breaking news
Prakasam
-
జాతీయస్థాయి సైన్స్ఫెయిర్కు రావిపాడు ప్రాజెక్ట్
కంభం: రావిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఎ.మధుసూదనరావు తయారు చేసిన ‘స్మార్ట్ మైక్రోస్కోప్’ ప్రాజెక్ట్ జాతీయ స్థాయి సైన్స్ఫెయిర్కు ఎంపికై ందని మండల విద్యాశాఖాధికారి అబ్దుల్ సత్తార్ తెలిపారు. ప్రాజెక్ట్ ఎంపికై న నేపథ్యంలో ఉపాధ్యాయుడు మధుసూదనరావు టీమ్ ను ఎంఈఓ, అధ్యాపకులు, యూటీఎఫ్ నాయకులు అభినందనలు తెలిపారు. ఒంగోలు టౌన్: సీఐటీయూ అఖిల భారత 18వ మహాసభలను విజయవంతం చేయాలనే లక్ష్యంతో ఈ నెల 26, 27 తేదీల్లో జిల్లాలో సీఐటీయూ నిర్వహించనున్న ప్రచార జాతాను విజయవంతం చేయాలని ఆ సంస్థ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జాతా వివరాలను వెల్లడించారు. రెండు బృందాలుగా జాతా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఒక బృందం 26వ తేదీ ఉదయం పామూరులో ప్రచార జాతా ప్రారంభించి కనిగిరి, పొదిలి, కురిచేడు, దొనకొండ, త్రిపురాంతకం, యర్రగొండపాలెం, దోర్నాల, పెద్దారవీడు గ్రామాల మీదుగా మార్కాపురం చేరుకుంటుందని తెలిపారు. 27 ఉదయం మార్కాపురం నుంచి ప్రారంభమయ్యే జాతా తర్లుపాడు, కంభం, గిద్దలూరు, బేస్తవారిపేట, హనుమంతునిపాడు, వెలిగండ్ల మీదుగా సీఎస్పురం చేరుకుంటుందని తెలిపారు. రెండో బృందం ఒంగోలు డివిజన్లో విస్తృతంగా పర్యటిస్తుందని, అనంతరం కొత్తపట్నం మండలంలోని ముఖ్య ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ నెల 31 నుంచి జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో జరగనున్న సీఐటీయూ జాతీయ మహాసభల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కార్మిక చట్టాలను తిప్పికొట్టేందుకు, ఆంధ్రుల హక్కుగా పరిగణిస్తున్న విశాఖ ఉక్కును పరిరక్షించుకునేందుకు అవసరమైన చర్చలు జరుగుతాయని తెలిపారు. ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా సాగించే ఉద్యమాలకు ఈ సభలు ఊతం ఇస్తాయన్నారు. జిల్లా నలుమూలల నుంచి కార్మికులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్ పాల్గొన్నారు. -
రెచ్చిపోతున్న మట్టి మాఫియా
మార్కాపురం టౌన్: మార్కాపురం పట్టణ శివార్లలో మట్టిమాఫియా రెచ్చిపోతోంది. నాలుగు రోజులుగా దరిమడుగు సమీపంలోని మమ్మసాబ్ కుంట వద్ద మట్టిని జేసీబీ, పొక్లైనర్లతో తవ్వి ట్రాక్టర్లతో, టిప్పర్లతో తరలించుకుపోతున్నారు. దీంతో రోడ్లు సైతం దెబ్బతింటున్నాయి. మట్టి ట్రాక్టర్లలో నుంచి మట్టి కిందపడి వాహనాల రాకపోకల సమయంలో దుమ్మురేగి వాహనదారుల కళ్లలో పడుతోంది. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. తమ కనుసన్నల్లో సాగుతున్న ఈ అక్రమ దందాకు ఎవరైనా అడ్డొస్తే అంతు తేలుస్తామంటూ బాహాటంగా బెదిరిస్తున్నారు. దీంతో ఎవరూ ఆవైపు కన్నెత్తి చూడటం లేదు. అధికారులు కూడా తెలీనట్టు నటిస్తున్నారు. ట్రాక్టర్ మట్టి రూ.500 నుంచి రూ.1000కి పెరుగుదల.. గతంలో ట్రాక్టర్ మట్టి రూ.500 ఉండగా ఏకంగా రెట్టింపుచేసి అమ్ముతున్నారు. ఎక్కడైనా చెరువులో మట్టి తవ్వుకున్నా స్థానికంగా ఉండే కూటమి నాయకులకు వెయ్యి రూపాయలు చెల్లించాల్సిందే. దీంతో భవన నిర్మాణదారులు మట్టిని కొనాలంటే భయపడుతున్నారు. కుంట, దరిమడుగు మధ్యలో ఉన్న మమ్మసాబ్ కుంట, గోగులదిన్నె తదితర ప్రాంతాల్లో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. మండలంలోని పలు చెరువుల్లో నీళ్లు ఉండటంతో ప్రభుత్వ భూముల్లో ఉన్న మట్టిని జేసీబీల సాయంతో తవ్వి అమ్ముతున్నారు. గురువారం క్రిస్మస్ పండుగ కావడంతో మట్టి తవ్వకాలకు సెలవు ప్రకటించారు. కూలీలు ఎవరూ రాకపోవడంతో పనులు ఆపారు. త్వరలో జిల్లా కానుండటంతో మార్కాపురం పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ భూములను రియల్ఎస్టేట్ వెంచర్లుగా మార్చి ఫ్లాట్లుగా పెట్టి అమ్ముతున్నారు. వ్యవసాయ భూములను ఫ్లాట్లుగా మార్చాలంటే కచ్చితంగా మట్టి అవసరమవుతోంది. ఒక ఎకరా భూమిని చదువు చేయాలంటే సుమారు 40 నుంచి 50 ట్రాక్టర్ల మట్టి కావాలి. వ్యవసాయ భూమి కాస్త లోతుగా ఉంటే మరో 30 ట్రాక్టర్ల మట్టి అదనంగా తోలాల్సి ఉంటుంది. ఈ అవసరమే మట్టి మాఫియాకు వరంగా మారుతోంది. అక్రమార్కులు కూటమి నాయకులు కావడంతో రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్ అధికారులు కూడా చూసిచూడనట్టు పోతున్నారు. మార్కాపురం నుంచి తర్లుపాడు రోడ్డు, రైల్వేస్టేషన్ రోడ్డు, కుంట రోడ్డుల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ వెంచర్లకు వందల సంఖ్యలో ట్రాక్టర్ల మట్టి అవసరం. ఈ నేపథ్యంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ప్రభుత్వ భూములు, పోరంబోకు భూములు, అసైన్మెంట్ ల్యాండ్లలో మట్టి వ్యాపారులు తమకు ఇష్టం వచ్చినట్టుగా తవ్వకాలు చేపడుతున్నారు. -
బెల్ట్ షాపులపై టాస్క్ఫోర్స్ కొరడా
ఒంగోలు టౌన్: జిల్లాలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై టాస్క్ఫోర్స్ పోలీసులు కొరడా ఝళిపించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మెరుపుదాడులు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. భారీగా మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకొన్నారు. ఎస్పీ హర్షవర్థన్ రాజు ఆదేశాలతో రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్ సీఐ సుధాకర్ బృందం గురువారం ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలోని ఒంగోలు మండలంలోని మద్దిరాలపాడు, నాగులుప్పలపాడు మండలంలోని చదలవాడ, మద్దిపాడు మండలంలోని మేదరమెట్ల, కొత్తపట్నం మండలంలోని అల్లూరు గ్రామాల్లో విస్తృతంగా దాడులు నిర్వహించారు. 105 క్వార్టర్ల మద్యం బాటిళ్లు, 10 బాటిళ్ల బీర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఒంగోలు మండలంలోని మద్దిరాలపాడు గ్రామ హైవే వద్ద నిబంధనలకు వ్యతిరేకంగా బెల్ట్ షాపు నిర్వహిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి ఐదు 180 ఎంఎల్ క్వార్టర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అతడిని ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్లో అప్పగించారు. మద్దిపాడు మండల పరిధిలోని గుండ్లాపల్లి హైవే రోడ్డుపై మద్యం విక్రయిస్తున్న ఒక వ్యక్తి నుంచి 45 క్వార్టర్ బాటిళ్లు, మరో వ్యక్తి నుంచి 18 క్వార్టర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. నాగులుప్పలపాడు మండలంలోని చదలవాడ గ్రామంలోని చీరాల రోడ్డులో మద్యం విక్రయిస్తున్న నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 6 క్వార్టర్ల మద్యం బాటిళ్లు, 10 బీర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. కొత్తపట్నం మండలంలోని అల్లూరు గ్రామంలో మరోసారి భారీగా మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. గతంలో ఎస్టీఆర్ఎప్ దాడులు చేసి ఈ గ్రామంలోని ఒక బెల్టు షాపు నుంచి భారీగా మద్యం స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. తాజాగా ఇప్పుడు మరోసారి కూడా ఈ గ్రామంలో బెల్టు షాపులో మద్యం పట్టుబడింది. గ్రామంలో బెల్ట్షాపు నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసుల బృందం అతడి వద్ద నుంచి 31 క్వార్టర్ల మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుంది. నిందితుడిని కొత్తపట్నం పోలీసు స్టేషన్లో అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్పీ హర్షవర్థన్ రాజు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఎక్కడైనా మద్యం విక్రయిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బెల్ట్షాపుల గురించి ఏదైనా సమాచారం ఉంటే వెంటనే 100కు ఫోన్ చేసి తెలియజేయాల్సిందిగా కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. ఈ దాడుల్లో టాస్క్ఫోర్స్ ఎస్సైలు సుదర్శన్, శివరామయ్య, ఏఎస్సై షేక్ మహబూబ్ బాషా, సిబ్బంది పాల్గొన్నారు. -
నెట్బాల్ జిల్లా జట్ల ఎంపిక
దొనకొండ: ఉమ్మడి ప్రకాశం జిల్లా సీనియర్ నెట్బాల్ బాల బాలికల జట్టును స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో బుధవారం ఎంపిక చేశారు. జిల్లా నెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులను ఎంపిక చేశారు. పురుషుల విభాగంలో బి.ప్రకాష్, కె.విజయ్, జె.జాషువా, వై.పూర్ణ, ఏ.కిరణ్కుమార్, ఏ.జగదీష్, వి.రాఘవేంద్ర, ఎం హేమంత్, ఐ.కిషోర్, ఎం జనార్దన్, పి.మునీంద్ర, పి.జావీద్, స్టాండ్బైగా ఏ.గోపి, బి.రామక్రిష్ణారెడ్డి, డి.లక్ష్మీరెడ్డిలు ఎంపికయ్యారు. మహిళల విభాగంలో.. శ్రావణి, అనుష్క, శివమ్మ, గిరిజ, శివలక్ష్మి, నాగదివ్య, విజయలక్ష్మి, మధుశాలిని, శ్రీదేవి, బషీరా, త్రివేణి, గురులక్ష్మీలు ఎంపికై నట్లు వ్యాయామ ఉపాధ్యాయులు కె.నరసింహారావు తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 27 నుంచి 29 వరకు ఈస్ట్గోదావరి రావులపాలెంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని అధ్యక్ష, కార్యదర్శులు ఎం కృష్ణారెడ్డి, ఐపీ రాజు తెలిపారు. ఎంపికలకు ముఖ్య అతిథిగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వీవీ రామాంజనేయులు పాల్గొన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు కాలే నరసింహారావు, బొరిగొర్ల మురళీకృష్ణ పాల్గొన్నారు. ఒంగోలు: భార్యను హత్య చేసిన కేసులో భర్తకు జీవిత ఖైదు విధిస్తూ రెండో అదనపు జిల్లా జడ్జి పి.లలిత బుధవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం..మద్దిపాడు మండలం రాచవారిపాలెంకు చెందిన సుభాషిణికి కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామానికి చెందిన తావేటి కృపారావుతో 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ క్రమంలో మద్యానికి బానిసైన కృపారావు భార్యపై అనుమానం పెంచుకొని నిత్యం వేధించేవాడు. దీంతో సుభాషిణి అదే గ్రామంలో నివాసం ఉంటున్న సోదరి ఇంట్లో తలదాచుకుంది. భార్యపిల్లలను వదిలిపెట్టి కృపారావు హైదరాబాద్లో ఉంటూ పెద్ద మనుషులతో కాపురానికి రావాలని ఒత్తిడి తెచ్చాడు. అతని మాటలు నమ్మి కాపురానికి వచ్చిన సుభాషిణిని 2015 డిసెంబర్ 24న రోకలిబండతో కొట్టి హతమార్చాడు. దీనిపై సుభాషిణి తల్లి జగన్నాథం లక్ష్మీ నారాయణమ్మ ఫిర్యాదు చేయగా అప్పటి టూటౌన్ సీఐ దేవప్రభాకర్ కేసు నమోదు చేసి కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి నిందితునిపై నేరం రుజువైనట్లు పేర్కొంటూ జీవిత ఖైదు, రూ.15 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించకుంటే 2 నెలలు అదనంగా జైలుశిక్ష చేయాలని ఆదేశించారు. ప్రాసిక్యూషన్ తరుపున అదనపు పీపీలు యత్తపు కొండారెడ్డి, కేవీ రామేశ్వరరెడ్డి వాదించగా కోర్టు లైజన్ కె.లక్ష్మీనారాయణ, వి.ప్రసాద్ సాక్షులు సకాలంలో కోర్టుకు హాజరయ్యేలా చేసి నేర నిరూపణకు సహకరించారు. -
ఏసు జీవితం ఆదర్శప్రాయం
ఒంగోలు సిటీ: ఏసుక్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పర్వదినాన్ని ప్రజలందరూ సుఖసంతోషాలతో జరుపుకోవాలని రాజ్యసభ సభ్యుడు వైవీ.సుబ్బారెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఒంగోలు పార్లమెంట్ వైఎస్సార్ సీపీ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, నెల్లూరు పార్లమెంట్ పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, కొండపి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జ్లు అన్నా రాంబాబు, కె.నాగార్జునరెడ్డి, ఒంగోలు, కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జ్లు చుండూరి రవిబాబు, దద్దాల నారాయణ యాదవ్ ఆకాంక్షించారు. ప్రేమ, కరుణ, దయ, జాలి, క్షమాగుణాలను కలిగిన ఏసుక్రీస్తు జీవితం సర్వమానవాళికి ఆదర్శప్రాయమన్నారు. -
లోక పావనం
గురువారం శ్రీ 25 శ్రీ డిసెంబర్ శ్రీ 2025క్రీస్తు జననం..లోక రక్షకుడైన ఏసుక్రీస్తు జన్మించిన పవిత్రమైన క్రిస్మస్ పర్వదినం కోసం జిల్లాలోని చర్చిలన్నీ ముస్తాబయ్యాయి. పలుచోట్ల క్రీస్తు జనన ఘట్టాలు కళ్లకు కట్టేలా సెట్టింగులు ఏర్పాటు చేశారు. చర్చిలను విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. వాడవాడలా క్రీస్తు రాకడను స్వాగతిస్తూ క్రిస్మస్ స్టార్లు ఏర్పాటు చేశారు. చర్చిల్లో బుధవారం రాత్రి క్యాండిల్ లైట్ సర్వీస్ నిర్వహించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. – సాక్షి నెట్వర్క్ -
ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదు
వంద రోజుల ప్రణాళిక ఏ విధంగా జరుగుతుందో పరిశీలించడానికి ఇతర శాఖల ఉద్యోగులను నియమించాలన్న ప్రభుత్వ నిర్ణయం సరికాదు. ఉపాధ్యాయుల ఆత్మాభిమానం దెబ్బతింటుంది. ప్రణాళికను పక్కాగా అమలు చేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు ఉన్నారు. – నరహరి అంజిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు, పీఆర్టీయూ విద్యార్థులు, ఉపాధ్యాయులపై మానసిక ఒత్తిడి వంద రోజులు ప్రణాళికలో భాగంగా పండగ సెలవులు కూడా ఇవ్వకుండా విద్యార్థులు, ఉపాధ్యాయులపై ఒత్తిడి పెట్టడం సరికాదు. విద్యార్థులు ఇష్టపడి చదవకుండా కష్టపడి చదివించేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం మంచిదికాదు. ప్రభుత్వ నిర్ణయాలతో వందశాతం ఫలితాలు ఎలా సాధిస్తారు. ప్రతి రోజు పరీక్షలు నిర్వహించడం, మరుసటి రోజు మార్కులు అప్లోడ్ చేయాలని పేర్కొనడం సరికాదు. విద్యాశాఖపై అవగాహన లేని వ్యక్తులను పర్యవేక్షకులుగా నియమించడం సమంజసం కాదు. ప్రభుత్వ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. – షేక్ అబ్దుల్ హై, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు -
బోధపడని ప్లాన్!
మరో మూడు నెలల్లో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మెరుగైన ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ అధికారులు అమలు చేస్తున్న వంద రోజుల ప్రణాళిక గందరగోళంగా మారింది. డిసెంబర్ మొదటి వారానికి సిలబస్ పూర్తి చేసి ప్రత్యేక తరగతులు నిర్వహించాల్సి ఉంది. ఒక వైపు బోధనేతర కార్యక్రమాల్లో పడిన ఉపాధ్యాయులు సకాలంలో సిలబస్ పూర్తి చేయలేకపోయారు. మరో వైపు పలు రకాల యాప్లతో ఉపాధ్యాయులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా వంద రోజుల ప్రణాళిక అమలు పర్యవేక్షణనను విద్యాశాఖకు సంబంధంలేని వ్యక్తులకు అప్పజెప్పడం వివాదాస్పదంగా మారింది. దీనిని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మా శాఖపై వారి పెత్తనం ఏంటని మండిపడుతున్నారు. ఒంగోలు సిటీ: జిల్లాలోని 364 వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో 17,298 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. ఇందులో 8 మున్సిపాలిటీ పాఠశాలలో 524 మంది, 249 జిల్లా పరిషత్ హైస్కూల్లో 11,522 మంది, గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ నాలుగు స్కూళ్లలో 43 మంది, 20 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 1,821 మంది, 22 ఎయిడెడ్ పాఠశాలల్లో 372 మంది, 28 కేజీబీవీ పాఠశాలల్లో 1,078 మంది, 6 ఏపీ ఎంఎస్ పాఠశాలల్లో 4,88 మంది, 11 ఏపీఎస్ డబ్ల్యూఆర్ఎస్ పాఠశాలల్లో 8,34 మంది, 9 ఏపీటీడబ్ల్యూఆర్ఎస్ స్కూళ్లలో 258 మంది, నాలుగు బీసీ వెల్ఫేర్ పాఠశాలల్లో 147 మంది, 3 ఏపీఆర్ఎస్ పాఠశాలల్లో 211 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. అంతేకాకుండా 272 ప్రైవేట్ పాఠశాలల్లో 11,882 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. గందరగోళంగా యాక్షన్ ప్లాన్ అమలు పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రభుత్వం వంద రోజుల యాక్షన్ ప్లాన్ను అమలు చేస్తోంది. అయితే అమలుకు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం విడుదలజేసిన ప్రణాళిక గందరగోళానికి గురిచేస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి విద్యాశాఖ ఉపాధ్యాయులకు బోధన కంటే ఇతర పనులు అప్పగించింది. దీంతో సిలబస్ సకాలంలో పూర్తి చేసేందుకు వారు ఇబ్బందులు పడ్డారు. దీనికి తోడు పరీక్షలు నిర్వహించడం ఒక ఎత్తయితే మూల్యాంకనం, మార్కుల అప్లోడ్ చేయడంతోనే వారికి సమయం అయిపోతోంది. భారం ఎక్కువై ఉపాధ్యాయులు సతమతమవుతున్నారు. డిసెంబర్ 6 నుంచి మార్చి 15వ తేదీ వరకు ఈ ప్రణాళికను అమలు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఒక వైపు పూర్తిస్థాయిలో సిలబస్ పూర్తి చేయలేక, మరో వైపు వందరోజుల ప్రణాళిక పటిష్టంగా అమలు చేయలేక అవస్థలు పడుతున్న టీచర్లకు ప్రభుత్వ నిర్ణయం తీవ్ర అసహనానికి గురిచేస్తోంది. విద్యాశాఖతో సంబంధం లేని వ్యక్తులకు ఈ ప్రణాళిక అమలు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడంపై ఉపాధ్యాయులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. స్లిప్ టెస్టుల నిర్వహణ, మార్కుల నమోదు, ఉపాధ్యాయుల హాజరు ఇలా పలు రకాల అంశాల నమోదు, పబ్లిక్ పరీక్షలు పూర్తయ్యేంత వరకు పర్యవేక్షించేందుకు వివిధ శాఖల అధికారులు ఇన్చార్జులుగా వ్యవహరిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం ఇన్చార్జ్ల కనుసన్నుల్లో జరుగుతుందని పేర్కొంటుండడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. వివిధ శాఖలు అధికారులు ఇలా.. యాక్షన్ ప్లాన్ అమలు చేయడానికి ఇన్చార్జులుగా రెవెన్యూ, పంచాయతీరాజ్, వైద్య, ఎంపీడీవో, ఆర్డబ్ల్యూఎస్, వ్యవసాయం, ఇరిగేషన్, మున్సిపల్ కమిషనర్, వెటర్నరీ శాఖలో పనిచేసే అధికారులను ఇన్చార్జులుగా నియమించింది. వీరంతా కలిసి మండల పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు వెళ్లి వంద రోజుల ప్రణాళిక అమలు అంశాన్ని పూర్తిగా పర్యవేక్షించాల్సి ఉంటుంది. అంతేకాకుండా స్లిప్ టెస్టులు, ఉపాధ్యాయుల హాజరు, 10లో షైనింగ్, రైజింగ్ స్టార్లుగా విభజించి పాఠాలకు బోధిస్తున్నారా లేదా అంశాన్ని రోజూ పరిశీలించాలి. ఉపాధ్యాయుల హాజరు నమోదు, శని ఆదివారాల్లో ఇతర సెలవుల జిల్లాల్లో తరగతులు నిర్వహిస్తున్నారా? లేదా? అని చూడాల్సిన బాధ్యత కూడా వీరిపై ఉంటుంది. మా వాళ్లు ఉండగా వారితో పనేంటి.. యాక్షన్ ప్లాన్ అమలుకు ఇతర శాఖల అధికారులు నియమించడంపై ఉపాధ్యాయుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. వాస్తవానికి ప్రతి మండలానికి ఎంఈఓ 1, 2 లతోపాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న డిప్యూటీ డీఈవోలు, ప్రతి పాఠశాలల హెచ్ఎంలు, సీఆర్పీ లు ఉన్నారు. వీళ్లు ఉండగా వేరే శాఖల వారిని ఇన్చార్జులుగా నియమించడం ఎందుకన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయం ఉపాధ్యాయులను అవమానించడమేనని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పాఠశాల విద్య అమలు తీరుపై వీరికి ఏ విధంగా అవగాహన ఉంటుందని ప్రశ్నిస్తున్నారు.ఇతర శాఖల పెత్తనం తగదు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో విద్యాశాఖ నిర్ణయాలు విద్యార్థులను తీవ్ర మానసిక ఒత్తిడి గురిచేస్తున్నాయి. వంద శాతం ఉత్తీర్ణత సాధించడానికి ఆంక్షలు విధించడం అశాసీ్త్రయం. ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో, నిబద్ధతతో పనిచేస్తుంటే ఇతర శాఖల అధికారులను తనిఖీల పేరుతో ప్రయోగించడం తగదు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలి. – డి.శ్రీనివాసులు, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి -
సెకండ్ హ్యాండ్ సెల్ఫోన్లు కొనొద్దు
● ఎస్పీ హర్షవర్థన్ రాజు ఒంగోలు టౌన్: తక్కువ ధరకు విక్రయించే సెల్ఫోన్లను కొనవద్దని, తప్పనిసరి పరిస్థితిలో సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనాల్సి వస్తే బిల్లును పరిశీలించిన తరువాతే కొనుగోలు చేయాలని ఎస్పీ హర్షవర్థన్ రాజు సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో 5 విడతల్లో రికవరీ చేసిన 342 సెల్ఫోన్లను బుధవారం బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎవరైనా ఎక్కువ ధర కలిగిన మొబైల్ ఫోన్ను తక్కువ ధరకు సెకండ్ హ్యాండ్కు విక్రయించేందుకు ప్రయత్నిస్తే నమ్మవద్దని, అలాంటి ఫోన్లను ఎట్టి పరిస్థితిలోనూ కొనవద్దని సూచించారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు మొబైల్ ఫోన్లను విక్రయించడానికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. మారిన పరిస్థితుల్లో సెల్ఫోన్లు జీవితంలో భాగంగా మారాయని, వ్యక్తిగత సమాచారం, విలువైన డేటా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సిమ్ కార్డును బ్లాక్ చేయించుకోవాలని, బ్యాంకు లింకై న మొబైల్ నంబర్ను మార్చుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిచిత వ్యక్తులకు మీ ఫోన్ ఇవ్వవద్దని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో దొరికిన మొబైల్ ఫోన్లను తీసుకొని వాడడం కూడా మంచిది కాదన్నారు. వెంటనే వాటిని స్థానిక పోలీసుస్టేషన్లో అప్పగించాలన్నారు. మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నప్పుడు పోలీస్స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సియర్ వెబ్సెట్లో ఫిర్యాదు చేస్తే చాలని చెప్పారు. రూ.50 లక్షల విలువైన ఫోన్లు అందజేత... గత 3 నెలల కాలంలో చోరీకి గురైన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేసిన 342 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. వీటి విలువ సుమారు రూ.50 లక్షలు ఉంటుందని చెప్పారు. 2021 నుంచి ఇప్పటి వరకు సుమారు 6,776 ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఫోన్లను ట్రేస్ చేశామన్నారు. ఫోన్లను రికవరీ చేయడంలో విశేష ప్రతిభ కనపరిచిన పోలీసు సిబ్బందికి అభినందనలు తెలిపారు. -
జిల్లా ప్రజలకు కలెక్టర్ క్రిస్మస్ శుభాకాంక్షలు
ఒంగోలు వన్టౌన్: కరుణామయుడు, లోక రక్షకుడు ఏసు ప్రభువు జన్మించిన పర్వదినం క్రిస్మిస్ పండుగను జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆనందంగా జరుపుకోవాలని కలెక్టర్ పీ రాజబాబు బుధవారం ఒక ప్రకటనలో ఆకాంక్షించారు. శాంతి, దయ, ప్రేమ, ధర్మం, న్యాయం, అహింస, పరోపకారం వంటి ఏసు క్రీస్తు బోధనలు, సర్వ మానవాళికి ఆచరణీయమని అన్నారు. క్రీస్తు జననం..మానవాళికి మహోదయం ఒంగోలు టౌన్: ఏసు క్రీస్తు జననంతో యావత్ ప్రపంచంలోని ప్రజల జీవితాల్లో వెలుగులు విరజిల్లాయని ఎస్పీ హర్షవర్థన్ రాజు చెప్పారు. జిల్లా ప్రజలందరికీ, పోలీసు సిబ్బందికి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ఎస్పీ ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన ఏసు క్రీస్తు మార్గం ఆచరణీయమైనదని చెప్పారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, కరుణ, త్యాగం వంటివి క్రీస్తు ఆచరించి చూపారన్నారు. జిల్లా ప్రజలు క్రిస్మస్ పండుగను సంతోషకరమైన వాతావరణంలో ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రధాన చర్చిలు, ప్రార్ధనా మందిరాల వద్ద ఎటువంటి సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
అక్రమ కేసులు అన్యాయం
● అక్రమ కేసులో అరైస్టె జైలులో ఉన్న చెన్నారెడ్డికి బెయిల్ మంజూరు గిద్దలూరు రూరల్: వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడం అన్యాయమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి కేపీ నాగార్జునరెడ్డి అన్నారు. అక్రమ కేసులో అరైస్టె జైలులో ఉన్న కంభం మాజీ ఏఎంసీ చైర్మన్ నెమలిదిన్నె చెన్నారెడ్డికి బుధవారం బెయిల్ మంజూరైంది. దీంతో ఆయన్ను కలిసేందుకు మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో గిద్దలూరు సబ్జైలు వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో కేపీ నాగార్జునరెడ్డి మాట్లాడుతూ న్యాయం గెలిచింది..ధర్మ నిలబడింది అన్నారు. టీడీపీ నాయకుడు చెన్నకేశవులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెన్నారెడ్డిపై అక్రమ కేసులు బనాయించడం దారుణమన్నారు. వారి మధ్య 15 అడుగుల దూరంలో మాటా మాటా ఘర్షణ తలెత్తితే చెన్నారెడ్డి..చెన్నకేశవులపై తీవ్రంగా దాడికి పాల్పడి గాయపరిచినట్లు వైద్యులతో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లను తయారు చేయించి అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారన్నారు. పోలీసులు పెట్టిన అక్రమ కేసులను న్యాయస్థానం నమ్మకపోవడం వల్లే బెయిల్ మంజూరైందన్నారు. దీనిపై పోలీస్ ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేయాలన్నారు. నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చిన వైద్యులు ప్రైవేట్ కేసులు ఎదుర్కొక తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ కేసులు బనాయించడం అలవాటుగా మారిందన్నారు. అక్రమ కేసులను బనాయించాలని చూస్తే ఇకపై సహించేది లేదన్నారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణాన్ని టీడీపీ నేతలు నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కక్ష పూరిత పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదని, పార్టీ అన్ని సమయాల్లో అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గిద్దలూరు మాజీ ఎంపీపీ కడప వంశీధరరెడ్డి, వైఎస్సార్ సీపీ మున్సిపల్ కన్వీనర్ మానం బాలిరెడ్డి, నాయకులు వేమిరెడ్డి రామచంద్రారెడ్డి, మండల కన్వీనర్ బి.ఓబులరావు, నాయకులు బొర్రా క్రిష్ణారెడ్డి, శ్రీరంగం, సీఆర్ఐ మురళి, రెడ్డి భాస్కర్రెడ్డి, కొమరోలు జెడ్పీటీసీ వెంకటనాయుడు, అర్ధవీడు ఎంపీపీ వెంకటరావు, బేస్తవారిపేట ఎంపీపీ ఓసూరారెడ్డి పాల్గొన్నారు. -
పంచాయతీ ట్రాక్టర్ను ఢీకొన్న ట్రావెల్ బస్సు
కురిచేడు: అతివేగంతో వస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు పంచాయతీ ట్రాక్టర్ను ఢీకొట్టడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే..బెంగళూరు నుంచి వినుకొండ వెళుతున్న వి కావేరి ట్రావెల్ బస్సు పాతపోలీసుస్టేషను వద్ద అతివేగంగా వెళుతూ పంచాయతీ ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టింది. ఈ ఘటనలో స్వీపర్ నందిగం ఇసాక్ కిందపడి గాయాలయ్యాయి. ట్రాక్టర్లో చెత్త వేసేందుకు వచ్చిన గ్రామస్తుడు తంగెళ్ల తలకు గాయమైంది. బస్సు అతివేగానికి భయాందోళనకు గురైన స్వీపర్లు బస్సును అడ్డుకొని నిలిపివేశారు. క్షతగాత్రులు నందిగం ఇసాక్ను వినుకొండ ఆస్పత్రికి తరలించారు. -
ఆలయ పరిసర ప్రాంతాలు స్వచ్ఛంగా ఉండాలి
త్రిపురాంతకం: బాలాత్రిపురసుందరీదేవి, పార్వతి త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయాల పరిసర ప్రాంతాలన్నీ భక్తులకు అసౌకర్యంగా కలగకుండా పరిశుభ్రంగా ఉంచాలని దేవదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కే రామచంద్రమోహన్ ఆదేశించారు. త్రిపురాంతకం ఆలయాలను ఆయన సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయాలు పురాతన రాతి నిర్మాణాలైనందున ఎక్కడా రంగులు వేయరాదన్నారు. గతంలో వేసిన రంగులను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. ఆలయ పరిసరాల్లో ఎలాంటి నూతన నిర్మాణాలు జరగాలన్నా, ప్రతిష్ఠలు చేయాలన్నా దేవదాయ శాఖ అనుమతించాల్సి ఉందన్నారు. దాతల ద్వారా జరిగినా ముందస్తు అనుమతులు అవసరమన్నారు. దాతల పేర్లుతో ఉన్న నేమ్ ప్లేట్లు ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేయరాదన్నారు. అనుమతులు లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదన్నారు. నూతనంగా నిర్మించిన దక్షిణ గోపురంలో గ్రానైట్ పరుపు బండలు వేయడంపై రామచంద్రమోహన్ ప్రశ్నించారు. ఈయన వెంట ఆలయాల ఈఓ అనిల్ కుమార్, ట్రస్ట్బోర్డు చైర్మన్ ఐవీ సుబ్బారావు, అర్చకులు ప్రసాదశర్మ, విశ్వనారాయణశాస్త్రి ఉన్నారు. ఆలయాల వద్ద పూర్ణకుంభ స్వాగతం పలికి పూజల అనంతరం వేద ఆశీర్వచనం అందించారు. -
వైపాలెంలో టీడీపీ ఫ్లెక్సీల రగడ
యర్రగొండపాలెం: టీడీపీలో ఒక వర్గం వారు వేయించిన ఫ్లెక్సీలను నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదేశాలతో తొలగించిన ఘటన యర్రగొండపాలెంలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. టీడీపీలో ఉన్న ఒక వర్గానికి చెందిన వారు క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మంగళవారం రాత్రి పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిలో టీడీపీ సీనియర్ నాయకుడు, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ డాక్టర్ మన్నె రవీంద్ర ఫొటోలు మాత్రమే ఉన్నాయి. అందులో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎరిక్షన్బాబు ఫొటోలు లేకపోవడంతో ఆ నాయకుడికి చిర్రెత్తి పోయింది. తన ఫొటోలు లేని ఫ్లెక్సీలు తొలగించాలని పోలీసులకు హుకుం జారీ చేసినట్లుంది..వెంటనే వారు పంచాయతీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఆగమేఘాలపై పంచాయతీ కార్యదర్శి రామసుబ్బయ్య రవీంద్ర వర్గీయులు ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలు తన సిబ్బందితో తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. పనిలో పనిగా వైఎస్సార్ సీపీ వర్గీయులు వేయించిన కొన్ని ఫ్లెక్సీలను కూడా తొలగించారు. ఇదేమిటని టీడీపీ వర్గీయులు ప్రశ్నిస్తే అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదని, పోలీసుల ఆదేశాల మేరకు అనుమతిలేని ఫ్లెక్సీలు తొలగిస్తున్నామని పంచాయతీ కార్యదర్శి బదులిచ్చినట్లు వారు తెలిపారు. ఎరిక్షన్బాబు వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఎందుకు తొలగించడంలేదని వారు నిలదీయడంతో ముందుగా 10/12 సైజ్లోపు ఉన్న ఫ్లెక్సీలు తొలగిస్తున్నామని, ఆ సైజ్కంటే పెద్దగా ఉన్నవాటిని రేపు తొలగిస్తామని చెప్పాడని వారు తెలిపారు. ఆగమేఘాలపై ఫ్లెక్సీలు ఎందుకు తొలగింపచేస్తున్నారని ఎస్సై పి.చౌడయ్యను ప్రశ్నిస్తే.. ఫ్లెక్సీలు తొలగించే విషయంలో పోలీసుల జోక్యం లేదని, ఇప్పుడు ఈ సమయంలో ఎందుకు తొలగిస్తున్నారో తనకు తెలియదని చెప్పారు. ఈ విషయం గురించి పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదని, ఈ ఫ్లెక్సీలను తొలగించే అధికారం పంచాయతీకి ఉందని బదులిచ్చారు. ఫ్లెక్సీల తొలగింపుపై రాత్రి 8 గంటల సమయంలో టీడీపీలోని మన్నె రవీంద్ర వర్గీయులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎరిక్షన్ బాబు ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలను కూడా తొలగించి ఆ తరువాత తమ ఫ్లెక్సీలు తొలగించాలని పట్టుబట్టారు. -
నాలుగు నెలల్లో 82 కిలోల గంజాయి స్వాధీనం
ఒంగోలు టౌన్: గత నాలుగు నెలల్లో భారీ స్థాయిలో గంజాయిని స్వాధీనం చేసుకోవడమే కాకుండా అనేక మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 19 నుంచి ఇప్పటి వరకు 82.517 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలోని పలు పోలీసుస్టేషన్లలో ఇప్పటి వరకు నమోదైన 6 గంజాయి కేసుల్లో 25 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నామని, వారి వద్ద నుంచి 9.87 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రైలు మార్గం ద్వారా జరుగుతున్న గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకున్నామన్నారు. ఈ క్రమంలో 10 కేసుల్లో 12 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 72.647 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా సమాజానికి పెద్ద ప్రమాదమని పేర్కొన్నారు. యువతను మత్తు పదార్ధాల బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీదా ఉందన్నారు. ఈ దిశగా జిల్లా పోలీసు శాఖ నిరంతరం చర్యలు తీసుకుంటోందని, రైల్వే మార్గాలు, ఆర్టీసీ బస్టాండ్లు, లాడ్జీలు, అనుమానాస్పద ప్రదేశాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గంజాయిని వినియోగించినా, విక్రయించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏదైనా సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1972, డయల్ 112, పోలీసు వాట్సప్ నంబర్ 9121102266కు తెలియజేయాల్సిందిగా కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రజలందరూ సహకరించాలని కోరారు. -
జీవితాలతో ఆటలు
జీతాల్లో కోతలు..మారుమూల పల్లెల్లోని ప్రజలకు వైద్యసేవలు అందిస్తూ అండగా నిలుస్తున్న ఆపద్బాంధవులకు కష్టమొచ్చింది. గ్రామీణుల జీవితాల్లో వెలుగులు నింపే ఉద్యోగులకు ఆపదొచ్చింది. పల్లె సంజీవని 104 అంబులెన్స్ ఉద్యోగులతో నిర్వహణా సంస్థ చెలగాటమాడుతోంది. అరకొర సిబ్బంది..రోజుకు పది గంటలకు పైగా విధులు..అదనపు పని ఒత్తిడి. కనీసం సెలవులు ఇవ్వకుండా వేధింపులు.. మహిళా ఉద్యోగుల పరిస్థితి మరింత దారుణం. ఇదేమని అడిగిన వారిపై లేనిపోని నిందలేసి వేటు వేస్తోంది. ప్రభుత్వ పెద్దల అండదండలతో భవ్య హెల్త్ కేర్ సర్వీసెస్ యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తోందంటూ సిబ్బంది రోడ్డెక్కారు. యాజమాన్యం వేధింపులను ఆపాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. భవ్య యాజమాన్యం వేధింపులు ఆపాలి భవ్య యాజమాన్యం 104 ఉద్యోగులకు అన్ని రకాలుగానూ దగా చేస్తోంది. పూర్తి వేతనాలను చెల్లించకపోగా ప్రతినెలా రూ.500 కోత విధించడం దారుణం. అసలే అరకొర జీతాలతో ఉద్యోగులు కుటుంబాలను పోషించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. జీతాలు పెంచడానికి బదులు కోతలు విధించడం దుర్మార్గం. ఉద్యోగుల పే స్లిప్పులను ఇవ్వక పోవడం నిబంధనలను ఉల్లంఘించడమే. ఈ తరహా వేధింపులను యాజమాన్యం ఆపాలి. లేకపోతే పోరాటాలను మరింత ఉధృతం చేస్తాం. – అబ్బూరి శ్రీనివాసరావు, ఏపీ 104 ఎంఎంయూ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మహిళా ఉద్యోగుల హక్కులను కాపాడాలి జిల్లాలోని ఏడుగురు మహిళా ఉద్యోగులు 104లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ శాఖలన్నింటిలోనూ మహిళలకు ప్రత్యేక సెలవులు ఇస్తారు. కానీ 104లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు ఎలాంటి సెలవులు ఇవ్వకపోవడం విచారకరం. ఒకవేళ సెలవు పెట్టినా ఇంటి వద్ద నుంచి పనిచేయాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారు. మహిళా సాధికారిత గురించి చెబుతున్న ప్రభుత్వం 104లో పనిచేస్తున్న మహిళల ప్రాథమిక హక్కులను కాపాడాలి. – మాకం లక్ష్మి, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒంగోలు టౌన్: జిల్లాలో 729 గ్రామాలకు గాను ‘104’ వాహనాలు కేవలం 47 మాత్రమే ఉన్నాయి. ఒక్కో వాహనంలో ఒక డ్రైవర్, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈఓ) ఉంటారు. మొత్తం మీద 94 మంది సిబ్బంది పనిచేయాల్సి ఉండగా ప్రస్తుతం 88 మంది మాత్రమే ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక భవ్య హెల్త్ కేర్ సర్వీసెస్ 104 కాంట్రాక్ట్ చేపట్టింది. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం మొత్తం ఉద్యోగులలో 10 శాతం బఫర్ సిబ్బందిని నియమించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు బఫర్ ఉద్యోగులను నియమించలేదు. అదనపు పనిభారంతో సతమతం... సరిపడా సిబ్బంది లేకపోయినప్పటికీ భవ్య యాజమాన్యం పట్టించుకోవడంలేదని ఎంఎంయూ ఎంప్లాయిస్ యూనియన్ ఆరోపిస్తోంది. ఒక ఉద్యోగి చేత ఇద్దరు ఉద్యోగుల పనిని చేయించుకుంటోందని మండిపడుతున్నారు. రెండు వాహనాలకు ఒక డ్రైవర్కు డ్యూటీ వేయడం, ఒక డీఈఓతో రెండు వాహనాల డేటా ఎంట్రీ చేయిస్తున్నారు. దీంతో 104 ఉద్యోగులకు ఊపిరాడని పరిస్థితి నెలకొంటోంది. రోగులకు సేవలందించడంతో పాటుగా ప్రతి రోజూ వివిధ రికార్డులను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆరు రకాల రికార్డులు పూర్తి చేయడమే కాకుండా ఎంఓ యాప్ను కూడా ఆన్లైన్ చేయాలి. దీనికితోడు ఇటీవల భవ్య యాప్ తీసుకొచ్చి దానిని కూడా ఆన్లైన్ చేయమని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో 104 ఉద్యోగులకు అసలు పనికంటే కొసరు పనే ఎక్కువైపోయిందని వాపోతున్నారు. సెలవులివ్వకుండా హక్కులు హరి... కొంతమంది ఉద్యోగులకు ఇంటి వద్ద తల్లిదండ్రులు ఉన్నారు. భార్య, బిడ్డల బాధ్యతలు చూడాల్సి ఉంటుంది. స్వయంగా అనారోగ్యం పాలవుతుంటారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా 104 ఉద్యోగులకు యాజమాన్యం సెలవులు ఇవ్వడం లేదు. మరీ ముఖ్యంగా మహిళలకు ప్రత్యేక ఆరోగ్య పరిస్థితుల సమయంలో కూడా సెలవులివ్వకుండా వేధింపులకు పాల్పడుతోందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా సెలవు పెట్టినప్పటికీ ఇంటి వద్ద నుంచే విధులు నిర్వహించమని ఒత్తిడి చేస్తున్నట్లు ఉద్యోగులు వాపోతున్నారు. సెలవు రోజు వేతనం మాత్రం కట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల హక్కులు సరే మానవ హక్కులను కూడా యాజమాన్యం ఉల్లంఘిస్తోందని ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీతంలో రూ.500 కోత... గత ప్రభుత్వంలో సర్వీస్ ప్రొవైడర్గా వ్యవహరించిన అరవిందో ఇచ్చిన జీతాల కంటే ప్రస్తుతం భవ్య యాజమాన్యం తక్కువ జీతాలు చెల్లిస్తోంది. ఇస్తున్న అరకొర జీతాల్లో నుంచి ఉద్యోగులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నెలకు రూ.500 కోత విధిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఎందుకు కోత విధిస్తున్నారో, ఎవరు విధిస్తున్నారో సమాధానం చెప్పేవారే లేకుండా పోవడంతో 104 ఉద్యోగులు దిక్కులు చూస్తున్నారు. ఏడు నెలలుగా ఉద్యోగులకు పే స్లిప్పులు ఇవ్వకుండా యాజమాన్యం దాగుడుమూతలు ఆడుతోంది. గతంలో ఇచ్చినట్లుగానే భవ్య యాజమాన్యం కూడా జీతాలు ఇస్తుందని అధికారులు ఇచ్చిన హామీ గాలిలో కలిసిపోయిందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. నిబంధనల ప్రకారం ఈఎస్ఐ, పీఎఫ్లో యాజమాన్యం వాటా చెల్లించాల్సి ఉంది. కానీ 104 ఉద్యోగుల నుంచి కంపెనీ వాటా, ఉద్యోగి వాటా రెండూ వసూలు చేస్తున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. అసలు ఉద్యోగులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇవ్వకపోవడంతో ఉద్యోగులు అభద్రతకు గురవుతున్నారు. ప్రశ్నిస్తే వేటే... భవ్య యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలన్నిటినీ యథేచ్చగా ఉల్లంఘిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగులకు కనీసం సెలవులు కూడా ఇవ్వకుండా వేధిస్తోందని, చంద్రబాబు ప్రభుత్వంలోని పెద్దతలకాయల మద్దతుతో రెచ్చి పోతున్న యాజమాన్యం వైఖరిని ప్రశ్నించడం నేరమవుతోందని సిబ్బంది ఆరోపిస్తున్నారు. యాజమాన్యం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి అధికారిని కలవడానికి ప్రయత్నించిన యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీద వేధింపులకు దిగినట్టు సమాచారం. సదరు నాయకుడు డేటా ఎంట్రీ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన సెలవులో ఉన్నప్పుడు తనిఖీ పేరుతో వెళ్లిన అధికారి చేసిన హంగామా చూసి ఉద్యోగుల విస్తుపోయారు. 104 వాహనంలో కాలం చెల్లిన మందులు ఉన్నాయని డేటా ఎంట్రీ ఆపరేటర్ మీద వేటు వేయడంపై 104 ఉద్యోగుల యూనియన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. -
ప్రణవికి పతకాలు
జాతీయ స్థాయి పిస్టల్ షూటింగ్లోకొత్తపట్నం: ఢిల్లీలో జరుగుతున్న 68వ జాతీయ పిస్టల్ షూటింగ్లో కొత్తపట్నం మండలం రంగాయపాలెం పంచాయతీ వలసపాలెం గ్రామానికి చెందిన ద్వారం ప్రణవి రెండు పతకాలు సాధించింది. ఈ నెల 11 నుంచి వచ్చే నెల 4 వరకు ఢిల్లీలో నిర్వహించే 68వ జాతీయ స్థాయి 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ జూనియర్ విభాగంలో వెండి పతకం, సివిలియన్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. ఈ సందర్భంగా ద్వారం ప్రణవిని రాష్ట్ర రైఫిల్ అసోసియేషన్ కార్యదర్శి డి.రాజకుమార్, ఒలింపిక్ మెడలిస్ట్ గగన్ నారంగ్ అభినందించారు. -
క్రీస్తు పుట్టుక లోకానికి వెలుగు
నాగులుప్పలపాడు: క్రీస్తు పుట్టుక సర్వ మానవాళికి శాంతి, సహనం అందించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి మేరుగు నాగార్జున అన్నారు. పార్టీ మేధావుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కంచర్ల సుధాకర్ ఆధ్వర్యంలో అమ్మనబ్రోలు గ్రామంలో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మేరుగు నాగార్జున క్రీస్తు జననం ఆవశ్యకత తెలియజేశారు. అనంతరం చర్చి సభ్యులకు నూతన వస్త్రాలు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాలడుగు రాజీవ్, ఓబుల్ రెడ్డి, కోయి హనుమయ్య, బాలకృష్ణ, బత్తుల ప్రసన్న, కొండయ్య, జెట్టి శ్రీనివాసరావు, హరిప్రసాద్, తదితరులు ఉన్నారు. -
న్యాయ సమస్యలు పరిష్కరించి కానిస్టేబుల్ ఉద్యోగాలు
● రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఒంగోలు టౌన్: పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు గత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని, న్యాయపరమైన చిక్కులతో ఆగిపోయిన ప్రక్రియను తాము వచ్చాక క్లియర్ చేసి ఉద్యోగాలు ఇచ్చినట్లు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత చెప్పారు. పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థులకు ఒంగోలు పీటీసీలో నిర్వహించనున్న శిక్షణ తరగతులను సోమవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ 6,100 పోస్టులకు సుమారు 40 లక్షల మంది పోటీ పడ్డారని, లక్షలాది మందితో పోటీపడి నెగ్గి ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. పోలీసు శాఖలో మిగిలిన పోస్టులను కూడా భర్తీ చేస్తామని, ప్రతి ఏడాది పోలీసు, టీచర్ పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పోలీసంటే భయం, గౌరవం కనిపించాలని, అప్పుడే ప్రజల్లో పోలీసు శాఖపై నమ్మకం కలుగుతుందన్నారు. 9 నెలల శిక్షణ కాలంలో 30 ఏళ్ల సర్వీసుకు సరిపడా నేర్చుకోవాలని చెప్పారు. శాంతి భద్రతలు సక్రమంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయులు స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, కలెక్టర్ పి.రాజాబాబు, ఎస్పీ హర్షవర్థన్ రాజు, పీటీసీ ప్రిన్సిపాల్ జీఆర్ రాధిక, విజయవాడ డీసీపీ కేజీవీ సరిత తదితరులు పాల్గొన్నారు. గిద్దలూరు రూరల్: గ్యాస్ సిలిండర్ లీకై హోటల్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటన పట్టణంలోని జయరాం లాడ్జి సమీపంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళితే..హోటల్ యజమాని వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ లీకై మంటలు వ్యాపించాయి. దీంతో హోటల్లోని వారంతా భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. -
ప్రశ్నించే గొంతులపై ఉక్కుపాదం
ఒంగోలు సబర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగం కల్పించిన హక్కులను నిర్వీర్యం చేస్తూ రాజ్యాంగ స్వతంత్ర సంస్థలను తమ జేబు సంస్థలుగా మార్చుకుంటున్నాయని ఓపీడీఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ రాంకుమార్ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యహక్కుల పరిరక్షణ సంస్థ జిల్లా కమిటీ సమావేశం సోమవారం ఒంగోలులోని ఏఐబీఎస్పీ కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి ఓపీడీఆర్ జిల్లా అధ్యక్షుడు గాలి సంగీతరావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన రాంకుమార్ మాట్లాడుతూ దేశంలోని సంపదలను తమ అనుకూల కార్పొరేట్ శక్తులకు అప్పనంగా కట్టబెడుతున్నారని, ప్రశ్నిస్తున్న గొంతులపై ఉక్కుపాదం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ పేరుతో ఓటుహక్కులను కాల రాస్తున్నారని, స్వతంత్ర సంస్థగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘాన్ని తమ జేబు సంస్థగా మార్చుకున్నారని దుయ్యబట్టారు. వందేమాతరాన్ని ఒక సమస్యగా సృష్టిస్తూ ప్రజలను గందరగోళపరుస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని భూములను కార్పొరేట్ శక్తులకు తమ అనుకూల పెత్తందారులకు, పీపీపీ విధానాల పేరుతో ప్రభుత్వ ఆస్తులను కట్టబెడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును అమ్మేసేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. మెడికల్ కళాశాలను ప్రభుత్వమే నిర్వహించాలని, అప్పుడే ప్రజలందరికీ వైద్యం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. గిరిజనులపై ఉక్కుపాదం మోపుతూ ఖనిజ సంపదలను కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పే ప్రయత్నాలు విరమించుకోవాలని సూచించారు. బూటకపు ఎన్కౌంటర్లు ఆపాలని, శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు చావలి సుధాకర్రావు, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ పి.పేరయ్య, ఐఎల్పీ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సుందరం, ఓపీడీఆర్ జిల్లా కమిటీ సభ్యులు న్యాయవాది పరిటాల వెంకటేశ్వర్లు, శిరీష, భీమవరపు సుబ్బారావు, షేక్ మొహమ్మద్ బాష, పి.నరేంద్ర, ఎం సుబ్బారావు, టి.వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రమాదంలో భారత రాజ్యాంగం మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ మానుకోవాలి ఓపీడీఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ రామ్కుమార్ ధ్వజం -
కంది పోయేంత కష్టం..!
