breaking news
Prakasam
-
అధిక ధరలపై కన్నెర్రజేసీ
కొత్తపట్నం: యూరియాను అధిక ధరలకు విక్రయించడంపై జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ కన్నెర్ర చేశారు. దుకాణదారునిపై 6ఏ కేసు నమోదు చేసి యూరియా నిల్వలను సీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే..కొత్తపట్నం మండలంలో ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న సమాచారంతో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు, ఒంగోలు సహాయ వ్యవసాయ సంచాలకుడు బి.రమేష్బాబు, తహసీల్దార్ శాంతి, వ్యవసాయాధికారి జి.కిషోర్బాబు బృందంతో దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేశారు. తొలుత కొత్తపట్నం శివాలయం వీధిలో ఉన్న షా ఎంటర్ప్రైజెస్ ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేశారు. తనిఖీల్లో యూరియా రూ.266లకు విక్రయించాల్సి ఉండగా అధిక ధరకు రూ.300 విక్రయిస్తుండటంతో జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దుకాణదారునిపై 6ఏ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. దుకాణంలోని 108 యూరియా బస్తాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఎరువుల బస్తాలు ఎమ్మార్పీ కంటే అధిక ధరకు విక్రయిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రైతులు ఫిర్యాదు చేస్తే దుకాణ యజమానులపై చట్టపర చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులకు ధరలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. -
ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోండి
● జాతీయ రహదారిపై ట్రాక్టర్ అడ్డుపెట్టి చిన్నగుడిపాడు గ్రామస్తుల రాస్తారోకో పెద్దదోర్నాల: కర్నూల్, గుంటూరు జాతీయ రహదారిపై తరచూ చోటు చేసుకుంటున్న ప్రమాదాలను నివారించేందుకు చర్యలు చేపట్టాలని చిన్నగుడిపాడు వాసులు మంగళవారం వాహనాల రాకపోకలను అడ్డుకుని రాస్తారోకోకు దిగారు. దీంతో కర్నూల్, గుంటూరు జాతీయ రహదారిపై గంట పాటు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరిధిలోని చిన్నగుడిపాడులో సోమవారం రాత్రి ఓ వాహనం ఢీకొని బొమ్మలాపురానికి చెందిన వ్యకి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ రహదారిలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో స్పీడ్ బ్రేకర్లతో పాటు డివైడర్లు ఏర్పాటు చేసి ప్రమాద తీవ్రతను తగ్గించాలని కోరుతూ గ్రామస్తులు రాస్తారోకోకు దిగారు. ఈ సందర్భంగా ట్రాక్టర్లను రోడ్డుకు అడ్డంగా పెట్టి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో సమాచారం అందుకున్న ఎస్సై మహేష్ హుటాహుటిన చిన్న గుడిపాడుకు చేరుకుని ఆందోళన చేస్తున్న వారితో చర్చించారు. సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని, వాహనాల రాకపోకలను అడ్డుకోవడం సరైన చర్య కాదన్నారు. సమస్య ఉన్నప్పుడు తహశీల్దార్ దృష్టికో, లేదంటే ఉన్నతాధికారుల దృష్టికో తీసుకు రావాలన్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని, ఆందోళన విరమించాలని కోరడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. దీంతో ట్రాఫిక్లో చిక్కుకున్న వాహనాల రాకపోకలను పోలీసులు క్రమబద్ధీకరించారు. -
మోసం చేయడం బాబు నైజం
నాగులుప్పలపాడు: ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నైజమని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. మండలంలోని చవటపాలెం, చేకూరపాడు గ్రామాల్లో మంగళవారం బాబు ష్యూరిటీ..మోసం గ్యారంటీ కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మేరుగు నాగార్జున మాట్లా డుతూ చంద్రబాబు మాయమాటలు, అబద్ధపు హామీ లు నమ్మి ప్రజలు నిలువునా మోసపోయారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని ఇంత వరకు సక్రమంగా అమలు చేయలేదన్నారు. ప్రతి పనికి దోచుకోవడం, దాచుకోవడం చందాన టీడీపీ నాయకులు అవినీతి కూపంలో కూరుకుపోయారన్నారు. ఏ పనిచేసుకోలేని దివ్యాంగుల పెన్షన్ను అన్యాయంగా తొలగిస్తూ చంద్రబాబు వారి ఊసురుపోసుకుంటున్నాడని మండిపడ్డారు. సంక్షేమ పథకాలు అమలు చేయడం చేతకాక రోజుకో డైవర్షన్ రాజకీయాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. పొగాకు, మిర్చి రైతులను చంద్రబాబు చేసిన మోసం వారు జీవితంలో మరచిపోరన్నారు. బర్లీ పొగాకు కొనుగోళ్లలో పార్టీలు చూసి కోనుగోలు చేస్తున్న ఈ ప్రభుత్వ తీరును ప్రజలు ఛీదరించుకుంటున్నారన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో జగనన్న మార్క్ఫెడ్ను రంగంలోకి దించడంతో పొగాకు బోర్డు చరిత్రలో ఎన్నడూ చూడని ధరలు పలికి రైతులు ఎంతో లాభపడ్డారన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రైతులంతా నష్టాల పాలై సాగుకు దూరమయ్యే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ హయాంలో అర్హతే ప్రామాణికంగా ఎవరి సిఫార్సు లేకుండా పథకాలు అందించారన్నారు. చంద్రబాబు నిరంకుశ పాలనకు రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉన్నాయన్నారు. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో ప్రజలంతా తిరగబడాలని పిలుపునిచ్చారు. అనంతరం బాబు ష్యూరిటీ– మోసం గ్యారెంటీ క్యూ ఆర్ కోడ్ను నాయకులతో కలిసి ఆవిష్కరించారు. రాష్ట్ర నాయకులు నలమలపు కృష్ణారెడ్డి, రైతు విబాగం జిల్లా అధ్యక్షుడు మారెళ్ల బంగారుబాబు, మండల కన్వీనర్ పోలవరపు శ్రీమన్నారాయణ, మేధావుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కంచర్ల సుధాకర్, గ్రీవెన్స్ సెల్ జిల్లా అధ్యక్షుడు పోలినేని కోటేశ్వరరావు, మండల ఉపాధ్యక్షుడు కాటూరి ఆదియ్య, కాకర్ల వెంకటేష్, మండల యూత్ అధ్యక్షుడు ఇమ్మిశెట్టి బాలకృష్ణ, మండల మహిళా అధ్యక్షురాలు పోకూరి లక్ష్మీ, పోకూరి హరిబాబు, చంద్రయ్య, గోపిరెడ్డి, చవటపాలెం గ్రామ సర్పంచ్ కాట్రగడ్డ వనజ శ్రీనివాసరావు, ఎంపీటీసీ సంతోష్, ఈదర శ్రీకాంత్, ఎండ్లూరి సుధీర్ పాల్గొన్నారు. గ్రామ కమిటీలు ఎంపిక చవటపాలెం గ్రామ అధ్యక్షునిగా ఆర్ జగదీష్, ఉపాధ్యక్షులుగా జిలకర ప్రేమ్చంధ్, బక్కా రవికాంత్, ప్రధాన కార్యదర్శిగా మాణిక్యరావు, అభి, సుధాకర్రావు పాటు మరో 12 మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. చంద్రబాబు మాయ మాటలతో రాష్ట్రం దివాలా బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో మాజీ మంత్రి మేరుగు నాగార్జున -
ఓడించామని కక్ష సాధింపు
ముండ్లమూరు(దర్శి): అసెంబ్లీ ఎన్నికల్లో గొట్టిపాటి లక్ష్మీని ప్రజలు ఓడించడంతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ చింతా శ్రీనివాసరెడ్డి అన్నారు. పసుపుపల్లు గ్రామంలో తనకు జరిగిన అన్యాయంపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన వివరాలు వెల్లడించారు. తనకు తన సోదరి భర్త రత్నారెడ్డి పేరుపై గ్రామ ప్రధాన సెంటర్ కూడలిలో రెండు సెంట్ల స్థలం ఉందని, వ్యాపారానికి అనుకూలంగా ఉండే ఆ స్థలంలో గత 25 ఏళ్లుగా రేకుల షెడ్లలో దుకాణాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయితే మంగళవారం తెల్లవారుజామున సుమారు 50 మంది పోలీసులకు వచ్చి దౌర్జన్యానికి దిగారన్నారు. దర్శి ఎస్సై మురళీ, ముండ్లమూరు ఎస్సై కమలాకర్, తాళ్లూరు ఎస్సై మల్లికార్జున్లు అక్కడకు వచ్చి ఎవరికీ చెప్పకుండా రేకుల దుకాణాలను కూల్చివేసేందుకు బీభత్సం సృష్టించారని చెప్పారు. మహిళలన్న గౌరవం కూడా లేకుండా వారిపై కూడా దౌర్జన్యం చేశారన్నారు. సీఐ రామారావు ఖాకీ దుస్తులు వేసుకున్న విషయం కూడా మరిచిపోయి అడ్డొస్తే కేసులు పెడతాం అంటూ చిందులు తొక్కి మహిళలని కూడా చూడకుండా రోడ్డుపైకి లాక్కెళ్లి దౌర్జన్యాన్ని ప్రదర్శించారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో మెజార్టీ వచ్చిందనే కూల్చివేత.. అసెంబ్లీ ఎన్నికల్లో పసుపుగల్లు గ్రామంలో 248 ఓట్లు మెజార్టీ వచ్చిందని, నాలుగు బూత్లలో వైఎస్సార్ సీపీకి మెజారిటీ రావడంతో సహించలేక గొట్టిపాటి లక్ష్మీ మమ్మల్ని ఇబ్బందులు పెట్టాలని కంకణం కట్టుకుందన్నారు. గొట్టిపాటి లక్ష్మీ చెప్పిందని బిజ్జం సుబ్బారెడ్డి గ్రామంలో ఈ పనిచేయిస్తున్నాడన్న విషయం గ్రామంలో అందరికీ తెలుసన్నారు. ఈ స్థలాన్ని నరసింహ స్వామి దేవస్థానానికి ఇస్తామని చెప్పామని, దేవునికి భూమి ఇస్తే గౌరవం వస్తుందని, ఆ గౌరవం దక్కకుండా ఉండాలని దౌర్జన్యంగా భూమి ఆర్అండ్బీదిగా చెప్తున్నారన్నారు. పంచాయతీ కార్యదర్శి ఎంపీపీకి, సర్పంచులు, మెంబర్లకు తెలియకుండా సంతకాలు పెట్టి తప్పుడు తీర్మానం తయారు చేశారన్నారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇలా చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పది మందికి సాయం చేసి పేరు తెచ్చుకోవాలని, ఇలా దౌర్జన్యాలు, పోలీసులను అడ్డుపెట్టుకొని కొంపలు కూల్చితే ప్రజలు రానున్న రోజుల్లో మరోసారి బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. ఇటీవల తూర్పు వీరాయపాలెం గ్రామంలో ముప్పరాజు శ్రీను నివాసాన్ని ఎటువంటి నోటీసులు లేకుండా పోలీసులను మొహరించి కూల్చివేశారని, మాకూ ఎటువంటి నోటీసులు లేకుండా తెల్లవారుజామునే వచ్చి దుకాణాలు కూల్చివేశారని చెప్పారు. పాలన అంటే పది మందికి సాయం చేసే బూచేపల్లి శివప్రసాద్రెడ్డిని చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. పోలీసులు వీధి రౌడీల్లా ప్రవర్తించారు మహిళలను కూడా ఈడ్చి పడేశారు ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో అల్లర్లు వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ చింతా శ్రీనివాసరెడ్డి ధ్వజం -
అన్ని విధాలా అండగా ఉంటాం
● ఎస్పీ ఏఆర్ దామోదర్ ఒంగోలు టౌన్: విధులు నిర్వర్తిస్తూ వివిధ కారణాలతో మృతి చెందిన వారు, రిటైర్డు పోలీస్ సిబ్బంది కుటుంబాలకు, హోంగార్డులకు అన్ని విధాలా అండగా ఉంటామని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. సమర్ధవంతమైన పోలీసింగ్తో పాటు సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తామని, సమాజ రక్షణలో ప్రాణాలర్పించిన సిబ్బందిని పోలీస్ శాఖ ఎప్పటికీ మరచిపోదన్నారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది కుటుంబాలతో స్వయంగా మాట్లాడి వారికి అందాల్సిన ప్రయోజనాలు, ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ ఫైళ్ల గురించి తెలుసుకొని వాటిని త్వరగా పూర్తి చేసేందుకు సంబంధిత డీపీఓ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కారుణ్య నియామకాలు పొందని కుటుంబసభ్యుల వివరాలు తెలుసుకొని, వారికి త్వరితగతిన కారుణ్య నియామకం పొందేలా కృషి చేస్తామని తెలిపారు. పోలీస్ కుటుంబసభ్యులకు ఏ సమస్య వచ్చినా తనను నేరుగా కలవవచ్చన్నారు. విధులు నిర్వర్తిస్తూ మరణించిన మురళి సతీమణి సుధారాణికి ఇన్సిడెంటల్ చార్జెస్ కింద రూ. 25,000 చెక్కు అందజేశారు. కార్యక్రమంలో సీతారామిరెడ్డి, విజయ్కుమార్, డీపీఓ సూపరింటెండెంట్లు సంధానిబాష, డి.శైలజ, సిబ్బంది పాల్గొన్నారు. ఒంగోలు మెట్రో: ప్రకాశం జిల్లా రచయితల సమాఖ్య సంస్థ ఆధ్వర్యంలో జిల్లా గ్రంథాలయంలో శుక్రవారం వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు 162 జయంతి, తెలుగు భాషా దినోత్సవం నిర్వహించనున్నట్లు అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ నూనె అంకమ్మరావు, కుర్రా ప్రసాద్బాబు ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి జీవీ శివారెడ్డి, నాగభైరవ సాహిత్య పీఠం అధ్యక్షుడు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ, నరసం రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు తేళ్ల అరుణ, విశిష్ట అతిథులుగా జిల్లా గ్రంథాలయ సంస్థ ఉపగ్రంథపాలకురాలు కాళహస్తి సంపూర్ణ, ప్రముఖ కవి నన్నపనేని రవి, మిడసల మల్లికార్జునరావు, గుంటూరు సత్యనారాయణ తదితరులు పాల్గొని ప్రసంగిస్తారని నిర్వాహకులు తెలిపారు. 10 గంటలకు తెలుగుతల్లి కవుల విగ్రహాలకు పూలాభిషేకం, సాయంత్రం 4 గంటలకు జరిగే తెలుగు భాషా దినోత్సవ సభ అనంతరం ఆహ్వాన కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలుగు భాషాభిమానులు పాల్గొనాలని కోరారు. -
బూచేపల్లి వెంకాయమ్మకు శుభాకాంక్షలు
చీమకుర్తి: జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. చీమకుర్తిలో నిర్వహించిన వేడుకల్లో కుమారుడు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, వారి కుటుంబసభ్యుల సమక్షంలో కేక్ కట్ చేశారు. మాజీ మంత్రి మేరుగు నాగార్జున, పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు ఇన్చార్జి చుండూరు రవి, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న బూచేపల్లి వెంకాయమ్మను గజమాలలతో సత్కరించి శాలువాలు కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. -
చౌటపాలెంలో తమ్ముళ్ల దౌర్జన్యం
పొన్నలూరు: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రశాంతమైన గ్రామాల్లో అల్లరులు, గొడవలు, ఆస్తులను నష్టపరుస్తూ రాక్షస సంప్రదాయాన్ని సృష్టిస్తున్నారు. తమను అడిగేవారు, అడ్డుకునే వారు లేరంటూ రోజు రోజుకు మరింతగా రెచ్చిపోతున్నారు. రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతూ అధికార మదంతో లక్షల రూపాయిలు పెట్టుబడులతో సాగుచేసి పంటలను సైతం ట్రాక్టర్తో దున్నించి పచ్చని పంటలను ధ్వంసం చేస్తున్నారు. మండలంలోని చౌటపాలెంలో వైఎసస్ సీపీ సానుభూతిపరురాలు బోయపాటి జోత్స్యకు తండ్రి నుంచి సంక్రమించిన పొలం ఉంది. చౌటపాలెం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 75/1లో 1.75 ఎకరాలు, 77/3లో 1.60 ఎకరాల భూమి ఉంది. అలాగే అనుమోలు చిన్నమ్మాయికి సర్వే నంబర్ 1426/1, 1426/2లో 2.87 ఎకరాల పొలం ఉంది. రెవెన్యూ రికార్డులతో పాటు ఆన్లైన్లో కూడా వీరి పేరుతోనే పొలం ఉంది. దీంతో కొన్నేళ్లగా ఆ పొలంలో అనేక పంటలు సాగు చేస్తూ వస్తున్నారు. నెల రోజుల క్రితం జామాయిల్ మొక్కలు సాగు చేశారు. అయితే గ్రామానికి చెందిన టీడీపీ సానుభూతిపరుడు నడిపినేని నరసింహం, అతని కొడుకు కిరణ్ అధికారం ఉందని జోత్స్య, చిన్నమ్మాయికి చెందిన భూమిలోని జామాయిల్ మొక్కలను ట్రాక్టర్తో దున్నేశారు. సదరు వ్యక్తులు కొన్ని రోజులుగా జోత్స్యకి చెందిన భూమిని కాజేయాలన్ని రాజకీయ అండదండలతో ఆమెను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం ట్రాక్టర్ తీసుకెళ్లి సాగుచేసిన జామాయిల్ మొక్కలను దున్నేశారు. ఏడాదిగా బాధితురాలికి వేధింపులు.. కూటమి ప్రభుత్వం ఏర్పండిది మొదలు సదురు వ్యక్తులు పొలం విషయంలో జోత్స్యని వేధిస్తున్నారు. వాస్తవంగా జోత్స్య తండ్రి రామారావు, నడిపినేని నరసింహం అన్నదమ్ములు. అయితే భాగపంపకాల్లో భాగంగా రామారావు మరణం తరువాత అతనికి చెందిన భూమి, కుమార్తె అయిన జోత్స్యకి సంక్రమించిది. దీంతో కొన్ని రోజులుగా ఆ భూమిని ఎలాగైనా పొందాలని, ఈ భూమి తమదంటూ నరసింహం అతని కుటుంబ సభ్యులు తరచూ గొడవలకు దిగుతున్నారు. ఈ క్రమంలో తన దగ్గర ఉన్న ఆధారాలతో ఆమె కందుకూరు సివిల్ కోర్టును ఆశ్రయించింది. 2018లో కోర్టు సదరు భూమి జోత్స్యకి చెందిదేనని తీర్పు ఇచ్చింది. అప్పటి నుంచి ఆ భూమిలో వివిధ పంటలు సాగు చేస్తూ వస్తోంది. అయితే ఏడాది వరకు స్తబ్ధుగా ఉన్న నరసింహం, కిరణ్ ఏడాది క్రితం కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో ఇదే అదునుగా భావించి మంత్రి స్వామిని, అధికారులను అడ్డుపెట్టుకోని జోత్స్య భూమిని కాజేయాలని ప్రయత్నం చేశారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరకపోవడంతో మంగళవారం ట్రాక్టర్ తీసుకెళ్లి జోత్స్య సాగుచేసిన జామాయిల్ మొక్కలను దున్నేశారు. ఇదేందని అడిగిన సదరు మహిళను నీ దిక్కున చోట చెప్పుకో అంటూ దుర్భాషలాడి దాడికి యత్నించినట్లు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సాగు చేసిన జామాయిల్ మొక్కలు ట్రాక్టర్తో దున్నివేత అడ్డుకున్న బాధిత మహిళపై దుర్భాషలాడి దాడికి యత్నం నాలుగు ఎకరాల్లో సాగుచేసిన జామాయిల్ మొక్కలు ధ్వంసం -
పోలీసులను అడ్డుపెట్టుకుని దారుణాలు
దర్శి: నియోజకవర్గంలో పోలీసులను అడ్డుపెట్టుకుని దారుణాలు చేస్తున్నారని, పోలీసులు శాంతి భద్రతలు పక్కన పెట్టి వైఎస్సార్సీపీ నాయకుల పై కేసులు పెట్టడం, దాడులు చేయడమే ధ్యేయంగా పని చేస్తున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అన్నారు. ముండ్లమూరు మండలం పసుపుగల్లులో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ చింతా శ్రీనివాసరెడ్డికి చెందిన దుకాణాలను కూల్చేసిన విషయం తెలుసుకున్న బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అక్కడకు వెళ్లి పరిశీలించారు. అక్కడ మహిళలు తమతో పోలీసులు ప్రవర్తించిన తీరును పూస గుచ్చినట్లు వివరించారు. పోలీసులు తమపై అమానుషంగా ప్రవర్తించారని, చెప్పలేని అసభ్య పదజాలంతో బూతులు తిట్టి దారుణంగా వ్యవహరించారని వాపోయారు. సంస్కారం మరచి తమతో అసభ్యంగా ప్రవర్తించిన తీరును వివరించారు. అనంతరం దర్శి వైఎస్సార్సీపీ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ నాయకులతో కలసి బూచేపల్లి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిందని అన్నారు. తెల్లవారుజామునే దర్శి సీఐ రామారావు, ఎస్సై మురళి, ముండ్లమూరు ఎస్సై కమలాకర్, తాళ్లూరు ఎస్సై మల్లిఖార్జున్, మరో 30 మంది పోలీసులు వచ్చి దౌర్జన్యంగా శ్రీనివాసరెడ్డి స్థలంలో ఉన్న గదులను పడగొట్టడంపై మండిపడ్డారు. పంచాయతీరాజ్కు సంబంధం లేని సెక్రటరీ ఇచ్చిన కంప్లైంట్ అడ్డం పెట్టుకుని కక్ష సాధింపుగా దుకాణాలు పడగొట్టారన్నారు. ఆర్అండ్బీ పరిధిలో ఆ స్థలం లేదని, చింతలపూడి వెళ్లే రోడ్డు పక్కన కాలువల వెనక్కు గదులు ఉన్నాయని, అయినా ఏ అధికారంతో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా పడగొట్టారని బూచేపల్లి ప్రశ్నించారు. ఇటీవల తూర్పువీరాయ పాలెం గ్రామంలో ముప్పరాజు శ్రీనివాసరావు భవనాన్ని పొక్లెయిన్లతో కూల్చి వేశారన్నారు. ఈరోజు చింతా శ్రీనివాసరెడ్డి దుకాణాలు పడగొట్టారన్నారు. అక్కడున్న మహిళలను, మండల ప్రజా ప్రతినిధిని ఈడ్చుకెళ్లి అసభ్య పదజాలంతో నానారకాల ఇబ్బందులు పెట్టారన్నారు. సంబంధం ఉన్న పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఫిర్యాదు చేయలేదని, సంబంధం లేని సెక్రటరీ ఫిర్యాదు చేస్తే దౌర్జన్యంగా ఎందుకు పగలగొట్టాల్సి వచ్చిందని పోలీసులను నిలదీశారు. ‘‘టీడీపీ ఇన్చార్జ్ గారు.. మీరు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు... మీకు చేతనైతే పది మందికి సాయం చేయండి. అధికారం ఉంది కదా అని పోలీస్ వ్యవస్థను వాడుకుని ఇలా చేయడం మంచి పద్ధతి కాదని’’ హితవు పలికారు. పోలీసులు శాంతి భద్రతలు పక్కన పెట్టి వైఎస్సార్సీపీ నాయకులపై కేసులు పెట్టడం, దాడులు చేయడమే ధ్యేయంగా పని చేస్తున్నారన్నారు. పోలీసులు అరాచకాలు, దౌర్జన్యాలు, కక్షసాధింపులు మానుకోవాలన్నారు. మండల కన్వీనర్ను లాగి చొక్కా చించి దారుణంగా ప్రవర్తించారన్నారు. ఈ విషయాలను ఎస్పీ, డీజీపీల దృష్టికి తీసుకుని వెళ్లి ఇక్కడ పోలీస్ల తీరుపై ఫిర్యాదు చేస్తామని చెప్పారు. బడ్జెట్ తగ్గించుకోవాలనే పింఛన్లు పీకేశారు: జిల్లాలో బడ్జెట్ తగ్గించుకోవాలనే 3780 పింఛన్లు తీసేశారని, నియోజకవర్గంలో 579 పింఛన్లు తీసేశారని చెప్పారు. ఏళ్ల తరబడి పింఛన్లు తీసుకుంటున్న వారిని కూడా అనర్హులుగా చేశారని, వారి ఉసురు ప్రభుత్వానికి తగులుతుందన్నారు. వైఎస్సార్ సీపీ మద్దతుదారులను టార్గెట్ చేసి పింఛన్లు రాకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వారందరికీ వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ నాయకుడిలా సీఐ దౌర్జన్యం: ముండ్లమూరు మండల కన్వీనర్ చింతా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 2002లో భూమిని కొనుగోలు చేసి అప్పటి నుంచి అందులో రూములు వేసుకుని ఉన్నామన్నారు. సీఐ తామేమి చెప్పినా వినకుండా టీడీపీ నాయకుడిలా దౌర్జన్యం చేశారన్నారు. మీరు జీతాలు తీసుకుంటుంది ప్రభుత్వం దగ్గరా లేక టీడీపీ కార్యాలయంలోనా లేక ఇన్చార్జ్ దగ్గర తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు. ‘‘మీ టైం అయిపోయింది వెళ్లిపోండిరా’’ అంటూ దౌర్జన్యంగా మాట్లాడిన తీరు తమను ఎంతో బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. పది మందికి సాయం చేస్తే ఎవరైనా హర్షిస్తారు కానీ ఇలా కక్ష సాధింపు చర్యలు చేస్తే ప్రజాగ్రహానికి గురికావాల్సి ఉంటుందని హితవు పలికారు. విలేకరుల సమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మండల కన్వీనర్లు వెన్నపూస వెంకటరెడ్డి, కాకర్ల కృష్ణారెడ్డి, యన్నాబత్తిన సుబ్బయ్య, జెడ్పీటీసీలు నుసుం నాగిరెడ్డి, తాతపూడి రత్నరాజు, స్టేట్ మహిళా విభాగం కార్యదర్శి మేడికొండ జయంతి, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సందెవేళ.. ప్రకృతి హేల
– కంభంసూర్యుడు అస్తమించే సమయంలో సుందర దృశ్యంసాయం సంధ్యవేళలో కంభం చెరువు మధ్యలో పడుతున్న సూర్యకిరణాలు సూర్యాస్తమయ సమయంలో కనువిందు చేస్తున్న కంభం చెరువు సాయంసంధ్య వేళలో అస్తమించే రవి కిరణాలు ప్రకృతి కాన్వాసుపై అద్భుత వర్ణచిత్రాలను ఆవిష్కరించాయి. ఇటీవల కురిసిన వర్షాలకు చారిత్రాత్మక కంభం చెరువులో 7 అడుగుల మేర నీళ్లు ఉన్నాయి. సాయంత్రం 6.30 నుండి 7 గంటల మధ్యలో సూర్యాస్తమయ సమయంలో సూర్య కిరణాలు నీటి పై పడుతూ వివిధ రంగులను ఆవిష్కరించిన దృశ్యం చూపరులను కట్టిపడేసింది. సాయంత్రం పూట పలువురు సందర్శకులు చెరువు వద్దకు వెళ్ళి సరదాగ సెల్ఫీలు తీసుకుంటూ గడుపుతున్నారు. -
ఖాకీ అరాచకమై..
చట్టం చుట్టమై..సివిల్ వివాదాల్లో తలదూరుస్తూ రాజ్యాంగ ఉల్లంఘన ఒంగోలు, టాస్క్ఫోర్స్: తెల్లవారితే వినాయక చవితి పండుగ. మరో పక్క గ్రామంలో ఒక మహిళ పాము కాటుతో మరణించింది. కొండపి మండలం జాళ్లపాలెంలో మంగళవారం కొందరు గ్రామస్తులు పండుగ ఏర్పాట్లలో నిమగ్నం కాగా, మహిళ చనిపోయిన బాధలో కొంత మంది ఉన్నారు. ఈ క్రమంలో కోర్టు పరిధిలో ఉన్న గ్రామంలోని రచ్చబండను పక్కా ప్రణాళికతో సీఐ సోమశేఖర్ తొలగించేందుకు పథకం రచించారు. ఆమేరకు ఎస్సై ప్రేమ్కుమార్ సాయంత్రం ఆరు గంటలకు గ్రామానికి వచ్చి మొదట గత నెలలో రచ్చబండ తొలగింపులో అడ్డుపడిన 10 మంది మహిళలపై కేసులు ఉన్నాయని, వారందరూ పోలీస్స్టేషన్కు రావాలని సూచించారు. దీంతో మహిళలు గ్రామంలో పాముకాటుతో మనిషి చనిపోయింది రేపు వస్తామని చెప్పారు. అయినా మీరు రావాల్సిందేనని పట్టుబట్టడంతో జీపులో తీసుకెళ్లమని మహిళలు చెప్పడంతో మీరు జీపులో కాదు ఆటోలో రావాలని ఆదేశించారు. ఈ క్రమంలో రాత్రి 8 గంటల సమయంలో గ్రామానికి వచ్చిన సీఐ సోమశేఖర్ 10 మంది మహిళా పోలీసులతో కలిపి దాదాపు 30 మంది కానిస్టేబుల్స్ను గ్రామానికి రప్పించారు. దీంతో విషయం అర్థమైన గ్రామస్తులు సుమారు 100 మంది వరకు రచ్చబండ వద్దకు చేరారు. తమకు ఎన్నో సంవత్సరాలుగా నీడనిచ్చే వేపచెట్టు, కూర్చునే రచ్చబండను తొలగించవద్దని వేడుకున్నారు. కానీ పోలీసులు మాత్రం మంత్రి స్వామి కళ్లలో ఆనందం చూడాలనే ఆరాటంతో వారందరినీ అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. కానీ గ్రామస్తులు వెళ్లకపోవటంతో చివరికి పిస్తోల్ తీసి కాల్చిపారేస్తా... నాకొడల్లారా అని గురి పెట్టి బెదిరించారు. అప్పటికీ మహిళలు తగ్గకపోవటంతో లాఠీలకు పనిచెప్పారు. ఈ క్రమంలో 8 మందికి తీవ్ర గాయాలు కాగా మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని పోలీసులు ఒక్కొక్కరిని ఒక్కో ఇంట్లో పెట్టి బయట తలుపేశారు. ఆ సమయంలో 108 గాయపడిన వారిని తీసుకుని వెళ్లడానికి వచ్చినా పోలీసులు ఒప్పుకోకపోవటంతో వారిని తీసుకుని వెళ్లకుండానే 108 వెళ్లిపోయింది. తరువాత పోలీసులు జేసీబీతో రచ్చబండను పూర్తిగా తొలగించి నీడనిచ్చే పచ్చని వేపచెట్టును పడగొట్టి ఎటువంటి ఆనవాలు లేకుండా ఉండేటట్లు ట్రాక్టర్లతో తొలగించారు. కేవలం ఒక్క సెంటు స్థలం కోసం అది కూడా టీడీపీ సానుభూతిపరుడిది అవునో కాదో తెలియని స్థలం కోసం మంత్రి స్వామి ఆదేశాలతో పోలీసులు ఈ విధంగా రాత్రి పూట విధ్వంసం సృష్టించటం పట్ల గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి నెట్వర్క్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీస్స్టేషన్లు పచ్చనేతల అడ్డాలుగా మారిపోయాయి. శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన పోలీసులు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. తమ పరిధులు దాటి సివిల్ వివాదాల్లో తలదూరుస్తూ రెచ్చిపోతున్నారు. ఇదేమిటని అడిగితే లాఠీలకు పనిచెబుతున్నారు. బెదిరింపులకు దిగుతూ అధికార పార్టీకి బానిసలుగా మారిపోతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దర్శి, కొండపి నియోజకవర్గాల్లో అయితే ఖాకీల తీరు సెపరేటుగా ఉంది. ఇక్కడ పచ్చనేతల చేతుల్లో కీలుబొమ్మలా మారి వారు చెప్పిందే వేదంగా ప్రతిపక్ష నేతలపై ప్రత్యక్ష దాడులకు దిగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నేరాల అదుపునకంటే పచ్చనేతలకు జీహుజూర్ అంటున్నారని ప్రజలు మండిపడుతున్నారు. దర్శి నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జ్ చెప్పిందే డ్యూటీగా చేస్తున్నారే తప్ప నిజమైన పోలీస్ డ్యూటీ మాత్రం చేయడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ నేతలే టార్గెట్గా దర్శి, ముండ్లమూరు, తాళ్లూరు పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తూర్పు వీరాయపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీటీసీ ముప్పరాజు శ్రీనుకు చెందిన స్థలం పై కూటమి నేతలు కన్నేశారు. ఆక్రమించుకోవాలని చూడటంతో కోర్టును ఆశ్రయించారు. స్థానిక కోర్టులో, జిల్లా కోర్టులో కూడా ఆస్థలం ముప్పరాజు శ్రీనుకు చెందుతుందని తీర్పు వచ్చింది. గ్రామ నడిబొడ్డులో ముప్పరాజు శ్రీను ఉండడం జీర్ణించుకోలేని టీడీపీ నేతలు అక్రమాలకు తెరలేపారు. గొట్టిపాటి లక్ష్మి ఆదేశాలతో గ్రామ కార్యదర్శి జేసీబీతో వెళ్లి సుమారు రూ.20 లక్షలతో నిర్మించుకున్న ఇంటిని ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారు. తూర్పు వీరాయపాలెం సర్వేనంబరు 133/5 లోని 2 సెంట్ల స్థలాన్ని 2010 లో ముప్పరాజు లక్ష్మి వద్ద కొనుగోలు చేసి రిజిస్టరు చేయించుకున్నారు. అప్పడు కూడా ఇదే పోలీసులు పచ్చ రౌడీల్లా వ్యవహరించి వైఎస్సార్సీపీ నేతలను భయబ్రాంతులకు గురి చేశారు. ఎవరైనా అడ్డువస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. ఈ సంఘటన మరువక ముందే పసుపుగల్లు గ్రామంలో ముండ్లమూరు మండల కన్వీనర్ చింతా శ్రీనివాసరెడ్డి స్థలంలో ఉన్న దుకాణాలను తొలగించారు. తూర్పు వీరాయపాలెం గ్రామంలో తొలగిస్తే ఏం చేయలేదు ఇక్కడ మాత్రం ఏం చేస్తారులే అనుకున్నారు. ఖాకీల ప్రతాపాన్ని చూపించారు. పసుపుగల్లు గ్రామంలో రిజిస్ట్రేషన్ స్థలం రోడ్డుకు అడ్డుగా లేదు. 25 సంవత్సరాల నుంచి ఆ స్థలంలో శ్రీనివాసరెడ్డి కుటుంబీకులు చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. మండల కన్వీనర్గా ఉన్న శ్రీనివాసరెడ్డికి చెందిన స్థలాన్ని మంగళవారం ఉదయం గం.5.30 కు పొక్లెయిన్ తీసుకుని వెళ్లి పడగొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో కుటుంబ సభ్యుల అడ్డుకుని తమకున్న పత్రాలు చూపించారు. దీంతో రంగంలోకి దిగిన సీఐ రామారావు పోలీసులకే అడ్డు చెప్తారా అంటూ ఎవడ్రా ఆపింది అని రౌడీలా రెచ్చిపోయారు. మీ టైం అయిపోయింది..వెళ్లిపోండి అని గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేశారు. అడ్డు వచ్చిన మహిళలను నానా దుర్బాష లాడారు. మహిళలపై సైతం ప్రతాపం చూపించారు. శ్రీనివాసరెడ్డి పై దాడి చేసి చొక్కాను చింపి వేశారు. సీఐ లాఠీ తీసుకుని స్థానికులపై లాఠీ ఝుళిపించారు. గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేశారు. గ్రామస్తులు ప్రతిఘటించి ఎదురు తిరగటంతో పోలీసులు దుకాణాలు కూల్చి వేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా గొట్టిపాటి లక్ష్మి నియోజకవర్గ ఇన్చార్జి పదవిని అడ్డం పెట్టుకుని ఆమె ఎక్కడికి వెళితే అక్కడికి పోలీసులను తిప్పుకోవడం పలు విమర్శలకు తావిస్తోంది. డీఎస్పీ అధికారి నుంచి ఎస్సైల వరకు ఆమె ఏ మండలానికి వెళ్లినా పోలీస్ కాన్వాయ్ వెంట వెళ్లాల్సిందే. -
పచ్చఖాకీ.. దౌర్జన్యకాండ
ముండ్లమూరు(దర్శి): ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పసుపుగల్లు గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు రెచ్చిపోయారు. వైఎస్సార్ సీపీ మండల కన్వినర్కు చెందిన దుకాణాల కూల్చివేతకు గ్రామానికి భారీగా తరలివచ్చారు. రావడం రావడంతోనే అరాచకానికి దిగారు. అడ్డొచ్చిన మహిళలను రోడ్డుపై ఈడ్చిపడేశారు. లాఠీలు ఝుళిపించారు. అరెస్టు చేసి పోలీసు జీపు ఎక్కించేందుకు యత్నించారు. దీంతో గ్రామస్తులు ఎదురుతిరిగారు. టీడీపీ నేతల ఒత్తిడితోనే.. వైఎస్సార్ సీపీ ముండ్లమూరు మండలం కన్వినర్ చింతా శ్రీనివాసరెడ్డి పసుపుగల్లు గ్రామంలో ఉంటున్నారు. ఆయనకు, ఆయన సోదరి భర్త రత్నారెడ్డి పేరున గ్రామ ప్రధాన సెంటర్లో రెండు సెంట్ల స్థలం ఉంది. వ్యాపారాలకు అనుకూలంగా ఉండడంతో 30 ఏళ్లుగా రేకుల షెడ్లు వేసుకుని దుకాణాలు నడుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చడీచప్పుడు లేకుండా మంగళవారం తెల్లవారుజామున దర్శి ఎస్సై మురళి, ముండ్లమూరు ఎస్సై కమలాకర్, తాళ్లూరు ఎస్సై మల్లికార్జున్తోపాటు సుమారు 30 మంది పోలీసులు పొక్లెయిన్లతో గ్రామానికి వచ్చారు. దుకాణాల కూల్చివేతకు యత్నించారు.శ్రీనివాసరెడ్డి, ఆయన సోదరి, కుటుంబ సభ్యులు పోలీసులను అడ్డుకున్నారు. పోలీసులు ఇవి అక్రమ నిర్మాణాలని, కూల్చివేయాలని గ్రామ కార్యదర్శి మౌలాలి ఫిర్యాదు చేశారని ఎస్ఐలు చెప్పారు. దీంతో కార్యదర్శిని పిలిచి తమ దుకాణాలు కూల్చేందుకు ఎవరు తీర్మానం చేశారని ప్రశి్నంచగా ‘‘పై నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం మేం చేస్తున్నాం. పైవాళ్లు చెప్పినట్లు మేం వినాలిగా మాదేముంది’’ అంటూ సమాధానమిచ్చారు. దీంతో శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది రిజిస్టర్డ్ భూమి అని కావాలంటే కొలతలు వేసి చూసుకోవాలని సూచించారు. అయినా కనీసం నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని సెక్రటరీని, పోలీసులను నిలదీశారు. దీంతో జరిగిన విషయాన్ని పోలీసులు ఫోన్లో సీఐ రామారావుకు తెలియజేయడంతో ఆయన వచ్చి వీరంగం చేశారు. ‘‘ఏయ్ ఎవడ్రా అడ్డు వచ్చేది? మర్యాదగా పక్కకు తప్పుకోండి. అడ్డొస్తే కేసులు పెడతాం’’ అంటూ చిందులు తొక్కారు. దీంతో పోలీసులు పైశాచికత్వం ప్రదర్శించారు. మహిళలని కూడా చూడకుండా రోడ్డుపై పక్కకు లాగిపడేశారు. లాఠీలను ఝుళిపించారు. మహిళలను పక్కకు లాగేందుకు మహిళా పోలీసులు ఉన్నా.. మగ ఎస్సైలు, పోలీస్ సిబ్బంది మహిళలను అసభ్యంగా తిడుతూ లాగి పడేశారు. దీంతో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ గొట్టిపాటి లక్ష్మి, స్థానిక టీడీపీ నాయకుడు బిజ్జం సుబ్బారెడ్డి ఒత్తిడి వల్లే పోలీసులు బరితెగిస్తున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో తమ గ్రామంలో వైఎస్సార్ సీపీకి 248 ఓట్ల మెజార్టీ వచ్చిందని, దానిని సహించలేకే తమపై ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అయినా సీఐ పట్టించుకోలేదు. సెక్రటరీతో మాట్లాడుకోవాలని పోలీసులు దౌర్జన్యాన్ని కొనసాగించారు. చివరకు గ్రామస్తులు పోలీసులపై తిరగబడడంతో చేసేది లేక రేకుల షెడ్ కూల్చివేసి అక్కడి నుంచి జారుకున్నారు. -
‘కాల్చిపారేస్తా.. కొడకల్లారా!’
ఒంగోలు, టాస్క్ఫోర్స్: కోర్టులో వివాదం నడుస్తున్నా.. పచ్చనేత ఆదేశంతో 20 ఏళ్ల క్రితం నిర్మించిన రచ్చబండను పోలీసులు రాత్రికి రాత్రే కూల్చేశారు. ఇదేమిటని నిలదీసిన గ్రామస్తులపై సీఐ సోమశేఖర్ రెచ్చిపోయారు. తుపాకీ చూపిస్తూ ‘కాల్చిపడేస్తా నా కొడకల్లారా’ అంటూ బెదిరించారు. రచ్చబండ తొలగింపును అడ్డుకున్న గ్రామస్తులపై లాఠీచార్జి చేశారు. దీంతో మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా కొండపి మండలం జాళ్లపాలెంలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.స్థానికుల కథనం ప్రకారం.. సర్వే నంబర్ 627లో 50 సెంట్ల ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలానికి 20 మంది హక్కుదారులుగా ఉన్నారు. స్థలంలో 20 ఏళ్ల క్రితం వేపచెట్టు చుట్టూ రచ్చబండ నిర్మించి గ్రామస్తులు ఉపయోగించుకుంటున్నారు. ఈ స్థల వివాదం హైకోర్టుకు చేరగా.. టీడీపీ సానుభూతిపరుడు మంత్రి స్వామిని ఆశ్రయించాడు. దీంతో మంగళవారం రాత్రి 30 మంది పోలీసులతో వచ్చిన సీఐ సోమశేఖర్ జేసీబీ సహాయంతో రచ్చబండను తొలగించారు.అడ్డుకునే ప్రయత్నం చేసిన గ్రామస్తుల్ని సీఐ సోమశేఖర్ కాల్చిపారేస్తా నా కొడకల్లారా అంటూ పిస్టల్ చూపించి బెదిరించారు. మహిళలపై లాఠీచార్జి చేయడంతో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేందుకు 108 వాహనం రాగా.. గాయపడ్డ వారిని వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి సీసీ కెమెరాను సైతం పోలీసులు పగులగొట్టారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
రజక వృత్తిదారులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
● జిల్లా రజక వృత్తిదారుల సంఘం డిమాండ్ ఒంగోలు సిటీ: రజక వృత్తిదారులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని జిల్లా రజక వృత్తిదారుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టంగుటూరి రాము, రాయల మాలకొండయ్య డిమాండ్ చేశారు. రజక వృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసనల్లో భాగంగా ఒంగోలు ప్రకాశం భవనం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వృత్తులు అంతరించి పట్టణ ప్రాంతాలకు వలసలు వచ్చి అనేక రకాల వృత్తులైన అపార్ట్మెంట్ వాచ్మెన్, ఇంటి పని వారిగా, ఇసీ్త్ర దారులుగా, బిల్డింగ్ వర్కర్స్ గా పనులు చేసుకుంటూ చాలీచాలని ఇరుకు గదుల్లో అద్దెకు ఉంటూ జీవనం సాగిస్తున్నారని అన్నారు. ఇల్లు, ఇళ్ల స్థలాలు లేని వారు దాదాపు 250 మంది ఉన్నారని, వీరి జాబితా స్థానిక ఎమ్మెల్యేకు ఇచ్చామని, కలెక్టర్కు మరొక 16 మంది అర్హత జాబితా కూడా ఇచ్చినట్లు చెప్పారు. వీటన్నింటినీ పరిశీలించి తక్షణమే ఇళ్లు మంజూరు చేయాలని వారు కోరారు. రజకులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలన్నారు. వాటిలో 50 ఏళ్లు నిండిన ప్రతి రజకవృత్తిదారునికి పింఛను మంజూరు చేయాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తరహాలో రజకులకు సామాజిక రక్షణ చట్టం అమలు చేయాలన్నారు. రజకులకు కేటాయించిన చెరువుల కుంటలపై హక్కు కల్పించి జీవో నంబర్ 343 అమలు చేయాలని, తెలంగాణలో మాదిరిగా ఆంధ్రాలో కూడా రజక ల్యాండ్రీ వృత్తిదారులకు నెలకు 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లోనే ధోబీ నిర్వహణ కాంట్రాక్టులని రజకులకే కేటాయించాలన్నారు. ధోబి పోస్టులు రజక యువతీ యువకుల ద్వారా భర్తీ చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో భూ సమస్యల మీద దృష్టి పెట్టి భూ ఆక్రమణదారుల నుంచి కాపాడాలన్నారు. అపార్ట్మెంట్ వాచ్మెన్లకు కనీస వేతన చట్టం అమలు చేసి నెలకు రూ.18 వేలు ఇవ్వాలని, రజకుల సమస్యలు పరిష్కరించాలన్నారు. సమస్యలపై కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియాకు వినతి పత్రం ఇచ్చారు. ధర్నాకు ఒంగోలు నగర కమిటీ సీఐటీయూ నాయకులు జీ రమేష్, జిల్లా కార్యదర్శి ఎం రమేష్ మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఆవులమంద రమణమ్మ, డాక్టర్ వెంకట కృష్ణయ్య, చీమకుర్తి కోటేశ్వరరావు, సహాయ కార్యదర్శి సీహెచ్ కొండయ్య, యోగమ్మ, అపార్ట్మెంట్ కం ఇసీ్త్రదారుల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, కమిటీ సభ్యులు శ్రీనివాసులు, నాగేశ్వరరావు, బూచిరాజు నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
విద్యార్థులు లక్ష్య సాధనకు కృషి చేయాలి
● కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు వన్టౌన్: ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని సాధించేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. స్థానిక భాగ్యనగర్లోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమశాఖ కళాశాల బాలికల వసతి గృహాలు – 2, 3 విద్యార్థులను సోమవారం జేడీ శీలం పరివర్తన భవనంలోకి మార్చారు. ఆధునికీకరించిన పరివర్తనా భవనాన్ని కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి మాట్లాడారు. ఒంగోలులోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ కళాశాల వసతి గృహాలు – 2, 3లో రూ.5.12 కోట్ల డీఎంఎఫ్ నిధులతో అదనపు గదుల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. తద్వారా విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా పరివర్తనా భవనంలోకి మార్చినట్లు చెప్పారు. జిల్లాలోని 38 సంక్షేమ వసతి గృహాల్లో వసతుల కల్పనకు రూ.13 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. డీఎంఎఫ్ నిధుల నుంచి రూ.19 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లాలో బాల్య వివాహాలను నిర్మూలించడానికి పేద విద్యార్థులు విద్యపై శ్రద్ధ వహించేలా సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ప్రతి విద్యార్థి పాజిటివ్ దృక్పథంతో, మానసిక స్థైర్యంతో ముందుకు సాగినప్పుడే నిర్దేశించుకున్న లక్ష్యాలు సాధించే అవకాశం ఉంటుందన్నారు. విద్యతో పాటు ఇతర వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకుని ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.లక్ష్మానాయక్, నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, వార్డెన్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
విజిలెన్స్ కొరడా!
