breaking news
Prakasam
-
సాగులో ఉన్న పంట ధ్వంసం
మర్రిపూడి: మూడు దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న భూమిలో ఉన్న కంది పంటను ఆ భూమి తమకు చెందిందంటూ ఓ వ్యక్తి, అతని కుటుంబ సభ్యులు ట్రాక్టర్తో దున్నివేసిన సంఘటన మర్రిపూడి మండలం ఎస్టీరాజుపాలెం గ్రామశివారులో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. ఎస్టీరాజుపాలెం గ్రామానికి చెందిన గిరిజన రైతు పొన్నర్సు నాగేశ్వరరావు 33 ఏళ్ల క్రితం పొదిలి మండలం రాజుపాలేనికి చెందిన చిలకా వెంకయ్య, తుళ్లూరి పెద్దన్న వద్ద ఎస్టీరాజుపాలెం గ్రామ శివారులో సర్వే నంబర్ 178–2లో 4.32 ఎకరాలు, సర్వే నంబర్ 56–2లో 4.09 ఎకరాల భూమి కొనుగోలు చేసి అనుభవిస్తున్నారు. అప్పటి నుంచి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు సాగుచేసుకుంటున్నారు. అయితే, ఇటీవల ఆ భూమిని గతంలో అమ్మిన చిలకా వెంకయ్య కుటుంబానికి చెందిన వారసులు తమదంటూ వచ్చి సాగులో ఉన్న వారిపై గొడవకు దిగారు. ఈ నేపథ్యంలో బాధితులు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామిని ఆశ్రయించి తమ గోడు వెల్లబోసుకున్నారు. నేనున్నానని మంత్రి హామీ ఇవ్వడంతో సదరు భూమిలో కంది పంట సాగుచేశారు. ప్రస్తుతం కంది పంట మొలకెత్తింది. ఆ పంటను చిలకా వెంకయ్య కుటుంబ సభ్యులు, వారి బావ మరుదులు 3 ట్రాక్టర్లతో వచ్చి నిలువునా దున్నేశారు. అడ్డుకోబోయిన బాధితుడు, అతని కుటుంబ సభ్యులతో వాదనకు దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బాధితులు అడ్డం తిరిగితే అంతమొందించేందుకు సైతం మారణాయుధాలను పొలం వద్దకు ట్రాక్టర్లో తీసుకొచ్చినట్లు బాధితురాలు పొన్నర్సు శ్రీదేవి తెలిపారు. దీనిపై బాధితులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. సాగర్ కెనాల్లో గల్లంతైన యువకుడు మృతి దొనకొండ: మండలంలోని పోలేపల్లి ఎస్సీ కాలనీకి చెందిన బెజవాడ మనోజ్(18) బుధవారం చందవరం సమీపంలోని సాగర్ కాలువలో ఈతకు వెళ్లి నీటి ప్రవాహంలో గల్లంతైన విషయం తెలిసిందే. గురువారం ఎస్సై టి.త్యాగరాజు పర్యవేక్షణలో పోలీస్, అగ్నిమాపక సిబ్బంది మనోజ్ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్ ఆపరేటర్ నాయక్ సహాయంతో మృతదేహాన్ని గుర్తించి, పోస్ట్మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. తండ్రి తిరుపాలు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఆర్మీ జవాన్ ఇంట్లో చోరీ కంభం: తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి నగలు, నగదు అపహరించిన సంఘటన స్థానిక వెంకటేశ్వరనగర్లో బుధవారం రాత్రి చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. స్థానిక న్యూ ఆల్ఫా స్కూల్ సమీపంలో నివాసం ఉంటున్న ఆర్మీ జవాన్ మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల దర్శనానికి వెళ్లారు. గురువారం తెల్లవారుజామున ఇంటి బయట గేటు తాళం పగలగొట్టి ఉండటాన్ని పక్కింటి వారు గమనించారు. లోపలికి వెళ్లి చూడగా బీరువా పగలగొట్టి అందులోని వస్తువులు చిందరవందరగా పడేసి ఉన్నాయి. దీంతో స్థానికులు ఇంటి యజమానికి, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని ఎస్సై నరసింహారావు పరిశీలించారు. మార్కాపురం క్లూజ్ టీమ్ బృందం వేలిముద్రలు సేకరించింది. ఇంట్లో 2 తులాల బంగారు నగలు, 20 తులాల వెండి పట్టీలు, రూ.50 వేల నగదు అపహరణకు గురైనట్లు సమాచారం. ఇటీవల కాలంలో పట్టణంలో దొంగతనాలు పెరిగిపోతుండటంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. పండగ పూట మృత్యు‘కీర్తన’ త్రిపురాంతకం: కళాశాలకు వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో తండ్రితో కలిసి బైక్పై సంతోషంగా ఇంటికి వెళ్తున్న బాలికను మార్గమధ్యంతో మృత్యువు బలితీసుకుంది. ఈ సంఘటన త్రిపురాంతకం మండలంలోని కంకణాలపల్లి రోడ్డులో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. కురిచేడు పడమర మాలపల్లెకు చెందిన బుట్టి కీర్తన(17) త్రిపురాంతకంలోని కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. వరలక్ష్మి వ్రతం, రెండో శనివారం, ఆదివారం.. ఇలా వరుసగా 3 రోజులు కళాశాలకు సెలవు రావడంతో తండ్రితో కలిసి బైక్పై ఇంటికి బయలుదేరింది. ఈ క్రమంలో కంకణాలపల్లి వద్ద బైక్ అదుపు తప్పడంతో సీసీ రోడ్డుకు కీర్తన తల బలంగా కొట్టుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమెకు స్థానిక వైద్యశాలలో ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం పల్నాడు జిల్లా వినుకొండ తరలించగా అక్కడ మృతి చెందింది. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పిడుగుపాటుకు ఒకరు మృతి ● మృతుడు వీరరాంపురం గ్రామ వైస్ సర్పంచ్ హనుమంతునిపాడు: మండల పరిధిలోని వీరరాంపురం గ్రామ పంచాయతీ వైస్ సర్పంచ్ గోనా దానయ్య(48) గురువారం సాయంత్రం పిడుగుపాటుకు మృతి చెందారు. వివరాలు.. దానయ్య వ్యక్తిగత పని నిమిత్తం బైక్పై నందనవనం వెళ్లి సాయంత్రం స్వగ్రామానికి తిరుగుప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం మొదలవడంతో రోడ్డు పక్కనే ఉన్న నందనవనం ఎంపీటీసీ నారాయణస్వామి పొలంలో రేకుల షెడ్ వైపు అడుగులు వేశారు. అదే సమయంలో పిడుగు పడటంతో దానయ్య అక్కడికక్కడే మృతి చెందారు. రేకుల షెడ్ కింద ఉన్న మరో ఇద్దరు షాక్కు గురై కాసేపటికి తేరుకున్నారు. మృతుడు దానయ్య భార్య సనీత అంగన్వాడీ కార్యాకర్తగా పనిచేస్తూ అనారోగ్యంతో రెండేళ్ల క్రితం మృతి చెందింది. మృతుడికి ఇద్దరు పిల్లలున్నారు. అందరితో కలివిడిగా ఉండే దానయ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆవును ఢీకొట్టిన ఆటో ● వృద్ధురాలు మృతి.. మరో ముగ్గురికి గాయాలు కంభం: ప్రయాణికులతో వెళ్తున్న ఆటో రోడ్డుపై అడ్డుగా వచ్చిన ఆవును ఽఢీకొట్టిన ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన గురువారం రాత్రి అనంతపురం–అమరావతి హైవే రోడ్డుపై కంభం సమీపంలో చోటుచేసుకుంది. వివరాలు.. కందులాపురం సెంటర్ నుంచి జంగంగుంట్లకు వెళ్తున్న ఆటో గ్రామ సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద అడ్డుగా వచ్చిన ఆవును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దూదేకుల సిద్ధమ్మ(65) మృతి చెందగా వెంగమ్మ, ఖాసింబి, ఆటో డ్రైవర్ ఓబుల్ రెడ్డికి మోస్తరు గాయాలయ్యాయి. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. మృతదేహాన్ని, క్షతగాత్రులకు కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 33 ఏళ్లుగా అనుభవంలో ఉన్న గిరిజన రైతు మొలకెత్తిన పంటను అక్రమంగా దున్నిన అమ్మకందారుని కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించిన గిరిజనులు -
హామీలకు తూట్లు !
బకాయిలు కోట్లు..నల్ల బర్లీ పొగాకు చివరి ఆకు వరకూ కొంటాం.. ఇది వ్యవసాయ శాఖామంత్రి అచ్చెంనాయుడు చెప్పిన మాట.. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. జిల్లాలో 6,325 టన్నుల నల్ల బర్లీ పొగాకు ఉత్పత్తి కాగా, ఇప్పటి వరకుకొనుగోలు చేసింది కేవలం 860 టన్నులు మాత్రమే. అంటే, ఉత్పత్తిలో కేవలం 15 శాతం మాత్రమే కొనుగోలు చేశారు. ఇందుకు రైతులకు చెల్లించాల్సిన రూ.7 కోట్ల బకాయిలు కూడా ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. అసలే మద్దతు ధర రాక అల్లాడుతున్న రైతులు కూటమి ప్రభుత్వ చర్యలతో మరింత ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతున్నారు. ఒంగోలు సబర్బన్: మిర్చి రైతును దగా చేసినట్టుగానే ప్రభుత్వం పొగాకు రైతునూ నయవంచన చేస్తోంది. బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటున్నా మని కూటమి ప్రభుత్వ పెద్దలు.. కొనుగోళ్లు ప్రారంభించి దాదాపు 48 రోజుల కావస్తోంది. అయినా ఇంత వరకు ఒక్క రూపాయి కూడా రైతుకు చెల్లించలేదు. రైతులు పెట్టిన పెట్టుబడి, బయట తెచ్చిన అప్పులతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్న ఆలోచన కూడా చేయడం లేదు చంద్రబాబు ప్రభుత్వం. రైతుల వద్దే 5,465 టన్నులు... జిల్లాలో బ్లాక్ బర్లీ పొగాకు దాదాపు 6,325 టన్నులు ఉత్పత్తి అయినట్లు అధికారులు అంచనాలు రూపొందించారు. జిల్లాలోని దాదాపు 20 మండలాల్లో బ్లాక్ బర్లీ పొగాకు సాగు చేశారు. ప్రధానంగా నాగులుప్పలపాడు, రాచర్ల, మద్దిపాడు, ముండ్లమూరు, దొనకొండ, కురిచేడు, పామూరు, కొమరోలు, తాళ్లూరు మండలాల్లో అత్యధికంగా సాగు చేయగా, మరో 11 మండలాల్లో ఒక మోస్తరుగా సాగు చేశారు. మద్దిపాడు మండలం గార్లపాడు గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలోని రైతులందరూ బ్లాక్ బర్లీ పొగాకును అక్కడకు తీసుకురావాలని సూచించారు. ఇంత పెద్ద మొత్తంలో ఉత్పత్తి అయితే.. తొలుత 500 టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఆ తర్వాత 800 టన్నులు అన్నారు. ప్రస్తుతానికి 1000 టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటి వరకు 400 మంది రైతుల నుంచి 860 టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. అయినా ఏ ఒక్క రైతుకూ ఒక్క రూపాయి కూడా జమ చేయలేదు. ఇప్పటి వరకు జిల్లాలోని రైతాంగానికి దాదాపు రూ.7 కోట్ల వరకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఆంక్షలతో చుక్కలు చూపిస్తున్న ప్రభుత్వం... రైతుల వద్ద ఉన్న చివరి ఆకు వరకు కొనుగోలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఆచరణకు వచ్చేసరికి ఒక్కో రైతు నుంచి గరిష్టంగా 20 క్వింటాళ్లకు మించి కొనుగోలు చేయబోమని ప్లేటు ఫిరాయించింది. దానికితోడు 20 శాతానికి మించి తేమ శాతం ఉండరాదని కూడా స్పష్టంగా ఆంక్షలు విధించింది. ఇలాంటి సందర్భాల్లో సన్న, చిన్నకారు రైతులకు ప్రాధాన్యత ఇస్తారు. గరిష్టంగా ఐదు, 10 ఎకరాల పరిధిలోని రైతుల వద్ద పంట నిల్వలు కొనుగోలు చేయాలి. ఐదెకరాల్లోపు చిన్న రైతు దగ్గర సైతం దాదాపు 60 టన్నులకు తక్కువ కాకుండా పొగాకు నిల్వలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పెట్టిన నిబంధనల ప్రకారం 20 క్వింటాళ్లు కొనుగోలు చేస్తే మిగిలిన 40 క్వింటాళ్లను ఆ రైతు ఏం చేసుకోవాలి. కొనుగోలు చేస్తామని నమ్మించి మోసం చేసిన కంపెనీలు కొనుగోలు చేయకపోవడంతోనే ఈ సంక్షోభం ఏర్పడింది. పొగాకు రైతును నమ్మించి మోసం చేస్తున్న ప్రభుత్వం బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు చేస్తున్నామంటూ ఊరిస్తున్న వైనం జిల్లాలో 6,325 టన్నుల ఉత్పత్తి ఇప్పటివరకు కేవలం 860 టన్నులే కొనుగోలు ఒక్క రూపాయి కూడా రైతుకు చెల్లించని ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సింది రూ.7 కోట్లు దిక్కుతోచని స్థితిలో జిల్లాలోని పొగాకు రైతులు ఆశగా ఎదురుచూస్తున్న వర్జీనియా రైతులు... వ్యాపారుల చేతిలో చిక్కిశల్యమవుతున్న వర్జీనియా పొగాకు రైతులు కూడా మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయిస్తుందేమోనన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వ్యాపారులు ఇదేవిధంగా కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పెడుతుంటే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్క్ఫెడ్ను రంగంలోకి దించి రైతుల వద్ద ఉన్న పొగాకు మొత్తాన్ని కొనుగోలు చేయించారు. చివరకు లో గ్రేడుకు మంచి ధర రాగా ఎందుకూ పనికిరాని మాడు రకం పొగాకుకు కూడా అనుకోని విధంగా ధరలు పెరిగి రైతులు ఎంతో లాభపడ్డారు. కానీ, ప్రస్తుతం బ్లాక్ బర్లీ పొగాకులో ఉత్పత్తి అయిన దానిలో కనీసం 15 శాతం మాత్రమే కొనుగోలు చేసి రైతులను ఇబ్బంది పెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం ఇక వర్జీనియా పొగాకు రైతులను ఆదుకునే అవకాశాలు కనుచూపు మేరలో కనపడటం లేదని రైతు సంఘ నాయకులు అంటున్నారు. -
చేనేత ఉత్పత్తులను ఆదరించాలి
ఒంగోలు సబర్బన్: చేనేత ఉత్పత్తులను ఆదరించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ అన్నారు. గురువారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత కార్మికులతో కలిసి స్థానిక కలెక్టరేట్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జేసీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ స్వదేశీ ఉద్యమంలో చేనేత ఉత్పత్తులు కూడా కీలకపాత్ర పోషించాయన్నారు. కాలపరీక్షను ఎదుర్కొని నిలబడిన చేనేత రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. చారిత్రక విశిష్టత కలిగిన చేనేత రంగాన్ని ఆదుకునేలా ప్రభుత్వం విద్యుత్, జీఎస్టీ రాయితీతోపాటు చేనేతకారుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయం తీసుకుందన్నారు. చేనేత సొసైటీలకు ఆప్కో నుంచి రావాల్సిన బకాయిలు త్వరగా చెల్లించేలా చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సందర్భంగా చేనేత ఉత్పత్తులను సొసైటీలు విక్రయించుకునేలా అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. మరో స్వాతంత్య్ర ఉద్యమంలా చేనేత ఉత్పత్తులను ఆదరించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఎల్డీఎం రమేష్ మాట్లాడుతూ చేనేతకారులకు ముద్ర రుణాలు త్వరగా మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. చేనేత, జౌళి సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రఘునందన్ మాట్లాడుతూ ముద్ర పథకం కింద బ్యాంకు రుణాల కోసం 2024 – 25 సంవత్సరంలో 217 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో 27 దరఖాస్తుదారులకు రూ.26 లక్షల రుణం మంజూరు చేసినట్లు తెలిపారు. అనంతరం ఏడుగురు చేనేతకారులను జాయింట్ కలెక్టర్ సన్మానించారు. చేనేత వస్త్రాల ప్రదర్శనను తిలకించారు. కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ వి.భీమయ్య, డెవలప్మెంట్ ఆఫీసర్ ఏ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ టి.వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ముందుగా ప్రకాశం భవనం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీని డీఆర్ఓ బి.చిన ఓబులేసు ప్రారంభించారు. చేనేత రంగ విశిష్టతను ఆయన కొనియాడారు. జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం -
గెలవలేకే రమేష్ యాదవ్పై దాడి
ఒంగోలు టౌన్: పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలలో గెలుపుపై నమ్మకం లేకనే కూటమి పార్టీల పాలకులు, నాయకులు కలిసి వైఎస్సార్ సీపీకి చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై హత్యాయత్నానికి పాల్పడ్డారని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందారెడ్డి విమర్శించారు. పులివెందుల ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై జరిగిన హత్యాయత్నానికి నిరసనగా ఒంగోలులోని నెల్లూరు బస్టాండ్ సెంటర్లోని బీఆర్ అంబేడ్కర్, జ్యోతీరావుపూలే విగ్రహాలకు గురువారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, పార్టీ నాయకుడు రామలింగారెడ్డిపై కత్తులు, ఇనుపరాడ్లు, రాళ్లతో దాడి చేయడం అత్యంత హేయమైన చర్యని ఖండించారు. ఈ చర్యలు ప్రజాస్వామ్యాన్ని కాలరాసే విధంగా ఉన్నాయన్నారు. ఎన్నికల నియమావలిని అనుసరించకుండా కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. పోలీసుల వ్యవహారశైలి అభ్యంతరకరంగా ఉందన్నారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జన్సీ నడుస్తున్నట్లు కనిపిస్తోందని, ఇది ప్రజాస్వామ్యానికి ఎంతమాత్రం మంచిది కాదని అన్నారు. కొండపి పంచాయతీ ఎన్నికలలో వైఎస్సార్ సీపీ మద్దతుతో పోటీ చేస్తున్న మేరీ అనే మహిళా అభ్యర్థిని కూడా ఇబ్బందులకు గురిచేయడం దారుణమన్నారు. వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై దాడి చేయడాన్ని క్రూరమైన చర్యగా అభివర్ణించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలకు తావులేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు మంచిదికాదన్నారు. ఇలాగైతే 2029లో రానున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కూటమి పార్టీల నేతలు బయట తిరగలేరని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకర్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, నాయకుడు బొట్ల రామారావు, నగర ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ఖాన్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. అడ్డుకునేందుకు పోలీసుల ప్రయత్నాలు... వైఎస్సార్ సీపీ నాయకుల నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేశారు. ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా నిరసన కార్యక్రమం గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. తొలుత వన్టౌన్ సీఐ నాగరాజు పార్టీ నాయకులకు ఫోన్ చేశారు. ఇది మీ పరిధి కాదు కదా అని నాయకులు ప్రశ్నించిన వెంటనే టూటౌన్ సీఐ మేడా శ్రీనివాసరావు తెరమీదకు వచ్చారు. ఒకసారి పోలీసు స్టేషన్కు రావాలని బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావుకు ఫోన్ చేశారు. పోలీసు స్టేషన్కు వెళ్లిన ఆయనతో సీఐ మాట్లాడుతూ.. అనుమతి లేకుండా నిరసన ప్రదర్శనలు చేయడానికి వీలులేదని హుకుం జారీ చేశారు. సమాచారం అందుకున్న చుండూరి రవిబాబు, బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఇతర నాయకులు పోలీసు స్టేషన్కు చేరుకున్నారు. పోలీసుల అనుమతి కోరుతూ లేఖ రాసిచ్చారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తామని చెప్పినప్పటికీ సీఐ వినలేదు. పార్టీ నాయకులు, పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అక్కడి నుంచి వచ్చిన నాయకులు అంబేడ్కర్, పూలే విగ్రహాలకు నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతుండగా ముగ్గురు ఎస్సైలు వచ్చి ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి వీల్లేదని, విగ్రహాలకు పూలదండలు వేయకూడదని అడ్డుకున్నారు. పార్టీ కార్యాలయంలో చేసుకోవాలంటూ ఎస్సై సందీప్ ఉచిత సలహా ఇచ్చారు. దాంతో బొట్ల రామారావుకు ఎస్సైకు మధ్య వాదన జరిగింది. అయినప్పటికీ పార్టీ నాయకులను బలవంతంగా అక్కడి నుంచి పంపించి వేశారు. పోలీసుల ఓవరాక్షన్పై పార్టీ కార్యకర్తలు, నాయకులు, స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. ఇలాగైతే రేపు మీ పార్టీ కార్యకర్తలు రోడ్లపై తిరగలేరు కూటమి పార్టీలకు వైఎస్సార్ సీపీ నాయకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, చుండూరి రవిబాబు హెచ్చరిక -
ప్రకాశం
37 /287గరిష్టం/కనిష్టంకెనాల్లో గల్లంతైన యువకుడు మృతి దొనకొండ మండలం పోలేపల్లి ఎస్సీకాలనీకి చెందిన యువకుడు బుధవారం సాగర్ కెనాల్లో ఈతకు వెళ్లి గల్లంతవగా, గురు వారం మృతదేహం లభ్యమైంది. సాగులో ఉన్న పంట ధ్వంసం ఓ గిరిజన రైతు 33 ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూమిలో ఉన్న కంది పంటను కొందరు వ్యక్తులు ట్రాక్టర్తో దున్నివేసి దౌర్జన్యానికి పాల్పడ్డారు. వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. గాలిలో తేమ శాతం అధికంగా ఉంటుంది. ఉక్కపోతగా ఉంటుంది. – 8లో.. శుక్రవారం శ్రీ 8 శ్రీ ఆగస్టు శ్రీ 2025 -
9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
ఒంగోలు వన్టౌన్: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఈ నెల 9వ తేదీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖాధికారి, ఎస్టీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ అధికారి వరలక్ష్మి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒంగోలు మినీ స్టేడియం పక్కనున్న గిరిజన భవన్లో ఉదయం 10 గంటలకు కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 22న తపాలా జీవిత బీమా ఏజెంట్ల ఎంపిక ఒంగోలు వన్టౌన్: భారత తపాలా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా పాలసీలు కట్టించే ఏజెంట్లను ఎంపిక చేసేందుకు ఈ నెల 22వ తేదీ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టు ఆఫీసెస్ ప్రకాశం డివిజిన్ ఎండీ జాఫర్ సాధిక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న ఏజెంట్లకు వారు సేకరించిన పాలసీలపై ఆకర్షణీయమైన కమీషన్ చెల్లించనున్నట్లు చెప్పారు. అభ్యర్థులు కనీసం 10వ తరగతి పాసై 18 సంవత్సరాలు నిండి ఉండాలన్నారు. ప్రాంతీయంగా పరిచయాలు కలిగి ఇన్సూరెన్స్ గురించి తెలిసి ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు బయోడేటాతో పాటు టెన్త్, ఇంటర్ మార్కుల జాబితాలు, 2 పాస్పోర్టు సైజు ఫొటోలు, ఆధార్ కార్డు, పాన్ కార్డుతో 22వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రకాశం పోస్టల్ సీనియర్ సూపరింటెండెంట్ కార్యాలయం, ఆంజనేయ కాంప్లెక్స్, భాగ్యనగర్ 2వ లైన్, ఒంగోలులో ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు. ఎంపికై న అభ్యర్థులు రూ.5 వేలకు ఎన్ఎస్సీ, కేవీపీ అకౌంట్ రూపంలో సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని తెలిపారు. క్రీడా స్ఫూర్తి చాటాలి ఒంగోలు: ప్రతిఒక్కరూ క్రీడాస్ఫూర్తి చాటుతూ త్వరలో నిర్వహించనున్న సౌత్ జోన్ పోటీల్లో జిల్లా పతాకాన్ని రెపరెపలాడించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఓ చిన్నఓబులేసు పిలుపునిచ్చారు. మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని జిల్లా క్రీడాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్థానిక డాక్టర్ పీ ఆనంద్ మినీ స్టేడియంలో గురువారం నిర్వహించిన 10 రకాల ఆటల పోటీలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా జాతీయ పతాకంతో పాటు జిల్లా పతాకాన్ని, జిల్లా క్రీడాపతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ క్రీడాకారులు ప్రతిభ చాటేందుకు ఈ పోటీలు మంచి అవకాశమని అన్నారు. డీఈఓ కిరణ్కుమార్ మాట్లాడుతూ ఏ రంగంలో రాణించాలన్నా క్రమశిక్షణ ముఖ్యమన్నారు. ఇది క్రీడాకారుల్లో ఎక్కువగా ఉంటుందని, అందువల్ల చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలని పిలుపునిచ్చారు. జిల్లా క్రీడాభివృద్ధి శాఖాధికారి జి.రాజరాజేశ్వరి మాట్లాడుతూ అథ్లెటిక్స్, ఆర్చరీ, బాక్సింగ్, వెయిట్లిఫ్టింగ్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, కబడ్డీ, ఖోఖో, హాకీ, వాలీబాల్ పోటీలు నిర్వహించి అండర్–22 విభాగానికి జిల్లా బాలబాలికల జట్లు ఎంపిక చేస్తున్నామన్నారు. ఎంపికై న జట్లు త్వరలో జరిగే సౌత్జోన్ పోటీల్లో తలపడతాయని తెలిపారు. అనంతరం పోటీలు నిర్వహించి జట్లను ఎంపిక చేశారు. కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కుర్రా భాస్కరరావు, క్రీడల ఇన్చార్జి వై.శీనయ్య, పలు క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలి ఒంగోలు వన్టౌన్: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీలకు చెందిన అర్హత ఉన్న విద్యార్థులు తమ పోస్టుమెట్రిక్ అనంతర ఉపకార వేతనాల రెన్యువల్స్కు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.లక్ష్మానాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. -
రైతును ఆదుకోవాల్సిన బాధ్యత టీడీపీ ఎమ్మెల్యేలకు లేదా..
పొగాకు రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత టీడీపీ కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలకు లేదా.? రైతుల ఓట్లు వేయించుకుని ఎమ్మెల్యేలుగా జిల్లాలో గెలిచారు కదా.. మరెందుకు పొగాకు రైతుల కష్టాలు పట్టించుకోవటం లేదు. ఏదో నామమాత్రంగా బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు, జిల్లాకు చెందిన మంత్రి స్వామి పొగాకు రైతుల కష్టాలను సీఎం చంద్రబాబు దృష్టికి ఎందుకు తీసుకెళ్లడంలేదో ప్రజలకు చెప్పాలి. ఇంతటి తీవ్రమైన కరువులో జిల్లా రైతాంగం ఉండటంతో పాటు పొగాకు రైతు కష్టాలు వర్ణణాతీతంగా మారాయి. పొదిలి వేలం కేంద్రానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చినప్పుడు ధరలో కొద్దిగా కదలిక వచ్చింది. ఆ తర్వాత యథావిధిగానే వ్యాపారులు కూటమి కట్టి మరీ ప్రభుత్వానికి సవాలు విసురుతున్నారు. – చుండూరు రవిబాబు, వైఎస్సార్ సీపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ లో గ్రేడ్ కోసం రూ.1000 కోట్లు కేటాయించాలి జిల్లాలోని రైతుల వద్ద ఉన్న లో గ్రేడ్ పొగాకు కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1000 కోట్లు కేటాయిస్తేనే ఈ సంక్షోభం తీరుతుంది. క్వింటా రూ.20 వేలకు తగ్గకుండా కొనుగోలు చేయాలి. ఈ ఏడాది వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా వర్జీనియా పొగాకు రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. కంపెనీలు, బోర్డు సూచనలకు అనుగుణంగా సాగుచేసిన రైతుకు సరైన దిగుబడులు రాక, గిట్టుబాటు ధర లభించక, వేలం కేంద్రాల్లో కొనుగోళ్లు జరక్క తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. – పమిడి వెంకట్రావు, ఏపీ రైతు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి -
రైతు గోడు పట్టని ప్రభుత్వం
ఒంగోలు సబర్బన్: పొగాకు రైతుల గోడును కనీసం విననైనా వినకుండా, కననైనా కనకుండా కళ్లులేని కబోదిలా టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలకులు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరు రవిబాబు, పార్టీ నాయకులతో కలిసి ఒంగోలు–2 పొగాకు వేలం కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు. స్థానిక త్రోవగుంటలోని వేలం కేంద్రంలో వేలం జరుగుతున్న తీరును పరిశీలించారు. రైతులు, పొగాకు బోర్డు అధికారులతో మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న వేలం గురించి తెలుసుకున్న మేరుగు నాగార్జున.. పొగాకు రైతులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావన్నారు. కూటమి ప్రభుత్వం పొగాకు రైతులను నిలువునా మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. పొగాకు వ్యాపార కంపెనీలతో ప్రభుత్వం చేతులు కలిపి మరీ పొగాకు రైతును నట్టేటముంచే పనిలో ఉందన్నారు. చంద్రబాబు సర్కారు తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పొగాకు రైతు కుదేలవుతుంటే చూడలేక మరో దఫా వేలం తీరును పరిశీలించేందుకు తాము వచ్చామన్నారు. తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పొగాకు రైతుల బాధలను కళ్లారా చూసేందుకు పొదిలి వచ్చారన్నారు. పొగాకు రైతులు పడుతున్న కష్టనష్టాలపై కేంద్రానికి, రాష్ట్రానికి లేఖలు కూడా రాశారని గుర్తు చేశారు. అసలు రైతులను ఏం చేయాలనుకుంటున్నారు చంద్రబాబూ అంటూ మేరుగు నాగార్జున ప్రశ్నించారు. పొగాకు రైతును పాతాళానికి నెడుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో క్వింటా పొగాకు ధర రూ.28 వేలకు వెళ్తే.. చంద్రబాబు ప్రభుత్వంలో అదికాస్తా రూ.15 వేలకంటే కిందకు దిగజారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్లాక్ బర్లీ పొగాకును రైతులందరి వద్ద కొనుగోలు చేయకుండా టీడీపీ నాయకులకు చెందిన పొగాకును మాత్రమే చీటీలు తీసుకుని మరీ కొనుగోలు చేయటం దుర్మార్గమైన చర్యని అన్నారు. కుదేలవుతున్న రైతులను చూస్తూ ఉండలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలను తాను వేడుకుంటున్నానని, చంద్రబాబు వద్దకు వెళ్లి పొగాకు రైతులను ఏ విధంగా ఆదుకుంటారో అడగాలని సలహా ఇచ్చారు. నాణ్యమైన పొగాకుకు కూడా రూ.280 దాటడం లేదు : చుండూరు రవిబాబు నాణ్యమైన పొగాకును కూడా కేజీ రూ.280 దాటకుండా కొనుగోలు చేస్తున్నారంటే.. వ్యాపారులు, ప్రభుత్వం ఏ విధంగా లాలూచీపడ్డారో అర్థమవుతోందని వైఎస్సార్ సీపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరు రవిబాబు అన్నారు. వ్యాపారులు, ప్రభుత్వ పెద్దలు కమ్మకై ్క పొగాకు రైతును నిలువునా అప్పులపాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పొగాకుకు డిమాండ్ క్రియేట్ చేయటంలో పొగాకు బోర్డు తీవ్రంగా వైఫల్యం చెందిందన్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు సిగ్గుపడాలన్నారు. కనీసం చంద్రబాబుతో మాట్లాడి రూ.200 కోట్లు తీసుకొచ్చి రిజెక్టు చేసి వెనక్కుపంపుతున్న పొగాకును కొనుగోలు చేయలేని ఎమ్మెల్యేలు ఎందుకున్నారంటూ ఆయన ప్రశ్నించారు. రైతుల్ని గాలికి వదిలేసిందని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెళ్ల బంగారుబాబు మాట్లాడుతూ లో గ్రేడ్ పొగాకును వెనక్కుపంపే పనిలోనే వ్యాపారులు, బోర్డు ఉన్నాయన్నారు. ఇంత పండించండి అని ఆఽథరైజేషన్ ఇచ్చి మరీ కొనుగోలు వద్దకు వచ్చేసరికి ఎందుకు ఈ రకంగా మోసం చేస్తున్నారని నిలదీశారు. రాష్ట్రంలో రూ.1.93 లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు రూ.500 కోట్లు ఇచ్చి పొగాకు రైతును ఆదుకోలేడా అంటూ ప్రశ్నించారు. కార్యక్రమంలో జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షుడు బీఎస్ఆర్ మూర్తి, వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి, ఒంగోలు మండల అధ్యక్షుడు మన్నే శ్రీనివాసరావు, నాయకులు కాట్రగడ్డ మహేష్ బాబు, పోలవరం శ్రీమన్నారాయణ, రైతులు పాల్గొన్నారు. పొగాకు రైతులను ఆదుకోవటంలో కూటమి ప్రభుత్వం విఫలం ఆత్మహత్యలు చేసుకునే స్థితికి రైతులను తీసుకెళ్తున్న పాలకులు ఒంగోలు–2 పొగాకు వేలం కేంద్రంలో వేలాన్ని పరిశీలించిన మాజీ మంత్రి మేరుగు నాగార్జున -
అర్జీల ఆడిట్లో నిర్లక్ష్యం వద్దు
– కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు సబర్బన్: గ్రీవెన్స్ అర్జీల ఆడిట్ విషయంలో నిర్లక్ష్యం వద్దని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. గ్రీవెన్స్ అర్జీలు పరిష్కారమవుతున్న తీరుతో పాటు పౌరసరఫరాలు, రెవెన్యూ సంబంధిత అంశాలపై బుధవారం తన క్యాంపు కార్యాలయంలో జేసీ ఆర్ గోపాలకృష్ణతో కలిసి ఆమె సమీక్షించారు. ఆడిట్లో పెండింగ్ లేకుండా చూడాలన్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీల విషయంలో పెండింగ్ ఉండకూడదన్నారు. ఐవీఆర్ఎస్ ద్వారా ప్రభుత్వం ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నందున అర్జీదారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలన్నారు. వృద్ధులకు నేరుగా ఇంటి వద్దకే రేషన్ సరుకుల పంపిణీలో పురోగతిపై కలెక్టర్ ఆరా తీశారు. పేదలకు పంపిణీ చేసేందుకు ఇప్పటికే గుర్తించిన ప్లాట్లలో ఖాళీలు, సాంకేతిక ఇబ్బందులపైనా అధికారులతో ఆమె చర్చించారు. సమావేశంలో డీఆర్ఓ బి.చిన ఓబులేసు, డీఎస్ఓ పద్మశ్రీ, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ వరలక్ష్మి, కలెక్టరేట్ పరిపాలనాధికారి రవి, గ్రీవెన్స్ ఆడిట్ బృంద సభ్యులు పాల్గొన్నారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యం ఒంగోలు టౌన్: నగర శివారులోని జగనన్న లే ఔట్లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. పోలీసుల కథనం ప్రకారం... నగర శివారులోని అగ్రహారంలో జగనన్న లే ఔట్లో నీటి గుంతలో బుధవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. మూడు రోజుల క్రితమే మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే కొత్తపట్నం మండలం పోలీసు స్టేషన్లో మూడు రోజుల క్రితం ఒక మిస్సింగ్ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. పోలీసులు వారికి సమాచారం ఇచ్చారు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అంతా నా ఇష్టం..!
ఈ ఫొటోలో గేటు బయట దీనంగా ఎదురుచూస్తున్న వ్యక్తి ఎవరో కాదు. ఆ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు. గత ఏడు సంవత్సరాలుగా పాఠశాల విద్యార్థులను రాష్ట్ర, జాతీయ స్థాయిలో తీర్చిదిద్దిన ఘనత ఆయనిది. కానీ అదే ఆయనకు చేటు తెచ్చిపెట్టింది. పాఠశాల ప్రిన్సిపాల్ సదరు వ్యాయామ ఉపాధ్యాయుడిపై కక్ష కట్టి పాఠశాలలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. పీడీ రామారావును విధుల్లోకి తీసుకోవాలని విద్యా శాఖ ఉన్నతాధికారులు ఆదేశించినా ఆ ప్రిన్సిపాల్కు అవేం పట్టడం లేదు. నన్ను ఎవరేం చేయలేరన్న భావనలో ఆయన వ్యవహార శైలి ఉందని విద్యార్థుల తల్లిదండ్రులే ఆరోపిస్తున్నారు.ముండ్లమూరు(దర్శి): ముండ్లమూరు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. పాఠశాలలో విద్యార్థుల భవిష్యత్కు బంగారు బాటలు వేయాల్సిన ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వివరాల్లోకి వెళితే..ముండ్లమూరు మోడల్ స్కూల్లో 2018 నుంచి వ్యాయామ ఉపాధ్యాయునిగా రామారావు పనిచేస్తున్నారు. పీడీ రామారావు అప్పటి నుంచి పాఠశాల విద్యార్థులను జాతీయ స్థాయి క్రీడాకారులుగా సైతం తీర్చిదిద్దారు. రామారావు శిక్షణ జాతీయస్థాయిలో ఒకరు, రాష్ట్రస్థాయిలో నలుగురు, జిల్లా స్థాయిలో ఎంతో మంది విద్యార్థులు పాఠశాలలో రామారావు వద్ద శిక్షణ తీసుకొని రాణించారు. మండల స్థాయి నుంచి జాతీయస్థాయి వరకు క్రీడల్లో విద్యార్థులకు మంచి గుర్తింపు వచ్చేలా తీర్చిదిద్దారు. అయితే రామారావుకు మంచి పేరు రావడం ప్రిన్సిపాల్ సహించలేకపోయారు. దీంతో గత ఏడాది విద్యార్థులను జిల్లా స్థాయి క్రీడలకు పోనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులను క్రీడలకు ఎందుకు పంపరని ప్రిన్సిపాల్ను పీడీ ప్రశ్నించారు. అప్పటి నుంచి కక్ష పెట్టుకున్న ప్రిన్సిపాల్..పీడీ విధులకు భంగం కలిగిస్తూ వస్తున్నాడు. జిల్లా స్థాయి పోటీలకు పిల్లలను పంపకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ప్రిన్సిపాల్ను అడిగారు. దీంతో అప్పటి నుంచి తోటి ఉద్యోగి అన్న గౌరవం లేకుండా అందరి ముందు దుర్భాషలాడుతున్నాడు. విధుల్లోకి రానివ్వకుండా అడ్డగింత ఈ క్రమంలో నెల రోజులుగా పీడీ పాఠశాలకు రాకుండా ప్రిన్సిపాల్ అడ్డుకుంటున్నాడు. గేటు బయట వాచ్మెన్లు పెట్టి పీడీ లోపలికి రానివ్వడం లేదు. దీంతో ఏడు ఏళ్లుగా ఏ పాఠశాలలో విద్యార్థులను రాష్ట్ర, జాతీయస్థాయిలో తీర్చిదిద్దారో..అదే పాఠశాలలోకి ప్రవేశం లేక దీనంగా పాఠశాల గేటు బయట ఎదురుచూస్తున్నారు. ఇటీవల పాఠశాలలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా వాచ్మెన్లు దాడి చేసి ఫోన్ పగులగొట్టారని పీడీ వాపోయారు. ప్రిన్సిపాల్ వ్యవహార శైలి పట్ల తల్లిదండ్రులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నన్ను ఎవరేం చేస్తారనే భావనలో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని, విద్యా శాఖ ఉన్నతాధికారులు అతనిపై చర్యలు తీసుకోకుంటే మా పిల్లలను స్కూల్కు పంపమని చెబుతున్నారు. విధుల్లోకి తీసుకోమని చెప్పాం: కిరణ్కుమార్, డీఈఓ ఈ విషయమై డీఈఓ కిరణ్కుమార్ను ఫోన్లో వివరణ కోరగా..గతంలోనే పీడీ రామారావును విధుల్లోకి చేర్చుకోవాలని ప్రిన్సిపాల్ను ఆదేశించాం. కానీ చేర్చుకోలేదు. విద్యార్థుల క్రీడా భవిష్యత్ నాశనం అవుతుందని ప్రిన్సిపాల్ పూర్ణచంద్రరావుకు షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చాం. ఉన్నతాధికారులు సైతం తెలియజేశాం. ఉన్నతాధికారుల నివేదిక ఆధారంగా తదుపరి ముందుకు వెళతాం. ప్రిన్సిపాల్ నిర్వాకం.. పీడీకి సంకటం మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్ ఇష్టారాజ్యం నెల రోజులుగా పీడీపై కక్ష సాధింపు రెన్యువల్ ఆర్డర్ వచ్చినా విధుల్లోకి తీసుకోకుండా ఇబ్బందులు క్రీడలకు దూరమవుతున్న విద్యార్థులు ప్రిన్సిపాల్ వైఖరిపై సర్వత్రా విమర్శలు -
హత్య కేసు కొట్టివేత
మార్కాపురం టౌన్: హత్య కేసులో నేరం రుజువు కానందున కేసు కొట్టివేస్తూ ఆరో అదనపు జిల్లా జడ్జి ఎం.శుభవాణి తీర్పు ఇచ్చినట్లు నిందితుల తరఫున న్యాయవాదులు లక్ష్మీకుమార్రెడ్డి, భూపని కాశయ్య, పురుషోత్తమనాయక్ బుధవారం తెలిపారు. వివరాలు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం పట్టణానికి చెందిన సద్దుల గౌరి అలియాస్ గీత చీరల వ్యాపారం చేసుకుంటూ వివిధ ప్రాంతాల్లో తిరుగుతుండేది. ఈ క్రమంలో జిల్లాలోని తాళ్లూరు మండలం దారంవారిపాలెం గ్రామానికి చెందిన ఎడ్లపల్లి అచ్చయ్యతో ఏర్పడిన పరిచయంతో సన్నిహితంగా మెలిగేది. వీరి మధ్య బేధాభిప్రాయాలు రావడంతో తేతపూడి వజ్రయ్య, కోటయ్య, అచ్చయ్య కలిసి 2010 ఆగస్టు 21న తాళ్లూరు మండలం తురకపాలెం గ్రామ పొలాల్లో ఆమెను గొంతునులిమి చంపారని తాళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. అయితే కేసులో సాక్షులను విచారించిన తర్వాత నిందితులపై నేరం రుజువు కానందున కేసును కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చినట్లు న్యాయవాదులు తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దు ● ఎస్పీ ఏఆర్ దామోదర్ ఒంగోలు టౌన్: మద్యం తాగి వాహనాలు నడపి భవిష్యత్తును దెబ్బ తీసుకోవద్దని ఎస్పీ ఏఆర్ దామోదర్ హెచ్చరించారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి పలువురిపై కేసులు నమోదు చేశారు. రాచర్ల మండలంలో మద్యం తాగి వాహనం నడుపుతున్న వ్యక్తిని గిద్దలూరు కోర్టులో హాజరుపరచగా 50 రోజుల జైలు శిక్షతోపాటు రూ.10 వేల జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇక నుంచి జిల్లాలో రోజూ వాహనాలు తనిఖీ చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారి తలిదండ్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎస్పీ స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి దొనకొండ: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే..దర్శి మండలం కట్టుబడివారిపాలెం గ్రామానికి చెందిన గర్నెపూడి మోషే (25) టెంట్ హౌస్ సప్లయిర్స్లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దొనకొండలోని బేతేలుపురానికి చెందిన రమ్యతో ఏడాది క్రితం వివాహమైంది. దొనకొండలో ఉన్న భార్య దగ్గరకు వచ్చిన మోషేకు తమ్ముడుకు బాగా లేదనే సమాచారంతో మంగళవారం రాత్రి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. చిన్నగుడిపాడు గ్రామం సమీపంలోని మలుపు వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డుపై పడి పోయాడు. రాత్రి కావడంతో ఆలస్యంగా గుర్తించారు. మెరుగైన వైద్యం నిమిత్తం ఒంగోలుకు తరలించారు. చికిత్స పొందుతూ మోషే మృతి చెందాడు. ఈ మేరకు ఎస్సై టి.త్యాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డిజిటల్ అసిస్టెంట్పై పంచాయతీ కార్యదర్శి వేధింపులు ● అధికారుల ముందే పంచాయతీ కార్యదర్శిని నిలదీసిన మహిళ తాళ్లూరు: తాళ్లూరు సచివాలయం–1 డిజిటల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మహిళపై అదే సచివాలయంలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి ఐవీ రమణారెడ్డి వేధింపులకు గురిచేస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వేధింపుల గురించి ఎవరికి చెప్పుకోవాలో తెలియక సదరు మహిళా డిజిటల్ అసిస్టెంట్ మదనపడుతోంది. ఈ క్రమంలో బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమావేశానికి హాజరైన సదరు మహిళా డిజిటల్ అసిస్టెంట్..కార్యక్రమానికి హాజరైన అధికారుల ముందు తన ఆవేదన వ్యక్తం చేసింది. పంచాయతీ కార్యదర్శి ఏ విధంగా వేధిస్తున్నారో వివరించి అధికారుల ముందే అతన్ని నిలదీసింది. దీంతో ఏం చేయాలో తెలియని పంచాయతీ కార్యదర్శి నీళ్లు నమిలాడు. పంచాయతీ కార్యదర్శి ఏ విధంగా వేధిస్తున్నాడో ఫోన్లో ఉన్న ఆధారాలను అధికారులకు చూపించింది. విషయం తెలుసుకున్న సదరు మహిళ కుటుంబసభ్యులు అక్కడకు చేరుకొని పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహంతో ఊగిపోయారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వారిని చెదరగొట్టారు. సమస్య ఉంటే పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయాలని చెప్పారు. -
బాబును నమ్మితే మోసం గ్యారంటీ
చీమకుర్తి రూరల్: మోసానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి మేరుగు నాగార్జున అన్నారు. మండలంలోని ఎర్రగుడిపాడు, మంచికలపాడు, బండ్లమూడి గ్రామాల్లో బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షుడు పమిడి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మేరుగు నాగార్జున మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అనే పథకాలతో ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో గెలుపొందిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందన్నారు. గత వైఎస్సార్ సీపీ హయాంలో పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాయన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక హామీలను తుంగలో తొక్కి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. అనంతరం చంద్రబాబు మోసాలను తెలియజేసే క్యూర్ కోడ్ కలిగిన పత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు ఉపాధ్యక్షుడు యనం శేషరెడ్డి శ్రీధర్ల శేషు, సీనియర్ నాయకులు ఓబుల్ రెడ్డి మాస్టారు, జి. ఓబుల్ రెడ్డి, గంగిరేకుల వెంకటరావు, నల్లూరి చంద్ర, మొగిలిచెట్టి వెంకటేశ్వర్లు, పొన్నపల్లి సుబ్బారావు, పెరికల నాగేశ్వరరావు, పొన్నపల్లి నాగేశ్వరరావు అత్యాల అంకయ్య మాగులూరి ఇమ్మానియేల్, జడ రాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స.హ చట్టంపై అవగాహన అవసరం ఒంగోలు సబర్బన్: సమాచార హక్కు చట్టంపై ప్రకృతి వ్యవసాయ రైతులు, సిబ్బంది అవగాహన పెంపొందించుకోవాలని ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వి.సుభాషిణి పేర్కొన్నారు. స్థానిక వెలుగు కార్యాలయంలో మంగళవారం సమాచార హక్కు చట్టంపై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స.హ చట్టం ఉద్దేశం, పౌరులు సమాచారం పొందే విధానం, అధికారుల విధులు, బాధ్యతలను వివరించారు. ఈ చట్టం ద్వారా ప్రజలు తమ హక్కులను ఎలా వినియోగించుకోవచ్చు, పాలక వ్యవస్థలో ఎలా జవాబుదారీతనం తీసుకురావచ్చో ఉదాహరణలతో విశదీకరించారు. ఈ సందర్భంగా పలువురి సందేహాలను నివృత్తి చేశారు. -
మంత్రి హామీలు నీటి మూటలేనా.. ?
● మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకుల ప్రశ్న ఒంగోలు టౌన్: సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలు ఇస్తామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇచ్చిన హామీ కేవలం నీటి మూటేనా అని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కొర్నిపాటి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కమిటీ సమావేశం బుధవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో నిర్వహిచంచారు. ఈ సందర్భంగా కొర్నిపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ...మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జూలై 10 రోజుల పాటు సమ్మె నిర్వహించారని, అనంతరం జరిగిన చర్చల సందర్బంగా సమ్మె కాలపు వేతనాలను చెల్లిస్తామని మంత్రి చెప్పారని గుర్తు చేశారు. ఆయన ఇచ్చిన హామీ నేటికీ అమలు కాలేదన్నారు. జిల్లాలో చనిపోయిన, అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులు అనేక మంది ఉన్నారని, ఆ స్థానంలో వారి కుటుంబసభ్యులకు ఉపాధి చూపాలని కోరుతుంటే అదుకు భిన్నంగా టీడీపీ కార్యకర్తలతో ఆయా స్థానాలను భర్తీ చేస్తున్నారని, ఇదేం న్యాయమని ప్రశ్నించారు. కోవిడ్ కార్మికులను ఆప్కాస్లో తీసుకోవాలని, కనీస వేతనాలను అమలు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోతుందన్నారు. ఒంగోలులో మున్సిపల్ కార్మికులపై రాజకీయ వేధింఫులు ఎక్కువయ్యాయని, సమస్యలు పరిష్కరించకుండా పనిభారాన్ని పెంచడం ఎంత మాత్రం సమర్ధనీయం కాదన్నారు. మున్సిపల్ కార్మికులపై పనిభారాన్ని తగ్గించాలని, న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే కార్మికులందరినీ ఐక్యం చేసి పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. సమావేశంలో సామ్రాజ్యం, సుబ్బరాయుడు, పి.పద్మ, మరియమ్మ, ఏడుకొండలు, చెన్నమ్మ పాల్గొన్నారు. -
ఏ ఒక్కరూ బాధ్యతలు విస్మరించరాదు
● జిల్లా న్యాయ సేవాదికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్టి షేక్ ఇబ్రహీం షరీఫ్ ఒంగోలు సబర్బన్: కార్మికులు, వాహనదారులు ఏ ఒక్కరూ బాధ్యతలు విస్మరించరాదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి షేక్ ఇబ్రహీం షరీఫ్ పేర్కొన్నారు. స్థానిక వెంగముక్కల రోడ్డులోని రవాణాశాఖ డీటీసీ కార్యాలయంలో బుధవారం వాహనాల యజమానులకు, డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హక్కుల గురించి పోరాటం చేస్తుంటారని, కానీ బాధ్యతల గురించి పట్టించుకోరని గుర్తు చేశారు. వాహనదారులు తప్పనిసరిగా నియమ నిబంధనలు పాటించాలన్నారు. ప్రతి వ్యక్తి వెనుక ఒక కుటుంబం ఉంటుందన్న విషయాన్ని విస్మరించకూడదన్నారు. అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె.రామచంద్రరావు మాట్లాడుతూ వాహన చోదకులు రహదారి భద్రతా నియమాలను పాటించాలన్నారు. ప్రమాదాల నివారణే లక్ష్యంగా రవాణా శాఖ అవగాహన కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆర్.సుశీల, డిప్యూటీ లేబర్ కమిషనర్ భవాని, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నరిశింగరావు, బాలల హక్కుల పరిరక్షణ అధికారి దినేష్కుమార్, జేజే బోర్డు లీగల్ అడ్వైజర్ రత్నప్రసాద్, న్యాయ సేవ సహాయకులు వావిలాల సదాశివశాస్త్రి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఏ కిరణ్ ప్రభాకర్, ఎల్.సురేంద్ర ప్రసాద్, ఏఎంవిఐ కే.జయ ప్రకాష్, యు.ధర్మేంద్ర, బి.భాను ప్రకాష్, డి.జశ్వంత్, పరిపాలనాధికారులు డి.సుధాకర్, ఎం.శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
సాగర్ కాలువలో యువకుడు గల్లంతు
దొనకొండ: సాగర్ కాలువలో ఈతకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఈ సంఘటన బుధవారం దొనకొండ మండలంలోని చందవరం గ్రామ సమీపంలో సాగర్ కాలువ వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. దొనకొండ మండలంలోని పోలేపల్లి ఎస్సీ కాలనీకి చెందిన బెజవాడ మనోజ్, ఎనిబెర నాని, దానియేల్ అనే ముగ్గురు యువకులు ఈత నేర్చుకునేందుకు కాలనీ నుంచి 3 కిమీ దూరంలో ఉన్న చందవరం సమీపంలోని సాగర్ కాలువ వద్దకు వెళ్లారు. ఇటీవల కాలువకు నీరు విడుదల చేయడంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. గట్టుపై కూర్చున్న బెజవాడ మనోజ్(18) ఈత కొట్టాలనే తాపత్రయంతో కాలువలోకి దిగాడు. నీటి ప్రవాహ ఉధృతికి మనోజ్ కొట్టుకుపోతుండగా గట్టుపై ఉన్న స్నేహితులు పెద్ద పెట్టున కేకలు వేశారు. వారికి ఈత రాకపోవడంతో కాలువలోకి దిగేందుకు సాహసించలేదు. కనుచూపు మేరలోనే నీటి ప్రవాహంలో మిత్రుడు గల్లంతవడంతో కన్నీటి పర్యంతమయ్యారు. సమాచారం తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు, స్నేహితులు హుటాహుటిన సాగర్ కెనాల్ వద్దకు వెళ్లి గాలించినా మనోజ్ ఆచూకీ లభ్యం కాలేదు. చేతికందివచ్చిన కుమారుడు కాలువలో గల్లంతవడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
తేరాతేజీ
అనుబంధాల సుమగంధంసహపంక్తి భోజనాలు చేస్తున్న ప్రజలు(ఫైల్) ● తేరాతేజీ వేడుకలకు సిద్ధమవుతున్న చారిత్రాత్మక కంభం చెరువు ● పెళ్లినాటి దండలను నీటిలో వదిలి మొక్కులు తీర్చుకోనున్న నూతన వధూవరులు ● వరుస సెలవు దినాలు కావడంతో సందర్శకులు పోటెత్తే అవకాశం కంభం: ఆధ్యాత్మికత, అనుబంధాలకు ప్రతీకగా భావించే తేరాతేజీ(గరిక తొక్కుడు) పండగకు చారిత్రాత్మక కంభం చెరువు కట్ట సిద్ధమైంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కేవలం కంభంలో మాత్రమే నిర్వహించుకునే ఈ పండగకు ముస్లింలు భారీ సంఖ్యలో తరలివస్తారు. శుక్రవారం పండగ సందర్భంగా కొత్త జంటలు, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో చెరువు కట్ట కోలాహలంగా మారనుంది. ఇదీ పండగ విశిష్టత ఏటా ఆగస్టులో నెల పొడుపు కనిపించిన 13వ రోజు తేరాతేజీ పండగను ముస్లింలు నిర్వహించుకుంటారు. తేరాతేజీ నెలను చేదు నెలగా చెబుతుంటారు. కొత్తగా వివాహం చేసుకున్న జంటలు నెల పొడుపు కనిపించినప్పటి నుంచి ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా 13వ రోజు తేరాతేజీ నాడు కంభం చెరువు కట్టపై కలుసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అక్కడే వారి పెళ్లినాటి దండలను నీటిలో వదిలి మొక్కులు తీర్చుకుంటారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి సహపంక్తి భోజనాలు చేస్తారు. చెరువు కట్టపై ఉన్న దీనాషావళి దర్గా వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు. చెరువు కట్టపై ఉన్న పచ్చికను తొక్కితే ఆరోగ్యానికి మంచిదని ముస్లింల నమ్మకం. అందుకే గరికతొక్కుడు పండగగా పిలుస్తారు. చెరువుకట్టకు ఉదయాన్నే చేరుకుని సాయంత్రం వరకు అక్కడే గడిపి తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో మార్గమధ్యంలో ఉన్న మామిడి చెట్ల ఆకులు తీసుకెళ్లి గుమ్మాలకు కట్టుకుంటుంటారు. పోటెత్తనున్న భక్తులు అధికారికంగా సెలవు దినం లేకపోయినా తేరాతేజీ పండగ కోసం ముస్లింలు ఎదురుచూస్తుంటారు. హైదరబాద్, గుంటూరు, కర్నూలు, బెంగళూరు తదితర దూరప్రాంతాల్లో స్థిరపడిన వారు పండగ రోజున కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామమైన కంభం చేరుకుంటారు. అలాగే కర్నూలు, గుంటూరు, నంద్యాల, గిద్దలూరు, దొనకొండ, వినుకొండ తదితర ప్రాంతాలకు చెందిన ముస్లింలు కూడా చెరువు కట్టకు భారీ సంఖ్యలో తరలివస్తారు. ఇతర కులాలకు చెందిన వారు సైతం పిల్లలతో కలిసి సరదాగా చెరువు కట్టపైకి వచ్చి వెళ్తారు. రైలు మార్గంలో వచ్చే వారు కంభం చెరువు సమీపంలోనే రైళ్లను ఆపేసి అక్కడే దిగుతుంటారు. ఈ దఫా శుక్రవారంతోపాటు శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో మూడు రోజులపాటు ప్రజలు చెరువు కట్టకు వచ్చే అవకాశం ఉంది. అధిక సంఖ్యలో వాహనాలు వచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. -
బాబు నైజం
నమ్మక ద్రోహం..పుల్లలచెరువు: తాము అధికారంలోకి వస్తే జగన్ కంటే రెండింతలు సంక్షేమ పథకాలు ఇస్తానని ఊదరగొట్టిన చంద్రబాబునాయుడు సీఎం అయ్యాక ప్రజలకు నమ్మక ద్రోహం చేశారని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. మండల కేంద్రంలో బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమం బుధవారం జిల్లా కార్యవర్గసభ్యుడు డి.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేయడం, అబద్ధాలు ఆడటం తప్ప రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే బాబు రాష్ట్రంలో ప్రజలకు గుర్తుండే పథకం ఏదైనా చేశాడా అని ప్రశ్నించారు. అభివృద్ధి, సంక్షేమం అంటే ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డిని గుర్తు చేసుకుంటారని అన్నారు. పేద ప్రజల వద్దకు పరిపాలన తెచ్చిన ఘనత జగనన్నకు దక్కుతుందని అన్నారు. పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో ఒక్కసారి 50 వేల డాక్టర్ పోస్టులు ఇచ్చిన ఘనత జగనన్నదన్నారు. బాబు ష్యూరిటీ అంటూ ఎన్నికల్లో గెలవక ముందు ఒక్కొక్క ఇంటికి రూ.6 లక్షలు, రూ.5 లక్షలు ఇస్తానంటూ చంద్రబాబు అబద్ధపు హామీలు ఇచ్చారన్నారు. సూపర్సిక్స్ పథకాలంటూ 143 హామీలు అమలు చేస్తామని చెప్పి మళ్లీ ప్రజలను మోసం చేశారన్నారు. అడ్డగోలు హామీలిచ్చి గద్దెనెక్కిన తరువాత పథకాలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. రెడ్బుక్ పేరుతో స్వీయ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయించి వేధించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో వారి దృష్టిని మరల్చేందుకు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి క్యూ ఆర్కోడ్ లను ఆవిష్కరించారు. దీనిని పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. నియోజకవర్గంలో దోచుకోవడమే లక్ష్యంగా కూటమి నాయకులు: నియోజకవర్గంలోని కూటమి నాయకులు చేయని దోపిడీ అంటూ లేదని, ఇసుక, మద్యం, బియ్యం లాంటి అక్రమ పనులు చేస్తూ దోచుకుంటున్నారని అన్నారు. గ్రామాల్లోకి ఇసుక రావాలంటే కప్పం కట్టందీ రాదని, వస్తే వారిపై కేసులు నమోదు చేయడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. ఇటీవల నియోజకవర్గంలో 20 ఏళ్ల క్రితం వేసిన పైపులైన్ను జేసీబీలతో తవ్వుకుని కోట్ల రూపాయలు దోచుకునేందుకు కూటమి నాయకులు ప్లాన్ చేశారని, దానిని జిల్లా అధికారులకు తెలియజేసి ఆపేశామని అన్నారు. ఎస్టీలకు అన్యాయం: నియోజకవర్గ మార్కెట్ యార్డు చైర్మన్ పదవి ఎస్టీకి కేటాయిస్తే దానిని అగ్రవర్ణాల వారికి కట్టపెట్టారని ఇది ఎస్టీలకు అన్యాయం చేయడం కాదా అని ప్రశ్నించారు. ఇదే జగనన్న పరిపాలలో ఎస్సీ, ఎస్టీలకు తగిన న్యాయం జరిగిందని, చంద్రబాబుకు ఎస్సీ, ఎస్టీలు అంటే ఏహ్యభావం ఉందని అన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గిరిజనుల నృత్యాలతో స్వాగతం పలకగా, బస్స్టాండ్ సెంటర్ లో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు, కార్యకర్తల హర్షధ్వానాల మధ్య సభావేదికకు చేరుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ వింగ్ సెక్రటరీ బి.సుబ్బారెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి ఉడుముల అరుణ, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎల్.రాములు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ జానకిరఘు, మాజీ ఎంపీపీ ఎం.సుబ్బారెడ్డి, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. నీ పాలనలో గుర్తుండే పథకం ఒక్కటి చెప్పు బాబు సూపర్సిక్స్ పథకాలంటూ ప్రజలను మరోసారి మోసం బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ సభలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజం -
కొండపిలో కూటమి అక్రమాలు
ఒంగోలు సిటీ: కొండపి సర్పంచ్ ఎన్నికల్లో కూటమి నేతలు వైఎస్సార్ సీపీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసి దౌర్జన్యానికి పాల్పడ్డారని మాజీ మంత్రి, పీఏసీ సభ్యుడు, కొండపి నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. బుధవారం ఆయన ఒంగోలు నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. పోలీస్ వ్యవస్థను అడ్డంపెట్టుకుని మంత్రి, నాయకులు అడ్డగోలుగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ వైఎస్సార్ సీపీ అభ్యర్థుల దరఖాస్తులను ఫోర్జరీ సంతకాలతో ఎన్నికల అధికారికి సమర్పించి ఉపసంహరణల కుట్రలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్నికల అధికారులను సైతం లొంగదీసుకుని ఈ అక్రమాలకు తెగబడ్డారని ఆయన ధ్వజమెత్తారు. సర్పంచ్ పదవికి పోటీ చేసేందుకు ముగ్గురు మహిళలు ముందుకు వచ్చారని, నామినేషన్ వేయకుండా వారిపై రకరకాలుగా అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. వై కళ్యాణి, ఏ విమలమ్మ, పల్లె మేరి నామినేషన్లు వేశారని, నామినేషన్ల సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కళ్యాణి భర్త వసంతరావు పోలీస్ డిపార్టుమెంట్లో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారని, ఆయన్ను సైతం భయాందోళనకు గురిచేసి బలవంతంగా నామినేషన్లు ఉపసంహరణ పత్రాలపై సంతకాలు చేయించారన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎస్పీ, కనిగిరి డీఎస్పీలకు ఫిర్యాదు చేశామన్నారు. అయితే కళ్యాణిని ఎవరూ ఒత్తిడి చేయలేదని, ఆమే స్వచ్ఛందంగా ఉపసంహరించుకున్నారని, వాటిని పోలీస్ స్టేషన్లో ఇచ్చిందని డీఎస్పీ మాట్లాడడం సరికాదని ధ్వజమెత్తారు. ఉపసంహరణ పత్రాలు ఎన్నికల అధికారికి ఇస్తారు కానీ పోలీస్ స్టేషన్లో ఎందుకు ఇస్తారని ప్రశ్నించారు. అధికారపార్టీ నాయకుల బెదిరింపులకు భయపడి ఊరు విడిచి ఎక్కడో తలదాచుకున్న విమలమ్మ వద్దకు వెళ్లి టెర్రరిస్టులను వేటాడినట్టుగా వేటాడి వారి వద్ద నుంచి ఉపసంహరణ పత్రాలపై సంతకాలు తీసుకున్నారని ఆరోపించారు. సమయం ముగిసినా కూడా ఎన్నికల అధికారి విమలమ్మ లేకుండా ఆమె పత్రాలను తీసుకుని ఉపసంహరించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఇక పల్లెమేరి ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధమయ్యారని, నామినేషన్ వేసేందుకు రక్షణ కల్పించాలని కోరిందని, తాము వెళ్లి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందన్నారు. ఆమె సంతకాలు ఫోర్జరీ చేసి ఉపసంహరించేలా చేశారని ఆరోపించారు. తాను పోటీలో ఉన్నానని చెబుతున్నా అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. కొండపిలో జరిగిన అక్రమాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. కొండపిలో పెద్ద ఎత్తున పోలీసులు మొహరించి వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. 4వ తేదీ రాత్రి నుంచి అధికార కూటమి నేతల అరాచకాలు ప్రారంభమయ్యాయన్నారు. ఉపసంహరణల సమయం గంట ముందు వరకూ తనతో ఫోన్లో మాట్లాడిన ఎన్నికల అధికారి తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారంటే ఆయన పై మంత్రి, నాయకులు ఎంత ఒత్తిడి తీసుకొచ్చారో అర్థమవుతోందన్నారు. ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని నామినేషన్ల ప్రక్రియను రద్దు చేసి మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి న్యాయబద్ధంగా ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. పులివెందులలో జెడ్పీటీసీ ఎన్నికల్లో దౌర్జన్యాలకు తెగబడడం, ఓటర్లను, పోటీలో ఉండే అభ్యర్థులను కూటమి నేతలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీపై జరిగిన దాడిని అందరూ ఖండించాలన్నారు. మాకు ప్రత్యర్థి అధికార కూటమా? అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతున్న అధికారులా? అన్న సందేహం కలుగుతోందన్నారు. నామినేషన్లు వేసిన నాటి నుంచి వేధింపులు.. సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నాటి నుంచి టీడీపీ నేతలు బెదిరింపులకు దిగారని పల్లె మేరి ఆరోపించారు. వారి చర్యలకు భయపడి ఊరు వదిలి వందల కిలోమీటర్లు దూరం వెళ్లి తలదాచుకున్నామని, తన భర్తను, పిల్లల్ని రకరకాలుగా వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. పోలీసులు, నాయకులు అందరూ టార్గెట్ చేశారని, అయినా తాను భయపడలేదని, ఫోర్జరీ సంతకాలతో నామినేషన్ ఉపసంహరణ పత్రాలు అధికారులకు ఇచ్చారని ఆరోపించారు. తాను ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, అధికారులు న్యాయం చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వ బెదిరింపులు దారుణం: ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ స్వేచ్ఛగా ఎన్నికలు జరగకుండా కూటమి ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడం దారుణమన్నారు. ఇటువంటి నియంతృత్వ విధానాలకు త్వరలో ప్రజలు బుద్ధి చెబుతారని విమర్శించారు. కార్యక్రమంలో యువజన విభాగం రీజినల్ కోఆర్డినేటర్ మారెడ్డి వెంకటాద్రిరెడ్డి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు ఢాకా పిచ్చిరెడ్డి, జిల్లా అంగన్వాడీ అధ్యక్షురాలు కనపర్తి గోవిందమ్మ, జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుడు పుట్టా వెంకటరావు, పల్లె శివరావు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు బచ్చల కోటేశ్వరరావు, చింతపల్లి హరిబాబు, పిన్నిక శ్రీనివాసరావు, ఇనకొల్లు సుబ్బారెడ్డి, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు మారెంరెడ్డి గంగాధరరెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు యామవరపు వీరవసంతరావు తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ ఎన్నికలు జరగకుండా కుట్రలు వైఎస్సార్ సీపీ నాయకులపై బెదిరింపులు అధికారులపై మంత్రి, నాయకుల ఒత్తిళ్లు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి అభ్యర్థులను బెదిరించారు ఎన్నికలు నిర్వహించే వరకూ పోరాడతాం మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ -
ఎకై ్సజ్లో పచ్చ పెత్తనం
● ఉన్నతాధికారులను సైతం లెక్క చేయని కిందిస్థాయి సిబ్బంది ● సూపరింటెండెంట్తో ఒంగోలు ఎకై ్సజ్ సీఐ వాగ్వాదం ● అధికార పార్టీ అండదండలతో పొదిలి ఎకై ్సజ్ సీఐని దూషించిన ఎస్సై ● ఎకై ్సజ్ శాఖలో పెత్తనం చెలాయిస్తున్న టీడీపీ మద్దతు సీఐలు ● డీసీ కార్యాలయంలోని ఒక ఎల్లో సీఐ ఫిర్యాదుతోనే గతంలో ఈఎస్ ఖాజా మొహిద్దిన్పై వేటు ? ● సుమారు రూ.2.50 కోట్లు కాజేసిన అధికారపార్టీ సామాజిక వర్గానికి చెందిన కానిస్టేబుల్ ఎకై ్సజ్ శాఖలో పచ్చ పెత్తనం పెచ్చుమీరిపోయింది. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో కొందరు అధికారులు పనిచేస్తున్నారు. అధికార పార్టీ సామాజికవర్గానికి చెందిన కొందరు ఉద్యోగులే బరితెగిస్తున్నారు. అక్రమాలకు పాల్పడుతూ ప్రశ్నించిన ఉన్నతాధికారులపై సైతం తిరగబడుతున్నారు. కానిస్టేబుళ్ల నుంచి సీఐ స్థాయి అధికారుల వరకూ అందరిదీ ఇదే తీరు. ఈ ప్రభుత్వం మాది మేమేం చేసినా చెల్లుబాటవుతుందన్న అహంకారంతో వ్యవహరించడం విమర్శల పాలవుతోంది. పొదిలి ఎస్సై సస్పెండ్... ఇటీవల పొదిలి ఎస్సై సైమన్ను సస్పెండ్ చేయడం ఎకై ్సజ్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం జిల్లాలో టీడీపీ నాయకులు, కార్యకర్తలే మద్యం దుకాణాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఒక్కో మద్యం దుకాణానికి అనుబంధంగా కనీసం 10 నుంచి 15 బెల్ట్ షాపులను అనధికారికంగా నిర్వహిస్తున్నారు. ఇదంతా అధికార పార్టీ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే జరుగుతోందని ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో పొదిలి ఎకై ్సజ్ ఎస్సై సైమన్కు ఒక వ్యక్తి వద్ద మూడు మద్యం బాటిళ్లు దొరికాయి. నిబంధనల ప్రకారం మూడు మద్యం బాటిళ్లు ఉండవచ్చు కనుక అతడిని ఆయన వదిలిపెట్టినట్లు సమాచారం. అయితే ఉన్నతాధికారులకు తెలియకుండా ఆయన బెల్ట్ షాపు నిర్వాహకుడిని పట్టుకొని వదిలేసినట్లు, ఈ విషయం గురించి ప్రశ్నించిన సీఐ అరుణకుమారిని దూషించినట్లు ప్రచారం జరిగింది. అయితే ఆయనను మాత్రం ఆఘమేఘాల మీద సస్పెండ్ చేశారు. దీని మీద ఎకై ్సజ్ శాఖలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరిపాలనా వ్యవస్థ కుప్పకూలిపోయింది. రాజకీయ జోక్యం మితిమీరడంతో అధికారులు చేష్టలుడిగి చూడడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. అన్నీ ప్రభుత్వ శాఖల్లో ఇదే పరిస్థితి నెలకొంది. పచ్చపార్టీ కార్యకర్తలు, నాయకులు నేరుగా ప్రభుత్వాధికారులను ఆదేశిస్తున్నారు. అవసరమైతే బెదిరింపులకు దిగుతున్నారు. ఎకై ్సజ్ శాఖలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఆ శాఖలో పనిచేస్తున్న అధికార పార్టీ సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులే బరితెగించి ప్రవరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా ఎకై ్సజ్ శాఖలో జరుగుతున్న పరిణామాలను ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా పేర్కొనవచ్చు. జిల్లా కేంద్రంలోని ఎలైట్ మాల్లో ఒక ఎకై ్సజ్ కానిస్టేబుల్ గుట్టుచప్పుడు కాకుండా రూ.2.50 కోట్ల మేర అవినీతికి పాల్పడినట్లు బయటపడింది. అయినా ఆయన మీద ఈగ వాలకుండా కూటమి ప్రభుత్వం కాపు కాయడం చూసి ప్రజలు నోటిమీద వేలేసుకున్నారు. అదే సామాజిక వర్గానికి చెందిన మరికొందరు ఉద్యోగులు ఉన్నతాధికారులపై తిరగబడి మాట్లాడడం లాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. ఇటీవల ఒంగోలు ఎకై ్సజ్ సీఐ ఒకరు ఏకంగా ఎకై ్సజ్ సూపరింటెండెంట్తో వాదన పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఎవరైనా ఇదేం పద్ధతి అనిఅడిగితే మమ్మల్నెవరురా ఆపేది అంటూ కాలరెగరేస్తున్నట్లు సహోద్యోగులు చెప్పుకుంటున్నారు. ఈ ప్రభుత్వం మాది మేమేం చేసినా చెల్లుబాటవుతుందన్న అహంకారంతో వ్యవహరించడం విమర్శల పాలవుతోంది. పాత ఈఎస్ను సాగనంపారు... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈఎస్గా షేక్ ఖాజా మొహిద్దిన్ను పోస్టింగ్ ఇచ్చారు. ఆయన వచ్చినప్పటి నుంచి కూటమి నాయకులకు సానుకూలంగా వ్యవహరించారు. మీడియాతో మాట్లాడే సమయంలో కూడా తన స్వామి భక్తిని దాచుకోకుండా కూటమి పాట పాడేవారు. ఎంత పచ్చసేవలో పావనమైనప్పటికీ ఆయనను అధికార పార్టీ సామాజిక వర్గం వదిలిపెట్టలేదని ప్రచారం జరుగుతోంది. డీసీ కార్యాలయంలో పనిచేసే అధికార పార్టీ సామాజిక వర్గానికి చెందిన ఒక సీఐ ఆయనపై పెత్తనం చేయడానికి ప్రయత్నించినట్లు సమాచారం. దీన్ని ఆయన అంగీకరించకపోయే సరికి కథ అడ్డం తిరిగింది. అప్పటిదాకా మావాడే అనిచెప్పిన తమ్ముళ్లు ఆయనను సాగనంపేందుకు ప్లాన్ చేశారు. ఎల్లో సీఐ కనుసన్నల్లో కమిషనర్కు ఫిర్యాదులు పంపించినట్లు సమాచారం. అంతటితో ఊరుకోకుండా కమిషనర్ కార్యాలయంలో చక్రం తిప్పడంతో కూటమి ప్రభుత్వం ఖాజా మొహిద్దిన్ మీద వేటు వేసినట్లు తెలుస్తోంది. 2024 సెప్టెంబర్లో ఒంగోలులో ఈఎస్గా బాధ్యతలు చేపట్టిన ఆయన చేత అన్నీ రకాలుగా ఊడిగం చేయించుకొని కేవలం 9 నెలలకే ఇంటికి పంపించారు. తన పరిధికి మించి కూటమి సేవ చేసినా ఆయనకు ఇప్పటి వరకు పోస్టింగు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఎకై ్సజ్ శాఖ ఉద్యోగులే చెప్పుకుంటున్నారు. రూ.2.42 కోట్లు కాజేసినా చర్యల్లేవు...ఈఎస్ను లెక్కచేయని ఆబ్కారీ సీఐ.. జిల్లా కేంద్రమైన ఒంగోలు ఎకై ్సజ్ సీఐ వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ సామాజికవర్గానికి చెందిన సీఐ లీనా గత కొంతకాలంగా ఉన్నతాధికారులకు సహకరించడంలేదని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం ఎకై ్సజ్ సూపరింటెండెంట్ షేక్ ఆయేషా బేగం పోలీసు స్టేషన్ తనిఖీ నిమిత్తం వెళ్లారు. రికార్డు నిర్వహణ సక్రమంగా లేకపోవడాన్ని ప్రశ్నించారు. రికార్డులు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. రికార్డులు ఇవ్వడానికి సీఐ తిరస్కరించడమే కాకుండా ఈఎస్ పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఈఎస్ ఎదుటే చేతిలోని సెల్ఫోన్ను నేలకు విసిరి కొట్టి ఆగ్రహంతో ఊగిపోయారు. తనపై అధికారితో దురుసుగా ప్రవర్తించడంతో అక్కడ ఉన్న ఉద్యోగులు విస్మయానికి గురయ్యారు. విధి నిర్వహణలో వైఫల్యం చెందడమే కాకుండా జిల్లా అధికారి పట్ల దురుసుగా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈఎస్ మీద దురుసుగా ప్రవర్తించిన సీఐ లీనాను కమిషనరేట్లో సరెండ్ మాత్రమే చేశారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉందన్న అహంకారంతోనే సదరు సీఐ నిర్లక్ష్యంగా వ్యవహరించారని కొందరు కిందిస్థాయి ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. ఇదేరీతిలో తాము వ్యవహరించి ఉంటే ఇప్పటికే సస్పెండ్ చేసి ఉండేవారని అంటున్నారు. -
రాష్ట్రంలో రెడ్బుక్ పాలన
మార్కాపురం/తర్లుపాడు: పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నికల సమయంలో ఓటమి భయంతో కూటమి నాయకులు బరితెగించి బీసీ నేత ఎమ్మెల్సీ రమేష్యాదవ్, వైఎస్సార్సీపీ నేత వేల్పుల రాముతోపాటు పలువురిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే, నెల్లూరు పార్లమెంట్ వైఎస్సార్ సీపీ పరిశీలకుడు జంకె వెంకటరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో ఖండించారు. ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే తమ నాయకులపై దాడి చేస్తున్నారని, కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తోందని అన్నారు. ప్రజలకు ఏం చేయాలి.. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి.. అనే అంశాన్ని మరచి రెడ్బుక్ పాలన నడిపిస్తున్నారని విమర్శిస్తున్నారు. బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్సీ రమేష్యాదవ్పై దాడికి దిగడం దారుణమన్నారు. ఒక ఎమ్మెల్సీకి పోలీసులు కనీస భద్రత కల్పించలేరా అని ప్రశ్నించారు. పులివెందులలో శాంతి భద్రతలు కాపాడేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో బీసీ నాయకులపై దాడులు పెరిగాయని వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గుమ్మా రాజేంద్రప్రసాద్ యాదవ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ బీసీ నేత, పులివెందుల శాసనమండలి సభ్యుడు రమేష్ యాదవ్పై మంగళవారం టీడీపీ గూండాలు చేసిన దాడిని ఆయన ఓ ప్రకటనలో ఖండించారు. ఇది బీసీలపై చేసిన దాడిగా అభివర్ణించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టడం తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. దాడి చేసిన నిందితులను ప్రభుత్వం వెంటనే అరెస్టు చేసి చట్టపరంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ రమేష్యాదవ్పై దాడిని ఖండించిన జంకె -
ప్రలోభాలు..బెదిరింపులు
సాక్షి, టాస్క్ఫోర్స్: కొండపి గ్రామ పంచాయతీ ఎన్నిక కూటమి ప్రభుత్వంలోని డొల్లతనాన్ని బయట పెట్టింది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము, ధైర్యం ఈ ప్రభుత్వానికి లేవని నిరూపితమైంది. కొండపి గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి టీడీపీ నాయకులు ప్రలోభానికి తెరలేపారు. మొదట వైఎస్సార్ సీపీతో 14 వార్డుల్లో 9 టీడీపీ, 5 వైఎస్సార్ సీపీకి, సర్పంచ్ టీడీపీ మద్దతు అభ్యర్థులకి కేటాయించేటట్లు ప్రలోభాలతో ప్రారంభించారు. ఈ ప్రతిపాదనను వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తిరస్కరించి ఎన్నికల బరిలో సర్పంచ్ పదవికి, 14 వార్డు పదవులకు నామినేషన్ దాఖలు చేయించారు. మంగళవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు సమీపించడంతో టీడీపీ అధిష్టానం ఎలాగైనా ఏకగ్రీవంగా గెలవాలని ఇందుకోసం సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించింది. మొదట నాయకుల చేత రాజీ చర్చలు ఫలప్రదం కాకపోవటంతో దండోపాయాన్ని ఎంచుకుని తమ తొత్తులైన పోలీసులను రంగంలోకి దించింది. దీంతో వీరు మంగళవారం ఉదయం నుంచే వైఎస్సార్ సీపీ మద్దతుతో పోటీలో ఉన్న ముగ్గురు మహిళా అభ్యర్థులు యనమద్ని కళ్యాణి, అడ్డగబొట్టు విమలమ్మ, పల్లెమేరిలను టార్గెట్ చేసి తమ పథకాన్ని అమలు చేశారు. మొదట కళ్యాణి ఇంటికి భారీగా పోలీసులతో వెళ్లి ఆమెను ఒక సీఐ బెదిరించి విత్డ్రా చేయించారు. తరువాత పక్క జిల్లాకు చెందిన సీఐను రంగంలోకి దింపి పల్లె మేరిని ప్రలోభపెట్టే పనిచేశారు. చివరగా విమలమ్మ ఎలాగైనా పోటీలో ఉండాలనే ఉద్దేశంతో టీడీపీ నాయకులకు దొరక్కుండా బస్సులో వెళుతుండగా టెక్నాలజీ సహాయంతో పసిగట్టి మరొక సీఐని రంగంలోకి దింపి అతని చేత వెళ్తున్న బస్సును ఆపి మరీ విమలమ్మను బెదిరించి ఆమె చేత బలవంతంగా వేలి ముద్రలు వేయించి నామినేషన్ విత్డ్రా చేయించారు. వాస్తవానికి 3 గంటలకల్లా నామినేషన్ విత్డ్రా కార్యక్రమం ముగించాల్సి ఉంది. కానీ ఎన్నికల అధికారి రవిబాబు ఆదేశాలతో మధ్యాహ్నం 3.15 గంటలకు గది తలుపులు మూశారు. దీంతో సర్పంచ్ ఎన్నికల జరుగుతుందని భావించారు. అయితే వైఎస్సార్ సీపీ అభ్యర్థులంతా విత్డ్రా చేసుకున్నారని, ఒక వేళ అభ్యర్థి విత్డ్రా చేయటానికి రాలేకపోతే ఆమె నామినేషన్కు ప్రపోజల్ పెట్టిన వారి చేత విత్డ్రా పత్రాలు సమర్పించవచ్చని ఆ ప్రకారం విత్డ్రా పత్రాలు ఎన్నికల అధికారి వద్దకు చేరాయని ఇక ఏకగ్రీవం అని ప్రకటించటమే తరువాయని టీడీపీ నాయకులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన ఆదిమూలపు సురేష్ ముందు జాగ్రత్త చర్యగా మేరి ఆరోగ్యంగా ఉందని, ఆమె అనారోగ్యంగా ఉండి రాలేని పరిస్థితిలో ఆమెకు ప్రపోజల్ సంతకం పెట్టిన వ్యక్తి ఫోర్జరీ సంతకాలతో విత్డ్రా ఫారం అందజేసే అవకాశం ఉందని, దానిని ఆమోదించవద్దని రాతపూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల అధికారి వద్దకు వెళ్లి కలిసే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన సీఐ సోమశేఖర్ వెంటనే సురేష్ ఎన్నికల అధికారిని కలవాలంటే 5 గంటల తరువాతేనని చెప్పి అడ్డుకుని ఆయనను అక్కడి నుంచి పంపించేశారు. వీళ్లకో న్యాయం..వాళ్లకో న్యాయమా.. మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ గడువు ముగియగా 3.15 గంటలకు ఎన్నికల అధికారి తలుపులు మూసి ఇంకెవరు విత్డ్రా లు చేసుకోవటానికి లేదన్నారు. కానీ టీడీనీ నాయకులు తరువాత కూడా కార్యాలయంలోకి వెళ్లి వస్తున్నా వారిని ఎవరూ అడ్డుకోలేదు. 3.45 గంటలకు కార్యాలయానికి వచ్చిన సురేష్ను ఎన్నికల అధికారిని కలవకుండా అడ్డుకుని పంపించేశారు. తరువాత 4 గంటల సమయంలో ఉపాధి హామీ పథకానికి చెందిన సిబ్బంది విమలమ్మ చేత సీఐ బలవంతంగా వేలిముద్రలు వేయించిన కాగితాలను తీసుకొచ్చి ఎన్నికల అధికారికి అందజేసి చివరికి ఎన్నిక ఏకగ్రీవం అని ప్రకటించారు. భారీ బందోబస్తు.. గ్రామ పంచాయతీ ఎన్నికల విత్డ్రా కార్యక్రమానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేయటంపై కొండపి గ్రామ ప్రజలు విస్మయం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలను డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షించగా ఒక సీఐ, ఐదుగురు ఎస్సైలు, దాదాపు 150 సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ మద్దతు అభ్యర్థులను బెదిరించి విత్డ్రా చేసే క్రమంలో ప్రజలు ఏమైనా తిరగబడతారేమోనన్న అనుమానంతో ఈ విధంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసుకున్నారా అని మండల ప్రజలు చర్చించుకున్నారు. ఆద్యంతం బెదిరింపుల పర్వం గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం నుంచి విత్డ్రా ప్రక్రియ ముగించే వరకు పోలీసులు బెదిరింపుల పర్వం సాగించారు. మొదట వార్డు సభ్యులను సోమవారం రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల అధికారి 8 మంది వైఎస్సార్సీపీ సానుభూతిపరుల విత్డ్రాలను ఆమోదించారు. దీనిపై వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి సురేష్ ఎన్నికల అధికారి రవిబాబును నిబంధనల ప్రకారం ఎలా విత్డ్రాలు చేస్తారని ప్రశ్నిస్తే సాయంత్రం 5 గంటల లోపే వారి చేత విత్డ్రా చేయించానని బుకాయించే ప్రయత్నం చేశారు. దీనిపై సురేష్ స్పందిస్తూ 5 గంటల సమయంలో వారు తన వద్దే ఉన్నారని అలాంటప్పుడు విత్డ్రా ఎలా చేస్తారని ప్రశ్నించటంతో నీళ్లు నమలటం రవిబాబు వంతయింది. దీనిపై డీజీపీ, గుంటూరు డీఐజీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్, మానవ హక్కుల సంఘానికి, కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ ఏఆర్ దామోదర్కు వాట్సాప్ ద్వారా సురేష్ ఫిర్యాదు చేశారు. దీనిపై న్యాయపోరాటం చేస్తానని కోర్టులను ఆశ్రయిస్తానని తెలిపారు. వైఎస్సార్సీపీ కార్యాలయానికి బందోబస్తు వైఎస్సార్సీపీ నాయకులు అడక్కుండానే పార్టీ కార్యాలయం వద్ద ఇద్దరు కానిస్టేబుళ్లను సాధారణ దుస్తుల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. తరువాత కార్యాలయం సమీపంలో ప్రధాన రహదారి వద్ద ముగ్గురు ఎస్సైలు, 10 మంది కానిస్టేబుల్స్ బందోబస్తు నిర్వహించారు. పార్టీ కార్యాలయానికి వచ్చిన వారు బయటకు వెళ్తుంటే రోడ్డు మొదట్లో ఎస్సై ప్రేమ్కుమార్ ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు అడ్డుకున్నారు. చివరికి ఎన్నికల ఫలితాలు విడుదలైన తరువాత కార్యాలయంలో విలేకరుల సమావేశానికి వస్తున్న విలేకరులను కూడా ఎస్సై స్థాయి అధికారి అడ్డుకునే ప్రయత్నం చేశారు. తరువాత కార్యాలయంలో విలేకరుల సమావేశం జరుగుతున్నంత సేపు డ్రోన్ కెమెరాతో వీడియో తీసే ప్రయత్నం చేశారు. ఈ విధంగా వైఎస్సార్ సీపీ నాయకులను అడుగడుగునా పోలీసులు అడ్డుకుని ఎట్టకేలకు సర్పంచ్ పదవిని టీడీపీకి అప్పగించారు. పోలీసుల కనుసన్నల్లో కొండపి పంచాయతీ ఎన్నికలు ఓటమి భయంతో పోలీసులనే నమ్ముకున్న టీడీపీ అధిష్టానం ఎన్నికలు జరిగితే కూటమి ప్రభుత్వానికి ఓటమే అంటున్న ప్రజలు ఫోర్జరీ సంతకాలు, బెదిరింపులతో ఏకగ్రీవం చేసుకున్న ప్రభుత్వం ముమ్మాటికీ అప్రజాస్వామిక గెలుపు అంటున్న వైఎస్సార్ సీపీ -
ఇళ్లకు స్మార్ట్ మీటర్లు బిగించవద్దు
ఒంగోలు సబర్బన్: తమ ఇళ్లకు విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించవద్దంటూ ప్రజలు గగ్గోలు పెడుతున్నారని ఏఐటీఎఫ్యూ రాష్ట్ర నాయకుడు డీవీ స్వామి అన్నారు. ఈ మేరకు ఒంగోలు నగరంలోని సంతపేట వద్ద స్థానిక ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి సీఐటీయూ ఒంగోలు నగర్ కార్యదర్శి టీ మహేష్ అధ్యక్షత వహించారు. ప్రజా సంఘాల ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ విద్యుత్ రంగ ప్రైవేటీకరణలో భాగంగా అదానీ కంపెనీకి స్మార్ట్ మీటర్ల బిగింపునకు ప్రభుత్వం అనుమతించిందన్నారు. స్మార్ట్ మీటరు బిగింపు విద్యుత్ వినియోగదారులందరికీ ప్రమాదకరంగా తయారవుతుందన్నారు. స్మార్ట్ మీటర్ల బిగింపునకు అయ్యే ఖర్చు కూడా ప్రజల మీద మోపుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ చార్జీలు పెంచే పద్ధతిలో భారాలు వేయటం అత్యంత దారుణమన్నారు. బిగించిన విద్యుత్ స్మార్ట్ మీటర్లు తొలగించాలని, ఇంటికి బిగించే స్మార్ట్ మీటర్లు పూర్తిగా రద్దు చేయాలని, విద్యుత్ సర్దుబాటు చార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కిసాన్ రైతు సంఘం సంయుక్త జిల్లా కన్వీనర్ చుండూరు రంగారావు, ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు ఎస్.కే మాబు, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి లలిత కుమారి, ఏఐఎఫ్టీయూ జిల్లా నాయకులు ఎంఎస్ సాయిబాబా, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు జి.కొండారెడ్డి, చీకటి శ్రీనివాసరావు, ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు ఆర్.మోహన్, సీఐటీయూ, ఐఎఫ్టీయూ, ఐద్వా, పెన్షనర్ల సంఘం, పట్టణ అభివృద్ధి కమిటీ నాయకులు పాల్గొన్నారు. ప్రజలపై విద్యుత్ భారాలు రద్దు చేయాలి విద్యుత్ భవన్ వద్ద ధర్నాలో ఏఐటీఎఫ్యూ రాష్ట్ర నాయకుడు డీవీ స్వామినిరసన తెలుపుతున్న ప్రజా సంఘాల ఐక్య వేదిక నాయకులు -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు
విలేకరులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్కొండపి: కొండపి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. దాదాపు 14 ఏళ్ల తరువాత జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేద్దామని భావించిన దళిత మహిళల ఆశలను పోలీసుల అండదండలతో అడియాశలు చేశారని, ఇందులో టీడీపీ నాయకులు ప్రధానపాత్ర పోషించారని ఆరోపించారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కొండపి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ నాయకుల అరాచకాలను సురేష్ వివరించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయి విత్డ్రా కార్యక్రమం ముగిసే వరకు కూటమి నాయకులు పోలీసుల సహకారంతో అనేక వికృత విన్యాసాలు చేశారని దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో సర్పంచ్ పదవిని ఎస్సీ మహిళకు కేటాయించారని, దీంతో టీడీపీ నాయకులు పోలీసుల అండదండలతో అరాచకానికి తెరతీశారన్నారు. వైఎస్సార్ సీపీ మద్దతుతో బరిలో నిలిచిన మహిళా అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. చట్టాలను, ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కి ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా 5 రోజుల ముందే పోలీసుల బెదిరింపులతో ఎన్నికలు ముగించారన్నారు. ముగ్గురు సీఐలతో బెదిరింపుల పర్వం: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోలీసులు, టీడీపీ నాయకులు, అధికారులు సంయుక్తంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. ఎన్నికల్లో శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు మహిళా అభ్యర్థులపై బెదిరింపు రాజకీయాలకు దిగారని ఇందులో ముగ్గురు సీఐలు ప్రధానపాత్ర పోషించారని ఆరోపించారు. మా మద్దతు అభ్యర్థుల్లో ఒకరైన యనమద్ని కళ్యాణి ఇంటికి ఒక సీఐ వెళ్లి బెదిరించి మరీ విత్డ్రా ఫారాలపై సంతకాలు తీసుకున్నారన్నారు. కళ్యాణి భర్త వసంతరావు ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడని, నీ భర్త ఉద్యోగం ఎలా చేస్తాడో చూస్తామని బెదిరింపులకు దిగారని ఆరోపించారు. ఈ విషయమై కనిగిరి డీఎస్పీ సాయిఈశ్వర్ యశ్వంత్కు సదరు సీఐపై ఫిర్యాదు చేస్తే ఆయన కొత్త కథ అల్లారని విమర్శించారు. అభ్యర్థి కళ్యాణి విత్డ్రా ఫారాలు తీసుకుని సీఐ వద్దకు వెళ్లి ఎన్నికల్లో పోటీ చేయటం లేదని చెప్పిందని కట్టుకథ అల్లారని విమర్శించారు. ఏ అభ్యర్థి అయినా ఎన్నికల్లో విత్డ్రా చేయాలంటే ఎన్నికల అధికారి వద్దకు వెళ్తారే తప్ప పోలీసుస్టేషన్కు ఎందుకు వెళ్తారని ప్రశ్నించారు. మరో అభ్యర్థి పల్లెమేరి చేత విత్డ్రా చేయించే బాధ్యత మరో సీఐ పై టీడీపీ నాయకులు పెట్టారన్నారు. ఈమె సుమారు 200 కిలోమీటర్ల దూరంలో పూర్తి ఆరోగ్యంగా ఉంటే .. అనారోగ్యంగా ఉందని విత్డ్రా చేయటానికి రాలేదని చెప్పి ఈమెకు ప్రపోజల్ చేసిన వ్యక్తి చేత విత్డ్రా ఫారాలపై ఫోర్జరీ సంతకాలు చేసి ఇచ్చారన్నారు. ఈ ఫోర్జరీ బాగోతంపై తాను ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేద్దామని వెళితే సీఐ సోమశేఖర్ తనను కలవకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. మరో అభ్యర్థి అడ్డబొట్టు విమలమ్మ టీడీపీ నాయకుల నుంచి భద్రత లేకపోవటంతో విత్డ్రా సమయం ముగిసే వరకు బస్సుల్లో తిరుగుతుంటే రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఈమెను మద్దిపాడు వద్ద బస్సు ఆపి చదువురాని ఈమె చేత బలవంతంగా విత్డ్రా ఫారాలపై వేలిముద్రలు వేయించి సుమారు 4 గంటల సమయంలో ఆ విత్డ్రా ఫారాలను తీసుకొచ్చి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఒక ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగి చేత ఇప్పించారని ఆరోపించారు. ఈ విధంగా ఎన్నికల్లో పోలీసులు తమ పాత్ర పోషించి చివరికి ఎన్నికలు ఏకగ్రీవం అని ప్రకటించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేది మహిళా అభ్యర్థులు: కొంతమంది టీడీపీ నాయకులు సర్పంచ్ అభ్యర్థి విషయంపై అసభ్యకరంగా మాట్లాడారని.. ఈ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థి మహిళ అని గుర్తు చేశారు. మగతనం అంటే ఇలా పోలీసులను అడ్డం పెట్టుకుని మహిళలను బెదిరించి అడ్డదారుల్లో గెలవటం కాదని, చేతనైతే దమ్ముంటే ప్రజాస్వామ్య యుతంగా స్వేచ్ఛా వాతావరణంలో ఎన్నికలు నిర్వహించి గెలవాలని హితవు పలికారు. ఎన్నికల ప్రక్రియను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, టీడీపీ నాయకులకు తగిన గుణపాఠం చెబుతారన్నారు. సమావేశంలో సురేష్ వెంట పార్టీ మండల అధ్యక్షుడు బచ్చల కోటేశ్వరరావు, ఢాకా పిచ్చిరెడ్డి, మారంరెడ్డి వెంకటాద్రిరెడ్డి, వసంత్రావు, దుద్దుగంట మల్లిఖార్జునరావు, బెజవాడ వెంకటేశ్వర్లు, చింతపల్లి హరిబాబు, పిన్నిక శ్రీనివాసులు, ఇనకొల్లు సుబ్బారెడ్డి, బొల్లినేని నాగేశ్వరరావు, పెట్లూరి కృష్ణమూర్తి,వి మల్లిఖార్జునరెడ్డి, షేక్ సల్తాన్, షేక్ కరీం, పాకనాటి సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు. పోలీసుల కనుసన్నల్లో కొండపి గ్రామ పంచాయతీ ఎన్నికలు వైఎస్సార్ సీపీ మద్దతు అభ్యర్థులను సీఐలు బెదిరించారు వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ -
ఉచిత బస్సు ఎలా.?
ఉన్న బస్సులతోమార్కాపురం: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15న ప్రవేశపెట్టనున్న ఉచిత బస్సు ప్రయాణం ఆర్టీసీ అధికారుల్లో టెన్షన్ పుట్టిస్తోంది. ఉన్న బస్సులతో ఎలా నడపాలో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కొత్త బస్సులు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. ప్రభుత్వం కూడా కొత్త బస్సులపై ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదు. దీంతో ఉన్న బస్సులను ఉచిత బస్సులుగా మారిస్తే కొన్ని రూట్లలో బస్సు సర్వీసులను రద్దు చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే ప్రయాణికుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఆ రూట్లలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటే సంస్థ ఆదాయం తగ్గే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఏం చేయాలో తెలియక మల్లగుల్లాలు..? మార్కాపురం డివిజన్లో మార్కాపురం, గిద్దలూరు, పొదిలి డిపోలు ఉన్నాయి. మార్కాపురం డిపోలో ప్రస్తుతం 90 ఆర్టీసీ బస్సులు, 16 హైర్ బస్సులు ఉన్నాయి. వీటిలో 50 పల్లెవెలుగు సర్వీసులు ఉన్నాయి. ప్రతిరోజూ సుమారు 39 వేల కిలోమీటర్లు తిరుగుతాయి. ఉచిత బస్సు అమలు చేస్తే మార్కాపురం, ఒంగోలు, నంద్యాల తదితర ప్రాంతాలకు నడిపే సర్వీసులను కొంత దూరం వరకే పరిమితం చేసే అవకాశం ఉంది. ఉచిత బస్సు అమలయ్యే తరువాత నుంచి మార్కాపురం నుంచి ఒంగోలుకు ప్రస్తుతం నడుపుతున్న ఆర్డీనరీ సర్వీసులను పొదిలి వరకు మాత్రమే నడపాలని అధికారులు తాత్కాలికంగా నిర్ణయించారు. ఇలా అయితే పొదిలి, ఒంగోలు మధ్య మార్కాపురం డిపో నుంచి ఆర్డినరీ సర్వీసులు తగ్గనున్నాయి. అలా చేస్తే ప్రయాణికులు ఇబ్బంది పడతారు. ఉచిత బస్ ప్రయాణంపై ఆర్టీసీ అధికారుల్లో టెన్షన్ తగ్గనున్న బస్ రూట్లు ఇప్పటికీ చాలా గ్రామాలకు ఆటోలే దిక్కు.. ఆ గ్రామాలకు ఆటోలే దిక్కు... ఇప్పటికీ మార్కాపురం, తర్లుపాడు మండలాల్లోని పలు గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు, విద్యార్థులు ఆటోల్లోనే మార్కాపురం వస్తుంటారు. మార్కాపురం మండలంలోని బోడపాడు, రాజుపాలెం, నాగులవరం, నికరంపల్లి, తర్లుపాడు మండలంలోని తుమ్మలచెరువు, మీర్జపేట, కారుమానిపల్లె తదితర గ్రామాలకు ఇప్పటికీ ఆర్టీసీ సౌకర్యం లేదు. ఈ గ్రామాల ప్రజలకు అత్యవసరమైనా సాధారణ పనైనా.. ఆటోల్లో, బొలెరో వాహనాల్లో పనులకు రావాల్సిందే. ప్రమాదాలు జరుగుతాయని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణించాల్సిన పరిస్థితి. ఈ నెల 15 నుంచి ప్రారంభించే ఉచిత సర్వీసులకు వీరు దూరం కానున్నారు. తమ స్వగ్రామాల నుంచి ఆటోల్లో మార్కాపురం వచ్చి తాము ప్రయాణం చేయాల్సిన గమ్యానికి వెళ్లాల్సిందే. ఈ గ్రామాలకు బస్సు సౌకర్యం విషయంలో అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే. ఒక వైపు కొత్తబస్సులు రాకపోగా, ఉన్న బస్సులనే రాజధానికి జిల్లా కేంద్రానికి కేటాయిస్తే ప్రస్తుతం నడుస్తున్న సర్వీసుల్లో కొన్నైనా రద్దు చేయాల్సిందే. దీనితో ఎలా చేయాలో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే ఉచిత బస్సుపై ప్రజల్లో, ప్రభుత్వంపై వ్యతిరేకతో పాటు అయోమయం, గందరగోళం నెలకొంది. -
అన్నదాతలను పట్టించుకోని ప్రభుత్వం
ఒంగోలు సిటీ: కూటమి ప్రభుత్వ లోప భూయిష్ట నిర్ణయాలతో రైతులకు సకాలంలో ఎరువులు అందక, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోందని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు. సాగుచేసిన పంటలకు కనీసం పెట్టుబడులు కూడా రాక జిల్లాలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాపోయారు. గిద్దలూరు మండలం ఓబులాపురం గ్రామంలో అప్పుల బాధ తాళలేక కౌలు రైతు తొట్టెంపూడి దిలీప్కుమార్ ఆత్మహత్య చేసుకున్నారన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 8 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి రైతులు చనిపోతున్నా కూటమి ప్రభుత్వం పట్టీపట్టనట్టు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. చనిపోయిన రైతు కుటుంబాలకు చిల్లిగవ్వ కూడా ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. అన్నదాత సుఖీభవ పేరుతో వ్యవసాయ భూముల్లో సీఎం చంద్రబాబు షో చేసి వెళ్లిపోయారని విమర్శించారు. జిల్లాలో వేలాది మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వ వాటా పడలేదని మండిపడ్డారు. నగదు కోసం వారంతా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారన్నారు. తెగుళ్లు, ప్రకతి వైపరీత్యాలను ఎదుర్కొని పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. యూరియాతో పాటు ఇతర కాంప్లెక్స్ ఎరువులు గత ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా స్థానికంగానే పంపిణీ చేసిందని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. ఎరువుల కంపెనీలు కాంప్లెక్స్ ఎరువులను బస్తాకు రూ.100 నుంచి రూ.255 వరకు పెంచి విక్రయిస్తున్నా పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. గిట్టుబాటు ధర కల్పనలో విఫలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బత్తుల బ్రహ్మానందరెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వంలో మామిడి కిలో రూ. 29 మద్దతు ధర ఉండగా, ఈ ఏడాది రెండు రూపాయలే రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం నగదు మొత్తాన్ని 24 గంటల్లో రైతు బ్యాంకు ఖాతాలో తమ చేస్తానని చెప్పిన ప్రభుత్వం, నెలలు గడిచినా జాడలేదని ఆరోపించారు. టమోటా, పత్తి, మిర్చి, శనగ, రొయ్యల రైతుల పరిస్థితి కూడా ఇలాగే ఉందన్నారు. పొగాకు రైతుల పరిస్థితి మరీ దారుణం.. పండించిన పొగాకు మొత్తం కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం చివరకు రైతుకు 20 చెక్కులకే పరిమితం చేయటం ఏంటని ప్రశ్నించారు. వేలం కేంద్రాలకు వస్తున్న బేళ్లలో అధిక సంఖ్యలో తిరస్కరిస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం ఆందోళన కలిగిస్తున్న రైతు ఆత్మహత్యలు ఎరువుల పంపిణీ, గిట్టుబాటు ధరలు కల్పించడంలో వైఫల్యం అన్నదాత సుఖీభవ నగదు పడక అన్నదాతల అవస్థలు వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి -
పారిశుధ్య కార్మికులకు రాజకీయ వేధింపులు
● మస్టర్ పాయింట్ల వద్ద పారిశుధ్య కార్మికుల ఆందోళన ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులపై రాజకీయ వేధింపులు పెరిగిపోయాయని సీఐటీయూ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం మస్టర్ పాయింట్ల వద్ద కార్మికులతో కలిసి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న వారిని వివిధ రాజకీయ కారణాలతో విధుల నుంచి తప్పించారన్నారు. తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఉపాధి కల్పించాలని, 60 ఏళ్లు నిండిన వారికి జీఓ నంబర్–25 ప్రకారం ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఐటీయూ నగర కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు కార్మికులపై పర్యవేక్షణ పేరుతో పని జరగట్లేదని వివిధ కారణాలతో కార్మికుల్ని మస్టర్ ఆపేయటం, విధుల నుంచి తొలగించి మీ ఉద్యోగం తీసేస్తామని భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. కార్మికులకు పీఎఫ్ గానీ, ఈఎస్ఐ కార్డులు గానీ పరిపూర్ణంగా అమలు చేయలేదన్నారు. చనిపోయిన కార్మికులకి పెండింగ్లో ఉన్న పీఎఫ్ క్లైమ్ చేయడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. మున్సిపల్ కార్మికులు చనిపోతే రెండు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా కార్మికులకి అందలేదన్నారు. యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు జి.నరసింహ, టి.విజయమ్మ, నాయకులు యు.రత్నకుమారి, మోహన్, రాములు, ఎద్దురవి, ఎం .బాబు, ఆర్ శ్రీనివాసరావు, పి సుబ్బారావు, ఆనంద్, కె. వెంకటేశ్వర్లు, ఎం లక్ష్మీకాంతం, నాగలక్ష్మి, కే వంశీ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
● ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కిరణ్కుమారెడ్డి ఒంగోలు సిటీ: ‘రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం’ అన్న కార్యక్రమాన్ని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నపరెడ్డి కిరణ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో ఒంగోలు రాంనగర్ 5వ లైన్ల ఫుడ్ సేఫ్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. కార్యక్రమంలో ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన నాలుగు డీఏలు, పీఆర్సీ కమిటీ, ఐఆర్ మధ్యంత భృతి వంటి విషయాల గురించి చర్చించామన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి వరకుమార్, ఉపాధ్యక్షుడు రమణ వెంకటేశ్వరరెడ్డి, గోపికృష్ణ, కోశాధికారి రంగారెడ్డి, ఒంగోలు పట్టణ అధ్యక్షుడు మోటా శ్రీనివాసరావు, కోశాధికారి ఏసురత్నం, శ్రీనివాసరావు, సునీల్ జవహరాలి, తాలూకా అధ్యక్షుడు సురేష్ బాబు, కార్యదర్శి శ్రీదేవి, చంద్రశేఖర్ శ్రీనివాసులు మహిళా అధ్యక్షురాలు డాక్టర్ మానస, వనజ, సుమతి, గౌరీ తదితరులు పాల్గొన్నారు. -
ఆటపాటలతో ప్రభుత్వాలను నిలదీస్తాం
ఒంగోలు టౌన్: ఆట, పాట, మాటలతో ప్రజలను చైతన్యం చేసి ప్రభుత్వాలను నిలదీస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. సీపీఐ రాష్ట్ర మహాసభలను పురస్కరించుకొని ఏపీ ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ప్రచార బస్సు యాత్రను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన ఆటపాటలు ఆకట్టుకున్నాయి. అనంతరం గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ పోరాటాల పురిటి గడ్డ ఒంగోలు నగరంలో తొలిసారిగా సీపీఐ రాష్ట్రమహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ఏర్పటి నాటి నుంచి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నారు. ఇక్కడి ప్రజల పేరు చెప్పుకొని నాయకులు బాగుపడ్డారే కానీ ప్రజల జీవితాల్లో ఎలాంటి అభివృద్ధి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ ప్రకాశం జిల్లాకు జీవనాధారమైన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభించి నేటికి 29 ఏళ్లు గడుస్తున్నా పనులు నత్త నడకన సాగుతున్నాయని చెప్పారు. కనిగిరి ప్రాంతంలో నిమ్జ్, దొనకొండలో పారిశ్రామిక వాడలు కేవలం హామీలుగానే మిగిలిపోయాయయని చెప్పారు. ఈ హామీలు అమలుకాక పోవడంతో జిల్లాలో నిరుద్యోగం తాండవిస్తుందన్నారు. ప్రజలకు ఉపాధి లేక వలసబాటలు పడుతున్నారన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. మహాసభలను పురస్కరించుకొని వెయ్యి మంది కళాకారులు, 100 గొంతుకలతో, 100 కళారూపాలతో ప్రజా కళా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమాలకు దర్శకుడు బాబ్జీ, వందేమాతరం శ్రీనివాస్, మాదాల రవి, అజయ్ఘోష్, గోరటి వెంకన్న తదితరులు హాజరుకానున్నట్లు తెలిపారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ బస్సు ప్రచారయాత్ర ఈ నెల 16వ తేదీ వరకు కొనసాగుతుందని వివరించారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రా నాయక్, ఆర్.రామకృష్ణ, ఆరేటి రామారావు, ఎస్కే నజీర్, పిచ్చయ్య, గుర్రప్ప, అనంతలక్ష్మి, దేవరకొండ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
రెవెన్యూ కార్యాలయంలో రికార్డులు మాయం
● పోలీస్స్టేషన్లో కేసు నమోదు ముండ్లమూరు(దర్శి): మండలంలోని శంఖరాపురం గ్రామానికి చెందిన 1బీ రికార్డు మాయమైంది. దీంతో ఆరుగురు రెవెన్యూ అధికారులపై మండ్లమూరు పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..శంఖరాపురం గ్రామానికి చెందిన మేడికొండ వెంకటకృష్ణారావుకు, అదే గ్రామంలో మరొకరికి పొలం వివాదం ఉంది. 1బీ మాన్యువల్ రికార్డు చూసి న్యాయం చేయాలని రెవెన్యూ అధికారులను ప్రాధేయపడినా ఉపయోగం లేకుండాపోయింది. దీంతో కృష్ణారావు హైకోర్టులో కేసు వేశారు. ఈ రికార్డు అటు శంఖరాపురంలో వీఆర్వో వద్ద కానీ, ఇటు తహసీల్దార్ కార్యాలయంలో గానీ లేదు. దీంతో రెవెన్యూ అధికారులు ఉద్దేశపూర్వకంగానే మాయంచేసి ఉంటారని హైకోర్టు జడ్జి అభిప్రాయపడ్డారు. 1బీ రికార్డు మాయం వెనుక ఎవరెవరి పాత్ర ఉందో గుర్తించటంతో పాటు 2018 నుంచి 2022 వరకు పనిచేసిన రెవెన్యూ అధికారులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఈమేరకు కలెక్టర్ స్థానిక తహశీల్దార్ లక్ష్మీనారాయణను అప్పడు పనిచేసిన అధికారులపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఆదేశించారు. ఆయన ఫిర్యాదు మేరకు అప్పటి తహసీల్దార్లు జి.నాంచారయ్య, పాలపర్తి పార్వతి, అప్పటి డీటీ కె.రవికుమార్, ప్రస్తుత డీటీ అద్దంకి స్రవంతి, అప్పటి సీనియర్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం, అప్పటి శంఖరాపురం వీఆర్వో నంబూరి గురవయ్యలను అనుమానితులుగా భావించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కమలాకర్ తెలిపారు. ఆర్ఐఓగా ఆంజనేయులు బాధ్యతల స్వీకరణ ఒంగోలు సిటీ: ఇంటర్మీడియెట్ బోర్డు ప్రకాశం జిల్లా ప్రాంతీయ పర్యవేక్షణాధికారిగా ఇంటర్ విద్య అధికారిగా వ్యవహరిస్తున్న తాళ్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కె. ఆంజనేయులు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఆర్ఐఓగా పనిచేస్తున్న ఏ సైమన్విక్టర్ ఇంటర్ బోర్డు పరీక్షల నియంత్రణ అధికారిగా నియామకం పొందడంతో ఆ బాధ్యతలను కూడా డీఐఈఓ ఆంజనేయులకు అప్పగిస్తూ ఇంటర్ బోర్డు కార్యదర్శి డాక్టర్ కృతికా శుక్లా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆంజనేయులు ఆర్ఐఓ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయన్ను కలిసి అభినందనలు తెలిపారు. -
వెట్టిచాకిరీ నుంచి 40 మందికి విముక్తి
● ఒడిశా, చత్తీస్గఢ్వాసులకు రిలీఫ్ సర్టిఫికెట్లు ఇచ్చి స్వగ్రామాలకు.. ఒంగోలు సబర్బన్: టంగుటూరు మండలంలోని రెండు రొయ్యల పరిశ్రమల్లో వెట్టి చాకిరీ చేస్తున్న 40 మంది ఒడిశా, చత్తీస్గఢ్ రాష్ట్ర వాసులకు జిల్లా అధికారులు విముక్తి కల్పించారు. ఈ మేరకు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో వారికి రిలీఫ్ సర్టిఫికెట్లు అందించారు. పనిచేసిన కాలానికి చట్ట ప్రకారం వారికి రావాల్సిన నగదును ఇప్పించడంతో పాటు ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించి బాధితులను వారి స్వస్థలాలకు చేర్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు. వీటికి సంబంధించిన వివరాలను ఒంగోలు ఆర్డీఓ కె.లక్ష్మీ ప్రసన్న తెలిపారు. ఒడిశా నుంచి 17 మంది, చత్తీస్గఢ్ నుంచి 23 మంది వచ్చి టంగుటూరు మండలంలోని రెండు రొయ్యల పరిశ్రమలలో పనిచేస్తున్నట్లు చెప్పారు. తమ జిల్లా ప్రజలు ఇక్కడ వెట్టి చాకిరీ చేస్తున్నారని ఛత్తీస్గడ్లోని బస్తర్ జిల్లా కలెక్టర్ ఇచ్చిన సమాచారం మేరకు స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రభుత్వ అధికారులు ఈ బాధితులను సోమవారం రక్షించినట్లు తెలిపారు. ఒక మధ్యవర్తి మాయమాటలు చెప్పి ఈ వెట్టి చాకిరీ ఊబిలోకి దించారని, తమకు సరైన వసతిగానీ, ఆహారం గానీ, చేసిన పనికి డబ్బులు కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారని బాధితులు చెప్పినట్లు ఆర్డీఓ వివరించారు. బాధితుల్లో మైనర్లు కూడా ఉన్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో సదరు పరిశ్రమలపై వెట్టిచాకిరీ నిర్మూలన, బాల కార్మిక నిర్మూలన, కనీస వేతన చట్టాల కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. బాధితుల కోసం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి బస్తర్ జిల్లా నుంచి వచ్చిన అధికారులతో వారి స్వస్థలాలకు పంపుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఐసీడీఎఎస్ పీడీ సువర్ణ, కార్మిక శాఖ సహాయ కమిషనర్ ఎం.కోటేశ్వరరావు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ మేరీ సుజాత, టంగుటూరు తహసీల్దార్ ఆంజనేయులు, డీసీపీఓ దినేష్కుమార్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సునీల్కుమార్, శ్యామ్ పాల్గొన్నారు. -
కుమారుడిపై తండ్రి దాడి
పెద్దదోర్నాల: కుమారుడిపై తండ్రి దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలోని అయ్యన్నకుంటలో సోమవారం రాత్రి జరిగింది. ఈ సంఘటనలో బయ్యన్న తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన కుడుముల వెంకటేశం భార్యపై చేయి చేసుకున్నాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న అతని కుమారుడు బయ్యన్న..తండ్రిని అడ్డుకోవడంతో గొడ్డలిలో దాడి చేయడంతో అతని తలపై తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన బయ్యన్నను బంధువులు చికిత్స నిమిత్తం స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బిడ్డకు పాలిస్తే రొమ్ము క్యాన్సర్ దూరం ఒంగోలు టౌన్: నిర్ణీత కాలం వరకు బిడ్డకు పాలివ్వడం ద్వారా రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా తల్లులను కాపాడవచ్చని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు అన్నారు. తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం జీజీహెచ్లోని గైనకాలజీ విభాగంలో తల్లులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాణిక్యరావు మాట్లాడుతూ...తల్లిపాలు తాగిన పిల్లలు బలంగా ఉంటారని, వారిలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందన్నారు. తల్లిపాలు తాగిన పిల్లల్లో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుందని, తల్లులు కూడా ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. సృష్టిలో తల్లిపాలకు మించింది లేదన్నారు. ప్రభుత్వ వైద్యకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అశోక్కుమార్ మాట్లాడుతూ సదస్సులో పాల్గొన్న మహిళలు ఇంటికి వెళ్లినప్పుడు తల్లిపాల ప్రాముఖ్యత గురించి చుట్టుపక్కల వారికి తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో గైనకాలజీ విభాగం హెచ్ఓడీ డాక్టర్ సంధ్యారాణి, పెడియాట్రిక్ హెచ్ఓడీ డాక్టర్ తిరుపతిరెడ్డి, ఆర్ఎంఓ డాక్టర్ మాధవీలత, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు ● మహిళ మృతి, మరో ఇద్దరికి స్వల్ప గాయాలు చౌటుప్పల్ రూరల్: రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీ ని కారు ఢీకొట్టడంతో మహిళ మృతిచెందింది. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం బొర్రోళ్లగూడెం గ్రామ స్టేజీ వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం చిరుకూరపాడు గ్రామానికి చెందిన మద్దిరాల ప్రవీణ్కుమార్ బెంగళూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ.. నెల రోజుల క్రితం హైదరాబాద్కు బదిలీ అయ్యాడు. హైదరాబాద్లోని ఈసీఐఎల్లో నివాసం ఉండడానికి ఇల్లు చూసుకున్నాడు. తన తల్లి గోవిందమ్మ(62), భార్య సుమతితో కలిసి అద్దె ఇంట్లో దిగేందుకు స్వగ్రామం చిరుకూరుపాడు నుంచి సోమవారం రాత్రి 9గంటలకు కారులో హైదరాబాద్కు బయల్దేరాడు. మార్గమధ్యలో మంగళవారం తెల్లవారుజామున చౌటుప్పల్ దాటిన తర్వాత బొర్రోళ్లగూడెం గ్రామ స్టేజీ వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. కారు ముందు సీట్లలో ఎయిర్ బ్యాగులు ఓపెన్ కావడంతో డ్రైవింగ్ చేస్తున్న ప్రవీణ్, అతడి భార్య సుమతికి స్వల్ప గాయాలయ్యాయి. వెనుక సీట్లులో కూర్చున్న ప్రవీణ్ తల్లి గోవిందమ్మకు ఛాతీ భాగంలో బలంగా తగలడంతో అక్కడికక్కడే మృతిచెందింది. గోవిందమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి మరిది మద్దిరాల నారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. సీఐ మన్మథకుమార్, ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్లియర్ చేశారు. -
పెళ్లి వద్దంటే వినరా.. టెకీ ఆత్మహత్య
జె.పంగులూరు: ప్రకాశం జిల్లా జే పంగులూరు మండలంలోని కొండమంజులూరు గ్రామంలో మంగళవారం సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకుంది. కొండమంజులూరు గ్రామానికి చెందిన బొప్పుడి శివయ్య కుమార్తె బొప్పుడి మానస (26) హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తోంది. ఆమెకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు సంబంధం ఖాయం చేసుకున్నారు. ఇది ఆమెకు ఇష్టం లేదు. దీంతో మంగళవారం చీరతో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసినట్టు తెలిపారు. చేశారు. -
నకిలీ ఉత్తర్వులతో రూ.2 లక్షలకు టోకరా
● ఎస్పీ దామోదర్కు ఫిర్యాదు చేసిన మహిళ ఒంగోలు టౌన్: ఉద్యోగం ఇప్పిస్తానంటూ నకిలీ ఉత్తర్వులు చూపించి ఒంగోలుకు చెందిన ఒక వ్యక్తి తన వద్ద 2 లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేశాడని కందుకూరు టౌన్కు చెందిన ఓ మహిళ సోమవారం ఎస్పీ ఏఆర్ దామోదర్కు ఫిర్యాదు చేశారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో ఆమె ఎస్పీని కలిసి తన సమస్యను విన్నవించుకున్నారు. అదేవిధంగా ఏటీఎం వద్ద మోసానికి గురయ్యానని ఒంగోలు నగరంలోని వెంకటేశ్వరకాలనీకి చెందిన బాధితుడు ఫిర్యాదు చేశారు. వ్యక్తిగత అవసరాల కోసం ఏటీఎంలో 50 వేల రూపాయల డబ్బు బదిలీ చేసేందుకు వెళ్లగా, ఏటీఎం పనిచేయకపోవడంతో ఏం చేయాలో తోచక నిలుచున్నానని, ఆ సమయంలో ఒక వ్యక్తి వచ్చి నెఫ్ట్ ద్వారా డబ్బులు పంపిస్తానని నమ్మబాలికాడని తెలిపారు. అతడి చేతికి 50 వేలు ఇచ్చానని, డబ్బులు అకౌంటులో పడకపోవడంతో మోసం జరిగినట్లు గ్రహించానని వాపోయాడు. తనకు న్యాయం చేయాలని ఎస్పీని వేడుకున్నాడు. బాధితుల ఫిర్యాదులపై స్పందించిన ఎస్పీ.. వెంటనే ఆయా పోలీసు స్టేషన్ అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. చట్టపరంగా విచారణ జరిపి బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ సెల్ సీఐ దుర్గా ప్రసాద్, డీటీసీ ఇన్స్పెక్టర్ షమీముల్లా, ట్రాఫిక్ సీఐ పాండురంగారావు, మీ కోసం ఎస్సై జనార్దన్ పాల్గొన్నారు. -
పొగాకుకు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలి
● జిల్లా వ్యవసాయ శాఖాధికారి శ్రీనివాసరావు మద్దిపాడు: పొగాకుకు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఎస్.శ్రీనివాసరావు రైతులకు సూచించారు. పొగాకుకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై ఆత్మ సౌజన్యంతో మండలంలోని నాగన్నపాలెం గ్రామంలో సోమవారం రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఏవో స్వర్ణలత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖాధికారి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సంవత్సరం బర్లీ పొగాకు వలన రైతులు నష్టపోయారని, రాబోయే సంవత్సరం పొగాకుకు ప్రత్యామ్నాయంగా అపరాలు వేసుకోవాలని ఆయన సూచించారు. డీపీఎం సుభాషిని మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా ఎరువులు, పురుగు మందులు వేయకుండా పంట దిగుబడులు పెంచుకోవాలన్నారు. రైతులంతా ఆరోగ్యవంతమైన పంటలు పండించాలని కోరారు. ఆత్మ డీపీడీ విజయనిర్మల మాట్లాడుతూ మట్టి పరీక్ష కార్డుల ఆధారంగా ఎరువులు వేసుకోవాలని తెలిపారు. రైతులంతా తప్పనిసరిగా పంట నమోదు చేయించుకోవాలన్నారు. మండల వ్యవసాయ అధికారి స్వర్ణలత మాట్లాడుతూ రైతులంతా పంట వేయనటువంటి నేలను కూడా నమోదు చేయించుకోవాలని తెలిపారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ యోజన పథకాల డబ్బులు జమ కాని రైతులు గ్రీవెన్స్ పెట్టుకోవచ్చని తెలిపారు. డీఏవో ఎస్.శ్రీనివాసరావు మినుము వేసే రైతులకు మినుము కిట్లు అందించారు. సర్పంచ్, రైతులకు నవధాన్యాల కిట్లు అందించారు. కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
మార్కాపురం టౌన్: భార్యపై కోపంతో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న వ్యక్తి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు మార్కాపురం రూరల్ ఎస్సై అంకమరావు తెలిపారు. మండలంలోని రాయవరం గ్రామానికి చెందిన చెన్నమ్మతో దొనకొండ మండలంలోని మల్లంపేట గ్రామానికి చెందిన మనుమాల బ్రహ్మయ్య(40)కు వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగ పిల్లలు సంతానం. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నమ్మ తన పిల్లలను తీసుకుని రాయవరంలోని పుట్టింటికి వచ్చింది. ఆదివారం బ్రహ్మయ్య అత్తగారి ఇంటికి వచ్చి భార్యను తనతో ఇంటికి రమ్మని పిలవగా ఆమె నిరాకరించింది. దీంతో మనస్తాపానికి గురై ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన బ్రహ్మయ్యను కుటుంబ సభ్యులు హుటాహుటిన మార్కాపురం జీజీహెచ్కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఒంగోలు జీజీహెచ్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఎస్సై వివరించారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. విద్యుదాఘాతంతో ఒకరు మృతి గిద్దలూరు రూరల్: విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన గిద్దలూరు మండలంలోని దిగువమెట్ట రైల్వే స్టేషన్ వద్ద సోమవారం చోటుచేసుకుంది. అందిన వివరాల ప్రకారం.. దిగువమెట్ట తండాకు చెందిన దేశావత్ పాపానాయక్(55) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రైల్వే స్టేషన్ వద్ద కాంట్రాక్టర్ నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులకు సోమవారం హాజరయ్యాడు. టిప్పర్ లారీలో ఇనుప సామగ్రిని అన్లోడ్ చేసేందుకు డ్రైవర్ ట్రాలీని పైకి లేపిన సమయంలో విద్యుత్ తీగలు తగిలాయి. అది గమనించని పాపానాయక్ టిప్పర్లోని సామగ్రి తీసేందుకు ప్రయత్నించడంతో విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితిలోకి చేరాడు. అక్కడే ఉన్న వ్యక్తులు పాపానాయక్ను కర్రలతో పక్కకు నెట్టి, చికిత్స నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మార్కాపురంలో భారీ చోరీ! మార్కాపురం టౌన్: మార్కాపురం పట్టణంలోని సత్యనారాయణ స్వామి గుడి సమీపంలోని బాబు కూల్ డ్రింక్స్ దుకాణంలో భారీ చోరీ చోటుచేసుకుంది. వివరాలు.. షాపు యజమాని షేక్ బాబు 4 రోజుల క్రితం మరో ప్రాంతంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. సోమవారం రాత్రి బాబు ఇంటి వద్ద రంపం, ఇతర ఇనుప సామగ్రి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ యు.నాగరాజు, ఎస్సై సైదుబాబుతోపాటు క్లూస్ టీం అధికారులు పరిశీలించారు. ప్రస్తుతం ఇంటి యజమాని అందుబాటులో లేరు. సుమారు 10 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురై ఉంటాయని బంధువులు చెబుతున్నారు. పోలీసులు డాగ్ స్క్వాడ్ను రప్పించి తనిఖీలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నిమ్మతోటలను పరిశీలించిన ఉద్యానవన అధికారులు
పాతసింగరాయకొండలోని ఊరచెరువులో అక్రమంగా మట్టి తవ్విన ప్రదేశం నేడు ‘రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం’ ఒంగోలు సిటీ: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఒంగోలులోని రామ్నగర్ 5వ లైన్లో గల ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ కార్యాలయంలో ‘రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సంఘ జిల్లా అధ్యక్షుడు చిన్నపరెడ్డి కిరణ్కుమార్రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన రూ.30 వేల కోట్ల రూపాయల బకాయిలు, 12వ పీఆర్సీ, ఐఆర్, పెండిండ్ డీఏలు, సరెండర్ లీవ్స్ బకాయిలు తదితర ప్రధాన డిమాండ్లపై చర్చించేందుకు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలపై ఒక వీడియో రూపంలో ముందుకు రానున్నట్లు తెలిపారు.హనుమంతునిపాడు: మండలంలోని సీతారాంపురంలో నిమ్మ తోటలను ఉద్యానవనశాఖ అధికారులు సోమవారం పరిశీలించారు. నిమ్మ ధరలు భారీగా పడిపోవడంతో పాటు తోటలకు తెగుళ్ల ఆశించాయని రైతులు ఆందోళన చెందుతుండటంపై సాక్షి దినపత్రికలో ‘పాతాళంలోకి నిమ్మ ధరలు’ శీర్షికతో సోమవారం కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన హార్టీకల్చర్ అధికారులు సీతారాంపురంలోని నిమ్మ తోటలను పరిశీలించి ఎండుపుల్ల, పులుసు పురుగు సమస్య ఎక్కువగా ఉందని గుర్తించారు. తెల్లపులుసు పురుగు, రసం పీల్చే పురుగు, కొమ్మ ఎండుతెగులు ఎక్కువగా ఉందని, వేరుకుళ్లు తెగులు కూడా ఉందని ఉద్యానవన శాఖాధికారిణి విష్ణుప్రియ తెలిపారు. తెగుళ్ల నివారణకు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు, పిచికారీ చేయాల్సిన క్రిమిసంహారక మందులపై రైతులకు సలహాలు, సూచనలు చేశారు. ఎండుపుల్లలు వచ్చిన వెంటనే కత్తిరించాలని తెలిపారు. నిమ్మతోటటకు డ్రిప్ ద్వారా నీటిని అందించాలన్నారు. వేసవిలో నిమ్మ పండ్లు కోతకు వచ్చేలా బహార్ పద్ధతి పాటించడం వలన కాయకు మంచి గిరాకీ వస్తుందన్నారు. రైతు ఆదాయం పొందుతారన్నారు. ఆమె వెంట వీఏఏ భరత్, రైతులు ఉన్నారు. -
నేడు ఈతముక్కల పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు
కొత్తపట్నం: మండలంలోని ఈతముక్కల గ్రామంలో ఉన్న ఎస్యూవీఆర్ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో 2024–25 విద్యా సంవత్సరానికిగానూ డీసీసీపీ కోర్సులో ఖాళీగా ఉన్న సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారా మంగళవారం భర్తీ చేయనున్నట్లు కాలేజీ ప్రిన్సిపాల్ వి.ఏసుప్రసాద్రావు తెలిపారు. ఉదయం 10 గంటలకు అడ్మిషన్లు ప్రారంభమవుతాయని చెప్పారు. పాలీసెట్ – 2025 ఎంట్రెన్స్ రాసి అర్హులై కౌన్సిలింగ్కు హాజరుకాని వారు, ఎంట్రెన్స్లో క్వాలిఫై కానివారు, దరఖాస్తు చేసి పరీక్ష రాయని వారితో పాటు పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులంతా అర్హులన్నారు. ఆసక్తి గల విద్యార్థులు వారి సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. స్పాట్ అడ్మిషన్లు అయిన వెంటనే ఫీజు చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు తన మొబైల్ నంబర్ 9441885492ను సంప్రదించాలని కోరారు. రేపు జూనియర్ టార్గెట్ బాల్ ఎంపిక పోటీలు సింగరాయకొండ: మండలంలోని పాత సింగరాయకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జిల్లా జూనియర్ టార్గెట్ బాల్ క్రీడాకారుల ఎంపిక పోటీలు బుధవారం నిర్వహించనున్నట్లు టార్గెట్ బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి షేక్ మునీర్ తెలిపారు. పోటీలో పాల్గొనేందుకు 2008 జనవరి ఒకటో తేదీకి ముందు జన్మించిన వారు అర్హులని స్పష్టం చేశారు. వివరాలకు 9701523167ను సంప్రదించాలని సోమవారం ఓ ప్రకటనలో సూచించారు. గ్రంథాలయాల్లో పోస్టులు భర్తీ చేయాలి ● డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పిచ్చయ్య మార్కాపురం: గ్రంథాలయాల్లో పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికపై భర్తీ చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కేవీ పిచ్చయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మార్కాపురంలోని సీఐటీయూ కార్యాలయంలో సోమవారం డీవైఎఫ్ఐ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పబ్లిక్ గ్రంథాలయాల్లో 974 పోస్టులు, స్కూల్స్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో 1800 పోస్టులు, జూనియర్ డిగ్రీ కళాశాలల్లో 300 లైబ్రేరియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. వీటిని కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో కాకుండా రెగ్యులర్ పద్ధతిలో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి లైబ్రేరియన్ కోర్సు చేసిన వారికి వయసు పెరిగిపోతోందని, ఈ విషయమై విద్యాశాఖ మంత్రి లోకేష్ను కలిసినా ఫలితం లేదన్నారు. గ్రంథాలయాల్లో పోస్టులు భర్తీ చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అనంతరం గ్రంథాలయ శాఖ ఖాళీ పోస్టుల సాధన కమిటీని ఏర్పాటు చేశారు. అధ్యక్ష్య కార్యదర్శులుగా సీహెచ్ మణికంఠ, ఎం.చెన్నారెడ్డి, ఉపాధ్యక్షులుగా శ్యాంబాబు, బాదరయ్య, శివ, సభ్యులుగా గురవయ్య, తేజ, మల్లికార్జున తదితరులను ఎన్నుకున్నట్లు డివిజన్ అధ్యక్షుడు షేక్ జబ్బార్ తెలిపారు. 11 నుంచి ఉచిత శిక్షణ ఒంగోలు వన్టౌన్: సీసీ కెమెరా, సెక్యూరిటీ అలారం ఇన్స్టాలేషన్, సర్వీసింగ్పై ఈ నెల 11 నుంచి 23వ తేదీ వరకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఒంగోలు రూడ్సెట్ సంస్థ డైరెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గ్రామీణ ప్రాంత యువకులు అర్హులని చెప్పారు. శిక్షణ పొందగోరే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 45 సంవత్సరాల్లోపు ఉండాలన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 8309915577 నంబర్ను సంప్రదించాలని సూచించారు. -
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పండుగలా జరపాలి
ఒంగోలు సబర్బన్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారులకు సూచించారు. సోమవారం అన్ని శాఖల ఉన్నతాధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ఈ నెల 15న 79వ స్వాతంత్య్ర దిన వేడుకలకు అతిథులకు ఆహ్వానం, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు సన్మానం, ప్రభుత్వ పథకాలు తెలియజేసేలా శకటాలు, ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు, ప్రతిభ చూపిన అధికారులు, సిబ్బందికి ప్రశంస పత్రాల ప్రదానం, సాంస్కృతిక కార్యక్రమాలు, వీటిని వీక్షించేందుకు విద్యార్థులను తరలించడంపై వంటివాటిపై సంబంధిత శాఖల అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఉదయం 8:30 గంటలకల్లా విద్యార్థులను పరేడ్ గ్రౌండ్లోకి తీసుకురావాలని ఆదేశించారు. ప్రోటోకాల్ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఆమె స్పష్టం చేశారు. ఈ నెల 10వ తేదీ నాటికి ప్రశంస పత్రాల కోసం ప్రతిపాదనలు పంపించాలని చెప్పారు. పీ – 4 పథకంలో మార్గదర్శకులను చురుకుగా గుర్తించిన వారిని, స్వతహాగా మార్గదర్శకులుగా మారిన అధికారులను ప్రశంస పత్రాలకు ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి బి.చిన ఓబులేసు, అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రత్యేక కార్యక్రమాల ఏర్పాట్లపై దృష్టి సారించాలి జిల్లా అధికారులతో కలెక్టర్ తమీమ్ అన్సారియా వీడియో కాన్ఫరెన్స్ -
ప్రభుత్వ భవనాలు కబ్జా!
