Prakasam
-
Andhra Pradesh: ఉపరితల ఆవర్తనం.. తగ్గిన ఉష్ణోగ్రతలు
సాక్షి, అమరావతి/ఒంగోలు సిటీ: దక్షిణ కోస్తాంధ్ర, యానాం పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆదివారం ఉష్ణోగ్రతలు కొద్దిమేర తగ్గాయి. పలుచోట్ల ఆకస్మిక వర్షాలు కురిశాయి. దక్షిణ కోస్తాలోని పలు జిల్లాల్లో ఎండ తీవ్రత తగ్గినా ఉక్కపోత ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆదివారం ప్రకాశం జిల్లా దరిమడుగులో అత్యధికంగా 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.54 మండలాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మరోవైపు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 54.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ప్రకాశం జిల్లా కనిగిరిలో 43 మిల్లీమీటర్లు, ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో 39.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయి. సోమవారం కూడా ఇదే తరహా వాతావరణం ఉండే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం జిల్లాలో గాలివాన బీభత్సం ప్రకాశం జిల్లాలో ఆదివారం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం పడింది. కనిగిరి, మార్కాపురం, కొండపి, గిద్దలూరు, దర్శి, సంతనూతలపాడు, ఒంగోలు నియోజకవర్గాల పరిధిలో వర్షం కురిసింది. కనిగిరి, దొనకొండ ప్రాంతాల్లో వడగండ్ల వాన పడింది. కనిగిరి మండలం శంఖవరంలో డబ్బుకొట్టు లక్ష్మమ్మ (52) అనే మహిళ పశుగ్రాసం కోసం వెళ్తుండగా, నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి గోడ గాలివానకు కూలి ఆమెపై పడటంతో అక్కడికక్కడే మృతిచెందింది.కనిగిరిలో ఈదురుగాలులకు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగి సరఫరా నిలిచిపోయింది. పీసీపల్లి, మర్రిపూడి, దర్శి, మార్కాపురం మండలాల్లోని కల్లాల్లో ఉన్న మిరపకాయలు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. పొన్నలూరులో పొగాకు బ్యారన్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. పొదిలిలో గాలివానకు భారీ వృక్షం విరిగి కారుపై పడటంతో ధ్వంసమైంది. -
కట్టుకున్నోడే కాలయముడయ్యాడు..!
పామూరు: కట్టుకున్నోడే ఆమె పాలిట కాలయముడయ్యాడు. భార్యపై అనుమానంతో నిద్రిస్తున్న సమయంలో రోకలిబండతో విచక్షణా రహితంగా దాడి చేసి హత్య చేసి పరారయ్యాడు. ఈ సంఘటన పామూరులో ఆదివారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం...స్థానిక ప్రశాంతినగర్లో యాసారపు రమేష్ బేల్దారీ పనులు చేసుకుంటూ భార్య మార్తమ్మ, ఇద్దరు కుమారులు, కుమార్తెతో కలిసి జీవిస్తున్నారు. రమేష్ బేల్దారీ పనులు చేస్తుండగా, మార్తమ్మ ఇళ్లలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. మార్తమ్మపై భర్త రమేష్కు అనుమానం. దీంతో ఆమైపె ద్వేషం పెంచుకొని నిత్యం గొడవలు పడుతుండేవాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం మార్తమ్మ నిద్రిస్తున్న సమయంలో భర్త రమేష్ రోకలిబండంతో విచక్షణారహితంగా దాడి చేసి పరారయ్యాడు. సమీపంలోని వారు గమనించి క్షతగాత్రురాలు మార్తమ్మను చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించగా..అప్పటికే మార్తమ్మ(30) మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతదేహాన్ని కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, కనిగిరి సీఐ షేక్.ఖాజావళి పరిశీలించారు. ఘటనపై ఎస్సై టి.కిషోర్బాబుతో మాట్లాడి వివరాలు సేకరించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీఐ ఖాజావళి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కనిగిరి వైద్యశాలకు తరలించారు. నిందితుడు పరారీలో ఉండగా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. భార్యపై రోకలిబండతో దాడి చేసి హత్య అనుమానంతో భార్యకు నిత్యం వేధింపులు -
గంగమ్మ తిరునాళ్లకు వేళాయే
తాళ్లూరు: జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన తిరునాళ్లలో గంగమ్మ తిరునాళ్ల ఒకటి . గుంటి గంగా భవానీ అమ్మవారి జాతరను ఏటా చైత్రమాస బహుళ విదియ నాడు వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది గంగమ్మ జాతర 100వ వార్షిక సందర్భంగా ఈ నెల 14న సోమవారం అంగరంగా వైభవంగా నిర్వహించేలా ఆలయ అధికారులు సర్వం సిద్ధం చేశారు. తిరునాళ్లకు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఇది తిరునాళ్ల చరిత్ర.. గంగా భవానీ ఆలయం 12వ శతాబ్దం కాలం నాటిది. కాటంరాజు కాలంలో నిర్మించిన గంగమ్మ దేవాలయాల్లో ఇది ఒకటి. ఈ గుడికి దక్షణం వైపు కొండపాడు వద్ద రాతిగుండు కిందుగా నీరు ప్రవహిస్తుండటంతో దీనిని గుండు గంగగా పిలిచేవారు. ఏడాది పొడవునా ప్రవహించే గంగా జల ఆధారంగా చుట్టుపక్కల గ్రామాల రైతులు పంటలు పండించేవారు. ఈ జల గంగమ్మ తల్లి వరప్రసాదంగా భావించి ఏటా తిరునాళ్ల నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. జలధారపైన ఉన్న గుండును తొలగిస్తే ఇంకా నీటి ప్రవాహం పెద్దదవుతుందని భావించిన రైతులు దానిని పక్కకు తొలగించారు. దీంతో అక్కడ గుంత ఏర్పడింది. కానీ నీరు మాత్రం పెరగలేదు. అప్పటి నుంచి గుంటి గంగగా మారింది. ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. పూర్వం మునులు తపస్సు చేసి గుంటిగంగలో స్నానమాచరించి శివాలయంలో పూజలు చేసేవారు. ఈ ప్రాంతాలు మునులు జపిస్తున్న మంత్రాలు వినిపిస్తూ ఉండేవని, అందువల్ల ఈ ప్రాంతాన్ని స్వాములవారి ధ్వని అని పిలిచేవారని పెద్దలు చెబుతుంటారు. దశాబ్దం క్రితం గంగమ్మ శివాలయాలను పునరుద్ధరించారు. ఈ ప్రాంగణంలోనే కృష్ణాలయం, నాగదేవత పుట్టశిలలు, పార్వతీ సమేత మల్లికార్జునస్వామి, అన్నపూర్ణాదేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ప్రసిద్ధ గాంచిన దేవాలయాలు, కాశీ నాయన ఆశ్రమం ఉన్నవి. పూర్వం ఈ ఆలయం కొండకోనల మధ్య అడవిలో తిరునాళ్లను పగలు చేసేవారు. క్రమేపి అడవి అంతరించిపోవడంతో తిరునాళ్లను రాత్రిళ్లు చేస్తున్నారు. భక్తులు శుక్ర, ఆదివారాలలో వందల సంఖ్యలో ఆలయానికి వచ్చి అమ్మవారికి పొంగళ్లు నైవేద్యంగా సమర్పిస్తారు. ఏటా చైత్రమాస బహుళ విదియ నాడు వైభవంగా తిరునాళ్లను నిర్వహిస్తున్నారు. కొండకోనల మధ్య ఉన్న ఈ ఆలయం ప్రకృతి రమణీయతకు నిలయం. ఈ దేవస్థానంలో అన్ని కులాల వారికి సత్రాలు ఉన్నాయి. ఈ సత్రాల వద్ద తిరునాళ్ల రోజు భక్తులకు అన్నదానం చేయడం ఆనవాయితీ. పశువుల పురోభివృద్ధికి ప్రదక్షిణాలు: పశువులు, మేకలు, గొర్రెలను నీటితో శుభ్రపరుచుకొని వాటికి రంగులు పూసి, మెడలో గంటలు కట్టి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం, ఈ ప్రాంత ప్రజల పశుపోషకులకు అలవాటు. ఇలా చేయడం ద్వారా తమ పశుసంత పురోభివృద్ధి చెందుతాయని ఇక్కడ ప్రజల నమ్మకం. తిరునాళ్లకు మూడు రోజుల ముందు నుంచి గుడి చుట్టూ తిప్పడం ఆనవాయితీగా వస్తుంది. ఏటా తిరునాళ్లను పురస్కరించుకొని గంగమ్మ తల్లికి భక్తులు విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. అలానే మండల ప్రజలు ఐకమత్యంతో కలిసి విద్యుత్ అలంకరణతో ప్రభలు ఏర్పాట్లు చేస్తున్నారు. డ్రోన్ కెమెరాలతో పోలీసుల బందోబస్తు తిరునాళ్ల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శి సీఐ వై.రామారావు, తాళ్లూరు ఎస్సై ఎస్ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో స్థానిక పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. వాహన రాకపోకలను క్రమబద్ధీకరించడంతో పాటు ఆలయం వద్ద భక్తులకు ఎటువంటి అవంతరాలు ఏర్పడకుండా 250 మంది సిబ్బందితో 3 డ్రోన్ కెమెరాలు, ఒక సీసీ కెమెరా రెండు విధాలుగా స్టాటిక్, రొటేటింగ్ టెక్నాలజీతో పనిచేసే దాదాపు 40 పైగా సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తూ పటిష్ట బందోబస్తును ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. భక్తులకు అన్నదానంతో పాటు మజ్జిగ, చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా గంగమ్మ తల్లి దేవస్థానం తిరునాళ్లకు పలు జిల్లాల నుంచి భారీగా తరలిరానున్న భక్తులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్న పోలీసులు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటుప్రత్యేకంగా ఆర్టీసీ బస్సు సర్వీసులు తాళ్లూరు మండలంలోని తూర్పుగంగవరం పంచాయతీ పరిధిలో ఉన్న సోమవరప్పాడు గ్రామంలో వేంచేసి ఉన్న గుంటి గంగమ్మ తిరునాళ్లకు వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకొని ఒంగోలు, పొదిలి డిపోల నుంచి ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఒంగోలు నుంచి చీమకుర్తి మీదుగా తూర్పుగంగవరం –దర్శి రోడ్డులో, అలానే దర్శి మీదుగా పొదిలి–తూర్పుగంగవరం గంగమ్మ తల్లి జాతరకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ సేవలు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. -
అదుపు తప్పి కారు బోల్తా
● నలుగురికి గాయాలు కంభం: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తాపడటంతో నలుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదివారం స్థానిక అనంతపురం– అమరావతి హైవే రోడ్డుపై జరిగింది. వివరాల్లోకి వెళితే..కర్ణాటక రాష్ట్రం చిక్లాపూర్కు చెందిన ఓ కుటుంబం కారులో శ్రీశైలం వెళ్లి దర్శనం చేసుకున్న అనంతరం తిరిగి కర్ణాటకకు వెళ్తుండగా కంభం– జంగంగుంట్ల మధ్యలో హైవేరోడ్డుపై అదుపుతప్పి పంటపొలాల్లో బోల్తాపడింది. ప్రమాదంలో కారులో ఉన్న పవన్, రామచంద్రపవన్, లక్ష్మి, విద్య, షాను, సిద్ధిరాజు ఉండగా వీరిలో ఇద్దరికి స్వల్పగాయాలు, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో కొందరిని ప్రభుత్వ వైద్యశాలకు, మరికొందరి ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. వీరిలో లక్ష్మి అనే వృద్ధురాలికి తీవ్ర గాయాలు కాగా మెరుగైన వైద్యం నిమిత్తం ఒంగోలు తరలించారు. -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
పెద్దారవీడు: ఎదురెదురుగా వస్తున్న ద్విచక్రవాహనాలు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా..నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలో పుచ్చకాయలపల్లి, పెద్దారవీడు గ్రామాల మధ్య ఆదివారం సాయంత్రం జరిగింది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..పెద్దారవీడులో నాగులమీరాస్వామి ఉరుసు సందర్భంగా అల్లు మహేశ్వరెడ్డి, అల్లు ఈశ్వరరెడ్డి కలిసి ద్విచక్ర వాహనంపై పుచ్చకాయలపల్లిలో ఉన్న మేనేత్త పోతిరెడ్డి నారాయణమ్మను తీసుకువచ్చేందుకు వెళ్లారు. పుచ్చకాయలపల్లి గ్రామం నుంచి మహేశ్వరెడ్డి, ఈశ్వరరెడ్డి మేనేత్త పోతిరెడ్డి నారాయణమ్మతో కలిసి ద్విచక్ర వాహనంపై పెద్దారవీడు గ్రామానికి బయలుదేరారు. సుంకేసుల గ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు పెద్దారవీడులో ఉన్న బంధువుల ఇంటికి వచ్చారు. తిరిగి పెద్దారవీడు నుంచి ద్విచక్ర వాహనంపై సొంత గ్రామానికి బయలుదేరగా పుచ్చకాయలపల్లి గ్రామం సమీపంలో మంగళికుంట వద్దకు రాగానే రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొట్టడంతో మహేశ్వరరెడ్డికి తలకు, ఈశ్వరరెడ్డి, నారాయణమ్మ, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వీరిని స్థానికులు వెంటనే మార్కాపురం జీజీహెచ్ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం మహేశ్వరరెడ్డి(15)ని ఒంగోలు జీజీ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో తరలించారు. మార్గమధ్యలో పొదిలి పట్టణానికి సమీపంలో మృతి చెందాడు. నారాయణమ్మ, ఈశ్వరరెడ్డిలను మెరుగైన వైద్యం నిమిత్తం నరసరావుపేటకు తరలించారు. మహేశ్వరరెడ్డి రాజంపల్లి సమీపంలో కేంద్రీయ విద్యాలయంలో 10వ తరగతి చదివి ఇటీవల పబ్లిక్ పరీక్షలు రాశారు. ఉరుసు పండుగ సందర్భంగా మహేశ్వరరెడ్డి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నారు. తల్లిదండ్రులు, బంధవులు కన్నీరు మున్నీరయ్యారు. -
సోషల్ మీడియా సైకోల హెడ్స్ చంద్రబాబు, లోకేష్
● ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ యర్రగొండపాలెం: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తండ్రి కొడుకులు ఇద్దరూ సోషల్ మీడియా సైకోల హెడ్స్ అని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అండతో వీధి శునకాలు సోషల్ మీడియాలో మహిళలపై అభ్యంతరకర పోస్టులతో చెలరేగి పోతున్నాయని మండిపడ్డారు. ఐ–టీడీపీకి చెందిన చేబ్రోలు కిరణ్ ఇటీవల తమ నాయకుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి కుటుంబంపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో అతడిని అరెస్ట్ చేశామని, తమ ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని కూటమి ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. కిరణ్ గతంలో అనేక పర్యాయాలు అభ్యంతరకర పోస్టులు పెట్టినప్పుడు కూటమి నాయకులు శునకానందం పొందారని, ఇప్పుడేందో వారు కథలు చెప్పి రాష్ట్ర ప్రజలను తప్పు దోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. -
రామతీర్థంలో ఆధ్యాత్మిక శోభ
● గంగమ్మ తిరునాళ్లకు పోటెత్తిన జనం చీమకుర్తి రూరల్: మండలంలోని రామతీర్థంలో వెలసిన గంగా బాలత్రిపుర సుందరీ సమేత మోక్ష రామలింగేశ్వరస్వామి దేవస్థానంలోని గంగమ్మ తల్లి తిరునాళ్లు సందర్భంగా శనివారం అమ్మవారిని దర్శించుకునేందుకు జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పొంగళ్లు పెట్టుకుని మొక్కులు తీర్చుకున్నారు. తిరునాళ్ల సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ దుకాణాలు, జైంట్వీల్, ప్రభలు ఆకర్షణీయంగా నిలిచాయి. ఆలయాలను విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. చీమకుర్తి నుంచి వైఎస్సార్ సీపీ, టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో ఒక్కో ప్రభ, చీమకుర్తి రూరల్ నుంచి రాజుపాలెం, కంభంపాడు, బూదవాడ నుంచి మరో మూడు ప్రభలు ఏర్పాటు చేశారు. ఆయా ప్రభలపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి సామాజిక సత్రంలో భక్తులకు అన్నదానం కార్యక్రమాలు, మంచినీటి సౌకర్యాలు వివిధ సంస్థలు, సంఘాల ప్రతినిధులు నిర్వహించారు. జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో 7 వేల మందికి అన్నదానం చేశారు. చిన్నపురెడ్డి మస్తాన్రెడ్డి, క్రిస్టపాటి శేఖర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, ఓబులరెడ్డి పాల్గొన్నారు. -
పశ్చిమ ప్రకాశంలో వర్షం
మార్కాపురం: డివిజన్ కేంద్రం మార్కాపురం పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో శనివారం సాయంత్రం 5.30 గంటల నుంచి గాలీవాన, ఉరుములు మొరుపులతో కూడిన వర్షం కురిసింది. రాత్రి 7.30 గంటల వరకు కురుస్తున్న వర్షంతో పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపేశారు. ప్రధాన వీధులన్నీ జలమయమయ్యాయి. పట్టణంతో పాటు వేములకోట, తిప్పాయపాలెం, నికరంపల్లి, దరిమడుగు, బోడపాడు, రాయవరం తదితర గ్రామాల్లో వర్షం కురిసింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగటంతో పలువురు వ్వాపారులు ఇబ్బంది పడ్డారు. వారం రోజుల నుంచి రోజూ సుమారు 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతూ తీవ్ర ఎండ వేడికి ఇబ్బంది పడుతున్న ప్రజలు ఒక్కసారిగా వర్షం కురిసి వాతావరణం చల్ల బడటంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. రాత్రి 7.30 గంటల వరకు కూడా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాలేదు. ● కూలిన చెట్లు, రేకుల షెడ్లు పొన్నలూరు: మండలంలో శనివారం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ప్రజలు భయందోళనకు గురయ్యారు. 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయడంతో పొన్నలూరు, వెంకుపాలెం, రాజోలుపాడు, కె.అగ్రహారంతో పాటు పలు గ్రామాల్లో చెట్లు కూలిపోయాయి. పొన్నలూరులో పొగాకు బ్యారన్ల రేకుల పైకప్పు కూలిపోయాయి. వర్షానికి మండలంలో ప్రధానంగా మిరప పంట కోత దశలో ఉండటంతో కొంతమేర నష్టం చేకూరే అవకాశం ఉందని, ముదురు పొగాకు దెబ్బతినే అవకాశం ఉందని రైతులు పేర్కొంటున్నారు. పీసీపల్లి: మండల కేంద్రం పీసీపల్లిలో గాలీవాన బీభత్సం సృష్టించింది. వడగండ్లతో మహావృక్షాలు సైతం నేలమట్టమయ్యాయి. హైస్కూల్ ఎదురుగా ఉన్న చెట్టు పడిపోవడంతో ప్రహరీ కూలిపోయింది. స్థానిక ఎస్సీ హాస్టల్లో రేకులు లేచిపోయాయి. ప్రభుత్వాస్పత్రిలో దిరిసిమ్మ చెట్లు నేలమట్టమయ్యాయి. పశు వైద్య కేంద్రంలో శతాబ్దపు దిరిసిమ్మ చెట్టు కూలిపోయింది. విద్యుత్ వైర్లు కూడా తెగిపడి కరెంట్ నిలిచిపోయింది. అమ్మవారిపల్లిలో దేవుళ్ల బ్రహ్మయ్య ఇంటి రేకులు లేచిపోయి అందులో ఉన్న పొగాకు పూర్తిస్థాయిగా తడిచింది. కొత్తపల్లికి చెందిన గల్లా నర్సింగ్ ఇంటి రేకులు లేచి పొగాకు పూర్తిగా తడిసి ముద్దయింది. మిరపకాయలు కూడా తడిసి ముద్దయ్యాయి. -
రంగనాయకుని బ్రహ్మోత్సవం ప్రారంభం
రాచర్ల: నల్లమల అటవీ ప్రాంతంలో రాచర్ల మండలంలోని జేపీ చెరువు గ్రామ సమీపంలో వెలసిన నెమలిగుండ్ల రంగనాయకస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జిల్లా నుంచే కాకుండా పక్క జిల్లాలైన కర్నూలు, గుంటూరు, వైఎస్సార్ జిల్లా నుంచి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం కోసం పోటెత్తారు. భారీగా క్యూ కట్టి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. దేవస్థానం అర్చకులైన అన్నవరం పాండురంగాచార్యులు, అన్నవరం సత్యనారాయణాచార్యులు, అన్నవరం వెంకటరంగాచార్యులు ఆధ్వర్యంలో సాయంత్రం నాలుగు గంటలకు అంకురార్పణ, విష్వక్సేన ఆరాధన, పుణ్యహవచనము, ముత్యాంగ్రహణం, యాగశాల ప్రవేశం, రాత్రి 7 గంటలకు పూలంగి సేవ, శేషవాహనం, రాత్రి 8:30 గంటలకు ధ్వజారోహణం, రాత్రి 10 గంటలకు నెమలిగుండ్ల రంగనాయకస్వామి అలంకారం, ఆదివారం రాత్రి 2 గంటలకు హనుమంత వాహనం కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి అశీసులు అందుకున్నారు. ఆదివారం జరిగే నెమలిగుండ్ల రంగనాయకస్వామి కళ్యాణానికి దేవస్థానం కార్యనిర్వహణాధికారి మల్లవరపు నాగయ్య ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. స్వామివారి కళ్యాణం రోజు మండపం వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా బ్యారికేడ్లు ఏర్పాటు చేసినట్లు గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య తెలిపారు. భక్తులకు కాశీనాయన రెడ్ల, యోగివేయన రెడ్ల, కృష్ణదేవరాయుల కాపు బలిజ, గోపాలకృష్ణ యాదవ, ఆర్యవైశ్య, మేదర, బ్రహ్మణ, విశ్వబ్రహ్మణ అన్నసత్రాల్లో అన్నసంతర్పణ చేశారు. వైభవంగా ఉత్సవ విగ్రహాల ఊరేగింపు అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
మద్దిపాడు: అనుమానాస్పదస్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన జాతీయ రహదారి పక్కన మద్దిపాడు మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఏడుగుండ్లపాడు పంచాయతీ పరిధిలో జాతీయ రహదారి పక్కనున్న బస్ షెల్టర్ వద్ద 35 నుంచి 45 సంవత్సరాల వయసున్న వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెంది ఉన్నాడు. అతని చాతిపై సరోజా అని పచ్చబొట్టు ఉంది. అతనికి సంబంధించిన ఇతర ఆనవాళ్లేమీ దొరకలేదు. స్థానిక వీఆర్వో కృష్ణవేణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు స్థానిక ఎస్సై బి.శివరామయ్య తెలిపారు. మృతుడిని గుర్తుపట్టిన వారు మద్దిపాడు పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచించారు. మార్కాపురం తహసీల్దార్ కారు బోల్తా ● స్వల్ప గాయాలతో బయట పడిన తహసీల్దార్ పొదిలి రూరల్: ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడి నిర్లక్ష్యంతో వెనుక నుంచి వస్తున్న కారు బోల్తా పడింది. ఈ సంఘటన పొదిలి మండలం తలమళ్ల–అగ్రహారం మధ్య ఒంగోలు–కర్నూలు రహదారిపై వ్యవసాయ మార్కెట్ కమిటీ సమీపంలో శనివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మార్కాపురం తహసీల్దార్ చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కారులో ఒంగోలు వెళ్తున్నారు. పొదిలి మండలంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ స్థలం వద్దకు రాగానే ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడు తన వాహనాన్ని రైట్కు తిప్పడంతో అతని ప్రాణాలు కాపాడే క్రమంలో తహసీల్దార్ చిరంజీవి సడన్ బ్రేక్ వేశారు. దీంతో ఒక్కసారిగా కారు మూడు పల్టీలు కొట్టి పక్కన పడింది. కారు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదంలో తహసీల్దార్ కుటుంబ సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి. తహసీల్దార్ కుటుంబ సభ్యులు వెంటనే తేరుకుని వేరే వాహనంలో ఒంగోలు వెళ్లి చికిత్స చేయించుకుని ఇంటికి వెళ్లిపోయారు. మహిళకు అరుదైన శస్త్ర చికిత్స ●● మూడు కిలోల కణతి వెలికితీత గిద్దలూరు రూరల్: పట్టణంలోని విరంచి వైద్యశాలలో డాక్టర్ మేడిశెట్టి సావిత్రి ఆధ్వర్యంలో రాచర్ల మండలం అనుమలవీడు గ్రామానికి చెందిన ఓ మహిళకు శనివారం అరుదైన శస్త్ర చికిత్స చేసి ఆమె కడుపులో ఉన్న 3 కిలోల కణతి వెలికి తీశారు. మహబూబ్బీ హైదరాబాద్లో ఉంటూ కొంత కాలంగా కడపునొప్పితో బాధపడుతోంది. అక్కడి వైద్యశాలల్లో పరీక్షలు చేయించుకుంది. కడుపులో గడ్డ ఉందని, ఆపరేషన్ చేయాలని అక్కడి వైద్యులు చెప్పారు. హైదరాబాద్ ప్రాంతంలో ఆపరేషన్ అంటే లక్షలు ఖర్చు అవుతుందని భావించిన ఆమె గిద్దలూరులోని విరంచి వైద్యశాలలోని డాక్టర్ సావిత్రమ్మను సంప్రదించారు. కడుపు నొప్పి నివారణకు ఆపరేషన్ చేయాలని ఆమె సూచించారు. డాక్టర్ బీవీఆర్ఎస్ఎస్ విరించి యాదవ్, డాక్టర్ గ్రీష్మా యాదవ్ల నేతృత్వంలో ప్రత్యేక వైద్య బృందం సాయంతో ఆపరేషన్ చేసి ఆమె కడుపులో ప్రమాదకరంగా ఉన్న కణతిని అతికష్టం మీదు వెలికి తీశారు. మహబూబ్బీ బంధువులు వైద్య బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గంజాయి తాగిన ఇద్దరు అరెస్టు మార్కాపురం: పట్టణ శివారులోని మార్కెట్ యార్డ్ సమీపం వై. జంక్షన్ వద్ద గంజాయి సేవించి ఉన్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు పట్టణ ఎస్సై సైదుబాబు శనివారం తెలిపారు. పట్టణంలోని కరెంట్ ఆఫీస్ దగ్గర, విద్యానగర్లలో నివాసం ఉండే షేక్ అల్లాభక్ష, షేక్ అక్బర్ ఆలీలు ఇటీవల గోపీనాథ్ వద్ద గంజాయి కొనుగోలు చేసి సేవించినట్లు తెలిసిందన్నారు. దీంతో వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్సై తెలిపారు. గంజాయి అమ్మిన, కొనుగోలు చేసినా, సేవించినా అరెస్టు చేస్తామని ఆయన చెప్పారు -
రేషన్ మేస్తూ.. రెచ్చిపోతూ..!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో రాత్రి 10 గంటలు దాటితే చాలు.. రేషన్ మాఫియా రోడ్డెక్కుతోంది. ఎక్కువగా చిన్నపాటి అప్పి ఆటోల్లో రేషన్ బియ్యాన్ని జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. నంబర్ ప్లేట్లు తీసేసిన వాహనాల్లో తరలిస్తున్నారు. ఎమ్మెల్యేల కంటే మేమేం తక్కువ అన్నట్లుగా పశ్చిమ ప్రకాశంలోని ఓ నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జి ఏకంగా బియ్యం సిండికేట్కు నేతృత్వం వహిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో ఇన్చార్జి అయితే.. మండలానికి ఇద్దరు నాయకులకు జీతమిచ్చి మరీ రేషన్ దందాను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. జిల్లా నాయకులకు పోటీగా పొరుగు జిల్లా నుంచి కూడా ఒక టీడీపీ నాయకుడు వచ్చి వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఒక యువ ఎంపీ, ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న పల్నాడు ప్రాంతానికి చెందిన ఒక సీనియర్ ఎమ్మెల్యే ఆశీసులతో రంగంలోకి దిగిన సదరు టీడీపీ నాయకుడు జిల్లాలోని అనేక నియోజకవర్గాల నుంచి బియ్యం కొనుగోలు చేసి పట్టపగలే తరలించి తీసుకెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిరుపేదల కడుపులు నింపడానికి గత ప్రభుత్వాలు రేషన్ బియ్యం ఇచ్చి ఆదుకోగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో పాలకులు పేదల కడుపుకొడుతూ అక్రమార్జన కోసం అర్రులు చాస్తూ రేషన్ బియ్యాన్ని దొడ్డిదారిన తరలించి అమ్ముకుంటున్నారంటూ ప్రజలు విమర్శిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలంతా రేషన్ బియ్యం అక్రమ రవాణాపై దృష్టి సారించారు. అప్పటి వరకు ఉన్న డీలర్లను బలవంతంగా తొలగించి టీడీపీ నాయకులకు రేషన్ దుకాణాలు అప్పగించారు. అనంతరం యథేచ్ఛగా రేషన్ బియ్యం తరలిస్తూ రెండుచేతులా సొమ్ము చేసుకుంటున్నారు. టీడీపీ ఒంగోలు నాయకులు ఒంగోలుతో పాటు కనిగిరి, చీరాల నియోజకవర్గాల నుంచి బియ్యం అక్రమ వ్యాపారాన్ని చేజిక్కించుకుని ఒంగోలు కేంద్రంగా విస్తరించినట్లు తెలుస్తోంది. ఒంగోలు నగరం శివారు ప్రాంతానికి చెందిన కార్పొరేటర్కు చీరాల, నగర నడిబొడ్డునున్న మరో కార్పొరేటర్కు ఒంగోలు, సంతనూతలపాడు, ఒక కాపు నాయకుడికి కనిగిరి నియోజకవర్గ రేషన్ బియ్యం వ్యాపారాన్ని అప్పగించినట్లు సమాచారం. వీరితో పాటు ఎమ్మెల్యే దామచర్ల నివాసం ఉండే బీకే అపార్ట్మెంట్లోనే నివాసం ఉంటున్న ఒక వ్యాపారికి కూడా ఈ రేషన్ వ్యాపారంలో భాగస్వామ్యం ఉందని చెబుతున్నారు. రెవెన్యూ, పోలీసు, రవాణా, నేషనల్ హైవేపై ఉన్న పోలీసులకు నెలవారీ మామూళ్లిస్తూ పేదల బియ్యాన్ని సరిహద్దులు దాటిస్తున్నట్లు సమాచారం. కొండపి నియోజకవర్గంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సింగరాయకొండ కేంద్రంగా రేషన్ దందా కొనసాగుతోంది. గత డిసెంబర్ మొదటివారంలో సింగరాయకొండలోని ఊరిచివర ఉన్న ఒక సినిమా హాలు వద్ద రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని డీఎస్ఓ, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఫుడ్ ఇన్స్పెక్టర్ బృందం దాడి చేసి పట్టుకుంది. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మధ్య జరుగుతున్న వార్లో భాగంగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. లారీలోని బియ్యాన్ని రాత్రికిరాత్రే మాయం చేసేందుకు సత్య వర్గానికి చెందిన నాయకులు ప్రయత్నాలు చేసినప్పటికీ.. జనార్దన్ ఒత్తిడి మేరకు అధికారులు కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు. అయితే, అధికారులు పట్టుకున్న లారీలో 780 బస్తాల బియ్యం ఉండగా, కేవలం 103 బస్తాల బియ్యం మాత్రమే ఉన్నట్లు కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నట్లు తెలుస్తోంది. కొండపి నియోజకవర్గంలో సత్య కనుసన్నల్లోనే రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం జరుగుతోందని, సింగరాయకొండలోని ఒక రైస్ మిల్లు యజమానికి ఈ దందాను అప్పగించారని సమాచారం. అతడితో పాటు జరుగుమల్లి మండలంలోని రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఒక మహిళా నాయకురాలి రైస్ మిల్లుకు కూడా బియ్యం తరలిస్తున్నట్లు సమాచారం. ఈమె కనిగిరి, సంతనూతలపాడు నుంచి కూడా బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ కొనుగోలు చేసిన బియ్యాన్ని గుజరాత్ తరలిస్తుండగా తెలంగాణ పోలీసులు పట్టుకోవడంతో ఈ మహిళా నాయకురాలి రేషన్ దందా వెలుగులోకి వచ్చింది. దర్శి నియోజకవర్గంలో రేషన్ బియ్యాన్ని నంబర్ ప్లేట్లు లేని వాహనాల్లో తరలిస్తున్నారు. అంతేగాకుండా ఎవరైనా వ్యక్తులు పోలీసులకు సమాచారమిచ్చినా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఒకవేళ పోలీసులు ఫోన్ లిఫ్ట్ చేసినా వాహనం నంబర్ అడుగుతున్నారని, వాహనానికి నంబర్ ప్లేట్ లేదని చెప్పగానే.. అయితే, మేమేం చేయలేమని ఫోన్ పెట్టేస్తున్నారని సమాచారం. ఇక్కడ టీడీపీ ఇన్చార్జి నియమించిన వ్యక్తికే బియ్యం విక్రయించాలని హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. కనిగిరి నియోజకవర్గానికి చెందిన రేషన్ బియ్యం వ్యాపారాన్ని జిల్లాలో కీలక ఎమ్మెల్యే అనుచరులు నిర్వహిస్తున్నారు. ఒంగోలుకు చెందిన ఒక నాయకుడు ఇక్కడి ప్రధాన నాయకుడికి నెలవారీ నజరానా ఇవ్వడమే కాకుండా మండల స్థాయి నాయకులకు కూడా మామూళ్లిచ్చి బియ్యాన్ని తరలిస్తున్నాడు. బేస్తవారిపేటలోని అనంతపురం–అమరావతి హైవేలో ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో ఉన్న ఒక రైస్ మిల్లు అడ్డగా గిద్దలూరు నియోజకవర్గంలో రేషన్ బియ్యం దందా సాగుతోంది. టీడీపీ నాయకుడికి చెందిన ఈ మిల్లుకు నేరుగా సివిల్ సప్లయిస్ గోడౌన్ నుంచే రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు సమాచారం. రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి కొత్తగా ప్యాక్ చేసి కర్నూలు సోనా, నంద్యాల సోనా, మసూరి రైస్ పేరుతో బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. పట్టుబడిన బియ్యాన్ని కొనుగోలు చేసి ఆ బిల్లులను అడ్డం పెట్టుకుని రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. యర్రగొండపాలెం నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జి కనుసన్నల్లోనే రేషన్ బియ్యం దందా జోరుగా జరుగుతోంది. ఐదు మండలాల వ్యాపారులను సిండికేట్గా తయారు చేసి పర్యవేక్షిస్తున్నట్లు టీడీపీలోని ఒక వర్గం బహిరంగంగానే ఆరోపిస్తోంది. జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేల అండదండలతో యథేచ్ఛగా రేషన్ దందా పేదల నోళ్లు కొడుతూ విచ్చలవిడిగా రేషన్ బియ్యం అక్రమ తరలింపు మూడు పువ్వులు ఆరు కాయలుగా బియ్యం అక్రమ వ్యాపారం ఒక్కో ఎమ్మెల్యేకి నెలకు రూ.25 లక్షలకుపైగా ముడుతున్నట్లు ప్రచారం పశ్చిమ ప్రకాశంలో అడ్డాగా గిద్దలూరు, యర్రగొండపాలెం గిద్దలూరులో మండలానికి ఐదుగురు టీడీపీ నాయకులకు నెలవారీ మామూళ్లు యర్రగొండపాలెంలో టీడీపీ ఇన్చార్జి కనుసన్నల్లో బియ్యం వ్యాపారం కొండపిలో రేషన్ దందా అంతా ‘సత్య’మే ఒంగోలు వ్యాపారుల చేతుల్లో ఒంగోలు, చీరాల, అద్దంకి, కనిగిరి రేషన్ దందా నేరుగా సివిల్ సప్లయిస్ గోడౌన్ నుంచే టీడీపీ నాయకుల రైస్ మిల్లులకు తరలుతున్న రేషన్ బియ్యం బేస్తవారిపేట రైస్ మిల్లు అడ్డాగా... జిల్లాలో రేషన్ బియ్యం దందా జోరుగా సాగుతోంది. పేదలకు దక్కాల్సిన బియ్యం విచ్చలవిడిగా అక్రమంగా తరలిపోతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేల అండదండలతో జిల్లా సరిహద్దులు దాటి రాష్ట్రం ఎల్లలు సైతం దాటిపోతోంది. సంతనూతలపాడు నుంచి తెలంగాణ మీదుగా గుజరాత్ తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని తెలంగాణ పోలీసులు పట్టుకోవడంతో జిల్లాలో రేషన్ దందాపై కూటమి పాలకులు తేలుకుట్టిన దొంగల్లా ఉండిపోయారు. మరోసారి రేషన్ మాఫియా గుట్టురట్టు కావడంతో నిరుపేదల నోళ్లు కొడుతున్న కూటమి పాలకులపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. పట్టుకుంది 780 బస్తాలు.. లెక్క చూపింది 103 బస్తాలు... నంబర్ ప్లేట్లు లేని వాహనాల్లో బియ్యం తరలింపు... 65 శాతం బియ్యం అడ్డదారిలోనే... జిల్లాలో 1,392 రేషన్ దుకాణాలు ఉండగా, దాదాపు అవన్నీ టీడీపీ నాయకులు, కార్యకర్తల చేతుల్లోనే ఉన్నాయి. వాటి నుంచి ప్రతి నెలా 9558.348 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పేదలకు పంపిణీ చేయాల్సి ఉండగా, సుమారు 65 శాతం బియ్యాన్ని అడ్డదారుల్లో కాకినాడ, కృష్ణపట్నం పోర్టులకు తరలిస్తున్నారు. కేవలం 35 శాతం బియ్యాన్ని మాత్రమే లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. రేషన్ బియ్యం అక్రమ వ్యాపారాన్ని పర్యవేక్షించేందుకు ప్రతి మండలం నుంచి ఇద్దరుముగ్గురు టీడీపీ నాయకులను నియమించి వారికి రేషన్ డీలర్ల నుంచి నెలవారీ జీతాలిస్తున్నట్లు సమాచారం. ఒక్కొక్కరికి రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు జీతాలిస్తున్నట్లు చెబుతున్నారు. ఒంగోలు నుంచి మొదలుకుని కొండపి, కనిగిరి, దర్శి, మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం, సంతనూతలపాడు నియోజకవర్గాలలో ప్రతి మండలంలోనూ కనీసం ఇద్దరు టీడీపీ నాయకులు రేషన్ బియ్యం అక్రమ వ్యాపారానికి మేనేజర్లుగా పనిచేస్తున్నారని సమాచారం. ఒంగోలు కేంద్రంగా విస్తరించిన రేషన్ దందా... -
పకడ్బందీగా చెన్నకేశవుని బ్రహ్మోత్సవాలు
మార్కాపురం టౌన్: మార్కాపురంలోని శ్రీదేవిభూదేవి సమేత శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు అధికారులంతా సమన్వయంతో సబ్కలెక్టర్ త్రివినాగ్ ఆదేశించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శుక్రవారం ఆయన సమీక్షించారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ కల్యాణోత్సవం నుంచి రథోత్సవం వరకు భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి భక్తులు హాజరవుతున్న దృష్ట్యా తగిన ఏర్పాట్లు చేయాలని దేవాదాయశాఖ అధికారులకు సూచించారు. బ్రహ్మోత్సవాలకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు డీఎస్పీ డాక్టర్ నాగరాజు తెలిపారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈఓ శ్రీనివాసరెడ్డి చెప్పారు. సమీక్షలో ఉత్సవ కమిటీ సభ్యులతోపాటు తహసీల్దార్ చిరంజీవి, అగ్నిమాపక అధికారి రామకృష్ణ, ఏఓ రవీంద్రారెడ్డి, ఎస్సై సైదుబాబు, విద్యుత్ డీఈ సియానాయక్ పాల్గొన్నారు. శతాధిక వృద్ధుడు కన్నుమూత పెద్దదోర్నాల: మండల కేంద్రంలో నివాసముంటున్న శతాధిక వృద్ధుడు షేక్ అబ్దుల్ మునాఫ్(101) శుక్రవారం కన్నుమూశారు. మండల కేంద్రానికి చెందిన అబ్దుల్ మునాఫ్ 1924లో జన్మించారు. రోడ్డు భవనాల శాఖలో వర్క్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించిన ఆయన 1987లో పదవీ విరమణ చేశారు. అబ్దుల్ మునాఫ్ తండ్రి అబ్దుల్ కరీంసాహెబ్, సోదరుడు షేక్ అబ్దుల్ జబ్బార్ సాహెబ్ పెద్దదోర్నాల మేజర్ పంచాయతీ సర్పంచ్లుగా సేవలందించారు. అబ్దుల్ మునాఫ్కు ముగ్గురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. మండల కేంద్రలోని ఖబరస్తాన్లో శుక్రవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ట్రాక్టర్ కింద పడి క్లీనర్ మృతి పామూరు: ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ టైర్ కిందపడి క్లీనర్ మృతిచెందిన సంఘటన మండలంలోని తిరగలదిన్నె పాఠశాల సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై టి.కిషోర్బాబు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని తిరగలదిన్నె గ్రామంలో నిర్మిస్తున్న ఆలయానికి ట్రాక్టర్తో ఇటుకలు తోలుతున్నారు. ఇటుకలను అన్లోడ్ చేసి ట్రాక్టర్ వేగంగా తిరిగి వస్తూ రోడ్డుపై ఉన్న స్పీడ్బ్రేకర్ దాటి ఒక్కసారిగా కుదుపునకు గురైంది. ఆ సమయంలో డ్రైవర్ పక్కన మడ్కార్ రేకుపై కూర్చుని ఉన్న నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన ట్రాక్టర్ క్లీనర్ పి.వెంకటకృష్ణ (45) జారి ట్రాక్టర్ ఇంజిన్ పెద్ద టైరు కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. అతని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిషోర్బాబు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం కనిగిరి వైద్యశాలకు తరలించారు. కృష్ణ మృతితో గ్రామంలో విషాదం అలముకుంది. సబ్ కలెక్టర్ త్రివినాగ్ -
బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతే లక్ష్యం
ఒంగోలు సబర్బన్: బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి కృషిచేసిన మహనీయుల ఆశయాలను కొనసాగించడమే వారికిచ్చే నిజమైన నివాళి అని రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి సత్యకుమార్యాదవ్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాయని చెప్పారు. మహాత్మా జ్యోతీరావు పూలే 199వ జయంతి సందర్భంగా శుక్రవారం స్థానిక ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాలులో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీసీ కార్పొరేషన్ అధ్వర్యంలో నిర్వహించిన వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా బలహీన వర్గాలు, కాపు లబ్ధిదారులకు మెగా రుణ మేళా, యూనిట్ల గ్రౌండింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ బలహీనవర్గాలకు అవసరమైన రుణాలు పంపిణీ చేయడంతో పాటు అన్ని రంగాలలో వారి అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉన్నాయన్నారు. రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖామంత్రి స్వామి మాట్లాడుతూ బీసీ సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నట్లు చెప్పారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ పూలేను స్ఫూర్తిగా తీసుకుని జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, టూరిజం బోర్డు చైర్మన్ నూకసాని బాలాజీ, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, డీఆర్ఓ బి.చినఓబులేసు, తదితరులు పాల్గొన్నారు. పూలే ఆదర్శాలు ఆచరణీయం : ఎస్పీ దామోదర్ ఒంగోలు టౌన్: విద్యతోనే మహిళల సాధికారిత సాధ్యమవుతుందని నమ్మి దేశంలో బాలికల కోసం మొట్టమొదటిగా పాఠశాలను ప్రారంభించిన మహనీయుడు జ్యోతీరావు పూలే అని, ఆయన ఆదర్శాలు ఆచరణీయమని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. జ్యోతీరావు పూలే జయంతిని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పూలే గొప్ప సంఘసంస్కర్త అని కొనియాడారు. మహిళల విద్యతో పాటుగా అనేక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారని చెప్పారు. ఆయన ఆశయాలను ప్రతిఒక్కరూ పాటించాలని, ఆయన తీసుకొచ్చిన సామాజిక చైతన్యాన్ని కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఆర్ఐ సీతారామిరెడ్డి, రమణారెడ్డి, ఏఆర్ ఎస్సైలు రవి కుమార్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి సత్యకుమార్యాదవ్ జ్యోతీరావుపూలేకి నివాళులు -
రైలుకు బ్రేక్.. ప్రాణాలు సేఫ్!
● ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని కాపాడిన రైల్వే సిబ్బంది మార్కాపురం: కుటుంబ కలహాలు, మానసిక కారణాలతో రైలు కింద పడి ఆత్మహత్యకు యత్నించిన ఓ యువకుడిని రైల్వే సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి రక్షించారు. వివరాల్లోకి వెళ్తే.. మార్కాపురంలోని విజయ టాకీస్ సమీపంలో నివాసముండే పి.అయ్యప్ప శుక్రవారం ఉదయం మార్కాపురం నుంచి గజ్జలకొండ వెళ్లే మార్గంలో ఔటర్ సిగ్నల్ వద్ద తెనాలి నుంచి మార్కాపురం వైపు వస్తున్న డెమో రైలు కింద పడి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. లోకోపైలట్ అత్యవసర బ్రేకులు వేసి రైలును ఆపారు. అయ్యప్ప గాయాలతో బయటపడగా రైల్వే ఏఎస్సై వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ హరికృష్ణ మార్కాపురం పట్టణానికి తరలించి చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం నర్సరావుపేటకు తరలించారు. -
చట్టసభల్లో బీసీలకు వైఎస్ జగన్ ప్రాధాన్యత
కొండపి: బీసీల రాజకీయ, ఆర్థిక అభ్యున్నతికి వైఎస్సార్ సీపీ హయాంలో సముచిత ప్రాధాన్యం దక్కిందని, బీసీను బ్యాక్వర్డ్ క్యాస్ట్గా కాకుండా బ్యాక్ బోన్ క్లాస్గా వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తించారని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు యామవరపు వసంతరావు ఆధ్వర్యంలో కొండపిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. బీసీల్లోని అన్ని ఉపకులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రాజ్యాధికారం దిశగా అడుగులు వేయించిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. సామాజిక న్యాయాన్ని సాకారం చేయడమే కాకుండా బీసీల్లో అత్యధిక మందిని చట్టసభలకు పంపిన అభినవ పూలే వైఎస్ జగన్ అని కొనియాడారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజలను బూటకపు హామీలతో మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు అధికారం చేపట్టి ఏడాదవుతున్నా ఒక్క పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయలేదని, బీసీలకు వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు. రెడ్ బుక్ పేరుతో సమాజంలో అరాచకత్వాన్ని ప్రేరేపిస్తుండటంతో శాంతిభద్రతలు క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను తుంగలోకి తొక్కి ప్రజాస్వామ్య విలువలను కాలరాశారని నిప్పులు చెరిగారు. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థను టీడీపీ కీలుబొమ్మగా మార్చి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతను ఉద్దేశపూర్వకంగా విస్మరించడమే కాకుండా మంత్రులు, నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడటాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని, కుటుంబ సభ్యులను కించపరుస్తూ కూటమి నాయకులు, ఐటీడీపీ కార్యకర్తలు మాట్లాడుతున్న తీరు జుగుప్సాకరమన్నారు. వైఎస్సార్ సీపీ ప్రజల నుంచి పుట్టిన పార్టీ అని, ఒకరికి వెన్నుపోటు పొడిచి లాక్కున్నది కాదన్నారు. గత ఎన్నికల్లో 40 శాతం ఓటర్లు వైఎస్సార్ సీపీ వైపు ఉన్నారన్న విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తుంచుకుంటే మంచిదన్నారు. రెడ్ బుక్ పేరుతో బెదిరిస్తే భయపడే వారు ఎవరూ లేరన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పూలే జయంతి సభలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ -
తనయుడిని చంపిన తండ్రి అరెస్టు
కంభం: మద్యం మత్తులో గొడవ పడుతున్న తండ్రి ఎక్కడ తన తల్లిని చంపేస్తాడోనని అడ్డుగా వెళ్లిన పద్నాలుగేళ్ల బాలుడు కత్తిపోటుకు బలైన సంగతి తెలిసిందే. అర్థవీడులో ఈనెల 8వ తేదీ రాత్రి జరిగిన ఈ హత్య కేసులో నిందితుడైన తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం కంభం సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో బాలుడి హత్య కేసు వివరాలను డీఎస్పీ యు.నాగరాజు వెల్లడించారు. మార్కాపురం పూలసుబ్బయ్య కాలనీకి చెందిన షేక్ ఖాశిం అర్థవీడులో వివాహం చేసుకోగా వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. మద్యానికి బానిసైన ఖాశింవలి తరచూ భార్యతో గొడవపడేవాడు. మార్కాపురం నుంచి భార్య అర్థవీడు రాగా ఖాసిం ఇక్కడ కూడా మద్యం తాగి గొడవ చేస్తున్నాడు. ఈనెల 8వ తేదీ మద్యం మత్తులో ఉన్న ఖాశింవలి ఇంట్లో వంట గదిలో కత్తిని అడ్డపంచెలో పెట్టుకోవడాన్ని కుమారుడు షేక్ షాకీర్(14) గమనించాడు. తల్లిని రక్షించే క్రమంలో అడ్డుగా వెళ్లిన షాకీర్ చాతిపై తండ్రి కత్తితో పొడవడంతో తీవ్ర గాయమైంది. మార్కాపురం జీజీహెచ్కు తరలించగా అప్పటికే మృతి చెందాడు. శుక్రవారం ఉదయం కంభం ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న నిందితుడిని అరెస్టు చేశామని, కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ మల్లికార్జున, అర్థవీడు ఎస్సై సుదర్శన్ యాదవ్ పాల్గొన్నారు. కేసు వివరాలు వెల్లడించిన మార్కాపురం డీఎస్పీ నాగరాజు -
ఆర్థికంగా కుదురుకున్నాకే ఆస్పత్రి అభివృద్ధి
ఒంగోలు టౌన్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదురుకున్న తరువాత సర్వజన ఆస్పత్రి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ చెప్పారు. శుక్రవారం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్ను ప్రారంభించారు. క్యాథ్ల్యాబ్ పనితీరును కార్డియాలజిస్టు డాక్టర్ కుంచాల వెంకటేశ్వర్లును అడిగి తెలుసుకున్నారు. ఐసీయూ వార్డును పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. క్యాథ్ ల్యాబ్ అందుబాటులోకి రావడం వలన స్టెంట్లు, యాంజియోప్లాస్టీల వంటివి వేయడానికి వీలు కుదురుతుందన్నారు. కార్డియాలజీ యూనిట్లో నలుగురు ఉండాల్సి ఉన్నా కేవలం ఒక్కరితోనే క్యాథ్ ల్యాబ్ను ఏర్పాటు చేయడం గొప్పవిషయమన్నారు. జీజీహెచ్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని చెప్పారు. 31 మంది ప్రొఫెసర్లు ఉండాల్సి ఉండగా 14 మంది మాత్రమే ఉన్నారని, 17 ఖాళీలున్నాయని తెలిపారు. 46 అసోసియేట్ ప్రొఫెసర్లకు గాను 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, 128 అసిస్టెంట్ ప్రొఫెసర్లకు గాను 43 ఖాళీలు, 56 ట్యూటర్లకు గాను 51 ఖాళీలు ఉన్నాయని వివరించారు. 86 మంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు ఉండాల్సి ఉండగా 73 ఖాళీలు, 613 టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్కు గాను 357 ఖాళీలున్నాయని తెలిపారు. మొత్తం మీద 60 శాతం ఖాళీలు ఉన్నాయన్నారు. సూపర్ స్పెషాలిటీలో 65 శాతం ఖాళీలు ఉన్నాయని చెప్పారు. వైద్య సిబ్బంది సాయంత్రం పూట ఓపీలు పూర్తయ్యే వరకు పనివేళల్లో పూర్తిగా ఆస్పత్రిలోనే ఉండాలని, అత్యవసర కేసులకు అందుబాటులో ఉండాలని చెప్పారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కుదుటపడ్డాక రాష్ట్రంలో ఉన్న 15 బోధనాస్పత్రులను బలోపేతం అయ్యేలా చూస్తామన్నారు. కొత్తగా నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాలలను పీపీపీ పద్ధతిలో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్షియల్ స్కీమ్ తీసుకొచ్చామన్నారు. సమావేశంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, టూరిజం బోర్డు చైర్మన్ నూకసాని బాలాజీ, మేయర్ గంగాడ సుజాత పాల్గొన్నారు. ఇదిలా ఉండగా క్యాథ్ ల్యాబ్ ప్రారంభ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒకరిద్దరు మినహా పెద్దగా కనిపించలేదు. బీజేపీ నాయకులు మాత్రం బాగా హడావుడి చేశారు. అయితే బీజేపీలోని రెండు గ్రూపులు వేర్వేరుగా మంత్రిని కలిశారు. జీజీహెచ్లో 60 శాతం వైద్యులు, సిబ్బంది కొరత కొత్త మెడికల్ కాలేజీ నిర్వహణ పీపీపీ పద్ధతిలోనే.. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ -
రైతులను మోసగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
ఒంగోలు టౌన్: రైతాంగాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు బహిరంగ మార్కెట్ కంటే తక్కువగా మద్దతు ధరలను ప్రకటించి వారిని మోసగించడం సిగ్గుచేటని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు విమర్శించారు. స్థానిక సుందరయ్య భవన్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ప్రభుత్వాల వల్లనే రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి దాపురించిందని మండిపడ్డారు. ఈ ఏడాది రాష్ట్రంలో గత సంవత్సరం మిర్చి క్వింటాకు రూ.20 వేల నుంచి రూ.24 వేల ధర లభించగా, ఈ ఏడాది కేవలం రూ.10 వేల నుంచి రూ.12 వేలు మాత్రమే ధర వచ్చిందని, దీని వలన రైతులు చాలా నష్టపోతున్నారని తెలిపారు. బహిరంగ మార్కెట్లో క్వింటా రూ.12 వేలు ఉండగా రాష్ట్ర ప్రభుత్వం క్వింటాకు రూ.11,780 ప్రకటించడం దుర్మార్గం అన్నారు. మిర్చి రైతుకు రూ.5 వేల బోనస్ ప్రకటించి స్వయంగా ప్రభుత్వమే కొనుగోలు చేయాని డిమాండ్ చేశారు. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.1500 మాత్రమే బోనస్ ప్రకటించిందన్నారు. దేశంలో కేరళ, తమిళనాడు, తెలంగాణ ప్రభుత్వాలు వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలకు బోనస్ ప్రకటించడాన్ని గుర్తు చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయలేదని, కౌలు రైతు సంక్షేమం కోసం ప్రవేశ పెట్టిన చట్టాలను అమలు చేయడం లేదన్నారు. ఖరీఫ్ సీజన్ వస్తున్నా పంటల బీమా అమలు చేయకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రుణపరిమితి వంటి రైతు సంక్షేమ పథకాలకు చట్టబద్ధత కల్పించాలని కోరారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వై.రాధాకృష్ణ మాట్లాడుతూ.. ప్రభుత్వ విధానాల వలన పొగాకు రైతులు నష్టపోవాల్సి వస్తుందని చెప్పారు. నల్లబర్లీ గత ఏడాది క్వింటా రూ.18 వేలు ఉండగా ఈ ఏడాది రూ.3 వేలకే కొనుగోలు చేయడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో కోకో సాగును ప్రోత్సహించిన కంపెనీలు ఊరగాయ పెట్టుకోమంటూ ఎగతాళి చేస్తున్నాయని అన్నారు. పసుపు ధర కూడా పతనమైందని, మొక్కజొన్న, వరికి గిట్టుబాటు ధరలు లభించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బాల కోటయ్య తదితరులు పాల్గొన్నారు. ఏపీ కౌలు రైతు సంఘ రాష్ట్ర కార్యదర్శి హరిబాబు -
పొగాకు రైతులపై ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి
కొండపి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు రైతుల పట్ల మొద్దు నిద్ర విడనాడి పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా కృషి చేయాలని మాజీ మంత్రి, పీఏసీ సభ్యుడు, కొండపి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా కొండపిలోని జెండా చెట్టు సెంటర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పొగాకు కొనుగోలు ప్రారంభం నుంచి రైతులకు ఆశించిన మేర బోర్డు వారు కొనుగోలు ప్రారంభించలేదని అన్నారు. ప్రస్తుత ధరలు ఏమాత్రం రైతులకు గిట్టుబాటు కల్పించేలా లేవని అన్నారు. పొగాకు కొనుగోళ్లలో ఇతర రాష్ట్రాల్లో కేజీ రూ.300 పైగా ధర పలుకుతుంటే, మన రాష్ట్రంలో సరాసరి రూ.250 పైగా పలుకుతున్నాయని అన్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన వేలంలో ఎక్కువగా నో బిడ్స్ కనబడుతున్నాయని, రైతులు ఏదో ఒక ధరకు ఇచ్చేలా చేసే ప్రయత్నంలో పొగాకు బోర్డు వారు ఉన్నారని అన్నారు. పొగాకు ధరలు పెరుగుతాయని రైతులు ఎదురుచూస్తుంటే ధరలు మాత్రం రోజురోజుకూ దిగజారిపోతున్నాయని, దీనివల్ల రైతులు తీవ్ర నష్టపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం మద్దతు ధర కేజీ రూ.300 పైగా ఉంటే రైతులు అప్పుల ఊబిలో పడకుండా ఉంటారని, ఇప్పటికై నా ప్రభుత్వం జోక్యం చేసుకొని పరిస్థితి చేయి దాటకముందే ధరలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం ముద్దు నిద్ర వీడి పొగాకు రైతులు రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేయకముందే ప్రభుత్వం జోక్యం చేసుకొని మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం లో ఇదే పరిస్థితి ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్క్ఫెడ్ ద్వారా రూ.200 కోట్లు తీసుకొచ్చి పొగాకు ధరలను స్థిరీకరించారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే మార్క్ఫెడ్ సొసైటీ ద్వారా రూ.200 నుంచి రూ.300 కోట్లు కేటాయించి పొగాకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పొగాకు బోర్డు రైతుల పక్షాన నిలబడి గిట్టుబాటు ధరలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు డాకా పిచ్చిరెడ్డి, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ఆరికట్ల కోటిలింగయ్య, వైస్ ఎంపీపీ రావులపల్లి కోటరాజు, పంచాయతీరాజ్ వింగ్ అధ్యక్షుడు షేక్ వన్నూరు, కల్చరల్ వింగ్ అధ్యక్షుడు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు యామవరపు వసంతరావు, యువజన విభాగ అధ్యక్షుడు గంగాధర్, మండల సీనియర్ నాయకులు బొక్కిసం సుబ్బారావు, బచ్చలకోటు, మండవ మాలకొండయ్య, దివి శ్రీనివాసరావు, పర్చూరి శ్రీనివాసరావు, మారెడ్డి వెంకటేశ్వర రెడ్డి, గౌరెడ్డి రమణారెడ్డి, నెన్నూరు పాడు రమణారెడ్డి, పరుచూరి సుబ్బయ్య, మోపర్తి నారాయణ, ఆరికట్ల హరినారాయణ, కోడిపిల్ల ప్రసాద్, శేషు, రాజబాబు, సాంబశివరావు, వినోద్, మహేష్, నజీర్, కోర్నేలు, యాకోబు, సుల్తాన్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేయాలి పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి సురేష్ -
కమీషన్లు రయ్యి మనీ!
ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగర పాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యంతో ఖజానాకు భారీగా తూట్లు పడుతోంది. పెనాల్టీల రూపంలో ప్రజాధనం వృథా అవుతోంది. నగరపాలక సంస్థ పరిధిలో అధికారుల వాహనాలు మొదలుకొని ఇంజినీరింగ్ విభాగంలో అనేక రకాల వాహనాలు ఉన్నాయి. వీటికి సంబంధించి సకాలంలో పన్నులు చెల్లించడం లేదు. దీంతో రవాణాశాఖ అధికారులు తనిఖీలు చేసినప్పుడు పలు మార్లు కార్పొరేషన్ వాహనాలను సీజ్ చేశారు. పెనాల్టీల రూపంలో రూ.8 లక్షలు ఒకసారి, రూ.3 లక్షలు ఒకసారి రవాణాశాఖకు చెల్లించారు. అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా ప్రజాధనం వృథాగా పోతోంది. మూడేళ్లుగా నో రిజిస్ట్రేషన్ నగరపాలక సంస్థలో నీళ్ల సరఫరాకు సంబంధించి రెండు వాటర్ ట్యాంకర్లు ఉన్నాయి. 2021–22వ సంవత్సరంలో ఎన్ క్యాప్ నిధులతో వాటిని కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన రెండు ట్రాక్టర్లను రవాణా శాఖ అధికారుల వద్ద రిజిస్ట్రేషన్ చేయించారు. వాటికి జత చేసిన 2 ట్రక్కులకు మాత్రం రిజిస్ట్రేషన్ చేయించలేదు. సాధారణంగా ఇంజన్కు రిజిస్ట్రేషన్ చేస్తే ఒక నంబరు మాత్రమే వస్తుంది. అదే ట్రక్కు, ట్రాక్టర్ ట్యాంకర్లకు రిజిస్ట్రేషన్ చేస్తే రెండు నంబర్లు వస్తాయి. కానీ ఒంగోలు నగర పాలక సంస్థ అధికారులు మాత్రం ట్రక్కులు బిగించిన ట్రాక్టర్లు చట్ట విరుద్ధంగా రోడ్డు మీద తిప్పుతున్నారు. ప్రైవేటు ట్రాక్టర్లకు రోజుకు రూ.80 నుంచి రూ.90 వేల వరకు చెల్లింపు ఒంగోలు నగరంలో శివారు ప్రాంతాల ప్రజలకు మంచినీరు సరఫరా చేసేందుకు ప్రతి రోజూ ప్రైవేటు ట్రాక్టర్ ట్యాంకర్ల యజమానులకు రూ.80 వేల నుంచి రూ.90 వేల వరకు చెల్లిస్తున్నారు. 45 ట్రాక్టర్లు ప్రతి రోజూ 225 నుంచి 240 ట్రిప్పుల వరకు ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీరు సరఫరా చేస్తున్నారు. నగర పాలక సంస్థ టెండర్ ఎస్టిమేషన్ ప్రకారం ఒక్కో ట్యాంకర్ ట్రిప్పునకు రూ.356 చెల్లిస్తుంది. ఈ విధంగా ప్రైవేటు ట్యాంకర్లకు రోజుకు రూ.80 వేలు చెల్లిస్తుంటే మొత్తం మీద కనీసం నెలకు రూ.24 లక్షలు చెల్లిస్తున్నారు. మరి నగర పాలక సంస్థకు ఉన్న రెండు ట్రాక్టర్లకు సంవత్సరానికి కట్టాల్సిన పన్నులు ఎందుకు కట్టడం లేదన్న ప్రశ్నలను అధికారుల వద్ద నుంచి సరైన సమాధానం రావడంలేదు. సొంత వాహనాలకు సకాలంలో పన్నులు చెల్లించి తిప్పితే ప్రైవేటు వాహనాలకు చెల్లించాల్సిన మొత్తం తగ్గుతుంది. కమీషన్ల కోసమే అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారంటూ కార్పొరేషన్ వర్గాల్లోనే భిన్న సర్వరాలు వినిపిస్తున్నాయి. ఆర్టీఓకు సకాలంలో వాహనాల పన్నులు చెల్లించని ఒంగోలు కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పటికీ రూ.11 లక్షలు పెనాల్టీలు చెల్లింపు రికార్డులు లేకపోవడంతో వాటర్ ట్యాంకర్ సీజ్ చేసిన ఆర్టీఓ అధికారులు రెండో ట్యాంకర్ను దాచేసిన అధికారులు మరోసారి చర్చనీయాంశంగా మారిన అధికారుల వ్యవహారం సొంత వాహనాలు ఉన్నా ప్రైవేటు ట్యాంకర్లకు నెలకు రూ.24 లక్షలు చెల్లింపు కమీషన్ల కోసమే అంటూ ఆరోపణలుఒక ట్రాక్టర్ను సీజ్ చేసిన రవాణా శాఖ అధికారులుఇటీవల నగరంలో రవాణా శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అందులో భాగంగా ఒంగోలు నగర పాలక సంస్థకు చెందిన ఏపీ 39 యుఆర్ 7561 నంబరుగల ట్రాక్టర్ రికార్డులను చూపించాలని అధికారులు డ్రైవర్కు అడిగారు. అయితే డ్రైవర్ నోరెళ్లబెట్టాడు. వెంటనే దానిని వెంగముక్కల పాలెం రోడ్డులోని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (డీటీసీ) కార్యాలయ ప్రాంగణానికి తరలించారు. సీజ్చేసి రోడ్డు ట్యాక్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్తో పాటు ఇతర పెనాల్టీలు కట్టి తీసుకెళ్లాలని ఒంగోలు కమిషనర్ కే.వెంకటేశ్వరరావుకు నోటీసులు పంపారు. ఒక వాహనాన్ని పట్టుకున్నారని తెలుసుకున్న కమిషనర్, ఇంజినీరింగ్ విభాగానికి చెందిన మున్సిపల్ ఇంజినీర్ పరిస్థితిని సమీక్షించారు. పన్నులు చెల్లించకుండా తిరుగుతున్న రెండో ట్రాక్టర్ను రంగారాయుడు చెరువు సమీపంలోని మంచినీరు సరఫరా చేసే ఫిల్టర్ బెడ్ వద్ద ఎవరికీ కనపడకుండా దాచేశారు. -
చేతికొచ్చిన బొప్పాయి నేలపాలు
● గాలీ, వాన బీభత్సంతో పంట నష్టం మర్రిపూడి: మండలంలో గురువారం గాలీ, వాన బీభత్సం సృష్టించింది. విపరీతమైన గాలి, వర్షంతో కూడిన గాలులు వీచడంతో అందివచ్చిన బొప్పాయి పంట నేలపాలైంది. మండలంలో 100 ఎకరాల్లో బొప్పాయి పంట సాగుచేశారు. ఉరుములు, మెరుపులతో వర్షం కురవడంతో బొప్పాయి పంట నేలకు ఒరిగింది. మండలంలో కాకర్ల, పన్నూరు, మర్రిపూడి, తంగెళ్ల, అంకేపల్లి, తదితర గ్రామాల్లో బొప్పాయి పంట సాగుచేశారు. అత్యధికంగా పన్నూరులో 65 ఎకరాలు సాగుచేశారు. మర్రిపూడి కొండపొలంలో సందల నర్సారెడ్డి అనే కౌలు రైతు 4 ఎకరాలల్లో బొప్పాయి సాగు చేశాడు. పంట కోతకు రావడంతో మరో రెండు రోజుల్లో కాయలు కోస్తామనుకున్న తరుణంలో గురువారం వర్షంతో కూడిన గాలులు వీచడంతో మూడు ఎకరాలు పూర్తిగా పంట దెబ్బతినిందని, ఎకరా పొలం మాత్రం పాక్షికంగా దెబ్బతిందని బాధితుడు తెలిపాడు. అకాల వర్షం కారణంగా సుమారు రూ.6 లక్షలు నష్టం వాటిల్లినట్లు బాధితుడు నర్సారెడ్డి పేర్కొన్నాడు. నేడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేస్తాయిఒంగోలు సబర్బన్: జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలన్నీ రెండో శనివారం సెలవు అయినా పనిచేస్తాయని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ) వి.పుష్పలత తెలిపారు. ఈ మేరకు ఆమె శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఉదయం 11 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జిల్లాలో అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు నేడు పనిచేస్తాయన్నారు. -
అణగారిన వర్గాల అభ్యున్నతికి పోరాడిన పూలే
ఒంగోలు సిటీ: పేదలు, బహుజనులు, గిరిజనుల కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి జ్యోతీరావు పూలే అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అన్నారు. స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జ్యోతిరావ్ పూలే చిత్రపటానికి బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరు రవిబాబు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ జ్యోతీరావు పూలే ఉద్యమకారుడు, సంఘసంస్కర్త అని కొనియాడారు. ఇటువంటి నాయకులు చేసిన సేవను గుర్తించుకొని మా నాయకుడు కూడా బహుజనులు, పేదల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో పూలేను ఎప్పటికీ గుర్తు పెట్టుకొని పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తామని తెలిపారు. ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరు రవిబాబు మాట్లాడుతూ విద్యావ్యాప్తి ద్వారా సాంఘిక అసమానతలు తొలగిపోతాయని జ్యోతీరావుపూలే భావించాడనీ, ఆయన అడుగు జాడల్లో అందరం నడుద్దామన్నారు. కార్యక్రమంలో ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ, మహిళా విభాగం పార్టీ రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, బడుగు ఇందిర, వైఎస్సార్ సీపీ నాయకులు బొట్ల రామారావు, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, సాధం విజయలక్ష్మి, దాసరి కరుణాకర్, పిగిలి శ్రీను, కోటి యాదవ్, పి.ఆంజనేయులు, దుంపా చెంచిరెడ్డి, మహానందరెడ్డి, ఇమ్రాన్ఖాన్, గౌడ్, బొట్ల మాల్యాద్రి, బొడ్డు వేణు, భాను, పుసమర్తి బాబు, తదితరులు పాల్గొన్నారు. ఘనంగా జ్యోతీరావుపూలే 199వ జయంతి వేడుకలు పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మపూలేకి నివాళులర్పిస్తున్న బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, వెంకాయమ్మ, చుండూరి రవిబాబు తదితరులు -
అక్రమ కేసులు ఎత్తేయాలని జర్నలిస్టుల నిరసన
● సబ్కలెక్టర్కు వినతిపత్రం మార్కాపురం: రాష్ట్ర ప్రభుత్వం ‘సాక్షి’ దినపత్రికపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ ‘సాక్షి’ ఎడిటర్ ఆర్ ధనుంజయరెడ్డితోపాటు మరో ఆరుగురు సాక్షి రిపోర్టర్లపై బనాయించిన అక్రమ కేసులను ఎత్తివేయాలని పాత్రికేయులు డిమాండ్ చేశారు. చంద్రబాబు రెడ్బుక్ అరాచకాలను వెలుగులోకి తెస్తున్న సాక్షి పత్రికపై వ్యవహరిస్తున్న కక్షపూరిత విధానాలను విడిచిపెట్టాలన్నారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని పశువేములకు చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త హరిశ్చంద్రను టీడీపీ వర్గీయులు హత్యచేసిన విషయాన్ని సాక్షిలో ప్రచురించినందుకు కూటమి ప్రభుత్వం కక్ష కట్టి సాక్షి ఎడిటర్తోపాటు మరో ఆరుగురిపై నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని మార్కాపురం ప్రెస్క్లబ్ గౌరవ అధ్యక్షుడు ఓఏ మల్లిక్, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఎన్వీ రమణ డిమాండ్ చేశారు. మార్కాపురం ప్రెస్క్లబ్ నుంచి సబ్కలెక్టర్ కార్యాలయం వరకూ శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించి అనంతరం సబ్కలెక్టర్ త్రివినాగ్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా పాత్రికేయుడు ఓఏ మల్లిక్ మాట్లాడుతూ ఒక దారుణాన్ని వెలుగులోకి తెచ్చిన సాక్షి పత్రికపై ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించడాన్ని ఖండించారు. పత్రికా స్వేచ్ఛను హరించే విధానాలను ప్రభుత్వం విడిచిపెట్టాలన్నారు. ఏదైనా వార్త నచ్చకపోతే ఖండన ఇవ్వవచ్చని, అలా కాకుండా కక్ష పూరితంగా వ్యవహరిస్తూ కేసులు నమోదు చేయడం మంచి సాంప్రదాయం కాదన్నారు. ఈరోజు సాక్షి కావచ్చు... రేపు మరో పత్రికకు కూడా ఇదే పరిస్థితి రావచ్చన్నారు. జర్నలిస్టులందరూ ఐక్యంగా ఉండి ఇలాంటి సంఘటనలను ఎదుర్కోవాలన్నారు. పోరాటాలు చేయాల్సిన అవసరం ఆసన్నమైందని చెప్పారు. పాత్రికేయులు అప్పటికప్పుడు వచ్చిన సమాచారాన్ని వెంటనే ప్రచురిస్తారని, ఇలాంటి వార్తలపై కూడా దారుణంగా ప్రభుత్వం వ్యవహరించడం శోచనీయమన్నారు. ప్రభుత్వం నమోదు చేసిన క్రిమినల్ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఇలా చేస్తే భవిష్యత్తులో పాత్రికేయ వృత్తి ప్రమాదకర పరిస్థితుల్లో పడుతుందని అన్నారు. కార్యక్రమంలో మార్కాపురం ప్రెస్క్లబ్ అధ్యక్షుడు డీ మోహన్రెడ్డి, సాక్షి ప్రతినిధులు జీఎల్ నరసింహారావు, డీ జగన్నాథరెడ్డి, బీ రామయోగి, బీ మల్లిఖార్జున్, ఎలక్ట్రానిక్ మీడియా అసోషియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే బాజీవలి, జిల్లా యూనియన్ కార్యవర్గ సభ్యులు ఎస్కె అన్నూ, ఏపీయూడబ్ల్యూజేఎఫ్ నాయకుడు వెన్న శ్రీనివాసరెడ్డి, ఎంపీజే రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కే బాబు, ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఎస్కే మహబూబ్ సుభానీ, సయ్యద్ షాకీర్ హుస్సేన్, వేశపోగు రాజు, ఆదినారాయణ, మల్లిఖార్జున, నరేంద్ర, అనీల్కుమార్, బషీర్, ఓబయ్య, ఎస్ పోలయ్య, ఎస్కె కరీమ్, ఖలీల్, బూదాల సురేష్కుమార్, కల్లూరి వెంకటేశ్వర్లు, సీహెచ్ సౌకత్, ఇమ్మడి శ్రీనివాసులు, ముకుందర్, ప్రకాష్, పవన్కుమార్, రాజ్కమల్, శేఖర్, వై శ్రీనివాసులు, ఆమ్ఆద్మీపార్టీ జిల్లా కన్వీనరు సుదర్శన్, శ్రీధర సాయికుమార్, ఎస్ఎమ్ సుభానీ, జాన్సన్, పీయల్ నవీన్, టీ మల్లిఖార్జున పాల్గొన్నారు.అక్రమ కేసులు ఎత్తివేయాలి రాష్ట్ర ప్రభుత్వం సాక్షి పాత్రికేయులపై నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఎన్వీ రమణ డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లాలో ‘సాక్షి’లో వచ్చిన వార్తపై పోలీసులు సాక్షి ఎడిటర్ ధనుంజయ్రెడ్డితోపాటు మరో ఆరుగురు సాక్షి రిపోర్టర్లపై పెట్టిన కేసును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన ప్రభుత్వమే ఇలా చేయడం మంచి సాంప్రదాయం కాదన్నారు. పత్రికల్లో వచ్చిన వార్తలు నచ్చకపోతే ఖండన ఇవ్వవచ్చని, ఇలా కేసులు పెడితే భవిష్యత్తులో పాత్రికేయ వృత్తిలోకి ఎవరైనా రావాలంటే భయపడతారని అన్నారు. ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన పత్రికా స్వేచ్ఛను ప్రభుత్వం గౌరవించాలని రమణ కోరారు. – ఎన్వి రమణ, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు -
జగనన్నతోనే పేదలకు న్యాయం
సంతనూతలపాడు: పేదలకు న్యాయం జగనన్నతోనే సాధ్యమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అన్నారు. మండలంలోని గుమ్మలంపాడులో ప్రసన్నాంజనేయస్వామి 60వ వార్షిక మహోత్సవాన్ని బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు ఇన్చార్జి చుండూరు రవిబాబు, మహిళా విభాగం అధ్యక్షురాలు దుంపా రమణమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రభలపై బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నాయకులు ఇద్దరేనన్నారు. ఒకరు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి కాగా, రెండో వ్యక్తి ఆయన కుమారుడు జగన్మోహన్రెడ్డి అన్నారు. జగనన్న పాలనలో అర్హులందరికీ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందాయన్నారు. ప్రభుత్వ సేవలను గ్రామస్థాయిలో అందించేందుకు సచివాలయ వ్యవస్థ రూపకల్పన చేశారని కొనియాడారు. మా కుటుంబంపై ప్రేమ, నమ్మకంతో నా తల్లికి జిల్లా పరిషత్ చైర్పర్సన్గా, నాకు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షునిగా జగనన్న అవకాశం కల్పించారన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేసి మళ్లీ జగనన్ను సీఎం చేసుకునేందుకు అందరూ కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఒంగోలు ఇన్చార్జి చుండూరు రవిబాబు మాట్లాడుతూ 10 నెలల కూటమి ప్రభుత్వ పాలనను చూసి ప్రజలు తప్పు చేశామని బాధపడుతున్నారన్నారు. అందరం కలిసికట్టుగా ముందుకు సాగి వైఎస్సార్సీపీని మళ్లీ అధికారంలోకి తీసుకువద్దామన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ దుంపా చెంచిరెడ్డి, బొక్కిసం శివరామయ్య, మొలకలపల్లి సుబ్బారావు, బొడ్డపాటి ఆంజనేయులు, బొడ్డపాటి శ్రీనివాసరావు, మంగపాటి శ్రీనివాసరావు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. , వచ్చే ఎన్నికల్లో జగనన్నను మళ్లీ సీఎం చేసుకుందాం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి -
రెండేళ్ల కిందటే జీవం!
గుండెకు వరం.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపు జిల్లాలోని హృద్రోగులకు వరంగా మారుతోంది. సామాన్య ప్రజలకు అత్యున్నత వైద్యసేవలందించాలన్న లక్ష్యంలో భాగంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో జిల్లా కేంద్రంలోని సర్వజన ఆస్పత్రికి క్యాథ్ల్యాబ్ మంజూరు చేశారు. ఆ సేవలు ప్రస్తుతం అందుబాటులోకి రానున్నాయి. క్యాథ్ల్యాబ్ను కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. పనులు నత్తనడకన సాగాయి. పనులు పూర్తయినా ల్యాబ్ ప్రారంభానికి నాలుగు నెలలు పట్టింది. తొలుత అట్టహాసంగా ప్రారంభించాలని ప్లాన్ చేశారు. అయితే, వైఎస్సార్ సీపీకి ఎక్కడ మంచి పేరు వస్తుందోనని తాత్సారం చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు శుక్రవారం వైద్యశాఖామంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఇక్కడ నలుగురు కార్డియాలజిస్ట్లకు ఒక్కరే ఉన్నారు. ● వైఎస్సార్ సీపీ హయాంలోనే తొలి అడుగు ● 2023లోనే ఒంగోలు జీజీహెచ్కి క్యాథ్ల్యాబ్ మంజూరు చేసిన అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ● అప్పట్లోనే టెక్నీషియన్లు, నర్సింగ్ స్టాఫ్కు శిక్షణ ● కూటమి ప్రభుత్వ హయాంలో నత్తనడకన పనులు ● జనవరికి పూర్తయిన పనులు.. నేడు ప్రారంభం ● 4 కార్డియాలజీ పోస్టులకు ఒక్కరితోనే సరి సాక్షి ప్రతినిధి, ఒంగోలు జిల్లా కేంద్రం ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో క్యాథ్ల్యాబ్ ఏర్పాటుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి వచ్చిన పీజీ ఫండ్స్తో క్యాథ్ల్యాబ్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. 2023వ సంవత్సరం డిసెంబర్లో టెండర్ పిలిచారు. 6 కోట్ల రూపాయలకుపైగా నిధులు కేటాయించారు. జీజీహెచ్ మొదటి అంతస్తు రూం నంబర్ 120లో క్యాథ్ల్యాబ్ ఏర్పాటుకు 2024 జనవరి నుంచి పనులు చేపట్టారు. మార్చి నుంచి ఆగస్టు వరకు సివిల్ పనులు పూర్తి చేశారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఎలక్ట్రికల్ పనులు పూర్తి చేసి ఆ తర్వాత నవంబర్ నాటికి మిషన్ బిగించారు. ఎన్నికల కోడ్ రావడంతో మిగిలిన ప్యాచ్ వర్క్ ఆగింది. ఆ తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో అక్కడి నుంచి పనులు నత్తను తలపించాయి. శానిటేషన్, ఐసీసీయూ పనులను జనవరి 25 నాటికి పూర్తి చేశారు. అప్పటి నుంచి జీజీహెచ్లో యాంజియోగ్రామ్ పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 51 మందికి పరీక్షలు చేసి స్టెంట్లు అవసరమైన వారిని గుంటూరు జీజీహెచ్కి తరలించారు. -
అగ్రహారం భూములపై రాబందులను వాలనివ్వం
ఒంగోలు టౌన్: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇచ్చిన అగ్రహారం భూముల్లో రాబందులను వాలనిచ్చేదిలేదని, అగ్రహారం భూములను కొల్లగొట్టాలని చూస్తే ఊరుకోమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పష్టం చేశారు. ఒంగోలు నగరంలోని వేలాది మంది ఇళ్లులేని నిరుపేదలకు అగ్రహారం భూముల్లో ఇంటి స్థలాలిచ్చేంత వరకు ఎర్రజెండాలతో పోరాటాం కొనసాగిస్తామని చెప్పారు. గురువారం ఒంగోలు వచ్చిన ఆయన.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన అగ్రహారం భూములను పార్టీ నాయకులు, లబ్ధిదారులతో కలిసి పరిశీలించారు. అనంతరం స్థానిక కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు సెంట్ల చొప్పున ఇంటి స్థలాలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి 10 నెలలు గడుస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై మండిపడ్డారు. ఒంగోలులో 20 ఏళ్ల క్రితం ఇంటి స్థలాలు పంపిణీ చేశారని, ఇప్పటికీ ఒక్కో ఇంట్లో ఏడుగురు కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారని తెలిపారు. అద్దెలు కట్టలేక అల్లాడిపోతున్నారని చెప్పారు. ఏడేళ్ల క్రితం నిర్మించిన టిడ్కో ఇళ్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి పేదలకు అందజేయాలన్నారు. లేకపోతే టిడ్కో ఇళ్లపై ఉద్యమం చేస్తామని ప్రకటించారు. అగ్రహారం భూములపై పేదలకే హక్కు... సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య ప్రసంగిస్తూ అగ్రహారం భూములపై పేదలకే హక్కుందన్నారు. అగ్రహారం భూములను కొల్లగొట్టాలని చూస్తే ఎర్రజెండాలు పాతి పేదలకు అండగా నిలుస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు గడుస్తున్నప్పటికీ పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడంలో విఫలమైందని విమర్శించారు. అగ్రహారం భూముల్లో భరోసా పత్రాలిచ్చిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. అధికారం పోగానే స్వలాభం కోసం పార్టీ మారారే తప్ప పేదలకు ఇచ్చిన భూముల గురించి పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఒంగోలులో పేదలకు ఇంటిస్థలాలు ఇచ్చేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. అనంతరం డీఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, నాయకులు కె.వీరారెడ్డి, శ్రీరాం శ్రీనివాస్, ఆర్.వెంకటరావు, వడ్డే హనుమారెడ్డి, ఆర్.రామకృష్ణ, కొత్తకోట వెంకటేశ్వర్లు, ఆర్.లక్ష్మి, ముత్తని అంజయ్య, ఎన్.మురళి, ఎం.విజయ, బాలకోటయ్య, ప్రభాకర్, గద్దల రవి తదితరులు పాల్గొన్నారు. అర్హులైన పేదలకు ఆ భూములు పంచాల్సిందే ఒక్కొక్కరికి రెండు సెంట్ల చొప్పున ఇస్తామన్న హామీ నెరవేర్చకుంటే పోరాటం భూములను పరిశీలించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ -
ఈదురుగాలుల బీభత్సం
సాక్షి నెట్వర్క్: జిల్లాలో గురువారం కురిసిన అకాల వర్షం బొప్పాయి రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. ఈదురుగాలులతో కురిసిన వర్షానికి జిల్లాలోని దర్శి, కురిచేడు, పొదిలి మండలాల్లో ఎక్కువ నష్టం వాటిల్లింది. వందల ఎకరాల్లో బొప్పాయి చెట్లు నేలకొరిగాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ● దర్శి మండలంలోని చందలూరు, వెంకటచలంపల్లి, మారెడ్డిపల్లి, బసిరెడ్డిపల్లి, అబ్బాయిపాలెం గ్రామాల్లో బొప్పాయి తోటలు నేలకొరిగాయి. మండలంలో సుమారు 50 ఎకరాల్లో బొప్పాయి సాగు చేశారు. ఆరుగాలం పండించిన పంట కళ్లెదుటే నేలపాలు కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షానికి కల్లాలో ఉన్న మిరపకాయలు, పందిర్లలో ఉన్న పొగాకు కూడా తడిసి ముద్దయింది. మండలంలోని జముకులదిన్నె గ్రామం వద్ద భారీ వృక్షం నేలకూలింది. చెట్టు రోడ్డుకు అడ్డంగా పడటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ● పొదిలి మండలంలో అకాల వర్షం రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. మండలంలోని చిదంబరంపల్లి, గొల్లపల్లి, కుంచేపల్లి, మల్లవరం గ్రామాల్లో చేతికి వచ్చిన బొప్పాయి నేలకొరిగింది. పంట బాగా పండి మంచి కాయలతో కళకళలాడుతున్న సమయంలో అకాల వర్షం తీరని నష్టం మిగిల్చిందని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. మండలంలో సుమారు 140 ఎకరాల్లో బొప్పాయి సాగు చేయగా 90 ఎకరాల్లో పూర్తిగా దెబ్బతింది. ఎకరాకు రూ.2 లక్షల మేరు నష్టం వాటిల్లిందని రైతులు బొనముక్కల రామిరెడ్డి, మారం సుబ్బారెడ్డి, సింగంరెడ్డి పెద్దిరెడ్డి, కామిరెడ్డి వెంకటరామిరెడ్డి, పెద్దిరాజు, వెంకటరెడ్డి వాపోయారు. ● పొదిలి మండలం రామాపురం జగనన్న కాలనీ సమీపంలో విద్యుత్ స్తంభంపై పిడుగు పడింది. పిడుగు విద్యుత్ పోలుపై పడటంతో పోలు పైభాగం విరిగికిందపడింది. ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ● కురిచేడు మండలం బోదనంపాడులో గురువారం సాయంత్రం వీచిన పెనుగాలులకు వేపచెట్టు రోడ్డుపై విరిగి పడింది. దీంతో రాకపోకలకు ఇబ్బంది కలిగింది. ● పొదిలి పట్టణంలో గురువారం సాయంత్రం వీచిన గాలులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. స్థానిక పెద్ద బస్టాండ్ సెంటర్లో విద్యుత్ స్తంభం ఎల్జీ షోరూంపై పడింది. స్థానిక ఎన్ఏపీ పంప్ హౌస్లో పెద్ద వేపచెట్టు నేలకొరిగింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ తీగలు తెగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అకాల వర్షానికి వందల ఎకరాల్లో నేలకొరిగిన బొప్పాయి పంట చేతికొచ్చే సమయంలో నేలకొరగడంతో రైతుల కన్నీరుమున్నీరు -
నమో.. చెన్నకేశవా..
మార్కాపురం టౌన్: దక్షిణ భారతదేశంలో ప్రత్యేకతను సంతరించుకున్న వైష్ణవ క్షేత్రాల్లో ఒకటైన మార్కాపురం శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. 7 శతాబ్దాల ఘన చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో చైత్రశుద్ధ పౌర్ణమి రోజున ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలను ప్రారంభించడం ఆనవాయితీ. శ్రీపాంచరాత్రాగమశాస్త్ర ప్రకారం 14 రోజులపాటు అత్యంత వైభవంగా సాగే ఈ ఆధ్మాత్మిక వేడుక భక్తులకు ఓ మరుపురాని కానుక. ఆలయంలో అబ్బురపరిచే శిల్ప సంపద విజయనగర చక్రవర్తుల కళాతృష్ణకు తార్కాణంగా నిలుస్తుంది. బ్రహ్మోత్సవాలు ఇలా.. శుక్రవారం అంకురార్పణ, శనివారం ఉదయం ధ్వజారోహణం, రాత్రికి రాయబారం, ఎదురుకోలు, సూర్యవాహనం, స్వామి వారి కల్యాణం(తెల్లవారితే ఆదివారం), 13న చంద్రవాహనం, 14న సింహ, 15న శేష, 16న వ్యాళి, 17వ తేదీ నుంచి పగలు ఉత్సవంగా పొన్న, 18న హనుమంత, 19న గరుడ, 20న గజ వాహనం, 21న సాయంత్రం 4.30 గంటలకు రథోత్సవం నిర్వహించనున్నారు. 22న అశ్వవాహనం, 23న హంస వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. 28న స్వామివారికి వసంతోత్సవం, ఊంజల్ సేవ, 29న 16 రోజుల పండగ నిర్వహించనున్నారు. ఉత్సవ ఏర్పాట్లు పూర్తి శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. మార్కాపురంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వేలాదిగా బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్వామి వారిని దర్శించుకునే విధంగా ప్రణాళిక రూపొందించాం. – శ్రీనివాసరెడ్డి, ఆలయ ఈఓ నేటి నుంచి 29వ తేదీ వరకు శ్రీలక్ష్మీ చెన్నకేశవుని బ్రహ్మోత్సవాలు -
ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఒంగోలు వన్టౌన్: ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఈడీ అర్జున్ నాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు 1305 యూనిట్లు కేటాయించినట్లు వెల్లడించారు. జిల్లాలో 21 నుంచి 50 ఏళ్లలోపు వయసున్న ఎస్సీలు అర్హులని స్పష్టం చేశారు. ఈ నెల 13 నుంచి మే 13వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కారు డ్రైవర్ దారుణ హత్యనెల్లూరు(క్రైమ్): కారు డ్రైవర్ దారుణ హత్యకు గురైన ఘటన నెల్లూరు ప్రగతినగర్ ఏ–బ్లాక్లో గురువారం వెలుగుచూసింది. పోలీసులు, బాధితుల కథనం మేరకు.. ప్రకాశం జిల్లా పామూరు మండలం తిరిగలదిన్నె గ్రామానికి చెందిన మాధవ, జ్యోతి దంపతులకు వాసు (23), వాసవి సంతానం. మాధవ కుటుంబం సుమారు 11 సంవత్సరాల క్రితం నెల్లూరు నగరానికి వలసొచ్చింది. వారు ప్రస్తుతం ప్రగతినగర్ ఏ–బ్లాక్లో నివాసం ఉంటున్నారు. మాధవ ఓ ప్రైవేట్ హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. వాసు కారు డ్రైవర్గా పనిచేస్తూ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. పలువురితో అతడికి గొడవలున్నాయి.హత్య చేశారిలా..పని ఉందంటూ వాసు బుధవారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి ఏడు గంటల సమయంలో తండ్రికి ఫోన్ చేసి పనిమీద ఉన్నానని ఇంటికి రావడం ఆలస్యమవుతందని చెప్పాడు. అర్ధరాత్రి ఓ యువకుడిపై వాసు కత్తితో దాడి చేశాడు. సదరు యువకుడు ఈ విషయాన్ని అప్పటికే వాసు వల్ల ఇబ్బందులు పడుతున్న వినయ్, మణికంఠ, లోకేశ్ అలియాస్ ఛత్రపతి, తేజ, సంతోష్తోపాటు మరికొందరికి తెలియజేశాడు. అందరూ కలిసి వాసును ఆర్టీసీ బస్టాండ్ వద్ద పట్టుకుని ప్రగతినగర్ ఏ–బ్లాక్ పదో వీధిలోని దర్గా వద్దకు తీసుకొచ్చి దాడి చేశారు. తమ వెంట తెచ్చుకున్న కత్తులతో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని వెంగళరావ్నగర్ సమీప చెరువులో పూడ్చిపెట్టేందుకు తీసుకెళ్లగా అక్కడ జనసంచారం ఉండటంతో ప్రగతినగర్ చెరువు సమీపంలోని చెత్తకుప్పలో పడేశారు. మృతదేహంపై పెద్ద చెత్తమూటను వేసి పరారయ్యారు. గురువారం ఉదయం స్థానికులు మృతదేహాన్ని గమనించి దర్గామిట్ట పోలీసులకు సమాచారం అందించారు. నగర డీఎస్పీ పి.సింధుప్రియ, ఎస్సై రోశయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి ఛాతి, పొట్ట, గొంతు ఇలా అనేక చోట్ల పెద్ద సంఖ్యలో కత్తిపోట్లు ఉన్నాయి. పేగులు సైతం బయటకు వచ్చాయి. విగతజీవిగా పడి ఉన్న కుమారుడిని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. సాంకేతికత ఆధారంగా నిందితుల్లో కొందరిని పోలీసులు గుర్తించారు. మూడు నెలల క్రితం సారాయంగడి సెంటర్లో ఓ స్వీట్ షాపు వద్ద జరిగిన వివాదం కూడా హత్యకు మరో కారణంగా తెలుస్తోంది. పరారీలో ఉన్న మరికొందరు నిందితుల్లో ఓ రౌడీషీటర్ ఉన్నట్లు సమాచారం. మృతదేహాన్నిచెత్తకుప్పల్లో పడేసిన నిందితులుపోలీసుల అదుపులోనిందితులుమృతుడిది పామూరు మండలం తిరిగలదిన్నె -
నేడు మహాత్మా జ్యోతీబాపూలే జయంతి
ఒంగోలు సబర్బన్: మహాత్మా జ్యోతీబాపూలే 199వ జయంతిని శుక్రవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. జిల్లా బీసీ సంక్షేమం–సాధికారత శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు కలెక్టర్ ఆధ్వర్యంలో ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని కొత్త కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న మహాత్మా జ్యోతీబాపూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారన్నారు. అనంతరం 11 గంటలకు ప్రకాశం భవన్లోని స్పందన హాలులో సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. ఈ వేడుకలకు ప్రతిఒక్కరూ హాజరుకావాలని కోరారు. వెలిగొండకు కార్యాచరణ రూపొందించాలి ఒంగోలు సబర్బన్: వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడానికి మిగిలిన పనులకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా అధికారులను ఆర్అండ్ఆర్, జలవనరుల శాఖ రాష్ట్ర కమిషనర్ ఆదేశించారు. విజయవాడ నుంచి గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో స్థానిక ప్రకాశం భవనం నుంచి జేసీ గోపాలకృష్ణ, ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేకరణ, ఆర్అండ్ఆర్ కాలనీలకు సంబంధించిన పనులను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. అందుకోసం పూర్తి స్థాయి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా 2026 జూలై నాటికి సాగు, తాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. స్టేజి–1కు సంబంధించి భూ సేకరణను ఏప్రిల్ మాసాంతానికి పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం అధికారులతో జేసీ సమీక్షించారు. ప్రాజెక్టు ప్రభావిత ముంపు గ్రామాల నిర్వాసితులకు పునరావాసం, పరిహారం చెల్లింపు, ఆర్అండ్ఆర్ కాలనీలలో సౌకర్యాల కల్పనను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వీడియో కాన్ఫరెన్స్లో జలవనరుల శాఖ ప్రాజెక్ట్స్ చీఫ్ ఇంజినీర్, భూ సేకరణ స్పెషల్ కలెక్టర్, ప్రాజెక్ట్స్ సూపరింటెండెంటింగ్ ఇంజినీరు, మార్కాపురం, కంభం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు (భూసేకరణ), మార్కాపురం, కంభం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు పాల్గొన్నారు. రెవెన్యూ సమస్యలపై దృష్టి సారించాలి ఒంగోలు సబర్బన్: రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తహసీల్దార్లు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గురువారం జేసీ గోపాలకృష్ణతో కలిసి ఆర్డీఓలు, తహసీల్దార్లు, మండల సర్వేయర్లతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో పరిష్కారం కోసం వచ్చిన రెవెన్యూ సమస్యల వివరాలను, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై గ్రామాల వారీగా యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. రెవెన్యూ సదస్సుల్లో, పీజీఆర్ఎస్లో వచ్చిన రెవెన్యూ అంశాలకు సంబంధించిన అర్జీల పరిష్కారంపై తహసీల్దార్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమస్య పరిష్కారం వీలుకాని పక్షంలో ఏ కారణం చేత పరిష్కారం వీలు కాదో సంబంధిత లబ్ధిదారునికి తెలియచేయాలని స్పష్టం చేశారు. రెగ్యులరైజేషన్ స్కీం–2025 ప్రక్రియపై తహసీల్దార్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో మార్కాపురం సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట త్రివినాగ్, డీఆర్ఓ బి.చిన ఓబులేసు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, తహసీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు. నెలాఖరు వరకు వడ్డీ రాయితీ పొడిగింపు ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను, ఖాళీ స్థలం పన్నుపై 50 శాతం వడ్డీ రాయితీకి గడువు తేదీని ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 2024–25 వరకు గల పన్ను బకాయిలను 30.04.2025లోపు ఏకమొత్తంగా చెల్లించి అపరాధ రుసుం (వడ్డీ) నుంచి 50 శాతం మినహాయింపు పొందే అవకాశాన్ని పన్ను బకాయిదారులకు ప్రభుత్వం కల్పించింది. పన్ను బకాయిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒంగోలు నగర కమిషనర్ వెంకటేశ్వరరావు కోరారు. పన్నులు చెల్లించడానికి సమీపంలోని వార్డు సచివాలయాలలోగానీ, నగరపాలక సంస్థ కార్యాలయంలోగానీ సంప్రదించాలని సూచించారు. -
బీసీ రుణాలు.. భారీ పైరవీలు
ఒంగోలు వన్టౌన్: అవినీతి, అక్రమాలకు పాల్పడేందుకు ఏ ఒక్క అవకాశాన్నీ కూటమి పార్టీల నాయకులు వదలడం లేదు. చివరకు బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధికి సబ్సిడీపై రుణాల మంజూరులో కూడా జోక్యం చేసుకుంటున్నారు. నియమ నిబంధనలు పూర్తిగా పక్కనపెట్టి తాము చెప్పిన వారికే రుణాలు మంజూరు చేయాలంటూ అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. నాయకుల ఒత్తిడికి తలొగ్గిన అధికారులు.. సిఫార్సులు, పైరవీలకే పెద్దపీట వేసేందుకు సిద్ధమయ్యారు. వేల సంఖ్యలో దరఖాస్తులు... బీసీ కార్పొరేషన్ రుణాల కోసం వేల సంఖ్యలో ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నారు. కానీ, పారదర్శకంగా వ్యవహరించి అర్హులకు రుణాలు మంజూరు చేయాల్సిన అధికారులు.. నాయకుల సిఫార్సులకే పెద్ద పీట వేస్తున్నారు. అలాంటి వారికే రుణాలు మంజూరు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మండలాల వారీగా ఎవరెవరికి రుణాలు మంజూరు చేయాలో ముందుగానే అధికారులకు కూటమి నాయకులు జాబితా అందజేశారు. మహాత్మా జ్యోతీరావుపూలే జయంతి సందర్భంగా నేడు వారికి సంబంధించిన రుణాల యూనిట్లను అధికారులు గ్రౌండింగ్ చేయనున్నారు. దీనివలన అర్హతల్లో ముందంజలో ఉన్నవారికి అన్యాయం జరగనుంది. నిరుద్యోగ యువతకు నిరాశ... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలైనప్పటికీ నిరుద్యోగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల గురించి పట్టించుకోలేదు. దీంతో నిరుద్యోగం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాల కోసం భారీగా నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. రుణం మంజూరైతే ఏదైనా స్వయం ఉపాధి పొందవచ్చని భావించారు. కానీ, టీడీపీ నాయకుల సిఫార్సులు ఉంటేనే రుణాలు మంజూరవుతున్నాయని తెలిసి తీవ్ర నిరాశకు గురవుతున్నారు. రూ.15.13 కోట్లతో 607 యూనిట్లకు నేడు గ్రౌండింగ్... బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధికి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ సబ్సిడీతో రుణాలు మంజూరు చేసేందుకు మొత్తం 143 రకాల యూనిట్లకు దరఖాస్తులు స్వీకరించారు. బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు కులాలకు సంబంధించి రూ.49.65 కోట్ల రుణాలను 2069 యూనిట్లను గ్రౌండింగ్ చేయాల్సి ఉండగా, ప్రస్తుతం బీసీ–491, ఈడబ్ల్యూఎస్ 148, కాపులు–40 చొప్పున కేవలం 607 యూనిట్లను రూ.15.13 కోట్లతో మంజూరు చేస్తున్నారు. వాటిని కూడా పైరవీదారులకే కేటాయించేందుకు రంగం సిద్ధం చేయడం పలు విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే మండల స్థాయిలో ఎంపీడీఓ, బ్యాంకర్లు తూతూమంత్రంగా ఇంటర్వ్యూలు నిర్వహించారు. కుల సంఘాల నాయకులతో సమావేశాలు నిర్వహించినప్పటికీ వారంతా టీడీపీకి చెందిన బీసీ నాయకులే కావడంతో వారిచ్చిన జాబితానే ఫైనల్ చేశారు. ఎక్కువ భాగం అనర్హులనే రుణాలకు ఎంపిక చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. బీసీ కార్పొరేషన్ రుణాల మంజూరులో కూటమి నేతల మితిమీరిన జోక్యం తాము చెప్పిన వారికే రుణాలివ్వాలంటూ పెద్ద ఎత్తున సిఫార్సులు అధికారులపై ఒత్తిడితో నష్టపోనున్న అర్హులు నేడు యూనిట్ల గ్రౌండింగ్ రాజకీయ జోక్యం లేదు బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీపై స్వయం ఉపాధి రుణాల మంజూరుకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ఎటువంటి రాజకీయ జోక్యం లేదు. పారదర్శకంగా వ్యవహరిస్తూ అర్హులనే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నాం. – ఎం.వెంకటేశ్వరరావు, బీసీ కార్పొరేషన్ అధికారి రాజకీయ పలుకుబడి ఉన్నవారికే రుణాలు గత వైఎస్సార్ సీపీ హయాంలో కులమతాలు, రాజకీయాలకు అతీతంగా ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో అటువంటి పరిస్థితులు కనిపించడంలేదు. రాజకీయ పలుకుబడి ఉన్నవారినే బీసీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాలకు లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నారు. – కఠారి శంకరరావు, అఖిల భారత యాదవ మహాసభ నాయకుడు -
14న రాష్ట్ర స్థాయి ఎడ్ల పందేలు
రాచర్ల: నెమలిగుండ్ల రంగనాయకస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 14వ తేదీ రాష్ట్రస్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర స్థాయి ఎడ్ల పందేల్లో పాల్గొనేవారు రూ.500 ప్రవేశ రుసుం చెల్లించి పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. విజేతలకు మొదటి నాలుగు బహుమతులు వరుసగా రూ.లక్ష, రూ.70 వేలు, రూ.50 వేలు, రూ.30 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. వివరాలకు 95056 81744, 79974 74026, 99120 32442ను సంప్రదించాలని సూచించారు. వివాదాస్పద భూమిలో జాయింట్ సర్వే కురిచేడు: కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ కోసం రిలయన్స్ సంస్థకు కురిచేడు మండలంలోని గంగదొనకొండ రెవెన్యూ పరిధిలో భూ కేటాయింపుపై వివాదం తలెత్తిన నేపథ్యంలో అటవీ, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా గురువారం సర్వే నిర్వహించాయి. కనిగిరి ఆర్డీఓ జి.కేశవర్ధన్రెడ్డి, డీఎఫ్ఓ వినోద్కుమార్, సబ్ డీఎఫ్ఓ శ్రీనివాసరావు, రేంజ్ అధికారి బి.నరసింహారావు సమక్షంలో సర్వేయర్లు ఆ భూములను కొలతలు వేసి హద్దు రాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. సర్వే కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. హద్దులు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించే దిశగా సమష్టిగా పనిచేస్తున్నట్లు చెప్పారు. వీఆర్వో హనుమంతురావు, ఇన్చార్జి సర్వేయర్ గోపి, గ్రామ సర్వేయర్లు, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. నాట్య మయూరాలకు గిన్నిస్ సర్టిఫికెట్లు యర్రగొండపాలెం: భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో 2023 డిసెంబర్లో హైదరాబాద్లో నిర్వహించిన ఆల్ ఇండియా నాట్య ప్రదర్శనలో స్థానిక శ్రీవెంకటేశ్వర భరత నాట్య అకాడమీకి చెందిన చిన్నారులు మందుల సాయి ఆహ్లాదిత, తాళ్లపల్లి నాగబాల నందిని, తాళ్లపల్లి నాగబాల వైష్ణవి, ఆముదం సిరిచందన, పిండి తేజస్విని పాల్గొన్నారు. ఈ నాట్య ప్రదర్శనకు గిన్నిస్ రికార్డులో చోటు దక్కింది. ఈ మేరకు గిన్నిస్ సర్టిఫికెట్లు, మెడల్స్ను గురువారం హైదరాబాద్లోని తెలంగాణ సారస్వత పరిషత్ భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో చిన్నారులు అందుకున్నారు. చిన్నారులను అకాడమీ నాట్య గురువు మందుల భారతి, వైస్ ఎంపీపీ ఆదిశేషు అభినందించారు. విద్యుత్ డీఈ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ అదృశ్యం ● సూసైడ్ నోట్ రాయడంతో కలకలం దర్శి(కురిచేడు): అప్పు ఇచ్చిన వ్యక్తి వేధింపులు తాళలేక దర్శి విద్యుత్ డీఈ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ఏకంగా సూసైడ్ నోట్ రాసి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన గురువారం వెలుగులోకి రాగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మురళి తెలిపారు. వివరాలు.. స్థానిక విద్యుత్ డీఈ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న గూడపురెడ్డి రామకృష్ణారెడ్డి తన ఇంట్లో మరణ వాంగ్మూలంతోపాటు మరో కాగితంపై బ్యాంకు ఖాతాలు, ఏటీఎం కార్డుల వివరాలు, పాస్వర్డ్లు రాసిపెట్టి అదృశ్యమయ్యారు. నాలుగేళ్ల క్రితం హనుమంతునిపాడు మండలం మిట్టపాలెం గ్రామానికి చెందిన కందుల రాజశేఖరరెడ్డి వద్ద తీసుకున్న రూ.2 లక్షల అప్పునకు ప్రాంసరీ నోట్లు, సంతకం చేసిన ఖాళీ చెక్కు ఇచ్చాడు. ఇప్పటి వరకు రూ.1.50 లక్షలు చెల్లించగా రాజశేఖరరెడ్డి రూ.15 లక్షలకు చెక్ బౌన్స్ చేశాడు. ఈ కేసుపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. రాజశేఖరరెడ్డి తరచూ ఫోన్ చేసి బెదిరిస్తున్నాడని, మార్చి 12వ తేది ఉదయం వాకింగ్కు వెళ్లగా బలవంతంగా కారులో ఎక్కించుకుని చైను, ఉంగరం, సెల్ఫో తీసుకున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. ‘నా మరణానికి కందుల రాజశేఖరెడ్డి, తన బావ చిన్నసుబ్బారెడ్డి, బాలకృష్ణ కారణం. ఇదే నా మరణ వాంగ్మూలం’ అని లేఖలో రాసి ఉంది. -
బాండెడ్ లేబర్ వ్యవస్థను నిర్మూలించాలి
● కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశాలు ఒంగోలు సబర్బన్: జిల్లాలో బాండెడ్ లేబర్ వ్యవస్థను పూర్తి స్థాయిలో నిర్మూలించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో బాండెడ్ లేబర్ సిస్టం రద్దు యాక్ట్–1976పై అవగాహన కల్పించేందుకు అన్ని శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లకు గురువారం ఉదయం కలెక్టర్ జిల్లా స్థాయిలో వర్క్ షాప్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు బాండెడ్ లేబర్ వ్యవస్థ నుంచి విముక్తి కాబడిన వారికి పునరావాసం కల్పించి వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేలా కృషి చేయాలన్నారు. కొత్తపట్నం మండలంలోని అల్లూరు, ఈతముక్కల గ్రామాలకు చెందిన ఏడు కుటుంబాలతో పల్నాడు జిల్లాలో వెట్టిచాకిరి చేయిస్తుండగా రెస్క్యూ చేసి రక్షించినట్లు తెలిపారు. గర్భిణులు, బాలింతలతో బలవంతంగా పని చేయిస్తున్నట్లు అధికారుల దృష్టికి రావడంతో వేగంగా స్పందించి వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించడంతోపాటు రిలీఫ్ సర్టిఫికెట్లు అందజేశామన్నారు. దాంతో పాటు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం కూడా ఇప్పించినట్లు చెప్పారు. వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించిన ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, కొత్తపట్నం తహసీల్దార్ను ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు. తొలుత ఇంటర్నేషనల్ జస్టీస్ మిషన్ (ఐజేఎం) ప్రతినిధి ప్రియాంక బాండెడ్ లేబర్ సిస్టం రద్దు యాక్ట్–1976 గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అన్ని శాఖల అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా ఈ – శ్రమ్ పోర్టల్లో ప్లాట్ ఫాం కార్మికులు, గిగ్ కార్మికుల సమీకరణ, పేర్ల నమోదుపై అవగాహన కోసం కార్మిక శాఖ రూపొందించిన వాల్ స్టిక్కర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జేసీ ఆర్.గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, అన్ని శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
చేబ్రోలు కిరణ్ను కఠినంగా శిక్షించాలి
ఒంగోలు టౌన్: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ను కఠినంగా శిక్షించాలని కోరుతూ వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం నియోజకవర్గ ఇన్చార్జి బడుగు ఇందిర ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వీడియో చిత్రీకరించిన పాయింట్ బ్లాక్ టీవీతో పాటుగా ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి, ఐటిడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ఒక ప్రణాళిక ప్రకారమే అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. సమాజంలో గౌరవనీయంగా బతికే నాయకులను, వారి కుటుంబసభ్యులను అవమానించడమే లక్ష్యంగా వీడియోలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు భూమిరెడ్డి రమణమ్మ, లీగల్ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు ధర్మాసి హరిబాబు, సమాచార హక్కు విభాగం అధ్యక్షుడు కె. శేషాద్రిరెడ్డి, న్యాయవాది గాయం సావిత్రి, బి.నాగమల్లేశ్వరరెడ్డి, పార్టీ మహిళా విభాగం నాయకురాలు షేక్ అఫ్సర్, బత్తుల ప్రమీల, మాధవి, జ్యోతి, మేరి, వాణి, ప్రసన్న, రాజేశ్వరి పాల్గొన్నారు. యర్రగొండపాలెం: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ను కఠినంగా శిక్షించాలని పార్టీ నాయకులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి కె.ఓబులరెడ్డి, మండల అధ్యక్షుడు ఏకుల ముసలారెడ్డి, వైస్ ఎంపీపీ ఎం.ఆదిశేషు, నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షుడు ఒ.సుబ్బారెడ్డి, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ ఎం.బాలగురవయ్య, సచివాలయాల మండల కన్వీనర్ సయ్యద్ జబీవుల్లా, ఆర్యవైశ్య సంఘ మండల అధ్యక్షుడు పబ్బిశెట్టి శ్రీనివాసులు, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు పి.రాములు నాయక్, జిల్లా కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ షాబీర్ బాష, సర్పంచ్లు బి.అరుణాబాయి, కె.వెంకటేశ్వరరెడ్డి, ఆర్.వెంకటయ్య, నాయకులు ఎన్.వెంకటరెడ్డి, వై.వెంకటేశ్వరరెడ్డి, టి.రాంబాబు, కె.సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. -
AP: పోలీసుల దాష్టీకం.. వైఎస్సార్సీపీ కార్యకర్తను హింసించిన ఎస్ఐ
సాక్షి, ప్రకాశం: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో అధికారుల అండతో పోలీసులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను టార్గెట్ చేసి అక్రమ కేసులు పెడుతూ వేధింపులకు గురిచేస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో ఓ ఎస్ఐ దారుణంగా వ్యవహరించారు. అక్రమ కేసు బనాయించి.. వైఎస్సార్సీపీ కార్యకర్తను విచక్షణారహితంగా కొట్టారు.వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లాలోని తాళ్లూరు ఎస్ఐ మల్లికార్జున.. వైఎస్సార్సీపీ కార్యకర్త విష్ణుపై అక్రమంగా కేసు పెట్టారు. కొర్రపాటిపాలెంకు చెందిన విష్ణు.. వైఎస్సార్సీపీ ఫ్లెక్సీ కట్టాడనే కారణంగా అతడిపై ఎస్ఐ మల్లికార్జున కేసు పెట్టారు. ఈ క్రమంలో విష్ణుపై కక్షగట్టిన టీడీపీ నేతలు రెచ్చిపోయారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక, టీడీపీ నేతల ప్రోద్భలంతో ఎస్ఐ.. వారి ఫిర్యాదు తీసుకుని విష్ణును స్టేషన్కు తరలించారు. అనంతరం,స్టేషన్కు వచ్చిన తర్వాత.. విష్ణుపై ఎస్ మల్లికార్జున విచక్షణారహితంగా దాడి చేశారు. తన బెల్టుతో విష్ణును చితకబాదారు. తర్వాత వదిలిపెట్టారు. దీంతో, బాధితుడు విష్ణుకు గాయాలు కావడంతో ఒంగోలు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దర్శి ఎమ్మెల్యే, జిల్లాపార్టీ అధ్యక్షుడు బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి.. అర్ధరాత్రి అతడిని పరామర్శించారు. -
అట్టహాసంగా ప్రభ తరలింపు
చీమకుర్తి రూరల్: మండలంలోని రామతీర్థం పుణ్యక్షేత్రంలో ఈనెల 12న జరిగే గంగమ్మ తిరునాళ్ల సందర్భంగా వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ ప్రభ తడిక తరలింపు బుధవారం అట్టహాసంగా నిర్వహించారు. భారీగా తరలి వచ్చిన వైఎస్సార్ సీపీ శ్రేణులు, స్థానిక ప్రజలు వెంటరాగా బాణసంచాలు, డప్పుల మోతలతో చీమకుర్తిలోని బూచేపల్లి కళ్యాణ మండపం దగ్గర నుంచి రామతీర్థం నిధిలోకి ప్రభ తడికను ఊరేగింపుగా తరలించారు. కార్యక్రమానికి బూచేపల్లి శివప్రసాదరెడ్డితో పాటు జెడ్పీ చైర్పర్సన్ వెంకాయమ్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రతి గ్రామం నుంచి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పమిడి వెంకటేశ్వర్లు, పట్టణ పార్టీ అధ్యక్షుడు కిష్టపాటి శేఖర్రెడ్డి, ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్పర్సన్ గోపువరపు రాజ్యలక్ష్మి పూర్ణచంద్ర, గంగిరెడ్డి ఓబులరెడ్డి, చిన్నపురెడ్డి మస్తాన్రెడ్డి, కౌన్సిలర్లు ఇందిరా సుందర రామిరెడ్డి, పాటిబండ్ల గంగయ్య, బాబురావు, యల్లయ్య, ప్రమీల రామబ్రహ్మం, సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, బూచేపల్లి అభిమానులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభ తరలింపునకు భారీగా తరలివచ్చిన ప్రజలు పాల్గొన్న ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ వెంకాయమ్మ -
ఇంగ్లిషు సిలబస్ భారం తగ్గించండి
ఒంగోలు సిటీ: ప్రస్తుతం ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు బోధిస్తున్న ఇంగ్లిషు సబ్జెక్టు సిలబస్ భారంగా ఉందని, దానిని తగ్గించాలని ఇంగ్లిషు ఫోరం ప్రతినిధులు డీఈఓ ఏ కిరణ్కుమార్ను కలసి వినతిపత్రం అందించారు. బుధవారం ఒంగోలు డీఈఓ కార్యాలయం వద్ద ఆయన్ను కలసిన ఫోరం సభ్యులు పదో తరగతి పాఠ్యాంశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, వాటి భారం తగ్గిస్తే ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ఇంగ్లిషు భాష పట్ల ఆసక్తిని పెంపొందించుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పారు. పదో తరగతి ఇంగ్లిషు సబ్జెక్టులో ఉన్న తొమ్మిది పాఠ్యాంశాలను ఆరుకు కుదించి, వర్క్ బుక్ను ఐచ్చికంగా ఉంచితే ఇంగ్లిషు సిలబస్ను సకాలంలో పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం డిసెంబర్లో విడుదల చేసిన పదో తరగతి షెడ్యూల్ ప్రకారం స్టడీ అవర్స్ నిర్వహించే సమయానికి సిలబస్ పూర్తి కావడం లేదని వాపోయారు. సిలబస్ను కుదించినట్లయితే షెడ్యూల్ ప్రకారం స్టడీ అవర్స్ నిర్వహించి విద్యార్థులను పరీక్షలకు అన్ని విధాలుగా సంసిద్ధులుగా ఉంచగలుగుతామన్నారు. కార్యక్రమంలో ఏపీ ఇంగ్లిషు ఫోరం సభ్యులు శ్రీరాం శ్రీనివాసరావు, మరియరాజు, బుర్ల కోటేశ్వరరావు, శరత్చంద్ర, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తాము ఇచ్చిన మెమొరాండంను విద్యాశాఖ కమిషనర్కు పంపించాలని వారు కోరారు. డీఈఓకు వినతిపత్రం అందించిన ఏపీ ఇంగ్లిష్ ఫోరం ప్రతినిధులు -
‘దిశ’లో సమస్యల ఏకరువు
ఒంగోలు సబర్బన్: జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం (దిశ)లో సమస్యలపై సభ్యులు ఏకరువు పెట్టారు. సమావేశంలో సమస్యలు చెప్పటం మినహా అవి మాత్రం పరిష్కారానికి నోచుకోలేదని సమావేశంలో ప్రశ్నించారు. మొదటి దిశ సమావేశంలోని తీర్మానాలకే అతీగతీ లేదని ధ్వజమెత్తారు. అప్పట్లో చేసిన తీర్మానాలను అమలు చేయలేదని వైఎస్సార్ సీపీ సభ్యులు చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రకాశం భవన్లోని గ్రీవెన్స్ హాలులో బుధవారం ఒంగోలు ఎంపీ, దిశ చైర్మన్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఈ సమావేశంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ సభ్యులు జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ పథకాలపై అలసత్వాన్ని నిలదీశారు. వైఎస్సార్సీపీ సభ్యుల పట్ల అధికారులు పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారన్నారు. తొలుత ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు వచ్చినందుకు కలెక్టర్ తమీమ్ అన్సారియాను ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకుండా అవసరమైన ముందస్తు చర్యలు పటిష్టంగా చేపట్టాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్, దిశ వైస్ చైర్మన్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ ఈ నెల 8 నుంచి 22 వ తేదీ వరకు 15 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా 7వ పౌష్టికాహార పక్షోత్సవాలు (పోషణ్ పక్వాడా) రోజుకు ఒక కార్యక్రమంతో సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని, దాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ నగరంలోని పోతురాజుకాలువ, నల్ల కాలువల్లో పూడిక తీత పనులు చేపట్టాలన్నారు. ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహా రెడ్డి, బీఎన్ విజయకుమార్ మాట్లాడుతూ తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో జేసీ రోణంకి గోపాల కృష్ణ, జెడ్పీ సీఈఓ చిరంజీవి, డీఆర్ఓ చిన ఓబులేసు, సీపీఓ వెంకటేశ్వర రావు, డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బాల శంకర రావు, హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్, పబ్లిక్ హెల్త్ ఈఈ శ్రీనివాస సంజయ్, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం.వెంకటేశ్వర రావుతో పాటు పలువురు పాల్గొన్నారు. దిశ తొలి సమావేశంలోని తీర్మానాల అమలు ఎక్కడ సమస్యలు చెప్పటమే కానీ పరిష్కారం లేదని సభ్యుల అసహనం ఎమ్మెల్యే తాటిపర్తికి సమాచారం ఇవ్వలేదని వైఎస్సార్ సీపీ సభ్యుల ఆగ్రహం కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే సమావేశానికి హాజరుమర్రిపూడి–పొదిలి రోడ్డు అధ్వానంగా ఉంది మర్రిపూడి–పొదిలి రోడ్డులో 12 కిలో మీటర్ల ప్రయాణానికి అర్ధ గంటపైగా సమయం పడుతోంది. రోడ్డు మరీ అధ్వానంగా మారింది. గతంలో కూడా సమావేశాల్లో ప్రస్తావించినా ప్రయోజనం లేదు. మర్రిపూడి సెంటర్లో 90 వేల లీటర్ల సామర్ధ్యం కలిగిన ఓవర్ హెడ్ ట్యాంకు కూలిపోయే స్థితిలో ఉంది. దాన్ని కడిగి ఎన్ని సంవత్సరాలైందో. ట్యాంకు పైకి ఎక్కడానికి భయపడుతున్నారు. అదే నీళ్లు ప్రజలకు సరఫరా చేస్తున్నారు. – వాకా వెంకట రెడ్డి, వైఎస్సార్ సీపీ ఎంపీపీ, మర్రిపూడి -
ఉపాధ్యాయుల సీనియారిటీని పారదర్శకంగా ఇవ్వాలి
ఒంగోలు సిటీ: ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను పారదర్శకంగా తయారు చేసి పదోన్నతులు ఇవ్వాలని యూటీఎఫ్ ప్రతినిధులు డీఈఓ ఏ కిరణ్కుమార్కు వినతిపత్రం అందించారు. స్థానిక డీఈఓ కార్యాలయం వద్ద యూటీఎఫ్ ప్రకాశం జిల్లా శాఖ ప్రతినిధులు బుధవారం డీఈఓను కలిసి ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీల విషయమై చర్చించి, మెమొరాండం అందించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొమ్మోజీ శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ అబ్దుల్, డీ వీరాంజనేయులు, ఎస్ రవి, జీ ఉమామహేశ్వరి, ఎన్ చినస్వామి, బాలవెంకటేశ్వర్లు, నల్లూరి వెంకటేశ్వర్లు, ఎం సంధ్యారాణి, ప్రభాకర్రెడ్డి, ఎస్వీ కొండారెడ్డి, ఉమామహేశ్వరరావు, డీ జోత్న్స, రమణమూర్తి, ఆర్ నారాయణ, లక్ష్మీనారాయణ, దార్ల శ్రీను, కే హనుమంతరావు, చంద్రశేఖరయ్య, జిలానీ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో వినతిపత్రం మే నెలలో నిర్వహించబోయే ఉపాధ్యాయుల పదోన్నతుల జాబితా మెరిట్ కం రోస్టర్ విధానంలో తయారు చేయాలని డీఈఓకు ఫ్యాప్టో ప్రతినిధులు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఫ్యాప్టో చైర్మన్ కే ఎర్రయ్య, ఎండీ రఫీ, కో చైర్మన్లు వీ మాధవరావు, జయరావు, అబ్ధుల్హై, వీ జనార్ధన్, డీ శ్రీనివాసులు, చల్లా శ్రీనివాసులు పాల్గొన్నారు. -
బతుకులు వెనక్కు!