అక్రమ ఎరువులపై ● పొదిలిలో 1704 బస్తాలు, ముండ్లమూరు మండలంలో 270 బస్తాల ఎరువులు సీజ్ పొదిలి/ముండ్లమూరు(దర్శి): ఎరువుల కొరత, అధిక ధరలతో రైతులు సతమతమతున్నట్లు ప్రచార మాధ్యమాల్లో వెలువడుతున్న కథనాలతో విజిలెన్స్ అధికారులు నిద్ర లేచారు. సోమవారం జిల్లాల్లోని పలు ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. పొదిలి, ముండ్లమూరు మండలం చింతలపూడిలో 1974 బస్తాల ఎరువులను సీజ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. పొదిలి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీలక్ష్మీ ట్రేడర్స్ ఎరువుల దుకాణాన్ని విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. స్టాక్ రికార్డుల్లో తేడాలను గమనించి ఇక్కడి వెంకయ్యస్వామి ఆలయం ఎదురుగా దుకాణానికి సంబంధించిన గోడౌన్పై దాడి చేశారు. 1704 బస్తాల వివిధ రకాల ఎరువులను అక్రమంగా నిల్వ చేసినట్లు గుర్తించారు. గోడౌన్కు అనుమతులు లేవని తనిఖీలో వెల్లడి కావడంతో ఎరువులతో సహా సీజ్ చేశారు. ఆ ఎరువుల విలువ సుమారు రూ.20.43 లక్షలు ఉంటుందని విజిలెన్స్ అధికారులు చెప్పారు. దుకాణ యజమానిపై 6ఏ కేసుతోపాటు క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించేందుకు ఎరువులు అక్రమంగా నిల్వ చేస్తే డీలర్లపై క్రిమినల్ కేసులు తప్పవని విజిలెన్స్ సీఐ రవిబాబు హెచ్చరించారు. తనిఖీల్లో తహసీల్దార్ పాల్, విజిలెన్స్ ఎస్సై నాగేశ్వరరావు, వ్యవసాయాధికారి దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, దుకాణ యజమాని మాట్లాడుతూ.. తనపై కక్షతో అధికారులు కేసులు నమోదు చేశారన్నారు. గతంలో జరిగిన విషయాలను దృష్టిలో పెట్టుకుని తన గోడౌన్ను సీజ్ చేశారని వాపోయారు. తమకు అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పారు. 270 బస్తాల యూరియా పట్టివేత ముండ్లమూరు(దర్శి): మండలంలోని చింతలపూడి గ్రామంలో ఎరువుల దుకాణాలను విజిల్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ రాఘవరావు ఆధ్వర్యంలో సోమవారం తనిఖీలు చేపట్టారు. మల్లికార్జున ట్రేడర్స్ షాపులో బిల్లు లేని 50 బస్తాల యూరియా, నాగార్జున ఫర్టిలైజర్స్ దుకాణంలో రూ.1,56,145 విలువైన 220 బస్తాల యూరియా, కాంప్లెక్స్ ఎరువులు సీజ్ చేశారు. తనిఖీలో విజిలెన్స్ ఏఓ శివనాగప్రసాద్, వ్యవసాయాధికారి తిరుమలరావు, కమర్షియల్ ట్యాక్స్ అధికారి రామారావు, హెడ్ కానిస్టేబుల్ రవికుమార్ పాల్గొన్నారు. -
పెన్షన్ సవరణ క్లాజ్ రద్దు చేయండి
● ఏపీఆర్పీఏ డిమాండ్ ఒంగోలు సిటీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లులో దొంగచాటుగా చూపించిన పెన్షన్ సవరణ క్లాజ్ ను తక్షణమే రద్దు చేయాలని ఏపీఆర్పీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ రాంబాబు డిమాండ్ చేశారు. ఏపీఆర్పీఏ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక ప్రకాశం భవనం వద్ద జీ శేషయ్య అధ్యక్షతన సోమవారం ధర్నా నిర్వహించారు. ధర్నాలో సంఘం జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి సీహెచ్.రాంబాబు మాట్లాడుతూ ఈపీఎస్ 95 పెన్షన్దారులకు కనీస పెన్షన్ రూ.9 వేలు, డీఏ ప్రకటించాలని, సీనియర్ సిటిజన్లకు రైల్వేలో 50 శాతం రాయితీని పునరుద్ధరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 8వ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు 12వ వేతన సవరణ కమిటీలను తక్షణమే నియమించి ఐఆర్ 30 శాతం ప్రకటించాలన్నారు. పెన్షన్దారులకు, ఉద్యోగులకు రావలసిన బకాయిలు వెంటనే మంజూరు చేయాలని, పెన్షన్దారులకు రావాల్సిన కమ్యూటేషన్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ తక్షణమే మంజూరు చేయాలన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన అన్ని రకాల బకాయిలు మంజూరు చేయాలని తదితర డిమాండ్లతో ధర్నా చేశారు. యూనియన్ నాయకులు మీగడ వెంకటేశ్వర రెడ్డి, టీవీఆర్ సుబ్బారావు, సీహెచ్ లక్ష్మీనారాయణ, రాబిన్ రవికుమార్, పీ పేరయ్య మాట్లాడారు. ఏపీ ఎన్జీవో సంఘ నాయకులు శరత్ బాబు కృష్ణారెడ్డి, బీఎస్ఎన్ఎల్ సంఘ నాయకులు నాగేశ్వరరావు, పోస్టల్ సంఘ నాయకులు కే వీరాస్వామి రెడ్డి, ఎస్జీపీఏ నాయకులు పరిటాల సుబ్బారావు, సీఐటీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రమేష్, ఎస్డబ్ల్యూఎఫ్ నాయకులు అయ్యప్ప రెడ్డి తదితరులు సందేశాలిచ్చారు. ధర్నా అనంతరం కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. -
కంభంలో అర్ధరాత్రి చోరీ
కంభం: తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి నగలు, నగదు అపహరించుకెళ్లిన సంఘటన స్థానిక షిరిడీసాయి నగర్లో సోమవారం వెలుగుచూసింది. వివరాలు.. షిరిడీసాయి నగర్కు చెందిన మట్టిమల్ల భాస్కర్ ఆదివారం ఉదయం అర్ధవీడు మండలంలోని బోగోలులో అత్తగారింటికి వెళ్లాడు. తిరిగి సోమవారం ఉదయం కంభంలోని తన ఇంటికి చేరుకోగా తాళం పగలగొట్టి ఉంది. బీరువాలోని వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండటం చూసి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలాన్ని ఏఎస్సై నారాయణ పరిశీలించి వివరాలు సేకరించారు. మూడు జతల బంగారు కమ్మలు, ఒక జత వెండి పట్టీలు, రూ.15 వేల నగదు చోరీ అయ్యాయని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. మార్కాపురం టౌన్: హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ సుబ్బారావు సోమవారం తెలిపారు. సీఐ కథనం మేరకు.. ఈనెల 9న కళాశాల విశ్రాంత అటెండర్ గోగిరెడ్డి కాశిరెడ్డి(65) సత్యనారాయణ స్వామి గుడి వద్ద ఉండగా పట్టణంలోని నానాజాతుల కాలనీకి చెందిన ఆవుల నాగేంద్ర, చల్లా శ్రీనివాసులు అతి వేగంగా వచ్చి ఢీకొట్టారు. ప్రమాద ధాటికి రోడ్డుపై పడిపోయిన కాశయ్య ‘ఏమి మిడిమాలంగా బండి తోలుతున్నావురా’ అని అనడంతో బైక్పై ఉన్న ఇద్దరు వాదనకు దిగి కాశయ్యను కాళ్లతో ఇష్టం వచ్చినట్లు తన్ని, తలను సిమెంటు రోడ్డుకేసి బలంగా బాదారు. గుంటూరులోని ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతూ కాశిరెడ్డి మరణించారు. తొలుత దాడి కేసు నమోదు చేసిన పోలీసులు.. కాశిరెడ్డి మృతిపై భార్య వెంకట సుబ్బమ్మ ఫిర్యాదు మేరకు హత్య కేసుగా మార్చారు. డీఎస్పీ ఆధ్వర్యంలో సీఐతోపాటు ఎస్సైలు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం ఉదయం మార్కెట్ యార్డు వద్ద ఉన్న నిందితులు ఆవుల నాగేంద్ర, చల్లా శ్రీనివాసులు పోలీసులను గమనించి బైక్పై పారిపోయేందుకు విఫలయత్నం చేశారు. ఇద్దరు నిందితులను అదుపులోనికి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారని సీఐ తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు చెప్పారు. -
కొత్తవి ఇవ్వకపోగా..ఉన్నవి పీకేస్తున్నారు
ఒంగోలు సబర్బన్: టీడీపీ కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా...ఉన్న పెన్షన్లు పీకేస్తున్నారు...ఇదెక్కడి అన్యాయమని మాజీ మంత్రి, ససంతనూతలపాడు వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. పింఛన్లు కోల్పోయిన దివ్యాంగులను తీసుకొని కలెక్టరేట్లో కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీ కోసం కార్యక్రమానికి మేరుగు నాగార్జున సోమవారం వచ్చారు. వైఎస్సార్సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరు రవిబాబు, పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానంద రెడ్డితో పాటు వైఎస్సార్ సీపీ శ్రేణులు దివ్యాంగుల వెంట వచ్చారు. వాళ్ల వెంట నడుస్తూ దివ్యాంగుల పట్ల టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. అనంతరం దివ్యాంగులను తీసుకొని మీ కోసం కార్యక్రమంలో కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియాను కలిసి దివ్యాంగులు గోడును మాజీ మంత్రి మేరుగు నాగార్జున వినిపించారు. వాళ్ల కాళ్లు చూడండి, వాళ్ల కళ్లు చూడండి అంటూ కలెక్టర్ను మేరుగు నాగార్జున వేడుకున్నారు. ఇలాంటి దివ్యాంగుల పెన్షన్లు తీసేయటానికి ప్రభుత్వానికి మనస్సు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. 90 శాతం ఉన్న అంగవైకల్యం ఒక్కసారిగా 35 శాతానికి, 40 శాతానికి ఏ విధంగా పడిపోతుందో చెప్పాలన్నారు. అంటే ప్రభుత్వం కావాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన దివ్యాంగుల పెన్షన్లు ఇవ్వకూడదని నిర్ణయించుకుందా అని కలెక్టర్ను ప్రశ్నించారు. మీ కళ్లతో మీరు చూడండి అంటూ కలెక్టర్కు దివ్యాంగులను మేరుగు నాగార్జున స్వయంగా చూపించారు. దాంతో రీ వెరిఫికేషన్ పెట్టించి పరీక్షలు చేయిస్తామని కలెక్టర్ తమీమ్ అన్సారియా భరోసా ఇచ్చారు. అనంతరం మేరుగు నాగార్జున మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు, పెన్షనర్లకు అండగా ఉంటుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దివ్యాంగులకు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు అండగా ఉండి ప్రతి ఒక్కరికీ పెన్షన్లు మంజూరు చేసి ఆయా కుటుంబాలను ఆదుకుంటే టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చి ఆ పెన్షన్లు పీకేయటం ఎంతవరకు సబబన్నారు. అనాదిగా పెన్షన్ల మీదే ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలను ఈ రోజు వీధిన పడేస్తారా అంటూ కూటమి ప్రభుత్వ పెద్దలను నిలదీశారు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 3,592 పెన్షన్లు దివ్యాంగులవి తీసేశారంటే ఎంతటి దుర్మార్గానికి కూటమి ప్రభుత్వం ఒడిగట్టిందో అర్థమవుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పెన్షన్లే లక్ష తీసేశారని, మిగతా పెన్షన్లు 5 లక్షల వరకు తొలగించారన్నారు. ఇంతటి దివాళాకోరు ప్రభుత్వం మరొకటి ఉంటుందా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో 66 లక్షల మందికి పెన్షన్లు అందించారంటే ఆయనది ఎంత పెద్దమససో అర్థం చేసుకోవాలన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వానికి డబ్బులు ఆదాయం చేద్దామనే తప్ప దివ్యాంగులను ఆదుకోవాలన్న ఆలోచనే లేదన్నారు. గతంలో ప్రభుత్వ డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికెట్లు ఇప్పుడే ఎలా తీసేస్తారన్నారు. వైఎస్సార్సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు గోపిరెడ్డి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం కొత్తగా ఇవ్వకపోగా ఉన్నవాటిని తొలగించటం దుర్మార్గమైన చర్య అన్నారు. అర్హులైన వికలాంగులకు అందరికీ పెన్షన్లు పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దివ్యాంగులను ఇబ్బందులు పెడుతున్న ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ వైఎస్సార్సీపీ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానంద రెడ్డి, పార్టీ ఒంగోలు ఇన్చార్జ్ చుండూరు రవిబాబు, దివ్యాంగుల విభాగం రాష్ట్ర కార్యదర్శి కాట్రగడ్డ శ్రీనివాసులు, రాష్ట్ర కార్యదర్శి బొట్ల రామారావు, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకర్, చెంచిరెడ్డి, క్రాంతి కుమార్తో పాటు పలువురు పాల్గొన్నారు. పోలీసుల తీరును తప్పుపట్టిన మేరుగు: మీ కోసం కార్యక్రమం కోసం దివ్యాంగులను తీసుకొచ్చిన వైఎస్సార్సీపీ నాయకులపై పోలీసులు అనుసరించిన తీరును మాజీ మంత్రి మేరుగు నాగార్జున తప్పుపట్టారు. తామేమీ ఆందోళన చేయటానికో, ధర్నా చేయటానికో రాలేదని, కొంతమంది దివ్యాంగులను తీసుకొని మీ కోసం కార్యక్రమంలో కలెక్టర్ను కలుస్తామంటే పోలీసులు అడ్డుకోవటం సరైన పద్ధతి కాదన్నారు. ముగ్గురు కానీ నలుగురు కానీ లోపలకు రావాలనటం, అంతవరకే లోపలకు అనుమతిస్తామనటం సరైన పద్ధతి కాదని అసహనం వ్యక్తం చేశారు. ఆంక్షలు పెట్టి దివ్యాంగులను, ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూస్తే సహించేది లేదని కూడా మేరుగు నాగార్జున స్పష్టం చేశారు. -
పోలీస్ గ్రీవెన్స్కు 80 ఫిర్యాదులు
ఒంగోలు సిటీ: ప్రజా ఫిర్యాదులపై విచారణ చేపట్టి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చూడాలని ఎస్పీ దామోదర్ సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్కు జిల్లా నలుమూలల నుంచి 80 మంది బాధితులు హాజరై ఎస్పీ ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. ఫిర్యాదుల పూర్వాపరాలు తెలుసుకున్న ఎస్పీ సంబంధిత స్టేషన్ల పోలీసు అధికారులతో మాట్లాడి త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదుల్లో కొన్ని.. గ్రీవెన్స్లో మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ రమణ కుమార్, ఎస్సీ,ఎస్టీ సెల్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ జగదీష్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పాండురంగారావు, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్ రావు, సిబ్బంది పాల్గొన్నారు. -
నల్లబర్లీ పొగాకు పూర్తిగా కొనుగోలు చేయాలి
● రైతుసంఘం ఆధ్వర్యంలో రైతుల నిరసన నాగులుప్పలపాడు: నల్లబర్లీ పొగాకు పూర్తిగా కొనుగోలు చేయాలని రైతు సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఆదివారం నాగులుప్పలపాడు బస్టాండ్ సెంటరులో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుసంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శలు జే. జయంత్బాబు, పమిడి వెంకట్రావులు మాట్లాడుతూ.. ఈ ఏడాది ప్రైవేట్ కంపెనీలు రైతులను ప్రోత్సహిస్తూ ఎంత పొగాకు పంట సాగు చేసినా కొనుగోలు చేస్తామని హమీ ఇచ్చి రైతుల చేత బర్లీ పొగాకు వేయించారన్నారు. తీరా పంట చేతికి వచ్చిన తరువాత కంపెనీలు చేతులెత్తేయడంతో రైతాంగం దిక్కుతోచని పరిస్థితుల్లో పడింది. ఈనేపథ్యంలో రైతుల వద్ద బర్లీ పొగాకును పూర్తిగా కొనుగోలు చేయాలని పలు దఫాలు ఆందోళన కార్యక్రమం చేపట్టామన్నారు. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం రైతుల వద్ద ఉన్న బర్లీ పొగాకు చివరి ఆకువరకు కొనుగోలు చేస్తామని హమీ ఇచ్చి రైతుల వివరాలను నమోదు చేయించింది. ఆమేరకు మార్క్ఫెడ్ను రంగంలోకి దింపి గత రెండు నెలల నుంచి కొనుగోలు ప్రారంభించారు. కూలీలకు డబ్బులు ఇవ్వలేని దుస్థితి.. ప్రస్తుతం గోదాములు ఖాళీగా ఖాళీగా లేవని సాకుతో కొనుగోలు నిలిపివేయడం దుర్మార్గమన్నారు. దాంతో ప్రస్తుతం కొనుగోలు చేసిన ప్రకారం చూస్తే సగం మంది రైతుల వద్ద మాత్రమే కొనుగోలు చేశారు. ఇంకా సగం మంది రైతుల పొగాకు ఇండ్ల వద్దనే పొగాకు చెక్కులు దర్శనమిస్తున్నాయని చెప్పారు. ఆ రైతులకు సీరియల్ పేర్లు రాక కొనుగోలు కేంద్రాలకు రాని దుస్థితి నెలకొంది. ఈ మేరకు కొనుగోలు చేసిన రైతాంగానికి ఎకరానికి రూ.50 వేల వరకు నష్టం తప్పడం లేదు. దాంతో అసలు కొనుగోలు నిలిపి వేస్తే మరింత నష్టపోతారన్నారు. పొగాకు అమ్ముడుపోక కూలీలకు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో రైతాంగం కొట్టుమిట్టాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం పునరాలోచించి ఇచ్చిన హమీ ప్రకారం రైతుల వద్ద ఉన్న బర్లీ పొగాకును చివరి ఆకువరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వర్జీనీయా పొగాకు లోగ్రేడ్ను రూ.20 వేలకు తగ్గకుండా కొనుగోలు చేయాలన్నారు. లేకపోతే పొగాకు రైతాంగాన్ని ఏకం చేసి ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు టీ శ్రీకాంత్, జి బసవపున్నయ్య, రావెళ్ల వెంకట్రావు, నాగేశ్వరరావు, గడ్డం ఏలియ్య, పాలపర్తి యోనా, హజరత్తయ్య, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. -
ఎరువుల దుకాణంపై విజిలెన్స్ దాడులు
దర్శి: మండలంలోని రాజంపల్లి గ్రామంలో ఎరువుల దుకాణంపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. సీఐ రాఘవరావుల ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో విజిలెన్స్ ఏఓ శివనాగప్రసాద్, ఏఓ రాధలు కలసి తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 5.76 మెట్రిక్ టన్నుల యూరియా షార్టేజ్ ఉన్నట్లు గుర్తించారు. ఎటువంటి లైసెన్స్ లేకుండానే విత్తనాలు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ అక్రమాల పై దుకాణం నిర్వాహకుడు మురళీపై 6ఏ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కొండపి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..గురువారం సాయంత్రం మండలంలోని ముప్పవరం గ్రామంలో కారు, బైక్ ఢీకొన్నాయి.ఆ సంఘటనలో గాయపడిన పెరిదేపి గ్రామానికి చెందిన అంగలకుర్తి చిన్న పౌలు(55)ను చికిత్స నిమిత్తం ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న చిన్న పౌలు ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొండపి ఎస్సై ప్రేమ్ కుమార్ తెలిపారు. -
అగ్నివీర్కు 159 మంది అర్హత
తిరుపతి రూరల్: అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ రాత పరీక్షలో ఎస్వీ డిఫెన్స్ అకాడమికి చెందిన 159 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు అకాడమి చైర్మన్ బీ శేషారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఉచితంగా ఫిజికల్ ట్రైనింగ్ ఇచ్చామని, వారు ఉద్యోగంలో చేరడానికి అవసరమైన సహకారం అందిస్తామన్నారు. అంతకుముందు 159 మంది విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఒంగోలు: జిల్లా ఫెన్సింగ్ క్రీడాకారుల ఎంపిక ఆదివారం స్థానిక డాక్టర్ పర్వతరెడ్డి ఆనంద్ మినీ స్టేడియంలో నిర్వహించారు. ఎంపిక ప్రక్రియను ప్రకాశం జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ చైర్మన్ కె.సాయి మనోహర, వ్యవస్థాపక అధ్యక్షుడు వి.నాగేశ్వరరావు పర్యవేక్షించారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 30న భీమవరం వెస్ట్ బెర్రీ పాఠశాలలో జరిగే అండర్ 17 క్యాడెట్ 11వ రాష్ట్రస్థాయి పోటీలలో ప్రకాశం జిల్లా తరుపున పాల్గొంటారని జిల్లా ఫెన్సింగ్ ముఖ్య కార్యదర్శి జి.నవీన్ తెలిపారు. ఎంపికై న బాలురు.. పి.అంబరీష్, కె.జగదీష్, ఎండీ అబ్దుల్, ఎస్.సంతోష్(ఈపీ), కె.దరహాస్, ఎస్కే అదిల్, బి.ఈశ్వర్, ఎం.యతిన్ శ్రీకార్తికేయ(ఫాయిల్), ఈ.తనూజ్, పి.నిఖిల్, టి.అభినవ్ బుద్ద, కె.తారక్రామ్(సాబ్రే) ఎంపికై న బాలికలు: ఎస్కె ఫిర్దోన్ తాన్వీర్, ఎం.మనస్వి(ఈపీ), పి.లిఖితరెడ్డి(ఫాయిల్), పి.చక్రిక, ఈ.మహిత, వి.లేఖన(సాబ్రే) ఒంగోలు సిటీ: 2004కు ముందు నియామక ప్రక్రియ ప్రారంభించిన ఉపాధ్యాయులు, ఉద్యోగ, పోలీసులందరికీ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 25వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ అలంకార్ సెంటర్లో నిర్వహించే మహాధర్నాను జయప్రదం చేయాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షేక్ అబ్దుల్ హై, డి వీరాంజనేయులు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. 2003 డీఎస్సీ టీచర్స్ ఫోరం చేపట్టిన మహా ధర్నాకు జిల్లా శాఖ సంపూర్ణ మద్దతు తెలియజేస్తోందన్నారు. జిల్లాలోని యూటీఎఫ్ కార్యకర్తలు భారీ ఎత్తున మహా ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
సీనియర్ అంతర్జిల్లాల మహిళా జట్టు ఎంపిక
ఒంగోలు: ప్రకాశం జిల్లా సాఫ్ట్బాల్ సీనియర్ మహిళా జట్టు ఎంపిక ఆదివారం స్థానిక శ్రీహర్షిణీ కాలేజీ క్రీడా ప్రాంగణంలో జరిగింది. ఎంపిక ప్రక్రియను ప్రకాశం జిల్లా అడ్హక్ కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులైన పి.నరసింహారెడ్డి, సంయుక్త కార్యదర్శి ఎ.రాంప్రసాద్ పర్యవేక్షించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీహర్షిణీ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ దాది ఆంజనేయులు మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించడం ద్వారా విద్య, ఉద్యోగ అవకాశాలను త్వరగా పొందవచ్చన్నారు. ఈనెల 30,31 తేదీల్లో గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగే రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో కూడా రాణించి జిల్లా కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేయాలని కోరారు. జిల్లా జట్టు.. సీహెచ్ మాధురి, జి.తేజస్విని, బి.భవాని, బి.భాగ్యశ్రీ, సీహెచ్ హక్స్ ప్రియ, బి.కీర్తిన, ఎన్.ప్రణతి, బి.భావన, ఐ.నాగవేణి, చైత్ర, సుల్తానా గ్రేస్, హాసిని, ధరణి, చరితారెడ్డి, ఆమోస్. -
హామీలు విస్మరించడం చంద్రబాబు నైజం
మద్దిపాడు: ఎన్నికలకు ముందు అలివిమాలిన హామీలు ఇవ్వడం, అధికారంలోకి రాగానే విస్మరించడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. మండలంలోని మద్దిపాడు, బసవన్నపాలెం గ్రామాల్లో ఆదివారం బాబు ష్యూరిటీ..మోసం గ్యారెంటీ కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల సమయంలో వందలాది హామీలిచ్చి ఒకటి అరా అరకొరగా హామీలు చేసి అన్ని హామీలు అమలు చేశామని గొప్పలు చెప్పుకోవడం దుర్మార్గమన్నారు. ప్రజలు నమ్మిన ప్రతిసారి వారిని నిలువునా మోసం చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు. ప్రజలకు మేలు చేయడం కంటే తన సొంత లాభం చూసుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ప్రస్తుతం అమరావతి నిర్మాణాల పేరుతో చేపడుతున్న పనులు పనికి వచ్చేవేనా అంటూ ప్రశ్నించారు. నిలువెత్తు నీళ్లలో మునిగిన అమరావతిని ప్రజలు ప్రసార మాధ్యమాల ద్వారా చూసి ఇక్కడ అమరావతి నిర్మించడం ఏమిటని ప్రశ్నిస్తున్నా తాను పట్టిన కుందేలుకు మూడు కాళ్లే అని వాదించే రకం చంద్రబాబు అన్నారు. 14 నెలల కాలంలో లక్షల కోట్లు అప్పులు తీరి రాష్ట్రాన్ని దివాలా తీసే పరిస్థితులు తీసుకువస్తున్నారన్నారు. చంద్రబాబు ఏనాడైనా ప్రజలకు ఉపయోగపడే ఒక్క పథకం అయినా అమలు చేశారా అని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వైఎస్సార్ సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. నాయకులు, కార్యకర్తలు ఎవ్వరూ అధైర్యపడాల్సిన అవసరంలేదన్నారు. కూటమి నాయకులు మేనిఫెస్టోను గ్రామాల్లోకి తీసుకువెళ్లి మది మంచి ప్రభుత్వం అని చెప్పే దమ్ము ఉందా అంటూ సవాల్ విసిరారు. సూపర్ సిక్స్ పథకాల పేరుతో జరుగుతున్న మోసాలను ప్రజల్లోకి విస్తతంగా తీసుకువెళ్లాలని నాయకులు, కార్యకర్తలను కోరారు. అనంతరం మద్దిపాడు, బసవన్నపాలెం గ్రామాల్లో క్యూ ఆర్ కోడ్ను ఆవిష్కరించారు. అనంతరం గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. మద్దిపాడు గ్రామ పార్టీ అధ్యక్షునిగా కాకుమాను శశికుమార్ను ఎంపిక చేసి ఆయనకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మండవ అప్పారావు ఉపాధ్యక్షుడు వాకా కోటిరెడ్డి, నాయకులు మోరబోయిన సంజీవరావు, మద్దా లక్ష్మీనారాయణ, నట్టే సంజీవరావు, కంకణాల సురేష్, నాదెండ్ల మహేష్, సన్నపు రెడ్డి రమణమ్మ, చిన్న అప్పయ్య, శ్రీరామమూర్తి, అబ్దుల్ మజీద్ పైనం ప్రభాకర్, పోకూరి శ్రీరామ మూర్తి పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
సీసీపై చర్యలు తీసుకోవాలని వినతి
టంగుటూరు: గ్రామ సమైక్య సంఘంలో అక్రమాలకు పాల్పడిన సీసీపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కందులూరు గ్రామంలోని కందులూరు–1 గ్రామ సమైక్య సంఘ సభ్యులు ఒంగోలులోని అధికారులను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ సమైక్య అధ్యక్షురాలు బొట్ల వెంకటరమణమ్మ, కార్యదర్శి ఉప్పలపాటి వెంకట్రావమ్మ, కోశాధికారి బొడ్డు సుశీల 25 గ్రామ సంఘాల సభ్యులు, మొదటి, రెండో లీడర్లతో ఎటువంటి సమావేశంగాని, సంప్రదింపులుగాని లేకుండా వెలుగు సీసీలు చెన్నుపాటి కవిత, అప్పిశెట్టి అరుణ కలిసి స్థానిక బ్యాంకు ఆఫ్ బరోడా బ్రాంచ్ మేనేజర్ జగదీశ్తో కలిసి ఫోర్జరీ సంతకాలతో తీర్మానం చేశారన్నారు. బ్యాంకులో వీరి పేర్లు మార్చి, చెక్ బుక్ రద్దుకి కూడా సిఫార్సు చేశారన్నారు. విషయం తెలుసుకున్న సభ్యులు ఫోర్జరీ చేసిన వారిపై విచారణ చేయాలని జేసీకి ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా పౌరసరఫరాల సంస్థ డిప్యూటీ కలెక్టర్ విచారణ చేశారు. సరైన నివేదిక ఇచ్చి జేసీకి అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో గ్రామ సమైక్య సంఘ సభ్యులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి యోగాసనాల్లో సత్తా
పీసీపల్లి: రాష్ట్రస్థాయి యోగాసనాల్లో మండలంలోని వెంగలాయపల్లి ప్రాథమిక పాఠశాలకు చెందిన స్వర్ణ వెంకటరమణయ్య సత్తా చాటారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో హ్యాండ్ బ్యాలెన్స్ ఆసనాల్లో ద్వితీయస్థానం, సుపైన్ ఆసనాల్లో తృతీయ స్థానం సాధించి జాతీయ స్థాయి యోగా పోటీలకు ఎంపికయ్యారు. వెంకట రమణయ్యను మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసులు, సంజీవ్ ఆంధ్రప్రదేశ్ పతంజలి యోగ పీఠం అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం, రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు అభినందించారు. -
సీబీఎస్సీ సౌత్ జోన్ తైక్వాండో విజేతలకు బహుమతులు
మార్కాపురం టౌన్: పట్టణంలోని కమలా హైస్కూల్లో మూడు రోజులుగా జరుగుతున్న సీబీఎస్సీ స్కూల్స్ సౌత్జోన్ తైక్వాండో చాంపియన్షిప్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈ పోటీలకు ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ తదితర ప్రాంతాల నుంచి సుమారు 1200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అండర్ 14, 17, 19 విభాగాల్లో విద్యార్థులు పాల్గొన్నారు. విజేతలకు బంగారు, వెండి, కాంస్య పతకాలను టోర్నమెంటు అబ్జర్వర్ సీ దొరై, హైస్కూల్ ప్రిన్సిపల్ స్వరూప్ రంజన్ అందజేశారు. ఒంగోలు సిటీ: ఆర్పీలకు నష్టం కలిగించే ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జీవీ కొండారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం (సీఐటీయూ) జిల్లా ద్వితీయ మహాసభ బీ విజయలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జి.వి కొండారెడ్డి మాట్లాడారు. అనంతరం ఈ సభలో ఒంగోలు, చీమకుర్తి, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలో పనిచేసే ఆర్పీలందరూ పాల్గొని నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా ధారా రూతమ్మ, గౌరవ అధ్యక్షురాలిగా కల్పన, ప్రధాన కార్యదర్శిగా నారాయణస్వామి రాజ్యలక్ష్మి, కోశాధికారిగా పమిడి పద్మశ్రీ,, సహాయ కార్యదర్శిగా జమ్మలమడుగు సుజాత, నయోమి, ఉపాధ్యక్షులుగా పీ ఆదిలక్ష్మిని పాలకవర్గంగా ఎన్నుకున్నారు. 11 మందితో జిల్లా కమిటీని ఎన్నుకున్నార ని చెప్పారు. ఈ సందర్భంగా వేతనాలు పెంచాలని, హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని, పని భారాన్ని తగ్గించాలని కోరారు. ఆన్లైన్ యాప్స్ శిక్షణ ఇవ్వాలని, రూ.10 లక్షలు గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించాలన్నారు. కార్యక్రమంలో సాయి లక్ష్మి, రేణుక, రమణ, దివ్య శాంతి, శ్రీ లక్ష్మి, చంద్రిక, భారతి తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన ఒంగోలు పుస్తక మహోత్సవం
ఒంగోలు సిటీ: పది రోజుల పాటు పుస్తక ప్రియులను అలరించిన మూడో ఒంగోలు పుస్తక మహోత్సవం ఆదివారం ఘనంగా ముగిసింది. చివరి రోజు కావడంతో పాఠకులు ఉదయం 10 గంటల నుంచే పీవీఆర్ బాలుర పాఠశాల మైదానానికి పోటెత్తారు. రాత్రి 9 గంటల వరకు పుస్తకాల కొనుగోలు కొనసాగింది. వచ్చే ఏడాది ఒంగోలుకు మళ్లీ వస్తామని నిర్వాహకులు ఇచ్చిన హామీతో పుస్తక మహోత్సవానికి వీడ్కోలు పలికారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు నిర్వహించిన క్విజ్ పోటీలో మొత్తం 30 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీని విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీకి చెందిన రహ్మానుద్దీన్ నిర్వహించారు. క్విజ్ పోటీలో మూడు జట్లు బహుమతులు సాధించాయి. పది రోజుల పాటు జరిగిన పుస్తక మహోత్సవంలో కథలు చెప్పడం, చిత్రలేఖనం, దేశభక్తి గీతాలాపన, ఏకపాత్రాభినయం, క్విజ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన మొత్తం 60 మంది విద్యార్థులకు ముఖ్య అతిథి పెనుగొండ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. దివంగత బి.హనుమారెడ్డి జీవితం–సాహిత్యం అంశంపై చర్చా వేదిక నిర్వహించారు. కార్యక్రమానికి అరసం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి చలపాక ప్రకాశ్, విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షులు కె.లక్ష్మయ్య తదితరులు వక్తలుగా పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. మూడో ఒంగోలు పుస్తక మహోత్సవం ముగింపు సభ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ సభకు జనవిజ్ఞాన వేదిక సీనియర్ నాయకుడు పుల్లారావు అధ్యక్షత వహించారు. ముగింపు ప్రసంగాన్ని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక అధ్యక్షుడు వల్లూరు శివప్రసాద్ అందించారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదికకు చెందిన జయప్రకాశ్, విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షుడు కె.లక్ష్మయ్య, విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ తరఫున సాహిత్య కార్యక్రమాల నిర్వాహకులు రహ్మానుద్దీన్ పాల్గొన్నారు. ముగింపు సభలో లక్ష్మయ్య మాట్లాడుతూ ఒంగోలు పుస్తక మహోత్సవం ఒంగోలుకు చెందిన సాహితీవేత్తలు తమంతట తాముగా నిర్వహించదలిస్తే అందుకు పూర్తి సహకారం విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అందిస్తుందని ఆయన అన్నారు. -
ఏడాది పాలన మోసాలమయం
సంతనూతలపాడు (చీమకుర్తి రూరల్)/నాగులుప్పలపాడు: కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో రాష్ట్రంలో పరిపాలన స్తంభించిపోయిందని, ఎక్కడ చూసినా మోసాలమయమైందని సంతనూతలపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్, మాజీ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. సంతనూతలపాడు మండలంలోని పి.గుడిపాడు, కొనగానివారిపాలెం గ్రామాల్లో, నాగులుప్పలపాడు మండలం ఓబన్నపాలెం, నాగులుప్పలపాడు గ్రామాల్లో ఆదివారం బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. సంతనూతలపాడులో మండల పార్టీ అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి అధ్యక్షతన వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేరుగు నాగార్జున మాట్లాడుతూ ఎన్నికల ముందు ముసలి కన్నీరు కార్చి అధికారంలోకి వచ్చిన తరువాత వెన్నుపోటు పొడవటం చంద్రబాబుకు అలవాటే అన్నారు. ఎప్పుడు ఎన్నికల్లో పోటీచేసినా ఏదో ఒక పార్టీ మద్దతుతో కల్లబొల్లి మాటలు చెప్పడం.. గెలిచిన తరువాత ప్రజల్ని మర్చిపోవడం ఆయన నైజమన్నారు. సూపర్సిక్స్ పేరుతో ఇంటింటికీ తిరిగి కూటమి నాయకుల ఫొటోలు వేసుకుని బాండ్లు పంపిణీ చేశారని, ఆ బాండ్లలో ఉన్న అంశాలను ఎవరైనా ప్రశ్నిస్తే ప్రశ్నించిన వారిపై అరెస్టులు, అసత్య ప్రచారాలు, కేసులుపెట్టి భయభ్రాంతులకు గురి చేయడం సర్వసాధారణమైందని విమర్శించారు. అన్నదాతకు ఎరువులు కొరత, పండించిన పంటకు మద్ధతు ధర లేదన్నారు. ప్రతి పనికి దోచుకోవడం, దాచుకోవడం అన్నట్లు పనులు చేస్తున్న టీడీపీ నాయకులు అవినీతి కూపంలో కూరుకుపోయారని విమర్శించారు. పొగాకు రైతులను, మిర్చి రైతులను చంద్రబాబు చేసిన మోసం వారు జీవితంలో మరచిపోరన్నారు. బర్లీ పొగాకు కొనుగోళ్లలో పార్టీలు చూసి కొనుగోలు చేస్తున్న ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా చేశాడో చూసి సిగ్గు తెచ్చుకోవాలన్నారు. కూటమి దౌర్జన్య పాలనకు చరమగీతం పాడాలంటే వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ను సీఎం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ క్యూఆర్ కోడ్ ను నాగార్జున, నాయకులు ఆవిష్కరించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ బీ విజయ, మద్దిపాడు ఎంపీపీ వాకా అరుణ కోటిరెడ్డి, జెడ్పీటీసీ దుంపా రమణమ్మ, దుంపా ఎలమందరెడ్డి, సర్పంచ్ కుంచాల పుష్ప సుబ్బారావు, సంతనూతలపాడు సర్పంచ్ దర్శి నాగమణి, నాగులుప్పలపాడు మండల కన్వీనర్ పోలవరపు శ్రీమన్నారాయణ, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెళ్ల బంగారుబాబు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, గ్రీవెన్స్ సెల్ జిల్లా అధ్యక్షుడు పోలినేని కోటేశ్వరరావు, దివ్యాంగుల విభాగం రాష్ట్ర కార్యదర్శి కాట్రగడ్డ శ్రీనివాసరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు తానిపర్తి శేషురెడ్డి, గొడుగు కాలేషా, మహిళా విభాగం అధ్యక్షురాలు సీతమ్మ, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
రాజకీయ ప్రత్యామ్నాయం రూపొందించుకోవాలి
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ● ఒంగోలులో ఘనంగా సీపీఐ 28వ రాష్ట్ర మహాసభలు ఒంగోలు సిటీ: రాష్ట్రంలో మతోన్మాద అరాచక పాలనకు ప్రత్యామ్నాయంగా వామపక్ష పార్టీలు రాజకీయ ప్రత్యామ్నాయం రూపొందించుకోవాలని, ఆ దిశగా చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు అన్నారు. వామపక్ష ఉద్యమాల బలోపేతానికి తాము కృషి చేస్తామన్నారు. ఒంగోలులో సీపీఐ 28వ రాష్ట్ర మహాసభలు ఎస్జీవీఎస్ కళ్యాణ మండపం ఆవరణలో ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో వామపక్ష పార్టీలు బలపడితేనే మతోన్మాదాన్ని ఎదిరించగలమని, ఆ దిశగా కమ్యూనిస్టు పార్టీ 28వ రాష్ట్ర మహాసభల్లో కార్యాచరణ రూపొందించుకోవాలని ఆయన సూచించారు. ఓట్లు చేర్పుల విషయంలో బీహార్లో ఎస్ఐఆర్ అమలు చేస్తూ అత్యంత కుట్రపూరితంగా ఎన్నికల కమిషనర్ వ్యవహరిస్తోందన్నారు. మరోవైపు వామపక్ష పార్టీల అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో 30 రోజుల జైలు జీవితం ఉంటే ఉద్వాసన పలకాలన్న చట్టాన్ని ప్రతిపాదించడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో మతోన్మాదం ఎప్పుడూ లేనంతగా పెరిగిందని, మోదీ భజనలు చంద్రబాబు ఎత్తుకుని మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ప్రశ్నించడానికి పుట్టిందన్న జనసేన, 32 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాదించిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత నోరు మెదపకపోవటం దారుణమన్నారు. పరిశ్రమలు, రాజధాని అభివృద్ధి పేరుతో లక్షలాది ఎకరాలు సేకరించి రియల్ ఎస్టేట్గా అభివృద్ధి చేస్తున్నారని, ఆ భూములు తనఖా పెట్టి బ్యాంకుల్లో రుణాలు తీసుకుని రాష్ట్రాన్ని దివాలా తీయిస్తున్న కార్పొరేట్ శక్తుల అభివృద్ధికి చంద్రబాబు నాయుడు దోహదపడుతున్నారని తీవ్రంగా ఆరోపించారు. 28వ రాష్ట్ర మహాసభలకు సూచనగా వేదిక నల్లూరి అంజయ్య ప్రాంగణంలో మాజీ ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖర రావు మృతవీరుల స్థూపాన్ని ఆవిష్కరించారు. పార్టీ జాతీయ నాయకులు రావుల వెంకయ్య ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభించారు. రాష్ట్ర నాయకుడు పీ జగదీష్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మహాసభలకు రాష్ట్ర నాయకులు జీవీ సత్యనారాయణమూర్తి, దుర్గా భవాని, నాజర్, జీఎంఎఎల్ నారాయణ అధ్యక్ష వర్గంగా వ్యవహరించిన సభలో సీపీఐ జాతీయ కమిటీ నాయకురాలు వహీదా పర్వీన్, సీపీఐ జాతీయ కమిటీ నాయకుడు రావుల వెంకయ్య, సినీ నటుడు మాదాల రవి, జీ ఈశ్వరయ్య, రావుల రవీంద్రనాథ్, నల్లూరి వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడారు. -
వనరులు దోచుకో..!
వాటా ఇచ్చుకో.. కనిగిరిరూరల్/పీసీపల్లి: అధికార అండతో తెలుగు తమ్ముళ్లు పెట్రేగిపోతున్నారు. ఇసుక వ్యాపారాన్ని పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకోని గుత్యాధిపత్యం ప్రదర్శిస్తూ దోచేస్తున్నారు. వారు నిర్ణయించిన ధరకే ఇక్కడ కొనుగోలు చేయాలి. లేదంటే తట్ట ఇసుక కూడా దొరకదు. బయట ప్రాంతాల నుంచి ఇసుక తీసుకువచ్చినా చెప్పిన ధరకే ఇచ్చేసి పోవాలి. లేదంటే వాహనం అక్కడ నుంచి కదలదు. ఇలా ఇసుక వ్యాపారాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. అంతా అతని చేతుల్లోనే.. కనిగిరి నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన పీసీపల్లి మండల నేత ఇసుక స్టాక్ పాయింట్ కాంట్రాక్టర్ను దక్కించుకున్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని అంతా నా ఇష్టం అన్నట్లు వ్యవహరిస్తూ ఇతరులు వ్యాపారం చేసుకోనివ్వకుండా, గంప ఇసుక అయినా తానే ఇవ్వాలంటూ వ్యవహరిస్తూ దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల స్టాక్ పాయింట్ నిర్వాహకునితో ఇసుక లోకల్ వ్యాపారులు, ట్రాక్టర్, లారీ ఓనర్లు గొడవకు దిగినట్లు ప్రచారం జరుగుతోంది. డంపింగ్ పాయింట్ నిర్వాహకుడు అధికార పార్టీకి చెందిన వాడు కావడంతో అతనితో ఢీకొట్టలేక మౌనం దాల్చి లోలోన తీవ్ర అసంతృప్తితో రగులుతున్నారు. ఇక పీసీపల్లి మండలంలోని వాగుల్లో తెలుగు తమ్ముళ్లు జోరుగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. పాలేటి నది పరివాహాక ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు చేసి ట్రక్కు కట్టుబడి ఇసుక రూ.2,200 నుంచి రూ.2,500 వరకు అమ్మకాలు చేస్తున్నారు. తలాపాపం తిలా పిడికెడు అన్న చందంగా అధికారులు, అధికార పార్టీ నేతలు, అందరికీ వాటాలు ఉన్నట్లు ప్రచారం ఉంది. టన్నుకు రూ.300 వరకు అదనపు దోపిడీ కనిగిరి నియోజకవర్గానికి అత్యధికంగా నెల్లూరు, జలదంకి తదితర ప్రాంతాల నుంచి ఇసుక రవాణా అవుతోంది. లారీ లోడింగ్తో కలిపి ఇసుక టన్ను కనిగిరికి చేరే సరికి రూ.600 వరకు పడుతుంది. దీన్ని నేరుగా వినియోగదారునికి అందించినా బేల్దార్లకు ఇచ్చినా.. అవసరాన్ని బట్టి రూ 550 నుంచి రూ 600లకు దించుతారు. అయితే స్టాక్ పాయింట్ నిర్వాహకుడు అధికార అండతో అధికారులను అడ్డుపెట్టుకుని ఇసుక లారీల డ్రైవర్లను, యజమానులను బెదరించుకుని తన స్టాక్ పాయింట్కు తరలించుకుంటున్నాడు. తన పాయింట్లో డంప్ చేసిన ఇసుకను, లేదా తన ద్వార సరఫరా చేసే..ఇసుక లారీ లోడును టన్ను రూ.800 నుంచి రూ.850లకు విక్రయిస్తున్నాడు. లారీ సుమారు 35 నుంచి 40 టన్నులు ఉంటుంది. అంటే ప్రతి టన్నుకు ఖర్చులు పోను సరాసరిన రూ.200 మిగిలినా ఒక లారీకి దాదాపు రూ.6 నుంచి రూ.8 వేల వరకు ఆదాయం మిగులుతుంది. ట్రాక్టర్ లెక్కన అయితే ట్రక్కు రూ.3,800లకు విక్రయిస్తున్నాడు. ఇందులో కూలీలు రూ.300, ట్రాక్టర్ బాడుగ రూ.500 ఖర్చవుతుంది. స్టాక్ పాయింట్ నిర్వాహకుడు అధికార పార్టీ నేత కావడంతో బయట నుంచి వచ్చే( చీమకుర్తి, సంతనూతపాడు, మార్కాపురం) ఇసుక లారీలు సైతం అతనికే లోడును దింపి వెళ్లాల్సిన పరిస్థితి. ప్రతి రోజు కనీసం 3నుంచి 5 లారీల ఇసుక అమ్మకం జరుగుతున్నట్లు ఇసుక వ్యాపారులు చెప్తున్నారు. కనిగిరిలో ఇసుకాసురులు అధికార అండతో జోరుగా అక్రమ తవ్వకాలు శివార్లలో డంపింగ్ పాయింట్లు కనిగిరిలో ఇసుక స్టాక్ డిపో నిర్వాహకుడి ఇష్టారాజ్యం టన్ను ఇసుకకు రూ.200 నుంచి రూ.300 అదనంగా వసూలు అడ్డుగోలు దోపిడీతో అల్లాడుతున్న గృహ నిర్మాణదారులు జోరుగా ఇసుక అక్రమ తవ్వకాలు పీసీపల్లిలో ఇసుక అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. అధికార పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా ఇసుక దోపిడీ వ్యాపారం చేస్తున్నారు. అధికారం మాది, అంతా మాది అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇసుకాసురులు అధికార పార్టీకి చెందిన వారు కావడం అక్రమార్జనలో ఎవరి వాటా వారికి దక్కుతుండటంతో రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు సైతం ఎవరికి వారు మౌనం దాల్చుతున్నారు. మండలంలో పాలేరు నది పరివాహక ప్రాంతాల్లో జోరుగా ఇసుక తవ్వాకాలు చేస్తున్నారు. టీడీపీ మండల, గ్రామ స్థాయి నేతలు ప్రొక్లైన్ పెట్టి మరీ తవ్వకాలు చేసి గ్రామ శివార్లలో ఇసుక డంపింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. మండలంలోని పెద అలవలపాడు, నేరేడుపల్లి, బట్టుపపల్లి, గంగ దగ్గర, పాటిటిల్లి, పంచలింగాల కొండ వాగుల సమీపంలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. సంపద సృష్టిలో భాగంగా టీడీపీ గ్రామ స్థాయి నేతలు జోరుగా ఇసుక దందా చేస్తూ రూ.లక్షలు అక్రమార్జన చేస్తున్నారు. -
హెచ్ఎంల సంఘ జిల్లా కార్యవర్గం ఎన్నిక
ఒంగోలు సిటీ: ఏపీ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ ఎన్నిక ఆదివారం ఒంగోలులోని ప్రధానోపాధ్యాయుల భవనంలో నిర్వహించారు. అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డేనియల్ పరిశీలకునిగా వ్యవహరించారు. జిల్లా గౌరవ అధ్యక్షునిగా ఎస్కే అహ్మద్ (జెడ్పీహెచ్ఎస్, ఏనుగులదిన్నెపాడు), అధ్యక్షునిగా ఎం.సుధాకర్ (జెడ్పీహెచ్ఎస్, తర్లుపాడు), ప్రధాన కార్యదర్శిగా వై.వెంకటరావు (జెడ్పీహెచ్ఎస్, త్రోవగుంట), కోశాధికారిగా జీఎస్ఆర్ సాయి (జెడ్పీహెచ్ఎస్, పల్లామల్లి), రాష్ట్ర కౌన్సిలర్లుగా ఎం.శ్రీనివాసరావు (జెడ్పీహెచ్ఎస్, బిట్రగుంట), ఎస్కే ఖాదర్మస్తాన్ (జెడ్పీహెచ్ఎస్ గరల్స్, దర్శి), ఎం.విజయభాస్కర్రెడ్డి (జెడ్పీహెచ్ఎస్, అర్థవీడు), కార్యనిర్వాహక కార్యదర్శిగా పీ.మహబూబ్ ఖాన్ (జెడ్పీహెచ్ఎస్, పెద్దకండ్లగుంట), కేంద్ర కార్యదర్శిగా పీ.సుధాకర్ (జెడ్పీహెచ్ఎస్, జరుగుమల్లి)లను ఎన్నుకున్నారు. మార్కాపురం డివిజన్ అధ్యక్షునిగా టీ శ్రీనివాసులరెడ్డి (జెడ్పీహెచ్ఎస్, తాటిచర్లమోటు), కార్యదర్శిగా ఎస్.నాగేశ్వరరావు (జెడ్పీహెచ్ఎస్,మర్రిపాలెం), ఒంగోలు డివిజన్ అధ్యక్షునిగా కేసీహెచ్ సుబ్బారావు, కార్యదర్శిగా ఎస్వీ రాంబాబులను ఎన్నుకున్నారు. ఎం.సుధాకర్వై.వెంకటరావు -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సీఎస్ పురం (పామూరు): నంద్యాలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సీఎస్ పురం వడ్డెరపాలేనికి చెందిన వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. మృతుని బంధువులు తెలిపిన వివరాల మేరకు.. సీఎస్ పురం వడ్డెపాలేనికి చెందిన బండారు దేవదాసు (44)కాంక్రీట్ మిషన్లతో నంద్యాలలో భవన నిర్మాణ పనులు చేయిస్తూ జీవిస్తున్నాడు. నిత్యం వాకింగ్ చేసే అలవాటున్న దేవదాసు శనివారం ఉదయం ఎప్పటిలాగే నంద్యాలలో వాకింగ్కు వెళ్లి రహదారి పక్కన నడుస్తున్న క్రమంలో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దేవదాసు అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో వడ్డెపాలెంలో విషాదం అలముకుంది. మృతునికి భార్య కుమారి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
చిన్నారుల నటనతో ఆకట్టుకున్న తెలుగు వెలుగులు
ఒంగోలు టౌన్: పుస్తక మహోత్సవం 9వ రోజు పెదపాడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన ‘తెలుగు వెలుగులు’ నృత్య రూపకం విశేషంగా ఆకట్టుకుంది. ఒక గంట నిడివి కలిగిన ఈ నృత్య రూపకంలో తెలుగు సాహిత్య చరిత్ర సంస్కృతిని ఆవిష్కరించారు. చిన్నారులు అద్భుతమైన హావభావాలు ప్రదర్శించారు. ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు విద్యార్థుల ప్రతిభ, కళారూపాలను ప్రదర్శించారు. మోనో యాక్షన్, మైమ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 60 మంది విద్యార్థులు పాల్గొన్నారు. తమకు ఇష్టమైన పాత్రలకు సంబంధించిన వేషధారణతో అచ్చుగుద్దినట్లుగా సంభాషణలను పలికించి ఔరా అనిపించుకున్నారు. అనంతరం మాదాల రంగారావు సాహిత్య వేదిక మీద ఏటుకూరి బలరామమూర్తి రచించిన మన చరిత్ర పుస్తకాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆవిష్కరించారు. రాహుల్ సాంకృత్యాయన్ రచించిన భారత దర్శనం పుస్తకాన్ని సీపీఐ రాష్ట్ర నాయకుడు హరినాథ్రెడ్డి ఆవిష్కరించారు. ఆ తరువాత ప్రకాశం జిల్లా సంస్కృతి, సాహిత్యం అనే అంశం మీద చర్చ జరిగింది. ఈ చర్చా కార్యక్రమంలో సినీ నటులు మాదాల రవి, ఏవీ పుల్లారావు, విజయవాడ బుక్ ఫెస్టివల్ అధ్యక్ష, కార్యదర్శులు మనోహర్ నాయుడు, లక్ష్మయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాదాల రవి మాట్లాడుతూ జిల్లా నుంచి ఎందరో కళాకారులు అద్భుతంగా రాణిస్తున్నారని చెప్పారు. జిల్లా కళల ప్రాధాన్యతను వివరిస్తూ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రా నాయక్ ఆలపించిన వందనం వందనం పాట విశేషంగా అలరించింది. శనివారం పుస్తక మహోత్సవానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ప్రజల కోరిక మేరకు పుస్తక మహోత్సవం చివరి రోజున ఆదివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
అక్రమంగానే భవన నిర్మాణం పూర్తి...
ఒంగోలు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు ప్లాన్ అప్రూవల్ను తిరస్కరించారు. ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులు తీసుకున్న తర్వాతే కమర్షియల్ కాంప్లెక్స్ను హైదరీ క్లబ్ కమిటీ నిర్మించాల్సి ఉంది. కానీ, అలాంటిదేమీ లేకుండానే నగరం నడిబొడ్డులో అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకపోయినా రోడ్డు మీదనే కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తుంటే ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్గానీ, టౌన్ ప్లానింగ్ అధికారులుగానీ కనీసం దానివైపు కనె ్నత్తి కూడా చూడలేదు. అడ్డగోలుగా అక్రమంగా అంత పెద్ద భవన నిర్మాణం జరుగుతుంటే కళ్లప్పగించి చూస్తున్నారే తప్ప ఆ నిర్మాణాన్ని నిలువరించే ప్రయత్నం కనీసం కూడా చేయలేదు. -
కార్పొరేషన్ విస్మరిస్తూ!