కనిగిరి రూరల్: జిల్లాలో సాగుచేసిన కంది పంట ప్రస్తుతం పూత, పిందె, కాయ దశలో ఉంది. పూత మెండుగా రావడంతో కళకళలాడుతుండగా, ఒక్క తడి కోసం రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. 2025–26 పంటకు సంబంధించి ఖరీఫ్ సీజన్లో వేసిన కంది ఏపుగా పెరిగింది. పూత, పిందె దశకు చేరుకుంది. లేట్ ఖరీఫ్, ఎర్లీ రబీలో వేసిన కందికి మాత్రం తడులు అవసరమని రైతులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా మంచు తీవ్రంగా పడుతోంది. సరైన నీటి తడులు లేని చోట బెట్టకు వచ్చింది. ఏపుగా పెరిగిన కంది మొక్కలు సాయంత్రానికి ఢీలా పడి నేలవాలుతున్నాయి. దానికితోడు పూత, పిందె, కాయకు తెగుళ్లు ఆశిస్తుండటంతో అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. బాగా కళకళలాడుతున్న పంట తెగుళ్ల ధాటికి విలవిల్లాడుతుండటంతో సస్యరక్షణ చర్యల్లో రైతన్న నిమగ్నమయ్యాడు. జిల్లాలో అత్యధికంగా కనిగిరిలోనే కంది సాగు.. జిల్లాలోని 36 మండలాల్లో 2024–25లో 73,303 హెక్టార్లకుగానూ 70,967 హెక్టార్లలో కంది పంట సాగు చేశారు. ఈ ఏడాది 2025–26లో ఖరీఫ్ కింద కంది సాధారణ విస్తీర్ణం 68,287 హెక్టార్లు కాగా, 76,087 హెక్టార్లలో సాగు విస్తీర్ణంగా నమోదైంది. రబీలో 99 హెక్టార్లలో సాగు చేశారు. జిల్లాలో అత్యధికంగా కంది సాగు చేసే వ్యవసాయ సబ్ డివిజన్లలో కనిగిరి ఒకటి. కనిగిరి ప్రాంతంలో అత్యధికంగా సాగు చేసే ప్రధాన పంట కంది. వ్యవసాయ సబ్ డివిజన్లోని ఆరు మండలాల్లో ఖరీఫ్లో సాధారణ విస్తీర్ణం 29,050 హెక్టార్లు కాగా, సాగు విస్తీర్ణం 37,118 వరకు ఉంది. రబీలో సాధారణ విస్తీర్ణం 24,361 హెక్టార్లు కాగా.. ఇప్పటి వరకు 9,060 హెక్టార్లకుపైగా వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. అత్యధికంగా కంది సాధారణ విస్తీర్ణం 15,193 హెక్టార్లు కాగా, ఇప్పటి వరకు 21,969 హెక్టార్లలో సాగు చేశారు. కనిగిరి మండలంలో 9,613 హెక్టార్లు, పామూరులో 1,712 హెక్టార్లు, వెలిగండ్ల 4,164 హెక్టార్లు, హెచ్ఎం పాడు 724 హెక్టార్లు, సీఎస్ పురం 621 హెక్టార్లు, పీసీ పల్లిలో 5,119.3 హెక్టార్లలో పంట వేసినట్లు ఇప్పటి వరకు నివేదికలున్నాయి. ఇవి గాక లేట్ ఖరీఫ్ కింద కొందరు రైతులు కంది సాగుచేశారు. ఇటీవల తుఫాన్ వల్ల కురిసిన వర్షాలకు అక్కడక్కడా నీటి మునిగిన పైరు కొంత దెబ్బతిన్నా.. మిగతా పంట సుమారు 3, 4 అడుగుల ఎత్తు పెరిగి పూత దశలో ఉంది. ఆశిస్తున్న తెగుళ్లు... ఖరీఫ్లో వేసిన కంది పైరు ఎక్కువ శాతం పూత, పిందె, కాయ దశలో ఉంది. మేలైన దిగుబడులు సాధించాలంటే పైరు తెగుళ్ల బెడద నుంచి రైతు తప్పించుకోవాలి. కందికి ప్రస్తుత దశలో మారుకా మచ్చల పురుగు, కాయ ఈగ, కాయ తొలుచు పురుగు, వెర్రి తెగులు పురుగు, గూడు పురుగు, తెల్లపురుగు ఆశిస్తోంది. కనిగిరి ప్రాంతంలో మారుకా మచ్చ పురుగు, (గూడు పురుగు), తెల్లపురుగు ఆశిస్తున్నట్లు చెప్పారు. మారుకా మచ్చ పురుగు మొగ్గ లోపల ఉండి తింటోంది. తర్వాత లేత ఆకులు, పూత పిందె కాయలను కలిపి గూడుగా చేసుకుని తింటుంది. కాయ అడుగు భాగంలో చిన్న రంధ్రం వేసి లోపలకి వెళ్లి గింజలు తిని కాయలను డొల్ల చేస్తోంది. మరో వైపు పూత దశలో ఉన్న కంది ఉదయాన్నే మంచుకు కళకళలాడినా.. సాయంత్రానికి సరైన తడులు లేకపోతే బెట్టకు వచ్చి నేలకు వాలుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కంది పంటను ఆశించిన తెల్ల పురుగు కంది పంటపై పురుగుల దాడి విపరీతంగా ఆశిస్తున్న తెగుళ్లు ఉదయం కళకళ.. సాయంత్రానికి డీలా..! దిక్కుతోచని స్థితిలో రైతన్న జిల్లాలో 76,087 హెక్టార్లలో కంది పంట సాగు కనిగిరి వ్యవసాయ సబ్ డివిజన్లో అత్యధికంగా 37,118 హెక్టార్లలో పంట -
ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్ట బందోబస్తు
● అధికారులను ఆదేశించిన కలెక్టర్ రాజాబాబు ఒంగోలు సబర్బన్: జిల్లాకు సంబంధించి ఈవీఎంలను భద్రపరచిన గోడౌన్ వద్ద నిరంతరం పటిష్ట భద్రత ఉండాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పి.రాజాబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు, మార్గదర్శకాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా సోమవారం ఒంగోలు నగరంలోని మామిడిపాలెంలో ఉన్న ఈవీఎం గోదాములను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలు, వీవీ ప్యాడ్స్, కంట్రోల్ యూనిట్స్, బ్యాలెట్ యూనిట్లలను, భద్రతా ఏర్పాట్లను క్షుణంగా పరిశీలించారు. అప్రమత్తంగా ఉండాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఒంగోలు డీఆర్ఓ చిన ఓబులేసు, చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, కలెక్టరేట్ సూపరింటిండెంట్ శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ తరుపున దామరాజు క్రాంతికుమార్, ఎనిమిది నియోజక వర్గాల డీటీలు, ఇతర రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పెద్దదోర్నాల: కుందేలు మాంసంతో పట్టుబడిన యువకుడికి అటవీశాఖ అధికారులు రూ.లక్ష జరిమానా విధించారు. ఈ సంఘటన సోమవారం మండల పరిధిలోని తిమ్మాపురంలో జరిగింది. మండల పరిధిలోని తిమ్మాపురంలో కుందేలు మాంసాన్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న పిక్కిలి రవి అనే యువకుడిని అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ప్రథమ నేరంగా పరిగణిస్తూ రూ.లక్ష జరిమానా విధించినట్లు పెద్దదోర్నాల రేంజి అధికారి హరి తెలిపారు. వీఆర్వోత సునీత, బీట్ ఆఫీసర్ కృష్ణవేణి తదితరులు ఉన్నారు. -
ఉంగరం కోసమే హత్య
సింగరాయకొండ: టంగుటూరులో జరిగిన హత్య కేసును పోలీసులు నాలుగు రోజుల్లో ఛేదించారు. మృతుడు నిందితునికి రూ.7 వేలు ఇవ్వాల్సి ఉండగా..ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదు. దీంతో అతన్ని చంపి, చేతికి ఉన్న ఉంగరాన్ని తీసుకోవాలని పథకం ప్రకారమే హత్య చేశాడు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. టంగుటూరుకు చెందిన మృతుడు రమణయ్య, జరుగుమల్లి మండలం వావిలేటిపాడుకు చెందిన నిందితుడు ఏడుకొండలు గతంలో స్థానికంగా రొయ్యల ఫ్యాక్టరీల్లో పనిచేశారు. ప్రస్తుతం రమణయ్య బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా, ఏడుకొండలు విజయవాడలో ర్యాపిడ్లో పనిచేస్తున్నాడు. గతంలో ఏడుకొండలు మృతుడు రమణయ్యకు రూ.7 వేలు అప్పుగా ఇచ్చాడు. ఎన్నిసార్లు అడిగినా నగదు ఇవ్వకపోవడంతో చేతికి రమణయ్యను హత్య చేసి చేతికి ఉన్న ఉంగరం చోరీ చేయాలని నిర్ణయించాడు. ఆ ప్రకారం ఈ నెల 16వ తేదీ పథకం ప్రకారం ఒంగోలు నుంచి వచ్చిన ఏడుకొండలు టంగుటూరులోని రమణయ్య ఇంటికి వెళ్లి అతనితో కలిసి అర్ధరాత్రి సుమారు 12:30 గంటల వరకు మద్యం సేవించారు. అనంతరం పథకం ప్రకారం వెంట తెచ్చుకున్న సుత్తితో రమణయ్య తలపై కొట్టాడు. కొన ఊపిరితో ఉండగా ఇంట్లో ఉన్న కత్తితో గొంతు కొసి ఉంగరం తీసుకొని ఉడాయించాడు. తొలుత ఎటువంటి ఆధారాలు దొరకలేదన్నారు. హత్య కేసును సింగరాయకొండ సీఐ సీహెచ్ హజరత్తయ్య, ఎస్సైలు బి.మహేంద్ర, నాగమల్లేశ్వరరావు, బి.మహేంద్ర, సిబ్బంది కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి చాకచక్యంగా నాలుగురోజుల్లో కేసును ఛేదించి ఆదివారం నిందితున్ని అరెస్టు చేశామన్నారు. టంగుటూరు హత్య కేసును ఛేదించిన పోలీసులు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడి -
పనులు చేశాం..బిల్లులు ఇవ్వరా..?
రాచర్ల: చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో అనుములపల్లె పంచాయతీ సర్పంచ్ సిరిగిరి రమేష్ సోమవారం మండల పరిషత్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసనకు దిగాడు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ గ్రామాల్లో బోర్ల మరమ్మతులు, తాగునీటి పైపుల లీకేజీల మరమ్మతులు, వీధిలైట్లు, పారిశుధ్య పనులన్నీ కూడా పంచాయతీ కార్యదర్శి సూచన మేరకే చేశానన్నారు. ఆ పనులకు సంబంధించి రూ.3.50 లక్షల బిల్లు మంజూరు చేయకుండా అధికారులు జాప్యం చేస్తున్నారని ఎంపీడీఓ దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతం అనుములపల్లెలో తాగునీటి మోటార్లు మరమ్మతులకు గురై ఐదు రోజులుగా తాగునీరు సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్తులు పడుతున్నారని చెప్పారు. సర్పంచ్తో కలిసి 20 మందికి పైగా గ్రామస్తులు మండల పరిషత్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. చేసిన పనులకు బిల్లులు మంజూరు చేయాలని కోరారు. అయితే కార్యాలయం ఎదుట నిరసనకు అనుమతి లేదని పోలీసులు సర్పంచ్ను పోలీస్స్టేషన్కు తరలించారు. అక్కడ కొంత సేపు కూర్చోపెట్టి ఇంటికి పంపించారని సర్పంచ్ రమేష్ తెలిపారు. మండల పరిషత్ కార్యాలయం ఎదుట సర్పంచ్ నిరసన -
విద్యుత్ టవర్ల రక్షణకు పటిష్ట చర్యలు
మార్కాపురం: మండలంలోని దరిమడుగు సమీపంలోని మహమద్సాబ్ కుంట వద్ద ఉన్న విద్యుత్ టవర్ల రక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు ట్రాన్స్కో ఈఈ మేకల రవిశంకర్ తెలిపారు. మట్టి మాఫియాతో ఏర్పడిన గుంతలు, ఇటీవల కురిసిన వర్షాలకు చేరిన నీటితో ప్రమాదం అంచున ఉన్న విద్యుత్ టవర్లపై ఈ నెల 19న సాక్షిలో శ్రీ220 కేవీ విద్యుత్ టవర్కు పొంచివున్న ముప్పుశ్రీ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన ఈఈ ఎస్కే అమీన్, సివిల్ ఈఈ నాగరాజు, డీఈ సుధీర్బాబు సందర్శించారు. తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని కాంట్రాక్టర్ పి.వెంకటేశ్వర్లుకు చెప్పామన్నారు. గిద్దలూరు రూరల్: రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పట్టణంలోని రాచర్లగేటు సమీపంలో రైల్వేట్రాక్పై ఆదివారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని నరవ గ్రామానికి చెందిన దుగ్గెపోగు రమేష్(33) పెయింటింగ్ కాంట్రాక్టు పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబ కలహాలతో గిద్దలూరుకు వచ్చి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సమాచారం అందుకున్న నంద్యాల జీఆర్పీఎఫ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మార్కాపురం: విద్యుదాఘాతానికి రైతు మృతి చెందాడు. ఈ సంఘటన తర్లుపాడు మండలంలోని జగన్నాథపురంలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన సయ్యద్ చాంద్బాషా (39) పొలానికి వెళ్లిన సమయంలో పొలం గట్టున ఉన్న విద్యుత్ కంచె తగిలి మృతి చెందాడు. తమ్ముడు ఖాశీంవలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బ్రహ్మనాయుడు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ● అధికారులతో సమీక్షలో కలెక్టర్ రాజా బాబు ఒంగోలు సబర్బన్: ఒంగోలు రెడ్క్రాస్ బ్లడ్ బ్యాంకును అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో రెడ్క్రాస్ సంస్థను అభివృద్ధి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ సభ్యులు, అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రెడ్క్రాస్ సంస్థలో బ్లడ్ కొరత లేకుండా బ్యాంకులో బ్లడ్ నిల్వలు చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. రెడ్క్రాస్ బ్లడ్ బ్యాంకులో 300 యూనిట్లు బ్లడ్ నిల్వలు చేయడానికి అవకాశం ఉందని, కానీ ఇప్పటి వరకు 100 యూనిట్ల రక్తం నిల్వలు మాత్రమే ఉన్నాయని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో జరిగే రాష్ట్ర పండుగలకు, ప్రత్యేక రోజుల్లో నిర్వహించే ఉత్సవాల్లో బ్లడ్ క్యాంపు నిర్వహించి దాతల నుంచి రక్త సేకరణ చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. సమావేశంలో స్టెప్ సీఈఓ శ్రీమన్నారాయణ, రెడ్ క్రాస్ కమిటీ సభ్యులు ఎం.నరసింహారావు, సి.ఆంజనేయులు, ఏ. వెంకట్రావు, ఏ.శ్రీనివాసరావు, డి.రవి ప్రకాష్ , బి.వి.ఎస్.కే కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయ కుట్రతోనే పేరు మార్పు
● ఉపాధి హామీ చట్టంలో మార్పులను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన ఒంగోలు టౌన్: రాజకీయ కుట్రతోనే ఉపాధి హామీ పథకం చట్టంలో మహాత్మాగాంధీ పేరు తొలగించారని, దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఎలాంటి పాత్ర పోషించని బీజేపీ.. చరిత్రను మసిపూసి మారేడుకాయ చేసేందుకు కుయుక్తులకు పాల్పడుతోందని వామపక్ష పార్టీల నాయకులు ధ్వజమెత్తారు. మహాత్మా గాంధీ పేరు తొలగించి జీ రాం జీ పేరు పెట్టిన మోదీ సర్కార్ ఉపాధి చట్టాన్ని కుదించి ఒక స్కీంలాగా మార్చివేయడం ప్రజలను దగా చేయడమేనని మండిపడ్డారు. ఉపాధి హామీ చట్టంలో మార్పులకు నిరసనగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆర్.వెంకటరావు అధ్యక్షత వహించగా, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ మాట్లాడారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి నిరంతరం కుట్రలు చేస్తూనే ఉన్నారని ఆరోపించారు. ప్రతి బడ్జెట్లోనూ ఉపాధి చట్టానికి నిధుల కోత విధిస్తూ వచ్చారని చెప్పారు. గ్రామీణ నిరుపేద ప్రజలకు పని చూపించడం, లేనిపక్షంలో తిండి పెట్టేందుకు చొరవ చూపడమే ఉపాధి హామీ పథకం లక్ష్యమని తెలిపారు. వామపక్ష పార్టీల ఒత్తిడి మేరకు యూపీఏ తీసుకొచ్చిన ఈ పథకంతో గ్రామీణ ప్రాంతాల రూపరేఖలు మారాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం నిధులను భరించాలనడమే కాకుండా తన వాటాను ముందుగానే డిపాజిట్ చేయాలనడం దుర్మార్గమన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు మాట్లాడుతూ ఉపాధి పథకం అమలైనప్పటి నుంచి నేటి వరకు దేశంలో రూ.9 లక్షల కోట్ల పనులు జరిగాయని తెలిపారు. దీనివలన గ్రామీణ ప్రాంతాలలో ఎన్ఎస్పీ చెరువులు, రోడ్లు, కుంటలు అభివృద్ధి చెందాయని, గ్రామీణ ప్రజల జీవితాలలో ఎంతోకొంత మార్పు తీసుకొచ్చిందని అన్నారు. వలసలు తగ్గాయని, పనులు లేని సమయంలో చిన్న, సన్నకారు రైతులు ఉపాధి పనులకు వెళ్లారని గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు రైతులు, కూలీల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. నిరసన కార్యక్రమంలో సీపీఐ న్యూ డెమెక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, సంయుక్త కిసాన్ జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు, శ్రీరాం శ్రీనివాసరావు, సయ్యద్ మౌలాలి, ఎంఏ సాలార్, జూపల్లి కోటేశ్వరరావు, నల్లూరి మురళి, కొత్తకోట వెంకటేశ్వర్లు, దాసరి అంజయ్య, బాలాజీరెడ్డి, లలిత కుమారి, ఎల్.రాజశేఖర్, కంకణాల ఆంజనేయులు, పమిడి వెంకటరావు, జీపీ రామారావు, ఎం.విజయ తదితరులు పాల్గొన్నారు. -
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న అధికారులు
● మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సింగరాయకొండ: చంద్రబాబు ప్రభుత్వంలో అధికారులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ విమర్శించారు. సింగరాయకొండ పార్టీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ సురేష్ మాట్లాడుతూ మీది రెడ్బుక్ అయితే మాది డిజిటల్ బుక్ అన్నారు. చివరికి జగనన్న పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటానికి కూడా ఆంక్షలు విధిస్తున్నారన్నారు. పోలీసులు ఫోన్ చేసి కందుకూరు రోడ్డు సెంటర్లో కాదు శానంపూడి రోడ్డులోని ఆర్చి వద్ద వేడుకలు జరుపుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారని, చివరకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా వెంటనే తొలగించాలని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. జగనన్న పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనటం మంచి పరిణామమన్నారు. 2027వ సంవత్సరంలో ముందస్తు జమిలి ఎన్నికలు తథ్యమని అన్నారు. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో డీ లిమిటేషన్ ఉండదని, నియోజకవర్గాల పునర్విభజన జరగదన్నారు. 2026వ సంవత్సరంలో జనగణన పూర్తి కాగానే మోదీ ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమవుతుందని వివరించారు. ఒంగోలు: ఉపాధ్యాయుల క్రీడాపోటీలు స్థానిక మినీ స్టేడియంలో సోమవారం ఉత్సాహంగా నిర్వహించారు. జిల్లా స్థాయి క్రీడాపోటీల్లో భాగంగా పురుషులకు క్రికెట్, మహిళలకు త్రోబాల్ పోటీలు నిర్వహించారు. క్రికెట్ విజేతగా మార్కాపురం డివిజన్, రన్నర్స్గా కనిగిరి డివిజన్ జట్లు నిలిచాయి. త్రోబాల్ విన్నర్స్గా కనిగిరి డివిజన్, రన్నర్స్గా ఒంగోలు డివిజన్ జట్లు నిలిచాయి. ఈ సందర్భంగా వారికి జిల్లా విద్యాశాఖ అధికారి సీవీ రేణుక మెడల్స్ అందించి అభినందించారు. జనవరిలో రాష్ట్రస్థాయిలో జరిగే పోటీల్లో కూడా రాణించి ప్రకాశం జిల్లా ఖ్యాతిని రాష్ట్రస్థాయిలో ఇనుమడింపజేయాలని ఆమె కోరారు. క్రీడా పోటీలను ఉప విద్యాశాఖ అధికారి చంద్ర మౌళీశ్వరరావు, మండల విద్యాశాఖ అధికారులు టి.కిషోర్బాబు, తన్నీరు బాలాజీ, కె.శ్రీనివాసరావులతోపాటు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి డాక్టర్ చెక్కా వెంకటేశ్వర్లు, ఎ.శిరీషాకుమారి పర్యవేక్షించారు. ● జిల్లా అధికారులను ఆదేశించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఒంగోలు సబర్బన్: జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల్లోని మూడు జిల్లాల్లో కూడా బ్లాక్ బర్లీ పొగాకు రైతులు ఎవరూ సాగు చేయవద్దని రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం అమరావతి నుంచి స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఆధ్వర్వంలో డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, టొబాకో బోర్డు, టొబాకో అసోసియేషన్, వివిధ కంపెనీ అధికారులు, మార్క్ఫెడ్ హెడ్ ఆఫీసు డిస్ట్రిక్ట్ మేనేజర్స్, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాశం, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్స్, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్స్తో టొబాకో బ్లాక్ బర్లీ, వైట్ బర్లీ సాగు వివరాలపై చర్చించారు. బ్లాక్ బర్లీ ఎవరూ సాగు చేయటానికి వీలులేదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తేల్చి చెప్పారు. వైట్బర్లీ సాగు చేసే రైతులు కంపెనీ వారి దగ్గర ఎంఓయూ కుదుర్చుకొని మాత్రమే సాగు చేయాలని సూచించారు. అదే విధంగా వైట్బర్లీ సాగు వివరాలను కంపెనీ వారు రైతు వారీగా వ్యవసాయాధికారులకు జాబితా పంపాలని సూచించారు. సమావేశంలో ఒంగోలు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ రాజాబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఉపాధి కరువై.. ఊరు బరువై..!
గ్రామీణ పేదలకు జీవనోపాధి భద్రత, వలసల తగ్గింపు, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి సాధన అనే లక్ష్యంతో అమలవుతోంది ఉపాధి హామీ పథకం. తాజాగా కేంద్రం తీసుకొచ్చిన నిబంధనలు పేదల బతుకులకు అవరోధంగా మారనున్నాయి. ఉపాధి కరువై వారు వలస బాట పట్టే పరిస్థితులు ఉత్పన్నం కానున్నాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథక లక్ష్యానికి తూట్లు పొడుస్తూ వచ్చింది. తొలిరోజు నుంచే రాజకీయ కారణాలతో ఉపాధి పనులను దెబ్బ తీసింది. రకరకాల సాకులు చెబుతూ జిల్లాలో ఉపాధి జాబ్ కార్డుల్లో భారీగా కోతలు పెట్టింది. అరకొర పనులు.. ఆపై బిల్లుల చెల్లింపులో ముప్పు తిప్పలు పెట్టడం వెరసి ఉపాధి కూలీలు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారు. ఇప్పటికే లక్ష మందికిపైగా వలస బాట పట్టగా, రానున్న రోజుల్లో మరో లక్షమంది జిల్లా వదలిపోయే ప్రమాదం ఉంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఉపాధి హామీ పథకానికి మంగళం పాడేందుకు పాడె సిద్ధమైంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉపాధి కూలీలకు కష్టాలు మొదలయ్యాయి. జిల్లాలో తొలుత ఫీల్డ్ అసిస్టెంట్ల చేత రాజీనామాలు చేయించడంతో తొలి ఏడాది పనులు ఆగిపోయాయి. రెండో ఏడాది నుంచి రకరకాల సాకులు చెబుతూ జిల్లాలో జాబ్ కార్డుల్లో భారీగా కోతలు పెట్టింది. దానికి తోడు అరకొర పనులు చేయిస్తున్నా బిల్లులను సకాలంలో మంజూరు చేయకుండా ఉపాధి కూలీలను ముప్పుతిప్పలు పెట్టడం మొదలు పెట్టారు. కోట్లాది రూపాయల వేతనాలు ఇవ్వకపోవడంతో ఉపాధి కూలి పనుల కోసం ఇతరత్రా దారులు వెదుక్కోవడం తప్పడంలేదు. తాజాగా కేంద్రం తీసుకొచ్చిన మార్పుతో పథకం నిర్వీర్యం కానుందని గ్రామీణ ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు. జిల్లాలో 4.1 లక్షల జాబ్కార్డులు ఉండగా 50 వేల కార్డులను తొలగించడంతో 3.6 లక్షల కార్డులు మిగిలాయి. ఉపాధి హామీ నిబంధనల ప్రకారం ఒక్కొక్క కుటుంబానికి ఏడాదికి 100 రోజులు పని కల్పించాల్సి ఉంది. ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం పనిదినాలకు 125 రోజులకు పెంచింది. నిజానికి జిల్లాలో 50 రోజుల పనులు కూడా జరగడం లేదని ఉపాధి కూలీలు ఆరోపిస్తున్నారు. గత ఏడాది 10,407 మంది వంద రోజుల పాటు పనులు చేయగా, ఈ ఏడాది కేవలం 1166 మంది మాత్రమే పనులు చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దీనిని బట్టి జిల్లాలో ఉపాధి హామీ పథకం పనులు ఏ విధంగా సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. మార్పులతో చిక్కులే.. ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకంలో చేసే ఖర్చుల్లో 90 శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుండగా 10 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇక నుంచి దీనిని 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రం భరించేలా మార్పులు చేశారు. రాష్ట్ర వాటా డిపాజిట్ చేసిన తరువాతనే కేంద్రం తన వంతు వాటా విడుదల చేస్తుందని షరతు విధించారు. అసలే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని కొండెక్కి కూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటా ఖర్చుచేయడం అనుమానమేనని ప్రజా సంఘాల నాయకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధిలో భాగంగా చేసే పనులను గ్రామ సభలు నిర్వహించడం ద్వారా ఎంపిక చేసేవారు. దానికి బదులుగా ఏఏ పనులు చేయాలో ఇక కేంద్రమే నేరుగా నిర్ణయిస్తుంది. దీని వలన అవసరమైన పనులు జరిగే అవకాశం ఉండకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. మరో లక్ష మంది వలస బాట తప్పదా... చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామాల్లో వలసలు పెరిగిపోయాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అటకెక్కడం, ప్రభుత్వం సాయం చేయకుండా ఒట్టిమాటలతో కాలం గడుపుతుండడంతో కుటుంబ పోషణ కోసం గ్రామీణ ప్రజలు వలస బాట పట్టారు. మార్చి నుంచి అక్టోబర్ వరకు జిల్లాలో ఏడాదికి లక్ష మంది వలసపోయినట్లు అంచనాలు ఉన్నాయి. ఎక్కువగా పశ్చిమ ప్రకాశం జిల్లా నుంచే వలసలు వెళుతున్నారని తెలుస్తోంది. మార్కాపురం పరిసర ప్రాంతాల నుంచి గుంటూరు, కర్నూలు ప్రాంతాలకు పత్తి తీయడానికి, మిర్చి కోతలకు వెళుతున్నట్లు సమాచారం. చెరుకు కోతలకు గాను యర్రగొండపాలెం పరిసర ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం వైపునకు కొందరు, రాయలసీమలోని చిత్తూరు ప్రాంతాలకు మరికొందరు వెళుతున్నట్లు తెలిసింది. జిల్లాలోని కనిగిరి, గిద్దలూరు పరిసర ప్రాంతాల నుంచి హైదరాబాద్, చైన్నె, బెంగళూరు తదితర నగరాల్లో భవన నిర్మాణ కార్మికులుగా పనులకు వెళుతున్నారు. ఇప్పుడు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులతో ఉపాధి పథకం పూర్తిగా నిర్వీర్యం అవడం ఖాయమని వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు ఆందోళన చెందుతున్నారు. కొత్త నిబంధనలు ప్రకారం చూస్తే మరో లక్ష మందికి పైగా జీవనోపాధిని వెదుక్కుంటూ వలసబాట పట్టే అవకాశం ఎక్కువగా ఉందన్న ఆందోళన గ్రామీణ ప్రాంతాల పేద ప్రజల్లో వ్యక్తమవుతోంది. నాలుగు నెలలుగా వేతనాలు లేవు... జిల్లాలో ఉపాధి వేతనాల బకాయిలు కొండలా పేరుకొని పోతున్నాయి. పనిచేసిన తర్వాత నెలల తరబడి వేతనాలు ఇవ్వకపోవడంతో ఉపాధి కూలీలు నిరాశకు గురౌతున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 4వ తేదీ వరకు చేసిన పనులకు వేతనాలు మంజూరయ్యాయి. ఆ తరువాత నేటి వరకు అంటే నాలుగు నెలల వేతనాలు మంజూరు కాలేదు. దీని తాలుకు రూ.78 లక్షలు పెండింగ్లో ఉన్నాయి. అంతేకాకుండా సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, గోకులం షెడ్లు, నీటి తొట్ల నిర్మాణాలతోపాటుగా హార్టీకల్చర్ కింద పండ్ల తోటలు సాగు చేస్తున్న రైతులకు సైతం బిల్లులు మంజూరు కాలేదు. సుమారు రూ.70 కోట్లకు పైగానే బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇప్పడు ఉపాధి హామీ పథకంలో చేసిన మార్పుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం ఖర్చు భరించాల్సి ఉంటుంది. ఈ లెక్కన పెండింగ్ బిల్లులు ఎప్పటికొస్తాయో చెప్పలేని పరిస్థితి నెలకొందని అధికారులు నొసలు విరుస్తున్నారు. -
అంగన్వాడీ ఆయాకు విద్యుత్ రాయితీ రాదట!
ఒంగోలు సబర్బన్: అంగన్వాడీ ఆయా..వచ్చేది గౌరవ వేతనం నెలకు రూ.7 వేలు మాత్రమే. ఆమెకు ఆ నగదు వేసేది సీఎఫ్ఎంఎస్ ద్వారానే. దీంతో ఆమెకు ఎస్సీ కోటాలో రావాల్సిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎత్తేసింది. దీనిపై బాధితులు కలెక్టర్ను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే సోమవారం కలెక్టర్ రాజాబాబు నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో టంగుటూరు మండలం ఎం.నిడమనూరుకు చెందిన అంగన్వాడీ ఆయా తాటితోటి శిరీష భర్త పిడుగురాళ్ల సురేష్ బాబు నిరుపేదనైన, ఎస్సీ సామాజికవర్గానికి చెందిన తన కుటుంబానికి రావల్సిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం రద్దు చేశారని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తన భార్య అంగన్వాడీ ఆయా అని, తనకు నెలకు రూ.7 వేలు మాత్రమే గౌరవ వేతనం వస్తుందని, కానీ విద్యుత్ అధికారులు మాత్రం తన భార్య శిరీష అంగన్వాడీ కార్యకర్త(టీచర్) అని నెలకు రూ.12 వేలు వస్తుందని రాశారన్నారు. ఆయా ఉద్యోగం చేస్తుంటే టీచర్ ఉద్యోగం చేస్తుందని రాయటంతో ఉచిత విద్యుత్ పథకానికి రావాల్సి రాయితీ రాకుండా విద్యుత్ అధికారులు, సిబ్బంది చేశారని కలెక్టర్ ముందు వాపోయాడు. దాంతో కలెక్టర్ రాజాబాబు ఏపీసీపీడీసీఎల్ ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లును పిలిపించారు. ఉచిత విద్యుత్ పథకం నష్టపోవటానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆ కుటుంబానికి తెల్ల రేషన్కార్డు ఉంది. పిల్లలకు తల్లికి వందనం వస్తుంది. కానీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం మాత్రం చంద్రబాబు ప్రభుత్వం ఎత్తేసింది. దాంతో చివరకు సీఎఫ్ఎంఎస్ ద్వారా గౌరవ వేతనం పడుతుంది కాబట్టి ఉచిత విద్యుత్ పథకం పోయిందని తేల్చారు. అందుకు సంబంధించిన విధివిధానాలపై ప్రభుత్వానికి నివేదిక పంపుదామని, పూర్తి వివరాలు ఒక రిపోర్టు రూపంలో తనకు పంపాలని విద్యుత్ ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లుకు కలెక్టర్ రాజాబాబు సూచించారు. అర్జీలను వెంటనే పరిష్కరించాలి: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలకు నాణ్యతతో కూడిన సత్వర పరిష్కారాన్ని అందించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబు వచ్చిన అర్జీలను నిశితంగా పరిశీలించారు. మొత్తం 268 వినతులను కలెక్టర్ పరిశీలించారు. వచ్చిన అర్జీలను ఆయాశాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్ రెడ్డి, కుమార్, జాన్సన్, కళావతి, విజయజ్యోతి, డీపీఓ ముప్పూరి వెంకటేశ్వరరావులతో కలసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. నిధులు విడుదల చేయాలని కలెక్టర్కు సర్పంచుల వినతి గిద్దలూరు రూరల్: మండలంలోని గ్రామ పంచాయతీల్లో పలు అభివృద్ధి పనులకు సంబంధించిన నిధుల విడుదల కోసం సర్పంచులు సోమవారం ఒంగోలులోని పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబును కలిసి వినతి పత్రం అందజేశారు. గిద్దలూరు మండలంలోని గ్రామ సర్పంచులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు మంజూరు చేయడంలో ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. తమ గ్రామ పంచాయతీలో వివిధ అభివృద్ధి పనుల కోసం గత 6 నెలలుగా ఖర్చు చేసిన నిధుల బిల్లులు ప్రభుత్వం నుంచి విడుదల కాలేదని వాపోయారు. ఒక్కో గ్రామ పంచాయతీలో సుమారు రూ.5 లక్షల మేర నిధులు ప్రభుత్వం నుంచి విడుదల కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల సర్పంచులు బయట అప్పులు చేసి మరీ ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అర్జీ ఇచ్చిన వారిలో సర్పంచులు ఏరువ రాజశేఖరరెడ్డి, అంజినాయక్, బండి శ్రీనివాసులు, భూదేవి, లక్ష్మీ ప్రసన్న, సమాధుల రాజేశ్వరి పాల్గొన్నారు. -
నాడు–నేడుతో రూపురేఖలు మారిన పాఠశాల
చీమకుర్తి: వైఎస్సార్ సీపీ హయాంలో సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన నాడు – నేడు ఫేజ్–1, ఫేజ్–2 పథకంతో చీమకుర్తి మండలం ఇలపావులూరు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల రూపురేఖలే మారిపోయాయి. రూ.43 లక్షలు ఖర్చుచేసి పాఠశాలకు ఆర్చి నిర్మాణంతో పాటు ప్రతి తరగతి గదిని గ్రానైట్ రాళ్లతో అద్దంలా తీర్చిదిద్దారు. పాఠశాల ఆవరణలో టైల్స్ పరిచారు. నాడు–నేడు నిధులతో పాఠశాల ఎంట్రెన్స్లో కార్పెట్ పరిచినట్లు సుందరంగా తీర్చిదిద్దారని ఆ గ్రామానికి చెందిన మనుబ్రోలు ఉమామహేశ్వరరావు, తదితరులు ఎంతో గొప్పగా చెబుతున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు మించి పాఠశాల తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలు, పిల్లలను అలరించేలా వేసిన పెయింటింగ్ నేటికీ విద్యార్థులను, గ్రామస్తులను ఎంతో ఆకర్షిస్తోంది. దీంతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగింది. సౌకర్యంగా పాఠాలు బోధించేందుకు నాడు–నేడు పథకం ద్వారా జరిగిన అభివృద్ధి పనులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఉపాధ్యాయులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికే తలమానికంగా పాఠశాల ఉందంటూ గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఉమా మహేశ్వరరావు తెలిపారు. -
విద్యుత్ పొదుపుపై అవగాహన పెంచుకోవాలి
ఒంగోలు సబర్బన్: విద్యుత్ పొదుపు, సమర్థ వినియోగంపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని ఏపీసీపీడీసీఎల్ ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. విద్యార్థి దశ నుంచి విద్యుత్ పొదుపు గురించి తెలుసుకుంటే ప్రతి ఇంట్లో విద్యుత్ను ఆదా చేయవచ్చని చెప్పారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (సీపీడీసీఎల్) ప్రకాశం సర్కిల్ ఆధ్వర్యంలో శనివారం పలు పాఠశాలల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. పోటీల్లో విజేతలకు కర్నూలు రోడ్డులోని సెయింట్ జేవియర్స్ హైస్కూల్లో బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థులకు ఇంధన పొదుపుపై వక్తృత్వం, వ్యాసరచన, డ్రాయింగ్ కాంపిటీషన్స్ నిర్వహించారు. ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజలకు, యువతకు విద్యుత్ పొదుపు గురించి అవగాహన కల్పించాలంటే తొలుత విద్యార్థి దశ నుంచి ఇంధన పొదుపుపై అవగాహన కల్పించాలన్నారు. విద్యుత్ను పొదుపుగా వినియోగించడంతో పాటు భద్రంగా వినియోగించాలన్నారు. సంప్రదాయేతర ఇంధన వినియోగాన్ని పెంచాలన్నారు. ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకం గురించి విద్యార్థులు తెలుసుకోవాలని చెప్పారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు డిసెంబర్ 14 నుంచి 20 వరకు జరిగాయన్నారు. వక్తృత్వ పోటీలో మొదటి బహుమతి కె.మౌనికా దుర్గ, జీఎస్ మానస చందన వైష్ణవి, పి.ఎలియాజర్ దక్కించుకున్నారు. వ్యాసరచన పోటీల్లో డి.హర్షవర్ధన్, జి.షారోన్ హుల్దా, ఎస్కే ఆసిఫ్ బాషా దక్కించుకున్నారు. డ్రాయింగ్ పోటీల్లో ఎండీ నిస్సార్ అహ్మద్, ఆర్.రేణుక, టి.సృజన దక్కించుకున్నారు. ఎస్ఈ కట్టా వేంకటేశ్వర్లు విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. టౌన్ డీఈఈ కేవీపీ రంగారావు, ఏఈఈ శివప్రసాద్, స్కూల్ అకాడమి ఇన్చార్జి సుభాషిణి, సిబ్బంది పాల్గొన్నారు. -
104 ఉద్యోగులపై వేధింపులు ఆపాలి
ఒంగోలు టౌన్: గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలందిస్తున్న 104 ఉద్యోగులపై భవ్య హెల్త్కేర్ సర్వీస్ సంస్థ వేధింపులు మానుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ 104 ఎంఎంయూ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం కలెక్టరేట్ ఎదురుగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం డీఎంహెచ్ఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాలం సుబ్బారావు మాట్లాడుతూ 104 ఉద్యోగులకు తగ్గించిన వేతనాలను, రద్దు చేసిన క్యాజువల్ సెలవులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. 5 సంవత్సరాల సర్వీసు దాటిన డ్రైవర్లకు స్లాబ్ మార్చి వేతనాలు చెల్లించాలని, డీఈఓలకు ఏపీ ప్రభుత్వ జీవో ప్రకారం 18,500 రూపాయల జీతం చెల్లించాలని కోరారు. 104లో ప్రజలకు అవసరమైన ఔషధాలను అందుబాటులో ఉంచడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగులపై భవ్య హెల్త్ కేర్ సర్వీస్ సంస్థ యాజమాన్యం వేధింపులకు పాల్పడటం దారుణమని, ఈ వైఖరి మార్చుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి రవి వర్మ, డివిజన్ కన్వీనర్ అడక శ్రీకాంత్, వంశీరెడ్డి, కళ్యాణి, దేవ కరుణ, కృప, చరణ్ తదితరులు పాల్గొన్నారు. -
వెలుగురేఖ!
గిరి గుండెల్లో..యర్రగొండపాలెం: నల్లమల అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండే పెద్ద పీఆర్సీ తాండా నుంచి ఏ చిన్న సమస్య వచ్చినా 25 కిలో మీటర్లు వెళ్లాల్సిందే. గిరిజన తాండా వాసులు పడే కష్టాలు వర్ణనాతీతం. పింఛన్ కావాలన్నా, రేషన్ కోసం అర్జీపెట్టుకోవాలన్నా మండల కేంద్రం యర్రగొండపాలెంకు పరుగులు తీయాలి. ముందు 4 కిలోమీటర్లు కాలినడక, ఆ తరువాత రెండు బస్సులు మారాల్సి వచ్చేది. అలా 25 కిలో మీటర్లు ప్రయాణం చేసేందుకు అష్టకష్టాలు పడేవారు. వైఎస్ జగన్ మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక పెద్ద పీఆర్సీ తాండా వాసుల కష్టాలు ఒక్కొక్కటిగా గట్టెక్కుతూ వచ్చాయి. జగన్ తీసుకొచ్చి సచివాలయ వ్యవస్థ ద్వారా సమస్యలు స్థానికంగానే పరిష్కరమవుతూ వచ్చాయి. వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి వారి సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకున్నారు. నవరత్నాల పథకాలను గిరిజనుల ఇంటి ముందుకే చేరేలా చేశారు. కరోనా మహమ్మరి వెంటాడడంతో కష్టాలు తప్పవనుకున్నాం. ఆ మహమ్మరి బారిన పడకుండా కాపాడటమేకాకుండా ఎటువంటి కష్టాలు లేకుండా చేశారంటూ ఆ తాండా వాసులు జగన్కు కృతజ్ఞతలు చెబుతున్నారు. శ్ఙ్రీదేశానికి స్వాతంత్య్రం వచ్చి 72 సంవత్సరాలైనా గిరిజనుల జీవితాల్లో మార్పులేదు. పాలకులు చిన్న చూపు చూస్తూనే వచ్చారు. తండాలను ఎవరూ పట్టించుకునేవారు కాదు. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అన్ని వర్గాల్లో ఉన్న పేదలతోపాటు సభ్యసమాజానికి దూరంగా, అటవీ ప్రాంతాల్లో జీవించే గిరిజనులను ఆయన గుర్తించారని పెద్ద పీఆర్సీ తండాకు చెందిన పలువురు పెద్దలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత కాలం తిరోగమనం అయినట్లు ఉందని, తిరిగి తాము కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోందని, ఎటువంటి సంక్షేమ పథకాలు తమ దరిచేరడంలేదని వారు ఆవేదన వ్యక్తపరిచారు. తమ సమస్యలను పట్టించుకునేనాథుడేలేడని, సచివాలయం వద్దకు వెళ్తే వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తుంటారని, ఏదైనా సమస్య ఉంటే ముందుగా తమ ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకుడితో కలవాలని, లేకుంటే అధికారులు సైతం ఆ సమస్యను పక్కన పెట్టేస్తున్నారని వారు విమర్శించారు. గ్రామాభివృద్ధికి చిరునామా ఆరవీటికోట రాచర్ల: మండలంలోని ఆరవీటికోట గ్రామం నల్లమల అటవీ ప్రాంతానికి సమీపంలోని ఉన్న మారుమూల ప్రాంతం. మండల కేంద్రానికి సుమారు 15 కిలో మీటర్ల దూరం ఉంటుంది. గ్రామానికి వచ్చే రోడ్డు రాళ్లు, రప్పలతో అధ్వానంగా ఉండేది. అంబులెన్స్ రావాలంటే నానా ఇబ్బందులు పడేవారు. ఎవరైనా అనారోగ్యానికి గురైతే మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆకవీడు పంచాయతీ ప్రభుత్వ ఆస్పత్రికి రావాలి. గ్రామంలో అంతర్గత రోడ్లన్నీ మట్టిరోడ్లుగా ఉండేవి. 2019లో వైఎస్ జగన్ మోహన్రెడ్డి సీఎం కావడంతో ఆరవీటికోట గ్రామ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. గ్రామంలో ఎటు చూసినా అభివృద్ధి పనులే కనపడ్డాయి. నవరత్నాల్లో భాగంగా రూ.1.13 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా గ్రామ సచివాలయ భవన నిర్మాణం కోసం రూ.40 లక్షలు, రైతు భరోసా కేంద్రం రూ.21.80 లక్షలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ సెంటర్ భవన నిర్మాణం కోసం రూ.17.50 లక్షలు, స్కూల్ అభివృద్ధి కోసం నాడు–నేడు పథకం ద్వారా రూ.14 లక్షలు, గ్రామంలో అంతర్గత సిమెంట్ రోడ్లు వేసేందుకు రూ.20 లక్షలతో అభివృద్ధి చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా, హెల్త్ క్లినిక్ భవనాలు నిర్మాణాలు చేసి అన్ని శాఖాల అధికారులను నియమించి, మండల కేంద్రానికి వెళ్లకుండానే గ్రామంలోనే అన్ని సదుపాయాలు కల్పించారని గ్రామస్తులు వివరించారు. ఒకప్పుడు ఆరవీటికోటకు రావాలంటే భయపడే బంధువులు నేడు ఆనందంగా వస్తున్నారని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.గిరిజనులకు ప్రత్యేక పంచాయతీలు ఏర్పాటు చేశారు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే పేదవర్గాలను గుర్తించి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు పరిచారు. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో నివశించే సుగాలి, చెంచు గిరిజనుల కష్టాలను తొలగించేందుకు తమ సమస్యలను తామే పరిష్కరించుకోవటానికి ప్రత్యేక పంచాయతీలను ఏర్పాటుచేసి పుణ్యం కట్టుకున్నారు. జగనన్న మాకు స్వయం ప్రతిపత్తి కల్పించారు. గిరిజన పంచాయతీ ఏర్పాటు చేయడంతోపాటు గూడెంలో సచివాలయం, హెల్త్ క్లీనిక్, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయించారు. – దేశావత్ బాలునాయక్, పెద్ద పీఆర్సీ తండా నా చిన్న కుమారుడికి ఉద్యోగం వచ్చింది జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడం వలన నా చిన్నకుమారుడికి వెటర్నరీ అసిస్టెంట్గా ఉద్యోగం వచ్చింది. సచివాలయాలు ఏర్పాటు చేయకపోతే మేము పొలం పనులు చేసుకొని బతకాల్సిన పరిస్థితి. జగనున్న కాలంలో వలంటీర్లు మా ఇంటి వద్దకు వచ్చి సమస్యల గురించి అడిగేవారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించి అర్జీలు పెట్టించేవారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేకుండా పోయింది. గతంలో వచ్చిన పథకాలు ఏమయ్యాయో అర్థం కావడంలేదు. వాటిని ఎవరో దిగమింగుతున్నారనిపిస్తోంది. – రామావత్ మత్రిబాయి, పెద్ద పీఆర్సీ తండా -
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి
ఒంగోలు సబర్బన్: ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలుచేయాలని ఏబీవీపీ జాతీయ కార్యదర్శి శ్రావణ్ బిరాజ్ చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక అద్దంకి బస్టాండ్ సెంటర్లో ఆదివారం ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రావణ్ బిరాజ్ మాట్లాడుతూ విద్యార్థులకు ఎన్నికల సమయంలో కూటమిలోని టీడీపీ నాయకులు అనేక హామీలు ఇచ్చారన్నారు. వాటిని నెరవేర్చడంలో చంద్రబాబు ప్రభుత్వం మీనమేషాలు లెక్కబెడుతోందన్నారు. రాష్ట్ర విద్యాశాఖామంత్రిగా ఉన్న లోకేష్ విద్యార్థులకు ఇచ్చిన ఎన్నికల హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. హాస్టళ్లలో కాస్మోటిక్ చార్జీల పెంపు, మెనూ చార్జీల పెంపు, ఫీజు రీయింబర్స్మెంట్ అందించటంలాంటి ఎన్నో హామీలు గుప్పించారని గుర్తు చేశారు. వాటిని వెంటనే పెంచాలని, ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయా లలో విద్యార్థి ఎన్నికలు నిర్వహించాలన్నారు. తద్వారా సమాజానికి సమర్థ నాయకత్వం దొరుకుతుందని వివరించారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యాగంటి గోపి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు అఖిల్, మల్లికార్జున్, జాతీయ కార్యవర్గ సభ్యులు వేదశ్రీ, ఏబీవీపీ నాయకులు సత్యసాయి, మహేష్, జిల్లా కన్వీనర్ గురునాథ్, మీడియా ఇన్చార్జ్ రావులపల్లి నాగేంద్ర యాదవ్, తదితరులు పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పందించాలి ఏబీవీపీ రాష్ట్ర సదస్సులో జాతీయ కార్యదర్శి శ్రావణ్ బిరాజ్ డిమాండ్ -
ప్రజల మనసుల్లో జగన్కు సుస్థిర స్థానం
మార్కాపురం రూరల్ (మార్కాపురం): నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలోనే ఆదర్శవంతమైన పాలన అందించి పేద ప్రజల సంక్షేమం, ఆర్ధిక అభివృద్ధి కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించారని మార్కాపురం వైఎస్సార్ సీపీ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. మండలంలోని ఇడుపూరు గ్రామంలో శనివారం రాత్రి వైఎస్ జగన్ ముందస్తు పుట్టినరోజు వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చెంచిరెడ్డి, యార్డు మాజీ చైర్మన్ డీ గురుబ్రహ్మం, జవ్వాజి వెంకటరెడ్డి, బండి సుబ్బారెడ్డి, సాఫ్ట్వేర్ సుబ్బారెడ్డి, శ్రీనివాసరెడ్డి, రామసుబ్బారావు, నాసర్, దిబ్బారెడ్డి, జక్రయ్య, దానయ్య తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల భారీ ర్యాలీ.. టంగుటూరు: మండలంలోని వల్లూరు వద్ద పేస్ కాలేజీ విద్యార్థులు ద్విచక్ర వాహనాలతో ఒంగోలు నుంచి భారీ ర్యాలీ నిర్వహించి కాలేజీ సమీపంలో భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా విద్యాప్రదాత జగన్మోహన్ రెడ్డి అని నినాదాలు చేశారు. ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి చుండూరి రవిబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణారెడ్డి, వై వెంకటేశ్వరరావు, నగర పార్టీ అధ్యక్షుడు కటారి శంకరరావు, గౌడ విభాగం జిల్లా అధ్యక్షుడు తాత నరసింహ గౌడ్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పల్నాటి రవీంద్ర రెడ్డి, విద్యార్థి విభాగం నగర ప్రెసిడెంట్ శ్రీకాంత్ పాల్గొని కేక్ కట్ చేశారు. -
గోగినేనివారిపాలెంలో మహిళ హత్య
పొదిలి రూరల్: రాత్రి నిద్రకు ఉపక్రమించిన మహిళ తెల్లవారేసరికి శవమైంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను గొంతు నులిమి, మెడకు తాడు బిగించి చంపినట్లు మృతదేహంపై ఆనవాళ్లు స్పష్టం చేస్తున్నాయి. పొదిలి మండలంలోని గోగినేనివారిపాలెం ఎస్సీ కాలనీలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. స్థానికుల కథనం మేరకు.. ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న పులి బుల్లెమ్మ(50) భర్త 5 నెలల క్రితం మృతి చెందాడు. గురువారం రాత్రి 10 గంటల వరకు ఆమె టీవీ చూసి నిద్రపోయింది. శుక్రవారం ఉదయం ఆమె మృతి చెందిందన్న విషయం తెలియడంతో కాలనీ మొత్తం కలకలం రేగింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బుల్లెమ్మ నివాసం ఉండే ఇంటితోపాటు పరిసర ప్రాంతాలను దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐ రాజేష్కుమార్, ఎస్సై వేమన తమ సిబ్బందితో కలిసి పరిశీలించారు. క్లూస్టీమ్, డాగ్ స్క్వాడ్ను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతురాలి శరీరం, మెడపై నల్లగా కమిలి ఉండడంతో గొంతు నులిమి చంపినట్లు నిర్ధారణకు వచ్చారు. ఆమె హత్యకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. మృతురాలికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుమార్తె లక్ష్మీతిరుపతమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం పొదిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒంగోలు టౌన్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టీడీపీ నాయకుడు ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో సమగ్ర దర్యాప్తునకు సంబంధించి జిల్లా పోలీసులకు ఏబీసీడీ అవార్డు దక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా కీలక కేసుల దర్యాప్తులో ప్రతిభ కనబరిచే పోలీసు అధికారులకు ప్రతి 3 నెలలకోసారి ఈ అవార్డు ప్రకటిస్తారు. శుక్రవారం మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ హరిష్ గుప్తా చేతుల మీదుగా జిల్లా ఎస్పీ హర్షవర్థన్రాజు, విజయనగరం ఎస్పీ ఏఆర్ దామోదర్ అవార్డు అందుకున్నారు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, మహిళా పోలీసు స్టేషన్ సీఐ సుధాకర్, ప్రస్తుత ట్రాఫిక్ సీఐ జగదీష్, డీటీసీ సీఐ పాండురంగారావు, గతంలో చీమకుర్తి సీఐగా విధులు నిర్విహించిన ఎం.సుబ్బారావు, సోషల్ మీడియా సెల్ సీఐ సూర్యనారాయణ, సంతనూతలపాడు ఎస్సై వి.అజయ్బాబు పాల్గొన్నారు. ఏబీసీడీ స్ఫూర్తితో.. సంచలన కేసులను సమర్థవంతంగా పరిష్కరించినప్పుడే ప్రజల్లో పోలీసు శాఖపై గౌరవం పెరుగుతుందని ఎస్పీ హర్షవర్థన్రాజు చెప్పారు. ఈ అవార్డును స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్లో మరిన్ని కేసులను సమష్టిగా చేధించడానికి కృషి చేయాలని సూచించారు. జిల్లాకు అవార్డు దక్కడం గర్వకారణమన్నారు. -
రబీ సీజన్కు సరిపడా యూరియా
ఒంగోలు సబర్బన్: జిల్లాలోని రైతులకు రబీ సీజన్లో అన్ని పంటలకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని వ్యవసాయ శాఖ జేడీ ఎస్.శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లాలో యూరియా లభ్యత వివరాలు వెల్లడించారు. జిల్లాలో ఈ ఏడాది అక్బోబర్ ఒకటో తేదీ నాటికి 4,824 టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. 2025 అక్బోబర్ 1 నుంచి 2025 డిసెంబర్ 31 వరకు జిల్లాకు మొత్తం 23,115 టన్నుల యూరియా అవసరం కాగా, మొత్తం 30,711 టన్నుల యురియాను రైతులకు అందుబాటులో ఉంచామని, ఈ నెలాఖరుకు 500 టన్నుల యూరియా జిల్లాకు రానుందని వివరించారు. నానో యూరియా, నానో డీఏపీ సైతం అందుబాటులో ఉందని వెల్లడించారు. ఎరువుల కృత్రిమ కొరత సృష్టించినా, అధిక ధరలకు విక్రయించినా డీలర్ల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. మద్దిపాడు: ఐటీసీ గోడౌన్లో 20 అడుగుల ఎత్తు నుంచి ప్రమాదవశాత్తు జారిపడిన వ్యక్తి మృతిచెందిన ఘటనపై మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు మండలంలోని గార్లపాడు గ్రామంలోని ఐటీసీ గోడౌన్లో త్రిపుర రాష్ట్రం థలై జిల్లాకు చెందిన ఇంతాస్ ఖాన్ (20) గురువారం ఉదయం 20 అడుగుల ఎత్తులో లైటింగ్ షీట్ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు ఆ షీట్ విరిగిపోవడంతో జారి కిందపడి తలకు తీవ్ర గాయాలై స్పృహ కోల్పోయాడు. అతడిని ఒంగోలులోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై మృతుని తండ్రి మద్దిపాడు పోలీస్స్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేశాడు. ఆమేరకు ఎస్ఐ వెంకట సూర్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మార్కాపురం: మార్కాపురం పట్టణంలోని ఓ బంగారం దుకాణంలో ఆభరణాలు చోరీచేసిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం కనమాకులపల్లి గ్రామానికి చెందిన గీత ఈనెల 17వ తేదీన మార్కాపురంలోని చెన్నకేశవస్వామి గుడి బజారులో ఓ బంగారం షాపులో ఆభరణాలు కొనుగోలు చేసేందుకు వెళ్లి మూడు జతల వెండి పట్టీలను చోరీ చేసింది. దుకాణ యజమాని ఫిర్యాదు మేరకు గీతను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై సైదుబాబు తెలిపారు. -
అభివృద్ధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి
ఒంగోలు సబర్బన్: ఆకాంక్షిత మండలంలో అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర ప్రభారి అధికారి వి.శ్రీనివాసరావు సూచించారు. కేంద్ర ప్రభుత్వం యాస్పిరేషనల్ బ్లాక్ కింద యర్రగొండపాలెం మండలంలో చేపట్టిన అభివృద్ధి పనుల పర్యవేక్షణకు నియమితులైన ప్రభారి అధికారి శ్రీనివాసరావు శుక్రవారం ఒంగోలులో కలెక్టర్ రాజాబాబుతో కలిసి జిల్లా అధికారులతో సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వ విధివిధానాలపై అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆకాంక్షిత మండలంలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 39 అంశాల్లో కొన్ని నూరు శాతం సాధించారని, మిగిలిన అంశాలపై కూడా శ్రద్ధ చూపాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆకాంక్షిత మండలాల్లో నిర్దేశిత లక్ష్యాలను మూడు నెలల్లోగా పూర్తి స్థాయిలో చేరుకోవాలన్నారు. సమావేశంలో సీపీఓ సుధాకర్రెడ్డి, డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, డీఎస్ఓ పద్మశ్రీ, డీఆర్డీఏ పీడీ నారాయణ, పశుసంవర్ధక శాఖ జేడీ వెంకటేశ్వరరావు, మత్స్యశాఖ జేడీ శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి వరలక్ష్మి, బీసీ సంక్షేమ అధికారి నిర్మల జ్యోతి, సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బాల శంకరరావు, డ్వామా పీడీ జోసఫ్ కుమార్, ఐటీడీఏ, ఐసీడీఎస్, అటవీ, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఆకాంక్షిత మండలంలో పనులు చేపట్టాలి కేంద్ర ప్రభారి అధికారి వి.శ్రీనివాసరావు -
ట్రాక్టర్ బోల్తాపడి ఒకరు మృతి
అర్ధవీడు: వెనుక వస్తున్న ఆర్టీసీ బస్సుకు సైడ్ ఇవ్వబోయి అదుపు తప్పిన ట్రాక్టర్ బోల్తాపడి ఒకరు మృతిచెందగా మరొకరికి గాయాలైన ఘటన మండలంలోని గన్నెపల్లి–రంగాపురం గ్రామాల మధ్య శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. బోరుబావిలో ఇరుక్కుపోయిన మోటార్లు వెలికితీసే ట్రాక్టరు గన్నెపల్లి నుంచి యాచవరం వెళ్తున్న క్రమంలో వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సుకు సైడ్ ఇవ్వబోయి అదుపు తప్పి పక్కనున్న సైడుకాలువలో పడిపోయింది. ట్రాక్టర్లో ఉన్న కడప జిల్లా మైదుకూరు మండలం రాబురాంపేటకు చెందిన ముత్యాల శ్రీను (44) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. ట్రాక్టర్లో ఉన్న ప్రొద్దుటూరు మండలానికి చెందిన ఆకుమల్ల కుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘ఉపాధి’ చట్టాన్ని దెబ్బతీయొద్దు
ఒంగోలు టౌన్: గ్రామీణ నిరుపేద ప్రజల జీవనోపాధిని దెబ్బతీసే విధంగా ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తే ఉపేక్షించేది లేదని, ప్రజలను ఏకం చేయడం ద్వారా పోరాటాలను ఉధృతంగా నిర్వహిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ హెచ్చరించారు. శుక్రవారం స్థానిక మల్లయ్యలింగం భవనంలో వామపక్ష పార్టీల సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ ఉపాధి హామీ చట్టం మార్పుపై మోదీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 22వ తేదీన ఽనిరసన కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. వామపక్ష పార్టీల ఒత్తిడి మేరకు యూపీఏ–1 పాలనలో ప్రారంభించిన ఉపాధి హామీ చట్టం వల్ల గ్రామీణ ప్రజలకు వంద రోజుల పని దొరకడంతో కొంతమేర మెరుగైన జీవితం అనుభవిస్తున్నారని చెప్పారు. గ్రామీణ ప్రాంతంలో వలసలు తగ్గాయని, ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందని చెప్పారు. ఆర్థికంగా కొంత వెసులుబాటు లభించడంతో పిల్లలను చదివించుకుంటున్నారని, కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్రలు మొదలుపెట్టారని ఆరోపించారు. ప్రజల వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని వెనక్కి తగ్గిన మోదీ ఇప్పుడు దొడ్డిదారిన పేరు మార్పు వంకతో పథకంలో అనేక మార్పులు తీసుకువడం అభ్యంతరకరమన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు మాట్లాడుతూ.. పార్లమెంటులో ప్రతిపక్షాల వాదనలు వినకుండా ఏకపక్షంగా సవరించిన ఉపాధి హామీ బిల్లును ఆమెదిండం దారుణమన్నారు. జీరామ్జీ పథకం పేరుతో ఉపాధి హామీని నిర్వీర్యం చేసి పేదల పొట్ట కొట్టడం భావ్యం కాదన్నారు. గతంలో కేవలం 10 శాతం నిధులు కేటాయించడానికే వెనకంజ వేసిన రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఏకంగా 40 శాతం నిధులు కేటాయించడం సాధ్యమయ్యే పనేనా అని ప్రశ్నించారు. ఉపాధి హామి పథకాన్ని నిలిపివేసే కుట్రలో భాగంగానే మార్పులు చేశారని ఆరోపించారు. సీపీఐఎంఎల్ న్యూ డెమెక్రసీ జిల్లా కార్యదర్శి సాగర్, జిల్లా నాయకులు ఎంఎస్ సాయి మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహాత్మాగాంధీ పేరు కనపడకుండా, వినపడకుండా చేయడానికి మోదీ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందన్నారు. దేవుళ్ల పేరుతో పథకాన్ని తీసుకొస్తే ఎవరూ విమర్శించరనే ఉద్దేశంతో రాముడి పేరుతో ఉపాధి హామీ పథకంలో మార్పులు తీసుకొచ్చారన్నారు. ప్రజలకు తిండిపెట్టే ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి దేవుడి పేరును అడ్డం పెట్టుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ నెల 22న నిరసన కార్యక్రమంలో రైతులు, నిరుపేదలు, వ్యవసాయ కూలీలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆర్.వెంకటరావు, శ్రీరాం శ్రీనివాసరావు, కొత్తకోట వెంకటేశ్వర్లు, బి.రఘురాం, నల్లూరి మురళి తదితరులు పాల్గొన్నారు. వామపక్ష నేతల హెచ్చరిక -
రియల్ బూచి!
