహతా దివంగత మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ హయాంలో పనిచేశారు. తన నిర్ణయానికి అనారోగ్యం ,మానసిక సమస్యలే కారణమని పేర్కొంటూ రాసిన ఒక లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెప్టెంబర్ 6న ఆయన మృతదేహం లభ్యమైంది. ఆదివారం నాడు ఆయన అంత్యక్రియలు జరిగాయి.ఆయన ఢిల్లీ ప్రభుత్వంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ కమిషనర్తో సహా వివిధ హోదాల్లో పనిచేశారు. 2007లో ఢిల్లీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి, మూడేళ్లకు పైగా ఆ పదవిలో కొనసాగారు. రాజధాని నగరంలో రవాణా, విద్యుత్ మరియు పౌర మౌలిక సదుపాయాలకు సంబంధించిన కీలక ప్రాజెక్టులను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన పదవీకాలంలోనే 2010లో ఢిల్లీలో కామన్వెల్త్ గేమ్స్ విజయవంతంగా నిర్వహించారు. -
కాంగ్రెస్కు మిత్రపక్షం నుంచే ఘాటు కౌంటర్
ఇండియా కూటమి మిత్రపక్షాల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఇంతకాలం ఎన్నికలు.. సీట్ల పంపిణీ కారణం కాగా.. ఈసారి కాంగ్రెస్–నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య మరో కారణం మాటల యుద్ధానికి దారి తీసింది. ఇదే అదనుగా బీజేపీ రంగంలోకి దిగి కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు గుప్పించింది. ‘వందేమాతరం’ చుట్టూ మొదలైన వివాదం.. ఇప్పుడు కూటమి మిత్రపక్షాల మధ్య రాజకీయ పోరుగా మారింది.జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్లో సోమవారం జరిగిన తొలి అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో జాతీయ గీతం ‘జనగణమన’కు ముందు ‘వందేమాతరం’ పూర్తి రూపాన్ని ఆలపించారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా సహా పలువురు నేతలు మొత్తం గీతం పూర్తయ్యే వరకు గౌరవంగా నిలబడ్డారు. ఈ పరిణామంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం రాజుకుంది. కాంగ్రెస్–ఎన్సీ రెండూ ఇండియా కూటమిలో భాగస్వాములే కావడంతో ఈ అంశం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.‘పూర్తి గీతం మా వైఖరికి విరుద్ధం’శ్రీనగర్ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ‘ఎక్స్’లో షేర్ చేశారు. ‘వందేమాతరం’ పూర్తి రూపం స్వాతంత్య్ర సమరయోధులు కోరుకున్నదానికి అనుగుణంగా లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ 1937లో ఆమోదించిన రూపాన్నే పాటించాలని, మిత్రపక్షాలు కూడా ఆ నిర్ణయాన్ని గౌరవించాలని కోరారు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, సుభాష్ చంద్రబోస్, మౌలానా ఆజాద్ తదితర స్వాతంత్య్ర సమరయోధుల అభిప్రాయాలను గౌరవించాల్సిన అవసరం ఉందని వేణుగోపాల్ పేర్కొన్నారు. మతపరమైన విభేదాలకు తావులేకుండా ఉండేందుకే కాంగ్రెస్ రెండు చరణాల రూపాన్ని అనుసరిస్తోందని ఆయన గుర్తు చేశారు. అయితే దీనికి ఎన్సీ ఘాటుగా స్పందించింది.అంతమాత్రాన ఆదేశిస్తారా?కేసీ వేణుగోపాల్ ట్వీట్కు ఎన్సీ నేత బషీర్ అహ్మద్ బదులిచ్చారు. మిత్రపక్షంగా ఉన్న తమను ఏం పాడాలి, ఎంతవరకు పాడాలి అని కాంగ్రెస్ నిర్దేశించలేదని స్పష్టం చేశారు. ‘‘ఆయనకు తన అభిప్రాయాన్ని ‘ఎక్స్’లో వెల్లడించే హక్కు ఉంది. అయితే దాన్ని మిత్రపక్షాలపై విధించలేరు. ప్రజలపై ఏదైనా విషయాన్ని బలవంతంగా రుద్దడాన్ని మేం వ్యతిరేకిస్తాం అని స్పష్టం చేశారు.‘నాగ్పూర్ ఆదేశాలు పాటించొద్దు’ఎన్సీ స్పందనతో కాంగ్రెస్ కూడా వెనక్కి తగ్గలేదు. ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లాలు ఇండియా కూటమిలో భాగస్వాములని గుర్తుచేసిన కాంగ్రెస్ నేతలు.. కూటమి నిర్ణయాన్ని గౌరవించాలని కోరారు. నాగ్పూర్ అంటే ఆర్ఎస్ఎస్ నిర్ణయాలను అనుసరించవద్దంటూ ఎన్సీ నేతలపై విమర్శలు చేశారు.కాంగ్రెస్పై బీజేపీ ఎదురుదాడిఈ వివాదాన్ని బీజేపీ కూడా అందిపుచ్చుకుంది. పూర్తి ‘వందేమాతరం’పై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. కాంగ్రెస్ వైఖరి ఆ పార్టీని 21వ శతాబ్దపు ‘ముస్లిం లీగ్’గా మార్చిందని బీజేపీ ఎంపీ, అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది విమర్శించారు. కాంగ్రెస్ ఈ అంశంలో పూర్తిగా ఒంటరిగా మిగిలిపోయిందని ఆయన అన్నారు. మరో బీజేపీ నేత ఆర్ఎస్ పఠానియా కూడా కాంగ్రెస్పై మండిపడ్డారు. కశ్మీర్లో వేర్పాటువాదులు సైతం ‘వందేమాతరం’పై అభ్యంతరం వ్యక్తం చేయలేదని వ్యాఖ్యానించారు.కూటమిలో కొత్త రగడ?ఒకే కూటమిలో ఉన్న కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ ‘వందేమాతరం’ విషయంలో భిన్న వైఖరులు తీసుకోవడం ఇండియా కూటమి అంతర్గత విభేదాలను మరోసారి బయటపెట్టింది. శ్రీనగర్ ఫిల్మ్ ఫెస్టివల్లో చోటుచేసుకున్న ఈ పరిణామం.. ఇప్పుడు జాతీయ స్థాయిలో రాజకీయ దుమారం రేపుతోంది.రెండు చరణాలకే కాంగ్రెస్ కట్టుబాటు‘వందేమాతరం’ విషయంలో కాంగ్రెస్ ఇప్పటికే తన వైఖరిని స్పష్టం చేసింది. 1937లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రకారం పార్టీ కార్యక్రమాల్లో రెండు చరణాల రూపాన్నే ఆలపించాలని గత నెలలో సీడబ్ల్యూసీ నిర్ణయించింది. పూర్తి గీతం విషయంలో బీజేపీ విమర్శలు పెరగడంతో ఈ నిర్ణయం మరింత రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.మరోవైపు కేంద్రం కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలలు, అధికారిక వేడుకల్లో పూర్తి ‘వందేమాతరం’ను ఆలపించే అంశం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తన 1937 నాటి నిర్ణయానికే కట్టుబడి ఉండగా.. అదే ఇండియా కూటమిలోని ఎన్సీ నేతలు శ్రీనగర్లో పూర్తి గీతానికి నిలబడటం చర్చనీయాంశంగా మారింది.ఇదీ చదవండి: సర్ప్రైజ్!! బీజేపీకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? -
సీఎం గొంతుతో మిమిక్రీ.. వెలుగులోకి భారీ ప్రభుత్వ ఉద్యోగాల కుంభకోణం
గౌహతి: అస్సాంలో ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ కాంట్రాక్టుల పేరుతో సాగుతున్న భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించేందుకు ఏకంగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ గొంతును పోలిన వ్యక్తితో మిమిక్రీ చేయించి మోసాలకు పాల్పడిన సీనియర్ సివిల్ సర్వీస్ అధికారిని సీఎం ప్రత్యేక విజిలెన్స్ సెల్ అధికారులు అరెస్ట్ చేశారు.1999 బ్యాచ్కు చెందిన అస్సాం సివిల్ సర్వీస్ అధికారి, ధేమాజీ జిల్లా అభివృద్ధి కమిషనర్గా పనిచేస్తున్న దేబేశ్వర్ బోరా ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా గుర్తించారు. ఆయన తన హోదాను దుర్వినియోగం చేస్తూ అక్రమాస్తులు ఆర్జించారనే ఆరోపణలపై విచారణ ప్రారంభంకాగా, ఈ విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఆశించేవారితో మాట్లాడేటప్పుడు సమయంలో తనకు ప్రభుత్వంలో అత్యున్నత స్థాయి వరకు సంబంధాలు ఉన్నాయని నమ్మించేందుకు నిందితుడు ఒక సరికొత్త ప్లాన్ వాడుకున్నాడు. మిమిక్రీ చేయడంలో నైపుణ్యం ఉన్న ఒక మధ్యవర్తి ద్వారా ఉద్యోగార్థులకు ఫోన్ చేయించేవాడు. ఆ ఫోన్ కాల్స్లో అవతలి వ్యక్తి అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ) రవి కోటాగా గొంతు మార్చి మాట్లాడేవారు. ప్రభుత్వం తరఫున ఆమోదం లభించిందని నమ్మించి అమాయకుల నుంచి భారీగా నగదు వసూలు చేసేవారు. అయితే, ధేమాజీకి చెందిన ఓ రాజకీయ నాయకుడుతో నాయకుడు క్యూబ్-బిజినెస్మన్తో ఈ తరహా డీల్ జరిగిన తర్వాత ఈ మోసం గుట్టు రట్టయింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భాగంగా విజిలెన్స్ అధికారులు ఆయన నివాసాల్లో సోదాలు నిర్వహించి, ఈ నకిలీ కాల్స్ ధ్వని రికార్డులు,ఇతర ఆధారాలను సేకరించి దేబేశ్వర్ బోరాను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దీనిపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. -
ప్రధాని మోదీ పర్యటనకు ముందు కలకలం
ముంబై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముంబై పర్యటన సందర్భంగా తీవ్ర కలకలం చెలరేగింది. ప్రధాని పాల్గొనాల్సిన కార్యక్రమంలో ఇద్దరు అగంతకులు చొరబడ్డారు. పీఎంవో అధికారులమంటూ అనుమానాస్పదంగా వ్యవహరించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి తుపాకితో పాటు ఫేక్ ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ నీతా ముకేష్ అంబానీ కల్చరల్ సెంటర్ వేదికగా ‘గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026’ సదస్సు జరగాల్సి ఉంది. ఈ సదస్సును ప్రారంభించేందుకు ప్రధాని మోదీ రావాల్సి ఉంది. అంతకంటే ముందే రోహన్ పరేఖ్ తాను ప్రధాన మంత్రి కార్యాలయ అధికారినంటూ ఆ ఈవెంట్కు వచ్చారు. తనిఖీల్లో భాగంగా అతని వద్ద నకిలీ పీఎంవో ఐడీ కార్డుతో పాటు తుపాకీ లభించడంతో భద్రతా బలగాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. అతనితో పాటు ఉన్న సెక్యూరిటీ గార్డును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటన తీవ్రత దృష్ట్యా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుల మొబైల్ ఫోన్లు, గుర్తింపు పత్రాలను పరిశీలిస్తున్నారు.తుపాకులతో, నకిలీ ఐడీలతో నేరుగా ప్రధాని మోదీ హాజరు కావాల్సిన కార్యక్రమానికి ఎందుకు వచ్చారనే అంశంపై లోతుగా విచారణ జరుపుతున్నారు.అత్యంత ప్రతిష్టాత్మకమైన వార్షిక ఫిన్టెక్ సదస్సులలో ఒకటైన ‘గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026’ను ముంబైలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటన వేళ జరిగిన ఈ భద్రతా లోపం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. -
ఐఎన్ఎస్ అధ్యక్షుడిగా కరణ్ రాజేంద్ర దర్దా
న్యూఢిల్లీ: దేశంలో వార్తాపత్రికలు, మ్యాగజైన్లు, పీరియాడికల్స్ ప్రచురణకర్తల సంఘం అయిన ఇండియన్ న్యూస్పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్)కి 2026–27 సంవత్సరానికిగాను అధ్యక్షుడిగా కరణ్ రాజేంద్ర దర్దా (లోక్మాత్) ఎన్నికయ్యారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన 67వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన ఎన్నికను ప్రకటించారు. అలాగే ఐఎన్ఎస్ డిప్యూటీ ప్రెసిడెంట్గా తన్మయ్ మహేశ్వరి (అమర్ ఉజాలా), వైస్ ప్రెసిడెంట్గా హర్ష మ్యాథ్యూ (వనిత), గౌరవ ట్రెజరర్గా అనంత్నాథ్ (గృహశోభిక) ఎన్నికయ్యారు. ఐఎన్ఎస్ సెక్రటరీ జనరల్గా మేరీ పాల్ కొనసాగనున్నారు. మరోవైపు 41 మందితో కూడిన ఐఎన్ఎస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల్లో కె.ఆర్.పి. రెడ్డి (సాక్షి), ఐ. వెంకట్ (ఈనాడు), వివేక్ గోయెంకా (ద ఇండియన్ ఎక్స్ప్రెస్–ముంబై), జయంత్ మామ్మెన్ మ్యాథ్యూ (మలయాళ మనోరమ) ఉన్నారు. -
‘ఆ ధోరణి ఇంకెప్పుడు మారుతుందో?..’ కంగనా కీలక వ్యాఖ్యలు
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, కోలీవుడ్ నటి త్రిష కృష్ణన్ బంధం గురించి చాలాకాలంగా అక్కడ చర్చ నడుస్తోంది. అయితే ఆమెను ఉద్దేశించి.. నటుడు, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట రాజకీయ దుమారం రేపాయి. తాజాగా ఆ వ్యవహారంపై సీఎం విజయ్ కూడా భగ్గుమన్నారు. మహిళల్ని కించపరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. అయితే ఈ ఎపిసోడ్పై నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు.మహిళలను కించపరిచేందుకు.. వారి వ్యక్తిత్వాన్ని, క్యారెక్టర్ను లక్ష్యంగా చేసుకోవడం ఎప్పటి నుంచో వస్తున్న ధోరణేనని ఆమె వ్యాఖ్యానించారు. హిమాచల్ప్రదేశ్లోని కులు జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించిన అనంతరం కంగనా మీడియాతో మాట్లాడారు. మహిళలు ఉద్యోగం చేస్తున్నా, విజయవంతమైనా, నాయకురాలిగా ఉన్నా, అధికార స్థానంలో ఉన్నా.. వారిని కిందకు లాగేందుకు.. ఆమె పరువు, గౌరవాన్ని దెబ్బతీసేలా ప్రచారం చేయడం మనకు కొత్తేం కాదు. అలాగని ఈ సమస్య భారత్కు మాత్రమే పరిమితం కాలేదని.. ప్రపంచమంతటా ఉందని పేర్కొన్నారామె. ఈ క్రమంలోనే త్రిష ఎపిసోడ్ను ఆమె ప్రస్తావించారు. తమిళనాడులో మొన్న ఏం జరిగిందో అంతా చూశారు. ఎంతో గౌరవనీయమైన నటి ఒక వ్యవహారంలో చిక్కుకున్నారు. ఆ వ్యవహారంలో సంబంధం ఇద్దరి మధ్య ఉంది. కానీ, దూషణలు, వ్యక్తిత్వాన్ని కించపర్చడం మాత్రం మహిళపైనే జరుగుతున్నాయి. ఎందుకలా?” అని కంగనా అన్నారు. ఆ ధోరణి ఇంకెప్పుడు ఆగుతుందని వ్యాఖ్యానించారామె. సమాజం తనను తాను ఈ విషయంలో పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందని.. మహిళలను మనం ఎలా చూస్తున్నాం? నిజంగా వారిని గౌరవిస్తున్నామా? అనే ప్రశ్నలకు సమాధానం వెతుక్కోవాలని వ్యాఖ్యానించారు.ఆగస్టు 3న కావేరీ జలాల వివాదంపై తంజావూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో ఉదయనిధి ప్రసంగిస్తున్న సమయంలో కొందరు త్రిష పేరు ప్రస్తావిస్తూ నినాదాలు చేశారు. దీనికి ఆయన స్పందించిన తీరు వివాదాస్పదమైంది. త్రిషను ఉద్దేశించే ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంపై కేసు నమోదవడంతో ఆగస్టు 4న ఉదయనిధిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బెయిల్పై విడుదలయ్యారు.అయితే తాను త్రిష పేరును ప్రస్తావించలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఉదయనిధి చెప్పారు. కావేరీ నదిని ఉద్దేశించే తాను ఆ వ్యాఖ్య చేశానని ఆయన వివరణ ఇచ్చారు. అయినప్పటికీ ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. త్రిషకు మద్దతుగా పలువురు సినీ ప్రముఖులు, మహిళా నేతలు స్పందించారు. కంగనా కూడా గతంలో ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. బహిరంగంగా అసభ్యకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేయడం ఏ నాగరిక సమాజమూ అంగీకరించదని పేర్కొన్నారు. ఉదయనిధిపై తీసుకున్న చట్టపరమైన చర్యలు మంచి ఉదాహరణగా నిలుస్తాయని వ్యాఖ్యానించారు.ఇదే వివాదం నేపథ్యంలో తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్ సోమవారం అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశరు. మహిళలపై వ్యక్తిగత దూషణలు, ద్వంద్వార్థ వ్యాఖ్యలను సహించబోమని స్పష్టం చేశారు. రాజకీయ విమర్శలు చేసుకోవచ్చని, కానీ మహిళలను కించపరిచే వ్యాఖ్యలకు మాత్రం చోటు ఉండకూడదని హెచ్చరించారు. మహిళలపై దూషణలు, వ్యక్తిగత దాడులు కొనసాగితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: అంతా మా ఇష్టం అంటే కుదరదిక్కడ -
భవన యజమాని అరెస్ట్
న్యూఢిల్లీ: విద్యాభ్యాసం, ఉపాధి కోసం వచ్చి పాత హాస్టల్ భవనంలో తలదాచుకున్న విద్యార్థులు, యువత భవిష్యత్తును అంధకారం చేస్తూ పేకమేడలా ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో భవన యజమాని కుటుంబాన్ని పోలీసులు అరెస్ట్చేశారు. కూలిన భవన యజమాని అయిన మాజీ భారత వాయుసేన సార్జెంట్, 81 ఏళ్ల హరిరామ్ గుప్తా, ఆయన భార్య ఊర్మీళ(75), కుమారుడు మహేశ్(52)లను ఢిల్లీ పోలీసులు అరెస్ట్చేశారు. పారిపోతున్న హరిరామ్ను హరియాణా–రాజస్తాన్ సరిహద్దుల్లోని భీవాడీలో పోలీసులు పట్టుకున్నారు. భవనం పాడవుతున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించినందుకు, పలువురి మరణాలకు కారణమైనందుకు వీళ్లపై పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. పేయింగ్ గెస్ట్ భవనాన్ని హరిరాం, అతని కుమారుడు నిర్వహిస్తున్నారు. భవనం భార్య పేరిట ఉంది. మరోవైపు భవనం కూలిన ఘటనలో మరణాల సంఖ్య ఏడుకు పెరిగింది. 27 గంటలపాటు నిరాటంకంగా కొనసాగిన అన్వేషణ, సహాయక చర్యలు సోమవారం సాయంత్రం ముగిశాయి. ఘటన జరిగినప్పటి నుంచి మొత్తంగా 12 మందిని శిథిలాల నుంచి అతికష్టంమీద బయటకు తీశారు. వీరిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మిగతా వారిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణం సమీప సత్య నికేతన్ ప్రాంతంలో బాయ్స్ పేయింగ్ గెస్ట్ భవనం కూలిన ఘటనపై ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) సారథ్యంలో ఉన్నతస్థాయి విచారణ జరపాలని ఢిల్లీ హైకోర్టు సోమవారం ఆదేశాలిచ్చింది. ‘‘ఎంసీడీ, ఇతర సంస్థలు చేపట్టిన చర్యల్లో పూర్తి నిర్లక్ష్యవైఖరి కారణంగానే భవనాలు కూలుతున్నాయి. ఇలాంటి దారుణోదంతాలతో తమకు సంబంధం లేదు అని ప్రభుత్వాలు చేతులు దులిపేసుకోవద్దు’’అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. కూలిన భవనానికి ఎలాంటి పిల్లర్లు, బీమ్లు లేకపోవడం గమనార్హం. మరోవైపు క్షతగాత్రులను ఢిల్లీ ఎయిమ్స్ ట్రామా సెంటర్లో చేర్పించడంతో తమ వారి ఆరోగ్య పరిస్థితి తెల్సుకునేందుకు కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు, ఆప్తులు ఆస్పత్రికి తరలివచ్చారు. వీడియోకాల్ చేసి... ప్రాణాలతో బయటపడి.. బిహార్కు చెందిన 19 ఏళ్ల ఆదిత్య బీకామ్ తొలి ఏడాది చదువుతూ నాలుగు రోజుల క్రితమే ఈ భవనంలో పై అంతస్తులో దిగాడు. భవనం కూలినప్పుడు శిథిలాల్లో చిక్కుకున్నా ఎలాగోలా సోదరి ఫోన్చేసి ‘‘నన్ను కాపాడండి. శిథిలాల్లో ఉన్నా. ఫోన్ బ్యాటరీ అయిపోతోంది. కాపాడండి’’అని చెప్పగానే ఫోన్ కట్అయింది. విషయం వెంటనే అక్కడి సహాయక బృందాలకు చెప్పగానే ఎలాగోలా శిథిలాల నుంచి అతడిని కాపాడారు. ప్రస్తుతం ఇతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఏకంగా నాలుగు గంటల తర్వాత ఆదిత్యను కాపాడటంపై కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. బీకామ్ చదువుతూ ఇదే భవనంలో ఉంటున్న 18 ఏళ్ల తన కుమారుడు అక్షిత్ లేడనే వార్త తెలిసి తల్లి దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు. ‘‘కాలిపై ఉన్న ఒకే ఒక్క పుట్టుమచ్చతో మా వాడిని గుర్తించా. ఘటన జరగడానికి కొన్ని గంటల ముందే ఊరి నుంచి తిరిగొచ్చి దుర్ఘటనలో బలయ్యాడు’’అని ఆమె ఏడుస్తూ చెప్పారు. అధికారుల సస్పెన్షన్ ఢిల్లీ మహిళా ముఖ్యమంత్రి రేఖా గుప్తా సోమ వారం ఘటనాస్థలికి సందర్శించారు. అధ్వానంగా ఉన్న భవనం వివరాలను ప్రభుత్వం దృష్టికితేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత ప్రభుత్వాధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో కొద్దిసేపటికే ఎంసీడీ డిప్యూటీ కమిషనర్ రాకేశ్ సహా సౌత్ జోన్ సూపరింటెండెంట్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(భవనాలు), అసిస్టెంట్ ఇంజనీర్(భవనాలు), జూనియర్ ఇంజనీర్లను ప్రభుత్వం సస్పెండ్చేసింది. నగరంలో అక్రమంగా నిర్మించిన ఐదంతస్తుల భవనాలను సీజ్ చేయాలని సీఎం ఆదేశించారు. బీజేపీ ప్రభుత్వాలపై రాహుల్ విమర్శలు ఢిల్లీ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ విమర్శలు గుప్పించారు. ‘‘భవనం కుప్పకూలడం సహా ప్రభుత్వాల వైఫల్యాలపై ఎవరు ఏ ప్రశ్నలడిగినా వాళ్లను కించపరచడమే మోదీ పనిగా పెట్టుకున్నారు. ప్రతిసారీ ప్రజల జీవితాలు, ఆశలు, ఆశయాలు ఇలాంటి భవనాల కింద నలిగిపోతున్నాయి. ప్రశ్నిస్తే ‘దిమాగీ నక్సల్’, ‘నారాజ్ ఫూఫా’ అంటూ కొత్త విమర్శలు సంధిస్తారేగానీ వైఫల్యాలకు తమదే బాధ్యత అనే జవాబుదారీతనం మాత్రం మోదీ ప్రదర్శించరు’’అని రాహుల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. -
అజెండాపై కుదరని ఏకాభిప్రాయం
కృష్ణా, గోదావరి జలాల వినియోగంలో ఏపీ, తెలంగాణల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ రెండో సమావేశంలోనూ అజెండాపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో భేటీలో చర్చించాల్సిన అంశాలపై వారంలోగా ప్రతిపాదనలు ఇవ్వాలని ఇరు రాష్ట్రాల అధికారులకు సీడబ్ల్యూసీ చైర్మన్ అనుపమ్ ప్రసాద్ సూచించారు.సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: కృష్ణా, గోదావరి జలాల వినియోగంలో ఆంధ్రపద్రేశ్, తెలంగాణల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి సూచనలు ఇచ్చేందుకు కేంద్రం ఏర్పాటుచేసిన కమిటీ రెండో సమావేశంలోనూ అజెండాపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో కమిటీ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై వారంలోగా ప్రతిపాదనలు ఇవ్వాలని రెండు రాష్ట్రాల అధికారులకు సీడబ్ల్యూసీ చైర్మన్ అనుపమ్ ప్రసాద్ సూచించారు. ఏపీ ప్రతిపాదనలను తెలంగాణకు, తెలంగాణ ప్రతిపాదనలను ఏపీకి పంపుతామని.. వాటిని పరిశీలించి ఇరు రాష్ట్రాల అధికారులు అభిప్రాయాలు చెప్పాక అజెండాను ఖరారుచేసి మరో రెండు వారాల తర్వాత సమావేశం నిర్వహిస్తామంటూ చేసిన సూచనకు ఇరు రాష్ట్రాల అధికారులు అంగీకరించారు. సీడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షతన జల వివాదాల కమిటీ రెండో సమావేశం ఢిల్లీలోని సీడబ్ల్యూసీ కార్యాలయంలో సోమవారం జరిగింది. ఏపీ తరఫున జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్కుమార్, సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు, ఈఎన్సీ కె. నరసింహమూర్తి.. తెలంగాణ తరఫున ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్, సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ తదితరులు సమావేశానికి హాజరయ్యారు. గత జనవరి 30న జరిగిన తొలి సమావేశానికి కొనసాగింపుగా ఈ భేటీ జరిగింది. ఆ సమావేశంలో అజెండా సమరి్పంచాలని ఇరు రాష్ట్రాల అధికారులను సీడబ్ల్యూసీ చైర్మన్ కోరినా ఇప్పటిదాకా అజెండాను రెండు రాష్ట్రాలు ప్రతిపాదించలేదు. దీంతో అజెండాను ఖరారు చేసేందుకు రెండో సమావేశాన్ని ఏర్పాటుచేశారు. పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతి, గోదావరిలో నీటి లభ్యతపై అధ్యయనం, గోదావరి జలాల్లో రెండు రాష్ట్రాల వాటాలు తేల్చడం, కృష్ణాపై అనుమతిలేకుండా తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులు తదితర అంశాలపై చర్చించాలని ఏపీ అధికారులు సూచించగా.. బ్రిజేష్కుఆర్ ట్రిబ్యునల్ తుది తీర్పు వచ్చేవరకు కృష్ణా జలాల్లో 50 శాతం వాటా వినియోగించుకునే అవకాశం కల్పించడం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 టీఎంసీల నీటి హక్కులను కల్పించడం, గోదావరి మిగులు జలాల వినియోగం, పోలవరం–నల్లమలసాగర్ లింక్, అంతర్రాష్ట్ర ప్రాజెక్టులకు అనుమతులు వంటి అంశాలపై చర్చించాలని తెలంగాణ అధికారులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. లభ్యత జలాల లెక్కలపై ఏపీ అభ్యంతరాలు.. గోదావరిలో ప్రవాహాలపై శాస్త్రీయంగా అధ్యయనం చేయించి నీటి లభ్యతను తేల్చాలని సీడబ్ల్యూసీ చైర్మన్ను ఏపీ అధికారులు కోరారు. నీటి లభ్యత తేల్చాక ఏపీ, తెలంగాణ వాటాలను తేల్చాలన్నారు. గోదావరి ట్రిబ్యునల్ను ఏర్పాటుచేసి రెండు రాష్ట్రాల వాటాలను తేల్చాలని తమ ప్రభుత్వం ఇప్పటికే లేఖ రాసిందని వారు గుర్తుచేశారు. నీటి వాటాలు తేలకముందే తెలంగాణ చేపట్టిన కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల వంటి ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీనిపై తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆ ప్రాజెక్టులన్నీ ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టినవేనని.. రీ–ఇంజినీరింగ్, డిజైన్ చేసి చిన్నచిన్న మార్పులు మాత్రమే చేశామని వివరించారు. ప్రస్తుత సంవత్సరం తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 65 రోజుల్లో వెయ్యి టీఎంసీలకు పైగా వరద జలాలు సముద్రంలో కలిశాయని.. అందులో 200 టీఎంసీలను వినియోగించుకోవడానికి చేపట్టిన పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతివ్వాలని ఏపీ అధికారులు కోరగా.. తెలంగాణ అధికారులు అభ్యంతరం తెలిపారు. వీటిపై సీడబ్ల్యూసీ చైర్మన్ అనుపమ్ ప్రసాద్ జోక్యం చేసుకుంటూ అజెండాలో చేర్చితే వాటిపై చర్చిద్దామని రెండు రాష్ట్రాల అధికారులకు సూచించారు. మాకు తాగునీరు, విద్యుత్ అవసరాలే ముఖ్యం : తెలంగాణ శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు విద్యుత్కేంద్రంలో తెలంగాణ సర్కార్ యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ ప్రాజెక్టును ఖాళీచేస్తోందని.. నీటి మట్టం 854 అడుగుల కంటే దిగువకు చేరితే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు నీళ్లందించలేని.. రాయలసీమ, చెన్నైకి తాగునీటిని సరఫరా చేయలేమని ఏపీ అధికారులు సీడబ్ల్యూసీ చైర్మన్కు వివరించారు. విద్యుదుత్పత్తి చేయకుండా తెలంగాణను నిలువరించాలని ఏపీ అధికారులు కోరడంపై తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తంచేశారు. అయితే, తమకు తాగునీరు, విద్యుత్ అవసరాలే అత్యంత ముఖ్యమని, ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగానే శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తిపై నిర్ణయాలు తీసుకుంటామని తెలంగాణ అధికారులు వివరించారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం దిగువన ఉన్న నాగార్జునసాగర్లో తగిన నిల్వలు అవసరమని చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఏపీ తన వాటాకు మించి నీళ్లను తరలిస్తోందన్నారు. వీటిపై సీడబ్ల్యూసీ చైర్మన్ అనుపమ్ ప్రసాద్ జోక్యం చేసుకుంటూ తాగునీటి అవసరాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని రెండు రాష్ట్రాల అధికారులకు సూచించారు.గోదావరి–కావేరి బ్లూప్రింట్ మేమే రూపొందిస్తాం : సీడబ్ల్యూసీ ఇక తెలంగాణలోని సమ్మక్క బ్యారేజ్ నుంచి గోదావరి జలాలను కావేరికి తరలించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుండగా.. పోలవరం ప్రాజెక్టు నుంచి కావేరికి గోదావరి జలాలను తరలించేలా గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. పోలవరం నుంచి గోదావరి జలాలను కావేరికి తరలిస్తే తమ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని తెలంగాణ అభ్యంతరం తెలుపుతోంది. సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. గోదావరి–కావేరి అనుసంధానం ప్రాజెక్టు బ్లూప్రింట్ తామే రూపొందిస్తామని సీడబ్ల్యూ చైర్మన్ అనుపమ్ ప్రసాద్ స్పష్టంచేశారు. -
ఢిల్లీ ట్రాజెడీ : మళ్లీ వార్తల్లో ఐఏఎస్ సంజీవ్
న్యూఢిల్లీ: సీనియర్ ఐఏఎస్ అధికారి, ఢిల్లీ మున్సిపల్ కమిషనర్ సంజీవ్ ఖిర్వార్పై మరోసారి తీవ్ర ఉచ్చు బిగుస్తోంది. గతంలో తన పెంపుడు కుక్కతో త్యాగరాజ్ స్టేడియంలో చక్కర్లు కొట్టి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ అధికారి, తాజాగా ఢిల్లీలోని సత్యనికేతన్ ఏరియాలో బిల్డింగ్ కుప్పకూలిన ఘోర ప్రమాదంతో మరోసారి వివాదాల కేంద్రబిందువుగా మారారు. ఈ ఘటనలో ప్రాణనష్టం సంభవించడంతో ఆయనపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీలోని సత్యనికేతన్ ఏరియాలో ఆదివారం (సెప్టెంబర్ 6, 2026) మధ్యాహ్నం ఐదు అంతస్తుల పీజీ హాస్టల్ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. భవన బేస్మెంట్లో మరమ్మతులు, నిర్మాణ పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. ఢిల్లీ పోలీసులు, సహాయక బృందాలు ఇప్పటివరకు 12 మందిని రక్షించాయి. ప్రమాదానికి కారణమైన హాస్టల్ యాజమాని హరిరాంబ్ బన్సల్ను రాజస్థాన్లో అరెస్టు చేశారు.మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రాణనష్టానికి కారణమంటూ డిమాండ్లు వ్యక్తమవుతుండటంతో, ఐఏఎస్ సంజీవ్ ఖిర్వార్ రాజీనామా చేయాలనే డిమాండ్లు జోరందుకున్నాయి. ఘటన జరిగిన మరుసటి రోజే (సోమవారం) ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ రంగంలోకి దిగి ఐదుగురు అధికారులను తక్షణమే సస్పెండ్ చేసింది.స్పందించిన ఎంబీసీ కమిషనర్ ఈ ప్రమాదంపై ఎంసీడీ కమిషనర్ సంజీవ్ ఖిర్వార్ స్పందిస్తూ.. అనధికారిక నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం అనేది ఒక సాధారణ ప్రక్రియ. ఆగస్టులో అదే ప్రాంతంలోని 3-4 భవనాలను కూల్చివేయాలని మేము ఆదేశాలు జారీ చేశాము. గత మూడు నెలల్లో 960 భవనాలను కూల్చివేశాము. 407 భవనాలను సీల్ చేశాం. మరో 1,500 భవనాలకు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. కూలిపోయిన 14వ నంబరు ఆస్తికి సంబంధించి, గతంలో కేవలం గ్రౌండ్+1 యూనిట్కు మాత్రమే అనుమతి ఉందని, ఎలాంటి భవన ప్రణాళికకు ఆమోదం లేదని అధికారులు తేల్చారు.విద్యార్థి సంఘాల ఆందోళనసత్యనికేతన్లో సహాయక చర్యలను పర్యవేక్షించిన ఢిల్లీ సీఎం రేఖా గుప్తా స్పందిస్తూ.. నగరంలో ఐదు అంతస్తులు ఉన్న అన్ని భవనాలను వెంటనే సీల్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పీజీలు, నర్సింగ్ హోమ్లు, పాఠశాలలు లేదా వాణిజ్య సంస్థలను ప్రారంభించే ముందు పాత భవనాల యజమానులు తప్పనిసరిగా స్ట్రక్చరల్ ఆడిట్ నివేదికలను సమర్పించేలా ఒక కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు. మరోవైపు, పౌర సంస్థల వైఫల్యానికి నిరసనగా ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ ఆధ్వర్యంలో సుమారు 150 నుంచి 200 మంది కార్యకర్తలు ఎంసీడీ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఎంసీడీ కమిషనర్ సంజీవ్ ఖిర్వార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.గతంలోనూ వివాదాలకే కేంద్రబిందువు1994 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి సంజీవ్ ఖిర్వార్ గతంలోనూ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో సాధారణ అథ్లెట్లను బయటకు పంపివేసి, తన భార్య, రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి రింకూ దుగ్గాతో కలిసి తన పెంపుడు కుక్కను వాకింగ్కు తీసుకువెళ్లిన వ్యవహారం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపింది.మేము ఫ్లడ్లైట్ల వెలుగులో రాత్రి 8 నుంచి 8.30 గంటల వరకు శిక్షణ తీసుకునేవాళ్ళం. కానీ ఆ అధికారి తన కుక్కను నడపడానికి వీలుగా మమ్మల్ని సాయంత్రం 7 గంటలకే మైదానం విడిచి వెళ్ళమని చెబుతున్నారు’ అని మే 26, 2022 నాటి కథనంలో కోచ్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోపణలను ఖిర్వార్ అప్పట్లో ఖండించినప్పటికీ, తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం ఆయనను లడఖ్కు బదిలీ చేసింది. ఆ తర్వాత కాలంలో మళ్లీ ఢిల్లీకి తిరిగి వచ్చిన ఆయన, ఈ ఏడాది జనవరిలో ప్రతిష్టాత్మకమైన ఎంసీడీ కమిషనర్ బాధ్యతలను చేపట్టారు. అయితే, ఇప్పుడు ప్రాణనష్టం సంభవించిన సత్య నికేతన్ భవనం కూలిన దుర్ఘటన నేపథ్యంలో అధికార యంత్రాంగం వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో,సంజీవ్ ఖిర్వార్ చుట్టూ వివాదాల ఉచ్చు మరింత బిగుసుకుంది. 👉ఇదీ చదవండి : ‘అయ్యా.. నేను ఐఏఎస్ తుకారాం ముండేని!’ -
ఢిల్లీ హాస్టల్ ఘటన: పెరిగిన మృతుల సంఖ్య
ఉన్నత చదువుల కోసం ఢిల్లీ వచ్చిన విద్యార్థుల జీవితాల్లో పెను విషాదం చోటుచేసుకుంది. దక్షిణ ఢిల్లీలోని సత్య నికేతన్లో ఆదివారం కుప్పకూలిన పీజీ హాస్టల్ భవనం ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. రాత్రంతా కొనసాగిన సహాయక చర్యల్లో మరో వ్యక్తిని శిథిలాల నుంచి బయటకు తీసినప్పటికీ.. అప్పటికే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 11 మందిని రక్షించగా.. మరికొందరి కోసం గాలింపు కొనసాగుతోంది.బేస్మెంట్లో మరమ్మతు పనులు జరుగుతుండగానే.. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఐదు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో లోపల ఉన్న పలువురు విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. భవనం కూలడానికి బేస్మెంట్ పనులు, నిర్మాణంలో లోపాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.ఈ ప్రమాదానికి సంబంధించిన మరో సీసీటీవీ దృశ్యం తాజాగా వెలుగులోకి వచ్చింది. కూలిపోయిన భవనానికి ఎదురుగా ఉన్న దుకాణం వద్ద ఓ వ్యక్తి కూర్చుని ఉండగా.. ఒక్కసారిగా భవనం కూలడం ప్రారంభమైంది. భారీగా దుమ్ము కమ్ముకోవడంతో అప్రమత్తమైన అతడు వెంటనే దుకాణం నుంచి బయటకు పరుగెత్తాడు. క్షణాల వ్యవధిలోనే భవనం కుప్పకూలడంతో అతడు తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ దృశ్యాలు ప్రమాద తీవ్రతను కళ్లకు కడుతున్నాయి.DELHI: SATYA NIKETAN BUILDING COLLAPSE: CCTV FOOTAGE EMERGESCCTV footage from opposite the building captures the moment a person rushes out of his shop to save his life as the collapse unfolds.Search and rescue operations continue at the site. pic.twitter.com/svxVTwDYhW— Subodh Kumar (@kumarsubodh_) September 7, 2026తప్పిన పెనుముప్పు?సత్య నికేతన్లోని ఈ ఐదు అంతస్తుల భవనంలో సుమారు 15 గదులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఒక్కో గదిలో ఇద్దరు, ముగ్గురు విద్యార్థులు ఉండేవారని చెప్పారు. ప్రమాదం ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకోవడంతో చాలామంది విద్యార్థులు బయట ఉండటం వల్ల ప్రాణనష్టం కొంత తగ్గిందని స్థానికులు పేర్కొన్నారు. ఇక సుమారు 30 ఏళ్ల నాటి ఈ భవనంలో ‘హాస్టల్ డేజ్’ పేరుతో పీజీ వసతి గృహం నిర్వహిస్తున్నారు. ప్రమాదానికి ముందు బేస్మెంట్లో మరమ్మతు పనులు జరుగుతున్నట్లు సమాచారం. ఇటీవలి వర్షాలతో బేస్మెంట్లో నీరు చేరి పునాది బలహీనపడటం వల్లే భవనం కూలిపోయి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. అయితే ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నది అధికారుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.శిథిలాల కింద ఆర్తనాదాలు..భవనం కూలిన వెంటనే చుట్టుపక్కల ప్రాంతంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. శిథిలాల కింద చిక్కుకున్నవారు తమను కాపాడాలంటూ ఫోన్లు చేసినట్లు అధికారులు తెలిపారు. కొందరు బాధితులు లోపల నుంచి వీడియోలు తీసి మిత్రులకు పంపించారు. శిథిలాల కింద ఉన్నవారు ఊపిరి పీల్చుకునేందుకు ఆక్సిజన్ సిలిండర్లను పంపించినట్లు సహాయక సిబ్బంది వెల్లడించారు.ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి శిథిలాలను తొలగిస్తున్నారు. ఇరుకైన వీధులు కావడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శిథిలాల కింద పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి.పీజీల నిర్వహణపై ప్రశ్నలుసత్య నికేతన్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పీజీలు, హాస్టళ్లలో ఉంటున్నారు. పాత భవనాలను పీజీలుగా మార్చి నిర్వహిస్తున్న తీరుపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవనాల నిర్మాణ నాణ్యత, భద్రతా ప్రమాణాలు, నిర్వహణపై అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.ప్రముఖుల సంతాపంఈ విషాద ఘటనపై రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జీత్ సింగ్ సంధు కూడా ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.మరోవైపు.. మృతుల సంఖ్య ఆరుకు చేరడం, మరికొందరి కోసం గాలింపు కొనసాగుతుండటంతో సత్య నికేతన్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తాజాగా బయటపడిన సీసీటీవీ దృశ్యాలు మాత్రం ప్రమాదం కూలిన భవనం లోపలే కాదు.. చుట్టుపక్కల ఉన్నవారినీ ఎంతటి ముప్పులోకి నెట్టిందో స్పష్టం చేస్తున్నాయి.ఇదీ చదవండి: రీల్స్ చూసి మోసపోవద్దు! పాపం ఆ అమ్మాయి.. -
ఉల్లిపాయలు కిలో రూ. 35