తీరం ముందుకు..కోతకు గురైన తీరంసింగరాయకొండ: జిల్లా పరిధిలో సముద్ర తీరం సుమారు 50 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. కొండపి నియోజకవర్గంలోని టంగుటూరు, సింగరాయకొండ మండలాల పరిధిలో సుమారు 12 కిలోమీటర్లు దూరం తీరం ఉంది. టంగుటూరు మండల పరిధిలో తేటుపురం, తాళ్లపాలెం, కేశుపాలెం, సింగరాయకొండ మండల పరిధిలో పాకల పంచాయతీలో పల్లెపాలెం, చెల్లెమ్మగారిపట్టపుపాలెం, పోతయ్యగారి పట్టపుపాలెం, క్రాంతి నగర్, శాంతినగర్, ఊళ్లపాలెం పంచాయతీ పరిధిలో దేవలంపల్లెపాలెం, బేసిన్ పల్లెపాలెం, బావివద్ద పల్లెపాలెం ఉన్నాయి. కొన్ని సంవత్సరాలుగా ఊళ్లపాలెం తీరంలో సముద్రం మార్చి, ఏప్రిల్ మాసంలో సుమారు 10 నుంచి 20 మీటర్లు ముందుకు వస్తుండేది. ఈ సంవత్సరం మాత్రం సుమారు 40 నుంచి 50 మీటర్ల వరకు ముందుకు వచ్చిందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తీరంలో ఉన్న రొయ్యల చెరువుల కట్టలు కోతకు గురయ్యాయని మత్స్యకారులు తెలిపారు. ఊళ్లపాలెం తీరంలో విచిత్రంగా ఊళ్లపాలెం, పాకల పంచాయతీ లోని పోతయ్య గారి పట్టపుపాలెంకు మధ్య మాత్రమే తీరం భారీగా కోతకు గురికాగా, ఊళ్లపాలెం తీరానికి దక్షిణం వైపు మాత్రం 10 మీటర్లు కోతకు గురైంది. అడ్డంకిగా మారిన రోడ్డు.. ఊళ్లపాలెం తీరంలో నిర్మించిన రోడ్డు బోట్ల భద్రతకు అడ్డంకిగా మారింది. సముద్ర తీరంలో గత ఏడాది అక్టోబర్లో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు సుమారు రూ.20 లక్షలతో తీరానికి సమాంతరంగా రోడ్డు నిర్మించి విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు. మొదట రోడ్డును తీరానికి సుమారు 80 మీటర్ల దూరంలో ఏర్పాటు చేద్దామని భావించారు. అయితే తరువాత ఇంజినీరింగ్ అధికారులు తీరానికి సుమారు 50 మీటర్ల దూరంలోనే నిర్మించాలని సూచించారు. ఇంజినీరింగ్ అధికారుల నిర్ణయాన్ని మత్స్యకారులు అప్పట్లో వ్యతిరేకించారు. అధికార టీడీపీ నాయకుల ఒత్తిడితో ఏమీ చేయలేక ఊరుకున్నారు. దీనికి తోడు అధికార పార్టీ నాయకులే ఈ రోడ్డు నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ రోడ్డు నిర్మాణం విషయమై తనకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని గ్రామ సర్పంచ్ పాకనాటి అనసూర్యమ్మ ఆరోపించారు. గ్రామంలో టీడీపీ నాయకుల ఇష్ట్రపకారమే పనులు జరిగాయన్నారు. ఈ రోడ్డు కారణంగా తీరంలో బోట్లు వెనక్కి జరుపుకోలేక మత్స్యకారులు అవస్థలు పడుతున్నారు. బోట్లు భద్రపరుచుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని వారు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కోతకు గురైన ఊళ్లపాలెం సముద్ర తీరం సుమారు 40 మీటర్లు ముందుకు వచ్చిన సముద్రం ధ్వంసమైన రొయ్యల చెరువు కట్టలు మత్స్యకారుల గుండెల్లో గుబులు బోట్ల భద్రతపై ఆందోళన తీరానికి దగ్గరగా రూ.20 లక్షలతో రోడ్డు నిర్మాణం బోట్లు వెనక్కి జరుపుకోవాలంటే అడ్డుగా ఉన్న రోడ్డు నాసిరకంగా రోడ్డు నిర్మాణం రోడ్డు నాసిరకంగా నిర్మించారని, నిబంధనల ప్రకారం క్యూరింగ్ కూడా చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాక రోడ్డు మార్జిన్లు కూడా తూతూ మంత్రంగా వేశారని, చిన్న వర్షానికి అవి ధ్వంసం అయ్యే ప్రమాదం ఉందని, కేవలం ధనార్జనే ధ్యేయంగా రోడ్లు నిర్మించారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. -
ఆ భూమి మనదే.. పనులు చేయండి
● ఆర్డీఓ కేశవర్దనరెడ్డి కురిచేడు: సీబీజీ (కంప్రెస్డ్ బయో గ్యాస్) ప్లాంట్ ఏర్పాటుకు రిలయన్స్ కంపెనీకి కేటాయించిన భూమి రెవెన్యూదే అని, దానిని చదును చేయాలని, పనులు ఆపవద్దని కనిగిరి ఆర్డీఓ జీ కేశవర్దనరెడ్డి ఆదేశించారు. ‘సీబీజీ భూముల కేటాయింపులో అత్యుత్సాహం’ అన్న శీర్షికన బుధవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించిన ఆర్డీఓ గంగదొనకొండ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 88, 90 లో కేటాయించిన 799.40 ఎకరాల స్థలాన్ని ఆయన పరిశీలించి ఆ భూమి రెవెన్యూదే అని నిర్ధారించారు. అయితే ఆ సమయంలో అటవీశాఖ అధికారులు ఎవరూ హాజరు కాలేదు. వారి అంగీకారం లేకపోవటంతో మళ్లీ అటవీశాఖ అధికారులు ఏం పేచీపెడతారో తెలియటం లేదు. ఇరు శాఖల అధికారుల సమక్షంలో జాయింట్ సర్వే చేసి హద్దులు నిర్ణయించకపోతే ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని తెలిసి కూడా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవటం గమనార్హం. ఈ పరిశీలనలో ఆర్డీఓ వెంట సర్వేయరు గోపి, వీఆర్వో హనుమంతరావు, సిబ్బంది ఉన్నారు. నేషనల్ క్రికెట్ టీంకి ఎంపికై న షేక్ కాలేషా ● నేపాల్లో మే 26 నుంచి 31 వరకు ఆడనున్న కాలేషా దర్శి: ఇంటర్నేషనల్ ఇండో–నేపాల్ కప్ 2025 చాంపియన్ షిప్ క్రికెట్ టోర్నమెంట్లో ఇండియా తరఫున ఆడేందుకు దర్శికి చెందిన షేక్ కాలేషా ఎంపికయ్యారు. నైన్ ఏ సైడ్ క్రికెట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన టోర్నమెంట్లో షేక్ కాలేషాను నేషనల్ టీంకు ఎంపిక చేశారు. ఈ మేరకు ఆ సంస్థ నుంచి కాలేషాకు ఉత్తర్వులు అందజేశారు. మే 26 నుంచి 31 వరకు నేపాల్లో ఈ చాంపియన్ షిప్ పోటీలు జరుగుతాయి. ఆల్ రౌండర్ ఆటగాడిగా కాలేషా ఇప్పటి వరకు రాణిస్తున్నారు. కాలేషా ఎంపిక కావడం పై పలువురు అభినందనలు తెలిపారు. మెరిట్ కం రోస్టర్ విధానంలోనే పదోన్నతులివ్వాలి ఒంగోలు సిటీ: మెరిట్ కం రోస్టర్ విధానంలోనే ఉపాధ్యాయుల పదోన్నతులు ఇవ్వాలని కోరుతూ బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బుధవారం ఎస్ఎస్సీ స్పాట్ కేంద్రాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఆమేరకు ఒంగోలు డీఆర్ఆర్ఎం హైస్కూల్ దగ్గర నిరసన తెలిపారు. జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు కర్ర దేవసహాయం మాట్లాడుతూ ప్రభుత్వం ప్రస్తుతం ప్రకటించిన ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితా కేవలం మెరిట్ ఆధారంగా తయారు చేశారని అది తగదన్నారు. కార్యక్రమంలో పీ నాగేశ్వరరావు, హనుమంతరావు, డేవిడ్రాజు, మనోహరరావు, వెంకట్రావు, కల్యాణ్, పాపారావు, భాస్కరరావు పాల్గొన్నారు. -
గంజాయి విక్రేతల అరెస్టు
మార్కాపురం: మార్కాపురం పట్టణ శివారులో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి సుమారు 2 కిలోల గంజాయి, ఒక బైకును స్వాధీనం చేసుకున్నట్లు మార్కాపురం డీఎస్పీ డాక్టర్ నాగరాజు తెలిపారు. బుధవారం డీఎస్పీ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. గంజాయి విక్రయాన్ని కట్టడి చేసేందుకు మార్కాపురం సీఐ పి.సుబ్బారావు ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేశారు. ఈ నెల 8వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో సీఐకి అందిన సమాచారం మేరకు ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ మలిపెద్ది ప్రభావతి, పట్టణ ఎస్సైలు సైదుబాబు, డాక్టర్ రాజమోహన్రావు, రూరల్ ఎస్సై అంకమరావుతో కూడిన బృందంతో ఎస్టేట్ ఏరియాలోని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. వీరిని చూసి అక్కడ ఉన్న ముగ్గురు వ్యక్తులు పారిపోతుండగా అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుల వద్ద ప్లాస్టిక్ కవర్లో 2 కిలోల గంజాయి లభ్యమైంది. పట్టణంలోని జగదీశ్వరి థియేటర్ వద్ద నివాసముండే సుంకర మధు, వెంకట గోపీనాధ్ అరకు ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేసి మార్కాపురం తీసుకొచ్చినట్లు విచారణలో వెల్లడైంది. వారు తన మిత్రులైన పట్టణంలోని కరెంటు ఆఫీసు వెనుక ఉండే పాడి తిరుమలయ్య, మీనా మసీదు వద్ద ఉండే ఎస్కే ఇమ్రాన్కు గంజాయి అమ్మేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులకు చిక్కారు. ఈ ముఠా గంజాయి రవాణా చేసేందుకు ఉపయోగించిన బైకును కూడా స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. త్వరలోనే మరికొందరు గంజాయి విక్రేతలు, వినియోగదారులను అరెస్టు చేస్తామని చెప్పారు. బెట్టింగ్ యాప్ల విషయంలో యువత అప్రమత్తంగా ఉండాలని, ఆన్లైన్ బెట్టింగ్తో ఆర్థికంగా చితికిపోయి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని డీఎస్పీ సూచించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ప్రవర్తనను తరచూ పరిశీలించాలని చెప్పారు. నిందితులను అరెస్టు చేయడంలో కృషి చేసిన సీఐ, ఎస్సైలను డీఎస్పీ అభినందించారు. ముగ్గురు నిందితుల నుంచి 2 కేజీ గంజాయి, బైకు స్వాధీనం వివరాలు వెల్లడించిన మార్కాపురం డీఎస్పీ నాగరాజు -
హామీల అమలుపై కూటమి కప్పదాట్లు
● ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ వర్కర్స్ యూనియన్ నాయకుల విమర్శ పొదిలి: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించి, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కూటమి నాయకులు ఇచ్చిన హామీని అమలు చేయాలని ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెన్నా బాల వెంకట్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్ విమర్శించారు. అధికారంలోకి రాగానే కార్మికులకు ఇచ్చిన హామీలను కూటమి నేతలు మరిచిపోవడం శోచనీయమన్నారు. బుధవారం స్థానిక ఎన్జీఓ హోంలో సంఘ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కూటమి నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించి, గత ఐదేళ్లుగా జిల్లా లేబర్ కార్యాలయాలకు చెల్లించాల్సిన బకాయిలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంటనే నిధులు మంజూరు చేసి పెండింగ్ క్లెయిమ్లు పరిష్కరించాలని కోరారు. ప్రతి కార్మికుడికి ఇల్లు మంజూరు చేసి, బ్యాంకు రుణం ఇప్పించాలన్నారు. కార్మిక సంఘం ఆధ్వర్యంలో సమస్యలపై తహసీల్దార్, కలెక్టర్, మంత్రులు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకవెళ్లినా వాటి గురించి ప్రస్తావించకపోవడం కార్మికులను మోసం చేయడమేనన్నారు. కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా సీఐటీయూ ఆధ్వర్యంలో ఈ నెల 24న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్మికులు అధిక సంఖ్యలో హాజరై ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జె.సురేష్, ఎ.శ్రీనివాసులు, భావన్నారాయణ, ఎన్.శ్రీను, వెంకట్, శ్రీను, పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ బోరు.. టీడీపీ నేత చేనుకు నీరు!
కొనకనమిట్ల: మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో డీప్ బోరు నీటిని స్థానిక టీడీపీ నాయకుడు తన సొంతానికి వినియోగించుకోవడం చర్చనీయాంశమైంది. ఎంపీడీఓ కార్యాలయ వెనుక భాగంలోని డీప్ బోరు నుంచి టీడీపీ నేత సాగు చేస్తున్న పొగాకు తోటకు నేరుగా పైపులు పరిచి నీరు వాడుకుంటున్నారు. గత కొద్దిరోజులుగా ఈ తంతు సాగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. డీప్ బోర్ సమీపంలో ఎంపీడీఓతోపాటు తహసీల్దార్ కార్యాలయం, రైతు సేవా కేంద్రం, వ్యవసాయాధికారి కార్యాలయం ఉన్నా టీడీపీ నేతను ఎవరూ ప్రశ్నించలేదు. పొగాకు తోటకు నీరు అత్యవసరమైన పక్షంలో అధికారుల అనుమతి తీసుకోవాలి కానీ ఇష్టారీతిగా డీప్ బోరును ఎలా వినియోగించుకుంటారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఎంపీడీఓను వివరణ కోరగా.. డీప్ బోరును వినియోగించుకుంటున్న విషయం తన దృష్టికి రాలేదని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
గ్రామవ్యవసాయ సహాయకునిపై దాడి
మర్రిపూడి: మండలంలోని అంకేపల్లి గ్రామ సచివాలయంలో గ్రామవ్యవసాయ సహాయకునిగా విధులు నిర్వహిస్తున్న ఈర్ల చినబాబుపై ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఆకస్మిక దాడి చేశారు. ఈ సంఘటన అంకేపల్లి గంగమ్మ గుడికి సమీపంలో బుధవారం జరిగింది. బంధువులు తెలిపిన వివరాలు మేరకు... మండలంలోని కూచిపూడి గ్రామానికి చెందిన ఈర్ల చినబాబు మండలంలోని అంకేపల్లి గ్రామ సచివాలయంలో గ్రామ వ్యవసాయ సహాయకునిగా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం తన సొంత గ్రామమైన కూచిపూడి నుంచి ద్విచక్రవాహనంపై విధులు నిర్వహించేందుకు అంకేపల్లి సచివాలయానికి బయలుదేరాడు. అంకేపల్లి గంగమ్మ దేవాలయం సమీపంలోకి రాగానే ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు మాస్క్లు ధరించి అటకాయించి ఇనుప రాడ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు. దాడిలో చినబాబు కుడికంటికి తీవ్ర గాయమైంది. శరీరంపై రక్త గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ఒంగోలు జీజీహెచ్కి తరలించినట్లు బంధువులు తెలిపారు. దిగజారిన కనిష్ట ధరలు టంగుటూరు: పొగాకు కనిష్ట ధరలు దిగజారుతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది వేలం ప్రారంభంలో కనిష్ట ధర రూ.260 వరకు పలికింది. అయితే గత వారం రోజులుగా ధర తగ్గుతూ బుధవారం కనిష్ట ధర రూ.230 పలికింది. పొగాకు కంపెనీల ప్రతినిధులు బోర్డు అధికారులతో కుమ్మకై ్క అన్ని కంపెనీలు వేలం పాల్గొనడం లేదు. దీంతో వేలంలో పాల్గొన్న కంపెనీలు ధరలను తగ్గించేస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పొలం, బ్యార్నీ కౌలు, కూలీ ధరలు పెరగడంతో సాగు ఖర్చు రెట్టిపయింది. ఈ పరిస్థితుల్లో గత ఏడాది కంటే మెరుగైన ధరలు వస్తేనే పొగాకు రైతులు గట్టెక్కేది. కానీ వేలం ప్రారంభం నుంచి ధరల్లో పెరుగుదల లేకపోగా ఉన్న ధరలను తగ్గించడంతో రైతులు నష్టపోతున్నారు. పొగాకు బోర్డు ఉన్నతాధికారులు వారానికి ఒక సారి వచ్చి వేలం కేంద్రాన్ని, వేలం ప్రక్రియను తూతూమంత్రంగా పరిశీలించి వెళుతున్నారే తప్ప ధరలపై శ్రద్ధ చూపడం లేదని రైతులు వాపోతున్నారు. బుధవారం వేలం కేంద్రానికి చింతలపాలెం, దావగూడూరు గ్రామాలకు చెందిన రైతులు 521 బేళ్లను వేలానికి తీసుకురాగా 371 బేళ్లను కొనుగోలు చేసి 150 బేళ్లను తిరస్కరించారు. గరిష్ట ధర రూ.280, కనిష్ట ధర రూ.230, సరాసరి రూ.254.95గా నమోదైంది. వేలంలో 19 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారని వేలం నిర్వహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఆందోళన చెందుతున్న పొగాకు రైతులు అధిక సంఖ్యలో తిరస్కరణకు గురవుతున్న బేళ్లు -
పశ్చిమ ప్రకాశంలోని పలు మండలాల్లో కరువు ఛాయలు అలుముకున్నాయి. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో తాగునీటి సమస్య ఏర్పడింది. గత మూడు నెలలుగా వర్షం లేక పంటలు నిలువునా ఎండిపోవడంతో పెట్టుబడి కూడా రాని పరిస్ధితి ఏర్పడింది. వేసిన పంటలన్నీ దాదాపు ఎండిపోయాయి. మరోవైపు పశువుల
రబీ సీజన్లో తీవ్ర నష్టం బేస్తవారిపేట: వేసిన పంటలన్నీ కళ్ల ముందే ఎండిపోయి రైతులు ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. అకాల వర్షాలు, తెగుళ్ల ఉధృతితో సాగుకు అయిన ఖర్చు కూడా రాక నష్టాలు మిగిలాయి. బేస్తవారిపేట మండలంలో ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లో పంటలకు నష్టం జరిగితే కేవలం రబీ సీజన్కే తీవ్ర కరువు మండలంగా ప్రకటించారు. ఖరీఫ్ సీజన్లో నష్టపోయిన పంట వివరాలను ప్రభుత్వానికి వ్యవసాయశాఖ అధికారులు పంపినా నేటికీ పట్టించుకోలేదు. రబీ సీజన్లో బేస్తవారిపేట మండలంలో వరి 25 హెక్టార్లు, కంది 12, అలసంద 25, మినుము 252, పొగాకు 253, వేరుశనగ 9, రాగి 61, నువ్వులు 58, జొన్న 68, మొక్కజొన్న 1006, వరిగ 73, శనగ 752, సజ్జలు 31, ఉలవలు 30 హెక్టార్లలో దెబ్బతింది. మొత్తం 3,656 మంది రైతులు 2,669 హెక్టార్లలో పంట నష్టపోయినట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. అక్టోబర్లో 200 ఎంఎం వర్షపాతానికి 169, నవంబర్లో 89కి 17, డిసెంబర్లో 29కి 97, జనవరిలో 7.1కి, ఫిబ్రవరిలో 0.8కి, మార్చి నెలలో 10.2కి జీరో, ఏప్రిల్లో 30కి 26.8 ఎంఎం వర్షపాతం నమోదైంది. సకాలంలో వర్షం పడకపోవడం, పంటలు లేత దశలో ఉన్నప్పుడు ఎక్కువగా పడటంతో పంటలకు తీవ్ర నష్టం జరిగింది. మార్కాపురం/తర్లుపాడు/కొనకనమిట్ల: రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించిన జాబితాలో మార్కాపురం, కొనకనమిట్ల, రాచర్ల, బేస్తవారపేట, తర్లుపాడు, కంభం, పుల్లలచెరువు, పెద్దారవీడు తదితర మండలాలున్నాయి. ఇందులో తీవ్రమైన కరువున్న మండలాలు పుల్లలచెరువు, కంభం, తర్లుపాడు, పెద్దారవీడు, బేస్తవారపేట మండలాలు ఉండగా ఒక మోస్తరుగా కరువు మండలాలు కొనకనమిట్ల, మార్కాపురం, రాచర్ల ఉన్నాయి. గత మూడు నెలలుగా వర్షపాతం లేకపోవడంతో రబీ సీజన్లో సాగుచేసిన పంటలన్నీ దిగుబడులు రాలేదు. పెట్టిన పెట్టుబడి వ్యయం కూడా రైతులకు రాలేదు. మరోవైపు గత ఏడాది డిసెంబరు నుంచి వర్షపాతం లేకపోవడంతో రబీలో సాగుచేసిన మినుము, పప్పుశనగ, కంది, అలసంద పైర్లతోపాటు చివరిదశలో ఉన్న మిర్చి పంట దిగుబడి కూడా తగ్గిపోయింది. దీనికి తోడు గిట్టుబాటు ధర లేకపోవడం, పెట్టుబడి ఖర్చులు చేతికొచ్చే పరిస్థితి కానరాక రైతులు విలవిల్లాడిపోతున్నారు. 2023 నవంబర్, డిసెంబర్లో ప్రకృతి వైపరీత్యాలకు ఇవ్వాల్సిన నష్టపరిహారంతోపాటు 2024 ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి పంట నష్టపరిహారం ఇంతవరకు ప్రభుత్వం రైతులకు ఇవ్వలేదు. వ్యవసాయం కోసం అప్పులు చేసిన రైతులు వడ్డీలు కట్టలేక మనోవేదనకు గురవుతున్నారు. అడుగంటుతున్న బోర్లు మార్కాపురం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో తాగునీటి సమస్య ఏర్పడుతోంది. దీనితో ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీటిని సరఫరా చేస్తున్నారు. మార్కాపురం మండలంలోని 4 పంచాయతీల్లో, కొనకనమిట్ల మండలంలోని 3 పంచాయతీల్లో, దోర్నాల మండలంలోని 6 పంచాయితీల్లో, పెద్దారవీడు మండలంలోని 9 పంచాయితీల్లో పుల్లలచెరువు మండలంలోని 4 పంచాయతీల్లో, తర్లుపాడు మండలంలోని పలు గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా మార్కాపురం మండలంలోని తిప్పాయిపాలెం, బిరుదులనరవ, రాయవరం గ్రామాల్లో ట్యాంకర్లతో నీటిని తోలుతున్నారు. పెద్దయాచవరం గ్రామంలో కూడా తాగునీటి సమస్య ఏర్పడింది. తర్లుపాడు మండలంలో తుమ్మలచెరువు, గానుగపెంట, ఒబాయపల్లి, పోతలపాడు, కలుజువ్వలపాడు తదితర గ్రామాల్లో నీటి సమస్య వేధిస్తోంది. పొదిలి మండలంలోని జువ్వలేరు, కొండాయపాలెం గురుగుపాడు గ్రామాల్లో నీటి సమస్య తలెత్తగా ట్యాంకర్ల ద్వారా అరకొరగా నీరు సరఫరా చేస్తున్నారు. ఇదిలా ఉండగా మార్కాపురం మండలంలోని వేములకోట, రాయవరం, నాగులవరం, గజ్జలకొండ, తిప్పాయపాలెం, కొనకనమిట్ల మండలంలోని పలు చెరువులు ఒట్టిపోయాయి. దిగుబడిపై తీవ్ర ప్రభావం కంభం: మండలంలో అవసరమైన సమయంలో వర్షం కురవకపోవడంతో శనగ, కంది, మినుము పంటలు పూత దశలో దెబ్బతిని పంట దిగుబడి తగ్గిపోయింది. మండలంలో ఈ ఏడాది శనగ 3589 ఎకరాలు, మొక్కజొన్న 359 ఎకరాలు, కంది 372 ఎకరాలు, మిర్చి 144 ఎకరాలు, జొన్న 73 ఎకరాలు, పొగాకు 306 ఎకరాల్లో సాగుచేశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో బోర్లలో నీరందక మొక్క జొన్నపంట ఎక్కువ శాతం దెబ్బతింది. పూత దశలో శనగ ఉండగా అధిక వర్షం కురవడంతో 7 క్వింటాళ్లు రావలసిన దిగుబడి 4 క్వింటాళ్లకు పడిపోయింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో 3–4 క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి 1.5 క్వింటాళ్లకు పడిపోయింది. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో బోర్లలో నీరు తగ్గి బత్తాయి, అరటి తోటలకు నీటి సమస్య తలెత్తింది. మండలంలోని ఎల్కోట పంచాయతీ పరిధిలోని సూరేపల్లిలో తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎండిపోయిన పంటలు కరువు మండలాలుగా ప్రకటించిన గ్రామాల్లో రబీ సీజన్లో సాగు చేసిన పంటలు వర్షాభావ పరిస్ధితుల వలన ఎండిపోయాయి. ఎక్కువగా మినుము, పప్పుశనగ, కంది, అలసందతోపాటు బొప్పాయి, జామ, బత్తాయి రైతులు నష్టపోయారు. మినుము 290 560 1959 పప్పుశనగ 972 561 190 అలసంద 138 213 3929 పల్లె పక్కలో కరువు బల్లెం! లోటు వర్షపాతం నెల మార్కాపురం తర్లుపాడు కురవాల్సిన వర్షం కురిసిన వర్షం కురవాల్సిన వర్షం కురిసిన వర్షం నవంబరు 92.3 మి.మీ 18 మి.మీ 102.7 మి.మీ 10.4మి.మీ డిసెంబరు 29.2 మి.మీ 45.4మి.మీ 24.7మి.మీ 70.8మి.మీ జనవరి 6.8మి.మీ 0 మి.మీ 8.7 మి.మీ 0.మి.మీ ఫిబ్రవరి 5.9 మి.మీ 0 మి.మీ 5.5 మి.మీ 0.మి.మీనీరు లేక తోట ఎండిపోతోంది మూడున్నర ఎకరాల్లో బత్తాయి తోట సాగుచేశాం. గత రెండు నెలల నుంచి వర్షాలు లేకపొవడంతో బోర్లలో నీరు సరిగా రావడం లేదు. ఎకరాకు నీరు పెట్టేందుకు 3 రోజులు పడుతోంది. పంటకు పెట్టిన పెట్టుబడి చేతికొచ్చే పరిస్థితి అనుమానమే. నీరు లేనట్లయితే కాయ ఊరదు. – కె రంగలక్ష్మి, నాయుడుపల్లి పంటమార్కాపురం సాగు విస్తీర్ణం (హెక్టార్లలో)తర్లుపాడు సాగు విస్తీర్ణం (హెక్టార్లలో)కొనకనమిట్ల సాగు విస్తీర్ణం (హెక్టార్లలో) -
రెవెన్యూ సదస్సుల్లో సమస్యలపై దృష్టి పెట్టండి
● జిల్లా అధికారులను ఆదేశించిన సీసీఎల్ఏ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి ఒంగోలు సబర్బన్: గ్రామాల వారీగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన సమస్యలపై దృష్టి పెట్టి వెంటనే పరిష్కరించాలని సీసీఎల్ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి జిల్లా అధికారులను ఆదేశించారు. విజయవాడ సీసీఎల్ఏ కార్యాలయం నుంచి మంగళవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక ప్రకాశం భవన్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాల కృష్ణతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయలక్ష్మి ప్రభుత్వ పథకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రధానంగా రీసర్వే సమస్యలు, సిటిజన్స్ సర్వీసెస్, పీజీఆర్ఎస్ పరిష్కారంపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రెవెన్యూ సదస్సుల పీజీఆర్ఎస్, రీసర్వే, ఐవీఆర్ఎస్ ఫీడ్ బ్యాక్, వాటర్ ట్యాక్స్ తదితర అంశాలపై సూచనలు ఇచ్చారు. జిల్లాల్లో రీసర్వే ప్రక్రియ పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. పీజీఆర్ఎస్ దరఖాస్తులు ఎస్ఎల్ఎలోపు వెళ్లకుండా గడువులోపు పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామ స్థాయిలో వాటర్ ట్యాక్స్ వసూలు పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్, జేసీతో పాటు జిల్లా రెవెన్యూ అధికారి బి.చిన ఓబులేసు, జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారి గౌస్ బాషా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.వెంకటేశ్వరరావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి శ్రీనివాసరావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. బోర్డు అనుమతి మేరకే పొగాకు సాగు మేలు● పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వశ్రీ టంగుటూరు: పొగాకు బోర్డు అనుమతించిన మేరకే సాగు చేయడం మంచిదని పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వశ్రీ అన్నారు. టంగుటూరు పొగాకు వేలం కేంద్రాన్ని మంగళవారం సందర్శించి వేలం ప్రక్రియను పరిశీలించారు. అనంతరం రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈడీ విశ్వ శ్రీ మాట్లాడుతూ రైతులంతా మార్కెట్ కు అనుగుణంగా పొగాకు తెచ్చుకొని అమ్మకాలు చేసుకోవాలన్నారు. మండెలలో మగ్గిన పొగాకునే బేళ్లు కట్టుకుని అమ్మకానికి తీసుకురావాలని తెలిపారు. రైతులు ఇప్పుడున్న మార్కెట్ ను చూసి ఖర్చులు పెంచుకోకుండా పొగాకు సాగు ఖర్చును తగ్గించుకోవాలన్నారు. అలాగే రైతులు తీసుకొచ్చిన బేళ్లన్నింటినీ నో బిడ్స్ లేకుండా కొనుగోలు చేయాలని కంపెనీ ప్రతినిధులకు సూచించారు. వేలం కేంద్రానికి కట్టుబడిపాలెం, కమ్మవారిపాలెం గ్రామాల రైతులు 435 బేళ్లు తీసుకొని రాగా అందులో 337 బేళ్లు కొనుగోలు చేశారు. రూ.263.30 సరాసరి ధర నమోదైంది. కార్యక్రమంలో పొగాకు బోర్డు వైస్ చైర్మన్ బొడ్డపాటి బ్రహ్మయ్య, సెక్రటరీ ఇన్చార్జ్ దివి వేణుగోపాల్, రీజినల్ మేనేజర్ ఎమ్.లక్ష్మణరావు, వేలం నిర్వహణాధికారి అట్లూరి శ్రీనివాసరావు, బోర్డు సిబ్బంది, టంగుటూరు పొగాకు బోర్డు రైతు నాయకులు, రైతులు పాల్గొన్నారు. -
సంపన్నులకు వరాలు.. సామాన్యులపై భారాలు
ఒంగోలు టౌన్: కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టేనాటికి రూ.450గా ఉన్న వంట గ్యాస్ ధర ప్రస్తుతం రూ.900కు చేరుకుందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య(ఐద్వా) జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి విమర్శించారు. అసలే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో వంటగ్యాస్ ధర మరో రూ.50 పెంచడం దారుణమని మండిపడ్డారు. తక్షణమే పెంచిన గ్యాస్ ధరను తగ్గించాలని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ఎల్బీజీ భవనంలో నిర్వహించిన ఐద్వా జిల్లా కమిటి సమావేశంలో ఆమె మాట్లాడారు. మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత సంపన్నులకు వరాలు ప్రకటిస్తూ సామాన్యులపై భారాలు మోపుతోందని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వస్తే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామన్న మోదీ మాటలకు చేతలకు పొంతన లేదని దుయ్యబట్టారు. ఎన్డీఏ ప్రభుత్వానికి దీటుగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కూడా ప్రజల నెత్తిన ధరల భారం మోపుతోందని విమర్శించారు. వంట గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి జి.ఆదిలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎన్.మాలతి, ఎస్కే నాగుర్బీ, కె.రాజేశ్వరి, కె.లక్ష్మీ ప్రసన్న, బి.రాజ్యలక్ష్మి, బి.పద్మ తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ రవాణా చేస్తున్న 3 లారీలు పట్టివేత
చీమకుర్తి రూరల్: మండలంలోని రామతీర్ధం నుంచి బూదవాడ వైపు గ్రానైట్ ముడి రాళ్లు అక్రమ రవాణా చేస్తున్న 2 లారీలు, ఒక టిప్పర్ను సేల్టాక్స్ అధికారులు పట్టుకున్నారు. మంగళవారం ఉదయం నుంచి అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. దాడుల్లో పట్టుకున్న లారీలను ఏపీఎండీసీ ప్రాంగణానికి తరలించారు. పూరి గుడిసె దగ్ధం ● రూ.2 లక్షల ఆస్తి నష్టం యర్రగొండపాలెం: ప్రమాదవశాత్తు నిప్పంటుకొని పూరి గుడిసె దగ్ధమైన సంఘటన యర్రగొండపాలెం మండలంలోని అయ్యంబొట్లపల్లెలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పూజల సత్యనారాయణ కుటుంబం పనుల నిమిత్తం బయటికి వెళ్లిన సమయంలో ఇంటికి నిప్పంటుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో దాదాపు రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లి మంటలు అదుపు చేశారు. హౌరా జనరల్ కోచ్లో గుర్తు తెలియని మృతదేహం ఒంగోలు టౌన్: ఒంగోలు రైల్వే స్టేషన్లో ఫస్ట్ ప్లాట్ఫాంపై హౌరా ఎక్స్ప్రెస్ జనరల్ కోచ్లో గుర్తు తెలియని వ్యక్తి మంగళవారం మృతి చెందాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతుడి వయసు సుమారు 35 ఏళ్లు ఉంటుంది. పీచ్కలర్ రౌండ్ నెక్ టీ షర్ట్ ధరించి ఉన్నాడు. కుడి చెంప, ఛాతీ మీద పుట్టుమచ్చలు ఉన్నాయి. రైల్వే స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు జీఆర్పీ ఎస్సై కె.మధుసూధన రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 9440627647ను సంప్రదించాలని ఎస్సై సూచించారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి టంగుటూరు: గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని వల్లూరు జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల వివరాల మేరకు..మండలం లోని టంగుటూరు బాపూజీ కాలనీకి చెందిన సవలం వర్ధన్(24) ఒంగోలులో ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తుంటాడు. సోమవారం రాత్రి ఆస్పత్రిలో పని ముగించుకొని ఇంటికి వస్తుండగా వల్లూరు సమీపంలోకి వచ్చే సరికి వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి ఎస్సై చేసుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగమల్లేశ్వరరావు తెలిపారు. మేలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలు ఒంగోలు టౌన్: ఒంగోలు నగరంలో మేలో నిర్వహించనున్న ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) రాష్ట్ర కార్యదర్శి డి.సోమసుందర్ కోరారు. మంగళవారం స్థానిక మల్లయ్యలింగం భవనంలో నిర్వహించిన రాష్ట్ర మహాసభల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒంగోలులో మూడోసారి నిర్వహిస్తున్న రాష్ట్ర మహాసభలను విజయవంతం చేసేందుకు సభ్యులు కృషి చేయాలని కోరారు. అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్, ఇంటి స్థలం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏచూరి శివ, ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఆలపాటి సురేష్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, ఎ.సురేష్, డి.కనకయ్య, వెంకటేశ్వర్లు, భక్తవత్సలం, కేవీ సురేష్ రెడ్డి, సీహెచ్ రాంబాబు, కె.శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఉపాధి పనులా..!
ఉద్యోగులతో ● పీడీ తనిఖీలో వెలుగు చూసిన అక్రమాలు యర్రగొండపాలెం: గ్రామాల్లో చిరుద్యోగాలు చేసుకునేవారి పేర్లతో ఉపాధి హామీ పనులు చేసినట్లు మస్టర్లు వేసుకున్నట్లు మంగళవారం జరిగిన సోషల్ ఆడిట్లో గుర్తించారు. ఆయా ప్రాంతాలకు చెందిన అంగన్వాడీ ఆయాలు, ఇతర ఉద్యోగుల పేర్లు నమోదు చేసుకొని ఉపాధి నిధులు దుర్వినియోగం చేశారని డ్వామా పీడీ జోసఫ్ కుమార్కు ఆడిట్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. అనేక ప్రాంతాల్లో నాటుకున్న మొక్కలు ఎండిపోయాయని, కొలతల్లో వ్యత్యాసాలు ఉన్నాయని వారు ఆరోపించారు. ఈ మేరకు రికార్డు చేసిన పీడీ ఉపాధి సిబ్బందిని మందలించారు. మండలంలో ఉపాధి, ఐటీడీఏ, పంచాయతీ రాజ్ ఆధ్వర్యంలో దాదాపు రూ.28 కోట్ల పనులు జరిగినట్లు ఆయన తెలిపారు. అనంతరం ఇటీవల విద్యుదాఘాతంతో మృతి చెందిన కంప్యూటర్ ఆపరేటర్ కోటేశ్వరరావు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఉపాధి సిబ్బంది ద్వారా సేకరించిన రూ.1.50 లక్షలు, తన సొంత నిధులు రూ.10 వేలు మృతుడి పిల్లలకు అందజేశారు. కాశికుంట తండాలో నిర్మిస్తున్న పశువుల నీటి తొట్టిని ఆయన పరిశీలించారు. నియోజకవర్గంలోని ఉపాధి సిబ్బందితో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని పలు సూచనలు ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీవో పి.శ్రీనివాసరావు, సోషల్ ఆడిట్ ఎస్ఆర్పీ వెంకటేశ్వర్లు, జిల్లా విజిలెన్స్ అధికారి ప్రసాద్, ఏపీవోలు కె.నాగేశ్వరరావు, ఎం.శైలజ పాల్గొన్నారు. -
సీబీజీ భూముల కేటాయింపులో అత్యుత్సాహం
కురిచేడు: రిలయెన్స్ బయోగ్యాస్ ప్లాంట్ విషయంలో ప్రభుత్వ పెద్దలు, అధికారులు చేసిన హడావుడి భూ వివాదాలకు దారి తీసింది. కురిచేడు మండలంలో కంప్రస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ (సీబీజీ) ఏర్పాటు కోసం 799.40 ఎకరాల భూమిని కేటాయించారు. అయితే ఈ భూమి రెండు శాఖల మధ్య వివాదాన్ని రేపింది. ఆ భూములు మావంటే, మావని రెండు శాఖల అధికారులు పోట్లాడుకుంటూ పనులు నిలిపేశారు. మంగళవారం తహసీల్దార్ రజనీకుమారి, ఆర్ఐ నాగరాజు, సర్వేయర్ గోపి, వీఆర్వో హనుమంతరావు, ఫారెస్ట్ రేంజర్ నరసింహారావు, బీట్ అధికారి ధనలక్ష్మి, సిబ్బంది సీబీజీకి కేటాయించిన భూముల విషయంపై ఉదయం నుంచి సాయంత్రం వరకు రికార్డులు పరిశీలించి చర్చలు జరిపారు. అయితే ఈ భూమి కచ్చితంగా ఎవరదనేది తేల్చలేకపోయారు. 50 ఏళ్లుగా రెండు శాఖల మధ్య వివాదం.. దొనకొండ, కురిచేడు మండలాల సరిహద్దులో అటవీశాఖకు (రిజర్వు ఫారెస్టు) దొనకొండ మండలం బాదాపురం వద్ద నుంచి కురిచేడు మండలం గుండ్లకమ్మ వాగు వరకు పొట్లపాడు బీటు కింద సుమారు 13 వేల ఎకరాల అటవీభూమి ఉంది. కాల క్రమంలో హద్దులు చెరిగిపోయాయి. వాటిని జాయింట్ సర్వేచేసి హద్దులు నిర్ణయించుకోవాల్సి ఉంది. ఈ విషయంపై ఆ రెండు శాఖలు పూర్తి స్థాయిలో ఆదిశగా ప్రయత్నాలు చేయలేదు. 50 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సమస్య ఇరు శాఖలకు తలనొప్పిగా మారింది. ఇలా భూములు కేటాయించాల్సి వచ్చినప్పుడు మాత్రమే ఇరుశాఖలు పోట్లాడుకోవటం, తరువాత ఎవరికి వారు మిన్నకుండిపోవటం జరుగుతూ వస్తోంది. ఆదాయ వనరుగా వివాదాస్పద భూమి రెవెన్యూ–అటవీశాఖల మధ్య వివాదాస్పదంగా మారిన భూ వివాదం రెండు శాఖల్లోని కొందరు అధికారులకు ఆదాయ వనరుగా మారింది. రెండు శాఖల్లోని కొందరి అధికారుల కనుసన్నల్లో భూములు ఆక్రమించుకుని సాగుచేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది అయితే అధికారుల సాయంతో నకిలీపట్టాలు, పట్టాదారు పాస్పుస్తకాలు సృష్టించి మరీ ఆ భూములను విక్రయించి సొమ్ముచేసుకున్నారని సమాచారం. సీబీజీకి కేటాయించడంతో మళ్లీ తెరపైకి భూ వివాదం.. తాజాగా మండలంలోని గంగ దొనకొండ రెవెన్యూ పరిధిలోని సర్వేనంబరు 88, 90 లలోని 799.40 ఎకరాల భూమిని తాజాగా రెవెన్యూ అధికారులు సీబీజీ కి కేటాయించి నిర్మాణ సంస్థకు అప్పగించారు. అయితే ఆ భూములు అప్పగించే ముందు దానిని సర్వేచేయకుండా, ఆ భూముల్లోని పట్టాదారులకు సమాచారం ఇవ్వకుండా కేవలం రికార్డులు చేసి అత్యుత్సాహం ప్రదర్శించారు. భూములను చదును చేసే క్రమంలో అటవీశాఖ అధికారులు ఆ భూములు మావి అంటూ చదును చేయకుండా అడ్డుకున్నారు. రెండు రోజులుగా కేటాయించిన స్థలంలో పనులు ఆగిపోయాయి. ఇరు శాఖల ఉన్నతాధికారులు చేరి రికార్డులు పట్టుకుని తిరుగుతున్నారే తప్ప ఆ భూమి ఎవరిది అనేది తేల్చకపోవటం విశేషం. ఆ భూములు మావంటే మావని ప్రభుత్వ శాఖల పోట్లాట రెవెన్యూ–అటవీ శాఖల మధ్య తారస్థాయికి చేరుకున్న వివాదం రెండు రోజులుగా నిలిచిపోయిన ప్లాంట్ పనులు -
ఫోన్లు ఇచ్చేసి నిరసన..
మారుమూల ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో నెట్ వర్క్ కష్టాలు అధికంగా ఉండడంతో కార్యకర్తలు అవస్థలు పడుతున్నారు. అన్ని యాప్లను కలసి ఒక యాప్గా చేస్తామని చెప్పి తమను పట్టించుకోవడంలేదని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకుండా యాప్ల పేరుతో ఇబ్బందులు గురిచేస్తుండడంతో ఐదు రోజుల కిందట అంగన్వాడీ కార్యకర్తలు తమ ఫోన్లను ఒంగోలు పీడీ కార్యాలయంలో ఇచ్చి తమ నిరసనను తెలియజేసి వెళ్లిపోయారు. అయితే పీడీ ఆదేశాల మేరకు సూపర్వైజర్లు, సీడీపీవో ప్రాజెక్టుల వారీగా అంగన్వాడీ వర్కర్లకు ఫోన్లను బలవంతంగా ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే కార్యకర్తలు ఆ ఫోన్లను వినియోగించడంలేదని తెలిసింది. -
రైలు ఢీకొని ఆర్మీ రిటైర్డు జవాన్ మృతి
టంగుటూరు: రైలు ఢీకొని ఆర్మీ రిటైర్డు జవాన్ మృతి చెందాడు. ఈ సంఘటన టంగుటూరు సెంటర్లో రైల్వే గేటు వద్ద మంగళవారం ఉదయం జరిగింది. గ్రామస్తులు, రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు..కొండపి గ్రామానికి చెందిన గడ్డిపాటి శ్రీనివాస్ ఆర్మీలో పనిచేస్తూ 2018లో రిటైర్డు అయ్యారు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే శ్రీనివాస్ తల్లిదండ్రులు టంగుటూరులో నివాసం ఉంటున్నారు. వారిని చూసేందుకు రెండు రోజుల క్రితం టంగుటూరు వచ్చాడు. అయితే మంగళవారం ఉదయం టీ తాగేందుకు టంగుటూరు సెంటర్కు వస్తున్న క్రమంలో రైల్వేగేట్ దాటుతుండగా రైలు ఢీకొని మృతి చెందాడు. ప్రమాదంలో శరీర భాగాలు ముక్కలయ్యాయి. సంఘటనా స్థలానికి రైల్వే పోలీసులు చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా ఈ నెల 20న నెల్లూరు రైల్వేస్టేషన్లో గార్డుగా విధుల్లో చేరాల్సి ఉందని కుటుంబసభ్యులు తెలిపారు. -
ఏపీటీసీఏ జిల్లా అధ్యక్షుడిగా అజయ్ కుమార్
ఒంగోలు సిటీ: ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ (ఏపీటీసీఏ) నూతన కార్యవర్గ అధ్యక్షుడిగా ఆర్కిడ్స్ హైస్కూల్ కరస్పాండెంట్ గేరా అజయ్ కుమార్ ఎన్నికై నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ (ఏపీటీసీఏ) రాష్ట్ర నాయకులు, ఎన్నికల పరిశీలకులు మాంటిస్సోరి ప్రకాష్ బాబు మంగళవారం ప్రకటించారు. అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు, ఎన్నికల పరిశీలకుడు మాంటిస్సోరి ప్రకాష్ బాబు మాట్లాడుతూ జిల్లా కార్యవర్గ అధ్యక్షుని ఎన్నికకు ఈనెల రెండో తేదీ నుంచి ఆరో తేదీ వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగిందని ఈ నామినేషన్ ప్రక్రియలో ఆర్కిడ్స్ హైస్కూల్ కరస్పాండెంట్ గేరా అజయ్ కుమార్ ప్రకాశం జిల్లా నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించారు. ఆయనకు రాష్ట్ర ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తరఫున ప్రకాష్ బాబు అభినందనలు తెలియజేశారు. త్వరలోనే నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరుగుతుందని ఈయన తెలిపారు. కార్యక్రమానికి ఐపీపీ కృష్ణసాయి హైస్కూల్ కరస్పాండెంట్ పిడుగు జాలిరెడ్డి అధ్యక్షత వహించగా, పూర్వ జిల్లా అధ్యక్షుడు ఆంధ్ర హైస్కూల్ కరస్పాండెంట్ బీ శ్రీనివాసరావు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై న గేరా అజయ్ కుమార్కు జిల్లాలోని పాఠశాలల కరస్పాండెంట్లు, డైరెక్టర్లు, ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు. -
సమాప్తం..!