జిల్లాకు రెక్కలొచ్చి..రియల్ ఎస్టేట్ వెంచర్మార్కాపురం: మార్కాపురం జిల్లా కాబోతుందన్న ప్రకటనను అడ్డుపెట్టుకుని జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బ్రోకర్లు పట్టణంలో వాలిపోయారు. పది రోజులుగా పట్టణంలో ఎక్కడ చూసినా ఇదే హడావుడి. తెల్లవారి ఎనిమిది గంటల నుంచే వీరి హంగామా మొదలైపోతోంది. ప్రధానంగా తర్లుపాడు రోడ్డు జాతరను తలపించేలా జనంతో కిటకిటలాడుతోంది. వ్యాపారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు లక్ష్యంగా మోసాలకు తెరతీస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రియల్ బ్రోకర్ల మాయాజాలంలో కనిగిరి, గిద్దలూరు, కంభం, బేస్తవారిపేటకు చెందిన పలువురు ఉద్యోగులు, వ్యాపారులు చిక్కుకున్నారని తెలుస్తోంది. స్థలాల రేట్లు అమాంతం పెంచేశారు. పూలసుబ్బయ్య కాలనీ నుంచి అల్లూరి పోలేరమ్మ గుడి, హోంగార్ుడ్స కాలనీ, ఇందిరమ్మ కాలనీ, నరసింహాపురం స్తోత్రియం, లిక్కర్ గోడౌన్, పట్టు పరిశ్రమ కార్యాలయం తదితర ప్రాంతాల్లో మొన్నటి వరకూ గజం రూ.10 వేలు పలికేది. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో గజం ధర ఏకంగా రూ.25 వేలకు చేరింది. దీనిని గమనిస్తే భూమాయ ఏ స్థాయిలో జరుగుతోందో అర్థమవుతుంది. త్వరగా లాభాలు వస్తాయన్న ఆశతో జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు యర్రగొండపాలెం, పుల్లలచెరువు, పెద్దదోర్నాల నుంచి కూడా పలువురు వ్యాపారులు, ఉద్యోగులు మూడు కుంటల స్థలం కొనిపెడితే మంచి రేటు వస్తుంది కదా అని ముందు వెనుక చూసుకోకుండా కొంటున్నారు. ఇదే అదునుగా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు డబుల్ రిజిస్ట్రేషన్ చేసి మాయమాటలు చెప్పి అంటగడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రిజిస్ట్రేషన్ సమయంలో ఇది బయటపడటంతో కొనుగోలు చేసిన వారు లబోదిబోమంటున్నారు. ఇటువంటి సంఘటనే మూడు రోజుల క్రితం తర్లుపాడు రోడ్డులోని అల్లూరి పోలేరమ్మగుడి వద్ద చోటుచేసుకుంది. ఇందిరమ్మ కాలనీలో సుమారు 150 ప్లాట్లను భూకబ్జాదారులు రాత్రికి రాత్రే కబ్జా చేసి తాత్కాలికంగా సిమెంటు ఇటుకలతో బేస్మెంటు కట్టారు. దీంతో ఆ స్థలాన్ని కొనుగోలు చేసినవారు నిజమైన లబ్ధిదారులు రావడంతో లబోదిబోమంటున్నారు. తిరునాళ్లను తలపిస్తున్న తర్లుపాడు రోడ్డు.. తర్లుపాడు రోడ్డులో తాత్కాలిక కార్యాలయాలు, ఆ తర్వాత శాశ్వత కార్యాలయాలు ఏర్పాటవుతాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఆ ప్రాంతం అమ్మకం, కొనుగోలుదార్లు, బ్రోకర్ల హడావుడి ఎక్కువగా ఉండడంతో తిరునాళ్ల వాతావరణం కనిపిస్తోంది. ఉదయం 8 గంటల నుంచే వాహనాల రాకపోకలతో తర్లుపాడు రోడ్డులో భారీ ట్రాఫిక్ ఉంటోంది.ప్రభుత్వ భూములు ఉన్నా... అటువైపు వెళ్లకండి అవసరమైతే మా పట్టా భూములు కొనుగోలు చేయండి...మా భూములు ఉన్న ప్రాంతాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలు పెట్టాలంటూ టీడీపీ నేతలు అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. కొత్త జిల్లాగా ఏర్పాటు కావడంతో పట్టణంలో దాదాపు 74 ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. ఆయా శాఖల ఆఫీసులు, అధికారులకు అవసరమైన భవనాలను తీసుకోవాలని తెరవెనుక యత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రాయవరం రోడ్డు, కాలేజీ రోడ్డు, వేములకోట రోడ్డు, దరిమడుగు రోడ్డు తదితర ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు ఎక్కువగా ఉన్నాయి. రాయవరం రోడ్డులో ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి. అయితే కూటమి నేతల భూములు ఉన్న తర్లుపాడు రోడ్డులోనే జిల్లా కార్యాలయాలు పెట్టాలని, ఆ దిశగా ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాలని స్థానిక అధికారులపై పది రోజులుగా ఒత్తిడి చేస్తున్నారు. తాత్కాలిక కార్యాలయాల కోసం తర్లుపాడు రోడ్డులో ఉన్న ప్రైవేట్ పాఠశాలల భవనాలను అద్దెకు తీసుకోవాలని సూచిస్తున్నారు. తద్వారా తమ భూముల విలువ పెంచుకోవాలని నాయకులు ప్రయత్నిస్తున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిడి మేరకు అధికారులు సైతం తర్లుపాడు రోడ్డులోనే ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. -
అబ్బురం.. సైన్స్ సంబరం
● జిల్లా స్థాయి విజ్ఞాన ప్రదర్శనలో 300 ప్రాజెక్టులు ● అందరినీ ఆలోచింపజేసిన నమూనాలు ● సృజనాత్మకత పెంపొందించుకోవాలని విద్యార్థులకు జేసీ సూచన ఒంగోలు సిటీ: చిట్టి మెదళ్లు గట్టి ఆలోచనలే చేశాయి. సమాజానికి ఉపయోగపడే ఆలోచనలకు ఆవిష్కరణల రూపమిచ్చాయి. ఉపాధ్యాయుల తోడ్పాటుతో ప్రాజెక్టులు రూపొందించిన విద్యార్థులు శుక్రవారం జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్లో ప్రదర్శించి అందరినీ అబ్బురపరిచారు. ఒంగోలులోని సాయిబాబా సెంట్రల్ స్కూల్ వేదికగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి డీఈఓ సీవీ రేణుక అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా జేసీ గోపాలకృష్ణ హాజరై జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 300 ప్రాజెక్టులను పరిశీలించారు. విద్యార్థులు ఆలోచనా శక్తి, సృజనాత్మకత పెంపొందించుకునేందుకు సైన్స్ ఫెయిర్ దోహదపడుతుందని జేసీ పేర్కొన్నారు. స్థానిక సమస్యలకు స్థానికంగా పరిష్కారాలు కనుగొనేలా ప్రాజెక్టులు తయారు చేయాలని సూచించారు. డీఈఓ రేణుక మాట్లాడుతూ.. విద్యార్థులు సైన్స్పై ఆసక్తి, అభిరుచిని పెంపొందించుకోవాలని సూచించారు. శాసీ్త్రయ దృక్పథంతో ప్రాజెక్టులు తయారు చేసి రాష్ట్ర స్థాయిలో సత్తా చాటాలని ఆకాంక్షించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరై ప్రాజెక్టుల నమూనాలను తిలకించారు. కార్యక్రమంలో ఒంగోలు, మార్కాపురం డీవైఈఓలు చంద్రమౌళీశ్వరరావు, ఎం.శ్రీనివాసులు, డీసీఈబీ శ్రీనివాసరావు, జిల్లా సైన్స్ అధికారి టి.రమేష్, ఒంగోలు ఎంఈఓ టి.కిషోర్బాబు, ఒంగోలు ఎమ్మార్వో మధుసూదనరావు, ఇతర మండలాల ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కార్బన్ శుద్ధి చేసే పద్ధతిని ప్రదర్శిస్తున్న వెలిగండ్ల జెడ్పీ స్కూల్ విద్యార్థి జితేంద్ర హ్యూమన్ హార్ట్ పనితీరును ప్రదర్శిస్తున్న చిరికూరపాడు హైస్కూల్ బాలిక మృదుల చార్జింగ్ షూను ప్రదర్శిస్తున్న మహ్మదాపురం జెడ్పీ స్కూల్ విద్యార్థి అజయ్ సెన్సార్ స్మార్ట్ బైక్తో చెన్నారెడ్డిపల్లె జెడ్పీ స్కూల్ బాలిక శ్రీదివ్య -
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం
ఒంగోలు సబర్బన్: జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అందించడానికి కలెక్టర్ పి.రాజా బాబు నేతృత్వంలో ప్రఖ్యాతిగాంచిన సెంచూరియన్ విశ్వవిద్యాలయం ప్రతినిధులతో శుక్రవారం ప్రకాశం భవనంలో సమావేశం నిర్వహించారు. మైనింగ్, పోర్టులు, హార్టీకల్చర్, ఆక్వా కల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్, హైడ్రోకార్బన్ తదితర రంగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసి వీటికి పరిశ్రమలను అనుసంధానం వలన జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు నైపుణ్యాన్ని మెరుగుపరుచుకొని ఉద్యోగాలు పొందడంలో దోహదపడుతుందని కలెక్టర్ చెప్పారు. అందులో భాగంగా త్వరితగతిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు. కార్యక్రమంలో సెంచూరియన్ యూనివర్సిటీ ప్రతినిధి జేఎన్ రావు, గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్, డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ రవితేజ, డీఆర్డీఏ పీడీ నారాయణ, జెడ్పీ సీఈవో చిరంజీవి, జిల్లాలోని పాలిటెక్నిక్, ఐటీఐ కాలేజీల ప్రిన్సిపాళ్లు, జిల్లా ఉపాధి అధికారి రమాదేవి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, స్టెప్ సీఈవో శ్రీమన్నారాయణ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక
టంగుటూరు: ఈ నెల 16, 17, 18 తేదీల్లో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 69వ రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ వాలీబాల్ అండర్ 14 బాలికల విభాగంలో ప్రకాశం జిల్లా జట్టు రన్నర్స్ గా నిలిచింది. ఈ పోటీల్లో మండలంలోని ఆలకూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సుదర్శి కుందన, వరికూటి వందన, కడియం జెస్సిక లు అత్యుత్తమ ప్రతిభ చూపారని వీరిలో కడియం జెస్సిక, వరికూటి వందన జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయుడు వాకా వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. ఎంపికై న విద్యార్థులు కడప జిల్లాలో జనవరి 6 నుంచి 10 వరకు జరిగే జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలీబాల్ జట్టు తరఫున పాల్గొంటారని పాఠశాల పీడీ పి.వెంకట్రావు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించిన విద్యార్థినులను టంగుటూరు మండల ఎంఈఓ 1,2 ఆనందరావు, బాలాజీ, ఉపాధ్యాయులు అన్నపూర్ణ, రాజ సులోచన, నిర్మల, చెన్నయ్య, విజయలక్ష్మి, అరుణకుమారి, సుబ్బారావు, భూషణ్ రెడ్డి, సుభాషిణి అభినందనలు తెలిపారు. ● జిల్లా ఖజానా శాఖ అధికారి ఏ.జగన్నాథరావు ఒంగోలు సబర్బన్: ప్రభుత్వ పింఛనుదారుల నుంచి 2026 సంవత్సరానికి సంబంధించి యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ల(ఏవీసీ)ను సమర్పించాలని జిల్లా ఖజానా, లెక్కల శాఖ అధికారి ఎ.జగన్నాథరావు వెల్లడించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ప్రభుత్వం పింఛనుదారుల నుంచి ఏవీసీ సర్టిఫికెట్లను జిల్లాలోని అన్ని ఖజానా కార్యాలయాలతో పాటు పోస్టాఫీసు, మీ సేవా, నెట్ సెంటర్స్లో ద్వారా కూడా పంపించవచ్చన్నారు. ఈ ఏవీసీ సర్టిఫికెట్లు జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు స్వీకరించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. జిల్లాలోని ఒంగోలు, పొదిలి, దర్శి, కనిగిరి, కంభం, గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం తదితర సబ్ ట్రెజరీల పరిధిలో సర్వీస్ పింఛను డ్రా చేసే పెన్షన్దారులు లైఫ్ సర్టిఫికెట్, నాన్ ఎంప్లాయిమెంట్ సర్టిఫికెట్లను సమర్పించాలన్నారు. అదేవిధంగా ఫ్యామిలీ పెన్షన్ డ్రా చేసే పెన్షన్దారులు లైఫ్ సర్టిఫికెట్, నాన్ ఎంప్లాయిమెంట్ సర్టిఫికెట్లతో పాటు అదనంగా నాన్–రీ మ్యారేజ్ సర్టిఫికెట్లను సమర్పించి వారి పెన్షన్ చెల్లింపులను క్రమబద్ధీకరించుకోవాల్సిందిగా ఆయన కోరారు. ఆర్థిక శాఖ సర్క్యులర్ ప్రకారం పింఛనుదారులకు మెరుగైన వసతులను కల్పించాలన్న సంకల్పంతో ప్రభుత్వం డిజిటల్ ఏవీసీల విధానాన్ని ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. నిర్ణీత కాల వ్యవధిలో యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికెట్లను సమర్పించని పింఛనుదారుల నెలవారీ పింఛనును మార్చి 2026 నుంచి నిలుపుదల చేస్తారన్నారు. ● పంచాయతీ కార్యదర్శులకు, డిప్యూటీ ఎంపీడీఓలకు జారీ చేసిన ప్రభుత్వం ● జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు ఒంగోలు సబర్బన్: జిల్లాలోని పలు గ్రామాల్లో కేవలం ఒక శాతం మాత్రమే ఇంటి పన్నులు వసూలు చేసిన పంచాయతీల కార్యదర్శులు, డిప్యూటీ ఎంపీడీఓలకు రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల వివరాలను జిల్లా పంచాయతీ అధికారి ముప్పూరి వెంకటేశ్వరరావు శుక్రవారం వెల్లడించారు. అన్ని పంచాయతీల్లో ఇంటి పన్ను పాత బకాయిలు సక్రమంగా వసూలు చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత డివిజినల్ పంచాయతీ అధికారులకు తగిన సూచనలు ఇవ్వాలని, వారి పరిధిలోని డిప్యూటీ ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారని గుర్తు చేశారు. మీ పరిధిలోని పంచాయతీల ఇంటి పన్ను వసూళ్లపై పర్యవేక్షణ చేయనందుకు మీపై ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోకూడదో ఈ షోకాజ్ నోటీసు అందిన 3 రోజుల్లోగా రాతపూర్వకంగా డీపీఓ ముందు హాజరై సంజాయిషీ సమర్పించాలని ఆదేశించారు. ఒక శాతం మాత్రమే ఇంటి పన్నులు వసూలైన గ్రామాల్లో పుల్లలచెరువు మండలం మర్రివేముల, ముటుకుల, ఐటీవరం, గంగవరం, అర్ధవీడు మండలం వెలగలపాయ, గన్నేపల్లి, బోగోలు, పొదిలి మండలం మల్లవరం, మార్కాపురం మండలం బోడపాడు, భూపతిపల్లి, ముండ్లమూరు మండలం శంకరాపురం, భీమవరం, దొనకొండ మండలం పోలేపల్లి, సీఎస్పురం మండలం కోవిలంపాడు, తాళ్లూరు మండలం తురకపాలెం, దోసకాయలపాడు, పొన్నలూరు మండలం చౌటపాలెం ఉన్నాయి. -
అల్లూరి చరిత్ర స్ఫూర్తిదాయకం
ఒంగోలు టౌన్: ప్రముఖ స్వాతంత్య్ర పోరాట వీరుడు, బ్రిటీష్ ముష్కరులను ముప్పుతిప్పలు పెట్టిన విప్లవకారుడు అల్లూరి సీతారామరాజు జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు చావలి సుధాకర్ అన్నారు. ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక మల్లయ్యలింగం భవన్లో ప్రముఖ చరిత్ర రచయిత సయ్యద్ నశీర్ అహమ్మద్ రచించిన అల్లూరికి అండగా నిలిచిన ఫజలుల్లా ఖాన్, షేక్ మదీనా పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇన్సాఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏ సాలార్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సుధాకర్ మాట్లాడుతూ.. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సోదరులందరూ కలిసి మెలసి జాతీయోద్యమాన్ని నిర్మించారని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం సాధించడానికి అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటం జాతీయ స్థాయిలో పేరుపొందిందని చెప్పారు. మన్యం అడవులను కేంద్రంగా చేసుకొని గిరిజనులను చైతన్యం చేయడం ద్వారా బ్రిటీష్ ముష్కరులను నిద్రలేకుండా చేసిన సీతారామరాజుకు ఫజలుల్లా ఖాన్, షేక్ మదీనా అండగా నిలబడడం చరిత్రలో దాగని సత్యమని చెప్పారు. దేశ ప్రజల మధ్య విద్వేషాలను రాజేయడం ద్వారా నిర్విఘ్నంగా పరిపాలించాలని బ్రిటీష్ ముష్కరులు వేసిన ఎత్తుగడలు ఐక్యంగా తిప్పి కొట్టారని, అదే స్ఫూర్తితో నేడు కార్పొరేట్ కనుసన్నల్లో సాగుతున్న పాలకులకు బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. ఈ ఆవిష్కరణలో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డి.లక్ష్మి నారాయణ, ఎస్డీపీఐ రాష్ట్ర నాయకులు షేక్ సత్తార్, దళిత కవి కత్తి కళ్యాణ్, ఎంహెచ్పీఎస్ నాయకుడు అహమద్ బుజ్జి, రెడ్స్టార్ జిల్లా నాయకుడు బీమవరపు సుబ్బారావు, ఐపీఎల్ నాయకుడు దాసరి సుందరం పాల్గొన్నారు. -
ఇంటర్మీడియెట్ సంస్కరణలపై అవగాహన
ఒంగోలు సిటీ: ఇంటర్మీడియెట్ విద్యలో ఈ విద్యా సంవత్సరం ప్రారంభించిన సంస్కరణల అమలులో కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు ప్రత్యేకించి పబ్లిక్ పరీక్షల నిర్వహణాధికారులు అవగాహన పెంచుకొని అప్రమత్తంగా ఉండాలని ఇంటర్ విద్య ఆర్జేడీ జె.పద్మ సూచించారు. ఇంటర్మీడియెట్ విద్యామండలి ఆధ్వర్యంలో ఒంగోలు ఏకేవీకే జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షల్లో భాగస్వాములయ్యే అధికారుల కోసం శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఇంటర్ బోర్డ్ ఓఎస్డీ (అకడమిక్), సదస్సు రిసోర్సు పర్సన్ వీవీ సుబ్బారావు సంస్కరణల అమలు గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పదో తరగతి వరకు ఎన్సీఈ ఆర్టీ సిలబస్, ఆంగ్ల మాధ్యమం అమలైన నేపథ్యంలో జాతీయ విద్యా విధానం దృష్ట్యా ఈ ఏడాది ఇంటర్ విద్యలో సిలబస్ మార్పు, పరీక్షల సంస్కరణలను అమలు చేశారన్నారు. ప్రశ్న పత్ర స్వరూపం, మార్కుల విభజన, ఆన్సర్ బుక్లెట్ల పేజీల పెంపు గురించి వివరించారు. మొదటి సంవత్సరం ఎంపీసీ విద్యార్థులు బయాలజీని, బైపీసీ విద్యార్థులు మ్యాథ్స్ సబ్జెక్టును అదనపు సబ్జెక్టుగా చదివే అవకాశం కల్పించారని, అదనపు సబ్జెక్టులో పాసైనా, ఫెయిలైనా ఇంటర్మీడియెట్ పాస్ సరిఫికెట్లో చూపరని, దాని కోసం ప్రత్యేకంగా మార్క్స్ మెమో ఉంటుందని గమనించాలన్నారు. గతంలో ఉన్న 14 రకాల గ్రూపుల స్థానంలో ఇకపై ఐదు రకాల కోర్ గ్రూపులుంటాయన్నారు. పార్ట్–1 కింద ఆంగ్లం, పార్ట్ –2 కింద 24 సబ్జెక్టుల్లో ఎంపిక చేసుకున్న ఒక సబ్జెక్టు, పార్ట్–3 కింద గ్రూప్ సబ్జెక్టులు ఉంటాయని తెలిపారు. ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి, ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.ఆంజనేయులు మాట్లాడుతూ థియరీ పరీక్షల నిర్వహణకు వీలుగా ట్రంకు పెట్టెలను సంసిద్ధం చేసుకోవాలన్నారు. పరీక్షల నిర్వహణలో తప్పిదాలు, పొరపాట్లు జరక్కుండా కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు చొరవ తీసుకోవాలని సూచించారు. సదస్సులో ఏకేవీకే జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రామిరెడ్డి, జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, పరీక్షల నిర్వహణలో భాగస్వాములయ్యే సిబ్బంది పాల్గొన్నారు. -
పేదల పొట్ట కొట్టేందుకే ఉపాధిలో మార్పులు
ఒంగోలు టౌన్: గ్రామీణ నిరుపేద ప్రజల పొట్టలు కొట్టేందుకే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో మార్పులు చేపట్టిందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు విమర్శించారు. దేశ ప్రజల సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేందుకే ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తోందని ధ్వజమెత్తారు. శుక్రవారం నగరంలోని బాపూజీ కాంప్లెక్స్లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద సీపీఎం జిల్లా కమిటీ నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాబు మాట్లాడుతూ వామపక్ష పార్టీల ఉద్యమాల ఫలితంగా 2005లో నాటి యూపీఏ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని చట్టంలా తీసుకొచ్చిందని తెలిపారు. కొంతకాలంగా ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ వస్తున్న మోదీ ప్రభుత్వం వికసిత్ భారత్ ఆజీవికా మిషన్ పేరుతో గ్రామీణ ప్రజల జీవనోపాధిని దెబ్బకొట్టే చర్యలకు దిగిందని విమర్శించారు. పేరు మార్పుతో పాటుగా విధానాలను మార్పు చేయడం గ్రామీణ ప్రాంతాల వ్యవసాయ కూలీలకు ఇబ్బందులు తెచ్చిపెడుతోందని చెప్పారు. ఈ పథకం వలన కేవలం వ్యవసాయ కూలీలకు పని దొరకడమే కాకుండా దేశ వ్యాప్తంగా సాగునీరు, తాగునీటి వనరులు అభివృద్ధి చెంది వ్యవసాయం అభివృద్ధి చెందడం, అనుబంధ పరిశ్రమలు ఏర్పడడం ద్వారా దేశంలో ప్రజల కొనుగోలు శక్తి పెరిగి సంపద సృష్టి జరిగిందని చెప్పారు. చెక్ డ్యామ్లు, చెరువులు అభివృద్ధి చెందడంతో చిన్నకారు, సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరినట్లయిందని చెప్పారు. కరువు పీడిత ప్రాంతాల్లో విస్తారంగా పంటల సాగు ప్రయోజనం పొందారని, తద్వారా కూలీలకు ఉపాధి దక్కిందని గుర్తు చేశారు. ఇప్పటి వరకు అమలులో ఉన్న నిబంధనల మేరకు 10 శాతం నిధులే చెల్లించలేని రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం నిధులు ముందస్తుగా డిపాజిట్ చేసే పరిస్థితులో ఉన్నారా అని ప్రశ్నించారు. ఏడాదిన్నర పాలనా కాలంలో 2.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఉపాధి హామీ పథకాన్ని దెబ్బ తీస్తున్న కేంద్ర వైఖరిని ప్రశ్నించకుండా నోరుమెదపక పోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జీవీ కొండారెడ్డి మాట్లాడుతూ కేంద్రంతోపాటుగా రాష్ట్రంలోని పార్టీలతో కలిసి రాజ్యాంగాన్ని విధ్వంసం చేసేందుకు మోదీ సర్కార్ బరితెగిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలోని కూటమి పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి అడుగులకు మడుగులొత్తడం దిగజారుడుపాలనకు నిదర్శనమని మండిపడ్డారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదించేలోపు ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాలం సుబ్బారావు, పమిడి వెంకటరావు, వి.బాలకోటయ్య, కంకణాల రమాదేవి, జాలా అంజయ్య, సీహెచ్ రాంబాబు, రఘురాం, పి.కల్పన, వీరస్వామి, భక్తసింగ్ రాజు, శేషయ్య, ఆదిలక్ష్మి పాల్గొన్నారు. -
సెలవు రోజుల్లో తరగతులు రద్దు చేయాలి
● యూటీఎఫ్ జిల్లా శాఖ డిమాండ్ ఒంగోలు సిటీ: ఎస్ఎస్సీ వంద రోజులు ప్రోగ్రాంలో విద్యార్థుల శారీరక, మానసిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆదివారాలు, సెలవు రోజుల్లో తరగతులు రద్దు చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కొమ్మోజు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలపై యూటీఎఫ్ జిల్లా శాఖ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ హై అధ్యక్షతన స్థానిక కలెక్టరేట్ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కొమ్మోజు శ్రీనివాసరావు మాట్లాడుతూ 2010కి ముందు చేరిన సీనియర్ టీచర్లకు టెట్ రద్దు చేయాలని, ఆ మేరకు విద్యా హక్కు చట్టాన్ని సవరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని కోరారు. ఎఫ్ఎల్ఎన్ 75 రోజుల ప్రోగ్రాం అమల్లో కూడా విద్యార్థులకు రాని అంశాలను వారికి స్వేచ్ఛగా నేర్పించే అవకాశం కల్పించాలన్నారు. సింగిల్ టీచర్లు సెలవుల విషయంలో ఓహెచ్లు ఉపయోగించుకునేందుకు పడుతున్న ఇబ్బందులు తొలగించాలన్నారు. గురుకుల సంక్షేమ పాఠశాలలో ఉపాధ్యాయులపై ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి అధికారుల వరకు వ్యవహరిస్తున్న తీరు మార్చుకోవాలన్నారు. జిల్లాలో కొన్ని మండలాల్లో టీచర్ల పట్ల ప్రత్యేకించి మహిళా ఉపాధ్యాయుల పట్ల ఎంఈఓలు వ్యవహరిస్తున్న తీరు సరిచేసుకోవాలన్నారు. జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ హై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సుమారు 30 వేల కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ పెట్టిందన్నారు. 12వ పీఆర్సీ కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఐఆర్ 30 శాతం ప్రకటించాలని, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన సరెండర్ లీవ్, ఆర్థిక బకాయిలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వీరాంజనేయులు మాట్లాడుతూ ఎఫ్ఎల్ఎన్ 100 రోజుల ప్రోగ్రాం పర్యవేక్షణకు విద్యాశాఖ అధికారులు కాకుండా వేరే డిపార్ట్మెంట్ వారిని నియమించడాన్ని యూటీఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. అదే విధంగా ఉపాధ్యాయుల మీద మానసిక ఒత్తిడి పెంచుతూ ఆదేశాలు ఇవ్వడం సరికాదన్నారు. ధర్నా అనంతరం డీఈఓ కార్యాలయంలో ఏడీ శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు నల్లూరి వెంకటేశ్వరరావు, కే వెంకయ్య, ఎం.సంధ్యారాణి, సీహెచ్ ప్రభాకర్రెడ్డి, కిలారి వెంకటేశ్వర్లు, పాలపర్తి రామాంజనేయులు, పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జీవీ శేష య్య, నాయకులు వైవీ వెంకట్రావు, ఆర్.నారాయణ, రమణమూర్తి, తాత వెంకటేశ్వర్లు, ఎం.మాలకొండయ్య, సుధాకర్రావు, దార్ల శ్రీనివాసరావు, దామ కొండపనాయుడు, బి.భాస్కరరావు పాల్గొన్నారు. -
ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలి
హాజరైన సీపీఐ శ్రేణులు, ప్రజలు కార్యక్రమంలో మాట్లాడుతున్న సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణ మార్కాపురం: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవోను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, వాటిని ప్రభుత్వమే నడపాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ డిమాండ్ చేశారు. లేకుంటే సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ విధానం పేరుతో మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ మార్కాపురం మెడికల్ కళాశాల వద్ద సీపీఐ ఆధ్వర్యంలో గురువారం వంటావార్పు, ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆనాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయగా, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమని అన్నారు. 2.70 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఐదారు వేల కోట్ల రూపాయలను మెడికల్ కళాశాలలు కట్టేందుకు కేటాయించలేదా.? అని ప్రశ్నించారు. వెనుకబడిన పశ్చిమ ప్రకాశానికి మెడికల్ కాలేజీ ఒక వరమని, ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి వెంకటరావు మాట్లాడుతూ విద్య, వైద్యాన్ని ప్రజలకు ఉచితంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. ముఖ్యమైన బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పుకోవడం దారుణమని అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు అందె నాసరయ్య మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాన్ని, ఉద్యమాలను, ప్రజల మనోభావాలను చంద్రబాబు ప్రభుత్వం గుర్తించి తక్షణమే ప్రైవేటీకరణ జీవోను ఉపసంహరిచుకోవాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే అది చేస్తాం.. ఇది చేస్తామంటూ చివరికి అన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్కే ఖాశీం, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కేవీ కృష్ణగౌడ్, ఎస్కే యాసీన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏఐవైఎఫ్ యువజన మాస పత్రికను రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రభాకర్, కరుణానిధి తదితరులు పాల్గొన్నారు. -
పొగబెట్టినారు.!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పొగాకు బోర్డు ఒంగోలు రీజియన్ పరిధిలో 11 పొగాకు వేలం కేంద్రాలున్నాయి. 2024–25 పంట కాలంలో 104.6 మిలియన్ కేజీల పొగాకు పండించేందుకు బోర్డు అనుమతి ఉంది. అయితే నాలుగేళ్లుగా వస్తున్న లాభాలతో ఈ ఏడాది పొగాకు సాగువైపు రైతులు అధికంగా మొగ్గు చూపారు. సాగు సమయంలో కంపెనీలు సైతం అదనపు సాగువైపు రైతులను పురిగొల్పాయి. ఫలితంగా పరిమితిని మించి 158.6 మిలియన్ కేజీల వరకు పొగాకు ఉత్పత్తులు రావచ్చని బోర్డు అధికారులు అంచనా వేశారు. దాదాపు 54 మిలియన్ కేజీల వరకు బోర్డు అనుమతికి మించి అదనపు పొగాకు పండింది. అయితే వేలం ప్రారంభంలో మంచి ధరలు వచ్చినా రానురాను పడిపోయాయి. రైతులకు కనీసం పెట్టుబడులు కూడా రాలేదు. కంపెనీలు కుమ్మకై ్క రైతులను ముంచేశాయని, వారికి బోర్డు అధికారులు వంతపాడారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. 2025–26 సీజన్కు సంబంధించి మొత్తం 90 మిలియన్ కేజీలు మాత్రమే సాగు చేయాలని బోర్డు పరిమితి విధించింది. ఎస్ఎల్ఎస్ పరిధిలో 48.1 మిలియన్ కేజీలు, ఎస్బీఎస్ పరిధిలో 42.1 మిలియన్ కేజీలు సాగుచేయాల్సి ఉంది. దీనికి సంబంధించి నాట్లు ప్రారంభమయ్యాయి. దాదాపు 2500 ఎకరాల నుంచి 3000 ఎకరాల్లో నారు సాగుచేస్తున్నారు. రీజియన్ పరిధిలో 11 వేలం కేంద్రాలు ఉండగా, సుమారు 25 వేల బ్యారన్లకు రైతులు లైసెన్స్లు కలిగి ఉన్నారు. 62 వేల హెక్టార్లలో పొగాకు సాగులో ఉంది. నారు సమయం నుంచే కష్టాలు.. పొగాకు నారు సాగుచేసే సమయం నుంచే రైతులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో 2500 నుంచి 3000 ఎకరాల్లో పొగాకు నారు సాగుచేస్తున్నారు. వరుస తుఫాన్ల కారణంగా నాట్లు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. మోంథా తుఫాన్కు ముందు పొగనారుమళ్లు సాగుచేసిన రైతులకు భారీగా లాభాలు వచ్చాయి. దిత్వా తుఫాన్ మరికొందరు రైతులకు నష్టాలు మిగిల్చింది. తెల్ల నేలల్లో అక్టోబర్లో పొగనాట్లు పూర్తి కావాల్సి ఉండగా.. నల్లరేగడి నేలల్లో నవంబర్ నుంచి డిసెంబర్ వరకు పొగనాట్లు పూర్తవుతాయి. తుఫాన్ల కారణంగా నారుదొడ్లు సాగు చేసే రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మోంథా తుఫాన్ ప్రభావంతో నారుదొడ్లు చాలా వరకు ధ్వంసం కాగా రైతులు భారీగా నష్టపోయారు. ఆ తర్వాత పొగనారుకు డిమాండ్ ఏర్పడటంతో నారుమూట ధరలు రూ.2,000 నుంచి ఒక్కసారిగా రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు పెరిగాయి. దీంతో నారుమళ్లు సాగుచేసుకున్న రైతులు భారీగా లాభాలు ఆర్జించారు. దీంతో రైతులు భారీగా నారుమళ్లు సాగు చేశారు. నారు ధరలు పడిపోయాయి.. 2.50 ఎకరాల్లో పొగాకు నారుమళ్లు సాగు చేశా. ఎకరాకు సుమారు రూ.2.50 లక్షలు ఖర్చు కాగా, సుమారు 200 నుంచి 250 మూటలు దిగుబడి వస్తుంది. మోంథా తుఫాన్ కారణంగా వేసిన నారుదొడ్డి దాదాపు పాడైంది. తిరిగి నారుమళ్లు సాగుచేశా. మొదట్లో నారు మూట ధర రూ.7 వేలు ఉండగా ప్రస్తుతం నారు అందుబాటులోకి వచ్చేసరికి ధర రూ.2 వేలకు పతనమైంది. నారుమూట ధర రూ.2,500 ఉంటే తప్ప గిట్టుబాటు కాదు. ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది. – తానికొండ రామచంద్రరావు, రైతు, పచ్చవ మోంథాతో నష్టం.. ఒకటిన్నర ఎకరాలో పొగాకు నారుమళ్లు సాగు చేశా. మోంథా తుఫాన్ కారణంగా నారుమళ్లలో నీరు నిలిచి పూర్తిగా నష్టపోయా. సుమారు రూ.2.50 లక్షలు నష్టమొచ్చింది. తిరిగి నారుమళ్లు సాగు చేస్తే ఇప్పుడు ధరలు తక్కువగా ఉన్నాయి. – ముళ్లమూరి శ్రీనివాసరావు, రైతు, పచ్చవ నారుకు తగ్గిన డిమాండ్... ఆరంభంలో ఎక్కువ ధరలు రావడంతో రైతులు పెద్ద ఎత్తున నారు సాగు చేశారు. ఒక్కసారిగా నారు ఎక్కువగా రావటంతో డిమాండ్ తగ్గిపోయింది. దీనికితోడు పొగనాట్లు దాదాపుగా పూర్తవడంతో పొగనారుకు డిమాండ్ భారీగా తగ్గింది. ప్రస్తుతం ఽముదురు నారు ధర రూ.వెయ్యి ఉండగా, లేత నారు ధర రూ.2,000 పలుకుతోంది. వాస్తవానికి నారుమూట ధర రూ.2,500 ఉంటే తప్ప గిట్టుబాటయ్యే పరిస్థితి లేదు. ఒక నారు మూటను కూలీలు కట్టాలంటే రూ.350 ఖర్చవుతుందని రైతులు చెబుతున్నారు. ఎకరా నారుదొడ్డి సాగు చేస్తే సుమారు 200 నుంచి 250 రూపాయల వరకు నారుమూటలు దిగుబడి వస్తాయి. ఒక ఎకరా నారు దొడ్డి సాగు చేయడానికి సుమారు రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షలు ఖర్చవుతుంది. ఈ సంవత్సరం పొగనారుమళ్లు సాగు చేసిన రైతులు కొంతమంది రూ.లక్షల్లో లాభాలు ఆర్జించగా, మరికొందరు ఆర్థికంగా నష్టపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా నాణ్యమైన నారును పొరుగు ప్రాంతాల నుంచి తెచ్చుకుంటుండడంతో స్థానికంగా లభ్యమయ్యే నారు ధరలు పతనానికి మరో కారణంగా నిలుస్తున్నాయి. ఇదిలా ఉండగా సంబంధిత శాఖ అధికారులుగానీ, బోర్డు అధికారులుగానీ రైతులకు అవగాహన కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం
● 104 వాహనాల జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ శ్రవణ్ కుమార్ మద్దిపాడు: రెండు పోలియో చుక్కలు వేసి పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దామని 104 వాహనాల జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ శ్రవణ్కుమార్ కోరారు. పల్స్ పోలియో కార్యక్రమంపై అవగాహన కల్పిస్తూ మద్దిపాడు బస్టాండ్ సెంటర్లో గురువారం మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ డిసెంబర్ 21వ తేదీ తలపెట్టిన పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని జయప్రదం చేసి పోలియో రహిత సమాజాన్ని సాధిద్దామన్నారు. ఈ నెల 23వ తేదీ వరకు పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుందన్నారు. మొదటి రోజు అప్పుడే పుట్టిన శిశువు నుంచి 5 సంవత్సరాల్లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేస్తామన్నారు. ఆ రోజు పోలియో చుక్కలు వేయించుకోని వారికి 22, 23, తేదీల్లో ఆశ, అంగనవాడీ, ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి వేస్తారని తెలిపారు. అనంతరం వారి ఇంటికి మార్కింగ్ చేస్తారన్నారు. మద్దిపాడు పీహెచ్సీ పరిధిలో 37 బూత్లు, 3 రూట్లు, 2 మొబైల్ టీంలు ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక ప్రదేశాలు.. అనగా ఇటుక బట్టీలు, సంచార జాతులు, మురికివాడలు, వలసలు ఉన్న పిల్లలకు ఆయా రూట్ సూపర్వైజర్లు పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 5,574 మంది 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంస్థలు సహకరించి పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో వ్యాధి లేని భారతంలో భాగస్వాములు కావాలని కోరారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి వైద్య శాఖ సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు. ముందుగా పీహెచ్సీలోని సమావేశ మందిరంలో డాక్టర్ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆశ, అంగన్వాడీ, ఆరోగ్య, స్వచ్ఛంద సంస్థల వలంటీర్లు, ఎంఎల్హెచ్పీలకు పల్స్ పోలియోపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ అన్వేష్ కుమార్, డాక్టర్ వినీల చౌదరి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రజిత కుమారి, సీనియర్ అసిస్టెంట్ శాంతకుమారి, సూపర్వైజర్ బాలకోటయ్య, నాగరాజి, పద్మావతి సిబ్బంది పాల్గొన్నారు. -
సీఎం సమీక్షలో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ
ఒంగోలు సబర్బన్: సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో గురువారం రెండో రోజు నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కలెక్టర్ పి.రాజాబాబు, ఎస్పీ హర్షవర్థన్రాజు పాల్గొన్నారు. బుధవారం మొదటి రోజు సీఎం సమీక్షకు కలెక్టర్లు మాత్రమే హాజరవగా, రెండో రోజు కలెక్టర్తో పాటు ఎస్పీ కూడా పాల్గొన్నారు. జిల్లాకు సంబంధించిన నివేదికలతో వారు హాజరయ్యారు. ఒంగోలు సిటీ: స్థానిక సమగ్ర శిక్ష కార్యాలయంలో ఒంగోలు డివిజిన్ పరిధిలోని మండల విద్యాశాఖ అధికారులు, సీఆర్ఎంటీఎస్లకు సోషల్ ఆడిట్పై గురువారం ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ దాసరి అనీల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీ నాటికి జిల్లాలో సోషల్ ఆడిట్ పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సోషల్ ఆడిట్ నోడల్ ఆఫీసర్ సోనీ రూత్, ఎం.జాలరత్నం, ప్లానింగ్ కో ఆర్డినేటర్ పి.నాగేంద్ర నాయక్, రిసోర్స్ పర్సన్లు హరిబాబు, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. ● ప్రభుత్వ, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో జేసీ గోపాలకృష్ణ సమీక్ష ఒంగోలు సబర్బన్: తల్లితండ్రి లేని పిల్లలను అనాథ పిల్లలుగా కాకుండా మన సొంత పిల్లలుగా భావిస్తూ వారిని తీర్చిదిద్దే బాధ్యత మనదే అని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ అన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల అధికారులతో గురువారం జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన ఆయన చాంబర్లో సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని యాజమాన్యాల సీసీఐలలో ఉన్న పిల్లల రక్షణ, సంరక్షణ వివరాలను ఆయా సంస్థల ప్రతినిధులను అడిగి జాయింట్ కలెక్టర్ తెలుసుకున్నారు. పిల్లలకు వారు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. సీసీఐలో ఎవరైనా ఇబ్బందులు పడుతున్నా.. ఏవైనా అవసరాలున్నా తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ప్రతి సీసీఐలో ఉన్న ఆర్ఫాన్ అండ్ సెమీ ఆర్ఫాన్ పిల్లలకు బర్త్ సర్టిఫికెట్లు, ఆధార్లు సమకూర్చాలని డీసీపీఓకు తెలిపారు. 8 సంవత్సరాలు దాటిన పిల్లలకు వారి కాళ్లపై వారు నిలబడేలా స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అందించాలని సూచించారు. అందుకు అన్ని డిపార్ట్మెంట్ల సహకారం అందించాలని కోరారు. అన్ని సీసీఐలలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలని సంబంధిత సీసీఐ వారికి తెలిపారు. జిల్లాలో అనధికారికంగా నిర్వహిస్తున్న ఏవైనా స్వచ్ఛంద సంస్థలను గుర్తించి వాటిపై తగు చర్యలు తీసుకోవాలని జేసీ ఆదేశించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ సువర్ణ, జిల్లా బాలల సంరక్షణ అధికారి పి.దినేష్ కుమార్, మిషన్ శక్తి కో ఆర్డినేటర్ ఇవంజిలిన్, సీసీఐ సిబ్బంది పాల్గొన్నారు. -
టంగుటూరులో వ్యక్తి దారుణ హత్య
టంగుటూరు: టంగుటూరులో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన స్థానిక వడ్డెపాలెంలో మంగళవారం రాత్రి జరగ్గా..బుధవారం అర్ధరాత్రి వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం...టంగుటూరు వడ్డెపాలెంలో నివాసం ఉంటున్న యనమనమంద వెంకట రమణయ్య(50) స్థానిక హెచ్డీఎఫ్సీ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో రమణయ్య ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో స్థానికులు తలుపు తీసి చూడగా మృతదేహం కనిపించింది. దీంతో కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, సింగరాయకొండ సీఐ హజరత్తయ్య, ఎస్సై నాగమల్లీశ్వరరావు, జరుగుమల్లి ఎస్సై మహేంద్రలు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్టీం సంఘటనా స్థలికి చేరుకొని క్షుణ్ణంగా పరిశీలించారు. మృతుని తల, గొంతపై ఐదు బలమైన గాయాలను గుర్తించారు. హైదరాబాద్లో నివాసం ఉండే మృతుని కుమారుడు, బంధువులు మంగళవారం రాత్రి నుంచి ఫోన్ చేస్తున్నా స్పందించడం లేదు. దీంతో మృతుని కుమారుడు తన స్నేహితులను ఇంటికి పంపించగా మృతదేహాన్ని కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా ప్రాంతాన్ని అణువణువు పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ రైల్వేస్టేషన్ వరకు వెళ్లి ఆగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుని భార్య 2016లో మృతి చెందారు. కుమారుడు, కుమార్తె ఉండగా వారికి వివాహమైంది. మృతుని కుమారుడు ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. హత్యకు సంబంధించి ఎటువంటి ప్రాథమిక ఆధారాలు లభించలేదన్నారు. దొంగతనం చేయడానికి వచ్చి హత్య చేశారా..వేరే ఇతర కారణాలతో హత్య జరిగింది అన్న కోణంలో విచారిస్తున్నామని తెలిపారు. కేసుకు సంబంధించి నాలుగు టీంలను రంగంలోకి దించి సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ పేర్కొన్నారు. వ్యక్తి హత్యతో టంగుటూరులో కలకలం రేగింది. రెండు రోజుల తరువాత వెలుగులోకి మృతుడు ప్రైవేట్ బ్యాంకు సెక్యూరిటీ గార్డు -
ఉపాధి చట్టాన్ని కాపాడుకునేందుకు ఉద్యమం
ఒంగోలు టౌన్: రగామీణ ప్రజలకు జీవనోపాధిని కల్పిస్తూ వలసలు అరికట్టడంలో గణనీయమైన పాత్ర పోషించిన మహాత్మాగాంధీ ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా పోరాటాలకు సిద్ధం కావాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల ఆంజనేయులు పిలుపునిచ్చారు. స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో గురువారం నాలుగు సంఘాల సంయుక్త సమావేశం నిర్వహించారు. నెరుసుల వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించిన సమావేశంలో నిరసన కార్యక్రమాలకు సంబంధించిన వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టం రాకముందు అనేక దశాబ్దాల పాటు గ్రామీణ ప్రాంతాల్లో పనైనా చూపండి..తిండయినా పెట్టండి అంటూ పోరాటాలు జరిగాయని గుర్తు చేశారు. 2005లో పార్లమెంట్లో 62 మంది ఉన్న వామపక్షాలకు 18 మంత్రి పదవులు ఇస్తామని ఆనాటి యూపీఏ ప్రభుత్వం ప్రతిపాదించిందని, పదవులకు బదులుగా గ్రామీణ పేదలకు ఉపాధి గ్యారంటీ చట్టం కావాలని వామపక్షాలు కోరాయని తెలిపారు. వామపక్ష పార్టీల ప్రయత్నంతోనే దేశంలో ఉపాధి హామీ చట్టం అమల్లోకి వచ్చిందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనతో పాటు వలసల నివారణ, గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరులు, శాశ్వత ఆస్తులు సమకూర్చడం వంటివి ఉపాధి హామీతో సాధ్యమైందన్నారు. పేదల జీవన ప్రమాణాలు కొంతమేర మెరుగయ్యాయని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కూలీలతో పాటుగా మధ్య తరగతికి చెందిన రైతు కుటాంబాల నుంచి కూడా ఉపాధి పనులు చేసుకున్నారని చెప్పారు. ఉపాధి హామీ పథకంతో గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి పెరిగి దేశాభివృద్ధికి దోహదపడిందన్నారు. కౌలురైతు సంఘం జిల్లా కార్యదర్శి వి.బాలకోటయ్య మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టాన్ని పేదలకు వ్యతిరేకంగా మార్చడమే కాకుండా పేరు మార్చి నిర్వీర్యం చేయడం కేంద్ర పాలకుల దమననీతికి నిదర్శనమన్నారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తూనే ఉందన్నారు. 90 శాతం నిధులకు కేంద్రం భరిస్తుండగా ఇప్పుడు దాన్ని 60 శాతంగా మార్చడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించకుండా ఈ చట్టాన్ని పూర్తిగా నిలిపివేసే ప్రమాదం ఉందని చెప్పారు. ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకునేందుకు ఉధృతంగా ఉద్యమాలను నిర్మిస్తామని చెప్పారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.రమేష్, రైతు సంఘం సీనియర్ నాయకులు పెండ్యాల హనుమంతరావు, గంగవరపు రమేష్బాబు, ఉబ్బా వెంకటేశ్వర్లు, పి.శ్రీను, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
220 కేవీ విద్యుత్ టవర్కు పొంచి ఉన్న ముప్పు
మార్కాపురం: మార్కాపురం ప్రాంతంలో మట్టి మాఫియా చెలరేగుతోంది. మట్టి అక్రమ తవ్వకాలతో దరిమడుగు వద్ద 220 కేవీ విద్యుత్ టవర్ కూలిపోయే ప్రమాదం ఏర్పడింది. గ్రామ సమీపంలోని సుబానీ కుంటలో గుండా 220 కేవీ విద్యుత్ లైన్ టవర్లు వెళ్తుండగా, దరిమడుగు వద్ద 220 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచే డివిజన్లోని మార్కాపురం, తర్లుపాడు, పొదిలి, కంభం, అర్ధవీడు, బేస్తవారపేట, గిద్దలూరు తదితర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా అవుతుంది. అయితే కుంటలో ఉన్న మట్టిని మట్టిని కొందరు అక్రమంగా ట్రాక్టర్లు, టిప్పర్లలో తరలించారు. దీంతో 220 కేవీ విద్యుత్ టవర్కు ముప్పు ఏర్పడింది. ఇటీవల కురిసన వర్షాలకు కుంటలో నీరు చేరడంతో టవర్ చుట్టూ ఉన్న కొద్దిపాటి మట్టి కూడా కరిగిపోతోంది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిస్తే.. టవర్ కూలిపోయే పరిస్థితికి వచ్చింది. ఈ హైటెన్షన్ విద్యుత్ లైను పక్కనే నేషనల్ హైవేతోపాటు దేవరాజుగట్టు నుంచి ఒంగోలు వెళ్లే హైవే రోడ్డు ఉంది. ఏ మాత్రం టవర్ ఒరిగి పడినా విద్యుత్ తీగలు తెగిపడి భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. మట్టిమాఫియా ఆగడాలను అరికట్టేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దరిమడుగు వద్ద అక్రమంగా మట్టి తవ్వకాలు హైటెన్షన్ విద్యుత్ వైర్ల పక్కనే నేషనల్ హైవే టవర్ కూలితే భారీ నష్టం తప్పదని ప్రజల ఆందోళన -
క్రీడలతో మానసిక స్థైర్యం
సంతనూతలపాడు: క్రీడల్లో పాల్గొనడం ద్వారా మానసిక స్థైర్యం పెంపొందుతుందని ఆర్జీయూకేటీ కళాశాలల రిజిష్ట్రార్ ఎస్ అమరేంద్రకుమార్ అన్నారు. మండలంలోని ఎండ్లూరు డొంక వద్ద ఉన్న ఆర్జీయూకేటీ కళాశాల ప్రాంగణంలో ఈ నెల 15న ప్రారంభమైన రాష్ట్రస్థాయి ఫుట్బాల్, క్రికెట్ టోర్నమెంట్ పోటీలు గురువారంతో ముగిశాయి. పోటీల్లో ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం, ఆర్కేపల్లి విద్యార్థులు పాల్గొన్నారు. పోటీలు పోటాపోటీగా సాగాయి. ఫుట్బాల్లో ఒంగోలు ఆర్జీయూకేటీ కళాశాల విద్యార్థులు విజేతగా నిలవగా, రన్నర్స్గా ఆర్కేపల్లి కళాశాల విద్యార్థులు నిలిచారు. క్రికెట్ టోర్నమెంట్లో నూజివీడు విద్యార్థులు విన్నర్స్గా నిలవగా, ఒంగోలు ఆర్జీయూకేటీ కళాశాల విద్యార్థులు రన్నర్స్గా నిలిచారు. విజేతలకు ఆర్జీయూకేటీ కళాశాలల రిజిష్ట్రార్ ఎస్.అమరేంద్రకుమార్ బహుమతులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్జీయూకేటీ కళాశాలల ఏఓ చంద్రశేఖర్, డీన్ రూపస్కుమార్, ఎఫ్ఓ మీరావళి, డీన్. దిలీప్, సీఈఓ ఎం శ్రీనివాసరెడ్డి, పీడీ పీవీ భాస్కర్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
దప్పిక తీరాలంటే.. క్యాన్లు మోయాల!