న్యూఢిల్లీ: దేశంలో ఉల్లిపాయల కొరత నానాటికీ పెరిగిపోతోంది. ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాయితీ అమ్మకాల్లో భాగంగా 17 నగరాల్లో సుమారు 4,000 టన్నుల బఫర్ స్టాక్ ఉల్లిపాయలను విక్రయించినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరే ఆదివారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎన్సీసీఎఫ్, నాఫెడ్ ద్వారా 2026 సంవత్సరం కోసం బఫర్ స్టాక్ కింద 1.21 లక్షల టన్నుల ఉల్లిపాయలను నిల్వ చేసింది. కొన్ని ఎంపిక చేసిన నగరాల్లో ఉల్లిపాయలను కిలోకు రూ.35 చొప్పున రాయితీ ధరకు ప్రభుత్వం విక్రయిస్తోంది. కాందా ఎక్స్ప్రెస్ ద్వారా భారీ సరుకు ఇప్పటికే ఢిల్లీ, చెన్నై నగరాలకు చేరుకుందని, రాబోయే రోజుల్లో గౌహతికి తరలించేందుకు మూడో రైలును చేస్తున్నామని నిధి ఖరే చెప్పారు. రాయితీపై ఉల్లిపాయల విక్రయాలతో వినియోగదారులకు కొంత ఉపశమనం లభించిందని, బయటి మార్కెట్లో ధరలు స్వల్పంగా తగ్గాయని అన్నారు. సెపె్టంబర్ 5న ఢిల్లీలో కిలో ఉల్లిపాయల చిల్లర ధర రూ.58, ముంబైలో రూ.53, చెన్నైలో రూ.63, రాంచీలో రూ.40గా ఉండగా, సగటు టోకు ధర కిలోకు రూ.42.79గా నమోదైంది. కొత్త ఖరీఫ్ ఉల్లి పంట పరిస్థితి ఆశాజనకంగా ఉందని అధికారులు చెబుతున్నారు. అక్టోబర్ రెండో వారం నుంచి ఈ పంట మార్కెట్కు వస్తుందని, తద్వారా సరఫరాపై ఒత్తిడి తగ్గి, ధరల విషయంలో మరింత ఉపశమనం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. -
విద్యార్థుల ఆశలు సమాధి
న్యూఢిల్లీ: ఉన్నత చదువుల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఢిల్లీలో హాస్టల్లో ఉంటున్న విద్యార్థుల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి. ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ సమీపంలోని సత్య నికేతన్లోని ఓ హాస్టల్ భవనం ఆదివారం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. శిథిలాల కింద దాదాపు 20 మంది చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అన్వేషణ, సహాయక బృందాలు అంచనావేశాయి. రద్దీగా ఉండే ఒక వీధిలోని 30 ఏళ్ల నాటి ఈ ఐదు అంతస్తుల భవనంలో ‘హాస్టల్ డేజ్’ పేరిట పేయింగ్ గెస్ట్(పీజీ) వసతి గృహాన్ని నిర్వహిస్తున్నారు. భవన బేస్మెంట్లో మరమ్మతు పనులు జరుగుతుండగా ఆదివారం మధ్యాహ్నం సుమారు 1.30 గంటల సమయంలో కూలింది. తాజా వర్షాలతో బేస్మెంట్లో నీరు చేరి పునాది బలహీనపడిందని, అందుకే కుప్పకూలిందని స్థానికులు చెప్పారు. ప్రమాదం విషయం తెల్సి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. భవనం కుప్పకూలి విద్యార్థులు మరణించడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జీత్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే ప్రక్రియ ప్రారంభించినట్లు పోలీసులు వివరించారు. లోపల చిక్కుకున్న వారి నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఘటనా స్థలంలో బీజేపీ ఎమ్మెల్యే అనిల్ చెప్పారు. ఆదివారం కావడం వల్లే తక్కువ ప్రాణనష్టం కూలిపోయిన భవనంలో దాదాపు 15 గదులు ఉండేవని, ఒక్కో గదిలో ఇద్దరు లేదా ముగ్గురు విద్యార్థులు కలిసి ఉండేవారని స్థానికులు తెలిపారు. ఆదివారం సెలవు కావడంతో చాలామంది విద్యార్థులు బయటకు వెళ్లినందున మరణాల సంఖ్య తగ్గిందని ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పారు. ఈ ప్రాంతంలోని ఇతర భవనాల పరిస్థితి, నిర్వహణపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘సత్య నికేతన ప్రాంతంలో భవనాలను ఐదు, ఆరు అంతస్తుల వరకు నిర్మిస్తున్నారు. చాలా ఇళ్లను బాలుర పీజీలుగా మార్చేసి, యజమానులు వేరే చోటికి తరలిపోతున్నారు. వారు తమ ఇళ్లకు పీజీలని పేరు పెట్టి, ఆన్లైన్లో అద్దెలు వసూలు చేసుకుంటున్నారు. భవనాల నిర్వహణ ఎలా ఉందో కూడా పట్టించుకోవడం లేదు’’ అని రెండు దశాబ్దాలకు పైగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రియాంక పేర్కొన్నారు. ప్రధాని మోదీ సంతాపం ఢిల్లీలో భవనం కూలిపోయిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. బాధితులకు సహాయం అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థులు ఉంటున్న భవనం కూలిపోవడం చాలా బాధాకరమని ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ఆప్తులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని వివరించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థి ప్రాణం విలువైనదని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారి ప్రాణాలకు భరోసా కల్పించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. ఈ ఘటనను అత్యంత హృదయ విదారకమైనది, ఆందోళనకరమైనదిగా అభి వరి్ణంచారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో సరైన వసతి గృహాలు లేకపోవడం వల్ల విద్యార్థులు ప్రైవేట్ హాస్టళ్లలో ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇది ‘నివారించదగిన విషాదం’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు.శిథిలాల కింద అరుపులు, ఆర్తనాదాలు ఘటనా స్థలంలో హృదయ విదారక పరిస్థితులు నెలకొన్నాయి. శిథిలాల నుంచి పెద్ద ఎత్తున అరుపులు, ఆర్తనాదాలు వినిపించాయి. తమను కాపాడాలంటూ బాధితులు రోదిస్తూ వేడుకున్నారు. కొందరు ఫోన్లు సైతం చేశారు. లోపల చిక్కుకుపోయిన వారు అక్కడి దృశ్యాలను ఫోన్లో చిత్రీకరించి మిత్రులకు పంపించారు. బాధితుల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. శిథిలాల కింద బాధితులు ఊపిరి పీల్చుకోవడానికి ఆక్సిజన్ సిలిండర్లను జారవిడిచినట్లు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చెప్పారు. ఘటనా స్థలంలో అగ్నిమాపక వాహనాలను మోహరించారు. ఈ ప్రాంతంలోని ఇరుకైన వీధుల్లో విద్యార్థుల కోసం హోటళ్లు, పీజీ వసతి గృహాలు అధికంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో నివసిస్తున్న విద్యార్థుల్లో చాలామంది కేరళ, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారని, వారు రోడ్డుకు అవతల ఉన్న కాలేజీల్లో చదువుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు. సహాయక బృందాలు శిథిలాలను తొలగిస్తుండగా స్థానికులు సహకరించారు. వారు తమ చేతులతో, అందుబాటులో ఉన్న సామగ్రితో బాధితుల కోసం గాలించారు. శిథిలాల కింద పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. కలచి వేసిన వీడియోహాస్టల్ భవనం కూలిపోగా కాంక్రీటు దిమ్మెల కింద ఓ విద్యార్థి చిక్కుకుపోయి నరకయాతన అనుభవించిన దృశ్యం చూపరులను కలచివేసింది. అతడిపై దుమ్ము పేరుకుపోయింది. ముఖంపై రక్తపు చారలు కనిపించాయి. నుదుటి పక్క నుండి రక్తం కారుతోంది. ఈ వీడియోను ఆత్మరామ్ కాలేజీ విద్యార్థులు షేర్ చేశారు. శిథిలాల కింద నుంచి ‘సేవ్ మీ, సేవ్ మీ’ అనే అరుపులు చాలాసేపు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. -
పిల్లల బాల్యాన్ని కాపాడాలి
న్యూఢిల్లీ: విద్యార్థుల్లో మాదకద్రవ్యాల వ్యసనం పట్ల ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. పిల్లలను క్రీడలు, శారీరక వ్యాయామం, సృజనాత్మక కార్యకలాపాల వైపు ప్రోత్సహించాలని, తద్వారా వారు సెల్ఫోన్లతో ఎక్కువ సమయం వృథా చేయకుండా జాగ్రత్త వహించాలని కోరారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా.. ఉత్తమ ఉపాధ్యాయులుగా జాతీయ అవార్డుకు ఎంపికైన వారితో ప్రధాని మోదీ ఢిల్లీలోని తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ వీడియోను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. ఉత్తమ ఉపాధ్యాయులతో ప్రధానమంత్రి సంభాషించారు. పిల్లల బాల్యాన్ని కాపాడాలని, వారిలో సహజ కుతూహలాన్ని పెంపొందించాలని చెప్పారు. తరగతి గది అభ్యాసాన్ని మరింత ఆసక్తికరంగా మార్చడానికి సృజనాత్మక పద్ధతులను ఎంచుకోవాలని అన్నారు. చదువులు మాత్రమే కాకుండా పిల్లల ప్రవర్తన, దైనందిన జీవితం పట్ల కూడా శ్రద్ధ వహించాలని స్పష్టంచేశారు. ఆధునిక యుగంలో ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోతున్న తరుణంలో విద్యార్థుల జీవితాల్లో టీచర్లు మరింత కీలక పాత్ర పోషించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. వారికి సరైన మార్గనిర్దేశం చేస్తూ ఉజ్వల భవిష్యత్తు వైపు ముందుకు నడిపించాల్సిన బాధ్యత టీచర్లపై ఉందన్నారు. విద్యార్థుల్లోనూ డ్రగ్స్ వ్యసనం పెరిగిపోతుండడం పట్ల ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. పెద్ద నగరాలు, విశ్వవిద్యాలయాల్లో ఎవరు ఎవరికి ఏమి ఇస్తున్నారో తెలియడం లేదని, దీనివల్ల డ్రగ్స్ బారిన పడిన వారిని గుర్తించడం కష్టమని అన్నారు. అందుకే విద్యార్థుల్లో డ్రగ్స్ ముప్పుపై తగిన అవగాహన కల్పించడానికి టీచర్లే చొరవ తీసుకోవాలని చె ప్పారు. డ్రగ్స్ అలవాటు ఉన్నట్లు గుర్తిస్తే వారి ని ఆ వ్యసనం నుంచి దూరం చేయాలని పే ర్కొన్నారు. వారి జీవితాల్లో బాల్యాన్ని సజీవంగా ఉంచడం ద్వారా ఉపాధ్యాయులు గొప్ప సహకారాన్ని అందించగలరని వెల్లడించారు.నిజ జీవిత నైపుణ్యాలతో అనుసంధానించాలి విద్యార్థుల్లో స్క్రీన్ టైమ్ పెరిగిపోవడం ఒక ప్రధాన సమస్యగా మారిందని ప్రధానమంత్రి చెప్పారు. పిల్లలు స్క్రీన్పై ఎంత సమయం గడుపుతున్నారు? రాత్రిపూట మొబైల్ ఫోన్లు ఎన్ని గంటలు వాడుతున్నారు? అనేదానిపై వారి తల్లిదండ్రులతో మాట్లాడాలని ఉపాధ్యాయులకు సూచించారు. క్రీడలు, శారీరక శ్రమతో కూడిన ఆటలు, సృజనాత్మక కార్యకలాపాలు, కళలపై ఆసక్తిని పెంపొందించుకోవడం ద్వారా స్క్రీన్ సమయాన్ని సహజంగా తగ్గించవచ్చని స్పష్టంచేశారు. -
విశ్వాసం పెంచిన ఆర్థిక వృద్ధి
న్యూఢిల్లీ: భారతదేశ ఆర్థిక వృద్ధి, స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) గణాంకాలపై ఆరోపణలు చేస్తున్నవారిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థను దిగజార్చినవారే.. నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించడాన్ని అంగీకరించలేకపోతున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. శనివారం ఢిల్లీలో శ్రీరామ్ కాలేజీ ఆఫ్ కామర్స్ వందేళ్ల వేడుకలో ప్రదానమంత్రి పాల్గొన్నారు. ఆయన ఈ కళాశాలకు రావడం 2013 తర్వాత ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. పశ్చిమాసియా యుద్ధంతోపాటు ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు, వాణిజ్యానికి అంతరాయాలు ఉన్నప్పటికీ ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో భారత్ 7.8 శాతం వృద్ధి సాధించిందని హర్షం వ్యక్తంచేశారు. ఈ వృద్ధి దేశ విశ్వాసాన్ని పెంచిందన్నారు. మన దేశాన్ని అత్యంత బలహీనమైన ఐదు ఆర్థిక వ్యవస్థల(ఫ్రాౖజైల్ ఫైవ్) జాబితాలోకి నెట్టి అపఖ్యాతి పాలైన వారికి నేడు ఈ గణాంకాలను జీర్ణించుకోవడం కష్టంగా ఉందని ఎద్దేవా చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా 2013లో తాను ఈ కాలేజీలో చేసిన ప్రసంగం అప్పట్లో ఒక అలజడిని సృష్టించిందని, 13–14 ఏళ్లు గడిచినప్పటికీ దాని ప్రభావం నేటికీ చెక్కుచెదరలేదని గుర్తుచేసుకున్నారు. అప్పట్లో ఒక దార్శనికతను(విజన్) ఆవిష్కరించానని అన్నారు. అప్పుడు చెప్పిన ప్రతి మాటా తన దృఢ విశ్వాసానికి నిదర్శనమని, ఆ మాటలకు అనుగుణంగానే ఎప్పుడూ జీవించానని ఉద్ఘాటించారు. నక్సలిజం నడ్డి విరిగింది 2013 నాటి ఆర్థిక పరిస్థితులను ప్రధానమంత్రి గుర్తుచేశారు. అప్పట్లో బలహీనమైన రూపా యి, దాదాపు 10 శాతం ద్రవ్యోల్బణం, రికార్డు స్థాయి కరెంట్ అకౌంట్ లోటు, మందగించిన పారిశ్రామిక వృద్ధి, పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడాన్ని ప్రస్తావించారు. దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత బలహీనంగా ఉందన్నారు. ప్రపంచం భారత్ను ఫ్రాౖజైల్ ఫైవ్లో ఒకటిగా పిలిచేదని చెప్పారు. అప్పట్లో కుంభకోణాలు తారస్థాయికి చేరాయని, అవినీతిపరులు నిర్భయంగా తిరిగేవారని వెల్లడించారు. ఉగ్రవాదుల ఆగడాలకు అడ్డు లేకుండా పోయిందని, పాకిస్తాన్పై నియంత్రణ తప్పిందని విమర్శించారు. కానీ, ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేవారు నేడు చిత్తుగా ఓడిపోయారని, పాకిస్తాన్ ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే భారత సైన్యం వారి గడ్డపైకే వెళ్లి దాడులు చేస్తోందని తెలిపారు. నక్సలిజం నడ్డి విరిగిందన్నారు. విధానపరమైన స్తబ్దత నుంచి చైతన్యవంతమైన విధానాల అమలు వరకు భారత్ ఎంతో పురోగతి సాధించిందని స్పష్టంచేశారు. ఈ రోజు భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించడాన్ని ప్రపంచం చూస్తోందని వెల్లడించారు. తాజా జీడీపీ గణాంకాలు దేశ ఆ ర్థిక బలాన్ని ప్రతిబింబిస్తున్నాయని తెలియజేశారు. దేశం వృద్ధి చెందడమే కాకుండా నూతన ఉపాధి అవకాశాలను సృష్టిస్తోందని పేర్కొన్నారు. దేశం ఇప్పుడు ఆర్థికంగా, సామాజికంగా చాలా సురక్షితంగా ఉందని చెప్పారు. ఇది చూసిన తర్వాత కొందరిలో అసహనం పెరుగుతోందన్నారు. అలాంటి దిమాగీ నక్సలైట్లకు ఎర్రకోట(స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం) నుంచే హోమియోపతి మందు ఇచ్చానని వ్యాఖ్యానించారు. దిమాగీ నక్సలిజాన్ని ప్రోత్సహిస్తున్న వారి నిజ స్వరూపాన్ని ప్రజలు ఇప్పుడు చూస్తున్నారని చెప్పారు. ప్రాథమిక సేవలు, అవకాశాల కోసం సామాన్య పౌరులు మాయి–బాప్(తల్లి–తండ్రి) సంస్కృతిపై ఆధారపడి ఉండాలని కొందరు కోరుకుంటున్నారని, అందుకే ఆర్థిక సమ్మిళితాన్ని వ్యతిరేకిస్తున్నారని మోదీ ఆరోపించారు. ‘మాయి–బాప్’ సంస్కృతిని సమర్థించేవారికి ఎదురుగా తాను ఒక బండరాయిలా నిలబడతానని ప్రధాన మంత్రి తేల్చిచెప్పారు. యువతను ఆకట్టుకొనే యత్నం ‘జెన్ జెడ్’ను ఆకట్టుకొనేందుకు ప్రధాని మోదీ ప్రయత్నించారు. నేటి తరం యువ తకు బాగా తెలిసిన ‘ఓజీ’ వంటి పదాలను తన ప్రసంగంలో చేర్చారు. ‘దురంధర్’ అనే సినిమా ప్రస్తావన కూడా తీసుకువచ్చారు. శ్రీరామ్ కాలేజీ పూర్వ విద్యార్థులు ఓజీలు(అసలైన దిగ్గజాలు) అని ప్రశంసించారు. వారు దురంధర్లు కాకపోయినా ఎన్నో సంచలనాలు సృష్టించారని చెప్పారు. సత్య గర్జన ముందు అబద్ధాల ప్రతిధ్వని నిలవదు కొందరు వ్యక్తులు దేశ పురోగతి పట్ల నిరాశావాదంతో ఉన్నారని మోదీ విమర్శించారు. ‘సగం నిండిన గ్లాసు’ ఉపమానాన్ని ప్రస్తావించారు. కొందరు గ్లాసును సగం నిండినట్లుగా, మరికొందరు సగం ఖాళీగా ఉన్నట్లుగా చూస్తారని చెప్పారు. అయితే, తాను మాత్రం గ్లాసు పూర్తిగా నిండినట్లుగా, అందులో సగ భాగం నీరు, సగ భాగం గాలి ఉన్నట్లుగా భావిస్తానని వివరించారు. 2013లో గ్లాసు సగం ఖాళీగా ఉందని భావించినవారు ఇప్పటికీ దేశాన్ని అదే దృక్పథంతో చూస్తున్నారని ఆక్షేపించారు. వారి దృష్టిలో గ్లాసు ఎప్పుడూ సగం ఖాళీగానే ఉంటుందన్నారు. తాను కేవలం గ్లాసు గురించే మాట్లాడుతున్నానని, ఖాళీగా ఉండే మరో దాని గురించి కాదని ప్రతిపక్షాలపై వ్యంగ్యా్రస్తాలు విసిరారు. తన ప్రసంగాన్ని ‘రిపోర్ట్ కార్డు’గా మోదీ అభివరి్ణంచారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాం«దీపై పరోక్షంగా విమర్శలు చేశారు. సత్య గర్జన ముందు అబద్ధాల ప్రతిధ్వని నిలవలేదని తేల్చిచెప్పారు. -
బోధనొక పవిత్ర కర్తవ్యం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: బోధన అనేది కేవలం జీవనోపాధి కోసం చేసే ఉద్యోగం కాదని, అదొక భావిభారత పౌరుల మనో వికాసానికి పునాది వేసే అత్యంత పవిత్రమైన కర్తవ్యమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను విద్యాలయాలకు తీసుకొచ్చి ఉపాధ్యాయుల చేతుల్లో పెట్టినప్పుడు, ఉపాధ్యాయులు సొంత బిడ్డల్లా భావించి రక్షణ, ఉన్నతిని చూసుకుంటారని వారు నమ్ముతారన్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే గురువుల ప్రధాన ధర్మమని హితోపదేశం చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో శనివారం రాష్ట్రపతి చేతుల మీదుగా దేశవ్యాప్తంగా 82 మంది అధ్యాపకులు, ఉపాధ్యాయులకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రదానం చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురికి ఈ గౌరవం దక్కింది. హైదరాబాద్ ఐఐటీ కెమికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ కీర్తి చంద్ర సాహూ, తెలంగాణలో కామారెడ్డి జిల్లా గాంధారిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సెకండరీ గ్రేడ్ టీచర్ బొంపెల్లి భవాని, ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని గుషిణి గ్రామపంచాయతీ పరిధిలోని చినమల్లుపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రాజేశ్ కౌలూరికి ఈ గౌరవం దక్కింది. ఈ అవార్డు గ్రహీతల్లో ఒకరైన జె.ప్రకాశరావు తెలుగు మూలాలున్న ఉపాధ్యాయుడు. అండమాన్ దీవుల్లోని మాయాబందర్ ప్రాంతంలో స్థిరపడిన తెలుగు, బహుభాషా కుటుంబాల విద్యార్థులకు విద్యాబోధన అందిస్తున్నారు. ఉపాధ్యాయుల ధోరణి మారాలి అవార్డు గ్రహీతలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగిస్తూ కేవలం పరీక్షల్లో మంచి మార్కులు సాధించే విద్యార్థులపైనే దృష్టి పెట్టే ఉపాధ్యాయుల ధోరణి మారాలని సూచించారు. అకడమిక్ ప్రతిభ అనేది విద్యార్థి బహుముఖ ప్రజ్ఞలో ఒక భాగం మాత్రమేనన్నారు. ఒక విద్యార్థి క్రీడల్లో రాణించవచ్చు, మరొకరికి నాయకత్వ లక్షణాలు ఉండవచ్చు, ఇంకొకరికి సామాజిక సేవపై ఆసక్తి ఉండవచ్చు.. ఇలా ప్రతి చిన్నారిలోని సహజ ప్రతిభను గుర్తించి వెలికితీయడమే ఉపాధ్యాయుల అసలైన బాధ్యత అని చెప్పారు. ఒక విద్యార్థి రాణించలేకపోతే ఆ లోపం కేవలం ఆ విద్యార్థిది మాత్రమే కాదని, విద్యావ్యవస్థ, ఉపాధ్యాయుల బాధ్యత కూడా అందులో ఉంటుందని తెలిపారు. విద్యార్థుల మెదళ్లలో కేవలం సమాచారాన్ని మాత్రమే నింపడం కాకుండా స్వతంత్ర ఆలోచనా శక్తిని, ప్రశ్నించే తత్వాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ, అంత్యోదయ భావన, సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ‘నేషన్ ఫస్ట్’స్ఫూర్తి కలిగిన పౌరులను తీర్చిదిద్దినప్పుడే ‘వికసిత్ భారత్’కల సాకారమవుతుందని ఉద్ఘాటించారు. బాలికల విద్య కోసం పాటుపడిన సావిత్రీబాయి ఫూలే కృషిని, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆదర్శాలను కొనియాడారు. ఒడిశాలోని రాయ్రంగ్పూర్ శ్రీఅరబిందో ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ సెంటర్లో తాను ఉపాధ్యాయురాలిగా పనిచేసిన రోజులను రాష్ట్రపతి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘నేను ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నప్పుడు నా విద్యార్థుల నుంచి కూడా నేనెంతో నేర్చుకున్నాను. వారి నుంచి పొందిన ప్రేమాభిమానాలే నా జీవితంలో నేను సాధించిన అత్యంత గొప్ప విజయాల్లో ఒకటిగా భావిస్తాను’అని ముర్ము చెప్పారు. -
సోనియా ఆత్మకథ ముద్రణ హార్పర్ కాలిన్స్ చేతికి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ ముద్రణ బాధ్యతలను హార్పర్ కాలిన్స్ ఇండియా చేపట్టింది. ముందుగా నిర్ణయించినట్టు ఈ పుస్తకం భారత్లో నవంబర్ 10నే విడుదల కానుంది. వాస్తవానికి ఈ పుస్తకాన్ని పెంగ్విన ర్యాండమ్ హౌస్ ప్రచురించాల్సి ఉండింది. అయితే కొన్ని అంశాల విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పెంగ్విన్ తాము ఈ పుస్తకాన్ని ప్రచురించడం లేదని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏర్పడ్డ అనిశ్చితి కాస్తా హార్పర్ కాలిన్స్ ఇండియా నిర్ణయంతో తొలగిపోయింది. చాలామంది ఎంతో ఆసక్తిగా రాజకీయ ఆత్మకథ కోసం ఎదురు చూస్తున్నారని.. ఇందులో నాటకీయత, వ్యక్తిగత అనుభవాలు, ప్రేమ, గుర్తింపు కోసం పోరాటం, బాధ్యతల వంటి అనేక కోణాలు ఆవిష్కృతమవుతాయిన హార్పర్ కాలిన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. రాతపత్రిలో కొన్ని మార్పులు చేసేందుకు నిరాకరించడంతో సోనియాగాందీకి, పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా మధ్య వివాదం మొదలైన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో చైనా ఆక్రమించిన భారత భూభాగానికి సంబంధించిన విభాగాలు, ఆర్ఎస్ఎస్కు సంబంధించిన అంశాలను తొలగించాల్సిందిగా పెంగ్విన్ సోనియాను కోరినట్లుగా కాంగ్రెస్ నేతలు ఆరోపణలు గుప్పించారు. ప్రభుత్వం భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకుంటోందని ఆరోపించారు. మరోవైపు పెంగ్విన ఇండియా మాత్రం తమపై ఎలాంటి ఒత్తిడి లేదని, ఒకానొక అంశంపై పడ్డ చిక్కుముడి వీడకపోవడంతో ప్రచురణ బాధ్యతల నుంచి తప్పుకున్నామని స్పష్టం చేసింది. -
కొండా సురేఖ బర్తరఫ్ బాధాకరం
సాక్షి, న్యూఢిల్లీ: కొండా సురేఖ బర్తరఫ్ బాధాకరమని..అయితే పార్టీ, ప్రభుత్వ ప్రతిష్టకు నష్టం కలిగించేలా ప్రవర్తిస్తే ఎంతటి వారైనా వారిపై కఠిన చర్యలు తప్పవని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలోని శబరి బ్లాక్లో ఆయన మీడియాతో మాట్లాడారు. క్రమశిక్షణా సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగానే కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై హైకమాండ్ సమానంగా చర్యలు తీసుకుందని, ఇందులో తమ ప్రమేయమేమీ లేదని తేల్చి చెప్పారు. ‘కూతురు సుస్మిత తెలిసి చేసినా తెలియక చేసినా.. సీఎం రేవంత్రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను కొండా సురేఖ ఖండించాల్సింది. జరిగిన తప్పిదాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉండేది. అలా చేయలేదు కాబట్టే ఏఐసీసీ ఈ పరిణామాన్ని తీవ్రంగా పరిగణించింది’అని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బ్లాక్మెయిల్ చేసే అవసరం లేదని స్పష్టం చేశారు. కొండా సురేఖ పార్టీలోనే కొనసాగాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు. గతంలో కొండా సురేఖపై రెండుసార్లు ఫిర్యాదులు వచ్చినప్పుడు స్వయంగా సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడి సర్దిచెప్పానని మహేశ్గౌడ్ గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎంత ప్రజాస్వామ్యం ఉంటుందో క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపట్ల అంత కఠినంగా కూడా వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన విజయవంతంగా పూర్తయిన సందర్భంగా అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా ఉన్నామని మహేశ్గౌడ్ ప్రకటించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్హౌస్కే పరిమితం కాకుండా అసెంబ్లీకి వచ్చి తన అనుభవాలను పంచుకోవాలని, ప్రతిపక్ష నేతగా తన వాదనను వినిపించాలని డిమాండ్ చేశారు. కేబినెట్ విస్తరణపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలన్నారు. గెలిచిన ప్రతి ఎమ్మెల్యే మంత్రి కావాలని కోరుకోవడం సహజమే అయినా అందరికీ ఒకేసారి అవకాశం ఇవ్వడం సాధ్యం కాదని, ఎన్నో సమీకరణాలు ఉంటాయని చెప్పారు. -
దంచి కొట్టిన వర్షం.. ఢిల్లీ ఎయిర్పోర్టును ముంచెత్తిన వరద నీరు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో కురిసిన కుండపోత వర్షం నగరాన్ని తీవ్రంగా అస్తవ్యస్తం చేసింది. ఈ భారీ వర్షం కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు, అండర్పాస్లలోకి వర్షపు నీరు చేరడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి భారీ ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది.ఈ వర్షం ప్రభావం ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంపై తీవ్రంగా పడింది. ఎయిర్పోర్ట్ ప్రాంగణంతో పాటు అరైవల్ గేట్లు, పాసేజ్ ఏరియాల్లోకి మోకాళ్ల లోతు నీరు చేరింది. దీంతో ప్రయాణికులు తమ లగేజీ ట్రాలీలను నీళ్లలోనే తోసుకుంటూ నడవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రవాహం తగ్గే వరకు ప్రయాణికులు గంటల తరబడి అక్కడే వేచి చూడాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఈదురు గాలులతో కూడిన ప్రతికూల వాతావరణం కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగింది. ఢిల్లీకి రావలసిన పలు విమానాలను ముందస్తు జాగ్రత్తగా జైపూర్, లక్నో, అహ్మదాబాద్ వంటి సమీప నగరాలకు మళ్లించగా, వందలాది సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. రహదారులు, విమానాశ్రయంలో నిలిచిన నీటిని తొలగించేందుకు విమానాశ్రయ సిబ్బంది, మున్సిపల్ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. పంపింగ్ మిషన్ల సహాయంతో నీటిని బయటకు పంపే చర్యలను వేగవంతం చేశారు. -
‘కొండా సురేఖ కాంగ్రెస్లోనే కొనసాగాలని కోరుకుంటున్నాం’
సాక్షి,న్యూఢిల్లీ: కొండా సురేఖ బర్తరఫ్పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కొండా సురేఖ తన కూతురు కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలను వెంటనే ఖండించి ఉండాల్సింది. అలా ఖండించకపోవడం వల్లే ఈ అంశాన్ని ఏఐసీసీ చాలా సీరియస్గా తీసుకుంది. కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని తాము బలంగా కోరుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ఎవరినీ బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం గానీ, పరిస్థితి గానీ లేదని మహేష్ గౌడ్ తేల్చిచెప్పారు. -
ఎందరి తాళిబొట్లు తెంచావో మరిచిపోయావా?
కశ్మీర్లో 1990లలో జేకేఎల్ఎఫ్ సాగించిన ఉగ్రవాద హింసకు బలైన కుటుంబాలు.. ఆ సంస్థ అధినేత యాసిన్ మాలిక్ తాజా అఫిడవిట్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నర్సు సరళా భట్ హత్య కేసులో తనకు మరణశిక్ష విధించాలని కోరుతూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన మాలిక్.. అదే సమయంలో తన భార్య ముషాల్ హుస్సేన్ ముల్లిక్కు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించాడు. అయితే తన భార్య వితంతువుగా జీవించకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొనడంపై బాధిత కుటుంబాలు మండిపడుతున్నాయి.జేకేఎల్ఎఫ్(JKLF) ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురైన స్క్వాడ్రన్ లీడర్ రవి ఖన్నా భార్య నిర్మల్ ఖన్నా.. యాసిన్ మాలిక్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 1990 జనవరి 25న శ్రీనగర్లోని ఓ బస్స్టాప్ వద్ద రవి ఖన్నాతో పాటు మరో ముగ్గురు వైమానిక దళ సిబ్బందిని ఉగ్రవాదులు కాల్చిచంపారు. ప్రత్యక్ష సాక్షులు, బాధితుల వాంగ్మూలాల ప్రకారం ఈ దాడికి యాసిన్ మాలిక్ నాయకత్వం వహించి కాల్పులు జరిపిన ప్రధాన షూటర్గా అతడిని గుర్తించారు.“నా ఆయుధాలు లేని భర్తను చంపాడు. ఆయన శరీరంలోకి 28 తూటాలు దూసుకెళ్లాయి. ఇప్పుడు తానే గొప్ప వ్యక్తినన్నట్లు మాట్లాడుతున్నాడు. అతడికి ఎలాంటి సానుభూతి అవసరం లేదు. మాలిక్కు మరణశిక్ష తప్ప మరో శిక్ష వద్దు. అతడిని ఉరితీసే రోజు కోసం ఎదురుచూస్తున్నా” అని నిర్మల్ ఖన్నా అన్నారు.మా సంగతేంటి?..తన భార్య వితంతువుగా జీవించకూడదనే ఉద్దేశంతో ఆమెకు విడాకులు ఇస్తున్నట్లు మాలిక్ చెప్పడంపై నిర్మల్ ఖన్నా తీవ్రంగా స్పందించారు. “నీ భార్య వితంతువు కాకూడదని అంటున్నావు. మరి నీ వల్ల భర్తలను కోల్పోయిన ఎన్నో మహిళల సంగతేంటి? వారి కుటుంబాల బాధ నీకు ఎప్పుడైనా గుర్తొచ్చిందా?” అని ప్రశ్నించారు.మాలిక్ చేతులకు రక్తం అంటుకుందని, అతడు చేసిన హింసకు మూల్యం చెల్లించాల్సిందేనని ఆమె అన్నారు. 36 ఏళ్లుగా న్యాయం కోసం ఎదురుచూస్తున్నామని చెబుతూ.. ఇంతకాలం గడిచినా బాధిత కుటుంబాలకు న్యాయం ఎందుకు జరగడం లేదని ప్రభుత్వం, న్యాయవ్యవస్థను ప్రశ్నించారు. మాలిక్ తాజా అఫిడవిట్ సానుభూతి పొందేందుకు చేస్తున్న ప్రయత్నమేనని ఆరోపించారు.‘నా తల్లి కూడా వితంతువైంది’మరో ఉగ్ర బాధితురాలు డాక్టర్ సుష్మా షల్లా కూడా మాలిక్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆమె తండ్రి ఇన్స్పెక్టర్ చునీలాల్ షల్లాను 1990 మే 1న ఉత్తర కశ్మీర్లో జేకేఎల్ఎఫ్ ఉగ్రవాదులు చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారు.“నేను ప్రత్యక్షంగా ఉగ్రవాద బాధిత కుటుంబానికి చెందిన వ్యక్తిని. యాసిన్ మాలిక్ తన పాపాలకు చివరకు మూల్యం చెల్లించాల్సి వస్తుండటం సంతోషంగా ఉంది. నా తండ్రిని జేకేఎల్ఎఫ్ చంపింది. నా తల్లి ఆయన మరణంతో వితంతువుగా జీవించాల్సి వచ్చింది. ఆ బాధను నువ్వెప్పుడైనా అనుభవించావా? ఇప్పుడు మాత్రం ఏడుస్తున్నావు” అని సుష్మా షల్లా మండిపడ్డారు.సరళా భట్ హత్య కేసులో..1990లో శ్రీనగర్లో నర్సు సరళా భట్ హత్యకు సంబంధించిన కేసులో యాసిన్ మాలిక్ విచారణను ఎదుర్కొంటున్నాడు. ఈ కేసులో తనకు మరణశిక్ష విధించాలని కోరుతూ అతడు తాజాగా అఫిడవిట్ దాఖలు చేశాడు. ఇకపై విచారణలో తన తరఫున ఎలాంటి వాదనలు వినిపించబోనని కూడా స్పష్టం చేశాడు. అదే అఫిడవిట్లో పాకిస్థానీ భార్య ముషాల్ హుస్సేన్ ముల్లిక్తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే ఈ రెండు నిర్ణయాల వెనుక సానుభూతి పొందే ప్రయత్నం ఉందని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి.36 ఏళ్లుగా ఎదురుచూపులు1990లలో కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడుల్లో భర్తలను, తండ్రులను కోల్పోయిన కుటుంబాలు ఇప్పటికీ ఆ విషాదం నుంచి పూర్తిగా బయటపడలేకపోతున్నాయి. యాసిన్ మాలిక్ తాజా అఫిడవిట్ నేపథ్యంలో ఆ పాత గాయాలు మరోసారి తెరపైకి వచ్చాయి. తన భార్య వితంతువు కాకూడదనే కారణాన్ని మాలిక్ ప్రస్తావించడమే ఇప్పుడు బాధిత కుటుంబాల ఆగ్రహానికి కారణమైంది.ఇదీ చదవండి: ఆ పెళ్లి కూతురి సమయస్ఫూర్తికి హ్యాట్సాఫ్ -
అక్కడ మెలోనీ.. ఇక్కడ మోదీ
ప్రపంచ రాజకీయాల్లో ఈ జంట కనిపిస్తే సోషల్ మీడియాలో సందడి మొదలవుతుంది. భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య ఉన్న స్నేహబంధం మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇద్దరి సరదా సంభాషణలు, ఆప్యాయ పలకరింపులు ఇప్పటికే ‘మెలోడీ’ పేరుతో వైరల్గా మారాయి. తాజాగా మెలోనీకి మోదీ చేసిన ఓ ప్రత్యేక విషెస్ ఈ స్నేహాన్ని మరోసారి చర్చలోకి తెచ్చింది.ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ అరుదైన ఘనత సాధించారు. అత్యధిక కాలం ప్రధానమంత్రిగా కొనసాగిన నేతగా ఆమె తాజాగా రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆమెకు అభినందనలు తెలిపారు. మెలోనీని తన స్నేహితురాలిగా పేర్కొంటూ.. ఆమె నాయకత్వంపై ఇటలీ ప్రజలకు ఉన్న విశ్వాసానికి ఈ ఘనత నిదర్శనమని అన్నారు.“నా స్నేహితురాలు ప్రధాని మెలోనీకి అభినందనలు. ఇటలీ యుద్ధానంతర చరిత్రలో అత్యంత ఎక్కువ కాలం నిరంతరంగా ప్రధానమంత్రిగా కొనసాగుతున్న ప్రధానిగా ఆమె నిలిచారు” అంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా శుక్రవారం ఓ పోస్ట్ చేశారు. మెలోనీ నాయకత్వంలో భారత్–ఇటలీ మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమైందని పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం మెలోనీతో కలిసి మరింత సన్నిహితంగా పనిచేయాలని ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.Mi congratulo con la mia amica, il Primo Ministro Meloni, per essere diventata il Primo Ministro con il mandato più lungo nella storia del dopoguerra italiano. Questo traguardo riflette la fiducia che il popolo italiano ripone nella sua leadership. La sua amicizia è stata…— Narendra Modi (@narendramodi) September 4, 2026అలా ప్రధానిగా..1977లో రోమ్లో జన్మించిన జార్జియా మెలోనీ చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. 1992లో యువజన రాజకీయ ఉద్యమంలో చేరిన ఆమె.. ఆ తర్వాత ఇటలీ పార్లమెంట్లో అడుగుపెట్టారు. 2008లో అప్పటి ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ ప్రభుత్వంలో యువజన వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. 2012లో ‘బ్రదర్స్ ఆఫ్ ఇటలీ’ పార్టీని స్థాపించి, 2014లో దాని అధ్యక్షురాలయ్యారు. 2022 సాధారణ ఎన్నికల్లో ఆమె పార్టీ నేతృత్వంలోని కూటమి విజయం సాధించడంతో.. అదే ఏడాది అక్టోబర్ 22న ఇటలీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. తద్వారా ఇటలీ చరిత్రలో తొలి మహిళా ప్రధానిగా మెలోనీ రికార్డు సృష్టించారు. తాజా రికార్డుపై ఇటు తన సోషల్ మీడియాలో మెలోనీ సైతం ఓ పోస్ట్ చేశారు.Oggi il nostro Governo diventa il più longevo della storia della Repubblica italiana.È un dato che accolgo con gratitudine e con un forte senso di responsabilità. Perché la stabilità non è un record da esibire, ma la condizione che consente a una Nazione di programmare,… pic.twitter.com/EpdHe35vJa— Giorgia Meloni (@GiorgiaMeloni) September 4, 2026మెలోనీ కంటే ముందు..ఇటలీ రిపబ్లిక్ ఏర్పడిన 1946 తర్వాత ఎంతోమంది ప్రధానులు మారారు. మెలోనీకి ముందు సుదీర్ఘకాలం నిరంతరంగా ప్రధానిగా కొనసాగిన రికార్డు సిల్వియో బెర్లుస్కోనీ పేరిట ఉండేది. 2001లో ప్రారంభమైన ఆయన రెండో ప్రభుత్వం 1,412 రోజులు కొనసాగింది. 2022 అక్టోబర్ 22న ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మెలోనీ తాజాగా ఆ రికార్డును అధిగమించారు.‘మెలోడీ’గా ఫేమస్..మోదీ, మెలోనీ మధ్య స్నేహం అంతర్జాతీయ వేదికలపైనా ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. ఇద్దరి సమావేశాలు, సంభాషణలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడంతో ‘మెలోడీ’ అనే హ్యాష్ట్యాగ్ కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది. మెలోనీ కూడా గతంలో మోదీతో తన స్నేహాన్ని సానుకూలంగా ప్రస్తావించారు. ఆఖరికి ఈ బంధం మెలోడీ చాక్లెట్లు పంచుకునే సరదా స్థాయి దాకా వెళ్లింది. అయితే ఈ బంధం గురించి ఇటు ఇండియాలో రాజకీయ దుమారం రేపిన సందర్భమూ ఉంది. ఆ సంగతి పక్కన పెడితే.. ఇక్కడ మోదీ రికార్డేఇటలీలో మెలోనీ సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగుతూ రికార్డు నెలకొల్పిన వేళ.. భారత్లోనూ ప్రధాని మోదీ సుదీర్ఘ పాలనతో ప్రత్యేక గుర్తింపు సాధించారు. 2014లో తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ.. 2019, 2024లో వరుసగా ఎన్నికై మూడోసారి ప్రధానిగా కొనసాగుతున్నారు. దీంతో దేశంలో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన నేతల జాబితాలో మోదీ అగ్రస్థానంలో ఉన్నారు. భారత్లో నెహ్రూ తర్వాత వరుసగా మూడు సార్లు ఎన్నికై ప్రధానిగా కొనసాగుతున్న నేతగా మోదీ నిలిచారు. ఇటలీలో మెలోనీ, భారత్లో మోదీ.. ఇద్దరూ తమ తమ దేశాల్లో సుదీర్ఘ రాజకీయ ప్రయాణంతో ప్రత్యేక ముద్ర వేశారు.మరింత బలపడనున్న బంధంఇటలీతో భారత్ సంబంధాలు మోదీ ప్రధాని అయ్యాకే క్రమక్రమంగా బలపడుతూ వచ్చాయి. ముఖ్యంగా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో మెలోనీ స్నేహం కీలకంగా ఉందని మోదీనే చాలాసార్లు పేర్కొన్నారు. వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, పెట్టుబడులు, ఇంధనం వంటి రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం కొనసాగుతున్న నేపథ్యంలో.. భవిష్యత్తులోనూ ఈ సంబంధాలు మరింత విస్తరించనున్నాయని మోదీ సంకేతమిచ్చారు.ఇదీ చదవండి: మెలోనీ అనుకుని కౌగిలించుకున్నారా? -
కాక్రోచ్ పార్టీలో తిరుగుబాటు.. ‘కేజ్రీవాల్ టీమ్’ అంటూ కొత్త పార్టీ!
