breaking news
Prakasam
-
కార్పొరేట్లకు దోచిపెట్టేందుకే ప్రైవేటీకరణ
● వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సింగరాయకొండ: పేద ప్రజలకు వైద్య విద్యను, వైద్యాన్ని దూరం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసమే మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించి కార్పొరేట్లకు దోచిపెడుతోందని వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్చార్జి, పార్టీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. సింగరాయకొండ మండలంలోని మూలగుంటపాడు పంచాయతీలో ఐటీఐ కాలేజీ సెంటర్లో ఆదివారం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకంగా రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఆదిమూలపు సురేష్ పాల్గొని మాట్లాడుతూ పేద ప్రజలకు వైద్య విద్యను, వైద్యాన్ని అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో 17 మెడికల్ కాలేజీలను గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి మంజూరు చేయించారని తెలిపారు. వాటిలో 7 మెడికల్ కాలేజీలను పూర్తి చేశారని గుర్తు చేశారు. 8 వేల కోట్ల రూపాయలకుగానూ 3 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, మిగిలిన 5 వేల కోట్ల రూపాయలతో కాలేజీలు పూర్తి చేయాల్సి ఉందని అన్నారు. కానీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం మిగిలిన 10 మెడికల్ కాలేజీలను పూర్తి చేయకుండా నిధుల కొరతను సాకుగా చూపి పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణకు మొగ్గుచూపుతోందన్నారు. జగనన్న మెడికల్ కాలేజీలను మంజూరు చేయించటంతో పాటు నిధు లు సమకూర్చి అన్ని రకాల అనుమతులు తీసుకువచ్చి స్థల సేకరణ జరిపి కాలేజీల నిర్మాణానికి నిధులు ఖర్చు చేయగా, వాటి నిర్మాణాలు వివిధ దశలలో ఉన్నాయని తెలిపారు. కానీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాటిని అప్పనంగా కార్పొరేట్లకు అప్పగించేందుకు కంకణం కట్టుకుందని ఆదిమూలపు సురేష్ దుయ్యబట్టారు. వైఎస్సార్ సీపీ ఎస్ఈసీ సభ్యుడు డాక్టర్ బత్తుల అశోక్కుమార్రెడ్డి మాట్లాడుతూ ప్రజలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. విజయవాడ ఆర్టీసీ బస్టాండుకు చెందిన నాలుగు ఎకరాల భూమిని సంవత్సరానికి ఒక్క రూపాయికి కూటమి ప్రభుత్వం లీజుకిస్తోందని, కార్పొరేట్లకు దోచిపెడుతోందని మండిపడ్డారు. అనంతరం ఇంటింటికి తిరిగి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా వైఎస్సార్, గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు మిరియం సుధాకర్, ఎంపీటీసీ అంబటి ప్రసాద్, మాలె ప్రకాష్రెడ్డి, మాలె రంగారెడ్డి, చుక్కా కిరణ్కుమార్, దాసు శ్రీను, గాదంశెట్టి గుప్తా, షేక్ బషీర్, చిరుమామిళ్ల వెంకటేశ్వర్లు, పోలుబోయిన వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు, ఎస్.కృష్ణారెడ్డి, ఎంపీటీసీ అంకయ్య, పఠాన్రియాజ్, చొప్పర వెంకన్న, రాపూరి ప్రభావతి, షేక్ మహమ్మద్బాషా, గొల్లపోతు గోవర్దన్, పాకనాటి రమణారెడ్డి, షేక్ కరీం, సాయికోటి, వాయిల పున్నయ్య, బుజ్జమ్మ, షేక్ అల్లాఉద్దీన్, షేక్ అల్లాభక్షు, పి.శ్రీనివాసులరెడ్డి, సీహెచ్ కృష్ణారెడ్డి, పెరికాల సునీల్, షేక్ అల్లా, కేశవరపు శ్రీనివాసులరెడ్డి, షేక్ రహీం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
నీటి కుంటలో జారి పడి పశువుల కాపరి మృతి
టంగుటూరు: పశువులను మేపుతున్న కాపరి ప్రమాదవశాత్తూ నీటికుంటలో జారిపడి మృతిచెందిన సంఘటన టంగుటూరు మండలంలోని ఆలకూరపాడు గ్రామ శివారులో శనివారం చోటుచేసుకోగా, ఆదివారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆలకూరపాడు గ్రామానికి చెందిన దివి సుందరయ్య (54)కు మతిస్థిమితం సరిగా ఉండదు. అతని అన్న వద్ద ఉంటూ పశువులు మేపుతూ ఉంటాడు. రోజూలాగే శనివారం గేదెలు తోలుకుపోయిన సుందరయ్య తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా కనిపించలేదు. ఆదివారం ఉదయం పెంటాయకుంటలో మృతదేహం కనిపించడంతో కుటుంబ సభ్యులకు గ్రామస్తులు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఒంగోలు జీజీహెచ్కి తరలించారు. మృతుడి అన్న దివి వెంకయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగమల్లీశ్వరరావు తెలిపారు. -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకోవాలి
కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు మాట్లాడుతున్న అన్నా రాంబాబు, వేదికపై ఉడుముల శ్రీనివాసులరెడ్డి, నాయకులు పొదిలి రూరల్: పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందించాలని, పేద విద్యార్థులకు వైద్య విద్య చేరువ చేయాలనే ఉద్దేశంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తే.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేయాలని చూస్తోందని వైఎస్సార్ సీపీ మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం పొదిలి విశ్వనాథపురం (16వ వార్డు)లో పార్టీ నగర పంచాయతీ అధ్యక్షుడు సానికొమ్ము శ్రీనివాసులరెడ్డి, రాష్ట్ర అంగన్వాడీ, మహిళా కార్యదర్శి ఉడుముల వరలక్ష్మమ్మ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసులరెడ్డితో కలిసి దివంగత సీఎం వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి అన్నా రాంబాబు నివాళులర్పించారు. అనంతరం మెడికల కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్వచ్ఛందంగా తరలివచ్చిన జనంతో సంతకాలు సేకరించారు. పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించనున్న నిరసన ర్యాలీ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అన్నా రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ద్వారా పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు దూరమవుతాయన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉంటే 500 పడకల ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయనే ఉద్దేశంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో ఏకంగా 17 వైద్య కళాశాలల నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. వాటిలో ఇప్పటికే 7 కళాశాలల నిర్మాణాలు పూర్తి కాగా, మరో 10 కాలేజీల నిర్మాణాలు వివిధ దశల్లో నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయా కళాశాలల ప్రైవేటీకరణకు ఆసక్తి చూపడం దుర్మార్గమన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పీపీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన హయంలో రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాల కూడా స్థాపించలేకపోయారన్నారు. ఏడాదిన్నర కాలంలోనే కూటమి ప్రభుత్వం ప్రజాగ్రహాన్ని చవిచూసిందన్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు లేవని, కూటమి ప్రభుత్వం మెడలు వంచైనాసరే పీపీపీ విధానాన్ని అడ్డుకోవాలని పార్టీ శ్రేణులకు అన్నా రాంబాబు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రారష్ట్ర కార్యదర్శులు కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, పొదిలి, కొనకనమిట్ల మండలాల పార్టీ అధ్యక్షులు గుజ్జుల సంజీవరెడ్డి, మోరా శంకర్రెడ్డి, మర్రిపూడి ఎంపీపీ వాకా వెంకటరెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, సాయిరాజేశ్వరరావు, కె.నరసింహరావు, జి.శ్రీనివాసులు, నూర్జహన్ బేగం, మెట్టు వెంకటరెడ్డి, కొత్తపులి బ్రహ్మారెడ్డి, మస్తాన్వలి, ఫిరోజ్, వెంకటేశ్వరరెడ్డి, ఏడుకొండలు, నగర పంచాయతీ బీసీ సెల్, బూత్ వింగ్, క్రిస్టియన్ మైనార్టీ, మహిళా విభాగం, మైనార్టీ సెల్, పంచాయతీ రాజ్ వింగ్, ఆర్టీఐ వింగ్, దివ్యాంగుల విభాగం, రైతు విభాగం, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, స్టూడెంటు వింగ్, వాణిజ్య విభాగం, వలంటరీ విభాగం, యూత్ వింగ్, సోషల్ మీడియా విభాగం కమిటీల నాయకులు, వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, ఉడుముల శ్రీనివాసులరెడ్డి పిలుపు పొదిలి 16వ వార్డులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రజా ఉద్యమం పోస్టర్ల ఆవిష్కరణ -
నరకదారులు
చీమకుర్తి వద్ద గుంతలమయమైన ప్రధాన రహదారిఅడుగుకో గుంత..మోకాలి లోతు బురదతో జిల్లాలోని అంతర్గత రహదారులు అధ్వానంగా మారాయి. ప్రధాన రహదారుల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రోడ్ల వరకు గుంతలు, మిట్టలతో, రాళ్లు తేలి ఉండటంతో వాహనదారులు నరకం చూస్తున్నారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లుపై ఉన్న గుంతల్లో వర్షం నీరు చేరి మరింత ప్రమాదకరంగా మారాయి. మట్టిరోడ్లు అయితే బురదమయమై అడుగుతీసి అడుగేయలేనంత దారుణంగా తయారై కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని వెక్కిరిస్తున్నాయి. -
మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడపాలి
నాగులుప్పలపాడు: విద్య, వైద్య రంగాలను పేద ప్రజలకు దూరం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం కుట్రపన్నిందని వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను చంద్రబాబు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఆదివారం మండలంలోని పోతవరం గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మేరుగు నాగార్జున మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 12 మాత్రమే మెడికల్ కళాశాలలు ఉండేవని తెలిపారు. పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, అట్టడుగు వర్గాల బిడ్డలు కూడా వైద్యులుగా మారాలనే గొప్ప సంకల్పంతో జగన్మోహన్రెడ్డి రాష్ట్రానికి కొత్తగా 17 మెడికల్ కళాశాలలు తీసుకొచ్చి వాటి నిర్మాణానికి కోట్ల రూపాయలు వెచ్చించి త్వరితగతిన పూర్తి చేయడానికి కృషి చేశారన్నారు. 5 మెడికల్ కళాశాలలను తన చేతుల మీదగానే ప్రారంభోత్సవం చేయడంతో పాటు మిగతా కళాశాలలు కూడా పూర్తయ్యే దశలో ఉన్న పరిస్థితుల్లో.. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు పేదల ఆరోగ్యంపై విషం వెళ్లగక్కారన్నారు. పీపీపీ విధానం పేరుతో మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసి పేదలకు వైద్యం, వైద్య విద్యను దూరం చేస్తున్నారన్నారు. ప్రతిఒక్కరూ విజ్ఞతతో ఆలోచించి చంద్రబాబు దుర్మార్గాలను అర్థం చేసుకోవాలన్నారు. దీంతో పాటు రాష్ట్రంలో రైతులు, వ్యవసాయాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. రైతులపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేక, పండించిన పంటలను కొనే వారు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనాన్నారు. బర్లీ పొగాకు రైతులకు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలుగాక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఎన్నికల హామీలన్నీ విస్మరించి మహిళలకు తీవ్ర అన్యాయం చేశారని చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై మేరుగు నాగార్జున మండిపడ్డారు. పరిపాలన గాలికొదిలేసిన చంద్రబాబు.. లేని నకిలీ మద్యం, లిక్కర్ స్కాంను బూచిగా చూపిస్తున్నారన్నారు. దీనిని ప్రజలు లోతుగా అధ్యయనం చేయాలన్నారు. అనంతరం మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయడాన్ని నిరసిస్తూ వాల్పోస్టర్లు విడుదల చేశారు. కోటి సంతకాల కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకుడు నలమలపు కృష్ణారెడ్డి, మండల కన్వీనర్ పోలవరపు శ్రీమన్నారాయణ, ఎంపీపీ నలమలపు అంజమ్మ కృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, గ్రీవెన్స్ సెల్ జిల్లా అధ్యక్షుడు పోలినేని కోటేశ్వరరావు, సీనియర్ నాయకులు తుమ్మల బ్రహ్మానందరెడ్డి, అన్నెం వెంకట్రామిరెడ్డి, వాకా కోటిరెడ్డి, కాట్రగడ్డ శ్రీనివాసరావు, బత్తుల ప్రసన్న, తగిరిశ సుబ్బారావు, కాటూరి ఆదియ్య, కందుల డానియేలు, పాలపర్తి ప్రవీణ్, పాదర్తి శివ, పాలేరు నాగేశ్వరరావు, కాకర్ల వెంకటేష్, గ్రామ సర్పంచ్ శీలం రేణుకా సురేష్, ఎంపీటీసీ పొద పవన్, డాకా రాజీవ్, పవన్ కుమార్, అనీల్, చిన్నం సురేష్, గోరంట్ల అంజయ్య, మాడుగుల యేసు, కాకునూళ్ల సుబ్బారావు, మారెడ్డి ఇందిర తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటుపరం చేయడం దుర్మార్గం కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ మంత్రి మేరుగు నాగార్జున -
వైఎస్సార్ సీపీలో నియామకం
● అంగన్వాడీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విజయలక్ష్మి ఒంగోలు సిటీ: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ అంగన్వాడీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన సాధం విజయలక్ష్మిని నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. కూలిన మట్టి మిద్దె కొమరోలు: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మట్టి మిద్దె కూలిన సంఘటన కొమరోలు మండలంలోని పామూరుపల్లె గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పామూరుపల్లె గ్రామంలో చిన్నపురెడ్డికి చెందిన మట్టి మిద్దె కూలిన సమయంలో అతను ఇంట్లోనే ఉండటంతో దంతెలు పడి గాయాలయ్యాయి. అతన్ని వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని చిన్నపురెడ్డి కోరారు. వీఆర్ఓ పాండు మట్టి మిద్దెను పరిశీలించారు. -
ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి
ఒంగోలు సబర్బన్: జిల్లాకు మొంథా తుఫాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రానున్న మూడు రోజులు జిల్లాలోని అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, మొంథా తుఫాన్ జిల్లా ప్రత్యేక అధికారి కోన శశిధర్ ఆదేశించారు. మొంథా తుఫాన్ నేపథ్యంలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై కలెక్టర్ పీ రాజాబాబుతో కలిసి ఒంగోలు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆదివారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శశిధర్ మాట్లాడుతూ తుఫాన్ కారణంగా జిల్లాలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శాఖల వారీగా చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్లపై సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. తుఫాన్ ముప్పు నేపథ్యంలో రానున్న మూడు రోజులు (27, 28, 29 తేదీలు) జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి తుఫాన్ను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలని ఆదేశించారు. అధికారులతో సమావేశం అనంతరం మీడియాతో శశిధర్ మాట్లాడుతూ తుఫాన్ ముప్పును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉందన్నారు. ప్రతి జిల్లాకు ఒక సీనియర్ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించడం జరిగిందన్నారు. తుఫాన్ను ఎదుర్కొనేందుకు ప్రకాశం జిల్లా యంత్రాంగాన్ని సమన్వయం చేయడానికి తాను ఒంగోలు వచ్చినట్లు తెలిపారు. ముందస్తు ఏర్పాట్లు, జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలపై కలెక్టర్, జాయింట్ కలెక్టర్తో కలిసి ఆల్ కీ డిపార్ట్మెంట్స్ అధికారులతో సమీక్షించినట్లు చెప్పారు. తుఫాన్ 28వ తేదీ రాత్రి మచిలీపట్నం – కాకినాడ మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేసిందని తెలిపారు. మత్స్యకారులు ఎవరైనా చేపల వేటకు సముద్రంలోకి వెళ్లారా లేదా అని సమీక్షించుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో ఎవరూ సముద్రంలోకి వెళ్లలేదని, అందరు సురక్షితంగా ఉన్నారని అధికారులు చెప్పినట్లు తెలిపారు. తుఫాన్ ప్రభావం తగ్గేంత వరకు, అధికారులు చెప్పేంత వరకు మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వెళ్లరాదని సూచించారు. సముద్ర తీరప్రాంత మండలాల్లోని 18 గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేసి అవసరమైతే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా అన్ని ఏర్పాట్లు చేపట్టడం జరిగిందన్నారు. అలాగే ఆయా ప్రాంతాలలోని వృద్ధులు, గర్భిణులపై ప్రత్యేక దృష్టి సారించి వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించే ఏర్పాట్లు చేపడుతున్నట్లు చెప్పారు. అధికారులతో సమీక్షిస్తున్న కోన శశిధర్, పక్కన జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సమీక్షకు హాజరైన జిల్లా అధికారులు తుఫాన్పై అప్రమత్తంగా ఉండండి జిల్లా అధికారులతో సమీక్షించిన తుఫాన్ జిల్లా ప్రత్యేక అధికారి కోన శశిధర్, కలెక్టర్ రాజాబాబుజిల్లాలోని చెరువులు, రిజర్వాయర్ల పరిస్థితిపై సమీక్ష... జిల్లాలోని చెరువులు, రిజర్వాయర్ల పరిస్థితిపై సమీక్షించుకోవడం జరిగిందని, ఎక్కడైతే ఓవర్ ఫ్లో అవుతున్నాయో ఆయా ట్యాంకులు, చెరువులపై ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ కలెక్టర్ ఆదేశాలతో తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు శశిధర్ తెలిపారు. వ్యవసాయ, ఉద్యానవనశాఖ, మత్స్యశాఖ, పశుసంవర్థక శాఖ, ఇరిగేషన్, వైద్యారోగ్య శాఖ, పంచాయతీ రాజ్, ఆర్అండ్బీ, విద్య, తదితర ముఖ్యమైన శాఖల అధికారులతో సమగ్రంగా సమీక్షించి తగు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. సంబంధిత శాఖల సిబ్బందితో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ గంటగంటకూ సమాచారం తీసుకుంటూ ఏదైనా సంఘటన జరిగితే తక్షణమే స్పందించేలా ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రకాశం జిల్లా యంత్రాంగం మొంథా తుఫాన్ను ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధంగా ఉందని శశిధర్ తెలిపారు. తొలుత తుఫాన్కు ముందు, తుఫాన్ సమయంలో, తుఫాన్ తర్వాత శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యలపై రూపొందించిన యాక్షన్ ప్లాన్ను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ పీ రాజాబాబు ప్రత్యేక అధికారికి సమగ్రంగా వివరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి బి.చిన ఓబులేసు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
పొలాల్లోకి దూసుకెళ్లిన ప్రైవేటు బస్సు
మార్కాపురం: ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లిన సంఘటన ఆదివారం రాత్రి ప్రకాశం జిల్లా మార్కాపురం–కుంట మధ్య జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మార్కాపురం నుంచి బెంగళూరు వెళ్తున్న ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కొట్టాలపల్లి గ్రామ మూల మలుపు తిరగగానే ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పొలాల్లోకి వెళ్లిపోయింది.ఆ సమయంలో బస్సులో ఉన్న ఎనిమిది మంది ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే, డ్రైవర్ వెంటనే బ్రేక్ వేయడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. సంఘటనాస్థలాన్ని మార్కాపురం రూరల్ ఎస్ఐ అంకమ్మరావు తన సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. -
నన్నేలు నాగన్నా..
నాగుల చవితి సందర్భంగా శనివారం జిల్లావ్యాప్తంగా నాగేంద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచే ఆలయాలకు భక్తులు బారులుదీరారు. పుట్టల్లో పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సుబ్రహ్మణ్యస్వామికి, జంట నాగులకు విశేష పూజలు చేశారు. – సాక్షి, ఒంగోలు సీఎస్ పురం మండలంలో పూజలు చేస్తున్న మహిళలు ఒంగోలు సంతపేట సాయిబాబా ఆలయంలో నాగేంద్రస్వామికి పూజలు చేస్తున్న భక్తులు -
కర్నూలు బస్సు ప్రమాదంలో ఒంగోలు వ్యక్తి మృతి
ఒంగోలు టౌన్: కర్నూలు సమీపంలోని చిన టేకూరు వద్ద శుక్రవారం జరిగిన బస్సు దగ్ధమైన ప్రమాదంలో ఒంగోలుకు చెందిన వ్యక్తి ఒకరు మరణించారు. నగరంలోని కమ్మపాలేనికి చెందిన బొంత ఆదిశేషగిరి రావు అలియాస్ గిరిరావు (45) ఉద్యోగ నిమిత్తం 20 ఏళ్ల క్రితం హైదరాబాద్కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అత్తాపూర్లో భార్యాబిడ్డలతో కలిసి నివసిస్తున్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)లో మార్కెటింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. కొద్దికాలం క్రితం ఆయన్ను పదోన్నతిపై బెంగళూరుకు బదిలీ చేశారు. దాంతో బెంగళూరులో పనిచేస్తూ వారానికి ఒకసారి హైదరాబాద్లోని ఇంటికి వచ్చి పోతుంటారు. గిరిరావుకు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. కుమార్తె డిగ్రీ చదువుతుండగా, కుమారుడు ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. దీపావళి పండుగకు ఇంటికొచ్చిన గిరిరావు గురువారం రాత్రి బెంగళూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. దురదృష్టవశాత్తు బస్సు ప్రమాదంలో మరణించారు. ఒంగోలులో నివాసం ఉండే ఆయన సోదరి సమాచారం తెలిసిన వెంటనే కర్నూలు బయలుదేరారు. ప్రస్తుతం గిరిరావు మృతదేహానికి డీఎన్ఏ పరీక్షలు చేయడం పూర్తయిందని, రిపోర్టు వచ్చిన తరువాత మృతదేహాన్ని హైదరాబాద్కు తరలించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు సమాచారం. అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. 20 ఏళ్ల క్రితమే హైదరాబాద్లో స్థిరపడిన కుటుంబం పదోన్నతిపై బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న గిరి రావు ఒంగోలు నుంచి కర్నూలు తరలిన కుటుంబ సభ్యులు -
మెడికల్ కాలేజీలను కాపాడుకోవాలి
మార్కాపురం టౌన్: గత వైఎస్సార్ సీపీ హయాంలో ఆనాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రానికి తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వైఎస్సార్ సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. మార్కాపురంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలన్నింటినీ పూర్తిచేయకపోగా, వాటిని పీపీపీ విధానంలో వారికి అనుకూలమైన ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి లబ్ధి పొందాలని చూడటం దురదృష్ణకరమని అన్నారు. దీనికి వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 28న మార్కాపురంలో శాంతియుత ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టరు కార్యాలయంలో వినతిపత్రం అందించనున్నట్లు తెలిపారు. మెడికల్ కాలేజీల నిర్మాణాలకు 550 కోట్లు ఖర్చుపెట్టలేని ముఖ్యమంత్రి చంద్రబాబు.. రాష్ట్రంలో సంపద ఎక్కడి నుంచి సృష్టిస్తారని ప్రశ్నించారు. మార్కాపురం, గిద్దలూరు, వై.పాలెం నియోజకవర్గాలతో పాటు అందరికీ ఉపయోగపడే మార్కాపురం మెడికల్ కాలేజీని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు, ప్రజలపై ఉందన్నారు. ఈ కాలేజీ పూర్తయితే పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్య తక్కువ ఖర్చుతో అందుతుందని తెలిపారు. ప్రైవేటు వారి చేతుల్లోకి వెళ్తే లక్షలాది రూపాయల డొనేషన్లు చెల్లించి చదివించడంతో పాటు కార్పొరేట్ వైద్యాన్ని డబ్బులు చెల్లించి పొందాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. పీపీపీ విధానాన్ని వామపక్షపార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, మేధావులు, జర్నలిస్టు సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నా కూటమి ప్రభుత్వం పీపీపీకే మొగ్గుచూపడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ప్రజలంతా దీనిపై ఆలోచించాలన్నారు. వచ్చే నెల 25 తర్వాత రాష్ట్ర గవర్నర్ వద్ద అపాయింట్మెంటు తీసుకుని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన కోటి సంతకాల పత్రాలందించి ఆయన ద్వారా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కృషి చేద్దామని అన్నా రాంబాబు పిలుపునిచ్చారు. అనంతరం 28న ర్యాలీలకు సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో మెనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ షంషేర్ ఆలీబేగ్, ఏఎంసీ మాజీ చైర్మన్ గొలమారి శ్రీనివాసరెడ్డి, జెడ్పీటీసీ నారు బాపన్రెడ్డి, పార్టీ పట్టణ ప్రెసిడెంట్ సలీమ్, ఎంపీపీ లక్ష్మిదేవీ కృష్ణారెడ్డి, సిరాజ్, పత్తి రవిచంద్ర, ఉత్తమ్కుమార్, రోజ్లిడియా, కొత్త కృష్ణ, బొగ్గరపు శేషయ్య, ఇబ్రహీం, సలీమ్, ఎం.శ్రీనివాసులు, గుంటక వనజాక్షి చెన్నారెడ్డి, చాటకొండ చంద్ర, పట్టణ ప్రధాన కార్యదర్శి గొలమారి సత్యనారాయణరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు చెంచిరెడ్డి, రైతు విభాగం పట్టణ అధ్యక్షుడు నూనె శివారెడ్డి, బట్టగిరి తిరుపతిరెడ్డి, నల్లబోతుల కొండయ్య, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రంగారెడ్డి, గౌస్ మొహిద్దీన్, బచ్చు సుబ్రహ్మణ్యం, పీవీ నాయుడు, వరమ్మ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించాలి 28న వైఎస్సార్ సీపీ ర్యాలీని విజయవంతం చేయాలి వైఎస్సార్ సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పిలుపు -
బినామీలకు కట్టబెట్టేందుకే ప్రైవేటీకరణ
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి కురిచేడు: వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో బృహత్తర ఆశయంతో రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను మంజూరు చేయిస్తే..చంద్రబాబు వాటిని తన బినామీలకు కట్టబెట్టేందుకు ప్రైవేటీకరణ జపం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మండిపడ్డారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మండల కేంద్రంలో శనివారం సాయంత్రం కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమాలు పార్టీ మండల కన్వీనర్ వైవీ సుబ్బయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా బూచేపల్లి మాట్లాడుతూ కల్లబొల్లి హామీలతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మంచి పేరు రాకూడదనే కుట్రలో భాగంగానే మెడికల్ కళాశాలలను ప్రైవేట్ చేస్తున్నారని విమర్శించారు. మెడికల్ కళాశాలలను ప్రైవేట్పరం చేస్తే వైద్య, విద్యతో పాటు వైద్య సేవలు కూడా అందని ద్రాక్షపండులా అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మెడికల్ కళాశాలల నిర్మాణానికి 25 ఏళ్లు పడుతుందని పెయిడ్ ఆర్టిస్టులతో ప్రచారం చేయిస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 కళాశాలలు మంజూరు చేయించి వాటిలో 7 కళాశాలలను మూడేళ్లలో పూర్తి చేసి వాటిని ప్రారంభించి పేదలకు వైద్య సేవలందించారని గుర్తు చేశారు. వైఎస్సార్ సీపీ హయాంలో గ్రామీణ ప్రాంతానికి కూడా స్పెషలిస్టు డాక్టర్లు వచ్చి పేదలకు ఉచితంగా వైద్య సేవలందించారని గుర్తు చేశారు. కానీ మోసపు మాటలతో అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఇప్పటికే మద్యం, ఇసుక పూర్తిగా కూటమి చేతుల్లోకి వెళ్లిపోయాయని, ఎయిర్పోర్టులు, ఓడరేవులు, గ్రీన్ఫీల్డ్ హైవేలు వారి బంధువులకు కట్టబెట్టినా పేదలకు నష్టం లేదని, కానీ పేదల ప్రాథమిక హక్కు అయిన విద్య, వైద్యం వారికి దూరం చేయాలని చూస్తుంటే పోరాటం చేస్తున్నామన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ఎంతో మంది ప్రాణాలు కాపాడిందని, కానీ ఆ పథకం కూడా కూటమి ప్రభుత్వంలో అటకెక్కిందన్నారు. భావితరాల అభివృద్ది కోసం ప్రతి ఒక్కరూ ఈ పోరాటంలో స్వచ్ఛందంగా చేయి కలపాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ టీయూసి రాష్ట్ర కార్యదర్శి షేక్.సైదా, జిల్లా అధికార ప్రతినిది గోగులముడి లింగారెడ్డి, వి.కోటయ్య, ఎం సుబ్బారెడ్డి, ఎన్ రాజయ్య, ఇందూరి పద్మ, షేక్.మౌలాలి, వరికూటి వెంకటేశ్వర్లు, పి.వెంకట్రావు, కె.జోసఫ్, ఊట్ల వెంకటేశ్వర్లు, అంకే గోపాలకృష్ణ, సారెడ్డి నాగిరెడ్డి, బల్లిపల్లి సుబ్బారావు కానాల శివారెడ్డి, ఎం నాగమణి, ఎం యోగిరెడ్డి, అంకే వెంకటేశ్వర్లు, కె.నాగేశ్వరరావు, గొట్టిపాటి రాములు, కొత్తమాసు సుబ్రహ్మణ్యం, పీవీ సుబ్బారావు, ఇందూరి సుబ్బారెడ్డి, సర్పంచ్లు కె.కృష్ణయ్య, కె.భాస్కరరెడ్డి, నాయకులు ఎన్ ప్రతాపరెడ్డి, ఎం. పిచ్చిరెడ్డి, రమణారెడ్డి, ఏ చెన్నారెడ్డి, జి.సంతారావు, పుల్లారెడ్డి, సాదం నాసరయ్య, ఎన్వీ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి
గిద్దలూరు రూరల్: రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందిన సంఘటన గిద్దలూరు మండలంలోని దిగువమెట్ట గ్రామ సమీపంలో నల్లమల ఘాట్ రోడ్డుపై శనివారం వేకువజామున జరిగింది. ఆళ్లగడ్డ నుంచి రాజమండ్రికి మొక్కజొన్న లోడుతో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తూ నల్లమల ఘాట్ రోడ్డు మలుపు వద్ద పాత రైల్వేబ్రిడ్జిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ దూదేకుల బాలహుస్సేన్ (50) క్యాబిన్లోనే ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. క్లీనర్ చిన్నయ్యకు స్వల్పగాయాలయ్యాయి. రోడ్డుకు అడ్డంగా లారీ ఉండిపోవడంతో నంద్యాల నుంచి గిద్దలూరు వైపు వెళ్లే వాహనాలు కిలోమీటరు మేర నిలిచిపోయాయి. దీంతో సుమారు 6 గంటల పాటు ట్రాఫిక్ సమస్య తలెత్తి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు ప్రయాణికులు బస్సులు, ఆటోల నుంచి దిగి నడుచుకుంటూ గిద్దలూరు చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రోడ్డుకు అడ్డంగా ఉన్న లారీని క్రెయిన్ సహాయంతో పక్కకు తొలగించారు. లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడు ఆళ్లగడ్డకు చెందిన వ్యక్తిగా గుర్తించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదే ప్రాంతంలో ఈ నెల 16వ తేదీ లారీ ఢీకొని డ్రైవర్ రాజు మృతి చెందాడు. పాత రైల్వే బ్రిడ్జి వద్ద గల మలుపు ప్రమాదకరంగా ఉందని, దానిని గుర్తించి వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలని సీఐ కె.సురేష్ సూచించారు. -
ట్రావెల్స్ బస్సుల తనిఖీ
ఒంగోలు టౌన్: కర్నూలు సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమై 19 మంది మృతిచెందిన నేపథ్యంలో జిల్లాలో ప్రైవేటు ట్రావెల్ బస్సులను పోలీసు శాఖ అధికారులు శనివారం తనిఖీ చేశారు. ఒంగోలు నగరంలోని ముంగమూరు రోడ్డు, అద్దంకి బస్టాండు సెంటర్, టంగుటూరు టోల్ గేట్ వద్ద 65 ట్రావెల్ బస్సులను తనిఖీ చేశారు. బస్సుల్లో దురదృష్టవశాత్తూ ఏదైనా ప్రమాదం జరిగితే ప్రయాణికులు బయటపడడానికి అత్యవసరమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయో.. లేదో పరిశీలించారు. ఎమర్జన్సీ డోర్ల పనితీరును పరిశీలించారు. అత్యవసర సమయాలలో గాజు అద్దాలను పగులగొట్టేందుకు అవసరమైన బ్రేకర్లు అందుబాటులో ఉంచాలని, లగేజీ ప్రదేశాల్లో మండే పదార్థాలు, చట్ట విరుద్ధమైన వస్తువులను రవాణా చేయకుండా చూడాలని సూచించారు. బస్సు రిజిస్ట్రేషన్ పత్రాలు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్స్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. బస్సు బయలుదేరడానికి ముందు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను పరిశీలించుకోవాలని, రవాణా శాఖ నిబంధనలు పాటించాలని, లేకపోతే వాహనాలను రోడ్ల మీద తిరగనిచ్చేది లేదని స్పష్టం చేశారు. స్కూల్, కాలేజీ బస్సుల తనిఖీ ఒంగోలు సబర్బన్: నగరంలో కాలేజీ, స్కూల్ బస్సులను రవాణా శాఖ అధికారులు శనివారం తనిఖీ చేశారు. ఉప రవాణా కమిషనర్ ఆర్.సుశీల ఆదేశాల మేరకు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించని కొన్ని కాలేజీలు, స్కూల్ బస్సులపై 22 కేసులు నమోదు చేసి సుమారు లక్ష రూపాయల అపరాధ రుసుం విధించారు. -
28న ర్యాలీని జయప్రదం చేయండి
● వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున పిలుపు మద్దిపాడు: రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం పీపీపీ విధానం పేరుతో ప్రైవేటీకరించడానికి వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీ సంతనూతలపాడు నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించనున్న ప్రజా ఉద్యమ ర్యాలీని పార్టీ శ్రేణులు, ప్రజలు విజయవంతం చేయాలని పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున పిలుపునిచ్చారు. ఆ మేరకు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో శనివారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. సంతనూతలపాడు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో మద్దిపాడు ఎంపీపీ వాకా అరుణ కోటిరెడ్డి, చీమకుర్తి ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, పార్టీ చీమకుర్తి పట్టణ అధ్యక్షుడు క్రిష్టపాటి శేఖర్రెడ్డి, సంతనూతలపాడు మండల అధ్యక్షుడు దుంపా చెంచురెడ్డి, నాగులుప్పలపాడు మండల అధ్యక్షుడు పోలవరపు శ్రీమన్నారాయణ, దుంపా యలమందారెడ్డి, ఇనగంటి పిచ్చిరెడ్డి, చీమకుర్తి జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్లో జిల్లా వాసుల ప్రతిభ
ఒంగోలు సిటీ: ‘కళాఉత్సవం 2025’ ను పురస్కరించుకొని విజయవాడలో ఈనెల 23, 24 తేదీల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లాకు చెందిన పలువురు ఐదు విభాగాల్లో పాల్గొని బహుమతులు సాధించారని మైనంపాడు డైట్ ప్రిన్సిపాల్ సామా సుబ్బారావు శనివారం తెలిపారు. ఫోక్డాన్స్ లో మూడో బహుమతిని సీఎస్పురం కేజీబీవీకి చెందిన పూజ గ్రూప్, సోలో ఓకల్లో రెండో బహుమతిని ఎన్.లక్ష్మీలాస్య సాయి, గ్రూప్ ఓకల్లో మూడో బహుమతిని జి.ఝాన్సీ గ్రూప్, థియేటర్ ఆర్ట్లో మూడో బహుమతిని కే కావ్య గ్రూప్, విజువల్ ఆర్ట్ టూడీలో రెండో బహుమతిని జీ శృతి గెలుచుకున్నారని తెలిపారు. విజేతలను అభినందించారు. ఒంగోలు సిటీ: ఆంధ్రకేసరి యూనివర్సిటీ పరిధిలోని పీజీ కళాశాలల్లో 2023–2024 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగో సెమిస్టర్ ఫలితాలను వైస్ఛాన్సలర్ డీవీఆర్.మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పీజీ కళాశాలల్లోని వివిధ కోర్సులకు సంబంధించి మొత్తం 1011 మంది విద్యార్థులు హాజరుకాగా, వారిలో 92.58 ఉత్తీర్ణత శాతంతో 936 మంది పాసైనట్లు తెలిపారు. ఏకేయూ స్థాయిలోని ఆయా కళాశాలల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన వారికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సీఈ ప్రొఫెసర్ సోమశేఖర, డాక్టర్ ఆర్.శ్రీనివాసులు, సూడా శివరాం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం: ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్గా వైఎస్సార్ సీపీ నేత, మార్కాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు దేవతి భగవన్నారాయణ నియామకపత్రం పంపించారు. ఆమేరకు నియామకపత్రం శనివారం అందినట్లు బాలమురళీకృష్ణ తెలిపారు. ఆర్యవైశ్య అభివృద్ధికి తనవంతు కృషిచేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా బాల మురళీకృష్ణను పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, ఆర్యవైశ్య సభ్యులు పలువురు అభినందించారు. మద్దిపాడు: మండలంలోని కందుల ఓబుల్ రెడ్డి గుండ్లకమ్మ జలాశయం నుంచి డ్యాం అధికారులు భారీగా నీరు విడుదల చేస్తున్నారు. గుండ్లకమ్మ నదిపై భాగంలో భారీగా వర్షాలు కురిసి వాగులు నదిలో కలుస్తుండటంతో వరద నీరు రిజర్వాయర్లోకి చేరుతోంది. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయానికి 24 వేల క్యూసెక్కుల నీరు రిజర్వాయర్ లోకి రావడంతో 9 గేట్లు ఎత్తి 24 వేల క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేశారు. రాత్రికి వరద నీరు భారీగా రావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గుండ్లకమ్మ నది దిగువ భాగంలో గ్రామాల్లో నివసించే ప్రజలు గుండ్లకమ్మ నది లోకి దిగరాదని ప్రజలను హెచ్చరించారు. డ్యామ్ అధికారులు గుండ్లకమ్మ రిజర్వాయర్ వద్ద అప్రమత్తంగా ఉన్నట్లు ఏఈ రామాంజనేయులు తెలిపారు. పెద్దదోర్నాల: నల్లమలలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మండల పరిధిలోని తీగలేరు వాగు ఉధృతంగా ప్రవహించటంతో చిన్నదోర్నాల వద్ద వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శనివారం రాత్రి ఏడు గంటల సమయంలో తీగలేరు పొంగటంతో మార్కాపురం, ఒంగోలు కడప, గిద్దలూరుతో పాటు శ్రీశైలం, కర్నూల్తో పాటు రాయలసీమ వైపునకు వెళ్లే వాహనాలను కుంట మీదుగా దారి మళ్లించారు. వర్షాలు కురుస్తున్న ప్రతి సారీ ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతుండటంతో వాహనాదారులు, ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
కంభం చెరువుకు జలకళ
కంభం: నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గుండ్లకమ్మ, జంపలేరు వాగులు ఉధృతంగా పారడంతో వరద నీరు చారిత్రక ప్రసిద్ధి చెందిన కంభం చెరువుకు వచ్చి చేరుతోంది. గతంలో కురిసిన వర్షాలకు పది అడుగుల మేర నీరు ఉండగా ప్రస్తుతం నీటి మట్టం 16 అడుగులు దాటినట్లు తెలుస్తోంది. మరో 3–4 అడుగులు నీరు చేరితే అలుగు పారే అవకాశం ఉంది. తుఫాన్ ప్రభావం ఈ నెల 29వ తేదీ వరకు ఉండటంతో ఈసారి చెరువు నిండి అలుగు పారుతుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిండు కుండలా ఉన్న కంభం చెరువు అందాలు కనువిందు చేస్తున్నాయి. చెరువులో నీరు చేరడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు చెరువును సందర్శించేందుకు వస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మార్కాపురం ఇన్చార్జ్ ఆర్డీఓ, వెలిగొండ ప్రాజెక్ట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శివరామిరెడ్డి, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలసి శనివారం కంభం చెరువును పరిశీలించారు. -
భూములు దోచిపెట్టి..పైసలు చేతబట్టి..!
కనిగిరిరూరల్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కనిగిరి ప్రాంతంలోని అధికార పార్టీ నాయకులు భూ అక్రమాలకు తెరలేపారు. రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి, వారికి డబ్బులు ముట్టజెప్పి యథేచ్ఛగా తమ అక్రమ దందా సాగించారు. కాసులకు కక్కుర్తిపడిన రెవెన్యూ అధికారులు అధికార పార్టీకి చెందిన కొందరు నేతలకు రూ.లక్షల విలువైన భూములను అప్పనంగా కట్టపెట్టినట్లు ప్రచారం ఉంది. పట్టణంతో పాటు, మండలంలోని విలువైన భూములున్న చల్లగిరిగిల్ల, బల్లిపల్లి, కంచర్లవారిపల్లి, పునుగోడు, తదితర గ్రామాల్లోని భూముల బదలాయింపు ప్రక్రియలో, మ్యుటేషన్ విధానంలో రూ.లక్షలు చేతులు మారాయి. కీలక అధికారితో పాటు, రెవెన్యూ సిబ్బంది అధికారపార్టీ నేతల మాటలకు జీ హుజూర్ అంటూ భారీగా అక్రమాలకు పాల్పడ్డారు. వీటిపై ‘సాక్షి’లో కథనాలు ప్రచురితమవడంతో పాటు కొందరు బాధితులు రెవెన్యూ అధికారుల అక్రమాలపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గత కలెక్టర్ తమీమ్ అన్సారియా కనిగిరి రెవిన్యూ కార్యాలయంలో భూ అక్రమాలు, భూ మ్యుటేషన్ అక్రమ భాగోతాలు, వెబ్ల్యాండ్ భూ పోర్టల్లో ఆన్లైన్ అక్రమాల వ్యవహారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ తరుణంలో ఆమె బదిలీ అయ్యారు. దీంతో కొన్ని రోజులు మిన్నకున్న కనిగిరి రెవెన్యూ అధికారులు తిరిగి దందా సాగించారు. జోరుగా దందా.. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు రెండు, మూడు ముఠాలుగా ఏర్పడి కీలక అధికారికి, రెవెన్యూ అధికారులకు నజరానాలు ఇచ్చి.. ఒత్తిడి చేసి అనేక అక్రమాలు చేయించారు. ఒకరి భూమికి చెందిన సర్వేనంబర్లను మరొకరి పేరుతో ఆన్లైన్ ఎక్కించడం, నిబంధనలకు విరుద్ధంగా భూ మ్యుటేషన్లు చేయించుకోవడం, జగనన్న లే అవుట్లలో, గతంలో కనిగిరి–పొదిలి రూట్లలో, కనిగిరి–కంభం రూట్లలో, కనిగిరి–పామూరు రూట్లలో వేసిన లే అవుట్లలో వాగులు, వంకల్లోని ప్రభుత్వ సౌకర్యాల నిమిత్తం వదిలేసిన ప్లాట్లల్లోని పట్టాలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష తీసుకుని పొజిషన్ పత్రాలు ఇవ్వడం వంటి అక్రమాలకు పాల్పడ్డారు. రికార్డుల పరిశీలన అనంతరం తహసీల్దార్ సస్పెన్షన్: గడిచిన మూడు నెలల్లో పదుల సంఖ్యలో భూముల మ్యుటేషన్లు, అసైన్డ్ పట్టాలు, అసైన్డ్ భూముల్లో పేర్ల మార్పు ఇలా అనేక అక్రమాలు చేసినట్లు కలెక్టర్కు పలు ఫిర్యాదులు వెళ్లాయి. అంతేగాక కొత్త కలెక్టర్కు బాధిత మహిళలు గ్రీవెన్స్లో కూడా కనిగిరి తహసీల్దార్ పై ఫిర్యాదు చేశారు. దీంతో ఒంగోలు ఆర్డీఓను విచారణ అధికారిగా నియమించారు. రెండ్రోజుల పాటు కనిగిరిలో రికార్డుల పరిశీలన చేశారు. అనంతరం తాజాగా ఇటీవల మ్యుటేషన్లు జరిగిన కొన్ని రికార్డులను ఒంగోలుకు తీసుకెళ్లారు. అందులో పది భూ మ్యుటేషన్ ఫైళ్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని సమాచారం. దీంతో కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. తహసీల్దార్ ఏవీ రవిశంకర్ ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు కనిగిరి కొత్త తహసీల్దార్గా జయలక్ష్మిని నియమించారు. సస్పెన్షన్ జాబితాలో నలుగురు వీఆర్వోలు..? విచారణ అధికారులు నివేదించిన జాబితాలో నలుగురు వీఆర్వోల పేర్లు ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే వీరిలో కొందరు నేరుగా తహసీల్దార్ అక్రమాల్లో భాగస్వాములుగా అయిన వారు కాగా.. కొందరు మాత్రం కేవలం అధికార పార్టీ ఒత్తిడితో ఫైల్స్ పై సంతకాలు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో భూమ్యుటేషన్ జరిగిన వాటికి సంబంధించిన ఫైల్స్ పై కూడా రహస్య విచారణ సాగిస్తున్నారు. అయితే అప్పట్లో ఆ సర్వే నంబర్లకు సంతకాలు చేసిన వీఆర్వోలు రిటైర్డ్ అయి ఉన్నారు. రెవెన్యూ భూ మాయలో, అక్రమాల్లో అత్యధికంగా లబ్ధి పొందింది అధికార పార్టీ నేతలేనని రెవెన్యూ అధికారులు బహిరంగంగా చెబుతున్నారు. తాము డబ్బులు తీసుకున్నా.. అధికార పార్టీ నేతల ఒత్తిడితోనే చేశామని కొందరు రెవెన్యూ సిబ్బంది వాపోతున్నారు. పట్టణ, రూరల్ గ్రామాలకు చెందిన అధికార పార్టీ నేతలు పోటీలు పడి మరీ తమ చేత అక్రమాలు చేయించారని అంటున్నారు. ఇప్పుడు అవన్నీ తమ మెడకు చుట్టుకున్నాయని..ఎవరిపై వేటుపడుతుందోనని కలవరపడుతున్నారు. -
ఆదివారం శ్రీ 26 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
పోలీస్శాఖలో అత్యంత కీలకంగా ఉండే స్పెషల్ బ్రాంచ్ జిల్లాలో గాడి తప్పుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిరంతరం నిఘా ఉంచి ఎలాంటి నేరం జరగకుండా పోలీసు శాఖను అప్రమత్తం చేయాల్సిన ఈ విభాగం అధికారులు, సిబ్బంది పనితీరుపై పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఎక్కడైనా సరే చీమ చిటుక్కుమన్నా వెంటనే సమాచారాన్ని సేకరించి ఉన్నతాధికారులకు ఉప్పందించాలి. ఎలాంటి నేరం జరగకుండా పోలీసు శాఖను అప్రమత్తం చేయాలి. అయితే అందుకు భిన్నమైన వాతావరణం నెలకొందన్న విమర్శలు ఉన్నాయి. జిల్లాలో స్పెషల్ బ్రాంచి పూర్తిగా వైఫల్యంపై ఎస్సీ హర్షవర్ధన్రాజు దృష్టిసారించినట్టు తెలిసింది. ఈ విభాగాన్ని ప్రక్షాళన చేసే దిశగా చర్యలు చేపట్టనున్నట్టు పోలీస్శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఉద్యోగాలు, పాస్పోర్టులకు సంబంధించి నిర్వహించే వెరిఫికేషన్లకు ఒక రేటు నిర్ణయించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. వెరిఫికేషన్కు గాను వ్యక్తిని బట్టి, అతడి స్థాయిని బట్టి వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఎవరైనా అడిగినంత ఇవ్వకపోతే నిబంధనల పేరిట రోజుల తరబడి తిప్పుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇవే కాకుండా పేకాట శిబిరాలు, సింగిల్ నంబర్ లాటరీ, స్పా, కోతముక్క నిర్వాహకుల నుంచి నెలవారి మామూళ్లు వసూలు చేస్తున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా వీరయ్య చౌదరి హత్య కేసు విచారణ సమయంలో కూడా పలువురు ఎస్బీ సిబ్బంది వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. రేషన్ మాఫియా, ఇసుక మాఫియా, గ్రానైట్ యజమానుల నుంచి భారీగా వసూళ్లు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ నాయకులతో కుమ్మకై ్క ప్రజలను వేధిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంతనూతలపాడు నియోజకవర్గానికి చెందిన కొందరు ఎస్బీ సిబ్బంది అవినీతిపై ఐజీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారం గురించి విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా ఇంటిలిజెన్స్ అధికారులను ఐజీ ఆదేశించినట్లు తెలుస్తోంది. జిల్లాలో స్పెషల్ బ్రాంచి ప్రక్షాళనకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. పోలీసు అధికారుల పనితీరును నిశితంగా పరిశీలిస్తున్న ఆయన తొలుత స్పెషల్ బ్రాంచిని పూర్తిగా ప్రక్షాళన చేయడం అవసరమని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జిల్లాలో పనిచేస్తున్న ఎస్బీ సిబ్బంది వివరాలను తెప్పించుకున్న సమాచారం. ఒక్కొక్కరినీ పిలిపించుకొని ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. పూర్తి సమాచారాన్ని చేతిలో పెట్టుకొని మాట్లాడుతుండడంతో పలువురు ఎస్బీ సిబ్బంది గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లుందని సమాచారం. ముఖ్యంగా దీర్ఘకాలంగా ఎస్బీలో పాతుకొనిపోయిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్లు తెలుస్తోంది. వైఫల్యాల్లోస్పెషల్సాక్షి ప్రతినిధి, ఒంగోలు: శాంతి భద్రతల పరిరక్షణలో స్పెషల్ బ్రాంచి పాత్ర ఎంతో కీలకం. నేరుగా రంగంలోకి రానప్పటికీ తెరవెనక ఉండి మొత్తం పోలీసు శాఖను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ఈ విభాగానిది. అయితే ఇక్కడ పనిచేస్తున్నవారు అసలు విధులను వదిలిపెట్టి ఇతర వ్యాపకాలతో కాలయాపన చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ విధులను విస్మరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 15 ఏళ్లుగా ఖాకీ దుస్తులు వేయని సిబ్బందిపై దృష్టి... జిల్లాలో గత 15 –20 ఏళ్లుగా ఖాకీ దుస్తులు వేసుకోకుండా పోలీసు ఉద్యోగం చేస్తున్నవారు అనేకమంది ఉన్నారు. స్పెషల్ బ్రాంచిలో విధులు నిర్వహిస్తున్న వీరు ఏళ్ల తరబడి ఇక్కడే తిష్టవేశారు. నిబంధనల ప్రకారం విధులు నిర్వహించకుండా ఇతర వ్యాపకాలతోనే కాలం వెళ్లబుచ్చుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసు ఉద్యోగిలా కాకుండా అధికార పార్టీ కార్యకర్త మాదిరిగా వ్యవహరిస్తున్నట్లు పోలీసు శాఖలో కిందిస్థాయి సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులో ఎస్బీ సిబ్బందిపై విపరీతమైన విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా పోలీసు శాఖలో జరుగుతున్న బదిలీల్లో కూడా వీరు జోక్యం చేసుకుంటున్నట్లు ప్రచారం. గత ఏడాది జిల్లాలో సుమారు 70 మందికి పైగా పోలీసులను అటాచ్ చేశారు. ఈ ఇద్దరు ఎస్బీ సిబ్బంది నిర్వాకం వల్లనే అటాచ్మెంట్ జరిగినట్టు పోలీసు ఉద్యోగులే విమర్శలు గుప్పించడం గమనార్హం. జిల్లాలోని ఒక కీలక ఎమ్మెల్యే అండదండలతో ఇద్దరు ఎస్బీ ఉద్యోగులు పెట్రేగిపోయినట్లు అనేక ఆరోపణలు వచ్చాయి. మాజీ ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు కేసులో కాకినాడ నుంచి విచారణకు వచ్చిన తులసీబాబు అనుచరులు ఎస్పీ కార్యాలయం వద్ద నానా రగడ సృష్టించడం తెలిసిందే. ఒక ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ అత్యుత్సాహం, మితిమీరిన జోక్యం వల్లనే తులసీబాబు అనుచరులు గొడవకు దిగినట్లు ప్రచారం జరిగింది. తాజాగా జిల్లాలో పోలీసుల బదిలీల విషయంలో కూడా సదరు ఎస్బీ హెడ్కానిస్టేబుల్ చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. వీరయ్య హత్య కేసులో వైఫల్యం... తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించడం తెలిసిందే. తాలుకా పోలీసు స్టేషన్, రూరల్ పోలీసు స్టేషన్లకు కూతవేటు దూరంలో ఈ హత్య జరిగింది. హత్యకు ముందు రెండు నెలలుగా రెక్కీ నిర్వహించినట్లు కూడా నిందితులు విచారణలో పేర్కొన్నారు. హైదరాబాద్, నెల్లూరు నుంచి ఒంగోలు వచ్చిన నిందితులు రెండు నెలలుగా రెక్కీ చేస్తున్నా పసిగట్టడంలో స్పెషల్ బ్రాంచి పోలీసులు వైఫల్యం చెందినట్లు తీవ్రమైన విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా నిందితులు వీరయ్యను హత్య చేసిన తరువాత దర్జాగా రూరల్, తాలుకా పోలీసు స్టేషన్ల మీదుగానే తప్పించుకొని పారిపోయారు. చీమకుర్తి వద్ద నిందితులు వాడిన స్కూటీ దొరికే వరకు ఎలాంటి సమాచారం కనుక్కోలేకపోయారన్న విమర్శలున్నాయి. నాగులుప్పలపాడు మండలంలో జరిగే కొలుపుల సందర్భంగా ఇరువర్గాల మధ్య గొడవలు జరిగాయి. ఈ సమాచారాన్ని ముందస్తుగా పసిగట్టడంలో కూడా ఎస్బీ వైఫల్యం చెందినట్లు ఆరోపణలు వచ్చాయి. జిల్లా కేంద్రానికి సమీప ప్రాంతాల్లో విధులు నిర్వహించే వారిలో అత్యధిక శాతం మంది నగరంలోనే తిష్టవేసి తెరవెనుక వ్యవహారాలు నెరుపుతున్నట్టు తెలిసింది. -
రోడ్డు మార్జిన్ దిగిన ప్రైవేట్ స్కూల్ బస్సు
కొండపి: డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రైవేటు స్కూల్ బస్సు రోడ్డు మార్జిన్ దిగి ఒక వైపునకు ఒరిగిన ఘటన ప్రకాశం జిల్లా కొండపి మండలం కొండపి–అనకర్లపూడి గ్రామాల మధ్య అట్లేరు వాగు వద్ద శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు..వర్షాలకు మండలంలోని అట్లేరు వాగు పొంగడంతో రెవెన్యూ, పోలీసు సిబ్బంది వాగుకు ఇరువైపులా ముళ్లకంచె వేసి రాకపోకలు నిలిపేశారు.శనివారం మండలంలోని అనకర్లపూడి సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు స్కూల్ బస్సు 40 మంది విద్యార్థులతో కొండపి నుంచి అనకర్లపూడికి వెళ్తుండగా అట్లేరును దాటేందుకు ముళ్లకంచెను తప్పించే క్రమంలో డ్రైవర్ నిర్లక్ష్యంతో బస్సు ముందు భాగం టైరు రోడ్డు మార్జిన్ దిగింది. అయినా బస్సును ఆపకుండా డ్రైవర్ ముందుకు వెళ్లడంతో వెనుక టైర్లు కూడా మార్జిన్ దిగాయి. దీంతో బస్సు ఒకవైపు ఒరిగింది. రెండో వైపు టైర్లు పైకి లేవడంతో బస్సులోని పిల్లలు, టీచర్లు కేకలు వేశారు. దీన్ని గమనించిన ఇతర వాహనదారులు..ఎమర్జెన్సీ డోర్ నుంచి పిల్లలను దించారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. అనంతరం క్రేన్తో బస్సును రోడ్డు మీదకి తీసుకొచ్చారు. -
కర్నూలు ఘటన.. స్పందించిన ట్రావెల్స్ యాజమాన్యం
సాక్షి, ప్రకాశం: కర్నూలు బస్సు ప్రమాదంపై తీవ్ర విమర్శల వేళ.. వీ కావేరి ట్రావెల్స్ యాజమాన్యం(Vemuri Kaveri Travels Reaction) స్పందించింది. బస్సుకు ఫిట్నెస్ లేదని, పైగా సర్టిఫికెట్లు కూడా కాలపరిమితి చెల్లాయని, అపరిమిత చలాన్లూ ఉన్నాయంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. తమ బస్సుకు అన్ని ఫిట్నెస్ సర్టిఫికెట్లు వ్యాలిడ్లోనే ఉన్నాయంటూ యాజమాని వేమూరి వెంకటేశ్వర్లు పేరిట ఒక ప్రకటన వెలువడింది.‘‘రాత్రి ప్రమాదం జరిగినట్టుగా మూడు గంటల 30 నిమిషాలకు మాకు సమాచారం అందింది. వర్షం పడుతున్న టైంలో రోడ్డుపైన బైకర్ స్కిడ్ అయ్యి.. బస్సును ఢీ కొట్టి పడిపోయాడు. బైక్ మంటలు చెలరేగి బస్సు కిందకు రావడంతో ప్రమాదం జరిగినట్టుగా తెలిసింది. ఆ సమయంలో మెయిన్ డోర్ వద్ద మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు బయటకు రాలేకపోయారు. రాడ్లతో మా డ్రైవర్లు అద్దాలు పగలకొట్టడంతో కొందరు బయటపడ్డారు. మా బస్సు కు సంబంధించి అన్ని ఫిట్నెస్ సర్టిఫికెట్లు వ్యాలిడ్లోనే ఉన్నాయి. బస్సులో మొత్తం 40 మంది రిజర్వ్డ్ ప్యాసింజర్ లు ఉన్నారు. అందరికీ మా ఏజెన్సీ తరఫున ఇన్సూరెన్స్ ఉంది. ప్రమాద ఘటనపై చింతిస్తున్నాం. మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం’’ అని ఆ ప్రకటనలో ఉంది. అయితే.. ప్రమాదంలో వీ కావేరీ ట్రావెల్స్ యాజమాన్య నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోందని బస్సును పరిశీలించిన అధికారులు అంటున్నారు. కనీస ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదని అంటున్నారు. ‘‘ప్రమాద సమయంలో బస్సు వంద కిలోమీటర్ల వేగంతో ఉంది. మంటలు ఆర్పేందుకు ఫోమ్ బాటిల్ కూడా అందుబాబులో లేదు. సేఫ్టీ విండో బద్ధలు కొట్టడానికి సుత్తి కూడా అందుబాబులో లేదు’’ అని అధికారులు తెలిపారు. మరోపక్క.. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ప్రధాన కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బైక్ను ఢీ కొట్టిన వెంటనే బస్సును ఆపి ఉంటే మంటలు చెలరేగి ఉండేవి కాదని, మంటలు అంటుకున్నప్పుడైనా ప్రయాణికులను అప్రమత్తం చేసినా.. కనీసం డోర్ తెరిచినా.. ప్రయాణికులంతా క్షేమంగా బయటపడి ఉండేవారేమోనని గాయపడిన కొందరు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు, బైకర్ కలిపి ఇప్పటిదాకా 20 మంది మృతి చెందారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో.. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించాలని అధికారులు భావిస్తున్నారు.ఇదీ చదవండి.. ఘోర ప్రమాదం తీవ్రంగా కలచివేస్తోంది: వైఎస్ జగన్ -