బేస్తవారిపేట: స్థానిక బీసీ హాస్టల్లో విద్యార్థులు దప్పిక తీర్చుకోవాలంటే రోజూ మినరల్ వాటర్ బబుల్స్ స్వయంగా మోసుకొచ్చుకోవాల్సిందే. వార్డెన్ విధులకు సక్రమంగా హాజరు కాకుండా ఆయన కుమారుడికి హాస్టల్ నిర్వహణ బాధ్యతలు అప్పగించడం, పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు మౌనం పాటించడంతో విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. విద్యార్థులు రోజూ జాతీయ రహదారి పక్కన ఉన్న ఆర్వో ప్లాంట్ వద్దకు వెళ్లి బబుల్స్లో మినరల్ వాటర్ తెచ్చుకుంటున్నారు. విద్యార్థులతో రాత్రి సమయంలో వాటర్ క్యాన్లు మోయిస్తున్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు.. హాస్టల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
నేడు జిల్లా స్థాయి విద్య వైజ్ఞానిక ప్రదర్శన
ఒంగోలు సిటీ: విద్యార్థుల్లో సృజనాత్మకత, ఉత్సుకత, ఆవిష్కరణ నైపుణ్యాలను పెంపొందించడంలో భాగంగా పెళ్లూరు సాయిబాబా సెంట్రల్ స్కూల్లో 19వ తేదీ జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు డీఈఓ సీవీ రేణుక గురువారం తెలిపారు. ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో మండల స్థాయిలో గెలుపొందిన విజేతలు పాల్గొంటారని తెలిపారు. ఇందులో సస్టైనబుల్ అగ్రికల్చర్, వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ ఆల్టర్నేటీవ్ ప్లాస్టిక్, గ్రీన్ ఎనర్జీ, ఎమర్జింగ్ టెక్నాలజీస్, రిక్రీయేషనల్ మేథమెటికల్ మోడలింగ్, హెల్త్ అండ్ హైజీన్, వాటర్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ అనే థీమ్ ఉంటాయని తెలిపారు. జిల్లాస్థాయి పోటీల్లో మొత్తం 266 విద్యార్థుల ప్రదర్శనలు, 38 ఉపాధ్యాయుల ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. మొత్తం విద్యార్థులు, ఉపాధ్యాయులు 570 మంది ప్రదర్శనలో పాల్గొంటారని పేర్కొన్నారు. పిల్లల్లో ఆవిష్కరణల పట్ల ఆసక్తిని కలిగించేలా సైన్స్ ప్రదర్శన నిర్వహించాలన్నారు. కనిగిరిరూరల్: ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పట్టణంలోని శివనగర్ కాలనీలో గురువారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే.. శివనగర్కు చెందిన సీహెచ్ బాబు(25) ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు యువకున్ని పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో మృత దేహాన్ని కనిగిరి మండంలోని స్వగ్రామానికి తరలించారు. టంగుటూరు: మండల పరిధిలోని 16వ నంబర్ జాతీయ రహదారి సమీపంలో గురువారం రాత్రి పూరి గుడిసెలు దగ్ధమయ్యాయి. వివరాల్లోకి వెళితే..స్థానిక రొయ్యల పరిశ్రమల్లో పనిచేసేందుకు వచ్చిన ఒరిస్సా వాసులకు మధ్యవర్తులు పూరిగుడిసెలు ఏర్పాటు చేశారు. వారంతా ఈ గుడిసెల్లో ఉంటూ షిఫ్టుల వారీగా విధులకు హాజరవుతుంటారు. ఈ క్రమంలో గురువారం నైట్ షిఫ్ట్కి వెళ్లిన వారి గుడిసెలకు మంటలంటుకున్నాయి. ఆ సమయంలో అటుగా వెళుతున్న వారు మంటలను అదుపు చేశారు. -
క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలకు చేరుకోండి
తాళ్లూరు: విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అన్నారు. మండలంలోని బొద్దికూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం సాయంత్రం బూచేపల్లి వెంకాయమ్మ, సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ మెటీరియల్ను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి నాడు–నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కోట్లాది రూపాయలు వెచ్చించారన్నారు. అమ్మఒడి పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాలకు నగదు జమ చేసి విద్యను ప్రోత్సహించారని తెలిపారు. బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ తానూ ఇదే గ్రామంలోని పాఠశాలలో చదువుకున్నానని తెలిపారు. విద్యార్థులు తల్లిదండ్రుల కష్టాన్ని తెలుసుకొని బాగా చదివి వారికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా ఎన్ని స్కూల్ బ్యాగ్లు చినిగిపోయాయని ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అడగ్గా.. 90 శాతం మంది విద్యార్థులు చేతులెత్తారు. దీంతో తమ చారిటబుల్ ట్రస్టు తరఫున విద్యార్థులందరికీ బ్యాగ్లు అందిస్తామని తెలిపారు. పాఠశాలలో మరమ్మతులకు గురైన వాటర్ప్లాంట్, మరుగుదొడ్లు బాగు చేయిస్తామని, టైనింగ్ హాల్కు, ప్రైమరీ స్కూల్ ప్రహరీ నిర్మాణానికి విరాళాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ మందా శాంసన్, ఉప సర్పంచ్ పులి ప్రసాద్రెడ్డి, వెలుగువారిపాలెం సర్పంచ్ ముచ్చుమారి కోటేశ్వరమ్మ బ్రహ్మారెడ్డి, ఎంపీటీసీ బాలకోటయ్య, నాయకులు పులి అంజిరెడ్డి, పులి రామిరెడ్డి, సగిలి రోషిరెడ్డి, పులి ప్రభాకర్రెడ్డి, ఎదులూరి కృష్ణారెడ్డి, ఎదురూరి శ్రీనివాస్రెడ్డి, పులి సుబ్బారెడ్డి, పాఠశాల హెచ్ఎం పి.సుబ్బారావు, పీడీ రవిప్రసాద్రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
నేడు ఉపాధ్యాయుల సమస్యలపై ధర్నా
ఒంగోలు సిటీ: ఉపాధ్యాయుల సమస్యలపై ఈ నెల 18న ఒంగోలు కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ అబ్దుల్ హై, డి.వీరాంజనేయులు పిలుపునిచ్చారు. స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. 2010కి ముందు ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలని, ఆ మేరకు విద్యాహక్కు చట్టం సవరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని కోరారు. పదో తరగతి 100 రోజుల కార్యాచరణలో భాగంగా విద్యార్థుల శారీరక, మానసిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆదివారాలు, సెలవు రోజుల్లో తరగతులు రద్దు చేయాలన్నారు. ఎఫ్ఎల్ఎన్ 75 రోజుల ప్రోగ్రాం అమల్లో కూడా విద్యార్థులకు స్వేచ్ఛగా వారికి రాని అంశాలు నేర్పించే అవకాశం కల్పించాలని కోరారు. సింగిల్ టీచర్లు సెలవుల విషయంలో ఓహెచ్లు ఉపయోగించుకునే విషయంలో పడుతున్న ఇబ్బందులను తొలగించాలని కోరారు. గురుకుల సంక్షేమ పాఠశాలలో ఉపాధ్యాయులపై ఆ శాఖ ఉన్నతాధికారులు నుంచి కిందిస్థాయి అధికారుల వరకు వ్యవహరిస్తున్న తీరు మార్చుకోవాలన్నారు. జిల్లాలోని కొన్ని మండలాల్లో ఎంఈఓలు మహిళా ఉపాధ్యాయులపై పట్ల వ్యవహరిస్తున్న తీరును సరిచేసుకోవాలని కోరారు. ధర్నాను విజయవంతం చేసేందుకు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ధర్నా అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేయడం, సమస్యలపై డీఈఓతో చర్చిస్తామని పేర్కొన్నారు. -
సురక్షిత నీటితోనే సంపూర్ణ ఆరోగ్యం
కొత్తపట్నం: సురక్షితమైన తాగునీరు అందించడం వలన అందరికీ సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జిల్లా పంచాయతీ అధికారి ఎం.వెంకటేశ్వరరావు అన్నారు. మండలంలోని కె.పల్లెపాలెం గ్రామంలో బుధవారం గ్రామ సభకు హాజరై సిబ్బంది, ప్రజలకు పలు సలహాలు, సూచనలు చేశారు. ప్రతి 15 రోజులకు ఒకసారి అన్ని ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులను పూర్తిగా శుభ్రపరచాలన్నారు. నీటి నమూనాలను పరీక్షించి ఎలాంటి కలుషితం కాకుండా నిర్ధారించాలన్నారు. బోర్లనీటి నమూనాలను ఇంజినీరింగ్ అసిస్టెంట్ సహాయంతో ఎఫ్టీకే ద్వారా ప్రజల సమక్షంలో పరీక్షించాలన్నారు. నిర్వహించిన అన్ని పరీక్షల వివరాలను కచ్చితంగా రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. గ్రామ ప్రజలకు సురక్షిత, శుభ్రమైన తాగునీరు అందించడంలో బాధ్యతాయుతంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటి పరీక్షల ద్వారా నిర్ధారణ చేసుకుని మాత్రమే ప్రజలకు స్వచ్ఛమైన నీరు సరఫరా చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీకృష్ణ, ఇన్చార్జి డిప్యూటీ ఎంపీడీవో జి.నాగేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యుడు పిన్ని నరసింహారావు, పీడీవో డాక్టర్ జె.సంపత్, డీఎఫ్సీఎస్జీ పేరయ్య, ప్రభుప్రకాశ్, చాపల జాలరాం, పిన్ని దేవప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా పంచాయతీ అధికారి ఎం.వెంకటేశ్వరరావు -
ప్రాజెక్టు నిర్మాణం ఇలా...
శ్రీశైలం ప్రాజెక్టులోని 43.58 టీఎంసీల కృష్ణ నీటిని శ్రీశైలం వద్ద ఉన్న కొల్లం వాగు నుంచి 2 టన్నెళ్ల ద్వారా ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాలోని 30 మండలాలకు అందించేలా ప్రాజెక్టును రూపకల్పన చేశారు. వెలిగొండ ప్రాజెక్టుతో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 15.25 మంది లక్షల మందికి తాగునీరు అందించేలా డిజైన్ చేశారు. గొట్టిపడియ, సుంకేసుల, కాకర్ల డ్యాంలు పూర్తి కాగా దోర్నాల మండలం కొత్తూరు వద్ద రెండు టన్నెళ్ల పనులు పూర్తయ్యాయి. ఒక్కో టన్నెల్ను 18.8 కిలోమీటర్ల పొడవుతో నిర్మించారు. మొదటి టన్నెల్ పనులు పూర్తి చేయగా, రెండో టన్నెల్ పనులు కూడా వేగంగా గత ప్రభుత్వంలో చేపట్టారు. దివంగత సీఎం వైఎస్సార్ మహా సంకల్పంతో ప్రాజెక్టును ప్రారంభించగా 2014 నాటికి టన్నెల్–1 11.50 కిలోమీటర్లు పూర్తికాగా, టన్నెల్–2 9 కిలోమీటర్లు పూర్తయింది. 62 శాతం టన్నెల్ 1 పనులు పూర్తికాగా, 48 శాతం టన్నెల్ 2 పనులు పూర్తయ్యాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019 వరకు 1వ టన్నెల్కు సంబంధించి కేవలం 2 కిలోమీటర్లు మాత్రమే పనులు జరిగాయంటే ప్రాజెక్టు నిర్మాణంపై టీడీపీ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో అర్థం చేసుకోవచ్చు. 2019లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాజెక్టుపై పూర్తిస్థాయిలో దృష్టి సారించి మొదటి టన్నెల్ను పూర్తి చేశారు. -
వన్యప్రాణులను చంపితే జైలుకే
● అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ అబ్దుల్ రవూఫ్ మార్కాపురం: వన్యప్రాణులను చంపితే జైలుకు పంపుతామని మార్కాపురం అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ అబ్దుల్ రవూఫ్ హెచ్చరించారు. మార్కాపురంలోని తన కార్యాలయంలో బుధవారం ట్రాన్స్పోర్టు అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రెస్మీట్లో మాట్లాడారు. అడవిని ఆనుకొని ఉన్న గ్రామాల్లో, వన్యప్రాణులు తిరిగే రెవెన్యూ కొండలు, తిప్పలు, పొదలు తదితర గ్రామాల్లో రైతులు పొలాల్లో విద్యుత్ వైర్లు పెట్టడం, ఉచ్చులు వేయడం చట్టవిరుద్ధమన్నారు. అలాంటి వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తామని చెప్పారు. విద్యుత్ శాఖ సిబ్బంది అలాంటి వాటిని తమ అటవీశాఖ సిబ్బందితో కలిసి గుర్తించాలని తెలిపారు. వారిపై వన్యప్రాణుల చట్ట ప్రకారం నాన్బెయిలబుల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని చెప్పారు. వన్యప్రాణులను స్వేచ్ఛగా తిరగనివ్వాలని విజ్ఞప్తి చేశారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దోర్నాల సబ్ డీఎఫ్ఓ నీరజ్ హాన్స్, మార్కాపురం, దోర్నాల, యర్రగొండపాలెం, విజయపురి సౌత్, గంజివారిపల్లి ఎఫ్ఆర్ఓలు పిచ్చిరెడ్డి, హరి, ప్రసన్న జ్యోతి, సుజాత, సూర్య నారాయణ, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు నాగరాజు, ప్రసాదరెడ్డి, శివశంకర్, ఇమ్రాన్ సిద్ధిఖీ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు టౌన్: శాంతి భద్రతల పరిరక్షించడం, నేరాలను అరికట్టడం, కేసుల దర్యాప్తులో సీసీ కెమెరాల పాత్ర కీలకమని ఎస్పీ హర్షవర్థన్ రాజు అన్నారు. తాలుకా పోలీసు స్టేషన్ పరిధిలో నేరాల కట్టడికి క్విజ్ ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ ఎన్ సూర్య కళ్యాణ చక్రవర్తి 50 సీసీ కెమెరాలను బుధవారం ఎస్పీకి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సామాజిక బాధ్యతతో జిల్లా పోలీసు శాఖకు సీసీ కెమెరాలు అందించిన సూర్య కళ్యాణ చక్రవర్తిని అభినందించారు. పోలీస్స్టేషన్ల పరిధిలో దొంగతనాలు, చైన్ స్నాచింగ్, ఈవ్టీజింగ్, రహదారి ప్రమాదాలు, అసాంఘిక కార్యకలాపాలు జరిగే ప్రదేశాలు, ఇతర నేరాలకు అవకాశం ఉన్న శివారు ప్రాంతాల్లో పెళ్లూరు నుంచి మంగమూరు వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఒంగోలు టౌన్: శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ఎలాంటి చర్యలకు పాల్పడినా ఉపేక్షించేదిలేదని, హద్దుమీరి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హర్షవర్థన్ రాజు హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా 388 మంది రౌడీ షీటర్లకు బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లాలోని పోలీసుస్టేషన్లకు పిలిపించి రౌడీలకు క్లాస్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రౌడీషీటర్ల ఫోన్లను ట్రాక్ చేస్తూ ఎప్పటికప్పుడు వారి కార్యకలాపాలను గమనిస్తున్నామని తెలిపారు. పద్ధతి మార్చుకొని మంచిగా ఉండాలని హితవు పలికారు. దౌర్జన్యాలు, నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి రోజూ రౌడీ షీటర్ల ఇంటికి వెళ్లి పోలీసు సిబ్బంది ఆరా తీస్తున్నారని, ఒకవేళ ఇంట్లో లేకుంటే మరుసటి రోజు ఉదయాన్నే పోలీస్స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు వివరించారు. సానుకూల ఆలోనలతో వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవాలని సూచించారు. యువత భవితను చెడగొట్టే అలవాట్లను విడిచిపెట్టి మంచిమార్గంలో సాగాలని, చెడు నడత కలిగిన వ్యక్తులు నేర ప్రవృత్తిని విడనాడి సద్బుద్ధితో జీవించాలని చెప్పారు. గతంలో జరిగిన పరిణామాలను మరచిపోవాలని, జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని సూచించారు. గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయాలు వంటి సమాజానికి హానీ చేస్తాయని, దురలవాట్ల నుంచి దూరంగా ఉండాలని చెప్పారు. పోలీసులు చేపట్టే ప్రజాహిత కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని కోరారు. ఎలాంటి గొడవలు, అల్లర్లకు పాల్పడకుండా మసలుకోవాలని చెప్పారు. దర్శి డీఎస్పీ లక్ష్మీ నారాయణ, మార్కాపురం డీఎస్పీ నాగరాజు, సీఐలు, ఎస్సైలు ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో కౌన్సెలింగ్ నిర్వహించారు. -
ప్రేమ, కరుణ, శాంతి సమ్మేళనమే క్రిస్మస్
ఒంగోలు సిటీ: ప్రేమ, శాంతి, కరుణ సమ్మేళనమే క్రిస్మస్ వేడుకని జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. నగరంలోని జెడ్పీ సమావేశం హాలులో కార్యాలయ సిబ్బంది ఆధ్వర్యంలో బుధవారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పాల్గొని కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరస్పరం ప్రేమ, శాంతితో నడుచుకోవాలన్న ఏసుక్రీస్తు బోధనలను పాటించాలని సూచించారు. ఏసుప్రభు జీవితం మానవాళికి ఒక సందేశమన్నారు. ఏసుప్రభు బోధనలు ప్రేమ, కరుణ, సేవ భావనతో నిండి ఉంటాయని, ప్రతి ఒక్కరూ వాటిని ఆచరించాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ బాలమ్మ, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడం కూల్చివేత
కనిగిరి రూరల్: ప్రభుత్వ, ఆర్అండ్బీ స్థలంలో ఓ పత్రికా విలేకరి(సాక్షి కాదు) నిర్మించిన అక్రమ కట్టడాన్ని రెవెన్యూ, అర్అండ్బీ, మున్సిపల్ అధికారుల బృందం బుధవారం రాత్రి కూల్చివేసింది. స్థానిక ఆర్అండ్బీ ఆఫీస్ సమీపంలోని హరిజనవాడలో ఓవీ రోడ్డుకు ఆనుకుని ఉన్న సుమారు 2 సెంట్ల స్థలంపై గత కొతం కాలంగా ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. దీనిపై ఇరువర్గాల వారు కోర్టును ఆశ్రయించారు. ఓ వర్గం ఎస్సీ, ఎస్టీ కమిషన్ను కూడా ఆశ్రయించింది. వారి తాజా ఉత్తర్వ్లుతో ఆ స్థలంలో కట్టడాన్ని తొలగించేందుకు అధికారులకు చర్యలు చేపట్టారు. ఈ విషయమై తహసీల్దార్ నర్రా జయలక్ష్మి మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ పొరంబోకు స్థలంలో ఎ.నాగకుమార్ చేపట్టిన అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం ఆర్అండ్బీకి చెందిన 6 అంకణాల స్థలంలో నిర్మాణాన్ని తొలగించాం. అక్రమ కట్టడాన్ని పూర్తిగా తొలగిస్తాం. గత కొంత కాలంగా ఆ భూమిపై నాగకుమార్, పంతగాని కొండమ్మ వర్గాల మధ్య వివాదం నడుస్తోంది. హరిజనవాడలో గల స్థలం తమదని, దానిపై తమకు పూర్తి హక్కు పత్రాలున్నాయని పంతగాని కొండమ్మ, ముద్దా రమా హైకోర్టులో కేసు వేయడంతోపాటు ఎస్సీ, ఎస్టీ కమిషన్ను ఆశ్రయించారు. నాగకుమార్ కూడా తనకు పొజిషన్ సర్టిఫికెట్ ఉందని హైకోర్టును ఆశ్రయించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.. దీనిపై తాము విచారణ చేపట్టగా అసలు ఆ భూమిలో ఎవరికీ పట్టా ఇవ్వలేదని తేలింది. రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ పొరంబోకు స్థలంగా ఉంది. చాలా ఏళ్ల నుంచి అక్కడ ఎస్సీలు నివసిస్తుండటంలో హరిజనపాలెంగా పిలుస్తున్నారు. గత తహసీల్దార్ రవికుమార్ 2025 జూన్లో నాగకుమార్కు 2 సెంట్లలో పీసీ( పొజిషన్ సర్టిఫికెట్) ఇచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు ఆ భూమిలోకి ఎవరూ వెళ్లకుండా రెండు వర్గాలకు చెందిన వారిని బైండోవర్ చేశాం. మున్సిపల్ పరిధిలోని స్థలానికి పట్టా ఇచ్చేందుకు తహసీల్దార్లకు అనుమతి లేదు. ఆర్డీఓ ఆదేశాల మేరకు నాగకుమార్కు ఇచ్చిన పొజిషన్ సర్టిఫికెట్ రద్దయింది. నాగకుమార్ రెండ్రోజుల క్రితం శ్లాబ్ నిర్మాణం చేపట్టడంతో ఎస్సీఎస్టీ కమిషన్, అలాగే హైకోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నాం’ అని వివరించారు. ఇదే అంశమై ఆర్అండ్బీ ఏఈ ఫిరోజ్ మాట్లాడుతూ.. నాగకుమార్ ఆర్అండ్బీ స్థలంలో అక్రమ నిర్మాణం చేపట్టారు. గతంలో మార్కింగ్ ఇచ్చాం. కోర్టు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్అండ్బీ స్థలంలో చేపట్టిన నిర్మాణం వరకు తాము పూర్తిగా తొలగిస్తాం. మిగతా కట్టడం విషయం రెవెన్యూ, మున్సిపల్ శాఖ పరిధిలో ఉంది. హైకోర్టు, ఎస్సీఎస్టీ కమిషన్ ఆదేశాల మేరకు చర్యలు ప్రస్తుతం కొంత మేర శ్లాబ్ తొలగింపు అక్రమ కట్టడాన్ని పూర్తిగా తొలగిస్తామన్న తహసీల్దార్ -
చుట్టాల్లా వచ్చి.. సొమ్ము కాజేసి..
ఒంగోలు టౌన్: వివాహ శుభకార్యానికి బంధువుల్లా వచ్చి ఎంచక్కా బంగారు నగలు, నగదు చోరీ చేసి సొంతూరుకు చెక్కేసిన మధ్యప్రదేశ్ ముఠాను ఒంగోలు తాలూకా పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. నిందితుల్లో ఇద్దరు వ్యక్తులతోపాటు ఓ మైనర్ ఉన్నాడు. అలాగే ప్రయాణికురాలి ముసుగులో చోరీలకు తెగబడుతున్న మరో మహిళను కూడా పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో నిందితుల వివరాలను ఎస్పీ హర్షవర్థన్రాజు వెల్లడించారు. ఒంగోలు నగరంలోని ముంగమూరు రోడ్డుకు చెందిన గుండవరపు కిషోర్ కుమార్ తన కుమార్తె వివాహాన్ని నవంబర్ 27వ తేదీన స్థానిక బృందావన్ కళ్యాణ మండపంలో చేశారు. పెళ్లికి వచ్చిన బంధువులంతా హడావుడిగా ఉన్నారు. ముహూర్త సమయంలో 158 గ్రాముల బంగారు నగలు, రూ.1.35 లక్షల నగదును ఒక బ్యాగులో ఉంచి వధూవరులను ఆశీర్వదించేందుకు వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసి చల్లగా జారుకున్నారు. కాసేపటి తర్వాత నగలు, నగదు పోయిన విషయాన్ని గుర్తించిన కిషోర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ హర్షవర్థన్ రాజు ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. మధ్యప్రదేశ్లోని సాన్సి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు, ఒక మైనర్ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. నిందితులు హరి ఓం, వికాస్తోపాటు ఓ బాలుడిని వారి స్వగ్రామంలోనే తాలుకా సీఐ విజయకృష్ణ బృందం పక్కా వ్యూహంతో అదుపులోకి తీసుకుంది. నిందితుల నుంచి బంగారు నగలతోపాటు, రూ.1.25 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన సొత్తు విలువ రూ.20.20 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. చోరీ కేసు ఛేదించడంలో ప్రతిభ చూపిన తాలుకా సీఐ బృందాన్ని ఎస్పీ అభినందించారు. కటకటాల్లోకి ఒంగోలు ‘బృందావనం’ దొంగలు పెళ్లి బంధువుల్లా వచ్చి చోరీకి పాల్పడిన మధ్యప్రదేశ్ ముఠా 158 గ్రాముల బంగారు నగలు, రూ.1.35 లక్షల నగదు స్వాధీనం ప్రయాణికురాలిగా నటిస్తూ చోరీలు చేస్తున్న మరో మహిళ అరెస్టు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ హర్షవర్థన్ రాజు కూతురి వివాహానికి చేసిన అప్పు తీర్చడం కోసం ఓ మహిళ చోరీలను మార్గంగా ఎంచుకుంది. మద్దిపాడు పరిధిలో నమోదైన చోరీ కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామానికి చెందిన తొండ శాంతి ఉరఫ్ కాశమ్మను అరెస్టు చేశారు. నిందితురాలి నుంచి రూ.10 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ కథనం మేరకు.. కాశమ్మ తన కూతురి వివాహానికి రూ.3 లక్షలు అప్పు చేసింది. అది తీర్చే మార్గం లేకపోవడంతో కోళ్లను చోరీ చేయడం మొదలుపెట్టింది. దాని వల్ల పెద్దగా సంపాదన లేదని భావించి తన తోడుకోడళ్లతో కలిసి ఆటోల్లో ప్రయాణికుల బ్యాగుల్లో సొత్తును చోరీ చేయడం మొదలుపెట్టింది. మద్దిపాడు మండలం తెల్లపాడు గ్రామానికి చెందిన మల్లిపెద్ది ధనలక్ష్మి ఈ నెల 1వ తేదీన నరసరావుపేటలో ఆర్టీసీ బస్సు ఎక్కి ఒంగోలు వచ్చింది. ఆమెను అనుసరించిన తొండ శాంతి కూడా ఒంగోలు చేరుకుంది. ధనలక్ష్మి ఎక్కిన ఆటోలోనే ఎక్కి ఆమె బ్యాగులో ఉన్న బంగారు నగలను కాజేసింది. ఏమీ తెలియనట్టు మధ్యలోనే ఆటో దిగి వెళ్లిపోయింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితురాలిని గుర్తించిన పోలీసులు బుధవారం మద్దిపాడు మండలం గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ వద్ద ఉన్న శాంతిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద ఉన్న బంగారు చంద్రహారం, గొలుసు, నలపూసల దండను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన మద్దిపాడు ఎస్సై జి.వెంకటసూర్య, కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందించారు. -
జాతీయస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపిక
టంగుటూరు: 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 12,13,14 తేదీల్లో పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో అండర్ 17 రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించిన మండలంలోని మర్లపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎ. అరుణ్కుమార్, గుమ్మా కీర్తన ప్రతిభ కనబరచి రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. వీరు జనవరి 6 నుంచి 9 వరకు చత్తీస్ఘడ్లో జరగనున్న జాతీయస్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో పాల్గొంటారని ప్రధానోపాధ్యాయుడు చుండూరి చలపతి తెలిపారు. ప్రతిభ చాటిన విద్యార్థులను పీడీ కౌసల్య, అచ్యుత్రావు, వెంకట్రావు, శ్రీనివాసులు, సునంద, పుష్పవల్లి, భాగ్యలక్ష్మి, సుమ, సుభాషిణి, సుధీర్, సుబ్రహ్మణ్యం, గ్రామస్తులు అభినందించారు. కంభం: మండలంలోని పలు ఎరువుల దుకాణాలను బుధవారం స్థానిక వ్యవసాయాధికారి మహమ్మద్తో కలిసి కనిగిరి ఏడీఏ తనిఖీ చేశారు. ఎరువుల నిల్వ రిజిస్టర్లు, బిల్ బుక్లను పరిశీలించారు. ఓ–ఫారం లైసెన్లో పొందుపరచని కారణంగా రూ.6.75 లక్షల విలువైన ఎరువులను సీజ్ చేశారు. -
అతివేగానికి యువకుడు బలి
టంగుటూరు: బైక్పై వేగంగా ప్రయాణిస్తున్న యువకుడు ముందు వెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన టంగుటూరు టోల్ ప్లాజా సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. టంగుటూరులోని ముదిరాజ్పాలేనికి చెందిన అనుముల అరుణ్ చంద్(19) వల్లూరు సమీపంలోని పేస్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం కాలేజీ వదిలిన తర్వాత మిత్రులతో కలిసి ఒంగోలు వెళ్లి అర్ధరాత్రి వేళ ఇంటికి తిరుగుపయనమయ్యాడు. అతివేగంగా వస్తున్న క్రమంలో రాత్రి సుమారు 11.55 గంటలకు టంగుటూరు టోల్ గేట్ సమీపంలో ముందు వెళ్తున్న కంటైనర్ లారీని వెనుక నుండి బలంగా ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అరుణ్ చంద్ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని ఎస్సై నాగమల్లేశ్వరరావు పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. మృతుడి తండ్రి రమేష్బాబు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. పుల్లలచెరువు: బతుకుదెరువు కోసం వచ్చిన యువకుడిని విద్యుదాఘాతం రూపంలో మృత్యువు కబలించింది. ఈ సంఘటన పుల్లలచెరువు మండలంలోని ఐటీవరం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేట జిల్లాలోని రాజక్కపేట గ్రామానికి చెందిన కొరివి యాదగిరి(26) వరి కోత యంత్రం డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఐటీ వరం గ్రామానికి చెందిన ఊట్ల రామయ్య పొలంలో వరి పైరు కోస్తుండగా విద్యుత్ తీగలు తగలడంతో షాక్కు గురయ్యాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంతప్కుమార్ తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన అరుణ్ చంద్అరుణ్ చంద్ (ఫైల్) యాదగిరి(పైల్) సంఘటన స్థలంలో యాదగిరి మృతదేహం వెనుక నుంచి కంటైనర్ను ఢీకొట్టిన బైక్ టంగుటూరు టోల్గేట్ వద్ద ప్రమాదం -
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
పెద్దారవీడు: జాతీయ రహదారిపై గుర్తు తెలియని వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పెద్దారవీడు మండలం పరిధిలోని తోకపల్లి గ్రామ సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తీవ్ర గాయాలతో హైవేపై పడి ఉన్న వ్యక్తిని అటుగా వెళ్తున్న వారు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. హైవే పెట్రోలింగ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని 108 అంబులెన్స్లో క్షతగాత్రుడిని మార్కాపురం జీజీహెచ్కు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు జీజీహెచ్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలిసిన వారు 9121102186ను సంప్రదించాలని ఎస్సై సాంబశివయ్య కోరారు. మార్కాపురం రూరల్ (మార్కాపురం): మార్కాపురం పట్టణ శివారులోని చెన్నరాయునిపల్లి వద్ద వీధి శునకాల దాడిలో సుమారు 20 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. అందిన వివరాల మేరకు.. మంగళవారం రాత్రి చిన్నరాజయ్యకు చెందిన 7 గొర్రెలు, బుధవారం సాయంత్రం చిన్నమల్లయ్యకు చెందిన 13 గొర్రెలను వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి. ఒక్కో గొర్రె సుమారు 10 వేల రూపాయలు ఖరీదు చేస్తుందని, కుక్కల బెడదతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వీధి శునకాలను కట్టడి చేయాలని కోరారు. -
పనులు చేయించారు.. బిల్లులు ఇవ్వరేం?