కంభం/రాచర్ల: వినియోగంలో లేని ప్రభుత్వ పాఠశాల గదులు, ప్రభుత్వ భవనాలను ప్రైవేట్ వ్యక్తులు సొంతానికి వినియోగించుకుంటున్నారు. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కంభం పంచాయతీ పరిధిలోని సాధుమియా వీధిలో పంచాయతీ నిధులతో సుమారు పదేళ్ల క్రితం పశువైద్యశాల నిర్మించారు. నేటికీ ఆ భవనాన్ని పశువైద్యాధికారులు స్వాధీనం చేసుకుని, సేవలందించేందుకు ముందుకు రాకపోవడంతో అది నిరుపయోగంగా ఉంది. ఈ భవనంలో ఓ టెంట్ హౌస్ నిర్వాహకుడు ఇటీవలే పాగా వేశాడు. కొద్ది రోజుల నుంచి టెంట్ హౌస్ సామగ్రిని భద్రపరుకుంటున్నా పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అలాగే రాచర్ల మండలం సత్యవోలు గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు పాఠశాల భవనంలో మకాం వేశాడు. సొంత ఇల్లు నిర్మించుకుంటున్న ఆయన.. స్కూల్ భవనంలో కాపురం పెట్టినా అధికారులు చోద్యం చూస్తున్నారు. సొంతానికి వాడుకుంటున్న ప్రైవేట్ వ్యక్తులు పట్టించుకోని అధికారులు -
దర్శి యువకుడు బెంగళూరులో మృతి
దర్శి: దర్శికి చెందిన మార్తుల ఖగోల్రెడ్డి (31) బెంగళూరులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విశ్రాంత ఎస్సై మార్తుల వెంకటేశ్వరరెడ్డి కుమారుడైన ఖగోల్రెడ్డి గత నాలుగేళ్లుగా లండన్లో ఉండి మాస్టర్ ఎంబీఏ పూర్తి చేశారు. గత మార్చిలో ఇండియా వచ్చి బెంగళూరులోని డేటా సెంటర్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆది వారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా స్నేహితుడితో కలిసి బెంగళూరు వస్కోట్లో ఉదయం 4 గంటల సమయంలో 4 ఏఎం బిర్యానీ పాయింట్కి మోటార్ సైకిల్పై వెళ్లారు. ఆ హోటల్ తీయకపోవడంతో తిరిగి వస్తుండగా, లలియ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైవే ఫ్లైఓవర్పై స్నేహితుడి హెల్మెట్ కిందపడింది. మోటార్ సైకిల్ వెనుకవైపు కూర్చుని ఉన్న ఖగోల్రెడ్డి కిందకు దిగి హెల్మెట్ తీసుకొస్తున్న సమయంలో హైవేపై వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో హైవేపైనుంచి కింద ఉన్న సర్వీస్ రోడ్డుపై పడి తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే ఖగోల్రెడ్డి మృతిచెందాడు. సోమవారం బెంగళూరులోని ఆస్పత్రిలో పోస్ట్మార్టం నిర్వహించారు. మంగళవారం దర్శిలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. విశ్రాంత ఎస్సై వెంకటేశ్వరరెడ్డికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉండగా కుమార్తెలకు వివాహం జరిగింది. ఏకై క కుమారునికి పెళ్లి చేయాలని కలలు కంటున్న సమయంలో మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పుచ్చలమిట్టలోని వారి నివాసం వద్ద విషదం అలముకుంది. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం నాలుగేళ్లుగా లండన్లో ఉండి ఇటీవలే బెంగళూరు వచ్చి సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఉద్యోగం -
వైద్యశాలలో రాజకీయాలొద్దు
● హాస్పిటల్ అభివృద్ధికి కలిసికట్టుగా పాటుపడదాం ● అంబులెన్స్ను ప్రారంభించిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ యర్రగొండపాలెం: ప్రభుత్వ వైద్యశాలలో రాజకీయాలకు తావివ్వవద్దని, హాస్పిటల్ అభివృద్ధికి తామందరం కలిసికట్టుగా పాటుపడదామని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. స్థానిక ఏరియా వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడారు. వివిధ రోగాలతో వైద్యశాలకు వచ్చిన పేదలను రక్త పరీక్షల కోసం బయటికి పంపుతున్నారని, ఇంజక్షన్లు, మందులు రాసిచ్చి మెడికల్ షాపుల వద్దకు పంపడం సరైంది కాదని, దీనివలన రోగులు ఆర్థికంగా నష్టపోతున్నారని అన్నారు. ఆర్థోపెడిక్ డాక్టర్ అందుబాటులో ఉండకపోవడం, వైద్యశాలలో బ్లడ్ బ్యాంక్ లేకపోవడంతో రోడ్డు ప్రమాద బాధితులు అనేక మంది మృతి చెందారని, అటువంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటానన్నారు. బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని డీఆర్సీ, జెడ్పీ సమావేశాలలో అనేక పర్యాయాలు అడిగినా ఫలితం లేకుండా పోయిందని ఆయన అన్నారు. వైద్యశాలలో ఏర్పాటు చేస్తున్న భోజన కాంట్రాక్టర్ స్థానికంగా ఉండేలా చూడాలని, రోగులకు రెండు పూటలా మంచి భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్యశాలలో పూర్తి స్థాయిలో వైద్యులున్నా తగిన సదుపాయాలు, ల్యాబ్లు లేకపోవడంతో రోగులు ఈ హాస్పిటల్ను గుర్తించడం లేదని, ప్రైవేటు వైద్యశాలలకు వెళ్లి రోగులు ప్రాణాలు పోగొట్టుకోవడంతోపాటు ఆర్థికంగా నష్టపోతున్నారని అన్నారు. అభివృద్ధి కమిటీ సభ్యులుగా మందుల ఆదిశేషు, పాత్లావత్ బాలు నాయక్లను ఎమ్మెల్యే ప్రకటించారు. సభ్యులుగా నియమితులైన వారు బాధ్యతాయుతంగా వ్యవహరించి వైద్యశాలలో ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలని అన్నారు. ఆర్థోపెడిక్ విభాగంలో సి–యాం మిషన్, ఆపరేషన్ థియేటర్కు అవసరమైన పరికరాలు ఏర్పాటు చేయడంతోపాటు మరో 10 తీర్మానాలు చేసి కమిటీ ఆమోదం తెలిపింది. అనంతరం వైద్యశాలకు మంజూరైన అంబులెన్స్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. పూర్తి సదుపాయాలు కలిగిన మరొక అంబులెన్స్ ఏర్పాటు చేస్తున్నారని, వైద్యశాల మార్చురీలో ఫ్రీజర్ బాక్స్, మృతులను తమ నివాసాలకు చేర్చేందుకు వాహనాన్ని తన సొంత నిధులతో ఏర్పాటు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. సమావేశంలో వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ యదిద్యా, డాక్టర్ ముబినా, డాక్టర్ రాంజీ నాయక్, ఎంపీపీ దొంతా కిరణ్గౌడ్, జెడ్పీటీసీ చేదూరి విజయభాస్కర్, సర్పంచ్ ఆర్.అరుణాబాయి, పార్టీ జిల్లా కార్యదర్శి కె.ఓబులరెడ్డి, మండల అధ్యక్షుడు ఏకుల ముసలారెడ్డి పాల్గొన్నారు. -
రైతులు కష్టాలపాలు
ఒంగోలు సబర్బన్: టీడీపీ కూటమి ప్రభుత్వం రైతులను మరిన్ని కష్టాలపాలు చేస్తోందని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని విమర్శించారు. వైఎస్సార్ సీపీ ఒంగోలు, కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జ్లు చుండూరు రవిబాబు, దద్దాల నారాయణలతో పాటు మరికొంత మంది నాయకులతో కలిసి సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్ సెల్కు వచ్చారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణను కలిసి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బ్రహ్మానంద రెడ్డి రైతులకు పెట్టుబడి సహాయం కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని, జూన్, 2024 నుంచే దీన్ని అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చి మాట తప్పిందని మండిపడ్డారు. ఈ రెండు సంవత్సరాలకు గాను ప్రతి రైతుకు రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.5 వేలు మాత్రమే ఇచ్చారన్నారు. అంతేకాక 7 లక్షల మందికి ఈ పథకంలో కోత విధించారన్నారు. దీనివల్ల వ్యవసాయ పెట్టుబడుల కోసం రైతులు అధిక వడ్డీలతో ప్రైవేటు అప్పుల మీద ఆధారపడే పరిస్థితిని సృష్టించారన్నారు. ఏరైతుకూ గిట్టుబాటు ధర దొరకడంలేదన్నారు. రైతు తాను పండించిన పంటలను రోడ్డుమీద వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉచిత పంటల బీమా రద్దు చేశారని, గత ఏడాది ఇన్సూరెన్సు చెల్లించకపోవడంతో రైతులకు బీమా డబ్బులు రాని పరిస్థితి ఏర్పడిందని, రైతులకు సున్నావడ్డీ పథకాన్ని కూడా ఎత్తివేశారని మండిపడ్డారు. రైతుకు విత్తనం నుంచి పంట అమ్మకం వరకూ అండగా ఉన్న ఆర్బీకేల వ్యవస్థను పూర్తిగా నీరుగార్చారన్నారు. రైతులకు ఎరువులను పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. యూరియా దొరక్కపోవడంతో ఎక్కడకు వెళ్లాలో రైతులకు అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. యూరియా కేటాయింపులకు, సరఫరాకు మధ్య చాలా వ్యత్యాసం ఉందన్నారు. పొటాష్ కలిసిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు అమాంతం పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా బస్తాపై బ్లాక్ మార్కెట్లో రూ.60 నుంచి రూ.100 వరకు అదనంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ చుండూరు రవి బాబు మాట్లాడుతూ రైతాంగం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి, అధిక రేట్లు పెట్టి ప్రైవేటు వ్యాపారుల వద్ద ఎరువులు కొంటున్నారని అన్నారు. రైతులు ఓవైపు కష్టాలు పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం కనీసం సమీక్షలు చేసే పరిస్థితి కూడా కనిపించడంలేదని మండిపడ్డారు. రైతులకు వెంటనే ఎరువులు అందుబాటులో ఉంచాలని, ఎరువుల బ్లాక్ మార్కెట్ను నియంత్రించాలని, బ్లాక్ మార్కెట్కు తరలించే వారి లైసెన్సులు రద్దు చేయాలని వారిపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేయాలని డిమాండ్ చేశారు. పొగాకు వేలం కేంద్రాల నుంచి ఒక్కో రైతు 40 నుంచి 50 శాతం బేళ్లు వెనక్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. పొగాకు కిలో రూ.200 తగ్గకుండా మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కనిగిరి వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ దద్దాల నారాయణ, పార్టీ జోనల్ రైతు విభాగం అధ్యక్షుడు ఆళ్ల రవీంద్రనాథ్ రెడ్డి, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు మారెళ్ల బంగారు బాబు, మాజీ ఎమ్మెల్యే కుసుకుర్తి ఆదెన్న, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, జిల్లా అధికార ప్రతినిధి నరాల రమణా రెడ్డి, పార్టీ నాయకులు కాట్రగడ్డ మహేష్ బాబు, పోలవరం శ్రీమన్నారాయణ, మన్నే శ్రీనివాస రావులతో పాటు పలువురు పాల్గొన్నారు. రైతులను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం యూరియా సహా ఎరువుల కొరత తీర్చాలి ఎరువుల పంపిణీ, గిట్టుబాటు ధరల్లో ప్రభుత్వం విఫలం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి వైఎస్సార్సీపీ ఒంగోలు పార్లమెంటుపరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి జేసీ గోపాల కృష్ణను కలిసి వినతిపత్రం అందజేత -
అక్రమంగా భూములు ఆన్లైన్ చేసుకున్నారు
ఒంగోలు సబర్బన్: పెద్దారవీడు మండలం తోకపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రైతుల భూములను మాజీ సర్పంచ్ భర్త మేకల శంకరరావు అక్రమంగా ఆన్లైన్ చేయించుకున్నాడని తోకపల్లి గ్రామానికి చెందిన కొందరు రైతులు మీ కోసం కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన మీ కోసం కార్యక్రమాన్ని జేసీ రోణంకి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి వచ్చిన తోకపల్లి గ్రామస్తులు జేసీని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. గ్రామంలోని అనేక సర్వే నంబర్లలోని భూములను మేకల శంకరరావు అధికారులను లోబరుచుకొని అక్రమంగా ఆన్లైన్లో ఎక్కించుకున్నాడన్నారు. శంకరరావు పేరుమీద 50కి పైగా భూముల ఆన్లైన్ ఖాతా నంబర్లు ఉన్నాయని జేసీకి వివరించారు. అతని వద్ద నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు, నకిలీ రిజిస్టర్ డాక్యుమెంట్లు సృష్టించి గ్రామంలోని ఇతరుల భూములను ఆన్లైన్ చేయించుకున్నాడని వివరించారు. అతని ఇంట్లో రెవెన్యూ అధికారులు, రిజిస్ట్రేషన్ అధికారులు, సర్వే అధికారుల స్టాంపులు, లెటర్ ప్యాడ్లు అనేకం ఉన్నాయన్నారు. అదేమని అడిగితే చంపుతానంటూ బెదిరిస్తున్నాడని వాపోయారు. గ్రామానికి చెందిన బిట్రా తిరుమలమ్మ (85)కు చెందిన 4 ఎకరాల భూమిని కూడా అక్రమంగా ఆన్లైన్ చేయించుకున్నాడని, ఆమె ఆరు నెలలుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ప్రయోజనం లేదని జేసీ దృష్టికి తెచ్చారు. వంద ఎకరాల పశువుల బీడు కబ్జా.. కనిగిరి మండలం వంగపాడు గ్రామంలోని వంద ఎకరాల పశువుల బీడు కబ్జాకు గురైందని గ్రామానికి చెందిన కాకర్ల శ్రీనివాసులు జేసీకి ఫిర్యాదు చేశాడు. గ్రామానికి చెందిన కాకర్ల సత్యం, కాకర్ల కొండయ్య, కాకర్ల సూర్యంతో పాటు మరికొంతమంది కలిసి పశువుల బీడు భూమిని అన్యాక్రాంతం చేశారన్నారు. దాదాపు 15 సర్వే నంబర్లలోని ఈ భూమి కొంతమంది చేతుల్లోకి వెళ్లటంతో గ్రామంలోని మిగతా రైతులు, పశు పోషకులకు చెందిన పశువులను పొలాల్లోకి వాళ్లు రానీయటం లేదన్నారు. రెవెన్యూ అధికారులు కూడా వాళ్లతో కలిసిపోయారని వివరించారు. కనీసం ఆర్టీఐ కింద సమాచారం అడిగినా రెవెన్యూ అధికారులు ఇవ్వటం లేదన్నారు. 1996 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలి.. 1996 డీఎస్సీలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు న్యాయం చేయాలని అప్పటి డీఎస్సీ అభ్యర్థులు పలువురు మీకోసం కార్యక్రమంలో సింగరాయకొండకు చెందిన రావూరి మురళీ కృష్ణ ఆధ్వర్యంలో అర్జీ సమర్పించారు. 1996 డీఎస్సీలో క్వాలిఫై అయ్యానని, మూడు విడతలుగా ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారన్నారు. ఎంపికై నా సెలక్షన్ జాబితాలో తన పేరు లేదన్నారు. కొందరు కోర్టుకు వెళ్లారని, తాను ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉండి కోర్టుకు వెళ్లలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. 1998 అభ్యర్ధులకు మాత్రం ఎంటీఎస్ పద్ధతిలో ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. ఎంటీఎస్ మాదిరిగా 1996 అభ్యర్థులకు కూడా ఉద్యోగాలు ఇచ్చేలా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని వేడుకున్నారు. తోకపల్లి మాజీ సర్పంచ్ గ్రామంలోని పొలాలు అక్రమంగా ఆన్లైన్ చేయించుకున్నాడు కనిగిరి మండలం వంగపాడులో పశువుల బీడు 100 ఎకరాలు కబ్జా మీ కోసంలో జేసీ గోపాలకృష్ణకు ఫిర్యాదు -
కొండపి పంచాయతీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ
● వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కొండపి: కొండపి పంచాయతీ ఎన్నికల్లో పార్టి అధిష్టానం ఆదేశాల ప్రకారం సర్పంచ్తో పాటు, అన్ని వార్డుల్లో పార్టీ సానుభూతిపరులు పోటీ చేస్తారని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీమంత్రి, పీఏసీ సభ్యుడు డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన నాయకులు, కార్యకర్తలతో ఎన్నికలపై ఆయన సమీక్షించారు. డాక్టర్ సురేష్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో పోటీ విషయమై కూటమి ప్రభుత్వ నాయకులు రాజీకి వచ్చారని 14 వార్డుల్లో 9 టీడీపీకి, 5 వైఎస్సార్సీపీ కి కేటాయిస్తామని, సర్పంచ్ అభ్యర్థి టీడీపీకి కేటాయించాలని ప్రతిపాదించారని, కానీ ఈ ఒప్పందానికి తాను ఒప్పుకోలేదని విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లానన్నారు. అధిష్టానం సూచనలతో సర్పంచ్తో పాటు అన్ని వార్డులకు అభ్యర్థులు బరిలో ఉంటారని ఆయన వివరించారు. పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.పది రోజులుగా పోస్టింగ్ కోసం ఎదురుచూపులు బేస్తవారిపేట: స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఎన్ఆర్ఈజీఎస్లో జేఈ పోస్టింగ్ కోసం పది రోజులుగా ఓ మహిళా అధికారి ఎదురుచూపులు చూస్తోంది. తర్లుపాడు మండలంలో ఎన్ఆర్ఈజీఎస్లో జేఈగా పనిచేస్తున్న సుభద్రాదేవి బేస్తవారిపేట మండల జేఈగా చేరేందుకు ఎమ్మెల్యే లెటర్ తీసుకున్నారు. ఈ మేరకు గతనెల 25వ తేదీ డ్వామా పీడీ బేస్తవారిపేట మండల ఎన్ఆర్ఈజీఎస్ జేఈగా అపాయిన్మెంట్ లెటర్ ఇచ్చారు. అదేరోజు ఎంపీడీఓ కార్యాలయంలో జాయినింగ్ లెటర్ అందజేశారు. రాచర్ల మండలం జేఈగా పనిచేస్తున్న నాగేశ్వరరావు బేస్తవారిపేటలో ఇన్చార్జ్గా పనిచేస్తున్నాడు. ఇతను రిలీవ్ కాకపోవడంతో సుభద్రాదేవి పది రోజుల నుంచి కార్యాలయానికి రావడం, కనీసం సంతకాలు కూడా చేయకుండా వెనుతిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యే లెటర్ ఇచ్చినా నాగేశ్వరరావును బేస్తవారిపేటలో ఉంచాలని, సుభద్రాదేవిని చేర్చుకోవద్దని టీడీపీ నాయకులు ఒత్తిడి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 12న జాతీయ నులిపురుగుల దినోత్సవం ఒంగోలు సబర్బన్: నులిపురుగులు పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు హాని కలిగిస్తాయని జేసీ ఆర్.గోపాల కృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లోని మీ కోసం కాన్ఫరెన్స్ హాలులో సోమవారం జాతీయ నులిపురుగుల దినోత్సవంపై కన్వెర్జెన్సీ మీటింగ్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఈనెల 12న నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల దినోత్సవంపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. జాతీయ నులిపురుగులు దినోత్సవ పోస్టర్ను జేసీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ 1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలందరికీ జాతీయ నులిపురుగుల దినోత్సవంలో భాగంగా ఆల్బెండజోల్ మాత్రలు మింగించాలని తెలిపారు. జిల్లాలో 1–19 ఏళ్లలోపు పిల్లలు 5,96,751 మంది ఉన్నారని వారికి 6,08,000 ఆల్బెండజోల్ మాత్రలు అవసరం అవుతాయన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పిల్లలు నులిపురుగుల నివారణకు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఆర్.బి.ఎస్.కె ప్రోగ్రాం అధికారి డాక్టర్ భగీరథి మాట్లాడుతూ ఆల్బెండజోల్ మాత్రలు అన్ని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలలకు, ఇతర విద్యా సంస్థలకు పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్ నాయక్, డాక్టర్ సూరిబాబు, డాక్టర్ కమలశ్రీ,, ఐసీడీఎస్ పీడీ, ఆర్బీఎస్కే సిబ్బంది పాల్గొన్నారు. -
శిక్షణ భారం!
ఒత్తిడి పాఠం..ఒంగోలు సిటీ: పాఠశాలలు ప్రారంభమై రెండో నెలలు పూర్తైనా కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఉపాధ్యాయులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నాయి. తరగతుల్లో బోధనకు బదులుగా వారికి విభిన్నమైన బోధనేతర పనులు అప్పగిస్తుండడంతో విద్యార్థుల భవిష్యత్పై ప్రతికూల ప్రభావం పడుతోంది. పాఠశాలలు జూన్ 12న ప్రారంభమైనప్పటికీ, ఉపాధ్యాయులు అప్పటి నుంచే బదిలీల కౌన్సెలింగ్లు, శిక్షణ కార్యక్రమాలు, వివిధ యాజమాన్య సమావేశాలతో తలమునకలయ్యారు. బోధనేతర పనులతో టీచర్లు బిజీగా ఉండడంతో మా పిల్లల చదువు దెబ్బతింటోందని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూళ్లు తెరుచుకున్నా కొనసాగిన బదిలీల కౌన్సెలింగ్.. ● జూన్ 12న పాఠశాలలు ప్రారంభమయ్యాయి. కూటమి ప్రభుత్వ నిర్వాకం, విద్యాశాఖ ముందుచూపు లేకపోవడంతో స్కూళ్ల తలుపులు తెరుచుకున్నా టీచర్ల బదిలీల కౌన్సెలింగ్ జరుగుతూ వచ్చింది. కౌన్సెలింగ్ నిబంధనల ప్రకారం జగరడంలేదని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేసిన సంగతి విదితమే. బదిలీల తంతు ముగిసింది. బదిలీ అయిన వారు విధుల్లో చేరారు. అప్పటికే వారం పాటు విద్యార్థులకు పాఠాలు దూరమయ్యాయి. ప్రభుత్వ ప్రచార యావ.. గురువులకు, విద్యార్థులకు శాపం.. జూన్ 21న కూటమి ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమం ఉపాధ్యాయులకు, విద్యార్థులకు శాపంగా మారింది. గిన్నిస్ రికార్డు కోసం కూటమి ప్రభుత్వం నానా హంగామా చేయడంతో ఉపాధ్యాయులు పడరాని పాట్లుపడ్డారు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలంటూ జిల్లా ఉన్నతాధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చింది. ఫలితంగా విద్యార్థుల చదువులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. జూలై 10వ తేదీ ఆర్భాటంగా నిర్వహించిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశాల(మెగా పీటీఎం)కు పదిహేను రోజుల ముందు నుంచే టీచర్లు తగరతి గదులకు దూరమయ్యారు. ఫ్యాప్టో నేతల ధర్నా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఉపాధ్యాయులకు బోధనేతర పనులు, శిక్షణలతో మానసిక ఒత్తిడిలకు గురవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బలవంతపు పీ 4 కార్యక్రమంతో ఉపాధ్యాయులను నిర్బంధానికి గురి చేయరాదన్నారు. బదిలీల ప్రమోషన్లు తీసుకున్నా పొజిషన్ ఐడీలు రాని ఉపాధ్యాయుల జీతాలు చెల్లించాలని, మున్సిపల్ ఉపాధ్యాయుల జీపీఎఫ్ సమస్య పరిష్కరించాలని, అంతర జిల్లాల బదిలీలు చేపట్టాలని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో నెంబరు 57 ను అమలు చేయాలని, 2003 డీఎస్సీ వారికి పాత పెన్షన్ పునరుద్ధరించాలని, ఈ విషయంపై ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. -
మెడికలేనా..
నిలిచిపోయిన మెడికల్ కళాశాలమార్కాపురం: కూటమి ప్రభుత్వం నూతన మెడికల్ కాలేజీలపై కక్ష కట్టింది. మొదట్లో పీపీపీ విధానంలో నిర్మిస్తామంటూ చెప్పి నిర్మాణాలు మాత్రం నిలిపేసింది. దీంతో మార్కాపురంలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. కాలేజీ నిర్మాణ పనులు యధావిధిగా జరిగి ఉంటే ఈ ఏడాదైనా ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం ప్రవేశాలు ప్రారంభమై ఉండేవి. కానీ అలా జరగలేదు. దీంతో ఈ ఏడాది మెడికల్ కౌన్సెలింగ్లో మార్కాపురం మెడికల్ కాలేజీని చేర్చలేదు. నిర్మాణం పూర్తయి ఉంటే నీట్ రాసిన విద్యార్థులు మార్కాపురం మెడికల్ కాలేజీలో ఆప్షన్ ఎంచుకునేవారు ఎంబీబీఎస్లో చేరేందుకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల నమోదు ఇప్పటికే ప్రారంభమైంది. అందులో మార్కాపురం మెడికల్ కాలేజీ లేకపోవడంతో తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది పశ్చిమ ప్రకాశం నుంచి నీట్ పరీక్షను సుమారు 5 వేల మంది రాశారు. పలువురు అర్హత సాధించారు. అయితే వారందరూ మార్కాపురం మెడికల్ కళాశాల పూర్తికాకపోవడంతో రాష్ట్రంలోని వివిధ మెడికల్ కళాశాలలను ఆప్షన్లుగా ఎంచుకున్నారు. గత ప్రభుత్వంలో 75 శాతం పూర్తయిన పనులు: పశ్చిమ ప్రకాశంలోని సుమారు 8 లక్షల మంది ప్రజలకు అత్యాధునిక వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్కాపురానికి సుమారు రూ.475 కోట్లతో మెడికల్ కళాశాలను మంజూరు చేశారు. 150 ఎంబీబీఎస్ సీట్లను దృష్టిలో ఉంచుకొని జీజీహెచ్ వైద్యశాల అభివృద్ధి పనులను, మెడికల్ కళాశాల నిర్మాణ పనులు చేపట్టారు. మార్కాపురం మండలం రాయవరం వద్ద 41.97 ఎకరాల విస్తీర్ణంలో మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు గత ఏడాది సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ రిజల్ట్ వచ్చే వరకూ జరిగాయి. పనులు కూడా గత రెండేళ్లలో వేగంగా జరగడంతో దాదాపు 75 శాతం పూర్తయ్యాయి. సిబ్బంది క్వార్టర్లు, నర్సింగ్ కళాశాల, జంట్స్, లేడీస్ హాస్టల్స్, క్లాసు రూములు, సెంట్రల్ క్యాంటిన్ పూర్తయ్యాయి. ప్రస్తుతం కళాశాలలో విద్యుత్ వైరింగ్, ప్లంబింగ్ పనులు, రంగులతోపాటు కొన్ని భవనాల నిర్మాణాలు పూర్తిచేయాల్సి ఉంది. జిల్లా వైద్యశాలను జీజీహెచ్గా మార్చడంతోపాటు 450 బెడ్లు ఏర్పాటుచేసి, 82 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంటు ప్రొఫెసర్లు, డాక్టర్లు అందుబాటులో ఉంచారు. దీంతో రోజుకు సుమారు 750 నుంచి 800 మంది పేషంట్లు వైద్యసేవలు పొందేవారు. 3 ఆక్సిజన్ ప్లాంట్లు, ఐసీయూ యూనిట్, వెంటిలేటర్ సౌకర్యాలను కూడా కల్పించారు. గత ఏడాది జూన్ 24న నేషనల్ మెడికల్ కౌన్సిల్ఆఫ్ ఇండియా బృందం మెడికల్ కాలేజీని, జీజీహెచ్ను సందర్శించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. అయితే ఆ నివేదిక ఏమైందో తెలీదు కానీ కూటమి ప్రభుత్వం మాత్రం అసంపూర్తి భవనాలంటూ నిలిపేయడంతో పాటు జీజీహెచ్లో ఉన్న సుమారు 40 మంది మెడికల్ కళాశాలకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్లను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు బదిలీ చేసింది. అయితే ఏడాది నుంచి ఈ పనులు కూడా జరగలేదు. కళాశాల నిర్మాణం పూర్తయి ఉంటే జీజీహెచ్లో ఏర్పాటు చేసిన 450 బెడ్లు ఉపయోగపడి ఉండేవి. వైద్య విద్యార్థుల ప్రాక్టికల్స్ కోసం అనేక ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా జనరల్ మెడిసిన్ కోసం 100, ఆప్తమాలజీ 20, డెర్మటాలజీ 10, సైకియాట్రీ విభాగం 10, జనరల్ సర్జరీల కోసం 100, ఆర్థోపెడిక్ విభాగానికి 40, ఈఎన్టీకి 20, ఐసీయూ బెడ్లు 20, పీడియాట్రిక్స్ 50, ఓబీజీ (ప్రసూతి గైనకాలజీకి) 50 బెడ్లను కేటాయించారు. వీటిలో ప్రస్తుతం కొన్ని బెడ్లు మాత్రమే రోగుల కోసం ఉపయోగిస్తున్నారు. ఏడాదిగా నిలిచిన మార్కాపురం మెడికల్ కళాశాల నిర్మాణం ఎంబీబీఎస్ కౌన్సెలింగ్లో మార్కాపురం కాలేజీని చేర్చని ప్రభుత్వం ఈ ఏడాది కూడా అడ్మిషన్లు లేనట్టే మండిపడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులుమెడికల్ కాలేజీ త్వరగా పూర్తిచేయాలి మార్కాపురం మండలం రాయవరం దగ్గర నిర్మిస్తున్న మెడికల్ కాలేజీని ప్రభుత్వం త్వరగా పూర్తిచేయాలి. దీని వలన 100 మెడికల్ సీట్లు మంజూరైతే ఈ ప్రాంత విద్యార్థులకు ఎంబీబీఎస్ విద్య అందుబాటులోకి వస్తుంది. దీనితోపాటు జీజీహెచ్లో కూడా రోగులకు మెరుగైన సేవలు లభిస్తాయి. ప్రభుత్వమే మెడికల్ కాలేజీని నిర్వహించాలి. పీపీపీ విధానం వద్దు. – డీఎంకే రఫీ, సీపీఎం నాయకులు -
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి
యర్రగొండపాలెం: అగ్రిగోల్డ్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక శివాలయం కమ్యూనిటీ హాలులో ఆదివారం మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాలకు చెందిన అగ్రిగోల్డ్ బాధితుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు నియోజకవర్గాల్లో కంపెనీకి చెందిన వేలాది ఎకరాల భూములు అగ్రిగోల్డ్ యాజమాన్యం డైరెక్టర్ల పేరుతో ఉన్నాయని, అవ్వా కుటుంబ సభ్యుల పేర్లతో ఎక్కువగా భూములు ఉన్నాయని, అవ్వా వెంకటరామారావు చైర్మన్గా, తన సోదరులు 8 రాష్ట్రాల్లో 32 లక్షల మందిని నిలువునా ముంచేశారని అన్నారు. కోర్టు పేరుతో తప్పుడు పద్దతుల్ని అవలంబిస్తూ ప్రభుత్వాన్ని, బాధితులను మోసంచేసి ఆస్తులను కొల్లగొట్టటానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. యాజమాన్యం ఆస్తులను కొల్లగొట్టినా, సీఎం చంద్రబాబు సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని చెప్పినా అగ్రిగోల్డ్ బాధితులకు మాత్రం న్యాయం జరగదని అన్నారు. బాధితుల పక్షాన నిలబడి ప్రభుత్వంపై సానుకూల ఒత్తిడి తెచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు ఒక గంట అగ్రిగోల్డ్ బాధితుల సమస్యపై దృష్టి పెడితే ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. సమావేశంలో అగ్రిగోల్డ్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కేవీవీ.ప్రసాద్, అగ్రిగోల్డ్ బాధిత సంఘ నాయకులు జీఎల్ సుబ్బారావు, పి.రామయ్య, జి.వెంకటసుబ్బయ్య, పిచ్చయ్య పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు -
అబద్ధపు హామీలతో బాబు వంచన
సభలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సభాప్రాంగణానికి ర్యాలీగా వస్తున్న వైఎస్సార్ సీపీ శ్రేణులుపెద్దదోర్నాల: ఎన్నికల్లో అలివికాని హామీలిచ్చిన చంద్రబాబు రాష్ట్ర ప్రజలను నిలువునా ముంచారని ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. శ్రీశైలం రహదారిలోని మల్లికార్జున ఎస్టేట్స్లో ఆదివారం నిర్వహించిన బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ సభలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. మండల పార్టీ కన్వీనర్ గంటా రమణారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో గెలవక ముందు ఒక్కొక్క ఇంటికి రూ.6 లక్షలు ఇస్తామంటూ చంద్రబాబు అబద్ధపు హామీలు ఇచ్చారన్నారు. ఆరు హామీలతో పాటు మరో 143 అదనపు హామీలు జూలై 24 నుంచి అమలవుతాయని మోసం చేశారన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం అంటూ కులాలు, సినిమాలను అడ్డు పెట్టుకున్నారని, అడ్డగోలు హామీలతో, ఒక జెండా, అజెండా లేని పవన్ కళ్యాణ్తో పొత్తులు పెట్టుకొని ప్రజలను మోసం చేశారని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు, ప్రతి ఒక్క మహిళకు రూ.18 వేల ఆర్థిక సహాయం, తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్క బిడ్డకు రూ.15 వేలు, ఉచిత ఇసుక, రైతు భరోసాను పేరు మార్చి అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా రైతులకు డబ్బులు ఈ విధంగా ఎన్నో పథకాలు అందిస్తామంటూ బాండ్లు కూడా ఇచ్చి ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఈ అబద్ధపు హామీలను ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలన్నారు. వెలిగొండ ప్రాజెక్టుపై కూటమి నిర్లక్ష్యం: తీవ్ర కరువు కాటకాలతో అలమటిస్తున్న పశ్చిమ ప్రాంతానికి సంజీవని అయిన వెలిగొండ ప్రాజెక్టును దివగంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి తీసుకొచ్చారని, ఆయన తనయుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆ ప్రాజెక్ట్కు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి జాతికి అంకితం చేశారని అన్నారు. కేవలం రూ.2 వేల కోట్లు కేటాయించి ముంపు గ్రామాల ప్రజలను అక్కడ నుంచి తరలిస్తే శ్రీశైలం డ్యాం నుంచి పుష్కలంగా వచ్చే నీటి వరద ఈ ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగపడేదని అన్నారు. సముద్రంలో వృథాగా కలిసే 30 టీఎంసీల నీటితో నల్లమల సాగర్ నీటితో కళకళలాడేదని ఆయన పేర్కొన్నారు. కేవలం మీ చాతగాని, దద్దమ్మ కూటమి పాలన వల్ల నిధులు కేటాయించలేకపోయారని విమర్శించారు. ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేలు, మంత్రులు వచ్చి సభలు పెట్టడం చంద్రశేఖర్ మీద సవాళ్లు విసరటం కాదని, దమ్ముంటే మీ పరిపాలనపై ఇప్పుడే డిబేట్ చేద్దామని ఆయన సవాల్ విసిరారు. జిల్లా ఇన్చార్జి మంత్రికి ఇక్కడి కష్ట సుఖాలు ఏం తెలుసో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. వైఎస్.రాజశేఖర్రెడ్డి మంత్రి వర్గంలో పని చేసిన జిల్లా ఇన్చార్జి మంత్రికి ఇక్కడి సమస్యలపై 12 లెటర్లు ఇచ్చానని, ఆయన ఎంత మాత్రం స్పందించి ఇక్కడ పనులు చేశారో చెప్పాలన్నారు. ఆర్టీసీ బస్టాండ్ మీ అబ్బ సొత్తా.. తెలుగుదేశం పార్టీ సమావేశాన్ని ఆర్టీసీ బస్టాండ్లో పెట్టుకోవటానికి అదేమన్నా మీ అబ్బ సొత్తా అంటూ ఎమ్మెల్యే తాటిపర్తి ఆ పార్టీ నాయకులను ప్రశ్నించారు. ఇన్చార్జి అని పేరు పెట్టుకున్న ఓ నేత నియోజకవర్గాన్ని లూటీ చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ప్రజలు తిరగబడటం మొదలు పెడితే వీళ్లందరి పంచెలు ఊడి పోతాయని హెచ్చరించారు. ప్రజలకు మీరు సేవ చేస్తారన్న ఆశతో మంచి అవకాశం ఇచ్చారని, కానీ రాబందులుగా మారి ప్రజలను దోచుకుంటున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. యర్రగొండపాలెం నియోజకవర్గంలో 20 ఏళ్ల క్రితం వేసిన పైపులైనును జేసీబీలతో తవ్వుకుని రూ.25 కోట్లు దోచుకునేందుకు ప్లాన్ వేశారని, తాను కలెక్టర్కు ఫిర్యాదు చేస్తే ఒక కిలో మీటర్ తవ్వేందుకు అనుమతి ఇచ్చామని అధికారుల చెప్పారన్నారు. ఒక నియోజక వర్గంలో ఏర్పాటు చేసిన పైప్లైన్ను మరో నియోజకవర్గంలో వేసేందుకు అనుమతులు ఉంటాయా అని అయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో భారీ ర్యాలీని నిర్వహించిన ఎమ్మెల్యే తొలుత నటరాజ్ సెంటర్లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మోటారు బైక్ ర్యాలీతో సభాప్రాంగణానికి చేరుకున్నారు. కార్యక్రమంలో మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ మజీద్, ఐటీ విభాగం జిల్లా అధ్యక్షులు దొందేటి నాగేశ్వరరెడ్డి, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి గుమ్మా పద్మజా యల్లేష్, ఎస్టీ నాయకులు డుమావత్ లతా చంద్రకాంత్నాయక్, మైనారిటీ సెల్ జిల్లా కార్యదర్శి దూదేకుల రసూల్, పుల్లలచెరువు పార్టీ నాయకుడు ఉడుముల శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. ఆరు హామీలతో పాటు మరో అదనపు హామీలంటూ మోసం మీ ఇంటికే నేరుగా డబ్బులు అందుతాయని అబద్ధపు హామీలు బాబు మోసాలను ఎండగట్టిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ -
అన్నం పెట్టే రైతులకు సున్నం
నిరుపేదల ఉపాధికి గండి..ఒంగోలు టౌన్: వ్యవసాయ రంగంలో 70 శాతానికి పైగా పనిచేస్తున్న మహిళలకు తగిన గుర్తింపు దక్కడం లేదని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల రమాదేవి పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా పంపిణీ వ్యవస్థను నీరుగార్చి ఆహార భద్రతకు తూట్లు పొడుస్తున్నాయని మండిపడ్డారు. ఆదివారం ఒంగోలులోని ఐద్వా కార్యాలయంలో జిల్లా మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ.. గ్రామీణ నిరుపేదలకు ఆసరాగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని పక్కదారి పట్టించారని, దేశానికి అన్నం పెట్టే రైతన్నలను దెబ్బ తీస్తూ వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు నిర్వహించేందుకు మహిళను సమాయత్తం చేస్తున్నామని చెప్పారు. ఈ నెల 19, 20వ తేదీల్లో కొండపిలో నిర్వహించనున్న ఐద్వా 13వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సయ్యద్ షర్మిల మాట్లాడుతూ.. పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కరువైందన్నారు. గత మూడేళ్ల కాలంలో చేపట్టిన ఉద్యమాలను సమీక్షించుకుని భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలకు మహాసభల్లో కార్యాచరణ రూపొందించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఐద్వా నాయకులు ఊసా రాజ్యలక్ష్మి, నెరుసుల మాలతి, ఎ.ఆదిలక్ష్మి, కె.ప్రసన్న, భావన రాజ్యలక్ష్మి, డి.శారా, కె.రాజేశ్వరి, శాంత కుమారి, అనంతలక్ష్మి, టి.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ రంగంలో మహిళల శ్రమకు గుర్తింపు లేదు ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల రమాదేవి -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
టంగుటూరు: జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం సంభవించిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృత్యువాతపడగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. టంగుటూరు మండలంలోని సూరారెడ్డిపాలెం ఫ్లయ్ ఓవర్పై చోటుచేసుకున్న ప్రమాదంలో అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం చిన్నులగారిపల్లి గ్రామానికి చెందిన పులి గంగాధర్(35) మృతి చెందారు. ఆయన తన భార్య గాయత్రి, అత్త రాధ, కొడుకు గంధర్వ్తో కలిసి చైన్నె నుంచి కారులో హైదరాబాద్ వెళ్తున్నారు. ఈ క్రమంలో సూరారెడ్డిపాలెం ఫ్లయ్ ఓవర్పై ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో గంగాధర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆయన మరణించారు. ఈ ప్రమాదంలో గంగాధర్ అత్త రాధ, అతని కొడుకు గంధర్వ్ గాయపడగా చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని ఎస్సై నాగమల్లేశ్వరరావు పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ట్రక్ ఢీకొనియువకుడు మృతి పొదిలి: మినీ ట్రక్ ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం పొదిలి టైలర్స్ కాలనీ సమీపంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. చీమకుర్తి మండలం లక్ష్మీపురం పంచాయతీ రాజుపాలేనికి చెందిన సుబ్బారావు పొదిలి పెద్ద చెరువు సాగర్ పైప్ లైన్ నిర్మాణ పనుల్లో క్రేన్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. మల్లవరం సమీపంలో పనులు ముగించుకొని స్వగ్రామానికి బైక్పై వెళ్తున్న సుబ్బారావును టైలర్స్ కాలనీ వద్ద ఒంగోలు నుంచి కనిగిరి వైపు వేగంగా వెళ్తున్న మినీ ట్రక్ ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. -
బనకచర్ల నిర్మిస్తారా?
రైతులను ఆదుకోలేని సీఎంఒంగోలు టౌన్: గిట్టుబాటు ధరలు రాక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రంలోని రైతులను ఆదుకోలేని ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష కోట్ల రూపాయలతో బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తానని చెప్పడం హాస్యాస్పదమని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి.రమాదేవి విమర్శించారు. స్థానిక సుందరయ్య భవనంలో ఆదివారం నిర్వహించిన సీపీఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దర్శి పంట పొలాల్లో మీటింగ్ పెట్టి రైతుల బ్యాంకు ఖాతాల్లో కేవలం రూ.5 వేలు వేశారని, దీని వలన రైతుల సమస్యలు ఎలా పరిష్కారమవుతాయో చెప్పాలని ప్రశ్నించారు. బర్లీ, వర్జీనియా పొగాకు కొనుగోలు చేసేందుకు రూ.1000 కోట్లు కేటాయించాలని రైతులు అడుగుతుంటే స్పందించని ముఖ్యమంత్రి మాయమాటలతో మభ్యపెట్టాలని ప్రయత్నిన్నారని ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లాలో అమరరాజా కంపెనీ జ్యూస్ కంపెనీ ఏర్పాటు చేయడంతో చిన్న, చితక ఫ్యాక్టరీలు మూతపడ్డాయని, దీనివల్లనే మామిడికి ధరలు రాలేదని చెప్పారు. కనీసం కూలి కూడా దక్కని పరిస్థితుల్లో మామిడి రైతులకు రూ.100 కోట్లు కేటాయించాలని కోరినా ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెవికెక్కడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ రకాల పంటలకు గిట్టుబాటు ధరలు రాక రైతులు అల్లాడిపోతున్నారని చెప్పారు. రైతులు, సామాన్య ప్రజలు పెరిగిన ధరలతో అల్లాడి పోతుంటే ట్రూ అప్ చార్జీలు, సర్దుబాటు చార్జీల పేరుతో విద్యుత్ చార్జీలను పెంచడం దుర్మార్గమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లను పగులగొట్టమని ప్రచారం చేసిన టీడీపీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అదే స్మార్ట్ మీటర్లను బిగించడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. విద్వేషాలను రెచ్చగొడుతున్న ఉప ముఖ్యమంత్రి .. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ చరిత్రను వక్రీకరిస్తూ సినిమాలు తీయడం ద్వారా సమాజంలో విద్వేషాలను రెచ్చగొడుతున్నారని రమాదేవి ఆరోపించారు. మైనారిటీల మనోభావాలను దెబ్బతీయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. మహారాష్ట్ర, బీహారు ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఉండేలా ఓటర్ల ప్రత్యేక సవరణ నాటకాలాడుతున్నారని ధ్వజమెత్తారు. జిల్లా సీపీఎం కార్యదర్శి ఎస్కే మాబు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసేలా ఓటర్ల ప్రత్యేక సవరణ జాబితా రూపొందించేందుకు చేస్తున్న ప్రయత్నాలను తప్పుపట్టారు. కార్యక్రమంలో సయ్యద్ హనీఫ్, చీకటి శ్రీనివాసరావు, కొండారెడ్డి, ఎం.రమేష్ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి.రమాదేవి -
నిమ్మ ధర!
పాతాళంలోకిహనుమంతునిపాడు: నిమ్మకాయల ధరలు పాతాళంలోకి పడిపోవడంతో ఆ రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నష్టాలు తప్పేలా లేవంటూ ఆందోళన చెందుతున్నారు. కాయలు కోసి మార్కెట్కు తీసుకెళ్లినా.. వ్యాపారులు కొనుగోలు చేయమని చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో తోటల్లోని చెట్లకే కాయలు వదిలేస్తున్నారు. అవన్నీ రాలిపోయి చెట్ల కింద పడుతున్నాయి. చెట్ల పాదుల్లో అలాగే వదిలేయడంతో ఆ కాయలన్నీ కుళ్లిపోయి ఆ వాసనకు నల్లి తెగులు వ్యాపిస్తోంది. ఈ తెగులు చెట్లకు సోకి ఏకంగా తోటలన్నీ తెగులు బారిన పడుతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, కూలీల ఖర్చులకు, ఆటో బాడుగలకు సరిపడా ధరలు కూడా పలకకపోవడంతో కాయను కోయడం కంటే చెట్లకు వదిలేయడమే మేలనే రైతులు వదిలేస్తున్నారు. కిలో రూ.2 నుంచి రూ.3 మాత్రమే... నిమ్మ ధరలు నిలకడ లేకుండా రోజుకో ధర పలుకుతోంది. హనుమంతునిపాడు మండలం నిమ్మ సాగులో జిల్లాలోనే మొదటి స్థానంలో ఉంది. 2,874 హెక్టార్లకుపైగా సాగుచేస్తున్నారు. ముదురు, లేత తోటల సాగు సుమారు 2000 ఎకరాలపైబడి జరుగుతోంది. ఈ మండలం నుంచి ప్రతిరోజూ కనిగిరి మార్కెట్కు ఆటోలు, మినీ లారీల్లో నిమ్మ కాయలు తరలిస్తుంటారు. ఇటీవల ధర పూర్తిగా పడిపోవడంతో రైతులకు సమస్యలొచ్చిపడ్డాయి. ప్రస్తుతం నిమ్మకాయలు కిలో రూ.2 నుంచి రూ.3కు మించి పలకడం లేదు. కమిషన్ వ్యాపారులు ధర లేదని కాయను కొనుగోలు చేయడం లేదు. పచ్చి కాయ కిలో రూ.5 నుంచి రూ.6 మించి కొనుగోలు చేయడం లేదు. కోత కూలీలు, ఆటో బాడుగలు కూడా రావడం లేదు. ఈ ఏడాది మొదటి నుంచి నిమ్మకు ధర లేకపోవడంతో రైతులు నష్టాల్లో కూరుకుపోయారు. ప్రభుత్వం నిమ్మ రైతుల గురించి పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్లి తెగులుతో దెబ్బతింటున్న నిమ్మ తోటలు... నిమ్మకాయలను చెట్లకే వదిలేయడంతో అవన్నీ పండిపోయి రాలిపోతున్నాయి. పాదుల్లో కుళ్లిపోతున్నాయి. కుళ్లిన వాసనకు నల్లి తెగులు సోకి చెట్ల ఆకులు సైతం రాలిపోతున్నాయి. ఎండు పుల్లల తెగులు కూడా సోకుతోంది. వైరస్ సోకడంతో తోటలన్నీ పూర్తిగా దెబ్బతింటున్నాయి. దీంతో రాలిన కాయను ఏరి రోడ్ల పక్కన పోస్తూ రైతులు నలిగిపోతున్నారు. పట్టించుకోని హార్టీకల్చర్ అధికారులు... నిమ్మతోటల్లో నల్లి తెగులు, వైరస్ వ్యాపిస్తున్నప్పటికీ హార్టీకల్చర్ అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వాటి నివారణ చర్యల గురించి రైతులకు కనీస సలహాలు, సూచనలు కూడా ఇవ్వకుండా అలసత్వం ప్రదర్శిస్తున్నారు. నిమ్మతోటలకు వేరు కుళ్లు, ఎండుపుల్ల తెగులు, పేను బంక, కాయకు మంగు, మచ్చలు వచ్చి నాణ్యత కోల్పోతున్నాయి. మంగు, గజ్జి, మచ్చలున్న కాయను గ్రేడ్ చేసి పనికి రావంటూ రోడ్ల పక్కన పోస్తున్నారు. తోటల్లో చెట్లకే వదిలేయడంతో రాలిపోతున్న నిమ్మకాయలు ధర లేకనే వదిలేశామంటున్న రైతులు కాయలు తీసుకొచ్చినా కొనుగోలు చేయమంటున్న వ్యాపారులు పాదుల్లో వదిలేసిన కాయలు కుళ్లిపోయి సోకుతున్న నల్లి తెగులు నల్లి తెగులుతో దెబ్బతింటున్న నిమ్మ తోటలు పట్టించుకోని అధికారులు, పాలకులు నష్టాలు తప్పడం లేదంటున్న నిమ్మ రైతులు ఈ ఏడాది పూర్తిగా నష్టపోయాం నిమ్మకాయకు ధర లేక కాయను కోయడం లేదు. కిలో రూ.2కు కూడా వ్యాపారుల అడగడం లేదు. కోత కూలీలకు వచ్చేలా కూడా ధరలు లేకపోవడంతో 5 ఎకరాల్లో సాగుచేస్తున్న నిమ్మ తోటల్లో కాయను కోయకుండా వదిలేశాను. ఈ ఏడాది పూర్తిగా నష్టపోయాం. నిమ్మ రైతు గురించి పట్టించుకునే నాథుడే లేడు. – జె.దేవదానం, రైతు, సీతారాంపురం -
పరిమళించిన మానవత్వం
గిద్దలూరు రూరల్: పట్టణానికి చెందిన గలిబిలి ప్రసాద్ అనే వ్యక్తి మద్యానికి బానిసై కుటుంబ సభ్యులకు దూరమయ్యాడు. స్థానిక గ్రంథాలయం ఎదుట రోడ్డు మీద గత 5 రోజుల నుంచి పడిపోయి ఉన్నాడు. అక్కడే మలమూత్ర విసర్జన చేస్తూ దుర్భర స్థితిలో పడి ఉన్న అతని సమీపంలోకి వెళ్లేందుకు స్థానికులు సాహసం చేయలేదు. సమాచారం తెలుసుకున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బీఎస్ నారాయణరెడ్డి స్పందించి మున్సిపల్ సిబ్బంది సహాయంతో ప్రసాద్కు క్షవరంతోపాటు స్నానం చేయించి నూతన వస్త్రాలు వేయించారు. అనంతరం ప్రసాద్ను కడప జిల్లా కాశినాయన మండలం ఓబులాపురం గ్రామంలోని వివేకానంద సేవాశ్రమానికి తరలించారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డిని స్థానికులు అభినందించారు. -
మద్యం మత్తులో మిత్రుల ఘర్షణ
● బైక్పై పెట్రోల్ పోసి తగలబెట్టిన వైనం ఒంగోలు టౌన్: మద్యం మత్తులో ఉన్న ముగ్గురు మిత్రుల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ చోటుచేసుకోగా.. ఓ యువకుడు పెట్రోల్ పోసి బైకును తగలబెట్టాడు. ఈ సంఘటన ఒంగోలు–కర్నూలు రోడ్డులోని పాలకేంద్రం సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్కు చెందిన లోనా రాం, అర్జున్, కిషోర్ స్నేహితులు. ముగ్గురూ చీమకుర్తి గ్రానైట్ పరిశ్రమల్లో పనులు చేస్తుంటారు. ఆదివారం కావడంతో సరదాగా ఒంగోలు నగరానికి వచ్చారు. తాము తెచ్చుకున్న బైకులో పెట్రోల్ అయిపోవడంతో పాలకేంద్రం వద్ద ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంచారు. ఒక బాటిల్లో పెట్రోలు పోయించుకుని వస్తూ మార్గమధ్యంలోని ఓ వైన్ షాప్లో ముగ్గురూ కలిసి మద్యం తాగారు. మత్తు తలకెక్కడంతో వారి మధ్య మాటల యుద్ధం మొదలైంది. రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్నారు. ఆ కోపంతో ఓ వర్గం యువకుడు బైక్కు నిప్పంటించి తగులబెట్టాడు. తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
ఆ డీలర్లపై 6ఏ కేసులు
తర్లుపాడు: డీలర్లు రేషన్ బియ్యం ఇవ్వకుండా వాటికి బదులుగా కార్డుదారులకు డబ్బులు ఇస్తుండటంపై ఆదివారం సాక్షి మెయిన్ ఎడిషన్లో ప్రచురితమైన ‘‘బియ్యం లేవ్.. డబ్బులు తీస్కో..’’ కథనంపై ఒంగోలు ఎన్ఫోర్స్మెంట్ డీటీ డేవిడ్రాజు, ఫుడ్ ఇన్స్పెక్టర్ ముకుంద హరి స్పందించారు. మండలంలోని కేతగుడిపి, సూరేపల్లి రేషన్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. డీలర్ల సమక్షంలో స్టాక్ను పరిశీలించారు. రెండు చోట్ల ఎక్కువ మొత్తంలో బియ్యం ఉన్నట్లు గుర్తించారు. కేతగుడిపిలో వీఆర్వో కాశీశ్వర్రెడ్డికి స్టాక్ అప్పగించారు. సూరేపల్లిలో డీలర్ పొంతన లేని సమాధానం ఇచ్చారు. దీంతో ఇద్దరు డీలర్లపై 6ఏ కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్ 1100 ఒంగోలు సబర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారం కోసం కాల్ సెంటర్–1100ను ప్రవేశపెట్టిందని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ మేరకు ఆమె ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఈ ద్వారా ప్రజలు సమస్యలను అర్జీల రూపంలో ఆన్లైన్ ద్వారా కూడా నమోదు చేసుకోనవచ్చన్నారు. అర్జీదారులు 1100 నంబర్కు డయల్ చేసి, తమ సమస్యను విన్నవిస్తే ఆన్లైన్లో ఫిర్యాదు రిజిస్టర్ చేసుకుంటుందని వివరించారు. ఆ సమస్యను సంబంధిత అధికారికి పంపి తద్వారా పరిష్కరించేందుకు వీలుకలుగుతుందన్నారు. సమస్యను కాల్ సెంటర్లో నమోదు చేసిన మొబైల్ నంబర్కు ఎస్ఎంఎస్ ద్వారా నిర్ధారణ సందేశం పంపుతారని వివరించారు. -
ఉమ్మడి సీనియారిటీ ప్రాతిపదికన ప్రమోషన్లు ఇవ్వాలి
ఒంగోలు సిటీ: ఉమ్మడి సీనియారిటీ ప్రాతిపదికపై ప్రమోషన్లు ఇవ్వాలని ప్రధానోపాధ్యాయుల సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం ఒంగోలులోని ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయుల సంఘ కార్యాలయంలో ఫ్యాప్టో, జాక్టో ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయుల సంఘం, మండల విద్యాశాఖ అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి ఐక్య వేదిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ.. మొట్టమొదట పీఆర్టీయూ పక్షాన ఒకే నియామక పరీక్ష ద్వారా ఉపాధ్యాయులుగా ఎంపికై న వారి ఖాళీలను బట్టి వివిధ మేనేజ్మెంట్ల పాఠశాలల్లో నియమించారన్నారు. అయినప్పటికీ పాఠశాల విద్యాశాఖ నియంతృత్వ ధోరణితో స్కూల్ అసిస్టెంట్లను ఎంఈఓలుగా నియమించిందని, వారికంటే సీనియర్ ప్రధానోపాధ్యాయులు, సీనియర్ స్కూల్ అసిస్టెంట్లు ఉన్నప్పటికీ జూనియర్లను ఎంఈఓలుగా నియమించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఉమ్మడి సీనియారిటీ ప్రకారం ప్రమోషన్లు ఇవ్వకపోతే రాష్ట్ర స్థాయిలో ఉద్యమిస్తామని, దీనిపై న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. డైట్ లెక్చరర్లు సీనియర్ లెక్చరర్లుగా ప్రమోషన్ పొందగానే డీఈఓలుగా ఎఫ్ఏసీ ఇచ్చారు కానీ డైట్ లెక్చరర్లకు ఈక్వల్ గా ఉన్న ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలను మాత్రం డీవైఈఓలుగా, డీఈఓలుగా నియమించకపోవడం చాలా అన్యాయమని, ఈ విధానాన్ని ఖండిస్తున్నామన్నారు. జాక్టో తరఫున శ్రీనివాసరావు, నరహరంజిరెడ్డి, మల్లికార్జున రావు ఫ్యాప్టో తరఫున అబ్దుల్ హై, రఘు, సుబ్బారావు, శ్రీనివాసరావు, పర్రె వెంకట్రావు, ప్రధానోపాధ్యాయుల సంఘం తరఫున వై.వెంకట్రావు. సాయి శ్రీనివాసరావు, మండల విద్యాశాఖ అధికారుల సంఘం తరఫున కిషోర్ బాబు, నాగేంద్రవదన్ పాల్గొన్నారు. ఎంఈఓల నియామకాల్లో సీనియర్లను పక్కనబెట్టడం సరికాదు విద్యాశాఖ తప్పు సరిదిద్దుకోకుంటే రాష్ట్ర స్థాయిలో ఉద్యమం ప్రభుత్వానికి ఫ్యాప్టో, జాక్టో సంఘాల హెచ్చరిక -
రాష్ట్ర స్థాయి పోటీలకు చీమకుర్తి క్రీడాకారిణిలు
చీమకుర్తి: చీమకుర్తిలోని జిల్లా పరిషత్ బాలికల హైస్కూలుకు చెందిన క్రీడాకారిణిలు రాష్ట్ర స్థాయి బాల్ బాడ్మింటన్ పోటీలకు ఎంపికయ్యారు. ఆదివారం కావలి సమీపంలోని చేవూరులో జరిగిన అంతర జిల్లా స్థాయి బాలికల పోటీల్లో చీమకుర్తి నుంచి ఎంపికై న వారి వివరాలను పీడీ డీ.స్వరూపావాణి చీమకుర్తిలోని మీడియాకు తెలిపారు. జూనియర్ బాడ్మింటన్ పోటీలకు దీక్ష, సబ్ జూనియర్ పోటీలకు కృప, మేఘన, అక్షయ ఎంపికయ్యారు. ఎంపికై న వారిలో జూనియర్స్కు అనంతపురంలోను, సబ్జూనియర్స్కు చేవూరులో రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహిస్తారని పీడీ తెలిపారు. ఎంపికై న క్రీడాకారిణిలను చీమకుర్తి జిల్లా పరిషత్ బాలికల హైస్కూలు టీచర్స్, వారి తల్లిదండ్రులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. -
ఈ వాచ్మన్ వద్దండి
దర్శి: పట్టణంలోని లంకోజనపల్లి రోడ్డులో ఎస్సీ సంక్షేమ బాలికల హాస్టల్లో వాచ్ ఉమన్ బదులు ఆమె భర్త విధులు నిర్వహించడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాచ్మెన్గా పురుషుడు వద్దంటూ ఏఎస్డబ్ల్యూఓకు ఆదివారం రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ.. బాలికల హాస్టల్లో వాచ్ ఉమన్ డ్యూటీ చేయాల్సిన స్వప్న తన భర్తను విధులకు ఎలా పంపుతోందని, ఆడపిల్లల హాస్టల్లోకి మగవారిని ఎలా అనుమతించారని ఏఎస్డబ్ల్యూఓను ప్రశ్నించారు. దీనిపై ఏఎస్డబ్ల్యూఓ స్పందిస్తూ.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వాచ్ ఉమన్ స్వప్నను బదిలీ చేస్తామని హామీ ఇవ్వడంతో తల్లిదండ్రులు శాంతించి వెనుదిరిగారు. కాగా వాచ్మన్కు వార్డెన్కు మధ్య విభేదాల వల్ల హాస్టల్లో నిత్యం వివాదం చోటుచేసుకుంటున్నట్లు సమాచారం. ● దర్శి ఎస్సీ బాలికల హాస్టల్ వద్ద తల్లిదండ్రుల నిరసన ● వాచ్ ఉమన్ బదులు భర్త విధుల్లో ఉండటంపై ఆగ్రహం -
జిల్లా మహిళా క్రికెట్ జట్టు ఎంపిక
ఒంగోలు: స్థానిక మంగమూరు రోడ్డులోని ఏసీఏ క్రికెట్ సబ్ సెంటర్ మైదానంలో ఆదివారం సీనియర్ మహిళా క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు నిర్వహించారు. అండర్ 23, సీనియర్ మహిళా క్రికెట్ జట్ల ఎంపికకు ఉమ్మడి జిల్లా నుంచి మహిళా క్రికెటర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఫీల్డింగ్, బ్యాటింగ్, కీపింగ్, బౌలింగ్ తదితర అంశాల్లో క్రీడాకారుల ప్రతిభను కోచ్లు కొప్పోలు సుధాకర్, లెఫ్ట్ శ్రీను, చంద్ర పరిశీలించారు. మొత్తం 20 మంది ప్రతిభావంతులకు ఈనెల 9, 10వ తేదీల్లో బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం రావినూతల క్రికెట్ స్టేడియంలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. అనంతరం వారిలో 16 మంది క్రీడాకారులను తుది జట్టుకు ఎంపిక చేస్తామని ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి కారుసాల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎంపికై న జట్లు ఈనెల 14 నుంచి 17వ తేదీ వరకు ఎన్టీఆర్ జిల్లా మూలపాడులో నిర్వహించనున్న అంతర్ జిల్లా క్రికెట్ పోటీల్లో ప్రకాశం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. ఎంపిక ప్రక్రియను ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు నవీన్కుమార్, సంయుక్త కార్యదర్శి బచ్చు శ్రీనివాసరావు, కోశాధికారి హనుమంతరావు, సభ్యులు బలరాం పర్యవేక్షించారు. -
భూ కబ్జా ఆపండి
మార్కాపురం: తమ పొలాలను కబ్జా చేసేందుకు ఒక టీడీపీ నాయకుడు ప్రయత్నిస్తున్నాడని ఆరోపిస్తూ ఆదివారం మార్కాపురం మండలంలోని నాగులవరం గ్రామస్తులు ఆదివారం ధర్నా నిర్వహించారు. వారసత్వంగా వస్తున్న తమ పొలాలను మార్కాపురం పట్టణానికి చెందిన ఒక టీడీపీ నేత ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నాడని, తమ భూములను కాపాడి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భూ కబ్జా విషయంపై ఇప్పటికే రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ధర్నాలో గ్రామానికి చెందిన మంగమ్మ, వెంకటేశ్వర్లు, ఏడుకొండలు, గురుస్వామి, పెద్ద అంకయ్య, ఆంజనేయులు, లక్ష్మీదేవి తదితరులు పాల్గొని టీడీపీ నాయకుడి తీరును తూర్పారబట్టారు. తమకు ఆ పొలమే జీవనాధారమని, తమ పొలాన్ని సర్వే చేసి కబ్జా కాకుండా చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. మార్కాపురం మండలం నాగులవరంలో గ్రామస్తుల ధర్నా టీడీపీ నాయకుడి తీరుపై ఆగ్రహం -
బియ్యం లేవట.. డబ్బులు తీసుకోవాలట..!