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ అడ్డుకుందాం
మద్దిపాడు: రాష్ట్రంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని సంతనూతలపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. మండలంలోని ఇనమనమెల్లూరు గ్రామంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పేరుతో పేదలకు వైద్యం అందిస్తే జగనన్న మరో అడుగు ముందుకేసి రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలు కట్టడానికి పూనుకున్నారని, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత స్వలాభం చూసుకునే చంద్రబాబు ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తూ నిర్ణయం తీసుకున్నారన్నారు. పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షగా మిగిలిపోయే ప్రమాదం ఏర్పడిందని దీన్ని మాజీ ముఖ్యమంత్రి జగనన్న ఖండిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారని అన్నారు. నిజంగా పేదలకు సేవ చేయాలన్న ఆలోచన కూటమి నాయకులకు ఉంటే పీపీపీ వంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోరని విమర్శించారు. మెడికల్ కళాశాలల్ని రక్షించుకుంటేనే భవిష్యత్లో పేదవాడి పిల్లలు డాక్టరవుతాడన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యాన్ని భ్రష్టు పట్టించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని, ఇప్పటికే ఆరోగ్య శ్రీ బిల్లులు పెండింగ్లో పెట్టిన కారణంగా ఆరోగ్యశ్రీ మూతపడిపోయి ప్రజలు ఉచిత వైద్యం కోసం అల్లాడాల్సిన దుస్థితి నెలకొందని విమర్శించారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని విజయవంతం చేసి కూటమి ప్రభుత్వం కళ్లు తెరిపించాలన్నారు. అనంతరం ఆయన గ్రామస్తులు పలువురితో సంతకాలు చేయించారు. కార్యక్రమంలో ఆయన వెంట మండల పార్టీ ఉపాధ్యక్షుడు వాకా కోటిరెడ్డి, గద్దె జాలయ్య, ఆకుల శ్రీనివాసరావు, ఆవుల వెంకారెడ్డి, పల్లబోతు హనుమంతరావు, యాదల శ్రీను, జీలగ కోటేశ్వరరావు తదితర పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. -
ముంచెత్తిన వాన
ఒంగోలు సబర్బన్: జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా జోరున వర్షాలు కురుస్తున్నాయి. మంగళ, బుధవారాల్లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. మంగళవారం జిల్లా వ్యాప్తంగా 26.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా కొత్తపట్నం మండలంలో 78.2 మిల్లీ మీటర్లు కురిసింది. మిగతా మండలాల్లో 2.4 మిల్లీ మీటరు నుంచి 78.4 మిల్లీ మీటర్ల వరకు వర్షం కురిసింది. అత్యల్పంగా చీమకుర్తి మండలంలోనే 2.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. సముద్ర తీర ప్రాంత మండలాలు సింగరాయకొండలో 75.6, ఒంగోలు అర్బన్, ఒంగోలు రూరల్లో 60.6 చొప్పున వర్షం కురిసింది. బుధవారం కూడా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు... జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గుండ్లకమ్మతో పాటు, ముసి, మన్నేరు, పాలేరుతో పాటు ఇతర వాగులు పారుతున్నాయి. ఒంగోలు మండలంలో ఉన్న ముదిగొండ వాగు పూర్తి స్థాయి సమర్ధ్యంతో పారుతోంది. ముదిగొండ వాగు పరిసర గ్రామాల్లో జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాల కృష్ణ బుధవారం పర్యటించారు. సాగునీటి చెరువుల్లోకి నీరు దండిగా వచ్చి చేరుతోంది. ఇదేవిధంగా మరో రెండు రోజులు కురిస్తే దాదాపు 30 నుంచి 50 శాతం సాగు నీటి చెరువులు అలుగులు పారే స్థాయికి చేరుకుంటాయి. పెళ్లూరు చెరువు ఇప్పటికే పూర్తిగా నిండింది. నీట మునిగిన పంటలు ముసురు పట్టి కురుస్తున్న వర్షాలకు జిల్లాలో సజ్జ, జొన్న, పొగాకు పంటలు కొన్ని మండలాల్లో నీటమునిగాయి. మరి కొన్ని పంటలు కూడా అదే పరిస్థితిలో ఉన్నాయి. పొగాకు నారుమడుల దశలో ఉంది. నారు మడుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పొగాకు బోర్డు అధికారులు ఇప్పటికే పలు సూచనలు, మెళుకువలు వివరించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్.శ్రీనివాసులు గ్రామాల వారీగా ఉన్న అగ్రికల్చర్ సెక్రటరీలకు రైతులను అప్రమత్తం చేసి పంటలు నీట మునగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలని సూచించారు. తీర ప్రాంత మండలాల్లో పర్యటించిన కలెక్ట: భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినందున బుదవారం కలెక్టర్ పీ.రాజా బాబు తీర ప్రాంత మండలాలు సింగరాయకొండ, కొత్తపట్నంలలో పర్యటించారు. అధికారుల బృందాలను అప్రమత్తం చేశారు. వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలు, వర్షాలు కురుస్తాయని సమాచారం వచ్చినందున జిల్లాలోని తీర ప్రాంతంలో ఉన్న ఐదు మండలాల్లో ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పునరావాస కేంద్రాల ఏర్పాటుకు ప్రదేశాలను గుర్తించామన్నారు. అవసరమైన పక్షంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్... భారీ వర్షాల హెచ్చరిక దృష్ట్యా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రకాశం భవనంలో 1077 టోల్ ఫ్రీ నంబరుతో కమాండ్ కంట్రోల్ రూమును అధికారులు ఏర్పాటు చేశారు. 24 గంటలూ పనిచేసేలా ఏర్పాటు చేసిన ఈ కంట్రోల్ రూములో విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్, పోలీస్, వైద్య, రెవిన్యూ, పశుసంవర్ధక శాఖలకు చెందిన సిబ్బందికి విడతల వారీగా విధులు కేటాయించారు. -
ఆరోగ్యశ్రీ లేక గాలిలో కలుస్తున్న పేదల ప్రాణాలు
యర్రగొండపాలెం: కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ఎత్తివేయడం వలన పేదల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని, సకాలంలో తగిన వైద్యంలేక యర్రగొండపాలెం నియోజకవర్గంలో ముగ్గురు గుండెపోటుతో మృతి చెందారని, ఇవన్నీ.. ప్రభుత్వ హత్యలేనని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యర్రగొండపాలెం వంద పడకల వైద్యశాలలో గుండెపోటుకు సంబంధించిన ఇంజక్షన్లు ఉన్నాయని, కానీ వాటిని ఉపయోగించే కార్డియాలజిస్ట్ లేడని, తగిన పరికరాలు లేకపోవడంతో బాధిత రోగులు ప్రైవేటు వైద్యశాలలను ఆశ్రయించాల్సి వస్తోందని అన్నారు. బోయలపల్లె గ్రామానికి చెందిన బొమ్మాజి బాలచెన్నయ్య గుండెపోటుతో స్థానిక ఒక ప్రైవేటు వైద్యశాలలో చేరాడని, ఆర్థిక స్థోమతలేక పోవడంతో అతనిని గుంటూరు జీజీహెచ్లో చేర్పించారని, అక్కడ వైద్యం కోసం రెండు రోజులు పడిగాపు కాయాల్సి రావడం వలన ఈ నెల 21వ తేదీ చెన్నయ్య మృతి చెందాడని అన్నారు. చెన్నయ్యకు సకాలంలో వైద్యం అందించమని జీజీహెచ్ సూపరింటెండెంట్ను సంప్రదించేందుకు తాను పలుమార్లు ఫోన్ చేసినా ఆయన రెస్పాండ్ కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడని, ఈ విషయం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్కు తన ఓఎస్డీ ద్వారా సమాచారం అందించానని అన్నారు. 21వ తేదీన మురారిపల్లె గ్రామానికి చెందిన నారు వెంకటనారాయణమ్మకు గుండెపోటు వచ్చిందని, ఆమెను ఒక ప్రైవేటు వైద్యశాలలో చేర్పించి చికిత్స చేయిస్తున్న సమయంలో మృతి చెందిందని, పుల్లలచెరువు మండలంలోని గంగవరం గ్రామానికి చెందిన కందుల నగేష్కు గుండెపోటు రావడంతో ఆయనను వైపాలెంలోని ఒక ప్రైవేటు వైద్యశాలలో చేర్పించాల్సి వచ్చిందని అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడని అన్నారు. ఆరోగ్యశ్రీ లేకపోవడం వలన వారి కుటుంబాలు డబ్బుల కోసం వెతుకులాడుకోవడం వలన కూడా వారు సకాలంలో వైద్యశాలలో చేర్పించలేక తమ కుటుంబ పెద్దను కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే... ప్రభుత్వ వైద్యశాలల్లో తగిన వసతులు కల్పించకుండా వైద్యులను నియమించకపోవడం వలన పేదలు ప్రైవేటు వైద్యశాలలను ఆశ్రయించాల్సి వస్తుందని, గత ప్రభుత్వ కాలంలో జగనన్న ఆరోగ్యశ్రీ పథకాన్ని అనేక వైద్యశాలల్లో ఏర్పాటు చేయించి, వారికి సకాలంలో డబ్బులు చెల్లిస్తుండటంతో పేదలు ఆయా వైద్యశాలల్లో చేరి సకాలంలో వైద్యం తీసుకొని తమ ప్రాణాలు కాపాడుకోగలిగారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రైవేటు వైద్యశాలలకు చెల్లించాల్సిన బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతోపాటు ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయడం వలన పేదలు అనేక మంది మృతి చెందుతున్నారని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని విమర్శించారు. జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పేదలకు అండగా నిలిచేందుకు వైఎస్సార్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టారని, ప్రమాదవశాత్తు మృతి చెందితే ఆ కుటుంబానికి రూ.5 లక్షలు, సహజ మరణానికి రూ.3 లక్షల ప్రకారం అందచేసి మృతుల కుటుంబాలకు అండగా నిలిచారని, ప్రస్తుతం అటువంటి పరిస్థితిలేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కొప్పర్తి చిన్న ఓబులరెడ్డి, సయ్యద్ జబీవుల్లా, ఆర్.అరుణాబాయి, పల్లె సరళ, డి.సుబ్బారెడ్డి, బి.రమణారెడ్డి, అంగిరేకుల ఆదినారాయణ, రంగబాబు, నారు సుబ్బారెడ్డి పాల్గొన్నారు. తగిన వైద్యంలేక గుండె పోటుతో ముగ్గురు మృతి ఇవన్నీ కూటమి ప్రభుత్వ హత్యలే వైపాలెం వైద్యశాలలో ఇంజక్షన్లు ఉన్నాయి.. కార్డియాలజిస్ట్ లేడు నిర్లక్ష్యంగా గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్కు ఫిర్యాదు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ -
ముంచెత్తిన వాన
కొనకనమిట్ల : బ్రాహ్మణపల్లిలో నీట మునిగిన మినుము బోడవాడ వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న దుప్పలమంద వాగు బేస్తవారిపేట : మిరపలో వర్షం నీరు చేరడంతో వడిలిపోతున్న మొక్కలు రాచర్ల : గుండ్లకమ్మ ఉధృతిని పరిశీలిస్తున్న ఎంపీడీఓ, ఎస్సై బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం తెల్లవారుజాము నుంచే ముసురు పట్టింది. మధ్యలో కాస్త తెరపిస్తూ భారీ వర్షం కురవడంతో లోతట్టు పొలాలు నీట మునిగాయి. వాగులు వంకలు పొంగి పొర్లడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా కేంద్రమైన ఒంగోలు వర్షం ధాటికి జలమయమైంది. ఒంగోలు ఆర్టీసీ డిపో సెంటర్, బాపూజీ మార్కెట్, కూరగాయల మార్కెట్ సెంటర్, జీజీహెచ్ పరిసరాల్లో ప్రధాన రహదారులపై వర్షం నీరు పోటెత్తడంతో వాహనదారులు అవస్థలు ఎదుర్కొన్నారు. – సాక్షి నెట్వర్క్ ఒంగోలు ఆర్టీసీ డిపో ఎదుట వాహనదారుల అవస్థలు పామూరు : అలుగుపారుతున్న బోడవాడ చెరువు -
16 మందికి కారుణ్య నియామకాలు
ఒంగోలు సబర్బన్: ప్రభుత్వ సర్వీసులో చేరిన వారు చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేయాలని కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. ప్రకాశం భవనంలో 16 మందికి కారుణ్య కోటాలో నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో నైపుణ్యం పెంచుకుంటూ ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షిస్తూ వారిని అభినందించారు. నియామక పత్రాలు పొందిన వారిలో ఆఫీసు సబార్డినేట్లు, టైపిస్టులు, జూనియర్ అసిస్టెంట్లు, పంచాయతీ సెక్రటరీలు (గ్రేడ్ – 5,6) ఉన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, ఏపీఎస్ఆర్టీసీ ఆర్.ఎం. జి.సత్యనారాయణ, సూపరింటెండెంట్ ఫణికుమార్, కలెక్టరేట్ పరిపాలన అధికారి రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ● ముగ్గురు సీసీలకు చార్జ్ మెమో పామూరు: పొదుపు మహిళా గ్రూపుల లావాదేవీల్లో అక్రమాలకు పాల్పడిన ఏపీఎం రజనీకుమారి, సీసీ గంగసాని భాస్కర్ను కలెక్టర్ సస్పెండ్ చేశారు. మరో ముగ్గురు సీసీలకు చార్జ్ మెమూ ఇచ్చినట్లు డీపీఎం ఆర్ఆర్ఎల్ అంబేడ్కర్ బుధవారం తెలిపారు. మండలంలోని గోపాలపురం, మోట్రావులపాడు గ్రామాల పొదుపు గ్రూపు సభ్యులు తమ సీసీఎల్ లోన్స్, సీ్త్రనిధి, ఉన్నతి లోన్స్లో అక్రమాలు జరిగినట్లు వీఓఏ బేబీషాలిని, వెలుగు అధికారులు, సీసీలపై గతంలో అధికారులకు పిర్యాదుచేశారు. దీనిపై ఉన్నతాధికారుల ఆదేశాలతో విచారణ చేసి రూ.36.91 లక్షల అవినీతి జరిగినట్లు గుర్తించి నివేదికను కలెక్టర్కు అందజేశారు. కలెక్టర్ స్పందించి అక్రమాలకు బాధ్యులైన నాటి పామూరు ఏపీఎం, ప్రస్తుత హెచ్ఎంపాడు ఏపీఎం రజనీకుమారి, నాటి వెలుగు సీసీ గంగసాని భాస్కర్రెడ్డిలను సస్పెండ్ చేశారు. మరో ముగ్గురు సీసీలు శ్రీనివాసులు, రమణయ్య, సుబ్రమణ్యంలకు చార్జ్మెమో ఇచ్చినట్లు డీపీఎం తెలిపారు. కాగా నాటి వీఓఏ బేబీషాలిని ఇప్పటికే విధులకు దూరంగా ఉన్నారు. -
యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి
● కలెక్టర్ రాజాబాబు కొత్తపట్నం: భారీ వర్షాల నేపథ్యంలో యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండి అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ బుధవారం కొత్తపట్నంలో విస్తృతంగా పర్యటించారు. యంత్రాంగం చేపడుతున్న ముందస్తు ఏర్పాట్లను పరిశీలించారు. తీర ప్రాంత గ్రామాలైన ఈతముక్కల, కె.పల్లెపాలెం మత్స్యకారులతో మాట్లాడుతూ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు ఎవ్వరూ సముద్రంలో వేటకు వెళ్లరాదన్నారు. గ్రామంలోని తుఫాన్ రక్షిత భవనాన్ని పరిశీలించి అత్యవసర పరిస్థితుల్లో చేపట్టాల్సిన చర్యలను వివరించారు. అనంతరం కొత్తపట్నం బీచ్ను పరిశీలించి మత్స్యకారులతో మాట్లాడారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. భారీ వర్షాలు కురిస్తే కొత్తపట్నంలో కొన్ని ప్రాంతాల్లో మునిగే అవకాశం ఉందని, వర్షంనీరు సముద్రంలోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికల వచ్చిన నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు తీర ప్రాంత మండలాలైన సింగరాయకొండ, టంగుటూరు, కొత్తపట్నం మండలాల్లో పర్యటించినట్లు తెలిపారు. పునరావాస కేంద్రాలను గుర్తించడంతో పాటు ఆ కేంద్రాల్లో వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించామన్నారు. ఒంగోలు ఆర్డీఓ కళావతి, జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, డీఆర్డీఏ పీడీ నారాయణ, డీపీఓ వెంకటేశ్వరావు, మత్స్యశాఖ ఏడీ శ్రీనివాసరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బాల శంకరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాఽధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, డ్వామా పీడీ జోసఫ్కుమార్, తహసీల్దార్ శాంతి, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
వెలిగొండ ఆర్ఆర్ ప్యాకేజీలో లోపాలు లేకుండా చూడాలి
● ప్రాజెక్టు పునరావాస, పునర్మిర్మాణ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి ● అధికారులతో సమీక్షలో కలెక్టర్ పీ.రాజా బాబు ఒంగోలు సబర్బన్: వెలుగొండ ప్రాజెక్టు పునరావాస, పునర్నిర్మాణ ప్యాకేజీ అమలులో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని కలెక్టర్ పీ.రాజాబాబు ఆదేశించారు. వెలుగొండ ప్రాజెక్టు సొరంగాల పనులు, నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీపై బుధవారం ప్రకాశం భవనంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణతో కలిసి ఆయన సమీక్షించారు. ఈ పనుల్లో పురోగతిని ప్రాజెక్ట్స్ ఎస్ఈ. అబూత్ అలీమ్ వివరించారు. మొత్తం 11 గ్రామాలకుగాను రెండు గ్రామాల్లో పునరావాస ప్యాకేజీకి లబ్ధిదారులను నిర్ధారించాల్సి ఉందన్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ నిర్వాసితులందరికీ పూర్తిస్థాయిలో న్యాయం జరగాలని స్పష్టం చేశారు. నిర్వాసితుల వద్ద ఎలాంటి డాక్యుమెంట్లు ఉన్నాయో, లబ్ధిదారులుగా గుర్తించేందుకు ఎలాంటివి అవసరమో వారికి తెలియజేయడంతో పాటు ఈ మొత్తం ప్రక్రియను బహిరంగంగా నిర్వహించాలని ఆదేశించారు. ఆ గ్రామాల ప్రజలతో ముఖాముఖి మాట్లాడాలని అన్నారు. వెలుగొండ కాలువలు, సొరంగాల పనులకు, పునరావాస ప్యాకేజీకి అవసరమైన నిధులపై కలెక్టర్ ఆరా తీశారు. ఈ విషయాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ప్రాజెక్టును త్వరగా పూర్తిచేసే క్రమంలో ఎలాంటి ఇబ్బంది ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలన్నారు. సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శివరామిరెడ్డి, సత్యనారాయణ, డీ.ఈ.ఈ.లు, ఏఈఈలు, డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు. -
మీ సంతకం..పిల్లల భవిష్యత్కు బాట
పుల్లలచెరువు: మీ సంతకం మీ పిల్లల భవిష్యత్కు బంగారు బాట వేస్తుందని, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ చేపట్టిన కోటి సంతకాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. మండలంలోని ఉమ్మడివరం గ్రామంలో మండల పార్టీ కన్వీనర్ డి.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బుధవారం కోటిసంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారన్నారు. పలు కళాశాలలు నడుస్తున్నాయని, మరి కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. పేదవాళ్లు అభివృద్ధి చెందడం ఇష్టం లేని చంద్రబాబు మెడికల్ కళాశాలలన్నీ ప్రైవేట్పరం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేయడం ద్వారా పేద, మధ్య తరగతి ప్రజల విద్యార్థులకు వైద్య విద్యను అందని ద్రాక్షగా మార్చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోను, ఇప్పుడు కూడా చంద్రబాబు పరిపాలనలో ఒక్క మెడికల్ కాలేజీ తీసుకునిరాక పోగా జగన్మోహన్రెడ్డి తెచ్చిన మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెట్టడం సిగ్గుచేటని అన్నారు. ఇటువంటి దుర్మార్గపు పనిని అడ్డుకునేందుకు రాజకీయాలకు అతీతంగా జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలంతా ఏకంకావాలని పిలుపునిచ్చారు. నమ్మి ఒట్లు వేసిన ప్రజలను నట్టేట ముంచడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని పేర్కొన్నారు. మెడికల్ కళాశాలల్ని రక్షించుకుంటేనే భవిష్యత్లో పేదల పిల్లలు వైద్యులు అవుతారన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా కోటి సంతకాలు సేకరించి వాటిని గవర్నర్కు పంపించి చంద్రబాబు దుష్టపన్నాగాన్ని అడ్డుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ డి.వెంకటేశ్వర్లు, మాజీ ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు ఎల్.రాములు, మాజీ ఎంపీపీ ఎం.సుబ్బారెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.రఘు, జిల్లా ఉపాధ్యక్షుడు ఓబుల్రెడ్డి, నాయకులు కోడిరెడ్డి, వీరారెడ్డి, నాసర్రెడ్డి, గొడుగు ఆంజనేయులు, వెంకిరెడ్డి, వెంకటరెడ్డి, రోసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వరికోత యంత్రాన్ని ఢీకొన్న కారు
● ముగ్గురికి గాయాలు కంభం: ఆగి ఉన్న వరికోత యంత్రాన్ని కారు ఢీకొని ముగ్గురికి గాయాలయ్యయి. ఈ సంఘటన బుధవారం రాత్రి కంభంలో జరిగింది. వివరాల్లోకి వెళితే..బేస్తవారిపేట మండలం నుంచి పోలవరం వెళ్తున్న వరి కోత యంత్రం అనంతపురం– అమరావతి హైవే రోడ్డుపై కందులాపురం అడ్డరోడ్డు వద్ద టైరు పంచరు కావడంతో రోడ్డుకు ఎడమవైపున ఆగి ఉంది. అదే సమయంలో గిద్దలూరు నుంచి మార్కాపురం వెళ్తున్న ఓ కారు ఆగి ఉన్న వరి కోత యంత్రాన్ని వెనుకవైపు నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ఉన్న గోపిదేశి శేఖర్, అతని భార్య చెంచులక్ష్మి తలకు, కాళ్లకు గాయాలు కాగా నాలుగేళ్ల బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యశాలలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం మార్కాపురం వైద్యశాలకు తరలించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఏఎస్సై నారాయణ వైద్యశాలలో క్షతగాత్రుల వద్ద వివరాలు సేకరించారు. -
25న ఏకేవీకే కాలేజీలో జాబ్ మేళా
ఒంగోలు సబర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) ఆధ్వర్యంలో ఈనెల 25వ తేదీ ఒంగోలు ఏకేవీకే డిగ్రీ కాలేజీలో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ పీ.రాజా బాబు పేర్కొన్నారు. ఈ జాబ్ మేళా పోస్టర్లను కలెక్టర్ పీ.రాజబాబు మంగళవారం ఆయన ఛాంబరులో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ మేళాలో బహుళ జాతీయ కంపెనీలు పాల్గొంటున్నాయి. ఇంటర్ నుంచి డిగ్రీ, పీజీ వరకు అర్హత ఉన్న అభ్యర్థులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ జాబ్ మేళాలో బహుళ జాతీయి 23 కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు.మొత్తం 1000కి పైగా ఉద్యోగ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. జీతాలు రూ.11 వేల నుంచి రూ.35 వేల వరకు ఉండగా, కొన్ని కంపెనీలు ప్రోత్సాహకాలు, ఇతర భత్యాలు కూడా అందిస్తున్నాయి. ఒంగోలు నగరంలోని అంజయ్య రోడ్డులో ఉన్న ఏకేవీకే డిగ్రీ కాలేజ్లో జరుగుతాయని సంప్రదించాల్సిన నంబర్లు: 9573798594, 7842004344 వీటితో పాటు ఏపీఎస్ఎస్డీసీ కమాండ్ కంట్రోల్ నంబర్లు: 9988853335, 8712655686, 8790118349, 8790117279 సంప్రదించవచ్చన్నారు. ● ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ ఒంగోలు టౌన్: దీపావళి పండక్కి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన డీఏ జీఓలు అసంబంధంగా ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. 21 నెలలపాటు ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏ బకాయిలను వాయిదాల పద్ధతిలో ఇస్తామని చెప్పడం తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. ప్రపంచంలో ఎక్కడా ఇలా జరగలేదని, మన దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి విధానం లేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, రెండు డీఏలు ఇచ్చి, పీఆర్సీ ప్రకటిస్తారని 16 నెలలుగా ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం షాక్ ఇచ్చిందన్నారు. ● యూటీఎఫ్ జిల్లా శాఖ డిమాండ్ ఒంగోలు సిటీ: యూటీఎఫ్, ఇతర ఉపాధ్యాయ సంఘాల పోరాటాల ఫలితంగా ముఖ్యమంత్రి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో చర్చించి ఇచ్చిన జీవోలను 60, 61 ను తక్షణమే సవరించాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ అబ్దుల్ హై, డీ వీరాంజనేయులు మంగళవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ర ముఖ్యమంత్రి, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, అధికారులతో చర్చించే సందర్భంలో కనీస ప్రస్తావనకు రాని అంశాలను డీఏ జీవోలలో ప్రస్తావించడాన్ని యూటీఎఫ్ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. ● ఏపీటీఎఫ్ జిల్లా శాఖ డిమాండ్ ఒంగోలు సిటీ: కరువు భత్యం (డీఏ) ఉత్తర్వులు జీఓ 60, 61 లను తక్షణమే సవరించాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జనార్ధనరెడ్డి, డి.శ్రీనివాసులు మంగళవారం డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు డీఏ లు ఇవ్వాల్సి ఉన్నా నేడు కేవలం ఒకే ఒక డీఏ మాత్రం మొక్కుబడిగా విడుదల చేస్తున్నట్లుగా సీఎం చంద్రబాబు ప్రకటించారని తెలిపారు. ఉద్యోగ ఉపాధ్యాయులను ఆందోళన, గందరగోళానికి గురిచేసేలా నేడు జీవోలు విడుదల చేయడం విచారకరమన్నారు. చీమకుర్తి: గ్రానైట్ రాయల్టీ వసూళ్లకు కాంట్రాక్ట్ తీసుకున్న ఏఎంఆర్ సంస్థ ప్రతినిధులకు, ఉమ్మడి జిల్లాలోని గ్రానైట్ ఫ్యాక్టరీల యజమానుల సంఘాల ప్రతినిధులకు మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. మంగళవారం ఒంగోలులోని ఏఎంఆర్ కార్యాలయంలో ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. గ్రానైట్ ఫ్యాక్టరీలోని కటింగ్ బ్లేడ్కు ప్రభుత్వం నిర్ణయించిన రూ.35 వేలను మాత్రమే చెల్లిస్తామని, అనధికారికంగా అడిగే రూ.35 వేలను మాత్రం ఇచ్చే పనిలేదని ఫ్యాక్టరీల యజమానులు తేల్చిచెప్పారు. కానీ అదనపు డబ్బులు ఇవ్వకపోతే ససేమిరా అని ప్రైవేటు సంస్థ చెప్పటంతో ఇరువురి మధ్య చర్చలు అర్ధంతరంగా నిలిచిపోయాయని ఫ్యాక్టరీల యజమానులు మీడియాకు తెలిపారు. -
జర్నలిస్టులపై అక్రమ కేసులతో వేధింపులు దారుణం
ఒంగోలు సిటీ: సాక్షి ఎడిటర్ ఆర్.ధనుంజయ రెడ్డిపై కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి వేధించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫోర్త్ ఎస్టేట్ గా పిలుచుకునే జర్నలిజంపై దాడి చేయడమేనని ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి విమర్శించారు. ఒంగోలులో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జరల్నిస్టులపై కూటమి ప్రభుత్వం కేసులు పెట్టడం హిట్లర్ వంటి నియంతల పాలనలను గుర్తు చేస్తోందని అన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం సాక్షి పత్రిక, టీవీల ప్రసారాలపై కక్ష కట్టి వ్యవహరిస్తోందన్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడమే అందుకు నిదర్శనమని చెప్పారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటంపై సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టిన కొన్ని గంటల్లోనే సిట్ అధికారులు ధనుంజయ రెడ్డి పై కేసులు పెట్టేందుకు ప్రయత్నించడం దుర్మార్గమని అన్నారు. 40 ప్రశ్నలతో ప్రశ్నావళిని రూపొందించి తక్షణమే సమాధానం చెప్పాలని ధనుంజయ రెడ్డిని ఒత్తిడి చేయటం అధికారులు ప్రభుత్వానికి సాగిల పడినట్లు అర్థమవుతోందని అన్నారు. రాష్ట్రంలో నకిలీ మద్యం సిండికేట్లను ఛేదించటం, అక్రమార్కులపై కథనాలను రాయటం ధనుంజయ రెడ్డి చేసిన తప్పా? అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుత ప్రభుత్వంలో జరుగుతున్న నకిలీ మద్యం భాగోతాన్ని సైతం గత ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేయటం కూటమి ప్రభుత్వం దివాలా కోరు చర్యలకు నిదర్శనమని, ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారని అన్నారు. నెల్లూరు జిల్లా సాక్షి బ్యూరో ఇన్చార్జికి సైతం అధికారులు నోటీసులు ఇవ్వడం దారుణమని బత్తుల విమర్శించారు. నకిలీ మద్యం వ్యవహారంలో 18 నెలలుగా నిద్ర నటించిన అధికారులు అది వెలుగు చూడగానే ఎదురుదాడికి దిగటం వారి పలాయన వాదానికి నిదర్శనమని అన్నారు. జర్నలిజం ఎంతో పవిత్రమైన వృత్తి అని, దానిపై దాడి చేసిన ప్రభుత్వాలు గతంలో కాలగర్భంలో కలిసిపోయిన సంగతి ఒకసారి గుర్తు చేసుకోవాలని ఆయన హెచ్చరించారు. వాస్తవాలను మీడియా ద్వారా వెలుగులోకి తీసుకొస్తున్న రిపోర్టర్లు, మీడియా వ్యవస్థలపై కేసులు పెట్టి వేధించటం ప్రభుత్వానికి అలవాటుగా మారిందని, అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన హెచ్చరించారు. సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులను మీడియా వ్యవస్థ, రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. -
జిల్లా వ్యాప్తంగా వర్షాలు
ఒంగోలు సబర్బన్: జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం 6.9 మిల్లీ మీటర్ల సరాసరి వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా సరాసరికంటే ఎక్కువగా పడి 8.7 మిల్లీ మీటర్లు నమోదైంది. జిల్లా మొత్తం 269.2 మిల్లీ మీటర్లు వర్షం కురవాల్సి ఉంటే 338.6 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. దానిప్రకారం జిల్లా మొత్తంలో సరాసరి కంటే 26 మిల్లీ మీటర్ల అధికంగా వర్షం కురిసినట్లయింది. జిల్లాలో అత్యధికంగా సీఎస్పురం మండలంలో 32.4 మిల్లీ మీటర్లు కురిసింది. మిగతా మండలాల్లో 1 మిల్లీ మీటరు నుంచి 16.6 మిల్లీ మీటర్ల వరకు వర్షం కురిసింది. ఎనిమిది మండలాల్లో అసలు వర్షమే కురవలేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల బుధవారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మంగళవారం సాయంత్రం నుంచే వర్షాలు కురవడం ప్రారంభమయ్యాయి. ఒంగోలు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక మోస్తరు వర్షం కురిసింది. ఒంగోలు నగరంలో రోడ్లు జలమయమయ్యాయి. -
గ్రానైట్ అనకొండలు
ప్రభుత్వ భూముల్లో కొండలను సైతం తొలిచేస్తున్న గ్రానైట్ క్వారీచీమకుర్తి: పేదవాడికి ఇల్లు కట్టుకోవడానికి సెంటు భూమి ఇవ్వమంటే రెవెన్యూ అధికారులు ముఖం చాటేస్తారు. రిటైర్డ్ పెన్షనర్ల సంఘ నాయకులు తమ కార్యాలయానికి 5 సెంట్లు స్థలం చూపండని పార్టీల నాయకులు, అధికారుల చుట్టూ తిరిగి కాళ్లు అరిగాయే తప్ప సెంటు స్థలం ఇచ్చింది లేదు. ప్రభుత్వానికి చెందిన వందలాది ఎకరాల భూములను గ్రానైట్ యజమానులకు అధికారికంగా కట్టబెట్టడంలో రెవెన్యూ అధికారుల చేతివాటం చూస్తే సామాన్యుడికి నోట మాటరావడం లేదు. చీమకుర్తి రెవెన్యూలో సర్వే నంబర్లు 958 నుంచి 1058 వరకు ఉన్న 258.67 ఎకరాల ప్రభుత్వ భూములను గ్రానైట్ వ్యాపారులు అడ్డదారుల్లో స్వాహా చేశారు. అద్దంకికి చెందిన పులిపాటి హేబేలు ఈనెల 17వ తేదీన చీమకుర్తి రెవెన్యూ పరిధిలోని 258.67 ఎకరాల ప్రభుత్వ భూములను గ్రానైట్ పెద్దలు ఆక్రమించుకున్నారని హైకోర్టులో రిట్పిటిషన్ దాఖలు చేయటంతో ప్రభుత్వ భూముల ఆక్రమణలు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గెలాక్సీ గ్రానైట్ చీమకుర్తి, ఆర్.ఎల్.పురం, బూదవాడ రెవెన్యూ పంచాయతీల్లో దాదాపు 3 వేల హెక్టార్లలో నిక్షిప్తమై ఉంది. వాటిలో ప్రభుత్వానికి చెందిన అనాధీనం, వాగులు, కొండ పోరంబోకులు, బండి దారి వంటి పలు కేటగిరీలకు చెందిన ప్రభుత్వ భూములు చీమకుర్తి, ఆర్.ఎల్.పురం, బూదవాడ రెవెన్యూ గ్రామాల్లో ఉన్నాయి. వాటిలో ప్రభుత్వానికి చెందిన భూములను చీమకుర్తి రెవెన్యూ పరిధిలోని మణికంఠ గ్రానైట్, కృష్ణసాయి గ్రానైట్స్, వాసవీ గ్రానైట్స్ యజమానులతో పాటు ఇతర వ్యాపారులు ఆక్రమించుకున్నారని పులిపాటి హేబేలు అనే వ్యక్తి హైకోర్టులో రిట్ పిటీషన్ను లాయర్ జడ శ్రావణకుమార్ ద్వారా దాఖలు చేశారు. వారితో పాటు హంస గ్రానైట్స్, జయమినరల్స్, ఎన్వీ ఎక్స్పోర్ట్ యజమానులు కూడా ప్రభుత్వ భూములలో ఆక్రమణదారులుగా ఉన్నారని హేబేలు దాఖలు చేసిన రిట్ పిటిషన్లో పేర్కొన్నారు. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కలెక్టర్, చీమకుర్తి తహసీల్దార్తో పాటు గ్రానైట్ యజమానులు ఇందుకు బాధ్యులుగా పిటిషన్లో పేర్కొన్నారు. మూడు పంచాయతీల్లో 400 ఎకరాలకుపైగా ఆక్రమణలు చీమకుర్తిలోని సర్వేనంబర్ 958 నుంచి 1058 వరకు 258.67 ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురైనట్లు హైకోర్టులో సమర్పించిన రిట్పిటిషన్లో పేర్కొన్నారు. ఆర్.ఎల్.పురం, బూదవాడ పంచాయతీల్లో మరో 150 ఎకరాల ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి. వాటన్నిటిలో కలిపి గ్రానైట్ యజమానులు రెవెన్యూ అధికారులను ప్రలోభాలకు గురిచేసి పేదలకు ఇచ్చిన పట్టాలను రద్దు చేయించి తమకు అనుకూలంగా మార్చుకొని వేలాది కోట్ల విలువ చేసే గ్రానైట్ సంపదను దోచుకెళుతున్నారు. కొన్ని భూముల్లో నేరుగా క్వారీయింగ్ చేసుకుంటుండగా మరికొన్ని భూముల్లో వేస్ట్ రాళ్లు, మట్టిని పోసుకునేందుకు డంపింగ్ అవసరాలకు వాడుకుంటున్నారు.పేదవాడికి సెంటు భూమి లేదంటారు... పెద్దవారికి ఎకరాలకు ఎకరాలు ఎలా ఇస్తారు? పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి సెంటు భూమి ఇవ్వమంటే లేదంటారు. అలాంటిది పేదలకు ఇచ్చిన భూముల పట్టాలను రద్దు చేసి గ్రానైట్ యజమానులకు ఎలా ఇస్తారు. గ్రానైట్ యజమానుల ఆక్రమణల పరిధిలోనున్న ప్రభుత్వ భూములను తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. – బండ్ల కొండలు, జేఏసీ అధ్యక్షుడు, చీమకుర్తి భూముల ఆక్రమణలపై నోటీసులు అందలేదు చీమకుర్తిలోని గ్రానైట్ భూములపై ఆక్రమించుకున్న వారి గురించి హైకోర్టు ద్వారా నాకు ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు రాలేదు. మెయిల్స్ అందలేదు. ఆ వివరాలు తెలిసిన తరువాత దాని మీద పరిస్థితులు ఏంటో తెలుసుకొని చెప్తాను. – ఆర్.బ్రహ్మయ్య, తహసీల్దార్ చీమకుర్తి ప్రభుత్వ భూములను గ్రానైట్ యజమానులకు కట్టబెట్టడం దారుణం ప్రభుత్వానికి చెందిన విలువైన భూములను గ్రానైట్ యజమానులు ఆక్రమించుకోవడం దారుణం. ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు సర్వే చేసి వాటిని కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉంది. జిల్లా అధికారులు జోక్యం చేసుకొని గ్రానైట్ యజమానుల పరిధిలోనున్న గ్రానైట్ భూములను రద్దు చేయాలి – వేమా చినకోటేశ్వరరావు, జైభీమ్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి, చీమకుర్తి. -
మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తే సహించం
● ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతామన్న మాజీ మంత్రి మేరుగు నాగార్జున మద్దిపాడు: ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తే సహించేది లేదని మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ మేరుగు నాగార్జున అన్నారు. మండల కేంద్రం మద్దిపాడు సమీపంలోని ఘడియపూడి కాలనీలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పేదలకు విద్య, వైద్యం అందేలా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషిచేసి పేద విద్యార్థులకు మెడికల్ కళాశాలను అందుబాటులోకి తీసుకొచ్చారని అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు ఆలంబనగా నిలిచేందుకు వారు నిలిచారని ప్రశంసించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం దక్కకుండా నిలువరించినందుకు తన అనుయాయులకు అవకాశం కల్పించేలా చంద్రబాబు జిమ్మిక్కులు చేస్తున్నాడని ఆయన మండిపడ్డారు. పేదలకు అందాల్సిన న్యాయమైన వైద్యం అందటం లేదన్నారు. ప్రతి ప్రభుత్వ పథకంలో పేదల పట్ల వివక్ష చూపిస్తూ కూటమి సర్కారు నియంతృత్వంగా వ్యవహరిస్తోందని, ప్రభుత్వం కళ్లు తెరిపించడం కోసమే కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆయన వెంట ఉపాధ్యక్షుడు వాకా కోటిరెడ్డి, గడియపూడి సర్పంచ్ బొమ్మల రామాంజనేయులు, శరణం సురేష్, బొమ్మల జగ్గయ్య, తలతోటి వెంకటేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
మత్స్యకారులకు ప్రభుత్వ పథకాలు అమలు చేయాలి
ఒంగోలు సబర్బన్: మత్స్యకారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కచ్చితంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ తన చాంబర్లో మత్స్యశాఖపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. జిల్లా మత్స్యశాఖ అధికారి, మెంబర్ కన్వీనర్ సీహెచ్ శ్రీనివాసరావు పథకాలకు సంబంధించిన సమాచారాన్ని కమిటీకి వివరించారు. సముద్ర తీర మత్స్యకారులకు పీఎంఎంఎస్వై పథకం ద్వారా తెప్పలు, ఇంజిన్లు, వలలు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. సీఆర్సీఎఫ్వీ పథకం కింద లైఫ్ జాకెట్లు, జీపీఎస్ సెట్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్లు సరఫరా చేసేందుకు ఎంపిక చేసిన కొత్తపట్నం పల్లెపాలెం మత్స్యకారుల జాబితాను ఆమోదించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ బి.చిరంజీవి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు, జిల్లా నీటిపారుదల శాఖ ఎస్ఈ వరలక్ష్మి, డీఆర్డీఏ పీడీ టి.నారాయణ, ఎల్డీఎం డి.రమేష్, సీఎంఎఫ్ఆర్ఐ అధికారి జి.సుధాకర్, జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు.పేరయ్య పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వాస్తవ స్ఫూర్తితో వినియోగించాలి ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను వాస్తవ స్ఫూర్తితో వినియోగించాలని కలెక్టర్ పి.రాజాబాబు ఆదేశించారు. మంగళవారం ప్రకాశం భవనంలో ఎస్సీ, ఎస్టీ కాంపోనెంట్ ప్లాన్ 2025–26పై కలెక్టర్ సమీక్షించారు. వివిధ శాఖలకు ఎస్సీ, ఎస్టీ కాంపోనెంట్ నిధులను ప్రభుత్వం కేటాయించిన తీరు, ఖర్చు చేసిన విధానంపై ఆరా తీశారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎన్.లక్ష్మా నాయక్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కలెక్టర్కు వివరించారు. కొన్ని శాఖలు లక్ష్యాలకు దూరంగా ఉండటంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. బలహీన వర్గాల అభివృద్ధి, వారి ఆవాస ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, జీవనోపాధి మెరుగుపరచాలనే ఆశయంతో ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని, అదే స్ఫూర్తితో ఆయా వర్గాలకు ప్రయోజనం కలిగేలా నిధులు ఖర్చు చేయాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదని హెచ్చరించారు. ప్రతి 2 నెలలకు ఒకసారి సమావేశం నిర్వహిస్తానని, వచ్చే సమావేశం నాటికి నిధుల వినియోగంలో స్పష్టమైన మార్పు కనిపించాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి వరలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ పీ.రాజా బాబు -
పోలీసు అమరవీరులకు ఘన నివాళి
అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తున్న మంత్రి, కలెక్టర్, ఎస్పీ తదితరులు ఒంగోలు టౌన్: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని మంగళవారం ఒంగోలులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసులకు అమరవీరుల స్థూపం వద్ద రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి డీబీవీ స్వామి, కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ వి.హర్షవర్థన్రాజు, ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు ఘనంగా నివాళులర్పించి పుష్పాంజలి ఘటించారు. ఈ సమయంలో భారీ వర్షం కురవగా కార్యక్రమాన్ని అలాగే కొనసాగించారు. మంత్రి స్వామి మాట్లాడుతూ.. పోలీసు అమరవీరుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి స్వామి చెప్పారు. విధి నిర్వహణలో జిల్లాలో గత ఏడాది 13 మంది పోలీసు సిబ్బంది మరణించినట్లు తెలిపారు. కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ.. దేశభద్రత, శాంతి భద్రతల పరిరక్షణకు నిస్వార్థంగా సేవలు అందిస్తున్న పోలీస్ సిబ్బంది మన అందరికీ గర్వకారణమన్నారు. విపత్తుల సమయంలో సహాయక చర్యలు చేపట్టడంలోనూ పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ఎస్పీ హర్షవర్థన్రాజు మాట్లాడుతూ.. 1959 అక్టోబర్ 21వ తేదీన లడఖ్లో హాట్ స్ప్రింగ్ ప్రాంతంలో చైనా దురాక్రమణకు పాల్పడగా, రక్తాన్ని గడ్డకట్టించే చలిలోనూ భారత జవాన్లు వీరోచిత పోరాటం చేశారని గుర్తు చేశారు. ఈ క్రమంలో 10 మంది జవాన్లు అశువులుబాశారని, వారి త్యాగానికి గుర్తుగా ఏటా అక్టోబరు 21 న శ్రీపోలీసు అమర వీరుల సంస్మరణ దినం్ఙ నిర్వహించుకుంటున్నామని వివరించారు, ఇటీవలే భారత ప్రభుత్వం అక్టోబర్ 21వ తేదీని శ్రీనేషనల్ పోలీస్ డ్ఙేగా ప్రకటించిందని పేర్కొన్నారు. జిల్లాకు చెందిన పోలీసు అమరవీరులు అద్దంకి సాల్మన్ కేరీ వెస్లీ, లేళ్ల శంకర్, మోటా ఆంజనేయులు, కె.వి ప్రశాంతరావు, చప్పిడి వెంకటరత్నం, కీర్తిశేషులు ఎస్కే మహమ్మద్ రఫీ, ఈ.పవన్కుమార్ త్యాగాన్ని ఎస్పీ కొనియాడారు. కార్యక్రమంలో సంతనూతలపాడు, కనిగిరి ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) నాగేశ్వర రావు, ఒంగోలు మేయర్ జి.సుజాత, పీడీసీసీబీ చైర్మన్ సీతారామయ్య, మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్కుమార్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎన్.లక్ష్మానాయక్, ఉప రవాణా శాఖ కమిషనర్ అర్.సుశీల, ఒంగోలు, దర్శి, కనిగిరి డీఎస్పీలు శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, సాయి ఈశ్వర్ యశ్వంత్, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, పోలీస్ క్లినిక్ డాక్టర్ భానుమతి, సీఐలు, ఎస్సైలు, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. స్మృతి పరేడ్లో నివాళులర్పిస్తున ్న పోలీస్ సిబ్బంది పుష్పాంజలి ఘటించిన మంత్రి డోలా, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పోలీస్ అమరవీరుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటాం కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్రాజు భరోసా -
చెంచుపాలెంలో వైద్య శిబిరం ఏర్పాటు
పొన్నలూరు: మండలంలోని మాలపాడు పంచాయతీ చెంచుపాలెం గ్రామానికి చెందిన అంగన్వాడీ హెల్పర్ గుదే రామసుబ్బులు(47) డెంగీ లక్షణాలతో పాటు లూపస్ అనే వ్యాధితో గత శుక్రవారం రాత్రి మరణించింది. రెండు వారాల క్రితం ఆమెకు డెంగీ లక్షణాలు ఉండటంతో పాటు రక్త కణాలు తగ్గిపోవడంతో ప్రైవేట్ హాస్పటల్లో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ రామసుబ్బులు మృతిచెందింది. దీనిపై శనివారం సాక్షిలో ‘డెంగీతో అంగన్వాడీ హెల్పర్ మృతి’ అనే శీర్షికతో వార్త ప్రచురితం కావడంతో స్పందించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సోమవారం పొన్నలూరు పీహెచ్సీ ఆధ్వర్యంలో చెంచుపాలెం గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరంతో పాటు ఇంటింటికీ ఫీవర్ సర్వే చేయించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు. అలాగే పంచాయతీ అధికారులు ప్రత్యేకంగా పారిశుద్ధ్య పనులు చేపట్టి బ్లీచింగ్ చల్లించారు. -
గడ్డి మందు తాగి యువకుడు మృతి
మర్రిపూడి: గడ్డి మందు తాగిన ఓ యువకుడు వైద్యశాలలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. బంధువుల కథనం మేరకు.. మండల కేంద్రమైన మర్రిపూడి వడ్డెపాలేనికి చెందిన మండే బసవయ్య, గౌరమ్మ దంపతుల కుమారుడు రాజు(36)కు స్వగ్రామానికే చెందిన తమ్మిశెట్టి భూలక్ష్మితో 16 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు ఉన్నారు. డోజర్ కొనుగోలు చేసి ఒంగోలులో బాడుగకు తిప్పుతూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో భార్యాభర్తలు ఒంగోలు వైఎస్సార్ కాలనీలో నివాసం ఉంటున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో వారం క్రితం ఒంగోలులో తాను ఉంటున్న నివాసంలో గడ్డి మందు తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆయనను ఒంగోలులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందగా స్వగ్రామమైన మర్రిపూడి మృతదేహాన్ని తీసుకొచ్చారు. తల్లి గౌవమ్మ, భార్య భూలక్ష్మి బోరున విలపిస్తుండటం పలువురిని కంటతడి పెట్టించింది. కురిచేడు: ౖబెక్ అదుపు తప్పి రోడ్డుపక్కన చెట్టును ఢీకొట్టడంతో ఓ యువకుడు అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన సోమవారం కురిచేడు–పెనగమూరు గ్రామాల మధ్య చోటుచేసుకుంది. వివరాలు.. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం మృత్యుంజయపురం గ్రామానికి చెందిన యర్రగుంట్ల మహేష్(35) జామాయిల్ తోటలు నరికేందుకు కూలీలను తీసుకెళ్తుంటాడు. గతంలో చేసిన పనులకు డబ్బులు రాక, కూలీలకు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతున్నాడు. సోమవారం ఉదయం జామాయిల్ తోటలు కొట్టించేందుకు అడ్వాన్సు తీసుకుని వచ్చేందుకు బైక్పై దర్శి బయలుదేరాడు. కురిచేడు దాటిన 3 కిలోమీటర్ల తర్వాత బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చింతచెట్టును ఢీకొనడంతో మహేష్ తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతునికి బార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.శివ తెలిపారు. మార్కాపురం: ఇంట్లో కుటుంబ సభ్యుల మీద అలిగి తన నలుగురు పిల్లలను తీసుకుని మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లలో తిరుగుతున్న మహిళను స్థానిక పోలీసులు సురక్షితంగా కుటుంబ సభ్యులకు చెంతకు చేర్చారు. యర్రగొండపాలెం మండలం రేగులపల్లి గ్రామానికి చెందిన కోటమ్మ భర్తపై అలిగి తన పిల్లలు అనీల్, నాగేంద్ర, నాగేశ్వరి, మరొకరిని వెంటబెట్టుకుని ఆదివారం రాత్రి మార్కాపురం బస్టాండుకు చేరింది. పిల్లలు ఆకలితో ఏడుస్తుంటే భోజనం తీసుకురావడానికి బయటకు వచ్చి తప్పిపోయింది. సోషల్ మీడియాలో చిన్నారుల ఫొటోలు వైరల్ కావడంతో మార్కాపురం పోలీసులు స్పందించారు. పిల్లలు రైల్వేస్టేషన్లో బెంచీలపై కూర్చుని ఉన్న ఫొటోలు వైరల్ కావడంతో సమాచారం తెలుసుకున్న రూరల్ ఎస్సై అంకమరావు ఆమె వద్దకు వెళ్లి భర్త, తల్లిదండ్రుల వివరాలు తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను మార్కాపురం పిలిపించి, కౌన్సెలింగ్ అనంతరం అప్పగించారు. -
విద్యుదాఘాతంతో తండ్రీకొడుకు మృతి
పొదిలి రూరల్: విద్యుదాఘాతానికి గురై తండ్రీకొడుకు మృతి చెందిన విషాద సంఘటన పొదిలి మండలం కొండాయపాలెం పంచాయతీలోని సలకనూతల గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. సలకనూతల గ్రామానికి చెందిన మాదాల పెద్దకోటయ్య(60), రెండో కుమారుడు వెంకటేశ్వర్లు(25)తో కలిసి పొలం నుంచి నేరుగా తమ ఇంటి సమీపంలోని పొగాకు బ్యారన్ వద్దకు చేరుకున్నాడు. వర్షానికి బ్యారన్ వద్ద చిత్తడిగా మారడం, విద్యుత్ ప్రసరించడంతో ఇద్దరూ ఒక్కసారిగా కుప్పకూలారు. పెద్దకోటయ్య అక్కడికక్కడే మృతి చెందగా, వెంకటేశ్వర్లును పొదిలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వెంకటేశ్వర్లు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విద్యుత్ షాక్తో తండ్రీకుమారుడు మరణించగా ట్రాక్టర్ ఢీకొని చనిపోయారని ప్రచారం జరగడం అనుమానాలకు తావిచ్చింది. ఒకేసారి తండ్రి, కుమారుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల అర్తనాదాలు మిన్నంటాయి. పొదిలి మండలం సలకనూతలలో విషాద ఘటన -
సముద్రంలో మత్స్యకారుల పడవపై పిడుగు
కొత్తపట్నం: సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటుపై పిడుగు పడిన సంఘటన మంగళవారం ఉదయం కొత్తపట్నం తీరంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలు కాగా, మరో ముగ్గురు మత్స్యకారులు సురక్షితంగా ప్రమాదం నుంచి బయట పడ్డారు. బాధితుల కథనం మేరకు.. మంగళవారం ఉదయం నలుగు కలిసి బోటుతో వేటకు బయలుదేరారు. కొత్తపట్నం –పిన్నింటివారిపాలెం మధ్యలో సముద్రంలోకి ఒక నాటికల్ మైల్(ఒకటన్నర కి.మీ) దూరం వెళ్లి వల వేయగా సుమారు 30 కేజీల రొయ్యలు లభించాయి. రెండోసారి వల వదిలిన సమయంలో బోటుకు అత్యంత సమీపంలో పిడుగు పడింది. బోటు నడుపుతున్న సైకం శ్రీను పిడుగుపాటుకు గురవడంతో కుడి బుజంపై తీవ్ర గాయమైంది. రెయిన్ కోట్ సైతం కాలిపోవడంతో వేడికి తట్టుకోలేక సముద్రంలోకి దూకేశాడు. తోటి మత్స్యకారులు హుటాహూటిన బోటును ఒడ్డుకు తీసుకొచ్చి, శ్రీనును ఒంగోలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పిడుగు ధాటికి బోటుకు ఆరు చోట్ల రంధ్రాలు పడ్డాయి. సుమారు రూ.70 వేలకు పైగా నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. ప్రభుత్వం స్పందించి పరిహారం ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. విషయం తెలుసుకున్న మత్స్యకార శాఖ ఏడీ సంగాని శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. ఒకరికి గాయాలు, మరో ముగ్గురు సురక్షితం -
శ్రీశైలం ఘాట్లో రోడ్డు ప్రమాదం
పెద్దదోర్నాల: ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, కారు ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన పెద్దదోర్నాల మండల పరిధిలోని శ్రీశైలం ఘాట్లో చిన్నారుట్ల సమీపంలోని మూల మలుపు వద్ద మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై మహేష్ కథనం మేరకు.. శ్రీశైలం నుంచి దోర్నాల వైపు వస్తున్న నూజివీడు డిపో సూపర్ లగ్జరీ బస్సు, బెంగళూరు నుంచి శ్రీశైలం వెళ్తున్న కారు చిన్నారుట్ల సమీపంలో మూలమలుపు వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. కారులో ప్రమాణిస్తున్న బెంగళూరు వాసులు రవికుమార్, భాస్కర్, ప్రభావతి వాసుదేవ, తేజశ్వినికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న శ్రీశైలం 108 సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం కర్నూలు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఎదురెదురుగా వస్తున్న కారు, ఆర్టీసీ బస్సు ఢీ కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్రగాయాలు -
‘చీమకుర్తి’ ప్రభుత్వ భూముల్లో గ్రానైట్ అక్రమ తవ్వకాలు
చీమకుర్తి: ప్రకాశం జిల్లా చీమకుర్తి రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో గ్రానైట్ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని హైకోర్టులో రిట్పిటిషన్ దాఖలైంది. అద్దంకికి చెందిన పులిపాటి హేబేలు ఈ నెల 17న న్యాయవాది జడ శ్రావణ్కుమార్ ద్వారా ఈ పిటిషన్ దాఖలు చేశారు. సర్వే నంబర్లు 958 నుంచి 1058 వరకు ఉన్న 258.67 ఎకరాల ప్రభుత్వ భూముల్లో అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు పిటిషన్లో తెలిపారు. మణికంఠ గ్రానైట్స్, కృష్ణసాయి గ్రానైట్స్, వాసవీ గ్రానైట్స్ యజమానులు అక్రమంగా అనుమతులు తెచ్చుకుని తవ్వకాలు సాగిస్తున్నారని పేర్కొన్నారు. వీరితోపాటు హంస, జయ మినరల్స్, ఎన్.వి.ఎక్స్పోర్ట్స్ తదితర క్వారీల యజమానులు ఆర్.ఎల్.పురం, బూదవాడ గ్రామ రెవెన్యూ పరిధిలో మరో 150 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూముల్లో అక్రమ తవ్వకాలు జరుపుతున్నారని ఆరోపించారు. అధికారుల్ని ప్రలోభపెట్టి పేదలకు డి–పట్టాగా ఇచి్చన భూముల్ని ఆ«దీనంలోకి తీసుకుని ఈ అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. -
బాస్కెట్ బాల్ జట్ల ఎంపిక
కందుకూరు రూరల్: ఉమ్మడి ప్రకాశం జిల్లా మహిళ, పురుషుల బాస్కెట్ బాల్ జట్ల ఎంపికలు ఆదివారం కందుకూరులోని టీఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించారు. ఈ ఎంపికలకు జిల్లా నలుమూలల నుంచి సుమారు 40 మంది పురుషులు, 30 మంది మహిళలు పాల్గొన్నారు. వీరిలో ప్రతిభ కనబరిచిన 12 మంది పురుషులు, 12 మంది మహిళలను జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. ఈ జట్లు విశాఖపట్నంలో నవంబర్ 7 నుంచి 10వ తేదీ వరకు జరిగే 11వ సీనియర్ రాష్ట్ర చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వలేటి రవీంద్ర, సెక్రటరీ తొట్టెంపూడి సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి విజయం సాధించాలన్నారు. క్రీడా కోటాలో ఉద్యోగాలు కూడా సాధించాలన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ మెంబర్ సయ్యద్ జిలాని బాషా, పీడీ యు.సుబ్రహ్మణ్య, పీడీ పోతురాజు, రమ్య తదితరులు పాల్గొన్నారు. -
జక్కంపూడి రాజాకు ఘనస్వాగతం
సింగరాయకొండ: వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాకు ఆదివారం కందుకూరు ఫ్లైఓవర్ వద్ద పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం దారకానిపాడు గ్రామానికి తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న సందర్భంగా పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో కలిశారు. పార్టీ జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు కనపర్తి శేషారెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి రాజాకు స్వాగతం పలికారు. ఆయన వెంట దారకానిపాడు వెవెళ్లారు. పార్టీ కొండపి మండల అధ్యక్షుడు బచ్చల కోటేశ్వరరావు, జరుగుమల్లి మండల అధ్యక్షుడు పిన్నిక శ్రీనివాసులు, ఎం గంగాధర్, లింగాబత్తిన రాజా పాల్గొన్నారు. ఒంగోలు వన్టౌన్: దీపావళి సందర్భంగా బీఎస్ఎన్ఎల్ ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లును అందిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ గుంటూరు మేనేజర్ ఎస్ శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నూతన వినియోగదారుల కోసం రూ.1 రిచార్జి పథకంతో నెల రోజుల పాటూ ఆన్లిమిటెడ్ కాల్స్, 2 జీబీ హై స్పీడ్ డేటా అందిస్తున్నట్లు చెప్పారు. నేడు రూ.100ల పై రీచార్జి చేసుకుంటే లక్కీడ్రాలో అర్హత పొందుతారని, డ్రాలో 10 మందికి 10 గ్రాముల వెండి నాణేలు అందించనున్నట్లు తెలిపారు. సీనియర్ సిటిజన్ ప్లాన్లో 1812లో అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 2 జీబీ డేటాను నవంబర్ 15 వరకూ రీచార్జి చేసుకునే వారికి అందించనున్నట్లు చెప్పారు. -
పచ్చనేతలకు ప్యాకేజీ...