వ్యసనాల వల..జీవితం..దేశ భవిష్యత్ యువత చేతుల్లోనే ఉంది. కానీ నేడు అదే యువత పెడదారి పెట్టి జీవితాన్ని అర్ధంతరంగా ముగించేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో ఎవరు ఏం చేస్తున్నారో అర్థం చేసుకునే లోపే రెండు పదుల వయసు నిండకుండానే అప్పుల భారం భరించలేక ఆత్మహత్యలతో జీవితం సమాప్తమైపోతుంది. వ్యసనాలకు, స్మార్ట్ ఫోన్లకు, సరదాలకు బానిసై కొందరు జీవితాలను నాశనం చేసుకుంటుండగా..మరి కొందరు ప్రమాదాల ఉచ్చులో చిక్కుకుని విగతజీవులుగా మారి కన్నవారికి గర్భ శోకం మిగులుస్తున్నారు. కనిగిరిరూరల్: స్మార్ట్ ఫోన్ ప్రపంచం యువతను కబళిస్తోంది. అరచేతిలోకి ప్రపంచాన్ని తీసుకువచ్చిన స్మార్ట్ఫోన్..అదే అరచేతితో యువతకు ఆర్ధాయుష్షు పోస్తోంది. వెల్లువెల్లా వచ్చిపడుతున్న యాప్ల్లో బంధీలవుతున్న యువత అందులోకి బయటకు రాలేక విలవిలలాడిపోతున్నారు. కళ్లెదుటే తిరుగుతున్న కన్నపిల్లలు అర్థాంతరంగా ఎందుకు చనువు చాలిస్తున్నారో తెలియని తల్లిదండ్రులకు గుండెకోతే మిగులుతోంది. బెట్టింగ్ వల..ప్రాణాలు విలవిల బెట్టింగ్ యాప్లు యువత ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. గడిచిన ఏడాది కాలంలో బెట్టింగ్ యాప్లకు ఐదుగురు బలి కాగా. మరో పది మందికి పైగా ఆత్మహత్యాయత్నం చేశారు. ● బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే ఓ యువకుడు ఆన్లైన్ గేమ్లో అప్పుల పాలయ్యాడు. నగలు, ఆస్తులు అమ్ముకున్నాడు. ● బయట ప్రాంతంలో ఉన్నత చదువులు చదువుతున్న కనిగిరికి చెందిన ఓ విద్యార్థిని స్మార్ట్ ఫోన్ యాప్ గేమ్ ఉచ్చులో చిక్కుకుని ఆత్మహత్య చేసుకుంది. ● పట్టణంలోని కొత్తపేటలో ఓ యువకుడు ఆన్లైన్ గేమ్లో అప్పుల పాలై ఊరు వదిలి వెళ్లి పోయాడు. ● మండలంలోని అడ్డ రోడ్డు ప్రాంతంలో ఇద్దరు విద్యార్థులు బెట్టింగ్ యాప్ ఉచ్చులో చిక్కుకొని నిద్రమాత్రలు మింగారు. అదృష్టవశాత్తు తల్లిదండ్రులు సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలు మిగిలాయి. ● బొడ్డు చావిడి ఏరియాకు చెందిన ఓ యువకుడు ఆన్లైన్ జూదంలో రూ.50 లక్షలు పోగొట్టుకుని ఆప్పుల పాలై.. ఊరొదిలి వెళ్లి.. అక్కడ కూడా వ్యసనాలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ● తాజాగా ఓ విద్యార్థి బెట్టింగ్ యాప్లో నగదు పోగొట్టుకొని ఇంట్లో వాళ్లు కొడతారని భయపడి ఊరి వేసుకున్నాడు. బయట ప్రపంచనానికి తెలిసిన కొన్ని. బయటకు రాకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయి తనువు చాలిస్తున్న ఎందరివో బయటకు రానివి ఉన్నాయి. పక్కదారి పడుతున్న యువత బెట్టింగ్ ఊబిలో కూరుకుపోయి అర్థాంతరంగా తనువు చాలింపు యువతను కబళిస్తున్న స్మార్ట్ ఫోన్లు తల్లిదండ్రుల పర్యవేక్షణ కొరవడడమే కారణం -
తండ్రి చేతిలో కొడుకు హతం
● భార్యను కత్తితో పొడవబోయి అడ్డొచ్చిన కొడుకును పొడిచి.. ● మద్యం మత్తులో దారుణం అర్ధవీడు(కంభం): మద్యం మత్తులో భర్త..భార్యపై దాడి చేస్తుండగా కుమారుడు అడ్డురాగా కత్తిపోటుకు గురై మృతి చెందిన సంఘటన అర్థవీడులో చోటు చేసుకుంది. అందిన వివరాల మేరకు మద్యానికి బానిసైన షేక్ ఖాసిం వలి తరచూ భార్యతో గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి భార్యతో గొడవపడి కత్తితో ఆమైపె దాడి చేస్తుండగా కొడుకు షాకీర్ (14) అడ్డు రాగా అతను కత్తిపోటుకు గురై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని కుటుంబ సభ్యులు కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం మార్కాపురం తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఘర్షణ అనంతరం మృతుడి తల్లి, సోదరి కలిసి మద్యం మత్తులో ఉన్న ఖాసీంవలిపై దాడి చేశారు. అతన్ని కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తున్నట్లు తెలిసింది. షాకీర్ మృతదేహం మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో ఉంది. -
హోరా హోరీగా బండలాగుడు పోటీలు
అర్థవీడు (కంభం): మండలంలోని నాగులవరం గ్రామంలో శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలను మార్కాపురం మాజీ ఎమ్మెల్యే, గిద్దలూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ కేపీ నాగార్జునరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. పోటీల్లో రాచర్ల మండలం ఆకవీడుకు చెందిన సూరా పూజితరెడ్డి ఎడ్లు 4500 అడుగుల దూరం బండలాగి ప్రథమస్థానంలో నిలిచి సత్తాచాటాయి. అక్కలరెడ్డి పల్లికి చెందిన కూతుళ్ల దక్షితరెడ్డి ఎడ్లు 4223 అడుగులు లాగి ద్వితీయ స్థానం, కంభం మండలం ఎల్కోటకు చెందిన ఉలవల హరికృష్ణ ఎడ్లు 4080 అడుగులు లాగి తృతీయ స్థానం, అర్థవీడు మండలం గన్నేపల్లికి చెందిన డి.ఖాసింవలి ఎడ్లు 4059 అడుగులు లాగి నాల్గవ స్థానం, గన్నేపల్లికి చెందిన భూపని గురవయ్య ఎడ్లు 3726 అడుగులు లాగి ఐదో స్థానం, కనిగిరికి చెందిన సానికొమ్ము శ్రీనివాసరెడ్డి ఎడ్లు 3 వేల అడుగులు లాగి ఆరో స్థానంలో నిలిచాయి. విజేతలకు బహుమతుల కింద రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు అందజేశారు. దండుగ వెంకటరెడ్డి, పిడుగు రవికుమార్రెడ్డి, రామిరెడ్డి నారాయణరెడ్డి, బాలసుబ్బారెడ్డి, తదితరులు బహుమతులకు ఆర్థిక సహకారం అందించారు. -
ప్రభుత్వ ఉద్యోగుల సంఘ మహిళా విభాగం ఎన్నిక
జిల్లా చైర్పర్సన్గా కాట్రగడ్డ రజిత మానస ఒంగోలు సిటీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మహిళా విభాగం జిల్లా చైర్పర్సన్గా డాక్టర్ కాట్రగడ్డ రజిత మానసను ఎంపిక చేసినట్లు సంఘ జిల్లా అధ్యక్షుడు చిన్నపరెడ్డి కిరణ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ కార్యాలయంలో కిరణ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా మహిళా విభాగం ఏర్పాటుపై కమిటీ సమావేశం నిర్వహించారు. సంఘ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ.. మహిళా విభాగం జిల్లా కన్వీనర్గా వనజ, ట్రెజరర్గా ప్రసన్నను ఎంపిక చేసినట్లు తెలిపారు. కో చైర్మన్లుగా శ్రీదేవి, గౌరి, అనుపమ, గురుదేవి, సునీత, కో కన్వీనర్లుగా సుజాత, నాగమణి, త్రివేణి, ప్రసన్న, జి.సుజాత, ప్రతిమ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళా విభాగం చైర్పర్సన్ మాట్లాడుతూ.. జిల్లాలో వివిధ శాఖల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో సంఘ జిల్లా కార్యదర్శి వరకుమార్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, పట్టణ అధ్యక్షుడు మోటూరు శ్రీనివాసరావు, ఒంగోలు తాలూకా అధ్యక్షుడు సురేష్ బాబు, గోపీకృష్ణ, బాబూరావు తదితరులు పాల్గొన్నారు. -
‘పోషణ్ పక్వాడా’ విజయవంతం చేయాలి
● కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు సబర్బన్: పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో 7వ పౌష్టికాహార పక్షోత్సవాలను మంగళవారం కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 8 నుంచి 22 వ తేదీ వరకు 15 రోజుల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. లబ్ధిదారులు స్వయంగా తమంతట తామే పోషణ్ ట్రాకర్ లో నమోదు చేసుకునే విధానంపై ప్రచారం చేయటం, కమ్యూనిటీ ఆధారిత నిర్వహణ కార్యక్రమం (సీఎంఏఎం) అమలు చేయడం ద్వారా పిల్లల్లో పోషకాహార లోపం నివారిస్తారన్నారు. పిల్లల్లో ఊబకాయాన్ని తగ్గించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాటు చేసుకునేలా చేయాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా రక్తహీనత కలిగిన కిశోర బాలికలపై, హై రిస్క్ ప్రెగ్నెంట్స్, ఊబకాయ పిల్లలు, బరువు తక్కువ పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించి వారికి అవసరమైన పౌష్టికాహారం అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయడంతో పాటు పౌష్టికాహారం ఆవశ్యకతను ప్రజలకు వివరించాలన్నారు. క్షేత్ర స్థాయిలో ఐసీడీఎస్, విద్య, హెల్త్, ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఐసీడీఎస్ పీడీ హేన సుజన మాట్లాడుతూ 7వ పౌష్టికాహార పక్షోత్సవాలు ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. తొలుత పక్షోత్సవాల్లో రోజు వారీగా నిర్వహించే కార్యక్రమం వివరాలను ఐసీడీఎస్ సీడీపీఓ మాధవి వివరించారు. ఈ సందర్భంగా 7వ పౌష్టికాహార పక్షోత్సవాలకు సంబంధించి ప్రచురించిన గోడ పత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా.వెంకటేశ్వర రావు, మెప్మా పీడీ శ్రీహరి, ఐసీడీఎస్ సీడీపీఓలు, సూపర్వైజర్లు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
యాప్ చిక్కుముడి!
● యాప్లతో అంగన్వాడీలపై పనిభారం ● సాంకేతిక సమస్యలు పరిష్కరించకుండా కొత్త యాప్లు ● బాలసంజీవని 2.0 వెర్షన్తో కొత్త ఇబ్బందులు ● పీడీ కార్యాలయంలో ఫోన్లు వెనక్కి ఇచ్చేసి నిరసన ● పీడీ ఆదేశాలతో ఫోన్లు బలవంతంగా వెనక్కి ఇస్తున్నారన్న ఆరోపణలు ● 5 జీ ట్యాబులు ఇవ్వాలని డిమాండ్ ● ప్రభుత్వ నిబంధనలతో నష్టపోతున్న చిన్నారులు..బాలింతలు అంగన్వాడీ..జిల్లాలో 13 ఐసీడీఎస్ ప్రాజెక్టులుఅంగన్వాడీ కేంద్రాలు 2903ఒంగోలు సిటీ: అంగన్వాడీలకు యాప్ కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్లు మొబైల్ ఫోన్లలో ఇన్స్టాల్కాక అవస్థలు పడుతున్నారు. సాంకేతిక సమస్యలు పరిష్కరించకుండా లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేయాలంటూ ఒత్తిడి చేస్తుండడంపై కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచే వీరికి యాప్ ఇబ్బందులు ప్రారంభమవుతున్నాయి. తొలుత ఫేస్ యాప్ ఓపెన్ చేయాలి. అది ఓకే అయితేనే మిగిలిన యాప్లు పనిచేస్తాయి. విధిగా ఉదయం 9 గంటలకు సాయంత్రం 4 గంటలకు ఫేస్ యాప్వేయాలి. అలాగే వచ్చిన వెంటనే పిల్లల హాజరు ఫొటో తీయాలి.. ఎంత మంది హాజరైతే అంత మందికి మాత్రమే ఆహారం ఇవ్వాల్సి ఉంటుంది. చాలా అంగన్వాడీ కేంద్రాల్లో ఉదయం 10.30 గంటల వరకూ పిల్లలు వస్తూనే ఉంటారు. ఆ తర్వాత వచ్చిన వారికి ఆహారం ఇచ్చే అవకాశం లేదు. ఇలా అందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఇది అధికారుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కావడంలేదని వారు వాపోతున్నారు. ఇక ఫేస్ యాప్ వేసిన రోజులకే వేతనం ఇస్తోంది. సాంకేతిక సమస్య తలెత్తితే ఆరోజు వేతనం కట్ చేస్తున్నారు. గౌరవ వేతనం ఇస్తున్న తమపై ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగా నిబంధనలు విధించడం సరికాదని వారు మండిపడుతున్నారు. పనిభారంతో అవస్థలు ప్రభుత్వం కోరిన సమాచారాన్ని యాప్ల ద్వారా ఇవ్వడం, రికార్డులు రాయడం, టేక్ హోమ్ రేషన్ పంపిణీ, ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు పిల్లల బరువును పరిశీలించడం వంటి విధులు నిర్వహిస్తున్నప్పటికీ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా తమ పై వేసి అదనపు భారాన్ని మోపుతున్నారని అంగన్వాడీ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు ఇస్తున్నది రూ.11,500 గౌరవ వేతనమేని, ప్రభుత్వ ఉద్యోగులు చేసే పనిని తమతో చేయిస్తున్నప్పటికీ వేతనాలు మాత్రం సమానంగా ఇవ్వడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం కొత్తగా తెచ్చిన బాలసంజీవని యాప్ను సవరణ చేయాలని, ఉద్యోగులతో పాటు తమకు సమాన వేతనాలు ఇవ్వాలని, పింఛన్ల పంపిణీ కార్యక్రమం నుంచి తమను మినహాయించాలని, పనిభారాన్ని తగ్గించాలని వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు. ఆధునిక టెక్నాలజీతో కూడిన 5 జీ ట్యాబ్లను అందజేయాలని కోరుతున్నారు. హెల్పర్లు అంగన్వాడీ కేంద్రాన్ని శుభ్రం చేయడం, ప్రీస్కూల్ విద్యార్థులకు పోషకాహారం వండి పెట్టడం, గిన్నెలు శుభ్రం చేయడం, పిల్లల వాష్రూమ్స్ శుభ్రం చేయడం వంటి పనులు చేస్తున్నా వీరికి కేవలం రూ.7 వేలు మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాల సంజీవని 2.0తో పోషణ ట్రాకర్, ఎఫ్ఆర్ఎస్ యాప్ ద్వారా లబ్ధిదారులకు పోషకాహారం పంపిణీ చేస్తున్నారు. వాస్తవానికి లబ్ధిదారుల ఫొటో క్యాప్చర్ చేసి సరుకులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఫోన్లో సాంకేతిక సమస్యలు తలెత్తినా, నెట్వర్క్ లేకపోయినా లబ్ధిదారుల ఫొటో క్యాప్చర్ కాకపోయినా సరుకులు ఇవ్వడం కుదరడం లేదని అంగన్వాడీ వర్కర్లు అంటున్నారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన అన్నీ ఫోన్లలో కొన్ని యాప్లు ఇన్స్టాల్ కావడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తాజాగా బాల సంజీవని 2.0 వెర్షన్తో కొత్త యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్లో వర్కరు, హెల్పరు ఫొటో క్యాప్చర్ చేసి గర్భిణులకు, బాలింతలకు 7–3 , 3–6 వయస్సున్న చిన్నారులకు బాలసంజీవని పంపిణీ చేయాలి. అయితే తరుచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతుండడంతో పోషకాహారం పంపిణీలో నానా ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం కొత్తగా యాప్లు తెచ్చి తమను ఇబ్బందులను గురి చేయడమే కాక, అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్రకు కూటమి ప్రభుత్వం తెరతీసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో పనికి మూడు యాప్ల్లో వివరాలు అప్లోడ్ చేయాల్సి వస్తోంది. ఇవి సాంకేతిక సమస్యలతో పనిచేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో ఏర్పడుతున్న ఇబ్బందులను ప్రజలకు వివరించాలని అంగన్వాడీ కార్యకర్తలు నిర్ణయించారు.కేంద్రాల్లో పనిచేస్తున్న వర్కర్లు, హెల్పర్లు: 5750పనిచేయని ఫోన్లతో ఎలా .. సక్రమంగా పనిచేయని ఫోన్లతో ఎలా పనిచేయాలో ప్రభుత్వమే చెప్పాలి. కొత్తగా ప్రవేశపెడుతున్న బాలసంజీవని 2.0 వెర్షన్ ప్రస్తుతం మా వద్ద ఉన్న ఫోన్లలో పనిచేయదు. నెట్వర్క్ సక్రమంగా ఉండటం లేదు. ప్రకాశం జిల్లాలో 13 ప్రాజెక్టులు ఉంటే అందులో 7 ప్రాజెక్టులు ట్రైబల్ ఏరియా కావడం వల్ల సిగ్నల్ ఉండక అంగన్వాడీ వర్కర్లు నానా అవస్థలు పడుతున్నారు. ఇంటర్నెట్ సదుపాయం లేకపోతే యాప్లు ఓపెన్ కావు. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించడంతో పాటు కొత్తగా 5 జీ ట్యాబ్లను ఇవ్వాలి. పగలు స్కూల్లో పని, రాత్రి యాప్లతో పనిచేయాల్సి వస్తోంది. ఇన్ని ఇబ్బందులతో పనిచేయడం కష్టంగా ఉంది. అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించడంతో పాటు కొత్త ట్యాబ్లను సమకూర్చాలి. – ఈదర అన్నపూర్ణ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఒంగోలు బెదిరింపులు కాదు.. తాము ఎవరినీ బెదిరించలేదు. కార్యకర్తలు తమ ఫోన్లు తీసుకుని వెళ్లి వారి పనులు వారు చేసుకుంటున్నారు. వారి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తాను. – హేనా సుజన్, పీడీ, ఐసీడీఎస్, ఒంగోలు -
హామీల్లో సిక్సర్లు.. అమలులో జీరోలు
దర్శి: చంద్రబాబు ఎన్నికల ముందు ఓట్ల కోసం హామీలు ఇవ్వటంలో సిక్సర్లు కొట్టి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారని.. తీరా హామీలు అమలు చేయడంలో జీరోలు అయ్యారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ఎద్దేవా చేశారు. మండలంలోని రాజంపల్లి ముసీ నది ఒడ్డున ఉన్న సువర్చలా సమేత ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల సందర్భంగా పొదిలి మండలం కుంచేపల్లి గ్రామస్తులు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ అన్నా రాంబాబు తో పాటు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారిని ప్రభ నిర్వాహకులు సన్మానించారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు అలవి కాని హామీలు ఇచ్చి ఆ తరువాత ఒక్కటీ అమలు చేయకుండా నాలుక మడతేయడంలో చంద్రబాబు ఆరి తేరారన్నారు. సూపర్ సిక్స్ పథకాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ‘‘ఇప్పుడు పథకాలు చూస్తే భయమేస్తుంది.. నేను అమలు చేయలేనని’’ చేతులెత్తి తూర్పు తిరిగి దణ్ణం పెడుతున్నారన్నారు. ఇటీవల ప్రకృతి వైపరీత్యాలకు రైతులు తీవ్రంగా నష్టపోతే వారికి రూపాయి కూడా విదల్చలేదన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నాయకుడు రాష్ట్రానికి అవసరం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నాయకుడు రాష్ట్రానికి ఎంతో అవసరం ఉందని బూచేపల్లి అన్నారు. అప్పుడే రాష్ట్రంలో పేదలకు సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. పాలన అంటే జగనన్నను చూసి నేర్చుకోవాలని సూచించారు. వైఎస్సార్ సీపీ మార్కాపురం ఇన్చార్జ్ అన్నా రాంబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెట్టించామన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమం అటకెక్కించారని, అభివృద్ధి పూర్తి గా కుంటుపడిందని చెప్పారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు కేవీ రమణారెడ్డి, పేరం సుభాష్ చంద్రబోస్ రెడ్డి, నాగిరెడ్డి, నారాయణరెడ్డి, నాయకులు, కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు సూపర్ సిక్స్ అమలు చేయలేనని చేతులెత్తి డకౌట్ అయ్యాడు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి -
రాష్ట్రానికి మంచి చేసే నాయకుడు కావాలి
దర్శి: మంచి చేసే నాయకుడు వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అన్నారు. మండలంలోని లంకోజనపల్లి గ్రామంలో అభయాంజనేయ స్వామి తిరునాళ్ల ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వైఎస్సార్ సీపీ యాదవ రాజులు ఏర్పాటు చేసిన ప్రభపై బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శివప్రసాద్రెడ్డికి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. శాలువాలు, పూల మాలలతో ఘనంగా సత్కరించారు. ప్రభపై ఆయన పుట్టిన రోజు కేక్ కట్ చేసి అందరికీ పంచి పెట్టారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ నిజం చెప్పే నాయకుడి అవసరం ఈ రాష్ట్రానికి ఎంతో ఉందని, అప్పుడే రాష్ట్ర ప్రజల భవిష్యత్ బాగుంటుందని చెప్పారు. ప్రస్తుతం మన రాష్ట్రం బాగు పడాలంటే రాష్ట్రానికి మాట తప్పని మడమ తిప్పని నాయకుడు కావాలని అన్నారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చి ఎగ్గొట్టే వారికి సరైన బుద్ధి చెప్పాలని, అప్పుడే అలాంటి అబద్ధపు హామీలు ఇవ్వకుండా ఉంటారని చెప్పారు. దేశంలో ఇచ్చిన మాటకు కట్టుబడి అన్నీ హామీలు అమలు చేసిన నాయకుడు ఒక్క మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే అని చెప్పారు. గత ప్రభుత్వంలో ఐదేళ్లు కరోనా వంటి విపత్తులు ఎదురొచ్చినా వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని రాష్ట్రం తన కుటుంబంగా భావించి పేదలకు సంక్షేమం ఆగకుండా అందజేసిన గొప్ప సీఎం వైఎస్ జగన్ మాత్రమే అని స్పష్టం చేశారు. దేశంలోనే ఎక్కడా చేయని విధంగా రాష్ట్రంలో ఆస్పత్రులను కట్టుదిట్టం చేసి పేదలకు కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చి ఉచిత వైద్యం అందించారన్నారు. బీసీలకు పెద్దపీట వేసిన వైఎస్ జగన్: బీసీలను బ్యాక్ బోన్గా నమ్మి వారికి రిజర్వేషన్లు కేటాయించి అండగా ఉన్నారని బూచేపల్లి తెలిపారు. బీసీలకు పెద్ద పీట వేసి ఎక్కువ ఎమ్మెల్సీలు ఇచ్చిన నాయకుడు రాష్ట్రంలో ఒక్క వైఎస్ జగనే అని అన్నారు. గతంలో నామినేటెడ్ పోస్టులు అన్నీ ఓసీలకు ఇచ్చే వారని... జగనన్న వచ్చిన తరువాతే 50 శాతం రిజర్వేషన్లు కేటాయించి మహిళలకు, బీసీ, ఎస్టీ, ఎస్సీలకు నామినేటెడ్ పదవుల్లో కూడా సముచిత స్థానం కల్పించి న్యాయం చేశారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన అన్నీ హామీలు వంద శాతం అమలు చేసిన గొప్ప సీఎం ఒక్క వైఎస్ జగన్ మోహన్రెడ్డి అని కొనియాడారు. చంద్రబాబు బీసీలకు 50 ఏళ్లు దాటితే పెన్షన్లు ఇస్తామని చెప్పారని అధికారంలోకి వచ్చి పది నెలలు అయినా ఒక్క పెన్షన్ అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. బీసీలకు కూడా సంక్షేమం అందించకుండా వారిని చంద్రబాబు దారుణంగా మోసగించారన్నారు. సూపర్ సిక్స్పై చేతులెత్తేసిన చంద్రబాబు: ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అంటూ కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అసెంబ్లీకి వచ్చాక తూర్పు తిరిగి దండం పెట్టి నేను సూపర్ సిక్స్ చేయలేనని చేతులెత్తేశారని బూచేపల్లి ఎద్దేవా చేశారు. చంద్రబాబు మోసాలను చూసిన ప్రజలు గత ప్రభుత్వ పాలనను గుర్తుకు తెచ్చుకుని మేము జగన్ మోహన్రెడ్డికి న్యాయం చేయలేక పోయామని బాధపడుతున్నారన్నారు. మళ్లీ ఎప్పుడు ఎన్నికలు వస్తాయా...జగనన్నను ఎప్పుడు సీఎం చేసుకుందామా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారన్నారు. జిల్లాలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు అండగా ఉండి అభయాంజనేయ స్వామి దయతో రానున్న ఎన్నికల్లో మీ అందరి ఆశీస్సులతో జగనన్నను మళ్లీ సీఎం చేసుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ కొరివి ముసలయ్య, మాజీ సర్పంచ్ కొరివి కోటయ్య, పట్టణ అధ్యక్షుడు ముత్తినీడి సాంబయ్య, ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు బొమ్మిరెడ్డి లక్ష్మీరెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
ఉక్కిరిబిక్కిరి!
రియల్సాక్షి ప్రతినిధి, ఒంగోలు: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన తొలి సంవత్సరమే జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం రూ.171 కోట్లు నష్టపోయింది. 2024–25 ఆర్ధిక సంవత్సరానికి రూ.502.58 కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం టార్గెట్ విధించింది. కానీ వచ్చింది కేవలం రూ.331.23 కోట్లు మాత్రమే. సాధారణంగా గత ఏడాది వచ్చిన నికర ఆదాయాన్ని బట్టి ఈ ఏడాది టార్గెట్ నిర్ణయిస్తారు. దాని ప్రకారమే ఈ ఏడాది రూ.502.58 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ గత ఏడాది వచ్చినంత కూడా రాకపోవడాన్ని బట్టి స్థిరాస్తి విక్రయాలు ఏ స్థాయికి పడిపోయాయో అర్థం చేసుకోవచ్చు. భూముల విలువ పెంచినా లక్ష్యాన్ని చేరుకోలేదు. రాబడిని పెంచేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించలేదు. జిల్లా కేంద్రం ఒంగోలులో ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది. 2024–25 సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యం రూ.181.50 కోట్లు కాగా రూ.120.87 కోట్లు మాత్రమే వచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. భూముల, స్థిరాస్తుల క్రయ, విక్రయాలు పడిపోవడంతో ఈ రంగంపై ఆధారపడిన వారి పరిస్థితి దయనీయంగా ఉంది. అప్పులు చేసి వ్యాపారం చేసిన వారు ఆత్మహత్యలే శరణ్యం అంటూ వాపోతున్నారు. ప్రజల ఆదాయం తగ్గిపోవడమే: ప్రజల ఆదాయ మార్గాలు పడిపోవడంతో స్థిరాస్తి లావాదేవీలు మందగించాయి. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని, పరిశ్రమలు క్యూ కడుతున్నాయంటూ చంద్రబాబు, ఎల్లో మీడియా చేసే ప్రచారమంతా ప్రజలను మభ్యపెట్టడానికేనని స్తిరాస్థి లావాదేవీలు స్పష్టం చేస్తున్నాయి. వాళ్లు చెప్పే మాటల్లో కొంతైనా నిజం ఉంటే స్థిరాస్తి లావాదేవీలు పెరగాలి. లేదా కనీసం గతంలో జరిగినట్లయినా జరగాలి. కానీ గతం కంటే తగ్గిపోయాయి. దీన్నిబట్టి మార్కెట్లో పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని, ప్రజల చేతుల్లో డబ్బులు లేవని తెలుస్తోంది. దీనికితోడు జిల్లాలో కరువు తాండవిస్తుండడంతో రైతుల్లోనూ, వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉండే రంగాల్లో కొనుగోలు శక్తి పడిపోయింది. కలసిరాని ఆర్భాట ప్రచారం.. జిల్లాలో భారీ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నాంరూ.వేల కోట్లు పెట్టుబడులు జిల్లాకు వస్తున్నాయి. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అంబానీ ఇక్కడ పరిశ్రమ పెడుతున్నాడని ఎల్లో గ్యాంగ్ హడావిడి సృష్టించింది. పశ్చిమ ప్రకాశం రూపురేఖలు మారిపోతున్నాయంటూ ఊదరగొట్టింది. రానున్న రోజుల్లో మరిన్ని భారీ పరిశ్రమలు వస్తున్నాయని, నిరుపయోగంగా ఉన్న భూములు వినియోగంలోకి వస్తాయంటూ మంత్రులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, వారి అనుకూల మీడియా ఊదరగొట్టినా కనిగిరి, మార్కాపురం, దర్శి, గిద్దలూరు తదితర ప్రాంతాల్లో గతేడాది కంటే ఆదాయం పడిపోవడం గమనార్హం. గతంలో చంద్రబాబు వేసిన ట్రిపుల్ ఐటీ, సోలార్ హబ్, నిమ్జ్లు నేటికీ కార్యరూపం దాల్చకపోవడం ఈ ప్రాంతవాసుల మదిలో మెదులుతూనే ఉంటుంది. జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన పది నెలల కాలంలోనే రిజిస్ట్రేషన్ శాఖ రూ.171 కోట్లు నష్టపోయిందంటే ఈ రంగంలో నెలకొన్న అనిశ్చితికి అద్దం పడుతోంది. పొలాలు, భూముల క్రయ విక్రయాలు కొనసాగటం గగనంగా మారాయి. చంద్రబాబు రాకతో రియల్ బూమ్ మరింత పడిపోయిందని రియల్టర్లు వాపోతున్నారు. పెట్టిన పెట్టుబడి రాకపోగా వడ్డీలు కట్టలేక అప్పుల పాలై ఆత్మహత్యలే శరణ్యమని గగ్గోలు పెడుతున్నారు. జిల్లా చరిత్రలో ఇంత ఘోరంగా నష్టపోవటం ఇదే తొలిసారి కావటం గమనార్హం. జిల్లాలో పడిపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారం నేల చూపులు చూస్తున్న రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.171 కోట్లు నష్టపోయిన ఆదాయం లక్ష్యం రూ.502.58 కోట్లు కాగా వచ్చింది రూ.331.23 కోట్లు మాత్రమే భూ విలువలు పెంచినా లక్ష్యానికి చేరుకోని పరిస్థితి జిల్లా కేంద్రం ఒంగోలు లక్ష్యం రూ.181 కోట్లు..వచ్చింది రూ.120 కోట్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వచ్చిన ఆదాయం కంటే రూ.15.44 కోట్లు తక్కువ కొత్త పరిశ్రమలు వస్తున్నాయని ఊదరగొట్టినా కానిరాని ఫలితంకొనుగోలు శక్తి తగ్గింది జిల్లాలోని ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గింది. కరువు ఒక ప్రధాన కారణంగా ఉంది. రైతుల వద్ద డబ్బులు లేవు. దానికి తోడు జిల్లాలో ఏడాదిలో కొత్త ప్రాజెక్టులు కూడా ఏమీ రాకపోవటం కూడా ప్రధాన కారణం. విమానాశ్రయం వచ్చి, కొత్త ప్రాజెక్టు వస్తే మళ్లీ రియల్ ఎస్టేట్ పుంజుకోవచ్చు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి లక్ష్యం కంటే రూ.171 కోట్లు తగ్గింది. అంతకు ముందు సంవత్సరం వచ్చిన రాబడి కంటే కూడా రూ.15.44 కోట్లు తగ్గింది. – ఆళ్ల బాల ఆంజనేయులు, జిల్లా రిజిస్ట్రార్ -
గురుకుల విద్యార్థులకు జాతీయ స్థాయి అవార్డులు
● 9 బంగారు పతకాలు ● ఉత్తమ జాతీయ గురుకుల పాఠశాలగా గుర్తింపు కురిచేడు: విజయవాడలో ఈనెల 5వ తేదీ నిర్వహించిన 12వ జాతీయ స్థాయి చిత్రకళా పోటీల్లో కురిచేడు లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులం విద్యార్థులు పీ మనోజ్కుమార్, వీ మనోజ్ పాల్లు జాతీయ స్థాయిలో బాల చిత్రకళా అవార్డులు అందుకున్నారు. మరో 9 మంది బంగారు పతకాలు, 13 మంది రజిత పతకాలు సాధించారు. వీటితో పాటు కురిచేడు గురుకుల పాఠశాలకు ఉత్తమ ఆర్ట్ పాఠశాలగా జాతీయ అవార్డు లభించింది. ఈ పోటీల్లో 1000 మంది పైగా విద్యార్థులు పాల్గొన్నారు. వీటితో పాటు అదేరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్, స్కూల్ ఆఫ్ ఫ్లయింగ్ అండ్ అచీవ్మెంట్ లు సంయుక్తంగా నిర్వహించిన వికసిత్ భారత్ మోదీ కార్యక్రమంలో ‘మన ప్రకృతిని మనమే కాపాడుకుందాం’ అనే అంశం పై జాతీయ స్థాయి సీనియర్, యువ చిత్రకళాకారులకు ఒన్డే స్పాట్ పెయింటింగ్ పోటీలు నిర్వహించగా స్థానిక పాఠశాల ఆర్ట్స్ ఉపాధ్యాయులు కే ప్రసాద్రావుకు జాతీయ స్థాయి అవార్డు లభించింది. దీంతో పాటు ప్రశంస పత్రాలు కూడా అందజేశారు. ఈ పోటీల్లో దేశంలోని అన్నీ రాష్ట్రాల నుంచి 135 మంది చిత్రకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఆరోన్బాబు విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులు కే ప్రసాద్రావుకు, విద్యార్థులకు అభినందనలు తెలిపారు. బ్యూటీ పార్లర్ కోర్సులో మహిళలకు ఉచిత శిక్షణ ఒంగోలు వన్టౌన్: బ్యూటీ పార్లర్ కోర్సులో మహిళలకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు ఒంగోలు రూడ్ సెట్ సంస్థ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణ ఏప్రిల్ 12 నుంచి 35 రోజుల పాటు జరుగుతుందన్నారు. ఈ ఉచిత శిక్షణకు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన గ్రామీణ ప్రాంతాల వారు అర్హులన్నారు. శిక్షణ పొందగోరే అభ్యర్థులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు కలిగి ఉండాలన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన, వసతి కల్పిస్తారన్నారు. ఇతర పూర్తి వివరాలకు 9573363141 అనే నంబరు పై సంప్రదించాలన్నారు. బండలాగుడు పోటీల్లో సత్తాచాటిన పల్నాడు ఎడ్లు కంభం: మండలంలోని లింగోజిపల్లి గ్రామంలో ఉపదేశశ రామస్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీల్లో పల్నాడు జిల్లా క్రోసూరుకు చెందిన సంపటం వీరబ్రహ్మనాయుడు ఎడ్లు 6769.08 అడుగుల దూరంలాగి ప్రథమ స్థానంలో నిలిచి సత్తాచాటాయి. మండలంలోని లింగోజిపల్లి గ్రామానికి చెందిన ఆవులపాటి వెంకటేశ్వర్లు ఎడ్లు 5812.05 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానం, యర్రబాలెంకు చెందిన వెంకటగిరి హేమలత నాయుడు ఎడ్లు 5600 అడుగులు లాగి తృతీయ స్థానం, అర్థవీడుకు చెందిన షేక్ మునాఫ్ వలి ఎడ్లు 4615 అడుగులు లాగి నాల్గవస్థానం, పొదిలికి చెందిన కూకట్ల నరసింహారావు ఎడ్లు 3600 అడుగులు లాగి ఐదో స్థానం, రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన బొర్రా రవితేజ ఎడ్లు 3373 అడుగులు లాగి ఆరో స్థానంలో నిలిచాయి. విజేతలకు బహుమతుల కింద రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు అందజేశారు. పశువులను సంరక్షించాలి ● కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు సబర్బన్: వేసవిని దృష్టిలో పెట్టుకొని పశువులను సంరక్షించుకోవాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. స్థానిక గ్రీవెన్స్ హాలులో సోమవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. పశువులతో పాటు మేకలు, గొర్రెలు, కోళ్లులాంటి వాటిని సంరక్షించుకోవాలన్నారు. అందుకోసం ప్రభుత్వం కొన్ని సూచనలు, సలహాలు చేసిందన్నారు. పోస్టర్ల రూపంలో గ్రామాల్లో పంపిణీ చేసి పశుపోషకుల్లో, రైతుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా జేసీ గోపాల కృష్ణ, పశు సంవర్ధక శాఖ జేడీ డాక్టర్ బేబీరాణితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. -
పేదల గృహాలు వేగవంతం చేయాలి
ఒంగోలు సబర్బన్: జిల్లాలో పేదల గృహాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి సోమవారం ఆమె సంబంధిత శాఖల జిల్లా అధికారులతో కలసి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గృహ నిర్మాణాల పురోగతి, జాతీయ ఉపాధి హామీ పథకం అమలు, వర్క్ ఫ్రమ్ హోం సర్వే, మిస్సింగ్ సిటిజన్స్ మ్యాపింగ్, పోషణ్ పక్వాడా కార్యక్రమం అమలు, గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య ఏర్పాట్లు, గ్రామ పంచాయతీల వర్గీకరణ సర్వే, జియో కో ఆర్డినేట్స్ తదితర అంశాలపై మండల ప్రత్యేక అధికారులు, మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఏపీవోలతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ రానున్న మే 31 వ తేదీ నాటికి జిల్లా వ్యాప్తంగా 8,839 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించామని చెప్పారు. ఇంత వరకు కేవలం 2,664 ఇళ్ల నిర్మాణం మాత్రమే పూర్తయిందని, లక్ష్యాలను నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పిల్లలు, మహిళల పోషకాహార స్థితి మెరుగుపరిచేందుకు మంగళవారం నుంచి 22వ తేదీ వరకు 15 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా పోషణ్ పఖ్వాడా కార్యక్రమాన్ని రోజుకు ఒక కార్యక్రమంతో సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 9,500 ఫారం పాండ్ల నిర్మాణాలు లక్ష్యం కాగా ఈ వారం ప్రతి గ్రామ పంచాయతీలో ఒక ఫారం పాండ్ నిర్మాణం పూర్తి చేసేలా ఫీల్డ్ అసిస్టెంట్స్ కృషి చేయాలన్నారు. జిల్లాలో పశువుల నీటి తొట్టెలు నిర్మించేందుకు అవసరమైన ప్రతిపాదనలు వెంటనే పంపాలని ఆదేశించారు. సమీక్ష సమావేశంలో హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్, డ్వామా పీడీ జోసఫ్ కుమార్, డీపీఓ వెంకటనాయుడు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బాల శంకరరావు, సీపీఓ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని అన్ని విభాగాల్లో సౌకర్యాలు కల్పించాలి మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ -
విధుల్లోకి సీనియర్ అసిస్టెంట్
మహిళా పోలీస్కు మెమో.. ● వేతనం నిలిపివేత, వేధింపులపై కలెక్టర్కు ఫిర్యాదు చేసినందుకే.. దళిత ఉద్యోగి అయిన ఉమామహేశ్వర పురం మహిళా పోలీస్ కట్టా అనూషపై వేధింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. టీడీపీ నేతలపై ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కేసును ఉపసంహరించుకునంటేనే వేతనం అందుతుందని ఇన్చార్జి ఎంపీడీఓ సహా పంచాయతీ కారదర్శి చెబుతుండటం, అందుకు అంగీకరించలేదని వేధిస్తున్న తీరుపై సోమవారం ప్రకాశం భవన్లో నిర్వహించిన గ్రీవెన్స్లో కలెక్టర్ తమీమ్ అన్సారియాకు మహిళా పోలీస్ అనూష ఫిర్యాదు చేశారు. కలెక్టర్కు ఫిర్యాదు ఇవ్వడంపై ఆగ్రహించిన ఇన్చార్జి ఎంపీడీఓ.. పంచాయతీ కార్యదర్శితో ఆమెకు మెమో జారీ చేయడం చర్చనీయాంశమైంది. పీ4 సర్వే, వర్క్ ఫ్రం హోం సర్వే విధుల్లో నిర్లక్ష్యం వహించడంపై వివరణ ఇవ్వాలని మెమోలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా గ్రామ సచివాలయ పరిధిలో సర్వేలకు ఎన్.దాసు, టి.రవీంద్ర, ఎ.రామాంజిరెడ్డి, ఎ.నాగార్జున, డి.రాము బాధ్యులని పేర్కొంటూ కార్యదర్శి సంతకంతో గత శుక్రవారం ఓ లెటర్ ఇచ్చారు. ఈ ప్రకారం ఆ సర్వేలతో మహిళా పోలీస్కు ఎలాంటి సంబంధం లేదు. కానీ, సర్వేలు చేయలేదంటూ కార్యదర్శి మెమో జారీ చేయడంలో మతలబు ఏమిటో అధికారులకే తెలియాలి. నాపై కలెక్టర్కు ఫిర్యాదు చేసినందుకే మెమో ఇచ్చా. ఎంపీడీఓ చెబితేనే వేతనం ఆపా’ అని సెక్రటరీ, తాను జీతం ఆపమని చెప్పలేదని ఎంపీడీఓ పరస్పర విరుద్ధంగా స్పందించడం వేధింపుల తీరును తేటతెల్లం చేసింది.ముండ్లమూరు(దర్శి): ‘ఎన్నాళ్లీ నరకం ...ఉద్యోగం చేయలేం’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. ఎట్టకేలకు సీనియర్ అసిస్టెంట్ కల్పన, టైపిస్ట్ ఆంత్రయ్యలను సోమవారం పై అధికారుల ఆదేశాల మేరకు విధుల్లోకి తీసుకున్నారు. సీనియర్ అసిస్టెంట్ గతంలో అనారోగ్య కారణంతో మెడికల్ లీవ్ పెట్టుకుని నెల రోజులు సెలవుపై వెళ్లారు. సెలవు నుంచి వచ్చిన వెంటనే విధుల్లోకి తీసుకోలేదు. దీనిపై ‘సాక్షి’లో కథనం ప్రచురితమవడంతో అధికారుల ఆదేశాల మేరకు విధుల్లోకి తీసుకున్నారు. -
గత ఏడాది కంటే తగ్గిన ఆదాయం
నూతనంగా ఏ ప్రభుత్వం వచ్చినా రియల్ ఎస్టేట్లో ఊపు రావాలి. అలాంటిది పాతాళానికి పడిపోయిందంటే ప్రజల కొనుగోలు శక్తి ఏ మేరకు పడిపోయిందో ఈ లెక్కలను బట్టి చూస్తే అర్థమవుతోంది. ప్రజల ఆదాయం తగ్గిపోవడంతో ఆస్తుల క్రయవిక్రయాలు అత్యంత దారుణంగా పడిపోయాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చివరి సంవత్సరంలో రూ.346.67 కోట్లు ఆదాయం వస్తే చంద్రబాబు మొదటి సంవత్సరంలో రూ.331.23 కోట్లు మాత్రమే వచ్చింది. అంటే గత సంవత్సరం వచ్చిన ఆదాయం కంటే పెరగాల్సింది పోయి రూ.15.44 కోట్లు తగ్గింది. దీనిని బట్టి చూస్తే మొన్నటి ఆర్థిక సంవత్సరానికి నష్టపోయిన రూ.171 కోట్లు, 2023–24 రావాల్సిన దానికంటే తగ్గిన రూ.15.44 కలుపుకుంటే మొత్తం కలిపి జిల్లాలో రావాల్సిన రిజిస్ట్రేషన్ ఆదాయం రూ.186.44 కోట్లు పడిపోయిందన్నది స్పష్టమవుతోంది. -
‘మీ కోసం’కు అత్యంత ప్రాధాన్యం
ఒంగోలు సబర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ కోసం కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. ప్రకాశం భవన్లోని గ్రీవెన్స్ భవనంలో సోమవారం కలెక్టర్ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాల కృష్ణతో కలిసి జిల్లా వ్యాప్తంగా వచ్చిన అర్జీదారులతో మాట్లాడారు. మీ కోసం కార్యక్రమంలో వచ్చే అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరమే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అర్జీదారుల సమస్యలను శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ప్రతి ఒక్క అర్జీపై ప్రత్యేక శ్రద్ధపెట్టి నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్జీలు రీ ఓపెన్ కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అధికారులు ప్రతి రోజు లాగిన్ అయి ఆన్లైన్లో వచ్చే వినతులను కూడా చూడాలన్నారు. సాంకేతిక సమస్యల వలన క్షేత్ర స్థాయిలో పరిష్కరించలేని అర్జీలు వస్తే ఆ విషయాన్ని ప్రజలకు అప్పుడే స్పష్టం చేయాలన్నారు. అలాంటి వాటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. సదరం స్లాట్ల సంఖ్య పెంచాలి: ఒంగోలు టౌన్: వికలాంగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని జిల్లాలో సదరం స్లాట్ల సంఖ్యను పెంచాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కేఎఫ్ బాబు కోరారు. ఈ మేరకు డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో కలెక్టర్ తమీమ్ అన్సారియాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ జిల్లాలో ఒంగోలు, గిద్దలూరుల్లో మాత్రమే సదరం సెంటర్లు ఉన్నాయని తెలిపారు. క్రమం తప్పకుండా జరిగే సదరం క్యాంపులను కూటమి ప్రభుత్వం వచ్చాక వెరిఫికేషన్ల పేరుతో ఆరు నెలలుగా ఆపివేసిందన్నారు. దాంతో అనేక మంది వికలాంగులు గ్రామ వార్డు సచివాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కొత్తగా దరఖాస్తు చేసుకునేవారి పరిస్థితి దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వికలాంగులను ఎటువంటి ఇబ్బందులకు గురిచేయకుండా సదరం స్లాట్లను పెంచాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నాయకులు దానియేలు, శివ, రాజు, రోశీబాబు, రాము తదితరులు పాల్గొన్నారు. అర్జీదారులతో మాట్లాడిన కలెక్టర్ తమీమ్ అన్సారియా -
20 ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు బంద్
ఒంగోలు టౌన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆరోగ్య శ్రీకి వందలాది కోట్ల రూపాయల మేరకు బకాయిలు చెల్లించకపోవడంతో జిల్లాలోని ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో సోమవారం నుంచి సేవలను బంద్ చేశారు. ఆరోగ్య శ్రీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారం రోజుల క్రితమే జాయింట్ కలెక్టర్ గోపాల కృష్ణకు సమ్మె నోటీసులు ఇచ్చారు. అయినా ప్రభుత్వంలో ఎలాంటి కదలిక లేకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో నెట్వర్క్ ఆస్పత్రులు సమ్మెకు దిగాయి. జిల్లాలో మొత్తం 120 కు పైగా ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు ఉండగా వాటిలో 42 ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా రోజుకు 150 నుంచి 200 మంది వరకు వివిధ హాస్పిటళ్లలో ఆరోగ్య శ్రీ కింద అడ్మిట్ అవుతున్నారు. ఒంగోలులోని ఒక ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రికి రోజువారి కనీసం 30 నుంచి 50 ఓపీలు వస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆరోగ్య శ్రీ బకాయిలు విడుదల చేయకుండా ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తుండడంతో విసుగు చెందిన జిల్లాలోని 20కి పైగా ఆస్పత్రులు సమ్మెకు దిగాయి. అత్యవసర సేవలను మినహాయించి రెగ్యులర్ ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేయడంతో నిరుపేద సామాన్య రోగులు ఇబ్బందులకు గురయ్యారు. ఆరోగ్య శ్రీ ఉంది కదాని మారు మూల ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు నిరాశగా వెనుతిరిగి వెళ్లడం కనిపించింది. అంతేకాకుండా గుండె జబ్బులతో బాధపడుతున్న రోగులు కొందరు ఇప్పటికే ఆరోగ్య శ్రీ కింద ఆస్పత్రిలో చేరి ఉన్నారు. ఆపరేషన్ల అప్రూవల్ కోసం ఎదరు చూస్తున్నారు. ఇప్పుడీ సమ్మె నోటీసు రావడంతో అప్రూవల్ వస్తుందో లేదో, ఆపరేషన్ జరుగుతుందో లేదో అనే ఆందోళనకు గురవుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల సమ్మెకి సకాలంలో స్పందించి బకాయిలు విడుదల చేస్తే సరేసరి లేకపోతే ఆపరేషన్కు సొంతంగా డబ్బులు చెల్లించాలని కొందరు వైద్యులు చెప్పి పంపిస్తున్నారు. ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోవడంతో పలువురు ఆరోగ్య మిత్రలు విధులకు డుమ్మా కొట్టారు. ఎన్నిసార్లు ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయడం లేదని కొందరు రోగులు ఫిర్యాదు చేస్తున్నారు. ఏదో చేస్తారని నమ్మి ఓటేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు కోలుకోలేని దెబ్బ తీశారని రోగులు దుమ్మెత్తి పోస్తున్నారు. -
పోలీసు గ్రీవెన్స్కు 92 ఫిర్యాదులు
ఒంగోలు టౌన్: ప్రజల సమస్యలను పరిష్కరించడమే ‘మీ కోసం’ లక్ష్యమని ఎస్పీ ఏఆర్ దామోదర్ చెప్పారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి 92 మంది ఫిర్యాదుదారులు ఎస్పీని కలిసి సమస్యలపై అర్జీలు అందజేశారు. చట్టప్రకారం విచారణ చేపట్టి బాధితులకు న్యాయం అందించేలా చూడాలని పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారానికి తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) కె. నాగేశ్వరరావు, వన్టౌన్ సీఐ నాగరాజు, ట్రాఫిక్ సీఐ పాండురంగారావు, ఐటీ కోర్ సీఐ సూర్యనారాయణ, సీసీఎస్ సీఐ జగదీష్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సైలు షేక్ రజియా సుల్తానా, ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మూల్యాంకన ప్రక్రియ పటిష్టంగా చేపట్టాలి
● కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు సిటీ: స్పాట్ వాల్యూయేషన్లో పాల్గొన్న ఉపాధ్యాయులందరూ మూల్యాంకన ప్రక్రియను పటిష్టంగా చేపట్టాలని కలెక్టర్ తమీమ్అన్సారియా పేర్కొన్నారు. ఒంగోలులోని డీఆర్ఆర్ఎం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి మూల్యాంకన ప్రక్రియను సోమవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభమైన మూల్యాంకన ప్రక్రియలో చీఫ్ ఎగ్జామినర్లు 113 మంది, అసిస్టెంట్ ఎగ్జామినర్లు 680 మంది, స్పెషల్ అసిస్టెంట్లు 226 మంది, అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్లు 9 మంది వెరసి మొత్తం 1,028 మంది నిమగ్నమై ఉన్నారని వివరించారు. వీరు సుమారు 1,78,218 మంది విద్యార్థుల పరీక్ష పేపర్లు దిద్దాల్సి ఉంటుందని తెలిపారు. స్పాట్ వాల్యుయేషన్లో పాల్గొంటున్న ఉపాధ్యాయులు ఇబ్బంది పడకుండా తగిన సదుపాయాలు కల్పించాలని డీఈఓ కిరణ్కుమార్ను ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఈఓతోపాటు ఎగ్జామ్స్ ఏసీ శివకుమార్, ఇతర సిబ్బంది ఉన్నారు. -
ఇద్దరు అదనపు జిల్లా జడ్జిలు బదిలీ
ఒంగోలు: స్థానిక జిల్లా కోర్టులో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు అదనపు జిల్లా జడ్జిలు సోమవారం బదిలీ అయ్యారు. ఒకటో అదనపు జిల్లా జడ్జిగా విధులు నిర్వహిస్తున్న డి.అమ్మన్నరాజాను కర్నూలు జిల్లా నంద్యాల 3వ అదనపు జిల్లా జడ్జిగా బదిలీ చేయగా ఆయన స్థానంలో అనంతపురం పోక్సో కోర్టు జడ్జి టి.రాజ్యలక్ష్మిని నియమించారు. ఒంగోలులో మూడో అదనపు జిల్లా జడ్జిగా విధులు నిర్వహిస్తున్న డి.రాములును గుంటూరు లేబర్ కోర్టు ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ కం ప్రిసైడింగ్ ఆఫీసర్గా బదిలీచేసి, ఆయన స్థానంలో మచిలీపట్నంలో 6వ అదనపు జిల్లా జడ్జిగా విధులు నిర్వహిస్తున్న ఎ.పూర్ణిమను నియమించారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. జొన్నల కొనుగోలుకు ఏర్పాట్లు ఒంగోలు సబర్బన్: జిల్లాలో రైతులు పండించిన జొన్నలు కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 1న ఏపీ పౌర సరఫరాల సంస్థ ఇచ్చిన సర్క్యులర్ ప్రకారం జిల్లాలో పండించిన సీ–43 మహేంద్ర రకం హైబ్రిడ్ జొన్నలను రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. రైతులు వీఏఏలను సంప్రదించి పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వం క్వింటా జొన్నలకు రూ.3,371 మద్దతు ధర ప్రకటించిందని వెల్లడించారు. నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలకు లోబడి జొన్నలు కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. హమాలీలను రైతులే ఏర్పాటు చేసుకుంటే ఆ ఖర్చులను ప్రభుత్వం అదనంగా ఇస్తుందని, గోనె సంచులు, జొన్నల రవాణా ఖర్చులను పౌరసరఫరాల సంస్థ భరిస్తుందని తెలిపారు. రైతులకు బ్యాంకు ఖాతాల్లో నగదు జమవుతుందని పేర్కొన్నారు. కబడ్డీ విన్నర్గా కరేడు జట్టు కొత్తపట్నం: శ్రీరామ నవమి పండుగ సందర్భంగా కొత్తపట్నంలో రెండు రోజులుగా నిర్వహించిన ప్రకాశం, బాపట్ల, తిరుపతి, నెల్లూరు జిల్లాల స్థాయి కబడ్డీ పోటీల్లో కరెడు జట్టు విజేతగా నిలిచింది. రాజుపాలెం జట్టు ద్వితీయ, కొండూరిపాలెం జట్టు మూడో బహుమతి, గుమ్మళ్లదిబ్బ జట్టు నాలుగో బహుమతి, అలగాయపాలెం జట్టు ఐదో బహుమతి గెలుపొందాయి. విజేతలకు వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు, ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి సొంత నగదుతో బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ అంజిరెడ్డి మాట్లాడుతూ.. క్రీడా పోటీలతో ఐక్యతా భావం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. మద్దతు ధర క్వింటాకు రూ.3371 జేసీ రోణంకి గోపాలకృష్ణ వెల్లడి -
పోలీస్ విచారణకు హాజరైన డాక్టర్ ప్రభావతి
ఒంగోలు టౌన్: మాజీ ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టడీ కేసు విచారణాధికారి, ఎస్పీ ఏఆర్ దామోదర్ ఎదుట గుంటూరు జీజీహెచ్ రిటైర్డ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఆమెను 5వ నిందితురాలిగా చేర్చి విచారణ చేస్తున్నారు. సోమవారం ఉదయం విచారణకు వచ్చిన ఆమెను మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత హాజరుకావాలని చెప్పారు. తొలిరోజు సుమారు నాలుగున్నర గంటల పాటు విచారించారు. విచారణలో ఆమె సంతృప్తికరంగా సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. మంగళవారం కూడా ఆమె విచారణకు హాజరుకానున్నారు. అట్రాసిటీ కేసు విచారించిన డీఎస్పీ యర్రగొండపాలెం: స్థానిక పోలీస్ స్టేషన్లో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు సోమవారం విచారించారు. మండలంలోని మొగుళ్లపల్లెకు చెందిన బి.రాజేష్ యర్రగొండపాలెంలోని మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట సెల్ పాయింట్ నిర్వహిస్తున్నాడు. ఆ గ్రామానికి చెందిన ఆరుగురు ఆ సెల్ పాయింట్ వద్దకు వచ్చి రాజేష్ను కులం పేరుతో దూషిస్తూ దాడి చేశారు. ఈ సంఘటనపై బాధితుడు ఈ నెల 5వ తేదీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు డీఎస్పీ మొగుళ్లపల్లి వెళ్లి దాడికి కారణాలపై విచారణ చేశారు. ఆయన వెంట సీఐ సీహెచ్ ప్రభాకరరావు, ఎస్సై పి.చౌడయ్య ఉన్నారు. హైవేపై డీజిల్ దొంగల హల్చల్! ● పోలీసుల అదుపులో డీజిల్ దొంగలు ● విచారిస్తున్నట్లు సమాచారం టంగుటూరు: జాతీయ రహదారిపై డీజిల్ దొంగలను పోలీసులు ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. అందిన సమాచారం మేరకు.. జాతీయ రహదారిపై రాత్రి సమయంలో లారీలను నిలిపి డ్రైవర్లు నిద్రిస్తున్న సమయంలో పల్నాడు జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు డీజిల్ దొంగిలించి టంగుటూరు మండలంలోని వల్లూరులో విక్రయిస్తున్నారు. ఈ విషయంపై ఉప్పందడంతో టంగుటూరు పోలీసులు దాడి చేసి దొంగలను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి సుమారు 300 లీటర్ల డీజిల్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. డీజిల్ దొంగలను టంగుటూరు పోలీసు స్టేషనుకు తరలించి తమదైన శైలిలో విచారిస్తున్నట్లు తెలిసింది. కాగా దీనిపై పోలీసులు ఎటువంటి విషయాలు బయటకు వెల్లడించలేదు. జాతీయ రహదారిపై డీజిల్ దొంగలు హల్చల్ చేస్తున్నా టోల్ ప్లాజా యాజమాన్యం, టోల్ ప్లాజా భద్రతా సిబ్బంది పట్టించుకోవడం లేదని పలువురు లారీ డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. వాహనదారులపై కేసులు నమోదు ● 44 మందికి రూ.1.36 లక్షల జరిమానా ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగరంలో వాహనాలు తనిఖీ చేసి నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఉప రవాణా కమిషనర్(డీటీసీ) ఆర్.సుశీల పేర్కొన్నారు. సోమవారం ఆర్టీసీ బస్టాండ్ సెంటర్తోపాటు నగరంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించామని తెలిపారు. మొత్తం 263 వాహనాలను తనిఖీ చేసి, నిబంధనలు పాటించని 44 మందిపై నమోదు చేశామని చెప్పారు. హెల్మెట్, సరైన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ లేనివారు, ఓవర్ స్పీడ్తో వెళ్తున్న వారిని గుర్తించి రూ.1.36 లక్షల జరిమానా విధించామని తెలిపారు. తనిఖీల్లో ఎంవీఐలు ఎ.కిరణ్ ప్రభాకర్, కె.రామచంద్ర రావు, ఎల్.సురేంద్ర ప్రసాద్, ఏఎంవీఐలు యు.ధర్మేంద్ర, బి.భానుప్రకాష్ పాల్గొన్నారు. జొన్నచొప్ప దగ్ధం అర్థవీడు(కంభం): ప్రమాదవశాత్తు నిప్పంటుకొని జొన్నచొప్ప దగ్ధమైన సంఘటన అర్థవీడు మండలంలోని అంకభూపాలెంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన మెట్ల పోలురాజు, మెట్ల శేఖర్ 5 ట్రాక్టర్ల చొప్పను వామిగా వేసుకొని పశువులకు మేతగా వినియోగించుకుంటున్నారు. సోమవారం చొప్పకు నిప్పంటుకొని మంటలు చెలరేగగా కంభం అగ్నిమాపక సిబ్బందికి సమచారం అందించారు. మంటలు ఆర్పేలోగా చొప్ప మొత్తం దద్ధమై రూ.50 వేలు నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. -
అన్యాయంగా ఇల్లు కూల్చారు
● లబోదిబోమంటున్న బాధిత మహిళ కొనకనమిట్ల: ఓ మహిళ గ్రామ కంఠం భూమిలో ఐదేళ్ల క్రితం వేసుకున్న రేకుల షెడ్ను టీడీపీ నాయకులు నిర్ధాక్షిణ్యంగా కూల్చివేసిన ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. కొనకనమిట్ల మండలం చినారికట్ల బీసీ కాలనీకి చెందిన బరిగే తిరుపతమ్మ గ్రామ పెద్దల సహకారంతో గ్రామ కంఠం భూమిలో రేకుల షెడ్ ఏర్పాటు చేసుకుని కుమార్తెతో కలిసి నివాసం ఉంటోంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ భూమిపై కన్నేసిన టీడీపీ నాయకుడు బరిగె బాలయ్య ప్రోద్బలంతో అతని అనుచరులు బరిగే భగవాన్, గడ్డి తిరుపతయ్య, కుమ్మరి ఏడుకొండలు, గోసుల చినవెంకటయ్య రేకుల షెడ్ ఖాళీ చేయాలంటూ బెదిరిస్తూ వస్తున్నారు. శనివారం తిరుపతమ్మ లేని సమయంలో రేకుల షెడ్ కూల్చివేశారు. రేకులు, కర్రలను చిల్లచెట్లలో పడేశారు. ఇంట్లో సామగ్రి బయటపడేసి, బయట ఉన్న చెత్తకు నిప్పు పెట్టారు. ఆమెకు జీవనాధారమైన కుట్టు మిషన్ను విసిరికొట్టడంతో అది పనికిరాకుండా పోయింది. ఇల్లు కూల్చివేతపై ప్రశ్నిస్తే దాడి చేసేందుకు యత్నించారని తిరుపతమ్మ వాపోయింది. ఆ స్థలంలో అప్పటికప్పుడు వాల్మీకి మహర్షి బ్యానర్ ఏర్పాటు చేసి, చిత్ర పటాలు పెట్టడం గమనార్హం. టీడీపీ నేతల దుశ్యర్యపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు తెలిపింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది. ఇదిలా ఉండగా గ్రామ కంఠం భూమి తమదని, ఖాళీ చేయాలంటూ గత ఏడాది నవంబర్లో పొదిలికి చెందిన నూతలపాటి లక్ష్మీప్రసూనాంబ కోర్టు ద్వారా తిరుపతమ్మకు నోటీసులు పంపారు. గ్రామ కంఠం భూమిపై కన్నేసి, దారుణానికి ఒడిగట్టారని బాధిత మహిళ ఆరోపించారు. రెండు రోజులుగా హైస్కూల్లో తలదాచుకుంటున్నట్లు ఆమె వాపోయింది. -
గంజాయి ముఠా ఆటకట్టు
సింగరాయకొండ: అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న నలుగురు యువకులను జాతీయ రహదారిపై టోల్గేట్ సమీపంలో టంగుటూరు వెళ్లే సర్వీసు రోడ్డులో అరెస్టు చేసినట్లు సీఐ సీహెచ్ హజరత్తయ్య తెలిపారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను సీఐ వెల్లడించారు. గుంటూరు పట్టణంలోని రాజాగారితోటకు చెందిన గాజుల రాజు, చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తి పట్టణంలోని సన్నిధి వీధిలో నివసిస్తున్న కేవీబీ పురం మండలం అంజూరు గ్రామానికి చెందిన పల్లం కిరణ్, ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా, పడువ మండలం ఛట్వ పంచాయతీ జీరా గ్రామానికి చెందిన భీమా ఖొరా, ఖాషూఖిని ముందుస్తు సమాచారంతో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుల వద్ద 4.550 కేజీల గంజాయి లభ్యమైందని, 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సీఐ చెప్పారు. డబ్బు కోసం గంజాయి వ్యాపారం టంగుటూరు మండల పరిధిలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న గాజుల రాజు గంజాయికి బానిసయ్యాడు. ఒడిశాకు చెందిన భీమాఖొరా, ఖాషూఖి సాయంతో గంజాయి తెప్పించుకుని తాగుతూ చిన్నచిన్న ప్యాకెట్లు చేసి అమ్ముతుండేవాడు. ఈ క్రమంలో రాజుకు పరిచయస్తుడైన శ్రీకాళహస్తికి చెందిన కిరణ్ ఫోన్ చేసి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, మూడున్నర కేజీల గంజాయి ఇప్పించాలని కోరాడు. అయితే రాజు భీమాఖొరా ద్వారా నాలుగున్నర కేజీల గంజాయి తెప్పించాడు. ముందుగా అనుకున్న ప్రకారం సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు టంగుటూరు టోల్గేట్ వద్దకు భీమాఖొరా, ఖాషూఖి గంజాయితో చేరుకున్నారు. అదే సమయానికి రాజు, కిరణ్ అక్కడికి వచ్చారు. గంజాయి ప్యాకెట్లను నిందితులు పరిశీలించే క్రమంలో పోలీసు జీపు రావడంతో నలుగురూ పారిపోయేందుకు ప్రయత్నించారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. కాగా గంజాయి ముఠాను చాకచక్యంగా అరెస్టు చేసిన సీఐ హజరత్తయ్య, టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు, కానిస్టేబుళ్లు శ్రీను, ఎస్.వెంకటరావు, ఎంవి కృష్ణారావు, శ్రీను, సుబ్బారెడ్డి, మహేష్, నాగార్జున, జయరాం, రమేష్ను ఎస్పీ ఏఆర్ దామోదర్ అభినందించారని సీఐ వివరించారు. నలుగురు నిందితులు అరెస్టు 4.550 కేజీల గంజాయి, 4 సెల్ఫోన్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన సింగరాయకొండ సీఐ -
సాగర్ జలాలు అంతంతమాత్రమే...