కబ్జా విస్తరిస్తూ..నిబంధనలకు విరుద్ధంగా హైదరీక్లబ్ కమిటీ నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్సాక్షి ప్రతినిధి, ఒంగోలు: నగరంలో అత్యంత విలువైన ప్రాంతం.. ఒక పక్క పీడీసీసీ బ్యాంక్ ప్రధాన కార్యాలయం, మరో పక్క ఒంగోలు ఆర్డీఓ కార్యాలయం.. వెనుకవైపు ఓల్డ్ రిమ్స్ ప్రాంగణం. ఎదురుగా ఒంగోలు హెడ్ పోస్టాఫీస్... వీటన్నింటి మధ్యలో ఒంగోలు నగర పౌరుల రిక్రియేషన్ కోసం ఏర్పాటు చేసిన హైదరీ క్లబ్. ఈ క్లబ్కు ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసుకుంటూ క్లబ్ ప్రాంగణంలో కలుపుకుంటూపోతున్నారు నిర్వాహకులు. క్లబ్ కోసం గతంలో కేటాయించిన స్థలంతో పాటు చుట్టుపక్కల స్థలాలను కూడా ఇప్పటికే కలిపేసుకున్నారు. కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా నామినేటెడ్ ప్రెసిడెంట్గా ఉన్న ఈ హైదరీ క్లబ్ కమిటీకి ఎస్పీ ఏఆర్ దామోదర్ మెంబర్గా కూడా ఉన్నారు. వీళ్లిద్దరికీ కమిటీలో ఎన్నికలు ఉండవు. వైస్ ప్రెసిడెంట్ మొదలుకుని మిగతా కమిటీకి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ కమిటీలో కీలక వ్యక్తి మొత్తం తానై వ్యవహరిస్తూ అక్రమాలకు తెగబడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతి లేకుండానే కమర్షియల్ కాంప్లెక్స్... క్లబ్కు కేటాయించిన స్థలం కాకుండా వైద్యారోగ్య శాఖకు చెందిన దాదాపు 300 గదులకుపైగా స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా కమిటీ కబ్జా చేసింది. కబ్జా చేసిన స్థలంలో హైదరీ క్లబ్ ప్రధాన గేటుకు పడమరవైపు ఉన్న స్థలంలో రోడ్డు ముఖద్వారంగా ఎలాంటి అనుమతులు లేకుండా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని హడావిడిగా చేపట్టారు. ఆ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం ఒంగోలు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో క్లబ్ పాలకమండలి దరఖాస్తు చేసుకుంది. అందుకోసం నిబంధనల ప్రకారం నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన రుసుంలు కూడా చెల్లించింది. అయితే కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం ప్లాన్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని టౌన్ ప్లానింగ్ అధికారులు ప్లాన్ను తిరస్కరించారు. కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించాలంటే ఆ స్థలాన్ని నగరపాలక సంస్థకు మార్ట్గేజ్ చేయాల్సి ఉంది. మార్ట్గేజ్ లేకుండానే ప్లాన్ అప్రూవల్ కోసం కమిటీ దరఖాస్తు చేసుకుంది. మార్ట్గేజ్ కోసం ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి కమిటీ పేరుమీద మార్ట్గేజ్ చేయాలని కోరారు. అది ప్రభుత్వ స్థలమని, హైదరీ క్లబ్ పేరు మీద మార్ట్గేజ్ చేయడం నిబంధనలకు విరుద్ధమని వాళ్లు కూడా తిరస్కరించారు. కమిటీలో రిటైరైన జిల్లా స్థాయి అధికారులు... హైదరీ క్లబ్ కమిటీలో రిటైరయిన జిల్లా స్థాయి అధికారులు కూడా ఉన్నారు. రెవెన్యూలో పనిచేసిన తహసీల్దార్లు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాల్లో పనిచేసిన అధికారులు కూడా పాలక మండలితో పాటు కమిటీలో సభ్యులుగా కొనసాగుతున్నారు. వాళ్లే దగ్గరుండి మరీ అక్రమ నిర్మాణాన్ని చేపట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమాల మీద బయటకు వచ్చి మాట్లాడే సాహసం ఎవరూ చేయలేకపోయినా ఇంత అడ్డగోలుగా వ్యవహరిస్తారా అంటూ లోలోపల మదనపడుతున్నారు. కలెక్టర్ ప్రెసిడెంట్గా ఉండే హైదరీ క్లబ్లోనే ఈ విధంగా జరిగితే ఇక ప్రభుత్వ నిబంధనలను, చట్టాన్ని పరిరక్షించేవారెవరంటూ నిలదీస్తున్నారు. రిక్రియేషన్ను కమర్షియల్గా మార్చి... హైదరీ క్లబ్ కోసం మొదట్లో ప్రభుత్వం కేటాయించిన స్థలం రిక్రియేషన్ కోసం. కానీ, ప్రస్తుత కమిటీ దానిని కమర్షియల్గా మార్పు చేసి అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. కమిటీ కబ్జా చేసిన స్థలాన్ని ఒక ఆదాయ వనరుగా మలచుకునే ప్రయత్నమే హడావిడిగా అక్రమంగా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం. క్లబ్ ఉండే స్థలం ప్రధాన కూడలి కావటంతో వ్యాపారానికి అనువుగా మారింది. దాంతో అడ్డగోలుగా అయినా సరే కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించి అద్దెలకిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే కమర్షియల్ కాంప్లెక్స్లోని షాపులను ఓపెన్ ఆక్షన్ ద్వారా కాకుండా అయినవారికి కట్టబెట్టే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. ఇప్పటికే షాపులను అద్దెలకు కేటాయించి రూ.లక్షల్లో అడ్వాన్స్లు కూడా తీసేసుకున్నట్లు సమాచారం. హైదరీ క్లబ్ పాలకమండలి కమర్షియల్ కాంప్లెక్స్ కోసం చేసుకున్న దరఖాస్తును తిరస్కరించాం. కమర్షియల్ కాంప్లెక్స్ కోసం చేసుకున్న ప్లాను నిబంధనల ప్రకారం లేదు. కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఆ స్థలాన్ని ఒంగోలు నగరపాలక సంస్థకు మార్ట్గేజ్ చేయాల్సి ఉంది. వాళ్లు సమర్పించిన ప్లాన్లో మార్ట్గేజ్ డాక్యుమెంట్లు లేవు. ఇంకా కొన్ని డాక్యుమెంట్లు వాళ్లు సమర్పించాల్సి ఉంది. అవేమీ లేకపోవటంతో ప్లాన్ అప్రూవల్ ఇవ్వలేదు. దీనిపై అదనపు సమాచారం కావాలంటే కమిషనర్ వెంకటేశ్వరరావును సంప్రదించండి. – జెడ్ సుధాకర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్, ఒంగోలు నగరపాలక సంస్థ -
ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతున్న యువకుడు మృతి
అర్ధవీడు: ఆత్మహత్యకు యత్నించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు మృతిచెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. అర్ధవీడు మండలంలోని మొహిద్దీన్పురం గ్రామానికి చెందిన వేల్పుల మల్లీశ్వరుడు (22) గత నెల 31వ తేదీ వ్యక్తిగత సమస్యలతో కలత చెంది క్షణికావేశంలో మద్యంలో గడ్డి మందు కలుపుకుని తాగి ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు చికిత్స నిమిత్తం కంభంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచనల మేరకు గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు అర్ధవీడు ఎస్సై సుదర్శనయాదవ్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. పెద్దదోర్నాల: కుటుంబ కలహాల నేపథ్యంలో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెద్దదోర్నాల మండల పరిధిలోని పెద్ద బొమ్మలాపురం తూర్పుపల్లెలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వేశపోగు యోహాన్ (41) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న ఎస్సై మహేష్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో కుటుంబంలో కొద్దిపాటి వివాదం తలెత్తిందని, ఈ నేపథ్యంలో యోహాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. మనస్తాపంతో మరో వ్యక్తి... నాగులుప్పలపాడు: మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్యహత్య చేసుకున్న సంఘటన నాగులుప్పలపాడు మండలంలోని ఉప్పుగుండూరు గ్రామంలో శనివారం జరిగింది. కొరిశపాడు మండలం బొడ్డువానిపాలెం గ్రామానికి చెందిన మల్లాల శ్రీను (53) ఉప్పుగుండూరు గ్రామానికి చెందిన ఒక మహిళతో కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు. కొద్దిరోజుల నుంచి అతన్ని ఆ మహిళ దూరం పెట్టడంతో మనస్తాపం చెంది ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రజియా సుల్తానా తెలిపారు. జరుగుమల్లి (సింగరాయకొండ): సాంకేతిక సమస్యల కారణంగా లారీ క్యాబిన్లో మంటలు చెలరేగి దగ్ధమైన సంఘటన శనివారం మధ్యాహ్నం జరుగుమల్లి మండలం కె.బిట్రగుంట పరిధిలోని హెచ్పీ పెట్రోల్ బంకు సమీపంలో గల దాబా వద్ద జరిగింది. టంగుటూరు అగ్నిమాపక అధికారి తెలిపిన సమాచారం ప్రకారం.. జార్కండ్ నుంచి చైన్నె వెళ్తున్న లారీ చాసిస్ క్యాబిన్లో కె.బిట్రగుంట పరిధిలోకి రాగానే మంటలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన లారీ డ్రైవర్ అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. టంగుటూరు అగ్నిమాపక అధికారి ఏ రమణారెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది వెళ్లి క్యాబిన్లోని మంటలు ఆర్పివేశారు. ఈ ప్రమాదం కారణంగా సుమారు రూ.8 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించిందని తెలిపారు. సిబ్బంది పాండురంగారావు, కిషోర్, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి
ఒంగోలు టౌన్: అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, వారి సమస్యలను పరిష్కరించాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒంగోలులోని అంబేడ్కర్ భవనంలో శనివారం అగ్రిగోల్డ్ బాధితుల రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని చెప్పారన్నారు. చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి అగ్రిగోల్డ్ బాధితులు కూటమికి ఓటు వేసి గెలిపించారని గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా మారిందన్నారు. ఒక్క సమస్య కూడా పరిష్కారానికి నోచుకోలేదన్నారు. ప్రభుత్వం వెంటనే ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి బాధితుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులను ఆర్డర్ సంస్థ ద్వారా విలువలు లెక్కించాలని కోరారు. భూముల వేలం ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. బాధితుల సమస్యలపై స్పందించకుంటే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వీవీ నాయుడు, ప్రధాన కార్యదర్శి వీ తిరుపతిరావు, జిల్లా గౌరవ అధ్యక్షుడు వీ హనుమా రెడ్డి, డీహెచ్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరువది సుబ్బారావు, పలు ప్రాంతాల నుంచి వచ్చిన సంఘ బాధిత నాయకులు ఆరెళ్లమ్మ, మాణిక్యారావు, శేషు కుమార్ రెడ్డి, రాంబాబు, నాగలక్ష్మి, జగన్, మంత్రి నాయక్, సుబ్బారావు, రామదాసు, శంకరయ్య, బెల్లంకొండ శ్రీనివాస్, మునిశంకర్, ఖాదర్ బాష, మల్లిఖార్జున, భద్రం, కుమార్, బడిత అప్పల నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ప్రకాశం పంతులు జీవితం ఆదర్శనీయం
ఒంగోలు సిటీ: స్వాతంత్య్ర సమరయోధుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం భావితరాలకు ఆదర్శనీయమని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. ప్రకాశం పంతులు జయంతి వేడుకలను స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. తొలుత టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ పీడీసీసీ బ్యాంకు చైర్మన్ వై.ఎం.ప్రసాద్రెడ్డి, ఎస్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షురాలు పేరం ప్రసన్న, వైఎస్సార్సీపీ నాయకులు రాజీవ్, నాగరాజు, అమర్, పులుసు సురేష్, పీటర్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
రక్షించిన పోలీసులు
బలవన్మరణానికి యత్నించిన మహిళ.. కంభం: బలవన్మరణానికి పాల్పడేందుకు రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను పోలీసులు కాపాడి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించిన సంఘటన శనివారం ఉదయం కంభంలో చోటుచేసుకుంది. కంభం పట్టణంలోని మేదరవీధికి చెందిన లాలమ్మ అనే మహిళ శనివారం ఉదయం 8.45 గంటల సమయంలో నాగులవరం రైల్వే గేటు సమీపంలో రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళ్తోంది. ఆమె ఎర్ర చీర ధరించి ఉండటంతో రైలు పట్టాలపై వస్తున్న గరీభ్రథ్ ఎక్స్ప్రెస్ రైలు డ్రైవరు అప్రమత్తమై రైలు ఆపడంతో మహిళకు ప్రమాదం తప్పింది. ఆ రైలు వెళ్లిపోయిన తర్వాత మళ్లీ రైలు పట్టాలపై నడుచుకుంటూ కంభం చెరువుకట్టవైపు ఆమె వెళ్తుండగా చెరువుకట్ట గేటు వద్ద ఉన్న రైల్వే సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఆమెను స్థానిక పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఎస్సై నరసింహారావు ఆ మహిళకు కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులను పిలిపించి అప్పగించారు. మార్కాపురంలో మరో వ్యక్తిని కాపాడిన పోలీసులు... మార్కాపురం: రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకోబోతున్న వ్యక్తిని పోలీసులు సకాలంలో స్పందించి కాపాడిన సంఘటన శనివారం మార్కాపురం రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. మార్కాపురం పట్టణానికి చెందిన టి.సురేంద్ర కుటుంబ సమస్యల కారణంగా తాను చనిపోతున్నట్లు ఉదయం 10 గంటల సమయంలో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తెలిపాడు. కుటుంబ సభ్యులు వెంటనే రూరల్ పోలీసు స్టేషన్కు సమాచారం అందించారు. డీఎస్పీ, సీఐ సూచనల మేరకు ఐటీ కోర్ టీమ్ సహాయంతో సురేంద్ర ఉన్న ప్రదేశాన్ని మార్కాపురం రూరల్ ఎస్సై అంకమ్మరావు గుర్తించారు. వెంటనే అతను ఉన్న రైల్వే ట్రాక్ వద్దకు చేరుకుని సురేంద్ర ఆత్మహత్య చేసుకోకుండా కాపాడారు. అనంతరం అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి మానసిక ధైర్యం కల్పించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో కుటుంబ సభ్యులు ఎస్సైకి కృతజ్ఞతలు తెలిపారు. -
పూరి ఎక్స్ప్రెస్లో తనిఖీలు
సింగరాయకొండ: పూరి–తిరుపతి ఎక్స్ప్రెస్లో స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సుమారు నాలుగు కేజీల గంజాయి పట్టుకుని ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన సింగరాయకొండ రైల్వేస్టేషన్ వద్ద శనివారం సాయంత్రం జరిగింది. స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందం తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాలతో ఒంగోలు–సింగరాయకొండ రైల్వేస్టేషన్ల మధ్య ఒంగోలు మహిళా పోలీస్స్టేషన్ సీఐ సుధాకర్ ఆధ్వర్యంలో స్పెషల్ టాస్క్ఫోర్స్ బృంద సభ్యులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ప్రయాణికుల బ్యాగులు తనిఖీ చేసి నాలుగు కేజీల గంజాయిని పట్టుకున్నారు. ముగ్గురు అనుమానితులను కూడా అదుపులోకి తీసుకుని స్థానిక రైల్వేస్టేషన్లో దిగారు. అక్కడి నుంచి గంజాయితో పాటు నిందితులను పినాకిని ఎక్స్ప్రెస్లో ఒంగోలు తరలించారు. వారిని విచారించిన తర్వాత జీఆర్పీ పోలీసులకు అప్పగించనున్నట్లు స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపారు. వారిలో చిత్తూరు జిల్లా యడమారి మండలం బోడగుట్టపల్లె పోస్ట్, కుప్పూరు గ్రామానికి చెందిన కేపీ వీరప్పన్ ఒరిశా నుంచి చిత్తూరు వెళ్తున్నాడు. అతని బ్యాగ్ను తనిఖీ చేయగా గంజాయి దొరికింది. మిగతా ఇద్దరి వివరాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు. ఈ ఘటనపై జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. తనిఖీల్లో ఎస్సైలు శ్రీకాంత్, చెంచయ్య, సుమారు 15 మందికిపైగా జీఆర్పీ, ఆర్పీఎఫ్, ఈగల్ టీం సభ్యులు పాల్గొన్నారు. నాలుగు కేజీల గంజాయి పట్టివేత ముగ్గురు అరెస్టు -
కోర్టు ఆవరణలో వైద్య కేంద్రం
● ప్రారంభించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతి ఒంగోలు: జిల్లా కోర్టు ఆవరణలో వైద్య కేంద్రాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి శనివారం ప్రారంభించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జిల్లా కోర్టు ఆవరణలోని పోస్టాఫీసు ఉన్న బ్లాక్లోని ఒక గదిలో ఏర్పాటు చేయగా, భారతి మాట్లాడుతూ న్యాయస్థానాల సముదాయం ఆవరణలో చికిత్స కేంద్రం ఏర్పాటు ద్వారా న్యాయవాదులు, న్యాయశాఖ అధికారులు, ఉద్యోగులతో పాటు కక్షిదారులకు ఎంతో ఉపయోగం ఉంటుందని అన్నారు. అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తులు జి.దీన, పందిరి లలిత, సీనియర్ సివిల్ జడ్జి హేమలత, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎస్కే ఇబ్రహీం షరీఫ్, జూనియర్ న్యాయమూర్తులు భానుసాయి, నవ్యశ్రీ, ఒంగోలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బొడ్డు భాస్కరరావు, ప్రకాశం జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు చాకిరి సుధాకరరావు, తదితరులు పాల్గొన్నారు. -
భార్యభర్తలను ఢీకొట్టిన లారీ
● భార్య మృతి సంతమాగులూరు (అద్దంకి రూరల్): బైకుపై వెళ్తున్న భార్యభర్తలను వెనుకు నుంచి లారీ ఢీకొట్టటంతో భార్య అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన సంతమాగులూరు మండలంలోని రామిరెడ్డిపాలెం గ్రామం వద్ద శనివారం చోటుచేసుకుంది. సంతమాగులూరు ఎస్సై తెలిపిన వివరాల మేరకు.. వినుకొండ మండలం గోకనకొండ గ్రామా నికి చెందిన గద్దల తిరుపతయ్య, అతని భార్య గద్దల కోటేశ్వరమ్మ (44) బైక్పై కొమ్మాలపాడు వైపు నుంచి సంతమాగులూరు వైపు వెళ్తున్నారు. రామిరెడ్డిపాలెంలోని రామాలయం వద్దకు రాగానే వెనుక నుంచి లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. కోటేశ్వరమ్మకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన తిరుపతయ్యను 108 వాహనంలో నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ఆంధ్రకేసరి త్యాగాలు మరువలేనివి
ఒంగోలు సబర్బన్: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని మనందరం రాష్ట్రాభివృద్ధికి కృషి చేద్దామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయస్వామి అన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు 154వ జయంతిని పురస్కరించుకుని శనివారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఉన్న ఆయన విగ్రహానికి కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్రెడ్డి, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణతో కలిసి పూలమాలలు వేసి మంత్రి నివాళులర్పించారు. టంగుటూరి ప్రకాశం పంతులు మునిమనుమడు సంతోష్కుమార్ను శాలువాతో సన్మానించారు. ఏబీఎం కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ పింగళి పాండురంగారావు రచించిన జాతీయ స్థాయి ధీరుడు టంగుటూరి ప్రకాశం పుస్తకాన్ని మంత్రి డోలా ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్, డీఆర్ఓ చిన ఓబులేసు, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, డీటీసీ సుశీల, డీసీఓ పద్మశ్రీ, డీఆర్డీఏ పీడీ నారాయణ, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఒంగోలు అర్బన్ తహసీల్దార్ పిన్నిక మధుసూదన్రావు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. ఆంధ్రకేసరి జీవితం స్ఫూర్తిదాయకం... ఒంగోలు టౌన్: స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో శనివారం టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏఆర్ డీఎస్పీ కె.శ్రీనివాసరావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, పీసీఆర్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్, ఆర్ఐలు రమణారెడ్డి, సీతారామిరెడ్డి పాల్గొన్నారు. -
చెడిపోయిందంటే చావే..!
సింగరాయకొండ: మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్లో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల కేంద్రం సుమారు ఐదు నెలలుగా మూతబడటంతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐదు నెలల క్రితం వరకూ ట్రాన్స్ఫార్మర్లు చెడిపోతే స్థానిక మరమ్మతుల కేంద్రంలో మరమ్మతులు చేయించి ఒక్క రోజులోనే బిగించేవారు. కానీ, ప్రస్తుతం ట్రాన్స్ఫార్మర్లు చెడిపోతే మరమ్మతులు చేయాలంటే ఒంగోలు, గుడ్లూరు తీసుకెళ్లాల్సి వస్తోంది. దీంతో మరమ్మతులకు గురైన ట్రాన్స్ఫార్మర్ను బాగుచేసి బిగించాలంటే రెండు నుంచి మూడు రోజుల సమయం పట్టడమే కాకుండా రవాణా చార్జీలు అదనపు భారంగా మారుతున్నాయి. నాలుగు మండలాలకు అవస్థలు... గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతులు, ప్రజల ఇబ్బందులు తీర్చేందుకు సింగరాయకొండ విద్యుత్ సబ్స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అధికారం చేపట్టిన అతి తక్కువ సమయంలోనే దీన్ని ఏర్పాటు చేయడంతో రైతులు తమ ట్రాన్స్ఫార్మర్లకు తక్కువ ఖర్చుతో మరమ్మతులు చేయించుకుని బిగించుకునేవారు. దీనివలన ఈ కేంద్రం పరిధిలోని సింగరాయకొండ, జరుగుమల్లి, కొండపి, ఉలవపాడు మండలాల రైతులు, ప్రజలు లబ్ధిపొందేవారు. ఒక్కోసారి పొన్నలూరు, టంగుటూరు మండలాల రైతులు కూడా వచ్చేవారు. ప్రతి నెలా సుమారు 50 ట్రాన్స్ఫార్మర్ల వరకు మరమ్మతులు చేసేవారు. దీనివలన సమయం ఆదా అవడమే కాకుండా రవాణా ఖర్చులు భారీగా తగ్గాయి. గతంలో ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులకు గురైతే గుడ్లూరు, ఒంగోలు తీసుకెళ్లాల్సి వచ్చేది. ఏ కేంద్రానికి వెళ్లాలన్నా సుమారు 30 కిలోమీటర్ల దూరం ఉండటంతో రవాణాకు సుమారు 2 నుంచి 3 వేల రూపాయలు ఖర్చయ్యేది. రెండు నుంచి మూడు రోజులు సమయం పట్టేది. కానీ, సింగరాయకొండలోనే కేంద్రం ఏర్పాటు చేయడంతో వెయ్యిలోపు ఖర్చుతో అతితక్కువ సమయంలో ట్రాన్స్ఫార్మర్ బాగుచేసి బిగించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూసివేత... రైతాంగానికి, ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న సింగరాయకొండ ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల కేంద్రాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 5 నెలల కిత్రం మూసివేశారు. తమ పార్టీకి చెందిన కాంట్రాక్టర్ను ఏర్పాటు చేసుకోవాలన్న ఉద్దేశంతో ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్కు గడువు ఉన్నప్పటికీ కాంట్రాక్టును పునరుద్ధరించకుండా అర్ధంతరంగా ఆపివేశారు. దీంతో కాంట్రాక్టర్ ఆ కేంద్రాన్ని మూసివేయగా, రైతులు, ప్రజలు ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల కోసం గుడ్లూరు, ఒంగోలు వెళ్తూ అవస్థపడుతున్నారు. మరమ్మతులకు గురైన ట్రాన్స్ఫార్మర్ను బాగుచేసి తిరిగి తీసుకొచ్చి బిగించేందుకు సుమారు 2 నుంచి 3 రోజులు పడుతుండగా, ఒక్కోసారి నాలుగు రోజులు కూడా పడుతోంది. దీని వలన సమయంతో పాటు రవాణా ఖర్చులు పెరిగి డబ్బు కూడా వృథా అవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగరాయకొండలో మూతబడిన ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల కేంద్రం ట్రాన్స్ఫార్మర్ చెడిపోతే గుడ్లూరు, ఒంగోలు తీసుకెళ్లాల్సిన వైనం స్థానిక విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో సుమారు వెయ్యి ట్రాన్స్ఫార్మర్లు ప్రతి నెలా సుమారు 50 ట్రాన్స్ఫార్మర్లకు మరమ్మతులు ఇతర ప్రాంతాలకు తరలించేందుకు తడిసి మోపెడవుతున్న రవాణా ఖర్చులు ఐదు నెలలుగా అవస్థపడుతున్న రైతులు, ప్రజలు కొత్త కాంట్రాక్టర్ను నియమించినా ప్రారంభం కాని పనులు... సుమారు నెల క్రితం కొత్త కాంట్రాక్టర్ను సింగరాయకొండ ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల కేంద్రానికి నియమించారు. కానీ, ఆయన పనులెప్పుడు ప్రారంభిస్తారో అర్థం కావడం లేదని విద్యుత్ శాఖ అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతులకు గురైతే బాగుచేసి మళ్లీ బిగించటం ఆలస్యం అవుతుండటంతో పక్క ట్రాన్స్ఫార్మర్లపై అదనపు భారం పడి అవి కూడా త్వరగా మరమ్మతులకు గురవుతున్నాయని విద్యుత్ శాఖ వారు తెలియజేస్తున్నారు. అందువలన ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సింగరాయకొండ ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల కేంద్రంలో త్వరగా ప్రారంభించేలా చూడాలని, తద్వారా తమ ఇబ్బందులు తీర్చాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు. -
25న సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరుకావాలి
ఒంగోలు సిటీ: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో డీఎస్సీ–2025 కు సంబంధించి వివిధ కేటగిరీల్లో 629 పోస్టులకు సెలెక్షన్ కమిటీ నిర్ణయించిన కమిటీలచే ఎంపికై న అభ్యర్థులందరూ ఈ నెల 25వ తేదీ సర్టిఫికెట్ వెరిఫికేషన్కు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని డీఈఓ కిరణ్కుమార్ శనివారం తెలిపారు. ఎంపికై న అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్కు చెరువుకొమ్ముపాలెంలోని సరస్వతి జూనియర్ కళాశాలలో హాజరు కావాలని కోరారు. మెసేజ్ వచ్చిన అభ్యర్థులు మూడు సెట్ల అటెస్టెడ్ అన్నీ సర్టిఫికెట్ కాపీలతోపాటు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని కోరారు. వెరిఫికేషన్కు హాజరైనప్పుడు ఒరిజినల్ ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, పోస్ట్గ్రాడ్యుయేట్, బి.ఎడ్, డి.ఎడ్, బి.పి.ఎడ్, పండిట్ ట్రైనింగ్ సర్టిఫికెట్లతో పాటు క్యాస్ట్ సర్టిఫికెట్, డిసేబుల్, స్టడీ సర్టిఫికెట్, ఆధార్కార్డు బయోమెట్రిక్ అటెండెన్స్ కోసం తీసుకొని రావాల్సిందిగా డీఈఓ కోరారు. ఒంగోలు టౌన్: రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న డాక్టర్ల ఇన్ సర్వీస్ పీజీ కోటాను 20 నుంచి 15 శాతానికి తగ్గించటం తగదని ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అసోసియేషన్ బాధ్యులు పేర్కొన్నారు. సంఘ జిల్లా అధ్యక్షుడు కాలమాల రాహుల్, జనరల్ సెక్రటరీ షేక్ ఖాదర్ మస్తాన్ బి, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సుందర్ ప్రసాద్, అసోసియేషన్ సభ్యులు డాక్టర్ నబి వలి, డాక్టర్ కుమార స్వామి తదితరులు పాల్గొని జిల్లా వైద్యాధికారి డాక్టర్ టీ వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో చర్చల సందర్భంలో సర్వీస్ కోటాలో తగ్గించే ఉద్దేశం ఉంటే అసోసియేషన్ ప్రతినిధులతో చర్చిస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం విస్మరించినదని అన్నారు. కేవలం ఏడు శాఖల్లో సర్వీస్ కోటా కాకుండా గతంలో మాదిరిగా అన్ని శాఖల్లో సర్వీస్ కోటా అమలయ్యేలా చూడాలని కోరారు. గిరిజన పల్లె ప్రాంతాల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న వైద్యుల కేరీర్పై సర్వీస్ కోటా తగ్గింపు అశనిపాతంలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమలు చేస్తున్న 20 శాతం కోటాను యధావిధిగా అమలు చేయాలని విన్నవించారు. -
సీపీఐ భారీ ర్యాలీ
ఒంగోలు టౌన్: సీపీఐ 28వ రాష్ట్ర మహాసభలు శనివారం ఒంగోలులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తరలివచ్చారు. తొలుత కార్యకర్తలతో నెల్లూరు రోడ్డులోని మినీ స్టేడియం నుంచి ర్యాలీ బయలుదేరి ఊరచెరువులోని సభాస్థలికి చేరుకున్నారు. ర్యాలీలో సంప్రదాయ వేషధారణలతో వచ్చిన కార్యకర్తలు ఆకట్టుకున్నారు. విప్లవ వీరుల వేషధారణలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ర్యాలీలో సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, సినీ హీరో మాదాల రవి, ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షుడు పీజీ చంద్రశేఖర్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జెల్లి విల్సన్, హరినాథ్ రెడ్డి, జి.ఓబులేసు, కెవివి ప్రసాద్, అజయ్ కుమార్, జగదీష్, రామచంద్రయ్య, ముప్పాళ్ల నాగేశ్వరరావు, అక్కినేని వనజ, డేగ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మహాసభ ర్యాలీకి సీపీఎం ఘన స్వాగతం: సీపీఐ రాష్ట్ర మహాసభల ర్యాలీకి సీపీఎం ఘనస్వాగతం పలికింది. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆధ్వర్యంలో నెల్లూరు బస్టాండు నుంచి తరలివచ్చిన ర్యాలీకి స్థానిక సాగర్ సెంటర్ వద్ద సీపీఎం నాయకులు పూలు చల్లి, కరచాలనం చేసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు, జిల్లా నాయకులు జీవీ కొండారెడ్డి, కంకణాల ఆంజనేయులు, కాలం సుబ్బారావు, కె.రమాదేవి, పి.కల్పన, పమిడి వెంకటరావు, దామా శ్రీనివాసరావు, బి.రఘురాం, అమీర్, నారాయణ తదితరులు ఉన్నారు. -
పౌరుషం, త్యాగానికి ప్రతీక ప్రకాశం పంతులు
ఒంగోలు సబర్బన్: పౌరుషం, త్యాగం, ప్రతిభకు ప్రతీకగా నిలిచిన టంగుటూరి ప్రకాశం పంతులును నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ పిలుపునిచ్చారు. ఆంధ్ర కేసరి 154వ జయంతిని పురస్కరించుకుని శనివారం దేవరంపాడులోని ఉప్పు సత్యాగ్రహ విజయ స్థూపం వద్ద నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ప్రకాశం పంతులు, మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం జాతీయ జెండాను ఆయన ఎగురవేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధునిగా, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు తనదైన ముద్ర వేశారని అన్నారు. సవాళ్లకు ఎదురొడ్డి ధైర్యంగా ముందుకు సాగిన ప్రకాశం పంతులును నేటి యువత స్ఫూర్తిగా తీసుకొని, తాము ఎంచుకున్న రంగంలో విజేతలుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ స్మారకం వద్ద రెండు ఎకరాల విస్తీర్ణంలో డ్వామా ఆధ్వర్యంలో పల్లెవనం ఏర్పాటు చేయిస్తామని ఆయన ప్రకటించారు. స్థూపం చుట్టూ పెండింగ్లో ఉన్న ప్రహరీ నిర్మాణాన్ని కూడా త్వరలో పూర్తి చేయిస్తామని తెలిపారు. మాల కార్పొరేషన్ చైర్మన్ పి.విజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేలా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి దృష్టికి తీసుకు వెళతానని చెప్పారు. కార్యక్రమంలో డీపీఓ వెంకట నాయుడు, డ్వామా పీడీ జోసఫ్ కుమార్, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, ఒంగోలు రూరల్ తహశీల్దార్ షేక్ నాయబ్ రసూల్, రూరల్ డిప్యూటీ తహశీల్దార్ కొల్లిబోయిన అశోక్ కుమార్, రూరల్ ఆర్ఐ శ్రీకంఠ శ్రీనివాస రావుతో పాటు పలువురు మండల స్థాయి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
పద్ధతి మారకుంటే ప్రభుత్వానికి సరెండర్
● వైద్య శాఖ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం ఒంగోలు సబర్బన్: ‘పైనుంచి పట్టించుకునే వారు లేరు.. కింద స్థాయిలో పనిచేసే వారు లేరు అన్నట్లుగా ఉంది పరిస్థితి. మీ నిర్లక్ష్యం వల్ల జిల్లాకు చెడ్డ పేరు వస్తోంది. సిగ్గుగా లేదా..?. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షించకుండా ఏం చేస్తున్నారు?. పద్ధతి మార్చుకోకుంటే ప్రభుత్వానికి సరెండర్ చేస్తా’అని వైద్య శాఖ ఉన్నతాధికారులను కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా ఘాటుగా హెచ్చరించారు. వైద్యశాఖలోని వివిధ విభాగాల ఉన్నతాధికారులతో శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఆమె సమావేశం నిర్వహించారు. డెలివరీలు, సీజనల్ వ్యాధులు, జ్వరాల కేసుల నమోదు తదితర వివరాలపై కలెక్టర్ ఆరా తీశారు. వైరల్ జ్వరాల బాధితులను గుర్తించడంలో క్షేత్రస్థాయిలో ఆశాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదన్నారు. ‘మీ పరిధిలో ఆసుపత్రులపై దృష్టి సారిస్తున్నారా లేదా..?. హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ కమిటీలను నియమించరా? కనీసం సమీక్షకు వచ్చేటప్పుడు నివేదికలు సమగ్రంగా తయారు చేసుకుని రారా?’ అంటూ డీసీహెచ్ఎస్ శ్రీనివాస నాయక్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మార్కాపురం జీజీహెచ్ను గత నెలలో మంత్రితో కలిసి తనిఖీ చేసినప్పుడు చర్చకు వచ్చిన సమస్యల పరిష్కారానికి మీరేమి చర్యలు తీసుకున్నారు? నాకు రిపోర్టు ఎందుకు పంపించలేదు?’ అంటూ సూపరింటెండెంట్ రామచంద్రరావును కలెక్టర్ ప్రశ్నించారు. కీలకమైన శాఖలోని ఉన్నతాధికారుల్లో ఇంత నిర్లక్ష్య ధోరణి ఏమిటని మండిపడ్డారు. -
భూములపై కన్నేసి!
గాలి కొదిలేసి..విమానాశ్రయం పేరుతో 1088 ఎకరాల సేకరణకొత్తపట్నం సముద్రతీరంసాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కరేడు భూముల వ్యవహారంలో ఒకవైపు వివాదం కొనసాగుతున్న తరుణంలోనే మరోవైపు కొత్తపట్నం మండంలోని భూములపై కన్నేయడంపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొత్తపట్నం మండలంలోని తీరప్రాంతాల భూములపై కన్నేసిన అధికార పార్టీ నాయకులు ఇక్కడి ప్రజలకు ఎయిర్ పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తామని చందమామ కబుర్లు చెబుతున్నరన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2014–19లోనూ నాటి చంద్రబాబు ప్రభుత్వం ఇదే తరహాలో హడావుడి చేసింది. ఒక్క పునాదిరాయి కూడా వేయకుండానే గద్దె దిగిపోయింది. తాజాగా ఇప్పుడు కూడా అదే విధంగా మళ్లీ హడావుడి మొదలు పెట్టింది. అయితే ఈసారి తీరప్రాంతంపై కన్నేసి పెద్ద సంఖ్యలో భూముల సేకరణకు రంగం సిద్ధం చేసుకుంటోంది. దీంతో కూటమి ప్రభుత్వ తీరు మీద ప్రజలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే విమానాశ్రయాలు కట్టి ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తారా లేకపోతే ఆ పేరుతో వేల ఎకరాలు అప్పనంగా కాజేస్తారా అని గుసగుసలాడుకుంటున్నారు. దొనకొండ విమానాశ్రయం గాలికి.. గత ఎన్నికల ప్రచారంలో దొనకొండ విమానాశ్రయాన్ని పునరుద్ధరిస్తామని పశ్చిమ ప్రకాశం ప్రజల్లో ఆశలు రేపి అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత దొనకొండ విమానాశ్రయం ప్రాంతంలో కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు పరిశీలించి వెళ్లారు. ఆ తరువాత ఏం జరిగిందో ఏమో కానీ దొనకొండ విమానాశ్రయం సంగతి మరిచిపోయారు. ఏడాదిన్నర అవుతున్నా ఇటువైపు తొంగిచూసిన పాపాన పోలేదు. ఈలోపు ఒంగోలులో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడంతో దొనకొండ ప్రజలు ప్రధానంగా పశ్చిమ ప్రకాశం ప్రజలు విస్తుపోయారు. దొనకొండ విమానాశ్రయాన్ని పక్కన పెట్టేయడం వారిని నిరాశకు గురి చేస్తోంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు ప్రభుత్వం దొనకొండను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని హంగామా చేసింది. పారిశ్రామిక హబ్ పేరుతో ఆర్భాటంగా ప్రచారం చేసుకుంది. ఐదేళ్లు పరిపాలన చేసినప్పటికీ కనీసం ఒక్కటంటే ఒక్క పరిశ్రమను కూడా దొనకొండకు తీసుకొని రాలేకపోయిందన్న విమర్శను మూటకట్టుకుంది. ఇపుడు అధికారంలోకి వచ్చిన తరువాతైనా దొనకొండను అభివృద్ధి చేస్తారేమో అనుకుంటే ఉన్న విమానాశ్రయాన్ని కూడా లేకుండా చేశారు. దాంతో దొనకొండకు విమానాశ్రయం రాదు.. పరిశ్రమలు రావని ప్రజలు నిర్ణయించుకున్నారు. చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయామని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒంగోలు సమీపంలో ఎయిర్ పోర్టు నిర్మించనున్నట్లు ప్రకటించింది. ఢిల్లీ నుంచి వచ్చిన బృందం ఇక్కడి భూములను పరిశీలించి వెళ్లింది. కొత్తపట్నం మండలంలోని అల్లూరు వద్ద ఎయిర్ పోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. జనవరిలో ఒంగోలుకు వచ్చిన కేంద్ర విమానయాన సంస్థ కమిటీ సభ్యులు అల్లూరు భూములను పరిశీలించి వెళ్లారు. అల్లూరులో విమానాశ్రయం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో రెవెన్యూ అధికారులు భూసేకరణకు రంగం సిద్ధం చేశారు. ఇందుకోసం మొదటి దశలో 657 ఎకరాల భూమిని సేకరించాలని రెవెన్యూ అధికారులు నిర్ణయించారు. ఈ 657 ఎకరాల భూమిలో వాన్పిక్ కు చెందిన 551 ఎకరాలు, పట్టా భూమి 103 ఎకరాలు, ప్రభుత్వ భూమి 12 ఎకరాలు సేకరించనున్నారు. తదుపరి దశలో మిగతా భూములను సేకరిస్తారు. అయితే 1088 ఎకరాలతోనే ముగిస్తారా లేక అదనంగా మరిన్ని ఎకరాల భూములను సేకరిస్తారా అనేది తేలాల్సి ఉంది. ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటుకు రెండు దశాబ్దాలకు ముందే బీజం పడింది. అయితే అది కార్యరూపం దాల్చలేదు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినప్పుడల్లా ఆ పార్టీ ప్రజాప్రతినిధులు హడావుడి చేసి తర్వాత అది మరుగునపడిపోవడం షరా మామూలుగా మారింది. -
పెద్దదోర్నాలలో ‘హ్యూజ్’ మనీ స్కాం
● పోలీసులను ఆశ్రయించిన బాధితులు పెద్దదోర్నాల: సులభ పద్ధతులతో డబ్బులు సంపాదించవచ్చన్న ఆశ కొందరిని నిలువునా ముంచుతోంది. ఎన్ని సంఘటనలు చోటు చేసుకుంటున్నా కొత్త తరహా మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా మండల కేంద్రంలో మరో సైబర్ మోసం వెలుగు చూసింది. హ్యూజ్ మనీ యాప్తో మండల ప్రజలు మరో మోసానికి గురయ్యారు. వీడియోలు చూస్తూ డబ్బులు సంపాదించవచ్చని ప్రజలను నమ్మించిన సైబర్ నేరగాళ్లు యాప్ లింకులతో మండల ప్రజలతో భారీగా డబ్బులు సేకరించి బోర్డు తిప్పేశారు. హ్యూజ్ పేరుతో వెలిసిన ఈ సైబర్ సంస్థలో డబ్బులు కొంత మొత్తంలో జమ చేస్తే ఎక్కువ మొత్తంలో ఆదాయం పొందవచ్చన్న పుకార్లను నమ్మి ప్రజలు వేలల్లో పెట్టుబడులు పెట్టారు. చివరకు సంస్థ బోర్డు తిప్పేయడంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్సై మహేష్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి యాప్లకు సంబంధించిన లింకులు క్లిక్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. మండల కేంద్రంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో సైతం హ్యూజ్ యాప్లో భారీగా పెట్టుబడులు పెట్టిన ప్రజలు మోసపోయినట్లు సమాచారం. టంగుటూరు: నోబిడ్లు అధికంగా జరుగుతున్నాయని చింతలపాలెం, దావగూడూరు గ్రామాలకు చెందిన రైతులు శుక్రువారం వేలం ప్రక్రియను అడ్డుకున్నారు. వేలం ప్రారంభమైన తర్వాత 40 బేళ్లు కొనుగోలు జరగగా వరుసగా 17 పొగాకు నోబిడ్లు, 5 పొగాకు బేళ్లు నో సేల్ జరిగాయి. దీంతో రైతులు ఆగ్రహం చెంది వేలాన్ని ఆడ్డుకున్నారు. వేలం నిర్వహణాధికారి గంట పాటు అటు కంపెనీ ప్రతినిధులతో, ఇటు రైతులతో చర్చలు జరిపినా ఫలితం లేదు. మధ్యాహ్నానికి ఒంగోలు ప్రాంతీయ అధికారి రామారావు వేలం కేంద్రానికి చెరుకొని మరో గంట చర్చలు జరిపినా రైతులు వేలం కేంద్రం వదిలి వెళ్లారు. వేలానికి 811 బేళ్లను వేలానికి తీసుకురాగా వాటిలో 17 కొనుగోలు జరగగా 24 పొగాకు బేళ్లు తిరస్కరించారు. గరిష్ట ధర రూ.288కాగా, కనిష్ట ధర రూ.140 పలకగా సరాసరి రూ.199.57 ధర పలికిందని వేలం నిర్వహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు. ● ఓ వ్యక్తి బ్యాంక్ ఖాతా నుంచి నుంచి రూ.60 వేలు మాయం కనిగిరి రూరల్: పట్టణంలో మరో ఆన్లైన్ సైబర్ మోసం వెలుగు చూసింది. 13వ వార్డు మంగలి మాన్యానికి చెందిన ఒక వ్యక్తి ఫోన్ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఆయన బ్యాంక్ ఖాతా నుంచి సుమారు 60 వేల రూపాయలు మూడు దఫాలుగా డ్రా చేశారు. గురువారం రాత్రి సెల్కు బ్యాంక్ ఓటీపీలు వరుసగా వచ్చాయి. అప్రమత్తమైన బాధితుడు వెంటనే మేనేజర్కు సమాచారం ఇచ్చాడు. ఓటీపీ లింక్లు తాక వద్దని ఆయన బాధితుడిని సలహా ఇచ్చారు. మరో అరగంటలోపు 22,400 ఒకసారి, రూ.19 వేలు మరోసారి, 18,600 ఇంకో సారి మొత్తం మూడు సార్లు రూ.60 వేలు దాక డ్రా చేసినట్లు మెసేజ్లు వచ్చాయి. దీంతో మళ్లీ వెంటనే బ్యాంక్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఫోన్ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారని, వెంటనే ఫోన్ స్వీచ్ ఆఫ్ చేయాలని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం బాధితుడు బ్యాంక్ అధికారులు, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశాడు. కుమార్తె వివాహం కోసం దాచి పెట్టుకున్న నగదు కాజేయడంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు. ఒంగోలు టౌన్: నూతన బార్ల ఏర్పాటుపై ఆసక్తి ఉన్న వ్యాపారులు దరఖాస్తు చేసుకోవాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ కె. వెంకట్ కోరారు. శుక్రవారం స్థానిక ఎకై ్సజ్ సర్కిల్ కార్యాలయంలో రియల్ ఎస్టేట్, రెస్టారెంట్ నిర్వాహకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రకటించిన బార్ పాలసీ గురించి వ్యాపారులకు వివరించారు. జిల్లా అధికారుల సమక్షంలో లాటరీ తీసి షాపులు కేటాయిస్తామని చెప్పారు. -
సాక్షి చీరాల విలేకరి మురళి కన్నుమూత
చీరాల అర్బన్: సాక్షి దినపత్రిక బాపట్ల జిల్లా చీరాల విలేకరి కడియం మురళి (51) శుక్రవారం ఉదయం మృతిచెందారు. కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రెండు రోజులు క్రితం గుంటూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చేరారు. ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. పత్రికా రంగంలో సుదీర్ఘకాలం పాటు జర్నలిస్టుగా ఆయన పనిచేశారు. సాక్షి దినపత్రిక చీరాల ఆర్సీ ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. అలానే ఏపీయూడబ్ల్యూజే ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన భౌతికకాయాన్ని చీరాలలోని జర్నలిస్టులు పట్టణంలో ర్యాలీగా స్థానిక హరిప్రసాద్నగర్లోని ఆయన స్వగృహానికి తరలించారు. ఆయన మరణవార్త తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి కరణం వెంకటేష్బాబు, మాజీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తిలు ఫోన్లో కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామన్నారు. చీరాల నియోజకవర్గంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, రాజకీయ పార్టీల నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. శనివారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. -
సమాజాన్ని సజీవంగా ఉంచేది కళలే
ఒంగోలు టౌన్: ప్రజల్లో నిత్య చైతన్యాన్ని రగిలిస్తూ సమాజాన్ని సజీవంగా ఉంచేది కళలేనని సినీ దర్శకుడు బాబ్జీ చెప్పారు. ‘‘ఒక్క రోజైనా ఒక్కసారైన కమ్యూనిస్టుగా బతుకు నేస్తమా’’ పాటతో ప్రసిద్ధుడైన ఆయన సీపీఐ రాష్ట్ర మహాసభలను పురస్కరించుకొని నిర్వహిస్తున్న కళా ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఒంగోలు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం గతంలో ఎన్నడూ లేనంతగా దేశం సంక్షోభంలో కూరుకొనిపోయిందన్నారు. దేశ ప్రజల సంపదపై కార్పొరేట్ శక్తులు పెత్తనం కొనసాగిస్తున్నారని, దోపిడీ మరింతగా పెరిగిపోయిందని, అవినీతి వ్యవస్థీకృతమైందని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యుడు స్వేచ్ఛగా మాట్లాడలేని దుస్థితి దాపురించిందన్నారు. ప్రజలు నమ్మకమైన ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఇలాంటి సంక్షోభ సమయంలో కవులు, కళాకారులే ప్రజల గొంతుకలను బలంగా వినిపిస్తున్నారన్నారు. ప్రజలను చైతన్యం చేస్తున్నారు కనుకనే గౌరీ శంకర్, ధబోల్కర్, స్టాన్ స్వామిలను తీరోగమన శక్తులు హతమార్చారని, ప్రజల్లో ఆలోచన రెకెత్తిస్తున్నందుకే ప్రజా యద్దనౌక గద్దర్ గుండెల్లో తూటాలు దించారని ఆరోపించారు. పాలకులు ఎంత అణచివేతకు గురిచేస్తున్నా, ఎన్ని ఆంక్షలు విధిస్తున్నా కవులు, కళాకారులు గళం విప్పి మాట్లాడుతూనే ఉన్నారని చెప్పారు. ఈ క్రమంలోనే ప్రజలను జోలపాడి నిద్రపుచ్చడానికి పాలకులు సినిమా మాధ్యమాన్ని ఎన్నుకున్నారని తెలిపారు. చరిత్ర పేరుతో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, సినిమా రంగాన్ని కార్పొరేట్ శక్తులు తమ గుప్పిట్లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. చట్టసభల్లో కమ్యూనిస్టులు లేకపోవడం వలన వారికి వచ్చిన నష్టమేమీ లేదని, దేశానికి, ప్రజలకే ఎక్కువ నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించారు. అధికార రాజకీయాలు చేయకుండా ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తున్న కమ్యూనిస్టులను ఆదరించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఒంగోలులో జరుగుతున్న సీపీఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. -
భార్యను కడతేర్చిన భర్త
బేస్తవారిపేట: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమె గొంతుకోసి హత్య చేసిన సంఘటన బేస్తవారిపేట మండలంలోని గలిజేరుగుళ్ల సమీపంలో ఉన్న పొలంలో శుక్రవారం చోటుచేసుకుంది. పీవీపురం గ్రామానికి చెందిన భార్య, భర్తలు పగ్గాల వెంకటేశ్వర్లు, రామలక్ష్మమ్మ(40) తాము సాగుచేసుకుంటున్న మొక్కజొన్న పొలం వద్దకు ఉదయం వెళ్లారు. వారి మధ్య ఏం జరిగిందో ఏమో.. పొలంలో వేప చెట్టు వద్ద భార్య గొంతు కోసి చంపేశాడు. ఈ విషయం సాయంత్రం 5 గంటల సమయంలో తమ్ముడికి ఫోన్ చేసి ‘నీ వదినను చంపేశాను..దహనం చేసుకుంటారో, ఏం చేసుకుంటారో చేసుకోండని’’ చెప్పాడు. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో హత్య చేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. వెంకటేశ్వర్లు ఫోన్ స్విచాఫ్ చేసుకుని పరారయ్యాడు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. సీఐ మల్లిఖార్జున, ఎస్సై ఎస్వీ రవీంద్రారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమానంతో గొంతు కోసి దారుణ హత్య -
భూముల రీసర్వే తనిఖీ
జరుగుమల్లి (సింగరాయకొండ): మండలంలోని దావగూడూరు గ్రామంలో ఫేస్–3 లో భాగంగా జరుగుతున్న భూముల రీసర్వే కార్యక్రమాన్ని జేసీ గోపాలకృష్ణ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రస్తుత విధానంలో భాగంగా ప్రభుత్వ భూములు సర్వే చేస్తుండగా సర్వేలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో రెవెన్యూ అధికారులకు వివరించారు. జేసీ గోపాలకృష్ణ మాట్లాడుతూ మండలంలో ఫేస్–3 లో దావగూడూరు, కామేపల్లి, సతుకుపాడు, రామచంద్రాపురం, ఐఎస్ కండ్రిక, సాదువారిపాలెం, ఎన్ఎన్ కండ్రిక గ్రామాల్లో రీ సర్వే జరుగుతోందన్నారు. రీ సర్వేలో గ్రామం మొత్తానికి బౌండరీ నిర్ణయించి మొదట ప్రభుత్వ భూములు, వాగులు, వంకలు, డొంకలు గుర్తించి తరువాత దేవదాయ భూములను గుర్తిస్తామన్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత పట్టా భూములను గుర్తిస్తామని వివరించారు. -
జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు దరఖాస్తుల ఆహ్వానం
ఒంగోలు సిటీ: జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని ఉపాధ్యాయులందరూ 2025 సంవత్సరానికి ఉపాధ్యాయ దినోత్సవ (గురుపూజోత్సవం) సెప్టెంబరు 5న జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు అర్హత కలిగిన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ ఎ.కిరణ్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో పనిచేస్తున్న వివిధ కేటగిరీలకు చెందిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఈ నెల 23వ తేదీలోపు ఎంఈఓలకు దరఖాస్తులు అందజేయాలని కోరారు. మండల విద్యాశాఖాధికారులు పరిశీలించిన దరఖాస్తులను డిప్యూటీ డీఈఓకు 25వ తేదీలోపు అందించాలన్నారు. డిప్యూటీ డీఈఓలు పరిశీలించిన దరఖాస్తులను 27వ తేదీ లోపల జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో అందజేయాలన్నారు. దరఖాస్తుకు కనీసం 15 సంవత్సరాల బోధనా అనుభవం కలిగి ఉండాలని, ఎటువంటి క్రమశిక్షణ చర్యలకు లోనై ఉండకూడదని తెలిపారు. మార్కాపురం: మార్కాపురం పట్టణంలోని కమలా విద్యా సంస్థల ప్రాంగణంలో సీబీఎస్ఈ స్కూళ్ల సౌత్ ఇండియా జోన్ 1 తైక్వాండో చాంపియన్ షిప్ పోటీలను శుక్రవారం కళాశాల కరస్పాండెంట్ పవన్ కుమార్, అకడమిక్ డైరెక్టర్ సింధూజ ప్రారంభించారు. దక్షిణాది రాష్ట్రాల పోటీలను మార్కాపురంలో నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, అండమాన్, పుదుచ్ఛేరి నుంచి 1200 మంది విద్యార్థినీ విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. అండర్ 14, 17, 19 విభాగాల్లో పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో తైక్వాండ్ టోర్నమెంటు అబ్జర్వర్ డాక్టర్ సీ దొరై, ఆర్గనైజింగ్ సెక్రటరీ ముఖేష్కుమార్, ఏపీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎస్కె అబ్దుల్ సలాం, ఆర్గనైజింగ్ కమిటీ ప్రెసిడెంట్ అఖిల్ పాల్గొన్నారు. ఒంగోలు టౌన్: కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థుల నియామక ప్రక్రియ జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం జరిగింది. ఈ పరిశీలనకు మొత్తం 349 మంది అభ్యర్థులకు గాను 327 మంది హాజరయ్యారు. 153 మంది సివిల్ అభ్యర్థులకు గాను 144 మంది, 196 ఏపీఎస్పీ అభ్యర్థులకు గాను 183 మంది హాజరయ్యారు. అభ్యర్థుల కుల ధ్రువీకరణ పత్రాలు, స్థానికత సర్టిఫికెట్లు, స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్లు పరిశీలించారు. మూడు సెట్ల అటెస్టేషన్ పత్రాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ ఉద్యోగాల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలన్నిటినీ సమగ్రంగా పరిశీలించారన్నారు. పత్రాల పరిశీలన అనంతరం అర్హత కలిగిన అభ్యర్థులను తదుపరి నియామక దశకు ఎంపిక చేస్తారని చెప్పారు. కార్యక్రమంలో ఏఏఓ పీఈ విజయ కుమార్, ఆర్ఐలు సతారామిరెడ్డి, రమాణా రెడ్డి, డీపీఓ సూపరింటెండెంట్ షేక్ సందాని బాషా, డి.శైలజ పాల్గొన్నారు. పుల్లలచెరువు: అక్రమంగా నిల్వ ఉంచిన రూ.84.20 లక్షల విలువైన మొక్కజొన్న, కంది విత్తనాలను విజిలెన్స్ అధికారులు సీజ్ చేసిన ఘటన పుల్లలచెరువులో శుక్రవారం జరిగింది. ఇన్వెక్టా అగ్రీటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రాసెసింగ్ యూనిట్ను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో అనుమతి పత్రాలు లేని, స్టాక్ రిజిస్టర్లో నమోదు చేయని 252.27 క్వింటాళ్ల మొక్కజొన్న, కంది విత్తనాలను సీజ్ చేసి వాటి అమ్మకాలను నిలిపేసినట్లు ఏఓ గోపికృష్ణ, క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్ జవహర్ నాయక్ తెలిపారు. ఈ తనిఖీల్లో డీసీటీఓ బి.రామారావు, సీఐ ఎన్.రాఘవరావు పాల్గొన్నారు. -
కనిగిరిలో ‘ఘన’నాథుడు
కనిగిరి రూరల్: వినాయక చవితి పండగకు కనిగిరిలో భారీ గణనాథుని కొలువుకు సిద్ధం చేశారు. ఈ మేరకు సుమారు రూ.5.50 లక్షల ఖరీదు చేసే వినాయకుని విగ్రహాన్ని హైదరాబాద్ దూల్పేట నుంచి ప్రత్యేక వాహనంలో కనిగిరికి శుక్రవారం తీసుకొచ్చారు. పట్టణంలోని 9వ వార్డులో వాల్మీకి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న భారీ గణపతి విగ్రహానికి కనిగిరి హైవేలోని కొత్తూరు అభయాంజనేయ స్వామి గుడి వద్ద ప్రత్యేక పూజలు చేసి అనంతరం మేళతాళాలతో వినాయకుని కొలువుదీర్చే మండపం వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వాల్మీకి యూత్, విగ్రహ కమిటీ నాయకులు మాట్లాడుతూ మహంకాళి అవతారంలో విఘ్నేశ్వరుడు కొలువుదీరుతున్నట్లు తెలిపారు. సుమారు 26 అడుగుల ఎత్తు, తలపై నాలుగు అడుగుల నాగ పడగ, కిరీటం, 23 అండుగుల వెడల్పు, సుమారు 5 టన్నుల బరువు ఉంటుందన్నారు. బహుశా జిల్లాలోనే అత్యంత పెద్ద గణపతి విగ్రహం ఇదే అవుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. -
మీ కోసం అర్జీలు తక్షణమే పరిష్కరించాలి
ఒంగోలు సబర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అందిన అర్జీలను క్షుణంగా పరిశీలించి నాణ్యతతో సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులు, పీజీఆర్ఎస్ ఆడిట్ టీమ్ అధికారులతో సమావేశమయ్యారు. శాఖల వారీగా పీజీఆర్ఎస్పై పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ, సర్వే సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్, పంచాయతీ రాజ్, ఎడ్యుకేషన్, ఏపీసీపీడీసీఎల్, మునిసిపల్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, దేవాదాయ తదితర శాఖలకు సంబంధించి ప్రజల నుంచి వివిధ సమస్యలపై ఎక్కువ అర్జీలు వస్తున్నాయన్నారు. పరిష్కరించిన అర్జీలు తిరిగి రీ ఓపెన్ కాకుండా సంబంధిత అధికారులు కరెక్ట్ ఎండార్స్మెంట్ ఇచ్చారా లేదా అని, అర్జీదారులు సంతృప్తి చెందారా లేదా అని ఆడిట్ టీమ్ కచ్చితంగా పరిశీలించాలని ఆడిట్ టీమ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అందిన అర్జీల్లో 47,200 అర్జీలను పరిష్కరించగా, 42,487 అర్జీలను ఆడిట్ చేశారని, అలాగే రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీల్లో 16,834 అర్జీలను పరిష్కరించగా, 16,796 అర్జీలను ఆడిట్ చేసినట్లు చెప్పారు. రీ సర్వేకు సంబంధించి గ్రామ సభల్లో వచ్చిన అర్జీల్లో 8,624 అర్జీలను పరిష్కరించగా, 8,609 అర్జీలను ఆడిట్ చేసినట్లు పీజీఆర్ఎస్ నోడల్ అధికారి పీవీఎస్పీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్ రెడ్డి వివరించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారి గౌస్ బాషా, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పానకాల రావు, డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాస నాయక్, కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సెక్షన్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అమ్మానాన్నకు తెలియకుండా.. పోలీసులకు చిక్కకుండా..!