యర్రగొండపాలెం: తీవ్ర కరువు కాటకాలతో అలమటిస్తున్న పశ్చిమ ప్రకాశంతోపాటు కడప, కర్నూలు జిల్లాల్లోని 30 మండలాల్లో ఉన్న సుమారు 16 లక్షల మంది ప్రజల దాహార్తిని తీర్చడంతో పాటు వేలాది ఎకరాలకు సాగునీరు అందించేందుకు పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ప్రాజెక్టు నుంచి వచ్చే నీటిని నిల్వ ఉంచేందుకు పెద్దారవీడు మండలంలోని సుంకేసుల, మార్కాపురం మండలంలోని గొట్టిపడియ, కంభం మండలంలోని కాకర్ల ప్రాంతాల్లో గ్యాప్లను నిర్మించారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గ్యాప్లలో 11 గ్రామాలు ముంపునకు గురవుతాయి. వేలాది ఎకరాల పొలాలు ఆ గ్యాప్లలో కలిసిపోతాయి. ఆయా గ్రామాల్లో నివశించే ప్రజలు నిర్వాసితులుగా మారిపోయి తాము పుట్టిన గడ్డపై ఉన్న మమకారం, బంధాలను వదులుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కూడా వారు నోచుకోని పరిస్థితి 2006 నుంచి ఏర్పడింది. అంతటి మహా త్యాగం చేసిన నిర్వాసితులు ఇప్పుడు టీడీపీ నాయకుల కబంద హస్తాల్లోకి వెళ్లాల్సి వచ్చింది. వారు చెప్పిందే వేదంగా వినాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో నిర్వాసితుల సంక్షేమానికి పెద్దపీట: 20 ఏళ్ల క్రితం ఆనాటి సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి వెలిగొండ ప్రాజెక్ట్కు శంకుస్థాపన చేసి బడ్జెట్లో నిధులు కేటాయించారు. పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో అన్ని వర్గాలకు చెందిన నిర్వాసితుల బాధలు తెలుసుకొని వారు తృప్తిపడేలా ఆయన ప్యాకేజీ ప్రకటించారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం నిర్వాసితులకు రూ.10 లక్షలుగా నష్టపరిహారం నిర్ణయించింది. ఈ పరిహారం సరిపోదని ప్రజలు చేసుకున్న విన్నపాలను ఆలకించి 2019లో అప్పటి సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా రూ.12.50 లక్షలకు పెంచారు. నేడు చేయి తడిపితేనే ప్యాకేజీ... ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ప్యాకేజీ పచ్చనేతలకు వరంగా మారింది. వెలిగొండ ప్రాజెక్ట్కు సంబంధించి మార్కాపురం యూనిట్–1కు రూ.29.13 కోట్లు, కంభం యూనిట్–2కు రూ.35 కోట్ల ప్రకారం నిధులు విడుదలయ్యాయని ప్రచారంలో ఉంది. ఈ నిధులను కాజేసేందుకు టీడీపీ నాయకులు నిర్వాసితులను మభ్యపెడుతున్నారు. తక్షణమే ప్యాకేజీ వర్తింపచేస్తామని రూ.20 వేల ప్రకారం వసూలు చేయడం మొదలు పెట్టారని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. ముందుగా ఈ ప్రక్రియ మార్కాపురం యూనిట్–1లోని పెద్దారవీడు మండలం సుంకేసులలో ప్రారంభించినట్లు తెలుస్తోంది. నష్టపరిహారం ఇవ్వడంలో జాప్యం: ముంపు గ్రామాలకు ప్యాకేజీ ఇవ్వడంలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు. 2023లో అప్పటి ప్రభుత్వం నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన 30 మంది తహసీల్దార్లను రంగంలోకి దింపింది. గడప గడపలో దర్యాప్తు జరిపి వారు గెజిట్ను రూపొందించారు. ఈ గెజిట్లో పుట్టిన బిడ్డ నుంచి 7 సంవత్సరాల వయస్సు ఉన్నవారి పేర్లు కూడా నమోదు చేశారు. ఆ తరువాత కూటమి ప్రభత్వం అధికారంలోకి రావడంతో నష్టపరిహారం రికార్డులను అధికారులు మూలన పడేశారు. ప్రస్తుతం ఆ గెజిట్లో నమోదైన వారందరూ 20 నుంచి 25 సంవత్సరాల వయస్సు దాటిన వారున్నారు. వీరికి కూడా ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తింపచేయాల్సి వస్తుంది. రూ.కోట్లు దండుకోవటానికి పథకం.. నిర్వాసితులను అడ్డుపెట్టుకొని రూ.కోట్లు దండుకోవటానికి పచ్చనేతలు పథకం వేశారు. ప్రభుత్వం తమదేనన్న అహంకారంతో వారు ఒక్కొక్క లబ్ధిదారుల నుంచి రూ.20 వేల ప్రకారం వసూలు చేస్తున్నట్లు సమాచారం. సుంకేసుల, కలనూతల, గుండంచెర్ల పంచాయతీల్లో మొత్తం 10,252 నిర్వాసిత కుటుంబాలు ఉన్నాయి. వారిలో 3,760 కుటుంబాలు అవార్డ్ పొందాయి. 1,360 కుటుంబాలను పెండింగ్లో పెట్టారు. ఈ లెక్కల ప్రకారం పచ్చనేతలు రూ.కోట్లలో వసూలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే గత వారం రోజులుగా దాదాపు 80 మంది నుంచి రూ.16 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. ఆయా గ్రామాలు ఉన్న లోయ ప్రాంతంలో అవినీతికి అధికారులు, పచ్చనేతలు తెరలేపారు. తమకు రావాల్సిన నష్టపరిహారం కోసం కూడా డబ్బులు చెల్లించాల్సి రావడంతో టీడీపీకి చెందిన బలహీన వర్గాలు మండిపడుతున్నాయి. ప్యాకేజీ స్కాంను అడ్డుకుంటాం పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితుల ప్యాకేజీ స్కాంను అడ్డుకుంటాం. అధికారం ఉందని టీడీపీ వర్గీయులు, ప్రాజెక్ట్ అధికారులు తమ ఇష్టం వచ్చినట్లు చేయాలనుకుంటున్నారు. ప్యాకేజీ మంజూరు కావాలంటే రూ.20 వేలు ఇవ్వాలని, లేకుంటే ప్యాకేజీ నిలిపి వేయిస్తామని నిర్వాసితులను ఆందోళనకు గురిచేస్తున్నారు. ఈ లెక్కల ప్రకారం కోట్ల రూపాయలు దండుకోవాలని కూటమి నాయకుడు పథకం వేశాడు. సుంకేసుల, కలనూతల, గుండంచెర్ల పంచాయతీల్లో 1,360 కుటుంబాలను పెండింగ్లో పెట్టారు. వీరికి కూడా అవార్డు రావటానికి పచ్చనేతలు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం గురించి కలెక్టర్, ప్రాజెక్ట్ స్పెషల్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లాను. నిర్వాసితుల ప్యాకేజీ కోసం జిల్లా గవ్వ చెల్లించాల్సిన అవసరం లేదు. నిర్వాసితులందరికీ తక్షణమే ప్యాకేజీ వర్తింపచేయాలి. అధికారులు స్పందించి సమస్యను సరిదిద్దకుంటే తీవ్ర ఆందోళన చేయటానికి సిద్ధంగా ఉన్నాను. – తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్యే, యర్రగొండపాలెం -
మెడికల్ కాలేజీలపై బాబు కుట్ర
మార్కాపురం టౌన్: పేదలకు ఉచిత వైద్యం, విద్య అందించేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెడికల్ కాలేజీలపై చంద్రబాబు కుట్ర పన్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ ఇన్చార్జి అన్నా రాంబాబు అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ పట్టణంలోని 1,4, 10, 11 బ్లాకుల్లో ఆదివారం కోటి సంతకాల సేకరణ చేపట్టారు. తొలుత తూర్పు వీధిలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అన్నా రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 17 మెడికల్ కళాశాలలను మంజూరు చేసిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. జగన్మోహన్రెడ్డి హయాంలోనే 5 మెడికల్ కాలేజీలకు పీజు సీట్లు కూడా మంజూరు చేశారని, 2024లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే మిగిలిన కాలేజీలు కూడా పూర్తయ్యేవన్నారు. 70 శాతం పూర్తయిన కళాశాలలను శాతం ప్రైవేట్పరం చేయడం దుర్మార్గమన్నారు. పార్టీలకతీతంగా జరుగుతున్న కోటి సంతకాల సేకరణలో స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి వెలిగొండ ప్రాజెక్టుకు ప్రాజెక్టును ప్రాముఖ్యను గుర్తించి రూ.3,500 కోట్లు మంజూరు చేశారన్నారు. కానీ చంద్రబాబు మాత్రం ప్రాజెక్టుకు శిలాఫలకం వేసింది నేనేనంటూ, పూర్తిచేసేది కూడా నేనేనంటూ చెప్పుకోవడమే తప్ప చేసిందేమీ లేదన్నారు. కూటమి పాలనలో ప్రజలకు చేసింది శూన్యమన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. అన్నా కృష్ణచైతన్య, పార్టీ స్టేట్ కమిటీ సభ్యులు వెన్న హనుమారెడ్డి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ షంషేర్ ఆలీబేగ్, ఏఎంసీ మాజీ చైర్మన్ గొలమారి శ్రీనివాసరెడ్డి, ఉడుముల కోటిరెడ్డి,, జెడ్పీటీసీ నారు బాపన్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ చర్లంచర్ల బాలమురళీకృష్ణ, డాక్టర్ చప్పల్లి కనకదుర్గ, టౌన్పార్టీ ప్రెసిడెంట్ సలీమ్, సిరాజ్, పత్తి రవిచంద్ర, ఉత్తమ్కుమార్, రోజ్లిడియా, కొత్త కృష్ణ, గుంటక వనజాక్షి చెన్నారెడ్డి, రంగస్వామి గౌడ్, చాటకొండ చంద్ర, పట్టణ ప్రధాన కార్యదర్శి గొలమారి సత్యనారాయణరెడ్డి, గొలమారి శివారెడ్డి, మండల పార్టీ అద్యక్షులు చెంచిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బినామీలకు దోచిపెట్టేందుకే ప్రైవేటీకరణ జపం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ మార్కాపురం ఇన్చార్జి అన్నా రాంబాబు ధ్వజం -
దీపావళి మరిన్ని వెలుగులు నింపాలి
● జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఒంగోలు సబర్బన్: తగ్గిన జీఎస్టీ ధరలు ప్రజల జీవితాల్లో మరిన్ని దీపావళి వెలుగులు నింపాలని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ అన్నారు. ‘సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్’ ప్రచార ముగింపు కార్యక్రమం ఆదివారం ప్రకాశం భవనంలో నిర్వహించారు. జీఎస్టీ శాఖ డిప్యూటీ కమిషనర్ సత్య ప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, రవాణా శాఖ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సురేంద్ర, కమర్షియల్ ట్యాక్స్ అధికారి కొప్పోలు సుధాకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. సంతనూతలపాడు: దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక రంగమైన వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేందుకే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 50 శాతం మేర సుంకాలను విధించాడని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నెరుసుల వెంకటేశ్వర్లు విమర్శించారు. ట్రంప్ విధించిన సుంకాలకు నిరసనగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక బస్టాండ్ సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నెరుసుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ట్రంప్ విధిస్తున్న సుంకాలతో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలకు మన దేశ ప్రధాని సాగిలపడి దాసోహం చేస్తున్నాడని విమర్శించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి బంకా సుబ్బారావు మాట్లాడుతూ అమెరికా తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడం కోసమే సుంకాలను విధిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అమెరికా ఆయుధాలను మనదేశంలో దిగుమతి చేసుకోవాలని మోడీపై ట్రంప్ ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోందన్నారు. అనంతరం ట్రంప్ చిత్రపటానికి కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ మాబు నిప్పంటించారు. కార్యక్రమానికి రైతు సంఘం మండల కార్యదర్శి ఎన్వీ నరసింహం అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షుడు కరిచేటి హనుమంతరావు, అన్ను వెంకటసుబ్బారావు, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎం సుశీల, ఏ శేషారావు, గౌరవాధ్యక్షుడు ఈ సుబ్బారావు, సీఐటీయూ మండల కన్వీనర్ షేక్ మస్తాన్, ఐద్వా నాయకులు ఎన్ మాలతి, ఎస్కే నాగూర్ భీ, వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. -
‘కోటి సంతకాలు’ త్వరగా పూర్తి చేయాలి
● మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి మేరుగు నాగార్జున మద్దిపాడు: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న కోటి సంతకాల కార్యక్రమం త్వరితగతిన పూర్తి చేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి మేరుగు నాగార్జున అన్నారు. మండలంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం పార్టీ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్య కళాశాలలను ప్రైవేటీకరించకుండా ప్రభుత్వమే నిర్మాణాలు పూర్తి చేసి నడిపేలా ఒత్తిడి తీసుకురావడానికి జగనన్న కోటి సంతకాల కార్యక్రమం చేపట్టారన్నారు. మండల నాయకులు అందరూ వారి వారి గ్రామాల్లో కోటి సంతకాల కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేస్తే సంతకాలను కేంద్ర కార్యాలయానికి పంపించడానికి వీలవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయన వెంట మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
పత్రికా స్వేచ్ఛపై దాడి హేయం
ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని నిలదీస్తున్న ‘సాక్షి’పై చంద్రబాబు ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. సాక్షి ఎడిటర్ ఆర్.ధనుంజయ్రెడ్డితో పాటు పలువురు జర్నలిస్టులపై అక్రమ కేసులు నమోదు చేసి విచారణల పేరుతో వేధిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన ప్రతిసారీ ఎక్కడో ఒక చోట సంబంధం లేని వ్యక్తులతో ఫిర్యాదుల చేయించి పోలీసులను ఉసిగొల్పుతోంది. పత్రికల గొంతు నొక్కి ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేయాలని కూటమి సర్కారు చేస్తున్న కుట్రలపై ప్రజాగ్రహం పెళ్లుబుకుతోంది. – సాక్షి నెట్వర్క్ సాక్షి జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డితో పాటు మిగిలిన పాత్రికేయులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి. పత్రికల్లో రాసిన వార్తల ఆధారంగా కేసులు నమోదు చేయడం సరికాదు. ఈ విధానాన్ని ప్రభుత్వం మానుకోవాలి. ఇలా అయితే ప్రజాస్వామ్య మనుగడ కష్టం. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను ప్రభుత్వం కాపాడాలి. అధికారంలో ఉన్న వారికి పత్రికల్లో వచ్చిన వార్తలు నచ్చకపోతే ఖండన ఇవ్వొచ్చు కానీ, పోలీసులతో కేసులు పెట్టించ కూడదు. ప్రజలన్నీ గమనిస్తున్నారు. – జంకె వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, నెల్లూరు పార్లమెంట్ వైఎస్సార్ సీపీ పరిశీలకుడు, పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు కక్షసాధింపు తగదు సమాజంలో జరుగుతున్న వాస్తవాలను బయట పెడుతున్న పత్రికలపై కక్షసాధింపు తగదు. సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి, రిపోర్టర్లపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సమంజసంగా లేదు. కూటమి నాయకులు చేస్తున్న అక్రమాలను వెలికి తీస్తే కక్ష సాధింపులకు పాల్పడడం మంచి పద్ధతి కాదు. ప్రజా పక్షాన నిలబడి నిజాన్ని నిర్భయంగా చెప్పేది ఒక సాక్షి పత్రిక మాత్రమే. ప్రభుత్వంలో అక్రమాలను వెలికితీస్తున్న జర్నలిస్టులు చేస్తున్న కృషిని అడ్డుకోవడం సరైన పద్ధతి కాదు. – ఉడుముల శ్రీనివాసులరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు, ప్రకాశం జిల్లా నియంతృత్వ పోకడలకు పరాకాష్ట ప్రభుత్వ వైఫల్యాలను, అక్రమాలను వెలికితీస్తూ ప్రజల పక్షాన నిలబడుతున్న జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సాక్షి ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డి, జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడం అత్యంత దుర్మార్గం. రాష్ట్రంలో నకిలీ మద్యం పేరుతో కొనసాగుతున్న దోపిడీని బయటపెట్టినందుకు పత్రికను నిలువరించేందుకు నిస్సిగ్గుగా ప్రయత్నిస్తున్న ఈ కూటమి ప్రభుత్వం తీరు అత్యంత గర్హనీయం. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. – కేవీ రమణారెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, ప్రకాశం జిల్లా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి కూటమి ప్రభుత్వం జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించి కక్షసాధింపు చర్యలకు పాల్పడటం మానుకోవాలి. సాక్షి ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డికి నోటీసులు ఇవ్వడం అప్రజాస్వామికం. ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను కాపాడాలి. జర్నలిస్టులపై పెట్టిన కేసులన్నింటినీ ఎత్తివేయాలి. పత్రికల్లో వార్తలు రాశారని కేసులు నమోదు చేయడం అనైతికం. కూటమి ప్రభుత్వం బెదిరింపు ధోరణితో వ్యవహరించడం సరికాదు. – వై.వెంకటేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ప్రకాశం జిల్లా సాక్షి జర్నలిస్ట్లపై కేసులు ఎత్తివేయాలి సాక్షి ఎడిటర్ ఆర్ ధనుంజయర్రెడ్డి, ఇతర జర్నలిస్టులపై పెట్టిన అక్రమకేసులను తక్షణం ఎత్తివేయాలి. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను ప్రభుత్వం కాపాడాలి. పత్రికల్లో వచ్చిన వార్తలు నచ్చకపోతే ఖండన ఇవ్వొచ్చు. కానీ పాత్రికేయుల ఇళ్లలో సోదాలు చేసి భయభ్రాంతులకు గురి చేయడం దుర్మార్గం. పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. –కల్లూరి రామిరెడ్డి, వైఎస్సార్సీపీ టీచర్స్ విభాగం జిల్లా అధ్యక్షుడు -
చెరబట్టారు..!
చెరువు భూములుఅధికారం అండగా టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. అధికారంలోకి వచ్చింది మొదలు ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను ఇష్టం వచ్చినట్లు ఆక్రమించేశారు. పశువుల పోరంబోకు, డొంకపోరంబోకు ఇలా... ఏ భూమినీ వదల్లేదు. ఇప్పుడు ఏకంగా చెరువు భూములపై కన్నేశారు. ఏం చేసినా అడిగేదెవరు అన్నట్లు చివరకు చెరువు భూములను వదలకుండా కబ్జా చేసి ఆక్రమించేశారు. కబ్జా విషయం అధికారులు తెలిసినా ఏం తెలియనట్లు చోద్యం చూస్తున్నారు. సాక్షి టాస్క్ఫోర్స్, ఒంగోలు: సింగరాయకొండ మండలంలో అతిపెద్దదైన మీడియం ఇరిగేషన్ చెరువు బింగినపల్లి చెరువు. సుమారు 650 ఎకరాల వైశ్యాలంలో చెరువు ఉంది. ఈ చెరువుకు ఆనుకుని పాతసింగరాయకొండ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 331లో 109 ఎకరాల వైశాల్యంలో అనచెరువు, సర్వే నంబర్ 327,330లలో సుమారు 30 ఎకరాల ఇనాం భూములు ఉన్నాయి. బింగినపల్లి చెరువు కింద సుమారు 2 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, అనకట్ట చెరువు కింద సుమారు 100 ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే బింగినపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నేత కన్ను ఈ చెరువుపై పడింది. గ్రామానికి చెందిన టీడీపీ నేత సన్నెబోయిన మాలకొండయ్య, మరో వ్యక్తి కలిసి పాతసింగరాయకొండ సర్వే నంబర్ 327, 330లో సుమారు 20 ఎకరాల ఇనాం భూములకు రిజిష్టర్ డాక్యుమెంట్ ఉందని సాకు చూపి ఇనాం భూములు 20 ఎకరాలతో పాటు బింగినపల్లి చెరువులో సుమారు 50 ఎకరాలు దున్ని తరువాత జామాయిల్ మొక్కలు నాటే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న పాతసింగరాయకొండ ఎస్సీ కాలనీవాసులు మా భూములు ఆక్రమిస్తున్నారని తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ వెంటనే సిబ్బందిని పంపి టీడీపీ నేత మొక్కలు నాటడాన్ని ఆపించారు. దీంతో టీడీపీ నేత మాలకొండయ్య, అడ్వకేట్ రాజేష్తో పాటు పొలం హక్కుదారుడంటూ మక్కె కోటిరెడ్డి, మరొక వ్యక్తి వచ్చి తహశీల్దార్ను కలిసి రిజిష్టర్ పత్రాలు అందజేసారు. ఎస్సీలు మాత్రం అగ్రిమెంట్ పత్రాలు అందజేసారు. చోద్యం చూస్తున్న ఇరిగేషన్ అధికారులు.. గత కొద్ది రోజులుగా బింగినపల్లి చెరువుతో పాటు పాతసింగరాయకొండ పంచాయతీ పరిధిలోని అనచెరువు కూడా ఆక్రమణకు గురవుతున్నా ఇరిగేషన్ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అంతేకాక ఆక్రమణదారులు చెరువు స్థలాన్ని ఆక్రమించటంతో పాటు జామాయిల్ వేస్తున్నారని, దీంతో చెరువు కింద సాగు చేసుకునే ఆయకట్టు దారులైన వరిరైతులకు సాగునీటి కష్టాలు ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనచెరువు ఆయకట్టు సుమారు 109 ఎకరాల వైశాల్యం ఉంటే ప్రస్తుతం కేవలం సుమారు 40 ఎకరాలు మాత్రమే ఉందని, మిగిలిన స్థలం ఆక్రమణకు గురైందని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. చెరువు ఆక్రమణకు గురవుతున్నా బింగినపల్లి చెరువు సాగు నీటి సంఘం అధ్యక్షుడు రోశిరెడ్డి కూడా పట్టించుకోలేదని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. మంత్రి స్వామి ఇలాకాలో ఇటువంటి ఆక్రమణలు జరగటం సిగ్గుచేటని, టీడీపీ నాయకుని భూ దాహానికి అంతేలేదా అని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. గతంలో ఈ భూ బకాసరుడు పాతసింగరాయకొండ పంచాయతీ పరిధిలోని ఇండస్ట్రీయల్ స్థలంలో పంట కాలువ ఆక్రమించాడని, జీవీఆర్ ఫ్యాక్టరీ సమీపంలో భూమిని సైతం ఆక్రమించాడని, ఇప్పుడు చెరువును కూడా వదల్లేదని టీడీపీలోని మరో వర్గం ఆరోపిస్తోంది. విచారించి చర్యలు తీసుకుంటాం బింగినపల్లి చెరువులో జామాయిల్ మొక్కలు నాటుతున్నారని తెలిసి సిబ్బందిని పంపించి ఆపించాను. తరువాత టీడీపీ నాయకుడు మాలకొండయ్య ఆ స్థలానికి రిజిష్టర్ డాక్యుమెంట్ ఉన్నాయని, స్థలం హక్కుదారుడంటూ మక్కె కోటిరెడ్డి అనే వ్యక్తిని తీసుకువచ్చారు. దీనిపై విచారణ చేస్తున్నాం. నివేదిక రాగానే చర్యలు తీసుకుంటాం. చెరువు స్థలాలు ఆక్రమణకు గురి కాకుండా కాపాడతాం. – ఎస్వీబీ రాజేష్, తహసీల్దార్ బింగినపల్లి చెరువుపై కన్నేసిన టీడీపీ నేత మండలంలో అతిపెద్దదైన బింగినపల్లి చెరువు చెరువు పరిధిలో సుమారు 2 వేల ఎకరాల ఆయకట్టు సుమారు 50 ఎకరాల చెరువు ఆక్రమణకు యత్నం చోద్యం చూస్తున్న ఇరిగేషన్ అధికారులు చెరువును కాపాడాలంటున్న ఆయకట్టు రైతాంగం రెండు ఎకరాల పొలాన్ని దున్నేశారు: మా తాతల నాటి నుంచి ఎన్నో ఏళ్లుగా బింగినపల్లి చెరువు వద్ద 2 ఎకరాలు సాగు చేసుకుంటున్నాను. నా పొలాన్ని దున్నేశారని తోటి రైతులు చెప్పటంతో వచ్చి చూసుకుంటే నా స్థలాన్ని దున్నేశారు. అధికారులే న్యాయం చేయాలి. – కొమరగిరి వరాస, ఎస్టీ కాలనీ, పాతసింగరాయకొండ -
చిరుత పులి దాడిలో గేదె మృతి
హనుమంతునిపాడు: చిరుతపులి దాడిలో గేదె మృతిచెందిన ఘటన మండలంలోని హనుమంతాపురం పంచాయతీ నారాయపల్లె గ్రామ సమీపంలో శనివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన బత్తుల బాలగురవయ్య గేదెలు పొలానికి తోలాడు. ఒక గేదె ఇంటికి తిరిగిరాలేదు. మూడు రోజుల నుంచి గేదె రాకపోవడంతో పొలానికి వెళ్లి వెతుకుతున్నారు. శనివారం గ్రామ సమీపాన అడవిలో చిరుత పులి దాడిలో గేదె మృతిచెంది ఉండటం గుర్తించారు. అక్కడ చిరుత పులి చంపి తిన్నట్లు ఆనవాళ్లు ఉండటంతో అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఒంగోలు సిటీ: ఒంగోలులోని పింగళి కోదండరామయ్య ఓరియంటల్ స్కూల్ విద్యార్థి మర్రిపూడి సాయి 69వ స్కూల్ గేమ్స్ రాష్ట్రస్థాయి బాక్సింగ్ చాంపియన్షిప్ పోటీల్లో కాంస్య పతకం శనివారం సాధించాడు. రాజమండ్రిలో ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ బాక్సింగ్ పోటీల్లో అండర్–14 విభాగంలో సాయి ఈ విజయం సాధించాడు. ఈ సందర్భంగా శనివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ నల్లమల్లి కోటి సూర్యనారాయణ సాయికి పతకాన్ని అందజేసి అభినందనలు తెలిపారు. -
మూతపడినా భారంగా మారిన విద్యుత్ బిల్లులు
పేర్నమిట్ట ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్కులో డైనమిక్ గ్రానైట్ మూతపడింది. నాగేశ్వరరావు అనే పారిశ్రామికవేత్త పార్కు ఏర్పడిన తొలినాళ్లలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వ ప్రోత్సాహం కరువై ఫ్యాక్టరీని నడపలేక మూతేశారు. ఎవరికై నా అద్దెకు గోడౌన్ల కోసం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే ఫ్యాక్టరీ మూసేసినా విద్యుత్ బిల్లు భారంగా మారింది. ప్రస్తుతం ఫ్యాక్టరీ నడవటం లేదు. అక్కడ వాచ్మెన్ ఉంటాడు. మూడు లైట్లు మాత్రమే వేస్తున్నారు. అయినా నెలకు రూ.20 వేలు విద్యుత్ బిల్లు వస్తోంది. మూడు, నాలుగు సంవత్సరాల క్రితం వాడుకున్న యూనిట్లకు గాను ట్రూ అప్ చార్జీల పేరుతో విద్యుత్ బిల్లు బాదుడు బాదుతున్నారు. దాంతో ఫ్యాక్టరీ మూసేసినా విద్యుత్ బిల్లు భారం మోయలేకున్నారు. -
అక్రమ వసూళ్లు
మార్కాపురం: వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజీ అమలు చేసేందుకు ఒక్కొక్కరి నుంచి రూ.20 వేలను టీడీపీ నేతలు వసూలు చేస్తున్నారని, ఈ అక్రమ దందాను ఆపకపోతే వేలాది మందితో ధర్నా చేస్తానని యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ హెచ్చరించారు. మార్కాపురం మండలం రాయవరం సమీపంలో ఉన్న వెలుగొండ ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టరును శనివారం ఆయన కలిసి మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ 2005 నుంచి గెజిట్లో పేరున్నా అవార్డుకాని వారి సంఖ్య దాదాపు 1350 మంది ఉన్నారన్నారు. గెజిట్లో పేర్లు ఉన్న వారికి అవార్డు ఇచ్చేందుకు మీకున్న సమస్య ఏమిటన్నారు. అధికారులు 2005 నాటి రేషన్కార్డు, ఆధార్కార్డులు తెమ్మంటూ నిర్వాసితులను ఇబ్బంది పడుతున్నారని, అవి లేనివారి పరిస్థితి ఏమిటని అన్నారు. అన్నీ కార్డులు ఉన్నా సుమారు 900 మందికి అవార్డు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రాజెక్టు నిర్వాసితులు అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారని ఎమ్మెల్యే చంద్రశేఖర్ చెప్పారు. ఒక్క కొత్తపేరు కూడా అవార్డుకు ఎంపిక కాలేదని, ఇచ్చిన అరకొర నిధులు కూడా టీడీపీకి చెందిన వారికే విడుదల చేయించుకోవడం తప్ప ఆయా గ్రామాల్లో నివశిస్తున్న అర్హులైన వారికి ఒక్కరికి కూడా సహాయం చేసే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేనట్టుందన్నారు. సుమారు 5 వేల మంది నిర్వాసితులు ఉన్నారని, వారందరికీ ఒకేసారి ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా కొంతమందికే ఇచ్చి 1300 మంది నిర్వాసితులను వదిలేస్తే వారికి ఎప్పుడు అవార్డు ఇస్తారని అన్నారు. ప్రతి ఒక్కరి ఆధార్ కార్డు, రేషన్కార్డు, ఓటరు కార్డులను తీసుకొచ్చి వివరాలను అధికారులకు చెప్పానని అన్నారు. ఒక నెలలోనే ఈ ప్రక్రియ పూర్తిచేస్తానని స్పెషల్ డిప్యూటీ కలెక్టరు చెప్పారని అన్నారు. పైసలిస్తేనే పరిహారం కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చి 18 నెలలు కావస్తున్నా ఇంత వరకూ వెలుగొండను ఎందుకు పూర్తిచేయలేదని, నిజంగా చిత్తశుద్ధి ఉంటే పూర్తి చేయలేరా అని ఎమ్మెల్యే చంద్రశేఖర్ అన్నారు. రాజకీయ కక్షలతో నిర్వాసితులను ఇబ్బందిపెట్టడం తగదన్నారు. టీడీపీ నాయకులు ప్రతి వ్యక్తి వద్ద నుంచి రూ.20 వేలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారుల పేర్లు చెప్పి రూ.20 వేలు డబ్బులు ఇస్తేనే పేర్లు పొందుపరుస్తామని, డబ్బులివ్వకుంటే అవార్డులో పేరున్నా మీకు డబ్బులు రావంటూ బెదిరిస్తున్నారని అన్నారు. 7 వేల మంది వరకూ నిర్వాసితులు ఉన్నారని, ఒక్క యర్రగొండపాలెం నియోజకవర్గం నుంచే 5 వేల మంది ఉన్నారని, దాదాపు రూ.10 కోట్లను టీడీపీ నాయకులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటివన్నీ ఇక్కడున్న ఇన్చార్జికి పట్టవని ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్షన్లలో బిజీగా ఉంటారే తప్ప ప్రజల కోసం పనిచేసే ఆలోచనే చేయడన్నారు. వెలుగొండ ప్రాజెక్టులో జరుగుతున్న అక్రమాలపై పదే పదే చెబుతున్నా ఈ పెద్దమనిషి నోరు విప్పడన్నారు. ఎందుకంటే వచ్చే కమీషన్ పోతుందేమోనని అన్నారు. ఆయన వెంట పెద్దారవీడు మండల పార్టీ కన్వీనర్ పీ కృష్ణారెడ్డి, సుంకేశుల సర్పంచ్ రమేష్, నాగిరెడ్డి, పుల్లారెడ్డి, సహదేవుడు, రమణారెడ్డి ఉన్నారు. కలెక్టర్ను కలిసిన ఎమ్మెల్యే తాటిపర్తి ఒంగోలు సబర్బన్: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులను టీడీపీ నాయకులు దోచుకుంటున్నారని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కలెక్టర్ పీ రాజాబాబు దృష్టికి తెచ్చారు. ఈ మేరకు ఆయన శనివారం నూతనంగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ను ఆయన ఛాంబర్లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. అనంతరం కలెక్టర్తో ఎమ్మెల్యే తాటిపర్తి యర్రగొండపాలెం నియోజకవర్గంలో జరుగుతున్న టీడీపీ అరాచకాలు, అక్రమాలు, అవినీతి గురించి వివరించారు. కలెక్టరేట్లో తాటిపర్తి చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. యర్రగొండపాలెంలో టీడీపీ ఇన్చార్జ్ చేస్తున్న అవినీతిని, అక్రమాలను, దౌర్జన్యాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. నియోజకవర్గంలో కుంటుపడుతున్న అభివృద్ధి గురించి కూడా వివరించానన్నారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులను టీడీపీ యర్రగొండపాలెం ఇన్చార్జ్ దోచుకుంటున్నాడన్నారు. నిర్వాసితుల నుంచి ఒక్కొక్కరి నుంచి రూ.20 వేల చొప్పున వసూలు చేస్తున్నారన్నారు. డబ్బులు ఇస్తేనే నిర్వాసితుల పేర్లు నమోదు చేసి నిధులు మంజూరు చేయిస్తున్నాడని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి 1,300 మందికి ఆర్ఆర్ ప్యాకేజీ మంజూరు కాలేదని, కనీసం అవార్డు కూడా కాకుండా టీడీపీ ఇన్చార్జ్ అడ్డుకుంటున్నాడని మండిపడ్డారు. -
పరిశ్రమలకు తాళం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కూటమి ప్రభుత్వ చర్యలతో పారిశ్రామిక రంగం కుదేలవుతోంది. ఎంఎస్ఎంఈలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలకు ఎగనామం పెట్టడం, విద్యుత్ బిల్లులు, రాయల్టీల భారంతో పరిశ్రమలను నడపలేక పారిశ్రామికవేత్తలు ఫ్యాక్టరీలను మూతేసుకుంటున్నారు. జిల్లాలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రావాల్సిన రాయితీలను ఇంత వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ఉన్న వాటికి రాయితీలు ఇవ్వకుండా ప్రోత్సాహకాన్ని గాలికి వదిలేసి కొత్తవాళ్లను ప్రోత్సహిస్తాననటంలో పరమార్థం ఏమిటో సీఎం చంద్రబాబుకే తెలియాలి. రూ.250 కోట్ల రాయితీల ఎగనామం... జిల్లాలో ఎంఎస్ఎంఈలకు రావాల్సిన రూ.250 కోట్ల రాయితీలకు చంద్రబాబు ప్రభుత్వం ఎగనామం పెట్టింది. జిల్లాలో మొత్తం 1,200 పరిశ్రమలకు రావాల్సిన సబ్సిడీ ఇంత వరకు ఇవ్వకుండా పారిశ్రామికవేత్తలను నిలువునా మోసం చేస్తోంది. అందులో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో 970 పరిశ్రమలకు రూ.170 కోట్ల రాయితీలు రావాల్సి ఉంది. మిగతా ఖాదీ బోర్డు, ఖాదీ కమిషన్కు చెందిన పరిశ్రమలున్నాయి. వీటిలో ప్రధానంగా గ్రానైట్ పరిశ్రమలు కాగా ఇతర పరిశ్రమలు కూడా అనేకం ఉన్నాయి. 500 పరిశ్రమల వరకు మూత దిశగా అడుగులు: జిల్లాలో గ్రానైట్తో పాటు అనేక రకాల పరిశ్రమలు మూత దిశగా అడుగులు పడుతున్నాయి. పారిశ్రామికంగా ఎంఎస్ఎంఈలను ప్రభుత్వం ప్రోత్సహించకపోవటంతో పాటు హక్కుగా రావాల్సిన సబ్సిడీలు కూడా ఇవ్వకుండా వేధించటమే అందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. జిల్లాలో ప్రధానంగా గ్రానైట్ పరిశ్రమ కార్మికులకు ఉపాధి కల్పిస్తోంది. అలాంటి గ్రానైట్ పరిశ్రమ పరిస్థితి ప్రస్తుతం అగమ్య గోచరంగా తయారైంది. ఇప్పటికే 400లకు పైగా గ్రానైట్ పరిశ్రమలు మూత పడగా, మరో 50 నుంచి 60 వరకు మూత దిశగా అడుగులు పడుతున్నాయి. మూత పడే దిశలో మరికొన్ని రకాల ఫ్యాక్టరీలు ఉన్నాయి. చీమకుర్తి మండలంతో పాటు సంతనూతలపాడు, పేర్నమిట్ట, మద్దిపాడు మండల గుళ్లాపల్లి గ్రోత్ సెంటర్లలో మూతపడిన ఫ్యాక్టరీలకు కొన్నింటికి తాళాలు వేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మార్టూరు, బల్లికురవ మండలాల్లో కూడా ఇదే పరిస్థితి. నష్టాలపాలై పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. రాయితీ వస్తుందని బ్యాంకుల్లో రూ.కోట్లలో రుణాలు తీసుకొని ఫ్యాక్టరీలు స్థాపిస్తే ప్రభుత్వ ప్రోత్సాహం లేక, రాయితీలు విడుదల చేయకపోవటంతో పారిశ్రామికవేత్తలు అప్పుల్లో కూరుకుపోయారు. రాయల్టీ వసూలు ఏఎంఆర్ సంస్థకు అప్పగించి మరీ భారం: రాష్ట్ర ప్రభుత్వం అసలే కష్టకాలంలో ఉన్న గ్రానైట్ పరిశ్రమపై మరో భారం మోపింది. మూలిగే నక్కపై తాటిపండు పడినట్లుగా మైనింగ్ రాయల్టీ వసూళ్లు ప్రైవేట్ ఏఎంఆర్ సంస్థకు లీజుకు ఇచ్చింది. దాంతో గ్రానైట్ పరిశ్రమల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. గతంలో బ్లేడుకు రూ.27 వేలు చార్జీ ఉంటే దానిని రూ.35 వేలకు పెంచింది ఏఎంఆర్ సంస్థ. లీజు పొందిన సంస్థ అదనంగా వసూళ్లకు పూనుకుంటున్న నేపథ్యంలో ఫ్యాక్టరీ యజమానులు అక్టోబర్ 1 నుంచి సమ్మెలోకి వెళ్లి ఫ్యాక్టరీలు బంద్ చేశారు. కార్మికులు ఉపాధి కోల్పోయారు. ప్రభుత్వ భారాలతోపాటు ముడిరాయి కొనుగోలు ఖర్చులు పెరిగాయి. ఫినిష్ చేసిన స్లాబుల ఎగుమతి లేక, అంతర్గత మార్కెట్ లేక జిల్లాలో చాలా పరిశ్రమలు మూతపడ్డాయి. కొన్ని 3 షిఫ్ట్లు కాకుండా ఒక్క షిప్ట్ మాత్రమే నడుపుతూ నెట్టుకొస్తున్నాయి. చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం ఇచ్చి ఆదుకోవాల్సింది పోయి ఈ విధంగా భారం మోపడం వల్ల, పెద్ద పరిశ్రమల పోటీకి తట్టుకోలేక మూతవేసుకోవాల్సిన స్థితిలో యజమానులు సతమతమవుతున్నారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది గ్రానైట్ ఫ్యాక్టరీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. సకాలంలో రాయితీలు ఇచ్చిన ఎంఎస్ఎంఈ పారిశ్రామిక వేత్తలను ఆదుకోవటం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చి 17 నెలలు పూర్తి కావస్తోంది. అయినా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రాయితీలు విడుదల చేయలేదు. దానికితోడు ప్రభుత్వం వసూలు చేయల్సిన రాయల్టీని ప్రైవేటు ఏఎంఆర్ సంస్థకు అప్పగించింది. – కాలం సుబ్బారావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెలుగొండ నిర్వాసితుల నుంచిత్వరలో రాయితీలు విడుదలవుతాయి జిల్లాలో ఎంఎస్ఎంఈలకు రావాల్సిన రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు రాయితీలు విడుదల చేయటానికి సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసినట్లు సమాచారం. వచ్చే నెలలో విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ పారిశ్రామిక సమ్మిట్ జరగనుంది. ఈ లోగా అందరికీ రాయితీలు వస్తాయన్న ఆశాభావంతో ఉన్నాం. – బి.శ్రీనివాసరావు, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం -
కూటమిది దివాలాకోరు ప్రభుత్వం
ఒంగోలు సిటీ: ఈ ఏడాది మాగాణి రైతు మొదలుకుని శనగ, మిర్చి, పొగాకు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించక తీవ్రంగా నష్టపోయారని, కూటమి ప్రభుత్వం 18 నెలలుగా ఏ ఒక్క రైతునీ ఆదుకోలేదని, ఇది దివాలా కోరు ప్రభుత్వమని వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు ధ్వజమెత్తారు. ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత రెండు సీజన్లకు చెందిన శనగ పంటకు గిట్టుబాటు ధర లభించక కోల్డ్ స్టోరేజీల్లో మగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే పరిస్థితి ఎదురైతే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటనే క్వింటాకు రూ.1500 చొప్పున బోనస్ ఇచ్చి ఒక్కో రైతు నుంచి గరిష్టంగా 30 క్వింటాల చొప్పున తెల్ల శనగలను క్వింటా రూ.12 వేలకు, ఎర్రశనగలను క్వింటా రూ.10 వేలకు కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ క్రాప్ నమోదు, పంటల బీమా అమలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లించి ఆదుకున్నారని వివరించారు. తద్వారా ఐదేళ్ల పాటు అన్ని వర్గాల రైతులు లబ్ధిపొందినట్లు వివరించారు. కానీ, కూటమి ప్రభుత్వం రైతులన్నా, పంటలకు గిట్టుబాటు ధరలన్నా చులకనగా చూస్తోందని విమర్శించారు. రైతుల గురించిగానీ, పంటల గురించిగానీ కూటమి ప్రభుత్వానికి, పాలకులకు పట్టడం లేదని ధ్వజమెత్తారు. దయనీయంగా పొగాకు రైతు పరిస్థితి... ఈ ఏడాది పొగాకు రైతు పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని చుండూరి రవిబాబు అన్నారు. ప్రతి రైతుకు బ్యారన్కు రూ.5 లక్షల నష్టం వాటిల్లినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల బ్యారన్ల ద్వారా రూ.2200 కోట్లు విదేశీ మాదకద్రవ్యం సమకూరుస్తున్న పొగాకు రైతును కూటమి ప్రభుత్వం చులకనగా చూస్తోందని దుయ్యబట్టారు. గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలం చెందినట్లు ఆరోపించారు. బర్లీ పొగాకు కొనుగోలు ప్రక్రియలో కూటమి అనుయాయులకు చెందినవి కొనుగోలు చేయడం వివక్షపూరిత చర్యగా ఆరోపించారు. గత ప్రభుత్వం పార్టీలకు అతీతంగా మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసినప్పుడు, ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా అటువంటి చర్యలు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. వ్యవసాయం వృథా అని భావించే కూటమి పాలకులు.. ఏ పంట సాగుచేయాలో, ఏ పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి శనగలకు క్వింటాకు రూ.3 వేలు బోనస్ ప్రకటించి తెల్ల శనగలు రూ.10 వేలకు, ఎర్రశనగలు రూ.8 వేలకు కొనుగోలు చేయాలని చుండూరి రవిబాబు డిమాండ్ చేశారు. రైతుకు గిట్టుబాటు ధర కల్పించి పంటలు కొనుగోలు చేస్తే వ్యవసాయం అభివృద్ధి చెంది తద్వారా సంపద పోగవుతుందని తెలిపారు. రైతుకు నష్టం చేకూరిస్తే సంపద అవిరవుతుందని గుర్తించాలని హితవు పలికారు. రైతుకు న్యాయం జరిగేంత వరకు తమ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రైతు విభాగం జోనల్ అధ్యక్షుడు ఆళ్ల రవీంద్రరెడ్డి, కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, ఒంగోలు మండల అధ్యక్షుడు మన్నే శ్రీనివాసరావు, నాయకులు దామరాజు క్రాంతికుమార్, నాసర్రెడ్డి, ప్రసన్నకుమార్రెడ్డి, డి.కోటేశ్వరరావు, వెంకటేశ్వరరావు, గౌతమ్, తదితరులు పాల్గొన్నారు. రైతాంగాన్ని ఆదుకోలేని చేతగాని ప్రభుత్వం హామీల అమలులో ఘోరంగా విఫలం గిట్టుబాటు ధర లేక రెండేళ్లుగా కోల్డ్ స్టోరేజీల్లో మగ్గుతున్న శనగలు నష్టపోయిన రైతులు శనగలకు రూ.3 వేలు బోనస్ ప్రకటించాలి వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు డిమాండ్ -
డీటీసీని పరిశీలించిన ఎస్పీ
ఒంగోలు సిటీ: స్థానిక కొత్తమామిడిపాలెంలోని పోలీస్ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ను ఎస్పీ హర్షవర్ధన్రాజు శనివారం పరిశీలించారు. 208 మంది పోలీసు కానిస్టేబుళ్లకు త్వరలో శిక్షణ తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో డీటీసీని ఎస్పీ సందర్శించారు. పరిసర ప్రాంతాలు, మౌలిక సదుపాయాలు, బ్యారక్లు, తరగతి గదులు, పరేడ్ గ్రౌండ్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. వంట గదిలో అపరిశుభ్రతను గుర్తించి వెంటనే మార్పులు చేయాలన్నారు. డైనింగ్ హాళ్లలో తలుపులు, పెయింటింగ్తో పాటు పైకప్పు నుంచి కారుతున్న వర్షం నీటిని గుర్తించి వెంటనే మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు. శారీరక శిక్షణ, పరేడ్ ప్రాక్టీస్కు ఉపయోగపడేలా గ్రౌండ్ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మైదానం చదునుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, రన్నింగ్ ట్రాక్, డ్రిల్ ఏరియా, గార్డెన్ వంటి సదుపాయాలు, అదనపు మౌలిక వసతుల ఏర్పాటు, శుభ్రతపై నిరంతర దృష్టి అవసరమని అధికారులకు సూచించారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించి నిపుణుల ద్వారా శిక్షణ తరగతులు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. మొక్కలు నాటి ట్రైనింగ్ సెంటర్ పరిసరాలు పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉండేలా చూడాలన్నారు. ఎస్పీ వెంట ఏఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, ఒంగోలు డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, కనిగిరి డీఎస్పీ సాయిఈశ్వర్ యశ్వంత్, డీపీఓ రామ్మోహన్రావు, పోలీస్ క్లినిక్ డాక్టర్ భానుమతి, ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, తాలూకా సీఐ విజయకృష్ణ, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సుధాకర్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ దేవప్రభాకర్, ఆర్ఐలు సీతారామిరెడ్డి, రమణారెడ్డి, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
పాకల బీచ్ను అభివృద్ధి చేస్తాం
● కలెక్టర్ రాజాబాబు సింగరాయకొండ: పర్యాటక రంగ అభివృద్ధికి అవకాశం ఉన్న పాకల బీచ్ను అన్ని రకాలా అభివృద్ధి చేయనున్నట్లు కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు. పాకల బీచ్ను శనివారం మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ బీచ్కు వచ్చే పర్యాటకులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. మరుగుదొడ్లు, స్నానపుగదులు, దుస్తులు మార్చుకోడానికి వీలుగా సౌకర్యాలు కల్పించాలన్నారు. బీచ్లో మొక్కలను నాటారు. అంతకుముందు మండల కేంద్రంలో జరిగిన స్వర్ణాంధ్ర– స్వచ్చాంధ్ర కార్యక్రమంలో మంత్రి స్వామి, డీపీఓ వెంకటేశ్వర్లు పాల్గొని ప్రజలకు ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను తెలియజేశారు. విద్యార్థులు సైకిల్ర్యాలీ నిర్వహించారు. పారిశుధ్య కార్మికులకు దుస్తులు అందజేసి సత్కరించారు. జెడ్పీ సీఈఓ చిరంజీవి, ఆర్డీఓ కళావతి, తహసీల్దార్ రాజేష్, ఈఓ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళలు పారిశ్రామిక రంగంలోనూ అభివృద్ధి చెందాలి
ఒంగోలు సబర్బన్: మహిళలు పారిశ్రామిక రంగంలోనూ అభివృద్ధి చెందాలని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ బి.శ్రీనివాస రావు పిలుపునిచ్చారు. స్థానిక పాత గుంటూరు రోడ్డులోని జనశిక్షణ సంస్థ(జేఎస్ఎస్) కార్యాలయంలో శుక్రవారం శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్ల పంపిణీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ శివ సాయి ఐటీఐలో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు అందజేశామన్నారు. మహిళలు తాము శిక్షణ పొందిన రంగాల్లో పరిశ్రమలను స్థాపించాలని ఆయన ఆకాంక్షించారు. సూక్ష్మ, మధ్యతరహా, భారీ పరిశ్రమలకు సబ్సిడీ ద్వారా వివిధ రకాలైన రుణాలను పీఎంఈజీపీ అందజేస్తుందన్నారు. దీనిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో శివసాయి ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ కే.శ్రీనివాసరావు, జనశిక్షణ సంస్థ ప్రోగ్రాం ఆఫీసర్ శ్యామ్ సునీల్, మరో ప్రోగ్రాం ఆఫీసర్ హరికృష్ణ, సంస్థ సిబ్బంది శివకృష్ణ, దుర్గాప్రసాద్తో పాటు శిక్షణ పొందిన మహిళలు పాల్గొన్నారు. -
పచ్చ నేతలకు మేతగా నిర్వాసితుల ప్యాకేజీ
యర్రగొండపాలెం: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ ప్యాకేజీ పచ్చనేతలకు మేతగా మారిందని, అధికారులు, టీడీపీ నాయకులు కలిసి ఆర్అండ్ఆర్ ప్యాకేజీని అతిపెద్ద స్కాంగా మార్చుకున్నారని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. వెలిగొండ ప్రాజెక్ట్ పరిధిలోని పెద్దారవీడు మండలం సుంకేసుల, కలనూతల, గుండంచెర్ల నిర్వాసితులు శుక్రవారం ఆయనతో కలిసి తమకు జరుగుతున్న అన్యాయం గురించి చర్చించారు. ఈ విషయంపై ఎమ్మెల్యే జేసీ, ఎస్డీసీలకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక్కొక్క నిర్వాసితుడి నుంచి రూ.20 వేల ప్రకారం మొత్తం రూ.10 కోట్లు వసూళ్లకు సిద్ధమయ్యారని, పైకం ఇచ్చిన వారికే అవార్డు వస్తుందని లేకుంటే ఆ అవార్డును నిలిపేస్తారని టీడీపీ నాయకులు బాహాటంగా నిర్వాసితులను ఆందోళనకు గురిచేస్తూ.. అధికార అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని, కొంతమంది నిర్వాసితుల నుంచి డబ్బు కూడా వసూలు చేశారని ఆయన అన్నారు. కూటమి దోపిడీకి అద్దంపట్టే ఈ వ్యవహారాన్ని అతిపెద్ద స్కాంగా పరిగణించాలని ఆయన సంబంధిత జిల్లా అధికారులను కోరారు. దాదాపు వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తయినప్పటికీ నిర్వాసితుల నమోదు కార్యక్రమం పెండింగ్లో ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని, ఆయా పంచాయతీల్లో మొత్తం నిర్వాసిత కుటుంబాలు 5,126 ఉన్నాయని, వారిలో 3,760 కుటుంబాలకు అవార్డు లభించిందని, మిగిలిన 1,360 కుటుంబాలను పెండింగ్లో పెట్టారని ఆయన అన్నారు. నిర్వాసితుల కుటుంబాలను 20 ఏళ్ల క్రితం గజిట్లో నమోదు చేసి నేటికీ అవార్డు కాకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని, దీనివెనక అతిపెద్ద కుట్ర దాగిఉందన్న విషయం అందరికీ తెలుసన్నారు. వీరిని ఏదో కారణం చూపించి అప్పటి అధికారులు, టీడీపీ నాయకులు అవార్డు చేయకుండా ఈ వ్యవహారాన్ని అవినీతి అవసరంగా మలుచుకున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అప్పటి కలెక్టర్, ప్రాజెక్ట్ స్పెషల్ కలెక్టర్, జేసీల దృష్టికి పలు దఫాలుగా తీసుకెళ్లినా పరిష్కరించకపోవడంలో ఉన్న మతలబు ఏమిటో అర్థం కావడం లేదని అన్నారు. పశ్చిమ ప్రాంత అభివృద్ధి కోసం, 4 జిల్లాలకు చెందిన ప్రజలకు తాగు, సాగు నీరు అవసరాలు తీర్చాలన్న సదుద్దేశంతో నిర్వాసితులు తమ ఉనికి, పుట్టిన గడ్డపై ఉన్న బంధాలు సైతం వదులుకున్నారని ఆయన అన్నారు. అటువంటి నిర్వాసితులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూడాల్సిన దయనీయ పరిస్థితి నెలకొందని, వారిపై టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్బాబు అవినీతి దాహాన్ని తీర్చుకోవటానికి సిద్ధం అయ్యాడని ఆయన విమర్శించారు. -
రాష్ట్ర స్థాయి టెన్నికాయిట్ పోటీలకు ఆరుగురు ఎంపిక
టంగుటూరు: అండర్ 19 బాల బాలికల టెన్నికాయిట్ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ పోటీలకు మండలంలోని ఆలకూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు వాక వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం సింగరాయకొండ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన ఎంపిక పోటీల్లో బాలుర విభాగంలో ఆర్ కార్తికేయ, వెంకట నాగ ఫణీంద్ర, ఏ.గోపీచంద్, బాలికల విభాగంలో వి.భవ్యశ్రీ,, పి.జాహ్నవి, బి.జేసిన్మాయి ఎంపికయ్యారని తెలిపారు. ఎంపికై న విద్యార్థులు త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పాఠశాల పీడీ పి.వెంకట్రావు తెలిపారు. ఎంపికై న విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు. జిల్లా స్థాయి హాకీ ఎంపికలు ప్రారంభిస్తున్న డీఈవో ఏ.కిరణ్ కుమార్ సంతనూతలపాడు: మండలంలోని మైనంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం అండర్ 14, 17 బాలబాలికల జిల్లా హాకీ జట్ల ఎంపిక నిర్వహించారు. ఈ ఎంపికను డీఈవో ఏ.కిరణ్ కుమార్ ప్రారంభించి మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడా నైపుణ్యం ప్రదర్శించిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు త్వరలో వివిధ జిల్లాల్లో జరగబోయే రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లలో పాల్గొంటారని జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ చెక్కా వెంకటేశ్వర్లు, ఏ.శిరీష తెలిపారు. కార్యక్రమంలో నిర్వాహకులు డి.శ్రీనివాసరావు, తిరుమలశెట్టి రవికుమార్, ఎంఈఓ వెంకారెడ్డి, హెచ్ఎంలు డీవీఎల్ నరసింహారావు, ఆళ్ల వెంకటేశ్వర్లు, స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ ఆకుల బ్రహ్మయ్య, ఎస్జీఎఫ్ సెక్రటరీస్ వెంకటేశ్వర్లు, శిరీష, హనుమాన్ చారి, డైట్ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. -
నిరసన గళం
నియంత పాలనపైకలెక్టరేట్ వద్ద నిరసన తెలుపుతున్న జర్నలిస్టులు, సాక్షి సిబ్బందిఒంగోలు సిటీ: ప్రజల పక్షాన నిలుస్తూ ప్రభుత్వ అక్రమాలను, వైఫల్యాలను ఎండగడుతున్న జర్నలిస్టులపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని నిరసన వ్యక్తం చేస్తూ జిల్లా అంతటా విలేకర్లు, జర్నలిస్టు సంఘాలు ఆందోళన చేపట్టాయి. జిల్లా కేంద్రంలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు, వివిధ మీడియా ప్రతినిధులు, సాక్షి విలేకర్లు, సిబ్బంది కలెక్టరేట్ వద్ద శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, జర్నలిస్టుల హక్కులు పరిరక్షించాలని వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి అలుగుల సురేష్ మాట్లాడుతూ ఎలాంటి వార్తలు రాయాలో పోలీసు వ్యవస్థ నిర్దేశించడం సరికాదన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్లో జర్నలిస్టులు రాయలేరని అన్నారు. పత్రికా వ్యవస్థను కూల్చేసేలా కూటమి ప్రభుత్వం వ్యవహరించడం దారుణమన్నారు. అధికారంలోకి వచ్చాక సాక్షి పత్రిక, మీడియాలపై కక్ష పూరితంగా చర్యలు తీసుకుంటోందని దుయ్యబట్టారు. అక్రమ కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. జర్నలిస్టులపై నమోదు చేసిన అక్రమ కేసులు ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒక పత్రిక ఎడిటర్ను, విలేకర్లను విచారణ పేరుతో రకరకాలుగా ప్రశ్నలతో వేధిస్తోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తీరుమార్చుకోకపోతే జర్నలిస్టుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఒంగోలు ప్రెస్ క్లబ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మీసాల శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఖండించారు. ప్రజలకు వాస్తవాలు తెలియకుండా చేసేందుకు జర్నలిస్టులపై కేసులు పెడుతోందన్నారు. ఏడాదిన్నర కాలంగా కూటమి ప్రభుత్వం జర్నలిస్టుల గొంతునొక్కేలా చూడడం సరికాదన్నారు. జర్నలిస్టులు రాయడానికి ప్రయత్నిస్తే వారి ఇళ్లకు వెళ్లి బెదిరించడం, ప్రజల పక్షాన నిలిస్తే తప్పు అన్న విధంగా కేసులు పెట్టడం సరికాదన్నారు. కల్తీమద్యం మీద సాక్షి జర్నలిస్టులు వార్తలు రాస్తే వారి ఇళ్లకు పోలీసులు పోయి నోటీసులు ఇవ్వడం, స్టేషన్కు తీసుకొచ్చి విచారించడం వంటి సంఘటనలతో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నంలో భాగంగా ఒక చిన్న వార్త రాసినందుకు నెల్లూరు బ్యూరో ఇన్చార్జ్ మస్తాన్రెడ్డిని 60 ప్రశ్నలు అడిగి ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. ఇదేమైనా సీబీఐ కేసా లేదా ఈడీ కేసా అని ప్రశ్నించారు. జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేస్తే వారు వార్తలు రాయకుండా ఉంటారనే ఉద్దేశంతో ఉన్నారని, ఆ పరిస్థితి ఉండదని, ఎవరికీ భయపడే ప్రసక్తే లేదన్నారు. సాక్షి ఎడిటర్ ఆర్ ధనుంజయరెడ్డికి ఇటువంటి పరిస్థితులు సృష్టించడం చాలా దారుణమన్నారు. జర్నలిస్టులను వేధింపులకు గురిచేస్తే ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం డీఆర్ఓ ఓబులేసు, డీఎస్పీ శ్రీనివాసరావుకు వినతి పత్రాలు అందజేశారు. ఆందోళనలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు ఇఫ్తార్ బాషా, ఎంసీఏ అధ్యక్షుడు వేల్పూరి నాగేశ్వరరావు, ఎంసీఏ మాజీ అధ్యక్షుడు ఇఫ్తేకర్ బాషా, ఏపీపీజేఏ రాష్ట్ర సభ్యులు ఎం.ప్రసాద్, ఏపీజేఎఫ్ జిల్లా కార్యదర్శి దాసరి సునీల్, ఏపీయూడబ్ల్యూజే మాజీ జాయింట్ సెక్రటరీ బైనబోయిన మాల్యాద్రి, జర్నలిస్టులు, సాక్షి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. గిద్దలూరు రూరల్: సాక్షి ఎడిటర్ ధనుంజయ్రెడ్డితో పాటుగా సాక్షి విలేకరుల పై అక్రమ కేసులు బనాయించడం హేయమైన చర్యగా భావించాలని సీఐటీయూ నాయకులు టి.ఆవులయ్య అన్నారు. జర్నలిస్టులపై అక్రమ కేసులకు నిరసనగా గిద్దలూరులోని జర్నలిస్టు సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు శుక్రవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసి రెవెన్యూ ఇన్స్పెక్టర్ భాస్కర్రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని సాక్షి కార్యాలయాల పై జరుగుతున్న దాడులు అప్రజాస్వామ్యమన్నారు. కార్యక్రమంలో జర్నలిస్టులు ఎం.రాజ్కుమార్, రఫీ, యాకుబ్ ఖాన్, రసూల్, ఖాజా, యల్లా శివ, నెమలిగుండం, గిరి, మూర్తి, శేఖర్, కాకి అంకయ్య, ఆచారి, రమేష్, కాశీ, సీఐటీయూ నాయకులు నరసింహులు, ఆర్ట్ ఆఫ్లివింగ్ యోగా టీచర్ బి.ఎస్.నారాయణరెడ్డి, ముస్లిం మైనార్టీ నాయకుడు ఖాజా, దళిత సంఘం నాయకులు పాల్గొన్నారు.యర్రగొండపాలెం: రాష్ట్రంలో నకిలీ మద్యం విచ్చలవిడిగా ప్రబలిపోతుందని, అనేక మంది పేదలు మృత్యువాత పడ్డారని వార్తలు రాసిన సాక్షి జర్నలిస్టులపై అక్రమ కేసులు నమోదు చేయడం, సాక్షి దిన పత్రిక ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డిని గంటల తరబడి విచారణ పేరుతో వేధించడం తగదని, అక్రమ కేసులను ఎత్తివేయాలని స్థానిక జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక డిప్యూటీ తహసీల్దార్ విజయభాస్కర్కు వినతి పత్రం అందజేశారు. ముందుగా బస్టాండ్ సెంటర్లో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి, చేతులకు సంకెళ్లు వేసుకొని పత్రిక స్వేచ్ఛను కాపాడాలని, జర్నలిస్టుల చేతులకు సంకెళ్లు వేస్తామనుకోవడం అవివేక చర్య అని నినదించారు. అక్కడి నుంచి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏపీయూడబ్లూజే మాజీ జిల్లా అధ్యక్షుడు షేక్.నూరుద్దీన్, త్రిపురాంతకం మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు శేషు, జర్నలిస్టులు సయ్యద్ షాకీర్ హుస్సేన్ (సర్దార్), షేక్.మహబూబ్ బాష, శంకర్ నాయక్, ఎన్.వెంకోబరావు, ఎస్.సూర్యనారాయణబాబు, ఎ.సత్యనారాయణరెడ్డి, పి.అయూబ్ ఖాన్, డి.లాలు, సుభాష్, యు.ఏసోబు, లక్ష్మిరెడ్డి, జి.కోటేష్, ఎ.అనిల్కుమార్, ఎ.ఏసుబాబు పాల్గొన్నారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఎన్వీ రమణ డిమాండ్ మార్కాపురం: ప్రభుత్వం సాక్షి ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డితోపాటు ఇతర పాత్రికేయులపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఎన్వీ రమణ కోరారు. శుక్రవారం మార్కాపురం పట్టణంలో పలువురు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు సబ్కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి సబ్కలెక్టర్ వెంకట సహదిత్ త్రివినాగ్కు వినపత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఎన్వీ రమణ మాట్లాడుతూ పాలకులకు పత్రికల్లో వచ్చిన వార్తలు నచ్చకపోతే ఖండన ఇవ్వొచ్చని, అలా కాకుండా పాత్రికేయులపై అక్రమ కేసులు నమోదుచేయడం, పత్రికా కార్యాలయాల్లో సోదాలు చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో జర్నలిస్టులు జీఎల్ నరసింహారావు, బీ మల్లిఖార్జునరావు, బీ రామయోగయ్య, పీ నరేంద్ర, శేఖర్, బూదాల సురేష్, అనీల్కుమార్, కల్లూరి వెంకటేశ్వర్లు, దొంతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చిన్నబాబు, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్ను కలిసిన జైళ్ల శాఖ డీఐజీ
ఒంగోలు సబర్బన్: జైళ్ల శాఖ గుంటూరు డీఐజీ డాక్టర్ ఎం.వర ప్రసాద్ కలెక్టర్ పీ.రాజా బాబును మర్యాద పూర్వకంగా కలిశారు. శుక్రవారం ప్రకాశం భవనంలో కలెక్టర్ను కలిసిన ఆయన పూల మొక్కను బహూకరించారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన జైలుతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఇతర జైళ్లకు సంబంధించిన అంశాలపై మాట్లాడారు. ఒంగోలు వన్టౌన్: జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్కు గాను 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించామని, ధాన్యం కొనుగోలుకు ఇప్పటి నుంచే అవసరమైన ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్ జాయింట్ కలెక్టర్ జిల్లాలో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్ల సంసిద్ధతపై సంబంధిత అధికారులతో శుక్రవారం సాయంత్రం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో 25 మండలాల్లో 185 రైతు సేవా కేంద్రాల పరిధిలో మొత్తం 45 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ధాన్యం సేకరణకు అవసరమైన రవాణా, హమాలీలు, గోనె సంచులను, తేమ శాతం కొలిచే యంత్రాలను ముందుగా అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొన్నారు. జిల్లాలో డిసెంబర్ నుంచి వరి ధాన్యం కోతల ప్రారంభమవుతాయని, నవంబరు మాసాంతానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఆయన చెప్పారు. ఆర్ఎస్కేలతో మ్యాపింగ్, రైతుల రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని తెలిపారు. పౌర సరఫరాల అధికారులు మిల్లులను ట్యాగ్ చేయడం, బ్యాంకు గ్యారంటీలను తీసుకోవడం, అన్ని మిల్లులు పని చేస్తున్నదీ లేనిదీ తనిఖీ చేయడం, సంబంధిత సిబ్బందికి శిక్షణ పూర్తి చేయడం వంటి కార్యక్రమాలను పూర్తి చేయాలన్నారు. సమావేశంలో కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి పద్మశ్రీ,, పౌరసరఫరాల శాఖ డీఎం వరలక్ష్మి, మార్కెటింగ్ ఏడీ వరలక్ష్మి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పశువులంటే ప్రాణం.. బీమా ఇవ్వం!
