Prakasam
-
ఉత్కంఠగా వాలీబాల్ టోర్నీ
ఉలవపాడు: రామాయపట్నం కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో అలగాయపాలెం గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేసిన వాలీబాల్ టోర్నమెంట్ను సీఐ జి.శివన్నారాయణ బుధవారం ప్రారంభించారు. ఉత్కంఠగా సాగిన డే అండ్ నైట్ మ్యాచ్లను ప్రేక్షకులు ఆసక్తిగా తిలకించారు. మైరెన్ స్టేషన్ పరిధిలోని 27 మత్స్యకార గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో యువత, క్రీడాకారులు హాజరయ్యారు. పోటీలను జవహార్ భారతి కాలేజీ పీడీ పర్యవేక్షిస్తున్నారు. కార్యక్రమంలో ఎస్సై ఎ.భాస్కర్రావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
శ్రీశైలం ఘాట్లో రోడ్డు ప్రమాదం
పెద్దదోర్నాల: ఎదురెదురుగా వస్తున్న ఓ ఆర్టీసీ బస్సు, తుఫాన్ వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు కర్ణాటక వాసులకు గాయాలు కావటంతో పాటు, ఘాట్ రోడ్డులో రెండు గంటల పాటు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సంఘటన మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని తుమ్మలబైలు గిరిజన గూడెం సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు.. కర్ణాటక నుంచి శ్రీశైలానికి వెళ్తున్న తుఫాన్ వాహనాన్ని, శ్రీశైలం నుంచి వస్తున్న కర్నూలు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తుమ్మలబైలు సమీపంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో తుఫాన్లో ప్రయాణిస్తున్న కర్ణాటక రాష్ట్రం విజయపురి జిల్లా పసురుకు చెందిన అశోక్, రాఘవేంద్ర, సోమేష్ చౌహాన్ గాయపడ్డారు. సమాచారం అందుకున్న పెద్దదోర్నాల, పెద్దారవీడు 108 వాహనాలు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను దోర్నాలలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు వైద్యశాలకు తరలించారు. ప్రమాదం కారణంగా రోడ్డుకిరువైపులా వాహనాల రాకపోకలు 2 గంటల పాటు పూర్తిగా నిలిచిపోయాయి. పోలీసులు, కొందరు ఆర్టీసీ సిబ్బంది కలిసి రోడ్డుకు అడ్డంగా ఉన్న వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కంభం: కంభం పట్టణంలోని రావిపాడు రోడ్డులో బుధవారం పట్టపగలే చోరీ జరగడంతో స్థానికంగా కలకలం రేగింది. ఉదయం 10 గంటల సమయంలో జరిగిన చోరీ వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్సై శివకృష్ణారెడ్డి కథనం మేరకు.. పందీటి రాజు గ్రామ పంచాయతీ కార్యాలయంలో విధులకు హాజరు కాగా, ఆయ భార్య ఇంటికి తాళం వేసి పనుల రీత్యా గిద్దలూరు వెళ్లారు. ఆమె ఇంటికి వచ్చేసరికి తాళం తెరిచి ఉంది. బీరువా పగలగొట్టి ఉండటంతో పోలీసుకు సమాచారం ఇచ్చారు. 5 గ్రాముల బరువైన రెండు జతల బంగారు కమ్మలు, 10 తులాల బరువైన రెండు జతల వెండి గొలుసులు, రూ.20 వేల నగదు చోరీ అయినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సును ఢీకొన్న తుఫాన్ వాహనం.. ముగ్గురికి గాయాలు ట్రాఫిక్కు 2 గంటల పాటు తీవ్ర అంతరాయం -
వ్యాపారానికి
ఎండ దెబ్బకు తాళలేక, కొనుగోలుదారులు రాక ఒంగోలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిలిచిన తోపుడు బండ్లుదేవుడా.. ఏమి ఎండ..రోహిణి కార్తె ప్రారంభం నుంచే భానుడు భగభగ మండుతున్నాడు. రహదారులు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. వేడి గాలులు వీస్తుండటంతో జనం ఇళ్లకు పరిమితం అవుతుండగా.. బేరాలు లేక వ్యాపారులు విలవిల్లాడుతున్నారు. ఎండ దెబ్బకు తట్టుకోలేక చిరువ్యాపారులు దుకాణాలు, తోపుడు బండ్లు మూత వేసి ఇంటి బాట పడుతున్న దృశ్యాలు ఒంగోలు నగరమంతా కనిపిస్తున్నాయి. హీట్ వేవ్పై వాతావరణ శాఖ ప్రకటనల నేపథ్యంలో ప్రధాన రహదారులు సైతం జన సంచారం లేక బోసిపోతున్నాయి. ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్, ఒంగోలు -
శిథిల చరిత్ర !
శిథిలావస్థకు చేరుకున్న గ్రంథాలయ భవనంపామూరు: ఆరు దశాబ్దాల చరిత్ర కలిగిన విజ్ఞాన భాండాగారం శిథిలావస్థకు చేరుకుంది. నిరుద్యోగ యువతకు, విద్యార్థుల పోటీ పరీక్షలకు బాసటగా నిలవాల్సిన గ్రంథాలయం పాలకుల నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారుతోంది. 1960 సంవత్సరంలో పామూరు పట్టణం దేవాలయాల వీధిలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటైన విజ్ఞాన ఆలయం 66 సంవత్సరాలుగా అద్దెభవనంలోనే నడుస్తోంది. 1973 వ సంవత్సరంలో ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థలో విలీనం చేశారు. అప్పట్లో లైబ్రరీకి వచ్చే వారి సంఖ్య ఎక్కువకావడంతో స్థలాభావంతో దానిని స్థానిక పొట్టిశ్రీరాములు వీధిలోని మరో అద్దెభవనంలోనికి మార్చారు. ప్రస్తుతం ఆ భవనం శిథిలావస్థకు చేరుకుని కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. పెద్ద వర్షానికి భవనం పైకప్పు నుంచి నీరు కారుతూ విలువైన పుస్తకాలు తడిసి పాడయ్యే దుస్థితి నెలకొంది. రెగ్యులర్ లైబ్రేరియన్ 2012 మే నెలలో పదవీ విరమణ చేయడంతో కొంతకాలం హనుమంతునిపాడు గ్రంథాలయం లైబ్రేరియన్ని, ఆ తర్వాత వెలిగండ్ల గ్రంథాలయం లైబ్రేరియన్ను ఇన్చార్జిగా నియమించారు. సదరు ఇన్చార్జి సోమ, గురు వారాలు రెండు రోజులే గ్రంథాలయంలో పనిచేస్తూ మిగతా దినాల్లో మూసివేసి ఉండటం, గ్రంథాలయానికి పోవాలంటే ఎక్కే మెట్లు శిథిలమై ప్రమాదకరంగా ఉండటంతో పుస్తక ప్రియులకు గ్రంథాలయానికి వెళ్లాలంటే భయపడుతున్నారు. ప్రస్తుతం లైబ్రరీలో 983 మంది సభ్యులు ఉండగా 9,808 వివిధ రకాల పుస్తకాలున్నాయి. ఇదిలా ఉండగా గ్రంథాలయానికి సొంత భవనం నిర్మించేందుకు గతంలో పామూరుకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు దివంగత సోమయాజులు తనకు ప్రభుత్వం నివేశనా స్థలం కింద ఇచ్చిన స్థలాన్ని గ్రంఽథాలయ భవన నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. ప్రస్తుతం దాతలు ఇచ్చిన స్థలం క్రమేణా ఆక్రమణలకు గురవుతోంది. తక్షణం నూతన భవనానికి నిధులు మంజూరు చేయించి గ్రంథాలయం శాశ్వత భవనంలో ఏర్పాటు చేయాలని విద్యార్థులు, మండల ప్రజలు కోరుతున్నారు. -
సెగ
భీకర గాలులతో అపార నష్టం ● పామూరు మండలంలో నేలరాలిన మామిడి, ఒరిగిన నిమ్మ చెట్లు ● మర్రిపూడి మండలంలో కూలిన విద్యుత్ స్తంభాలు పామూరు/మర్రిపూడి: ప్రకాశం జిల్లాలోని మర్రిపూడి, మార్కాపురం జిల్లాలోని పామూరు మండలాల్లో మంగళవారం సాయంత్రం, రాత్రి వీచిన బలమైన ఈదురు గాలుల ధాటికి మామిడి, నిమ్మ తోటలకు నష్టం వాటిల్లడంతోపాటు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దూబగుంట్ల వద్ద పామూరుకు చెందిన గువ్వల నరసింహం రూ.4 లక్షలకు లీజుకు తీసుకున్న 13 ఎకరాల మామిడి తోటలో కాయలు భారీగా నేలరాలాయి. అయ్యవారిపల్లె వద్ద రైతులు చింతలపూడి రామచంద్రయ్య, శాంతమ్మకు చెందిన 225కు పైగా నిమ్మ చెట్లు, కొన్ని మామిడి చెట్లు ఒరిగిపోయాయి. సీఎస్పురం మండలంలోని చింతపూడి గ్రామంలో మామిడి కాయలు నేలరాలాయి. మర్రిపూడి పంచాయతీ రాజుపాలెం గ్రామంలో అభయ ఆంజనేయస్వామి ఆలయంలో ధ్వజ స్తంభం సగానికి విరిగి పడింది. చిమట గ్రామ పొలాల్లో 2 స్తంభాలు, మర్రిపూడిలో 3 స్తంభాలు, మర్రిపూడి కొండ పొలంలో ఒక ట్రాన్స్ఫార్మర్ కూలి విద్యుత్ తీగలు తెగిపోయాయి. మరికొన్ని విద్యుత్ స్తంభాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పొట్టిరెడ్డిపాలెం వద్ద మామిడి తోటలో కాయలు పూర్తిగా రాలిపోవడంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. అంకేపల్లి, గంగపాలెం, మర్రిపూడి, దుగ్గిరెడ్డిపాలెం, వల్లాయపాలెం తదితర గ్రామాలల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. -
అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలి
కందుకూరు: పొగాకు రైతులకు మద్దతుగా ఆందోళన చేసిన వైఎస్సార్ సీపీ నాయకులపై అక్రమంగా కేసులు నమోదు చేయడం దుర్మార్గమని, వైఎస్సార్సీపీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ డిమాండ్ చేశారు. గిట్టుబాటు ధరలు లేక అప్పులపాలై ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రైతులకు అండగా నిలిచేందుకు వేలం కేంద్రాన్ని సందర్శించామన్నారు. రైతు నాయకుడి ముసుగులో ఉన్న అధికార పార్టీకి చెందిన నేత రైతుల ఆందోళనలు పక్కదారి పట్టించేందుకు, గిట్టుబాటు ధరలు రాకపోతే ప్రభుత్వానికి ఏం సంబంధం అంటూ వ్యంగ్యంగా మాట్లాడిన అధికార పార్టీ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసులు నమోదు చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. పొగాకు రైతుల ఆందోళనలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పెట్టిన పెట్టుబడులు కూడా రాక రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే వారిపై అభాండాలు వేస్తూ తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురిచేయడం దారుణమని, ఇది ముమ్మాటికీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని ధ్వజమెత్తారు. ఇప్పటికై నా రైతు ప్రతినిధులుగా వెళ్లిన వైఎస్సార్ సీపీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని బుర్రా డిమాండ్ చేశారు. -
ఆగని ఇసుక తవ్వకాలు
కందుకూరు రూరల్: కందుకూరు మండలంలోని శ్రీరంగరాజపురం సమీపంలో మన్నేరు నుంచి ఇసుక తవ్వి మదనగోపాలపురం సమీపంలో డంప్ చేస్తున్నారు. శ్రీరంగరాజపురానికి చెందిన రైతు ఒంగోలుకు చెందిన ఇసుక వ్యాపారికి పేదల భూమిని తన భూమి అంటూ ఇసుకను విక్రయించాడు. దీంతో ఒంగోలుకు చెందిన వ్యాపారులు ఇసుక తవ్వకాలు జరిపి భారీ మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి రైతులకు, కూటమి నాయకులకు ఎక్కువ మొత్తంలో ముడుపులు చెల్లించి యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్నారు. మన్నేరు నుంచి లారీలు, టిప్పర్లతో ఇతర ప్రాంతాలకు ఇసుక తరలి వెళ్తున్నా ఏ అధికారీ పట్టించుకోవడం లేదు. మన్నేరులో పెద్ద పెద్ద క్వారీలు పెట్టి ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని, దీని వల్ల మంచినీటి బోర్లకు, వ్యవసాయ బోర్ల నీటికి ఇబ్బంది కలుగుతుందని శ్రీరంగరాజపురం, మదనగోపాలపురం గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎస్సీల భూముల్లో ఇసుక తవ్వకాలు: ఉలవపాడు మండలంలోని బద్దిపూడి గ్రామం ఎస్సీలకు సంబంధించిన ఇసుక భూముల్లో జేసీబీతో తవ్వకాలు జరిపి మదనగోపాలపురం గ్రామం వద్ద డంపింగ్ చేసి అక్కడ నుంచి లారీల్లో తరలిస్తున్నారు. మా భూముల్లో తవ్వకాలు జరపవద్దని ఎన్ని సార్లు అడ్డుకున్నా అధికార బలం, అధికారుల అండదండలతో ఒంగోలుకు చెందిన ఇసుక వ్యాపారులు ఇసుక తవ్వుకొని వెళ్తున్నారని ఎస్సీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిని అడ్డుకోవాల్సిన అధికారులు వారికే వంత పలుకుతున్నారని, అధికారులు స్పందించి ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని రైతులు కోరుతున్నారు. భారీగా తరలి వెళ్తున్న ఇసుక -
ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు
ఒంగోలు సిటీ: జిల్లాలోని ముస్లింలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. హజ్రత్ ఇబ్రహీం జీవితాంతం చేసిన త్యాగాలకు ప్రతీకగా ముస్లింలు బక్రీద్ పండుగ చేస్తారని అన్నారు. పేదలకు దాన ధర్మాలు, త్యాగం, ప్రేమ, సత్యానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ● గోడౌన్ను పరిశీలించిన కలెక్టర్ పి.రాజాబాబు ఒంగోలు సబర్బన్: జిల్లాకు సంబంధించి ఈవీఎంలను భద్రపరచిన గోడౌన్ వద్ద నిరంతరం పటిష్టమైన భద్రత ఉండాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పి.రాజాబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా బుధవారం ఒంగోలు నగరంలోని మామిడిపాలెంలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎం) గోదాములను కలెక్టర్ తనిఖీ చేసి గోదాములకు వేసిన సీళ్లను పరిశీలించారు. అక్కడి భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. కలెక్టర్ వెంట జిల్లా డీఆర్ఓ శ్రీధర్ రెడ్డి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఇతర రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు సబర్బన్: జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు తహశీల్దార్లకు రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఒంగోలు తహశీల్దార్గా పనిచేస్తున్న పిన్నిక మధుసూదనరావు డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి పొందిన వారిలో ఉన్నారు. ఈయన జిల్లాలోని కొమరోలు, పెద్దారవీడు, చీమకుర్తి, కొత్తపట్నంలలో తహశీల్దార్గా పనిచేశారు. కొత్తపట్నంలో తహశీల్దార్గా పనిచేస్తూ ఒంగోలుకు బదిలీపై వచ్చారు. మరొకరు కలెక్టరేట్లో ల్యాండ్ సెక్షన్లో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న షేక్ మహమ్మద్ హుస్సేన్కు కూడా డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి లభించింది. ఈయన పాత ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల, బేస్తవారిపేట, మద్దిపాడు, పొన్నలూరు, గుడ్లూరు, ఉలవపాడు, సీఎస్ పురంలలో తహశీల్దార్గా పనిచేశారు. ప్రస్తుతం కలెక్టర్లో సెక్షన్ సూపరింటెండెంట్గా విధులు నిర్వర్తిస్తున్నారు, వీరిరువురికి వారం రోజుల్లో డిప్యూటీ కలెక్టర్లుగా పోస్టింగ్ ఇవ్వనున్నారు. మార్కాపురం: జనగణన, గృహ గణన కార్యక్రమంలో భాగంగా అధికారులు సర్వేకు వెళ్లినప్పుడు పలు గృహాలకు తాళం వేయడంతో సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. మార్కాపురం జిల్లా వ్యాప్తంగా సుమారు 10,180 గృహాలకు తాళాలు వేసినట్టు సిబ్బంది గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా 21 మండలాలు, 4 నియోజకవర్గాలను 2222 బ్లాకులుగా విభజించి, 2222 సిబ్బందిని కేటాయించి గృహ గణన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నెల 1 నుంచి ప్రారంభించిన కార్యక్రమం నెలాఖరుతో పూర్తికావాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా 13,27,117 మంది జనాభా ఉన్నట్లు అంచనా వేశారు. జిల్లాలో మొత్తం 4,13,863 ఇళ్లను సర్వే చేయాలని అధికారులు అంచనా వేయగా 4 లక్షల 6 వేల గృహాల గణన పూర్తిచేశారు. గృహ గణన కార్యక్రమంలో వెలిగండ్ల మండలం జిల్లా వ్యాప్తంగా చూస్తే తడబడుతోంది. ఇక్కడ మొత్తం 9620 గృహాలకు గాను 7756 గృహాలను లెక్కించగా 591 గృహాలు తాళం వేసినట్టుగా గుర్తించారు. పొదిలి మండలంలో 16,950 గృహాలు ఉండగా 500 గృహాలకు తాళంవేసినట్టు గుర్తించారు. సీఎస్పురంలో 12,367 గృహాలు ఉండగా 265 గృహాలకు తాళాలు వేసి ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా కంభంలో 1012 గృహాలకు డోర్లాక్ వేసినట్టు గుర్తించారు. ఆ తరువాత పామూరులో 658 గృహాలకు డోర్లాక్ వేశారు. గిద్దలూరులో 516 గృహాలకు తాళాలు వేయగా, కొనకనమిట్లలో 612 గృహాలకు డోర్లాక్ ఉన్నట్టు గుర్తించారు. ఇలా డోర్లాక్ ఉన్న గృహాలను గుర్తించడం సిబ్బందికి తలకు మించిన భారంగా మారుతోంది. మరోవైపు అధికారులు సిబ్బందికి టార్గెట్లు నిర్ణయించి త్వరగా పూర్తిచేయాలని ఒత్తిడి తెస్తున్నారు. -
డ్ర గ్స్ రహిత జిల్లానే లక్ష్యం
● కలెక్టర్ రాజాబాబు ఒంగోలు సబర్బన్: జిల్లాను మాదకద్రవ్య రహితంగా చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పి.రాజాబాబు పేర్కొన్నారు. స్థానిక ప్రకాశం భవన్ నుంచి బుధవారం జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. జిల్లాలో గుర్తించిన 20 హాట్ స్పాట్లలో విజిబుల్ పోలీసింగ్ ఉండాలన్నారు. మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఎకై ్సజ్, పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రెమడాల్, ఆల్ఫ్రజోలం మందులను వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించే ఔషధ దుకాణాల లైసెన్సులు రద్దు చేయాలని స్పష్టం చేశారు. గంజాయి కేసులు, సీజ్ చేసిన వాహనాల వివరాలను ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఆయేషా బేగం, పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలను ఎస్పీ వి.హర్షవర్ధన్రాజు వివరించారు. డీఆర్ఓ శ్రీధర్రెడ్డి, కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ, ఆర్డీవోలు, డీఎస్పీలు, డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఉషారాణి, ఆర్ఐఓ ఆంజనేయులు, డీఈఓ రేణుక, మైన్స్ డీడీ రాజశేఖర్, మార్కెటింగ్ శాఖ ఏడీ వరలక్ష్మి పాల్గొన్నారు. గుడ్లూరు: రామాయపట్నం పోర్టు మొదటి దశ నిర్మాణ పనులు గడువులోగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. గుడ్లూరు మండలంలోని కర్లపాలెం గ్రామ నిర్వాసితులకు తెట్టు వద్ద నిర్మిస్తున్న పునరావాస కాలనీని, తెట్టు నుంచి పోర్టు వరకు నిర్మిస్తున్న రైల్వే లైన్ పనులను కలెక్టర్ బుధవారం పరిశీలించారు. సాలిపేటలో ఎస్టీ కాలనీ వాసులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పొర్టు పనులు, పరిపాలన భవన నిర్మాణానికి భూసేకరణపై సంబంధిత అఽధికారులతో సమీక్షించారు. అనంతరం చేవూరులో ఓటరు అనుసంధాన ప్రక్రియను పర్యవేక్షించారు. కలెక్టర్ వెంట జేసీ కల్పనాకుమారి, సబ్ కలెక్టర్ హిమవంశీ, మారిటైమ్ బోర్డు ఈఈ శివరాం, తహసీల్దార్ బాలకిశోర్, నవయుగ సంస్థ ప్రతినిధులు, స్థానిక అధికారులు ఉన్నారు. కంభం: బైక్–లారీ ఢీకొన్న సంఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ ప్రమాదం కంభం పట్టణంలో అనంతరం–అమరావతి హైవే బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. కంభం అర్బన్ కాలనీకి చెందిన అమిరిశెట్టి దిలీప్కుమార్(19) బుధవారం రాత్రి 8 గంటల సమయంలో బైక్పై వెళ్తూ అనంతపురం– అమరావతి జాతీయ రహదారిపై లారీని ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. కంభం ప్రభుత్వ వైద్యశాలలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతదేహానికి కంభం ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గురువారం శ్రీ 28 శ్రీ మే శ్రీ 2026
పొన్నలూరులో నిరుపయోగంగా ఆశ్రమ పాఠశాల కొత్త భవనంగిరి పుత్రులు..అద్దె చదువులుపొన్నలూరు: గిరిపుత్రుల్లో అక్షరాస్యత శాతాన్ని పెంపొందించేందుకు ఏర్పాటైన ఆశ్రమ పాఠశాలలను చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం చేస్తోంది. పేద గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన గిరిజన ఆశ్రమ పాఠశాల సొంత భవనం, కనీస వసతులకు నోచుకోక కునారిల్లుతోంది. నిధులున్నా పాలకులు పట్టించుకోకపోవడంతో అద్దె భవనాల్లోనే అవస్థలు పడుతున్నారు పొన్నలూరు గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు. సాక్షాత్తూ సంక్షేమశాఖ మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఉండడం గమనార్హం. దాదాపు 25 సంవత్సరాల కిందట ఆశ్రమ పాఠశాల ఆరంభమైంది. అప్పటి నుంచి 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకూ అద్దె భవనాల్లో విద్యార్థులు చదువుకుంటున్నారు. 2022 సంవత్సరంలో పదో తరగతి వరకూ చదువుకునే అవకాశాన్ని అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది. మొదటిలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ ఆ తరువాత ఉపాధ్యాయుల కృషితో ప్రస్తుతం 150 మంది ఉన్నారు. ఈ పాఠశాలకు పక్కాభవనం నిర్మించడానికి కొన్నేళ్ల క్రితం శ్రీశైలం గిరిజన సమగ్ర అభివృద్ధిశాఖ సంస్థ నుంచి రూ.5.40 కోట్లు మంజూరయ్యాయి. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పక్కనే నిర్మించడానికి 1.10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించారు. అందులో రూ.3.50 కోట్లతో భవన నిర్మాణ పనులు చేపట్టి 80 శాతం వరకు నిర్మాణ పనులు పూర్తిచేశారు. అయితే మిగిలిన ఫ్లోరింగ్, గ్రిల్స్, తలుపులు, కిటికీలు, ప్రహరీ, విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్ల నిర్మాణ పనులు చేయకుండా కాంట్రాక్టర్ వెళ్లిపోయాడు. గిరిజన విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు అప్పటి కలెక్టర్ పాఠశాలను సందర్శించారు. మిగిలిన పనులు పూర్తి చేయడానికి రూ.2.50 కోట్లతో అంచనాలు తయారు చేసి నిధులు మంజూరు కోసం విజయవాడ ఈఎన్సీ కార్యాలయానికి పంపించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పూర్తి సౌకర్యాలతో పక్కా భవనాన్ని పూర్తి చేసేందుకు 2024–25లో శ్రీశైలం గిరిజన సమగ్ర అభివృద్ధి సంస్థ రూ.3.26 కోట్లు మంజూరు చేసింది. 2025 అక్టోబర్ నెలలో రీ టెండర్ ద్వారా పనులు ఇవ్వాలని ఐటీడీఏ అధికారులు సూచించారు. 2017 సంవత్సరంలో ఉన్న పాత రేట్ల ప్రకారం పనులు చేపట్టాలని నిబంధన విధించడంతో పాత రేట్లు ప్రకారం పనులు చేపడితే తాము నష్టపోతామని టెండర్ వేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఫలితంగా భవన నిర్మాణ పనులు ముందుకు సాగలేదు. వాస్తవంగా 2026 విద్యా సంవత్సరానికి గిరిజన ఆశ్రమ పాఠశాల భవన అసంపూర్తి పనులు పూర్తిచేసి వాడుకలోకి తెస్తామని మంత్రి స్వామి హామీ ఇచ్చారే కానీ దాని అమలుపై దృష్టిసారించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం ఫలితంగా వచ్చే విద్యా సంవత్సరంలో కూడా విద్యార్థులు అద్దెభవనంలోనే అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొంది. పనులు ఆగిపోయిన అసంపూర్తి భవనాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. -
కూలీల ఆటో బోల్తా
● ఏడుగురు కూలీలకు గాయాలు కొండపి: కూలీల ఆటో బోల్తా పడి నలుగురికి తీవ్ర గాయాలు కాగా మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని చిన్న వెంకన్నపాలెం సమీపంలోని సబ్స్టేషన్ వద్ద మంగళవారం సాయంత్రం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం..మండలంలోని నేతివారిపాలెం ఎస్సీ కాలనీకి చెందిన మహిళలు టంగుటూరు మండలంలోని ఒక ప్రైవేట్ పొగాకు కంపెనీలో కూలి పనులకు వెళుతుంటారు. మంగళవారం కూడా వెన్నూరు గ్రామానికి చెందిన ఆటోలో కంపెనీకి వెళ్లి సాయంత్రం తిరిగి వస్తుండగామండలంలోని చిన్న వెంకన్నపాలెం సబ్ స్టేషన్ సమీపంలోకి వచ్చేసరికి ముందుగా వెళుతున్న ద్విచక్ర వాహనదారుడు ఒక్కసారిగా పక్కకు వెళ్లడంతో ఆటో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయగా అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఆటోలో ఉన్న మహిళా కూలీలంతా గాయపడ్డారు. వారిలో ఈశ్వరమ్మ, గోవిందమ్మ, దేవమ్మ, ఆటో డ్రైవర్ సుబ్బారావులకు తీవ్ర గాయాలు కాగా మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించడంతో ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. -
రాజ్యాంగ నిబంధనల ప్రకారం బీసీ రిజర్వేషన్లు
ఒంగోలు సబర్బన్: రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించేందుకు అవసరమైన అంచనా వేయడం కోసం డెడికేటెడ్ కమిషన్ కృషి చేస్తోందని కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం, వినతుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా, కలెక్టర్ పి.రాజాబాబుతో కలసి ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా మాట్లాడుతూ ప్రతి యూనిట్కు సంబంధించిన బీసీ జనాభా శాతం, రిజర్వేషన్ పరిమితులపై కమిషన్ సమగ్ర అధ్యయనం చేయాల్సి ఉంటుందన్నారు. అందులో భాగంగా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే సమగ్రంగా నిర్వహించి, కచ్చితమైన సమాచారం సేకరించాలని ఆదేశించారు. కలెక్టర్ పీ రాజాబాబు మాట్లాడుతూ జిల్లాలో ఏకీకృత కుటుంబ సర్వే సమగ్రంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా జనాభా గణాంకాలు, బీసీ వర్గాల ప్రాతినిధ్యం వంటి అంశాలపై కమిషన్కు సమగ్ర వివరాలు అందజేసినట్లు కలెక్టర్ తెలిపారు. అనంతరం ప్రజల నుంచి, సంఘాల ప్రతినిధుల నుంచి చైర్మన్ వినతులు స్వీకరించడంతో పాటు వారి అభిప్రాయాలు, సమస్యలను నమోదు చేసుకున్నారు. కార్యక్రమంలో డెడికేటెడ్ కమిషన్ సెక్రటరీ డి.చంద్రశేఖర్ రాజు, జెడ్పీ సీఈఓ చిరంజీవి, డీపీఓ వెంకటేశ్వరరావు, సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మా నాయక్, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి నిర్మలా జ్యోతి, సీపీఓ శ్రీనివాసులు రెడ్డి, ఉమ్మడి జిల్లాకు చెందిన మున్సిపల్ కమిషనర్లు, డీఎల్డీఓలు, జీఎస్ డబ్ల్యూఎస్ అధికారులు పాల్గొన్నారు. మద్దిపాడు: మండలంలోని గుండ్లాపల్లి, కొష్టాలు సెంటర్ వద్ద రెండు ద్విచక్రవాహనాలు చోరీకి గురయ్యాయి. ఈ మేరకు స్థానిక పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఇళ్లనే దొంగలు టార్గెట్ చేశారు. ఇటీవల కాలంలో జాతీయ రహదారి వెంట పలు చోట్ల దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో సోమవారం రాత్రి బైక్ల దొంగతనం కలకలం రేపింది. మద్దిపాడు పోలీసులు రాత్రిళ్లు జాతీయ రహదారి వెంట గస్తీ పెంచాలని ప్రజలు కోరుతున్నారు. రాజకీయ పార్టీలు, బీసీ సంఘాల వినతుల స్వీకరణ బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా -
ప్రజల సంతృప్తి మేరకు పనిచేయాలి
● కలెక్టర్ విజయసునీత మార్కాపురం టౌన్: ప్రజల సమస్యలను పరిష్కరించి వారి సంతృప్తి మేరకు పనిచేయాలని కలెక్టర్ ఎం విజయసునీత అన్నారు. స్థానిక కలెక్టరేట్లో ఐవీఆర్ఎస్ కాల్స్, పెన్షన్స్పై మంగళవారం ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెన్షన్ పంపిణీలో నిర్లక్ష్యం వహించకుండా జిల్లాను ముందు వరుసలో నిలిపేందుకు కృషి చేయాలన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి పెన్షన్ ఇవ్వడం లేదని, ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. ఐవీఆర్ఎస్ సర్వేలో కొంత వెనుకబాటు కనిపిస్తోందని, దాన్ని సరిచేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు, డీఆర్డీఏ ఇన్చార్జి పీడీ నీలకంఠారెడ్డి, ఎంపీడీఓలు పాల్గొన్నారు. ఒంగోలు సిటీ: జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాలను స్క్వాడ్ సభ్యులు తనిఖీ చేసినట్లు డీఈఓ సీవీ రేణుక తెలిపారు. పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పదో తరగతి హిందీ పరీక్షకు 175 మందికి గాను 57 మంది హాజరు కాగా 118 మంది గైర్హాజరయ్యారు. అలాగే ఏపీఓఎస్ఎస్ (ఎస్ఎస్సీ) ఇంగ్లిష్ పరీక్షకు మొత్తం 492 మంది విద్యార్థులకు గాను 392 మంది హాజరు కాగా 100 మంది గైర్హాజరయ్యారు. ఏపీఓఎస్ఎస్ (ఇంటర్మీడియెట్) తెలుగు పరీక్షకు 519 మందికి గాను 407 మంది హాజరు కాగా 112 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. కందుకూరు రూరల్: పిడుగుపాటుకు వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని విక్కిరాలపేట పొలాల్లో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. విక్కిరాలపేట గ్రామానికి చెందిన యరయాల మాలకొండయ్య గ్రామ సమీపంలో సరుడు వేర్లు తీసేందుకు కూలీ పనికి వెళ్లాడు. మంగళవారం సాయంత్రం గాలివాన, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వర్షానికి పని నుంచి ఇంటికి వస్తుండగా ఒక్కసారిగా పిడుగు పడి మాలకొండయ్య (61) మృతి చెందాడు. గమనించిన బంధువులు 108 వాహనంలో కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించగా పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ● మరొకరికి గాయాలు అద్దంకి రూరల్: బైక్ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. ఈ సంఘటన అద్దంకి మండలంలోని రేణింగవరం రోడ్డులో జార్లపాలెం గ్రామం సమీపంలో మంగళవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే.. జె. పంగులూరు ఎస్సీ కాలనీకి చెందిన జశ్వంత్(19), మైకేల్లు పని నిమిత్తం అద్దంకి వచ్చి తిరిగి పంగులూరుకు వెళ్తుండగా మార్గమధ్యంలో రేణింగవరం గ్రామ సమీపంలో గ్రీన్ఫీల్డ్ హైవే వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. జస్వంత్ అక్కడికక్కడే మృతి చెందగా, మైకేల్కు గాయాలవడంతో 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సీఐ సుబ్బరాజు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గురువులకు సెలవుల్లేవ్ !
అద్దంకి: ప్రభుత్వ పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించినా ఉపాధ్యాయులకు మాత్రం ప్రతి రోజూ ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమంలో పాల్గొనాల్సిందేనని విద్యాశాఖ హెచ్చరించింది. ఈ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విద్యాశాఖ రూపొందించిన కార్యక్రమాల్లో డీవైఈఓలు, ఎంఈవోలు, ఉపాధ్యాయులు మండలాల్లో తిరగాల్సి ఉంది. గత నెల 24 నుంచి అన్ని పాఠశాలలకూ వేసవి సెలవులు ప్రకటించినా, ఉపాధ్యాయులు మాత్రం వారి పాఠశాల పరిధిలోని బడిఈడు పిల్లలను గుర్తించి పాఠశాలలో చేర్పించే బాధ్యత నిర్వర్తించాలని విద్యాశాఖ మార్గదర్శకాలు జారీచేయడంతో వేసవి సెలవుల్లో సైతం తాము పనిచేయక తప్పడంలేదని పలువురు వాపోతున్నారు. మండు వేసవిలో వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు సూచిస్తున్న ప్రభుత్వం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎవరూ బయటకు రావద్దని హెచ్చరిస్తోంది. తమకు మాత్రం వేళాపాళా లేకుండా ‘బడి పిలుస్తోంది’ ర్యాలీలు నిర్వహించాలని ఆదేశించడం ఏమిటని ఉపాధ్యాయ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పిల్లల్ని చేర్పించాల్సిందే.. ప్రతి ఉపాధ్యాయుడు తమ తరగతిలో పిల్లల సంఖ్య తగ్గకుండా చూసుకోవాలని, టీచర్– విద్యార్థి నిష్పత్తికి అనుగుణంగా ఈ సంఖ్య లేకపోతే ఆ ఉపాధ్యాయుడిని వేరొక స్కూలుకు పంపుతామని ఇప్పటి నుంచే విద్యాశాఖాధికారులు ఒత్తిడి పెడుతున్నారు. అద్దంకి నియోజకవర్గంలోని పలు పాఠశాలల్లో తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉండడంతో ఆ పాఠశాలలను సమీప స్కూళ్లలో విలీనం చేస్తారని, పోస్టులు సైతం రద్దయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తుండడంతో ఉపాధ్యాయుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మహిళా ఉపాధ్యాయులు, పదవీ విరమణ దగ్గరలో ఉన్న ఉపాధ్యాయులను సైతం ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమంలో పాల్గొనాలని ఒత్తిడి చేస్తుండడంతో మండుటెండలో తిరిగి అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని, మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. -
విద్యుత్ అంతరాయాలపై అప్రమత్తంగా ఉండాలి
● ఏపీసీపీడీసీఎల్ ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు ఒంగోలు సబర్బన్: వేసవిలో విద్యుత్ అంతరాయాలపై విద్యుత్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఏపీసీపీడీసీఎల్ ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఈ మేరకు ఆయన తన కార్యాలయం నుంచి జిల్లాలోని అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. వేసవిలో ఏర్పడిన అధిక ఉష్ణోగ్రతలు, ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో వర్షపాతం వలన ఏర్పడుతున్న విద్యుత్ అంతరాయాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యుత్ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని, మరమ్మతులు వెంటనే చేపట్టాలని, అన్నీ డివిజన్లలో కూడా కంట్రోల్ రూం పెట్టాలని ఆదేశించారు. ప్రజలు విద్యుత్ సమస్యల పరిష్కారానికి 1912 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి తెలపాలని లేదా సంబంధిత లైన్మెన్కి గానీ, సంబంధిత సబ్ స్టేషన్కి గానీ వెంటనే తెలియపరచాలని కోరారు. -
కూలి పనికి వచ్చి ఇంటికి కన్నం
కంభం: కూలి పని కోసం వచ్చి పక్కింటికి కన్నం వేసి నగలు, నగదు కాజేసి వెళ్లారని మార్కాపురం డీఎస్పీ యు నాగరాజు పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీన అర్థవీడు మండలం గన్నేపల్లిలో జరిగిన చోరీలో నేరస్తులను పోలీసులు అదుపులోనికి తీసుకొని కోర్టులో హాజరు పరిచారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ కేసు వివరాలు వెల్లడించారు. పెద్దారవీడు మండలానికి చెందిన దూదేకుల ఖాసీం, మార్కాపురానికి చెందిన ఈర్ల అంకమరాజు, తాడివారిపల్లికి చెందిన కందుల షడ్రక్ అను ముగ్గురు గన్నేపల్లిలో యర్రయ్య అనే మేసీ్త్ర దగ్గర బేల్దారీ పనులకు వచ్చి గ్రామంలో పని చేసుకుంటున్నారు. వీరిలో గతంలో నేర చరిత్ర కలిగిన దూదేకుల చిన్నఖాసీం వలి మిగిలిన ఇద్దరిని కలుపుకొని గ్రామానికి చెందిన కనుమర్లపూడి వెంకట సురేష్ కుటుంబంతో కలసి శ్రీశైలంలో బంధువుల శుభకార్యానికి వెళ్లిన విషయం తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఆ ఇంట్లో చోరీ చేయాలని నిర్ణయించుకొని 11వ తేదీ తెల్లవారుజామున 3:30 గంటల సమయం ఇంట్లోకి ప్రవేశించి తలుపులు పగల గొట్టి బీరువాలో ఉన్న 10 తులాల బంగారు బిస్కెట్, 3 బంగారు ఉంగరాలు, ఒక జత బంగారు జాలర్లు, ఒక జత బంగారు చెవిచుట్టలు, నాలుగు జతల చెవికమ్మలు, రూ.50 వేల నగదు అపహరించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మార్కాపురం డీఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో కంభం సీఐ కె. మల్లికార్జున, అర్థవీడు ఎస్సై శివనాంచారయ్య సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం సాయంత్రం అర్థవీడు మండలంలోని నాగులవరం గ్రామంలో ఆంజనేయస్వామి గుడి వద్ద నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. గన్నేపల్లిలో జరిగిన చోరీలో బంగారాన్ని రికవరీ చేశారు. వీటితో పాటు దూదేకుల ఖాసిం గతంలో ఏప్రిల్ 29న పెద్దారవీడు మండలం దేవరాజుగట్టులో మట్టి వెంకట్లక్ష్మమ్మ ఇంట్లోకి ప్రవేశించి బీరువా తాళాలు పగలగొట్టి అందులో సుమారు రూ. 15 లక్షలు విలు విలువైన బంగారు, వెండి వస్తువులు, ఈనెల 2వ తేదీన లక్ష్మి చెన్నకేశవనగర్ కాలనీలో మార్కాపురంలో చిలకపాటి రాజాబాబు ఇంట్లో బీరువా పగలగొట్టి రూ. 40వేలు విలువ చేసే వస్తువులు దొంగిలించినట్లు తెలిపారు. వీటితో పాటు పెద్దారవీడు పోలీస్ స్టేషన్లో రెండు ట్రాన్స్ఫార్మర్ల వైర్ల దొంగతనం కేసులు, అర్థవీడు పోలీస్స్టేషన్లో వైరు దొంగతనం, మార్కాపురం రూరల్ స్టేషన్లో 3 ట్రాన్స్ఫార్మర్లలోని వైర్ల దొంగతనం కేసులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కేసు చేధనలో చాకచక్యంగా పనిచేసిన సీఐ కె. మల్లికార్జున, ఎస్సై శివనాంచారయ్య, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. గన్నేపల్లిలో చోరీకి పాల్పడిన నిందితులు అరెస్టు 12 తులాల బంగారం రికవరీ కేసు వివరాలు వెల్లడించిన మార్కాపురం డీఎస్పీ నాగరాజు -
పశువుల అక్రమ రవాణాపై ఉక్కుపాదం
● ఎస్పీ హర్షవర్థన్ రాజు ఒంగోలు టౌన్: మూగ జీవాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 53 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్రాజు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. పట్టణ ప్రాంతాల్లో అదనంగా మరిన్ని ప్రత్యేక టీంలను నియమించినట్లు తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నోడల్ ఆఫీసర్గా మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ పి.శ్రీధర్ను నియమించినట్లు వెల్లడించారు. పోలీసు, పశుసంవర్థక శాఖ, రెవెన్యూ శాఖలతో కలిసి ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బృందాలను ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లా సరిహద్దు ప్రాంతాలు, చెక్ పోస్టులు, టోల్ గేట్లు, ప్రధాన రహదారులు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతుందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు, కోర్టు మార్గదర్శకాలను, జంతు సంరక్షణ చట్టాలను ఉల్లంఘించే వారిపై కేసులను నమోదు చేస్తామని హెచ్చరించారు. చట్టవిరుద్ధంగా మూగజీవాలను తరలించడం, అనుమతులు లేకుండా రవాణా చేయడం, జంతు హింసకు పాల్పడడం వంటి చర్యలను సహించేది లేదన్నారు. ప్రశాంత వాతావరణంలో బక్రీదు పండుగ జరుపుకునేలా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. పండుగ నేపథ్యంలో జిల్లాలో ఎవరైనా శాంతి భద్రతలు, సామాజిక సామరస్యం దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తే కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. ఎవరైనా పశువులను అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం ఉంటే సమీపంలోని పోలీసుస్టేషన్లో తెలియజేయాలని, చట్టాన్ని చేతుల్లో తీసుకొని భౌతిక దాడులకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గోవులను అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందినప్పుడు పశు సంరక్షణ కార్యకర్తలు పోలీసులతో కలిసి వెళ్లి జాయింట్ కమిటీ ద్వారానే చర్యలు చేపట్టాలని సూచించారు. సంతలు, సరిహద్దు చెక్పోస్టుల వద్ద ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని, సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. మత సామరస్యానికి భంగం కలగకుండా పండుగను ప్రశాంతంగా నిర్వహించేందుకు కమ్యూనల్ సెన్సిటివ్ ప్రాంతాల్లో శాంతి కమిటీ సమావేశాలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మసీదులు, సున్నితమైన ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు. సున్నిత ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, అసాంఘిక శక్తుల కదలికలపై నిఘా పెట్టాలన్నారు. గో వధ, పశువుల అక్రమ రవాణాపై ఏదైనా సమాచారం ఉంటే 9121102242, 9121102266, 9121102116 నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
బుధవారం శ్రీ 27 శ్రీ మే శ్రీ 2026
యర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గంలో ఇన్చార్జిల కనుసన్నల్లోనే బియ్యం మాఫియా వ్యవహారం నడుస్తోంది. యర్రగొండపాలెం నియోజకవర్గంలో రేషన్ డీలర్లు కొందరు నేరుగా లబ్ధిదారుల ఇంటికి థంబ్ తీసుకొని నగదు ఇచ్చి వస్తున్నారు. కేవలం ఒకటి రెండు రోజులు మాత్రమే బియ్యం పంపిణీ చేస్తున్నారని, బియ్యం అడిగితే స్టాకు అయిపోయిందని, లేకపోతే సర్వర్ డౌన్ అయిందని చెప్పి బియ్యం ఇవ్వకుండా నగదు ఇస్తున్నారని ప్రజల నుంచి ఫిర్యాదు వస్తున్నాయి. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న వైపాలెం టీడీపీ ఇన్చార్జి డీలర్లను ఉద్దేశించి ‘‘నెలకు రూ.30 వేల నుంచి రూ.40 వేలు దెం...తున్నారని’’ వ్యాఖ్యానించడం పరిస్థితికి అద్దంపడుతోంది. ఇక దర్శి నియోజకవర్గంలో రేషన్ బియ్యం సేకరణ కొత్త పుంతలు తొక్కుతోంది. ఎవరైతే ఎక్కువ బియ్యాన్ని సేకరిస్తారో వారికి ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో రేషన్ బియ్యం అధికార పార్టీ కీలక నేతలకు ఏటీఎంగా మారింది. పేదలకు అందాల్సిన చౌక బియ్యాన్ని పందికొక్కుల్లా పచ్చ పార్టీ నేతలు అడ్డగోలుగా బొక్కేస్తున్నారు. రేషన్ దుకాణాల్లో కేవలం రెండు మూడు రోజులు మాత్రమే పంపిణీ చేసి మిగతాది దర్జాగా నల్లబజారుకు తరలించేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని ఇద్దరు మంత్రుల ఇలాఖాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని లోకం కోడై కూస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఉమ్మడి జిల్లా అంతటా మూడు వ్యాన్లు.. ఆరు లారీల్లా అక్రమ రవాణా సాగిపోతోంది. జిల్లా నలుమూలల నుంచి టన్నుల కొద్దీ బియ్యం జోరుగా విదేశాలకు ఎగుమతవుతోంది. కనిగిరిలో స్థానిక నాయకులను కాదని ఒంగోలు నుంచి దిగుమతి చేసుకున్న నాయకుడికి రేషన్ సేకరణ అప్పగించినట్లు స్థానిక టీడీపీ నాయకులు కొందరు గొణుక్కుంటున్నారు. ఒంగోలుకు చెందిన రేషన్ మాఫియా డాన్ ఒకరు కనిగిరిలో తన వ్యక్తుల ద్వారా బియ్యం సేకరించి పట్టణ శివారులో నిల్వ చేస్తున్నట్లు సమాచారం. రెండు మినీ వ్యాన్ల ద్వారా రాత్రి పూట గుట్టు చప్పుడు కాకుండా ఒంగోలుకు బియ్యం తరలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ నాయకుడి అండదండలుండడంతో అధికారులు ఎవరూ ఇటు వైపు కన్నెత్తి చూసేందుకు సాహసం చేయడం లేదు. చౌకగా.. దోచేయగాప్రతి మండలానికి పాట... పశ్చిమ ప్రకాశంలో ముఖ్యమైన నియోజకవర్గంలో కీలక నేత సోదరుడే రేషన్ మాఫియాను శాసిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో రేషన్ బియ్యం కొనుగోలుకు వేలం పాట నిర్వహించి, ఎవరైతే ఎక్కువ పాడుకున్నారో వారికి రేషన్ బియ్యం సేకరణ అప్పగించినట్లు తెలుస్తోంది. పాట ప్రకారం ప్రతి నెలా కీలక నేత సోదరుడికి ముట్టచెప్పాలి. ఇక్కడ సేకరించిన బియ్యాన్ని కాకినాడ పోర్టుకు తరలిస్తున్నట్లు సమాచారం. అయితే పొదిలి, కొనకనమిట్ల మండలాల్లో సేకరించిన బియ్యాన్ని పల్నాడు జిల్లా వినుకొండలో ఉన్న టీడీపీ నాయకుడికి విక్రయిస్తుంటారని, అక్కడ నుంచి కృష్ణపట్నం పోర్టుకు బియ్యం తరలిపోతుందని చెవులు కొరుక్కుంటున్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో కూడా కీలక నేత సోదరుడి పెత్తనం కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గంలో ఇంటింటికీ తిరిగి బియ్యం సేకరిస్తున్నట్లు సమాచారం. రేషన్ దుకాణాల నుంచి కూడా రేషన్ బియ్యం సేకరించి బేస్తవారిపేట జంక్షన్లోని ఒక రైస్ మిల్లుకు తరలించి అక్కడ నుంచి పోర్టులకు తరలిస్తున్నట్లు సమాచారం. బియ్యం సేకరణకు గాను మండలానికి ఒకరు చొప్పున టీడీపీ నాయకులను నియమించి వారికి నెలకు రూ.20 నుంచి రూ.50 వేల వేతనం కూడా ఇస్తున్నట్లు సమాచారం. దీంతో పోటాపోటీగా బియ్యం సేకరణ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. సాక్షి టాస్క్ఫోర్స్: జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీ ఒక తంతుగా మారింది. ప్రతి నెలా 12వ తేదీ వరకు బియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా కేవలం మూడు, నాలుగు రోజులు మాత్రమే పంపిణీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. అది కూడా అరకొరగానే బియ్యం పంపిణీ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా రేషన్ కార్డు ప్రకారం బియ్యం ఇవ్వమని అడిగితే డీలర్లు వారితో వాదనకు దిగుతున్నారు. ‘‘ఇంతే ఇస్తాం...నీకు ఇష్టమొచ్చిన వారికి చెప్పుకో..మాకేం కాదంటూ’’ నిర్లక్ష్యంగా జవాబిస్తున్నారు. బియ్యం పంపిణీ గురించి తనిఖీ చేయాల్సిన రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ సిబ్బంది కాగడా పెట్టి వెదికినా కనిపించడం లేదు. ఎక్కడో ఒక చోట నామ మాత్రపు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు ప్రతి నెలా 12 వేల మెట్రిక్ టన్నుల బియ్యం వస్తోంది. ఇందులోంచి 50 శాతానికి పైగా బియ్యాన్ని తరలించాలని అధికార పార్టీ నాయకులు డీలర్లపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అంటే నెలకు సుమారుగా 6 వేల మెట్రిక్ టన్నులకు పైగా బియ్యం తరలిపోతుందని తెలుస్తోంది. మంత్రుల నియోజకవర్గాల్లో అడ్డూ అదుపు లేకుండా... జిల్లాలో ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న అద్దంకి, కొండపి నియోజకవర్గాల్లో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని విమర్శలు వినిపిస్తున్నాయి. అద్దంకి నియోజకవర్గంలో మంత్రికి సన్నిహితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తుల సారథ్యంలో బియ్యం సేకరణ జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బియ్యం సేకరణ కోసం నియోజకవర్గ బాధ్యతలను ఒకరికి అప్పగించినట్లు సమాచారం. సేకరించిన బియ్యాన్ని అద్దంకి నుంచి నేరుగా హైవే ఎక్కి చైన్నెలోని ఒక రైస్ మిల్లుకు తరలిస్తున్నట్లు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరో మంత్రి గారి కొండపి నియోజకవర్గంలో కూడా యథేచ్ఛగా రేషన్ బియ్యం అక్రమ మార్గాన తరలిపోతోంది. ఈ నియోజకవర్గంలో రేషన్ డీలర్లు ఇద్దరు కీలక నాయకులతో వేగలేకపోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఒక మంత్రికి సన్నిహితంగా మెలుగుతున్న ఒక కీలక నాయకుడి పెత్తనం కొండపి నియోజకవర్గంలో ఎక్కువగా ఉందని వినిపిస్తోంది. సింగరాయకొండలోని ఓ రైస్మిల్ కేంద్రంగా రేషన్ మాఫియా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలోని సింగరాయకొండ, మర్రిపూడి, జరుగుమల్లి, కొండపి, పొన్నలూరు, టంగుటూరు మండలాల నుంచి బియ్యాన్ని సేకరించి నేరుగా చైన్నె పోర్టుకు తరలిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఎవరైనా డీలర్ మాట వినకపోతే అతడిపై ఎన్ఫోర్స్మెంట్ దాడులు జరుగుతున్నాయని సమాచారం. రెండు మూడు రోజులే బియ్యం పంపిణీ... ఒంగోలు నగరంలో రేషన్ బియ్యం పంపిణీ సక్రమంగా జరగడంలేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రతి నెలలో కేవలం రెండు మూడు రోజులకు మించి బియ్యం సరఫరా చేయడంలేదని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో 5వ తేదీ సాయంత్రమే అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక రేషన్ డీలర్ అక్రమంగా బియ్యం తరలిస్తుండగా స్థానికులు కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అయినా అధికారులు మాత్రం కళ్లు మూసుకొని తమకేమీ తెలియదన్నట్లుగా మిన్నకుండిపోయారని విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇక్కడ కీలక నేత పీఏల కనుసన్నల్లో రేషన్ అక్రమంగా తరలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ కీలక నేత సహాయంతో ఒంగోలుకు చెందిన కొందరు టీడీపీ నాయకులు చీరాల, కనిగిరిల్లో పాగా వేసి రేషన్ బియ్యం సేకరించి అడ్డదారిలో అమ్ముకుంటున్నట్లు సమాచారం. సంతనూతలపాడు నియోజకవర్గంలో అధికార పార్టీ కీలక నేత ప్రధాన అనుచరులే రేషన్ బియ్యం మాఫియాను నడిపిస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గంలో చీమకుర్తి, సంతనూతలపాడు, నాగులప్పలపాడు, మద్దిపాడు మండలాల్లో టీడీపీ కార్యకర్తలను నియమించుకొని వారి ద్వారా రేషన్ బియ్యాన్ని సేకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సేకరించిన బియ్యాన్ని మద్దిపాడు మండలం గ్రోత్ సెంటర్లోని ఒక రైస్ మిల్లుకు తరలిస్తున్నారని తెలుస్తోంది. కీలక నేతతో దొడ్డిదారి ఒప్పందం చేసుకున్న పల్నాడు జిల్లాకు చెందిన ఒక టీడీపీ నాయకుడైన రేషన్మాఫియా డాన్ ద్వారా కృష్ణపట్నం పోర్టుకు బియ్యాన్ని తరలిస్తున్నట్లు సమాచారం. కందుకూరు నియోజకవర్గంలో రేషన్ బియ్యం పంపిణీ జరగడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. లబ్ధిదారులకు కిలోకు రూ.10 లెక్కన చేతిలో పెట్టి బియ్యం లేదని ఒట్టి చేతులు చూపుతున్నారని వాపోతున్నారు. పచ్చ తమ్ముళ్లు సిండికేట్గా తయారై కృష్ణపట్నం పోర్టుకు బియ్యం తరలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కీలక నేతకు నైవేద్యం ముట్టచెబుతున్నామని చెబుతుండడంతో అధికారులు మనకెందుకు వచ్చిన గొడవంటూ పట్టించుకోవడం మానేశారని తెలుస్తోంది. -
తాగు నీరిచ్చే దిక్కేది !