విలాసాలకు అలవాటు పడిన కొందరు యువకులు.. ఆదివారం, ఇతర సెలవు దినాలు రాగానే బైక్లపై షికారు చేసేందుకు, ఈత సరదా తీర్చుకునేందుకు పునుగోడు చేరుకుంటున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా, పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు రిజర్వాయర్ పరిసరాలను తమ అడ్డాగా మార్చుకుంటున్నారు. చెరువులు, రిజర్వాయర్ల వద్ద కాపలాగా ఉండే లస్కర్ల వ్యవస్థను ప్రభుత్వం తొలగించింది. దీంతో సరదాగా చెరువులు, రిజర్వాయర్లలో దిగిన వారు ప్రమాదానికి గురైతే వారిని కాపాడే నాథుడు లేకుండాపోయాడు. దీంతో డ్రౌనింగ్ మృతుల సంఖ్య పెరుగుతోంది. రిజర్వాయర్ పరిసరాల్లో పోలీసుల నిఘా లేకపోవడం వల్లే అసాంఘిక కార్యకలాపాలు అధికమయ్యాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచి అసాంఘిక కార్యకలాపాలను నిరోధించేందుకు పోలీసులు చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. -
పుస్తకావిష్కరణలో రచయితల సందడి
ఒంగోలు టౌన్: నగరంలోని పీవీఆర్ హైస్కూల్ ఆవరణలో నిర్వహిస్తున్న పుస్తకావిష్కరణ మహోత్సవంలో ఎనిమిదో రోజు శుక్రవారం రచయితలు సందడి చేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రచయితలు, పాఠకులు, సాహితీ ప్రేమికులతో పుస్తకాల స్టాల్స్ వద్ద రద్దీ నెలకొంది. దేశభక్తి గీతాల పోటీలో 80 మందికి పైగా పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం వివిన మూర్తి రచించిన వాడూ–నేనూ, డా.దేవరాజు మహారాజు రచించిన హిందుత్వ సింహాసనం మీద అబద్ధాల చక్రవర్తి పుస్తకాలను ఆవిష్కరించారు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ సంపాదకులు గడ్డం కోటేశ్వరరావు అధ్యక్షత వహించిన సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రసంగిస్తూ.. సమాజంలో నేటికి అంటరానితనం కొనసాగుతోందని, ఇది దేశానికి ఎంత మాత్రం మంచిదికాదన్నారు. మోదీ ప్రధాన మంత్రి అయిన తరువాత 11 ఏళ్ల కాలంలో ఏకంగా 140 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి దేశాన్ని ముంచేశారని విమర్శించారు. దేశంలో మతోన్మాద శక్తులు చెలరేగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీవీ సత్యనారాయణ మూర్తి ప్రసంగిస్తూ... నేనూ వాడు పుస్తకంలో దళితుల సమస్యలను చర్చించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పుస్తక ప్రదర్శన అధ్యక్ష కార్యదర్శులు మనోహర్ నాయుడు, లక్ష్మయ్య పాల్గొన్నారు. -
ప్రజా కళలతోనే సమాజంలో మార్పు సాధ్యం
ఒంగోలు టౌన్: ప్రజా కళలతోనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని, నేటికీ జానపదాలకు, పౌరాణిక సాహిత్యానికి ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదని ప్రముఖ వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన రోజుల్లో కూడా బాహుబలి సినిమాను ఎంత మంది చూశారో పల్లె కన్నీరు పెడుతుందన్న పాటను అంతకుమించి చూశారని చెప్పారు. సీపీఐ రాష్ట్ర మహాసభల సందర్భంగా జరుగుతున్న కళా ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఎంసీఏ భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కళలను కార్పొరేట్ శక్తులు తమ గుప్పిట్లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని, ఇందులో భాగంగా ప్రేక్షకులను వ్యసనపరులుగా మార్చడం, సమాజంలో భయభ్రాంతులను సృష్టించడం, హింసాప్రవృత్తిని పెంచిపోషించడం వంటి వాటిని ప్రమోట్ చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి సినిమాలు బూతు సాహిత్యంతో దుర్వాసన వేస్తున్నాయని, తప్పుడు చరిత్రలను సినిమాలుగా నిర్మించి ప్రజల మెదళ్లలో విషం నింపుతున్నారని మండిపడ్డారు. ఇదే సినిమా రంగంలో అనేక మంది గొప్ప దర్శకులు వచ్చారని, ప్రపంచం మెచ్చే సినిమాలను నిర్మించారని అన్నారు. రాచరికంతో కూడిన హింసాప్రవృత్తిని పెంచిపోషిస్తున్న సినిమాలను ప్రజలు తిరస్కరించాలని పిలుపునిచ్చారు. ఇటీవల ఏకకాలంలో 27 పుస్తకాలను నిషేధించడం గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ అక్షరాన్ని నిషేధించడం మూర్ఖత్వమని, పాలకుల పిరికితనానికి నిదర్శనమన్నారు. ఒక పుస్తకాన్ని పాలకులు నిషేధిస్తే దాన్ని ప్రజలు గుండెల్లో దాచుకుంటారని చెప్పారు. తాను ఎమ్మెల్సీగా చట్టసభల్లో ప్రజల వాణిని బలంగా వినిపిస్తున్నానని తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గుజ్జుల ఈఽశ్వరయ్య మాట్లాడుతూ కళారూపాలను ఆయుధంగా చేసుకొని సీపీఐ అనేక పోరాటాలను నిర్మించిందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో బండెనక బండికట్టి పాటతో ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన కమ్యూనిస్టులు 10 లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచిపెట్టారని అన్నారు. అశ్లీల సాహిత్యానికి, అశ్లీల సినిమాలకు ప్రత్యామ్నాయంగా ప్రజా కళలను ప్రజలు ఆదరించాలని కోరారు. సమావేశంలో ప్రజా నాట్యమండలి నాయకులు చంద్రా నాయక్, రామకృష్ణ, చిన్నం పెంచలయ్య, పాట వెంకన్న, శ్రీశైలం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
అసెస్మెంట్ బుక్ విధానాన్ని ఉపసంహరించుకోవాలి
ఒంగోలు సిటీ: పాఠశాలల్లో పరీక్షల నిర్వహణలో మూల్యాంకన పుస్తకాలు విద్యార్థులకు సరఫరా చేసే కొత్త విధానం అనేక సమస్యలకు దారి తీస్తోందని, ఈ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జనార్దన్రెడ్డి, శ్రీనివాసులు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక డీఈఓ కార్యాలయంలో ఏడీ వరప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ విధానం పాఠశాల పనివేళల్లో బోధన సమయాన్ని హరించేలా ఉందన్నారు. పాఠశాలలో మూల్యాంకనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడి బోధన గంటలకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. మార్కుల నమోదు కూడా ఉపాధ్యాయులకు పని భారంగా పరిణమించిందని పేర్కొన్నారు. ఇప్పటికే ఆన్లైన్ నమోదు, రిజిస్టర్ నమోదుతో పాటు బబ్లింగ్ చేసే పని కూడా ఉపాధ్యాయులకు సంక్రమించిందన్నారు. ఆన్లైన్ విధానంలో నమోదుకు మాత్రమే పరిమితమై మిగిలిన నమోదు నుంచి వెసులుబాటు ఇవ్వాలని పేర్కొన్నారు. కొత్త విధానంతో మంచి ఫలితాలు రావు సరికదా నష్టదాయకంగా మారకముందే ఈ విధానం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. జిల్లా సబ్ కమిటీ సభ్యులు హనుమంతురావు, శేషారావు, ఓ.రవి, మండల శాఖ బాధ్యులు వీరరాఘవులు, రామారావు, సుబ్బయ్య, రాము, ఓ.హరి ప్రసాద్, రవి పాల్గొన్నారు. ఏపీటీఎఫ్ జిల్లా శాఖ డిమాండ్ -
రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న మనువాదులు
ఒంగోలు టౌన్: దేశ ప్రజలను ఐక్యంగా ఉంచడంలో బాబా సాహెబ్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ఎంతో దోహదపడిందని, అధికారంలోకి వచ్చిన మనువాదులు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. స్థానిక సీవీఎన్ రీడింగ్ రూంలో శుక్రవారం నిర్వహించిన ఒంగోలు కళా ఉత్సవాల్లో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దేశంలో పలు కులాలు, మతాలు, భాషలు ఉన్నాయని చెప్పారు. దేశ సంపదను దోచుకుంటున్న బీజేపీ ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని ఆరోపించారు. బీజేపీపై వామపక్షాలు చేస్తున్న పోరాటంలో కళాకారులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. పాలకుల అవినీతి బాగోతాలను ఎండగట్టాలన్నారు. సినీ నటుడు మాదాల రవి మాట్లాడుతూ తెలుగు సినిమా రంగానికి ఎంతో మంది కళాకారులను అందించిన ఘనత ప్రజా నాట్యమండలికి దక్కుతుందని చెప్పారు. పోలీసు వారి హెచ్చరిక దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ దేశంలో జరిగిన చారిత్రక పోరాటాల్లో ప్రజా కళాకారులు పోషించిన పాత్రను చరిత్ర ఎన్నటికీ మరచిపోదన్నారు. ఈ సందర్భంగా ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, ఏపూరి సోమన్న ఆటపాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సినీనటుడు సన్నీ అఖిల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో ప్రజా నాట్యమండలి నాయకులు, నల్లూరి వెంకటేశ్వర్లు, చంద్రా నాయక్, చిన్నం పెంచలయ్య, రామకృష్ణ, నాగరాజు, పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. -
గణేష్ మండపాల అనుమతికి సింగిల్ విండో విధానం
● ఎస్పీ ఏఆర్ దామోదర్ ఒంగోలు టౌన్: ప్రభుత్వ నిబంధనలకు లోబడి వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకోవాలని, గణేష్ విగ్రహాల ఏర్పాటుకు ఆన్లైన్లో తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ స్పష్టం చేశారు. వినాయక మండపాల అనుమతులకు పోలీసు శాఖ ప్రత్యేకంగా సింగిల్ విండో విధానాన్ని తీసుకొచ్చిందని, గణేష్ఉత్సవ డాట్ నెట్ అనే వెబ్సైట్లో కమిటీ సభ్యుల వివరాలు, మండపం ఏర్పాటు చేసే స్థలం, పోలీసు స్టేషన్ పరిధి, విగ్రహం ఎత్తు, మండపం ఎత్తు, విగ్రహ ప్రతిష్ట జరిపే రోజు, నిమజ్జనం ఎక్కడ చేస్తారు, ఏ వాహనంలో నిమజ్జనానికి తరలిస్తారు తదితర వివరాలు తెలియజేస్తూ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. పోలీసు అనుమతి పొందడానికి ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఆన్లైన్ దరఖాస్తు మేరకు ఎస్హెచ్ఓ తనిఖీ చేసి, క్యూఆర్ కోడ్ కలిగిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేస్తారని తెలిపారు. వినాయక విగ్రహాల వద్ద భద్రతాపరమైన జాగ్రతలు తీసుకోవాలని సూచించారు. ● నిందితుడి నుంచి 2 బైకులు స్వాధీనం మార్కాపురం: చెడు వ్యసనాలకు లోనై బైకులు చోరీ చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి రెండు బైకులు స్వాధీనం చేసుకున్నట్లు మార్కాపురం సీఐ పి.సుబ్బారావు తెలిపారు. గురువారం సాయంత్రం స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిందితుడి వివరాలు వెల్లడించారు. పట్టణంలోని ఎస్వీకేపీ కళాశాల ఎదురు నారాయణం శ్రీనివాసులు అనే వ్యక్తికి చెందిన టూవీలర్ చోరీ కాగా ఈనెల 19వ తేదీన టౌన్ ఎస్సై సైదుబాబు కేసు నమోదు చేశారు. వన్టౌన్ ఎస్సై సైదుబాబు, టూటౌన్ ఎస్సై రాజమోహన్రావుతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. గురువారం పట్టణంలోని సహారా పెట్రోల్ బంకు వద్ద అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. నిందితుడిని పెద్దదోర్నాల మండలం వైచెర్లోపల్లి గ్రామానికి చెందిన సండ్ర అజయ్గా పోలీసులు గుర్తించారు. మార్కాపురం పట్టణంతోపాటు దోర్నాలలో కూడా బైక్ చోరీ చేసినట్లు నిందితుడు ఒప్పుకొన్నాడు. నిందితుడి నుంచి రూ.1.75 లక్షల విలువైన 2 బైకులు స్వాధీనం చేసుకున్నామని, కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఐ చెప్పారు. ● కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు సబర్బన్: సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించాలని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. గురువారం వివిధ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హాస్టళ్లలో విద్యార్థినీ, విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలంటే భోజనం, వసతితోపాటు పరిసరాలు బాగుండాలన్నారు. రెసిడెన్షియల్ విద్యాలయాల్లో పిల్లల ఆరోగ్యంపై కూడా శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. విద్యాలయాలతోపాటు హాస్టళ్లలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు–ఖాళీలు, మౌలిక సదుపాయాలు, సొంత–అద్దె భవనాలు, ఉన్నతాధికారులు తనిఖీ చేస్తున్న తీరు, విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న విధానం, ఆహార నాణ్యత, మెనూ అమలు –సమస్యలపై కలెక్టర్ చర్చించారు. ఉన్నతాధికారులు హాస్టళ్లను తనిఖీ చేసిన వివరాలు ప్రతి వారం తనకు నివేదించాలని ఆదేశించారు. ఆయా హాస్టళ్లను నియోజకవర్గాల స్పెషల్ ఆఫీసర్లకు ట్యాగ్ చేసి ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని చెప్పారు. ఆరోగ్య సమస్యలను విద్యార్థులు ప్రస్తావించినప్పుడు తేలికగా తీసుకోవద్దని, వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. పదో తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ గైడ్లు త్వరగా వచ్చేలా చూస్తానని, గణితం, సైన్స్ బోధించేందుకు ట్యూటర్లను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్, బీసీ సంక్షేమ అధికారి నిర్మల జ్యోతి, గిరిజన సంక్షేమ అధికారి వరలక్ష్మి, దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు సువార్త, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల జిల్లా సమన్వయ అధికారి జయ, కేజీబీవీ జీసీడీఓ హేమలత, ఆయా శాఖల నియోజకవర్గ స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
విద్యార్థులు ప్రపంచాన్ని చదవాలి
ఒంగోలు టౌన్: విద్యార్థులు పాఠ్యాంశాలతోపాటు పుస్తకాలు చదవాలని, సరైన కోణంలో ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలని ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ సూచించారు. స్థానిక పీవీఆర్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏడో రోజు గురువారం పుస్తక ప్రదర్శనను ఆయన తిలకించారు. అనంతరం మాదాల రంగారావు సాహిత్య వేదికపై ప్రెస్ అకాడమీ చైర్మన్ మాట్లాడుతూ.. నేటి విద్యార్థుల్లో సామాజిక స్పృహ సన్నగిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గాజా యుద్ధంలో 20 వేల మందికి పైగా చిన్నారులు మరణించారని, వారిలో అత్యధికంగా తిండి కోసం బారులుగా నిలబడినవారే ఉండటం బాధాకరమన్నారు. అమెరికా ఇప్పటికీ ఈ మానవ హననం కొనసాగాలని కోరుకుంటోందని చెప్పారు. ఆర్యులు భారతదేశానికి వలస వచ్చినవారేనన్న వాదన కొన్ని శతాబ్దాలుగా చర్చలో ఉందని, వీటన్నింటినీ పుస్తకాలు చదవడం ద్వారా తెలుసుకోవాలని చెప్పారు. మాతృభాషకు ప్రాధాన్యత ఇస్తూనే ఇంగ్లిష్ నేర్చుకోవాలని సూచించారు. తాను కూడా పీవీఆర్ ఉన్నత పాఠశాలలోనే చదువుకున్నానని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ విఠపు బాల సుబ్రమణ్యం మాట్లాడుతూ.. విద్యాలయాల్లో కేవలం పాఠ్య పుస్తకాలకే పరిమితం కావాలని, ఇతర వ్యాపకాలు ఉండకూడదని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం దుర్మార్గమన్నారు. విద్యార్థులు అన్ని రకాల పుస్తకాలు చదవడం ద్వారా ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలని, ఎల్లలు లేకుండా ఎదగాలని ఆకాంక్షించారు. తొలుత అద్దంకి బస్టాండ్ నుంచి పీవీఆర్ గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షుడు మనోహర్ నాయుడు అధ్యక్షత వహించిన సభలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాల కృష్ణ, విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ కార్యదర్శి లక్ష్మయ్య, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, జేవీవీ నాయకులు సీఏ ప్రసాద్, ప్రజా నాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రా నాయక్, కార్యదర్శి చిన్నం పెంచలయ్య, కవి పొన్నూరి వెంకట శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ -
దివ్యాంగుల పెన్షన్ వెరి‘పీకేశన్’..!
పింఛను తొలగించి నోటికాడ ముద్ద లాగేసిన సర్కారుసదరం వెరిఫికేషన్లో ఇష్టారీతిగా పర్సెంటేజీ ఇచ్చిన వైద్యులు సింగరాయకొండ/హనుమంతునిపాడు/ ముండ్లమూరు: అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఒక్క కొత్త పింఛన్ మంజూరు చేయని కూటమి ప్రభుత్వం ఉన్న పింఛన్లను మాత్రం ఇష్టం వచ్చినట్లు తొలగిస్తోంది. ముఖ్యంగా నడవడానికి వీల్లేకుండా, కాళ్లు, చేతులు వంకరపోయి ఏ పనిచేసుకోలేని వారి పింఛన్లను సైతం రీ వెరిఫికేన్ పేరుతో నిర్ధాక్షిణ్యింగా తొలగించారు. దీంతో దివ్యాంగులు గగ్గోలు పెడుతున్నారు. వైద్యులు ఇష్టం వచ్చినట్లు పరీక్షించి మా కొడుపులు కొట్టాని మండిపడుతున్నారు. దివ్యాంగుల పట్ల ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వంపై దివ్యాంగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింగరాయకొండలో 108 పింఛన్లు తొలగించాపు సింగరాయకొండ మండలంలో 908 మంది దివ్యాంగ పింఛన్దారులు, 54 మంది ఆరోగ్య పింఛన్దారులు ఉన్నారు. ఇటీవల రీ వెరిఫికేషన్లో 131 మంది దివ్యాంగులను అనర్హులుగా గుర్తించినట్లు ప్రకటించారు. ఈ 131 మందిలో 108 పింఛన్లు రద్దు చేసి, మళ్లీ అప్పీల్ చేసుకోవాలని చెప్పారు. మిగిలిన 23 మందిలో 16 మందికి దివ్యాంగుల కోటాలో రూ.6 వేలు వస్తుండగా వారిని రూ.4వేలు ఇచ్చే వృద్ధాప్య పింఛన్దారులుగా మార్చారు. మరో ఏడుగురిని ఆరోగ్య పింఛన్ల కింద రూ.15 వేలు ఇస్తుండగా వారిని రూ.4 వేల వృద్ధాప్య పింఛన్లలోకి మార్చారు. ఇష్టారాజ్యంగా పరీక్షలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దివ్యాంగుల వికలాంగత్వం రీ వెరిఫికేషన్ చేపట్టింది. అయితే వైద్యులు ఇష్టం వచ్చినట్లు పరీక్షలు చేసి తక్కువ పర్సంటేజీలు ఇవ్వడంతో ఎంతో మంది అర్హులకు అన్యాయం జరిగింది. కనీసం వికలాంగులమన్న కనికరం కూడా లేకుండా రీ వెరిఫికేషన్ రోజుల తరబడి తిప్పుకున్నారని దివ్యాంగులు వాపోతున్నారు. ● హనుమంతునిపాడు మండలంలో 467 దివ్యాంగ పింఛన్లు ఉన్నాయి. వాటిలో 67 మందికి పింఛన్లు తొలగించినట్లు నోటీసులు జారీ చేశారు. 10 ఏళ్ల నుంచి తీసుకుంటున్న దివ్యాంగులు ఉన్నారు. పింఛన్లు తొలగించిన వారిలో చేతులు, కాళ్లు వంకరపోయి కనీసం నడవలేని వారే ఉన్నారు. వారి పింఛన్లను వికలాంగత్వం తక్కువ ఉందన్న సాకుతో తొలగించారు. ఏ పనిచేయలేని మా పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించి మా నోటికాడి కూడు తీశారని కన్నీరుమున్నీరవుతున్నారు. ● ముండ్లమూరు మండలంలో సుమారు 160 మంది దివ్యాంగుల పింఛన్లు తొలగించారు. దీంతో బాధితులంతా బుధవారం ఎంపీడీఓ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. వైద్యులు ఇష్టం వచ్చినట్లు పరీక్ష చేసి పర్సంటేజీలు తగ్గించి రాసి అన్యాయంగా మా పెన్షన్లు తొలగించారని గోడు వెళ్లబోసుకున్నారు. అయినా అధికారులెవ్వరూ పట్టించుకోలేదు. దీంతో కలెక్టర్ను కలిసి విన్నవిస్తామని, అక్కడ న్యాయం జరగకపోతే ఆందోళన బాట పడతామని స్పష్టం చేశారు. ఒక్కో మండలానికి 100కు పైగా రద్దు కదల్లేని వారి పింఛన్లు కూడా తొలగించడంపై సర్వత్రా విమర్శలు పింఛన్ల అప్పీల్కు మండల కార్యాయాలకు దివ్యాంగులు దివ్యాంగుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోంది. కనీసం నడవడానికి వీల్లేని వారి పింఛన్లను సైతం రీ వెరిఫికేషన్ పేరుతో తొలగించింది. ఫలితంగా ఒక్క సింగరాయకొండ మండలంలోనే 108 మంది దివ్యాంగుల పింఛన్లను రద్దు చేశారు. రీ వెరిఫికేషన్లో వైద్యులు ఇష్టారీతిన పర్సంటేజీలు ఇవ్వడంతో పదేళ్లుగా పింఛన్లు తీసుకుంటున్న దివ్యాంగులను కూడా అనర్హులుగా తేల్చి పింఛన్లు రద్దు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పీసీపల్లి మండలం పాలేటిపల్లి గ్రామానికి చెందిన నారపురెడ్డి రమణమ్మ నడుములకు సర్జరీ అనంతరం మంచానికి పరిమితమైంది. ఐదేళ్ల క్రితం సదరంలో వైద్యులు పరీక్షించి 69 పర్సెంటేజీతో సర్టిఫికెట్ ఇవ్వగా పెన్షన్ డబ్బుతోనే జీవిస్తోంది. వెరిఫికేషన్ నెపంతో ఆమె పెన్షన్ పీకేసిన ప్రభుత్వం.. పునఃపరిశీలనకు ఎంపీడీఓకు అర్జీ పెట్టుకోవాలని నోటీస్ ఇచ్చింది. రానూపోను సుమారు 40 కిలోమీటర్లు ప్రయాణించాలంటే ఆటో బాడిగ రూ.1000 కట్టాలని, అంత స్థోమత తనకు లేదని రమణమ్మ వాపోతోంది. – పీసీపల్లి -
రెండు కాళ్లూ పనిచేయవు
నా రెండు కాళ్లు పనిచేయవు. పక్షవాతం కూడా వచ్చింది. ఒకరి సాయం లేకుండా ఎక్కడికి వెళ్లలేను. వికలాంగత్వం తక్కువగా ఉందని నా పింఛన్ తొలగించామని చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. మళ్లీ అప్పీల్ చేసుకోమంటున్నారు. కొండపి ఆస్పత్రికి ఆటోలో వెళ్లాలంటే రూ.2 వేలు ఖర్చవుతుంది. ఆటోలో కొండపి వెళుతుంటే సగం దూరం వెళ్లాక సచివాలయ సిబ్బంది ఫోన్ చేసి డాక్టర్ లేరని చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. – కుంచాల సుజాత, డ్రైవర్పేట రెండో లైను, సింగరాయకొండః -
పీఈటీపై కేసు నమోదుకు టీడీపీ నేతల అడ్డుపుల్ల!
ఒంగోలు టాస్క్ఫోర్స్: సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం జెడ్పీ హైస్కూల్లో ఓ బాలికను లైంగికంగా వేధించిన వ్యాయామ ఉపాధ్యాయుడు పిల్లి హజరత్తయ్య సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. అతనిపై పోక్సో కేసు నమోదు చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించినా పోలీసులు మీనమేషాలు లెక్కిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈనెల 19వ తేదీ సాయంత్రం పీఈటీపై ఫిర్యాదు చేయడానికి డీవైఈఓ చంద్రమౌలీశ్వరరావు సింగరాయకొండ పోలీస్స్టేషన్కు వెళ్లారు. ఏమైందో ఏమో కానీ ఫిర్యాదు చేయకుండానే వెనుదిరిగారు. దీనిపై విద్యాశాఖ, పోలీసులను వివరణ కోరగా భిన్నమైన సమాధానాలివ్వడం అనుమానాలకు తావిస్తోంది. డీవైఈఓ మాట్లాడుతూ.. తాను 19వ తేదీ రాతపూర్వకంగా అర్జీ తీసుకెళ్తే పోలీసులు టైప్ చేయించి ఇవ్వాలని సూచించారన్నారు. కంప్యూటర్లో టైప్ చేయించుకుని వెళ్తే సీఐ హజరత్తయ్యకు ఇవ్వాలనడంతో రాత్రి 8.30 గంటల వరకు వేచిచూసి వెనుదిరిగానని చెప్పారు. ఎస్సై బి.మహేంద్ర మాట్లాడుతూ.. ఊళ్లపాలెం పీఈటీపై ఫిర్యాదు చేయడానికి డీవైఈఓ రాగా కొన్ని వివరాలు అడిగామని, సమాచారం లేకపోవడంతో కలెక్టర్తో మాట్లాడి మళ్లీ వస్తానని వెళ్లిపోయారని చెప్పారు. ఇదిలా ఉండగా.. మంత్రి స్వామితో మాట్లాడిన తర్వాతే కేసు నమోదు చేయాలని అప్పటి వరకు ఎలాంటి చర్యలు వద్దని అధికార పార్టీ నాయకులు కొందరు ఎస్సైపై ఒత్తిడి తెచ్చారని బీసీ సంఘ నాయకుడు పొటికలపూడి జయరాం ఆరోపించారు. మర్రిపాలెం(విశాఖ జిల్లా): ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో ఊహించని మలుపు చోటు చేసుకుంది. ప్రమాదానికి కారణమైన కారులో గంజాయిని గుర్తించిన పోలీసులు, ఆ కేసులో పరారీలో ఉన్న మరో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ విషయాన్ని గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఐదో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ రవికుమార్ వెల్లడించారు. ఈ నెల 12న సుభాష్నగర్ వద్ద జరిగిన ప్రమాదంలో ఒక కారు ఢీకొని ఏడాదిన్నర చిన్నారి వర్షిత్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత కారు డ్రైవర్, తమిళనాడుకు చెందిన అర్జునన్ జెమినీ అధ్ముఘంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు కారులో ఉన్న మరో ముగ్గురు పరారయ్యారు. పోలీసులు ఈ నెల 16న సీజ్ చేసిన కారును తనిఖీ చేయగా.. అందులో 21 కిలోల గంజాయిని గుర్తించారు. విచారణలో భాగంగా పరారీలో ఉన్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో హైదరాబాద్లోని హాస్టల్లో ఉంటున్న గుంటూరుకు చెందిన 20 ఏళ్ల అక్షయ గౌతమి, ఒంగోలుకు చెందిన 25 ఏళ్ల పెర్లి విజయవర్ధన్ రాజు, గుంటూరుకు చెందిన 19 ఏళ్ల షేక్ మహమ్మద్ జాకీర్ ఉన్నారని సీఐ తెలిపారు. ఈ నలుగురు విజయవాడలో కారు అద్దెకు తీసుకుని అరకు వెళ్లి అక్కడ గంజాయి కొనుగోలు చేశారు. తిరిగి వస్తుండగా ఊర్వశి జంక్షన్ సమీపంలోని సుభాష్నగర్ వద్ద ప్రమాదం జరిగింది. నిందితుల్లో ఒకరైన పెర్లి విజయవర్ధన్ రాజుపై ఇప్పటికే ఒంగోలులో 11 కేసులు ఉన్నాయని, మరొక నిందితుడు మహమ్మద్ జాకీర్పై కూడా గంజాయి కేసు ఉందని పోలీసులు వెల్లడించారు. యువతికి తల్లిదండ్రులు లేరు. విజయవర్ధన్కు బంధువు కావడంతో అతనితో ఇలా వెళ్తూ ఉంటుంది. ఈ కేసులో ప్రతిభ చూపించిన ఎస్ఐలు షేక్ సమీర్, రవికుమార్లను సీఐ అభినందించారు. ఊళ్లపాలెం జెడ్పీ హైస్కూల్ పీఈటీపై పోక్సో కేసు నమోదుకు కలెక్టర్ ఆదేశించినా స్పందన శూన్యం0 మంత్రి డోలాతో చర్చించాకే కేసు కట్టాలని టీడీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు -
ప్రజా సమస్యల పరిష్కారానికి పాటే ఆయుధం
ఒంగోలు టౌన్: ప్రజా సమస్యల పరిష్కారానికి పాటే ఆయుధంగా ప్రజా నాట్యమండలి కళారూపాలు నిర్వహిస్తుందని ప్రజా నాట్యమండలి గౌరవాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సీపీఐ రాష్ట్ర మహాసభలను పురస్కరించుకొని నగరంలోని సీవీఎన్ రీడింగ్ రూంలో నిర్వహిస్తున్న ఒంగోలు కళా ఉత్సవాలు గురువారం రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో నల్లూరి మాట్లాడుతూ...ప్రజలను చైతన్య పరిచి ఉద్యమ మార్గంలోకి నడిపించే శక్తి ఒక్క పాటకు మాత్రమే ఉందని చెప్పారు. పేదలకు భూములు పంచడం, కూలి రేట్లు పెంచడం, కార్మికుల హక్కుల కోసం చేస్తున్న పోరాటాల్లో పాట కీలక పాత్ర పోషిస్తోందన్నారు. సినీ గేయ రచయిత ఎస్కే మీరా మాట్లాడుతూ.. పామరులకు సైతం వేదిక ఇచ్చిన గొప్ప చరిత్ర కమ్యూనిస్టు పార్టీలకే దక్కుతుందన్నారు. మూడో తరగతి మాత్రమే చదివిన తాను రాసిన భక్తి కోరిన బలి, కనురెప్ప, చర్లపల్లి భూ పోరాటాలు, పద్మప్యూహం నాటికలు ప్రజాదరణ పొందాయని చెప్పారు. సభలో ప్రజా నాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రనాయక్, కార్య నిర్వాహక కార్యదర్శి రామకృష్ణ, కోశాధికారి పిచ్చయ్య, ధూళిపాళ్ల సీతారామయ్య, ఎస్కే నజీర్ పాల్గొన్నారు. -
నా కడుపు కొట్టారు..
నా కళ్లు పనిచేయవు. 2011లో సదరం సర్టిఫికెట్లో 77 శాతం వికలాంగత్వం ఉన్నట్లు సర్టిఫికెట్ ఇచ్చారు. అప్పటి నుంచి పెన్షన్ తీసుకుంటున్నాం. ఇటీవల రీ వెరిఫికేషన్లో వైద్యులు 46 శాతం వికలాంగత్వం ఉన్నట్లు ఇచ్చారు. నేను కాలికి బూటు వేసుకుంటే గానీ పైకి లెగవలేను. బూటు కొనుక్కోవాలంటే రూ.78 వేలు ఖర్చవుతుంది. వీటిని కేంద్రంగా ఉచితంగా ఇస్తుంది. 46 శాతం పర్సంటేజీ ఇవ్వడం వల్ల ప్రభుత్వ పథకాలు వర్తించవు. నా పింఛన్ తొలగించి నా కడుపు కొట్టారు. –కొచ్చెర్ల లక్ష్మి, దివ్యాంగురాలు, ఊళ్లపాలెం -
నల్లమలలో గుప్త నిధుల తవ్వకాలు
యర్రగొండపాలెం: నల్లమల అటవీ ప్రాంతంలో గుప్త నిధుల తవ్వకాన్ని ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. యర్రగొండపాలెం మండలం గంజివారిపల్లె రేంజ్ పరిధిలో చెన్నుపల్లికి సమీపంలో వెలసిన వీరులోడు స్వామి కుంట వద్ద కొందరు వ్యక్తులు బుధవారం అర్ధరాత్రి తర్వాత గుప్త నిధుల కోసం జేసీబీతో తవ్వకాలు మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న రేంజ్ ఇన్చార్జి అధికారి ప్రసన్న జ్యోతి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ షేక్.కరీముల్లా తమ సిబ్బందితో దాడి చేశారు. అధికారుల రాకను పసిగట్టిన దుండగులు కొందరు అక్కడి నుంచి పరారు కాగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఉపయోగించిన జీప్, జేసీబీలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను విచారిస్తున్నామని, పరారైన వ్యక్తులను త్వరలోనే అరెస్టు చేస్తామని ఫారెస్ట్ సెక్షన్ అధికారి తెలిపారు. నల్లమల అటవీ ప్రాంతంలో పులుల సంచారం ఎక్కువ ఉందని, వాటి బారిన పడి ప్రాణాలపైకి తెచ్చుకోవద్దని హెచ్చరించారు. జేసీబీ, జీప్ను స్వాధీనం చేసుకున్న ఫారెస్ట్ అధికారులు పట్టుబడిన ఇద్దరు నిందితులు.. పరారీలో మరికొందరు -
పనులు వేగవంతం చేయండి
ఒంగోలు సబర్బన్: ఆర్డీఎస్ఎస్ పనులు వేగవంతం చేయాలని, అందుకు సంబంధించిన కార్యాచరణ రూపొందించుకొని ముందుకు పోవాలని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి విద్యుత్ అధికారులను ఆదేశించారు. స్థానిక రామ్నగర్లోని విద్యుత్ భవన్లోని కాన్ఫరెన్స్లో గురువారం ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన విద్యుత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో కేంద్ర, రాష్ట్రాల ముఖ్య పథకాలైన ఆర్డీఎస్ఎస్, పీఎం సూర్యఘర్ పురోగతి మీద ప్రత్యేకంగా సమీక్షించారు. రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు అందించటంలో నిర్లక్ష్యం విడనాడాలన్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల విషయంలో ఎలాంటి ఆరోపణలు వచ్చినా సహించేది లేదన్నారు. పరివర్తకాల పనితీరు విషయంలో కూడా సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యుత్ శాఖపై ప్రజల అభిప్రాయం, విద్యుత్ కలెక్షన్లు, బకాయిలపై సమీక్షించారు. ప్రజలకు స్మార్ట్ మీటర్లు పట్ల ఉన్న అపోహలను తొలగించాలని, వాటి ఆవశ్యకతను తెలియజేయాలని సూచించారు. ఏపీ సీపీడీసీఎల్ డైరెక్టర్లు మురళీకృష్ణ యాదవ్, జిల్లా ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు, ఈఈలు, డీఈఈ లు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. ● 26 ఎర్రచందనం దుంగలు స్వాధీనం కొమరోలు : తిరుపతి టాస్క్ఫోర్స్ బృందం ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి 26 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లుగా కడప సబ్ కంట్రోల్ ఆర్ఎస్ఐ నరేష్ తెలిపారు. మండలంలోని గుంతపల్లె బీట్ పరిధిలో టాస్క్ఫోర్స్ బృందం కూంబింగ్ చేపట్టింది. ఈ క్రమంలో ముగ్గురు అనుమానాస్పదంగా సంచరిస్తూ టాస్క్ఫోర్సు బృందాన్ని చూసి పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నారు. విచారణలో గుంతపల్లె అటవీ ప్రాంతంలోని కల్వర్టు కింద 26 ఎర్రచందనం దుంగలను ఉంచినట్లుగా తెలిపారు. టాస్క్ఫోర్స్ బృందం 26 ఎర్రచందనం దుంగలను, ఒక మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకొని తిరుపతి టాస్క్ఫోర్స్ పోలీసుస్టేషన్కు తరలించినట్లుగా తెలిపారు. ఎర్రచందనం దుంగల విలువ రూ.25 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ● ఫారెస్టు ఆఫీసర్స్ అసోిసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు మార్కాపురం: శ్రీశైల శిఖరం వద్ద అటవీ శాఖ ఉద్యోగులపై దాడి చేసిన సంఘటనలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు చెప్పారని, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని ఏపీ జూనియర్ ఫారెస్టు ఆఫీసర్స్ అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు. అసోషియేషన్ నాయకులతో కలిసి గురువారం అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ సందీప్ కృపాకర్కు వినతిపత్రం అందించి తమ సమస్యలు విన్నవించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే దాడి సంఘటనపై ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి వివరించామని, వారు స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. అడవుల్లో క్రూరమృగాలు, విషసర్పాల మధ్య తాము విధులు నిర్వర్తిస్తున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో తమపై దాడి చేయడం బాధగా ఉందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు మధ్య నల్లమల అటవీ ప్రాంతం ఉందని, దేశంలోనే పెద్ద టైగర్ రిజర్వు ప్రాజెక్టు అని పులులను కాపాడేందుకు తాము కష్టపడుతున్నామన్నారు. అడవులో అభివృద్ధి పనులు చేయాలంటే నిబంధనల ప్రకారం చేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు శశిభూషణ యాదవ్, మార్కాపురం యూనిట్ కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు, సుధాకర్, బాలాకుమారి తదితరులు పాల్గొన్నారు. -
అటవీ శాఖ సిబ్బందిపై దాడి హేయమైన చర్య
మార్కాపురం: అటవీశాఖ సిబ్బందిపై దాడిచేసి భయభ్రాంతులకు గురిచేసిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ, హత్యాయత్నం చట్టాల కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు, గిరిజన ప్రజా సమాఖ్య జాతీయ అధ్యక్షుడు వడిత్య శంకర్నాయక్ డిమాండ్ చేశారు. శ్రీశైల శిఖరం వద్ద విధి నిర్వహణలో ఉన్న ఫారెస్టు అధికారులపై బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి మద్యం సేవించి సిబ్బందిపై దాడి చేసినందుకు నిరసనగా సభ్యులతో కలిసి మార్కాపురంలోని అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. అనంతరం డిప్యూటీ డైరెక్టర్ సందీప్ కృపాకర్కు వినతిపత్రం అందచేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే అటవీశాఖ సిబ్బందిపై దాడి చేయడంతో పాటు ఫారెస్టు అధికారిక వాహనాన్ని తానే నడుపుతూ సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశారన్నారు. శ్రీశైలం ఘాట్లో రాత్రిపూట వాహనాన్ని తిప్పి అక్కడి నుంచి అతిథి గృహానికి తీసుకెళ్లి తన అనుచరులతో దాడి చేయించడం దుర్మార్గమైన చర్య అన్నారు. విధి నిర్వహణలో యూనిఫాంలో ఉన్న అటవీ అధికారులపై దాడి చేయడంతో పాటు మానసిక క్షోభకు గురైన అధికారులకు తక్షణమే అన్నీ విధాలుగా అండగా ఉండాలన్నారు. దాడికి పాల్పడిన ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం, విధి నిర్వహణకు ఆటంకం పరిచిన అంశాలపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే అధికారులకు అండగా తాము రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. భవిష్యత్లో ఇటువంటి సంఘటనలు జరగకుండా, అటవీ శాఖ అధికారులకు రక్షణ కల్పిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శంకర్ నాయక్ డిమాండ్చేశారు. కార్యక్రమంలో గిరిజన నాయకులు రామూనాయక్, ధర్మా నాయక్, మనోజ్ నాయక్, వీరాంజనేయులు నాయక్, హనుమంత్, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, కోటి నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
పరీక్షిస్తూ..
ఏడాది గడుస్తూ! విద్యాశాఖ తీరు అధ్వానం విద్యాశాఖ అధికారుల తీరు అధ్వానంగా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు డీఎస్సీ అభ్యర్థులను గందరగోళం చేసే విధంగా ఉన్నాయి. అభ్యర్థు మెరిట్ లిస్ట్ , వారి ర్యాంక్స్ విడుదల చేసిన తర్వాతే సెలక్ట్ లిస్ట్ విడుదల చేయాలి. గతంలో ఏ డీఎస్సీ కి లేని విధంగా కొత్త నిబంధనలు విధించడం సరికాదు. ఈ విధానంతో అక్రమాలు జరిగే అవకాశం ఉంది. – సీహెచ్ వినోద్, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకుడు ఒంగోలు సిటీ: జిల్లాలో వివిధ కేటగిరీల కింద 623 ఉపాధ్యాయ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఏప్రిల్ 14వ తేదీన డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదల జేసింది. మే 15వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరించింది. జూన్ 6వ తేదీ నుంచి జూలై 4 వరకు పరీక్షలు జరిగాయి. 21,559 మంది అభ్యర్థులు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు రాశారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో 2152 మంది గైర్హాజరయ్యారు. తుది కీని ఆగస్టు 1 తేదీన విద్యాశాఖ విడుదల చేసింది. ఆగస్టు 14న అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో నార్మలైజేషన్ మార్కులతో కలిపి స్కోర్ ఇచ్చింది. అయితే టెట్ వివరాలు విద్యాశాఖ దగ్గర లేకపోవడంతో మెరిట్ జాబితా విడుదలలో జాప్యం జరుగుతోంది. శుక్రవారం టెట్ మార్కులు అప్లోడ్ చేసేందుకు చివరి అవకాశంగా విద్యాశాఖ ప్రకటించింది. భర్తీపై రోజుకో కథనం మెగా డీఎస్సీ ద్వారా పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామంటూ నిరుద్యోగులను ఊరిస్తూ వచ్చిన కూటమి ప్రభుత్వం ఏడాది దాటిన తర్వాత డీఎస్సీ ప్రకటన చేసింది. పోస్టుల ప్రకటన, పరీక్షల నిర్వహణ, ఫలితాలు వెల్లడి వరకూ అంతా అస్తవ్యస్తంగా తయారైంది. ఇదిలా ఉండగా ఉపాధ్యాయుల కొలువుల భర్తీకి సంబంధించి అధికార పార్టీ అనుకూల మీడియాతో పాటు, రకరకాల సోషల్ మీడియాల్లో రోజుకో కథనం పుట్టుకొస్తుండడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మెరిట్ జాబితాతో సంబంధం లేకుండా అర్హులకు ఫోన్ల ద్వారా మెజేస్లు పంపుతామని, వారు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు రావాలన్న ప్రచారం జరుగుతూ వస్తోంది. వచ్చే నెల 5వ తేదీ నాటికి కొత్త ఉపాధ్యాయులు విధుల్లోకి చేరిపోతారంటూ ప్రకటనలు వెలువడుతున్నాయి. దీనిపై జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అభ్యర్థులకు క్లారిటీ ఇచ్చే వారు కరువయ్యారు. ఇంత గందరగోళం మధ్య ఏం జరుగుతుందో అనే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇలా.. డీఎస్సీ అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించిన తరువాత ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో తెలియజేసిన తరువాత మెరిట్ లిస్టు ప్రకటిస్తారు. మెరిట్ లిస్టు ప్రకటించిన తరువాత రోస్టర్ విధానంలో ఎంపిక చేసిన జాబితాను 1:2 నిష్పత్తిలో ప్రకటించి అభ్యర్థుల సర్టిఫికెట్లు వెరిఫై చేస్తారు. ఇలా ఎంపిక పారదర్శకంగా జరిగేది. ప్రస్తుతం అందుకు భిన్నంగా జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జూన్లో నిర్వహించిన డీఎస్సీ 2025 పరీక్ష ఫలితాలను విద్యాశాఖ ప్రకటించింది. వాటిని అభ్యర్థుల ఫోన్లకు నేరుగా వివరాలను పంపింది. తాజాగా మెరిట్ జాబితాను ప్రకటించకుండా 1:5 నిష్పత్తిలో అభ్యర్థులకు మెసేజ్లు వస్తాయని వారు జిల్లాలో ఎంపిక చేసిన కేంద్రానికి వెళ్లి సరిఫికెట్లు పరిశీలన చేసుకోవాల్సి ఉంటుందని ప్రచారం జరిగింది. దీంతో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో తెలిసే అవకాశం లేదు. ఈసారి మెరిట్ లిస్టును సర్టిఫికెట్లు వెరిఫై రోజు ప్రకటిస్తారని విద్యాశాఖ వర్గాలు చెబుతుండడం గమనార్హం. ప్రస్తుతం జరుగుతున్న విధానాన్ని పరిశీలిస్తే పారదర్శకతకు అవకాశం లేదని అవినీతికి, పలుకుబడికి అవకాశం ఉందని, అర్హులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఎంపికై న వారికి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయించేందుకు ఖాళీల వివరాలను విద్యాశాఖ సేకరించినట్లు తెలుస్తోంది. 14 బృందాల ఏర్పాటు.. మెరిట్ జాబితా ప్రకటించకుండా సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేస్తామని జిల్లా విద్యాశాఖ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. మెసేజ్ వచ్చిన అభ్యర్థులు నగర శివారు చెరువుకొమ్ముపాలెంలోని సరస్వతి జూనియర్ కళాశాలలో ధ్రువపత్రాల వెరిఫికేషన్కు రావాలంటున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా విద్యాశాఖ అధికారులు 14 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల్లో మండల విద్యాశాఖాధికారులు, ఐటీ సిబ్బంది కూడా ఉంటారు. సర్టిఫికెట్ల పరిశీలన చేసే విధానంపై బృందాలకు బుధవారం, గురువారం విజయవాడ విద్యాశాఖలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సమాచారం. ఎంపిక ప్రక్రియపై రోజుకో రకంగా ప్రచారం కేటగిరి పోస్టులు లాంగ్వేజ్ 1 39 ఇంగ్లిష్ 95 హిందీ 23 గణితం 94 భౌతిక శాస్త్రం 24 జీవశాస్త్రం 70 సాంఘికశాస్త్రం 106 పీఈటీ 72 ఎస్జీటీ 106 మెగా డీఎస్సీ అంతా గందరగోళంగా తయారైంది. ఏడాది కాలంగా ఉపాధ్యాయ కొలువుల భర్తీపై ప్రభుత్వం నిరుద్యోగులను ఊరిస్తూ వస్తోంది. అర్హత పరీక్ష నిర్వహించిన తర్వాత కూడా ఫలితాలు వెల్లడి దగ్గర నుంచి నియామక ప్రక్రియ చేపట్టే వరకూ అంతా అస్తవ్యస్తంగా తయారైంది. మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది..భర్తీ ఎప్పుడు జరుగుతుందన్న విషయంపై జిల్లా విద్యాశాఖ అధికారులు సైతం సరైన సమాధానం ఇవ్వడం లేదు. దీనిపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
బాబు పాలనలో రాష్ట్రం నిలువు దోపిడీ
మద్దిపాడు: రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు నిలువు దోపిడీ చేస్తూ కార్పొరేట్లకు భూములు అమ్మేస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు ఇన్చార్జి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. మండలంలోని ఇనమనమెళ్లూరు గ్రామంలో గురువారం బాబు ష్యూరిటీ..మోసం గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అబద్ధాలతో గద్దెనెక్కిన చంద్రబాబు ఏడాదిలో చేసిన మోసాలను ప్రతి ఒక్కరికీ తెలియజేయాలని పిలుపునిచ్చారు. బినామీ కంపెనీలతో భూములు మొత్తం కొనుగోలు చేయిస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలతో పాటు సిట్టింగ్కు అనుమతులు ఇచ్చి 14 గంటల పాటు మద్యం విక్రయించేలా అనుమతులు ఇవ్వడం దారుణమన్నారు. గ్రామాల్లో 24 గంటలూ బెల్టుషాపుల్లో మద్యం విక్రయిస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో గ్రామ గ్రామాన మద్యం ఏరులై పారుతోందని ఆరోపించారు. డీఎస్సీలో మెరిట్ లిస్టు ప్రకటించకుండానే ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీని వెనుక లోకేష్ హస్తం ఉందన్నారు. కూటమి ప్రభుత్వం సర్కారు ఉద్యోగార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. పింఛన్ రూ.4 వేలకు పెంచి వేల సంఖ్యలో దివ్యాంగుల పింఛన్లు రద్దు చేసి దివ్యాంగుల పట్ల దుర్మార్గంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఒకటి రెండు హామీలను అరకొరగా అమలు చేసి అన్నీ చేశామని గొప్పలు చెప్పుకోవడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. నమ్మి ఓట్లేసిన ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నైజమన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి, ప్రస్తుత కూటమి పాలనకు ప్రజలు తేడా గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెబుతారని చెప్పారు. వైఎస్సార్ సీపీ హయాంలో మూడేళ్ల కాలంలో పాఠశాలలు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్లు ఇలా ఎన్నో నిర్మాణాలు చేస్తే చంద్రబాబు ఏడాదిలో చేసింది శూన్యమన్నారు. నిన్న మొన్నటి వరకు విజన్ 2020 అని, ఇప్పుడు విజన్ 2047 అంటున్నారని, అవేమీ ఎవరికీ అర్థం కావన్నారు. అన్నదాత సుఖీభవ పథకంలో ఎంతో మంది అర్హులకు అన్యాయం జరిగిందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తే కూటమి ప్రభుత్వంలో ఒక్క పథకాన్ని అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేస్తున్నారన్నారు. చంద్రబాబు మోసాలను తెలుసుకోవడానికి క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆయన మోసాలు అన్ని తెలుస్తాయన్నారు. ఎంపీపీ వాకా అరుణ కోటిరెడ్డి, సంతనూతపాడు అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి, పైడిపాటి వెంకట్రావు, యల్లమందారెడ్డి, కందుల డానియేల్, కిష్టిపాటి శేఖరరెడ్డి, బొమ్మల రామాంజనేయులు, సన్నపురెడ్డి రమణమ్మ, బెజవాడ రాము, పల్లపాటి అన్వేష్, నాదెండ్ల మహేష్, తేళ్ల పుల్లారావు, మద్దా లక్ష్మీనారాయణ, విల్సన్, పూనాటి అప్పయ్య, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి మేరుగు నాగార్జున -
గుండ్లకమ్మ పరవళ్లు
రాచర్ల: మండలంలో నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు గుండ్లకమ్మవాగు పరవళ్లు తొక్కుతూ ఉధృతంగా ప్రవహిస్తోంది. చోళ్లవీడు గ్రామ సమీపంలోని బ్రిడ్జి వద్ద గుండ్లకమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అకవీడు, చోళ్లవీడు, చినగానిపల్లె పంచాయతీల్లోని తురకవాని చెరువు, దొడ్డేనిచెరువు, ఉప్పలేటిచెరువు, ఎర్రగుడిదిన్నె చెరువు, రంగయ్యనాయుడు చెరువులకు గుండ్లకమ్మ వరద నీటితో కళకళలాడుతున్నాయి. దీంతో ఆయా గ్రామాల్లో భూగర్భజలాలు పెరిగి వ్యవసాయ బోరుబావులకు నీరు వస్తున్నాయని ఆయా గ్రామాల రైతులు వివరించారు. ఆకవీడులోని తురకవాని చెరువు అలుగు పారుతుండటంతో పంటకాలువలు మరమ్మతులకు గురై గ్రామం నుంచి మోకాలి లోతులో నీరు ప్రవహిస్తున్నాయి. రోడ్డుపై నీరు ప్రవహిస్తుండటంతో వచ్చేపోయే వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుండ్లకమ్మ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాగులో ముమ్మరంగా చేపల వేట కొనసాగిస్తున్నారు. -
సభ్యసమాజం తలదించుకునేలా ఎమ్మెల్యే ‘బుడ్డా’ తీరు
యర్రగొండపాలెం: శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి అటవీ శాఖ అధికారులపై వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం రాత్రి శ్రీశైలంలో అటవీ శాఖాధికారులపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, తన అనుచరులు దాడి చేసిన సంఘటనపై ఆయన స్పందించారు. ఈ మేరకు గురువారం పార్టీ కార్యాలయంలో ఆయన సాక్షితో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి నేతలకు అధికార మదం తలకెక్కి మనుషులమేనన్న విచక్షణ కోల్పోయి ఏకంగా అధికారులపై జులుం ప్రదర్శిస్తున్న తీరు అందరూ గమనిస్తున్నారన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రానికి అతిసమీపంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా అర్ధరాత్రి సృష్టించిన వీరంగం రాష్ట్రంలో అధికారులపై ప్రభుత్వానికి ఉన్న చిన్న చూపు, లెక్కలేనితనాన్ని సూచిస్తుందన్నారు. ఆ ఎమ్మెల్యే రాష్ట్రంలో సీబీఎన్ అమ్ముతున్న కల్తీ మద్యం సేవించినట్లుందని, తాను ఒక ఎమ్మెల్యే అని మరచి తనకున్న అధికార గర్వాన్ని ప్రదర్శించాడని మండిపడ్డారు. దళితుడైన ఎఫ్బీవో టీకే గురవయ్యను వాహనంలో ఎక్కించుకొని ఆయన ఛాతిపై తన అనుచరులతో దాడి చేయిస్తూ రాత్రంతా రోడ్లపై తిప్పాడని, ఈ సంఘటన సభ్య సమాజం ఛీత్కరించుకునేలా ఉందన్నారు. ఇంత జరిగినా ఆ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు చీమకుట్టినట్లు లేక పోవడం శోచనీయమని, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఎమ్మెల్యే బుడ్డాను అరెస్ట్ చేయాల్సిందే: ఫారెస్ట్ అధికారులు
మార్కాపురం, ప్రకాశం జిల్లా: ఫారెస్ట్ అధికారులు, ఉద్యోగులపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ను అరెస్ట్ చేసి పదవి నుంచి తొలగించాలని ఫారెస్ట్ అసోసియేషన్ నాయకులు నిరసన చేపట్టారు. ఒకవేళ బుడ్డాపై ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఫారెస్ట్ అధికారులుపై దాడి చేపనప్పటికీ బుడ్డాపై చంద్రబాబు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై నిరసనను ఉధృతం చేశారు. ఈ క్రమంలోనే ఏపీ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ అసోసియేషన్ నాయకులు బుడ్డాపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. నల్లమలలో అటవీ సిబ్బందిపై శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ దాడికి పాల్పడటం ఇప్పుడు రాష్ట్రంలో కలకలం రేపుతోంది. శ్రీశైలం శిఖరం చెక్ పోస్ట్ వద్ద ఫారెస్ట్ వాహనాన్ని ఆపి తమపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి, ఆయన అనుచరులు దాడి చేశారంటూ ఫారెస్ట్ సిబ్బంది ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.ఎమ్మెల్యే దాడి విషయాన్ని ఫారెస్ట్ సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఫారెస్ట్ వాహనాన్ని ఎమ్మెల్యే తానే నడుపుతూ.. సిబ్బందిని వాహనంలో ఎక్కించుకెళ్లినట్లు సమాచారం. అర్ధరాత్రి 2 గంటల వరకు ఫారెస్ట్ సిబ్బందిని ఎమ్మెల్యే, ఆయన అనుచరులు తిప్పినట్లు తెలిసింది.ఫారెస్ట్ గార్డ్ గురవయ్యపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి అనుచరులు దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మేం చెప్పినట్టు వినడం లేదని ఎమ్మెల్యే దాడి చేశారంటున్న ఫారెస్ట్ సిబ్బంది.. డిపార్ట్మెంట్ వాహనాన్ని కూడా ఎమ్మెల్యే లాక్కున్నారంటూ ఆరోపిస్తున్నారు. -
కాలువల్లో పూడికతీత పనులు చేపట్టాలి
ఒంగోలు సబర్బన్: నీటి కాలువల్లో పూడికతీత, జంగిల్ క్లియరెన్స్ పనుల్లో నాణ్యత ముఖ్యమని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. ఇరిగేషన్ అధికారులతో బుధవారం క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. జిల్లాలో వివిధ నీటి కాలువల్లో జరుగుతున్న ఈ పనుల్లో పురోగతిపై ఆమె సమీక్షించారు. నాగార్జునసాగర్, రామతీర్థం, మోపాడు, కంభం చెరువుల నుంచి నీళ్లు సరఫరా అయ్యే కాలువల్లో చేపట్టిన పనుల పురోగతిని ఇరిగేషన్ ఎస్ఈ వరలక్ష్మి కలెక్టర్కు వివరించారు. ఎస్డీఎంఎఫ్ పనులను టెండర్ల ద్వారా చేపట్టామన్నారు. రూ.10 లక్షల లోపు విలువైన పనులైతే ఆయా సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టినట్లు తెలిపారు. ఈ పనులను సకాలంలో పూర్తి చేయడంతో పాటు నాణ్యత కూడా అత్యంత కీలకమని కలెక్టర్ అన్నారు. ఈ దిశగా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి చెరువులను కూడా పూర్తిస్థాయిలో నింపాలన్నారు. భూగర్భ నీటిమట్టం పెంచేందుకు ఆయా ప్రాంతాలను బట్టి నీటి సంరక్షణ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రతిపాదనలను కూడా రూపొందించాలని చెప్పారు. సమావేశంలో ఇరిగేషన్ ఈఈలు, భూగర్భ నీటివనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు. -
సాగర్ నీరు వెంటనే విడుదల చేయాలి
త్రిపురాంతకం: నాగార్జున సాగర్ కాలువల ద్వారా రైతులకు సాగు నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. త్రిపురాంతకం మండలం నడిగడ్డకు వచ్చిన ఆయనను కలిసిన రైతాంగం సమస్యలు ఏకరువు పెట్టారు. సాగర్ జలాశయంలో నిండుగా నీరున్నా రైతాంగానికి సాగునీరు విడుదల చేయడంలో ప్రభుత్వం ఇంతవరకు చర్యలు తీసుకోలేదని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. నీరు సమృద్ధిగా ఉన్న ప్రజలకు నీటిని విడుదల చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కృష్ణానది పరవళ్లు తొక్కుతూ సముద్రానికి తరలిపోతున్నా సాగర్ ఆయకట్టుదారులు నారు వేసుకోలేకపోతున్నారన్నారు. ప్రభుత్వం, అధికారులు ఇకనైనా రైతుల గురించి ఆలోచించాలన్నారు. ఇదే విధంగా కొనసాగితే సకాలంలో పంటలు వేసుకోలేరని చెప్పారు. రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచి పంపిణీ సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. రైతులకు అన్యాయం చేస్తే సహించేది లేదని, వారికి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందన్నారు. రైతులు, కౌలు రైతుల సమస్యలు పరిష్కరించి వారికి పంట రుణాలు అందించి ఖరీఫ్ పంటలకు అన్ని విధాలా సహకరించాలని అధికారులను, బ్యాంకర్లను చంద్రశేఖర్ కోరారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ ఆళ్ల సుబ్బమ్మ ఆంజనేయరెడ్డి, పార్టీ కన్వీనర్ ఎస్ పోలిరెడ్డి, పార్టీ నాయకులు వెంకటేశ్వర్లు, గాలెంయ్య, రమణారెడ్డి, నారాయణరెడ్డి, మురారి గాలెయ్య తదితరులు ఉన్నారు. -
భర్త ఆచూకీ లేడు.. అత్తమామలు వేధిస్తున్నారు
పొదిలి: టీ తాగి వస్తానని చెప్పి మార్గమధ్యంలో వదిలేసి వెళ్లిన భర్త ఆచూకీ కోసం తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా మాదాపూర్ గ్రామానికి చెందిన యువతి బుధవారం పొదిలి పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళ్తే.. పొదిలి నగర పంచాయతీ పరిఽధిలోని పోతవరానికి చెందిన బత్తుల కార్తీక్ బేల్దారీ పనుల కోసం తెలంగాణ వెళ్లాడు. పని ప్రదేశంలో మాదాపూర్కు చెందిన అనూష అనే యువతి పరిచయమైంది. కుటుంబ సభ్యులను ఎదిరించి ఇద్దరూ వివాహం చేసుకున్నారు. భార్యభర్తలు ఇద్దరూ తెలంగాణాలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తొలి రోజుల్లో బాగానే ఉన్నప్పటికీ రోజులు గడిచేకొద్దీ వారి మధ్య మనస్పర్థలు పొడచూపాయి. ఇటీవల దర్శిలో జరిగిన బంధువుల వివాహానికి భార్యాభర్తలు హాజరయ్యారు. ఈ సమయంలో అనూషను వదిలించుకుంటే మంచి సంబంధం చూసి వివాహం చేస్తామని కార్తీక్కు తల్లిదండ్రులు నచ్చజెప్పినట్లు సమాచారం. అనూషను వదిలించుకోవాలని నిర్ణయించుకున్న కార్తీక్.. ఆమెతో కలిసి తెలంగాణ పయనమయ్యాడు. ఆర్మూరులో ఆగిన సమయంలో తాను టీ తాగి వస్తానని భార్యకు చెప్పి వెళ్లాడు. ఎంత సమయం వేచి చూసినా భర్త తిరిగిరాలేదు. ఫోన్ కూడా స్విచాఫ్ రావడంతో అనుమానించిన ఆమె తన భర్తను వెతుక్కుంటూ పోతవరం చేరింది. అక్కడ ఇంటికి తాళం వేసి ఉండటంతో అత్తామామలకు ఫోన్ చేసింది. రూ.10 లక్షలు కట్నం ఇస్తేనే ఇంటికి రావాలని అటువైపు నుంచి సమాధానం రావడంతో విస్తుపోయింది. దిక్కుతోచని పరిస్థితుల్లో పొదిలి పోలీస్ స్టేషన్కు చేరుకుని జరిగిన తతంగంపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. తాను గర్భవతినని, భర్త ఆచూకీ తెలుసుకుని న్యాయం చేయాలని ఆ యువతి పోలీసులను కోరింది.కంభం: కంభంలోని ఓ గృహంలో అక్రమంగా నిల్వ ఉంచిన గోవా మద్యాన్ని బుధవారం ఎకై ్సజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. స్థానిక నెహ్రూనగర్లో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. పోతురాజుటూరు గ్రామానికి చెందిన కవలకుంట్ల నరేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్ద 35 గోవా మద్యం ఫుల్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎకై ్స్జ్ సీఐ హెచ్చరించారు.ఒంగోలు జైలుకు అరుణఒంగోలు టౌన్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో అతడి సన్నిహితురాలు అరుణను నెల్లూరు పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. నెల్లూరు నుంచి హైదరాబాద్కు కారులో వెళ్తున్న ఆమెను మేదరమెట్ల వద్ద నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. కావలి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నెల్లూరు పోలీసులు ఆమెను రాత్రి 10 గంటలకు ఒంగోలు జిల్లా జైలుకు తరలించారు.ఒంగోలు సబర్బన్: జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియాను బుధవారం కందుకూరు సబ్ కలెక్టర్ డి.హిమవంశీ కలిశారు. ఇటీవలే కందుకూరు సబ్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణను కూడా ఆయన ఛాంబర్లో కలిశారు.భర్త ఇంటికి వెళ్తే రూ.10 లక్షలు తెమ్మంటున్నారుపొదిలి పోలీస్ స్టేషన్లో తెలంగాణ యువతి ఫిర్యాదు -
మహిళల సమస్యలపై ఐక్య ఉద్యమాలు
కొండపి: మహిళలు సామాజికంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఐక్య ఉద్యమాలు నిర్మించాలని ఐద్వా జిల్లా మహాసభలు తీర్మానించాయి. ఐద్వా జిల్లా మహాసభల్లో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్కే మస్తాన్బి మాట్లాడుతూ మహిళలపై లైంగిక దాడులు, హత్యలు, ఆకృత్యాలు పెరిగేందుకు కారణమైన మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామన్నారు. ఏడాది కాలంలో 35 వేల మందిపై అఘాయిత్యాలు జరిగాయన్నారు. మద్యం, మత్తు పదార్థాలు విచ్చలవిడిగా దొరకడమే నేరాలు పెరిగిపోవడానికి కారణమన్నారు. ఆకృత్యాలకు పాల్పడిన దోషులపై సకాలంలో విచారణ చేసి శిక్షలు వేయకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతున్నాయన్నారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జీవీ కొండారెడ్డి మాట్లాడుతూ ప్రజల మధ్య కులం, మతం పేరుతో, ప్రాంతీయ తత్వాల పేరుతో బీజేపీ, ఆర్ఎస్ఎస్ రెచ్చగొట్టే కుట్రలు చేస్తున్నాయని, వాటిని ఎదుర్కొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ సోషలిస్టు వ్యవస్థలో మాత్రమే మహిళలకు సంపూర్ణ రక్షణ ఉందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్ములుగా ఉన్న మహిళలకు పాలకులు ప్రాధాన్యం ఇవ్వకుండా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి మాట్లాడుతూ మూడేళ్ల ఉద్యమ సమీక్ష, భవిష్యత్ కర్తవ్యాల నివేదికపై మండలాల వారీగా చర్చలు చేసి కార్యదర్శి నివేదికను తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించామన్నారు. పీడీఎఫ్ జిల్లా సహాయ అధ్యక్షురాలు ఉమామహేశ్వరి, కల్పన, వీరాస్వామి, కేజీ మస్తాన్, కొండయ్య, సుజాత, సూరిబాబు, రూబెన్, బాబురావు, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. హనుమంతునిపాడు: స్థానిక పోలీసు స్టేషన్లో బుధవారం 53 మద్యం బాటిళ్లు పగులగొట్టారు. ఈ సందర్భంగా ఎస్సై మాధవరావు మాట్లాడుతూ అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ పీవీ వెంకట్ పర్యవేక్షణలో గతంలో నమోదైన వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న మొత్తం 53 క్వార్టర్ బాటిళ్ల మద్యం, 3.5 లీటర్లు దేశీయ సారాయి ధ్వంసం చేసినట్లు ఆయన తెలిపారు. -
వైరల్ ఫీవర్!