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాకు సాగర్ జలాలు తీసుకురావడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు విఫలమయ్యారు. గత సంవత్సరం కృష్ణానదిలో పుష్కలంగా నీటి వనరులున్నా.. జిల్లాకు నీళ్లిచ్చే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. ఫలితంగా నేడు రైతు కరువు పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 47.381 టీఎంసీల నీటిని తాగు, సాగునీటి అవసరాలకు అందించినట్టు ఇరిగేషన్ అధికారులు లెక్కలు చెబుతున్నారు. జిల్లాలో 58 నోటిఫైడ్, నాన్ నోటిఫైడ్ చెరువులు ఉన్నాయి. వీటిలో సుమారు 46 చెరువులు నింపామని అధికారులు కాకిలెక్కలు చెబుతున్నారు. చాలా ప్రాంతాల్లో చెరువుల నీటిమట్టాలు పడిపోయాయి. పలు చెరువులు బీడుగా దర్శనమిస్తుండటం గమనార్హం. పుల్లలచెరువు మండలం వెంకట రెడ్డి పల్లెలో బీడుగా మారిన పంట పొలం -
వైఎస్సార్ సీపీ శ్రేణులకు అండగా ఉంటా
ఒంగోలు సిటీ: జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉంటానని వైఎస్సాస్సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి భరోసా ఇచ్చారు. 2029 ఎన్నికల్లో జిల్లాలో వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడుతుందని పేర్కొన్నారు. ఆదివారం ఒంగోలులోని పార్టీ జిల్లా కార్యాలయంలో బూచేపల్లి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కటింగ్ అనంతరం పార్టీ నాయకులు, అభిమానులు ఘనంగా సన్మానించారు. పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరు రవిబాబు అధ్యక్షతన నిర్వహించిన వేడుకల్లో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మనందరెడ్డి, కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్, మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసులరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, మాజీ ఎఎంసీ చైర్మన్ వెంకటేశ్వరరావు, మున్సిపల్ కార్పొరేటర్లు, ఇమ్రాన్ఖాన్, ప్రవీణ్కుమార్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు దుంపా చెంచిరెడ్డి, దామరాజు క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. జన్మదిన వేడుకల్లో కార్యకర్తలనుద్దేశించి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి -
బౌద్ధ స్థూపాలకు పూర్వవైభవం తీసుకురావాలి
చీమకుర్తి: రాష్ట్రంలోని బౌద్ధ స్థూపాలకు పూర్వవైభవం తీసుకురావాలని బౌద్ధ భిక్షువులు ఆకాంక్షించారు. జపాన్కు చెందిన బౌద్ధ భిక్షువు యూషీ, శ్రీలంకకు చెందిన బౌద్ధ భిక్షువు బోధిహీన్ ఆదివారం దొనకొండ మండలంలోని చందవరం బౌద్ధ స్థూపాన్ని సందర్శించి తిరిగి ఒంగోలు వెళ్తూ మార్గం మధ్యలో చీమకుర్తిలో ఆగి విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులతో, విలేకరులతో వారు మాట్లాడారు. రాష్ట్రంలో 40 బౌద్ధ స్థూపాలున్నాయని, ఒక్కొక్క స్థూపం వద్ద ప్రతి పౌర్ణమి రోజు దీపోత్సవం చేస్తున్నామని చెప్పారు. అమలాపురం వద్ద ప్రభుత్వం రెండు లేదా మూడు ఎకరాల భూమి ఇస్తే బౌద్ధమత వ్యాప్తి కోసం శాంతి ప్రదేశం నిర్మించతలపెట్టినట్లు తెలిపారు. స్థానిక ప్రజలకు బౌద్ధ మతం గురించి వారు ఉపదేశించారు. పండుగ పూట విషాదం ● నీటికుంటలో పడి బాలుడు మృతి దొనకొండ: నీటికుంటలో పడి బాలుడు మృతి చెందడంతో పండుగ పూట విషాదం అలముకుంది. మండల కేంద్రమైన దొనకొండ పంచాయతీలోని గుట్టమీదపల్లి గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై టి.త్యాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. గుట్టమీదపల్లి గ్రామానికి చెందిన పిక్కిలి వెంకటేశ్వరరావు గొర్రెలు మేపుకుంటూ జీవిస్తుంటాడు. శ్రీరామనవమి పండుగ, ఆదివారం సందర్భంగా పాఠశాలకు సెలవు కావడంతో కుమారుడు పిక్కిలి తరుణ్ (13)ని తీసుకుని గొర్రెలు తోలుకుని పొలం వెళ్లాడు. నేను గొర్రెల దగ్గర ఉంటాను, నువ్వు వెళ్లి అన్నం తినిరా.. అని తండ్రికి కుమారుడు చెప్పగా, తండ్రి ఇంటికెళ్లి అన్నం తిని తిరిగి గొర్రెల వద్దకు వెళ్లాడు. అక్కడ కుమారుడు కనిపించలేదు. చుట్టుపక్కల గాలించగా, రైతులు పంటలు పండించుకోవడానికి ఏర్పాటు చేసుకున్న నీటి కుంటలో శవమై కనిపించడంతో వెంకటేశ్వరరావు నిర్ఘాంతపోయాడు. సమాచారం అందుకున్న ఎస్సై త్యాగరాజు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి బయటకు తీయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. వెంకటేశ్వరరావుకు కుమారుడు, కుమార్తె సంతానం కాగా, కుమారుడు తరుణ్ స్థానిక విశ్వభారతి స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. రాజ్యాధికారం ద్వారానే హక్కులు ఒంగోలు వన్టౌన్: దేశంలో మైనార్టీ వర్గాలకు రాజ్యాధికారం ద్వారా మాత్రమే వారి హక్కులు, రాజ్యాంగ పరిరక్షణ సాధ్యమవుతుందని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ అన్నారు. ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. 75 సంవత్సరాల రాజ్యాంగం అమలులో సవాళ్లు అనే అంశంపై ఒంగోలు అంబేడ్కర్ భవన్లో ఆదివారం సమావేశం నిర్వహించారు. విజయకుమార్ పాల్గొని మాట్లాడుతూ రాజ్యాంగ హక్కుల అమలు, పరిరక్షణ బాధ్యత ప్రజలదేనని అన్నారు. ప్రజా ఉద్యమాల ద్వారా మాత్రమే వాటిని సాధించుకోవాలన్నారు. కార్యక్రమంలో వీసీకే పార్టీ నాయకులు డాక్టర్ విద్యాసాగర్, సురేష్ పంతగాని, తదితరులు పాల్గొన్నారు. -
సిగ్నల్ తీగల కత్తిరింపు ఇంటిదొంగల పనేనా?
ఒంగోలు టౌన్: నెల్లూరు జిల్లాలో రైల్వే సిగ్నల్ తీగలను కత్తిరించి చోరీకి పాల్పడిన ఘటన మరువక ముందే ఒంగోలు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు సిగ్నల్ తీగలను కత్తిరించడం సంచలనం సృష్టిస్తోంది. శుక్రవారం ఒంగోలు జీఆర్పీ సీఐ మౌలా షరీఫ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రైలు దొంగతనాలు జరగుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అదే రోజు రాత్రి ఒంగోలు సమీపంలో కొందరు వ్యక్తులు రైల్వే సిగ్నల్ తీగలను కత్తిరించడంపై ప్రయాణికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు జాతీయ రహదారిపై జీఆర్పీ పోలీసులు పహరా కాస్తున్న సమయంలోనే మరోవైపు వారికి సమీపంలోనే దుండగులు దొంగతానికి యత్నించడం చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం రాత్రి 1.15 గంటల సమయంలో 282–3 పోస్టు వద్ద ఉన్న సిగ్నల్ తీగలను గుర్తు తెలియని దొంగలు కత్తిరించారు. అదే సమయంలో అటుగా హైదరాబాద్ నుంచి చైన్నె వెళ్లే ఎక్స్ ప్రెస్ రైలు వచ్చింది. అయితే ఆ రైలు ఇక్కడ ఆగకుండా వెళ్లిపోయింది. సిగ్నల్ తీగలను కత్తిరించిన కొద్దిసేపటి తరువాత మరో రైలు వచ్చి ఆగినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే వరస దొంగతనాలపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రైల్వే సిగ్నల్ వ్యవస్థ మీద అవగాహన ఉన్న ప్రస్తుత ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు, రైల్వే పోలీసుల సహకారం లేకుండా నిందితులు ఇలాంటి ఘటనలకు పాల్పడే అవకాశం లేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అరకొర భద్రతపై ప్రయాణికుల ఆందోళన జిల్లా కేంద్రమైన ఒంగోలు రైల్వే స్టేషన్లో అరకొర భద్రతపై ప్రయాణికులు ఆందోళ చెందుతున్నారు. రైల్వే స్టేషన్లో జీపీఆర్, ఆర్పీఎఫ్ పోలీసు స్టేషన్లు ఉన్నప్పప్పటికీ తగినంత మంది సిబ్బంది లేరు. ఉన్న సిబ్బంది కూడా విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రైల్వే స్టేషన్, స్టేషన్ పరిసరాల్లో ఎక్కడ పడితే అక్కడ మందుబాబులు బహిరంగంగా మద్యం సేవిస్తున్నా రైల్వే పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్టేషన్లోని మూడు ప్లాట్ఫారాలపై కనీసం ఒక్క రైల్వే పోలీసు కూడా కనిపించకపోవడం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. టికెట్ లేకుండా ప్రయాణించే వారి వద్ద నుంచి డబ్బు వసూలు చేయడంపై ఉన్న ఆసక్తి రైల్వే ప్రయాణికులకు రక్షణ కల్పించే విషయంలో లేకపోవడం విమర్శలకు మరో కారణం. విధుల్లో నిర్లక్ష్యం ప్రస్తుత జీఆర్పీ సీఐ మౌలా షరీష్ స్థానికంగా నివాసం ఉండకుండా గుంటూరు నుంచి రాకపోకలు సాగిస్తుండటంతో జీఆర్పీ పోలీసు స్టేషన్పై పర్యవేక్షణ లేకుండా పోయింది. ఒంగోలు తరువాత సింగరాయకొండలో మాత్రమే ప్రత్యేక పోలీసు పాయింట్ ఉంది. ఇటీవల రైల్వే ఆధునికీకరణ పనులు జరుగుతుండడంతో ఆ పాయింట్ను తొలగించారు. ప్రస్తుతానికి కావలి నుంచి సింగరాయకొండకు ఆర్పీఎఫ్ పోలీసులు వస్తున్నారని తెలుస్తోంది. కావలి నుంచి ఆర్పీఎఫ్ పోలీసులు, ఒంగోలు నుంచి జీఆర్పీ పోలీసులు రోజూ ఉదయం, సాయంత్రం ఇద్దరు చొప్పున విధులకు రావాల్సి ఉంటుందని, అయితే సిబ్బంది కొరత పేరుతో ఒంగోలు నుంచి జీఆర్పీ సిబ్బంది డుమ్మా కొడుతున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ రైల్వే ఉద్యోగి పేర్కొన్నారు. కావలి నుంచి మాత్రం రాత్రి పూట మాత్రమే విధులకు హాజరవుతూ ఉదయం వేళ డుమ్మా కొడుతున్నట్లు చెప్పారు. ఒంగోలు నుంచి రోజుకు 10 వేల మందికి పైగా ప్రయాణికులు, సింగరాయకొండ నుంచి రోజూ 4 వేల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. సరైన రక్షణ లేకపోవడంతో రైళ్లలో ప్రయాణం చేయాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. రైల్వే పోలీసుల పాత్రపై అనుమానాలు రైల్వే స్టేషన్లలో అంతంతమాత్రంగా పోలీసు భద్రత వరుస ఘటనలతో ప్రయాణికుల్లో భయాందోళన -
వృత్తిపై ఆర్టీసీ కంట్రోలర్ నిబద్ధత
ఇంకొల్లు(చినగంజాం): ఓ ప్రయాణికుడు బస్సులో మరిచిపోయిన బ్యాగును ఇంకొల్లు ఆర్టీసీ బస్టాండ్ కంట్రోలర్ సురక్షితంగా అప్పగించి వృత్తిపై నిబద్ధత చాటుకున్నారు. వివరాలు.. గిద్దలూరు ప్రాంతంలో పంచాయతీ గుమస్తాగా విధులు నిర్వహించే జితేంద్రరెడ్డి ఆదివారం తన వ్యక్తిగత పనిపై ఒంగోలు నుంచి ఇంకొల్లుకు ఆర్టీసీ బస్సులో వచ్చారు. ఈ క్రమంలో బస్సులో తన బ్యాగు మరచిపోయారు. బ్యాగు పోగొట్టుకున్న విషయాన్ని ఆలస్యంగా గుర్తించి ఇంకొల్లు బస్టాండ్లోని కంట్రోలర్ షేక్ బాబును సంప్రదించారు. అయితే అప్పటికే ఆయన ప్రయాణించిన బస్సు ఒంగోలుకు బయలుదేరింది. బస్సు డ్రైవర్కు ఫోన్ చేసిన కంట్రోలర్.. బ్యాగును తిరిగి తెప్పించి జితేంద్రరెడ్డికి అప్పగించారు. బాధితుడితోపాటు ప్రయాణికుల సంఘం అధ్యక్షుడు మోహన కృష్ణ తదితరులు కంట్రోలర్ను అభినందించారు. -
పొలాలు నోరెళ్లబెట్టి!
పాలకులు ఎండబెట్టి..మర్రిపూడిలో కరువు రక్కసి ఉగ్రరూపం...మర్రిపూడి: చుక్కనీరు లేని ఇరిగేషన్ చెరువులు, ఒట్టిపోయిన బోర్లు, 500 అడుగులు లోతుకెళ్లినా కనిపించని నీరు, కనుచూపు మేర అంతా బీడే. ఈ విధంగా మర్రిపూడి మండలంలో కరువు రక్కసి ఉగ్రరూపం దాల్చింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో మండలంలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయి. మండలంలోని 13 ఇరిగేషన్ చెరువుల్లో చుక్కనీరు లేకపోవడంతో పిచ్చిచెట్లు పెరిగిపోయాయి. దీంతో ఆయకట్టు అంతా బీడుభూములను తలపిస్తున్నాయి. వర్షాభావ పరిస్థితులు, నీటితడులు లేక సాగుచేసిన పంటలన్నీ నిలువునా ఎండిపోతున్నాయి. మండలంలో 500పైచిలుకు బోర్లు ఉంటే అందులో 80 చేతిపంపులు పూర్తిగా ఒట్టిపోయాయి. ఎక్కువ శాతం బోర్లు తప్పుపట్టి పనికిరాకుండా ఉన్నాయి. వ్యవసాయ బోర్లు 500 అడుగుల్లోతు వేసినా చుక్క నీరు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఖరీఫ్లో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. దీంతో వాగులు, వంకలు, కుంటల్లో చుక్కనీరు లేక పశువులు నీటికి తీవ్ర ఇక్కట్లు పడాల్సిన దుస్థితి నెలకొంది. ఏప్రిల్ మొదటి వారంలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే మున్ముందు పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని మండల వాసులు వాపోతున్నారు. – ఖరీఫ్లో కంది 19,086 ఎకరాల్లో సాగుచేయాల్సి ఉండగా, 21,200 ఎకరాల్లో సాగు చేశారు. అలాగే సజ్జ 842 ఎకరాలకుగానూ 766 ఎకరాలు, వాణిజ్య పంటలు 1200 ఎకరాలకుగానూ 676 ఎకరాల్లో సాగుచేశారు. వ్యవసాయ బోర్లు ఒట్టిపోవడంతో పంటలు ఎండుముఖం పట్టాయి. కొందరు వేలకు వేలు ఖర్చు చేసి ఆరుతడులు ఇస్తున్నారు. వర్షాలు లేకపోవడంతో తెగుళ్లు విజృంభించాయి. దీంతో దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. మిర్చి ధరలు లేకపోవడంతో కోత కూలి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు పొలాల్లోనే వదిలేస్తున్నారు. -
పాతాళగంగ కోసం పాట్లు
పుల్లలచెరువు: మండలంలో తాగునీరు, వ్యవసాయ బోర్లలో నీరు పూర్తిగా అడుగంటింది. ప్రస్తుతం నీటి కోసం ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. మండలంలో వ్యవసాయం పూర్తిగా భూగర్భజలాలపైనే ఆధారపడి ఉంది. వర్షపాతం తక్కువగా ఉండటంతో గ్రామాల్లోని చిన్న, పెద్ద చెరువుల్లో నీరు పూర్తిగా అడుగంటిపోయింది. భూగర్భ జలాలు అడుగంటడంతో 1000 అడుగుల మేర బోర్లు వేస్తున్నప్పటికీ నీరు పడటం లేదు. ప్రధానంగా రైతులు మిర్చి, పత్తి, కంది, ఇతర వాణిజ్య, ఆరు తడి పంటలు సాగు చేస్తున్నారు. మిర్చి పంట సాగుచేసిన పొలాల్లో బోర్లలో నీరు రాకపోవడంతో కాపుకు వచ్చిన పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు విపరీతంగా నష్టపోవాల్సి వస్తోంది. పంటలు ఎండిపోతూ ఒక పక్క, వేలాది రూపాయలు ఖర్చు పెట్టి చుక్క నీరు పడక మరోపక్క రైతులు అల్లాడిపోతున్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లోనూ పశుసంపద ఎక్కువగా ఉంది. పశువులకు తాగునీటికి ఇబ్బంది కలుగుతోంది. పశుగ్రాసం ఉన్న ప్రాంతాల్లోని చిన్నచిన్న కుంటలు, చెరువులు ఒట్టిపోయాయి. దీంతో ఇంటి దగ్గరే పశువులకు తాగునీరు అందించాల్సి ఉంది. తగ్గిన సాగు విస్తీర్ణం... మండలంలోని 19 గ్రామ పంచాయతీల్లో 2024–25 ఖరీఫ్లో సాధారణ పంట విస్తీర్ణం 26,500 ఎకరాలు కాగా, 22,600 ఎకరాల్లోనే సాగేచేశారు. రబీలో 2,500 ఎకరాలు సాగుచేయాల్సి ఉండగా, కేవలం 1,530 ఎకరాల్లో మాత్రమే పంటలు సాగుచేసినట్లు అధికారులు చెబుతున్నారు. -
గ్రూపు రాజకీయాల ధాటికి.. విద్యార్థుల భవిష్యత్తు గాలికి!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు ట్రిపుల్ ఐటీ అక్రమాలకు అడ్డాగా మారింది. టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల అండదండలతో ఇందులోని అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ఇక్కడ నిబంధనలకు వ్యతిరేకంగా కొందరు గెస్ట్ ఫ్యాకల్టీలు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు కొట్టేశారు. ఇప్పుడు వీరు విద్యార్థుల భవిష్యత్తును గాలికొదిలేసి గ్రూపు రాజకీయాలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. అడ్డదారుల్లో 40 మందికి పదోన్నతులు.. ట్రిపుల్ ఐటీలో 2017లో టీచింగ్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్ విడుదలైంది. ఎలాంటి రాత పరీక్షలు లేకుండా, రికమండేషన్ ద్వారా 40 మంది గెస్ట్ ఫ్యాకల్టీలుగా రిక్రూట్ అయ్యారు. ఏడాది తిరగకుండానే వీరిలో నలుగురికి మినహా మిగిలిన వారందరికీ 2018లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు వచ్చేశాయి. అధికారిక ఉత్తర్వులు, గవర్నింగ్ కౌన్సిల్ ఆమోదంలేకుండానే వీరి డిజిగ్నేషన్ మార్చేశారు. గెస్ట్ ఫ్యాకల్టీల్లో ఒకరు అప్పుడు అడ్మినిస్ట్రేటివ్ హోదాలో పదోన్నతులకు బరితెగించినట్లు ఆరోపణలున్నాయి.ఆనాడు అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదా పొందిన వారంతా ప్రస్తుతం ఏవోగా, ఫైనాన్షియల్ ఆఫీసర్ (ఎఫ్ఓ)గా, స్టూడెంట్ వెల్ఫేర్ డీన్గా, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్గా ప్రత్యేక హోదాలను అనుభవిస్తున్నారు. ఆ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కు స్నేహితుడైన ఓ వ్యక్తిని అడ్డదారుల్లో గెస్ట్ ఫ్యాకల్టీగా తీసుకొచ్చి అసిస్టెంట్ ప్రొఫెసర్ను చేసి స్టోర్స్ పర్చేజ్ ఇన్చార్జిగా కూడా అదనపు బాధ్యతలప్పగించారు. అండగా నిలిచిన జగన్ సర్కారు.. ట్రిపుల్ ఐటీలో 2018లో కాంట్రాక్టు టీచింగ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈసారి మాత్రం నిబంధనల ప్రకారం ఎంపిక ప్రక్రియ నడిపారు. ఇందులో సెలెక్ట్ అయిన వారిని తొలగించాలన్న కుట్రతో ఎల్లో గ్యాంగ్ 2019లో వీరిని సాగనంపి మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు రావాలని చెప్పినట్లు సమాచారం. అప్పుడే అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం వీరిని కొనసాగించడంతో ఎల్లో గ్యాంగ్ పప్పులు ఉడకలేదు.అయినప్పటికీ ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారమిచ్చి కోవిడ్ సమయంలో వీరిని నిలిపివేశారు. విషయం తెలుసుకున్న నాటి సీఎం వైఎస్ జగన్ వారికి న్యాయం చేసి ఉద్యోగాల్లో కొనసాగించారు. ట్రిపుల్ ఐటీలోని కాంట్రాక్టు ఉద్యోగులందరికీ జీతాలు పెంచుతూ జీవో ఇవ్వగా దాన్ని కూడా ఎల్లో గ్యాంగ్ దురి్వనియోగం చేసింది. 2017లో ఎంపికై గెస్ట్ ఫ్యాకల్టీలుగానే మిగిలిపోయిన నలుగురికి.. 2018లో నిబంధనల ప్రకారం ఎంపికైన కాంట్రాక్టు ఫ్యాకల్టీలకు జీతాలు పెంచకుండా కుట్రలు చేసినట్లు ఆరోపణలున్నాయి. నేడు కాంట్రాక్టు ఉద్యోగుల ధర్నాఒంగోలు ట్రిపుల్ ఐటీలో జరుగుతున్న అక్రమాలతో అన్యాయానికి గురైన కాంట్రాక్టు ఉద్యోగులు సోమవారం నూజీవీడు ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా చేయనున్నారు. మరోవైపు.. ట్రిపుల్ ఐటీ కాలేజీలో తిష్టవేసిన ఎల్లో గ్యాంగ్ ఆగడాలను అరికట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఓ మంత్రి అండదండలతో వీరు రెచ్చిపోతున్నారన్న ఆరోపణలున్నాయి. విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా రాజకీయాలకు పాల్పడుతున్నారన్న విమర్శలూ ఉన్నాయి. డిజిగ్నేషన్ మార్పు నేరుగా చేయకూడదు.. ఇది ఎప్పట్నుంచో ఉన్న సమస్య. సాంకేతిక కారణాలవల్ల దీనిపై ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. గత నెల 28న గవరి్నంగ్ కౌన్సిలింగ్ సభ్యుల సమావేశం జరిగింది. గెస్ట్ ఫ్యాకల్టీలకు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా డిజిగ్నేషన్ మార్పు నేరుగా చేయకూడదని, ఇంటర్నల్ కమిటీ వేసిన తర్వాతే చేయాలన్న సూచనలున్నాయి. అయితే, 110 జీఓ ద్వారా 2018 ఫ్యాకల్టీల సమస్యలు పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్నందున ధర్నా జరగకపోవచ్చు. – డాక్టర్ భాస్కర్ పటేల్, డైరెక్టర్, ట్రిపుల్ ఐటీ, ఒంగోలు -
జగ్జీవన్రాం ఆశయాలు కొనసాగించాలి
ఒంగోలు సిటీ: దళిత, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్రాం అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అన్నారు. ఒంగోలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం డాక్టర్ బాబు జగ్జీవన్రాం 117 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జగ్జీవన్రాం చిత్రపటానికి ఎమ్మెల్యే శివప్రసాద్రెడ్డితో పాటు జెడ్పీ చైర్పర్సన్ వెంకాయమ్మ, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరు రవిబాబు, పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ మాదాసి వెంకయ్య, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, అనుబంధ సంఘాల నాయకులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పూలమాలలు సమర్పించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ భారతదేశ తొలి ఉపప్రధానిగా జగ్జీవన్రాం అనేక సేవలు అందించారని కొనియాడారు. దళితులు, అణగారిన వర్గాల వారికి న్యాయ చేయడమే కాక, పేద ప్రజలకు సముచిత న్యాయం కోసం కృషి చేసిన సామాజికవేత్త అని కొనియాడారు. ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరు రవిబాబు మాట్లాడుతూ సంఘసంస్కర్త, సామాజిక న్యాయం కోసం పోరాడిన యోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్రాం అని కొనియాడారు. జగ్జీవన్రాం వంటి గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని తెలిపారు. దళితుల సంక్షేమానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతగానో కృషి చేశారన్నారు.కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షులు దుంపా రమణమ్మ, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, మాజీ పీడీసీసీ బ్యాంకు చైర్మన్ వై.ఎం.ప్రసాద్రెడ్డి, జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ నాయకులు డి.క్రాంతికుమార్, పి.కోటేశ్వరరావు, ఎంపీపీ గాయం సావిత్రి, పేరం ప్రసన్న, రమణమ్మ, బడుగు ఇందిర, ఆసోది యలమందా రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ వెంకాయమ్మ వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా జగ్జీవన్రాం జయంతి వేడుకలు -
● ఉపాధ్యాయుల పోస్టుల భర్తీలో యాజమాన్యాల దోపిడీ ● పోస్టును బట్టి ముందే రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షల వరకూ వసూలు ● ఆన్లైన్ పరీక్ష వద్దంటూ కోర్టులకు ● నిలిచిపోయిన ప్రక్రియ ● జిల్లా వ్యాప్తంగా 140 ఎయిడెడ్ పాఠశాలలు ● 205 మంది మిగులు ఉపాధ్యాయులు ● జీరో ఎన్ర
ఒంగోలు సిటీ: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎయిడెడ్ పాఠశాలలు 140 ఉన్నాయి. వీటిల్లో 613 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అందులో సింగిల్ టీచర్ ఉన్న పాఠశాలలు 40 ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో 205 మంది మిగులు టీచర్లు ఉన్నారు. అయితే 21 ఎయిడెడ్ పాఠశాలల్లో 74 పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. గత ఏడాది డిసెంబరులో ఆయా పాఠశాలల్లో నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ ఇక్కడే తిరకాసు ఉంది. కేవలం పేపర్ ప్రకటనల్లో మాత్రమే పోస్టులు చూపించారు. లోలోపల మాత్రం ముందుగానే అభ్యర్థులను ఎంపిక చేసుకుని వారి నుంచి ఒక్కో అభ్యర్థి వద్ద రూ.15 నుంచి రూ.20 లక్షలు వసూలు చేశారని సమాచారం. ఆన్లైన్ వద్దంటూ కోర్టుకి.. ఆఫ్లైన్లో పరీక్ష నిర్వహిస్తే వారి ఇష్టానుసారంగా నచ్చిన వారికి పోస్టులు కట్టబెట్టే అవకాశం ఉంది. అదే ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహిస్తే కష్టంగా మారే అవకాశం ఉందని భావించిన ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు విడతల వారీగా కోర్టును ఆశ్రయించాయి. గతంలో 8 పాఠశాలలు, తాజాగా 13 పాఠశాలల యాజమాన్యాలు కోర్టుకెళ్లాయి. గిద్దలూరు సెయింట్ పాల్స్ ఎయిడెడ్ స్కూల్, హిందూ ఎయిడెడ్ (కొత్తపల్లి), చిత్తరంజన్ అరబిక్ పాఠశాల (కనిగిరి), వీసీఏ ఎయిడెడ్ ఉన్నత పాఠశాల (వెంకటరెడ్డి పల్లి), కేఎంఎయిడెడ్ ఉన్నత పాఠశాల (గుడిపాటి పల్లి), ఎబీఎం ఎయిడెడ్ హైస్కూల్ (ఒంగోలు), ముప్పవరం ఎయిడెడ్ ఉన్నత పాఠశాల (జె.పంగులూరు), ఎమ్మెస్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాల రామకృష్ణాపురం (చీరాల) తదితర పాఠశాలల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. అలాగే తాజా 13 ఎయిడెడ్ పాఠశాలలు కోర్టుకెళ్లాయి. ఎస్బీఎన్ఆర్ ఎయిడెడ్ పాఠశాల (కొమరోలు), సెయింట్ జాకబ్ ఎయిడెడ్ పాఠశాల (ముండ్లపాడు), హిందూ ఎయిడెడ్ పాఠశాల (గిద్దలూరు), శ్రీ శ్రీనివాస ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాల (రావిపాడు), శ్రీరంగరాజన్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాల (కంభం), ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాల (రాజుపాలెం), అంబేడ్కర్ ఎయిడెడ్ ఓరియంటల్ పాఠశాల (కనిగిరి), జీఎస్ఎస్టీ ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాల (కరేడు), లూథరన్ ఉన్నత పాఠశాల (తర్లుపాడు), ఏకే మెమోరియల్ రెసిడెన్సీ ఎయిడెడ్ ఉన్నత పాఠశాల (చెరుకూరు), ప్రకాశం ఎయిడెడ్ పాఠశాల (అద్దంకి), ఏబీఎం ఎయిడెడ్ పాఠశాల (బేస్తవారిపేట), నీలం జేమ్స్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాల (చీరాల) ఎయిడెడ్ పాఠశాలలు కూడా తమ పాఠశాలల్లోని 38 పోస్టుల భర్తీకి ఇటీవల కోర్టుకు వెళ్లాయి. మూతపడిన ఎయిడెడ్ పాఠశాలలకు నోటీసులు పిల్లలు లేక మూతపడిన ఎయిడెడ్ పాఠశాలలకు జిల్లా విద్యాశాఖాధికారులు నోటీసులు ఇస్తున్నారు. సింగరాయకొండ ఎస్వీ ఎయిడెడ్ స్కూల్, ఒంగోలులోని జగ్జీవన్రాం ఎయిడెడ్ యూపీ స్కూల్ 2021లో, దశరాజుపల్లి ఎయిడెడ్ పాఠశాలను 2015లో, ఒంగోలులోని సీతారామపురం ఎయిడెడ్ స్కూల్ను 2016లో, రాచవారిపాలెం ఎయిడెడ్ స్కూల్ను 2021లో, కనిగిరిలోని ఎబీఎం ఎయిడెడ్ స్కూల్ను 2021 లో మూసివేశారు. విచిత్రమేమంటే పిల్లలు లేక, ఉపాధ్యాయులు రిటైర్ అయ్యి ఇలా ఏదో ఒక కారణంతో మూతపడిన ఎయిడెడ్ పాఠశాలలకు జిల్లా విద్యాశాఖాధికారులు నోటీసులు ఇవ్వడంతో ఉపాధ్యాయులు అవాక్కవుతున్నారు. అలాగే ఎయిడెడ్ స్కూల్లో మిగులు ఉపాధ్యాయులు ఉండి, పిల్లలు లేని ఎయిడెడ్ స్కూల్స్కు నోటీసులు ఇవ్వకపోవడం గమనార్హం. ఆ పాఠశాలలకు నోటీసులెక్కడా..? టీచర్లు ఉండి జీరో ఎన్రోల్మెంట్ ఉన్న పాఠశాలలకు అధికారులు నోటీసులు ఇవ్వకపోవడం గమనార్హం. జిల్లాలో యర్రగొండపాలెంలోని డీఎంబీసీ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో 8 మంది ఉపాధ్యాయులు, మార్కాపురం శారదా ఎయిడెడ్ స్కూల్లో ఇద్దరు ఉపాధ్యాయులు, దొనకొండ ఇందిరాగాంధీ ఓరియంటల్ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు, మార్కాపురం ఎబీఎం హైస్కూల్లో ఐదుగురు, గిద్దలూరు వివేకానంద ఎయిడెడ్ హైస్కూల్లో ఐదుగురు, జీవీఎస్ ఎయిడెడ్ హైస్కూల్లో ఏడుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. సమావేశం హైస్కూల్లో ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు. వీటిల్లో జీరో ఎన్రోల్మెంట్ ఉన్నా అధికారులు పట్టించుకున్న దాఖలాల్లేవు. ఆదేశాలు అందిన వెంటనే ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తాం ఎయిడెడ్ యాజమాన్యాలు కోర్టుకు వెళ్లడంతో ఆన్లైన్ పరీక్ష వాయిదా వేశాం. విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తాం. – ఎ.కిరణ్కుమార్, డీఈఓ, ఒంగోలు -
మాజీ ఎంపీపీ ఆంజనేయరెడ్డికి బెయిల్
యర్రగొండపాలెం: త్రిపురాంతకం ఎంపీపీ పీఠాన్ని దక్కించుకునేందుకు టీడీపీ నాయకుల పన్నిన కుట్రకు బలై అక్రమ కేసులతో జైలుకెళ్లిన త్రిపురాంతకం మండల వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యుడు ఆళ్ల ఆంజనేయరెడ్డికి శనివారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మండల పరిషత్ ఉప ఎన్నికలో ఎంపీపీగా పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్న ఆయన్ను తప్పించేందుకు కూటమి నాయకుడి పావులు కదిపిన విషయం జిల్లా ప్రజలకు తెలిసిందే. ఆయన ఆదేశాలతో గత నెల 23న ఆంజనేయరెడ్డిపై పోలీసులు అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు బనాయించి అరెస్టు చేశారు. ఈ మేరకు కోర్టు ఆంజనేయరెడ్డిని రిమాండ్కు పంపింది. ఎటువంటి సాక్షాధారాలు లేకుండా పోలీసులు పెట్టిన అక్రమ కేసులను సవాల్ చేస్తూ ఆంజనేయరెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తి ఆ పిటిషన్ను పరిశీలించి ఆంజనేయరెడ్డికి బెయిల్ మంజూరు చేశారు. రైలు కిందపడి వ్యక్తి మృతి మార్కాపురం టౌన్: రైలు కిందపడి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం మార్కాపురం రైల్వేస్టేషన్ ఔటర్ సిగ్నల్ వద్ద జరిగినట్లు హెడ్ కానిస్టేబుల్ హరికృష్ణారెడ్డి తెలిపారు. మార్కాపురం మండలం పెద్దయాచవరం గ్రామానికి చెందిన వై.అల్లూరయ్య (55) శనివారం ఉదయం 10 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. మధ్యాహ్నం సమయంలో ఔటర్ సిగ్నల్ వద్ద పట్టాల పక్కన చనిపోయి కనిపించాడు. మతిస్థిమితం లేక పట్టాలు దాటుతూ ప్రమాదవశాత్తు రైలు ఢీకొని మృతి చెంది ఉంటాడని భావిస్తున్నట్లు హరికృష్ణారెడ్డి తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆడుకుంటూ..అనంత లోకాలకు! మార్కాపురం: గుర్తుతెలియని కారు ఢీకొని బాలుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మండలంలోని తిప్పాయిపాలెంలో శనివారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన కోడే వెంకటేశ్వర్లు, కుమారిల కుమారుడు కోడే శివకాశి (10) ఆడుకుంటూ రోడ్డు దాటుతుండగా మార్కాపురం నుంచి కంభం వైపునకు వెళ్తున్న గుర్తుతెలియని కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తల్లిదండ్రులు వెంటనే హుటాహుటిన శివకాశిని కంభం వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు కంభంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్నాడు. కుమారుని మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున రోదించారు. అప్పటి వరకూ ఇంట్లో తమతో మాట్లాడి ఆడుతూ..పాడుతూ.. నిముషాల వ్యవధిలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో కుటుంబంలో విషాదం నెలకొంది. రూరల్ ఎస్సై అంకమరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేషనల్ హైవేపై ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా కారును గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ప్రమాదవశాత్తూ జారిపడి ఏఎస్ఐ మృతి
ఒంగోలు టౌన్: జిల్లా పోలీసు శాఖలోని ఐటీ కోర్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ కె.వేణుగోపాలరావు ప్రమాదవశాత్తూ జారి పడి మరణించారు. శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో జారిపడి గాయాలవగా, వెంటనే స్థానిక ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున వేణుగోపాలరావు మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు అఖిల్, అలేఖ్య ఉన్నారు. వేణుగోపాలరావు భౌతికకాయాన్ని ఆయన స్వగ్రామమైన నాగులప్పలపాడులోని నివాసానికి తరలించారు. సమాచారం తెలిసిన వెంటనే ఎస్పీ ఏఆర్ దామోదర్ నాగులుప్పలపాడు వెళ్లి వేణుగోపాలరావు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. వేణుతో తనకు 17 ఏళ్ల అనుబంధం ఉందని, తాను ట్రైనీ డీఎస్పీగా జిల్లాకు వచ్చినప్పుడు ఐటీ కోర్ విభాగంలో సాంకేతికతను అందిపుచ్చుకుంటూ పలు కీలకమైన కేసుల్లో సేవలందించారని గుర్తు చేసుకున్నారు. అందుకే ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన్ను ఐటీ కోర్ విభాగంలో ఇన్చార్జిగా నియమించినట్లు తెలిపారు. ఎస్పీ వెంట ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్బాబు, డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఎస్బీ రాఘవేంద్ర, రూరల్ సీఐ శ్రీకాంత్బాబు, సింగరాయకొండ సీఐ హజరత్తయ్య, ఆర్ఐలు సీతారామిరెడ్డి, రమణారెడ్డి, నాగులుప్పలపాడు ఎస్ఐ శ్రీకాంత్, టంగుటూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
జగ్జీవన్రామ్ అడుగుజాడల్లో నడవాలి
ఒంగోలు వన్టౌన్: సామాజిక న్యాయం, స్వాతంత్య్రం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని సమరం సాగించిన రాజకీయ, సామాజిక విప్లవ యెధుడు, మహోన్నత వ్యక్తి బాబూ జగ్జీవన్ రామ్ అడుగుజాడల్లో నడవాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అన్నారు. డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకల సందర్భంగా శనివారం ఆయన విగ్రహానికి పూల మాలలు వేసిన అనంతరం మాట్లాడారు. ఆయన తన జీవితాన్ని సామాజిక న్యాయం, రైతుల సంక్షేమం, దేశ అభివృద్ధికి అంకితం చేశారన్నారు. అతి చిన్న వయస్సులోనే శాసన సభ్యులుగా ఎన్నికయ్యారని, 8 సార్లు పార్లమెంటు సభ్యులుగా కూడా పని చేశారన్నారు. కేంద్ర కార్మిక శాఖ, వ్యవసాయ శాఖ, రక్షణ శాఖ మంత్రిగా కూడా సేవలందించారన్నారు. మరణించే వరకూ దేశ సేవకు, సమాజ అభ్యున్నతి కోసం కృషి చేశారని చెప్పారు. కార్యక్రమంలో ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్, జేసీ ఆర్ గోపాల కృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేశు, నగర మేయర్ గంగాడ సుజాత, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ఎన్ లక్ష్మానాయక్, నీలం నాగేంద్రరావు, ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ, బిళ్లా చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. జగ్జీవన్రామ్కు ఎస్పీ నివాళులు ఒంగోలు టౌన్: బడుగు బలహీనవర్గాల హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాడిన యోధుడు బాబూ జగ్జీవన్రామ్ అని ఎస్పీ ఏఆర్ దామోదర్ కొనియాడారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో జగ్జీవన్రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఎస్పీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఉప ప్రధానిగా దేశానికి ఎనలేని సేవలను జగ్జీవన్రామ్ అందించారని తెలిపారు. సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతి, అణగారిన ప్రజలకు సమాన హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పారు. భారత రాజ్యాంగంలో సామాజిక న్యాయం అనే అంశాన్ని చేర్చడంలో కీలకపాత్ర పోషించారని తెలిపారు. కార్మికుల హక్కులు, వ్యవసాయ రంగం అభివృద్ధి, విద్యారంగంలో సంస్కరణలు చేపట్టి మంచి పరిపాలనా దక్షకుడిగా పేరొందారని చెప్పారు. దేశ ప్రజల చేత బాబూజీగా కొనియాడబడుతున్న జగ్జీవన్రామ్ ఆలోచనలకు అనుగుణంగా ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్బాబు, డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ఆర్ఐలు సీతారామిరెడ్డి, రమణారెడ్డి, ఏఆర్ ఎస్సైలు పాల్గొన్నారు. 400 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం ● ఇద్దరిపై బైండోవర్ కేసులు మార్కాపురం: మార్కాపురం ఎకై ్సజ్ సీఐ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో శనివారం పెద్దదోర్నాల మండలం వైచెర్లోపల్లి అటవీ ప్రాంతంలో దాడులు నిర్వహించి నాటుసారా తయారీకి సిద్ధంగా ఉన్న 400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి పిక్కిలి వెంకటేశ్వర్లును అరెస్టు చేశారు. మరో ఇద్దరు పాత నేరస్థులను దోర్నాల తహసీల్దార్ ముందు బైండోవర్ చేశారు. వీరికి బెల్లం సరఫరా చేసిన వ్యాపారులపై కూడా చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. దాడుల్లో ఎకై ్సజ్ ఎస్సై గోపాలకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా -
అతిథులు వచ్చేశాయ్.!