గిద్దలూరు రూరల్: గ్రామ పంచాయతీల్లో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు నెలల తరబడి చెల్లించకుండా బకాయి పెట్టడంపై గిద్దలూరు మండల సర్పంచ్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుధవారం గిద్దలూరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నుంచి వాకౌట్ చేసి కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. సర్వసభ్య సమావేశం మొదలైన కాసేపట్టికే బిల్లుల చెల్లింపుపై ఎంపీడీఓ సీతారామయ్యను ప్రశ్నించిన సర్పంచ్లు.. సరైన సమాధారం ఇవ్వకపోవడంతో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ హాల్ నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్లు మాట్లాడుతూ.. ‘గ్రామాల్లో తాగు నీటి సమస్య పరిష్కారం కోసం బోర్లకు మరమ్మతులు చేయించాం. పైపులైన్ల లీకేజీలను సరిచేయించాం. అధికారుల సూచన మేరకే వీధిలైట్లు, పారిశుధ్యం, ఇతర అభివృద్ధి పనులు చేశాం. గత 6 నెలలుగా ఖర్చు చేసిన నిధుల తాలూకు బిల్లులు ప్రభుత్వం నుంచి ఇంత వరకు విడుదల కాలేదు. నిధులివ్వకుంటే ఇకపై పనులెలా చేయగలం. ఒక్కో పంచాయతీకి సుమారు రూ.5 లక్షల మేర నిధులు విడుదల చేయాల్సి ఉంది. అప్పులు చేసి పనులు చేపట్టామని మొత్తుకుంటున్నా బిల్లులివ్వకుండా కాలయాపన చేయడం సరికాద’ని ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయని, ఇప్పటికై నా ప్రభుత్వం బిల్లులివ్వాలని విజ్ఞప్తి చేశారు. నిరసన ప్రదర్శనలో సర్పంచ్లు ఏరువ రాజశేఖరరెడ్డి, బండి శ్రీనివాసులు, లక్ష్మీ ప్రసన్న, సమాధుల రాజేశ్వరి, అంజినాయక్ తదితరులు పాల్గొనగా ఎంపీపీ కడప లక్ష్మి సంఘీభావం తెలిపారు. గిద్దలూరులో సర్వసభ్య సమావేశం నుంచి సర్పంచ్ల వాకౌట్ ఒక్కో పంచాయతీకి రూ.5 లక్షలకు పైగా బిల్లుల బకాయి 6 నెలలుగా బిల్లులు చెల్లించడం లేదని మండిపాటు -
జిల్లాలో 45 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
● జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాల కృష్ణ ఒంగోలు సబర్బన్: జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన ధాన్యం ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాల కృష్ణ చెప్పారు. ఈ మేరకు ఆయన మంగళవారం ప్రకాశం భవనంలోని తన చాంబర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లాలో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ద్వారా ధాన్యం సేకరణ తీరు, సాధిస్తున్న పురోగతిని వివరించారు. జిల్లాలో 27 మండలాల్లో 201 రైతు సేవా కేంద్రాల పరిధిలో 45 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ఖరీఫ్ 2025–26 సీజన్లో ఈనెల 16వ తేదీ వరకు 212 మంది రైతుల నుంచి రూ.3.99 కోట్ల విలువైన 1779.6 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు రూ.3.98 కోట్లను 211 మంది రైతులకు చెల్లించినట్లు చెప్పారు. మిగిలిన డబ్బులను తదుపరి బ్యాంకు బ్యాచ్ ప్రాసెస్లో జమచేస్తారన్నారు. జిల్లాలో లేట్ ఖరీఫ్, ఎర్లీ రబీ సాగును దృష్టిలో పెట్టుకుని రైతుల వద్ద నుంచి ప్రతి గింజ కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టామన్నారు. ధాన్యాన్ని విక్రయించడంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబరు 8008901457 ను సంప్రదించవచ్చని చెప్పారు. అదేవిధంగా వాట్సాప్ 7337359375 లోనూ సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ వరలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ప్రారంభోత్సవం మళ్లీ..మళ్లీ
మద్దిపాడు: అదేదో సినిమాలో చెల్లి పెళ్లి జరగాలి మళ్లీ మళ్లీ అంటూ పిచ్చి కవిత్వం చెప్పినట్టుగానే ఉంది తెలుగు తమ్ముళ్ల పరిస్థితి. గత సంవత్సరం మార్చి 3వ తేదీన అప్పటి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున మంత్రి హోదాలో పలు సచివాలయాలను, వెల్ నెస్ సెంటర్లను, రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. ఈ క్రమంలో 2024 మార్చి మూడో తేదీన ఏడుగుండ్లపాడులో నిర్మించిన సచివాలయం పక్కనే ఉన్న వెల్ నెస్ సెంటర్ ను ప్రారంభించారు. నేడు ఆ శిలాఫలకంపై పేపర్లు అడ్డుగా ఉంచి ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే చేత తిరిగి అదే సచివాలయాన్ని ప్రారంభింపజేయడం తెలుగు తమ్ముళ్ల విజ్ఞతను పలువురు గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులే.. ఎన్నిసార్లు ప్రారంభోత్సవాలు చేస్తారంటూ మాట్లాడుకోవడం వినిపించింది. ఒంగోలు టౌన్: ఎట్టకేలకు జీజీహెచ్లో ఆహారం సరఫరా చేసే కాంట్రాక్టర్లను అధికారులు ఖరారు చేశారు. ప్రస్తుతం జీజీహెచ్లోని రోగులకు ఆహారం సరఫరా చేస్తున్న డైట్ కాంట్రాక్ట్ గడువు జూలైతో ముగిసింది. వెంటనే మరొకరిని నియమించకుండా పాత కాంట్రాక్టర్నే కొనసాగించారు. ఐదు నెలల తర్వాత కొత్త వారిని నియమించాలన్న నిర్ణయానికి అధికారులు వచ్చారు. అందులో భాగంగా డిస్టిక్ట్ డైట్ కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్న జేసీ ఆర్.గోపాలకృష్ణ మంగళవారం జరిగిన కమిటీ సమావేశంలో కొత్త కాంట్రాక్టర్ల కోసం లక్కీ డ్రా తీశారు. మొత్తం ఐదుగురు దరఖాస్తు చేసుకోగా లక్కీ డ్రా తీశారు. సుకవాసి శ్రీనివాసరావు, మెస్సెస్ అంజనా ఎంటర్ప్రెజెస్, మెస్సెస్ కృష్ణ కనస్ట్రక్షన్స్ను ఎంపిక చేశారు. వీరు ముగ్గురు తలా 8 నెలల పాటు రొటేషన్ పద్ధతిలో ఆహారం సరఫరా చేస్తారు. -
టీడీపీవి చిల్లర రాజకీయాలు
గిద్దలూరు రూరల్: టీడీపీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తూ అక్రమ కేసులతో అణచివేయాలని చూస్తున్నారని, అటువంటి అప్రజాస్వామిక చర్యలను చూస్తూ సహించమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అన్నారు. కంభం మాజీ ఏఎంసీ చైర్మన్ నెమిలిదిన్నె చెన్నారెడ్డి పై అక్రమ కేసులు బనాయించి గిద్దలూరు సబ్ జైలులో ఉంచిన నేపథ్యంలో ఆయనను పరామర్శించేందుకు మంగళవారం పట్టణంలోని సబ్జైలుకు వచ్చిన సందర్భంగా బూచేపల్లి విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీలో ఉత్సాహంగా పనిచేస్తూ ప్రజల్లో అభిమానం కలిగి ఉన్న సీనియర్ నాయకుడు చెన్నారెడ్డి పై అక్రమంగా కేసులు పెట్టి జైలులో ఉంచడం దారుణం అన్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ నాయకుల పై అక్రమ కేసులు ఎక్కువగా పెడుతున్నారన్నారు. గిద్దలూరు మండలం దొడ్డంపల్లె గ్రామానికి చెందిన బొర్రా క్రిష్ణారెడ్డిని గతంలో అక్రమంగా అరెస్ట్ చేసి 65 రోజుల పాటు జైలులో ఉంచారని, తరువాత ఇప్పుడు ఏ తప్పూ చేయని చెన్నారెడ్డి పై అక్రమ కేసులు బనాయించి జైలులో పెట్టడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా భావిస్తున్నామన్నారు. కంభం కందులాపురం సెంటర్లో వైఎస్సార్ విగ్రహానికి టీడీపీ నాయకులు వారి నాయకుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారని, ఆ విషయాన్ని చెన్నారెడ్డి అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఫ్లెక్సీలు తొలగించాలని కోరారన్నారు. అదే చెన్నారెడ్డి చేసిన తప్పయిందని.. లేనిపోని అక్రమ కేసులు బనాయించి జైలులో ఉంచడం ఎంత వరకు సమంజసం అని అన్నారు. ఇది కక్షపూరిత పాలన.. అధికారం ఎప్పుడూ మీదే ఉండదని టీడీపీ నాయకులు గ్రహించుకోవాలని తాటిపర్తి అన్నారు. అక్రమ కేసులతో వైఎస్సార్ సీపీ నాయకులను ఇబ్బందులకు గురిచేయడం ప్రజలు గమనిస్తుంటారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కక్ష పూరిత పరిపాలన కొనసాగిస్తూ అరాచక సంస్కృతిని లేవనెత్తుతున్నారని విమర్శించారు. అక్రమ కేసులకు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలెవరూ భయపడరని వారు గుర్తుపెట్టుకోవాలన్నారు. అక్రమ కేసుల్లో ఇబ్బందులు పడే నాయకులకు, కార్యకర్తలకు వైఎస్సార్ సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పోలీసు శాఖ వారు శాంతి భద్రతలకు విఘాతం కల్పించేలా ప్రవర్తించడం మంచి పద్ధతి కాదన్నారు. అక్రమ కేసులకు వారు సహకరించకుండా ఉండాలని కోరారు. జగనన్న ప్రభుత్వంలో పేదప్రజలకు ఎటువంటి లోటులేకుండా సుపరిపాలన కొనసాగిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో అటువంటి పాలన కరువైందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, కంభం మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీ కడప వంశీధరరెడ్డి, వైఎస్సార్ సీపీ మున్సిపల్ కన్వీనర్ మానం బాలిరెడ్డి, మండల కన్వీనర్ బి.ఓబులరావు, వైఎస్సార్ సీపీ నాయకులు బొర్రా క్రిష్ణారెడ్డి, సూరా స్వామిరంగారెడ్డి, పాలుగుళ్ల నరసింహారెడ్డి, శ్రీకాంత్రెడ్డి, ఎదురు శ్రీనివాసరెడ్డి, సీఆర్ఐ మురళి, కొమరోలు జెడ్పీటీసీ వెంకటనాయుడు, అర్ధవీడు ఎంపీపీ వెంకటరావు, మాజీ ఎంపీపీ రవికుమార్యాదవ్, తదితరులు పాల్గొన్నారు. -
వెలిగొండపై అసత్య ప్రచారాలొద్దు
యర్రగొండపాలెం: వెలిగొండ ప్రాజెక్టుపై టీడీపీ నాయకులు అసత్యప్రచారాలు చేస్తున్నారని, వారికి దమ్ముంటే ప్రాజెక్ట్పై చంద్రబాబు పాత్ర గురించి శ్వేతపత్రం విడుదల చేయాలని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ సవాల్ విసిరారు. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పదే పదే వెలిగొండ ప్రాజెక్ట్ను సందర్శించడం, వైఎస్సార్ సీపీపై విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ మేరకు స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిమ్మల రామానాయుడు విమర్శల కోసం వెలిగొండ ప్రాజెక్ట్ను వినియోగించుకోవడం అత్యంత హేయమైన చర్య అన్నారు. ప్రాజెక్ట్ గత చరిత్ర ఏమిటో ఒక సారి నెమరువేసుకోవాలని ఆయన హితవు పలికారు. 1996లో వెలిగొండ ప్రాజెక్ట్కు చంద్రబాబు శంకుస్థాపన చేసే సమయంలో పర్మిషన్లులేవని, భూసేకరణ, పునరావాసంపై ఆలోచనకానీ లేదని ఆయన అన్నారు. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్ట్కు కొబ్బరికాయకొట్టిన బాబుకు టన్నెల్ పనులు దాదాపు పూర్తిచేసిన వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని విమర్శించే హక్కు ఏమాత్రం లేదని అన్నారు. 1980 నుంచే ప్రాజెక్టు ప్రతిపాదనలు: వెలిగొండ ప్రాజెక్ట్ టన్నెల్ ద్వారా కృష్ణానది బ్యాక్ వాటర్ను తరలించాలనే ప్రతిపాదనలు 1980 నుంచే ఉన్నాయని, అప్పటికి టీడీపీ పుట్టనేలేదని, అంటే టీడీపీ పాత్ర వెలిగొండ ప్రాజెక్ట్లో లేదని స్పష్టంగా అర్థమవుతోందని తాటిపర్తి అన్నారు. ఆ పార్టీ ఉనికేలేనప్పటి నుంచి వినిపిస్తున్న వెలిగొండకు తొలిసారి 1991లో కృష్ణానది జలాలను శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నల్లమల కొండ ప్రాంతానికి టన్నెల్ ద్వారా తీసుకొని రావాలని నిర్ణయించారని వివరించారు. 1994లో సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను అధికారులు సిద్ధం చేసి ప్రాజెక్ట్ సమగ్ర నివేదికను అధికారులు సిద్ధం చేసి అంకురార్పణ చేశారన్నారు. టీడీపీని విజయవంతంగా లాగేసుకున్న బాబు ఆర్భాటాల కోసం 1996 మార్చి 5న శంకుస్థాపనచేసి ప్రాజెక్ట్ను నిర్లక్ష్యంగా వదలేశారని విమర్శించారు. ఈ అంశాన్ని కాగ్ రిపోర్ట్ 4/2023లో పేజీ నంబర్ 15 నుంచి 22 పేజీల వరకు ప్రాజెక్ట్ను చంద్రబాబు శంకుస్థాపన చేశారే తప్ప 2004 వరకు ఎటువంటి ప్రధాన అడుగులు పడలేదని, ఎటువంటి పనులు చేపట్టలేదన్న విషయాన్ని స్పష్టంగా పొందుపరిచిందని అన్నారు. వైఎస్సార్ హయాంలోనే ముందడుగు.. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి 2004 అక్టోబర్ 27న వెలిగొండ ప్రాజెక్ట్కు నిజమైన పునాదిరాయి వేశారని, అన్ని పర్యావరణ అనుమతుల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి అనుమతులు వచ్చేలా కృషి చేశారని, రైతుల నుంచి భూములు సేకరించి వారికి చెల్లింపులు చేశారన్నారు. రూ.3500 కోట్లు ఖర్చుపెట్టి దాదాపు 70 శాతం పనులు జరిగిన తరువాత తిరిగి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ ప్రాజెక్ట్పై సవతి ప్రేమ చూపించారని అన్నారు. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి 2 టన్నెల్స్, కొండల నడుమ గ్యాప్లను పూర్తి చేశారని, కరోనా మహమ్మరి విజృంభిస్తున్నా ప్రాజెక్ట్పై ఆయన సంపూర్ణ శ్రద్ధ వహించి నిర్మాణాలు పూర్తి చేసి జాతికి అంకితం చేశారన్నారు. మళ్లీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 11 పునరావాస గ్రామాలకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇచ్చి ఆ ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా జలాలు మళ్లిస్తామని జగన్మోహన్రెడ్డి అప్పట్లోనే చెప్పారని అన్నారు. మంత్రి నిమ్మల అసత్య ప్రచారం.. మంత్రి నిమ్మల వెలిగొండపై అసత్య ప్రచారం చేస్తూ దాదాపు రెండేళ్ల నుంచి 8 పునరావాస కాలనీల్లో ఎటువంటి అభివృద్ధి పనులు కానీ, టీ5 కాలువ పనులు చేపట్టలేకపోయారని విమర్శించారు. రూ.300 కోట్లు బడ్జెట్లో కేటాయించి, అందులో కేవలం రూ.100 కోట్లు కూడా ఖర్చుచేయని ఈ ప్రభుత్వం 2026లో పూర్తి చేసి నీళ్లు ఇస్తామని చెప్తున్నారన్నారు. ఏదో పనులు చేయిస్తున్నట్లు ప్రజలను మభ్యపెట్టేందుకు పదే పదే వెలిగొండ ప్రాజెక్ట్ను మంత్రి విజిట్ చేస్తున్నారని విమర్శించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ కాలంలో పూర్తయిన పనులు తమ ఖాతాల్లో వేసుకొని తామే చేయిస్తున్నామని కలరింగ్ ఇచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మంత్రి వాస్తవాలకు దగ్గరగా మాట్లాడాలని, వెలిగొండను బాధ్యతగా పూర్తిచేయాలని ఆయన హితవుపలికారు. సమావేశంలో ఎంపీపీ దొంతా కిరణ్గౌడ్, పార్టీ మండల కన్వీనర్ ఏకుల ముసలారెడ్డి, వైఎస్సార్ సీపీ వివిధ విభాగాల నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
సహకార శాఖలో రిటైర్మెంట్ వయసు పెంచాలి
ఒంగోలు సబర్బన్: సహకార శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే 62 ఏళ్లకు పెంచాలని సహకార శాఖ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘ నాయకులు మాట్లాడుతూ ఆరోగ్య బీమాను రూ.5 లక్షలకు తక్కువ కాకుండా చేసి అమలు పర్చాలన్నారు. జీతభత్యాల్లో కోత విధించడం సరైనది కాదన్నారు. ఉద్యోగులందరికీ వేతనాలు పెంచాలని, కనీస వేతనం డిమాండ్ ప్రకారం రూ.26 వేలకు తగ్గకుండా ప్రతి ఉద్యోగికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ సహకార సంఘం ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ ధర్నాకి జేఏసీ నాయకులు, సహకార సంఘం ఉద్యోగుల సంఘం సీఐటీయూ అనుబంధ సంఘ జిల్లా అధ్యక్షుడు వీ మనోజ్ కుమార్ అధ్యక్షత వహించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు, ఏపీ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ గౌరవ అధ్యక్షుడు కాలం సుబ్బారావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకార రంగానికి నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఇప్పటి దాకా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సహకార సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో తీసుకోవాలని ప్రయత్నాల వేగవంతం చేస్తోందని, దీనికి వ్యతిరేకంగా నిలబడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ పెద్దల నిర్ణయానికి తలవంచి సహకార సంఘాలను దాని స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీయటానికి పూనుకోవటం అత్యంత దారుణమన్నారు. 2019 తర్వాత చేరిన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కాకపోతే ఈనెల 22వ తేదీ జిల్లా కోఆపరేటివ్ బ్యాంకుల(పీడీసీసీ) ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని, అప్పటికీ పరిష్కారం కాకపోతే 29వ తేదీ చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే జనవరి 5 నుంచి ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ సత్య శివశంకర్, ప్రధాన కార్యదర్శి జీ రామాంజనేయరెడ్డి, కోశాధికారి కార్తీక్ రెడ్డి, రామిరెడ్డి, కృష్ణ చైతన్య, వీరబ్రహ్మం, రమణారెడ్డి, రమేష్, శ్రీనివాసరావు, రంగయ్య, బాలాజీ, ప్రసాదు, అంజిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, పవన్ కుమార్, సందీప్, రాజేషు తదితరులు జిల్లా నలుమూలల నుంచి సొసైటీ సభ్యులందరూ పాల్గొన్నారు. -
ప్రభుత్వ స్థలం ఆక్రమణకు యత్నం
సింగరాయకొండ: ప్రభుత్వ స్థలం కనిపిస్తే చాలు ఆక్రమించేయటం.. అందులో అక్రమ నిర్మాణాలు చేపట్టడం టీడీపీ నాయకులకు అలవాటుగా మారింది. ఈ క్రమంలో మండలంలోని శానంపూడి గ్రామ పంచాయతీ శివారులోని సర్వే నంబరు 447 లోని సుమారు రూ.60 లక్షల విలువైన 2.51 ఎకరాల భూమిపై ఆ గ్రామానికి చెందిన టీడీపీ నాయకుని కన్ను పడింది. దీంతో ఈ భూమి పై నకిలీ పత్రాలు సృష్టించి అందులో అక్రమ కట్టడాలు నిర్మించే ప్రయత్నం చేశారు. దీనిపై ప్రజల నుంచి ఫిర్యాదులు రావటంతో అప్రమత్తమైన రెవెన్యూ, పంచాయతీ అధికారులు అక్రమ నిర్మాణాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తహశీల్దార్ రాజేష్ సిబ్బందిని పంపి ఎటువంటి అక్రమ నిర్మాణాలు జరిపినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి పనులు ఆపగా, గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారి సాంబశివరావు ఇది ప్రభుత్వ స్థలమని ఇందులో అక్రమ కట్టడాలు నిషేధమని బోర్డు ఏర్పాటు చేశారు. కానీ బోర్డు ఏర్పాటు చేసిన కొద్ది సేపటికే సదరు ఆక్రమణదారుడు బోర్డు తొలగించినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఈ భూమిని అప్పటి తహశీల్దార్ ఉషారాణి జగనన్న కాలనీకి ఇచ్చేందుకు ప్రయత్నించగా ఆ భూమిపై తనకు అసైన్మెంటు పట్టా ఉందని హైకోర్డు ను ఆశ్రయించి జగనన్న కాలనీకి కేటాయించకుండా ఆపుకున్నాడు. ఆ స్థలంలో జామాయిల్ సాగవుతోంది. తరువాత చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అందులో జామాయిల్ కొట్టుకుని లబ్ధిపొందాడని ఆ గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ విలువైన భూమిలో అక్రమ నిర్మాణాలు కడుతున్నాడని, దీనిపై పంచాయతీ సెక్రటరీ ప్రభుత్వ స్థలమని బోర్డు కూడా ఏర్పాటు చేశాడని వివరించారు. దీనిపై తహశీల్దార్ రాజేష్ను వివరణ కోరగా ఈ స్థలం డొంక పోరంబోకు భూమి అని, ఈ భూమిపై ఎవరికీ పట్టాలు ఇవ్వరని ఇందులో అక్రమ కట్టడాలు కడుతుంటే ఆపామన్నారు. సదరు వ్యక్తి ఈ భూమిపై గతంలో హైకోర్టును ఆశ్రయించాడని, కోర్టు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురి కాకుండా చూస్తామన్నారు. -
చెత్త రాజకీయాలు ఆపండి
కమిషనర్ చాంబర్ ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతున్న కార్మికులు, సీఐటీయూ నాయకులు ఒంగోలు సబర్బన్: మున్సిపల్ శానిటేషన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, అధికారుల వేధింపులను ఆపాలని డిమాండ్ చేస్తూ ఒంగోలు నగర కమిషనర్ చాంబర్ను సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు మంగళవారం ముట్టడించారు. కమిషనర్ చాంబర్ ఎదుట బైఠాయించి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ ఒంగోలు నగర కన్వీనర్ టి.మహేష్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీ శానిటేషన్ కార్మికులను వార్డులు మార్చడంలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఒంగోలు నగరంలో పారిశుధ్య కార్మికులు పనిచేయట్లేదని ముద్ర వేసి ఇష్టారీతిగా వార్డులు మారుస్తూ రాజకీయాలు చేయడం కక్ష సాధింపు కాదా అని ప్రశ్నించారు. ఈ విధానం సరైనది కాదని కార్మికులు యూనియన్ నాయకులు అనేకసార్లు చెప్పినా బలవంతంగా వార్డులు మార్చారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ అధికారులకు రెండుసార్లు అవార్డులు ప్రకటించిందని, తుఫాను విపత్తు సందర్భాల్లో శానిటేషన్ కార్మికులు ఫ్రంట్ వారియర్స్గా పని చేశారంటూ సన్మానించారని గుర్తు చేశారు. అయితే కార్మికులు పని చేయడం లేదని అభాండాలు వేస్తూ రాజకీయ కారణాలతో తొలగింపులు, కక్ష సాధింపులకు దిగడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి కొర్రపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. స్థానిక సమస్యలు పరిష్కరించడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని, నేటికీ చనిపోయిన కుటుంబాల వారికి ఈ కూటమి ప్రభుత్వం ఉపాధి కల్పించలేదని మండిపడ్డారు. నేటికీ వారి పీఎఫ్ క్లెయిమ్లు పెండింగ్లో ఉన్నాయన్నారు. కార్మికులకు అవసరమైన మెటీరియల్, కనీస సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్య ధోరణి వీడాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే కార్మికులపై వేధింపులు, కక్ష సాధింపులు పెరిగాయని ఆరోపించారు. ఒంగోలు మూడో డివిజన్ పరిధిలో కార్మికులందరినీ వార్డు మార్చారని, మార్చిన చోట పనిచేయకపోతే ఉద్యోగం ఊడు తుందని శానిటరీ ఇన్స్పెక్టర్, ఎమ్హెచ్ఓ బెదిరిస్తున్నారని మండిపడ్డారు. యూనియన్ నాయకులకు కనీస సమాచారం లేకుండా బలవంతంగా వార్డులు మార్చడాన్ని తప్పుబట్టారు. కార్యక్రమంలో యూనియన్ నగర అధ్యక్ష కార్యదర్శులు టి.విజయమ్మ, గడ్డం నరసింహ, యూనియన్ నాయకులు యు.రత్నకుమారి, ఎం.లక్ష్మీకాంతం, పి.కోటేశ్వరి, బి.బుల్లెమ్మ, డి.అంకమ్మ, పి.సుభాషిణి, భారతి, రజనీకాంత్, యేసు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు నగరపాలక సంస్థను ముట్టడించిన పారిశుధ్య కార్మికులు కమిషన్ చాంబర్ ముందు బైఠాయించి వ్యతిరేకంగా నినాదాలు వేధింపులు, కక్ష సాధింపులు అధికమయ్యాయని సీఐటీయూ నేతల ధ్వజం చంద్రబాబు పాలనలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఉపాధి కల్పించాలని డిమాండ్ -
బడుగుల జాగాలోకి బలమున్నోళ్లు!
● టీడీపీ నేతల అండతో చెలరేగుతున్న ఆక్రమణదారులు ● మార్కాపురం ఇందిరమ్మ కాలనీలో రాత్రికి రాత్రే స్థలాలు కబ్జా ● గత రెండు రోజుల్లో 175 ప్లాట్లు ఆక్రమించిన వైనం ● బేస్మెంట్లు వేసి దౌర్జన్యం చేస్తుండటంతో లబ్ధిదారులు లబోదిబో ● ఫిర్యాదుల పరంపరతో కూల్చివేతకు దిగిన రెవెన్యూ అధికారులు మార్కాపురం: మార్కాపురం జిల్లా ప్రకటించిన దరిమిలా భూ ఆక్రమణలు పెచ్చుమీరుతున్నాయి. రియల్ ఎస్టేట్ పుంజుకుంటుందని, రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరుగుతుందని అధికార పార్టీ నేతలు డప్పు కొట్టినా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. భూములు కొనడం దండగ అని భావించిన కొందరు అక్రమార్కులు అధికార టీడీపీ నేతల అండతో పేదల స్థలాల్లోకి చొరబడుతున్నారు. రాత్రికి రాత్రే నివాస స్థలాలు కబ్జా చేసి బేస్మెంట్లు సైతం నిర్మిస్తున్నారు. ఆక్రమణదారుల ఆగడాలు చూసి పేదలు లబోదిబోమంటూ రెవెన్యూ అధికారులను ఆశ్రయిస్తున్న పరిస్థితి. మార్కాపురం పట్టణంలోని తర్లుపాడు రోడ్డులో జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేస్తారన్న ప్రచారం ఊపందుకోవడంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. కూటమి నేతల అండ చూసుకుని ఖాళీ స్థలం కనిపిస్తే చాలు రాత్రికి రాత్రే గోడలు పెట్టి ఆక్రమిస్తున్నారు. 2 రోజుల క్రితం మార్కాపురం పట్టణంలోని తర్లుపాడు రోడ్డులో రిటైర్డు ఎస్సైతో పాటు పలువురు ఆర్మీ ఉద్యోగుల స్థలాన్ని అధికార టీడీపీకి చెందిన నాయకుడు ఆక్రమించేందుకు బరితెగించాడు. హక్కుదారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆక్రమణలు తొలగించారు. ఇదిలా ఉండగా ఇందిరమ్మ కాలనీలో 2 రోజుల వ్యవధిలో భూకబ్జాదారులు సుమారు 175 ప్లాట్లు ఆక్రమించారు. రాత్రికి రాత్రే సిమెంటు ఇటుకలతో బేస్మెంట్లు కట్టడాన్ని చూసి ప్రజలతో పాటు రెవెన్యూ అధికారులు సైతం విస్తుపోయారు. మంగళవారం ఉదయం తమ స్థలాల్లో బేస్మెంట్లను చూసిన ఇందిరమ్మ కాలనీ వాసులు లబోదిబోమంటూ రెవెన్యూ అధికారులకు మొరపెట్టుకున్నారు. తమ భూములకు రక్షణ లేదని, ఆక్రమణదారులు చెలరేగుతున్నా కట్టడి చేయడం లేదంటూ చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రెవెన్యూ, పోలీసు, గృహ నిర్మాణ శాఖ అధికారులకు వరుసబెట్టి ఫిర్యాదులు చేశారు. దీంతో మంగళవారం తహసీల్దార్ చిరంజీవి, డీఈ పవన్కుమార్, పోలీసుల సహకారంతో అక్రమ నిర్మాణాలను గుర్తించి జేసీబీతో కూల్చివేయించారు. ఇందిరమ్మ కాలనీలోని హక్కుదారులు తమ స్థలాల్లో గృహ నిర్మాణాలు చేపట్టాలని అధికారులు సూచించారు. భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు మార్కాపురం జిల్లా కాబోతున్న నేపథ్యంలో భూకబ్జాదారులు అల్లూరి పోలేరమ్మ గుడి, ఇందిరమ్మ కాలనీ ఫేజ్–2లో 20 ఏళ్ల క్రితం పేదలకు ఇచ్చిన స్థలాలను ఆక్రమిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. మంగళవారం ఉదయం పోలీసు, గృహ నిర్మాణశాఖ అఽధికారులతో కలిసి సుమారు 150కి పైగా బేస్మెంట్లను తొలగించాం. ఆక్రమణదారులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు. కాలనీలో స్థలాలు ఉన్నవారందరికీ నోటీసులు జారీ చేస్తున్నాం. – చిరంజీవి, తహసీల్దార్ జేసీబీతో అక్రమనిర్మాణం తొలగింపు -
కరాటేలో మార్కాపురం విద్యార్థిని సత్తా
మార్కాపురం: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో డాలీ కాలేజీలో ఈనెల 15న నిర్వహించిన స్కూల్ గేమ్స్ కరాటే పోటీల్లో మార్కాపురం పట్టణానికి చెందిన ఎమ్ఎస్ స్పోర్ట్స్ కరాటే స్కూల్ విద్యార్థిని ఎస్కే జోయా సిద్ధిఖి సత్తా చాటింది. అండర్–14 బాలికల విభాగంలో జాతీయ స్థాయిలో తృతీయ స్థానంలో నిలిచిన బాలికను కరాటే చీఫ్ ఎగ్జామినర్ ఎం శ్రీనివాసరెడ్డి, పలువురు పట్టణ ప్రముఖులు అభినందించారు. ఒంగోలు సిటీ: బీహార్లో ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించిన అండర్–13 మెయిన్ నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో ఒంగోలుకు చెందిన దండు ఆశశ్రీ గరల్స్ సింగిల్స్ విభాగంలో కాంస్యం సాధించింది. కుమార్తె విజయంపై ఆశశ్రీ తండ్రి శ్రీనివాసరావు ఆనందం వ్యక్తం చేశారు. ఆశశ్రీ ప్రదర్శనపై ఆమెకు శిక్షణ ఇస్తున్న బెంగళూరులోని ప్రకాష్ పడుకోన్ బ్యాడ్మింటన్ అకాడమీ కోచ్ సాగర్ చోప్రా హర్షం వ్యక్తం చేశారు. సింగరాయకొండ: ప్రమాదవశాత్తు ట్రాక్టర్ డివైడర్ను ఢీకొన్న ఘటనలో గాయపడ్డ జార్ఖండ్ కూలీల్లో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. శనివారం రాత్రి జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన నలుగురు కూలీలు విద్యుత్ సామగ్రి ఉన్న ట్రాక్టర్లో శానంపూడి వెళ్తున్నారు. ఈ క్రమంలో ట్రాక్టరు కందుకూరు ఫ్లయ్ఓవర్ పక్కన సర్వీసు రోడ్డులోకి రాగానే ప్రమాదవశాత్తు డివైడర్ను ఢీకొట్టి బోల్లా పడింది. ఈ ఘటనలో మట్టదొరై(25), చొక్రో గోపి(20)కి తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరు యువకులకు స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులందరినీ ఒంగోలు జీజీహెచ్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మట్టదొరై, చొక్రోగోపి మృతి చెందారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించామని పోలీసులు వివరించారు. -
కానిస్టేబుళ్లే పోలీసు శాఖకు వెన్నెముక
ఒంగోలు టౌన్: పోలీసు శాఖకు కానిస్టేబుళ్లు వెన్నెముక లాంటి వారని, శాంతి భద్రతల పరిరక్షణ కానిస్టేబుళ్ల భుజస్కంధాల మీదనే ఆధారపడి ఉంటుందని మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ రమణ కుమార్ పేర్కొన్నారు. ఎస్పీ హర్షవర్థన్ రాజు ఆదేశాల మేరకు కొత్తగా ఎంపికై న పోలీసు కానిస్టేబుళ్లకు మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. తొమ్మిది నెలలపాటు పొందే శిక్షణలో శారీరక దృఢత్వం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడంపై దృష్టి సారించాలని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించిన వారు వృత్తిలో సమర్థవంతంగా రాణించే అవకాశం ఉంటుందన్నారు. బాధ్యతతో విధులు నిర్వర్తిస్తూ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. సానుకూల ఆలోచనలు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో వ్యక్తిత్వాన్ని తీర్చుదిద్దుకోవాలని, ప్రతి ఒక్కరూ హుందాగా వ్యవహరించాలని చెప్పారు. ఉత్తమమైన శిక్షణతో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ నెల 22 నుంచి కానిస్టేబుళ్లకు శిక్షణ ప్రారంభం కానుందని తెలిపారు. కార్యక్రమంలో ఒంగోలు సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పార్టీ కార్యక్రమం తరహాలో.. జిల్లాకు ఎంపికై న 281 మంది కానిస్టేబుళ్లలో సివిల్ విభాగంలో పురుష అభ్యర్థులు 88 మంది, మహిళలు 38 మంది, అలాగే ఏపీఎస్పీ విభాగంలో 155 మంది ఉన్నారు. వీరిని మంగళవారం మంగళగిరి 6వ బెటాలియన్కు తరలించారు. అభ్యర్థుల వెంట కుటుంబ సభ్యులు సైతం ఉండటంతో మొత్తం 20 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. అయితే కొత్త కానిస్టేబుళ్లను తరలించే బస్సులకు యువగళం ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియను పార్టీ వ్యవహారంలా మార్చడం నైతికంగా సమర్థనీయం కాదని ప్రజా సంఘాల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. యువగళం ఫ్లెక్సీ మీద సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చిత్రాలను ముద్రించి, హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత ఫొటో వదిలేయడం గమనార్హం. కానిస్టేబుల్ అభ్యర్థులను పల్లె వెలుగు బస్సుల్లో మంగళగిరికి తరలించడంపై కొందరు తలిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. -
హైవేపై ప్రమాదాల కట్టడికి చర్యలు
● ఎస్పీ హర్షవర్థన్ రాజు మద్దిపాడు: జాతీయ రహదారిపై ప్రమాదాలను కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హర్షవర్థన్రాజు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన మద్దిపాడు మండలంలోని గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ను తనిఖీ చేశారు. ఫ్యాక్టరీల్లో పనులకు వెళ్లి వచ్చేవారితో గ్రోత్ సెంటర్ ప్రాంతం రద్దీగా ఉండటం, కూలీలు ప్రమాదకర పరిస్థితిలో రోడ్డు దాటుతుండటాన్ని గమనించారు. జాతీయ రహదారిపై మహిళలు చేయెత్తినా బస్సు ఆగకపోవడంతో రోడ్డుపైకి వచ్చి మరీ బస్సులను నిలుపుదల చేయడాన్ని ఎస్పీ గమనించి వారితో కాసేపు మాట్లాడారు. గ్రోత్ సెంటర్ వద్ద బస్సులు ఆపడం లేదని, అదేమంటే ఫ్రీ బస్సు కాదంటున్నారని సమస్యను ఎస్పీకి వివరించారు. దీంతో ఆయన ఆర్టీసీ ఆర్ఎంకు ఫోన్ చేసి గ్రోత్ సెంటర్ వద్ద బస్ స్టాపింగ్ పాయింట్ ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. అప్పటికప్పుడే గ్రోత్ సెంటర్ ముందు భాగంలో బస్సు నిలిపేందుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేశారు. స్టాపింగ్ పాయింట్లో బస్సులు ఆగేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. ఈ క్రమంలోనే కలెక్టర్ రాజాబాబుకు ఫోన్ చేసి సమస్యను వివరిస్తూ ఉండగా.. జాతీయ రహదారిపై గుంటూరు వైపు వెళ్తున్న ఆయన గ్రోత్ సెంటర్ వద్ద ఆగి ఎస్పీతో మాట్లాడారు. రోడ్డు భద్రతా చర్యల్లో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కలెక్టర్కు ఎస్పీ వివరించారు. అనంతరం జాతీయ రహదారిపై హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారిని ఆపి ఎస్పీ కౌన్సెలింగ్ ఇచ్చారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని, మీ కుటుంబాలు ఎంతో ఆశగా మీకోసం ఎదురు చూస్తూ ఉంటాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. హెల్మెట్లు ధరించకుండా ప్రయాణిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొదటి తప్పిదంగా పరిగణించి వదిలేస్తున్నామని, మరో మారు జాతీయ రహదారిపైకి హెల్మెట్ లేకుండా రావద్దని వాహనదారులకు స్పష్టం చేశారు. ఎస్పీ వెంట డీఎస్పీ శ్రీనివాసరావు, ఒంగోలు టౌన్ సీఐ, మద్దిపాడు ఎస్ఐ వెంకట సూర్య, స్పెషల్ పార్టీ పోలీసులు, పలువురు పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
బాధితులకు సత్వర న్యాయం అందించాలి
● ఎస్పీ హర్షవర్థన్రాజు ఒంగోలు టౌన్: ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం మీకోసంలో వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, వీలైనంత త్వరగా బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ హర్షవర్థన్ రాజు ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీకోసంకు 90 ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదుదారులతో ఎస్పీ మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చట్టపరంగా విచారణ జరిపి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మీ కోసం ఫిర్యాదుల పట్ల అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి అలసత్వం లేకుండా నిర్ణీత సమయంలో పరిష్కారం చూపాలన్నారు. ఫిర్యాదు చేయడానికి వచ్చే వృద్ధులు, నడవలేని పరిస్థితిలో వున్న వారి సమస్యలను ప్రత్యేకంగా పరిశీలనలోకి తీసుకోవాలని చెప్పారు. సంఘటన స్థలాలను సందర్శించి చట్ట ప్రకారం పరిష్కారం చూపాలన్నారు. జిల్లా పోలీసు కార్యాలయానికి రాలేని ప్రజలు స్థానిక పోలీసు స్టేషన్లో, సబ్ డివిజన్ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ రమణ కుమార్, తాలూకా సీఐ విజయ కృష్ణ, దర్శి సీఐ రామారావు, కంభం సీఐ మల్లికార్జున, కనిగిరి సీఐ శ్రీనివాసులు, పీసీఆర్ సీఐ దుర్గా ప్రసాద్, ప్యానల్ అడ్వకేట్ బి.బాలాజీ, మీకోసం ఎస్సై జనార్దన్రావు పాల్గొన్నారు. అమరజీవికి నివాళులు... జిల్లా పోలీసు కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి ఎస్పీ హర్షవర్థన్రాజు, మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ రమణ కుమార్, ఎస్బీ సీఐ శ్రీనివాసరావు, పీసీఆర్ సీఐ దుర్గా ప్రసాద్, డీటీసీ సీఐ పాండురంగారావు, ఆర్ఐ రమణారెడ్డి తదితరులు నివాళులర్పించారు. -
జిల్లా ప్రగతి నివేదికలు సిద్ధం చేయాలి
● కలెక్టర్ రాజాబాబు ఆదేశం ఒంగోలు సబర్బన్: అన్ని ప్రభుత్వ విభాగాల నుంచి జిల్లా ప్రగతి నివేదికలు సిద్ధం చేయాలని జిల్లా అధికారులను కలెక్టర్ పీ రాజాబాబు ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 17, 18 తేదీల్లో రాజధానిలో జరగనున్న కలెక్టర్ల సమీక్ష సమావేశానికి అవసరమైన ప్రగతి నివేదికలను సిద్ధం చేయాలన్నారు. అవసరమైన నివేదికల గురించి జిల్లా అధికారులతో సమీక్షించారు. జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు అభివృద్ధి పనులు, పునరావాస కేంద్రాల వివరాలను సమగ్రంగా ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు. జిల్లాలో తాగునీటి పథకాల పనులకు సంబంధించిన ప్రణాళికలు తయారు చేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. ఆగస్టు నుంచి అమలవుతున్న సీ్త్ర శక్తి పథకం గురించి ప్రతిస్పందన నివేదికలు తయారు చేయాలని చెప్పారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి వెంకటేశ్వర్లు, డ్వామా పీడీ జోసఫ్ కుమార్, గనులశాఖ డీడీ రాజశేఖర్, విద్యుత్ శాఖ ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
ఈతముక్కల తీరం సమీపంలో సోనా బోట్లు
కొత్తపట్నం: కడలూరు, నాగపట్నం, పాండిచ్చేరి ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు మరోసారి బరితెగించారు. కొత్తపట్నం మండలంలోని ఈతముక్కల తీరానికి సమీపంలో నాలుగు రోజులుగా సోనా బోట్లతో చేపల వేట సాగిస్తూ రెచ్చిపోతున్నారు. రోజురోజుకూ హద్దు మీరి తీరం దగ్గరకు వచ్చి మరీ చేపలు వేటాడుతున్నారు. దీంతో చిన్నచిన్న చేపలను కూడా కోల్పోతామంటూ స్థానిక మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. సోనా బోట్లతో చేపల వేట సమయంలో రాష్ట్రాల సరిహద్దులు దాటకూడదని కేంద్ర మత్స్యశాఖ నిబంధనలు విధించినప్పటికీ పట్టించుకోకుండా ఏపీలోకి ప్రవేశించి ఏకంగా తీరం సమీపంలోనే చేపలు వేటాడుతున్నారు. కడలూరు బీచ్ నుంచి వచ్చి ఆంధ్ర సరిహద్దుల్లో ఎక్కడబడితే అక్కడ వేట కొనసాగిస్తున్నారు. నాలుగు రోజుల నుంచి ఈతముక్కల బీచ్ సమీపంలో వేట సాగిస్తుండగా, మత్స్యశాఖ అధికారులు పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నా రని స్థానిక మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. ఈతముక్కల బీచ్ సమీ పంలో స్థానికులైన చిరు మత్స్యకారులు కండ్లు వల వేసి వేట సాగిస్తున్నారు. మొయ్య చేపలు పడుతున్నాయి. అవి కూడా దక్కనీయకుండా సోనా బోట్లతో వచ్చి కడలూరు మత్స్యకారులు వేట సాగిస్తున్నారని స్థానిక మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మత్స్యశాఖ అధికారులు దీనిపై స్పందించి కడలూరు సోనా బోట్లను అదుపు చేయాలని కోరుతున్నారు. ఆందోళనలో స్థానిక మత్స్యకారులు మత్స్యశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు -
తెలుగు ప్రజల ఆత్మగౌరవం.. అమరజీవి
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ఒంగోలు సిటీ: రాష్ట్ర ఆవిర్భావం కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అన్నారు. సోమవారం ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, కె.నాగార్జునరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు, కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు ఉడుముల శ్రీనివాసులరెడ్డి, కసుకుర్తి ఆదెన్నతో కలిసి అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం వలనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని, రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవడం ఒక్కటే ఆయనకు నిజమైన నివాళి అని చెప్పారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటానికి పొట్టి శ్రీరాములు ప్రధాన కారకులయ్యారని చెప్పారు. పొట్టి శ్రీరాములు ఆశయాలను నేటి తరం అధ్యయనం చేసి ఆచరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కె.వి.రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, బొట్ల రామారావు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమరజీవి త్యాగ ఫలితమే తెలుగు రాష్ట్రం : మంత్రి డోల ఒంగోలు సబర్బన్: అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగ ఫలితమే తెలుగు రాష్ట్ర అవతరణ అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి అన్నారు. సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా స్థానిక సీవీఎన్ రీడింగ్ రూమ్ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి కలెక్టర్ పీ రాజాబాబు, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి డోలా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగు భాష మాట్లాడే ప్రజలందరికీ ప్రత్యేక రాష్ట్రం కావాలని 58 రోజులపాటు పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేశారన్నారు. ఆయన మరణించిన 10 నెలల తర్వాత ప్రత్యేక ఆంధ్రరాష్ట్రాన్ని ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ ఆంధ్రుల పౌరుషానికి ప్రతీకగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని చెప్పారు. పొట్టి శ్రీరాములు ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్, జేసీ ఆర్.గోపాలకృష్ణ, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి లక్ష్మానాయక్, స్టెప్ సీఈఓ శ్రీమన్నారాయణ, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, ఒంగోలు అర్బన్ తహసీల్దార్ మధుసూదన్రావు, ఒంగోలు నగర పాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
సమస్యలతో పోటెత్తిన అర్జీదారులు
ఒంగోలు సబర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీదారులు పోటెత్తారు. కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 264 మంది అర్జీలు అందజేశారు. ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. గతంలో పనిచేసిన కలెక్టర్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు చెప్పినా ప్రయోజనాంలేదన్నారు. మంచినీటికి పైపులైన్ ఏర్పాటు చేసి కాలనీ ప్రజల దాహార్తిని తీర్చాలన్నారు. అర్జీలు నిర్ణీత గడువు లోగా పరిష్కరించాలి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోగా నాణ్యతతో పరిష్కారించేలా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో అలస్వతం ఉండరాదన్నారు. సమస్యల పరిష్కారం కోసం అధికారుల వద్దకు వచ్చే ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్రెడ్డి, కుమార్, జాన్సన్, కళావతి, విజయజ్యోతి పాల్గొన్నారు. -
మార్కాపురం జిల్లాకు అన్యాయం చేయొద్దు
● దర్శితో కూడిన మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయాలి ఒంగోలు టౌన్: దర్శి నియోజకవర్గంతో కూడిన మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయాలని సీపీఐ నాయకులు ప్రతిపాదించారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో డీఆర్వో చిన ఓబులసును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ...మార్కాపురం కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉండే దొనకొండ మండలం, 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కురిచేడు, 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న దర్శి మండలాలను నూతన జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు. వీలైతే దర్శి నియోజకవర్గాన్ని మార్కాపురంలో కలిపితే బాగుంటుందన్నారు. జిల్లా కేంద్రమైన నంద్యాలకు 160 నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం మండలాన్ని కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్కాపురంలో కలపడమే మేలని చెప్పారు. దీనికి భిన్నంగా మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాలతో జిల్లాను ఏర్పాటు చేస్తే కొత్త జిల్లాకు అన్యాయం చేసినట్లే అవుతుందన్నారు. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతానికి తాగునీరు అందించేందుకు నాడు దర్శిలో ఎన్ఎస్పీ స్టోరేజీ చెరువును ప్రభుత్వం నిర్మించిందని, ఇక్కడ నుంచే కనిగిరి, పొదిలి తదితర ప్రాంతాలకు తాగునీరు అందిస్తారన్నారు. ఇప్పుడు దర్శి మండలాన్ని ప్రకాశం జిల్లాలో కొనసాగిస్తే ఎటువంటి నీటి ఆధారం లేని ప్రాంతాలకు తాగునీటి సమస్య తలెత్తే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం చేసిన కోట్లాది రూపాయల ఖర్చు నిరుపయోగంగా మారే అవకాశం కూడా ఉందన్నారు. తాగునీటి కోసం మార్కాపురం జిల్లాను ప్రకాశం జిల్లా మీద ఆధారపడేలా చేయడం భావ్యం కాదన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు దొనకొండలో ప్రభుత్వం భూములను కూడా గుర్తించిందని, బ్రిటీష్ కాలం నుంచి దొనకొండలో విమానాశ్రయం ఉందని, ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇవన్నీ ప్రకాశం జిల్లాలోకే వెళ్లిపోతాయని చెప్పారు. మార్కాపురం జిల్లా అభివృద్ధికి దొనకొండను కలపాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. వీటన్నింటినీ ప్రభుత్వం సమగ్రంగా విశ్లేషించి తగు నిర్ణయం తీసుకోవాలని కోరారు. పశ్చిమ ప్రకాశం కోసం అనేక పోరాటాలు చేసిన ప్రజా నాయకుడు పూల సుబ్బయ్య పేరుతో మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు ఆర్.వెంకటరావు, అందే నాసరయ్య, డి.శ్రీనివాస్, సయ్యద్ యాసిన్, ఎంఏ సాలార్, ఎస్కే ఖాశీం, శ్రీరాం శ్రీనివాసరావు, విజయ, లక్ష్మి, కరుణానిధి, ప్రభాకర్, గులాం పాల్గొన్నారు. -
సేవ్ యరజర్ల..సేవ్ ఎర్త్..