పశ్చిమానికి మార్కాపురం: పశ్చిమ ప్రకాశం వాసులు జ్వరాలతో మంచం పడుతున్నారు. వైరల్ ఫీవర్ వేగంగా వ్యాపిస్తుండటంతో వందలాది మంది బాధితులు చికిత్స కోసం ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యశాలలకు క్యూ కడుతున్నారు. మార్కాపురం జీజీహెచ్కు వస్తున్న జ్వర పీడితుల సంఖ్య చాంతాడులా పెరుగుతోంది. ప్రైవేట్ ఆస్పత్రులు సైతం జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. మార్కాపురం పట్టణంలోని వివిధ ప్రాంతాలతోపాటు డివిజన్ పరిధిలోని మండలాల నుంచి జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న వారు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. ఈనెల 1 నుంచి 19వ తేదీ వరకు 194 మంది జ్వర పీడితులు జీజీహెచ్లో చికిత్స పొందగా, ప్రస్తుతం 32 మంది ఇన్పేషెంట్లుగా ఉన్నారు. మార్కాపురం పట్టణంలోని సుమారు 20 ప్రైవేట్ వైద్యశాలలు రోగులతో నిండిపోతున్నాయి. పలువురు జ్వరపీడితులు నీరసంతో ఇబ్బంది పడుతూ సైలెన్ బాటిల్స్ పెట్టించుకుంటున్నారు. కాగా వైద్యశాలల్లో ల్యాబ్లన్నీ రక్త పరీక్షలకు వచ్చిన వారితో నిండిపోతున్నాయి. పారిశుధ్యం అధ్వానం మార్కాపురం డివిజన్లోని గ్రామాల్లో పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. కొద్దిపాటి వర్షానికే అంతర్గత రోడ్లు బురదమయంగా మారడం, వర్షం నీరు రోజుల తరబడి నిల్వ ఉండటంతో దోమలు విజృంభిస్తున్నాయి. దోమల ధాటికి తట్టుకోలేకపోతున్నామని, రోజూ ఫాగింగ్ చేయాలని పట్టణ ప్రాంతాలతోపాటు పల్లె వాసులు కోరుతున్నారు. మార్కాపురం జీజీహెచ్కు జ్వర బాధితుల క్యూ వందల సంఖ్యలో ప్రజలు అనారోగ్యంపాలు కిటకిటలాడుతున్న ప్రైవేట్ వైద్యశాలలు -
ప్రధాని మోదీ చౌకీదార్ కాదు చోర్
● ప్రజా రచయిత జయరాజ్ ఒంగోలు టౌన్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనను తాను చౌకీదార్ అని చెప్పుకుంటున్నారని, నిజానికి ఆయన దేశ సంపదను కొల్లగొట్టి కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్న చోర్ అని ప్రజా రచయిత జయరాజ్ విరుచుకుపడ్డారు. సీపీఐ రాష్ట్ర మహాసభల సందర్భంగా ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో నగరంలోని సీవీఎన్ రీడింగ్ రూంలో బుధవారం నిర్వహించిన ఒంగోలు కళాఉత్సవాల్లో ముఖ్య అతిథిగా మాట్లాడుతూ పదేళ్ల మోదీ పాలనలో సాధించిందేమీ లేదన్నారు. బీజేపీ పాలనలో దేశం వందేళ్లు వెనక్కి పోయిందన్నారు. మాటరాని వాడి గొంతుకగా ప్రజలను చైతన్య పరచడానికి కమ్యూనిస్టు పార్టీలు చేస్తున్న కృషిని కొనియాడారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ తెలుగు సినీ రంగానికి మాదాల రంగారావు, వందేమాతరం శ్రీనివాస్, బాబ్జీ, అజయ్ ఘోష్ వంటి కళాకారులను అందించిన ఘనత ప్రజా నాట్యమండలికి దక్కుతుందని చెప్పారు. ప్రజల హక్కుల కోసం, కార్మిక చట్టాల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్టులు అహర్నిశలు పోరాటాలు చేస్తున్నారని చెప్పారు. సీపీఐ రాష్ట్ర నాయకుడు జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులకు, ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటంలో కళాకారులు కీలకపాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ప్రజా నాట్యమండలి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజల కోసం పాటుపడేదే కళలని, ప్రజా నాట్యమండలి ప్రజల గొంతకను బలంగా వినిపిస్తుందన్నారు. నెల 23, 24 తేదీల్లో ఒంగోలులో జరుగుతున్న సీపీఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి ప్రజా నాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రా నాయక్ అధ్యక్షత వహించగా కార్యదర్శి చిన్నం పెంచలయ్య, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి రామకృష్ణ, శ్యామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రజా కళాకారులు ఉమక్క, సామ్యేల్, దేవరాజ్, ప్రేమానందం, బొల్లుముంత కృష్ణ, జయరావులను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. -
పులి జాడ కోసం గాలింపు
కంభం: చిరుతపుటి సంచారంపై ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని డీఆర్వో ఆనందరావు సూచించారు. కంభం మండలంలోని నడింపల్లి, ఔరంగబాద్ గ్రామాల సమీపంలోని ఏనుగు కొండ పరిసరాల్లో ఉన్న పంట పొలాల్లో చిరుత పాదముద్రలను రైతులు గుర్తించిన విషయం తెలిసిందే. పులి సంచరిస్తోందని తెలియడంతో అప్రమత్తమైన ఫారెస్టు అధికారులు పాదముద్రలు ఉన్న ప్రాంతాన్ని బుధవారం పరిశీలించారు. కొండ పరిసర ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. వర్షం పడటం వల్ల పులి పాదముద్రలు స్పష్టంగా లేవని, ఆచూకీ కోసం గాలిస్తున్నామని డీఆర్వో తెలిపారు. చీమకుర్తి రూరల్: చీమకుర్తి మండల పరిధిలోని రామతీర్థం ప్రాంతంలో మైనింగ్, విజిలెన్స్ అధికారులు బుధవారం వాహనాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మైనింగ్ బిల్లులు లేకుండా గ్రానైట్ ముడిరాళ్లను తరలిస్తున్న ఏడు వాహనాలను సీజ్ చేశారు. గ్రానైట్ బ్లాకులు తరలిస్తున్న మూడు లారీలు, ఫినిషింగ్ మెటీరియల్ తరలిస్తున్న 2 లారీలు, కంకర ముడిరాయి తరలిస్తున్న 2 లారీలను సీజ్ చేసి ఏపీఎండీసీ ప్రాంగణానికి తరలించారు. ● 24వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ సూచన ఒంగోలు సిటీ: స్పౌజ్, మ్యూచువల్ ప్రాతిపదికన అంతర్ జిల్లా బదిలీలకు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు లీప్ యాప్లో ఈ నెల 24వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ కిరణ్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో నమోదు చేసిన దరఖాస్తు ఫారాన్ని సంబంధిత మండల విద్యాశాఖాధికారికి గురువారం నుంచి 24వ తేదీలోగా అందజేయాలని స్పష్టం చేశారు. ఈ నెల 23 నుంచి 26వ తేదీ వరకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తులను పరిశీలిస్తామని తెలిపారు. ఈ నెల 28, 29వ తేదీల్లో పాఠశాల విద్యా డైరెక్టర్ కార్యాలయంలో వెరిఫికేషన్ అనంతరం తుది జాబితాను 30వ తేదీన ప్రభుత్వానికి సమర్పిస్తారని పేర్కొన్నారు. పైన పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం అర్హులైన ఉపాధ్యాయులు, హెచ్ఎంలు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వివరాల కోసం ఎంఈఓ, డీవైఈఓ, డీఈఓ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. పామూరు: తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగిన ఘటన బుధవారం మండల కేంద్రమైన పామూరులోని తూర్పు వీధిలో వెలుగుచూసింది. వివరాలు.. తూర్పు వీధికి చెందిన బోగ్యం పేరమ్మ తమ బంధువైన యాటా ప్రసన్న ఇంటికి మంగళవారం రాత్రి వెళ్లింది. బుధవారం ఉదయం ఆమె తిరిగి వచ్చి చూసేసరికి ఇంటి బయట తాళం పగలగొట్టి ఉంది. బీరువా తాళం పగలగొట్టి 4 గ్రాముల బంగారు కమ్మలు, రూ.10 వేల నగదు చోరీకి గురయ్యాయని పేరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిషోర్బాబు తెలిపారు. కనిగిరిరూరల్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మాచవరానికి చెందిన యు రమణారెడ్డి (44) మంగళవారం రాత్రి బైక్పై ప్రధాన రహదారి దాటుతూ బైక్ జారడంతో కింద పడ్డాడు. ఈ క్రమంలో తన ఇంటి ముందు ఉన్న కాలువ రాయిని గుద్దుకుని రమణారెడ్డికి బలమైన దెబ్బలు తగలి మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్దిపాడు: మండలంలోని గుండ్లాపల్లి కార్యదర్శి నెల రోజుల క్రితం వారం రోజుల పాటు విధులకు గైర్హాజరవడంతో ఎంపీడీఓ వి.జ్యోతి అతనిపై చర్యలకు డీపీఓకు రిపోర్టు పంపారు. సదరు కార్యదర్శి తన ఇష్టానుసారంగా తిరుగుతూ అవసరమైన రోజు కార్యాలయానికి వెళ్లి పనులు చేసుకుంటున్నాడని స్థానికులు విమర్శిస్తున్నారు. గుండ్లాపల్లి గ్రామానికి ఇన్చార్జిగా పక్క గ్రామానికి చెందిన కార్యదర్శిని నియమించినప్పటికీ చార్జి అప్పగించకపోవడంతో గ్రామంలో జరగాల్సిన పనులు కుంటుబడుతున్నాయని అంటున్నారు. దీనిపై డీపీఓ వెంటనే చర్యలు తీసుకోవాలని, తద్వారా గ్రామంలో ఇబ్బందులు తొలగించేందుకు కొత్త కార్యదర్శిని నియమించాలని కోరుతున్నారు. -
బిందు, తుంపర సేద్యాన్ని ప్రోత్సహించాలి
ఒంగోలు సబర్బన్: జిల్లాలో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు కింద 2025–26లో 10 వేల హెక్టార్లలో నూతనంగా డ్రిప్, స్పింక్లర్ల ఇరిగేషన్ను ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ సీహెచ్ శ్రీనివాసులు పేర్కొన్నారు. భాగ్యనగర్లోని కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. జిల్లాలో బిందు, తుంపర సేద్యాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా పరిపాలనా అనుమతులు కూడా ఇచ్చారన్నారు. ఇప్పటి వరకు ఏపీఎంఐపీ ఎంఐఏఓపీలు, హార్టికల్చర్ అధికారులు, వీహెచ్ఏల ద్వారా రైతులను గుర్తించామన్నారు. స్థానికంగా ఉన్న రైతు సేవా కేంద్రాల ద్వారా 8,915 రైతులకు 11,221.91 హెక్టార్లకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిందన్నారు. అందులో 1,118 రైతులకు సంబంధించి 1,433.02 హెక్టార్లకు డ్రిప్, స్పింక్లర్లకు కలెక్టర్ ద్వారా పరిపాలన ఆమోదం తీసుకున్నామన్నారు. ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ రైతులకు ప్రతి రోజూ సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు గ్రామాల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. గత ఏడాది పంటలకు ధరలు ఆశించిన మేరకు రాకపోవడంతో మిరప, పొగాకు, బొప్పాయి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఈ ఏడాది ఎక్కువ మంది రైతులు మే మొదటి వారం నుంచి ప్రత్యామ్నాయ పంటలుగా పత్తి, మొక్కజొన్న, కంది, బొప్పాయి, నిమ్మ, బత్తాయి, మామిడి, కూరగాయలు, పూలమొక్కలు, కరివేపాకు సాగు చేసుకునేందుకు రైతులు ముందుకు వస్తున్నారని ఆయన వెల్లడించారు. జిల్లాలో 10 వేల హెక్టార్లలో సాగు లక్ష్యం ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు -
నిరుపేద కుటుంబాలను రోడ్డున పడేస్తున్న మద్యం
ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం పాలసీ వలన మద్యం తాగే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీంతో గ్రామీణ ప్రాంతాలు, పట్టణ శివారు ప్రాంతాల్లోని శ్రామికుల జీవితాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బులతో మద్యం తాగుతున్న కొందరు వ్యక్తులు కుటుంబ పోషణను పట్టించుకోవడం లేదు. దాంతో భార్యా బిడ్డలు పస్తులుండాల్సి వస్తోంది. పిల్లల ఆకలి బాధలు చూడలేక కొందరు మహిళలు కూలి పనులకు వెళుతున్నారు. మద్యం విక్రయాలను తగ్గించడమే కాకుండా పూర్తిగా మద్య నిషేధం విధించడానికి కృషి చేయాలి. – కంకణాల రమాదేవి, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి -
వనరులను సమర్థంగా వినియోగించుకోండి
ఒంగోలు సబర్బన్: అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడంపై మున్సిపాలిటీలు దృష్టి సారించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఒంగోలుతో పాటు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల కమిషనర్లతో బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీల వారీగా కార్యాలయంలో ఉన్న పారిశుధ్య కార్మికుల వివరాలు, ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ, డ్రైనేజీలను శుభ్రం చేయటం, తాగునీటి సరఫరాపై ప్రధానంగా ఆమె సమీక్షించారు. పారిశుధ్య నిర్వహణపై ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి ప్రభుత్వం అభిప్రాయాలు సేకరిస్తున్నందున పారిశుధ్య పనుల నిర్వహణలో నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. జిల్లా కేంద్రమైన ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ఆయా విషయాల్లో ఇతర మున్సిపాలిటీలకు ఆదర్శంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కమిషనరు కె. వెంకటేశ్వరరావును కలెక్టర్ ఆదేశించారు. డ్రైనేజీలను శుభ్రం చేయటానికి నగరంలో 15 రోజులపాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని చెప్పారు. అన్న క్యాంటీన్లలో పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు కీలకమని కమిషనర్లకు చెప్పారు. వీధి కుక్కలను కట్టడి చేయటం, వాటికి వ్యాక్సిన్ వేయించడం పైనా దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ విషయంలో పశుసంవర్ధక శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్లకు చెప్పారు. జంతు ప్రేమికుల సహకారం తీసుకోవాలని సూచించారు. సమావేశంలో మునిసిపల్ కమిషనర్లతో పాటు పబ్లిక్ హెల్త్ అధికారులు కూడా పాల్గొన్నారు. కోతలు లేకుండా విద్యుత్ అందించాలి ఒంగోలు సబర్బన్: కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేపట్టాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులతో బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వినియోగదారుల పట్ల సిబ్బంది ప్రవర్తన బాగుండాలని, సంస్థకు చెడ్డపేరు రాకుండా చర్యలు తీసుకోవాలని ఏపీసీపీడీసీఎల్ ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లును ఆదేశించారు. వ్యవసాయ, పరిశ్రమలకు విద్యుత్ డిమాండు–సరఫరా, పీఎం సూర్యఘర్, ఆర్.డి.ఎస్.ఎస్ పనులు, స్మార్ట్ మీటర్లు, నూతన సబ్ స్టేషన్ల నిర్మాణ పనుల్లో పురోగతి, సిబ్బంది– ఖాళీలు, గ్రీవెన్స్ అర్జీల పరిష్కారం, ఐవీఆర్ఎస్ సర్వేలో ప్రజల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్, తదితర అంశాలపై ఆమె సమీక్షించారు. ఆయా అంశాలపై ఏపీసీపీడీసీఎల్ ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు కలెక్టరుకు వివరించారు. ఖాళీగా ఉన్న ఏఈఈ పోస్టులను భర్తీ చేయటానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ పనిచేసే ప్రాంతంలోనే సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రధానంగా ఐవీఆర్ఎస్ సర్వేలో విద్యుత్తుశాఖ సేవలపై ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరిగేలా చూడాలన్నారు. దోర్నాల, మార్కాపురం, ముండ్లమూరు, చీమకుర్తి, పెద్దారవీడు, యర్రగొండపాలెం, సంతనూతలపాడు, పామూరు, మద్దిపాడు మండలాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఆర్డీఎస్ఎస్ కార్యక్రమంలో భాగంగా గ్రామాలకు కొత్తగా వేస్తున్న 3–ఫేస్ విద్యుత్ లైన్ల పనులు కూడా వేగవంతం చేయాలని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో విద్యుత్ శాఖ ఈఈలు, డీఈఈలు, నెడ్ క్యాప్ అధికారులు పాల్గొన్నారు. -
ఉపాధి పనుల్లో భారీ అవినీతి
దర్శి: ‘‘ఇలాంటి పనులు చేయడానికి మీకు సిగ్గుండాలి..ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయండి..ఇంత అవినీతి పనులకు డబ్బులు ఎలా చెల్లించారు..ఒక్కటంటే ఒక్క పనీ సక్రమంగా లేదు..మిమ్మల్ని ఏం చేయాలో మాకే అర్థం కావడం లేదు. కొలతల్లో మరీ ఇంత తేడాలా..అన్నీ కొలతలు తేడాలే..పనులు చేయకుండా కాలువలు నీరొచ్చి పూడి పోయాయని ఎలా చెప్తారు. మీరు పనులు చేసినప్పుడు కనీసం ఫొటోలు అయినా ఉండాలిగా..? మీరు చేసిన పనికి రాసిన రాతలకు పొంతన లేదు...పని చేసినట్లు ఫొటోల ఆధారాలూ లేవు..తప్పుడు లెక్కలు వేసి బిల్లులు చేశారు’’ అంటూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పీడీ గంగవరపు జోసఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు 25 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకంలో చేసిన రూ.12,14,47,188 ల పనులు, పంచాయతీ రాజ్, ఇతర శాఖల ద్వారా చేసిన రూ.7,06,95,482లు కలపి మొత్తం రూ.19,21,42,670 విలువైన పనులపై సామాజిక తనిఖీ నివేదిక ఇచ్చారు. ఈ నివేదికలో టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్ట్ అసిస్టెంట్లు భారీ అవినీతికి పాల్పడినట్లు వెల్లడైంది. గతంలో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలగించారు. ఆ స్థానంలో కూటమి నేతలను ఫీల్డ్ అసిస్టెంట్లుగా నియమించారు. అధికారం మాది..ఇక మమ్మల్ని అడిగేదెవరకున్నారేమో కానీ ఉపాధి హామీ పనుల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు, టీఏలు చేతివాటం ప్రదర్శించారు. సామాజిక తనిఖీల్లో వారి అవినీతి బట్టబయలైంది. సామాజిక తనిఖీ అధికారులు డోర్ టూ డోర్ ఎంక్వయిరీ చేసి వారి అవినీతిని తూర్పారబట్టారు. జాబ్ కార్డులు అప్డేట్ లు చేయలేదు. పని ప్రదేశాల్లో టెంట్లు, మెడికల్ కిట్లు, వంటి సౌకర్యాలు కల్పించలేదు. అన్నీ కల్పించినట్లు రాసుకుని బిల్లులు చేసుకున్నారు. పనుల కొలతలు, రోడ్డు పనులు తనిఖీలు చేసిన నివేదికను ప్రజా వేదికలో చదివి వినిపించారు. ఉపాధి పనులు చేసిన చోట పనికి ముందు ఫొటోలు, పని తరువాత ఫొటోలు తీసి పెట్టలేదని పనులు చేసేటప్పుడు మాత్రమే ఫొటోలు పెట్టారని చెప్పారు. పనులు వద్ద వర్క్ బోర్డులు ఏర్పాటు చేయలేదు. ప్రతి పనిలో 10 నుంచి 36 శాతం వరకు కొలతలు తేడాలు ఉన్న పనులు అధికంగా ఉన్నాయి. అధిక మొత్తంలో పనులు చేసినట్లు నమోదు చేసి డబ్బులు డ్రాచేశారు. చేసిన పనుల కొలతలు పెంచి బిల్లులు చేశారు. గ్రావెల్ రోడ్లకు లోకల్ గ్రావెల్ తోలి పనులు నాసిరకంగా చేశారు. మస్టర్లకు సంతకాలు, వేలు ముద్రలు లేకుండా పేమెంట్లు చేసినట్లు రాసుకున్నారు. అంగన్వాడీ, ఆశావర్కర్లకు పనులు కల్పించి పేమెంట్లు చేశారు. రైతులకు తెలియకుండా వారు పనులు చేసినట్లుగా మస్టర్లు వేసి వారి ఖాతాల్లో పనులు చేయకుండానే డబ్బులు వేసి ఆ డబ్బులు వసూలు చేసుకున్నారు. పనికి వెళ్లకుండా పేమెంట్లు వేసి ఆ తరువాత వారికి తెలియజేసి వారి వద్ద డబ్బులు తీసేసుకున్న ఎన్నో సంఘటనలు ప్రతి గ్రామంలో ఇంటింటి సర్వేలో వెల్లడైంది. కొన్ని పుస్తకాల్లో పనులు చేసిన వారి సంతకాలు లేకుండా అన్నీ ఒకే వేలిముద్రలు వేసినట్లు గుర్తించారు. ఈ పనులపై టీఏ, ఎఫ్ఏలను ప్రశ్నించగా కొందరు రైతులు దున్నుకున్నారని, మరి కొన్ని వర్షాలకు కొట్టుకు పోయాయని పొంతన లేని సమాధానం ఇచ్చారు. పనులు చేసినప్పుడు ఫొటోలు ఇవ్వండని అడగ్గా మౌనమే సమాధానమైంది. సాయంత్రం వరకు 6 పంచాయతీలకు చెందిన వివరాలు వెల్లడించారు. కార్యక్రమంలో సామాజిక తనిఖీ ప్రోగ్రాం అధికారి పీ ఈశ్వరరావు, ఎస్ఆర్పీ నాగరాజు, ఏపీడీ సుబ్బారావు, డీఆర్బీ నాగరాజు ఎంపీపీ సుధారాణి, ఎంపీడీఓ వసంతరావునాయక్ పాల్గొన్నారు. -
సంపద కిక్కు!
ప్రభుత్వం 14 గంటలు మద్యం విక్రయిస్తుంటే..కూటమి నాయకులు 24 గంటలూ మద్యం అమ్మకాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన పాలసీతో మద్యం ఏరులై పారుతోంది. ఇప్పటికే ప్రతి వీధిలోనూ బెల్టుషాపులు..అది చాలదన్నట్టు ప్రతీ మద్యం దుకాణానికి పర్మిట్ రూములు, 14 గంటలు బార్లు బార్ల తెరిచేలా ప్రభుత్వ నిర్ణయించడంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడమేనా సంపద సృష్టి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో అధికారికంగా 189 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇవన్నీ అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లో నడుస్తున్నాయి. ప్రభుత్వం లైసెన్సు మంజూరు చేసిన దుకాణాలకు అదనంగా ఒక్కో దుకాణానికి అనుబంధంగా పుట్టగొడుగుల్లా బెల్టుషాపులు పుట్టుకొచ్చాయి. జిల్లాలోని 729 పంచాయతీల్లోని 1823 గ్రామాలుండగా ప్రతి గ్రామంలోనూ బెల్టు షాపులు ఏర్పాటు చేశారు. అక్రమంగా కోట్లాది రూపాయలు జేబులో వేసుకుంటున్నా కూటమి పాలకుల కడుపు నిండడంలేదు. దాంతో మరింతగా అమ్మకాలు పెంచుకునేందుకు పర్మిట్ రూంలు, బార్లకు నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రజల జేబులు ఖాళీ చేయడం ద్వారా సంపద సృష్టించేందుకు శ్రీకారం చుట్టింది. 29 బార్లకు నోటిఫికేషన్ జిల్లాలో 29 బార్లకు కూటమి ప్రభుత్వం రెండు రోజుల క్రితం నోటిఫికేషన్ జారీ చేసింది. 26 బార్లు ఓపెన్ కేటగిరీలోకి వస్తాయి. మిగిలిన మూడు బార్లు గీత కార్మికులకు కేటాయించింది. ఇందులో ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో 16 బార్లు ఏర్పాటు చేయనుంది. మార్కాపురం పరిధిలో 5, చీమకుర్తి, పొదిలి, దర్శి, కనిగిరి, గిద్దలూరు పరిధిలో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో 24 మద్యం దుకాణాలున్నాయి. ఈ 16 బార్లతో కలుపుకుంటే 40 దుకాణాలు మందుబాబులకు అందుబాటులో ఉంటాయి. ఇక మందుబాబులకు తాగినోడికి తాగినంత మద్యం దొరుకుంది. రోజుకు రూ.3 కోట్ల మద్యం విక్రయాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడతల వారీగా మద్య నిషేధం చేయాలని భావించి ప్రభుత్వం ద్వారా మద్యం విక్రయాలు ప్రారంభించారు. అందుకు భిన్నంగా కూటమి పాలకులు ప్రజల చేత మద్యం తాగించడమే పనిగా పెట్టుకున్నారు. దాంతో ఏడాది కాలంలోనే జిల్లాలో 12 నుంచి 16 శాతం మద్యం విక్రయాలు పెరిగిపోయాయి. రోజుకు రూ.3 కోట్లకు పైగానే మద్యం విక్రయాలు జరుగుతున్నాయంటే పరిస్థితిని అంచనా వేయవచ్చు. పండుగలు, ఆదివారం సెలవులు, జాతరలు, తిరునాళ్లు జరిగే సమయంలో ఏకంగా రూ.6 కోట్ల వరకు మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. సరాసరిన నెలకు రూ.100 నుంచి రూ.120 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం. మరింత ఆదాయమే లక్ష్యంగా ముందుకు నెలకు రూ.120 కోట్ల వరకు విక్రయాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఈ ఆదాయాన్ని మరింత పెంచుకునేందుకు పలు మార్గాలను అన్వేషిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే బార్లు, పర్మిట్ రూంలకు అనుమతివ్వాలని నిర్ణయించింది. ఇందుకుగాను తాజాగా 29 బార్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒక్కో బార్కు అప్లికేషన్ ఫీజు రూ.5 లక్షలుగా నిర్ణయించింది. ప్రాసెసింగ్ ఫీజు మరో రూ.10 వేలు కలిపి రూ.5.10 లక్షల చలానా కట్టాల్సి వస్తుంది. ఇది నాన్ రిఫండబుల్ ఫీజు. లైసెన్స్ ఫీజును రెండు శ్లాబులుగా విభజించారు. 50 వేల లోపు జనాభా కలిగిన ప్రాంతాలకు రూ.35 లక్షలు, 50 వేల జనాభా దాటిన ప్రాంతాలకు రూ.55 లక్షలుగా నిర్ణయించారు. జిల్లాలో 21 బార్లు రూ.55 లక్షల పరిధిలో ఉండగా మిగిలిన 8 బార్లు రూ.35 లక్షల పరిధిలో ఉన్నాయి. గీత కార్మికులకు కేటాయించిన 3 బార్లకు 50 శాతం రాయితీ. ఈ ఫీజును 6 విడతలుగా చెల్లించే వెసులుబాటు ఉంది. ఒక్కో బార్కు కనీసం 4 దరఖాస్తులు వస్తేనే డ్రా తీస్తామని, లేని పక్షంలో ఆయా బార్ల పరిధిలో మళ్లీ నోటిఫికేషన్ ఇస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ లెక్కన జిల్లాలో 29 బార్లకు గాను అప్లికేషన్ల రూపంలోనే సుమారు రూ.6 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఫీజుల రూపంలో రూ.14.35 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇదంతా ప్రజల జేబుల నుంచే వసూలు చేస్తున్నారన్న సంగతిని మరిచిపోకూడదని ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్నాయి. మందే మందు... నిన్నా మొన్నటి వరకు రోజుకు 12 గంటల పాటు మద్యం విక్రయాలు చేసేలా నిబంధనలు విధించారు. ఇప్పుడు తాజాగా అదనంగా మరో 2 గంటల పాటు మద్యం విక్రయించేందుకు అనుమతించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు బార్లలో మద్యం విక్రయించేందుకు అనుమతించడంపై మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే గ్రామాల్లో అనధికారికంగా నిర్వహిస్తున్న బెల్టు షాపుల్లో 24 గంటలూ మద్యం విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పొద్దస్తమానం కూలి పనులు చేసి సంపాదించిన సొమ్మంతా తాగుడుకే తగలబెడుతున్నారని మహిళలు కన్నీరు పెట్టుకుంటున్నారు. మరికొందరు మగాళ్లు మద్యం కోసం భార్యాబిడ్డలను వేధిస్తున్నారని, ఇంట్లోని వస్తువులను తీసుకెళ్లి తెగనమ్ముకుంటూ పీకలదాకా తాగుతున్నారని వాపోతున్నారు. శ్రామిక ప్రజల సంపాదనను మద్యం పేరుతో దోచుకుంటున్న పాలకులు సంపద సృష్టిస్తున్నామని గొప్పలు చెబుతుండడం సిగ్గుచేటని ప్రజా సంఘాల నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. మహిళలపై పెరిగిపోయిన హింస కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళల మీద అన్నీ రకాల హింస పెరిగింది. మహిళలు, బాలికలపై అత్యాచారాలు పెచ్చుమీరిపోయాయి. మందుబాబుల ఆగడాలతో మహిళలు ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. దీనితోపాటుగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి సామాన్యులు అల్లాడి పోతున్నారు. చేయడానికి పనులు లేక యువకులు ఆవేదనకు గురవుతున్నారు. అర్ధరాత్రి వరకూ బార్లకు అనుమతులు, పర్మిట్ రూంలకు అనుమతివ్వడం చాలా దారుణం. ఆదాయం గురించి తప్ప ప్రజారోగ్యం గురించి పాలకులు పట్టించుకోకపోవడం విచారకరం. – మర్రి విజయ, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు -
9 మంది హెడ్ కానిస్టేబుళ్లకు పదోన్నతి
ఒంగోలు టౌన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తున్న 9 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి కల్పించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో పదోన్నతి పొందిన వారికి ఉత్తర్వులు అందజేశారు. అనంతరం ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ పదోన్నతి అనేది మరింత బాధ్యత పెంచుతుందని చెప్పారు. ఏఎస్సైలుగా పదోన్నతి పొందిన హెడ్ కానిస్టేబుళ్లు మరింత నిబద్ధతగా విధులు నిర్వహించి పోలీసు శాఖ ప్రతిష్ట పెంచాలని కోరారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ శాంతి భద్రతల పరిరక్షణకు పాటుపడాలన్నారు. పాఠశాల, కళాశాల విద్యార్ధులకు గుడ్టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించాలని, మాదక ద్రవ్యాలు, గంజాయి సేవనం వలన కలిగే అనర్థాలను వివరించి చెప్పాలన్నారు. సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణలో చురుగ్గా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఏవో రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు. ఏఎస్సైగా పదోన్నతి పొందిన వారిలో సుభాన్ సాహిబ్ (బాపట్ల జిల్లా), కె.మురళీధర్ (నెల్లూరు జిల్లా), ఎస్ఆర్ ఖాశీం షరీఫ్ (తాళ్లూరు పీఎస్), షేక్ జిల్లా సాహెబ్ (బాపట్ల జిల్లా), ఐవీ శ్రీనివాసరావు (మార్కాపురం రూరల్), షేక్ బాజి బాబు (త్రిపురాంతకం పీఎస్), ఎస్కే ప్రవీణ్ షా (డీసీఆర్బీ ఒంగోలు), సీహెచ్ హెప్సీ రాణి (డీసీఆర్బీ ఒంగోలు), వి.కోటేశ్వరరావు (బాపట్ల జిల్లా) ఉన్నారు. -
చలం రచనలు ఆదర్శనీయం
ఒంగోలు టౌన్: సమాజంలో మహిళ గురించి మాట్లాడటానికి భయపడే రోజుల్లోనే వందేళ్ల క్రితమే మహిళలకు పురుషులతో సమానత్వ హోదా కల్పించాలని చలం చర్చించాడని ప్రభవ వ్యవస్థాపకురాలు చంద్రలత చెప్పారు. పీవీఆర్ ఉన్నతపాఠశాల ఆవరణలో జరుగుతున్న పుస్తక మహోత్సవం 6వ రోజు మాదాల రంగారావు సాహిత్య వేదికలో బుధవారం చలం రచించిన ‘సీ్త్ర’ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీ్త్రకి శరీరం ఉంది దానికి వ్యాయామం ఇవ్వండి, ఆమెకు మెదడు ఉంది దానికి జ్ఞానం ఇవ్వండి, ఆమెకు హృదయం ఉంది దానికి అనుభవం ఇవ్వండని చలం చెప్పిన మాటలను గుర్తు చేశారు. అప్పటి సంప్రదాయాలకు వ్యతిరేకంగా సీ్త్ర స్వేచ్ఛ గురించి పరదాలను తెగతెంపులు చేశారని చెప్పారు. ఆనాడు చలం చర్చించిన విషయాలు నేటికీ సజీవంగా ఉన్నాయని, భావి తరాలు చలాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పారు. నరసం రాష్ట్ర అధ్యక్షురాలు తేళ్ల అరుణ చలం రచనలు ఒక విప్లవాన్ని తీసుకొచ్చాయని చెప్పారు. రచయిత కాట్రగడ్డ దయానంద్ చలం రచనల గురించి విళ్లేషించారు. కార్యక్రమాన్ని వల్లూరు శివ ప్రసాద్ నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు చిన్నారుల కోసం నిర్వహించిన కథల పోటీలో 80 మందికి పైగా చిన్నారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
పోక్సో కేసులో దోషికి 20 ఏళ్ల జైలు.. ఒంగోలు కోర్టు తీర్పు
ఒంగోలు: ప్రేమ పేరుతో బాలికను మభ్యపెట్టి పలుమార్లు అత్యాచారం చేసిన కేసులో దోషికి 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ ఒంగోలు పోక్సో కోర్టు న్యాయాధికారి కానుగుల శైలజ బుధవారం తీర్పు చెప్పారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొట్టిపాటి శ్రీనివాసరావు తెలిపిన మేరకు.. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలానికి చెందిన బాలిక తల్లిదండ్రులతో కలిసి ప్రతి ఆదివారం అల్లూరు గ్రామంలో చర్చికి వెళ్లేది. ఆ చర్చిలో మైకు ఏర్పాటుచేసే బత్తుల చంటి అలియాస్ విల్సన్ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఇంటర్ చదువుతున్న ఆ బాలికను మభ్యపెట్టి ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. కొన్నాళ్లకు బాలిక అనారోగ్యంగా ఉంటుండడంతో తల్లిదండ్రులు ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించారు. బాలిక గర్భం దాల్చినట్లు వెల్లడైంది. తల్లిదండ్రులు నిలదీయడంతో బాలిక చంటి అలియాస్ విల్సన్ గురించి చెప్పింది. బాలిక తల్లిదండ్రులు 2019 ఆగస్టు 6న కొత్తపట్నం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అప్పటి ఎస్.ఐ. మేడా శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. అప్పటి డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి.ప్రసాద్ కేసు దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. కోర్టులో ఇరువైపుల వాదనలు విన్న న్యాయాధికారి నిందితుడు చంటి అలియాస్ విల్సన్పై నేరారోపణ రుజువైందని ప్రకటించారు. దీంతో దోషికి 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధించారు. బాధితురాలికి రూ.3 లక్షలు, ఆమె బిడ్డకు రూ.3 లక్షలు అందేలా చూడాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థను ఆదేశించారు. -
పిడుగు గుట్టు.. ఇలా పసిగట్టు
బెల్లంకొండ : వర్షం మొదలయ్యే ముందు తరచూ మన ఫోన్లకు విపత్తుల శాఖ నుంచి ‘మీ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉంది’.. అంటూ మెసేజ్లు రావడం గమనిస్తుంటాం. పిడుగు ఎప్పుడు పడుతుందో.. ఎలా పడుతుందో ఎవరికీ తెలీని పరిస్థితి. కొన్ని సందర్భాల్లో ప్రాణనష్టం కూడా సంభవిస్తుంది. ఇక ఇంట్లోని గృహోపకరణాలు కూడా కాలిపోతుంటాయి. పిడుగులో ఉండే కాంతి ప్రభావంవల్ల నష్టం భారీగానే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో పిడుగు నుంచి రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల శాఖ ఎప్పటికప్పుడు మెసేజ్ల రూపంలో హెచ్చరికలు జారీచేస్తూనే ఉంటుంది. అయితే, ఈ పిడుగు ప్రమాదాన్ని అరగంట ముందే గుర్తించేందుకు ‘దామిని లైట్నింగ్’ మొబైల్ యాప్ ఉంది. పూణే కేంద్రంగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (ఐఐటీఎం) దీన్ని రూపొందించింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో 83 చోట్ల ప్రత్యేక సెన్సార్లను అమర్చింది. ‘కాపర్’తో పిడుగుకు చెక్.. ఇంటి పరిసరాల్లో కాపర్ ఎర్త్ వైర్ ఏర్పాటుతో పిడుగుపాటు నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. ఇంటి ఆవరణలో కొంత ఎత్తయిన ప్రదేశం నుంచి నేరుగా భూమిలోకి కాపర్ ఎర్త్ (రాగి వైర్ను అనుసంధానం చేస్తూ భూమిలోకి పాతాలి) ఏర్పాటుచేయడం ద్వారా దాదాపుగా కిలోమీటర్ దూరంలో పడిన పిడుగును నేరుగా భూమిలోకి ఇదే ఆకర్షించుకుంటుంది. ఎర్త్ వైర్ను ఏర్పాటుచేసే సమయంలో ఉప్పు, కర్ర బొగ్గు, నీటి మిశ్రమాలతో రాగి వైరు కలిగిన పైప్/ఇనుప రాడ్డును భూమి లోపలికి పాతడంవల్ల ప్రమాదాలకు నివారించవచ్చు. ఎలా ఉపయోగించాలంటే.. ముందుగా ఫోన్లో గూగుల్ ప్లేస్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్లోకి వెళ్లి.. దామిని లైటింగ్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత పేరు, మొబైల్ నంబరు, అడ్రస్, పిన్కోడ్తో రిజిస్టర్ చేసుకోవాలి. జీపీఎస్ లొకేషన్ తెలుసుకునేందుకు యాప్కు అనుమతివ్వాలి. మీ ప్రాంతంలో పిడుగుపడే అవకాశం ఉందో లేదో తెలుసుకునేందుకు వీలుగా మూడు రంగులను చూపిస్తుంది. వాటి ఆధారంగా మీరున్నచోట ప్రమాదాన్ని ముందే హెచ్చరిస్తుంది. రంగుల సంకేతం ఇలా.. ఎరుపు రంగు : మీరున్న ప్రాంతంలో మరో ఏడు నిమిషాల్లో పిడుగుపడే అవకాశం ఉంటే ఆ సర్కిల్ ఎరుపు రంగులోకి మారుతుంది. పసుపు రంగు : మరో 10–15 నిమిషాల్లో పిడుగుపడే అవకాశముంటే సర్కిల్ పసుపు రంగులోకి మారుతుంది. నీలం రంగు : 15–25 నిమిషాల్లో పిడుగుపడే అవకాశముంటే ఆ సర్కిల్ నీలం రంగులోకి మారిపోతుంది.ఇలా జాగ్రత్త పడండి.. » వర్షంపడే సందర్భంలో చెట్ల కింద ఉండకూడదు. ముఖ్యంగా ఎత్తైన చెట్టు కింద అస్సలు ఉండకూడదు. » ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వస్తే రైతులు పొలాల వద్ద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదు. » పిడుగులుపడే సమయంలో లక్షల డిగ్రీల ఉష్ణోగ్రతతో విడుదలయ్యే వేడి ఒక్కసారిగా మనిషిని చేరగానే గుండెపై ప్రభావం చూపుతుంది. » వర్ష సూచన ఉన్నప్పుడు గొడుగులపై ఇనుప బోల్టులు, సెల్ఫోన్లు, కెమెరాలు దగ్గర లేకుండా చూసుకోవాలి. ఫోన్ల నుంచి వచ్చే సిగ్నల్ పిడుగుపడే అవకాశాన్ని ఎక్కువ చేస్తుంది. » పిడుగులవల్ల విద్యుత్ ఉపకరణాలు కాలిపోయే అవకాశం ఉంది. ఆ సమయంలో టీవీలకు ఉన్న విద్యుత్ కేబుల్ కనెక్షన్లు తొలగించాలి. » వర్షం పడుతున్న సమయంలో విద్యుత్ తీగల కింద, ట్రాన్స్ఫార్మర్ల సమీపంలో ఉండకూడదు. తడి ప్రదేశాల్లో ఉండకపోవడం చాలా మంచిది.అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలకు దూరం.. వర్షం పడుతున్న సమయంలో బయటకు వెళ్లకుండా ఉంటే మంచిది. ఒకవేళ వెళ్లాల్సి వస్తే ‘దామిని లైట్నింగ్’ యాప్ ఉపయోగించి పిడుగు ఎక్కడ పడుతుందో.. ఏ సమయంలో పడుతుందో తెలుసుకోవచ్చు. తద్వారా ప్రమాదానికి గురికాకుండా సురక్షితంగా ఉండవచ్చు. – ప్రవీణ్కుమార్, తహసీల్దార్, బెల్లంకొండ -
మృత్యువులోనూ వీడని స్నేహం..
కనిగిరిరూరల్: ఒకరు సీనియర్, మరొకరు జూనియర్ అయినా వారిద్దరూ మంచి స్నేహితులు.. సరదాగా చెరువులో తెప్పపై వెళ్లిన ఇద్దరూ తెప్ప తిరగబడి నీటమునిగి ఒకేసారి మృత్యువాత పడ్డారు. పోలీసుల కథనం మేరకు.. కనిగిరి పట్టణంలోని నక్కలతిప్పకు చెందిన బొందలపాటి ప్రవీణ్ కుమారుడు బొందలపాటి శివ ప్రసాద్ (19), శంఖవరంలోని ఏనుగంటి ఎర్రయ్య కుమారుడు ఏనుగంటి గౌతమ్ (18) ఇద్దరూ ఇంటర్మీడియెట్లో జూనియర్, సీనియర్లు. వీరిద్దరూ స్నేహితులు. గౌతమ్ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతుండగా.. శివ ప్రసాద్ ఇంటర్ పూర్తయి సబ్జక్టులు మిగిలి ఉండటంతో ఇంటి దగ్గరే ఉండి చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో శనివారం ఓ ప్రైవేటు టీచర్ దగ్గర ట్యూషన్కు వెళ్లిన గౌతమ్ రాత్రికి అక్కడే ఉన్నాడు. ఆదివారం ఉదయాన్నే ఆ ప్రైవేట్ ట్యూషన్ టీచర్ వద్ద బైక్ తీసుకుని శంఖవరంలోని ఇంటి దాకా వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు. భైరవకోన జలపాతం చూసేందుకు వెళ్తున్నానని ఇంటిదగ్గర చెప్పి బయటికి వచ్చాడు. అనంతరం నక్కలతిప్ప వద్ద స్నేహితుడు శివప్రసాద్ ఇంటి వద్దకు వెళ్లి అతడిని బైక్పై ఎక్కించుకున్నాడు. అయితే వీరిద్దరూ పునుగోడు వద్ద రిజర్వాయర్ చెరువు వద్దకు వెళ్లారు. అక్కడున్న తెప్ప పడవను తీసుకుని సరదాగా లోపలికి వెళ్లారు. తెప్పను లోపల అదుపు చేసుకోలేకపోవడంతో అది తిరగబడింది. దీంతో వీరికి ఈత రాక ఇద్దరూ రిజర్వాయర్ నీటిలో మునిగి మృతి చెందారు. ఆదివారం ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిన ఇద్దరు పిల్లలు ఇంటికి తిరిగిరాకపోవడంతో మృతుల తల్లిదండ్రులు పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో మంగళవారం పునుగోడు రిజర్వాయర్ వద్దకు వచ్చిన జాలర్లకు కట్ట దగ్గర తెప్ప కనపడకపోవడంతో మరో తెప్ప సాయంతో లోపలికి వెళ్లి చూడగా ఒక తెప్ప, యువకుల మృతదేహాలు కనిపించాయి. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్సై టీ శ్రీరాం ఘటనా స్థలానికి సిబ్బందితో వెళ్లి యువకుల మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, సీఐ ఖాజావలి, తహసీల్దార్ ఏవీ రవిశంకర్, ఇతర అధికారులు పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. చనిపోయిన యువకులిద్దరివీ నిరుపేద కుటుంబాలే. ఆ ఇళ్లకు వారిద్దరూ పెద్ద కుమారులే. అనుమానం వ్యక్తం చేస్తున్న మృతుల తల్లిదండ్రులు: రెండ్రోజుల నుంచి ఇద్దరు పిల్లల్లో ఒకరి ఫోన్ పూర్తిగా స్విచ్ ఆఫ్ కావడం.. మరొక ఫోన్రింగ్ అయినా లిఫ్ట్ చేయకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల మృతదేహాలపై గాయాలు కూడా ఉన్నాయంటున్నారు. ఫోన్ లోకేషన్లపై పలు అనుమానాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ఫోన్ లొకేషన్లు కొంత సేపు సీఎస్పురం ప్రాంతంలో, కొద్దిసేపు కనిగిరి ప్రాంతంలో, మరికొంత సేపు మంత్రాలయం ఏరియాలో ఉన్నట్లు శివప్రసాద్ తండ్రి ప్రవీణ్ ఆరోపిస్తున్నాడు. తన కుమారుడి ఒంటిపై గాయాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల మరణం ప్రమాదవశాత్తు జరిగింది కాదని, పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. ఎస్సై శ్రీరాం ఏమంటున్నారంటే.. ఈ సందర్భంగా ఎస్సై టీ శ్రీరాం విలేకరులతో మాట్లాడుతూ భైరవకోన జలపాతం చూసేందుకు వెళ్తున్నట్లు చెప్పిన ఇద్దరు యువకులు పునుగోడు రిజర్వాయర్ వద్దకు వెళ్లారని..తెప్ప పడవ తీసుకుని రిజర్వాయర్లోకి దిగి తెప్ప బోల్తాపడటంతో నీటిలో మునిగి ఈతరాక మృతిచెందారన్నారు. మృతదేహాలను పరిశీలించగా ఎటువంటి గాయాలు లేవని, అయినా పోస్టుమార్టం నిర్వహించి ఎఫ్ఎస్ఎల్ (చనిపోయాక నీళ్లలో పడేశారా.. లేక నీళ్లలో పడిన తర్వాత చనిపోయారా అనేది నిర్ధారించే పరీక్ష) రిపోర్టు ప్రకారం తగు దర్యాప్తు చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే సోమవారం పునుగోడు రిజర్వాయర్ను చూసేందుకు సీఎస్పురం మండలం సీతారాంపురానికి చెందిన కొందరు ముస్లిం కుటుంబాలు వచ్చాయన్నారు. వాళ్లకు మృతులకు సంబంధించిన ఫోన్లు దొరికాయని.. వాటిని సీఎస్పురం ఎస్సైకు అందజేశారన్నారు. అయితే మృతుల ఫోన్ నంబర్లు, ముస్లిం కుటుంబాల సెల్ఫోన్ నంబర్లు కూడా సీడీఆర్లో పెట్టి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బయటకు వద్దన్నా వినలేదు.. ఇంట్లో మీనాన్న లేరు.. నువ్వు బయటకు వెళ్లొద్దు..నాన్న వస్తే అరుస్తాడు అని ఎంత బతిమిలాడినా.. వినకుండా ఆదివారం కదా.. ఒక అరగంట ఊర్లోనే అలా బయట తిరిగి వస్తాను.. అని చెప్పి వెళ్లిన మనవడు శవంగా మారాడని మృతుడు బొందలపాటి శివ ప్రసాద్ నాయనమ్మ కన్నీరుమున్నీరైంది. చేతికి అందివచ్చిన కుమారుడు మృతిచెందడంతో తల్లిదండ్రులు దుర్గ, ప్రవీణ్లు గుండెలవిసేలా రోదిస్తున్నారు. తండ్రి ప్రవీణ్ స్టేజీ కళాకారుడు.. కార్యక్రమాల్లో పాటలు పాడి వచ్చిన డబ్బుతో పిల్లలను పోషించుకుంటున్నాడు. ఇద్దరు కుమారులు కాగా శివ ప్రసాద్ పెద్ద కుమారుడు. ఇప్పుడే వస్తానని వెళ్లి.. వెంటనే తిరిగి వస్తానని చెప్పి వెళ్లిన కుమారుడు.. శవమై తేలడంతో తల్లిదండ్రులు అంకమ్మ, ఎర్రయ్యలు చేసే రోదనలు మిన్నంటుతున్నాయి. కూలీ పనిచేసుకుని జీవించే ఆ కుటుంబంలో చేతికి అందివచ్చిన కొడుకు చనిపోవడంతో కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. గౌతమ్ చదువులో కూడా మంచి తెలివి గల వాడని బంధువులు తెలిపారు. పేదరికం కారణంతో ప్రైవేటు కళాశాల నుంచి ఇంటర్ రెండో సంవత్సరం ప్రభుత్వ కాలేజీలోకి మారినట్లు తెలిపారు. అంకమ్మ, ఎర్రయ్య దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు కాగా.. గౌతమ్ పెద్ద వాడు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
కనిగిరిరూరల్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండంలోని చిన ఇర్లపాడుకు చెందిన ముద్దా మహేష్ (18) డీజే ఆపరేటర్గా పనిచేస్తుంటాడు. సోమవారం సీఎస్పురం మండలంలోని కార్యక్రమానికి వెళ్లి రాత్రికి తిరిగి డీజే వాహనంలో వస్తున్నారు. ఈ క్రమంలో మండలంలోని ఎన్ గొల్లపల్లి రోడ్డు మలుపు వద్ద జారి కిందపడ్డాడు. తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. -
ప్రాణాలు దైవాధీనం!