ప్రతి ఏటా వేసవిలో యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఆసియాలోని పలు దేశాల నుంచి జరుగుమల్లి వచ్చే ఎగ్రెట్ జాతి పక్షులు ప్రస్తుతం సందడి చేస్తున్నాయి. పెద్దసంఖ్యలో జంటలుగా వచ్చిన ఈ పక్షులు ఇక్కడి చెట్లపై ఎంతో ఆసక్తికరంగా గూళ్లు కట్టుకుని గుడ్లు పెట్టి పిల్లలను పొదుగుతున్నాయి. చుట్టుపక్కల చెరువులు, పొలాల్లో చేపలు, ధాన్యం గింజలు తెచ్చి పిల్లలకు అందించి పోషిస్తున్నాయి. పిల్లలకు రెక్కలొచ్చి ఎగిరే శక్తి రాగానే వాటిని తీసుకుని ఆయా దేశాలకు వెళ్లిపోతుంటాయి. మగ పక్షి ఎండు పుల్లలు తీసుకొచ్చి ఆడ పక్షికి అందిస్తుంటే.. ఆడ పక్షి గూడు కట్టి గుడ్లు పెట్టి పొదగడం, పిల్లలు పుట్టాక ఆహారం అందించడం వంటి దృశ్యాలు చూస్తూ పక్షి ప్రేమికులు మైమరిచిపోతున్నారు. ఈ పక్షులకు ఎటువంటి హానీ కలగకుండా గ్రామస్తులు కాపాడుతున్నారు. – సాక్షి, ఒంగోలు -
చిన్న కంభంలో గోవా మద్యం పట్టివేత
కంభం: మండలంలోని చిన్నకంభంలో అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ డి.బాలయ్య ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించి నక్కా ప్రసాద్ అనే వ్యక్తి నివాసంలో అక్రమంగా నిల్వ ఉన్న గోవా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నక్కా ప్రసాద్తో పాటు కర్నూల్కు చెందిన బెస్త హరికృష్ణ అనే మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఎకై ్సజ్ సీఐ కొండారెడ్డి మాట్లాడుతూ హరికృష్ణ స్వస్థలం కర్నూలు కాగా అతను గోవాలో పనిచేస్తుంటాడు. వీరిరువు కలిసి గోవా మద్యం ట్రైన్లో తెచ్చుకొని ఇక్కడ విక్రయించుకుంటాడు. అందిన సమాచారం మేరకు శనివారం ఉదయం నక్కా ప్రసాద్ ఇంట్లో తనిఖీలు నిర్వహించగా 53 ఫుల్ బాటిల్స్ గోవా మద్యం దొరికిందని, ఇద్దరిని అదుపులోకి తీసుకొని మద్యాన్ని స్వాధీనం చేసుకొని అతనికి చెందిన ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశామని చెప్పారు. ఎవరైనా ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం విక్రయించినా, బెల్టుషాపులు నిర్వహించినా, అక్రమంగా మద్యం తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎకై ్సజ్ అధికారులకు సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. జోరుగా గోవా మద్యం వ్యాపారం గిద్దలూరు నియోజకవర్గంలో గోవా మద్యం వ్యాపారం జోరుగా సాగుతోంది. గోవా నుంచి ఓ కంటైనర్లో మద్యం వస్తోందని, గిద్దలూరు, రాచర్ల, కంభం, మార్కాపురం మీదుగా నరసరావు పేటకు వెళ్తున్నట్లు సమాచారం. కంభం, బేస్తవారిపేట, అర్థవీడు మండలాలకు కేంద్రంగా చిన్నకంభం ఉన్నట్లు తెలిసింది. ఫంక్షన్లు, ఇతర కార్యక్రమాలకు ఈ మద్యాన్ని ఎక్కువగా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో రెండు సార్లు ఎకై ్సజ్ అధికారులు గోవా మద్యం స్వాధీనం చేసుకోగా అది చిన్న కంభం నుంచే సరఫరా అయినట్లు పోలీసులు గుర్తించారు. ఎకై ్సజ్ అధికారులు గోవా మద్యం దొరికినప్పుడు కేసులు పెట్టి కోర్టుకు పంపడం.. కొన్ని రోజులకే నిందితులు తిరిగి వచ్చేస్తుండటంతో అక్రమ మద్యం వ్యాపారానికి అడ్డుకట్ట పడటం లేదు. గోవా మద్యం అక్రమ రవాణాపై ఎకై ్సజ్ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 53 ఫుల్ బాటిళ్లు స్వాధీనం ఇద్దరిని అరెస్టు చేసిన ఎకై ్సజ్ పోలీసులు -
పోక్సో కేసు నమోదు
కొండపి: స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో పోక్సో కేసు నమోదైనట్లు కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ తెలిపారు. ఆ వివరాల ప్రకారం.. కొండపి మండలంలోని కే ఉప్పలపాడులో ఏడేళ్ల బాలికపై 50 ఏళ్ల వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. పచ్చాకు పనుల నిమిత్తం ముండ్లమూరు మండలం నుంచి కే ఉప్పలపాడు వచ్చిన కూలీలకు చెందిన బాలికకు చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి మచ్చిక చేసుకుని ఆ బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో అసభ్యకరంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లి కొండపి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా, విచారించి పోక్సో కేసు నమోదు చేశారు. రెండు నెలలుగా ఇలా జరుగుతుండగా, బాలిక భయపడి బయటకు చెప్పలేదని విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై రౌడీషీట్ కూడా ఓపెన్ చేశామని చెప్పారు. విచారణలో కొండపి సీఐ సోమశేఖర్, ఎస్సై ప్రేమ్కుమార్ పాల్గొన్నారు. -
ఓ వైపు వర్షాలు.. మరో వైపు ఎండలు
సాక్షి, అమరావతి/ఒంగోలు సబర్బన్: ఒకవైపు ఎండలు, మరోవైపు వర్షాలతో రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవగా, కోస్తాలోని పలుచోట్ల ఎండల తీవ్రత కొనసాగింది. అత్యధికంగా నంద్యాల జిల్లా మద్దూరు, ప్రకాశం జిల్లా రాళ్లపల్లిలో 111.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలసలో 39.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 39.2 డిగ్రీలు, శ్రీకాకుళం జిల్లా కొల్లివలసలో 39.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అకాల వర్షాలకు గుంటూరు, ప్రకాశంసహా పలు జిల్లాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గుంటూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున అకాల వర్షం కురిసింది. దీనివల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల్లో జొన్న రైతులకు కొంత మేర నష్టం వాటిల్లింది. మంగళగిరి నియోజకవర్గం వ్యాప్తంగా 150 హెక్టార్లలో పసుపు పండించారు. అకాల వర్షం కురియడంతో నీళ్లు నిలబడకపోయినా పసుపు తడిసిపోయిందని, తడవడం వల్ల నల్లమచ్చలు, బూజు వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రకాశం జిల్లాలో పలుచోట్ల గురువారం రాత్రి భారీ వర్షం పడింది. కంభం, బేస్తవారిపేట, అర్థవీడు, కొమరోలు మండలాలు, యర్రగొండపాలెం మండలంలో ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షానికి వందల ఎకరాల్లో అరటి, బొప్పాయి, టమోటా పంటలు దెబ్బతిన్నాయి. -
చేతికొచ్చిన పంట నేలపాలు
ఒంగోలు సబర్బన్: జిల్లాలో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షాలకు వివిధ రకాల పంటలు 215 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. పశ్చిమ ప్రాంతంలో గురువారం సాధారణ స్థాయి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది. ప్రధానంగా మూడు మండలాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనాలు రూపొందించారు. అందులో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని పంటలు 194 హెక్టార్లు కాగా, ఉద్యాన శాఖ ఆధ్వర్యంలోని పంటలు 21 హెక్టార్లు ఉన్నాయి. జిల్లాలో అత్యధికంగా మొక్కజొన్న 178.40 హెక్టార్లలో దెబ్బతింది. అలసంద 10 హెక్టార్లలో, వరి 4.04 హెక్టార్లలో, మినుము ఒక హెక్టారులో, అరటి 11 హెక్టార్లు కాగా, బొప్పాయి 8 హెక్టార్లలో, కూరగాయలు 2 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు అధికారులు అంచనాలు రూపొందించారు. వాస్తవానికి పంట నష్టం ఇంకా ఎక్కువగానే ఉంది. సీఎస్పురం, బేస్తవారిపేట, వెలిగండ్ల, పుల్లలచెరువు, కొమరోలు, యర్రగొండపాలెం మండలాల్లోని మొత్తం 262 మంది రైతులు తమ పంటలను నష్టపోయినట్లు అధికారులు తెలిపారు. 35.8 సెంటీ మీటర్ల వర్షం కురిసింది జిల్లాలో గురువారం పలు మండలాల్లో 35.8 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా యర్రగొండపాలెంలో 6.6 సెం.మీ, పుల్లలచెరువులో 4.6 సెం.మీ వర్షం కురిసింది. కొమరోలులో 2.6, త్రిపురాంతకంలో 2.4, బేస్తవారిపేటలో 2.4 కురవగా 1.7 నుంచి 1.1 సెంటీ మీటర్లు దోర్నాల, దొనకొండ, అర్థవీడు, కొనకనమిట్ల, పెద్దారవీడు, పొదిలి, దర్శి, వెలిగండ్ల మండలాల్లో కురిసింది. కురిచేడు, హనుమంతునిపాడు, గిద్దలూరు, కనిగిరి, తర్లుపాడు, రాచర్ల, మార్కాపురం, కంభం, పామూరు మండలాల్లో చిరుజల్లులు మొదలుకొని ఒక మోస్తరు వర్షం కురిసింది. మిగతా 16 మండలాల్లో వర్షం లేదు. అరటి రైతుల ఆక్రందన కంభం: కంభం మండలంలో గురువారం సాయంత్రం, అర్ధరాత్రి ఓ మోస్తారు వర్షం కురిసినప్పటికీ పెనుగాలులు తీవ్రంగా వీచడంతో కంభం చెరువు ఆయకట్టు కింద సాగవుతున్న పలు అరటి తోటలు నేలకొరిగాయి. కంభం, పోరుమామిళ్లపల్లి, చింతలపాలెం, సోమవారిపేట, హజరత్గూడెం, కాగితాల గూడెం పరిధిలో సుమారు 250–300 ఎకరాల్లో అరటి తోటలు సాగులో ఉన్నాయి. కొందరి అరటి తోటలు కోత దశలో ఉండగా, మరికొందరి తోటలు వివిధ దశల్లో ఉన్నాయి. వీచిన పెనుగాలులకు చిన్నకంభం, పోరుమామిళ్లపల్లి పరిధిలో కోత దశలో ఉన్న సుమారు 20 ఎకరాల్లో అరటి తోటలు గెలలతో సహా నేలకొరిగిపోయాయి. ఇంకా కొందరు రైతులకు చెందిన తోటల్లో ఎకరాకు 100–150 చెట్ల వరకు నేల కొరిగిపోవడంతో రూ.40 – రూ.50 లక్షల పంట నష్టం జరిగిందని రైతులు చెబుతున్నారు. ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు పెట్టుబడులు పెట్టి సాగు చేసుకున్న అరటి తోటలు ఇలా ఒక్కసారిగా నేలకొరిగి పోవడంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. కొమరోలులోనూ.. కొమరోలు: మండలంలో గురువారం సాయంత్రం వీచిన భారీ ఈదురు గాలులు, వర్షానికి 30 ఎకరాల్లో అరటిపంట నష్టం వాటిల్లినట్లుగా రైతులు తెలిపారు. బ్రాహ్మణపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో భారీ ఈదురు గాలులు వీయడంతో ఆ ప్రాంతంలోనే అరటి పంట పూర్తిగా నేలమట్టమైంది. 10 రోజుల్లో అరటి గెలలు కోయడానికి సిద్ధమవుతున్న రైతులు అవి నేలమట్టం కావడంతో లబోదిబోమంటూ కన్నీటి పర్యంతమయ్యారు. పిడుగు పాటుకు 3 గేదెలు మృతి ఈదురు గాలులు, భారీ వర్షం, పిడుగులు పడడంతో కొమరోలు మండలంలో 3 గేదెలు మృతిచెందాయి. మండలంలోని ఇడమకల్లు గ్రామంలో మల్లెపోగు యాకోబుకు చెందిన రెండు గేదెలను పాక సమీపంలో కట్టివేసి ఉంచగా పిడుగుపాటుకు రెండు గేదెలు అక్కడికక్కడే మృతిచెందాయి. వాటి విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. అలాగే మదవపల్లె గ్రామంలో పీరయ్యకు చెందిన ఒక గేదె పిడుగుపాటుకు మృతిచెందింది. 446 ఎకరాల్లో మొక్కజొన్న పంట నష్టం బేస్తవారిపేట: అకాల వర్షాలకు 446 ఎకరాల్లోని మొక్కజొన్న పంట పూర్తిగా దెబ్బతిన్నట్లు వ్యవసాయాధికారిణి జక్కం మెర్సీ తెలిపారు. మండలంలోని బసినేపల్లె, ఎంపీ చెరువు, పీవీ పురం, పూసలపాడు, మోక్షగుండం గ్రామాల్లో మొక్కజొన్న పంట గాలులకు నేలకొరిగిందన్నారు. గ్రామాల్లో పర్యటించి ప్రాథమిక నివేదికలను ఉన్నతాధికారులకు పంపుతున్నట్లు తెలిపారు. మండలంలోని జెన్నివారిపల్లె, గలిజేరుగుళ్ల, అక్కపల్లె, గంటాపురం గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్శాఖ అధికారులు నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి గ్రామాలకు విద్యుత్ సరఫరా జరిగే విధంగా చర్యలు తీసుకున్నారు. అకాల వర్షాలకు ఉద్యాన పంటలకు నష్టం యర్రగొండపాలెం: అకాల వర్షాలకు ఉద్యాన పంటలకు భారీ నష్టం వాటిల్లింది. గురువారం సాయంత్రం కురిసిన ఈ వర్షం వలన 35 ఎకరాల్లో వేసిన బొప్పాయి, అరటి, టమోటా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఉద్యాన శాఖాధికారి ఆదిరెడ్డి తెలిపారు. యర్రగొండపాలెం మండలంలోని బోయలపల్లి, పందివానిపల్లె, పుల్లలచెరువు మండలంలోని రాచకొండ గ్రామాల్లో 12 మంది రైతులు 28 ఎకరాల్లో వేసిన బొప్పాయి పంట గాలి, వర్షానికి పూర్తిగా దెబ్బతినడంతో వారికి దాదాపు రూ.28 లక్షల వరకు నష్టం వాటిల్లి ఉంటుందని తెలిపారు. ఆయా గ్రామాల్లో 4 ఎకరాల్లో వేసిన టమోటాకు రూ.2.80 లక్షలు, 3 ఎకరాల్లో వేసిన అరటి పంటకు రూ.6.75 లక్షల వరకు నష్టపోయి ఉంటారన్నారు. జిల్లాలో అకాల వర్షాలకు 215 హెక్టార్లలో దెబ్బతిన్న పంటలు మూడు మండలాల్లోని 262 మంది రైతులకు నష్టం పెనుగాలులకు నేలకొరిగిన అరటి, బొప్పాయి తోటలు పిడుగుపాటుకు మూడు గేదెల మృతి నష్టపరిహారం అందించాలంటున్న రైతులుమరో పది రోజుల్లో పంట చేతికి వస్తుందనే ఆనందంతో ఉన్న రైతులకు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆనందంగా ఉన్న రైతుల కుటుంబాల్లో ప్రకృతి ప్రకోపం కన్నీరు మిగిల్చింది. ఆరుగాలం శ్రమించి పండించుకున్న పంటలు ఒక్క గాలివానకు నేలకొరిగి పోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. జిల్లాలో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షం, ఈదురు గాలులకు అరటి, బొప్పాయి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వందల ఎకరాల్లో పంట నష్టపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు.కాపుపై ఉన్న బొప్పాయి పంట నష్టపోయా రెండు ఎకరాల్లో బొప్పాయి పండిస్తున్నాను. మంచి కాపుపై ఉన్న సమయంలో అకాల వర్షానికి పంట పూర్తిగా దెబ్బతింది. దీనివలన రూ.1.80 లక్షల వరకు నష్టపోయాను. – టి.నాగయ్య, కొమరోలు అరటి గెలలతో సహా చెట్లు నేలకొరిగాయి రెండున్నర ఎకరాల్లో అరటి తోట వేశాను. చెట్లన్నీ గెలలు కాసి కోతకు వచ్చి ఉన్నాయి. మార్కెట్లో ధర కూడా ఉండటంతో పెట్టుబడులు వస్తాయని నమ్మకంగా ఉండగా గురువారం రాత్రి వీచిన గాలులకు గెలలతో సహా చెట్లు నేలకొరిగిపోయాయి. అధికారులు పరిశీలించి నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలి. – షేక్ ఇబ్రహీం, అరటి రైతు, కంభం ప్రభుత్వం ఆదుకోవాలి చిన్నకంభం ఇలాఖాలో మూడు ఎకరాల్లో అరటి తోట వేశాను. ఇప్పుడే గెలలు కోతకు వచ్చాయి. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పెంచుకున్న అరటి తోటలు ఆకస్మికంగా వీచిన గాలులకు ఇలా నేలకొరిగిపోవడంతో తీవ్రంగా నష్టం వాటిల్లింది. పంటనష్టం జరిగిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. – మజీద్, అరటి రైతు -
సమస్యలను పరిష్కరించేలా ఆలోచించాలి
ఒంగోలు సిటీ: వ్యవస్థాపక మనస్తత్వం పెంపొందించుకోవడం, సమాజంలో ఉండే సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేలా ఆలోచించడం వలన పారిశ్రామికవేత్తగా ఎదగవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ.కిరణ్ కుమార్ అన్నారు. ఒంగోలు పట్టణంలోని పీవీఆర్ మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఎంటర్ ప్రెన్యూరియల్ మైండ్సెట్ డెవలప్మెంట్ జిల్లా స్థాయి ప్రాజెక్టు ప్రదర్శనకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఈఓ కిరణ్కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు సరైన నైపుణ్యాలు పెంపొందించుకుంటేనే ఉపాధి కల్పించే స్థాయికి చేరవచ్చన్నారు. పాఠశాల విద్యాశాఖ, ఉద్యం స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 10 మంది విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. అందులో నుంచి రెండు ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. బేస్తవారిపేట బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్ట్కు ప్రథమస్థానం, జంగంగుంట్ల జెడ్పీ పాఠశాల ప్రాజెక్టు రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపికై నట్లు డీఈఓ తెలిపారు. ఈ విద్యార్థులు విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు హాజరు కావాలన్నారు. డీఈఓ కిరణ్కుమార్ మెమొంటోలు, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. కార్యక్రమంలో డీసీఈబీ కార్యదర్శి మర్రిబోయిన శ్రీను, ఏఎంఓ రమేష్, జిల్లా సైన్స్ అధికారి టీ రమేష్, పాఠశాల హెచ్ఎం జిల్లా జ్యూరీ మెంబర్స్ బి.తిరుపతయ్య, కె.కె.ఎస్ రవికాంత్, ఈఎండీపీ కోఆర్డినేటర్లు రమణకుమారి, నీలిమ పాల్గొన్నారు. -
నేతలకు కిక్కిస్తూ!
ఊళ్లు ఊగిపోతూ..ఒంగోలు టౌన్: జిల్లాలో 188 మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అందులో భాగంగా తొలి విడతగా 171, ఆ తరువాత గీత కార్మికులకు మరో 10 శాతం అంటే 17 దుకాణాలను కేటాయించింది. వీటన్నింటినీ అధికార పార్టీ నేతలు సిండికేట్గా ఏర్పాటై వీటిని దక్కించుకున్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని మద్యం వ్యాపారులు రెచ్చిపోతున్నారు. అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తుడడంతో వీటికి అనుబంధంగా 2 వేలకుపైగా బెల్టు షాపులు వెలిశాయి. ఊరూరుకి మద్యం సరఫరా చేస్తూ ఇంటింటికీ మద్యం డెలివరీ చేస్తున్నారు. ఇప్పుడు జిల్లాలో మంచినీరు దొరకని గ్రామాలు అనేకం ఉన్నాయి. కానీ మద్యం లభించని గ్రామం ఒక్కటంటే ఒక్కటి కూడా ఉండదంటే అతిశయోక్తి కాదు. ఒక్క ఫోన్ కొడితే చాలు క్షణాల్లో మద్యం ఇంటి ముందు ప్రత్యక్షమవుతోంది. ఐదున్నర నెలల్లోనే రూ.1100 కోట్ల అమ్మకాలు గత ఏడాది అక్టోబర్ 16వ తేది నుంచి ప్రైవేటు దుకాణాలను తెరచి మద్యం విక్రయాలను ప్రారంభించారు. అంతకుముందు ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉన్నప్పుడు జరిగిన వ్యాపారం కంటే ఇప్పుడు 20 నుంచి 30 శాతానికి పైగా మద్యం విక్రయాలు పెరిగాయి. జిల్లాలో ఒంగోలు, మార్కాపురంలలో లిక్కర్ డిపో ఉన్నాయి. ఒంగోలు డిపో పరిధిలో ఒంగోలు, సింగరాయకొండ, చీరాల, పర్చూరు, అద్దంకి, కందుకూరు సర్కిళ్లు ఉన్నాయి. మార్కాపురం డిపో పరిధిలో మార్కాపురం, యర్రగొండపాలెం, పొదిలి, దర్శి, గిద్దలూరు సర్కిళ్లు ఉన్నాయి. ఒంగోలు డిపో పరిధిలో గత ఏడాది అక్టోబర్ 16వ తేదీ నుంచి మార్చి నెలాఖరు వరకూ మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్ల ద్వారా లిక్కర్, బీర్ల అమ్మకాలు దాదాపు రూ.550 కోట్లు జరిగాయి. మార్కాపురం డిపో పరిధిలో సైతం రూ.550 కోట్ల అమ్మకాలు జరిగాయని అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద ఐదున్నర నెలల్లో సుమారు రూ.1100 కోట్ల విక్రయాలు జరిగాయి. 2 వేలకు పైగా బెల్టు షాపులు: జిల్లాలో 188 మద్యం దుకాణాలు ఉండగా 2 వేలకు పైగా బెల్టుషాపులు ఉన్నాయి. జిల్లాలోని ప్రతి పల్లెల్లోనూ మద్యం ఏరులై పారుతోంది. ఒంగోలు నగరంలోని అన్నీ శివారు ప్రాంతాల్లో బెల్టుషాపులు నిర్వహిస్తున్నారు. నగరంలోని ఎఫ్సీఐ గోడౌన్ ఎదురుగా, కొప్పోలు, దశరాజుపల్లి, కరవది, పేర్నమిట్ట, ఉలిచి, వెంగముక్కలపాలెం తదితర గ్రామాల్లో బెల్టుషాపులు నిర్వహిస్తున్నారు. ఒక్కో గ్రామంలో రెండు మూడు బెల్టు షాపులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఒంగోలు, ఎస్ఎన్పాడు, మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి, కొండపి నియోజకవర్గాల పరిధిలోని అన్నీ గ్రామాల్లో బెల్టుషాపులు నడుస్తున్నాయి. జిల్లాలో మద్యం విక్రయాలు అధికార తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, వారి బినామీల పేర్లతో నిర్వహిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎకై ్సజ్ అధికారులు బెల్టు షాపుల వైపు కన్నెత్తి చూడడం లేదు. పక్కా సమాచారం ఉన్నా పట్టించుకోవడం లేదు. జిల్లాలో బెల్టు షాపులు నిర్వహిస్తున్న తెలుగుదేశం నేతలు సైతం అధికారులను లెక్క చేయడం లేదు. ఎవరైనా ప్రశ్నిస్తే మా ప్రభుత్వం అధికారంలో ఉంది. మమ్మల్నెవరు ఆపేదంటూ ఎదురు తిరుగుతున్నారు. మొబైల్ ఫోన్ల ద్వారా అమ్మకాలు... మొబైల్ ఫోన్లో బుక్ చేస్తే చాలు ఇంటికే మద్యం డెలివరీ చేస్తున్నట్లు సమాచారం. జిల్లాలోని పశ్చిమ ప్రకాశంలో ఒక పట్టణంలో ఆటో ద్వారా ఇంటింటికీ మద్యం సరఫరా చేస్తున్నట్లు సమాచారం. జిల్లాలో పట్టణ ప్రాంతాల్లో మాత్రమే మద్యం దుకాణలు ఉండగా పల్లెల్లో బెల్టు షాపులు ఉన్నాయి. మద్యం దుకాణాల కంటే బెల్టు షాపులే ఎక్కువగా ఉండడంతో పచ్చని పల్లెలు నిషాతో తూగుతున్నాయి. పల్లెలు, పట్టణాల తేడా లేకుండా యువకులు, రైతు కూలీలు, రోజువారి కూలీలు నిత్యం మందు తాగి పనులకు వెళ్లకుండా తిరుగుతున్నారని, దాంతో సామాన్య ప్రజల కుటుంబాలు ఆకలితో అల్లాడుతున్నాయని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు కుటుంబాన్ని పోషించిన వ్యక్తి నేడు మందుకు అలవాటు పడిపోయి తిరుగుతుంటే పిల్లాపాపలు చదువు మానుకొని పనులకు వెళుతున్నారని వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం మీద మహిళలు మండిపడుతున్నారు. ఊరూరా బెల్టు దుకాణాలు.. మోటారు సైకిళ్లు, ఆటోల్లో ఇంటింటికీ మద్యం మంచినీరు దొరకని గ్రామాల్లో సైతం కావాల్సినంత మందు ప్రభుత్వ పాలసీతో భారీగా పెరిగిన మందుబాబులు ఒంగోలు, మార్కాపురం డిపోల పరిధిలో రూ.1100 కోట్ల అమ్మకాలు అధికారులకు నెలనెలా మామూళ్లు ఇవ్వాల్సిందే.. మద్యాన్ని ఆదాయ వనరుగా చూడటం సిగ్గుచేటు మద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వనరుగా భావించడం సిగ్గుచేటు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.30 వేల కోట్ల అమ్మకాలు జరగడం పరిస్థితిని తెలుపుతోంది. మద్యాన్ని నియంత్రించి నిరుపేద సామాన్యుల కుటుంబాలకు అండగా నిలబడాల్సిన ప్రభుత్వమే మద్యం వ్యాపారాన్ని ప్రోత్సహించడం బాధాకరం. మహిళలపై దాడులకు, అత్యాచారాలకు కారణమవుతున్న మద్యాన్ని నిషేధించాలి. – కంకణాల రమాదేవి, ఐద్వా జిల్లా కార్యదర్శి. విచ్చలవిడి బెల్ట్షాపులపై చర్యలేవీ.. మద్యం షాపుల్లో వసూలు చేస్తున్న అధిక ధరలను, గ్రామాల్లో బెల్టు షాపులను పూర్తిగా అరికడతామని సీఎం చంద్రబాబు తెలిపారు. బెల్టుషాపు నిర్వహిస్తూ పట్టుబడితే రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తామని ప్రగల్భాలు పలికినా క్షేత్ర స్థాయిలో అవేవీ అమలు కావడం లేదు. ప్రతి లైసెన్సు షాపు నుంచి నెలనెలా వచ్చే మామూళ్లను నొక్కేస్తూ ఎకై ్సజ్ అధికారులు పట్టీ పట్లనట్లు ఉండటంతో గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టు షాపులు వెలుస్తున్నాయి. గత ప్రభుత్వంలో మద్యం షాపులు ఊరికి చివరిలో మాత్రమే ఉండేవి. నేడు ఆ పరిస్థితి లేదు. – పల్లపోలు బాలకోటిరెడ్డి, మాజీ సర్పంచ్, శింగరబొట్లపాలెం ఎకై ్సజ్ అధికారులు కన్నెత్తి చూడటం లేదు మా పంచాయతీలోని బసిరెడ్డిపల్లె గ్రామంలో చీప్లిక్కర్ అధిక ధరలకు అమ్ముతున్నారు. మందుబాబులు విచ్చలవిడిగా తాగి రాత్రి, పగలు తేడా లేకుండా బజారుల్లో తిరుగుతున్నారు. ఎకై ్సజ్ అధికారులు మాత్రం ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. – చీరాల ఇజ్రాయేలు, కొచ్చర్లకోట, దొనకొండ మండలం -
శ్రీశైలం ఘాట్లో త్రుటిలో తప్పిన ప్రమాదం
పెద్దదోర్నాల: వేగంగా వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగిన సంఘటన శుక్రవారం శ్రీశైలం ఘాట్ రోడ్డులోని చింతల గిరిజనగూడెం సమీపంలో చోటు చేసుకుంది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించటంతో వాహనంలో ప్రయాణిస్తున్న వారు ఎటువంటి ప్రమాదానికి గురి కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. అందిన సమాచారం మేరకు.. గుంటూరుకు చెందిన రవీంద్రకుమార్ తన మిత్రుడైన కొమ్మూరి శ్రీనుకు చెందిన రెనాల్ట్ కారును తీసుకుని కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం కోసం శ్రీశైలానికి బయలు దేరాడు. ఈ క్రమంలో చింతల గిరిజన గూడెం దాటి ఘాట్లో ప్రయాణిస్తున్న సమయంలో కారు ఇంజన్ భాగంలో ఒక్కసారిగా దట్టమైన పొగలతో మంటలు చెలరేగాయి. ఈ సమయంలో డ్రైవర్ చాకచక్యంగా వేగాన్ని నియంత్రించి కారును రోడ్డుకు ఓ పక్కకు నిలిపి వేయటంతో ప్రయాణికులు సురక్షితంగా బయట పడ్డారు. ఈ సమయంలో డ్రైవర్ కంగారుకు గురైతే పక్కనే ఉన్న భారీ లోయలోకి కారు దూసుకు వెళ్లేదని, త్రుటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నామని కారులో ప్రయాణిస్తున్న రవీంద్రకుమార్ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఎస్సై మహేష్ సిబ్బందితో కలిసి హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్కు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. ఫైర్ అధికారులు సిబ్బందిలో కలిసి అగ్నిమాపక వాహనంతో సంఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు. ఇంజన్ భాగంలోని బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ తోనే మంటలు చెలరేగి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. కారులో మంటలు వ్యాపించిన సమయంలో పెద్ద పెద్ద శబ్దాలు రావటంతో శ్రీశైలం ఘాట్లో ప్రయాణించే వాహనదారులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. వేగంగా వెళ్తున్న కారులో చెలరేగిన మంటలు డ్రైవర్ సమయ స్ఫూర్తితో ప్రయాణికులు సురక్షితం -
బాలికలకు కేజీబీవీల పిలుపు
మార్కాపురం/పామూరు: గ్రామీణ ప్రాంతాలకు చెంది బడిఈడు పిల్లలు, బడి మానేసిన బాలికలకు విద్యనందించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కస్తూర్బా గాంధీ గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేశాయి. జిల్లాలో బాలికల అక్షరాస్యతా శాతం తక్కువగా ఉన్న మండలాలను గుర్తించిన ప్రభుత్వం 28 కస్తూర్బా పాఠశాలలు ఏర్పాటు చేసింది. వాటిలో 6వ తరగతి ప్రవేశానికి, ఇంటర్ మొదటి సంవత్సరంతో పాటు 7, 8, 9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లు భర్తీ చేసేందుకు మార్చి 22వ తేదీ నుంచి ఏప్రిల్ 11 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఒక్కొక్క పాఠశాలలో 40 సీట్లు ఉన్నాయి. 2025–26 విద్యాసంవత్సరానికి 6వ తరగతిలో 1120 మంది బాలికల ప్రవేశానికి నోటిఫికేషన్ జారీచేసింది. బడి మానేసిన, బడి ఈడు పిల్లలను ఉపాధ్యాయులు సర్వే నిర్వహించి గుర్తిస్తుంటారు. వారిలో బాలికలను సమీప గురుకుల విద్యాలయాల్లో చేర్పించాలని ప్రత్యేక అధికారులకు సర్వే నివేదికలు అందాయి. పాఠశాల ప్రత్యేకతలు.. కస్తూరిబాగాంధీ గురుకుల విద్యాలయాల్లో బాలికలకు ఉచిత విద్యతో పాటు, ఉచిత వసతి అందిస్తారు. పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, దుస్తులు, ట్రంకు పెట్టెలు ఉచితంగా అందజేస్తారు. అలాగే కాస్మోటిక్ కిట్లను అందజేస్తారు. రోజూ ఉదయం పాలతో పాటు టిఫిన్, సాయంత్రం చిరుతిళ్లు, గురు, శనివారాల్లో స్వీట్స్, శని, ఆదివారాలు మినహా మిగతా రోజుల్లో కోడిగుడ్డుతో తయారు చేసిన కర్రీ ఇస్తారు. వారంలో 7 రోజులు 7 రకాల మెనూలను విద్యార్థులకు అందిస్తున్నారు. ప్రత్యేక అధికారి నుంచి టీచర్లు, వాచ్మెన్, స్వీపర్ వరకు అందరూ మహిళలే ఉంటారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా బోధన సాగుతుంది. జిల్లాలో ఉన్న ఇంటర్మీడియెట్కు సంబంధించి కేజీబీవీల్లో ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ గ్రూపులు ఉన్నాయి. మూడు కళాశాలల్లో ఒకేషనల్ కోర్సులు ఉన్నాయి. విద్యార్థులకు నైట్ స్టడీ అవర్స్తోపాటు కెరీర్ గైడెన్స్పై కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం 6వ తరగతిలో ప్రవేశం పొందితే పదో తరగతితో పాటు ఇంటర్మీడియెట్ వరకు చదువుకోవచ్చు. ఒకవేళ ఇంటర్లో చేరితే రెండేళ్ల పాటు చదువుకోవచ్చు. ప్రాధాన్యత ప్రకారం ఎంపిక.. కస్తూరిబాగాంధీ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు మొదట బడిమానేసిన పిల్లలు, తల్లిదండ్రులు లేని చిన్నారులు, ఎస్సీ, ఎస్టీ వారికి ప్రాధాన్యత ఇస్తారు. పాఠశాలలో చేరేందుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటారు. అర్హతలు ఇలా.... కేజీబీవీల్లో ప్రవేశాల్లో అనాథలు, బడిబయట పిల్లలు, డ్రాపౌట్స్ (బడిమానేసినవారు) పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బీపీఎల్ బాలికలు మాత్రమే తొలి ప్రాధాన్యతగా సీట్లు కేటాయిస్తారు. ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను మాత్రమే అడ్మిషన్ కోసం పరిగణిస్తారు. విద్యార్థినులు తమ దరఖాస్తును వెబ్సైట్ ‘ఏపీకేజీబీవీ.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఐఎన్’ లో పొంది దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికై న బాలికలకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం అందుతుంది. ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ జిల్లాలో 28 కస్తూర్బా పాఠశాలలు 6వ తరగతిలో 1120 సీట్లకు, 11వ తరగతిలో 1120 సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం 7, 8, 9, 10, 12 తరగతుల్లో మిగులు సీట్ల భర్తీ ఏప్రిల్ 11వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులకు అవకాశం గ్రూపుల వారీగా ఇంటర్మీడియెట్ కోర్సులు నిర్వహిస్తున్న కేజీబీవీలుఎంపీసీ : అర్థవీడు, బీ.వీ.పేట, దర్శి, దొనకొండ, కనిగిరి (ఎంఐఎన్), కొనకనమిట్ల, కొమరోలు, ముండ్లమూరు, పెద్దారవీడు, పెద్దదోర్నాల, పామూరు, పొన్నలూరు, రాచర్ల, త్రిపురాంతకం, వెలిగండ్ల, జరుగుమల్లి. బైపీసీ: సీఎస్పురం, కొత్తపట్నం, మర్రిపూడి, పీ.సీ.పల్లి, పుల్లలచెరువు, తాళ్లూరు, తర్లుపాడు, వై.పాలెం ఎంఈసీ : పొదిలి (ఎంఐఎన్) సీఎస్ఈ : హెచ్ఎంపాడు ఏఅండ్టీ : మార్కాపురం ఎంఎల్టీ : కురిచేడు -
ఏకేయూ పెన్ కాక్ సిలాట్ పురుషుల జట్టు ఎంపిక
ఒంగోలు సిటీ: నార్త్ బెంగళూరు యూనివర్శిటీలో ఈ నెలలో జరిగే ఆలిండియా ఇంటర్ యూనివర్శిటీ పెన్ కాక్ సిలాట్ పోటీల్లో పాల్గొనేందుకు ఆంధ్రకేసరి యూనివర్శిటీ పురుషుల జట్టును స్థానిక యూనివర్శిటీ ప్రాంగణంలో శుక్రవారం ఎంపిక చేశారు. జట్టులో కే ప్రేమ్కుమార్, కే సాయిరామ్, షేక్ అక్రం, ఎం.శివయ్య అనే నలుగురు క్రీడాకారులు స్థానం సంపాదించారు. పెన్ కాక్ సిలాట్ జట్టు ఎంపిక కార్యక్రమంలో ఆంధ్రకేసరి యూనివర్శిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఐ.దేవీవరప్రసాద్, ఏకేయూ క్రీడాకారుల సెలక్షన్ కమిటీ సభ్యులు జి.సాయిసురేష్ పాల్గొన్నారు. ఎంపికైన క్రీడాకారులను ఏకేయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ డి.వి.ఆర్.మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు తదితరులు అభినందించారు. పోటీల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య మార్కాపురం: ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలోని కళాశాల రోడ్డులో నూతనంగా ప్రారంభిస్తున్న ఓ షోరూమ్లో చోటుచేసుకుంది. టూటౌన్ ఎస్సై రాజమోహన్రావు కథనం ప్రకారం.. మార్కాపురం పట్టణంలోని నాగులపుట్ట వీధిలో నివాసముండే గుర్రాల మహేష్(25) నూతనంగా ప్రారంభించనున్న వస్త్ర షోరూమ్లో చేరాడు. గురువారం రాత్రి పనిచేసిన అనంతరం సిబ్బంది ఇంటికి వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం సిబ్బంది వచ్చి చూడగా మహేష్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. మైనింగ్ రంగంలో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం ● మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మద్దిపాడు: మైనింగ్ రంగంలో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుడదామని మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్లో ఉన్న ఎస్ఈజెడ్ లో మంత్రి శుక్రవారం మధ్యాహ్నం పర్యటించారు. గ్రానైట్ శ్లాబుల కటింగ్, క్వార్ట్జ్ నుంచి బిల్డింగ్ మెటీరియల్ తయారీ యూనిట్లను స్థానిక ఎమ్మెల్యే బీఎన్.విజయ్ కుమార్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 1500కి పైగా మైనింగ్ సంస్థలు ఉన్నాయని, సెజ్ లో 100కి పైగా ప్లాంట్స్ ఏర్పాటు చేయడం ఇక్కడి అవకాశాలకు నిదర్శనమన్నారు. త్వరలోనే నూతన పాలసీతో మైనింగ్ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ప్రాసెసింగ్ రంగంలో ఉద్యోగ అవకాశాలు, ఎగుమతితో ఆదాయం పెంచుకునే మార్గాలను మెరుగుపరుచుకుందామన్నారు. ఈ సందర్భంగా సెస్ తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని గ్రానైట్ ఫ్యాక్టరీల యజమానులు మంత్రికి వినతిపత్రం సమర్పించారు. గ్రోత్ సెంటర్ గ్రానైట్ అసోసియేషన్ అధ్యక్షుడు రత్నాకర్, ప్రకాశం జిల్లా గ్రానైట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఆళ్ల రవి, రాజేంద్ర సంత్వాల్, మహేష్, కె.రామ్మోహన్రావు, శివరాం, ఉదయ్, మద్దిపాడు టీడీపీ అధ్యక్షుడు జయంత్ బాబు పాల్గొన్నారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
పెద్దదోర్నాల/పెద్దారవీడు: యర్రగొండపాలెం నియోజకవర్గంలోని వేర్వేరు ప్రాంతాల్లో గురు, శుక్రవారాల్లో సంభవించిన మూడు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. పెద్ద దోర్నాల మండలంలోని గంటవానిపల్లె సమీపంలో కర్నూలు–గుంటూరు ప్రధాన రహదారిపై బైక్ను శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వై.చర్లోపల్లికి చెందిన పాముల విజయభాస్కర్(25), అతని సన్నిహితుడు కటారి పోల్రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న ఎస్సై మహేష్ తన సిబ్బందితో కలిసి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను పెద్దదోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే విజయభాస్కర్ మృతి చెందినట్లు వైద్యాధికారి లావణ్య ధ్రువీకరించారు. మండలానికి చెందిన 108 వాహనం ఇతర ప్రాంతానికి వెళ్లిన నేపథ్యంలో ఎస్సై తన వాహనంలోనే క్షతగాత్రులను వైద్యశాలకు తరలించారు. విజయభాస్కర్ ప్రాణాలు కాపాడేందుకు ఎస్సై మహేష్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పెద్దారవీడు మండలంలో.. రోడ్డుపై అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించపోయిన జీపు అదుపుతప్పి బోల్తాపడగా అదే సమయంలో అక్కడ నిలిపిన లారీని వెనుక నుంచి వచ్చిన మరో ట్రక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ రైతు మృతి చెందగా, మరో రైతు, డ్రైవర్, క్లీనర్కు గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి పెద్దారవీడు మండలంలోని గొబ్బూరు–తోకపల్లి గ్రామాల మధ్య చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జాతీయ రహదారిపై గుంటూరు వైపు వెళ్తున్న జీపు అదుపుతప్పి బోల్తా పడింది. వెనకాల వస్తున్న లారీ డ్రైవర్ గమనించి అకస్మత్తుగా నడిరోడ్డుపై నిలిపివేశారు. జీపులో ఉన్న వారిని రక్షించేందుకు డ్రైవర్, క్లీనర్ కిందకు దిగి వెళ్తుండగా వీరి లారీని మిరపకాయల లోడుతో వస్తున్న ట్రక్ ఢీకొట్టింది. చిమ్మచీకటి, వర్షం కారణంగా సంభవించిన ఈ ప్రమాదంలో మిర్చి ట్రక్ లో ఉన్న ఇద్దరు రైతులతో పాటు డ్రైవర్, క్లీనర్కు గాయాలయ్యాయి. రైతు ఖాసిం మృతి చెందగా మరో రైతు, డ్రైవర్ను మెరుగైన చికిత్స కోసం ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. కాగా, బోల్తా పడిన జీపులో ప్రయాణిస్తున్న 13 మందిలో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పి.అనిల్కుమార్ తెలిపారు. సంతనూతలపాడు మండలంలో... సంతనూతలపాడు: మండలంలోని ఎనికపాడు – గుమ్మలంపాడు రహదారిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనికపాడు గ్రామానికి చెందిన ఎర్రగుంట్ల సుబ్బాయమ్మ (55) మృతి చెందింది. ఎనికపాడు గ్రామానికి చెందిన దర్శి సుబ్రహ్మణ్యం మోటార్ సైకిల్పై సుబ్బాయమ్మ గుమ్మలంపాడు వెళుతుండగా, మార్గం మధ్యలో గొర్రెలు తగిలి ఆమె కిందపడింది. గాయపడిన ఆమెను 108 అంబులెన్స్లో చికిత్స నిమిత్తం ఒంగోలు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందింది. సంతనూతలపాడు, పెద్దదోర్నాల, పెద్దారవీడు మండలాల్లో ప్రమాదాలు బైక్ ప్రమాదాల్లో యువకుడు, మహిళ దుర్మరణం, మరొకరికి తీవ్ర గాయాలు లారీని మరో వాహనం ఢీకొన్న ఘటనలో రైతు మృతి, పలువురికి గాయాలు -
తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి
ఒంగోలు సబర్బన్: ఈ వేసవిలో జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. వేసవిలో తాగునీటి సరఫరా, వడగాడ్పులపై తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తపై సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు హాలులో కలెక్టర్ సమీక్షించారు. పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా వేసవిలో ఎక్కడైనా తాగునీటి సమస్య తలెత్తితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. మున్సిపల్, ఆర్డబ్ల్యూఎస్, తదితర శాఖల అధికారులు వేసవిలో తాగునీటి సరఫరాపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించి పటిష్టంగా అమలు చేయాలన్నారు. సమస్యాత్మక గ్రామాలను ముందుగానే గుర్తించి సంబంధిత శాఖల అధికారులంతా సమన్వయంతో పనిచేసి ఆయా గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. మండలస్థాయి అధికారులు కూడా తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కడా సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో తాగునీటి వనరులను పూర్తిస్థాయిలో నింపుకోవాలని, బోర్ వెల్స్ పూర్తిస్థాయిలో పనిచేసేలా చూడాలని, అవసరమైన వాటికి మరమ్మతులు చేయించాలని సూచించారు. ప్రజలందరికీ రక్షిత మంచినీరు అందించేందుకు రక్షిత తాగునీటి పథకాలలోని ఫిల్టర్ బెడ్లకు మరమ్మతులు చేయించాలన్నారు. వడగాడ్పులపై ప్రజలను అప్రమత్తం చేయాలి... పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో వడగాడ్పులపై ప్రజలను అప్రమత్తం చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీ, మండల కేంద్రంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో అధికంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. బస్టాండ్, రైల్వేస్టేషన్లు, ఆటో స్టాండ్లు, పబ్లిక్ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఉపాధి హామీ పథకం పనులు జరిగే ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాగునీరు, షామియానాలు వంటివి ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్యలో ఎవరూ ఎండలో తిరగరాదన్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగులు, క్యాప్లు వినియోగించాలన్నారు. ఒదులుగా ఉండే కాటన్ దుస్తులే ధరించాలని, వడదెబ్బ తగిలిన వారికి తక్షణమే గ్లూకోజ్ వంటివి ఇవ్వాలని, తడిగుడ్డతో తుడవాలని, తదుపరి మజ్జిగ వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలని కలెక్టర్ వివరించారు. ఈ విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఆస్పత్రులు, అంగన్వాడీ కేంద్రాలు, స్కూళ్లలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. సమావేశంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ డీపీఎం మాధురి, జెడ్పీ సీఈఓ చిరంజీవి, డీపీఓ వెంకట నాయుడు, ఇరిగేషన్ ఎస్ఈ వరలక్ష్మి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బాలశంకరరావు, డ్వామా పీడీ జోసఫ్ కుమార్, డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు, డీసీహెచ్ఎస్ డాక్టర్ సూరిబాబు, ఐసీడీఎస్ పీడీ హేనసుజన, పబ్లిక్ హెల్త్ ఈఈ శ్రీనివాస సంజయ్, గ్రౌండ్ వాటర్ డీడీ విద్యాసాగర్, పశుసంవర్థకశాఖ జేడీ డాక్టర్ బేబీరాణి, తదితర అధికారులు పాల్గొన్నారు. వేసవి దృష్ట్యా ముందస్తు చర్యలు చేపట్టాలి చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదు కలెక్టర్ తమీమ్ అన్సారియా -
తప్పుడు కేసుకు ఒప్పుకోలేదని..
● ఎండీయూ వాహనాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు టంగుటూరు: మండలంలోని సూరారెడ్డిపాలెంలో గురువారం సాయంత్రం రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్న ఎండీయూ వాహనాన్ని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సీజ్ చేశారు. ఎండీయూ ఆపరేటర్ అంకయ్య కథనం మేరకు.. ఎన్ఫోర్స్మెంట్ డీటీ శివరామకృష్ణ, ఎఫ్ఐ ప్రమోద్ వాహనాన్ని తనిఖీ చేశారు. 100 కేజీల రేషన్ బియ్యానికిగాను 50 కేజీల బస్తా ఒకటి, మరో బస్తాలో 33 కేజీలు ఉన్నాయి. అయితే 50 కేజీలు తక్కువగా ఉన్నాయని అధికారులు నివేదిక రాసుకున్నారు. ఆ మేరకు సంతకం చేయాలని ఒత్తిడి చేశారు. వెంకయ్య అందుకు అంగీకరించకపోవడంతో ఎండీయూ వాహనాన్ని అధికారులు తీసుకెళ్లిపోయారు. దీనిపై టంగుటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు తీసుకోలేదని, జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని అంకయ్య చెప్పారు. వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడిని అనే కక్షతో అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. క్రికెట్ బెట్టింగులపై నిఘా ఒంగోలు టౌన్: క్రికెట్ బెట్టింగులకు యువత దూరంగా ఉండాలని, బెట్టింగులకు పాల్పడేవారిపై గట్టి నిఘా పెట్టామని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం డీఎస్పీ ఆధ్వర్యంలో నగరంలోని ఆర్టీసీ బస్టాండు, అద్దంకి బస్టాండు సెంటర్, నెల్లూరు బస్టాండు, మంగమూరు రోడ్డు, తదితర ముఖ్య కూడళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మొత్తం 15 బృందాలుగా ఏర్పడిన పోలీసులు బెట్టింగులకు పాల్పడే వారిని గుర్తించేందుకు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. గుంపులుగా వున్న వారి ఫోన్లను పరిశీలించారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లపై ఆన్లైన్ బెట్టింగులు పాల్పడుతుంటే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సుమారు 1000 మంది ఫోన్లను పరిశీలించగా 18 మంది ఫోన్లలో అనమానాస్పద యాప్లను గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్న నేఫథ్యంలో బెట్టింగులకు పాల్పడేవారిని గుర్తించేందుకు ప్రత్యేక తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు. తనిఖీల్లో వన్టౌన్ సీఐ నాగరాజు, తాలూకా సీఐ అజయ్కుమార్, సింగరాయకొండ సీఐ హజరత్తయ్య, ఎస్సైలు పాల్గొన్నారు. -
జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్చార్జ్గా జేసీ
ఒంగోలు సబర్బన్: జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్చార్జిగా జాయింట్ కలెక్టర్, జిల్లా అదనపు మేజిస్ట్రేట్ రోణంకి గోపాలకృష్ణ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. జిల్లా గ్రంథాలయ సంస్థలకు సంబంధించిన వ్యవహారాలు నిర్వహించడానికి జాయింట్ కలెక్టర్లను పర్సన్ ఇన్చార్జిలుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థకు జిల్లాలోని కార్పొరేషన్, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల నుంచి రావాల్సిన గ్రంథాలయ సెస్సు బకాయిల వసూలుకు చర్యలు తీసుకుంటామన్నారు. గ్రంథాలయాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్న జేసీని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఇప్పటి వరకు నిర్వహించిన గ్రంథాలయాల వ్యవహారాలను గోపాలకృష్ణకు ఆమె వివరించారు. -
మద్యం తాగించి కొట్టి చంపారు
ఒంగోలు టౌన్: మిస్టరీగా మారిన అర్జున్ రెడ్డి హత్య కేసు ఒక కొలిక్కి వచ్చింది. ఒంగోలు రూరల్ మండలంలోని పాతపాడు గ్రామానికి చెందిన మోరుబోయని అర్జున్ రెడ్డి (57) గత నెల 19వ తేదీ నుంచి కనిపించడం లేదు. దాంతో అనుమానం వచ్చిన ఆయన సోదరుడు వెంకటేశ్వర రెడ్డి 29వ తేదిన తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అర్జున్ రెడ్డి భార్య సుశీలతో వివాహేతర సంబంధం ఉన్నట్లు చెబుతున్న కావూరి రమేష్రెడ్డిని గురువారం ఉదయం అరెస్టు చేశారు. తమదైన శైలిలో విచారించారు. దాంతో అర్జున్ రెడ్డిని హత్య చేసినట్లు అంగీకరించాడు. పోలీసుల కథనం ప్రకారం...పాతపాడుకు చెందిన కాపూరి రమేష్రెడ్డికి, అదే గ్రామానికి చెందిన మోరబోయిన అర్జున్ రెడ్డి భార్య సుశీలతో అక్రమ సంబంధం ఉంది. చాలా కాలంగా వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుంది. అయినా అర్జున్రెడ్డి అడ్డుగా ఉన్నాడని భావించిన రమేష్రెడ్డి, సుశీలతో కలిసి హత్యకు పథకం పన్నాడు. ఈ పథకంలో భాగంగా అర్జున్రెడ్డిని మద్యం తాగేందుకు రమ్మని చెప్పి దశరాజుకుంట పొలాల వైపు పిలుచుకొని వెళ్లాడు. అర్జున్రెడ్డిని మాటల్లో పెట్టి ఫుల్లుగా మద్యం తాగించాడు. మద్యం మత్తులో ఉన్న అతడిని రాయితో కణతకు కొట్టి చంపాడు. అర్జున్రెడ్డి మరణించాడని నిర్ధారణ చేసుకున్న తరువాత సుశీలతో కలిసి మృతదేహాన్ని పక్కనే ఉన్న మరల బావిలో పడేశారు. ఆ తరువాత ఏమీ తెలియనట్లు ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. అయితే 19వ తేదీ నుంచి అర్జున్ రెడ్డి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. మృతుడి సోదరుడు తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. మృతదేహం బాగా కుళ్లిపోయి ఉండడంతో ఘటన స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. అర్జున్రెడ్డి భార్య సుశీల ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సీఐ అజయ్ కుమార్ తెలిపారు. ఆమె కోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేశామని, త్వరలోనే ఆమెను పట్టుకుంటామని చెప్పారు. -
300 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
బేస్తవారిపేట: కూటమి ప్రభుత్వంలో రేషన్ బియ్యం అక్రమార్కులు రెచ్చిపోతూనే ఉన్నారు. గురువారం బేస్తవారిపేట జంక్షన్లో హైవే రోడ్డు పక్కన ఉన్న రైస్ మిల్లులో పాలిష్ చేసిన రేషన్ బియ్యాన్ని లారీలో తరలిస్తుండగా మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ సీజ్ చేశారు. రైస్ మిల్లులో 300 క్వింటాళ్ల పాలిష్డ్ రేషన్ బియ్యాన్ని లోడ్ చేసుకున్న లారీ ఇక్కడి పెట్రోల్ బంకులో డీజీల్ కొట్టించుకుని వెళ్తుండగా సబ్ కలెక్టర్ అదుపులోకి తీసుకున్నారు. లారీలో రేషన్ బియ్యం బస్తాలను కిందకు దింపి పరిశీలించారు. తెల్లటి సంచులకు ఇంపోర్టర్ వియత్నాం అడ్రస్తో, ఎక్స్పోర్టర్ అడ్రస్ హేమరాజ్ ఇండస్ట్రీస్ ప్త్రెవేట్ లిమిటెడ్, కోల్కతా, వెస్ట్బెంగాల్ పేరుతో ట్యాగ్లు వేశారు. లారీని పట్టుకున్న విషయం తెలుసుకున్న యజమానులు హుటాహుటిన సబ్ కలెక్టర్ వద్దకు చేరుకున్నారు. నంద్యాలలో జనవరిలో నిర్వహించిన వేలంలో రేషన్ బియ్యం కొన్నామని, బేస్తవారిపేటలోని రైస్మిల్లుకు తీసుకొచ్చి పాలిష్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నామని వ్యాపారులు చెప్పడం గమనార్హం. దీనిపై స్పందించిన సబ్ కలెక్టర్.. ఎన్ని బియ్యం కొన్నారు, ఇప్పటి వరకు ఎన్ని క్వింటాళ్లు ఎక్స్పోర్ట్ చేశారు, స్టాక్ ఎక్కడ పెట్టారు, బ్యాగ్లపై అంటించిన అడ్రస్లకు బియ్యం పంపకుండా మరో చోటకు ఎందుకు తరలిస్తున్నారు, బియ్యం కొనుగోలు చేసి నాలుగు నెలలు అవుతున్నా ఎందుకు ఎక్స్పోర్ట్ చేయలేదని ప్రశ్నల వర్షం కురిపించడంతో యాజమాని నీళ్లు నమిలాడు. నంద్యాల నుంచి లారీలో బియ్యం తెస్తే గాజులపల్లె, తాటిచర్ల మోటు వద్ద చెక్ పాయంట్లలో తీసుకున్న రశీదులు ఎక్కడ?, రేషన్ బియ్యం మిల్లుకు తరలించేటప్పుడు అధికారులకు సమాచారం ఇచ్చారా అని ప్రశ్నించగా సరైన సమాధానం లేదు. దీంతో లారీని సీజ్ చేసి కంభంలోని రేషన్ గోడౌన్కు తరలించాలని తహసీల్దార్ జితేంద్రకుమార్, ఎన్ఫోర్స్మెంట్ డీటీ రామనారాయణరెడ్డిని సబ్ కలెక్టర్ ఆదేశించారు. ఆయన వెంట ఎఫ్ఐ సల్మాన్, ఆర్ఐ కాశయ్య, వీఆర్వో ఉన్నారు. బేస్తవారిపేటలోని ఓ రైస్ మిల్లులో పాలిష్ చేసి అక్రమంగా రవాణా లారీని సీజ్ చేసిన మార్కాపురం సబ్కలెక్టర్ వెంకట త్రివినాగ్ కంభం రేషన్ గోడౌన్కు బియ్యం తరలింపు -
బరితెగించిన తెలుగు తమ్ముళ్లు
జరుగుమల్లి(సింగరాయకొండ): అధికార అండగా తెలుగు తమ్ముళ్లు బరితెగించారు. మట్టి కోసం ఏకంగా 48 ఎకరాల ఆయకట్టు ఉన్న నేతివారికుంట కట్టను ధ్వంసం చేశారు. జరుగుమల్లి పంచాయతీలోని పంగులూరివారిపాలెంలోని నేతివారికుంటను చింతలపాలెం గ్రామానికి చెందిన పచ్చతమ్ముళ్లు యథేచ్ఛగా తవ్వకాలు చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు కావడంతో అధికారులు సైతం ఏం చేయలేక మిన్నకుండాల్సిన పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే..పంగులూరివారిపాలెం గ్రామ పరిధిలో ఉన్న నేతివారికుంటకు 48 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ కుంటను గతంలో ఐటీసీ కంపెనీ వారు అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా కుంట కట్టలను పటిష్టం చేయడంతో పాటు అభివృద్ధి చేశారు. కానీ గురువారం చింతలపాలెం గ్రామానికి చెందిన పచ్చతమ్ముళ్లు తమ పొలాలకు మట్టి కావాలని ఎటువంటి అనుమతులు లేకుండా నేతివారికుంట కట్టలను ధ్వంసం చేసి మట్టిని తరలించారు. దీంతో విషయం తెలిసి జరుగుమల్లి గ్రామ సర్పంచ్ కె.పున్నారావు, వైఎస్సార్ సీపీ నాయకులు పిన్నిక శ్రీనివాసులు గ్రామస్తులను వెంటబెట్టుకుని వెళ్లి జేసీబీనీ, ట్రాక్టర్లను అడ్డుకున్నారు. ఈ లోగా కుంట కట్టలను ధ్వంసం చేస్తున్నారని పంచాయతీ, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వటంతో ఆర్ఐ స్రవంతి, వీఆర్ఓ చైతన్య, పంచాయతీ కార్యదర్శి విద్యుల్లతలు అక్కడికి చేరుకుని అక్రమరవాణాదారులను అడ్డుకున్నారు. అయితే తమ్ముళ్లు మాత్రం వీరిని లెక్కచేయకుండా కుంట కట్టను ధ్వంసం చేస్తాం..అవసరమైతే మళ్లీ ఎన్ఆర్జీఎస్ పథకం కింద కట్టను అభివృద్ధి చేస్తామని వారితో వాదులాటకు దిగారు. దీంతో అధికారులు, గ్రామస్తులు ససేమిరా అనడంతో చివరికి తమ్ముళ్లు కట్టను వదిలి కుంటలోని మట్టిని ట్రాక్టర్ల ద్వారా తరలించారు. దీనిపై సర్పంచ్ పున్నారావు మాట్లాడుతూ తమ్ముళ్ల అక్రమ దందాపై రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. మట్టి కోసం నేతివారికుంట కట్ట ధ్వంసం అడ్డుకున్న గ్రామస్తులు, అధికారులు కట్టను వదిలి చెరువులో తవ్వకాలు -
నిద్రిస్తున్న మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ
కొమరోలు: ఆరుబయట నిద్రిస్తున్న ఓ మహిళ మెడలో బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తి లాక్కెళ్లాడు. ఈ సంఘటన కొమరోలు మండలంలోని బాలిరెడ్డిపల్లె గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. దుండగుడి దుశ్చర్యతో ఉలిక్కిపడి లేచిన ఆమె బిగ్గరగా కేకలు వేయడంతో స్థానికులు పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. స్థానికులు డయల్ 100కు కాల్ చేసి చోరీ విషయాన్ని తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితురాలు ఈశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఒంగోలు టౌన్: ప్రజలు వేసవి వ్యాధుల బారిన పడకుండా వైద్య సిబ్బంది జాగ్రతలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. స్థానిక డీఎంహెచ్ఓ ఛాంబర్లో గురువారం వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కాన్ఫరెన్స్ వివరాలను డీఎంహెచ్ఓ వెల్లడించారు. స్కూలు పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం, సికిల్ సెల్ అనీమియా, వేసవి వ్యాధుల గురించిన సమీక్షా సమావేశంలో కమిషనర్ పలు సూచనలు చేసినట్లు తెలిపారు. గర్భిణులను ప్రాథమిక దశలోనే గుర్తించి, వారికి పూర్తిస్థాయి వైద్య సేవలను అందించాలని సూచించారు. రక్తహీనతతో బాధపడే వారిని సకాలంలో గుర్తించి వైద్య అందిస్తే మాతృమరణాలు గణనీయంగా తగ్గించవచ్చని చెప్పారు. 5 ఏళ్ల లోపు బరువు తక్కువగా ఉన్న చిన్నారులను న్యూట్రీషన్ రీ హాబిలేషన్ సెంటర్కు రెఫర్ చేయడం ద్వారా శిశు మరణాలకు అడ్డుకట్టవేయవచ్చన్నారు. వడదెబ్బ నివారించుటకు ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. సమావేశంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ పద్మజ, డీపీఎంఓ డాక్టర్ వాణిశ్రీ, శ్రవణ్, శ్రీవాణి, హేమంత్, చల్ల ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ధర సైంధవులు!