తర్లుపాడు: పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న చౌకబియ్యం దళారులు, అధికార కూటమి నేతలకు ఆదాయ వనరుగా మారింది. 1న కార్డుదారులకు అందుబాటులో ఉండి నిత్యావసర వస్తువులు సరఫరా చేయాల్సిన డీలర్ ఇంటింటికీ తిరిగి బయోమెట్రిక్ థంబ్ వేయించుకుని ‘రేషన్ లేదు.. డబ్బులు తీస్కోండి’ అంటూ కార్డుదారులపై మండిపడటం.. ఆ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండటం ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలో తీవ్ర చర్చకు దారితీసింది.మండలంలోని కేతగుడిపి పంచాయతీలో సుమారు 1100 మంది రేషన్కార్డుదారులు ఉన్నారు. వీరందరికీ 1న రేషన్ అందించాల్సిన డీలర్ తన కుమారుడు ద్వారా బియ్యం లేవంటూ కార్డుదారుల నుంచి థంబ్ వేయించుకుని కిలోకు రూ.10 చొప్పున డబ్బు చెల్లించారు. ఇదేమని అడిగేందుకు సాహసించని కార్డుదారులు ఇచి్చనకాడికి తీసుకొన్నారు. గతంలో రేషన్ బియ్యాన్ని కొందరు ప్రైవేటు వ్యక్తులు కార్డుదారుల ఇళ్లకు వెళ్లి కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం రేషన్ డీలర్లే అధికార పార్టీ నేతల అండతో బియ్యం ఇవ్వకుండా నేరుగా మార్కెట్కు తరలిస్తుండటం గమనార్హం. -
సుఖీభవ పేరుతో సెట్టింగ్ డ్రామా
ఒంగోలు సిటీ: ‘పంజాబీ దాబాలాంటి సెట్టింగ్ వేసి.. 50 నుంచి 60 నులక మంచాలపై మహిళలు, రైతులను కూర్చోబెట్టారు. సీఎం చంద్రబాబు వెనుక గడ్డివాము, ఒక ట్రాక్టర్ పెట్టి.. చుట్టూ పచ్చగా ఉండేలా భారీ సెట్టింగ్ వేసి అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ఓ డ్రామా తరహాలో నిర్వహించారు’ అని దర్శి ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ఎద్దేవా చేశారు. కష్టాల్లో ఉన్న రైతులను పలకరించకుండా అన్నదాతా సుఖీభవ పేరుతో షూటింగ్ చేసుకుని వెళ్లిపోయారని మండిపడ్డారు.శనివారం ఒంగోలులోని పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పరిపాలనలో ఏటా 53.58 లక్షల మంది లబ్ధిదారులకు రైతు భరోసా అందేదని, చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఆ సంఖ్యను భారీగా కుదించారని దుయ్యబట్టారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 46.87 లక్షల మందికి అన్నదాత సుఖీభవ ఇస్తున్నారని, మిగిలిన 7 లక్షల మంది రైతులు ఏమి అన్యాయం చేశారో చెప్పాలని ఆయన నిలదీశారు. మొదటి ఏడాది రైతులకు సాయం ఎగ్గొట్టి, ఇప్పుడు కేంద్రం వాటా కలుపుకుని రూ.7 వేలు ఇవ్వడం దగా చేయడమేనన్నారు. బడ్జెట్లో అన్నదాత సుఖీభవకు ఎంత కేటాయించారో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర ఎందుకు కల్పించరు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మిర్చి పంటకు క్వింటాల్కు రూ.27 వేలు నుంచి రూ.28 వేలు ధర లభిస్తే.. చందరబాబు హయాంలో క్వింటాల్ ధర రూ.6 వేలకు పడిపోయిందని శివప్రసాద్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక మిర్చి, పొగాకు, శనగ, వరి, పత్తి ఇలా అన్ని పంటల రైతులు గిట్టుబాటు ధరలు రాక అవస్థలు పడుతున్నారన్నారు. దర్శిలో కార్యక్రమం ఎవరి కోసం.. సీఎం చంద్రబాబు దర్శిలో నిర్వహించిన కార్యక్రమం ఎవరి కోసమో చెప్పాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. మిర్చి రైతుల కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి మిర్చి యార్డుకు వెళ్లిన తర్వాత సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖరాసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. పొదిలికి జగన్మోహన్రెడ్డి వస్తే వేలాది మంది రైతులు, కార్యకర్తలు తరలివచ్చారని, వారిపై కేసులు పెట్టి వేధింపులకు గురిచేశారన్నారు. -
జగన్ పర్యటనను అడ్డుకుంటే శిక్ష తప్పదు
● వైఎస్సార్ సీపీ నెల్లూరు పార్లమెంట్ పరిశీలకుడు జంకె వెంకటరెడ్డి మార్కాపురం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనను కూటమి ప్రభుత్వం అడ్డుకుంటే ప్రజాకోర్టులో వారికి శిక్ష తప్పదని వైఎస్సార్ సీపీ నెల్లూరు పార్లమెంట్ పరిశీలకుడు, మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి హెచ్చరించారు. శనివారం మార్కాపురంలో మీడియాతో ఆయన మాట్లాడారు. నెల్లూరు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటనకు ప్రజలు స్వచ్ఛందంగా భారీగా తరలిరాగా, అడ్డుకునేందుకు కూటమి సర్కారు చేసిన కుట్రలు అప్రజాస్వామికమని అన్నారు. ఇది పూర్తిగా ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన చర్య అంటూ తీవ్రంగా ఖండించారు. ప్రజల్లోకి వెళ్లే స్వేచ్ఛ ప్రతి నాయకునికి ఉంటుందన్నారు. తమ అభిమాన నేత పర్యటనకు వెళ్లే పూర్తి అధికారం స్వేచ్ఛ ప్రజలకు కూడా ఉంటుందని ఆయన గుర్తుచేశారు. ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్న కూటమి సర్కార్.. జగన్ను, ప్రజలను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. జగన్ పర్యటనను ఎంత అడ్డుకుంటే ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై అంత కోపం పెరుగుందని హెచ్చరించారు. దీని ఫలితం వచ్చే ఎన్నికల్లో కూటమి సర్కార్ అనుభవించాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికై నా కూటమి సర్కార్ ఇటువంటి ప్రజా వ్యతిరేక చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. కూటమి సర్కార్ తీరులో మార్పు రాకపోతే ప్రజలే ఆ ప్రభుత్వాన్ని మారుస్తారన్నారు. వైఎస్ జగన్ తన ఐదేళ్ల పదవీ కాలంలో ప్రజలకు ఏం చేశారని కూటమి సర్కార్ పెద్దలు హాస్యాస్పదంగా ప్రశ్నిస్తున్నారని, జగన్ ఏం చేశారో జనంలోకి వెళ్లి అడిగే దమ్ము ఈ ప్రభుత్వ పెద్దలకు ఉందా.? అని జంకె సవాల్ విసిరారు. తన పాలనలో మూడేళ్లు కరోనా ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందిగా మారినప్పటికీ పేదల సంక్షేమాన్ని వదలకుండా అనేక పథకాలను వైఎస్ జగన్ అమలు చేసిన విషయం ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని అన్నారు. ఈ విషయం కూటమి ప్రభుత్వంలోని పెద్దలకు కూడా తెలుసన్నారు. ఈ విషయాన్ని గమనించిన కూటమి పెద్దలు.. జగన్ జనంలోకి వెళితే ప్రభుత్వంపై వ్యతిరేకత రావడంతో పాటు వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుస్తుందన్న భయంతో జగన్ పర్యటనను అడుగడుగునా అడ్డుకుంటున్నారని జంకె విమర్శించారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వ పెద్దలు ఇటువంటి విధానాలను విడిచిపెట్టాలని ఆయన హితవు పలికారు. -
బాబు ఫ్లాప్ షో
అన్నదాత సుఖీభవ డబ్బుల పంపిణీ పేరుతో సీఎం చంద్రబాబు నాయుడు సినిమా సెట్టింగ్ను తలపించేలా పంట పొలాల మధ్య..నులక మంచాలపై కూర్చొని మెడలో పచ్చ కండువాలు వేసుకున్న రైతుల మధ్య చేసిన కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయింది. మండుటెండతో రైతులు మధ్యలోనే జారుకోగా..టీడీపీ కార్యకర్తలతో సభను మమ అనిపించారు. జిల్లా అభివృద్ధికి సంబంధించిన ఏ ఒక్క కొత్త హామీనీ ఇవ్వకుండా పాత హామీలనే వల్లెవేసిన బాబు తీరుపై అధికార పార్టీ కార్యకర్తల్లోనే అసంతృప్తి వ్యక్తమైంది. దర్శి: బాబు వస్తారు..వరాల జల్లు కురిపిస్తారు అన్న ఆశతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి అన్నదాత సుఖీభవ మొదటి కార్యక్రమం దర్శి మండలం తూర్పువీరాయపాలెంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని వినూత్న రీతిలో ఖర్చు లేకుండా పేరు సంపాదించేలా ఉండాలని దర్శి టీడీపీ ఇన్చార్జ్ గొట్టిపాటి లక్ష్మి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. అధికారులు రెండు రోజులు భారీ ఎత్తున వచ్చి హడావిడి చేశారు. వచ్చే రైతులకు పాస్లు కూడా ఇచ్చి పంపారు. శనివారం ఉదయం 10 గంటలకు నాయకులు, కార్యకర్తలు వచ్చారు. వచ్చిన వారు అక్కడ చూసి ఖంగుతిన్నారు. అక్కడ అన్నీ నులక మంచాలే దర్శనం ఇచ్చాయి. ఒక్కటంటే ఒక్క కుర్చీ లేదు. టెంట్లు లేవు, ఎండకు ప్రజలు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు కూడా లేవు. పొలంలో ఎండలో కేవలం నులక మంచాలు మాత్రమే వేసి పెట్టారు. ఆ మంచాలపై టీడీపీ సానుభూతిపరులైన రైతులను కూర్చోబెట్టి ఆ ప్రోగ్రాం అయినా సక్సెస్ చేద్దామనుకున్న ప్రయత్నం విఫలమైంది. మండుటెండలో మంచాలతో ప్రహసనం: రైతులను ఆకుపచ్చ కండువాలు వేసి వారికి కేటాయించిన మంచాల పై కూర్చోబెట్టారు. అంత వరకు బాగానే ఉంది. పది గంటల నుంచి భానుడు భగ్గుమన్నాడు. ఆ ఎండకు మెడలో కండువాలు కాస్తా తలపైకి చేరాయి. ఎల్ఈడీ స్క్రీన్లో ప్రధాని మోదీ హిందీలో చెప్తున్న ప్రసంగాన్ని పెట్టడంతో జనానికి అర్థంకాక తలపట్టుకున్నారు. పైన టెంట్ లేకపోవడం, అక్కడ పూర్తి స్థాయిలో తాగునీరు లేకపోవడంతో వచ్చిన రైతులు, మహిళలు ఆ ఎండదెబ్బకు తట్టుకోలేక చల్లగా జారుకున్నారు. దీంతో మంచాలన్నీ ఖాళీ అయ్యాయి. ఆ తరువాత టీడీపీ అనుకూల రైతులకు పాస్లు ఇచ్చి పిలిచి కూర్చోబెట్టారు. వారు కూడా ఎండదెబ్బకు జారుకోవడం మొదలుపెట్టారు. దీంతో చంద్రబాబు వచ్చే సమయమైంది మంచాలు ఖాళీగా కనిపిస్తున్నాయని చెకింగ్ పాయింట్ తీసేసి కార్యకర్తలందరినీ వదిలేశారు. చంద్రబాబు, మంత్రులు, అధికారులు వచ్చి ఆయనతో పాటు మంచాల మీద కూర్చున్నారు. దీంతో వెనకున్న వారికి వచ్చిన వారు కనిపించలేదు. మంచాలపై కూర్చోకుండా నిలబడటం మొదలైంది. ఆ తరువాత ఒకరిని చూసి మరొకరు అందరూ మంచాలపై నుంచి లేచి నిలబడ్డారు. మంచాలు విరిగి తుక్కు తక్కు అయిపోయాయి. దీంతో మంచాల డ్రామా సెట్టింగ్ కాస్తా అట్టర్ ఫ్లాప్ అయింది. ఒక్క హామీ ఇవ్వని వైనం బాబు వస్తారు..వరాలు కురిపిస్తారు.. హామీలిస్తారని ఎదురుచూసిన కార్యకర్తలకు తీవ్ర నైరాశ్యం మిగిలింది. నియోజకవర్గానికి సంబంధించి ఒక్క హామీ ఇచ్చిన పాపాన పోలేదు. నియోజకవర్గంలో గత ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చారో అదే హామీలను మళ్లీమళ్లీ కొత్తగా ఇస్తున్నట్టు వల్లెవేశారు. జిల్లాలో రైతులకు రూ.122.74 కోట్లు: అన్నదాత సుఖీభవ పథకం కింద జిల్లాలో 2,68,165 రైతులకు రూ.122.74 కోట్లు, దర్శి నియోజకవర్గంలోని 42,871 మంది రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.29.06 కోట్ల నగదును పంపిణీ చేశామంటూ రైతులైన సుబ్బరత్తమ్మ, పేరయ్యలకు చెక్కు రూపంలో నగదును సీఎం అందజేశారు. దర్శి మండలంలో 10,987 మంది రైతులకు రూ.7.69 కోట్లు, తూర్పు వీరాయపాలెంలో 476 మంది రైతులకు రూ.7.20 కోట్లు నగదు ఇచ్చామన్నారు. ఉదయం 11.30 గంటలకు రైతుల వద్దకు వచ్చిన ముఖ్యమంత్రి దాదాపు రెండు గంటలపాటు కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, టీడీపీ దర్శి ఇన్చార్జ్ గొట్టిపాటి లక్ష్మి జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.శ్రీనివాసులు ఉన్నారు.నారపుశెట్టికి అవమానం దర్శి నియోజకవర్గంలో టీడీపీకి పెద్ద దిక్కులా ఉన్న మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావుకు, ఆయన సోదరుడు నగర పంచాయతీ చైర్మన్ నారపు శెట్టి పిచ్చయ్యకు చంద్రబాబు పర్యటనలో అవమానం ఎదురైంది. మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావును చంద్రబాబు వాహనంలోకి ఎక్కనివ్వలేదు. అలాగే హెలిపాడ్ వద్ద పిచ్చయ్యను చంద్రబాబును కలిసేందుకు అవకాశం కల్పించలేదు. దీంతో నారపుశెట్టి పాపారావు అభిమానులకు విషయం తెలిసి భగ్గుమంటున్నారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీలోనే ఉన్న పాపారావును సీఎం వాహనం ఎక్కనివ్వకపోవడం దర్శి నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. సీఎం పాల్గొన్న కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అవడంపై కార్యకర్తల్లో అసంతృప్తి మంచాలతో డ్రామా సెట్టింగులు పల్లె వాతావరణం తీసుకురావాలనే ప్రయత్నం బెడిసికొట్టిన వైనం ఇదేం కార్యక్రమమంటూ ముక్కున వేలేసుకున్న రైతులు, టీడీపీ కార్యకర్తలు ప్రసంగంలో దర్శి అభివృద్ధి ఊసే ఎత్తని చంద్రబాబుబాబు సభలో కార్యకర్తలు ఎక్కి తొక్కడంతో విరిగిపోయిన మంచాలు -
భార్య గొంతు కోసిన భర్త
● కుటుంబ కలహాల నేపథ్యమే కారణం పెద్దదోర్నాల: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ భర్త తన భార్య గొంతు కోశాడు. ఈ సంఘటన మండల పరిధిలోని పెద్దబొమ్మలాపురం పడమటపల్లెలో శనివారం జరిగింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన వివాహిత మల్లేశ్వరి తీవ్రంగా గాయపడింది. స్థానికుల సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రురాలిని 108లో మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని పెద్ద బొమ్మలాపురానికి చెందిన స్వేచ్ఛకుమార్, మల్లేశ్వరి దంపతులు. స్వేచ్ఛకుమార్ గతంలో కొన్నాళ్లు హోంగార్డుగా విధులు నిర్వహించాడు. కొన్ని కారణాల రీత్యా విధుల నుంచి పోలీసు అధికారులు తప్పించారు. ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి. ఆమె అదే గ్రామంలో ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లి అక్కడే ఉంటోంది. గ్రామ సమీపంలో ఉన్న కొండ వద్దకు బహిర్భూమికి వెళ్లిన మల్లేశ్వరిని అటకాయించిన స్వేచ్ఛకుమార్ కత్తితో ఆమె గొంతు కోసి పరారైనట్లు పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
తిరోగమనం వైపు విద్యా వ్యవస్థ
రెండు ఓట్లు కలిగి ఉండటం నేరంఒంగోలు సబర్బన్: రెండు ఓట్లు కలిగి ఉండటం చట్ట ప్రకారం నేరమని ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న అన్నారు. ఒంగోలు ఆర్డీఓ కార్యాలయంలోని తన ఛాంబర్లో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పొలిటికల్ పార్టీ ప్రతినిధులతో శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎలక్షన్ కమీషన్ యాక్ట్ ప్రకారం సెక్షన్..31, ఆర్పీఏ–1950 ప్రకారం రెండు ఓట్లు కలిగిఉన్న వారిపై ఒక ఏడాది జైలు శిక్ష లేదా లక్ష రూపాయలు జరిమానా విధిస్తారన్నారు. ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతినెలా నియోజకవర్గ స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతినిధుల సలహాలు, సూచనలు తీసుకుంటున్నామని తెలిపారు. ఒంగోలు నియోజకవర్గంలో రెండేసి ఓట్లు కలిగిన వారు వెంటనే ఒక ఓటును రద్దు చేసుకోవాలన్నారు. మీరు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో అక్కడ మాత్రమే ఓటును కలిగి ఉండాలని తెలిపారు. రెండో ఓటును వెంటనే రద్దు చేసుకోకపోతే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నేరంగా పరిగణిస్తారన్నారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారన్నారు. వెంటనే రెండో ఓటును తొలగించుకోవాలని ఒంగోలు నియోజకవర్గంలోని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఓటుకు ఆధార్ అనుసంధానం చేసుకోని వారు ఆధార్ అనుసంధానం వెంటనే చేసుకోవాలని కోరారు. 18 ఏళ్లు నిండిన యువత ఓట్లు నమోదు చేసుకోవాలని కోరారు. ఒంగోలు నియోజకవర్గంలోని పోలింగ్ బూత్లలో 1200 ఓట్ల కంటే ఎక్కువ కలిగిన పోలింగ్ బూత్లోని ఓట్లను పక్కనే ఉన్న వేరే పోలింగ్ స్టేషన్కు మారుస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో లొకేషన్ చేంజ్ 12 పోలింగ్ బూతులు, కొత్తగా ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లు 12 వరకు పెరుగుతాయని మొత్తం పోలింగ్ స్టేషన్లు ఒంగోలు నియోజకవర్గంలో 271 ఏర్పడతాయని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రతినిధి దామరాజు క్రాంతికుమార్ మాట్లాడుతూ ఒంగోలు నియోజకవర్గంలో ఎన్నికల నియమ నిబంధనలకు విరుద్ధంగా రెండేసి ఓట్లు కలిగిన ఓటర్లు దాదాపుగా 30 నుండి 35 వేల మంది ఉన్నారని ఇటువంటి ఓటర్ల వల్ల ఎన్నికల వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోతుందని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో అన్ని పొలిటికల్ పార్టీల ప్రతినిధులు, అధికారులు ఒంగోలు కృష్ణ మోహన్, సుధాకర్, బాబురావు, రాంభూపాల్ రెడ్డి, పద్మజ, నాయుడు, శేషుబాబుతో పాటు పలువురు పాల్గొన్నారు.ఒంగోలు సిటీ: విద్యా వ్యవస్థను తిరోగమనం వైపు నెడుతున్న కూటమి ప్రభుత్వానికి పతనం తప్పదని ఫ్యాప్టో రాష్ట్ర నాయకత్వం హెచ్చరించింది. ఫ్యాప్టో రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు శనివారం స్థానిక ప్రకాశం భవన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఫ్యాప్టో చైర్మన్ కె.ఎర్రయ్య అధ్యక్షతన నిర్వహించిన ధర్నాలో ఉపాధ్యాయ, ఎంఈఓ, పెన్షనర్ల సంఘాల నేతలు పలువురు పాల్గొని మాట్లాడారు. బోధనేతర పనుల నుంచి ఉపాధ్యాయులను పూర్తిస్థాయి విముక్తులను చేస్తామని, మెరుగైన పీఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చిన మంత్రి లోకేష్.. కనీసం ఉపాధ్యాయ సంఘ నేతలకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడంపై మండిపడ్డారు. ఎంఈఓల రాష్ట్ర సంఘ నేతలు తొలిసారిగా ధర్నాలో పాల్గొని సంపూర్ణ మద్దతు ప్రకటించగా, ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ ఎస్ఎండీ రఫీ ధర్నాను ప్రారంభించారు. ఎంఈఓల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.కిషోర్బాబు మాట్లాడుతూ విద్యార్థులకు పాఠాలు చెప్పడం మానివేసి వారికి పెట్టిన తిండి లెక్కలు తేల్చడానికి ఉపాధ్యాయులు సమయం వెచ్చించాల్సి రావడం విచారకరమన్నారు. ఎంఈఓ, హెచ్ఎం, డిప్యూటీ డీఈఓ ప్రమోషన్ల ప్రక్రియలో కామన్ సర్వీస్ రూల్స్ అమలుకు ఉన్న అడ్డంకులు తొలగించాలని డిమాండ్ చేశారు. సీనియర్ ఉపాధ్యాయులచే ఖాళీగా ఉన్న డిప్యూటీ డీఈఓ, డైట్ కాలేజీ లెక్చరర్లు, ఎంఈఓల పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వీరాంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలు ఉపాధ్యాయులను బోధనకు దూరం చేసేలా ఉండటం విచారకరమన్నారు. ఉపాధ్యాయులను గిన్నిస్ బుక్ రికార్డు కోసం యోగాంధ్ర, మెగా పీటీఎం వంటి ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలు అమలు చేసే వారుగా మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 మంది విద్యార్థులున్న ప్రత్యేక పాఠశాలల్లో ఉపాధ్యాయులు కాపలాదారుగా పనిచేయాల్సి రావడం విద్యా వ్యవస్థకే తీరని అవమానమని అన్నారు. బోధన వ్యవస్థకు ఆటంకం కలిగిస్తున్న యాప్లను పూర్తిగా రద్దు చేయాలని, ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని, తదితర 19 డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీటీఏ జిల్లా అధ్యక్షుడు పర్రె వెంకట్రావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థను తిరోగమనం వైపు నెడుతోందని దుయ్యబట్టారు. మరో పదేళ్లలో ప్రభుత్వ బడులు లేకుండా చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఉపాధ్యాయుల సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపాలి... ఎంఈఓల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎన్.నాగేంద్రవదన్ మాట్లాడుతూ సమాజాన్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయులు లేనిదే సమాజం లేదని, అటువంటి ఉపాధ్యాయుల సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపాలని హితవు పలికారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు సీహెచ్ మంజుల మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులను సీఎం, మంత్రులు నిర్లక్ష్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. హెచ్ఎంల అసోసియేషన్ జిల్లా కార్యదర్శి వై.వెంకటరావు, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎస్కే అబ్దుల్ హై, బి.వెంగళరెడ్డి, ఏపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు పీవీ సుబ్బారావు మాట్లాడుతూ ఎంఈఓ–1 పోస్టుల భర్తీకి తీసుకున్న జీవోను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. జెడ్పీ, గవర్నమెంట్ మేనేజ్మెంట్లలో సంయుక్త సీనియారిటీ ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు టీసీహెచ్ సుబ్బారావు, ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కంచర్ల సుబ్బారావు పాల్గొని వారి సంఘాల తరఫున మద్దతు ప్రకటించారు. ఫ్యాప్టో భాగస్వామ్య సంఘాల నాయకులు డి.శ్రీనివాసులు (ఏపీటీఎఫ్–257), బి.వెంకట్రావు(ఏపీటీఎఫ్ 1938), చల్లా శ్రీనివాసులు, ఎస్.రవి, ఎన్.చిన్నస్వామి, వి.మాధవరావు, డి.జయరావు, జీఎండీ సనాఉల్లా, వి.జనార్దనరెడ్డి (ఏపీటీఎఫ్ 257), కె.శ్రీనివాసరావు, పరిటాల సుబ్బారావు, అట్లూరి అమ్మయ్య, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న కూటమి ప్రభుత్వ విధానాలే కారణం బోధనకు దూరమవుతున్న ఉపాధ్యాయులు ఫ్యాప్టో ధర్నాలో పలువురు ఉపాధ్యాయ సంఘ నేతల ఆందోళన తొలిసారి ఎంఈఓ అసోసియేషన్ సంఘీభావం -
విద్యుదాఘాతానికి రైతు బలి
పొదిలి రూరల్: పొలంలో వ్యవసాయ విద్యుత్ బోరుకు సంబంధించిన పనులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై రైతు మృతి చెందాడు. ఈ సంఘటన పొదిలి మండలం అన్నవరంలో శనివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన యర్రంరెడ్డి చెన్నారెడ్డి (55) తన పొలంలో ఉన్న విద్యుత్ బోరుకు మరమ్మతులు చేస్తున్నాడు. బోరులోకి పైపులు దించే క్రమంలో పైన పొలాలకు సరఫరా చేసే 11కేవీ విద్యుత్ వైర్లు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు చెన్నారెడ్డికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పొదిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
జగన్ 2.0లో కార్యకర్తలకే ప్రాధాన్యం
చీమకుర్తి: టీడీపీ, బీజేపీ, జనసేనతో పాటు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా 2029లో ముఖ్యమంత్రి అయ్యేది వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం చీమకుర్తిలోని బూచేపల్లి కల్యాణ మండపంలో వైఎస్సార్ సీపీ చీమకుర్తి మండల స్థాయి కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. బూచేపల్లి శివప్రసాదరెడ్డితో పాటు పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ 2029లో కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2.0 పరిపాలనలో పార్టీ నాయకులు, కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యం ఇస్తారంటూ కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు తన సొంత జిల్లాను వదిలిపెట్టి సంతనూతలపాడు నియోజకవర్గానికి వచ్చిన మేరుగు నాగార్జునను వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిపించేందుకు ప్రతిఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారు... మేరుగు నాగార్జున మాట్లాడుతూ పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పొదిలిలో నిర్వహించిన కార్యక్రమానికి 50 వేల మంది రైతులు హాజరైతే.. వారిపై చంద్రబాబు ప్రభుత్వం కేసులు పెట్టిందని, కానీ, ఇప్పుడు వచ్చి అన్నదాత సుఖీభవ అంటూ రైతుల పట్ల చంద్రబాబు మొసలికన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశాడు. ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్ పథకాలతో పాటు 134 హామీలతో ప్రజలను మోసం చేసి చంద్రబాబు సీఎం అయ్యారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనా కాలంలో ప్రజలకు పార్టీలకతీతంగా ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారో, ఇప్పుడు చంద్రబాబు ఏడాది పాలనలో ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారో తేల్చుకుందామని, బహిరంగ చర్చకు సిద్ధమా..? అని కూటమి నేతలకు సవాల్ విసిరారు. జగన్ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను గడప గడపకు అందిస్తే ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. ఇప్పుడు చంద్రబాబు పథకాలేమీ అమలు చేయకుండానే సుపరిపాలనకు తొలి అడుగు అంటూ ప్రజల్లో వెళ్తే ప్రజలు మొహం చాటేస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ పిలుపు మేరకు బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ పేరుతో సంతనూతలపాడు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ సూపర్ సిక్స్, ఆడబిడ్డ నిధి పథకాలను ఎగ్గొట్టి ప్రజలను చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. సమావేశం అనంతరం బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీకి సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు. అనంతరం బూచేపల్లి శివప్రసాదరెడ్డి, బూచేపల్లి వెంకాయమ్మ, మేరుగు నాగార్జునను పార్టీ నాయకులు గజమాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నం శ్రీధర్, ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్పర్సన్ గోపురపు రాజ్యలక్ష్మి, పార్టీ చీమకుర్తి పట్టణ అధ్యక్షుడు క్రిష్టిపాటి శేఖరరెడ్డి, మండల రూరల్ అధ్యక్షుడు పమిడి వెంకటేశ్వర్లు, నాయకులు గోపిరెడ్డి ఓబుల్రెడ్డి, చిన్నపురెడ్డి మస్తాన్రెడ్డి, మొగిలిశెట్టి వెంకటేశ్వర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తల సమావేశంలో బూచేపల్లి శివప్రసాదరెడ్డి, వెంకాయమ్మ, మేరుగు నాగార్జున పొగాకు రైతులపై కేసులు పెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు అన్నదాత సుఖీభవ అంటున్నాడని ధ్వజం -
గొర్రెలు, మేకల పెంపకం సంఘానికి అన్యాయం
సంతమాగులూరు (అద్దంకి): కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్నా గొర్రెలు, మేకల పెంపకం సంఘానికి రూపాయి కేటాయించలేదని గొర్రెలు, మేకల సంఘ రాష్ట్ర కార్యదర్శి పెద్దబ్బాయి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘ 7వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని రాష్ట్ర కార్యదర్శి కిలారి పెద్దబ్బాయి పిలుపునిచ్చారు. అందులో భాగంగా శనివారం బాపట్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బల్లికురవ, సంతమాగులూరు మండలాల్లోని కొప్పెరపాడు, ఎస్ఎల్ గుడిపాడు, ఎంకే పాలెం, మామిళ్లపల్లి తదితర గ్రామాల్లో పర్యటించి మహాసభల కరపత్రాలు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ ఆగస్టు 17 ,18వ తేదీల్లో ఒంగోలులో రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వృత్తి రక్షణ, వృత్తిదారుల సంక్షేమం కోసం మహాసభల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెంపకందార్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి సమగ్ర కార్యాచరణ ప్రకటించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయానికి అనుబంధంగా గొర్రెల పెంపకం ప్రధానమైన జీవనాధారంగా ఉందని గుర్తు చేశారు. రాష్ట్రంలో రెండు కోట్ల 21 లక్షల గొర్రెలు, మేకల సంపద, ఐదు వేలకు పైగా పెంపకందార్ల సహకార సంఘాలు, సుమారు నాలుగు లక్షల కుటుంబాలకుపైగా ఈ రంగంపై ఆధారపడి బతుకుతున్నాయన్నారు. గ్రామీణ స్థాయి సొసైటీల్లో జిల్లా స్థాయిలో యూనియన్లు, రాష్ట్రాల్లో ఫెడరేషన్ ఏర్పాటు చేసినా వాటికి తగిన నిధులు ప్రభుత్వాలు కేటాయింపులు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మానవ సమాజానికి బలమైన నాణ్యమైన, పౌష్టికాహారం అందిస్తున్న కీలకమైన రంగాన్ని ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం అన్యాయన్నారు. బీమా పథకాలు సరిగా అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఫారెస్ట్ అధికారులు గొర్రెలను అడవిలోకి రానివ్వకపోయినా పశువుల పోరంబోకు భూములు, కుంటలు, దారులు ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. మందులు, టీకాలు, డీ వార్మింగ్ కోసం బడ్జెట్లో నిధులు పెంచాల్సిన అవసరం ఉందని, నా బార్డు ద్వారా 50 శాతం సబ్సిడీ రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలన్నారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి తోట తిరుపతిరావు, రాష్ట్ర బాధ్యులు పూసపాటి వెంకట్రావు, బాపట్ల జిల్లా సంఘ కార్యదర్శి బుర్రి ఆంజనేయులు, చిమట సైదులు, పెద సింగరయ్య పాల్గొన్నారు. -
జిల్లాకు రిక్త హస్తం చూపించిన బాబు
ఒంగోలు సిటీ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా ప్రజలకు రిక్తహస్తం చూపించారని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. శనివారం నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ జిల్లాకు చంద్రబాబు వస్తుంటే పొగాకు రైతుల కోసం ఏదైనా ప్రకటన చేస్తారేమోనని ఆశగా చూశారని, తీరా సినిమా సెట్టింగ్ వేసుకుని వెళ్లిపోవడంతో నిరుత్సాహానికి గురయ్యారన్నారు. జిల్లాలో పొగాకు రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్న పరిస్థితి నెలకొని ఉందని, వేలం కేంద్రాల్లో ధర రాకపోవడం, ఎక్కువగా తిరస్కరణ బేళ్లు ఉండటంతో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు. వారిని ఆదుకోవడం మానేసి రైతులకు అన్నీ చేస్తున్నామని అబద్ధాలు చెప్పడం సరికాదన్నారు. సంక్షేమ పథకాలు అందించిన జగన్మోహన్రెడ్డిని జనం ఒక దైవంలా చూసుకుంటున్నారని, అది చూసి ఓర్వలేక ఆయనపై బురదజల్లే కార్యక్రమాలు చేయడం మంచిది కాదన్నారు. ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్తో పాటుగా ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రసంగంలో దొనకొండ పారిశ్రామికవాడ ఊసే లేదన్నారు. డిగ్రీ కళాశాల ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. ఇసుక, మట్టి దోపిడీ, మద్యం, రేషన్ బియ్యం మాఫియాలు, తాజాగా చేపలు చెరువుల వద్ద నుంచి వసూలు చేస్తూ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. మీరు సమావేశం పెట్టుకున్న పక్కనే ఒక రైతు ఇంటిపై మీ నియోజకవర్గ ఇన్చార్జి దౌర్జన్యానికి పాల్పడిందని, దీనికి మీరు ఏం సమాధానం చెబుతారని చంద్రబాబును ప్రశ్నించారు. పోలీసులను, అధికారులను అడ్డం పెట్టుకుని నియోజకవర్గ ప్రజలను ఇబ్బందులు పెడుతోందన్నారు. రైతులకు మేలుచేసిన రైతు భరోసా కేంద్రాలు తిరిగి పనిచేసేలా చూడాలని బూచేపల్లి డిమాండ్ చేశారు. మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ మేరుగు నాగార్జున మాట్లాడుతూ తల్లికి వందనం కార్యక్రమంలో లక్షలాది మంది లబ్ధిదారులకు డబ్బులు ఇవ్వకుండా ముంచేశారన్నారు. ‘‘నాడు వ్యవసాయం దండుగ అన్నారు. నేడు రైతు పక్షపాతిగా ఉండే ప్రసక్తే లేదు’’ అని చంద్రబాబు అంటున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయకుండా మోసం చేశారన్నారన్నారు. వెలుగొండను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. సంక్షేమశాఖ మంత్రి సొంత జిల్లా, చీమకుర్తి పట్టణంలో సంక్షేమ హాస్టల్లో ఉంటున్న బాలిక వెంట్రుకలను కోసేశారని, దీనికి మంత్రి ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నేం శ్రీధర్బాబు, వైఎస్సార్ సీపీ నాయకులు బెజవాడ రాము, కోటిరెడ్డి, సుధాకర్, ఓబుల్రెడ్డి, అన్వేష్, చెంచిరెడ్డి, శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి -
బిర్యానీ రేటు దగ్గర గొడవ
ఒంగోలు టౌన్: నగరంలో మందుబాబులు రెచ్చిపోతున్నారు. పీకలదాకా తాగి గొడవలకు దిగుతున్నారు. ఇటీవల త్రోవగుంట రోడ్డులోని ఒక రెస్టారెంటులో మద్యం బాబులు గొడవకు దిగగా.. శుక్రవారం సౌత్ బైపాస్లో రెచ్చిపోయారు. నగరంలోని ప్రగతి నగర్కు చెందిన కొందరు యువకులు సౌత్ బైపాస్లో రోడ్డు పక్కన బీఫ్ బిర్యానీ పాయింట్ దగ్గరకు వచ్చారు. బిర్యానీ తిన్న తరువాత రేటు విషయంలో నిర్వాహకురాలు మరియమ్మతో గొడవ పెట్టుకున్నారు. ఈ తతంగాన్ని గమనిస్తున్న అక్కడున్న వెల్డింగు షాపు నిర్వాహకుడు తంగిరాల ఏసురత్నం కల్పించుకున్నాడు. మహిళతో దురుసుగా ప్రవర్తించడం సరికాదని హితవు పలికాడు. దాంతో మద్యం మత్తులో వున్న యువకులు రెచ్చిపోయారు. మాకే నీతులు చెబుతావా అంటూ గొడవకు దిగారు. స్నేహితులతో వచ్చి ఏసురత్నం మీద దాడి చేశారు. గాయపడిన ఏసురత్నాన్ని ఒంగోలు జీజీహెచ్కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ గొడవకు సంబంధించిన వీడియో సామాజిక మాద్యమాల్లో పెద్ద ఎత్తున ట్రోల్ అవుతోంది. -
నైరాశ్యమే!
నమ్మినోళ్లకుఎన్నికల వేళ ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చని చంద్రబాబు ● గద్దెనెక్కిన 14 నెలల తర్వాత తొలిసారి దర్శి మండలంలో పర్యటన ● బాబు హామీలను గుర్తు చేసుకుంటున్న నియోజకవర్గ ప్రజలు ● గత ఏడాది ఆయకట్టుకు సాగు నీరందక ఎండిన పంటలు ● నష్ట పరిహారం కింద అన్నదాతలకు పైసా విదల్చని సర్కారు ● దొనకొండకు రాని పరిశ్రమలు.. నిరుద్యోగుల ఉసూరు‘నేను మారాను.. మీకంతా మంచే చేస్తాను. దొనకొండలో పరిశ్రమలు స్థాపిస్తా.. నిరుద్యోగులకు ఉద్యోగాలొచ్చే వరకు భృతి అందజేస్తా.. ఎంఎస్ఎంఈ ప్రాజెక్టును పునరుద్ధరిస్తా.. హైవే బ్రిడ్జిలు నిర్మిస్తా.. సాగర్ ఆయకట్టులో మూడు పంటలు పండించుకునేలా సాగునీరు సరఫరా చేస్తా.. తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి ఇంటింటికీ తాగునీరు అందిస్తా..’ ఇవీ గత ఏడాది సార్వత్రిక ఎన్నికల వేళ దర్శి నియోజకవర్గ ప్రజలకు ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు ఇచ్చిన హామీలు. ఇవి కాకుండా కూటమి మేనిఫెస్టోలో సూపర్ సిక్స్తోపాటు మొత్తం 140కి పైగా హామీలు గుప్పించి ఇంటింటికీ కరపత్రాలు పంపిన చంద్రబాబు.. తీరా గద్దెనెక్కిన తర్వాత అమలు సంగతి మరిచారు. హామీలు అమలు చేస్తారని చంద్రబాబును నమ్మిన ప్రజలకు చివరకు మిగిలింది నైరాశ్యమే. అధికారం చేపట్టిన తర్వాత సీఎం హోదాలో తొలిసారి దర్శి పర్యటనకు వస్తున్న చంద్రబాబునాయుడు హామీలపై పెదవి విప్పుతారో.. ఎప్పటిలాగే నాలుక మడతేస్తారోనని నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శి: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా 2024 మే 4వ తేదీన దర్శి పర్యటనకు వచ్చిన చంద్రబాబు ఇబ్బడిముబ్బడిగా హామీలు గుప్పించారు. కానీ వాటిలో ఒక్కటంటే ఒక్క హామీని కూడా అమలు చేసిన దాఖలాలు లేవు. దొనకొండలో ఇండస్ట్రియల్ టౌన్షిప్ ఏర్పాటు చేస్తామని, పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, తద్వారా నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తామని నమ్మబలికిన చంద్రబాబు ఇక్కడ ఒక్క పరిశ్రమనూ నెలకొల్పే దశగా చర్యలు తీసుకోలేదు. పైగా నిరుద్యోగులకు రూ.3 వేల చొప్పున ఇస్తామన్న భృతినీ తొలి ఏడాదే ఎగ్గొట్టారు. 2014–19 మధ్య ఐదేళ్లపాటు పాడిన పాటనే చంద్రబాబు గత ఏడాది సార్వత్రిక ఎన్నికల మరళా పాడారు. కానీ అభివృద్ధికి అన్ని వనరులు ఉన్న దొనకొండను మాత్రం పట్టించుకోలేదు. రైతులకు దగా గోదావరి–కృష్ణా నదులను అనుసంధానం చేసి సాగర్ కాలువల ద్వారా మూడు పంటలకు నీరు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఆయకట్టు పరిదిలో కనీసం ఒక పంటకు కూడా గతేడాది నీరు అందించలేదు. శనివారం చంద్రబాబు పర్యటిస్తున్న తూర్పు వీరాయపాలెం గ్రామంలోని పొలాలకు సైతం పూర్తి స్థాయిలో ఒక పంటకు కూడా నీరివ్వలేదు. గతేడాది సాగర్ ఆయకట్టు పరిధిలోని ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో నీరు అందక మొక్కజొన్న పంట ఎండిపోయింది. అలాగే అకాల వర్షాల కారణంగా వరి, సజ్జ, గుమ్మడి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. ఆయా పంటలను మంత్రులు, కలెక్టర్ పరిశీలించి వెళ్లారే కానీ పంట నష్టపోయిన రైతులకు పైసా విదిల్చిన పాపాన పోలేదు. పరిశ్రమలు హుళక్కేనా? రాగముక్కపల్లిలో రూ.7 కోట్ల నిధులతో ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్ పునఃప్రారంభిస్తామని, చందవరం వద్ద రూ.6 కోట్లతో ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తామన్న హామీలు నెరవేర్చే దిశగా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనులు సైతం నత్తనడకన సాగుతున్నాయి. కేంద్రంలో కూటమి పార్టీనే అధికారంలో ఉన్నప్పటికీ గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులే కానీ ఈ ఏడాది కిలోమీటర్ ట్రాక్ కూడా నిర్మించలేదు. దర్శి నుంచి శ్రీకాళహస్తి వరకు పనులన్నీ ఆగిపోయాయి. పెద్ద ఉయ్యాలవాడలో ముసి నదిపై వంతెన, దోర్నపు వాగుపై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం సంగతినే మరిచారు. ● గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణ పనులు ప్రారంభమైన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పనులను పరుగెత్తిస్తామని, అభివృద్ధికి తొలి అడుగు అక్కడ నుంచేనని టీడీపీ ఇన్చార్జ్ గొట్టిపాటి లక్ష్మి ఇచ్చిన హామీకి ఇంత వరకు అతీగతి లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అధికారులను పిలిపించి డ్రైవింగ్ స్కూల్ పనులపై చర్చించడం మినహా గడిచిన 13 నెలలుగా అటువైపు కన్నెత్తి చూడలేదు. గత ప్రభుత్వంలో చేపట్టిన నిర్మాణాలు, భవనాలకు వేసిన పిల్లర్లు అలాగే దర్శనమిస్తున్నాయి. తాగునీటికీ దిక్కులేదుదర్శి నియోజకవర్గంలో ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేస్తామన్న హామీ నీటి మూటగా మారింది. ప్రస్తుతం ఎన్ఏపీ రిజర్వాయర్ నుంచి తాగునీరు శుద్ధి చేయకుండా నేరుగా పైప్లైన్ల ద్వారా వదులుతున్నారు. అవి తాగిన ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఆ నీటిని కూడా వారం, పది రోజులకు ఒకసారి వదులడం గమనార్హం. కొన్ని గ్రామాలకు 15 రోజులకు కూడా నీరు సరఫరా కావడం లేదు. గత ప్రభుత్వంలో అమృత్ 2.0 పథకంలో భాగంగా దర్శి నగర పంచాయతీకి రూ.121 కోట్లతో నూతన పైప్లైన్లు, ఇంటింటికీ తాగునీటి కుళాయిలు మంజూరు చేశారు. ఆ పనులను జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ప్రారంభించారు. అయితే కూటమి అధికారంలోకి రాగానే అమృత్ పనులను నిలిపివేశారు. గుండ్లకమ్మ ఎగువ నీటిని తాళ్లూరు మండలం మల్కాపురం వద్ద లిఫ్ట్ చేసుకుని మండ్లమూరు, తాళ్లూరు మండలాలకు తాగునీరు ఇస్తామన్న హామీని ఇంతవరకు పట్టించుకోలేదు. తాళ్లూరు మండలంలోని మొగిలిగుండాల రిజర్వాయర్ పనులు పరుగులు పెట్టిస్తానని ప్రజలకు ఇచ్చిన హామీని సైతం గాలికొదిలేశారు. అక్రమాలపై ఆరాతీస్తారా? దర్శి నియోజకవర్గంలో అభివృద్ధిని గాలికొదిలేసి కూటమి నేతలు యథేచ్ఛగా దందాలు చేస్తున్నారు. ముండ్లమూరు మండలం చిలకలేరులో ఇసుకను జేసీబీలతో తవ్వి టన్ను రూ.1230కు తెగనమ్మారు. టర్బో లారీల్లో ఇతర ప్రాంతాలకు సైతం ఇసుక తరలించి సొమ్ము చేసుకున్నారు. భవన నిర్మాణదారులకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని దర్శి గడియారం స్తంభం సెంటర్ సాక్షిగా హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇక్కడ జరుగుతున్న ఇసుక దందాపై స్పందిస్తారా అనేది ప్రశ్నార్థకమే. గ్రామాలు, పట్టణాల్లో విచ్చలవిడిగా వెలసిన బెల్టు షాపులు, సమయ పాలన లేకుండా బార్ అండ్ రెస్టారెంట్లలో మద్యం విక్రయాలు, అడ్డగోలుగా గ్రావెల్ తవ్వకాలపై చంద్రబాబు ఆరా తీస్తారా లేదా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. -
పట్టపగలు దొంగల హల్చల్
● సుమారు 10 సవర్ల బంగారం చోరీ సింగరాయకొండ: పట్టపగలే ఓ ఇంటి తాళం పగలకొట్టి చోరీకి పాల్పడి పోలీసులకు దొంగలు సవాల్ విసిరారు. సుమారు 10 సవర్ల బంగారం అపహరించారు. ఈ ఘటన సింగరాయకొండ మండల కేంద్రంలోని చేపల మార్కెట్ సమీపంలో ఉన్న అంబేడ్కర్ నగర్–4వ లైన్లో శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఇంటి యజమాని బండి కృష్ణవేణి గుడ్లూరు మండలం పెదపవనిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో లెక్చరర్గా పనిచేస్తోంది. ఆమె భర్త వెంకటేశ్వర్లు ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు. శుక్రవారం ఉదయం భార్యభర్తలిద్దరూ కలిసి గురుకుల పాఠశాలకు కారులో వెళ్లారు. అయితే, మధ్యాహ్నం 2 గంటల సమయంలో కూడా తాళం వేసి ఉండటాన్ని ఆ ఇంటి పైపోర్షన్లో అద్దెకు ఉండేవారు చూశారు. కానీ, సాయంత్రం 4.30 గంటలకు తాళం పగలకొట్టి ఉండటాన్ని గమనించి వెంటనే చోరీ జరిగిన సమాచారాన్ని కృష్ణవేణికి తెలిపారు. వారు ఇంటికొచ్చి చూడగా బీరువాలోని దుస్తులు చిందరవందరగా పడి ఉన్నాయి. సుమారు 10 సవర్ల బంగారం చోరీ అయిందని గుర్తించారు. ఇంకా ఎంత మొత్తం చోరీ జరిగిందనే దానిపై ఫిర్యాదు ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్తో సంఘటన స్థలాన్ని పరిశీలించి పోలీసులు ఆధారాలు సేకరించారు. బిర్యానీ రేటు దగ్గర గొడవ ● రెచ్చిపోయిన మందుబాబులు ఒంగోలు టౌన్: నగరంలో మందుబాబులు రెచ్చిపోతున్నారు. పీకలదాకా తాగి గొడవలకు దిగుతున్నారు. ఇటీవల త్రోవగుంట రోడ్డులోని ఒక రెస్టారెంటులో మద్యం బాబులు గొడవకు దిగగా.. శుక్రవారం సౌత్ బైపాస్లో రెచ్చిపోయారు. నగరంలోని ప్రగతి నగర్కు చెందిన కొందరు యువకులు సౌత్ బైపాస్లో రోడ్డు పక్కన బీఫ్ బిర్యానీ పాయింట్ దగ్గరకు వచ్చారు. బిర్యానీ తిన్న తరువాత రేటు విషయంలో నిర్వాహకురాలు మరియమ్మతో గొడవ పెట్టుకున్నారు. ఈ తతంగాన్ని గమనిస్తున్న అక్కడున్న వెల్డింగు షాపు నిర్వాహకుడు తంగిరాల ఏసురత్నం కల్పించుకున్నాడు. మహిళతో దురుసుగా ప్రవర్తించడం సరికాదని హితవు పలికాడు. దాంతో మద్యం మత్తులో వున్న యువకులు రెచ్చిపోయారు. మాకే నీతులు చెబుతావా అంటూ గొడవకు దిగారు. స్నేహితులతో వచ్చి ఏసురత్నం మీద దాడి చేశారు. గాయపడిన ఏసురత్నాన్ని ఒంగోలు జీజీహెచ్కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ గొడవకు సంబంధించిన వీడియో సామాజిక మాద్యమాల్లో పెద్ద ఎత్తున ట్రోల్ అవుతోంది. -
కృష్ణమ్మ పరవళ్లతో పారవశ్యం..!
● శ్రీశైలం డ్యాంకు పెరిగిన సందర్శకులు ● పెద్దదోర్నాల గణపతి ఫారెస్టు చెక్పోస్టు వద్ద అధిక సంఖ్యలో వాహనాలు పెద్దదోర్నాల: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదికి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులో 8 గేట్లను ఎత్తి దిగువనున్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం డ్యాంను సందర్శించేందుకు, శ్రీశైలం మల్లన్నను దర్శించుకునేందుకు పర్యాటకులు, భక్తులు భారీగా శ్రీశైలం తరలివెళ్తున్నారు. దీంతో పాటు శ్రావణ శుక్రవారం కావడంతో అధిక సంఖ్యలో వాహనాలలో భక్తులు శ్రీశైలం పుణ్యక్షేత్రానికి తరలివెళ్లారు. శుక్రవారం పెద్దదోర్నాల మండల పరిధిలోని నల్లమల ఘాట్ రోడ్లలో వాహనాల రద్దీ మరింత పెరిగింది. ఒకవైపు మల్లన్న కొలువుదీరిన శ్రీశైలం పుణ్యక్షేత్రం భక్తులకు కొంగుబంగారంగా వెలుగొందుతుండగా.. మరోవైపు భ్రమరాంభా మల్లికార్జునుల పాదపద్మాలను స్పృశిస్తూ ప్రవహించే కృష్ణా నదిపై నల్లమల అభయారణ్యంలో నిర్మించిన బహుళార్థక నీలం సంజీవరెడ్డి శ్రీశైలం హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదలడం మరింత శోభను చేకూరుస్తోంది. వీటన్నింటికీ నల్లమల అందాలు తోడయ్యాయి. ఇటీవల డ్యాం ఎగువ భాగంలో కురిసిన భారీ వర్షాలకు శ్రీశైలం డ్యాంకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. డ్యాంకు వరద ప్రవాహం అధికంగా ఉండటంలో నాలుగు రోజులుగా డ్యాం గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో డ్యాం వద్ద నీరు దిగువకు జాలువారుతున్న సుందర దృశ్యాలను చూసేందుకు సందర్శకులు భారీగా శ్రీశైలం డ్యాంసైట్కు తరలివెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్దదోర్నాల మండల పరిధిలోని నల్లమల ఘాట్రోడ్డులో, గణపతి ఫారెస్టు చెక్పోస్టు వద్ద వాహనాలతో రద్దీ వాతావరణం నెలకొంది. దీంతో పాటు కొద్దిరోజులుగా నల్లమల అటవీప్రాంతంలో వర్షాలు కురుస్తుండటంతో చెట్లన్నీ చిగురించి పచ్చదనంతో పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. ఈ దృశ్యాలన్నీ చూసేందుకు పలు ప్రాంతాలకు చెందిన సందర్శకులు ప్రత్యేక వాహనాలలో శ్రీశైలం తరలివెళ్తుండటంతో రద్దీ ఏర్పడింది. -
ప్రభుత్వ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి
● క్షయ వ్యాధిగ్రస్తులతో జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ వాణిశ్రీ ఒంగోలు టౌన్: కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి నిక్షమ్ పోషణ యోజన కింద క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహారం కోసం ప్రతి నెలా రూ.1000 బ్యాంకులో జమ చేస్తోందని జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ వాణిశ్రీ తెలిపారు. దాంతోపాటుగా దాతల సహాయంతో కూడా పోషకాహారాన్ని అందజేస్తున్నట్లు చెప్పారు. వ్యాధిగ్రస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక కోడేవీధిలోని మస్జిద్లో టీబీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాపాకాలనీ అర్బన్ వైద్యశాల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రంగకుమార్ యాదవ్ మాట్లాడుతూ రెండు వారాల కంటే ఎక్కువగా జ్వరం రావడం, విడవకుండా దగ్గు వేధించడం, చాతిలో నొప్పి, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ వైద్యులను సంప్రదించాలని చెప్పారు. మద్యపానం, ధూమపానం చేసే వ్యక్తులు, మధుమేహంతో బాధపడేవారు, పోషకాహార లోపం కలిగిన వారు ఎక్కువగా క్షయవ్యాధి బారినపడే ప్రమాదం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని క్షయవ్యాధిగ్రస్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పీపీఎం కోటేశ్వరరావు, టీబీ సూపర్వైజర్ కాలేషా తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన అద్దె బస్సుల డ్రైవర్లు
● ఆన్ కాల్ డ్రైవర్లుగా అవకాశం ఇవ్వాలంటూ ధర్నా ● కనిగిరి డిపోలో నిలిచిపోయిన బస్సులు కనిగిరి రూరల్: ఆన్ కాల్ డ్రైవర్లుగా బస్సులు నడిపేందుకు తమకు అవకాశం ఇవ్వకుండా కొత్తవారిని ఆహ్వానిస్తూ అద్దె బస్సుల యజమానుల మాట విని తమ దరఖాస్తులను తిరస్కరించడాన్ని నిరసిస్తూ కనిగిరిలో శుక్రవారం అద్దె బస్సుల డ్రైవర్లు రోడ్డెక్కి నిరసన తెలిపారు. స్థానిక ఆర్టీసీ డిపో పరిధిలో సుమారు 24 అద్దె బస్సులు తిరుగుతున్నాయి. ఆ బస్సుల్లో డ్రైవర్లుగా సుమారు 65 మంది పనిచేస్తున్నారు. వీరంతా దాదాపు 12 నుంచి 15 ఏళ్లుగా డ్రైవర్లుగా విధులు నిర్వర్తిస్తూ అన్ని విధాలుగా అనుభవం కలిగి ఉన్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) వారు కనిగిరి డిపోలో ఆన్ కాల్ డ్రైవర్లుగా పనిచేసేందుకు అవుట్ సైడ్ డ్రైవర్ల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆ దరఖాస్తుల స్వీకరణలో ఇప్పటికే అన్ని అర్హతలు కలిగి అనుభవం ఉన్న అద్దె బస్సుల డ్రైవర్ల దరఖాస్తులను తిరస్కరించారు. దీనిని వ్యతిరేకిస్తూ అద్దె బస్సుల డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం డ్రైవర్లు విధులు బహిష్కరించి కనిగిరి డిపో ఆవరణలో ధర్నాకు దిగారు. మాకు అన్యాయం చేయడం తగదు... తమకు ఎప్పుడో ఒకసారి ఆర్టీసీలో అవకాశం లుగుతుందన్న ఆశతోనే సుమారు 15 ఏళ్లుగా ఆర్టీసీ అద్దె బస్సుల్లో డ్రైవర్లుగా చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నట్లు ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్ల యూనియన్ నాయకులు ఆంజనేయులు, రాజారావు తెలిపారు. ఆర్టీసీ యాజమాన్యం కనీసం తమ దరఖాస్తులను పరిగణలోకి తీసుకోకుండా అద్దె బస్సుల ఓనర్ల మాటలు విని తమను అన్యాయం చేయడం తగదని అన్నారు. అద్దె బస్సుల ఓనర్ల విన్నపాన్ని పరిగణలోకి తీసుకుని ఏళ్ల నుంచి డ్రైవర్లుగా వెట్టిచాకిరి చేస్తున్న తమకు అవకాశం కల్పించకపోవడం దారుణమన్నారు. ఆన్కాల్ డ్రైవర్లుగా అద్దె బస్సుల డ్రైవర్లకు అవకాశం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఆర్టీసీ అధికారులు కనీసం తమకు సమాధానం చెప్పడం లేదని వాపోయారు. అంతేగాకుండా ఎంతో ప్రశాంతంగా తాము నిరసన తెలుపుతుంటే పోలీసులతో దౌర్జన్యంగా బయటకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసేంత వరకు పోరాటం సాగిస్తామన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు భాస్కర్రెడ్డి, సుందరయ్య, మహీంధ్ర, శ్రీనివాసులు, యలమందారెడ్డి, ఖాజా, నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం పర్యటనకు పటిష్ట భద్రత
● ఎస్పీ ఏఆర్ దామోదర్ దర్శి: అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబునాయుడు శనివారం దర్శి మండలంలోని తూర్పువీరాయపాలెం గ్రామానికి వస్తున్న సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. సీఎం సభ ఏర్పాట్లను జిల్లా అధికారులతో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. హెలీప్యాడ్, వీఐపీ వాహనాల రూట్, పార్కింగ్ ఏరియా వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం ఎస్పీ విలేకర్లతో మాట్లాడుతూ.. సీఎం పర్యటనను డ్రోన్ కెమెరాలు, సీపీ కెమెరాలతో పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. ఎస్పీ వెంట దర్శి, ఒంగోలు, మార్కాపురం డీఎస్పీలు లక్ష్మీనారాయణ, ఆర్.శ్రీనివాసరావు, యు.నాగరాజు, ఎస్బీ సీఐ రాఘవేంద్ర, దర్శి, త్రిపురాంతకం సీఐలు, ఎస్సైలు ఉన్నారు. -
రైతుకు ఉరివేసి!