ఒంగోలు టౌన్: జిల్లా కేంద్రమైన ఒంగోలులోని సర్వజన ఆస్పత్రి రోగుల సహనాన్ని పరీక్షిస్తోంది. పేరుకు పెద్దాస్పత్రి అయినా ఇక్కడ చికిత్స తీసుకోవాలంటే గంటల తరబడి వేచి ఉండాల్సిందే. ఓపీ దగ్గర నుంచి వైద్యం చేయించుకునే వరకూ పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. అష్టకష్టాలుపడి ఓపీ తీసుకుని సంబంధిత డాక్టర్ గది దగ్గరకు వెళితే సీనియర్ వైద్యులు అందుబాటులో ఉండరు. మెడలో స్టెత్ వేసుకొని తిరుగుతున్న జూనియర్ వైద్యులతోనే పనికానిస్తుండడంతో రోగులు అసంతృప్తికి గురవుతున్నారు. మంచి డాక్టర్లు ఉన్నారంట అని చెప్పుకుంటుంటే విని ఎంతో దూరం నుంచి వచ్చిన రోగులకు పెద్ద డాక్టర్ల దర్శనభాగ్యం ఉండదు. అత్యవసర చికిత్స కోసం వచ్చే రోగులు ఎవరి వీల్ చైర్లు వారే తెచ్చుకోవాల్సిన దుస్థితి. ఆస్పత్రి బయట అత్యవసర రోగుల కోసం స్ట్రెచర్లు ఉండవు. వీల్ చైర్లు ఉండవు. ఒకవేళ ఉన్నా రోగులను లోపలకు తీసుకెళ్లేందుకు సిబ్బంది ఉండరు. రోగుల సహాయకులే వీల్ చైర్లను తోసుకుంటూ వెళ్లాల్సి పరిస్థితులు నెలకొన్నాయి. వేయి మందికి 16 కుర్చీలు సర్వజన ఆస్పత్రికి ప్రతి రోజు 800 మంది నుంచి 1000 మందికి పైగా రోగులు వస్తుంటారు. సోమవారం, బుధవారం, శనివారం రోజుల్లో ఈ సంఖ్య 1200 లకు పైగానే ఉంటుంది. మద్దిపాడు, నాగులుప్పలపాడు, సంతనూతలపాడు, చీమకుర్తి, టంగుటూరు, సింగరాయకొండ ప్రాంతాల నుంచే కాకుండా జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న యర్రగొండపాలెం, దోర్నాల, పెద్దారవీడు, అర్థవీడు, కంభం, దొనకొండ, కురిచేడు ప్రాంతాల నుంచి కూడా చికిత్స కోసం రోగులు ఇక్కడకు వస్తుంటారు. ఇక్కడకు వచ్చిన రోగులు మొదట అభా యాప్లో పేరు నమోదు చేసుకోవాలి. ఓటీపీ వచ్చాక ఓపీ కౌంటర్ దగ్గరకు వెళ్లాలి. ఈ ప్రక్రియ పూర్తవడానికి కనీసం గంటన్నరకు పైగానే పడుతుంది. అంతసేపు రోగులు ఎదురు చూస్తూ నిల్చోవాలి. ఇక్కడ వందల మంది రోగులకు కేవలం 16 కుర్చీలు, 6 బల్లలు మాత్రమే ఉన్నాయి. ఒక్కో బల్లమీద నలుగురు కూర్చోవచ్చు. అంటే మొత్తం మీద 40 మంది మాత్రమే కూర్చునే అవకాశం ఉంది. మిగిలిన వారంతా గంటల తరబడి నిలబడలేక నానా అవస్థలు పడుతున్నారు. అయినా జీజీహెచ్ అధికారులు పట్టించుకోవడంలేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చికిత్స కోసం వచ్చే రోగులు మౌలిక వసతులు లేక అల్లాడిపోతున్నారు. పారిశుధ్యం అధ్వానం జీజీహెచ్లో పారిశుధ్యం లోపించింది. ఆస్పత్రిలోని మూడు అంతస్తుల్లో ఎక్కడా ఫినాయిల్తో శుభ్రం చేసినట్లు కనిపించదు. బాత్ రూంలు, మరుగుదొడ్లు అపరిశుభ్రంగా దుర్గంధం వెదజల్లుతుంటాయి. కంట్రాక్టర్ ఇచ్చే కమీషన్లకు కక్కుర్తిపడిన అధికారులు నాసిరకం ఫినాయిల్ వినియోగిస్తూ నెలనెలా లక్షల్లో బిల్లులు డ్రా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు బ్లీచింగ్ ఎక్కడ చల్లుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఆస్పత్రిలో దోమల బెడద ఎక్కువైపోయిందని, ఆరోగ్యం కోసం ఆస్పత్రికి వస్తే అనారోగ్యం బారిన పడాల్సి వస్తుందని రోగులు వాపోతున్నారు. ఆస్పత్రికి గాయాలతో వచ్చే రోగులు చాలా ఎక్కువ. గాయాలను శుభ్రం చేసే గాజుగుడ్డ మరీ నాసిరకంగా ఉంటుందని, బెటాడిన్, హైడ్రోజన్ పెరాకై ్సడ్, స్పిరిట్లు మరీ నాణ్యతలేనివి వాడుతున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. రోగుల ఆరోగ్యం కంటే తమ చేతికి వచ్చే కమీషన్ల మీదనే అధికారులు దృష్టి పెడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అడుగడుగునా రాజకీయమే... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జీజీహెచ్లో అడుగడుగునా రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. కొంత మంది వైద్యులు, సిబ్బంది అధికార పార్టీకి చెందిన వారమంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రాణాలు కాపాడాల్సిన ఆస్పత్రిలో రాజకీయాలేంటని రోగులు విమర్శిస్తున్నారు.జీజీహెచ్లో పేరుకే మూడు లిఫ్టులు. ఓపీ కౌంటర్ల వద్ద ఉన్న ప్రధానమైన లిఫ్టు ఏడాదిగా పనిచేయడం లేదు. డయాలసిస్ సెంటర్ వద్ద ఉన్న లిఫ్టు నెల రోజులుగా మరమ్మతులకు గురైంది. ఇక మిగిలింది మెడికల్ ఓపీ దగ్గర ఉన్న లిఫ్టు మాత్రమే పనిచేస్తుంది. దాంతో ఎప్పుడు చూసినా ఈ లిఫ్టు దగ్గర రోగులు గుంపులు గుంపులుగా నిలబడి ఉంటున్నారు. ఒకేసారి 15 మందికి పైగా లిఫ్టు ఎక్కుతుండడంతో మధ్యలోనే ఎక్కడ ఆగిపోతుందోనని రోగులు ఆందోళన చెందుతున్నారు. లోడు ఎక్కువ కావడంతో ఇది కూడా దాదాపుగా చెడిపోయే పరిస్థితికి చేరుకున్నట్లు ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. గుండె జబ్బుల విభాగం మొదటి అంతస్తులోనే ఉంది. గుండె జబ్బులతో బాధపడే రోగులు లిఫ్టు ఎక్కే పరిస్థితి లేకపోవడంతో మెట్లు ఎక్కాల్సి వస్తోంది. దీంతో కొందరు రోగులు వెనక్కి తిరిగి వెళ్లిపోతున్నారు. ఆస్పత్రి రెండు, మూడు అంతస్తుల్లో ఎంఐసీయూ, ఆర్ఐసీయూ, ఎన్ఐసీయూ, పీడీఐసీయూ, సర్జికల్ ఐసీయూలు ఉన్నాయి. మొత్తం మీద ఈ ఐసీయూల్లో 100 మందికి పైగా చికిత్స చేయించుకుంటున్నారు. అయినా అధికారులకు చీమకుట్టినట్టయినా లేదని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెలల తరబడి లిఫ్టులు పనిచేయకపోయినా అధికారులు పట్టించుకోకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
ప్రకృతి విధ్వంసకులు చరిత్రహీనులే
ఒంగోలు టౌన్: ప్రకృతిని కాపాడిన వారే ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతారని, ప్రకృతిని విధ్వంసం చేసిన వాళ్లు చరిత్ర హీనులుగా మిగులుతారని ప్రజా రచయిత జయరాజ్ అన్నారు. నగరంలోని పీవీఆర్ ఉన్నత పాఠశాల ఆవరణలో జరుగుతున్న పుస్తక మహోత్సవం బుధవారం ఐదో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కళారంగం సమాజంపై ప్రభావం అనే అంశంపై జరిగిన చర్చలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రకృతి మానవుడికి సమస్తం ఇచ్చిందని చెప్పారు. విమానాలు, రాకెట్లను ప్రకృతి నుంచే స్ఫూర్తి పొంది తయారు చేశారని, మానవుడు సొంతంగా కనుగొన్నదేమీ లేదన్నారు. మనిషి అవసరాలను తీరుస్తుంది ప్రకృతేనని స్పష్టం చేశారు. ప్రకృతిని గాఢంగా ప్రేమించిన అంబేడ్కర్ దేశం గర్వించదగిన మేధావిగా పేరొందారన్నారు. ప్రకృతి సంపద సమస్త మానవులందరికీ సమానంగా చెందాలన్న కారల్ మార్క్స్ యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేశారని, చెరువులు తవ్వించి, చెట్లు నాటిన అశోకుడు చరిత్రలో గొప్ప రాజుగా నిలిచిపోయాడని వివరించారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర గౌరవాధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ...ప్రపంచ విప్లవాలలో ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసింది ప్రజా కళలేనని చెప్పారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి చిన్నం పెంచలయ్య, చంద్రనాయక్, విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ కార్యదర్శి మనోహర్ నాయుడు, గాయకులు రామకృష్ణ, నూకతోటి శరత్బాబు పాల్గొన్నారు. తొలుత జయరాజ్ రచించిన గేయాలను ఆలపించడం ప్రేక్షకులను ఉత్సాహపరిచింది. పుస్తక మహోత్సవానికి మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రజా రచయిత జయరాజ్ -
అక్షరాస్యత పెంపొందించాలి
ఒంగోలు సబర్బన్: నిరక్షరాస్యులైన వయోజనులకు అక్షరాస్యతను పెంపొందించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. ఒంగోలు కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంగళవారం ఉల్లాస్–అక్షర ఆంధ్ర అక్షరాస్యతా కార్యక్రమంపై ఎంపీడీఓలు, ఎంఈఓలు, డీఆర్డీఏ–ఏపీఎంలు, డీడబ్ల్యూఎంఏ– ఏపీఓలు, నగరపాలక, మున్సిపల్ కమిషనర్లు, సిటీ మిషన్ మేనేజర్లకు జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని గ్రామ స్థాయి నుంచి విజయవంతం చేయాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఉల్లాస్–అక్షర ఆంధ్ర అక్షరాస్యతా కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, దీనికి సంబంధిత జిల్లా అధికాలందరూ తమ సహకారం, తోడ్పాటు అందించాలని కోరారు. 15–59 ఏళ్ల మధ్య నిరక్షరాస్యులైన వయోజనులకు ఉద్దేశించిన సాంకేతికత, వయోజన విద్య అందుబాటులోకి తెచ్చే కార్యక్రమమని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో స్వచ్ఛంద బోధకులుగా కనీసం పదో తరగతి విద్యార్హత ఉన్న వారు ఎవరైనా సరే 10 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇది స్వచ్ఛందంగా జరిపే కార్యక్రమమని తెలిపారు. ఉల్లాస్–అక్షర ఆంధ్ర అక్షరాస్యతా కార్యక్రమం గ్రామ స్థాయిలో విజయవంతం అయ్యేలా తగు సూచనలు, సలహాలు అందజేశారు. కార్యక్రమానికి వయోజన విద్యాశాఖ ఉపసంచాలకులు బి.జగన్మోహన్రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో వయోజన విద్యా శాఖ పర్యవేక్షకులు, అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారులు, గణాంక అధికారి, జెడ్పీ సీఈఓ చిరంజీవి, డీఆర్డీఏ పీడీ నారాయణ, డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, డీపీఓ వెంకట నాయుడు, హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాదుతో పాటు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి
● జిల్లా అధ్యక్షుడు చిన్నపరెడ్డి కిరణ్కుమార్రెడ్డి ఒంగోలు సిటీ: ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పీఆర్సీని వెంటనే ప్రకటించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నపరెడ్డి కిరణ్కుమార్రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ‘రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం’ కార్యక్రమం ఒంగోలులోని మెడికల్ కాలేజీలో ప్రకాశం జిల్లా అధ్యక్షుడు చిన్నపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో కార్యదర్శి వరకుమార్, కోశాధికారి రంగారెడ్డి ఒంగోలు పట్టణ అధ్యక్షులు మోటా శ్రీనివాసరావు తాలూకా అధ్యక్షుడు సురేష్ బాబు, ప్రసన్న, ఏసురత్నం, శ్రీనివాసులు ,అంకబాబు లతోపాటు మెడికల్ కళాశాల ఉద్యోగులు విజయ లక్ష్మీ గారు, శ్రీనివాస యాదవ్, బాబురావు ,రాజేష్, కార్తీక్, దినకర్, ప్రభావతి, చాందిని ,రమేష్ బాబు, లావణ్య, పద్మలత, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు టౌన్: సీపీఐ రాష్ట్ర మహాసభలను పురస్కరించుకొని నగరంలోని సీవీఎన్ రీడింగ్ రూంలో బుధవారం నుంచి కళా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రా నాయక్ తెలిపారు. మంగళవారం పీవీఆర్ ఉన్నత పాఠశాల ఆవరణలో కళా ఉత్సవాలకు సంబంధించిన బ్రోచర్ను విజయవాడ బుక్ ఫెస్టివల్ అధ్యక్షుడు మనోహర్ నాయుడు, ప్రజానాట్యమండలి కార్యదర్శి చిన్నం పెంచలయ్యతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం చంద్రా నాయక్ మాట్లాడుతూ...ఈ నెల 24వ తేదీ వరకు కళా ఉత్సవాలు కొనసాగుతాయని చెప్పారు. నేటి సమాజం ఎదుర్కొంటున్న అనేక ప్రజా సమస్యలను ఇతివృత్తంగా తీసుకొని కళారూపాలుగా ప్రదర్శించనున్నట్లు చెప్పారు. ఈ కళా ఉత్సవాలలో ప్రముఖ సినీ దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ, బాబ్జీ, సినీ గాయకులు వందేమాతరం శ్రీనివాస్, గోరటి వెంకన్న, జయరాజ్, ప్రజా నాట్యమండలి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు తెలిపారు. -
పంట పొలాల్లో చిరుత సంచారం!
కంభం: మండలంలోని నడింపల్లి, ఎల్కోట మధ్యలో ఉన్న పంట పొలాల్లో మంగళవారం చిరుత పులి పాదముద్రలు కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఔరంగబాద్ గ్రామానికి చెందిన రైతులు స్థానిక ఏనుగుకొండ సమీపంలో సాగు చేస్తున్న మొక్కజొన్న పంట వద్దకు వెళ్లిన సమయంలో వారికి పులి పాదముద్రలు కనిపించడంతో ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు. రాత్రి ఫారెస్టు సిబ్బంది నడింపల్లి గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. పరిసరాలను పరిశీలించిన ఫారెస్టు సిబ్బంది ఆందోళన చెందాల్సిన అవసరం అవసరం లేదని, జాగ్రత్తగా ఉండాలని రైతులకు, గ్రామస్తులకు సూచించారు. సుమారు మూడు గ్రామాలకు సమీపంలో ఉన్న పంట పొలాల్లో పులి పాదముద్రలు కనిపించడంతో స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు. -
చీమకుర్తిలో టీడీపీ నేతల కక్ష సాధింపు
చీమకుర్తి: నిరుపేద కుటుంబంపై అధికారులు జులుం ప్రదర్శించారు. చీమకుర్తి శివారులోని గరికమిట్టలో నిరుపేదలైన మారం వెంకారెడ్డి, బాయమ్మ నిర్మించుకుంటున్న ఇంటి పునాదులను మంగళవారం పోలీస్ బందోబస్తు నడుమ మున్సిపల్ అధికారులు జేసీబీతో తొలగించారు. అధికార టీడీపీ నాయకుల ప్రోద్బలంతో మున్సిపల్ అధికారులు నిర్ధాక్షిణ్యంగా ఇంటి పునాదులను జేసీబీతో పెకలించడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము నిర్మించుకుంటున్న ఇంటి పరిసరాల్లో గత 12 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నామని, 6 నెలల క్రితం ఇంటిని నిర్మించుకునేందుకు పునాదులు వేసుకున్నామని బాధితులు తెలిపారు. కాగా మున్సిపల్ అధికారుల తీరుపై స్థానిక వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ గంగిరెడ్డి ఇందిర సుందరరామిరెడ్డి మండిపడ్డారు. చీమకుర్తిలో వాగు పోరంబోకు స్థలాల్లో వందలాది మంది ఇళ్లు నిర్మించుకున్నారని, వాటి జోలికి వెళ్లకుండా గరికమిట్టలో నిరుపేద కుటుంబం చిన్న ఇల్లు కట్టుకుంటుంటే కూల్చేయడం ఏమిటని మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. అధికారం చేతిలో ఉందని కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ప్రజలే గుణపాఠం చెబుతారని టీడీపీ నేతలను హెచ్చరించారు. నిరుపేద కుటుంబంపైకి అధికారులను ఉసిగొల్పి రాక్షసానందం జేసీబీతో ఇంటి పునాదులు పెకలించిన వైనం మున్సిపల్ కమిషనర్ను నిలదీసిన వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ -
డిజిటల్ మైక్రో క్రెడిట్ ప్లాన్ ఆమోదించాలి
ఒంగోలు సబర్బన్: డిజిటల్ మైక్రో క్రెడిట్ ప్లాన్ను త్వరగా ఆమోదించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా బ్యాంకర్లకు సూచించారు. పొదుపు సంఘాల మహిళలకు రుణాల మంజూరుపై స్థానిక క్యాంపు కార్యాలయంలో మంగళవారం కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పరిస్థితిని డీఆర్డీఏ పీడీ నారాయణ కలెక్టర్కు వివరించారు. పొదుపు సంఘాల మహిళలు రుణాలను తిరిగి చెల్లించడంలో చురుగ్గా ఉన్నారన్నారు. గతంలో రుణాలు మంజూరు చేసేందుకు గ్రూపులోని సభ్యులంతా సంతకాలు చేసిన పత్రాలు బ్యాంకులకు సమర్పించేవారని, ఇప్పుడు బయోమెట్రిక్ వేలిముద్ర వేయటం ద్వారా గ్రూపు సభ్యులు తమ అంగీకారం తెలుపుతున్నారని వివరించారు. నూతనంగా ప్రవేశపెట్టిన ఈ విధానం ద్వారా మైక్రో క్రెడిట్ ప్లాన్స్ను బ్యాంకులు ఆమోదించడంలో కొంత జాప్యం జరుగుతున్నట్లు చెప్పారు. ఈ ప్రక్రియలో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకునేందుకు ఎడిట్ ఆప్షన్ను వచ్చే నెలలో ప్రభుత్వం ఇస్తుందన్నారు. ప్రస్తుతం తాత్కాలికంగా మైక్రో క్రెడిట్ ప్లాన్స్ను బ్యాంకర్లు ఆమోదిస్తే ఎంత మొత్తంలో పొదుపు సంఘాలకు రుణాలు అవసరమో ఒక అవగాహన వస్తుందని పీడీ నారాయణ చెప్పారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ త్వరగా ఈ తాత్కాలిక డిజిటల్ అప్రూవల్స్ను ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించారు. అందుకోసం బ్యాంకర్లు పొదుపు మహిళా గ్రూపులకు ఉదారంగా రుణాలు అందించాలన్నారు. ఈ విషయాల్లో బ్రాంచ్ మేనేజర్లకు అవగాహన కల్పించేలా గురు, శుక్రవారాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని చెప్పారు. బ్యాంకర్లకు ఏపీఎంలు కూడా అందుబాటులో ఉండేలా చూడాలని పీడీని ఆదేశించారు. డ్వాక్రా సంఘాల మహిళలు చేస్తున్న పొదుపు డబ్బుల్లో 75 శాతం ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని, మిగిలిన 25 శాతం నగదు అంతర్గత రుణాలకు ఇవ్వాలని చెప్పారు. సమావేశంలో ఎల్డీఎం రమేష్, బ్యాంకుల రీజినల్ మేనేజర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇసుక డిపోలను విస్తృతంగా తనిఖీలు చేయాలి జిల్లాలోని ఇసుక డిపోలను విస్త్రతంగా తనిఖీలు చేపట్టాలని గనులు, భూగర్భ శాఖ అధికారులను కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గనులు, భూగర్భ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇసుక డిపో యజమానులపై ఇసుక రవాణా చేసే వాహనదారులు, ట్రాన్స్పోర్టర్లు ఫిర్యాదులు చేస్తున్నారని ప్రస్తావించారు. రవాణాదారులను ఇసుక డిపో యజమానులు ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని, దీనిపై క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేపట్టాలన్నారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిని సమగ్రంగా విచారించాలని ఆదేశించారు. ఖనిజ అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా గనులు, భూగర్భశాఖ అధికారులు టి. రాజశేఖర్, ఏం. విష్ణువర్ధన్, బి. రామచంద్ర, ఇతర గనులు, భూగర్భశాఖ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా -
ప్రాణాల మీదకు తెచ్చిన ట్రిపుల్ రైడింగ్
దర్శి: మితిమీరిన వేగం ఆపై ట్రిపుల్ రైడింగ్ ముగ్గురు యువకులను చావు అంచుల వరకు తీసుకెళ్లింది. దర్శి పట్టణంలోని అద్దంకి రోడ్డులో ఎన్ఎస్పీ కాలనీ సమీపంలో మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. అద్దంకి వైపు నుంచి దర్శికి వస్తున్న కారు ఆగి ఉన్న ఆటోను క్రాస్ చేసి ముందుకు వెళ్తోంది. అదే సమయంలో బృందావనానికి చెందిన కాటూరి శ్రీమాన్, కుంటా వంశీ, తోటకూర రుషి అనే ముగ్గురు యువకులు బైక్పై వేగంగా వస్తూ కారును ఢీకొట్టారు. కారు రేడియేటర్లోకి బైక్ చొచ్చుకెళ్లడంతో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. ప్రమాదం ధాటికి బైక్పై ఉన్న ముగ్గురు యువకులు ఎగిరి పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో శ్రీమాన్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఒంగోలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన ఇద్దరు యువకులు దర్శిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతివేగంగా కారును ఢీకొట్టిన బైక్ ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు -
విలపింఛెన్
దివ్యాంగులుఅర్హత ఉన్నా పింఛన్లు తొలగిస్తున్నట్లు నోటీసులు వచ్చాయంటూ కలెక్టరేట్కు మీకోసంలో తమ గోడు వెళ్లబోసుకునేందుకు వచ్చిన దివ్యాంగులుసాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా...అధికారంలోకి వచ్చిన తరువాత మరోలా మాట్లాడటం టీడీపీ అధినేత చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఎన్నికల సమయంలో దివ్యాంగులకు అప్పటి వరకు ఉన్న రూ.3 వేల పింఛన్ను అధికారంలోకి రాగానే రూ.6 వేలు చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చిన తరువాత దివ్యాంగుల పింఛనును రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచినట్లే పెంచి లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోతలు పెట్టేందుకు రంగం సిద్ధం చేశాడు. దివ్యాంగులను తిరిగి వైద్యులచే పరీక్షలు నిర్వహించేందుకు రీ వెరిఫికేషన్ ప్రక్రియను గత ఏడాది డిసెంబర్ నుంచి ప్రారంభించారు. రీ వెరిఫికేషన్ పేరిట చేపట్టిన ఆరోగ్య పరీక్షల్లో వేలాది మందిని అనర్హులుగా చేసే కుట్రకు తెరలేపారు. రీ వెరిఫికేషన్లో అంగవైకల్యం 90 శాతం, 80 శాతం ఉన్నా అడ్డంగా ఆ శాతాలకు కోత విధించి దివ్యాంగుల పింఛన్లకు కోత పెట్టే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అందుకుగాను ఏరియాల వారీగా సదరమ్ క్యాంపులు నిర్వహించి పింఛన్లు తీసుకుంటున్న దివ్యాంగులకు వైద్య పరీక్షలు చేయించారు. జిల్లా వ్యాప్తంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పింఛన్ తీసుకుంటున్న వారు 33,310 మంది ఉన్నారు. వారిలో ఇప్పటి వరకు 30 వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు చెబుతున్నారు. పింఛనుకు అనర్హులని నోటీసులు జారీ... సదరమ్ క్యాంపుల్లో వైద్య పరీక్షలు నిర్వహించిన మీదట కొంతమందికి దివ్యాంగ పింఛను తీసుకోవటానికి మీరు అనర్హులంటూ ఇప్పటికే పింఛన్లు తీసుకుంటున్న దివ్యాంగులకు నోటీసులు పంపుతున్నారు. ఈ విధంగా నోటీసులు జిల్లాలో దాదాపు 9 వేల మంది వరకు వచ్చాయన్నది సమాచారం. దీంతో బెంబేలెత్తిన దివ్యాంగులు ఆ నోటీసులు తీసుకొని సోమవారం ఒంగోలులో నిర్వహిస్తున్న కలెక్టర్ మీ కోసం కార్యక్రమానికి పోటెత్తారు. 90 శాతం, 85 శాతం అంగవైకల్యంతో ఇప్పటి వరకు పింఛను పొందుతుంటే రీ వెరిఫికేషన్లో సాధారణ వైకల్యం మాత్రమే ఉందని, అందుకు దివ్యాంగుల పింఛనుకు అనర్హులని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా నోటీసులు జారీ చేశారు. దాంతో దివ్యాంగులు లబోదిబోమంటూ జిల్లా అధికారుల వద్దకు క్యూ కడుతున్నారు. ఈ నెల 27 నాటికి తొలగింపు ప్రక్రియ పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టమవుతోంది. దాంతో సెప్టెంబర్లో పింఛను రాదేమోనని దివ్యాంగులు ఆందోళన చెందుతున్నారు. వీల్చైర్లో కూర్చున్న ఈ యువతి పేరు చిమట త్రివేణి(18). తాళ్లూరు మండలం నాగంబొట్లవారిపాలెం. ఈమెకు రెండో ఏట నుంచే పోలియో సోకి రెండు కాళ్లూ చచ్చుబడిపోయాయి. అప్పటి నుంచి మంచానికే పరిమితమైంది. కనీసం బాత్రూంకు వెళ్లాలన్నా తల్లి తీసుకెళ్లాల్సిందే. ఈమెకు గతంలో వైద్యులు 90 శాతం అంగవైకల్యం ఉందని సదరమ్లో సర్టిఫికెట్ ఇచ్చారు. అప్పటి నుంచి దివ్యాంగురాలిగా పింఛను పొందుతోంది. అయితే ఇటీవల జరిపిన రీ వెరిఫికేషన్లో త్రివేణిది సాధారణ వైకల్యం అని పరీక్షలు నిర్వహించిన వైద్యులు సర్టిఫై చేశారు. దాంతో త్రివేణి పింఛనుకు అనర్హురాలని నోటీసులు పంపారు. దాంతో నాగంబొట్లవారిపాలెం నుంచి మీ కోసం కార్యక్రమంలో కలెక్టర్కు అర్జీ ఇచ్చేందుకు రిక్షాలో తల్లి అంజమ్మ ఒంగోలుకు తీసుకొచ్చింది. వీల్చైర్లో కలెక్టరేట్లోకి తీసుకెళ్లి మీకోసంలో అర్జీ ఇచ్చి వచ్చింది. ప్రభుత్వ కుట్రలకు దివ్యాంగులు బలైపోతున్నారు. పింఛన్లు పెంచి ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం ఏదో ఒక వంక పెట్టి పింఛన్లను అడ్డగోలుగా తొలగిస్తోంది. రీవెరిఫికేషన్ పేరుతో 90 నుంచి 80 శాతం వైకల్యం ఉన్నా..కోత పెట్టి దివ్యాంగ పింఛన్ తీసుకునేందుకు అనర్హులంటూ లబ్ధిదారులకు నోటీసులు పంపుతోంది. ఇప్పటికే జిల్లాలో 9 వేల మంది దివ్యాంగ పింఛన్దారులకు ఇలా అనర్హులంటూ నోటీసులు పంపించారు. దీంతో వారంతా తమ నోటిదగ్గర కూడు తీసేస్తున్నారంటూ లబోదిబోమంటున్నారు. మీకోసంలో జిల్లా అధికారికి తమ సమస్యలను వివరిస్తున్న దివ్యాంగులు -
జిల్లాకు ఆరెంజ్ అలర్ట్
ఒంగోలు సబర్బన్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఆదివారం జిల్లాలో 15.3 మి.మీల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా సోమవారం కూడా పశ్చిమ ప్రాంతంలో అక్కడక్కడా వర్షం కురుస్తూనే ఉంది. జిల్లా వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. ఆదివారం అత్యధికంగా అర్థవీడు, రాచర్ల మండలాల్లో వర్షం కురిసింది. అర్థవీడులో 45 మిల్లీ మీటర్లు, రాచర్లలో 43.8 మిల్లీ మీటర్లు, మార్కాపురంలో 32.6, తర్లుపాడులో 29.4, కంభంలో 27.6, పెద్దారవీడు 26.8, బేస్తవారిపేటలో 22.8, వెలిగండ్లలో 21, పుల్లలచెరువులో 20 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. జిల్లాలోని మిగతా మండలాల్లో 5 నుంచి 19 మిల్లీ మీటర్ల వరకు వర్షం కురిసింది. జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ... అల్పపీడనం మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ సూచించింది. అందులో భాగంగా జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ నెల 19న దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతం మధ్య తీరం దాటవచ్చని వాతావరణ కేంద్రం సూచనల మేరకు జిల్లా యంత్రాంగం అప్రమత్తమయింది. మత్స్యకారులను సముద్రంలో వేటకు వెళ్లరాదని ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా జిల్లా అధికారులకు, మున్సిపల్ కమిషనర్లకు సూచనలు జారీ చేశారు. విద్యుత్ శాఖ సిబ్బంది సెలవులు రద్దు: భారీ వర్షాలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఏపీసీపీడీసీఎల్ ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు సూచించారు. విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది సెలవులు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగి పడి ఉంటే, వాటిని తాకవద్దని, వెంటనే 1912 నంబర్కి సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ 1912 లేదా ఎల్.ఎం.సి 9440817491 నంబర్కి కాల్ చేయాలని సూచించారు. నల్లమలలో భారీ వర్షాల పెద్దదోర్నాల: నల్లమల అభయారణ్యంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండల పరిధిలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పలు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. రెండు రోజులుగా అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో మండల పరిధిలోని తీగలేరు పొంగటంతో గంటవానిపల్లి వద్ద దశాబ్దాల క్రితం నిర్మించిన నేల బారు చప్టాపై నీరు భారీగా ప్రవహిస్తుండంతో గతంలో చప్టాకు చేసిన మరమ్మతులు పూర్తి స్థాయిలో కొట్టుకు పోయినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. దీంతో గ్రామానికి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. గంటవానిపల్లె ప్రజలు బయటకు రాలేక అత్యవసర పనులు వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని వాపోతున్నారు. గ్రామస్తుల చిరకాల స్వప్నమైన హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి గత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కర్నూల్, గుంటూరు రహదారి నుంచి తీగలేరు మీదుగా గంటవానిపల్లి గ్రామానికి నిర్మించే ఈ బ్రిడ్జికి సంబంధించి రూ.270 కోట్లు మంజూరు చేస్తూ అప్పటి ప్రభుత్వం జీఓ జారీ చేసిందని, అయితే ఇంత వరకు బ్రిడ్జి నిర్మాణం మొదలు కాలేదని గంటవానిపల్లె గ్రామస్తులు వాపోతున్నారు. ప్రవహిస్తున్న జంపలేరు వాగు అర్ధవీడు: నల్లమల అడవుల్లో వారం నుంచి కురుస్తున్న వర్షాలకు బుగ్గ వాగుకు నీరు చేరింది. నాయినిచెరువు నిండు కుండలా నిండి అలుగు రావడంతో జంపలేరు జలకళ సంతరించుకుంది. నాయినిచెరువు కింది భాగంలో ఉన్న పైచెరువు, బొల్లుపల్లి చెరువుకు కూడా నీరు చేరింది. ఇలాగే 10 రోజుల పాటు బుగ్గ నీరు ప్రవహిస్తే అర్ధవీడు చెరువు కూడా నిండుకుండలా జలకళ సంతరించుకుంటుందని ఆయా గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
నవోదయలో క్లస్టర్ స్థాయి కళా ఉత్సవ్
తర్లుపాడు: మండలంలోని కలుజువ్వలపాడు పీఎం శ్రీ జవహర్ నవోదయ–2లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 19 కళాశాలలకు సంబంధించిన క్లస్టర్ స్థాయి కళా ఉత్సవ్–2025ను ప్రిన్సిపల్ బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. మార్కాపురం మున్సిపల్ కమిషనర్ నారాయణరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రకృతిని కాపాడుకుంటూ స్వచ్ఛభారత్ నెలకొల్పేందుకు తమ వంతు పాత్ర పోషించాలని, విలువలతో కూడిన విద్యలో రాణిస్తూ ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షించారు. దేశ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించాలని కోరారు. కళల గురించి విద్యార్థులకు సాధనా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కే మధుసూదన్ శాస్త్రి వివరించారు. గుంటూరుకు చెందిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్కు చెందిన సిబ్బంది బీ సురేష్బాబు, ప్రభాకర్ రావు, జయశంకర్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. వైస్ ప్రిన్సిపల్ శ్రీధర్, రెండు రాష్ట్రాలలోని నవోదయ విద్యాలయాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఒంగోలు టౌన్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ ద్వారా జాబ్ క్యాలండర్ విడుదల చేయాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న డిమాండ్ చేశారు. నగరంలోని ఎల్బీజీ భవనంలో జరుగుతున్న జిల్లా స్థాయి శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడుతూ డీఎస్సీలో ఇచ్చిన పోస్టులు కాకుండా ఇంకా మిగిలిపోయిన టీచర్ పోస్టులను త్వరితగతిన భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో మొత్తం 20 వేల పోలీసు కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉండగా 6100 పోస్టులు భర్తీ చేస్తున్నారని, మిగిలిన 14 వేల పోస్టులను కూడా భర్తీ చేయాలని కోరారు. గ్రూప్ వన్, గ్రూప్ 2, బ్యాక్లాగ్ పోస్టులు, రెవెన్యూ డిపార్ట్మెంటులో ఉన్న 29 వేల పోస్టులను సాధ్యమైనంత తొందరగా భర్తీ చేయాలన్నారు. డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కేఎఫ్ బాబు మాట్లాడుతూ జిల్లాలో వాన్పిక్, నిమ్జ్, దొనకొండ ప్రాంతంలో పరిశ్రమలను ఏర్పాటు చేయాలని కోరారు. కేవీ పిచ్చయ్య అధ్యక్షత వహించిన కార్యక్రమంలో పి.కిరణ్, పి.నరేంద్ర, జి.కొండయ్య, మోహన్, సురేష్ పాల్గొన్నారు. -
ముప్పా సురేష్ అరెస్టు
ఒంగోలు టౌన్: ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టీడీపీ నాయకుడు ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో ప్రధాన నిందితుడు ముప్పా సురేష్ను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ముందు హాజరుపరచగా రిమాండ్ విధించారు. దీంతో ఆయనను జిల్లా జైలుకు తరలించారు. గత ఏప్రిల్ 22వ తేదీ వీరయ్య చౌదరి హత్య జరిగినప్పటి నుంచి ముప్పా సురేష్ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. పోలీసులు అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. హైకోర్టుకు వెళ్లిన ఆయనకు చుక్కెదురైంది. సుప్రీం కోర్టుకు వెళ్లినా బెయిల్ లభించలేదు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఎస్పీ ఎదుట లొంగిపోయారు. ఆయన అరెస్టుతో వీరయ్య చౌదరి కేసులో నిందితులందరినీ పోలీసులు అరెస్టు చేసినట్లయింది. ● అడ్డుకున్న భూ యజమానులు సంతనూతలపాడు (చీమకుర్తి రూరల్): కృష్ణపట్నం నుంచి హైదరాబాదు వెళ్లే బీపీసీఎల్ పెట్రోల్ పైపులైన్ నిర్మాణ పనులను ప్రైవేట్ స్థలాలలో చేపట్టడంతో భూ యజమానులు అడ్డుకున్నారు. సంతనూతలపాడు మండలం రెడ్డిపాలెం సర్వే నంబరు 437లో సోమవారం పనులను ప్రారంభించగా, సదరు భూ యజమానులు అడ్డుకున్నారు. భూ యజమానులైన చలువాది బదరీ నారాయణ, పబ్బిశెట్టి శ్రీనివాసరావుకు – బీపీసీఎల్ పెట్రోల్ పైపులైన్ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. సమాచారం అందుకున్న ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, స్థానిక తహసీల్దార్ నారాయణరెడ్డి ఆ ప్రాంతానికి వెళ్లి నిర్మాణ పనులను నిలిపివేశారు. భూమికి సంబంధించిన పత్రాలతో భూ యజమానులు, బీపీసీఎల్ పెట్రోల్ పైపులైన్ అధికారులు మంగళవారం ఒంగోలు ఆర్డీఓ కార్యాలయానికి రావాలని ఆర్డీఓ ఆదేశించారు. ఒంగోలు: చెక్ బౌన్స్ కేసులో నిందితునికి ఏడాదిన్నర జైలు శిక్ష విధిస్తూ ఎకై ్సజ్ మేజి స్ట్రేట్ ఎస్.కోమలవల్లి సోమవారం తీర్పు చెప్పారు. పోలీసుశాఖలో అదనపు ఎస్పీగా పనిచేసి రిటైరైన ఒంగోలు నివాసి తాడి జయప్రసాద్ వద్ద కుటుంబ ఖర్చుల నిమిత్తం పోలీసుశాఖలోనే హెడ్ కానిస్టేబుల్గా పనిచేసి రిటైరై, అద్దంకి మండలం వేలమూరిపాడులో నివాసం ఉంటున్న జ్యోతి కోటేశ్వరరావు 2015 సెప్టెంబర్ 24న రూ.10 లక్షలు అప్పు తీసుకున్నాడు. అందుకుగానూ ప్రామిసరీ నోటు అందజేశారు. అనంతరం వడ్డీ నిమిత్తం బ్యాంకు ద్వారా రెండు దఫాలు కొంత మొత్తం చెల్లించారు. మిగిలిన మొత్తం చెల్లించమని ఒత్తిడి రావడంతో పార్ట్ పేమెంట్ కింద రూ.12 లక్షలకు చెక్కు ఇచ్చారు. ఈ చెక్కును తాడి జయప్రసాద్ బ్యాంకులో జమచేయగా, అది బౌన్స్ అయింది. దీంతో ఆయన కోర్టులో కేసు వేశారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి నేరం నిరూపణ అయినట్లు పేర్కొంటూ నిందితుడు జ్యోతి కోటేశ్వరరావుకు ఏడాదిన్నర జైలుశిక్ష, ఫిర్యాదికి నష్టపరిహారం కింద రూ.12 లక్షలు చెల్లించాలని ఆదేశించారు. అదే విధంగా రూ.10 వేలు జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో 6 నెలలపాటు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
29 బార్లకు దరఖాస్తుల ఆహ్వానం
ఒంగోలు టౌన్: రాష్ట్ర ప్రభుత్వ నూతన బార్ పాలసీలో భాగంగా జిల్లాలో 29 బార్లకు లైసెన్స్లు మంజూరు చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు తెలిపారు. స్థానిక ప్రకాశం భవనంలోని డీపీఈఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈఎస్ షేక్ ఆయేషా బేగంతో కలిసి బార్ పాలసీ గురించి ఆయన వివరించారు. 29 బార్లలో గీత కార్మికులకు మూడు బార్లను కేటాయించినట్లు తెలిపారు. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో 16 బార్లు, మార్కాపురం పరిధిలో 5, చీమకుర్తి, పొదిలి, దర్శి, కనిగిరి, గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో ఒక్కొక్కటి చొప్పున బార్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతిచ్చినట్లు వివరించారు. దరఖాస్తులను ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతిలో స్వీకరించనున్నట్లు తెలిపారు. ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చని చెప్పారు. ఎక్కడి నుంచైనా దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా ఆన్లైన్ సౌకర్యాన్ని కల్పించినట్లు తెలిపారు. దరఖాస్తు ఫీజు 5 లక్షల రూపాయలు, ప్రాసెసింగ్ ఫీజు 10 వేల రూపాయలతో ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 28వ తేదీ అంబేడ్కర్ భవన్లో కలెక్టర్ సమక్షంలో డ్రా తీసి లైసెన్స్లు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. నూతన పాలసీలో రెండు శ్లాబులుగా విభజించారని, ఒంగోలు, మార్కాపురం రూ.55 లక్షల శ్లాబు పరిధిలోకి వస్తాయని, మిగిలిన బార్లు రూ.35 లక్షల శ్లాబు పరిధిలోకి వస్తాయని తెలిపారు. ఈ ఫీజులను ఆరు విడతలుగా చెల్లించవచ్చన్నారు. ఎకై ్సజ్ సూపరింటెండెంట్ షేక్ ఆయేషా బేగం మాట్లాడుతూ నూతన బార్ల ఏర్పాటుకు హైబ్రిడ్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. గీత కార్మికులకు కేటాయించిన బార్లలో గౌడ కులస్తులు ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో ఒకటి, మార్కాపురం పరిధిలో గౌడ, గాండ్ల కులస్తులకు చెరోకటి చొప్పున రెండు రిజర్వ్ చేసినట్లు చెప్పారు. గీత కార్మికుల బార్లకుగానూ ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందన్నారు. 30వ తేదీ లాటరీ ద్వారా లైసెన్సులు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. గీత కార్మికులకు ఫీజులో 50 శాతం రాయితీ కల్పించినట్లు చెప్పారు. లైసెన్స్ కాలపరిమితి ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటి నుంచి 2028 ఆగస్టు వరకు ఉంటుందన్నారు. కొత్త వ్యాపారులు ఎక్కువగా దరఖాస్తు చేసుకునే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. విలేకరుల సమావేశంలో ఏఈఎస్ ఎర్ర వెంకటేష్ పాల్గొన్నారు. వాటిలో గీత కార్మికులకు మూడు కేటాయింపు -
‘నక్షత్ర వీధుల్లో భారతీయుల పాత్ర’ పుస్తకావిష్కరణ
ఒంగోలు టౌన్: నగరంలో జరుగుతున్న మూడో పుస్తక మహోత్సవం సోమవారం 4వ రోజుకు చేరుకుంది. విశాలాంధ్ర బుక్ హౌస్ ప్రచురించిన డాక్టర్ మహీధర నళినీ మోహన్ రచించిన రాకెట్ కథ, నక్షత్ర వీధుల్లో భారతీయుల పాత్ర పుస్తకాలను విశ్రాంత ఐఏఎస్ అధికారి హరి నారాయణ చక్రవర్తి ఆవిష్కరించారు. 16వ శతాబ్దంలో ధూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకం పుస్తకాన్ని విడుదల చేశారు. తిరుమల రామచంద్ర రచించిన మనలిపి పుట్టుపూర్వోత్తరాలు, నుడి–నాడుడి పుస్తకాలను ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక అధ్యక్షుడు వల్లూరు శివప్రసాద్, విశాలాంధ్ర బుక్ హౌస్ జనరల్ మేనేజర్ మనోహర్ నాయుడు విడుదల చేశారు. తిరుమల రామంద్ర శత జయంతి సందర్భంగా ఈ పుస్తకాలను ఆవిష్కరించినట్లు మనోహర్ నాయుడు తెలిపారు. పీవీఆర్ ఉన్నత పాఠశాల గ్రౌండ్లో జరుగుతున్న పుస్తక మహోత్సవానికి వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చిన్నపిల్లల కథలు, చందమామ కథల పుస్తకం, కామిక్స్ తదితర పుస్తకాలతో పాటుగా జనవిజ్ఞాన వేదిక నిర్వహిస్తున్న సైన్స్ కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి మట్టి బొమ్మలతో వర్క్షాపు నిర్వహించారు. ఈ వర్క్షాపులో సుమారు 70 మందికి పైగా విద్యార్థులు, చిన్నారులు పాల్గొన్నారు. వివిధ రకాల మట్టిబొమ్మలు, ఆట వస్తువులను తయారు చేసిన చిన్నారులు తమలోని సృజనాత్మకతను చాటుకున్నారు. ఈ కార్యక్రమం చిన్నారులను, పెద్దలను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాల్లో జిల్లాకు చెందిన పలువురు రచయితలు, మేధావులు, సాహితీవేత్తలు పాల్గొన్నారు. -
లారీని ఢీకొని..
సింగరాయకొండ: ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి మోటారు సైకిల్తో ఢీకొని యువకుడు మృతిచెందిన సంఘటన సోమవారం మధ్యాహ్నం సింగరాయకొండ మండల పరిధిలోని విమానాల రన్వేపై వెంకటేశ్వర కళ్యాణ మండపం సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. జరుగుమల్లి మండలం నందనవనం గ్రామానికి చెందిన ఇత్తడి జయప్రకాష్ (38) జాతీయ రహదారిపై బీకే త్రషర్స్ కంపెనీ సమీపంలోని హెచ్పీ పెట్రోల్ బంకులో మేనేజర్గా పనిచేస్తున్నాడు. మధ్యాహ్న సమయంలో పెట్రోల్ బంకు నుంచి మండలంలోని మూలగుంటపాడు గ్రామ పంచాయతీలో నివసిస్తున్న తన యజమాని ఇంటికి బయలుదేరాడు. హెల్మెట్ ధరించి మోటారు సైకిల్పై విమానాల రన్ వేపై వెళ్తున్న సమయంలో ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ ఎటువంటి సిగ్నల్ ఇవ్వకుండా లారీని రోడ్డు పక్కన ఉన్న హోటల్ వద్ద ఆపే ప్రయత్నం చేశాడు. గమనించని జయప్రకాష్.. లారీ వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టాడు. అతని హెల్మెట్ ముందు భాగం పగిలి అవతల పడగా, మోటారు సైకిల్ అదుపుతప్పి దూరంగా పడింది. ఈ ప్రమాదంలో జయప్రకాష్ తలకు తీవ్రగాయాలయ్యాయి. హైవే అంబులెన్స్లో ఒంగోలు జీజీహెచ్కి తరలిస్తుండగా, మార్గం మధ్యలోనే అతను మరణించాడు. హెల్మెట్ ధరించినప్పటికీ లాక్ పెట్టుకోకపోవటంతో ప్రమాదం జరిగినప్పుడు అది ఎగిరిపడిపోయి జయప్రకాష్ నుదిటికి గాయాలైనట్లు తెలుస్తోంది. జయప్రకాష్ భార్య దివ్యవాణి నందనవనంలో ఆశా కార్యకర్తగా పనిచేస్తుండగా, ఇద్దరు కుమారులు ఉన్నారు. దివ్యవాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.మహేంద్ర వివరించారు. మృతదేహానికి ఒంగోలు జీజీహెచ్లో మంగళవారం పోస్టుమార్టం చేయనున్నట్లు బంధువులు తెలిపారు. పొదిలి మండలంలో మరో యువకుడు... పొదిలి రూరల్: ఆగి ఉన్న లారీని ఢీకొని బైక్పై వెళ్తున్న యువకుడు మృతిచెందాడు. ఒంగోలు–కర్నూలు రహదారిపై పొదిలి మండలంలోని తలమళ్ల–అగ్రహారం గ్రామాల మధ్య పవర్ గ్రిడ్ వద్ద ఆదివారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పొదిలి మండలంలోని మాదాలవారిపాలేనికి చెందిన దాసరి మధు (24) మర్రిచెట్లపాలెంలోని గ్రానైట్ క్వారీలో పనిచేస్తుంటాడు. రోజూ మాదిరిగా తన పనులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వెళ్తుండగా, పొదిలి నుంచి ఒంగోలు వైపు వెళ్తూ పవర్గ్రిడ్ సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మధు తలకు తీవ్రగాయాలవడంతో స్థానికులు వెంటనే పొదిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మధు మృతి చెందాడు. మోటారు సైకిల్పై వెళ్తున్న యువకుడు మృతి హెల్మెట్ ధరించినా లాక్ పెట్టకపోవడంతో తలకు గాయాలై దుర్మరణం -
సెప్టెంబర్ నుంచి సాగుకు సాగర్ జలాలు
యర్రగొండపాలెం: ఎన్ఎస్పీ ప్రధాన కాలువ నుంచి జిల్లాకు సెప్టెంబర్ మొదటి వారంలో సాగు నీటిని పూర్తి స్థాయిలో విడుదల చేయనున్నట్లు దర్శి ఈఈ ఎం.రామకృష్ణ తెలిపారు. సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘నీరున్నా నిష్ఫలం’ వార్తకు ఆయన స్పందించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ డ్యాం నిండుగా ఉండటం వలన సముద్రం పాలయ్యే నీటిని కాలువల ద్వారా డైవర్ట్ చేస్తారని, ఈ నీటిని నోటిఫైడ్, నాన్ నోటిఫైడ్ చెరువులు నింపుకోవడానికి, ఇతర అవసరాలకు వినియోగించుకోవడానికి వదులుతున్నామన్నారు. వరద నీరు వచ్చే సమయంలో రైతుల విజ్ఞప్తి మేరకు అవసరమైన సాగునీరు సరఫరా చేస్తున్నామన్నారు. కాలువల ద్వారా వదిలే వరద నీటిపై పూర్తిగా ఆధారపడి సాగు చేయవద్దని, ప్రస్తుతం కాలువల్లో వదిలే నీరు వరద నీటి మళ్లింపులో భాగమేనని ఆయన వివరించారు. -
కావాలనే పింఛన్ తీసేశారు
కావాలనే దర్శి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యుడు దివ్యాంగ పింఛను తొలగించాడు. నాకు నడుముల దగ్గర నుంచి కాళ్లు సక్రమంగా పనిచేయవు. పదినిమిషాలు నిలబడలేను. పది నిమిషాలు కూర్చోలేను. ఎక్కువ సేపు పడుకున్నా శరీరమంతా నొప్పులే. అలాంటి నాకు దివ్యాంగుల పింఛను తీసేశారని ఇంటికి నోటీసు వచ్చింది. దర్శి వైద్యశాలకు వెళితే అసలు డాక్టరు కనీస పరీక్షలు కూడా చేయలేదు. మనిషిని చూసి వెళ్లిపొమ్మన్నాడు. చివరకు ఇంటికి దివ్యాంగ పింఛనుకు అనర్హుడవని నోటీసు మాత్రం వచ్చింది. ఇక నేను ఏవిధంగా జీవనం సాగించాలి అని ఆందోళన వ్యక్తం చేశాడు. – వై.అంజిబాబు, తాళ్లూరు -
రోడ్డుపై రాకపోకల అడ్డగింత
సంతనూతలపాడు (చీమకుర్తి రూరల్): సంతనూతలపాడులోని ఎంపీడీఓ కార్యాలయం వెనుకవైపు రోడ్డుపై కొందరు వ్యక్తులు రాకపోకలను అడ్డుకుని స్థానికులను ఇబ్బందులు గురిచేస్తుండటంతో సోమవారం ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్శాఖ స్పందన కార్యక్రమంలో ఎస్పీ దామోదర్కు బాధితుడు ఇనగంటి సుబ్రహ్మణ్యం అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు చేశారు. బొద్దులూరి యల్లమంద అనే వ్యక్తి హైకోర్ట్ ఆర్డర్ కూడా లెక్కచేయకుండా ఆ రోడ్డులో ఉంటున్న వారు రాకపోకలు సాగించకుండా అడ్డంగా వాహనాలు నిలిపి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాడని ఆరోపించారు. దీనిపై గతంలో జరిగిన తగాదా నేపథ్యంలో జిల్లా కోర్టులో కేసు వేయగా, కోర్టు టెంపరరీ ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చి రాకపోకలకు అడ్డంకులు కలిగించవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ఇటీవల హైకోర్ట్లో విచారణ జరగ్గా, రహదారికి అడ్డంపెట్టిన వాహనాలు తొలగించాలని సంతనూతలపాడు పోలీసులను కోర్టు ఆదేశించిందని తెలిపారు. పోలీసులు కూడా యల్లమంద కుటుంబానికి రోడ్డుపై పార్కింగ్ చేయరాదని చెప్పి వాహనాలు తొలగించారన్నారు. కానీ, పోలీసుల మాట కూడా హైకోర్ట్ ఆదేశాలను కూడా ఉల్లంఘించి మరుసటి రోజే మళ్లీ రోడ్డుకి అడ్డంగా యల్లమంద బైకులు పెట్టిస్తున్నాడని సుబ్రహ్మణ్యం ఎస్పీకి వివరించారు. తప్పుడు కేసులు పెట్టి బెదిరింపులు... ఇటీవల రాఖీ పండుగ రోజు తన అక్క రాఖీ కట్టడానికి సన్నిహితులు, స్నేహితులతో తమ ఇంటికి రాగా, యల్లమంద ఉద్దేశపూర్వకంగా వారిని బూతులు తిట్టాడని సుబ్రహ్మణ్యం ఎస్పీ ఎదుట వాపోయాడు. పైగా, పోలీస్ స్టేషన్లో తప్పుడు ఫిర్యాదులు చేసి బెదిరిస్తున్నాడన్నారు. తమ వీధి వైపుగానీ, తమ ఇంటివైపుగానీ ఎవరైనా వస్తే చంపేస్తామంటూ హెచ్చరిస్తున్నాడని తెలిపారు. పోలీసుల విచారణలో తాము చూపించిన ఫొటోలు, వీడియోలు ఉన్నా కూడా తమ స్నేహితులపైనే బైండోవర్ రాశారని సుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలున్నా కూడా పోలీసు రక్షణ లేకుండా తమను ఒంటరివాళ్లను చేసి తప్పుడు కేసులు పెడతామని భయపెడుతున్నారన్నారు. ఇది ఇలాగే కొనసాగకుండా తక్షణం చర్యలు తీసుకుని తమకు శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్పీకి సుబ్రహ్మణ్యం విజ్ఞప్తి చేశారు. -
నా పింఛన్ తొలగించారు...