‘తమ్ముళ్లూ.. ఇన్నాళ్లు మీరు విద్యార్థులు, యువత, వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు చూసి ఉంటారు. ఇకపై మీ గ్రామాల్లోనే పశువుల హాస్టళ్లు చూస్తారు. పశువులన్నీ ఒకేచోట ఉండేలా హాస్టల్ పెడతాం. వాటిని అప్పుడప్పుడూ వెళ్లి యజమానులు చూసుకోవచ్చు’’ ఇవీ ఇటీవల ఓ సభలో సీఎం నారా చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు.. ఇవి విన్న జనమంతా పశువులకు హాస్టళ్లేంటో అని జుట్టు పీక్కున్న పరిస్థితి. పశువులంటే తనకు అంత ప్రాణమని సీఎం చంద్రబాబు తన వ్యాఖ్యల ద్వారా వెల్లడించినప్పటికీ అవి ప్రమాదాల్లో మృతి చెందితే బీమా వర్తింపజేస్తామని మాత్రం ఎక్కడా చెప్పలేదు. పైగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన పశు బీమా పథకానికి సైతం బడ్జెట్లో నిధులు కేటాయించకుండా తూట్లు పొడవడంపై పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బేస్తవారిపేట: ఊహించని విపత్తులు, కరువు కాటకాలు, రోడ్డు, రైలు, అగ్ని ప్రమాదాలు, విద్యుదాఘాతాలు, పిడుగుపాటుతో పశువులు మృత్యువాత పడితే, వాటిని చంటి బిడ్డల్లా సంరక్షించే యజమానులు అనుభవించే బాధ వర్ణణాతీతం. పాడి పైనే ఆధారపడి కుటుంబాలను పోషించుకునే వారు పశువుల మరణాన్ని జీర్ణించుకోలేరు. మృత్యువాత పడిన పశువులకు బీమా లేకపోతే ఆ రైతులు ఆర్థికంగా చితికిపోవాల్సిందే. ఈ నేపథ్యంలో రైతుల సమస్యపై సహృదయంతో స్పందించిన గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నేరుగా పశు బీమా పథకాన్ని అమలు చేసింది. 2019కు ముందు వరకు పశు బీమా పథకాన్ని ప్రైవేట్ ఏజెన్సీల ఆధ్వర్యంలోనే నిర్వహించగా ఆ విధానానికి అప్పటి సీఎం వైఎస్ జగన్ స్వస్తి పలికారు. 2019 నుంచి 2022 వరకు మూడేళ్లపాటు ప్రమాదాల్లో మృతి చెందిన పశువులకు వైఎస్సార్ పశు నష్ట పరిహారం అందించారు. 2022లో ప్రభుత్వ పశు బీమా పథకాన్ని ప్రవేశపెట్టి పాడి రైతులకు మరింత మేలు చేసేందుకు చర్యలు చేపట్టారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం పశు బీమా పథకాన్ని పాడి రైతులకు దూరం చేసేలా నిబంధనలను సవరించింది. బడ్జెట్లో నిధులు కేటాయించకుండా పథకాన్ని గాలికొదిలేసింది. పాడి రైతులపై అధిక ప్రీమియం భారాన్ని మోపడంతో బీమా చేయించుకునేందుకు రైతులు ముందుకు రాని పరిస్థితి. ఈ క్రమంలో పశువులు మృత్యువాత పడి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. జిల్లాలో తెల్ల పశువులు 56,332, నల్ల పశువులు 6,71,812, గొర్రెలు 15,67,122, మేకలు 4,17,589 ఉన్నాయి. గత ప్రభుత్వంలో పశుసంవర్థకశాఖ అధికారులు పాడిరైతుల వద్దకు వెళ్లి బీమా పథకంపై అవగాహన కల్పించి, నమోదు చేయించేవారు. ఇందుకు గాను ప్రభుత్వం పశు సంవర్ధక శాఖ సిబ్బందికి ప్రోత్సాహక నగదు కూడా అంజేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం గత ఏడాది బడ్జెట్లో విడుదల చేసిన అరకొర నిధులతో ఈ ఏడాది జనవరిలో మొక్కుబడిగా పథకాన్ని ప్రారంభించింది. కొన్ని పశువులకు మాత్రమే బీమా చేసి చేతులు దులుపుకొంది. ఉదాహరణకు బేస్తవారిపేట మండలానికి 100 పశువులకు సరిపడా బడ్జెట్ కేటాయించారు. దీంతో ఒక్కో పశువైద్యశాల పరిధిలో 25 పశువులకు మాత్రమే బీమా చేయాల్సి వచ్చింది. మరి మిగిలిన పశువుల సంగతేమిటో పాలకులే సెలవివ్వాలి. అడ్డగోలుగా నిబంధనలు వివిధ ఘటనల్లో పశువులు, సన్నజీవాలను కోల్పోతున్న వారిని ఆదుకోవడానికి 2019కు ముందు ప్రభుత్వ పరంగా ఎలాంటి బీమా పథకం లేదు. ప్రైవేట్ బీమా పథకాలు చేయించుకున్నవారికి సైతం సదరు కంపెనీలు తమ చుట్టూ రెండేళ్లపాటు తిప్పుకొని అరకొరగా బీమా నిధులు జమచేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పశుపోషకులకు ఎలాంటి ఇబ్బందులు కలగజేయకుండా పశువుల బీమాకు శ్రీకారం చుట్టింది. కానీ ఏడాదిన్నర క్రితం గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం పశువుల బీమా పథకంలో అడ్డగోలు నిబంధనలు చొప్పించి పాడి రైతుల ఆశలపై దారుణంగా దెబ్బకొట్టింది. ఉత్పాదక దశలో ఉన్న 2–10 ఏళ్ల వయసులోపు ఆవులు, 3–12 ఏళ్ల వయసు గేదెలకు, అలాగే ఏడాదిన్నర వయసున్న మేలు జాతి ఎద్దులు, దున్నలు, రెండేళ్లు పైబడిన ఎద్దులు, దున్నలు, నాటు ఆవులు, ఆరు నెలల పైబడిన మేకలు, గొర్రెలకు మాత్రమే బీమా వర్తిస్తుందని నిబంధనలు విధించింది. యజమాని ఉద్దేశపూర్వకంగా హాని తలపెట్టినా, ప్రైవేట్ ఏజెన్సీల్లో బీమా చేయించినా పథకం వర్తించదని చెప్పిన ప్రభుత్వం రాష్ట్ర, జాతీయ విపత్తుల ప్రతిస్పందన నిధి పరిధిలోకి వచ్చే ప్రమాదాలకు బీమా సొమ్ము చెల్లించబోమని మెలికపెట్టింది. పదేళ్ల వయసు దాటిన ఎద్దులు, దున్నలకు, ఆరు నెలల్లోపు వయసు గొర్రెలు, మేకలకు, శాశ్వత అంగవైకల్యం కలిగిన పశువులకు బీమా వర్తించదని నిబంధన విధించడంతో పాడి రైతులు డీలా పడిపోయారు. బీమా మొత్తం ప్రీమియం ప్రభుత్వ వాటా రైతు వాటా 15 వేలు 960 768 192 30 వేలు 1920 1536 384 గొర్రెలు, మేలకు 375 300 75 (రూ6 వేలకు) వైఎస్సార్ పశు బీమా పథకం కింద చెల్లించే మొత్తం ప్రీమియంలో 80 శాతాన్ని ప్రభుత్వమే భరించేది. 20 శాతం మాత్రమే పశుపోషకులు చెల్లించేవారు. దేశీ ఆవులు, గేదెలు ఒక్కో దానికి ప్రభుత్వం రూ.924 ప్రీమియం భరించగా, పశుపోషకులు రూ.231, అలాగే ఎద్దులు, దున్నపోతులకు ప్రభుత్వం ఒక్కోదానికి రూ.185 భరించగా లబ్ధిదారులు రూ.116, గొర్రెలు, మేకలకు ఒక్కోదానికి ప్రభుత్వం రూ.185 భరించగా లబ్ధిదారులు రూ.46 చెల్లంచేవారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క జీవం చనిపోయినా బీమా వర్తింపజేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంతో పోలిస్తే కూటమి ప్రభుత్వంలో పశువుల బీమా ప్రీమియంను రెట్టింపు చేశారు. పశు బీమా పథకానికి కూటమి సర్కారు సమాధి బడ్జెట్లో అరకొర నిధులతో కొన్ని పశువులకే బీమా మొత్తం ప్రీమియం చెల్లించి బీమా చేయించుకోండని అధికారుల సూచన భారం మోయలేక బీమా పథకానికి దూరంగా ఉన్న రైతులు కూటమి ప్రభుత్వంలో ఇలా.. ఒక్కో పశువుకు బీపీఎల్, ఎస్సీ, ఎస్టీలు చెల్లించాల్సిన ప్రీమియం వివరాలు -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కూటమి సర్కారు కుట్ర
పెద్దదోర్నాల: వైఎస్ జగన్ హయాంలో చేసిన అభివృద్ధిని కప్పెట్టడంతోపాటు తన అనుచరులకు లబ్ధి చేకూర్చే ఉద్దేశంతోనే సీఎం చంద్రబాబు పీపీపీ విధానాన్ని తెరపైకి తెచ్చారని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడం చంద్రబాబుకు కొత్తేమీ కాదని, గత టీడీపీ ప్రభుత్వ జమానాల్లో షుగర్ ఫ్యాక్టరీలు, నూలు మిల్లులను అడ్డగోలుగా అమ్మేశారని దుయ్యబట్టారు. శుక్రవారం పెద్దదోర్నాల మండల పరిధిలోని ఎగువ చర్లోపల్లి, పెద్దబొమ్మలాపురం గ్రామాల్లో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు గంటా రమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే తాటిపర్తి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో శంకుస్థాపన చేసిన మెడికల్ కాలేజీల్లో 7 ప్రారంభం కాగా 10 కాలేజీలు దాదాపు 80 శాతం పూర్తయ్యాయని తెలిపారు. జగనన్న చేసిన అభివృద్ధిని చూడలేక ఆయన చేపట్టిన ప్రాజెక్టులను ప్రైవేటీకరణ చేస్తున్నారని విమర్శించారు. మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం కళ్లు తెరిచేలా చేయడమే కోటి సంతకాల కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వివరించారు. కార్యక్రమంలో నాయకులు చిట్టె వెంకటేశ్వరరెడ్డి, గుమ్మా యల్లేష్, అల్లు రాంభూపాల్రెడ్డి, వల్లభనేని పవన్కుమార్, మొద్దు తిరుపతిరావు త్రిపురాంతకం నాయకులు ఆళ్ల కృష్ణారెడ్డి, సింగా ప్రసాద్, యర్రగొండపాలెం సర్పంచ్ అరుణాబాయి, అల్లు రాంకోటిరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. వైపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శ ప్రైవేటీకరణకు నిరసనగా చర్లోపల్లిలో కోటి సంతకాల సేకరణ -
ప్రభుత్వ న్యాయవాదిగా శ్రీకాంత్
ఒంగోలు: ప్రభుత్వ న్యాయవాదిగా జి.శ్రీకాంత్ నియమితులయ్యారు. ఆ మేరకు లీగల్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్ అండ్ జస్టిస్ ప్రభుత్వ కార్యదర్శి గొట్టపు ప్రతిభాదేవి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పర్చూరు మండలం దేవరపల్లికి చెందిన శ్రీకాంత్.. న్యాయవాద విద్య పూర్తిచేసి ఒంగోలులో 1997లో ప్రాక్టీస్ ప్రారంభించారు. గతంలో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా, రెండుసార్లు ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా పనిచేశారు. తాజాగా ప్రభుత్వ న్యాయవాదిగా జిల్లా కోర్టులో విధులు నిర్వహించేందుకు ఆయన నియమితులయ్యారు. మూడు సంవత్సరాల పాటు ఈ బాధ్యతలు నిర్వహించనున్నారు. మార్కాపురం: మార్కాపురం పట్టణంలో రెండు బైకులు చోరీ అయిన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక విద్యానగర్కు చెందిన తిరుమలరెడ్డి రామాంజనేయరెడ్డి గురువారం రాత్రి తన ఇంటిముందు బైకును పార్క్ చేసి మరుసటిరోజు ఉదయం చూసుకునేసరికి కనిపించలేదు. అలాగే పట్టణంలోని పదో వార్డు జగదీశ్వరి థియేటర్ ప్రాంతంలో పఠాన్ ఉమర్ఖాన్కు చెందిన బైకు కూడా ముందు రోజు ఇంటిముందు పార్క్ చేసి శుక్రవారం నిద్రలేచి చూసేసరికి కనపించలేదు. దీంతో బైకుల యజమానులు ఇద్దరు పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. చోరీ అయిన బైకుల విలువ సుమారు రూ.1.70 లక్షలు కాగా, కేసులు దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై సైదుబాబు తెలిపారు. ● రూ.1,09,910 నగదు స్వాధీనం పెద్దారవీడు: మండల పరిధిలోని రేగుమానిపల్లి గ్రామం సమీపంలో పేకాట శిబిరంపై పెద్దారవీడు. పెద్దదోర్నాల ఎస్సైలు వి.సాంబశియ్య, వి.మహేష్ సంయుక్తంగా తమ సిబ్బందితో కలిసి శుక్రవారం దాడి చేశారు. ఈ సందర్భంగా పెద్దారవీడు ఎస్సై మాట్లాడుతూ.. పేకాట స్థావరంలో కోతముక్క ఆడుతున్న 14 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద రూ.1,09,910 నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులను మార్కాపురం ఏజేఎఫ్సీ కోర్టు మేజిస్ట్రేట్ ఎం.బాలాజీ ఎదుట హాజరుపరచగా ఒక్కొక్కరికి రూ 300 జరిమానాతోపాటు 2 రోజుల సాధారణ జైలు శిక్ష విధించారని వివరించారు. ఒంగోలు సిటీ: గ్రంథాలయ ఉద్యోగులకు 010 కింద వేతనం చెల్లించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నపరెడ్డి కిరణ్కుమార్రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఒంగోలు గ్రంథాలయ కార్యాలయంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రీటీ తాగుతూ మాట్లాడుకుందాంశ్రీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చిన్నపరెడ్డి కిరణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఒంగోలు టౌన్ అధ్యక్షుడు మోటా శ్రీనివాసరావు, డాక్టర్ మానస, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి జీవీ శివారెడ్డి, గ్రంథాలయ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు పీవీ సుబ్బారెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు వై.వెంకటేశ్వరరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ఎ.భాస్కర రావు, జిల్లా మహిళా కన్వీనర్ డి.ధనమ్మ, గ్రంథాలయ సంస్థ పెన్షనర్ వింగ్ అధ్యక్షుడు డీవీ సుబ్బారెడ్డి, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఒంగోలు టౌన్: రైల్వే ఉద్యోగులంతా అంబేడ్కర్ ఆలోచనా విధానంతో ఐక్య పోరాటాలు చేయాలని ఆలిండియా ఎస్సీ, ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ జోనల్ సెక్రటరీ దాశరధి కృష్ణ పిలుపునిచ్చారు. స్థానిక రైల్వేస్టేషన్ ఆవరణలో ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కృష్ణ పాల్గొని ప్రసంగించారు. అంబేడ్కర్ ఒక నాయకుడు మాత్రమే కాదని, విశ్వమానవుడని, శ్రామికుల వేతనం కోసం, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం రాజ్యాంగంలో హక్కులు కల్పించారని చెప్పారు. అంబేడ్కర్ ఆశయాల సాధన కోసం రైల్వేలో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు పోరాటాలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జోనల్ ప్రెసిడెంట్ అంగడి వినోద్, సాయిబాబా, గూటలా పాపారావు, బీవీ నాయక్, విజయరాజు, గంగపట్నం శ్యామ్ సుందర్ నాయక్, దాసరి శ్రీకాంత్, చింతా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
కిల్కారి సేవలను ఉపయోగించుకోవాలి
ఒంగోలు సిటీ: కిల్కారి సేవలను గర్భిణులు, బాలింతలు ఉపయోగించుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు సూచించారు. ఒంగోలులో జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో శుక్రవారం ఆశ నోడల్ ఆఫీసర్లకు జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. కిల్కారి సేవలతో పాటు ఆడపిల్లను పుట్టనిద్దాం – ఆడపిల్లని చదివిద్దాం అనే అంశంపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కిల్కారి కాల్ వచ్చినపుడు ప్రతి సమాచారాన్ని పూర్తిగా గర్భిణులు, బాలింతలు వినేలా చూడాలన్నారు. తద్వారా ప్రతి గర్భిణీ, బాలింతకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కిల్కారి ప్రోగ్రాం ప్రవేశపెట్టిందన్నారు. మాతాశిశు మరణాలు తగ్గించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గర్భిణికి నాలుగో నెల మొదలుకుని పుట్టిన బిడ్డకు ఏడాది నిండేంత వరకు వారానికి ఒకసారి రెండు నిమిషాల్లోపు నిడివి గల కిల్కారి కాల్స్ వస్తాయని, తల్లీబిడ్డల ఆరోగ్య క్షేమ సమాచారం తెలియజేస్తాయని తెలిపారు. దీనిపై ఆశ నోడల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు పీహెచ్సీల పరిధిలోని గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ కమలశ్రీ, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి దాసరి శ్రీనివాసులు, ఆరోగ్య విద్య విస్తరణ అధికారి రాజేశ్వరి, డీసీఎం, కిల్కారి రీజినల్ ప్రోగ్రాం ఆఫీసర్ బి.రాజు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు
ఒంగోలు వన్టౌన్: మండల అభివృద్ధి అధికారులు వారి ప్రధాన కర్తవ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పి.రాజాబాబు హెచ్చరించారు. ఎస్సీ ప్రజలు మెజార్టీగా ఉండే గ్రామాల్లో ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన (పీఎం – ఏజేఏవై) అమలుపై శుక్రవారం ప్రకాశం భవనంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందడమంటే జిల్లా అభివృద్ధి చెందడమేనన్నారు. జిల్లా సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.లక్ష్మానాయక్ మాట్లాడుతూ పీఎం – ఏజేఏవై కింద గ్రామ స్థాయిలో విద్య, వైద్యం, తాగునీరు, పారిశుధ్యం, సామాజిక భద్రత, గ్రామీణ రోడ్లు, ఇళ్ల నిర్మాణం, విద్యుత్, మెరుగైన వ్యవసాయ విధానాలు, ఆర్థిక సమ్మిళితం, డిజిటలైజేషన్, నైపుణ్యాభివృద్ధి పెంపు, జీవనోపాధి కల్పన వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం సర్పంచ్ అధ్యక్షతన ఏర్పడే కమిటీలో గ్రామాభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తారని తెలిపారు. ఈ విధంగా గుర్తించిన పనులను కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో చేపడతారన్నారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిధులు మంజూరు చేసిందని, పనులను కూడా గుర్తించినప్పటికీ వాటిని చేపట్టడంలో జాప్యం జరుగుతోందని ఆయన తెలిపారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఎంపీడీవోలు అంటేనే మండల స్థాయిలో అభివృద్ధి పనుల పర్యవేక్షణ అధికారులని, మీ ప్రధాన విధిపై దృష్టి సారించకుండా ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. పథకాలను పర్యవేక్షిస్తూ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. మొక్కుబడిగా పనిచేస్తామంటే కుదరదని హెచ్చరించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో చిరంజీవి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బాలశంకరరావు, డీఆర్డీఏ పీడీ నారాయణ, డీఈవో కిరణ్ కుమార్, డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ ఎస్ఈ వరలక్ష్మి, ఏపీసీపీడీసీఎల్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ ఎస్ఈ అశోక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ రాజాబాబు -
బినామీల కోసమే ప్రైవేటీకరణ
దర్శి: పేద ప్రజలకు విద్య, వైద్యం అందించడం మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికే సాధ్యమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో దర్శి నగర పంచాయతీ పరిధిలోని కొత్తరెడ్డిపాలెం రచ్చబండ వద్ద గురువారం కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమం నిర్వహించారు. కౌన్సిలర్ ఆవుల జ్యోతి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముఖ్యఅతిథులుగా హాజరైన బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ముందుగా సంతకాలు చేసి కోటి సంతకాల ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలనలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రానికి 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు తీసుకొచ్చారన్నారు. వాటిని కొనసాగిస్తే జగనన్నకు ఎక్కడ మంచి పేరు వస్తుందో అనే దుర్బుద్ధితో పాటు తన బినామీల కోసం ప్రభుత్వ, ప్రైవేట్, పార్టనర్షిప్ (పీపీపీ) పేరుతో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటుపరం చేసి పేదల నోట్లో మట్టి కొట్టి చరిత్రహీనుడిగా సీఎం చంద్రబాబు మిగిలిపోయారన్నారు. పేదలకు ఉచిత వైద్యం, వైద్య విద్య ఎలా అందుతాయి..? వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన 17 మెడికల్ కళాశాలల్లో ఐదు అందుబాటులోకి వచ్చి తరగతులు, వైద్య సేవలు అందిస్తుండగా, మరో 12 కళాశాలలు నిర్మాణంలో వివిధ దశల్లో ఉన్నాయని బూచేపల్లి శివప్రసాద్రెడ్డి తెలిపారు. సీఎం చంద్రబాబు వాటిని ప్రైవేటీకరిస్తే పేద విద్యార్థులకు మెడికల్ కళాశాలల్లో ఉచిత వైద్య విద్య, పేద రోగులకు ఉచిత వైద్యం ఎలా అందుతాయని ప్రశ్నించారు. జిల్లాలోని మార్కాపురం మెడికల్ కళాశాల పనులు 70 శాతం పూర్తయ్యాయని, ఎంతో నాణ్యతతో నిర్మాణాలు కూడా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో చేపట్టారని చెప్పారు. పశ్చిమ ప్రాంత ప్రజలు తమకు మెడికల్ కళాశాల వచ్చిందని ఎంతో సంతోషించారని తెలిపారు. కానీ, కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు చంద్రబాబు తీరని అన్యాయం చేశారన్నారు, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఒంగోలులో నిర్మించిన రిమ్స్, జీజీహెచ్లో నేటికీ వేలాది మంది ఉచిత వైద్యం చేయించుకుంటున్నారని గుర్తుచేశారు. కోవిడ్ హయాంలో ఎంతో మంది బాధితులకు పైసా ఖర్చు లేకుండా కాపాడారన్నారు. జగనన్న ఆశయాలకు చంద్రబాబు తూట్లు పొడుస్తూ పేద ప్రజలను జలగల్లా పీక్కుతినేందుకు కంకణం కట్టుకున్నారన్నారు. రాష్ట్రంలో అమరావతి అభివృద్ధి పేరుతో ఇప్పటికే రెండు లక్షల కోట్లకుపైగా అప్పు తెచ్చిన చంద్రబాబు.. మెడికల్ కళాశాలల నిర్వహణకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేయలేరా..? అని ప్రశ్నించారు. ఇదేనా పేదలపై మీకున్న చిత్తశుద్ధి అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల కనీస అవసరాలు తీర్చలేని సీఎం ఆ పదవికి అర్హుడేనా అని ప్రశ్నించారు. దీనికి నిరసనగా దర్శి నియోజకవర్గంలో 60 వేలకుపైగా సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ నెల 28న భారీ ర్యాలీ నిర్వహించి రెవెన్యూ కార్యాలయంలో, నవంబర్ 12న కలెక్టర్ కార్యాలయంలో అర్జీలివ్వనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో అందరూ కలిసికట్టుగా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని బూచేపల్లి పిలుపునిచ్చారు. చరిత్రహీనుడిగా చంద్రబాబు... జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ పేదలకు ఆరోగ్య శ్రీ, 108, 104, అమ్మ ఒడి, ఉచిత విద్య, వైద్యం వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలలో అమలు చేశారని వివరించారు. కరోనాను సైతం ఆరోగ్య శ్రీలో చేర్చి పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని జగన్మోహన్రెడ్డి అందించారన్నారు. నేడు చంద్రబాబు హయాంలో ఆరోగ్య శ్రీ కూడా సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను తన స్వార్థం కోసం చంద్రబాబు ప్రైవేటుపరం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నిర్ణయం వెంటనే వెనక్కు తీసుకోకపోతే చంద్రబాబు చరిత్రహీనుడిగాా మిగిలిపోతాడని హెచ్చరించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, బూచేపల్లి వెంకాయమ్మలను దుశ్శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అధిక సంఖ్యతో ప్రజలు, వైఎస్సార్ సీపీ శ్రేణులు హాజరై మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ పరిశీలకుడు బొడ్డు రామారావు, మండల కన్వీనర్లు వెన్నపూస వెంకటరెడ్డి, యన్నాబత్తిన సుబ్బయ్య, కాకర్ల కృష్ణారెడ్డి, తూము వెంకటసుబ్బారెడ్డి, ఎంపీపీ బొరిగొర్ల ఉషామురళి, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి మేడికొండ జయంతి, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు గాలిమూటి దేవప్రసాద్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్రెడ్డి, జెడ్పీటీసీ నుసుం వెంకటనాగిరెడ్డి, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి షేక్ సైదా, క్రిస్టియన్సెల్ రాష్ట్ర కార్యదర్శి గుంటు పోలయ్య, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు కొల్లా ఉదయభాస్కర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఐవీ సుబ్బారెడ్డి, సర్పంచ్ల సంఘ అధ్యక్షుడు మారం ఇంద్రసేనారెడ్డి, కేసరి రాంభూపాల్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కేవీ రెడ్డి, ఎంపీటీసీల సంఘ అధ్యక్షుడు బండి గోపాల్రెడ్డి, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, కౌన్సిలర్లు మేడం మోహన్రెడ్డి, తుళ్లూరి బాబూరావు, మాజీ ఎంపీపీలు గోళ్లపాటి మోషె, ఇత్తడి దేవదానం, క్రిస్టియన్ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు కృపానందం, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు గల్లెపోగు ఏసుదాసు, విద్యార్థి విభాగం రీజినల్ కో ఆర్డినేటర్ దుగ్గిరెడ్డి నారాయణరెడ్డి, నాయకులు కోరే సుబ్బారావు, షేక్ షకీలా అమీన్ బాషా, మేడగం బాలకృష్ణారెడ్డి, ఆవుల శివారెడ్డి, ఊట్ల వెంకటేశ్వర్లు, కేసనపల్లి నాగేశ్వరరావు, అన్నవరపు రవి, చెరుకూరి జగన్, నుసుం ప్రతాప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వాహనదారులకు అందని సేవలు...
టోల్ ప్లాజాల్లో వాహనదారులకు సేవలందించేందుకు టోల్ ఫ్రీ నంబరు 1033 ఉంది. దానికి వాహనదారులు ఫోన్ చేస్తే సిబ్బంది స్పందించరు. టోల్ ప్లాజా పెట్రోలింగు వాహనం ఎక్కడ ఉంటుందో తెలియదు. వారి పర్యవేక్షణ కొరవడటంతో రాత్రి పూట లారీ డ్రైవర్లు రోడ్డు పక్కన పెట్టుకుని నిద్రపోతూ ఉంటారు. ఆ సమయంలో ఆయిల్ దొంగలు అదే అదునుగా చూసుకుని లారీ ట్యాంకుల్లో డీజిల్ కాజేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అలాగే జాతీయ రహదారి అంబులెన్సులో ప్రాథమిక చికిత్సకు అవసరమైన మందులు ఉండవు. అధికారులు ఇస్తున్నా ఆంబులెన్సు సిబ్బంది అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే అంబులెన్స్లో ప్రథమ చికిత్స చేయాల్సిన వైద్యులు, సిబ్బంది లేరని, వాటిని అలంకార ప్రాయంగా సింగరాయకొండలోని కలికవాయి వద్ద ఉంచుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. -
అక్రమ కేసులు ఎత్తివేయాలి
మార్కాపురం: సాక్షి దినపత్రికపై పెట్టిన అక్రమ కేసులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయూడబ్ల్యూజే) జిల్లా అధ్యక్షుడు ఎన్వీ రమణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై వార్తలు రాశారన్న కక్షతో కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. పత్రికా వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పత్రికల్లో వచ్చిన వార్తలు నచ్చకపోతే ఖండన ఇవ్వవచ్చని, అంతేగానీ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేయడం తగదని అన్నారు. పత్రికా కార్యాలయాలకు వెళ్లి పోలీసులు సోదాలు చేయడం మంచి సంప్రదాయం కాదని ఆయన అన్నారు. ఒంగోలు: ఫెన్సింగ్ అండర్ – 14 జిల్లా క్రీడాకారులను గురువారం స్థానిక మినీ స్టేడియంలో ఎంపిక చేశారు. ఫెన్సింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జి.నవీన్ ఆధ్వర్యంలో ఫాయిల్, ఈపీ, సాబ్రే విభాగాలలో ఎంపిక జరిగింది. ఈపీ విభాగంలో బాలబాలికలు ఎంపికవగా, ఫాయిల్, సాబ్రే విభాగాలలో బాలురు మాత్రమే ఎంపికయ్యారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 18 నుంచి కాకినాడలోని లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిఽథ్యం వహిస్తారని నవీన్ తెలిపారు. ఫాయిల్ విభాగంలో ఎంపికై న బాలురు : జి.తనీష్, జె.జగదీశ్వర్, కె.భవేష్, డి.రాహుల్ ఈపీ విభాగంలో ఎంపికై న బాలురు : జె.సాయిచరణ్, డి.చరణ్ సాయి ఫణీశ్వర్, సీహెచ్ జ్ఞానేశ్వర్, టి.లలిత్ చౌదరి ఈపీ విభాగంలో బాలికలు : బి.సౌమ్యశ్రీ, డి.ప్రియ, టి.మృధుల, సీహెచ్ జైత్రశ్రీ సాబ్రే విభాగంలో బాలురు : షేక్ అయాన్ మహీబ్, డి.రోహిత్, దేవాన్ష్ -
నల్లమలను జల్లెడ పట్టిన బలగాలు
పెద్దదోర్నాల: ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీశైలం పర్యటనతో నల్లమల అటవీ ప్రాంతాన్ని గ్రేహాండ్ బలగాలు, పోలీసులు జల్లెడ పట్టారు. గురువారం ఉదయం కర్నూలులోని ఓర్వకల్లుకు ప్రత్యేక విమానంలో చేరుకున్న నరేంద్ర మోదీ.. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా నంద్యాల జిల్లా సున్నిపెంట చేరుకుని శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు నల్లమల అభయారణ్యంలోని ప్రతి ప్రాంతాన్ని గ్రేహాండ్ దళాలు జల్లెడ పట్టాయి. దీంతో పాటు అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్ ద్వారా భద్రతను పర్యవేక్షించారు. పెద్దదోర్నాల మండల పరిధిలోని శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రతి 10 కిలోమీటర్లకు ఓ సెక్యూరిటీ పాయింట్ ఏర్పాటు చేశారు. ప్రతి పాయింట్లో ఓ ఇన్స్పెక్టర్తో పాటు 8 మంది పోలీసులను ఉంచి నల్లమలలో సంచరించే వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టారు. దీంతో పాటు అభయారణ్యంలోని ముఖ్యమైన ప్రాంతాలలో వాహనాలు మరమ్మతులకు గురై రోడ్లపై నిలిచిపోగా, ట్రాఫిక్కు ఇబ్బందులు తలెత్తకుండా క్రేన్లు, బుల్డోజర్లు ఏర్పాటు చేసి తొలగించారు. మండల కేంద్రంలోని గణపతి చెక్పోస్టు నుంచి శిఖరం వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా మొబైల్ పార్టీ పోలీసులను ఏర్పాటు చేశారు. కాగా, మండల కేంద్రంలోని మల్లికార్జుననగర్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీశైలం వెళ్లే వాహనాలను నిలిపివేయడంతో ప్రయాణికులు, యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వృద్ధులు, చిన్నారులు భోజన వసతి కోసం అవస్థపడ్డారు. మార్కాపురం డీఎస్పీ నాగరాజు, యర్రగొండపాలెం సీఐ ప్రభాకర్రావు, ఎస్సై మహేష్లు మండలంలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
పైసలిస్తేనే ప్యాకేజీ.!
యర్రగొండపాలెం: డబ్బులిస్తేనే ప్యాకేజీ మంజూరు చేయిస్తామని వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితుల నుంచి డబ్బు వసూలు చేసేందుకు టీడీపీ నాయకులు ఒత్తిడి చేస్తున్నారు. ఒక్కొక్క కుటుంబం రూ.20 వేల చొప్పున చెల్లిస్తే వెంటనే ప్యాకేజీ మంజూరవుతుందని ప్రచారం మొదలు పెట్టడంతో పాటు కొంతమంది వద్ద డబ్బు వసూలు చేసినట్లు తెలిసింది. వసూలైన సొత్తు నుంచి కూటమి నాయకుడికి రూ.10 వేలు, మిగిలిన రూ.10 వేలలో స్థానిక నాయకులు, అధికారులకు ముట్టజెప్పాల్సి ఉంటుందని వారు వివరిస్తునట్లు తెలిసింది. పెద్దారవీడు మండలంలోని సుంకేసుల, కలనూతల, గుండంచెర్ల గ్రామాలకు చెందిన మొత్తం నిర్వాసిత కుటుంబాలు 5,126 ఉన్నాయి. వాటిలో 3,760 కుటుంబాలు అవార్డు పొందగా, 1,360 కుటుంబాల జాబితాను ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. వీరి నుంచి దాదాపు రూ.10 కోట్లు వసూలు చేసేందుకు పచ్చ నాయకులు పూనుకున్నారు. డబ్బు వసూళ్ల పర్వం బహిరంగంగానే జరుగుతోందని ఆయా ప్రాంతాల నిర్వాసితులు చెబుతున్నారు. ప్రాజెక్ట్ కోసం తమ సొంత గ్రామాలను వదిలిపెట్టి దూరంగా వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నామని, తమకు ప్రభుత్వ పరంగా రావాల్సిన ప్యాకేజీ కోసం ఎదురు చూస్తుంటే.. టీడీపీ నాయకులు సొమ్ము చేసుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. సుంకేసుల పంచాయతీలో 2756 కుటుంబాలు ఉండగా, 1,900 అవార్డు పొందారు. 856 పెండింగ్లో ఉన్నాయి. కలనూతల పంచాయతీలోని 1,170 కుటుంబాలలో 1,030 అవార్డులు పొందగా, 140 కుటుంబాలు పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా గుండంచర్ల పంచాయతీలో 1,200 కుటుంబాలలో 830 అవార్డు పొందగా, 370 కుటుంబాలవి పెండింగ్లో ఉంచారు. అవార్డు పొందిన వారితో పాటు పెండింగ్లో ఉన్న కుటుంబాలకు కూడా వెంటనే ప్యాకేజీ మంజూరు చేయిస్తామని పచ్చనేతలు అక్రమ వాసూళ్లకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. టీడీపీ నాయకులు చేస్తున్న అవినీతి అక్రమాల నుంచి తమను కాపాడాలని నిర్వాసితులు కోరుతున్నారు. -
డైట్లో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్
ఒంగోలు సిటీ: అంతర్జాతీయ ఆహార దినోత్సవం సందర్భంగా మైనంపాడు డైట్ కళాశాలలో గురువారం ఫుడ్ ఫెస్టివల్ గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి డైట్ ప్రిన్సిపల్ సామా సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఫుడ్ ఫెస్టివల్లో విద్యార్థులు వివిధ రకాల వంటలను ప్రదర్శించారు. ప్రత ఒక్కరూ వంటకం తయారీ విధానం, దానిలో ఉన్న పోషక విలువ గురించి వివరించారు. వారు చేసిన ప్రత్యేక వంటకాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రిన్సిపాల్, అధ్యాపకులు, నాన్ టీచింగ్ స్టాఫ్ వంటకాలు రుచి చూసి విద్యార్థులను అభినందించారు. ఒంగోలు సిటీ: గుర్తు తెలియని వ్యక్తి రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం కరవది–ఒంగోలు రైల్వేస్టేషన్ల మధ్య జరిగింది. ఒంగోలు రైల్వేస్టేషన్ ఆన్డ్యూటీ స్టేషన్ మాస్టరు ఫిర్యాదు మేరకు జీఆర్పీ ఎస్సై మధుసూధనరావు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల మేరకు..కరవది–ఒంగోలు రైల్వేస్టేషన్ల మధ్య 50 నుంచి 55 ఏళ్ల వయసు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి పట్టాలు దాటుతున్న క్రమంలో, లేదా తనంతట తాను రైలు ఢీకొని మృతి చెందాడా అన్న కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలిపారు. మృతుడి 5.5 అడుగుల ఎత్తు ఉన్నాడు. మృతున్ని గుర్తించేందుకు ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. మృతుని వివరాలు తెలిస్తే 9440627647 నంబర్ను సంప్రదించాలని కోరారు. టంగుటూరు: కడుపునొప్పి భరించలేక ఎలుకల మందు తిని వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండలంలోని కారుమంచిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. చీరాలకు చెందిన వహీద(25)కు కారుమంచికి చెందిన అరవింద్లో ఆరేళ్ల క్రితం వివాహమైంది. అయితే ఆమె కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. ఈ క్రమంలో ఆస్పత్రిలో చూయిస్తున్నా తగ్గలేదు. విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు కూడా కారుమంచి వచ్చి వెళ్లారు. పెద్ద ఆస్పత్రిలో చూయిస్తామని చెప్పారు. ఈ క్రమంలో గత నెల 25న విపరీతమైన కడుపు నొప్పి రావడంతో భరించలేక ఇంట్లోనే ఎలుకలమందు తిని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన భర్త అరవింద్ ఒంగోలులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. ఈ మేరకు వహీదా తల్లి స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టంగుటూరు తహసీల్దార్ ఆంజనేయులు ఒంగోలు జీజీహెచ్లో శవపంచనామా నిర్వహించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. రాచర్ల: అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో నిద్రిస్తున్న వృద్ధురాలి మెడలోని బంగారు సరుడును దొంగలించేందుకు గుర్తు తెలియని దుండగుడు విఫలయత్నం చేశాడు. ఈ సంఘటన మండలంలోని జేపీ చెరువు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన కొక్కు అంకమ్మ తన నివాసంలో బుధవారం అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని దుండగుడు వచ్చి బంగారు సరుడును లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో అంకమ్మ అప్రమత్తమై పెద్దపెట్టున కేకలు వేయడంతో దుండగుడు పరారయ్యాడు. చోరీకి వచ్చిన వ్యక్తి టోపీ సంఘటన స్థలంలో పడిపోయిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఒంగోలు సిటీ: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలల్లో చెకుముకి సైన్న్స్ సంబరాలు ప్రారంభించనున్నట్లు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు వెంకట్రావు, జి.శ్రీనివాసులరెడ్డి తెలిపారు. పాఠశాల, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పరీక్షలు జరుగుతాయన్నారు. ఈ నెల 18న 8, 9, 10 తరగతులకు విద్యార్థులకు సైన్సు పరీక్ష నిర్వహిస్తామన్నారు. పాఠశాల స్థాయిలో మొదటిస్థానం పొందిన విద్యార్థులను ఎంపిక చేసి ముగ్గురు విద్యార్థులను ఆ పాఠశాల జట్టుగా నవంబర్ 1న జరగనున్న మండల, పట్టణ స్థాయి చెకుముకి సైన్సు సంబరాలకు పంపాలన్నారు. పూర్తి వివరాలకు 8309335057, 9948220868 ను సంప్రదించాలని కోరారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీసేందుకు సైన్సుపై ఆసక్తి పెంపొందించేందుకు చెకుముకి సంబరాలు ఉపయోగపడతాయన్నారు. పాఠశాల స్థాయి చెకుముకిలో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు పాల్గొనేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, పాఠశాలల యాజమాన్యాలు, విద్యాధికారులు విద్యార్థులను ప్రోత్సహించి జయప్రదం చేయాలని కోరారు. -
అమాయకులపైనా మీ దాష్టికం?
గిద్దలూరు రూరల్: గిద్దలూరు అటవీశాఖ అధికారులు అమాయకులపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని బేస్తవారిపేట మండలం పొగుళ్ల గ్రామస్తులు కొందరు ఆరోపించారు. పోగుళ్లకు చెందిన మేకల తిమ్మయ్యపై అక్రమ కేసు నమోదు చేసి నిర్బంధించారంటూ గిద్దలూరు రేంజ్ అటవీ శాఖ కార్యాలయం వద్ద అతని బంధువులు గురువారం ఆందోళన చేశారు. గ్రామస్తుల కథనం మేరకు వివరాలు.. పోగుళ్ల గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో 20 రోజుల క్రితంతిమ్మయ్య ఒక కొండముచ్చును చంపాడంటూ అటవీశాఖ అధికారులు విచారణకు వెళ్లారు. దీంతో అతను గ్రామ పెద్దలను ఆశ్రయించగా రేంజ్ ఆఫీసర్ సత్యనారాయణరెడ్డితో చర్చించారు. తిమ్మయ్యను తీసుకొస్తే మాట్లాడి పంపిస్తామని చెప్పడంతో బుధవారం అటవీశాఖ కార్యాలయానికి చేరుకున్నారు. గురువారం వరకు తిమ్మయ్యను విడిచిపెట్టకపోవడంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘ మీకు ఏమీ కాదు అని చెప్పి రేంజ్ ఆఫీసర్ మా వద్ద రూ.50 వేలు వసూలు చేశారు. ఏమైందో ఏమో వణ్యప్రాణిని చంపారు, నాటు తుపాకీ దొరికింది’ అని ఇప్పుడు చెబుతున్నారు. కొండముచ్చును రేచు కుక్కలు చంపి పడేస్తే.. తిమ్మయ్య తుపాకీతో కాల్చి చంపాడని బలవంతంగా ఒప్పించి కాగితాలపై సంతకాలు చేయించుకున్నారని, ఇంత అన్యాయమా అని వాపోయారు. కార్యాలయంలోకి ఎవరు రాకుండా తలుపులు వేయడంపై తిమ్మయ్య బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై సత్యనారాయణరెడ్డిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. శ్రీకేసు వివరాలు రాస్తున్నా, ఇప్పుడు నేను ఎవరినీ కలవలేనుశ్రీ అని సిబ్బందితో సమాధానం చెప్పించారు. అటవీశాఖ అధికారుల తీరుపై పోగుళ్ల వాసుల ఆందోళన అక్రమ కేసులు బనాయించారని ఆరోపణ -
మేమెందుకు నడుస్తున్నామంటే..