● 8 నెలలుగా తాగునీటి కోసం అవస్థ పడుతున్నాం ● బిందెలతో చలివేంద్ర గ్రామస్తుల నిరసన దర్శి: దర్శి పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న చలివేంద్ర గ్రామానికి తాగునీరు ఇవ్వడం లేదని గ్రామస్తులు మంగళవారం ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు నెదర్లాండ్ తాగునీటి రిజర్వాయర్కు కూతవేటు దూరంలో చలివేంద్ర గ్రామం ఉంది. గత ప్రభుత్వంలో గ్రామానికి నిత్యం నీరు సరఫరా అయ్యేది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వారం, పది రోజులకు, నెలకు ఒక సారి నీరివ్వడం మొదలుపెట్టారు. అలా ఒక సంవత్సరం తరువాత పూర్తిగా నీరివ్వడం మానేశారు. ప్రస్తుతం గ్రామానికి తాగునీరు ఇచ్చి ఎనిమిది నెలలైందని మహిళలు వాపోతున్నారు. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక గ్రామంలో నీటి ట్యాంక్ వద్ద ఖాళీ బిందెలతో తమ నిరసన తెలిపారు. నెల్లూరు (టౌన్): పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో కందుకూరు నియోజకవర్గంలో తక్కువ పాస్ పర్సంటేజీ వచ్చిన కేజీబీవీల ప్రిన్సిపల్స్, పీజీటీలకు నోటీసులను సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య మంగళవారం జారీ చేశారు. పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర యావరేజ్ 85 శాతం కాగా, 79.5 శాతం ఫలితాలు రావడంతో గుడ్లూరులోని మొగళ్లూరు కేజీబీవీ ప్రిన్సిపల్స్కు నోటీసులు పంపారు. ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర సగటు 81 శాతం కాగా, కందుకూరు నియోజకవర్గంలోని వలేటివారిపాలెంలో 75, ఉలవపాడులో 77, కందుకూరులో 45.8, లింగసముద్రంలో 66.6 శాతం ఉత్తీర్ణత రావడంతో అక్కడి కేజీబీవీల ప్రిన్సిపల్స్కు నోటీసులను జారీ చేశారు. వీరితో పాటు ఆయా సబ్జెక్టుల్లో తక్కువ మార్కులు రావడంతో ఐదుగురు పీజీటీలకూ నోటీసులు జారీ అయ్యాయి. వీరందరూ వారంలో వివరణ పంపాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వీటిని సమగ్రశిక్ష రాష్ట్ర అధికారులకు పంపి, వారి నిర్ణయం మేరకు చర్యలు చేపట్టనున్నామని తెలిపారు. -
గాలివాన బీభత్సం
కందుకూరు: తీవ్ర ఎండలు, వడగాల్పులతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మంగళవారం వరుణుడి కరుణతో కాస్త ఉపసమనం లభించినా భీకర గాలివాన బీభత్సం సృష్టించాయి. మంగళవారం సాయంత్రం వరకు భరించ లేని ఎండలు, తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. అయితే సాయంత్రానికి ఆకాశం ఒక్కసారిగా మేఘామృతమై భారీ ఈదరుగాలులతో పాటు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం ప్రారంభమైంది. బలంగా వీచిన ఈదురు గాలుల ధాటికి పట్టణంలో పలుచోట్ల చెట్లు నేలకూడంతో పాటు, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే శ్రీనగర్ కాలనీలో బొట్లగుంట శ్రీనివాసులు అనే వ్యక్తి రేకుల ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. గాలుల ఉధృతితో ఇంటిపై ఉన్న రేకులు మొత్తం ఎగిరిపోయాయి. దీంతో ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం తడిసిపోయాయి. చుట్టుపక్కల వారు వచ్చి వారికి సాయం అందించారు. మామిడి రైతులను కూడా తీవ్ర దెబ్బతీసింది. కందుకూరు చుట్టుపక్క ఉన్న మామిడి తోటల్లో కాయలు పూర్తిగా నేలరాలాయి. ప్రస్తుతం కాయలు బాగా పక్వానికి వచ్చి కోత దశలో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో కాయలు రాలిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండపి: మండలంలో మంగళవారం రాత్రి ఈదురుగాలులు, వడగండ్ల వాన బీభత్సం సృష్టించాయి. దీంతో పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపో యాయి. తహసీల్దార్ కార్యాలయంలో వేపచెట్టు కూలిపోగా.. గురుకుల పాఠశాల ఎదురుగా భారీ చెట్టు రోడ్డుపై పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రెవెన్యూ, పోలీస్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్టును తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. రోడ్లపై పడిన చెట్లను తొలగింపు ప్రక్రియను తహసీల్దార్ శీలం శ్రీనివాసరావు, సీఐ వైవీ రమణయ్య, ఎస్సై త్యాగరాజు, సిబ్బంది పర్యవేక్షించారు. పొన్నలూరు: మండలంలో మంగళవారం ఈదురు గాలులతో కూడిన ఓమోస్తారు వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తీవ్ర ఉక్కపోతతో ఇబ్బంది పడిన ప్రజలకు, సాయంత్ర పూట ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఓమోస్తారు వర్షానికి కాస్త ఉపశమనం పొందారు. ఒక్కసారిగా వీచిన గాలులకు పొన్నలూరు, వెల్లటూరుతో పాటు పలు గ్రామాల్లో చెట్లు విరిగి కిందపడిపోయాయి. అలాగే అక్కడక్కడ పొగాకు బ్యారన్ల రేకులు ఎగిరిపోయాయి. కొన్ని గ్రామాల్లో బయట ఆరబోసిన మిరపకాయలు కూడా తడిచిపోయినట్లు రైతులు తెలిపారు. ఈదురుగాలుల వలన కొన్ని గ్రామాల్లో మూడు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కందుకూరు రూరల్: మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం సాయంత్రం గాలివాటన భీభత్సం సృష్టించింది. మోపాడు గ్రామాలో ఎం.రాముకు చెందిన గొర్రెలకు వేసిన రేకుల షెడ్డు రేకులు ఎగిరిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో చెట్లు విరిగిపోయాయి. కొన్ని గ్రామాల్లో చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడడంతో విద్యుత్కు అంతరాయం కలిగింది. విద్యుత్ అధికారులు స్పందించి విద్యుత్ను పునరుద్ధరిస్తున్నారు. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన గాలి వాన కురిసింది. -
పొగాకు రైతుకు పచ్చపోటు
కందుకూరు: ‘‘అమ్మా పెట్టదు.. అడుక్కు తిననీయదు’’ అన్న చందంగా ఉంది అధికార పార్టీ నేతల వ్యవహార శైలి. గిట్టుబాటు ధరలు లేక కడుపు మండి పొగాకు రైతులు రోడ్డెక్కుతుంటే అండగా నిలవాల్సిన అధికార పార్టీ.. రైతుల ఆందోళనలను నీరుగార్చే కుట్రలకు పాల్పడుతోంది. దీంతో అధికార పార్టీ నేతల తీరుపై పొగాకు రైతుల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కందుకూరులోని రెండో పొగాకు వేలం కేంద్రంలో సోమవారం జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం. ఈ ఏడాది పొగాకు గిట్టుబాటు ధరలు లేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కనీసం పెట్టిన పెట్టుబడులు అయినా చేతికొస్తే చాలు అన్న ఆందోళనలో రైతులు ఉన్నారు. అయితే రెండు నెలలుగా వేలం జరుగుతున్న తీరును పరిశీలిస్తే పొగాకు రైతుల ఆందోళనను మరింత పెంచేలా ఉంది. గిట్టుబాటు ధరలు అటుంచి కనీసం వేలం కేంద్రాలకు తెచ్చిన పొగాకును కూడా కొనే దిక్కు లేకుండా పోయింది. అంతర్జాతీయంగా ఆర్డర్లు లేవనే సాకుతో వ్యాపారులు పొగాకు కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. దీంతో వేలం కేంద్రాలకు తీసుకొచ్చిన బేళ్లు అధిక శాతం నోబిడ్ కింద నమోదవుతున్నాయి. ఒకవేళ కొన్నా కూడా అతి తక్కువ ధరలకు అదీ కొద్ది మొత్తంలోనే బేళ్లు కొంటున్నారు. దీంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తమ ఆవేదనను, ప్రస్తుత మార్కెట్ పరిస్థితిని ప్రభుత్వం, పొగాకు బోర్డు దృష్టికి తీసుకెళ్లేందుకు రైతులు ఆందోళన బాట పడుతున్నారు. పొగాకు బోర్డు ప్రకాశం రీజియన్ పరిధిలో మొత్తం 11 వేలం కేంద్రాలుంటే అన్ని వేలం కేంద్రాల్లోను రైతులు పెద్ద సంఖ్యలో ఆందోళనలకు దిగుతున్నారు. ప్రతి రోజు వేలాన్ని అడ్డుకోవడంతో పాటు, రోడ్లపై బేళ్లను వేసి తగలబెడుతున్నారు. వీరికి ప్రతిపక్ష వైఎస్సార్సీపీతో పాటు, పలు రైతు సంఘాలు, వామపక్ష పార్టీలు వంటి మద్దతు తెలుపుతున్నాయి. పొగాకు రైతులను ఆదుకోవాలంటూ ధర్నాలు చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక్క అధికార పార్టీ మాత్రం పొగాకు రైతుల ఆందోళనలను నీరుగార్చే ప్రయత్నం చేస్తోంది. వారి ఆందోళనలను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేయడంతో పాటు, గిట్టుబాటు ధరలతో ప్రభుత్వానికి ఏం సంబంధం అన్న రీతిలో ఆ పార్టీ నేతల వ్యవహార శైలి ఉంది. టీడీపీ నేత ఓవరాక్షన్పై రైతుల విస్మయం: పొగాకు రైతులకు మద్దతుగా కందుకూరులోని రెండో వేలం కేంద్రంలో వైఎస్సార్సీపీ ఆందోళన చేపట్టింది. నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్యాదవ్ రైతుల తరుఫున బోర్డు అధికారులను నిలదీసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకుడి ముసుగులో టీడీపీ నాయకుడు బుర్రాను అడ్డుకునే ప్రయత్నం చేయడం అక్కడ వారికి వింతగా అనిపించింది. గిట్టుబాటు ధరలు రాకపోతే బోర్డుకేం సంబంధం అంటూ వితండ వాదం చేసే ప్రయత్నం చేశారు. బోర్డును బ్లెయిమ్ చేయవద్దు, అంతర్జాతీయ మార్కెట్ బాగా లేదంటూ వ్యాపారులకు వత్తాసు పలికేందుకు రైతుల ఆందోళనను తప్పుదారి పట్టించేందుకు పథకం వేశారు. అయితే అక్కడ ఉన్న రైతులు ఒక్కసారి రివర్స్ అయ్యారు. బోర్డులో రైతులకు మద్దతు ధర ఇవ్వకపోతే ఇంక ఎక్కడ ఇస్తారని, అయినా మేము మా ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ధర్నా చేస్తుంటే నీకేం పని అంటూ నిలదీశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకుని సర్ది చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా జిల్లాలో జరుగుతున్న పొగాకు రైతుల ఆందోళనలకు మద్దతు తెలపకపోగా ధరల విషయాన్ని పూర్తిగా పక్కదారి పట్టించే కుట్రలకు పాల్పడడంపై తీవ్ర విమర్శలు ఆ పార్టీ నేతలు మూటగట్టుకుంటున్నారు. అసలే చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో పొగాకు రైతుల జీవితాలు తారుమారయ్యాయని, గత రెండేళ్లలో అప్పులు తప్ప పైసా మిగిలింది లేదని రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో అండగా నిలవాల్సిన ప్రభుత్వం తరఫున నాయకులే ఇటువంటి చేష్టలకు దిగుతుండడంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రైతుల పక్షాన నిలబడటమే నేరంగా చూపిస్తూ పచ్చ మీడియాలో వైఎస్సార్ సీపీ నాయకులపై దుష్ప్రచారానికి ఒడిగట్టారు. -
మట్టి తవ్వకాలతో వరిసాగు ప్రశ్నార్థకం
కొత్తపట్నం: ‘చెరువులో ఇష్టం వచ్చినట్లు మట్టి తీస్తే 2 వేల ఎకరాల భూమి బీడుగా మారుతుంది. చిన్న, సన్న కారు రైతులు తీవ్రంగా నష్టపోతారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోవడం లేద’ని వైఎస్సార్ సీపీ ఒంగోలు సమన్వయకర్త చుండూరి రవిబాబు ప్రశ్నించారు. మండలంలోని అల్లూరు గ్రామానికి చెందిన చాపాయి, చక్రాయి ఇరిగేషన్ చెరువులో మట్టిని ఇష్టం వచ్చినట్లు తవ్వి వెంచర్లకు తరలిస్తున్నారు. దీనిపై గ్రామస్తులు సోమవారం కలెక్టర్కు అర్జీ ఇచ్చారు. దీంతో కాసేపు తవ్వకాలు ఆపేసి..తిరిగి మంగళవారం యధావిధిగా తవ్వకాలు ప్రారంభించారు. దీంతో మంగళవారం వైఎస్సార్ సీపీ సమన్వయకర్త చుండూరి రవిబాబు, ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, జనసేన నాయుడు మిట్నసల చైతన్య ప్రసాద్, సీపీఎం మండల కార్యదర్శి సూరిని స్వామిరెడ్డి, గ్రామస్తుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ చెరువులో ఇష్టం వచ్చినట్లు మట్టి తీస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఇష్టం వచ్చినట్లు మట్టి తవ్వుతున్నా పంచాయతీ కార్యదర్శి నాకేం తెలియదన్నట్లు వ్యవహరించడం దారుణమన్నారు. ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు ఫోన్లు చేసినా స్పందన లేదని అసహనం వ్యక్తం చేశారు. ముదిగొండ వద్ద దగ్గర మట్టి తీస్తుంటే ఉప్పునీరుగా మారాయని గుర్తు చేశారు. ఇవన్నీ చౌడు భూములని, తవ్వేకొద్ది ఉప్పునీరు ఊరి పంటలు దెబ్బతింటాయని, పొలాలు కూడా పనికి రాకుండా పోతాయని చెప్పారు. ఇరిగేషన్ చెరువుల్లో అనుమతి లేకుండా మట్టి తవ్వకూడదని, కానీ ఇక్కడ ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి మాట్లాడుతూ ఈ ఇరిగేషన్ చెరువు పరిధిలో 1800 ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. గతంలో ప్రభుత్వానికి సంబంధించిన రోడ్లకు పంచాయతీ అనుమతితో మట్టి తోలుకున్న సంఘటనలు ఉన్నాయన్నారు. ఉన్నతాధికారులు స్పందించకుంటే వేల మంది రైతులు రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రైతు విభాగం జనరల్ సెక్రటరీ ఆళ్ల రవీంద్రరెడ్డి మాట్లాడుతూ చెరువులో ఎటువంటి అనుమతి లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమంగా మట్టి తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. రైతు కూలీ సంఘం మండల కార్యదర్శి స్వామిరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సహాయంతోనే ఇష్టం వచ్చినట్లు మట్టిని తవ్వి తరలిస్తున్నారన్నారు. అక్రమ తవ్వకాలు ఆపకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఎంపీటీసీ మిట్నసల శాంతారావు, స్వర్ణ శివారెడ్డి, రామకృష్ణారెడ్డి, సుధాకర్రెడ్డి, వెంకారెడ్డి, శీనారెడ్డి, హరిబాబు, నాంచార్లు, మల్లికార్జున, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోతే రైతుల పరిస్థితి ఏంటి..? ఇరిగేషన్ అధికారులు ఫోన్లు ఎత్తడం లేదు తవ్వకాలు ఆపకుంటే వాహనాలను అడ్డుకుంటాం చాపాయి, చక్రాయి చెరువు వద్ద నేతల సమావేశం -
మీ కోసం అర్జీలను సకాలంలో పరిష్కరించాలి
● కలెక్టర్ రాజాబాబు ఒంగోలు సిటీ: మీ కోసం కార్యక్రమానికి సమస్యలపై వచ్చే అర్జీలను ప్రజల సంతృప్తే లక్ష్యంగా సహేతుకంగా, సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాలులో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీధర్రెడ్డి, ఎస్డీసీలు కళావతి, మాధురి, డీపీఓ వెంకటేశ్వరరావుతో కలిసి ప్రజల నుంచి సమస్యలపై కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏదైనా కారణంతో ఫిర్యాదు పరిష్కారం సాధ్యం కాకపోతే ఆ కారణాన్ని అర్జీదారునికి అర్థమయ్యేలా వివరించి ఎండార్స్మెంట్ ఇవ్వాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎటువంటి నిర్లక్ష్యం చూపకూడదన్నారు. అధికారి తీసుకున్న చర్యలతో అర్జీదారుడు సంతృప్తి చెందాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిర్యాదులు మళ్లీ రీ ఓపెన్ కాకూడదని, ఒకవేళ ఏదైనా అర్జీ రీ–ఓపెన్ అయితే సంబంధిత అధికారి తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 286 అర్జీలు రాగా, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
దళితులు ఐకమత్యంతోనే హక్కులు సాధించాలి
కందుకూరు రూరల్: రాజ్యాంగపర హక్కుల సాధన కోసం దళితులు ఐక్య పోరాటానికి సిద్ధం కావాలని ప్రజా వాగ్గేయకారుడు, తెలంగాణ శాసనమండలి సభ్యులు గోరటి వెంకన్న పిలుపునిచ్చారు. కందుకూరులోని దూబగుంటలో బీఆర్ అంబేడ్కర్ విగ్రహ రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోరటి వెంకన్న మట్లాడుతున్న మాల, మాదిగల మధ్య ఉన్న సమస్యలను ఇరువర్గాలు వారు సామరస్యంతో పరిష్కరించుకోవాలే తప్ప మనువాద పాలకులు ఆడే నాటకంలో బలిపశువులు కాకూడదన్నారు. గౌతమ బుద్ధుని మార్గంలో అంబేడ్కర్ సిద్ధాంత వెలుగులో రాజ్యాధికారం సాధించినప్పుడే బహుజనుల విముక్తి సాధ్యపడుతుందన్నారు. వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ మాల, మాదిగలు ఇతతుల అధికారం కోసం పాకులాడుతున్నారే తప్ప వారి రాజ్యాధికారం కోసం పొరాటాలు చేయడం లేదన్నారు. ఓటు అనే ఆయుధంతో మన సీట్లను మనమే గెలిపించుకొని అధికారాన్ని చేపట్టాలన్నారు. బహుజన కళామండలి ఉదయభాస్కర్ బృందం ఆలపించిన సామాజిక చైతన్య గీతాలు, గోరటి వెంకన్న ఆట, పాట సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. బహుజన కెరటాలు వ్యవస్థాపకుడు పల్నాటి శ్రీరాములు అధ్యక్షతన వహించిన కార్యక్రమంలో ప్రముఖ సాహిత్య విమర్శకులు ప్రొఫెసర్ కోయి కోటేశ్వరరావు, కావలి ఎంఈఓ బండి గోవిందయ్య, ఎస్డబ్ల్యూఅండ్ ఎస్ఎం హాస్టల్ పూర్వ విద్యార్థుల సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గౌడపేరు కోటిలింగం, కళ్లగుంట మోహనరావు, బీటీఏ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్లా, చలంచర్ల బ్రహ్మయ్య, రిటైర్డ్ లెక్చరర్ కొప్పోలు కామేశ్వరి, బండి ధనమ్మ, దాసరి బాలకృష్ణ, కట్టా సుచరిత పాల్గొన్నారు. -
ఈదురుగాలుల బీభత్సం
మేడపి టోల్ గేట్వద్ద కూలిన హోర్డింగ్ను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే తాటిపర్తి గాలి బీభత్సానికి రోడ్డుకు అడ్డంగా కూలిన మేడపి టోల్ గేట్ యర్రగొండపాలెం: రోహిణి కార్తె ప్రారంభమైన రోజే ప్రకృతి విలయ తాండవం సృష్టించింది. సోమవారం పెద్ద ఎత్తున వర్షం కురుస్తుండటంతో ఈ సంవత్సరం రోహిణి కార్తె ప్రభావం అంతగా ఉండదనుకున్నారు. వెనువెంటనే గాలి బీభత్సవం సృష్టించింది. పలు ప్రాంతాల్లో చెట్టు విరిగి పడ్డాయి. రేకుల షెడ్లు ఎగిరిపోయాయి. దాదాపు 2 గంటల పాటు ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళనతో ప్రజలు భయం భయంగా గడిపారు. కొలుకుల రోడ్డులో గృహం పూర్తిగా కూలిపోయింది. ఇంట్లో ఉన్న పిల్లలు ఆడుకోవటానికి పక్కింట్లోకి వెళ్లారు. గృహిణి బొడ్డు మంగమ్మ పనుల నిమిత్తం బయటికి వెళ్లింది. ఈ తరుణంలో వీచిన గాలికి రేకులతో నిర్మించుకున్న ఆ గృహం నేలమట్టమైంది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. త్రిపురాంతకం మండలంలోని మేడపి టోల్గేట్ హోర్డింగ్ రోడ్డుకు అడ్డంగా విరిగి పడింది. ఈ సమయంలో ఆ ప్రాంతంలో వాహనాలు లేకపోవడంతో ప్రమాదం చోటుచేసుకోలేదు. ఆ ప్రాంతంలో పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి టోల్గేట్ వద్ద పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో 5 విద్యుత్ స్తంభాలు పూర్తిగా విరిగిపడ్డాయి. ఆయా ప్రాంతాల్లోని 15 స్తంభాలపై చెట్లు విరిగి పడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు ఏఈ కిషోర్ ఆధ్వర్యంలో సిబ్బంది చర్యలు చేపట్టారు. మార్కాపురం రోడ్డులో రెండు వేప చెట్లు విరిగి పడటంతో రాకపోకలకు కాసేపు అంతరాయం కలిగింది. విద్యుత్ ఏఈ కార్యాలయానికి అడ్డంగా వేప చెట్టు కూలింది. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న క్రీడా ప్రాంగణం పైకప్పు రేకులు గాలికి ఎగిరిపోయాయి. బస్టాండ్ సెంటర్ నుంచి ప్రభుత్వ వైద్యశాల వరకు కురిసిన వర్షం నీరు ఏరులై పారింది. ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిన సమాచారం ఇంకా తమకు అందలేదని, మంగళవారం ఉదయం నియోజకవర్గంలో పర్యటించి పంట నష్టం అంచనా వేస్తామని ఆ శాఖాధికారి పి.ఆదిరెడ్డి తెలిపారు. కురిచేడు: మండలంలో ఆదివారం రాత్రి ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలుల ధాటికి రైతుకు చెందిన రేకుల షెడ్, పైపులు ధ్వంసమయ్యాయి. మండలంలోని కాటంవారిపల్లె గ్రామానికి చెందిన ఆవుల వెంకటరెడ్డి వ్యవసాయానికి సంబంధించిన పైపులు, ట్రాక్టరు, సామాన్లు పెట్టుకునేందుకు పంటపొలంలో సుమారు రూ.10 లక్షలతో రేకులషెడ్డు నిర్మించుకున్నాడు. ఆదివారం రాత్రి అర్ధంతరంగా పెనుగాలులు వీచి స్వల్పంగా వర్షం కురిసింది. ఆ పెనుగాలుల బీభత్సానికి రేకులు లేచి పొలాల్లో పడ్డాయి. రూ.5 లక్షల విలువైన పైపులు కూడా పగిలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కూలిన ఇళ్లు, నేలకూలిన రేకుల షెడ్లు రోడ్డుకు అడ్డంగా విరిగి పడిన చెట్లు -
మెగా డీఎస్సీ అక్రమాలమయం
సింగరాయకొండ: కూటమి ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని నోటిఫికేషన్ నుంచి ప్రశ్నాపత్రాల రూపకల్పన, పరీక్షల నిర్వహణ, ఎంపికల వరకు భారీ అవకతవకలు చోటు చేసుకున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, కొండపి ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. ఇది మెగా డీఎస్సీ కాదని పూర్తిగా మాయ డీఎస్సీగా మారిందని అభివర్ణించారు. విద్యా శాఖమంత్రిగా నారా లోకేష్ పూర్తిగా విఫలమయ్యారని, డీఎస్సీ–2025 అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. లోకేష్ అట్టర్ఫ్లాప్.. విద్యాశాఖలో రోజురోజుకు వెలుగుచూస్తున్న అవినీతి కథనాలు చూస్తుంటే విద్యాశాఖ మంత్రి నారాలోకేష్కు ఆ శాఖపై ఏ మాత్రం పట్టు ఉన్నట్లు కనిపించడం లేదన్నారు. విద్యాశాఖను పూర్తిగా గాలికి వదిలేసి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అన్ని శాఖల్లో జోక్యం చేసుకునే లోకేష్కు విద్యాశాఖలో జరుగుతున్న అవకతవకలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. వైఎస్సారీ సీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ను కూటమి ప్రభుత్వం పక్కన పెట్టి మెగా డీస్సీ పేరుతో భారీ ప్రచారం చేసుకుందన్నారు. కానీ నియామకాల ప్రక్రియలో పారదర్శకత కొరవడిందన్నారు. నోటిఫికేషన్ నుంచి ప్రశ్నాపత్రాల రూపకల్పన, పరీక్షల నిర్వహణ, పోస్టుల భర్తీ వరకు అన్ని చోట్లా అక్రమాలు జరిగాయని విమర్శించారు. లక్షలాది ప్రతిభావంతులైన నిరుద్యోగ యువత భవిష్యత్తో చెలగాటమాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రశ్నకు బదులేది.. డీఎస్సీ–2025 అవకతవకలపై సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరినా ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదన్నారు. నవీన్ అనే అభ్యర్థి కృష్ణా జిల్లా టాపర్గా నిలిచాడని, అతను ఎస్ఈఆర్టీలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేశాడని, ప్రశ్నాపత్రాల కూర్పులో భాగమయ్యాడని, అతనికి ర్యాంకు వచ్చినా ఉద్యోగం ఇవ్వకపోవడంతో కోర్టును ఆశ్రయించడం వాస్తవం కాదా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇప్పటికీ మెరిట్ లిస్టు ఎందుకు విడుదల చేయడం లేదని, అభ్యర్థులకు మెసెజ్లు పంపడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. స్పోర్ట్స్ కోటాలో ఒక్కో పోస్టును రూ.15 లక్షల చొప్పున విక్రయించారన్న విమర్శలు వినిపిస్తున్నాయని, సీఎం బంధువుగా చెప్పుకునే వ్యక్తి ఈ పోస్టుల విక్రయంలో ప్రధాన పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. ప్రతిభావంతులైన నిరుద్యోగులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. డీఎస్సీ అవకతవకలపై సీబీఐతో గానీ సిట్టింగ్ జడ్జితో గా నీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అవకాశాలు కోల్పోయిన అభ్యర్థులకు న్యాయం చేయాలన్నారు. విద్యాశాఖ పై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ పూర్తిగా విఫలమయ్యారని, వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి సురేష్ డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ అట్టర్ ఫ్లాప్ మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి లోకేష్ తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలి మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ డిమాండ్ -
బెట్టింగ్పై ఉక్కుపాదం మోపాలి
● నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఒంగోలు టౌన్: క్రికెట్ బెట్టింగ్పై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ హర్షవర్థన్ రాజు ఆదేశించారు. మట్కా, పేకాట, కోడిపందేలు వంటి అసాంఘిక కార్యకలాపాలు, జూదాలను పూర్తిగా నిర్మూలించాలని సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రకాశం, మార్కాపురం జిల్లాల పోలీసు అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్, మిస్సింగ్, రోడ్డు ప్రమాదాలపై సమీక్షించిన ఎస్పీ పలు సూచనలు చేశారు. స్టేషన్ల వారీగా పెండింగ్ కేసులు, అరెస్టులు, దర్యాప్తు పురోగతి, కేసుల ఛేదన, నేర నియంత్రణకు సంబంధించిన పలు అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే ప్రదేశాలను గుర్తించి వాటిని శుభ్రం చేయించాలని, బహిరంగ మద్యంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. జిల్లాలో గుర్తు తెలియని మృతదేహాలు, కారణం తెలియని మరణం కేసులు, అనుమానాస్పద మృతి కేసులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించారు. ఆయా కేసుల్లో అన్నీ కోణాల్లో దర్యాప్తు చేసి పూర్తిస్థాయి సాక్ష్యాధారాలను సేకరించాలని, ఆర్ఎఫ్ఎస్ఎల్, ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులను త్వరితగతిన తెప్పించుకొని పరిష్కరించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలను గుర్తించి కుంభాకార దర్పణాలు, సైన్ బోర్డులు, బారికేడ్స్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదాలకు సంబంధించి ఎఫ్ఏఆర్, ఐఏఆర్ అండ్ డీఏఆర్ రిపోర్టులను నిర్ణీత కాలవ్యవధిలో కోర్టుకు సమర్పించాలని సూచించారు. స్మార్ట్ పోలీసింగ్ సాంకేతికత అప్లికేషన్లో భాగంగా సెంట్రల్ క్రైం ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టం, సీసీ నిఘా, డ్రోన్ సర్వైలెన్స్, ఇతర డిపాజిట్ ప్లాట్ఫాంలను సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలన్నారు. నేరాలను ముందుగానే గుర్తించి ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలను అందించాలని కోరారు. బక్రీద్ పండుగ వేడుకలు, కార్యక్రమాల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్లో ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ, మార్కాపురం డీఎస్పీ నాగరాజు, మహిళా పోలీసుస్టేషన్ డీఎస్పీ పి.శ్రీధర్, ఎస్బీ సీఐ శ్రీనివాసరావు, డీసీఆర్బీ సీఐ దేవ ప్రభాకర్, సీసీఎస్ సీఐ బీమానాయక్, ఐటీ కోర్ సీఐ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీసు స్పందనకు 66 ఫిర్యాదులు
ఒంగోలు టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కర వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 66 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ హర్షవర్థన్ రాజు వారితో నేరుగా మాట్లాడి సమస్య పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను చట్టపరిధిలో విచారణ చేసి త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. నడవలేని స్థితిలో వచ్చిన బాధితుల వద్దకు వచ్చిన ఎస్పీ స్వయంగా వారి సమస్యలను ఆలకించడమే కాకుండా సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. వికలాంగులు, వృద్ధులు, మహిళల సమస్యలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ పి.శ్రీధర్, ట్రాఫిక్ సీఐ హజరత్తయ్య, సంతమాగులూరు సీఐ శేషగిరి రావు, కొండపి సీఐ రమణయ్య, ప్యానల్ అడ్వకేట్ బాలాజీసింగ్, మీ కోసం ఎస్సై జనార్దన్రావు తదితరులు పాల్గొన్నారు. -
యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
● కలెక్టర్ రాజాబాబు ఒంగోలు సిటీ: ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు యువత ముందుకు రావాలని కలెక్టర్ పి.రాజాబాబు పిలుపునిచ్చారు. సోమవారం ఒంగోలు మండలం దసరాజుపల్లి గ్రామంలో 5 ఎకరాల విస్తీర్ణంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) పార్క్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో స్థానికులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడారు. దసరాజుపల్లిలో ఈ పార్కుకు అవసరమైన రోడ్లు, కల్వర్టులు, డ్రైనేజీలు వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ మదన్, ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు, ఏఎంసీ చైర్మన్ వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు. -
మంట..
ఎండఒంగోలు టౌన్: రోహిణి కార్తె తొలిరోజు ఎండలు మండిపోయాయి. ఉమ్మడి జిల్లా అంతటా భానుడు ప్రతాపాన్ని చూపించాడు. 34 మండలాలు నిప్పుల కొలిమిలా భగభగమన్నాయి. మూడు మండలాల్లో 45పైన, 12 మండలాల్లో 44 డిగ్రీలు దాటాయి. దీంతో జనం అల్లాడిపోయారు. వేడికి తోడు వడగాలులు, ఉక్కపోతలు వేధించడంతో జనం బెంబేలెత్తి పోయారు. తెల్లవారుజామున 4 గంటల తరువాత వర్షం కురవడంతో ఉదయం 11 గంటల వరకు వాతావరణం చల్లగా ఉంది. దీంతో జనం కొంత ఊపిరి పీల్చుకున్నారు. అయితే 12 గంటలు దాటిన తర్వాత ఒక్కసారిగా సూర్యుడు తన ప్రతాపం చూపించడం మొదలు పెట్టాడు. దాంతో జనం హడలిపోయారు. జిల్లా అంతా నిప్పులు కొలిమిలా మారిపోయింది. సోమవారం ప్రకాశం, మార్కాపురం జిల్లాలోని అన్నీ మండలాల్లోనూ 42 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అత్యధికంగా అద్దంకి, బల్లికురవ, ఎస్ఎన్పాడు 45.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జే.పంగులూరులో 44.9, కనిగిరి 44.7, ఒంగోలు 44.6, ఎన్జీపాడు, త్రిపురాంతకంలో 44.5 డిగ్రీలు నమోదైంది. పుల్లలచెరువు 44.3, చీమకుర్తి, కొండపి, మద్దిపాడుల్లో 44.1 డిగ్రీలు నమోదు కాగా కురిచేడు 43.9, ముండ్లమూరు, తాళ్లూరు 43.8 డిగ్రీలు, టంగుటూరు, పెద్దారవీడుల్లో 43.7 డిగ్రీల ఎండ దంచి కొట్టింది. కొరిశపాడు 43.6, హెచ్ఎంపాడు 43.4, వైపాలెం, దొనకొండ 42.9, కొనకనమిట్ల, మార్కాపురంలలో 42.8 డిగ్రీలు నమోదైంది. సంతమాగులూరు, రాచర్ల, బేస్తవారిపేట, కంభం, పెద్ద దోర్నాల 42.7 డిగ్రీలు, పొదిలి 42.6, కందుకూరు, కొత్తపట్నం, పొన్నలూరు, దర్శి 42.5, తర్లుపాడు 42 డిగ్రీలు నమోదైంది. అయితే జిల్లాలో పలు చోట్ల ఒక్కసారిగా వర్షం విరుచుకుపడింది. వైపాలెం, త్రిపురాంతకం మండలాల్లో మధ్యాహ్నం వరకు ఎండ ప్రతాపం చూపించగా సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వడగళ్ల వాన కురిసింది. వడదెబ్బకు ఇద్దరు మృతి జె.పంగులూరు: వారం రోజులుగా ఉన్న ఎండల తీవ్రత, ఉక్కపోత, వేడి వడగాడ్పులకు పండుటాకులు రాలిపోతున్నారు. మండల పరిధిలోని బూదవాడ గ్రామానికి చెందిన నూతలపాటి దయమ్మ (65) ఆదివారం రాత్రి వేడి గాలికి, వడ దెబ్బ తగిలి మృతిచెందింది. ముండ్లమూరు మండలంలో.. ముండ్లమూరు: వడదెబ్బకు గురై లక్కిరెడ్డి సుబ్బమ్మ (85) మృతి చెందిన సంఘటన మండలంలోని పులిపాడు గ్రామంలో చోటు చేసుకుంది. కొద్ది రోజులుగా కాస్తున్న ఎండలకు సుబ్బమ్మ అస్వస్థతకు గురైంది. సోమవారం వడదెబ్బకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉదయం చల్లగా ప్రారంభమై మధ్యాహ్నంకల్లా విరుచుకుపడిన సూర్యుడు అద్దంకి, బల్లికురవ, సంతనూతలపాడులో అత్యధికంగా 45.4 డిగ్రీలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 మండలాల్లో 44 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదు తొలిరోజే భగభగలాడిన రోహిణీ కార్తే వడదెబ్బకు ఇద్దరు మృతి -
కూటమి పాలనలో పొగాకు రైతుకు ఉరి
కందుకూరు: కూటమి ప్రభుత్వ పాలనలో పొగాకు రైతులు గిట్టుబాటు ధరలు లేక అప్పుల బాధతో ఉరేసుకునే పరిస్థితి ప్రస్తుతం వచ్చిందని, గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితిని పొగాకు రైతులు ఎదుర్కోలేదని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్యాదవ్ అన్నారు. స్థానిక పామూరు రోడ్డులోని రెండో పొగాకు వేలం కేంద్రాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ప్రస్తుతం వేలం జరుగుతున్న తీరును రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బుర్రా మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ తరఫున వేలం కేంద్రానికి వస్తున్నారని తెలుసుకుని, 7.30 గంటలకే వేలం ముగించేశారన్నారు. ఇదేమని అడిగితే ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల వేలం ముగించామని చెప్తున్నారని మండిపడ్డారు. టీడీపీ రెండేళ్ల పాలనలో పొగాకు రైతులకు ఇప్పటి వరకు లాభాలు వచ్చిన దాఖలాలు లేవన్నారు. అదే గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో క్వింటా రూ.36 వేల వరకు ధరలు పలికాయని, కానీ ప్రస్తుతం కనీస మద్దతు ధర దేవుడెరుగు ఒక బ్యారన్కు రూ.5 లక్షల వరకు రైతులు నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పారు. ఇదేమని పొగాకు బోర్డు అధికారులను అడిగితే రకరకాల సాకులు చెప్తున్నారన్నారు. వ్యాపారులంతా ఒకేమాట మీదకు వచ్చి పొగాకు కొనుగోలు చేస్తున్నట్లు అర్థమవుతోందన్నారు. వ్యాపారుల సిండికేట్ వల్లే కనీస ధరలు రావడం లేదని, వేలం ముందుకు సాగడం లేదన్నారు. ఇప్పటికై నా వ్యాపారులు మారి రైతులను ఆదుకునేందుకు ముందుకు రావాలని, రైతుల పంట సాగు చేయకపోతే వ్యాపారులే తీవ్రంగా నష్టపోతారని వివరించారు. అలాగే ప్రభుత్వం కూడా ముందుకొచ్చి మార్క్ఫెడ్ను రంగంలోకి దించి పొగాకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మద్దతు ధరలు లేని ప్రతిసారి గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారని వివరించారు. కానీ ఈ ప్రభుత్వం పొగాకుతో పాటు వరి, మొక్కజొన్న, కంది వంటి ఏ పంటలకు కూడా మద్దతు ఇవ్వలేదన్నారు. కనీసం క్రాప్ ఇన్సూరెన్స్ కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందని, గిట్టుబాటు ధరలు కల్పించకపోతే రైతుల తరఫున ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు కూడా సిద్ధమేనని స్పష్టం చేశారు. 7.30 గంటలకే వేలం క్లోజ్: సాధారణంగా ప్రతిరోజు వేలం ప్రక్రియ ఉదయం 8.30 నుంచి 9 గంటల మధ్యలో ప్రారంభమవుతుంది. అయితే సోమవారం మాత్రం 7.30 గంటలకే వేలం మొత్తం ముగిసి, బేళ్లను తరలించడం కూడా జరిగిపోయింది. కందుకూరులోని రెండు వేలం కేంద్రాల్లోను ఇదే పరిస్థితి. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పొగాకు రైతులకు మద్దతుగా వేలం కేంద్రం వద్ద రైతులు ఆందోళన చేస్తారని ముందస్తు సమాచారంతోనే, అధికారులు వేలాన్ని ఉదయాన్నే ముగించేశారు. అదేమని రైతులు ప్రశ్నిస్తే ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల ఉదయాన్నే వేలాన్ని ప్రారంభించి ముగించినట్లు అధికారులు చెప్పడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజు ఇలా ఎందుకు చేయడం లేదని నిలదీస్తే అధికారుల నుంచి సమాధానం కరువైంది. పొగాకు బేళ్లు తగలబెట్టి నిరసన రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేస్తూ పామూరు రోడ్డులోని పొగాకు వేలం కేంద్రం వద్ద బుర్రా మధుసూదన్యాదవ్ ఆధ్వర్యంలో రైతులు పొగాకు బేళ్లను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. పామూరు రోడ్డుపై పొగాకు బేళ్లు వేసి ఆందోళనకు దిగారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు రైతుల ఆందోళనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పొగాకు బేళ్లు తగలబెట్టడానికి వీల్లేదని, ట్రాఫిక్ అంతరాయం అంటూ పట్టణ ఎస్సై శివనాగరాజు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై బుర్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు మద్దతుగా పోరాడుతుంటే పోలీసుల ఆంక్షలు ఏంటి అంటూ నిలదీశారు. పొగాకు రైతులకు న్యాయం చేయాలన్నదే తమ ఉద్దేశమని, పొగాకు రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం వేలం నిర్వహణాధికారిని కలిసి రైతుల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. టీడీపీ నాయకుని అతి బుర్రా మధుసూదన్యాదవ్ రైతులతో కలిసి వేలం కేంద్రాన్ని సందర్శిస్తున్న సమయంలో రైతు సంఘ నాయకుడు, టీడీపీ నాయకుడు తాటికొండ రమణయ్య ఓవరాక్షన్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వేలం కేంద్రంలో బుర్రా రైతులతో మాట్లాడుతున్న సమయంలో బోర్డు అధికారులు అక్కడికి చేరుకుని ప్రస్తుత మార్కెట్ పరిస్థితి గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. స్పందించిన బుర్రా గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే బోర్డు తరఫున ఏం చర్యలు తీసుకున్నారు, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటూ ప్రశ్నిస్తున్నారు. ఆ సమయంలో రమణయ్య ఇక్కడ బోర్డును నిందిస్తారేంటి అంటూ వ్యాపారులు, బోర్డుకు మద్దతుగా మాట్లాడుతూ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. వెంటనే స్పందించిన బుర్రా ఏదైనా ఉంటే రైతులకు అండగా నిలబడే ప్రయత్నం చేయాలి గానీ, ఇలా వ్యాపారులు, ప్రభుత్వం తరఫున మాట్లాడడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చుట్టూ ఉన్న రైతులు ఒక్కసారిగా రమణయ్య తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ప్రతిపక్ష పార్టీగా రైతుల పక్షాన పోరాడేందుకు వస్తే అక్కడకి వచ్చి రెచ్చగొట్టేలా ప్రవర్తించడం సరైన విధానం కాదన్నారు. టీడీపీ నాయకుడు ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టే ప్రయత్నం చేశారంటూ బుర్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ సంఘటనను వక్రీకరించిన టీడీపీ సోషల్మీడియా బుర్రా రైతు పట్ల దురుసుగా ప్రవర్తించారంటూ ప్రచారం చేసుకోవడం వింతగా మారింది. అసలు ఏం జరిగిందనేది కూడా తెలుసుకోకుండా వైఎస్సార్ సీపీపై దుష్ప్రచారం చేయాలనే ఉద్దేశంతో టీడీపీ నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఇక్కడ కొసమెరుపు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పండిట్ కామరాజు, నాయకులు షేక్ రఫి, తోకల కొండయ్య, గణేశం గంగిరెడ్డి, ముప్పవరపు కిశోర్, నన్నం పోతురాజు, అనుమోలు లక్ష్మీనరశింహం, నోటి వెంకటేశ్వరరెడ్డి, పెన్నా క్రిష్ణయ్య, చీమల వెంకటరాజా, పావం కొండయ్య, వల్లూరి కోటేశ్వరరావు, నగళ్ల నారయ్య, బిల్లా రమణయ్య, పాలవెల్లి అమర్నాథ్రెడ్డి, కాపులూరి మధుసూదన్, చనమాల కోటేశ్వరరావు, ఉప్పుటూరి నాగేశ్వరరావు, చెన్నారెడ్డి వెంకటేశ్వర్లు, బద్దిపూడి జయరావు, చింతం వెంకారెడ్డి, కట్టా హనుమంతరావు, కాట్రగడ్డ వెంకట్రావ్, వంకాయలపాటి వెంకటేశ్వర్లు, కొత్త మహేష్, షేక్ దస్తగిరి, గొర్ల రమేష్, ఈర్ల వెంకటేశ్వర్లు, తల్లపనేని గోఫి, పత్తిపాటి శ్రీనివాసులు, గోకరాజు సుబ్బారావు, అన్నాబత్తిన మాల్యాద్రి, కొండూరు నర్సారెడ్డి, తన్నీరు ధరణి, లక్ష్మీ, ఆదాంబి తదితరులు పాల్గొన్నారు. పొగాకు వేలం కేంద్రాల వద్ద నిరసన సరైన మద్దతు ధర లేక ఒకవైపు అల్లాడిపోతుంటే వేలానికి తీసుకొచ్చే 50 శాతం బేళ్లను కొనుగోలు చేయకుండా తిరస్కరిస్తున్నారని రైతులు వాపోయారు. అందుకు నిరసనగా రైతులు, సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు కొండపిలోని పొగాకు బోర్డు వద్ద బేళ్లను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. కొండపి ఎస్సై త్యాగరాజు చేరుకొని పొగాకు రైతులు, నాయకులతో మాట్లాడి నిరసన కార్యక్రమాన్ని విరమింపచేశారు. పొగాకుకు ప్రభుత్వం కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం రైతులు పొదిలిలో పొగాకు వేలాన్ని బహిష్కరించి నిరసన తెలిపారు. అనంతరం వేలం కేంద్రం నుంచి ఒంగోలు–కర్నూలు రహదారి వరకు ర్యాలీ చేశారు. నిరసన చేయడానికి వచ్చిన రైతు సంఘ నాయకులను, రైతులను పోలీసులు అడ్డుకొని వెనక్కి పంపారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రకాశం జిల్లా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వెల్లంపల్లి పొగాకు బోర్డు వద్ద నిరసన చేపట్టారు. ఒంగోలు 1వ వేలం కేంద్రంలో పొగాకు రైతులకు మద్దతు ధర కల్పించి వారికి న్యాయం చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పమిడి వెంకటరావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పొగాకు రైతుకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ కనిగిరి టుబాకో బోర్డులో సోమవారం రైతులు నిరసన తెలిపారు. -
మంగళవారం శ్రీ 26 శ్రీ మే శ్రీ 2026
కొండలను కొల్లగొడుతున్నారు..కుంటలను గుల్లచేస్తున్నారు..చెరువుల్లో విధ్వంసం..చేతికి అందిన కాడికి మట్టికొట్టుకొని పోతున్నారు. అడ్డూ అదుపూ లేని తవ్వకాలతో కొండలు కరిగిపోతున్నాయి. గ్రామస్తుల ఫిర్యాదులను పెడచెవిన పెడుతున్నారు. అధికారులను లెక్క చేయడంలేదు. నీకు చేతనైంది చేసుకోపో అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. నియోజకవర్గాల్లో కీలక నేతకు కప్పం కడితే చాలు ఎలాంటి చలానాలు కట్టకపోయినా పర్వాలేదంటూ ప్రభుత్వాదాయానికి గండికొడుతున్నారు మట్టి కొల్లగొట్టే అనకొండలు. చెరువులు మింగేసి..సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న మద్దిపాడు మండలంలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. అధికార పార్టీ నేతల అండదండలతో రెచ్చిపోతున్నారు. కొన్ని రోజులుగా మండలంలోని చెరువులు, కుంటల్లో అక్రమంగా మట్టిని తవ్వుకుంటున్నారు. ముఖ్యంగా మద్దిపాడు మండలంలోని అన్నంగి, బూరేపల్లి, గడియపూడి, గార్లపాడు పరిసర ప్రాంతాల్లోని కొండలను సైతం వదిలిపెట్టకుండా మట్టి దోచుకుంటున్నారు. ఇక్కడ కొండల్లో ఎర్ర మట్టి ఉంటుంది. దీనిపై కన్నేసిన స్థానిక టీడీపీ నాయకులు ఏకంగా జేసీబీలను పెట్టి కొండలను కొల్లగొడుతున్నారు. వందల సంఖ్యలో టిప్పర్లు పెట్టి మట్టిని అమ్ముకుంటున్నారు. ఎవరైనా ఇదేంటని ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. మట్టి తవ్వకాలపై మైనింగ్ డీడీ రాజశేఖర్ టీడీపీ నాయకులపై పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టిస్తోంది. మద్దిపాడు పోలీసులు అన్నంగి గ్రామ టీడీపీ అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న నారిపెద్ది అనిల్, టీడీపీ క్లస్టర్ ఇన్చార్జి అన్నాబత్తిన శివ, బూరేపల్లి గ్రామ టీడీపీ సర్పంచ్ రావిపాటి శేషయ్య, గుండ్లాపల్లికి చెందిన రాముడు తదితరులపై కేసు నమోదు చేయడంతో మండలంలో మట్టి దోపిడీ చర్చనీయాంశంగా మారింది. బూరేపల్లి కొండ మాయం.. అన్నంగి పంచాయతీ పరిధిలో బూరేపల్లి గ్రామంలో 440.20 ఎకరాల్లో విస్తరించి ఉన్న బూరేపల్లి కొండ ఇప్పుడు కనిపించని పరిస్థితి నెలకొంది. ఈ కొండలోని సర్వేనంబర్ 472లో 94.42 ఎకరాలు పోలీసు బెటాలియన్కు కేటాయించారు. మిగిలిన ఎర్రకొండను పచ్చ తమ్ముళ్లు తవ్వుకొని మట్టిని విక్రయిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పగలంతా పొదల మాటున ఉంచిన జేసీబీలు రాత్రయితే చాలు రంగంలోకి దిగుతున్నాయి. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు జేసీబీతో తవ్వకాలు చేస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. పదుల సంఖ్యలో టిప్పర్లు పెట్టి మట్టిని తరలిస్తున్నట్లు మైనింగ్ అధికారులకు ఫిర్యాదులు చేశారు. టిప్పరు మట్టి రూ.10 వేలకు విక్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతి రోజూ సుమారు 100 టిప్పర్ల వరకు తరలిస్తున్నారని తెలుస్తోంది. సగటున నెలకు రూ.3 కోట్లకు పైగానే మట్టి అమ్మకాలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులోంచి టీడీపీ కీలక నేతలకు టిప్పర్కు రూ.2 వేల చొప్పున కప్పం కడుతున్నట్లు టీడీపీ నాయకులే చెవులు కొరుక్కుంటున్నారు. కొండను ఇష్టమొచ్చినట్లు తవ్వేయడంతో ఎక్కడ పడితే అక్కడ గుంతలు ఏర్పడ్డాయి. రేపు వర్షాలకు ఈ గుంతలు నిండితే అటుగా వచ్చే పశువులకు, పశుపోషకులకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. కొత్తపట్నం చెరువుల్లో మట్టి మాయం... జిల్లా కేంద్రానికి చెందిన ఒక కీలక నేత వెంచర్కు కొత్తపట్నం మండలంలోని అల్లూరు చెరువు నుంచి మట్టిని తరలిస్తున్నట్లు ఆ గ్రామానికి చెందిన ప్రజలు సోమవారం కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఇరిగేషన్ ఏఈ కి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి స్పందనలేదని కలెక్టర్కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అల్లూరు గ్రామంలోని చాపాయి, చక్రాయి ఇరిగేషన్ చెరువుల్లో నుంచి వందలాది టిప్పర్లు, ట్రాక్టర్లను ద్వారా ఒంగోలు మండలంలోని కొప్పోలు సమీపంలో కీలక నేత వెంచర్కు మట్టిని తరలిస్తున్నారు. సుమారు 60 ఎకరాల్లో ఈ వెంచర్ వేస్తున్నట్లు సమాచారం. దీన్ని చదును చేయడానికి వందలాది టిప్పర్ల మట్టి అవసరమవుతుందని చెబుతున్నారు. ఇందుకోసం ఇరిగేషన్ అధికారుల అనుమతి తీసుకున్న దాఖలాలు లేవు. పంచాయతీ తీర్మానం చేయలేదు. అధికారం చేతిలో ఉందన్న అహంకారంతో సీనరేజ్ కట్టకుండా అనధికారికంగా, అక్రమంగా మట్టిని తవ్వుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ అక్రమంగా మట్టి తవ్వుకొంటూ విక్రయాలు చేస్తున్నారు. పెద్దారవీడు మండలంలో మట్టితవ్వకాలు మితిమీరినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే నియోజకవర్గంలో సొంత పొలంలో రైతులు మట్టి తవ్వుకున్నా కీలక నేతకు టిప్పర్కు రూ.350 కప్పం కట్టాల్సి వస్తుందని ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా ఒక బొలేరో వాహనంలో కొంత మంది వ్యక్తులు మైనింగ్ అధికారులమని తిరుగుతూ టిప్పర్, ట్రాక్టర్ యజమానుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక కనిగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనుల మాటున అడ్డగోలుగా మట్టి తవ్వకాలు సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రైల్వే పనులు, హైవే పనుల కోసమని మట్టిని తవ్వుకుంటున్న కొందరు వ్యక్తులు పంచాయతీ కార్యదర్శులకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని తెలుస్తోంది. కొన్ని చోట్ల 15 ట్రాక్టర్లకు పర్మిషన్ తీసుకొని 50 ట్రాక్టర్లకు మట్టిని తవ్వుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. సింగరాయకొండ మండలంలోని శానంపూడి, పాత సింగరాయకొండ గ్రామాల్లో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. పాత సింగరాయకొండ పంచాయతీలో ఈనాం, ప్రభుత్వ భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొండపి నియోజకవర్గంలోని ఆరు ఇరిగేషన్ చెరువుల్లో మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. కందుకూరు నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. ఇరిగేషన్ చెరువులను తవ్వేస్తూ మట్టిని రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తున్నారని తెలుస్తోంది. ఒంగోలు సిటీ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలు/కళాశాలల్లో 5వ తరగతి, జూనియర్ ఇంటర్మీడియెట్ ఫేజ్–1, ఫేజ్–2 కేటాయింపుల అనంతరం మిగిలిన ఖాళీల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు డీసీఓ డి.జయ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా డీసీఓ మాట్లాడుతూ ప్రవేశ పరీక్షకు హాజరై ఎంపిక కాలేని వారు, ఎంపికై చేరని వారు, చేరి స్లైడింగ్ కోరిన విద్యార్థులు మాత్రమే ఈ కౌన్సెలింగ్కు హాజరు కావాలని తెలిపారు. విద్యార్థులు హాల్టికెట్, ర్యాంక్ కార్డు, ఆధార్, స్టడీ సర్టిఫికెట్, ఇతర సంబంధిత ధ్రువపత్రాలతో కౌన్సెలింగ్కు హాజరు కావాలని కోరారు. కౌన్సెలింగ్ జరిగే తేదీ ఉదయం 9 గంటల్లోపు విద్యార్థినీ, విద్యార్థులు హాజరు కావాలని కోరారు. కురిచేడులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులంలో 5వ తరగతి బాలురుకు ఈనెల 26వ తేదీ, కొండపిలోని గురుకులంలో 5వ తరగతి బాలికలకు ఈనెల 27వ తేదీ, సింగరాయకొండలోని గురుకులంలో జూనియర్ ఇంటర్ (జనరల్) బాలికలకు ఈనెల 29వ తేదీ, అలాగే దర్శిలోని గురుకులంలో జూనియర్ ఇంటర్ బాలురకు ఈ నెల 30వ తేదీ కౌన్సెలింగ్ నిర్వహిస్తారని తెలిపారు. పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం ఒంగోలు సిటీ: పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలిరోజు తెలుగు పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు డీఈఓ సీవీ రేణుక తెలిపారు. తెలుగు పరీక్షకు మొత్తం 1288 మంది విద్యార్థులు నమోదుకాగా, 1094 మంది హాజరయ్యారు. 194 మంది గైర్హాజరయ్యారు. అలాగే అపాస్ (ఎస్ఎస్సీ) తెలుగు పరీక్షకు 658 మంది విద్యార్థులకు గాను 546 మంది హాజరుకాగా, 112 మంది గైర్హాజరయ్యారు. అపాస్ (ఇంటర్మీడియెట్) ఇంగ్లిష్ పరీక్షకు 326 మందికిగాను 257 మంది హాజరయ్యారు. 69 మంది గైర్హాజరయ్యారు. మార్కాపురం జిల్లా కలెక్టర్ మార్కాపురం జెడ్పీ గరల్స్ హైస్కూల్ను తనిఖీ చేశారు. జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాలను స్క్వాడ్ సభ్యులు తనిఖీ చేశారు. ప్రకాశం జిల్లాలో డీఈఓ రేణుక నాలుగు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. మద్దిపాడు మండలం అన్నంగి–బూరేపల్లి గ్రామాల మధ్య కొండను తవ్వి గ్రావెల్ తరలించడంతో ఏర్పడిన గోతులుగుండ్లకమ్మకు ప్రమాదం... మట్టి దొంగల ధన దాహానికి గుండ్లకమ్మ ప్రమాదంలో పడిందని పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుండ్లకమ్మ జలాశయానికి రక్షణగా కట్టగా పోసిన మట్టిని తవ్వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరికొద్ది రోజుల్లో రుతుపవనాలు రానున్నాయి. వర్షాలు దంచికొడితే గుండ్లకమ్మ కట్ట దెబ్బతినే ప్రమాదం ఉంది. అదే కనుక జరిగితే చుట్టు పక్కల గ్రామాలు నీటమునిగే అవకాశం ఉందని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇరిగేషన్ అధికారులు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని పరిసర గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
పొగాకు రైతు ధర్మాగ్రహం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు రీజియన్ పరిధిలో పొగాకు వేలం ప్రారంభమై రెండు నెలలు గడిచినా మూడు మిలియన్ కేజీల ఉత్పత్తులూ ఇప్పటి వరకు కొనలేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలే సరైన గిట్టుబాటు ధరలు లేక ఆవేదనలో ఉన్న రైతులు వేలం ప్రక్రియ ఆలస్యంతో మరింత నష్టాల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రైతులు ఎక్కడికక్కడ రోడ్డెక్కుతున్నారు. రోడ్లపై పొగాకు బేళ్లను పోసి తగలబెట్టి నిరసన తెలుపుతున్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని గిట్టుబాటు ధరలు కల్పించాలని, లేదంటే ఆత్మహత్యలే శరణ్యమని హెచ్చరిస్తున్నారు. కర్ణాటక వేలం ముగియకపోవడం, అంతర్జాతీయంగా ఆర్డర్లు లేవనే సాకుతో వ్యాపారులు, పొగాకు కొనేందుకు ముందుకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు, కొండపి, టంగుటూరు, పొదిలి, కనిగిరి, వెల్లంపల్లి, ఒంగోలు 1 వేలం కేంద్రాల వద్ద రైతులు నిరసనలు తెలిపారు. రోడ్డుపై పొగాకు బేళ్లను వేసి తగలబెట్టారు. చంద్రబాబు పాలనపై కన్నెర్ర చేశారు. రెండు నెలలుగా ధరలు లేక నానా అగచాట్లు పడుతుంటే ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలు ఇదే విధంగా ఉంటే బ్యారన్కు రూ.5 లక్షల వరకు నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందారు.టీడీపీ నేత ఓవరాక్షన్ ఇదిలా ఉంటే రైతులకు మద్దతుగా వైఎస్సార్ సీపీ కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ సోమవారం కందుకూరులోని రెండో పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించిన సమయంలో టీడీపీ నేత, రైతు నాయకుడు తాటికొండ రమణయ్య ఓవరాక్షన్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వేలం కేంద్రంలో బుర్రా రైతులతో మాట్లాడుతున్న సమయంలో బోర్డు అధికారులు అక్కడికి చేరుకుని ప్రస్తుత మార్కెట్ పరిస్థితి గురించి వివరించే యత్నం చేశారు.స్పందించిన బుర్రా గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే బోర్డు తరఫున ఏం చర్యలు తీసుకున్నారు, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటూ ప్రశ్నించారు. ఆ సమయంలో రమణయ్య ఇక్కడ బోర్డును నిందిస్తారేంటి అంటూ వ్యాపారులు, బోర్డుకు మద్దతుగా మాట్లాడుతూ రైతులను రెచ్చగొట్టే యత్నం చేశారు. వెంటనే స్పందించిన బుర్రా.. రమణయ్య తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతులకు అండగా నిలబడకుండా వ్యాపారులకు వంతపాడడంపై మండిపడ్డారు. దీంతో రైతులు కూడా రమణయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధరలు పెంచేలా చర్యలు తీసుకోవాలని, వ్యాపారులు వేలంలో పాల్గొని పొగాకు కొనేలా చూడాలని బుర్రా మధుసూదన్ డిమాండ్ చేశారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
ఉలవపాడు: మండల పరిధిలో ఆదివారం జరిగిన మూడు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..భీమవరం ఎస్టీ కాలనీలో జరుగుతున్న అంకమ్మ కొలుపులకు సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం ఎస్టీ కాలనీకి చెందిన చేవూరి జాలయ్య (53) ద్విచక్రవాహనం పై వస్తూ భీమవరం సమీపంలో విద్యుత్స్తంభానికి ఢీకొట్టాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉలవపాడు సీహెచ్సీ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మామిడి కాయలు కొనుగోలు చేయడానికి ఆగి..... మండల పరిధిలోని వీరేపల్లి గ్రామం వద్ద జాతీయరహదారిపై మామిడి కాయలు కొనుగోలు చేయడానికి వచ్చి ఆగి రోడ్డు దాటుతూ కారు ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం జరిగింది. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేలూరుపాడు గ్రామానికి చెందిన 30 మంది వేళంగిణికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళుతున్నారు. వీరేపల్లి వద్ద మామిడి కాయలు కొనుగోలు చేయడానికి బస్సును ఆపారు. బస్సులో నుంచి అమర్లపూడి ఏసుపాదాలు (64) దిగి బయట రోడ్డు మీద నడుస్తున్న సమయంలో కారు వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఏసుపాదాలు అక్కడికక్కడే మృతి చెందాడు. టూర్ కు వెళ్లి వస్తున్న సమయంలో ప్రమాదం జరగడంతో తోటిగ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. మరొకరికి గాయాలు తిరుమలకు నడిచి వెళ్తుండగా... తిరుమలకు నడిచి వెళుతున్న వ్యక్తిని గుర్తు తెలియని కారు ఢీ కొన్న సంఘటన జాతీయరహదారి పై వీరేపల్లి వద్ద ఆదివారం జరిగింది. అద్దంకి మండలం వి.కొప్పెరపాడుకు చెందిన నాగరాజు తన మిత్రులతో కలసి తిరుమలకు కాలి నడకన నడిచి వెళుతున్నాడు. ఈ క్రమంలో వెనుక నుంచి కారు ఢీ కొనడంతో గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని 108 సిబ్బంది కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కదలని బేళ్లు.. రైతుకు కన్నీళ్లు..!