సాగును చిదిమేసి..అన్నదాతను కూటమి ప్రభుత్వం నిలువునా ముంచేసింది. వర్షాలు లేక జిల్లాలో కరువు కరాళ నృత్యం చేస్తోంది. భూమినే నమ్ముకున్న రైతులకు కష్టాలు తప్పడం లేదు. విత్తు వేయాలంటే భయపడిపోయే పరిస్థితులున్నాయి. పొగాకు, మిర్చి, పత్తి, శనగ, మామిడి, నిమ్మ, వరి.. ఏ పంటలకూ గిట్టుబాటు ధర లభించక ఆర్థికంగా రైతు కుదేలైపోయాడు. కూటమి ప్రభుత్వం సాగునీటి రంగాన్ని గాలికొదిలేయడం, ఏడాది కాలంగా రైతుకు ఇవ్వాల్సిన ఆర్థిక సాయాన్ని ఎగ్గొట్టడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. పెరిగిపోతున్న అప్పులను చూసి భయాందోళనతో బలవన్మరణానికి పాల్పడుతున్నాడు. ఏడాది కాలంగా జిల్లాలో ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కనీసం ఆ కుటుంబాలకు చిల్లిగవ్వ కూడా విదల్చకపోగా, ఏవేవో కుంటిసాకులు చెబుతూ రైతు ఆత్మహత్యలను తప్పుదోవ పట్టించడం మరింత దారుణమని రైతు సంఘాల నాయకులు మండిపడుతున్నారు. అన్ని రకాలుగా సంక్షోభంలో కూరుకుపోయిన రైతుకు అరకొరగా డబ్బులిచ్చేందుకు ముఖ్యమంత్రి ఆర్భాటం చేస్తున్నాడని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ● అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతన్న ● జిల్లాలో 17 మండలాల్లో తీవ్ర కరువు ● పట్టెడు అన్నం పెట్టే రైతన్నను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం ● మిర్చి, పొగాకు, శనగ, పత్తి, వరి, కంది పంటలకు మద్దతు ధర రాక విలవిల ● ఆర్థికంగా కుదేలైన రైతు కుటుంబాలు ● ఏడాదిలోనే ఏడుగురు రైతులు ఆత్మహత్య ● జిల్లాలో జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత ఆర్భాటం ● తొలి ఏడాది సాయం ఎగ్గొట్టి.. నేడు కోతలు పెట్టి ● నేడు అరకొర డబ్బులు ఇచ్చేందుకు దర్శి వస్తున్న సీఎం చంద్రబాబు సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో 2024–25 రబీ సీజన్లో సాధారణంగా 3,97,880 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగుచేయాల్సి ఉంది. అయితే, కేవలం 2,99,331 ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. వేసిన పంటల్లో కూడా దాదాపు లక్షకుపైగా ఎకరాల్లో నిలువునా ఎండిపోయాయి. మిగతా 1.99 లక్షల ఎకరాల్లో కూడా సగానికిపైగా ఎకరాల్లో దిగుబడి మరీ దారుణంగా పడిపోయింది. దాదాపు జిల్లాలో సుమారుగా 4 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేయాల్సి ఉండగా, చివరకు దిగుబడి అంతంతమాత్రంగానే వచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు జిల్లాలో ఏడుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక్కసారిగా చుట్టిముట్టిన ఆర్థిక సమస్యలతో కాలం వెళ్లదీయలేక ఇక లాభం లేదని నిస్సహాయతతో తనువు చాలిస్తున్నారు. సకాలంలో వర్షాలు పడక, ఒకవేళ అదును దాటి పంటలు సాగు చేస్తే పంట సక్రమంగా చేతికిరాక విలవిల్లాడిపోతున్నారు. దానికితోడు ప్రభుత్వం అందిస్తానన్న సాయం అందించకపోవటంతో ఆశగా ఎదురుచూసి చేసిన అప్పులు తీర్చలేక అశువులుబాస్తున్నా రు. జిల్లాలో రైతులకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆర్థికంగా కోలుకోలేని స్థితికి చేరుకున్నారు. రైతు అప్పులు చేసి అవి తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే దానికి కూడా ఏవో కొన్ని సాకులు చూపించి రైతు కుటుంబానికి వచ్చే సాయం కూడా రాకుండా పంగనామం పెడుతున్నారు. ఆదరించాల్సిన ఇంటి పెద్ద లేకపోవటంతో ఆ కుటుంబాల పరిస్థితి వర్ణనాతీతంగా మారుతోంది. మిర్చి రైతు కంట్లో కారం.. జిల్లాలోని పశ్చిమ ప్రకాశంలో మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి తదితర నియోజకవర్గాల్లోని గ్రామాల్లో రైతులు అత్యధికంగా మిర్చి సాగు చేస్తారు. వైఎస్సార్ సీపీ హయాంలో 96 వేల ఎకరాల్లో సాగు చేసిన రైతులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగు విస్తీర్ణాన్ని భారీగా తగ్గించేశారు. ఈసారి సుమారు 59,005 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. గతేడాది నవంబర్లో క్వింటా ధర రూ.17 వేల నుంచి రూ.18 వేలు ఉండగా, డిసెంబరు నాటికి రూ.14 వేలకు పడిపోయింది. జనవరిలో రూ.14 వేల నుంచి రూ.12 వేలకు చేరి మార్చిలో రూ.10 వేలు కనిష్టానికి పడిపోయింది. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు మిర్చియార్డుకు వెళ్లడంతో ప్రభుత్వం కొనుగోళ్లపై దృష్టి సారించింది. 2021–22, 2022–23 సంవత్సరాల్లో క్వింటా మిర్చి ధర రూ.25 వేల నుంచి రూ.32 వేల మధ్య పలికింది. అలాంటిది ఈ ఏడాది రూ.11 వేలకు పడిపోవడం గమనార్హం. రైతులు రూ.లక్షల్లో నష్టపోయారు. రైతు కుటుంబాలు కోలుకోలేని అప్పుల ఊబిలోకి నెట్టబడ్డాయి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో సాధారణ విస్తీర్ణం 4,62,944 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయాల్సి ఉంది. అలాంటిది ఇప్పటి వరకు కేవలం 25,725 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. అంటే సాధారణ విస్తీర్ణంలో కేవలం నాలుగు శాతం మాత్రమే సాగులోకి వచ్చిందంటే జిల్లాలో రైతన్న పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అన్నదాత సుఖీభవ కుదింపే లక్ష్యంగా... ఏడాది పాలన తరువాత చంద్రబాబుకు ఎన్నికల హామీ గుర్తుకొచ్చింది. ఈ ఏడాదిలో ఎంతో మంది రైతుల ఉసురుపోసుకున్నారు. ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలు కుమిలిపోతున్నాయి. అయినా అర్హులైన రైతులందరికీ అన్నదాత సుఖీభవ ఇస్తున్నాడా అంటే అదీ లేదు. సవాలక్ష ఆంక్షలు పెట్టి జల్లెడపట్టారు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం గాలికి వదిలేసి ఎగ్గొట్టారు. చివరకు 2,68,165 మంది రైతులను అర్హులుగా తేల్చారు. పీఎం కిసాన్తో సంబంధం లేకుండా ఏడాదికి రూ.20 వేలు ఇస్తానన్న ఆయన.. తాజాగా పీఎం కిసాన్తో కలిపి ఇస్తానని మాట మార్చారు. తొలి విడత రూ.7 వేలు ఇస్తానని చెప్పి, గత నెలలో వచ్చిన పీఎం కిసాన్తో కలిపి రూ.7 వేలు అని మాట మార్చారు. అయితే, మొదటి విడతలో చంద్రబాబు రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తుంది కేవలం రూ.5 వేలు మాత్రమే. జిల్లాలో రూ.134.08 కోట్లు ఇస్తున్నానని చెబుతున్నారు.అందులో భాగంగా శనివారం సీఎం చంద్రబాబు దర్శికి రానున్నారు. అదే వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 2022–23 సంవత్సరంలో రైతు భరోసా కింద 2,86,256 మందికి ఏడాదికి రూ.13,500 చొప్పున వైఎస్ జగన్ అందజేశారు. రైతు భరోసా రూపంలో అందించింది ఐదేళ్లలో అక్షరాలా రూ.1,634.85 కోట్లు. -
ప్రకాశం
37 /287గరిష్టం/కనిష్టంనమ్మినోళ్లకు నైరాశ్యమే.. ఎన్నికల వేళ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక తొలిసారి నేడు దర్శి నియోజకవర్గానికి రానున్నారు.కృష్ణమ్మ పరవళ్లతో పారవశ్యం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదికి వరద నీరు పోటెత్తుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో చూసేందుకు పర్యాటకులు పోటెత్తారు.వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడా చిరుజల్లులు పడవచ్చు. ఉక్కపోతగా ఉంటుంది. శనివారం శ్రీ 2 శ్రీ ఆగస్టు శ్రీ 2025– 8లో.. -
ఫీడర్ కెనాల్ పనుల పరిశీలన
పెద్దదోర్నాల: మండల పరిధిలోని గంటవానిపల్లె వద్ద జరుగుతున్న ఫీడర్ కెనాల్ అండర్ టన్నెల్ పనులను ఇరిగేషన్ ఇన్చార్జి ఎస్ఈ అబూతాలిమ్ శుక్రవారం పరిశీలించారు. గంటవానిపల్లె వద్ద జరుగుతున్న అండర్ టన్నెల్ ఎస్కేప్ రెగ్యులేటర్ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు క్యాంపు కార్యాలయంలో ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. వెలుగొండ ప్రాజెక్టు రెండవ సొరంగం తవ్వకం పనులు మరో కిలోమీటరు మేర జరగాల్సి ఉందని, దీంతో పాటు లైనింగ్ పనులు మరో 5.2 కిలోమీటర్ల మేర జరగాల్సి ఉన్నాయని అధికారులు ఎస్ఈ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పనులు పూర్తి స్థాయిలో నిర్వహించేలా చూడాలని, దీంతో పాటు ఎస్కేప్ రెగ్యులేటర్ అండర్ టన్నెల్ పనులు వేగంగా జరిగేలా చూడాలని ఆయన అధికారులకు సూచించారు. ఎస్ఈ వెంట క్వాలిటీ కంట్రోల్ ఈఈ రాజగోపాల్, డీఈ. విద్యాసాగర్, ఏఈ అశోక్, ఇరిగేషన్ డీఈ చర్యణ్, ఏఈ అంజలి, మెగా కన్స్టక్షన్స్ డీఎం శ్రీనాథ్, ప్లానింగ్ ఇంజినీర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
5న పాలిటెక్నిక్ ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు
ఒంగోలు సిటీ: ఒంగోలులోని డీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించి ఈ నెల 5న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ఎన్.శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఈ పాలిటెక్నిక్ కాలేజీలో ఆటోమొబైల్, సివిల్, మెకానికల్ బ్రాంచిల్లో సీట్లు ఉన్నాయన్నారు. స్పాట్ అడ్మిషన్కు హాజరయ్యేందుకు దరఖాస్తులు కళాశాలలో ఇస్తున్నట్లు తెలిపారు. 4వ తేదీలోపు విద్యార్థులు తమ దరఖాస్తు ఈ కళాశాలలో అందజేయాలని తెలిపారు. దరఖాస్తుతో పాటు విద్యార్థి పదో తరగతి మార్క్స్ మెమో, 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్స్, క్యాస్ట్ సర్టిఫికెట్, టీసీ, పాలిసెట్–2025 రాసిన విద్యార్థులు తమ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్ల నకళ్లు జతచేయాలన్నారు. 5వ తేదీ జరిగే కౌన్సిలింగ్కు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. కొండపి పంచాయతీకి ముగిసిన నామినేషన్లు కొండపి: 14 సంవత్సరాల తర్వాత కొండపి పంచాయతీకి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడంతో నామినేషన్లు వేయడానికి అభ్యర్థులు పోటీపడ్డారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు నామినేషన్ ప్రక్రియ ముగిసిందని, సర్పంచ్ స్థానానికి 15 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి రవిబాబు తెలిపారు. 14 వార్డులకు 39 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారన్నారు. 1వ వార్డుకు నలుగురు అభ్యర్థులు, 2వ వార్డుకు ముగ్గురు, 4వ వార్డుకు ఇద్దరు, 5వ వార్డుకు ఇద్దరు, 6వ వార్డుకు ముగ్గురు, 7వ వార్డుకు నలుగురు, 8వ వార్డుకు ముగ్గురు, 9వ వార్డుకు ఇద్దరు, పదో వార్డుకు ముగ్గురు, 11 వ వార్డుకు ముగ్గురు, 12వ వార్డుకు ఇద్దరు, 13వ వార్డుకు ఇద్దరు, 14వ వార్డుకు ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిపారు. స్క్రూట్ని శనివారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. టీడీపీ నాయకుడితో కలిసి పింఛన్లు పంపిణీ మార్కాపురం: పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రహసనంలా మారింది. సచివాలయ ఉద్యోగులు కూడా కూటమి నేతలు లేనిది ముందుకు వెళ్లడం లేదు. వారి మెప్పు కోసం చేస్తున్న పనులు విమర్శలకు తావిస్తున్నాయి. మార్కాపురం మండలంలోని పెద్దయాచవరం పంచాయతీ గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి ఒకరు శుక్రవారం మొద్దులపల్లిలో పింఛన్లు పంపిణీ చేసేందుకు గ్రామ టీడీపీ నాయకుడిని వెంటపెట్టుకుని వెళ్లారు. లబ్ధిదారులకు ఇవ్వాల్సిన పింఛను డబ్బులను కూడా ఆ టీడీపీ నాయకునికి ఇచ్చి సదరు ఉద్యోగి బయోమెట్రిక్ వేసి పింఛన్లు పంపిణీ చేయడం చర్చనీయాంశమైంది. ఈ ఫొటో సోషల్మీడియాలో వైరల్ అయింది. ఈ విషయమై మార్కాపురం ఎంపీడీఓ శ్రీనివాసులును వివరణ కోరగా అతను పంచాయతీ వర్కర్ అని తెలిపారు. సాగర్ కాలువను పరిశీలించిన ఇరిగేషన్ సీఈ కురిచేడు: జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ (అడ్మిన్), కమ్ చీఫ్ ఇంజినీర్ (ప్రాజెక్ట్స్) బి.శ్యాం ప్రసాద్ నాగార్జునసాగర్ కుడికాలువను శుక్రవారం పరిశీలించారు. కురిచేడు 126 వ మైలు వద్ద నుంచి 202.796 కి.మీ.వద్ద, దొనకొండ మండలం చందవరం 185.611 కి.మీ వద్ద కూలిపోయిన బ్రిడ్జిని పరిశీలించారు. సాగర్ కాలువకు తాగు, సాగు నీరు విడుదల చేశారు. జిల్లా సరిహద్దు 85వ మైలు వద్ద 2550 క్యూసెక్కుల నీరు కుడికాలువకు వస్తోంది. 126వ మైలులో 1790 క్యూసెక్కుల నీరు దర్శి బ్రాంచి కాలువకు చేరుతోంది. ఒంగోలు బ్రాంచి కాలువకు నీరు శుక్రవారం రాత్రికి చేరుతుందని ఆయన తెలిపారు. ఈ పర్యటనలో కురిచేడు ఎన్ఎస్పీ డీఈఈ అక్బర్ బాషా, కురిచేడు ఎన్ఎస్పీ ఏఈఈలు కె.సాంబశివరావు, బీ రవీందర్ రెడ్డి, కురిచేడు 32వ డిస్ట్రి బ్యూటరీ కమిటీ అధ్యక్షుడు ఉన్నగిరి కోటేశ్వరరావు, క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు. -
చెప్పినట్టు వినకపోతే... ట్రాక్టర్లతో తొక్కి చంపేస్తాం
పొదిలి రూరల్: అధికార మదంతో పచ్చమూకలు రెచ్చిపోతున్నాయి. పట్టా భూముల్లో సాగు చేసిన కంది పంటను దౌర్జన్యంగా ట్రాక్టర్తో ధ్వంసం చేసి దున్నేశారు. ఇది తమ ప్రభుత్వమని, చెప్పినట్టు వినకపోతే ట్రాక్టర్లుతో తొక్కి చంపేస్తాం అని బెదిరించారు. వివరాల్లోకి వెళితే... ప్రకాశం జిల్లా పొదిలి మండలంలోని అన్నవరం గ్రామ పరిధి సర్వే నంబరు 75లో 40 ఎకరాల బీడు భూమి ఉంది. గ్రామ పెద్దలు ఆ భూమిని రెండు భాగాలుగా విడగొట్టి 20 ఎకరాలు వైఎస్సార్సీపీ వారికి, మరో 20 ఎకరాలు టీడీపీ వాళ్లకు సమానంగా పంచి ఇద్దరికి ఒప్పందం చేసి సాగు చేసుకోమన్నారు. 2018లో ఆ భూమికి వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన 16 మంది రైతులకు అధికారులు పట్టాదారు పాసు పుస్తకం ఇచ్చారు. సర్వేనంబరు 75లో కొత్తపులి రమణమ్మ, కొత్తపులి రమణయ్య, కొత్తపులి నాగిరెడ్డి, కొత్తపులి వెంకటేశ్వర్లు, కొత్తపులి కోటిరెడ్డి, లక్కు వెంకట లక్షి్మ, కొత్తపులి పరమేశ్వరమ్మ, కొత్తపులి సులోచన, కొత్తపులి ఓబులురెడ్డి(ఓబులేసు), కొత్తపులి నాగిరెడ్డి, కొత్తపులి ఓబులురెడ్డి (అచ్చిరెడ్డి), కొత్తపులి పెదవెంకటేశ్వర్లు, కొత్తపులి రమణమ్మ (మాలకొండయ్య), పులిబాల కోటిరెడ్డి, కొత్తపులి ఓబులురెడ్డి (ఓబులురెడ్డి), ఇతరులు ఉన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తరువాత కొందరు టీడీపీ వర్గీయులు వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై తమకూ ఈ భూముల్లో వాటా ఉందంటూ దౌర్జన్యం చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో శుక్రవారం టీడీపీకి చెందిన పులి చిన నాగిరెడ్డి, వెన్నపూస చిన సుబ్బారెడ్డి, పెద్ద సుబ్బారెడ్డి, యర్రంరెడ్డి రమణయ్య, యర్రంరెడ్డి నాగిరెడ్డి, దమ్మిడి చెన్నయ్య ట్రాక్టర్లుతో వచ్చి సర్వేనంబరు 75లో మాకు ఇంకా 10 ఎకరాల భూమి ఉందంటూ వాదనకు దిగారు.వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన వారి పట్టా భూముల్లో కొత్తపులి వెంకటరెడ్డి సాగు చేసుకున్న 4 ఎకరాల కంది పంటను నాశనం చేశారు. విషయం తెలుసుకున్న ఈసర్వే నంబరులోని మిగిలిన రైతులు అక్కడికి వచ్చారు. తమ భూమిని ఆక్రమించుకొని టీడీపీ వర్గీయులు భయభ్రాంతులకు గురి చేశారని, అడ్డం వచి్చన వాళ్లను చంపేస్తామని బెదిరించి అసభ్యంగా దూషించినట్టు బాధిత రైతులు వాపోయారు. తమకు పట్టాలు ఉన్నాయని చెప్పినా పట్టించుకోలేదన్నారు. ఈ విషయంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. -
తీరువా కష్టాలు !
కన్నీటి ధారలు.. పిచ్చి చెట్లతో నిండిపోయిన పంటకాలువలు.. మరమ్మతులకు నోచుకోని చెరువులు.. సాగునీరందక అన్నదాత కంట కన్నీటి ధారలు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతన్నలకు అన్నీ కష్టాలే. ప్రధానంగా సాగునీటి రంగాన్ని పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. కరువుతో అల్లాడుతున్న రైతుకు ఇది శాపంగా మారింది. పెట్టుబడులు రాక..ప్రభుత్వం నుంచి సాయం అందక అన్నివైపులా నష్టపోయిన రైతుపై సాగునీటి తీరువా రూ.7.8 కోట్లు చెల్లించాలంటూ నోటీసులు ఇవ్వడం దారుణమంటున్నారు వ్యవసాయరంగ నిపుణులు చంద్రబాబు వస్తున్నాడని సాగర్ నీరు విడుదల... ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శి వస్తున్నాడని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు సాగర్ కుడి కాలువకు శ్రీశైలం డ్యాం నుంచి నీటిని వదిలారు. నాలుగైదు రోజుల నుంచి శ్రీశైలానికి వరద ఉధృతి తీవ్రంగా వస్తుండడంతో గేట్లు ఎత్తి నాగార్జున సాగర్కు నీళ్లొదిలారు. అయితే కరువుతో అల్లాడుతున్న ప్రకాశం జిల్లాకు సాగర్ నీటిని నాలుగు రోజుల క్రితమే విడుదల చేయాల్సి ఉంది. అయితే ఇరిగేషన్ ఉన్నతాధికారుల నుంచి అనుమతులు రాలేదు. ఇదిలా ఉండగా చంద్రబాబు పర్యటన ఖరారు కావడంతో హడావుడిగా బుధవారం డ్యాం నుంచి సాగర్ కుడికాలువకు నీరు వదిలారు. దాంతో జిల్లా బోర్డర్ సాగర్ కాలువ 85/3 కిలోమీటరు వద్దకు గురువారం సాయంత్రానికి నీళ్లు చేరుకున్నాయి. జిల్లా బోర్డర్ ముటుకుల వద్ద 2250 క్యూసెక్కుల నీరు కాలువ ద్వారా జిల్లాలోకి ప్రవేశించింది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అసలే వెనుబడిన జిల్లా. దానికితోడు టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరం నుంచే జిల్లాలో కరువు కరాళనృత్యం చేస్తోంది. అయినా టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలకు కనీసం వ్యవసాయ రంగంపై కరుణ చూపించిన దాఖలాలు లేవు. జిల్లాలో చిన్నతరహా నీటి ప్రాజెక్టుల కింద 852 సాగునీటి చెరువులు ఉన్నాయి. వీటితో పాటు నాగార్జున సాగర్ ఆయకట్టు కింద కూడా పంటలు సాగుచేస్తున్నారు. ఇవికాకుండా ఎత్తిపోతల పథకాల ద్వారా కూడా పంటలు సాగవుతున్నాయి. వీటన్నింటి కింద జిల్లా వ్యాప్తంగా దాదాపు 9.50 లక్షలకుపైగా ఎకరాల్లో సాగు భూమి ఉంది. అయితే, ఇవన్నీ లెక్కల్లోనే ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం చెరువులు, కాలువల మరమ్మతులకు చిల్లి గవ్వ కూడా ఖర్చు చేయలేదు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలో ఖరీఫ్, రబీ సీజన్లు కలిపి 6.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేశారు. కరువుతో చివరకు 3 లక్షల ఎకరాల్లో కూడా పంటలు పండలేదు. పిచ్చిచెట్లతో నిండిన సాగునీటి కాలువలు... సాగునీటి చెరువులు, కాలువలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. చిన్ననీటి పారుదల చెరువుల నుంచి పంటలకు నీరందించే నీటి సరఫరా కాలువలు సైతం పూడిపోయి పంట పొలాలకు సక్రమంగా నీరు చేరే పరిస్థితి లేకుండా పోయింది. ఇక వర్షం పడిందంటే కాలువల్లో నీరు ఎటుపడితే అటు వెళ్లిపోయి వృథాగా మారుతోంది. జిల్లాలోని చెరువుల నుంచి పొలాలకు నీటిని అందించే తూములు సైతం పూడిపోయి ఉన్నాయి. చెరువుల్లో బెడ్లెవల్స్ సైతం పూడికతో నిండిపోయాయి. ఇక, జిల్లాకు ప్రధాన సాగునీటి వనరైన సాగర్ కుడికాలువ పరిస్థితి మరీ దారుణం. సాగర్ ఆయకట్టు కింద దాదాపు 4 నుంచి 4.50 లక్షల ఎకరాల వరకు సాగు భూమి ఉంది. అయితే సాగర్ మేజర్ కాలువలు, మైనర్ కాలువలు పిచ్చి చెట్లతో, జమ్ము తూడుతో పూర్తిగా కనపడకుండా కనుమరుగైపోయాయి. సాగర్ నీరు వచ్చినా చివరి ఆయకట్టు వరకు నీరు చేరే పరిస్థితులు లేవు. కరువుతో సహవాసం... జిల్లా రైతాంగం కరువుతో సహవాసం చేస్తోంది. 2024–25 రబీ సీజన్లో 20 మండలాల్లో కరువు పీడించింది. ఖరీఫ్లోనూ పంటలు సక్రమంగా పండలేదు. దాంతో రైతులు నష్టపోయారు. జిల్లాలోని రైతాంగానికి టీడీపీ కూటమి ప్రభుత్వం నుంచి రూ.45.27 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ కింద పంట నష్టపరిహారం రావాల్సి ఉంది. అయినా చంద్రబాబు జిల్లాలోని రైతాంగానికి ఒక్క పైసా కూడా విదిల్చిందిలేదు. 2024–25లో రూ.15.88 కోట్లు, అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది రూ.29.39 కోట్లు, చంద్రబాబు ప్రభుత్వం జిల్లాలో పంటలు నష్టపోయిన రైతాంగానికి బకాయిపడింది. నీటి తీరువా కట్టాలంటూ వేధింపులు... కరువుతో అల్లాడుతున్న జిల్లా రైతాంగానికి నీటి తీరువా కట్టాలంటూ చేస్తున్న వేధింపులు శాపంగా పరిణమించాయి. ఇప్పటికే రెవెన్యూ అధికారుల ఇళ్లకు నోటీసులు పంపిస్తున్నారు. జిల్లాలోని ఒంగోలు, మార్కాపురం, కనిగిరి రెవెన్యూ డివజన్ల పరిధిలో మొత్తం 5,61,355 మంది రైతులు రూ.7.80 కోట్లు నీటి తీరువా పన్ను కట్టాలని రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇప్పటి వరకు కనిగిరి రెవెన్యూ డివిజన్లో మాత్రమే రూ.5.16 లక్షలు రైతులు చెల్లించారు. నీటి తీరువాతో పాటు ఆలస్యం అయ్యే కొద్దీ 6 శాతం వడ్డీతో సహా చెల్లించాలంటూ నోటీసులు పంపుతున్నారు. అసలుకు తోడుగా వడ్డీ తడిసి మోపైడెందన్న చందంగా రూ.44,10,971.37కు చేరుకుంది. నీటి తీరువా వివరాలు.... రెవెన్యూ సబ్ డివిజన్ రైతు ఖాతాలు కట్టాల్సిన మొత్తం (రూ) వడ్డీ (6 శాతం..రూ) మార్కాపురం 193270 1,13,99,488.05 6,83,969.28 కనిగిరి 228272 2,67,48,218.10 16,04,893.09 ఒంగోలు 139813 3,53,68,403.00 21,22,109.00 మొత్తం 561355 7,79,27,075.52 44,10,971.37 జిల్లాలో సాగునీటి రంగం గాలికి చెరువుల మరమ్మతులు పట్టని అధికారులు పిచ్చి చెట్లు, జమ్ముతో నిండిన పంట కాలువలు చెరువులు, కాలువల అభివృద్ధికి రూ.13.26 కోట్లతో ప్రతిపాదనలు ఫైలు తిప్పి పంపిన చంద్రబాబు ప్రభుత్వం కరువుతో అల్లాడుతున్న రైతుపై నీటితీరువా భారం 5,61,355 మంది రైతులు రూ.7.80 కోట్లు చెల్లించాలని నోటీసులు 6 శాతం వడ్డీతో రూ.44 లక్షలు అదనంగా చెల్లించాలంటూ వేధింపులు చంద్రబాబు వస్తున్నాడని హడావుడిగా సాగర్ కుడి కాలువకు నీళ్లు -
ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి
ఒంగోలు సబర్బన్: లో గ్రేడ్ పొగాకు కొనుగోలుకు ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రభుత్వ రంగ సంస్థలచే కొనుగోలు చేసేందుకు చొరవ చూపాలని పలువురు రైతు సంఘ నేతలు డిమాండ్ చేశారు. గురువారం ఒంగోలులోని పొగాకు బోర్డ్ ఆర్ఎం కార్యాలయం వద్ద ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. లో గ్రేడ్ పొగాకు కొనుగోలుకు రూ.1000 కోట్లు కేటాయించాలని, క్వింటా రూ.20 వేలకు తగ్గకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు జూజ్జూరు జయంతిబాబు అధ్యక్షతన జరిగిన ధర్నాలో సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి పమిడి వెంకటరావు మాట్లాడుతూ ఈ ఏడాది వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా వర్జీనియా పొగాకు రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందన్నారు. కంపెనీలు, బోర్డు సూచనలకు అనుగుణంగా సాగు చేసిన రైతుకు సరైన దిగుబడులు రాక, గిట్టుబాటు ధర లభించక, వేలం కేంద్రాల్లో కొనుగోళ్లు జరక్క తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుతో బ్యారన్కు రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రైతాంగం ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉందని ఆందోళన వెలిబుచ్చారు. జిల్లాలో ఈ పాటికే మిర్చి, నల్ల బర్లీ పొగాకు రైతులు 12 మంది వరకు ఆత్మహత్యలకు పాల్పడ్డారని గుర్తు చేశారు. భరోసా కల్పించాల్సిన బోర్డు, ప్రభుత్వం నెలన్నరగా ఆందోళన చేపట్టినా స్పందించలేదన్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో 45 శాతం బేళ్లు తిప్పి పంపడం వల్ల కొంటారో, కొనరోనని రైతులు ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది మంత్రులు, బోర్డు చైర్మన్, ఈడీ అనేక సార్లు పర్యటించడం వల్ల రైతులు ఆశగా ఎదురు చూశారన్నారు. ఇకనైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని లో గ్రేడ్ కొనుగోలుకు రూ.1000 కోట్లు కేటాయించాలని, పెనాల్టీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత సంవత్సరం 140 మిలియన్ కిలోల కొనుగోలు... జయంతి బాబు మాట్లాడుతూ గత సంవత్సరం 140 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు చేసిన యంత్రాంగం.. ఈ ఏడాది మరో 40 మిలియన్ కిలోలకు అనుమతిచ్చినందునే అధికంగా సాగు చేశారని అన్నారు. బోర్డు చైర్మన్ 240 మిలియన్ కిలోలుగా వక్రీకరించినట్లు ఆరోపించారు. కేవలం సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. బోర్డుచైర్మన్, ఈడీ కంపెనీలకు వత్తాసు పలుకుతున్నట్లు ఆరోపించారు. ధరలు దిగజార్చి కంపెనీలకు మేలు చేసే విధంగా బోర్డు యంత్రాంగం కుట్రపన్నుతోందని దుయ్యబట్టారు. ప్రభుత్వం లో గ్రేడ్ పొగాకు రూ.20 వేలకు తగ్గకుండా కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఎస్టీసీతో పాటు పొగాకు ఉత్పత్తిదారుల సమాఖ్యను రంగంలోకి దించాలన్నారు. గతంలో కొనుగోలు చేసిన ప్రభుత్వ సంస్థలకేమీ నష్టం వాటిల్లలేదని, లాభపడ్డాయని గుర్తు చేశారు. అనంతరం రీజినల్ మేనేజర్ శీలం రామారావుకు వినతిపత్రం అందజేశారు. ఆగస్టు మొదటి వారంలో బోర్డు ఉన్నతాధికారుల సమావేశం జరగనుందని, ఆ సమావేశంలో పొగాకు సమస్యపై చర్చించడం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. తూబాటి శ్రీకాంత్ ధర్నాను ప్రారంభించగా, సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు పెంట్యాల హనుమంతరావు, తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో రైతు సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు అబ్బూరి వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి బెజవాడ శ్రీనివాసరావు, నాయకులు కిలారి పెద్దబ్బాయి, కురిచేటి హనుమంతరావు, కొల్లూరు వెంకటేశ్వర్లు, చిలుకూరి వెంకట్రావు, పోలవరపు జనార్దన్రావు, దాసరి ఆంజనేయులు, నార్నే చెంచయ్య, మొలకలపల్లి కోటేశ్వరరావు, చెరుకూరి వాసు, తోకల శేషారావు, గాదె నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. లో గ్రేడ్ పొగాకు కొనుగోలు చేయించాలి రూ.1000 కోట్లు కేటాయించి రైతులను ఆదుకోవాలి పొగాకు ఆర్ఎం కార్యాలయం వద్ద రైతుల ధర్నా -
బయ్యర్లు కొంటుంటే వద్దంటావేంటి?
పొదిలి: వేలానికి ఉంచిన బేళ్లను బయ్యర్లు కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చినా బోర్డు నిర్వహణాధికారి గిరిరాజ్కుమార్ అడ్డుకుంటున్నారంటూ ఓ రైతు ఆందోళనకు దిగారు. పొదిలి పొగాకు వేలం కేంద్రంలో గురువారం చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. పొదిలి పొగాకు వేలం కేంద్రానికి మండలంలోని రాజుపాలెం గ్రామానికి చెందిన చంద్రశేఖర్ ఆరు బేళ్లను తీసుకొచ్చారు. మొత్తం బేళ్లు తిరస్కరణకు గురికావడంతో వేలం నిర్వహణాధికారి తీరుపై రైతు ఆగ్రహించారు. ఇలాగైతే రైతులకు న్యాయం ఎలా చేస్తావని ప్రశ్నించడంతో ఇరువురి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో రైతును బయటకు వెళ్లాలంటూ నిర్వహణాధికారి హెచ్చరించారు. తనకు జరిగిన అన్యాయం, వేలం అధికారి తీరుపై పొగాకు బోర్డు చైర్మన్కు రైతు ఫోన్లో ఫిర్యాదు చేశారు. మంచి పొగాకును కూడా లోగ్రేడ్గా నిర్ణయించి రైతుల పొట్టకొడుతున్నారని చంద్రశేఖర్ ఆరోపించారు. తాను తెచ్చిన బేళ్లలో కొన్ని కొనడానికి బయ్యర్లు ముందుకొస్తే అవి వద్దని వేలం అధికారి అడ్డుతగిలారని వివరించారు. చివరికి బయ్యర్లను బతిమలాడి ఒప్పించి బేళ్లను అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని రైతు చంద్రశేఖర్ వాపోయారు. ఇదిలా ఉండగా వేలం అధికారి తమను చిన్న చూపు చూస్తూ బేళ్లను సగానికి సగం వెనక్కి పంపుతుండటంతో వ్యయప్రయాసలకు గురికావాల్సి వస్తోందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పొదిలి పొగాకు వేలం కేంద్రంలో రైతు ఆందోళన -
క్రీడాకారులతో కూటమి చెడుగుడు!
స్పోర్ట్స్ స్కూళ్లలో అడ్మిషన్లు నిలిపేసిన రాష్ట్ర ప్రభుత్వం క్రీడా కుసుమాలను వెలికితీయాలంటే క్షేత్ర స్థాయిలో యువతను ప్రోత్సహించాలి. మట్టిలో మాణిక్యాలకు తగిన శిక్షణ ఇచ్చి క్రీడా నైపుణ్యాన్ని మెరుగుపరచాలి. ఇదే ఉద్దేశంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం గిరిజన విద్యార్థుల కోసం స్పోర్ట్స్ స్కూళ్లను ఏర్పాటు చేసింది. విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న క్రీడల్లో రాణించేలా తీర్చిదిద్దేందుకు కోచ్లను నియమించింది. అయితే కూటమి ప్రభుత్వం గద్దెనెక్కగానే గిరిజన విద్యార్థుల క్రీడావకాశాలపై దెబ్బకొట్టింది. స్పోర్ట్స్ స్కూళ్లలో అడ్మిషన్లు సైతం నిలిపేసి భావి క్రీడాకారుల జీవితాలతో చెడుగుడు ఆడుకుంటోంది. యర్రగొండపాలెం: గిరిజన విద్యార్థుల్లో దాగిఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసి జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచే విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అరకులో ఉన్న ఏపీటీడబ్ల్యూఆర్ స్పోర్ట్స్ స్కూల్కు అనుబంధంగా రాష్ట్రంలో ఆరు క్రీడా పాఠశాలకు శ్రీకారం చుట్టారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట(బాలురు), భద్రగిరి(బాలికలు), తూర్పు గోదావరి జిల్లాలోని ముసురుమిల్లి(బాలురు), ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం(పీటీజీ–బాలురు), నంద్యాల జిల్లాలోని మహానంది(బాలికలు), అనంతపురం జిల్లాలోని గొల్లలదొడ్డి(బాలురు)లో 6 స్పోర్ట్స్ సూళ్లను ప్రారంభించారు. ఆయా పాఠశాలల్లో 720 మంది విద్యార్థినీ, విద్యార్థులు ఆటల పోటీల్లో ప్రతిభాపాఠవాలు ప్రదర్శించే అవకాశం కల్పించారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ, గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థలు సంయుక్తంగా నిర్వహించే ఈ స్పోర్ట్స్ సూళ్లను 2022లో ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఒక్కో ఈవెంట్కు ఒకరు చొప్పున 23 మంది కోచ్లను నియమించారు. దీంతో గిరిజన విద్యార్థులు తమకు అందుబాటులో ఉన్న పాఠశాలల్లో చేరి నైపుణ్యాన్ని పెంపొందించుకున్నారు. అనేక మంది విద్యార్థులు జిల్లా స్థాయితో పాటు అంతర్జాతీయ స్థాయి వరకు ఈ స్పోర్ట్స్ స్కూల్స్ ద్వారా ఎదగ గలిగారు. క్రీడా పాఠశాలల్లో చేరేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులకు గత ప్రభుత్వంలో ప్రత్యేక పరీక్షలు నిర్వహించి అడ్మిషన్లు ఇచ్చేవారు. గిరిజనుల పిల్లలు క్రీడా ప్రతిభను కనబరిచేందుకు వేదికలుగా ఉన్న ఈ పాఠశాలలపై కూటమి ప్రభుత్వం కన్నెర్రజేసింది. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 14 నెలలు కావస్తున్నప్పటికీ సోర్ట్స్ స్కూళ్లలో ఒక్క గిరిజన విద్యార్థికీ అడ్మిషన్ ఇచ్చిన పాపానపోలేదు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే గిరిజన విద్యార్థులను కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందనిపిస్తోదని వైపాలేనికి చెందిన గిరిజన నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు. 6 స్పోర్ట్స్ స్కూళ్లలో కోచ్లు ఉన్నప్పటికీ విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వకపోవడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. స్పోర్ట్స్ స్కూళ్లలో అడ్మిషన్లు లేకపోవడం వల్ల గిరిజన విద్యార్థులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన పిల్లలు క్రీడల్లో ఎదగకుండా ఈ ప్రభుత్వం ఎందుకు ఆటంకం కలిగిస్తోందో అర్థం కావడం లేదని, తమ పిల్లలను ఉన్నత స్థాయిలో చూసుకునే అవకాశం కల్పించకపోవడం శోచనీయమని వారు అంటున్నారు. వెంటనే రాష్ట్రంలో ఉన్న 6 స్పోర్ట్స్ స్కూళ్లలో గిరిజన విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. క్రీడల్లో గిరిజన విద్యార్థులు ప్రతిభ కనబరచకుండా సర్కారు అడ్డుపుల్ల అగమ్యగోచరంగా రాష్ట్రంలోని 6 స్పోర్ట్స్ స్కూళ్ల పరిస్థితి తమ పిల్లలను చిన్నచూపు చూడటం తగదని గిరిజన సంఘ నేతల మండిపాటు వివిధ క్రీడాంశాలకు సంబంధించిన పాఠశాలలు పాఠశాల క్రీడలు సీతంపేట(బాలురు), పార్వతీపురం మన్యం ఆర్చరీ, అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, వాలీబాల్ భద్రగిరి(బాలికలు), పార్వతీపురం మన్యం అథ్లెటిక్స్, హాకీ, జూడో, వెయిట్లిఫ్టింగ్ ముసురుమిల్లి(బాలురు), తూర్పుగోదావరి ఆర్చరీ, అథ్లెటిక్స్, బాక్సింగ్, ఫుట్బాల్ యర్రగొండపాలెం(బాలురు), ప్రకాశం ఆర్చరీ, అథ్లెటిక్స్, హాకీ, వాలీబాల్ మహానంది(బాలికలు), నంద్యాల ఆర్చరీ, అథ్లెటిక్స్, టేబుల్ టెన్నిస్ గొల్లలదొడ్డి(బాలురు), అనంతపురం అథ్లెటిక్స్, బాక్సింగ్, ఫుట్బాల్, వెయిట్లిఫ్టింగ్ -
ఏకేయూ పీజీ ఫలితాలు విడుదల
ఒంగోలు సిటీ: ఆంధ్రకేసరి యూనివర్సిటీ పరిధిలోని పీజీ కళాశాలల్లో 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి మూడో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను ఏకేయూ వైస్ చాన్సిలర్ ప్రొఫెసర్ డి.వి.ఆర్.మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు గురువారం సాయంత్రం విడుదల చేశారు. ఈ పరీక్షలకు మొత్తం 1037 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, వారిలో 929 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. వారిలో 770 మంది విద్యార్థులు 82.8 శాతం మేరకు ఉత్తీర్ణత సాధించినట్లు ఆంధ్రకేసరి యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ హరిబాబు తెలిపారు. ఈ ఫలితాలలో హిస్టరీ, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ తదితర విభాగాలలో పరీక్షలు రాసిన విద్యార్థులు నూరు శాతం పాసయ్యారని చెప్పారు. యూనివర్సిటీ స్థాయిలో, ఆయా కళాశాలల స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఏకేయూ ఉప కులపతి ప్రొఫెసర్ డి.వి.ఆర్.మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు, సీఈ ప్రొఫెసర్ జి.సోమశేఖర, ఏసీఈ డాక్టర్ ఏ భారతీదేవి తదితరులు అభినందించారు. కార్యక్రమంలో పీజీ కో ఆర్డినేటర్ (నాన్ కాన్ఫిడెన్షియల్) డాక్టర్ ఆర్.శ్రీనివాస్, ఏసీఈ సహాయకులు డాక్టర్ ఎన్.సురేష్, పరీక్షల విభాగం పర్యవేక్షకుడు సూడా శివరామ్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
పొలాలకు సాగర్ జలాలు
త్రిపురాంతకం: నాగార్జున సాగర్ ప్రధానకాలువకు సాగర్ జలాలు విడుదలయ్యాయి. సాగర్ జలాశయానికి ఎగువ భాగం నుంచి నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో సాగునీటిని విడుదల చేశారు. ప్రకాశం జిల్లాకు 2600 క్యూసెక్కులు జిల్లా సరిహద్దులో చేరుతోంది. ఈఏడాది సకాలంలో కృష్ణా ఎగువ ప్రాంతంలో వర్షాలు కురిసి సకాలంలో జలాశయాలు నిండటంతో సాగునీటి సరఫరాకు అనుకూలంగా మారింది. జిల్లా సరిహద్దు 85 మైలు వద్ద గురువారం తెల్లవారుజామున 1750 క్యూసెక్కుల నీరు చేరగా, సాయంత్రానికి 2600 క్యూసెక్కులు పెరిగినట్లు సాగర్ కాలువల డీఈ విజయలక్ష్మి తెలిపారు. సాగర్ ప్రధానకాలువ, రామతీర్థం వరకు నీరు చేరిన తదుపరి మేజర్లకు నీటిని విడుదల చేయనున్నట్లు ఆమె తెలిపారు. రెండు మూడు రోజులో సాగునీటి సరపరా పెరిగి మేజర్లకు సాగునీటిని అందించనున్నారు. పూర్తి స్థాయిలో సాగర్ ప్రధాన కాలువ ద్వార సాగునీటిని చివరి భూములకు ఎలాంటి ఆటంకం లేకుండా సరఫరా చేయాల్సిన అవసరం ఉంది. నీటి సరఫరాను పరిశీలించిన సీఈ నాగార్జున సాగర్ ప్రధానకాలువ నీటి సరఫరాను చీఫ్ ఇంజినీర్ బి.శ్యామ్ ప్రసాద్ పరిశీలించారు. ముందుగా తాగు నీటి చెరువులను నింపాలని అధికారులకు సూచించారు. త్రిపురాంతకం మండలం దూపాడు సాగర్ ప్రధాన కాలువపై సీఈ పర్యటించి అధికారులతో సాగర్ నీటి సరఫరాపై ఆరా తీశారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమన్వయం చేసుకుని చెరువులు నింపాలన్నారు. సాగునీటి సరఫరా, ఆయకట్టు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈయన వెంట డీఈ విజయలక్ష్మి, ఏఈలు శ్రీమన్నారాయణ, భరత్, డిస్ట్రిబ్యూటరి కమిటీ చైర్మన్ చలమయ్య ఉన్నారు. జిల్లా ప్రధాన కాలువకు నీటి సరఫరా రెండు మూడు రోజులలో మేజర్లకు నీటి విడుదల -
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్కు 49 మంది ఎంపిక
యర్రగొండపాలెం: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అడక్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక గిరిజన గురుకుల పాఠశాలలో గురువారం జరిగిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలో 49 మంది ఎంపికయ్యారు. జిల్లా నలుమూలల నుంచి దాదాపు 200 మంది ఎంపికలో పాల్గొన్నారని అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పి.రామచంద్రరావు, ఎం.వెంకటరెడ్డి తెలిపారు. పాల్గొన్న వారిలో అండర్–14లో 12 మంది, అండర్–16లో 28 మంది, 18, 20 ఏళ్ల యువతీ, యువకులు 9మంది ప్రకారం ఎంపికయ్యారని, వీరు బాపట్ల జిల్లా చీరాలలో జరిగే 36వ జూనియర్ సౌత్జోన్ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ మీట్లో పాల్గొంటారని పేర్కొన్నారు. చికిత్స పొందుతూ వృద్ధురాలు మృతి మార్కాపురం: ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ వృద్ధురాలు మృతి చెందింది. ఈ సంఘటన గురువారం మార్కాపురం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. పెద్దారవీడు గ్రామానికి చెందిన వేశపోగు ఏసమ్మ(72) ప్రతి రోజు ఉదయం పూట మార్కాపురం వచ్చి కూరగాయలు కొనుగోలు చేసి పెద్దారవీడు ప్రాంతంలో అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో బుధవారం ఆమె మార్కెట్కు వచ్చి కూరగాయలు కొనుగోలు చేసి తీసుకువెళుతున్న క్రమంలో ఎదురుగా వచ్చిన ఆటో ఏసమ్మను ఢీకొట్టింది. ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక జీజీహెచ్లో ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సాంకేతిక సమస్యతో నిలిచిన గూడ్స్ రైలు గిద్దలూరు రూరల్: సాంకేతిక సమస్యతో గూడ్ రైలు నిలిచిపోయింది. ఈ సంఘటన పట్టణంలోని రాచర్ల గేటు వద్ద గురువారం మధ్యాహ్నం జరిగింది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు నుంచి గుంతకల్ వైపుగా వెళ్లే గూడ్స్ రైలు ఇంజన్లో సాంకేతిక మరమ్మతుల కారణంగా రాచర్ల గేటు వద్ద సుమారు అరగంట సేపు నిలిచిపోయింది. దీంతో పట్టణంలోని రాచర్ల గేటు దాటి అవతలి వైపుకు వెళ్లే వాహనదారులు రోడ్డు పై అలాగే నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అరగంట తరువాత ఇంజన్లో మరమ్మతులు చేయడంతో రైలు ముందుకు కదిలింది. దీంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. -
చెరువులు, కాలువల అభివృద్ధి ప్రతిపాదనలు వెనక్కి...
జిల్లాలోని సాగునీటి చెరువులు, కాలువల అభివృద్ధికి జిల్లా జలవనరుల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వాటిని రాష్ట్ర ప్రభుత్వం కనీసం కనికరం కూడా లేకుండా వెనక్కి తిప్పిపంపింది. జిల్లా వ్యాప్తంగా 153 పనులను గుర్తించిన అధికారులు అందుకోసం సుమారు రూ.13.20 కోట్లు ఖర్చవుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. వాటిని పట్టించుకోకుండా వెనక్కు తిప్పి పంపటంతో అధికారులు చేసేది లేక మిన్నకుండిపోయారు. అందులో ప్రధానంగా కొండపి అసెంబ్లీ నియోజకవర్గంలోని పాలేరు–బిట్రగుంట సప్లై చానల్ కింద 11 అభివృద్ద్ధి పనులకు రూ.1.47 కోట్లు కేటాయించాలని పంపిన ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కొండపి నియోజకవర్గంలోని సంగమేశ్వరం ప్రాజెక్టుకు టీడీపీ పాలకులు మంగళం పాడి కనీసం ఉపయోగం లేకుండా చేశారు. కనీసం ఈ నిధులు వస్తే పీబీ చానల్ కింద చెరువులు బాగుపడతాయని, దానికింద ఉన్న 9 చెరువుల పరిధిలోని 9,500 ఎకరాలకుపైగా పంట పొలాలు సస్యశ్యామలం అవుతాయని రైతులు కూడా భావించారు. -
ఫిషింగ్ హార్బర్ స్థల పరిశీలన
కొత్తపట్నం: ఫిషింగ్ హార్బర్ స్థలాన్ని మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్ గురువారం పరిశీలించారు. కొత్తపట్నం మండలంలోని కె.పల్లెపాలెం గ్రామంలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2017–18లో హార్బర్ మంజూరైందని, స్థలం కేటాయింపులో సమస్యలతో నిలిచిపోయిందని అన్నారు. సుమారు రూ.400 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రంగం సంసిద్ధమైందని తెలిపారు. గ్రామ పెద్దల సమక్షంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఫిషింగ్ హార్బర్తో కలిగే లాభాలు, అవసరాల గురించి వివరించారు. ఫిషింగ్ హార్బర్ ఏర్పాటైతే పెద్ద పడవలు వస్తాయని, వాటి ద్వారా అధిక ఆదాయం పొందవచ్చని, అలాగే మత్స్యకారుల స్థితిగతులు మారతాయని తెలిపారు. సబ్సిడీ ద్వారా కూడా పెద్ద పడవలు అందించే అవకాశం ఉందన్నారు. ఫిషింగ్ హార్బర్ కావాలంటే స్థలం కావాలని, దానికి అందరి సహకారం అవసరమని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి సోనా బోట్లు వచ్చి తమ సంపదను కొల్లగొడుతున్నాయని మత్స్యకారులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన స్పందించారు. డ్రోన్ కెమెరాలతో వాటిని గుర్తించి కఠిన చర్యలు తీసుకునే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలోని మత్స్యకారులు సుమారు 350 పడవలతో జీవనం కొనసాగిస్తుండగా, మత్స్య సంపద ఎలా వస్తుందని కమిషనర్ ఆరా తీశారు. మరో వారంలో పూర్తిగా ఫిషింగ్ హార్బర్ స్థలం ఏర్పాటు గురించి సంబంధిత అధికారులతో చర్చించి స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీఎండీ నగేష్, జాయింట్ డైరెక్టర్ సీహెచ్ శ్రీనివాసరావు, ఏడీ ఇన్చార్జి ఎస్.శ్రీనివాసరావు, భాస్కర్, ఎఫ్డీవో ఆషా, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వరకుమార్, సర్వేయర్ సుధీర్బాబు, మత్స్యశాఖ యూనియన్ అధ్యక్షుడు పేరయ్య, శ్రీను, జక్రయ్య, ఎంపీటీసీ సభ్యుడు నరసింహారావు, గ్రామ పెద్దలు, మత్స్యకారులు పాల్గొన్నారు. -
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో కూల్ డ్రింక్ షాపు దగ్ధం
● రూ.2 లక్షల మేర నష్టం పుల్లలచెరువు: విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి కూల్ డ్రింక్ దుకాణం దగ్ధమైన సంఘటన మండలంలోని నర్వ తండాలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని కొమరోలుకు సమీపంలో హైవేపై నర్వ తండాకు చెందిన బి.తేజానాయక్ కూల్ డ్రింక్స్, రిటైల్ షాపు నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో షాపులోని సుమారు రూ.50 వేల విలువైన ఫ్రిజ్లు, రిటైల్ సరుకులు, రూ.లక్ష నగదు, మూడు ప్రామిసరీ నోట్లు, రూ.30 వేల విలువైన టీవీ, రూ.15 వేల విలువైన ఫోన్లు పూర్తిగా కాలిపోయాయి. అధికారులు పరిశీలించి తగిన పరిహారం అందజేయాలని బాధితుడు వేడుకొంటున్నాడు. -
సంతాన సాఫల్య కేంద్రాలు నిబంధనలు పాటించాలి
● ఫర్టిలిటీ సెంటర్లను తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ ఒంగోలు టౌన్: ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఏఆర్టీ, సరోగసి సెంటర్లను నిర్వహిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఏఆర్టీ, సరోగసీ సెంటర్లు ప్రతినెలా 5వ తేదీలోపు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ఏఆర్టీ, సరోగసి చట్టం కింద రిజిస్టరైన ఆస్పత్రులను బుధవారం జిల్లా వైద్యాధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అర్హత కలిగిన వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పనిచేస్తున్నారా లేదా అని పరిశీలించారు. నిర్ధేశించిన వైద్య పరికరాలు వినియోగిస్తున్న తీరును పరిశీలించారు. వివిధ ఆసుపత్రుల రికార్డులను పరిశీలించి చూశారు. వైద్యశాలలో లభిస్తున్న సేవలు, వాటి ఫీజుల వివరాలు రోగులకు అర్థమయ్యే భాషలో ప్రదర్శించాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ సమయంలో సమర్పించిన సమాచారం ప్రకారం సిబ్బంది అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఏదైనా మార్పులు చేర్పులు చేస్తే వెంటనే జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయానికి తెలియజేయాలని చెప్పారు. జిల్లాలో ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ లేకుండా ఆస్పత్రి, ల్యాబరేటరీ, డయాగ్నోస్టిక్ సెంటర్లు నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉంటే తెలియజేయాలని చెప్పారు. వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాస్ మీడియా అధికారి డి.శ్రీనివాసులు పాల్గొన్నారు. సమస్యలపై ‘రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం’ ఒంగోలు సిటీ: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ఆగస్టు 5వ తేదీ నుంచి శ్రీరండి టీ తాగుతూ మాట్లాడుకుందాం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నపరెడ్డి కిరణ్కుమార్రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు సమస్యలు, వారికి రావాల్సిన బకాయిలపై చర్చించేందుకు కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. మూడు నెలల పాటు జరిగే కార్యక్రమంలో వారానికి ఒక సమస్యను లేవనెత్తుతామన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వరకుమార్, రామన వెంకటేశ్వరరెడ్డి, వెంకటేశ్వరరావు కోశాధికారి రంగారెడ్డి, పట్టణ అధ్యక్షుడు మోటార్ శ్రీనివాస్రావు, కోశాధికారి ఏసురత్నం, తాలూకా అధ్యక్షుడు సురేష్, అంకబాబు తదితరులు పాల్గొన్నారు. రూ.281.52 కోట్ల రాయితీల మంజూరు ఒంగోలు సబర్బన్: జిల్లా వ్యాప్తంగా నెలకొల్పిన పరిశ్రమలకు రాయితీ కింద రూ.281.52 కోట్లు మంజూరు చేసినట్లు జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ తెలిపారు. ప్రకాశం భవనంలోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో బుధవారం డీఐఈపీసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలోని 104 పరిశ్రమలకు చెందిన క్లెయిమ్లు వచ్చాయన్నారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా అనుమతుల కోసం దరఖాస్తు చేసిన వాటికి ఎస్ఎల్ఏ సమయం వరకు వేచి ఉండకుండా త్వరితగతిన మంజూరు చేయాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించామని తెలిపారు. నర్సింగ్ అభ్యర్థులకు జర్మనీలో ఉద్యోగావకాశాలు ఒంగోలు వన్టౌన్: నర్సింగ్ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ మహిళా అభ్యర్థులకు జర్మనీలో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి జె.రవితేజ యాదవ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ, సామాజిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి కేంద్రాల్లో పూర్తి ఉచిత వసతితో శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 8 నెలల నుంచి 10 నెలల పాటు శిక్షణ ఉంటుందన్నారు. బీఎస్సీ నర్సింగ్ చేసిన వారికి రెండేళ్ల క్లినికల్ అనుభవం, జీఎన్ఎం నర్సింగ్ చేసిన వారికి మూడేళ్ల క్లినికల్ అనుభవం ఉండాలని తెలిపారు. అభ్యర్థులు 35 ఏళ్ల లోపు ఉండాలన్నారు. 8 నెలల నుంచి 10 నెలల శిక్షణలో జర్మన్ లాంగ్వేజ్ బీ2 స్థాయి పరీక్ష ఉత్తీర్ణత సాధించాలని చెప్పారు. వీసా, విమాన టికెట్ ఖర్చులు ఉద్యోగం ఇచ్చే కంపెనీలు భరిస్తాయన్నారు. రూ.2,40,000 నుంచి రూ.3,10,000 వరకు జీతం ఉంటుందన్నారు. అభ్యర్థులు 9988853335, 8712655686 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
ప్రజలను మోసం చేయడంలో బాబు దిట్ట
● మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సింగరాయకొండ: ప్రజలను నమ్మించి మోసం చేయడంలో సీఎం చంద్రబాబు దిట్టని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. మండలంలోని శానంపూడిలో బుధవారం రాత్రి పార్టీ మండల అధ్యక్షుడు మసనం వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగిన బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ, పార్టీ గ్రామ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిఽథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ఒక్క హామీ సక్రమంగా అమలు చేయటం లేదని మండిపడ్డారు. ఆడబిడ్డ నిధి, మహాశక్తి, నిరుద్యోగ భృతి, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేయలేదన్నారు. తల్లికి వందనం కూడా అరకొరగా ఇచ్చారని, అదేమంటే కేంద్రం ఈ పథకానికి ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదని చెబుతున్నారని ధ్వజమెత్తారు. పథకాలు అమలు చేయమంటే అన్ని అమలు చేశామని చెబుతున్నారని, లేకపోతే మీ నాలుక మందం అని అంటున్నారని, నాలుక మందమో, మీ తోలు మందమో ప్రజలే తేలుస్తారని హెచ్చరించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగం ఇచ్చిన వ్యక్తిగత హక్కులతో సమావేశం ఏర్పాటు చేస్తే పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారని, ఇది అంబేడ్కర్ రాజ్యాంగమా లేక రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా..అని సురేష్ ప్రశ్నించారు. కూటమి అరాచకాలు రాసేందుకు ఎన్ని పుస్తకాలైనా సరిపోవని, కంప్యూటర్ ఒక్కటే సరిపోతుందన్నారు. లేని శాఖకు మంత్రి స్వామి వలంటీర్ వ్యవస్థను రద్దు చేసినా నేటికీ స్వామి ఆ శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. వలంటీర్లు ప్రజలకు సంక్షేమ పథకాలను ఇంటికి తెచ్చి ఇచ్చేవారని, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో వారి గౌరవ వేతనం రూ.5 వేల నుంచి 10 వేలకు పెంచుతానని చెప్పి ఇప్పుడు ఆ వ్యవస్థనే రద్దు చేసిందని ఆరోపించారు. నియోజకవర్గంలో ఇసుక, గ్రావెల్, బియ్యం మాఽఫియా యథేచ్ఛగా సాగుతోందని, బియ్యం నుంచి ప్రతినెలా మంత్రి స్వామికి రూ.25 లక్షల ముడుపులు ముడుతున్నాయని ఆరోపించారు. అనంతరం బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించారు. పార్టీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బత్తుల అశోక్కుమార్రెడ్డి, సర్పంచ్ బ్రహ్మయ్య, మాదాల శంకర్, ఆర్.అంకయ్య, బి.బుజ్జి, ఏ.దత్తు, ఎం.వేణు, బి.మురళి, ఎన్.బాలయ్య, బి.ప్రభాకర్, కె.పోలిరాజు, కె.భాస్కర్, వి.శ్రీహరి, ఆర్.వెంకటప్రసాద్, ఎస్.వీరయ్య, ఎన్.బాలకోటయ్య, షేక్ సుల్తాన్, కూనం నరేంద్రరెడ్డి, సుదర్శి వెంకట్రావు, యనమల మాధవి, రాపూరి ప్రభావతి, పఠాన్ రియాజ్, షేక్ మహమ్మద్ బాషా, షేక్ సలీం, గాదంశెట్టి గుప్తా, సోమిశెట్టి సురేష్, చుక్కా కిరణ్కుమార్, మిడసల అశోక్, గొల్లపోతు గోవర్ధన్, కోమిట్ల వెంకారెడ్డి, షేక్ అల్లాభక్షు, షేక్ కరీం, బుజ్జమ్మ, షేక్ నౌషాద్, గోళ్లమూడి అశోక్రెడ్డి, బల్లెల ప్రభాకరరెడ్డి, కేశవరపు కృష్ణారెడ్డి, పౌల్, తాతయ్య, విజయ్, నరేష్, పున్నయ్య, సాయికోటి, పి.శ్రీనివాసులరెడ్డి, చొప్పర శివ, పాకనాటి రమణారెడ్డి, పాకనాటి సుబ్బారెడ్డి, హనుమంతరావు పాల్గొన్నారు. -
వసతులు లేక ఇబ్బంది పడుతున్నాం
మా ఊరి బడిని బాగుచేయాలి సుందరయ్య కాలనీలోని మా పాఠశాల ఏమీ బాగోలేదు. నేలపైనే కూర్చుని చదువుకోవాల్సిన పరిస్ధితి. పాఠశాల ఏర్పాటై ఏళ్లు గడుతున్నా కనీస వసతులు లేవు. రోజూ ఇబ్బందులు పడుతున్నాం. ఫర్నిచర్తో పాటు అధిక గదులున్న భవనాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. – ప్రభు కుమార్, 4వ తరగతి, మార్కాపురంవర్షం కురిస్తే పాఠశాలలో కష్టంవిద్యార్థులకు సరిపడా రూములు లేవు. ఉన్న రెండు రూముల్లో ఒకటి వంటశాలగా వాడుతున్నారు. మేము వరండాలో రేకుల కింద కూర్చుంటున్నాం. రేకులకు తుప్పుపట్టి రంధ్రాలు ఏర్పడటంతో వర్షం కురిసినప్పుడల్లా తరగతులు నిలిచిపోతున్నాయి. ఎండా కాలంలో ఆ రేకుల కింద కూర్చోలేకపోతున్నాం. – రోహన్, 5వ తరగతి విద్యార్థి, మార్కాపురం కాలనీ పిల్లలు చదువుకోవడానికి సరైన వసతి లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు పంపే స్థోమత లేక ఊర్లో గవర్నమెంట్ బడికి పంపుతున్నాం. పిల్లలంతా ఇరుకుగా ఉన్న వంట గదిలో కూర్చోవడం చూస్తే బాధగా ఉంది. అధికారులు స్పందించి మా ఊరి బడిని బాగు చేయాలని కోరుతున్నాం. – పెరికె రాణెమ్మ,బచ్చలకూరపాడు -
సెల్ఫోన్ల దొంగకు సంకెళ్లు!