జెన్జీ ఉద్యమాలతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన కాక్రోచ్ జనతా పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ మాజీ వలంటీర్ మనీష్ బ్రహ్మభట్ సంచలన ఆరోపణలకు దిగారు. అసలు ఉద్యమ స్ఫూర్తికి సీజేపీ దూరమైందని, నిరసనల్లో పాల్గొన్న క్రియాశీలక వలంటీర్లను పక్కనపెట్టి కొందరితోనే పార్టీని నడుపుతున్నారని అన్నారు. అలాగే సీజేపీ నాయకత్వం రాజకీయ నాయకులకు తొత్తులుగా మారారని అన్నారు. ఈ క్రమంలో కాక్రోచ్ జనతా పార్టీ-డెమోక్రటిక్ (CJP-D) పేరుతో కొత్త వేదికను ప్రకటించారు. గురువారం ఢిల్లీలో మనీష్ బ్రహ్మభట్ కొత్త పార్టీని ప్రకటించారు. కాక్రోచ్ జనతా పార్టీ తో సంబంధం లేకుండా సీజేపీ-డెమోక్రటిక్ పేరుతో ఇక తాను పోరాటం చేస్తానని అన్నారు. అభిజీత్ దీప్కే నేతృత్వంలోని సీజేపీ నాయకత్వం ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), దాని కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు అనుకూలంగా మారిందని ఆయన విమర్శించారు. పార్టీని ‘టీమ్ కేజ్రీవాల్’గా మార్చేశారని ఆరోపిస్తూ.. విద్యార్థులు, నిరుద్యోగులు, ఇతర రాష్ట్రాల ప్రజల సమస్యలపై పోరాడటానికి బదులుగా బీజేపీని వ్యతిరేకించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. దీప్కే సహా సీజేపీలోని ఎనిమిది మంది నాయకులకు ఆప్తో దగ్గరి సంబంధాలు ఉన్నాయని అన్నారాయన.Manish Brahmbhatt launches new group Cockroach Janata Party Democratic in DelhiManish Brahmbhatt launches a new group called Cockroach Janata Party Democratic in Delhi. He says the old Anna anti-corruption protest was hijacked by Arvind Kejriwal's team without asking real…— Ankit (@Extreo_) September 3, 2026మనీష్ బ్రహ్మభట్ గుజరాత్లో మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు. అలాగే, 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలన్పూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసి 964 ఓట్లు సాధించారు. సీజేపీ ఉద్యమంలో గుజరాత్ నుంచి వలంటీర్, కోఆర్డినేటర్గా పనిచేశారు. అయితే నీట్ నిరసనల తర్వాత.. ఆగస్టు మొదటి వారంలో సీజేపీ కోర్ టీమ్ సమావేశం జరిగింది. దానికి మనీష్కు ఆహ్వానం వెళ్లలేదు. మహారాష్ట్రలోని అభిజీత్ దీప్కే నివాసంలో(ఛత్రపతి శంభాజీనగర్కు) ఈ మీటింగ్ జరుగుతోందని మీడియా ద్వారా తెలుసుకుని బ్రహ్మభట్ అక్కడికి వెళ్లారు. అయితే ఆయనకు చేదు అనుభవమే ఎదురైంది. దీప్కే నివాసంలోకి అనుమతించకపోవడంతో.. మనీష్ అక్కడే బైఠాయించి నిరసన చేపట్టారు. జంతర్మంతర్ ఉద్యమంలో పాల్గొన్న పలువురు వలంటీర్లను కీలక చర్చలకు.. అదీ ఉద్దేశపూర్వకంగానే దూరంగా ఉంచారని ఆయన ఆరోపించారు. ఆ సమయంలో ఆరోగ్యం క్షీణించడంతో బ్రహ్మభట్, ఆయన సహచరుడు రాహుల్ పాండ్యా ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత సీజేపీని తాను వీడుతున్నట్లు ఆయన ప్రకటించి.. ఇప్పుడు కొత్త వింగ్ ప్రకటించారు. భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన కాక్రోచ్ కామెంట్ల నేపథ్యంతో.. మే 16న అభిజీత్ దీప్కే CJPని తొలుత వ్యంగ్యాత్మక ఆన్లైన్ ఉద్యమంగా ప్రారంభించారు. కానీ, అదే యువత వేదికగా మారింది. నిరుద్యోగం, పరీక్ష పేపర్ లీకులు, విద్యా వ్యవస్థలో అక్రమాల వంటి అంశాలను ఈ వేదిక ప్రస్తావించింది. అయితే సీజేపీ ఆవిర్భావం నుంచే అభిజిత్ దీప్కేకు, ఆప్కు సంబంధాలు ఉన్నాయనే చర్చా నడిచింది. జంతర్మంతర్ నిరసనల్లోనూ కేజ్రీవాల్ సహా ఆ పార్టీ నేతలు హాజరై సంఘీభావం తెలపడమూ తెలిసిందే. అభిజీత్ దీప్కే 2020 నుంచి 2023 వరకు ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా, ఎన్నికల ప్రచార బృందంలో పనిచేశారు. ముఖ్యంగా 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీమ్లు, డిజిటల్ కంటెంట్ ద్వారా పార్టీ ప్రచారంలో పాల్గొన్నారు. 2023లో అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన తర్వాత ఆప్తో తన అనుబంధం ముగిసిందని దీప్కే ఇదివరకే స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు బ్రహ్మభట్ చేసిన ఆరోపణలకు సీజేపీ నుంచి ఎలాంటి సమాధానం ఇంకా రాలేదు.ఇదీ చదవండి: అగ్రనేతల ఆమోదంతోనే.. ఆమె తొలగింపు జరిగిందా? -
ఇస్రో: జీఎస్ఎల్వీ-ఎఫ్17 సక్సెస్.. నింగిలోకి ‘నిఘా నేత్రం’
సాక్షి, శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దేశ రక్షణ, విపత్తుల నిర్వహణకు కీలకమైన ఈఓఎస్-05 (జీశాట్-1ఏ) ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన జీఎస్ఎల్వీ-ఎఫ్17 ప్రయోగం విజయవంతమైంది. శుక్రవారం తెల్లవారుజామున 2.55 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.రెండో ప్రయోగ వేదిక నుంచి బయలుదేరిన జీఎస్ఎల్వీ-ఎఫ్17.. సరిగ్గా 18 నిమిషాల తర్వాత 3.13 గంటలకు 2,367 కిలోల బరువున్న ఈఓఎస్-05ను సబ్-జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ (సబ్-జీటీఓ)లోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఉపగ్రహం 170 కి.మీ. పెరీజీ, 28,934 కి.మీ. అపోజీ(భూమికి అత్యంత దూరం) ఉన్న కక్ష్యలోకి చేరింది. సుమారు 51.7 మీటర్ల ఎత్తు, 420.5 టన్నుల బరువున్న ఈ రాకెట్కు ఇది 19వ జీఎస్ఎల్వీ మిషన్.ఇక ఈఓఎస్-05ను ఇస్రో సైంటిస్టులు ‘స్మార్ట్ బాయ్’ అని పిలవడానికి కారణం దాని అత్యాధునిక నిఘా సామర్థ్యాలే. భూస్థిర కక్ష్యలో ఉండి భారత ఉపఖండాన్ని ప్రతి 10 నిమిషాలకు ఒకసారి చిత్రీకరించగల ఈ ఉపగ్రహం.. అధిక రిజల్యూషన్తో స్పష్టమైన చిత్రాలను అందిస్తుంది. మల్టీస్పెక్ట్రల్, హైపర్స్పెక్ట్రల్ కెమెరాలతో పంటలు, అడవులు, నీటి వనరులు, ఖనిజ సంపదతో పాటు వరదలు, తుపాన్లు, కార్చిచ్చుల వంటి విపత్తులను దాదాపు రియల్టైమ్లో పర్యవేక్షించగలదు. సరిహద్దుల్లోని కీలక ప్రాంతాలపై నిఘా పెట్టడంలోనూ ఇది ఎంతో ఉపయోగపడుతుంది. Another giant leap for India in Space! Kudos to Team @isro on the successful launch of GSLV-F17/EOS-05.EOS-05 is a state-of-the-art Earth Observation satellite and India’s first imaging satellite from Geosynchronous Orbit, enabling advanced imaging across visible, infrared,… pic.twitter.com/1HHJrWM7ze— Dr Jitendra Singh (@DrJitendraSingh) September 3, 2026‘ఈఓఎస్-05’ ప్రత్యేకత ఏమిటంటే?సాధారణంగా లో-ఎర్త్ ఆర్బిట్, సన్-సింక్రోనస్ ఆర్బిట్లోని ఉపగ్రహాలు ఒక ప్రాంతాన్ని చిత్రీకరించడానికి కొంత సమయం తీసుకుంటాయి. అయితే ఈఓఎస్-05 భూస్థిర కక్ష్య నుంచి దక్షిణాసియాను ఒకే ఫ్రేమ్లో చిత్రీకరించే సామర్థ్యం కలిగి ఉంది. భారత ఉపఖండాన్ని ప్రతి 10 నిమిషాలకు ఒకసారి చిత్రీకరించి సమాచారాన్ని పంపగలదు. ఇందులోని ఎంఎక్స్-వీఎన్ఆర్ పేలోడ్ అధిక స్పేషియల్ రిజల్యూషన్తో చిత్రాలను అందించనుంది. కనిపించే కాంతి, ఇన్ఫ్రారెడ్, మల్టీస్పెక్ట్రల్, హైపర్స్పెక్ట్రల్ బ్యాండ్లలో సమాచారాన్ని సేకరించగలదు.రక్షణకు కీలక ఆయుధంసరిహద్దుల్లోని సైనిక స్థావరాలు, ఇతర కీలక ప్రాంతాలను పర్యవేక్షించడంలో ఈ ఉపగ్రహం ఉపయోగపడనుంది. ఇంతకు ముందు చెప్పినట్లు.. ప్రకృతి విపత్తుల సమయంలోనూ దీని సేవలు కీలకం కానున్నాయి. వరదలు, తుపాన్లు, కార్చిచ్చుల సమయంలో దాదాపు రియల్టైమ్లో పరిస్థితిని అంచనా వేయడానికి చిత్రాలను ఉపయోగించుకోవచ్చు. పంటల ఆరోగ్యం, అటవీ ప్రాంతాలు, నీటి వనరులు, ఖనిజ సంపద వంటి అంశాలపై కూడా విలువైన సమాచారాన్ని అందిస్తుంది.పాత వైఫల్యానికి సమాధానం2021 ఆగస్టులో జీఎస్ఎల్వీ-ఎఫ్10 ద్వారా ప్రయోగించిన జీశాట్-1 మిషన్ విఫలమైంది. తాజాగా ఈఓఎస్-05ను విజయవంతంగా కక్ష్యలోకి చేర్చడం ద్వారా ఆ చేదు జ్ఞాపకానికి ఇస్రో చెక్ పెట్టింది. ఈ ఏడాది ప్రారంభంలో ఎదురైన పీఎస్ఎల్వీ వైఫల్యం తర్వాత కూడా శాస్త్రవేత్తలు పట్టుదలతో పనిచేసి తాజా మిషన్ను విజయవంతం చేశారు.వర్షంలోనూ ప్రయోగాన్ని వీక్షించిన 1,500 మందిప్రయోగాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు లాంచ్ వ్యూ గ్యాలరీకి సుమారు 1,500 మంది తరలివచ్చారు. తెల్లవారుజామున 2 గంటల నుంచే వర్షం కురుస్తున్నా వారు వెనక్కి తగ్గలేదు. వర్షంలోనే నిలబడి జీఎస్ఎల్వీ-ఎఫ్17 నింగిలోకి దూసుకెళ్లిన దృశ్యాన్ని వీక్షించారు.ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ ప్రయోగం విజయవంతం కావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఏడాది తొలి మానవ రహిత గగన్యాన్ మిషన్ను కూడా చేపట్టేందుకు వేగంగా, పద్ధతిగా పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో ఆరు ప్రయోగాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.ఇదీ చదవండి: వచ్చేస్తోంది.. సూపర్ ఎల్ నినో! -
అగ్రనేతల ఆమోదంతోనే...
సాక్షి, న్యూఢిల్లీ: మంత్రివర్గం నుంచి కొండా సురేఖ ఉద్వాసనకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాందీ, రాహుల్గాంధీ ఆమోదం తెలిపారు. దీంతో గత మూడు రోజులుగా ఢిల్లీ కేంద్రంగా కొనసాగిన సురేఖ వ్యవహారానికి పార్టీ అధిష్టానం బర్తరఫ్తో ముగింపునిచ్చింది. రాష్ట్ర ముఖ్య నేతలు ఇచ్చిన సమాచార క్రోడీకరణ..తమ పరిశీలనలో వెల్లడైన వాస్తవాలు..ఏఐసీసీ కేంద్ర కార్యాలయం వేదికగా సురేఖ చేసిన వ్యాఖ్యల తీవ్రత దృష్ట్యా ఆమెపై వేటుకే హైకమాండ్ మొగ్గు చూపింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్, క్రమశిక్షణా సంఘం అభిప్రాయాలను.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గురువారం సోనియా, రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. చర్చల అనంతరం సురేఖను బర్తరఫ్ చేసేందుకు రాష్ట్ర నాయకత్వానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఒక వర్గాన్నే లక్ష్యంగా చేసుకున్నారనే విమర్శలకు తావులేకుండా చిన్నారెడ్డిపైనా వేటు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధిష్టానం నుంచి సమాచారం అందిన వెంటనే..తదుపరి పర్యవసానాలు, పార్టీపై పడే ప్రభావంపై పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మంతనాలు జరిపిన ముఖ్యమంత్రి..తర్వాత హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. మూడ్రోజులుగా తర్జనభర్జనలు.. సురేఖతో పాటు చిన్నారెడ్డికి సంబంధించి ఢిల్లీలో అనేక పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మంగళవారం కేసీ వేణుగోపాల్తో భేటీ అయిన ముఖ్యమంత్రి తన అభిప్రాయం చెప్పారు. రాష్ట్రంలో పార్టీని, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్న సురేఖపై కఠినంగా వ్యవహరించకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని, విపక్షాలకు అ్రస్తాలను అందించినట్లే అవుతుందని అన్నారు. మంత్రివర్గం నుంచి ఆమెను తొలగించాలని విన్నవించారు.దీనిపై ఏఐసీసీ చీఫ్ ఖర్గే.. పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డిల అభిప్రాయాలను సేకరించారు. మెజార్టీ నేతలు ఆమెను తొలగించేందుకే మొగ్గు చూపారు. సురేఖ కూడా తన వాదన ఖర్గేకు చెప్పుకున్నారు. ఇంతటితో ఆగకుండా పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద నుంచే ముఖ్యమంత్రిపై మొదటగా చర్యలు తీసుకోవాలంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఇద్దరూ ఆమె తొలగింపుపై పట్టుబట్టడంతో గురువారం సైతం వరుస సమావేశాలు కొనసాగాయి. సోనియా, రాహుల్కు కేసీ సమాచారం బుధవారం నాటి వరుస భేటీల సారాంశం.. రాష్ట్ర నేతల నుంచి వ్యక్తమైన అభిప్రాయాలను ఖర్గేతో మరోమారు చర్చించిన కేసీ వేణుగోపాల్..ఆయన సూచనల మేరకు అన్ని అంశాలను అగ్రనేతలు రాహుల్గాం«దీ, సోనియాగాం«దీలకు వివరించారు. దీంతో వారు సురేఖపై వేటుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. మరోవైపు చిన్నారెడ్డిని తప్పించాలని నిర్ణయించారు. ఈ సమాచారం సీఎం, పీసీసీ చీఫ్లకు కేసీ వేణుగోపాల్ చేరవేశారు. కాపాడని ‘రాహుల్ మనుస్మృతి’ ఇటీవల పుణెలో జరిగిన ‘ఛాత్రోం కీ గూంజ్’ కార్యక్రమంలో రాహుల్గాంధీ మనుస్మృతి, మహిళలపై చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో సురేఖపై అధిష్టానం కటువుగా వ్యవహరించకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమయ్యింది. కానీ అలా జరగలేదు. మహిళలు దేశానికి అత్యంత పెద్ద ఆస్తి అని, వారు తమ కోసం తాము నిలబడాలని, పితృస్వామ్య భావజాలాన్ని ప్రశ్నించాలని రాహుల్ ఈ కార్యక్రమంలో పిలుపునిచ్చారు. మహిళకు తనకంటూ ప్రత్యేకమైన వ్యక్తిత్వం, కలలు, లక్ష్యాలు ఉండాలని, స్వతంత్రంగా వ్యవహరించాలని సూచించారు. ఈ నేపథ్యంలో బీసీ మంత్రి అయిన సురేఖపై చర్యలు ఉండక పోవచ్చని, ఆమెపై వేటు వేస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని హైకమాండ్ భావించవచ్చనే చర్చ జరిగింది. సురేఖ కూడా మీడియా ముందు రాహుల్ వ్యాఖ్యలు ప్రస్తావించారు. కానీ పార్టీ అధిష్టానం.. సురేఖపై వేటుకే మొగ్గు చూపింది.సీఎం నివాసంలో సుదీర్ఘ చర్చలు సురేఖ బర్తరఫ్ నేపథ్యంలో తలెత్తే పర్యవసానాలు, రాజకీయ ప్రభావం, దీనిని ఎదుర్కొనే వ్యూహంపై ఢిల్లీలోనే ఉన్న పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ముఖ్యమంత్రి తన అధికారిక నివాసంలో చర్చోపచర్చలు జరిపారు. సుమారు రెండు గంటల పాటు సమావేశం జరిగింది. రాజకీయ విమర్శలకు తావివ్వకుండా బీసీ మహిళలకు పార్టీలో ప్రాధాన్యం ఉంటుందనే సందేశాన్ని ఇవ్వడంపై సమాలోచనలు జరిపారు. ఈ భేటీలోనే గద్వాల్ విజయలక్ష్మీ, నేరెళ్ల శారద, గుండు సుధారాణిలకు పదవులు ఇవ్వాలనే నిర్ణయం జరిగింది. కాగా సురేఖ తొలగింపు సమాచారం మీడియాకు అందాక ముఖ్యమంత్రి హైదరాబాద్కు బయలుదేరారు. ఆ తర్వాత మహేశ్గౌడ్, భట్టిలు కూడా హైదరాబాద్ వెళ్లారు. -
ఫ్రిజ్లో మృతదేహం కేసులో ప్రధాన నిందితుడికి ఊరట
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: పదిహేనేళ్ల క్రితం హైదరాబాద్లో కలకలం రేపిన కరీంనగర్ యువకుడి కిడ్నాప్, హత్య కేసులో ప్రధాన నిందితుడిని సుప్రీంకోర్టు నిర్దోషిగా తేలుస్తూ తీర్పు ఇచ్చింది. మృతదేహాన్ని ఫ్రిజ్లో దాచిన ఈ ఘటనలో ప్రధాన నిందితుడు కొండపాక శ్రీధర్ అలియాస్ శేఖర్ (ఏ1) దాఖలు చేసిన అప్పీల్పై గురువారం తీర్పు వెలువరించింది. ఆయన్ను తక్షణమే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దిగువ కోర్టు విధించిన జీవిత ఖైదును ఉమ్మడి హైకోర్టు సమర్థించడాన్ని సవాల్ చేస్తూ నిందితుడు దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కె.వినోద్ చంద్రన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈ వ్యవహారంలో ఆరుగురు నిందితుల్లో ఒకరు విచారణ దశలోనే చనిపోగా, మిగిలిన ఐదుగురికి కింది కోర్టు జీవిత ఖైదు ఖరారు చేసిందన్నారు. కానీ, పైకోర్టు నలుగురిని నిర్దోషులుగా విడుదల చేసి, శ్రీధర్కు మాత్రమే శిక్షను సమర్థించిందని తెలిపారు. అతడు ఫ్లాట్ను అద్దెకు తీసుకున్నట్లు కచ్చితమైన ఆధారాలు లేవని, ఇప్పటికే 16 ఏళ్లుగా జైలుకే పరిమితమయ్యాడని, బెయిల్ వచ్చినా పూచీకత్తు సమర్పించలేని స్థితిలో ఉన్నాడని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం పోలీసుల తీరుపై పలు సందేహాలు వ్యక్తం చేసింది. కింది కోర్టులో శిక్ష పడిన నలుగురిని హైకోర్టు విడుదల చేస్తే, వారిపై ప్రభుత్వం ఎందుకు అప్పీల్కు వెళ్లలేదని నిలదీసింది. సహ నిందితులను వదిలేసి, ఒకే వ్యక్తిపై హత్యానేరాన్ని ఎలా నిర్ధారిస్తారని వ్యాఖ్యానించింది. ఈ కేసులో ఏం జరిగిందంటే... జగిత్యాలకు చెందిన శ్రీనివాస్ అనే యువకుడు 2011 జూన్లో హైదరాబాద్కు వచ్చి అదృశ్యమయ్యాడు. కిడ్నాపర్లు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయడంతో, బాధితుడి తండ్రి లక్షన్నర రూపాయలు వారు చెప్పిన బ్యాంకు ఖాతాలో జమ చేశాడు. ఆ బ్యాంక్ లావాదేవీలు, ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఉప్పల్లోని ఓ అపార్ట్మెంట్లో గాలింపు చేపట్టారు. అక్కడి 402వ నంబరు ఫ్లాట్లోని ఫ్రిజ్లో శ్రీనివాస్ మృతదేహం ప్లాస్టిక్ కవర్లు, వైర్లతో చుట్టి కుళ్లిన స్థితిలో కనిపించింది. ఈ కేసులో కరీంనగర్ కోర్టు ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. హైకోర్టు శ్రీధర్ మినహా నలుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పుపైనే శ్రీధర్ సుప్రీంను ఆశ్రయించాడు. -
మోదీకి ఆ కానుక ఇవ్వాలనుకున్నా.. కానీ ఏమైందంటే?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి ఇచ్చేందుకు బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ సిద్ధం చేసిన వినూత్న కానుక.. భారత్కు చేరకముందే కరిగిపోయింది. అత్యుత్తమ బెల్జియన్ చాక్లెట్లతో ప్రత్యేకంగా తయారు చేసిన ఢిల్లీ ఇండియా గేట్ ప్రతిబింబించే చాక్లెట్ను గిఫ్ట్గా ఇద్దామనుకున్నట్లు బార్ట్ వెల్లడించారు. అయితే, భారత్కు దాన్ని తీసుకురాలేకపోయానని తెలిపారు. బహుమతి.. ప్రయాణంలో కరిగిపోవడంతో భారత్కు చేరుకోలేకపోయింది. అయితే, మరో ప్రతిరూపాన్ని బెల్జియంలో సిద్ధంగా ఉంచామని.. దాన్ని ఈసారి మోదీకి ‘ఒక్క ముక్కలో’ అందజేస్తానంటూ డి వెవర్ చెప్పడంతో అక్కడ నవ్వులు పూశాయి."మా ఉమ్మడి చరిత్ర, భవిష్యత్ భాగస్వామ్యానికి ప్రతీకగా మేము ఇండియా గేట్ను ఎంచుకున్నాము. ఎందుకంటే ఇండియా గేట్ ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో ఫ్లాండర్స్ ఫీల్డ్స్లో పోరాడి ప్రాణాలు కోల్పోయిన భారతీయ సైనికులను స్మరించే శాసనంపై ఉన్న భాగాన్ని ఈ చాక్లెట్ శిల్పంపై పెద్దదిగా రూపొందించినట్లు ఆయన చెప్పారు. ఒక శతాబ్దానికి పైగా భారతీయ సైనికులు వేల మైళ్ళు ప్రయాణించి బెల్జియం గడ్డపై పోరాడారు. వారి త్యాగాన్ని మేము మరిచిపోలేదు. వారి ధైర్యాన్ని, త్యాగాన్ని మేం ఎప్పటికీ మరువలేమన్నారు.బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ భారత్ పర్యటనలో భాగంగా ఇవాళ (గురువారం) ప్రధాని నరేంద్ర మోదీతో విస్తృత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. 2027 నాటికి ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు 80 ఏళ్లు పూర్తి చేసుకోనున్న తరుణంలో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణలు, సెమీకండక్టర్లు, ఫిన్టెక్, క్రిటికల్ మినరల్స్, ప్రజల మధ్య సంబంధాలు, విద్యా-పరిశోధనా సహకారంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ మోదీ, వెవర్ ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు.ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై వారు అభిప్రాయాలను పంచుకున్నారు. భారతదేశం - బెల్జియం భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా చర్చలు జరిపారు. భారత్-బెల్జియం ద్వైపాక్షిక సంబంధాల్లో ప్రజల మధ్య సంబంధాలే అత్యంత కీలకమైన బలంగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. -
అదంతా రాఘవ్ చద్దా ప్లానే.. ఆప్ ఎదురుదాడి
ఓటర్ జాబితాలో పేరు తొలగింపుపై బీజేపీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య మాటల యుద్ధం మొదలైంది. పంజాబ్ ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తన పేరు తొలగించడంపై చద్దా తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది పొరపాటు కాదని.. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తన పేరును తొలగించారని ఆరోపించారు. ఈ ఆరోపణలను ఖండిస్తూ ఆప్ ఎదురుదాడికి దిగింది.ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లో భాగంగా ఆగస్టు 13న విడుదలైన పంజాబ్ ముసాయిదా ఓటర్ల జాబితాలో రాఘవ్ చద్దా పేరు లేదు. ఆయన పేరును ‘పర్మినెంట్గా షిఫ్ట్ అయ్యారు’ అనే కారణంతో తొలగించినట్లు జాబితాలో పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని చద్దా రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణించారు. అయితే ఇదంతా చద్దా వ్యూహంలో భాగమేనని.. ఢిల్లీలో ఓటరుగా పేరు నమోదు చేసుకునేందుకు ఆయన ‘బ్యాక్డేటెడ్’ విధానాన్ని ప్రయత్నిస్తున్నారని ఆప్ ఆరోపించింది.‘బ్యాక్డేటెడ్ విధానం’ అంటే.. ఇప్పుడు ఓటరుగా నమోదు చేసుకుంటూ, గతంలోనే ఆ ప్రాంతంలో నివసిస్తున్నట్లు రికార్డుల్లో చూపించడం. రాఘవ్ చద్దా ఢిల్లీలోని రాజిందర్ నగర్లో ఓటరుగా నమోదు చేసుకునే విషయంలో ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారని ఆప్ ఆరోపిస్తోంది. అంటే.. ఇప్పుడు జరిగే ఓటరు నమోదును గత తేదీ నుంచే అమల్లో ఉన్నట్లు చూపించేందుకు ప్రయత్నిస్తున్నారన్నది ఆప్ వాదన.‘రాజకీయ కక్షతోనే’..అంతకు ముందు.. తన ఓటర్ ఐడీ పంజాబ్లోని మొహాలీలో నమోదై ఉందని చద్దా తెలిపారు. తాను పంజాబ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ‘షిఫ్టెడ్’గా ఎలా గుర్తించారని ప్రశ్నించారు. ఇది సాధారణ క్లరికల్ తప్పిదం కాదని.. రాజకీయ కక్షతోనే తన పేరును తొలగించారని ఆరోపించారు. అయితే ఇది ముసాయిదా జాబితా మాత్రమేనని, అభ్యంతరాలు–దావాల ప్రక్రియ ద్వారా పేరు తిరిగి చేర్చుకునే అవకాశం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు.ఆప్ ఎదురుదాడి..చద్దా ఆరోపణలను ఆప్ తీవ్రంగా ఖండించింది. సర్ ప్రక్రియను నిర్వహించేది ఎన్నికల సంఘమే తప్ప పంజాబ్ ప్రభుత్వం కాదని స్పష్టం చేసింది. ఓటర్ల జాబితాలో ఎవరి పేరు చేర్చాలి, ఎవరి పేరు తొలగించాలనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని పేర్కొంది.అంతేకాదు.. ఢిల్లీలోని రాజిందర్ నగర్లో తన ఓటరు నమోదును గత తేదీ నుంచి అమల్లోకి వచ్చేలా చేయడానికి చద్దా ప్రయత్నిస్తున్నారని ఆప్ ఆరోపించింది. ఈ విషయంలో ఎన్నికల సంఘం వర్గాల నుంచి తమకు సమాచారం అందిందని తెలిపింది. ఇలాంటి బ్యాక్డేటెడ్ లేదంటే చట్టవిరుద్ధమైన ప్రక్రియ జరిగి ఉంటే దానిపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది.‘ఢిల్లీలోనే ఉంటున్నారు’చద్దా ప్రస్తుతం పంజాబ్లో కాకుండా ఢిల్లీలో నివసిస్తున్నారని ఆప్ పేర్కొంది. ఒకవేళ ఆయన పంజాబ్లో నివసించకపోతే తన ఓటర్ నమోదును కొనసాగించడమో లేదంటే మార్చుకోవడమో ఆయన వ్యక్తిగత బాధ్యతేనని తెలిపింది. ఇప్పుడు ఓటర్ జాబితా నుంచి పేరు తొలగింపునకు ఆప్, పంజాబ్ ప్రభుత్వాన్ని నిందించడం సరికాదని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. సర్లో భాగంగా తొలగించిన పేర్లపై అభ్యంతరాలు, క్లెయిమ్లను స్వీకరించే ప్రక్రియ కొనసాగుతోంది. తుది ఓటర్ల జాబితాను అక్టోబర్లో విడుదల చేయనున్నారు.ఇదీ చదవండి: స్టాలిన్ ఆశలకు మద్రాస్ హైకోర్టు గండి -
ఆ ఇద్దరు ఐఏఎస్లదీ ఒకే కథ!
సివిల్స్లో విజయం సాధారణమేమీ కాదు. మన దేశంలో ఎంతోమంది యువతకు అదొక కల. అందుకోసం ఏళ్ల తరబడి కష్టపడుతుంటారు కూడా. కానీ ఆ ప్రతిష్ఠాత్మక ఉద్యోగాన్ని సాధించిన తర్వాత కూడా.. అదే కెరీర్లో జీవితాంతం కొనసాగాలని లేదనుకుంటే?. రోమన్ సైనీ, దివ్యా మిట్టల్ ప్రయాణాలే దీనికి ఆసక్తికరమైన సమాధానం. ఇద్దరూ తమకు దక్కిన అవకాశాన్ని వదులుకుని.. తమకు నచ్చిన దారిని ఎంచుకున్నారు.రోమన్ సైనీ 2013లో UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో 18వ ర్యాంక్ సాధించి IASలోకి అడుగుపెట్టారు. మరోవైపు దివ్యా మిట్టల్ 2012 UPSC పరీక్షలో 68వ ర్యాంక్ సాధించి IASకు ఎంపికయ్యారు. ఆమె 2013 బ్యాచ్ అధికారిణిగా సర్వీసులో చేరారు. ఒకరు ఐఏఎస్లో చేరిన 20 నెలల్లోనే బయటకు వచ్చి స్టార్టప్ ప్రపంచంలోకి వెళ్లగా.. మరొకరు 13 ఏళ్ల సుదీర్ఘ సేవ అనంతరం తాజాగా రాజీనామా చేశారు. ఇద్దరి నిర్ణయాల వెనుక దారులు వేరు.. కానీ లక్ష్యం మాత్రం తమకు నచ్చిన జీవితాన్ని ఎంచుకోవడమే. ఒకరు ప్రభుత్వ ఉద్యోగం కంటే వ్యాపారాన్ని ఎంచుకుంటే.. మరొకరు సుదీర్ఘ ప్రజాసేవ తర్వాత కొత్త అధ్యాయం వైపు అడుగులు వేశారు. ఇప్పుడు ఈ ఇద్దరి ప్రయాణాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి.ఇందులో రోమన్ సైనీ ప్రయాణం చాలా ప్రత్యేకం. 16 ఏళ్లకే ఎయిమ్స్ ప్రవేశ పరీక్షలో విజయం సాధించి వైద్య విద్య పూర్తి చేసిన ఆయన.. 2013లో యూపీఎస్సీ సివిల్స్లో ఆల్ ఇండియా 18వ ర్యాంక్ సాధించారు. కేవలం 22 ఏళ్ల వయసులో ఐఏఎస్ అయ్యారు. అయితే ప్రతిష్ఠాత్మకమైన సివిల్ సర్వీస్లో ఆయన కెరీర్ రెండేళ్లు కూడా కొనసాగలేదు. లాల్బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (LBSNAA)లో ఉన్న సమయంలో గౌరవ్ ముంజాల్తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఐఏఎస్ను వీడి ముంజాల్తో కలిసి యూన్అకాడమీ నిర్మాణంలో భాగమయ్యారు.ఐఏఎస్ నుంచి ఎడ్టెక్ వైపు..2015లో ప్రారంభమైన యూన్ అకాడమీకి రోమన్ సైనీ సహ వ్యవస్థాపకుడిగా వ్యవహరించారు. ఆన్లైన్ విద్య అంతగా విస్తరించని సమయంలో తీసుకున్న ఈ నిర్ణయం పెద్ద సాహసమే. అయితే కొవిడ్ సమయంలో యూన్ అకాడమీ భారీ స్థాయిలో విస్తరించింది. నెలకు లక్షకు పైగా లైవ్ క్లాసులు, దాదాపు 10 లక్షల మంది చెల్లింపు సబ్స్క్రైబర్లు ఉన్న దశను సంస్థ చూసింది. తాజాగా యూన్ అకాడమీని అప్గ్రాడ్ 200 మిలియన్ డాలర్లకు పైగా విలువైన ఆల్-స్టాక్ డీల్లో కొనుగోలు చేసింది. ఈ పరిణామంతో సైనీ ఐఏఎస్ను వదిలి నిర్మించిన అధ్యాయం మరో మలుపు తిరిగింది.13 ఏళ్ల తర్వాత దివ్యా మిట్టల్ రాజీనామారోమన్ సైనీకి పూర్తి భిన్నంగా దివ్యా మిట్టల్ ఐఏఎస్లో సుదీర్ఘ ప్రయాణం సాగించారు. ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం బెంగళూరులో చదువుకున్న ఆమె.. లండన్లో ఉద్యోగం చేసిన తర్వాత భారత్కు తిరిగి వచ్చి సివిల్ సర్వీసెస్లో చేరారు. 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో పనిచేశారు. దేవరియా, మిర్జాపూర్, సంత్కబీర్ నగర్ వంటి జిల్లాల్లో జిల్లా మేజిస్ట్రేట్గా బాధ్యతలు నిర్వర్తించారు.మీర్జాపూర్లోని ఓ మారుమూల కొండ గ్రామానికి పైపుల ద్వారా తాగునీరు అందించడంలో ఆమె కీలకంగా వ్యవహరించారు. దశాబ్దాలుగా నీటి కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలకు తాగునీరు అందించడం ఆమె సేవా కాలంలోని గుర్తుండిపోయే పనుల్లో ఒకటిగా నిలిచింది.2026లో ఈ ఇద్దరి కెరీర్ ప్రయాణాలు మరోసారి ఆసక్తికరమైన మలుపు తీసుకున్నాయి. యూపీఎస్సీ 2013 బ్యాచ్కు చెందిన రోమన్ సైనీ అప్పటికే ఐఏఎస్ను వదిలి వ్యాపార రంగంలోకి వెళ్లారు. సరిగ్గా 13 ఏళ్ల తర్వాత ఆయన సహ వ్యవస్థాపకుడిగా నిర్మించిన యూన్అకాడమీ మరో చేతుల్లోకి వెళ్లింది. రోనీ స్క్రూవాలా నేతృత్వంలోని ఎడ్టెక్ సంస్థ అప్గ్రాడ్, యూన్అకాడమీని 200 మిలియన్ డాలర్లకు పైగా విలువైన ఆల్-స్టాక్ డీల్లో సొంతం చేసుకుంది. ఒకప్పుడు 3.44 బిలియన్ డాలర్ల గరిష్ఠ విలువను అందుకున్న యూన్అకాడమీ.. ఇప్పుడు దానితో పోలిస్తే దాదాపు 94 శాతం తక్కువ విలువకు డీల్ కావడం విశేషం. ఈ ఒప్పందంతో యూన్అకాడమీ షేర్హోల్డర్లకు upGradలో వాటాలు దక్కాయి. రోమన్ సైనీ మాత్రం సంస్థ నిర్వహణ నుంచి తప్పుకుని ఇకపై అడ్వైజరీ పాత్రలో కొనసాగనున్నారు.అదే సమయంలో దివ్యా మిట్టల్ 13 ఏళ్ల సుదీర్ఘ ఐఏఎస్ సేవకు స్వచ్ఛందంగా ముగింపు పలికారు. ఒకరు ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి స్టార్టప్ నిర్మించి, 13 ఏళ్ల తర్వాత ఆ సంస్థ కొత్త యాజమాన్యంలోకి వెళ్లడాన్ని చూశారు. మరొకరు 13 ఏళ్లపాటు ఐఏఎస్గా సేవలందించిన తర్వాత స్వయంగా ఆ కెరీర్కు వీడ్కోలు పలికారు. ఇద్దరి ప్రయాణాలూ వేర్వేరైనా.. 2026లో మాత్రం ఇద్దరూ తమ జీవితాల్లో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.ఇద్దరి నిర్ణయాలు భిన్నమైనప్పటికీ.. సందేశం మాత్రం ఒకటే. యూపీఎస్సీలో విజయం అనేది కెరీర్కు ముగింపు కాదు.. కొత్త ప్రయాణానికి ఆరంభం మాత్రమే. తాను సాధించిన ప్రతిష్ఠాత్మక స్థానంలోనే జీవితాంతం కొనసాగాల్సిన అవసరం లేదని ఈ ఇద్దరి కథలు చెబుతున్నాయి. ఒకరు ఐఏఎస్ నుంచి వ్యాపారవేత్తగా మారితే.. మరొకరు 13 ఏళ్ల పరిపాలనా సేవ తర్వాత కొత్త అధ్యాయం వైపు అడుగులు వేశారు. అందుకే.. యూపీఎస్సీ క్లియర్ చేయడమే అంతిమ లక్ష్యం కాదని, ఆ తర్వాత మనకు నచ్చిన మార్గాన్ని ఎంచుకోవడమే అసలు సవాల్ అని రోమన్ సైనీ, దివ్యా మిట్టల్ ప్రయాణాలు గుర్తుచేస్తున్నాయి.ఇదీ చదవండి: రాఘవ్ చద్దా ఓటు మిస్సింగ్? -
రాఘవ్ చద్దా సంచలన ఆరోపణలు
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. ఉద్దేశపూర్వకంగా ఆయా ప్రభుత్వాలు ఓటర్లను తొలగిస్తున్నాయంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ తరుణంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు, మాజీ ఆప్ నేత రాఘవ్ చద్దా ఓటు గల్లంతు కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ పరిణామంపై చద్దా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సర్ ప్రక్రియలో తన పేరును ఓటర్ల జాబితా నుంచి తొలగించడం సాధారణ క్లరికల్ తప్పిదం కాదని చద్దా ఆరోపించారు. ఆప్ను వీడి బీజేపీలో చేరిన తర్వాత తనపై ఆ పార్టీ నాయకత్వం కక్ష పెంచుకుందని చద్దా ఆరోపించారు. ఆ రాజకీయ విభేదాలను ఇప్పుడు ఓటర్ల జాబితా సవరణ వరకు తీసుకొచ్చారని మండిపడ్డారు. ఎన్నికల జాబితా రూపకల్పనలో పనిచేసే అధికారులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రభావం ఉండే అవకాశం ఉందని పేర్కొంటూ.. తన పేరును ‘షిఫ్టెడ్’గా గుర్తించడంపై సమగ్ర వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. తన పేరును ఏదైనా కారణంతో ఫ్లాగ్ చేసినప్పటికీ, SIR మార్గదర్శకాల్లోని నిబంధనల ప్రకారం ప్రజాప్రతినిధులకు కల్పించిన ప్రత్యేక రక్షణ కింద తన పేరును డ్రాఫ్ట్ జాబితాలో ఉంచాల్సి ఉందని వాదించారు. ఈ నిబంధనను తన విషయంలో ఉద్దేశపూర్వకంగానే పక్కనపెట్టారని ఆరోపించారు.రూల్స్ను కావాలనే..SIR మార్గదర్శకాల్లోని పారా 4(d)ను కూడా రాఘవ్ చద్దా ప్రస్తావించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా ప్రజాప్రతినిధుల పేర్లు ఎన్నికల డేటాబేస్లో ఫ్లాగ్ అయినప్పటికీ.. క్లెయిమ్స్, అభ్యంతరాల సమయంలో అవసరమైన పత్రాలు సమర్పించుకునేందుకు వారి పేర్లను డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో చేర్చాలని ఈ నిబంధన చెబుతోందని అన్నారు. తాను పంజాబ్ నుంచి సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడినని, అయినప్పటికీ తన పేరును డ్రాఫ్ట్ జాబితాలో ఉంచకుండా ‘షిఫ్టెడ్’గా పేర్కొనడం నిబంధనల ఉద్దేశపూర్వక ఉల్లంఘనేనని ఆరోపించారు.The AAP government in Punjab has now taken its politics of revenge to the Draft Electoral Rolls.I am a sitting Rajya Sabha MP from Punjab, with my voter ID registered in Mohali, Punjab. Yet my name has been classified as “shifted” in the draft electoral rolls.Thankfully,… pic.twitter.com/laAFAAWYiQ— Raghav Chadha (@raghav_chadha) September 3, 202620.66 లక్షల పేర్లు తొలగింపుపంజాబ్లో సర్ సందర్భంగా మొత్తం 20.66 లక్షల ఓటర్ల పేర్లు డ్రాఫ్ట్ జాబితా నుంచి తొలగించారు. వీళ్లలో శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయినవాళ్లు, మరణించినవారు, డూప్లికేట్ నమోదులు ఉన్నవారు ఉన్నారు. మొత్తం ఓటర్లలో ఇది దాదాపు 9.7 శాతం. చద్దా పేరు కూడా ‘ఆబ్సెంట్, షిఫ్టెడ్, డిజీస్డ్ అండ్ డూప్లికేట్’ (ASDD) జాబితాలో పర్మినెంట్లీ షిఫ్టెడ్గా నమోదైంది. ఆప్ కౌంటర్అయితే చద్దా ఆరోపణలను అధికార ఆప్ తీవ్రంగా ఖండించింది. సర్ ప్రక్రియను ఎన్నికల సంఘమే నిర్వహిస్తోందని, ఇందులో పంజాబ్ ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని పార్టీ, రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. మరోవైపు చద్దా తన ఓటరు నమోదును ఢిల్లీకి మార్చుకునే ప్రయత్నం చేశారని ఆప్ ఆరోపించింది. దీంతో ఓటరు జాబితా వ్యవహారం ఇరు పార్టీల మధ్య రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలకు దారితీసింది. తుది జాబితా ఇంకా రాలేదు: ఈసీఇది ప్రస్తుతం డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా మాత్రమేనని ఎన్నికల సంఘం చెబుతోంది. పేరు తొలగింపుపై అభ్యంతరాలు, క్లెయిమ్స్ దాఖలు చేసుకునే అవకాశం చద్దాతో పాటు ఇతర ఓటర్లకు కూడా ఉంది. సెప్టెంబర్లో ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం అక్టోబర్లో తుది ఓటర్ల జాబితా వెలువడనుంది అని క్లారిటీ ఇచ్చింది.ప్రస్తుతం ఇది డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా మాత్రమే. పేరు తొలగింపుపై క్లెయిమ్స్, అభ్యంతరాలు దాఖలు చేసుకునే ప్రక్రియ కొనసాగుతోంది. తన పేరు ‘షిఫ్టెడ్’గా ఎలా నమోదైందనే దానిపై రాఘవ్ చద్దా అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఈ వ్యవహారంపై వివరాలు సేకరిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు. మరోవైపు ఆప్ మాత్రం SIR ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వానికి పాత్ర లేదని స్పష్టం చేసింది. దీంతో ఈ వివాదం రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలకు దారితీసింది.ఇదీ చదవండి: ఎవరు చెబితే అలా మాట్లాడుతున్నావ్?.. హీరోయిన్పై బీజేపీ ఫైర్ -
ఇతర మహిళల్ని అవమానించొద్దు.. నటిపై భగ్గుమన్న బీజేపీ!