పొదిలి రూరల్: పొదిలి మండలంలోని మల్లవరం గ్రామానికి చెందిన విద్యార్థులు గురువారం నడుస్తూ.. నానాతంటాలు పడుతూ పాఠశాలకు చేరుకున్నారు. కర్నూలులో ప్రధాని మోదీ సభకు జనాన్ని తరలించేందుకు ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులను అధిక సంఖ్యలో తరలించడంతో స్థానికంగా ప్రయాణికులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. మల్లవరం గ్రామానికి చెందిన విద్యార్థులు భుజాన బ్యాగుల మోతతో సుమారు 5 కి.మీ నడిచి పొదిలిలోని ప్రభుత్వ పాఠశాలకు అతి కష్టమ్మీద చేరుకున్నారు. అధిక చార్జీ చెల్లించి ఆటోలు ఎక్కలేక కాళ్లకు పనిచెప్పారు. -
రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి
గిద్దలూరు రూరల్: మండలంలోని దిగువమెట్ట గ్రామ నల్లమల ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలుకు చెందిన లారీ డ్రైవర్ మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే..కర్నూలు నుంచి విజయవాడ వెళుతున్న లారీ..ప్రమాదవశాత్తు నల్లమల్ల ఘాట్ రోడ్డు మలుపు వద్ద పాత బ్రిడ్జిని ఢీకొట్టింది. ప్రమాదంలో లారీ డ్రైవర్ బి.రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ రోడ్డుగా నిలిచిపోవడంతో నంద్యాల నుంచి గిద్దలూరు వైపు వచ్చే వాహనాలు కిలోమీటరు మేర నిలిచిపోయాయి. దీంతో సుమారు 6 గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రోడ్డుకు అడ్డంగా ఉన్న లారీని క్రేన్ సాయంతో పక్కకు తొలగించారు. లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ రాజు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడు కర్నూలుకు చెందిన వాడిగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాత బ్రిడ్జిని ఢీకొని రోడ్డుకు అడ్డంగా నిలిచిన లారీ 6 గంటల పాటు స్తంభించిన ట్రాఫిక్ -
ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ విరమించుకోవాలి
ఒంగోలు సిటీ: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు ఈ నెల 22 నుంచి నవంబర్ 12 వరకు జరుగుతున్న బస్సుజాతలో విద్యార్థులంతా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కుల్లాయిస్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయికుమార్ పిలుపునిచ్చారు. ఒంగోలులోని లింగయ్య భవన్లో గురువారం బస్సుజాత వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో పీపీ విధానాన్ని ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రూ.6,400 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యను కాపాడాలని, మూసివేసిన పాఠశాలలను పునఃప్రారంభించాలని తెలిపారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజుల దోపిడీ అరికట్టి ఫీజు నియంత్రణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరారు. పేద విద్యార్థులకు ఉన్నత చదువుకున్న దూరం చేసే జీఓ నంబర్ 77 రద్దు చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న 3480 ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ హాస్టల్లో మౌలిక వసతులు కల్పించి పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రతి మండలంలో జూనియర్ కళాశాలలు, నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ జూనియర్ డిగ్రీ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న బస్సు జాతాలో భాగంగా నవంబర్ రెండవ తేదీన ఒంగోలు పట్టణంలోకి వస్తామని, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నాయకులు తాహిద్, ఇఫ్రాజ్, లోకేష్, స్టాలిన్, సన్నీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పెండింగ్లో రూ.6,400 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మూతపడిన పాఠశాలలను పునఃప్రారంభించాలి ఎన్నిక హామీ మేరకు 107, 108, 77 జీఓలను రద్దు చేయాలి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కుల్లాయిస్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయికుమార్ -
పొలం ఆక్రమించారు.. న్యాయం చేయండి
గిద్దలూరు రూరల్: తమ పొలాన్ని ఇతరులు ఆక్రమించుకున్నారని, అధికారులు స్పందించి న్యాయం చేయాలని ఓ బాలింత తన భర్త రెడ్యానాయక్, పసిబిడ్డతో కలిసి స్థానిక రెవెన్యూ కార్యాలయం వద్ద గురువారం ఆవేద వ్యక్తం చేసింది. బాధిత కుటుంబ కథనం మేరకు.. దిగువమెట్ట తండాకు చెందిన కాండ్రావత్ లక్ష్మీబాయ్ జేజినాయన బుక్కె మంగ్యానాయక్కు అంబవరం రెవెన్యూ ఇలాకాలో 1962లో అప్పటి ప్రభుత్వం 3.38 ఎకరాల భూమి మంజూరు చేసింది. సంబంధిత పత్రాలు తమ వద్ద లేకపోవడంతో తహసీల్దార్ కార్యాలయంలో విచారించగా రికార్డులో వివరాలు నమోదై ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్న భూమిని ఆరేళ్ల క్రితం జయరాంపురం తండాకు చెందిన కరిమయ్య, అతని కుమారుడు గురవయ్య ఆక్రమించి సాగు చేసుకుంటున్నారు. దీంతో పోలీసులతోపాటు రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. పొలం ఆక్రమించిన వారిని అప్పటి తహసీల్దార్ సీతారామయ్య పిలిపించి హెచ్చరించడంతో వెనక్కి తగ్గిన కరిమయ్య మళ్లీ భూమిలోకి ప్రవేశించాడు. నకిలీ పత్రాలు చూపుతూ తమను భూమిలోకి రానివ్వకుండా దౌర్జన్యం చేస్తున్నారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. దీనిపై తహసీల్దార్ ఎం.ఆంజనేయరెడ్డి స్పందించారు. ప్రభుత్వం కేటాయించిన భూమిని కొనడం, అమ్మడం నేరమని, వెంటనే వారిని పిలిచి విచారించి న్యాయం చేస్తానని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. కంభం: కొండలు, తిప్పల వెంట ఇష్టానుసారంగా మట్టి తవ్వి అక్రమంగా రవాణా చేస్తున్నా సంబంధింత అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి నేతల మద్దతుతో అక్రమార్కులు సాగిస్తున్న మట్టి దందాను అడ్డుకునేందుకు ఏ అధికారీ ధైర్యం చేయడం లేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. అర్ధవీడు మండలంలోని నాగులవరం కొండ, కంభం మండలంలోని చిన్నకంభం, ఎల్కోట గ్రామాల వద్ద ఉన్న కొండలను జేసీబీలతో తవ్వి ట్రాక్టర్లు, టిప్పర్లతో యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ట్రాక్టర్ ట్రక్కు మట్టిని రూ. 700కు విక్రయిస్తూ జేబులు నింపుకొంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, గృహాలు నిర్మించుకునే వారు చేసేదేమీ లేక వారు చెప్పినంత సొమ్ము చెల్లించి తమ అవసరాల కోసం మట్టిని తోలుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో స్థానికంగా ఉండే అధికార పార్టీ నాయకులు కొండల్లో మట్టి తోలే వారి వద్ద ఒక్కో ట్రాక్టర్కు రూ.100 వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మట్టి దందాపై మౌనంగా ఉంటున్న అధికార యంత్రాంగం.. పరిస్థితిని బట్టి హడావిడి చేస్తుండటం చర్చనీయాంశమైంది. ట్రాక్టర్ మట్టి రూ.700 కూటమి నేతల వాటా రూ.100 -
వ్యక్తిగత పరిశుభ్రతతో ఆరోగ్యం, ఆనందం
● డీఈఓ కిరణ్ కుమార్ ఒంగోలు సబర్బన్: వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యం, ఆనందం కలుగుతుందని జిల్లా విద్యాశాఖాధికారి ఏ.కిరణ్ కుమార్ అన్నారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో బుధవారం నిర్వహించిన గ్లోబల్ హ్యాండ్ వాష్ డే కార్యక్రమాన్ని డీఈఓ ప్రారంభించారు. జిల్లా విద్యాశాఖ, విజయవాణి చారిటబుల్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చేతులు శుభ్రంగా కడుక్కోవడం ద్వారా డీ వార్మింగ్ టాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం రాదన్నారు. మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీహరి మాట్లాడుతూ మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అని గ్లోబల్ హ్యాండ్ వాష్ డే ప్రాధాన్యతను వివరించారు. డాక్టర్ వీరభద్రుడు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాల శుభ్రత పాటించాలన్నారు. కార్యక్రమంలో స్టెప్ అండ్ యూత్ స్పోర్ట్స్ జిల్లా అధికారి శ్రీమన్నారాయణ, జిల్లా ఉమన్ చైల్డ్ డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సువర్ణ పాల్గొన్నారు. సంతనూతలపాడు: మండలంలోని మైనంపాడు హైస్కూల్లో ఈనెల 17వ తేదీ 69వ స్కూల్ గేమ్స్ హాకీ అండర్ 14, అండర్ 17 బాయ్స్ అండ్ గరల్స్ జిల్లా టీం సెలక్షన్స్ నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా స్కూల్ గేమ్ సెక్రటరీ డాక్టర్ చెక్క వెంకటేశ్వర్లు, ఏ శిరీష కుమారి తెలిపారు. ఈ పోటీలకు ముఖ్యఅతిథిగా, పర్యవేక్షకులుగా డీఈఓ ఏ కిరణ్ కుమార్ హాజరవుతున్నట్టు చెప్పారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఉన్న హాకీ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనాలని కోరారు. అండర్ 17 లో పాల్గొనే ఇంటర్మీడియెట్ బాలబాలికలు టెన్త్ క్లాస్ మార్క్స్ మెమో, పాన్ నంబర్, అపార్ ఐడీని ప్రిన్సిపల్తో అటిస్టేషన్ చేయించుకోవాలన్నారు. -
సర్కారు గొప్పలు.. ప్రయాణికులకు తిప్పలు
ఒంగోలు టౌన్: ప్రధాన మంత్రి కర్నూలు పర్యటనకు జిల్లాలోని ఒంగోలు, గిద్దలూరు, పొదిలి, మార్కాపురం, కనిగిరి డిపోల నుంచి 160 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. ఇందులో ఒంగోలు డిపోలో 74 పల్లెవెలుగు బస్సులుండగా ఏకంగా 40 బస్సులను కర్నూలు సభకు తరలించినట్లు సమాచారం. మంగళవారమే జిల్లా నుంచి బస్సులన్నీ వెళ్లిపోయాయి. తిరిగి 17వ తేదీ సాయంత్రం లేదా రాత్రికి గానీ బస్సులు జిల్లాకు చేరుకోవు. 18వ తేదీ నుంచి రోడ్డు మీదకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తం మీద మూడు రోజుల పాటు జిల్లాలో సగం పల్లెవెలుగు బస్సులు కనిపించవు. మహిళలకు ఉచిత బస్సు పథకంలో ప్రధానంగా పల్లెవెలుగు బస్సులను నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు డిపోలో ఉన్న బస్సుల్లో సగం బస్సులను కర్నూలు సభకు తరలించడంతో మహిళా ప్రయాణికులకు కష్టాలు మొదలయ్యాయి. వందలాది గ్రామాలకు బస్సులు వెళ్లే అవకాశం లేదు కనుక ఆయా గ్రామాలకు చెందిన ప్రయాణికులు, మహిళలు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించక తప్పని పరిస్థితి. మహిళలకు ఉచిత బస్సులు ప్రారంభించినప్పటి నుంచి సభలు, సమావేశాలంటూ ఆర్టీసీ బస్సులను తరలించడం నిత్యకృత్యమైపోయిందని ఆర్టీసీ యూనియన్ నాయకులు విమర్శిస్తున్నారు. -
చచ్చినా చావే..!
కంభం: మండలంలోని రావిపాడు గ్రామంలో శ్మశాన వాటికకు వెళ్లాలంటే అష్టకష్టాలు పడాల్సిందే. గుండ్లకమ్మ వాగు ప్రవహిస్తున్న సమయంలో ఊర్లో ఎవరైనా చనిపోతే నడుముల లోతుకు పైగా నీటిలో అడుగులో అడుగేస్తూ పాడె మోయాల్సిన దుస్థితి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు గుండ్లకమ్మ వాగు ప్రవహిస్తోంది. గ్రామానికి చెందిన అంజిరెడ్డి(54) బుధవారం మృతి చెందారు. శ్మశానానికి వెళ్లే మార్గంలో గుండ్లకమ్మ వాగులో నుంచి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు మృతుడి బంధువులు, గ్రామస్తులు అష్టకష్టాలు పడ్డారు. వాగు అవతల ఉన్న పంటపొలాలకు వెళ్లడానికి కూడా తిప్పలు తప్పడం లేదని, అధికారులు స్పందించి వాగుపై వంతెన నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. -
నేడు ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటన
పెద్దదోర్నాల: నేడు శ్రీశైల పుణ్యక్షేత్రానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ వస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేట్టారు. గ్రేహాండ్స్, స్పెషల్ పార్టీ పోలీసులు బుధవారం శ్రీశైలం ఘాట్రోడ్డులో అడుగడుగునా తనిఖీ చేశారు. బందోబస్తుకు హాజరైన పోలీసు సిబ్బందికి ముందుగా పెద్దదోర్నాల పోలీస్స్టేషన్ వద్ద మార్కాపురం డీఎస్పీ నాగరాజు దిశానిర్దేశం చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ అధికారులు, సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, శ్రీశైలం నుంచి వచ్చి పోయే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. లైసెన్స్, సరైన ధ్రువీకరణ పత్రాలు లేని, మద్యం తాగిన వాహనదారులను ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. శ్రీశైలం ఘాట్ రోడ్డులోకి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇతర వాహనాలను అనుమతించేది లేదని డీఎస్పీ తెలిపారు. ఆయన వెంట యర్రగొండపాలెం సీఐ ప్రభాకర్రావు, పలువురు ఎస్సైలు ఉన్నారు. శ్రీశైలం వచ్చి వెళ్లే వాహనాలు ముమ్మరంగా తనిఖీ భద్రతా చర్యలను పర్యవేక్షించిన మార్కాపురం డీఎస్పీ గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇతర వాహనాల నిలిపివేత -
నకిలీ మద్యంతో పేదల ప్రాణాలు బలి
సింగరాయకొండ: నకిలీ, కల్తీ మద్యం వ్యాపారంతో పేద ప్రజల ప్రాణాలు పొట్టనపెట్టుకున్న దోషులను కఠినంగా శిక్షించి ప్రాణాలు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలని, ఈ అక్రమ వ్యాపారంపై సీబీఐతో పూర్తి స్థాయి విచారణ జరిపించాలని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో బుధవారం కల్తీ మద్యం వ్యవహారంపై దోషులను కఠినంగా శిక్షించాలని ఎన్నికల హామీలో భాగంగా ప్రజలకు నాణ్యమైన మద్యం అందించాలని కోరుతూ మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని వైఎస్సార్ సీపీ శ్రేణులు కదం తొక్కారు. ఈ సందర్భంగా పార్టీ క్యాంపు కార్యాలయం వద్ద నుంచి ప్రధాన రహదారి గుండా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సర్కిల్ కార్యాలయానికి భారీ ర్యాలీగా వెళ్లి అసిస్టెంట్ సూపరింటెండెంట్ వెంకట్, సీఐ ఎం.శివకుమారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో డాక్టర్ ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ కల్తీమద్యంపై ముఖ్యంగా 5 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచామన్నారు. నకిలీ మద్యం గుట్టు రట్టు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వైన్షాపులు, పర్మిట్రూమ్లు, బార్లు, బెల్టుషాపులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలన్నారు. ఇప్పటి వరకు పత్రికల కథనాల ప్రకారం సుమారు 421 మందికి పైగా నకిలీ మద్యం కారణంగా మృత్యువాత పడ్డారని, వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వైన్ షాపుల కేటాయింపులో జరిగిన అక్రమాలను గుర్తించి అనర్హులను తొలగించాలన్నారు. మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహించేలా చర్యలు తీసుకుని అమ్మకం వేళలు తగ్గించాలని కోరారు. బడులు, దేవాలయాలకు సమీపంలో, పబ్లిక్ స్థలాల్లో ఏర్పాటు చేసిన వైన్షాపులు, బార్ల లైసెన్స్లు రద్దు చేయాలని డిమాండ్ చేశామన్నారు. టీడీపీ కనుసన్నల్లో నకిలీ మద్యం వ్యాపారం: రాష్ట్రంలో బట్టబయలైన నకిలీ మద్యం వ్యాపారం టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే జరుగుతుందని ఇందుకు పూర్తి ఆధారాలు బట్టబయలయ్యాయని డాక్టర్ సురేష్ ఆరోపించారు. నెల్లూరు, విజయవాడ, ఏలూరు, పాలకొల్లు, పరవాడ తదితర ప్రాంతాలలో నకిలీ మద్యం తయారీ కేంద్రాలు బట్టబయలయ్యాయన్నారు. నకిలీ మద్యం వ్యవహారం తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్చార్జి, ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి, అతని బావమరిది గిరిధర్రెడ్డి, కట్టా సురేంద్రనాయుడు, అనుచరుడు జనార్దనరావు కనుసన్నల్లో జరిగిందని వీరందరూ టీడీపీ వారే కదా అని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆఫ్రికాలో మద్యం డిస్టిలరీలు ఉన్నాయని జయచంద్రారెడ్డి తన ఎన్నికల అఫిడవిట్ ఇచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సుమారు రూ.5,300 కోట్లు నకిలీ మద్యం వ్యాపారం ద్వారా దోచుకున్నారని ఇంతటి భారీ అక్రమ వ్యాపారం బట్టబయలు చేసి దోషులకు శిక్ష పడాలంటే రాష్ట్ర ప్రభుత్వ చెప్పుచేతల్లో ఉండే సిట్ కాదని, సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని సురేష్ డిమాండ్ చేశారు. పార్టీ సీఈసీ సభ్యుడు డాక్టర్ మాదాసి వెంకయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు ఇస్తానని ప్రజలను మభ్యపెట్టిందని ఈరోజు నకిలీ మద్యాన్ని ప్రజలకు అందిస్తూ వారి ప్రాణాలను హరించిందని, ఇందుకు ముమ్మాటికీ టీడీపీ నాయకులే కారకులని విమర్శించారు. ర్యాలీ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకులు వై వెంకటేశ్వరరావు, ఎస్ఈసీ సభ్యుడు డాక్టర్ బత్తుల అశోక్కుమార్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మసనం వెంకట్రావు, చింతపల్లి హరిబాబు, బచ్చల కోటేశ్వరరావు, ఇనకొల్లు సుబ్బారెడ్డి, బెజవాడ వెంకటేశ్వర్లు, మాకినేని వెంకట్రావు, కనపర్తి శేషారెడ్డి, తానికొండ రామచంద్రరావు, రాపూరి ప్రభావతి, షేక్ సుల్తాన్, పఠాన్ రియాజ్, చొప్పర వెంకన్న, కనపర్తి గోవిందమ్మ, యనమల మాధవి, చుక్కా కిరణ్కుమార్, దాసు శ్రీను, షేక్ కరీం, గొల్లపోతు గోవర్దన్, మిరియం సుధాకర్, గాదంఽశెట్టి గుప్తా, చిరుమామిళ్ల వెంకటేశ్వర్లు, కోమిట్ల వెంకారెడ్డి, నరేష్, షేక్ అల్లాభక్షు, నాగార్జున, భాను, నవీన్రెడ్డి, బుజ్జమ్మ, చిడిపూడి కృష్ణారెడ్డి, చిమట శ్రీను, చామల ఉదయశంకరరెడ్డి, నాగేశ్వరరెడ్డి, దేవరపల్లి వరుణ్, బత్తిన మనోహర్రావు, దగ్గుమాటి శంకరరెడ్డి, పిల్లి తిరుపతిరెడ్డి, పల్నాటి వెంకటేశ్వరరెడ్డి, ముప్పా కోటేశ్వరరావు, మారెడ్డి వెంకటేశ్వరరెడ్డి, టి రవీంద్రరెడ్డి, వై వీర వసంతరావు, పూనూరి సంజీవరెడ్డి, సోమిశెట్టి సురేష్, బల్లెల ప్రభాకరరెడ్డి, కేశవరపు కృష్ణారెడ్డి, పాకనాటి సుబ్బారెడ్డి, కాళహస్తి వెంకారెడ్డి, పురిణి దేవ, గాలి బుజ్జి, దాసరిశేషయ్య, సాయికోటి, మాదాల శంకర్, అంకయ్య, కాకి జయపాల్, వాయిల పున్నయ్య, శివారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
సాగర్ కాలువలో గల్లంతైన వ్యక్తి మృతి
తాళ్లూరు: మండలంలోని వెలుగువారిపాలెం వద్ద సాగర్ కాలువలో చేపలు పట్టేందుకు వెళ్లిన పొదిలి మండలం కాటూరివారిపాలెం వాసి మెలిక ప్రసాద్(48) నీట మునిగి గల్లంతైన విషయం తెలిసిందే. వల బయటకు లాగే క్రమంలో కాలుకు చుట్టుకోవడంతో పట్టుతప్పి నీటిలో పడిపోయిన ప్రసాద్ అదే ప్రదేశంలో పూడికలో కూరుకుపోయి మృతి చెందాడు. బంధువులతోపాటు స్థానికులు కలిసి వలల సహాయంలో కాలువ నుంచి మృతదేహాన్ని బుధవారం వెలికితీసి స్వగ్రామానికి తరలించారు. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న వ్యక్తి మృతి చెందటంతో కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపిస్తున్నారు. గ్రామ సర్పంచ్ ముచ్చుమారి కోటేశ్వరమ్మ బ్రహ్మారెడ్డి, వీఆర్వో చిన్నకృష్ణ పోలీసులకు సమచారం ఇవ్వటంతో సంఘటనా స్థలాన్ని ఏఎస్ఐ భాస్కర్రావు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. ● హెడ్ పోస్టాఫీసు ఎదుట ఉద్యోగుల ధర్నా మార్కాపురం టౌన్: కేంద్ర ప్రభుత్వం పోస్టల్ ఉద్యోగుల వ్యతిరేక విధానాలను విడనాడాలని, 8వ పే కమిషన్ సభ్యులను నియమించాలని రాష్ట్ర అఖిలభారత తపాలా ఉద్యోగుల సంఘం సహాయ కార్యదర్శి ఎన్.రమణారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మార్కాపురం ప్రధాన తపాలా కార్యాలయం ఎదుట ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలిండియా జనరల్ సెక్రటరీ ఎస్ఎస్ మహదేవయ్యను ఉద్దేశపూర్వకంగా విధుల నుంచి తొలగించారని, ఆయనను మళ్లీ విధుల్లోకి తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ఎన్ఎఫ్పీఈ కార్మిక సంస్థ గుర్తింపును వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు డి.నారాయణరెడ్డి, ఎం.శ్రీనివాసులు, ఎ.రవి, కార్తీక్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు టౌన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎకై ్సజ్ శాఖలో విధులు నిర్వహిస్తూ మరణించిన కానిస్టేబుళ్లు ఎం.శ్రీనివాసరావు, డి.సుబ్బారావు కుటుంబ సభ్యులకు సహచర ఉద్యోగులు సాయం అందించారు. జిల్లాలోని కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్ల నుంచి ఫండ్ సేకరించి ఒక్కో కుటుంబానికి రూ.74 వేల చొప్పున ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు చేతుల మీదుగా బుధవారం స్థానిక ఎకై ్సజ్ డీసీ కార్యాలయంలో అందజేశారు. సహృదయంతో సాటి ఉద్యోగుల కుటుంబాలకు చేయూతనివ్వాలన్న ఆలోచన చేసిన అసోసియేషన్ నాయకులకు ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ అభినందించారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ కె.విజయ, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ షేక్ ఆయేషా బేగం, ప్రకాశం జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కానిస్టేబుల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.శ్రీనివాసులు, జనరల్ సెక్రటరీ ఎస్.శ్రీనివాసులు, అసోసియేట్ ప్రెసిడెంట్ సీహెచ్ శ్రీనివాసరావు, కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
బస్సులు లేక అవస్థలు
● ప్రధాని పర్యటన నేపథ్యంలో రాయలసీమ జిల్లాలకు బస్సుల కేటాయింపు ● జిల్లా నుంచి 160 బస్సులు తరలింపు మార్కాపురం: ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 16న నంద్యాల జిల్లా శ్రీశైలం, కర్నూలులో జరిగే వివిధ కార్యక్రమాలకు హాజరవుతున్న నేపథ్యంలో జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు, ఒంగోలు, కనిగిరి, పొదిలి డిపోల నుంచి సుమారు 160 బస్సులను నంద్యాల, కర్నూలు జిల్లాలకు పంపడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి పలువురు బస్టాండులకు రాగా బస్సులు లేకపోవడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా పలు బస్టాండుల్లో బస్సులు లేక ఖాళీగా కనిపించగా, ప్రయాణికులతో నిండిపోయాయి. అరకొరగా వచ్చే బస్సులు ఎక్కేందుకు ప్రయాణికులు సీట్ల కోసం యుద్ధమే చేయాల్సి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల బుధవారం వర్షం కురవడంతో అటు బయటకు రాలేక, ఇటు బస్టాండులో ఉండలేక మహిళా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పిల్లా పాపలు, లగేజీతో బస్టాండుకు వస్తే బస్సులు లేవు. ముఖ్యంగా మార్కాపురం నుంచి విజయవాడ, ఒంగోలు, కడప, వినుకొండ, మాచర్ల, గిద్దలూరు తదితర ప్రాంతాలతో పాటు గ్రామాలకు వెళ్లే పలు సర్వీసులను తాత్కాలికంగా రద్దుచేసి రాయలసీమ జిల్లాలకు పంపారు. మార్కాపురం పట్టణానికి వచ్చేందుకు సమీప గ్రామాల ప్రజలు ఆటోలను ఆశ్రయించగా కంభం, పెద్దారవీడు, పెద్దదోర్నాల, త్రిపురాంతకం, కొనకనమిట్ల, పొదిలి తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సకాలంలో బస్సులు లేకపోవడంతో ఆటోల్లో లేదా కార్లు బాడుగకు మాట్లాడుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. గిద్దలూరు నుంచి 35, మార్కాపురం నుంచి 35, ఒంగోలు నుంచి 35, కనిగిరి నుంచి 35, పొదిలి నుంచి 20 బస్సులను కర్నూలు, నంద్యాల జిల్లాలతోపాటు రాయలసీమ జిల్లాలకు పంపారు. గురువారం కూడా ఇదే పరిస్థితి ఉండనుంది. దీంతో పలువురు ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు. -
ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలి
మార్కాపురం: ఆర్టీసీ ఉద్యోగుల ప్రమోషన్లపై దీపావళి పండగలోగా జీవో విడుదల చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఏపీపీటీడీ(ఆర్టీసీ) ఉద్యోగుల ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ నరసయ్య హెచ్చరించారు. బుధవారం మార్కాపురంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పదోన్నతులకు సంబంధించి ఈ ఏడాది ఆగస్టు 28న ముఖ్యమంత్రి, రవాణాశాఖ మంత్రి అనుమతి ఇచ్చినప్పటికీ జీఏడీ విభాగంలో పెండింగ్ పెట్టి ఇంతవరకూ జీఓ విడుదల చేయలేదన్నారు. దీంతో పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న సుమారు 6 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారని చెప్పారు. ఈ సమస్యను దీపావళిలోగా పరిష్కరించకుంటే ఉద్యమమే శరణ్యమని హెచ్చరించారు. అనంతరం మార్కాపురం ఆర్టీసీ డిపో గ్యారేజీ వద్ద నూతనంగా నిర్మించిన ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు చక్రపాణి, ఎస్వీఎస్ శాస్త్రి, బీబీ వెంకటేశ్వర్లు, సీహెచ్ జనార్దన్రావు, పి.శేఖర్నాయుడు, బాషా హుస్సేన్, మంగమ్మ, కొండలరావు తదితరులు పాల్గొన్నారు. -
పీపీపీ ఓ దండగమారి విధానం
ఒంగోలు వన్టౌన్: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ చేసేందుకు కూటమి సర్కారు తెరపైకి తెచ్చిన పీపీపీ విధానం ఓ దండగమారి పంచాయితీ అని, తక్షణమే పీపీపీ మోడల్ను ఉపసంహరించుకోవాలని దళిత హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చప్పిడి రవిశంకర్ డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీల విషయంలో కూటమి ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ఒంగోలులోని కలెక్టరేట్ సమీపంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద బుధవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో ఎస్సీ సంక్షేమంపై ఇచ్చిన హామీలకు తూట్లు పొడిచారని విమర్శించారు. ఎస్సీ కార్పొరేషన్లో 2024–25 ఆర్థిక సంవత్సరంలో మాల కార్పొరేషన్కు రూ.341 కోట్లు, మాదిగ కార్పొరేషన్కు రూ.400 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించారే కానీ 16 నెలలుగా ఒక్క రూపాయి కూడా అర్హులకు అందించలేదని దుయ్యబట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.వేల కోట్లతో ఎస్సీ, ఎస్టీ యాక్షన్ ప్లాన్ ప్రకటించి ఆరు నెలలైనా ఒక్క రూపాయి నిధులివ్వకుండా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ జనాభా నిష్పత్తి ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఎన్ఎస్ఎఫ్డీసీ, ఎన్ఎస్కేఎఫ్డీసీ పథకాలకు నిధులు మంజూరు చేసే అవకాశం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని తప్పుబట్టారు. దళితులు పోరాడి సాధించుకున్న ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులైనా మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో సంఘ నాయకులు అబ్రహాము, జాన్ వెస్లీ, యేసు దాస్, ధనరాజ్, జిలాని, బ్రహ్మ, సామేలు, మోషే, మరియమ్మ, శాంతి, విజయలక్ష్మి, మనోహర్, కావేరి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టొద్దు ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల నుంచి రుణాలు మంజూరు చేయాలి దళిత హక్కుల పోరాట సంఘం నేతల డిమాండ్ -
వైద్య విద్యకు కూటమి సర్కారు సమాధి
పొదిలిలో సంతకాల సేకరణను ప్రారంభిస్తున్న బత్తుల, అన్నా రాంబాబు ఉప్పలపాడులో సంతకాల సేకరణలో పార్టీ నేతలు పొదిలి రూరల్: సామాన్యులు, పేదలకు వైద్యం, వైద్య విద్య అందకూడదనే దురుద్దేశం, అనుచరులకు ప్రభుత్వ ఆస్తులను దోచిపెట్టే దుర్మార్గపు ఆలోచనలతో సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంటు పరిశీలకుడె బత్తుల బ్రహ్మానందరెడ్డి, మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు విమర్శించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమాన్ని బుధవారం పొదిలి, ఉప్పలపాడు గ్రామాల్లో ప్రారంభించారు. పొదిలి విశ్వనాథపురంలో పార్టీ నగర పంచాయతీ అధ్యక్షుడు సానికొమ్ము శ్రీనివాసులురెడ్డి, ఉప్పలపాడులో మండల పార్టీ అధ్యక్షుడు గుజ్జుల సంజీవరెడ్డితో కలిసి సర్కారు తీరుకు నిరసనగా సంతకాల సేకరణ చేపట్టారు. ముందుగా ఆయా ప్రాంతాల్లోని వైఎస్సార్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ రాష్ట్రపతి ఏపిజే అబ్దుల్ కలాం జయంతి సందర్బంగా ఆయన చిత్ర పటానికి ఘన నివాళులర్పించారు. కోటి సంతకాల సేకరణ సమావేశాల్లో బత్తుల, అన్నా మాట్లాడుతూ.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలకు మెరుగైన వైద్యం, విద్య అందించేందుకు రాష్ట్రంలో ఏకంగా 17 వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. వాటిలో ఇప్పటికే 7 కాలేజీలు ప్రారంభం కాగా, మరో 10 కాలేజీల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. కూటమి గద్దెనెక్కిన తర్వాత వైద్య కళాశాలలను సమాధి చేసేందుకు కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. దాదాపు రూ.లక్ష కోట్లు విలువ చేసే ప్రభుత్వ వైద్య కళాశాలలను, వేలాది ఎకరాల భూములను సీఎం చంద్రబాబు తన అనుచరులకు కట్టబెట్టేందుకు పీపీపీ విధానాన్ని తెరపైకి తెచ్చారని దుయ్యబట్టారు. చంద్రబాబు చీకటి బాగోతాన్ని బట్టబయలు చేసేందుకు, వైద్య కళాశాలల ప్రైవేటీకరణతో రాష్ట్ర ప్రజలకు కలిగే నషం, ఇబ్బందులను వివరించేందుకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ కుట్రలను తిప్పి కొట్టేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, పార్టీ రారష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, నాయకులు గొలమారి చెన్నారెడ్డి, సాయి రాజేశ్వరరావు, కె నరసింహరావు, కల్లం సుబ్బారెడ్డి, జి.శ్రీనివాసులు, నూర్జహన్ బేగం, గౌసియా బేగం, యక్కలి శేషగిరి రావు, మస్తాన్వలి, ఫిరోజ్, వెంకటేశ్వరరెడ్డి, పార్టీ వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అందులో భాగమే.. ప్రజా సమస్యలు గాలికొదిలేసి దోపిడీకి తెరలేపారు వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల, మాజీ ఎమ్మెల్యే అన్నా ధ్వజం కూటమి సర్కారు పీపీపీ విధానానికి వ్యతిరేకంగా పొదిలిలో కోటి సంతకాల సేకరణ -
ఒంగోలులో నకిలీ బీరు కలకలం
ఒంగోలు టౌన్: నగరంలో నకిలీ బీరు బాటిల్ కలకలం సృష్టించింది. నగర శివారులోని కొప్పోలులో జాతీయ రహదారికి సమీపంలో ఉన్న ఒక వైన్ షాపులో మంగళవారం ఒక కస్టమర్ మద్యం కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. అనుమానం వచ్చిన అతడు ప్రభుత్వం విడుదల చేసిన ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ డౌన్లోడ్ చేసుకొని పరీక్షించాడు. తొలుత మాన్షన్ హౌస్ లిక్కర్ తీసుకొని క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయగా మద్యం బాటిల్ వివరాలు వచ్చాయి. ఆ తరువాత బీర్ బాటిల్ మీద ఉన్న క్యూ ఆర్ కోడ్కు స్కాన్ చేశాడు. ఎర్రర్ అని వచ్చింది. ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో తీసిన సదరు కస్టమర్ ఒంగోలులోని వైన్ షాపుల్లో నకిలీ బీర్ విక్రయిస్తున్నారని, మందుబాబులు జాగ్రత్తగా ఉండాలని సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయింది. నకిలీ బీరు తాగుతున్నామంటూ మందుబాబులు ఆందోళనకు గురయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్లో కేవలం నకిలీ లిక్కర్ను మాత్రమే గుర్తించే సౌకర్యం ఉందని, బీరు బాటిళ్లను గుర్తించే సౌకర్యం లేదని ఎక్సైజ్ ఈఎస్ షేక్ ఆయేషా బేగం తెలిపారు. ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ను కేవలం లిక్కర్ బాటిళ్ల స్కానింగ్కు మాత్రమే ఉపయోగించాలని సూచించారు. బీరు బాటిళ్ల మీద కంపెనీకి చెందిన క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంటుందని, ప్రభుత్వ యాప్కు దీనికి సంబంధం లేదని స్పష్టం చేశారు. 🚨 Public Alert! Be Cautious! 🚨A shocking incident has come to light at Koppole Road, Ongole.At Sai Wines, when people scanned the Mansion House QR code, it worked successfully but when they scanned a beer bottle, the code showed an error on the official AP consumer website.… pic.twitter.com/uTOsi9ilqc— VoiceOfAndhra (@VoicesOfAndhra) October 14, 2025 -
ఒక్క పనిముట్టు.. అందితే ఒట్టు!
మార్కాపురం: కూటమి ప్రభుత్వ తీరు వ్యవసాయ రంగాన్ని క్రమంగా సంక్షభంలోకి నెడుతోంది. పంటలకు గిట్టుబాటు కల్పించడంలో, ప్రకృతి వైపరీత్యాలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంలో ఘోరంగా విఫలమైన కూటమి ప్రభుత్వ పాలకులు.. అన్నదాతలకు అవసరమైన వ్యవసాయ పనిముట్లు సకాలంలో అందించకుండా చోద్యం చూస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్ ముగిసి రబీ సీజన్ ప్రారంభమైనప్పటికీ వ్యవసాయ పనిముట్లు అందకపోవడంతో రైతులు అద్దెకు తెచ్చుకుని వాడుకోవాల్సిన దుస్థితి. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలో ఖరీఫ్లో 70 వేల హెక్టార్లలో రైతులు వరి, మొక్కజొన్న, కంది, జొన్న, వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఆముదం, పత్తి, మిర్చి సాగు చేశారు. ఈ పంటల్లో తెగుళ్లను నివారించేందుకు తైవాన్ స్ప్రేయర్లు అవసరం. దీంతోపాటు రబీ సీజన్లో పొలాలు సాగు చేసుకునేందుకు, దుక్కులు దున్నుకునేందుకు మెయింటైన్ కల్టివేటర్ (ట్రాక్టరుతో నడిచే గొర్రు), నూర్పిడి యంత్రాలు, భూమ్ స్ప్రేయర్ (ట్రాక్టరుతో నడిపే స్ప్రేయరు), విత్తనాలు ఎదబెట్టే గొర్రులు రైతులకు అత్యవసరం. ఇవేవీ జిల్లా వ్యాప్తంగా రైతులకు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు వస్తాయో.. రావో.. కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో వ్యవసాయ డ్రోన్లను అందుబాటులోకి తెచ్చినా అవి కొన్ని మండలాలకే పరిమితం చేశారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా రబీ సీజన్ ప్రారంభం కావడంతో మొక్కజొన్న, శనగ సాగు చేసుకునేందుకు, విత్తనాలు ఎద పెట్టుకునేందుకు, ట్రాక్టరుతో నడిచే గొర్రు అత్యవసరం. పత్తి, మిర్చి, వరి పంటల్లో తెగుళ్ల నివారణకు తైవాన్ స్ప్రేయర్లు అందించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. పెట్టుబడి మరింత భారం పత్తి, మిర్చి పండిస్తున్న రైతులు లక్షల రూపాయల సొమ్మును పెట్టుబడి కోసం ఖర్చు చేస్తున్నారు. ఎకరా పత్తి సాగుకు రూ.25 వేల వరకు, మిర్చి సాగుకు లక్షన్నర రూపాయలకు పైగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఈ నేపఽథ్యంలో పవర్ స్పేయర్లు, ఇతర యంత్ర పరికరాలకు బాడుగలు చెల్లించాలంటే ఆర్థికంగా మరింత భారం పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే పత్తి సుమారు 13 వేల హెక్టార్లలో, వరి 6 వేల హెక్టార్లలో, మొక్కజొన్న సుమారు 5వేల హెక్టార్లలో సాగుచేశారు. కాగా పత్తికి అక్కడక్కడా తామర పురుగు, పచ్చదోమ, మిర్చికి పై ముడత, వరికి ఆకుమచ్చ తెగులు ఆశించింది. వీటి నివారణకు మందులు పిచికారీ చేయాలంటే కశ్చితంగా తైవాన్ స్ప్రేయర్ అవసరం. సేద్యానికి అవసరమైన పనిముట్లతో తైవాన్ స్ప్రేయర్లు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. యుద్ధప్రాతిపదికన వ్యవసాయ పరికరాలు అందిస్తే రబీ సీజన్లో ఉపయోగకరంగా ఉంటుందని రైతులు ఆశిస్తున్నారు. ఖరీఫ్లో సాగుచేసిన పత్తి రబీ ప్రారంభమైనా రైతులకు అందని వ్యవసాయ పరికరాలు రోటోవేటర్లు, తైవాన్ స్ప్రేయర్ల కోసం ఎదురుచూపులు జిల్లాలో ఖరీఫ్లో 70 వేల హెక్టార్లలో వివిధ రకాల పంటల సాగు పనిముట్లకు అద్దెలు చెల్లించలేక అవస్థలు పడిన రైతులు -
డైవర్షన్ పాలిటిక్స్లో దిట్ట చంద్రబాబు
● మాజీ మంత్రి జోగి రమేష్ను అక్రమంగా కేసులో ఇరికిస్తున్నారు ● వైఎస్సార్ సీపీ బీసీ గౌడ నాయకుల ఆగ్రహం ఒంగోలు వన్టౌన్: నకిలీ మద్యం కేసులో అసలు దొంగలను తప్పించేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలకు తెరదీయడం సిగ్గు చేటని వైఎస్సార్ సీపీ బీసీ గౌడ నాయకుడు తాతా నరశింహ గౌడ్ ధ్వజమెత్తారు. మాజీ మంత్రి జోగి రమేష్ను అక్రమంగా కేసులో ఇరికిస్తున్నారని మండిపడ్డారు. ఒంగోలులోని బొట్ల సుబ్బారావు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నారా వారి నకిలీ మద్యం కూటమి ప్రభుత్వంలో ఏరులై పారుతోందని ఎద్దేవా చేశారు. నకిలీ మద్యం విక్రయించి ప్రజా ధనం దోచుకుంటూ అడ్డంగా దొరికిన టీడీపీ నాయకుడు జయచంద్రారెడ్డి, జనార్దన్రావు, సురేంద్రనాయుడు సహా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసుతో లింకులు ఉన్న టీడీపీ ముఠాను తప్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కాగా స్కెచ్ వేశారని, గౌడ సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్పై అక్రమ కేసు నమోదు అందులో భాగమేనని ఆరోపించారు. ఈ కుట్రలో అసలు సూత్రదారులు చంద్రబాబు, లోకేష్ కాగా, పాత్రధారులు జయచంద్రారెడ్డి, జనార్థన్ అని చెప్పారు. ప్రజల ప్రాణాలను బలిగొంటున్న నకిలీ మద్యం మకిలిని వైఎస్సార్ సీపీ అంటించాలని సాగిస్తున్న కుట్రలు భగ్నం కాక తప్పదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కల్లుగీత కార్మికులు, గౌడ సంఘీయులను సంఘటితం చేసి రాష్ట్ర వ్యాప్త ఉద్యమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం గత 17 నెలలుగా ప్రజలను మోసం చేస్తూ పాలన సాగిస్తోందన్నారు. గత ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుడితే.. కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు నిర్ణయించడం బడుగుబలహీన వర్గాలకు తీవ్ర అన్యాయం చేసేందుకేనని విమర్శించారు. ఒక పక్క మట్టి, ఇసుక, లిక్కర్ సిండికేట్లతో రాష్ట్రాన్ని దోచుకుంటున్న కూటమి ముఠాలు.. అది చాలదన్నట్లు నకిలీ మద్యంతో రూ.వేల కోట్లు పోగేసుకున్నాయని ధ్వజమెత్తారు. నకిలీ మద్యం కేసును తప్పుదారి పట్టించేందుకు జోగి రమేష్పై అక్రమ కేసులు బనాయించడం అవివేకమన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ చేయడం చంద్రబాబు దిట్ట అని మండిపడ్డారు. నకిలీ మద్యంతో పేద ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్న కూటమి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని, తక్షణమే జోగి రమేష్ గౌడ్ మీద అక్రమ కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా నాయకులు తాతా నాంచార్లు గౌడ్, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫణిదపు సుధాకర్, కొత్తపట్నం మండలం బీసీ సెల్ అధ్యక్షుడు తుళ్లూరి వెంకట నారాయణ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు 38వ డివిజన్ పాలడుగు శ్రీనివాసరావు, 15వ డివిజన్ నాయకుడు వీసం బాలకష్ణ, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
యువకుడి ఉసురు తీసిన ఈత సరదా
గిద్దలూరు రూరల్: ఈతకు వెళ్లిన ఓ యువకుడు నీట మునిగి మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన గిద్దలూరు మండలంలోని కొండపేట గ్రామ సమీపంలో గల ఆంజనేయస్వామి గుడి వెనుక సగిలేరు వాగులో మంగళవారం చోటుచేసుకుంది. అందిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన సయ్యద్ ఆసిఫ్(22) స్నేహితులతో కలిసి సగిలేరు వాగులో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో వాగు లోతట్టు ప్రాంతంలోకి వెళ్లిన ఆసిఫ్ ప్రమాదవశాత్తు నీట మునిగిపోయాడు. స్నేహితులు గమనించి అతడిని రక్షించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. నీటిలో మునిగిపోయిన ఆసిఫ్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. సమాచారం అందుకున్న స్థానిక సీఐ కె.సురేష్ తమ సిబ్బందితో కలిసి వాగు వద్దకు చేరుకున్నారు. స్థానికుల సహాయంతో ఆసిఫ్ను బయటకు తీసి చికిత్స నిమిత్తం పోలీస్ వాహనంలో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే మార్గమధ్యంలోనే ఆసిఫ్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. యువకుడి మృతిపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఆసిఫ్ తండ్రి రసూల్ అటవీశాఖలో కాంట్రాక్ట్బేస్ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఇంటర్మీడియెట్ వరకు చదివిన ఆసిఫ్ ఇంటి వద్దనే ఉంటున్నాడు. -
అడవుల సంరక్షణకు ప్రాధాన్యం
ఒంగోలు సబర్బన్: అడవుల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పి.రాజాబాబు పేర్కొన్నారు. వివిధ విభాగాల అటవీ శాఖ అధికారులతో, పర్యాటక శాఖ అధికారులతో మంగళవారం ఆయన ప్రకాశం భవన్లో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అడవుల సంరక్షణతో పాటు పర్యాటక రంగం అభివృద్ధి పైనా దృష్టి సారించాలని అందుకు అవసరమైన ఆర్థిక సహకారాన్ని జిల్లా యంత్రాంగం తరఫు నుంచి అందిస్తామన్నారు. జిల్లాలో అటవీ ప్రాంత విస్తీర్ణం, నగరవనాల అభివృద్ధి, రోడ్లు, మొబైల్ టవర్ల నిర్మాణాలు తదితర ప్రాజెక్టులకు అటవీశాఖ అనుమతులు, కోస్తా తీరం వెంట గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ అభివృద్ధి, రెవెన్యూ రికార్డుల్లో రిజర్వ్ ఫారెస్ట్ భూముల వివరాల అప్డేషన్, మ్యుటేషన్, ఫారెస్ట్, వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్, అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలు, పర్యాటక అభివృద్ధి, స్థానికులకు జీవనోపాధి కల్పించేందుకు తీసుకుంటున్న చర్యల గురించి సంబంధిత అధికారులు కలెక్టర్కు వివరించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారానికి అటవీ శాఖల వివిధ విభాగాల నుంచి ఒకరిని ప్రత్యేకంగా కేటాయించాలని చెప్పారు. దీంతోపాటుగా ప్రతినెలా అటవీ భూముల పరిరక్షణకు అవసరమైన సంయుక్త సమావేశం, భూముల జాయింట్ సర్వే జరిగేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. జిల్లాలో రెండు విమానాశ్రయాలు రానున్నాయని, వచ్చే ఏడాది ఆగస్టు నాటికి వెలుగొండ ద్వారా నీళ్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ ఆలోచన అని కలెక్టర్ చెప్పారు. ఇవి అందుబాటులోకి వస్తే ప్రకాశం జిల్లా ముఖచిత్రమే మారిపోతుందన్నారు. హైదరాబాద్, అమరావతి, తిరుపతి, బెంగళూరుకు మధ్యలో ఉన్న ప్రాంతం కావడం, నల్లమల పరిధిలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉండడం వల్ల భవిష్యత్తులో మంచి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేలా అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అటవీశాఖ అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి వినోద్ కుమార్, డీఎఫ్వో(సోషల్ ఫారెస్ట్) రాజశేఖర్ రావు, గిద్దలూరు టైగర్ రిజర్వ్ డీడీ నిషాకుమారి, మార్కాపురం అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ షేక్ మహమ్మద్ అబ్దుల్ రవూఫ్, జిల్లా ఇన్చార్జి పర్యాటక అధికారి రమ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. పర్యాటకాభివృద్ధి పైనా దృష్టి సారించాలి అటవీ, పర్యాటక శాఖలపై సమీక్షలో కలెక్టర్ రాజాబాబు -
చేపల వేటకు వెళ్లి ఒకరు గల్లంతు
తాళ్లూరు: సాగర్ కాలువలో చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయి గల్లంతయ్యాడు. ఈ సంఘటన తాళ్లూరు మండలంలోని వెలుగువారిపాలెం పంచాయితీ రెడ్డి సాగర్ ఓబీసీ కెనాల్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పొదిలి మండలం కాటూరివారిపాలెం గ్రామానికి చెందిన మెలిక ప్రసాద్(40) తన భార్య కొండమ్మతో కలిసి చేపలు పడుతూ జీవనం సాగిస్తుంటాడు. రోజూమాదిరిగానే సాగర్ కాలువలో చేపలు పట్టేందుకు వల వేశౠరు. నీటిలో నుంచి వల బయటకు తీస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు వల కాలుకు చుట్టుకోవడంతో పట్టుతప్పి కాలువలో పడి గల్లంతయ్యాడు. మెలిక ప్రసాద్(40)కు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ప్రసాద్ మరణించి ఉంటాడని భావించిన కుటుంబ సభ్యులు తమ బంధువులతో కలిసి మృతదేహాం కోసం గాలిస్తున్నారు. -
ప్రధాని పర్యటనకు భద్రత కట్టుదిట్టం
పెద్దదోర్నాల: ప్రధాని నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకాశం జిల్లా మార్కాపురం డీఎస్పీ నాగరాజు తెలిపారు. ఈ నెల 16వ తేదీ ప్రధాని నరేంద్రమోదీ శ్రీశైలం పుణ్యక్షేత్రం పర్యటన నేపథ్యంలో చేపట్టబోయే భద్రతా ఏర్పాట్లపై సీఐ ప్రభాకర్రావు, ఎస్సై మహేష్లతో కలిసి స్థానిక పోలీస్స్టేషన్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో పెద్దదోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లే వాహనాలను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మండల కేంద్రంలోని మల్లికార్జున నగర్లోనే నిలిపేస్తామని తెలిపారు. దీంతో పాటు అదే రోజు ప్రధాని కర్నూలు పట్టణంలో పర్యటిస్తుండటంతో గుంటూరు, ఒంగోలు తదితర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులను కుంట, గిద్దలూరు, నంద్యాల మీదుగా దారి మళ్లించనున్నట్లు తెలిపారు. భక్తులు, యాత్రికులు తమ ప్రయాణాలను కొద్ది గంటల పాటు వాయిదా వేసుకోవాలని, వీలుంటే రద్దు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు శ్రీశైలం వెళ్లే వాహనదారులు లైసెన్స్లతో పాటు వాహనాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను తమ వాహనాల్లో కచ్చితంగా ఉంచుకోవాలన్నారు. లైసెన్సులు, ధ్రువీకరణ పత్రాలు లేని పక్షంలో శిక్షలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. దీంతో పాటు నల్లమల అభయారణ్యంలో ప్రయాణించే యాత్రికులు తమ వాహనాలను ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయటం తీవ్రంగా పరిగణిస్తారన్నారు. అలా ఎక్కడ పడిలే అక్కడ వాహనాలను పార్కింగ్ చేస్తే చలానాలు భారీగా ఉంటాయని హెచ్చరించారు. శ్రీశైలం వెళ్లే యాత్రికులు, భక్తులు పోలీసుల నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. శ్రీశైలం వెళ్లే వాహనచోదకులు మద్యం తాగి వాహనాలు నడపటం నేరమని, అధికారులకు పట్టుబడితే శిక్షలు కఠినంగా ఉంటాయన్నారు. నల్లమల అభయారణ్యంలో సుమారు 300 మంది సిబ్బందిలో భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. 16వ తేదీ ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు శ్రీశైలం వెళ్లే వాహనాలు ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలో నిలిపివేత ఉదయం 9 నుంచి 2 గంటల వరకు ప్రయాణాలు నిషేధం కర్నూలు వెళ్లే వాహనాలు కుంట, గిద్దలూరు మీదుగా దారి మళ్లింపు -
ఏకేయూలో బీఎడ్ పరీక్షల నిర్వహణ
ఒంగోలు సిటీ: ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయ పరిధిలోని బీఎడ్ 2వ సంవత్సరం మూడో సెమిస్టర్ విద్యార్థులకు 13వ తేదీ సోమవారం నుంచి పరీక్షలు ప్రారంభమైనట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ జి.సోమశేఖర మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా సోమశేఖర మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 42 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. యూనివర్సిటీ అధికారులు 42 మంది అబ్జర్వర్లు, 3 స్క్వాడ్ టీంలను ఏర్పాటు చేశామని, ఎలాంటి అవకతవకలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నారన్నారు. ఎవరైనా మాల్ ప్రాక్టీసుకు పాల్పడితే డీబార్ చేస్తున్నామని తెలిపారు. 14వ తేదీ మంగళవారం గిద్దలూరు పరిధిలో జరిగిన పరీక్షలో మాల్ ప్రాక్టీసుకు పాల్పడిన ఇద్దరు విద్యార్థులను స్క్వాడ్ టీం డీబార్ చేశారన్నారు. తాను సీఎస్ఆర్ శర్మ కాలేజీ, శ్రీ నాగార్జున డిగ్రీ కాలేజీ సెంటర్లను పరిశీలించినట్లు చెప్పారు. -
కలెక్టర్ను కలిసిన గిద్దలూరు టైగర్ ప్రాజెక్టు డీడీ
ఒంగోలు సబర్బన్: కలెక్టర్ పీ.రాజాబాబును గిద్దలూరు టైగర్ ప్రాజెక్టు డిప్యూటీ డైరెక్టర్ నిషాకుమారి మర్యాద పూర్వకంగా కలిశారు. స్థానిక ప్రకాశం భవన్లోని కలెక్టర్ చాంబర్లో మంగళవారం కలిసిన ఆమె కలెక్టర్కు మొక్క అందజేశారు. ఈ సందర్భంగా ఇద్దరి అధికారుల మధ్య టైగర్ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలు, నల్లమల ప్రాజెక్టులో పర్యాటక అభివృద్ధి అంశాలపై మాట్లాడారు. చీమకుర్తి: గ్రానైట్ ఫ్యాక్టరీల యజమానుల సమ్మె విరమిస్తున్నట్టు ఫ్యాక్టరీల యజమానుల యూనియన్ ప్రతినిధులు ప్రకటించారు. గత 14 రోజుల నుంచి చేస్తున్న సమ్మెను విరమించి బుధవారం నుంచి ఫ్యాక్టరీలను తిరిగి నడపనున్నట్లు యజమానులు తెలిపారు. నాలుగు రోజుల క్రితం గ్రానైట్ ఫ్యాక్టరీల యజమానులు విజయవాడలోని మైన్స్ మంత్రిని కలిశారు. గ్రానైట్ రాయల్టీ వసూళ్లలో ప్రైవేటు ఏజెన్సీ ఏఎంఆర్ కంపెనీ వారు ప్రభుత్వానికి చెల్లించే రాయల్టీకి రెట్టింపు డబ్బులు అనధికారికంగా ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్న విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి సూచనల మేరకు మంగళవారం సమ్మెను విరమించాలని సంతనూతలపాడు, మార్కాపురం ఎమ్మెల్యేలు బీఎన్ విజయకుమార్, కందుల నారాయణరెడ్డి మంగళవారం చీమకుర్తిలోని ఒక ప్రైవేటు గెస్ట్ హౌస్లో గ్రానైట్ ఫ్యాక్టరీల యజమానులతో సమావేశమయ్యారు. అనంతరం సమ్మెను విరమిస్తున్నట్టు ప్రకటించారు. -
ప్రక్షాళనకు వేళాయే!
వేటుతో మొదలాయే..● ఏడాదిన్నరగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న జిల్లా పోలీసులు ● సీఐ, ఎస్సైల వ్యవహారశైలిపై నివేదికలు తెప్పించుకొని పరిశీలిస్తున్న ఎస్పీ హర్షవర్దన్ రాజు ● మహిళల ఫిర్యాదుతోనే పొదిలి సీఐ వెంకటేశ్వర్లుపై వేటు వేసినట్లు పోలీసు వర్గాల్లో ప్రచారం ● మరో సీఐపై కూడా వేటుకు రంగం సిద్ధం ● డ్రంక్ అండ్ డ్రైవ్ వసూళ్లపై సీరియస్ ● ఎస్బీ సిబ్బందిపైనా ఫిర్యాదుల వెల్లువ ● జిల్లాలో భారీగా పోలీసు శాఖ ప్రక్షాళనజిల్లాలో కొంత మంది పోలీసు అధికారుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ నేతల అండదండలతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన హర్షవర్ధన్రాజు వీటన్నింటిపై దృష్టిసారించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే పొదిలి సీఐపై వేటు పడిందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కొత్త పోలీస్ బాస్ ప్రక్షాళన చేసే దిశగా అడుగలు వేస్తారా అన్నది అన్ని వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్బీలో పనిచేస్తున్న కొంత మంది సిబ్బంది వ్యవహారశైలి మీద విపరీతమైన ఆరోపణలు వచ్చాయి. పోలీసు శాఖ ఉద్యోగులుగా కాకుండా అధికారపార్టీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని వారిపై ఆరోపణలు ఉన్నాయి. వారు చక్రం తిప్పి జిల్లాలో పలువురు పోలీసు సిబ్బందిని అటాచ్మెంట్ చేయించడం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా అధికారపార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. దాదాపుగా జిల్లాలో పనిచేస్తున్న అత్యధిక శాతం సీఐలు, ఎస్సైల మీద అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసు శాఖలో సమగ్రమైన మార్పు తీసుకురావాలంటే చాలామంది వేటు వేయాల్సి వస్తుందని, అది సాధ్యమయ్యే పనేనా అంటూ పలువురు చర్చించుకుంటున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు విమర్శలు వచ్చాయి. శాంతి భద్రతలను ఏమాత్రం పట్టించుకోకుండా గాలికొదిలేసినట్టు ఆరోపణలు వచ్చాయి. జిల్లాలోని పలు సర్కిల్ అధికారులపై, కింది స్థాయి సిబ్బంది అధికార పార్టీ నేతలు అండచూసుకుని రెచ్చిపోతున్నారని విమర్శలు ఉన్నాయి. గత నెల 14వ తేదీ ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన వి.హర్షవర్థన్ రాజు తనదైన శైలిలో పోలీసు శాఖలో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పొదిలి సీఐ వెంకటేశ్వర్లును రేంజి వీఆర్కు పంపించడమే కాకుండా ఆఘమేఘాలపై కొత్త సీఐగా రాజేష్ బాధ్యతలను చేపట్టారు. ఇదే తరహాలో మరికొంత మందిపై వేటుపడనుందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల ఒంగోలు రూరల్, తాలుకా పోలీసుస్టేషన్లకు కూతవేటు దూరంలో టీడీపీ నాయకుడు ముప్పవరపు వీరయ్య చౌదరి అత్యంత దారుణంగా హత్యకు గురైన తర్వాత జరిగిన పరిణామాలతో అప్పటి తాలూకా సీఐపై మాత్రం వేటువేసి చేతులు దులుపుకున్నారు. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇక ట్రాఫిక్ విభాగంపై లెక్కలేనన్ని ఆరోపణలు వస్తున్నాయి. అలాగే మరో కీలక అధికారి వ్యవహారంపై కూడా పలు రకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. దీంతో కొత్త బాస్ ఒంగోలు నగరంపై ప్రత్యేక దృష్టిసారించినట్టు తెలుస్తోంది. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లపై రహస్యంగా నివేదిక తెప్పించుకుంటున్నట్టు తెలిసింది. మహిళల ఫిర్యాదుతోనే పొదిలి సీఐపై వేటు... పొదిలి సీఐ వెంకటేశ్వర్లు మీద తొలి నుంచి అనేక ఆరోపణలు వస్తున్నాయి. అవినీతి అరోపణలు మాత్రమే కాకుండా ఆయన వ్యక్తిగత వ్యవహారశైలి గురించి పలు ఆరోపణలు ఉన్నాయి. ఒంగోలు వన్టౌన్ సీఐగా పనిచేసిన సమయంలో వ్యక్తిగత సమస్య మీద పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వేధించడంపై పత్రికలలో కథనాలు వచ్చాయి. మార్టూరు టోల్ ప్లాజా వద్ద ప్రజలంతా చూస్తుండగానే మహిళను కొట్టడం సంచలనం సృష్టించింది. తాజాగా పొదిలి సీఐగా ఉన్న ఆయన పోలీస్స్టేషన్కు వచ్చే మహిళలను వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధిత మహిళలు ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఎస్పీ..విషయాన్ని రేంజి ఐజీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో రాత్రికి రాత్రే ఆయన్ను వీఆర్కు పంపించడమే కాకుండా ఆయన స్థానంలో రాజేష్ను నియమించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ వ్యాపారంపై సీరియస్... జిల్లా కేంద్రమైన ఒంగోలులో గత ఏడాదిన్నర కాలంగా ట్రాఫిక్ డీఎస్పీ లేకుండానే గడిచిపోయింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల విషయంలో ట్రాఫిక్ పోలీస్ అధికారులు భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. డ్రంక్ డ్రైవ్లో పట్టుబడిన వాహనాల అసలు జరిమానా కంటే వారి వసూళ్లే అధికంగా ఉండేవని బాధితులు వాపోయారు. మోటారు బైకు దొరికితే అదనంగా రూ.10 వేలు, ఆటో, కార్లు వంటి వాహనాలు దొరికితే రూ.20 వేల వరకు వసూలు చేసేవారని ఆరోపణలు ఉన్నాయి. కోర్టు నుంచి ఆదేశాలు వచ్చినా .. జిల్లాలో కొందరు సీఐలు రాజకీయ నాయకులు మద్దతుతో రెచ్చిపోయినట్లు ఆరోపణలు వచ్చాయి. నగరంలోని ఒక ప్రభుత్వ వైద్యశాలలో పనిచేసే మహిళా ఉద్యోగినిని ఇద్దరు సహోద్యోగులు వేధిస్తున్నారన్న ఆరోపణలపై ఓ సీఐ కేసు నమోదు చేయకుండా తాత్సారం చేశారు. కోర్టు నుంచి ఆదేశాలు వచ్చినా బేఖాతరు చేయలేదని ఆ మహిళా ఉద్యోగి ఆరోపిస్తున్నారు. గత సోమవారం సదరు మహిళ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ కేసు గురించి కూడా ఆయన సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఒక ఎస్ఐ తీరుపై కూడా ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఒంగోలు డెన్పై విమర్శల వెల్లువ... నగరంలోని ఓ పోలీసు అధికారి అనధికార డెన్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడ ఏ నేరం జరిగినా డెన్కు తీసుకెళ్లి విచారణ చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా సింగిల్ నెంబర్ లాటరీ, గంజాయి కేసుల పేరుతో ఎస్సీ ఎస్టీ బీసీ, మైనారిటీ యువకులను తీసుకొచ్చి వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై కూడా ప్రజాసంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒంగోలు కేంద్రంగా పనిచేస్తున్న మరో సీఐపై కూడా ఇదే విధమైన ఫిర్యాదులొచ్చినట్టు సమాచారం. రెండు నెలల క్రితం సదరు సీఐ డిపార్టుమెంట్లో పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగిని తీసుకొని వైజాగ్ విహారయాత్రకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న గత ఎస్పీ దామోదర్ సీఐకు క్లాస్ పీకడమే కాకుండా సదరు మహిళా ఉద్యోగినిపై బదిలీ వేటు వేసినట్లు సమాచారం. ఇక గ్రానైట్ టిప్పర్లు, ఇసుక లారీల నుంచి సైతం భారీగా వసూలు చేస్తున్నారని ఆయనపై వస్తున్న ఆరోపణల విషయంలో కూడా ఎస్పీ సీరియస్గా ఉన్నట్లు సమాచారం. -
జనార్దనరావు వెనుక ప్రభుత్వ పెద్దలు?