● అదుపులోకి తీసుకున్న జీఆర్పీ పోలీసులు ఒంగోలు టౌన్: రైలులో ప్రయాణిస్తున్న వారి చేతుల్లోని సెల్ ఫోన్లను లాక్కుని నిమిషాల్లో మాయమయ్యే దొంగను ఒంగోలు జీఆర్పీ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక రైల్వే స్టేషన్లోని జీఆర్పీ పోలీసు స్టేషన్లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ షేక్ మౌలా షరీఫ్ వివరాలు వెల్లడించారు. ఒంగోలు నగరంలోని భాగ్యనగర్ 4వ లైనుకు చెందిన షేక్ రఫీ గత కొంతకాలంగా రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నాడు. రైలు గేటు వద్ద కూర్చుని సెల్ఫోన్ చూసే ప్రయాణికుల చేతులపై కర్రతో కొట్టి కిందపడిన ఫోన్లను తీసుకుని ఉడాయించేవాడు. నిందితుడి మీద పలు స్టేషన్లలో 4 కేసులు, ఒంగోలు వన్టౌన్ పోలీసు స్టేషన్లో సస్పెక్ట్ షీట్ నమోదై ఉన్నాయి. ఇతని కదలికలపై నిఘా ఉంచిన జీఆర్పీ పోలీసులు ఒంగోలు రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రూ.50 వేల విలువైన ఒప్పో మొబైల్ ఒకటి, రియల్ మీ ఫోన్లు 3, శాంసంగ్ ఫోన్ ఒకటి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేయడంలో కృషి చేసిన జీఆర్పీ ఎస్సై మధుసూదన్రావు, సిబ్బందిని సీఐ మౌలా షరీఫ్ అభినందించారు. -
బేళ్ల తిరస్కరణతో రైతులకు తీవ్ర నష్టం
ఒంగోలు టౌన్: పొగాకు కొనుగోళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం వేయి కోట్ల రూపాయలు కేటాయించాలని, వర్జీనియా పొగాకు క్వింటా రూ.20 వేలకు తగ్గకుండా కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు జయంతి బాబు, పమిడి వెంకటరావు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక ఎల్బీజీ భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వాతావరణం సరిగా లేకపోవడంతో ఈ ఏడాది పొగాకు దిగుబడి సరిగా రాలేదన్నారు. నాణ్యత లేదని సాకులు చెబుతూ వ్యాపారులు కొర్రీలు పెట్టడంతోపాటు రోజూ వందల సంఖ్యలో బేళ్లను వెనక్కి పంపిస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. వేలం మొదలైన తరువాత వందలాది మంది రైతులు నాలుగుసార్లు బేళ్లను వెనక్కి తీసుకెళ్లారని, గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు. ఒక్కో బ్యారన్కు ఐదారు లక్షల రూపాయల వరకు రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం శాపంగా మారకూడదని, ఇప్పటికే మిర్చి, నల్లబర్లీ పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. అయినా కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలతో పొగాకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. పొగాకు రైతులకు మద్దతుగా గురువారం ఒంగోలులోని ఆర్ఎం కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పొగాకు కొనుగోళ్లకు ప్రభుత్వం రూ.వేయి కోట్లు ఇవ్వాలి రైతులు చస్తున్నా కూటమి ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ అధ్యక్ష కార్యదర్శుల ధ్వజం -
తర్లుపాడు ఎంపీడీఓపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
ఒంగోలు సబర్బన్: స్వీపర్తో అసభ్యంగా ప్రవర్తించిన తర్లుపాడు ఎంపీడీఓ చక్రపాణి ప్రసాద్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు బుధవారం కలెక్టర్ తమీమ్ అన్సారియాను కోరారు. అనంతరం సంఘ జిల్లా అధ్యక్షుడు రావినూతల కోటిమాదిగ మాట్లాడుతూ.. తర్లుపాడు పోలీసులు ఎంపీడీఓపై కేసు నమోదు చేిశారు కానీ ఇంతవరకు అరెస్ట్ చేయలేదన్నారు. ఎంపీడీఓపై చట్టపరంగా, శాఖాపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్ను కలిసిన వారిలో సంఘ నాయకులు నేదరపల్లి జయరాజ్, రేణమాల మాధవ, రావినూతల వెంకటేష్, సూరపోగు మోజెష్, ఎనిబెర అబ్రహం, రోశయ్య తదితరులు ఉన్నారు. పొలం వివాదంలో గొడ్డళ్లతో దాడి ● ముగ్గురికి తీవ్ర గాయాలు కొమరోలు: పొలం విషయమై దాయాదుల మధ్య తలెత్తిన వివాదం తీవ్ర స్థాయి ఘర్షణకు దారితీసింది. ఈ సంఘటన కొమరోలు మండలంలోని గోనపల్లెలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. రెండు వర్గాలకు చెందిన వారు గొడ్డళ్లు, కర్రలతో పరస్పరం దాడి చేసుకోగా పెద్దినేని వెంకటేశ్వర్లు, పెద్దినేని శేఖర్, వసంత, రమణయ్య, లక్ష్మీదేవి, చంద్రయ్యకు గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంలో గిద్దలూరు వైద్యశాలకు తరలించారు. ఇరువర్గాలపై కేసులు నమోదు చేసినట్లుగా ఎస్హెచ్ఓ నారాయణ తెలిపారు. -
రెంటు బడి.. ‘వంట’బడి!
సమస్యల మధ్య కొనసాగుతున్న బాలల విద్య ఇలాగైతే చదువు ‘వంట’బట్టేనా? ప్రభుత్వ పాఠశాలలకు పేద విద్యార్థులను క్రమంగా దూరం చేసేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని సర్కారు బడుల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులను సైతం పాలకులు ఇబ్బందులకు గురిచేస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు ఇటీవల మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాటలను ఉటంకించిన సీఎం చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆ దిశగా గత ఏడాది కాలంగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో అద్దె భవనాల్లో, పాఠశాల వంటగదుల్లో అరకొర వసతుల మధ్యే విద్యార్థులు చదువుకోవాల్సిన దుస్థితి. మనబడి నాడు–నేడు పనులకు మంగళం పాడిన కూటమి సర్కారు విద్యాభివృద్ధిపై కపట ప్రేమ చూపుతోందనేందుకు జిల్లాలోని పలు పాఠశాలలు తార్కాణంగా నిలుస్తున్నాయి. మార్కాపురం సుందరయ్య కాలనీలో పాఠశాల ఆగిన నిర్మాణం.. దికై ్కన అద్దె భవనం బేస్తవారిపేట: స్థానిక ఇస్లాంపేటలో అద్దె భవనంలో నిర్వహిస్తున్న ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో సరైన వసతులు లేకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. ఏడేళ్ల క్రితం ఉరుఊ్ద పాఠశాల రెండు తరగతి గదులు శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉండటంతో అధికారులు పడగొట్టారు. సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో నూతన గదులను బేస్మెంట్ వరకు నిర్మించిన కాంట్రాక్టర్ బిల్లులు రాలేదని మధ్యలోనే వదిలేశాడు. అప్పటి నుంచి పాఠశాలను ఇస్లాంపేటలో ఓ అద్దె ఇంట్లో నడుపుతున్నారు. ప్రతి నెలా ఉపాధ్యాయులే అద్దె, కరెంట్ బిల్లు చెల్లిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 28 మంది చదువుకుంటున్నారు. వసతులు లేకపోవడం, ఇరుకు గదుల్లో పాఠాలు చెప్పాల్సి రావడంతో కొందరు తల్లిదండ్రులు టీసీలు తీసుకుని వేరే పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పిస్తున్నారు. నాడు–నేడు మొదటి విడతలో ఎంపికై న ఈ పాఠశాలలో టాయిలెట్స్ నిర్మించారు. బెంచీలు, స్మార్ట్ టెలివిజన్ ఇవ్వగా వసతి లేక మూలన పెట్టారు. అసంపూర్తి భవనానికి నిధులు మంజూరు చేసి సమస్య పరిష్కరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. మొండి గోడలు.. చిల్లుల రేకులు మార్కాపురం టౌన్: మార్కాపురం పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుందరయ్య కాలనీలో ప్రాథమికోన్నత పాఠశాల అద్దె భవనంలో అరకొర వసతుల మధ్య నడుస్తోంది. ఈ కాలనీలో రోజూ పనికెళ్లి పొట్టపోసుకునే కూలీలే అధికం. వేల రూపాయల ఫీజులు కట్టి తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపలేక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు అందరూ మొగ్గుచూపుతున్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు సుమారు 63 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలలో 2 గదులు, వరండా మాత్రమే ఉన్నాయి. ఒక గదిలో వంటశాల ఉండగా, మరో గదిలో 1, 2 తరగతుల విద్యార్థులు కూర్చుంటున్నారు, వరండాలో 3, 4, 5, తరగతుల విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. వరండా మొత్తం రేకులతో కప్పి ఉంది. రేకులు శిథిలావస్థకు చేరి చిల్లులు పడటంతో వర్షం కురిసినపుడు చిన్నారులు అవస్థలు పడుతున్నారు. నేలపై కూర్చోవడం, వీధి కుళాయి వద్ద నీరు తెచ్చుకుని తాగడం, ఆరుబయటే కాలకృత్యాలు తీర్చుకోవడం ఇక్కడి విద్యార్థులకు అలవాటు చేసినట్టుగా కనిపిస్తోంది. బయట నుంచి చూసేవారికి ఇక్కడ ఓ పాఠశాల ఉందని కూడా తెలియడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మార్కాపురం సుందరయ్య కాలనీలో అద్దె ఇంట్లో మొండిగోడల మధ్య విద్యా బోధన కొనకనమిట్ల మండలం బచ్చలకూరపాడు ఏఏ పాఠశాలలో వంట గదిలో తరగతులు బేస్తవారిపేటలో నిధులివ్వకపోవడంతో నిలిచిన ఉర్దూ పాఠశాల నిర్మాణం బెంచీలకు సైతం దిక్కులేక నేలపైనే కూర్చుంటున్న విద్యార్థులు కనీస మౌలిక వసతులు కల్పించడంలో కూటమి సర్కారు నిర్లక్ష్యం కొనకనమిట్ల: మండలంలోని బచ్చలకూరపాడు ఎస్సీ కాలనీలో మండల పరిషత్ ఏఏ పాఠశాలలో నాడు–నేడు పనులు నిలిచిపోవడం విద్యార్థులకు శాపంగా మారింది. రెండో విడతలో భాగంగా చేపట్టిన నూతన పాఠశాల నిర్మాణ పనులు శ్లాబ్ దశ వరకు పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం రాగానే పనులు నిలిపేయడంతో పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్న 24 మంది విద్యార్థులను వంట గదిలో కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తున్నారు. అయితే ఇరుకు గదిలో కూర్చోలేక కొందరు పిల్లలు బయటకు వెళ్లి ఆటలాడుకుంటున్నారు. పాఠశాల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని సర్వసభ్య సమావేశంలో ప్రశ్నిస్తున్నా అధికారులు స్పందించడం లేదని గ్రామ సర్పంచ్ మెట్టు రమణమ్మ, ఆమె భర్త వైస్ ఎంపీపీ మెట్టు వెంకటరెడ్డి చెప్పారు. ఇదిలా ఉండగా ఇటీవల బదిలీలకు ముందు వరకు పాఠశాలలో ఇద్దరు టీచర్లు ఉండగా ప్రస్తుతం ఒక్కరే పనిచేస్తున్నారు. శ్రీవిద్యార్థులు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. సమస్యను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామ’ని ఎంఈఓ–2 నరసింహారావు చెప్పారు. -
జేసీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు
ఒంగోలు సబర్బన్: జిల్లా వ్యాప్తంగా అధికారులు అన్ని సంస్థలు, గోడౌన్లు, పెట్రోలు బంకులు, గ్యాస్ గోడౌన్లతో పాటు ఇతర సంస్థల్లో బుధవారం విస్తృత తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. జిల్లాలోని రెవెన్యూ విభాగానికి చెందిన ఆర్డీఓలు, తహసీల్దార్లతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు తనిఖీల్లో పాల్గొన్నారు. జిల్లా రెవెన్యూ అధికారులు, పౌరసరఫరాల అధికారి, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది, ఫుడ్ ిసేప్టీ అధికారులు, లీగల్ మెట్రాలజీ అధికారులు, ఫైర్ డిపార్ట్మెంట్, రూరల్ వాటర్ సప్లయ్ అధికారులు కూడా తనిఖీల్లో పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లు జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. ఉదయం 8 గంటల నుంచి అధికారిలందరూ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారన్నారు. స్పెషల్ డ్రైవ్లో భాగంగా పెట్రోలు బంకులు, గ్యాస్ ఏజెన్సీలు, రేషన్ షాపులు, ఎంఎల్ఎస్ పాయింట్స్, రైస్ మిల్లులు, బాణసంచా గోడౌన్లు, వాటర్ ఆర్ఓ ప్లాంట్లు, సినిమా హాళ్లు కూడా తనిఖీ చేశారు. ఇప్పటి వరకు పెట్రోలు బంకులు–38, గ్యాస్ ఏజెన్సీలు–9, రేషన్ షాపులు–50, ఎంఎల్ఎస్ పాయింట్స్–9, రైస్ మిల్లులు–6, బాణసంచా గోడౌన్లు–3, ఆర్ఓ ప్లాంట్లు–22, ఆర్టీసీ బస్టాండ్స్–2, హోటల్స్–2, ఐస్ క్రీమ్–1, ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ యూనిట్–1, సినిమా హాళ్లు–5 పరిశీలించారు. తనిఖీలు నిర్వహించిన వారిలో జిల్లా పౌరసరఫరాల అధికారి ఎస్.పద్మశ్రీ, రెవెన్యూ డివిజనల్ అధికార్లు, సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్, జిల్లాలోని అందరూ తహసీల్దార్లు, సివిల్ సప్లయ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది, ఫుడ్ పేఫ్టీ అధికారులు, లీగల్ మెట్రోలజీ అధికారులతో పాటు అన్ని విభాగాల అధికారులు ఉన్నారు. -
పీఆర్సీ లేదు.. బకాయిల్లేవు
● బీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు పర్రె వెంకటరావు ఒంగోలు సిటీ: బహుజన ఉపాధ్యాయ హక్కుల పరిరక్షణే బహుజన టీచర్స్ అసోసియేషన్ లక్ష్యమని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పర్రె వెంకటరావు పేర్కొన్నారు. బుధవారం బహుజన టీచర్స్ అసోసియేషన్ 25వ ఆవిర్భావ సదస్సును స్థానిక సంఘ కార్యాలయంలో నిర్వహించారు. పర్రె వెంకటరావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ కమిటీ వేయకుండా, బకాయిలు చెల్లించకుండా తాత్సారం చేయడం సరికాదన్నారు. టీచర్ల బదిలీలు, పదోన్నతుల్లో బహుజనుల హక్కులు కాపాడటంతో బీటీఏ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏల్చూరి మాధవరావు మాట్లాడుతూ.. యాప్ల భారం తగ్గిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంకా ఎక్కువ చేయడం తగదని అన్నారు. జిల్లా కార్య నిర్వాహక అధ్యక్షుడు కర్ర దేవసహాయం అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పారాబత్తిన జాల రామయ్య మద్ధిరాల శరత్ చంద్రబాబు, పల్లె తిరుపతిస్వామి, కొండమూరి కొండలరాయుడు, చెక్క కోటేశ్వరరావు, మిర్యాల వెలుగొండయ్య, గాలిమోటు భాస్కరరావు, బొంత కళ్యాణ్, టి.రాజ్ కుమార్, కొప్పోలు కిషోర్, నన్నేసాని భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. -
మహిళలకు స్థిరమైన జీవనోపాధి కల్పించాలి
ఒంగోలు సబర్బన్: స్వయం సహాయక సంఘాల మహిళలకు స్థిరమైన జీవనోపాధి కల్పించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. సూక్ష్మరుణ ప్రణాళిక (మైక్రో క్రెడిట్ ప్లాన్), ఏసీఎల్పీ(యాన్యువల్ క్రెడిట్ అండ్ లైవ్లీహుడ్ ప్లాన్) పథకాలు అమలు చేయడంతో పాటు లబ్ధిపొందేలా చర్యలు చేపట్టాలన్నారు. బుధవారం ప్రకాశం భవన్లోని సమావేశ మందిరంలో డీఆర్డీఏ, వ్యవసాయ, పశు సంవర్ధక, సెరీకల్చర్, చేనేత–జౌళి శాఖ, పరిశ్రమలు, ఉద్యాన శాఖ, ఎల్డీఎం తదితర శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డ్వాక్రా మహిళలకు ఏఏ శాఖల్లో సబ్సిడీ యూనిట్స్ అమలు చేస్తున్నారో అవగాహన కల్పించాలని ఆదేశించారు. జిల్లాలోని 45,297 స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైన 4,46,026 మందిలో పీ4 కార్యక్రమానికి ఎంపిక చేసిన వారికి ప్రాధ్యానత ఇవ్వాలన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ నారాయణ, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవికుమార్, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు, జిల్లా సెరీకల్చర్ అధికారి సంజయకుమార్, జిల్లా పరిశ్రమల అధికారి శ్రీనివాసరావు, ఎల్డీఎం రమేష్ కుమార్, జిల్లా చేనేత జౌళి శాఖాధికారి, ఫుడ్ ప్రాసెసింగ్ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా -
పరిమితికి మించి సాగుచేస్తే నష్టాలే
● పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్కుమార్ పొదిలి: పొగాకు రైతులు అనుమతించిన దానికంటే అధికంగా సాగు చేస్తే నష్టపోయే అవకాశం ఉందని పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్కుమార్ అన్నారు. స్థానిక పొగాకు వేలం కేంద్రాన్ని బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా వేలం సరళిని పరిశీలించి రైతులతో సమావేశమయ్యారు. రానున్న పంట కాలానికి బోర్డు అనుమతించిన 142 మిలియన్ కేజీల సాగుకు మాత్రమే రైతులు పరిమితం కావాలన్నారు. అంతర్జాతీయంగా దేశీయ పొగాకుకు బ్రెజిల్, జింబాబ్వే దేశాలు పోటీగా ఉండేవన్నారు. ప్రస్తుతం తాంజానియా, ఉగాండ, మలాభి వంటి దేశాలు ఎఫ్సీవి పొగాకును సాగు చేసి దేశీయ పొగాకు మార్కెట్కు గట్టి పోటీ ఇస్తున్నాయని చెప్పారు. రానున్న పంట కాలానికి రైతులు అధిక ధరలకు బ్యారన్లు, పొలాలు కౌలుకు తీసుకోవద్దని సూచించారు. లోగ్రేడ్ పొగాకు కొనుగోళ్లలో ఏర్పడిన సంక్షోభాన్ని తొలగించేందుకుకంపెనీల యాజమాన్యాలు, ఉన్నతాధికారులతో మాట్లాడి లోగ్రేడ్ పొగాకును కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. రైతులు మార్కెట్ సరళిని గమనించి బోర్డు అధికారులు, క్షత్ర సిబ్బంది సూచించిన బేళ్లను మాత్రమే వేలం కేంద్రాలకు తీసుకురావాలని ఆయన కోరారు. అదనపు పంట అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుందన్నారు. రైతుల వద్ద ఉన్న మొత్తం పొగాకును అమ్ముకునే విధంగా పొగాకు బోర్డు చర్యలు తీసుకుంటుందన్నారు. వ్యాపారులతో సమావేశమైన ఆయన.. లోగ్రేడ్ పొగాకు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవాలని కోరారు. వేలం కేంద్రాలకు రైతులు లోగ్రేడ్ పొగాకు మాత్రమే తీసుకవస్తున్నందున కొనుగోలు చేయలేక పోతున్నామని వ్యాపారులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వేలం అధికారి జి.గిరిరాజ్కుమార్, రైతులు పాల్గొన్నారు. -
అత్యవసర షెడ్యూల్లో ఆంతర్యం ఏమిటి ?
● కొండపి పంచాయతీ ఎన్నికలపై మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ కొండపి: కొండపి పంచాయతీ ఎన్నికలకు అత్యవసర షెడ్యూల్ ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ మంత్రి సురేష్ ప్రశ్నించారు. మంగళవారం సాయంత్రం కొండపిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కొండపి పంచాయతీ నాయకులతో ఎన్నికల గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సురేష్ మాట్లాడుతూ 2026 ఫిబ్రవరి నాటికి అన్ని పంచాయతీలకు గడువు ముగుస్తుందని కేవలం 6 నెలల మాత్రమే ఉన్న సందర్భంలో ఇప్పటికిప్పుడు కొండపి పంచాయతీకి షెడ్యూల్ ప్రకటించడంలో దాగి ఉన్న మర్మం ఏంటి అని ప్రశ్నించారు. కోర్టు కేసుల పెండింగ్ నుంచి రాష్ట్రంలో దాదాపు 27 పంచాయతీలు ఉన్నాయని, అందులో జిల్లాలో మంగమూరు పంచాయతీ కూడా ఉందని, కేవలం రెండు పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని మంత్రి స్వామి ఒత్తిడి చేసి ఎన్నికల నిర్వహిస్తున్నారన్నారు. ఓటర్ల జాబితా అంతా తప్పులు తడకగా ఉందని, దానితో ఎలక్షన్ కు ఎలా వెళతారని ప్రశ్నించారు. వార్డుల్లో ఓట్లను ఏ ప్రాతిపదికన నిర్ణయించారో ఎవరికీ అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉన్నారన్నారు. రానున్న ఆరు నెలల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పంచాయతీ ఎన్నికలతో పాటు కొండపి పంచాయతీకి కూడా ఎన్నిక నిర్వహిస్తే అంతా సవ్యంగా ఉండేదన్నారు. నామినేషన్లకు కేవలం మూడు రోజుల మాత్రమే అవకాశం ఇచ్చారని, పోటీ చేసే అభ్యర్థులు ధ్రువపత్రాలు సిద్ధం చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఉందన్నారు. కేవలం మంత్రి స్వామి స్వలాభాపేక్ష కోసం మాత్రమే ఎన్నికల నిర్వహిస్తున్నారని పంచాయతీలోని ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. పంచాయతీలో పోటీ చేయడానికి ఒక కమిటీని వేశామని, కమిటీ ఆదేశాల మేరకు అభ్యర్థుల పోటీ పై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ బచ్చల కోటేశ్వరరావు, గొట్టిపాటి మురళి, బొక్కిసం సుబ్బారావు, ఆరికట్ల కోటిలింగయ్య, వైస్ ఎంపీపీ రావులపల్లి కోటరాజు, యామవరపు వీర వసంతరావు, సుల్తాన్ వన్నూరు, హరి నారాయణ శేఖర్ రెడ్డి, రాయుడు, శివరాం, కొర్నేలు, వెంకటరావు, శ్రీను చిన్న వసంతరావు, వెంకటేశ్వర రెడ్డి, రమణారెడ్డి నజీర్, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఒక్క రోజే 1,001 బేళ్ల తిరస్కరణ
టంగుటూరు/కొండపి: టంగుటూరు, కొండపి వేలం కేంద్రాల పరిధిలో మంగళవారం ఒక్క రోజే 1,001 బేళ్లు తిరస్కరణకు గురయ్యాయి. వేలం కేంద్రాల చరిత్రలో ఒకే రోజు ఇన్నీ బేళ్లు తిరస్కరణకు కాలేదు. వ్యాపారులంతా కుమ్మకై ్క రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇప్పటికే 8 రౌండ్లు వేలం ముగిసినా నిత్యం వందల సంఖ్యలో బేళ్లు తిరస్కరణకు గురవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు రోజుకు 300 పైచిలుకు బేళ్లు తిరస్కరిస్తుంటే మంగళవారం ఒక్కో కేంద్రంలో 500 పైచిలుకు బేళ్లు తిరస్కరణకు గురయ్యాయి. మంగళశారం టంగుటూరు వేలం కేంద్రానికి 973 బేళ్లు రాగా 406 బేళ్లు కొనుగోలుచేసి 567 బేళ్లు తిరస్కరించారు. గరిష్ట ధర రూ.280, కనిష్ట ధర రూ.160, సరాసరి ధర రూ.216.83గా నమోదైంది. వేలంలో 36 మంది వ్యాపారులు పాల్గొన్నట్లు బోర్డు అధికారులు ప్రకటిస్తున్నా..వాస్తవానికి 10 మంది కూడా పాల్గొనడం లేదు. దీంతో ఉన్న వ్యాపారులంతా కుమ్మకై ్క ఇష్టం వచ్చినట్లు ధరలు ఇచ్చి బేళ్లను తిరస్కరిస్తున్నారు. టంగుటూరు వేలం కేంద్రంలోకి రైతులను రానివ్వకుండా వేలం నిర్వహించడం విశేషం. అసలు రైతులను బయట పెట్టి వేలం నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కొండపిలో 9వ రౌండ్ వేలం మంగళవారం ప్రారంభమైంది. ఈ రౌండ్లోనైనా ధరలు వస్తాయని రైతులు ఆశలు పెట్టుకుంటే వారి ఆశలు ఆడియాశలు చేస్తూ ఒకే రోజు 534 బేళ్లను తిరస్కరించారు. జువ్విగుంట, అయ్యవారిపాలెం, జాళ్లపాలెం, పీరాపురం, తంగెళ్ల గ్రామాల రైతులు 1176 బేళ్లను తీసుకురాగా 642 బేళ్లను కొనుగోలు చేసి 534 బేళ్లను తిరస్కరించారు. గరిష్ట ధర రూ.280, కనిష్ట ధరరూ.159, సరాసరి ధర రూ.241.01గా నమోదైంది. -
వివాహిత అనుమానాస్పద మృతి
దర్శి: పట్టణంలోని లంకోజనపల్లి రోడ్డుకు చెందిన రావులపల్లి ఐశ్వర్య(21) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సోమవారం సాయంత్రం 9 గంటల ప్రాంతంలో లంకోజనపల్లి రోడ్డులోని తమ నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు తెలిపారు. మృతురాలు కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు..బొట్లపాలెం గ్రామానికి చెందిన మాడపాకుల అంజయ్య కుమార్తె ఐశ్వర్యను ఏడాదిన్నర క్రితం రావులపల్లి వంశీకి ఇచ్చి వివాహం చేశారు. అప్పటి నుంచి అదనపు కట్నం కోసం తమ కుమార్తెను వేధించేవాడని తెలిపారు. ఇటీవల వేధింపులు ఎక్కువ కావడంతో సోమవారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఈ విషయంపై ఎస్సై మురళీని వివరణ కోరగా..భర్త వేధిపులు కారణంగా భార్య ఉరేసుకోని ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో విచారణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో హెచ్ఈఓ మృతి బేస్తవారిపేట: రోడ్డు ప్రమాదంలో మోక్షగుండం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెచ్ఈఓగా పనిచేస్తున్న శగునాల నాగేశ్వరరావు(57) మంగళవారం మృతి చెందారు. ఈ సంఘటన మండలంలోని మోక్షగుండం సమీపంలో ఒంగోలు–నంద్యాల హైవేరోడ్డుపై జరిగింది. వివరాల్లోకి వెళఇతే..హజరత్గూడెం నుంచి స్కూటీపై నాగేశ్వరరావు పీహెచ్సీ బయలుదేరాడు. మోక్షగుండం సమీపంలో వైద్యశాలలోనికి వెళ్లేందుకు హైవేరోడ్డు క్రాస్ చేసే సమయంలో బ్రహ్మంగారిమఠం నుంచి గుంటూరు వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ సంఘటనలో నాగేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రున్ని 108లో కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించే సమయంలో మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కంది విత్తనాలు కొందరికే..! కొనకనమిట్ల: కంది విత్తనాల పంపిణీ తీరుపై కొనకనమిట్లలో రైతులు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక రైతు సేవా కేంద్రంలో మంగళవారం కంది విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు ఏఈఓ, వీఏఏలు చెప్పడంతో ఆశగా వెళ్లిన రైతులకు భంగపాటు ఎదురైంది. ఉచితంగా కంది విత్తనాలు ఇస్తున్నట్లు చెప్పడంతో పెద్ద సంఖ్యలో రైతులు తమ భూముల జిరాక్స్ కాపీలతో వెళ్లారు. మధ్యాహ్నం వరకు 40 మంది రైతులకు ఒక్కొక్కరికి 4 కిలోల చొప్పున విత్తనాలు పంపిణీ చేసిన అధికారులు సర్వర్ పని చేయడం లేదని, మరో 40 మందికే విత్తనాలు ఇస్తామని స్పష్టం చేయడంతో రైతులు ఆగ్రహించారు. తమ పరిస్థితి ఏమిటని వీఏఏని నిలదీయడంతో ‘మేమేం చేయలేం. ప్రభుత్వం 80 ప్యాకెట్లు ఇచ్చింది. అవే పంచుతున్నామ’ని జవాబిచ్చారు. దీనిపై ఏఓ ప్రకాష్రావును వివరణ కోరగా మండలానికి 70 క్వింటాళ్ల కంది విత్తనాలు వచ్చాయని, సాగు చేసే రైతులే తీసుకోవాలని చెప్పారు. -
ఒకటి రెండైంది.. సమస్య మెండైంది!
ప్రజలతోపాటు రెవెన్యూ యంత్రాంగానికి తలబొప్పి కట్టిస్తున్న తహసీల్దార్ కార్యాలయాల విభజన లాగిన్ల తారుమారుతో అటుఇటూ తిరుగుతూ దరఖాస్తుదారుల తిప్పలులాగిన్లు తారుమారైన విషయం వాస్తవమే ఒంగోలు అర్బన్, ఒంగోలు రూరల్ తహసీల్దార్ కార్యాలయాలకు సంబంధించిన లాగిన్లు తారుమారైన విషయం వాస్తవమే. ఒంగోలు అర్బన్లోని శివారు గ్రామాలకు చెందిన లాగిన్లు ఒంగోలు రూరల్ తహసీల్దార్ లాగిన్కు వెళ్తున్నాయి. అదేవిధంగా ఒంగోలు మండలంలోని కొన్ని రూరల్ గ్రామాలకు చెందిన దరఖాస్తులు ఒంగోలు అర్బన్ తహసీల్దార్ కార్యాలయానికి చెందిన ఆర్ఐ, వీఆర్ఓ, తహసీల్దార్ లాగిన్లకు వస్తున్నాయి. వీటిని గమనించి ఆర్ఐలు, వీఆర్ఓలకు తగిన సలహాలు, సూచనలు చేశాం. ప్రజలకు, దరఖాస్తుదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా లాగిన్లు చెక్ చేసుకునేలా ఆదేశాలు జారీ చేశాం. ప్రజలకు ఇబ్బంది లేకుండా అధికారులే మార్పులు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశాం. ఈ విషయంపై జిల్లా కేంద్రంలోని గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం (జీఎస్డబ్ల్యూఎస్) కార్యాలయ కో ఆర్డినేటర్కు లేఖ కూడా రాశాం. – పిన్నిక మధుసూదన్రావు, ఒంగోలు అర్బన్ తహసీల్దార్ ఒంగోలు సబర్బన్: ఒంగోలు తహసీల్దార్ల కార్యాలయాల్లో అధికారుల లాగిన్లలో గందరగోళం నెలకొంది. వాటిలో ఏం జరుగుతోందో ఎవరికీ అంతుబట్టటం లేదు. రెండుమూడు నెలలుగా లాగిన్లలో సాంకేతిక సమస్య ఏర్పడటంతో దరఖాస్తుదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. గతంలో ఒంగోలు మండలం మొత్తానికి ఒకే తహసీల్దార్ కార్యాలయం ఉండేది. అలాంటిది ఏడాది క్రితం కొత్తగా ఒంగోలు అర్బన్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. మొదటి నుంచి ఉన్న తహసీల్దార్ కార్యాలయాన్ని ఒంగోలు రూరల్ తహసీల్దార్ కార్యాలయంగా మార్పు చేశారు. రెండు తహసీల్దార్ కార్యాలయాలుగా విభజించి రెండు కార్యాలయాలకు ఇద్దరు తహసీల్దార్లను కూడా నియమించారు. ఎవరి కార్యాలయాలను వాళ్లకు అప్పగించిన ఉన్నతాధికారులు ఎవరి లాగిన్ను వాళ్లకు ఏర్పాటు చేశారు కూడా. ఇంతవరకూ బాగానే ఉంది. అధికారులు, సిబ్బంది వరకు ఏ ఇబ్బందీ లేదు. మరి ఇబ్బంది వచ్చిపడిందల్లా ఒంగోలు అర్బన్, ఒంగోలు రూరల్ పరిధిలోని ప్రజలకే. ఏదైనా సర్టిఫికెట్ కావాలని గ్రామ, వార్డు సచివాలయంలోగానీ, మీ సేవా కేంద్రంలోగానీ దరఖాస్తు చేసుకుంటే.. అక్కడి నుంచే దరఖాస్తుదారునికి కష్టాలు ప్రారంభమవుతున్నాయి. సంబంధిత వీఆర్ఓతో సంతకం పెట్టించి మీ సేవలోగానీ, గ్రామ, వార్డు సచివాలయంలోగానీ దరఖాస్తు చేసుకుంటే.. ఆ దరఖాస్తు ఆన్లైన్లో వెంటనే రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) లాగిన్కు రావాల్సి ఉంది. ఉదాహరణకు ఒంగోలు రూరల్ మండలం దేవరంపాడు గ్రామంలో దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ఆ ఫైల్ తీసుకుని ఒంగోలు రూరల్ ఆర్ఐ వద్దకు వస్తే ఆ దరఖాస్తు ఆర్ఐ లాగిన్లో కనపడదు. అదేవిధంగా ఒంగోలు అర్బన్కు చెందిన దరఖాస్తుదారుడు ఇందిరమ్మ కాలనీలోని వార్డు సచివాలయంలో ఇన్కం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుని ఒంగోలు అర్బన్ ఆర్ఐ వద్దకు వెళ్తే ఆ దరఖాస్తు ఒంగోలు అర్బన్ ఆర్ఐ లాగిన్లో కనబడదు. మీ సేవలో, సచివాలయాల్లో చేసిన దరఖాస్తులు ఏమవుతున్నాయని పరిశీలించగా, చివరకు తేలిందేమిటంటే ఒంగోలు అర్బన్ తహసీల్దార్కు దరఖాస్తు చేసుకుంటే ఒంగోలు రూరల్ తహసీల్దార్ లాగిన్కు, రూరల్లో దరఖాస్తు చేసుకుంటే అర్బర్ తహసీల్దార్కు వెళుతున్నాయి. వారాల తరబడి తిరగాల్సిన దుస్థితి... తహసీల్దార్ కార్యాలయాలలో లాగిన్ సమస్యలతో అధికారులు తలలు పట్టుకోవటం ఒక ఎత్తయితే, దరఖాస్తు చేసుకున్న ప్రజలు అధికారులు, కార్యాలయాల చుట్టూ వారాల తరబడి తిరగాల్సిన దుస్థితి నెలకొంది. రెండు తహసీల్దార్ కార్యాలయాలు వేరైనప్పటికీ.. అధికారులు, సిబ్బంది వేరైనప్పటికీ ఒక్కో దరఖాస్తుదారుడు మాత్రం ఒంగోలు అర్బన్, రూరల్ తహసీల్దార్ల వద్దకు, ఇద్దరు ఆర్ఐల వద్దకు, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్ల వద్దకు, ఇద్దరు డిప్యూటీ తహసీల్దార్ల వద్దకు ప్రదక్షిణలు చేస్తూ నానా అవస్థలు పడుతున్నాడు. ఒకవైపు స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమయ్యాయి. మరోవైపు తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ లాంటి పథకాల కోసం దరఖాస్తు చేసుకోవటానికి నానా అవస్థలు పడుతున్నారు. రేషన్కార్డులకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. తమ దరఖాస్తు ఎక్కడుందో తెలుసుకునేసరికే దరఖాస్తుదారులకు తలప్రాణం తోకలోకి వస్తోంది. వీటన్నింటికీ కారణం లాగిన్స్ అస్తవ్యస్తంగా తయారుకావడమే. ఒంగోలు నగరంలోని ప్రజలతో పాటు ఒంగోలు రూరల్ మండలంలోని గ్రామాల ప్రజలు సైతం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒంగోలు తహసీల్దార్ల కార్యాలయాల్లో గందరగోళంగా లాగిన్స్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకుంటే ప్రదక్షిణలు చేయాల్సిందే.. గతంలో ఒకటిగా ఉన్న తహసీల్దార్ కార్యాలయం ఇటీవల రెండుగా విభజన ఒంగోలు అర్బన్, ఒంగోలు రూరల్ తహసీల్దార్ కార్యాలయాలుగా ఏర్పాటు అర్బన్ తహసీల్దార్కు దరఖాస్తు చేస్తే రూరల్కి.. రూరల్ తహసీల్దార్కు చేస్తే అర్బన్కు వెళ్తున్న దరఖాస్తులు ఎవరి దరఖాస్తు ఎక్కడుందో తెలియక కాళ్లరిగేలా తిరుగుతున్న ప్రజలు -
రిజర్వేషన్లు మాయం!
జిల్లాలో మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ల నియామకంలో కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరించింది. ఎస్సీ, ఎస్టీలకు దక్కాల్సిన పదవులను అగ్రకులాలకు అప్పగించి స్వయంగా ప్రభుత్వమే చట్టాన్ని ఉల్లంఘించింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెత్తనం చెలాయిస్తున్న కూటమి ప్రజాప్రతినిధులకు ఉన్నతాధికారులు సైతం జీ హుజూర్ అనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమకు దక్కాల్సిన పదవులను వేరేవారికి కట్టబెట్టడంపై అధికార పార్టీలోని ఎస్సీ, ఎస్టీ నాయకులు రగిలిపోతున్నారు. దళితుల హక్కులను కాలరాస్తున్నారని జిల్లాలోని ఎస్సీ, ఎస్టీలు మండిపడుతున్నారు. న్యాయం కోసం ఇప్పటికే కొందరు కోర్టు తలుపులు తట్టారు. మరికొందరు అదే దారిలో ఉన్నారు. అగ్రతాంబూలం..సాక్షి ప్రతినిధి,ఒంగోలు: జిల్లాలో 10 మార్కెట్ యార్డులు ఉన్నాయి. యార్డు చైర్మన్ పదవుల నియామకం విషయంలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లను ఖరారు చేసింది. బీసీ వెల్ఫేర్ డిపార్టమెంట్ ద్వారా జీవో నంబర్ ఎంఎస్ 77ను విడుదల చేసింది. దీని ప్రకారమే రిజర్వేషన్లు నిర్ణయించాలని ప్రస్తుత కూటమి ప్రభుత్వం తొలుత కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలననుసరించి జనాభా ప్రతిపాదిక, రొటేషన్ విధానం ద్వారా జూన్ 6వ తేదీ రిజర్వేషన్లను ఖరారు చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం జిల్లాలోని కనిగిరి దర్శి మార్కెట్ యార్డులను ఎస్సీలకు రిజర్వ్ చేశారు. యర్రగొండపాలెం మార్కెట్ యార్డు పదవిని ఎస్టీలకు కేటాయించారు. ఒంగోలు, గిద్దలూరు బీసీ జనరల్కు, పొదిలి బీసీ మైనార్టీ మహిళకు కేటాయించారు. మొత్తం మీద ఓసీలకు 4, బీసీలకు 3, ఎస్సీలకు 2, ఎస్టీకి 1 రిజర్వ్ చేశారు. ఇక్కడ దాకా సజావుగా సాగినట్లు కనిపించింది. ఆ తర్వాత తాను ఇచ్చిన ఆదేశాలనే పక్కన పెట్టేసింది రాష్ట్ర ప్రభుత్వం. రిజర్వేషన్లు గిజర్వేషన్లు లేవు, అంతా మా ఇష్టం అన్నట్టుగా కూటమి పాలకులు సొంత రాజ్యాంగాన్ని అమలు చేయడానికి శ్రీకారం చుట్టారు. దళితులు, ఆదివాసీల సీట్లపై కన్ను... జిల్లాలోని 10 మార్కెట్ యార్డుల్లో 4 చోట్ల ఓసీలకు కేటాయించినా టీడీపీ నాయకులు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేసిన స్థానాలపై కన్నేశారు. ఇక్కడ కూడా తామే పెత్తనం చేయాలన్న దురుద్దేశంతో రిజర్వేషన్లను పక్కన పెట్టేశారు. అధికారం చేతిలో ఉండడంతో దొడ్డిదారిన వారి పదవులను అనుభవించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో దళితులకు రిజర్వ్ అయిన కనిగిరి, దర్శి మార్కెట్ యార్డు పదవులను చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే కలెక్టర్ రిజర్వేషన్లను ప్రకటించినా టీడీపీ ఎమ్మెల్యేలు లెక్కచేయడం లేదు. ఆయా స్థానాల్లో ఓసీల అభ్యర్థులను ప్రకటించి నిబంధనలకు వ్యతిరేకంగా వారి చేత ప్రమాణ స్వీకారాలు చేయిస్తున్నారు. కూటమి పాలకుల బరితెగింపు చూసి ఎస్సీ, ఎస్టీ సంఘాలు మండిపడుతున్నాయి. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎస్సీకి రిజర్వ్ చేసిన కనిగిరి మార్కెట్ యార్డు చైర్మన్ పదవికి అధికార పార్టీ సామాజిక వర్గానికి చెందిన ఏరువ శ్రీనివాసరావుకు ప్రకటించారు. ఇప్పుడాయన స్థానంలో ఆయన సతీమణి రమాదేవికి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే లిస్టును హైకమాండ్ వద్దకు పంపించినట్లు తెలుస్తోంది. దీంతో ఇక్కడ టీడీపీలోని ఎస్సీలు నిరాశకు గురవుతున్నారు. తమ నోటికాడికి వచ్చిన అవకాశాన్ని లాగేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే దర్శి మార్కెట్ యార్డులోనూ ఇదే తంతు కొనసాగుతోంది. ఎస్సీలకు రిజర్వ్ చేసిన ఈ స్థానంలో తొలుత బీసీ మహిళకు కట్టబెడుతూ ఈ నెల 10వ తేదీన ప్రభుత్వం జీవో ఆర్టీ నంబర్ 585 విడుదల చేసింది. నియోజకవర్గ ఇన్చార్జీ ఒత్తిడితో మరుసటి రోజే ఈ ఉత్తర్వును రద్దు చేసింది. 11వ తేదీన ఓసీ మహిళకు రిజర్వ్ చేస్తూ మరో ఉత్తర్వును జారీ చేసింది. నిజానికి కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం దర్శి మార్కెట్ యార్డు ఎస్సీలకు కేటాయించాల్సి ఉంది. కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెట్టి తమ ఇష్టం వచ్చినట్లు రిజర్వేషన్లను మార్చుకుంటున్న కూటమి పాలకుల తీరు మీద తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పొదిలి మార్కెట్ యార్డు పదవిని బీసీ మైనారిటీ మహిళకు కేటాయించగా అక్కడ మైనార్టీ పురుషుడిని నియమించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎస్టీలకు రిజర్వ్ చేసిన యర్రగొండపాలెం నియోజకవర్గంలో కూడా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఎస్టీ జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ అధికార పార్టీ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నాయకుడికి మార్కెట్ యార్డు పదవిని కట్టబెట్టేందుకు కూటమి నేతలు పన్నాగాలు పన్నుతున్నారు. రూ.2 కోట్లకు మార్కెట్ యార్డు పదవి... మార్కెట్ యార్డు పదవులకు జిల్లాలో భారీగా డిమాండ్ ఏర్పడింది. ఈ పదవి కోసం టీడీపీలోని ఓసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఎంతకై నా రెడీ అంటున్నట్టు సమాచారం. పశ్చిమ ప్రకాశం జిల్లాలోని ఒక కీలక నియోజకవర్గంలో రూ.2 కోట్లకు మార్కెట్ యార్డు చైర్మన్ పదవిని అమ్ముకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్న మరో నియోజకవర్గంలో కూడా ఈ పదవికి మంచి ధర పలికినట్లు చెప్పుకుంటున్నారు. తెరవెనుక పెద్ద ఎత్తున లాలూచీలు జరగడంతోనే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేసిన పదవులను వారికి దక్కకుండా చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లాలో గందరగోళంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవుల కేటాయింపులు పది స్థానాల్లో 4 జనరల్, 3 బీసీలకు, 2 ఎస్సీలకు, 1 ఎస్టీకి రిజర్వేషన్లకు తిలోదకాలిచ్చిన కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో ఓసీలకు పదవులు మహిళకు రిజర్వ్ చేసిన పొదిలి మార్కెట్ యార్డు చైర్మన్ కుర్చీలో పురుషుడికి పట్టం కనిగిరి, దర్శిలు ఎస్సీలకు కేటాయిస్తే..ఓసీల నియామకం అంతా మాఇష్టం అంటున్న టీడీపీ నాయకులు పశ్చిమాన చైర్మన్గిరికి రూ.2 కోట్ల ముడుపులు రగలిపోతున్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులుమార్కెట్ యార్డు పదవుల భర్తీలో జిల్లా వ్యాప్తంగా రిజర్వేషన్లను అమలు చేయకుండా మొండిగా వ్యవహరిస్తున్న కూటమి పాలకులకు యర్రగొండపాలెంలో ఎదురు దెబ్బ తగిలింది. కూటమిలోని బీజేపీకి చెందిన ఎస్సీ నాయకులు, ఆలిండియా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉద్యోగుల సంఘం మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆరె రమణయ్య ఎస్టీలకు కేటాయించిన యర్రగొండపాలెం మార్కెట్ యార్డును ఓసీలకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఎస్టీ జనరల్ రిజర్వేషన్ను అమలు చేయకుండా ఓసీ అభ్యర్థికి మార్కెట్ యార్డు పదవిని కట్టబెడుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు జీవో ఆర్టీ నంబర్ 593ను సవాల్ చేస్తూ ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో జీవోను సస్పెండ్ చేస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. తదుపరి ఆగస్టు 4వ తేదీన వాదనలు వింటామని, అప్పటి వరకు సదరు ఓసీ అభ్యర్థి పదవి చేపట్టకూడదని, యార్డు వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని ఆదేశించింది. ఇదే విషయం మీద ఒక గిరిజన నాయకుడు కూడా కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. ఇదే విధంగా జిల్లాలోని కనిగిరి, దర్శి, పొదిలి మార్కెట్ యార్డుల విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన జీవోను రద్దు చేయాలని కోరుతూ పలువురు ఎస్సీ సంఘాల నాయకులు హైకోర్టు తలుపు తట్టనున్నారని సమాచారం. -
వ్యాయామ ఉపాధ్యాయునిపై విచారణ
సింగరాయకొండ: మండలంలోని ఊళ్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయునిపై వచ్చిన అరోపణలపై కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశాలతో డీఈఓ నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యులు మంగళవారం విచారణ చేపట్టారు. కమిటీ సభ్యులు ఒంగోలు డిప్యూటీ డీఈఓ చంద్రమౌళీశ్వరరావు, జీసీడీఓ కె.హేమలత, ఎంఈఓ–1 కె.శ్రీనివాసులు ముందుగా పాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థినులతో సమావేశమయ్యారు. తరువాత ఒక విద్యార్థి తల్లిని పిలిపించి ఆమె అభిప్రాయాన్ని రాతపూర్వకంగా తెలుసుకున్నారు. చివరగా ఊళ్లపాలెం ఉన్నత పాఠశాలకు వచ్చి విచారణ చేపట్టాల్సి ఉండగా డీఈఓ నుంచి అత్యవసర సమావేశం అని ఫోన్ రావడంతో బుధవారం విచారణ కొనసాగిస్తామని వెళ్లిపోయారు. విచారణ వివరాలను కమిటీ సభ్యులు గోప్యంగా ఉంచారు. -
వారానికి రూ.700 వస్తున్నాయమ్మా..!
కంభం: ‘ ఉపాధి కూలి గిట్టుబాటు కావడం లేదమ్మా. కొన్నిసార్లు వారానికి రూ.700 నుంచి రూ.800 మాత్రమే వస్తున్నాయి’ అని ఉపాధి కూలీలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. మండలంలోని కందులాపురం, కంభం పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన రైతువారి నీటి గుంతలను మంగళవారం ఆమె పరిశీలించారు. రైతులతో మాట్లాడి సాగు చేస్తున్న పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉపాధి కూలీలతో మాట్లాడారు. మండలంలో ఎంతమంది ఉపాధిహామీ కూలీలు ఉన్నారు, వారిలో ఎంతమంది ఎంత పనిచేశారు, పని చేసిన కాలానికి ఎంత వరకు నగదు జమైందో విషయాలను డ్వామా అధికారులను అడిగి తెలుసుకున్నారు. బంగారు కుటుంబంపై ఉపాధి సిబ్బందికి కనీస అవగాహన లేకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలు నిర్వహించి అందరికీ అవగాహన కల్పించాలని సూచించారు. అధికారులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వర్షం నీరు వృథాగా పోకుండా భూమిలోకి ఇంకించేందుకు నీటి కుంటలు ఉపయోగపడతాయన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1075 రైతువారి నీటికుంటలు పూర్తి చేశామని, మరో 800 నీటికుంటలు పురోగతిలో ఉన్నాయన్నారు. పశ్చిమ ప్రకాశంలో రైతువారి నీటి కుంటల నిర్మాణం ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని, రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్, డ్వామా పీడీ జోసఫ్ కుమార్, తహసీల్దార్ వి.కిరణ్, ఏపిడి భాస్కరరావు, ఏపీఓ జీవరత్నం, ఇన్చార్జి ఎంపీడీఓ ఖాదర్, డిప్యూటీ ఎంపీడీఓ విజయలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు. గురుకుల పాఠశాలలో ముఖాముఖి స్థానిక అంబేడ్కర్ గురుకుల బాలికల విద్యాలయంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా పదోతరగతి, ఇంటర్మీడియెట్ విద్యార్థినులతో ముఖాముఖి నిర్వహించారు. సుమారు 20 నిమిషాల పాటు వారితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థినులు నీటి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా..తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. అనంతరం ఆర్వోప్లాంట్ను, విద్యార్థినుల గదులను పరిశీలించారు. కలెక్టర్ వద్ద వాపోయిన ఉపాధి కూలీలు అధికారులపై కలెక్టర్ ఆగ్రహం బంగారు కుటుంబంపై అవగాహన లేకపోవడంపై మండిపాటు -
వితంతు పెన్షన్ల మంజూరుకు వితండవాదం
తాళ్లూరు: ప్రభుత్వ అధికారులను టీడీపీ నేతలు ఏ స్థాయిలో నియంత్రిస్తున్నారో తెలిపే ఉదంతమింది. పింఛన్లు మంజూరు కాకుండా మోకాలడ్డుతూ రాక్షసానందం పొందుతున్న టీడీపీ నేతలకు అధికారులు తలొంచుతున్న తీరు తరచూ చర్చనీయాంశమవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. తాళ్లూరు మండలంలోని కొర్రపాటివారిపాలెం గ్రామానికి చెందిన గోనుగుంట పద్మావతి, కొర్రపాటి బుచ్చమ్మ వితంతు పింఛనుకు అర్హులు. తమకు పింఛను మంజూరు చేయాలని గత కొంత కాలంగా ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ‘మీ ఊరి సర్పంచ్ భర్త రామయ్య చెబితేనే పింఛను వస్తుందమ్మా’ అని ఎంపీడీఓ దారా హనుమంతరావు చెబుతున్నారని ఇద్దరు మహిళలు వాపోయారు. ‘కలెక్టర్ గ్రీవెన్స్లో అర్జీ ఇచ్చినా మండల అధికారులు స్పందించడం లేదు. మేము వైఎస్సార్ సీపీ సానుభూతిపరులమనే కారణంతో టీడీపీ వాళ్లు పింఛను రాకుండా ఎంపీడీఓపై ఒత్తిడి చేస్తున్నార’ని ఆరోపించారు. ఈ విషయమై ఎంపీడీఓను వివరణ కోరగా.. వారు పింఛను కోసం వచ్చిన మాట వాస్తవమే. అనారోగ్యం దృష్ట్యా ఈ మధ్య సెలవులో ఉన్నా. వచ్చే సోమవారంలోగా సమస్య పరిష్కరిస్తా’ అని చెప్పారు. సర్పంచ్ భర్త చెబితేనే ఎంపీడీఓ ఇస్తారట! తాళ్లూరు మండలం కొర్రపాటివారిపాలెం మహిళ ఆవేదన -
31న జిల్లా స్థాయి అథ్లెట్ల ఎంపిక
యర్రగొండపాలెం: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అడహక్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక గిరిజన గురుకుల పాఠశాలలో అథ్లెట్లను ఎంపిక చేయనున్నట్లు కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు పి.రామచంద్రరావు, ఎం.వెంకటరెడ్డి మంగళవారం తెలిపారు. ఈ ఎంపికలో అండర్ 14, 16 విద్యార్థినీ, విద్యార్థులు, 18, 20 ఏళ్ల వయస్సు ఉన్న యువతీ, యువకులు పాల్గొనవచ్చన్నారు. ఎంపికై న అథ్లెట్స్ను బాపట్ల జిల్లా చీరాలలో జరిగే 36వ రాష్ట్ర స్థాయి జూనియర్ సౌత్జోన్ అథ్లెటిక్స్ మీట్కు ఎంపిక చేస్తామని వారు తెలిపారు. ఆసక్తి ఉన్న అథ్లెట్స్ తమ జనన ధ్రువీకరణ పత్రం, 10వ తరగతి మార్కుల జాబితా, ఆధార్ కార్డు, రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలతో ఈ నెల 31వ తేదీ ఉదయం 8 గంటలలోపు హాజరు కావాలన్నారు. పూర్తి సమాచారం కోసం రాజు నాయక్, బ్రహ్మనాయక్ సెల్ నంబర్లు, 76750 26220, 99081 69358లకు సంప్రదించవచ్చని చెప్పారు. అనుబంధ సంఘాల ఏర్పాటుపై సమీక్ష చీమకుర్తి: ప్రకాశం, బాపట్ల జిల్లాల వైఎస్సార్ సీపీ అనుబంధ సంఘాల ఇన్చార్జి మెట్టు వెంకట అప్పారెడ్డి మంగళవారం చీమకుర్తిలో ప్రకాశం జిల్లా వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రకాశం జిల్లా లో అనుబంధ సంఘాల కమిటీలను ఏర్పాటు చేసేందుకు త్వరలో సమావేశం నిర్వహించనున్నట్లు వారు ఈ సందర్భంగా తెలిపారు. ఎస్సీ కాలనీలో పాఠశాలను కొనసాగించాలి ● కలెక్టర్కు విన్నవించిన ఖాజీపురం ఎస్సీ కాలనీవాసులు కంభం: ఎస్సీకాలనీలో 40 ఏళ్లుగా ఉన్న పాఠశాలను తొలగించి మరోస్కూల్లో కలిపేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని బేస్తవారిపేట మండలం ఖాజీపురం ఎస్సీ కాలనీకి చెందిన పలువురు మహిళలు కలెక్టర్ తమీమ్ అన్సారియాకు ఫిర్యాదు చేశారు. మంగళవారం కంభంకు వచ్చిన కలెక్టర్ను వారు కలిసి తమ సమస్యను విన్నవించారు. గ్రామంలో ఉండే మెయిన్ స్కూల్లో విద్యార్థులు తక్కువగా ఉన్నారని, తమ స్కూల్లో 26 మంది పిల్లలున్నారని, కానీ ఇక్కడ ఉన్న పిల్లలను మెయిన్ స్కూల్లో చేర్పించి ఈ పాఠశాలను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. నెల రోజుల నుంచి మండల అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ప్రధానోపాధ్యాయుడిని అడిగినా సరైన సమాధానం చెప్పడం లేదని ఫిర్యాదు చేశారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఉన్న స్కూల్ను యథావిధిగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. తల్లికి వందనం డబ్బులు పడలేదమ్మా... ! తన ఇద్దరు పిల్లలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారని వారికి తల్లికి వందనం డబ్బులు పడలేదని బత్తుల వెంకటజ్యోతి అనే మహిళ మంగళవారం కంభం పర్యటనకు వచ్చిన కలెక్టర్ తమీమ్ అన్సారియా ముందు వాపోయింది. తర్లుపాడు మండలానికి చెందిన బత్తుల వెంకట జ్యోతి ఇద్దరు కవల పిల్లలు రాములు, లక్ష్మణ్ కంభం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. వారికి తల్లికి వందనం డబ్బులు పడలేదని పాఠశాలలో అడిగితే గ్రీవెన్స్ లో పెట్టుకుంటే పడతాయని చెప్పడంతో గ్రీవెన్స్లో అర్జీ పెట్టింది. ఆ తర్వాత కూడా డబ్బులు పడకపోవడంతో అక్కడికెళ్లి అడగ్గా స్కూల్లోనే వెళ్లి అడగండి అని చెబుతున్నారని ఆమె కలెక్టర్ దృష్టికి తెచ్చింది. అక్కడే ఉన్న ఎంఈఓను, ఎంపీడీఓను పిలిచిన కలెక్టర్ వారు ఏ సచివాలయం కిందకు వస్తారో.. ఎందుకు డబ్బులు పడలేదో వెంటనే విచారించండని ఆదేశించారు. -
డబ్బులకు పీడించకు అన్నందుకు..
గిద్దలూరు రూరల్: అధికార టీడీపీ అండదండలతో గిద్దలూరులో వడ్డీ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. అధిక వడ్డీకి డబ్బులు ఇచ్చి వేధింపులకు గురిచేయడం సరికాదన్నందుకు కర్రలతో దాడి చేసి రెచ్చిపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసే ఆస్పత్రి నుంచి రిపోర్టు వచ్చిన తర్వాత చూస్తామంటూ సమాధానమిస్తున్నారని బాధితుని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గిద్దలూరు మండలం దిగువమెట్టకు చెందిన ఆవుల నరసమ్మ, ఆమె చెల్లెలు లక్ష్మీదేవి గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా అధిక వడ్డీలకు, చీటీపాటల ద్వారా డబ్బులు ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన వెంకటమ్మ అనే మహిళ నరసమ్మ వద్ద చీటీ పాడుకుంది. నెలకు రూ.5 వేలు చొప్పున ఆరు నెలల వాయిదాలు చెల్లించాల్సి ఉంది. ఆ డబ్బుల కోసం సోమవారం నరసమ్మ తన మనుషులతో కలసి వెంకటమ్మ ఇంటికి వచ్చింది. దుర్భాషలాడుతూ డబ్బులు చెల్లించాలని నిలదీసింది. ఆ సమయంలో వెంకటమ్మ సమీప బంధువు సుధాకర్ అధిక వడ్డీలు తీసుకోవడం పద్ధతి కాదని, డబ్బులకు మనుషులను ఈ విధంగా పీడించడం ఏమిటని ప్రశ్నించాడు. మధ్యలో నీకెందుకు అంటూ నరసమ్మ మనుషులు సుధాకర్, అతని భార్య శివాణి పై కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో సుధాకర్ తలకు, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. అనంతరం గాయపడిన వారిని బంధువులు చికిత్స నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం సుధాకర్ను నంద్యాల వైద్యశాలకు తరలించారు. బాధితులు ఈ విషయమై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎనిమిది మంది వ్యక్తులు వచ్చి తమ వారిపై దాడికి పాల్పడ్డారని పోలీసులకు చెప్పారు. వైద్యశాల నుంచి రిపోర్టు వచ్చిన తరువాత కేసు నమోదు చేస్తామంటూ పోలీసులు సమాధానమిచ్చారు. దీనిపై బాధితుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ అండదండలు చూసుకుని డబ్బుల కోసం దాడికి పాల్పడుతున్నారని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. అధిక వడ్డీలకు డబ్బులు ఇచ్చి ప్రజలను పీడించే వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కర్రలతో ఇష్టారాజ్యంగా దాడి తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలు గిద్దలూరులో వడ్డీ వ్యాపారుల దాష్టీకం అధికార టీడీపీ అండదండలతో దాడులు మెడికల్ రిపోర్టు వచ్చాక కేసు నమోదు అంటున్న పోలీసులు -
అజెండాపై నిరసనలు..