కృతి సనన్ రాఖీ యాడ్ దుమారం చల్లారక ముందే.. మరో నటి స్వరా భాస్కర్ రాజకీయ వివాదంలో చిక్కుకున్నారు. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావత్’ సినిమాలోని ‘జౌహర్’ సన్నివేశంపై ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. మహిళల త్యాగాన్ని అవమానించేలా మాట్లాడటం సరికాదని విమర్శించింది.ఢిల్లీలో ఇటీవల జరిగిన ‘వుమన్, లైఫ్, ఫ్రీడమ్’ కార్యక్రమంలో స్వరా భాస్కర్ ‘పద్మావత్’లోని జౌహర్ సన్నివేశాన్ని ప్రస్తావించారు. సినిమాలో మహిళలు తమ గౌరవాన్ని కాపాడుకునేందుకు ఆత్మాహుతి చేసుకున్నట్లు చూపించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకవేళ లైంగిక హింసకు గురైన మహిళ ఈ సన్నివేశాన్ని చూస్తే.. తన జీవితాన్ని కొనసాగించాలనుకోవడం తప్పా అనే భావన కలగొచ్చని స్వరా ప్రశ్నించారు. ‘గౌరవం కోసం చనిపోకపోతే పిరికిదానిననే భావన కలుగుతుందా?’ అన్న కోణంలో ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించారు. లైంగిక హింసకు గురైన మహిళలకు కూడా బతికే హక్కు ఉందన్న సందేశమే సమాజానికి వెళ్లాలని ఆమె పేర్కొన్నారు.జౌహర్ (Jauhar) అంటే.. యుద్ధంలో శత్రు సైన్యం చేతిలో చిక్కి అవమానం, లైంగిక హింసకు గురికాకుండా ఉండేందుకు మహిళలు సామూహికంగా అగ్నిలోకి దూకి ఆత్మాహుతి చేసుకునే ఆచారం.‘ఆమె పిరికిదని అనలేదు’స్వరా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఆమె వివరణ ఇచ్చారు. తాను రాణి పద్మావతిని కానీ, జౌహర్ చేసిన మహిళలను కానీ పిరికివాళ్లుగా పేర్కొనలేదని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను తప్పుగా అనువదించి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను ప్రశ్నించింది జౌహర్ చేసిన మహిళల ధైర్యాన్ని కాదని.. ఆ సన్నివేశం ఆధునిక సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తుందన్నదేనని వివరించారు.‘ఇతర మహిళలను గౌరవించాలి’ఈ వివాదంపై స్పందించిన బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ప్రతి మహిళ ఇతర మహిళలను గౌరవించాల్సిన అవసరం ఉందని అన్నారు. స్వరా పేరులోని ‘స్వర్’ (గొంతు/స్వరం)ను ప్రస్తావిస్తూ ఆమె వ్యాఖ్యలపై వ్యంగ్యంగా స్పందించారు. ఆమె ఎవరి గొంతుతో మాట్లాడుతున్నారనే ప్రశ్నను కూడా లేవనెత్తారు. మహిళల త్యాగాలను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు.పోలీసులకు ఫిర్యాదుఈ వివాదం రాజకీయ విమర్శలకే పరిమితం కాలేదు. బిహార్కు చెందిన బీజేపీ నేత కృష్ణకుమార్ సింగ్ స్వరా భాస్కర్పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. హిందూ సమాజం, రాజ్పుత్ మహిళలను కించపరిచేలా ఆమె వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో ఆరోపించినట్లు కథనాలు పేర్కొన్నాయి.కర్ణిసేన కూడా..పద్మావత్ విడుదల సమయంలోనే ఆ సినిమాలోని అంశాలపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసిన కర్ణిసేన.. తాజా వివాదంలోనూ స్వరా భాస్కర్ను తప్పుబట్టింది. జౌహర్ను, రాజ్పుత్ మహిళల త్యాగాన్ని విమర్శించే ముందు చారిత్రక నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలని సూచించింది. కర్ణిసేన మహిళా విభాగం నేత కీర్తి రాథోర్.. స్వరా వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్పుత్ మహిళల త్యాగం, ధైర్యాన్ని కించపరిచే వ్యాఖ్యలను సహించబోమని హెచ్చరించారు.మళ్లీ తెరపైకి ‘పద్మావత్’ వివాదం2018లో విడుదలైన ‘పద్మావత్’లో రాణి పద్మావతి పాత్రను దీపికా పదుకొణె పోషించారు. ఆ సమయంలో కర్ణిసేన అభ్యంతరాలతో సినిమా టైటిల్ పద్మావతి కాస్త పద్మావత్గా మారింది. ఇక చిత్ర క్లైమాక్స్లో శత్రు సేనల చేతికి చిక్కకుండా రాజ్పుత్ మహిళలు సామూహికంగా జౌహర్ చేసినట్లు సన్నివేశాన్ని తెరకెక్కించారు. ఈ సన్నివేశం అప్పట్లోనే తీవ్ర చర్చకు దారితీసింది. స్వరా భాస్కర్ కూడా సినిమా విడుదల సమయంలో దర్శకుడు భన్సాలీకి బహిరంగ లేఖ రాసి జౌహర్ చిత్రీకరణపై తన అభ్యంతరాలను వ్యక్తం చేశారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఆమె మరోసారి అదే అంశాన్ని ప్రస్తావించడంతో వివాదం తాజాగా మళ్లీ రాజుకుంది.చరిత్రా? సమాజానికి సందేశమా?‘పద్మావత్’లో జౌహర్ చిత్రీకరణ చుట్టూ సాగుతున్న తాజా వివాదం.. చరిత్రను సినిమాల్లో ఎలా చూపించాలి? చారిత్రక ఘటనలను ఆధునిక సామాజిక విలువలతో ఎలా చూడాలి? అనే ప్రశ్నలను మరోసారి ముందుకు తెచ్చింది. ఇదే సమయంలో ‘పద్మావత్’ రచయిత ప్రకాశ్ కపాడియా కూడా జౌహర్ సన్నివేశాన్ని సమర్థించారు. అది ఆ కాలంలోని వాస్తవ పరిస్థితుల ప్రతిబింబమని, నేటి ప్రమాణాలతో మాత్రమే దాన్ని అంచనా వేయకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. స్వరా భాస్కర్ మాత్రం తన ఉద్దేశం ఏ మహిళనూ అవమానించడం కాదని స్పష్టం చేస్తున్నారు. ఆమె వ్యాఖ్యలకు బీజేపీ, కర్ణిసేన నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో.. ‘పద్మావత్’ జౌహర్ వివాదం మరోసారి బాలీవుడ్, రాజకీయ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది.వివాదాలు స్వరా భాస్కర్కు కొత్తేమీ కాదు. నటిగా ‘తను వెడ్స్ మను’, ‘రాంఝనా’, ‘తను వెడ్స్ మను రిటర్న్స్’, ‘నిల్ బట్టే సన్నాటా’, ‘వీరే ది వెడ్డింగ్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఆ తర్వాత తన వ్యాఖ్యలు, రాజకీయ వైఖరితోనూ తరచూ వార్తల్లో నిలిచారు. సీఏఏ-ఎన్ఆర్సీ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొనడం నుంచి ‘వీరే ది వెడ్డింగ్’లోని ఓ సన్నివేశంపై వచ్చిన విమర్శల వరకు.. ఆమెపై పలు సందర్భాల్లో చర్చ జరిగింది. 2024లో యాహ్యా సిన్వార్పై చేసిన వ్యాఖ్యలు కూడా వివాదానికి దారితీశాయి. ఇప్పుడు ‘పద్మావత్’లోని జౌహర్ సన్నివేశంపై వ్యాఖ్యలతో మరోసారి వివాదం రేగింది.ఇదీ చదవండి: పాతికేళ్ల జలయుద్ధానికి ఎట్టకేలకు తెర -
కొండా సురేఖ ఎపిసోడ్కు నేడు ఎండ్కార్డ్?
సాక్షి, ఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో కొంతకాలంగా కలకలం రేపుతున్న మంత్రి కొండా సురేఖ కుటుంబ వ్యవహారం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. మంత్రి సురేఖపై క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన నివేదిక, సీఎం రేవంత్రెడ్డి అభిప్రాయం, హైకమాండ్ ముందు సురేఖ వివరణ, ఆపై మీడియా ముందు సీఎంపై చేసిన ఆరోపణలు.. అన్నింటినీ పరిశీలించిన కాంగ్రెస్ పెద్దలు తుది నిర్ణయంపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగే కీలక భేటీ నేపథ్యంలో ఈ వ్యవహారానికి తెరపడొచ్చనే చర్చా జోరందుకుంది. పరకాల రాజకీయాల నేపథ్యంలో మొదలైన వివాదం.. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్(చిట్టక్క) చేసిన వ్యాఖ్యలతో మరింత ముదిరింది. సీఎం రేవంత్రెడ్డితో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిపై ఆమె చేసిన వ్యాఖ్యలను తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తీవ్రంగా భావించారు. కొండా కుటుంబంపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు పార్టీ క్రమశిక్షణా కమిటీ కూడా ఈ వ్యవహారంపై తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంపై సురేఖను వివరణ కోరగా.. తన కుమార్తె వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. అయితే పీసీసీ మాత్రం ఈ వ్యవహారం అంతా అధిష్టానమే చూసుకుంటుందని చెబుతూ వచ్చింది. ఈలోపు ఈ వివాదంపై విచారణ జరిపిన టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ.. సురేఖ వ్యవహారంపై ఓ నివేదిక సిద్ధం చేసింది. ఆ నివేదిక ఆగస్టు 25న టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్కు చేరింది. అక్కడి నుంచి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్కు.. అటు నుంచి ఏఐసీసీకి చేరింది. అప్పటి నుంచి ఈ అంశం కాంగ్రెస్ హైకమాండ్ వద్దే ఉంది. అయితే వెంటనే చర్యలు తీసుకోకుండా.. సురేఖ వివరణ, పార్టీపై దాని ప్రభావం, తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వంటి అంశాలను అధిష్టానం పరిశీలిస్తూ వచ్చింది.రేవంత్ స్పష్టమైన వైఖరిముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండగా.. ఈ ఎపిసోడ్ అంతా నడిచింది. తిరిగొచ్చిన వెంటనే ఆయన ఈ పరిణామాలపై భగ్గుమన్నారు. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్రెడ్డి ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యి ఈ అంశంపై చర్చ జరిపారు. ఈ సందర్భంగా సురేఖపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆయన వివరించినట్లు సమాచారం. పార్టీలో క్రమశిక్షణ విషయంలో స్పష్టమైన సందేశం వెళ్లాలన్నది రేవంత్ అభిప్రాయంగా తెలుస్తోంది. అలాగే పాలమూరు రాజకీయాల్లో కాకరేపిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి వ్యవహారంపైనా ఆయన చర్చించినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి నుంచి పదవుల నుంచి తప్పించాలని అధిష్టానాన్ని సీఎం రేవంత్ కోరుతుండగా.. దానికి టీపీసీసీ చీఫ్ మహేష్గౌడ్ సైతం మద్దతు ప్రకటించినట్లు సమాచారం. అయితే.. సురేఖకు మద్దతు కూడామరోవైపు సురేఖను వెంటనే కేబినెట్ నుంచి తొలగించొద్దంటూ కాంగ్రెస్లోని కొందరు సీనియర్ నేతలు హైకమాండ్ను కోరినట్లు తాజా సమాచారం. ఇద్దరు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇద్దరు మంత్రులు సహా పలువురు నేతలు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో సురేఖ విషయంలో హైకమాండ్ ముందు రాజకీయంగా సున్నితమైన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో.. ఒకవేళ ఆమెను బర్తరఫ్ చేసినా ఆ తర్వాతి పరిస్థితులకు సిద్ధపడుతున్నట్లు సమాచారం.హైకమాండ్తో సురేఖ భేటీమరోవైపు ఢిల్లీలో నిన్నంతా కాంగ్రెస్ హెడ్క్వార్టర్స్ ఇందిరా భవన్ వేదికగా నాటకీయ పరిణామాలు జరిగాయి. అధిష్టానం పిలుపుతో అక్కడికి వెళ్లిన కొండా సురేఖ.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు. తనపై జరుగుతున్న పరిణామాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే సీఎం రేవంత్తో పాటు పలువురు మంత్రులపై వస్తున్న ఆరోపణల గురించి కూడా హైకమాండ్ వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తాను చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని హైకమాండ్ హామీ ఇచ్చిందని ఆమె చెప్పారు. ఆ వెంటనే సీఎం రేవంత్, ఖర్గేతో మరోసారి భేటీ జరిపారు. అయితే రాష్ట్ర వ్యవహారాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఖర్గే.. రాహుల్ గాంధీతో చర్చించాకే ఏ నిర్ణయమైనా వెల్లడిస్తామని చెప్పినట్లు సమాచారం.నేడు కీలక భేటీలురాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితర అగ్రనేతలు తిరిగి అందుబాటులోకి రావడం, తెలంగాణకు చెందిన కీలక నేతలు ఢిల్లీలో ఉండటంతో గురువారం చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, మీనాక్షి నటరాజన్ తదితరులు హైకమాండ్తో చర్చించే అవకాశం ఉంది. ఈ భేటీ తర్వాత రేవంత్, మహేష్ గౌడ్లు హైదరాబాద్కు తిరుగుపయనం అవుతారని సమాచారం. దీంతో ఇవాళ నిర్ణయం వెలువడొచ్చనే ప్రచారం జోరందుకుంది. ఇటు ఇవాళ కొండా సురేఖ దంపతులు తిరిగి వరంగల్కు చేరుకోనున్నారు. అనుచరులతో వాళ్లు భేటీ అవుతారని సమాచారం అందుతోంది.కేబినెట్ మార్పులపై కూడా చర్చ?ఈ నెలాఖరుకల్లా నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయాలనే ఆలోచనలో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్లు ఉన్నారు. ఇప్పటికే అధిష్టానంతో సుదీర్ఘంగా చర్చించారు. అయితే ఇవాళ్టి భేటీలో సురేఖపై నిర్ణయంతో పాటు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. సురేఖను తప్పిస్తే ఆమె స్థానంలో ఎవరిని తీసుకోవాలి? ఇప్పటికే ఖాళీగా ఉన్న స్థానాల్లో ఎవరికి అవకాశం ఇవ్వాలి? నామినేటెడ్ పదవుల భర్తీ ఎలా చేపట్టాలి? అనే అంశాలపైనా ఢిల్లీలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. వేటా.. ప్రత్యామ్నాయ మార్గమా?సురేఖను కేబినెట్ నుంచి తొలగించే అవకాశాలు బలంగా ఉన్నాయన్న ప్రచారం కొనసాగుతున్నప్పటికీ.. హైకమాండ్ మరో మార్గాన్ని పరిశీలిస్తోందన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఆమెకు కేబినెట్ నుంచి తప్పుకుని మరో కీలక పదవి ఇచ్చే అవకాశంపై కూడా చర్చ జరుగుతున్నట్లు తాజా కథనాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే కొండా వ్యవహారంపై వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు ఎవరూ బహిరంగంగా స్పందించవద్దని హైకమాండ్ నుంచి సూచనలు వెళ్లినట్లు సమాచారం. తుది నిర్ణయం వచ్చే వరకు ఎవరూ వ్యాఖ్యలు చేయకూడదన్న ఆదేశాలు.. ఈ అంశాన్ని పార్టీ ఎంత సీరియస్గా తీసుకుంటోందో స్పష్టం చేస్తున్నాయి. సురేఖతో పాటు జి.చిన్నారెడ్డి వ్యవహారం కూడా హైకమాండ్ ముందుంది. ఇద్దరిపై క్రమశిక్షణా కమిటీ సిఫారసులు చేయడంతో.. ఒకేసారి ఇద్దరిపై చర్యలు తీసుకోవాలా? లేక వేర్వేరుగా నిర్ణయం తీసుకోవాలా? అన్నదీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి చేరింది. ఒకవైపు రేవంత్రెడ్డి కఠిన చర్యల వైపు మొగ్గు చూపుతున్నారన్న సమాచారం.. మరోవైపు సురేఖకు పార్టీలోని కొందరి మద్దతు.. ఇంకోవైపు హైకమాండ్ రాజకీయ లెక్కలు.. ఈ మూడు అంశాల మధ్య తుది నిర్ణయం ఆసక్తికరంగా మారింది. నేటి ఢిల్లీ పరిణామాలతో కొండా ఎపిసోడ్కు ఎండ్కార్డ్ పడుతుందా? లేదంటే మరో మలుపు తిరుగుతుందా?అన్నదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో హాట్టాపిక్ అయ్యింది.ఇదీ చదవండి: పిల్లల బడిలో.. పెద్దోళ్ల ఆఫీస్! -
ఎల్ నినో పంజా.. ఐఎండీ షాకింగ్ అప్డేట్!
దేశంలో వర్షాల తీరును ఎల్ నినో ప్రభావం మార్చేస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలో మారుతున్న సముద్ర ఉష్ణోగ్రతల ప్రభావంతో ఇటు నైరుతి రుతుపవనాల పనితీరుపై ప్రభావం పడుతోంది. ముఖ్యంగా దక్షిణ భారతంలో ఈ పరిస్థితులు మరీ ఘోరంగా ఉన్నాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్ లోటు వర్షపాతంతో ముగుస్తుందా? అనే అనుమానాల నడుమ.. భారత వాతావరణ విభాగం (IMD) షాకింగ్ అప్డేట్ ఇచ్చింది.దేశంలో వర్షాలపై ఎల్ నినో ప్రభావం మరింత స్పష్టమవుతోంది. పసిఫిక్ మహాసముద్రంలో పరిస్థితులు బలపడుతున్న నేపథ్యంలో సెప్టెంబర్లోనూ దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ చెబుతోంది. అయితే ఉత్తర భారతంతో పోలిస్తే దక్షిణ ప్రాంతంలో వర్షాల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆగస్టులో దక్షిణ ద్వీపకల్పంలో సాధారణం కంటే 27 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతం నుంచి వచ్చే వర్ష వ్యవస్థలు దక్షిణం వైపు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపకపోవడం కూడా ఇందుకు కారణమైంది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళలో వర్షాలపై ఆందోళన పెరిగింది.ఆగస్టులో దేశానికీ లోటేనైరుతి రుతుపవనాలకు కీలకమైన ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా 16.3 శాతం వర్షపాతం లోటు నమోదైంది. నెలలో సాధారణంగా కురవాల్సిన వర్షాలతో పోలిస్తే ఈ లోటు కనిపించింది. ఆగస్టు చివరి నాటికి దాదాపు 42 శాతం జిల్లాలు లోటు వర్షపాతం పరిధిలో ఉండగా.. మరో 5 శాతం జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. అంటే లోటు కేవలం ఒకటి రెండు రాష్ట్రాలకు పరిమితం కాలేదన్నమాట.అల్పపీడనాలు.. ఉత్తరానికే మళ్లాయిఈసారి వర్షాల అసమాన పంపిణీకి అల్పపీడనాల గమనం కూడా ఒక కారణంగా మారింది. బంగాళాఖాతంలో ఏర్పడిన పలు అల్పపీడన వ్యవస్థలు ఉత్తర దిశగా పయనించి మధ్య, ఉత్తర భారతంపై ఎక్కువ ప్రభావం చూపాయి. దీంతో అక్కడ కొన్ని ప్రాంతాలకు భారీ వర్షాలు అందగా.. దక్షిణ ద్వీపకల్పంలో ఆశించిన వర్షాలు పడలేదు. ఒకే దేశంలో ఒకచోట వరదలు.. మరోచోట వర్షాభావం కనిపించడానికి ఇదీ ఒక కారణం.సెప్టెంబర్లోనూ నిరాశేసెప్టెంబర్ సాధారణంగా నైరుతి రుతుపవనాల చివరి కీలక నెల. ఈ సమయంలో కురిసే వర్షాలు ఖరీఫ్ పంటలకు, నేలలో తేమను నిలబెట్టుకోవడానికి ఎంతో అవసరం. అయితే ఈసారి దేశవ్యాప్తంగా సెప్టెంబర్ వర్షపాతం దీర్ఘకాల సగటులో 91 శాతం కంటే తక్కువగా ఉండొచ్చని IMD అంచనా వేసింది. దీంతో సీజన్ ముగిసేలోపు వర్షాల లోటు కొంత మేర భర్తీ అయ్యే అవకాశాలు తగ్గాయి.రుతుపవనాలకు బలహీన ముగింపు?జూన్–సెప్టెంబర్ కాలాన్ని నైరుతి రుతుపవనాల సీజన్గా పరిగణిస్తారు. సెప్టెంబర్లోనూ వర్షాలు తగ్గితే.. మొత్తం సీజన్ సాధారణం కంటే గణనీయమైన లోటుతో ముగిసే అవకాశం ఉంది. అదే జరిగితే వ్యవసాయ ఆధారిత ప్రాంతాల్లో నేల తేమ, సాగునీరు, జలాశయాల నిల్వలపై ఒత్తిడి పెరగొచ్చు. అయితే స్థానికంగా కురిసే భారీ వర్షాలు ఈ పరిస్థితిని కొంతవరకు మార్చే అవకాశం ఉంటుంది.పంటలకు కీలక దశప్రస్తుతం ఖరీఫ్ పంటలు కీలక ఎదుగుదల దశలో ఉన్నాయి. పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, పప్పుధాన్యాలకు తగినంత నేలతేమ అవసరం. వర్షాల విరామం ఎక్కువైతే పంటల దిగుబడులపై ప్రభావం పడే అవకాశం ఉంది. మరోవైపు నేలలో తేమ తక్కువగా ఉంటే రబీ పంటల సాగు ప్రారంభ సమయంలోనూ రైతులకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది.వర్షాలే కాదు.. వేడి కూడా?వర్షాల లోటుతోపాటు ఉష్ణోగ్రతల పరిస్థితిపైనా IMD నిఘా పెట్టింది. సెప్టెంబర్లో కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా ఉంది. వర్షాలు తగ్గడం, నేల తేమ పడిపోవడం, వేడి పెరగడం ఒకేసారి జరిగితే నీటి అవసరం మరింత పెరుగుతుంది. ముఖ్యంగా వ్యవసాయం, తాగునీటి వనరులపై దీని ప్రభావం కనిపించే అవకాశం ఉంది.ముందున్నది కీలక సమయంఎల్ నినో ప్రభావం ఒక్కసారిగా దేశమంతా ఒకే విధంగా కనిపించదు. సముద్ర ఉష్ణోగ్రతలు, గాలుల కదలికలు, ఇతర సముద్ర–వాతావరణ వ్యవస్థలు కూడా భారత వర్షపాతాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే రానున్న నెలల్లో దీని తీవ్రత ఎలా మారుతుంది? దాని ప్రభావం శీతాకాలం, తదుపరి వర్షాకాలం వరకు ఎంతవరకు కొనసాగుతుంది? అన్నది కీలకంగా మారింది. ఐఎండీ అంచనా ప్రకారం.. ఎల్ నినో ఎఫెక్ట్ మార్చి వరకూ కొనసాగనుంది.మొత్తంగా.. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల పంపిణీ దక్షిణాదికి పెద్దగా కలిసిరాలేదు. ఉత్తర, మధ్య భారతానికి అల్పపీడన వ్యవస్థల ద్వారా వర్షాలు అందుతుండగా.. దక్షిణ ద్వీపకల్పంలో లోటు కొనసాగుతోంది. సెప్టెంబర్లోనూ ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోతే వ్యవసాయం, నేలతేమ, నీటి వనరులపై ఒత్తిడి మరింత పెరిగే అవకాశముంది. దీంతో ఎల్ నినో ప్రభావం రానున్న నెలల్లో ఎలా మారుతుందన్నది దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: జెన్జీ.. కేర్ ఫ్రీ అనుకునేరు! -
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు రండి
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026కు హాజరు కావాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆహ్వానించారు. హైదరాబాద్లోని భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7 నుంచి మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సులో భాగంగా రక్షణ ఎక్స్పో–2026ను ప్రారంభించాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్రెడ్డి బుధవారం ఉదయం రాజ్నాథ్తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ కార్మిక, గనుల శాఖ మంత్రి జి.వివేక్ వెంకటస్వామి, ఎంపీలు ఎం.అనిల్కుమార్ యాదవ్, డాక్టర్ మల్లు రవి, సురేశ్ షెట్కార్, పోరిక బలరాం నాయక్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రొటోకాల్) హర్కర వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్లోబల్ సమ్మిట్ లక్ష్యాలను రాజ్నాథ్కు సీఎం వివరించారు. రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వారిద్దరూ చర్చించారు. డిఫెన్స్ ఎక్స్పోలో లైవ్ డెమోలు... ఏరోస్పేస్, రక్షణ, అంతరిక్ష రంగాలపై ప్రత్యేక సదస్సుతోపాటు ఎయిర్ షో, ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్, భూఉపరితల రక్షణ వ్యవస్థలకు సంబంధించిన లైవ్ డెమోలు డిఫెన్స్ ఎక్స్పోలో ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్రెడ్డి రాజ్నాథ్కు వివరించారు. ఈ దృష్ట్యా డిఫెన్స్ ఎక్స్పోకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని, ఆహూతులకు మార్గనిర్దేశం చేయాలని కోరారు. ఎయిర్ షో నిర్వహణకు గగనతల అనుమతుల మంజూరు చేయాలని.. యుద్ధ విమానాల భాగస్వామ్యంతోపాటు సూర్యకిరణ్, సారంగ్ ఏరోబాటిక్ బృందాల ప్రదర్శనలు ఉండేలా ఆదేశాలివ్వాలని విన్నవించారు. స్టాటిక్ ఎయిర్క్రాఫ్ట్ ప్రదర్శనకు కూడా మద్దతు అందించాలన్నారు. త్రివిధ దళాలకు చెందిన అత్యాధునిక రక్షణ వ్యవస్థల డెమోలను ఈ ఎక్స్పోలో ఏర్పాటు చేయాలని కోరారు. రక్షణ శాఖ కోరినట్లుగా భూసేకరణ... ఆదిలాబాద్ విమానాశ్రయానికి సంబంధించిన భూసేకరణ గురించి రాజ్నాథ్ సింగ్, రేవంత్రెడ్డి మధ్య చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 750 ఎకరాల భూమిని సేకరించిందని రేవంత్ చెప్పారు. ఈ విమానాశ్రయం కోసం రక్షణ శాఖ మొత్తం 1,500 కోరిందని.. ఆ మేరకు మరో 750 ఎకరాల భూసేకరణ ప్రక్రియ చేపడతామని తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో డీఆర్డీఎల్ ప్రాజెక్టు కోసం 416.18 ఎకరాలను నామమాత్రపు రుసుముతో 33 ఏళ్ల లీజు ప్రాతిపదికన కేటాయించనున్నట్లు రాజ్నాథ్కు సీఎం వివరించారు. విమానాశ్రయాల పనులు వేగవంతం చేయాలి... ఆదిలాబాద్, మామూనురు (వరంగల్) విమానాశ్రయాల పనులు వేగవంతం చేయాలని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు సీఎం రేవంత్రెడ్డి మరోసారి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని మంత్రి కార్యాలయంలో బుధవారం ఆయన్ను పార్టీ ఎంపీలు, అధికారులతోపాటు వెళ్లి కలిశారు. మామూనూరు విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణను పూర్తి చేసి కేంద్రానికి అప్పగించిన విషయాన్ని గుర్తుచేశారు. ఆదిలాబాద్ విమానాశ్రయంలో కార్గో, ప్యాసింజర్ టెర్మినల్తోపాటు మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్హాలింగ్ (ఎంఆర్వో) వసతులు ఏర్పాటు చేయాలని కోరారు. ఆదిలాబాద్లో రన్వే విషయంలో తుది నిర్ణయానికి సంబంధించి రక్షణ, పౌర విమానయాన శాఖల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. దీనిపై రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ మామునూరు ఎయిర్పోర్ట్ టెండర్లను రెండు వారాల్లో ఆహ్వానిస్తామని చెప్పారు. డిసెంబర్ నాటికి ఖరారు చేసి పనులకు అదే నెలలో శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో హెలీ టూరిజం అభివృద్ధికి కృషి చేయాలని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ కోరారు. హుస్సేన్సాగర్లో సీప్లేన్ ల్యాండింగ్కు సంబంధించిన నివేదికను రెండు వారాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని పౌర విమానయాన అధికారులు సీఎంకు తెలియజేశారు. -
హోదాలా.. డోంట్ కేర్!