ఒంగోలు సిటీ: కుటీర పరిశ్రమల్లా నకిలీ మద్యం తయారు చేస్తూ, ఆధారాలతో సహా బయటపడినప్పటి నుంచి దాన్ని ఎలాగైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అంటించేందుకు టీడీపీ పెద్దలు చేస్తున్న కుట్రలు పరాకాష్టకు చేరాయని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి అశోక్బాబు ధ్వజమెత్తారు. నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిలీ మద్యం కేసులో వైఎస్సార్ సీపీ నాయకుడు జోగి రమేష్కు ప్రమేయం ఉందంటూ ఆ కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు ఆరోపణ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. దానిపై ఎల్లో మీడియా రెచ్చిపోతూ, నిన్న సాయంత్రం నుంచే ట్రోల్స్ చేస్తోందన్నారు. కేవలం వైఎస్సార్ సీపీపైనా, ఆ పార్టీ నాయకులపైనా కక్ష సాధింపులకు పాల్పడడం, కేసు నుంచి తాము బయట పడేందుకు డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా సీఎం చంద్రబాబు చేసిన కుట్ర అని దుయ్యబట్టారు. ‘‘అసలు జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న అద్దేపల్లి జనార్దనరావు వీడియో ఎలా రికార్డ్ చేశాడు? పైగా తన ఫోన్ పోయిందని చెప్పినట్లు ఎల్లో మీడియాలోనే వచ్చింది. అలాగే ఏ కేసులో నిందితుడైనా, ఇన్వెస్టిగేషన్ అధికారుల ముందు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు నిలబడి, చేతులు కట్టుకుని వినమ్రతతో మాట్లాడతారు. కానీ నిన్న జనార్దనరావు లీక్ చేసిన వీడియోలో ఆయన చక్కగా చైర్లో కూర్చుని ఉన్నాడు. పక్క నుంచి ఆఫీసర్ ఎవరో ప్రామ్ట్ చేస్తునట్లుగా ఉంది. పైగా తను ఆఫ్రికా నుంచి వచ్చినప్పటి డ్రెస్తోనే ఉన్నాడు. మరి ఆ వీడియో ఎప్పుడు, ఎవరు, ఎవరి ఫోన్లో రికార్డు చేశారు? ఇదంతా చూస్తుంటే, ఒక పథకం ప్రకారం చేసిన కుట్ర మాదిరిగా కనిపించడం లేదా’’ అని వరికూటి సూటిగా ప్రశ్నించారు. అలాగే ఆ వీడియోను మీడియాకు ఎవరు విడుదల చేశారు? అన్నది తేలాలన్నారు. ఈ కేసులో వాస్తవాలను కప్పిపుచ్చుతూ కొత్త కట్టుకథ వినిపించేందుకే ఆ వీడియో విడుదల చేశారన్నది స్పష్టమవుతోందని, పోలీసుల అదుపులో, జైలు అధికారుల రిమాండ్లో ఉన్న వ్యక్తి వీడియో లీకు కావడానికి బాధ్యత ఎవరిదని నిలదీశారు. జనార్దనరావు గత వారం ఆఫ్రికా నుంచి కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడని, నకిలీ మద్యం తయారీలో పార్టీ, ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేదని, తాము మాత్రమే ఆ పని చేశామని చెప్పుకొచ్చాడన్నారు. ఆ రోజే మరి నిజంగా జోగి రమేష్ పేరు ఎందుకు ప్రస్తావించలేదని, రమేష్ చెబితేనే తాను నకిలీ మద్యం తయారు చేసిన విషయాన్ని ఆ వీడియోలోనే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. కేసులో ఏ–1 నిందితుడైన జనార్దనరావు చంద్రబాబుకు అంతటి సన్నిహితుడేనని, 2024 ఎన్నికల్లో తంబళ్లపల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జయచంద్రారెడ్డికి చంద్రబాబు టికెట్ ఇచ్చినప్పుడు జనార్దనరావు అక్కడే ఉన్నాడన్నారు. బీఫాం ఇచ్చేటప్పుడు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులే ఉంటారు. మరి జనార్దనరావు ఆ సమయంలో చంద్రబాబు, జయచంద్రారెడ్డిలతో ఉండటం దేనికి సంకేతమన్నారు. ఇన్ని ఆధారాలు కనిపిస్తున్నా జనార్దనరావుకు జోగి రమేష్ సన్నిహితుడన్న ప్రభుత్వ వాదన పూర్తిగా కట్టు కథన్నారు. నకిలీ మద్యం కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న వ్యక్తి ఓ కార్పొరేట్ పారిశ్రామికవేత్త తరహాలో దర్జాగా గన్నవరం విమానాశ్రయంలో దిగారు. ఆయన ధీమా వెనుక దన్ను ఎవరు? కేసు నుంచి బయటపడేస్తామని ముఖ్యనేత హామీ ఇచ్చిన ధీమాతోనే కదా ఆయన అంత దర్జాగా వచ్చారని ఆరోపించారు. అంత హడావుడిగా ఎందుకు ఆంధ్రప్రదేశ్ చేరుకున్నారు? వెంటనే వచ్చి తాము చెప్పినట్టుగా కట్టు కథలు చెప్పాలన్న ముఖ్యనేత ఆదేశించారన్నది నిజం కాదా అన్నారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న జోగి రమేశ్కు ఆయన నిజంగానే సన్నిహితుడే అయితే ఇంత హడావుడిగా విదేశాల నుంచి వచ్చే ధైర్యం చేయలేరు కదా? అంటే జనార్దన్రావు వీడియో ద్వారా చెప్పిందంతా ప్రభుత్వ పెద్దలు అల్లిన కట్టు కథ అన్నది స్పష్టమవుతోందన్నారు. అసలు జనార్దనరావు ఫోను గుట్టు విప్పితే దీని వెనకాల ఉన్న బడా వ్యక్తుల జాతకాలు బయటకు వస్తాయన్నారు. ములకలచెరువులో నకిలీ మద్యం రాకెట్ బయటపడిన రోజు మీడియాతో మాట్లాడిన ఎకై ్సజ్ అధికారులు, అక్కడ ఈ ఏడాది మే, జూన్ నుంచి నకిలీ మద్యం తయారు చేస్తున్నారని చెప్పారన్నారు. ఇప్పుడు జనార్దనరావు తన వీడియోలో గత ప్రభుత్వ హయాం నుంచి జోగి రమేష్ చెప్పడం వల్లనే నకిలీ మద్యం తయారు చేశానని చెబుతున్నారని, దానికి, దీనికి లింక్ కుదరడం లేదన్నారు. బాబు మాటలే జనార్దనరావు వీడియో.. జనార్దనరావు వీడియో సోమవారం సాయంత్రం విడుదల కాగా, అందులోని విషయాలపై ముందురోజు రాత్రే.. అంటే ఆదివారం రాత్రి మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు సూచన ప్రాయంగా వివరాలు ఎలా వెల్లడించారు? అంటే ఆ వీడియో విడుదల కానుందని, అందులో ఏం మాట్లాడారన్న సమాచారం ఒక రోజు ముందుగానే ఆయనకు తెలుసా అని ప్రశ్నించారు. నకిలీ మద్యం కేసులో వైఎస్సార్ సీపీ నాయకులకు ప్రమేయం ఉందని చంద్రబాబు ఆదివారం రాత్రి చెప్పిన విషయాలే.. సోమవారం విడుదలైన జనార్దన్రావు వీడియోలోనూ ఉండటం వెనుక లోగుట్టు ఏమిటన్నారు. ఇవన్నీ చూస్తుంటే.. ఇదంతా ఒక పక్కా వ్యూహం ప్రకారం విపక్ష వైఎస్సార్ సీపీపై బురద చల్లుతూ, తాము ఈ కేసు నుంచి బయట పడేందుకు, ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వ పెద్దలు చేస్తున్న కుట్రన్నారు.. ఒక్క మాటలో చెప్పాల్చంటే.. పెదబాబు, చినబాబు చేసిన కుట్ర, కుతంత్రం ఇదంతా? అది నిజం కాదని చెప్పే ధైర్యం ఆ ఇద్దరికీ ఉందా? అని ప్రశ్నించారు. జయచంద్రారెడ్డిని ఎందుకు తీసుకురావడం లేదు.. ములకలచెరువు నకిలీ మద్యం మాఫియాలో కీలక పాత్రధారిగా ఉన్న టీడీపీ నేత జయచంద్రారెడ్డిని విదేశాల నుంచి రప్పించేందుకు పోలీసులు ఎందుకు ప్రయత్నించడం లేదు? ఆయనపై ఎందుకు ఇంకా లుక్ అవుట్ నోటీసు జారీ చేయడం లేదని వరికూటి ప్రశ్నించారు. ఆయన రాష్ట్రానికి వస్తే తమ దందా బయటపడుతుందని ప్రభుత్వ పెద్దలు భయపడుతున్నారని నిలదీశారు. నకిలీ మద్యం బయటపడగానే ముఖ్యమంత్రి చంద్రబాబు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారన్నారు. అసలు ఆ నకిలీ అన్నది ఒక ప్రాంతానికే పరిమితం అన్నట్టు నమ్మించేందుకు యత్నించారన్నారు. మరి ఇప్పుడు ఎందుకు రాష్ట్రవ్యాప్తంగా మద్యం నాణ్యత తనిఖీకి ప్రత్యేక యాప్ ప్రవేశపెట్టారు? అంటే నకిలీ మద్యం రాష్ట్రమంతా విస్తరించిందని ఒప్పుకున్నట్లే కదా అని ప్రశ్నించారు. నిజంగా జోగి రమేష్ చెబితేనే జనార్దనరావు నకిలీ మద్యం తయారు చేస్తే.. తాను జయచంద్రారెడ్డికి చెందిన వాహనంలోనే ఆ మద్యాన్ని రవాణా చేశానని జయచంద్రారెడ్డి డ్రైవర్ చెప్పారు. మరి అక్కడ కూడా జోగి రమేష్ చెబితేనే ఆ రవాణా జరిగిందా? అని నిలదీశారు. వైఎస్సార్ సీపీ డిమాండ్ చేస్తున్నట్లు నకిలీ మద్యం కేసుపై సీబీఐ దర్యాప్తు ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలోని అన్ని వైన్షాప్లు, పర్మిట్రూమ్లు, బార్లు, బెల్టు షాప్ల్లో తనిఖీలు ఎందుకు చేయడం లేదు? ఏది అసలు మద్యం? ఏది నకిలీ అనేది గుర్తించే ప్రయత్నం ఎందుకు చేయడం లేదని నిలదీశారు. -
17న జాబ్ మేళా
ఒంగోలు సబర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 17న ఎస్ఎన్పాడు మండలంలోని ఎండ్లూరి డొంకలోని మహిళా ప్రాంగణంలో ‘జాబ్ మేళా‘ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పీ.రాజా బాబు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం తన ఛాంబర్లో అందుకు సంబంధించిన పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ జాబ్ మేళాలో హెటెరో లాబ్స్, శ్రీ చక్ర హ్యుందాయ్, ఎంఆర్ఎఫ్, బ్రహ్మ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, భారత్ ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్, టాటా ఎలక్ట్రానిక్స్, ఫ్లిప్కార్ట్, పేటీఎం, పీఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్, తిరుమల ఆటోమోటివ్స్ వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. 18 నుండి 35 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు తమ అర్హత ప్రకారం ఈ మేళాలో పాల్గొని ఉద్యోగ అవకాశాలను పొందవచ్చు. బీటెక్, డిగ్రీ, ఇంటర్మీడియెట్, ఐటీఐ, డిప్లొమా, పీజీ వంటి అర్హతలున్న అభ్యర్థులకు వివిధ రంగాల్లో అవకాశాలు లభించనున్నాయి. జిల్లా యువత తమ రిజిస్ట్రేషన్ను రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లో పూర్తి చేసుకోవాలని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. పూర్తి వివరాల కోసం సంప్రదించాల్సిన టోల్ ఫ్రీ నంబర్లు: 99888 53335, 87126 55866, 87901 18349, 87901 17279 ఈ నంబర్లతో పాటు కార్యాలయంలో అందుబాటులో సంప్రదించవలసిన ఎస్.కె. బాషా: 99630 05209 ను కూడా సంప్రదించవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధి అధికారి రమాదేవి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జె.రవితేజతో పాటు ఇతర ఇతర అధికారులు పాల్గొన్నారు. -
శానిటేషన్ పరిశీలించిన డీపీఓ
సంతనూతలపాడు: మండల కేంద్రమైన సంతనూతలపాడులో మంగళవారం శానిటేషన్, ఓహెచ్ఎస్ఆర్, తాగునీటి ట్యాంకు, ఎస్ డబ్ల్యూపీసీ కేంద్రం, గార్బేజ్ కలెక్షన్, స్వామిత్వ సర్వేలను జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు పరిశీలించారు. వాటర్ ట్యాంక్ వద్ద ఇంజినీరింగ్ అసిస్టెంట్ ద్వారా వాటర్ టెస్టింగ్ చేయించారు. 15 రోజులకు ఒకసారి ఓహెచ్ ఎస్ఆర్ ట్యాంకును క్లీన్ చేయాలని డీపీఓ పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. తాగునీరు కలుషితం కాకుండా ఎప్పటికప్పుడు ట్యాంక్ పరిసరాలు పరిశుభ్రం చేయించాలన్నారు. ఆయన వెంట ఎంపీడీవో డి.సురేష్ బాబు, డిప్యూటీ ఎంపీడీవో పి.రవికుమార్, ఆర్డబ్ల్యూఎస్ అసిస్టెంట్ ఇంజినీర్ మధుసూదన్రావు, పంచాయతీ కార్యదర్శి ఎన్.ప్రతాప్ కుమార్, డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ చక్రధర్, నియోజకవర్గ రిసోర్స్ పర్సన్ జయశంకర్, గ్రామపంచాయతీ ప్రతినిధులు బాబురావు, శిఖామణి, పంచాయతీ శానిటేషన్ సిబ్బంది, క్లాప్ మిత్రలు పాల్గొన్నారు. -
నాణ్యం పేరుతో కల్తీ మద్యం
యర్రగొండపాలెం: కల్తీ మద్యం సరఫరా చేసే ఆలోచన మనస్సులో పెట్టుకొని నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్పిన ఏకై క నాయకుడు చంద్రబాబు అని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కూటమి ప్రభుత్వ మద్యం విధానాలకు వ్యతిరేకంగా సోమవారం పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించి, ఎకై ్సజ్ సర్కిల్ కార్యాలయంలో మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు రాజకీయ చరిత్రలో కనీసం నాణ్యమైన మంచి నీళ్లు ఇచ్చిన చరిత్ర లేదని ఆయన విమర్శించారు. బాబు మాటలు నమ్మిన మద్యం ప్రియుల నోట్లో మట్టి కొడుతున్నాడని, రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం సరఫరా చేసి వారి ప్రాణాలను హరిస్తున్నాడని విమర్శించారు. కూటమి నాయకులు దోపిడీనే లక్ష్యంగా చేసుకొని అడ్డగోలుగా దోచుకోమని వాళ్ల ఎమ్మెల్యేలకు, నాయకులకు ఈ వ్యాపారాన్ని అప్పచెప్పాడని, సినిమా ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్లకు సినిమాలు అప్పచెప్పినట్లు మద్యం వ్యాపారాన్ని దళారులకు అప్పచెప్పాడని అన్నారు. శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర, విశాఖపట్నం అయ్యనపాత్రుడి పక్కనే ఉన్న నాయకుడికి, బనగానిపల్లెలో ఆ నియోజకవర్గ ఇన్చార్జికి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ఇంకొక నాయకుడికి, కృష్ణ, గుంటూరును అక్కడ ఉన్న ఒకరికి ఇస్తే ఇబ్రహీంపట్నంలో పట్టుబడ్డాడని, రాష్ట్రంలో ప్రతి చోట కల్తీ మద్యం ఏరులై పారుతోందని అన్నారు. జగనన్న పాలనలో ఒక్క బెల్ట్ షాపు ఉండేదికాదని, ఆయన పాలనలో రాష్ట్రంలో ఉన్న 40 వేల బెల్ట్ షాపులు తీసివేయిస్తే అప్పట్లో మద్యం అమ్మకాలు తగ్గాయని, అర్ధరాత్రి మద్యం సీసా దొరికేది కాదని అన్నారు. ప్రతి చోట పిప్పరమెంట్ దొరకదేమో కానీ నారావారి కల్తీ బుడ్డి దొరుకుతుందని ఆయన వ్యంగ్యంగా అన్నారు. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ కాలంలో ప్రతి సంవత్సరం 10 శాతం మద్యం అమ్మకాల్లో ఆదాయం వచ్చేదని, మద్యం అమ్మకాలు తగ్గాయని, ఆదాయం పెరిగేదని, ఈ రోజు అమ్మకాలు విపరీతంగా పెరిగాయని, ఆదాయం మాంత్రం 3 శాతానికి పడిపోయిందని అన్నారు. 10 శాతం నుంచి 3 శాతానికి ఆదాయం పడిపోయిందంటే మిగిలిన ఆ డబ్బు కూటమి ఎమ్మెల్యేల జేబుల్లోకి వెళ్తోందని అన్నారు. ఊరూరా వెలిసిన ఈ సారా కొట్లను ధ్వంసం చేయాల్సిన అవసరం ఉందని, తక్షణమే ఎకై ్సజ్ శాఖవారు జోక్యం చేసుకొని వీటిని అదుపు చేయకపోతే మహిళలే ఆ షాపులపై తిరగబడతారని హెచ్చరించారు. 30 వేల మంది కల్తీమద్యం బారినపడి చనిపోయారని సిగ్గులేకుండా టీడీపీ నాయకులు చెప్పారని, చనిపోయిన వారిపేర్లు ఈ నాటివరకు చెప్పడంలేదని, కల్తీమద్యంతో పట్టుబడిన టీడీపీ నాయకులే ఆ వ్యాపారాన్ని చేస్తూ గతంలో వ్యాపారం జరిగిందని ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు నీతిమాలిన రాజకీయాన్ని ఆపాలని, మద్యం, వ్యవసాయం, మట్టి, ఇసుక, గనులను ప్రైవేటు వారికి అమ్మేస్తున్నాడని, ఈ రోజు గ్రానైట్ ఇండస్ట్రీ పనిచేయడం లేదని, ఎక్కడికక్కడ చెక్పోస్టులు పెట్టి సీనరేజ్లు వసూలు చేస్తున్నారని అన్నారు. జిల్లాకు వచ్చిన మెడికల్ కాలేజీని తమకు అనుకూలమైన ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేశాడని, ఇటువంటి ఒంటెత్తు పోకడలు, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే మరో నేపాల్ మాదిరి గా ఆంధ్ర రాష్ట్ర మారుతుందని హెచ్చరించారు. -
హాస్టళ్లు తనిఖీ చేసిన ఎమ్మెల్యే తాటిపర్తి
యర్రగొండపాలెం: ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ సోమవారం పట్టణంలో ఉన్న హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్సీ బాలికలు, బాలుర హాస్టళ్లలో ఉన్న విద్యార్థులతో ఆయన కాసేపు ముచ్చటించారు. ఆయా వసతి గృహాల్లో ఉన్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. శుభ్రమైన భోజనం, శుద్ధి చేసిన నీటిని విద్యార్థులకు అందించాలని వార్డన్లకు సూచించారు. ఆయన వెంట ఎంపీపీ దొంతా కిరణ్గౌడ్, జెడ్పీటీసీ చేదూరి విజయభాస్కర్, సర్పంచ్ ఆర్.అరుణాబాయి ఉన్నారు. ఒంగోలు సబర్బన్: సురక్షితమైన జీవితానికి ఏడు సూత్రాలు పాటిస్తే అనారోగ్యంపాలు కాకుండా చేసుకోవచ్చని కలెక్టర్ పీ.రాజాబాబు పేర్కొన్నారు. గ్లోబల్ హ్యాండ్ వాష్ డే ప్రాధాన్యతను వివరిస్తూ ముద్రించిన గోడ పత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. స్థానిక కలెక్టరేట్లోని మీ కోసం భవన్లో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం, యూనిసెఫ్, విజయ వాణి చారిటబుల్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. కలెక్టర్ పీ.రాజాబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వ్యక్తిగత శుభ్రత పాటించాలన్నారు. ముఖ్యమైన ఏడు సందర్భాల్లో చేతులను కడుక్కోవడం అలవాటుగా చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, డీఆర్ఓ ఓబులేసు, జిల్లా విద్యాధికారి కిరణ్ కుమార్, జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, ఐసీడీఎస్ పీడీ సువర్ణ, విజయ వాహిని చారిటబుల్ ఫౌండేషన్ ప్రోగ్రాం ఆఫీసర్ టీ రంగారావు, వాష్ ప్రోగ్రాం ప్రతినిధి కే మరియబాబు పాల్గొన్నారు. ఒంగోలు టౌన్: కార్తీక మాసం సందర్భంగా జిల్లాలోని పాకల బీచ్కు ప్రతి ఆదివారం ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు ప్రజా రవాణాధికారి సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒంగోలు ఆర్టీసీ డిపో నుంచి ప్రతి ఆదివారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రతి గంటకు ఒక బస్సు సర్వీసును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పొదిలి ఆర్టీసీ డిపో నుంచి ఉదయం రెండు, మధ్యాహ్నం రెండు ట్రిప్పులు వేసినట్లు చెప్పారు. కనిగిరి ఆర్టీసీ డిపో నుంచి కందుకూరు మీదుగా 4 బస్సు సర్వీసులు, కందుకూరు డిపోలో 6 బస్సు సర్వీసులను నడపనున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రూపుల వారీగా వనభోజనాలకు వెళ్లే వారికి అద్దె ప్రతిపాదికన ప్రత్యేక బస్సులు ఇవ్వనున్నట్లు తెలిపారు. -
కడలి వెంట కన్నీటి చూపులు
చీరాల: కడలి కెరటాలు ఆ కుటుంబాలలో కన్నీటిని మిగిల్చాయి. సరదాగా సేద తీరేందుకు చీరాల ఓడరేవు తీరానికి వచ్చి సముద్రస్నానం చేస్తుండగా అలల తాకిడికి గల్లంతైన ఐదుగురు విద్యార్థులలో ఆదివారమే ముగ్గురు మృతదేహాలు లభ్యమవగా, సోమవారం మరో విద్యార్థి మృతదేహం తీరానికి చేరింది. దీంతో బాధిత కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అమరావతిలోని విట్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎంటెక్ చదువుతున్న ఏడుగురు స్నేహితులు ఆదివారం సెలవు దినం కావడంతో సరదాగా గడిపేందుకు చీరాల ఓడరేవు సముద్రతీరానికి వచ్చి గల్లంతైన విషయం విధితమే. స్థానిక మత్య్సకారులు గమనించి నలుగురు విద్యార్థులను బయటకు తీసుకురాగా, సాయి మణిదీప్ (జడ్చర్ల), జీవన్ సాత్విక్ (హైదరాబాద్), శ్రీసాకేత్ (హైదరాబాద్) గల్లంతయ్యారు. కొంత సమయం తర్వాత ముగ్గురి మృతదేహాలు తీరానికి చేరాయి. భోరుమన్న గౌతమ్ కుటుంబ సభ్యులు... మరో ఘటనలో వేటపాలెం మండలం వడ్డె సంఘానికి చెందిన ఇద్దరు విద్యార్థులు కూడా ఆదివారం గల్లంతయ్యారు. రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినా వీరి ఆచూకీ లభించలేదు. బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ స్వయంగా వాడరేవు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. మైరెన్, గజ ఈతగాళ్లు, అగ్నిమాపక సిబ్బంది సహకారంతో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి కోసం కుటుంబ సభ్యులు రాత్రంతా తీరం వద్దనే వేచి ఉన్నారు. సోమవారం ఉదయం తీరానికి గౌతమ్ కృష్ణప్రసాద్ మృతదేహం వచ్చింది. దీంతో అతని కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి... ఆదివారం లభ్యమైన ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు, సోమవారం తీరానికి చేరిన మరో విద్యార్థికి మృతదేహానికి చీరాల ఏరియా వైద్యశాలలో సోమవారం పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. విద్యార్థులు గల్లంతైన సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు హుటాహుటిన చీరాల వచ్చి ఏరియా వైద్యశాలలోని మార్చురీలో ఉన్న మృతదేహాలను చూసి కన్నీటిపర్యంతమయ్యారు. పెద్ద చదువులు చదువుకుని ఆసరాగా నిలుస్తారని అనుకుంటే అందరినీ వదిలి వెళ్లిపోయారా అంటూ కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు కంటతడి పెట్టించాయి. ఐదో విద్యార్థి షారోన్ ఆచూకీ లభించకపోవడంతో బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్, ఆర్డీఓ చంద్రశేఖర్నాయుడు, చీరాల డీఎస్పీ, సీఐలు, ఎస్సైలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. చీరాల ఓడరేవు తీరానికి వచ్చిన గౌతమ్ మృతదేహం విద్యార్థుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి జాడలేని షారోన్ తీరంలో గాలింపు చర్యల కొనసాగింపు -
విద్యుదాఘాతానికి బేల్దారి కూలీ మృతి
కంభం: విద్యుదాఘాతానికి బేల్దారి కూలీ మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే..కందులాపురం కూడలి సమీపంలో నిర్మాణంలో ఓ గృహం వద్ద పసుపుల పెద్ద గురువయ్య(53) అనే వ్యక్తి పనిచేస్తున్న సమయంలో ఆ గృహానికి ముందు భాగంలో ఉన్న విద్యుత్లైన్ తీగలకు తగిలి షాక్ గురై కిందకు పడిపోయాడు. అతన్ని వెంటనే కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యశాలలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం ఒంగోలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. -
గడువు లోగా పరిష్కరించాలి
● ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలపై కలెక్టర్ రాజాబాబు ఒంగోలు సబర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన సమస్యలను నిర్ణీత గడువు లోగా చిత్తశుద్ధితో పరిష్కరించాలని కలెక్టర్ పి.రాజాబాబు అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఒంగోలు కలెక్టరేట్లోని మీ కోసం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన శ్రీప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యు అధికారి చిన ఓబులేసు, ఒంగోలు ఆర్డీఓ కళావతి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కుమార్, పార్ధసారధి, విజయజ్యోతిలు అర్జీలు స్వీకరించారు. అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులకు సూచించారు. సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకంతో ప్రజలు మన దగ్గరకు వస్తారని, ఆ నమ్మకాన్ని ప్రతి అధికారి నిలబెట్టుకోవాలన్నారు. ప్రతి అర్జీని క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు. సీపీఆర్పై మాక్డ్రిల్ ఈ సందర్భంగా సీపీఆర్పై మాక్డ్రిల్ నిర్వహించారు. ఆకస్మాత్తుగా ఎవరైనా గుండెపోటుతో పడిపోతే ఏ విధంగా సీపీఆర్ చేయాలో వైద్యులు అవగాహన కల్పించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మాక్డ్రిల్ నిర్వహిచంచారు. ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ హేమంత్, డీసీహెస్ డార్టర్ సూరిబాబు, డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు సీపీఆర్ చేయాల్సిన పద్ధతిని వివరించారు. -
కేసు నమోదు చేయాలంటూ ఆందోళన
మార్కాపురం: లారీ డ్రైవర్ను కొట్టిన ఓనర్పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ డ్రైవర్ తరఫు వారు సోమవారం మార్కాపురం పోలీసుస్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. పట్టణంలోని సుందరయ్యకాలనీలో నివాసముండే లారీ డ్రైవర్ నారాయణ మద్యం తాగాడని మూడు రోజుల క్రితం చీమకుర్తికి చెందిన లారీ ఓనర్ మర్రిచెట్లపాలెం సమీపంలో తీవ్రంగా కొట్టాడు. దీంతో పొదిలిలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో నారాయణ చికిత్స పొందాడు. ఈ సంఘటనకు సంబంధించి లారీ ఓనర్పై మార్కాపురం పోలీసుస్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ కింద కేసు నమోదు చేయాలని సీపీఎం నాయకుడు రూబెన్, మరికొంత మంది సుందరయ్యకాలనీ వాసులు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులకు, కాలనీవాసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తమ విధులను అడ్డుకోవద్దంటూ ఎస్సై సైదుబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో కొంతసేపు స్వల్ప ఉద్రిక్తత కూడా నెలకొంది. సీపీఎం నాయకుడు రూబెన్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో సీపీఎం నాయకుడు రఫీ, తదితరులు స్టేషన్కు చేరుకుని మాట్లాడారు. అనంతరం వివాదం సద్దుమణిగింది. కాగా, మార్కాపురం పట్టణ ఎస్సై తన విధులకు ఆటంకం కలిగించారంటూ సీపీఎం నాయకుడు రూబెన్పై కేసు నమోదు చేశారు. దీంతో పాటు పోలీసుస్టేషన్ వద్ద ఆందోళన చేసిన దేవరాజు, మరికొంత మందిపై కూడా కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
గనుల శాఖపై నిరంతర పర్యవేక్షణ
● కలెక్టర్ రాజాబాబు ఒంగోలు సబర్బన్: గనుల శాఖకు సంబంధించి నిరంతర పర్యవేక్షణ అవసరమని కలెక్టర్ పి.రాజాబాబు గనుల శాఖ అధికారులను ఆదేశించారు. ఒంగోలు కలెక్టరేట్లోని తన ఛాంబర్లో గనుల శాఖ అధికారులతో సోమవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జిల్లాలోని గనుల విస్తీర్ణం, ప్రభుత్వానికి రావాల్సిన రాబడిపై, గనుల రకాలు, లభిస్తున్న ఉపాధి, రవాణా, ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం, ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, తదితర వివరాలపై కలెక్టర్ ఆరా తీశారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.432.94 కోట్లు రాబడి లక్ష్యం నిర్దేశించగా, సెప్టెంబర్ నెల వరకు రూ.157.08 కోట్లు వచ్చిందన్నారు. జిల్లాలో మేజర్, మైనర్ మైనింగ్ క్వారీలు ఉండగా, అందులో 144 క్వారీలు పనిచేస్తున్నాయని, 132 క్వారీలు పనిచేయడం లేదని గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్ కలెక్టర్కు వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గనుల శాఖ ద్వారా ప్రభుత్వానికి రాబడి పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమ మైనింగ్పై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో ఎక్కడా అక్రమ మైనింగ్ జరగరాదని స్పష్టం చేశారు. జిల్లాలో ఏ కారణం చేతనైనా మైనింగ్ క్వారీ జరగకపోతే సమగ్ర నివేదిక అందించాలని కలెక్టర్ గనుల శాఖ డీడీని ఆదేశించారు. -
శివాలయంలో చోరీ
దొనకొండ: మండలంలోని మంగినపూడి శివాలయంలో దుండగులు ఆదివారం అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. శివాలయం గేటు తాళం పగలకొట్టి కానుకల హుండీని తీసుకువెళ్లి పక్కనే చెరువులో పడేసి, అందులోని కానుకలను తీసుకువెళ్లారు. శివాలయం ఎదురు బడ్డీ కొట్టులో తాళం పగలకొట్టి అందులోని పెట్రోలు, ఇతర తిను బండారాలు, సిగరెట్లు, కూల్డ్రింక్స్ సీసాలు, కొంత నగదు తీసుకువెళ్లారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో కూడా ఇదే శివాలయంలో చోరీకి పాల్పడి విలువైన వస్తువులు అపహరించారని గ్రామస్తులు తెలిపారు. రెండు చెక్ బౌన్స్ కేసుల్లో ఇద్దరికి జైలు శిక్ష ఒంగోలు: రెండు వేర్వేరు చెక్ బౌన్స్ కేసుల్లో ఇద్దరికి జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి వి.వెంకటేశ్వరరావు సోమవారం తీర్పు చెప్పారు. వెలిది బాలాజీ బాబు అనే వ్యక్తి వద్ద నలగర్ల ప్రసాద్ అనే వ్యక్తి రెండు దఫాలుగా రూ.6 లక్షల అప్పు తీసుకున్నాడు. బాకీ చెల్లింపు నిమిత్తం రూ.9,03,800 విలువైన చెక్కు జారీచేయగా, దానిని వెలిది బాలాజీ బాబు బ్యాంకులో జమచేయగా బౌన్స్ అయింది. దీంతో బాలాజీ బాబు కోర్టును ఆశ్రయించగా విచారించిన న్యాయమూర్తి.. నేరం నిరూపణ అయినట్లు పేర్కొంటూ నిందితుడు నలగర్ల ప్రసాద్కు రెండు సంవత్సరాల జైలుశిక్ష విధించడంతో పాటు ఫిర్యాదికి రూ.17,97,600 చెల్లించాలని చెప్పడంతో పాటు కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.10 వేలు జరిమానా విధించారు. మరో కేసులో... చిల్లర నందకిషోర్ అనే వ్యక్తి వద్ద పొత్తూరి బాలకృష్ణ అనే వ్యక్తి వద్ద రూ.6 లక్షల అప్పు తీసుకున్నాడు. బాకీ నిమిత్తం రూ.8 లక్షలకు చెక్కు జారీ చేయగా నందకిషోర్ బ్యాంకులో జమచేశాడు. అది బౌన్స్ అయినట్లు నిర్ధారణ అయింది. దీంతో నంద కిషోర్ కోర్టును ఆశ్రయించాడు. కేసును విచారించిన న్యాయమూర్తి నేరం నిరూపణ అయినట్లు పేర్కొంటూ నిందితునికి రెండు సంవత్సరాల జైలు శిక్ష, ఫిర్యాదికి రూ.12 లక్షలు చెల్లించాలని చెప్పడంతో పాటు కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.10 వేలు జరిమానా విధించారు. -
బస్సుల్లో ఎక్కించుకోవాలని భక్తుల ఆందోళన
పెద్దదోర్నాల: శ్రీశైలం వెళ్లే బస్సుల్లో తమను ఎక్కించుకోవాలంటూ పలువురు భక్తులు ఆర్టీసీ బస్సుల ఎదుట ఆందోళన నిర్వహించి ఆర్టీసీ బస్సులను నిలువరించారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి పెద్దదోర్నాల ఆర్టీసీ బస్టాండులో చోటు చేసుకుంది. వివరాల మేరకు రెండవ శనివారం, ఆదివారం రెండు రోజులు సెలవు దినాలు కావటంతో మండల కేంద్రంలో శ్రీశైలం వెళ్లే యాత్రికులతో రద్దీ నెలకొంది. దీంతో శ్రీశైలం వెళ్లే పలు వాహనాలు యాత్రికుల రద్దీతో కిటకిటలాడాయి. ఈ నేపథ్యంలో ఆదివారం మండల కేంద్రంలో రద్దీ ఎక్కువ కావటంతో శ్రీశైలం వెళ్లే ప్రతి బస్సు వద్ద యాత్రికులు ఎగబడ్డారు. అయితే ప్రయాణికులకు సరిపడినన్ని బస్సులు ఏర్పాటు చేయలేదు. దీనికి తోడు ఘాట్ రోడ్లలో పరిమితికి లోబడి ప్రయాణికులతో వెళ్లాలన్న నిబంధనలు ఉండటంతో కొంత మంది ఆర్టీసీ సిబ్బంది అధిక లోడు ప్రయాణికులతో వెళ్లేందుకు నిరాకరించారు. దీంతో తాము మూడు గంటల నుంచి బస్సుల కోసం కాసుకుని ఉన్నా తమను బస్సుల్లో ఎక్కించుకోలేదని కొందరు ప్రయాణికులు ఆందోళన నిర్వహించి బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో స్పందించిన ఆర్టీసీ కంట్రోలర్లు భక్తులకు నచ్చబెప్పి ప్రతి బస్సులో కొందరు ప్రయాణికులు ఎక్కేందుకు అవకాశం కల్పించటంతో గొడవ సద్దుమణిగింది. -
అధికారులా.. రౌడీలా?
యర్రగొండపాలెం: రెవెన్యూ అధికారులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని, బోగస్ ఇంటి స్థల పట్టాలని చెప్పి నిర్మాణాల్లో ఉన్న గృహాలను వారు దౌర్జన్యంగా కూలగొట్టించారని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ ఆరోపించారు. స్థానిక కొప్పుకొండకు సమీపంలో ఉన్న వెంకటగిరి కాలనీలో గుడిసెలు, నిర్మాణంలో ఉన్న ఇంటి గోడలు, నీటి తొట్లు కూల్చివేయించారని ఆ ప్రాంతం గిరిజనులు చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే స్పందించి ఆదివారం ఆ ప్రాంతానికి వెళ్లి ఆ స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1997, 2008 సంవత్సరాల్లో ప్రభుత్వం చెంచు గిరిజనులకు ఇచ్చిన ఇంటి పట్టాలు బోగస్ పట్టాలని తహసీల్దార్ కూలకొట్టించడం వెనుక టీడీపీ నేతల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. గతంలో పట్టాలు ఇచ్చిన తహసీల్దార్లు బోగస్ పట్టాలు మంజూరు చేశారా అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న తహసీల్దార్ అవి బోగస్ పట్టాలని ఏ విధంగా నిర్ధారించారని, చెంచు గిరిజనులకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అక్కడ ఉన్న నిర్మాణాలను కూలగొట్టించడం హేయమైన చర్యఅని ఆయన అన్నారు. కొంతమంది టీడీపీ నాయకులు ఆ స్థలాలపై కన్నేసి, వాటిని కాజేయటానికి వేసిన పన్నాగాన్ని అధికారులు సమర్ధించి వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో దొంగలు రాజ్యమేలుతున్నారని, ఈ ప్రభుత్వం పేదలకు గృహాలు నిర్మించి ఇవ్వలేకపోయినా.. సొంతంగా నిర్మించుకుంటున్న గృహాలను కూల్చివేయిస్తోందని మండిపడ్డారు. ఆ ప్రాంతంలో గిరిజనులకు ఇంటి పట్టాలు ఇవ్వకుంటే రూ.1.80 కోట్లతో ఐటీడీఏ నిధులు ఖర్చుపెట్టి తారు రోడ్డు ఎందుకు వేయించిందని, తాగు నీటి కోసం బోరు ఏ విధంగా వేయించారని ఆయన అధికారులను ప్రశ్నించారు. ఆ ప్రాంతంలో గిరిజన కాలనీలు ఉన్నాయన్న ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం ఐటీడీఏ నిధులను కేటాయించిన విషయాన్ని అధికారులు పరిగణలోకి తీసుకోకుండా టీడీపీ నాయకులు చెప్పిందే వేదంగా వ్యవహరిస్తున్నారని, గిరిజనులు గృహ నిర్మాణాలు చేయనీయకుండా గిరిజనులను రోడ్డున పడేస్తున్నారని అన్నారు. ఈ సంఘటనపై కలెక్టర్, ఎస్పీల దృష్టికి తీసుకెళ్తామని, గిరిజనులకు తమ పార్టీ అండగా నిలుస్తుందని, వారికి న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తామని ఆయన అన్నారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ దొంతా కిరణ్గౌడ్, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి కొప్పర్తి చిన్న ఓబులరెడ్డి, మండల కన్వీనర్ ఏకుల ముసలారెడ్డి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు పి.రాములు నాయక్, సర్పంచ్ ఆర్.అరుణాబాయి, వివిధ విభాగాల నాయకులు సయ్యద్ జబీవుల్లా, కందూరి కాశీవిశ్వనాథ్, ఆవుల కోటిరెడ్డి, బి.బాలచెన్నయ్య ఉన్నారు. -
జూనియర్ చాంబర్ అధ్యక్షుడిగా శబరీనాథ్
ఒంగోలు టౌన్: జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ ఒంగోలు ఛాప్టర్ అధ్యక్షుడిగా పి.శబరీనాథ్ నాయర్ ఎన్నికయ్యారు. కార్యదర్శిగా కె.వీరబ్రహ్మం, కోశాధికారిగా జె.శ్రీనివాసరావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక మాంటిస్సోరి స్కూల్లో జూనియర్ చాంబర్ వార్షిక సమావేశం ఆదివారం నిర్వహించారు. సమావేశంలో 2026వ సంవత్సరానికి గాను నూతన కమిటీని ఎన్నుకున్నారు. కోనంకి వరుణ్ కుమార్, పి.రామాంజనేయులు, ఏడుకొండలు, శ్రీరాములు రెడ్డి, నాగేశ్వరరావు ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. సమావేశంలో జేసీఐ పూర్వాధ్యక్షులు టి.రవికుమార్, కనకారావు, అద్దంకి శ్రీనివాసరావు, వివి రమణ, ఇస్మాయిల్, ఈపూరి శివప్రసాద్, ఆంద్ర శ్రీనివాసరావు, జాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు వన్టౌన్: ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఒంగోలు మంగమూరు రోడ్డులో బైపాస్ వద్ద ఉన్న సంఘ జిల్లా కార్యాలయంలో కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతి నెలా ఒక నియోజకవర్గంలో జిల్లా కమిటీ, స్థానిక సంఘీయులతో చర్చించి స్థానిక సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని తీర్మానం చేశారు. కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షుడు చెరిగిచర్ల ప్రకాష్, జిల్లా అధ్యక్షుడు పులివర్తి సాయిబాబా, కార్యదర్శి నాగేంద్ర, కోశాధికారి పావులూరు బ్రాహ్మణచారి, కీనల శ్రీనివాసచారి, సన్నమూరి వీరబ్రహ్మం, పదిరి ఆదినారాయణ, చెరుకూరి ఓంకార చారి, పచ్చవ సుబ్రహ్మణ్యం, వేల్పూరి రామారావు, రాచకుళ్ళ రవికుమార్, పోతులూరి వీరబ్రహ్మం, మునిగంటి వెంకటేశ్వరచారి, పోతులూరి శివ, బ్రహ్మచారి, మునగంటి విశ్వరూపచారి, అలుగుపల్లి శ్రీనివాసచారి, గోనుగుంట దిలీప్ తదితరులు పాల్గొన్నారు. -
ఈతకు వెళ్లి యువకుడు మృతి
తాళ్లూరు: ఈతకు వెళ్లి యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని శివరాంపురం గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు. గుమ్మడి ముత్యాలు, సుజాత కుమారుడు గుమ్మడి సన్నీ (20 ) ఏసీ మెకానిక్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం కావడంతో గ్రామంలోని కొంత మంది యువకులతో కలిసి పెద్దసాగర్ కాలువలో ఈత కొట్టేందుకు వెళ్లారు. ఈత కొడుతున్న సమయంలో సన్నీ నీటిలో మునిగి మృతి చెందాడు. మృతునికి ఏడాదిన్నర క్రితమే వివాహమైంది. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సింగరాయకొండ: దాడి కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్సై బి.మహేంద్ర తెలిపారు. వివరాల్లోకి వెళితే..మండలంలోని మూలగుంటపాడు పంచాయతీ విద్యానగర్ 3వ లైనులో నివసిస్తున్న కొల్లా వినయ్పై ఈ నెల 10వ తేదీ శుక్రవారం ఊళ్లపాలెంకు చెందిన కొల్లా సాయి చరణ్, జరుగుమల్లి మండలం సతుకుపాడు గ్రామానికి చెందిన బల్లికుర సుమంత్ దాడి చేశారు. బాధితుడు వినయ్ ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో ఇద్దరు నిందితులను శనివారం సాయంత్రం కందుకూరు ఫ్లైఓవర్ వద్ద అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచినట్లు ఎస్సై పేర్కొన్నారు. ఒంగోలు టౌన్: నగరంలోని బైపాస్ రోడ్డులో డంపింగ్ యార్డు వద్ద అనధికారికంగా ఇసుక విక్రయిస్తున్న 20 ట్రాక్టర్లను పోలీసులు పటుకున్నట్లు సమాచారం. ప్రభుత్వం లైసెన్స్ మంజూరు చేసిన వ్యక్తిని కాదని అనధికారికంగా ఇసుక విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దాంతో ప్రభుత్వం మంజూరు చేసిన లైసెన్స్ రద్దు చేయాలని ప్యూచర్ ట్రేడ్స్కు చెందిన భరత్ ఇటీవల మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్కు వినతిపత్రం అందజేయడంతో ఇసుక అక్రమ విక్రయాల వ్యవహారం బట్టబయలైంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నగరంలో అనధికారికంగా ఇసుక విక్రయిస్తున్న 20 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ఒంగోలు తాలూకా పోలీస్స్టేషన్ సీఐ విజయకృష్ణ నిర్ధారించకపోవడం గమనార్హం. -
విషతుల్యం
కూటమి నేతలు ధనార్జనే ధ్యేయంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. లక్షలాది మందికి నీటి సరఫరా చేసే విషయంలో కాసులకు కక్కుర్తి పడి కలుషిత జలాలతో జనాలను అనారోగ్యం పాలుచేస్తున్నారు. రక్షిత మంచినీరు బదులు మురుగునీటిని సరఫరా చేస్తున్నా అటు పాలకులు, ఇటు అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాణజలం..దర్శి: దర్శి పట్టణం నుంచి దర్శి, పొదిలి, తాళ్లూరు, ముండ్లమూరు మండలాలకు చెందిన ప్రజలకు నిత్యం సాగర్ జలాలు సరఫరా చేసేందుకు నాలుగున్నర దశాబ్దాల కిందట ఎన్ఏపీ (నెదర్లాండ్ ఎయిడెడ్ ప్రాజెక్ట్) సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును నిర్మించారు. ఈ ప్రాంతంలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉండడంతో అప్పట్లో రూ.4 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. సాగర్ కాలువ నుంచి వచ్చే జలాలను స్టోరేజ్ ట్యాంకుకు మోటార్ల ద్వారా సరఫరా చేసి వాటిని శుద్ది చేసి నియోజకవర్గంలో ప్రజలకు తాగునీరు అందించేలా ప్రణాళికలు చేశారు. ప్రారంభంలో దీని ద్వారా దర్శి, కనిగిరి, పొదిలి ప్రాంతాలకు నిత్యం రెండు లక్షల మందికి తాగునీరు అందించేవారు. 930 మీటర్ల మట్టికట్టతో 2538 మిలియన్ లీటర్ల పరిమాణం కలిగిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో నీటిని శుద్ధి చేసేందుకు 7 శాండ్ ఫిల్టర్ బెడ్లు ఏర్పాటు చేశారు. 5 లక్షల లీటర్ల నీటి పరిమాణం కలిగిన క్లియర్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ను కూడా నిర్మించారు. ఫిల్టర్ బెడ్లలో శుద్ధి చేసిన జలాలను నేరుగా క్లియర్ వాటర్ ట్యాంక్లకు సరఫరా చేయాల్సి ఉంటుంది. ప్రారంభంలో దర్శి, పొదిలి, తాళ్లూరు, ముండ్లమూరు మండలాలకు నీటిని పంపేవారు. తర్వాత మర్రిపూడి, కనిగిరి మండలాలకు సైతం నీటిని సరఫరా చేశారు. ఈ నీటిని సరఫరా చేసేందుకు టెండర్లు నిర్వహించేవారు. కాంట్రాక్టు పొందిన వ్యక్తి నీటిని క్రమం తప్పకుండా శుద్ధి చేసి పంపిణీ చేయాల్సి ఉంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నీటి సరఫరా అంతా సక్రమంగా జరిగింది. రోజు విడిచి రోజు నీటిని పంపిణీ చేసేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది. అంతేకాకుండా నీటి శుద్ధి చేయకుండా సరఫరా చేస్తున్నారు. సాగర్ కాలువ కట్టపై ఉన్న డంపింగ్ మురుగు వర్షాలకు సాగర్ కాలువలోకి చేరుతోంది. ఆ నీటినే నేరుగా మంచినీటి రిజర్వాయర్కు పంపింగ్ చేస్తున్నానని, ఆ నీటిని కనీసం శుద్ధి చేయకుండా అలాగే నేరుగా క్లియర్ వాటర్ ట్యాంక్కు సరఫరా అవుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫిల్టర్ చేయకుండా నేరుగా నీటిని సరఫరా చేస్తూ తమ ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టి మినరల్ వాటర్ కొనుగోలు చేయలేక సాగర్ జలాలు వాసన వస్తున్నా గత్యంతరం లేక ఆ నీటిని తాగాల్సి వస్తోందని వాపోతున్నారు. టెండర్ల దశలోనే తిరకాసు.. గత ప్రభుత్వంలో ఈ నీటిని శుద్ధి చేసి సరఫరా చేసేందుకు టెండర్లు పిలిచి కాంట్రాక్టరు ద్వారా నీటిని సరఫరా చేసే వారు. నీటి పంపిణీకి సంబంధించి దర్శి, ముండ్లమూరు, తాళ్లూరులకు విడివిడిగా టెండర్లు పిలిచేవారు. దర్శికి సంబంధించి రూ.2 కోట్లు, తాళ్లూరు మండలానికి రూ.76.5 లక్షలు, ముండ్లమూరు మండలానికి రూ.98 లక్షలు చెల్లించేలా టెండర్లను ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పిలిచేవారు. మొత్తంగా రూ.3.735 కోట్లకు సంబంధించిన టెండర్లను వైఎస్సార్ సీపీ హయాంలో 30 శాతం తక్కువకు టెండర్ వేసేవారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉన్నంత వరకూ నీటిని శుద్ధి చేస్తూ రోజు విడిచి రోజు నీటిని అందించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. టెండర్ల దశలో అంతా గోల్మాల్ జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఎవరూ పోటీకి రాకుండా అధికార పార్టీకి చెందిన వ్యక్తి కేవలం ఒక శాతం తక్కువ కోడ్ చేసి దక్కించుకున్నాడని ఆరోపణలు వినిపించాయి. అయితే తాను చేసే పనిలో అధిక మొత్తంలో అధికార పార్టీకి చెందిన కీలక ప్రజాప్రతినిధికి భారీగా నజరానా చెల్లించాడని సమాచారం. కాంట్రాక్ట్ దక్కించుకున్న వ్యక్తి నీటి సరఫరాకు సంబంధించి కనీస నిబంధనలు పాటించడంలేదని తెలుస్తోంది. నీటిని శుద్ధి చేయడంలేదని, కనీసం బ్లీచింగ్ కూడా వేయకుండా అలాగే సాగర్ జలాలు గ్రామాలకు మురుగు నీరుగా సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం పురుగులను నిర్మూలించేందుకు గ్యాస్ లేదా బ్లీచింగ్ కూడా నీటిలో కలుపకుండా అలాగే సరఫరా చేయడంతో అందులో పురుగులు కూడా వస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. మట్టిమట్టిగా నీరు రావడమే కాకుండా దుర్వాసన వస్తోందని వాపోతున్నారు. నిండుగా నీరున్నా వారానికి రెండు రోజులు మాత్రమే సరఫరా చేస్తున్నారు. ఫలితంగా తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కలుషిత నీరు వస్తున్నా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పట్టించుకోవడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్ఏపీ రిజర్వాయర్ -
ఫిల్టర్ బెడ్ సంపులో జారిపడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి మృతి
ఒంగోలు టౌన్: నగర పాలక సంస్థలో పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగి నగరంలోని ఒక మంచినీటి సంపులో జారిపడి మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం... స్థానిక చెరువుకొమ్ముపాలేనికి చెందిన సీతారాం శ్రీనివాస్ (30) నగరపాలక సంస్థలోని ఇంజినీరింగ్ విభాగంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. గతంలో చెరువుకొమ్ముపాలెంలో ఐదేళ్లపాటు పనిచేసిన శ్రీనివాస్.. ఆరు నెలల కిత్రం ఒంగోలు వచ్చి నగరంలోని బాలాజీరావుపేట ఫిల్టర్ బెడ్స్లో ఎలక్ట్రీషియన్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. శనివారం రాత్రి 12 గంటల సమయం తర్వాత నైట్ డ్యూటీలో వుండగా పొరపాటున సంపులో జారిపడి ఈత రాకపోవడంతో నీటిలో మునిగి చనిపోయాడు. ఆదివారం ఉదయం మృతదేహం నీటిపై తేలియాడుతుండడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన ఒంగోలు వన్టౌన్ పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ● ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నారాయణ విద్యా సంస్థ వద్ద ధర్నా ఒంగోలు సిటీ: నారాయణ విద్యాసంస్థల్లో అడ్మిషన్ల కోసం టాలెంట్ టెస్ట్లు నిర్వహించడం నిలిపివేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకుడు సీహెచ్ వినోద్ డిమాండ్ చేశారు. ఒంగోలులోని నారాయణ విద్యా సంస్థ వద్ద ఆదివారం ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి బండి వీరాస్వామి అధ్యక్షత వహించగా, వినోద్ మాట్లాడుతూ నారాయణ విద్యాసంస్థల పట్ల విద్యాశాఖ పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. నారాయణను మంత్రి పదవి నుంచి బర్త్రఫ్ చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుందన్నారు. నారాయణ విద్యాసంస్థ అడ్మిషన్ల పక్రియలో భాగంగా టాలెంట్ టెస్ట్ పేరుతో విద్యార్థుల వద్ద నుంచి రూ.100 వసూలు చేసి గెలుపొందిన విద్యార్థికి కోటి రూపాయలు ఇస్తామని ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖామంత్రి నారాయణ నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్ల కోసం ఈ విధమైన టాలెంట్ టెస్టులు నిర్వహించడం సిగ్గుచేటని అన్నారు. పేద విద్యార్థుల పట్ల నారాయణ విద్యాసంస్థలకు నిజంగా ప్రేమ ఉంటే ఆ విద్యాసంస్థల్లో 10 శాతం సీట్లు ఉచితంగా పేదలకు కేటాయించి నిజాయితీ నిరూపించుకోవాలన్నారు. మళ్లీ టాలెంట్ టెస్ట్లు నిర్వహిస్తే తప్పనిసరిగా అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు విజయ్, పాండురంగారావు, సాయి, గంగాంజీ కుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు. ● బంగారం, వెండి, నగదు అపహరణ సంతమాగులూరు (అద్దంకి రూరల్): తాళం వేసిన ఇంటిలోకి దొంగలు ప్రవేశించి బంగారం వెండి, నగదు దొంగిలించిన సంఘటన ఆదివారం మధ్యాహ్నం బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలంలోని కుందుర్రులో జరిగింది. సంతమాగులూరు ఎస్సై సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. కందుర్రు గ్రామంలో ఎస్కే ఖాశింసైదా కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళాలు వేసి పనిమీద బయటకు వెళ్లారు. ఆ సమయంలో గుర్తుతెలియని వారింటి తాళాలు పగులగొట్టి బీరువా తెరిచి రూ.20 వేల నగదు, సవర బంగారం, 35 తులాల వెండి వస్తువులు అపహరించారు. ఇంటికి వచ్చిన ఖాశింసైదా దొంగతనం జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై కేసు నమోదు చేశారు. ఒంగోలు టౌన్: పొదిలి సీఐ వెంకటేశ్వరరావును వీఆర్కు పంపించారు. ఆ మేరకు ఐజీ కార్యాలయం నుంచి ఆదివారం ఉత్తర్వులు వచ్చాయి. ఆయన స్థానంలో వీఆర్లో ఉన్న యు.రాజేష్ను నియమించారు. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో రాజేష్ బాధ్యతలు స్వీకరించారు. రాజేష్ గతంలో జిల్లాలోని పామూరు, కంభం సీఐగా పనిచేసి ఉన్నారు. పొదిలి సీఐ వెంకటేశ్వరరావు మీద పలు ఆరోపణలు ఉన్నట్లు సమాచారం. -
ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం.. సమాచార హక్కు చట్టం
● ర్యాలీలో డీఆర్ఓ ఓబులేసు ఒంగోలు సబర్బన్: సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం వంటిదని జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు అన్నారు. సమాచార హక్కు చట్టం 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఒంగోలులో ర్యాలీ, సమావేశం నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టర్ కార్యాలయం నుంచి నెల్లూరు బస్టాండ్ మీదుగా చర్చి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు మాట్లాడుతూ సమాచర హక్కు చట్టం అమల్లోకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ర్యాలీ, సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ చట్టం ద్వారా ప్రజలడిగిన సమాచారాన్ని అధికారులు అందించాలన్నారు. ప్రజలు సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకుని అవసరమైన సమాచారాన్ని పొందవచ్చని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం విజయవాడలోని ప్రధాన సమాచార కార్యాలయం వర్చువల్గా కూడా విచారణ నిర్వహిస్తోందని, ఇది ఎంతో ఉపయోగకరమని అన్నారు. కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీఓ కళావతి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయ జ్యోతి, జిల్లా విద్యా శాఖాధికారి కిరణ్ కుమార్, ఒంగోలు అర్బన్ తహసీల్దార్ పిన్నిక మధుసూదనరావు, ఒంగోలు రూరల్ డిప్యూటీ తహసీల్దార్ కుట్టుబోయిన అశోక్ కుమార్, రూరల్ ఆర్ఐ శ్రీకంఠ శ్రీనివాసరావు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. -
నేతల మేత.. పేదలకు వాత..!