దళారులే..కొత్తపట్నం: లాభాలతో కళకళలాడాల్సిన ఉప్పు రైతుల మోము.. దళారుల దోపిడీతో చిన్నబోతోంది. ఉప్పు నాణ్యతను బట్టి గిట్టుబాటు ధర కల్పించాల్సిన ప్రభుత్వం చేతులెత్తేయడంతో దళారులదే ఇష్టారాజ్యమైంది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా జిల్లాలో ఈ ఏడాది ఉప్పు దిగుబడి సగానికి సగం పడిపోయిన పరిస్థితుల్లో డిమాండ్ పెరిగింది. ఈ మేరకు రైతులకు దక్కాల్సిన లాభాన్ని దళారులు గద్దల్లా తన్నుకుపోతున్నారు. బహిరంగ మార్కెట్లో 75 కేజీల బస్తా రూ.500 ఉండగా.. సిండికేట్ అయిన వ్యాపారులు కేవలం రూ.150 ఇచ్చి సరిపెడుతున్నారు. ఫలితంగా రైతులు నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి తలెత్తింది. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో చినగంజాం, కనపర్తి, కొత్తపట్నం, మోటుమాల, పాదర్తి, పాకల, ఊళ్లపాలెం, బింగినపల్లి తీర ప్రాంతాల్లో 7 వేల మందికి పైగా రైతులు సుమారు 4 వేల ఎకరాల్లో ఉప్పు సాగు చేస్తున్నారు. ఉప్పు కొటార్లను నమ్ముకుని 10 వేల మందికి పైగా కూలీలు జీవనోపాధి పొందుతున్నారు. జిల్లాలో ఏటా 20 వేల టన్నుల ఉప్పు ఉత్పత్తి అవుతుండగా స్థానిక అవసరాలకుపోను తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో వాతావరణం అనుకూలించి లాభాలు చవిచూసిన రైతులకు ఈ ఏడాది కష్టాలు ఎదురయ్యాయి. ప్రకృతి ప్రకోపించడంతోపాటు దళారులు దోపిడీ చేస్తుండటంతో ఉప్పు రైతులు విలవిల్లాడుతున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో 75 కేజీల బస్తా ధర సుమారు రూ.500 పలుకుతుండగా.. అదే సమయంలో రైతుకు దక్కుతోంది రూ.150 మాత్రమే. సబ్బులు, బ్లీచింగ్, తోళ్ల పరిశ్రమ, ఇతర కెమికల్ ఫ్యాక్టరీల్లో వినియోగించే ఉప్పు ధర క్వింటా రూ.150 పలుకుతోంది. ఇది గత ఏడాదికంటే తక్కువ కావడం గమనార్హం. తమిళనాడులోని తూతుకూడిలో క్వింటా ఉప్పు రూ.350 పలుకుతుండగా జిల్లాలో మాత్రం అందులో సగమే దక్కుతుండటంతో రైతులు నిశ్చేష్టులవుతున్నారు. గతంలో పాత ఉప్పు ధర అధికంగా, కొత్తగా ఉత్పత్తి చేసిన ఉప్పు అంతకంటే కాస్త తక్కువ ధర పలికేది. కానీ దళారుల మాయాజాలంతో పాత ఉప్పు ధర 75 కేజీల బస్తాపై రూ.50 తగ్గింది. కేజీ ఉప్పు ధర మరో రూ.3 పెరిగితే కనీసం పెట్టుబడి చేతికొస్తుందని రైతులు ఆశిస్తున్నారు. ఆ కయ్యా మాదే.. ఈ కయ్యా మాదే..! మార్కెట్లో డిమాండ్ నేపథ్యంలో ఉప్పు ధర పెరిగే అవకాశం ఉన్నా లోకల్ వ్యాపారులు సిండికేట్గా మారి అడ్డు తగులుతున్న తీరు చర్చనీయాంశమైంది. ఇతర జిల్లాల నుంచి వ్యాపారులను రానివ్వకుండా లోకల్ సిండికేట్ బెదిరిస్తుండటమే కాకుండా లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఉప్పు నిల్వ చేస్తున్నారు. రైతులకు తక్కువ ధర చెల్లించి కొనుగోలు చేసిన ఈ ఉప్పును మార్కెట్లో హెచ్చు ధరకు విక్రయించి సొమ్ము చేసుకోవడమే లక్ష్యంగా వ్యాపారుల సిండికేట్ పావులు కదుపుతోంది. దళారుల మాయతో ఉప్పు రైతులకు దక్కని గిట్టుబాటు ధర ఈ ఏడాది ప్రకృతి అనుకూలించక సగానికి పడిపోయిన దిగుబడి డిమాండ్ ఉన్నా వ్యాపారుల సిండికేట్తో సొమ్ము చేసుకోలేని దుస్థితి బహిరంగ మార్కెట్లో 75 కేజీల బస్తా రూ.500.. రైతుకిచ్చేది రూ.150 పరిశ్రమల అవసరాలకు వినియోగించే ఉప్పు క్వింటా రూ.150 మాత్రమే.. పెట్టుబడి కూడా చేతికొచ్చే పరిస్థితి లేదని ఉప్పు రైతుల ఆవేదన -
శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం
కనిగిరిరూరల్: శాంతి భద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా కనిగిరి డీఎస్పీ కార్యాలయాన్ని గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయ పరిసరాల్లోని పోలీస్ క్వార్టర్స్, పెండింగ్ కేసుల వివరాలను, ఎస్సీ, ఎస్టీ ఫోక్సో కేసుల వివరాలను తెలుసుకుని డీఎస్పీకి పలు సూచనలు చేశారు. సబ్ డివిజన్ పరిధిలో నెలకొన్న పరిస్థితులు, శాంతి భద్రతల అంశాలపై డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్తో క్షుణ్ణంగా చర్చించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకోవాలన్నారు. అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణలో కఠినంగా వ్యవహరించాలన్నారు. క్రికెట్ బెట్టింగ్, శక్తి యాప్, మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సీసీ కెమెరాల ప్రాముఖ్యత గురించి ప్రజలకు తెలియచేసి సీసీ కెమెరాల ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. నేరాల నియంత్రణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కనిగిరిలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విధి నిర్వహణలో సిబ్బంది ఏమైనా సమస్యలు ఎదుర్కొంటుంటే తక్షణం నా దృష్టికి తీసుకురావాలని తెలిపారు. కేసుల పరిష్కారం జాప్యం లేకుండా పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం జెడ్పీ హైస్కూల్ విద్యార్థులతో మాట్లాడారు. అంజుమన్ కమిటీ సభ్యులు , గ్రానైట్ క్వారీ సభ్యులు నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాను అందచేశారు. కార్యక్రమంలో డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, సీఐ ఖాజావలి, కనిగిరి, హెచ్ఎంపాడు ఎస్సైలు టి.శ్రీరాం, యు మాధవరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. తొలుత ఉదయాన్నే స్థానిక కాస్మోపాలిటన్ క్లబ్ ఆవరణలో మున్సిపల్ చైర్మన్ ఎస్కే అబ్దుల్ గఫార్, క్లబ్ సభ్యులతో కలిసి షటిల్ ఆడారు. ఆతర్వాత పట్టణంలోని సాయిబాబా గుడి, వెంకటేశ్వర స్వామి దేవస్థానం, తదితర ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఎస్పీ ఏఆర్ దామోదర్ను మున్సిపల్ చైర్మన్ ఎస్కే అబ్దుల్ గఫార్ కలిసి, పుష్ప గుచ్ఛం అందచేశారు. అనంతరం పట్టణంలోని ట్రాఫిక్ సమస్యను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. నేరాల కట్టడి, రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలి ఎస్పీ ఏఆర్ దామోదర్ -
మైనార్టీల సంక్షేమానికి కృషి చేసింది వైఎస్ జగనే..
● ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ షంషేర్ ఆలీబేగ్ మార్కాపురం: ముస్లిం మైనార్టీల మనోభావాలను గౌరవిస్తూ పార్లమెంట్లో వక్ఫ్ సవరణ బిల్లును వైఎస్సార్ సీపీ వ్యతిరేకించిందని ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ మీర్జా షంషేర్ ఆలీబేగ్ పేర్కొన్నారు. ముస్లింల సంక్షేమానికి వైఎస్సార్ సీపీ కట్టుబడి ఉంటుందని పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి స్పష్టం చేశారన్నారు. గురువారం మార్కాపురంలో తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వక్ఫ్ బిల్లును రాష్ట్రంలోని టీడీపీ జనసేన పార్టీలు సమర్థించగా, వైఎస్సార్ సీపీ వ్యతిరేకించిందన్నారు. గతంలో కూడా మైనార్టీల అభ్యున్నతికి వైఎస్సార్ సీపీ చేయూతనిచ్చిందన్నారు. ముస్లింల స్ధితిగతులు మార్చేందుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 4 శాతం రిజర్వేషన్లు అమలు చేశారని గుర్తుచేశారు. తండ్రి కంటే రెండు అడుగులు ముందుకు వేసిన వైఎస్ జగన్ ముస్లింలను విద్యావంతులుగా తీర్చిదిద్దడంతో పాటు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ముందుకు నడిపారని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముస్లింల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించగా, వైఎస్సార్ సీపీ మాత్రం గౌరవించిందన్నారు. ముస్లిం సమాజం వైఎస్ జగన్కు రుణపడి ఉంటుందని తెలిపారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో మసీదులు, ఈద్గాల అభివృద్ధికి వైఎస్ జగన్ అత్యధికంగా నిధులు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఉమ్మడి జిల్లాలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో షాదీఖానాల నిర్మాణానికి కోట్ల రూపాయల నిధులను కేటాయించినట్లు తెలిపారు. కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి సైతం నిధులు కేటాయించారన్నారు. వక్ఫ్ సవరణ బిల్లును ఉపసంహరించుకుని, ముస్లింల మనోభావాలను గౌరవించాలని షంషేర్ ఆలీబేగ్ కోరారు. -
రైల్వేస్టేషన్లో గుర్తు తెలియని వృద్ధుడి మృతి
ఒంగోలు టౌన్: రైల్వే ప్లాట్ ఫారం మీద గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందారు. రైల్వే పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..రైల్వే స్టేషన్లోని మొదటి ప్లాట్ ఫారం మీద 60 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని వృద్ధుడు గురువారం మరణించారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో వృద్ధుడు మరణించి ఉండటం గమనించిన ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. లేత ఆకుపచ్చ రంగు చొక్కాపై బులుగు, నలుపు రంగు చారల, నలుపు తెలుపు రంగు లుంగీ ధరించి ఉన్నాడు. సమాచారం తెలిసిన వారు ఒంగోలు రైల్వే ఎస్ఐ ఫోన్ నెంబర్ 9440627647కు తెలియజేయాలని ఎస్సై అరుణ కుమారి కోరారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి టంగుటూరు: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన స్థానిక టోల్ప్లాజా సమీపంలో బుధవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..స్థానిక టోల్ప్లాజా సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని తీవ్ర రక్తగాయాలై గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడు శరీరంపై తెలుపు రంగు చొక్కా, నలుపు రంగు ఫ్యాంట్ ధరించి ఉన్నాడు. మృతుని 40 ఏళ్ల వయసుంటుందని, ఎటువంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని గుర్తిస్తే 9121102137, 9121102135 నంబర్లకు సంప్రదించాలని ఎస్సై నాగమళ్లీశ్వరరావు తెలిపారు. నిందితునికి రెండేళ్ల జైలు● లారీని నిర్లక్ష్యంగా నడిపి ముగ్గురు మరణానికి కారణమైన కేసులో.. చీమకుర్తి: లారీని నిర్లక్ష్యంగా నడిపి ముగ్గురు మరణానికి కారణమైన లారీ డ్రైవర్ ముత్తు పాండియన్ రంగస్వామికి ఒంగోలు కోర్టు రెండు సంవత్సరాల 3 నెలల జైలుశిక్ష, రూ.5,500 జరిమానా విధించింది. ఒంగోలు స్పెషల్ ఎకై ్సజ్ కోర్టు జడ్జి ఎస్ కోమలవల్లి గురువారం తీర్పు ఇచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...2019 జూన్ 8న చీమకుర్తిలోని గంగవరం రోడ్డులో ముగ్గురు వ్యక్తులు బైకుపై పెట్రోల్ బంకు వద్ద పెట్రోల్ కొట్టించుకొని వెళ్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో చీమకుర్తి క్రిష్టియన్పాలెం, అంబేడ్కర్నగర్కు చెందిన మందా రాకేష్, మట్టిగుంట రాకేష్, ఆత్మకూరి మహేష్ ముగ్గురు మరణించారు. పి.నాగరాజు ఫిర్యాదు మేరకు నమోదైన ఈ కేసులో నిర్లక్ష్యంగా లారీని నడిపి ముగ్గురు మరణానికి కారణమైన లారీ డ్రైవర్కు శిక్ష పడటంతో సమర్ధవంతంగా బాధ్యతలను నిర్వహించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. -
సాగు కదలక!
సాయమందక..మార్కాపురం: జిల్లాలో 2024–25 సంవత్సరంలో ఖరీఫ్ సాగు లక్ష్యం 2,02,249 హెక్టార్లు. సుమారు 1.7 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. రబీ సీజన్లో సాధారణంగా 3,97,880 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగుచేయాల్సి ఉంది. అయితే, కేవలం 2,99,331 ఎకరాల్లో మాత్రమే సాగైంది. వేసిన పంటల్లో కూడా దాదాపు లక్షకుపైగా ఎకరాల్లో నిలువునా ఎండిపోయాయి. మిగతా 1.99 లక్షల ఎకరాల్లో కూడా సగానికిపైగా ఎకరాల్లో దిగుబడి మరీ దారుణంగా పడిపోయింది. దీంతో రైతన్న పరిస్థితి దయనీయంగా మారింది. నవంబర్, డిసెంబర్ మాసాల్లో కురిసిన అకాల వర్షాలకు జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అంతక ముందు ఏడాది నవంబర్, డిసెంబర్ మాసాల్లో కురిసిన వర్షాలకు సైతం పంటనష్టం భారీగా ఉంది. గతేడాది ఖరీఫ్ నుంచి పరిహారం కోసం అన్నదాతలు ఎదురుచూస్తూనే ఉన్నారు. నేడు కూటమి ప్రభుత్వంలో... రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు దాటుతున్నా నేటికీ ఏ ఒక్క రైతుకూ ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం అందలేదు. దీంతో రైతులంతా పెట్టుబడుల కోసం 2019కి పూర్వం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించినట్లుగా మళ్లీ వారి వద్దకే వెళ్తున్నారు. ఈ ఏడాది కేవలం పీఎం కిసాన్ నిధి కింద మాత్రమే రైతులకు రూ.2 వేల నగదు బ్యాంకు ఖాతాల్లో జమైంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సాయం అందలేదు. చివరకు గతేడాది రెండు సీజన్లకు సంబంధించిన పంట నష్టపరిహారం కూడా ఎగ్గొట్టడంతో కూటమి ప్రభుత్వ తీరుపై అన్నదాతలు తీవ్రస్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఖరీఫ్, రబీ సీజన్లలో అకాల వర్షాలు, ప్రకృతి విపత్తులతో రైతులు తీవ్రంగా పంట నష్టపోయారు. కానీ, నేటికీ కూటమి ప్రభుత్వం నుంచి రైతులకు నష్టపరిహారం అందలేదు. వడ్డీలకు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి పండించిన పంటలు నష్టపోయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రబీ పంటలకు నష్టపరిహారం ఎప్పుడో..? 2023–24 రబీ సీజన్లో మార్కాపురం డివిజన్లో మిర్చి, పత్తి, అపరాలు, తదితర పంటలను రైతులు అధికంగా సాగుచేశారు. 2023 నవంబరు, డిసెంబరు నెలల్లో కురిసిన అకాల వర్షాలకు పొలాల్లో నీళ్లు నిలిచి పంటలు దెబ్బతిన్నాయి. పత్తి, మిర్చి పంటలకు ఊహించని తెగుళ్లు వచ్చి దిగుబడులు పూర్తిగా తగ్గిపోయాయి. తెగుళ్ల నివారణ కోసం రైతులు వేలాది రూపాయలు కూడా ఖర్చు చేశారు. కానీ, ఫలితం దక్కలేదు. ముఖ్యంగా మినుము, కంది, సజ్జ, పొద్దు తిరుగుడు, ఆముదం, నూగు, జొన్న తదితర పంటలు బాగా దెబ్బతిన్నాయి. అయితే, గతేడాది మార్చిలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వలేకపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతేడాది జూన్ 20 వ తేదీ కేంద్ర కరువు బృందం మార్కాపురం ప్రాంతంలో పర్యటించింది. ఈ బృందంలో ఎంఅండ్ఏ డైరెక్టర్ మన్నుజీ ఉపాధ్యాయ, కేంద్ర పశుసంవర్థకశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎస్ఈ కశ్యప్, న్యూఢిల్లీకి చెందిన ఫుడ్ అండ్ పబ్లిక్ డిపార్ట్మెంటు డిప్యూటీ డైరెక్టర్ మదన్మోహన్ మౌర్య, నీతిఆయోగ్ సీనియర్ రిసెర్చ్ ఆఫీసర్ అనూరాధ బట్నాతో పాటు జిల్లా అధికారులు, స్థానిక అధికారులు ఉన్నారు. ముందుగా వేములకోట చెరువును పరిశీలించి అక్కడి రైతులతో మాట్లాడి పంట నష్టాన్ని అంచనా వేసి నివేదిక పంపారు. కానీ, నేటికీ రైతులకు పంట నష్టపరిహారం మాత్రం అందలేదు. రైతులకు పంట నష్టపరిహారం చెల్లించకుండా చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం రెండు పంట సీజన్లు దాటినా అందని పరిహారం గతేడాది ఖరీఫ్ నుంచి ఎదురుచూస్తున్న రైతాంగం మార్కాపురం డివిజన్లోనే 5,940 మంది రైతులకు రూ.4.65 కోట్లు అందాల్సిన వైనం వ్యవసాయానికి సాయం చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోర వైఫల్యం అన్నదాతల్లో తీవ్ర నైరాశ్యం కనీవినీ ఎరుగని రీతిలో పథకాలు అందించిన గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంరైతులకు పంట నష్టపరిహారం అందించాలి మార్కాపురం నియోజకవర్గంలో పలు మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. కానీ, పంట నష్టపోయిన రైతులకు మాత్రం పరిహారం చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కరువు ప్రాంతాలుగా ప్రకటించిన దృష్ట్యా గతేడాది రబీలో సాగుచేసి నష్టపోయిన పంటలకు కూడా ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి. రైతుల రుణాలు మాఫీ చేయాలి. – బాలనాగయ్య, వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు -
వేసవిలో చలచల్లగా..
బేస్తవారిపేట: వేసవి ప్రారంభమై ఎండతీవ్రత, ఉక్కపోత పెరుగుతున్న నేపథ్యంలో గురువారం ఒక్కసారిగా వర్షం కురిసి వాతావరణం చల్లబడటంతో పశ్చిమ ప్రకాశం ప్రజలు సేదతీరారు. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులు వీయడంతో స్వల్ప నష్టం వాటిల్లింది. బేస్తవారిపేట మండలంలోని జెన్నివారిపల్లెలో ఈదురుగాలులతో కూడిన వర్షానికి ఐదు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ తీగలు ఎక్కడికక్కడ తెగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈదురుగాలులకు కోత దశలో ఉన్న మొక్కజొన్న పంట నేలకొరిగింది. దాదాపు 300 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు. మూడు రేకుల షెడ్లకు రేకులు ఎగిరి కిందపడ్డాయి. మార్కాపురంలో వర్షం... మార్కాపురం/కొనకనమిట్ల: పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో అకస్మాత్తుగా వర్షం కురిసి వాతావరణం చల్లబడింది. వేసవిలో వర్షం పడటంతో ప్రజలు బయటకు వచ్చి వర్షంలో తడుస్తూ చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించారు. వారం రోజులుగా 39 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత ప్రారంభమవుతోంది. సాయంత్రం 6 గంటల వరకూ ఎండ అధికంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో వర్షం కురిసి చల్లటి గాలులు వీచాయి. సుమారు 20 నిమిషాల పాటు వర్షం కురిసింది. అదే సమయంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తర్లుపాడు, కొనకనమిట్ల మండలాల్లోని పలు గ్రామాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. చిత్తడిగా మారిన కనిగిరి రోడ్లు... కనిగిరి రూరల్/హనుమంతునిపాడు: కనిగిరిలో గురువారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో వర్షం కురిసి వాతావరణం పూర్తిగా చల్లబడింది. వర్షం నీటితో పట్టణంలోని ప్రధాన, శివారు ప్రాంతాల్లోని రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. కొద్దిపాటి వర్షానికే పట్టణంలోని రోడ్లపై నీళ్లు నిలవడంతో ప్రజలు చీదరించుకుంటున్నారు. హనుమంతునిపాడు మండలంలోనూ చిరుజల్లులు కురిసాయి. మండల కేంద్రంతో పాటు వేములపాడు, గాయంవారిపల్లి, తిమ్మారెడ్డిపల్లి, హాజీపురం, వెంగపల్లి, తదితర గ్రామాల్లో ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షం కురిసింది. గాలులకు నిమ్మతోటల్లో పిందె, పూత రాలిపోయింది. కోతకోసిన రాగి పంట కూడా కొంత దెబ్బతింటుందని రైతులు తెలిపారు. -
మాటమీద నిలబడే వ్యక్తి.. వైఎస్ జగన్
దర్శి: దేశంలో మాట మీద నిలబడిన ఒకే ఒక్క సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అన్నారు. దర్శి మండలంలోని శామంతపూడి గ్రామంలో ఆంజనేయస్వామి తిరునాళ్లు మహోత్సవాన్ని బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. తిరునాళ్లలో వైఎస్సార్ సీపీ నాయకుడు అమరా మురళి ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ ప్రభపై ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డితో పాటు జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పాల్గొన్నారు. వారిని దుశ్శాలువాలు, పూలమాలలతో నాయకులు ఘనంగా సత్కరించారు. ప్రభ ఏర్పాటు చేసిన మురళిని బూచేపల్లి అభినందించారు. ఈ సందర్భంగా శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మాట మీద నిలబడిన వ్యక్తులు ఇద్దరే ఇద్దరున్నారన్నారు. వారిలో ఒకరు దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కాగా, రెండో వ్యక్తి ఆయన కుమారుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని తెలిపారు. తన తండ్రి ఆశయ సాధనలో భాగంగా పేదలందరికీ న్యాయం చేయడం జగనన్నతోనే సాధ్యమని అన్నారు. జగనన్న పాలనలో పార్టీలు, కులాలు, మతాలు చూడలేదని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలన్నీ అందించిన గొప్ప నాయకుడని కొనియాడారు. పనులు చేసుకునే ప్రజలు తమ పనులు మానుకుని పథకాల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగాల్సిన అవసరం లేకుండా ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్, 2000 మందికి ఒక సచివాలయం, సచివాలయంలో సేవలందించేందుకు 11 మంది ఉద్యోగులను నియమించిన గొప్ప సీఎం అని గుర్తుచేశారు. నేరుగా గడపగడపకు పథకాలు, ప్రభుత్వ సేవలు అందించడం వైఎస్ జగన్కే సాధ్యమైందన్నారు. కూటమి పాలన చూసి బాధపడుతున్న ప్రజలు... ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ పాలన చూస్తూ జగనన్న లాంటి గొప్ప సీఎంని పోగొట్టుకుని తప్పు చేశామని ప్రజలు బాధపడుతున్నారని బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో జగనన్నను మళ్లీ సీఎం చేసుకోవాలని ప్రతి పేదవాడు పరితపిస్తున్నాడన్నారు. జగనన్నకు వృద్ధాప్యం అప్పుడే రాదని, ఆయనకు ఇంకా ఎంతో వయసుందని, మళ్లీ మీ అందరి మద్దతుతో సీఎంగా పేదలందరికీ జగనన్న న్యాయం చేస్తారని భరోసా ఇచ్చారు. గత ఎన్నికల్లో తన గెలుపునకు కృషి చేసిన అందరికీ బూచేపల్లి ధన్యవాదాలు తెలిపారు. తమ కుటుంబంపై ప్రేమ, నమ్మకంతో తన తల్లికి జిల్లా పరిషత్ చైర్పర్సన్గా, తనకు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షునిగా జగనన్న అవకాశం కల్పించారన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేసి మళ్లీ వైఎస్సార్ సీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని, జగనన్నను సీఎంని చేసుకునేందుకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ దర్శి మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, సాగర్ ప్రాజెక్ట్ మాజీ వైస్ చైర్మన్ సద్ది పుల్లారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కేవీ రెడ్డి, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు కొల్లా ఉదయభాస్కర్, నాయకులు పమిడి కొండయ్య, అమరా వెంకటేశ్వర్లు, దుగ్గిరాల రామస్వామి, అమరా పద్దయ్య, అమరా నారాయణ, తదితరులు పాల్గొన్నారు. పేదలందరికీ న్యాయం జగనన్నతోనే సాధ్యం వచ్చే ఎన్నికల్లో జగనన్నను మళ్లీ సీఎంను చేసుకుందాం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి -
పోస్టల్ అండ్ పెన్షనర్ల అసోసియేషన్ నిరసన
ఒంగోలు వన్టౌన్: ఆలిండియా పోస్టల్ అండ్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ఒంగోలులోని హెడ్పోస్టాఫీసు ఎదురుగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఉద్యోగ విరమణ చేసిన వారి హక్కులను దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం విధివిధానాలు రూపొందిస్తోందన్నారు. ప్రస్తుతం–భవిష్యత్తులో ఉద్యోగ విరమణ చేసిన వారి మధ్య వివక్షత లేకుండా న్యాయం చేయాలన్నారు. అన్ని పెన్షన్దారులకు 8వ వేతన కమిషన్ ప్రయోజనాలను సమానంగా పొడిగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీహెచ్క్యూ ఉపాధ్యక్షుడు డి.మోహనరావు, రాష్ట్ర డిప్యూటీ జనరల్ కార్యదర్శి కె.వెంకటేశ్వర్లు, కె.వీరాస్వామిరెడ్డి, పి.పేరయ్య, టి.వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రేపు జగ్జీవన్రామ్ జయంతి ఒంగోలు సబర్బన్: డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ జయంతిని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీ నిర్వహించనున్నట్లు కలెక్టర్ కార్యాలయం నుంచి గురువారం ప్రకటన విడుదల చేశారు. ఉదయం ఒంగోలు నగరంలోని నెల్లూరు బస్టాండ్ వద్ద ఉన్న జగ్జీవన్రామ్ విగ్రహానికి, అంబేడ్కర్ భవనానికి వెళ్లేదారిలో ఉన్న ఆయన కాంస్య విగ్రహానికి నివాళులర్పించనున్నట్లు తెలిపారు. అనంతరం అంబేడ్కర్ భవనంలో సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంఘ నాయకులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
లక్ష్యాల మేరకు రుణాలివ్వాలి
ఒంగోలు సబర్బన్: బీసీ, ఈబీసీ, కాపు యాక్షన్ ప్లాన్ కింద బ్యాంకులకు కేటాయించిన లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా బ్యాంకర్లను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బీసీ కార్పొరేషన్, ఇతర కార్పొరేషన్ల అధికారులు, వివిధ బ్యాంకుల అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రుణాలు మంజూరు చేసి ఆయా వర్గాల ప్రజల అభ్యున్నతికి ఆర్థిక తోడ్పాటు అందించాలని బ్యాంకర్లను కోరారు. బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీ, రెడ్డి, క్షత్రియ, కమ్మ, ఈబీసీ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, కాపు వర్గాలకు స్వయం ఉపాధి పథకాల కింద మంజూరు చేసిన వివిధ యూనిట్ల గ్రౌండింగ్ పురోగతిపై సమీక్షించి పలు సలహాలు, సూచనలు చేశారు. జిల్లాలో వీరికి సంబంధించి 1,864 యూనిట్ల మంజూరుకు సంబంధించిన దరఖాస్తులను వివిధ బ్యాంకులకు పంపడం జరిగిందన్నారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు ఈ నెల 9వ తేదీలోపు సుమారు వెయ్యి యూనిట్లు గ్రౌండింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను కలెక్టర్ ఆదేశించారు. ఈ నెల 11వ తేదీ జరిగే మహాత్మా జ్యోతీరావుపూలే జయంతి వేడుకల్లో సంబంధిత లబ్ధిదారులకు యూనిట్ల మంజూరు ఉత్తర్వులిచ్చేలా చర్యలు తీసుకోవాలని బీసీ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. ప్రతిబ్యాంకుకు ఇచ్చిన లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేసి యూనిట్లు గ్రౌండింగ్ అయ్యేలా చూడాలని ఆదేశించారు. సమావేశంలో బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం.వెంకటేశ్వరరావు, ఎల్డీఎం రమేష్, బ్యాంకర్లు పాల్గొన్నారు. ప్రజల అభ్యున్నతికి పాటుపడాలి బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా -
ప్రీ స్కూళ్ల బలోపేతానికి కృషి చేయాలి
ఒంగోలు సిటీ: అంగన్వాడీలపై పనిభారం తగ్గించి ప్రీ స్కూళ్ల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేయాలని అంగన్వాడీల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నపూర్ణ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల సెక్టార్ లీడర్లు మూడు సంవత్సరాల క్రితం వారికిచ్చిన ఫోన్లు పనిచేయని కారణంగా గురువారం ఒంగోలులోని ఐసీడీఎస్ పీడీ ఆఫీసులో రిటర్న్ చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ మాట్లాడుతూ ప్రభుత్వం నిన్న బీఎస్ 2.0 వర్షన్ యాప్ విడుదల చేసిందని, ఆ యాప్లో ఉదయం 9 గంటలకు, సాయంత్రం నాలుగు గంటలకు అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ ఫేస్ రికగ్నైజేషన్ చేయాలనడం ఇబ్బందిగా ఉందని అన్నారు. 11 రకాల రిజిస్టర్ రిపోర్ట్స్ ఆ యాప్లో రాయమనడం, ఉదయం 9 గంటలకి ఎంతమంది పిల్లలుంటే అంతమందికే ఫుడ్ పెట్టాలనడంతో అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో ఏడు ప్రాజెక్టులు గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయని, అటవీ ప్రాంతంలో ఉన్నాయని, అక్కడ సిగ్నల్స్ ఉండవని తెలిపారు. సిగ్నల్స్ లేకపోతే ఫేస్ రికగ్నైజేషన్ కాదని, దానివలన అంగన్వాడీల జీతం కట్ చేసే పరిస్థితి ఉందని అన్నారు. వీటిద్వారా అంగన్వాడీలను నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. పనిచేయడానికి తాము వ్యతిరేకం కాదని, 5జీ ట్యాబులిస్తే పనిచేస్తామని తెలిపారు. పనిచేయని ఫోన్లను వెనక్కి ఇచ్చేయమని, సొంత ఫోన్లలో పనిచేయవద్దని కమిషనర్ చెప్పారన్నారు. జిల్లాలో 80 నుంచి 90 శాతం అంగన్వాడీలు సొంత ఫోన్లలో పనిచేస్తున్నారన్నారు. ఆఫీస్ ఫోన్లు మా దగ్గర ఉంటే.. అధికారులు సొంత ఫోన్లోనైనా పనిచేయండని చెప్పి బెదిరిస్తున్నారన్నారు. అందుకే ఆఫీస్ ఫోన్లు ఆఫీస్కి ఇచ్చామని, ఈ ఫోన్లలో పనిచేయడం సాధ్యమేనా అని నిపుణులతో ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. అంగన్వాడీలకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా కనీస వేతనాలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి, అంగన్వాడీల సంఘ గౌరవాధ్యక్షుడు ఎం.రమేష్, సీఐటీయూ జిల్లా నాయకుడు మాలకొండయ్య, అన్ని ప్రాజెక్టుల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. అంగన్వాడీలపై పనిభారం తగ్గించాలి అంగన్వాడీల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నపూర్ణ -
ఏడు రోజులుగా ఆకలి కేకలు
గిద్దలూరు మండలంలోని వెంకటాపురం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండిపెట్టడం మానేసి ఏడు రోజులైంది. పాఠశాలలోని 66 మంది విద్యార్థులు రోజూ ఇంటి నుంచి క్యారేజీ తెచ్చుకుని తింటున్నారు. కూటమి అధికారం చేపట్టిన తర్వాత కుకింగ్ ఏజెన్సీ నిర్వాహకులను తొలగించి తమకు అనుకూలంగా ఉన్న వారిని నియమించేందుకు వేసిన ఎత్తుగడ.. విద్యార్థులకు ఆకలి బాధలు తెచ్చిపెట్టింది. ఈ పాఠశాలలోని ముగ్గురు వంట మనుషుల్లో వెంకటలక్ష్మమ్మను ఉద్యోగం నుంచి తొలగించారు. మిగిలిన ఇద్దరు కుమారి, రంగలక్ష్మమ్మ ఆరోగ్యం బాగోలేదని పాఠశాలకు రావడం లేదు. దీంతో పేద విద్యార్థులకు ఆకలి బాధలు తప్పడం లేదు. -
లోకేష్ పర్యటనలో ఏరులై పారిన మద్యం
పీసీపల్లి: మండల పరిధిలోని దివాకరపల్లి గ్రామంలో కంప్రెస్డ్ బయో గ్యాస్ప్లాంట్ భూమి పూజకు మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. అయితే లోకేష్ పర్యటన సందర్భంగా స్థానిక నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. కార్యక్రమానికి ఎవ్వరూ రారన్న ఉద్దేశంతో మద్యాన్ని ఏరులై పారించారు. ఇక మహిళలను కార్యక్రమానికి తరలించేందుకు నానా పాట్లు పడ్డారు. కార్యక్రమానికి వస్తే డ్వాక్రా మహిళలకు రాయితీ రుణాలిస్తామని మభ్యపెట్టారు. ఉపాధి కూలీలు పనికి వెళ్లకుండా కార్యక్రమానికి వస్తే మస్టర్ వేస్తామని నమ్మబలికారు. తీరా కార్యక్రమం ప్లాంట్ శంకుస్థాపన అని తెలియడంతో డ్వాక్రా మహిళలు మండిపడ్డారు. రాయితీ రుణాలంటే ఇక్కడకు వచ్చామని, లేదంటే ఈ కొండల్లో మాకేంటి పనంటూ రుసరుసలాడుతూ అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఇక విచ్చలవడిగా మద్యం సరఫరా చేయడంతో మందుబాబులు తాగి సభా ప్రాంగణంలోనే పడిపోయారు. కార్యక్రమానికి ప్రజలను తరలించేందుకు స్కూల్, కాలేజీ బస్సులను వినియోగించారు. అయితే చాలా వాహనాలు ప్రజలు లేకుండానే వచ్చాయి. -
దొడ్డు బియ్యం.. తినలేకపోతున్నాం
‘రోజూ లావు బియ్యంతో అన్నం పెడుతున్నారు. అది తినలేకపోతున్నాం. మంచి నీళ్లకు చాలా ఇబ్బంది పడుతున్నాం. హాస్టల్ బిల్డింగ్ కూడా బాగోలేదు’ అని కనిగిరి బీసీ గురుకులం విద్యార్థులు రాష్ట్ర మంత్రులు ఎస్. సవి, ఆనం రామనారయణరెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. మార్చి 8వ తేదీన కనిగిరి వచ్చిన ఇద్దరు మంత్రులు.. ఇక్కడి మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేశారు. మెనూ, ఇతర వసతుల గురించి ఆరా తీస్తున్న సమయంలో విద్యార్థులు తమ అవస్థలను తెలియజేశారు. వచ్చే ఏడాది నుంచి వసతి గృహాలకు బీపీటీ బియ్యాన్ని అందజేస్తామని పొడిపొడిగా మాట్లాడి మంత్రి సవిత వెళ్లిపోగా.. ఇక్కడి పరిస్థితిలో ఏమాత్రం మార్పులేదు. -
ముక్కిన బియ్యం.. మురిగిన గుడ్లు
మార్కాపురం పట్టణంలోని తర్లుపాడు రోడ్డులో ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహం నిర్వహణలో డొల్లతనం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ పరిశీలనలో బట్టబయలైన సంఘటన ఇది. హాస్టల్లో విద్యార్థులకు పెడుతున్న అన్నంలో పురుగులు వస్తున్నాయని, నాణ్యత లేదని సబ్ కలెక్టర్కు ఫిర్యాదు అందడంతో మార్చి 17వ తేదీ రాత్రి బాలికల హాస్టల్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్లో నాసిరకంగా ఉన్న కూరగాయలు, బియ్యం, మురిగిన కోడిగుడ్లను పరిశీలించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పిల్లలకూ ఇలాగే అన్నం పెడతారా అంటూ తీవ్ర స్వరంతో మందలించారు. -
అమరజీవి అంటే అంత నిర్లక్ష్యమా లోకేష్?
ఒంగోలు టౌన్: పొట్టి శ్రీరాములు పుట్టిన ఊరు పడమటిపల్లికు పది కిలోమీటర్ల దూరంలో రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి వచ్చిన విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అమరజీవి గురించి మాటమాత్రంగానైనా ప్రస్తావించకపోవడం అమరజీవి పట్ల ఆయన నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని అమరజీవి పొట్టి శ్రీరాములు అభిమాన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పేరకం నాగాంజనేయులు బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు. యువగళం యాత్ర సందర్భంగా కూడా అలవపాడు వరకు పాదయాత్ర చేశారని, పొట్టి శ్రీరాములు కోసం మరో పది కిలోమీటర్లు పాదయాత్ర చేయకపోవడం బాధాకరమన్నారు. 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు జిల్లాగా నామకరణం చేసి ఆ మహనీయుడి త్యాగాలను గౌరవించారని తెలిపారు. అలాగే 2014లో నాటి చంద్రబాబు ప్రభుత్వం మార్చిన రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని 2019లో వైఎస్ జగన్ మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన వెంటనే నవంబర్ 1వ తేదీకి మార్చి పొట్టిశ్రీరాములు పట్ల గౌరవాన్ని చాటుకున్నారని తెలిపారు. డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు వారసులను సన్మానించే సమయంలో మారెళ్ల ఆసుపత్రిని బాగు చేయిస్తామని చెప్పారని, నేటికి నాలుగు నెలలు గడిచినా హాస్పిటల్ భవనానికి కనీసం సున్నం కూడా కొట్టలేదన్నారు. అతిగా మద్యం తాగి వ్యక్తి మృతి మార్కాపురం టౌన్: అతిగా మద్యం తాగి అనారోగ్యానికి గురై వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..పట్టణంలోని వడ్డె బజారుకు చెందిన కుంచాల ఆంజనేయులు(35) వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ఇంట్లోనే మద్యం తాగాడు. రాత్రి సమయంలో తీవ్రమైన కడుపునొప్పిరావడంతో కుటుంబసభ్యులు వైద్యశాలకు తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందాడు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై సైదుబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వ్యక్తి అనుమానాస్పద మృతి ముండ్లమూరు(కురిచేడు): మండలంలోని చంద్రగిరి సమీపంలోని శ్రీరామ్ డెయిరీ వద్ద గేటు పక్కన రోడ్ మార్జిన్లో ఉన్న నీటి కాలువలో పడి వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. తాళ్లూరు మండలం విఠలాపురం గ్రామానికి చెందిన మహేష్బాబు(37) ఆదివారం ఉగాది పండుగ రోజున ముండ్లమూరులోని తన సోదరుడు హనుమంతరావు ఇంటికి వచ్చాడు. భోజనం చేసి తిరిగి విఠలాపురం వెళుతూ చంద్రగిరి సమీపంలోని సైడ్కాలువలో పడి మృతిచెందాడు. నీరు ఎక్కువగా ఉండటంతో మృతదేహం కనిపించలేదు. నీరు తగ్గిన తరువాత మృతదేహం బయటపడటంతో ఆ రోడ్డున వెళ్లే వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై నాగరాజు సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహం వద్ద ఆనవాళ్లు పరిశీలించగా మృతుడు విఠలాపురం గ్రామానికి చెందిన మహేష్బాబుగా నిర్ధారించారు. మృతుని తల్లి ఘటనా స్థలానికి వచ్చి తన కుమారుడేనని నిర్ధారించి బోరున విలపించింది. పోస్టుమార్టం అనంతరంమృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగిస్తామని ఎస్సై తెలిపారు. -
ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి
పొన్నలూరు: ప్రమాదవశాత్తు అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడటంతో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని ముత్తరాసుపాలెం, ముప్పాళ్ల రోడ్డు మార్గంలో బుధవారం జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాలు మేరకు..ముత్తరాసుపాలెం గ్రామానికి చెందిన సర్వేపల్లి వెంకయ్య(50) సర్వేపల్లి వెంకట్రావు, లేతవడ్ల రామకృష్ణ ముప్పాళ్ల సమీపంలోని పాలేరులో ఇసుక లోడుకి ట్రాక్టర్లో బయలుదేరారు. రామకృష్ణ ట్రాక్టర్ నడుపుతుండగా మిగిలిన ఇద్దరు అతని పక్కనే ఇంజన్లో కూర్చున్నారు. ఈ క్రమంలో కొంత దూరం వెళ్లిన తరువాత మార్గమధ్యలో ఒక్కసారిగా ట్రాక్టర్ అదుపుతప్పి పక్కనే ఉన్న గుంతలోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ట్రాక్టర్ ఇంజన్లో కూర్చున్న వెంకయ్య భయపడి కిందకు దూకడంతో తారు రోడ్డుపై పడి తలకి బలమైన గాయం కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. అలాగే రామకృష్ణ, వెంకట్రావులు గుంతలో పడిపోవడంతో స్వల్ప గాయాలయ్యాయి. దీంతో అటుగా వెళ్తున్న ప్రయాణికులు గమనించి 108కి సమాచరం ఇవ్వడంతో వారు వచ్చి క్షతగాత్రులను చికిత్స కోసం కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. అలాగే వెంకయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. మద్యం మత్తులో ట్రాక్టర్ను నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ మేరకు ఎస్సై అనూక్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యార్థులు అర్ధాకలితో అల్లాడుతున్నారు
వసతి గృహాలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు కావడం లేదు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నాణ్యత పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. మోడల్ స్కూల్, జ్యోతిరావు పూలే బీసీ గురుకుల బాలకల పాఠశాలలో భోజనం బాగోలేదని మంత్రి ఎదుటే విద్యార్థులు మొరపెట్టుకున్నారు. అయినా విద్యాశాఖ అధికారుల్లో చలనం లేకపోవడం బాధాకరం. పేద పిల్లలు చదువుకునే పాఠశాలలపై ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి. – సీహెచ్ పవన్కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు -
విద్యార్థుల కూడు గోడుకు ఇవిగో సాక్ష్యాలు
రోజూ నీళ్ల చారే ‘ఏపీ మోడల్’ పెద్దదోర్నాల మండల పరిధిలోని మోట్ల మల్లికార్జునాపురంలోని ఏపీ మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ వసతి గృహ విద్యార్థినులు 100 మంది భోజనంతో పాటు వసతి సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తీరు ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అందిన సమాచారంతో పాఠశాలను తనిఖీ చేయగా.. బాలికలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు. ప్రిన్సిపాల్ ఏది చెబితే అదే వండుతున్నానని పార్ట్ టైమ్ వార్డెన్ చెప్పగా.. మెనూలో వంటకాలపై ప్రిన్సిపాల్ నీళ్లు నమిలారు. ఈ విషయంపై ‘సాక్షి’లో కథనం రావడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఎవరూ ప్రశ్నించకుంటే వారికి రోజూ నీళ్ల చారే గతి! మెనూకు మంగళం ‘మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదు సార్. అడిగితే ఏమంటారోనని భయం. రోజూ ఆకలి బాధతో అల్లాడిపోతున్నాం’ ఇదీ ఒంగోలులోని దివ్యాంగుల హాస్టల్ విద్యార్థుల ఆవేదన. ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన ఒంగోలు పర్యటనకు వచ్చిన విభిన్న ప్రతిభావంతుల ఆ శాఖ డైరెక్టర్కు మెనూ అమలు కావడం లేదని ఫిర్యాదు చేయడంతో ఆయన విచారణకు ఆదేశించారు. దివ్యాంగులకు సరైన మౌలిక వసతులు కల్పించడంతోపాటు పోషకాహారం అందించాల్సిన ప్రభుత్వం అది తమ పనికాదన్నట్టుగా వ్యవహరిస్తోందనడానికి ఈ సంఘటనే నిదర్శనం. -
లోకేష్..ఇచ్చిన మాట నిలుపుకో
ఒంగోలు టౌన్: అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే కోర్టు కేసులను పరిష్కరించి కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని యువగళంలో మాట ఇచ్చిన లోకేష్ అధికారంలోకి వచ్చి 10 నెలలవుతున్నా మాట నిలుపుకోలేదని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కె.బాబు విమర్శించారు. ఎల్బీజీ భవనంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వమని సొంత డబ్బా కొట్టుకుంటే లాభం లేదని, నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలుపుకుంటూ ఉద్యోగాలు ఇచ్చినప్పడే మంచి ప్రభుత్వం అవుతుందని చెప్పారు. తమ సొంత ప్రయోజనాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసి సుప్రీం కోర్టు లాయర్లను పెట్టుకునే నాయకులు నిరుద్యోగుల కోసం మాత్రం ఒక లాయర్ను పెట్టడానికి తగిన చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. తక్షణమే కోర్టులో ఉన్న కేసును త్వరితగతిన పరిష్కరించి కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కానిస్టేబుల్ అభ్యర్థులకు మెయిన్ పరీక్షల తేదీని ప్రకటించాలని కోరారు. కూటమి ప్రభుత్వం కానిస్టేబుల్ అభ్యర్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. వీలైనంత త్వరగా కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీని చేపట్టకుంటే చలో విజయవాడ పేరుతో నిరసన కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో పి.కిరణ్, పి.రాంబాబు పాల్గొన్నారు. -
12వ పీఆర్సీకి కమిషన్ను నియమించాలి
ఒంగోలు సిటీ: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రతి ఐదేళ్లకు ఒకసారి వేతన సవరణ జరుగుతుందని, 11వ వేతన సవరణ ముగిసి 21 నెలల అయినా 12వ వేతన సవరణ కమిషన్ వేయకపోవడంతో ఉద్యోగుల్లో నిరాశ నెలకొందని ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ సభ్యులు చెన్నుపాటి మంజుల అన్నారు. 30 శాతం ఐఆర్ ప్రకటించి, 12వ వేతన సవరణ కమిషన్ ను తక్షణమే నియమించాలని కోరుతూ ఫ్యాప్టో జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఒంగోలులో కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం జిల్లా ఫ్యాప్టో చైర్మన్ కే.ఎర్రయ్య అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ సభ్యులు చెన్నుపాటి మంజుల మాట్లాడుతూ సీపీఎస్, జీపీఎస్ లను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాలని, 2003 డీఎస్సీ వారికి కేంద్ర ప్రభుత్వ మెమో 57 ద్వారా పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాలని కోరారు. 11వ పీఆర్సీ బకాయిలు, డీఏ, సరెండర్ లీవ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ను తక్షణమే చెల్లించాలన్నారు. 70 ఏళ్ల వయస్సు దాటిన పెన్షనర్లకు 10 శాతం, 75 ఏళ్లు దాటిన వారికి 15 శాతం అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ అమలు చేయాలన్నారు. పంచాయతీ రాజ్ యాజమాన్యంలో కారుణ్య నియామకాలు తక్షణమే చేపట్టాలని, ప్రభుత్వ పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీసు రూల్స్ కు సంబంధించిన 72 ,73 ,74 జీవోలను అమలు చేయాలని కోరారు. 117 జీవోను రద్దుచేసి ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని కూడా అమలు చేయాలని, ఉపాధ్యాయుల పదోన్నతుల సీనియర్ జాబితాలో ఉన్న తప్పుల తడకలు సవరించి మెరిట్ కం రోస్టర్ ప్రకారం రీ ఆర్గనైజ్ చేయాలన్నారు. బదిలీలకు సంబంధించి బాలికలు ఉన్న పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులను మాత్రమే నియమించాలని, 50 సంవత్సరాలు అనే నిబంధన తొలగించి ఉన్న వారిని కూడా బదిలీ చేయాలని, మెడికల్ రియింబర్స్మెంట్ బిల్లులను సత్వరమే పరిష్కరించాలని కోరారు. జెడ్పీ పీఎఫ్ లోన్స్, క్లోజర్స్ విషయంలో సీఎఫ్ఎంఎస్ పంపించడంలో ఉన్న జాప్యాన్ని తొలగించాలన్నారు. ఎస్ఎస్సీ స్పాట్ నుంచి 60 ఏళ్ల వయసు దాటిన వారికి ఆర్డర్స్ పంపారని, అలాంటి వారిని సంబంధిత హెడ్మాస్టర్ రిలీవ్ చేయరాదని తగిన ఆదేశాలు ఇవ్వాలన్నారు. కార్యక్రమానికి ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ ఎస్.ఎం.డి.రఫి, ఫ్యాప్టో ప్రకాశం జిల్లా నాయకులు వి.మాధవరావు, డి.జయరావు, వై.వెంకట్రావు, ఎస్.కె.అబ్దుల్ హై, వి.జనార్దన్ రెడ్డి, బి. వెంకట్రావు, రాష్ట్ర సంఘ బాధ్యులు కే.శ్రీనివాసరావు, చల్లా శ్రీనివాసులు, పి.వెంకట్రావు, జీవీకే కీర్తి తదితరులు పాల్గొన్నారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన తమ సమస్యలుపరిష్కరించాలని డిమాండ్ -
జీవితాంతం నమ్మరు
చంద్రబాబును ముస్లింలుఒంగోలు టౌన్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అప్రజాస్వామిక వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబును ముస్లింలు జీవితకాలంలో ఎప్పుడూ నమ్మరని, భారతదేశ ముస్లింల దృష్టిలో చంద్రబాబు దోషిగా నిలబడక తప్పదని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర నాయకుడు షేక్ అబ్దుల్ సత్తార్ స్పష్టం చేశారు. స్థానిక దక్షిణ బైపాస్లో చౌరస్తాలో బుధవారం పార్టీ నాయకులతో కలిసి నిరసన ప్రదర్శన చేపట్టిన ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్త పిలుపులో భాగంగా వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా విజయవాడ ధర్నా చౌక్లో నిరసన చేస్తున్న తనతో పాటు తమ పార్టీ ప్రకాశం, నెల్లూరు జిల్లాల నాయకులను పోలీసులు అరెస్టు పేరుతో వాహనంలోకి ఎక్కించి జిల్లా సరిహద్దుల వరకు తీసుకొచ్చి విడిచిపెట్టారని తెలిపారు. పోలీసు చర్య అప్రజాస్వామికమని విమర్శించారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం ప్రజా సంఘాలు నిరసన తెలియజేసినా, వాట్సప్ల ద్వారా 5 కోట్ల మంది ముస్లింలు వ్యతిరేకించినా నిరంకుశంగా వక్ఫ్ సవరణ బిల్లును కేంద్రం ప్రవేశ పెట్టిందన్నారు. ఈ నల్లబిల్లును దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకించడమే కాకుండా ముస్లింలకు అండగా నిలబడతామని ప్రకటించగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం సవరణల పేరుతో ముస్లింల కళ్లు గప్పి బిల్లుకు మద్దతు తెలపడం సిగ్గుచేటన్నారు. వక్ఫ్ బిల్లు విషయంలో చివరి నిముషం వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వైఖరి ప్రకటించకుండా దాగుడు మూతలు ఆడిందన్నారు. వక్ఫ్ బిల్లుకు సవరణలు రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. కూటమి ప్రభుత్వంపై ముస్లింలకు నమ్మకాలు సన్నగిల్లాయన్నారు. కార్యక్రమంలో ఎస్డీపీఐ రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ గని, జిల్లా ప్రధాన కార్యదర్శి మలానా అసద్, జిల్లా నాయకులు పఠాన్ ఖాజా వలి, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, జిల్లా నాయకుడు ఫాజిల్ పాల్గొన్నారు. -
ఎయిడెడ్ పాఠశాలల సమాచారం ఇవ్వండి
ఒంగోలు సిటీ: జిల్లాలో ప్రస్తుతం పనిచేస్తున్న 94 ఎయిడెడ్ పాఠశాలల పూర్తి సమాచారం డాక్యుమెంట్లతో సహా 12 పేజీలు మూడు సెట్లు డీఈఓ కార్యాలయానికి ఇవ్వాలని ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే వెంకటరావు, ప్రభాకర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల వివరాలు, పాఠశాల గుర్తింపు, పాఠశాల కమిటీ వివరాలు, పాఠశాల మూడేళ్ల ఆడిట్ రిపోర్ట్ పాఠశాల వసతుల అన్ని వివరాలతో యాజమాన్యాలు బుక్లెట్ తయారుచేసి పంపాలని విద్యాశాఖ డైరెక్టర్ తెలిపినట్లు చెప్పారు. నేటి నుంచి ఎస్ఎస్సీ స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభం ఒంగోలు సిటీ: ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల స్పాట్ వాల్యూయేషన్ ఒంగోలులోని డీఆర్ఆర్ మున్సిపల్ హైస్కూల్లో గురువారం నుంచి ప్రారంభమవుతుందని డీఈఓ ఎ.కిరణ్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోషల్ సబ్జెక్టుకు సంబంధించిన మూల్యాంకనం 4వ తేదీ నుంచి ప్రారంభమవుతుందన్నారు. సోషల్ సబ్జెక్టునకు సంబంధించిన ఉపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించి శుక్రవారం ఉదయం 8 గంటలకు స్పాట్ వాల్యూయేషన్ క్యాంపునకు హాజరుకావాల్సిందిగా కోరారు. రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు చీమకుర్తి క్రీడాకారులు చీమకుర్తి: రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు చీమకుర్తి క్రీడాకారులు ఎంపికయ్యారని కోచ్ కరిచేటి వెంకట్ బుధవారం తెలిపారు. చీమకుర్తి గెలాక్సీ స్పోర్ట్స్ క్లబ్కు చెందిన ఆరికాటి సూర్యతేజ, గూండా వెంకట సుకుమార్ ఎంపికయ్యారన్నారు. ఈనెల 6వ తేదీ నుంచి 9 వరకు సత్యసాయి జిల్లా ధర్మవరంలో జరగనున్న రాష్ట్ర స్థాయి జూనియర్ హాకీ పోటీల్లో వారు పాల్గొంటారని చెప్పారు. ఈ సందర్భంగా పోటీలకు ఎంపికై న క్రీడాకారులను కోచ్తో పాటు వారి తల్లిదండ్రులు అభినందించారు. 9లోపు సీనియారిటీ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ ఒంగోలు సిటీ: జిల్లా విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల కింద పనిచేస్తున్న ఉపాధ్యాయుల సబ్జెక్టు వారీగా సీనియారిటీ జాబితాకు సంబంధించిన అభ్యంతరాలను ఈ నెల 9వ తేదీ లోపల జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలని డీఈఓ ఎ.కిరణ్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీనియారిటీ జాబితాను ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ (టీఐఎస్) ఆధారంగా రూపొందించామన్నారు. ఈ జాబితాలు జిల్లా విద్యాశాఖ వెబ్సైట్ www.prakasamschooledu.com లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అభ్యంతరాల సమర్పణకు అవసరమైన వివరాలను అభ్యంతరం చేసే ఉపాధ్యాయుడి పూర్తి పేరు, పదవి, సంబంధిత వివరాలు, సీనియారిటీ జాబితాలో తప్పిదం ఎక్కడ ఉందో స్పష్టంగా పేర్కొనాలన్నారు. ఆధారాలు లేదా సాక్ష్యాలు ఉంటే జత చేయాలని, సంబంధిత అధికారి ధ్రువీకరణతో సమర్పించాలన్నారు. ఫిర్యాదుల పరిష్కార కమిటీ అభ్యంతరాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకొని ప్రధానోపాధ్యాయులు/ఉపాధ్యాయులకు తెలియజేస్తారన్నారు. -
పది నెలల్లో జిల్లాకు ఏం చేశారో చెప్పండి
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా కనిగిరిలో సీబీజీ ప్లాంట్ శంకుస్థాపన సభకు హాజరైన మంత్రి లోకేష్, ఈ సందర్భంగా నిర్వహించిన సభలో చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. గడిచిన 10 నెలలుగా ప్రకాశం జిల్లాకి ఏం చేశారో చెప్పుకోలేని దుస్థితిలో ఉన్న ప్రభుత్వం, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రశ్నించిన వారిపై రెడ్ బుక్ పేరుతో బెదిరింపులకు దిగుతోందని మండిపడ్డారు. బుధవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. శ్ఙ్రీమార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించిన తర్వాతే జిల్లాలో అడుగుపెడతామన్నారు. నెల్లూరు జిల్లాలో ఉన్న కందుకూరును ప్రకాశం జిల్లాలో కలుపుతామన్నారు. దాన్ని ఇంతవరకు పట్టించుకోలేదు. వెలిగొండ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా ప్రాజెక్టు కోసం తట్టెడు మట్టి ఎత్తలేదు. ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు కూడా కేటాయించలేదు. ఇటీవలే జిల్లాకు వచ్చిన సీఎం చంద్రబాబు ప్రాజెక్టును కూడా సందర్శించడానికి ధైర్యం చేయలేక వెళ్లిపోయారు. ఇద్దరు మంత్రులుండీ వెలిగొండ ప్రాజెక్టు లైనింగ్ పనులు చేపట్టలేదు. జిల్లాకు ఏమీ చేయలేకపోయారు. లోకేష్ మాటలు వింటుంటే ఆయనకు జిల్లాపై కనీస అవగాహన లేదని స్పష్టంగా అర్థమవుతోంది. జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు మంచి చేస్తామని చెప్పే మంత్రులను చూశాం కానీ, మాట్లాడితే కేసులు పెడతామని హెచ్చరించే మంత్రిగా లోకేష్నే చూస్తున్నాం. లోకేష్ రెడ్బుక్ కి ఎవరూ భయపడేది లేదు. ఇటీవల స్థానిక సంస్థలకు నిర్వహించిన ఉప ఎన్నికలతో ఆ విషయం లోకేష్కి అర్థమయ్యే ఉంటుంది. వైఎస్సార్ సీపీ హయాంలో ప్రకాశం జిల్లా అభివృద్ధి పరుగులు: ‘‘ప్రకాశం జిల్లాకు వైఎస్సార్ సీపీ ఏం చేసిందని లోకేష్ ప్రశ్నిస్తున్నాడు.. మార్కాపురం మెడికల్ కాలేజీ నిర్మాణానికి రూ.475 కోట్లు కేటాయించింది. పాల శీతలీకరణ కోసం 161 సెంటర్లు ఏర్పాటు చేశాం. 591 సచివాలయాలు, 593 ఆర్బీకే సెంటర్లు, దాదాపు 1992 బడులను నాడు–నేడు కింద ఆధునికీకరించాం. 228 డిజిటల్ లైబ్రరీలు, 492 హెల్త్ సెంటర్లు, రెండు అగ్రి ల్యాబ్లు వైఎస్సార్ సీపీ హయాంలోనే ఏర్పాటు చేశాం. వీటన్నింటికీ జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.2 వేల కోట్లకుపైగా కేటాయించగా, ఒక్క వెలిగొండ ప్రాజెక్టు కోసమే ఏకంగా రూ.10 వేల కోట్లు కేటాయించారు. రామాయపట్నం పోర్టును వైఎస్సార్ సీపీ హయాంలోనే మొదలుపెట్టి దాదాపు 50 శాతం పనులు పూర్తి చేశారు. జిల్లాకు మెడికల్ కాలేజీ వచ్చిందంటే అదీ వైఎస్సార్ సీపీ హయాంలోనే. మర్డర్లు, మానభంగాలు చేసిన వారంతా టీడీపీలో ఉంచుకుని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వైఎస్సార్ సీపీ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళలకు రక్షణ లేకుండా పోయింది. రోజుకు 70 మంది మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని వారే ఒప్పుకున్నారు. ఆధారాలు లేకుండా అవాకులు చవాకలు పేలడం మానుకోవాలి. వెనుకబడిన ప్రకాశం జిల్లా మీద ప్రభుత్వం కరుణ చూపించాలి. ప్రజాప్రతినిధులుగా బాధ్యతగా మెలగాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీల విషయంలో చిత్తశుద్ధితో పనిచేయాలి. కేవలం పది నెలల పాలనతోనే కూటమి ప్రభుత్వం దారుణమైన ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుంది. వ్యవసాయం భారమైంది. గ్రామాల్లో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. టీడీపీ నాయకులను తొందర్లోనే వెంటబడి తరిమి కొట్టే రోజులు రాబోతున్నాయి. గతంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు జిల్లాకు ఏం చేశాడో చర్చకు సిద్ధమా?’’ అని తాటిపర్తి ప్రశ్నించారు. ఏం చేశారో చెప్పుకోలేకనే రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు వెలిగొండ ప్రాజెక్టులో తట్ట మట్టినైనా తీశారా? ఇద్దరు మంత్రులుండీ ఉమ్మడి జిల్లాకు చేసింది శూన్యం జిల్లాపై మంత్రి లోకేష్కి కనీస అవగాహన లేదు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజం -
ఐసీయూలో..