● కనిగిరి పొగాకు వేలం కేంద్రం పరిధిలో 8 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తి ● వేలం ప్రారంభమై నెలరోజులు కావస్తున్నా 4,602 కేజీలు మాత్రమే కొనుగోలు కనిగిరి పొగాకు వేలం కేంద్రం పరిధిలో గత వారంలో బేళ్ల తిరస్కరణలు ఇలా ఉన్నాయి.. కనిగిరి రూరల్: చంద్రబాబు ప్రభుత్వ పాలనలో పొగాకు రైతులు కుదేలయ్యారు. కనిగిరి పొగాకు వేలం కేంద్రం పరిధిలోని పొగాకు రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. దీంతో రైతు సంఘాల నాయకులు నేడు ఆందోళనకు పిలుపునిచ్చారు. కనిగిరి వేలం కేంద్రం పరిధిలో పొగాకు సాగు విస్తీర్ణం 4,952 హెక్టార్లు కాగా, 5 క్లస్టర్ల పరిధిలో 74 గ్రామాల్లో 1,245 బ్యారన్లు ఉన్నాయి. గతేడాది పొగాకు ఉత్పత్తి 8.5 మిలియన్ కేజీలు కాగా, ఈ ఏడాది 8 మిలియన్ కేజీల ఉత్పత్తి మాత్రమే వచ్చింది. వేలం కేంద్రం ప్రారంభమై 29 రోజులు కావస్తున్నా నేటికీ 4,602 మిలియన్ కేజీలు మాత్రమే కొనుగోలు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. బేళ్ల తిరస్కరణలతోనే సరి... కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటినా పొగాకు రైతుల సమస్యలపై దృష్టి సారించకపోవడంతో పొగాకు కంపెనీల ప్రతినిధులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి బ్యారన్ నుంచి 12 బేళ్ల వరకు అనుమతి ఉన్నా.. ఇప్పటి వరకు మూడునాలుగు సార్లు వేలానికి వెళ్లిన రైతులకు చేదు అనుభవం ఎదురైంది. పొగాకు రైతు గ్రేడ్ నంబర్ (ఎఫ్ 1, ఎఫ్ 2, ఎఫ్ 3), పచ్చా, మీడియం, లో గ్రేడ్ నాలుగు రకాలను వేలం కేంద్రానికి తీసుకెళ్తుండగా, కేవలం గ్రేడ్ 1 (ఎఫ్ 1, ఎఫ్ 2, ఎఫ్ 3) రకాల పొగాకు మాత్రమే కొనుగోలు చేసి మిగతా వాటిని తిరస్కరిస్తున్నారు. దీంతో ప్రతిసారీ వేలం కేంద్రానికి పొగాకు బేళ్లు తీసుకురావడం.. తక్కువ బేళ్లను మాత్రమే కొనుగోలు చేయడంతో మిగతా వాటిని తీసుకుని ఉసూరుమంటూ తిరిగి ఇంటికి వెళ్లడం రైతులకు నిద్ర లేకుండా చేస్తోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అధిక ధరలు... రెండేళ్ల క్రితం కనిగిరి పొగాకు వేలం పరిధిలో 7.58 మిలియన్ కేజీల ఉత్పత్తి వచ్చింది. దాదాపు రైతు దగ్గర ఉన్న పొగాకు మొత్తాన్ని అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కొనుగోలు చేయించింది. గత ప్రభుత్వంలో కేజీ గరిష్ట ధర రూ.350 నుంచి రూ.360 వరకు, కనిష్ట ధర రూ.280 నుంచి రూ.270 వరకు వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్ల నుంచి ఆ పరిస్థితి లేదు. గతేడాది కేజీ గరిష్ట ధర రూ.280 పలకగా, ఈ ఏడాది మరీ రూ.250కు దిగజారింది. అంతేగాకుండా మీడియం, లో గ్రేడ్ పొగాకు బేళ్లను కొనుగోలు చేయకపోతుండటంతో రైతులు దిగాలు చెందుతున్నారు. ఇళ్లలో పేరుకుపోయిన పొగాకు బేళ్లను చూసుకుంటూ.. పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలనే బెంగతో లోలోన కుమిలిపోతున్నారు. వారంతిరస్కరించిన బేళ్లు వేలానికి తెచ్చిన బేళ్లుసోమవారం 264 75 మంగళవారం 254 115 బుధవారం 219 82 గురువారం 255 149 శుక్రవారం 105 50 శనివారం 254 99 నో బిడ్లతో అల్లాడుతున్న పొగాకు రైతులు తిరస్కరించే పనిలోనే నిమగ్నమవుతున్న కంపెనీల ప్రతినిధులు ఎక్కడి పొగాకు అక్కడే ఉండటంతో ఆందోళనలు నేడు నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన రైతు సంఘాలు -
ఎయిడెడ్ ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించాలి
● ఏపీ టీచర్స్ గిల్డ్ డిమాండ్ ఒంగోలు సిటీ: ఎయిడెడ్ ఉపాధ్యాయులకు కలెక్టర్ రాజాబాబు కౌన్సెలింగ్ నిర్వహించాలని ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.వెంకటరావు, సీహెచ్.ప్రభాకరరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 132 ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న 555 మంది ఉపాధ్యాయ సిబ్బందికి గాను 115 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు, 15 మంది గణిత ఉపాధ్యాయులు, 18 మంది సోషల్ ఉపాధ్యాయులు, 12 మంది తెలుగు పండిట్లు, 10 మంది హిందీ పండిట్లు, 9 మంది పీఈటీలు, 8 మంది సైన్స్ ఉపాధ్యాయులు, ఇద్దరు క్రాఫ్ట్ టీచర్లు, 13 మంది నాన్ టీచింగ్ సిబ్బంది ఖాళీగా ఉన్నారని తెలిపారు. వీరికి వెంటనే కౌన్సెలింగ్ నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లోకి సర్దుబాటు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. తాళ్లూరు: మండలంలోని తూర్పుగంగవరం యూత్ ఆధ్వర్యంలో జీసీసీ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. ఫైనల్ మ్యాచ్లో మాధవరం ఆనంద్ లెవెన్స్–తూర్పుగంగవరం హోం జట్టు తలపడ్డాయి. ఇందులో తూర్పుగంగవరం హోం జట్టుపై మాధవరం జట్టు ఘన విజయం సాధించింది. మ్యాచ్ గెలిచిన మాధవరం టీమ్ రూ.1 లక్ష, రన్నరప్గా నిలిచిన తూర్పుగంగవరం టీం రూ.75 వేలు, మూడో స్థానం నాగంబొట్లపాలెం జట్టు రూ.50 వేలు, నాల్గవ స్థానంలో తూర్పుగంగవరం జూనియర్ జట్టు నిలిచి రూ.25 వేలు కై వసం చేసుకున్నాయి. ప్రతిభ కనబరిచిన జట్లకు దాతలు సహకారంతో నగదు బహుమతితోపాటు కప్లను అందించారు. యర్రగొండపాలెం: మండలంలోని వీరభద్రాపురం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు బత్తుల శ్రీను ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని, చేసిన వాగ్దానాలు ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయకపోవడంతోనే ఆ పార్టీలోని నాయకులు ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నారని అన్నారు. తమ పార్టీ అధికారంలో లేకపోయినా జగనన్నపై ఉన్న అభిమానంతో టీడీపీ నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు మక్కువ చూపుతున్నారని చెప్పారు. పార్టీలో కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తుండటం వలన వారే తమ ప్రాంతంలో నాయకత్వం వహిస్తూ ప్రజల సమస్యలపై స్పందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఏకుల ముసలారెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు మందుల ఆదిశేషు, వివిధ విభాగాల నాయకులు కె.ఓబులరెడ్డి, ఎం.బాలగురవయ్య, సయ్యద్ జబీవుల్లా, వి.మోహన్రెడ్డి పాల్గొన్నారు. -
ఎండల తీవ్రత నానాటికీ పెరుగుతోంది. ఉదయం 7 గంటలకే సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. ఉమ్మడి జిల్లాలో ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటిపోయింది. 38 మండలాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతలకు వడగాలులు తోడై నిప్పుల కొలిమిలా మారుతో
సోమవారం శ్రీ 25 శ్రీ మే శ్రీ 2026ఎండతీవ్రతతో నిర్మానుష్యంగా ఉన్న ఒంగోలులోని కొత్తపట్నం బస్టాండ్ సెంటర్ఒంగోలు టౌన్: జిల్లాలో ఈ ఏడాది ఎండలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్ నెల చివర నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చిన ఎండలు మే నాటికి తీవ్రంగా మారాయి. వారం రోజుల నుంచి జిల్లాలో నమోదవుతున్న ఉష్ణోగ్రతల దెబ్బకు ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒకటి రెండు మండలాలు మినహా మిగిలిన అన్నీ మండలాల్లో 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు దాటుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే ఎండ వేడి మొదలవుతోంది. క్రమంగా మధ్యాహ్నంకల్లా నిప్పుల కొలిమిలా మారుతోంది. రాత్రి 11 గంటలకు కూడా వేడి గాలులు తగ్గడం లేదు. దాంతో పగలు రాత్రి వడగాలులు, ఉక్కపోతలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎప్పుడూ రద్దీగా కనిపించే ఒంగోలు నగరంలోని ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. మిట్ట మధ్యాహ్నం సమయంలో ఎంత పనిపడినా బయటకు రావడానికి సాహసం చేయలేకపోతున్నారు. సాయంత్రం 6 గంటలు దాటిన తరువాతే జనాలు ఇంటి నుంచి బయటకు వస్తున్నారు. ఉలవపాడులో సూర్యుడి ఉగ్రతాండవం... ఆదివారం జిల్లాలోని ఉలవపాడులో సూర్యుడు ఉగ్రరూపం ప్రదర్శించాడు. ఉలవపాడులో జిల్లాలోనే అత్యధికంగా 45.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు అల్లాడిపోయారు. సంతనూతలపాడులో కూడా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ప్రజలు ఇంటి నుంచి అడుగు బయటకు పెట్టాలంటే భయపడిపోయారు. నేడు, రేపు కూడా అవే ఉష్ణోగ్రతలు... నేడు, రేపు కూడా ఎండలు తీవ్రంగా ఉంటాయని విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది. మార్కాపురం జిల్లాలోని అన్నీ మండలాల్లో 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రత నమోదవుతుందని ప్రకటించింది. ఆదివారం తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన గిద్దలూరు, కొమరోలు, రాచర్ల, మార్కాపురంలో కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అంచనా వేసింది. గిద్దలూరులో 40.9, కొమరోలులో 40.5, రాచర్లలో 41ల చొప్పున ఒక్కో డిగ్రీ పెరుగుతుందని, మార్కాపురంలో ఏకంగా 3 డిగ్రీలు పెరిగి 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని తెలిపింది. ప్రకాశం జిల్లాలోని బల్లికురవ, జె.పంగులూరులో సుమారు 45 డిగ్రీలు, అద్దంకి, సంతమాగులూరులో 44.8, గుడ్లూరులో 44.7, డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని, మిగిలిన అన్నీ మండలాల్లో కూడా ఒకటి రెండు మండలాలు మినహాయించి మిగిలిన అన్నీ మండలాల్లో 44 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. ఒంగోలు అర్బన్లో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని ప్రకటించింది. రోహిణి వచ్చేసింది బాబోయ్... వేసవి కాలంలో రోహిణిలో రోళ్లు పగులుతాయని చెబుతుంటారు. ఈసారి రోహిణికి ముందే ఎండలు తన ప్రతాపం చూపాయి. ఇక నేటి నుంచి రోహిణి కార్తె కూడా వచ్చేసింది. 15 రోజులు రోహిణి కార్తె ప్రభావం ఉంటుంది. ఎండలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుటికే ఉష్ణోగ్రతలకు వడ గాలులు తోడవడంతో వేడి, ఉక్కపోతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జిల్లాలో వడదెబ్బకు పలువురు మరణిస్తున్నారు. వేసవి ప్రభావంతో జనాలు పిట్టల్లా రాలుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనలేకపోవడంపై జనాలు మండిపడుతున్నారు. నగర పాలక సంస్థ, మున్సిపాలిటీలు, పంచాయతీలు మొద్దు నిద్రపోతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
అప్గ్రేడ్కానున్న మార్కాపురం పోలీస్ స్టేషన్లు
పాకల బీచ్లో సాయంత్రం వేళ పర్యాటకుల సందడి ● డీజీపీ ఆఫీసుకు ప్రతిపాదనలు మార్కాపురం: జిల్లా కేంద్రంగా మార్కాపురం పట్టణం మారడంతో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మార్కాపురం పోలీసు స్టేషన్లను అప్గ్రేడ్ చేయాలని డీజీపీ కార్యాలయానికి ప్రతిపాదనలు వెళ్లాయి. త్వరలో కార్యరూపం దాల్చనుంది. ప్రస్తుతం మార్కాపురానికి పట్టణ పోలీసుస్టేషన్తో పాటు రూరల్ పోలీసు స్టేషన్ కలిపి సీఐని ఏర్పాటు చేశారు. మార్కాపురం పట్టణ, రూరల్ పోలీసు స్టేషన్లను అప్గ్రేడ్ చేయాలని డీజీపీ కార్యాలయానికి ప్రతిపాదనలు పంపారు. 15 నుంచి 20 రోజుల్లో ప్రతిపాదనలకు ఆమోదం రానున్నట్లు తెలిసింది. అప్గ్రేడ్ కాగానే మార్కాపురం పట్టణ, రూరల్ పోలీసుస్టేషన్లకు సీఐ స్థాయి అధికారి ఇన్చార్జిగా వ్యవహరించనున్నారు. దీంతోపాటు పలువురు ఎస్సైలను కూడా అదనంగా నియమించనున్నారు. శాంతి భద్రతలపై పర్యవేక్షణ, ట్రాఫిక్ నిర్వహణ, రౌడీషీటర్లపై నిఘా తదితర అంశాలపై ప్రత్యేక నిఘా పెట్టే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ స్టేషన్ ఇన్చార్జిలుగా ఎస్సైలు వ్యవహరిస్తున్నారు. అప్గ్రేడ్ కాగానే సీఐ స్టేషన్ ఇన్చార్జిగా ఉంటారు. జిల్లా కేంద్రం కావడంతో ఇటీవల క్రైమ్ రేట్ కూడా పెరుగుతోంది. దొంగతనాలు, యాక్సిడెంట్లు, భూకబ్జా ఆరోపణలు, చిన్న చిన్న కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో పోలీసు అధికారులు రెండు స్టేషన్లను అప్గ్రేడ్ చేసి సీఐ స్థాయి అధికారిని నియమించాలని హోం శాఖకు నివేదికలు పంపారు. రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇందుకు సుముఖంగా ఉండటంతో త్వరలో మార్కాపురం పట్టణ, రూరల్ స్టేషన్లు అప్గ్రేడ్ కానున్నాయి. ప్రస్తుతం పట్టణంలో 40 మంది కానిస్టేబుల్స్, హోమ్గార్డులు, రూరల్లో కూడా అదే స్థాయిలో సిబ్బంది ఉన్నారు. మార్కాపురం మీదుగా పలు జాతీయ రహదారులు వెళ్తున్నాయి. పట్టణ శివారులోని వై జంక్షన్ నుంచి ఒంగోలు, కర్నూలు జాతీయ రహదారి, మార్కాపురంలోని కుంట వద్ద నుంచి అనంతపురం–విజయవాడ జాతీయ రహదారులు ఉన్నాయి. ఆయా మార్గాల్లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. నేరప్రవృత్తి కూడా పెరుగుతోంది. దీంతో పోలీసు సిబ్బంది సంఖ్య పెంచాలంటే స్టేషన్ను అప్గ్రేడ్ చేయాలి. ప్రస్తుతం ఉన్న సిబ్బందిలో చాలామంది ట్రాఫిక్, కోర్టు డ్యూటీలు, ఎన్బీడబ్ల్యూ (నాన్ బెయిలబుల్ వారెంటు) అందజేయడం, వివిధ కేసుల్లో ఉన్న నేరస్తులను తీసుకురావడం, సెంట్రీ డ్యూటీలు ఇతరత్రా కార్యక్రమాలకు విధి నిర్వహణలో సిబ్బందిని కేటాయించడంతో ఉన్న సిబ్బందితో లా అండ్ ఆర్డర్, కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం భారంగా మారుతోంది. ఇదే సమయంలో నైట్ బీట్లు కూడా పెంచారు. ఉదయం డ్యూటీ చేసే సిబ్బంది రాత్రిపూట ఒక్కొసారి చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో అప్గ్రేడ్ చేయడం వలన మరో నలుగురు ఎస్సైలు, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుల్స్ను నియమించే అవకాశం ఉంది. దీని ద్వారా ట్రాఫిక్ను, నేరాలను నియంత్రించవచ్చని, వివిధ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టవచ్చని స్థానిక పోలీసు అధికారులు భావిస్తున్నారు. హోంశాఖ నుంచి అనుమతి రాగానే మార్కాపురం రూరల్, టౌన్ పోలీస్స్టేషన్లు, సీఐ స్థాయి అధికారుల పాలనలోకి వెళ్లనుంది. -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
ఒంగోలు టౌన్: రాష్ట్రంలోని యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా వైఫల్యం చెందారని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జిల్లా అధ్యక్షుడు ఆర్.కరుణానిధి విమర్శించారు. జూన్ 1వ తేదీ నుంచి పల్నాడు జిల్లా కోటప్పకొండలో జరిగే విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని కోరుతూ ఆదివారం మల్లయ్యలింగం భవనంలో కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా కరుణానిధి మాట్లాడుతూ నలభై సంవత్సరాల రాజకీయ, పాలనా అనుభవం ఉందని చెప్పుకునే బాబు ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఎందుకు నెరవేర్చలేక పోయారని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో బాబు ష్యూరిటీ– జాబు గ్యారంటీ అని నినాదాలు ఇప్పుడేం పోయాయోనని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డీఎస్సీ, గ్రూప్స్, పోలీసు, రెవెన్యూ, హెల్త్, విద్యుత్ తదితర శాఖలో వేలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేసే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం యువతను దగా చేయడమేనని ధ్వజమెత్తారు. ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం యువత ఆతృతగా ఎదురుచూస్తుందన్నారు. బడా కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ పరుస్తున్న బాబు ప్రభుత్వం యువతకు మాత్రం ఉద్యోగ అవకాశాలు లేకుండా చేస్తుందని మండిపడ్డారు. కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల ద్వారా యువతను చౌక కార్మికులుగా మార్చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగాలు రాక, చేయడానికి చేతిలో పనులు లేక గ్రామీణ యువత వలస వెళుతోందని, పల్లెల్లో దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యువత ఓట్లతో అధికారంలోకి వచ్చి వారిని విస్మరించడం తగదని, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయకపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. పల్నాడు జిల్లా కోటప్పకొండలో జరుగుతున్న శిక్షణా తరగతులను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యువజన సమాఖ్య నాయకులు నాగరాజు, కట్టా ఆంజనేయులు, స్టాలిన్, ఆదర్ష్, మరియబాబు, ఏవీఎస్ చౌదరి, గోపీ పాల్గొన్నారు. రాష్ట్రాన్ని నిరుద్యోగాంధ్రప్రదేశ్గా మార్చిన కూటమి పాలకులు ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు కరుణానిధి ధ్వజం -
పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక
కంభం: మండలంలోని తురిమెళ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1975–76 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమానికి కర్నూలు ప్రభుత్వజూనియర్ కళాశాల విశ్రాంత అధ్యాపకుడు బీవీ మధుసూధనరావు అద్యక్షత వహించారు. ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ విద్యా బోధన కేవలం పాఠ్యాంశాలకు, డిగ్రీ పట్టాలకు, సర్టిఫికెట్లకు పరిమితం కాకుండా జ్ఞాన – విజ్ఞాన సహితంగా విద్యాబోధన జరిగితే జీవితంలో ఉన్నత స్థానంలో రాణిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు విద్యార్థి దశలో జరిగిన మధురమైన అనుభూతులను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను, పూర్వ విద్యార్థులను ఘనంగా సన్మానించారు. పూర్వ విద్యార్థులు రమణయ్య, లింగం వెంకటేశ్వర్లు, శిరిగిరి రమేష్, పూర్ణ చంద్రరావు, బెల్లంకొండ సాయిబాబు, గోవిందయ్య, బాలచెన్నమ్మ, ఆదిలక్ష్మి పాల్గొన్నారు. సింగరాయకొండ: విద్యుదాఘాతానికి పాకల–2 గ్రామ సచివాలయం ఎనర్జీ అసిస్టెంట్ పోట్లూరి శేషాద్రి(42) మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం పాకల బస్టాండ్ సెంటర్లోని కుంట వద్ద జరిగింది. వివరాల్లోకి వెళితే..విద్యుత్ మరమ్మతుల్లో భాగంగా శేషాద్రి బస్టాండ్ సెంటర్లోని కుంట వద్ద ఉన్న ట్రాన్స్ఫారం వద్ద ఇతర సిబ్బంది తో కలిసి మరమ్మతులు చేస్తున్నాడు. ఈ క్రమంలో శేషాద్రి విద్యుత్ స్తంభం పైకి ఎక్కి మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా విగతజీవిగా మారిపోయాడు. అయితే విద్యుత్ శాఖాధికారులు మాత్రంఅన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, విద్యుత్ సరఫరాకు అవకాశం లేదని చెబుతున్నారు. మృతదేహాన్ని విద్యుత్ స్తంభం పై నుంచి కిందకు దించేందుకు విద్యుత్ శాఖాధికారులు చాలా సేపు శ్రమించాల్సి వచ్చింది. మృతునికి భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పి.శ్రీహరి తెలిపారు. -
ఆర్టీసీ బస్టాండ్ను తనిఖీ చేసిన ఈడీ
పొదిలి రూరల్: స్థానిక ఆర్టీసీ బస్టాండ్ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రహ్మానందరెడ్డి ఆకస్మికంగా ఆదివారం రాత్రి తనిఖీ చేశారు. టాయిలెట్స్, స్టాల్స్, మంచినీటి ప్లాంటును పరిశీలించారు. మరుగుదొడ్లతో పాటు, బస్టాండ్, పరిసరాలు నిత్యం శుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. బస్టాండ్లోని సమస్యల గురించి డీఎం శంకర్రావుతో మాట్లాడి తెలుసుకున్నారు. స్టాల్స్లో అనుమతించిన మేర మాత్రమే సరుకులు, వస్తువులు, పదార్థాలు విక్రయించాలని సూచించారు. అధిక ధరలకు విక్రయించినా, నాణ్యత లోపించినా చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. ఆయనతో పాటు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సత్యనారాయణ ఉన్నారు. -
దొంగస్వామి నుంచి భూములు తిరిగి తీసుకోవాలి
ఒంగోలు వన్టౌన్: గత 24 సంవత్సరాల నుంచి గుడ్లూరు మండలం చేవూరులో దొంగస్వామిని రక్షిస్తున్న జిల్లా అధికారులపై విచారణ జరపాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఒంగోలులోని సీపీఐ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో భారత హేతువాద సంఘ అధ్యక్షుడు నార్నె వెంకటసుబ్బయ్య పాల్గొని మాట్లాడారు. 2002లో అప్పటి అటవీ శాఖామంత్రి అయ్యన్న పాత్రుడు నెల్లూరు వెళ్తూ రోడ్డు పక్కన ఉన్న పెద్ద పెద్ద కట్టడాలు, దేవుళ్లు, రాక్షసుల బొమ్మలు చూసి ఇదేమిటని లోపలికి వెళ్లి పరిశీలించారని గుర్తుచేశారు. ఆక్రమించిన భూమిలో దొంగస్వామి ఆ నిర్మాణాలు చేశాడని మంత్రి దృష్టికి అధికారులు తీసుకెళ్లారన్నారు. ఆ విషయంపై విచారణ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ 24 సంవత్సరాలుగా అధికారులు విచారణ కొనసాగిస్తూనే ఉన్నారన్నారు. ఒక పేదవాడు నివసించటానికి ప్రభుత్వ భూమిలో చిన్న గుడిసె వేసుకుంటే మరుక్షణమే కూల్చివేసే అధికారులు.. ఒక దొంగస్వామి చేవూరు సాగుచెరువు, అటవీ భూములు ఆక్రమించి ఆశ్రమం పేరుతో మోసం చేస్తుంటే ఇంతవరకు ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించారు. అటవీ భూమిలో అనాథ పిల్లల స్కూలు అని 7–4–2007న 37వ నంబర్తో జీవో తెచ్చుకుని ఆ జీవోలోని నిబంధనలకు వ్యతిరేకంగా యజ్ఞాలు, యాగాలు చేస్తూ ఎవరైనా తనిఖీకి వచ్చినప్పుడు ప్రలోభపెట్టి తనకు అనుకూలంగా రిపోర్టు రాయించుకుంటున్నాడన్నారు. 2000 సంవత్సరంలో సర్వే నంబర్ 879లోని 36 ఎకరాల చెరువు పోరంబోకు భూమిని తనదే అంటూ, ఇతరులెవరికీ హక్కు లేదంటూ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో రామదూత ఆశ్రమం పేరుతో రిజిస్టర్ చేయించుకున్నాడన్నారు. ఇటువంటి మోసగాడిని అరెస్ట్ చేసి జైల్లో వెయ్యాల్సిన అధికారులు.. ఆ పని చేయకుండా దొంగ స్వామికి వత్తాసు పలుకుతున్నారన్నారు. ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకోకుండా ఏదోక రేటుకు అతనికే అమ్ముదామనే ఆలోచన కలెక్టర్కు రావడం ఏమిటని వెంకటసుబ్బయ్య ప్రశ్నించారు. హేతువాద సంఘం చేసిన పోరాట ఫలితంగా 2021లో ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాణి సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను పరిశీలించి మంత్రులు, ఉన్నతాధికారులతో చర్చించి కలెక్టర్ పెట్టిన అమ్మకాన్ని రద్దు చేసి తక్షణమే స్వాధీనం చేసుకోండి అని ఆదేశించారన్నారు. అయినప్పటికీ ఎవరూ పట్టించుకోవడంలేదన్నారు. ఆ తర్వాత కూడా 2024లో నెల్లూరు జిల్లా కలెక్టర్ రెండోసారి అమ్మకానికి పెట్టారన్నారు. ఏ జీవో ప్రకారం అమ్మకానికి పెట్టడం జరిగిందో బహిరంగపరచాలన్నారు. 24 సంవత్సరాలుగా ఆక్రమణదారులను తన్ని తరిమివేయకుండా కాపాడిన జిల్లా అధికారులపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర హేతువాద సంఘ అధ్యక్షుడు ఎంకే బేగ్, సీపీఐ నాయకుడు ఉప్పుటూరి ప్రకాశరావు, పౌర సమాజం అధ్యక్షుడు గుమ్మళ్ల నరసింహారావు, హేతువాద సంఘ సభ్యులు రంగారెడ్డి, నజీర్ బాషా, సుభాని, సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు, ఏపీసీఎల్సీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నల్లూరి కాంతి, అద్దంకి వీరాంజనేయులు, హేతువాద సంఘ రాష్ట్ర నాయకుడు సిఖా చంద్రశేఖర్బాబు, తదితరులు పాల్గొన్నారు. 24 ఏళ్లుగా చేవూరు దొంగస్వామిని రక్షిస్తున్న జిల్లా అధికారులపై విచారణ జరపాలి ప్రజాసంఘాల నాయకుల డిమాండ్ -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
అద్దంకి: ౖబెక్ను లారీ ఢీకొన్న ప్రమాదంలో భార్యా భర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన పట్టణంలోని భవానీ సెంటర్లో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే..ముండ్లమూరు మండలం మారెళ్లకు చెందిన రామాంజనేయులు, అతని భార్య బైకుపై పనిమీద గుంటూరు వెళుతున్నారు. ఈ క్రమంలో వారి బైకు పట్టణంలోని భవానీ సెంటర్కు చేరుకోగానే లారీ ఢీకొట్టడంతో రామాంజనేయులుకు తీవ్ర గాయాలయ్యాయి. భార్యకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది క్షతగాత్రున్ని తొలుత అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరువాత ఒంగోలు వైద్యశాలకు తరలించారు. మార్కాపురం రూరల్: మండలంలోని వేములకోట పంచాయతీ పరిధిలోని కొట్టాలపల్లిలో అదివారం విషాధ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన చెవుల వీరయ్య (58)తన ఇంటి సమీపంలో ఒంటిపై గాయాలతో మృతి చెందాడు. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వేమన తెలిపారు. మార్టూరు: అనుమానాస్పదస్థితిలో మహిళ మృతిచెందిన సంఘటన మార్టూరులో ఆదివారం వెలుగు చూసింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన హరిచందన్ ప్రధాన్, జయంతి (28) అనే ఇద్దరు సీ్త్రపురుషులు భార్యాభర్తలుగా చెప్పుకుని గత నెలలో స్థానిక జాతీయ రహదారి సమీపంలోని ఓ నూలు మిల్లులో కార్మికులుగా చేరారు. శనివారం రాత్రి తమ క్వార్టర్స్లోని ఇంటి సీలింగ్ ఫ్యాన్కు జయంతి ఉరి వేసుకుని మృతి చెందిందంటూ హరిచందన్ స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. ఆదివారం ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. జయంతి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేయించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా హరిచందన్ ప్రధాన్కు గతంలో వివాహమై భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా, మృతురాలికి కూడా గతంలో వివాహమై భర్త, నలుగురు పిల్లలు ఉన్నారని సమాచారం. వీరిద్దరూ మాత్రమే గత నెలలో ఇక్కడికి వచ్చి కార్మికులుగా చేరారు. హరిచందన్ ప్రధాన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. వేటపాలెం: రోడ్డుపై ఆగి ఉన్న మోటార్ బైకును వెనుక నుంచి వచ్చి మరో మోటార్ బైకు ఢీకొన్న సంఘటనలో వెనుక కూర్చుని ఉన్న వ్యక్తి మృతి చెందాడు. అక్కాయిపాలెం పంచాయతీలో బైపాస్ రోడ్డు జంక్షన్ దగ్గరలో ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. చీరాల వైపు నుంచి ఎస్.శ్రీనివాసరావు (50) తన స్నేహితుడి మోటార్ బైకుపై వెనుక కూర్చుని వేటపాలెం వైపు వస్తున్నాడు. అక్కాయిపాలెం వద్దకు వచ్చేసరికి రోడ్డుపై నిలిపి ఉన్న మరో బైకును వెనుక నుంచి ఢీకొట్టారు. బైకు వెనుక కూర్చున్న శ్రీనివాసరావు రోడ్డుపై పడి తలకు గాయాలై మృతి చెందాడు. మృతుడు పర్చూరు కోర్టులో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేటపాలెం: సైకిల్పై వెళుతున్న వ్యక్తిని వెనుక నుంచి వచ్చిన ద్విచక్రవాహనం ఢీకొనడంతో సైకిల్పై ఉన్న వ్యక్తి మృతిచెందిన సంఘటన ఆదివారం రాత్రి వేటపాలెం మండలం పందిళ్ళపల్లి సమీపంలోని 216 జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ధోనిపూడి రమేష్ (45) రొయ్యల చెరువుల వద్ద కూలి పనులు చేస్తుంటాడు. ఆదివారం రాత్రి పనులు ముగించుకుని ఇంటికి వెళుతున్న సమయంలో పందిళ్ళపల్లి సమీపంలోని హెచ్పీ పెట్రోలు బంకు సమీపంలోని 216 జాతీయ రహదారిపై వెళుతుండగా వెనుక నుంచి గ్లామర్ ద్విచక్రవాహనం ఢీకొనడంతో రమేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. అలానే ద్విచక్రవాహనంపై ఉన్న వ్యక్తి కూడా కింద పడటంతో అతని కాలుకు తీవ్రగాయమైంది. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న వేటపాలెం ఎస్ఐ జనార్దన్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను నమోదు చేశారు. మృతుడు ధోనిపూడి రమేష్ పొట్టి సుబ్బయ్యపాలెం వాసి కాగా ప్రస్తుతం కుమార్తె లక్ష్మి వద్ద ఉంటున్నట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఎంఆర్ఎఫ్ దుకాణంలో చోరీ
కంభం: పట్టణంలో ఓ దుకాణంలో చోరీ జరగగా మరో దుకాణంలో చోరీకి దొంగలు విఫలయత్నం చేశారు. ఈ సంఘటనలు వేర్వేరు చోట్ల శుక్రవారం రాత్రి జరిగాయి. వివరాలు.. హైవే రోడ్డులో ఉన్న ఎంఆర్ఎఫ్ షోరూమ్లో రాత్రి షట్టర్ పగలగొట్టి కౌంటర్లో ఉన్న రూ.50 వేల నగదు అపహరించుకెళ్లారు. ఉదయం షోరూం వద్దకు వచ్చిన యజమాని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బస్టాండ్ సమీపంలో ఉన్న గణేష్ ఫర్నిచర్ షాపులో తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి చోరీకి విఫలయత్నం చేశారు. ఎస్సై శివకృష్ణారెడ్డి చోరీ జరిగిన షాపు వద్దకు వెళ్లి సీసీ కెమెరాలు పరిశీలించారు. ఎరుపు రంగు కారులో వచ్చిన వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. సీసీ కెమెరాలోని దృశ్యాల ద్వారా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మార్కాపురం నుంచి వచ్చిన క్లూస్ టీమ్ చోరీ జరిగిన దుకాణంలో వేలిముద్రలు సేకరించింది. -
ఇద్దరు దొంగలకు సంకెళ్లు
ఒంగోలు టౌన్: చీమకుర్తి పట్టణంలోని ఒక హార్డ్వేర్ దుకాణంలో జరిగిన చోరీ కేసులో ఇద్దరు నిందితులకు జిల్లా పోలీసులు సంకెళ్లు వేశారు. నిందితుల నుంచి భారీగా బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ హర్షవర్థన్రాజు వివరాలు వెల్లడించారు. ఎస్పీ కథనం ప్రకారం.. చీమకుర్తి పట్టణం కొత్తపేట బజార్లో నివశించే అద్దేపల్లి నగేష్బాబు ఏడాదిన్నరగా ఇసుకవాగు సెంటర్లో శ్రీ వెంకటేశ్వర హార్డ్వేర్ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ నెల 12వ తేదీ ఉదయం 8 గంటలకు ఎప్పటిలాగే దుకాణానికి వెళ్లిన నగేష్ లోపల రెండో గది ఉన్న చెక్క తలపులకు తాళం వేసే ఇనుప గడియ తొలిగించి ఉండటం కనిపించింది. అనుమానం వచ్చి చూడగా గదిలోని రెండు బీరువాల్లో దాచి ఉంచిన బంగారం, వెండి, నగదు దొంగతనానికి గురైనట్లు గుర్తించాడు. వెంటనే చీమకుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు చోరీ జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. క్లూస్ టీం సహకారంతో సాక్ష్యాధారాలు సేకరించారు. సీసీ కెమెరాలు, ఇతర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దర్యాప్తు ముమ్మరం చేశారు. నేరస్థలంలో సేకరించిన ఆధారాలతో నెల్లూరు జిల్లా సీతారాంపురం గ్రామానికి చెందిన మిరపల్లి ప్రసాద్ అలియాస్ గురవయ్య చోరీకి పాల్పడినట్లు నిర్థారణకు వచ్చారు. ఇతడు భవనాలపైకి సులువుగా ఎక్కి రూఫ్ టాప్ల ద్వారా దుకాణాలు, ఇళ్లల్లోకి ప్రవేశించి దొంగతనాలు చేయడంలో దిట్ట. ఇతడు నెల్లూరు జిల్లా సీతారాంపురం, ప్రకాశం జిల్లా టంగుటూరు, కందుకూరు, పొదిలి, కనిగిరి, శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ పోలీసుస్టేషన్ల పరిధిలో 13 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చీమకుర్తి సీఐ డి.ప్రసాద్, చీమకుర్తి, మద్దిపాడు, కొత్తపట్నం, ఒంగోలు తాలుకా, సంతనూతలపాడు ఎస్సైలు ఎల్.సంపత్కుమార్, జి.వెంకటసూర్య, యూ.సుధాకర్, ఎం.సుదర్శన్, అజయ్బాబులు బృందంగా ఏర్పడ్డారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం కనిగిరి మండలం నందిమారెళ్ల శివాలయం వద్ద పామూరు వైపు నుంచి వస్తున్న ప్రసాద్, గుంటూరు జిల్లా పెద్ద పలుకలూరు గ్రామానికి చెందిన కుంభా సాంబయ్యలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 34 సవర్ల బంగారం, సుమారు 2 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు. పామూరులోని పీడీసీసీ బ్యాంకు, దుత్తలూరులోని ఎస్బీఐల్లో ప్రసాద్ డిపాజిట్ చేసిన నగదు 5.95 లక్షల రుపాయలను మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. చోరీ జరిగిన పది రోజుల్లోనే కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ హర్షవర్థన్రాజు అభినందించారు. చోరీ చేసిన పది రోజుల్లోనే పట్టుకున్న ఖాకీలు ప్రధాన నిందితుడిపై 13 చోరీ కేసులు నిందితుల నుంచి రూ.37 లక్షల సొత్తు స్వాధీనం చోరీ వివరాలు వెల్లడించిన ఎస్పీ హర్షవర్థన్రాజు -
ఉత్సాహంగా రాష్ట్ర స్థాయి అండర్ 13 చెస్ పోటీలు
మార్కాపురం: మార్కాపురం పట్టణంలోని కేఆర్ గ్రౌండ్ ఫంక్షన్ హాలులో అండర్ 13 రాష్ట్ర స్థాయి బాలుర, బాలికల చెస్ చాంపియన్షిప్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో తొలిసారిగా నిర్వహించిన ఈ పోటీల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 146 మంది క్రీడాకారులు పాల్గొన్నట్టు చెస్ ప్రతినిధి పీసీహెచ్ బసవేశ్వరరావు, చీఫ్ ఆర్బిటర్ జీవీకుమార్ తెలిపారు. ఈ పోటీలు 23, 24 తేదీల్లో జరుగుతున్నాయని, విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో చక్కా రామగోపాల్, చెన్నయ్య, వీరయ్య, ప్రభుదాస్, తదితరులు పాల్గొన్నారు. ● జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఇన్చార్జి కార్యదర్శి సీహెచ్వీ రామకృష్ణ ఒంగోలు: బాల్య వివాహాలు చట్ట ప్రకారం నేరం అని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఇన్చార్జి కార్యదర్శి సీహెచ్వీ రామకృష్ణ అన్నారు. స్థానిక జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో శనివారం మతపెద్దలతో బాల్య వివాహాల నిర్మూలన అనే అంశంపై న్యాయమూర్తి అవగాహన కల్పించారు. బాల్య వివాహాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నా, వాటికి సహకరించినా, వాటి నిర్వహణ చేసినా చట్ట ప్రకారం శిక్షలు ఉంటాయని పేర్కొన్నారు. తప్పు తెలిసి చేసినా, తెలియక చేసినా చట్ట ప్రకారం శిక్షార్హులే అని, ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. తద్వారా సమాజంలో చట్టపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవించవచ్చన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తే ప్రకాశం జిల్లాలో అత్యధికంగా బాల్య వివాహాలు నమోదవుతున్నాయని, ఈ విషయం పట్ల అధికారులు, ప్రజలు, మతపెద్దలు అవగాహన కలిగి ఉండి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో చెన్నకేశవ స్వామి ఆలయ అర్చకులు రాంబాబు, శ్రీధర్, ముస్లిం మతపెద్దలు ఖాదర్బాషా, క్రైస్తవ మతపెద్దలు జెర్మియా తదితరులు పాల్గొన్నారు. ● రైతు సంఘ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పమిడి వెంకటరావు మార్కాపురం: వెలిగొండ ప్రాజెక్టు నీటిని వచ్చేనెల చివరి నాటికి ఇస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలని రైతు సంఘ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పమిడి వెంకటరావు డిమాండ్ చేశారు. రైతు సంఘ జిల్లా మహాసభల ముగింపు సందర్భంగా శనివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 30 ఏళ్లుగా ఈ ప్రాజెక్టును ఉపయోగించుకుని రాజకీయంగా లబ్ధిపొందుతున్నారే కానీ, ప్రాజెక్టు పూర్తిచేసి ఈ ప్రాంత అభివృద్ధికి చేసిందేమీలేదన్నారు. నిర్వాసితుల నష్టపరిహారం, మిగిలిన కాలువల పనులు పూర్తికావాలంటే ఇంకా రూ.3500 కోట్లు ఖర్చుచేయాల్సి ఉండగా, జూన్ నెలలో ప్రాజెక్టు ద్వారా నీరు అందిస్తామని చెప్పడం మరొకసారి ఈ ప్రాంత ప్రజలను మోసం చేసినట్లేనని అన్నారు. మార్కాపురం జిల్లా నూతన కమిటీ ఎన్నిక.. రైతు సంఘ మార్కాపురం జిల్లా కమిటీ అధ్యక్ష, కార్యదర్శులుగా డీ తిరుపతిరెడ్డి, ఊసా వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా పీ తిప్పారెడ్డి, గాలి వెంకట రామిరెడ్డిలను ఎన్నుకున్నట్లు సహాయ కార్యదర్శిగా ఎన్నికై న డీ సోమయ్య తెలిపారు. -
అడ్డేలేదయ్యా..!
మట్టి మాఫియా చెలరేగిపోతోంది. చెరువులను ఇష్టానుసారం తవ్వేస్తోంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండదండలతో చెరువులను చెరబడుతోంది. రాత్రింబవళ్లు చెరువులను తవ్వేసి మట్టిని అక్రమంగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటోంది. సాగునీటి చెరువులు గుల్లవుతున్నాయి. రియల్ ఎస్టేట్ భూములకు ఈ మట్టిని తరలించేస్తున్నారు. చెరువుల్లో మట్టిని తవ్వి ప్లాట్లకు తరలిస్తున్నా మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు చోద్యం చూస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మట్టి మాఫియా..వీరేపల్లి చెరువులో సాగుతున్న మట్టి తవ్వకాలు కందుకూరు: నియోజకవర్గంలో మట్టి మాఫియా పేట్రేగిపోతోంది. ప్రధానంగా గుడ్లూరు, ఉలవపాడు మండలాల్లోని సాగునీటి చెరువులను ఆసరాగా చేసుకుని మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ మండలాల్లో కావలి, కందుకూరు నియోజకవర్గాలకు సరిహద్దుగా ఉన్న గ్రామాల చెరువుల్లో మట్టి తవ్వి తరలించేస్తున్నారు. జాతీయ రహదారి పక్కన వెలుస్తున్న రియల్ ఎస్టేట్ వెంచర్లకి, కావలి ప్రాంతానికి ఇక్కడి నుంచే మట్టిని తరలిస్తున్నారని తెలుస్తోంది. రెండు రోజుల కిందట నర్సాపురం కుంటి చెరువు నుంచి పక్కనే ఉన్న ఓ రియల్ వెంచర్ 5 వేల ట్రిప్పుల మట్టిని తరలించారని తెలుస్తోంది. అలాగే వీరేపల్లి చెరువు నుంచి శనివారం భారీ ఎత్తున మట్టి తవ్వకాలు చేశారు. ఇలా ఎక్కడ పడితే అక్కడ చెరువుల్లో ఇష్టారీతిన మట్టి తవ్వకాలు చేస్తున్నారు. అలాగే జాతీయ రహదారి 167బి పక్కన కందుకూరు, సింగరాయకొండ మధ్యలో కొత్తగా పుట్టుకొచ్చిన వెంచర్లకు చెరువులు, కుంటల నుంచి వేల ట్రిప్పుల మట్టిని తరలిస్తున్నారు. పట్టపగలే బహిరంగంగానే జేసీబీలు ఏర్పాటు చేసి ఇష్టారీతిన మట్టి తవ్వకాలు చేస్తున్నారు. ఈ మట్టి మాఫియా వెనకాల అధికార పార్టీకి చెందిన కీలక నేత హస్తం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన అనుమతితోనే మట్టి మాఫియా చెలరేగిపోతుందని తెలుస్తోంది. అదే సందర్భంలో చెరువుల్లో సాగుతున్న మట్టి తవ్వకాల గురించి స్థానిక ఇరిగేషన్శాఖ అధికారులకు తెలియనిది కాదు. ఈ మాఫియాకు ఆశాఖ ఉన్నతాధికారి మద్దతు ఉందనేది బహిరంగ రహస్యమే. అధికార పార్టీ కీలక నేత ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్న ఈ అధికారి చెరువుల్లో సాగుతున్న తవ్వకాల గురించి ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నర్సాపురం వద్ద ఉన్న కుంటి చెరువుల్లో మట్టి తవ్వకాల గురించి ఈ అధికారికి ముందే తెలిసినా ఆ వైపు కన్నెత్తి చూడకుండా మిగిలిన సిబ్బందిని కూడా అడ్డుకున్నట్లు సమాచారం. ఉన్నతాధికారుల నుంచి ఇప్పటికే పలుమార్లు మెమోలు అందుకున్న ఈ అధికారి తీరులో మాత్రం ఏమాత్రం మార్పు రావడం లేదు. ఉన్నతాధికారుల ఆదేశాలు అంటే తనకు లెక్కేలేదన్నట్లు సదరు అధికారి వ్యవహార శైలి ఉంది. దీంతో మట్టి మాఫియాకి నియోజకవర్గంలో ఎదురేలేకుండా పోతోంది. ఫలితంగా ఇరిగేషన్ చెరువుల భద్రత ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. అయినా సరే మట్టిమాఫియా ఇచ్చే కమీషన్లకు అలవాటు పడ్డ స్థానిక అధికారులు చెరువుల భద్రత గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. -
ప్రకాశం
ఆదివారం శ్రీ 24 శ్రీ మే శ్రీ 2026ఇంట్లో ఉండలేక.. బయటకు రాలేక.. 7కొండపి మండలం పెద్దకండ్లగుంటలో టీడీపీ నాయకులు అక్రమాలకు తెరలేపారు. కోర్టులో స్టే ఉన్న ప్రదేశంలో లెవలింగ్ పనులు చేస్తున్నారు.ఒంగోలు సబర్బన్: భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. నాలుగు రోజులుగా ఉమ్మడి జిల్లా వేడి సెగలతో ఉడికిపోతోంది. 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్ర ఉక్కబోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. సోమవారం నుంచి రోహిణీ కార్తె ప్రారంభం కానుంది. 24వ తేదీ నుంచి మూడు రోజుల పాటు 44 నుంచి 47 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా శనివారం అత్యధికంగా కొండపిలో 43 డిగ్రీలు నమోదైంది. కనిగిరి 42.5, పుల్లలచెరువు, అద్దంకిల్లో 42.1, ఒంగోలు, త్రిపురాంతకం, బల్లికురవ, జేపంగులూరు, చీమకుర్తి, నాగులుప్పలపాడుల్లో 42 డిగ్రీలు నమోదైంది. ఒంగోలు నగరంలో ఉదయం 11 గంటల వరకూ ఎండతీవ్రత తక్కువగా ఉంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి భానుడు ప్రతాపం చూపించాడు. రాత్రి ఎనిమిది గంటలు దాటినా సెగలు తగ్గలేదు. కొన్ని ప్రాంతాల్లో తరుచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో ప్రజల అవస్థలు వర్ణనాతీతంగా మారింది. రెండు రోజులుగా కరెంటు కోతలు విధిస్తుండడంతో ఇబ్బందులు పడ్డారు. ఇంట్లో ఉండలేక..బయటకు రాలేక పడుతున్న ఇక్కట్లు అన్నీఇన్నీ కావు. భానుడి భగభగలతో జిలా్ోల్లని పలు ప్రాంతాలు ఉదయం 11 గంటల నుంచే జనంలేక వెలవెలబోయాయి. నిత్యం రద్దీగా ఉండే నగర కూడళ్లు సైతం నిర్మానుష్యంగా మారాయి. రాత్రి వేళలో కూడా వేడి తగ్గని పరిస్థితి ఉండడంతో వృద్ధులు, చిన్నారులే కాదు, యువత కూడా రోడ్డు మీదకు రావాలంటే భయపడుతున్నారు. రేపటి నుంచి రోహిణీ కార్తె... రోహిణీ కార్తె అంటేనే రోళ్లు పగులుతాయన్నది నానుడి. సోమవారం నుంచి రోహిణీ కార్తె ప్రారంభం కానుంది. అంతకు ఒక రోజు ముందు ఆదివారం నుంచే 45 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు ఉండవచ్చని వాతావరణ శాఖ సూచిస్తోంది. మధ్యాహ్నం వేళ బయటకు రావొద్దు.. ఎండలు ఎక్కువగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల్లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావడం మంచిది కాదంటున్నారు. ముఖ్యంగా రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఇలాంటి వారు వడగాడ్పులకు త్వరగా డీ హైడ్రేషన్కు గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. మరోవైపు గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లల విషయంలోనూ అప్రమత్తత అవసరమని, ఇంట్లో ఉన్నా వేడి తీవ్రతకు గురవుతారని అంటున్నారు. ఇంట్లోకి వేడిగాలులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రమేష్ బాబు (ఫైల్)వేము నారమ్మ (ఫైల్) ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉష్ణోగ్రతలు గరిష్టం కనిష్టం కొండపి 43 30 కనిగిరి 42.5 31 పుల్లలచెరువు 42.1 31 అద్దంకి 42.1 30 ఒంగోలు 42 30 త్రిపురాంతకం 42 31 బల్లికురవ 42 31 జేపంగులూరు 42 30 చీమకుర్తి 42 31 నాగులుప్పలపాడు 42 30 తాళ్లూరు 41 30 టంగుటూరు 41 30 తాళ్లూరు: మండలంలో వేర్వేరు గ్రామాల్లో వడదెబ్బకు శనివారం ఇద్దరు మృతి చెందారు. మండలంలోని రజానగరం ఎస్సీ కాలనీకి చెందిన పెరికల రమేష్ బాబు (45) వడదెబ్బకు మృతి చెందాడు. అతనికి మూడేళ్ల క్రితం ప్రమాదవశాత్తు కాలు విరిగింది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అలాగే మండలంలోని చింతలపాలెం ఎస్సీ కాలనీకి చెందిన వృద్ధురాలు వేము నారమ్మ (70) వడదెబ్బతో మృతి చెందింది. -
వృద్ధులను మోసం చేస్తున్న ముఠా అరెస్టు
కందుకూరు: వృద్ధులకు మాయమాటలు చెప్పి కారులో ఎక్కించుకుని మోసం చేస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు పట్టణ ఎస్సై పులి శివనాగరాజు శనివారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. పట్టణంలోని పామూరు బస్టాండ్లో బస్సు కోసం ఒంటిరిగా నిలబడి ఉండే వృద్ధులను ముఠా సభ్యులు లక్ష్యంగా చేసుకుంటారు. వారితో మాటలు కలిపి తాము మీ ఊరికే వెళ్తున్నామంటూ నమ్మించి కారులో ఎక్కించుకుంటారు. అనంతరం పట్టణం దాటిన తర్వాత కత్తితో బెదిరించి వారి వద్ద ఉన్న బంగారు నగలు, డబ్బు లాక్కుంటారు. అనంతరం వారిని బహిరంగ ప్రదేశంలో వదిలేసి వెళ్లిపోతారు. బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు చేసి ఓ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు సవర్ల బంగారు ఉంగరాలు, నేరానికి ఉపయోగించిన కారు, కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు తమ కారులో వదిలిపెడతామని మాయమాటలు చెప్పితే వారిని నమ్మవద్దని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై సూచించారు. -
పరిశుభ్రత అందరి బాధ్యత
● నగరంలోని వీధులు ఊడ్చిన కలెక్టర్ రాజాబాబు ఒంగోలు సబర్బన్: పరిశుభ్రత ప్రతి పౌరుడి బాధ్యత అని కలెక్టర్, ఒంగోలు నగర పాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ పి.రాజాబాబు పేర్కొన్నారు. శ్రీఆపరేషన్ క్లీన్ స్వీప్శ్రీ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఒక రాష్ట్రం–ఒక పరిశుభ్రత లక్ష్యం కార్యక్రమంలో భాగంగా శనివారం ఒంగోలు కలెక్టరేట్ వద్ద నిర్వహించిన మున్సిపాలిటీ ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని కలెక్టర్ పి.రాజాబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ నుంచి నెల్లూరు బస్టాండ్ వరకు చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా పాల్గొని చీపురు పట్టి పారిశుధ్య పనులు చేపట్టారు. నెల్లూరు బస్టాండ్ వద్ద తాటి ముంజలు అమ్ముకునే వారితో, తోపుడు బండిపై రాగి జావ అమ్ముకునే వారితో, ప్రజలతో కలెక్టర్ మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని మే 23వ తేదీ నుంచి నాలుగు వారాలపాటు అమలు చేస్తారని, మొదటి వారంలో నగరంలోని చెత్త ఎక్కువగా పేరుకుపోయే రెడ్ స్పాట్లు (ఎక్కువగా చెత్త పేరుకుపోయే ప్రాంతాలు), యెల్లో స్పాట్లు (పాక్షికంగా చెత్త పేరుకుపోయే ప్రాంతాలు) పూర్తిగా తొలగించడంపై దృష్టి సారిస్తారన్నారు. రెండవ వారంలో కాలువలు, డ్రైనేజీ వ్యవస్థలను శుభ్రపరిచి, నీటి నిల్వలు, వరద సమస్యలను నివారించడానికి చర్యలు తీసుకోవడం, మూడవ వారంలో నివాస, వాణిజ్య ప్రాంతాల్లో పరిశుభ్రతను మెరుగుపరచడం, నాల్గవ వారంలో పబ్లిక్ టాయిలెట్స్, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రజా ప్రదేశాలను శుభ్రపరచడం ద్వారా హైజీన్ ప్రమాణాలను పెంచడం వంటి కార్యక్రమాలు చేపడతారన్నారు. కార్యక్రమంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయకుమార్, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకట క్రిష్ణయ్య, ఒంగోలు కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, మెప్మా సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, ప్రజలు పాల్గొన్నారు. -
చెడ్డీ గ్యాంగ్తో అప్రమత్తంగా ఉండాలి
మార్కాపురం టౌన్: మార్కాపురం ప్రాంతంలో చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా మహిళలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ నాగరాజు హెచ్చరించారు. చెడ్డీ గ్యాంగ్ కదలికల సమాచారంతో శనివారం పట్టణంలోని లాడ్జిలు, శివారు ప్రాంతాలను పోలీసు అధికారులు తమ సిబ్బందితో తనిఖీలు చేశారు. పట్టణ శివారుల్లో గుడారాలు వేసుకుని ఉన్న అనుమానితులను ప్రశ్నించారు. వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ నాగరాజు మాట్లాడుతూ రాత్రి సమయాల్లో ఇళ్ల తలుపులు, కిటికీలు బిగించి పెట్టుకోవాలని, అనుమానాస్పదంగా కనిపిస్తే సమీప పోలీసుస్టేషన్లో సమాచారం ఇవ్వాలన్నారు. అపరిచితులను ఇంట్లోకి అనుమతించొద్దని, నగదు, బంగారు ఆభరణాలు భద్రంగా ఉంచుకోవాలన్నారు. కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఒంటరిగా ఉన్న వృద్ధులు, మహిళల ఇళ్లపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనుమానాస్పదంగా వాహనాలు, వ్యక్తులు కనిపిస్తే డయల్ 100, పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. రాత్రి వేళల్లో పోలీసుల గస్తీ ముమ్మరం చేసినట్లు డీఎస్పీ నాగరాజు పేర్కొన్నారు. డీఎస్పీ నాగరాజు -
కంత్రి పనులు
మంత్రి ఇలాఖాలో సాక్షి టాస్క్ఫోర్స్: కొండపి మండలం పెద్దకండ్లగుంటలో టీడీపీ నాయకులు అక్రమాలకు తెరలేపారు. కోర్టులో స్టే ఉన్న ప్రదేశంలో లెవెలింగ్ పనులు ప్రారంభించారు. 2014 టీడీపీ ప్రభుత్వంలో గ్రామ సర్వే నంబర్ 195/4లో 35 ప్లాట్లు వేశారు. 2019 ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న దురుద్దేశంతో ఎటువంటి ప్రొసీడింగ్స్ లేకుండా అప్పటి ఎమ్మెల్యే స్వామి ప్రోద్బలంతో ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. అనంతరం తహసీల్దార్ చిరంజీవి, ఎమ్మెల్యే స్వామిలు కలిసి నల్లపుకొండ స్వామి, దాసరి మాలకొండయ్య, గర్నిపూడి సుందరరావు, దంతం హరిబాబు, మల్లవరపు శేషయ్యలకు ప్లాట్లు ఇచ్చారు. మిగిలిన వారికి కూడా ఇస్తామన్నారు. అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించి అధికారంలోకి వచ్చింది. ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించాలన్న లక్ష్యంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జగనన్న కాలనీల పేరుతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. 195/1 సర్వే నంబర్లు బీసీ, ఓసీలకు, 195/4 సర్వే నంబర్లు ఎస్సీలకు జగనన్న కాలనీలో ఇళ్లు మంజూరు చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నించారు. 195/4లో తమకు ఇళ్ల పట్టాలు మంజూరయ్యాయని 45 మంది 2020 మే 15న కోర్టుకు వెళ్లారు. ఈ విషయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ సర్పంచ్ భువనగిరి సత్యనారాయణ అదే ఏడాది మే 30న ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అధికారులు సమాచారం కోరారు. ఒక్క కోర్టుకు సంబంధించిన ఆర్డర్ మాత్రమే తమ వద్ద ఉందని, దానికి ప్రొసీడింగ్స్ కూడా లేవని ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అధికారులు ఆయనకు సమాచారం అందించారు. 2021లో అప్పటి తహసీల్దార్ 195/4లో ఇచ్చిన ఇళ్ల పట్టాలు రద్దు చేయాలని కోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం ఆ స్థలంపై 7029/2020 నంబర్తో హైకోర్టులో స్టే ఆర్డర్ ఉంది. ఇప్పుడు ఇలా.. కోర్టులో పెండింగ్లో ఉన్న స్థలంలో ఎవరూ ఎటువంటి పనులు చేసేందుకు అవకాశం లేదు. తమ ప్రభుత్వం అధికారంలో ఉందని, తాము ఏది చేసినా చెల్లుతుందన్న ధోరణితో కూటమి నాయకులు కోర్టులో పెండింగ్లో ఉన్న స్థలంలో నూతనంగా మళ్లీ ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని కొత్త నాటకానికి తెరలేపారు. అంతటితో ఆగకుండా లెవలింగ్ పనులు కూడా ప్రారంభించారు. అప్పట్లో ఆ స్థలంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఇప్పటికీ రద్దు కాలేదు. అప్పటి లబ్ధిదారుల్లో 21 మందికి జగనన్న కాలనీలో ఇళ్లు కూడా మంజూరయ్యాయి. కోర్టు పరిధిలో ఉన్న స్థలంతో పాటు దాని వెనుకే ఉన్న ఉన్న సర్వే నంబర్ 125లో పోరంబోకు భూమిని కొంతమేర ఆక్రమించి లెవెలింగ్ పనులు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొండపి నియోజకవర్గంలో టీడీపీ నాయకులది ఇష్టారాజ్యమైంది. కూటమి నాయకులు అక్రమంగా డబ్బులు సంపాదించేందుకు దొడ్డిదారులు వెతుకుతున్నారు. కోర్టు ఆర్డర్లను సైతం ధిక్కరిస్తూ ప్రభుత్వం తమదే అనే ధీమాతో ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధికారులను సైతం పక్కదారి పట్టిస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా అందిన కాడికి దండుకుంటున్నారు. ఇళ్ల స్థలాల స్వాధీనానికి టీడీపీ నేతల ప్లాన్ కోర్టులో ఉన్న స్థలంలో ఇళ్ల పట్టాల కోసం కుయుక్తులు అప్పట్లో ఆర్డీవో ప్రొసీడింగ్స్ లేకుండానే నివేశన స్థలాల పంపిణీ ప్రభుత్వ నిధులు కాజేసేందుకు అదే సర్వే నంబర్లో లెవలింగ్ పనులు ఆదాయం కోసం అన్వేషణ పేదలకు పట్టాలివ్వాలన్న సాకుతో లెవలింగ్ పనుల ద్వారా నాలుగు రాళ్లు వెనకేసుకోవాలన్న ఉద్దేశంతో కూటమి నాయకులు అధికారుల చుట్టూ ప్రస్తుతం ప్రదిక్షణాలు చేస్తున్నారు. ముఖ్యంగా నిధులను ఉపాధి హామీ పథకం ద్వారా డ్రా చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కూటమి నేతల కుట్రలకు అధికారులు సహకరిస్తారా..? అన్న ప్రశ్న స్థానికుల్లో ఉత్పన్నమైంది. అసలు కోర్టు పరిధిలో ఉన్న స్థలంలో ఏ విధంగా పనులు చేస్తారని ప్రజలు, కూటమిలో ఒక వర్గం నాయకులు చర్చించుకోవడం గమనార్హం. -
ట్రాక్టర్ ఢీకొని మహిళ దుర్మరణం
బేస్తవారిపేట: ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని కొత్తపల్లి సమీపంలో శనివారం జరిగింది. వివరాలు.. మండలంలోని అక్కపల్లి గ్రామానికి చెందిన కొమ్మ పెద్దరంగమ్మ (41) తన భర్త సైదయ్యతో కలిసి ద్విచక్ర వాహనంపై బేస్తవారిపేట వెళ్తోంది. కొత్తపల్లి గ్రామ సమీపంలో ట్రాక్టర్ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన పెద్దరంగమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పెద్దదోర్నాల: చీరకు నిప్పంటుకుని ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలోని నల్లగుంట్లలో శుక్రవారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన మూగెమ్మ చీరకు నిప్పంటుకుని శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. భర్త గురవయ్య అందించిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి వంట చేసేందుకు పొయ్యి దగ్గరకు వెళ్లిన మూగెమ్మకు ప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకుంది. దీంతో మంటల చెలరేగటంతో 50 శాతానికిపైగా శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమాచారాన్ని అందుకున్న 108 సిబ్బంది హుటాహుటిన నల్లగుంట్లకు చేరుకుని క్షతగాత్రురాలిని మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. దీంతో వైద్యాధికారులు ప్రాథమిక చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. -
అత్యంత ఖరీదైన ప్రాంతం.. అక్కడ ఎకరా రూ.18 కోట్లు.. అంత విలువైన రెండెకరాల ప్రభుత్వ స్థలం సైకిల్ పార్టీ వశమైంది. సొంత పార్టీ కార్యాలయ నిర్మాణానికి చవగ్గా కట్టబెట్టేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సుమారు రూ.36 కోట్లున్న స్థలాన్ని సంవత్సరానికి కేవలం రూ.2 వేలకు లీ
శనివారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2026టీడీపీకి కేటాయించిన స్థలానికి కూత వేటు దూరంలో ఉన్న ఎకరా స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు లీజుకు తీసుకున్నారు. దానికి నెలకు రూ.25 వేలకు అద్దెకిచ్చారు. ఎకరాకు రూ.25 వేల చొప్పున రెండు ఎకరాలకు కలిపితే రూ.50 వేలు. ప్రైవేటు స్థలానికి నెలకు రూ.50 వేలు ఎక్కడ, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయానికి కేటాయించిన స్థలానికి సంవత్సరానికి రూ.2 వేలు ఎక్కడా..? చంద్రబాబు అని ప్రజలు విమర్శిస్తున్నారు.ఒంగోలు నగరంలో గూడు కోసం నిరుపేద మూడు సెంట్ల స్థలం అడిగితే వంద నిబంధనలు పెడతారు. నగరంతో పాటు మున్సిపాలిటీల్లో, నగర పంచాయతీల్లో సొంతింటి కల నెరువేర్చుకోవాలనుకున్న నిరుపేదలకు మూడు సెంట్ల స్థలం అందని ద్రాక్షేమరి. మున్సిపాలిటీల్లో, నగరపాలక సంస్థల్లో మూడు సెంట్లు ఇవ్వడానికి నిబంధనలు అంగీకరించవు. కేవలం 2 సెంట్లు, లేకుంటే ఒకటిన్నర సెంటు మాత్రమే ఇవ్వగలమని అధికారులు, ఎమ్మెల్యేలు తెగేసి చెబుతారు. కానీ, సొంత రాజకీయ పార్టీ కార్యాలయానికి మాత్రం రూపాయికి, వెయ్యి రూపాయలకు ఎకరాల ఎకరాలు ఇచ్చేస్తారు. ఇదీ అధికార తెలుగుదేశం పార్టీ తీరు అంటూ.. అత్యంత తక్కువ లీజు ధరకు ప్రభుత్వ స్థలాన్ని ధారదత్తం చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.రూ.1.32 లక్షలతో..66 ఏళ్లు పచ్చగా! -
ఇవిగో నిధులు.. అవిగో నీళ్లు!