ఒక చేయి పూర్తిగా పనిచేయదు. గత పది సంవత్సరాలుగా దివ్యాంగుల పింఛను తీసుకుంటున్నాను. ఇటీవల దర్శి ప్రాథమిక వైద్యశాలలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడ వైద్యుడు కనీసం నన్ను పరీక్ష కూడా చేయలేదు. కూర్చోబెట్టి అటూ ఇటూ తిరగమన్నాడు. అంతే లేచి వెళ్లిపొమ్మన్నాడు. తీరా ఇంటికి మాత్రం దివ్యాంగుల పింఛనుకు అనర్హుడవని నోటీసు వచ్చింది. అంటే పింఛను తొలగించినట్లేనా...సదరం సర్టిఫికెట్లో పర్సంటేజ్ తక్కువ ఉందని పింఛను తొలగించారు. ఆ పింఛను మీదనే ఆధారపడి జీవిస్తున్నాను. – జీఆర్.కృష్ణారావు, తాళ్ళూరు -
మేసీ్త్రలను తొలగించి పొట్టకొట్టారు
ఒంగోలు సబర్బన్: స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న 55 మంది మేసీ్త్రలతో కలిపి దాదాపు 110 మంది పారిశుధ్య కార్మికులను అక్రమంగా తొలగించి పొట్టకొట్టారంటూ సోమవారం స్థానిక ప్రకాశం భవనంలో నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో జేసీ ఆర్.గోపాలకృష్ణకు ఫిర్యాదు చేశారు. సీఐటీయూ ఒంగోలు నగర అధ్యక్షుడు టి.మహేష్ ఆధ్వర్యంలో ఉద్యోగాలు కోల్పోయిన మేసీ్త్రలు, పారిశుధ్య కార్మికులు జేసీని కలిసి గోడు వెల్లబోసుకున్నారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా తమను తొలగించి నూతనంగా కూటమి పార్టీల నాయకులు చెప్పిన వారికి ఉద్యోగాలిచ్చారని జేసీ దృష్టికి తీసుకెళ్లారు. దాదాపు 15 సంవత్సరాలకుపైగా ఒంగోలు మున్సిపాలిటీలో పనిచేస్తున్నామని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తమను ఎలాంటి సమాచారం లేకుండా తొలగించారని చెప్పారు. తాము చేసిన తప్పు ఏమిటని అడిగినా మున్సిపల్ కమిషనర్ చెప్పడం లేదన్నారు. మేసీ్త్ర వ్యవస్థ ఇక నుంచి ఉండదని మాత్రమే చెప్పారన్నారు. అలాంటప్పుడు నూతనంగా తీసుకున్న వారు పారిశుధ్య పనులు చేయటం లేదని, మేసీ్త్రలుగానే పనిచేస్తున్నారని జాయింట్ కలెక్టర్కు వివరించారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దేవస్థాన స్థలంలో మున్సిపల్ అధికారులకు ఏం పని.? మార్కాపురం శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి దేవస్థానం పడమట వైపున్న ఖాళీ స్థలాన్ని అద్దెకు ఇచ్చేందుకు మున్సిపాలిటీ అధికారులు టెండర్లు పిలవడం అన్యాయమని మార్కాపురానికి చెందిన పురోహితుడు శ్రీకంఠం నారాయణాచార్యులు జేసీని కలిసి ఫిర్యాదు చేశారు. మార్కాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానానికి ఆమోదించారన్నారు. దేవస్థానానికి సంబంధించిన స్థలంలో మున్సిపల్ అధికారులకు అద్దెకిచ్చే హక్కు ఎవరిచ్చారన్నారు. ఈ విధానం చూస్తుంటే కొందరు కౌన్సిలర్లు, రాజకీయ నాయకులు కలిసి శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి దేవస్థాన స్థలాలను, దేవస్థానం మొత్తాన్ని కూడా అమ్మేదానికి వెనకాడేలా లేరని స్పష్టమవుతోందన్నారు. వెంటనే ఈ తీర్మానాన్ని రద్దు చేయాలని జాయింట్ కలెక్టర్ను కోరారు. సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే వేధిస్తున్నారు... ఒంగోలులోని కొప్పోలు రోడ్డులో రైల్వేస్టేషన్కు ఉత్తరం వైపు వైఎస్సార్ కాలనీలో సొంతంగా స్థలం కొనుక్కుని ఇంటి నిర్మాణం చేసుకుంటే అక్కడ కొంతమంది డబ్బులివ్వాలని బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరిస్తున్నాని మీ కోసం కార్యక్రమంలో జేసీకి ఓ బ్యాంకు ఉద్యోగి ఫిర్యాదు చేశారు. యూనియన్ బ్యాంక్ టంగుటూరు శాఖలో క్యాషియర్గా పనిచేస్తున్న బేలాళ రమేష్ వైఎస్సార్ కాలనీ 3వ అడ్డరోడ్డులో 23.5 గదుల స్థలం కొన్నాడు. అందులో రూ.5,30,000తో మున్సిపాలిటీ నుంచి అన్ని అనుమతులు తీసుకుని ఇల్లు నిర్మించుకున్నాడు. స్థానికంగా ఉన్న బొజ్జా వీరయ్య అనే అతను కబ్జాచేసి తనను ఇంటికి వెళ్లనీయకుండా రోడ్డుకి అడ్డంగా రేకుల షెడ్డు ఏర్పాటు చేసి ఇబ్బందులు పెడుతున్నాడన్నారు. అదేవిధంగా తూర్పు వైపున ఉన్న వీడీఓ కాలనీ వైపు రేకుల షెడ్డు వారితో మాట్లాడుకుని అక్కడ రోడ్డుకి అడ్డంగా గుంత తీశారన్నారు. అదేంటని అడిగితే వీడీఓ కాలనీ ప్రెసిడెంట్ రూ.5,00,000 డిమాండ్ చేస్తున్నాడన్నారు. రెండోవైపు వాళ్లు రూ.4,00,000 డిమాండ్ చేస్తున్నారన్నారు. ఈ విషయమై అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకుండా ఉందన్నారు. వారి బారి నుంచి తనను కాపాడాలని జేసీ గోపాలకృష్ణను వేడుకున్నాడు. మీ కోసం కార్యక్రమంలో జేసీతో పాటు డీఆర్వో చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వరకుమార్, శ్రీధర్రెడ్డి, కుమార్, జాన్సన్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నామన్నా పట్టించుకోవడం లేదు పనిచేస్తున్న వాళ్లని కాదని కొత్తగా 35 మందిని తీసుకున్నారు. ఒంగోలు నగరపాలక సంస్థలో అడ్డగోలు వ్యవహారాలపై మీ కోసం కార్యక్రమంలో జేసీకి ఫిర్యాదు -
పోలీసు స్పందనకు 64 ఫిర్యాదులు
ఒంగోలు టౌన్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం మీ కోసంలో 64 ఫిర్యాదులు వచ్చాయి. వివిధ సమస్యలతో జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన బాధితులు నేరుగా ఎస్పీ ఏఆర్ దామోదర్ను కలిసి వినతిపత్రాలు అందజేశారు. ప్రజా సమస్యలపై స్పందించిన ఎస్పీ.. నేరుగా ఆయా పోలీసుస్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. మీ కోసంలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి ఒక్క బాధితుడికి న్యాయం జరగాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు శాఖ ప్రజలకు అండగా నిలబడాలన్న ఉద్దేశంతోనే ప్రతి వారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ రమణ కుమార్, ఎస్సీ, ఎస్టీ సెల్ సీఐ దుర్గాప్రసాద్, సీసీఎస్ సీఐ జగదీష్, ట్రాఫిక్ సీఐ పాండురంగారావు, ఎస్సై జనార్దన్రావు పాల్గొన్నారు. మాకు న్యాయం చేయండి.. పుల్లలచెరువు: మాకు న్యాయం చేయండి అంటూ వినుకొండకు చెందిన గజ్వల్లి విజయభారతి, కుమారుడు మణికంఠ గుప్త సోమవారం ఒంగోలులోని పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్సెల్లో ఎస్పీ దామోదర్కు ఫిర్యాదు చేశారు. తన భర్త గజ్వల్లి నాగేశ్వరరావుకు సోదరులైన పుల్లలచెరువుకు చెందిన గజ్వల్లి భాస్కరరావు, గజ్వలి శ్రీనివాసరావు తన భర్తకు రావాల్సిన ఆస్తులు అడగడానికి తేదీ 30–07–2025న పుల్లలచెరువు వెళ్లిన తమను తీవ్రంగా అవమానించి ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి షాపు వద్ద మాట్లాడుతున్న తమపై భాస్కరరావు, శ్రీనివాసరావు పుల్లలచెరువు పోలీసులకు ఫిర్యాదు చేసి తమ కుమారుడిని స్టేషన్కు తీసుకెళ్లారన్నారు. స్టేషన్లో పోలీసులతో కొట్టించి దుర్భాషలాడారన్నారు. అదే రోజు స్టేషన్లో పోలీసుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ నాటికి తమను పిలిచి పరిష్కరిస్తానని వారిద్దరూ చెప్పి ఉన్నారన్నారు. కానీ, నేటికీ ఎటువంటి సమాచారం లేదన్నారు. తనకు, తన కుమారుడికి తన మరుదులు, పోలీసులతో ప్రాణహాని ఉందని, తమకు న్యాయం చేయాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. -
తల్లి అంత్యక్రియలకు ముందుకు రాని కుమారులు
ప్రకాశం జిల్లా: ఆస్తిలో వాటా పంచి ఇవ్వలేదన్న కారణంతో కన్న తల్లి అంత్యక్రియలు చేసేందుకు కుమారులు ముందుకురాలేదు. ప్రకాశం జిల్లా పొదిలి మండలం మూగచింతల గ్రామానికి చెందిన నల్లబోతుల పుల్లయ్య, వీరయ్య దంపతులకు ఐదుగురు కుమారులు. వీరికి 2.45 ఎకరాల పొలం, రెండు చోట్ల 14 సెంట్ల స్థలం ఉంది. 20 ఏళ్లుగా వీరి కుటుంబంలో ఆస్తి విషయంలో గొడవలున్నాయి. తల్లిదండ్రులు మొదటి ముగ్గురు కుమారులకు ఆస్తి పంపకంలో వాటా ఇవ్వకుండా చివరి ఇద్దరు కుమారులకే వాటా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆదివారం తల్లి వీరమ్మ మృతిచెందింది. మృతదేహాన్ని చూసేందుకు కుమారులంతా వచ్చినా.. కర్మకాండలకు అయ్యే ఖర్చును ఆస్తి తీసుకున్న కుమారులే భరించాలని మొదటి ముగ్గురు కుమారులు మెలిక పెట్టారు. దీనిపై వారి మధ్య వాదోపవాదాలు జరిగాయి. చివరకు అంత్యక్రియలు నిలిచిపోయాయి. -
ఘనంగా నాగభైరవ పురస్కార ప్రదానోత్సవం
ఒంగోలు మెట్రో: ప్రముఖ కవి డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు పేర ఏటా ఇస్తున్న నాగభైరవ సాహిత్య పీఠం పురస్కారాల ప్రదానోత్సవాన్ని ఆదివారం ఒంగోలులోని రెడ్క్రాస్ భవనంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సినీ నటుడు రఘుబాబు మాట్లాడుతూ నాగభైరవ కోటేశ్వరరావును తాను చిన్నప్పుడు తాత అని పిలిచేవాడినంటూ ఆయనతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రజానాట్యమండలి నాయకుడు నల్లూరి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు మాట్లాడుతూ ఏటా క్రమం తప్పకుండా నాగభైరవ కోటేశ్వరరావు పేరిట రచయితలకు పురస్కారాలు ప్రదానం చేయడం సముచితంగా ఉందని అన్నారు. కళామిత్రమండలి అధ్యక్షుడు డాక్టర్ నూనె అంకమ్మరావు మాట్లాడుతూ నాగభైరవ కోటేశ్వరరావు కదిలించే కవిత్వాన్ని కళ్లముందుంచి, కవిత్వమే ఊపిరిగా బతికారని అన్నారు. పద్యాన్ని, గద్యాన్ని సమపాళ్లలో రంగరించి రచనలు చేసిన గొప్ప సాహితీవేత్త నాగభైరవ అని కొనియాడారు. సాహిత్యపీఠం చేస్తున్న సేవను వీరవల్లి సుబ్బారావు అభినందించారు. కుర్రా ప్రసాద్ బాబు నాగభైరవతో తన పరిచయాన్ని వివరించారు. అనువాద ప్రక్రియలో పురస్కారాలు పొందిన రాచపాళెం చంద్రశేఖరరెడ్డి (నెత్తురు నది), కోనేరు కల్పన (దర్పణం)లకు వరుసగా రూ.10 వేలు, రూ.5 వేలు చొప్పున నగదు బహుమతులను నిర్వాహకులు అందించారు. కేకేఎల్ స్వామికి నాగభైరవ కళా పురస్కారం రూ.10 వేలు, నాగభైరవ ఆత్మీయ పురస్కారం పొందిన గిరిబాబు తరఫున ఆయన కుమారుడు రఘుబాబుకు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కవులు, రచయితలు డాక్టర్ బీరం సుందరరావు, చుండి బేబీ సుజాత, కె.బాలకోటయ్య, వి.ఝూన్సీదుర్గ, బీరం అరుణ, సింహాద్రి జ్యోతిర్మయి, కేఎస్వీ ప్రసాద్, పోతినేని వెంకటేశ్వర్లు, బెజవాడ రామారావు, డాక్టర్ నాగభైరవ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
బొప్పాయి రైతు బేజారు
కొండారెడ్డిపల్లిలో కుప్పకూలిన బొప్పాయి తోటను పరిశీలిస్తున్న హెచ్ఓ, ఏఓ (ఫైల్)తర్లుపాడు: శ్రమనే నమ్ముకుని జీవనం సాగిస్తున్న రైతన్నను ప్రకృతి కకావికలం చేయగా, ఆదుకుని అండగా నిలవాల్సిన ప్రభుత్వం కాలయాపన చేస్తూ కొర్రీలు పెడుతోంది. దీంతో బొప్పాయి రైతు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత మే నెలలో పెనుగాలుల బీభత్సానికి పశ్చిమ ప్రకాశంలోని తర్లుపాడు, మార్కాపురం, కొనకనమిట్ల, పొదిలి, కురిచేడు, బేస్తవారిపేట, కంభం తదితర మండలాల్లో వందలాది ఎకరాల్లో చేతికొచ్చిన బొప్పాయి పంట నేలకూలింది. నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్న రైతన్నలకు నిరాశ నిస్పృహలు తప్పడం లేదు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి నష్టాన్ని అంచనా వేసి నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపారు. కానీ, నాలుగు నెలలైనా నష్టపరిహారం డబ్బులు అందకపోవడంతో రైతన్నలు పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ సహాయం అందితే కొంతలో కొంత ఉపశమనం కలుగుతుందని భావించినప్పటికీ కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో రైతన్నలు ఆందోళనకు గురవుతున్నారు. -
నిషేధిత కత్తి
పట్టా భూములపైతిమ్మపాలెంలో నిషేధిత భూమిగా నమోదైన పట్టా భూమిరెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో సుమారు ఆరు గ్రామాల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తమ వ్యవసాయ పట్టా భూములను రెవెన్యూ రికార్డులు, ఆన్లైన్లో నిషేధిత, ప్రభుత్వ భూములుగా నమోదు చేయడంతో వారు అవస్థలు పడుతున్నారు. అధికారులు చేసిన తప్పిదాన్ని మరోసారి పరిశీలించి రైతులకు న్యాయం చేయాలని కొన్ని నెలలుగా ఆయా గ్రామాల రైతులు రెవెన్యూ అధికారులకు మొరపెట్టుకుంటున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. పొన్నలూరు: రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంతో రైతుల సొంత భూములపై ఉన్న హక్కులను ఇబ్బందుల్లోకి నెట్టారు. పొన్నలూరు మండలం చెరుకూరు రెవెన్యూ పరిధిలో తిమ్మపాలెం, చెరుకూరు, ముండ్లమూరివారిపాలెం, రామన్నపాలెం, శివన్నపాలెం, వెంకుపాలెం గ్రామాలు ఉన్నాయి. చెరుకూరు రెవెన్యూ పరిధిలోని 15వ సర్వే నంబర్ నుంచి 1398 సర్వే నంబర్ వరకు సుమారు 4 వేల ఎకరాలకు పైగా రైతుల వ్యవసాయ పట్టా భూములు ఉన్నాయి. భూములన్నీ రైతులకు వారసత్వంగాను, కొనుగోలు ద్వారా పక్కాగా పట్టా భూములుగా ఉన్నాయి. 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో నిషేధిత, ప్రభుత్వ భూములను గుర్తించేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో ఈ పట్టా భూములను స్థానిక రెవెన్యూ అధికారులను క్షేత్ర స్థాయిలో విచారించి నిషేధిత భూములు ఉంటే గుర్తించాలని అప్పటి ప్రభుత్వం ఆదేశించింది. రెవెన్యూ అధికారులు నిషేధిత, ప్రభుత్వ భూములను గుర్తించే క్రమంలో పొరపాటున లేదా కావాలనే చేశారో.. ఏమైందో ఏమోగానీ ఈ వ్యవసాయ భూముల్లోని సుమారు కొన్ని వేల ఎకరాలను ఆరు గ్రామాల రైతులకు తెలియకుండా రెవెన్యూ రికార్డులు, ఆన్లైన్లో నిషేధిత, ప్రభుత్వ భూములుగా నమోదు చేశారు. దీంతో గత టీడీపీ ప్రభుత్వంలో రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదం వలన రైతులు నేడు ఇబ్బందులు పడుతున్నారు. అవస్థలు పడుతున్న రైతులు: ఆరు గ్రామాలకు చెందిన రైతుల వ్యవసాయ పట్టా భూములను నిషేధిత, ప్రభుత్వ భూములుగా నమోదు చేయడం వలన 2017 నుంచి ఇప్పటి వరకు రైతులు పలు విషయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ పెట్టుబడుల కోసం బ్యాంకులు నుంచి రుణాలు పొందాలంటే ఆన్లైన్లో నిషేధిత భూములుగా ఉండటంతో వ్యక్తిగత రుణాలు తీసుకోలేకపోతున్నారు. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే వ్యవసాయ రాయితీలు, పథకాలు సక్రమంగా పొందలేకపోతున్నారు. ప్రధానంగా రైతులు వారి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తమ పట్టా భూములను అమ్ముకోవాలన్నా, కొనుగోలు చేయాలన్నా వీలు పడక తీవ్ర అవస్థలు పడుతున్నారు. విన్నవించినా పట్టించుకోవడం లేదు భూముల సమస్యపై కొన్ని నెలలుగా జిల్లా నుంచి, స్థానిక అధికారుల దృష్టికి ఆయా గ్రామాల రైతులు అర్జీల రూపంలో సమస్యను తెలియజేస్తున్నా..ఒక్కరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. అలాగే స్థానిక మంత్రి స్వామికి విన్నవించినా ఫలితం శూన్యమని రైతులు వాపోతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. -
ఆటో ఢీకొని రెండు గేదెలు మృతి
నాగులుప్పలపాడు: ఆటో ఢీకొని రెండు గేదెలు మృతిచెందిన సంఘటన ఆదివారం రాత్రి నాగులుప్పలపాడు మండలంలోని ఉప్పుగుండూరులో నాగన్నవాగు చెక్ డ్యాం సమీపంలో జరిగింది. బాపట్ల జిల్లా పెదగంజాంకు చెందిన ఒకే కుటుంబం వారు ట్రాలీ ఆటోలో కామేపల్లి గుడికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నారు. నాగన్నవాగు చెక్ డ్యాం వద్దకు వచ్చేసరికి చీకట్లో గేదెలు ఎదురురావడంతో కనిపించక ఆటో ఢీకొట్టింది. దాంతో రెండు గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. వాటి విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వారు క్షేమంగా బయటపడి ఊపిరిపీల్చుకున్నారు. -
ప్రభుత్వ విద్యాలయాల్లో రాజకీయ వేదికలా.
సింగరాయకొండ: మీరు ఇచ్చిన జీఓలను మీరే తుంగలో తొక్కి విద్యాలయాలను రాజకీయాలకు వేదికలుగా మారుస్తున్నారని, జీఓలు, ఉత్తర్వులు ఆచరించటానికి కాదు...కేవలం ప్రతిపక్షాలను అణగ తొక్కటానికేనా అని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ను ప్రశ్నించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో కొండపి వ్యవసాయ మార్కెటింగ్ యార్డు చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహించటంపై మండల కేంద్రంలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పనితీరుపై ఘాటుగా స్పందించారు. డాక్టర్ సురేష్ మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసే జీఓలు, ఉత్తర్వులు, చట్టాలన్నీ ప్రతిపక్షాలకే తప్ప మీరు ఆచరించటానికి కాదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీ క్రీడా మైదానంలో ఏఎంసీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం కోసం మూడు రోజులుగా విద్యార్థులు ఆడుకోవటానికి వీలు లేకుండా ఏర్పాట్లు చేస్తూ మైదానంలో గుంటలు తవ్వి ధ్వంసం చేశారని అన్నారు. కార్యక్రమానికి ఇద్దరు మంత్రులు హాజరవటం దేనికి సంకేతమని ప్రశ్నించారు. సాక్షాత్తు నంబరు 2 గా చెప్పుకునే లోకేష్కు చెందిన విద్యాశాఖలోనే ఈ విధంగా ఉల్లంఘనలు జరగటం దారుణమన్నారు. నాడు–నేడు కింద పాఠశాలలను అభివృద్ధి చేస్తే రాజకీయాల కోసం ఆ పాఠశాలలను వాడుకుంటూ లక్షలాది రూపాయలతో బాగు చేసిన మైదానాలు విద్యార్థులకు పనిరాకుండా చేయటమేనా ముందడుగు అని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాఠశాల క్రీడామైదానాల చుట్టూ కాంపౌండ్వాల్ కట్టి భద్రపరిస్తే కూటమి ప్రభుత్వ నాయకులు మాత్రం వాటిని రాజకీయ వేదికలుగా మారుస్తున్నారని ఆరోపించారు. చివరికి కార్యక్రమం సందర్భంగా పక్కనే ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలోనే వంటలు వండటంతో పాటు మిగిలిన అన్నం, వంటకాలను ఆ పాఠశాల ఆవరణలోనే జేసీబీతో గుంటలు తీసి పోశారని ఆరోపించారు. ప్రస్తుతం క్రీడా మైదానాలను రాజకీయ వేదికలుగా మారుస్తున్నారని, ఇక ముందు పాఠశాల ఫర్నిచర్ను కూడా రాజకీయ సమావేశాలకు వాడినా ఆశ్చర్యం లేదన్నారు. ఇదేనా పాఠశాలలను అభివృద్ధి చేయటం అని చినబాబును ప్రశ్నించారు. దీనిపై రాష్ట్ర విద్యా శాఖ సెక్రటరీ కూన శశిధర్, విద్యాశాఖ కమిషనర్ రామరాజు, కలెక్టర్ తమీమ్ అన్సారియా, డీఈఓ కిరణ్కుమార్కు వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు వివరించారు. -
కెమెరా ట్రాప్లో చిరుత
పెద్దదోర్నాల: మండల పరిధిలోని చిన్నారుట్ల గిరిజన గూడెంలో మూడేళ్ల బాలిక కుడుముల అంజమ్మపై దాడి చేసిన చిరుత ఎట్టకేలకు కెమెరా కంటికి చిక్కింది. గత బుధవారం తల్లిదండ్రులతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారిపై చిరుతపులి దాడి చేసి గాయపర్చిన సంఘటన పాఠకులకు విదితమే. ఈ సంఘటనతో అటవీశాఖ ఉన్నతాధికారులు చిన్నారుట్ల గూడెంలో ఐదుగురు ప్రొటక్షన్ వాచర్లను ఏర్పాటు చేయటంలో పాటు గూడెం చుట్టూ 15 ట్రాప్డ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి గూడెం చుట్టూ ఏర్పాటు చేసిన కెమెరాలో చిరుత సంచారం నిక్షిప్తమైంది. చిన్నారుట్ల గూడెం పరిసరాల్లో సంచరిస్తున్న చిరుత గూడెంలోని రెండు లేగ దూడలపై కూడా దాడి చేసి వాటిని చంపినట్లు గిరిజనులు పేర్కొంటున్నారు. ఆయా సంఘటనలతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు ఆదివారం చిన్నారుట్ల గిరిజన గూడెంలో పర్యటించారు. ఈ సందర్భంగా పెద్దదోర్నాల ఫారెస్టు రేంజి అధికారి హరి గూడెంవాసులకు పలు సూచనలు చేశారు. రాత్రి వేళల్లో చెంచు గిరిజనులు బయట తిరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. గిరిజనులు అప్రమత్తంగా ఉండాలి.. నల్లమల అభయారణ్యంలో పులుల సంతతి పెరిగేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా పులులకు ఆహారంగా ఉపయోగపడే జింకలు, దుప్పులు, అడవి పందుల పెరుగుదలకు మూడు నెలల పాటు అభయారణ్యంలో ప్రవేశించటాన్ని అధికారులు నిషేధించారు. జూలై 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు పులుల మేటింగ్కు అనుకూలమైన వాతావరణం. దట్టమైన అభయారణ్యంలోని నిషిద్ధ ప్రాంతాల్లోకి పర్యాటకులు, ప్రజలు వెళ్లకుండా కట్టుదిట్టమైనా చర్యలు తీసుకుంటున్నారు. సాధారణంగా ఈ సమయం పూర్తిగా వర్షాకాలం కాబట్టి కురిసిన వర్షాలతో అడవి అంతా పచ్చబడి దట్టమైన చెట్లు, పొదలతో నిండి ఉంటుంది. ఈ కాలంలోనే పెద్దపులులు తాము జత కట్టిన పులితో ప్రశాంతతో సంచరిస్తుంటాయి. దీని వల్ల అభయారణ్యంలో నివసించే చెంచు గిరిజనులు ఈ సమయంలోనే కాస్తంత అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. రాత్రివేళ జాగ్రత్తగా ఉండండి.. చిన్నారుట్ల గూడెం వాసులు అప్రమత్తంగా ఉండాలని పెద్దదోర్నాల ఫారెస్టు రేంజి అధికారి హరి పేర్కొంటున్నారు. గత బుధవారం గూడెంలోని బాలికపై దాడికి పాల్పడినట్లుగా భావిస్తున్న చిరుత గూడెం చుట్టే తిరుగుతున్నట్లు కెమెరా ట్రాపుల్లో నిక్షిప్తమైంది. ఈ నేపథ్యంలో గూడేనికి చెందిన గిరిజనులు రాత్రి వేళల్లో జాగ్రత్తగా ఉండాలన్నారు. చిరుత సంచారానికి సంబంధించి సమాచారాన్ని ఉన్నతాధికారులకు నివేదించినట్లు ఆయన తెలిపారు. రాత్రి వేళల్లో గూడెం చుట్టూ తమ సిబ్బంది నిరంతర పెట్రోలింగ్ ఉంటుందని, గూడెం వాసులు ధైర్యంగా ఉండాలని ఆయన కోరారు. -
నీరున్నా నిష్ఫలం
త్రిపురాంతకం: కృష్ణమ్మ బిరబిరా పరుగులెడుతోంది. నదీ పరివాహంలోని జలాశయాలు నిండు కుండల్లా దర్శనమిస్తున్నాయి. అయినా సాగర్ రైతుల సాగునీటి కష్టాలు తీరే పరిస్థితులు కనిపించడంలేదు. సాగర్ జలాలు ప్రధాన కాలువ ద్వారా ప్రకాశం జిల్లాకు విడుదల చేసినా నేటికీ మేజర్లకు సాగునీటిని విడుదల చేయకపోవడంతో రైతాంగం మండిపడుతున్నారు. నాగార్జున సాగర్ ప్రధాన కాలువ ద్వారా సాగునీరు విడుదల చేసి దాదాపు 20 రోజులు కావస్తోంది. జిల్లాలో గత నెల 30న సాగర్ జలాలు ప్రధాన కాలువ ద్వారా సరఫరా అయ్యాయి. ఒంగోలు రామతీర్థం జలాశయానికి నీరందించిన వెంటనే సాగునీరు విడుదల చేస్తారని రైతాంగం ఎదురు చూసినా అదిజరగలేదు. సాగర్ అధికారుల చుట్టూ రైతులు సాగునీటి విడుదల కోసం ప్రదక్షిణ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి నీటి విడుదలపై ఎలాంటి నిర్థిష్టమైన ప్రకటన చేయలేదు. సాగునీటి విడుదలకు ఇంకా ఎన్నిరోజులు చూడాలని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. జలాశయాలు నిండాయి.. సాగర్ జలాలు సాగరానికి కృష్ణానది పరివాహంలో ఉన్న ఆల్మట్టి, నారాయణ్పూర్, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. గత నెల నుంచి జలాశయాల్లోని నీటిని తగ్గించేందుకు పలు దఫాలు గేట్లు తెరచి దిగువకు విడుదల చేశారు. సాగర్ జలాలు సముద్రం పాలవడం తప్ప జలాశయాల ద్వారా సాగునీరు అందించే పరిస్థితులు కనిపించడం లేదు. అధికారులను నీటి విడుదలపై ప్రశ్నిస్తే సమాధానం లేదు. వృథాగా సముద్రం వైపు పరుగులు తీస్తున్న నీటిని వినియోగించుకునే పరిస్థితుల్లో ప్రభుత్వం లేకపోవడంపై ప్రజలు విమర్శిస్తున్నారు. వృథా అవుతున్న నీటి ద్వారా సాగర్ పరివాహంలోని నోటిఫైడ్ చెరువులు, నాన్నోటిఫైడ్ చెరువులు, కుంటలు నింపితే కనీసం వాటి పరిధిలో భూగర్భ జలాలు పెరిగి బోర్లకు నీరు సమృద్ధిగా వచ్చేది. సాగర్ జలాలు విడుదలై 20 రోజులు.. నారుకు నీరులేదు సాగర్ జలాలు విడుదలై 20 రోజులు గడిచినా సాగుకు నీరందించకపోవడంతో రైతులు పంటలు వేసుకోవాలా లేదా అన్న అనుమానంతో ఉన్నారు. సాగునీరు లేక పోవడంతో సాగర్ కాలువల దిగువన నారుమళ్లు పోసుకునే పరిస్థితులు సన్నగిల్లాయి. కేవలం బోర్ల కింద అక్కడక్కడా నార్లు పోసుకునేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు. సాగునీరు వీలున్నంత తొందరగా విడుదల చేస్తే నారుమళ్లు పోసుకుంటామని అన్నదాతలు చెబుతున్నారు. మైనర్ కాలువ ద్వారా నీరందక నారుకు నోచుకోని భూములుసాగునీరు విడుదలకాని మేజర్ కాలువ -
పారా సిట్టింగ్ వాలీబాల్ వరల్డ్ కప్నకు విజయకుమార్ ఎంపిక
దర్శి: పారా క్రీడల్లో ఒకటైన పారా సిట్టింగ్ వాలీబాల్ వరల్డ్ కప్–2025 పోటీలకు దర్శి పట్టణానికి చెందిన వేల్పుల విజయకుమార్ ఎంపికయ్యారు. అక్టోబర్ 8 నుంచి 18 వ తేదీ వరకు అమెరికాలో జరగబోయే పారా సిట్టింగ్ వాలీబాల్ వరల్డ్ కప్ పోటీల్లో విజయ్కుమార్ పాల్గొననున్నారు. దీనికి సంబంధించి పారా ఒలింపిక్ ఆఫ్ ఇండియా నుంచి అధికారిక లేఖ అందినట్లు వేల్పుల విజయకుమార్ తెలిపారు. గతంలో 2023 లో కజకిస్థాన్ దేశంలో జరిగిన ఆసియన్ జోన్ పారా సిట్టింగ్ వాలీబాల్ పోటీల్లో భారతదేశం తరఫున విజయ్కుమార్ పాల్గొన్నారు. రెండోసారి భారతదేశం తరఫున ఆడటానికి అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ పారా సిట్టింగ్ వాలీబాల్ అసోసియేషన్ కు ధన్యవాదాలు తెలిపారు. మార్కాపురం: రాష్ట్రంలో మద్యం, మైనింగ్ మాఫియాల ఆగడాలను అరికట్టాలని ప్రజా సంకల్ప వేదిక జాతీయ అధ్యక్షుడు మధిర రంగసాయిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మార్కాపురంలోని వారి కార్యాలయంలో దక్షిణ కోస్తా జిల్లాల ముఖ్యనాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని నిర్మూలించేందుకు అందరూ ముందుకు రావాలని అన్నారు. రాజకీయ చైతన్యంతోనే రాజ్యాంగ ఫలాలు అన్నీ వర్గాలకు అందుతాయని అన్నారు. గ్రామ స్థాయి నుంచి ప్రజా సంకల్ప వేదికకు పునాదులు వేయాలన్నారు. మార్కాపురం మెడికల్ కాలేజీ శిథిలావస్థకు చేరుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెలుగొండ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నీ వర్గాల ప్రజలను ప్రజా సంకల్ప వేదికలోనికి ఆహ్వానించాలని రంగసాయిరెడ్డి సూచించారు. సింగరాయకొండ: ఊళ్లపాలెం వ్యాయామ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న పిల్లి హజరత్తయ్యను సస్పెండ్ చేసినట్లు డీఈఓ కిరణ్కుమార్ ఆదేశాలు జారీ చేశారని ఎంఈఓ–1 కత్తి శ్రీనివాసరావు తెలిపారు. ఇటీవల హజరత్తయ్యపై నకిలీ ధ్రువపత్రాలతో వ్యాయామ ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తూ ప్రభుత్వాన్ని మోసం చేశారని, విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు రావటంతో కలెక్టర్ తమీమ్ అన్సారియా త్రీమెన్ కమిటీ వేసి విచారణ చేశారు. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆయన విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలు రుజువుకావటంతో కలెక్టర్ ఆదేశాలతో హజరత్తయ్యను సస్పెండ్ చేసినట్లు వివరించారు. -
క్రీడలతో ఆత్మవిశ్వాసం
ఒంగోలు టౌన్: క్రీడలు క్రమశిక్షణతో పాటు మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. ఆదివారం స్థానిక మినీ స్టేడియంలో సిద్దార్థ కరాటే డు అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన 43వ అంతర్జాతీయ కరాటే పోటీలను ఆయన ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా 12 రాష్ట్రాల నుంచి తరలివచ్చిన 700 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీలను ప్రకాశం జిల్లాలో నిర్వహించడం సంతోషాన్ని కలిగించిందన్నారు. కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులకు శారీరక దృఢత్వంతో పాటుగా మానసిక స్థైర్యాన్ని కలిగిస్తాయని చెప్పారు. జాతీయ స్థాయిలో వివిధ ప్రాంతాలు, విభిన్న సంస్కృతుల నుంచి వచ్చిన క్రీడాకారులతో పరస్పర అవగాహన కలిగించడమే కాకుండా స్నేహాన్ని పెంపొందిస్తాయన్నారు. క్రీడలతో చెడు అలవాట్లను దూరంగా పెట్టవచ్చని చెప్పారు. జిల్లాకు చెందిన క్రీడాకారులు అద్భుతమైన నైపుణ్యాన్ని కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని చెప్పారు. తల్లిదండ్రులు పిల్లలను చదవుతో పాటు క్రీడల్లో కూడా ప్రోత్సహించాలని సూచించారు. క్రీడల్లో రాణించిన విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని, దేశానికి సేవ చేసే అవకాశం కూడా లభిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, తాలూకా సీఐ విజయకృష్ణ, టూటౌన్ సీఐ మేడా శ్రీనివాసరావు, కరాటే అసోసియేషన్ నాయకులు నల్లూరి మోహన్, విద్యా సంస్థల అధిపతి నల్లూరి వెంకటేశ్వర్లు, మండవ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పుస్తక మహోత్సవంలో చిన్నారుల సందడి
ఒంగోలు టౌన్: స్థానిక పీవీఆర్ హైస్కూల్ ఆవరణలో నిర్వహిస్తున్న పుస్తక మహోత్సవంలో ఆదివారం మూడో రోజు చిన్నారుల సందడి కనిపించింది. ఆదివారం సెలవు రోజు కావడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, చిన్నారులు, తల్లిదండ్రులు, ఉద్యోగులు, సాహితీ ప్రియులు తరలివచ్చారు. పిల్లల కథల పుస్తకాలు, కామిక్స్, యాక్టివిటీ పుస్తకాలను పిల్లలు కొనుగోలు చేశారు. నేషనల్ బుక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంజులూరు కృష్ణకుమారి, సీఏ ప్రసాద్ పర్యవేక్షణలో చిన్నారులకు సృజనాత్మక రచన వర్క్షాప్ నిర్వహించారు. దాదాపుగా 40 మంది చిన్నారులు ఈ వర్క్షాపులో ఉత్సాహంగా పాల్గొన్నారు. కొందరు చిన్నారులు కథలు రాయగా, మరికొందరు పిల్లలు తమకు నచ్చిన బొమ్మలు గీసి అభినందనలు అందుకున్నారు. అనంతరం ఎన్బీటీ ప్రచురించిన బాలల సాహిత్యం జుజూరానా, మంచిమిత్రులు, షేరా–మిత్తు, బుజ్జి గుడ్లగూబ, బాలు అండ్ తోకల కథలను ఆవిష్కరించారు. ప్రముఖ రచయిత నాగభైరవ ఆదినారాయణ అధ్యక్షత వహించగా ఎన్బీటీ దక్షిణ భారత ఇన్చార్జి పత్తిపాక మోహన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గంగిశెట్టి శివకుమార్ పుస్తకాలను ఆవిష్కరించారు. తదనంతరం జరిగిన చర్చా వేదికలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేదికలో తమను ప్రభావితం చేసిన పుస్తకాల గురించి జిల్లా ప్రముఖులు ప్రసంగించారు. ఆకట్టుకున్న మ్యాజిక్ షో... శాసీ్త్రయ సమాజం కోసం పోరాడుతున్న జన విజ్ఞాన వేదిక నిర్వహించిన ఇంద్రజాల ప్రదర్శన చిన్నారులను విశేషంగా ఆకట్టుకుంది. గాజు పెంకుల మీద నడవడం, మేకుల మీద నిలబడటం వంటి ప్రదర్శలు ఆలోచనలు రేకెత్తించాయి. పగిలిన గాజు పెంకుల మీద ఎలాంటి గాయాలు కాకుండా నడుస్తుంటే చిన్నారులు ఆశ్చర్యంతో తిలకించారు. కార్యక్రమంలో నల్లూరి వెంకటేశ్వర్లు, బుచ్చిబాబు, రవికుమార్, ఉదయ కిరణ్, కె.లక్ష్మయ్య, రహంతుల్లా, చిలకమర్తి పద్మజ, రహ్మానుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
పెండింగ్ కేసులు పరిష్కరించాలి
మద్దిపాడు: పెండింగ్ కేసులన్నింటినీ వేగంగా పరిష్కరించాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశించారు. మద్దిపాడు పోలీస్స్టేషన్ను ఆదివారం ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. స్టేషన్ను, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషన్ నిర్వహణపై ఎస్ఐ శివరామయ్యకు సలహాలు, సూచనలు చేశారు. 2020 నుంచి రికార్డులు పరిశీలించి పెండింగ్ కేసులు, మిస్సింగ్ కేసుల వివరాలడిగి తెలుసుకున్నారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని ఎస్ఐని ఆదేశించారు. అనంతరం స్టేషన్లోని ఫోన్లను పరిశీలించారు. డయల్100కు వచ్చే కాల్స్ విషయంలో సిబ్బంది ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారో పరిశీలించారు. స్టేషన్ను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఎస్పీ వెంట డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ ఉన్నారు. -
రోడ్డెక్కని ఫోర్ లైన్ పనులు.!
చీమకుర్తి: అదిగో ఫోర్లైన్.. ఇవిగో నిధులు అంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒంగోలు–బేస్తవారిపేట ఫోర్ లైన్ రోడ్డు నిర్మాణం గురించి ఊదరగొడుతున్నారు. కానీ, ప్రతిపాదనల దశ దాటి ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంతో ప్రభుత్వం తీరుపై ప్రజల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాలకులు, అధికారుల అధ్వానపు పనితీరు కారణంగానే ఫోర్ లైన్ పనులు రోడ్డెక్కలేదని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఒంగోలు సమీపంలోని ఎస్ఎస్ఎస్ కాలేజీ వద్ద 8వ కిలోమీటరు వరకు ఒంగోలు–కర్నూలు రోడ్డు ఫోర్ లైన్ నిర్మాణం జరిగి ఉంది. ఒంగోలు నుంచి 9వ కిలోమీటరు నుంచి బేస్తవారిపేట వరకు సంతనూతలపాడు, చీమకుర్తి, పొదిలి, కనిగిరి, మార్కాపురం, కంభం, బేస్తవారిపేట ఆర్అండ్బీ రోడ్డు మీదుగా దాదాపు 113 కిలోమీటర్ల మేర ఫోర్ లైన్ను నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఒంగోలు నుంచి బేస్తవారిపేట వరకు మూడు దశలలో సర్వేలు నిర్వహించి ఏది ఉత్తమమో పరిశీలించనున్నారు. ప్రభుత్వ భూమి, ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించాల్సిన భూమి ఎంతెంత ఉంటుందో లెక్కలు కట్టనున్నారు. ఎన్ని వంతెనలు, ఎన్నెన్ని బైపాస్లు, ఎన్ని టోల్ ప్లాజాలు పెడితే పెట్టిన ఖర్చు ఎంత కాలంలో వసూలు చేసుకునే వీలుంటుందనే పలు అంశాలపై సర్వేలు పూర్తయిన తర్వాత ఫోర్లైన్కు టెండర్లు పిలిచే అవకాశాలున్నాయి. ప్రతిపాదనలు, సర్వే పనుల్లోనే తీవ్ర జాప్యం నెలకొనడంతో ఇక రోడ్డు నిర్మాణ పనులు మొదలయ్యేది ఎప్పుడో.. పూర్తయ్యేది ఎప్పుడోనని ప్రజలు నిట్టూరుస్తున్నారు. ప్రభుత్వ నత్తనడక తీరును విమర్శిస్తున్నారు. చీమకుర్తి బైపాస్ వైపే ఫోర్ లైన్ ఎక్స్టెన్షన్కు ప్రతిపాదనలు... చీమకుర్తి పట్టణానికి ఊరు వెలుపుల సాగర్ కాలువ కట్ట మీదుగా ఇప్పటికే డబుల్ లైన్ బైపాస్ ఉంది. దాన్నే ఫోర్లైన్గా విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. చీమకుర్తి బైపాస్ను సాగర్కాలువకు ఉత్తరం వైపున్న కాలువ కట్టపై నిర్మించి ఉన్నారు. దానికి అదనంగా మరో డబుల్ లైన్ వేస్తే సరిపోతుందని భావిస్తున్నారు. వాస్తవానికి ఫోర్లైన్ నిర్మాణానికి డివైడర్కు ఇరువైపులా 7 మీటర్ల చొప్పున రెండువైపులా కలిసి 14 మీటర్లు కావాల్సి ఉంది. డివైడర్కు మరో రెండు మీటర్లు, ఇరువైపులా రోడ్డు మార్జిన్లకు మరో రెండు మీటర్ల చొప్పున 4 మీటర్లు కావాల్సి ఉంది. ఆ లెక్కన ఫోర్లైన్కు దాదాపు 20 మీటర్లు.. అంటే 60 అడుగుల వెడల్పున ఫోర్ లైన్ నిర్మించాల్సి ఉంది. చీమకుర్తి బైపాస్లో ఇప్పటికే డబుల్ లైన్ ద్వారా రోడ్డు 7 మీటర్ల వెడల్పులో, రెండుపక్కల మార్జిన్లుగా దాదాపు ఇరువైపులా 3 మీటర్లు ఉంది. ఇక ఫోర్లైన్కు అదనంగా 10 మీటర్లు.. అంటే 30 అడుగుల స్థలం కావాల్సి ఉంది. ఇప్పుడున్న బైపాస్ మార్జిన్ను ఆనుకుని పలు భవనాలు, వ్యాపార సముదాయాలు, పెట్రోల్ బంకులు వంటి నిర్మాణాలు ఉన్నాయి. దాదాపు 30 అడుగుల మేర ఫోర్లైన్కు చీమకుర్తి బైపాస్లో స్థలాన్ని సేకరించాల్సి ఉంది. ఆ లెక్కన బైపాస్లో విలువైన భవనాలు, ఇంటి స్థలాలు, పొలాలు రోడ్డు విస్తరణలో కోల్పోయే ప్రమాదం ఉంది. దీంతో చీమకుర్తి పట్టణ వాసులు కొంత మంది చీమకుర్తి మెయిన్రోడ్డులోనే పట్టణంలో నుంచి ఫోర్లైన్ నిర్మిస్తే పట్టణం డివైడర్లతో అందంగా ఉంటుందని అంటున్నారు. దాని వలన పట్టణం, వ్యాపార సముదాయాలు అందంగా రూపుదిద్దుకుని అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుందంటున్నారు. ఫోర్లైన్ను చీమకుర్తి పట్టణంలో నుంచే నిర్మించాలని ఆకాంక్షిస్తున్నారు. అలా చేయాలంటే పట్టణంలోని వ్యాపార సముదాయాలను రోడ్డుకు ఇరువైపులా 30–50 అడుగుల వెడల్పున కోల్పోయే ప్రమాదం ఉంటుంది. దీంతో మరికొందరు ఫోర్లైన్ను పట్టణంలో నుంచి కాకుండా ఊరు బయట బైపాస్వైపే నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకొంత మంది మాత్రం బైపాస్ వైపు ఫోర్ లైన్ నిర్మిస్తే ఇప్పుడున్న బైపాస్ను ఆనుకుని ఉన్న విలువైన స్థలాలు పోతాయని ఆందోళన చెందుతున్నారు. ఇక, సంతనూతలపాడు, పొదిలి పట్టణంలో నుంచి కాకుండా ఊరి బయట నుంచి బైపాస్లతో ఫోర్లైన్ నిర్మించాలని భావిస్తున్నారు. ఉత్తరం వైపు కట్టపై నిర్మించేందుకే ఆర్అండ్బీ అధికారుల మొగ్గు... ఆర్అండ్బీ అధికారులు మాత్రం చీమకుర్తిలో సాగర్ కాలువపై ఉత్తరం వైపున్న కట్టపై ఇప్పుడున్న డబుల్ లైన్ బైపాస్ను ఆనుకునే ఫోర్లైన్ నిర్మించేందుకు మొగ్గు చూపుతున్నారు. దక్షిణం వైపు నిర్మిస్తే కాలువ కట్టపై ఎంట్రెన్స్లో, ఎండింగ్లో రెండు వంతెనలు నిర్మించాల్సి వస్తుందని, అది అదనపు ఖర్చని అంటున్నారు. పీపీపీ పద్ధతిలోనే నిధుల సేకరణ... పేరుకు ఫోర్లైన్ అని ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించినప్పటికీ దానిని నిర్మించేందుకు కావాల్సిన నిధులను పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) పద్ధతిలో సేకరించాలని నిర్ణయించారు. నిర్మించే కాంట్రాక్టర్ టెండర్లో వర్క్ ఆర్డర్ దక్కించుకున్న తర్వాత నిర్మాణం పూర్తయ్యాక ఒంగోలు నుంచి బేస్తవారిపేట వరకు టోల్ప్లాజాలు ఏర్పాటు చేసి రోడ్డు నిర్మాణానికి పెట్టిన డబ్బును వడ్డీతో సహా వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. దీంతో ఫోర్లైన్ నిర్మించిన తర్వాత వాహనదారులపై భారం పడే అవకాశం ఉంది. పీపీపీ పద్ధతిలోనే ఫోర్లైన్ నిర్మాణం ఒంగోలు నుంచి బేస్తవారిపేట వరకు దాదాపు 113 కిలోమీటర్ల పొడవున ఫోర్లైన్ నిర్మించనున్నాము. పీపీపీ పద్ధతిలో టెండర్లు పిలుస్తారు. ప్రస్తుతం సర్వే నిర్వహించి ఎంత ఖర్చవుతుంది, సేకరించాల్సిన భూమి ఎంత వంటివి పూర్తయ్యాక టెండర్ల ప్రక్రియ జరుగుతుంది. – రామ్నాయక్, ఆర్అండ్బీ ఎస్ఈ, ఒంగోలు -
రవాణా కార్మికులను చిన్నచూపు చూస్తున్నారు
ఒంగోలు టౌన్: రవాణా రంగం కార్మికులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని, బీఎన్ఎస్ చట్టంతో కార్మికుల జీవితాలను సంక్షోభంలో పడేశాయని ఆలిండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంటేపల్లి శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక కొత్త కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మోటారు వాహనాల చట్టం, బీఎన్ఎస్ చట్టాలను తీసుకొచ్చి కార్మికులను కోలుకోని దెబ్బతీసిందని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై జిల్లాలో ఉద్యమం జరుగుతోందని తెలిపారు. పోలీసులు, ఆర్టీఓల వేధింపులకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ క్రమంలో ఒంగోలులో ఫెడరేషన్ రాష్ట్ర మహాసభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. నగరంలోని ఆటో కార్మికులకు పర్మినెంట్ స్టాండ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక కాపు కళ్యాణ మండపంలో మహాసభలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఫెడరేషన్ ఆలిండియా ప్రధాన కార్యదర్శి జనాబ్దేవ్, జాతీయ ఉపాధ్యక్షుడు ఆర్.లక్ష్మయ్య, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.శివాజీ, ముజఫర్ అహ్మద్, కె.దుర్గారావు తదితరులు పాల్గొంటారని తెలిపారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు మాట్లాడుతూ దేశంలోని కార్మిక వర్గంపై అణచివేత కొనసాగుతోందని చెప్పారు. కార్మిక కోడ్లతో ప్రాథమిక హక్కులు ప్రమాదంలో పడ్డాయని చెప్పారు. దేశంలో రవాణా రంగం చాలా కీలకమైనదని, రవాణా రంగం ఆగిపోతే దేశం స్తంభిస్తుందని చెప్పారు. కార్మిక హక్కుల సాధన కోసం ఐక్య పోరాటాలు చేపడతామన్నారు. సమావేశంలో కార్మిక సంఘ నాయకులు తంబి శ్రీనివాసరావు, దాసరి మల్లికార్జునరావు, మున్వర్ బాషా తదితరులు పాల్గొన్నారు. -
ప్రకాశం
ఆదివారం శ్రీ 17 శ్రీ ఆగస్టు శ్రీ 20257పుస్తకాల పండుగ ఏడేళ్ల తరువాత ఒంగోలు నగరంలోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో పుస్తక మహోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఈనెల 24వ తేదీ వరకు పుస్తకాల ప్రదర్శన నిర్వహిస్తారు. పశువుల అపహరణ ముఠా అరెస్టు పశువులను అపహకరించి సంతల్లో అమ్ముతున్న ఏడుగురుని మర్రిపూడి పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నాలుగు ట్రాలీ వాహనాలు, రూ.4.55 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. -
కన్నయ్యా
కృష్ణయ్యా..ఒంగోలు సంతపేటలోని సాయిబాబా మందిరం వద్ద ఉట్టికొడుతున్న చిన్నారికృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా శనివారం జిల్లాలోని వైష్ణవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పలు ఆలయాలు, విద్యా సంస్థల్లో చిన్నారుల చేత శ్రీకృష్ణ, గోపికల వేషధారణలు వేయించారు. యువతీ, యువకులు, చిన్నారులు ఉత్సాహంగా ఉట్టికొట్టారు.ప్రభుత్వ జూనియర్ కాలేజీ క్రీడా మైదానంలో చేసిన కొండపి ఏఎంసీ చైర్మన్ ప్రమాణ స్వీకారం ఏర్పాట్లుసాక్షి టాస్క్ఫోర్స్: ప్రభుత్వ విద్యా సంస్థల ప్రాంగణంలో విద్యా సంస్థల కార్యక్రమాలు తప్ప ఇతర ప్రైవేటు కార్యక్రమాలు ముఖ్యంగా రాజకీయ పార్టీల కార్యకలాపాలు నిర్వహించవద్దని కూటమి ప్రభుత్వం తరఫున విద్యాశాఖాధికారులు జీఓ జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కానీ సింగరాయకొండ మండల కేంద్రంలోని ఏఆర్సీ అండ్ జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజి ఆవరణలో కొండపి వ్యవసాయ మార్కెటింగ్ యార్డు చైర్మన్ పదవీ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా కూటమి పార్టీల నాయకుల ఫ్లెక్సీ లు క్రీడా ప్రాంగణంతో పాటు కాలేజి చుట్టుపక్కల ఏర్పాటు చేశారు. దీనికితోడు ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామితో పాటు మరో ముగ్గురు మంత్రులు, వివిధ రాష్ట్ర స్థాయి బోర్డు చైర్మన్లు పాల్గొన్నారు. వీరికి బందోబస్తు కింద దాదాపు 60కి పైగా పోలీసులను ఏర్పాటు చేశారు. ఈ కాలేజి ఆవరణ చుట్టు పక్కల పలు ప్రైవేటు విద్యా సంస్థలు, గృహాలు ఉన్నాయి. ఈ విధంగా జీఓలు వీరే ఇస్తారు.. మళ్లీ జీఓలను వీరే తుంగలో తొక్కటంపై ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వివరణ కోరేందుకు ఎంపీడీఓ, ఎంఈఓ, జిల్లా విద్యాశాఖాధికారిని ఫోన్ ద్వారా అడిగే ప్రయత్నం చేసినా వారు అందుబాటులోకి రాలేదు. దీనిపై వైఎస్సార్ సీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పఠాన్ రియాజ్ విస్మయం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ డొల్లతనానికి నిదర్శనమని ఆక్షేపించారు. – సాక్షి, ఒంగోలు -
చంద్రబాబు అంటే గుర్తుకొచ్చేది వెన్నుపోటే
పెద్దదోర్నాల: చంద్రబాబు పేరు చెపితే అందరికీ గుర్తుకు వచ్చేది వెన్ను పోటేనని యర్రగొండపాలెం ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి తాడిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. మండల పరిధిలోని పెద్దబొమ్మలాపురం, యడవల్లిలలో బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ గంటా రమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చంద్రశేఖర్ మాట్లాడుతూ ఊకదంపుడు ఉపన్యాసాలు, ప్రచారాలతో ప్రజలను మోసం చేయటమే చంద్రబాబు నైజమన్నారు. ఆయన చేసిన తప్పుడు ప్రచారాలకు మద్దతు పలికిన మీడియా చానళ్లకు ఎన్నో లాభాలు, పదవులను అందించిన ఘనత చంద్రబాబు నాయుడిదేనన్నారు. అయిన వారిని అందలాలు ఎక్కించిన చంద్రబాబు నిరుపేదలకు మాత్రం పిడికిలిని విదిల్నిన పాపాన పోలేదన్నారు. గతంలో డ్వాక్రా మహిళల రుణాల మాఫీ, రైతుల రుణాల మాఫీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు అని వారికి ఏమీ చేయని ఘనత చంద్రబాబుదేనన్నారు. అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయమే దండగ అన్న పెద్దమనిషి ఆయనేనన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఎన్నో పథకాలను అందించారని చెప్పారు. పాఠశాలను ఆధునికీకరించటంతో పాటు, వైద్యం కోసం ఎన్నో మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారన్నారు. దీంతో పాటు 55 వేల వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగాలను భర్తీ చేశారని తెలిపారు. నేడు మండల కేంద్రంలోని సామాజిక అరోగ్య కేంద్రంలో 14 వైద్యుల పోస్టుల ఖాళీలున్నాయన్నారు. పెద్దదోర్నాల ఆర్టీసీ బస్టాండ్కు తమ ప్రభుత్వం ద్వారా డబ్బులు చెల్లిస్తే, ఆ బస్టాండ్ను ఆక్రమించుకోవాలని టీడీపీ నాయకులు చూస్తున్నారన్నారు. ఈ సందర్భంగా పెద్దబొమ్మలాపురం తూర్పుపల్లెలో అంగన్వాడీ స్కూల్ ఎదుట మడుగులా మారిన స్థలాన్ని, ట్యాంకు నుంచి లీకుకు గురై వెళుతున్న నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం బొమ్మలాపురం బ్రహ్మంగారి గుడి వద్దనున్న గిరిజనులకు నీటి సమస్య, పక్కా గృహల సమస్యపై ఐటీడీఏ ప్రాజెక్టు అధికారితో మాట్లాడి వారి సమస్యలను వివరించారు. కార్యక్రమంలో నాయకులు సింగా ప్రసాద్, చిట్యాల వెంకటేశ్వరరెడ్డి, ఎంపీటీసీలు వెంకటరెడ్డి, రామనారాయణరెడ్డి, చిట్టె మల్లికార్జునరెడ్డి, వెన్నా పాండు రంగారెడ్డి, చిట్యాల వెంకటేశ్వరరెడ్డి, యక్కంటి శ్రీకాంత్రెడ్డి, పొందుగుల నాగమల్వేశ్వరి, అలుగుల లక్ష్మయ్య, మధు, రత్నరాజు, కొండా సురేష్, రావిక్రింది రామారావు, వెన్నా వెంకటేశ్వరరెడ్డి షెక్షావలి, లాలూనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
చక్ర బంధం!