ఒంగోలు సబర్బన్: నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం అజెండా విషయంలో కార్పొరేటర్లు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ట్రంకు రోడ్డు విస్తరణలో నష్టపోతున్న వారికి పరిహారం ఇవ్వాలని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. ఒంగోలు నగర మేయర్ జి.సుజాత అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం మంగళవారం కార్యాలయ ప్రాంగణంలోని కౌన్సిల్ హాలులో నిర్వహించారు. అమృత్–2 పథకంలో మంచినీటి సరఫరా మెరుగుపరిచేందుకు, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నెలకొల్పటానికి, బత్తులవారికుంట అభివృద్ధితో పాటు ఇతర పనులకు కలిపి రూ.484.55 కోట్ల కేటాయింపు విషయమై జనసేన కార్పొరేటర్ ఈదర చిన్నారి ప్రస్తావిస్తూ రూ.9 కోట్లు నగర పాలక సంస్థ మీద భారం వేయటం సబబుకాదన్నారు. అదేవిధంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం కౌన్సిల్ ఆమోదం రూ.339.93 కోట్లు అయితే మరో రూ.100 కోట్లు ఎందుకు పెరిగిందో వివరించాలని మేయర్ను అడగగానే టీడీపీ సభ్యుడు తిప్పరపల్లి రవితేజ లేచి అడ్డుకోవటంతో సభలో కొంతసేపు వాదోపవాదాలు జరిగాయి. మంచినీటి సరఫరాకు సంబంధించి ఒకే అంశాన్ని మూడు, నాలుగు చోట్ల ఎందుకు పెట్టారని ఈదర సురేష్ ప్రశ్నించారు. అదేవిధంగా ఎన్టీఆర్ కళాక్షేత్రంలో గతంలో మున్సిపాలిటీకి డబ్బులు ఎగ్గొట్టిన వ్యక్తికే తిరిగి అప్పజెప్పటాన్ని జనసేన కార్పొరేటర్ యనమల నాగరాజు ప్రస్తావించారు. వాటి రికార్డులు కూడా కార్యాలయంలో లేవన్నారు. ట్రంకు రోడ్డు విస్తరణలో వ్యాపారులకు నష్ట పరిహారం ఇవ్వాలి: వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు నగర అభివృద్ధిలో భాగంగా ట్రంకు రోడ్డు, మస్తాన్ దర్గా నుంచి బీవీఎస్ హాలు మీదుగా కొత్తపట్నం బస్టాండ్ వరకు రోడ్డు విస్తరణ చేస్తున్న సందర్భంగా వ్యాపారులకు నగదు రూపంలో నష్టపరిహారం ఇవ్వాలని వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ ఖాన్ కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. విస్తరణతో నగరంలోని చిన్న, పెద్ద వ్యాపారులు తమ దుకాణాలను కోల్పోయి నిరాశ్రయులు అయ్యే అవకాశం ఉందన్నారు. గతంలో కూడా టీడీపీ ప్రభుత్వమే విస్తరణ చేపట్టిందని, అప్పట్లో వ్యాపారులకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. వాళ్లను అన్ని రకాలుగా ఆదుకోవాలని, పూర్తిగా దుకాణాలు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయంగా మున్సిపల్ స్థలాలు వ్యాపార కూడళ్లలో కేటాయించాలన్నారు. వైఎస్సార్ సీపీ మరో సభ్యుడు జి.ప్రవీణ్ కుమార్ కూడా వ్యాపారులను ఆదుకోవాలని గొంతు కలిపారు. అదేవిధంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో డివిజన్లలో పర్యటించినప్పుడు స్థానికులు చెప్పిన అభివృద్ధి పనులను గడప గడపకు మన ప్రభుత్వం (జీజీఎంపీ) పథకంలో చేపడితే వాటిని రద్దు చేయాలని టీడీపీ సభ్యులు చెప్పటం దారుణమని కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. అప్పట్లో చేసిన సనులకు బిల్లులు చెల్లించకపోతే ఆ కాంట్రాక్టరు ఏం కావాలని నిలదీశారు. ఈ విషయమై డిప్యూటీ మేయర్, జనసేన నేత వెలనాటి మాధవరావు కూడా ఏకీభవించారు. కేటాయించిన పనులు ఆపటం సరికాదన్నారు. ప్రస్తుతం సాధారణ నిధులు ఖర్చు చేస్తున్నారని గతంలో పనిచేసిన కాంట్రాక్టర్లకు రూ.కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు. వాళ్లకు చెల్లించకుండా కొత్త పనులు ఏవిధంగా చేపడతారని ప్రశ్నించారు. అదేవిధంగా బీపీఎస్ పథకం కింద రూ.10 కోట్లు రావాల్సి ఉందని, వాటితో పాటు ఇతర ఆదాయ వనరుల కింద మున్సిపాలిటీకి రావాల్సినవి ఉన్నాయని, వాటిని రాబట్టడంలో అధికారులు వైఫల్యం చెందారన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాన మంత్రి పీవీ.నరసింహారావు, మాజీ సీఎం కొణిజేటి రోశయ్య విగ్రహాలను తొలగించవద్దంటూ వైఎస్సార్సీపీ, జనసేన కార్పొరేటర్లు కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. కూరగాయల మార్కెట్లో షాధీఖానాకు ఎదురుగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని స్థానిక కార్పొరేటర్ ప్రస్తావించారు. నగరంలో పారిశుధ్యం దారుణంగా ఉందని కార్పొరేటర్ ఈదర సురేష్ బాబు ప్రస్తావించారు. కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బీఎన్.విజయ కుమార్, కమిషనర్ వెంకటేశ్వరరావు, ఎంఈ ఏసయ్య, ఏసీపీ సుధాకర్, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. వాడీవేడీగా ఒంగోలు నగరపాలక సంస్థ సమావేశం ట్రంకు రోడ్డు విస్తరణలో వ్యాపారులకు నష్టపరిహారం ఇవ్వాలన్న వైఎస్సార్ సీపీ పూర్తిగా షాపులు కోల్పోయే వారికి ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ ‘గడప గడపకు మన ప్రభుత్వం’ పథకంలో అభివృద్ధి పనుల రద్దుపై సభలో రచ్చ పీవీ, కొణిజేటి విగ్రహాలను యధాతథంగా ఉంచాలన్న వైఎస్సార్ సీపీ, జనసేన సభ్యులు టీడీపీ, జనసేన సభ్యుల మధ్య మాటల యుద్ధం -
పెనాల్టీలు కట్టలేను... తొక్కించుకుంటూ పోండి..
ప్రకాశం జిల్లా: ఆర్టీఓ అధికారులకు మామూళ్లు ఇచ్చిన వాహనాలను వదిలేస్తున్నారని, ఇవ్వని వాహనాలకు భారీ ఎత్తున పెనాల్టీలు వేస్తున్నారని ఆగ్రహంతో పేర్నమిట్టకు చెందిన ఒక టిప్పర్ యజమాని ఆర్టీఓ డిపార్టుమెంట్కు చెందిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన ఇది. ప్రకాశం జిల్లా, సంతనూతలపాడు చెరువు కట్ట వద్ద కర్నూల్రోడ్డు మీద సోమవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే... చీమకుర్తి నుంచి ఒంగోలు వైపు గ్రానైట్ డస్ట్ను తీసుకొస్తున్న టిప్పర్పై ఓవర్లోడు పేరుతో దాదాపు రూ.53 వేలు పెనాల్టీ వేసినట్లు తెలిసింది. అంతకుముందు కొద్దిరోజుల క్రితం అదే వాహనానికి సుమారు రూ.80 వేల వరకు పెనాల్టీ వేశారని సమాచారం. ఇలా ఒకే వాహనానికి పెనాల్టీల మీద పెనాల్టీలను వేస్తూ మరో పక్క మామూళ్లు ఇచ్చిన వాహనాలను కళ్లెదుటే వదిలేస్తుండటంతో ఆ టిప్పర్ యజమాని ఆగ్రహం తారస్థాయికి చేరుకుంది. తన టిప్పర్ను ఒక్కదానినే కాటా వద్దకు ఎందుకు తీసుకుపోతున్నారని, గ్రానైట్ లోడుతో వెళ్తున్న ఇతర టిప్పర్లను ఎందుకు పట్టించుకోవడం లేదని, వాటికి ఎందుకు పెనాల్టీలను వేయటం లేదని బాధిత టిప్పర్ యజమాని ఆర్టీఓ అధికారులను నిలదీశాడు. అంతే కాకుండా తన ఒంటిపై ఉన్న చొక్కాను విప్పదీసి ఆర్టీఓ అధికారుల కారుకు అడ్డంగా పడుకొని తనను తొక్కించుకుంటూ పోండని, ఇలా పెనాలీ్టలను వేస్తూ ఉంటే తాము టిప్పర్లను ఎలా తిప్పగలమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల ఫిర్యాదు కాగా, తన వాహనాన్ని అడ్డుకొని విధులకు ఆటంకం కలిగించారని ఆర్టీఓ అధికారులు టిప్పర్ యజమానిపై సంతనూతలపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దానిపై బాధిత టిప్పర్ యజమానితో మాట్లాడేందుకు ప్రయత్నం చేయగా, టిప్పర్ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. దానిపై ఇన్చార్జి ఆర్టీఓతో మాట్లాడే ప్రయత్నం చేయగా వారు ఫోన్లో అందుబాటులోకి రాలేదు. -
సెలవు పెడితే ఇక అంతే...
జిల్లాలోని ఏకోపాధ్యాయ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఏదైనా అత్యవసర పనుల మీద సెలవు పెట్టాల్సి వచ్చినప్పుడు పక్క స్కూలు నుంచి డిప్యుటేషన్ మీద మరో ఉపాధ్యాయుడిని నియమించే అవకాశం కూడా ఉండడం లేదని సమాచారం. దాంతో టీచర్ సెలవు పెడితే విద్యార్థులకు కూడా అప్రకటిత సెలవు ఇచ్చేస్తున్నట్లు తెలుస్తోంది. చదువుతో పాటుగా పర్యవేక్షణ ఎలా.. ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి చదువు చెప్పడం ఎంత కష్టమో వారిని పర్యవేక్షించడం కూడా అంతకన్నా కష్టమని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఒకరికి ఇద్దరు ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్న స్కూళ్లో ఈ సమస్యను ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాదు కానీ ఏకోపాధ్యాయ స్కూళ్లలో పర్యవేక్షణ చేయలేక ఉపాధ్యాయులు చేతులెత్తేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్య లభించడం గగనమైపోతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. -
బీసీ వసతి గృహంలో దారుణమైన పరిస్థితులు
● బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ డైరక్టర్ ఒంగోలు వన్టౌన్: జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలపై ఃసాక్షిలో వచ్చిన కథనానికి స్పందించిన బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ డైరక్టర్ బత్తుల పద్మావతి సోమవారం సాయంత్రం ఒంగోలు మంగమూరు రోడ్డులోని బీసీ సంక్షేమ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డైరక్టర్ అనేక విషయాలను గుర్తించారు. పిల్లలతో ముచ్చటించారు. వసతి గృహంలో విద్యార్థులంతా నేలపైనే పడుకుంటున్నారని, తగినన్ని బాత్రూంలు లేవన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలేదని భోజనాన్ని పరిశీలించారు. అనారోగ్యానికి గురైన విద్యార్థులకు సరైన మందులు ఇవ్వడంలేదని, గడువు తీరిన మందులను కూడా గుర్తించారు. కరెంటు స్విచ్ బోర్డులు పాడైపోయి, పగిలిపోయాయన్నారు. విద్యార్థులకు అందే విధంగా స్విచ్ బోర్డులు ఏర్పాటు చేయడం దారుణమన్నారు. విద్యార్థుల వసతి గృహం పైనే రెండు కంపెనీలకు సెల్ టవర్లను ఏర్పాటు చేయడం ఎంత వరకు సబబన్నారు. -
చదువు ఒంటరైంది..
ప్రాథమిక విద్య విద్యార్థులకు కీలకమైన దశ. చదువులో బలమైన పునాది పడితేనే జీవితంలో నిలదొక్కుకోగలుగుతారు. విద్యారంగానికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నామని కూటమి ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతోంది. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వ విద్యను నీరుగార్చి ప్రైవేటు విద్యా రంగానికి ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకుంటోందన్న విమర్శలున్నాయి. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు చాలా మంది ఆసక్తి చూపించడంలేదు. జిల్లాలోని 545 పాఠశాలల్లో ఏకోపాధ్యాయులు సేవలందిస్తుండడం ఇందుకు నిదర్శనంగా ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 20 మంది విద్యార్థులు దాటితే ఒక హెడ్ మాస్టర్తో సహా ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలి. కానీ జిల్లాలో అనేక పాఠశాలల్లో 20 మంది విద్యార్థుల కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ ఒక్క ఉపాధ్యాయుడితోనే బడిని నెట్టుకొస్తున్నారంటే పాలకులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. యర్రగొండపాలెంలోని తమ్మడపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 125 మంది విద్యార్థులుండగా ఒకే ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారు. ఇంత మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఎలా చదువు చెప్పగలడో పాలకులకే ఎరుక. సింగరాయకొండ మండలంలోని బింగినపల్లి ప్రాథమిక పాఠశాలలో 21 మంది విద్యార్థులు చదువుకుంటున్నా ఇక్కడ ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. బేస్తవారిపేట, అర్థవీడు, కొమరోలు మండలాల్లో 13 పాఠశాలల్లో 20 మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులు చదువుకుంటున్నా ఒక్క ఉపాధ్యాయుడిని నియమించడం గమనార్హం. 20 మంది దాటినా ఒక్కరే.. -
మీకోసంలో సమస్యల వెల్లువ
ఒంగోలు సబర్బన్: శ్రీ కృష్ణకళ్యాణ మండపం–యాదవ భవన్ నిర్మాణానికి స్థలం మంజూరు చేస్తూ మునిసిపల్ కార్పొరేషన్ చేసిన తీర్మానాన్ని పరిగణలోకి తీసుకొని ఆ భూమిని మళ్లీ ఇతర శాఖలకు కేటాయించకుండా చూడాలని ఆల్ ఇండియా యాదవ మహాసభ నాయకులు కలెక్టర్ తమీమ్ అన్సారియాకు విజ్ఞప్తి చేశారు. ప్రకాశం భవన్లో సోమవారం నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు వాళ్ల సమస్యలను అర్జీల రూపంలో కలెక్టర్కు అందజేశారు. ఈ సందర్భంగా యాదవ సామాజిక సేవా సంస్థ నిర్వాహకులు, జిల్లా యాదవ సంఘ నాయకులు ఆలిండియా యాదవ మహాసభ జనరల్ సెక్రటరీ కటారి శంకర్ ఆధ్వర్యంలో కలెక్టర్ను కలిశారు. ఒంగోలు తహశీల్దార్ నివేదిక ఆధారంగా పెళ్లూరులో 70 సెంట్ల భూమిని సర్వే నెం.78/1లో యాదవ భవన్ కోసం మంజూరు చేశారని, దీనికి కౌన్సిల్ ఆమోదం తెలిపారని, భవన నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారని చెప్పారు. అయితే తమకు కేటాయించిన స్థలంలో కొంత భాగాన్ని తాజాగా విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి కేటాయించి శంకుస్థాపన చేశారన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా దాదాపు మూడు లక్షల మంది యాదవుల మనోభావాలకు అనుగుణంగా శ్రీ కృష్ణ కళ్యాణ మండపం–యాదవ భవన్కి కేటాయించిన స్థలాన్ని యధాతథంగా ఉంచి, కౌన్సిల్ తీర్మానాన్ని కొనసాగించాలని కోరారు. వ్యాయామ ఉపాధ్యాయుల నకిలీ సర్టిఫికెట్లు పరిశీలించాలి: 2025 సంవత్సరంలో జరిగిన మెగా డీఎస్సీలో వ్యాయామ ఉపాధ్యాయుల (ఎస్ఏ పీఈ అండ్ పీఈటీ) నకిలీ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్యా పోరాట సమితి నాయకులు కలెక్టర్కు మీ కోసం కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. వ్యాయామ ఉపాధ్యాయ పోస్టుల కోసం చాలామంది అభ్యర్థులు వ్యాయామ విద్య శిక్షణ పూర్తిచేయకుండా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ నేరుగా పరీక్ష రాసి సర్టిఫికెట్లు పొందారన్నారు. అదేవిధంగా 4వ సెమిస్టర్ విద్యార్థులకు అవకాశం లేనప్పటికీ తప్పుడు సమాచారాన్ని దరఖాస్తులో నమోదు చేసి పరీక్ష రాశారన్నారు. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని వ్యాయామ విద్యా అభ్యర్థులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సంపాదించిన వారి సర్టిఫికెట్లు పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. అభ్యర్థుల ఆధార్ కార్డు నుంచి వారి పీఎఫ్ అకౌంట్ వివరాలు సేకరించి, అనర్హులైన వారి సర్టిఫికెట్లు రద్దుచేసి వ్యాయామ విద్య శిక్షణ తీసుకున్న నిరుద్యోగులకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నామన్నారు. తల్లికి వందనం కోసం తిప్పుకుంటున్నారు తల్లికి వందనం పథకం కోసం కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారని ఒంగోలు రూరల్ మండలం ఉలిచి గ్రామానికి చెందిన బుర్రా రాజేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన పెద్ద కుమారుడు బుర్రా శశి కుమార్ కోసం భార్య అనితా దేవికి సంబంధించిన అన్ని సర్టిఫికెట్లతో ఉలిచి సచివాలయంలో దరఖాస్తు చేశామన్నారు. తల్లి ఆధార్ మ్యాపింగ్ వేరే వారితో జరిగిందని తిరస్కరించారని చెప్పారు. టెక్నికల్ సమస్యను పరిష్కరించకుండా తిప్పుకుంటున్నారని, సమస్య పరిష్కరించాలని కోరారు. మా ఆస్తులు లాక్కున్నాడు: వరుసకు బావ అయిన భువన కాశిరెడ్డి తమ ఆస్తులు బలవంతంగా లాక్కున్నాడని మర్రిపూడి మండలం గంగపాలెం గ్రామానికి చెందిన భువన కోటేశ్వరమ్మ తన ఇద్దరు మానసిక వికలాంగులైన పిల్లలతో కలిసి వచ్చి కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. తన భర్త భువన బ్రహ్మయ్య 2003వ సంవత్సరంలో చనిపోయాడని, అప్పటి నుంచి మానసిక వికలాంగులైన కుమారుడు రామాంజనేయులు, కుమార్తె రమాదేవిలను తన వద్ద ఉంచుకొని జీవనం సాగిస్తున్నానని వెల్లడించింది. అయితే తన సమీప బంధువు భువన కాశిరెడ్డి తనకున్న ఇల్లు, పొలం, దొడ్డి స్థలాలను బలవంతంగా లాక్కున్నాడని విలపించింది. చివరకు పిల్లలను సాకే స్థోమత లేక వారిని గుంటూరులోని అనాథ శరణాలయంలో ఉంచాల్సిన పరిస్థితి దాపురించిందని కన్నీరుమున్నీరైంది. తనకు న్యాయం చేయాలని కలెక్టర్ను వేడుకుంది. యాదవ భవన్ భూమిని అలానే ఉంచాలి... వ్యాయామ ఉపాధ్యాయుల నకిలీ సర్టిఫికెట్లు పరిశీలించాలి కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియాకు విజ్ఞాపనలు -
పిల్లలకు ఉడికీ, ఉడకని భోజనం
ఒంగోలు వన్టౌన్: ఉడికీ, ఉడకని అన్నం పిల్లలకు పెడుతున్నారని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒంగోలులోని మంగమూరు రోడ్డులో ఉన్న బీసీ బాలుర వసతి గృహాన్ని ఆయన సోమవారం రాత్రి పరిశీలించారు. వసతి గృహంలో ప్రతి గదిని పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ స్వయంగా పిల్లలకు వడ్డించే భోజనం తిని సరిగ్గా ఉడక్కపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం తన సొంత డబ్బులతో పిల్లలకు భోజనం తెప్పించారు. వసతి గృహం పై రెండు సెల్ఫోన్ టవర్లను ఏర్పాటు చేశారని, దీని వలన పిల్లలపై రేడియేషన్ ప్రభావం పడుతుందన్నారు. మంచినీటిని పిల్లలే బయట నుంచి తెచ్చుకుంటున్నారన్నారు. ప్రతి గదిలో చిన్న లైటు ఒకటి మాత్రమే ఉందని, తాము పరిశీలిస్తున్న సమయంలోనే ఫ్యాన్లు ఏర్పాటు చేస్తున్నారన్నారు. మొదటి అంతస్తు ఫ్లోర్ విద్యార్థులు నడిస్తే ఊగిపోతుందని విద్యార్థులు తెలపడంతో పరిశీలించారు. వర్షం పడితే విద్యార్థులు కనీసం విశ్రమించడానికి కూడా వీలు లేకుండా గది మొత్తం వర్షం నీటితో ఉండిపోయే పరిస్థితి ఉందన్నారు. 99 మంది విద్యార్థులకు 6 బాత్రూంలు మాత్రమే ఉన్నాయన్నారు. ప్రతి నెలా విద్యార్థులకు చెల్లించాల్సిన కాస్మొటిక్ చార్జీలను కూటమి ప్రభుత్వం గత డిసెంబర్ నుంచి విద్యార్థుల ఖాతాలకు జమ చేయడంలేదన్నారు. విద్యార్థులను ప్రతి వారం వైద్యులు చెకప్ చేయాలని అలా జరగడంలేదని, పైగా హాస్టల్లో గడువు తీరిన మందులు ఉన్నాయని, వీటినే విద్యార్థులకు అందిస్తున్నారని చెప్పారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పొన్నుగంటి చైతన్య, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్, బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, జోనల్ ఇన్చార్జి దుగ్గిరెడ్డి నారాయణరెడ్డి, ప్రకాశం జిల్లా విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పల్నాటి రవీంద్రరెడ్డి, సంయుక్త కార్యధర్శి ప్రవీణ్ చంద్, విక్రమ్, వేణు, వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. మంత్రి సవాల్ను స్వీకరిస్తాం రాష్ట్రంలో ఏహాస్టల్ బాగోలేదో చెప్పాలన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత సవాల్ను తాము స్వీకరిస్తామని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అన్నారు. ఒంగోలు మంగమూరు రోడ్డులోని బీసీ బాలుర వసతి గృహాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంత్రి రాష్ట్రంలోని ఏ ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లోని పరిస్థితులను పరిశీలించలేదన్నారు. నారా వారి స్పెషల్ బొద్దింక భోజనాన్ని వసతి గృహంలో విద్యార్థులకు అందించారని, దీనికి సాక్ష్యం హోం మంత్రేనన్నారు. జగనన్న గోరుముద్దలను ఘోర ముద్దలుగా కూటమి ప్రభుత్వం మార్చిందన్నారు. జగనన్న రూ.7245 కోట్లు ఖర్చు పెట్టి విద్యార్థులకు పోషకాహారం అందించారని చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పీ చైతన్య మాట్లాడుతూ సంక్షేమ హాస్టల్స్ సంక్షోభ హాస్టల్స్గా మారాయన్నారు. డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సినిమా టిక్కెట్లు పెంచమని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు కానీ విద్యార్థుల కాస్మొటిక్ చార్జీలను పెంచడంలేదన్నారు. జిల్లాకు చెందిన మంత్రి బాలవీరాంజనేయ స్వామి రూ.149 కోట్లు హాస్టళ్ల మరమ్మతులకు విడుదల చేసినట్లు ప్రకటించినా ఎక్కడా మరమ్మతులు జరగలేదన్నారు. విద్యార్థులకు ఇంత వరకూ బెడ్ షీట్లు అందించలేదని చెప్పారు. అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ -
14 ఏళ్ల నిరీక్షణకు తెర
● కొండపి పంచాయతీకి ఎన్నికల నోటిఫికేషన్ కొండపి: కొండపి పంచాయతీ ఎన్నికల కోసం దాదాపు 14 సంవత్సరాల నిరీక్షణకు తెరపడింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని కొండపి పంచాయతీకి ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం విడుదల చేసినట్లు ఎంపీడీవో రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 30వ తేదీ కొండపి పంచాయతీకి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. అదే రోజు ఉదయం గం.10:30 నుంచి ఆగస్టు 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 2వ తేదీ ఉదయం 8 గంటల నుంచి, 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్క్రూట్నీ ప్రక్రియ జరుగుతుందని, నాలుగో తేదీ తిరస్కరణకు గురైన నామినేషన్ల జాబితా విడుదల, 5వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ, మూడు గంటల తర్వాత అభ్యర్థుల తుది జాబితా విడుదల చేస్తామని తెలిపారు. ఎన్నిక అవసరమైతే 10వ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించి మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఓట్లు లెక్కింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే గెలిచిన అభ్యర్థిని ప్రకటిస్తామని, రీపోలింగ్ అవసరమైతే 12వ తేదీ ఉదయం 7 గంటల నుంచి ఒంటిగంట వరకు నిర్వహించి మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించి గెలిచిన అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు. ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహించండి ● ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు నంద కిశోర్ మార్కాపురం: డాక్టర్లు ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నందకిశోర్ స్థానిక వైద్యులకు సూచించారు. సోమవారం ఆయన మార్కాపురం ఐఎంఏ కార్యాలయాన్ని సందర్శించి డాక్టర్లతో మాట్లాడారు. సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలని, ఇందుకోసం గ్రామాల్లో పట్టణాల్లో సదస్సులు నిర్వహించాలని సూచించారు. ఐఎంఏ ఆధ్వర్యంలో ప్రత్యేక రోజుల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేయాలని తెలిపారు. మార్కాపురం చుట్టుపక్కల ఉన్న ఐఎంఏ బ్రాంచ్ సభ్యులతో మాట్లాడుతూ సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో ఐఎంఏ అద్యక్ష, కార్యదర్శులు డాక్టర్ వంశీకృష్ణ, ఫణీంద్రారెడ్డి, శివశంకర్, రాంబాబు, హర్ష, మాధవరావు, శరత్ తదితరులు పాల్గొన్నారు. ముగిసిన ఎనిమిదో రౌండ్ పొగాకు కొనుగోళ్లు కొండపి: స్థానిక పొగాకు వేలం కేంద్రంలో సోమవారంతో 8వ రౌండ్ పొగాకు కొనుగోలు ప్రక్రియ ముగిసింది. ఎనిమిదో రౌండ్ ప్రారంభం నుంచి రోజుకు సగటుగా 350 బేళ్లకు పైన తిరస్కరించారు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రౌండ్ చివర దశకు చేరుకునేసరికి కామేపల్లి, పచ్చవ గ్రామాలకు చెందిన రైతుల బేళ్లను అధిక సంఖ్యలో తిరస్కరించడంతో వేలం ప్రక్రియ నిలిపేశారు. ధర తగ్గించైనా పొగాకు బేళ్లను కొనుగోలు చేయాలని వేలం ప్రక్రియను నిలిపేశారు. గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే బేళ్ల తిరస్కరణ పిడుగుపాటులా ఉంటోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 9వ రౌండ్ ప్రారంభం నుంచైనా పొగాకు రైతుకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 412 బేళ్లు తిరస్కరణ: స్థానిక పొగాకు వేలం కేంద్రంలో సోమవారం నిర్వహించిన వేలంలో 412 బేళ్లు తిరస్కరణ గురైనట్లు వేలం నిర్వహణ అధికారి జి.సునీల్ కుమార్ తెలిపారు. క్లస్టర్ పరిధిలోని వెన్నూరు చిన్న వెంకన్నపాలెం గ్రామాలకు చెందిన రైతులు 911 బేళ్లను వేలానికి తీసుకొచ్చారు. అందులో 499 బేళ్లు కొనుగోలయ్యాయి. వ్యాపారులు వివిధ కారణాలతో 412 బేళ్లను తిరస్కరించారు. పొగాకు గరిష్ట ధర కేజీ రూ.281, కనిష్ట ధర రూ.159, సరాసరి ధర కేజీ రూ.232.76 గా నమోదైంది. వేలంలో 27 కంపెనీలకు చెందిన వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు. సోమవారం నిర్వహించిన వేలాన్ని పొగాకు బోర్డు వైస్ చైర్మన్ బొడ్డపాటి బ్రహ్మయ్య సందర్శించారు. -
ప్రకాశం
36 /27కూటమి ప్రభుత్వం మోసానికి కేరాఫ్ అడ్రస్కూటమి ప్రభుత్వం మోసానికి కేరాఫ్ అడ్రస్ అని ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అన్నారు. 7గరిష్టం/కనిష్టంనేతల విగ్రహాలకు ఎసరు..! ఒంగోలు నగరంలో రంగారాయుడు చెరువు వద్ద ఉన్న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, బాపూజీ కాంప్లెక్స్ ముందున్న కొణిజేటి రోశయ్య విగ్రహాలు తొలగించేందుకు మున్సిపల్ కౌన్సిల్లో రంగం సిద్ధం చేశారు. వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడా చిరుజల్లులు పడవచ్చు. ఉక్కపోతగా ఉంటుంది.– 8లో.. మంగళవారం శ్రీ 29 శ్రీ జూలై శ్రీ 2025 -
నేతల విగ్రహాలకు ఎసరు..!
ఒంగోలు సబర్బన్: నగరంలో గతంలో నెలకొల్పిన నాయకుల విగ్రహాలకు తంటా వచ్చి పడింది. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఆ విగ్రహాల మీదనే టీడీపీ నాయకుల కన్ను పడింది. ఒంగోలులోని రంగారాయుడు చెరువు వద్ద ఉన్న మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు, బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ముందున్న మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య విగ్రహాలు తొలగించేందుకు మంగళవారం జరగనున్న ఒంగోలు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ఆమోదించేందుకు రంగం సిద్ధం చేశారు. ట్రాఫిక్కు అంతరాయంగా మారాయనే కారణంగా ఈ రెండు విగ్రహాలను అక్కడి నుంచి తొలగించాలని నిర్ణయించారు. ఇక కౌన్సిల్ ఆమోదమే తరువాయి. ట్రంకురోడ్డు విస్తరణపై కూటమి పార్టీల్లో భిన్నాభిప్రాయాలు.. ట్రంకురోడ్డు విస్తరణపై కూటమి పార్టీలు తలోదారిగా వ్యవహరిస్తున్నాయి. ట్రంకురోడ్డు 100 అడుగులు, దర్గా నుంచి బీవీఎస్ హాలు మీదుగా కొత్తపట్నం బస్టాండ్ సెంటర్ వరకు 80 అడుగులతో విస్తరించాలని నిర్ణయించారు. అయితే 100 అడుగుల విస్తరణ అనేసరికి ట్రంకురోడ్డులోని వ్యాపారులు ఆందోళనకు దిగారు. ఆర్థికంగా కుదేలవుతామని మొత్తుకుంటున్నా అధికారులు మాత్రం మార్కింగ్ ఇస్తూ వస్తున్నారు. ఎమ్మెల్యే దామచర్ల, టీడీపీ కార్పొరేటర్లు 100 అడుగులకు సై అంటున్నారు. జనసేన మాత్రం 60 అడుగులే అంటోంది. 124 అంశాల్లో 50కిపైగా ముందస్తు అనుమతులే... కూటమి ప్రభుత్వంలోని టీడీపీ, జనసేన పార్టీల నాయకుల మధ్య సఖ్యత లేకపోవటంతో ఇంత వరకు స్టాండింగ్ కమిటీ ఊసేలేదు. రూ.50 లక్షల వరకు చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు మేయర్ సుజాత ముందస్తు అనుమతులిచ్చి ఆ తర్వాత కౌన్సిల్ ఆమోదానికి పెడుతున్నారు. అందులో భాగంగానే ఈసారి మేయర్ సొంత డివిజన్ అయిన 18వ డివిజన్లో అభివృద్ధి పనులకు రూ.కోట్లు కుమ్మరించుకోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ప్రధాని పీవీ, మాజీ సీఎం కొణిజేటి విగ్రహాల తొలగింపునకు కుట్ర మేయర్ డివిజన్లో అభివృద్ధి పనులకు రూ.కోట్ల కుమ్మరింపు నేడు ఒంగోలు నగరపాలక సంస్థ కౌన్సిల్ సాధారణ సమావేశంరూ.15 లక్షలు ఎగ్గొట్టిన వ్యక్తికే తిరిగి ఎన్టీఆర్ కళాక్షేత్రం... ఎన్టీఆర్ కళాక్షేత్రం నిర్వహణ బాధ్యతలను గతంలో రూ.15 లక్షలు ఎగ్గొట్టిన వ్యక్తికే తిరిగి కట్టబెట్టనున్నారు. గతంలో లీజుకు తీసుకున్న వై.త్రిశంకరరావు రూ.15 లక్షలు బాకీ పడి అవి కట్టకుండానే కళాక్షేత్రంలోని అన్ని సామాన్లు పీక్కెళ్లాడు. చివరకు బ్యాంకు గ్యారంటీని కూడా డ్రా చేసుకున్నాడు. వీటన్నింటికీ నగర పాలక సంస్థ అధికారుల అండదండలున్నాయి. అధికార పార్టీకి చెందిన ముఖ్య నేత అండదండలతో తిరిగి ఎన్టీఆర్ కళాక్షేత్రం నిర్వహణను కారు చౌకగా అతని బినామీకే కట్టబెట్టనున్నారు. నెలకు రూ.80,315 అద్దె నిర్ణయించి చివరకు రూ.38,150కు మాత్రమే కట్టబెట్టే అంశాన్ని కూడా కౌన్సిల్లో ఆమోదానికి పెట్టారు. -
దోచుకున్న సొమ్ము సింగపూర్కి..
ఒంగోలు సిటీ: రాష్ట్రంలో అవినీతి, అక్రమాలకు పాల్పడి దోచుకున్న సొమ్ముతో సింగపూర్లో పెట్టుబడులు పెట్టేందుకే సీఎం చంద్రబాబు రాష్రానికి పెట్టుబడుల ముసుగులో సింగపూర్ వెళ్లారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కాకుమాను రాజశేఖర్ ఆరోపించారు. ఒంగోలు నగరంలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014–19 మధ్యలో, 2024 నుంచి ఇప్పటి వరకూ అధికారంలో ఉన్న చంద్రబాబు ఏ రకంగా భూముల దోపిడీకి పాల్పడ్డారో అందరికీ తెలుసన్నారు. అమరావతి పేరుతో 33 వేల ఎకరాలను రైతుల దగ్గర తీసుకుని తిరిగి 45 వేల ఎకరాలు కావాలంటూ ల్యాండ్ పూలింగ్కు వెళ్లడం వెనుక పెద్ద కుట్ర దాగిఉందన్నారు. తన ముఖ్య అనుచరులు, పార్టీ నాయకులకు భూములు అప్పగించేందుకే ఈ దోపిడీ జరుగుతోందని ఆయన ధ్వజమెత్తారు. 2019కి ముందు అధికారంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద కంపెనీలకు భూ కేటాయింపులు చేశారని, కేవలం ఒక్క కంపెనీ కూడా పెట్టుబడి పెట్టిన దాఖలాలు లేవని అన్నారు. అమరావతి పేరుతో వేలాది ఎకరాలు సేకరించి ఒక్క శాశ్వత కట్టడం కూడా చేపట్టలేదని, ఇప్పుడు కూడా అదే జరుగుతోందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినా అమరావతి ప్రాంతంలో ఎలాంటి పురోగతి లేదన్నారు. మూడు పంటలు పండే భూములిచ్చేందుకు సిద్ధంగా లేమని రైతులు స్పష్టం చేస్తున్నారన్నారు. తాజాగా విశాఖ బీచ్లో విలువైన భూములు కాజేసేందుకు పెద్ద ఎత్తున దందా జరుగుతోందని ఆయన ఆరోపించారు. విజయవాడ విద్యాధరపురం ఆర్టీసీ బస్టాండ్లో 4.15 ఎకరాల ఆర్టీసీ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు కేటాయించడం అన్యాయమన్నారు. రూ.156 కోట్ల పెట్టుబడుల కోసం పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోందన్నారు. పెట్టుబడిదారులు, వ్యాపారస్తుల కోసం ప్రజల్ని ఇబ్బందులు పెట్టే విధంగా బస్టాండ్ను గొల్లపూడి ఎలా తరలిస్తారని నిలదీశారు. చంద్రబాబు ఈ విధంగా అరాచకపాలన సాగిస్తున్నారని రాజశేఖర్ ధ్వజమెత్తారు. వ్యాపార సంస్థలేమీ సేవా సంస్థలు కాదన్నారు. ఇష్టారాజ్యంగా వారికి కేటాయింపులు చేయడం సరికాదన్నారు. వారి దగ్గర నుంచి పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. ఒంగోలులో కూడా ఏ విధంగా భూములు ఆక్రమిస్తున్నారో చూస్తున్నామన్నారు. వీటన్నింటిపై వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్చితంగా విచారణ జరుపుతామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, కార్పొరేటర్లు ఇమ్రాన్ఖాన్, ప్రవీణ్కుమార్, వలంటీర్ల విభాగం అధ్యక్షుడు నాటారు జనార్దనరెడ్డి, కో ఆప్షన్ సభ్యులు శ్యాంసాగర్, నాయకులు గౌతమ్, పెట్లూరు ప్రసాద్, 13వ డివిజన్ అధ్యక్షుడు రాజేష్, తదితరులు పాల్గొన్నారు. -
అధికార పార్టీ నాయకులే అధికారులా..?
● పేర్నమిట్టలోని రేషన్ షాపుపై తహసీల్దార్కు స్థానికుల ఫిర్యాదు సంతనూతలపాడు (చీమకుర్తి రూరల్): రేషన్షాపు నిర్వహణ సక్రమంగా లేదంటూ సంతనూతలపాడు తహసీల్దార్కు పేర్నమిట్ట వాసులు సోమవారం ఫిర్యాదు చేశారు. బత్తుల శ్రీను, మట్టిగుంట చిరంజీవి, తదితరులు పేర్నమిట్ట గ్రామంలోని 28వ నంబర్ రేషన్ దుకాణంపై ఫిర్యాదు చేశారు. గత సంవత్సరం నవంబర్లో 6ఏ కేసు నమోదు చేయగా, అప్పటి నుంచి వీఆర్ఓ లాగిన్ ద్వారా రేషన్ ఇస్తున్నారని, కానీ, సోమవారం వీఆర్ఓ రాకుండా ఆ షాపులో అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సరుకు దింపుతున్నారని తెలిపారు. స్థానికులు అడ్డగించి తగిన చర్యలు తీసుకోవాలంటూ తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. -
ఎఫ్ఆర్ఎస్తో ముప్పుతిప్పలు
బేస్తవారిపేట: ఎన్నికల సమయంలో జీతాలు పెంచుతామని అంగన్వాడీ కార్యకర్తలకు కూటమి నాయకులు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జీతాలు పెంచకపోగా పనిభారం పెంచారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకే సమాచారాన్ని రెండు యాప్ల్లో నమోదు చేయమనడంతో అంగన్వాడీ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే బాలసంజీవని ద్వారా లబ్ధిదారులకు ఫేస్ యాప్ ద్వారా రేషన్ ఇస్తుండగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పోషణ ట్రాకర్ యాప్లో కూడా లబ్ధిదారుల ఫేస్ గుర్తింపు నిబంధనను తప్పనిసరి చేయడంతో కార్యకర్తలు రెండు యాప్లు నిర్వహించాల్సి వస్తోంది. ఆ యాప్ల గురించి ముందుగా శిక్షణ ఇప్పిస్తే ఫలితం ఉంటుంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలతో పాటు 7–36 నెలల పిల్లలకు ప్రతి నెలా పోషకాహారాన్ని ఇంటికే అందిస్తున్నారు. గర్భిణులు, బాలింతలు, పిల్లల వివరాలను పోషణ యాప్, బాలసంజీవని యాప్లలో నమోదు చేయాల్సి వస్తోందని అంగన్వాడీ కార్యకర్తలు చెబుతున్నారు. టీహెచ్ఆర్(టేక్ హోమ్ రేషన్) అందించాలంటే ఒకే వ్యక్తిని రెండుసార్లు ముఖ యాప్ల ద్వారా గుర్తించాల్సి రావడం కూడా ఇబ్బందికరంగా మారినట్లు చెబుతున్నారు. కార్యకర్తలు లబ్ధిదారులను అంగన్వాడీ కేంద్రాల వద్దకు పిలిపించుకుని పోషణ ట్రాకర్ యాప్లో ఫొటో అప్లోడ్ చేయాలి. వారికి ఇచ్చిన సరుకుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంది. ఈ సమయంలో సాంకేతికపరమైన ఇబ్బందులు వస్తున్నాయి. నెట్వర్క్ సరిగా రాకపోవడం, సెల్ఫోన్లు సరిగా పనిచేయకపోవడంతో ఈ ఫేస్ యాప్ ఓపెన్ కావడం లేదు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు గర్భిణులు, బాలింతలు గంటల తరబడి కేంద్రాల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. సమస్య తీరకుంటే మరోసారి కేంద్రం వద్దకు రావాల్సిందే. గతంలో సంతకాలు తీసుకుని సరుకులు ఇచ్చేవారని, ఈ ప్రభుత్వంలో ఆన్లైన్ విధానంలోనే పంపిణీ చేయాల్సి రావడంతో ఇబ్బందులు పడుతున్నామని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరుకుల కోసం నాలుగైదు సార్లు కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోందని లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలా రెండు సార్లు తిరగాలి.. బాలామృతం, బాలసంజీవని కిట్ల కోసం నెలలో మొదటి శుక్రవారం, మూడో శుక్రవారం గర్భిణులు, బాలింతలు టీహెచ్ఆర్ కోసం వెళ్లాలి. బియ్యం, కందిపప్పు, ఆయిల్, గుడ్లు, పాలు, బాలామృతం ప్యాకెట్ తెచ్చుకునేందుకు రెండుసార్లు వెళ్లిన సమయంలో యాప్లతో సమస్యలు తలెత్తుతున్నాయి. నాలుగేళ్ల క్రితం ఇచ్చిన సెల్ఫోన్లు, నెట్ వర్క్ పనిచేయకపోవడంతో ఐదారుసార్లు తిరగాల్సి వస్తోంది. 15 రకాల రికార్డులు నిర్వహించాలి.. అంగన్వాడీ కార్యకర్తలు ఆయా కేంద్రాల్లో 15 రకాల రికార్డులు నిర్వహించాల్సి వస్తోంది. దీని వల్ల చిన్నారుల ప్రాథమిక విద్యకు ఇబ్బందులు కలుగుతున్నాయని వాపోతున్నారు. ఇందులో లబ్ధిదారులకు అందించే ఆహార వినియోగం, పిల్లలు, గర్భిణిలు, బాలింతల వివరాల నమోదు రికార్డులు, ప్రీస్కూల్ అడ్మిషన్ రికార్డులను ప్రతి నిత్యం విధిగా నమోదు చేయాల్సిన పరిస్థితి. వాటితో పాటుగా పిల్లలకు అందించే టీకాలకు సంబంధించిన రికార్డుల రిజిస్టర్, విటమిన్–ఏ రికార్డు, రెఫరల్ సర్వీసెస్ గృహ సందర్శకుల రికార్డులు నిర్వహించాలి. దీంతో పాటు నెలవారీ ప్రాజెక్ట్, కేంద్రాల పరిధిలోని హౌస్ హోల్డ్ సర్వే, గ్రోత్ రికార్డు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సంబంధించిన రెండు టేక్ హోమ్ రేషన్ పంపిణీ రికార్డు నిర్వహించాల్సి వస్తోంది. జిల్లాలో అంగన్వాడీ సెంటర్లు 2,903 అంగన్వాడీ వర్కర్లు 2,853 గర్భిణులు 9,723 బాలింతలు 6,201 ప్రీస్కూల్ పిల్లలు 38,309 పోషణ ట్రాకర్ ద్వారానే సరుకులు ఇవ్వాలని కేంద్రం నిబంధన ఫేస్ యాప్లు సరిగా పనిచేయక అవస్థల్లో అంగన్వాడీ కార్యకర్తలు పౌష్టికాహారం పంపిణీలో ఇక్కట్లు నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్వాడీలుఒకే యాప్ విధానాన్ని తీసుకురావాలి ప్రతిరోజు అంగన్వాడీ కార్యకర్తలు రెండు యాప్ల్లో వివరాలు నమోదు చేయాల్సి వస్తోంది. ఒకే సమాచారాన్ని రెండు యాప్ల్లో నమోదు చేయడం వల్ల సమయం వృథా అవుతోంది. సర్వర్, నెట్వర్క్ సమస్యలు వచ్చినప్పుడు గంటల తరబడి లబ్ధిదారులు వేచిఉండాల్సిన పరిస్థితి. సమయమంతా ఆయా యాప్ల్లో వివరాల నమోదుకే సరిపోతోంది. అంగన్వాడీలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జీతాలు పెంచాలి. – సరళాదేవి, అంగన్వాడీ యూనియన్ నియోజకవర్గ అధ్యక్షురాలు -
మోసానికి కేరాఫ్ అడ్రస్
కూటమి ప్రభుత్వం● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి తాళ్లూరు: మోసానికి కేరాఫ్ అడ్రస్గా కూటమి ప్రభుత్వం మారిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి విమర్శించారు. ఎన్నికల హామీలను వంద శాతం నెరవేర్చిన ఏకై క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. తాళ్లూరు మండల కేంద్రంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద సోమవారం నిర్వహించి బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ కార్యక్రమానికి పార్టీ మండల అధ్యక్షుడు తూము సుబ్బారెడ్డి అధ్యక్షత వహించారు. అనంతరం మండల స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఆయా కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్తో పాటు 143 హామీలను గాలికి వదిలేసిందని, ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. కూటమి పార్టీల నాయకులు సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం పేరుతో గ్రామాల్లో పర్యటిస్తుంటే.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ ప్రజలు నిలదీస్తున్నారని అన్నారు. ఈ ప్రభుత్వం అమలు చేసిన కొన్ని హామీలు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేసినవేనని తెలిపారు. కరోనా విపత్తు సమయంలో కూడా ఇచ్చిన అన్ని హామీలను ఆనాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కులమతాలు, పార్టీలకు అతీతంగా అమలు చేశారని వివరించారు. కానీ, కూటమి ప్రభుత్వంలో అమరావతి కోసం లక్షల కోట్ల రూపాయలు అప్పుగా తీసుకొచ్చిన డబ్బులు ఏం చేశారో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. మోదీ మెప్పు కోసం రూ.300 కోట్ల ప్రజాధనాన్ని యోగాంధ్ర పేరుతో చంద్రబాబు, పవన్కళ్యాణ్ దుర్వినియోగం చేశారని బూచేపల్లి ఆరోపించారు. రూ.300 కోట్లు పెట్టి వైజాగ్లో గత ప్రభుత్వం నిర్మించిన భవనాలను ఉపయోగించుకోవడం వారికి చేతకావడంలేదని విమర్శించారు. మహిళలకు మాయమాటలు... జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ చంద్రబాబు 2014 ఎన్నికల్లోనూ పొత్తుతో వచ్చి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేశారని గుర్తుచేశారు. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి భారీ గెలుపు చూసి భయంతో 2024లోనూ మళ్లీ కూటమి కట్టి ఈవీఎంల ట్యాపరింగ్లు చేసి గెలిచారని, ఇప్పుడు కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి మోసం చేశారని మండిపడ్డారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ప్రతి మహిళకు రూ.18,000, మూడు గ్యాస్ సిలిండర్లు వంటి హామీలేవీ నెరవేర్చకుండా మాయమాటలు చెప్పి మోసం చేశారని ధ్వజమెత్తారు. నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటాం... కూటమి నాయకులు పెడుతున్న అక్రమ కేసులకు వైఎస్సార్ సీపీ శ్రేణులు భయపడవద్దని, ప్రతి వైఎస్సార్ సీపీ నాయకుడు, కార్యకర్తకు తాము అండగా ఉంటామని బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, బూచేపల్లి వెంకాయమ్మ హామీ ఇచ్చారు. 2029లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తుందని, అప్పటి వరకు ప్రతిఒక్కరూ ధైర్యంగా కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు తూము సుబ్బారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధుసూదన్రెడ్డి, ఐవీ సుబ్బారెడ్డి, జిల్లా సర్పంచ్ల సంఘ ఉపాధ్యక్షుడు మారం ఇంద్రసేనారెడ్డి, జిల్లా కోఆప్షన్ సభ్యుడు ఆదాం షరీఫ్, మండల ఉపాధ్యక్షుడు పులి ప్రసాద్రెడ్డి, ఆలోకం హరిబాబు, అనుబంధ విభాగాల అధ్యక్షులు కొర్రపాటి విష్ణు, కై పు అశోక్రెడ్డి, గువ్వల శ్రీనివాసరెడ్డి, గోవిందరాజు, మాయర్తి ప్రభుదాస్, నాగళ్ల గోపి, నాగళ్ల వెంకట్రావు, లతీఫ్, రమణారెడ్డి, సర్పంచ్లు మందా శాంసన్, షేక్ వలి, మంచాల వెంకటేశ్వరరెడ్డి, చిమట సుబ్బారావు, బొడ్డు రాములు, ఎంపీటీసీలు యోహాన్, పుల్లమ్మ, కోటయ్య, మాజీ జెడ్పీటీసీ లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, మండల నాయకులు యత్తపు మధుసూదన్రెడ్డి, కటకంశెట్టి శ్రీను, దేవదానం, గోపాల్రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, జయరామిరెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, సభ్యులు, నియోజకవర్గస్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
మొలకెత్తని ఆశలు
జిల్లాలో ఖరీఫ్ సాగు నత్తనడకన సాగుతోంది. ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడం, భూగర్భ జలాలు అడుగంటడంతో సాగు ముందుకు సాగడం లేదు. సాధారణంగా ఖరీఫ్లో ఈ పాటికి జిల్లాలో కనీసం 30 శాతానికిపైగా పంటలు సాగుకావాల్సి ఉండగా ఈ ఏడాది పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పంటల సాగు 8 శాతం మాత్రమే కాగా.. విత్తిన పొలాల్లోనూ మొలకలు రాక రైతులు నష్టపోతున్నారు. మరో వైపు గిట్టుబాటు ధరలు దక్కుతాయో లేదోనని మిర్చి సాగు చేయాలంటేనే రైతులు భయపడుతున్నారు.● ఖరీఫ్ సాగు అరకొర ● ఆశించిన వర్షాలు లేక బీళ్లుగా పొలాలు ● ఇప్పటికి 8 శాతం మాత్రమే పంటల సాగు ● విత్తిన పొలాల్లోనూ మొలకలు రాక నష్టం ● మిర్చి వైపు చూడని రైతులు మార్కాపురం: జిల్లా వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఖరీఫ్ ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం, పొలాలు పదునెక్కక వ్యవసాయం ముందుకు సాగడం లేదు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పడుతున్న వర్షపు జల్లులు తేమ శాతాన్ని పెంచుతున్నాయే తప్ప పంటలు సాగు చేసుకునేందుకు ఉపయోగపడటం లేదు. రుతుపవనాలు సకాలంలో వచ్చి వర్షాలు పడతాయని వాతావరణశాఖ అధికారులు ప్రకటిస్తున్నా ఆకాశంలో మబ్బుల జాడ తప్ప వర్షపు చినుకు పొలంలో పడటం లేదు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్లో 1,29,102 హెక్టార్లలో పంటలు సాగు కావాల్సి ఉండగా ఇప్పటికి కేవలం 10,468 హెక్టార్లలో మాత్రమే సాగయ్యాయి. అంటే 8.11 శాతమే పంటలు సాగైనట్టు అంచనా. పశ్చిమ ప్రకాశంలో కరువు పరిస్థితి ఇలా... పశ్చిమ ప్రకాశంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. సాధారణ వర్షపాతం కూడా పలు మండలాల్లో నమోదు కాలేదు. ఎండిపోయిన చెరువులు, బీడు భూములు కనిపిస్తున్నాయి. సాధారణంగా ఖరీఫ్లో రైతులు సజ్జ, కంది, ఆముదం, పత్తి, మిర్చి పంటలు సాగు చేస్తారు. ఇటీవల కురిసిన వర్షానికి కొంత మంది రైతులు పొలాలు సిద్ధం చేసుకుంటున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఆలస్యంగా నాట్లు వేస్తే తెగుళ్లు వస్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి రోజు వర్షం కోసం రైతులు ఎదురుచూడటమే సరిపోతోంది. కొన్ని చోట్ల పత్తి, కంది, సజ్జ, జొన్న పైర్లు వేసినా మొలకలు రాలేదు. కొన్నిచోట్ల విత్తనాలు నాటిన తరువాత వర్షం కురవడంతో పొలంపై ఉన్న మట్టి అట్టలాగా మారి మొలకలు తక్కువగా వచ్చాయి. పడిపోయిన మిర్చి సాగు: ఈ ఏడాది మిర్చిసాగు గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయి. గతేడాది గిట్టుబాటు ధరలేక పెట్టుబడుల డబ్బులు రాక మిర్చి రైతులు అవస్థలు పడుతున్నారు. నాడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మిర్చి రైతులకు ఎర్ర బంగారం కాగా నేడు భారంగా మారింది. 2021–22, 2022–23 సంవత్సరాల్లో క్వింటా మిర్చి ధర రూ.25 వేల నుంచి రూ.30 వేల మధ్య పలికింది. గతేడాది నుంచి ధరలు తగ్గుతూ వచ్చాయి. గతేడాది నవంబరులో రూ.15 నుంచి రూ.16 వేలు ఉన్న ధర ఫిబ్రవరి నాటికి రూ.11 వేలకు కూడా పలకలేదు. దీంతో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లడంతో ప్రభుత్వం కొనుగోళ్లపై దృష్టిపెట్టింది. అయినా నష్టాలే మిగిలాయి. ఎకరా మిర్చిసాగుకు సుమారు రూ.లక్ష నుంచి రూ.1.25 లక్షల వరకూ ఖర్చు వస్తోంది. గతేడాది మిర్చికి తెగుళ్లు ఆశించడంతో అటు దిగుబడి తగ్గిపోయి, ఇటు గిట్టుబాటు ధరలేక తీవ్రంగా నష్టపోయారు. దీంతో ఈ ఏడాది మిర్చి సాగు చేయాలంటేనే రైతులు భయపడుతున్నారు. జిల్లా మొత్తం మీద ఈ సీజన్లో వెయ్యి ఎకరాలకు మించి సాగు కాలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో సాగు ఇలా... పంట పేరు సాగైన విస్తీర్ణం (హెక్టార్లలో) వరి 249 జొన్న 34 సజ్జ 612 మొక్కజొన్న 1683 కొర్రలు 235 పెసలు 58 మినుములు 121 కందులు 117 వేరుశనగ 90 నువ్వులు 1954 పొద్దుతిరుగుడు 2 ఆముదం 585 పత్తి 4679 సోయాబీన్ 49 -
హామీలు నెరవేర్చని ప్రభుత్వాన్ని సాగనంపుదాం
● జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ కొత్తపట్నం: హామీలు నెరవేర్చని కూటమి ప్రభుత్వాన్ని సాగనంపడానికి రోజులు దగ్గరపడ్డాయని జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. మండలంలోని నల్లూరి గార్డెన్ పక్కనే ఉన్న స్థలంలో బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ముందుగా ఈతముక్కల నుంచి కొత్తపట్నం సభా కార్యక్రమానికి కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. బస్టాండ్ సెంటర్లో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు, మండల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వెంకాయమ్మ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రతిసారీ మోసపూరిత మాటలు చెప్పి ఓట్లు వేయించుకుని మోసం చేస్తున్నాడని, ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకే బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమం చేపట్టామన్నారు. తల్లికి వందనం, ఏడాదికి మూడు సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు వంటి పథకాలు ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పినవన్నీ నెరవేర్చారని అన్నారు. ఈ పథకాలు మళ్లీ అమలు కావాలంటే జగన్మోహన్రెడ్డిని సీఎం చేసుకోవాలని కోరారు. పొగాకు రైతులను పరామర్శించడానికి వైఎస్ జగన్ వస్తే ఆయన్ను చూసేందుకు వచ్చిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టించడం సిగ్గుచేటున్నారు. ప్రజలకు మేలు జరిగేలా పథకాలు అమలు చేయాలి కానీ రెడ్బుక్ పేరుతో అక్రమ కేసులు పెట్టడం తగదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్రావు మాట్లాడుతూ పోరాటం చేసి పోలీసులను కూడా లెక్క చేయకుండా సభా ప్రాంగణానికి చేరుకున్న కార్యకర్తలకు ఎంత అభిమానం ఉందో తెలుస్తోందన్నారు. చంద్రబాబు నాయుడు సింగపూర్ వెళ్తుంటే నాలుగు రోజులు పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రిగా చేస్తాడటని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పరిపాలన టీడీపీకి అప్పగించడం, పవన్ కల్యాణ్ నెలవారీ మామూళ్లు తీసుకోవడం చూస్తున్నామన్నారు. జగన్మోహన్రెడ్డి మీటింగ్ పెడితే గజగజలాడుతున్నారని తెలిపారు. వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ప్రతి పేదవాడికి ఉచిత వైద్యం, ఉచిత విద్యుత్ అందించిన ఘనత వైఎస్ రాజశేఖరెడ్డి, జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. 99 శాతం సంక్షేమ పథకాలు అమలుచేసిన వ్యక్తి జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను గుర్తుచేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, గతంలో అందుకున్న పథకాలన్నీ మళ్లీ పొందాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డిని గెలిపించుకోవాలన్నారు. పార్టీ కార్యక్రమాలను అడుగడుగునా పోలీసులు అడ్డుకుంటున్నారని, కార్యకర్తలు కలసికట్టుగా ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నారు. మాజీ పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మాదాసి వెంకయ్య మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై పోలీసు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని, తాము అండగా ఉంటామని చెప్పారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీ రమణారెడ్డి మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని, వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు కాకుమాను రాజశేఖర్ మాట్లాడుతూ దమ్మున్న మగాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అక్రమ కేసులు పెడితే వెనుకకు తగ్గేదే లేదన్నారు. ఎంపీపీ, మండల పార్టీ అధ్యక్షుడు లంకపోతు అంజిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకుందని, మంచి ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకర్, వ్యవసాయ విభాగం జోనల్ అధ్యక్షుడు ఆళ్ల రవీంద్రరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు సైకలం లక్ష్మీ శారద, మాజీ సర్పంచ్ దాచూరి గోపాల్రెడ్డి, బొట్ల సుబ్బారావు, ఎంపీటీసీ సభ్యుడు మిట్నసల శాంతారావు, మన్నె శ్రీనివాసరావు, వాయల సుమతి, నగరగంటి శ్రీనవాసరావు, పిచ్చిరెడ్డి, యేలు వెంకటేశ్వరరావు, మన్నె శ్రీధర్, ఓబుల్రెడ్డి, రమాదేవి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ప్రకృతి వ్యవసాయ విధానం భేష్
● జిల్లాలోని పలు మండలాల్లో పర్యటించిన కేరళ బృందం ● ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల పరిశీలన ఒంగోలు సబర్బన్: ప్రకృతి వ్యవసాయ విధానాలపై లోతైన అవగాహన, శిక్షణ కోసం కేరళ నుంచి వచ్చిన 34 మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి బృందం జిల్లాలో ఆదివారం పర్యటించింది. ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను బృందం సందర్శించింది. ప్రకృతి వ్యవసాయం జిల్లా డీపీఎం వి.సుభాషిణి నేతృత్వంలో కేరళ బృందం తొలుత మద్దిపాడు మండలం దొడ్డవరం గ్రామానికి చెందిన రైతు రామాంజనేయులు పొలాన్ని పరిశీలించారు. రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో 20 రకాల పంటల వైవిధ్యంతో సాగు చేస్తున్న విధానాలను వారు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. కొత్తపట్నం మండలం పాదర్తిలో రైతు మస్తాన్ సాగు చేస్తున్న ఏ–గ్రేడ్ వేరుశనగ పంటను కేరళ బృందం వీక్షించింది. మస్తాన్ అనుసరిస్తున్న అంతర పంటలు, సరిహద్దు పంటల ప్రయోజనాలను బృందం తెలుసుకుంది. కొత్తపట్నానికి చెందిన మల్లేశ్వరి బయో–రిసోర్స్ సెంటర్ను సందర్శించారు. అక్కడ ఘన జీవామృతం తయారీ ప్రక్రియ, విత్తనశుద్ధి చర్యలపై ప్రాక్టికల్ డెమోను ప్రత్యక్షంగా చూశారు. కేరళ బృందంతో పాటు రైతు సాధికార సంస్థ సీనియర్ కన్సల్టెంట్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డీవీ రాయుడు, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ సుభాషిణి, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది కూడా పాల్గొన్నారు. వ్యక్తి అనుమానాస్పద మృతి తర్లుపాడు: మండలంలోని కలుజువ్వలపాడు నవోదయ కళాశాల ఎదురుగా అటవీ ప్రాంతంలో వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని గమనించిన పశువుల కాపరులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు రాగసముద్రానికి చెందిన బి.విష్ణుగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆర్టీసీ బస్సుల్లో చోరీలు చేసే వ్యక్తి అరెస్టు ● 10 ల్యాప్టాప్లు స్వాధీనం ● విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన వన్టౌన్ సీఐ నాగరాజు ఒంగోలు సిటీ: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల బ్యాగ్లు చోరీ చేసే వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఒంగోలు వన్టౌన్ సీఐ నాగరాజు తెలిపారు. నిందితుడు కందుకూరుకు చెందిన విసా రమేష్బాబును ఒంగోలు భాగ్యనగర్ వద్ద అరెస్టు చేసి అతని వద్ద నుంచి 10 ల్యాప్టాప్లు, రూ.1000 నగదు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ.2,50,000 ఉంటుందని తెలిపారు. ఒంగోలు వన్టౌన్ కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకర్ల సమావేశంలో సీఐ నాగరాజు వివరాలు వెల్లడించారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లో బస్సుల్లో ప్రయాణించేవారు తమ వెంట తీసుకువెళ్లిన బ్యాగ్లను బస్సులో పెట్టి ఆర్టీసీ బస్టాండ్లో టిఫిన్కి లేదా భోజనం నిమిత్తం దిగేవారిని గమనించి నిందితుడు చోరీకి పాల్పడేవాడు. కందుకూరుకు చెందిన వీసా రమేష్బాబు ప్రయాణికుడిలా బస్సు ఎక్కినట్లు నటించి ప్రయాణికులు సీట్లో లేకుండా బ్యాగులు మాత్రమే సీట్లు ఉన్న చోట కూర్చొని అతని దగ్గర ఉన్న ఖాళీ బ్యాగ్ పెట్టి చాకచక్యంగా వారి బ్యాగ్ దొంగిలించేవాడని తెలిపారు. గత రెండేళ్లుగా ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లో దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 5న సుధాకర్ అనే వ్యక్తి విజయవాడ నుంచి తిరుపతి వెళుతూ ఒంగోలు బస్టాండ్లో మంచినీళ్ల బాటిల్ కోసం దిగాడు. నిందితుడు వీసా రమేష్బాబు..సుధాకర్ బ్యాగ్ను తీసి అందులోని రూ.5 వేల నగదు, విలువైన పత్రాలు అపహరించాడు. సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి ఆర్టీసీ బస్టాండ్లోనీ సీసీ కెమెరాల ఆధారంగా దొంగను గుర్తించారు. నిందితుడు ఆదివారం ఒంగోలు భాగ్యనగర్ వద్ద ఉండగా అరెస్టు చేసి అతని వద్ద మొత్తం 10 ల్యాప్టాప్లు, రూ.1000 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసులో ప్రతిభ కనపరిచిన టుటౌన్ సీఐ నాగరాజు, ఒంగోలు టుటౌన్ ఎస్సై సువర్ణ, ఓ.సురేష్, ఏఎస్సై సాయి, సిబ్బంది విజయ్, కానిస్టేబుళ్లు అనిల్ను ఎస్పీ అభినందించారు. -
జూనియర్ బాస్కెట్బాల్ జట్ల ఎంపిక
కందుకూరు రూరల్: ఉమ్మడి ప్రకాశం జిల్లా బాల, బాలికల బాస్కెట్ బాల్ జట్ల ఎంపికలు కందుకూరు టీఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానం ఆదివారం నిర్వహించారు. జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపికలకు జిల్లా నలుమూలల నుంచి 30 మంది బాలుర, 25 మంది బాలికలు హాజరయ్యారు. వీరిలో ప్రతిభ కనబరిచిన 12 మంది బాలుర, 12 మంది బాలికలను జట్టుకు ఎంపిక చేశారు. ఎంపికై న జట్లు వచ్చే నెల 14 నుంచి 17వ తేదీ వరకు తూర్పుగోదావరి జిల్లా పీఠాపురంలో జరిగే 10వ రాష్ట్ర స్థాయి జూనియర్ బాస్కెట్బాల్ ఛాంపియన్ షిప్లో పాల్గొంటారని ఉమ్మడి ప్రకాశం బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీలు వలేటి రవీంద్ర, టి.సుబ్బారావు తెలిపారు. ఎంపిక కార్యక్రమంలో మార్కాపురం పీడీ రమాదేవి, పీడీలు సుబ్రహ్మణ్యం, శ్రీనివాసరావు, కె.చిట్టెమ్మ, క్విజ్ కళాశాలకు చెందిన కోచ్ శివకుమారిలు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు టంగుటూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని సూరారెడ్డిపాలెం సమీపంలోని హెచ్పీ పెట్రోల్ బంకు సమీపంలో ఆదివారం రాత్రి జరిగింది. స్థానికులు, జాతీయ రహదారి అంబులెన్సు సిబ్బంది తెలిపిన వివరాల మేరకు..కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామానికి చెందిన దాసరి వెంకటేశ్వర్లు సూరారెడ్డిపాలెం సమీపంలో రోడ్డు దాటుతుండగా ప్రమాదవశాత్తు కిందపడగా గుర్తుతెలియని వాహనం అతని కాలుపై నుంచి వెళ్లడంతో కాలు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం జాతీయ రహదారి అంబులెన్సులో జీజీహెచ్కు తరలించారు. అనంతరం ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. -
అమృత్ భారత్.. నత్తనడక.!