● యరజర్లలో అక్రమ మట్టి తవ్వకాలు ఆపాలని గ్రామస్తుల నిరసన ఒంగోలు సబర్బన్: టంగుటూరు మండలం యరజర్లలో అక్రమ ఎర్ర మట్టి తరలింపును అడ్డుకోవాలని గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు ఇష్టమొచ్చినట్లు అక్రమంగా ఎర్రమట్టి తరలిస్తున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నిత్యం వందల సంఖ్యలో పెద్ద పెద్ద టిప్పర్లు అక్రమంగా మట్టి తరలిస్తున్నా మైనింగ్ శాఖ అధికారులు నిద్రమత్తులో నటిస్తున్నారని విమర్శించారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేయింబవళ్లు గ్రామస్తుల పొలాల్లో నుంచి ఇష్టంవచ్చినట్లు తరలిస్తున్నారన్నారు. అక్రమ తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం ఉందని, ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. యరజర్లకు చెందిన అన్నపరెడ్డి బ్రహ్మానందబాబు ఆధ్వర్యంలో శెట్టి వెంకటేశ్వర్లు, పుచ్చకాయల ఆంజనేయులు, ఖాశీంబీ తదితరులు పాల్గొన్నారు. -
రెండు గృహాల్లో చోరీ
● రూ.10 లక్షల విలువైన సొత్తు అపహరణ సింగరాయకొండ: మండలంలోని మూలగుంటపాడు గ్రామ పంచాయతీలో రెండు గృహాల్లో రూ.10 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దుండగులు చోరీకి పాల్పడ్డారు. స్థానికుల కథనం ప్రకారం..గ్రామంలోని నక్కపాలెంలో నివసిస్తున్న బొడ్డు వినయ్కుమార్ ఈ నెల 12న విజయవాడ వెళ్లి సోమవారం ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటి మెయిన్డోర్ గడి ధ్వంరమై ఉండటంతో ఇంట్లోకి వెళ్లి చూడగా ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాను పరిశీలించగా రెండు సవర్ల బంగారు చైను, రెండు ఉంగరాలు, రెండు వెండి కుందులు చోరీకి గురైనట్లు నిర్ధారించారు. అదే విధంగా విద్యానగర్ 5వ లైనులో నివసిస్తున్న తలమంచి కృష్ణారెడ్డి ఈ నెల 13వ తేదీ శనివారం అనారోగ్యంగా ఉండటంతో నెల్లూరు ఆస్పత్రికి వెళ్లి వచ్చేటప్పుడు కావలిలోని కుమార్తె ఇంటికి వెళ్లి సోమవారం ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటికి రాగానే ఇంటి ప్రధాన తలుపు గడి విరిగిపోయి ఉండటాన్ని గమనించి లోపలికి వెళ్లి చూడగా ఇంట్లో బీరువాలోని వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. ఇంట్లో తన తల్లికి చెందిన 7 సవర్ల బంగారం వస్తువులు, దేవుడి గదిలోని 600 గ్రాముల వెండి గ్లాసులు, ప్లేటు, రెండు కుందులు చోరీకి గురయ్యాయి. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా..క్లూస్టీం వచ్చి ఆధారాలు సేకరించారు. -
ద్విచక్రవాహనాలు ఢీకొని వ్యక్తి మృతి
● ఇద్దరికి గాయాలు పొదిలి రూరల్: ఎదురెదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. ఈ సంఘటన సోమవారం రాత్రి పొది లి మండలంలోని తలమళ్ల–అగ్రహారం మధ్య ఒంగోలు–కర్నూలు రహదారిపై జరిగింది. స్థానికులు వివరాల ప్రకారం..మండలంలోని ఏలూరు పంచాయతీ టి.సల్లూరు గ్రామానికి చెందిన వారు పొదిలి నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళుతున్నారు. అదే విధంగా కొమరోలు మండలం అల్లినగరానికి చెందిన నాగరాజు ఒంగోలు నుంచి బైక్పై స్వగ్రామానికి వెళుతుండగా తల్లమల–అగ్రహారం కోల్డ్ స్టోరేజీ సమీపంలో ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ప్రమాదంలో నాగరాజు(27) అక్కడికక్కడే మృతి చెందగా, మరో బైక్పై వెళుతున్న భార్యభర్తలు కోటేశ్వరరావు, రోజాలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జనకోటి గర్జన
ప్రైవేటుపైమాజీ ఎమ్మెల్యే జంకెకి అస్వస్థతఒంగోలు చర్చి సెంటర్లో వైఎస్సార్ విగ్రహం వద్ద ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినదిస్తున్న వేలాది మంది వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలుపేద ప్రజలకు వైద్యసేవలు, వైద్య విద్యను దూరం చేసేలా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజాగ్రహం పెల్లుబికింది. వైఎస్సార్ సీపీ నేతృత్వంలో చేపట్టిన కోటి సంతకాల ఉద్యమంలో స్వచ్ఛందంగా భాగస్వాములైన ప్రజలు సర్కారు తీరుపై తమ నిరసన గళం వినిపించారు. జిల్లా వ్యాప్తంగా సేకరించిన సంతకాలను ఒంగోలు నుంచి తాడేపల్లికి తరలించే కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది మంది ప్రజలు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించారు. పీపీపీని నిరసిస్తూ చంద్రబాబు వైఖరిని దుమ్మెత్తిపోశారు.సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పేదల సంక్షేమం పట్టని చంద్రబాబు ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ పేరుతో సొంత వ్యక్తులకు కట్టబెట్టే కుట్రలను మానుకోవాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి హితవు పలికారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను ఒంగోలుకు తరలించారు. ఆ ప్రతులను తాడేపల్లికి తరలించే కార్యక్రమంలో భాగంగా సోమవారం నగరంలోని చర్చి సెంటర్ నుంచి వైఎస్సార్ సీపీ కార్యాలయం వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చి సెంటర్లోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన నిరుపేద సామాన్య ప్రజలకు వైద్య సేవలను ఉచితంగా అందించాలన్న సదుద్దేశంతో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి 17 మెడికల్ కళాశాలల నిర్మాణాలు ప్రారంభించారని తెలిపారు. విద్య, వైద్యం ప్రజల ప్రాథమిక హక్కు అని, అందుకే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ రంగం ద్వారానే మెడికల్ కాలేజీలు నిర్వహించడానికి పూనుకున్నారన్నారు. అందుకు విరుద్ధంగా చంద్రబాబు మెడికల్ కాలేజీలను సొంత వ్యక్తులకు పప్పు బెల్లంలా పంచిపెడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమ పథకాలన్నింటినీ అటకెక్కించారని, సూపర్సిక్స్ పథకాల ఆనవాళ్లు ఎక్కడా కనిపించడం లేదన్నారు. పేద ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలోని 99 శాతం ప్రజలకు మేలు చేసే పథకాలను పక్కనబెట్టేసి కేవలం 99 పైసలకే ప్రభుత్వ భూమిని కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను చంద్రబాబు కబంద హస్తాల నుంచి కాపాడుకోవడానికి జగనన్న పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో 5,26,148 మంది సంతకాలు చేశారని తెలిపారు. ప్రైవేటు మెడికల్ కళాశాలలకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికై నా చంద్రబాబు కళ్లు తెరిచి మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా మెడికల్ కళాశాలలను నిర్మించి నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేకపోతే వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ప్రజా పోరాటాలను కొనసాగిస్తామన్నారు. ఇదే స్ఫూర్తిని నాయకులు, కార్యకర్తలు కొనసాగించాలని, జగనన్నను తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. పశ్చిమ ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది, మెడికల్ కళాశాలలను మంజూరు చేసింది జగనన్నే అని చెప్పారు. భవిష్యత్లో జగన్మోహన్రెడ్డి పాలనలో పశ్చిమ ప్రకాశం జిల్లా అభివృద్ధికి పూర్తిస్థాయిలో అండగా నిలబడతామని తెలిపారు. సంక్షేమం జగన్తో సాధ్యం: జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో సంక్షేమ పథకాలను వంద శాతం అమలు చేసిన ఘనత జగనన్నకే దక్కిందని చెప్పారు. ఆరోగ్య శ్రీ, వసతిదీవెన, విద్యాదీవెన, అమ్మ ఒడి, వంటి సంక్షేమ పథకాలను నూటికి నూరు శాతం అమలు చేసి దమ్మున్న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరూపించుకున్నారన్నారని చెప్పారు. జిల్లాలోని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ప్రజల ఆకాంక్షల మేరకు జగనన్నను తిరిగి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు అహర్నిశలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పేదలకు వైద్యం దూరం చేసేందుకు బాబు కుట్రలు: యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందించడానికి నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రయత్నిస్తే పేదలకు వైద్యాన్ని దూరం చేయడానికి నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర బడ్జెట్లో మెడికల్ కళాశాలల నిర్మాణం కోసం కేవలం రూ.ఐదు వేల కోట్లు కేటాయించడానికి చంద్రబాబుకు చేతకావడం లేదని ఎద్దేవా చేశారు. పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం, మెరుగైన వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురాడం జగనన్న ఏకై క లక్ష్యం అన్నారు. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే అభివృద్ధి: ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ జగనన్న పీపుల్స్ లీడరైతే చంద్రబాబు పేపరు లీడర్ అని అన్నారు. జగనన్న ఐదేళ్ల పాలనలో క్షేత్రస్థాయి నుంచి గ్రామాలను అభివృద్ధి బాట పట్టించారని రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు నిస్పక్షపాతంగా సంక్షేమ పథకాలు అందించారని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చిన ఏకై క ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనని చెప్పారు. ఏకకాలంలో 17 మెడికల్ కళాశాలలను ప్రారంభించిన ముఖ్యమంత్రి చరిత్రలో ఎక్కడా లేరన్నారు. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని తేల్చిచెప్పారు. చంద్రబాబు ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి.. మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని చెప్పారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను రాష్ట్రంలోని ప్రజలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, చంద్రబాబు ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని, పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని సామాన్య ప్రజలను వేధిస్తున్నారని విమర్శించారు. వైద్య సేవలందక ప్రాణాలు పోతున్నాయ్.. మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూ పశ్చిమ ప్రకాశం ప్రజలు సరైన వైద్య సౌకర్యాలు లేక అల్లాడిపోతున్నారని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు, పక్షవాతం లాంటి వ్యాధులు వచ్చినప్పుడు మెరుగైన వైద్య సేవల కోసం హైదరాబాద్, గుంటూరు వంటి దూరం ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, దాంతో కాలయాపన జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకొని నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్కాపురంలో మెడికల్ కళాశాల మంజూరు చేశారని చెప్పారు. పశ్చిమ ప్రకాశం ప్రజల ఆరోగ్యాన్ని లెక్క చేయని చంద్రబాబు ప్రభుత్వం ఈ మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పి వ్యాపారం చేసుకునేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. గిద్దలూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ కేపీ నాగార్జునరెడ్డి మాట్లాడుతూ జగనన్న పాలనలో సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా సమానంగా చేపట్టారన్నారు. నాడు–నేడు తో స్కూళ్లు, ఆస్పత్రులు బాగుపడ్డాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు గిట్టుబాటు ధరలు లేవని, ఉద్యోగులకు జీతాలు సక్రమంగా రావడంలేదని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిలిచిపోయిందని చెప్పారు. ఏవిధంగా చూసినా రాష్ట్రంలోని ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించడాన్ని సామాన్య ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు విద్య, వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉందన్నారు. ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలి ప్రైవేటీకరణ పేరుతో సొంత వ్యక్తులకు సంపదను దోచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ 18 నెలల చంద్రబాబు పాలనలో రాష్ట్రంలోని ప్రజలు కష్టనష్టాలకు గురవుతున్నారని చెప్పారు. ప్రజల సంపదను సొంతవ్యక్తులకు కట్టబెట్టడమే చంద్రబాబు విజన్ అని, ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో జగనన్నను ముఖ్యమంత్రి చేయడానికి ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ మంత్రి మేరుగు నాగార్జున బాపట్ల జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు కూడా కావడంతో ఆయన బాపట్లలో నిర్వహించిన కార్యక్రమానికి మద్దిపాడు నుంచి ర్యాలీగా తరలివెళ్లారు. కార్యక్రమంలో మాజీ పీడీసీసీ బ్యాంకు చైర్మన్ మాదాసి వెంకయ్య, రాష్ట్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు కుప్పం ప్రసాద్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కేవీ.రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, బొట్ల రామారావు, మాజీ ఎమ్మెల్యేలు ఉడుముల శ్రీనివాసరెడ్డి, కసుకుర్తి ఆదెన్న, మాజీ పీడీసీసీ బ్యాంకు చైర్మన్ వైఎం.ప్రసాద్రెడ్డి, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, లీగల్ సెల్ నాయకులు హరిబాబు, హిదయతుల్లా, కే స్వామిరెడ్డి, కొత్తపట్నం మండల అధ్యక్షుడు లంకపోతు అంజిరెడ్డి, చీమకుర్తి జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, నగరపాలక సంస్థ ఫ్లోర్లీడర్ ఇమ్రాన్ఖాన్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ, గౌడ విభాగం జిల్లా అధ్యక్షుడు తాత నరసింహగౌడ్, జిల్లా కార్యదర్శి సయ్యద్ అప్సర్బేగం, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, వైఎస్సార్ సీపీ నాయకులు దామరాజు క్రాంతికుమార్, జిల్లాలోని అన్ని వివిధ విభాగాలకు చెందిన పార్టీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, కోఆప్షన్ మెంబర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.విద్యుత్ పొదుపుపై అవగాహన కల్పించాలి -
జాతీయ స్థాయి హాకీ పోటీలకు మద్దిపాడు విద్యార్థిని
మద్దిపాడు: మండల కేంద్రం మద్దిపాడులోని కడియాల యానాదయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎం.అను జాతీయ స్థాయి హాకీ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల పీడీలు వనజ, సౌజన్య తెలిపారు. ఈనెల 11, 12, 13వ తేదీల్లో నెల్లూరు జిల్లాలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ 17 బాలికల హాకీ టోర్నమెంట్లో అను మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టులో స్థానం సంపాదించుకుంది. ఆమె త్వరలో జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ పట్టణంలో జరిగే జాతీయ పోటీల్లో ఆడనుంది. ఎంపికై న విద్యార్థిని అను ను పీడీలు వనజ, సౌజన్యలను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాల్యాద్రి, ఇతర ఉపాధ్యాయులు అభినందించారు. ఒంగోలు సబర్బన్: అమరజీవి పొట్టిశ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల కృష్ణ కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ఘనంగా నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పొట్టిశ్రీరాములు తెలుగుజాతికి చేసిన సేవలను కొనియాడారు. ఆయన ప్రాణత్యాగంతో ఆంధ్రరాష్ట్రం ఏర్పడిందని, యావత్ తెలుగుజాతికి పొట్టిశ్రీరాములు నిత్యస్మరణీయులని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్ రెడ్డి, కుమార్, జాన్సన్, మాధురి, విజయజ్యోతి, జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, డీపీఓ ముప్పూరి వెంకటేశ్వరరావు, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఒంగోలు సిటీ: విద్యార్థుల్లో సేవాదృక్పథం, దేశభక్తి పెంపొందించడమే స్కౌట్ లక్ష్యమని ఎంఈఓ తిరుపతి కిషోర్బాబు అన్నారు. భారత్ గౌడ్స్ అండ్ గైడ్స్ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా పరిధిలోని పీఎం శ్రీ పాఠశాలలకు సంబంధించిన స్కౌట్ మాస్టర్లకు 7 రోజుల శిక్షణ తరగతులు ఒంగోలు నగరంలోని డీఆర్ఆర్యం హైస్కూల్లో సోమవారం ప్రారంభించారు. ఈ శిక్షణ 21వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఒంగోలు ఎంఈఓ తిరుపతి కిషోర్ బాబు మాట్లాడుతూ భారత్ గౌడ్స్ అండ్ గైడ్స్ ద్వారా విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ పెంపొందించవచ్చన్నారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా అసోసియేషన్ కార్యదర్శి తన్నీరు బాలాజీ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 51 పీఎం శ్రీ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బేసిక్, అడ్వాన్స్డ్ స్కౌట్ శిక్షణ ఇస్తారన్నారు. కార్యక్రమంలో ఎంఈఓలు వెంకటారెడ్డి, సుబ్బయ్య, డోల శ్రీను, అల్లూరి హైస్కూల్ హెచ్ఎం సుబ్బారావు, డీఎల్ నారాయణ, జిల్లా ట్రెజరర్ వెంకట్రావు, కేవీ శేషారావు, పీ వెంకట్ రెడ్డి, బ్రహ్మేశ్వర రావు, శ్రీనివాసరావు, గోపాలకృష్ణ పాల్గొన్నారు. కంభం: కంభం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మార్కాపురం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనవరి 4 నుంచి 18వ తేదీ వరకు జాతీయ స్థాయి లెదర్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గెలిచిన వారికి ప్రథమ బహుమతి రూ.2 లక్షలు, ద్వితీయ బహుమతి కింద రూ.లక్ష అందిస్తారన్నారు. ప్రతి మ్యాచ్ కు మ్యాన్ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ది సిరీస్, బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాట్స్మెన్ అవార్డులు, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తారన్నారు. డిసెంబర్ 30వ తేదీలోగా ఎంట్రీ ఫీజు రూ.6 వేలు చెల్లించి తమ జట్టు పేరు నమోదు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 9440255999, 9295555990, 9849377383 నంబర్లను సంప్రదించాలన్నారు. -
12వ పీఆర్సీ కమిషన్ను నియమించాలి
● బీటీఏ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పర్రె వెంకట్రావు డిమాండ్ ఒంగోలు సిటీ: 12వ పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని బహుజన టీచర్స్ అసోసియేషన్ (బీటీఏ) రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పర్రె వెంకట్రావు డిమాండ్ చేశారు. బీటీఏ జిల్లా కౌన్సిల్ సమావేశాన్ని ఆదివారం ఉదయం 10 గంటలకు స్థానిక సంఘ కార్యాలయంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకట్రావు మాట్లాడుతూ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రకటించాల్సిన పీఆర్సీని జాప్యం చేయడం వలన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు మెడబలిమి ముసలయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలని, డీఏ బకాయిలు, నాలుగు సంవత్సరాల క్రితం పెట్టిన సరెండర్ లీవులు ఇంతవరకు మంజూరు కాలేదని, వెంటనే మంజూరు చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఏల్చూరు మాధవరావు, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కల్లగుంట మోహన్రావు, రాష్ట్ర నాయకులు డి.మాల్యాద్రి ఎల్.ఆంటోనీ, కట్టా రమేష్, మందిరాల శరత్ చంద్రబాబు, పారాబత్తెన జాలరామయ్య, చల్లా నరసింహారావు, సీహెచ్ చిన్న వెంగయ్య, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఏకగ్రీవంగా జిల్లా కార్యవర్గం ఎన్నిక... సమావేశం అనంతరం జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా గౌరవాధ్యక్షునిగా పారాబత్తెన జాలరామయ్య, అధ్యక్షునిగా షేక్ అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శిగా కర్ర దేవసహాయం, అసోసియేట్ అధ్యక్షునిగా ఏల్చూరు మాధవరావు, కార్యనిర్వాహక అధ్యక్షునిగా ఎద్దు శ్రీను, కోశాధికారిగా పల్లె కృష్ణమూర్తి, ప్రచార కార్యదర్శిగా కొండమూరి కొండలరాయుడు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా నూకతోటి కుమారస్వామి, ఆడిట్ సెక్రటరీగా పల్లె తిరుపతిస్వామి, డిప్యూటీ జనరల్ సెక్రటరీగా కల్లగుంట యలమందరావు, అడిషనల్ జనరల్ సెక్రటరీగా పీక బాబూరావు, మహిళా కార్యదర్శిగా వేల్చూరు భాగ్యం, మరికొందరు రాష్ట్ర కౌన్సిలర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
పుష్కరాలలో మునిగితే అంటురోగాలు
● హేతువాద సంఘ అధ్యక్షుడు వెంకటసుబ్బయ్య ఒంగోలు వన్టౌన్: పుష్కరాలలో మునిగితే వచ్చేది పుణ్యం కాదని, అంటురోగాలని భారత హేతువాద సంఘ అధ్యక్షుడు నార్నె వెంకటసుబ్బయ్య అన్నారు. ఒంగోలులోని సీపీఐ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా ఆధునిక విజ్ఞానం పెరిగిపోతుంటే మన దేశంలో మాత్రం మూఢనమ్మకాలు పెరిగిపోతున్నాయన్నారు. మూఢ నమ్మకాలు అరికట్టాల్సిన పాలకులే.. పుష్కారాలలో మునిగితే పుణ్యం వస్తుందని ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలకు ముహూర్తాలు నిర్ణయించి వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తున్నారన్నారు. రాజమండ్రి వద్ద జరిగే గోదావరి పుష్కరాలకు 5700 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి ప్రకటించారన్నారు. ప్రజా ధనాన్ని మతపరమైన కార్యక్రమాలకు వినియోగించకూడదన్నారు. పుష్కరాలలో మునిగితే పుణ్యం వస్తుందని మతపరమైన సంస్థలు, పీఠాధిపతులు చెప్పుకుంటారని, కానీ, ప్రజాప్రతినిధులకు ఏం పనని ప్రశ్నించారు. కుంభమేళాలో మునిగితే పుణ్యం వస్తుందని దేశ ప్రధాని, యూపీ ముఖ్యమంత్రి ప్రజలను రెచ్చగొట్టి వందలాది మంది మృతికి కారణమయ్యారన్నారు. కుంభమేళాలో ఎంత మంది చనిపోయింది లెక్కలేదన్నారు. గంగా నదిలో ఎన్ని శవాలు తెలియాడాయో లెక్క చెప్పలన్నారు. కచ్చితంగా ఈ సంఘటనకు దేశ ప్రధాని మోదీ బాధ్యత వహించాలన్నారు. 2015లో రాష్ట్రంలో జరిగిన గోదావరి పుష్కరాలలో 30 మంది చనిపోయారని, అందుకు అప్పటి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. విలేకరుల సమావేశంలో హేతువాద సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మొగల్ కాలేషా బేగ్, సభ్యులు ఎస్వీ రంగారెడ్డి, ఒంగవోలు నాగేశ్వరరావు, సుభానీ, ఎస్.చంద్రశేఖరబాబు తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ తైక్వాండో పోటీలకు ఒంగోలు విద్యార్థులు
ఒంగోలు: జాతీయ తైక్వాండో పోటీలకు ఒంగోలు విద్యార్థుల ఎంపిక హర్షణీయమని ఆల్ ఇండియా పోర్ట్ ట్రాన్స్పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ ఏపీ చైర్మన్ షేక్ ఖలీఫాతుల్లాభాషా అన్నారు. స్థానిక సీవీఎన్ రీడింగ్ రూం క్లబ్ ఆవరణలో ఆదివారం నిర్వహించిన ఎంపిక ప్రక్రియకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంతర్జాతీయ తైక్వాండో 5వ డాన్ కోచ్ షేక్ కరిముల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎంపికలో 20 మంది అర్హత సాధించారు. ఎంపికై న వారంతా జాతీయ పోటీలో సత్తాచాటి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎంపికై న విద్యార్థులను ఖలీఫాతుల్లాబాషాతోపాటు సీవీఎన్ పాలకవర్గం సభ్యులు రామిరెడ్డి నితిన్రెడ్డి, కోడూరి రాధాకృష్ణ, శ్రీచక్రవర్తి తదితరులు అభినందించారు. -
రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య
కంభం: స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్పై రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. రైల్వే ట్రాక్పై తల, మొండెం వేరుగా పడి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు మార్కాపురం మండలం పిడుదలనర్వకు చెందిన నరేంద్రారెడ్డిగా రైల్వే పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. తాళ్లూరు: బైక్ అదుపుతప్పి వ్యక్తికి తీవ్రగాయాలైన సంఘటన తాళ్లూరు మండలంలోని తూర్పుగంగవరం–చీమకుర్తి ప్రధాన రహదారిపై గుంటి గంగమ్మ దేవస్థానం సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. మండలంలోని దోసకాయలపాడు గ్రామానికి చెందిన రామయ్య అనే వ్యక్తి పని నిమిత్తం బైక్పై చీమకుర్తి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా అదుపుతప్పి ప్రమాదం జరిగింది. గాయపడిన రామయ్యను వైద్యం నిమిత్తం తూర్పుగంగవరంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్కు తరలించారు. రహదారులు గుంతలతో అధ్వానంగా తయారవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. ఒంగోలు టౌన్: నగరంలో థైరాయిడ్ పరీక్షలు నిర్వహించే వ్యక్తి ఒకరు అనుమానాస్పద స్థితిలో మరణించారు. పోలీసుల కథనం ప్రకారం... టంగుటూరు మండలం అలకూరపాడు గ్రామానికి చెందిన లేళ్లపల్లి రాజ్కుమార్ ఒంగోలు నగరంలోని 60 అడుగుల రోడ్డులో కొంతకాలంగా థైరోకేర్ క్లినిక్ నిర్వహిస్తున్నారు. రోగుల నుంచి రక్తం సేకరించి థైరాయిడ్ పరీక్షలు చేయిస్తుంటాడు. మనస్పర్థల కారణంగా భార్య విడిచిపెట్టి వెళ్లింది. దాంతో మద్యానికి బానిసయ్యాడు. క్లినిక్లోని సోఫాలో నుంచి కిందపడిపోయి మరణించి ఉన్నాడు. ఆదివారం ఉదయం రిపోర్టుల కోసం వచ్చిన వ్యక్తి చూసి ఇరుగుపొరుగు వారికి చెప్పారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. రాజ్కుమార్ చనిపోయి రెండుమూడు రోజులై ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఒంగోలు జీజీహెచ్కి తరలించారు. ఒంగోలు తాలూకా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విమానాల రన్వేకు మరమ్మతులు
సింగరాయకొండ: కేంద్ర ప్రభుత్వ నిధులు సుమారు రూ.80 కోట్లతో నిర్మించిన విమానాల రన్వే పనులు నాసిరకంగా జరగటంతో రన్వేపై గుంతలు పడి తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో అప్రమత్తమైన జాతీయ రహదారి అధికారులు రన్వేపై శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. గతంలో రన్వేపై గుంతలు పడిన ప్రాంతాలను తారుతో సరిచేసేవారు. ఆ తరువాత కురిసిన వర్షాలకు తారు లేచిపోయి మళ్లీ గుంతలు పడ్డాయి. వాహనదారుల నుంచి విమర్శలు రావటంతో ఎట్టకేలకు రన్వేపై గుంతలు పడిన ప్రాంతాన్ని పూర్తిగా తొలగించి సిమెంటు కాంక్రీట్తో నాణ్యంగా గుంతలు పూడ్చే పనులు చేపట్టారు. గతంలో ఈ గుంతల వద్ద నిదానంగా వెళ్లాల్సి వచ్చేదని, రాత్రివేళల్లో గుర్తించకపోతే ప్రమాదాలు జరిగేవని, ఇక ఆ సమస్య ఉండదని వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
‘ఉపాధి’ నిర్వీర్యం చేసే కుట్రలు ఆపండి
ఒంగోలు టౌన్: దేశంలోని గ్రామీణ నిరుపేద ప్రజలకు ఎంతోకొంత భరోసా ఇస్తున్న ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఆపాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల ఆంజనేయులు డిమాండ్ చేశారు. సుందరయ్య భవనంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ స్వాతంత్య్రం తరువాత అనేక చట్టాల్లో గ్రామీణ ప్రాంత ప్రజలకు జీవనోపాధి చూపుతున్న ఉపాధి హామీ పథకం ఒక వరం వంటిదన్నారు. ఉపాధి హామీ పథకాన్ని చట్టంగా చేశారంటే పనిని గ్యారంటీగా కల్పించడమని అర్థమని, ఇందుకు ప్రభుత్వం బాధ్యతగా ఉంటుందని భరోసా ఇవ్వడమేనని చెప్పారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం పూజ్యబాపు గ్రామీణ రోజ్గార్ యోజన అని పేరు మార్చిందని తెలిపారు. పైకి పేరు మాత్రమే మార్చినట్లు కనిపిస్తున్నా పని గ్యారంటీ అనే పదాన్ని తొలగించడం ప్రజలను మోసం చేయడమేనని మండిపడ్డారు. ఉపాధి చట్టాన్ని ఒక పథకంగా మార్చి దానిని అమలు చేయవచ్చు చేయకపోవచ్చనేలా బలహీనపరిచారని చెప్పారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నెరుసుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పేదరిక నిర్మూలన, వలసల నివారణ, గ్రామీణ సమాజంలో నీటి వనరులు, ఆస్తులు సమకూర్చడం, గ్రామీణ పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం వంటి ఉత్తమ లక్ష్యాలతో యూపీఏ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. మొదట కేంద్ర బడ్జెట్లో 4 శాతం నిధులు కేటాయించారని, మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత క్రమంగా నిర్వీర్యం చేస్తూ 1.3 శాతానికి తగ్గించారని చెప్పారు. నిజంగా గ్రామీణ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే కేంద్ర బడ్జెట్లో ఏడాదికి రూ.2.5 లక్షల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. 200 రోజుల పని, రోజు వేతనం రూ.600 కు పెంచాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో పనులు లేక పట్టణాలకు వలస వస్తున్న పేదలకు పని కల్పించేలా పట్టణాలకు కూడా ఉపాధి హామీ విస్తరించాలని ప్రజలు కోరుతుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పని ప్రదేశంలో రెండు పూటలా ఫొటోలు తీయాలని, ఈకేవైసీ చేయించాలని రకరకాల సాకులు చెబుతూ లక్షలాది మంది పేదల జాబ్ కార్డులను తొలగించారని, పనులు చేసిన కూలీలకు నెలల తరబడి వేతనాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం ఆర్ధిక సంక్షోభం నుంచి బయటపడాలంటే గ్రామీణ పేదల కొనుగోలు శక్తి పెరిగితేనే సాధ్యపడుతుందని, అందుకు ఉపాధి హామీ చట్టాన్ని మరింత విస్తరించడమే కాకుండా పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. -
హెల్మెట్ వాడకంతో ప్రాణరక్షణ
● ఎస్పీ హర్షవర్థన్రాజు ఒంగోలు టౌన్: రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాపాయం నుంచి బయటపడాలంటే హెల్మెట్ ధరించడం ఒక్కటే మార్గమని ఎస్పీ హర్షవర్థన్ రాజు తెలిపారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు, సిబ్బందితో హెల్మెట్ వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలలో మరణిస్తున్న వారిలో తలకు హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపేవారే ఎక్కువగా ఉంటున్నారని తెలిపారు. తలకు గాయం కావడం వలన తీవ్ర రక్తస్రావం జరిగుతోందని, దాంతో వైద్యం అందించే సమయం కూడా లేకుండా పోతోందని చెప్పారు. ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా తలకు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. ఇది ద్విచక్ర వాహనాలు నడిపేవారికి రక్షణ కవచంలా పనిచేస్తుందన్నారు. వాహనదారులు ప్రతిఒక్కరూ తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మైనర్లు వాహనం నడపకూడదని హెచ్చరించారు. అతివేగం, ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, ఎంతమాత్రం మంచిదికాదన్నారు. రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించుకోవడమే కాకుండా ఆ నియమాలను పాటించాలని చెప్పారు. కుటుంబ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని డ్రైవింగ్ చేయాలని సూచించారు. -
రాష్ట్రంలో అక్రమ అరెస్టుల పర్వం
● వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల ధ్వజం కంభం: రాష్ట్రంలో అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరే శ్యామల ధ్వజమెత్తారు. కంభం మండలానికి చెందిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి నెమలిదిన్నె చెన్నారెడ్డి అక్రమ అరెస్టుపై యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డితో కలిసి హైదరాబాద్లోని కేపీహెచ్పీ బస్టాండ్ సమీపంలో వైఎస్సార్ విగ్రహం వద్ద ఆదివారం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. అధికార పార్టీని ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారన్నారు. చెన్నారెడ్డి కుటుంబానికి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎటువంటి దాడి చేయకపోయినా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం దుర్మార్గమని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. జగనన్న ఇలాంటి కేసులను గమనిస్తున్నారని, యువత ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. భవిష్యత్లో చంద్రబాబు ప్రభుత్వం, పాలకులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. -
మద్యం మత్తులో అత్తపై అల్లుడు దాడి
యర్రగొండపాలెం: పూటుగా మద్యం సేవించి అత్తపై కత్తితో అల్లుడు దాడి చేసిన సంఘటన మండలంలోని మిట్టమీదిపల్లె గ్రామంలో ఆదివారం జరిగింది. పాతకక్షల కారణంగా నారాయణ మద్యం సేవించి అత్త రవణమ్మ ఇంటి వద్దకు వెళ్లాడు. అక్కడ ఘర్షణపడి తన వద్ద ఉన్న కత్తితో ఆమైపె దాడి చేసి గొంతుకోసేందుకు ప్రయత్నించాడు. ఈ సంఘటనలో రవణమ్మ గొంతుపై తీవ్రంగా గాయమైంది. వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స చేస్తున్నారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పి.చౌడయ్య తెలిపారు. -
రాష్ట్ర స్థాయి జూడో పోటీలకు క్రీడాకారులు ఎంపిక
ఒంగోలు: రాష్ట్ర స్థాయి జూడో క్యాడెట్, జూనియర్స్ క్రీడాకారుల ఎంపిక ఆదివారం స్థానిక రాజీవ్నగర్లోని ఓ ప్రైవేటు స్కూలులో నిర్వహించారు. సుమారు 50 మంది క్రీడాకారులు జిల్లావ్యాప్తంగా ఈ ఎంపికకు హాజరయ్యారు. ఎంపికై న వారిలో ఎం.లక్ష్మీ ప్రదీప్, కె.లక్ష్మి నిశాంత్, డి.రవీంద్ర, సీహెచ్ నాగకోమల్, షేక్ సాజల్ మీర్జా, డి.నరేంద్ర, ఆర్.రామ్చరణ్, ఎన్.అమరేశ్వరరెడ్డి ఉన్నారు. వీరిని అసోసియేషన్ రాష్ట్ర డిసిప్లీనరీ కమిటీ చైర్మన్ షేక్ ఖాజా మస్తాన్ అభినందించారు. ఎంపికై న వీరు ఈనెల 19 నుంచి 22 వరకు కర్నూల్లో జరిగే రాష్ట్రస్థాయి క్యాడెట్, జూనియర్స్ టోర్నమెంట్లో పాల్గొంటారని ప్రధాన కార్యదర్శి ఎ.రవి తెలిపారు. -
జాతీయ మహాసభలను జయప్రదం చేయండి
● సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ పిలుపు ఒంగోలు టౌన్: సీఐటీయూ అఖిల భారత మహాసభలు ఈ నెల 31 నుంచి జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్టణంలో జరగనున్నాయని, జిల్లా నుంచి అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్ పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని 49వ డివిజన్లో సీఐటీయూ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లపై మహాసభలలో చర్చించనున్నట్లు తెలిపారు. అంతేగాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా భవిష్యత్తులో ఉద్యమానికి రూపకల్పన చేయనున్నట్లు చెప్పారు. లేబర్ కోడ్లను ఉపసంహరించుకునేంత వరకు పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. లేకపోతే కార్మికుల హక్కులతో పాటు ప్రజల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటుందన్నారు. లేబర్ కోడ్లు కేవలం కార్మికుల సమస్య మాత్రమే కాదని, యావత్ ప్రజలతో ముడిపడి ఉన్న అంశమని చెప్పారు. దేశ ప్రజలంతా ముక్తకంఠంతో వ్యతిరేకించాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు జి.రమేష్, జి.ఆదిలక్ష్మి, కె.రాజేశ్వరి, వీరాస్వామి, ఆర్.పెంచల కొండయ్య, రామయ్య, డి.కోటయ్య, ఎస్కే సుభాని, వి.కాశిం, టి.వీరయ్య పాల్గొన్నారు. -
ప్రయోగానికిపంగనామం.!
కనిగిరి రూరల్: చంద్రబాబుకు మొదటి నుంచీ రైతన్నలంటే చులకనే. ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా వ్యవసాయాన్ని, రైతులను చిన్నచూపు చూస్తుంటారు. ఈసారీ అదే జరుగుతోంది. అన్నదాతలు ఎదుర్కొంటోన్న అనేక సమస్యలే అందుకు నిదర్శనంగా ఉన్నాయి. వీటికితోడు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రూ.కోట్లు వెచ్చించి రైతన్న సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన అగ్రి టెస్ట్ ల్యాబ్లను నిర్వీర్యం చేసింది. జిల్లాలో మొత్తం 7 అగ్రి టెస్ట్ ల్యాబ్లకుగానూ రెండు పనిచేస్తుండగా, ఒకటి నిర్మాణ దశలో ఆగిపోయింది. మిగతా నాలుగు అగ్రి ల్యాబ్లు సుమారు ఏడాది నుంచి మూతబడ్డాయి. రైతులకు నాడు ఎంతో మేలు చేసిన అగ్రి టెస్ట్ ల్యాబ్లు నేడు నిర్వీర్యంగా మారి పాలకుల నిర్లక్ష్యాన్ని, చేతగానితనాన్ని వెక్కిరిస్తున్నాయి. ఆయా ల్యాబ్లకు చెందిన కోట్ల విలువ చేసే భవనాలు, పరికరాలు నిరుపయోగంగా మారుతున్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రూ.కోటితో ఏర్పాటు... ఎంతో ఉన్నత లక్ష్యం, ఆశయంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతన్న సంక్షేమం కోసం సుమారు రూ.కోటి ఖర్చు పెట్టి అగ్రి టెస్ట్ ల్యాబ్లు నిర్మించారు. ప్రధానంగా వ్యవసాయంలో కల్తీ నివారణే లక్ష్యంగా ఏర్పాటు చేశారు. రైతులు ఉపయోగించే విత్తనాలు, ఎరువుల నాణ్యతను పరీక్షించిన తర్వాత సాగుచేపడితే మేలైన దిగుబడులు సాధించే వీలుంటుందనే ఉద్దేశంతో అగ్రి టెస్టింగ్ ల్యాబ్లను ఆనాటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సుమారు రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షలతో భవన నిర్మాణాలు, రూ.40 లక్షల ఖర్చుతో వివిధ రకాల విలువైన పరికరాలు, రసాయనాలు, కంప్యూటరైజ్డ్ సిస్టమ్లను అందుబాటులోకి తెచ్చింది. కనిగిరిలోని ఏఎంసీ కార్యాలయ ఆవరణలో డాక్టర్ వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ను ప్రారంభించారు. 2021లో దీనిని ప్రారంభించిన తర్వాత నెల రోజులకే 15 నుంచి 20 వరకు పరీక్షల నమూనాలు రైతుల నుంచి వచ్చేవి. కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల రైతన్నలకు ఇది ఎంతగానో ఉపయోగపడింది. అయితే చంద్రబాబు సర్కార్ వచ్చిన తర్వాత ఈ ల్యాబ్లు మూతపడ్డాయి. రూ.లక్షల విలువైన సామగ్రి నిరుపయోగంగా మారింది. ఏటా 1200 నుంచి 1500 వరకు పరీక్షలు... కనిగిరి వ్యవసాయ సబ్ డివిజన్లోని ఆరు మండలాల్లో ఖరీఫ్లో సాధారణ విస్తీర్ణం 29,050 హెక్టార్లు కాగా, సాగు విస్తీర్ణం 37,118 హెక్టార్ల వరకు ఉండేది. రబీలో సాధారణ విస్తీర్ణం 24,361 హెక్టార్లు కాగా, ఇప్పటి వరకు 9,060 హెక్టార్లకుపైగా వివిధ రకాల పంటలు సాగులో ఉన్నాయి. ఇంకా చాలా మంది రైతులు పంటల సాగుకు భూములు సిద్ధం చేసుకుంటున్నారు. కంది సాధారణ విస్తీర్ణం 15,193 హెక్టార్లు కాగా, ఇప్పటి వరకూ అత్యధికంగా 21,968 హెక్టార్లలో సాగు చేశారు. రైతులే స్వయంగా నేరుగా విత్తనాలు, ఎరువులు పరీక్షించుకునేందుకు ఉపయోగకరంగా ఉండేది. రైతులే స్వయంగా విత్తన పరీక్షలు, నాణ్యత పరీక్షలను రైతు భరోసా కేంద్రాల ద్వారా అగ్రి ల్యాబ్లకు వచ్చి జరిపించుకునేవారు. ఏటా సుమారు 270 నుంచి 300 మంది వరకు ల్యాబ్లలో పరీక్షలు చేయించుకునేవారు. 2021 నుంచి ప్రతి ఏటా సుమారు 1200 నుంచి 1500 వరకు పరీక్షలు జరిగేవి. విత్తనాలు, ఎరువులు, మందులకు పరీక్షలు... రైతులు విత్తనాలను పరీక్షించుకున్న తర్వాతే భూమిలో నాటాలన్న ఉన్నతాశయంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అగ్రి టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేశారు. దీంతో కనిగిరి ప్రాంత రైతులు దీన్ని బాగా సద్వినియోగం చేసుకున్నారు. ఎరువులు, విత్తనాల నాణ్యతను పరీక్షించుకుని నివేదికల తర్వాత సాగుచేసుకునేవారు. వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలో మూడు రకాలుగా జర్మినేషన్, ఫిజికల్ ప్యూరిటీ, మాయిశ్చర్ పద్ధతుల్లో ఇద్దర అధికారులు పరిశీలన జరిపేవారు. అంతేగాకుండా నత్రజని, పొటాషియం, భాస్వరం సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు రసాయనాలను ఉపయోగించేవారు. ఎరువుల నాణ్యతను గుర్తించి ఆ తర్వాత పంటలు సాగు చేసుకునేందుకు రైతులకు వ్యవసాయ అధికారులు సలహాలు, సూచనలు చేసేవారు. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. అగ్రి ల్యాబ్లను చంద్రబాబు ప్రభుత్వం మూసివేయడంతో వాటిలో పనిచేసే అధికారులను ఇతర విభాగాలకు డిప్యుటేషన్ వేశారు. దీంతో విత్తనాలు, ఎరువుల పరీక్షలకు దర్శి వెళ్లాల్సి వస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అగ్రి టెస్ట్ ల్యాబ్లను నిర్వీర్యం చేసిన చంద్రబాబు ప్రభుత్వం లక్షల రూపాయల విలువైన భవనాలు, పరికరాలు నిరుపయోగం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేయగా ఎంతో ఉపయోగపడిన వైనం ఏడాదిన్నరగా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోక శిథిలమవుతున్న భవనాలు వ్యవసాయాన్ని చిన్నచూపు చూడటంపై అన్నదాతల ఆందోళన -
పీపీపీతో ఊపిరి తీసి..
కోటి సంతకాల ఉద్యమంతో ఉవ్వెత్తున నిరసన గళంమార్కాపురం: అన్ని విధాలుగా వెనుకబడిన పశ్చిమ ప్రాంత ప్రజలకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించేందుకు, పేదలకు వైద్య విద్యను చేరువ చేసేందుకు నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్కాపురానికి మెడికల్ కాలేజీని మంజూరు చేయడంతోపాటు రూ.450 కోట్లు కేటాయించారు. మార్కాపురం మండలం రాయవరం వద్ద 41.97 ఎకరాల స్థలంలో పనులు వేగంగా చేయించారు. 70 శాతం పనులు పూర్తికాగానే గత ఏడాది ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో తాత్కాలికంగా ఆగిపోయాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీ పనులు నిలిపేశారు. కొన్ని నెలల తరువాత పీపీపీ విధానంలో నిర్మిస్తామని అన్నారు. ఇదే సమయంలో జీజీహెచ్ ఊపిరి కూడా తీశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో 75 మంది డాక్టర్లు ఉన్న వైద్యశాల కూటమి ప్రభుత్వం రాగానే వైద్యులను బదిలీ చేయడంతో 22కు చేరింది. 500 నుంచి 600 మధ్య ఉన్న ఓపీ ఒక్కసారిగా 300 నుంచి 350కు పడిపోయింది. అత్యవసర వైద్యసేవల కోసం 2018 నాటి పరిస్థితులు పునరావృతం కావడంతో స్థానిక వైద్యులు ఒంగోలు, గుంటూరుకు రెఫర్ చేస్తున్నారు. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలూ ఉద్యమ బాట: ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ, సీపీఐ, సీపీఎంతోపాటు ఇతర ప్రజా సంఘాల నాయకులు మెడికల్ కాలేజీ కోసం రౌండ్ టేబుల్ సమావేశాలు, ధర్నాలు, సబ్కలెక్టరుకు వినతిపత్రాలు అందచేయడం, ప్రదర్శనలు నిర్వహించి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ ప్రజాగ్రహాన్ని చంద్రబాబు ప్రభుత్వానికి వినిపిస్తున్నారు. రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి మాజీ ఎంఎల్సీ లక్ష్మణరావు, డాక్టర్ ఆళ్ల వెంకటేశ్వర్లు, మాజీ ఆర్ధిక శాఖ కార్యదర్శి పీవీ రమేష్ తదితరులు ఇక్కడికి వచ్చి పీపీపీ విధానం వలన వచ్చే నష్టాలను తెలిపారు. జీజీహెచ్ కూడా పీపీపీ విధానంలోకి.. మెడికల్ కళాశాలతోపాటు జీజీహెచ్ను కూడా పీపీపీ విధానంలోకి మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 2వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వైద్యసేవలు పశ్చిమ ప్రకాశం ప్రజలకు అందని ద్రాక్షలాగా మారనుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు సుదూరం కానున్నాయి. ఎమర్జెన్సీ సర్వీసులు కావాలంటే ప్రాణాలను దేవుడిపై భారంవేసి ఒంగోలు లేదా గుంటూరుకు వెళ్లాలి. నాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే మెడికల్ కళాశాలకు సంబంధించి సిబ్బంది క్వార్టర్స్, నర్సింగ్ కళాశాల, జంట్స్, లేడీస్ హాస్టల్స్, సెంట్రల్ క్యాంటీన్ ఇలా అనేక భవన నిర్మాణ పనులను దాదాపు పూర్తి చేశారు. జీజీహెచ్లో 420 బెడ్లను సిద్ధం చేశారు. జనరల్ సర్జరీ కోసం 100, జనరల్ మెడిసిన్ 100, ఆర్ధోపెడిక్ విభాగానికి 40, ఆప్తమాలజీకి 20, డెర్మటాలజీ 10, సైక్రియాట్రి విభాగానికి 10, ఈఎన్టీకి 20, ఐసీయూకి 20, పీడియాట్రిక్స్ 50, గైనకాలజీకి 50 బెడ్లు కేటాయించారు. ఇప్పుడు ఇవన్నీ జీజీహెచ్లో కనిపించడం లేదు. నిర్మాణ సామగ్రి, వైద్య పరికరాల తరలింపు.. గత ఏడాది నవంబర్ 5,6 తేదీల్లో మెడికల్ కళాశాల నిర్మాణ సంస్థ కళాశాల ఆవరణలో ఉన్న సామగ్రిని తరలించే ప్రక్రియ ప్రారంభించింది. వైద్య పరికరాలను కూడా తరలించారు. దీంతో వ్యాధి నిర్ధారణ పరీక్షలు కూడా రోగులకు దూరం కావడంతోపాటు ప్రైవేటు వైద్యశాలకు వెళితే భారం కానున్నాయి. ఇప్పటికే ఇక్కడ ఉన్న అత్యాధునిక వైద్య పరికరాలను రాష్ట్రంలోని వివిధ మెడికల్ కళాశాలలకు తరలించారు. పేరుకు మాత్రమే జీజీహెచ్ సేవల్లో మాత్రం పీహెచ్సీలా తయారైంది. పీపీపీ విధానం అమలైతే పరిస్థితి ఇంకా దారుణంగా మారనుంది. మెడికల్ కాలేజీని ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల ఉద్యమం చేపట్టింది. ఈ ఉద్యమంలో జిల్లాలోని ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. పీపీపీ విధానంపై ఆగ్రహించారు. మెడికల్ కాలేజీని ప్రభుత్వమే నిర్వహించాలని నినదించారు. మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆధ్వర్యంలో జిల్లాలోనే అత్యధికంగా 85 వేల మంది ప్రజలు సంతకాల రూపంలో తమ నిరసన వ్యక్తం చేశారు. ఇది మార్కాపురం ప్రాంత ప్రజల మనోభావాలను తెలియజేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 5,26,148 సంతకాలు సేకరించినట్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి బూచేపల్లి శివప్రసాద్రెడ్డి వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా సేకరించిన సంతకాల పత్రాలను సోమవారం ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయం నుంచి తాడేపల్లికి తరలించి ఆ తరువాత గవర్నర్కు అందజేయనున్నారు. -
ప్రైవేటీకరణపై నిరసన గళమెత్తండి
సింగరాయకొండ: చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకంగా నిరసన గళమెత్తాలని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పిలుపునిచ్చారు. కోటి సంతకాల కార్యక్రమం నియోజకవర్గంలో జయప్రదం గా జరిగిందని, ప్రజలు పార్టీలకు అతీతంగా సంతకాలు చేయటం ద్వారా తమ నిరసనను తెలియజేశారని చెప్పారు. మండల కేంద్రంలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో ఆదివారం రాత్రి కోటి సంతకాల కార్యక్రమం పై శ్రీహలో కొండపి..చలో ఒంగోలుశ్రీ వాల్పోస్టర్ ఆవిష్కరించారు. డాక్టర్ సురేష్ మాట్లాడుతూ రెండు నెలలుగా సాగుతున్న ఈ ప్రజా ఉద్యమం ద్వారా అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, మంత్రులకు వినతిపత్రాలను కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, పలు రాజకీయ పార్టీలు అందజేశాయని, విద్యార్థి సంఘాల వారు బంద్ కూడా నిర్వహించారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం విద్యా వ్యవస్థకు శాపంలా మారిందన్నారు. ప్రభుత్వానికి ఎన్నో రకాలుగా విజ్ఞాపన పత్రాలు అందించామని, నిరసన ర్యాలీలు చేశామన్నారు. చిట్టచివరి అస్త్రంగా ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు మా నాయకులు, కార్యకర్తల శ్రమ ఫలితంగా కోటి సంతకాలతో సిద్ధం చేసిన వినతి పత్రాలను గవర్నర్ అబ్దుల్ నజీర్కు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 18వ తేదీన స్వయంగా అందజేయనున్నట్లు వివరించారు. ఈనెల 10వ తేదీ భారీగా ర్యాలీగా నియోజకవర్గంలో సిద్ధం చేసిన 63,162 సంతకాల ప్రతులను ఒంగోలు పార్టీ కార్యాలయానికి చేర్చామన్నారు. సోమవారం నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఉదయం 9 గంటలకు పార్టీ క్యాంపు కార్యాలయం నుంచి ర్యాలీగా బయలు దేరి టంగుటూరు టోల్ గేట్కు చేరుకుని అక్కడి నుంచి అందరూ కలిసి ఒంగోలు బయలుదేరి వెళతామని వివరించారు. కలెక్టరేట్ సెంటర్లోని వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అక్కడి నుంచి తాడేపల్లికి తరలిస్తామని వివరించారు. పేదలకు అందని ద్రాక్షగా వైద్య విద్య, వైద్యం: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించటం వలన పేదలకు, బడుగు, బలహీన వర్గాల వారికి వైద్య విద్య, వైద్యం అందని ద్రాక్షలా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జగనన్న 5 మెడికల్ కాలేజీలను ప్రారంభించారన్నారు. పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీలను పూర్తి చేశారన్నారు. 650 పడకల ఆస్పత్రులు కూడా సిద్ధమయ్యాయని, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ కాలేజీలకు 150 సీట్లు మంజూరు చేస్తే చంద్రబాబు ప్రభుత్వం వద్దని తిరస్కరించిందన్నారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పై ఇటీవల కాలంలో ఇంతపెద్ద ప్రజాఉద్యమం జరగలేదన్నారు. కోటి సంతకాల సేకరణ పత్రాలను అన్నింటినీ సంతకం చేసిన వ్యక్తి పేరు, ఫోన్ నంబరు, మండలం, గ్రామం పేరుతో ఆన్లైన్ చేశామని వివరించారు. ప్రతి వెయ్యి మందికి ఒక డాక్టరు అవసరమని, కానీ రాష్ట్రంలో కేవలం 0.03 శాతం మాత్రమే ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించి ఉంటే 2,500 సీట్లు పెరిగేవన్నారు. ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ఈ పథకం కింద ఆస్పత్రులకు రూ.3,500 కోట్ల బకాయిలు ఉన్నారన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కేవలం టీడీపీ వారికే ఇస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు మసనం వెంకట్రావు, షేక్ సుల్తాన్, చుక్కా కిరణ్కుమార్, షేక్ కరీం, లింగాబత్తిన నరేష్, పెరికాల సునీల్, మిరియం సుధాకర్, నాగార్జున, షేక్ అల్లాభక్షు, దాసరి శేషయ్య, దాసు శ్రీనివాసులు, షేక్ మల్లాంగ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
నేడు ‘కోటి సంతకాల ర్యాలీ’ని జయప్రదం చేయండి
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ఒంగోలు సిటీ: రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి అంచనాలకు మించి స్పందన వచ్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంతకాల పత్రాల బహిరంగ ర్యాలీ సోమవారం ఒంగోలు చర్చి సెంటర్లోని వైఎస్సార్ విగ్రహం వద్ద నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల నుంచి సేకరించిన కోటి సంతకాల ప్రతులు ప్రత్యేక వాహనంలో ఒంగోలు నుంచి తాడేపల్లిలోని కేంద్ర పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నాయని చెప్పారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. నియోజకవర్గ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జ్లు, జిల్లా నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ప్రజాప్రతినిధులు, వివిధ హోదాలో పార్టీ పదవుల్లో ఉన్న నాయకులు, పార్టీ శ్రేణులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. దొనకొండ: దొనకొండ రైల్వే పోలీస్ స్టేషన్ను గుంటూరు రైల్వే డివిజన్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ బి.శైలేష్కుమార్ ఆదివారం తనిఖీ చేశారు. వార్షిక తనిఖీలో భాగంగా స్టేషన్, రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బందికి సూచన, సలహాలందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైలు దొనకొండకు చేరిన సమయంలో పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, తరచుగా అక్కడక్కడ అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయని, అలాంటివి జరగకుండా చూడాలని సూచించారు. అనుమానితులను గుర్తించి వివరాలను తెలుసుకోవాలన్నారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. ఆయన వెంట ఏఎస్ఐ వీరాంజనేయులు, సిబ్బంది ఉన్నారు. ఒంగోలు: మాస్టర్ అథ్లెటిక్స్ రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు పలు పథకాలు సాధించారు. ఈనెల 13, 14 తేదీల్లో బాపట్ల జిల్లాలో జరిగిన 7వ ఆంధ్రప్రదేశ్ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో ప్రకాశం జిల్లా తరఫున 14 మంది పాల్గొన్నట్లు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ తానికొండ సురేష్కుమార్, దాసరి విజయభాస్కర్ తెలిపారు. స్వర్ణ పతకాలు 19, రజతం 12, కాంస్యం 8 వెరసి మొత్తం 39 పతకాలు సాధించినట్లు తెలిపారు. పతకాలు సాధించిన వారిలో ఎన్.లక్ష్మి, కేవీపీ శైలజ, ఎండి అల్లారఖ, కె.మేనక, టి.పద్మావతి, ఎండి హజీరాబేగం, ఎస్.బాలకోటేశ్వరరావు, డి.రవి, ఎం.బ్రహ్మయ్య, కె.భగవాన్, వై.నిరంజన్బాబు, కె.జీవన్కుమార్, డి.విజయభాస్కర్, డాక్టర్ టి.సురేష్కుమార్ ఉన్నారు. పతకాలు సాధించిన వీరంతా జనవరి 30 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు రాజస్థాన్ రాష్ట్రంలో జరిగే 7వ జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించినట్లు పేర్కొన్నారు. -
ప్రైవేటుపరం చేస్తే వైద్యసేవలు కష్టమే
మెడికల్ కాలేజీని, జీజీహెచ్ వైద్యశాలను కూడా ప్రైవేటుపరం చేస్తే పేద ప్రజలకు చాలా కష్టం. ప్రభుత్వాలు ప్రజలకు ఉచిత వైద్యసేవలు అందించాల్సిన బాధ్యత ఉంది. బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పుకోకూడదు. పశ్చిమ ప్రకాశంలో గిరిజనులు, దళితులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వారికి అత్యవసరమైతే ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి ఫీజులు చెల్లించి వైద్యసేవలు ఎలా పొందుతారో అర్థం కావడం లేదు. వైద్యశాలను ప్రభుత్వమే నిర్వహించాలి. ప్రజాగ్రహాన్ని ఇప్పటికై నా గుర్తించి పీపీపీని రద్దుచేయాలి. – పత్తి రవిచంద్ర, వైఎస్సార్ సీపీ బూత్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి, మార్కాపురం -
ఏఎంఆర్ విజిలెన్స్ టీమ్ కలకలం!