మార్కాపురం: జిల్లాలో రేషన్ పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. కూటమి ప్రభుత్వంలో ఆయా పార్టీల నాయకులు, మద్దతుదారులే రేషన్ డీలర్లుగా అవతారమెత్తి రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించి స్వాహా చేస్తున్నారు. కార్డుదారులకు సక్రమంగా రేషన్ పంపిణీ జరగక లబోదిబోమంటున్నారు. జిల్లాలో యథేచ్ఛగా రేషన్ బియ్యం అక్రమ రవాణా సాగుతోంది. ఇటీవల నాగులుప్పలపాడు, పొన్నలూరు, మార్కాపురం ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని కేసులు మాత్రమే నమోదు చేసి బయటకు తెలుస్తుండగా, జిల్లావ్యాప్తంగా గుట్టుచప్పుడు కాకుండా విచ్చలవిడిగా రేషన్ దందా సాగుతోంది. రేషన్ కార్డుదారుల సమస్యలు పరిష్కరించడంతో పాటు రేషన్ పంపిణీ వ్యవస్థను సక్రమంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన ఆహార సలహా సంఘ సమావేశాలు మొక్కుబడిగా సాగుతుండటంతో అక్రమార్కులు రోజురోజుకూ చెలరేగిపోతున్నారు. క్షేత్రస్థాయిలో తెల్ల రేషన్ కార్డుదారులు ఎదుర్కొంటున్న సమస్యలు అధికారుల దృష్టికి వెళ్లడం లేదు. ఒకవేళ వెళ్లినా.. పట్టించుకునేవారు లేకపోవడంతో కార్డుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 6,37,820 రేషన్కార్డులు, 1,392 రేషన్ దుకాణాలు... జిల్లాలో రేషన్ పంపిణీ ఒక ప్రహసనంలా మారింది. బియ్యానికి బదులుగా కిలోకు 10 రూపాయల డబ్బులిస్తామని, తీసుకుంటే తీసుకోండి.. లేదంటే లేదంటూ బాహాటంగానే రేషన్ డీలర్లు చెబుతున్నా పట్టించుకునే అధికారులు లేరు. ఎక్కడైనా రేషన్ బియ్యం పట్టుబడితే తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే అధికారులు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇలాంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్వహించాల్సిన ఆహార సలహా సంఘ సమావేశాలు జిల్లాలో నాలుగైదు చోట్ల మాత్రమే మొక్కుబడిగా సాగాయి. టంగుటూరు, కంభం, గిద్దలూరు, ఒంగోలు తదితర ప్రాంతాల్లో ఈ సమావేశాలు నిర్వహించగా, మిగిలిన చోట వీటి ఊసే లేదు. గత నెల 16న ప్రభుత్వం (వినియోగదారుల కమిషన్) సమావేశాలు నిర్వహించాలని చెప్పడంతో మొక్కుబడిగా నిర్వహించారు. జిల్లాలో మొత్తం 6,37,820 రేషన్కార్డులు ఉండగా, 1392 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ప్రతి నెలా సుమారు 10,582 మెట్రిక్ టన్నుల బియ్యం జిల్లాకు వస్తోంది. కానీ, పేదలకు సక్రమంగా అందకుండా కూటమి నాయకులు స్వాహా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మొక్కుబడిగా సమావేశాలు... జిల్లా వ్యాప్తంగా ఆహార సలహా సంఘాలు పూర్తిస్థాయిలో పనిచేయకపోవటంతో సమావేశాలు మొక్కుబడిగా జరుగుతున్నాయి. సక్రమంగా సమావేశాలు నిర్వహించకపోవటంతో వినియోగదారులకు అందాల్సిన నిత్యావసర వస్తువులు సక్రమంగా అందడం లేదు. అధికారులను ప్రశ్నించే కమిటీ లేకపోవటంతో నిత్యావసర వస్తువుల పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ప్రస్తుతం రేషన్దుకాణాలు అలంకారప్రాయంగా మిగిలాయి. గతంలో బియ్యం, చక్కెర, కిరోసిన్, గోధుమలు, కందిపప్పు, నూనె, గోధుమపిండి, ఉప్పు ఇచ్చేవారు. ఇప్పుడు కేవలం బియ్యం, చక్కెరకు మాత్రమే పరిమితమయ్యాయి. కమిటీ ఇలా... ఆహార సలహా సంఘ కమిటీలో ఆర్డీఓ, తహసీల్దార్, ఒక డీలర్, ప్రింట్ మీడియా సభ్యుడు, ఎంపీడీఓ, నాలుగు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలకు చెందిన వ్యక్తులు ఉంటారు. వీరందరూ నెలవారీగా సమావేశాలు నిర్వహించి కార్డుదారుల ఇబ్బందులు, తదితర అంశాలపై చర్చించి ప్రత్యేక రిజిష్టర్ తయారు చేయాల్సి ఉంటుంది. పౌరసరఫరా గోడౌన్ నుంచి రేషన్ దుకాణాలకు వచ్చే సరుకుల వివరాలపై సభ్యులకు పూర్తి స్థాయిలో సమాచారం ఉండాలి. కానీ, కమిటీల సమావేశం జరగకపోవడంతో సమస్యలు అధికారుల దృష్టికి పోవటం లేదు. రేషన్ బియ్యం పలు చోట్ల పక్కదారి పడుతోంది. మార్కాపురం, తర్లుపాడు, మర్రిపూడి మండలాల్లో కొంతమంది రేషన్ డీలర్లు బాహాటంగానే బియ్యం బదులుగా కిలోకు 10 రూపాయలు డబ్బులిస్తామని చెబుతున్నారు. జిల్లాలో అస్తవ్యస్తంగా రేషన్ పంపిణీ వ్యవస్థ కూటమి నాయకుల కనుసన్నల్లో పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం బియ్యంకు బదులు కిలోకు రూ.10 ఇస్తామంటున్న డీలర్లు తమ సమస్యలు పట్టించుకునేవారు లేరంటున్న కార్డుదారులు మొక్కుబడిగా ఆహార సలహా సంఘ సమావేశాలు కమిషన్ ఆదేశాలు పట్టించుకోవడం లేదు జిల్లాలో ఆహార సలహా సంఘ సమావేశాలను గత నెల 16వ తేదీ నిర్వహించాలని కమిషన్ ఆదేశించింది. అక్కడక్కడా మాత్రమే కొంతమంది తహసీల్దార్లు నిర్వహించారు. అవి కూడా మొక్కుబడిగా సాగాయి. కొన్నిచోట్ల డిప్యూటీ తహసీల్దార్లే ఈ సమావేశాలు పెట్టారు. వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలంటే సమావేశాలు నిర్వహించడం లేదు. దీనివలన ప్రభుత్వం దృష్టికి కార్డుదారుల సమస్యలు వెల్లడం లేదు. రేషన్ దుకాణాలు, పెట్రోల్ బంకులను కమిటీ సభ్యులతో కలిసి అధికారులు తనిఖీ చేయాలని ఆదేశాలిచ్చినప్పటికీ అమలు కావడం లేదు. ఇప్పటికై నా సమావేశాలు నిర్వహించి రేషన్ కార్డుదారుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి. – ఓఏ మల్లిక్, జిల్లా వినియోగదారుల సమాఖ్య గౌరవాధ్యక్షుడు -
ఇసుక తోలలేక!
తమ్ముళ్లతో తాళలేక..‘‘ఇసుక డంపింగ్ యార్డు నిర్వహణకు ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చింది. అయితే కొంతమంది వ్యక్తులు ప్రైవేటుగా వాహనాల్లో తెచ్చి సొంతంగా ఇసుక అమ్ముకుంటున్నారు. ఒక్క ఒంగోలు నగరంలోనే 40 మంది వ్యక్తులు సొంతంగా ఇసుక డంపింగ్ చేస్తున్నారు. వారితో నేను పోరాడే పరిస్థితి లేదు. ఇక్కడ వ్యాపారం చేసే పరిస్థితులు లేవు. ప్రభుత్వం ఇచ్చిన లైసెన్స్ను దయచేసి రద్దు చేయండి...’’ అంటూ ఫ్యూచర్ ట్రెండ్స్కు చెందిన భరత్ మైనింగ్ డిప్యూటీ డైరక్టర్ రాజశేఖర్కు వినతి పత్రం అందచేయడం జిల్లాలో అధికార కూటమి నేతల ఇసుక ఆగడాలకు అద్దం పడుతోంది. లైసెన్స్ పొందిన వ్యాపారులపై తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుల దౌర్జన్యాలు, రౌడీయిజానికి అంతేలేకుండా పోతోందనడానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉచితంగా ఇసుక ఇస్తున్నట్లు తెగ ప్రచారం చేసుకుంటున్నారు. మరో వైపున మద్యం బెల్ట్ షాపుల తరహాలో ప్రైవేటు డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసుకున్న తమ్ముళ్లు యథేచ్ఛగా ఇసుక దందాకు పాల్పడుతున్నారు. ఫలితంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు అధిక ధరలకు ఇసుకను కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉచిత ఇసుక పేరుతో గత ఏడాది నవంబరులో జిల్లాలోని ఒంగోలు, గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం, కనిగిరి, దర్శి ప్రాంతాల్లో డంపింగ్ యార్డులకు అనుమతిచ్చి లైసెన్స్లు మంజూరు చేసింది. ఫ్యూచర్ ట్రెండ్స్ సంస్థ నిర్వాహకుడు భరత్కు ఒంగోలు డంపింగ్ యార్డుకు లైసెన్స్ మంజూరైంది. భరత్ పశ్చిమ ప్రకాశం జిల్లా అధికార పార్టీకి చెందిన ఒక కీలక ఎమ్మెల్యే అనుచరుడిగా ప్రచారం జరుగుతోంది. ఈ లైసెన్స్ కోసం ఆయన కోటి రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. జనవరిలో ఆయన డంపింగ్ యార్డు ఏర్పాటు చేసుకున్నారు. అప్పటికే నగరంలో టీడీపీకి చెందిన కొందరు నాయకులు సొంతంగా డంపింగ్ యార్డులను ఏర్పాటు చేసుకుని ఇసుక విక్రయాలు ప్రారంభించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇలాంటి ప్రైవేటు డంపింగ్ యార్డులు ఒక్క ఒంగోలు నగరంలోనే సుమారు 40 యార్డులు ఉన్నట్లు భరత్ ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ అధిక ధరలకు ఇసుక విక్రయించడమే కాకుండా ప్రభుత్వ డంపింగ్ యార్డులో ఇసుక కొనుగోలు చేయకుండా కస్టమర్లపై ఒత్తిళ్లు చేసేవారని తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ డంపింగ్ యార్డు నిర్వాహకుడైన భరత్ ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పటికే కోటి రూపాయల చేతిచమురు వదిలించుకున్న ఆయన డంపింగ్ యార్డుకు తాళాలు వేసి వెళ్లిపోయాడు. ఇటీవల కలెక్టర్ పిలుపు మేరకు ఒంగోలు వచ్చిన ఆయన తిరిగి డంపింగ్ యార్డు తెరిచినప్పటికీ తెలుగు తమ్ముళ్ల దందా ముందు తాళలేకపోయాడు. ఈసారి ఏకంగా తన లైసెన్స్ రద్దు చేయమంటూ ఆయన మైనింగ్ డీడీకి వినతి పత్రం అందించడంతో జిల్లాలో తెలుగు తమ్ముళ్ల ఉచిత ఇసుక దోపిడీపై చర్చకు తెరతీసినట్లయింది. ఇసుక అమ్మకాల విషయంలో జిల్లాలో తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యాలు, అరాచకాలపై ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయి. కీలక నాయకులు నిర్ణయించిన టీడీపీ నాయకులు మాత్రమే ఇసుక అమ్మకాలు చేయాలని హుకుం జారీ చేసి బహిరంగంగా దౌర్జన్యాలకు పాల్పడ్డారు. ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఇసుక వ్యాపారుల మీద దాడులు చేశారు. వారి టిప్పర్లను ధ్వంసం చేశారు. లారీ డ్రైవర్లను చితకబాది వేధింపులకు గురిచేశారు. లారీలను స్వాధీనం చేసుకున్నారు. తమకు కప్పం కట్టకుండా జిల్లాలో ఇసుక విక్రయించడానికి వీలులేదని రౌడీయిజం చెలాయించారు. టిప్పర్ల యజమానులకు కోట్లాది రూపాయలు ఇవ్వకుండా వేధించడంతో వారు కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగడం సంచలనం సృష్టించింది. తాజాగా మరో వ్యక్తి తనకు ఇచ్చిన లైసెన్స్ను రద్దు చేయమని కోరడం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మైనింగ్ అధికారులైతే మొద్ద నిద్ర పోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. మైనింగ్ అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో బెల్టు షాపుల తరహాలో ఇసుక యార్డులు కూడా వెలిశాయి. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే ఈ అనధికారిక యార్డులు నడుస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. తాము చెప్పిన రేటుకే ఇసుక అమ్మకాలు చేయాలని హుకుం జారీ చేస్తున్నారు. తమ వద్దకాదని ఇతర ప్రాంతాల నుంచి ఇసుకను తెచ్చుకుంటే లారీకి వారు చెప్పిన కప్పం కట్టి వెళ్లాల్సిందే. లేదంటే అధికారులను ఉసిగొల్పి అక్రమ కేసులు బనాయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని గిద్దలూరు నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వం గిద్దలూరులో అధికారికంగా ఇసుక డంపింగ్ యార్డు నిర్వహణకు లైసెన్స్ మంజూరు చేసింది. నియోజకవర్గంలో ఎవరైనా సరే ఇక్కడ నుంచి ఇసుక కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కానీ అధికార టీడీపీ కీలక నేత ఇక్కడ సొంతంగా ప్రతి మండలంలోనూ ఇసుక డంపింగ్ యార్డులకు అనుమతి ఇవ్వడం విమర్శల పాలవుతోంది. నియోజకవర్గంలోని కొమరోలు, రాచర్ల, అర్ధవీడు, బేస్తవారిపేట, కంభంలలో ఇసుక డంపింగ్ యార్డులు పెట్టి అనధికారికంగా ఇసుక అమ్మకాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మార్కాపురం నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పొదిలిలో అనధికారికంగా డంపింగ్ యార్డు ఏర్పాటు చేసి అధిక ధరలకు ఇసుక విక్రయాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మార్కాపురంలో అధిక ధరలకు ఇసుక విక్రయాలు చేస్తున్నారు. నేరుగా ఇసుక తెచ్చుకుంటే రూ.900 కు వచ్చే ఇసుక ఇసుకను రూ.1500 కు విక్రయిస్తున్నారు. దీంతో ప్రజల జేబుకు రూ.600 వరకు చిల్లు పడుతోంది. యర్రగొండపాలెం నియోజకవర్గంలోని త్రిపురాంతకం, పుల్లలచెరువు, పెద్దారవీడు, దోర్నాల మండలాల్లో కూడా అనధికారికంగా డంపింగ్ యార్డులు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ ఇన్చార్జి కనుసన్నల్లోనే ఈ యార్డులను ఏర్పాటు చేసి దొడ్డిదారిన ఇసుక విక్రయాలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక దర్శి నియోజకవర్గంలో అయితే టీ ట్యాక్స్ వసూలు చేసేందుకు ఒక కంటైనర్ ఏర్పాటు చేయడం గమనార్హం. ఎక్కడనుంచైనా నియోజకవర్గంలోకి ఇసుక లారీ, ట్రాక్టర్ వచ్చిందంటే వీరికి ట్యాక్స్ కట్టాల్సిందే. ఇక జిల్లా కేంద్రమైన ఒంగోలులో 40 వరకు ఇసుక డంపింగ్ యార్డులు ఉన్నట్లు అధికారిక డంపింగ్ యార్డు నిర్వాహకుడు భరత్ ఆరోపణలు చేయడం గమనార్హం. కొండపి నియోజకవర్గానికి డంపింగ్ యార్డు మంజూరు చేయలేదు. జరుగుమల్లి, పొన్నలూరు మండలాలు పాలేరు నదీ తీర ప్రాంతంలో ఇసుక లభ్యమౌతుంది. ఇక్కడ నుంచి టీడీపీ నాయకులు ఇసుకను ఇష్టారాజ్యంగా తవ్వుకుంటున్నారు. ట్రాక్టర్ లోడింగ్ రూ.800 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లిలో అనధికారికంగా ఇసుకను అమ్మేసుకుంటున్నారు. కనిగిరిలో ట్రాక్టర్కు రూ.500 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
పేదోళ్ల ఆరోగ్యాన్ని దూరం చేసేందుకు కుట్ర
యర్రగొండపాలెం: పేద వర్గాల ఆరోగ్యం, వారి బిడ్డల వైద్య విద్యను దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రపన్నిందని, దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జగనన్న తన పాలనలో రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారని, వాటిని ఈ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసేందుకు పూనుకుందని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో కోటి సంతకాల సేకరణను ఆయన ప్రారంభించారు. కార్యక్రమానికి పార్టీ మండల కన్వీనర్ ఏకుల ముసలారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులు, రైతు కూలీలు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు కార్పొరేట్ వైద్యశాలలకు వెళ్లలేక తమ ప్రాణాలు కోల్పోతున్నారన్న ఉద్దేశంతో గత ప్రభుత్వ కాలంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు అనుమతి తీసుకొచ్చారని చెప్పారు. వాటిలో కొన్ని కళాశాలల నిర్మాణాలు పూర్తిచేసుకొని నిర్వహణ కొనసాగుతోందని, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి నాయకులు పేదల రక్తాన్ని పీల్చి దోచుకోవటానికి తమ అనుచరులకు ఆ కళాశాలలను అప్పనంగా అప్పచెప్పేందుకు పీపీపీ పద్ధతిని ప్రవేశపెట్టిందని ఆయన విమర్శించారు. దీనివలన పేద, మధ్య తరగతి కుటుంబీకులు వైద్యం చేయించుకోలేని పరిస్థితిని తీసుకొస్తున్నారని, ఈ విషయాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. రాష్ట్రానికి మెడికల్ సీట్లు మంజూరు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించిన దుర్మార్గపు సీఎం చంద్రబాబు అని ఆయన దుయ్యబట్టారు. కూటమి నాయకులు రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని విస్మరించి తమ జేబులు నింపుకోవటానికి ఇటువంటి చర్యలు చేపడుతున్నారని, మెడికల్ కళాశాలలను చిల్లర డబ్బులకు లీజుకు ఇచ్చి తాము రూ.కోట్లల్లో దోచుకొని దాచుకోవటానికే పీపీపీ పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రజల నుంచి సంతకాలు సేకరించాలని ఆయన కోరారు. ఆయా కార్యక్రమాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, ఎంపీపీలు దొంతా కిరణ్గౌడ్, ఆళ్ల సుబ్బమ్మ ఆంజనేయరెడ్డి, గుమ్మా పద్మజ ఎల్లేష్ యాదవ్, జెడ్పీటీసీలు చేదూరి విజయభాస్కర్, యేర్వ చలమారెడ్డి, ఆర్.వాగ్యానాయక్, పార్టీ మండల కన్వీనర్లు గంటా వెంకట రమణారెడ్డి, దోమకాళ్ల వెంకటేశ్వర్లు, పి.కృష్ణారెడ్డి, ఎస్.పోలిరెడ్డి, వివిధ విభాగాల రాష్ట్ర, జిల్లా నాయకులు ఉడుముల అరుణ, ఆర్.అరుణాబాయి, పొన్న వెంకటలక్ష్మి, పల్లె సరళ, జి.శార, కె.ఓబులరెడ్డి, భూమిరెడ్డి సుబ్బారెడ్డి, వై.వెంకటేశ్వరరెడ్డి, మార్తాల సుబ్బారెడ్డి, సయ్యద్ జబీవుల్లా, ఒంటేరు నాగేశ్వరరావు, కందూరి కాశీవిశ్వనాథ్, పబ్బిశెట్టి శ్రీనివాసులు, సూరె శ్రీనివాసులు, దోగిపర్తి సంతోష్ కుమార్, ఎల్.రాములు, లాలు నాయక్, షేక్.షెక్షావలి, చిట్టేల వెంకటేశ్వరరెడ్డి, సన్నెపోగు సుందరరాజు, పి.రాములు నాయక్, టి.సత్యనారాయణరెడ్డి, కోటిరెడ్డి, దుగ్గెంపూడి సుబ్బారెడ్డి, ఎస్.ప్రసాద్, బి.బాలచెన్నయ్య పాల్గొన్నారు. -
మెరిట్ కమ్ రోస్టర్ విధానంలో డీఎస్సీ కౌన్సెలింగ్ నిర్వహించాలి
ఒంగోలు సిటీ: మెరిట్ కమ్ రోస్టర్ విధానంలో డీఎస్సీ కౌన్సెలింగ్ నిర్వహించాలని బీటీఏ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు కర్ర దేవసహాయం అన్నారు. బహుజన టీచర్స్ అసోసియేషన్ జిల్లా అత్యవసర సమావేశం శనివారం ఉదయం 10 గంటలకు బీటీఏ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు కర్ర దేవసహాయం మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ 2025 కౌన్సెలింగ్ జీఓ నంబర్ 90 ప్రకారం సెలెక్షన్ లిస్టును రీ ఆర్గనైజ్ చేసి మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. కమిషనర్ ఇచ్చిన నియమాలను అనుసరించి కేవలం మెరిట్ ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారని, ఈ విధానాన్ని బీటీఏ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. కేవలం మెరిట్ ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించడం వలన రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారని బీటీఏ పక్షాన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్, కమిషనర్ విజయరామరాజుకు వినతిపత్రాలను మెయిల్ చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇప్పటి వరకు జరిగిన కౌన్సెలింగ్ను రద్దు చేసి జీఓ నంబర్ 90 అనుసరించి మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించాలని కోరారు. బీటీఏ రాష్ట్ర కార్యదర్శి పారాబత్తిన జాలరామయ్య మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రిజర్వేషన్ వర్గాల వారికి తీవ్రంగా అన్యాయం చేసిందన్నారు. పదోన్నతుల్లో, బదిలీల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా కేవలం మెరిట్ ప్రకారం నిర్వహించి రిజర్వ్ వర్గాల వారికి వ్యతిరేకంగా చేసిందని చెప్పారు. సమావేశంలో బీటీఏ జిల్లా ప్రచార కార్యదర్శి పల్లె కృష్ణమూర్తి, జిల్లా ఉపాధ్యక్షుడు కొండమూరి కొండల రాయుడు, జిల్లా నాయకులు చెక్క కోటేశ్వరరావు, బాజీ బాబు తదితరులు పాల్గొన్నారు. -
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ఒంగోలు సబర్బన్: స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశ పెట్టడం ద్వారా పౌరసరఫరాల వ్యవస్థలో నూతన అధ్యాయమని కలెక్టర్ పీ.రాజాబాబు అన్నారు. ప్రస్తుత రేషన్ కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డుల జిల్లా స్థాయి పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు శనివారం కలెక్టరేట్లో నిర్వహించారు. కార్యక్రమంలో సంక్షేమశాఖ మంత్రి స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఏటీఎం కార్డు సైజులో ఉండే స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా ఏ షాపులో, ఏ సమయంలో రేషన్ సరుకులు తీసుకున్నారో ట్రేస్ చేయవచ్చన్నారు. కార్డు పోయినా జిరాక్స్ కాపీతో కార్డుదారులు రేషన్ సరుకులు తీసుకోవచ్చని చెప్పారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 6,51,818 స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. వీరికి 1392 రేషన్ షాపుల ద్వారా సరుకులు అందిస్తామన్నారు. జిల్లావ్యాప్తంగా వారం రోజుల్లో కార్డుల పంపిణీ ప్రక్రియను పూర్తి చేస్తామని డీఎస్ఓ పద్మశ్రీ తెలిపారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్ధనరావు, ఒంగోలు ఆర్డీవో కళావతి, ఒంగోలు మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్.వెంకట్రావు, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్, ఒంగోలు నగర మేయర్ సుజాత, ఇతర నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సింగరాయకొండ: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఏఆర్సీ అండ్ జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో శనివారం అండర్–19 బాల బాలికల జిల్లా క్రికెట్ జట్ల ఎంపిక నిర్వహించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరచిన క్రీడాకారులను ఎంపిక చేశారు. జూనియర్ కాలేజి ఫిజికల్ డైరెక్టర్ కే శంకర్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సెలక్టర్లుగా జే ప్రభాకర్, నామా చంద్రశేఖర్, ఏ కిరణ్కుమార్, పీ రమేష్, సయ్యద్ జంషీర్ అబ్దాల్ పాల్గొన్నారు. -
ప్రభుత్వ దుర్మార్గ ఆలోచనకు బుద్ధి చెప్పాలి
బేస్తవారిపేట: ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరంచేసే ప్రభుత్వ దుర్మార్గ ఆలోచనకు ప్రజలే బుద్ధి చెప్పాలని వైఎస్సార్సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. కంభంలోని వైజంక్షన్లో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రభుత్వం ప్రైవేటుపరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శనివారం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ కేపీ నాగార్జునరెడ్డితో కలిసి ప్రారంభించారు. ముందుగా కందులాపురం సెంటర్లో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం పార్టీ శ్రేణులతో ర్యాలీగా వైజంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన సభ వద్దకు చేరారు. పీపీపీ పేరుతో ప్రజలకు వైద్యం అందుబాటులోకి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందన్నారు. టీడీపీ పెద్దలు వారి అనుచరులకు, బినామీలకు మెడికల్ కాలేజీలకు కట్టబెట్టేందుకు కుట్రలు చేసిందని విమర్శించారు. నేడు వైద్యశాలల్లో ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయని వివరించారు. విద్య, వైద్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కుట్రలు చేసి వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకులను అక్రమ అరెస్ట్లు చేయడంపై దృష్టి పెట్టిందన్నారు. అధికారంలోకి వచ్చిన మరుసటిరోజు నుంచే నకిలీ మద్యం తయారు కేంద్రాలను ఏర్పాటు చేసుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ పాలనలో 43 వేల బెల్ట్షాపులను తొలగిస్తే నేడు ఇంటింటికీ మద్యం సరఫరా జరుగుతోందన్నారు. 1923 నుంచి 2019 వరకు ఏపీలో 12 మెడికల్ కళాశాలలు ఉన్నాయని, 2300 మంది డాక్టర్లుగా చదువుకునేవారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన తర్వాత కరోనా సమయం రెండున్నరేళ్లు పోగా దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా 17 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం నుంచి అనుమతులు తీసుకుకొచ్చిందన్నారు. ఒక్కొక్క కళాశాలకు 50 ఎకరాలు స్థలం కేటాయించారని, ఐదు కళాశాలలను పూర్తి చేసి ప్రారంభించారని చెప్పారు. ఎన్నికల సమయంలో మరో రెండు కళాశాలల పనులు పూర్తయ్యాయన్నారు. ఇంకో ఆరు కాలేజీలు 80 శాతం, మూడు కాలేజీలు 40 పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. ఏడాదికి వెయ్యి కోట్లు ఖర్చు పెడితే అన్నీ కళాశాలలు పూర్తయి ఏడాదికి 2550 మంది డాక్టర్లుగా చదువుకుని బయటకు వస్తారన్నారు. ఫలితంగా రాష్ట్ర ప్రజలకు వైద్యసేవలు గ్రామీణ ప్రాంతాలకు చేరువ అవుతాయన్నారు. మార్కాపురంలో మెడికల్ కాలేజీ పూర్తి కావడంతో వెనుకబడిన పశ్చిమ ప్రకాశంలో అధునాతనమైన ఉచిత వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. చంద్రబాబు పాలన అంతా ఆర్భాటం.. చంద్రబాబు 14 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన సమయంలో ఏనాడూ పేద ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోలేదని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ కేపీ నాగార్జునరెడ్డి అన్నారు. సూపర్సిక్స్తోపాటు 200 హామీలు ఇచ్చిన చంద్రబాబు కేవలం 2–3 పథకాలు అరకొరగా అమలు చేశారన్నారు. కళ్లు ఆర్పకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు తనకు తానేసాటి అని మరొక్కసారి నిరూపించుకున్నాడని విమర్శించారు. ఒక్క మెడికల్ కళాశాల ఏర్పాటైతే 1500 పడకలు, స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ గిద్దలూరు నియోజకవర్గ పరిశీలకులు కేవీ రమణారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వరరావు, ఎంపీపీలు వేగినాటి ఓసూరారెడ్డి, చేగిరెడ్డి తులశమ్మ, ఎం వెంకట్రావ్, జెడ్పీటీసీలు బీవీ రాజయ్య, వెంకటనాయుడు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు నెమిలిదిన్నె చెన్నారెడ్డి, అబ్దుల్ గఫార్ఖాన్, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్లు గొంగటి చెన్నారెడ్డి, ఆవుల శ్రీధర్రెడ్డి, యేరువ రంగారెడ్డి, ఎం రవికుమార్, మాజీ ఎంపీపీలు రవికుమార్యాదవ్, వెంకటరాజు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. -
తొలి మద్యం తయారీ కేంద్రం కుప్పం
● ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ యర్రగొండపాలెం: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో రాష్ట్రంలో మొదటి డిస్టిలరీ ఫ్యాక్టరీ కుప్పంలోనే ప్రారంభం అయిందని.. చివరి డిస్టిలరీ కేంద్రం విశాఖపట్టణంలో ఏర్పాటు చేశారని, అదికూడా స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు చెందిందని ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా ప్రతినిధులు, నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు రాష్ట్రానికి తీసుకొని వచ్చింది మద్యం కంపెనీలు తప్ప ప్రజలకు మంచి చేసే కంపెనీలు తేలేదని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వ కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు నవరత్నాల పథకం కింద అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి పేదలకు ఎంతో మేలు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ సంక్షేమ పథకాలను గాలికి వదిలేసి అన్నీ చేశామని డప్పాలు కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మహిళలు, రైతులకు జరుగుతున్న అన్యాయాలపై వైఎస్సార్ సీపీ ఆందోళనలు చేపడుతుంటే అరకొరగా పథకాలను అమలు చేశారని చెప్పారు. అబద్ధాల ప్రచారంలో దిట్ట.. ఇటీవల సూపర్ సిక్స్–సూపర్ సక్సెస్ అని మూడు హామీలు సీ్త్రశక్తి, నిరుద్యోగ భృతి, 50 సంవత్సరాల పింఛన్ ఎత్తివేసి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని గ్లోబల్ ప్రచారం చేయడం మొదలు పెట్టారని ఆయన అన్నారు. దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు తప్పులు చేసుకుంటూ పోతూ ఉంటే మనం వాటిని పట్టించుకోకుండా వదిలేస్తే పేద ప్రజలకు తాము కూడా అన్యాయం చేసినవారమవుతామన్నారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా గ్రామాలలో ప్రజలకు అవగాహన పరచాలని, వారిలో చైతన్యం తీసుకొని రావాల్సిన అవసరం ఎంతయినా ఉందని ఆయన అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జగనన్న ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు. సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, ఎంపీపీ దొంతా కిరణ్గౌడ్, ఆళ్ల ఆంజనేయరెడ్డి, గుమ్మా ఎల్లేష్ యాదవ్, జెడ్పీటీసీలు చేదూరి విజయభాస్కర్, యేర్వ చలమారెడ్డి, ఆర్.వాగ్యానాయక్, పార్టీ మండల కన్వీనర్లు ఏకుల ముసలారెడ్డి, గంటా వెంకట రమణారెడ్డి, దోమకాళ్ళ వెంకటేశ్వర్లు, పి.కృష్ణారెడ్డి, ఎస్.పోలిరెడ్డి, వివిధ విభాగాల రాష్ట్ర. జిల్లా నాయకులు ఉడుముల అరుణ, ఆర్.అరుణాబాయి, పొన్న వెంకటలక్ష్మి, పల్లె సరళ, గార్లపాటి శార, కె.ఓబులరెడ్డి, సయ్యద్ జబీవుల్లా, భూమిరెడ్డి సుబ్బారెడ్డి, వై.వెంకటేశ్వరరెడ్డి, కందూరి కాశీవిశ్వనాథ్, పి.రాములు నాయక్ పాల్గొన్నారు. -
కర్నూలు రోడ్డుపై నెల రోజులుగా గొయ్యి..!
ఒంగోలు – కర్నూలు రోడ్డుపై సంతనూతలపాడు సమీపంలోని బ్రిడ్జిపై ఉన్న గొయ్యి ఒంగోలు – కర్నూలు రోడ్డుపై సంతనూతలపాడు సమీపంలో ఉన్న బ్రిడ్జి మీద రోడ్డు దెబ్బతిని నెల రోజుల క్రితం గొయ్యి ఏర్పడింది. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ప్రధాన ఆర్అండ్బీ రహదారిపై పెద్ద గొయ్యి పడి ప్రమాదకరంగా ఉన్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వదిలేశారు. దీనిపై గత నెల 22వ తేదీ సాక్షి దినపత్రిక ఒంగోలు క్లస్టర్ పేజీలో ‘రహదారి ఇలా.. రాకపోకలు సాగేదెలా’ అనే శీర్షికతో గొయ్యికి సంబంధించిన ఫొటోలతో కథనం కూడా ప్రచురితమైంది. ఇరవై రోజులైనా అధికారులుగానీ, పాలకులుగానీ పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రస్తుతం ఆ గొయ్యి పెద్దదిగా మారి మరింత ప్రమాదకరంగా ఉన్నప్పటికీ ఏ ఒక్కరూ స్పందించడం లేదు. దీంతో కూటమి ప్రభుత్వ అధ్వానపు పరిపాలనను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. పైగా, ఆ గొయ్యి వద్ద అడ్డంగా పోలీసులు బ్యారికేడ్ ఏర్పాటు చేసి నిర్లక్ష్యంగా వదిలేయడాన్ని వాహనదారులు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. అసలే వంతెన కావడంతో ఆ గొయ్యి వద్ద ఏమాత్రం ప్రమాదం జరిగినా భారీ నష్టం జరిగే అవకాశం ఉండటంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళల్లో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రానైట్ రాళ్లతో భారీ వాహనాల రాకపోకలతో ప్రమాదం జరిగే అవకాశం... చీమకుర్తి మండలంలోని రామతీర్థం గ్రానైట్ క్వారీల నుంచి గ్రానైట్ రాళ్ల ఓవర్ లోడుతో నిత్యం భారీ టిప్పర్లు, ట్రాలీలు ఈ రోడ్డుపై రాకపోకలు సాగిస్తుంటాయి. బ్రిడ్జిపై గొయ్యి ఏర్పడిన ప్రాంతంలో సగం రోడ్డుకు అడ్డంగా పోలీసులు బ్యారికేడ్ ఏర్పాటు చేసి వదిలేయడంతో అక్కడ సగం రోడ్డుపైనే వాహనాలు రాకపోకలు సాగించాల్సి ఉంది. దీంతో అక్కడ ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. పైగా, ఇటీవల కురుస్తున్న వర్షాలకు బ్రిడ్జి కింద నీటి ప్రవాహం ఎక్కువై రోడ్డు మరింత దెబ్బతింటోంది. ఫలితంగా ఆ బ్రిడ్జి మధ్యలో ఏర్పడిన గొయ్యి సైజు పెరుగుతూ వస్తోంది. అయినప్పటికీ పాలకులుగానీ, అధికారులుగానీ పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో రోడ్లను సూపర్గా చేశామని సీఎం, ఎమ్మెల్యేలు చెప్పుకుంటున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం ప్రజల ప్రాణాలతో చెలగాటం అడుతుండటంపై ప్రజల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. నడిరోడ్డుపై ఉన్న గోతులు కూడా పూడ్చకపోవడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులైనా స్పందించాలని కోరుతున్నారు. 20 రోజుల క్రితం సాక్షిలో కథనం ప్రచురితమైనా స్పందించని అధికారులు, పాలకులు ప్రస్తుతం మరింత పెద్దదిగా మారి ప్రమాదకరంగా మారిన గొయ్యి -
వాగులో పడి బాలుడు మృతి
గిద్దలూరు రూరల్: వాగులో పడి బాలుడు మృతిచెందిన సంఘటన గిద్దలూరు మండలంలోని గడికోట గ్రామ సమీపంలో గల సగిలేరువాగు వద్ద శనివారం జరిగింది. గడికోట గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ (15) గేదెలను మేపేందుకు వాగు సమీంలోకి తీసుకెళ్లాడు. ఆ సమయంలో గేదెలు వాగులో ఉండటం వల్ల వాటిని బయటకు తోలేందుకు వాగులోకి దిగాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ వాగు లోతట్టు ప్రాంతంలో చిక్కుకుని మునిగిపోయాడు. స్థానికులు అతడిని వాగులో నుంచి బయటకు తీసేలోపే మృతి చెందాడు. హుస్సేన్ ముండ్లపాడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. శనివారం పాఠశాలకు సెలవు కావడంతో గేదెలను మేపేందుకు వెళ్లిన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. తల్లిదండ్రులకు హుస్సేన్ పెద్ద కుమారుడు కాగా, ఒక చెల్లి, ఒక తమ్ముడు ఉన్నారు. -
ఫ్రిజ్ పేలడంతో రూ.4 లక్షల ఆస్తి నష్టం
కొమరోలు: షార్ట్ సర్క్యూట్ కారణంగా పెద్ద శబ్ధంతో ఫ్రిజ్ పేలిపోయిన సంఘటన కొమరోలు మండలంలోని రాజుపాలెం గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. రాజుపాలెం గ్రామానికి చెందిన దద్దనాల చెంచయ్య ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్రిజ్ పేలిపోయింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఇంటి బయట ఉండటంతో ఎవరికీ ఎటువంటి హానీ జరగలేదు. అయితే, ఇంట్లోని సామగ్రి అగ్నికి ఆహుతవడంతో రూ.4 లక్షల నష్టం వాటిల్లినట్లు చెంచయ్య తెలిపారు. సమాచారం అందుకున్న గిద్దలూరు అగ్నిమాపకశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కొండపి: మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొండపి మండల కేంద్రంలోని పొదిలి రోడ్డులో ఉన్న స్టేట్ బ్యాంక్ సమీపంలో చోటుచేసుకుంది. కొండపి ఎస్సై బి.ప్రేమ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. షేక్ ఆరీఫ్ (22)కు తాను ప్రేమించిన యువతితో మనస్పర్థలు తలెత్తి గొడవలు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్లో వారు నివసిస్తున్న సమయంలో గొడవల కారణంగా అక్కడి కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో రిపోర్టు ఇవ్వగా ఆరీఫ్కు, ఆ యువతకి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అప్పటి నుంచి ఇద్దరికీ ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవల కారణంగా మనస్తాపం చెందిన ఆరీఫ్ శుక్రవారం అర్ధరాత్రి రెండున్నర గంటల ప్రాంతంలో అందరూ నిద్రిస్తున్న సమయంలో కొండపిలోని ఇంట్లో ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని మరణించాడు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఒంగోలు టౌన్: శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నగరంలో పోలీసులు శనివారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండు, డార్మిటరీ, కొత్త కూరగాయల మార్కెట్, పాత కూరగాయల మార్కెట్, రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో తనిఖీలు చేశారు. పేలుడు పదార్థాలు కనుగొనడంలో ప్రత్యేక శిక్షణ పొందిన జాగిలం చీతా సహాయంతో డాగ్ స్క్వాడ్ బృందం తనిఖీలలో పాల్గొంది. టాస్క్ఫోర్స్, స్పెషల్ పార్టీ బృందం మాదక ద్రవ్యాలు, ఇతర అక్రమ రవాణాను గుర్తించడానికి అనువణువూ పరిశీలన చేశారు. అనుమానం కలిగిన బ్యాగులను పరిశీలించడమే కాకుండా వ్యక్తుల వద్ద గుర్తింపు కార్డులను తనిఖీ చేశారు. తనిఖీలలో ఎస్సై శివరామయ్య, డాగ్ హ్యాండర్ల ప్రభాకర్ పాల్గొన్నారు. -
బీకే త్రషర్స్ను పరిశీలించిన బీమా కంపెనీ
సింగరాయకొండ: అగ్నిప్రమాదం సంభవించిన బీకే త్రషర్స్ కంపెనీని ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు, క్లూస్ టీం సిబ్బంది శనివారం పరిశీలించారు. మూడు ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పేప్రయత్నం చేశాయని, మంటలు అదుపులోనే ఉన్నా ఇంకా బేళ్లు మండుతున్నాయని కంపెనీ ప్రతినిధులు వారికి వివరించారు. కాగా బీకేటీ కంపెనీ శనివారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తమ కంపెనీలో జీపీఐకి చెందిన రూ.550 కోట్ల విలువైన పొగాకు, ఎల్అండ్ఎం కంపెనీకి చెందిన రూ.18 కోట్ల విలువైన పొగాకు కాలిపోయిందని, గోడౌన్కు రూ.30 కోట్లు కలిపి మొత్తం రూ.598 కోట్ల నష్టం వాటిల్లిందని జీఎం శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. గిద్దలూరు రూరల్: పట్టణంలోని 9వ వార్డు కుమ్మరివీధిలో పల్లె నాగమ్మకు చెందిన మట్టి మిద్దె ప్రమాదవశాత్తూ కూలిపోయింది. శనివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల కురిసిన వర్షాలకు మట్టి మిద్దె పూర్తిగా నాని ఉంది. ఈ నేపథ్యంలో ప్రమాదవశాత్తూ కూలిపోయింది. ఆ సమయంలో నాగమ్మ వరండాలో నిద్రిస్తుండటంతో ప్రమాదం తప్పింది. మిద్దెలోని దంతెలు, మట్టి కిందపడిపోవడంతో ఇంట్లోని వస్తువులు, నిత్యావసర సరుకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మిద్దె కూలి తనకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని బాధితురాలు విజ్ఞప్తి చేసింది. గిద్దలూరు రూరల్: ద్విచక్ర వాహనంపై వెళ్తూ అదుపుతప్పి కిందపడి తీవ్రగాయాలై వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని కె.ఎస్.పల్లె గ్రామ సమీపంలో జరిగింది. కె.బయనపల్లె గ్రామానికి చెందిన పాములేటి (39) అనే వ్యక్తి తన బైక్పై పెద్దచెరువు గ్రామానికి వెళ్లి తిరిగి వస్తూ శుక్రవారం అర్ధరాత్రి ప్రమాదవశాత్తూ అదుపుతప్పి కిందపడిపోయాడు. నంద్యాల హైవేలో విధులు నిర్వర్తిస్తున్న హైవే పోలీసులు పాములేటిని 108 అంబులెన్స్లో గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నంద్యాల తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ప్రజలే శ్రమదానం..!
ప్రభుత్వ వైఫల్యం..ఒంగోలు – మంగమూరు రోడ్డుపై పాడైపోయి ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతంలో మరమ్మతులు చేస్తున్న మంగమూరు యువకులుసంతనూతలపాడు: కూటమి ప్రభుత్వంలో చెప్పేదొకటి..చేసేదొకటి అనేదానికి రోడ్లే నిదర్శనంగా ఉన్నాయి. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్రంలోని రోడ్లన్నింటికీ మరమ్మతులు చేయించామని సీఎం చంద్రబాబు నుంచి ఎమ్మెల్యేల వరకూ గొప్పలు చెప్పుకుంటుండగా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. అనేక ప్రధాన రహదారులు సైతం అధ్వానంగా మారి ప్రయాణికుల నడ్డి విరుస్తున్నాయి. ఇలాంటి ఓ రోడ్డు గురించి పాలకులు, అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అనేక మంది వాహనదారులు ప్రమాదాలకు గురై గాయాలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆరు నెలల క్రితం ఏకంగా ఒక మహిళ మృత్యువాతపడింది. ఈ రోడ్డు ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉందా అంటే.. అదేమీ కాదు. జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలోనే ఉంది. అదే.. ఒంగోలు నుంచి మంగమూరు వెళ్లే రోడ్డు. ఈ రోడ్డులో సుందరమ్మ వాగు వద్ద తారు రోడ్డు 20 అడుగుల పొడవున ఉబ్బెత్తుగా మారి ప్రమాదాలకు నిలయమైంది. కొణిజేడు కొండ నుంచి ఎర్రమట్టిని ఓవర్ లోడుతో తరలిస్తూ వాహనాలు తిరుగుతుండటంతో ఈ రోడ్డుపై కొంతభాగం దెబ్బతింది. రోడ్డు ఉబ్బెత్తుగా మారిన ప్రాంతం ప్రమాదాలకు కారణమవుతోంది. రాత్రి వేళల్లో ప్రమాదాలు జరిగి పలువురికి గాయాలు... రాత్రి వేళల్లో ఒంగోలు నుంచి మంగమూరు రోడ్డుపై ప్రయాణం చేసేవారు సుందరమ్మ వాగు వద్ద ఉబ్బెత్తుగా మారిన రోడ్డును గమనించ ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రధానంగా ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి కిందపడి గాయపడుతున్నారు. ఆరు నెలల క్రితం మంగమూరు గ్రామానికి చెందిన భార్యాభర్తలు ఒంగోలు వెళ్లి రాత్రివేళ తిరిగి ఇంటికొస్తూ ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడ్డారు. వాహనం వెనుకవైపు కూర్చున్న మహిళ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఒంగోలులోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో సుమారు పది లక్షల రూపాయలు వెచ్చించి చికిత్స పొందినప్పటికీ ఫలితం దక్కలేదు. చివరకు మృత్యువాత పడింది. తరచూ ఎవరో ఒకరు అదే ప్రాంతంలో ప్రమాదాలకు గురవుతూ గాయపడుతున్నారు. గత శుక్రవారం రాత్రి కూడా మంగమూరుకు చెందిన ఒక యువకుడు ఒంగోలు వెళ్లి తిరిగి గ్రామానికి వస్తూ ఉబ్బెత్తుగా ఉన్న తారు రోడ్డు వద్ద వాహనం అదపుతప్పి కిందపడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో ఒంగోలులోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. వరుస ప్రమాదాలతో మంగమూరు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడంతో వారే స్వయంగా రంగంలోకి దిగారు. మంగమూరు అంబేడ్కర్ నగర్కు చెందిన యువకులు శనివారం ఉదయం శ్రమదానం చేసి ఉబ్బెత్తుగా మారి ప్రమాదాలకు కారణమవుతున్న రోడ్డు భాగాన్ని తవ్వి చదును చేశారు. ఇక్కడే కాకుండా ఓవర్ లోడుతో వాహనాలు ప్రయాణించడం వలన మంగమూరు – ఒంగోలు రోడ్డు పలు చోట్ల పాడైపోయి ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డుకు పూర్తిగా మరమ్మతులు నిర్వహించి ప్రమాదాలు జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. శ్రమదానం చేసి రోడ్డుకు మరమ్మతులు చేసిన వారిలో మంగమూరు అంబేడ్కర్ నగర్ యువకులు కొండసింగు ధనుంజయ, పైడి హనుమంతరావు, పందిపాటి రవి, కసుకుర్తి శివ, కంకణాల వెంకటేశ్వర్లు, మంచికలపాటి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. పాడైపోయి వాహన ప్రమాదాలకు కారణమవుతున్న రోడ్డు పలువురు ప్రమాదాలకు గురై గాయాలతో ఆస్పత్రి పాలు ఆరు నెలల క్రితం ఒక మహిళ మృతి శుక్రవారం రాత్రి యువకుడికి గాయాలు నెలల తరబడి పట్టించుకోని పాలకులు, అధికారులు స్వచ్ఛందంగా మరమ్మతులు చేసుకున్న యువత కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యపు పాలనకు నిలువెత్తు నిదర్శనం -
అక్రమంగా కలప తరలింపుతో బిక్కుబిక్కుమంటున్న వన్యప్రాణులు...
గిద్దలూరు అటవీశాఖ పరిధిలో గుండ్లకమ్మ రేంజ్, తురిమెళ్ల రేంజ్, బేస్తవారిపేట రేంజ్, గిద్దలూరు రేంజ్, స్క్వాడ్ రేంజ్, డీఈటీ రేంజ్ కలిపి మొత్తం 6 రేంజ్లకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు ఉన్నారు. అందులో గిద్దలూరు రేంజ్ ఆఫీసర్ సత్యనారాయణరెడ్డి స్క్వాడ్ రేంజ్కి ఇన్చార్జిగా, గుండ్లకమ్మ రేంజ్ ఆఫీసర్ నరసింహారావు డీఈటీ రేంజ్కి ఇన్చార్జిగా, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఆనందరావు బేస్తవారిపేట రేంజ్కి ఇన్చార్జిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గిద్దలూరు అటవీశాఖ పరిధిలో అభయారణ్యం సుమారు 10 వేల హెక్టార్లలో విస్తరించి ఉంది. గిద్దలూరు రేంజ్లోని గుండ్లమోటు, గుండ్లకమ్మ రేంజ్ పరిధిలోని కుక్కలగుండం, ఇసుకల గుండం నుంచే కాకుండా నంద్యాల జిల్లా పచ్చర్ల అటవీప్రాంతం నుంచి సైతం అక్రమంగా వెదురు, ఇతర కలప తరలిస్తున్నారు. అక్రమంగా కలప తరలించే వారు అభయారణ్యంలో ఎలా అడుగు పెడుతున్నారు.. అక్రమంగా కలప ఎలా తరలిస్తున్నారనే ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు. కలప, వెదురు నరికే వారి గొడ్డలి చప్పుళ్లకు వన్యప్రాణులు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్నాయి. -
ప్రైవేటీకరణపై పోరాటం
మార్కాపురం: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలందరికీ ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించడంతో పాటు విద్యార్థులకు వైద్య విద్యను కూడా అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఒకేసారి 17 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి అన్నా రాంబాబు వివరించారు. కానీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించేందుకు చర్యలు చేపట్టడం బాధాకరమని అన్నారు. దీనికి వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పోరాటం చేయనున్నట్లు చెప్పారు. మార్కాపురం పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమం వాల్పోస్టర్లు ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెడికల్ కళాశాలలను నిలిపివేయడంతోపాటు ఇటీవల కాలంలో వాటిని ప్రైవేటీకరణ చేస్తూ పీపీపీ విధానంలో నిర్మించాలని టెండర్లను ఆహ్వానించడం దారుణమని అన్నారు. ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో మెడికల్ కళాశాలల నిర్వహణ ఉంటే పేదలకు ఉచితంగా వైద్యం ఎలా అందుతుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల నుంచి కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని నవంబరు 22వ తేదీ వరకూ గ్రామాలు, పట్టణాల్లో వాడవాడలా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 28న మార్కాపురం నియోజకవర్గ కేంద్రాల్లో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నవంబరు 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీ జరుగుతుందన్నారు. ప్రజల నుంచి సేకరించిన సంతకాలను 23న జిల్లా కేంద్రాలకు పంపనున్నట్లు వెల్లడించారు. అనంతరం 24న పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించిన తరువాత రాష్ట్ర గవర్నర్కు అందజేయనున్నట్లు తెలిపారు. ఇది రాజకీయ లబ్ధి కోసం చేసేది కాదని, ప్రజలందరూ స్వచ్ఛందంగా సంతకాల సేకరణలో పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మీర్జా షంషేర్ ఆలీబేగ్, మార్కాపురం, కొనకనమిట్ల ఎంపీపీలు లక్ష్మీదేవీ కృష్ణారెడ్డి, మురళీకృష్ణ యాదవ్, మార్కాపురం, కేకే మిట్ల జెడ్పీటీసీలు నారు బాపన్రెడ్డి, అక్కిదాసరి ఏడుకొండలు, మున్సిపల్ మాజీ చైర్మన్ చిర్లంచర్ల బాల మురళీకృష్ణ, బీసీ సెల్ రాష్ట్ర నాయకులు పీఎల్పీ యాదవ్, పార్టీ పట్టణ కన్వీనరు సలీమ్, ఏఎంసీ మాజీ చైర్మన్ గొలమారి శ్రీనివాసరెడ్డి, పొదిలి పట్టణ, మండల కన్వీనర్లు సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, గుజ్జుల సంజీవరెడ్డి, కౌన్సిలర్లు డాక్టర్ కనకదుర్గ, చంద్ర శేఖర్, రోజ్లిడియా, ముత్తారెడ్డి వెంకట రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి గొలమారి సత్యనారాయణ రెడ్డి, పార్టీ నాయకులు బట్టగిరి తిరుపతిరెడ్డి, శేషయ్య, కొండయ్య, గౌస్ మొహిద్దీన్, కేకే మిట్ల వైస్ ఎంపీపీ మెట్టు వెంకటరెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, చాంద్బాషా తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ ఉద్యమం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభం వాల్పోస్టర్లు ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ దుర్మార్గం
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ దుర్మారం పామూరు: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలనుకోవడం ప్రభుత్వ దుర్మార్గపు చర్య అని వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు, నెల్లూరు పార్లమెంట్ పరిశీలకుడు, మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి అన్నారు. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఓ కార్యక్రమానికి వెళ్తూ మార్గం మధ్యలో పామూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జంకె మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు, పేద విద్యార్థులకు వైద్య విద్య అందించేందుకు ఏకంగా 17 వైద్య కళాశాలలకు అనుమతులు సాధించి నిర్మాణాలు చేపట్టారన్నారు. ఇప్పటికే 7 కళాశాలల నిర్మాణాలు పూర్తికాగా మరో 10 కళాశాలల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఆయా వైద్య కళాశాలలపై సవతి తల్లి ప్రేమ చూపుతూ వాటి ప్రైవేటీకరణకు మొగ్గుచూపడం అత్యంత హేయమని అన్నారు. దీనిపై వైఎస్సార్ సీపీ పోరాటాలకు సిద్ధమవుతోందన్నారు. కోటిసంతకాల సేకరణ చేపట్టి గవర్నర్కు వినతిప్రతం ఇచ్చే కార్యక్రమం చేపడుతోందని తెలిపారు. కూటమి పాలనా పగ్గాలు చేపట్టిన 15 నెలల్లోనే ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులైపారుతోందని, మద్యం బెల్ట్ దుకాణాలతో గ్రామాల్లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని, పేదల కుటుంబాలు బజారున పడుతున్నాయని జంకె ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి నాయకులు కల్తీ మద్యంతో కోట్లు దండుకుంటూ ప్రజల ఆరోగ్యం, ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు. అనంతరం జంకెను స్థానిక నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు గంగసాని హుసేన్రెడ్డి, టీచర్ల విభాగం జిల్లా అధ్యక్షుడు కల్లూరి రామిరెడ్డి, అంబటి కొండారెడ్డి, గట్లా విజయభాస్కర్రెడ్డి, పాలేటి ప్రేమ్కుమార్, చల్లా సుబ్బారావు, జొన్నలగడ్డ గోవిందయ్య, శ్రీరాం శ్రీనివాసులు, వెలుతుర్ల తిరుపతిరెడ్డి, షేక్ రసూల్, చింతంరెడ్డి బాలిరెడ్డి, కోటపాటి రమణారెడ్డి, వాకమళ్ల కోటిరెడ్డి, తాతిరెడ్డి నరసారెడ్డి పలువురు నాయకులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి -
ఇంటి దొంగలు..!