‘‘పుట్టామా.. ఇంజినీరింగ్, మెడిసిన్, సీఏ లాంటి చదువులు చదివామా? మంచి ఉద్యోగం సంపాదించామా... జీవితం సక్సెస్’’ ఇది ఒకప్పటి బతుకు ఫిలాసఫీ. కానీ జెన్–జీలు ఇలా కాదంటోంది తాజా అధ్యయనం. అంతర్జాతీయ విద్యా సంస్థ ఎమిరైటస్ ‘‘ఇండియాస్ జెన్–జీ ఔట్లుక్ 2026: రీ కాల్కులేటింగ్ ఎడ్యుకేషన్, ఆంబీషన్ అండ్ సక్సెస్’’ పేరుతో నిర్వహించిన ఈ అధ్యయనం నవతరం గురించి పలు ఆసక్తికరమైన అంశాలను వెలుగులోకి తెచ్చింది. 1997– 2012 మధ్య పుట్టిన వాళ్లను మనం జెన్–జీ అని పిలుస్తున్నాం కదా.. వీరు దేశంలోని ప్రధాన మెట్రోల్లోని 15 – 28 ఏళ్ల మధ్య వయసున్న సుమారు వెయ్యి మందిని ప్రశ్నించి వారి ఆశలు, ఆశయాలు, విజయానికి నిర్వచనాలను సేకరించింది. ముందు తరం నడిచిన బాటను కాదని కొత్త అడుగులు వేస్తున్న వారి గురించి స్థూలంగా..ఉద్యోగ ప్రస్థానం...మునుపటిలా చిన్న ఉద్యోగంతో మొదలుపెట్టి అంచలంచెలుగా పైకి ఎదగాలన్న సూత్రానికి వీరు విరుద్ధం. ఉద్యోగమిచ్చే మేనేజర్, జీఎం, వీపీ, చైర్మన్ వంటి హోదాల కంటే పనికి – జీవితానికి మధ్య బ్యాలెన్స్ ఉండాలనుకుంటున్న జెన్–జీలు సుమారు 74 శాతం. అసలు సక్సెస్ఫుల్ కెరియర్కు ఎగ్జిక్యుటివ్ లీడర్ కావాల్సిన అవసరమే లేదన్నది 65 శాతం మంది నమ్మకం. వీరి దృష్టిలో విజయం అంటే... నైపుణ్యాలు. అవసరానికి తగ్గట్టు మారిపోగలగడం. సంతృప్తినిచ్చే, అర్థవంతమైన పని.లోకలే మేలు...ఒకప్పుడు ఎంతో పాపులర్ అయిన విదేశీ చదువులపై జెన్–జీకి పెద్ద ఆశలేం లేవు. పెరిగిపోతున్న ఖర్చులు, వీసా నిబంధనల్లో వస్తున్న మార్పులు, చదువు తరువాత ఉద్యోగాలు వస్తాయన్న గ్యారంటీ లేకపోవడం వంటి కారణాల వల్ల నాణ్యమైన లోకల్ విద్యే మేలని 48 శాతం మంది అభిప్రాయపడ్డారు. కాలేజీ ముందునాటి చదువులు చదువుతున్న వారిలో 87 శాతం, కాలేజీల్లోకి అడుగుపెడుతున్న వారిలో 92 శాతం లోకల్ కోర్సులకు జై అంటున్నారు.విదేశీ విద్యా సంస్థలు స్థానికంగా అందించే కోర్సుల్లో చేరేందుకు అభ్యంతరం లేదని సుమారు 69 శాతం మంది చెబుతున్నారు. ఒకట్రెండు సెమిస్టర్లకు విదేశాలకు వెళతారా? అంటే అప్పటి వరకూ విదేశీ చదువులపై ఆసక్తి చూపని వారిలోనూ 12 శాతం మంది సై అంటూండటం విశేషం. -
సాగు ప్రాజెక్టుల కార్యసాధకుడు వైఎస్సార్
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల కార్యసాధకుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డేనని సీఎం రేవంత్రెడ్డి కొనియాడారు. పోలవరం, ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుల పనులను వైఎస్సారే ప్రారంభించారని గుర్తుచేశారు. తెలంగాణ రైతుల కష్టాలు తీర్చేందుకు ఆయన తలపెట్టిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుతోపాటు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు ప్రస్తుతం ఆగిపోయాయని.. అయితే ఆయన కలగన్న ఆ ప్రాజెక్టులను పూర్తిచేసి తెలంగాణ ప్రజలకు అంకితమిస్తానని రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి అవార్డు–2026 ప్రదానోత్సవ కార్యక్రమానికి రేవంత్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నాడు సీఎంగా ఉచిత విద్యుత్పై వైఎస్సార్ తొలి సంతకంవైఎస్సార్ జీవితాంతం ప్రజాశ్రేయస్సు కోసం శ్రమించారని.. 2003లో చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు ఎర్రటి ఎండల్లో సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించిన ఆయన నాడు ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్నారని రేవంత్రెడ్డి గుర్తుచేశారు. ముఖ్యంగా కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, ఎండిపోతున్న పంటలతో అష్టకష్టాలు పడుతున్న రైతులకు ఉచిత విద్యుత్ హామీ ఇచ్చి 2004లో సీఎం అయ్యాక ఆ పథకంపై తొలి సంతకం చేసి మాట నిలబెట్టుకున్న మహనీయుడని ప్రశంసించారు. దాదాపు రూ. 1,300 కోట్ల విద్యుత్ బకాయిలను రద్దు చేయడమే కాకుండా అప్పటికి రైతులపై ఉన్న వేలాది అక్రమ కేసులన్నింటినీ తొలగించిన ఘనత వైఎస్సార్కే దక్కుతుందన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం సహా ఆయన కలలుగన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అదే వైఎస్సార్కు నిజమైన నివాళి అని చెప్పారు. వైఎస్సార్ పేదల పక్షపాతి: ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే వై.ఎస్. రాజశేఖరరెడ్డి పేదల పక్షపాతి అని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కొనియాడారు. డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి అవార్డు–2026ను ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్కు ఖర్గే ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్తోపాటు హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ దేశానికి చేసిన విశేష సేవలను ఆయన స్మరించుకున్నారు. 17 ఏళ్ల క్రితం వైఎస్సార్ను కోల్పోయినా ఆయన నెలకొల్పిన ఆదర్శాలు నేటికీ సజీవంగా ఉన్నాయన్నారు. ఏ రైతు, ఏ పేద కుటుంబం కనీస అవసరాలకు నోచుకోకుండా మిగిలిపోకూడదన్నదే రాజశేఖరరెడ్డి సిద్ధాంతమని గుర్తుచేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం, ఇందిరమ్మ ఇళ్ల ద్వారా గూడు, భూమిలేని వారికి భూపంపిణీ, రైతులకు ఉచిత విద్యుత్ వంటి విప్లవాత్మక పథకాలను అమలు చేశారని ప్రశంసించారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ను బలోపేతం చేయడంతోపాటు 39 ఎంపీ స్థానాల్లో పార్టీని గెలిపించి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో వైఎస్సార్ కీలకపాత్ర పోషించారని వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్, టీపీసీపీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, తుమ్మల నాగేశ్వరరావు, గడ్డం వివేక్, ఎంపీలు సురేశ్ షెట్కార్, నిరంజన్రెడ్డి, అనిల్ యాదవ్, కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేశ్, కేవీపీ రామచంద్రరావు, మధుయాష్కి, సంపత్ పాల్గొన్నారు.వైఎస్సార్, స్వామినాథన్ మహనీయులు: భట్టి రైతుల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకొచ్చిన ఇద్దరు మహనీయుల్లో ఒకరు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అయితే, మరొకరు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కొనియాడారు. వ్యవసాయ రంగానికి శాస్త్ర సాంకేతిక ఫలాలను స్వామినాథన్ అందించారని, రైతులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందనే భరోసాను వైఎస్సార్ కల్పించారని చెప్పారు. ఆయన మరణం తర్వాత వచ్చిన ప్రభు త్వాలు సైతం విస్మరించలేని విధంగా రైతు సంక్షేమానికి వైఎస్సార్ బాటలు వేశారని చెప్పారు. ఆయన నేర్పిన ఓనమాలతోనే తాను ఎమ్మెల్యేగా ఉప ముఖ్యమంత్రిగా ఎదిగేందుకు దోహదపడ్డాయన్నారు. రచ్చబండ కొనసాగాల్సిందేనని చెప్పి బయలుదేరిన ఆయన.. ఎవరికీ కనబడనంత దూరానికి వెళ్లిపోయారని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. ఒక గొప్ప నాయకుడి వారసుడిగా పార్టీ నేతలు, కార్యకర్తలంతా ముందుకు వెళ్తుండటాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. -
ఏబీసీ చైర్మన్గా మోహిత్ జైన్ ఏకగ్రీవ ఎన్నిక
న్యూఢిల్లీ: బెన్నెట్ కోల్మన్ అండ్ కంపెనీ లిమిటెడ్ (బీసీసీఎల్) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (పబ్లిషింగ్), ఆ సంస్థ బోర్డు సభ్యుడైన మోహిత్ జైన్ 2026–27కుగాను ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ (ఏబీసీ) చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రముఖ దినపత్రికలు ది టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎకనామిక్ టైమ్స్ను ప్రచురించే బీసీసీఎల్.. ఈ ఎన్నిక ద్వారా 43 ఏళ్ల తర్వాత మళ్లీ ఏబీసీ చైర్మన్ పదవిని పొందింది. అలాగే ప్రముఖ మీడియా ఏజెన్సీ మాడిసన్ వరల్డ్ పార్ట్నర్, డైరెక్టర్ అయిన విక్రమ్ సఖుజా ఏబీసీ డిప్యూటీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏబీసీ సెక్రటరీ జనరల్గా అదిల్ కసద్ వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఎంబీఏతోపాటు కెమికల్ ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన జైన్కు ప్రింట్ మీడియా రంగంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. బీసీసీఎల్లో ఆయన పబ్లిషింగ్, బిజినెస్ ఆపరేషన్లను ముందుకు తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషించారు. బీసీసీఎల్ఓ చేరడానికి ముందు, ఆయన జీఎస్కే కన్సూ్యమర్ హెల్త్కేర్ ఇండియా మేనేజ్మెంట్ టీమ్లో భాగస్వామిగా ఉన్నారు. అలాగే 2021–22కుగాను ఇండియన్ న్యూస్పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) అధ్యక్షుడిగా పనిచేశారు. -
కాంగ్రెస్ది 420 ప్రభుత్వం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్నా ప్రజలకు చేసిందేమీ లేదని, ప్రతి విషయంలోనూ మోసం చేసిన ‘420 ప్రభుత్వం’గా మిగిలిపోయిందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. ఆరు గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల గొంతు కోసిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా బుధవారం ఆయన ఒక ప్రకటనలో మండిపడ్డారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రైతులు, విద్యార్థులు, మహిళలు, నిరుద్యోగులు.. ఇలా ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన ఆరోపించారు. సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి తెచ్చారని, ఆరు డీఏలు, పీఆర్సీ, ఈహెచ్ఎస్ చెల్లింపుల్లో కాలయాపన చేస్తూ మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. మహిళలకు నెలకు రూ.2,500, వృద్ధులకు రూ.4,000 పెన్షన్, రైతులకు ఎకరానికి రూ.15 వేల సాయం, ఏటా 2 లక్షల ఉద్యోగాలు, రూ.4,000 నిరుద్యోగ భృతి హామీలను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. బీసీలకు ఏటా రూ.20 వేల కోట్లు ఇస్తామన్న హామీని నీరుగార్చారని, కుల గణన పేరుతో ముస్లింలను బీసీల్లో చేర్చి అసలైన బీసీలకు అన్యాయం చేశారని విమర్శించారు. -
జాతీయ జలభద్రతకు ఏకీకృత కార్యాచరణ ఉండాలి
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చేపట్టే ప్రతి జల సంరక్షణ పనిని ఒకే జలభద్రతా ప్రణాళిక పరిధిలోకి తీసుకురావాలని, ఏకీకృత కార్యాచరణతోనే ఇది సాధ్యమవుతుందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్లో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ బుధవారం నిర్వహించిన తొలి ‘జల్ సంచయ్–జన్ భాగీదారీ’సదస్సులో ఉత్తమ్ ప్రసంగించారు. జలభద్రతను కేవలం ఇంజనీరింగ్ పనులుగానో, ప్రభుత్వ శాఖల కార్యక్రమంగానో చూడకూడదన్నారు. తాగునీరు, వ్యవసాయం, గ్రామీణ జీవనోపాధి, పర్యావరణ పరిరక్షణ ముడిపడి ఉన్న ఈ అంశాన్ని ప్రజా ఉద్యమంగా మలచాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఉపాధి హామీ, పీఎంకేఎస్వై, ఆర్థిక సంఘం నిధులు, కాంపా, సీఎస్ఆర్ తదితర మార్గాల్లో జల సంరక్షణ పనులు జరుగుతున్నాయని, ఈ కార్యక్రమాల మధ్య సమన్వయం లోపిస్తే ఆశించిన ఫలితాలు రావు అని హెచ్చరించారు. ఎన్ని నిర్మాణాలు చేపట్టామన్నది కాకుండా ఎంత నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది..భూగర్భ జలాలు ఎంత మేర వృద్ధి చెందాయన్న ఫలితాల ఆధారంగా పనితీరును అంచనా వేయాలని సూచించారు. ముందంజలో తెలంగాణజల సంరక్షణలో తెలంగాణ అత్యుత్తమ పనితీరు కనబరుస్తోందని ఉత్తమ్ తెలిపారు. 2025 ‘జల్ సంచయ్–జన్ భాగీదారీ’లో రాష్ట్రం బెస్ట్ పెర్ఫార్మర్గా గుర్తింపు పొందిందని, దేశంలోని టాప్–50 జిల్లాల్లో తెలంగాణ నుంచి 13 జిల్లాలు నిలవడం దీనికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో 44,360 చెరువులు, జలవనరులు ఉండగా, అందులో 28,739 వనరుల్లో పనులు చేపట్టామని, ఇప్పటికే 22,428 చోట్ల పునరుద్ధరణ పూర్తయిందని వివరించారు. రాష్ట్రంలోని 74 భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల ద్వారా 74.51 లక్షల ఎకరాలకు సాగునీటి సామర్థ్యం సృష్టించగా, మరో 53.18 లక్షల ఎకరాలను వాస్తవ రూపంలోకి తీసుకురావాల్సి ఉందన్నారు. -
ముందు సీఎంపై చర్యలు తీసుకోవాలి
సాక్షి, న్యూఢిల్లీ: విలేకరుల సమావేశంలో మాట్లాడక ముందు మంత్రి సురేఖ వారితో ముచ్చటించారు. సీఎం, ఇతర నేతలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యల చేశారు. తనపై చర్యలు తీసుకునే ముందు ముఖ్యమంత్రిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలన్నారు. ‘ప్రస్తుతం అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూస్తున్నా. రాజీనామా చేయాలని ఇప్పటివరకు నాకెవరూ చెప్పలేదు. నేను బీసీని కాబట్టి నాకు ఒక న్యాయం, ఇతర సామాజిక వర్గాలకు మరో న్యాయం పాటిస్తారా? కేబినెట్లో ఉన్న ఇతర సామాజిక వర్గాలకు చెందిన పలువురు నేతలపై కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. మరి వాటన్నింటికీ ఏం సమాధానం చెబుతారు? మంత్రి పొంగులేటి కుమారుడు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్యపై అవినీతి ఆరోపణలు వస్తే ఎందుకు నోటీసులు ఇవ్వరు? సీఎంది క్రమశిక్షణ ఉల్లంఘన కాదా? సీఎం రేవంత్రెడ్డి అనేకసార్లు పదేళ్లు నేనే ముఖ్యమంత్రినని ప్రకటించుకున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులను ఆయనే నేరుగా ప్రకటిస్తున్నారు. ఇది క్రమశిక్షణ ఉల్లంంఘన కాదా? నన్ను కావాలనే టార్గెట్ చేస్తున్నారు. నాపై చర్యలు తీసుకోవాలంటే పార్టీ, ప్రభుత్వంలో ఇంకా చాలామందిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. వీటన్నింటికీ ఎవరు సమాధానం చెబుతారు? నా కుమార్తె మాట్లాడిన దాంట్లో తప్పేముందో చెప్పాలి. ప్రభుత్వ పెద్దల, సీఎంకుటుంబ సభ్యుల అవినీతి అందరికీ తెలియదా? నాపై బర్తరఫ్ వంటి లాంటి చర్యలు తీసుకుంటే ఏం జరుగుతుందో నేను ఇప్పుడే చెప్పలేను..’ అని సురేఖ అన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ను సైతం తొలగించేందుకు కుట్ర జరగుతోందని, మంత్రి పొన్నంను ఆయన శాఖలో స్వేఛ్చగా పని చేయనీయడం లేదని ఆరోపించారు. -
నా కుమార్తె వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు
సాక్షి, న్యూఢిల్లీ: తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి కొండా సురేఖ అన్నారు. వివాహం చేసుకుని స్వతంత్రంగా జీవిస్తున్న ఆమె మాట్లాడిన మాటలకు, మంత్రిగా ఉన్న తనకు పార్టీ షోకాజ్ నోటీసు ఇవ్వడం పెద్ద తప్పని పేర్కొన్నారు. తన కుమార్తె మాట్లాడిన మాటలకు తననెలా బాధ్యురాలిని చేస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వెనకుండి మాట్లాడించిన శక్తులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్తో భేటీ అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు.‘మంగళవారమే ఢిల్లీకి చేరుకున్నప్పటికీ సమయం దొరకలేదు. బుధవారం మధ్యాహ్నం పార్టీ అధ్యక్షుడిని కలిసి అన్ని అంశాలను సమగ్రంగా వివరించా. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బిజీగా ఉండటంతో ఆయన్ను కలవలేకపోయా. నా వివరణను ఖర్గే, మీనాక్షి నటరాజన్లకు లిఖితపూర్వకంగా అందజేశా. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాం«దీ, రాహుల్ గాం«దీ, ప్రియాంక గాం«దీలకు ఈ–మెయిల్ ద్వారా, కేసీ వేణుగోపాల్కు వాట్సాప్ ద్వారా పంపించా. నా వివరణను పరిశీలిస్తానని ఖర్గే చెప్పారు..’అని సురేఖ వెల్లడించారు. నా కూతురు పూర్తి స్వతంత్ర వ్యక్తిగా జీవిస్తోంది.. ‘నా కూతురికి పెళ్లయింది. తను ఒక ఇంటి కోడలిగా పూర్తి స్వతంత్ర వ్యక్తిగా జీవిస్తోంది. తన ఆలోచనలు, అభిప్రాయాలను వ్యక్తం చేసే, మాట్లాడే అధికారం ఆమెకు ఉంది. మాట్లాడవద్దని చెప్పే అధికారం తల్లిదండ్రులుగా మాకు లేదు. సమాజంలో నిత్యం వందల మంది ఎన్నో మాట్లాడుతుంటారు. అలాగే ఆమె కూడా మాట్లాడింది. ఆమె నా బిడ్డ అయినంత మాత్రాన నన్ను ఎందుకు బాధ్యురాలిని చేయాలి? మహిళలు మనుస్మృతి భావజాలాన్ని వీడి తండ్రి లేదా సోదరుల మద్దతుపై ఆధారపడకుండా స్వతంత్రంగా మాట్లాడాలని రాహుల్ గాంధీ పదేపదే చెబుతున్నారు. నా బిడ్డ అలాగే స్వతంత్రంగా మాట్లాడింది. ఆ వ్యాఖ్యలను సమరి్ధంచడం లేదా ఖండించడంపై నేనేమీ మాట్లాడను. నా సొంత రాజకీయ జీవితం, నా భర్త రాజకీయ ప్రస్థానం వేరు. మంత్రి పదవి కొనసాగించాలని కోరా.. నేను పద్మశాలి వర్గానికి, నా భర్త మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవాళ్లం. తెలంగాణలో ఈ రెండు సామాజిక వర్గాలకు కలిపి దాదాపు 16 శాతం ఓటు బ్యాంకు ఉంది. బీసీ మంత్రిగా ఉన్న నాపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. అప్పగించిన శాఖలను నిరి్వఘ్నంగా నిర్వహిస్తూ ప్రజలకు మరింత సేవ చేయాలనే ఆలోచనతో పనిచేస్తున్నా. నా మంత్రి పదవికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొనసాగేలా చూడాలని అధిష్టానాన్ని కోరా. నాపై మాట్లాడిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరూ స్వచ్ఛందంగా మాట్లాడలేదు. కొందరు వెనకుండి బలవంతంగా మాట్లాడించారు. వివాదం అవుతుందనే ఉద్దేశంతో వారి పేర్లు బయటపెట్టడం లేదు. ఎవరు మాట్లాడించారో అధిష్టానానికి తెలుసు. మాట్లాడినవారే స్వయంగా మాకు ఫోన్లు చేసి..వాళ్లు పిలిస్తే అయిష్టంగానే వెళ్లాల్సి వచి్చందని చెప్పారు. తప్పు చేయని నన్ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకే పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేయాలి. వారి వెనుక ఉండి నడిపించిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది..’అని సురేఖ అన్నారు. పీసీసీ క్రమశిక్షణ సంఘం తమకు అందిన ఫిర్యాదుల ఆధారంగా నివేదిక ఇచ్చి ఉండవచ్చని, ఏఐసీసీ సభ్యురాలిగా ఉన్న తనపై నిర్ణయం తీసుకునే తుది అధికారం కేవలం అధిష్టానానికే ఉంటుందని చెప్పారు. ఏఐసీసీ తీసుకునే నిర్ణయం ఆధారంగా తన తదుపరి నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. -
తెగని పంచాయితీ.. తగ్గని సురేఖ!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యవహారం ఢిల్లీ వేదికగా మరింత ముదిరింది. వివాదం అధిష్టానం వద్దకు చేరినా బుధవారం ఏమీ తేల్లేదు. సురేఖపై చర్యలు తీసుకునేలా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తుండగా..మరోవైపు సురేఖ కూడా తన వాదన గట్టిగా విన్పించారు. పైగా హైకమాండ్ పెద్దలతో భేటీ తర్వాత కూడా ఏమాత్రం తగ్గనట్టుగా వ్యాఖ్యలు చేయడంతో పరిస్థితి మరింత జఠిలంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఈ విషయంలో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై పార్టీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రోజంతా నాటకీయ పరిణామాలు ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్ వేదికగా బుధవారం రోజంతా నేతల వరుస భేటీలు జరిగాయి. రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా సీనియర్ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు, దీని పర్యవసానాలు వంటి అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర నేతలను ఢిల్లీకి పిలిపించిన అధిష్టానం.. బుధవారం వారితో సమావేశాలు నిర్వహించింది. కొండా సురేఖ విషయమై మంగళవారం రాత్రే ముఖ్యమంత్రి అభిప్రాయం తీసుకున్న ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్, బుధవారం తొలుత ఉదయం 11.30 గంటల సమయంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు. వారిద్దరి అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా సుస్మిత, మంత్రి సురేఖల వ్యవహారాన్ని పీసీసీ అధ్యక్షుడు తప్పుపట్టినట్లు తెలిసింది. సుస్మిత వ్యాఖ్యలతో ప్రభుత్వం, పార్టీలో గందరగోళం నెలకొందని, అనేకమంది జిల్లా నేతలు, ఎమ్మెల్యేలు దీన్ని తప్పుపట్టినట్లుగా మహేశ్ వివరించినట్లు సమాచారం. కూతురు మాట్లాడిన విషయాలను సురేఖ తప్పుపట్టకపోగా, ఆ వ్యాఖ్యలతో తనకేం సంబంధం అన్న రీతిలో స్పందించడం సరైంది కాదని అన్నట్టు తెలిసింది. సురేఖపై క్రమశిక్షణా చర్యల విషయంలో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సమ్మతమేనని చెప్పినట్టు సమాచారం. ఎమ్మెల్యేలు స్పందించడంపై మీనాక్షి అసహనం! అయితే పీసీసీ వైఖరికి భిన్నంగా మీనాక్షి స్పందించినట్లు తెలుస్తోంది. ఓ మంత్రి కుమార్తె మాట్లాడితే దానిపై హుటాహుటిన 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పందించడం సరైందేనా? ఇది ఎవరి ఆదేశాల మేరకు జరిగిందన్న రీతిలో మీనాక్షి మాట్లాడినట్టు చెబుతున్నారు. పార్టీలోని ఇతర ఎమ్మెల్యేలు, నేతలు మాట్లాడితే స్పందించని ఎమ్మెల్యేలు.. సుస్మిత వ్యాఖ్యలపై అంతలా స్పందించడాన్ని చాలామంది సీనియర్లు తప్పుపట్టిన విషయాన్ని ఆమె ప్రస్తావించినట్లు సమాచారం. మధ్యలో వచ్చిన రేవంత్.. కేసీ వేణుగోపాల్తో మీనాక్షి, మహేశ్ల భేటీ జరుగుతుండగానే.. కేంద్రమంత్రి రాజ్నాధ్ సింగ్తో భేటీ ముగించుకుని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేరుగా ఇందిరాభవన్కు చేరుకుని వారితో జత కలిశారు. వీరి భేటీ కొనసాగుతుండగానే అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం కార్యాలయానికి రావడంతో అంతా కలిసి ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగానూ ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు ఇద్దరూ సురేఖ అంశాన్ని తీవ్రంగా తప్పుపట్టడమే కాకుండా రాష్ట్ర నేతల అభిప్రాయాన్నీ వివరించారు. ఆమెను కేబినెట్ నుంచి తొలగించాలన్న అభిప్రాయాన్నే ఖర్గే వద్ద వెలిబుచ్చినట్లు తెలిసింది. రాష్ట్రంలో పరిణామాలపై ఖర్గే అసంతృప్తి రాష్ట్ర కాంగ్రెస్లో జరుగుతున్న కుమ్ములాటలు, ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలపై ఖర్గే తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో జరుగుతున్న వరుస పరిణామాలు, కలహాలతో చెడ్డపేరు వస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వం, పార్టీలోని నేతలపై అనేక ఫిర్యాదులు అధిష్టానానికి అందుతున్నాయని, వీటిని రాష్ట్ర స్థాయిలోనే కట్టడి చేయకపోవడానికి గల కారణాలపై గట్టిగా నిలదీసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ, ప్రభుత్వం మధ్య కొరవడిన సమన్వయం, నేతల మధ్య ఏర్పడ్డ అభిప్రాయ భేదాలను పరిష్కరించడంలో వైఫల్యమే దీనికి కారణమని ఆయన పేర్కొనట్లు సమాచారం. అయితే సురేఖ వ్యవహారంలో ఆమెను పిలిచి మాట్లాడతామని, ఆ తర్వాత తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఖర్గే స్పష్టం చేశారు. గంట పాటు చర్చల అనంతరం ముఖ్యమంత్రి ఏఐసీసీ కార్యాలయం వెనుక గేటు ద్వారా బయటకి వెళ్లిపోయారు. కొద్దిసేపటికి మీనాక్షి సైతం అక్కడి నుంచి నిష్క్రమించారు. సురేఖ ఎంట్రీ.. గంట పాటు వెయిటింగ్ ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, మీనాక్షితో ఖర్గే, కేసీల భేటీ జరుగుతుండగానే మంత్రి కొండా సురేఖ సైతం ఇందిరాభవన్కు వచ్చారు. నేరుగా ఖర్గే కార్యాలయానికి వెళ్లిన ఆమె.. అక్కడ గంట సేపు నిరీక్షించారు. సీఎం, మీనాక్షి, కేసీలు వెళ్లిపోయాక ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాజా పరిణామాలు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల అవినీతి, వారిపై వచ్చిన భూకబ్జా ఆరోపణలు, వివిధ సందర్భాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు, కేబినెట్లోని ఇతర మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఆయనకు ఒక నివేదిక అందించినట్లు తెలిసింది. అనంతరం సురేఖ మీడియాతో ముచ్చటించారు. ఖర్గేతో కొండా సురేఖ మీనాక్షి, సురేఖ, ఉత్తమ్ మంతనాలు మీడియాతో సురేఖ ముచ్చటిస్తున్న సమయంలోనే రాష్ట్ర మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఇందిరాభవన్కు వచ్చారు. ఉత్తమ్ను చూసిన సురేఖ ఆయనతో కలిసి ఇందిరాభవన్కు తిరిగొచ్చి మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిణామాలు, ప్రభుత్వ పెద్దలపై ఆరోపణలు, ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన నివేదికను ఆమెకు అందజేశారు. తనను మంత్రివర్గంలో కొనసాగించాలని, తన కూతురు మాట్లాడిన దానికి తనను బాధ్యురాలిని చేయరాదని కోరారు. అనంతరం బయటకు వచ్చి విలేకరులతో మాట్లాడారు. సురేఖ ఆరోపణలను ఖర్గేకు వివరించిన రేవంత్ సురేఖ విలేకరులతో మాట్లాడిన తర్వాత.. సీఎం రేవంత్ మరోసారి ఖర్గేను కలిసారు. సురేఖ విలేకరులతో మాట్లాడుతూ చేసిన ఆరోపణలపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఏఐసీసీ కార్యాలయం వేదికగా ఆమె ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర నేతలపై ఆరోపణలు చేశారంటూ ఆయనకు చెప్పినట్లు సమాచారం. ఇంత జరిగాక కూడా ఆమెపై చర్యలు తీసుకోకుండా ఉపేక్షించడం తగదని అన్నారని తెలిసింది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి కూడా పాల్గొన్నారు. కాగా ఈ అన్ని అంశాలపై రాహుల్గాంధీ ఢిల్లీకి వచ్చిన తర్వాత చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఖర్గే హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఖర్గేతో భేటీ తర్వాత రేవంత్, భట్టి.. వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. -
ఢిల్లీలో వైఎస్సార్ అవార్డ్స్-2026 ప్రదానోత్సవం
ఢిల్లీ: ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో వైఎస్సార్ అవార్డ్స్-2026 కార్యక్రమం జరిగింది. స్వామినాథన్ ఫౌండేషన్కు వైఎస్సార్-2026 అవార్డ్ ప్రదానం చేశారు. కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు తెలంగాణ మంత్రులు, ఎంపీలు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ‘‘పేద ప్రజల కోసం పనిచేసిన నాయకుడు వైఎస్సార్. ఆయన వల్లే కేంద్రంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చాం. వైఎస్సార్ వల్లే ఏపీలో 39 లోక్సభ సీట్లు గెలిచాం. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత వైఎస్సార్దే. హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్. స్వామినాథన్ ఫౌండేషన్కు వైఎస్సార్ అవార్డు ఇవ్వడం సంతోషం’’ అని ఖర్గే పేర్కొన్నారు. -
200 ఏళ్ల కల నెరవేరింది.. ఆ ఇంట్లో ఎట్టకేలకు అమ్మాయి పుట్టింది
ముంబై: మహారాష్ట్రలోని బీడ్ జిల్లా, పార్లీకి చెందిన దహిఫలే కుటుంబంలో ఐదు తరాల (దాదాపు 200 ఏళ్ల) నిరీక్షణ తర్వాత ఒక ఆడబిడ్డ జన్మించింది. ఐదు తరాలుగా కేవలం మగపిల్లలే జన్మిస్తున్న ఈ కుటుంబంలోకి లక్ష్మీదేవిలా పాప అడుగుపెట్టడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఆ చిన్నారికి ‘గార్గి’ అని నామకరణం చేశారు.సౌభాగ్యవతి కల్పన రిషికేష్ దహిఫలే ఇటీవల ఈ ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అనంతరం తల్లిని, నవజాత శిశువును ఇంటికి తీసుకువచ్చేందుకు కుటుంబ సభ్యులు ఎవరూ ఊహించని రీతిలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. పూలతో అందంగా అలంకరించిన ఒక ప్రత్యేక రథంలో తల్లిని, చిన్నారి గార్గిని కూర్చోబెట్టారు. డప్పులు, తాళాల వాయిద్యాలు, సంబరాల నడుమ గ్రామంలో కోలాహలంగా ఊరేగింపు నిర్వహించారు. దహిఫలే కుటుంబం ఆ చిన్నారిని యువరాణిలా చూసుకుంటుండగా స్థానికులు, గ్రామస్తులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. కుటుంబ సభ్యుల భావోద్వేగం ఈ సందర్భంగా గార్గి తాత లింబాజీ దహిఫలే మాట్లాడూతూ.. మా కుటుంబంలో కుమార్తె ఉండటం గొప్ప అదృష్టం. చాలా ఏళ్లుగా మాకు ఉన్న ఒకే ఒక్క వెలితి నేటితో తీరిపోయింది. ఈ రోజు లక్ష్మీదేవి స్వయంగా మా ఇంటికి వచ్చినట్లు అనిపిస్తోంది’అని పాప అమ్మమ్మ సురేఖ దహిఫలే ఆనందం వ్యక్తం చేశారు. గార్గి తండ్రి రిషికేష్ మాట్లాడుతూ.. సాధారణంగా సమాజంలో చాలామంది కొడుకు కావాలని కోరుకుంటారు. కానీ ఆడపిల్ల తెచ్చే ఆనందం, అనుభూతే వేరు. కుమార్తెలు తండ్రులకు ప్రత్యేకం. మా పాపను అపురూపంగా పెంచుకుంటాం’ అని తెలిపారు.సమాజంలో ఆడపిల్లల పట్ల ఉన్న వివక్షను పోగొట్టి, ఆడబిడ్డ జననం అనేది ఎంతో సంతోషం, గర్వకారణమైన విషయమని సమాజానికి ఒక సానుకూల సందేశం ఇవ్వడానికే ఈ వేడుకను ఇంత ఘనంగా నిర్వహించినట్లు దహిఫలే కుటుంబం పేర్కొంది -
హోదాలా డోంట్ కేర్... ప్రశాంతతకే ఓటేస్తున్న ‘జెన్-జీ’
‘‘పుట్టామా..ఇంజినీరింగ్, మెడిసిన్, సీఏ లాంటి చదువులు చదివామా? మంచి ఉద్యోగం సంపాదించామా... జీవితం సక్సెస్’’ ఇది ఒకప్పటి బతుకు ఫిలాసఫీ. కానీ జెన్-జీలు ఇలా కాదంటోంది తాజా అధ్యయనం. అంతర్జాతీయ విద్యా సంస్థ ఎమిరైటస్ ‘‘ఇండియాస్ జెన్-జీ ఔట్లుక్ 2026: రీ కాల్కులేటింగ్ ఎడ్యుకేషన్, ఆంబీషన్ అండ్ సక్సెస్’’ పేరుతో నిర్వహించిన ఈ అధ్యయనం నవతరం గురించి పలు ఆసక్తికరమైన అంశాలను వెలుగులోకి తెచ్చింది. 1997- 2012 మధ్య పుట్టిన వాళ్లను మనం జెన్-జీ అని పిలుస్తున్నాం కదా.. వీరు దేశంలోని ప్రధాన మెట్రోల్లోని 15 - 28 ఏళ్ల మధ్య వయసున్న సుమారు వెయ్యి మందిని ప్రశ్నించి వారి ఆశలు, ఆశయాలు, విజయానికి నిర్వచనాలను సేకరించింది. ముందు తరం నడిచిన బాటను కాదని కొత్త అడుగులు వేస్తున్న వారి గురించి స్థూలంగా.మునుపటిలా చిన్న ఉద్యోగంతో మొదలుపెట్టి అంచలంచెలుగా పైకి ఎదగాలన్న సూత్రానికి వీరు విరుద్ధం. ఉద్యోగమిచ్చే మేనేజర్, జీఎం, వీపీ, ఛైర్మన్ వంటి హోదాల కంటే పనికి - జీవితానికి మధ్య బ్యాలెన్స్ ఉండాలనుకుంటున్న జెన్-జీలు సుమారు 74 శాతం. అసలు సక్సెస్ఫుల్ కెరియర్కు ఎగ్జిక్యుటివ్ లీడర్ కావాల్సిన అవసరమే లేదన్నది 65 శాతం మంది నమ్మకం. వీరి దృష్టిలో విజయం అంటే... నైపుణ్యాలు. అవసరానికి తగ్గట్టు మారిపోగలగడం. సంతృప్తినిచ్చే, అర్థవంతమైన పనిలోకలే మేలు...ఒకప్పుడు ఎంతో పాప్యులర్ అయిన విదేశీ చదువులపై జెన్-జీకి పెద్ద ఆశలేం లేవు. పెరిగిపోతున్న ఖర్చులు, వీసా నిబంధనల్లో వస్తున్న మార్పులు, చదువు తరువాత ఉద్యోగాలు వస్తాయన్న గ్యారెంటీ లేకపోవడం వంటి కారణాల వల్ల నాణ్యమైన లోకల్ విద్యే మేలని 48 శాతం మంది అభిప్రాయపడ్డారు. కాలేజీ ముందునాటి చదువులు చదువుతున్న వారిలో 87 శాతం, కాలేజీల్లోకి అడుగుపెడుతున్న వారిలో 92 శాతం లోకల్ కోర్సులకు జై అంటున్నారు. విదేశీ విద్యా సంస్థలు స్థానికంగా అందించే కోర్సుల్లో చేరేందుకు అభ్యంతరం లేదని సుమారు 69 శాతం మంది చెబుతున్నారు. ఒకట్రెండు సెమిస్టర్లకు విదేశాలకు వెళతారా? అంటే అప్పటి వరకూ విదేశీ చదువులపై ఆసక్తి చూపని వారిలోనూ 12 శాతం మంది సై అంటూండటం విశేషం.ఎందుకీ పోకడ...జెన్-జీలో వచ్చిన ఈ మార్పునకు చాలా కారణాల ఉన్నట్లు ఈ అధ్యయనం ద్వారా తెలిసింది. ఐటీ కంపెనీల్లో రాత్రికి రాత్రి వేలమంది ఉద్యోగులకు లేఆఫ్లు పలుకుతున్న తీరు, వీసా నిబంధనల్లో తరచూ వస్తున్న మార్పులు, అన్ని రంగాల్లోకి ప్రవేశిస్తున్న కృత్రిమ మేధ వంటివి జెన్-జీ ఆలోచనలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కొన్ని దశాబ్దాలుగా మంచి మార్కులు తెచ్చుకుని ఏదో ఒక ప్రొఫెషనల్ కోర్సు (ఇంజినీరింగ్, వైద్యం, సీఏ, ప్రభుత్వ ఉద్యోగాలు, ఎంబీఏ వంటివి) పూర్తి చేసి ఉద్యోగంలో స్థిరపడితే జీవితం సార్థకం అన్న భావన ఉండేదని, ఇప్పుడు ఈ పాత కెరీర్ మ్యాప్ పనిచేయడం లేదని ఈ అధ్యయనాన్ని నిర్వహించిన సంస్థ ఎమిరైటస్ సీఈవో దామెర అశ్విన్ చెబుతున్నారు.అయితే జెన్-జీ ఈ మార్గంలో ఎవరూ ఊహించనంత వేగంగా మార్పులు చేస్తోందని తెలిపారు. ఎప్పటికప్పుడు మారిపోతున్న నైపుణ్య అవసరాలను సంస్థలు అందుకోలేకపోతూంటే జెన్-జీలు ఈ మార్పులను పరిశీలిస్తూ తమనితాము మార్చుకుంటున్నారని, కొత్త నైపుణ్యాలతో కొత్త రకం ఉద్యోగ డిమాండ్లను అందుకునే ప్రయత్నం చేస్తున్నారని ఈ నివేదిక చెబుతోందన్నారు. ‘‘జెన్-జీ గురించి ప్రస్తుతం జరుగుతున్నంత చర్చ ఏ తరంపైనా జరిగి ఉండదేమో. కొందరు ఈ తరం పోకడలను చూసి ఆనందిస్తే.. అపార్థం చేసుకున్న వాళ్లూ చాలామందే ఉన్నారు. అంతేకాకుండా.. తక్కువ అంచనా వేసిన వాళ్లకూ కొదవేమీ లేదు. అందుకే అసలీ తరం ఏమనుకుంటోందో, ఏం చెప్పదలచుకున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశాం’’ అని చెప్పారు. -
ఆ లేఖలో ఏముంది? రాజకీయ ప్రకంపనలని కొండా సురేఖ ఎందుకన్నారు?
సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ తిరుగుబాటు చేస్తుండడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఇటీవలే సీఎం రేవంత్రెడ్డికి రాఖీ సైతం కట్టారు కొండా సురేఖ. దీంతో ఆమె ఇష్యూ కాస్త చల్లబడేలా ఉందని కొందరు భావించారు. అయితే, కొండా సురేఖ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. న్యూఢిల్లీలో బుధవారం మీడియాతో మాట్లాడిన కొండా సురేఖ తాను మల్లికార్జున ఖర్గేను కలిసి, తన వివరణ ఇచ్చానని తెలిపిన విషయం తెలిసిందే. సవివరమైన లేఖను ఖర్గేకు అందజేశానని ఆమె అన్నారు. ఆ లేఖ బయటకు వస్తే రాజకీయ ప్రకంపనలు సంభవిస్తాయని కొండా సురేఖ అనడం గమనార్హం. రాజీనామా చేయాలంటే.. తాను చేయబోనని చెప్పారు. తన కూతురు ఎమ్మెల్యే కావాలనుకుకుంటున్నారని తెలిపారు. కడియం శ్రీహరి తన కూతురును ఎంపీని చేసుకున్నారని చెప్పారు. మహిళలు స్వతంత్రంగా బతకాలని రాహుల్ గాంధీ చెబుతున్నారని అన్నారు. పొంగులేటి, భట్టి విక్రమార్క కమీషన్లపైన కూడా చాలా ఫిర్యాదులు వచ్చాయని, దానిపైన ఎవరూ ఎందుకు మాట్లాడటం లేదని ఆమె నిలదీశారు.లేఖలో ఏముంది?మల్లికార్జున ఖర్గేను కలిసి, లేఖను ఖర్గేకు అందజేశానని.. అది బయటకు వస్తే రాజకీయ ప్రకంపనలు సంభవిస్తాయని చెబుతూ కొండా సురేఖ మరో బాంబు పేల్చారు. దీంతో ఆ లేఖలో ఏముందన్న ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ కొండా సురేఖపై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటే ఆమె ఆ లేఖను బయటపెడతారా? అసలు ఆ లేఖలో ఏ అంశాలను ప్రస్తావించారు? ఎవరిని ఉద్దేశించి రాశారు? అందులో ఎలాంటి కీలక విషయాలు ఉన్నాయి? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో లేఖలోని అంశాలపై ఉత్కంఠ మరింత పెరిగింది. అయితే లేఖలోని పూర్తి వివరాలు ఇప్పటివరకు బహిరంగం కాలేదు. ఖర్గేకు లేఖ అందజేసినట్లు ఆమె స్వయంగా చెప్పడంతో, కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన కీలక అంశాలు అందులో ఉండొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లేఖ బయటకు వస్తుందా? అందులోని విషయాలు ఏమిటన్నది తెలియాలంటే మరింత స్పష్టత రావాల్సి ఉంది. లేఖ గురించి చెప్పే సమయంలో ఆమె భట్టి విక్రమార్క, పొంగులేటి కమీషన్లపై ఎందుకు చర్యల్లేవు?’’ అంటూ కూడా ప్రశ్నించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇదీ చదవండి: బంగారం ఎందుకు కొనొద్దు? విదేశీ పర్యటనలు ఎందుకు వద్దు? -
నాకంటే ముందు రేవంత్పై చర్యలు తీసుకోవాలి: కొండా సురేఖ సంచలనం
న్యూఢిల్లీ: తెలంగాణ మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీలో ఆమె చిట్చాట్లో పాల్గొన్నారు. తాను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశానని తెలిపారు. ఆయనకు తన వివరణ ఇచ్చానని చెప్పారు. తనపై చర్యలు తీసుకుంటే బీసీలు ఏకమవుతారని హెచ్చరించారు. కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ తనకు దొరకలేదని అన్నారు. తన బిడ్డ ఉన్న విషయాలే మాట్లాడారని చెప్పారు. ఉన్నది మాట్లాడితే చర్యలు ఎందుకని ప్రశ్నించారు. ‘‘భట్టి విక్రమార్క, పొంగుటేలి కమీషన్లపై ఎందుకు చర్యల్లేవు? నాకంటే ముందు రేవంత్పై చర్యలు తీసుకోవాలి. పదేళ్లు తానే సీఎంనని రేవంత్ ఎలా అంటారు? నేను లెటర్ల రూపంలో అధిష్ఠానికి చెప్పాల్సింది చెప్పాను. బెంగళూరులో ఖర్గేను కలిసినప్పుడే అన్నీ చెప్పాను. నా కూతురిని రెచ్చగొట్టినందుకే విమర్శించింది. ఎమ్మెల్యే టికెట్ ఎవరికి అనేది రేవంత్ రెడ్డి ఎలా నిర్ణయిస్తారు? నా కూతురు మాట్లాడినదానికి నాపై చర్యలు తీసుకోవద్దు’’ అని కొండా సురేఖ అన్నారు. కాగా, ఇప్పటికే ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానంతో సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. కొండా సురేఖ అంశంపై వారు కాంగ్రెస్ అధిష్ఠానానికి తమ అభిప్రాయాలు చెప్పినట్లు తెలుస్తోంది. క్రమశిక్షణ కమిటీ చేసిన సిఫార్సులపై కూడా చర్చించినట్లు సమాచారం. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పిస్తారన్న ఊహాగానాలు వస్తున్నాయి. ఇదీ చదవండి: బంగారం ఎందుకు కొనొద్దు? విదేశీ పర్యటనలు ఎందుకు వద్దు? -
ఢిల్లీలో హైటెన్షన్.. ఖర్గేతో కొండా సురేఖ కీలక చర్చలు!
ఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత విభేదాల వ్యవహారం ఢిల్లీకి చేరింది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి మంత్రి కొండా సురేఖ చేరుకున్నారు. మరికాసేపట్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ఆమె భేటీ కానున్నారు. మరోవైపు ఇప్పటికే ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ వరుసగా అధిష్ఠాన పెద్దలతో సమావేశమవుతున్నారు.ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి.. ఖర్గే, కేసీ వేణుగోపాల్తో సుమారు గంటన్నరపాటు సమావేశమైనట్లు సమాచారం. ఈ భేటీలో కొండా సురేఖ వ్యవహారంతో పాటు పార్టీ క్రమశిక్షణ, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, పెండింగ్లో ఉన్న రెండు మంత్రి పదవులు, కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.కొండా సురేఖ కుమార్తె సుష్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు, అలాగే ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చేసిన సిఫార్సులు కూడా చర్చకు వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సురేఖను కేబినెట్ నుంచి తప్పించాలా? లేక శాఖ మార్పుతో సరిపెట్టాలా? అనే అంశంపై అధిష్ఠానం సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు సురేఖకు కాంగ్రెస్లోని కొందరు సీనియర్ నేతలు మద్దతుగా నిలిచినట్లు తెలుస్తోంది. ఆమెపై తుది నిర్ణయం తీసుకునే ముందు సురేఖతో సంప్రదింపులు జరపాలని కొందరు నేతలు అధిష్ఠానాన్ని కోరినట్లు తెలిసింది. శాఖను మార్చడం వంటి ప్రత్యామ్నాయాన్ని కూడా కొందరు నేతలు సూచించినట్లు సమాచారం.ఇక మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్తో కేసీ వేణుగోపాల్ సమావేశం కూడా కీలకంగా మారింది. సురేఖ వ్యవహారంపై వారి అభిప్రాయాలను తీసుకున్న అనంతరం ఖర్గే నేతృత్వంలో మరో కీలక భేటీ జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా.. కొండా సురేఖపై చర్య విషయంలో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో ఉత్కంఠగా మారింది.ఇదీ చదవండి: ప్రజలను కాంగ్రెస్ నట్టేటముంచింది: కేటీఆర్ -
ఢిల్లీలో కాంగ్రెస్ నేతల కీలక భేటీలు.. ఏం జరుగనుంది?
ఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్లో సంస్థాగత వ్యవహారాలపై చర్చించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ఢిల్లీలోని ఇందిరా భవన్కు చేరుకున్నారు. మరికాసేపట్లో కాంగ్రెస్ అగ్రనేత, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో వారు భేటీ కానున్నారు.ఈ సందర్భంగా కొండా సురేఖ వ్యవహారంతో పాటు పార్టీ సంస్థాగత అంశాలు, కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన తదితర అంశాలపై చర్చించనున్నట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. పార్టీ సంస్థాగత బలోపేతం, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై కూడా అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది.దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఢిల్లీకి వచ్చామని, ఆయనను స్మరించుకుంటున్నామని మహేష్ గౌడ్ తెలిపారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టాన పెద్దలను కలుస్తున్నట్లు చెప్పారు. అనంతరం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా కలిసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్లో తాజా పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.ఇదీ చదవండి: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ చార్జ్షీట్ -
మా తప్పేంటి?.. భారత్, చైనా, అమెరికా పరిహారం చెల్లించాల్సిందే!