మేదరమెట్ల: పక్కనే గుండ్లకమ్మ జలాశయం నిండుకుండలా ఉన్నా ఆ నీళ్లు తమ పొలాలకు మళ్లించే నాథుడు లేక మెట్ట ప్రాంత రైతులు కన్నీరు పెడుతున్నారు. పథకానికి శంకుస్థాపన చేసి పదిహేనేళ్లు దాటింది. కొరిశపాడులో యర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకం పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా మిగిలింది. అవిగో నీళ్లు.. ఇవిగో నిధులు..అంటూ మభ్యపెట్టడమే తప్ప క్షేత్రస్థాయిలో పథకం పనులు పూర్తి చేసి తమ గొంతు తడిపేవారు కరువయ్యారని కొరిశపాడు, నాగులుప్పలప్పాడు మండలాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆశల పల్లకిలో అడియాశలు దాదాపు 20 వేల ఎకరాల ఆయుకట్టుకు సాగునీరు అందించే లక్ష్యంతో గుండ్లకమ్మ నీటి ఆధారంగా ఆ పథకాన్ని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రారంభించారు. ఆయన అకాల మరణం తర్వాత వచ్చిన ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా పథకం పనులు పడకేశాయి. నష్టపరిహారం కూడా ఇవ్వని ప్రభుత్వం ఎత్తిపోతల పథకం నిర్మాణంతో ముంపునకు గురైన కొరిశపాడులోని తూర్పుపాలెం గ్రామ నిర్వాసితులకు నష్టపరిహారం అందించడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గ్రామం మొత్తం ముంపునకు గురికావడంతో కొన్నేళ్లుగా గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికై నా నష్టపరిహారంతో పాటు నిర్వాసితులకు పునరావాసం కల్పించాలిన తూర్పుపాలెం వాసులు కోరుతున్నారు. హామీలు నీటి మూటలేనా? ఇటీవల కలెక్టర్ రాజాబాబు, ఇతర అధికారులు ఆ పథకానికి సంబంధించిన కొరిశపాడు రిజర్యాయర్ను సందర్శించారు. అప్పుడు ఆయన మాట్లాడుతూ పథకం పూర్తి చేసేందుకు రూ.35 కోట్లు కేటాయించారని, రెండు, మూడు నెలల్లో పనులు పూర్తి చేసి రైతులకు నీరు అందిస్తామని ప్రకటించారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. ప్రకటించిన నిధులు విడుదల కాకపోవడం, కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించక పోవడంతో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి. గడిచిన పదిహేనేళ్ల నుంచి ఎప్పటికప్పుడు ఈ సీజన్లో నీరు అందుబాటులోకి వస్తుందని, రెండు మండలాలకు చెందిన రైతులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కపటి ప్రేమను వీడి తక్షణమే నిధులు విడుదల చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి ఈ ఏడాదికై నా గుండ్లకమ్మ జలాలు అందించేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. పడకేసిన యర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకం గుండ్లకమ్మ పారేదెన్నడు? దశాబ్దానికిపైగా తీరని రైతుల వెతలు తుప్పుపడుతున్న పైపులైన్లు హామీలకే పరిమితమైన చంద్రబాబు ప్రభుత్వం -
రాజకీయ స్వార్థం కోసం విభజన వద్దు
మార్కాపురం: జిల్లా కేంద్రమైన మార్కాపురం మున్సిపాలిటీలో వార్డుల విభజన సక్రమంగా జరగలేదని, సమగ్ర విచారణ జరిపి రాజకీయ కోణంలో కాకుండా ప్రజల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని వార్డుల పునర్విభజన చేయాలని వైఎస్సార్ సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు శుక్రవారం కలెక్టర్ ఎం.విజయసునీత, కమిషనర్ నారాయణరావును కలిసి వినతిపత్రాలు అందజేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం మార్కాపురం పట్టణంలో 35 వార్డులు ఉండగా 40 వార్డులకు పెంచారని, విభజన ప్రక్రియ అసంబద్ధంగా జరిగిందని తెలిపారు. మున్సిపల్ నిబంధనలు, 2025 జనాభా లెక్కల ప్రకారం విభజన చేయాలని, అలా కాకుండా కొంత మంది నాయకుల స్వార్థం కోసం, కొన్ని రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసం విభజన చేశారని ప్రజలు తనకు ఫిర్యాదు చేశారని తెలిపారు. విభజన ప్రక్రియలో డోర్ నంబర్లు, హద్దులు సరిగా లేవని, మ్యాప్లు కూడా రిలీజ్ చేయలేదని అన్నారు. 1 నుంచి 19 వార్డుల్లో ఒక వార్డును, 20 నుంచి 30 వార్డుల్లో ఒక వార్డును మాత్రమే పెంచి మిగిలిన 5 వార్డుల్లో 3 వార్డులను కొత్తగా ఏర్పాటు చేశారన్నారు. మున్సిపల్ నిబంధనలను ఏమాత్రం పాటించలేదన్నారు. శాశ్వత ప్రయోజనాలను, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని వార్డుల విభజన చేపట్టి ఉంటే బాగుండేదని అన్నారు. మళ్లీ రీ సర్వే చేయాలని కలెక్టర్, కమిషనర్ను కోరినట్టు అన్నా రాంబాబు వివరించారు. తమ అభ్యంతరాలను అధికారులు పరిశీలించాలని కోరారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ప్రజలకు సౌకర్యవంతంగా మళ్లీ విభజన చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఇదే విషయంపై మున్సిపల్ మాజీ చైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ మున్సిపల్ డైరెక్టర్ కార్యాలయంలో కూడా వినతిపత్రాన్ని అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి షంషేర్ ఆలీబేగ్, పార్టీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు సలీమ్, సత్యంరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, పార్టీ నాయకులు బట్టగిరి తిరుపతిరెడ్డి, ఆసీఫ్ఖాన్, నాలి కొండయ్య, సీహెచ్ శ్రీనివాసులు, బి.శేషయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని వార్డులు విభజించాలి ప్రస్తుతం వార్డుల విభజన సక్రమంగా జరగలేదు కలెక్టర్, కమిషనర్కు ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు -
మరోవైపు వాన
ఓ వైపు ఎండ..నాగంపల్లి పొలాల్లో దెబ్బతిన్న ట్రాన్స్ఫాం, విరిగిన స్తంభంచీమకుర్తి బైపాస్లో చెట్లు విరిగి అడ్డంగా పడిన వాటిని తొలగిస్తున్న దృశ్యాలుఒంగోలు సబర్బన్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం భిన్న వాతావరణం నెలకొంది. ఒక పక్క సూర్యుడు సుర్రుమంటే మరో పక్క ఈదురుగాలులతో వాన కురిసింది. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా కనిగిరిలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. త్రిపురాంతకంలో 40.7, బల్లికురవలో 40.5 డిగ్రీలు నమోదైంది. మార్కాపురం జిల్లాలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం పడి రెండు, మూడు రోజులుగా భగ్గుమన్న భానుడు ఒక్క రోజు కాస్త ఊరట కలిగించాడు. ఒంగోలు నగరంలో మధ్యాహ్నం కాసేపు చిరుజల్లులు పడివాతావరణం చల్లబడింది. ఈదురు గాలులతో భారీ వర్షం గిద్దలూరు రూరల్: ఉరుములు, మెరుపులతో ఈదురు గాలుల భారీ వర్షం కారణంగా మండలంలోని ఉయ్యాలవాడ, సూరేపల్లె, లింగాపురం గ్రామాల్లో 6 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వాతావరణంలో ఒక్కసారిగా మారి శుక్రవారం వేకువ జామున ఉరుములు మెరుపులతో భారీ వర్షం మండలంలో బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో విద్యుత్ స్తంభాలు నేలకొరిగి ఆయా గ్రామాల్లో వ్యవసాయ బోర్లకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న ముండ్లపాడు ఏఈ కె.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో విద్యుత్శాఖ సిబ్బంది మరమ్మతులు చేసి గృహాలకు విద్యుత్ సరఫరా అందించారు. పిడుగుపాటుకు మండలంలోని కె.ఎస్.పల్లెలో కొబ్బరి చెట్టు ధ్వంసమైంది. భారీ వర్షంతో పట్టణంలోని రాజానగర్, శ్రీరామ్నగర్, ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు, కశెట్టివారివీధి, డీఆర్ఆర్ ప్లాజా వైపు వీధులు జలమయమై ప్రజల రాకపోకలు ఇబ్బందిగా మారాయి. డ్రైనేజి కాలువల్లో నుంచి మురుగు నీరు రోడ్లు మీదకు వచ్చి చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గాలివాన బీభత్సం బేస్తవారిపేట: మండలంలో గురువారం అర్ధరాత్రి ఉరుములు–మెరుపులతో గాలివాన కురిసింది. గలిజేరుగుళ్లలోని రామాలయం గుడి ముందు ఉన్న ధ్వజస్తంభం విరిగిపడిపోయింది. శింగరపల్లెలో ఒకటి, జెన్నివారిపల్లెలో మూడు, ఖాజీపురంలో ఒక విద్యుత్ స్తంభం ఈదురుగాలులకు విరిగిపోయాయి. దీంతో పొలాల్లోని మోటార్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పొలాల్లో ఆరబెట్టుకున్న మొక్కజొన్న కంకులు వర్షానికి తడిసిపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ఉరుములు, మెరుపులు..ఈదురు గాలులు.. కొనకనమిట్ల: మండలంలోని పలు గ్రామాల్లో గురువారం అర్ధరాత్రి విపరీతమైన ఈదురు గాలులతో ఓ మోస్తారు వర్షం పడింది. ఈదురు గాలుల ప్రభావం ఎక్కువగా నాగంపల్లి, వింజవర్తిపాడు, గొట్లగట్టు, కాట్రగుంట, మర్రిపాలెం, వాగుమడుగు, పెదారికట్ల, గొంటువానిపల్లి గ్రామాల్లో కనిపించింది. ఆయా గ్రామాల్లో 50కి పైగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగి పడినట్లు విద్యుత్ అధికారులు వెల్లడించారు. నాగంపల్లిలో వింజవర్తిపాడు ప్లీడర్కు సంబంధించి ట్రాన్స్ఫాం దెబ్బతినటంతో పాటు విద్యుత్ స్తంభం పడిపోయింది. నాగంపల్లి ఎస్సీ కాలనీలో ఎక్కువగా స్తంభాలు పడిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గొట్లగట్టు, మర్రిపాలెం, పెదారికట్ల గ్రామాల్లో పొలాల్లో స్తంభాలు పడిపోయాయి. నాగంపల్లి, వింజవర్తిపాడు గ్రామాల్లో ఓ మోస్తారు వర్షం పడింది. పలు చోట్ల అరటి, బొప్పాయి తోటలకు ఈదురు గాలులతో నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు. పడిపోయిన విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్త స్తంభాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ బ్రహ్మం చెప్పారు. కాట్రగుంట పంచాయతీ ఓబులరెడ్డిపల్లిలో గురువారం అర్థరాత్రి, శుక్రవారం తెల్లవారు జామున వీచిన ఈదురు గాలుల బీభత్సానికి గ్రామానికి చెందిన రాజాల లక్ష్మిరెడ్డి ఇటీవల రూ.5 లక్షలతో గొర్రెల షెడ్ నిర్మించాడు. అయితే ఈదురు గాలులకు షెడ్కు ఏర్పాటు చేసిన సిమెంటు రేకులు లేచి ముక్కలు ముక్కలై చెల్లాచెదురుగా పొలాల్లో పడిపోయాయి. దీంతో పాటు పొలాల్లోని కరెంటు స్తంభాలు విరిగిపడటంతో తీగలు తెగిపడ్డాయి. వీఆర్ఓ రమేష్ జరిగిన నష్టం అంచనా వేసి నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామన్నారు. గోడకూలి ఒకరు మృతి పీసీపల్లి: గాలివానకు గోడకూలి ఒకరు మృతి చెందిన ఘటన గురువారం రాత్రి మండలంలోని శంకరాపురంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గంధం ప్రసాదు (34) వర్షం సుడి గాలులకు గొర్రెలను ఇంటికి తోలుకొని వస్తుండగా గాలివాన బాగా వీస్తుండంతో డెయిరీ ఫాం గోడ పక్కన నిలుచున్నాడు. గాలివానకు గోడ అతని మీద కూలింది. ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో బంధువులు వెతుకుతూ అతని మీద గోడ పడినట్లు గుర్తించి హుటాహుటిన ప్రైవేటు వాహనంలో పీసీపల్లి వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి 108 లో కనిగిరి ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గతంలోనే రెండుసార్లు గోడ కూలిందని డెయిరీ ఫాం యజమాని మాచినేని రవికిరణ్ చౌదరి ఫాం కోసం బరువు లేని బ్రిక్ రాళ్లతో గోడ నిర్మించారు. ఆ గోడ గాలికి కూలి దాని కింద పడి ప్రసాదు మృతి చెందినట్లు బంధువులు ఆరోపించారు. మృతునికి ముగ్గురు పిల్లలు, భార్య సంగీత ఉన్నారు. చీమకుర్తి బైపాస్లో రోడ్డుకు అడ్డంగా పడిన చెట్లు చీమకుర్తి: గురువారం అర్ధరాత్రి చీమకుర్తిలో వీచిన బలమైన గాలులు, వర్షానికి బైపాస్లో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. కొన్ని చెట్లు వాహనదారులపై కూడా పడి స్వల్ప ప్రమాదాలతో బయటపడ్డారు. చీమకుర్తి మెయిన్రోడ్డులో కట్టిన ఫ్లెక్సీలు ఊడి రోడ్డు మీద పడటంతో ప్రయాణికులకు ప్రమాదకరంగా మారింది. ఒంగోలు నుంచి చీమకుర్తి మీదుగా పొదిలి వైపు రాకపోకలు దాదాపు రెండు గంటల పాటు నిలిచిపోయాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చీమకుర్తి మున్సిపల్ కమిషనర్ వై.రామకృష్ణయ్య తన సిబ్బందితో జేసీబీల సాయంతో రోడ్డుకు అడ్డంగా పడిన చెట్లు, ఫ్లెక్సీలను తొలగించారు. బలమైన గాలువు, వర్షంతో పాటు ఉరుములు, మెరుపుల ధాటికి తెల్లవారుజాము వరకు కరెంటు కట్ చేయటంతో ఉక్కపోతలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. -
జాతీయ స్థాయి పోటీలకు జిల్లా క్రీడాకారులు
ఒంగోలు: జాతీయస్థాయి అండర్–17 క్యాడెట్ ఫెన్సింగ్ పోటీలకు జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారిణులు ఎంపికయ్యారని ఫెన్సింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జి.నవీన్ తెలిపారు. ఇటీవల తణుకులో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో వ్యక్తిగత శాబర్ విభాగాలలో పుత్తూరు చక్రిక, అంకాల తన్వి పతకాలు కై వసం చేసుకుని జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు చెప్పారు. ఈ నెల 23 నుంచి 28వ తేదీ వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రాపూర్ పట్టణంలో నిర్వహించనున్న 21వ జాతీయస్థాయి ఫెన్సింగ్ క్యాడెట్ అండర్–17 విభాగం పోటీల్లో వారు పాల్గొంటారన్నారు. ఎంపికై న క్రీడాకారిణులను ప్రకాశం జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వి.నాగేశ్వరరావు ఒంగోలులోని మినీ స్టేడియంలో శుక్రవారం అభినందించారు. ● గుండెపోటుతో రిటైర్డ్ ప్రిన్సిపాల్ మృతి తాళ్లూరు: చార్ధామ్ యాత్రకు వెళ్లి గుండెపోటుతో రిటైర్డ్ ప్రిన్సిపాల్ మృతి చెందారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని నాగంబొట్లపాలెం గ్రామానికి చెందిన వంగల మస్తాన్రెడ్డి (66) కుటుంబ సభ్యులతో వారం క్రితం చార్ధామ్ యాత్రకు వెళ్లారు. యమునోత్రికి రెండు కిలో మీటర్ల దూరంలో మస్తాన్రెడ్డి గుండెనొప్పితో కుప్పకూలారు. వెంటనే కుటుంబ సభ్యులు జానకీ చట్టీ అనే పట్టణంలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు పరీక్షలు చేసి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఆయన భౌతిక కాయం శనివారం ఉదయానికి స్వగ్రామం తరలించి అంత్యక్రియలు చేయనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మస్తాన్రెడ్డి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్గా పదవీ విరమణ పొందారు. ఆయనకు ముగ్గురు కుమారులు, కుమారై ఉన్నారు. సంతమాగులూరు (అద్దంకి): రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని ఏల్చూరు సమీపంలోని నామ్ రహదారిపై గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగింది. అందిన సమాచారం ప్రకారం.. కర్నాటక రాష్ట్రంలోని రాయచోటి నుంచి నరసరావుపేటకు ఓ టెంపో వెళ్తోంది. మండలంలోని ఏల్చూరు గ్రామ సమీపంలోని హైవేపై వాహనం నడుస్తుండగానే టైర్ పేలి పోవడంతో అదుపుతప్పి రోడ్డు మార్జిన్లోకి దూసుకెళ్లి పడిపోయింది. ప్రమాద సమయంలో టెంపోలో 12 మంది ప్రయాణిస్తుండగా తొమ్మిది మందికి గాయాలయ్యాయి. అందులో ఒకరికి తీవ్ర గాయమైంది. క్షతగాత్రులను నామ్ అంబులెన్స్లో నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద తీరును పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాయాలతో బయటపడటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఒంగోలు టౌన్: రైల్వేస్టేషన్ సమీప రైల్వే క్వార్టర్స్ వద్ద గురువారం సాయంత్రం గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని స్థానికులు గమనించి టూటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని జీజీహెచ్కు తరలించారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి సుమారు 30 ఏళ్లు ఉంటాయి. మృతుడి సమాచారం తెలిసిన వారు 91211 04778, 90004 26018 నంబర్లకు ఫోన్ చేయాలని ఎస్సై ఎస్వీ రమణ కోరారు. -
ఎస్సీ కాలనీకి తప్పిన ప్రమాదం
జె.పంగులూరు: మండల పరిధిలోని కొండమూరు ఎస్సీ కాలనీకి అగ్ని ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం సమీపంలోని రైతులు మొక్కజొన్న దండు (వ్యర్థాలు)కు నిప్పంటించారు. వేసవి కాలం కావడంతో ఎండ వేడి, వడగాడ్పులకు చుట్టుపక్కల పొలాలకు క్షణాల్లో మంటలు వ్యాపించాయి. సమీపంలో ఉన్న ఎస్సీ కాలనీ వైపు కూడా మంటలు వేగంగా వ్యాపించాయి. ఎస్సీ కాలనీ వాసులు అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్ వచ్చే లోపు కాలనీ వాసులు తమ వద్ద ఉన్న మోటార్ల సాయంతో మంటలు కాలనీలోకి రాకుండా అదుపు చేశారు. ఇంతలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి పూర్తి స్థాయిలో మంటలు అదుపు చేయడంతో కాలనీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. గ్రామంలోని లక్ష్మయ్య అనే రైతుకు చెందిన రెండు ఎకరాల సుబాబుల్ తోట మంటల్లో కాలిపోయింది. శేషారావు అనే రైతుకు రూ.2 లక్షల మేర నష్టం జరిగింది. ఓరుగంటి అంజిరెడ్డికి చెందిన చెందిన ఎకరా మునగ చేను, వాసుపల్లి సుబ్బారెడ్డికి చెందిన ఎకరా బుడిద గుమ్మడి కాయల చేను పూర్తిగా దగ్ధమైంది. సంపంగుల విజయరాజుకు చెందిన మామిడి తోట కొత మేర దగ్ధమైంది. సమాచారం అందుకున్న తహసీల్దార్ సింగారావు కొండమూరు ఎస్సీ కాలనీని పరిశీలించారు. నష్టం వివరాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తానని తెలిపారు. మొక్కజొన్న వ్యర్థాలకు నిప్పంటించిన రైతులు పక్క పొలాలకు అంటుకున్న మంటలు 20 నుంచి 25 వరకు బోర్లు దగ్ధం రెండు ఎకరాల సుబాబుల్ తోట కూడా.. -
వివిధ హోదాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు నియామకం
ఒంగోలు సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాకు చెందిన నాయకులను వివిధ హోదాల్లో నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారు రాష్ట్ర లీగల్ సెల్ జనరల్ సెక్రటరీగా ఒంగోలుకు చెందిన కోమట్ల శ్రీనివాస స్వామిరెడ్డిని, రాష్ట్ర పంచాయతీరాజ్ వింగ్ సెక్రటరీగా సంతనూతలపాడుకు చెందిన జగన్నాథం కోటి లింగం (పూర్ణ)ను నియమించినట్లు తెలిపారు. అలాగే కొండపి నియోజకవర్గ విశ్వ బ్రాహ్మణ విభాగం ప్రెసిడెంట్గా కొండపికి చెందిన నూతలపాటి పోతులూరిని నియమించినట్లు పార్టీ కార్యాలయం తెలిపింది.ఒంగోలు సిటీ: ఆంధ్రకేసరి యూనివర్సిటీ పరిధిలోని బీపీఎడ్, అండ్ డీపీఎడ్ కళాశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలను వైస్ ఛాన్సలర్ డీవీఆర్. మూర్తి శుక్రవారం విడుదల చేశారు. ఈ పరీక్షలకు బీపీఎడ్ కోర్సుకు సంబంధించిన మొత్తం 976 మంది విద్యార్థులు హాజరుకాగా, వారిలో 96.93 ఉత్తీర్ణతా శాతంతో 946 మంది విద్యార్థులు పాసైనట్లు తెలిపారు. అలాగే డీపీఎడ్ కోర్సుకు సంబంధించి మొత్తం 154 మంది విద్యార్థులు హాజరుకాగా, వారిలో 96.10 ఉత్తీర్ణతా శాతంతో 148 మంది పాసైనట్లు అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎకనామిక్స్ డాక్టర్ ఎ.భారతిదేవి తెలిపారు. ఆంధ్రకేసరి యూనివర్సిటీ పరిధిలోని ఆయా కళాశాలల స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను వైస్ చాన్సలర్ డీవీఆర్ మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ హరిబాబు అభినందించారు. కార్యక్రమంలో డీన్ సీడీసీ డాక్టరు కేవీఎన్ రాజు, పీజీ పరీక్షల కోఆర్డినేటర్ ఆర్.శ్రీనివాసు పాల్గొన్నారు. మార్కాపురం: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను పార్టీలకతీతంగా రైతులంతా ఏకమై అడ్డుకోవాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీ క్రిష్ణయ్య కోరారు. ప్రెస్క్లబ్లో శుక్రవారం నిర్వహించిన రైతు సంఘం మార్కాపురం జిల్లా మొదటి మహాసభ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్వామినాధన్ కమిషన్ అమలు చేయకపోవడంతో రాబోయే కాలంలో ఇప్పుడున్న రైతుల్లో పది శాతం కూడా మిగలకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరించడంతో రైతులు నష్టాల్లోకి వెళ్తున్నారని అన్నారు. వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రైతులు ఐకమత్యం అయితే ప్రభుత్వాలు దిగివస్తాయని చెప్పారు. ఢిల్లీలో వేలాది మంది రైతులు 13 నెలల పాటు ఆందోళన చేయడంతో మోదీ ప్రభుత్వం క్షమాపణ చెప్పిందన్నారు. స్వామినాధన్ కమిషన్ అమలుచేస్తే రైతులకు ప్రయోజనం ఉంటుందన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలా పార్లమెంటులో చట్టం చేయాలని డిమాండ్ చేశారు. గిట్టుబాటు ధరల కోసం కేంద్రం రూ.5 లక్షల కోట్ల నిధిని ఏర్పాటు చేయాలన్నారు. విత్తన చట్టాన్ని 2025లో మార్చారని, దీని వలన రైతులు నష్టపోతున్నారన్నారు. ఇప్పటికే శనగలు, పత్తి, వర్జీనియా పొగాకు పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోయారని తెలిపారు. సాగు చేసిన ప్రతి పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభించి 30 ఏళ్లు గడిచినా ఎప్పటికి పూర్తవుతుందో తెలియదన్నారు. జిల్లాకు నిధులు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో మార్కాపురం జిల్లా అధ్యక్షుడు పీ వెంకటరావు, తిప్పారెడ్డి, ఊసా వెంకటేశ్వర్లు, తిరుపతిరెడ్డి, సోమయ్య, రాజశేఖర్రెడ్డి, బాల నాగయ్య, వెంకటరావు, రాజు, తదితరులు పాల్గొన్నారు. -
ఫుట్బాల్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గం ఎంపిక
ఒంగోలు: ఫుట్బాల్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని శుక్రవారం స్థానిక హైదరీ క్లబ్లో ఎంపిక చేశారు. ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ నుంచి నీలాద్రి వెంకట కుమార్, పవన్కుమార్, ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కుర్రా భాస్కరరావు, ఎన్నికల అధికారి సిరిగిరి రంగారావు ఆధ్వర్యంలో ఈ ఎంపిక జరిగింది. అధ్యక్షునిగా అంచిపోగు రమేష్బాబు, ఉపాధ్యక్షులుగా రోజర్ బిన్ని, తాళ్లూరి విజయ్కుమార్, ఆర్.రామతులసి, కోశాధికారిగా జాజుల శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులుగా బి.అమృత, జి.విజయ్భరత్, టి.ప్రదీప్, బి.రమాదేవిలను ఎన్నుకున్నారు. మాజీ అధ్యక్షుడు కావూరి విన్సెంట్ను గౌరవాధ్యక్షునిగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి రంగారావు ప్రకటించారు. -
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
పొదిలి రూరల్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. పొదిలి మండలంలోని అక్కచెరువు సమీపంలో ఈ నెల 20వ తేదీ రాత్రి రెండు బేకులు ఢీకొని ముగ్గురికి గాయాలయ్యాయి. వారిలో గురుగుపాడు గ్రామానికి చెందిన యనమల చిరంజీవి తీవ్రగాయాలపాలై ఒంగోలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి పరిస్థితి విషమించి ప్రాణాలు విడిచాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కందుకూరు: పట్టణంలోని శ్రీరామ్నగర్కాలనీ వాటర్ ట్యాంక్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు పట్టణ ఎస్సై శివనాగరాజు శుక్రవారం తెలిపారు. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని స్థానిక ఏరియా వైద్యశాలకు తరలించారు. వడదెబ్బ తగిలి సదరు వ్యక్తి మృతి చెందినట్లు గుర్తించామన్నారు. 9121102203 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. -
పొగాకు వేలం కేంద్రాల వద్ద 25న నిరసనలు
ఒంగోలు టౌన్: మార్కెట్లో పొగాకు కొనే దిక్కులేక రైతులు అల్లాడిపోతున్నారని, కానీ, ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఈ నెల 25వ తేదీ పొగాకు వేలం కేంద్రాల వద్ద నిరసనలు చేపట్టాలని నిర్ణయించామని రైతు సంఘ జిల్లా కార్యదర్శి జజ్జూరి జయంతిబాబు తెలిపారు. ఒంగోలు నగరంలోని ఎల్బీజీ భవనంలో గురువారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. సంఘ జిల్లా అధ్యక్షుడు పమిడి వెంకటరావు అధ్యక్షత వహించగా, జయంతిబాబు మాట్లాడుతూ గత సంవత్సరం కేజీ రూ.280తో ప్రారంభమైన పొగాకు వేలం.. ఈ ఏడాది కేవలం రూ.250తో మొదలైందని తెలిపారు. మొదట్లో 30 శాతంగా ఉన్న నో బిడ్ ప్రస్తుతం 70 శాతానికి పెరిగిందని చెప్పారు. పొగాకును కొనుగోలు చేయకుండా చెక్కులు తిరిగి ఇంటికి పంపిస్తున్నారని, ఈ నేపథ్యంలో పొగాకు అమ్ముకోవడం రైతులకు కనాకష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే ఒక్క బ్యారన్కు రూ.6 లక్షల వరకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్న పొగాకు రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. కంపెనీల ప్రయాజనాల కోసం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. అందుకు నిరసనగా ఈ నెల 25వ తేదీ వేలం కేంద్రాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా జూన్ 1వ తేదీ పొగాకు బోర్డు వద్దకు రాయబారం వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎస్కే మాబు, ఏడుకొండలు, కనపర్తి సుబ్బారావు, రామారావు, గాలి వెంకటేశ్వర్లు, వేజండ్ల సింగయ్య పాల్గొన్నారు. -
డిగ్రీ మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదల
ఒంగోలు సిటీ: డిగ్రీ మొదటి సంవత్సరం ఫలితాలను ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయ వైస్ చాన్సిలర్ ప్రొఫెసర్ డీవీఆర్ మూర్తి గురువారం తన కార్యాలయంలో విడుదల చేశారు. మొత్తం 9,183 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా, 48.26 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పరీక్షల నియంత్రణాధికారి భారతీదేవి తెలిపారు. ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను వీసీ మూర్తి, రిజిస్ట్రార్ హరిబాబు అభినందించారు. కార్యక్రమంలో పరీక్షల నిర్వహణ సహాయకులు సురేష్ బాబు, పీజీ పరీక్షల కో ఆర్డినేటర్ డాక్టర్ ఆర్.శ్రీనివాసు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
శుక్రవారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2026
ఆబ్కారీ శాఖ మామూళ్ల మత్తులో జోగుతోంది. నిబంధనలు తుంగలోకి తొక్కి కాసులవేటలో పడింది. ప్రభుత్వాదాయాన్ని పెంచాల్సిన బాధ్యతను పక్కనబెట్టి సొంత ఆదాయాన్ని పెంచుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెలవారీ మామూళ్లతో ఆ శాఖ అధికారులు భారీగా వెనకేసుకుంటున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు మద్యం వ్యాపారులపై ఎలాంటి కేసులు నమోదు కాకపోవడమే ఇందుకు నిదర్శనమని ఆ శాఖ ఉద్యోగులే గుసగుసలాడుకుంటున్నారు. దీంతో ఏం జరుగుతుందోనని ఉన్నతాధికారులు ఆరాతీసే పనిలో పడ్డారని తెలిసింది. అవినీతి పెరగడంతో పాటు మద్యం విక్రయాలలో రాష్ట్రంలోనే ఉమ్మడి జిల్లా అట్టడుగు స్థానంలో నిలిచి ఆదాయం పడిపోవడంపై కమిషనర్ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. -
ఎరువుల దుకాణాల తనిఖీ
త్రిపురాంతకం: మండలంలోని ఎరువులు, పురుగు మందుల దుకాణాలను గురువారం జిల్లా అధికారులు తనిఖీ చేశారు. ఎరువులు, పురుగుమందుల నిల్వలపై కేసులు నమోదు చేశారు. ఎరువుల ధరల పెరుగుదలపై ‘ఎరువులు బె‘ధర’గొడుతున్నాయ్’ అనే శీర్షికతో సాక్షి దినపత్రిక జిల్లా పేజీలో గురువారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. త్రిపురాంతకంలోని ఎరువులు, పురుగుమందుల దుకాణాలపై జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, వ్యవసాయశాఖ జేడీఏ బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. వెంకట ధరణి ట్రేడర్స్లో 3.49 లక్షల రూపాయల స్టాక్, కదంబని ట్రేడర్స్లో 34 వేల రూపాయల ఖరీదు చేసే ఎరువులు సీజ్ చేశారు. స్టాక్ బుక్ నిల్వల్లో వ్యత్యాసం ఉండటంతో వాటి అమ్మకాలు నిలుపుదల చేశారు. ఆయా దుకాణదారులపై 6ఏ కేసులు నమోదు చేశారు. తహసీల్దార్ విజయభాస్కర్, ఏఓలు సంఘమేశ్వరరెడ్డి, లక్ష్మీనారాయణ, ఆర్ఐ శ్రీనివాసరావు, వీఆర్ఓ రమ్యకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
యువకుడిని ముక్కలు ముక్కలుగా చేసి.. దారుణ హత్య
యర్రగొండపాలెం: తమ కుమార్తెతో సన్నిహితంగా ఉన్న యువకుడిని బాలిక తల్లిదండ్రులు దారుణంగా హత్య చేసి, అతని శరీర భాగాలను ముక్కలుగా నరికి పొలాల్లో ఉన్న బోరు బావిలో పడేసిన దారుణ ఘటన మార్కాపురం జిల్లా యర్రగొండపాలెంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మార్కాపురం డీవైఎస్పీ కె.నాగరాజు బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. చెంచు కాలనీకి చెందిన దిగుడు ఆంజనేయులు (21) ఈ నెల 13వ తేదీ రాత్రి ఓ 15 ఏళ్ల బాలిక ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో బాలిక తల్లిదండ్రులు కూలీలకు డబ్బులు ఇచ్చేందుకు ఊర్లోకి వెళ్లారు. రాత్రి 10 గంటల సమయంలో తిరిగి ఇంటికి వచ్చి తలుపులు తెరిచి చూస్తే బాలికతో ఆంజనేయులు సన్నిహితంగా ఉండటాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆమె తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. ఆవేశంలో ఇంట్లో ఉన్న అట్లపెనం తీసుకొని యువకుడి తలపై మోదడంతో అతను మృతి చెందాడు. మరుసటి రోజు కూడా ఆ మృతదేహాన్ని తమ ఇంట్లోనే ఉంచుకున్నారు. వాసన వస్తుండటంతో నిందితులు మృతదేహాన్ని మాయం చేసేందుకు శరీర భాగాలను ముక్కలుగా నరికి అక్కడికి సమీపంలోని ప్రైవేటు స్కూలు వెనుక వైపు పొలాల్లో ఉన్న ఒక బోరుబావిలో పడేశారు. ఈ నెల 13వ తేదీ నుంచి ఆంజనేయులు కనిపించకుండా పోయాడని అతని బావ చెల్లె వెంకటరావు ఈ నెల 16న ఇచి్చన ఫిర్యాదు మేరకు సీఐ కె.అజయ్కుమార్ ఆధ్వర్యంలో ఎస్సై దేవకుమార్ దర్యాప్తు చేపట్టారు. మృతుడు ఆంజనేయులు సెల్ ఆధారంగా బాలిక ఇంటి వద్ద అదృశ్యమైనట్లు నిర్ధారణకు వచ్చారు. అనుమానాస్పదంగా ఉన్నబాలిక తల్లిదండ్రులకు పెద్దారవీడు మండలంలోని బోడ్రెడ్డిపల్లె జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకుని విచారించగా ఆంజనేయులును తామే హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారు. దీంతో వారిని అరెస్టు చేసినట్లు డీవైఎస్పీ తెలిపారు. వారి కుమార్తెను త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పారు. కేసును త్వరితగతిన ఛేదించిన సీఐ కె.అజయ్కుమార్, ఎస్సై ఎం.దేవకుమార్లను ఆయన అభినందించారు. బోరుబావిలో ఉన్న శరీర భాగాలను వెలికి తీసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాగా డీవైఎస్పీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో మృతుడు ఆంజనేయులు బంధువులు పోలీస్ స్టేషన్లో గొడవకు దిగారు. వెంటనే బోరుబావిలో ఉన్న శరీర భాగాలను వెలికి తీయాలని, నిందితులను అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
అటవీ సంపదను భక్షించిన ఇంటి దొంగలు
మార్కాపురం: అటవీ సంపదను కాపాడాల్సిన అధికారులే అడవిలో అభించిన గుప్త సంపదను కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోట్ల రూపాయల బంగారు ఆభరణాలు, వజ్రాలు, నవరత్నాలతో కూడిన రెండు కుండలు తవ్వకాల్లో బయటపడగా వాటిని ప్రభుత్వానికి అప్పగించకుండా వాటాలు వేసుకుని పంచుకున్నట్టు తెలిసింది. ఈ సంఘటన మార్కాపురం జిల్లాలోని గిద్దలూరు నల్లమల అటవీ ప్రాంతంలోని పులుల అభయారణ్యం పరిధిలో ఫిబ్రవరి మొదటి వారంలో జరగ్గా రెండు రోజుల క్రితం వెలుగులోకి వచ్చింది. ఇందులో అటవీశాఖ అధికారులే పాత్రధారులుగా వ్యవహరించడం గమనార్హం. గుప్త నిధులు తవ్వే ముఠాతో చేతులు కలిపి అటవీశాఖ ఉద్యోగులే గడ్డపార పట్టి గుంతలు తీసి గుప్తనిధులను వెలికితీసి ప్రభుత్వానికి అప్పగించకుండా వారే వాటాలు వేసుకుని పంచుకోవడం సంచలనంగా మారింది. గిద్దలూరు అటవీశాఖ పరిధిలోని తురిమెళ్ల రేంజ్, ఆర్వీటికోట సెక్షన్ ఎర్రగుంట్ల లొకేషన్లో గుప్తనిధులు ఉన్నట్లు అటవీశాఖ అధికారులకు ఫిబ్రవరిలో సమాచారం అందింది. ఈ సమాచారం అక్కడ పనిచేసే నలుగురు ప్రొటెక్షన్ వాచర్స్, ఒక రేంజ్ అధికారికి తెలియడంతో గుప్తనిధులను కాజేసేందుకు పక్కా స్కెచ్ వేశారు. అటవీ ప్రాంతంలో పనులు జరుగుతుండడంతో, వాటిని ఆసరాగా చేసుకుని అర్ధవీడుకు చెందిన ఒక వ్యక్తితో జేసీబీ తెప్పించుకుని తవ్వకాలు చేపట్టారు. రెండు పెద్ద కుండలు బయటకు తీశారు. అందులో బంగారం, వజ్రాలు, నవరత్నాలతో కూడిన విలువైన వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వానికి అప్పగించకుండా.. వాటాలేసుకుని..నిజానికి ఈ వస్తువులను, బంగారాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సిన అటవీశాఖ బీట్ అధికారులు, వాచర్లు, రేంజ్ ఆఫీసర్లు ఒక్కటై అవి నిజమైనవా ? నకిలీవా అని తెలుసుకునేందుకు హైదరాబాదుకు తీసుకెళ్లారు. అక్కడ పరీక్షలు చేయించి స్వచ్ఛమైన బంగారం, తరువాత విలువైన వజ్రాలు, నవరత్నాలుగా నిర్ధారించుకున్నారు. దీంతో వాటిని అక్కడ అమ్మేందుకు ప్రయత్నించగా ఎవరూ కొనేందుకు ముందుకు రాకపోవడంతో బెంగళూరుకు వెళ్లి విక్రయించినట్లు సమాచారం. ఈ సంఘటన జరిగిన తరువాత ఒక బీట్ ఆఫీసరు గిద్దలూరులో ఇంటిని కూడా కొనుగోలు చేసినట్టు తెలిసింది. అయితే అటవీ సిబ్బందే గుంతలు తవ్వుతున్న ఫొటోలు, దొరికిన కుండల ఫొటోలు సోషల్మీడియాలో రావడంతో ఈ విషయం బయటకు వచ్చింది. కాగా బుధవారం ఈ సమాచారం తెలుసుకున్న గిద్దలూరు అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టి, సమాచారం సేకరించినట్టు తెలిసింది. ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు అటవీశాఖ ఉన్నతాధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో జింక మృతి
పొదిలి రూరల్: పొలాల్లో నుంచి పరుగుతీస్తూ రోడ్డు దాటుతున్న జింకను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన పొదిలి పట్టణంలోని బాప్టిస్టుపాలెం వద్ద బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. జింక మృతి చెందడాన్ని గమనించిన కొందరు వ్యక్తులు గుట్టుగా మాంసాహారం కింద తీసుకెళ్లడం గమనార్హం. వన్యప్రాణి సంరక్షణ చట్టంలో భాగంగా చనిపోయిన జింక కలేబరానికి అటవీ శాఖ అధికారులు పోస్ట్మార్టం నిర్వహించి, ఖననం చేయాల్సి ఉండగా అదేమీ పట్టించుకోలేదు. అటవీశాఖ అధికారుల తీరుపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టంగుటూరు: పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యంతో మూడు ఎకరాల్లో జామాయిల్ తోట దగ్ధమైంది. ఈ సంఘటన మండలంలోని జమ్ములపాలెం గ్రామ శివారులో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామంలో సేకరించిన చెత్తను శివారులో ఉన్న చెత్త సేకరణ సంపద కేంద్రం వద్ద వేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం పంచాయతీ సిబ్బంది చెత్తకు నిప్పు పెట్టడంతో పక్కనే ఉన్న కొత్తపల్లి వెంకటేశ్వర్లు, అన్నాబత్తిన పూర్ణచంద్రరావులకు చెందిన పొలంలో జామాయిల్ తోటలకు మంటలు అంటుకున్నాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడటంతో సమీపంలోని పశువుల కాపరులు రైతులకు సమాచారం అందించారు. రైతులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. సుమారు రూ.లక్ష వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు. ఒంగోలు సిటీ: ధ్యానంతో ఒత్తిడి దూరమై ఏకాగ్రత పెరుగుతుందని ఏఆర్ డీఎస్పీ కె.శ్రీనివాసరావు అన్నారు. ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిబ్బందికి ఆరోగ్య పరిరక్షణపై సూచనలు చేశారు. విధి నిర్వహణలో ఎదురయ్యే శారీరక, మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు. శ్రీరామచంద్ర మిషన్న్కు చెందిన భాస్కర్రెడ్డి, ఏ. విజయలక్ష్మి మాట్లాడుతూ నిత్యం ధ్యానం చేయడం ద్వారా మానసిక, శారీరక ప్రశాంతత నెలకొంటుందన్నారు. జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లు, సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని ధ్యానం పెంపొందిస్తుందని సూచించారు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఆరోగ్యకర జీవనశైలి ద్వారా గుండె సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవచ్చన్నారు. ఆర్ఐలు రమణారెడ్డి, సీతారామిరెడ్డి, ఆర్ఎస్సైలు ప్రసాద్, మాల్యాద్రి, తిరుపతి స్వామి, సిబ్బంది పాల్గొన్నారు. పుల్లలచెరువు: మండల కేంద్రమైన పుల్లలచెరువులోని శ్రీనివాస భారత్ గ్యాస్ ఏజెన్సీపై 6ఏ కేసు నమోదు చేసినట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి డి.అంకయ్య బుధవారం తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో వినియోగదారుల ఫిర్యాదు మేరకు గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్ఓ విలేకరులతో మాట్లాడుతూ.. శ్రీనివాస భారత్ గ్యాస్ ఏజెన్సీలో సిలిండర్పై అధికంగా వసూలు చేస్తున్నారని, బ్లాక్ మార్కెట్లో సిలిండర్లు విక్రయిస్తున్నారని జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయని తెలిపారు. కలెక్టర్, జేసీ ఆదేశాల మేరకు కంపెనీ ప్రతినిధి సక్షమంలో ఏజెన్సీ కార్యాలయాన్ని తనికీ చేయగా 177 సిలిండర్లకుగాను 33 మాత్రమే ఉన్నాయని, 144 సిలిండర్లు అక్రమంగా విక్రయించినట్లు తేలిందని వివరించారు. వినియోగదారులకు ఇబ్బంది లేకుండా చేసేందుకు భారత్ గ్యాస్ కంపెనీ ప్రతినిధికి ఏజెన్సీ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. గ్యాస్ ఏజెన్సీ పాయింట్ నుంచి 15 కి.మీ పరిధిలో గల గ్రామాల్లో వినియోగదారులకు డోర్ డెలివరీ ఉచితంగా చేయాలని డీఎస్ఓ స్పష్టం చేశారు. తనిఖీలో ఎన్ఫోర్స్మెంట్ డీటీ చంద్రశేఖర్, వీఆర్వో కోటేశ్వరరావు పాల్గొన్నారు. -
గురువారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2026
ఖరీఫ్కు ముందే ఎరువుల ధరలు రైతుల మాడు పగులగొడుతున్నాయి.ఒక వైపు పంటలు సరిగ్గా పండకపోవడం, మరో వైపు గిట్టుబాటు ధరలు లభించకపోవడం, చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడం వెరసి పెరిగిన ధరలతో మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా తయారైంది రైతుల పరిస్థితి. ఖరీఫ్ సీజన్ పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్న సమయాన కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు రూ.91 కోట్లకుపైగా భారం పడుతుండడంతో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. రానున్న రోజుల్లో ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతుండడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎరువుల ధరలు ఎప్పుడు ఎంత పెరుగుతున్నాయో రైతులకు సమాచారం ఇచ్చే వ్యవస్థ లేకపోవడం దారుణమని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏ రకానికి ఎంత పెరిగిందో వ్యవసాయశాఖ నుంచి సైతం ఎలాంటి ప్రకటనలూ లేవు. నిబంధనల ప్రకారం ఎమ్మార్పీ కంటే అదనంగా అమ్మడానికి వీల్లేదు. అయితే పెరిగిన ధరల్ని చూపిస్తూ కొందరు పాత ఎమ్మార్పీలు ఉన్నా కొత్త ధరలపై విక్రయించే అవకాశం ఉంది. ఎరువులు..బెధరగొడుతున్నాయ్! -
వాటాల కోసం వాదులాటపై విచారణ
పొదిలి రూరల్: పొదిలి మండల పరిధిలో ఉపాధి హామీ పథకంలో భారీగా అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. కమీషన్ రూపంలో నొక్కేసిన సొమ్మును పంచుకునే విషయంలో తేడాలు రావడంతో ఇటీవల సిబ్బంది, ఎఫ్ఏలు గొడవపడ్డారు. ఈ విషయం ఉన్నతాధికారుల వద్దకు చేరడంతో బుధవారం పొదిలిలోని ఉపాధి హామీ కార్యాలయంలో జిల్లా క్వాలిటీ కంట్రోల్ అధికారి శ్రీనివాసులు విచారణ చేపట్టారు. కూలీల వద్ద ఎంత డబ్బు వసూలు చేశారు?, ఎవరెవరు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు?, కార్యాలయ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్ల మధ్య గొడవకు ముఖ్య కారణాలు ఏమిటనే విషయాలపై ఆరా తీశారు. విచారణ అనంతరం జిల్లా క్వాలిటీ కంట్రోల్ అధికారి విలేకర్లతో మాట్లాడుతూ.. గ్రామాల్లో పనులు కొలతల ప్రకారం సక్రమంగా చేశారా లేదా అనే విషయాన్ని క్షేత్ర స్థాయిలో విచారించనున్నట్లు చెప్పారు. అధికారులు డబ్బు వసూలు చేస్తున్నట్లు కూలీలు ఫిర్యాదు చేయలేదని చెప్పారు. -
రామచంద్రాపురంలో చైన్ స్నాచింగ్
● నిద్రిస్తున్న మహిళల మెడలో బంగారు గొలుసులు అపహరణ మార్కాపురం రూరల్: గాఢ నిద్రలో ఉన్న మహిళల మెడలో బంగారు ఆభరణాలను గుర్తు తెలియని దుండగులు అపహరించారు. ఈ సంఘటన బుధవారం వేకువజామున మార్కాపురం మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలు.. గ్రామానికి చెందిన వెంకటలక్ష్మమ్మ(37) ఇంటి ముందు వరండాలో నిద్రిస్తుండగా ఆమె మెడలో ఉన్న సుమారు మూడు తులాల బంగారు సరుడును గుర్తు తెలియని వ్యక్తి లాక్కుని పరారయ్యాడు. అలాగే 70 ఏళ్ల వృద్ధురాలు దేవవరపు కోటమ్మ ఇంటి ముందు వేపచెట్టు కింద నిద్రిస్తుండగా ఆమె మెడలోని సుమారు 25 గ్రాముల బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తి అపహరించాడు. రెండు ఘటనల్లో అప్రమత్తమైన బాధితులు కేకలు వేయడంతో స్థానికులు గుమిగూడి దొంగల ఆచూకీ కోసం గాలించారు. వరుస చోరీలతో గ్రామంలో కలకలం రేగింది. సమాచారం అందుకున్న మార్కాపురం సీఐ ఎండీ హుస్సేన్, పట్టణ ఎస్సై విశ్వనాథరెడ్డి గ్రామానికి చేరుకుని బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. వేసవి కాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులను గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
ఎన్నికల హామీలు అమలు చేయాలి
● వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ మార్కాపురం: ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి పేద ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సీహెచ్ కోటేశ్వరరావు, ఆవుల శేఖర్ డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక ప్రెస్క్లబ్లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని నిరు పేదలకు ప్రభుత్వ భూములు పంచాలని, లేదంటే ఎర్రజెండాలు పాతి భూ పోరాటాలు చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు రెండేళ్లుగా ఆ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ పేదలకు పంపిణీ చేసేందుకు ముఖ్యమంత్రికి మనసు రావడం లేదన్నారు. అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులకు ఎకరం భూమి 99 పైసలకే ఇవ్వడం వెనుక రహస్యం ఏమిటని ప్రశ్నించారు. వారికి 99 పైసలకే భూములిస్తే తప్పేముందని ఎదుటివారిపై బురదజల్లి ప్రశ్నించడం చంద్రబాబుకు అలవాటైందన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత అసైన్డ్ భూ బదలాయింపు నిషేఽధిత చట్టాన్ని సవరణ చేయడం వెనుక అదానీ, అంబానీ లాంటి కార్పోరేట్ శక్తుల హస్తం ఉందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అసైన్ చేసిన భూములు 35 లక్షల ఎకరాలు పేదల వద్ద ఉండాల్సి ఉందని, అయితే అందులో 13 లక్షల ఎకరాలు అన్యాక్రాంతమై పెద్దల చేతుల్లోకి వెళ్లాయన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 20 ఏళ్లకు పైబడి అనుభవంలో ఉన్న వారికి అన్ని హక్కులతో ఫ్రీ హోల్డ్ చేసిందని, చంద్రబాబు ప్రభుత్వం 2 సంవత్సరాలుగా ఆ భూములను హోల్డ్లో పెట్టి అన్నదాత సుఖీభవ, బ్యాంకుల్లో పంట రుణాలు మంజూరు చేయడం లేదన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 5 లక్షల పెన్షన్లు తీసివేశారన్నారు. ఇప్పటికై నా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఐ నాయకులు నాసరయ్య, ఎస్కే ఖాశీం, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కృష్ణ, మోహన్, పవన్ కల్యాణ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆన్లైన్ ఔషధాలను నియంత్రించాలి
ఒంగోలు టౌన్: ఆన్లైన్ ఔషధాలపై నియంత్రణ విధించాలని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర నాయకుడు దగ్గుమాటి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బంద్ నిర్వహించిన మెడికల్ షాపు నిర్వాహకులు బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆన్లైన్ విక్రయాల వలన ఔషధాల దుర్వినియోగం జరుగుతుందని ఆందోళన వెలిబుచ్చారు. అదుపులేకుండా యాంటీ బయాటిక్స్, సైకోట్రోపిక్, ఓపియాయిడ్ మందులు వాడి ఆరోగ్యం పాడుచేసుకుంటున్నారని చెప్పారు. ఒకే ప్రస్కిప్షన్ ను పదే పదే వినియోగించి నియంత్రిత ఔషధాలను కొనుగోలు చేస్తున్నారని, దీని వల్ల డ్రగ్ రెసిస్టెంట్ అవడంతో వ్యాధులు త్వరితంగా తగ్గడం లేదన్నారు. ఔషధాలను వాణిజ్య వస్తువులుగా పరిగణించడం సరైన నిర్ణయం కాదన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఈ ఆన్లైన్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరారు. మందుల ధరలు రోజురోజుకూ పెరిగిపోయి సాధారణ ప్రజలకు అందుబాటులో లేకుండా పోతున్నాయని, దీర్ఘకాలిక వ్యాధులు, ప్రాణాంతక ఔషధాల ధరలు చాలా మందికి అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీపీ, షుగర్, క్యాన్సర్ మందుల ధరలు తగ్గించాలని కోరారు. ప్రజలకు నాణ్యమైన మందులు చవకగా అందించాలన్నారు. ఫార్మసీ వృత్తిని కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పావులూరి శ్రీధర్, సతీష్, వెంకారెడ్డి, కూరపాటి వెంకట సత్యనారాయణ, ఏడుకొండలు, నరసింహారావు, మాలంపాటి రమణరావు, కోటిరెడ్డి, రవికుమార్, వేమూరి సుబ్బారావు, శ్రీనివాసులు రెడ్డి, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. -
సెగలు.. పొగలు!