చీమకుర్తి: ప్రకాశం జిల్లాలో గ్రానైట్ సీనరేజి వసూళ్ల కోసం చంద్రబాబు ప్రభుత్వం కాంట్రాక్టు అప్పగించిన ప్రైవేటు ఏజెన్సీ ఏఎంఆర్ సంస్థ సిబ్బంది ఏకంగా విజిలెన్స్ అధికారుల అవతారమెత్తారు. ఆన్ గవర్నమెంట్ డ్యూటీ బోర్డులతో ఉన్న వాహనాల్లో వచ్చి పోలీసు అధికారులమంటూ గ్రానైట్ వాహనదారుల్ని భయభ్రాంతులకు గురిచేశారు. వివరాల్లోకెళ్తే.. గ్రానైట్ వాహనాల నుంచి సక్రమంగా బిల్లులను చెక్ చేస్తున్నారా, లేదా? తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన ఏఎంఆర్ సంస్థ సిబ్బంది.. విజిలెన్స్ టీమ్ సభ్యులమంటూ మూడు రోజులుగా చీమకుర్తి బైపాస్ రోడ్డుపై గ్రానైట్ వాహనాలను ఆపి ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నారు. ఎటువంటి నంబర్ ప్లేట్లూ లేకుండా ఆన్ గవర్నమెంట్ డ్యూటీ బోర్డులతో, చేతిలో లాఠీలతో హడావిడి చేస్తున్నారు. తాము సెంట్రల్ గవర్నమెంట్ విజిలెన్స్ సిబ్బందిమని ఒకసారి, నెల్లూరు మైన్స్ అధికారులమని మరోసారి చెబుతూ లారీలను అడ్డుకుంటున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక బీజేపీ నేత గుండా శ్రీనివాసరావు వారిని ఫొటోలు తీసి చీమకుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని వాహనాలను స్టేషన్కు తరలించారు. పోలీసులు ఏఎంఆర్ సంస్థ యాజమాన్యాన్ని సంప్రదించగా.. సంస్థ అనుమతితోనే వారి సిబ్బంది పనితీరును తెలుసుకునేందుకు ఇలా తనిఖీలు చేశారని యాజమాన్యం సమాధానమిచ్చింది. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకున్న వాహనాలను వదిలిపెట్టారు. -
పది కిలోల అడవి పంది మాంసం స్వాధీనం
మార్కాపురం: పెద్దారవీడు మండలం సానికవరం సమీపంలో అడవి పంది మాంసాన్ని అమ్ముతున్న వ్యక్తిని అరెస్టు చేసి పది కిలోలు స్వాధీనం చేసుకున్నట్లు మార్కాపురం డీఆర్ఓ నాగరాజు గౌడ్ తెలిపారు. సానికవరం సమీపంలో ఒక ఫామ్ హౌస్లో వాచ్మెన్గా పనిచేస్తున్న రేగుమానిపల్లికి చెందిన పి.దేవసహాయం పొలానికి పందులు రాకుండా విద్యుత్ కంచె వేశాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం పొలానికి వెళ్లి చూడగా విద్యుత్ షాక్కు గురై అడవి పంది మృతి చెంది ఉండటాన్ని గుర్తించాడు. అనంతరం పది కిలోల మాంసాన్ని అమ్మకానికి పెట్టాడు. సమాచారం అందుకున్న డీఆర్ఓ నాగరాజు గౌడ్ తన సిబ్బందితో అక్కడికి వెళ్లి మాంసాన్ని స్వాధీనం చేసుకుని ఆయన్ను అరెస్టు చేశారు. దాడిలో ఫారెస్టు బీట్ ఆఫీసర్ రవికుమార్, ప్రొటెక్షన్ ఆఫీసర్లు వెంకటేశ్వర్లు, శివరామరాజు, స్నేక్ క్యాచర్ నిరంజన్ పాల్గొన్నారు. ● ఒకరికి తీవ్ర గాయాలు కొండపి: అదుపుతప్పి వాహనం బోల్తా పడి ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని పెద్దకండ్లగుంట–కొండపి గ్రామాల మధ్య మలుపు వద్ద శనివారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక టెంట్ హౌస్కు సంబంధించిన అశోక్ లేలాండ్ వాహనం పెద్దకండ్లగుంట నుంచి కొండపి వైపు వేగంగా వస్తోంది. డ్రైవర్ వేగాన్ని నియంత్రించే క్రమంలో వాహనం అదుపుతప్పింది. దీంతో పక్కనే ఉన్న పొలాల్లోకి పల్టీలు కొట్టుకుంటూ వెళ్లి చెట్టును ఢీకొని ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్కు గాయాలవడంతో స్థానిక ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లి చికిత్స అందించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలులోని ఓ ప్రైవేట్ హాస్పటల్కు తరలించారు. మార్కాపురం: పట్టణంలోని అయ్యప్పస్వామి గుడివద్ద శనివారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి అగ్నిప్రమాదం జరిగిందని యజమాని కోటిరెడ్డి తెలిపారు. వెంటనే అప్రమత్తమై మంటలార్పినట్ల తెలిపారు. ఈ ప్రమాదంలో కిరాణాషాపులో ఉన్న పలు వస్తువులు కొద్దిగా దగ్ధమయ్యాయి. -
హాస్టల్ విద్యార్థులను వైద్యులు ప్రతి నెలా పరీక్షించాలి
● డీఆర్ఓ ఓబులేసు ఒంగోలు వన్టౌన్: ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులను ప్రతి నెలా వైద్యులు పరీక్షించాలని డీఆర్ఓ ఓబులేసు సూచించారు. ఒంగోలు అన్నవరప్పాడులోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహం–7ను శనివారం రాత్రి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పిస్తున్న వసతుల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా వంట గది, తాగునీరు, మరుగుదొడ్లు, స్టోర్ గదిని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా..లేదా, ప్రతి నెలా వైద్యులు వస్తున్నారా లేదా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వసతులు బాగున్నాయని విద్యార్థులు ఆయనతో చెప్పారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. చివరిగా విద్యార్థులతో ఆయన సమావేశమయ్యారు. డీఆర్ఓ మాట్లాడుతూ విద్యార్థులకు వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహించరాదని వసతి గృహం సిబ్బందికి సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసినట్లు చెప్పారు. వసతి గృహంలో మొత్తం 95 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. ఆయనతో పాటు సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.లక్ష్మానాయక్, సహాయ సంక్షేమ అధికారి టి.లింగయ్య, వసతి గృహ సంక్షేమ అధికారి అంకబాబు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆక్రమణలు అడ్డుకున్న రెవెన్యూ అధికారులు
స్థానికులతో మాట్లాడుతున్న ఆర్డీఓ, ఒంగోలు అర్బన్ తహసీల్దార్ గుడిసెలు వేసుకునేందుకు స్థలం వద్దకు చేరిన జనాలు ఒంగోలు సబర్బన్: ఒంగోలు అర్బన్ మండలం ముక్తినూతలపాడు సర్వే నంబర్ 186లో స్థలాలు ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకునేందుకు పలువురు పేదలు శనివారం సీపీఐ ఆధ్వర్యంలో ప్రయత్నించారు. సమాచారం తెలుసుకున్న ఒంగోలు అర్బన్ తహసీల్దార్ పిన్నిక మధుసూదన్రావు ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది అడ్డుకున్నారు. పోలీసులను తీసుకెళ్లి మరీ ఆక్రమణలు నిలువరించారు. అనంతరం ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న ఆక్రమణలకు పూనుకున్న ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముక్తినూతల పాడు సర్వే నంబర్ 186లో 12.80 ఎకరాల భూమి ఉందన్నారు. సీపీఐ నాయకులు దాదాపు 600 మందితో 1.20 ఎకరాల భూమిలో చిల్లచెట్లు తొలగించి అందులో తాత్కాలిక గృహాలు వేసుకునేందుకు ప్రయత్నించారన్నారు. తహసీల్దార్ పిన్నిక మధుసూదన్రావు తన సిబ్బందితో అక్కడికి చేరుకొని స్థలాన్ని పరిశీలించి సదరు భూమి ముక్తినూతలపాడు సర్వే నంబర్ 186లో 12.80 ఎకరాల భూమిగా గుర్తించారని చెప్పారు. ఆ భూమి గ్రామ ఎఫ్ఎల్ఆర్ దాఖలా ‘రైతు వారి ఇనామ్’గా నమోదైందన్నారు. పట్టాదారు పేర్లు నమోదై 1981లో 12.80 ఎకరాల భూమి నుంచి ఎన్ఎస్పీ కాలువ కోసం 4.40 ఎకరాలు భూ సేకరణ ద్వారా సేకరించి 5 సబ్ డివిజన్స్గా విభజించినట్లు వివరించారు. పోలీసులు అడ్డుకోవడంతో సీపీఐ నాయకుల ఆధ్వర్యంలో అక్కడి నుంచి సుమారు 400 మందితో పట్టణంలో ర్యాలీ నిర్వహించారన్నారు. ర్యాలీ తహసీల్దార్ కార్యాలయానికి నినాదాలతో చేరుకున్నారు. దీంతో సీపీఐ నాయకులతో చర్చలు జరిపిన ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న పట్టణంలో ఎవరికై నా ఇంటి స్థలాలు లేని లబ్ధిదారులు ఉంటే వారు సంబంధిత సచివాలయాల్లో అర్జీలు దాఖలు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ భూములు గుర్తించి వారికి నివేశన స్థలాలు కేటాయించే విషయంలో ఉన్నతాధికారులకు నివేదికలు పంపిస్తామని చెప్పారు. సర్వే నంబర్ 186లోని భూమి విషయంలో ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత సీపీఐ ప్రతినిధులు ఈ నెల 17న ఒంగోలు రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం వద్దకు వచ్చి తమ అనుమానాలు నివృత్తి చేసుకోవాలని నోటీసుల ద్వారా తెలియజేసినట్లు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న స్పష్టం చేశారు. పోలీసులతో కలిసి ముక్తినూతలపాడు వెళ్లిన అధికారులు సీపీఐ ఆధ్వర్యంలో ఇళ్లు వేసేందుకు ప్రయత్నించిన పేదలు -
చెస్లో ఒంగోలు విద్యార్థిని సత్తా
ఒంగోలు సబర్బన్: స్థానిక పీవీఆర్ బాలికల హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని గుంటక ఆముక్త జర్మనీలో నిర్వహించిన అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో సత్తా చాటింది. తన తొలి ఓపెన్ మహిళా ఇంటర్నేషనల్ మాస్టర్ (డబ్ల్యూఐఎం) నార్మ్ సాధించింది. ఈ సందర్భంగా ఆముక్తను శనివారం కలెక్టర్ రాజాబాబు తన చాంబర్లో సత్కరించి ప్రత్యేకంగా అభినందించారు. ఆముక్త తాజా అంతర్జాతీయ విజయంతో కేవలం 13 ఏళ్ల వయసులోనే 2208 ఫైడే ఎలో రేటింగ్తో మహిళా ఫైడే మాస్టర్ (డబ్ల్యూఎఫ్ఎం) టైటిల్ కై వసం చేసుకుంది. జర్మనీలో జరిగిన బలమైన అంతర్జాతీయ టోర్నమెంట్లో దేశ విదేశాల నుంచి పాల్గొన్న శక్తివంతమైన క్రీడాకారిణుల మధ్య అత్యుత్తమ ప్రదర్శన చేసి తన మొదటి మహిళా ఇంటర్నేషనల్ మాస్టర్ నార్మ్ సాధించింది. ఇది ఆమెను భవిష్యత్లో మహిళా ఇంటర్నేషనల్ మాస్టర్ మాత్రమే కాకుండా మహిళా గ్రాండ్మాస్టర్ దిశగా ముందుకు నడిపించే మైలురాయిగా నిలిచిందని కలెక్టర్ అభినందించారు. ప్రధాన అంతర్జాతీయ విజయాలలో ఆముక్త నిలిచిందన్నారు. ఇప్పటికే పలు పతకాలు... 2025లో తజికిస్థాన్లో జరిగిన వెస్ట్రన్ ఆసియా యువ చెస్ చాంపియన్షిప్లో భారత జట్టుకు ఆముక్త ప్రాతినిధ్యం వహిస్తూ ర్యాపిడ్ విభాగంలో స్వర్ణ పతకం, అలాగే ర్యాపిడ్, బ్లిట్జ్, స్టాండర్డ్ విభాగాల్లో పలు పతకాలు సాధించి దేశానికి గౌరవం తీసుకొచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో వివిధ వర్గాలలో ఆముక్త స్థిరంగా పాయింట్లు సాధిస్తూ కఠినమైన పోటీల్లోనూ తన ప్రతిభను నిరూపించుకుంటూ వచ్చింది. జాతీయ స్థాయిలో అండర్–11, అండర్–13, అండర్–15 వయో విభాగాలలో, అలాగే జట్టు ఫార్మాట్లలో భారతస్థాయి చాంపియన్షిప్లలో ఆముక్త అనేక సార్లు అగ్రస్థానాల్లో నిలిచింది. 2025లో నేషనల్ అమేచ్యూర్ (బి–2300 మహిళల విభాగం) బోధ్గయాలో నిర్వహించిన టోర్నమెంట్లో 9 రౌండ్లలో 6 పాయింట్లు సాధించి మొత్తంగా మూడో స్థానం దక్కించుకోవడం ఆమె స్థిరమైన ఫార్మ్కు నిదర్శనం. రాష్ట్ర స్థాయి విజయాలు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోటీల్లో ఆముక్త ఇప్పటికే తనదైన ముద్ర వేసింది. 2024లో రాష్ట్ర అండర్–17 బాలికల చెస్ చాంపియన్షిప్లో విజేతగా నిలవడంతో పాటు 2023లో అండర్–11 బాలికల రాష్ట్ర చాంపియన్షిప్లో రన్నరప్గా నిలిచింది. ప్రకాశం జిల్లాలో అండర్–17 బాలికల సెలెక్షన్ టోర్నమెంట్ వంటి అనేక జిల్లా స్థాయి టోర్నమెంట్లలో అగ్రస్థానాలు సాధిస్తూ రాష్ట్ర చెస్ రంగంలో తన స్థానాన్ని బలంగా స్థిరపరుచుకుంది. అంతర్జాతీయ స్థాయి టోర్నమెంట్లో విజేతగా పీవీఆర్ బాలికల హైస్కూల్ విద్యార్థిని ఆముక్త ప్రత్యేకంగా అభినందించిన కలెక్టర్ రాజాబాబు -
పచ్చాకు ముఠాలకు రక్షణ చట్టం కావాలి
● వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు డిమాండ్ ఒంగోలు టౌన్: పచ్చాకు ముఠా కూలీలకు ప్రభుత్వం రక్షణ చట్టం తీసుకురావాలని, ప్రతిఒక్కరికీ బీమా సౌకర్యం కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల ఆంజనేయులు డిమాండ్ చేశారు. శనివారం వ్యవసాయ కార్మిక సంఘం నాయకులతో కలిసి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో పొగాకు పంటపై ఆధారపడి 60 లక్షల మంది రైతులు, 2 కోట్ల మంది కూలీలు, 85 లక్షల మంది బీడీ కార్మికులు, 75 లక్షల మంది వివిధ వ్యాపారాలు చేసేవారు కలిపి మొత్తం 4.5 కోట్ల మంది ఉన్నారని తెలిపారు. వీరి ద్వారా వివిధ రూపాలలో భారీగా అమ్మకం పన్ను ప్రభుత్వానికి చేరుతోందన్నారు. పొగాకు ఎగుమతి ద్వారా ప్రభుత్వానికి గతేడాది 16,786 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం లభించిందని తెలిపారు. పొగాకు వలన ప్రభుత్వానికి ఇంత ఆదాయం రావడానికి కారకులైన ముఠా కూలీలకు ఎటువంటి రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో 1.50 లక్షల ఎకరాలలో పొగాకు పంట పండిస్తున్నారని తెలిపారు. 70 వేల మంది ముఠా కూలీలు నాలుగు నెలల పాటు ఆకు కొట్టి, అల్లి, క్యూరింగ్ చేసి, బేళ్లు కట్టే వరకు పనులు చేస్తున్నారని వివరించారు. అయినప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. పనిచేస్తున్న క్రమంలో ప్రమాదాలకు గురవుతున్నారని, ప్రతి ఏడాది పదుల సంఖ్యలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని తెలిపారు. కాళ్లుచేతులు పోవడం జరుగుతుందని చెప్పారు. పని చేయించుకునే రైతు మానవతా హృదయంతో సాయం చేయడం మినహా ప్రభుత్వాల నుంచి కనీస సాయం అందడం లేదన్నారు. కనీసం బీమా సౌకర్యమైనా కల్పించకపోవడం దారుణమన్నారు. ఈ విషయంలో పార్లమెంటు ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఎంపీని కలిసిన వారిలో వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా అధ్యక్షుడు నెరుసుల వెంకటేశ్వర్లు, జిల్లా నాయకుడు కె.వెంకటేశ్వర్లు ఉన్నారు. -
సీపీఐ రాష్ట కార్యదర్శి ఈశ్వరయ్యతో డీఎస్పీ వాగ్వాదం
● జాతీయ రహదారిపై బైఠాయించిన మహిళలుఒంగోలు టౌన్: ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనారిటీ నిరుపేద మహిళలు బూమిని ఆక్రమించుకున్న సమాచారం తెలిసిన వెంటనే డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. వెంటనే భూమిని ఖాళీ చేసి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. భూమిని ఖాళీ చేసేందుకు మహిళలు ససేమిరా అంటూ మొండికేశారు. పోలీసులు మహిళలని కూడా చూడకుండా వారిని లాగిపడేసేందుకు ప్రయత్నించారు. మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించారు. కాసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మహిళలు, సీపీఐ కార్యకర్తలు, నాయకుల నినాదాలతో నార్త్ బైపాస్ హోరెత్తింది. పోలీసుల వ్యవహార శైలిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావుకు గుజ్జుల ఈశ్వరయ్యకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల దురుసు ప్రవర్తనను నిరసిస్తూ మహిళలు, సీపీఐ నాయకులు జాతీయ రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వం ఒక్క సెంటు కూడా ఇవ్వలేదు ● ీసపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు నివేశన స్థలాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఈ రెండేళ్లలో కనీసం ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విమర్శించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నగరంలో 20 వేల మందికి నివేశన స్థలాలు ఇచ్చిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్థలాల్లో ఒక ఇటుక కూడా వేయలేదని చెప్పారు. ఒంగోలు నగరంలో ఎప్పుడో 20 ఏళ్ల క్రితం పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చారని, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదని చెప్పారు. నిరుపేదలకు నివేశన స్థలాలు ఇచ్చేంత వరకు సీపీఐ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఉంటే స్థలంలో ఉంటాం, లేకుంటే జైళ్లకు వెళ్తామని స్పష్టం చేశారు. నార్త్ బైపాస్ ఇనాం భూములను తక్షణమే పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే పోరాటాన్ని మరింత ఉధృదం చేస్తామని హెచ్చరించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, సహాయ కార్యదర్శి ఆర్.వెంకటరావు, నగర కార్యదర్శి శ్రీరాం శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు ఎంఏ సాలార్, రామకృష్ణ, దాసరి అంజయ్య, మత్తన ఆంజయ్య, నూనె జగన్మోహనరావు, అనంతలక్ష్మి, కట్టా ఆంజనేయులు, నల్లూరి మురళి, మౌలాలీ పాల్గొన్నారు. -
19,490 కేసులకుపైగా పరిష్కారం
● జిల్లాలో 29 బెంచీలతో లోక్ అదాలత్ ఒంగోలు: జాతీయ లోక్ అదాలత్లో భాగంగా శనివారం జిల్లావ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమంలో 19,490కిపైగా కేసులు పరిష్కారమైనట్లు జిల్లా ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్ టి.రాజ్యలక్ష్మి తెలిపారు. జిల్లావ్యాప్తంగా 29 బెంచీలను కక్షిదారుల సౌకర్యార్థం ఏర్పాటు చేశామన్నారు. ఆయా బెంచీలలో న్యాయమూర్తులతోపాటు న్యాయవాదులు కలిసి 19,240 క్రిమినల్ కేసులు, పది ప్రీలిటిగేషన్ కేసులు, 240 సివిల్ కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి టి.రాజ్యలక్ష్మి మీడియాకు తెలిపారు. కేసుల పరిష్కారంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా వర్గాలకు సంబంధించిన కేసులు కూడా పరిష్కరించినట్లు తెలిపారు. అంతేగాకుండా వివిధ కేసులలో కక్షిదారులకు రూ.5 కోట్లను పరిష్కారం రూపంలో అందజేసినట్లు చెప్పారు. ఆయా కార్యక్రమాలలో జిల్లా అదనపు న్యాయమూర్తులు టి.రాజా వెంకటాద్రి, ఎ.పూర్ణిమ, పందిరి లలిత, సీనియర్ సివిల్ జడ్జిలు హేమలత, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్, జూనియర్ న్యాయమూర్తులు పాల్గొని కేసుల పరిష్కారానికి కృషి చేశారు. -
అండర్–12 జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక
ఒంగోలు: అండర్–12 జిల్లా క్రికెట్ జట్టును శనివారం స్థానిక మంగమూరు రోడ్డులోని అసోసియేషన్ సబ్సెంటర్స్లో ఎంపిక చేశారు. ఈ ఎంపికకు జిల్లావ్యాప్తంగా 80 మంది హాజరయ్యారు. వీరిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు 30 మందిని ప్రాబబుల్స్గా ఎంపిక చేసినట్లు ప్రకాశం జిల్లా క్రికెట్ అసో సియేషన్ కార్యదర్శి కారుసాల నాగేశ్వరరావు తెలిపా రు. ప్రాథమికంగా ఎంపికై న వారికి కొరిశపాడు మండలం రావినూతల క్రికెట్ గ్రౌండులో కీపింగ్, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ వంటి అన్ని విభాగాలలో ప్రతిభా పరీక్షలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన 16 మందితో తుది జట్టును ప్రకటిస్తామన్నారు. ఎంపికై న జట్టు జనవరిలో జరిగే అంతర్ జిల్లాల క్రికెట్ పోటీలలో ప్రకాశం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుందన్నారు. ఎంపిక ప్రక్రియను ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు నవీన్కుమార్, సంయుక్త కార్యదర్శి శ్రీనివాసరావు, కోశాధికారి హనుమంతరావు, సభ్యుడు బలరాం పర్యవేక్షించారు. ఎంపిక ప్రక్రియకు సెలెక్టర్లుగా బి.చంద్రశేఖర్, లెఫ్ట్ శ్రీను, బాబూరావు, శివనాగేశ్వరరావు వ్యవహరించారు. -
కర్నూల్–గుంటూరు రహదారిపై రోడ్డు ప్రమాదం
పెద్దదోర్నాల: ఎదురెదురుగా వస్తున్న ఓ కారు, ద్విచక్ర వాహనం ఒకదానికొకటి ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కర్నూల్–గుంటూరు జాతీయ రహదారి చిన్నదోర్నాల అడ్డ రోడ్డు..జమ్మిదోర్నాల గ్రామాల మధ్య శనివారం సాయంత్రం జరిగింది. క్షతగాత్రులను స్థానికులు ఓ ఆటోలో మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రమాదంలో చిలకలూరిపేట సమీపంలోని మల్లాయపాలేనికి చెందిన వెంకట మాధవి, దూదేకుల యాసిన్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీశైలంలో దైవదర్శనం ముగించుకుని మోటారు సైకిల్పై స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న మోటారు సైకిల్ జమ్మిదోర్నాల వద్దకు చేరుకుంది. గుంటూరు నుంచి శ్రీఽశైలం వెళ్తున్న కారు అతి వేగంతో మోటారు సైకిల్ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో వెంకట మాధవి కుడికాలు మోకాలి వరకు నలిగిపోయింది. దూడేకుల యాసిన్ చేతి వేళ్లతో పాటు పలు చోట్ల గాయాలయ్యాయి. క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం నర్సారావుపేటకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎదురెదురుగా వచ్చిన కారు, మోటారు సైకిల్ ఢీ మోటారు సైకిల్పై ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలు -
అప్పులకు బాబు లెక్కలు చెప్పాలి
ఒంగోలు సిటీ: ‘‘ప్రభుత్వం నడపాల్సిన మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ ముసుగులో తన బినామీలకు కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తున్నారు. మరో వైపు ఖరీదైన భూములను కారుచవగ్గా ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారు. ఇదేనా సంపద సృష్టి ..’’ అంటూ సీఎం చంద్రబాబుపై దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివరప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మండిపడ్డారు. పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం, వైద్య విద్య అందుబాటులోకి తెచ్చేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 17 మెడికల్ కళాశాలలను తీసుకొస్తే నేడు అందులో 10 కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకునేంత వరకూ మా పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. అత్యంత విలువైన ప్రభుత్వ భూములను లూలూ వంటి ప్రైవేటు సంస్థలకు కారు చవగ్గా కట్టబెట్టడం సరికాదని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు చంద్రబాబు సంపద సృష్టిస్తా అంటూ వాగ్దానాలు చేశారని, తమ బినామీల కోసం, వాళ్ల పార్టీ నాయకుల కోసం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం, ప్రభుత్వ భూములను చవగ్గా కట్టబెట్టడం చూస్తుంటే మీ సంపద సృష్టి అంతా మీ వాళ్ల కోసమేనా అని ఆయన నిలదీశారు. రూ.లక్షల కోట్ల అప్పులకు లెక్క చెప్పాలి.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకూ రూ.2.50 లక్షల కోట్లు అప్పు చేశారని, వాటిని దేని కోసం వినియోగిస్తున్నారో లెక్క చెప్పాలని బూచేపల్లి శివప్రసాద్రెడ్డి డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలకు కోతలు పెట్టారు..సూపర్ సిక్స్ అమలు కావడం లేదు.. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వడంలేదు.. మరి అప్పు తెచ్చిన డబ్బు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అటు అమరావతి కట్టడంలేదు..ఇటు ప్రజలకు ఉపయోగపడే పనులేమీ చేయడం లేదు.. ప్రభుత్వం నడపాల్సిన మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారు. ఈ డబ్బులు ఏం చేస్తున్నారో లెక్కలు చెప్పాలని ప్రజలే కోరుతున్నారన్నారు. రూ.4 వేల కోట్లు ఖర్చుచేస్తే పది మెడికల్ కశాళాలను ప్రభుత్వమే నడపొచ్చన్నారు. రైతులు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్దతు ధరలు రాక అన్ని రకాల రైతులు కుదేలవుతున్నారని అన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 75 కేజీల వరిమూటకు రూ.1800 నుంచి రూ.2 వేలు ఉంటే నేడు రూ.1300 కూడా రావడం లేదన్నారు. ఆర్బీకేల ద్వారా రైతులకు మద్దతు ధర వచ్చేలా జగన్ చర్యలు తీసుకున్నారన్నారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం దళారులకు కొమ్ముకాస్తూ రైతులను అన్యాయం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. రైతులకు మద్దతు ధర వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోంథా తుపానుతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోలేదని విమర్శించారు. సాగర్ జలాలను చివరి భూముల వరకూ ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 15న ఒంగోలులో భారీ ర్యాలీ.. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చిన కోటి సంతకాల ఉద్యమానికి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో మంచి స్పందన వచ్చిందని బూచేపల్లి తెలిపారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల నుంచి సంతకాల సేకరణ ప్రతులు జిల్లా కార్యాలయానికి చేరాయని చెప్పారు. జిల్లాలో 5,26,148 పత్రాలపై సంతకాలు చేశారన్నారు. మార్కాపురం నియోజకవర్గంలో 85 వేలు వరకూ వచ్చాయన్నారు. ఇది ఆ ప్రాంత ప్రజల మనోభావాలను తెలియజేస్తుందన్నారు. పశ్చిమ ప్రకాశం ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు జగన్ మార్కాపురంలో మెడికల్ కళాశాలను నిర్మిస్తే దానిని చంద్రబాబు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కొత్తగా జిల్లాకు తాము వ్యతిరేకం కాదని, మార్కాపురం జిల్లాకు ఆర్థిక వనరులు ఏంటి.. నిధులు కేటాయించకుండా ఆ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. 15వ తేదీ ఉదయం 10 గంటలకు ఒంగోలు చర్చి సెంటర్లోని వైఎస్సార్ విగ్రహం వద్ద నుంచి పార్టీ జిల్లా కార్యాలయం వరకూ వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొట్ల రామారావు, వైఎస్సార్ సీపీ నాయకులు చింతలచెరువు సత్యనారాయణరెడ్డి, దుంపా చెంచురెడ్డి, ఉప్పలపాటి ఏడుకొండలు, గోనుగుంట రజనీ, గౌతమ్ అశోక్, రాయిని వెంకటరావు, పెట్లూరు ప్రసాద్, బాలినేని శ్రీనివాసరెడ్డి, సయ్యద్ అప్సర్, షేక్ మీరావలి, తదితరులు పాల్గొన్నారు. -
నవోదయ ప్రవేశ పరీక్షకు 3504 మంది హాజరు
ఒంగోలు సిటీ: జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశ పరీక్షకు 3504 మంది విద్యార్థులు హాజరైనట్లు జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ సి.శివరామ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ నవోదయ ప్రవేశ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 25 కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించినట్లు చెప్పారు. ఈ పరీక్షకు మొత్తం 5502 మంది విద్యార్థులకు గాను, 3504 మంది హాజరుకాగా, 1998 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. ఒంగోలు సిటీ: జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ హైస్కూల్స్లో 117 మంది అకడమిక్ ఇన్స్ట్రక్టర్స్ ను ఎంపిక చేసినట్లు డీఈఓ సీవీ రేణుక శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ఎంపికై న వారి జాబితాను జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయ వెబ్సైట్లో ఉంచామన్నారు. ఎంపికై న వారందరూ ఈ నెల 15వ తేదీ వారికి కేటాయించిన పాఠశాలలో విధుల్లో చేరాల్సిందిగా కోరారు. సంబంధిత మండల విద్యాశాఖాధికారి, ప్రధానోపాధ్యాయులు ప్రతి నెలా 2వ తేదీ వారి పరిధిలో పనిచేస్తున్న అకడమిక్ ఇన్స్ట్రక్టర్స్ వారి డ్యూటీ సర్టిఫికెట్ ను సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ ఒంగోలు వారికి సమర్పించాలని కోరారు. ● ప్రతి పాఠశాలలో జీఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాన్ని అమలు చేయాలి ● పాఠశాల విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ సుబ్బారెడ్డి ఒంగోలు సబర్బన్: పదో తరగతి వంద రోజుల యాక్షన్ ప్లాన్ సక్రమంగా నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ ఏ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో శనివారం ఒంగోలు, కొండపి, సంతనూతలపాడు నియోజకవర్గాల ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలతో సమావేశమయ్యారు. సమావేశంలో జీఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం అన్ని ప్రాథమిక పాఠశాలల్లో సక్రమంగా జరగాలని చెప్పారు. ప్రతిరోజు పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి వారి మార్కులను మరుసటి రోజున లీప్ అప్లో అప్లోడ్ చేయాలని చెప్పారు. చదువులో వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి నూరు శాతం ఉత్తీర్ణులయ్యేటట్లు చూడాలన్నారు. గత సంవత్సరం కంటే మార్కులు ఎక్కువ వచ్చేలాగా విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో ఒంగోలు ఉప విద్యాశాఖ అధికారి ఏ చంద్రమౌళీశ్వర్, డీసీఈబీ సెక్రెటరీ మర్రిబోయిన శ్రీనివాసులు, ఒంగోలు ఎంఈఓ టీ కిషోర్ బాబు, ఏఎంఓ పీ నాగేంద్ర నాయక్ పాల్గొన్నారు. జె.పంగులూరు: మండల పరిధిలోని స్థానిక మాగుంట సుబ్బరామిరెడ్డి, బాచిన నారాయణమ్మ జూనియర్ కళాశాలలో శనివారం ఉమ్మడి ప్రకాశం జిల్లా బాలురు, పురుషులు ఖోఖో జట్ల ఎంపిక నిర్వహించారు. ఈ ఎంపికలో ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి బాలురు, పురుషుల క్రీడాకారులు 150 మంది పాల్గొన్నట్లు సెలక్టర్లు తెలిపారు. ఈ నెల 19, 20, 21 తేదీల్లో స్థానిక మాగుంట సుబ్బరామిరెడ్డి జూనియర్ కళాశాలలో జూనియర్ బాల, బాలికల రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు జరగనున్నట్లు తెలిపారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఈ నెల 24, 25, 26 నుంచి రాష్ట్ర స్థాయి సీ్త్ర పురుషుల ఖోఖో పోటీలు నిర్వహిస్తారన్నారు. క్రీడాకారుల ఎంపికలో ప్రకాశం జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు వసంత రఘుబాబు, ఉపాధ్యక్షుడు మండవ సౌజన్య, జాయింట్ సెక్రటరీ వై శ్రీనివాసరెడ్డి పాల్గొని జట్లను ఎంపిక చేసినట్లు ఖోఖో సమైఖ్య ఉపాధ్యక్షులు తెలిపారు. -
ఆశలు..ఎర్రబారి..!
తెగులు సోకిన మిర్చి పైరుమార్కాపురం: రెండేళ్లుగా మిర్చిరైతులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎర్ర బంగారమని నమ్మి సాగు చేసి నష్టాల్లో మునిగిపోయారు. జిల్లాలో ప్రధానంగా మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి నియోజకవర్గాల్లో మిర్చిని ఎక్కువగా సాగు చేస్తారు. ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో రెండేళ్లతో పోల్చుకుంటే సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. 2023 సంవత్సరంలో జిల్లాలో 96 వేల ఎకరాల్లో సాగు చేశారు. ధరలు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడిన రైతులు సాగును కుదించేసుకున్నారు. 2024లో 66,387 ఎకరాల్లో సాగు చేశారు. ఈ ఏడాది పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. చంద్రబాబు ప్రభుత్వం రైతులను పట్టించుకోకపోవడంతో చేసిన అప్పులు తీర్చే దారి కనిపించక పశ్చిమాన రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. గత ఏడాది సాగు విస్తీర్ణంతో పోల్చుకుంటే ఈ ఏడాది సగానికి సగం పడిపోయింది. జిల్లాలో సుమారు 33,291 ఎకరాల్లో మాత్రమే మిర్చిని పండిస్తున్నారు. ఈ సారి మోంథా తుపాను వీరిపాలిట విలన్గా మారింది. తుపాను తర్వాత మిర్చి పంటకు తెగుళ్ల బెదడ పట్టుకుంది. దీనిపై నల్లతామర, కుచ్చుముడత (వైరస్) తదితర తెగుళ్లు విజృంభిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 15 వేల ఎకరాల్లో ఈ తెగుళ్లు సోకినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఊహించని విధంగా మిర్చికి నల్లతామర, వైరస్ తెగులు సోకడంతో రైతులు విలవిల్లాడిపోతున్నారు. భారీగా పడిపోనున్న దిగుబడి.. మిర్చి పంటకు తెగుళ్లు సోకడంతో దిగుబడి భారీగా పడిపోయే అవకాశాలు ఉన్నాయని ఉద్యానవనశాఖ అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఎకరాకు 2 క్వింటాళ్ల చొప్పున మొదటి రెండు కోతల్లోనే దిగుబడులు తగ్గుతున్నాయని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో దాదాపు 30 వేల క్వింటాళ్ల దిగుబడి తగ్గిపోనుంది. దీంతో ఈ ఏడాది కూడా వారికి నష్టాల పోటు తప్పట్లేదు. గుంటూరు మార్కెట్ యార్డులో ప్రస్తుతం రూ.15 వేల నుంచి రూ.16 వేల మధ్య ధర పలుకుతోంది. ఈ లెక్కన క్వింటా రూ.15 వేల ప్రకారం రూ.45 కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. మిర్చి సాగుకు ఒక్కొక్క రైతు సుమారు రూ.1 లక్ష పైనే ఖర్చుచేశారు.తామర పురుగును అరికట్టుకోవాలి మిర్చిలో తామర పురుగు సోకింది. దీంతోపాటు తెల్లదోమలు, అఫిట్స్ వైరస్ తెగులు వచ్చింది. ఇవి రసం పీల్చడం, పూత, కాయలను దెబ్బతీయడం ద్వారా దిగుబడులను తగ్గిస్తున్నాయి. రాత్రిపూట గాలిలో తేమ ఎక్కువగా ఉండటం, పగటిపూట పొడి వాతావరణంలో ఉధృతి ఎక్కువగా ఉంటే వ్యాపిస్తాయి. జనవరి వరకూ రైతులు ఈ తెగుళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. నివారణకు సేంద్రియ పద్దతులు, వేపనూనె, పసుపురంగు అట్టలు, పంట శుభ్రత పాటించాలి. కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. తెగులు సోకిన ఆకులను తొలగించాలి. నీలం, పసుపురంగు జిగురు అట్టలను పొలంలో ఏర్పాటు చేసుకోవాలి. – లక్ష్మీనారాయణ, వ్యవసాయాధికారి, పెద్దారవీడు -
ఖాళీ బిందెలతో మహిళల నిరసన
కనిగిరిరూరల్: మంచినీటి సమస్యలపై స్థానిక పదో వార్డు 6వ సచివాలయం వద్ద మహిళలు ఖాళీ బిందెలతో గురువారం నిరసనకు దిగారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ పదో వార్డులోని కంది పప్పు మిల్లు వీధి, ప్రధాన వీధులకు కొన్ని రోజులుగా నీళ్లు రావడం లేదన్నారు. ఇటీవల డీప్ బోర్వెల్ మరమ్మతులు చేసినా కుళాయిలకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదన్నారు. దీంతో నీటి కోసం వార్డు ప్రజలు అనేక ఇక్కట్లు పడుతున్నామన్నారు. సచివాలయ ఎమ్యునిటీ అధికారి ఇన్చార్జి కావడంతో వార్డులోని నీటి సమస్యను పట్టించుకోవడం లేదని మహిళలు అరోపించారు. అనంతరం సచివాలయ అధికారులకు వినతిపత్రం అందచేశారు. టంగుటూరు: బాల్య వివాహాలతో ఎన్నో అనర్థాలు ఉన్నాయని జిల్లా బాలల సంరక్షణ అధికారి పి.దినేష్కుమార్ అన్నారు. బాల్య వివాహాల విముక్తి భారత్ వందరోజుల కార్యక్రమంలో భాగంగా మండలంలోని బి.నిడమానూరు కేజీబీవీ పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, చిన్న వయసులోనే వివాహాలు చేస్తే పిల్లల అమూల్యమైన జీవితం నాశనం అవుతుందన్నారు. బాలిక ఇంటికి భారమనే అపోహలో తల్లిదండ్రులు ఉన్నారని, ఇటువంటి అపోహల నుంచి విద్యార్థులు బయటకు రావాలని సూచించారు. ప్రతి బాలిక అభివృద్ధి చెందుతే కుటుంబ వ్యవస్థ, సమాజం అభివృద్ధి చెందినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో టంగుటూరు, సింగరాయకొండ ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, కేజీబీవీ ప్రిన్సిపాల్ స్రవంతి తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు టౌన్: గంజాయికి అడ్డాగా మారిన చీమకుర్తిపై పోలీసులు దృష్టి సారించారు. సీఐ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మండంలోని జీఎల్పురం గ్రామం ఎస్టీ కాలనీలో గంజాయి విక్రయిస్తున్న నాగలూరి మార్తమ్మ అనే మహిళను గురువారం అదుపులోనికి తీసుకున్నారు. ఆమె వద్ద ఉన్న 1.850 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో ముగ్గురు వ్యక్తుల నుంచి గంజాయి కొనుగోలు చేసినట్లు మార్తమ్మ తెలిపింది. దీంతో ఆ ముగ్గురిని అరెస్టు చేసేందుకు ముమ్మర గాలింపు చేపట్టినట్లు సీఐ తెలిపారు. -
మెరుగైన ఫలితాలు సాధించాలి
కనిగిరిరూరల్: మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని ఇంటర్ విద్య గుంటూరు జోన్ సంయుక్త సంచాలకురాలు జె.పద్మ అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలను గురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంకల్ప–2026 కార్యాచరణ ప్రణాళిక అమలు తీరును, బోధనాభ్యాసాన్ని, విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. ఏబీసీ కేటగిరిలుగా వర్గీకరించి నిర్వహిస్తున్న పరీక్షల విధానం, ఫలితాల విశ్లేషణను సమీక్షించారు. మెరుగైన ఫలితాలు సాధించాలని తెలిపారు. అనంతరం రికార్డులను, సైన్స్ ల్యాబ్ను, మధ్యాహ్న భోజన పథకం, వసతులను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పొలంరెడ్డి రమణారెడ్డి, అధ్యాపకులు కుమ్మరకుంట సురేష్, సీహెచ్ చెన్నకేశవులు, పద్మజ, రవీంద్ర, హనుమంతరావు, రామరాజు, కోటి సాహెబ్, వెంకటరాజు, గురవమ్మ, నాగమణి, ప్రమోద్, వెంకట సురేష్, మార్తమ్మ, మహాబూబ్ బాషా, సాయి తదితరులు పాల్గొన్నారు. ఆర్జేడీ పద్మ -
లైంగిక దాడి కేసులో నిందితునికి పదేళ్ల జైలు
ఒంగోలు: మతిస్థిమితం లేని మహిళపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితునికి పదేళ్ల జైలు శిక్ష విఽధిస్తూ 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి పందిరి లలిత గురువారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. మానసిక వికలాంగురాలైన బాధితురాలిది ఒంగోలు. 2021 మార్చి 20న సాయంత్రం 4 గంటల సమయంలో నాగినేని నారాయణ అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడినట్లు ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై అప్పటి సీఐ సత్యకై లాష్ కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ఇరువైపులా వాదనల అనంతరం నేరం రుజువైనట్లు పేర్కొంటూ నిందితుడు నారాయణకు పదేళ్ల జైలుశిక్ష, పదివేల రూపాయల జరిమానా విధిస్తూ జిల్లా న్యాయమూర్తి పందిరి లలిత తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పీపీ కేవీ రామేశ్వరరెడ్డి, కోర్టు లైజన్గా ఏఎస్సై కె.లక్ష్మీనారాయణ, హెచ్సీ కె.నరేంద్రరావులు వ్యవహరించారు. సింగరాయకొండ: వేటకు వెళ్లి మత్స్యకారుడు ప్రమాదశాత్తు మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం మండలంలోని పాకల గ్రామ పంచాయతీ పోతయ్యగారి పట్టపుపాలెం వద్ద జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..పోతయ్యగారి పట్టపుపాలెంకు చెందిన కోడూరి ఏడుకొండలు(47) గురువారం తెల్లవారుజామున తన ఇద్దరు కుమారులతో కలిసి చేపల వేటకు వెళ్లాడు. చేపల కోసం వల వేసి వల లాగే క్రమంలో ప్రమాదవశాత్తు సముద్రంలో పడి మృతి చెందాడు. దీంతో ఇద్దరు కుమారులు తండ్రి ఏడుకొండలు మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై బి. మహేంద్ర పేర్కొన్నారు. సింగరాయకొండ: రైలు పట్టాలు దాటుతుండగా గూడ్స్రైలు ఢీకొని అంగన్వాడీ కార్యకర్త కరేటి రమాదేవి(62) మృతి చెందింది. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం సోమరాజుపల్లి రైల్వే గేటు సమీపంలోని 3వ రైల్వేలైనుపై జరిగింది. స్థానికుల కథనం ప్రకారం..సోమరాజుపల్లి ఎస్సీ కాలనీ–2 లోని అంగన్వాడీ కేంద్రంలో రమాదేవి పనిచేస్తోంది. మధ్యాహ్నం ఆమె ఇంటికి వెళుతుండగా రైలు పట్టాలు దాటే క్రమంలో కావలి నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న గూడ్స్రైలు ఆమెను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి భర్త, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రమాదేవి మృతికి ఆయాలు, కార్యకర్తలు, సూపర్వైజర్లు సంతాపం తెలియజేశారు. అంగన్వాడీ సూపర్వైజర్ రిజ్వానా, స్నేహితురాలు ఖమురున్నీసా సంఘటనా స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని రైల్వే పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఒంగోలు సిటీ: జిల్లా విద్యాశాఖాధికారిగా సీవీ రేణుక గురువారం బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు డీఈఓగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులకు వందరోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత వచ్చేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అధికారులందరినీ సమన్వయం చేసుకుంటూ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకుంటూ ముందుకు పోతామన్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ పి.రాజాబాబు, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. మర్రిపూడి: పాముకాటుకు మహిళ మృతి చెం దింది. ఈ సంఘటన మండలంలోని కెల్లంపల్లి పంచాయతీ జి.అగ్రహారంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కెల్లంపల్లి పంచాయతీ జి.అగ్రహారం గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీటీసీ కందిమళ్ల రామయ్య, అతన భార్య అరుణ(40) ఇద్దరు కలిసి పశువులకు గడ్డి కోసేందుకు గ్రామానికి సమీపంలోని పొలంలోకి వెళ్లారు. కోసిన గడ్డిని ట్రాక్టర్లో వేసే క్రమంలో గడ్డిలో ఉన్న పాము కాటు వేసింది. దీంతో బాధితురాలిని పొదిలి వైద్యశాలకు తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం నిమపిత్తం ఒంగోలులోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
చెన్నారెడ్డిని కోర్టుకు తరలించిన పోలీసులు
సాక్షి టాస్క్ఫోర్స్: వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన కార్యదర్శి నెమలిదిన్నె చెన్నారెడ్డిపై నమోదు చేసిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో గురువారం మార్కాపురం డీఎస్పీ యు. నాగరాజు విచారణ చేపట్టారు. సంఘటన జరిగిన హైవే రోడ్డులో ఉన్న టీస్టాల్ను పరిశీలించి వివరాలు సేకరించారు. చెన్నారెడ్డి గురువారం ఉదయం మార్కాపురం డీఎస్పీ కార్యాలయంలో హాజరయ్యాడు. మాజీ ఎమ్మెల్యేలు కేపీ నాగార్జునరెడ్డి, అన్నావెంకటరాంబాబు డీఎస్పీ కార్యాలయం వద్దకు వెళ్లి అధికారులు, వైఎస్సార్ సీపీ నాయకులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. రాత్రి 10 గంటల సమయంలో చెన్నారెడ్డిని మార్కాపురం డీఎస్పీ కార్యాలయం నుంచి కంభం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొచ్చి అక్కడ వైద్య పరీక్షల అనంతరం గిద్దలూరు కోర్టుకు తీసుకెళ్లారు. చెన్నారెడ్డి వైద్యశాలకు తీసుకొచ్చారని తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు అధిక సంఖ్యలో వైద్యశాలకు చేరుకొని సంఘీభావం తెలిపారు. -
విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యం వద్దు
దర్శి: విద్యార్థులకు వసతులు కల్పించే విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేసు అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని ఆయన గురువారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పిస్తున్న వసతుల గురించి ఆరా తీశారు. వంటగది, తాగునీరు, మరుగుదొడ్లను పరిశీలించారు. వసతి గృహంలో ఉన్న విద్యార్థులతో మాట్లాడి మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెలా వైద్యులు వస్తున్నారా లేదా, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు, హాస్టల్లో కల్పిస్తున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేసు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆయన మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు బాలికల వసతి గృహాన్ని పరిశీలించినట్లు తెలిపారు. వసతులు, భోజనంపై సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు చక్కగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మీనాయక్, దర్శి నియాజకవర్గ ప్రత్యేకాధికారి జూన్సన్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వరరావు, తహసీల్దార్ శ్రావణ్కుమార్, ఏఎస్డబ్ల్యూఓ ఆదిలక్ష్మి, హాస్టల్ వార్డెన్ అరుణ పాల్గొన్నారు బాలికల హాస్టల్ను తనిఖీ చేసిన డీఆర్వో ఓబులేసు -
కారు డ్రైవర్కు సంకెళ్లు
యర్రగొండపాలెం: టోల్గేట్ల వద్ద చలానా ఎగ్గొట్టేందుకు, పోలీసుల చెకింగ్ నుంచి బయటపడేందుకు కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్, పోలీస్ సైరన్తో తిరుగుతున్న డ్రైవర్ను స్థానిక పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ మేరకు పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ కె.అజయ్కుమార్ కేసు వివరాలు వెల్లడించారు. సీఐ కథనం ప్రకారం.. మార్కాపురానికి చెందిన షేక్ మున్వర్ అలియాస్ మున్నా ఐదేళ్ల క్రితం అప్పటి గిద్దలూరు ఎమ్మెల్యే కారు డ్రైవర్గా పనిచేశాడు. ఆ సమయంలో గడువుదీరిన ఎమ్మెల్యే స్టిక్కర్ను నిందితుడు తన వద్ద ఉంచుకొని దానిపై వినుకొండ ఎమ్మెల్యే ఆంజనేయులు పేరుతో నకిలీ స్టిక్కర్ తయారు చేయించుకొని కారు ముందు భాగాన పెట్టుకొని తిరుగుతున్నాడు. గడువు తీరిన ఎమ్మెల్యే స్టిక్కర్తో టోల్గేట్, ఫారెస్ట్ చెక్క్ పోస్టుల వద్ద డబ్బులు చెల్లించకుండా దర్జాగా తన కారును తిప్పుతున్నాడు. ఎస్పీ హర్షవర్ధన్రాజు, మార్కాపురం డీఎస్పీ నాగరాజు ఆదేశాల మేరకు ఎస్సై పి.చైడయ్య మాచర్ల రోడ్డులోని మిల్లంపల్లి టోల్ గేట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో అతని బాగోతం బయటపడింది. నకిలీ స్టిక్కర్తో పాటు కారు నంబర్ ఏపీ07డీజడ్1807లో ఉన్న డీని బ్లూ కలర్ స్టిక్కర్తో బ్లాక్ చేశాడు. నిందితుడు మున్వర్పై ట్యాంపరింగ్, ఎంవీ కేసులు నమోదు చేశామని సీఐ తెలిపారు. అర్హత లేని వారు తమ వాహనాలపై పోలీస్, ప్రెస్, మెజిస్ట్రేట్, ఎమ్మెల్యే, ప్రభుత్వ శాఖలకు చెందిన లోగోలు వాడుతున్నారని, అటువంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ అజయ్కుమార్ హెచ్చరించారు. ● నూతన అధ్యక్షుడిగా శిద్దా సుధీర్కుమార్ ఎమ్మెల్యే నకిలీ స్టిక్కర్తో తిరుగుతున్న నిందితుడు వివరాలు వెల్లడించిన సీఐ అజయ్కుమార్ -
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శిగా షంషేర్ ఆలీబేగ్
మార్కాపురం: వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శిగా మార్కాపురం పట్టణానికి చెందిన డాక్టర్ మీర్జా షంషేర్ ఆలీబేగ్ను నియమిస్తూ తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటన విడుదల చేసింది. ఈయన గతంలో ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా, మార్కాపురం మార్కెట్ యార్డు చైర్మన్గా పనిచేశారు. తనపై నమ్మకంతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానని, కార్యకర్తలకు అందుబాటులో ఉండి పార్టీ అభివృద్ధికి కృషిచేస్తానని షంషేర్ తెలిపారు. తనకు పదవి వచ్చేందుకు సహకరించిన వైఎస్సార్ సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, రీజినల్ కో ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి శివశంకర్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. -
శాపం కాకూడదు.!
వరం కావాలి.. ● మార్కాపురం జిల్లాపై వై.పాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ యర్రగొండపాలెం: కొత్తగా ఏర్పడబోతున్న మార్కాపురం జిల్లా ప్రజలకు ఒక వరంగా ఉండాలని, శాపం కాకూడదని యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. గురువారం మార్కాపురంలో దళిత సంఘాల నాయకులు ప్రెస్ మీట్ పెట్టి తనను వలస నేతగా విమర్శించడంపై ఆయన స్పందించారు. ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ తనపై దళిత నాయకులు చేసిన విమర్శలను ఖండించారు. తాను వలస నేతను కాదని, ప్రకాశం బిడ్డనని స్పష్టం చేశారు. ప్రస్తుత, భవిష్యత్ తరాలకు ఒక బహుమానంగా మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత అందరిపై ఉందన్న ఉద్దేశంతో బాధ్యత గల ప్రజాప్రతినిధిగా తాను మాట్లాడుతున్నానని అన్నారు. పశ్చిమ ప్రకాశంలో బహుజనులు, గిరిజనులు, మధ్యతరగతి కుటుంబీకులు, వెనుకబడిన తరగతులకు చెందినవారు, మైనార్టీ లు, అన్ని వర్గాలకు చెందిన వారిలో అత్యంత పేద కుటుంబాలు నివసిస్తున్నాయని తెలిపారు. వారి అభ్యున్నతికి కొత్తగా ఏర్పడనున్న జిల్లా తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాలు ఎవరికీ శాశ్వతం కాదని, రాజకీయ నాయకులకు కొమ్ముకాయడం మానుకుని వాస్తవాలు విశ్లేశించాలని హితవు పలికారు. రాష్ట్రంలో ఏర్పడబోతున్న జిల్లాల్లో మార్కాపురం జిల్లా అత్యంత వెనుకబడిందన్న సత్యాన్ని గుర్తించాలన్నారు. చంద్రశేఖర్కు ఏం తెలుసు అనే మేధావులు.. కొత్త జిల్లాకు ఆర్థిక పురోగతి అవసరమా, కాదా అనే విషయాన్ని గుండెలపై చేయివేసుకుని ఆలోచించాలని అన్నారు. ఆర్థిక వనరులులేని ఈ ప్రాంతంలో పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తయినప్పటికీ సాగు, తాగునీటి అవసరాల కోసం అనేక గ్రామాలు అలమటిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత తక్కువ ధరకు అత్యంత ఎక్కువ స్థాయిలో వ్యవసాయ అధారిత ఫ్యాక్టరీలు, కంపెనీలు, కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మూడు రాష్ట్రాలకు రవాణా వ్యవస్థలు కలిగిన ఈ ప్రాంతంలో ఆర్థిక వనరులు హక్కుగా రావాలే తప్ప.. మరే ఇతర మార్గాలలో రావన్న సత్యాన్ని గమనించాలని కోరారు. తాను సంపూర్ణ అవగాహనతో ప్రజాప్రతినిధిగా పశ్చిమ ప్రాంత ప్రజలకు మేలు చేయాలన్న మంచి ఉద్దేశంతో కొత్తగా ఏర్పడబోతున్న జిల్లా పరిస్థితులపై మాట్లాడుతున్నానని తెలిపారు. దళిత కార్డులు ఉపయోగించుకుని మీతో మాట్లాడిస్తున్న నేతలను ప్రశ్నించండని, ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన జిల్లా గెజిట్ ప్రకారం మేలు ఏంటో, కీడు ఏంటో బహిరంగంగా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డితో మాట్లాడించండని అన్నారు. జీవిత కాలం అత్యంత పేద జిల్లాగా మార్కాపురాన్ని మార్చే కుట్రను గ్రహించాలని హితవు పలికారు. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మార్కాపురం ఒక అడ్డాగా మారి వెనుకబడిన తరగతులకు, పేదలకు అందని ద్రాక్షగా తయారైందన్నారు. కొంతమంది కబంధ హస్తాలలో బిగించబడటాన్ని గ్రహించాలని, చౌకబారు వ్యాఖ్యలుమాని ఈ ప్రాంతాభివృద్ధి కోసం పోరాటం చేయాలని తాటిపర్తి చంద్రశేఖర్ హితవు పలికారు. పేదల బిడ్డల కోసం, పేదల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీని ప్రైవేటు వ్యక్తులకు అమ్మివేసిన టీడీపీ నాయకులకు మార్కాపురం గురించి మాట్లేడే నైతిక హక్కు లేదన్నారు. మిర్చి యార్డ్ ఏర్పాటు గురించి మాట్లాడలేని వారికి రైతుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉందో తెలుస్తోందన్నారు. ఇండస్ట్రియల్ హబ్గా ఉన్న దొనకొండ, ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం శ్రీశైలంను వదులుకుని చంద్రబాబు కంబంధ హస్తాలలో బంధించబడిన టీడీపీ ఎమ్మెల్యేల బాధ్యతారాహిత్యం ఈ జిల్లాకు శాపంగా మారబోతుందన్న విషయాన్ని గుర్తించాలని ఆయన అన్నారు. -
కనిపించకుండా వణికిస్తోంది..