ఆకస్మిక వరదలతో అతలాకుతలం అయిన నేపాల్ సరికొత్త డిమాండ్ను తెర మీదకు తెచ్చింది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతుండగా.. భారత్ సహా పలు దేశాలు పాలు పంచుకుంటున్నాయి. అయితే తమకు సాయంతో పాటు న్యాయం కూడా జరగాలని నేపాల్ వాదిస్తోంది. చేయని తప్పులకు శిక్ష తామెందుకు అనుభవించాలని.. భారత్, చైనా, అమెరికాలు తమకు పరిహారం చెల్లించాల్సిందేనంటూ చెబుతోంది.హిమాలయ దేశం నేపాల్.. ఇప్పుడు క్లైమేట్ జస్టిస్ పేరిట ప్రపంచం ముందు ఓ ప్రశ్న ఉంచింది. వాతావరణ మార్పుల ప్రభావంతోనే తాము భారీ విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో ప్రపంచంలో అత్యధిక కార్బన్ డయాక్సైడ్ (CO₂) ఉద్గారాలు చేస్తున్న దేశాల్లో ముందున్న చైనా, అమెరికా, భారత్ తమకు వాతావరణ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. ఈ మూడు దేశాలు చారిత్రక బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ చెబుతున్నారు. తాము తక్కువ స్థాయిలోనే కార్బన్ ఉద్గారాలు చేస్తున్నా.. వాతావరణ మార్పుల ప్రభావంతో భారీ విపత్తులను ఎదుర్కొంటున్నామని శిశిర్ అంటున్నారు. తమ దేశం సృష్టించని సంక్షోభానికి తామే మూల్యం చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారాయన. ‘ఇది పర్వత సునామీ’చైనా సరిహద్దులోని రసువా జిల్లాలో ఆగస్టు 26న సంభవించిన ఆకస్మిక వరదలు నేపాల్ను అతలాకుతలం చేశాయి. హిమనదీ ప్రాంతంలో మంచు, శిలలు కూలిపోవడంతో భారీగా నీరు, బురద, రాళ్లు దిగువ ప్రాంతాలకు దూసుకొచ్చాయి. ఈ ఘటనలో వెయ్యి మందికి పైనే ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది గల్లంతయ్యారు. వాళ్ల ఆచూకీ కోసం ఇంకా అన్వేషణ కొనసాగుతూనే ఉంది. సాధారణ వర్షపాతం లేకుండానే ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో బాధిత ప్రాంతాల ప్రజలకు తగినంత ముందస్తు హెచ్చరిక అందలేదు. దీంతో ఈ విపత్తును నేపాల్ విదేశాంగ మంత్రి ‘క్యాటస్ట్రాఫిక్ మౌంటెన్ సునామీ’గా అభివర్ణించారు. వాతావరణ మార్పుల కారణంగా హిమాలయాల్లో మంచు కరుగుదల వేగవంతమవుతోందని.. దాని ప్రభావంతో హిమనదులు, పర్వత వాలులు ఆందోళనకరంగా మారుతున్నాయన్న నిపుణుల హెచ్చరికలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మా తప్పు లేకుండా మూల్యం చెల్లిస్తున్నాం’వాతావరణంలోకి నేపాల్ గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు వాస్తవంగా చాలా తక్కువ. అయినప్పటికీ మేం సృష్టించని ప్రపంచ సంక్షోభానికి అంతిమ మూల్యం చెల్లిస్తున్నాం’’ మంత్రి ఖనాల్ అంటున్నారు. వాతావరణ మార్పుల వల్ల హిమాలయాల్లో మంచు కరుగుదల, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇటీవలి వరదలతో నేపాల్లో కీలక మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయని, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో కూడా గణనీయమైన భాగం దెబ్బతిందని, దేశ ఆర్థిక వ్యవస్థపైనా ఈ విపత్తు తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారాయన.‘సాయం కాదు.. న్యాయం’ఇది నాగరికత మనుగడకు సంబంధించిన విషయం. ఇకపై వాతావరణ విపత్తుల విషయంలో మా దౌత్య విధానాన్ని ‘సాయం’గా కాకుండా.. ‘న్యాయం, పరిహారం’ వైపు మళ్లిస్తాం. ఇది దాతృత్వం కాదు.. చట్టపరమైన, నైతిక బాధ్యత అని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే వాతావరణ నష్టపరిహారానికి సంబంధించి అంతర్జాతీయ భాగస్వాములకు నేపాల్ క్లెయిమ్ పంపిందని మంత్రి వెల్లడించారు. రాబోయే అంతర్జాతీయ వేదికలన్నింటిపైనా ఈ అంశాన్ని గట్టిగా ప్రస్తావిస్తామని చెప్పారు.కాలుష్యంలో ఎవరి వాటా ఎంత?వాతావరణ మార్పులపై నేపాల్ చేస్తున్న వాదనలో ప్రధానంగా కార్బన్ ఉద్గారాల అసమానతను ప్రస్తావిస్తోంది. గ్లోబల్ కార్బన్ బడ్జెట్ (Global Carbon Budget 2025) గణాంకాల ప్రకారం.. కార్బన్డయాక్సైడ్ ఉద్గారాల్లో చైనా వాటా సుమారు 32 శాతం. అమెరికా వాటా 13 శాతం, భారత్ వాటా 8 శాతం. అంటే ఈ మూడు దేశాలే కలిపి ప్రపంచ ఫాసిల్ కార్బన్ ఉద్గారాల్లో దాదాపు 53 శాతం రిలీజ్ చేశాయన్నమాట. అయితే.. అయితే నేపాల్ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. 2024 గణాంకాల ప్రకారం ఆ దేశం నుంచి రిలీజ్ అయిన కర్బన ఉద్గారాలు సుమారు 1.59 కోట్ల టన్నులు మాత్రమే. అంటే ప్రపంచ దేశాల్లో ఆ వాటా 0.04 శాతం మాత్రమే. అలాగే యావరేజ్గా ఒక దేశం 0.5 టన్నులు రిలీజ్ చేస్తుంటే.. నేపాల్ అంతకంటే తక్కువగా ఉందన్నమాట. అలాగని..చైనా, అమెరికా, భారత్ వంటి దేశాలు నేపాల్కు తప్పనిసరిగా పరిహారం చెల్లించాలనే రూల్గానీ, చట్టంగానీ లేదు. ఇది కేవలం నేపాల్ తెర మీదకు తెచ్చిన ‘క్లైమేట్ జస్టిస్–లాస్ అండ్ డ్యామేజ్’ వాదన మాత్రమే. అయితే తక్కువ ఉద్గారాలు చేసే దేశాలే వాతావరణ విపత్తులతో ఎక్కువగా నష్టపోతున్న నేపథ్యంలో.. ఎక్కువ కార్బన్ను రిలీజ్ చేస్తున్న చేసిన దేశాలు ఆర్థిక బాధ్యత తీసుకోవాలన్న డిమాండ్ మాత్రం చర్చనీయాంశంగా మారే అవకాశం లేకపోలేదు.ఇదీ చదవండి: కాల్చరు.. పూడుస్తారు! ఎందుకో తెలుసా? -
‘ఉక్కు’ ఉనికికి ముప్పు
సాక్షి, విశాఖపట్నం, సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు నినాదంతో ఆవిర్భవించిన స్టీల్ ప్లాంట్ని కనుమరుగు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగా మొన్న.. ప్లాంట్ నుంచి సీఐఎస్ఎఫ్ బలగాల ఉప సంహరణ ప్రక్రియ మొదలుపెట్టిన యాజమాన్యం.. తాజాగా రూ.వందల కోట్ల విలువ చేసే ప్లాంట్ మిగులు భూముల వేలానికి తెరతీసింది. హెచ్బీ కాలనీ, గాజువాక ఆటోనగర్ ప్రాంతాల్లో ఉన్న 459 ప్లాట్ల విక్రయానికి రూ.858.68 కోట్ల రిజర్వ్ ధరతో నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్ఎల్ఎంసీ) మంగళవారం ఈ–ఆక్షన్ నోటిఫికేషన్ విడుదల చేయడం ఉద్యోగ, కార్మిక సంఘాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. నిధుల సమీకరణ, అసెట్ మానిటైజేషన్ పేరుతో జరుగుతున్న ఈ వేలం ప్రక్రియ వాస్తవానికి ప్లాంట్ ఆస్తులను ముక్కలు ముక్కలుగా చేసి ప్రైవేట్కు అప్పగించే వ్యూహంలో భాగమేనన్న అనుమానాలు బలపడుతున్నాయి. మూడు దశాబ్దాలకు పైగా తెలుగువారి ఆత్మ గౌరవానికి, పోరాటాలకు ప్రతీకగా నిలిచిన విశాఖ ఉక్కు ఆస్తులను బేరం పెట్టడం ముంచుకొస్తున్న ప్రైవేటీకరణ తుపానుకు బలమైన సంకేతమని భావిస్తున్నారు. ఇన్నాళ్లూ ప్రైవేటీకరణ జరగనివ్వబోమంటూ అబద్ధాలు వల్లెవేస్తూ మోసం చేస్తూ వచ్చిన చంద్రబాబు సర్కారు మరో కుట్రపూరిత నిర్ణయానికి కొమ్ము కాస్తోందని, విశాఖ ఉక్కుకు వెన్నుపోటు పొడిచిందని ఉద్యోగ, కార్మిక వర్గాలు మండిపడుతున్నాయి. భూముల వేలం ప్రక్రియను తక్షణమే నిలిపి వేయాలని, సంస్థకు సొంత గనులు కేటాయించాలని, సెయిల్లో విలీనం చేసి ప్లాంట్ని కాపాడాలని డిమాండ్ చేస్తున్నాయి. వేలం ఆన్లైన్ రిజిస్ట్రేషషన్కు ప్రకటన.. తాజాగా ఎన్ఎల్ఎంసీ మొత్తం 459 ప్లాట్లను ఈ–వేలం వేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో అత్యధికంగా నగర నడి»ొడ్డున ఉన్న సీతమ్మధార పరిధిలోని హెచ్బీ కాలనీలో రూ.838.93 కోట్ల రిజర్వ్ ధరతో 87,949.77 చ.గజాల విస్తీర్ణంలో ఉన్న 456 ప్లాట్లు, పారిశ్రామికంగా అత్యంత కీలకమైన గాజువాక ఆటోనగర్లోని బ్లాక్– 2లోని 2,728 చ.గజాలు, బ్లాక్–3లోని 2894.44 చ.గజాల్లో ఉన్న రూ.19.75 కోట్లు విలువైన ప్లాట్లను వేలంలో చేర్చారు. అక్టోబర్ 12వతేదీన 243 ప్లాట్లకు, 16వతేదీన 216 ప్లాట్లకు సంబంధించిన వేలం విక్రయం జరగనుంది. వేలంలో పాల్గొనేవారు ఆన్లైన్లో రిజిస్ట్రేషషన్ చేసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్ఈ) మిగులు ఆస్తుల నగదీకరణలో భాగంగా 2022 జూన్లో ఆర్థిక శాఖ పరిధిలో ఏర్పాటైన ఎన్ఎల్ఎంసీ ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తోంది. సీపీఎస్ఈల వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో సహాయపడటం దీని ముఖ్య ఉద్దేశం. ప్యాకేజీలతో మభ్యపుచ్చి నిర్వీర్యం చేసే కుట్ర ఆర్ఐఎన్ఎల్ ఆ«దీనంలో ఉన్న సుమారు 19 వేల ఎకరాలకుపైగా భూముల్లో అత్యంత విలువైన వాణిజ్య స్థలాలను ముందుగా అమ్మకానికి పెట్టి సంస్థను క్రమంగా నిర్వీర్యం చేసే కుట్ర మొదలైందని ఉద్యోగ, కార్మిక సంఘాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్యాకేజీల పేరుతో మభ్యపుచ్చి ఎన్ఎల్ఎంసీ ద్వారా భూముల విక్రయానికి తెర తీశారని మండిపడుతున్నారు. నాడు గట్టిగా అడ్డుకున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వంఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలను నిశితంగా గమనిస్తే ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలు క్రమంగా ఊపందుకుంటున్నాయి. 2021 జనవరిలో స్టీల్ప్లాంట్లో వంద శాతం వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలుపగా నాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దీన్ని గట్టిగా వ్యతిరేకించి అడ్డుకుంది. దీనిపై కార్మికులు, ప్రజా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తడంతో అడుగులు ముందుకు పడలేదు. అంతేకాకుండా ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత ప్రభుత్వం జీవీఎంసీ కౌన్సిల్లో, అసెంబ్లీలో తీర్మానాలు ప్రవేశ పెట్టింది. దీంతో వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రైవేటీకరణ ప్రక్రియకు అడ్డుకట్ట పడింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రైవేటీకరణ అడుగులు వేగంగా పడ్డాయి. రాజకీయ సమీకరణాల నేపథ్యంలో 2025 జనవరిలో కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీని ప్రకటించింది. దీన్ని రుణాల చెల్లింపులు, పాత బకాయిల కోసం వినియోగించడంతో ప్లాంట్ అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడలేదు. సొంత గనులు కేటాయించి ఉంటే.. కర్మాగారానికి సొంత గనులు కేటాయించకపోవడం వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయిందన్నది ఎవరూ కాదనలేని సత్యం. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం స్టీల్ప్లాంట్పై మొసలి కన్నీళ్లు కార్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తీసుకున్న చర్యలు శూన్యం. వైజాగ్ స్టీల్కు సొంతగనులు ఇవ్వకుండా.. ఓ ప్రైవేట్ సంస్థకు కేటాయించేలా తన పరపతి వినియోగించారు. ముడిసరుకు కొనుగోలు భారం మోయలేక, మూలధనం కొరతతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీన్ని సాకుగా చూపిస్తూ ప్లాంట్కు చెందిన విలువైన స్థలాలను మిగులు, వృథా ఆస్తుల పేరుతో విక్రయించడం వ్యూహాత్మక కుట్రలో భాగమేనని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. -
అన్ని ఎఫ్ఐఆర్లూ కొట్టివేత
న్యూఢిల్లీ: పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపట్టిన నిరసన సందర్భంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విద్యార్థులపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ఎఫ్ఐఆర్లను కొట్టివేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఇందుకు రాజ్యాంగం ప్రకారం తమకు దక్కిన ప్రత్యేక అధికారాలను న్యాయస్థానం ఉపయోగించుకుంది. ఈ కేసులు విద్యార్థులపై భవిష్యత్తుపై ప్రభావం చూపకూడదని స్పష్టంచేసింది. నీట్ పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు మూడు నెలల్లోగా పరిహారం అందజేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.కేంద్రం అభ్యర్థన మేరకు నిరసనకారులపై క్రిమినల్ విచారణను ముగించింది. ‘‘యువ నిరసనకారుల భవిష్యత్ అవకాశాలను దృష్టిలో ఉంచుకొని, వారికి సంపూర్ణ న్యాయం చేయడానికి మేము రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద మాకు లభించిన అధికారాలను ఉపయోగిస్తున్నాం’’అని స్పష్టంచేసింది. కక్షిదారులకు సంపూర్ణ న్యాయం చేకూర్చడానికి ఎలాంటి ఉత్తర్వులైనా జారీ చేసే అధికారాన్ని ఆరి్టకల్ 142 సర్వోన్నత న్యాయస్థానానికి కలి్పస్తుంది. తమ ముందు కుదిరిన అవగాహనకు ఇరుపక్షాలు కట్టుబడి ఉండాలని సూచించింది. 2,873 మందిపై కొత్తగా ఎఫ్ఐఆర్లు నిరసనలకు సంబంధించిన ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వంతోపాటు మహారాష్ట్ర, అస్సాం, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు కోరినట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం నిరసనకారులపై అన్ని ఎఫ్ఐఆర్లను కొట్టివేస్తూ ధర్మాసనం ఉత్తర్వు జారీచేసింది. ప్రభుత్వ అభ్యర్థనను మన్నిస్తూ, ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసనలో పాల్గొన్న తీవ్రమైన నేర చరిత్ర కలిగిన 2,873 మంది వ్యక్తులపై కొత్తగా ఎఫ్ఐఆర్లు నమోదు చేసేందుకు ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు అనుమతి ఇచి్చంది. ప్రజలపై దాడులు, ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తుల విధ్వంసానికి పాల్పడిన వారిపై కొత్త ఎఫ్ఐఆర్లు నమోదు చేసేందుకు కూడా సమ్మతి తెలియజేసింది. ఈ ఎఫ్ఐఆర్ల పరిధి కేవలం ఆ రెండు రకాల నేరాలకు మాత్రమే పరిమితం కావాలని వెల్లడించింది. సీజేపీ నిరసన ర్యాలీ రద్దు ఢిల్లీలో సెపె్టంబర్ 5న చేపట్టాల్సిన నిరసన ర్యాలీ రద్దు చేసున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ మంగళవారం ప్రకటించింది. విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. సీజేపీ కో–కన్వీనర్ సౌరవ్ దాస్ ఈ మేరకు కోర్టులో ఒక ప్రకటన చదివి వినిపించారు. ఉపసంహరించుకుంటాం: నడ్డా నిరసనకారులపై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకుంటామని, వారిలో ఎవరిపైనా కఠిన చర్యలు తీసుకోబోమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. సెప్టెంబర్ 5న జరగాల్సిన నిరసన ర్యాలీని రద్దు చేయాలన్న సీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. నీట్ పేపర్ లీక్ అనంతరం ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబ సభ్యులకు 90 రోజు ల్లోగా తగిన పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. సంపూర్ణ న్యాయం జరిగింది: దీప్కే సుప్రీంకోర్టు తాజా ఉత్త ర్వును సీజేపీ కన్వీనర్ అభిజీత్ దీప్కే స్వాగతించారు. తమ గళాన్ని వినిపించడానికి వీధులు, సోషల్ మీడియాను ఆశ్రయించిన విద్యార్థులకు, పౌరులందరికీ ఎట్టకేలకు న్యాయం చేకూరిందని అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. తమ డిమాండ్లన్నీ నెరవేరాయి కాబట్టి పాదయాత్రను విరమిస్తున్నామని తెలిపారు. సంపూర్ణ న్యాయం జరిగిందన్నారు. తమ ఆందోళన విజయవంతమైందని వెల్లడించారు. సుప్రీంకోర్టుకు దీప్కే కృతజ్ఞతలు తెలియజేశారు. తమకు మద్దతు ఇచ్చిన ప్రజలకు ఈ తీర్పును అంకితం చేస్తున్నట్లు చెప్పారు. ఇది కేవలం జంతర్ మంతర్ వద్దే కాకుండా, దేశవ్యాప్తంగా వీధుల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరి విజయమని అభివరి్ణంచారు. ప్రజలంతా గళం విప్పకపోయి ఉంటే ఇది సాధ్యమయ్యే దని కాదని వివరించారు. -
ఎయిర్ స్టాఫ్ అసిస్టెంట్ చీఫ్గా శక్తి శర్మ
న్యూఢిల్లీ: భారత సాయుధ బలగాల చరిత్రలో ఎయిర్ వైస్ మార్షల్ శక్తి శర్మ నూతన చరిత్రను లిఖించారు. వాయుసేన ప్రధాన కార్యాలయంలో అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్(విద్య)గా ఆమె బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఎయిర్ వైస్ మార్షల్ లేదా ఆ హోదాకు సమానమైన పోస్ట్లో అధికారిణి బాధ్యతలు చేపట్టడం వాయుసేన చరిత్రలో ఇదే తొలిసారికావడం విశేషం. శక్తి శర్మ గతంలో వాయుసేనలో ఎయిర్ కమోండోర్గా సేవలందించారు. ‘‘భారత రక్షణ దళాల్లో ఎయిర్ మార్షల్(సమాన హోదా) స్థాయి పదవిని అధిరోహించిన తొలి మహిళా ఎయిర్ వైస్ మార్షల్గా శక్తి శర్మ నూతనాధ్యాయానికి తెరతీశారు. భారత వాయుసేన ఘనతలో ఇదొక మైలురాయి’’ అని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో కొనయాడింది. శక్తి శర్మ 1994లో భారతవాయుసేన విద్యావిభాగంలో చేరారు. వాయుసేన శిక్షణా కేంద్రాలు, ఫీల్డ్ స్టేషన్లు, కమాండ్ హెడ్క్వార్టర్లు, ఎయిర్ హెడక్వార్డర్లలో విభిన్నమైన బాధ్యతలు ఈమె సమర్థవంతంగా నిర్వర్తించారు. వీటితోపాటు ఐఐటీ కాన్పూర్, పుణె విశ్వవిద్యాలయంలో ఇండియన్ ఎయిర్ఫోర్స్ చైర్స్ ఆఫ్ ఎక్స్లెన్స్ స్థాపనలో కీలకభూమిక పోషించారు. కపుర్తలా సైనిక్ స్కూల్కు ప్రిన్సిపల్గా పనిచేసి త్రివిధ దళాల నుంచి ఒక సైనిక్ స్కూల్కు సారథ్యంవహించిన తొలి అధికారిణిగా రికార్డ్ నెలకొల్పారు. ఈమె విజయాల యాత్ర భారత రక్షణబలగాల్లో అధికారిణులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. మూడు దశాబ్దాల కెరీర్లో ఈమె ఐఏఎఫ్ ‘ఘనతతో గగనాన్ని తాకండి’నినాదాన్ని నిరూపించి యువ తరానికి స్ఫూర్తిదాయకంగా మారారు’’ అని రక్షణ శాఖ శ్లాఘించింది. -
సురేఖను తప్పించాల్సిందే!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్న నేతలపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన అభిప్రాయాన్ని అధిష్టానం వద్ద కుండబద్ధలు కొట్టినట్లు తెలిసింది. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ కుటుంబ వ్యవహారంతో పార్టీ, ప్రభుత్వం రెండూ సంకట పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని.. ఈ విషయంలో ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించాలన్నదే మెజారిటీ ఎమ్మెల్యేలు, ఇతర నేతల అభిప్రాయంగా ఉందని సీఎం తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. కొండా సురేఖ వ్యవహారాన్ని ఉపేక్షిస్తే పార్టీ కేడర్కు తప్పుడు సంకేతాలు వెళ్లడంతోపాటు రాష్ట్ర నాయకత్వంపై లేనిపోని అపోహలకు తావిచ్చినట్లు అవుతుందని ఆయన చెప్పినట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, సీనియర్ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత సీఎంను ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, దీనిపై వ్యక్తమైన భిన్నాభిప్రాయాలు, ప్రభుత్వంపై కొందరు ఎమ్మెల్యేలు, నేతలు బహిరంగంగా చేస్తున్న వ్యాఖ్యలు, జిల్లాల్లో బయటపడుతున్న విభేదాల నేపథ్యంలో రాష్ట్ర నేతలను ఢిల్లీకి పిలిపించిన అధిష్టానం మంగళవారం వారితో చర్చించింది. గతంలో పెద్ద మనసుతో ఉపేక్షించినా.. ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్తో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం రాత్రి ముందుగా భేటీ అయ్యారు. కాన్వాయ్ లేకుండా కేవలం ఒక్క కారులోనే కేసీ ఇంటికి చేరుకొని గంటపాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొండ సురేఖ అంశంలో జరిగిన పరిణామాలు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యల గురించి వివరించినట్లు తెలిసింది. అలాగే పలు జిల్లాల్లో నేతల మధ్య ఏర్పడ్డ భేదాభిప్రాయాలపై చర్చించారు. ఈ సందర్భంగానే కొండా సురేఖ అంశంలో ఆమె శాఖలో బయటపడ్డ అవినీతి ఆరోపణలు, జిల్లాల నేతల నుంచి వచ్చిన ఫిర్యాదులు, గతంలోనే ఆమె కుమార్తె నేరుగా తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను కేసీకి ముఖ్యమంత్రి వివరించినట్లు తెలిసింది. అప్పుడే సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించాలనే అభిప్రాయాలు వ్యక్తమైనా పెద్ద మనసుతో ఉపేక్షించామని.. కానీ ప్రస్తుతం ఆమె కుమార్తె నేరుగా తనపై అవినీతి ఆరోపణలు చేయడంతోపాటు స్థానిక ఎమ్మెల్యేను తూలనాడటాన్ని కేడర్ సహించట్లేదన్న విషయాన్ని బలంగా చెప్పినట్లుగా సమాచారం. అధిస్టానం నిర్ణయాలనే ధిక్కరించేలా ఎమ్మెల్యే అభ్యర్థిత్వాలపై సుస్మిత వ్యాఖ్యలను సైతం జిల్లా ఎమ్మెల్యేలు తీవ్రంగా తప్పుపడుతున్న విషయాన్ని వివరించినట్లు తెలిసింది. ఈ పరిణామాల దృష్ట్యా ఆమె కేబినెట్ను తొలగించడమే సమంజసమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక జి.చిన్నారెడ్డి విషయంలోనూ ఉపేక్షించరాదని.. ఈ రెండు విషయాలపై క్రమశిక్షణా సంఘం చేసిన నిర్ణయాన్ని పార్టీ అమలు చేసేలా చూడాలని సీఎం కోరినట్లుగా తెలిసింది. అసెంబ్లీ తర్వాత మంత్రివర్గ విస్తరణ.. అదే సమయంలో సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తే ఆమె స్థానంలో చేపట్టాల్సిన భర్తీతోపాటు ఖాళీగా ఉన్న మంత్రి పదవులను కూడా భర్తీ చేయాలన్న అంశం కేసీ, రేవంత్ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. రెడ్డి సామాజిక వర్గం నుంచి సుదర్శన్రెడ్డి, బీసీ సామాజికవర్గం నుంచి ఆది శ్రీనివాస్, ఎస్సీ సామాజిక వర్గం నుంచి గడ్డం ప్రసాద్కుమార్, డిప్యూటీ స్పీకర్గా బాలూనాయక్ పేర్లను ముఖ్యమంత్రి ముందుంచినట్లుగా చెబుతున్నారు. మంత్రి పదవులు దక్కని సీనియర్లకు నామినేటెడ్ పదవులను ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. మంత్రివర్గ విస్తరణపై అసెంబ్లీ సమావేశాలు ముగిశాక ఈ నెల మూడో వారంలో ఓ నిర్ణయానికి రావాలని నిశ్చయించినట్లు సమాచారం. ఆ తర్వాతే నామినేటెడ్ పదవుల భర్తీపై నిర్ణయం తీసుకుందామనే అభిప్రాయం వ్యక్తమైందని తెలియవచ్చింది. అలాగే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ముందుగానే అభ్యర్థుల ప్రకటనపైనా ఈ నెలాఖరులోగా నిర్ణయం తీసుకోవాలని సీఎం సూచించినట్లు సమాచారం. ఢిల్లీలోనే మంత్రులు.. హస్తిన రాజకీయాల నేపథ్యంలో కీలక మంత్రులు ఢిల్లీలో మకాం వేశారు. జలవనరులకు సంబంధించిన సదస్సులో పాల్గొనేందుకు మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి బుధవారం సైతం ఇక్కడే ఉండనున్నారు. అయితే రాజకీయ భేటీలు ఉంటాయన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. మంత్రివర్గంలో మార్పుచేర్పులు, నామినేటెడ్ పదవుల భర్తీలు జరిగితే మాత్రం ఆయన్ను పలిపించి మాట్లాడతారని ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రులను కలిసేందుకు వచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీలోనే ఉండగా దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా స్వామినాథన్ ఫౌండేషన్కు అందిస్తున్న అవార్డు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబులు బుధవారం ఉదయం ఢిల్లీ చేరుకోనున్నారు. వారు సైతం అధిష్టానం పెద్దలతో భేటీ అవుతారని అంటున్నారు. ఇక అధిస్టాన పెద్దల పిలుపుమేరకు ఢిల్లీకి వచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ బుధవారం ఉదయం అధిస్టాన పెద్దలతో భేటీ కానున్నారు. మరోవైపు రాష్ట్రపతి భవన్లో జరిగిన స్పీకర్ల సదస్సు కోసం ఢిల్లీ వచ్చిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అంతకుముందు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. పార్టీకి తాను చేసిన సేవలను వివరిస్తూ కేబినెట్ విస్తరణలో తనకు అవకాశం కల్పించాలని విన్నవించినట్లు తెలిసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి తనకు ప్రాతినిధ్యం ఇవ్వడం ద్వారా పార్టీకి సానుకూలత ఏర్పడుతుందని ఆయన తెలిపినట్లుగా సమాచారం. సురేఖ వేచిచూసినప్పటికీ.. మరోవైపు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో కలిసి మంత్రి కొండా సురేఖ ఒకే విమానంలో మంగళవారం ఢిల్లీ చేరుకున్నప్పటికీ అధిష్టానం నుంచి ఆమెకు ఇంకా పిలుపు రాలేదు. కేసీ వేణుగోపాల్ను సీఎం కలిసి వెళ్లాక కొండా సురేఖ కూడా కేసీని కలుస్తారనే ప్రచారం జరిగింది. అయితే రాత్రి 10 గంటల సమయం దాటినా ఆమెను కేసీ పిలవలేదు. దీంతో బుధవారం ఉదయం అధిష్టానం పెద్దల నుంచి ఆమెకు పిలుపు వచ్చే అవకాశం ఉందని సమాచారం. నివేదిక ఇచ్చా.. అధిష్టానం నిర్ణయమే ఫైనల్: మల్లు రవి తమ పార్టీలో చోటుచేసుకున్న తాజా పరిణామాలపై క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా నివేదికను హైకమాండ్కు అందజేశానని నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి తెలిపారు. ఇక అధిష్టానమే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని.. హైకమాండ్ నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందేనని మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. -
తెలంగాణకు తుమ్మిడిహెట్టి ప్రాణహితం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని కరువు పీడిత ప్రాంతాలకు నీళ్లిచ్చేందుకు ప్రాణహిత జలాలే ప్రాణాధారమని, వాటిని గరిష్ట స్థాయిలో గ్రావిటీ పద్ధతిన వినియోగించుకునేందుకు 152 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మించుకునేందుకు సహకరించాలని మహారాష్ట్రను తెలంగాణ మరోమారు కోరింది. తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణ అనుమతుల అంశమై మంగళవారం కేంద్ర జల సంఘం చైర్మన్ అనుపమ్ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి తెలంగాణ నుంచి శాఖ కార్యదర్శి శ్రీధర్, సలహాదారు ఆదిత్యనాథ్దాస్, ఈఎన్సీ రమేశ్బాబు, సీఈ విజయ్లతోపాటు అంతర్రాష్ట్ర విభాగ అధికారులు హాజరయ్యారు. మహారాష్ట్ర తరఫున సీఈ సోనాలి చావ్డేతో పాటు ఇంజనీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఇంజనీర్లు గోదావరి అవార్డు మొదలు, నీటి లభ్యత, కేటాయింపులు, హక్కులు, తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణానికి గతంలో చేసిన ప్రతిపాదనలు, మహారాష్ట్రతో ఒప్పందాలు, ప్రస్తుతం బరాజ్ నిర్మాణ అవసరం, ముంపు సమస్యలు, వాటికి అందించే పరిహారం వంటి అంశాలపై ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పునరావాస, పరిహార పూర్తి బాధ్యత మాదే..తుమ్మిడిహెట్టి బరాజ్ను 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ (ఫుల్ రిజర్వాయర్ లెవల్)తో నిర్మించి, 160 టీఎంసీల నీటిని మళ్లించడం ద్వారా 16.40 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా ప్రాజెక్టును డిజైన్ చేశామని, అయితే రాష్ట్రాల మధ్య కుదరని ఏకాభిప్రాయంతో దీనిని 148 మీటర్లకు తగ్గిస్తూ గత ప్రభుత్వ హయాంలో ఒప్పందాలు జరిగిన విషయాన్ని ఇంజనీర్లు ప్రస్తావించారు. అయితే 148 మీటర్లతో ప్రస్తుతం బరాజ్ నిర్మిస్తే తమ అవసరాలకు ఆ నీరు ఏమాత్రం సరిపోదని, 80 నుంచి 100 టీఎంసీల నీటి అవసరాలు ఉన్న దృష్ట్యా 152 మీటర్లకు బరాజ్ను నిర్మించే అవకాశాలను పరిశీలించాలని కోరారు. 152 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే మహారాష్ట్రలో ముంపు 5,247 హెక్టార్లు మాత్రమేనని, ఇందులో నదీగర్భంలోనే ముంపు ఎక్కువగా ఉందని, వ్యవసాయా««ధారిత భూమి 2వేల హెక్టార్లు కంటే తక్కువనే ఉంటుందని వివరించారు. దీనికి సంబంధించిన పూర్తి పరిహారాన్ని మహారాష్ట్ర కోరిన మేరకు నిర్వాసితులకు అందిస్తామని వివరించా రు. బరాజ్ సాధారణ నిర్వహణ సమయంలో నీటిముంపునకు గురయ్యే భూమిని, బరాజ్ వల్ల ఏర్పడే ముంపు ప్రభావాలను పరిగణనలోకి తీసుకుని తెలంగాణ ప్రభు త్వం భూమిని సేకరిస్తుందని, అవసరమైతే ప్రభావిత ప్రాంతాలను రక్షించేందుకు ఫ్లడ్ బ్యాంకులు నిర్మిస్తామని వెల్లడించింది. బరాజ్ నిర్మాణంతో మహారాష్ట్రకు నీటి హక్కులకు ఎలాంటి విఘాతం కలగదని తెలిపింది. గత నివేదికలు అందిస్తే అధ్యయనం చేస్తామన్న మహారాష్ట్ర రాష్ట్ర అభిప్రాయాలను విన్న మహారాష్ట్ర ఇంజనీర్లు.. తెలంగాణ నుంచి పలు అంశాలపై అదనపు సమాచారం కోరినట్టు తెలిసింది. బరాజ్ నిర్మాణ ప్రాంతంలో నీటి లభ్యత, 152 ఎఫ్ఆర్ఎల్తో మహారాష్ట్ర ప్రాంతంలో ఉండే ముప్పు, దీనిపై సీడబ్ల్యూపీఆర్ఎస్ (సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్) గతంలో ఇచ్చిన నివేదికలు, రెండు రాష్ట్రాల అధికారులతో ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర బోర్డుల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల వివరాలను తమకు అందించాలని కోరారు. ఇవన్నీ సమర్పిస్తే మూడు వారాల్లో మరోమారు భేటీ అవుదామని నిర్ణయించినట్టు తెలిసింది. భేటీ అనంతరం మహారాష్ట్ర కోరిన వివరాలు, రాష్ట్ర ప్రజెంటేషన్ వివరాలను తెలంగాణ ఇంజనీర్లు ఢిల్లీలోనే ఉన్న మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి వివరించారు. -
పేపర్ లీకేజీ కేసులో..అడ్డంగా దొరికిన ఏడో ర్యాంకర్
ముంబై: మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) డ్రగ్ ఇన్స్పెక్టర్ (గ్రూప్-బి) పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సంచలనం వెలుగుచూసింది. ఈ కేసులో తాత్కాలిక మెరిట్ జాబితాలో ఏడో ర్యాంకు సాధించిన రుతుజా పాటిల్ను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నందుర్బార్లో అరెస్ట్ చేశారు. దీంతో ఈ కుంభకోణంలో అరెస్టయిన వారి సంఖ్య ఏడుకి చేరింది.పరీక్షకు ముందే రుతుజా పాటిల్కు లీకైన ప్రశ్నపత్రం అందిందని పోలీసులు తెలిపారు. అయితే, అధికారులకు ఎలాంటి అనుమానం రాకుండా ఉండాలనే ప్లాన్తో.. కావాలనే 10 ప్రశ్నలకు తప్పు సమాధానాలు రాయాలని నిందితులు ఆమెకు సలహా ఇచ్చినట్లు విచారణలో తేలింది. కోర్టులో హాజరుపరిచిన అనంతరం రుతుజాను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు.మార్చి 22న మహారాష్ట్ర వ్యాప్తంగా ఆరు డివిజనల్ కేంద్రాల్లో డ్రగ్ ఇన్స్పెక్టర్ స్క్రీనింగ్ పరీక్ష ఆఫ్లైన్లో జరిగింది. జూన్ 12న వెలువడిన ఫలితాల్లో 506 మంది ఇంటర్వ్యూలకు అర్హత సాధించగా, జూలైలో ఇంటర్వ్యూలు పూర్తయ్యాయి. అయితే, పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ జూలై 22 నుంచి 26 మధ్య అభ్యర్థులు, ప్రజాప్రతినిధుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. లీకైన ప్రశ్నపత్రాలు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల ద్వారా సర్క్యులేట్ అయినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.దీంతో అప్రమత్తమైన ఎంపీఎస్సీ మొత్తం రిక్రూట్మెంట్ ప్రక్రియను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, పారదర్శకత కోసం త్వరలో మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేసింది.ఈ పేపర్ లీక్ కుంభకోణంలో ఇప్పటికే ముగ్గురు ఎంపీఎస్సీ అధికారులతో పాటు మొత్తం ఆరుగురిని క్రైమ్ బ్రాంచ్ అరెస్ట్ చేసింది. విశ్వేశ్వర్ దత్తాత్రేయ నకాతే (ఎంపీఎస్సీ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్),గోపాల్ భట్టు మరాఠే (ఎంపీఎస్సీ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్) అభిజీత్ గణపత్రావ్ లెంద్వే (ఎంపీఎస్సీ అండర్ సెక్రటరీ),ప్రవీణ్ దిలీప్ పాటిల్ (కౌటిల్య అకాడమీ డైరెక్టర్),అమృత్ నామ్దేవ్ పాటిల్, లోకేష్ అలియాస్ గౌరవ్ రాజేంద్ర పాటిల్ (సహ నిందితులు),నిందితులంతా కలిసి పరీక్షకు ముందే ప్రశ్నలను సేకరించి, ప్రత్యేక సెట్గా తయారు చేసి అనధికార వ్యక్తులకు చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ కేసులో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
చావు అంచుల వరకు వెళ్లిన యువకుడు.. కాపాడిన ‘చున్నీ’
భోపాల్: ఒక్కసారిగా విరుచుకుపడిన భయంకరమైన వరద.. కళ్లముందే బైక్తో సహా కొట్టుకుపోతున్న ఒక వ్యక్తి.. ‘కాపాడండి.. కాపాడండి’ అని ప్రాణభయంతో కేకలు వేస్తూ అర్థిస్తున్నాడు. అప్పుడే దేవుడిలా ముందుకొచ్చింది ఓ నవవధువు! క్షణం ఆలస్యం చేయకుండా తన మెడలోని చున్నీనే తాడులా విసిరింది! ఆ అభాగ్యుడు దాన్ని పట్టుకోగానే.. తన బంధువు, మరో స్థానికుడి సాయంతో శక్తులన్నీ ఒడ్డి అతడిని ఒడ్డుకు లాగి, మృత్యువు నుంచి కాపాడింది.ఘటాష్నిలోని మామ్లా గ్రామానికి చెందిన ఆ వ్యక్తి సోమవారం సాయంత్రం ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా ఉప్పొంగిన వరద నీటిలో చిక్కుకుని కొట్టుకుపోవడం ప్రారంభించాడు. అదే సమయంలో రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న నవవధువు, ఆమె బంధువైన మరో మహిళ ఈ భయానక దృశ్యాన్ని గమనించారు. క్షణం కూడా ఆలోచించకుండా ఆ నవవధువు తన మెడలోని చున్నీని తొలగించి, నీటి ప్రవాహంలో పోరాడుతున్న బైకర్ వైపు తాడులా విసిరింది.ఆ వ్యక్తి చాకచక్యంగా చున్నీని పట్టుకోగా, నవవధువు,ఆమెతో ఉన్న మహిళ దాన్ని గట్టిగా పట్టుకుని ఒడ్డుకు లాగడం ప్రారంభించారు. వారి ధైర్యసాహసాలను చూసిన మరో స్థానికుడు కూడా వెంటనే పరుగెత్తుకొచ్చి వారితో చేయి కలిపాడు. ముగ్గురూ కలిసి శక్తులన్నీ ఒడ్డి ఆ బైకర్ను ప్రాణాపాయం నుంచి సురక్షితంగా రక్షించారు.ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్లో కురుస్తున్న రికార్డు స్థాయి వర్షాలకు చంబా జిల్లా అతలాకుతలమైంది. కొండచరియలు విరిగిపడటంతో రహదారులు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో అధికారులు ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ విపత్కర పరిస్థితిలోనూ సొంత ప్రాణాలను పణంగా పెట్టి బైకర్ను కాపాడిన ఆ నవవధువు, ఆమె బంధువుల సాహసాన్ని స్థానికులతో పాటు ప్రభుత్వ అధికారులు విశేషంగా కొనియాడుతున్నారు. A biker caught in a sudden flash flood in Himachal Pradesh's Chamba was pulled to safety by a family who risked the strong current to help him. The incident took place on the Kakiara-Tunuhatti road in the Bharmala area of Bhatiyat after heavy rain late in the evening caused water… pic.twitter.com/pdvEimLaER— NDTV (@ndtv) September 1, 2026 -