నిర్మానుష్యంగా ఉన్న ఒంగోలు చర్చి సెంటర్ఒంగోలు సబర్బన్: భానుడి భగభగలతో ఉమ్మడి ప్రకాశం జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. బుధవారం పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 45 డిగ్రీలకు చేరుకున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఎండ వేడిమి, ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా కనిగిరిలో 46.1, కొండపి 45.6, ఒంగోలు 44.5 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడదెబ్బకు ఇద్దరు మృతిచెందారు. మంగళవారంతో పోల్చుకుంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు నుంచి మూడు డిగ్రీలు అదనంగా నమోదయ్యాయి. రానున్న మూడు రోజుల్లో తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచే వేడిగాలుల తీవ్రత కనిపించింది. ఉమయం 11 గంటలు నగరంలోని ప్రధాన వీధులు కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించాయి. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. సాయంత్రం ఆరు గంటల తరువాతే రోడ్ల వెంట జనాలు సంచరించటం కనపడింది. ఇంట్లో ఉక్కపోతతో జనం అల్లాడిపోయారు. జిల్లాలోని సముద్ర తీర ప్రాంత మండలాల్లో సైతం విపరీతమైన ఉష్ణోగ్రతలు చోటు చేసుకున్నాయి. తీర ప్రాంత మండలాలతో పాటు ఒంగోలు, కొండపి, కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు సంతనూతలపాడు, అద్దంకి, దర్శి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, యర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో 44 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాంతో జిల్లాలోని ప్రజానీకం ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోయారు. ఒక వేళ అత్యవసర పనుల నిమిత్తం బయటకు వచ్చినా వడదెబ్బకు తల్లడిల్లిపోయారు. 24వ తేదీ వరకూ జాగ్రత్త: కలెక్టర్ జిల్లాలో ఈనెల 24 వతేదీ వరకు తీవ్రమైన వేడి వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండవచ్చన్న వాతావరణ హెచ్చరికల దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పీ రాజాబాబు సూచించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తక్షణ సన్నద్ధత, ఉపశమన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లు, అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో వేడి వాతావరణంలో అనారోగ్యం, మరణాల నివారణ, ప్రజల రక్షణ, అత్యవసర సేవల కొనసాగింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. బస్ స్టాండ్లు, మార్కెట్లు, ప్రధాన కూడళ్లు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర రద్దీ ప్రాంతాల్లో తాగునీటి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నీటి కొరత ఎక్కువగా ఉండే నివాస ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించడం కోసం మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పరిపాలన, వైద్యారోగ్య, పోలీస్, రెవెన్యూ, విద్య, అగ్నిమాపక సేవలు, స్వచ్ఛంద సంస్థలు, ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. వడదెబ్బకు ఇద్దరు మృతి గుడ్లూరు: వడదెబ్బకు గురై గుడ్లూరు మండలంలో బుధవారం ఇద్దరు మృతిచెందారు. గ్రామానికి చెందిన ఉపాధి కూలీ గంగోలు ఆదిశేషు (58) ఉదయం ఉపాధి హామీ పనికి వెళ్లాడు. కంచె తొలగించే పనిచేస్తూ అలసిపోయాడు. పని పూర్తిచేసుకుని మస్టర వేయించుకుని ఐరిస్ ఫొటో తీయించుకుని ఉదయం 9 గంటల సమయంలో విశ్రాంతి తీసుకునేందుకు కూర్చునేందుకు ప్రయత్నిస్తూ ముందుకు పడిపోయాడు. నోటి నుంచి గురక రావడంతో తోటి కూలీలు వెంటనే 108 వాహనంలో కందుకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న ఏపీఓ వెంకటేశ్వర్లు మృతుని ఇంటి వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మట్టి ఖర్చులకు గ్రామస్తులు రూ.5 వేలు ఆర్థిక సాయం అందించారు. అధికారుల నిర్లక్ష్యం: వేసవి కాలం ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి. 8 గంటలకే ఎండ తీవ్రత వలన ఉక్కపోత ఎక్కువగా ఉంటోంది. ఉదయం 6 గంటల నుంచి 8 గంటలకు పనిముగించాలి. కానీ 9 గంటల వరకు కూలీల చేత పని చేయిస్తున్నారు. తాగేందుకు మంచినీరు కూడా అందుబాటులో ఉంచడం లేదు. దీంతో ఉపాధి కూలీలు వడదెబ్బకు గురవుతున్నారు. వడదెబ్బకు వృద్ధుడు మృతి అదేవిధంగా మండలంలోని రావూరు గ్రామానికి చెందిన గొల్లప్రోలు సుబ్బారావు (65) వడదెబ్బకు గురై బుధవారం మృతి చెందాడు. -
దశదిన కర్మకు హాజరైన వైవీ, బూచేపల్లి
తాళ్లూరు: తాళ్లూరుకు చెందిన సీనియర్ నాయకుడు, వ్యాపారవేత్త ఐవీరెడ్డి తండ్రి ఇడమకంటి చిన కోటిరెడ్డి దశదిన కర్మకు రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, అద్దంకి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ వైవీ భద్రారెడ్డి హాజరయ్యారు. తొలుత చినకోటిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో పార్టీ మండల అధ్యక్షుడు తూము సుబ్బారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధుసూదన్రెడ్డి, పార్టీ జిల్లా సెక్రటరీ మారం ఇంద్రాసేనారెడ్డి, ఐవీ సుబ్బారెడ్డి, దర్శి మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, ముండ్లమూరు ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మారెడ్డి, దర్శి వైస్ ఎంపీపీ దుర్గారెడ్డి, మండల ఉపాధ్యక్షుడు హరిబాబు, జిల్లా రైతు విభాగం సెక్రటరీ సంగు కొండారెడ్డి, జిల్లా మైనారిటీ సభ్యుడు షేక్ కాలేషా, రైతు విభాగం అధ్యక్షుడు గువ్వల శ్రీనివాసరెడ్డి, యూత్ అధ్యక్షుడు కొర్రపాటి విష్ణు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు యామర్తి ప్రభుదాస్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు కై పు అశోక్రెడ్డి నాయకులు కోటా కృష్ణారెడ్డి, చార్లెస్ సర్జన్, ఐ.రాజగోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించాలని ధర్నా
మార్కాపురం: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ ఎన్ఎంయూ రీజనల్ అసిస్టెంట్ సెక్రటరీ టి.మల్లికార్జునరావు, వైస్ ప్రెసిడెంట్ నాగిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక ఆర్టీసీ డిపో ఎదుట ఎన్ఎంయూ నాయకులు బుధవారం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీ్త్ర శక్తి బస్సుల్లో 0 టిక్కెట్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. పీఆర్సీ కమిటీని వెంటనే నియమించాలని, ఐఆర్ తక్షణమే ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న 4 డీఏలను, లీవ్ ఎన్క్యాష్మెంట్ను ఇవ్వాలని కోరారు. ప్రయాణికులకు సరిపడ బస్సులను ప్రభుత్వం కొనుగోలు చేయాలని, కార్మికులకు గతంలో ఉన్న వైద్య సదుపాయాలను కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు కుమార్, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వర్లు, సిహెచ్ శ్రీనివాసులు, హుస్సేన్, సత్యనారాయణరెడ్డి, నాగ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలి
● కలెక్టర్ ఎం విజయసునీత మార్కాపురం టౌన్: నిరుద్యోగ యువతకు అవసరమైన రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇప్పించాలని కలెక్టర్ ఎం విజయసునీత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ఛాంబర్లో బుధవారం జిల్లాలోని నైపుణ్య అభివృద్ధి అధికారులతో పాటు సంబంధితశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ కమిటీ సభ్యులందరూ సమన్వయంతో పనిచేసి నిరుద్యోగులకు ఉపాధి మార్గం చూపాలని కోరారు. వారి పరిధిలో ఉన్న నిరుద్యోగులకు జాబ్మేళాల వివరాలు తెలియజేయాలన్నారు. విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. సోలార్ పంపుసెట్లు, వ్యవసాయం, డ్రోన్ పైలెట్స్, ప్రకృతి వ్యవసాయం, నిర్మాణ రంగం వాటిలో యువతకు శిక్షణ ఇప్పించాలని ఆమె తెలిపారు. జిల్లా నైపుణ్యా అభివృద్ధి కమిటీలో ఉన్న వివిధ శాఖలకు చెందిన 19 మంది సభ్యులు సమన్వయంతో నిరుద్యోగులకు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కంచి బాబు, సిడాప్ జీడీఎం శ్రీనివాసులు, మైనింగ్ అధికారి శివప్రసాదు తదితరులు పాల్గొన్నారు. -
పవన్ సాన్నిహిత్యాన్ని అడ్డం పెట్టుకుని డబ్బుల దందా..?
ఉమ్మడి జిల్లా కూటమిలో కుంపట్లు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. పేరుకే జనసేనలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెర వెనక ఆట ఆడిస్తున్నది మాత్రం తెలుగుదేశం పార్టీ నేతలే అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సీఎంను కలిసిన 24 గంటలు గడవకముందే జనసేన నాయకుడు ఆరోపణలు గుప్పించడం సంచలనంగా మారింది. అయితే ఈ ఆరోపణల వెనుక టీడీపీ ముఖ్యనేత హస్తం ఉందని బాలినేని వర్గం ఆరోపణలు చేస్తోంది. సాక్షి ప్రకాశం : జిల్లా కూటమిలో వర్గ రాజకీయాలు తారస్థాయికి చేరుకున్నాయి. జనసేన ఇప్పటికే రెండు ముక్కలుగా విడిపోవడం తెల్సిందే. మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి ఆరు జిల్లాల డీ లిమిటేషన్ సమావేశం బాధ్యతలు అప్పగించడంతో అటు జనసేనలోనే కాకుండా ఇటు టీడీపీలో కూడా అలజడి రేగుతోంది. ఆ సమావేశానికి జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ వర్గం గైర్హాజరవడం ద్వారా బాలినేని ఆధిపత్యానికి గండి కొట్టే ప్రయత్నం చేసింది. బాలినేని ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడంతో ఆందోళనకు పచ్చనేతలు జడా బాల నాగేంద్రం ద్వారా తీవ్రమైన ఆరోపణలు చేయించిందని ఒక వర్గం ఆరోపిస్తోంది. రెండు వర్గాలు పోటా పోటీగా విలేకరుల సమావేశం పెట్టి విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడంతో జిల్లా కూటమి నాయకులు ఎండలకు మించి ఉక్కపోతకు గురవుతున్నారు. అధిష్టానాన్ని లెక్క చేయకుండా.... స్థానిక సంస్థల డీ లిమిటేషన్ సమావేశం బాధ్యతలను బాలినేనికి అప్పగించారు. దీంతో ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు జిల్లాల సమావేశం ఒంగోలులో నిర్వహించారు. జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ అండ్ కో ఆ సమావేశాన్ని బాయ్ కాట్ చేశారు. తమకు పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహించిన డీ లిమిటేషన్ సమావేశాన్ని స్వయంగా జిల్లా అధ్యక్షుడే బాయ్ కాట్ చేసినప్పటికీ జనసేన అధిష్టానం ఏమీ చేయలేక పోయింది. దీంతో పారీ్టపై జనసేన అధిష్టానం పట్టు కోల్పోయిందన్న విమర్శలు వినిపించాయి. ఇదిలా ఉండగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులతో తమను ఇబ్బంది పెట్టిన బాలినేనికి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడంపై రియాజ్ వర్గం రగిలిపోతున్నట్లు సమాచారం. సీఎం చంద్రబాబును కలిశాక... ఒకవైపు జిల్లా కూటమిలో టీడీపీ, జనసేనలోని వర్గాలు బాలినేనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబును మాజీ ఎమ్మెల్యే బాలినేని కలవడం పచ్చశిబిరంలో అలజడి రేపింది. దీంతో బాలినేనికి చెక్ పెట్టకపోతే ఇక లాభం లేదని భావించిన ఆ వర్గం వ్యూహాత్మకంగా జడా బాల నాగేంద్రంను రంగంలోకి దింపిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. బాల నాగేంద్రం మొదట్నుంచి బాలినేని ప్రధాన అనుచరుడిగా వ్యవహరిస్తున్నారు. పలుమార్లు ఎమ్మెల్యే దామచర్ల మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. మొన్న జరిగిన డీ లిమిటేషన్ సమావేశంలో కూడా బాలినేని వెంట ఉన్న బాల నాగేంద్రం ఉన్నట్టుండి ఆయనపైనే ఆరోపణలు చేయడంపై పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. బాలినేని వర్గం ప్రతి విమర్శలు... ఉదయం బాల నాగేంద్రం బాలినేని మీద విమర్శలు గుప్పించారు. సాయంత్రం అయ్యేసరికల్లా బాలినేని వర్గం ప్రెస్మీట్ పెట్టి ప్రతి విమర్శలు చేసింది. ఇతర పార్టీ నాయకులు తెర వెనక ఉండి బాలినేని మీద విమర్శలు చేయిస్తున్నారని జనసేన రాష్ట్ర నాయకురాలు రాయపాటి అరుణ ఆరోపణలు చేయడం గమనార్హం. సీఎం చంద్రబాబుతో కలిసి జిల్లా పరిస్థితులు చర్చించిన విషయం బయటకు వచ్చిన వెంటనే కొందరు నాయకులు బాలినేని మీద తప్పుడు ఆరోపణలతో ప్రెస్ మీట్ పెట్టించారని అనుమానం వ్యక్తం చేశారు. నాగేంద్రం వెనక ఉన్న వ్యక్తి ఏమీ పీకలేరని ఆమె విరుచుకుపడ్డారు. ఇతర పారీ్టల నాయకులు జనసేనపై పెత్తనం చేయాలని చూస్తే ఊరుకోమన్నారు. ఇరు పార్టీల అధినేతలు మౌనం... జిల్లాలో కూటమి పారీ్టల్లో ఎత్తులు, పై ఎత్తులతో స్థానిక నాయకులు తరచూ వీధిన పడుతున్నారు. మొదట్లో టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల నేరుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత జనసేన నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాలినేనికి వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అయినా టీడీపీ అధిష్టానం పట్టించుకోవడం లేదు. జనసేన పార్టీ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. మొదట రియాజ్, అరుణ వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడిచింది. అరుణను వెంటాడి మరీ దాడి చేసినా పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు. ఇప్పుడు బాలినేని కార్యక్రమాలను రియాజ్ అండ్ కో బాయ్ కాట్ చేసింది. అయినా సరే జనసేన అధినేత పట్టించుకోవడం లేదు. ఇరు పారీ్టల అధినేతల మౌనం వెనక ఉన్న మతలబు ఏమిటో అర్థం కాక సామాన్య కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. పదవులు అమ్ముకుంటున్న బాలినేని...జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఉన్న సాన్నిహిత్యాన్ని అడ్డం పెట్టుకొని బాలినేని, ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి పదవులు అమ్ముకుంటున్నారని జడా బాల నాగేంద్రం చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. పార్టీ కేంద్ర కార్యాలయంలో కీలక పాత్ర పోషిస్తున్న రామ్ తాల్లూరి, లింగమనేని రమేష్ లతో కుమ్మక్కై పదవులు అమ్ముకుంటున్నారని బాల నాగేంద్రం విమర్శలు చేయడం గమనార్హం. నియోజకవర్గ ఇన్చార్జి పదవికి రూ.10 లక్షలు, జిల్లా అధ్యక్ష పదవికి రూ.50 లక్షలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో సీట్లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నారని, ఒంగోలు జిల్లా అధ్యక్ష పదవి ఇప్పిస్తామంటూ ఎన్ఆర్ఐలకు ఫోన్లు చేయిస్తున్నారని ఆరోపించారు. ఒంగోలు నగర కార్పొరేషన్ ఎన్నికల్లో, ఒంగోలు నియోజకవర్గానికి బాలినేని, ఆయన కుమారుడ్ని దూరంగా పెట్టాలని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రెస్ మీట్ వెనక అధికార పార్టీకి చెందిన కీలకనేత వర్గం హస్తం ఉందని ప్రచారం జరుగుతోంది. -
అక్రమ కేసులు పెట్టడమే ఆయన డ్యూటీ
సాక్షి, ప్రకాశం: దర్శి ఎస్సై మురళి వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. ప్రైవేటు సెటిల్మెంట్లకు పోలీస్ స్టేషన్ను అడ్డాగా మార్చారన్న విమర్శలు ఉన్నాయి. టీడీపీ నాయకులను నిత్యం పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వారికి సకల మర్యాదలు చేస్తూ వారు చెప్పిందే వేదంలా పని చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పెట్రోల్ ధరల పెంపుపై సోమవారం దర్శిపట్టణంలో వైఎస్సార్సీపీ నిర్వహించిన ఆందోళనకు ఆటోలు ఇచ్చారంటూ రెండు ఆటోల అద్దాలను పగులగొట్టడం వివాదాస్పదంగా మారింది. ఆది నుంచీ వివాదాస్పదమే.. టీడీపీ నేతలతో క్రికెట్ బెట్టింగ్లను వేయించి వాటిని ప్రోత్సహిస్తూ వారి వద్ద భారీ మొత్తంలో ముడుపులు పుచ్చుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. బెట్టింగ్ల్లో పెద్ద మొత్తంలో డబ్బులు గెలుచుకున్న వారిని పిలిపించి కేసులు నమోదు చేస్తామని బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో ఎస్పీ హర్షవర్ధన్రాజు దర్శికి ప్రత్యేక టీంను పంపి క్రికెట్ బెట్టింగ్లు వేసే టీంను పట్టుకున్నారు. అయితే అందులో ప్రధాన నిందితులు టీడీపీకి చెందిన వారే కావడంతో ఈ ఎస్సై, సీఐలు వారిని దేశం దాటించారన్న అనుమానాలు పోలీస్ డిపార్ట్మెంట్లోనే వ్యక్తమయ్యాయి. దీంతో ఎస్సైని కొన్ని రోజులు విధుల నుంచి పక్కన పెట్టి ఇక్కడ ఇన్చార్జ్ ఎస్సైని కూడా నియమించారు. పారిపోయిన క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులను ఇప్పటికీ పట్టుకున్న పాపానపోలేదు. బొద్దుకూరపాడు, ఎర్రోబనపల్లి, చలివేంద్ర కొండ శివారుల్లో పెద్ద మొత్తంలో పేకాట శిబిరాలు నిర్వహించి సీఐతో కలిసి భారీ మొత్తంలో నెల మామూళ్లు వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దర్శి నుంచి వెళ్లే అక్రమ ఇసుక, అక్రమ రేషన్ బియ్యం తరలింపును ప్రోత్సహిస్తూ వారి వద్ద భారీ మొత్తంలో వసూళ్లు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బిల్లులు చెల్లించి తెచ్చుకునే వారి ఇసుక లారీని గొట్టిపాటి లక్ష్మి ప్రధాన అనుచరులు ధ్వంసం చేయగా సంబంధిత యజమాని ఫిర్యాదు చేయడంతో కేసు కట్టారు. ఆ తరువాత ఆ ఎఫ్ఐఆర్ ను మాయం చేసి యజమానిని బెదిరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ ఎఫ్ఐఆర్ స్థానంలో మరో కేసు కట్టినట్లు సమాచారం. ఇది ఒక ఎత్తైయితే వైఎస్సార్ సీపీ నేతలు ప్రజా వ్యతిరేక విధానాలపై ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నప్పుడు దురుసుగా ప్రవర్తించడం, వారిని భయభ్రాంతులకు గురి చేయడం, కేసులు పెడతామని బెదిరించడం తరుచూ జరుగుతోందని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. వైఎస్సార్ సీపీకి చెందిన వారు ఫ్లెక్సీలు కట్టుకున్నా వివాదాలు సృష్టించి వారిపై కేసులు పెడతామని బెదిరించి డబ్బులు వసూళ్లు చేశారని తెలిసింది. గతంలో గణేష్ నిమజ్జనాన్ని కూడా రాజకీయం చేసి చలివేంద్రలో గ్రామస్తుల ఇళ్లపై దాడి చేసి మహిళలని కూడా చూడకుండా వారిని లాఠీతో చావబాదారు. అర్ధరాత్రి వరకు మహిళలను పోలీస్ స్టేషన్లోనే ఉంచి ఆ తరువాత ఇంటికి పంపారు. అయినా ఈ ఎస్సై పై అప్పట్లో ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు చేసుకోనివ్వకుండా అడ్డుకోవడం, ఫ్లెక్సీలు కట్టేవాళ్లను బెదిరించడం, ఎవరైనా అభిమానంతో ఫ్లెక్సీలు కడితే టీడీపీ నేతలను ఉసిగొలిపి అక్రమ కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి చావబాదడం చేస్తున్న ఎస్సై తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. ఇటీవల బొట్లపాలెం గ్రామంలో టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీ నేతలను కొట్టగా వైఎస్సార్ సీపీ నేత పైనే కేసులు పెట్టి గ్రామంలో పోలీస్ పికెటింగ్ నిర్వహించి భయబ్రాంతులకు గురి చేశారు. కొత్తరెడ్డిపాలెం గ్రామంలో డీజే సౌడ్తో వైఎస్సార్ సీపీ కార్యక్రమాలు చేశారని ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టించారు. గొట్టిపాటికి దాసోహం: టీడీపీ ఇన్చార్జ్ గొట్టిపాటి లక్ష్మీకి దాసోహం చేయడానికే పోలీస్ ఉద్యోగంలో చేరారన్నట్లు వ్యవహరిస్తున్న ఈ ఎస్సై తీరు వివాదాస్పదంగా మారింది. మండలంలో ఆమె ఎక్కడికి వెళితే అక్కడకు కాన్వాయ్ పెట్టుకుని ఈ ఎస్సై ప్రత్యక్షమవుతారు. ఆమె బర్త్డే పారీ్టలకు, ఆమె చేస్తున్న ప్రైవేటు కార్యక్రమాలకు స్టేషన్లో డ్యూటీ కూడా మానుకుని ఆమె వెంటే పోలీస్ జీపుతో పాటు పోలీస్ సిబ్బందిని కూడా కాన్వాయ్గా తీసుకెళ్లి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంతో ఎటువంటి సంబంధం లేని టీడీపీ ఇన్చార్జ్ అయిన ఆమె కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ దర్శికి వస్తున్నారంటే పోలీస్ కాన్వాయ్ పెట్టి ఆమె వెంట ఉండి తీసుకొస్తారు. టీడీపీ కార్యక్రమాలను దగ్గరుండి ఆమెకు సెక్యూరిటీ ఇస్తుంటారు. ప్రభుత్వ వాహనాలతో ప్రైవేటు వ్యక్తులకు సెక్యూరిటీ ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
మాడుపగులుతోంది..!
ఉమ్మడి జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం ఏడు గంటల నుంచే సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. 11 గంటల నుంచే భానుడి భగభగలు పెరుగుతున్నాయి. రానున్న నాలుగు రోజుల్లో ఎండల తీవ్రత మరింతగా పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. అత్యవసరమైతేనే జనం బయటకు రావాలని సూచించింది. వేసవి సెగలకు బల్లికురవ మండలంలో ఒక ఉపాధి కూలీ మృతి చెందాడు.ఒంగోలు టౌన్: రోహిణి కార్తెకు ముందే భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. ఉమ్మడి జిల్లాలో మంగళవారం అన్ని నియోజకవర్గాల్లో 41 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లా కేంద్రాలైన ఒంగోలు, మార్కాపురంలలో గరిష్ట ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. అలాగే కనిగిరి, అద్దంకి, దర్శి, కంభం, బేస్తవారిపేట, చీమకుర్తిల్లో కూడా 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. యర్రగొండపాలెం, సింగరాయకొండ 41 డిగ్రీలు, నల్లమల అటవీ ప్రాంతంలోని దోర్నాలలో 40 డిగ్రీలు నమోదైంది. అయితే నమోదైన ఉష్ణోగ్రతల కంటే వేడి అధికంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా 45 డిగ్రీల వేడి తీవ్రత ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో జిల్లా వాసులు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. రానున్న మూడు రోజులు అగ్నిగుండమే... రానున్న మూడు రోజులు రికార్డు స్థాయిలో ఎండలు ఉంటాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. ప్రకాశం జిల్లాలోని పలు మండలాల్లో, మార్కాపురం జిల్లాలో 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. 20, 21 తేదీల్లో బుధ, గురువారం రెండు రోజులు ప్రకాశం జిల్లాలోని కొన్ని మండలాలు, మార్కాపురంలో 45 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని ప్రకటించింది. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని సూచించింది. కనిపించని చలివేంద్రాలు: గతంలో ఎన్నడూ లేనంతగా ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా జిల్లాలో ఎక్కడా చలి వేంద్రాలు కనిపించడం లేదు. జిల్లా కేంద్రమైన ఒంగోలు, మార్కాపురంలో కూడా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. మండల కేంద్రాలు, పంచాయతీల్లో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఎక్కడో ఒకటీ అరా కనిపిస్తున్నాయి. విద్య, వైద్యం కోసం ప్రతినిత్యం గ్రామీణ ప్రజలు జిల్లా కేంద్రాలకు వస్తుంటారు. ఎండ వేడికి గొంతు ఎండిపోయి దాహం వేస్తే గుక్కెడు మంచినీళ్లు దొరకడం గగనమైపోయింది. చలివేంద్రాలు లేకపోవడంతో లీటర్ నీళ్లు 5 రూపాయలు పెట్టి కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి నెలకొంది. కనీసం చలివేంద్రాలను కూడా పెట్టలేని దుస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని ప్రజలు విమర్శిస్తున్నారు. -
డీఏ, సరెండర్ లీవ్ బకాయిలివ్వాలి
● టీచర్స్ గిల్డ్ వినతి ఒంగోలు సిటీ: ఎయిడెడ్ ఉపాధ్యాయుల డీఏ, సరెండర్ లీవ్స్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.వెంకటరావు, సీహెచ్.ప్రభాకరరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు, ప్రభుత్వంలో విలీనమైన ఎయిడెడ్ ఉపాధ్యాయులకు, పదవీ విరమణ పొందిన ఎయిడెడ్ ఉపాధ్యాయులకు 2018, 2019 కి సంబంధించి 41 నెలల డీఏ బకాయిలు, 2023 నుంచి సరెండర్ లీవ్ బకాయిలు, ఆఫ్ పే లీవ్ బకాయిలు చెల్లించాలని కోరారు. ఒంగోలు వన్టౌన్: డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఈ నెల 26న ఒంగోలుకు చేరుకుని ప్రకాశం భవన్లోని పీజీఆర్ఎస్ హాలులో ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకూ సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహిస్తారని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ, సాధికారత అధికారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కమిషన్ రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల స్థితిగతులపై పరిశోధన నిర్వహిస్తుందని తెలిపారు. స్థానిక సంస్థల వారీగా వెనుకబడిన తరగతులకు ఇవ్వాల్సిన రిజర్వేషన్ శాతాన్ని నిర్ణయించేందుకు సమగ్ర అనుభవ ఆధారిత అంచనాలను చేపడుతుందన్నారు. వినతి పత్రాలను అందించే వారు పైన పేర్కొన్న విషయాలను మాత్రమే పరిమితం చేయాలన్నారు. ఒంగోలు సిటీ: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు ఆర్ఐఓ ఆంజనేయులు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో 28 సెంటర్లు, మార్కాపురం జిల్లాలో 22 సెంటర్లు చొప్పున మొత్తం 50 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇంటర్ మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులు ప్రకాశం జిల్లాలో 8,249 మంది, మార్కాపురం లో 5,231 మంది చొప్పున మొత్తం 13,480 మంది పరీక్షలకు హాజరవుతారన్నారు. అలాగే రెండో సంవత్సరం జనరల్ విద్యార్థులు ప్రకాశం జిల్లాలో 4,380 మంది, మార్కాపురం జిల్లాలో 3,332 చొప్పున మొత్తం 7,712 మంది పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు. అలాగే ఇంటర్ మొదటి సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులు ప్రకాశం జిల్లాలో 413 మంది, మార్కాపురం జిల్లాలో 479 మంది చొప్పున మొత్తం 892 మంది పరీక్షలకు హాజరగుతున్నట్లు చెప్పారు. అలాగే రెండో సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులు ప్రకాశం జిల్లాలో 326 మంది, మార్కాపురం జిల్లాలో 460 మంది చొప్పున మొత్తం 786 మంది పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, రెండవ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. కంభం: కోడి కూయకముందు నుంచి అర్ధరాత్రి వరకూ నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తుండటంతో మందుబాబులు పూటుగా మద్యం తాగి హైవే రోడ్ల వెంబడి, బస్టాండ్, రైల్వే స్టేషన్, సందుల్లో దొర్లుతూ దర్శనమిస్తున్నారు. కంభంలో హైవే రోడ్డు పక్కన ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద మంగళవారం ఓ యువకుడు తాగి పడిపోయాడు. చంద్రబాబు ప్రభుత్వంలో బడి, గుడి అన్న తేడా లేకుండా మద్యం అమ్మి కుటుంబాలను నాశనం చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒంగోలు వన్టౌన్: ఒంగోలు ఉప కార్మిక కమిషనర్గా ఎస్కే గౌస్ను నియమిస్తూ కార్మిక శాఖ కమిషనర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకూ ఎ.గాయిత్రీ దేవి ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
గ్రామ సచివాలయం భవనంపై టీడీపీ జెండా
గిద్దలూరు రూరల్: టీడీపీ నేతల చేష్టలను ప్రజలను ఈసడించుకుంటున్నారు. ప్రభుత్వ కార్యాలయంపై ఏకంగా టీడీపీ జెండా ఉంచడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మండలంలోని కంచిపల్లెలోని గ్రామ సచివాలయం భవనంపై టీడీపీ జెండాను ఎగురవేశారు. ఇంత బహిరంగంగా కార్యాలయంపై టీడీపీ జెండా ఎగురవేసినా అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల గ్రామస్తులు మండిపడుతున్నారు. బెట్టింగ్ ముఠా అరెస్టు పెద్దదోర్నాల: క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్టు చేసినట్లు సీఐ అజయ్కుమార్ తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ వివరాలు వెల్లడించారు. ఈ నెల 18వ తేదీన మండల పరిధిలోని హరివిల్లు హోటల్వెనుక వైపున ఉన్న ప్లాట్ల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను అదుపులోనికి తీసుకొని విచారించారమని తెలిపారు. వీరిలో నలుగురు బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు నిర్ధారించి అదుపులోనికి తీసుకున్నట్లు చెప్పారు. గుంటూరుకు చెందిన నేలకుర్తి హరిబాబు అనే వ్యక్తితో కలిసిన ఈ నలుగురు ముఠాగా ఏర్పడి బెట్టింగ్కు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. నిందితులను మార్కాపురం కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎస్సై వెంకట రమణయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
సుందరయ్య స్ఫూర్తితో ఉద్యమాలు
ఒంగోలు సిటీ: పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ప్రజా ఉద్యమాలకు పునరంకితం అవుతామని సీపీఎం నాయకులు పేర్కొన్నారు. సీపీఎం ఒంగోలు నగర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో జెండా ఆవిష్కరణలు, నివాళి కార్యక్రమాలు నిర్వహించారు. నివాళులర్పించారు. పలు ప్రాంతాల్లో మజ్జిగ పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో సీపీఎం నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, నగర కార్యదర్శివర్గ సభ్యులు జి. రమేష్, తంబి శ్రీనివాసులు మాట్లాడుతూ సుందరయ్య జీవితం నిరాడంబరతకు నిదర్శనమని కొనియాడారు. దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమాల నిర్మాణానికి ఆయన జీవితాంతం కృషి చేశారని తెలిపారు. కార్మిక, రైతాంగ, మహిళా ఉద్యమాలకు నాయకత్వం వహించడంతో పాటు తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. రైతాంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎన్. వీరాస్వామి, దామా శ్రీనివాసులు, ఘట్టమనేని శ్రీనివాసరావు, ఎస్డీ హుస్సేన్, కొర్నిపాటి శ్రీనివాసులు, డి.వెంకటేశ్వర్లు, బేబీరావు పాల్గొన్నారు. -
సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ అరుణ్ రిచర్డ్ బాధ్యతల స్వీకారం
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): సెంట్రల్ జీఎస్టీ గుంటూరు కమిషనరేట్ నూతన కమిషనర్గా అరుణ్ రిచర్డ్ మంగళవారం గుంటూరు కన్నావారితోటలోని ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. 2007 సివిల్ సర్వీసెస్ బ్యాచ్కి చెందిన అరుణ్ రిచర్డ్ విశాఖపట్నం జీఎస్టీ, కస్టమ్స్ జోన్లోని ఐదు కమిషనరేట్లకు అప్పిలేట్ అథారిటీగా, సెంట్రల్ ట్యాక్స్, కస్టమ్స్ అప్పీల్స్ కమిషనర్గా పనిచేస్తూ గుంటూరు జీఎస్టీకి బదిలీపై వచ్చారు. కమిషనర్ మాతృబాష తెలుగు అయినప్పటికీ, తెలుగు రాష్ట్రాలలో పనిచేయడం ఆయనకు ఇదే మొదటిసారి. బాధ్యతలు స్వీకరించిన అరుణ్ రిచర్డ్ను అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు కలిసి, పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. తొలుత కమిషనర్కు అడిషనల్ కమిషనర్ బి.లక్ష్మీనారాయణ, జాయింట్ కమిషనర్ దేవ్కుమార్, పీఆర్ఓ ఆర్.పి.పి కుమార్లు ఘన స్వాగతం పలికారు. సిబ్బంది మార్చ్ఫాస్ట్ నిర్వహించారు. అరుణ్ రిచర్డ్ను స్వాగతం పలుకుతున్న అడిషనల్ కమిషనర్ లక్ష్మీనారాయణ -
మంచి నీరు ఎక్కువగా తాగాలి
ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఎండల కంటే వేడి గాలులు, సెగ ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా ప్రమాదం. ఉదయం 11 గంటల తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఉంటే మంచిది. ఒకవేళ అనివార్య కారణాలతో బయటకు వెళితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దాహం వేసినా, వేయకపోయినా అరగంటకోసారి 300 ఎంఎల్ నీళ్లు తాగాలి. నీళ్లతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ఓఆర్ఎస్ పౌడర్, మజ్జిగ, నిమ్మకాయ నీళ్లు తాగాలి. కూల్ డ్రింక్స్ తాగకపోవడమే మంచిది. వడదెబ్బ తగిలితే వెంటనే సమీపంలోని వైద్యశాలకు తరలించాలి. అశ్రద్ధ చేయకూడదు. – డాక్టర్ ధీరజ్ బాబు సానాల, ఎండీ, జనరల్ ఫిజీషియన్, శ్రీ రామ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఒంగోలు -
భూ వివాదంతోనే హత్య
పామూరు: సీఎస్పురం మండలం పెద్దగోగులపల్లెలో ఈ నెల 15న జరిగిన హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ దుర్గాసి వినోద్కుమార్ తెలిపారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. సీఎస్పురం మండలంలోని పెద్ద గోగులపల్లి గ్రామానికి చెందిన మిరియం బాబుచౌదరి, చిలంకూరి రమేష్రెడ్డిలకు గ్రామ సమీపంలోని 4 ఎకరాల పొలానికి సంబంధించి వివాదం ఉంది. దీంతో ఇద్దరూ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఈనెల 15వ తేదీ శుక్రవారం సదరు పొలంలో చిలంకూరి రమేష్రెడ్డి షెడ్ నిర్మాణానికి సంబంధించి పునాది పనులు చేస్తుండగా విషయం తెలుసుకున్న మిరియం వెంకటేశ్వర్లు, ఆయన కుమారుడు మిరియంబాబు చౌదరి, మరికొందరు అక్కడికి వెళ్లి ట్రాక్టర్తో నిర్మాణ పనులను తొలగించడంతో వివాదం ప్రారంభమైంది. ఈ విషయాన్ని రమేష్రెడ్డి ఇంటికి వెళ్లిన తరువాత భార్య, తల్లికి చెప్పాడు. పొల వివాదం సర్దుమణగాలన్నా, తమకు పొలం దక్కాలన్నా మిరియం వెంకటేశ్వర్లు లేదా ఆయన కుమారుడు మిరియం బాబుచౌదరిలో ఒకరిని అడ్డు తొలగించాలని చెప్పాడు. అదే రోజు మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో మిరియం వెంకటేశ్వర్లు మోటార్బైక్పై రమేష్రెడ్డి ఇంటి ముందునుండి వెళ్తుండగా చిలంకూరి రమేష్రెడ్డి, అతని భార్య ధనలక్ష్మి, తల్లి రామాంజమ్మలు అడ్డుకొని వాగ్వాదానికి దిగారు. గొడవలో చిలంకూరి రమేష్రెడ్డి మడ్డుకత్తితో మిరియం వెంకటేశ్వుర్లుపై దాడికి యత్నించగా వెంకటేశ్వర్లు అప్రమత్తమై తప్పించుకోగా మోస్తరు గాయమైంది. స్థానిక మహిళలు అక్కడకు చేరుకొవడంతో నిందితుడు చిలంకూరి రమేష్రెడ్డి అక్కడ నుంచి పరారై రోడ్డు వైపుకు వెళ్లాడు. ఇంతలో విషయం తెలుసుకున్న వెంకటేశ్వర్లు కుమారుడు మిరియం బాబుచౌదరి బైక్పై ఊళ్లోకి వస్తుండగా గమనించిన చిలంకూరి రమేష్రెడ్డి అదే కత్తితో మిరియం బాబుచౌదరిని పొడవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు మిరియం బాబుచౌదరిని కారులో పామూరు సీహెచ్సీ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నిందితుడు రమేష్రెడ్డి సంఘటనా స్థలం నుంచి పరారై సమీపంలోని కొట్టాలుపల్లె గ్రామానికి వెళ్లాడు. గ్రామంలో రమేష్రెడ్డికి బంధువు అయిన నల్లపు రామాంజిరెడ్డి రక్తపు దుస్తులు, ఇతర ఆధారాలను కాల్చేవేయించి నిందితున్ని మరో చోట దాచి ఉంచాడు. మృతుని తండ్రి మిరియం వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుని కోసం గాలిస్తున్నారు. విషయం తెలుసుకున్న చిలంకూరి రమేష్రెడ్డి మంగళవారం మండలంలోని పెదరాజుపాలెం వీఆర్ఓ బి.మాల్యాద్రి వద్ద లొంగిపోయాడు. వీఆర్ఓ ఇచ్చిన సమాచారం మేరకు పెద్దగోగులపల్లి విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలోని బ్రిడ్జి వద్ద నిందితున్ని చిలంకూరి రమేష్రెడ్డిని అరెస్ట్చేసి అక్కడి నుంచి కొటాలుపల్లి వెళ్లి ఆధారాలు చెరిపివేసి దాగి ఉండేందుకు సహకరించిన నల్లపు రామాంజిరెడ్డిని కూడా అరెస్టు చేసినట్లు సీఐ దుర్గాసి వినోద్కుమార్ తెలిపారు. తొలుత మొదట మిరియం వెంకటేశ్వర్లుతో గొడవపడి స్వల్ప గాయానికి కారణమైన రమేష్రెడ్డి భార్య ధనలక్ష్మి, తల్లి రామాంజమ్మలపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ఇంకా ఎవరికై నా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నట్లు, ఆధారాలు ఉంటే వారిపై కూడా కేసు నమోదు చేసి అరెస్టు చేస్తామన్నారు. సీఐ వెంట ఎస్సై యం.వెంకటేశ్వరనాయక్, సిబ్బంది ఉన్నారు. హత్య కేసులో ఇద్దరి అరెస్టు మరో ఇద్దరిపై కేసు నమోదు హత్య కేసు వివరాలను వెల్లడించిన సీఐ -
ఆక్రమించేస్తాం
వల్లకాడా..వాగు పోరంబోకా..శ్మశాన స్థలమా..వాగు పోరంబోకు భూమా..ఏదైనా సరే ఆక్రమించేస్తారు... అడిగేదెవరు..అడ్డుకునేదెవరు అన్నట్లు గ్రామాల్లో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. అధికారం అండగా గ్రామాల్లో కబ్జా పర్వం సాగిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే..దూషణలకు, దాడులకు దిగుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మర్రిపూడి మండలంలో చిలంకూరులో ఓ టీడీపీ నేత ఏకంగా శ్మశానానికి వెళ్లే దారినే కబ్జా చేశాడు. అంతటితో ఆగకుండా ఒకటిన్నర ఎకరాల చెరువు పోరంబోకు భూమిని ఆక్రమించి శాశ్వత కట్టడాలు కట్టేశాడు. అధికారులకు తెలిసినా ఎటువంటి చర్యలు తీసుకోకుండా మౌనం వహించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మర్రిపూడి: మండలంలోని చిలంకూరు గ్రామంలో టీడీపీ నేతల అక్రమాలు, అరాచకాలకు పెచ్చుమీరాయి. ఖాళీ స్థలాలే కాకుండా ఏకంగా శ్మశాన దారి, చెరువు పోరంబోకు భూమిని ఆక్రమించేశారు. చెరువు పోరంబోకు భూమిలో ఏకంగా శాశ్వత కట్టడాలు కట్టారంటే అక్రమార్కులకు రెవెన్యూ అధికారుల అండదండలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మండలస్థాయి అధికారులకు ఈ ఆక్రమణల పర్వం గురించి తెలిసినా పట్టించుకోకపోవడంతో బాధితులు కలెక్టర్ను కలిసి తన గోడును వెళ్లబోసుకున్నారు. పచ్చనేతలు ఆక్రమించిన చెరువుకు నీరు చేరితే ఆక్రమంగా నిర్మించిన కట్టడాలతో దళితుల నివాసాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమించినా..అడిగేదెవరు..? మండలంలోని చిలంకూరు గ్రామాన్ని ఆనుకొని సర్వే నం.70లో సుమారు 20 ఎకరాల్లో మొండి చెరువు, వాగు పోరంబోకు భూమి విస్తరించి ఉంది. ఈ భూమిపై ఆదే గ్రామానికి చెందిన కూటమి నాయకుడు కొప్పోకు రమేష్ కన్ను పడింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అనుకున్నదే తడువుగా ఆక్రమణకు పూనుకున్నారు. వాగు పోరంబోకు, మొండి చెరువును యథేచ్ఛగా ఆక్రమించి విశాలమైన షెడ్ను శాశ్వతంగా నిర్మించాడు. అంతటితో ఆగకుండా ఎలాంటి అనుమతులు లేకుండా దళితవాడకు సమీపంలో ఉన్న మొండి చెరువును అక్రమంగా తవ్వేసి, చెరువుమట్టిని సుమారు ఒకటిన్నర ఎకరాల విస్థీర్ణంలో చదును చేశాడు. ఇదేమని ప్రశ్నించిన దళితులను మీకు దిక్కున్న చోట చెప్పుకోండని బెదిరిస్తూ దౌర్జన్యానికి దిగాడు. అనుమతి లేకుండా చెరువుమట్టి తరలింపు సదరు టీడీపీ ఆక్రమణలతో ఆగలేదు. చెరువులోని మట్టిని ఎటువంటి అనుమతులు లేకుండా తవ్వేశాడు. దాదాపు ఎకరన్నర భూమిని ఆక్రమించి అందులో కూడా చెరువు మట్టినే తోలుకున్నాడు. ఇంత బహిరంగంగా చెరువు మట్టిని ఆక్రమంగా తవ్వేస్తున్నా అధికారులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో అధికారులనే ఆక్రమణలకు, అక్రమ తవ్వకాలు సహకరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. శ్మశానానికి వెళ్లే దారి ఆక్రమణ చిలంకూరు గ్రామంలో దళితులకు చెందిన శ్మశాన వాటికకు వెళ్లే రహదారిని గ్రామానికి చెందిన కొప్పోకు రమేష్ ఆక్రమించాడని అదే గ్రామానికి చెందిన దళితులు కలెక్టర్కు పలు మార్లు ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఎవరైన చనిపోతే శవాలను ఖననం చేసేందుకు తీసుకెళ్లే రహదారిని ఆక్రమించడంపై దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్మశానానికి వెళ్లే రహదారిని ఆక్రమించడమే కాకుండా శాశ్వత కట్టడాలు కట్టాడని, దాదాపు రెండు ఎకరాల బారులో మట్టితోలి చదునుచేశాడన్నారు. ఇదేమని ప్రశ్నించిన మా ఎస్సీలపై దౌర్జన్యం చేస్తున్నాడని వారు వాపోయారు. వర్షాకాలంలో చెరువుకు నీరు చేరితే నాయకుల ఆక్రమణలో నిర్మించిన కట్టడాలతో దళితుల నివాసాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తహసీల్దార్ జనార్దన్ను సంప్రదించినా మహిళలని కూడా చూడకుండా దురుసుగా సమాధానం చెబుతున్నారని మహిళలు వాపోయారు. దళిత మహిళల నిరసన మండలంలోని చిలంకూరు గ్రామానికి సమీపంలో ఉన్న చెరువును గ్రామానికి చెందిన ఓ నాయకుడు యథేచ్ఛగా ఆక్రమించి శాశ్వత కట్టడాలు కట్టి శ్మశానానికి వెళ్లే దారిలేకుండా చేస్తున్న విషయాన్ని ఉన్నతాధికారులుకు దృష్టికి తీసుకెళ్లినా..ఎలాంటి స్పందన లేకపోవడంతో దళిత మహిళలు నిరసనకు దిగారు. దళితవాడ నుంచి శ్మశానానికి ఎలా వెళ్లాలని వారు ప్రశ్నిస్తున్నారు. మాకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. స్పందించని రెవెన్యూ అధికారులు శ్మశాన స్థలం, చెరువు వాగుపోరంబోకు భూమి ఆక్రమణపై దళిత మహిళలు పలుమార్లు తహసీల్దార్ జనార్దన్ను కలిసి విన్నవించారు. అయితే ఆయన నుంచి సరైన స్పందన లేకపోగా దురుసుగా వ్యవహరించారని మహిళలు వాపోయారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఆక్రమణలు తొలగించలేదంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమణలను తొలగించి దళితులను న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ఆక్రమణలపై తహసీల్దార్ జనార్దన్ను వివరణ కోరగా..చిలంకూరు చెరువులో గత కొన్ని నెలలుగా నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. దీనిపై పరిశీలించి నోటీసులు ఇచ్చి ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారు. దళితుల శ్మశాన దారిని ఆక్రమించిన టీడీపీ నాయకుడు ఒకటిన్నర ఎకరాల చెరువుపోరంబోకు భూమి యథేచ్ఛగా ఆక్రమణ చెరువులో శాశ్వత కట్టడాలు నిర్మించిన వైనం ప్రశ్నించే వారిపై దౌర్జన్యం కలెక్టర్కు ఫిర్యాదు చేసిన దళితులు కూటమి పాలనలో పెచ్చుమీరిన ఆక్రమణలు -
జనసేనలో మరోసారి ముసలం
ప్రకాశం: జిల్లా జనసేనలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. జనసేన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఆయన అనుచరుడే తిరుగుబాటు చేశారు. నిన్న మొన్నటివరకూ జిల్లాలో బాలినేని మౌత్పీస్గా ఉన్న జనసేన నాయకుడు జడ బాలనాగేంద్ర.. తీవ్ర విమర్శలు చేశారు. ఈరోజు(మంగళవారం, మే 19వ తేదీ) ప్రెస్మీట్ పెట్టిన బాలనాగేంద్ర.. బాలినేనిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జనసేనలో బాలినేని పదవులు బేరం పెట్టుకుంటున్నారని ధ్వజమెత్తారు. బాలినేని, ఆయన కొడుకు ప్రణీత్ రెడ్డి జనసేనను నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు బాలినేని, ఆయన కొడుకుని పార్టీకి దూరం పెట్టాలని పవన్ కళ్యాణ్కి విజ్ఞప్తి చేశారు బాలనాగేంద్ర. -
జాతీయ రహదారిపై ఆక్రమణలు తొలగించండి
మార్కాపురం టౌన్: జిల్లాలో జాతీయ రహదారుల మీద ప్రమాదాలు జరగకుండా ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయసునీత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా స్థాయి టాస్క్ఫోర్సు కమిటీ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జాతీయ రహదారులపై ప్రమాదాలు జరగకుండా ఆక్రమణలు తొలగించేందుకు టాస్క్ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేశారన్నారు. జిల్లాలో ఉన్న 3 జాతీయ రహదారులపై ఆక్రమణలు తొలగించేందుకు జాయింట్ కమిటీలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. జాతీయ రహదారులపై వాహనాలు అడ్డదిడ్డంగా పార్కింగ్ చేయకుండా వాహనదారులకు అవగాహన కల్పించాలన్నారు. మున్సిపల్ ప్రాంతాల్లో జాతీయ రహదారిపై అక్రమంగా ఉన్న దుకాణాలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. రాత్రి సమయాల్లో పశువులను జాతీయ రహదారులపై తోలకుండా గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్ను తనిఖీలు నిర్వహించి గుర్తించాలన్నారు. జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగిన వెంటనే వైద్యారోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి వైద్యసేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శివరామిరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి బాలూ నాయక్, ఆర్టీఓ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు పథకాలపై అవగాహన కల్పించాలి
● కలెక్టర్ రాజాబాబు ఒంగోలు సబర్బన్: రైతులకు పథకాలపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. జిల్లాలో పప్పు దినుసుల ఉత్పత్తి పెంచేందుకు ‘ఆత్మ నిర్భర భారత్ మిషన్’ కింద తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ అధ్యక్షతన సోమవారం ప్రకాశం భవన్లో జిల్లాస్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పప్పు ధాన్యాల సాగును పెంచేందుకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేయాలన్నారు. ఆత్మ పీడీ రత్న మంజుల, జెడ్పీ సీఈఓ చిరంజీవి, నాబార్డ్ డీడీఎం రవికుమార్, ఎల్డీఎం రమేష్, వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు. ● కలెక్టర్ రాజాబాబు ఒంగోలు సబర్బన్: జన గణన విధుల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్ చేయాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులు ఆదేశించారు. జిల్లాలో పురోగతిపై సోమవారం ప్రకాశం భవనంలో సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లతో ఆయన టెలీ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గణన విధులు నిర్వహించే సిబ్బంది తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో ఉండాలన్నారు. ప్రతి ఇంటికి గరిష్టంగా ఐదు నిమిషాలు మాత్రమే పట్టే సర్వేలో ఎందుకు స్పష్టమైన పురోగతి ఉండటం లేదని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీఓలు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు తమ పరిధిలో నిర్దిష్ట ప్రాంతాలను ఎంపిక చేసుకొని సర్వే త్వరగా పూర్తయ్యేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. సమావేశంలో సీపీఓ సుధాకర్రెడ్డి, డీపీఓ వెంకటేశ్వరరావు, జెడ్పీ సీఈఓ చిరంజీవి, డీఈఓ రేణుక, జన గనణ విభాగ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. దొనకొండ: అనారోగ్యంతో బాధపడుతూ చర్చి పై నుంచి దూకి వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన సోమవారం జరిగింది. ఎస్సై ఎల్ రామకృష్ణ వివరాల ప్రకారం..పోలేపల్లి ఎస్సీ కాలనీకి చెందిన గాలిమూటి నాగలక్ష్మీ(25)కి ఎనిమిదేళ్ల క్రితం వివాహం కాగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతోంది. ఉదయం ఇంటి నుంచి చెప్పకుండా బయటకు వెళ్లిపోయింది. తీరా చూసే సరికి చర్చి పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. చుట్టు పక్కల వారు గమనించి మెరుగైన వైద్యం నిమిత్తం దర్శికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. నాగలక్ష్మీ తల్లి మరియమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. పెద్దదోర్నాల: మండల కేంద్రంలో బెట్టింగ్కు పాల్పడుతున్న నలుగురు యవకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మండలానికి చెందిన కొందరు యువకులు ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడి చేశారు. నిందితులను విచారించన అనంతరం కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఐ అజయ్కుమార్ తెలిపారు. -
బ్రోకర్ల పొత్తు.. రైతులు చిత్తు!