ఉచితం..సాక్షి ప్రతినిధి, ఒంగోలు: స్వాతంత్య్ర దినోత్సవం రోజున కూటమి ప్రభుత్వం సీ్త్ర శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు సర్వీసులను ప్రారంభించింది. రెండో రోజు శనివారం మహిళల నుంచి అంతంత మాత్రంగానే స్పందన కనిపించింది. ఒంగోలు, మార్కాపురం బస్టాండ్లు మినహా మిగతా ప్రాంతాల్లో రద్దీ కనిపించలేదు. కనిగిరి,గిద్దలూరు,యర్రగొండపాలెం, సంతనూతలపాడు, కొండపి, దర్శి నియోజకవర్గాల్లో బస్సులు ఖాళీగానే తిరిగాయి. ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే ఆర్భాటంగా ప్రారంభించింది కానీ అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలమైందని మహిళా ప్రయాణికులు ఆరోపిస్తుండడం గమనార్హం. ఉచిత బస్సు పథకం ప్రారంభమైందికదా అని కండెక్టర్లను అడిగితే ఇంకా చార్ట్ రాలేదన్న సమాధానం వచ్చింది. దీంతో ఎంతో ఆశతో తొలిరోజే ఉచిత బస్సు ప్రయాణం చేయాలని ఆర్టీసీ బస్సు ఎక్కిన మహిళలు విస్తుపోయారు. జిల్లాలో అనేక రూట్లను కుదించడంతో ఆయా గ్రామాల మహిళలకు ఉచిత బస్సు ఉండీ ఉపయోగం లేకుండా పోతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. పొదిలి ఆర్టీసీ డిపోను సందర్శించిన ఆర్ఎం సత్యనారాయణకు ఊహించని విధంగా ప్రయాణికుల నుంచి చుక్కెదురైంది. అసలే బస్సులు సరిగా లేవని, గంటల కొద్దీవేచి చూసినా బస్సులు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత బస్సుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలని చెప్పారు. దాంతో ప్రయాణికులకు జవాబు చెప్పలేక ఆర్ఎం వెనుదిరిగారు. 500లకు పైగా గ్రామాలకు బస్సుల్లేవు.. జిల్లాలో 729 పంచాయతీలు ఉన్నాయి. శివారు కాలనీలతో కలుపుకొని 1823 గ్రామాలు ఉన్నాయి. ఇందులో దాదాపుగా 500 గ్రామాలకు పైగా ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. ఒక్క ఒంగోలు పరిసర గ్రామాల్లో 60 నుంచి 100 గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడపడం లేదు. ఏలూరివారిపాలెం, గుడిపాడు, బోడపాలెం, పిడతలపూడి రూట్లలో ఆర్టీసీ బస్సులు తిరగడంలేదు. మువ్వవారి పాలెంకు ఒకప్పుడు బస్సు సౌకర్యం ఉండేది. ఇప్పుడా సర్వీసును నిలిపివేశారు. ఇనుమలమోటూరు, గాజులపాలెం, రాయవారిపాలెం, అన్నంగి, బసవన్నపాలెం, చింతాయపాలెం గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. ఒంగోలు డిపో నుంచి టంగుటూరు మీదుగా కామేపల్లి వెళ్లే రూట్లో 10 గ్రామాలు ఉన్నాయి. వాటికి కూడా ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. నిజానికిది మెయిన్ రూటు. ఈ రూటులో ప్రయాణికులు ఎక్కువగా తిరుగుతుంటారని ఆర్టీసీ సిబ్బంది చెబుతున్నారు. టంగుటూరు నుంచి ఆలకూరపాడు, అనంతవరం గ్రామాలకు వెళ్లాలంటే ఆటోలే దిక్కు. కనపర్తిలో గతంలో 4 బస్సులు తిరిగేవి. ఇప్పుడు కేవలం ఒక్క బస్సు సర్వీసును మాత్రమే తిప్పుతున్నారు. పొదిలి నుంచి వయా మునగపాడు మీదుగా దొనకొండకు గతంలో 8 బస్సు సర్వీసులు తిరిగేవి. ఇప్పుడు ఒక్క బస్సు సర్వీసు కూడా లేకుండా తీసేశారు. ఇది కూడా రద్దీ బాగా ఉండే మెయిన్ రూటు కావడం విశేషం. కనిగిరి డిపో పరిధిలో గానుగపెంట, బడుగులేరు గ్రామాల రూట్లో అసలు బస్సులు తిరగడం లేదు. ఏరువారిపల్లి, పోలారం రూట్లలో కూడా ఆర్టీసీ బస్సు సర్వీసులు తిరగడం లేదు. అడ్డరోడ్డు, నల్లారెడ్డిపల్లిలకు ఆర్టీసీ బస్సులు వెళ్లవు. అడ్డరోడ్డు లోపల ఉన్న 10 గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడపడం లేదు. గిద్దలూరు మండలంలోని కొంగలవీడు, వేములపాడు, కొమ్మూనూరు, నల్లగట్ల, అంబవరం, వెళ్లుపల్లె, వెంగళరెడ్డి పల్లె, జయరామపురం, కంచిపల్లె, అంకిరెడ్డి పల్లె, ఓబులాపురం, వెంకటాపురం, బురుజుపల్లి గ్రామాలకు ఆర్టీసీ బస్సులను నడపడం లేదు. కొమరోలు మండలంలో చింతలపల్లె పంచాయతీలోని అన్నీ గ్రామాలకు ఆర్టీసీ బస్సులు వెళ్లవు. మండలంలోని మరో 17 గ్రామాలకు కూడా బస్సులు నడపడం లేదు. అర్ధవీడు మండలంలోని అంకభూపాలెం, ఇందిరానగర్, నారాయణ పల్లె, వీరభద్రాపురం, అయ్యావారిపల్లి గ్రామాలకు ఆర్టీసీ బస్సులు లేవు. బేస్తవారిపేట చెన్నుపల్లె, బాలేశ్వరపురం, రాచర్ల మండలంలోని 10 గ్రామాలకు, కంభం మండలంలోని రావిపాడు, ఎల్ కోట, లింగోజిపల్లి గ్రామాలకు బస్సులు లేవు. మార్కాపురం పరిధిలో 34 గ్రామాలకు బస్సులు లేవు. ఈ గ్రామాలకు చెందిన మహిళలు ఉచిత బస్సు ఎక్కాలంటే ఆటోలో మార్కాపురం, తర్లుపాడు, కొనకనమిట్ల మండల కేంద్రాలకు వచ్చి ఎక్కాల్సి ఉంటుంది. ఉచిత బస్సు సౌకర్యం జిల్లాలోని ప్రజలందరికీ అందుబాటులో లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. పుణ్యక్షేత్రాలకు ఉచితం లేనట్లే.. జిల్లా నుంచి వందలాది భక్తులు నిత్యం తిరుపతి, శ్రీశైలం, అన్నవరం, సింహాచలం, శ్రీకాళహస్తి వెళుతుంటారు. అయితే ఈ పుణ్యక్షేత్రాలకు వెళ్లాలంటే ఎక్స్ప్రెస్ బస్సులు చాలా తక్కువ. అధిక శాతం సూపర్ లగ్జరీ, అల్ట్రాడీలక్స్ బస్సులు మాత్రమే ఉన్నాయి. దీంతో భక్తులు తప్పనిసరిగా టికెట్టు కొని ప్రయాణాలు చేయాల్సిందే. జిల్లాలో కూడా మాలకొండ, భైరవకోన, శింగరకొండ తదితర ఆధ్యాత్మిక కేంద్రాలకు బస్సు సౌకర్యం లేదు. దాంతో ఉచిత ప్రయాణం చేయాలన్నా ఆ అవకాశం లేదు. రాయలసీమ నుంచి కొత్తపట్నం, కరేడు, రామాయపట్నం బీచ్లకు ఎక్కువ మంది పర్యాటకులు వస్తుంటారు. నేరుగా ఇక్కడకు వెళ్లడానికి కూడా ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ఉచిత బస్సు సౌకర్యం ఉన్నా ఉపయోగపడే అవకాశం లేదని చెబుతున్నారు.బస్సుల కోసం మార్కాపురం బస్టాండులో వేచిచూస్తున్న మహిళలు2112ఉచిత బస్సు సౌకర్యం కేవలం పల్లెవెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సులకు మాత్రమే పరిమితం చేశారు. జిల్లాలోని ఒంగోలు ఆర్టీసీ డిపోలో సూపర్ లగ్జరీ, ఆల్ట్రాడీలక్స్, 4 ఏసీ బస్సు సర్వీసులు ఉన్నాయి. జిల్లాలోని మిగతా 4 డిపోలను కలుపుకొని మొత్తం 10 వరకు ఏసీ బస్సులు ఉన్నాయి. దూరప్రాంతాలకు వెళ్లే వారు, అనారోగ్యంతో బాధపడే వారు సహజంగా ఏసీ బస్సుల్లో ప్రయాణం చేయాలనుకుంటారు. అయితే ఉచిత బస్సు పథకంలో ఏసీ బస్సులను అనుమతించలేదు. మహిళలు ఏసీ బస్సులు ఎక్కడానికి అనర్హులా అని మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అలాగే సూపర్ లగ్జరీ, అల్ట్రాడీలక్స్ సర్వీసుల్లో కూడా అనుమతించాలని డిమాండ్ చేస్తున్నాయి.ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్.. శనివారం మధ్యాహ్నం 12.30.. కనిగిరి వైపు వెళ్లే ప్లాట్ఫాం వద్ద పెద్ద ఎత్తున మహిళలు బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపు గంటసేపటి నుంచి పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసుల కోసం నిరీక్షించారు. ఇక వేచిచూసే ఓపికలేక చాలా మంది మహిళలు అప్పుడే వచ్చిన అల్ట్రాడీలక్స్ బస్సు ఎక్కేశారు. మరి కొందరు మాత్రం బస్సుల కోసం ఎదురు చూశారు. ఒంటిగంట సమయంలో ఎక్స్ప్రెస్ బస్సు వచ్చింది. 12.30 గంటల సమయంలో సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు బస్టాండ్లో 15 బస్సులు ఉండగా అందులో 8 సూపర్ లగ్జరీ, ఆల్ట్రాడీలక్స్, ఇంద్రా సర్వీసులు ఉన్నాయి. సీ్త్రశక్తి పేరుతో కూటమి ప్రభుత్వం ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అవస్థల యానంగా మారింది. కేవలం ఐదు రకాల బస్సులకు మాత్రమే అనుమతినిచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణించవచ్చు అంటూ ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, నాయకులు చేస్తున్న హడావుడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదిలోనే హంసపాదన్నట్లు తొలిరోజే కొన్ని రూట్లలో మహిళలు టికెట్టు తీసుకొని ప్రయాణించాల్సి వచ్చింది. ఉచిత బస్సు పథకం ప్రారంభమైందికదా అని కండెక్టర్లను అడిగితే ఇంకా చార్ట్ రాలేదన్న సమాధానం వచ్చింది. దీంతో ఎంతో ఆశతో తొలిరోజే ఉచిత బస్సు ప్రయాణం చేయాలని ఆర్టీసీ బస్సు ఎక్కిన మహిళలు విస్తుపోయారు. ఉచిత బస్సు కోసం మహిళలు గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది. జిల్లాలో దాదాపు 500 గ్రామాలకు బస్సు సర్వీసులు లేకపోవడం గమనార్హం. -
వేల్ మురుగా..హరోం హర
ఊరేగింపులో వల్లీదేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవమూర్తులుమేళతాళాలతో నిర్వహిస్తున్న వేల్కావడి మహోత్సవంశ్రావణ మాసం సందర్భంగా ఒంగోలులోని కేశవస్వామి పేట శివాలయంలో ఉన్నసుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజల అనంతరం వేల్కావడి నగరోత్సవాన్ని శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు శరీరానికి శూలాలు గుచ్చుకుని, కావడిలు మోస్తూ సుబ్రహ్మణ్యేశ్వరుని భజిస్తూ మేళతాళాలతో నగరోత్సవం నిర్వహించారు. కేశవస్వామిపేట శివాలయం నుంచి సుబ్రహ్మణ్యేశ్వరుని కావడితో వస్తున్న భక్తులుశూలం గుచ్చుకుని కావడి మోస్తున్న భక్తుడు -
గొప్పనేత సర్దార్ గౌతు లచ్చన్న
ఒంగోలు వన్టౌన్: సర్దార్గా ఖ్యాతి గడించిన స్వాతంత్య్ర సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల పెన్నిధి, రైతు బాంధవుడు, కార్మిక శ్రేయోభిలాషి అయిన గొప్ప నేత సర్దార్ గౌతు లచ్చన్న అని బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ ఎం వెంకటేశ్వరరావు అన్నారు. గౌతు లచ్చన్న 116వ జయంతి వేడుకలను ఒంగోలు బీసీ కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీ మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంకితభావంతో ఎన్నో ఉద్యమాలు నడిపిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. కార్యదక్షత, ఉక్కు సంకల్పం వలనే ఆయనకు సర్దార్ అనే పేరు వచ్చిందన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఎగిసిపడిన రాజకీయ కెరటమన్నారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం పదవులను సైతం త్యాగం చేశారని చెప్పారు. ఈ సందర్భంగా గౌతు లచ్చన్న చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి నిర్మలా జ్యోతి తదితరులు పాల్గొన్నారు.ఒంగోలు: జిల్లా స్థాయి యోగాసన పోటీలు ఈనెల 17న స్థానిక అంజయ్య రోడ్డులోని ఏకేవీకే విద్యాకేంద్రం ఆవరణలో నిర్వహిస్తున్నట్లు యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ప్రకాశం అధ్యక్ష, కార్యదర్శులు బోయపాటి రవి, సోమ సుబ్బారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ట్రెడిషనల్, ఆర్టిస్టిక్ సోలో, ఆర్టిస్టిక్ పెయిర్, రిథమిక్ పెయిర్ విభాగాల్లో పోటీలు ఉంటాయి. 9 నుంచి 14 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు సబ్ జూనియర్స్, 14పైన 18 మధ్య వయస్సు ఉన్నవారు జూనియర్స్, 18పైన 28 మధ్యవయస్సు ఉన్నవారు సీనియర్స్గా పరిగణిస్తారు. 28 ఏళ్లకు పైబడిన వారికి ట్రెడిషనల్ యోగాసనాల్లో మాత్రమే పోటీలు ఉంటాయి. పూర్తి వివరాలకు సెల్ నంబర్లు 7780680121 లేదా 9490163312 లను సంప్రదించాలని అధ్యక్ష, కార్యదర్శులు బోయపాటి రవి, సోమ సుబ్బారావు పేర్కొన్నారు. బేస్తవారిపేట: స్థానిక త్రిలోక పుణ్యక్షేత్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా బండలాగుడు పోటీలు నిర్వహించారు. గుంటూరు జిల్లా పత్తిపాడుకు చెందిన పమిడి అంజయ్య చౌదరి ఎడ్లు 3752 అడుగుల దూరం లాగి మొదటి స్థానంలో నిలిచాయి. కంభం మండలం దరగకు చెందిన సిద్దన కళ్యాణ్ ఎడ్లు 3750 అడుగులు, వైఎస్సార్ జిల్లా పాలూరుకు చెందిన కే హేమలతారెడ్డి ఎడ్లు 3500 అడుగులు, బేస్తవారిపేట మండలం బసినేపల్లెకు చెందిన వెనిగండ్ల శ్రీనివాసులు ఎడ్లు 3500 అడుగులు, పల్నాడు జిల్లా బయ్యవరానికి చెందిన కడియం మణికంఠ ఎడ్లు 3455 అడుగులు, గిద్దలూరు మండలం అక్కలరెడ్డిపల్లె కుతుర్ల దీక్షిత్రెడ్డి, నిశాంత్రెడ్డి ఎడ్లు 3269, పల్నాడు జిల్లా అడవిపాలెం పొకల శ్రీనివాసులు ఎడ్లు 3255, రాచర్ల మండలం అక్కపల్లె మండలం బత్తుల భూపాల్ ఎడ్లు 3051, ప్రకాశం జిల్లా గురువారెడ్డిపాలేనికి చెందిన వాకా సుబ్బారెడ్డి ఎడ్లు 3 వేల అడుగులు, అవుకు మండలం సంకేసులకు చెందిన సగబాలి ఆంతోనమ్మ ఎడ్లు 3 వేల అడుగుల దూరం లాగి వరుసగా ఒకటి నుంచి పది స్థానాల్లో నిలిచాయి. గెలుపొందిన ఎడ్ల యజమానులకు మొదటి పది బహుమతులు వరుసగా రూ.20 వేలు, రూ.16 వేలు, రూ.12 వేలు, రూ.10 వేలు, రూ.8 వేలు, రూ.6 వేలు, రూ.4 వేలు, రూ.3, రూ.2500, రూ.2 వేలను దాతలు అందజేశారు. -
పుస్తకాల పండుగ.!
ఒంగోలు టౌన్: నగరంలో పుస్తకాల పండుగ జరుగుతోంది. ఏడేళ్ల సుదీర్ఘకాలం తర్వాత నగరంలో పుస్తక మహోత్సవం ఏర్పాటు చేయడంతో ప్రజలు ఎంతో ఆసక్తిగా సందర్శిస్తున్నారు. ఒంగోలులోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ పుస్తక మహోత్సవానికి నగరంలోని అన్నివర్గాల ప్రజలు, యువకులు, విద్యార్థులైన బాలబాలికలు సైతం పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మొబైల్ ఫోన్లు వచ్చాక నేటి తరంలో పుస్తక పఠనం తగ్గిపోయిందన్న ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో ఒంగోలు నగరంలో ఏర్పాటు చేసిన పుస్తక మహోత్సవానికి భారీ స్పందన లభించడం నిర్వాహకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటి వరకూ హైదరాబాద్, విజయవాడ వంటి నగరాలకు మాత్రమే పరిమితమైన పుస్తక ప్రదర్శన ఒంగోలు నగరంలో కూడా ఏర్పాటు చేయడంతో ప్రజల్లో ఆసక్తి నెలకొన్నట్లు తెలుస్తోంది. 2016 సంవత్సరంలో తొలిసారిగా ఒంగోలులో పుస్తక మహోత్సవాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం రెండేళ్ల తర్వాత 2018లో రెండోసారి పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. తిరిగి ఏడేళ్ల తర్వాత ఇప్పుడు పుస్తక మహోత్సవం జరుగుతుండటంతో పండుగ వాతావరణం కనిపిస్తోంది. అందుబాటులో లక్ష పుస్తకాలు... పుస్తక ప్రదర్శనలో 600 మంది ప్రచురణకర్తలకు సంబంధించిన లక్ష పుస్తకాలు అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎప్పుడో చిన్నప్పుడు చదివిన చందమామ కథల పుస్తకాలను కూడా ఈ ప్రదర్శనలో ఉంచడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రపంచ ప్రసిద్ది చెందిన జార్జీ బెర్నాడ్డ్ షా, లియో టాల్స్టాయ్, డీల్ కార్నగీ, నెపోలియన్ హీల్, ప్యూడోర్ దోస్తోయ్ఎస్కీ, ఆల్బర్ట్ కాము రాసిన ఆంగ్ల సాహిత్యం పుస్తకాలను కూడా అందుబాటులో ఉంచారు. బాలల సాహిత్యం, ఆధ్యాత్మిక గ్రంథాలు, ఆరోగ్య రక్షణకు సంబంధించిన పుస్తకాలు, కథలు, నవలలు, కవిత్వం, కెరీర్ గైడెన్స్, లా బుక్స్ ఇంకా అనేక పుస్తకాలు ప్రదర్శనలో ఉన్నాయి. జపనీస్ మాంగా కామిక్స్, పజిల్స్, యాక్టివిటీ పుస్తకాలు ఆకట్టుకుంటున్నాయి. నేషనల్ బుక్ ట్రస్ట్, అరసం, ఎమెస్కో, అన్వీక్షణి, విశాలాంధ్ర బుక్ హౌస్, ప్రజాశక్తి బుక్ హౌస్ లాంటి ప్రసిద్ధ సంస్థలతో పాటు మొత్తం 35 బుక్ స్టాల్స్ ఉన్నాయి. పుస్తకాల కొనుగోళ్లపై 10 శాతం రాయితీ కూడా ఇస్తున్నారు. ఇన్ని పుస్తకాలు ఒకేచోట దొరకడం చాలా అరుదైన సందర్భం కావడంతో విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, సాహిత్య ప్రియులు, విద్యార్థులు, యువకులు పుస్తక మహోత్సవానికి అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రతిరోజూ సాహిత్య సమావేశాలు... పుస్తక మహోత్సవాన్ని పురస్కరించుకుని మాదాల రంగారావు సాహిత్య వేదిక వద్ద ప్రతిరోజూ వివిధ అంశాల మీద సాహిత్య చర్చలు ఏర్పాటు చేస్తున్నారు. శనివారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన 100 మంది కవులతో కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ తమీమ్ అన్సారియా, మాజీ ఐఏఎస్ అధికారి ఎండీ ఇంతియాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పొన్నూరు శ్రీనివాసులు, చంద్రనాయక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 18వ తేదీ గ్రంథాలయాలు సమాజం అనే అంశం మీద చర్చ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 19వ తేదీ పాటల జయరాజ్తో ముఖాముఖి, 20న చలం రచించిన సీ్త్ర నవల వచ్చి 100 ఏళ్లయిన సందర్భాన్ని పురస్కరించుకుని చర్చ ఏర్పాటు చేశారు. 21వ తేదీ ప్రముఖ జర్నలిస్టు తెలకపల్లి రవి రచించిన 6 పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. అదేరోజు సాయంత్రం 6 గంటలకు తల్లిదండ్రులు, పిల్లలు, ఉపాధ్యాయులు, చదువులపై వీరి పాత్ర అంశంపై చర్చ ఏర్పాటు చేశారు. 24న ముగింపు సభ జరగనుంది. దీంతోపాటు మూఢనమ్మకాలపై అవగాహన కల్పించే విధంగా జనచైతన్య వేదిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో చిన్నారులను ఆకట్టుకుంటున్నాయి. పుస్తక మహోత్సవంలో పుస్తకాలను పరిశీలిస్తున్న విద్యార్థినులు, వృద్ధుడు ఒంగోలులో పుస్తక మహోత్సవానికి భారీగా తరలివస్తున్న ప్రజలు బాలబాలికలు సైతం పుస్తకాలు కొనడానికి ఆసక్తి సాహిత్య సమావేశాలతో నగరంలో పండుగ వాతావరణం 24 వరకు పుస్తక మహోత్సవం -
పశువుల అపహరణ ముఠా అరెస్ట్
మర్రిపూడి: పశువులను అపహరించి సంతల్లో అమ్మి సొమ్ము చేసుకుంటున్న ముఠాను మర్రిపూడి పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఐ రమేష్బాబు ఆ వివరాలు వెల్లడించారు. పొదిలి, మర్రిపూడి, చీమకుర్తి, కొండపి, కొనకనమిట్ల తదితర మండలాల్లో మేత కోసం పొలం వెళ్లిన పశువులను ట్రాలీ వాహనాల్లో ఎక్కించి అక్రమంగా తరలిస్తున్నారు. ఆ సమయంలో ఎవరైనా అడ్డొస్తే వారిపై మారణాయుధాలతో దాడి చేస్తున్నారు. అపహరించిన పశువులను గుట్టుచప్పుడు కాకుండా ఇతర జిల్లాల్లోని పశువుల సంతకు తరలించి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. కొన్నాళ్లుగా ఇలాంటి పశువుల అపహరణ సంఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. మర్రిపూడి మండలంలోని పలు గ్రామాల్లో ఘటనలు... మర్రిపూడి మండలంలోని గుండ్లసముద్రం, మర్రిపూడి, కూచిపూడి, రేగలగడ్డ తదితర గ్రామాల్లో వరుసగా పశువుల అపహరణ ఘటనలు చోటుచేసుకున్నాయి. దాంతో పాటు చుట్టుపక్కల మండలాల్లోని అనేక గ్రామాల్లోనూ పశుపోషణే జీవనాధారంగా చేసుకుని జీవిస్తున్న వారికి చెందిన పశువులు అపహరణకు గురయ్యాయి. పశుపోషకులు వారి పశువులను మేత కోసం ఆయా గ్రామాల పరిసరాల్లోని బీడు భూములకు తోలతారు. అనంతరం వాటికి ఎవరూ కాపలా ఉండరు. మేత మేయడం పూర్తయిన తర్వాత సాయంత్రానికి వాటంతట అవే ఆయా గ్రామాల్లోని యజమానుల నివాసాలకు చేరుకుంటాయి. దీన్ని ఆసరాగా చేసుకుని పశువుల అపహరణ ముఠా రెచ్చిపోయింది. దొంగలే పశుకాపరుల అవతారమెత్తి... పశుకాపరులెవరూ లేకుండా బీడు భూముల్లో మేతమేస్తూ మందలుగా ఉన్న పశువులను దొంగలు గుర్తిస్తారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎవరూ లేని సమయం చూసి ఓ పథకం ప్రకారం పశుకాపరుల అవతారమెత్తి దాదాపు 2 కిలోమీటర్ల దూరం వాటిని తోలుకుపోతారు. అక్కడ ఓ పథకం ప్రకారం ముందే సిద్ధంగా ఉంచిన ట్రాలీ వాహనాల్లో బలవంతంగా పశువులను ఎక్కిస్తారు. నేరుగా ఇతర జిల్లాల్లోని సంతకు తరలిస్తారు. వాటిని సంతలో అమ్మి వచ్చిన సొమ్ముతో జల్సా చేసుకుంటారు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా కొన్నాళ్లు వేచి ఉండి ఆ తర్వాత మళ్లీ పశువుల అపహరణకు పాల్పడతారు. గ్రామాల్లో తిరుగుతూ అదును చూసి పశువులను మాయం చేస్తూ ఉంటారు. పశువులను కోల్పోయిన వారు వాటి జాడ కోసం వెతికీవెతికీ వేసారిపోతుంటారు. ఇలా అదృశ్యమవుతున్న పశువుల సంఖ్య క్రమంగా పెరిగిపోవడంతో బాధిత పశుకాపరులంతా ఏకమై తమ పశువుల జాడ చూపాలంటూ పోలీసులను ఆశ్రయించారు. సాక్షిలో కథనం ప్రచురితం కావడంతో స్పందించిన పోలీసులు... మర్రిపూడి మండలంలోని గ్రామాల్లో పశువులు అపహరణకు గురవుతూ బాధిత పశుపోషకుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోవడంతో సాక్షి దినపత్రికలో గత జూలై 25వ తేదీ పశువుల అపహరణ శీర్షికతో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఆ కథనానికి స్పందించిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో గత శుక్రవారం రాత్రి మర్రిపూడి మండలంలోని రేగలగడ్డ సమీపంలో చెరువు కట్ట వద్ద అనుమానాస్పదంగా తారసపడిన పశువుల తరలించిన వాహనాలను స్వాధీనం చేసుకుని విచారించారు. తద్వారా అనుమానితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కొనకనమిట్లకు చెందిన నలుగురు, పొదిలికి చెందిన ముగ్గురు నిందితులను పోలీస్స్టేషన్కు తరలించి తమదైన శైలిలో పోలీసులు విచారించడంతో పశువులను అపహరించింది తామేనని వారు అంగీకరించారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వారి వద్ద ఉన్న నాలుగు ట్రాలీ వాహనాలు, ఓ ద్విచక్ర వాహనంతో పాటు పలు మారణాయుధాలు, రూ.4.55 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం నిందితులను పొదిలి కోర్టులో హాజరుపరచనున్నట్లు మర్రిపూడి ఎస్ఐ టీ రమేష్బాబు తెలిపారు. నిందితులతో మర్రిపూడి ఎస్ఐ రమేష్బాబు నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న గేదెలను అక్రమంగా తరలించిన ట్రాలీ వాహనాలు ఏడుగురిని అదుపులోకి తీసుకున్న మర్రిపూడి పోలీసులు నాలుగు ట్రాలీ వాహనాలు, ఒక ద్విచక్ర వాహనం, రూ.4.55 లక్షల నగదు స్వాధీనం -
జాతీయ జెండాకు అవమానం
పొన్నలూరు: మండలంలోని కె.అగ్రహారం గ్రామంలో సచివాలయ సిబ్బంది నిర్వాకంతో జాతీయ జెండాకు అవమానం జరిగింది. శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గ్రామ సచివాలయ భవనం వద్ద సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు జాతీయ జెండా ఎగురవేశారు. సాయంత్రం 5 గంటల తర్వాత జెండా తీసి భద్రపరచాల్సి ఉండగా, అలా చేయకుండా మర్చిపోయి వదిలేశారు. దీంతో శనివారం ఉదయం జెండా కిందపడిపోయి ఉంది. శనివారం కూడా కార్యాలయాలకు సెలవు కావడంతో సిబ్బంది విధులకు రాలేదు. దీంతో కిందపడిన జెండా మట్టిలో అలాగే ఉంది. సిబ్బంది నిర్లక్ష్యంపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస దేశభక్తి, బాధ్యత లేకుండా సచివాలయ సిబ్బంది వ్యవహరించడాన్ని విమర్శిస్తున్నారు. కె.అగ్రహారంలో సచివాలయ సిబ్బంది నిర్వాకం శుక్రవారం ఎగురవేసిన జెండాను తియ్యకుండా నిర్లక్ష్యం కిందపడిన జాతీయ జెండా -
జేవీవీ రాష్ట్ర మహాసభల పోస్టర్లు ఆవిష్కరణ
ఒంగోలు టౌన్: జన విజ్ఞాన వేదిక (జేవీవీ) రాష్ట్ర మహాసభల పోస్టర్లను శనివారం ఒంగోలులో ఆవిష్కరించారు. సెప్టెంబర్ 13, 14 తేదీల్లో విజయనగరంలో జరగనున్న రాష్ట్ర 18వ మహాసభలను జయప్రదం చేయాలని జేవీవీ సీనియర్ నాయకుడు ఏవీ పుల్లారావు పిలుపునిచ్చారు. నగరంలోని ఎల్బీజీ భవనంలో గల జేవీవీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర మహాసభల పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాలలో శాసీ్త్రయ సమాజం ఏర్పాటే లక్ష్యంగా గత 38 ఏళ్లుగా జేవీవీ పనిచేస్తోందని తెలిపారు. మూఢ నమ్మకాల వలన సమాజ ప్రగతి నిలిచిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సైన్స్ ఆధారంగా ఆలోచన చేయాలని సూచించారు. ఉపాధ్యాయులు, విద్యావంతులు, యువకులు సమాజ చైతన్యం కోసం జేవీవీలో భాగస్వాములు కావాలని కోరారు. జేవీవీ రాష్ట్ర కమిటీ సభ్యుడు సీహెచ్ జయప్రకాష్, యు.భాస్కర్ మాట్లాడుతూ అందరికీ మెరుగైన విద్య, నాణ్యమైన వైద్యం అందాల్సిన అవసరం ఉందన్నారు. చిన్నారులు, పాఠశాల విద్యార్థులలో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించాలని చెప్పారు. కార్యక్రమంలో జేవీవీ జిల్లా ఉపాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.దేవప్రసాద్, ఏ విశ్వరూపం, ఎస్వీ రంగారెడ్డి, ఎన్టీ వెంకటేష్, జె.శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ
● మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు మార్కాపురం టౌన్: ఇటీవల జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కూటమి ప్రభుత్వం ఖూనీ చేసిందని మాజీ ఎమ్మెల్యే మార్కాపురం ఇన్చార్జి అన్నా రాంబాబు విమర్శించారు. శనివారం ఆయన వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా నిర్వహించాల్సిన ఎలక్షన్ కమిషన్, పోలీసులు, పోలింగ్ సిబ్బంది అధికార పార్టీతో కుమ్మక్కవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టే అన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన వీడియో, ఫొటోల సాక్షిగా జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కమలాపురం ప్రాంతాలకు చెందిన టీడీపీ నాయకులు దొంగఓట్లు వేస్తూ పట్టుబడ్డారన్నారు. పులివెందులలో ప్రజాస్వామ్యం వర్ధిల్లిందంటూ మంత్రి లోకేష్ చేసిన ట్వీట్ వీడియోలోనే దొంగ ఓటర్లున్నారన్నారు. పోలింగ్ బూత్ను ఆక్రమించుకున్న మంత్రి రామప్రసాద్రెడ్డిపై ఇప్పటి వరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఏజెంట్లనే కాక కనీసం వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులను కూడా ఓట్లు వేయనీకుండా తీవ్ర అక్రమాలకు పాల్పడి ఎన్నికల్లో గెలవడం సిగ్గుచేటని అన్నారు. ఎన్నికల నిర్వహణపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించిందని, ఈ నేపథ్యంలో హడావుడిగా కూటమి ప్రభుత్వం ఓట్ల లెక్కింపు కోసం ఎక్కువ టేబుళ్లను వేసి ఎన్నికల ఫలితాలను ప్రకటించడం విడ్డూరమన్నారు. పులివెందులలో టీడీపీకి 6,716, వైఎస్సార్ సీపీకి 683 ఓట్లు వచ్చాయంటే రిగ్గింగ్ లెక్కలే చెబుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు నిజంగా అంతటి ప్రజాబలం ఉందని అనుకుంటే ఇన్ని అక్రమాలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందన్నారు. ఈనెల 5న పులివెందులలో ప్రచారం కోసం వెళ్లిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై, వైఎస్సార్ సీపీ నాయకుడు వేల్పుల రాముపై దాడిచేసి హత్యచేయడానికి ప్రయత్నించారని, కారుపై పెట్రోల్ పోసి తగులబెట్టి భయభ్రాంతులకు గురిచేశారన్నారు. ఈ దాడిలో గాయపడి చావుబతుకుల మధ్య ఉన్న రాముపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం దారుణమని అన్నారు. కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ మరీ విడ్డూరంగా పక్కగ్రామంలో పత్తివ్యాపారం ఏంటని, ఇంకా మేం ఉండబట్టే తలలు పగిలాయి, లేదంటే తలలు తెగిపడేవి అని బాధ్యతా రహితంగా మాట్లాడటం ఐపీఎస్ అధికారికి తగదన్నారు. పులివెందులలో వైఎస్సార్ సీపీ అభ్యర్ధి తుమ్మల హేమంత్ రెడ్డిని కనీసం ఓటు వేయనీయలేదని, ఆరోజు తెల్లవారుజామున నుంచే హౌస్ అరెస్టు చేశారని అన్నారు. అధికారపక్ష అభ్యర్ధిని మాత్రం స్వేచ్ఛగా వదిలేశారన్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి స్థానికుడైనా తెల్లవారుఝామున నుంచే ఆయన ఇంటికి వెళ్లి కనీసం చెప్పులు కూడా వేసుకోనివ్వకుండా, ఆరోగ్యం బాగోలేదని చెబుతున్నా వినకుండా రెండు చేతులను పట్టుకుని లాక్కుని వచ్చారన్నారు. యూనిఫాం వేసుకున్న పోలీసులు ప్రజలను రక్షించడానికా.. పాలకులు చెప్పింది చేయడానికా.. అని ప్రశ్నించారు. ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన టీడీపీ గూండాలకు పోలీసులు బాసటగా నిలిచారని, ఓట్లు వేసేందుకు బయలుదేరిన వైఎస్సార్ సీపీ సానుభూతిపరులను అడ్డుకుని వారి స్లిప్పులు లాక్కున్నా పోలీసులు మాత్రం నోరు మెదపలేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేస్తూ అత్యంత దారుణంగా నిర్వహించిన పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలను రద్దుచేసి కేంద్ర బలగాల ఆధ్వర్యంలో తిరిగి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. -
ఆర్టీసీ బస్సులో మంటలు
టంగుటూరు: షార్ట్ సర్క్యూట్తో ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ సంఘటన మండలంలోని వల్లూరు జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. 40 మంది ప్రయాణికులతో ఒంగోలు నుంచి కావలి వెళుతున్న ఆర్టీసీ బస్సు వల్లూరు సమీపంలోకి వచ్చే సరికి బస్సు ముందు భాగంలో మంటలు చెలరేగాయి. బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును ఆపి ప్రయాణికులను కిందకు దించి మంటలను అదుపు చేశారు. అనంతరం ప్రయాణికులను మరో బస్సులో తరలించారు. డ్రైవర్ మంటలను ముందే పసిగట్టడంతో పెనుప్రమాదం తప్పిందని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
రెండు గంటల్లోనే బాలికను రక్షించి..
ఒంగోలు టౌన్: కిడ్నాప్ అయిన బాలికను కేవలం రెండే గంటల్లో పోలీసులు రక్షించారు. అందుకోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి... చీమకుర్తి మండలం మువ్వవారిపాలెం గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలిక చీమకుర్తిలోని ఒక ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. బాలిక తండ్రి గతంలో కొంతకాలం తిరుపతిలో నివసించాడు. అప్పుడు వారింటికి దగ్గరలో నివాసం ఉంటున్న ఈశ్వర్రెడ్డితో పరిచయమైంది. అతని వద్ద బాలిక తండ్రి అప్పుగా కొంత డబ్బు తీసుకున్నాడు. ఆ డబ్బులు సకాలంలో తిరిగివ్వకపోవడంతో అతడి కూతురిని కిడ్నాప్ చేయాలని ఈశ్వర్రెడ్డి పథకం పన్నాడు. అనుకున్నదే తడవుగా శుక్రవారం చీమకుర్తి చేరుకున్నాడు. స్కూల్లో స్వాతంత్య్ర దిన వేడుకల్లో పాల్గొని ఇంటికి వెళ్తున్న బాలిక వద్దకు మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో వచ్చాడు. రా ఇంటికి వెళ్దామని బైక్ ఎక్కమన్నాడు. నిజమేననుకుని ఆ బాలిక బైక్ ఎక్కింది. స్వీట్లు తీసుకుని ఇంటికి వెళదామని నమ్మించి దారి మార్చాడు. మార్గం మధ్యలో బాలిక తండ్రికి ఫోన్ చేసి అప్పుగా తీసుకున్న డబ్బులిస్తేనే నీ కూతుర్ని వదిలేస్తా..లేదంటే చంపేస్తా అంటూ బెదిరించాడు. భయపడిన బాలిక తండ్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లా సరిహద్దుల వెంట ఉన్న చెక్పోస్టులను అప్రమత్తం చేశారు. కిడ్నాపర్ ఫోన్ నంబర్ను ట్రాక్ చేయడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో బైకు కదలికలను గుర్తించి కిడ్నాపర్ను అరెస్టు చేశారు. బాలికను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. కేవలం 2 గంటల వ్యవధిలోనే బాలికను రక్షించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తల్లిదండ్రులు, విద్యా సంస్థల యాజమాన్యాలు పిల్లల భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తు తెలియని వ్యక్తులతో మాట్లాడే సమయంలో, వారి వాహనాలను ఎక్కమన్నప్పుడు గుడ్డిగా నమ్మవద్దని పిల్లలకు నేర్పించాలని చెప్పారు. బాలికను గుర్తించడంలో ప్రతిభ కనబరిచిన డీఎస్పీ శ్రీనివాసరావు, చీమకుర్తి సీఐ సుబ్బారావు, చీమకుర్తి ఎస్సై కృష్ణయ్య, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పోలీసు అధికారులు, చీమకుర్తి హెచ్సీ రాయుడు, కానిస్టేబుళ్లు నాయుడు, అనిల్, విజయ్లను ఎస్పీ అభినందించారు. -
రాష్ట్రంలో రౌడీరాజ్యం
యర్రగొండపాలెం: రాష్ట్రాన్ని రౌడీరాజ్యంగా చేశారని, అందుకు పులివెందుల, ఒంటిమిట్టలో జరిగిన ఎన్నికలే నిదర్శనమని ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉప ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. పులివెందుల పేరు చెపితే గుర్తుకు వచ్చే నాయకుడు వైఎస్సార్ అన్నారు. రాష్ట్రంతో పాటు దేశంలోనే అత్యంత బలమైన నాయకుడిగా, చరిష్మా కలిగిన నాయకుడిగా వైఎస్సార్ గుర్తుకు వస్తారని తెలిపారు. పులివెందుల సిటీని తలపించేలా అభివృద్ధి చేశారన్నారు. అక్కడ ఇంటర్నల్ డ్రైనేజీ ఉంటుందని, ప్రాథమిక పాఠశాల నుంచి ట్రిపుల్ ఐటీ వరకు పాఠశాలలు, జేఎన్టీయూ, మెడికల్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, న్యాయస్థానం అక్కడ ఉన్నాయన్నారు. పులివెందుల బస్టాండ్, మార్కెట్ యార్డ్లను రాష్ట్రంలో మరెక్కడా చూడలేమని, అక్కడ ఉన్న రోడ్లు ఉద్యానవనంలా కనిపిస్తాయన్నారు. అటువంటి ప్రాంతంలో ఎన్నికలు చేయాలంటే చంద్రబాబు నాయుడికి శక్తి, దమ్ము సరిపోలేదని, ఎన్నికలు సక్రమంగా చేస్తే చిత్తు చిత్తుగా ఓడిపోతామని భయపడ్డారన్నారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి 11 మంది పోటీచేస్తే ఇద్దరికే ఓట్లు పోలయ్యాయని, మిగిలిన ఎవరికీ ఓట్లు పడలేదన్నారు. దొంగ ఓట్లు వేసే వాడికి 100 టీడీపీకి, ఒక ఓటు వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా గుద్దాలని చెప్పారని, మిగిలిన 9మంది మిగిలి పోయారనే అలోచనే వారికి లేదన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ఎన్నికలు ఇంకొకటి లేవన్నారు. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే పులివెందుల, ఒంటిమిట్టలో రీపోలింగ్ జరపాలని ఆయన సవాల్ విసిరారు. లోకేష్ ఎర్రబుక్ అంటూ ఎర్రిపాలన చేసుకుంటూ పోతున్నాడని ఎద్దేవా చేశారు. లోకేష్ మిడిమిడి జ్ఞానంతో ఒక ట్వీట్ చేశాడని, ఆ పాలన ఎలాగుందో ట్వీట్ కూడా అలాగే ఉందని, ఆ పోస్టులో జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పొన్నతోట మల్లికార్జున ఉండటం గమనించలేకపోయాడన్నారు. అదే విధంగా కలెక్టర్ చేసిన ట్వీట్లో దొంగ ఓటర్లు ఉన్నారని ప్రెస్మీట్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రస్తావించగానే ఆ ట్వీట్ను కలెక్టర్ డిలీట్ చేశారని, ఈ విధంగా వివిధ ప్రాంతాల నుంచి వందల మంది టీడీపీ వాళ్లతో దొంగ ఓట్లు వేయించారని మండిపడ్డారు. సమావేశంలో జెడ్పీటీసీ చేదూరి విజయభాస్కర్, మండల పార్టీ అధ్యక్షుడు ఏకుల ముసలారెడ్డి, గంట వెంకట రమణారెడ్డి, పి.కృష్ణారెడ్డి, డి.వెంకటేశ్వర్లు, కె.ఓబులరెడ్డి, ఆళ్ల ఆంజనేయరెడ్డి, సయ్యద్ జబీవుల్లా, ఆర్.అరుణాబాయి, పి.రాములు నాయక్, సూరె రమేష్, వై.వెంకటేశ్వరరెడ్డి, పల్లె సరళ, ఎనిబెర శార, షేక్ ఫజూల్ పాల్గొన్నారు. పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలే నిదర్శనం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజం -
కూటమి పాలనలో ప్రజాసామ్యం ఖూనీ
ఒంగోలు సిటీ: పులివెందుల, ఒంటిమిట్టలో ఈ నెల 12న జరిగిన ఉప ఎన్నికలను చూస్తే సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం, ఎన్నికల కమిషన్, పోలీస్ వ్యవస్థలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే కాకుండా అపహాస్యం చేసినట్లు స్పష్టమవుతోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ధ్వజమెత్తారు. ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ విధానాలు బ్రిటీష్ విధానాలను తలపిస్తున్నాయన్నారు. పోలింగ్ బూత్లలో వైఎస్సార్ సీపీ ఏజెంట్లు కూర్చోవడానికి కూడా వీల్లేకుండా చేయడం, ప్రజలు స్వేచ్ఛగా ప్రశాంతంగా ఓట్లు కూడా వేయనివ్వకుండా హౌస్ అరెస్ట్లు చేయడం, పక్క నియోజకవర్గాల నుంచి టీడీపీ నాయకులను పిలిపించి ఓట్లు వేయించడం వంటి నియంతృత్వ విధానాలకు పాల్పడ్డారని విమర్శించారు. ఎన్నికల ముందు అధికారంలోకి రావడానికి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పి.. అధికారంలోకి రాగానే అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేసి ఉంటే ప్రజస్వామ్యబద్ధంగా ప్రజలను ఓట్లు అడిగేవారని, అలా కాకుండా ఓడిపోతామనే భయంతో పరువుపోతుందని పోలీస్ వ్యవస్థను, ఐఏఎస్లు, ఐపీఎస్లను ఎన్నికల వద్ద నిలబెట్టి నానా రకాలుగా రిగ్గింగ్ చేసి భయాందోళనకు గురిచేశారని విమర్శించారు. ఇటువంటి ఎన్నికలను బర్తరఫ్ చేయాలన్నారు. మళ్లీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేస్తోందన్నారు. బీహర్లో గతంలో దౌర్జన్యాలు, అరాచకాలతో ఎలక్షన్ నిర్వహించే పరిస్థితి ఉండేది కాదని, ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని మరో బీహార్లా తయారు చేసి నానా రకాలుగా ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకునే మీరు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయాలని కోరుకుంటున్నామని బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి -
చిరుత దాడితో ఉలిక్కిపడిన జిల్లా
పెద్దదోర్నాల: మండలంలోని చిన్నారుట్ల గిరిజనగూడెంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన చిరుత దాడి సంఘటనతో జిల్లా ఉలిక్కిపడింది. నల్లమల అభయారణ్యం చరిత్రలో తొలిసారి ఓ వన్యప్రాణి మనుషులపై దాడి చేసిన సంఘటనను అటవీశాఖ అధికారులు సీరియస్గా తీసుకున్నారు. గతంలో తిరుపతి, దిగువమెట్ట తదితర ప్రాంతాల్లో చిరుతలు దాడులు చేసి మనుషులను మట్టుబెట్టిన సంఘటనలు జరిగాయి. అయితే, ఆ సంఘటనలకు, చిన్నారుట్ల గిరిజనగూడెంలో జరిగిన సంఘటనకు చాలా వ్యత్యాసం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తిరుపతి, దిగువమెట్ట ప్రాంతాల్లో జరిగిన సంఘటనలను గమనిస్తే చిరుతల దాడిలో చనిపోయిన వారు అటవీ ప్రాంతంలోనే సంచరిస్తున్నారు. ఆ క్రమంలో అవి దాడులకు పాల్పడ్డాయి. అటవీ ప్రాంతంలో కట్టెలు కొట్టడానికి వెళ్లి కట్టెలు సేకరించే క్రమంలో ఒంగి ఉండటాన్ని బట్టి మనుషులను మరో జంతువులుగా భావించి దాడులకు పాల్పడి ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. అయితే, బుధవారం చిన్నారుట్లగూడెంలో జరిగిన సంఘటనలో తల్లిదండ్రులతో పాటు ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారిని నోట కరుచుకున్న సంఘటనతో చిరుతలు ఆహారం కోసం చేసిన దాడిగా భావిస్తున్నారు. నల్లమల పులుల అభయారణ్యం చరిత్రలో తొలిసారి ఓ ఇంట్లో నిద్రిస్తున్న బాలికపై దాడి చేయడంతో నల్లమలలో నివసించే చెంచు గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. నేరుగా ఇంట్లోకి వెళ్లి నిద్రపోతూ ప్రతిఘటించలేని స్థితిలో ఉన్న మనుషులపై దాడి చేయటాన్ని బట్టి చూస్తే అది మనిషి రక్తానికి అలవాటుపడిన జంతువుగా అనుమానిస్తున్నారు. చిరుతపులి కదలికలపై నిరంతర నిఘా... బాలికపై చిరుతపులి దాడి చేసిన సంఘటనపై అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుత కదలికలపై దృష్టి సారించారు. గురువారం రాత్రి చిన్నారుట్లగూడేనికి చేరుకున్న ఫారెస్టు రేంజ్ అధికారి హరి గూడెంలోని అన్ని ప్రాంతాలలో ట్రాప్డ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీంతో పాటు 5 మంది ప్రొడక్షన్ వాచర్లను నియమించి చిరుత కదలికలపై నిఘా ఉంచారు. మనిషి రక్తానికి అలవాటుపడిన వన్యప్రాణులు.. తిరిగి అదే ప్రాంతంలో సంచరించే అవకాశం ఉన్నందున వాటి కదలికలను విశ్లేషించుకుని తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు రేంజి అధికారి తెలిపారు. -
ఉత్తమ సేవలకు ప్రశంస
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ అవార్డులకు ఎంపికై న జిల్లాలోని పలువురు అధికారులకు ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు ప్రశంస పత్రాలు అందజేశారు. శుక్రవారం ఒంగోలులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి డీబీవీ స్వామి, కలెక్టర్ తమీమ్అన్సారియా, ఎస్పీ ఏఆర్ దామోదర్ చేతులమీదుగా అవార్డులు అందించి అభినందించారు. – సాక్షి, ఒంగోలు ప్రశంస పత్రాలు అందుకుంటున్న బీసీహెచ్.ఓబులేసు(డీఆర్ఓ), కె.శ్రీధర్రెడ్డి(స్పెషల్ కలెక్టర్, ఎల్ఏ), జి.జోసెఫ్కుమార్(పీడీ, డ్వామా), డాక్టర్ బి.రవి(జేడీ, పశుసంవర్ధక శాఖ), ఎ.కిరణ్కుమార్(డీఈఓ), ఎం.వెంకటేశ్వరరావు(ఈడీ, బీసీ కార్పొరేషన్), ఎస్.పద్మశ్రీ(డీఎస్ఓ), పి.శ్రీమన్నారాయణ(సీఈఓ, స్టెప్), డాక్టర్ టి.వెంకటేశ్వర్లు(డీఎంహెచ్ఓ), కె.వెంకటేశ్వర్లు(ఎస్ఈ, ఏపీసీపీడీసీఎల్), డి.బాలశంకర్రావు(ఎస్ఈ, ఆర్డబ్ల్యూఎస్), ఎ.జగన్నాథరావు(డీడీ, జిల్లా ట్రెజరీ), కె.హరికృష్ణ(డీఎం, మార్క్ఫెడ్)ఎం.శివకుమారి, బి.అశోక్ కుమార్ (ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్లు), ఎ.మాధవరావు(ఎంవీఐ)ఉత్తమ సేవా పతకాలు అందుకుంటున్న బి.లక్ష్మీనారాయణ(ఎస్డీపీఓ, దర్శి), కె.వెంకటమోహన్రావు(హెసీ), ఎంఎస్ఎస్.అశోక్ బాబు(అడిషనల్ ఎస్పీ, ఏఆర్), కె.వెంకటశివ సుబ్బారావు(ఏఆర్ ఎస్సై) ,ఎన్.రామచంద్రరావు(ఏఆర్ ఎస్సై), డి.శివనాయక్(ఏఆర్ హెచ్సీ), ఆర్.వెంకట శంకరబాబు(ఎఆర్ హెచ్సీ), ఎన్.చంద్రలీల(ఏఎస్సై), ఎం.నాగలక్ష్మి(ఏఎస్సై), ఖాదర్మొహిద్దిన్(ఏఎస్సై), ఎస్కే మహబూబ్బాషా(ఏఎస్సై) (కుడి నుండి ఎడమకు) -
త్యాగధనుల జీవితం ఆదర్శనీయం
ఒంగోలు: దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను అర్పించిన త్యాగధనుల జీవితాలు అందరికీ ఆదర్శమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ.భారతి అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కోర్టు ఎదుట జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ త్యాగధనుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ హితం కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తులు టి.రాజ్యలక్ష్మి, పందిరి లలిత, కానుగుల శైలజ, సీనియర్ సివిల్ జడ్జి సీహెచ్ రామకృష్ణ, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కోర్టు ఆవరణలోని గ్రంథాలయం వద్ద జాతీయ జెండాను ఒంగోలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బొడ్డు భాస్కరరావు, కార్యదర్శి జగజ్జీవన్రావు ఆవిష్కరించారు. జెండా వందనం చేస్తున్న జిల్లా జడ్జి భారతి -
కారు, మోటార్ సైకిల్ ఢీ
పెద్దదోర్నాల: ఎదురుగా వస్తున్న కారు, మోటారు సైకిల్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన కర్నూల్ గుంటూరు జాతీయ రహదారిపై జరిగింది. ప్రమాదంలో రామచంద్రకోటకు చెందిన బీజెపీ నాయకుడు అంబటి అల్లూరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళఇతే.. మండల కేంద్రం నుంచి ద్విచక్రవాహనంపై రామచంద్రకోటకు వెళ్తున్న అల్లూరెడ్డిని మార్కాపురం నుంచి దోర్నాల వైపుకు వస్తున్న కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలయిన అల్లూరెడ్డిని మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం మార్కాపురం ఏరియా వైధ్యశాలకు తరలించారు.