సీజేపీ నిరసనకారులకు సుప్రీంకోర్టు గుడ్న్యూస్
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకారులపై సుప్రీంకోర్టు ఎఫ్ఐఆర్లను రద్దు చేసింది. జూలై 20 నుంచి 25 మధ్య జరిగిన నిరసనల్లో నమోదైన ఎఫ్ఐఆర్లు రద్దు కానున్నాయి. జూలై 20 నుంచి 25 మధ్య జరిగిన సీజేపీ నిరసనలపై దేశంలో ఎక్కడా ఎఫ్ఐఆర్లను నమోదు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2,873 నేరచరిత్ర కలిగిన వారి నేపథ్యంలో వారిపై ఎఫ్ఐఆర్ల నమోదుపై పోలీసులకు సుప్రీంకోర్టు స్వేచ్ఛనిచ్చింది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు నష్టపరిహారం చెల్లింపులపై విధివిధానాలు రూపొందించాలని ఆదేశించింది. విధివిధానాలు రూపొందించిన మూడు నెలల్లోగా కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలరని చెప్పింది. ఇరుపక్షాల మధ్య కుదిరిన అవగాహనకు కట్టుబడి ఉండాలనే షరతుకి లోబడి ఆర్టికల్ 142 కింద ఎఫ్ఐఆర్లను రద్దు చేస్తున్నామని, ఈ విధానాన్ని రాష్ట్రాలు సైతం పాటించవచ్చని పేర్కొంది.‘సెప్టెంబర్ 5 ర్యాలీ’ రద్దువిద్యార్థులపై కేసుల ఉపసంహరణతో కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 5న తలపెట్టిన ర్యాలీని రద్దు చేసుకుంది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ముందు సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ వెల్లడించారు. మరోవైపు, అంతకుముందు ఎఫ్ఐఆర్ల రద్దుకు సుప్రీంకోర్టులో అప్లికేషన్ దాఖలు చేశారు ఢిల్లీ , బిహార్, అస్సాం, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర పోలీసులు. రెండు పక్షాలు పరస్పర నమ్మకంతో సమస్యలను పరిష్కరించుకోవడం మంచిదని సీజేఐ చెప్పారు. విద్యార్థులను ప్రత్యర్థులుగా భావించడం లేదని సొలిసిటర్ జనరల్ తెలిపారు. -
నేపాల్ విలయం.. ఇస్రో-నాసా నిసార్ నిద్రపోయిందా?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఉపగ్రహాల్లో ఒకటైన నాసా–ఇస్రో సంయుక్త నిసార్ ఇప్పుడు ఏం చేస్తోంది?. నేపాల్ విపత్తు విషయంలో అది ఏదైనా సమాచారం సేకరించిందా? లేదంటే నిద్ర పోతోందా?. ఆకస్మిక వరదలు, మంచు, నీరు, రాళ్లు, బురద కదలికలతో తీవ్ర విధ్వంసం చోటుచేసుకున్న నేపథ్యంలో.. ఈ విపత్తుకు సంబంధించి నిసార్ ఏం గుర్తించింది? దాని డేటా ఏం చెబుతోంది? అనే ప్రశ్నలు ఆసక్తిని రేపుతున్నాయి.సుమారు 1.3 బిలియన్ డాలర్ల వ్యయంతో రూపొందించిన నిసార్(NISAR)ను భూమిపై జరిగే మార్పులను మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వంతో గుర్తించేలా ఇస్రో-నాసాలు దీనిని అభివృద్ధి చేశాయి. హిమనదులను(గ్లేసియర్ల) పర్యవేక్షించడం, భూభాగ కదలికలను గుర్తించడం, కొండచరియలను అధ్యయనం చేయడం, భూకంపాలను పరిశీలించడం, విపత్తుల నిర్వహణకు కీలక సమాచారం అందించడం దీని లక్ష్యాలు. ముఖ్యంగా హిమనదులు, క్రియాశీల టెక్టానిక్ ప్రాంతాలు, వాతావరణ మార్పుల ప్రభావాలతో ప్రమాదకరంగా మారుతున్న హిమాలయాలు.. నిసార్ పరిశీలనకు కీలక ప్రాంతాల్లో ఒకటి.మరి నిసార్ ఎక్కడ?నేపాల్ రసువా జిల్లాలో గ్లేసియర్ కూలిపోవడం, మంచు, నీరు, రాళ్లు, బురద భారీగా పొటెత్తడంతో విపత్తు తలెత్తింది. నిసార్ రూపొందించిన ప్రధాన లక్ష్యాల్లోనే ఇలాంటి హిమనదులు, కొండచరియలు, భూభాగ మార్పులను పరిశీలించడం ఉంది. అయితే ఇప్పటివరకు ఈ విపత్తుకు సంబంధించి నిసార్ కనీస అంచనా, హెచ్చరిక సమాచారం లేదంటే కీలక శాస్త్రీయ విశ్లేషణ అనేవి ఏవీ కూడా పబ్లిక్ డొమైన్లో కనిపించకపోవడం చర్చకు దారితీసింది. నిసార్ ప్రస్తుతం కక్ష్యలో ఉండి క్రమం తప్పకుండా డేటా సేకరిస్తుంటే.. నేపాల్ విపత్తుకు సంబంధించి అదసలు ఏం గుర్తించిందన్నది ఆసక్తికరంగా మారింది.నాసా-ఇస్రో చెప్పేది ఇదే..నాసా ప్రకారం.. నిసార్ విపత్తులను ట్రాక్ చేయడం, పర్యావరణ వ్యవస్థలను పర్యవేక్షించడం, హిమనదులు, మంచు ప్రాంతాలను అధ్యయనం చేయడం, భూమి ఉపరితలం ఎలా మారుతోందో తెలుసుకోవడంలో సహాయపడుతుంది. దీని ద్వారా ప్రాణాలను రక్షించేందుకు, ప్రకృతి వనరుల నిర్వహణకు అవసరమైన సమాచారం అందుతుందని నాసా పేర్కొంది. ఇస్రో కూడా నిసార్ ప్రతి 12 రోజులకు ప్రపంచంలోని భూభాగం, మంచుతో కప్పబడిన ప్రాంతాలను చిత్రీకరిస్తుందని తెలిపింది. ‘కదలికలు గుర్తించగలం’నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీకి చెందిన నిసార్ ప్రాజెక్ట్ శాస్త్రవేత్త పాల్ రోజెన్ ఇంతకు ముందు నిసార్ సామర్థ్యాలను వివరించారు. భూమి, మంచు కదలికలను త్రీడీ రూపంలో అధ్యయనం చేయగలమని, భూకంపాలకు ముందు.. భూకంపాల సమయంలో.. ఆ తర్వాత భూమి కదలికలను మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వంతో కొలవచ్చని తెలిపారు. అంతేకాదు.. కొండచరియలు విరిగిపడటానికి ముందు చోటుచేసుకునే కదలికలను గుర్తించగలమని, హిమనదుల కదలికలను పర్యవేక్షించడం ద్వారా గ్లేషియల్ లేక్ ఔట్బర్స్ట్ ఫ్లడ్ (GLOF) ముప్పులను అంచనా వేయడంలో సహాయపడుతుందని వివరించారు.ఏడాది క్రితమే ఆపరేషన్స్ ప్రారంభంనిసార్ కక్ష్యలోకి ప్రవేశించి ఏడాది పూర్తైంది. ఈ సందర్భంగా ఆగస్టు 4న బెంగళూరులో నాసా, ఇస్రో సంయుక్తంగా కార్యక్రమం నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో ఉపగ్రహం సాధించిన పురోగతి, శాస్త్రీయ ఫలితాలు, డేటా పంపిణీ తదితర అంశాలను ప్రస్తావించారు. నాసా ఎర్త్ సైన్స్ డివిజన్ డైరెక్టర్ కరెన్ ఎం. సెయింట్ జర్మెయిన్.. భూమి వ్యవస్థలను అర్థం చేసుకోవడానికి నిసార్ అందిస్తున్న భారీ స్థాయి డేటా ప్రాధాన్యాన్ని వివరించారు. ఇస్రో శాస్త్రవేత్తలు అటవీ బయోమాస్, నేల తేమ, పంటలు, సముద్ర ఉపరితల గాలులు, మడ అడవులు, అటవీ మార్పులు, భూభాగ మార్పులు వంటి అంశాల్లో నిసార్ అప్లికేషన్లను వివరించారు.వెనెజువెలా భూకంప టైంలో..నిసార్ ఇప్పటికే విపత్తుల విశ్లేషణలో ఉపయోగపడిందనడానికి ఉదాహరణగా నిలిచాయి. జూన్ 24న వెనెజువెలాలో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించిన కొన్ని రోజులకే నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ నిసార్ డేటాతో రూపొందించిన మ్యాప్ను విడుదల చేసింది. భూకంపాల కారణంగా భూభాగం ఎంత మేరకు కదిలిందో ఆ మ్యాప్ చూపించింది. అత్యవసర నిర్వహణ అధికారులు, శాస్త్రవేత్తలకు ఇది ఉపయోగకరమైన సమాచారాన్ని అందించిందని నాసా తెలిపింది.అయితే నేపాల్ విషయంలో ఎందుకు?నేపాల్ విపత్తుపై మాత్రం నిసార్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి పబ్లిక్ విశ్లేషణ వెలువడలేదు. దీంతో కొన్ని కీలక ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. విపత్తుకు ముందు ప్రాంతంలో భూభాగ కదలికలను నిసార్ గుర్తించిందా? గ్లేసియర్లలో ఏవైనా అసాధారణ మార్పులను నమోదు చేసిందా? విపత్తుకు దారితీసిన ప్రక్రియలకు సంబంధించి నిసార్ డేటాలో ఏమైనా సంకేతాలు ఉన్నాయా? ఇప్పటికే ప్రాథమిక విశ్లేషణ జరిగిందా? జరిగితే ఆ వివరాలను ఎందుకు బయటపెట్టలేదు? అనేదే ఆ ప్రశ్నలు. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలి. నిసార్ ప్రతి వరద, కొండచరియలు, హిమనదులు కుప్పకూలిపోవడం, భూకంపాన్ని ముందుగానే హెచ్చరించే పూర్తిస్థాయి ఆపరేషనల్ వార్నింగ్ ఉపగ్రహం కాదు. దీని ప్రధాన లక్ష్యం భూమి, మంచు ప్రాంతాల్లో జరిగే మార్పులను అత్యంత ఖచ్చితత్వంతో పరిశీలించడం, ఆ డేటాను శాస్త్రీయ విశ్లేషణకు అందించడం. అలాగే నిసార్లో సాంకేతిక వైఫల్యం జరిగిందన్న ఆధారాలు కూడా ఇప్పటివరకు లేవు.‘డేటా తీస్తుంది.. విశ్లేషించేది మనుషులే’అయితే నేపాల్ విపత్తు తర్వాత ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్ రోజెన్ కీలక విషయాన్ని వెల్లడించారు. నిసార్ డేటాను సేకరిస్తుంది కానీ దాన్ని విశ్లేషించేది శాస్త్రవేత్తలేనని చెప్పారు. ఇలాంటి ముందస్తు సంకేతాలను గుర్తించేందుకు అవసరమైన దీర్ఘకాలిక డేటా సిరీస్ను నిసార్ ఇప్పుడిప్పుడే సేకరిస్తోందన్నారు. అలాగే హిమాలయ ప్రాంతమంతటా సాధారణ, అసాధారణ కదలికలను గుర్తించేందుకు ఆటోమేటెడ్ టూల్స్ను అభివృద్ధి చేయాల్సి ఉందని.. అలాంటి వ్యవస్థలు సిద్ధమైన తర్వాతే ప్రమాదాలను అంచనా వేసే అవకాశాలు మెరుగవుతాయని వివరించారు. నిసార్ ఈ తరహాలో పనిచేసే తొలి ఉపగ్రహం కావడంతో దాని డేటా, సామర్థ్యాలను పూర్తిగా అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు.డేటా మాత్రం అందుబాటులోకి రావాల్సిందేనిసార్ నుంచి సేకరించే డేటాను ప్రాసెస్ చేసిన తర్వాత పబ్లిక్ ఆర్కైవ్లో అందుబాటులో ఉంచేందుకు నాసా, ఇస్రో అంగీకరించాయి. అందువల్ల నేపాల్ విషాదం నేపథ్యంలో నిసార్ డేటాపై మరింత ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం నిసార్ కక్ష్యలో ఉంది.. డేటాను సేకరిస్తోంది. అయితే ఈ ఉపగ్రహం నేపాల్ విపత్తు విషయంలో ఏం చూసింది? ఏం గుర్తించింది? అన్నది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.బహుశా శాస్త్రీయ విశ్లేషణలు జరుగుతుండొచ్చు.. డేటాను ధ్రువీకరించేందుకు సమయం పడుతుండొచ్చు. అలాగే హిమాలయాల్లోనే ఇంతటి విపత్తు చోటుచేసుకున్న నేపథ్యంలో.. నిసార్ సేకరించిన డేటా ఇప్పుడు అత్యంత కీలకంగా మారే అవకాశం లేకపోలేదు. విపత్తుకు ముందు అక్కడ ఏం జరిగింది? హిమనదులు, భూభాగ కదలికల్లో ఏవైనా అసాధారణ మార్పులు నమోదయ్యాయా?.. నిసార్ డేటా సమాధానం చెబుతుందా అన్నదే ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: కార్లు మాట్లాడుకుంటే.. యాక్సిడెంట్లే జరగవట! -
టూర్లు.. పెళ్లిళ్లు.. బంగారం: మోదీ కీలక పిలుపు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలను మించి వృద్ధి రేటు నమోదు చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, సంక్షోభాలు, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు కొనసాగుతున్నప్పటికీ భారత్ శర వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ‘స్వదేశీ.. వోకల్ ఫర్ లోకల్’ మంత్రాన్ని పాటించాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి పరోక్షంగా చురకలంటించారు.కిర్గిజిస్థాన్లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సుకు హాజరైన మోదీ.. మంగళవారం ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ‘‘7.8 శాతం వృద్ధి దేశ ప్రజల్లో ఆనందాన్ని నింపింది. ఇది ప్రజల సంకల్ప బలం, కష్టపడి పనిచేసే తత్వానికి ప్రతిబింబం’’ అని అన్నారు.‘ప్రపంచం యుద్ధంలో ఉంది’ప్రస్తుతం ప్రపంచం యుద్ధాలు, సంక్షోభాలతో సతమతమవుతోందని మోదీ పేర్కొన్నారు. కొవిడ్ కాలం 2020 నుంచి ఇప్పటివరకు ఎక్కడా పూర్తి స్థాయిలో స్థిరత్వం కనిపించలేదని, సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ భారత్ వేగంగా ముందుకు సాగుతోందని అన్నారు.విదేశీ టూర్లు వద్దు.. ‘వెడ్ ఇన్ ఇండియా’ఈ నేపథ్యంలో ప్రజలు దేశీయ ఉత్పత్తులు, సేవలకు ప్రాధాన్యమివ్వాలని ప్రధాని కోరారు. అవసరం లేని విదేశీ ప్రయాణాలకు దూరంగా ఉండాలని, విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్లు అసలే నిర్వహించవద్దని సూచించారు. పెళ్లిళ్లను దేశంలోనే నిర్వహిస్తూ ‘వెడ్ ఇన్ ఇండియా’ నినాదాన్ని పాటించాలని అన్నారు. అలాగే అవసరం లేకపోతే బంగారం కొనుగోలు చేయవద్దని పిలుపునిచ్చారు. స్వదేశీ ఉత్పత్తులు, సేవలను ఎంత ఎక్కువగా ప్రోత్సహిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ అంతగా బలోపేతమవుతుందని చెప్పారు.‘అబద్ధాల ప్రతిధ్వని’పై వ్యాఖ్యలుఇదే సమయంలో దేశంలో కొందరు నిరాశావాదంతో ‘జూట్ కీ గూంజ్’ (అబద్ధాల ప్రతిధ్వని) వ్యాప్తి చేస్తున్నారని మోదీ వ్యాఖ్యానించారు. అయితే ఇలాంటి విమర్శలు, నిరాశావాద ప్రచారాలను అధిగమిస్తూ భారత ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం వృద్ధిని నమోదు చేసిందని అన్నారు. ‘‘దేశంలోనే కొందరు తీవ్ర నిరాశలో మునిగిపోయి అబద్ధాల ప్రతిధ్వనిని వ్యాప్తి చేస్తున్నారు. వాటన్నింటినీ అధిగమించి దేశం 7.8 శాతం వృద్ధిని సాధించింది. ఈ వేగాన్ని కొనసాగించాలి’’ అని మోదీ పేర్కొన్నారు.మోదీ చెప్పిన ‘జూట్ కీ గూంజ్’ పదప్రయోగం ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చేపట్టిన ‘ఛాత్రోం కీ గూంజ్’ ప్రచారంపై కొనసాగుతున్న రాజకీయ విమర్శలకు సంబంధించి చేసిన వ్యాఖ్యగా భావిస్తున్నారు. రాహుల్గాంధీ వివిధ కార్యక్రమాల్లో చేసిన వ్యాఖ్యలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ ఇప్పటికే తీవ్ర విమర్శలు చేసింది. ఆయన నాలుగు కార్యక్రమాల్లో చేసిన 40 ప్రకటనల్లో 29 అవాస్తవమైనవని, మరో 11 తప్పుదారి పట్టించేలా ఉన్నాయని బీజేపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే మోదీ ‘అబద్ధాల ప్రతిధ్వని’ అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.7.8 శాతం వృద్ధిసోమవారం విడుదలైన గణాంకాల ప్రకారం.. 2026–27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో భారత జీడీపీ 7.8 శాతం వృద్ధి చెందింది. అంతకుముందు త్రైమాసికంలోని 8.6 శాతంతో పోలిస్తే వృద్ధి కొంత తగ్గినప్పటికీ.. అంచనాలను మాత్రం అధిగమించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఇంధన మార్కెట్లలో అనిశ్చితి వంటి సవాళ్ల మధ్య ఈ వృద్ధి నమోదైంది.భారత్ స్వాతంత్ర్యం సాధించి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ‘‘విధానం సరైనది.. సంకల్పం స్పష్టంగా ఉంది.. 140 కోట్ల మంది భారతీయుల ఐక్య శక్తితో దేశాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తాం’’ అని తాజా వీడియో సందేశంలో ఉద్ఘాటించారు.ఇదీ చదవండి: రాహుల్ గాంధీ? విజయ్?? పీఎం అభ్యర్థి ఎవరసలు! -
హిమాలయ బోర్డు ఏర్పాటు చేయాలి
కఠ్మాండు: హిమాలయ ప్రాంతాల్లో విపత్తులను ఎదుర్కోవడానికి ఐదు సరిహద్దు దేశాలతో కలిపి హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని ఆధ్మాతి్మక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ డిమాండ్చేశారు. సున్నితమైన ఈ పర్వత ప్రాంతానికి రాజకీయాలకు అతీతంగా భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్, భూటాన్లతో కూడిన సరిహద్దు సహకారం అవసరమన్నారు. ఆదివారం కఠ్మాండులో ఏర్పాటు చేసిన ‘నేపాల్కు సంఘీభావం’కార్యక్రమంలో ప్రసంగించారు. తక్షణ సహాయానికి మించి, హిమాలయాలపై విస్తృతస్థాయిలో సామూహిక బాధ్యత అవసరమని సద్గురు పిలుపునిచ్చారు. ఆ పర్వతాలు దేశాల మధ్య గీసిన సరిహద్దులకు అతీతమైనవని, వాటి భవిష్యత్తు వాటిపై ఆధారపడిన వారందరికీ సంబంధించినదని గుర్తించాలని ఆయన అన్నారు. ‘పర్వతాలకు మీ రాజకీయాలు తెలియదు. మీరు మాట్లాడే అర్థంలేని మాటలు లేదా భాష పర్వతాలకు తెలియదు. హిమాలయ ప్రాంతం భూమిపై అద్భుతమైన, సున్నితమైన ప్రాంతం. అటువంటి పర్వతాల రక్షణ కోసం అవి విస్తరించి ఉన్న దేశాలన్నింటితో కూడిన ఒక సంస్థ ఏర్పాటు తక్షణ అవసరం. ఈ విపత్తు తీవ్రత ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది. దీని పరిణామాలను నేపాల్ లాంటి చిన్నదేశం ఒంటరిగా ఎదుర్కోలేదు. మనం దీనిపై దృష్టి పెట్టాలి’అని ఆయన అన్నారు. కోటి రూపాయల విరాళం.. నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి కోటి రూపాయల విరాళంగా ఇస్తామని ఆయన హామీ ఇచ్చారని ఇషా ఫౌండేషన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. చైనా–నేపాల్ సరిహద్దు సమీప ప్రాంతాల్లో సంభవించిన భారీ ఆకస్మిక వరదల తర్వాత ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది యాత్రికుల బృందం ఆచూకీ లేకుండా పోయింది. నేపాల్ వైపున ఉన్న ముగ్గురు ఇషా వలంటీర్ల ఆచూకీ లభ్యం కాలేదని తెలిపింది. ఇషా ఫౌండేషన్ ప్రతి సీజన్లో కైలాస్ మానసరోవర్ యాత్రలను నిర్వహిస్తోంది. యాత్రలో భాగంగా కాలినడకన ట్రెక్కింగ్ చేస్తూ బృందాలు కఠ్మాండు నుంచి నేపాల్ మీదుగా టిబెట్కు వెళ్తాయి. -
రెండేళ్లుగా ఏం చేశారు?
సాక్షి, అమరావతి: మద్యం రవాణా అక్రమ కేసు విషయంలో ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) రెండేళ్లుగా ఏం చేసిందని సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏమీ కనుగొనలేకపోయిందని తేల్చి చెప్పింది. ఈ కేసులో సిట్ అనుసరిస్తున్న పక్షపాత, చట్ట విరుద్ధ తీరును తప్పు పట్టింది. సిట్ తీరు ఆందోళన కలిగిస్తోందని, అతి చేస్తోందని తెలిపింది. ఈ కేసులో తాము ముందు సిట్ తీరు తేలుస్తామని, ప్రవర్తనను పరిశీలిస్తామని స్పష్టం చేసింది. ఆ తర్వాతే హైకోర్టు ఇచ్చిన తీర్పు లోతుల్లోకి వెళతామని తేల్చి చెప్పింది.ఈ కేసులో నిందితుడు కేసిరెడ్డి రాజశేఖర్రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్లో ఉండగానే, కింది కోర్టులో సిట్ ప్రొడక్షన్ వారెంట్ కోరడాన్ని తప్పుబట్టింది. ‘అతను అప్పటికే కస్టడీలో ఉన్నాడు. పారిపోయే అవకాశం ఏ మాత్రం లేదు. అలాంటప్పుడు మీరు ప్రొడక్షన్ వారెంట్ కోసం ఎలా దరఖాస్తు చేస్తారు? ఇది హైకోర్టును మీరి వ్యవహరించడం కాదా? ఇది అతి చేయడం కాదా?’ అని సిట్ను సుప్రీంకోర్టు ధర్మాసనం కడిగి పారేసింది. దర్యాప్తు సంస్థల ఏకపక్ష వైఖరిని రాజ్యాంగంలోని అధికరణ 136 కింద ఎలా అనుమతించగలమని నిలదీసింది. సిట్ తీరు కచ్చితంగా ఆక్షేపణీయమేనని ఘాటుగా వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టును ఆశ్రయించిన సిట్ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును సవాలు చేస్తూ సిట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సిట్ తరఫున సీనియర్ న్యాయవాది బండారుపల్లి ఆదినారాయణరావు వాదనలు వినిపించేందుకు సిద్ధం కాగా, ధర్మాసనం జోక్యం చేసుకుంది. ‘కేసిరెడ్డి రాజశేఖర్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్లో ఉంది.కేసిరెడ్డి పోలీసు కస్టడీపై మీరు (సిట్) నిజంగా సీరియస్గా ఉన్నారా? ఒకవైపు కస్టోడియల్ ఇంటరాగేషన్ కావాలని కోరుతారు. తీరా జడ్జి ప్రొడక్షన్ వారెంట్ ఇచ్చాక పోలీసు కస్టడీకి సిద్ధంగా లేమని చెబుతారా? ఇదేం తీరు? పోలీసు కస్టడీకి ప్రిపేర్ కాకుండా తిరిగి జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని అడగడం ఏ రకమైన ప్రవర్తన? ప్రొడక్షన్ వారెంట్ అనేది అరెస్ట్ వారెంట్తో సమానం. రెండేళ్లుగా ఈ కేసు దర్యాప్తు నడుస్తోంది. అయినా ఇప్పటి వరకు ఏమీ కనుగొనలేకపోయారు’ అంటూ సిట్ తీరును ధర్మాసనం తీవ్రస్థాయిలో ఎండగట్టింది. కస్టోడియల్ విచారణ అవసరం.. న్యాయవాది ఆదినారాయణరావు ఈ సందర్భంగా వాదనలు వినిపిస్తూ.. మద్యం రవాణా కేసు భారీ వ్యవహారమని, నిందితుడిని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సిన అవసరం ఉందని కోర్టుకు విన్నవించారు. ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు విచారణను వాయిదా వేస్తూ వస్తోందని, ప్రొడక్షన్ వారెంట్ను నిరోధిస్తూ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ఆయన తమ చర్యలను సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. ఒక దాని వెంట ఒకటి కేసుల నమోదు దీనిపై కేసిరెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది పటా్వలియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దర్యాప్తు సంస్థ ఉద్దేశ పూర్వకంగానే ఒకదాని తర్వాత ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేస్తోందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. 2024 నాటి మద్యం అక్రమ కేసులో బెయిల్ వచ్చే అవకాశం ఉన్న దశలో, ఉద్దేశ పూర్వకంగానే సిట్ ఈ ఏడాది మరో కేసు (మద్యం రవాణా) నమోదు చేసిందన్నారు. తద్వారా కేసిరెడ్డిని కస్టడీలో ఉంచేలా సిట్ కక్షపూరిత తీరుతో వ్యవహరించిందన్నారు. అందుకే హైకోర్టు కేసిరెడ్డి అక్రమ అరెస్ట్ను చట్ట విరుద్ధంగా ప్రకటించిందని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అరెస్ట్ను చట్టవిరుద్ధంగా ప్రకటించిన హైకోర్టు మద్యం రవాణా అక్రమ కేసులో తమ అరెస్ట్ను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ రాజశేఖర్రెడ్డి, వాసుదేవరెడ్డి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గేదెల తుహిన్ కుమార్ సిట్ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. రాజశేఖర్రెడ్డి, వాసుదేవరెడ్డిల అరెస్ట్ను అక్రమంగా ప్రకటించి, వారి తక్షణ విడుదలకు ఆదేశాలిచ్చారు.మద్యం రవాణా కేసులో చాలా కాలంగా అరెస్టు అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం భావించినప్పటికీ, 2026 ఏప్రిల్ 7న ఈ కేసులో బెయిల్ లభించిన తర్వాతే రాజశేఖర్రెడ్డిని అరెస్ట్ చేసి, జ్యుడీషియల్ కస్టడీ కోసం అత్యవసరంగా చర్యలు తీసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని హైకోర్టు తెలిపింది. కేసిరెడ్డిని ముందుగా కస్టడీలోకి తీసుకుని, తర్వాత కోర్టులో అరెస్ట్ చూపారంది. అంతేకాక అరెస్ట్కు ముందు వైద్య పరీక్షలు నిర్వహించారని, ఇది బీఎస్ఎస్ఎస్ సెక్షన్ 53కు విరుద్ధమని తేల్చి చెప్పింది.హైకోర్టు తీర్పును అనుసరించాల్సిందే న్యాయవాదుల వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. సిట్ వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించింది. కస్టడీలో ఉన్న వ్యక్తికి సంబంధించి ప్రొడక్షన్ వారెంట్ ఇవ్వడాన్ని తప్పుబడుతూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సిట్ అనుసరించాల్సిందేనని తేల్చి చెప్పింది. లేని పక్షంలో ఈ వ్యాజ్యాన్ని కొట్టేస్తామని హెచ్చరించింది. తాము హైకోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టేంత వరకు.. అవి పూర్తి స్థాయిలో చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. అయితే, ఈ కేసు పూర్వాపరాల ఆధారంగా ఈ వ్యవహారాన్ని లోతుగా పరిశీలించాల్సి ఉందని తెలిపింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని కేసిరెడ్డి రాజశేఖర్రెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డిలను ఆదేశిస్తూ వారికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 15వ తేదీకి వాయిదా వేసింది. -
‘మోదీజీ.. నా జీవితాన్ని నరకం చేశారు’
జంతర్ మంతర్ నిరసనల సమయంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుచిత వ్యాఖ్యలు చేసిన మైనర్ బాలిక వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తీవ్ర దుమారం రేగడంతో ఆమె క్షమాపణలు చెప్పడం, బాలిక తల్లి కూడా ప్రధాని మోదీకి రిక్వెస్ట్ చేయడం.. ఆయన క్షమించేయడం.. పోలీసులు ఉండదని చెప్పడంతో ఈ వ్యవహారం ఇంతటితో సమసిపోయిందని అంతా భావించారు. అయితే తాజాగా ఆమెకు సంబంధించిన మరో వీడియో నెట్టింటకు చేరింది.తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో.. ‘మోదీజీ.. మీరు నా జీవితాన్ని నరకం చేశారు’ అంటూ ఆమె ఆరోపించడం సంచలనంగా మారింది. ఘటన తర్వాత తాను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పినట్లు ఉంది. ‘‘మీరు నన్ను ఎంతగా వెంటాడారంటే.. ప్రతిచోటా వేధింపులకు గురయ్యాను. ఎక్కడికెళ్లినా ముఖం దాచుకోవాల్సి వస్తోంది’’ అని ఆమె అందులో చెప్పినట్లు ఉంది. ఈసారి తాను వెనక్కి తగ్గబోనని, కోల్పోవడానికి తన వద్ద ఏమీ లేదని కూడా పేర్కొన్నట్లు తెలుస్తోంది.ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారో స్పష్టత లేదు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ దీనిని తమ అధికారిక ‘ఎక్స్’ ఖాతాల్లో షేర్ చేశాయి. బాలికను బెదిరించి, క్షమాపణ చెప్పేలా ఒత్తిడి చేశారని ఇరు పార్టీలు మండిపడ్డాయి. మరోవైపు.. బాలిక తరఫు న్యాయవాది మాత్రం ఆ వీడియో ఏఐ జనరేటెడ్ కాదని, అందులో ఉందని ఆమెనేనని వ్యాఖ్యానించారు. కానీ, ఆ వీడియో ఎప్పుడు తీశారనేదానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.జులై 23న జంతర్ మంతర్ నీట్ నిరసనల సమయంలో ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీని సదరు బాలిక తిట్టిపోసింది. దీనిపై సుప్రీంకోర్టు న్యాయవాది స్మృతి సింగ్ చాందెల్ ఫిర్యాదు చేయడంతో జూలై 29న నోయిడాలోని ఎక్స్ప్రెస్వే పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. అనంతరం కేసును దర్యాప్తు కోసం ఢిల్లీకి బదిలీ చేశారు. తొలుత ఆమె వయసును పోలీసులు ఎఫ్ఐఆర్లో తప్పుగా పేర్కొన్నారు. అయితే.. తన వయసు 15 ఏళ్లేనని.. కొందరు రెచ్చగొట్టి అలా మాట్లాడించారని ఆ తర్వాత ఆమె క్షమాపణలు చెప్పింది.మకాం మార్చేసి..జంతర్ మంతర్ ఘటన వివాదం, కేసు భయంతో ఆమె కుటుంబం ఆందోళనకు గురైంది. తమకు వేధింపులు వస్తున్నాయని, తన బిడ్డ చేసిన తప్పును పెద్ద మనుసుతో మన్నించాలని తల్లి, ప్రధాని మోదీని వేడుకుంది. ఆ తర్వాత నోయిడాలోని నివాసాన్ని ఖాళీ చేసి ప్రస్తుతం హరియాణాలో తల్లిదండ్రులతో ఉంటున్నట్లు తెలిసింది.‘యువతకు మరో అవకాశం ఇవ్వాలి’ఈ వివాదంపై స్పందించిన ప్రధాని మోదీ.. ఈ ఘటనలో పాల్గొన్న యువతపై కఠిన చర్యలకు బదులుగా వారిని క్షమించి మరో అవకాశం ఇవ్వాలని అన్నారు. దీంతో వివాదం క్రమంగా సద్దుమణిగినట్లు కనిపించింది. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోతో ఈ వ్యవహారం మళ్లీ రాజకీయ చర్చకు వచ్చింది. ఇదీ చదవండి: డింపుల్.. మామూలు దూకుడు కాదది! -
లిక్కర్ అక్రమ రవాణా కేసు.. సిట్పై సుప్రీంకోర్టు సీరియస్
సాక్షి, ఢిల్లీ: ఏపీలో లిక్కర్ అక్రమ రవాణా కేసులో సిట్ దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజ్ కేసిరెడ్డి కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసిన సిట్ వైఖరిపై మండిపడిన సర్వోన్నత న్యాయస్థానం.. ‘సిట్ అతి చేస్తోంది’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇదేం ప్రవర్తన? అంటూ సిట్ తీరును నిలదీసింది.లిక్కర్ అక్రమ రవాణా కేసు రెండేళ్లుగా కొనసాగుతున్నా ఇప్పటివరకు ఏం కనుగొన్నారని సిట్ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఒకవైపు నిందితుడిని కస్టడీలోకి తీసుకుని విచారించాలని కోరుతూ.. మరోవైపు పోలీసు కస్టడీకి తాము సిద్ధంగా లేమని చెప్పడమేంటని ప్రశ్నించింది. ఇదేం ప్రవర్తన? అంటూ సిట్ తీరును నిలదీసింది. ముందుగా సిట్ వ్యవహరించిన తీరును పరిశీలిస్తామని, ఆ తర్వాత హైకోర్టు తీర్పుపై దృష్టి పెడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సిట్ తప్పనిసరిగా పాటించాల్సిందేనని, లేదంటే కేసును కొట్టివేస్తామని హెచ్చరించింది. అనంతరం, తదుపరి విచారణను వాయిదా వేసింది.ఇదీ చదవండి: వెలిగొండలో క్రెడిట్ చోరీ.. -
రష్యా చమురుక్షేత్రంపై దాడి
మాస్కో/న్యూఢిల్లీ: నెలల తరబడి తమపై దాడులతో తెగబడుతున్న రష్యాపై ఉక్రెయిన్ మరోసారి బదులుతీర్చుకుంది. రష్యాలోని లెనిన్గ్రాడ్ ఓబ్లాస్ట్ పరిధిలోని కిరిషి నగరంలోని అత్యంత కీలకమైన చమురుశుద్ధి కర్మాగారంపై ఉక్రెయిన్ డ్రోన్లు దాడిచేశాయి. దీంతో ఆయిల్ రిఫైనరీ కేంద్రం నుంచి మంటలు చెలరేగాయి. గతంలో రెండుసార్లు దాడులతో నెలల తరబడి ఉత్పత్తిని ఆపేసి మరమ్మత్తుల తర్వాత ఇటీవలే ఉత్పత్తిని మొదలుపెట్టగా వెంటనే ఉక్రెయిన్ దాడులు చేయడం గమనార్హం. ఈ దాడిలో ప్రాణనష్టం వివరాలను రష్యా బయటపెట్టలేదు. రిఫైనరీపై దాడికి యతి్నంచిన 62 డ్రోన్లలో నేలమట్టంచేశామని రష్యా ప్రకటించింది. శనివారం రాత్రి నుంచి గత 24 గంటల్లో 500 డ్రోన్లను కూల్చేశామని రష్యా రక్షణశాఖ తెలిపింది. దాడులకు ప్రతీకారం తప్పదని రష్యా అధ్యక్షకార్యాలయం అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోస్ హెచ్చరించారు. భారత్ నుంచి రష్యాకు భారీగా పెట్రోల్చమురు శుద్ది కర్మాగారాలపై ఉక్రెయిన్ దాడులు తీవ్రతరంచేయడంతో రష్యా స్థానిక అవసరాలకు సరిపడా చమురును ఉత్పత్తిచేయలేక దిగుమతులపై ఆధారపడుతోంది. దీంతో తాజాగా సముద్రమార్గం ద్వారా భారీస్థాయిలో పెట్రోల్ను సరఫరాచేస్తూ మిత్రదేశాన్ని భారత్ ఆదుకుంటోందని గణాంకాలు వెల్లడించాయి. గత రెండు నెలల్లో భారత్ నుంచి ఏకంగా 10 లక్షల బ్యారెళ్ల పెట్రోల్ రష్యాకు ఎగుమతి అయినట్లు వాణిజ్యరంగంలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గుజరాత్లోని వడినార్ చమురుశుద్ది కర్మాగారం నుంచి ఎగుమతులు ఎక్కువగా జరిగాయి. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో భారత్ తన ఇంధనఅవసరాల కోసం రష్యా నుంచి ముడిచమురున భారీస్థాయిలో కొనుగోలుచేయడం తెల్సిందే. ఇందుకు ప్రతిగా ముడిచమురును శుద్ధిచేశాక వచ్చే పెట్రోల్ను తిరిగి రష్యాకు సరఫరాచేస్తున్నట్లు తెలుస్తోంది. -
మాట్లాడింది రాహులా? భాగవతా?
న్యూఢిల్లీ: అమెరికాలో పర్యటిస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ న్యూయార్క్ మేడిసన్ స్క్వేర్ గార్డెన్లో చేసిన ప్రసంగంపై రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారత్లో ముస్లింలు ఉండకూడదు అని భావించే వాళ్లు అసలు హిందువులే కాదు అంటూ భాగవత్ చేసిన వ్యాఖ్యలపై సిబల్ విమర్శలు గుప్పించారు. మోహన్ భాగవత్కు విదేశాల్లో ఉన్నప్పుడే భిన్నత్వంలో ఏకత్వ భావన గుర్తుకొస్తుందా? అని ఎద్దేవా చేశారు. ‘‘భాగవత్ చేసిన ప్రసంగం వింటుంటే అసలు అది రాహుల్ గాంధీ ప్రసంగమా లేదంటే నిజంగానే భాగవత్ మాట్లాడారా? అనే అనుమానమొ చ్చింది. అచ్చం రాహుల్గాం«దీలా మాట్లాడారు’’ అని సిబల్ వ్యంగ్య వ్యాఖ్యచేశారు. ‘‘భాగవత్ భారత్లో ఉన్నప్పుడు హిందువుగా ఉన్నందుకు గర్వించాలని తెగ ప్రసంగిస్తారు. తీరా అమెరికా వంటి విదేశాలకు వెళ్లినప్పుడు హఠాత్తుగా భిన్నత్వంలో ఏకత్వ భావనను గుర్తుకొస్తుంది. విదేశీ గడ్డపై కాలుమోపినప్పుడు మాత్రమే భిన్నత్వంలో ఏకత్వంపై ప్రసంగాలు దంచికొడుతున్నారు. ఇదే ఆయన హిందుత్వ నిజ స్వరూపం. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి భిన్నత్వం కోసం పెద్ద పోరాటమే జరుగుతోంది. మీరు ప్రజలను స్వేచ్ఛగా బతకనివ్వరు. జంతర్ మంతర్ వద్ద ఆందోళనకారులపై ప్రభుత్వం దమనకాండకు పాల్పడితే ఒక్కమాటైనా మాట్లాడారా?’’ అని సిబల్ సూటి ప్రశ్నవేశారు. కాంగ్రెస్, టీఎంసీలు సైతం భాగవత్ వ్యాఖ్యలపై స్పందించాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇలాంటి మాటలను ముందుగా హిందూముస్లిం విద్వేషాలను రెచ్చగొట్టే బీజేపీ నేతలకు చెప్పాలని సూచించాయి. భాగవత్ అబద్ధాలు చెప్పడం మానేయాలని, ఆర్ఎస్ఎస్ డీఎన్ఏ నిండా ఉన్నది విద్వేషం, మతవాదమేనంటూ దుమ్మెత్తిపోశాయి. -
నేపాల్లోని తెలంగాణవాసుల కోసం ముమ్మర యత్నాలు
సాక్షి, న్యూఢిల్లీ: నేపాల్ను అతలాకుతలం చేసిన వరద విపత్తులో చిక్కుకున్న తెలంగాణవాసుల భద్రత, గల్లంతైన వారి అన్వేషణపై ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కఠ్మాండులోని భారత రాయబార కార్యాలయం, నేపాల్ పోలీసులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను వేగవంతం చేసినట్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విదేశాంగ శాఖ సమాచారం ప్రకారం, ఆగస్టు 29న టిబెట్ నుంచి 449 మంది భారతీయులు నేపాల్లోకి ప్రవేశించారు.వారిలో 397 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నేపాల్ నుంచి వచి్చన బాధితుల జాబితాను పరిశీలించగా, తెలంగాణకు చెందిన అల్లి అయిలేష్ వివరాలు తెలంగాణ భవన్ రికార్డులతో సరిపోలాయి. ఆయన ఇప్పటికే తన కుటుంబ సభ్యులతో సంప్రదింపుల్లో ఉన్నారని, క్షేమంగా హైదరాబాద్కు చేరుకుంటారని అధికారులు ధ్రువీకరించారు. మరోవైపు, వరదల్లో ప్రాణాలు కోల్పోయిన మృతుల ఛాయాచిత్రాలు, ప్రాథమిక వివరాలను నేపాల్ ప్రభుత్వం తమ డిజాస్టర్ పోర్టల్లో అందుబాటులో ఉంచింది. రసువా, నువాకోట్, ధాదింగ్, చిత్వన్, గోర్ఖా, తనహున్, నావల్పరాసీ (తూర్పు, పశ్చిమ), కఠ్మాండు జిల్లాల్లో భద్రపరిచిన పారి్థవదేహాలను గుర్తించే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. కుటుంబ సభ్యులు నేరుగా చూసి పోల్చుకోగలిగితే డీఎన్ఏ పరీక్ష అవసరం లేదని, బంధుత్వ ఆధారాలను బట్టి మృతదేహాలను అప్పగిస్తారని నేపాల్ పోలీసులు తెలిపారని చెప్పారు. భౌతికంగా గుర్తించలేని పక్షంలో తల్లిదండ్రులు లేదా తోబుట్టువుల డీఎన్ఏ ప్రొఫైల్ను సేకరించిన నమూనాలతో సరిపోలుస్తారని తెలిపారు. డీఎన్ఏ నివేదికల కోసం బంధువులు ఎవరూ శ్రమపడి నేపాల్కు ప్రయాణించాల్సిన అవసరం లేదని, స్వస్థలంలోనే తీసుకున్న డీఎన్ఏ ప్రొఫైళ్లను ఈ–మెయిల్ ద్వారా స్వీకరించే విధానాన్ని నేపాల్ పోలీసులు రూపొందిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. పారి్థవదేహాల తరలింపు విధివిధానాలు పూర్తిగా ఖరారయ్యే వరకు కుటుంబ సభ్యులు నేపాల్ ప్రయాణాలు చేయవద్దని, ముందుగా తెలంగాణ భవన్ లేదా భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. అధికారిక నిర్ధారణ పూర్తయిన తర్వాతే తదుపరి సమాచారాన్ని వెల్లడిస్తామన్నారు. -
ఆ ఘోర ఘటనను గుర్తు చేసిన మోహన్ భగవత్..
ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం.. 349 ప్రాణాలు గాల్లోనే కలిసిపోయాయి. రెండు విమానాలు ఎదురెదురుగా ఢీకొన్న ఆ ఘటన అత్యంత విషాదకర ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది. 1996లో జరిగిన ఈ చార్ఖీ దాద్రి ఘోర ప్రమాదాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తాజాగా గుర్తుచేశారు. ప్రమాదం తర్వాత ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు చేపట్టిన సహాయక చర్యలను ప్రస్తావిస్తూ.. అప్పట్లో మృతులు ముస్లింలా, ఇతరులా అని తాము చూడలేదంటూ ఆయన పేర్కొన్నారు.న్యూయార్క్లో జరిగిన ‘వన్ వరల్డ్ వన్ హ్యుమానిటీ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 1996 నవంబర్ 12న దాద్రి మీదుగా వెళ్తున్న రెండు ప్రయాణికుల విమానాలు గాల్లోనే ఢీకొన్నాయని చెప్పారు. మృతుల్లో ఎక్కువ మంది ముస్లింలేనని గుర్తుచేశారు. ఆ సమయంలో వారు ముస్లింలా? అని మేం ఎప్పుడూ ఆలోచించలేదని.. ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారని భగవత్ అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయకపోవడం వల్లే ఆర్ఎస్ఎస్ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయగలుగుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రతిఫలం ఆశించకపోవడంతో తమ సేవా కార్యక్రమాలను ఆర్ఎస్ఎస్ ప్రచారం చేసుకోదని తెలిపారు.1996 నవంబర్ 12న హరియాణాలోని చార్ఖీ దాద్రి గ్రామం మీదుగా వెళ్తున్న సమయంలో సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 747, కజకిస్థాన్ ఎయిర్లైన్స్కు చెందిన ఇల్యూషిన్ IL-76 విమానాలు గాల్లోనే ఢీకొన్నాయి. ఢిల్లీకి సుమారు 100 కిలోమీటర్ల పశ్చిమాన ఈ ప్రమాదం జరిగింది. రెండు విమానాల్లో ఉన్న మొత్తం 349 మంది మరణించారు. సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ విమానం జెడ్డా నుంచి ఢిల్లీకి వస్తోంది. అందులో 312 మంది ఉన్నారు.మరోవైపు కజకిస్థాన్ ఎయిర్లైన్స్ విమానం ఢిల్లీ నుంచి కజకిస్థాన్లోని చిమ్కెంట్కు బయలుదేరింది. అందులో 37 మంది ఉన్నారు. కజక్ విమానం 15,000 అడుగుల ఎత్తులో కొనసాగాల్సి ఉండగా.. నిర్దేశించిన దానికంటే దిగువకు వచ్చింది. సుమారు 14,000 అడుగుల ఎత్తులో రెండు విమానాలు ఒకే మార్గంలోకి రావడంతో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు విమానాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అందులోని వారెవరూ ప్రాణాలతో బయటపడలేదు.ప్రమాదానికి దారితీసిన ప్రధాన సమస్యల్లో కమ్యూనికేషన్ లోపం ఒకటని దర్యాప్తులో తేలింది. కజకిస్థాన్ ఎయిర్లైన్స్ సిబ్బందికి ఇంగ్లిష్ భాషపై పరిమిత పరిజ్ఞానం ఉండటంతో పాటు.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి వచ్చిన కొన్ని సమాచారాన్ని రేడియో ఆపరేటర్ ద్వారా అందించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఇచ్చిన ఎత్తుకు సంబంధించిన ఆదేశాలపై గందరగోళం ఏర్పడింది. కజక్ విమానానికి ఎక్కువ ఎత్తులో ప్రయాణించాల్సిందిగా సూచించినప్పటికీ.. అది మరింత దిగువకు వచ్చింది. అదే సమయంలో సౌదీ విమానం కూడా అదే గగనతలంలో దిగుతుండటంతో రెండు విమానాలు ఢీకొన్నాయి. -
ఆత్మ పరిశీలన చేసుకోవాలి
న్యూఢిల్లీ: పెండింగ్ కేసులు, విచారణలో జాప్యం, పెరుగుతున్న ఖర్చులతో భారత న్యాయవ్యవస్థ సతమతమవుతోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి.నాగరత్న ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాద సంఘాలు (బార్ కౌన్సిళ్లు) తమ ఆలోచన ధోరణిని మార్చుకుని న్యాయ వితరణను సుస్థిరం చేసేందుకు ముక్తకంఠంతో మాట్లాడాలని పిలుపునిచ్చారు. శనివారం ఢిల్లీ నేషనల్ లా యూనివర్సిటీ (ఎన్ఎల్యూ) 13వ స్నాతకోత్సవంలో జస్టిస్ నాగరత్న, మాట్లాడుతూ బార్ కౌన్సిళ్లు సభ్యుల గౌరవం పొందకపోవడం న్యాయ వ్యవస్థకు శుభసూచకం కాదని అన్నారు. అందువల్ల వృత్తిపరమైన నైతిక ప్రమాణాలను కాపాడటం, నైపుణ్య పరిరక్షణల్లో తమ పాత్ర ఏమిటన్న అంశంపై బార్ కౌన్సిళ్లు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. దేశంలో రాజ్యాంగ విలువలను కాపాడేవారు న్యాయవాదులేనని, బార్ కౌన్సిల్లోని లోపాలు, చేసే తప్పులు దేశ రాజకీయ, పౌర జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతుంది కాబట్టే సమాజంలో వారి ప్రాధాన్యత ఏర్పడిందని చెప్పారు. బార్ సభ్యులు ప్రతి ఒక్కరూ తమ ఆలోచనా ధోరణిని మార్చుకొని, కక్షిదారుల సేవను ప్రజాసేవగా భావించాలని గుర్తు చేశారు. లేదంటే భవిష్యత్తులో న్యాయవాదులు తమ ప్రాముఖ్యతను కోల్పోయే ప్రమాదముందని హెచ్చరించారు. చట్టాలను కాపాడేందుకు న్యాయవాదులు తమ జ్ఞానం, వివేచనలను ఉపయోగించాలని సూచించారు. న్యాయవాదులు ప్రజాస్వామ్య వ్యవస్థలకు ‘‘సేఫ్టీ వాల్్వలు’’ అని అభివర్ణించిన జస్టిస్ నాగరత్న, బార్ స్వతంత్రత అనేది న్యాయవాదుల వ్యక్తిగత ప్రయోజనం కోసం ఇచి్చన హక్కు కాదని స్పష్టం చేశారు. -
మోదీగారు...‘శుద్దీకరణ’ నేరం!
న్యూఢిల్లీ: ‘శుద్దీకరణ’వివాదంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీ లక్ష్యంగా విమర్శలకు దిగారు. కొన్ని రోజుల క్రితం ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగించిన వేదికను భారతీయ జనతా పార్టీ నేతలు శుద్ధి చేయడంపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఆ ఘటన ఒక నేరమని, ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యులపై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదయ్యేలా చూడాలని రాహుల్ గాంధీ శనివారం డిమాండ్ చేశారు. దళితులు బాగుంటే ఓర్చుకోలేని బీజేపీ–ఆర్ఎస్ఎస్ మనస్తత్వం ఇదని ఆయన న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ధ్వజమెత్తారు. నేరం జరిగి 20 రోజులు అవుతున్నా ఇప్పటివరకూ ఎలాంటి చర్య తీసుకోలేదని ఎత్తి చూపారు. ‘‘కాంగ్రెస్ అధ్యక్షుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ అధ్యక్షుడికి న్యాయం కల్పించండి. న్యాయ దక్కేలా చేయడం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత.’’అని రాహుల్ వ్యాఖ్యానించారు. బీజేపీ ఉత్తరాఖండ్ విభాగం అధ్యక్షుడు మహేంద్ర భట్ ‘శుద్ధీకరణ’ను సమర్థించుకున్నారని ఆరోపించిన రాహుల్.. ఆ ‘‘ఆ పని (శుద్ధీకరణ) చేసిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నది మా డిమాండ్. ప్రధాని నరేంద్ర మోదీ తాను అన్ని కులాలకు చెందిన వాడినని, దేశానికి ప్రధానిని అని చెబుతూంటారు. కానీ ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడు మాత్రం శుద్ధీకరణను సమర్థించుకుంటున్నారు’’అని విమర్శించారు. శుద్దీకరణ చేసింది ఆర్ఎస్ఎస్ వాళ్లని, వారిపై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ప్రధాని ఆదేశించాలని రాహుల్ డిమాండ్ చేశారు. ‘‘హల్ద్వానీలో ఖర్గే ర్యాలీ జరిగిన రెండు రోజులకు ఆగస్టు పదవ తేదీన వాళ్లు శుద్దీకరణ చేశారు. ఇది నేరం. ఆగస్టు 13న ఖర్గే ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తారు’’అని గుర్తు చేశారు. ‘‘రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధమిది. రాజ్యాంగాన్ని అందించిన బీఆర్ అంబేద్కర్ లాంటి వారు, మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూలు ఒకపక్కన ఉంటే బీజేపీ–ఆర్ఎస్ఎస్ ఇంకోపక్కన ఉన్నాయి’’ అని అన్నారు.దళితులపై వేల ఏళ్లుగా హింసదళితులపై వేల ఏళ్లుగా హింస జరుగుతోందని, రాజ్యాంగం ప్రకారం ఇది అక్రమమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈనాటికి కూడా దళిత బిడ్డలతో పాఠశాలల్లో మరుగుదొడ్లు శుభ్రం చేయిస్తున్నారని, ఇదీ ఈ దేశపు వాస్తవం అని రాహుల్ ఆరోపించారు. దళితులు బావుల్లోంచి నీరు తాగకుండా, టీకొట్లలో రెండు గ్లాసుల పద్ధతి పాటిస్తున్నారని ఒకటి దళితులకు, ఇంకోటి ఇతరులకు ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. దళిత వరుడు గుర్రంపై ఊరేగుతూ ఎక్కడ తనను కొడతారో అన్న భయంతో హెల్మెట్ ధరించాల్సిన భారత్లో ఉన్నామని చెప్పారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జు ఖర్గే మాత్రమే కాకుండా రాజస్థాన్ నేత తికారామ్ జుల్లి, ఎన్డీయే మంత్రి జీతన్ రామ్ మాంఝీలు కూడా పలు సందర్భాల్లో శుద్దీకరణ అవమానాన్ని ఎదుర్కొన్నట్లు తెలిపారని రాహుల్ వివరించారు. దళితులు ఎంత సక్సెస్ సాధిస్తే అతడిపై దాడులు అంత తీవ్రంగా ఎక్కువవుతాయని ఆరోపించారు. ‘‘ఇది అంటరానితనానికి మరోపేరు’’అని చెప్పారు. -
ఆట.. మీ జీన్స్లో ఉందా?
ఒక చిన్న డీఎన్ఏ నమూనా.. దేశంలో ఒక పెద్ద క్రీడా భవిష్యత్తుకు క్లూ కానుంది! మన క్రీడాకారులు మైదానంలో చెమట చిందించక ముందే.. వారి జన్యువులను ల్యాబ్లో విశ్లేషించి ఎవరు భవిష్యత్ చాంపియన్లు కాగలరో గుర్తించే ప్రయత్నం మొదలైంది! ఎవరు ఏ క్రీడలో రాణించగలరు? ఎవరి శరీరం ఏ ఆటకు అనువుగా ఉంటుంది? ఎవరిలో ఎంత శక్తి దాగుంది? అనే ప్రశ్నలకు సమాధానాలను డీఎన్ఏలో వెతికే సరికొత్త ప్రయోగానికి గుజరాత్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.అహ్మదాబాద్ వేదికగా 2030లో జరగే కామన్వెల్త్ క్రీడల్లో చాంపియన్లుగా నిలిచే సత్తా ఉన్న వారెవరో వెలికితీసేందుకు దేశంలోనే తొలిసారిగా గుజరాత్ ప్రభుత్వం క్రీడా జీనోమిక్స్ కార్యక్రమాన్ని చేపట్టింది. క్రీడాకారుల జన్యు సమాచారాన్ని వారి శారీరక, క్రీడా ప్రదర్శన వివరాలతో అనుసంధానించి సమగ్ర ప్రొఫైళ్లను రూపొందించనుంది. వాటి ఆధారంగా క్రీడా ప్రతిభను గుర్తించడంతోపాటు అందుకు అనువైన క్రీడాశిక్షణను రూపొందించడం, క్రీడాకారులకు అనువైన క్రీడను ఎంపిక చేయడం, గాయాల నిర్వహణ వంటి అంశాలను మరింత మెరుగ్గా చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఈ కార్యక్రమాన్ని గుజరాత్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో ఆ రాష్ట్ర బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ అమలు చేస్తోంది. ఇందుకోసం గుజరాత్ అథ్లెట్ జీనోమ్ డేటాబేస్ను రూపొందించనుంది. ఇందులో క్రీడాకారుల జన్యు, శారీరక, క్రీడా ప్రదర్శనకు సంబంధించిన సమాచారాన్ని సమీకరిస్తారు. ‘‘క్రీడా ప్రతిభను గుర్తించి, క్రీడాకారులను అభివృద్ధి చేసేందుకు మరింత శాస్త్రీయ, ఆధారిత విధానాన్ని రూపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం’’ అని గుజరాత్ శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి అర్జున్ మోఢ్వాడియా తెలిపారు.ఈ ఏడాది 2,000 డీఎన్ఏ నమూనాలుమొదటి దశలో టెన్నిస్ క్రీడాకారుల నుంచి డీఎన్ఏ నమూనాలను సేకరించనున్నారు. తదుపరి దశలో ఆర్చరీ, ఫెన్సింగ్, జూడో, షూటింగ్ క్రీడాకారులను చేర్చనున్నారు. ఈ ఏడాది సుమారు 2,000 నమూనాలు, వచ్చే ఏడాది 10,000 నమూనాలు సేకరించి విశ్లేషించాలని గుజరాత్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 14 ఏళ్లలోపు, 14 నుంచి 18 ఏళ్లలోపు, 18 ఏళ్లు పైబడిన క్రీడాకారుల కోసం వేర్వేరు విభాగాలతో డేటాబేస్ రూపొందించనున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి చాంపియన్లకు ఇందులో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అథ్లెటిక్స్, స్విమ్మింగ్, బాక్సింగ్, రెజ్లింగ్, జూడో, టెన్నిస్, తైక్వాండో, జిమ్నాస్టిక్స్, ఫెన్సింగ్, ఫుట్బాల్, హాకీ, హ్యాండ్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, లాన్ టెన్నిస్, కబడ్డీ, ఖోఖో, ఆర్చరీ, షూటింగ్, చెస్ తదితర క్రీడలకు సంబంధించిన సమాచారాన్ని డేటాబేస్లో చేర్చనున్నారు.గాయాలు, శిక్షణపై కూడా ఉపయోగంజన్యు లక్షణాలు కండరాల నిర్మాణం, ఓర్పు, జీవక్రియ, వ్యాయామానికి శరీరం స్పందించే తీరు, కోలుకునే వేగం, గాయాలకు గురయ్యే అవకాశాలు వంటి అంశాలతో ఏ మేరకు సంబంధం కలిగి ఉన్నాయో తెలుసుకునేందుకు స్పోర్ట్స్ జీనోమిక్స్ ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ‘‘జన్యు, జీవసంబంధ సమాచారాన్ని సమీకరించడం ద్వారా ప్రతి క్రీడాకారుడికి మరింత సమగ్ర ప్రొఫైల్ను రూపొందించడమే గుజరాత్ నమూనా లక్ష్యం. తద్వారా క్రీడాకారుల ప్రతిభపై మరింత లోతైన అవగాహన లభిస్తుంది’’ అని సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కార్యదర్శి బి. భారతి తెలిపారు. -
క్షేమంగా ఇంటికి చేరుకున్న 28 మంది యాత్రికులు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రకృతి విలయానికి అతలాకుతలమైన నేపాల్లో చిక్కుకున్న మొత్తం 68 మంది ఏపీ వాసుల్లో ఇప్పటివరకు 28 మంది సురక్షితంగా స్వస్థలాలకు చేరారు. ఇంకా 13 మంది జాడ తెలీకపోవడంతో.. వారి ఆచూకీ కోసం అక్కడి అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వీరంతా మానస సరోవర్ యాత్ర, ట్రెక్కింగ్ కోసం వెళ్లిన వారే కావడం గమనార్హం. ఇందులో కొందరు విదేశాల్లో స్థిరపడ్డారు. దీంతో మిగిలిన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.‘సైన్ ఇన్ ట్రావెల్స్’ ఆధ్వర్యంలో మానస సరోవర్ యాత్రకు వెళ్లిన సుమారు 28 మంది అక్కడ వరదల్లో చిక్కుకున్నారు. భారీగా వరదలు వ్యాపించడంతో వీరి కళ్ళెదుటే ఎంతోమంది మృత్యువాతపడ్డారు. అయితే, వీరందరూ శుక్రవారం రాత్రి, శనివారం మధ్యాహ్నానికి పలు గ్రూపులుగా హైదరాబాద్, విజయవాడ చేరుకున్నారు. కళ్లేదుటే ఘోరం జరిగినా ఎవరినీ రక్షించలేని, ఎవరికీ సహాయపడలేని స్థితిలో ఉన్నామంటూ వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఇక ఆచూకీ లభించని 13 మంది అన్నమదేవర వెంకట్రామ్, అన్నమదేవర అనఘ, చొప్పరపు రమేశ్బాబు, సంతోష్ సాహు, స్పందన్ సాహు, పాధ్య సురభి మన్మథ, సైనా కుమారి సాహు, వీఎల్ బాలసుబ్రహ్మణ్యం, అట్లూరి శశికుమార్, నిమ్మగడ్డ రాజ్య లక్షి్మ, కె. గోవింద్, సుహాసిని రెడ్డి కందిమల్ల, రంగనాథ్లుగా గుర్తించారు. భాస్కర్ శాస్త్రి కుటుంబం క్షేమం.. మరోవైపు.. అక్కడ చిక్కుకున్న వారిలో కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన భాస్కర్శాస్త్రి, మణి శారద, రఘునాథ శాస్త్రి, హన్షిక కూడా సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. అయితే, రఘునాథ శాస్త్రికి తీవ్రమైన పల్మనరీ ఎడిమా (ఊపిరితిత్తుల్లో ద్రవం చేరడం) ఏర్పడడంతో ఆ కుటుంబం శుక్రవారం సాగా చేరుకుని హోటల్లో బసచేసింది. అక్కడ ఆక్సిజన్ సదుపాయం ఏర్పాటుచేశారు. శనివారం వారు న్యాలమ్ కౌంటీకి చేరుకున్నారు. సరిహద్దు, వాతావరణం, రహదారి పరిస్థితులను బట్టి కోడారి మీదుగా కాఠ్మాండు చేరేందుకు వారు ప్రయతి్నస్తున్నారు. వీరి కుటుంబం ఆది లేదా సోమవారం కాఠ్మాండు చేరుకునే అవకాశముంది. సెప్టెంబర్ 1న కాఠ్మాండు–ముంబై–హైదరాబాద్ విమాన ప్రయా ణం ఖరారైనట్లు అధికారులు తెలిపారు. -
రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో మనుస్మృతికి, డా. బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి మధ్య పోరాటం జరుగుతోందని అన్నారు. శనివారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కేంద్రంపై సంచలన ఆరోపణలు చేశారు.ఆర్ఎస్ఎస్, బీజేపీ మనుస్మృతిని అనుసరిస్తున్నాయి. మనుస్మృతి ఆధారంగానే దళితులపై వివక్ష కొనసాగుతోంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే పాల్గొన్న సభలను వాళ్లు శుద్ధీకరణ చేస్తున్నారు. ఈ ఘటనే వాళ్ల వివక్షకు నిదర్శనం. అంటరాని తనం పాటిస్తున్నారు.. అది నేరం. దేశంలో దళితులపై అనాదిగా కొనసాగుతున్న అణచివేతకు ఇప్పటికీ పూర్తిగా తెరపడలేదని రాహుల్ గాంధీ అన్నారు. ముఖ్యంగా ఉత్తర భారతంలో దళిత విద్యార్థులతో మరుగుదొడ్లు కడిగించడం, ‘శుద్ధీకరణ’ పేరుతో వివక్ష చూపడం వంటి ఘటనలు అంటరానితనానికి నిదర్శనమని విమర్శించారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై వెంటనే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని కులాలకు చెందిన వాడినని ప్రధాని మోదీ చెబుతున్నప్పటికీ.. బీజేపీ నేతలు మాత్రం పాత కుల వివక్ష విధానాలనే కొనసాగిస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి కొత్త సంస్థలు, కొత్త పేర్లు, కొత్త విభాగం వచ్చినా.. దాని విధానాలు మాత్రం మారలేదని విమర్శించారు. భారత రాజ్యాంగం కల్పించిన సమానత్వం, హక్కులను కాపాడటం కోసమే తమ పోరాటమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారుLIVE: Special Congress Party Briefing by LoP Shri @RahulGandhi at AICC HQ, New Delhi https://t.co/f6sL6o2vHX— Congress (@INCIndia) August 29, 2026 ఇదీ చదవండి: సోనియా బుక్.. అందుకే బీజేపీ భయపడుతోందా? -
ఆ మూడింటి వల్లే.. సోనియా పుస్తకాన్ని ఆపేశారా!?
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాసిన బిలాంగింగ్ ఏ జర్నీ ఆఫ్ లవ్ పుస్తకం భారత్లో ప్రచురణపై వివాదం ముదురుతోంది. ప్రపంచవ్యాప్తంగా పుస్తకాన్ని ప్రచురించేందుకు సిద్ధమైన పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా.. ఇక్కడ మాత్రం పబ్లిష్ చేయబోమని ప్రకటించింది. అయితే వ్యవహారంపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉండటంతోనే పెంగ్విన్ వెనక్కి తగ్గిందని అంటోంది.సోనియా గాంధీ రాసిన ఈ జ్ఞాపకాల పుస్తకాన్ని అమెరికాకు చెందిన ఆల్ఫ్రెడ్ ఏ. నాఫ్.. పెంగ్విన్ రాండమ్ హౌస్ గ్రూప్లోని సంస్థగా నవంబర్ 10న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే భారత్లో ఈ పుస్తకానికి పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ప్రచురణకర్త కాదని తాజాగా స్పష్టం చేసింది. పుస్తకాన్ని ప్రచురించేందుకు తాము ఆసక్తి చూపామని, అయితే అందులో కొన్ని విషయాల్ని తాము నిజమా? కాదా? అని ధృవీకరించుకోవాల్సి ఉంటుందని, ఈ క్రమంలో రచయిత(సోనియా గాంధీ)తో జరిగిన చర్చల పూర్తి ఫలవంతంగా జరగలేదని వెల్లడించింది. ఆ వివరాలు గోప్యమైనవని, వాటిపై మరింత వ్యాఖ్యానించబోమని తెలిపింది.మూడు అంశాలే అసలు వివాదమా?కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం.. ఆటోబయోగ్రఫీలో మూడు కీలక అంశాలపై పెంగ్విన్ ఇండియాతో సోనియా గాంధీకి విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. మొదటిది చైనా సరిహద్దు వివాదం, భారత భూభాగంలో చొరబాట్లు. రెండోది ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, ఆయన పనితీరు, కేంద్ర ప్రభుత్వ విధానాలపై సోనియా గాంధీ అభిప్రాయాలు. మూడోది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రభావం, భారత రాజకీయాలు-సామాజిక వ్యవస్థపై దాని పాత్ర. ఈ అంశాలకు సంబంధించిన కొన్ని భాగాలను సవరించాలని లేదంటే పూర్తిగా తొలగించాలని పెంగ్విన్ ఇండియా సూచించినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే తన అనుభవాలు, అభిప్రాయాల ఆధారంగా రాసిన విషయాలను మార్చేందుకు సోనియా గాంధీ అంగీకరించలేదని సమాచారం.‘ఒత్తిడి ఉంది’.. కాంగ్రెస్ ఆరోపణఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. లోక్సభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్.. పెంగ్విన్ ఇండియా ప్రకటన బలహీనంగా ఉందని వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్, ఇతర అంశాలపై పుస్తకాలను ప్రచురించేందుకు సంస్థ సిద్ధంగా ఉండగా.. సోనియా గాంధీ పుస్తకంపై ఎందుకు వెనుకడుగు వేసిందని ప్రశ్నించారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ కూడా ఇదే ప్రశ్నను లేవనెత్తారు. ప్రపంచవ్యాప్తంగా అదే పుస్తకాన్ని ప్రచురిస్తున్నప్పుడు భారత్లో మాత్రం మార్పులు ఎందుకు కోరుతున్నారని నిలదీశారు. పుస్తకాన్ని ఒత్తిడితో అడ్డుకోవడం భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతం అని ఆరోపించారు.‘కట్టుకథలు అల్లొద్దు’.. బీజేపీ కౌంటర్కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. పుస్తకంపై భయాందోళన వాతావరణం ఉందంటూ కాంగ్రెస్ తప్పుడు కథనాన్ని సృష్టిస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్ కేసవన్ విమర్శించారు. పుస్తకంలోని ఏ భాగాలకు వాస్తవ నిర్ధారణ అవసరమైందో కాంగ్రెస్ నేతలు చెప్పాలని ప్రశ్నించారు. మరో బీజేపీ నేత అజయ్ అలోక్.. పుస్తకంలో వాస్తవాలు, గణాంకాలు సరిగా లేకపోవడం వల్లే ప్రచురణకర్తలు వెనక్కి తగ్గుతున్నారని వ్యాఖ్యానించారు.ఆత్మకథలో ఏముంది?‘Belonging: A Journey of Love’లో తన జీవితంలోని వ్యక్తిగత, రాజకీయ ప్రయాణాన్ని సోనియా గాంధీ వివరించారు. ఇటలీలో ఓ చిన్న పట్టణంలో గడిపిన బాల్యం నుంచి రాజీవ్ గాంధీ భార్యగా భారత్కు రావడం, ఇందిరా గాంధీ కోడలిగా మారడం, 1984లో ఇందిరా గాంధీ హత్య, 1991లో రాజీవ్ గాంధీ హత్య తర్వాత రాజకీయాల్లోకి రావడం వంటి కీలక ఘట్టాలను పుస్తకంలో ప్రస్తావించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సుదీర్ఘకాలం కొనసాగిన తన రాజకీయ జీవితంతోపాటు.. 2004లో ప్రధాని పదవిని చేపట్టే అవకాశం వచ్చినప్పటికీ దాన్ని తిరస్కరించిన నిర్ణయం గురించి కూడా తన జ్ఞాపకాలను పంచుకున్నట్లు ప్రచురణకర్త వెల్లడించింది.ఇక భారత్లో ఈ పుస్తకాన్ని ఎవరు ప్రచురిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పెంగ్విన్ ఇండియా నుంచి పుస్తక ప్రచురణ తప్పుకున్న నేపథ్యంలో హార్పర్కాలిన్స్ సహా పలు భారతీయ ప్రచురణ సంస్థలు హక్కుల కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం. అయితే పెంగ్విన్ అభ్యంతరాలపై కాంగ్రెస్-బీజేపీ మధ్య కౌంటర్లతో సోనియా గాంధీ పుస్తకం విడుదలకు ముందే రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది.పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా చుట్టూ వివాదాలు కొత్తేమీ కావు. గతంలో మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవణే రచించిన Four Stars of Destiny విషయంలోనూ ప్రచురణపై వివాదం చెలరేగింది. అలాగే వెండీ డోనిగర్ రచించిన The Hindus: An Alternative History పుస్తకాన్ని 2014లో న్యాయపరమైన వివాదాల నేపథ్యంలో పెంగ్విన్ ఇండియా భారత మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంది. తాజాగా సోనియా గాంధీ Belonging: A Journey of Love విషయంలోనూ ప్రచురణపై వివాదం తెరపైకి రావడంతో పెంగ్విన్ వ్యవహారశైలి మరోసారి చర్చనీయాంశమైంది.ఇదీ చదవండి: మలాలా ఆత్మకథ చదివినందుకు.. పనిష్మెంట్! -
చైనా సరిహద్దు! నేపాల్ సంచలన నిర్ణయం.. భారత్ కీలక ప్రకటన!
భారీ వరదల నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సహాయక చర్యల కోసం ఇతర దేశాల సాయం తమకేం అక్కర్లేదని తేల్చేసింది. అన్ని ప్రభుత్వ యంత్రాంగాలను సహాయక చర్యలకు రంగంలోకి దింపినట్లు ప్రధాని బాలేంద్ర షా వెల్లడించారు. తమ భద్రతా బలగాలే సమర్థంగా పని చేస్తున్నాయని.. అలాంటప్పుడు వేరే దేశాల అవసరం తమకు ఉండకపోవచ్చని నేపాల్ విదేశాంగ శాఖ అంటోంది. దీనికి స్పందించిన భారత్.. ఓ కీలక ప్రకటన చేసింది.నేపాల్-టిబెట్ సరిహద్దులో బుధవారం ఆకస్మిక వరద పోటెత్తింది. ఎగువన ఉన్న గ్లేసియర్ కరిగిపోవడంతో.. బండరాళ్లు, బురదతో కూడిన వరద క్షణాల్లో ముంచెత్తడంతో పలు గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. సహాయక చర్యలు కొనసాగుతుండగా.. ఇప్పటిదాకా 600 మృతదేహాలను వెలికి తీశారు. మరో 1,400 మంది జాడ తెలియాల్సి ఉంది. ఇందులో భారత్ సహా పలు దేశాలకు చెందిన యాత్రికులు కూడా ఉన్నారు. ముఖ్యంగా నేపాల్లోని రసువా జిల్లాలో వరద బీభత్సం తీవ్రంగా ఉంది. పలు గ్రామాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోగా.. రహదారులు, వంతెనలు ధ్వంసమయ్యాయి. జలవిద్యుత్ ప్రాజెక్టులకు భారీ నష్టం వాటిల్లింది. ఇంతకు ముందు వరద కారణంగా ఏర్పడిన మరో సరస్సు కట్టలు తెంచుకునే ప్రమాదం చైనా ఇప్పటికే నేపాల్ను హెచ్చరించింది. దీంతో మరోసారి జల ప్రళయం(మునుపటి కంటే ఐదు రెట్లు తీవ్రతతో..) రావొచ్చని ఆందోళనల నడుమ అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.భారత్ రియాక్షన్ ఇదే..నేపాల్ విదేశీ రెస్క్యూ బృందాల అవసరం లేదని ప్రకటించినప్పటికీ.. భారత్ మాత్రం అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. నేపాల్ అభ్యర్థన మేరకు.. అదనపు మానవతా సాయం, వైద్య బృందాలు, ఇంజినీరింగ్ సిబ్బంది, అవసరమైన పరికరాలను పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది.ఇప్పటికే రెండు విమానాల్లో సహాయక సామగ్రిని నేపాల్కు పంపినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. మరో విమానం కూడా త్వరలో బయలుదేరనుంది. టన్నెల్ రెస్క్యూ టీమ్ను పంపేందుకు ముందుగా రెకీ బృందాన్ని పంపుతున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. అక్కడి పరిస్థితిని పరిశీలించిన అనంతరం అవసరమైన పరికరాలను గుర్తించనున్నారు. అదేవిధంగా వైద్య బృందాన్ని పంపడంతోపాటు.. వరదల కారణంగా దెబ్బతిన్న రహదారి కనెక్టివిటీని పునరుద్ధరించేందుకు బెయిలీ(పోర్టబుల్) వంతెనలు, సాంకేతిక బృందాలను అందించేందుకు భారత్ ముందుకొచ్చింది.బృందాలనూ పంపుతాంసహాయక చర్యల్లో సహాయం చేసేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అవసరమైన పరికరాలను పంపేందుకు భారత్ ప్రత్యేకంగా నేపాల్కు ప్రతిపాదన చేసినట్లు జైస్వాల్ వెల్లడించారు. దీనిపై నేపాల్ ప్రభుత్వం నుంచి స్పందన కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. విపత్తుతో ప్రభావితమైన ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.పలు దేశాల నుంచి సాయం ఆఫర్నేపాల్ వరదల్లో తమ దేశాలకు చెందిన పౌరులు గల్లంతైన నేపథ్యంలో పలు దేశాలు సహాయక బృందాలను పంపేందుకు ముందుకొచ్చాయి. భారత్, చైనా, అమెరికా, బ్రిటన్, జపాన్, దక్షిణ కొరియా, శ్రీలంక, బంగ్లాదేశ్ రెస్క్యూ బృందాలను పంపేందుకు ఆసక్తి వ్యక్తం చేసినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ప్రస్తుతానికి విదేశీ రెస్క్యూ బృందాల అవసరం లేదని నేపాల్ విదేశాంగ శాఖ ప్రతినిధి లోక్ బహదూర్ ఛేత్రి తెలిపారు. తమ భద్రతా సంస్థలు ఇప్పటికే శోధన, రక్షణ చర్యలను చేపట్టాయని.. అవి సమర్థంగా కొనసాగుతున్నాయని చెప్పారు.చైనా సరిహద్దు ప్రాంతం కావడం వల్లేనా?విదేశీ రెస్క్యూ బృందాలను అనుమతించకపోవడం వెనుక రసువా ప్రాంత భౌగోళిక ప్రాధాన్యత కూడా కారణమై ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ ప్రాంతం చైనా ఆధీనంలోని టిబెట్కు సమీపంలో ఉండటంతో.. విదేశీ బృందాల రాక సున్నితమైన అంశంగా మారి ఉండొచ్చని నేపాల్ మాజీ దౌత్యవేత్త దినేశ్ భట్టారాయ్ అభిప్రాయపడ్డారు. అయితే నేపాల్ విదేశాంగ శాఖ మాత్రం ఆ అభిప్రాయాన్ని తోసిపుచ్చింది.‘సాయం పూర్తిగా వద్దనడం కాదు’నేపాల్ అంతర్జాతీయ సాయాన్ని పూర్తిగా తిరస్కరించడం లేదని ఛేత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ భద్రతా వ్యవస్థ సమర్థంగా పనిచేస్తోందని, ఏదైనా ప్రత్యేక నైపుణ్యం లేదంటే సాంకేతిక సహాయం అవసరమైతే ఆయా దేశాలను తామే సంప్రదిస్తామని చెప్పారు.వరదల్లో దక్షిణ కొరియాకు చెందిన పలువురు జలవిద్యుత్ ప్రాజెక్టు సిబ్బంది గల్లంతయ్యారు. నేపాల్ ప్రస్తుతం విదేశీ రెస్క్యూ బృందాలను అంగీకరించే పరిస్థితిలో లేదని తమకు సమాచారం అందినట్లు దక్షిణ కొరియా తెలిపింది. అయినప్పటికీ నేపాల్తో చర్చలు కొనసాగిస్తామని పేర్కొంది. మానవతా సాయం కింద 10 లక్షల డాలర్లను అందించనున్నట్లు ప్రకటించింది.ఆ వెంటనే యూటర్న్.. విదేశీ బృందాలకు ఓకే!విదేశీ రెస్క్యూ బృందాల సాయం అవసరం లేదన్న నేపాల్ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. అంతర్జాతీయ ఒత్తిడి, పెద్ద సంఖ్యలో విదేశీయులు గల్లంతైన నేపథ్యంలో పరిమిత స్థాయిలో విదేశీ నిపుణులను అనుమతించింది. భారత్, చైనా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా నుంచి నిపుణులు టన్నెల్ రెస్క్యూ, డీఎన్ఏ పరీక్షలు, ఫోరెన్సిక్ గుర్తింపు ప్రక్రియల్లో సహకరించనున్నారు. ఇదిలా ఉండగా.. భారత్ ఇప్పటికే వైద్య, టన్నెల్ రెస్క్యూ బృందాలతో పాటు ఎన్డీఆర్ఎఫ్ సాయాన్ని అందించేందుకు చర్యలు చేపట్టింది.ఇదీ చదవండి: ఫరక్కా డెడ్లైన్.. మరో జల యుద్ధం తప్పదా? -
మధ్యవర్తిత్వ కేసుల నియంత్రణకు ఎంసీఐ
న్యూఢిల్లీ: దేశంలో మధ్యవర్తిత్వ కేసులను నియంత్రించేందుకు ఉద్దేశించిన మీడియేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) ఎట్టకేలకు ఏర్పాటైంది. ఇందుకు సంబంధించిన మీడియేషన్ చట్టం–2023లోనే అమల్లోకి వచ్చింది. కానీ, మూడేళ్లుగా ఎంసీఐను ఏర్పాటు చేయకపోవడంపై పార్లమెంటరీ కమిటీ ఇటీవల కేంద్రంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ చట్టంతో ఒనగూరే పూర్తి ప్రయోజనాలను పొందేందుకు ఎంసీఐని త్వరగా అందుబాటులోకి తీసుకురావడం చాలా కీలకమని కమిటీ పేర్కొంది. ఈ నివేదిక ఈ నెలారంభంలో పార్లమెంట్ ముందుకు వచ్చింది. అయితే, అర్హులైన న్యాయ నిపుణుల కొరత కారణంగా ఇప్పటి దాకా ఎంసీఐను ఏర్పాటు చేయలేకపోయినట్లు కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలోనే గురువారం రాత్రి ఎంసీఐ ఏర్పాటుపై కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ కౌన్సిల్ సంస్థాగత వివాద పరిష్కార విధానాన్ని క్రమబదీ్ధకరించడంతోపాటు మధ్యవర్తిత్వ ప్రక్రియను ప్రోత్సహిస్తుంది. అలాగే, మధ్యవర్తిత్వం ద్వారా కేసులను పరిష్కరించే సంస్థలకు గుర్తింపునిస్తుంది. ఈ రంగంలో నిపుణులకు శిక్షణ ఇచ్చి, ధ్రువీకరణ పత్రాలు అందించే సంస్థలకు కూడా అనుమతులను మంజూరు చేస్తుంది. వాణిజ్య, సివిల్, కుటుంబ వివాదాలను కోర్టుల వెలుపల పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం రెండు విధానాలను ప్రోత్సహిస్తోంది. మొదటిది సంస్థాగత మధ్యవర్తిత్వ తీర్పు, రెండోది మీడియేషన్ అంటే సంప్రదింపుల ద్వారా మధ్యవర్తిత్వం. సంస్థాగత మధ్యవర్తిత్వంలో కేసులను తీర్పుల ద్వారా పరిష్కరిస్తే, సంప్రదింపుల మధ్యవర్తిత్వంలో కేసులను సయోధ్య ద్వారా పరిష్కరిస్తారు. ఏదైనా సరే ఇవి రెండూ తాత్కాలిక ఏర్పాట్లు మాత్రం కావు. ఆర్బిట్రేషన్, మీడియేషన్ వ్యవస్థలు సంస్థాగతమైనవి. ఇవి చూపే పరిష్కారానికి ఇరుపక్షాలు కచ్చితంగా కట్టుబడి ఉండాల్సిందే. కోర్టుల్లో కేసులు గుట్టలుగా పేరుకుపోవడం, న్యాయం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితుల నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వ విధానాలకు ప్రాధాన్యం ఇస్తోంది. -
ఉల్లి ధరల కట్టడికి రంగంలోకి కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలకు ఉపక్రమించింది. బఫర్ నిల్వ ల్లోని ఉల్లిని మార్కెట్లోకి విడుదల చేస్తూ ఢిల్లీలో కిలో రూ.35కే రాయితీపై విక్రయాలను ప్రారంభించింది. త్వరలో మరిన్ని నగరాలకు ఈ పథకాన్ని విస్తరించేందుకు రంగం సిద్ధం చేసింది. అక్రమంగా నిల్వ చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని రాష్ట్రాలకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అకాల వర్షాలు.. పాడైన నిల్వలు.. దేశంలో ఉల్లి దిగుబడి పుష్కలంగా ఉంది. దేశీయ అవసరాలకు మించిన ఉత్పత్తి ఉన్నప్పటికీ ధరల పెరుగుదలకు ప్రధానంగా అకాల వర్షాలు, నిల్వ ఉంచిన ఉల్లి కుళ్లిపోవడం కారణాలుగా కనిపిస్తున్నాయి. 2025–26లో దేశంలో 307.37 లక్షల టన్నుల ఉల్లి ఉత్పత్తి జరిగింది. దేశీయంగా ఏడాదికి 204 లక్షల టన్నుల ఉల్లి అవసరమవుతుంది. సాధారణ పరిస్థితుల్లో ఈ ఉత్పత్తి దేశీయ డిమాండ్ను సులభంగా తీర్చగలిగేది. కానీ ఈసారి రబీ పంట కోత సమయంలో కురిసిన అకాల వర్షాలు ఉల్లి డిమాండ్ లెక్కలను మార్చేశాయి. మార్చి, ఏప్రిల్లో కురిసిన భారీ వర్షాలతో పొలాల్లో నీరు నిలిచిపోయింది. దీంతో తేమశాతం పెరిగి నిల్వ చేసిన ఉల్లిలో ఫంగస్ ఏర్పడి కుళ్లిపోవడం ప్రారంభమైంది. సాధారణంగా ఏటా ఉల్లి ఉత్పత్తిలో 25 శాతం వరకు నష్టం జరుగుతుంది. ఈ ఏడాది వర్షాలు, అధిక తేమ కారణంగా ఈ నష్టం 35–40 శాతానికి పెరిగినట్లు అంచనా. అంటే, 110 నుంచి 120 లక్షల టన్నుల ఉల్లి కుళ్లిపోయినట్లు అంచనా వేస్తున్నారు. దీంతో మార్కెట్లకు చేరుతున్న నాణ్యమైన ఉల్లి పరిమాణం తగ్గింది. ఇదే ధరల పెరుగుదలకు కారణమైంది. దీంతో ప్రస్తుతం మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.60 నుంచి రూ.70 వరకు చేరింది. రాజధానిలో సంచార విక్రయ కేంద్రాలు ధరల కట్టడి చర్యల్లో భాగంగా కేంద్రం ఎన్సీసీఎఫ్, నాఫెడ్ ఆధ్వర్యంలో మొబైల్ వాహనాలు, రిటైల్ కేంద్రాల ద్వారా రాయితీ ఉల్లిని విక్రయిస్తున్నారు. ఢిల్లీలో 40 ఎన్సీసీఎఫ్ మొబైల్ వాహనాలు, 50 నాఫెడ్ మొ బైల్ వాహనాలు, వాటి రిటైల్ కేంద్రాలతో పాటు కేంద్రీయ భండార్ దుకాణాల్లోనూ ఉల్లిని అందుబాటుకి తెచ్చారు. త్వరలో లక్నో, పటా్న, అమృత్సర్, కోల్కతా, చండీగఢ్ తదితర నగరాలకు రాయితీపై ఉల్లిని విక్రయించనున్నారు. దేశంలోని ప్రధాన వినియోగ కేంద్రాలకు రైలు, రోడ్డు మార్గాల్లో ఉల్లిని తరలించనున్నారు. ఇదే సమయంలో ఉల్లిని అక్రమంగా నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించడం, బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడటాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ధరల పెరుగుదల కోసం ఉల్లిని దాచిపెట్టే వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. పండుగల సమయంలో సరఫరాకు ఇబ్బంది లేకుండా బఫర్ నిల్వలను అవసరమైన మేరకు విడుదల చేస్తామని వెల్లడించింది.