యర్రగొండపాలెం: వ్యవస్థలో లోపాలు, అధికారుల ఉదాసీన వైఖరిని ఆసరాగా చేసుకుని వ్యాపారులు, దళారులు కలిసి ఆడిన మోసపూరిత ఆటలో రైతులు ఓడిపోయారు. మూడు నెలలపాటు చోమటోడ్చి పండించిన మొక్కజొన్న పంటను కొందరు వ్యాపారులు కొనుగోలు చేయకుండా చేతులెత్తేస్తే.. మరికొందరు మాత్రం గద్దల్లా తన్నుకుపోయి రైతులకు చిల్లిగవ్వ దక్కనీయలేదు. రైతుల శ్రమను దోపిడీ చేసి లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు, దళారులపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతున్నా చంద్రబాబు సర్కారు చేష్టలుడిగి చూస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పొలంలో విత్తు దశ నుంచి పంట కోత వరకు రైతులకు అండగా నిలిచి, గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. వ్యాపారుల మోసాలు, దళారుల దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అదేమీ చేయకపోగా వ్యవసాయదారులను పరోక్షంగా దెబ్బకొట్టే చర్యలకు పూనుకుంది. యర్రగొండపాలెం నియోజకవర్గంలోని 5 మండలాల్లో 2 వేల మంది రైతులు దాదాపు 7 వేల ఎకరాల్లో విత్తన మొక్కజొన్న సాగు చేశారు. రాష్ట్రంతోపాటు తెలంగాణకు చెందిన వ్యాపారులు ఇక్కడి గ్రామాలకు దళారులను పంపి మొక్కజొన్న సాగు చేసేలా రైతులను ఒప్పించారు. ‘ఉచితంగా విత్తనాలు అందిస్తాం. పంట సాగు సమయంలో రూ.10 వేలు ఇస్తాం. పంట కోత అయ్యాక విత్తనాలు మేమే కొనుగోలు చేస్తాం’ అనేది రైతులతో చేసుకున్న ఒప్పంద సారాంశం. ముందుగా అనుకున్న ప్రకారం విత్తనాలు ఇచ్చి పంట సాగు చేయించిన వ్యాపారులు రోజుల వ్యవధిలోనే రైతులతో చేసుకున్న ఒప్పందానికి తూట్లు పొడిచారు. పెట్టుబడి కోసం ఇస్తామన్న రూ.10 వేలు ఎగ్గొట్టడంతోపాటు మాటలు చెప్పి మభ్యపెట్టారు. వాస్తవానికి ఈ రూ.10 వేలు సైతం రైతుకు వచ్చిన ఆదాయంలో మినహాయించుకునేవే అయినప్పటికీ ఆ డబ్బు ఇవ్వలేదు. మోసం ఇలా.. పెద్దారవీడు మండలంలోని శివాపురం గ్రామానికి చెందిన కొంతమంది రైతులకు తెలంగాణ రాష్ట్రం మేడ్చల్కు చెందిన ఒక వ్యాపారి మొక్కజొన్న పంటను టన్ను రూ.34 వేల ప్రకారం కొనుగోలు చేస్తామని చెప్పి రైతులకు విత్తనాలు పంపిణీ చేశాడు. ఆ విత్తనాలతోపాటు భూమి దున్నుకోవటానికి ఎకరాకు రూ.10 వేల ప్రకారం ఇస్తామని చెప్పడంతో రైతులు ఆశపడి మొక్కజొన్న పంట పండించారు. నాసిరకం విత్తనాలు కావడంతో కొంత మంది రైతులకు ఒకటిన్నర టన్నులు, మరి కొందరు రైతులకు టన్ను చొప్పున మాత్రమే దిగుబడి వచ్చింది. పంట వేసుకునే సమయంలో ఇస్తామన్న రూ.10 వేలను వ్యాపారి ఇవ్వలేదు. పంట కోతకొచ్చిన తర్వాత సైతం మాయమాటలు చెబుతూ ఆ గ్రామం వైపు తిరిగి చూడలేదు. చేసేదిలేక రైతులు కళ్లాల్లో మొక్కజొన్న ఆరబోసి కొనేవారి కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్ని రోజులైనా విత్తన కంపెనీ స్పందించకపోవడంతో సదరు రైతులు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. దీంతో దిగివచ్చిన మేడ్చల్ కంపెనీ యజమాని ఆ పంటను కొనుగోలు చేశాడు. ఆ కంపెనీ ఏర్పాటు చేసిన ఏజెంట్ పంటను పూర్తిగా ఎత్తుకెళ్లాడు. ఈ సమయంలో రైతులకు అందించిన చెక్కులు బ్యాంకులో బౌన్స్ కావడంతో లబోదిబోమంటున్నారు. ఈ విషయం జిల్లా ఉన్నతాధికారులకు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరబెట్టిన మొక్కజొన్న కంకులు విత్తన మొక్కజొన్న పేరుతో రైతులను ముంచిన బ్రోకర్లు యర్రగొండపాలెం నియోజకవర్గంలో 7 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు పంట దిగుబడి ఎత్తుకెళ్లి డబ్బు ఎగ్గొట్టిన వ్యాపారులు రైతులకు ఇచ్చిన బ్యాంక్ చెక్కులు బౌన్స్ మొక్కజొన్న పంట సాగు చేసి రైతులందరం అప్పులపాలయ్యాం. దిగుబడి బాగా వస్తుందని, మంచి ధర ఇప్పిస్తామని బ్రోకర్ చెప్పి పంట విత్తించాడు. ముందుగా విత్తనాలు ఉచితంగా ఇచ్చాడు. ఖర్చుల కోసం ఎకరాకు రూ.10 వేల ప్రకారం ఇస్తామని చెప్పి ఎగనామం పెట్టాడు. పంట విత్తుకున్న నాటి నుంచి కోతకు వచ్చే వరకు అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. పంటను కొనుగోలు చేయించడం కోసం పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. పంట కొన్నాక ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. పెట్టుబడి కోసం చేసిన అప్పునకు వడ్డీ పెరిగిపోతోంది. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నాం. – పెనుగొండ కొటిరెడ్డి, మొక్కజొన్న రైతు, శివాపురందిగుబడి లేక.. పెట్టుబడి దక్కక.. ఎకరా విస్తీర్ణంలో మొక్కజొన్న పంట సాగు చేసేందుకు ఒక్కో రైతు రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టారు. పంట దిగుబడి 3 టన్నుల వరకు వస్తుందని రైతులు ఆశించగా టన్ను నుంచి 2 టన్నులకే పరిమితమైంది. టన్ను రూ.34 వేల చొప్పున విక్రయిస్తే కనీసం పెట్టుబడి కూడా చేతికొచ్చే పరిస్థితి లేదని రైతులు తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. ఇదిలా ఉండగా పండించిన పంటను వ్యాపారులు ఎత్తుకెళ్లి డబ్బు ఎగ్గొట్టడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. -
తొలుత రాయబారం.. పోరుబాటకు నిర్ణయం
● మాజీ మంత్రి మేరుగు, ఒంగోలు ఇన్చార్జ్ చుండూరి రైతాంగ పోరాటాలకు వైఎస్సార్ సీపీ సీపీ మద్దతు తప్పక ఉంటుందని ఆ పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు పేర్కొన్నారు. సోమవారం ఎన్జీ రంగా భవన్లో పొగాకు రైతుల సదస్సుకు హాజరై మద్దతు తెలిపి ప్రసంగించారు. వైఎస్సార్ సీపీ హయాంలో రైతుల సంక్షేమానికి తీసుకున్న చర్యలను వివరించారు. మార్క్ఫెడ్ను రంగంలోకి దించి రూ.300 కోట్ల విలువైన పొగాకును అప్పటి సీఎం వైఎస్ జగన్ కొనుగోలు చేయించారని గుర్తు చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. రైతులు ఆశించిన విధంగా వర్జీనియా పొగాకును రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరారు. ఒంగోలు సిటీ: పొగాకు రైతులు తీవ్రమైన గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, బేళ్లు తిరస్కరిస్తూ.. ధర తెగ్గోస్తూ రైతులను నానాఇబ్బందులకు గురిచేయడం సరికాదని రైతు సంఘం నాయకులు ధ్వజమెత్తారు. టన్ను పొగాకు రూ.30 వేలకు కొనుగోలు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించడంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలను రంగంలోకి దించాలని డిమాండ్ చేశారు. సోమవారం ఒంగోలులోని ఎన్జీ రంగా భవన్లో పొగాకు రైతుల సదస్సు నిర్వహించగా, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పమిడి వెంకటరావు, వడ్డే హనుమారెడ్డి, పరిటాల కోటేశ్వరరావు కోడూరు నాంచార్లు అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి జయంతి బాబు మాట్లాడుతూ.. గత ఏడాది ఒక్కో బ్యారన్కు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల మేర రైతుల నష్టపోయారని, ఈ ఏడాది ధరలను బట్టి చూస్తే ఐదారు లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లే సూచనలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వేలం కేంద్రానికి తెచ్చిన పొగాకు బేళ్లలో 70 శాతానికి పైగా తిరిగి వెనక్కు తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడటం శోచనీయమన్నారు. కూలీలకు సైతం డబ్బు ఇవ్వలేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ నేపథ్యంలో పొగాకు ధరలపై చర్చించడానికి కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. జూన్ 1వ తేదీన గుంటూరులోని టుబాకో బోర్డు వద్దకు రాయబారానికి వెళ్లనున్నట్లు చెప్పారు. అందుకు సన్నాహకంగా ఈ నెల 25వ తేదీన వేలం కేంద్రాల వద్ద నిరసన తెలియజేయాలని రైతులకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య మాట్లాడుతూ.. పొగాకుపై 40 శాతం జీఎస్టీ పెంపుదల సాగుదారులకు శాపంగా మారిందన్నారు. పొగాకు కొనుగోలు చేస్తున్న ఐటీసీకి వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటే.. పంట పండిస్తున్న రైతులు బ్యారన్కు ఐదారు లక్షల రూపాయలు నష్టపోతుండటం విచారకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలే అందుకు కారణమని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి పొగాకుపై రూ.90 వేల కోట్ల ఆదాయం వస్తున్నా.. ధరల స్థిరీకరణకు రూ.500 కోట్లు కేటాయించకపోవడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు సర్కారు లెటర్లు రాయడం ఆపేసి, పొగాకు ఉత్పత్తిదారుల సంఘానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అమెరికా–ఇండియా వాణిజ్య ఒప్పందం వల్ల ఏ పంటకు గిట్టుబాటు ధర లేకుండా పోయిందని పొగాకు రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.జమలయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వాలు రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరు రంగారావు మాట్లాడుతూ పొగాకు రైతులను పట్టించుకునే పరిస్థితుల్లో బోర్డు లేదని, వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఎస్.లలిత కుమారి, నెల్లూరు జిల్లా రైలు సంఘం కార్యదర్శి మూలే వెంకయ్య, మార్కాపురం రైతు సంఘం జిల్లా కన్వీనర్ ఊస వెంకటేశ్వర్లు, ఆచార్య ఎన్జీ రంగా కిసాన్ సంస్థ నాయకులు శేషయ్య, వైఎస్సార్ సీపీ రైతు విభాగం నాయకుడు, పొగాకు బోర్డు మాజీ సభ్యులు మారెళ్ల బంగారు బాబు, కిసాన్ కాంగ్రెస్ నాయకులు కొండ్రగుంట సుబ్బారావు, షేక్ సైదా, రైతులు పాల్గొన్నారు. మేరుగ నాగార్జున చుండూరి రవిబాబు టుబాకో బోర్డు తీరుతో ఒక్కో బ్యారన్కు రూ.5 లక్షల మేర నష్టం టన్ను రూ.30 వేలకు కొనుగోలు చేస్తేనే రైతులకు గిట్టుబాటు కేంద్రానికి సీఎం చంద్రబాబు లెటర్లు రాస్తే ఒరిగేదేమీ లేదు పొగాకు ఉత్పత్తిదారుల సంఘానికి నిధులు కేటాయించాలి పొగాకు రైతు సదస్సులో నాయకుల ధ్వజం 25న వేలం కేంద్రాల వద్ద నిరసన.. జూన్ 1న బోర్డుతో రాయబారం -
ఆర్టీసీని ప్రైవేటుపరం చేయొద్దు
● కలెక్టరుకు వినతిపత్రం అందించిన ఉద్యోగులు మార్కాపురం: ఆర్టీసీ బస్సులను ప్రైవేటుపరం చేయవద్దని ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూనియన్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ సోమయాజుల సుబ్బశాస్త్రి, జిల్లా కార్యదర్శి జనార్దనరావు ఆధ్వర్యంలో సోమవారం పీజీఆర్ఎస్లో కలెక్టర్ విజయసునీతకు వినతిపత్రం అందజేశారు. ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెడుతూ ప్రైవేటుపరం చేయాలనే నిర్ణయాన్ని తక్షణమే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ బస్సులను ప్రైవేటుపరం చేయకుండా ఆర్టీసీ సిబ్బంది ద్వారానే నడపాలని కోరారు. దీనివలన కొత్త ఉద్యోగాలు రావడంతోపాటు ప్రజలకు సౌకర్యంగా ఉంటుందన్నారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తే తాము చూస్తూ ఊరుకోమని, ఉద్యమబాట పడతామని హెచ్చరించారు. ఒంగోలు: ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని జూనియర్ బాలుర హ్యాండ్ బాల్ జూనియర్ జట్టు ఎంపిక ఈనెల 20న స్థానిక డీఆర్ఆర్ఎం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ కార్యదర్శి కె.శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2006 జనవరి 1వ తేదీ తరువాత జన్మించిన వారు మాత్రమే అర్హులు. వయస్సు ధ్రువీకరణ పత్రం, ఆధార్కార్డుతో ఆసక్తిగల క్రీడాకారులు సాయంత్రం 3గంటలకు ఎంపిక ప్రదేశంలో హాజరుకావాలి. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 27 నుంచి 29వరకు విజయనగరం జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు సెల్ నంబర్ 9666702555ను సంప్రదించాలని జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసరావు తెలిపారు. ● ఉల్లాస్ అక్షరాంధ్ర కార్యక్రమంపై సమీక్షలో కలెక్టర్ పి.రాజాబాబు ఒంగోలు సబర్బన్: జిల్లాలో ఉల్లాస్ అక్షరాంధ్ర కార్యక్రమం 2026–27 కింద నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దటమే లక్ష్యమని కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. ఈ మేరకు తన ఛాంబర్లో సంబంధిత అధికారులతో సోమవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ ఉల్లాస్ అక్షరాంధ్ర కార్యక్రమం కింద 98,475 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్నారు. డ్వాక్రా సంఘాలు, శ్రామిక సంఘాలు, మెప్మా గ్రూపులను భాగస్వాములుగా చేసుకొని డీఆర్డీఏ, మెప్మా, డ్వామా, జీఎస్డబ్ల్యూఎస్ తదితర శాఖల సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ చిరంజీవి, సీపీఓ, డీపీఓ, డీఆర్డీఏ, డ్వామా, మెప్మా, ఐసీడీఎస్ శాఖల ప్రాజెక్టు అధికారులు, జీఎస్డబ్ల్యూ, వయోజన విద్యా శాఖ డీడీ, సిబ్బంది పాల్గొన్నారు. సీఎస్పురం(పామూరు): మండలంలోని మిట్టపాలెం నారాయణస్వామివారి ఆలయానికి ఆదివారం రూ.2,02,311 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ ఎస్జీఆర్ నరసింహబాబు, ధర్మకర్త కొమ్మినేని చిన్న ఆదినారాయణ సోమవారం తెలిపారు. స్వామివారి దర్శనం టికెట్ల అమ్మకం ద్వారా రూ.1,04,456, లడ్డుప్రసాదాల అమ్మకం ద్వారా రూ.29,400, శాశ్వత అన్నదానం పథకం నిర్వహణకు విరాళాలుగా రూ.48,907, పంచామృతాభిషేకానికి విరాళంగా రూ.11,032, ఇతర విరాళాలుగా రూ.2,516, స్వామివారికి శ్రీపాద కానుకల కింద రూ.6 వేలు విరాళాలుగా వచ్చినట్లు ఈఓ, ధర్మకర్త తెలిపారు. ఒంగోలు వన్టౌన్: కారు డ్రైవింగ్లో పురుషులకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు ఒంగోలు రూడ్ సెట్ సంస్థ డైరక్టర్ పీ శ్రీనివాస రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మే నెల 29 నుంచి 30 రోజుల పాటు ఈ ఉచిత శిక్షణ అందిస్తారన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులు శిక్షణకు అర్హులని తెలిపారు. శిక్షణ పొందగోరే అభ్యర్థులకు 19 సంవత్సరాలు నిండి ఉండాలని, 50 సంవత్సరాలలోపు వయస్సు ఉండాలన్నారు. అభ్యర్థులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు కలిగి ఉండాలన్నారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజన సౌకర్యాలను కల్పిస్తారన్నారు. పూర్తి వివరాలకు 9573363141 అనే నంబరుపై సంప్రదించవచ్చన్నారు. -
కారు ఢీకొని వ్యక్తి మృతి
కొనకనమిట్ల: మోటార్ సైకిల్పై వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన జాతీయ రహదారిపై కొనకనమిట్ల మండలం చౌటపల్లి సమీపంలో ఆదివారం జరిగింది. కొనకనమిట్ల మండలంలోని తువ్వపాడు పంచాయతీ చౌటపల్లి ఎస్సీకాలనీకి చెందిన చిరుగూరి వెంగయ్య (55) తన మోటార్ సైకిల్పై కొనకనమిట్ల వెళ్లి సరుకులు తీసుకుని తిరిగి చౌటపల్లి ఎస్సీకాలనీకి వస్తున్నాడు. అదే సమయంలో పొదిలి వైపు నుంచి మార్కాపురం వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి మోటార్ సైకిల్పై వెళ్తున్న వెంగయ్యను వెనుక వైపు ఢీకొట్టింది. దీంతో ఎగిరి రోడ్డుపై పడిన వెంగయ్య తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన కారు సంఘటన స్థలానికి కొద్ది దూరం వెళ్లి ఆగింది. మృతుడు వెంగయ్యకు భార్య కుమారి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కూలి పని చేసుకుని జీవించే వెంగయ్య మృతి చెందడంతో భార్య, పిల్లలు, బంధువులు రోదిస్తున్నారు. సమాచారం అందుకున్న కొనకనమిట్ల ఎస్ఐ శ్రీకాంత్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి ప్రమాదానికి గల కారణాలడిగి తెలుసుకున్నారు. వెంగయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
నడిరోడ్డుపై టీడీపీ నాయకుల బాహాబాహీ
● పొదిలిలో ఒకరిపై ఒకరు చేయి చేసుకున్న ఇద్దరు నాయకులు పొదిలి రూరల్: మార్కాపురం జిల్లా పొదిలిలో టీడీపీ నాయకుల మధ్య ఉన్న విభేదాలు భగ్గుమన్నాయి. ఒక సమస్యపై మాట్లాడుకునే క్రమంలో విభేదాలు బయట పడ్డాయి. ఆదివారం పొదిలి పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఓ ఆస్పత్రి వారు నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రారంభించారు. అనంతరం స్వచ్ఛ రథం కూడా ప్రారంభించారు. ఆ సమయంలో కొత్తపాలేనికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త నరేష్కు స్వచ్చ రథం ఎందుకు ఇచ్చారని మాదాలవారిపాలెం సొసైటీ అధ్యక్షుడు యర్రం వెంకటేశ్వరరెడ్డిని ఆ పార్టీ జిల్లా మైనార్టీ కార్యదర్శి షేక్ రసూల్ ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే కందుల ఈ సమస్యపై తరువాత మాట్లాడామని చెప్పి వెళ్లిపోయారు. అనంతరం ఇద్దరు నాయకులు బయటకు వచ్చి ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడంతో మాటా మాటా పెరిగి చిలికి చిలికి గాలి వానలా మారి గొడవకు దిగారు. అందరూ చూస్తుండగానే పోలీసుల సమక్షంలోనే బాహాబాహీ తలపడి ఒకరిపై మరొకరు చేయి చేసుకున్నారు. దీంతో అక్కడ ఉన్న నాయకులు ఇరువురినీ తప్పించి సర్ది చెప్పి పంపించి వేశారు. దీంతో గొడవ సర్దుమణిగింది. ప్రజల సమక్షంలోనే ఇద్దరు నాయకులు గొడవ పడి కొట్టుకోవడం చూసి జనం విస్తుపోయారు. -
దర్శిలో అర్ధరాత్రి చోరీ
● రూ.4.60 లక్షల నగదు, నాలుగు సవర్ల బంగారు ఆభరణాల దోపిడీ దర్శి: దర్శి నగర పంచాయతీలోని కొత్తరెడ్డిపాలెంలో తూము శ్రీనివాసరెడ్డి ఇంట్లో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. స్థానికులు వివరాల మేరకు..శనివారం రాత్రి శ్రీనివాసరెడ్డి భవనంపైన నిద్రించాడు. ఆయన భార్య పంచలోని కటకటాల్లో పడుకున్నారు. అయితే ఇంటి వెనుక వైపు ఉన్న పొలాల్లోని ప్రవేశించిన దుండగులు వంటగది తలుపులు గడ్డపారతో పెకిలించి లోనికి ప్రవేశించారు. ఇంట్లోని సొరుగులో ఉన్న నాలుగు సవర్ల చైను, బీరువాలో ఉన్న రూ.4.60 లక్షల నగదు అపహరించారు. తెల్లవారుజామున నిద్ర లేచిన కుటుంబసభ్యులు వెనుక తలుపులు తీసి ఉంది. బీరువాలోని నగదు, బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో శ్రీనివాసరెడ్డి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ రామారావు, ఎస్సై మురళీలు ఘటనా స్థలానికి చేరుకొని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం ఒంగోలు నుంచి క్లూస్ టీం వచ్చి వేలిముద్రలు సేకరించారు. వాస్తవానికి ఆ బంగారం, నగదు శ్రీనివాసరెడ్డికి చెందినది కాదని తెలుస్తోంది. ఆయన బావమర్దికి చెందిన నగదు బ్యాంక్ నుంచి తీసుకువచ్చి ఇంట్లో పెట్టారు. ఆ నగదు అపహరణకు గురి కావడంతో కుటుంబసభ్యులు ఆవేదన చెందుతున్నారు. బీరువాలో మరికొన్ని నగలు.. దుండగులు బీరువా పై అరలో ఉన్న రూ.5 లక్షలు అపహరిచారు. అయితే కింద అర మాత్రం దుండగులు కదిలించలేదు. కింద అర తాళాలు తీస్తే అందులో సుమారు 35తులాలు బంగారం, నగదు కలిపి రూ.50 లక్షల వరకు సొత్తు ఉంది.ఆ తాళం తీయకపోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
● కలెక్టర్ విజయసునీత మార్కాపురంటౌన్: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఎం విజయసునీత అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో ఆదివారం విద్యాశాఖాఽధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో నిరంతరం, విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునే బస్సు సౌకర్యాన్ని కల్పించాలని చెప్పారు. మార్కాపురం జిల్లాలో మొత్తం 22 కేంద్రాల్లో 9,502 మంది విద్యార్థులు సఫ్లిమెంటరీ పరీక్షలకు హాజరవుతున్నట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. ఏవైనా సమస్యలుంటే 08592 281275 టోల్ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు ఇంటర్ బోర్డు అధికారులు కలెక్టర్కు వివరించారు. మాస్కాపీయింగ్ జరగకుండా ఆయా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో డీఆర్ఓ శివరామిరెడ్డి, ఇంటర్బోర్డు ఆర్ఐఓ ఆంజనేయులు, రమణారెడ్డి, ఇన్చార్జి డీఎంహెచ్ఓ డాక్టర్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు. -
స్థల వివాదంలో తోపులాట
● పాఠశాలకు చెందిన ఖాళీ స్థలంపై కన్నేసిన మూడు వర్గాలు ● గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు పెద్దదోర్నాల: మండల పరిధిలోని కడపరాజుపల్లెలో ఓ స్థల వివాదం ఘర్షణకు దారి తీసింది. గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనం కొన్నేళ్లుగా శిథిలావస్థకు చేరింది. దీంతో ఆ స్థలంపై కన్నేసిన గ్రామంలోని కొన్ని వర్గాలకు చెందిన వారి మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో ఽరెండు వర్గాలకు చెందిన వారు శనివారం రాత్రి స్థానిక పోలీస్స్టేషన్లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ వివాదం నడుస్తుండగానే ఆదివారం మూడో వర్గానికి చెందిన మరి కొందరు పాఠశాలకు చెందిన ఖాళీ స్థలంలో మాకూ హక్కు ఉందంటూ కొత్త వివాదానికి తెర తీశారు. దీంతో ఈ వివాదం గ్రామంలో తీవ్ర స్థాయికి చేరింది. దీంతో మూడు వర్గాలకు చెందిన వారు వారి వారి ఇలవేల్పులు, కుల దైవాల ఫొటోలను పాఠశాలకు చెందిన ఖాళీ స్థలంలో పోటీలు పడి ఏర్పాటు చేసుకోవటంతో వివాదం మరింత ముదిరింది. ఈ వివాదం చిలికి చిలికి గాలి వానగా మారడంతో శనివారం తోపులాటకు దారితీసింది. ఈ వివాదంపై జోక్యం చేసుకున్న మార్కాపురం డీఎస్పీ నాగరాజు, సీఐ. అజయ్కుమర్, ఎస్సై వెంకట రమణయ్యలు సంఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. స్థలంలో ఏర్పాటు చేసిన దేవుళ్ల ఫొటోలను తొలగించారు. అనంతరం స్థలం ఎంపీపీ స్కూల్కు చెందిన స్థలంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అనంతరం గ్రామంలో ఏఎస్సై పోలురాజు ఆధ్వర్యంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పికెట్ ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. -
యువకుడు ఆత్మహత్యాయత్నం
గిద్దలూరు రూరల్: మండలంలోని సంజీవరాయుడుపేట గ్రామానికి చెందిన బి.శ్రీకాంత్ అనే యువకుడు నంద్యాలరోడ్డులోని సగిలేరు బ్రిడ్జి రైల్వే ట్రాక్పై ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాంత్ అనే యువకుడు వృత్తి రీత్యా డ్రైవర్గా జీవనం కొనసాగి స్తుంటాడు. తల్లిదండ్రులు లేని కారణంగా కుటుంబ సభ్యుల ఆదరణ కోల్పోయి మద్యానికి బానిసై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ రైలుపట్టాలపై పడుకున్న సమయంలో గుంటూరు నుంచి గుంతకల్ వైపు వెళ్లే గూడ్స్ రైలు డ్రైవర్ పట్టాలపై పడుకుని ఉన్న శ్రీకాంత్ను గుర్తించి రైలును నిలుపుదల చేసి సమాచారాన్ని గిద్దలూరు రైల్వేస్టేషన్కు అందజేశారు. సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్ పిచ్చిరెడ్డి తన సిబ్బంది సంఘటనా స్థలానికి వద్దకు చేరుకొని రైలు పట్టాలపై ఉన్న శ్రీకాంత్ను అదుపులోనికి తీసుకొని ఆత్మహత్యకు కారణాలను తెలుసుకుని కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. -
ఆర్టీసీని ప్రైవేటీకరిస్తే ఊరుకోం
ఒంగోలు సిటీ: ఆర్టీసీ విద్యుత్ బస్సులు కొనుగోలు చేసి సంస్థ సిబ్బందితోనే నడపడం ద్వారా ప్రజా రవాణా వ్యవస్థను పరిరక్షించవచ్చని ఏపీ పీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వాకా రమేష్ అన్నారు. ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 2వ రోజు ఒంగోలు డిపో కమిటీ ఆధ్వర్యంలో డిపో మేనేజర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీని దశలవారీగా ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారన్నారు. ప్రైవేటీకరణ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఖాళీ పోస్టులను భర్తీ చేయడం, సొంత బస్సుల సంఖ్యను పెంచడం వంటి ప్రధాన డిమాండ్లతో నిరసనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిపోలను ఖాళీ చేయడం, ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేట్ ఆధీనంలో నడపించే చర్యలు ప్రజా రవాణా రంగానికి ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు సురక్షితమైన, చవకై న రవాణా సేవలు అందించే సామర్థ్యం కేవలం ఆర్టీసీకే ఉందని గుర్తు చేశారు. ఆర్టీసీలో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయకపోవడంతో యువతకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయని విమర్శించారు. డ్రైవర్, కండక్టర్, సాంకేతిక సిబ్బంది కొరతతో ఉద్యోగులపై అదనపు పనిభారం పడుతోందన్నారు. నెల్లూరు జోనల్ అధ్యక్షుడు బెజవాడ రవి మాట్లాడుతూ 2029 నాటికి ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేట్ వారికి అప్పగించే జీఓ నం. 88ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పేద, మధ్యతరగతి, విద్యార్థులకు అందుబాటులో ఉన్న ప్రజా రవాణా వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సీ్త్ర శక్తి పథకంలో భాగంగా 3000 బస్సులు కొని 10,000 సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. డీఏ, పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలని, పీఆర్సీ చైర్మన్ని నియమించాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రచార కార్యదర్శి ఓ. రామకృష్ణ, జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి, జిల్లా కార్యదర్శి పోలయ్య, జిల్లా జాయింట్ సెక్రటరీ ఎ. అదిశేషు, డిపో నాయకులు ఈ. సాయికృష్ణ, రెడ్డి, గ్యారేజీ కార్యదర్శి ఓ. పోలయ్య, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విద్యుత్ బస్సులు ఆర్టీసీనే కొనుగోలు చేసి సిబ్బందితో నడపాలి ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియర్ రాష్ట్ర కార్యదర్శి వాకా రమేష్ -
మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ
యర్రగొండపాలెం: నీటి కుంటలో మునిగి మృతి చెందిన చిన్నారుల కుటుంబాలను ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ ఆదివారం పరామర్శించారు. ఆ కుటుంబాలకు రూ.50వేల ప్రకారం ఆర్థిక సహాయం అందచేశారు. మండలంలోని బోయలపల్లి ఎస్సీ పాలెంకు చెందిన కొమ్ము శశికుమార్(11), బోయలపల్లి దీపన్(10)లు గత నెల 14వ తేదిన పొలంలో ఉన్న నీటికుంట(ఫారం పాండ్)లో జారిపడి మృతి చెందారు. సంఘటన విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే ప్రభుత్వ వైద్యశాలకు చేరి చిన్నారుల కుటుంబాలకు ధైర్యం చెప్పారు. ఆ కుటుంబం కోలుకోలేని పరిస్ధితిలో ఉండటం వలన ఆయన మరో సారి ఎస్సీ పాలెంకు చేరి వారిని ఓదార్చారు. కూలి పనులకు వెళ్లలేక ఆర్థిక ఇబ్బందులలో ఉన్న ఆ చిన్నారుల ఒక్కొక్క కుటుంబానికి రూ.50వేల ప్రకారం ఆర్థికసాయం అందచేశారు. ఎమ్మెల్యే వెంట మండల పార్టీ అధ్యక్షుడు ఏకుల ముసలారెడ్డి, నాయకులు కె.ఓబులరెడ్డి, ఎం.బాలగురవయ్య, చేదూరి విజయభాస్కర్, వై.వెంకటేశ్వరరెడ్డి, సయ్యద్ జబీవుల్లా, కోల వెంకటేశ్వర్లు, రాములు నాయక్, సురేష్ నాయక్ ఉన్నారు. -
రేషన్కు ఈకేవైసీ గండం
జిల్లా వ్యాప్తంగా ఉన్న మండలాలు: 21 మార్కాపురం: జిల్లా వ్యాప్తంగా ఈ–కేవైసీ చేయించుకోని రేషన్కార్డుదారులకు రేషన్ సరఫరా నిలిపేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పలువురు కార్డుదారులు ప్రభుత్వ నిర్ణయంతో ఆందోళన చెందుతున్నారు. పనుల కాలం కావడంతో రేషన్షాపుల వద్దకు వెళ్లలేక పలువురు లబ్ధిదారులు రేషన్ తీసుకోవడం లేదు. దీంతో రేషన్కార్డు ద్వారా వచ్చే ఇతర పథకాలు కూడా ఆగిపోనున్నాయి. జిల్లా వ్యాప్తంగా మార్కాపురం, కనిగిరి, యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల్లోని 21 మండలాల్లో 743 రేషన్ షాపుల్లో 10,15,212 మంది రేషన్ కార్డుదారులు ఉన్నారు. ఇప్పటి వరకూ 36,205 మంది ఈ–కేవైసీ చేయించుకోలేదు. ఈనెలాఖరులోపు ఈ–కేవైసీ చేయించుకోకుంటే రేషన్తోపాటు ప్రభుత్వ పథకాలు కూడా ఆగిపోనున్నాయి. పలువురు వలసపోవడం, ఈ–కేవైసీపై అవగాహన లేకపోవడం, రేషన్ డీలర్ల నిర్లక్ష్యం తదితర కారణాలతో ఈ–కేవైసీ చేయించుకోలేకపోయారు. ఎక్కువగా జిల్లా కేంద్రమైన మార్కాపురంలోనే 3620 మంది కార్డుదారులు ఈ–కేవైసీ చేయించుకోవాలి. కనిగిరిలో 2409, గిద్దలూరులో 2319, త్రిపురాంతకంలో 2138, యర్రగొండపాలెంలో 2527, పామూరులో 2209, దోర్నాలలో 2218 మంది లబ్ధిదారులు ఈ–కేవైసీకి దూరంగా ఉన్నారు. స్పెషల్ డ్రైవ్ చేయించకపోతే వీరందరికీ రేషన్తోపాటు ప్రభుత్వ పథకాలు కూడా ఆగిపోనున్నాయి. మొత్తం రేషన్కార్డులు: 10,15,212జిల్లాలో మొత్తం రేషన్ దుకాణాలు: 743ఈ–కేవైసీ చేయించుకోనివారు: 36,205నెలాఖరులోపు చేయించుకోవాలి ఈనెలాఖరులోపు ఈ–కేవైసీ చేయించుకోని రేషన్కార్డుదారులందరూ తప్పనిసరిగా ఈ–కేవైసీ చేయించుకోవాలి. లేకపోతే రేషన్ నిలిపేస్తారు. ప్రతి ఒక్కరూ రేషన్, పథకాలు పొందాలంటే ఈ–కేవైసీ తప్పనిసరి. – చిరంజీవి, తహశీల్దార్ -
దొంగాట..కాసుల వేట
ఒంగోలు సిటీ: ఏడాదంతా పుస్తకాలతో కుస్తీపడిన విద్యార్థులకు వేసవిలో ఉత్సాహం..ఉల్లాసం.. ఆరోగ్యం అందించేందుకు ఏటా శాప్ ఆధ్యర్యంలో ప్రత్యేక క్రీడా శిబిరాలు జరుగుతుంటాయి. ఈ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకూ విద్యార్థులకు సుమారు 25 కిపైగా క్రీడాంశాల్లో 55 శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించి శాప్ జిల్లాకు రూ.6.54 లక్షలు కేటాయించింది. వీటి ద్వారా ఆయా క్రీడల కోసం అవసరమైన పరికరాల కొనుగోలుతోపాటు ప్రతిరోజూ పౌష్టికాహారం అందించాల్సి ఉంది. శిక్షణ శిబిరాలు ప్రారంభమై పక్షం రోజులు దాటుతున్నా మొక్కుబడిగా శిబిరాలు సాగుతున్నాయి. శాప్ ఇచ్చిన నిధులను ఖర్చు చేయకపోగా క్రీడాకారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలోనూ ఒంగోలులోని మినీ స్టేడియంలో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ సంక్రాంతి సంబరాలు..క్రీడలతో సంప్రదాయ వేడుకలు అంటూ ఫ్లెక్సీ వేశారు. అయితే పోటీలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా పక్కనే అధికార పార్టీ నేత ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలకు వచ్చిన వారితో నాలుగు ఆటలు ఆడించి మమ అనిపించారు. ప్రత్యేక శిబిరాలు ఇలా.. జిల్లా క్రీడాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఒంగోలులో ఫుట్బాల్, సెపక్తక్రా, బాక్సింగ్, ఖోఖో, కరాటే, రైఫిల్ షూటింగ్, స్కేటింగ్, స్విమ్మింగ్, తైక్వాండో, పవర్ లిఫ్టింగ్లతోపాటు, ఆర్చరీ, అథ్లెటిక్, ఫెన్సింగ్, చెస్, కబడ్డీ, బ్యాడ్మింటన్, జూడో క్రీడల్లో శిక్షణ శిక్షణ ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారు. జరుగుమల్లిలో పవర్ లిఫ్టింగ్, కారుమూడివారిపాలెంలో హ్యాండ్బాల్, పామూరులో బాల్బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్ శిక్షణ ఏర్పాటు చేశారు. ఆలకూరుపాడులో వాలీబాల్, అల్లూరు వాలీబాల్, కరేడులో హ్యాండ్బాల్, కబడ్డీ, సింగరాయకొండలో హ్యాండ్బాల్, ఎస్ఎన్పాడులో హాకీ, బ్యాడ్మింటన్, బిట్రగుంటలో వెయిట్లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, వైపాలెంలో అథ్లెటిక్స్, ఖోఖో, బ్యాడ్మింటన్, కనిగిరిలో బ్యాడ్మింటన్, ఖోఖో, మార్కాపురంలో బాక్సింగ్, వాలీబాల్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్, గిద్దలూరులో టెన్నిస్, పంగులూరులో ఖోఖో, కబడ్డీ క్రీడలకు శిక్షణ ఇస్తున్నారు. శాప్ ఇచ్చిన నిధుల నుంచి పరికరాలకు రూ.2,32,440, మైదానాలు సిద్ధం చేసేందుకు రూ.1,65,000 ఖర్చు చేయాల్సి ఉంది. అయితే క్రీడా పరికరాలు కొనుగోలు చేయలేదు. శిక్షణకు సంబంధించి పై నుంచి వచ్చిన పరికరాలను ఇంత వరకు క్యాంపులకు పంపిణీ చేయలేదు. మైదానం లోపల కనీస వసతుల్లేకుండా మొక్కుబడిగా సిద్ధం చేశారు. శిబిరాలకు వచ్చే విద్యార్థులు తాగునీటి కోసం కూడా అల్లాడుతున్నారు. పౌష్టికాహారంలోనూ చేతివాటం.. క్రీడల్లో శిక్షణ ఇవ్వడంతోపాటు పౌష్టికాహారాన్ని కూడా అందించాలి. ఇందుకోసం రూ.2,57,400 ఖర్చు చేయాలి. పాలు, గుడ్డు, ఇతర బలమైన ఆహారాన్ని ఒక్కో రోజు ఒక్కోటి చొప్పున అందించాల్సి ఉంది. అయితే వీటిల్లోనూ అధికారులు చేతివాటం చూపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతి విద్యార్థికి రూ.6 ఇవ్వాల్సి ఉండగా ఏఒక్క విద్యార్థికీ ఒక్క రూపాయి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు.వేసవి శిక్షణ శిబిరాల్లో పూర్తిగా ఉచితంగా శిక్షణ ఇవ్వాలి. అయితే షటిల్ బ్యాడ్మింటన్ శిక్షణ కోసం అనధికారికంగా ఒక్కొక్కరి వద్ద రూ.1000 చొప్పున 30 మంది వద్ద రూ.30 వేలు వసూలు చేసినట్లు సమాచారం. కోచ్లనే ఆ డబ్బులు వసూలు చేయమని అధికారే చెప్పడం గమనార్హం. షటిల్ కాక్లకు కూడా డబ్బులు వసూలు చేశారు. ఉచితంగా ఇవ్వాల్సిన శిక్షణకు డబ్బులు వసూలు చేయమన్న విషయంలో విభేదాలతో కోచ్ విరమించుకోవడంతో ఒంగోలు నగరంలో షటిల్ బ్యాడ్మింటన్ శిక్షణ శిబిరం నిలిచిపోయింది. ఇలా వేసవి శిక్షణ శిబిరాలు క్రీడాకారులకు ఉపయోగపడకపోగా సంబంధిత అధికారులకు ఆదాయవనరుగా మారాయి. -
అర్హతను బట్టి ఉద్యోగాలు కల్పించాలి
● కౌశల్ కార్యక్రమంపై అధికారులతో కలెక్టర్ రాజాబాబు సమీక్ష ఒంగోలు సబర్బన్: కౌశల్ కార్యక్రమంలో భాగంగా గతేడాది నిర్వహించిన సర్వేలో నమోదు చేసుకున్న నిరుద్యోగ యువతకు వారి అర్హత మేరకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై దృష్టి పెట్టాలని కలెక్టర్ పి.రాజాబాబు ఆదేశించారు. సంబంధిత అధికారులతో శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సర్వేలో నమోదు చేసుకున్న వారికి ప్రభుత్వ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి వారి ప్రతిభ ఆధారంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసే జాబ్మేళాలలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో కూడా మొదటి విడత నిర్వహించిన పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రత్యేక జాబ్మేళాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఉద్యోగాల కోసం ఆసక్తిగా సర్వేలో వివరాలు నమోదు చేసుకున్న యువతకు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు నిర్దిష్ట సమయాలలో పరీక్షలు కూడా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. ఆయా విషయాలపై నిరుద్యోగ యువతకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో సచివాలయాల నోడల్ ఆఫీసర్ సువార్త, స్టెప్ సీఈవో శ్రీమన్నారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
‘జలధార’ ఉద్యమంలా చేపట్టాలి
● కలెక్టర్ పి.రాజా బాబు ఒంగోలు సబర్బన్: ప్రజల భాగస్వామ్యాన్ని పెంచి జలధార–జలహారతి కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలాగా ముందుకు తీసుకువెళ్లాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సాధించిన పురోగతిపై వాటర్ షెడ్, నీటిపారుదల శాఖ ప్రిన్సిపుల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ శనివారం అమరావతి సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం జిల్లా అధికారులతో సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గుర్తించిన పనులు, వాటిలో సాధిస్తున్న పురోగతిని వివరించారు. సమావేశంలో డ్వామా పీడీ జోసఫ్ కుమార్, ఇరిగేషన్ ఎస్ఈ వరలక్ష్మి, భూగర్భజల శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్.ఈ. నాగేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఒంగోలు వన్టౌన్: సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లోని విద్యార్థులకు సురక్షిత మంచి నీరు అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు ఆ శాఖ డెప్యూటీ డైరక్టర్ ఎన్ లక్ష్మా నాయక్ అన్నారు. ఒంగోలు అంబేడ్కర్ భవనంలో ప్రకాశం, మార్కాపురం జిల్లాల వసతి గృహ అధికారులకు సురక్షిత తాగునీటిని అందించే విధానంపై శనివారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో ఫీల్డ్ టెస్ట్ కిట్లపై వార్డెన్లకు ప్రత్యక్ష అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి హాస్టల్కు ఎఫ్టీకే కిట్లను పంపిణీ చేస్తామని, ప్రతినెలా నీటి నాణ్యత పరీక్షలు తప్పనిసరిగా చేయాలన్నారు. శిక్షణ కార్యక్రమంలో ఒంగోలు ఏఎస్డబ్ల్యూఓ రబియా, అద్దంకి ఏఎస్డబ్ల్యూఓ స్వరూప, దర్శి ఏఎస్డబ్ల్యూఓ, కనిగిరి అసిస్టెంట్ డైరెక్టర్ ఆది లక్ష్మి, శివనాయక్, కొండపి ఏఎస్డబ్ల్యూఓ జాన్ ప్రసాద్, బేస్తవారిపేట ఏఎస్డబ్ల్యూఓ రామకృష్ణారెడ్డి, ప్రకాశం, మార్కాపురం జిల్లాల పరిధిలోని సాంఘిక సంక్షేమ వసతి గృహ సంక్షేమ అధికారులు పాల్గొన్నారు. యర్రగొండపాలెం: తన స్నేహితులతో కలిసి గంజాయి దమ్ము పీకుతూ మరో రౌండ్ ఇవ్వలేదని యువకుడు పోలీస్ స్టేషన్ కాంపౌండ్లో ఉన్న సెల్ టవర్ ఎక్కిన సంఘటన శనివారం మార్కాపురం జిల్లా యర్రగొండపాలెంలో జరిగింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి చుక్కలు చూపించిన ఆ యువకుడు కిందికి దిగివచ్చిన తరువాత గంజాయి ఇప్పించండి సార్ అని ఎస్సై దేవకుమార్ను అడిగాడు. స్థానిక తిరుమలగిరి కాలనీకి చెందిన ఉడతల హనుమంతు తన స్నేహితులతో కలిసి గంజాయి తాగుతున్నాడు. చివరగా తనకు దమ్ము ఇవ్వకపోవడంతో పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి అక్కడ ఉన్న టవర్ ఎక్కాడు. తనకు గంజాయి ఇప్పిస్తేనే తాను కిందికి దిగివస్తానని, లేకుంటే కిందికి దూకుతానని పోలీసులను బెదిరించాడు. అక్కడికి చేరిన పోలీసులతోపాటు అగ్నిమాపక సిబ్బంది హనుమంతును కిందికి దించారు. కాగా హనుమంతు పుటుగా మద్యం తాగి టవర్ ఎక్కాడని పోలీసులు ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం గమనార్హం. నీకు ఏమి కావాలని కిందికి దిగివచ్చిన ఆ యువకుడిని ఎస్సై ప్రశ్నించగా మద్యం కావాలని అడిగాడని ఆ ప్రెస్నోట్లో పేర్కొన్నారు. మత్తులో ఉన్న హనుమంతును 108 అంబులెన్స్లో ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించారు. -
ఆదివారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2026
చౌక దుకాణాలే రేషన్ మాఫియాకు అడ్డాగా మారిపోతున్నాయి..అధికార పార్టీ టీడీపీ నేతల కనుసన్నలో నడుస్తున్న ఈ దుకాణాలకు వెళ్తున్న లబ్ధిదారులకు వింత పరిస్థితి ఎదురవుతోంది. బియ్యం లేవు.. వేలి ముద్రలు వేసి ఇచ్చిన డబ్బులు తీసుకెళ్లండంటూ హుకుం జారీ చేస్తున్నారు. లేదంటే దాడులకు తెగబడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా పేదల బియ్యాన్ని కొల్లగొడుతున్న రేషన్ మాఫియా పోర్టుల ద్వారా విదేశాలకు తరలించి రూ.కోట్లు గడించి జేబులు నింపుకుంటున్నారు. ఈ తంతు అధికారులకు తెలిసినా ప్రభుత్వ పెద్దల ఒత్తిడి, మామూళ్ల మత్తులో చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక్క కందుకూరు నియోజకవర్గం, పరిసర నియోజకవర్గాల నుంచి దాదాపు 1200 టన్నుల మేర బియ్యం పక్కదారి పడుతోంది.పేదోడి ముద్దనుమింగేస్తున్న మాఫియా..మధ్య వ్యాపారులు మిల్లర్లు రూ.18 నుంచి 20 వరకు ఇస్తారు. రైస్ మిల్లుల్లో పాలిష్ పట్టి నేరుగా కృష్ణపట్నం పోర్టుకు తరలిస్తున్నారు. అక్కడ కేజీకి రూ.30 నుంచి రూ.35 వరకు విక్రయిస్తున్నారు. పాలిష్ పట్టిన మిల్లు నిర్వాహకులకు కేజీకి రూపాయి ఇస్తారు. ఇలా సరాసరి కేజీకి రూ.15 వరకు సిండికేట్కు లాభం వస్తుంది. ఈ లాభాలన్నీ నియోజకవర్గ అధికార పార్టీ పెద్దలకు చేరుతుంది. నియోజకవర్గం నుంచి ప్రతి నెలా సుమారు 800 నుంచి 900 టన్నులు బియ్యం వరకు పక్కదారి పడుతోందని తెలుస్తోంది. సమీప నియోజకవర్గాల నుంచి మరో 200 నుంచి 300 టన్నులు పోర్టుకు చేరుతోందని సమాచారం. మధ్యవర్తులు, వాహనాల ఖర్చులు అన్ని పోను ఎలా చేసుకున్నా నెలకు కోటి రూపాయలు సిండికేట్ జేబుల్లోకి చేరుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
వైఎస్సార్ సీపీ నేత హత్య కేసు ముమ్మర విచారణ
● వివరాలు సేకరిస్తున్న ఫోరెన్సిక్, క్లూస్ టీమ్లు సీఎస్పురం (పామూరు): వైఎస్సార్ సీపీ నేత మిరియం బాబుచౌదరి (42) శుక్రవారం దారుణ హత్యకు గురైన నేపథ్యంలో పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. మండలంలోని పెద్దగోగులపల్లెలో పామూరు సీఐ వినోద్కుమార్ పర్యవేక్షణలో శనివారం విచారణ చేపట్టారు. హత్య జరిగిన ప్రాంతంలో గుంటూరు ఫోరెన్సిక్ బృందం, కనిగిరి క్లూస్ టీమ్లు రక్తనమూనాలు, వేలిముద్రలు సేకరించాయి. నిందితుడు హత్యకు వాడిన కత్తి, ఇతర ఆధారాలు పోలీసు అధికారులు సేకరించారు. దీనిపై సీఐ వినోద్కుమార్ను వివరణ కోరగా మిరియం బాబుచౌదరి హత్యపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో నిందితులను అరెస్టు చేసి వారికి కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. -
టోల్ప్లాజా వద్ద వసూల్ రాజా!
టంగుటూరు: టంగుటూరు టోల్ ప్లాజా అడ్డాగా ఒక రవాణా శాఖ అధికారి అక్రమ వసూళ్లకు తెరలేపాడు. శనివారం సింగరాయకొండలో సంత కావడంతో శుక్రవారం రాత్రి 1 గంట నుంచి సంతకు తరలించడానికి ఆవులను తరలించే ఆటోలు, గొర్రెల లారీలు, వరి కోత మిషన్లు, పశువుల లారీలకు ఒంగోలు వైపు నుంచి వందల సంఖ్యలో వస్తున్నాయి. అదే అదునుగా చూసుకున్న రవాణా శాఖ అధికారి ఆవుల ఆటోల వద్ద రూ.500, గొర్రెల లారీల వద్ద రూ.2 వేలు, వరికోత మిషన్ల వద్ద రూ.500, పశువుల లారీల వద్ద రూ.2 వేలు ముక్కు పిండి మరీ వసూలు చేశారు. ఏదైనా వాహనం నిబంధనలు అతిక్రమిస్తే చలానాలు వేయాలి. కానీ వాటికి సంబంధించినవేవీ లేకుండా వసూళ్లకు పాల్పడుతున్నట్లు వాహనదారులు ఆరోపిస్తున్నారు. అసలే టోల్ప్లాజా సర్వర్ లోపంతో వాహనాలు బారులు తీరి వాహనదారులు ఇబ్బంది పడుతుంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా రవాణా శాఖ అధికారి వలన ట్రాఫిక్ జామై వాహనదారులు అష్టకష్టాలు పడుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మార్కాపురం రూరల్: మార్కాపురం మండలం చింతగుంట్ల సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. మృతుడు పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం అల్లూరివారిపాలెం గ్రామానికి చెందిన చౌడవ కోటేశ్వరరావు (55)గా గుర్తించారు. గాయపడిన వ్యక్తి మేడూరి నాగమల్లేశ్వరరావుగా తేలింది. పోలీసుల కథనం ప్రకారం.. నాగమల్లేశ్వరరావు తన స్వగ్రామం మార్కాపురం మండలం ఎల్బీఎస్ నగర్లో ఉన్న పొలం ఆన్లైన్ పనుల కోసం తన స్నేహితుడు కోటేశ్వరరావుతో కలిసి బైకుపై నరసరావుపేట నుంచి బయల్దేరాడు. చింతగుంట్ల సమీపంలో బైపాస్ రోడ్ నుంచి సర్వీస్ రోడ్లోకి వెళ్లేందుకు ఒక్కసారిగా మోటార్ సైకిల్ మలుపు తిప్పాడు. అదే సమయంలో శ్రీశైలం వైపు నుంచి గిద్దలూరు దిశగా వెళ్తున్న కారు వెనుక నుంచి వెగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్ నడుపుతున్న కోటేశ్వరరావుకు తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. నాగమల్లేశ్వరరావుకు స్వల్ప గాయాలుకాగా స్థానికులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మార్కాపురం రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తే ఉద్యమం
కందుకూరు: ప్రజా రవాణా వ్యవస్థలో ప్రధానరంగమైన ఆర్టీసీ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్మికుడిపై ఉందని, ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే ప్రభుత్వ యత్నాలను అడ్డుకుంటామని ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల్ అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం స్థానిక డిపో వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ బస్సులు కొనే ప్రతిపాదనను ప్రభుత్వం చేస్తోందని, దీని ద్వారా ఆర్టీసీ డిపోలను ఖాళీ చేయించే కుట్రకు ప్రభుత్వం తెరలేపుతోందన్నారు. విద్యుత్ బస్సులను పూర్తిగా ఆర్టీసీ సంస్థకే అప్పగించాలన్నారు. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 60 శాతం పోస్టులను భర్తీ చేయాలన్నారు. సీ్త్ర శక్తి పథకం విజయవంతం కావాలంటే 3 వేల కొత్త బస్సులను కొని ఆర్టీసీకి ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న డీఆర్సీ అరియర్స్ను క్లియర్ చేయడంతో పాటు, 12వ పీఆర్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ బస్సులను ఆర్టీసీ మాత్రమే నడిపేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డిపో అధ్యక్షుడు మహేష్బాబు, గ్యారేజీ అద్యక్ష, కార్యదర్శులు స్వామి, రహంతుల్లా, సిసిఎస్ డిలిగేట్ నల్లూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తే సహించం పొదిలి: ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే ప్రభుత్వ యత్నాలను అడ్డుకుంటామని స్థానిక ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు చెప్పారు. స్థానిక ఆర్టీసీ గ్యారేజీ గేటు వద్ద మహ్మద్ అబ్దుల్ బాజీ అధ్యక్షతన శనివారం గేట్ మీటింగ్ నిర్వహించారు. ఎలక్ట్రికల్ బస్సులను ప్రైవేటుకు అప్పగించడం ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే ఎత్తుగడలో భాగమేనని విమర్శించారు. ఎలక్ట్రికల్ బస్సుల పేరిట డిపోలను ఖాళీ చేసి, ఉద్యోగులను ఇతర డిపోలకు తరలించే విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు. 11వ పీఆర్సీ బకాయిలు, డీఏ అరియర్స్, కొత్త డీఏలను వెంటనే చెల్లించాలన్నారు. 12వ పీఆర్సీ కమిషన్ నియమించి ఐఆర్ వెంటనే చెల్లించాలన్నారు. ధర్నాలో డిపో గౌరవాధ్యక్షుడు ఎం.షరీఫ్, స్టేట్ కమిటీ సభ్యులు పి.కొండలరావు, పీఎన్ రెడ్డి, భాస్కర్రెడ్డి, డిపో సెక్రటరీ పి.ఓబులేసు, ఎంఎన్.మీరా, బ్రహ్మయ్య, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి స్వామికి సమస్యల ఏకరువు
సాక్షి, టాస్క్ఫోర్స్: సింగరాయకొండ మండలంలోని పాత సింగరాయకొండ గ్రామ పంచాయతీలో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి పాల్గొనగా, స్థానిక ప్రజలు సమస్యలు ఏకరువు పెట్టారు. స్థానిక ఎస్సీకాలనీకి చెందిన ఉపాధి హామీ పథకం మహిళా కూలీలు తమ కాలనీలో తాగునీటి సమస్య ఉందని, ఇటీవల బోర్లు వేసినప్పటికీ వేసవి కావడంతో చాలడం లేదని మంత్రికి తెలిపారు. రామతీర్థం నీరు గ్రామానికి వస్తున్నాయే తప్ప ఎస్సీకాలనీకి రావడం లేదన్నారు. రామతీర్థం నీరు ఎస్సీకాలనీ వరకు వచ్చేలా పైపులైను వేయాలని కోరారు. కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉందని, మురుగునీరు సక్రమంగా పారడం లేదని, మురుగు కాల్వలు నిర్మించాలని మంత్రిని కోరారు. తాతయ్య ఎస్టీకాలనీ వద్ద గల మేళం వాగు చెరువుకు ఉన్న రెండు తూముల నుంచి నీరు లీకవుతోందని, కొత్త తూములు ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై మంత్రి స్వామి మాట్లాడుతూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తూతూమంత్రంగా స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర... రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పాతసింగరాయకొండలో తూతూమంత్రంగా జరిగిందన్న విమర్శలు వినిపించాయి. గ్రామంలో మూడు నెలలకుపైగా పారిశుధ్య కార్మికులు లేరని, ఈ కార్యక్రమం కోసం ముందు రోజు ఇద్దరిని పనిలోకి తీసుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అంతేగాకుండా జంట గ్రామాలైన మూలగుంటపాడు నుంచి ఇద్దరిని, సింగరాయకొండ నుంచి ఆరుగురిని తీసుకొచ్చి కార్యక్రమాన్ని మమ అనిపించారని, మంత్రి స్వామి కూడా రోడ్లు శుభ్రం చేసే కార్యక్రమం కాకుండా రోడ్లు తిరిగే కార్యక్రమం చేశారని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. గ్రామంలో పారిశుధ్య కార్మికులు లేకపోవటంతో గ్రామ పంచాయతీకి కేటాయించిన ట్రాక్టరు గ్రామ సచివాలయం వద్దే సంవత్సర కాలంగా నిరుపయోగంగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. టీడీపీలో బయటపడిన వర్గ విభేదాలు... స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో టీడీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయన్న ప్రచారం మండలంలో జోరుగా సాగుతోంది. పాత సింగరాయకొండ గ్రామ పంచాయతీ ఆ మండల టీడీపీ అధ్యక్షుడు మించల బ్రహ్మయ్య స్వగ్రామం. గ్రామ పంచాయతీలో గ్రావెల్ మాఫియా ప్రధాన సూత్రధారులైన మించల బ్రహ్మయ్య, గాలి హరిబాబు రెండు వర్గాలుగా విడిపోయి ఉన్నారు. కొంత కాలంగా ఈ రెండు వర్గాలు ఉప్పు–నిప్పుగా ఉన్నాయి. మంత్రి స్వామి రాక సందర్భంగా గాలి వర్గం వేసిన ఫ్లెక్సీలలో మించల బ్రహ్మయ్య ఫొటో వేయకపోవడం చర్చనీయాంశమైంది. ఇటీవల గాలి హరిబాబు తన వర్గాన్ని, గ్రావెల్ సామ్రాజ్యాన్ని బలోపేతం చేసుకునేందుకు తన బంధువులను పార్టీలో చేర్చుకోవటానికి ఆసక్తి చూపగా, ఆ ప్రయత్నానికి మించల బ్రహ్మయ్య అడ్డుపడ్డాడన్న ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది. గాలి వర్గం బలపడితే తనకు తలనొప్పి అవుతుందని బ్రహ్మయ్య భావిస్తున్నాడని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. శనివారం కార్యక్రమం గాలి వర్గం నిర్వహించగా, బ్రహ్మయ్య వర్గం దూరంగా ఉంది. చాలా మంది నాయకులు కూడా హాజరు కాలేదని, దీనిపై మంత్రి స్వామి కూడా అసహనం వ్యక్తం చేశారని పార్టీలో చర్చ నడుస్తోంది. దీంతో ముందు జాగ్రత్తగా ఉపాధి హామీ పథకం కూలీలకు ముందుగానే మస్టర్లు వేసి వారందరినీ ట్రాక్టర్ల ద్వారా కార్యక్రమానికి తరలించారని చర్చించుకుంటున్నారు. దీనికితోడు కొంతకాలంగా మంత్రి స్వామి, దామచర్ల సత్య ఇద్దరూ కార్యక్రమాలలో పాల్గొంటున్నారని, కానీ, శనివారం మంత్రి స్వామి మాత్రమే పాల్గొన్నారని, వారిద్దరి మధ్య కూడా విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని ప్రచారం జరుగుతోంది. అందుకే సత్య వర్గం కూడా స్వామి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రచారం ఉంది. స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమంతో టీడీపీలోని వర్గ విభేదాలు బయటపడ్డాయని మండలంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. పాత సింగరాయకొండలో స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్రలో పాల్గొన్న మంత్రి స్వామి ఉపాధి కూలీలతో కార్యక్రమం నిర్వహణ పక్క పంచాయతీల నుంచి పారిశుధ్య కార్మికుల తరలింపు బయటపడిన టీడీపీలోని వర్గ విభేదాలు మండలస్థాయి నాయకులపై మంత్రి స్వామి అసహనం -
డీజిల్ భారం..!