కంభం: అమృత్ భారత్ పథకం కంభం రైల్వేస్టేషన్లో నత్తనడక నడుస్తోంది. ఈ పథకం కింద ఎంపికై న కంభం రైల్వేస్టేషన్లో అభివృద్ధి పనులు చేసేందుకు రూ.11 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఆ నిధులతో సుమారు 3 సంవత్సరాల క్రితం చేపట్టిన అభివృద్ధి పనులు నేటికీ పూర్తి కాలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కంభం రైల్వేస్టేషన్కు చుట్టుపక్కల మండలాల నుంచి నిత్యం వందలాదిమంది ప్రయాణికులు వస్తుంటారు. గిద్దలూరు నియోజకవర్గంలో ఆర్మీలో పనిచేసే వారు అధికంగా ఉండటంతో వారంతా కుటుంబాలతో కలిసి రైళ్లలోనే వెళ్తుంటారు. అందుకోసం కంభం రైల్వేస్టేషన్నే ఆశ్రయిస్తుంటారు. రాత్రి సమయాల్లో రైళ్ల కోసం వేచి చూస్తుంటారు. నిత్యం వందలాదిమంది ప్రయాణించే కంభం రైల్వేస్టేషన్లో అరకొర సౌకర్యాలతో ప్రయాణికులు అవస్థపడుతున్నారు. అమృత్ భారత్ పథకంలో మూడు సంవత్సరాల క్రితం కంభం రైల్వేస్టేషన్లో చేపట్టిన అభివృద్ధి పనులన్నీ నేటికీ అరకొరగానే జరిగాయి. అదనపు గదుల నిర్మాణం, వెయిటింగ్ హాలుకు మరమ్మతులు, ప్లాట్ఫాంల పెంపు, గ్రానైట్, టైల్స్ ఏర్పాటు, రైల్వే స్టేషన్ ముఖద్వారం ఆధునికీకరణ, ప్రాంగణం చుట్టూ ప్రహరీ, పార్కింగ్ టైల్స్ వంటి పనులు చేపట్టారు. మొదటి ప్లాట్ఫాం నుంచి రెండో ప్లాట్ఫాంకు వెళ్లేందుకు లిఫ్ట్ ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో లిఫ్ట్ నిర్మాణం పూర్తవగా, మిగిలిన పనులన్నీ నిర్మాణ దశలోనే ఉన్నాయి. అభివృద్ధి పనులన్నీ పూర్తయితేనే కంభం రైల్వేస్టేషన్ రూపురేఖలు మారి ప్రయాణికులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు అందుతాయని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. కంభం, అర్థవీడు, బేస్తవారిపేట, కనిగిరి మండలాల నుంచి ప్రయాణికులు, ఆర్మీ ఉద్యోగులు కంభం రైల్వేస్టేషన్ నుంచే సుదూర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కనిగిరి పట్టణం నుంచి రాత్రివేళ కంభం రైల్వేస్టేషన్కు బస్సు సౌకర్యం కూడా ఉందంటే.. కంభం రైల్వేస్టేషన్కు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. కంభంలో పలు ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగుతుండగా, గరీభ్ రథ్, పూరీ–యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్, ధర్మవరం ఎక్స్ప్రెస్, ఇంకా కొన్ని వీక్లీ ట్రైన్స్ ఆపకపోవడంతో దూరప్రాంతాలకు వెళ్లే ఆర్మీ ఉద్యోగులు, ఇతర ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే ఉన్నతాధికారులు స్పందించి అన్నిరకాల రైళ్లు కంభం రైల్వేస్టేషన్లో ఆగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. అభివృద్ధి పనుల్లో జరుగుతున్న జాప్యంపై రైల్వే ఉన్నతాధికారులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు డివిజనల్ రైల్వే మేనేజర్ సుదేష్నాసేన్ శనివారం కంభం రైల్వేస్టేషన్ను తనిఖీ చేసి అభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల నాణ్యత, పురోగతి లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని, పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. గతంలోనూ ఉన్నతాధికారులు ఆగ్రహించినా అభివృద్ధి పనులు మాత్రం వేగం పుంజుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. సుమారు 50 ఏళ్లుగా కంభం రైల్వేస్టేషన్లో అందుబాటులో ఉన్న పార్శిల్ సర్వీసులను ఇటీవల నిలిపివేయడంతో వ్యాపారులు, ప్రజలు, ఆర్మీ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాదు, గుంటూరు, విజయవాడ, బెంగళూరు వంటి దూర ప్రాంతాలకు ద్విచక్రవాహనాలు, బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు పంపించేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిలిపివేసిన పార్శిల్ సర్వీసులను వెంటనే పునరుద్ధరించాలని చుట్టుపక్కల మండలాల ప్రజలు కోరుతున్నారు. కంభం రైల్వేస్టేషన్ కంభం రైల్వేస్టేషన్ అభివృద్ధి పనుల్లో తీవ్ర జాప్యం అమృత్ భారత్ పథకం కింద రైల్వేస్టేషన్కు రూ.11 కోట్లు మంజూరు పనులు ప్రారంభమై మూడేళ్లు కావస్తున్నా పూర్తి కాని వైనం ఆలస్యంపై రైల్వే శాఖ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినా ఫలితం శూన్యం పనులు పూర్తయితే ప్రయాణికులకు అనేక సౌకర్యాలు త్వరితగతిన పూర్తిచేయాలంటున్న ప్రజలు అన్ని రైళ్లు ఆగేలా చూడాలి... పార్శిల్ సర్వీసులు పునరుద్ధరించాలి... అరకొరగానే అభివృద్ధి పనులు... పనుల్లో జాప్యంపై ఉన్నతాధికారులు ఆగ్రహం... తరచూ మొరాయిస్తున్న లిఫ్ట్తో ప్రయాణికులకు ఇబ్బందులు... నూతనంగా ప్రారంభించిన లిఫ్ట్ తరచూ మొరాయిస్తుంది. దీంతో ప్రయాణికులు రైలు వచ్చేస్తుందన్న తొందర్లో పట్టాలు దాటుకుని రెండో ప్లాట్ఫాంపైకి వెళ్తున్నారు. రెండో ప్లాట్ఫాంలో నీటి సమస్య ఉందని ప్రయాణికులు చెబుతున్నారు. ఆర్వోప్లాంట్ వినియోగంలో లేకపోవడంతో పాటు వెయిటింగ్ హాలు లేకపోవడం, మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో రిజర్వేషన్ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్లాట్ఫాంపై ఇంకా పార్కింగ్ టైల్స్, గ్రానైట్ పరచలేదు. స్టేషన్ ఆవరణలోని పనులన్నీ అసంపూర్తిగా ఉన్నాయి. రాత్రివేళ ప్లాట్ఫాంలు మందుబాబులకు అడ్డాగా మారుతున్నాయి. అక్కడే మద్యం సేవించి ఖాళీ బాటిల్స్, గ్లాసులను పరిసరాల్లో పడేస్తుండటంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. -
భూ దాహం
పచ్చ నాయకుడినాగులుప్పలపాడు: అధికారం అండతో ఏడాది నుంచి కూటమి నేతల అకృత్యాలు రోజు రోజుకీ ఎక్కువైపోతున్నాయి. అడిగేవారు లేరని అందినకాడికి దోచుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. ఇసుక, మద్యం, గ్రావెల్, బియ్యం ఇలా ఒకటేమిటి అందినకాడికి దోచుకుంటూ రెండు చేతులా సంపాదించుకుంటున్నారు. తాజాగా ఒంగోలు రూరల్ మండలం చింతాయగారిపాలెం గ్రామంలోని ప్రభుత్వ భూమిపై ఒక టీడీపీ నాయకుడి కన్నుపడింది. అంతే లక్షల రూపాయల విలువ చేసే స్థలాన్ని కబ్జా చేయడానికి పూనుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే ఒంగోలు రూరల్ మండలం చింతాయగారిపాలెం సర్వే నంబరు 409/1 లో 75 సెంట్ల స్థలం ఉంది. ఈ స్థలంలో గత ప్రభుత్వం గ్రామ సచివాలయం, రైతుభరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ల నిర్మాణాలకు పూనుకుంది. సదరు స్థలం లోతట్టుగా ఉండటంతో అప్పట్లోనే దానిని కొంత మేరకు పూడ్చి, చదును చేయడానికి ప్రభుత్వం రూ.6 లక్షలు మంజూరు చేసింది. పూడిక, చదును చేసే పనులు పూర్తయిన తరువాత ఆ స్థలంలో 2020లో సచివాలయ నిర్మాణానికి చర్యలు చేపట్టారు. సచివాలయ భవన నిర్మాణం మొదలుపెట్టిన క్రమంలో గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు చాపల శ్రీనుతో పాటు మరికొంత మంది కలిసి ఆ భూమి తమదంటూ కోర్టుకు వెళ్లారు. అంతలోనే 2023 లో మళ్లీ ఆ భూమి తమది కాదని కోర్టులో వేసిన కేసును టీడీపీ నాయకులే తిరిగి వాపసు తీసుకున్నారు. అధికారులు కూడా పరిశీలించి ఈ భూమి టీడీపీ నాయకులది కాదని చెప్పడంతో మిన్నకుండిపోయాడు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ టీడీపీ నాయకుడు రెచ్చిపోయి ప్రభుత్వ భవనాల నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా ఆ స్థలంలోకి ఎవరినీ రానీయకుండా దౌర్జన్యం చేస్తూ బెదిరింపులకు గురిచేస్తున్నాడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై గ్రామస్తులు ఇటీవల కలెక్టర్ను కలిసి విన్నవించారు. ఈ సమస్యపై ఇప్పటికై నా అధికారులు స్పందించి అక్రమార్కుల చెరలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని విడిపించి గ్రామ సచివాలయం, ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు సహకారం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయమై వీఆర్వో రామకృష్ణను వివరణ కోరగా ఆ స్థలానికి సంబంధించి గతంలో ఇద్దరు వ్యక్తులు కోర్టును ఆశ్రయించారని, వారిలో ఒకతను కేసును వెనక్కి తీసుకున్నారని మరొక వ్యక్తి కేసు పెండింగ్ లోనే ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆ స్థలంలోకి ఎవరినీ అనుమతించేది లేదని తెలిపారు. ప్రభుత్వ స్థలం తనదంటూ టీడీపీ నాయకుడి దౌర్జన్యం ఒంగోలు రూరల్ మండలం చింతాయగారిపాలెంలో ఆక్రమించుకోవడానికి యత్నాలు ఇప్పటికే ఆ స్థలంలో సచివాలయం, రైతు సేవా కేంద్రం, హెల్త్ క్లినిక్ నిర్మాణ పనులు గతంలో కోర్టులో ఉన్న కేసు వెనక్కి అధికారం రావడంతో ఆ స్థలం తనదంటూ మళ్లీ గ్రామస్తులకు బెదిరింపులు ఆక్రమణలు తొలగించి గ్రామాభివృద్ధికి తోడ్పడాలి గ్రామంలో ప్రజల సౌలభ్యం కోసం సచివాలయం, మిగతా ప్రభుత్వ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఇప్పటికే వాటిని నిర్మించుకోకపోవడం వలన అభివృద్ధికి దూరంగా ఉన్నాం. ప్రభుత్వ స్థలం ఆక్రమణలకు పాల్పడిన వ్యక్తులు ఇప్పటికై నా కోర్టు నిబంధనలకు లోబడి ఆక్రమణలు వదిలేసి గ్రామాభివృద్ధికి తోడ్పాటునందించి కలసి రావాలి. – నాయుడు శ్రీరాములు, సర్పంచ్, చింతాయగారిపాలెం -
వర్షం కోసం ఎదురుచూపులు
జూలై మూడో వారానికై నా వర్షం పడుతుందని ఎదురుచూశాం. చిరు జల్లులు తప్ప పంటలు వేసుకునేందుకు అనుకూలమైన వర్షాలు లేవు. మార్కాపురం ప్రాంతమంతా వర్షాధారంపైనే రైతులందరం పంటలు సాగు చేసుకుంటున్నాం. పదును వాన కురిస్తే విత్తనాలు చల్లుకుంటాం. అడపా దడపా కురుస్తున్న వర్షాల వలన రైతులకు ఎటువంటి ఉపయోగం లేదు. – లక్ష్మిరెడ్డి, రైతు, వేములకోట మిర్చి సాగు చేయాలంటే భయంగా ఉంది పోయిన ఏడాది మిర్చి సాగు చేశాను. గిట్టుబాటు ధర రాలేదు. దాంతో పాటు అకాల వర్షాలతో తెగుళ్లు వచ్చి దిగుబడులు కూడా తగ్గిపోయాయి. దీంతో ఈ ఏడాది మిర్చి సాగు చేయాలంటేనే భయంగా ఉంది. ఈ ఏడాది ఇంత వరకు వర్షాలు లేవు. జూలై నెలాఖరైనా పొలాల్లో విత్తనాలు చల్లలేదు. ఆలస్యంగా పంటలు సాగు చేస్తే అనుకోని తెగుళ్లు వస్తాయి. వ్యవసాయం చేయాలంటేనే భయంగా ఉంది. వర్షం పడితే పత్తి, సజ్జ వేద్దామనుకుంటున్నా. – వెంకటేశ్వరరెడ్డి, మేకలవారిపల్లి -
స్మార్ట్ మీటర్లతో పెనుభారం
ఒంగోలు సబర్బన్: విద్యుత్ వినియోగదారులపై పెనుభారం మోపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయని ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా రెండో రోజు ఒంగోలు నగరంలోని గాంధీజెగర్, జెడ్పీ కాలనీ, ఆర్టీసీ కాలనీ, శివప్రసాదు కాలనీ, కొత్తడొంక, మిలటరీ కాలనీ, యానాది సంఘం, వడ్డిగుంట కాలనీల్లో ఆదివారం ఐక్యవేదిక నాయకులు ఇంటింటికీ తిరిగి స్మార్ట్ మీటర్ల వల్ల భవిష్యత్లో జరిగే అనర్థాలను వివరించారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఆదేశంతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ప్రైవేట్పరం కార్యక్రమంలో భాగంగా ఆదానీ కంపెనీకి స్మార్ట్ మీటర్లు బిగింపు కోసం అనుమతి ఇచ్చారన్నారు. ప్రజా సంఘాల ఐక్యవేదిక కమిటీ ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లు బిగించవద్దు అంటూ ఇంటింటికీ తిరిగి నినాదాలు చేస్తున్నారు. గాంధీనగర్లోని స్మార్ట్ మీటర్లు గోడౌన్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ నగర అధ్యక్షుడు రాంబాబు, ఏఐటీయూసీ నాయకుడు కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు స్మార్ట్ మీటర్లను పగలకొట్టండి వారిపై కేసులు పెట్టండి మేము మీకు మద్దతుగా ఉంటామని లోకేష్ చెప్పి ఇప్పుడు అధికారంలోకి రాగానే అవన్నీ మరిచిపోయారాఅని ప్రశ్నిస్తున్నారు. స్మార్ట్ మీటర్ల బిగింపును ఆపకుంటే భవిష్యత్లో ప్రజలను కలుపుకొని పోరాటాలను చేస్తామని హెచ్చరించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు చీకటి శ్రీనివాసరావు, ఐఎఫ్టీయూ నాయకులు రాజశేఖర్, ఎం.ఎస్.సాయి, సీఐటీయూ ఒంగోలు నగర కార్యదర్శి మహేష్, దామా శ్రీనివాసులు, సీహెచ్ చిరంజీవి, తంబి శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, ఇతర సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఇంటింటికీ అవగాహన గాంధీనగర్లోని స్మార్ట్ మీటర్ల గోడౌన్ వద్ద నిరసన -
మద్యం పేరుతో అక్రమ కేసులు తగదు
చీమకుర్తి రూరల్: మద్యంలో ఎలాంటి స్కాం లేదని తెలిసినా కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా ఎంపీ మిథున్రెడ్డి పై, వైఎస్సార్ సీసీ నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టడం, అరెస్టులు చేయించడం తగదని మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ మేరుగు నాగార్జున అన్నారు. మండలంలోని తొర్రగుడిపాడులో ఆదివారం ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం, అరెస్టు చేయడం పరిపాటిగా మారిందన్నారు. ఇటీవల మంత్రి పర్యటనలో డోలా బాలవీరాంజనేయస్వామి బూచేపల్లి కుటుంబంపై రాజకీయ విమర్శలు చేయడం తగదని, జిల్లాలో అవినీతి మరక అంటని కుటుంబం బూచేపల్లి కుటుంబం అని అన్నారు. పైసా ఆశించకుండా పార్టీలకు అతీతంగా ప్రజలకు సహాయం చేసే కుటుంబం బూచేపల్లిది అన్నారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు పమిడి వెంకటేశ్వర్లు, ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నం శ్రీధర్బాబు, మాజీ వైస్ ఎంపీపీ రామసాని సూర్యం, మండల రైతు అధ్యక్షుడు నల్లూరి చంద్ర, కౌన్సిలర్ మేకల సులోచన ఎల్లయ్య, దాసరి లక్ష్మీనారాయణ, కత్తి రమణారెడ్డి, డాక్టర్ బొడ్డపాటి హరిబాబు, పులి శ్రీను, కొనికి సుబ్రహ్మణ్యం, కృష్ణమూర్తి, దేవుడు తదితరులు ఉన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి ●● యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లూరి వెంకటేశ్వర్లు ఒంగోలు సిటీ: వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లూరి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒంగోలు సీఐటీయూ జిల్లా కార్యాలయంలో యునైటెడ్ మెడికల్–హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ సమావేశం ఆదివారం నిర్వహించారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు వై.సురేష్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో తాళ్లూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తొలగించిన మగ ఆరోగ్య కార్యకర్తలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. రీడిప్లోయెన్మెంట్ విధానం వలన మహిళా ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, దాన్ని రద్దుచేసి ఎక్కడ వేతనాలు పొందుతున్నారో అక్కడే విధులు నిర్వహించేలా చూడాలని కోరారు. ఆన్లైన్ వర్క్ యాప్స్ సంఖ్య తగ్గించి పనిభారం తగ్గించాలని, పీఆర్సీ, ఐ.ఆర్ ఇవ్వాలని కోరారు. సీపీఎస్ విధానం రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీధరబాబు మాట్లాడుతూ ప్రతి పీహెచ్సీలో డేటా ఎంట్రీ ఆపరేటర్ని నియమించాలని, గ్రామ, వార్డ్ హెల్త్ సెక్రటరీలను వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోకి తీసుకు రావాలని, వైద్య ఆరోగ్య శాఖ విధులు మాత్రమే చేయించాలని కోరారు. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులంతా యూనియన్లో సభ్యత్వం తీసుకొని తమ సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాటాల్లో కలిసి రావాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు మాట్లాడుతూ ఈ ఏడాది డిసెంబర్ 31 నుంచి 2026 జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో నిర్వహించే సీఐటీయూ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్.ఎల్.హెచ్.పి సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. సమావేశంలో యూనియన్ నాయకులు బెజవాడ వెంకటేష్, ఎం.నాయక్, పి.కుమారి తదితరులు పాల్గొన్నారు. -
పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక
యర్రగొండపాలెం: సకుటుంబ సమేతంగా మిత్రులంతా ఒకచోట చేరి సందడి చేశారు. అలనాటి జ్ఞాపకాలను ఒకరికొకరు చెప్పుకొని ఆనందపడ్డారు. నాటి జ్ఞాపకాలను నెమేరుకొని మనసారా నవ్వుకున్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1976–78 నుంచి 1980–82వరకు విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఎంంతో ఉత్సాహంగా సాగింది. వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు, ఉద్యోగ విరమణ చేసినవారు 120 మంది పూర్వ విద్యార్థులు, వారి కుటుంబాలు కలిసి ముచ్చటించుకున్నారు. ఈ సందర్భంగా పూర్తిగా వెనకబడిన యర్రగొండపాలెంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన సమితి ప్రెసిడెంట్ దివంగత వేగినాటి కోటయ్య సతీమణి కాశమ్మను వారంతా ఘనంగా సన్మానించారు. -
ప్రకాశం
36 /277గరిష్టం/కనిష్టంస్మార్ట్ మీటర్లతో పెనుభారం స్మార్ట్ మీటర్లతో విద్యుత్ వినియోగదారులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెనుభారం మోపుతున్నాయని ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.అమృత్ భారత్..నత్తనడక అమృత్ భారత్ పథకం కింద ఎంపికై న కంభం రైల్వే స్టేషన్లో రూ.11 కోట్లతో మూడేళ్ల క్రితం చేపట్టిన అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి.వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో జల్లులు పడవచ్చు. సోమవారం శ్రీ 28 శ్రీ జూలై శ్రీ 2025– 8లో.. -
మున్సిపాలిటీల్లో శానిటేషన్ అధ్వానం
ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగరంతో పాటు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో శానిటేషన్ అధ్వానంగా ఉందని వినియోగదారుల రక్షణ సంఘం(డీసీపీసీ) సభ్యులు జిల్లా అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. జేసీ ఆర్.గోపాల కృష్ణ అధ్యక్షతన శుక్రవారం ఆయన ఛాంబర్లో సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీసీపీసీ సభ్యులు వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లో శానిటేషన్ అధ్వానంగా ఉందని, మరుగుదొడ్ల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని, కొన్ని చోట్ల మునిసిపల్ ఏరియాల్లో శానిటేషన్ బాగుండటం లేదని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అలాగే కొన్ని చోట్ల గుంతలు ఎక్కువగా ఉండటం వలన ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారన్నారు. కరెంట్ వైర్లు కిందకు వేలాడుతుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతన్నారని చెప్పారు. ఒంగోలు నగరంలో అన్ని ప్రాంతాల్లో కుక్కల బెడద అధికంగా ఉందన్నారు. వృద్ధులు, చిన్నారులను కరిచి గాయాల పాలు చేస్తున్నాయని చెప్పారు. ఒంగోలు నగరంలో కోతులు బెడద కూడా ఎక్కువగా ఉందన్నారు. ఒంగోలులో ప్రజల సౌకర్యార్థం సిటీ బస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా జేసీ గోపాల కృష్ణ స్పందిస్తూ వెంటనే ఒంగోలు, గిద్దలూరు, కనిగిరి మునిసిపల్ కమిషనర్లతో మాట్లాడి వారం రోజుల లోపల శానిటేషన్, గుంతలు కూడా సరిచేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశిస్తామన్నారు. కరెంట్ వైర్లు కిందకు వేలాడుతున్నందున వెంట సరిచేయాల్సిందిగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఏప్రిల్ నుంచి నెలలో ఒకరోజు ఎన్ఫోర్స్మెంట్ డేగా ప్రకటిస్తున్నారని, జిల్లాలో ప్రతి నెలా ఆ రోజు 9, 10 శాఖల అధికారులతో తనిఖీలు చేస్తామన్నారు. సంబంధిత తహశీల్దారు, ఎన్ఫోర్సుమెంట్ డిప్యూటీ తహశీల్దార్లు, ఎలక్ట్రికల్ ఏఈ, ఫైర్ డిపార్ట్మెంట్, లీగల్ మెట్రోలజీ, ఫుడ్ సేఫ్టీ, రెవిన్యూ డివిజనల్ అధికారులు, మునిసిపల్ కమిషనర్లు, జిల్లా పౌరసరఫరాల అధికారి, సివిల్ సప్లయ్ జిల్లా మేనేజరుతో పాటు జిల్లా సంయుక్త కలెక్టర్ కూడా తనిఖీల్లో పాల్గొంటారన్నారు. తనిఖీల్లో డీసీపీసీ సభ్యులు కూడా భాగస్వాములు కావాలని కోరారు. సమావేశాలో జిల్లా పౌరసరఫరాల అధికారి ఎస్.పద్మశ్రీ,, డీఎంహెచ్ఓ డాక్టర్ టి.వెంకటేశ్వర్లు, ఒంగోలు మునిసిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ కమిషనర్ సుశీల, అసిస్టెంట్ కమిషనర్ లీగల్ మేట్రోలజీ స్వర్ణ, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మహ్మద్ షంషేర్ ఖాన్, జిల్లా వినియోగదారుల సంఘం యం.నాగేశ్వరరావు, ఏనుగుల సురేష్, ఓ.సిహెచ్.నరసింహులు, వీరారెడ్డి, ప్రసాద్, మాధవ, కృష్ణరావు, బాలకృష్ణ, ఐ.నాగేంద్రరావు పాల్గొన్నారు. వినియోగదారుల రక్షణ సంఘ సమావేశంలో జేసీకి సభ్యుల ఫిర్యాదు -
ఎయిడెడ్ పోస్టుకు నిర్వహించే పరీక్షకు హాల్టికెట్లు
ఒంగోలు సిటీ: ఉమ్మడి ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వల్లపల్లి గ్రామంలోని సీఏ అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఖాళీగా ఉన్న ఎస్జీటీ ఎయిడెడ్ పోస్టు భర్తీ కోసం ఈ నెల 27వ తేదీ నిర్వహించే పరీక్షకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు అప్లికేషన్ ఐడీ, పుట్టిన తేదీని సీఎస్ఈ పోర్టల్లో సమర్పించి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని డీఈఓ కిరణ్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నరసరావుపేట ఇంజినీరింగ్ కాలేజీ, నరసరావుపేట ఇంజినీరింగ్ కాలేజీ అటానమస్ బ్లాక్–4లో నిర్వహించే పరీక్ష కేంద్రాల్లో ఉదయం గం.9.30 నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు రెండో సెషన్ జరుగుతుందన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ పరీక్ష కేంద్రానికి హాల్టికెట్లతో పాటు ఏదైనా గుర్తింపు కలిగిన ద్రువపత్రంతో ఒక గంట ముందుగా హాజరు కావాలని కోరారు. ఏకేయూ పీజీ మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదల ఒంగోలు సిటీ: ఆంధ్రకేసరి విశ్వ విద్యాలయం పరిధిలోని పీజీ కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి సెమిస్టర్ పరీక్షలు రాసిన విద్యార్థుల ఫలితాలను ఏకేయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డీవీఆర్ మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పరీక్షలకు మొత్తం 1025 మంది విద్యార్థులకు గాను, 932 మంది హాజరైనట్లు తెలిపారు. వీటిలో 752 మంది విద్యార్థులు 80.7 శాతం మేరకు ఉత్తీర్ణులైనట్లు చెప్పారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ఆంధ్ర కేసరి యూనివర్సిటీ సీఈ ప్రొఫెసర్ జి.సోమశేఖర, ఏసీఈ డాక్టర్ ఏ.భారతీ దేవి, పీజీ కో ఆర్డినేటర్ (నాన్ కాన్ఫిడెన్షియల్) డాక్టర్ ఆర్.శ్రీనివాస్, పరీక్షల విభాగం పర్యవేక్షకుడు సూడా శివరామ్ తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. నేడు ఉపాధ్యాయుల నిరసన ఒంగోలు సిటీ: ఒంగోలు డీఈఓ కార్యాలయం వద్ద శనివారం సాయంత్రం 4.30 గంటలకు నిర్వహించే నిరసన కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొని తమ నిరసన తెలియజేయాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ అబ్దుల్ హై, డీ వీరాంజనేయులు శనివారం ఒక ప్రకటనలో కోరారు. బదిలీలు, పదోన్నతులు పూర్తయి రెండు నెలలైనా ఉపాధ్యాయుల క్యాడర్ స్ట్రెంత్, పొజిషన్ ఐడీలు ఇంత వరకు ఇవ్వలేదన్నారు. రెండు నెలల నుంచి జీతం రాక ఉపాధ్యాయులు ఆర్ధికంగా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. కౌన్సెలింగ్ ద్వారా బదిలీ అయినా రిలీవర్ రాక అదే స్కూల్లో నిలిచిపోయిన ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలన్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న సుమారు 600 ఎస్జీటీ పోస్టుల్లో తాత్కాలికంగా అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించాలని కోరారు. ఉపాధ్యాయులను బోధనకు కాకుండా, బోధనేతర కార్యక్రమాలు విపరీతంగా పెంచి మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలు పేరుకుపోయాయని, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
దేశ వీరులు పశ్చిమ పౌరులు
కంభం: భారత త్రివిధ దళాల్లో జిల్లాకు చెందిన వేలాది మంది ప్రాణాలు పణంగా పెట్టి దేశ రక్షణ విధులు నిర్వర్తిస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ ప్రకాశంలోని గిద్దలూరు నియోజకవర్గం నుంచి యువత ఆర్మీలో చేరేందుకు అమితాసక్తి కనబరుస్తుండటం విశేషం. దాయాది దేశమైన పాకిస్తాన్తోపాటు చైనాతో జరిగిన యుద్ధాలు, కవ్వింపు చర్యలు, విధి నిర్వహణలో ఎదురైన ప్రమాదాల్లో జిల్లాకు చెందిన సైనికులు 36 మంది సైనికులు అశువులుబాశారు. అమరుల్లో గిద్దలూరు నియోజకవర్గానికి చెందిన 20 మంది సైనికులు ఉండగా, ఒక్క కంభం మండలానికే చెందిన వారు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 25 ఏళ్ల క్రితం జూలై 26వ తేదీన కార్గిల్ యుద్ధంలో భారత్ విజయ పతాకం ఎగురవేసింది. పాక్ మూకలను తిప్పికొట్టే క్రమంలో వందలాది మంది భారత సైనికులు వీర మరణం పొందగా వారిలో కంభం మండలం ఎల్.కోట గ్రామానికి చెందిన జి.శ్రీనివాసులు ఉన్నారు. మృత్యువుకే సవాల్ పశ్చిమ ప్రకాశం వాసులు సైన్యంలో చేరడానికి ప్రధాన కారణం ఇక్కడి వారి పూర్వీకులే. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో గిద్దలూరు ప్రాంత వాసులు ఎక్కువ మంది పాల్గొన్నారు. వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు.. ఇలా ఒకరిని చూసి మరొకరు స్ఫూర్తి పొందుతూ సైన్యంలో చేరే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారని మాజీసైనికులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న అగ్నివీర్ సైనిక నియామకాల్లో సైతం పశ్చిమ ప్రకాశం నుంచి వందలాది మంది యువకులు చేరి దేశ సేవలో పాలుపంచుకుంటున్నారు. జిల్లాలో ప్రస్తుతం సుమారు 13 వేల మంది మాజీ సైనికులు, 5 వేల మంది సైనికులుండగా ఒక్క గిద్దలూరు నియోజకవర్గం నుంచే 10 వేలకు పైగా మాజీ సైనికులు, 4 వేల మంది సైనికులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సంక్షేమానికి చొరవచూపాలి పోలీసులతో కలిసి మాజీ సైనికులు ఎన్నికల విధుల్లో పాలుపంచుకుంటున్నారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే సైనికులు తమ కుటుంబాల సంక్షేమానికి చొరవ చూపాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. 20 ఏళ్లకు పైగా సైన్యంలో పనిచేసి వచ్చిన వారికి 5 సెంట్ల నివేశన స్థలం, 5 ఎకరాల ప్రభుత్వ భూమి ఇవ్వాలని కోరుతున్నా నిరాశే ఎదురవుతోంది. పశ్చిమ ప్రకాశంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయడంతోపాటు పెన్షనర్లకు ఉపయోగకరంగా ఉండేలా స్పర్శ్ కేంద్రాన్ని నెలకొల్పాలని, రేషన్ కార్డు స్థానంలో డిఫెన్స్ వెల్ఫేర్ కార్డు అందించాని సైనికులు, మాజీ సైనికులు డిమాండ్ చేస్తున్నారు. మాజీ సైనికుల కార్యాలయానికి స్థలం మంజూరు చేయడంతోపాటు రైల్వే దొనకొండ ప్రాంతంలో ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. భరతమాత సేవలో ముందున్న పశ్చిమ ప్రకాశం సైనికులు వివిధ యుద్ధాలు, ప్రమాదాల్లో అమరులైన 36 మంది జవాన్లు జిల్లాలో సైనికులు 5 వేల మంది, విశ్రాంత సైనికులు 13 వేల మందికి పైగా.. గిద్దలూరు నియోజకవర్గంలోనే సుమారు 10 వేల మాజీ జవాన్లు, 4 వేలకు పైగా సోల్జర్లు సైనిక కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వాలు చొరవచూపాలని విజ్ఞప్తి -
దేవస్థాన భూములను ఆక్రమిస్తే చర్యలు
పామూరు: దేవస్థాన భూముల్లో ఎవరైనా ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని దేవదాయశాఖ జిల్లా అధికారి పానకాలరావు, ఈఓ శ్రీగిరిరాజ నరసింహబాబు హెచ్చరించారు. పామూరు మండల కేంద్రంలోని నెల్లూరు రోడ్డు, విరువూరు రోడ్డులో సర్వేనంబర్లు 441/1, 2, 3, 442/1, 2, 3లోని 28 ఎకరాలు, సర్వే నంబర్ 256/2లోని 29.33 ఎకరాల భూమిని శుక్రవారం పరిశీలించారు. శ్రీమదన వేణుగోపాలస్వామి, వల్లీ భుజంగేశ్వరస్వామి ఆలయ భూములను కొందరు ఆక్రమించి గుడిసెలు, ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా పరిశీలించి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవస్థాన భూముల్లో ఎలా నిర్మాణాలు చేపట్టారని నిలదీశారు. కొన్నిచోట్ల ఆక్రమణలు తొలగించారు. అదేవిధంగా ఆలయ భూముల్లో ఉన్న చిల్లచెట్లను తొలగించారు. గతంలో 32 కుటుంబాలే ఉండగా, నేడు 90 కుటుంబాల వరకూ ఆక్రమించారని, తక్షణమే ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించకుంటే తామే జేసీబీలతో తొలగించాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సై టి.కిషోర్బాబు, కేవీ రమణయ్య, గుర్రం వెంకటేశ్వర్లు, బండ్లా నారాయణ పాల్గొన్నారు. రేపు బాస్కెట్బాల్ జిల్లా జట్ల ఎంపిక ఒంగోలు: బాస్కెట్బాల్ జిల్లా జట్లను ఈ నెల 27వ తేదీ కందుకూరులోని టీఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో ఎంపిక చేయనున్నట్లు బాస్కెట్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వలేటి రవీంద్ర, తొట్టెంపూడి సుబ్బారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని బాలబాలికలు 2007 జనవరి 1వ తేదీ తర్వాత జన్మించిన వారు అర్హులని తెలిపారు. హాజరుకాదలచుకున్న వారు వయస్సు ధ్రువీకరణ పత్రంతో రావాలని సూచించారు. ఎంపికై న క్రీడాకారులు ఆగస్టు 14 నుంచి 17వ తేదీ వరకు పిఠాపురంలో నిర్వహించనున్న పదో జూనియర్ బాలబాలికల రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. దేవదాయశాఖ జిల్లా అధికారి పానకాలరావు ఆలయ భూముల్లో ఆక్రమణలు, చెట్ల తొలగింపు -
దగా
కలగా కేంద్రాలు..కొనుగోళ్లు!సాక్షి ప్రతినిధి, ఒంగోలు: మోసపు ప్రకటనలతో పొగాకు రైతులను ప్రభుత్వం దగా చేస్తోంది. మద్దతు ధర కోసం రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న రైతులను మభ్య పెట్టేందుకు పొగాకు వేలం ప్రక్రియలో మార్క్ఫెడ్ పాల్గొంటుందని ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. నెల రోజులు దాటుతున్నా మార్క్ఫెడ్ ద్వారా ఒక్క కేజీ కూడా కొనుగోలు చేయలేదు. పొగాకు బోర్డు ప్రకాశం రీజియన్లోని ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో మొత్తం 11 వేలం కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో 2024–25 ఏడాదికి గాను 105.27 మిలియన్ కేజీల పొగాకును అమ్ముకునేందుకు పొగాకు బోర్డు అనుమతిచ్చింది. ఈ మేరకు ఈ ఏడాది మార్చి 10, 19వ తేదీల్లో రెండు దశల్లో అన్ని వేలం కేంద్రాల్లో పొగాకు వేలం ప్రక్రియ ప్రారంభమైంది. నాలుగేళ్లకు భిన్నంగా ఈ ఏడాది వేలం ప్రారంభం నుంచే రైతుకు మద్దతు ధర కరువైంది. కర్నాటకలో మంచి ధరలు రావడంతో ఇక్కడా అలాగే ఉంటుందని రైతులు ఆశపడ్డారు. అయితే కంపెనీల మాయాజాలం, బోర్డు అధికారుల చేతివాటం, ప్రభుత్వ నిర్లక్ష్యం వెరసి రైతుకు మద్దతు ధర కరువైంది. కేవలం బ్రైట్ గ్రేడ్ పొగాకు మాత్రమే కేజీకి రూ.280 ఇచ్చిన వ్యాపారులు, మిగిలిన గ్రేడ్ల ధరలు దారుణంగా తగ్గించేశారు. ఇప్పటి వరకు వచ్చిన సరాసరి ధర చూస్తే కేజీకి కేవలం రూ.241 మాత్రమే. ఈ నేపథ్యంలో మద్దతు ధరలు ఇవ్వాలని రెండు నెలలుగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. వేలం ప్రక్రియను అడ్డుకోవడంతో పాటు, రోడ్లపైకి వచ్చి పొగాకు తగులబెట్టి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పొదిలి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి రైతులకు అండగా నిలిచారు. రైతులకు మద్దతు ధరలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వేలంలో పోటీని పెంచేందుకు మార్క్ఫెడ్ను రంగంలోకి దించుతున్నట్లు ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు మార్క్ఫెడ్ కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. సరికదా జిల్లాలోని ఏ వేలం కేంద్రంలో కూడా ఇప్పటి మార్క్ఫెడ్ తరఫున ఒక్క కేజీ పొగాకును కూడా ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయలేదు. వాస్తవానికి గతంలో ఒకసారి పొగాకు మార్కెట్లో ధరల సంక్షోభం ఏర్పడినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్క్ఫెడ్ను రంగంలోకి దించి పొగాకును కొనుగోలు చేయించారు. దీంతో వ్యాపారుల మధ్య పోటీ పెరిగి ధరలు అమాంతం పెరిగాయి. నాలుగేళ్లుగా రైతులు లాభాలు చవిచూశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితులు తలకిందులయ్యాయి. ప్రభుత్వం ఉత్తుత్తి ప్రకటనలకే పరిమితమైంది తప్ప రైతులను ఆదుకునే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. ఆర్భాటపు ప్రకటనలతో కాలయాపన.. పొగాకు వేలం ప్రక్రియ ప్రారంభమై దాదాపు నాలుగు నెలల కావస్తోంది. 11 వేలం కేంద్రాల పరిధిలో అధికారిక, అనధికారి పొగాకు ఉత్పత్తి కలుపుకుని 142 మిలియన్ కేజీలు ఉండొచ్చని అంచనా. దీనిలో ఇప్పటికే 76.58 మిలియన్ కేజీల పొగాకును రైతులు అమ్ముకున్నారు. అంటే దాదాపు 50 శాతానికి పైగా రైతులు ఉత్పత్తులను అరకొర ధరలకే విక్రయించారు. అయినా సరే ఇప్పటికీ ప్రభుత్వం మద్దతు ధరలు కల్పించలేదు. తాజాగా ఒక్కో రైతు నుంచి 20 క్వింటాళ్లు కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. అయితే తక్కువ పండించిన రైతులు ఇప్పటికే తమ వద్ద ఉన్న పొగాకును తక్కువ ధరలకు తెగనమ్ముకున్నారు. ప్రభుత్వం ఇప్పుడు వేలం ప్రక్రియలోకి వచ్చినా సగం మంది రైతులకు కూడా ప్రయోజనం ఉండేలా కనిపించడం లేదు. ఇలా రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం మోసపు మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం పొగాకు రైతులను ఆదుకోవాలి 14 ఎకరాల్లో పొగాకును పండించాను. 65 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇప్పటి వరకు వేలంలో 40 క్వింటాళ్ల పొగాకును వ్యాపారులు కొనుగోలు చేశారు. గత సంవత్సరంలో కేజీ రూ.360 పలికిన పొగాకు ఈ ఏడాది రూ.240, రూ.250 పలుకుతోంది. గిట్టుబాటు ధర దక్కకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నా. అధిక సంఖ్యలో బేళ్లు తిరస్కరణకు గురవుతూ అధిక భారం పడుతోంది. జూన్ 11వ తేదీన పొగాకు రైతుల గిట్టుబాటు ధర కోసం పొదిలి వేలం కేంద్రాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సందర్శించారు. ఆ తర్వాత ప్రభుత్వం మార్క్ఫెడ్ ను రంగంలో దించి పొగాకు రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు ఏమీ కొనలేదు. అమ్ముడుపోయిన పొగాకులో కూలీలకు ఇవ్వడానికి కూడా డబ్బులు రాలేదు. నా దగ్గర దాదాపు 25 క్వింటాళ్ల పొగాకు ఇంకా అమ్మకానికి ఉంది. దీన్నైనా మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి ఆదుకోవాలి. – సురేష్, పొగాకు రైతు, నేతివారిపాలెం ఈ ఏడాది నష్టాలు తప్పవు 11 ఎకరాల్లో పొగాకు సాగు చేశాను. ఇందుకు రూ.22 లక్షలు పెట్టుబడి అయ్యింది. ఏటా ఒక ఎకరానికి 9 నుంచి 10 క్వింటాళ్ల పంట పండేది. ఈ ఏడాది దిగుబడి కూడా భారీగా తగ్గింది. ఒక్కో బ్యారన్కు రూ.4 లక్షల నష్టం వస్తోంది. ఇప్పటి వరకు పొగాకు బోర్డులో రెండు బ్యారన్లకు కేవలం 18 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. ఎప్పుడు వేలం కేంద్రానికి వెళ్లినా బేళ్లు తిరస్కరణకు గురౌతున్నాయి. ఇప్పుడు ఒక్కో రైతు వద్ద నుంచి 20 క్వింటాళ్లు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. – రాయిండ్ల వెంకట నారాయణ, పొగాకు రైతు, పొందుటూరు గ్రామం, టంగుటూరు మండలం. -
అమరులారా వందనం
● గత ఏడాది జూన్లో తూర్పు లడఖ్ సమీపంలో సైనిక విన్యాసాలు చేస్తుండగా యుద్ద ట్యాంక్ నీటిలో కొట్టుకుపోయి ఐదుగురు జవాన్లు మరణించారు. వారిలో రాచర్ల మండలానికి చెందిన జేసీఓ ముత్తుముల రామకృష్ణారెడ్డి ఉన్నారు. ● గిద్దలూరు మండలం కిష్టంశెట్టిపల్లి గ్రామానికి చెందిన సంగిరెడ్డి సంజీవరెడ్డి నాలుగేళ్లళ్ల క్రితం సిక్కింలో మంచు కొండల చరియలు పడి మృతి చెందారు. ● గతేడాది డిసెంబర్లో కంభం మండలం రావిపాడుకు చెందిన వరికుంట్ల సుబ్బయ్య జమ్మూలోని పూంచ్ సెక్టార్లో కాపలా కాస్తున్న సమయంలో మందుపాతర పేలి మృతి చెందారు. ● కంభంకు చెందిన నంద్యాల శ్రీనివాసులు 2004లో శ్రీనగర్లో జరిగిన ఆపరేషనన్ రక్షక్లో అమరుడయ్యారు. ఆయన మరణించే నాటికి భార్య వకులాదేవి 6 నెలల గర్భిణి. నంద్యాల శ్రీనివాసులుకు మరణాంతరం విశిష్ట సేవా మెడల్ దక్కింది. ● కంభం మండలంలోని తురిమెళ్ల గ్రామానికి చెందిన పత్తి వెంకట నారాయణ 1988లో శ్రీలంకలో చేపట్టిన ఆపరేషన్ పవన్లో పాల్గొన్నారు. యుద్ధభూమిలో వీరమరణం పొందిన ఆయనకు అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. ● కంభం మండలం తురిమెళ్లకు చెందిన సీహెచ్ రంగస్వామి 1962లో చైనా యుద్ధంలో, ఎం.రంగారెడ్డి 1965లో పాకిస్థాన్తో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందారు. కంభం పట్టణానికి చెందిన జి.గాలెయ్య 2006లో ఆపరేషన్ రక్షక్లో, ఎల్కోట గ్రామానికి చెందిన జి.శ్రీనివాసులు 1999 కార్గిల్ యుద్దంలో తుది శ్వాస విడిచారు. -
సంక్షోభంలో విద్యారంగం
ఒంగోలు సిటీ: కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో విద్యారంగంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఒంగోలు నగరంలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం దాదాపు 18 లక్షల మంది విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. ఫలితంగా ఒక తరం విద్యార్థులు నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. దీనిపై వైఎస్సార్ సీపీ పోరాటం చేయనుందని ప్రకటించారు. ఇది కేవలం రాజకీయపరమైనది కాదని, రాష్ట్ర భవిష్యత్, విద్యార్థుల భవితకు సంబంధించిందని, రాష్ట్రంలోని విద్యార్థి సంఘాలు, మేధావులు, ఉద్యోగ సంఘాలు స్వచ్ఛందంగా మద్దతు పలకాలని కోరారు. ప్రభుత్వం మెడలు వంచి విద్యర్థులకు సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు చెల్లించేలా ఉద్యమం చేస్తామన్నారు. ఎన్నికల సమయంలో ప్రైవేటు కళాశాలల్లో పీజీ చదువుతున్న విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులను రోడ్డున పడేశాడని ధ్వజమెత్తారు. సకల శాఖల మంత్రిగా ఉన్న లోకేష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి చెందిన వారు, ఇతర రాష్ట్రాల్లో చదువుతున్న విద్యార్థులకు వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారన్నారు. ఇంటర్ తెలంగాణలో చదివి ఇక్కడ ఇంజినీరింగ్ చదివే విద్యార్థులకు కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఎగ్గొట్టడం సరికాదన్నారు. పేదలకు అండగా వైఎస్సార్... ప్రతిభ ఉన్న పేద విద్యార్థులకు ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, తదితర ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిదని కేవీ రమణారెడ్డి అన్నారు. అధికారంలో ఉన్నన్నాళ్లు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని దిగ్విజయంగా అమలు చేశారన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ పథకానికి గ్రహణం పట్టించారని ధ్వజమెత్తారు. దాదాపు రూ.1700 కోట్లు బకాయిలు పెట్టారని ఆరోపించారు. ఫలితంగా పేద విద్యార్థులు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన బకాయిలను 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి తీర్చారన్నారు. అలాగే క్రమం తప్పకుండా విద్యా దీవెన, వసతి దీవెన కార్యక్రమాల ద్వారా నిధులు ఇచ్చి పేద విద్యార్థులకు అండగా నిలిచారన్నారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్య భారం కాకుండా చూశారన్నారు. విద్యారంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పేద విద్యార్థుల భవిష్యత్తో చెలగాటమాడుతోందన్నారు. ఫీజు రీయింబర్స్మెంటుకు సంబంధించి ఆరు క్వార్టర్లు బకాయిలు పెట్టిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు. కళాశాల యాజమాన్యాలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఫలితంగా కళాశాల నిర్వహణ భారంగా మారడంతో నాణ్యమైన విద్య అందించేందుకు యాజమాన్యాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయన్నారు. తమ బిడ్డల భవిష్యత్పై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్నారు. కొంచెం డబ్బులున్న వారు తమ పిల్లలను పొరుగు రాష్ట్రాల్లోని ఇంజినీరింగ్ కళాశాలల్లో చేరుస్తున్నారన్నారు. ఫలితంగా ఉన్నత విద్యలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీ ప్రసాద్, రాష్ట్ర ఇంటలెక్చువల్ ప్రధాన కార్యదర్శి రొండా అంజిరెడ్డి, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు పల్నాటి రవీంద్రరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కూటమి ప్రభుత్వం పేరుకుపోతున్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విద్యార్థుల పక్షాన పోరాటానికి వైఎస్సార్ సీపీ సిద్ధం మేధావులు, విద్యార్థి సంఘాలు కలిసిరావాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి పిలుపు -
కేపీఐపై నిరంతర పర్యవేక్షణ తప్పనిసరి
ఒంగోలు సబర్బన్: ప్రభుత్వం నిర్దేశించిన కేపీఐ (కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్)పై జిల్లా స్థాయి అధికారులు నిరంతరం సమగ్రంగా పర్యవేక్షణ ఉంచాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. ఆయా అంశాల్లో పురోగతిని తాను కూడా ప్రతివారం సమీక్షిస్తానని చెప్పారు. కేపీఐ లక్ష్యాలు–పురోగతిపై అవగాహన కల్పించేందుకు శుక్రవారం ప్రకాశం భవనంలో అన్ని శాఖల ఉన్నతాధికారులతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స్వర్ణాంధ్ర–2047 కోసం ప్రధానంగా దృష్టి సారించాల్సిన అంశాలను గుర్తించి వీటిలో పురోగతి కోసం కేపీఐలను ప్రభుత్వం ఎంచుకున్నట్లు వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే వీటి కోసం లక్ష్యాలను ప్రభుత్వం నిర్దేశించిందని కలెక్టర్ తెలిపారు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి రాష్ట్ర స్థాయిలో అన్ని శాఖల ఉన్నతాధికారులకు వీటిని తెలియజేస్తారని, అనంతరం అక్కడ నుంచి జిల్లాలోని ఉన్నతాధికారులకు శాఖల వారీగా ఇవి వస్తాయని, వీటిని మండల స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఆయా లక్ష్యాలను కాలానుగుణంగా (పీరియాడికల్) చేరుకునేలా చర్యలు తీసుకోవాలని, సంబంధిత వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసేలా చూడాలని చెప్పారు. మండల స్థాయి అధికారులు చేస్తున్న పనులు, సాధిస్తున్న పురోగతిపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆన్లైన్లో రియల్ టైంలో ఈ వివరాలు కనిపిస్తూ ఉంటాయన్నారు. ఫైళ్లు సైతం పరిపాలనలో సాంకేతిక వినియోగానికి పెద్ద పీట వేస్తున్న ప్రభుత్వం, ఇందులో భాగంగా శాఖల వారీగా ఆయా కార్యాలయాలకు సంబంధించిన జీవోలు, సర్క్యులర్లు, ఇతర కీలక ఫైళ్లను కూడా ఆన్లైన్లో పొందుపరిచేలా చర్యలు చేపట్టిందని కలెక్టర్ చెప్పారు. వీటిని ఈపీటీఎస్.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైటులో అప్లోడ్ చేయాలని అన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాల కృష్ణ, డీఆర్ఓ బి.చిన ఓబులేసు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా -
స్కూటర్ను ఢీకొట్టిన క్యాష్ ట్రక్
కొనకనమిట్ల: రోడ్డు ప్రమాదంలో దంపతులు తీవ్రంగా గాయపడిన సంఘటన ఒంగోలు–గిద్దలూరు హైవేపై చినారికట్ల జంక్షన్ సమీపంలో పెట్రోల్ బంక్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. చినారికట్లకు చెందిన సోము సుబ్బారెడ్డి, సుశీల దంపతులు తమ పొలం నుంచి స్కూటర్పై ఇంటికి వెళ్తున్న క్రమంలో ఒంగోలు నుంచి వస్తున్న ఓ క్యాష్ పికప్ ట్రక్ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన సుబ్బారెడ్డి, సుశీల దంపతులకు పొదిలి ప్రభుత్వ వైద్యశాలలో ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం ఒంగోలులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు బంధువులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని ఎస్సై ప్రభాకరరెడ్డి పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన బ్యాంక్ వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
వర్క్ అవుట్ సోర్సింగ్ చర్యలు ఆపాలి
ఒంగోలు సిటీ: మున్సిపల్ కార్మికుల పొట్టగొట్టి కాంట్రాక్టర్ల బొజ్జ నింపే వర్క్ అవుట్ సోర్సింగ్ చర్యలు ఆపాలని మున్సిపల్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. ఒంగోలు మున్సిపల్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం శుక్రవారం సీఐటీయూ ప్రకాశం జిల్లా కార్యాలయంలో జీ నరసింహ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా కె.ఉమామహేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జూలై 12 నుంచి ఇంజినీరింగ్ కార్మికులు, 16వ తేదీ నుంచి పారిశుద్ధ్య కార్మికులు పది రోజుల పాటు సమ్మె చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమంపై ఉక్కుపాదం మోపాలని ప్రయత్నించిందన్నారు. కార్మికుల ఐక్య పోరాటం వల్ల కొంతమేర ప్రభుత్వం దిగివచ్చి ఇంజినీరింగ్ కార్మికుల వేతనాలు పెంచటం, పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన సంక్షేమ పథకాల జీవోలు, సమ్మెకాలపు వేతనం ఇస్తానని 22వ తేదీ మున్సిపల్ శాఖ మంత్రి దగ్గర జరిగిన చర్చల్లో మంత్రి హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే ఆగస్టు 5 తర్వాత రిలే నిరాహార దీక్షలు, అప్పటికీ కూటమి ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోతే ఆమరణ నిరాహార దీక్షలు చేపడతామన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థలో రెండు డివిజన్ల పరిధిలో వర్క్ అవుట్సోర్సింగ్ విధానాన్ని తీసుకొచ్చి చాప కింద నీరు లాగా ఆప్కాస్ ను ఎత్తేసి మళ్లీ లోకల్ ఏజెన్సీలకు ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిందని తెలిపారు. టెండర్లు పిలిచారని, వెంటనే వాటిని రద్దు చేయాలని నెల్లూరులోని మున్సిపల్ కార్మికులు ఈనెల 12వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారన్నారు. ఈ విధానాన్ని రాష్ట్రం మొత్తం అమలు చేయడానికి ప్రయత్నం మొదలుపెట్టిందన్నారు. వెంటనే వర్క్అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు మరో పోరాటానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు చీకటి శ్రీనివాసరావు మాట్లాడుతూ నేను మారిపోయాను అన్న చంద్రబాబు.. మళ్లీ మన రాష్ట్రంలో ప్రపంచీకరణ మొదలుపెట్టారని, స్మార్ట్ మీటర్లు, కరెంటు బిల్లులను విపరీతంగా పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని విమర్శించారు. వెంటనే ఈ విధానాలు ఆపాలని, లేదంటే కార్మికులు ఉద్యమబాట పట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.నాగభూషణం, కోశాధికారి జ్యోతి బసు, సీఐటీయూ నగర కార్యదర్శి, యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు కె.సామ్రాజ్యం, యు.రత్నకుమారి, యూనియన్ నగర జిల్లా కార్యదర్శి కొర్నేపాటి శ్రీనివాసరావు, టి.విజయమ్మ, ఆనంద్, వై రవి, ఎం బాబు, జేమ్స్, కె.వంశీ, మోహన్ రావు, ఇంజినీరింగ్, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. మున్సిపల్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు -
వాహన తనిఖీల్లో వెనుకబడిన జిల్లా
ఒంగోలు సబర్బన్: వాహన తనిఖీల్లో ప్రకాశం జిల్లా రవాణా శాఖ అధికారులు వెనుకబడ్డారని గుంటూరు రీజినల్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎన్.శివరామప్రసాదు అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక వెంగముక్కలపాలెం రోడ్డులోని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలుత జిల్లాలోని రవాణా శాఖ డీటీసీ, ఆర్టీఓలు, మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రహదారి భద్రతా నిబంధనల మేరకు భారీ, అతి భారీ ట్రాలీలు, టర్బో లారీలు, టిప్పర్లు సరుకు రవాణా చేసుకోవాలని, ఓవర్ లోడుతో రోడ్డు మీదకు వస్తే కేసులు రాసి పెనాల్టీలు విధిస్తామని హెచ్చరించారు. ప్రకాశం జిల్లాలో రవాణా అధికారుల పర్యవేక్షణ, తనిఖీలు తగ్గాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా డీటీసీ ఆర్.సుశీల, ఆర్టీఓలు కలిసి గ్రూప్ చెకింగ్లు చేపట్టే విధంగా ఆదేశాలు జారీ చేశామన్నారు. 24/7 తనిఖీ అధికారులు విధుల్లో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పామన్నారు. జిల్లా వ్యాప్తంగా లైఫ్ ట్యాక్స్ రాబడి దాదాపు రూ.3 కోట్లకుపైగా మైనస్లో ఉందన్నారు. వాహనాల విక్రయాల షోరూముల వద్ద నుంచే లైఫ్ ట్యాక్స్లు రావాల్సి ఉందని, మరి ఎక్కడ లోపం జరిగిందో ఎగ్జిక్యూటివ్ అధికారులతో తనిఖీలు చేయిస్తామని చెప్పారు. షోరూమ్ల నిర్వాహకులు లైఫ్ ట్యాక్సులు సక్రమంగా కట్టకపోవటం వలనే వాహనాల అమ్మకాలకు, లైఫ్ ట్యాక్సుకు తేడా ఉందన్నారు. అదేవిధంగా క్వార్టర్లీ వాహన ట్యాక్సులు రూ.2 కోట్లు వసూలు కావాల్సి ఉందన్నారు. రహదారుల మీద తనిఖీలు లేనందువలనే మూడు నెలలకు ఒకసారి కట్టాల్సిన ట్యాక్స్లు కట్టకుండా రోడ్ల మీద వాహనాలు తిరుగుతున్నాయన్నారు. అందుకోసం రెండు మండలాలకు ఒక మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ను కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరానికి 100 శాతం రెవెన్యూ వసూలయ్యేలా డీటీసీ ఆర్.సుశీలను ఆదేశించామన్నారు. విలేకరుల సమావేశంలో జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆర్.సుశీల, మార్కాపురం ఆర్టీఓ వై.శ్రీచందన, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
గంజాయి, చెయిన్ స్నాచింగ్ ముఠా అరెస్టు
ఒంగోలు సిటీ: గంజాయి విక్రయాలు, చెయిన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసినట్టు ఒంగోలు డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు తెలిపారు. రూ.30 వేలు విలువచేసే గంజాయి, రూ.14.50 లక్షల విలువచేసే బంగారు ఆభరణాలను వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. శుక్రవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు. సింగరాయకొండకు చెందిన గుంజి నరసింహారావు గంజాయికి అలవాటుపడ్డాడు. ఒడిశా రాష్ట్రానికి చెందిన గంజాయి విక్రయదారులు మిలన్ దాస్, శంకర్ పటేకర్, హడిలతో పరిచయం పెంచుకున్నాడు. వారి వద్ద నుంచి కొద్ది మొత్తంలో గంజాయి తెచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి ఒంగోలులో విక్రయించి డబ్బు సంపాదించాలని నరసింహారావు ఆశపడ్డాడు. ఆంధ్రా, ఒడిశా సరిహద్దులకు వెళ్లి అక్కడ వారికి కొంత మొత్తం డబ్బు చెల్లించి గంజాయి తీసుకునేవాడు. అక్కడి నుంచి వచ్చేటప్పుడు కొంత దూరం రైలు, మరికొంత దూరం బస్సుల్లో ప్రయాణించి ఒంగోలు చేరుకునేవాడు. ఇంటికి వెళ్లి గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసేవాడు. వాటిని ఒంగోలు నగరంలోని కాలేజీల వద్ద ప్యాకెట్ రూ.300 నుంచి రూ.500 వరకూ విక్రయించేవాడు. వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడు. ఈ క్రమంలో నరసింహారావుకు ఒంగోలుకు చెందిన గంజాయి విక్రయదారులు గోపాలకృష్ణ, అల్తాఫ్ పరిచయమయ్యారు. నరసింహారావు తెచ్చిన గంజాయిలో వారికి కూడా కొంత ఇచ్చేవాడు. వారు కూడా ఆ గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి అమ్మేవారు. అల్తాఫ్ స్నేహితులు నగరానికి చెందిన ఎనుగంటి కార్తీక్, మోట నవీన్, ఆవులమంద అంకబాబు, ఎకాంబరం నరేంద్ర, కుందురు ప్రవీణ్, తన్నీరు అఖిల్, షేక్ కృపారావులు కూడా గంజాయి ప్యాకెట్లు విక్రయించేవారు. వచ్చిన లాభాన్ని అంతా పంచుకునేవారు. ఈ క్రమంలో గంజాయిని తెచ్చేందుకు నరసింహారావు వైజాగ్ వెళ్లాడు. అక్కడి నుంచి ఆంధ్రా, ఒడిశా సరిహద్దుకు వెళ్లి ఒక కేజీ గంజాయి తీసుకొచ్చి ఇంట్లో దాచిపెట్టాడు. తెచ్చిన గంజాయిని గోపాలకృష్ణ, అల్తాఫ్లకు ఇచ్చేందుకు ముక్తినూతలపాడు గ్రామ శివారులోని ధరణి వెంచర్ వద్దకు వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న ఒంగోలు తాలూకా పోలీసులు మాటు వేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.30 వేలు ఉంటుంది. వీరిని విచారించగా ఈ ముఠాలో సభ్యుడిగా ఉన్న షేక్ కృపారావు మహిళల మెడల్లో చెయిన్లు అపహరించేవాడని గుర్తించారు. అతని వద్ద నుంచి రూ.14.50 లక్షల విలువైన 145 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఒడిశాకు చెందిన ముఠా పరారీలో ఉందని, వారిని త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.