పేరుకే పెద్దాసుపత్రి.. జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది రోగులు ఇక్కడకు వచ్చి వెళ్తుంటారు.. ఎప్పుడు చూసినా రద్దీగా ఉంటుంది. రోడ్డు ప్రమాదాలు, పాయిజన్ కేసులు, ఎంల్సీ వంటి అత్యవసర కేసులు సైతం పెద్ద ఎత్తున వస్తుంటాయి. ఇక్కడ స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత వేధిస్తోంది. చిన్న చిన్న కేసులు తప్పించి మిగతా కేసులను గుంటూరుకు తరలించి చేతులు దులుపుకుంటున్నారు. అత్యవసర వైద్య విభాగం ఎక్కడో కనిపించదు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో అత్యవసర వైద్యం ఐసీయూ మంచమెక్కింది. సర్వజన వైద్యంఒంగోలు టౌన్: రిమ్స్.. వేలాది మంది రోగులకు వైద్య సేవలు అందించే జిల్లా ఆసుపత్రి. వందలాది మంది వైద్య విద్యార్థులను తీర్చిదిద్దే బోధనాసుపత్రి. అయినా ఇక్కడ సూపర్ స్పెషాలిటీ సేవలు అందని ద్రాక్షగా మిగిలిపోతున్నాయి. న్యూరాలజిస్టు లేకుండానే సదరం సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. ఒక్కరే కార్డియాలజిస్టు ఉండడంతో ఆయన సెలవు పెడితే వైద్య సేవలు ఆగిపోతున్నాయి. లేజర్ చికిత్స లేక కిడ్నీ రోగులు పాట్లు పడుతున్నారు. ఒంగోలు దక్షిణ, ఉత్తర బైపాస్ ల మీద తరచుగా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇక్కడ ట్రామా సెంటర్ కనిపించదు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత సమస్యలతో జీజీహెచ్ సతమతమవుతోంది. పేరుకు అనేక మంది వైద్యులున్నప్పటికీ వైద్య సేవల విషయంలో పాలకుల కొండంత నిర్లక్ష్యం కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వాస్పత్రిలో వైద్య సేవలు సక్రమంగా అందడం లేదని విమర్శలు వస్తున్నాయి. వైద్య సేవలకంటే రాజకీయాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో రోగుల పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రైవేటు వైద్యశాలలకు వెళ్లి వందల రుపాయల ఓపీ ఫీజులు, వేల రూపాయల రక్త పరీక్షల చేయించే స్థోమత లేని వాళ్లే ఇక్కడకు వైద్య చికిత్స కోసం వస్తుంటారు. ఎంతో ఆశతో ఆస్పత్రికి వచ్చిన రోగులు వైద్యుల నిర్లక్ష్యంతో అవస్థలు పడుతున్నారు. గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని వాపోతున్నారు. న్యూరాలజిస్టు లేకుండానే సదరం సర్టిఫికెట్లు... ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో సదరంకు వచ్చే వికలాంగుల ఆరోగ్య పరిస్థితిని న్యూరాలజిస్టులు నిర్ధారించాల్సి ఉంటుంది. న్యూరాలజిస్టు లేకుండానే సదరం సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. కాదు కూడదంటే గుంటూరుకు వెళ్లండి. నెల్లూరుకు వెళ్లండని సలహా ఇస్తున్నారు. ఆ మధ్య కందుకూరు నుంచి ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు అనారోగ్యంతో మాట కోల్పోయారు. ఆయన ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే సదరం సర్టిఫెకెట్ జారీ చేశారు. కానీ అధికారులు ఆ సర్టిఫికెట్ చెల్లదని తిరస్కరించారు. న్యూరాలజిస్టు మాత్రమే సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పారు. దాంతో వారు అవస్థలు పడుతూ గుంటూరు వెళ్లి సదరం సర్టిఫికెట్ తీసుకోవాల్సి వచ్చింది. ఇలాంటి ఘటనలు నిత్యం రిమ్స్లో దర్శనమిన్తూనే ఉంటాయి. నిరుపేదలు చాలా ఇబ్బందులు పడుతున్నా ఇక్కడ పాలకులకు చీమకుట్టినట్టయినా లేదు. అంతే కాకుండా ఇటీవల పక్షవాతం కేసులు ఎక్కువై పోయాయి. చికిత్స కోసం జీజీహెచ్కు వస్తే గుంటూరుకు పంపిస్తున్నారు. నిజానికి పక్షవాతం కేసుల్లో తొలి గంటలోపు చికిత్స చేయాల్సి ఉంటుంది. దాన్ని గోల్డెన్ అవర్ అంటారు. ఇక్కడ నుంచి గుంటూరు వెళ్లాలంటే కనీసం రెండున్నర గంటల సమయం పడుతుంది. దాంతో గోల్డెన్ అవర్ సమయం దాటిపోతుంది. ఆ తరువాత ఎంత చికిత్స చేసినా ఫలితం పెద్దగా ఉండదు. దీంతో రోగులు అప్పో సప్పో చేసి ప్రైవేటు వైద్యశాలలకు వెళుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఇద్దరు న్యూరో సర్జన్లు ఉన్నారు. కానీ కనీసం న్యూరో ఫిజీషియన్ లేరు. అనేక సంవత్సరాల నుంచి ఈ ఆస్పత్రిలో న్యూరో ఫిజీషియన్ పోస్టు ఖాళీగా ఉంది. కొన్నాళ్ల క్రితం ఒక న్యూరాలజిస్టును నియమించారు. ఆయన ఇక్కడ ఉండలేక సెలవు మీద వెళ్లిపోయారు. ఆ తరువాత ఆయన బదిలీ చేయించుకున్నట్లు తెలిసింది. ఆ తరువాత మరో న్యూరాలజిస్టును ప్రభుత్వం ఇక్కడ వేయలేదు. అలాగే గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు, డయాబెటాలజిస్టులు సైతం ఇక్కడ లేరు. ఒక్క కార్డియాలజిస్టుతోనే సరి... పెద్దాసుపత్రిలో ఒక కార్డియాలజిస్టు మాత్రమే ఉన్నారు. ఆయన జిల్లా స్టెమీ నోడల్ ఆఫీసర్గా కూడా చేస్తున్నారు. ఒక్కరే కార్డియాలజిస్టు ఉండడంతో పనిభారంతో అల్లాడిపోతున్నారు. ప్రతి రోజు కనీసం 50 మంది రోగులు గుండె సమస్యలతో ఆస్పత్రికి వస్తుంటారు. వారిలో రోజుకు 4 నుంచి 5 మంది ఆస్పత్రిలో అడ్మిట్ అవుతున్నారు. ఇటీవల ఆయన వ్యక్తిగత పనుల మీద వారం రోజులు సెలవు మీద వెళితే రోగులను గుంటూరు రెఫర్ చేశారు. సాధారణ కేసులైతే పర్వాలేదు. అత్యవసర కేసుల విషయంలో మాత్రం రోగులు ఎక్కడకు వెళ్లాలి. అనివార్యంగా ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీయాల్సి వస్తోందని వాపోతున్నారు. ట్రామా విభాగం ఎక్కడ ?ప్రభుత్వాస్పత్రిలో ట్రామా కేర్ విభాగం ఎక్కడుందో వెతుక్కోవాల్సి వస్తోంది. ఒంగోలు దక్షిణ, ఉత్తర బైపాస్ ల మీద తరచుగా ప్రమాదాలు జరుగుతుంటాయి. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కారు యాక్సిడెంట్లు నిత్యం జరుగుతుంటాయి. రోడ్డు ప్రమాదం జరిగిన వాళ్లను జీజీహెచ్కు తరలిస్తుంటారు. ఇక్కడ ప్రత్యేక ట్రామా విభాగం లేదు. నిజానికి ట్రామా విభాగంలో ఆరుగురు వైద్యులు, స్టాఫ్ నర్సులు 12 మంది, ఎంఎన్ఓలు 6, ఎఫ్ఎన్ఓలు 6, ఎల్టీ 3, రేడియాలజిస్టు 2, బయోమెడికల్ ఇంజినీరింగ్ ఒకరు ఉండాలి. ఈ సిబ్బంది ఎక్కడా కనిపించరు. ట్రామా కేర్ రోస్టర్ ఏమిటో తెలియదు. ట్రామా కేర్ కు ఏడాదికి ఎంత బడ్జెట్ వస్తుందో, అది ఏమైపోతుందో దేవుడికే తెలియాలి. యాక్సిడెంట్ కేసులను కూడా క్యాజువాలిటీ వైద్యంతోనే సరిపెడుతున్నారు. దాంతో రోగుల ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి. క్యాజువాలిటీలో సీనియర్ వైద్యులు ఒక్కరు కూడా సరిగా విధులు నిర్వహించడంలేదని విమర్శలు వస్తున్నాయి. మెడికోలు, జూనియర్ వైద్యులతోనే పనికానిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ అందుతున్న వైద్య సేవలపై సాక్షాత్తు కలెక్టర్ తమీమ్ అన్సారియా హెచ్చరికలు జారీ చేసినా ఖాతరు చేయడం లేదనే చెప్పాలి. స్పెషలిస్టు వైద్యం అందని ద్రాక్షే న్యూరాలజిస్టు, గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు, డయాబెటాలజిస్టులు లేరు న్యూరాలజిస్టు లేకుండానే సదరం సర్టిఫికెట్లు మంజూరు ఒక్క కార్డియాలజిస్టుతోనే సర్దుకొనిపోతున్న వైనం కనిపించని ట్రామా కేర్ విభాగం ఏదైనా సమస్య వస్తే గుంటూరుకు రెఫర్ స్పెషలిస్టు వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రులే దిక్కు -
నేడు ఫ్యాప్టో నిరసన జయప్రదం చేయండి
ఒంగోలు సిటీ: రాష్ట్ర ఫ్యాప్టో సంఘం పిలుపు మేరకు బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్ వద్ద జిల్లా ఫ్యాప్టో శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే నిరసన కార్యక్రమంలో వందలాది సంఖ్యలో జిల్లాలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్స్ పాల్గొని విజయవంతం చేయాలని ఫ్యాప్టో, ఏపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు కె.వి.జి.కీర్తి, వై.శ్రీనివాసులు, పి.వి.సుబ్బారావు మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు సంబంధించిన పీఆర్సీ, ఐఆర్, డీఏ, ససరెండర్ లీవ్స్, సీపీఎస్ ఉపాధ్యాయుల అరియర్స్ వంటి మొండి బకాయిల సాధన, విద్యారంగ సమస్యల సాధన కోసం నిరసన తెలుపుతున్నామని జిల్లా ఫ్యాప్టో డిప్యూటీ సెక్రటరీ జనరల్, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి.వెంకటరావు, ఫ్యాఫ్టో జిల్లా కార్యవర్గ సభ్యుడు, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.అశోక్ కుమార్ తెలిపారు. ప్రధాన డిమాండ్లు ఇవీ.. ● సీపీఎస్, జీపీఎస్ లను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. ● 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వ మెమో 57 ద్వారా పాత పెన్షన్ విధానాన్ని వర్తింప చేయాలి. ● 12 వ పీఆర్సీకి కమిషన్ ను వెంటనే నియమించాలి. ఈ లోగా 30 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలి. 3 డీఏలను ప్రకటించాలి. ● 11వ పీఆర్సీ బకాయిలు, డీఏ బకాయిలు, సరెండర్ లీవు బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను తక్షణమే చెల్లించాలి. ● 70 ఏళ్లు దాటిన పెన్షనర్స్కు 10 శాతం, 75 ఏళ్లు నిండిన వారికి 15 శాతం అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ ను అమలు చేయాలి ● పంచాయతీరాజ్ యాజమాన్యంలో పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలను తక్షణమే చేపట్టాలి. కలెక్టర్ పూల్ ద్వారా వెంటనే పోస్టింగ్స్ ఇవ్వాలి. ● ప్రభుత్వ, పంచాయతీ రాజ్ ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ రూల్స్ కు సంబంధించి 72, 73, 74 జి.ఓ లను అమలు చేయాలి. రిలయన్స్ సీబీజీ ప్లాంట్కు భూమిపూజ నేడు పీసీపల్లి: మండల పరిధిలోని దివాకరపల్లె గ్రామం వద్ద ఏర్పాటు చేయనున్న రిలయన్స్ సీబీజీ ప్లాంట్కు బుధవారం భూమిపూజ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్, రిలయన్స్ ప్రతినిధిగా అనంత్ అంబానీ తదితరులు వస్తున్న నేపథ్యంలో అన్నీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్తో పాటు స్థానిక ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, జేసీ ఆర్ గోపాలకృష్ణలతో కలిసి సభా వేదిక వద్ద జిల్లా అధికారులతో సమావేశమై ముందస్తు ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి వస్తున్న వీవీఐపీలకు, వీఐపీలకు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ తో పాటు ఎస్పీ దామోదర్, ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, ఏఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీలు లక్ష్మీనారాయణ, నాగరాజు, సాయి ఈశ్వర్ యశ్వంత్, శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై వాస్తవాలు బయటపెట్టండి ఒంగోలు టౌన్: పాస్టర్ అనుమానాస్పద మృతిపై నిస్పక్షపాతంగా విచారణ జరిపించాలని, వాస్తవాలను బయట పెట్టాలని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు చీకటి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని ఫ్లై ఓవర్ నుంచి ట్రంకు రోడ్డు మీదుగా కలెక్టరేట్ వరకు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల మృతిపై వాస్తవాలను వెలికి తీసి దోషులను కఠినంగా శిక్షించినప్పుడే ఇలాంటి దుర్మార్గాలు పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పారు. పాస్టర్ మృతిపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరపాలని, పాస్టర్ ప్రవీణ్ కుటుంబాన్ని ఆదుకోవాలని, దళిత క్రిస్టియన్ల మీద దాడులు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మైనారిటీ క్రైస్తవ మతాల ప్రజలకు రక్షణ కల్పించాలన్నారు. కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బి.రఘురాం మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మతోన్మాదులు పెట్రేగి పోతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో పాస్లర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
కూటమి బండారాన్ని బయట పెడతాం
ఒంగోలు టౌన్: త్రిపురాంతకం మండల పరిషత్ ఎన్నికల విషయంలో కూటమి నాయకులు చేసిన అక్రమాలు, అరాచకాలను బయట పెడతామని యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ చెప్పారు. జిల్లా జైలులో ఉన్న ఎంపీటీసీ ఆళ్ల ఆంజనేయరెడ్డిని మంగళవారం ఆయన పరామర్శించారు. అనంతరం తాటిపర్తి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఎంపీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న ఆంజనేయరెడ్డి మీద అక్రమ కేసులు పెట్టి జైలుపాలు చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని మండిపడ్డారు. జరగని దాడిని జరిగినట్లు చిత్రీకరించి, అధికార పార్టీ ఒత్తిళ్లతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దానికి అనుగుణంగా సాక్షులను తయారు చేసి పక్కా ప్రణాళిక ప్రకారం ఆళ్ల మీద తప్పుడు కేసులు పెట్టారని వివరించారు. అధికార పార్ట టీడీపీ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు సూచనలు, సలహాలతోనే పోలీసులు కేసు పెట్టారని ఆరోపించారు. త్రిపురాంతకం ఎన్నికల్లో టీడీపీ గెలిచి ఉంటే బలం పెరిగిందని చెప్పుకునేవారని, ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారమని తప్పుకుంటున్నారని విమర్శించారు. త్రిపురాంతకం ఎన్నికలు వైఎస్సార్ సీపీ అంతర్గత వ్యవహారమైతే మా పార్టీ ఎంపీటీసీ సృజనను టీడీపీ ఇన్చార్జ్ పర్యవేక్షణలో మార్కాపురంలో ఎందుకు గృహనిర్బంధంలో ఉంచారని ప్రశ్నించారు. పోలీసులకు ఫోన్లు చేసి ఎందుకు కేసులు పెట్టించారో చెప్పాలని నిలదీశారు. యర్రగొండపాలెంలో ఒక దుకాణంలో దళితుడి మీద దాడి చేసి తల పగులగొడితే పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదన్నారు. ఎలాంటి సాక్ష్యాలు లేకపోయినా ఆళ్ల ఆంజనేయ రెడ్డి మీద కేసు నమోదు చేశారని మండి పడ్డారు. ఎవరైతే కేసు పెట్టారని పోలీసులు చెబుతున్నారో వారే స్వయంగా తామెలాంటి కేసు పెట్టలేదని చెబుతున్నారని, తమ చేత బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని సృజన తండ్రి దాసు చెబుతున్నారని తెలిపారు. దాసు కుటుంబ సభ్యుల చేత తప్పుడు వాంగ్మూలం ఇప్పించారని ఆరోపించారు. రాజకీయ ఒత్తిళ్లతోనే పోలీసులు కేసు పెట్టారని, త్రిపురాంతకం సీఐ కంకణాలపల్లి ఎంపీటీసీకి ఫోన్ చేసి బెదిరించారని, ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రాజకీయ ఒత్తిళ్లతో అమాయకుల మీద కేసులు పెట్టి వేధించడం సరికాదన్నారు. తాము ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినందు వల్లనే సీసీ కెమెరాల నిఘా మధ్యలో ఎన్నికలు నిర్వహించారని, లేకపోతే లోపల ఏం జరిగిందో ప్రపంచానికి తెలియకపోయేదన్నారు. ఆళ్ల ఆంజనేయ రెడ్డి మీద తప్పుడు కేసులు పెట్టిన వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకునేలా న్యాయపోరాటం చేస్తామన్నారు. కూటమి దిగజారుడు రాజకీయాలు చేసిందని, కాకమ్మ కబుర్లు చెప్పి తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామన్నారు. ఎంపీటీసీ తండ్రి, ఆళ్ల ఆంజనేయ రెడ్డి మీద కేసు పెట్టినట్లు చెబుతున్న దాసు మాట్లాడుతూ...ఆంజనేయరెడ్డి ఎలాంటి దూషణలు చేయడం కానీ, ఆటకాయించడం కాని, దాడి చేయడం కానీ చేయలేదని చెప్పారు. ఆయన మీద ఎలాంటి కేసు పెట్టలేదని స్పష్టం చేశారు. పోలీసులు కావాలని తప్పుడు కేసు నమోదు చేశారని చెప్పారు. ఎమ్మెల్యే వెంట త్రిపురాంతకం ఎంపీపీ ఆళ్ల సుబ్బమ్మ, ఎంపీటీసీ మిరియంపల్లి సుబ్బారావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆళ్ల ఆంజనేయ రెడ్డి అక్రమ అరెస్టు మీద న్యాయపోరాటం చేస్తాం టీడీపీ ఇన్చార్జ్ ఎరిక్షన్ బాబు జోక్యంతోనే తప్పుడు కేసులు ఎంపీపీ ఎన్నికల కోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ -
లేజర్ చికిత్స లేక కిడ్నీ రోగుల పాట్లు...
వేసవి కాలం వచ్చిందంటే చాలు కిడ్నీలో రాళ్ల సమస్య వేధిస్తోంది. ప్రస్తుతానికి ఇద్దరు యూరాలజిస్టులు ఉన్నా కిడ్నీలో రాళ్లకు చికిత్స చేసేందుకు తగిన వైద్య పరికరాలు లేకపోవడంతో వైద్యసేవలు అంతంత మాత్రంగానే ఉంది. కిడ్నీలో రాళ్ల కు చికిత్స చేయించుకునేందుకు వచ్చిన రోగులను గుంటూరుకు రిఫర్ చేసి మిన్నకుండి పోతున్నారు. దీంతో నిరుపేద సామాన్య రోగులు ఇబ్బందులు వర్ణనాతీతం. కిడ్నీలో రాళ్లకు సాధారణంగా లేజర్ ద్వారా చికిత్స చేయాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కానీ ఇంత పెద్ద ఆస్పత్రిలో లేజర్ వైద్య పరికరాలు అందుబాటులో లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని రోగులు వాపోతున్నారు. కిడ్నీలో రాళ్ల కేసులే కాకుండా గుండె జబ్బులు, షుగర్, రక్తపోటు రోగుల్లో కిడ్నీలు దెబ్బ తినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యుల చెబుతున్నారు. జిల్లాలో కనిగిరి, మార్కాపురం తదితర ప్రాంతాల్లో కిడ్నీ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల గుండె జబ్బులు కూడా ఎక్కువైపోయాయి. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని జీజీహెచ్లో లేజర్ వైద్య పరికరాలను అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది. -
అంతంత మాత్రంగా ఆస్తి పన్ను చెల్లింపులు
మార్కాపురం టౌన్: గత ఆర్థిక సంవత్సరం 2023–24లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రజలపై భారం పడకుండా ఉండేందుకు ఆస్తి పన్ను బకాయిదారులకు 100 శాతం వడ్డీ మాఫీ ప్రకటించింది. దీంతో ప్రజలు సంతోషంగా ఆస్తి పన్ను చెల్లించారు. ఈ ఏడాది కూటమి ప్రభుత్వం సుమారు వారం రోజుల క్రితం వడ్డీలో 50 శాతం మాఫీ ప్రకటించడంతో వసూళ్లు మాత్రం ఆశించిన మేర మున్సిపల్ ఖజానాకు చేరలేదు. ఉన్న ఆస్తి పన్ను డిమాండ్కు పన్నుదారులు సగం మాత్రమే బకాయిలు చెల్లించారు. పురపాలక సంఘాల్లో ఆస్తి పన్ను, ఖాళీ స్థలం, నీటి పన్నులు చెల్లించాలని ప్రజలకు సూచించారు. జిల్లాలో ఒక కార్పొరేషన్తో పాటు ఆరు మున్సిపాల్టీలు/నగర పంచాయితీలు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం 2024–25 మార్చి 31వ తేదీ నాటికి ఆస్తి పన్నులు ప్రజలు సుమారు 50 శాతం మేర మాత్రమే చెల్లించారు. మార్చి నెలాఖరు నాటికి పన్నుల రూపంలో 95 శాతం ప్రజలు చెల్లించే అవకాశం ఉటుందని అధికారులు భావించినా లక్ష్యం నెరవేరలేదు. బకాయిలు వసూళ్లలో సిబ్బంది అలసత్వం పురపాలక సంఘాల్లో పన్నుల వసూళ్లకు గతంలో బిల్ కలెక్టర్లు ఇంటింటికీ తిరిగి డిమాండ్ నోటీసులు ఇచ్చి పన్నులు చెల్లించాలని పన్నుదారులు కోరే వారు. వారి స్థానంలో సచివాలయం సిబ్బంది, కాంట్రాక్టు ఉద్యోగులకు అప్పగించారు. ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల కావడంతో కొంతమంది ఉద్యోగులు జిల్లా వ్యాప్తంగా మున్సిపాల్టీల్లో సెలవు పెట్టి ప్రిపరేషన్కు వెళ్లారు. సిబ్బంది కొరతతో ఇస్తి పన్ను బకాయిల వసూళ్లలో ప్రజలకు ముందస్తు సరైనా అవగాహన కల్పించలేకపోయారు. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి మున్సిపాల్టీకి చెల్లించాల్సిన పన్ను బకాయిలు చెల్లించాలని మైక్ల ద్వారా ప్రచారం చేశారు. పన్నుల చెల్లింపులో వడ్డీపై 50 శాతం తగ్గింపు ప్రభావం కూడా బాగా చూపిందని కొందరు అధికారులు పెర్కొంటున్నారు. కొన్ని పురపాలక సంఘాల్లో ప్రత్యేక టీమ్లు ఏర్పాటు చేసిన ఆశించిన మేర పన్నుల బకాయిలను రాబట్టలేకపోయారు. జిల్లాలో పన్నుల విధింపు జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్తో పాటు మార్కాపురం మున్సిపాలిటీ, ఐదు నగర పంచాయతీలు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం 2024–25, మార్చి 31వ తేదీ నాటికి పన్నులు ఇలా ఉన్నాయి. జిల్లాలో మొత్తం 1,35,222 అసెస్మెంట్లు ఉండగా అందులో మొత్తం డిమాండ్ రూ.107.83 కోట్లు ఉండగా అందులో ఇప్పటికి 59.48 కోట్ల రూపాయల ఆస్తి పన్నులు ప్రజలు చెల్లించారు. ఇంకా బకాయిల రూపంలో రూ.48.36 కోట్లను పురపాలక సంఘాలకు చెల్లించాల్సి ఉంది. అందులో భాగంగా ఒంగోలు కార్పొరేషన్లో 66,069 అసెస్మెంట్లకు రూ.73.39 కోట్ల డిమాండ్ ఉండగా రూ.37.66 కోట్లు, మార్కాపురం 18,345 అసెస్మెంట్లకు రూ.11.20 కోట్లకు రూ.6.62 కోట్లు, కనిగిరి 9,991 అసెస్మెంట్లకు రూ.4.93 కోట్లకు రూ.3.31 కోట్లు, గిద్దలూరు 12,497 అసెస్మెంట్లకు రూ.4.67 కోట్లకు రూ.3.42 కోట్లు, దర్శి 9,720 అసెస్మెంట్లకు రూ.5.28 కోట్లకు రూ.3.61 కోట్లు, చీమకుర్తి 7,315 అసెస్మెంట్లకు రూ.4.73 కోట్లకు రూ.3.16 కోట్లు, పొదిలి 11,285 అసెస్మెంట్లకు రూ.3.63 కోట్లకు రూ.1.70 కోట్ల మేర పన్నులు ప్రజలు చెల్లించారు. ప్రస్తుతం ప్రభుత్వం 50 శాతం వడ్డీ మాఫీ ప్రకటన వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 100 శాతం వడ్డీ మాఫీ జిల్లాలో డిమాండ్ రూ.107.83 కోట్లు చెల్లించింది మాత్రం రూ.59.48 కోట్లు ఇంకా బకాయిలు రూ.48.36 కోట్లు పన్ను వసూళ్ల శాతంతో మున్సిపాల్టీలు ఇలాజిల్లాలోని వివిధ పురపాలక సంఘాల్లో పన్నుల చెల్లింపులో శాతంగా ఇలా ఉన్నాయి. పొదిలి నగర పంచాయతీ పన్నుల వసూళ్లలో 46.94 శాతంతో వెనుకబడి ఉంది. గిద్దలూరు నగర పంచాయతీ 73.37 శాతంతో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. మిగిలిన పురపాలక సంఘాలు దర్శి 68.28 శాతం, కనిగిరి 67.09, చీమకుర్తి 66.83, మార్కాపురం 59.13, ఒంగోలు కార్పొరేషన్ 51.31 శాతంలో ఉన్నాయి. -
పింఛన్ నగదు మాయం
● పోలీసుల దర్యాప్తు తర్లుపాడు: వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఇచ్చేందుకు రెండు రోజుల క్రితం బ్యాంకు నుంచి డ్రా చేసిన పింఛన్ సొమ్ము అదేరోజు మాయమైంది. ఈ ఘటనపై మంగళవారం పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..మండలంలోని కేతగుడిపి సచివాలయ పరిధిలో పంపిణీ చేయాల్సిన పింఛన్ రూ.15.36 లక్షల నగదును సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంటు మల్లిక గత నెల 29న బ్యాంకు నుంచి డ్రా చేసి నగదును బ్యాగులో పెట్టుకుని ఆటో ఎక్కుతుండగా క్యాష్ ఉన్న బ్యాగును ఆటోలో పెట్టగానే ఆటో డ్రైవరు ఉడాయించాడని మంగళవారం మార్కాపురం పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రెండు రోజుల తరువాత ఫిర్యాదు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. మంగళవారం గ్రామానికి చెందిన వృద్ధులు పింఛన్ కోసం ఎదురుచూస్తుండగా సచివాలయ ఉద్యోగి వచ్చి పింఛన్ డబ్బులు కనిపించడం లేదని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ నివ్వెరపోయారు. అప్పుడు సదరు ఉద్యోగిని మార్కాపురం పట్టణ పోలీసుస్టేషన్కు వెళ్లి నగదు మాయంపై ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై సైదుబాబు తెలిపారు. ఈ విషయమై ఎంపీడీఓ చక్రపాణి ప్రసాద్ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులో లేరు. మరోవైపు అదే గ్రామానికి చెంది మరో ఉద్యోగి 31 మంది లబ్ధిదారులకు పింఛను అందించగా మిగిలిన వారు తమకు రాకపోవడంతో సచివాలయం వద్ద పింఛను డబ్బుల కోసం ఎదురుచూసున్నారు. -
సముద్రంలో గల్లంతై యువకుడు మృతి
వేటపాలెం: సముద్రం నీటిలో మునిగి యువకుడు మృతి చెందాడు. మరో యువకుడిని మైరెన్ పోలీసులు కాపాడారు. ఈ సంఘటన మండలంలోని రామాపురం సముద్రతీరంలో మంగళవారం జరిగింది. మైరెన్ పోలీస్లు తెలిపిన వివరాల మేరకు..పర్చూరు నెహ్రు కాలనీకి చెందిన చుక్కా వంశీ (26) చిలకలూరిపేట దగ్గరలోని పసుమర్రు గ్రామానికి చెందిన షేక్ రహమతుల్లా ఇద్దరు రామాపురం సముద్రతీరానికి వచ్చారు. పర్యాటకులతో కలిసి ఇద్దరు సముద్రంలో స్నానాలు చేసే సమయంలో అలల తీవ్రతకు ఇద్దరూ కొట్టుకుపోతూ కేకలు వేశారు. అక్కడే ఉన్న మైరెన్ పోలీస్లు, స్థానిక జాలర్ల వెంటనే స్పందించి ఇద్దరిని నీటిలో నుంచి బయటికి తీసుకువచ్చారు. అయితే వంశీ సముద్రం నీరు బాగా తాగడంతో పరిస్థితి విషమించింది. అక్కడే సీపీఆర్ చేసి 108లో చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో యువకుడు షేక్ రహంతుల్లా వెంటనే కోలుకున్నాడు. ఎస్సై వెంకటేశ్వర్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉపాధి హామీతో 2.95 లక్షల కుటుంబాలకు మేలు
ఒంగోలు సబర్బన్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో 2.95 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరిందని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ విడుదల చేసిన ప్రకటనలో 6 లక్షల మంది వేతనదారులకు పనులు కల్పించి వేతనాలు రూపంలో రూ.272.00 కోట్లు చెల్లించారన్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 1.35 కోట్ల పనిదినాలు కల్పించటం లక్ష్యంగా ముందుకు సాగామన్నారు. ఇప్పటి వరకు 1.29 కోట్ల పనిదినాలు (96%) కల్పించామని, 4 లక్షల 42 వేల కుటుంబాలకు జాబ్ కార్డులు మంజూరు చేసినట్లు చెప్పారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామాల్లో మౌలిక వసతులైన పశువుల షెడ్స్, సిమెంట్ రోడ్స్, తారు రోడ్లు (బీటీ రోడ్డు), సుస్థిర వసతులు గ్రామీణ ప్రజలుకు రైతుల పొలంలో పంట సంజీవనీలు (ఫామ్ పాండ్స్) నిర్మించినట్లు వివరించారు.మిస్సింగ్ కేసు నమోదుపొన్నలూరు: స్థానిక పోలీస్ స్టేషన్లో మంగళవారం మిస్సింగ్ కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..స్థానిక అంబేడ్కర్ నగర్కు చెందిన లేళ్లపల్లి కొండమ్మ మార్చి 29న శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అయితే నాలుగు రోజులైనా ఇంటికి రాకపోవడంతో బంధువులను, చుట్టపక్కల గ్రామాల్లో విచారించిన కుటుంబ సభ్యులు కొండమ్మ ఆచూకీ తెలియకపోవడంతో స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనూక్ తెలిపారు.పామూరులో..పామూరు: పామూరుకు చెందిన వ్యక్తి అదృశ్యంపై తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై టి.కిషోర్బాబు తెలిపారు. పామూరు చెన్నకేశవనగర్ 1వ లైన్కు చెందిన యాదగిరి నాగ ప్రవీణ్ గత నెల 23వ తేదీ రాత్రి బాడుగ నిమిత్తం మండలంలోని వగ్గంపల్లెలోని వ్యక్తికి చెందిన పశువులను మార్కాపురం తీసుకుపోయేందుకు వెళ్లాడు. అక్కడ పశువులను దించి తిరిగివస్తూ వగ్గంపల్లెలో 24వ తేదీ తెల్లవారుజాము 3.30 గంటల సమయంలో పశువుల యజమానులను వగ్గపల్లెలో దించివేశాడు. అప్పటి నుంచి నాగప్రవీణ్ తన వాహనంతో తిరిగి రాకపోవడంతో తండ్రి నాగేశ్వరరావు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.నష్టపరిహారం చెక్కుల పంపిణీపెద్దదోర్నాల: నల్లమల అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లి పెద్దపులుల దాడుల్లో చనిపోయిన పశువుల యజమానులకు అటవీ శాఖాధికారులు మంగళవారం నష్ట పరిహారం చెక్కులు అందజేశారు. స్థానిక అటవీ శాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చింతల, బోడేనాయక్ తండాలకు చెందిన పలువురు గిరిజన పశుపోషకులకు రేంజి అధికారి జీవన్కుమార్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా కుడుముల పోతయ్యకు రూ.20 వేలు, కుడుముల పెద్దక్కకు రూ.15 వేలు, కుడుమలు హనుమక్కకు రూ.15 వేలు, భూమని హనుమక్కకు రూ.20 వేలు, కుడుముల బయ్యన్నకు రూ.15 వేలు, బోడేనాయక్ తండాకు చెందిన డుమావత్ శ్రీనునాయక్ రూ.20 వేలు చొప్పున చెక్కులు అందజేశారు. చింతల బీట్ ఆఫీసర్ చెన్నయ్య, పశు పోషకులు పాల్గొన్నారు. -
పూట గడవక..!
కూలి అందక..బేస్తవారిపేట: వలసలు నివారించేందుకు, గ్రామీణ ప్రాంతాల్లోనే ఉపాధి కల్పించేందుకు 2006లో కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో పనిచేసిన కూలీలకు వారం రోజుల్లో వేతనాలు అందించాల్సి ఉంది. ప్రతి కూలీకి రోజువారీ వేతనం రూ.300 నిర్దేశించగా, కూలీలు చేసిన పనికి రూ.275 ప్రకారం అందిస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉపాధి కూలీలకు సకాలంలో వేతనాలు అందించడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నెలల తరబడి వేతనాలు అందకపోవడంతో కూలీలు ఆందోళన చెందుతున్నారు. గతంలో నెలల తరబడి వేతనాలు అందని పరిస్థితి ఎప్పుడూ లేదని కూలీలు వాపోతున్నారు. సౌకర్యాలు అంతంతమాత్రమే.. ఉపాధి కూలీలకు నిలువ నీడ లేదు. మండుటెండలో విలవిల్లాడుతున్నారు. వేసవిలో భానుడు ఉగ్రరూపం దాల్చడంతో ఇబ్బందులు పడుతున్నారు. పనుల సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి కనీసం నీడ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనిచేసే సమయంలో వడదెబ్బ, చిన్నచిన్న గాయాలవుతుంటాయి. ఈ సమయంలో ప్రాథమిక చికిత్స చేయడానికి మెడికల్ కిట్లు పని ప్రదేశంలో ఉంచాలి. వాటిని కూడా ప్రభుత్వం ఇంత వరకు సరఫరా చేయలేదు. వేతనదారులు డీహైడ్రేషన్కు గురైతే కనీసం ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా లేని పరిస్థితి క్షేత్రస్థాయిలో నెలకొంది. గతంలో వేసవిలో కూలీలకు మజ్జిగ పంపిణీ చేయడంతో పాటు, ఎండల్లో పనిచేసే వారికి టార్పాలిన్ పట్టలు పంపిణీ చేశారు. కానీ ఇటీవల కూలీలకు అందే సౌకర్యాలు తగ్గించడంతో పని ప్రాంతాల్లో ఇబ్బందులు తప్పడం లేదు. ఇతర పనులకు మొగ్గు.. జిల్లాలోని 38 మండలాల్లో గుర్తించిన 840 పనుల్లో 59,011 మంది కూలీలకు పని కల్పించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం వారిలో సగం 36,260 మంది మాత్రమే పనులకు హాజరవుతున్నారు. రెండు, మూడు నెలల కూలి డబ్బులు అందక కుటుంబ పోషణ భారంగా మారి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. కూలీలు క్రమంగా ఉపాధి పనులకు స్వస్తి పలుకుతూ ప్రత్యామ్నాయ పనులు వెతుక్కునే పనిలో పడ్డారు. ఉపాధి కూలీలకు రెండున్నర నెలలుగా అందని వేతనం చేసిన పనికి ప్రతిఫలం అందక కూలీల ఆవేదన ఉపాధిపై నమ్మకం లేక ఇతర పనులకు మొగ్గు పని ప్రదేశంలో లేని మెడికల్ కిట్లుతక్కువ కూలీలు హాజరవుతున్న మండలాలు.. మండలం హాజరు హాజర కావాల్సిన వుతున్న కూలీలు కూలీలు సింగరాయకొండ 2216 987 తర్లుపాడు 1721 672 యర్రగొండపాలెం 2366 975 కురిచేడు 739 347 గిద్దలూరు 1294 762 దర్శి 1531 689 కొత్తపట్నం 1416 730 పొదిలి 2237 1288 రాచర్ల 1899 809 -
ఒకే రాత్రి ఐదు ఆలయాల్లో దొంగతనం
దర్శి: మండలంలో ఒకే రాత్రి ఐదు ఆలయాల్లో చోరీలు జరిగాయి. ఈ సంఘటనలు మండలంలోని లంకోజనపల్లి, వెంకటాపురం గ్రామాల్లో మంగళవారం రాత్రి జరిగాయి. లంకోజనపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ పగులగొట్టి సుమారు రూ.25 వేల నగదు తీసుకెళ్లారు. తూర్పు వెంకటాపురంలో పోలేరమ్మ, అంకాలమ్మ, శివాలయం, బాలాపుర పోలేరమ్మ ఆలయాల్లో తాళాలు పగులగొట్టి హుండీల్లో ఉన్న సుమారు రూ.20 వేల నగదు దొంగలు ఎత్తుకెళ్లారు. పోలేరమ్మ ఆలయంలో వెండి హారం, కిరీటం ఉండగా కిరీటాన్ని వదిలేసి వెండి హారం, హుండీని ఎత్తుకెళ్లారు. మిగిలిన మూడు ఆలయాల్లో హుండీలు ఎత్తుకెళ్లి పగులగొట్టి నగదు దోచుకున్నారు. ఒకే రోజు వరుస దొంగతనాలు జరగడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ముండ్లమూరు మండలంలో కూడా ఇదే విధంగా ఒకే రాత్రి మూడు దొంగతనాలు జరిగాయి. -
క్రీడలతో ఐకమత్యం పెంపు
● రెండు జిల్లాల స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం సీఎస్పురం(పామూరు): క్రీడలు ఐకమత్యాన్ని పెంపొందిస్తాయని వైఎస్సార్ సీపీ మైనారిటీసెల్ రాష్ట్ర కార్యదర్శి, సర్పంచ్ షేక్.ఖాదర్బీబుజ్జి, డాక్టర్ పి.వీరన్నగౌడ్ అన్నారు. మండలంలోని శీలంవారిపల్లె గ్రామంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను వారు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల సైతం తమ పిల్లలను ఆ దిశగానే ప్రోత్సహించాలన్నారు. క్రీడలు అంతర్గత శక్తి సామర్థ్యాలను, దేహదారుఢ్యాన్ని పెంపొందిస్తాయన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, పోటీల్లో పాల్గొనే వారు క్రీడాస్ఫూర్తితో టోర్నమెంట్ను విజయవంతం చేయాలన్నారు. టోర్నమెంట్లో 25 జట్లు తమ పేర్లను నమోదుచేసుకున్నారు. ఉపసర్పంచ్ తీకెనం బాబూరావు, ముడియాల గోపి, మాజీ ఎంపీటీసీ మునగల నారాయణరెడ్డి, సంగిశెట్టి పీరయ్యనాయుడు, కొట్టే రవీంద్ర, శ్రీనివాసులు, కదిరి రత్నం, సన్నపురెడ్డి రామకృష్ణ, షేక్.ఖాజావళి, పలువురు పాల్గొన్నారు. -
పశు వైద్యశాలల్లోనూ నీటి తొట్లు
● పశుసంవర్ధక శాఖ జేడీ బేబీరాణి కొనకనమిట్ల: జిల్లాలో అన్ని పశు వైద్యశాలల్లో నీటి తొట్లు ఏర్పాటు చేసి పశు పోషకులకు ఇబ్బంది కలగకుండా కృషి చేస్తున్నామని పశుసంవర్ధక శాఖ జేడీ బేబీరాణి పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రమైన కొనకనమిట్ల పశు వైద్యశాలనును ఆమె పరిశీలించారు. జేడీ మాట్లాడుతూ.. అన్ని గ్రామాల్లో మూగజీవాలకు వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నట్లు తెలిపారు. పశువులకు సంక్రమించే సీజనల్ వ్యాధులు, నివారణ మార్గాలపై పశుపోషకులకు అవగాహన కల్పించారు. వేసవి దృష్ట్యా పశు వైద్యశాలల్లోనూ నీటి తొట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం స్థానిక పశు వైద్యశాల ఆవరణలో రైతులకు గడ్డి జొన్నలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పశు వైద్యాధికారి అమూల్య, వెటర్నరీ అసిస్టెంట్ పూర్ణచంద్రరావు, ఆఫీస్ సబార్డినేట్ నాగార్జునరెడ్డి పాల్గొన్నారు. -
సహకారం
అల్లాహ్ చూపిన మార్గం.. సమభావం.. నెల రోజుల కఠోర ఉపవాస దీక్షను ఆచరించిన ముస్లింలు రంజాన్(ఈద్ ఉల్ ఫిత్ర్) వేడుకలను సోమవారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. నూతన వస్త్రాలు ధరించి, ముక్కు పుటాలు గుభాళించే అత్తరు చల్లుకుని, కళ్లకు సుర్మా పెట్టుకుని మసీదులకు చేరుకున్న ముస్లింలు.. తదనంతరం తక్బీర్ పఠిస్తూ ఈద్గాల వద్దకు ర్యాలీగా బయలుదేరారు. పూర్వీకుల సమాధులపై పూలు చల్లి ప్రార్థనలు చేశారు. సామూహిక నమాజ్ ఆచరించి, పరస్పర ఆలింగనాలతో రంజాన్ ముబారక్ చెప్పుకొన్నారు. పవిత్ర ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ పేర్కొన్న సూక్తుల సారాంశాన్ని ముస్లిం మత పెద్దలు వివరించారు. ముస్లింలు మహ్మద్ ప్రవక్త చూపిన మార్గంలో నడుస్తూ.. సమాజంలో సమభావం నెలకొల్పేందుకు, పేదలు సంతోషంగా జీవించేందుకు సహకారం అందించాలని ఉద్బోధించారు. రంజాన్ సందర్భంగా జిల్లాలో మత సామరస్యం వెల్లివిరిసింది. ఒంగోలులో ఈద్ ముబారక్ చెప్పుకొంటున్న చిన్నారులు– సాక్షి నెట్వర్క్ -
వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నల్లబ్యాడ్జీలతో ర్యాలీ
ఒంగోలు టౌన్: వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ముస్లిం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వివిధ మసీదుకు చెందిన ముస్లింలు నల్లబ్యాడ్జీలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆయా మసీదులలో పండుగ నమాజు అనంతరం ర్యాలీగా బయలుదేరిన ముస్లింలు పాత కూరగాయల మార్కెట్ సమీపంలోని మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని, వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తన వైఖరిని ప్రకటించాలని, ముస్లింల రాజ్యాంగ హక్కులను కాపాడాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరక్టర్ షేక్ మహబూబ్ మాట్లాడుతూ వక్ఫ్ ఆస్తుల ఆక్రమణదారులకు రక్షణ కల్పించేలా బిల్లులో సవరణలు తీసుకొని రావడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సమర్ధనీయం కాదని చెప్పారు. ముస్లింలను ఇబ్బందులకు గురి చేసేందుకు బీజేపీ నేతృత్వంలోని కూటమి పాలకులు చేస్తున్న దుష్ట ప్రయత్నాలను న్యాయపోరాటాల ద్వారా తిప్పి కొడతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు ఇచ్చిన మాట ప్రకారం వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నిలబడాలని కోరారు. నిరసనలో ముస్లిం నాయకులు ఎస్డీ సర్దార్, న్యాయవాది కరీముల్లా, అబ్దుల్ రవూఫ్, సయ్యద్ ఇస్మాయిల్, పి.కరిముల్లా తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తమ సేవలతోనే పేరు ప్రఖ్యాతులు
● ఎస్పీ దామోదర్ ఒంగోలు టౌన్: ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పదని, అయితే, ఉద్యోగంలో ఉన్నప్పుడు అందించిన ఉత్తమ సేవలతోనే ఉద్యోగానంతరం కూడా గుర్తుండిపోయేలా పేరు ప్రఖ్యాతులు లభించి ఆత్మసంతృప్తి కలిగిస్తాయని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. జరుగుమల్లి ఏఎస్సై జి.శ్రీనివాసరావు, గిద్దలూరు హెడ్కానిస్టేబుల్ కేవీ రమణారెడ్డి, ఐటీ కోర్ హెడ్ కానిస్టేబుల్ సీహెచ్ శ్రీనివాసరావు సోమవారం ఉద్యోగ విరమణ చేసిన సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రత్యేకంగా వారిని ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు శాఖలో సుదీర్ఘకాలం సేవలు అందించడం గొప్ప విషయమని, అందరికీ సకాలంలో రిటైర్డ్మెంట్ ప్రయోజనాలు అందించడానికి కృషి చేస్తానని చెప్పారు. రిటైర్మెంట్ ద్వారా వచ్చిన డబ్బును జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని సూచించారు. శేష జీవితాన్ని సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఏదైనా సహాయం కావాలంటే సంప్రదించాలని, పోలీసు శాఖ ఎప్పటికీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ఆర్ఐ సీతారామిరెడ్డి, ఏఆర్ ఎస్సై తిరుపతిస్వామి, సిబ్బంది పాల్గొన్నారు. -
గుర్తుతెలియని మృతదేహాలు లభ్యం
నాగులుప్పలపాడు: మండలంలోని ఉప్పుగుండూరు గ్రామంలో హైస్కూల్ సమీపంలోని రజకుల క్వారీ కుంటలో సోమవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. కుంటలో మృతదేహం తేలియాడటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఒంగోలు తరలించారు. మృతుడి వయసు 30 నుంచి 40 సంవత్సరాలు ఉంటుందని, తెల్లగీరల చొక్కా, నీలిరంగు ప్యాంటు ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం మృతిచెంది ఉండవచ్చని భావిస్తున్నారు. సంఘటన స్థలంలో పడి ఉన్న మద్యం, వాటర్ బాటిళ్ల ఆధారంగా.. మద్యం సేవిస్తూ ప్రమాదవశాత్తూ క్వారీ కుంటలో పడి ఉండవచ్చని అంచనా వేశారు. మృతుడికి సంబంధించిన ఎటువంటి ఆధారాలూ లేకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.హైవే బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని మృతదేహంయర్రగొండపాలెం: మండలంలోని నరసాయపాలెం సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న వంతెన కింద గుర్తు తెలియని మృతదేహాన్ని సోమవారం పోలీసులు గుర్తించారు. మృతుడి వయసు దాదాపు 50 సంవత్సరాలు ఉంటుందని పేర్కొన్నారు. మృతుడి శరీరంపై ఉన్న యూనిఫాంను బట్టి మోటార్ ఫీల్డ్కు చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని, కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పి.చౌడయ్య తెలిపారు. -
మోటూరి స్ఫూర్తితో మహిళా సమస్యలపై పోరాటం
ఒంగోలు టౌన్: ఏపీలో మొట్టమొదటి మహిళా మెడికల్ రిప్రజంటేటివ్గా పనిచేసి తాను నమ్మిన సిద్ధాంతం కోసం చివరి శ్వాస వరకూ పోరాడిన మోటూరి ఉదయం స్ఫూర్తితో మహిళా సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తామని ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి తెలిపారు. మోటూరి ఉదయం 23వ వర్ధంతిని స్థానిక ఎల్బీజీ భవనంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ మహిళలు వంటింటికే పరిమితమైన కాలంలోనే మోటూరి ఉదయం స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారని తెలిపారు. రాష్ట్రంలో మహిళా సంఘాన్ని స్థాపించడంలో కీలకపాత్ర పోషించిన ఆమె.. సీ్త్ర, పురుష సమానత్వం కోసం అనేక పోరాటాలు నిర్వహించారని తెలిపారు. ఉదయం స్ఫూర్తితో మహిళల కోసం ఒంగోలులో ఉచిత న్యాయ సలహా కేంద్రం నిర్వహిస్తున్నట్లు ఐద్వా జిల్లా నాయకురాలు జి.రాజ్యలక్ష్మి తెలిపారు. ఆమె మనవరాలైన డా.ఉదయిని సహకారంతో బేతూన్ నర్సింగ్ హోంలో ప్రతి నెలా మూడో శుక్రవారం ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఉదయం ట్రస్ట్ ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలతో పాటు సామాజిక చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బి.పెద్ద గోవిందమ్మ, ఎన్.మాలతి, కె.రాజేశ్వరి, కె.రాణి తదితరులు పాల్గొన్నారు. -
కొమరోలులో కారు బీభత్సం
కొమరోలు: మద్యం మత్తులో ఓ వ్యక్తి వేగంగా కారు నడుపుతూ బీభత్సం సృష్టించాడు. ఆదివారం అర్ధరాత్రి కొమరోలు పట్టణంలోని అమరావతి–కడప రాష్ట్రీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి కారును వేగంగా నడుపుతూ రోడ్డు పక్కనే ఉన్న దుకాణాల బోర్డులను, విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. స్తంభం విరిగిపోవడంతో అధికారులు అప్రమత్తమై విద్యుత్ సరఫరా నిలిపివేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై నాగరాజు.. మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కారును పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రమాదం కారణంగా కొమరోలులో దాదాపు 2 గంటలపాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ శాఖ సిబ్బంది యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి సరఫరాను పునరుద్ధరించారు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో 2 గంటలు నిలిచిన సరఫరా పోలీసుల అదుపులో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి -
వైవీ మాతృమూర్తికి ఘన నివాళి
ఒంగోలు సిటీ: రాజ్యసభ సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ ఉత్తర క్రియలు సోమవారం నిర్వహించారు. ఒంగోలు వీఐపీ రోడ్డులో ఆయన స్వగృహంలో ఉదయం నుంచి ప్రత్యేక హోమాలు చేశారు. ఈ కార్యక్రమాల్లో వైవీ సుబ్బారెడ్డి, ఆయన సోదరులు భద్రారెడ్డి. హనుమారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఎంపీలు, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పిచ్చమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో వైఎస్ విజయమ్మ, వైఎస్ అనిల్ రెడ్డి, వైఎస్ సునీల్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వైఎస్సార్ సీపీ ప్రకాశం జిల్లా రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, గొల్ల బాబూరావు, ఎంపీలు గురుమూర్తి, తనూజారాణి, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, కురసాల కన్నబాబు, శంకర్నారాయణ, నారాయణస్వామి, చెల్లుబోయిన వేణుగోపాల్, తానేటి వనిత, అనిల్ కుమార్ యాదవ్, తోట నరసింహులు, మాజీ ఎంపీలు మార్గాని భరత్, కరణం బలరాం, ఎమ్మెల్యేలు ఉప్పాల శ్రీనివాస్, తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్సీలు అనంతబాబు, కౌరు శ్రీనివాస్, మేరుగు మురళి, పాలవలస విక్రాంత్, మొండితోక అరుణ్, తూమాటి మాధవరావు, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, అన్నా రాంబాబు, కేపీ నాగార్జునరెడ్డి, జంకె వెంకటరెడ్డి, బుర్రా మధుసూదన్ యాదవ్, టీజేఆర్.సుధాకర్బాబు, కదిరి బాబూరావు, రామ్రెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, బియ్యపు మధుసూదన్రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, కరణం ధర్మశ్రీ,, కురుముట్ల శ్రీనివాస్, బూడి ముత్యాల నాయుడు, గొడ్డేటి మాధవి, నంబూరి శంకరరావు, గొట్టుగల్ల భాగ్యలక్ష్మి, ధనలక్ష్మి, శ్రీనివాస్ నాయుడు, తలారి వెంకట్రావు, ప్రతాప్రెడ్డి, అదీప్రాజ్, రెడ్డి శాంతి, పెట్ల ఉమాశంకర్ గణేష్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల, వైఎస్సార్ సీపీ నాయకుడు అంబటి మురళి, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్లు చుండూరు రవిబాబు, కరణం వెంకటేష్ బాబు, దద్దాల నారాయణ యాదవ్, వరికూటి అశోక్బాబు, గాదె మధుసూదన్రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, వరికూటి అమృతపాణి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకరరావు, ఎమ్మెల్యే బీఎన్ విజయ్కుమార్, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి, వై వెంకటేశ్వర్లు, మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొమ్మూరి కనకారావు మాదిగ, మాజీ పీడీసీసీ బ్యాంకు చైర్మన్ వై.ఎం.ప్రసాద్రెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ముస్లింలకు అండగా వైఎస్సార్ సీపీ
● ఒంగోలు ఈద్గాలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి ప్రార్థనలు ఒంగోలు టౌన్: రాష్ట్రంలోని ముస్లింలకు వైఎస్సార్ సీపీ అండగా నిలుస్తుందని పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. ముస్లింల సంక్షేమం, అభ్యున్నతికి పార్టీ కట్టుబడి ఉందన్నారు. నగర పాలక సంస్థ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ ఖాన్ ఆధ్వర్యంలో ఒంగోలులోని ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన మంచినీరు, మజ్జిగ కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈద్గా వద్ద నమాజులో పాల్గొన్నారు. అనంతరం ముస్లింలను కలిసి ఈద్ ముబారక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లలో అనేక సంక్షేమ పథకాలను ముస్లింలకు అందజేశారన్నారు. రాజకీయంగా కూడా ఎంతో ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు, నగర అధ్యక్షుడు కఠారి శంకర్, కో ఆప్షన్ సభ్యుడు షేక్ నాగూర్, దాసరి కరుణాకర్, మల్లెల భాస్కర్ రెడ్డి, మైనారిటీ నాయకులు ఉన్నారు. -
ఆరు జిల్లాల్లో కరువు
సాక్షి, అమరావతి: వర్షాలు లేక, పంటలు పండక ఆరు జిల్లాల్లో కరువు తాండవిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తేల్చింది. ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. గత ఖరీఫ్ సీజన్లోనూ ప్రభుత్వం 49 కరువు మండలాలను ప్రకటించింది. రబీ సీజన్లో వాటి సంఖ్య ఇంకా పెరిగింది. ప్రస్తుతం ఆరు జిల్లాల పరిధిలోని 51 మండలాల్లో కరువు ఉన్నట్లు నిర్ధారించింది. వాటిలోని 37 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు ఉండగా.. 14 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నట్లు పేర్కొంది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, ప్రకాశం జిల్లాల్లో ఈ మండలాలు ఉన్నాయి. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 17, కర్నూలు జిల్లాలో 10, వైఎస్సార్ జిల్లాలో 10 తీవ్ర కరువు, కరువు మండలాలు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే అనంతపురం జిల్లాలో 7, నంద్యాల జిల్లాలో 5, శ్రీ సత్యసాయి జిల్లాలో 2 మండలాల్లో తీవ్ర కరువు, కరువు పరిస్థితులు ఉన్నాయని వెల్లడించింది. లోటు వర్షపాతం, ఎండిపోయిన పంటల పరిస్థితితో పాటు జిల్లా కలెక్టర్లు ఇచ్చిన నివేదికల ఆధారంగా రెవెన్యూ శాఖ కరువు మండలాలను నిర్ధారించింది. ఆయా ప్రాంతాల్లో అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.