మార్కాపురం: ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలు పెంచడంతో ఆర్టీసీపై అదనపు భారం పిడుగు పడింది. అసలే నష్టాల బాటలో నడుస్తున్న ఏపీటీడీ (ఆర్టీసీ) పరిస్థితి డీజిల్ ధర పెంపుతో మరింత దయనీయంగా మారింది. రోజుకు సుమారు 1.30 లక్షల రూపాయల భారం పడుతుండగా, నెలకు సగటున 40 లక్షల రూపాయల భారం పడుతోంది. శుక్రవారం ఉదయం ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయి. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా క్రూడాయిల్ ధరలు పెరగడంతో ఆయిల్ కంపెనీలు ఆ భారాన్ని వినియోగదారులపై మోపుతున్నాయి. డీజిల్ లీటరుపై 3.16 రూపాయలు, పెట్రోల్ 3.14 రూపాయలు పెంచాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 7 డిపోలు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో అద్దంకి, కందుకూరు, ఒంగోలు డిపోలు ఉన్నాయి. మార్కాపురం జిల్లాలో మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, పొదిలి డిపోలు ఉన్నాయి. వాటి పరిధిలోని బస్సులు రోజూ 2,12,124 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాయి. దీంతో డీజిల్ కూడా రోజుకు సుమారు 38,515 లీటర్లు వినియోగిస్తున్నాయి. లీటర్ ధర రూ.3.16 పెరగడంతో ఆ భారం ఆర్టీసీపై పడింది. ఇవి కాక ఆయా డిపోల్లో హైర్ బస్సులు కూడా తిరుగుతున్నాయి. ఇప్పటికే నష్టాల బాటలో నడుస్తున్న ఆర్టీసీకి పెరిగిన డీజిల్ ఖర్చులు అదనపు భారం కానున్నాయి. లీటరు డీజిల్ సగటున 6 కిలోమీటర్లలోపే వస్తోంది. కొన్ని బస్సులకు 5 కిలోమీటర్లు మాత్రమే వస్తోంది. దీంతో నెలకు సుమారు 40 లక్షల రూపాయలు ఆర్టీసీపై అదనపు భారం పడుతోంది. ఆయిల్ కంపెనీలు మరోసారి ధరలు పెంచుతాయన్న వార్తలు వినిపిస్తుండటంతో అదనపు భారం మళ్లీ పెరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. డీజిల్ ధరల పెరుగుదలతో జిల్లాలో ఆర్టీసీకి నెలకు రూ.40 లక్షల అదనపు భారం ఉమ్మడి జిల్లాలో 7 ఆర్టీసీ డిపోలు ప్రతిరోజూ 2,11,674 కిలోమీటర్ల ప్రయాణం మొత్తం బస్సుల సంఖ్య 527 డీజిల్ వినియోగం 38,515 లీటర్లు డిపో బస్సుల తిరిగే డీజిల్ వాడకం సంఖ్య కిలోమీటర్లు (లీటర్లలో) మార్కాపురం 88 33,661 6124 పొదిలి 62 23,870 4160 కనిగిరి 89 36,768 6658 గిద్దలూరు 64 27,646 4910 అద్దంకి 39 15,557 2783 కందుకూరు 78 31,463 5540 ఒంగోలు 107 43,159 8338 మొత్తం 527 2,12,124 38,515 -
ఎస్ఐఆర్పై అప్రమత్తంగా ఉండాలి
ఒంగోలు సిటీ: ఓటర్ల జాబితా సవరణ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రివిజన్ (ఎస్ఐఆర్) పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అన్నారు. ఒంగోలులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ప్రకాశం జిల్లాలోని వైఎస్సార్ సీపీ బీఎల్ఏ లకు ఓటర్ల ప్రత్యేక జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పై నియోజకవర్గ ఇన్చార్జ్లు, అబ్జర్వర్లు, మండల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ అధ్యక్షులు, మండల బూత్ అధ్యక్షులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ జూన్ 15వ తేదీ నుంచి ఎస్ఐఆర్ ప్రారంభమవుతుందని, ఈలోపే అన్ని నియోజకవర్గాల్లో బూత్ ఏజెంట్లను నియమించుకొని రిటర్నింగ్ అధికారికి సమర్పించాలన్నారు. ప్రతి ఓటరును బీఎల్ఓలతో కలిసి వెరిఫై చేసి డూప్లికేట్ ఓట్లను, డెత్ ఓటర్లను తొలగించాలని, ఈ విషయంలో అధికార పార్టీ ఓట్లను జాగ్రత్తగా పరిశీలించాలని కోరారు. ప్రతి ఓటరు ఎన్యుమరేషన్ ఫారాన్ని, ధ్రువీకరణ పత్రాన్ని జత చేసి సంతకం చేసి బీఎల్ఓ లకు ఇవ్వాలని సూచించారు. డూప్లికేట్ ఓట్ల తొలగింపులు చేపడతారని, ఇందులో నిజమైన ఓటర్ల తొలగింపు జరిగితే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. మార్పులు, చేర్పులు, మరణించినవారి పేర్లను పరిశీలించి తొలగించే విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరారు. ప్రతి బీఎల్ఏ 2025 ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి అవగాహన తెచ్చుకోవాలని సూచించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, జోనల్ ఇన్చార్జ్ పుత్తా శివశంకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ఎస్ఐఆర్ పై దృష్టి పెట్టి పనిచేస్తుందని, ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జాగ్రత్తలు తీసుకొని ఓటర్ల సవరణ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఓటుని పరిశీలించాలన్నారు. అనేక రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ వల్ల ముఖ్యమంత్రులే ఓడిపోయారని, ప్రతి ఓటరు మనకు ముఖ్యమని, దానికి అనుకూలంగా పని చేయాలన్నారు. అన్ని నియోజకవర్గాల్లో బూత్ లెవెల్ ఏజెంట్లకు శిక్షణ నిర్వహించాలన్నారు. ఎస్ఐఆర్ జరిగిన రాష్ట్రాలైన మధ్యప్రదేశ్ లో 34 లక్షలు, గుజరాత్లో 68 లక్షలు, తమిళనాడులో 74 లక్షలు, పశ్చిమ బెంగాల్లో 91 లక్షల ఓట్లను తొలగించారన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్ర శేఖర్, మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ మేరుగు నాగార్జున, మాజీ మంత్రి కొండపి నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదిమూలపు సురేష్, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు, కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కసుకుర్తి ఆదెన్న, కేవీ.రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, బొట్ల రామారావు, ఒంగోలు నగర అధ్యక్షులు కఠారి శంకరరావు, మండల పార్టీ అధ్యక్షులు లంకపోతు అంజిరెడ్డి, దుంపా చెంచిరెడ్డి, మన్నే శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, మండల నాయకులు, బీఎల్ఏలు పాల్గొన్నారు. -
బాలుడు అనుమానాస్పద మృతి
అర్ధవీడు: ఓ బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని రంగాపురం ఎస్సీ కాలనీలో శనివారం జరిగింది. అందిన వివరాల ప్రకారం..అర్ధవీడు మండలం రంగాపురం ఎస్సీ కాలనీకి చెందిన గడెం అభిలాష్ (17) అనే బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అభిలాష్ తల్లిదండ్రులు మరణించడంతో రంగాపురంలోని అమ్మమ్మ ఇంట్లో ఉంటూ కంభం పట్టణంలో ఐటీఐ చదువుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అనూమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న ఎస్సై శివ నాంచారయ్య సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ● రూ.1.50 లక్షల నష్టం కొత్తపట్నం: మండలంలోని గుండమాల గ్రామం పెద్దపాలేనికి చెందిన పిన్ని లక్ష్మణరావుకు సంబంధించిన వేట సామగ్రి శనివారం అగ్ని ప్రమాదంలో కాలి బూడిదైంది. వంజరం, కనగుర్త చేపల వేటకు వినియోగించే మూడు టంగీస్ వలలు ఉదయం అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి. ఒక వల పూర్తిగా కాలిపోగా, రెండు వలలు పాక్షికంగా కాలిపోయి పూర్తిగా పనికిరాకుండా పోయాయి. మొత్తం మూడు వలలు పనికిరాకుండా పోయాయని, వాటి విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ● కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పెద్దదోర్నాల: వెలుగొండ ప్రాజెక్టు సొరంగ నిర్మాణ పనుల వద్ద అస్సోం రాష్ట్రానికి చెందిన కార్మికుడు అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన ఈ నెల 9వ తేదీన జరిగినట్లు భావిస్తుండగా సోదరుని ఫిర్యాదుతో శనివారం వెలుగు చూసింది. ఎస్సై వెంకట రమణయ్య అందించిన వివరాల ప్రకారం.. బసంత్కుమార్ రభ (36) పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టులో కార్మికుడిగా విధులు నిర్వహించేందుకు ఈ నెల 8వ తేదీన మండల పరిధిలోని కొత్తూరు వద్దకు వచ్చాడు. శ్రీశైలం బ్యాక్ వాటర్లోని కొల్లంవాగు వద్ద కార్మికుడిగా విధుల్లో చేరినట్లు సమాచారం. ఆ మరుసటి రోజు నుంచి అతను కనిపించకుండా మాయమయ్యాడు. బసంత్కుమార్ రభను పనిలో పెట్టుకున్న సదరు ఏజెంట్ ఈ విషయాన్ని అస్సోంలోని అతని కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. అతని సోదరుడు సుమంత్కుమర్ రభ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది. విచారణ చేపట్టిన పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సెల్ఫోన్, బ్యాగు తదితర వస్తువులు అతనికి కేటాయించిన గదిలోనే వదిలి వెళ్లినట్లు ప్రాజెక్టు అధికారులు పేర్కొంటున్నారు. -
హైవేలపై బ్లాక్ స్పాట్ల పరిశీలన
● అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేసిన డీటీసీ సుశీల ఒంగోలు సబర్బన్: జిల్లా వ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులపై ఉన్న బ్లాక్ స్పాట్లను డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (డీటీసీ) ఆర్.సుశీల శనివారం పరిశీలించారు. పోలీస్ అధికారులు, జాతీయ రహదారుల అధికారులతో కలిసి ఎన్హెచ్–16 గుడ్లూరు సర్కిల్ పరిధిలోని మోచర్ల మొదలుకుని అద్దంకి సర్కిల్ పరిధిలోని మేదరమెట్ల వరకూ బ్లాక్ స్పాట్లను పరిశీలించారు. ప్రమాదాలు జరిగేలా ఉన్న ప్రాంతాలు, ఇప్పటి వరకూ ప్రమాదాలు జరిగిన ప్రాంతాల్లో పర్యటించి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై జాయింట్ ఇన్స్పెక్షన్ చేశారు. ఈ సందర్భంగా డీటీసీ ఆర్.సుశీల మాట్లాడుతూ కలెక్టర్ పి.రాజాబాబు ఆదేశాల మేరకు 5 బ్లాక్ స్పాట్లపై జాయింట్ ఇన్స్పెక్షన్ చేసినట్లు చెప్పారు. జిల్లా మొత్తం మీద 23 బ్లాక్ స్పాట్లు ఉన్నాయన్నారు. 13 బ్లాక్ స్పాట్లను ఫిబ్రవరి నెలలో జాయింట్ ఇన్స్పెక్షన్ చేశామన్నారు. మిగిలిన 10 బ్లాక్ స్పాట్లకుగానూ ఐదు బ్లాక్ స్పాట్లను జాయింట్ ఇన్స్పెక్షన్ చేశామన్నారు. జాయింట్ ఇన్స్పెక్షన్ చేసిన ప్రదేశాలలో ఉలవపాడు మండలం చాగొల్లు ఫ్లై ఓవర్, ఎన్ హెచ్–16లో గుడ్లూరు మండలం మోచెర్ల, తెట్టు, చేవూరు క్రాస్ రోడ్, ఎస్హెచ్ – 1678లో కందుకూరు మండలం ఓగూరు వద్ద ఆంజనేయ కోల్డ్ స్టోరేజ్ ప్రాంతాలు ఉన్నాయని వెల్లడించారు. అదేవిధంగా మేదరమెట్ల కొండ ప్రాంతం సమీపంలోని జాతీయ రహదారిని కూడా పరిశీలించి రహదారి ప్రమాదాలకు గల కారణాలను విశ్లేషించి వాటిపై తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. ఎన్హెచ్ 16పై వాహన తనిఖీలు చేపట్టి వాహనంపై టార్పాలిన్ కట్టకుండా, సరైన రికార్డులు లేకుండా ఇసుక తోలుతున్న 4 ట్రాక్టర్లు, ట్రైలర్లను సీజ్ చేశారు. జాయింట్ ఇన్స్పెక్షన్లో ఎన్హెచ్–16 పీడీ అనీల్ కుమార్, ఎన్హెచ్–1678 అధికారులు, కందుకూరు డీఎస్పీ, సీఐ, దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ, సీఐలు, రవాణా శాఖ ఒంగోలు కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏఓ) శ్రీనివాసరావు, దర్శి మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ పరిశపోగు రవికుమార్, ఇతర పోలీస్ అధికారులు, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. -
ఉద్యమం ఉధృతం
రైతులను ఆదుకునేందుకుఒంగోలు సబర్బన్: పొగాకు కొనుగోళ్లలో మాంద్యం సృష్టిస్తున్నారని వైఎస్సార్ సీపీ నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ధ్వజమెత్తారు. ఐటీసీ గుత్తాధిపత్యంతో రైతులు నిలువునా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఒంగోలు–2 వేలం కేంద్రాన్ని మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ మేరుగు నాగార్జున, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు పార్టీ నాయకులతో కలిసి శనివారం సందర్శించారు. పొగాకు వేలం కేంద్రం–2లో పొగాకు వేలం జరుగుతున్న తీరును పరిశీలించారు. వేలం కేంద్రంలోని పొగాకు బోర్డు అధికారులతో, పొగాకు రైతులతో వేలం తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మేరుగు నాగార్జున మాట్లాడుతూ పొగాకు వ్యాపారంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తే కానీ గుత్తాధిపత్యాన్ని వహిస్తున్న ఐటీసీకి బుద్ధిరాదన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో క్వింటా పొగాకు రూ.38 వేలు వరకూ కొనుగోలు చేశామని, ప్రస్తుతం పంట పండించాలంటే ఖర్చులు పెరిగి రూ.30 వేల వరకూ అవుతున్నాయని చెప్పారు. ఈ నష్టాన్ని రైతులు ఏవిధంగా భరిస్తారని నిలదీశారు. ఇదేవిధంగా ఉంటే రైతులు పొగాకు క్రాప్ హాలిడే ప్రకటిస్తే పొగాకు వ్యాపారులు ఏమవుతారని ప్రశ్నించారు. పొగాకు బోర్డు ఈడీని కలుస్తాం, వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ద్వారా కేంద్ర మంత్రులను కలిసి పరిస్థితిని వివరిస్తామన్నారు. లంచాలు మరిగి రైతులను గాలికి వదిలేశారు వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరు రవిబాబు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడొచ్చినా వ్యాపారుల పక్షాన ఉంటూ పర్సంటేజీలు దండుకోవటమే పనిగా పెట్టుకుంటున్నారన్నారు. ఈ ఏడాది కిలో పొగాకుపై రూ.80 దండుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం లంచాలు మరిగి రైతులను గాలికి వదిలేస్తుందని ధ్వజమెత్తారు. ఒక్క సిగరెట్టుకు రూ.0.70 పైసలు మాత్రమే ఖర్చవుతుందని, కానీ రూ.10 నుంచి రూ.20 వరకూ అమ్ముకొని కంపెనీలు అత్యధికంగా లాభాలు గడిస్తున్నాయన్నారు. రైతుల కోసం రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయాలన్నారు. వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెళ్ల బంగారుబాబు మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పంటలు వేద్దామంటే ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలు లేవన్నారు. కనీసం కిలోకు రూ.200 కూడా రావటం లేదన్నారు. వేలం కేంద్ర పొగాకు రైతు నాయకుడు సునీల్ బాబు మాట్లాడుతూ టీడీపీకి చెందిన ఎంపీలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శ్రీకృష్ణదేవరాయలుతో పాటు మరికొంత ఎంపీలను కలిసి సమస్యను వివరించినా ప్రయోజనం లేదన్నారు. కార్యక్రమంలో మద్దిపాడు మాజీ ఏఎంసీ చైర్మన్ ఇనగంటి పిచ్చిరెడ్డి, వైఎస్ఆర్ సీపీ ఒంగోలు మండల పార్టీ అధ్యక్షుడు మన్నె శ్రీనివాసరావు, నాగులుప్పులపాడు మండల పార్టీ అధ్యక్షుడు పోలవరపు శ్రీమన్నారాయణ, మద్దిపాడు ఎంపీపీ కోటిరెడ్డి, సంతనూతలపాడు మండల పార్టీ అధ్యక్షుడు దుంపా చెంచి రెడ్డి, వేలం కేంద్రం పొగాకు రైతు నాయకుడు వడ్డెళ్ల ప్రసాదు, సునీల్ బాబు, వైఎస్ఆర్ సీపీ నాయకులు బొట్ల రామారావు, పాలడుగు రాజేష్ పాల్గొన్నారు. -
ఏసీబీ డీఎస్పీగా శిరీష
ఒంగోలు సిటీ: ఒంగోలు ఏసీబీ డీఎస్పీగా ఎస్.శిరీష శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సేవల్లో అవినీతి పెరుగుతోందన్నారు. పింఛన్లు, రేషన్, భూమి సమస్యలు, మున్సిపల్ సేవలు, ప్రభుత్వ పథకాలు వంటి అంశాల్లో కొంతమంది అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు ఇస్తే వారి పనులు తాము దగ్గరుండి రూపాయి ఖర్చు లేకుండా చేయిస్తామని తెలిపారు. అవినీతిని అరికట్టేందుకు ప్రజలు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదులు ఇవ్వాలన్నారు. ఎక్కడైనా అవినీతి జరిగినట్లయితే వెంటనే 9440446189, 9440446187, 8333925624 నంబర్కు కాల్ చేసి సమాచారం ఇవ్వవచ్చాన్నరు. మీ వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంచుతారని చెప్పారు -
రెండేళ్లలో కూటమిపై ప్రజల్లో వ్యతిరేకత
చీమకుర్తి రూరల్: చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత తెచ్చుకుందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అన్నారు. కూనంనేనివారిపాలెం గ్రామంలో ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానం 25వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం రాత్రి నిర్వహించిన తిరునాళ్లలో వైఎస్సార్ సీపీ నాయకులు ఏర్పాటు చేసిన ప్రభపై పమిడి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించిన కార్యక్రమంలో బూచేపల్లి శివప్రసాద్రెడ్డితో పాటు జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ మేరుగు నాగార్జున, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని, ఆరుగాలం అష్టకష్టాలు పడి పొగాకు పండించిన రైతులకు మద్దతు ధర కల్పించి ఆదుకునే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదన్నారు. రైతన్నల పక్షాన వైఎస్సార్ సీపీ నాయకులు పోరాడితే వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయడంలో చూపుతున్న శ్రద్ధ పొగాకు రైతులకు మద్దతు ధర కల్పించడంలో లేదని విమర్శించారు. ప్రజలకు మాట ఇస్తే నెరవేర్చే వ్యక్తి జగనన్నే అని, ఎన్నికల సమయంలో ప్రజలకు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి సంక్షేమ పథకాలు నెరవేర్చని వ్యక్తి చంద్రబాబు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద ప్రజలకు అండగా సంక్షేమ పథకాలు అమలు చేసిన జగనన్నను ఎన్ని కష్టాలు వచ్చినా మనమందరం సమష్టి కృషితో మళ్లీ సీఎం చేసుకోవాలని అన్నారు. వైఎస్సార్సీపీ పాలనలోనే రైతులకు అండ: మాజీ మంత్రి మేరుగు నాగార్జున మాజీ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉంటుందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కులాలు, మతాలకు అతీతంగా సంక్షేమం, అభివృద్ధి అందిందని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించకుండా పేద ప్రజలను, మహిళలను, గిట్టుబాటు ధరలు ఇవ్వక రైతులను మోసగించిందన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, గ్రామపార్టీ అధ్యక్షుడు యర్రగుంట్ల మోహన్, యర్రగుంట్ల వసంతరావు, బొడ్డపాటి హరిబాబు, నల్లూరి నారాయణ, మండల రైతు విభాగం అధ్యక్షుడు నల్లూరి రామచంద్రారావు, గోరంట్ల రామకృష్ణ, వేమూరి బాలకృష్ణ, పేరాబత్తిన పేరయ్య, పాటిబండ్ల గంగయ్య, సుందరరామిరెడ్డి, పాలడుగు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
2 ట్రాన్స్ఫార్మర్లలో రాగి తీగ చోరీ
తాళ్లూరు: పొలాల్లో ట్రాన్స్ఫార్మర్లను దుండగులు ధ్వంసం చేసి రాగితీగ చోరీ చేసిన సంఘటన తాళ్లూరు మండంలోని నాగంబొట్లపాలెం గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన రైతులు సోము వెంకట నరసింహారెడ్డి, కె.పిచ్చిరెడ్డి, వెంకటరెడ్డి, నగేష్ తమ వ్యవసాయ బోర్ల కోసం ఏర్పాటు చేసుకున్న రెండు ట్రాన్స్ఫార్మర్లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. సుమారు 20 ఎకరాల్లో పశుగ్రాసం, వరి నారు సాగు చేశామని, ట్రాన్స్ఫార్మర్లు చోరీ కావడంతో పంటలు ఎండుముఖం పట్టే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చోరీపై పోలీసులు, విద్యుత్శాఖ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ● ప్రకాశం, మార్కాపురం జిల్లాల వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు ● అర్ధరాత్రి బైకులపై చక్కర్లు కొడితే చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరిక ఒంగోలు సిటీ: ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో నైట్ పెట్రోలింగ్ ముమ్మరం చేసినట్లు ఎస్పీ హర్షవర్థన్రాజు పేర్కొన్నారు. రాత్రి సమయంలో అనవసరంగా, అనుమానాస్పదంగా తిరిగేవారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రకాశం జిల్లాలో 780 వాహనాలు తనిఖీ చేసి, సరైన పత్రాలు లేని 103 వాహనాలు, అలాగే మార్కాపురం జిల్లాలో 552 వాహనాలు తనిఖీ చేసి 133 వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలకు ఈ–చలానా విధించినట్లు చెప్పారు. రాత్రి వేళ 11 గంటల తర్వాత అనవసరంగా రోడ్లపై తిరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు, పాత నేరస్తులు, చెడునడత కలిగిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు చెప్పారు. నేరాల నియంత్రణతోపాటు శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు డయల్ 112కు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
వివిధ హోదాల్లో వైఎస్సార్సీపీ నాయకుల నియామకం
ఒంగోలు సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు నాయకులను వివిధ హోదాల్లో నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. వారు వరుసగా స్టేట్ స్టూడెంట్ వింగ్ వైస్ ప్రెసిడెంట్గా దర్శికి చెందిన దుగ్గిరెడ్డి నారాయణరెడ్డిని, స్టేట్ స్టూడెంట్ వింగ్ జనరల్ సెక్రటరీగా కనిగిరికి చెందిన మునగాల హరీశ్వరరెడ్డిని, స్టేట్ సోషల్ మీడియా వింగ్ సెక్రటరీగా మార్కాపురానికి చెందిన దగ్గుల సాగర్రెడ్డిని, స్టేట్ యూత్ జాయింట్ సెక్రటరీగా మార్కాపురానికి చెందిన గాయం వెంకటేశ్వరరెడ్డిని నియమించినట్లు తెలిపారు. అలాగే జిల్లా నూర్బాషా/దూదేకుల విభాగం ప్రెసిడెంట్గా కొండపికి చెందిన షేక్ రజియా హుస్సేన్ను, జిల్లా బీసీ సెల్ సెక్రటరీగా కనిగిరికి చెందిన వంకదారి వెంకటరాజా నియమించారు. అలాగే ఒంగోలు సిటీ మహిళా విభాగం ప్రెసిడెంట్ గా ఒంగోలుకు చెందిన ఎస్కే.రషుదా, ఒంగోలు నియోజకవర్గ మహిళా విభాగం ప్రెసిడెంట్ గా ఒంగోలుకు చెందిన బడుగు మాధవీలతను నియమించారు. ఒంగోలు సిటీ: ఒంగోలు ఏసీబీ డీఎస్పీగా ఎస్.శిరీష శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సేవల్లో అవినీతి పెరుగుతోందన్నారు. పింఛన్లు, రేషన్, భూమి సమస్యలు, మున్సిపల్ సేవలు, ప్రభుత్వ పథకాలు వంటి అంశాల్లో కొంతమంది అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు ఇస్తే వారి పనులు తాము దగ్గరుండి రూపాయి ఖర్చు లేకుండా చేయిస్తామని తెలిపారు. అవినీతిని అరికట్టేందుకు ప్రజలు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదులు ఇవ్వాలన్నారు. ఎక్కడైనా అవినీతి జరిగినట్లయితే వెంటనే 9440446189, 9440446187, 8333925624 నంబర్కు కాల్ చేసి సమాచారం ఇవ్వవచ్చాన్నరు. మీ వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంచుతారని చెప్పారు. మార్కాపురం టౌన్: రాష్ట్రంలోని పురపాలక సంఘాల్లో వర్క్ ఔట్సోర్సింగ్ పేరుతో అన్ని విభాగాల ప్రైవేటీకరణకు ప్రభుత్వం సిద్ధమైందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీకేఎం రఫీ అన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్క్ ఔట్ సోర్సింగ్ విధానాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు తీర్పు మేరకు ఔట్సోర్సింగ్ కార్మికులను వెంటనే రెగ్యులర్ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, సంక్షేమ పథకాలను మున్సిపల్ కార్మికులకు వెంటనే అమలు చేయాలని, ఉద్యోగ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు సుబ్బరాయుడు, జీ హరి, చెన్నకేశవులు, చిన్నరాయుడు, శ్రీను, దాసు, రషీదు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ బలోపేతమే లక్ష్యంగా కమిటీల ఏర్పాటు
సింగరాయకొండ: నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ బలోపేతమే లక్ష్యంగా మండల, గ్రామ కమిటీలను పూర్తి చేసి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆరు మండలాల మండల పార్టీ అధ్యక్షులకు దిశా నిర్దేశం చేశారు. డాక్టర్ సురేష్ శుక్రవారం మార్కాపురంలోని జార్జి ఇంజినీరింగ్ కాలేజి నుంచి జూమ్ మీటింగ్లో వర్చువల్ గా మండల పార్టీ అధ్యక్షులకు పార్టీ బలోపేతంపై దిశా నిర్దేశం చేశారు. డాక్టర్ సురేష్ మాట్లాడుతూ మండల, గ్రామ కమిటీల నియామకం పూర్తి చేయటం ద్వారా పార్టీ బలోపేతం అవుతుందన్నారు. ప్రతి గ్రామంలో పర్యటించి గ్రామ కమిటీలను పూర్తి చేయాలని సూచించారు. పార్టీ కార్యకర్తల మధ్య సమన్వయానికి కృషి చేయాలని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల పక్షాన నిలవాలని సూచించారు. భవిష్యత్ కార్యాచరణపై ఆయన వారికి దిశానిర్దేశం చేశారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షులు మసనం వెంకట్రావు, పిన్నిక శ్రీనివాసరావు, చింతపల్లి హరిబాబు, బచ్చల కోటేశ్వరరావు, దుద్దుగుంట మల్లిఖార్జునరావు, ఇంకొల్లు సుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
హమ్మయ్యా.. బతికిపోయాం!
సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసు అధికారులు మంటలు వ్యాపించిన ప్రాంతంలో కాలిపోయిన పెయింట్ డబ్బాలు ఇతర వాహనాల్లో గమ్యస్థానాలకు వెళ్తున్న ప్రయాణికులు ఉలవపాడు: మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద ట్రావెల్స్ బస్సు దగ్ధమై 14 మంది సజీవ దహనం కాగా, మరో 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడిన సంఘటన మరువక ముందే అదే తరహా ఘటన ఉలవపాడు మండలంలో చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడగా ట్రావెల్స్ బస్సు పూర్తిగా కాలిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నుంచి తిరుపతికి 36 మంది ప్రయాణికులతో వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సులో ఉలవపాడు మండల పరిధిలోని రాజుపాలెం–చాగల్లు మధ్య జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారు జామున మంటలు చెలరేగాయి. ప్రమాదానికి గురైన బస్సును ఓవర్ టేక్ చేస్తున్న మరో వాహనం డ్రైవర్ జరగబోయే ప్రమాదాన్ని పసిగట్టి అప్రమత్తం చేయడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. కావేరి ట్రావెల్స్ బస్సు పంక్చర్ కాగా అలాగే దూసుకెళ్తుండటంతో ఒత్తిడి అధికమై తొలుత పొగలు, కాసేపటికే మంటలు వ్యాపించాయి. ప్రయాణికులంతా హుటాహుటిన దిగి తమ లగేజీని తీసేసుకోవడంతో ఆస్తి నష్టం కూడా తప్పింది. ఫైర్ ఎక్స్టింగ్విషర్లు లేవు బస్సు కళ్ల ముందే దగ్ధమవడాన్ని చూసిన ప్రయాణికులు భీతిల్లారు. దారిన వెళ్తున్న వ్యక్తి అప్రమత్తం చేయకుంటే తమ పరిస్థితి ఏమిటో తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతోందని ప్రయాణికులు అభిప్రాయపడ్డారు. బస్సులో మంటలు ఆర్పేందుకు ఫైర్ ఎక్స్టింగ్విషర్లు లేవని, అత్యవసర ద్వారం తెరిచే టూల్ కిట్ కూడా కనిపించలేదని, అందరం ముందు ద్వారం నుంచి బయటకు రావాల్సి వచ్చిందని ప్రయాణికులు పేర్కొన్నారు. బస్సులో ఉన్న కొంత నీటిని టైర్ వద్ద మంటలపై పోసినా చల్లారకపోవడంతో ఫైర్ స్టేషన్కు ఫోన్ చేసినప్పటికీ ప్రయాణికులకు సమాధానం కరువైంది. మంటలు చెలరేగిన బస్సు టైరు పక్కనే ఉండే లగేజీ క్యాబిన్లో పెయింట్ డబ్బాలు ఉన్నాయని, వీటి మూలంగానే వేగంగా మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా కాలిపోయి ఉంటుందని ప్రత్యక్ష సాక్షులైన ప్రయాణికులు తెలిపారు. ప్రయాణికుల క్షేమం గాలికి.. ప్రమాద సమయంలో బస్సు నుంచి దిగిన ప్రయాణికులను ఎవరూ పట్టించుకోలేదు. కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోగా, అదే సంస్థకు చెందిన బస్సులు హైవేలో వెళ్తున్నా ఒక్కటీ ఆపలేదు. ప్రయాణికులు చేతులెత్తి అర్థిస్తున్నా స్పందన లేకపోవడంతో శాపనార్థాలు పెడుతూ ప్రైవేట్ కార్లు, ఇతర వాహనాల్లో తమ గమ్యస్థానాలకు వెళ్లారు. అధికారుల పరిశీలన ఘటనా స్థలాన్ని కందుకూరు ఆర్టీఓ నాగలక్ష్మి, కందుకూరు సీఐ అన్వర్ బాషా, ఉలవపాడు ఎస్సై సుబ్బారావు పరిశీలించారు. బస్సు డ్రైవర్ల వద్ద ప్రమాద వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే హైవే రోడ్ సేఫ్టీ పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ఉలవపాడు మండలంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న బస్సు 36 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు సురక్షితం బస్సులో కనీస వసతులు లేవు బస్సు చాలా పాతగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే బయటకు వెళ్లడానికి అత్యవసర ద్వారం కూడా లేదు. మంటలు ఆర్పేందుకు మంచి నీళ్లు పోశారు. హైవేలో వెళ్తున్న మరో బస్సు నుంచి కార్బన్ డయాకై ్సడ్ సిలిండర్లు తీసుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు తప్ప ఈ బస్సులో మాత్రం సిలిండర్లు ఉంచలేదు. బస్సు పంక్చర్ అయి పెద్ద శబ్ధం వచ్చింది. కొంత సేపటి తర్వాత పొగలు వస్తుండటంతో వెనుక వస్తున్న వారు గమనించి అప్పమత్తం చేశారు. మొత్తం మీద పెద్ద గండం నుంచి బయటపడ్డాం. – వినోద్, హోటల్ వ్యాపారి, హైదరాబాద్ -
ఈనాం భూములకు పట్టాలివ్వండి
సంతమాగులూరు(అద్దంకి): మండలంలోని కొమ్మాలపాడు, సజ్జాపురం, మక్కెనవారిపాలెం తదితర గ్రామాల్లోని 4,800 ఎకరాల ఈనాం భూములకు పట్టాలు ఇప్పించాలని కలెక్టర్ రాజాబాబును కొమ్మాలపాడు గ్రామస్తులు కోరారు. మండలంలోని సజ్జాపురం గ్రామంలో కలెక్టర్ శుక్రవారం రాత్రి పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. గ్రామంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయని ఆరా తీశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. తమ దృష్టికి వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా గ్రామంలో భూములకు సంబంఽధించి వచ్చిన అర్జీలను రీసర్వే సమయంలో సరిచేస్తామని, మండల సర్వేయర్ సాంబశివరావు, వీఆర్ఓ సామ్యేల్ అర్జీదారులకు చెప్పడంపై మండిపడ్డారు. సమస్యలు ఏకరువు మట్టికొండకు చుట్టూ ఉన్న భూమిని ఆక్రమించి అందులోకి జీవాలను తోలుకెళ్లనీయడం లేదని, మట్టి కోసం వెళ్తున్న వారిని అడ్డగిస్తున్నారని స్థానికులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. నూతన పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. ఎలక్ట్రిక్ బైకు బ్యాటరీ చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని విన్నవించారు. సబ్స్టేషన్ నుంచి బల్లికురవ మండలంలోని చెన్నుపల్లి, మార్టూరు వెళ్లడానికి ఉన్న మట్టిరోడ్డును పొడిగించి మెటల్ రోడ్డు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఏల్చూరు నుంచి సజ్జాపురం కూడలికి నెహ్రు నగర్ రోడ్డును కలపాలని కోరారు. కొప్పరం పంచాయతీ పరిధిలో రెండు గ్రానైట్ క్వారీల నుంచి వచ్చే కాలుష్యాన్ని తాము భరిస్తున్నామని, ఆదాయం మాత్రం కొప్పరం పంచాయతీ వెళ్తోందని, అలా కాకుండా తమ పంచాయతీకి ఆదాయం కేటాయించాలని కోరారు. పల్లె నిద్ర కార్యక్రమంలో జేసీ కల్పనాకుమారి, అద్దంకి ఆర్డీఓ జాన్సన్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీధర్రెడ్డి, అద్దంకి ఆర్డీఓ జాన్సన్, జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, డీపీఓ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ రవిబాబు, ఎంపీడీఓ జ్యోతిర్మయి తదితర అఽధికారులు పాల్గొన్నారు. పల్లె నిద్రలో కలెక్టర్ రాజాబాబుకు కొమ్మాలపాడు రైతుల వినతి గ్రానైట్ ఆదాయం రెవెన్యూ గ్రామానికి జమ చేయాలని వేడుకోలు -
అప్రమత్తంగా ఉండాలి
ఓటర్ల జాబితా సవరణపైమార్కాపురం: ఓటర్ల జాబితా సవరణ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రివిజన్(ఎస్ఐఆర్)పై వైఎస్సార్ సీపీ బూత్ లెవెల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని ఆ పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు సూచించారు. శుక్రవారం పట్టణంలోని విహారి లాడ్జిలో మార్కాపురం పట్టణ, రూరల్, తర్లుపాడు, కొనకనమిట్ల, పొదిలి టౌన్, రూరల్ మండలాల వైఎస్సార్ సీపీ బీఎల్ఏలకు ఎస్ఐఆర్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అన్నా మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ శ్రేణులందరికీ స్వగ్రామంలో ఓటు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దేశంలో ఎక్కడైనా ఓటు హక్కు కలిగి ఉంటే వారి ఓటును స్వగ్రామంలో మాత్రమే ఉండేలా చూడాలన్నారు. వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు, అభిమానుల ఓట్లను అధికార పార్టీ వారు కావాలని తొలగించే అవకాశం ఉందని, అటువంటి వాటిని గుర్తించి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేద్దామని, మళ్లీ ఓటుహక్కు కల్పించేందుకు పోరాడుదామని చెప్పారు. బీఎల్ఏలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. 2002లో ఓటర్ల రివిజన్ జరిగిందని, మళ్లీ ఇప్పుడు జరుగుతోందని చెప్పారు. 2002, 2025 ఓటర్ల జాబితాను పరిశీలించి రివిజన్ చేస్తారన్నారు. ప్రతి ఓటరూ ఎన్యుమరేషన్ ఫారాన్ని, ధ్రువీకరణ పత్రాన్ని జత చేసి సంతకం చేసి బీఎల్ఓలకు ఇవ్వాలని సూచించారు. డూప్లికేట్ ఓట్ల తొలగింపులు చేపడతారని, ఇందులో నిజమైన ఓటర్ల తొలగింపు జరిగితే తన దృష్టికి తేవాలని అన్నా రాంబాబు స్పష్టం చేశారు. మార్పులు, చేర్పులు, మరణించిన వారి పేర్లను పరిశీలించి తొలగించే విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి జోనల్ ఇన్చార్జి పుత్తా శివశంకర్రెడ్డి మాట్లాడుతూ.. ఎస్ఐఆర్తో యూపీలో 2.85 కోట్ల మంది, మధ్య ప్రదేశ్లో 34 లక్షలు, గుజరాత్లో 68 లక్షలు, పశ్చిమ బెంగాల్లో 91, తమిళనాడులో 74 లక్షల మంది ఓటర్లను తొలగించారన్నారు. ముందుగా ఓటర్ డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేస్తారని, దానిని గమనించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఎన్నికల అధికారికి ఇవ్వాలన్నారు. ఓటర్ మ్యాపింగ్ ప్రకారం రివిజన్ జరుగుతుందన్నారు. ఓటర్ల జాబితాను దగ్గరపెట్టుకోవాలని, నిశితంగా పరిశీలించాలని, తొలగించిన ఓటర్లలో మరణించిన వారివి కాకుండా ఇతరుల ఓట్లు ఎవరైనా ఉన్నాయేమో బీఎల్ఏలు పరిశీలించాలని సూచించారు. కార్యక్రమంలో అన్నా కృష్ణచైతన్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు షంషేర్ ఆలీబేగ్, కేవీ రమణారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, పార్టీ పోలింగ్ బూత్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి పత్తి రవిచంద్ర నియోజకవర్గంలోని ఆయా మండలాల వైఎస్సార్ సీపీ అధ్యక్షులు సలీమ్, చెంచిరెడ్డి, మురారి వెంకటేశ్వర్లు, శంకర్రెడ్డి, శ్రీనివాసరెడ్డి, సంజీవరెడ్డి, జెడ్పీటీసీ నారు బాపన్రెడ్డి, లీగల్ సెల్ అధ్యక్షుడు కాశయ్య, సోషల్ మీడియా అధ్యక్షుడు రఫీ, పార్టీ ప్రధాన కార్యదర్శి సత్యంరెడ్డి, పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పుత్తా శివశంకర్రెడ్డిని ఘనంగా సన్మానించారు. వైఎస్సార్ సీపీ మార్కాపురం ఇన్చార్జి అన్నా రాంబాబు మార్కాపురం నియోజకవర్గ బీఎల్ఏలకు అవగాహన హాజరైన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, జోనల్ ఇన్ఛార్జి పుత్తా శివశంకర్రెడ్డి -
భూ తగాదాలో ఒకరు దారుణ హత్య
సీఎస్పురం(పామూరు): భూ వివాదం విషయంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన శుక్రవారం సీఎస్పురం మండలంలోని పెద్దగోగులపల్లె గ్రామంలో చోటుచేసుకుంది. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో ఈ హత్య అనంతరం భయానక వాతావరణం నెలకొంది. పోలీసులు, మృతుని తండ్రి కథనం మేరకు.. గోగులపల్లి గ్రామ సమీపంలో సర్వే నంబర్ 362/2లో 4 ఎకరాల భూమికి సంబంధించి మిరియం వెంకటేశ్వర్లు, అదే గ్రామానికి చెందిన చిలంకూరి రమేష్రెడ్డి మధ్య వివాదం తలెత్తగా కోర్టులో కేసు నడుస్తోంది. ఈ క్రమంలో పలుమార్లు పెద్దల వద్ద పంచాయితీ పెట్టి చర్చించారు. కాగా, గురు, శుక్రవారాల్లో చిలంకూరి రమేష్రెడ్డి సదరు పొలంలో పని చేయిస్తుండగా మిరియం వెంకటేశ్వర్లు, ఆయన కుమారుడు బాబు పనులను అడ్డుకున్నారు. కోర్టులో కేసు ఉండగా పనులు చేయడం సరికాదని చెప్పి ఇంటికొచ్చారు. కాగా, శుక్రవారం మధ్యాహ్నం మిరియం వెంకటేశ్వర్లు తన పొలానికి బైక్పై రమేష్రెడ్డి ఇంటి మీదుగా వెళ్తుండగా రమేష్రెడ్డి మడ్డుకత్తితో దాడికి యత్నించాడు. వెంకటేశ్వర్లు తృటిలో తప్పించుకోగా గొంతు వద్ద స్వల్ప గాయమైంది. రమేష్రెడ్డి, అతనితోపాటు ఉన్న కొటాలుపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దాడి గురించి కుమారుడు బాబుకు తెలియజేయడంతో బైక్పై భార్గవ్ అనే యువకుడితో కలిసి ఊళ్లోకి వస్తున్నాడు. రోడ్డు వైపు వెళ్తున్న రమేష్రెడ్డి బృందానికి బాబు ఎదురపడగా అక్కడే నిలువరించారు. కొటాలుపల్లెకు చెందిన వ్యక్తులు బాబును బంధించగా రమేష్రెడ్డి కత్తితో గొంతు, చాతీ మధ్య పొడిచాడు. దీంతో బాబు రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితులు ముగ్గురు అక్కడి నుంచి పరారయ్యారు. బాబుతో బైక్పై వచ్చిన యువకుడు భయాందోళనకు గురై కేకలు వేసి సమీపంలోని వారిని పిలిచాడు. బాబును కారులో పామూరు సీహెచ్సీకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతునికి భార్య అనసూయ, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతుడు వ్యవసాయం చేస్తుంగా, నిందితుడు ఆటో తోలుతూ జీవనం సాగిస్తున్నాడు. సంఘటన స్థలాన్ని పామూరు సీఐ దుర్గాసి వినోద్కుమార్, ఇన్చార్జి ఎస్సై కట్టా అనూక్ పరిశీలించారు. పామూరు సీహెచ్సీలో మృతుడి తండ్రి, క్షతగాత్రుడు మిరియం వెంకటేశ్వర్లుకు ప్రథమ చికిత్స అందించారు. వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. జెడ్పీటీసీ, వైస్ ఎంపీపీ పరామర్శ మిరియం బాబు మృతి చెందిన విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు, స్థానిక జెడ్పీటీసీ మేకల శ్రీనివాసయాదవ్, వైస్ ఎంపీపీ దుగ్గిరెడ్డి ప్రతాప్రెడ్డి, పలువురు వైద్యశాలకు చేరుకున్నారు. బాబు మృతదేహాన్ని పరిశీలించి, మృతుని తండ్రి వెంకటేశ్వర్లును పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సీఎస్పురం మండలం గోగులపల్లి గ్రామంలో ఘటన హత్యానంతరం గ్రామంలో భయానక వాతావరణం -
శనివారం శ్రీ 16 శ్రీ మే శ్రీ 2026
çßæÐ]l$ÃĶæ*Å..º-†-MìS´ùĶæ*… ♥ ఉలవపాడు మండలంలో జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. 36 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు సురక్షితంగా బయటపడ్డారు. రక్షిత మంచినీటి పథకాలు దెబ్బతింటున్నాయి జరుగుమల్లి మండలంలో పాలేరులో ఇసుక ఇష్టారాజ్యంగా తవ్వుతున్నారు. పాలేరు పరిసరాల్లో భూగర్భ జలాలు అడుగంటి రక్షిత మంచినీటి పథకాలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. జేసీబీ, టిప్పర్ల ద్వారా ఇసుక రవాణా జరగటంతో పాలేరులో భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఈ గుంతల కారణంగా వరదల సమయంలో పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. – యర్రా రామకృష్ణ, వైఎస్సార్ సీపీ ఐటీ విభాగం కొండపి నియోజకవర్గ అధ్యక్షుడు ఇసుక తవ్వకాలతో వరద భయం మండలంలోని పాలేరులో యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా జరుగుతున్నాయి. వీరు ఇష్టారాజ్యంగా జేసీబీతో తవ్వి భారీ గుంతలు ఏర్పాటు చేయటంతో భూగర్భ జలాలు అడుగంటి రక్షిత మంచినీటి పథకాలకు నీరు సరఫరా కాని దుస్థితి ఉంది. ఇసుక తవ్వకాల వలన నది దిశ మార్చుకుని వరదల సమయంలో ఊరుపై వరదలు వచ్చే అవకాశం ఉంది. – పిన్నిక శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు, జరుగుమల్లి మట్టి మేతగాళ్లు నిబంధనలకు నిలువునా పాతరేస్తున్నారు. నిరాటంకంగా కొండల్ని పిండి చేసేస్తున్నారు. చెరువులను చెరపట్టిస్తున్నారు. కాల్వలను కనిపించకుండా మాయం చేస్తున్నారు. ఇష్టారీతిగా తవ్వుకో, దోచుకో, తినుకో అని దోపిడీ సూత్రాన్ని పాటిస్తున్నారు. ‘‘ఎక్కడైనా తవ్వుకోండి. ఇష్టమొచ్చిన ధరకు అమ్ముకోండి. ఎవరూ అడ్డుకోరు. ఎవరైనా ఆపితే చూద్దాం’’ అంటూ అధికార పార్టీ నేతలు అభయం ఇస్తుండడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. రూ.కోట్లు విలువజేసే సంపదను కొల్లకొడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కొండపి నియోజకవర్గంలో భారీ యంత్రాలతో రేయింబవళ్లు తవ్వకాలు జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారన్న ఆరోపణలున్నాయి.తవ్వుకో దోచుకో తినుకో! -
భారం రూ. కోటి..!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: డబుల్ ఇంజన్ సర్కార్ ప్రజలపై పెనుభారాన్ని మోపుతోంది. రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకొని శుక్రవారం ఉదయం నుంచే పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుతున్నామని ప్రకటించింది. దాంతో వాహనదారుల గుండెల్లో బాంబు పేలినంత పనయింది. పశ్చిమాశియాలో యుద్ధం కారణంగా క్రూడాయిల్ దిగుమతి మందగించడంతో ధరలు పెంచుతున్నట్టు ప్రకటించింది. పెట్రోల్పై రూ.3.29, డీజిల్పై రూ.3.14 పెంచడంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వాహనదారులపై ప్రతి రోజూ రూ.కోటికి పైగా భారం పడుతోంది. జిల్లాలో మొత్తం వాహనాలు 5.72 లక్షలు ఉన్నాయి. వాటిలో అత్యధికంగా ద్విచక్ర వాహనాలు 4.10 లక్షలు ఉన్నాయి. పెట్రోలు వాడే ద్విచక్ర వాహనాలతో పాటు కార్లు, ఇతర వాహనాలు కలుపుకొని 6,500 వరకూ ఉన్నాయి. ఇకపోతే ఆటోలు జిల్లాలో 30,500, లారీలు 25,000, ట్రాక్టర్లు 13,000, కార్లు 25,000, ట్రావెల్స్ బస్సులు, స్కూలు, కాలేజీ బస్సులు, మినీ బస్సులతో పాటు ఇతర వాహనాలు మొత్తం కలిపి 1,55,500 ఉన్నాయి. ప్రతి రోజూ డీజిల్ భారం రూ.75 లక్షలు పడుతుండగా, పెట్రోలు భారం రూ.31 లక్షలు వరకూ ఉంది. అంటే మొత్తంగా పెట్రోలు, డీజిల్ భారం జిల్లా ప్రజలపై రోజుకు రూ.1.06 కోట్లు పడుతున్నట్లు అంచనాలు వెల్లడిస్తున్నాయి. మహిళలకు ఫ్రీ బస్సుల దెబ్బ నుంచి కోలుకోకముందే.... మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించటంతో ఆటోలు నడిపే చాలా మంది ఈ వృత్తి నుంచి మానుకున్నారు. మాలాంటి వాళ్లం వేరే వృత్తి చేతకాక ఆటో నడుపుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాం. ఇక ప్రస్తుతం పెరిగిన డీజిల్ ధరతో ఆటో ద్వారా జీవించాలంటే కష్టంగా మారనుంది. ప్రతి రోజూ నాగులుప్పలపాడు నుంచి ఒంగోలుతో పాటు ఇతర ప్రాంతాలకు ప్యాసింజర్లను రవాణా చేస్తుంటాను. చార్జీ పెంచితే ప్రయాణికులు ఊరుకోరు. పెంచకపోతే గిట్టుబాటు కాదు. ఏం చేయాలో అర్థంకాక సతమతమవుతున్నాం. – కన్నెదారి అజయ్, ఆటో డ్రైవర్, నాగులుప్పలపాడు డీజిల్ పెరగటంతో జీవనం గగనంగా మారింది ఉన్నట్లుండి డీజిల్ పెరగటంతో జీవనం గగనంగా మారింది. ఇప్పటికే ఉన్న ధరలతో ఒంగోలులో ఆటో నడపాలంటేనే చాలా కష్టంగా మారింది. సర్వీసు రూ.20 అంటేనే చాలా ఎక్కువగా ప్రయాణికులు భావిస్తున్నారు. ప్రతి రోజూ రూ.500లకు డీజిల్ కొట్టిస్తే ఆయిల్ ఖర్చులు పోను కనీసం రూ.300 మిగలటం కూడా కష్టంగా మారింది. ప్రస్తుతం పెరిగిన డీజిల్ ధరతో వృత్తిని కొనసాగించటం చాలా కష్టం. ఇక ఆటో రిపేరు వచ్చిందంటే ఆరోజు ఒట్టి చేతులతో ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఇప్పటికే ఒంగోలు నగరంలో దాదాపు 2 వేల ఆటోలు వరకూ ఆపేశారు. – చల్లాపల్లి సురేష్ బాబు, ఆటో డ్రైవర్, ఒంగోలు -
పొగాకు రైతులను ఆదుకోవాలి
వేలం అధికారితో మాట్లాడుతున్న బూచేపల్లి శివప్రసాదరెడ్డి, అన్నా రాంబాబు, నాయకులు వేలం తీరును పరిశీలిస్తున్న బూచేపల్లి శివప్రసాదరెడ్డి, అన్నా రాంబాబు, వైఎస్సార్ సీపీ నాయకులుపొదిలి: అష్టకష్టాలకోర్చి పండించిన పొగాకు పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతుంటే సీఎం చంద్రబాబు ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి విమర్శించారు. పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ అన్నా రాంబాబుతో కలిసి గురువారం పొదిలి పొగాకు వేలం కేంద్రాన్ని బూచేపల్లి సందర్శించారు. రైతులు, వేలం కేంద్రం అధికారులతో మాట్లాడారు. మార్కెట్ పరిస్థితి, పొగాకు నాణ్యత గురించి వివరాలడిగి తెలుసుకున్నారు. అనంతరం శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ తక్షణమే మార్క్ఫెడ్కు రూ.500 కోట్లు కేటాయించి పోటీ మార్కెట్ చేయించి పొగాకు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వేలంలో సుమారు 60 శాతం మేర నోబిడ్ బేళ్లను రైతులు తిరిగి తీసుకెళ్లే పరిస్థితి దాపురించిందన్నారు. వేలం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోందన్నారు. గత సంవత్సరం పొగాకు రైతులకు మద్దతుగా వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పొదిలి వేలం కేంద్రాన్ని సందర్శించిన విషయాన్ని బూచేపల్లి గుర్తు చేశారు. ఆ సమయంలో రైతుల నుంచి జగన్కు లభించిన ఆదరణ చూసి తట్టుకోలేని చంద్రబాబు ప్రభుత్వం.. రైతులపై, వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించిందని తెలిపారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించడంపై ఉన్న శ్రద్ధ పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఎందుకు లేదని ప్రశ్నించారు. ధరలు లేవని రైతులు చేస్తున్న ఆందోళనలను కూడా చంద్రబాబు ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదన్నారు. పొగాకు బేళ్లు తగలబెడుతున్నా, వేలం ఆపి రోడ్డు మీదకు వస్తున్నా.. రైతుల వైపే ప్రభుత్వం చూడటం లేదన్నారు. పొగాకు కొనుగోలు చేసే వ్యాపారులకు రైతుల బాగోగులతో సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తారని, కానీ ప్రభుత్వం కూడా అలాగే వ్యవహరించడం సరికాదని, తప్పనిసరిగా రైతులను ఆదుకోవాల్సిందేనని అన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో క్వింటా రూ.36 వేలకు కొనుగోలు... గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆనాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో క్వింటా పొగాకును రూ.36 వేలకు కొనుగోలు చేశారని, కానీ, ఇప్పుడు రూ.22 వేలకు కూడా ఎందుకు కొనుగోలు చేయటం లేదో సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని బూచేపల్లి శివప్రసాదరెడ్డి నిలదీశారు. బ్యారన్కు రూ.5 లక్షల మేరకు రైతులకు నష్టం వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం కూలీలకు కూడా రైతులు డబ్బులిచ్చే పరిస్థితి లేదన్నారు. పరిస్థితిని అర్థం చేసుకుని మార్క్ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేయించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఏ పంటకూ రైతులకు గిట్టుబాబు ధర లేదని మండిపడ్డారు. రైతులకు అండగా ఉంటాం : అన్నా రాంబాబు వైఎస్సార్ సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ అన్నా రాంబాబు మాట్లాడుతూ నీటిని రవాణా చేసి మరీ పొగాకుకు నీటి తడులు అందించి రైతులు ఎంతో కష్టపడి పొగాకు పండించారన్నారు. కానీ, పొగాకును గిట్టుబాటు ధరకు వేగంగా కొనుగోలు చేసేందుకు ముందుకు రావటం లేదని పలువురు రైతులు తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. వ్యాపారులు సిండికేట్గా మారి రైతులకు ధర పెంచే పరిస్థితి లేదన్నారు. ఈ సమయంలో ప్రభుత్వమే మార్క్ఫెడ్ను రంగంలోకి దించి రైతుల పొగాకును అధిక ధరకు కొనుగోలు చేయించాలన్నారు. రైతులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కొనకనమిట్ల ఎంపీపీ ఎం.మురళి, జెడ్పీటీసీ సభ్యుడు అక్కిదాసరి ఏడుకొండలు, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు గుజ్జుల సంజీవరెడ్డి, నాయకుడు మోరా శంకరరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, మురారి వెంకటేశ్వర్లు, వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు యక్కలి శేషగిరిరావు, రామసుబ్బారెడ్డి, మాజీ సర్పంచ్లు ఆవుల వెంకట సుబ్బారెడ్డి, కొండ్రగుంట శ్రీనివాసరావు, దొరిశల సుబ్బారెడ్డి, మండల మాజీ ఉపాధ్యక్షుడు ఉన్నం శ్రీనివాసులు, ఫిరోజ్, పార్టీ నాయకులు ఆనికాళ్ల ఈశ్వరరెడ్డి, కొత్తపులి బ్రహ్మారెడ్డి, రైతు విభాగం నాయకుడు బీరం కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పని చేయకుండా.. పంచేసుకుంటూ..!