అటవీశాఖలో గిద్దలూరు అటవీశాఖ పరిధిలోని నల్లమల అభయారణ్యంనల్లమల అటవీ ప్రాంతం గిద్దలూరు రూరల్: అటవీశాఖలో ఇంటి దొంగల చేతివాటంపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. వీరి సహకారంతోనే అక్రమార్కులు చెలరేగిపోతున్నారన్న ఆరోపణలున్నాయి. గిద్దలూరు అటవీశాఖ పరిధిలోని నల్లమల అభయారణ్యంలో వేటగాళ్లు, అటవీ సంపదను కొల్లగొట్టే అక్రమార్కుల అడుగులు పడుతుండటంతో అలజడి ఎక్కువైపోతోంది. దుండగులు అభయారణ్యంలోకి ప్రవేశించేందుకు అటవీశాఖలోని ఇంటి దొంగలు సహకరిస్తున్నారని, అధికారులు, సిబ్బంది సైతం అవినీతికి పాల్పడుతూ పట్టించుకోకుండా వదిలేస్తున్నారని పుకార్లు షికారు చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు, సిబ్బంది అనుమతులు లేనిదే అక్రమార్కులు, వేటగాళ్లు అడవిలో అడుగుపెట్టడం వీలుపడదనే వాదన వినిపిస్తోంది. యథేచ్ఛగా వన్యప్రాణుల వేట... వేటగాళ్లు సైతం అభయారణ్యంలోకి యథేచ్ఛగా ప్రవేశిస్తూ వారికి కావాల్సిన జంతువులను వేటాడుతున్నారు. ఇటువంటి సంఘటనలు గతంలో అనేకం జరగ్గా.. ఈ నెల 7వ తేదీ సండ్రపాడు బీటులో ఇద్దరు వేటగాళ్లు నాటుతుపాకీతో అటవీశాఖ అధికారులకు పట్టుబడ్డారు. 9వ తేదీ రైలులో తరలివెళుతున్న అక్రమ వెదురు కలపను స్వాధీనం చేసుకున్నారు. 2022 నుంచి 2025 వరకు గుండ్లకమ్మ రేంజ్ పరిధిలో దుప్పి, జింక, ఉడుము, కణతి, నెమలి, అడవి పందులు, ఇతర వన్యప్రాణులను వేటాడిన కేసులు 40కిపైగా నమోదయ్యాయి. గిద్దలూరు, తురిమెళ్ల, బేస్తవారిపేట రేంజ్ పరిధిలో 25 కేసులు కలిపి మొత్తం 65 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. వేటగాళ్ల చేతిలో గాయపడిన వన్యప్రాణులకు అటవీశాఖ అధికారులు చికిత్స అందించి సురక్షితంగా అభయారణ్యంలో వదిలిన సంఘటనలు అనేకం జరిగాయి. నామమాత్రంగా వన్యప్రాణుల సంరక్షణ కార్యక్రమాలు... ఈ నెల 2 నుంచి 8వ తేదీ వరకు అటవీశాఖ ఆధ్వర్యంలో వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాలను నామమాత్రంగా నిర్వహించారు. వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ఫలితాలు శూన్యం. అడవి అక్కడ.. సిబ్బంది ఇక్కడ..! వేల హెక్టార్లలో విస్తరించి ఉన్న గిద్దలూరు అభయారణ్యాన్ని సంరక్షించే అటవీశాఖ అధికారులు.. వారికి కేటాయించిన పోస్టులకు సంబంధించిన ప్రాంతాల్లో అందుబాటులో లేకుండా దూరంగా నివాసం ఉండటం వల్ల అటవీ సంరక్షణ కష్టతరం అవుతున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు గిద్దలూరు అటవీశాఖ పరిధిలో 6 రేంజ్లలో ఏబీఓ పోస్టులు 40 ఖాళీగా ఉన్నాయి. ఎఫ్బీఓలు 7, ఎఫ్ఎస్ఓలు 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సిబ్బంది కొరత ఉండటం వలన ఉన్న అరకొర సిబ్బందితో అటవీ సంరక్షణ కష్టతరంగా మారింది. సిబ్బంది కొరతతో అవస్థలు... ఇసుకగుండం నార్త్, ఈస్ట్, మాలకొండపెంట ఈస్ట్, వెస్ట్, ఓబులేసుపెంట, దిగువమెట్ట ఈస్ట్, వెస్ట్, టన్నల్ బీటు, రాచర్ల, ఆకవీడులో మొత్తం 10 బీట్లకుగానూ గుండ్లకమ్మ రేంజ్లో ఏబీఓ పోస్టులు 10, దిగువమ్టెట ఠాణాలో 2 కలిపి మొత్తం 12 ఖాళీగా ఉన్నాయి. ఎఫ్బీఓలు 8 మంది పనిచేస్తున్నారు. 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇసుకగుండం, రాచర్ల, మాలకొండపెంట, దిగువమెట్ట బీట్లకు సెక్షన్ ఆఫీసర్లుగా ఎఫ్ఎస్ఓలు నలుగురు ఉండాల్సి ఉండగా, 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డీఆర్వోగా ఒకరు విధులు నిర్వర్తిస్తున్నారు. తురిమెళ్ల, బేస్తవారిపేట రేంజ్లలో 8కి 8 ఏబీఓ పోస్టులు ఖాళీ... గిద్దలూరు రేంజ్ పరిధిలో కొత్తకోట, సండ్రపాడు, బోది, ఎస్.ఆర్.పేట, గడికోట కలిపి మొత్తం 5 బీట్లకుగానూ కొత్తకోటలో మాత్రమే ఏబీఓ పనిచేస్తున్నారు. మిగిలిన నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎఫ్బీఓ 1, ఎఫ్ఎస్ఓ 1 చొప్పున పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తురిమెళ్ల రేంజ్లో పుల్లలచెరువు, జేబీకే పురం, పాపినేనిపల్లె, బొల్లుపల్లె, వెలగలపాయ, పాపినేనిపల్లె–2, పాపినేనిపల్లె ఠాణాలో 2 కలిపి మొత్తం 8 మంది ఏబీఓలు ఉండాల్సి ఉండగా, అన్ని పోస్టులూ ఖాళీగా ఉన్నాయి. ఎఫ్బీఓలు 9 మంది ఉండాల్సి ఉండగా, 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎఫ్ఎస్ఓ ఒక్క పోస్టు ఉండగా, ఆ ఒక్కటి ఖాళీగా ఉంది. మూడు డీఆర్ఓలకుగానూ ఒక్క పోస్టు ఖాళీగా ఉంది. బేస్తవారిపేట రేంజ్ పరిధిలో తాటిచెర్ల, నల్లగుంట్ల, చింతలపల్లె, జె.పి.చెరువు, చిన్న ఓబినేనిపల్లె, సింగసానిపల్లె, అల్లినగరం, గుంతపల్లిలో 8 ఏబీఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎఫ్బీఓలు 8 మందికిగానూ 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎఫ్ఎస్ఓలు ముగ్గురు ఉండాల్సి ఉండగా రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డీఆర్వో ఇన్చార్జి రేంజ్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నారు. వారి సహకారంతోనే జోరుగా కలప అక్రమ రవాణా జరుగుతోందని విమర్శలు 40కిపైగా నమోదైన వన్యప్రాణుల వేట కేసులు సిబ్బంది నిర్లక్ష్యానికి వన్యప్రాణులకు పొంచి ఉన్న ప్రమాదం పనిచేసే ప్రాంతంలో నివాసం ఉండని అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు -
డ్రోన్ పెట్రోలింగ్ ముమ్మరం చేయాలి
ఒంగోలు టౌన్: డ్రోన్ పెట్రోలింగ్ను ముమ్మరంగా నిర్వహించాలని, జిల్లాలోని అన్ని గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి పోలీసు అధికారులను ఆదేశించారు. పోలీసు అధికారులు తరచూ గ్రామాలను సందర్శించి ప్రజలతో మమేకం కావాలని, గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. శుక్రవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ వి.హర్షవర్ధన్రాజుతో కలిసి పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుత నేర పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మహిళలపై జరిగే నేరాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఆర్థిక నేరాలలో టాప్ 10 స్థానాలలో ఉన్న వారిపై నిఘా ఉంచాలన్నారు. దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా తయారీ, విక్రయాలు, నిల్వలపై దృష్టి సారించాలని చెప్పారు. నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమీక్ష సమావేశంలో ఒంగోలు డీఎస్సీ శ్రీనివాసరావు, దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ, మార్కాపురం డీఎస్సీ నాగరాజు, కనిగిరి డీఎస్సీ సాయిఈశ్వర్ యశ్వంత్, మహిళా పోలీసు స్టేషన్ డీఎస్సీ రమణ కుమార్, సీఐలు పాల్గొన్నారు. -
కలెక్టరేట్లో సమీకృత కమాండ్ కంట్రోల్ రూం
ఒంగోలు వన్టౌన్: ప్రకాశం భవనంలో ఉన్న కలెక్టర్ కార్యాలయంలోని వివిధ విభాగాలను కలెక్టర్ పీ రాజాబాబు శుక్రవారం రాత్రి పరిశీలించారు. కలెక్టరేట్లో సమీకృత కమాండ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేయనున్నారు. దీని కోసం పీజీఆర్ఎస్ మీకోసం హాలు, ఆడిట్ టీము, సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ విభాగం పనిచేస్తున్న కార్యాలయాలను జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, డీఆర్ఓ బీ చిన ఓబులేసులతో కలిసి తనిఖీ చేశారు. వీరి వెంట కలెక్టరేట్లోని వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు ఉన్నారు. ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగరంలో తాగునీటి పరఫరా తీరును డీఎంహెచ్ఓ డాక్టర్ టి.వెనకటేశ్వర్లు శుక్రవారం పరిశీలించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయన ఒంగోలు నగర పాలక సంస్థ ఇంజినీరింగ్ విభాగం అధికారులతో కలిసి పర్యవేక్షించారు. రాంనగర్, సంతపేట, అన్నవరప్పాడు తదితర ప్రాంతాల్లో తాగునీరు సరఫరా అవుతున్న ఎస్ఎస్–2 ట్యాంక్ పరిధిలోని ప్రాంతాలను మునిసిపల్ ఇంజినీర్ యేసయ్య ఆధ్వర్యంలో పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో సరఫరా అవుతున్న తాగునీరు ప్రసుత్తం పరిశుభ్రంగా సరఫరా అవుతున్నట్లు గుర్తించామని డీఎంహెచ్ఓ చెప్పారు. నగరంలో తాగునీరు పైపులు లీకేజి ఉంటే వెంటనే వాటిని మరమ్మతులు చేసి ప్రజలకు పరిశుభ్రమైన నీటిని సరఫరా చేయాలని మునిసిపల్ ఇంజినీర్కు సూచించారు. -
‘కల్తీ మద్యం’పై నిరసన
ఒంగోలు సిటీ: మద్యం దుకాణాల్లో కల్తీ మద్యం విచ్చలవిడిగా సరఫరా చేస్తున్నారని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో కల్తీ మద్యాన్ని వ్యతిరేకిస్తూ ఒంగోలులోని అంబేడ్కర్ భవనం వద్ద శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. కల్తీ మద్యాన్ని వ్యతిరేకిస్తూ మహిళలు నినాదాలు చేశారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ మహిళా విభాగం నాయకులు ర్యాలీగా బయలుదేరగా పోలీసులు అడ్డుకొని పది మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కార్యాలయం లో డీసీ కి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం కార్యాలయం ఎదురు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ చూసిన కల్తీ మద్యం వల్ల మరణాలు ఎక్కువవుతున్నాయన్నారు. అధికార పార్టీ అండతో రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం యూనిట్లు ఏర్పాటు చేశారని ధ్వజమెత్తారు. అధికార పార్టీకి చెందిన నాయకులు ఒక్కొక్కరు ఏరియాలను పంచుకున్నారని విమర్శించారు. పార్టీ రాష్ట్ర మహిళా విభాగం జోనల్ ఇన్చార్జ్ గంగసాని లక్ష్మి మాట్లాడుతూ జగనన్న ఇంటి వద్దకే పరిపాలన అని మంచి చేస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాన్ని హోం డెలివరీ చేస్తోందని విమర్శించారు. లిక్కర్ షాపులే ఒక కుంభకోణమన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం పాడు ఎంపీపీ గాయం సావిత్రి, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, మద్దిపాడు ఎంపీపీ వాకా అరుణ, పార్టీ మహిళా నాయకులు సన్నపురెడ్డి రవణమ్మ, గోనెల మేరీ కుమారి, సయ్యద్ అప్సర్, పులి శాంతి, వడ్లమూడి వాణి, కాకర్లమూడి రజిని, జమీల బేగం, సవరం రత్తమ్మ, నెలకుర్తి మహేశ్వరి, పండిటి లక్ష్మి,నాగమణి, మన్యం సంధ్య, పి.లక్ష్మి, కె.సంధ్య, మొలకపల్లి సీతమ్మ, తన్నీరు రాగమ్మ, కే లక్ష్మి, పీ పార్వతి, జీ మాలతి, పీ అమూల్య, జీ తిరుపతమ్మ, రాచూరి సుస్మిత, మాధవి, బత్తుల కోటమ్మ, రాధా, ఎన్ సరిత, ఇండ్ల భాను, ముద్దావనమ్మ, రాచూరి పుష్ప, ఎం లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
సింగరాయకొండ: పేద, మధ్య తరగతి వర్గాలకు వైద్య విద్యను, వైద్యాన్ని దరిచేర్చటానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంజూరు చేసిన మెడికల్ కాలేజీలను పీపీపీ విధానం ద్వారా ప్రైవేటుకు కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వ పన్నాగాలను అడ్డుకోవటంతో పాటు పీపీపీ విధానాన్ని రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి, పీఏసీ సభ్యుడు డాక్టర్ ఆదిమూలపు సురేష్ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మండలంలోని పాకల గ్రామంలో అభ్యుదయ కళ్యాణ మండపంలో శుక్రవారం కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. డాక్టర్ సురేష్ మాట్లాడుతూ కరోనా సమయంలో డాక్టర్ల కొరతను తెలుసుకుని పేదలకు వైద్య విద్యను, వైద్యాన్ని దరిచేర్చే మంచి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సహకారంతో 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేసి వాటిలో 5 మెడికల్ కాలేజీలను పూర్తిచేసి ప్రారంభోత్సవం చేయగా రెండు మెడికల్ కాలేజీలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. మిగిలిన 10 మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటుకు పప్పు బెల్లాల రూపంలో అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం పన్నాగాలు పన్నుతోందని ఆరోపించారు. ఎకరా స్థలాన్ని కేవలం ఏడాదికి రూ.100 కు లీజు పద్ధతిన 66 ఏళ్లు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. ఒక్కో మెడికల్ కాలేజీ సుమారు 50 ఎకరాల్లో ఉంటుందని ఆ విధంగా ఒక్కో మెడికల్ కాలేజీ ఏడాదికి రూ.5 వేల లీజు పద్ధతిలో అందజేయటానికి పూనుకుందని, ఇంతకంటే దారుణమైన ప్రభుత్వం మరొకటి లేదని ఘాటుగా విమర్శించారు. ఒక్కో మెడికల్ కాలేజీ నిర్మాణానికి సుమారు రూ.500 కోట్లు అవుతుందని ఆ ప్రకారం 17 మెడికల్ కాలేజీలకు రూ.8,500 కోట్లు అవుతుండగా ఇప్పటి వరకు రూ.3 వేల కోట్ల వరకు జగనన్న ఖర్చు చేశాడని మిగిలిన, రూ.5 వేల కోట్లను సంవత్సరానికి వెయ్యి కోట్ల చొప్పున ఖర్చు చేసి పూర్తి చేయవచ్చని, కానీ డబ్బులు లేవని ప్రైవేటుకు అప్పగిస్తామని చెప్పటం సిగ్గుచేటన్నారు. పేదలకు వైద్యాన్ని, విద్యను దూరం చేయటంలో మంత్రి స్వామి తన వంతు పాత్ర పోషించాడని, తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ప్రైవేటు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం పూనుకోవటాన్ని దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు అన్నారని ఇప్పుడు ప్రైవేటుకు కట్టబెడుతుంటే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకుందని విమర్శించారు. పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ మాదాసి వెంకయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వ్యవస్థలను ప్రైవేటీకరించేందుకే మొగ్గు చూపుతుందని, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే తహశీల్దార్, ఎంపీడీఓ, పోలీస్స్టేషన్ లను కూడా ప్రైవేటీకరించినా ఆశ్చర్యం లేదని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం మెడికల్సీట్లు మంజూరు చేస్తానంటే వద్దు అని చెప్పిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యుటివ్ మెంబర్ డాక్టర్ బత్తుల అశోక్కుమార్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసే పీపీపీ విధానాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేయటాన్ని దేశచరిత్రలో తీసుకున్న నికృష్టమైన నిర్ణయమని ఎద్దేవా చేశారు. తరువాత మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలిరోజు 500 సంతకాలను సేకరించారు. అంతకుముందు వైఎస్సార్, డాక్టర్ కోటారెడ్డి, పూనూరు వెంకారెడ్డి విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు వై వెంకటేశ్వరరావు, పార్టీ అధ్యక్షులు మసనం వెంకట్రావు, బచ్చల కోటేశ్వరరావు, చింతపల్లి హరిబాబు, దుద్దుగుంట మల్లిఖార్జునరావు, కేశవరపు కృష్ణారెడ్డి, గొల్లపోతు గోవర్దన్, ఎంపీటీసీలు గోళ్లమూడి అశోక్కుమార్రెడ్డి, ఏపూరి శ్రీనివాసులు, అంకయ్య, బల్లెల ప్రభాకరరెడ్డి, ఎం శివారెడ్డి, బుర్ల భాస్కరరెడ్డి, పాలెపు మాధవరావు, వినోద్, గౌడపేరు రాఘవ, మాధవ, కుర్రు కళ్యాణ్, బుజ్జమ్మ, పున్నయ్య తాతయ్య, విజయ్, పౌల్, వాయిల ఆనంద్, ప్రభుదాసు, కాలేషా, షకీలా, ప్రమీల, ప్రళయకావేరి శివ, వీ పెద్ద యలమందయ్య, ఢాకా పిచ్చిరెడ్డి, చొప్పర వెంకన్న, రాపూరి ప్రభావతి, నరేందర్రెడ్డి, సుదర్శి వెంకట్రావు, షేక్ సుల్తాన్, చుక్కా కిరణ్కుమార్, యనమల మాధవి, కోమిట్ల వెంకారెడ్డి, చొప్పర శివ, పెరికాల సునీల్, షేక్ కరీం, సోమిశెట్టి సురేష్, మాదాల శంకర్, ప్రభాకరరెడ్డి, దాసరి శేషయ్య, భాగ్యమ్మ, నవీన్రెడ్డి, భాను, నాగార్జున, చిడిపోతు కృష్ణారెడ్డి, షేక్ నౌషాద్, పుట్టా వెంకట్రావు, ఎం వెంకటాద్రి రెడ్డి, బొక్కిసం సుబ్బారావు, గొట్టిపాటి మురళి, జెడ్పీటీసీ బెజవాడ వెంకటేశ్వర్లు, పిల్లి తిరుపతిరెడ్డి, తానికొండ రామచంద్రరావు, నాగినేని భాస్కర్, దుంపా అనిల్కుమార్రెడ్డి, పిన్నిక కమలేష్, నరేష్, సయ్యద్ ఆబిద్ అలీ, షేక్ అల్లాబక్షు, షేక్ పటేల్, మారంరెడ్డి గంగాధరరెడ్డి పాల్గొన్నారు. -
ప్రకాశం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, ప్రకాశం: ప్రకాశం(Prakasam) జిల్లాలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. టంగుటూరు మండలంలోని కలికివాయి బిట్రగుంటలో పొగాకు గోదాంలో అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగింది. అగ్ని ప్రమాదం కారణంగా మంటలు ఎగిరిపడుతున్నాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నారు.వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లాలో బెల్లం కోటయ్యకు చెందిన పొగాకు గోదాంలో మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్య్కూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్టు సమాచారం. అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే.. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం లేనప్పటికీ భారీగా జరిగిన ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. -
బోధనేతర కార్యక్రమాలకు మినహాయింపు ఇవ్వండి
ఒంగోలు సిటీ: ఉపాధ్యాయులకు బోధనేతర కార్యక్రమాల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఫ్యాప్టో నాయకులు కోరారు. ఈ మేరకు గురువారం డీఈఓ కార్యాలయ సూపరింటెండెంట్ ఆదిలక్ష్మి, డీఆర్ఓ ఓబులేసుకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో నాయకులు మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ నుంచి బోధనేతర పనులు, విద్యాశక్తి కార్యక్రమం బహిష్కరిస్తున్నామని తెలిపారు. విద్యారంగంలో మితిమీరిన బోధనేతర కార్యక్రమాలతో బోధనా సమయం హరించుకుపోతోందన్నారు. ఉపాధ్యాయులకు కూడా బోధనపై ఆసక్తి తగ్గేలా బోధనేతర కార్యక్రమాలు పెరిగిపోయాయని, పలు దఫాలుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకం సంబంధించిన పనులు మాత్రమే ఉపాధ్యాయులు చేపడతారని, మూల్యాంకనానికి సంబంధించి పరీక్షల నిర్వహణ తప్ప ఏ ఇతర బోధనేతర పనులను గానీ, అనవసరమైన గూగుల్ షీట్స్ నింపడం గాని, విద్యా శక్తి, జీఎస్టీ 2.0 లాంటి సీజనల్ ప్రచార కార్యక్రమాలను చేపట్టమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా ఫ్యాప్టో చైర్మన్ కె.ఎర్రయ్య ఫ్యాప్టో డిప్యూటీ సెక్రటరీ జనరల్ షేక్ అబ్దుల్ హై, ఫ్యాప్టో కో చైర్మన్ వి.మాధవరావు, సభ్యులు డి.శ్రీనివాసులు, పీవీ సుబ్బారావు, జి.ఉమామహేశ్వరి, సీహెచ్ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చట్టాలపై అవగాహన అవసరం
పాల్గొన్న పోలీసు అధికారులు, సిబ్బంది ● ఎస్పీ హర్షవర్ధన్రాజు ఒంగోలు టౌన్: కొత్త చట్టాలపై పోలీసు అధికారులంతా పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉంలని ఎస్పీ వి.హర్షవర్ధన్రాజు సూచించారు. నూతన చట్టాలకు అనుగణంగా రూపొందించిన రిజిస్టర్లను నిక్కచ్చిగా నిర్వహించడం తప్పనిసరని స్పష్టం చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని గెలాక్సీ కాంప్లెక్స్లో గురువారం నూతన చట్టాలపై పోలీసు అధికారులు, పోలీస్స్టేషన్ల రైటర్లు, అసిస్టెంట్ రైటర్లు, టెక్నికల్ అసిస్టెంట్లకు అవగాహనా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డిజిటలైజేషన్, వేగవంతమైన న్యాయం లక్ష్యంగా నూతన చట్టాలను రూపొందించినట్లు వివరించారు. జీరో ఎఫ్ఐఆర్, ఈ ఎఫ్ఐఆర్లను సమర్ధవంతంగా అమలు చేయడంలో రికార్డులు కీలకమని చెప్పారు. అధికార పరిధితో సంబంధం లేకుండా నమోదు చేసే జీరో ఎఫ్ఐఆర్, దర్యాప్తు పురోగతి వివరాలు, ఈ సమన్స్ పంపే ప్రక్రియ, నేర దృశ్యాల వీడియో రికార్డింగ్, ఈ ఎవిడెన్స్ వంటి డిజిటల్ విధానాలకు సంబంధించిన రిజిస్టర్లు కొత్త విధానం ప్రకారం నిర్వహించాలని సూచించారు. రికార్డులన్నింటినీ ఎప్పటికప్పుడు పోర్టల్లో నమోదు చేయాలన్నారు. ప్రిలిమినరీ ఎంకై ్వరీ రికార్డుల విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని చెప్పారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల దర్యాప్తును రెండు నెలల్లో పూర్తి చేయడానికి సంబంధించిన రికార్డులు పక్కాగా ఉండాలన్నారు. నేరాల దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించారు. కొత్త చట్టాల అమలుతో పోలీసుల జవాబుదారీతనం, పారదర్శకత మరింత పెరుగుతాయని చెప్పారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ దేవప్రభాకర్, ఐటీ కోర్ సీఐ సూర్యనారాయణ, టూటౌన్ సీఐ మేడా శ్రీనివాసరావు, ఎస్సైలు పాల్గొన్నారు. -
మార్కాపురం సబ్ కలెక్టర్ బదిలీ
మార్కాపురం: మార్కాపురం సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట త్రివినాగ్ బదిలీ అయ్యారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఐఏఎస్ల బదిలీల్లో భాగంగా ఆయనను గృహ నిర్మాణశాఖ డిప్యూటీ సెక్రటరీగా బదిలీ చేశారు. ఆ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్కుమార్మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఒంగోలు వన్టౌన్: ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు ఒంగోలు రూడ్ సెట్ సంస్థ డైరెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21వ తేదీ నుంచి 31 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు అర్హులన్నారు. అభ్యర్థులు ఆధార్, రేషన్ కార్డు కలిగి ఉండాలన్నారు. శిక్షణ కాలంలో భోజనం, వసతి సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు, అభ్యర్థులు తమ పేర్ల నమోదుకు 83099 15577 నంబర్నుగానీ, ఒంగోలులోని భాగ్యనగర్ 4వ లైన్ 11వ అడ్డరోడ్డులో ఉన్న రూడ్సెట్ సంస్థ కార్యాలయంలోగానీ సంప్రదించాలని సూచించారు. ఒంగోలు వన్టౌన్: జీఎస్టీపై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని జేసీ గోపాలకృష్ణ సూచించారు. స్థానిక ప్రకాశం భవన్ వద్ద నుంచి గురువారం ఏర్పాటు చేసిన జీఎస్టీ 2.0 ర్యాలీని జేసీ ప్రారంభించారు. జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నెల్లూరు బస్టాండ్ మీదుగా మినీ ఆడిటోరియం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0 సంస్కరణలు తీసుకురావడంతో మెడిసిన్స్, మొదలు అనేక వస్తువులపై జీఎస్టీ తగ్గిందని తెలిపారు. కొన్నింటిని జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయించినట్లు చెప్పారు. వాటన్నింటిపై అవగాహన ఉండాలని సూచించారు. డ్రగ్ కంట్రోలర్ పీఎస్ జ్యోతి, డ్రగ్ ఇన్స్పెక్టర్ పి.శ్రీరామమూర్తి, ఒంగోలు రిటైల్ షాప్ అధ్యక్షుడు జి.వెంకటరెడ్డి, వి.వెంకటరావు, వైద్యారోగ్యశాఖ తరఫున డీసీహెచ్ఎస్ డాక్టర్ ఎం.శ్రీనివాసనాయక్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సూరిబాబు, ఆర్బీఏకే నోడల్ అధికారి డాక్టర్ భగీరథి, జిల్లా మీడియా అధికారి బెల్లం నరసింహరావు, నర్సింగ్ విద్యార్థులు, అధ్యాపకులు, పట్టణ ఆరోగ్య కేంద్రాల ఆరోగ్య కార్యకర్తలు, పర్యవేక్షకులు పాల్గొన్నారు. మార్కాపురం టౌన్: పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో హెచ్ఎం కొట్టడంతో విద్యార్థినికి ఫిట్స్ వచ్చి ఆస్పత్రి పాలైంది. బుధవారం జరిగిన ఈ సంఘటన గురువారం పాఠశాల తనిఖీకి వెళ్లిన సబ్ కలెక్టర్ త్రివినాగ్కు బాధిత విద్యార్థిని తల్లి ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న కీర్తన అనే విద్యార్థిని తరచూ పాఠశాలకు లేటుగా వస్తుందన్న కారణంతో బుధవారం హెచ్ఎం శ్రీదేవి కొట్టడంతో ఫిట్స్కు గురవగా, వెంటనే సమీపంలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు. ఇంటికి వెళ్లిన తర్వాత విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లి దేవి గురువారం ఉదయం పాఠశాల తనిఖీ నిమిత్తం సబ్ కలెక్టర్ త్రివినాగ్ వస్తున్నాడని తెలుసుకుని హెచ్ఎం శ్రీదేవిపై ఆయనకు ఫిర్యాదు చేసింది. స్పందించిన సబ్ కలెక్టర్.. పాఠశాల హెచ్ఎంపై విచారణ చేసి నివేదిక పంపాలని ఎంఈఓను ఆదేశించారు. పాఠశాలకు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆలస్యంగా రావడంపై కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రేయర్ సమయానికల్లా హాజరుకావాలని ఆదేశించారు. హాస్టల్ విద్యార్థులు ఉదయం 8.45 గంటల్లోగా పాఠశాలకు చేరుకునేలా వార్డెన్లకు సమాచారం పంపాలని హెచ్ఎంలకు సూచించారు. లేకుంటే వార్డెన్లపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ హెచ్చరించారు. -
పార్టీ అండగా ఉంటుంది
భయం వద్దు..● వైఎస్సార్ సీపీ శ్రేణులకు రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి భరోసా ఒంగోలు సిటీ: కూటమి ప్రభుత్వ వేధింపులకు వైఎస్సార్ సీపీ శ్రేణులెవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి భరోసా ఇచ్చారు. వినాయకుని నిమజ్జనంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పాటలు పెట్టారనే అక్కసుతో ఒంగోలు 45వ డివిజన్కు చెందిన వైఎస్సార్ సీపీ వర్గీయులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించి అక్రమ కేసు నమోదు చేసి రిమాండ్కు పంపగా, బెయిల్పై బయటకు వచ్చిన వారు గురువారం వైవీ సుబ్బారెడ్డిని కలిశారు. నిమజ్జనం రోజు ఏం జరిగిందో వైవీకి వివరించారు. మహిళల పట్ల కూడా పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, 50 మందికిపైగా వైఎస్సార్ సీపీ వారిపై అక్రమ కేసు బనాయించారని తెలిపారు. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీకి ప్రజల్లో పెరుగుతున్న బలాన్ని చూసి భయపడుతున్న కూటమి పాలకులు వైఎస్సార్ సీపీ శ్రేణులను భయాందోళనకు గురి చేసే విధంగా పోలీసులను అడ్డం పెట్టుకుని అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అక్రమ కేసులో బాధితులకు అండగా నిలిచిన వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, లీగల్ సెల్ న్యాయవాదులు పెన్నా నాగరాజు, ధర్నాసి హరిబాబు, జయచంద్రనాయక్, అలికేపల్లి యగ్నేశ్వరరెడ్డి, కోడూరి రవిబాబును వైవీ సుబ్బారెడ్డితో పాటు పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు అభినందించారు. వారి వెంట వైఎస్సార్ సీపీ నాయకుడు వెన్నపూస వెంకటేశ్వరరెడ్డి, కార్పొరేటర్ వెన్నపూస కుమారి, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రవణమ్మ ఉన్నారు. -
కాసులు పిండేస్తాం!
కేసులు పెడతాం..ఇతర లారీలు ససేమిరా... ఉచిత ఇసుక హామీని నిలబెట్టుకోవాలి ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. గత ప్రభుత్వం కంటే అధిక ధరకు ఇసుక అమ్ముతున్నారు. ప్రతి మండలంలో ఐదు నుంచి పది మంది లూజు ఇసుక అమ్ముకుని జీవించేవారు. బలవంతంగా వారిని అమ్ముకునే పరిస్థితి లేకుండా చేశారు. – డాకాల పుల్లయ్య, రైతు సంఘ నియోజకవర్గ కార్యదర్శి బేస్తవారిపేట: జిల్లాలో వందలాదిమంది ఇసుక వ్యాపారులున్నారు. ఏళ్ల తరబడి ఇసుక అమ్ముకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. సుమారు 400 నుంచి 500 మంది ఇసుక విక్రయాలపై బతుకుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారికి కష్టాలు మొదలయ్యాయి. ఇసుక రీచ్ల నుంచి ఇసుక తెచ్చుకుని అమ్ముకోకుండా వారిపై ఒత్తిడి చేయడం, పోలీసు కేసులతో బెదిరించడంతో పాటు భయాందోళనకు గురిచేశారు. ఇసుక వ్యాపారుల టిప్పర్లను ధ్వంసం చేయడమే కాకుండా రోజుల తరబడి వారి అధీనంలో పెట్టుకుని వేధించారు. దాంతో టిప్పర్ యజమానులు, ఇసుక వ్యాపారులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. అయినప్పటికీ పచ్చనేతలు ఊరుకోలేదు. ప్రైవేటు వ్యాపారులు ఇసుక అమ్మడానికి వీళ్లేదని ఆంక్షలు విధించారు. ఎవరైనా ఇసుక తెచ్చుకున్నా తమ ఇసుక స్టాక్ పాయింట్లో, చెప్పిన ధరకే అన్లోడ్ చేయాలని హుకుం జారీ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో గత్యంతరం లేక ఇసుక వ్యాపారులు కూలి పనులకు వెళ్తున్నారు. కొందరు మాత్రం పచ్చనేతలతో బేరం కుదుర్చుకుని స్టాక్ పాయింట్కు ఇసుక తరలిస్తున్నట్లు తెలుస్తోంది. నెలకు రూ.2.75 కోట్ల దోపిడీ... జిల్లాలో నెలకు 50 నుంచి 65 వేల టన్నుల ఇసుక విక్రయాలు జరుగుతున్నట్లు అధికారుల అంచనా. ప్రతి టన్నుపై టీడీపీ నాయకులు 500 నుంచి 700 రూపాయలు అధికంగా ఎల్లో ట్యాక్స్ వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంటే నెలకు రూ.2.75 కోట్లకుపైగా అక్రమంగా వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ లెక్కన ఏడాదికి సుమారు 40 కోట్ల రూపాయలకు పైగా తమ్ముళ్లు జేబులు నింపుకుంటున్నారని సమాచారం. ఇంత భారీ మొత్తం దోపిడీ జరుగుతున్నా ప్రభుత్వ పెద్దలు ఇంకా ఉచిత ఇసుక గురించి మాట్లాడుతుండటంపై సామాన్యులు మండిపడుతున్నారు. ఒక్క గిద్దలూరు నియోజకవర్గంలో పరిస్థితిని పరిశీలిస్తే.. కంభం, అర్ధవీడు, బేస్తవారిపేట, గిద్దలూరు, రాచర్ల, కొమరోలు మండలాల్లో దాదాపుగా నెలకు 8500 టన్నుల ఇసుక అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రైవేట్ వ్యక్తులు లారీలో ఇసుక తీసుకొస్తే టన్ను రూ.800కు స్టాక్ పాయింట్లో దించాలి. అధికార పార్టీ ప్రజాప్రతినిధి అనుచరులు టన్ను రూ.1200 ప్రకారం స్టాక్ పాయింట్లకు చేరవేస్తున్నారని తెలుస్తోంది. టన్నుకు అదనంగా రూ.400 నుంచి రూ.700 దండుకుంటున్నారు. 8500 టన్నులకు నెలకు రూ.34 లక్షలు దోపిడీ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా గతంలో రాచర్ల మండలం రంగారెడ్డిపల్లె సమీపంలో ఒంగోలు–నంద్యాల హైవేపై ఇసుక స్టాక్ పాయింట్ను అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ప్రతి మండలంలో ఇసుక స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేసి టీడీపీ నేతలకు అప్పగించారు. వీరు అదనపు దోపిడీకి తెరలేపారు. బేస్తవారిపేట జంక్షన్, కొమరోలు, రాచర్ల మండల కేంద్రాల్లో టన్ను రూ.1300, అర్ధవీడులో టన్ను రూ.1500, గిద్దలూరులో టన్ను రూ.1200, కంభంలో రూ.1500కు విక్రయిస్తున్నారు. మండల కేంద్రం నుంచి పల్లెలకు ట్రాక్టర్లతో ఇసుక తరలించడానికి అదనపు భారం పడుతోంది. గతంలో 40 టన్నుల లారీ ఇసుక రూ.34 వేల నుంచి రూ.36 వేలకు వచ్చేది. నేడు రూ.52 వేలు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. బాడుగ అదనం... తరలించే దూరాన్ని బట్టి టన్నుకు రూ.200 నుంచి రూ.400 బాడుగ అదనంగా చెల్లించాలి. అరకొరగా అవసరమైన ఇసుకను తెచ్చుకోవాలంటే బాడుగ ఖర్చులు భారంగా మారుతున్నాయి. మార్కాపురం, దర్శి, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో స్టాక్ యార్డ్ పేరుతో ఈ దందా జరుగుతోంది. ఇసుక కాంట్రాక్ట్ దక్కించుకున్న ఎమ్మెల్యేల అనుచరులు ఇసుక అమ్మకాలపై డేగకన్ను వేశారు. లూజుగా ఇసుక అమ్ముకునే వ్యక్తుల వద్దకు వెళ్లి కేసులు పెడతామని బెదిరింపులకు దిగుతున్నారు. గతంలో బాడుగలకు వెళ్లిన లారీలు ఖాళీగా తిరిగి వచ్చే సమయంలో ఇసుక తెచ్చుకునేందుకు కొంత వెసులుబాటు ఉండేది. వారిని పోలీసులతో బెదిరించి పోలీస్స్టేషన్లలో లారీలను పెట్టడంతో వారు చెప్పిన ధరకే డంపింగ్ యార్డ్లో అన్లోడ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఉద్యమిద్దాం
● మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సింగరాయకొండ: కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా మెడికల్ కాలేజీలను ప్రైవేట్పరం చేయాలని చూస్తుందని, దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. స్థానిక పార్టీ క్యాంపు కార్యాలయంలో గురువారం నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడిక్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేట్పరం చేసి పేద విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేసేందుకే కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నిందన్నారు. దీనికి నిరసనగా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు సంతకాలు సేకరణ, రచ్చబండ కార్యక్రమాన్ని జిల్లాలో తొలుత పాకల గ్రామంలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. పేద విద్యార్థులు, పేద ప్రజల కోసం మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా 17 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు పూనుకుంటే కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేట్పరం చేసి సొమ్ము చేసుకునేందుకు యత్నిస్తుందని మండిపడ్డారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు. పాకలలోని అభ్యుదయ కళ్యాణమండపంలో జరిగే కార్యక్రమంలో పార్టీ పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, వై వెంకటేశ్వరరావు, సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు డాక్టర్ మాదాసి వెంకయ్య పాల్గొంటారన్నారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ విభాగాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడు, ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బత్తుల అశోక్కుమార్రెడ్డి, మండల అధ్యక్షుడు మసనం వెంకట్రావు, చొప్పర వెంకన్న, రాపూరి ప్రభావతి, నరేందర్రెడ్డి, షేక్ మహమ్మద్బాషా, షేక్ సుల్తాన్, యనమల మాధవి, చుక్కా కిరణ్కుమార్, దాసు శ్రీను, గొల్లపోతు గోవర్దన్, నరేష్, పటేల్, కోమట్ల వెంకారెడ్డి, గాలిబుజ్జి, బుజ్జమ్మ, పెరికాల సునీల్, కుంచాల రవి, చొప్పర శివ, షేక్ అల్లాభక్షు, సోమిశెట్టి సురేష్, రావినూతల అంకయ్య, ఎం భాగ్యలక్ష్మి, కేశవరపు నవీన్రెడ్డి, ఎం జెస్సిపాల్, షేక్ కరీం, మాదాల శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
త్రిపురాంతకం: బొలోరా వాహనం, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన మేడపి – మానేపల్లి రోడ్డులో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. త్రిపురాంతకం మండలం గణపవరానికి చెందిన మందా పేరయ్య (22), మందా కోటేష్లు పుల్లలచెరువు మండలం ఐటీవరంలో ఉన్న తల్లి కోటమ్మ వద్దకు వెళుతూ ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో పేరయ్య అక్కడికక్కడే మృతి చెందగా కోటేష్ తీవ్రంగా గాయపడ్డాడు. వీరిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల పిల్లలు. బేల్దారీ పనుల నిమిత్తం గురువారం రాత్రి హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ప్రమాదం జరిగింది. దీంతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది. మృతుడు పేరయ్య తండ్రి అనారోగ్యంతో రెండేళ్ల క్రితం మృతి చెందాడు. బొలోరా వాహనంలో ప్రయాణిస్తున్న ఐటీవరానికి చెందిన కొన్ని కుటుంబాలు రవ్వారంలోని గురప్పస్వామి దేవాలయానికి వెళుతూ ప్రమాదానికి గురయ్యారు. వారికి చిన్న చిన్న గాయాలయ్యాయి. సీఐ అసాన్, ఎస్సై శివబసవరాజులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన పేరయ్య కుటుంబసభ్యులు తమకు న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి వారితో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. మరొకరి పరిస్థితి విషమం మేడపి–మానేపల్లి రోడ్డులో ప్రమాదం -
సెకండరీ గ్రేడ్ టీచర్లకు కౌన్సెలింగ్ పూర్తి
● సోమవారం నుంచి విధుల్లోకి.. కనిగిరి రూరల్: మెగా డీఎస్సీ ద్వారా ఎంపికై న సెకండరీ గ్రేడ్ టీచర్లకు కౌన్సెలింగ్ పూర్తయినట్లు డీఈఓ కిరణ్కుమార్ తెలిపారు. స్థానిక ఆల్ఫా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలో జిల్లా విద్యాశాఖ అధికారి ఏ కిరణ్కుమార్ కౌన్సెలింగ్ నిర్వహించి వారికి స్థానాలు కేటాయించారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ జిల్లాలో 124 మంది సెకండరీ గ్రేడ్ తెలుగు, ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికై నట్లు తెలిపారు. వారికి ఈ నెల 3వ తేదీ నుంచి రెసిడెన్షియల్ తరహాలో శిక్షణ ఇచ్చామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శిక్షణ కేంద్రంలో కౌన్సెలింగ్ నిర్వహించి ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. సోమవారం నుంచి వారంతా కేటాయించిన పాఠశాలల్లో విధుల్లో చేరాల్సి ఉంటుందన్నారు. కౌన్సెలింగ్లో మండల విద్యాశాఖ అధికారులు యూవీ నారాయణరెడ్డి, జి.సంజీవి, రాజాల కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన అంతరిక్ష వారోత్సవాలు
ప్రాజెక్టులు పరిశీలిస్తున్న విద్యార్థులు బహుమతులు అందజేస్తున్న దృశ్యం ● రెండో రోజు స్పేస్ ఎగ్జిబిషన్కి విశేష స్పందన ఒంగోలు సిటీ: సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం, ఇస్రో, క్విస్ ఇంజినీరింగ్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన అంతరిక్ష వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన షార్ చీఫ్ జనరల్ మేనేజర్ పి.వెంకటరెడ్డి మాట్లాడుతూ ఇస్రోలో చేసిన వివిధ ప్రయోగాల గురించి వివరించారు. రానున్న కాలంలో మరిన్ని ప్రయోగాలు చేస్తామన్నారు. గగన్యాన్ తదితర ప్రాజెక్టుల గురించి విద్యార్థులకు వివరించారు. వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రభుత్వం సైన్సు రంగంలో ఎన్నో ప్రాజెక్టులు చేపట్టనుందన్నారు. భారతీయ అంతరిక్ష స్టేషన్ను నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది లివ్ ఇన్ స్పేస్ కాన్సెప్ట్తో అంతరిక్ష వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, ప్రజల్లో, విద్యార్థుల్లో సైన్సు గురించి అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. వారోత్సవాలకు ఏర్పాటు చేసిన క్విస్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ నిడమానూరి సూర్య కల్యాణ్ చక్రవర్తి, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ డాక్టర్ నిడమానూరి గాయత్రి దేవిలకు కృతజ్ఞతలు తెలిపారు. 3 వేల మంది విద్యార్థుల సందర్శన అంతరిక్ష వారోత్సవాలకు వివిధ పాఠశాలలు, కాలేజీలకు చెందిన విద్యార్థులు 3 వేల మంది హాజరయ్యారు. స్పేస్ ఎగ్జిబిషన్, ప్రాజెక్ట్ ఎక్స్పోని తిలకించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఎక్స్ పో, పెయింటింగ్ పోటీలు, క్విజ్, పోస్టర్ ప్రజంటేషన్ తదితర పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. క్విస్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వైవీ హనుమంతరావు, డీపీఎస్ ఆర్ డైరెక్టర్ డాక్టర్ బీవీ సుబ్బారావు, వరల్ట్ స్పేస్ వీక్ – 2025 ఒంగోల్ సబ్ కమిటీ ఛైర్మన్ లీలా నాగ శ్రీనివాసరావు, మెంబర్ సెక్రటరీ ఆదిత్య, ఇస్రో అధికారులు రామాంజనేయులు, అప్పారావు, శివ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బెల్టు, కల్తీ మద్యంపై ఆందోళన చేస్తాం
ఒంగోలు సిటీ: ప్రజల పక్షాన నిలబడి బెల్టుషాపులు, కల్తీ మద్యంపై ఆందోళన చేస్తామని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గురువారం ఒంగోలు వచ్చిన ఆయన.. మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కల్తీ మద్యంకి ఆస్కారం లేకుండా ప్రభుత్వమే మద్యాన్ని విక్రయించిందన్నారు. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పాలసీ మార్చేసిందన్నారు. ప్రస్తుతం ప్రైవేటు మద్యం దుకాణాలన్నీ కూటమి నేతల కనుసన్నల్లోనే నడుస్తున్నాయని ఆయన ఆరోపించారు. బెల్టు షాపుల ద్వారా కల్తీ మద్యాన్ని విక్రయిస్తున్నారన్న ఆరోపణలున్నాయన్నారు. వారం రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నామని, రకరకాల అంశాలు ప్రచారంలో ఉన్నాయని అన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లుతెరిచి కల్తీ మద్యాన్ని నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బెల్టుషాపులు మూసివేస్తే కల్తీ మద్యానికి ఆస్కారం ఉండదన్నారు. లిక్కర్ స్కాం పేరుతో అక్రమ అరెస్టులు... ఏమీ లేని దానికి తమ ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కాం జరిగిందంటూ అక్రమ అరెస్టులు చేస్తూ భూతద్ధంలో చూపిస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. పేదలకు నాణ్యమైన వైద్యం, విద్య అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కళాశాలలు ప్రారంభించామన్నారు. లక్షలు వెచ్చించి ఖరీదైన వైద్యాన్ని పేదలు చేయించుకోలేక ప్రాణాలు పోగొట్టుకోకూడదనే ఉద్దేశంతో మెడికల్ కళాశాలలు ప్రారంభించామన్నారు. వాటికి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వస్తుందని, ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందన్న గొప్ప ఆలోచనతో వాటిని ప్రారంభించామని అన్నారు. వాటిని పూర్తి చేస్తే వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న కుట్రతో కూటమి ప్రభుత్వం పీపీపీ విధానాన్ని తెస్తోందన్నారు. ప్రైవేటీకరణను ప్రజలు సైతం వ్యతిరేకిస్తున్నారన్నారు. ప్రైవేటీకరణతో కలిగే నష్టాలను ప్రజలకు వివరించేందుకు తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించుకున్నారన్నారు. తమ ప్రభుత్వ హయాంలో నర్సీపట్నంలో నిర్మాణం మొదలుపెట్టిన కళాశాల వద్దకు ఆయన వెళ్తున్నారన్నారు. ఒక్కరోజులో అన్ని భవనాల నిర్మాణాలు పూర్తికావని, నర్సీపట్నంలో ఏమీలేదన్న స్పీకర్ ప్రకటనపై వాస్తవాలు చూపించేందుకు తమ పార్టీ అధినేత వెళ్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలపై పాలకులను నిలదీసే హక్కు ఎవరికై నా ఉంటుందన్నారు. ట్రాఫిక్ నియంత్రణ చేయలేమని చెప్పడం సరికాదని, జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తికి ఆ స్థాయిలో రక్షణ కల్పిస్తే ఎలాంటి సంఘటనలు జరిగేందుకు ఆస్కారం ఉండదని వైవీ అన్నారు. ప్రభుత్వ ఆధీనంలో మెడికల్ కళాశాలలు, వైద్యశాలలు ఉంటే మెరుగైన వైద్యం అందుతుందా..లేదా..? అన్నది ప్రజలు కూడా గమనించాలన్నారు. డీఎస్సీ పారదర్శకంగా జరగలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. దానిపై విచారణ జరిపించి అర్హులైన వారికి అవకాశం కల్పించాలన్నారు. వైవీ సుబ్బారెడ్డి వెంట వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు, రాష్ట్ర పార్లమెంట్ కార్యదర్శులు కె.వి.రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, బొట్ల రామారావు, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, తదితరులు పాల్గొన్నారు. -
మెడికల్ కళాశాలల ప్రైవేట్పరం దుర్మార్గం
● వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి ఒంగోలు సిటీ: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన 17 మెడికల్ కళాశాలలను ప్రైవేట్పరం చేయాలని చూడటం దుర్మార్గమని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 10వ తేదీ నుంచి 22వ తేదీ వరకు గ్రామ/వార్డు రచ్చబండ ద్వారా సంతకాలు సేకరిస్తామన్నారు. కొండపి నియోజకవర్గంలోని పాకల గ్రామంలో 10వ తేదీ ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు. అదే రోజు సాయంత్రం ఒంగోలులో సంతకాల సేకరణ చేస్తామన్నారు. అక్టోబర్ 28న ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ప్రదర్శన ర్యాలీ నిర్వహిస్తామన్నారు. అనంతరం నవంబర్ 12న జిల్లా కేంద్రంలో ప్రదర్శన ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. నవంబర్ 23న నియోజకవర్గాల కేంద్రాల నుంచి సంతకాలు చేసిన వినతిపత్రాలు జిల్లా కేంద్రాలకు వచ్చే కార్యక్రమం నిర్వహిస్తామని, ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు లేదా ఇన్చార్జిలు జెండా ఊపి ప్రారంభించాలని తెలిపారు. నవంబర్ 24న సంతకాలు చేసిన వినతిపత్రాలను జిల్లా కేంద్రం నుంచి కేంద్ర కార్యాలయానికి చేర్చే కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షుడు జెండా ఊపి ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఈ జాబితాలను గవర్నర్ అపాయింట్మెంట్ బట్టి పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి గవర్నర్కు అందజేసే కార్యక్రమం ఉంటుందని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో ప్రవేశపెట్టిన 104, 108 వాహనాలను కూటమి ప్రభుత్వం నీరుగారుస్తోందన్నారు. కూటమి ప్రభుత్వంలో సామాన్యుడికి వైద్యం అందే పరిస్థితి కనిపించడం లేదని మండిపడ్డారు. పేదలకు వైద్యం అందుబాటులోకి తీసుకురావాలన్నదే లక్ష్యం.. పేదలకు వైద్యం అందుబాటులోకి రావాలన్న లక్ష్యంతోనే వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 మెడికల్ కాలేజీలను తీసుకువచ్చారన్నారు. అందులో 7 మెడికల్ కళాశాలలు నిర్మాణాలు పూర్తికాగా, 10 కళాశాలలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. కానీ టీడీపీ నాయకులు నిత్యం అబద్ధాలు వల్లె వేస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇంతటి దుర్మార్గమైన ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు. కనీసం ఓట్లు వేసిన ప్రజల కోసమైనా టీడీపీ నాయకులు నిజాలు మాట్లాడాలన్నారు. ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. అందుకే కోటి సంతకాలను సేకరిస్తున్నామన్నారు. మెడికల్ కళాశాలలు ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్పరం కానివ్వకుండా వైఎస్సార్ సీపీ పోరాడుతుందని తెలిపారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, పార్టీ పార్లమెంట్ కార్యదర్శి కసుకుర్తి ఆదెన్న, రాష్ట్ర పార్లమెంట్ కార్యదర్శులు కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, బొట్ల రామారావు, సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, జాయింట్ సెక్రటరీ బొగ్గుల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
దర్శి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సాయినగర్ సమీపంలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే..గంగదేవిపల్లి గ్రామానికి చెందిన మల్లికార్జునరావు, పద్మజలు బైక్పై వెళుతుండగా కుక్క అడ్డు రావడంతో అందుతప్పి కిందపడి గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం ఇవ్వగా వారిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం ఒంగోలుకు తరలించారు. ఒంగోలు టౌన్: నగరంలోని స్పా సెంటర్లలో గురువారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నగరంలోని సీఐలు, ఎస్సైలతో కూడిన 9 బృందాలు నగరంలోని 9 స్పా సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్పా సెంటర్ల నిర్వహణకు సంబంధించిన లైసెన్సులు, అనుమతులు, స్పా సెంటర్లలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను పరిశీలించారు. స్పా సెంటర్లలోని సీసీ కెమెరాలు ఏర్పాటు, వాటి పనితీరు, అంతర్గత నిర్మాణ శైలి వంటివాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ వి.హర్ష వర్థన్ రాజు మాట్లాడుతూ...స్పా, మసాజ్ సెంటర్ల పేరుతో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడినా, అసాంఘిక కార్యకలాపాలకు నిర్వహించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత ఉజ్వల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉందని చెప్పారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు. తనిఖీల్లో ఒన్టౌన్ సీఐ నాగరాజు, సబ్ డివిజన్ ఎస్సైలు నాగమల్లేశ్వరరావు, సుధాకర్, పున్నారావు, అజయ్బాబు, వెంకటసైదులు, నాగేంద్ర కుమార్, ఫణిభూషన్ పాల్గొన్నారు. దొనకొండ: బాడుగకు ఆటో మాట్లాడుకుని డ్రైవర్పై కత్తితో దాడి చేసి ఆటోను తీసుకుని గుర్తు తెలియని వ్యక్తి పరారయ్యాడు. ఈ సంఘటన గురువారం సాయంత్రం మండలంలోని మల్లంపేట సమీపంలో జరిగింది. ఎస్సై టి.త్యాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మార్కాపురానికి చెందిన నాగరాజు ఆటోను దొనకొండకు గుర్తు తెలియని వ్యక్తి రూ.600 కిరాయికి మాట్లాడుకున్నాడు. మార్కాపురం నుంచి మల్లంపేట మీదుగా దొనకొండకు బయల్దేరారు. ఆటో మల్లంపేట గ్రామం దాటిన వెంటనే ఆటోలో కూర్చున్న గుర్తు తెలియని వ్యక్తి డ్రైవర్ నాగరాజుపై కత్తితో దాడి చేసి కింద పడేసి ఆటో తీసుకుని పరారయ్యారు. గాయపడిన నాగరాజు సమీపంలోని మల్లంపేటకు చేరుకుని గ్రామస్తుల సహకారంతో చికిత్స నిమిత్తం మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లాడు. నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై తెలిపారు. సమాచారం తెలుసుకున్న దర్శి డీఎస్పీ బి.లక్ష్మీనారాయణ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. నిందుతుడి కోసం గాలింపు వేగవంతం చేయాలని పోలీస్ సిబ్బందికి ఆయన సూచించారు. ● మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు దర్శి: ఉద్యోగులు, కార్మికులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలే మార్గమని మాజీ శాసనమండలి సభ్యుడు కేఎస్ లక్ష్మణరావు అన్నారు. సీఐటీయూ, యూటీఎఫ్, జనవిజ్ఞాన వేదికల అధ్వర్యంలో తాండవ రంగారావు అధ్యక్షతన తాలూకా క్లబ్ సమావేశం హాలులో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ అంగన్వాడీలు 42 రోజులు సమ్మె చేసినప్పుడు వేతనాలు పెంచుతామని ఇచ్చిన వాగ్దానం నేటికీ అమలు కాలేదన్నారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, 6 డీఏలు ఇవ్వాల్సి ఉన్నా ప్రకటించడం లేదని, అందుకోసం పోరాటాలు తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేశారు. ముందుగా ప్రపంచ విప్లవకారుడు చేగువేరా వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జీవీ కొండారెడ్డి, యూటీఎఫ్, జేవీవీ నాయకులు మీనిగ శ్రీనివాసరావు, రాజశేఖర్, ఫాతిమా, తిరుపతమ్మ పాల్గొన్నారు.