కందుకూరు: గ్రామీణ ప్రాంత పేదలకు ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన ఉపాధి హామీ పథకం(వీబీ–జీరామ్ జీ)లో అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. కూలీలకు మంజూరు చేసే సొమ్ముతోపాటు మెటీరియల్ కాంపోనెంట్ కింద చేపట్టే పనుల్లో అందినకాడికి దండుకుంటున్నా అధికారులు చోద్యం చూస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ సొమ్మును అధికార పార్టీ చోటా నాయకులు, ఉపాధి హామీ అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది వాటాలేసుకుని ఆరగిస్తున్న తీరు చర్చనీయాంశమైంది. సాంకేతికతా.. చట్టుబండలా? ఉపాధీ హామీ పథకంలో అవినీతిని అరికట్టేందుకు నూతన సాంకేతికతను ప్రవేశపెట్టినా అక్రమాలను అడ్డుకోలేకపోతోంది. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్లుగా టీడీపీ కార్యకర్తలను నియమించుకుని అక్రమాలకు తెరతీశారు. కందుకూరు ప్రాంతంలో అడ్డగోలుగా చేపట్టిన పనులే అందుకు నిదర్శనం. గ్రామీణ ప్రాంతాల్లో కుంటలు, రోడ్లు, కాల్వలు అభివృద్ధి చేయకుండానే చేసినట్లు చూయించడంతో నివ్వెరపోవడం ప్రజల వంతయింది. కందుకూరు మండల పరిధిలో 167–బి జాతీయ రహదారి మార్జిన్లో జేసీబీలతో పనులు చేసిన కాల్వల్లో మళ్లీ కూలీలతో పని చేయించినట్లు చూపారు. మహదేవపురం పంచాయతీ పరిధిలోని ఓవీ రోడ్డులో సీటీఆర్ఐ సమీపంలో ఇటీవల రోడ్డు విస్తరణలో భాగంగా జేసీబీతో పనులు చేశారు. అదే ప్రాంతంలో ఇటీవల కూలీలతో తూతూ మంత్రంగా పనులు చేయించారు. అలాగే ఓగూరు గ్రామం నుంచి కోల్డ్స్టోరేజ్ వరకు జాతీయ రహదారి పక్కన చేసిన పనులదీ ఇదే పరిస్థితి. ఇలా అనేక గ్రామాల్లో పనులు చేసినట్లు నమోదు చేసి బిల్లులు డ్రా చేస్తున్నారు. దీంతో పథకం కింద అభివృద్ధి పనులకు కేటాయించిన నిధులు ఖర్చవుతున్నాయి కానీ ఫలితం మాత్రం శూన్యం. గ్రామాల్లో లేనివారి పేర్లతో మస్తర్ ఉపాధీ హామీ పథకంలో దొంగ మస్తర్లను అరికట్టేందుకు కొత్త సాంకేతికతను ప్రవేశపెట్టారు. పని ప్రదేశం నుంచి కూలీల ఫొటోలు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని నిర్ణయించారు. అయితే దొంగ మస్తర్లు వేసే వారికి ఇవేవీ అడ్డురావడం లేదు. గ్రామంలో ఏనాడూ లేని వారి పేర్లతో మస్తర్లు వేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు లాంటి ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లను, ప్రస్తుతం కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థుల పేర్లను జాబ్కార్డుల్లో నమోదు చేసి వారి ఫొటోలు కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. నూతన సాంకేతికత అద్భుతంగా పని చేస్తుంటే ఇలా హాజరు వేయడం ఎలా సాధ్యపడుతోందనేది మిలియన్ డాటర్ల ప్రశ్నగా మిగిలింది. లింగసముద్రం మండలం వెంగళాపురం పంచాయతీ పరిధిలో కళ్యాణ్రామ్ అనే విద్యార్థి గుడ్లవల్లేరులోని కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. ప్రస్తుతం అతను కాలేజీలోనే ఉన్నాడు. కానీ బుధవారం వేసిన మస్తర్లో మాత్రం అతని పేరు, ఫొటో నమోదు చేశారు. అలాగే నందిని అనే ఇంటర్ విద్యార్థిని అసలు పనికే వెళ్లదు. కానీ ఆమె పేరు మస్తర్లో ఉంది. కందుకూరు మండలంలోని పాలూరు దొండపాడు గ్రామంలో పలువురు కూలీలు ఏ రోజూ పనికి వెళ్లిన పాపాన పోలేదని, గ్రామంలో చిల్లరకొట్టు నిర్వహిహించుకుంటున్న వారి పేర్లను రోజూ మస్తర్లో నమోదు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. ప్రస్తుతం పనులు నిర్వహిస్తున్న ప్రతి గ్రామంలో ఇదే తరహా వ్యవహారం నడుస్తోంది. అయినా సరే ఎన్ఆర్ఈజీఎస్ అధికారులకు ఇవేవీ కనిపించవు. పనులన్నీ సక్రమంగా నిర్వహిస్తున్నట్లు రికార్డులు తయారు చేస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో అడ్డగోలుగా సాగుతున్న పనులు పనులకు హాజరు కాని, నగరాల్లో ఉంటున్న వారి పేర్లపై దొంగ మస్తర్లు పనులకు హాజరైన వారికి కూలి ఇవ్వాలంటే లంచం ముట్టజెప్పాల్సిందే అవినీతి బయటపడకుండా చోటా లీడర్లు, అధికారులు కుమ్మక్కు ఉపాధి హామీ పథకంలో వెలుగు చూస్తున్న అవినీతి విచిత్రాలు -
ఒంగోలు కమిషనర్గా వెంకట కృష్ణయ్య
ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్గా టి.వెంకట కృష్ణయ్య గురువారం బాధ్యతలు చేపట్టారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలోని ఆయన చాంబర్లో ఫైలుపై సంతకాలు పెట్టి విధుల్లో చేరారు. అనంతరం కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్ పి.రాజాబాబును మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందించారు. ఒంగోలు నగర పరిస్థితులపై కలెక్టర్తో కొంతసేపు చర్చించారు. అనంతరం నగరపాలక సంస్థలోని టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్, శానిటేషన్, రెవెన్యూ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి నగరంలోని పరిస్థితులపై సమీక్షించారు. ఒంగోలు సిటీ: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 48 ఎయిడెడ్ పాఠశాలలకు ఒకే టీచర్ ఉన్నారని, మరో టీచర్ను కేటాయించాలని ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.వెంకటరావు, సీహెచ్ ప్రభాకరరెడ్డి గురువారం ఒక ప్రకటనలో కోరారు. ఒకే టీచర్తో అన్ని తరగతులకు బోధన జరుగుతుండటంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఒకే టీచర్ ఉన్న ఎయిడెడ్ పాఠశాలలు మండలాల వారీగా ఒంగోలు 9, నాగులుప్పలపాడు 5, మద్దిపాడు 2, చీమకుర్తి 1, బేస్తవారిపేట 1, కనిగిరి 2, హనుమంతునిపాడు 2, వెలిగండ్ల 3, కంభం 3, మార్కాపురం 2, గిద్దలూరు 4, కొమరోలు 2, అద్దంకి 1, పర్చూరు 2, యద్దనపూడి 1, ఉలవపాడు 1 చొప్పున ఉన్నాయన్నారు. ఆయా పాఠశాలల్లో ఒకే టీచర్ పనిచేస్తున్నందున విద్యార్థులకు సరైన బోధన జరగక, ఉపాధ్యాయులకు సెలవు మంజూరు కాక అటు యాజమాన్యం, ఇటు మండల విద్యాశాఖ అధికారులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. జిల్లాలో మిగులుగా ఉన్న 202 మంది ఎయిడెడ్ ఉపాధ్యాయులకు కౌన్సిలింగ్ నిర్వహించి విద్యాబోధనకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజాబాబును కోరారు. -
కూటమి పాలనలో కుదేలవుతున్న రైతులు
● రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు సిటీ: సీఎం చంద్రబాబు పాలనలో గిట్టుబాటు ధర లభించక రైతులు కుదేలవుతున్నారని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఒంగోలు వచ్చిన ఆయన.. మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ వైఫల్యంతో మొక్కజొన్న, పొగాకు, మిర్చి, ఆక్వా రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. వ్యాపారులతో కుమ్మకై ్క ఫీడు ధరలు పెంచడం దారుణమన్నారు. దీనిపై ఆక్వా రైతులు నిరసనలు చేస్తూ రోడ్డెక్కారన్నారు. మొక్కజొన్న రైతులు మొక్కజొన్నలను రోడ్డుపై పారబోసి ఆందోళన చేశారన్నారు. రైతులకు ఎలాంటి బీమా సౌకర్యం లేదని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ హయాంలో రైతులకు అన్నిరకాల సేవలు అందుబాటులో ఉంచామన్నారు. గిట్టుబాటు ధర లభించే విధంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. అమరావతి రైతులకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు. ముందు తీసుకున్న భూములకే న్యాయం చేయలేదని, ఇప్పుడు మళ్లీ భూములు తీసుకుని వారికి తీరని అన్యాయం చేస్తోందని ధ్వజమెత్తారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. అమరావతి రైతులకు ప్లాట్లు ఇచ్చి సౌకర్యాలు కల్పించి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైవీ సుబ్బారెడ్డి వెంట మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదిమూలపు సురేష్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కె.వి.రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్లు మాదాసి వెంకయ్య, వై.ఎం.ప్రసాద్రెడ్డి, పార్టీ ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, వైఎస్సార్ సీపీ నాయకులు దుంపా చెంచిరెడ్డి, వెన్నపూస వెంకటేశ్వరరెడ్డి, పాలడుగు శ్రీనివాసరావు, నటారు జనార్దనరెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పల్నాటి రవీంద్రారెడ్డి, రాయపాటి అంకయ్య, నారపరెడ్డి, మధు, దేవరపల్లి అంజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ఆంక్షల చట్రం
యంత్రం.. కూటమి వారికే వ్యవసాయ పరికరాలు ఏ ప్రభుత్వమైనా రైతులకు సంబంధించిన పథకాలు అమలుచేసే సమయంలో పార్టీలు చూడకూడదు. కానీ, కూటమి ప్రభుత్వం మాత్రం తమ పార్టీ సానుభూతిపరులకే వ్యవసాయ పరికరాలు అందించేలా పథకం అమలు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. రైతులందరికీ కాకుండా కొందరికే వ్యవసాయ యంత్ర పరికరాలు అందించేలా పథకాన్ని రూపొందించడం శోచనీయం. ఆన్లైన్ దరఖాస్తులు తొలుత ఇన్చార్జి మంత్రికి పంపడమేమిటి.. అనంతరం జేసీ లాగిన్కు రావడం ఏమిటి..? అర్హులైన వారందరికీ పరికరాలిచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదా.? ఇదంతా చూస్తుంటే అన్నదాతకు వెన్నుపోటు పొడిచే విధంగా ఉంది. – డాక్డర్ చింతలపూడి అశోక్కుమార్, వైఎస్సార్ సీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జి రైతులను ఆదుకోవాలి వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో ఉన్న ఇ–కేవైసీ నిబంధనలు ఎత్తివేసి జిల్లాకు కనీసం రూ.20 కోట్లు బడ్జెట్ కేటాయించాలి. రైతులకు అవసరమైన పనిముట్లను సకాలంలో అందరికీ అందించాలి. పంట నష్టపరిహారం కూడా త్వరగా చెల్లించాలి. గతేడాది తుఫాన్లకు పంటలు దెబ్బతిన్నాయి. రైతులు తీసుకున్న రుణాలు మాఫీ చేయాలి. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే వ్యవసాయ రుణాలు ఇవ్వాలి. – ఉడుముల కోటిరెడ్డి, వైఎస్సార్ సీపీ ఎస్ఈసీ మెంబర్ మార్కాపురం/అద్దంకి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా రైతులకు ఒక్క వ్యవసాయ పనిముట్టు కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది పథకం అమలు చేస్తామని చెప్పడంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో లక్షల మంది రైతులు వ్యవసాయ యంత్ర పరికరాల కోసం ఎదురుచూస్తున్నారు. కానీ, ప్రభుత్వం కేటాయించిన అతి తక్కువ బడ్జెట్తో పాటు విధించిన ఆంక్షలు చూసి ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బడ్జెట్లో రూ.7.35 కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించింది. కానీ, ఉమ్మడి జిల్లాలో 2,69,635 మంది రైతులుండగా, దాదాపుగా 1,42,349 హెక్టార్లలో ఖరీఫ్ సీజన్లో పంటల సాగు ఉంటుందని అంచనా వేశారు. మార్కాపురం జిల్లాలో 1,53,660 మంది రైతులుండగా ఈ ఏడాది 86,349 హెక్టార్లలో ఖరీఫ్ సాగు చేయవచ్చని అంచనా వేశారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో 1,15,975 మంది రైతులు ఉండగా, 56 వేల హెక్టార్లలో ఖరీఫ్ సాగు ఉండొచ్చని అంచనా వేశారు. ప్రధానంగా పత్తి, మిర్చి, వరి, సజ్జ, జొన్న, తదితర పంటలు సాగుచేయనున్నారు. రైతులకు శాపంగా మారిన నిబంధనలు... ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి దాదాపు 7.35 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇందులో మార్కాపురం జిల్లాకు రూ.3.15 కోట్లు, ప్రకాశం జిల్లాకు రూ.4.20 కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపులు చూస్తేనే ఏమాత్రం సరిపోవని అర్థమవుతోంది. ప్రధానంగా ఇ–క్రాప్లో నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం విధించిన నిబంధన సాధారణ రైతులకు శాపంగా మారింది. ఇందులో 5 ఎకరాల్లోపు ఉన్న చిన్న, సన్నకారు, ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు 50 శాతం, 5 ఎకరాలు పైబడిన రైతులకు 40 శాతం సబ్సిడీ ఇస్తారు. మరొక నిబంధన ప్రకారం 3 సీజన్లలో ఇ క్రాప్ తప్పనిసరిగా నమోదు చేసుకుని ఉండాలి. ప్రధానంగా మినీ ట్రాక్టర్లు, ట్రక్కులు, పోస్టు హార్వేస్టు, తైవాన్ స్ప్రేయర్లు, హార్వెస్టింగ్ పనిముట్లు, విత్తనపు గొర్రులు ఇలా 9 రకాల పనిముట్లు అందజేస్తారు. రైతుల ఎంపిక తీరుపై తీవ్ర విమర్శలు... ఈ నెల 19 తుది గడువుగా పేర్కొన్నప్పటికీ సర్వర్ ఓపెన్ కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వివరాలన్నీ జిల్లా ఇన్చార్జి మంత్రి లాగిన్కు వెళ్లి అక్కడ పరిశీలన అనంతరం జేసీ లాగిన్కు వస్తాయి. లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. అయితే, ఇక్కడే తిరకాసు ఉంది. ఇ–క్రాప్లో నమోదైన రైతులందరికీ గ్యారంటీగా పరికరాలు వస్తాయని లేదు. మంత్రి లాగిన్, అక్కడి నుంచి జేసీ లాగిన్కు వస్తాయి. లాటరీ ద్వారా ఎంపిక చేస్తామనే విధానం పట్ల రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనివలన అర్హులైన రైతులకు రికమెండేషన్ ఉంటేనే యాంత్రీకరణ పథకం వస్తుందని అర్థమవుతుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,69,635 రైతులుంటే.. బడ్జెట్లో 7.35 కోట్ల రూపాయలే కేటాయించారని, అవి ఏమాత్రం సరిపోవని, అందుకే రైతుల సంఖ్య తగ్గించేందుకు ఎంపిక ప్రక్రియను లోపభూయిష్టంగా నిర్వహిస్తున్నారన్న అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ మరో 15 రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే రైతులు దుక్కులు దున్ని పొలాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఎక్కువగా మినీ ట్రాక్టర్లు, ట్రక్కులు, విత్తనపు గొర్రులు, తైవాన్ స్ప్రేయర్లపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. మండల కేటాయింపులు తక్కువ స్థాయిలో ఉండటం, రైతులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో సిఫార్సు ఉన్నవారికే వ్యవసాయ పనిముట్లు వస్తాయనే భావనతో పలువురు ఆసక్తి చూపడం లేదు. నిబంధనలు సడలించి బడ్జెట్ పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
పనికి రాకపోతే సగం.. వస్తే రూ.100 నుంచి రూ.150
ఉపాధి హామీ కూలీల సొమ్మును దోచుకోవడం రెండేళ్లుగా నిత్యకృత్యంగా మారింది. పని చేయకుండానే మస్తర్ వేస్తే ఓ రేటు, పనికి వచ్చినా కూలి ఇచ్చేందుకు మరో రేటును నిర్ణయించి మరీ ఫీల్డ్ అసిస్టెంట్లు వసూళ్లకు పాల్పడుతున్నారని గ్రామాల్లో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పైసలివ్వలేదంటే మరుసటి వారం నుంచి ఆ కూలీలను పనులకు రానిచ్చే పరిస్థితి లేదు. ఇదిలా ఉండగా గ్రామంలో ఉండి కూడా పనులకు వెళ్లని వారి పేర్లను మస్తర్లో నమోదు చేస్తున్న ఎఫ్ఏలు.. సదరు కూలీకి వచ్చే సొమ్ములో సగం దిగమింగేస్తున్నారు. ఇలా ప్రతి గ్రామంలో పదుల సంఖ్యలో పేర్లు నమోదు చేసి నొక్కేస్తున్నా అధికారులు కళ్లకు గంతలు కట్టుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారమంతా కష్టపడి పని చేసిన కూలీలు తమకు రావాల్సిన సొమ్ము తీసుకోవడానికి కూడా రూ.100 నుంచి రూ.150 చెల్లించాల్సి వస్తోంది. కందుకూరు మండలంలోని ఓగూరు గ్రామంలో వారానికి రూ.600 కూలి దక్కగా అందులో రూ.150 ఫీల్డ్ అసిస్టెంట్ డిమాండ్ చేయడంతో వివాదం నడుస్తోంది. ఇదెక్కడి అన్యాయం అంటూ గ్రామంలోని కూలీలు ప్రశ్నిస్తున్నారు. -
డామిట్.. కథ అడ్డం తిరిగింది
కురిచేడు: పెళ్లికి హాజరైన యువకుడు చేతివాటం ప్రదర్శించి నగదు, బంగారతో ఉడాయించాడు. అయితే అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో డామిట్ కథ అడ్డం తిరిగింది. వివరాల్లోకి వెళితే.. యోహోషువా అనే యువకుడు యువకుడు త్రిపురాంతకంలోని బంధువుల ఇంట్లో శుభాకార్యానికి హాజరయ్యారు. అక్కడ రూ.4 లక్షల నగదు, బంగారంతో ద్విచక్రవాహనంపై పరారయ్యాడు. ఈ క్రమంలో పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం చింతలచెరువు రైల్వే బ్రిడ్జి సమీపంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడి గాయపడ్డాడు. దారిన పోయే వారు గమనించి 108కి సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది మహబూబ్ బాషా, నరేష్బాబులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రథమ చికిత్స చేశారు. అక్కడే అసలు కథ మొదలైంది. క్షతగాత్రుడి తన పేరు యోహోషువా అని, తనది కురిచేడు మండలంలోని కాటంవారిపల్లె గ్రామమని, తాము చాలా కాలం క్రితం విజయవాడ వెళ్లి అక్కడ స్థిరపడ్డామని 108కి సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. తాను తన బంధువుల ఇంట్లో శుభకార్యానికి త్రిపురాంతకం వెళ్లి వస్తున్నట్లు తెలిపాడు. కానీ కాటంవారిపల్లె గ్రామ చరిత్రలో ఆ పేరు ఉన్న కుటుంబం లేదని గ్రామస్తులు తెలిపారు. ఈ క్రమంలో క్షతగాత్రుడు కావాలనే అబద్ధం చెబుతున్నట్లు గ్రహించిన 108 సిబ్బంది అతని వద్ద ఉన్న ఫోన్లో నంబర్ తీసుకొని అతని భార్యకు సమాచారం ఇచ్చారు. తన భర్త రూ.4 లక్షల నగదు, బంగారం తీసుకొని ఉడాయించాడని, బంధువుల ఇంట్లో శుభకార్యం జరుగుతుందని, అక్కడ నుంచి వాటిని తెచ్చాడని తెలిపింది. అతను త్రిపురాంతకం నుంచి ఉడాయించగానే వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతని ఫోన్నంబరు సిగ్నల్ ఆధారంగా సంఘటనా స్థలానికి చేరారు. 108 సిబ్బంది ద్విచక్ర వాహనం, నగదు, ఆభరణాలు పోలీసులకు అప్పగించి క్షత గాత్రుడిని మెరుగైన వైద్యం నిమిత్తం వినుకొండలోని వైద్యశాలకు తరలించారు. రోడ్డు ప్రమాదంతో చోరీ విషయం వెలుగులోకి -
పరారీలోనే హత్య కేసు నిందితుడు
ఒంగోలు టౌన్: ఒంగోలులో హత్యకు గురైన దివ్యాంగురాలు, ఇరిగేషన్ శాఖ ఉద్యోగి మోరేపల్లి ఆదిలక్ష్మి అంత్యక్రియలు పూర్తయ్యాయి. భర్త వరప్రసాద్ స్వగ్రామమైన త్రిపురాంతకం మండలం మిల్లంపల్లి గ్రామంలో గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. హత్య కేసులో నిందితుడిగా భావిస్తున్న వెంకటరమణ కోసం మూడు పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఘటన అనంతరం నిందితుడు వెంకటరమణ సీఎస్పురం మండలం బొంతువారిపల్లికి వెళ్లి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసుల విచారణలో తేలింది. బాధితురాలి భర్త వరప్రసాద్ నుంచి నిందితుడికి సంబంధించిన వివరాలు సేకరించి వివిధ ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. బుధవారం రాత్రి ఒంగోలులోని శ్రీరామ లాడ్జిలో ఆదిలక్ష్మి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఆదిలక్ష్మి హత్య ఘటనపై దివ్యాంగుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిందితుడిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఒంగోలులో దివ్యాంగుల సంఘం ఆధ్వర్యంలో రిమ్స్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. శ్రీఆదిలక్ష్మి కుటుంబానికి న్యాయం చేయాలిశ్రీ, శ్రీహంతకుడిని వెంటనే పట్టుకోవాలిశ్రీ అంటూ నినాదాలు చేస్తూ జిల్లా రెవెన్యూ అధికారి కార్యాలయం వరకు ప్రదర్శన చేపట్టారు. డీఆర్ఓకు వినతిపత్రం సమర్పించిన అనంతరం అంధుల సంఘ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. దివ్యాంగ మహిళను దారుణంగా హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలవాలని కోరారు. ఆదిలక్ష్మి భర్తకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, కుమారునికి పూర్తి స్థాయిలో ఆర్థిక, విద్యా సహాయం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆర్పీడీ చట్టం–2016ను పటిష్టంగా అమలు చేసి దివ్యాంగుల భద్రతకు చర్యలు తీసుకోవాలని కోరారు. నిందితుడిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని దివ్యాంగుల సంఘాలు పేర్కొన్నాయి. -
నిబంధనలు ఉల్లంఘిస్తే బస్సులు సీజ్ చేస్తాం
ఒంగోలు సబర్బన్: స్కూల్, కాలేజీ బస్సులు నిబంధనలు పాటించకుంటే సీజ్ చేస్తామని డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ ఆర్ సుశీల హెచ్చరించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రవాణా శాఖాధికారులు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం డీటీసీ మాట్లాడుతూ జిల్లాలో 744 స్కూల్, కాలేజీ యాజమాన్యాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. బస్సులన్నీ నిబంధనల ప్రకారం ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలన్నారు. జిల్లాలో 250 బస్సులను తనిఖీ చేయగా 137 బస్సులు నిబంధనలతో ఉన్నాయని, నిబంధనలు లేని 113 బస్సులను వెనక్కి తిప్పి పంపామన్నారు. నిబంధనల ప్రకారం స్కూల్ బస్సులన్నీ అత్యవసర ద్వారం, అత్యవసర కిటికీలు, అన్ని కిటికీలకు రైలింగ్స్, స్పీడ్ లిమిట్ జీపీఎస్ సిస్టం, ఇతర భద్రతా పరికరాలు అమర్చుకోవాలని సూచించారు. జిల్లాలో 23 బ్లాక్ స్పాట్స్ గుర్తింపు జిల్లా వ్యాప్తంగా రహదారులపై ప్రమాదాలకు ఆస్కారం ఉన్న 23 బ్లాక్ స్పాట్స్ గుర్తించినట్లు పేర్కొన్నారు. అందులో ఫిబ్రవరిలో 13 ప్రాంతాలను పరిశీలించామని, తాజాగా మరో ఐదు బ్లాక్ స్పాట్స్ను పరిశీలించినట్లు పేర్కొన్నారు. అలవలపాడు క్రాస్ రోడ్, వెంకటాపురం క్రాస్ రోడ్, తిమ్మన్నపాలెం విలేజ్ జంక్షన్, యాదవ హోటల్, పైలాన్ సెంటర్ దగ్గర, మేదరమెట్ల, ద్వారకా నగర్ జంక్షన్, అద్దంకిలోని ప్రాంతాలను పరిశీలించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో దర్శి డీఎస్పీ బాల మురళీకృష్ణ, దర్శి సీఐ ఎండ్లూరి రామారావు, నేషనల్ హైవేస్ –16 ప్రాజెక్టు డైరెక్టర్ అనిల్ కుమార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. స్కూలు బస్సులకు ఎఫ్సీ తప్పనిసరి జిల్లా వ్యాప్తంగా 23 బ్లాక్ స్పాట్స్ గుర్తింపు డిప్యూటీ ట్రాన్స్పోర్సు కమిషనర్ సుశీల -
ముగిసిన హనుమజ్జయంతి వేడుకలు
అద్దంకి: ప్రముఖ పుణ్యక్షేత్రం శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 14న ప్రారంభమైన హనుమజ్జయంతి ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. గురువారం స్వామికి అష్టోత్తర శత కలశాభిషేకం, పూర్ణాహుతి, మండప దేవతా పూజలు, హోమం, పూర్ణాహుతి, బలిహరణ, మండపోద్వాసన పూజలు చేశారు. కార్యక్రమాలను ఆలయ పాలకమండలి చైర్మన్ చుండూరి మురళీ సుధాకర్రావు, పాలకమండలి సభ్యులు, ఏసీ తిమ్మానాయుడు పర్యవేక్షించారు. యర్రగొండపాలెం/అద్దంకి: చిన్న వయసులోనే సుగర్ వ్యాధి బారినపడి చావుబతుకుల మధ్య ఉన్న పసిబిడ్డల వైద్యానికి తమ వంతు సాయమందించేందుకు దాతలు ముందుకొస్తున్నారు. యర్రగొండపాలెం మండలం వీరభద్రాపురం గ్రామానికి చెందిన అన్నాచెల్లెళ్ల ఆరోగ్య పరిస్థితిపై శ్రీఆదుకోండయ్యా.. ఈ పసి బిడ్డలను..శ్రీ శీర్షికన శ్రీసాక్షిశ్రీలో గురువారం ప్రచురితమైన కథనానికి గురువారం పలువురు దాతలు స్పందించారు. అద్దంకి మండలంలోని శింగరకొండ ప్రసన్నాజనేయస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ చిన్ని శ్రీమన్నారాయణ రూ.5 వేలు అందజేశారు. అలాగే వివిధ ప్రాంతాలకు చెందిన దాతలు మరో రూ.25 వేలు బాధిత కుటుంబం బ్యాంక్ అకౌంట్లో జమ చేసినట్లు ఆ పసిబిడ్డల బంధువులు తెలిపారు. తాళ్లూరు: మిద్దె ఎక్కుతూ ప్రమాదవశాత్తు మెట్ల పై నుంచి కాలుజారి వ్యక్తి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు వివరాల ప్రకారం..మండలంలోని నాగంబొట్లపాలెం గ్రామానికి చెందిన యర్రగొర్ల ఆంజనేయులు మూడు రోజుల క్రితం మాధవరంలో బంధువుల దేవర కొలుపులకు వెళ్లాడు. కొలుపుల్లో భాగంగా మూడో రోజు ఆదివారం బంధువులు భోజనాలు మిద్దైపె ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మెట్లు ఎక్కుతుండగా కాలుజారి కింద పడటంతో తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే అతన్ని కుటుంబ సభ్యులు ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం గురువారం మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చి అంత్యక్రియలు చేశారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ● రూ.5 లక్షల విలువైన రొయ్యలు మృత్యువాత కొత్తపట్నం: రొయ్యల చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు పురుగుమందు పోయడంతో రొయ్యలు మృత్యువాత పడ్డాయి. ఈ సంఘటన కొత్తపట్నం సమీపంలోని బకింగ్ హామ్ బ్రిడ్జి పక్కన జరిగింది. వివరాల్లోకి వెళితే..కొత్తపట్నం గ్రామానికి చెందిన పురిణి కోటయ్య నెల రోజుల క్రితం ఎకరా చెరువును కౌలుకు తీసుకొని రొయ్యలు సాగు చేశాడు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పురుగుమందు డబ్బాను చెరువులో వేశారు. గురువారం కోటయ్య చెరువు వద్దకు వెళ్లి చూడగా రొయ్య పిల్లలన్నీ పైకి తేలి ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. దీంతో స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రొయ్య పిల్లల కొనుగోలు, బ్లీచింగ్, మందులు, విద్యుత్ బిల్లులు కలుపుకొని రూ.5 లక్షల వరకు ఖర్చయిందని, మొత్తం నష్టపోయాయని కన్నీరు మున్నీరుగా విలపించాడు. -
కావేరి ట్రావెల్స్లో మంటలు.. 36 మంది ప్రయాణికులు..
సాక్షి, ప్రకాశం: ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు వ్యాపించాయి. మంటలను గుర్తించిన వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కనే నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది.ఈ ఘటనకు సంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కావేరి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తుండగా శుక్రవారం తెల్లవారుజామున జిల్లాలోని ఉలవపాడు మండలం భీమవరం అడ్డరోడ్డు బస్సు నుంచి పొగలు వచ్చాయి. బస్సు ఇంజిన్ నుంచి వస్తున్న పొగలను గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై రోడ్డు పక్కనే బస్సును నిలిపివేశాడు. వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేసి కిందకు దింపేశాడు. దీంతో, ప్రయాణికులు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. -
దిగజారిన నిమ్మ ధర
హనుమంతునిపాడు: నిమ్మకాయలకు ఈ వారంలో ధర భారీగా తగ్గింది. గత నెలలో నిమ్మకాయ నాణ్యత, సైజును బట్టి కొనుగోలుదారులు రైతు వద్ద నుంచి కిలో రూ.100 నుంచి రూ.120ల పైగా కొనుగోలు చేశారు. అయితే బుధవారం నిమ్మకాయల ధర కేజీ ఒక్కసారిగా రూ.30 నుంచి రూ.35 లకు పడిపోయింది. రైతుల వద్ద కిలో కాయ నాణ్యతను బట్టి సన్నకాయ రూ.30 నుంచి రూ.35, పెద్ద సైజు రూ.50 వరకు కొనుగోలు చేస్తున్నట్లు రైతులు చెప్తున్నారు. ఒక వైపు ఎండలు తీవ్రంగా ఉన్నాయి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దిగుబడి కూడా తగ్గింది. అయినా కనిగిరిలో వ్యాపారులు కుమ్మకై ్క ఒకే మాటమీద ఉండి రైతులను మోసం చేస్తూ ధరలు దిగ్గోస్తున్నారని నిమ్మ కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిమ్మకు ధరలేక కోత కూలీలు, ఆటో చార్జీలు కూడా రావడం లేదని చెప్తున్నారు. నిమ్మ రైతులను మద్దతు ధర కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలని, రైతులు గాయం వెంకటరెడ్డి, జిలానీ, దేవదానం, కృష్ణారెడ్డి తదితరులు కోరుతున్నారు. -
ఏకేయూలో ప్రీ పీహెచ్డీ పార్ట్ 1 ఫలితాలు విడుదల
ఒంగోలు సిటీ: ఆంధ్రకేసరి యూనివర్సిటీ పరిధిలో పరిశోధక విద్యార్థులకు (ప్రీ.పి.హెచ్.డి పార్ట్–1) 2023–24 కు సంబంధించి డిసెంబరులో నిర్వహించిన పరీక్షల ఫలితాలను వైస్ ఛాన్సలర్ డీవీఆర్ మూర్తి బుధవారం విడుదల చేశారు. ఈ పరీక్షలకు 52 మంది విద్యార్థులు హాజరుకాగా 94.23 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పరీక్షల నియంత్రణాధికారి (సీఈ) ప్రొఫెసర్ సోమశేఖర తెలిపారు. యూనివర్సిటీ పరిధిలోని ఆయా కళాశాలల స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినీ విద్యార్థులను వైస్ చాన్సలర్ డీవీఆర్ మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ నిర్మలమణి, డీన్ అకడమిక్స్ ప్రొఫెసర్ జి.రాజమోహనరావు, తదితరులు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పీజీ పరీక్షల కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్.శ్రీనివాసులు, పరీక్షల విభాగం పర్యవేక్షకులు సూడా శివరాం, తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీలు
మార్కాపురం: తర్లుపాడు మండలంలోని సీతానాగులవరంలో వీరాంజనేయ స్వామివారి జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీలు బుధవారం ఉత్సాహంగా సాగాయి. ఆరు పండ్ల విభాగంలో నంద్యాల జిల్లా గోస్పాడు మండలం సాంబవరం గ్రామానికి చెందిన బీరంబుల్స్, జూపల్లి ప్రభాకర్రెడ్డి ఎడ్ల జత 5265.4 అడుగుల దూరం లాగి ప్రథమ బహుమతిని, ఇదే ఎడ్ల జత 4852.1 అడుగుల దూరం లాగి ద్వితీయ బహుమతిని, మార్కాపురం జిల్లా కంభం మండలం దర్గా గ్రామానికి చెందిన డీవీకె బుల్స్, లాయర్ కృష్ణ ఎడ్ల జత 4506 అడుగులు లాగి తృతీయ బహుమతిని సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు. రాచర్ల మండలం ఆకవీడు గ్రామానికి చెందిన బీహెచ్కె బుల్స్, విజయలక్ష్మి నాయుడు ఎడ్ల జత 4 వేల అడుగులు లాగి నాల్గవ బహుమతిని, మార్కాపురం మండలం దరిమడుగు గ్రామానికి చెందిన ముడియాల వెంకటేశ్వరరెడ్డికి చెందిన ఎడ్ల జత 2018 అడుగులు లాగి 5వ బహుమతిని సాధించినట్లు తెలిపారు. -
తిరుచిరాపల్లి ఇన్కంటాక్స్ చీఫ్ కమిషనర్గా విజయలక్ష్మి
సింగరాయకొండ: తమిళనాడు రాష్ట్రం తిరుచిరాపల్లి ఇన్కంటాక్స్ చీఫ్ కమిషనర్గా 1992 ఐఆర్ఎస్ బ్యాచ్ అధికారి, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సతీమణి టీహెచ్ విజయలక్ష్మి నియమితులయ్యారు. ఈనెల 11వ తేదీ ఆమె పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈమె 33 సంవత్సరాలుగా ఇన్కంటాక్స్ అధికారిగా వివిధ హోదాల్లో విధులు నిర్వహించి ఆయా స్థానాలకు వన్నెతెచ్చిన ఉత్తమ అధికారిగా గుర్తింపు పొందారు. తన విధి నిర్వహణలో జాయింట్ కమిషనర్గా బెంగళూరు, రాయచూర్లో, అడిషనల్ కమిషనర్గా కర్నూలులో, కమిషనర్గా చైన్నెలో, ప్రిన్సిపల్ కమిషనర్గా హైదరాబాద్లో విధులు నిర్వహించారు. విజయలక్ష్మి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీలో ఈసీఈ విభాగంలో బీటెక్ పూర్తి చేశారు. ఐఏఎం బెంగళూరులో ఎంబీఏ కోర్సు చేసి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి ప్రజా విధానాలపై సింగపూర్ యూనివర్శిటీ, అమెరికాలోని హార్వర్డ్ యూనివర్శిటీలో ప్రత్యేక డిగ్రీ సాధించారు. -
కన్నతల్లిపై కర్కశత్వం
కందుకూరు: మంచంలో నుంచి లేవలేని స్థితిలో ఉన్న 85 ఏళ్ల కన్నతల్లిపై క్రూరంగా ప్రవర్తించాడు ఓ ప్రబుద్ధుడు. కర్రతో తీవ్రంగా కొడుతూ రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు. కందుకూరు పట్టణంలోని పోతురాజుమిట్ట ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ దారుణం బుధవారం వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వివరాలు.. పోతురాజుమిట్ట ప్రాంతానికి చెందిన తన్నీరు నర్సమ్మ అనే వృద్ధురాలికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. వీరిలో పెద్ద కుమారుడు, కుమార్తె చనిపోగా, ఓ కుమారుడు హైదరాబాద్లో ఉంటున్నాడు. ప్రస్తుతం ఆమె చిన్న కుమారుడైన ప్రసాద్ వద్ద ఉంటోంది. ఆమె పేరిట ఉన్న పొలం, ఇల్లు కూడా ప్రసాద్కే రాసిచ్చింది. ప్రసాద్కు మొదటి భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా ప్రసాద్ పెట్టే హింసను భరించలేక పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. బేల్దారి పనులు చేసే ప్రసాద్కు మద్యం తాగి తిరగడం దినచర్యగా మారింది. ఈ క్రమంలో 85 ఏళ్ల వయసున్న తల్లిని గత కొంతకాలంగా తీవ్రంగా హింసిస్తున్నాడు. ప్రతినెలా ఆమెకు వచ్చే పింఛను డబ్బు కూడా లాగేసుకుంటూ క్రూర మృగంలా ప్రవర్తించసాగాడు. తల్లిని కర్రతో కొడుతూ హింసిస్తున్న సమయంలో బంధువులు వీడియో తీసి బుధవారం సోషల్మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. నిందితుడు ప్రసాద్పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు కందుకూరు టౌన్ ఎస్సై శివనాగరాజు తెలిపారు. వృద్ధురాలిని సంరక్షణ కేంద్రానికి తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కన్న తల్లిని దారుణంగా కొట్టిన రాక్షసుడిని కఠినంగా శిక్షించాలని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. 85ఏళ్ల వృద్ధురాలిని కొట్టి హింసిస్తున్న కుమారుడు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ రాక్షసుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు -
అంధ మహిళా ఉద్యోగి దారుణ హత్య
ఒంగోలు టౌన్: మూడు బృందాలతో గాలింపు : ఎస్పీ ఇరిగేషన్ శాఖ ఉద్యోగి ఆదిలక్ష్మి మిస్సింగ్పై ఫిర్యాదు అందగానే దర్యాప్తు ప్రారంభించామని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి శ్రీరామ్ లాడ్జిలో ఉన్నట్లు గుర్తించామని ఎస్పీ హర్షవర్థన్ రాజు తెలిపారు. వెంకటరమణ అనే వ్యక్తి పదునైన ఆయుధంతో ఆమె గొంతు కోశాడని, హత్యకు గల కారణాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని చెప్పారు. నిందితుని జాడ కోసం మూడు ప్రత్యేక బృందాలను నియమించినట్లు తెలిపారు. లాడ్జిల్లో తనిఖీలను ముమ్మరం చేస్తామని చెప్పారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలి.. అంధురాలు ఆదిలక్ష్మిని దారుణంగా హత్యచేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని నగరంలోని అంధులు డిమాండ్ చేశారు. బుధవారం రాత్రి హత్య జరిగిన లాడ్జి ముందు అంధులు ధర్నా చేశారు. పోలీసులు పక్కాగా దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేయాలని, మృతురాలి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కోరారు. నమ్మకంగా లాడ్జికి తీసుకెళ్లి గొంతు కోసి చంపిన దుండగుడు ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ హర్షవర్థన్ రాజు -
ఘోర ప్రమాదం.. ఇద్దరు యువకులు దుర్మరణం
● పొదిలి సమీపంలో బైక్ను ఢీకొట్టిన కారు పొదిలి రూరల్: వేగంగా వెళ్తున్న కారు, బైక్ ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఈ సంఘటన పొదిలి మండలంలోని మాదాలవారిపాలెం–సలకనూతల గ్రామాల మధ్య బుధవారం ఉదయం చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు.. పొదిలి మండలంలోని గోగినేనివారిపాలెం, దేవరపాలెం గ్రామాలకు చెందిన ఐదుగురు యవకులు రెండు ద్విచక్ర వాహనాలపై శ్రీశైలం వెళ్తున్నారు. మార్కాపురం నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న కారు మార్గమధ్యంలో సలకనూతల సమీపంలో ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టింది. దేవరపాలేనికి చెందిన పుత్తూరి అనీల్(22) అక్కడకక్కడే మృతి చెందగా గోగినేనివారిపాలేనికి చెందిన దాసరి అంకబాబు(20)కు తీవ్రగాయాలయ్యాయి. మరో బైక్పై వెళ్తున్న యువకులు 108కు సమాచారం ఇవ్వగా.. క్షతగాత్రుడు అంకబాబును పొదిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలిస్తుండగా మార్గమధ్యంలో తలమల్ల సమీపంలో అంకబాబు మృతి చెందాడు. ప్రమాద తీవ్రతకు బైకు ముందు టైరు వేరుపడి కారు ముందు భాగంలో ఇరుక్కుపోయింది. అదే సమయంలో పొదిలి పర్యటనకు వస్తున్న కలెక్టర్ విజయసునీత సంఘటన స్థలంలో ఆగి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించేందుకు చర్యలు చేపట్టారు. సంఘటన స్థలాన్ని ఎస్సై సూరెడ్డి రాజేష్ పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమి త్తం పొదిలి వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతులు ఇరువురూ బావబామ్మర్ది కొడుకులు. మృతుల కుటుంబీకులు, బంధువుల రోదనలతో పొదిలి ఆసుపత్రి ఆవరణ మిన్నంటింది. -
రెండో రోజు ఏపీ ఈఏపీ సెట్కు 236 మంది గైర్హాజరు
ఒంగోలు సిటీ: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్ –2026 ఆన్లైన్ సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్టులు) పరీక్ష ఒంగోలులోని 6 పరీక్ష కేంద్రాల్లో, మార్కాపురంలోని 2 పరీక్ష కేంద్రాల్లో బుధవారం రెండో రోజు జరిగాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 236 మంది గైర్హాజరయ్యారు. ఇంజినీరింగ్ విభాగంలో ఒంగోలులోని పరీక్ష కేంద్రాల్లో మొత్తం 3,278 మంది విద్యార్థులకు గాను 3136 మంది హాజరుకాగా, 142 మంది గైర్హాజరయ్యారు. అలాగే మార్కాపురంలో మొత్తం 1140 మందికి గాను 1046 మంది హాజరుకాగా, 94 మంది గైర్హాజరయ్యారు. ● తలమళ్లలో ‘నేను బడికి పోతాను’ ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్ విజయసునీత పొదిలి రూరల్: పిల్లలు ఉండాల్సింది పనిలో కాదు..మంచి నడవడిక, సభ్యత నేర్పే బడిలో అని కలెక్టర్ ఎం.విజయ సునీత అన్నారు. పొదిలి మండలంలోని తలమళ్ల ప్రైమరీ స్కూల్ విద్యార్థులతో ‘నేను బడికి పోతాను’ కార్యక్రమంపై బుధవారం నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. అనంతరం ఉప్పలపాడులో పదో తరగతి ఫెయిలై శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. సమయం తక్కువగా ఉన్నందున తగిన ప్రణాళికలతో సాగి అనుకున్న ఫలితాలు సాధించాలన్నారు. అనంతరం ఏడుగురు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. ప్రజలకు ప్రభుత్వ పాఠశాలలో ఉండే వసతులపై అందరికీ అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో మార్కాపురం డిప్యూటీ డీఈఓ ఎం.శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంఈఓ–2 నాగలక్ష్మి, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యుత్ శాఖలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి● డీవైఎఫ్ఐ డిమాండ్ ఒంగోలు సిటీ: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖతో సహా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఏఈ పోస్టులను రెగ్యులర్ పద్ధతిలో వెంటనే భర్తీ చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కేవీ పిచ్చయ్య, కె.ఎఫ్ బాబు బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచి నిరుద్యోగులకు ద్రోహం చేయొద్దన్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది యువత ఇంజినీరింగ్ కోర్సులు చేసి కోచింగ్ లు తీసుకొని ఏఈ, ఏఈఈ ఉద్యోగాల కోసం అనేక సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారన్నారు. విద్యుత్ శాఖలో గత ఐదేళ్ల నుంచి ఏఈ, ఏఈఈ పోస్టులు భర్తీ చేయకుండా నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. విద్యుత్ శాఖలో 1500 కు పైగా ఏఈ, ఏఈఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ఏపీ ట్రాన్స్కో 285, ఏపీ జెన్కోలో 975, ఏపీ ఈపీడీసీఎల్ 75, ఏపీ ఎస్పీడీసీఎల్లో 1275, ఏపీ సీపీడీసీఎల్లో 542 మొత్తం ఖాళీలు ఉన్నాయి అన్నారు. ఒక్క విద్యుత్ శాఖ లోనే 3782 మంది ఉద్యోగులు రిటైర్మెంట్ అవుతున్నారని, పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలు పెంచితే మరో రెండేళ్లు వీరు కొనసాగుతారని, దీనివల్ల నిరుద్యోగులు తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్ లో వస్తున్న నోటిఫికేషన్లో విద్యుత్ శాఖలో 1500 ఏఈ, ఏఈఈ పోస్టులు రెగ్యులర్ పద్ధతిలో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రోడ్లు, భవనాల శాఖకు సంబంధించి ఇంజినీరింగ్ పోస్టులు 600 పైగా ఖాళీలు ఉంటే జాబ్ క్యాలెండర్లో మాత్రం కేవలం 132 ఇంజినీరింగ్ పోస్టులు చూపించారన్నారు. పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖకు సంబంధించి 1000 కి పైగా పోస్టులు ఖాళీలు ఉండగా 328 పోస్టులు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు సంబంధించి 550 ఖాళీలు ఉంటే జాబ్ క్యాలెండర్లో 21 మాత్రమే చూపించారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి భయపడి వయసు పెంచుకుంటూపోతే నిరుద్యోగుల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. ప్రస్తుతం విద్యుత్ శాఖలో 34,582 మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారని, వారిలో వచ్చే నాలుగు సంవత్సరాలులో 80 శాతం మంది రిటైర్డ్ అవుతున్నారన్నారు. తక్షణమే ఏఈ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి రెగ్యులర్ పరిధిలో భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నామని, లేని పక్షంలో డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. -
పారిశుధ్య నిర్వహణ లోపభూయిష్టం
ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేదంటూ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్, కలెక్టర్ పి.రాజాబాబు మున్సిపల్ అధికారులపై మండిపడ్డారు. బుధవారం ఒంగోలులోని పలు ప్రాంతాలను ఆకస్మికంగా సందర్శించిన ఆయన పారిశుధ్యం అధ్వానంగా ఉండటంతో సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుధ్య పనులతో పాటు మురుగు కాలువలు శుభ్రంగా ఉండాలని సూచించారు. అలాగే నిరుపయోగంగా ఉన్న కార్పొరేషన్ స్థలాలను పరిశీలించారు. తొలుత కలెక్టర్ నగర పరిధిలోని కొత్త మామిడిపాలెంలో ఉన్న కంపోస్టింగ్ యూనిట్ను సందర్శించి సేంద్రియ వ్యర్థాలను ఎరువుగా మార్చే పద్ధతిని పరిశీలించి నిర్వాహకుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చెత్త సంపద కేంద్రాన్ని సందర్శించారు. చెత్త సంపద కేంద్రాలు పటిష్టంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. తదుపరి కలెక్టర్ గాంధీ పార్కును సందర్శించి పార్కు నిర్వహణను పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న వాకింగ్ ట్రాక్ను త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పార్కు పక్కనే నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. పీవీఆర్ స్కూల్ పక్కన నిర్మిస్తున్న సులభ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని పరిశీలించి త్వరితగతిన నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ ఊట చెరువు ప్రాంతాన్ని సందర్శించి నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాలను పరిశీలించి ఈ స్థలాలను ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అద్దంకి బస్టాండ్ వద్ద ఉన్న మున్సిపల్ స్థలాన్ని, పాత కూరగాయల మార్కెట్ స్థలాన్ని, బాపూజీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న మున్సిపల్ స్థలాన్ని పరిశీలించారు. కలెక్టర్ వెంట ఒంగోలు మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రాంభూపాల్ రెడ్డి, మున్సిపల్ ఇంజినీర్ ఐషయ్య, ఎంహెచ్ఓ వైష్ణవి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. -
50 క్వింటాళ్ల మొక్కజొన్నలు దగ్ధం
అద్దంకి: ఆరు ఎకరాల్లో పండిన మొక్కజొన్న కండెలు కోత కోసి కుప్ప వేయగా ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ సంఘటన అద్దంకి మండలంలోని గోవాడ పంచాయతీ సాధునగర్ పొలాల్లో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన రైతు గానుగపెంట ఆదాం ఈ ఏడాది ఆరు ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాడు. మొక్కలు పడిపోవడంతో కండెలు కోయించి కుప్పగా పోశాడు. గురువారం కండెలను ఇంటికి తోలుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలోనే కండెలకు నిప్పంటుకోవడంతో దాదాపు 50 క్వింటాళ్ల మొక్కజొన్న అగ్నికి ఆహుతయ్యాయి. అసలే ధర లేదు.. పండించిన పంట అగ్గిపాలైందని కన్నీటి పర్యంతమయ్యాడు. పొలంలో మొక్కజొన్న ఎండు ఆకుపై సిగరెట్ ఆర్పకుండా పడేయడంతో మంటలు చెలరేగి ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు. -
రాష్ట్రంలో యువతపై దాడులు దారుణం
దర్శి: రాష్ట్రంలో యువతపై దాడులు చేయడం దారుణమని వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కర్నూలు పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు బాలసుబ్రహ్మణ్యం ఆలియాస్ బాలుపై అక్రమ కేసులు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో దర్శి ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ఆదేశాల మేరకు యువజన విభాగం ప్రకాశం జిల్లా అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్రెడ్డి ఆధ్వర్యంలో దర్శిలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఏతప్పూ చేయని బాలసుబ్రహ్మణ్యంను పోలీసులను ఉపయోగించి తప్పుడు కేసులు పెట్టి ఆత్మహత్యలకు పాల్పడే లా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినా బాలు ఇంటికి పోలీసులు వెళ్లి అన్యాయంగా హింసించారన్నారు. పోలీసుల వేధింపులు తాళలేక బాలు ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితికి తీసుకొచ్చారన్నారు. యువత రాజకీయాల్లో ఉండకూడదని వారిపై తప్పుడు కేసులు పెట్టడం, అన్యాయంగా జైలుకు పంపడం, వేధింపులకు గురిచేయడం కూటమి ప్రభుత్వానికి పరిపాటిగా మారిందన్నారు. నిరుద్యోగ యువతకు ఇస్తామన్న రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వమని ప్రశ్నించినందుకు ఇంతగా వేధింపులు, పైశాచికత్వానికి దిగుతారా అని మండిపడ్డారు. ప్రశ్నించే వారిని టార్గెట్ చేసి తప్పుడు కేసులు బనాయించి వారికి ఎక్కడా ఉద్యోగాలు రాకుండా, ఏ పోటీ పరీక్షల్లో పాల్గొననీయకుండా, ఆర్ధిక సంస్థల నుంచి అప్పులు పుట్టకుండా ప్రశ్నించే యువతను అణిచివేసే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీకి బలం యువకులే అని, అలాంటి యువతపై పోలీసులు అరాచకానికి దిగితే మాత్రం సహించేది లేదన్నారు. న్యాయపరంగా, చట్టపరంగా వాటిని ఎదుర్కొంటామని చెప్పారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టానుసారంగా చేస్తే కచ్చితంగా బుద్ధి చెప్తామన్నారు. కార్యక్రమంలో దర్శి, ముండ్లమూరు, కురిచేడు మండల పార్టీ కన్వీనర్లు వెన్నపూస వెంకటరెడ్డి, చింతా శ్రీనివాసరెడ్డి, యన్నాబత్తిన సుబ్బయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు కేవీరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధుసూదన్రెడ్డి, విద్యార్థి విభాగం జోనల్ ఇన్చార్జ్ దుగ్గిరెడ్డి నారాయణరెడ్డి, క్రిష్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గుంటు పోలయ్య, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు ఇరుగుల శ్రీనివాసరెడ్డి, సోషల్ మీడియా అధ్యక్షుడు ఒంటేలు మల్లిఖార్జున్, జిల్లా ప్రధాన కార్యదర్శి యరమల మధుసూదన్రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి సన్నీ బాబు, తాళ్లూరు యువజన విభాగం అధ్యక్షుడు కొర్రపాటి విష్ణు, పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు కోట బుచ్చన్న చౌదరి, నాయకులు పాణెం మజ్ఞువలి, షేక్ అమీర్బాషా, అన్నవరపు రవి, దామెర్ల రామ్మోహన్రావు, తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.