స్క్రబ్ టైఫస్.. ఈ పేరు జిల్లా వాసులను వణికిస్తోంది. ఈ మహమ్మారి బారినపడి ఇద్దరు మృత్యువాత పడగా, మరికొందరు ఒంగోలు, గుంటూరు జీజీహెచ్లలో చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఇది కనిపిస్తోంది. అదీ పశ్చిమ ప్రకాశంలో ఎక్కువ ప్రభావం చూపుతోంది. పొలాలకు వెళ్లే మహిళలలో ఈ తరహా జ్వరాలు కనిపిస్తుండటంతో గ్రామీణ మహిళలు పొలాలకు వెళ్లాలంటే భయంతో వణికిపోతున్నారు. జ్వరం వస్తేనే బెంబేలెత్తుతున్నారు. దీనిపై అవగాహన లేకపోవడంతో జ్వర బాధితులు సకాలంలో చికిత్స చేయించుకోక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఒంగోలు టౌన్: వరుస మరణాలతో జిల్లాలో కలకలం... స్క్రబ్ టైఫస్తో వరుస మరణాలు సంభవించడంతో జిల్లాలో కలకలం రేగింది. జిల్లాలో ఇద్దరు మరణించగా, మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. యర్రగొండపాలెం గ్రామంలోని ఇజ్రాయిల్పేటకు చెందిన 61 ఏళ్ల వృద్ధురాలు పరిమళ దానమ్మ గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ ఈ నెల 6వ తేదీ తెల్లవారుజామున మృతి చెందింది. గత నెల 16వ తేదీ జ్వరం, నీళ్ల విరేచనాలు, నీరసంతో ఆమె బాధపడుతూ ఒక ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందింది. అక్కడ తగ్గకపోవడంతో కుటుంబ సభ్యులు ఏరియా వైద్యశాలకు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్కి పంపించారు. 18 రోజుల పాటు గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. అలాగే సంతనూతలపాడు మండంలోని రుద్రవరం గ్రామానికి చెందిన కోయ నాగేంద్రమ్మ అనే 51 ఏళ్ల వృద్ధురాలు కూడా స్క్రబ్ టైఫస్తో బాధపడుతూ మరణించింది. జ్వరం బారిన పడిన నాగేంద్రమ్మకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేసినప్పటికీ తగ్గకపోవడంతో గుంటూరు జీజీహెచ్కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 9వ తేదీ మరణించింది. మరో ఆరుగురికి పాజిటివ్... కొనకనమిట్ల మండలంలోని అంబాపురం గ్రామానికి చెందిన మరో వృద్ధురాలికి స్క్రబ్ టైఫస్ సోకింది. కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆమెకు కొనకనమిట్ల ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స చేయిస్తున్నారు. ఎంతకూ తగ్గకపోవడంతో వైద్య పరీక్షలు చేసి స్క్రబ్ టైఫస్ సోకినట్లు నిర్ధారించారు. వెంటనే ఒంగోలు జీజీహెచ్కి తరలించి వైద్యం చేస్తున్నారు. అయితే, స్క్రబ్ టైఫస్తో బాధపడుతూ ఒంగోలు జీజీహెచ్కి వస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నెల 9వ తేదీ నుంచి గురువారం వరకు ఐదుగురు స్క్రబ్ టైఫస్తో బాధపడుతూ జీజీహెచ్లో చేరినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.మాణిక్యరావు తెలిపారు. 9వ తేదీ ఒక్కరోజే జీజీహెచ్కి ముగ్గురు వచ్చారు. 10వ తేదీ ఒకరు, 11వ తేదీ మరొకరు చేరినట్టు సమాచారం. అంతేగాకుండా ప్రైవేటు ఆస్పత్రి నుంచి మరొక కేసు కూడా జీజీహెచ్కి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద ఈ మూడు రోజుల్లో ఆరు పాజిటివ్ కేసులు నమోదై జీజీహెచ్లో చేరారు. బాధితుల్లో ఒంగోలు నగరంతో పాటు పొదిలి, కందుకూరు, మార్కాపురం, కంభాలపాడు గ్రామాలకు చెందిన వారున్నారు. ప్రస్తుతం వీరంతా ఆరోగ్యంగా ఉన్నారని, ఒకటీరెండు రోజుల్లో వీరిని డిశ్చార్జి చేస్తామని జీజీహెచ్ వైద్యులు తెలిపారు. భయాందోళన అవసరం లేదు స్క్రబ్ టైఫస్ ప్రమాదకరం కాదు. డాక్సిసైక్లిన్ ట్యాబ్లెట్తో నయమవుతుంది. నిజానికి ఇది గత రెండుమూడేళ్లుగా కనిపిస్తోంది. మన జిల్లాలో 2024లో 31 కేసులు పాజిటివ్ వచ్చాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారు 20 కేసులు నమోదయ్యాయి. వారం రోజులుగా జరుగుతున్న ప్రచారం వలన ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే వ్యాధి సోకిన తర్వాత ఆర్ఎంపీల వద్దకు వెళ్లకుండా ప్రభుత్వ వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స చేయించుకోవడం ఉత్తమం. – డాక్టర్ టి.వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి భయం వద్దు.. సకాలంలో చికిత్స అవసరం... స్క్రబ్ టైఫస్ అనేది వైరస్ కాదు. అంటే ఒకరి నుంచి మరొకరికి సోకదు. ప్రాణాపాయం కూడా కాదు. ఇది సాధారణమైన జ్వరం మాత్రమేని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో స్క్రబ్ టైఫస్ సోకి చనిపోయిన వారంతా 60 ఏళ్ల వయసు కలిగిన వారు కావడాన్ని గమనించాలని చెబుతున్నారు. వృద్ధాప్యంలో వచ్చే ఇతర ఆరోగ్య సమస్యలు స్క్రబ్ టైఫస్ మీద తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు వైద్యులు భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా ఆర్ఎంపీల వద్ద చికిత్స చేయించుకోవడం సర్వసాధారణమైపోయింది. దీంతో విలువైన కాలం హరించుకుపోతుందని, వ్యాధిని నిర్ధారించే సరికి ప్రాణం పోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, చలి కనిపించిన వెంటనే సమీపంలోని ప్రాథమిక వైద్యశాలకు వెళ్లి చికిత్స చేయించుకోవాలని సూచిస్తున్నారు. -
రేపు నవోదయ ప్రవేశ పరీక్ష
ఒంగోలు సిటీ: జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశానికి ఈ నెల 13వ తేదీ పరీక్ష నిర్వహించనున్నట్లు జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ సి.శివరామ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షను ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 25 కేంద్రాల్లో 5,502 మంది విద్యార్థులకు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గంట ముందుగానే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, ప్రవేశ కార్డు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. ఒంగోలు: అండర్–12 బాలుర జిల్లా క్రికెట్ జట్టును ఈ నెల 13వ తేదీ స్థానిక మంగమూరు రోడ్డులోని అసోసియేషన్ సబ్ సెంటర్లో ఎంపిక చేయనున్నట్లు ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి కారుసాల నాగేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు తప్పనిసరిగా వైట్ డ్రస్, షూ, సొంత కిట్తో హాజరుకావాలని సూచించారు. జనన ధ్రువీకరణ పత్రం (ఫారం 5), ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్ వెంట తీసుకురావాలన్నారు. 2013 సెప్టెంబర్ 1 నుంచి 2015 ఆగస్టు 31వ తేదీ మధ్య జన్మించిన వారు మాత్రమే ఎంపికకు అర్హులని తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు పూర్తి వివరాలకు కోచ్ల మొబైల్ నంబర్లు 9701022333, 9246222999ను సంప్రదించాలని నాగేశ్వరరావు సూచించారు. ఒంగోలు: జాతీయస్థాయి 40వ తైక్వాండో చాంపియన్షిప్ను ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు విజయవాడలోని మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు కోచ్, తైక్వాండో 5వ డాన్ షేక్ కరిముల్లా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పాల్గొనదలచిన విద్యార్థులు ఈ నెల 14వ తేదీ స్థానిక సీవీఎన్ రీడింగ్ రూం ఆవరణలో నిర్వహించనున్న ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి హాజరుకావాలని సూచించారు. తద్వారా విజయవాడలో నిర్వహించే జాతీయస్థాయి పోటీల్లో సత్తాచాటాలన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోచ్ కరిముల్లా సూచించారు. ● జిల్లా ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి రాజ్యలక్ష్మి ఒంగోలు: కక్షిదారులు ఈ నెల 13వ తేదీ నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాఽధికార సంస్థ చైర్పర్సన్ టి.రాజ్యలక్ష్మి కోరారు. స్థానిక జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలను ఆమె వెల్లడించారు. జాతీయ లోక్ అదాలత్లో రాజీకి అర్హత కలిగిన అన్ని క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, చెక్బౌన్స్ కేసులు, మోటారు వాహన ప్రమాద బీమా వ్యాజ్యాలు, అన్ని రకాల బ్యాంకు కేసులు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ప్రీ లిటిగేషన్ స్థాయిలో కూడా కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎకై ్సజ్ కేసులు, ట్రాఫిక్ కేసులు కూడా పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్లో కేసుల పరిష్కారం నిమిత్తం 29 బెంచీలు ఏర్పాటు చేశామన్నారు. ప్రీ సిట్టింగ్ల ద్వారా ఇప్పటికే 15,150 కేసులు పరిష్కరించినట్లు వెల్లడించారు. దీనివల్ల కేసులు వేగవంతంగా పరిష్కరించుకునే సౌల భ్యం ఉందన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాజ్యలక్ష్మి కోరారు. ఒంగోలు వన్టౌన్: దక్షిణ భారతదేశ యాదవ సమ్మేళనం 2026 ఫిబ్రవరి 8న నిర్వహించనున్నట్లు జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ తెలిపారు. జిల్లాకు వచ్చిన ఆయన ఒంగోలులోని సమితి కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. యాదవులపై ఆగ్రకుల దాడులను ప్రభుత్వం అరికట్టాలన్నారు. మార్కాపురం జిల్లాకు కాటమరాజు జిల్లాగా పేరును నిర్ణయించాలని కోరారు. యాదవ నాయకులు జాజుల శ్రీనివాస యాదవ్, కుట్టుబోయిన కోటియాదవ్, పాశం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
కోటి సంతకాల గర్జన
కోటి సంతకాల ప్రతులుసాక్షి ప్రతినిధి, ఒంగోలు: పేదల వైద్య విద్యకు, వైద్యానికి పాతరేసే ప్రభుత్వ నిర్ణయంపై జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కళాశాలను పీపీపీ విధానంలో చంద్రబాబు తన బినామీలకు కట్టబెట్టే కుటిలయత్నంపై సమరభేరి మోగించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన వచ్చింది. రెండు నెలలుగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో పార్టీ నాయకులు రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి సంతకాలు చేసి సీఎం చంద్రబాబుకు హెచ్చరికలు చేశారు. ఎనిమిది నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు ఉద్యమ స్థాయిలో వేల మంది సంతకాల ప్రతులను బుధవారం జిల్లా పార్టీ కార్యాలయానికి తరలించారు. అన్ని నియోజకవర్గాల్లో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించి ప్రతులను ప్రత్యేక వాహనాల్లో జిల్లా కేంద్రానికి తీసుకొచ్చారు. పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి వాటిని భద్రపరిచారు. ప్రభుత్వమే నిర్వహించాలి.. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలకు సంబంధించిన ప్రతులను ఒంగోలు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చ్ని నాయకులు, కార్యకర్తలు, అభిమానుల నడుమ నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయానికి తరలించారు. ఒంగోలు నియోజకవర్గంలో సేకరించిన 62 వేల సంతకాల ప్రతుల బాక్సులన్నింటినీ ప్రత్యేక వాహనంలో తరలించారు. వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి జెండా ఊపి ఆ వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా పాల్గొని సంతకాలు చేశారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ ఒంగోలు నియోజకవర్గ పరిశీలకుడు వై.వెంకటేశ్వరరావు, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, కొత్తపట్నం మండల అధ్యక్షుడు, ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, ఒంగోలు మండల అధ్యక్షుడు మన్నే శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. నిరంతర ఉద్యమం సింగరాయకొండలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి కోటి సంతకాల ప్రతులను ఒంగోలుకు తరలించారు. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో వాటిని ఒంగోలుకు తరలించారు. కార్లతో ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరించేందుకు జారీ చేసిన జీఓ నెంబరు.590 ను రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందని ఆదిమూలపు సురేష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నియోజకవర్గంలో 59,504 సంతకాలను సేకరించి ఒంగోలు పార్టీ కార్యాలయానికి తరలించామన్నారు. పార్టీ సీఈసీ సభ్యుడు డాక్టర్ మాదాసి వెంకయ్య, ఎస్ఈసీ సభ్యుడు డాక్టర్ బత్తుల అశోక్కుమార్రెడ్డి, ఆరు మండలాల పార్టీ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీసీలు, ఇతర నాయకులు పాల్గొన్నారు. పీపీపీ వద్దే వద్దు.. సంతనూతలపాడు నియోజకవర్గంలోని సంతనూతలపాడు, చీమకుర్తి, మద్దిపాడు, నాగులుప్పలపాడు మండలాల్లో సేకరించిన 72 వేల సంతకాల ప్రతులను వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, నాయకులు ర్యాలీగా ఒంగోలులోని పార్టీ జిల్లా కార్యాలయానికి తరలించారు. మద్దిపాడులోని పార్టీ నియోజకవర్గ కార్యాలయం వద్ద సంతకాల ప్రతులను ఆటోలో నింపి మేరుగు నాగార్జున జెండా ఊపి ఆటోను ప్రారంభించారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. మేరుగు నాగార్జున మాట్లాడుతూ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు సీఎం చంద్రబాబు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ పేరుతో ప్రజలకు దూరం చేస్తున్నారన్నారు. పీపీపీ విధానం ద్వారా మెడికల్ కాలేజీలు నిర్వహిస్తే పేద ప్రజలకు వైద్యం, వైద్య విద్య అందదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ పరిశీలకుడు బొట్ల రామారావు, జెడ్పీటీసీ, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ,,సంతనూతలపాడు మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ప్రజల నుంచి అనూహ్య స్పందన మార్కాపురం నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆధ్వర్యంలో మార్కాపురం టౌన్, రూరల్, తర్లుపాడు, కొనకనమిట్ల, పొదిలి టౌన్, పొదిలి మండలాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు, రైతులు, మహిళలు వ్యవసాయ కూలీలు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొని ప్రభుత్వమే కళాశాలతో పాటు వైద్యశాలను కూడా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వాహనాన్ని జెండా ఊపి మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రారంభించారు. కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం కళ్లుతెరచి ప్రజల మనోభావాలను గుర్తించి మెడికల్ కాలేజీని పీపీపీ విధానానికి ఇచ్చిన జీవోను రద్దుచేసి ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యే కే ఆదెన్న, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ షంషేర్ ఆలీబేగ్, ఎస్ఈసీ సభ్యుడు వెన్నా హనుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు అన్యాయం మెడికల్ కాలేజీలు, అనుబంధ ఆస్పత్రులను ప్రైవేటీకరించాలన్న చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రజలు ఛీకొడుతున్నారని వైఎస్సార్ సీపీ గిద్దలూరు ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో గిద్దలూరు నియోజకవర్గంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతమైందన్నారు. 56,500 మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సంతకాలు చేశారని వెల్లడించారు. బుధవారం ఉదయం సంతకాల ప్రతులతో పార్టీ కార్యాలయం నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మున్సిపల్ విభాగం కార్యదర్శి వేమిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీపీలు, పార్టీ మండల అధ్యక్షులు పాల్గొన్నారు. బాబు నిర్ణయం దుర్మార్గం కనిగిరిలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల పత్రాలను పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి దద్దాల నారాయణ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి ప్రత్యేక వాహనంలో బుధవారం ఒంగోలుకు తరలించారు. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి బైక్లు, కార్లతో ర్యాలీగా బయలుదేరి స్థానిక చెక్పోస్టు వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దద్దాల మాట్లాడుతూ పేదలకు విద్య, వైద్యం అందించాలన్న లక్ష్యంతో 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేస్తే వాటిని బాబు సర్కార్ ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమన్నారు. నియోజకవర్గంలో 60,230 సంతకాలు సేకరించినట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే, విశాఖపట్నం పార్లమెంట్ పార్టీ పరిశీలకుడు కదిరి బాబూరావు, పీడీసీసీబీ మాజీ చైర్మన్ వైఎం ప్రసాద్రెడ్డి(బన్నీ) పాల్గొన్నారు. -
పీపీపీలు కుప్పకూలుతాయి
యర్రగొండపాలెం: దేశంలో తీవ్ర సంక్షోభాన్ని సృష్టించిన ఇండిగో విమానాలు ఒక్కసారిగా గాలిలోకి ఎగరకుండా మొరాయించాయని, అదే విధంగా చంద్రబాబు ప్రభుత్వం తలపెట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యవస్థ కుప్ప కూలితే రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమిటని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ ప్రశ్నించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రతులను ఒంగోలుకు తరలించే వాహనాన్ని ఆయన పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇండిగోలో 65 శాతం వాటా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండటం వలన ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆ విమానాలను ఆకస్మికంగా నిలిపేశారని, దీనివలన లక్షలాది మంది విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అనేక మంది మానసిక వ్యథకు గురయ్యారన్నారు. ఇతర దేశాలకు వెళ్లాల్సిన విద్యార్థులు, ఉద్యోగులు తమ ప్రయాణాలను నిలుపుకోవాల్సి వచ్చిందని అన్నారు. చంద్రబాబు పీపీపీ పద్ధతిలో అమ్మకానికి పెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్వహణ తమకు చేతకాదని ప్రైవేటు వ్యక్తులు చేతులు ఎత్తివేస్తే అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు, శస్త్ర చికిత్స చేయించుకోవటానికి సిద్ధంగా ఉన్న వారితో పాటు లక్షలాది మంది మెడికో విద్యార్థుల పరిస్థితి ఎలాగుంటుందో ఊహించుకుంటేనే భయం వేస్తుందని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు, విద్యార్థుల పరిస్థితి గుర్తించి అన్ని వర్గాలకు చెందిన పేద పిల్లల తల్లిదండ్రులు కంటున్న మెడికో కలలను నెరవేర్చాలన్న ఉద్దేశంతో రాష్ట్రానికి 17 మెడికల్ కళాశాలలను మంజూరు చేయించారని, వాటి నిర్మాణాలకు కోట్లాది రూపాయలు కేటాయించి పనులు వేగవంతం చేయించారన్నారు. వాటిలో 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేయించారని చెప్పారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు తన 18 ఏళ్ల పదవీ కాలంలో ఒక్క మెడికల్ కాలేజీ మంజూరు చేయించలేకపోయారని, ఉన్న కాలేజీలను నిర్వీర్యం చేసేందుకు పథకాలు పన్నుతున్నాడని విమర్శించారు. చంద్రబాబు అధికారం చేజిక్కించుకున్న తరువాత రాష్ట్రంలో రెడ్బుక్ సంస్కృతిని తీసుకొచ్చి అల్లకల్లోలం చేస్తున్నారని, ఎక్కడ చూసినా దోపిడీలు, హత్యలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా తమకేమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. పార్టీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమానికి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. నియోజకవర్గం మొత్తం మీద 61,190 సంతకాలను సేకరించగలిగామని అన్నారు. -
ఎంఎస్ఎంఈ పార్క్ స్థలాన్ని పరిశీలించిన జేసీ
కొండపి: మండలంలోని నెన్నూరుపాడు గ్రామంలో సర్వే నంబర్ 433 లో 44.31 ఎకరాల భూమిలో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్కు స్థలాన్ని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ బుధవారం పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలిచ్చారు. ఆయన వెంట తహసీల్దార్ శీలం శ్రీనివాసరావు, ఆర్ఐ శ్రీనివాసరావు మండల సర్వేయర్ రాజు, ఏపీ 11సీ జోనల్ మేనేజర్, ఇతర రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఉన్నారు. చీమకుర్తి: ప్రకాశం జిల్లా బాలికలు, మహిళల ఖోఖో జట్ల ఎంపిక ఈనెల 12న చీమకుర్తి ప్రభుత్వ హైస్కూలులో నిర్వహిస్తున్నట్లు జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వీ.రఘుబాబు, కే హనుమంతురావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 44వ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హాజరయ్యే క్రీడాకారిణులు వయస్సు ధ్రువీకరణకు ఆధార్ కార్డులను తీసుకొని హాజరు కావాలన్నారు. ఒంగోలు వన్టౌన్: స్థానిక సంస్థలు, చట్ట సభల్లో ఓబీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించే బిల్లులను ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా చట్టాలు చేయాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఒంగోలులోని సంఘ జిల్లా కార్యాలయంలో ‘హలో బీసీ–చలో ఢిల్లీ’ వాల్పోస్టర్ను పలువురు బీసీ నాయకులతో కలసి బుధవారం ఆవిష్కరించారు. ఈనెల 15, 16 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించనున్న మహా ధర్నా, పార్లమెంటు ముట్టడి కార్యక్రమంలో బీసీలు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈనెల 15న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మహా ధర్నాతో పాటు, పార్లమెంటు ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. 16న ఓబీసీలకు జనాభా దామాషా మేరకు రాజకీయ రిజర్వేషన్లతో పాటు, మహిళా రిజర్వేషన్ చట్టసవరణ చేసి ఓబీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని డిమాండ్ చేస్తూ విజ్ఞాపన పత్రాలను ప్రముఖులకు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో సంఘ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుమ్మరి క్రాంతి కుమార్, జిల్లా మేదర సంఘం అధ్యక్షుడు కేతా చలపతిరావు, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు గోగుశివుడు, వడ్డెర సంఘం నాయకుడు తన్నీరు శ్రీనివాసరావు, రజక సంఘం నాయకుడు నాగేశ్వరరావు, నాయి బ్రాహ్మణ సంఘం నాయకుడు భోదనం శ్రీనివాసరావు, జంగం సంఘ నాయకులు దోగిపర్తి సుబ్బారావు, కృష్ట బలిజ సంఘం నాయకుడు బీకే మూర్తి, మేదర సంఘం నాయకుల సిరివెళ్ల బాలకృష్ట, పిల్లి మధు, వీరా చంద్రశేఖర్ శనగవరపు రాజేంద్రప్రసాద్, సైభ మురళి, వాసు, సూర్యబలిజ నాయకులు మద్దెల మురళి పాల్గొన్నారు. -
ఉచిత వైద్యం అందించడమే ధ్యేయం
దర్శి: పేదలందరికీ ఉచిత వైద్యం అందించడమే వైఎస్సార్ సీపీ ధ్యేయమని పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ స్పష్టం చేశారు. కోటి సంతకాల ఉద్యమంలో భాగంగా దర్శి నియోజకవర్గంలో సేకరించిన 60 వేల సంతకాల ప్రతులను బుధవారం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి ఒంగోలుకు తరలించారు. పార్టీ కార్యాలయంలో ప్రతులను ప్రదర్శించి వాహనంలో 30 బాక్సుల్లో ప్రతులను ఉంచి బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, వెంకాయమ్మలు జెండా ఊపి వాహనాన్ని ర్యాలీగా తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, వెంకాయమ్మ మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలో 60 వేల సంతకాలు పూర్తి చేసి ఆన్లైన్ చేసినట్లు తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా కోటి సంతకాల ఉద్యమానికి మద్దతు పలికారని చెప్పారు. ఈనెల 15వ తేదీన జిల్లాలో అన్నీ నియోజకవర్గాల నుంచి ఒంగోలుకు వచ్చిన ప్రతులను తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయానికి చేర్చుతారన్నారు. గ్రామంలో ఉద్యమంలా సంతకాల సేకరణ విజయవంతంగా జరిగిందని చెప్పారు. చంద్రబాబు పేదలకు ఉచిత వైద్యం దూరం చేస్తున్న తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. ప్రతి పేదవాడు టీడీపీకి ఓటు ఎందుకు వేశామా అని బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు పేదలకు మేలు చేయాలి కానీ ఇలా తమ స్వార్థం కోసం గత పాలకులు తీసుకొచ్చిన ప్రభుత్వ ఆస్తులను దోచుకోవాలనుకోవడం దురదృష్టకరమన్నారు. వైఎస్ జగన్కు మంచి పేరు రావడాన్ని టీడీపీ నేతలు, చంద్రబాబు జీర్ణించుకోలేక పేదలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ పేరుతో తన బినామీలకు అప్పగించి ప్రైవేటుపరం చేసి పేదలకు వెన్నుపోటు పొడిచేందుకు కుట్రలు చేస్తు్ాన్నరన్నారు. ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో పేదలకు ఉచిత వైద్యం అందుతుందా అని ప్రశ్నించారు. ఇదేనా పేదల పట్ల చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధి అని మండిపడ్డారు. ఇప్పటికై నా చంద్రబాబు బుద్ధి తెచ్చుకుని పీపీపీ విధానం వెనక్కు తీసుకుని పేదలకు ఉచిత మెడికల్ విద్య, ఉచిత వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జగనన్న ఆదేశాల మేరకు పేదల కోసం ఎందాకై నా పోరాడేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. -
మార్కాపురం జిల్లాలో దర్శిని కలపాలి
● డీఆర్ఓకు వినతిపత్రం అందించిన జంకె మార్కాపురం: నూతనంగా ఏర్పాటు చేయనున్న మార్కాపురం జిల్లాలో దర్శి నియోజకవర్గాన్ని కలపాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నెల్లూరు పార్లమెంట్ పరిశీలకుడు జంకె వెంకటరెడ్డి బుధవారం ఒంగోలులో డీఆర్ఓకు వినతిపత్రం అందచేశారు. జిల్లాలోని మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి నియోజకవర్గాలను కలిపి పశ్చిమ ప్రకాశంగా పిలుస్తారని, అలాంటి దర్శి నియోజకవర్గాన్ని ఒంగోలులో కలపడం ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. పశ్చిమ ప్రకాశం ప్రజలతో పాటు విద్యావంతులు, మేధావులు, సామాజికవేత్తలు, రాజకీయపార్టీల ప్రజాప్రతినిధులు ప్రజా సంఘాల వారు సైతం దర్శిని మార్కాపురంలో కలపాలని కోరుతున్నారన్నారు. భౌగోళికంగా, సాంస్కృతికంగా ఐదు నియోజకవర్గ ప్రాంతాలు సారూప్యతను కలిగి ఉన్నాయన్నారు. ఇందుకు భిన్నంగా మార్కాపురం జిల్లాలో దర్శిని మినహాయించడం మంచిది కాదన్నారు. దర్శి లేకుండా జిల్లా ఏర్పాటు చేయడం అసంబద్ధగా, అసమతుల్యంగా అన్యాయంగా ఉందని ప్రజలు భావిస్తున్నారన్నారు. మార్కాపురం పట్టణానికి దగ్గరగా దొనకొండ, కురిచేడు మండలాలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికై నా ఈ ప్రాంత ప్రజల మనోభావాలను గుర్తించి దర్శిని మార్కాపురం నియోజకవర్గంలో కలపాలని కోరారు. 2022లో జిల్లా పునర్వ్యవస్ధీకరణలో భాగంగా మార్కాపురంను జిల్లా చేయాలని వినతిపత్రాలు అందించామని జంకె పేర్కొన్నారు. తమ అభ్యంతరాలను పరిశీలించి దర్శి నియోజకవర్గాన్ని మార్కాపురం జిల్లాలో కలపాలని ఆయన కోరారు. ఈయన వెంట పార్టీ నాయకులు ధర్మానాయక్, మందటి శివారెడ్డి తదితరులు ఉన్నారు. -
శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట నిఘా
● గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి సింగరాయకొండ: జిల్లాలో శాంతిభధ్రతల పరిరక్షణకు పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి అన్నారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో గంజాయి రవాణా, విక్రయాలు, నియంత్రణ, నేరాల నియంత్రణ, లా అండ్ ఆర్డర్ పరిస్థితులు, కీలక కేసుల పురోగతిపై ఎస్పీ వి.హర్షవర్ధన్రాజుతో కలిసి సమీక్షించారు. ఐజీ మాట్లాడుతూ చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తులపై నిఘా ఉంచి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నేర దర్యాప్తులో సాంకేతిక నైపుణ్యం ద్వారా నిందితులను గుర్తించి అరెస్టు చేయాలన్నారు. పెండింగ్ కేసులను సాధ్యమైనంత త్వరగా విచారించి నిందితులకు చట్టపర శిక్షలు విధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గంజాయి రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని, రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోలీస్స్టేషన్ను సందర్శించే బాధితులకు నమ్మకం, ధైర్యాన్ని కల్పించేలా ప్రతి కేసునూ పోలీసు అధికారులు సున్నితంగా వ్యవహరించాలని సూచించారు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ, కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, సీఐలు సీహెచ్ హజరత్తయ్య, నాగరాజు, రామారావు, ప్రసాద్, రాజేష్కుమార్, ఎస్సైలు బి.మహేంద్ర, నాగమల్లేశ్వరరావు, ఎస్సైలు పాల్గొన్నారు. -
8 నెలలుగా పశువైద్యశాలల్లో మందుల్లేవ్
ఒంగోలు టౌన్: ఎనిమిది నెలలుగా ప్రభుత్వ పశువైద్యశాలలకు మందులు రావడం లేదని, దీంతో సరైన చికిత్స అందక పళువులు చనిపోతున్నాయని ఏపీ గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి పూసపాటి వెంకటరావు అన్నారు. ఈ మేరకు నగరంలోని పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి ఎన్.వెంకటేశ్వరరావుకు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పూసపాటి వెంకటరావు మాట్లాడుతూ ప్రభుత్వ పశువైద్యశాలల్లో మందులు లేకపోవడంతో ప్రైవేట్ మెడికల్ షాపులకు వెళ్లి మందులు కొనాల్సి వస్తుందని, దీంతో పెంపకందార్లు రూ.లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుందని చెప్పారు. గ్రామాల్లో అంటువ్యాధులు తీవ్రంగా ఉన్నాయని, అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. ఇప్పటికై నా గ్రామాల్లో ఉచిత పశు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి జీవాలను కాపాడాలని డిమాండ్ చేశారు. పశు బీమా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం గత 5 నెలలుగా నిధులు విడుదల చేయడం లేదని, దీంతో వేలాది జీవాలు చనిపోయినా ఎలాంటి నష్టపరిహారం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం తరహాలోనే పశు బీమా పథకాన్ని అమలు చేయాలని, పశు బీమాకు వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు. డిసెంబర్, జనవరి నెలల్లో పశువులకు బొబ్బవ్యాధి, నాచురోగం వచ్చే అవకాశాలు ఉంటాయని, వ్యాధి నివారణ కోసం ముందస్తు టీకాలు వేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రభుత్వ పశు వైద్యశాలలో టీకాలు కూడా అందుబాటులో లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుందన్నారు. దీంతో పశు పెంపకందార్లు తీవ్ర అందోళనకు గురవుతున్నారని, వెంటనే టీకాలను అందుబాటులో ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పశువులు చనిపోయి నష్టపోయిన పెంపకందారులకు పశు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా పావలా వడ్డీకే రుణ పరపతి సౌకర్యం కల్పించాలని కోరారు. జిల్లాలోని అన్నీ బ్యాంకులకు, లీడ్ బ్యాంక్ మేనేజర్కు రుణాలు ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి తోట తిరుపతిరావు, జిల్లా కమిటీ సభ్యులు కొండరాజు జయరాం, మువ్వా రామరాజు తదితరులు పాల్గొన్నారు. -
హుస్సేన్బీ ఇంటిని పరిశీలించిన తహసీల్దార్
పొన్నలూరు: మండలంలోని కె.అగ్రహారంలో ఎస్కే హుస్సేన్బీ సర్వే నంబర్ 447/3ఏలోని 78 గజాల స్థలంలో సుమారుగా 40 ఏళ్ల క్రితం ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటుంది. హుస్సేన్బీకి ముగ్గురు కుమార్తెలు కాగా మూడో కుమార్తె తన తల్లి ఇంటిని దక్కించుకునేందుకు స్థానిక టీడీపీ సానుభూతిపరుడి సహకారంతో స్థానిక వీఆర్వో సంతకం, స్టాంపును ఫోర్జరీ చేసి తన పేరుపై పొజిషన్ సర్టిఫికెట్ తయారు చేశారు. ఈ తరువాత కుమార్తె ఫోర్జరీ పత్రంతో తన భర్తకి గత అక్టోబర్లో రిజిస్ట్రేషన్ చేసింది. విషయం తెలుసుకున్న హుస్సేన్బీ ఆధారాలతో కలెక్టర్కు స్పందనలో ఫిర్యాదు చేసింది. దీనిపై అధికారులు పట్టించుకోకపోవడంతో హుస్సేన్బీ సమస్యపై సాక్షిలో మంగళవారం శ్రీఅక్రమాల కేటుగాళ్లుశ్రీ అనే శీర్షికన ప్రచురితమైంది. దీనికి స్పందించిన ఉన్నతాధికారులు ఈ విషయంపై విచారించాలని తహసీల్దార్ను ఆదేశించారు. దీంతో బుధవారం తహసీల్దార్ పుల్లారావు గ్రామానికి చేరుకొని బాధితురాలితో మాట్లాడారు. అనంతరం సచివాలయానికి చేరుకొని హుస్సేన్బీతో పాటు కుమార్తెని విచారించారు. ఇద్దరికీ నోటీసులు జారీ చేస్తామని, నాలుగు రోజుల్లో అర్హత పత్రాలు చూపించాలని, లేకుంటే అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
రెండు ఆయిల్ ట్యాంకర్ల పట్టివేత
ఒంగోలు టౌన్: చైన్నె నుంచి ఇండస్ట్రీయల్ మిక్స్డ్ ఆయిల్తో వస్తున్న రెండు ట్యాంకర్లను విజిలెన్స్ పోలీసులు ఎస్ఎస్ఎన్ ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో పట్టుకున్నారు. విజిలెన్స్ సీఐలు రాఘవరావు, రవిబాబు, డీసీటీ ఓ.రామారావు, ఎస్సై నాగేశ్వరరావు, ఎస్ఓ పుల్లయ్య బృందం బుధవారం పొదిలి మెయిన్ రోడ్డులో తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ ట్యాంకర్లు పట్టుబడ్డాయి. గ్రానైట్ కంపెనీలు, క్వారీల్లో ఉపయోగించే మిక్స్డ్ అయిల్ ను అక్రమంగా తరలిస్తున్నట్లు నిర్ధారించారు. ప్రభుత్వానికి కట్టాల్సిన జీఎస్టీ రూ.2.70 చెల్లించకుండా ట్యాంకర్ల ద్వారా చెన్పై కు చెందిన రాజమణి ఒంగోలులోని శ్రీనివాస లూబ్రికెంట్స్కు సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది. దీదన్ని డీజిల్ బదులుగా చీమకుర్తిలోని గ్రానైట్ పరిశ్రమలకు, క్రషర్ వాహనాలకు వినియోగించడానికి రూ.87లకు అమ్మివేసినట్లు తేలింది. తక్కువ పరిణామం ఉన్నట్లు వే బిల్లు తయారు చేసి జీఎస్టీ కూడా ఎగవేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రెండు ట్యాంకర్లను స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ అధికారుల బృందం నమునాలు సేకరించారు. అక్రమంగా రవాణా చేస్తున్న ఒంగోలుకు చెందిన ఏల్చూరి శ్రీనివాసరావు, చీమకుర్తికి చెందిన ఎర్లా నారాయణ, చైన్నె దివ్య ఇండస్ట్రీస్కు చెందిన రాజమణిలపై కేసు నమోదు చేశారు. టెన్త్ విద్యార్థులకు ఆల్ఇన్వన్లు అందించిన బూచేపల్లిచీమకుర్తి రూరల్: బూచేపల్లి వెంకాయమ్మ, సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మండలంలోని దేవరపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ 10వ తరగతి విద్యార్థులకు ఆల్ఇన్వన్ స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రి, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ మేరుగు నాగార్జున స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణ కలిగి విద్యనభ్యసించాలని, కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. తమ కుటుంబం పేద విద్యార్థులకు ఎల్లప్పుడూ చేయూతనిస్తుందన్నారు. పాఠశాలలో మరుగుదొడ్ల సమస్య ఉందని ఉపాధ్యాయులు చెప్పడంతో జెడ్పీ నుంచి నిధులు కేటాయిస్తామని వెంకాయమ్మ తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులు పాఠశాలకు రావడానికి బస్సు సౌకర్యం లేదని తెలపగా ఆర్టీసీ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తామన్నారు. మేరుగు నాగార్జున మాట్లాడుతూ చారిటబుల్ ట్రస్టు ద్వారా విద్యార్థులకు చేయూతనివ్వడం అభినందనీయమన్నారు. పార్టీ అధ్యక్షుడు పమిడి వెంకటేశ్వర్లు, ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, జిల్లా రైతు విభాగం ప్రధాన కార్యదర్శి ఓబులరెడ్డి, వైస్ ప్రసిడెంటు చిన్నపురెడ్డి వెంకటేశ్వరరెడ్డి, జిల్లా బీసీ సెల్ జనరల్ సెక్రటరీ టీ గాంధీ, పులి వెంకారెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
స్మార్ట్గా జాప్యం
మార్కాపురం: జిల్లాలో స్మార్ట్ రేషన్కార్డుల పంపిణీలో స్మార్ట్గా జాప్యం జరుగుతోంది. చంద్రబాబు సర్కార్ అధికారంలోనికి వచ్చిన తర్వాత రేషన్కార్డుల స్థానంలో స్మార్ట్కార్డులు ముద్రించారు. వీటి పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. జిల్లాల్లో మొత్తం 6,51,820 రేషన్కార్డులు పంపిణీ చేయాలనే లక్ష్యం పెట్టుకోగా ఇంకా 47 వేల రేషన్ కార్డులు పంపిణీ చేయాల్సి ఉంది. అత్యధికంగా జిల్లా ఉన్నతాధికారులు ఉండే ఒంగోలులోనే 7054 స్మార్ట్ రేషన్ కార్డులు వినియోగదారులకు అందించాల్సి ఉంది. రెవెన్యూ, సచివాలయ సిబ్బంది సంబంధిత వినియోగదారులకు వీటిని అందించాలి. ఎక్కువగా పశ్చిమ ప్రకాశంలోనే పెండింగ్ ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఉపాధి హామీ పనులు ఆగిపోవడంతో మార్కాపురం గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో పలువురు కుటుంబ పోషణ కోసం తెలంగాణ ప్రాంతానికి వలసలు వెళ్లారు. వారందరికీ స్మార్ట్కార్డుల పంపిణీ నిలిచిపోయింది. రేషన్కార్డుల పంపిణీని జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ, సచివాలయ సిబ్బంది డీలర్ల ద్వారా అందించాలని నిర్ణయించారు. పలుచోట్ల గ్రామ సచివాలయ సిబ్బందికి పనిభారం, కార్డుదారులు వలస పోవడంతో ఈ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. ప్రస్తుతం ప్రతి పథకానికి రేషన్కార్డును లింక్ చేయడంతో లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందకుండాపోయే ప్రమాదం ఉంది. తల్లికి వందనం, రైతు భరోసా తదితర పథకాలకు రేషన్కార్డే ఆధారం. ఈ నేపథ్యంలో రేషన్కార్డుల పంపిణీపై స్పెషల్ డ్రైవ్ చేస్తే తప్ప లబ్ధిదారులకు అందే అవకాశం లేదు. నత్తనడకన రేషన్ కార్డుల పంపిణీ జిల్లా వ్యాప్తంగా 6,51,820 స్మార్ట్కార్డులు ఒక్క ఒంగోలులోనే 7,054 పెండింగ్ పంపిణీ చేయాల్సిన రేషన్కార్డులు 47 వేలు త్వరలో అందిస్తాం: మార్కాపురం మండలంలో ఇంకా సుమారు 2 వేల స్మార్ట్ రేషన్కార్డులు పంపిణీ చేయాల్సి ఉంది. పలువురు తమ స్వగ్రామాల్లో లేకపోవడంతో మా సిబ్బంది అందించలేక పోయారు. త్వరలోనే కార్డులు అందజేస్తాం. – చిరంజీవి, తహసీల్దార్, మార్కాపురం -
కార్మికుల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి
● కలెక్టర్ రాజాబాబు చీమకుర్తి: కార్మికుల ఆరోగ్యంపై గ్రానైట్ క్వారీల యజమానులు దృష్టి సారించాలని కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. చీమకుర్తిలోని గ్రానైట్ క్వారీలు, ప్రభుత్వ పాఠశాలలు, మధ్యాహ్న భోజనం, సురక్షిత తాగునీటి ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ గ్రానైట్ వనరులపై ఆదాయం పెరిగేలా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ప్రభుత్వానికి గ్రానైట్ నుంచి రూ.180 కోట్ల ఆదాయం వచ్చిందని, రానున్న ఏడాదికి రూ.220 కోట్లు టార్గెట్గా పెట్టుకున్నట్లు తెలిపారు. గ్రానైట్ క్వారీల యజమానుల సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉన్నామన్నారు. క్వారీల నుంచి వెలువడే కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అనంతరం చీమకుర్తి ప్రభుత్వ హైస్కూలు, ఏపీ గిరిజన గురుకుల బాలుర పాఠశాలలను సందర్శించారు. అక్కడ మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. మద్యాహ్న భోజనం ఈ రోజే బాగుందా లేక ప్రతిరోజూ మెనూ పాటిస్తూ నాణ్యతతో అందిస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థులను అడిగి 100 రోజుల యాక్షన్ ప్లాన్ గురించి, టీచర్లు తీసుకుంటున్న చర్యలు విద్యార్థులకు ఏ విధంగా దోహదపడుతుందో తెలుసుకున్నారు. పాటిమీదపాలెంలోని సురక్షిత తాగునీటి శుభ్రత, కుళాయిల నీరు ఏ విధంగా ఉందో అక్కడికక్కడే నిపుణలతో పరీక్షించారు. కార్యక్రమాలలో సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయ్కుమార్, ఎస్డీసీ విజయజ్యోతి, మైన్స్ డీడీ టీ.రాజశేఖర్, ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, డీఎంహెచ్ఓ టి.వెంకటేశ్వరరావు, స్థానిక అధికారులు, నాయకులు పాల్గొన్నారు. -
యర్రగొండపాలెం సీఐకు మెమో
● ఎరిక్షన్ బాబు బర్త్డే వేడుకల్లో పోలీసుల ఓవరాక్షన్పై ఎస్పీ సీరియస్ ● సెలవు మీద వెళుతున్న దోర్నాల ఎస్సై ఒంగోలు టౌన్: యర్రగొండపాలెం టీడీపీ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడమే కాకుండా ఆయన పట్ల అత్యంత వినయం ప్రదర్శించిన సీఐ కె.అజయ్ కుమార్, ఎస్సై చౌడయ్య, దోర్నాల ఎస్సై వి.మహేష్, పుల్లలచెరువు ఎస్సై సంపత్ కుమార్లపై ఎస్పీ హర్షవర్థన్ రాజు సీరియస్ అయ్యారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయానికి పిలిపించి తలంటినట్లు తెలిసింది. పోలీసు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించడం ఏంటని ప్రఽశ్నించినట్లు సమాచారం. ఈ విషయం గురించి వివరణ అడుగుతూ సీఐ, ఎస్సైలకు చార్జిమెమో ఇచ్చినట్లు తెలుస్తోంది. యరిక్షన్బాబు పుట్టినరోజున సీఐ, ఎస్సైలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా వ్యవహరించారని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పొదిలి: టెట్ పరీక్ష సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని యూటీఎఫ్ కార్యవర్గ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం రాత్రి విశ్వనాథపురంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులంతా రెండేళ్ల లోపు టెట్ పరీక్ష పాస్ కావాలని, అలా లేకుంటే వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని సెప్టెంబర్ 1న సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. ఈ తీర్పుపై ప్రభుత్వాలు కోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలన్నారు. ఈ తీర్పుతో రాష్ట్రంలో లక్ష మంది ఉపాధ్యాయుల భవిష్యత్ ప్రమాదంలో పడిందన్నారు. డీఎస్సీ ద్వారా నియామకం పొంది సర్వీసులో పలు రకాల శిక్షణలు తీసుకున్న తరువాత కూడా టెట్ పాస్ కావాలని కోర్టు తీర్పు ఇవ్వడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రివ్యూ పిటిషన్ వేయటం, లేదా విద్యా హక్కు చట్టంతో మార్పులు చేయాలన్నారు. నిరసనలో జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు బుజ్జిబాబు, పొదిలి మండల అధ్యక్ష, కార్యదర్శులు సత్యనారాయణరెడ్డి, పాలడుగు వెంకటేశ్వర్లు, బీంపాటి శ్రీనివాసరెడ్డి, గంజి రమణారెడ్డి, సింగంపల్లి సుబ్బారావు, తోట శ్రీనివాసులు, డి.గురవమ్మ, రమణమ్మ, కేవీ నారాయణ, ఆర్.సోమరాజు, శ్రీనివాస్, శైలజ, ఎం.సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. చీమకుర్తి రూరల్: విద్యుదాఘాతానికి వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం..మండలంలోని చండ్రపాడు ఎంపీయూపీ పాఠశాలలో జలదీక్షా వారోత్సవాల్లో భాగంగా పాఠశాల ఆవరణలోని నీళ్ల ట్యాంకును శుభ్రం చేసేందుకు ముగ్గురు కూలీలను మాట్లాడారు. వారు బాత్రూం పైగా ట్యాంకు ఎక్కే క్రమంలో 11 కేవీ విద్యుత్ తీగ తగలడంతో అనపర్తి రవికుమార్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతునిది ఏలూరివారిపాలెం. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వాసుత్రికి తరలించారు. సాక్షిటాస్క్ఫోర్స్: టీడీపీ నాయకుడి ఫిర్యాదు మేరకు మంగళవారం రాత్రి వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన కార్యదర్శి నెమలిదిన్నె చెన్నారెడ్డి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో కంభం పోలీసులు బుధవారం మధ్యాహ్నం చెన్నారెడ్డిని కంభం పోలీస్స్టేషన్కు పిలిపించారు. సుమారు 3 గంటల సమయంలో కంభం పోలీస్స్టేషన్ నుంచి చెన్నారెడ్డిని మార్కాపురం డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఆరు గంటల తర్వాత మార్కాపురం డీఎస్పీ చెన్నారెడ్డిని కొంతసేపు విచారణ చేపట్టిన అనంతరం గురువారం ఉదయం తిరిగి హాజరు కావాలని చెప్పి బయటకు పంపారు. చెన్నారెడ్డిని కంభం నుంచి మార్కాపురం డీఎస్పీ కార్యాలయానికి పోలీసులు తీసుకెళ్లారన్న విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపి నాయకులు మార్కాపురం చేరుకున్నారు. డీఎస్పీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన అనంతరం చెన్నారెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. -
కాలువలో పడి యువకుడు మృతి
నాగులుప్పలపాడు: ద్విచక్రవాహనంపై వెళుతున్న యువకుడు అదుపుతప్పి రోడ్డు పక్కన కాలువలో పడటంతో మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే..మద్దిపాడు మండలం తిమ్మనపాలెం గ్రామానికి చెందిన బోజేపల్లి కోటయ్య (32) మోటారు సైకిల్పై ఉప్పుగుండూరు నుంచి నాగులుప్పలపాడు వెళుతున్నాడు. ఈ క్రమంలో మధ్యలో వారాహగిరి కోల్డ్ స్టోరేజీ సమీపంలో మోటార్ సైకిల్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న నీటి కుంటలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు 108కు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. -
‘కోటి’ గళాల గర్జన
సాక్షి, విశాఖపట్నం, నెట్వర్క్: చంద్రబాబు సర్కారు కక్షపూరిత విధానాలతో ప్రభుత్వం కొత్త మెడికల్ కళాశాలలను ప్రైవేట్పరం చేయడం.. ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాలను బుధవారం నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు, మీడియా సమావేశాలు నిర్వహించి ప్రత్యేక బాక్సుల్లో భద్రపరిచి ఆయా జిల్లా కేంద్రాలకు తరలించారు. నియోజకవర్గ పార్టీ కార్యాలయాల వద్ద వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలు జెండా ఊపి కోటి సంతకాల వాహనాలను ప్రారంభించారు. పలుచోట్ల మహిళలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని కోటి సంతకాల వాహనాలకు హారతి పట్టారు. ఇకనైనా చంద్రబాబు సర్కారుకు కనువిప్పు కలగాలని, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని దేవుడిని ప్రార్థించారు. యువత, విద్యార్థులు, మేధావులు, ప్రజలు ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీల్లో పాల్గొని మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినదించారు. వైఎస్సార్ సీపీ ప్రజా ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 10న రచ్చబండగా మొదలై మారుమూల గిరిజన గూడేల నుంచి నగరాల దాకా ఉద్ధృతంగా ఈ కార్యక్రమం సాగింది. కాకినాడలోని వైఎస్సార్సీపీ కార్యాలయానికి భారీ ర్యాలీగా వెళుతున్న యువత, నాయకులు, పార్టీ శ్రేణులు అన్ని మండలాలు, అన్ని పంచాయతీల్లో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రెండు నెలలుగా మహోద్యమంలా సాగిన కోటి సంతకాల సేకరణలో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా, భారీగా పాల్గొన్నారు. నవంబరు 12న రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ నిర్వహించిన ర్యాలీల్లో విద్యార్థులు, యువత, మేధావులు పెద్ద ఎత్తున పాల్గొని మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని నిరసిస్తూ కదం తొక్కారు. కోటి సంతకాల మహా ఉద్యమంతో చంద్రబాబు సర్కార్కు ఇకనైనా కనువిప్పు కలగాలని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే చంద్రబాబు సర్కార్కు బుద్ధి చెప్పేందుకు ఎలాంటి ఉద్యమాలకైనా సిద్ధమంటూ హెచ్చరించారు. సంతకాల పత్రాలతో విశాఖలో భారీ బైక్ ర్యాలీ చేపడుతున్న ప్రజలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ⇒ ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సేకరించిన సంతకాలను బుధవారం జిల్లా కేంద్రానికి ర్యాలీగా తరలించారు. దర్శి నుంచి ఒంగోలుకు వాహనాల ర్యాలీని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ జెండా ఊపి ప్రారంభించారు. యర్రగొండపాలెం నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. గిద్దలూరులో కేపీ నాగార్జునరెడ్డి, మార్కాపురంలో అన్నా రాంబాబు, కొండపిలో ఆదిమూలపు సురేష్, సంతనూతలపాడులో మేరుగు నాగార్జున, కనిగిరిలో దద్దాల నారాయణ యాదవ్ ర్యాలీలను ప్రారంభించారు. ఒంగోలు నియోజకవర్గంలో సేకరించిన 62 వేల సంతకాలను పార్టీ జిల్లా కార్యాలయానికి చేర్చినట్లు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు తెలిపారు. ⇒ పశ్చిమ గోదావరి జిల్లాలో కోటి సంతకాలతో వాహనాల ర్యాలీలను భారీ ఎత్తున నిర్వహించారు. మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడపాలని డిమాండ్ చేశారు. తణుకులో మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు, తాడేపల్లిగూడెంలో మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, నరసాపురంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, ఆచంటలో మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, భీమవరంలో నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు, పాలకొల్లులో నియోజకవర్గ సమన్వయకర్త గుడాల శ్రీహరిగోపాలరావు, ఉండిలో నియోజకవర్గ సమన్వయకర్త పీవీఎల్ నరసింహరాజు ఆధ్వర్యంలో ర్యాలీలు జరిగాయి. వైద్య కళాశాలలను ప్రభుత్వమే నడిపేలా చంద్రబాబు బుద్ధి మార్చాలని దేవుడిని కోరుతూ తణుకు నియోజకవర్గం వేల్పూరు, అత్తిలిలో మహిళలు సంతకాల ప్రతులకు మంగళ హారతులిచ్చి సాగనంపారు. ⇒ తిరుపతి, చిత్తూరు జిల్లాలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. నియోజకవర్గ సమన్వయకర్తల ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రతులను తిరుపతి వైఎస్సార్సీపీ కార్యాలయంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డికి అందజేశారు. అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించారు. పుంగనూరులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రతుల ప్రత్యేక వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గంగాధర నెల్లూరులో మాజీ మంత్రి నారాయణస్వామి, నగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజా, చిత్తూరులో విజయానందరెడ్డి, శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన్రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, వెంకటగిరిలో నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, గూడూరులో ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, నాయుడుపేటలో కిలివేటి సంజీవయ్య, నాగలాపురంలో నూకతోటి రాజేష్, తవణంపల్లిలో డాక్టర్ సునీల్కుమార్, పలమనేరులో వెంకటేగౌడ్, కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల ప్రతులను ప్రత్యేక వాహనంలో తిరుపతికి తరలించారు. ⇒ ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. నియోజకవర్గ కేంద్రాల నుంచి వాహనాల్లో కోటి సంతకాల పత్రాల బాక్సులను తరలించారు. పోలీసులు అడ్డుకున్నా వెనకడుగు వేయకుండా ర్యాలీలు నిర్వహించారు. పలాస నియోజకవర్గంలో మాజీ మంత్రి అప్పలరాజు ఆధ్వర్యంలో పత్రాలను తరలించారు. ⇒ విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో సుమారు 10 లక్షల సంతకాలు సేకరించారు. విశాఖ జిల్లా మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయానికి అన్ని నియోజకవర్గాల నుంచి వాహనాల్లో కోటి సంతకాల బాక్స్లు చేరుకున్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే రాజు అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో సమన్వయకర్తలు మళ్ల విజయప్రసాద్, వాసుపల్లి గణేష్కుమార్, మజ్జి శ్రీనివాసరావు, తిప్పల దేవన్రెడ్డి, మొల్లి అప్పారావు, నియోజకవర్గం పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో నియోజకవర్గాల సమన్వయకర్తలతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, సమన్వయకర్తలు కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకర్ గణేష్, కంబాల జోగులు, అన్నంరెడ్డి అదీప్రాజ్, పార్లమెంట్ పరిశీలకులు శోభాహైమావతి, పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ పాల్గొన్నారు. అల్లూరి జిల్లాలో పాడేరులోని పార్టీ కార్యాలయానికి వ్యానుల్లో సంతకాల పత్రాల బాక్స్లు చేరుకున్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడు మత్సరాస విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో వాటిని సేకరించారు. కార్యక్రమంలో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర తదితరులు పాల్గొన్నారు. -
2 కోట్ల సంతకాలకు చేరువగా ప్రజా ఉద్యమం
మార్కాపురం/ మార్కాపురం టౌన్: మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రజల మద్దతుతో ప్రజా ఉద్యమంలా మారి 2 కోట్ల సంతకాలకు చేరువైందని పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. మార్కాపురం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి అన్నా రాంబాబుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సంతకాలు చేశారని చెప్పారు. పశ్చిమ ప్రకాశంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా అన్నా రాంబాబు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్నీ వర్గాల ప్రజలకు నష్టం కలిగిందన్నారు. వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తే విద్య, వైద్య పేదలకు దూరమవుతాయన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోకుంటే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తే నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాలలు పూర్తయి అందుబాటులోకి వస్తాయన్నారు. కందులా ఇలా మాట్లాడటం తగునా.. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాము ఉద్యమం చేస్తుంటే అపహాస్యం చేస్తూ ఎమ్మెల్యే మాట్లాడటం తగదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ అన్నా రాంబాబు అన్నారు. తాను వెంటనే స్పందిస్తే ఈ ఉద్యమం పక్కదారి పట్టే ప్రమాదం ఉన్నందున ఇప్పటి వరకూ ఏమీ మాట్లాడలేదన్నారు. మీరు ప్రతిపక్షంలో ఉండి ఉద్యమాలు చేసినప్పుడు ఏనాడూ ఎగతాళిగా మాట్లాడలేదని అన్నారు. అధికార పార్టీలో ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలని, అధికార బలంతో, మదంతో మాట్లాడితే సమాజం క్షమించదన్నారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఇటీవల విలువలు లేకుండా వ్యవహరిస్తున్నారని, ఇది మంచిపద్ధతి కాదన్నారు. ఇటీవల పొదిలి మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల ఒక కులాన్ని కించపరుస్తూ మాట్లాడటం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ షంషేర్ ఆలీబేగ్, స్టేట్ కమిటీ సభ్యులు వెన్నా హనుమారెడ్డి, జెడ్పీటీసీ నారు బాపన్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు చెంచిరెడ్డి, మురారి వెంకటేశ్వర్లు, మోర శంకర్రెడ్డి, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు సలీమ్, సత్యనారాయణరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, కొనకనమిట్ల జెడ్పీటీసి అక్కిదాసరి ఏడుకొండలు, ఎంపీపీ మురళీకృష్ణయాదవ్, డాక్టర్ మగ్బుల్ బాషా, సంజీవరెడ్డి, వైస్ చైర్మన్ అంజమ్మ శ్రీనివాసులు, కౌన్సిలర్లు సిరాజ్, చాటకొండ చంద్ర, ముంగమూరి శ్రీను, కొత్త కృష్ణ, వార్డు ఇన్ఛార్జిలు ఏడుకొండలు, గఫూర్, మౌలాలి, గుంటక అంజిరెడ్డి, బొగ్గరపు శేషయ్య, బాలకృష్ణారెడ్డి, కె.ఆది, చిప్స్ శ్రీనివాస్, పీవీ నాయుడు, కరీముల్లా, ముత్తారెడ్డి వెంకటరెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, ఎస్ వెంకటరెడ్డి, బ్రహ్మారెడ్డి, సుబ్బారావు, సీహెచ్ వెంకటరామిరెడ్డి, చాటకొండ నాగరాజు, న్యాయవాదులు భూపని కాశయ్య, చౌడేశ్వరరావు, వాల్మీకి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ నల్లబోతుల కొండయ్య సోషల్ మీడియా అధ్యక్షుడు మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు. -
ఎయిడెడ్ విద్యార్థులకు మెటీరియల్ ఇవ్వాలి
ఒంగోలు సిటీ: ఎయిడెడ్ విద్యార్థులకు మెటీరియల్ ఇవ్వకుండా ఎఫ్ఎల్ఎన్ 75 రోజుల కార్యక్రమం ఏ విధంగా నిర్వహించాలని ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.వెంకట్రావు, ప్రభాకర్రెడ్డిలు మంగళవారం ప్రశ్నించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం పని చేస్తున్న 80 ప్రాథమిక, 22 ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒకటి నుంచి 5వ తరగతి వరకు చదివే పేద విద్యార్థులకు మెటీరియల్ ఇవ్వకుండా గ్యారంటీ ఫౌండేషన్ లిటరసీ న్యూమరసే ప్రోగ్రాం ఎఫ్ఎల్ఎన్ ఏ విధంగా ఎయిడెడ్ పాఠశాలల్లో నిర్వహించాలని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. సర్వశిక్ష అభియాన్ అధికారులను ఎన్నిసార్లు అడిగినా ఎయిడెడ్ విద్యార్థులకు సంబంధించి ఎఫ్ఎల్ఎన్, తరల్ కిట్లు, స్పోర్ట్స్ మెటీరియల్ ఇవ్వలేదని, డిసెంబర్ 5న జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్కు సంబంధించిన నిధులు విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కంభం: జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాల మేరకు మంగళవారం కంభం, బేస్తవారిపేట మండల విద్యాశాఖాధికారులు అబ్దుల్ సత్తార్, శ్రీనివాసులు, మధుసూదన్రెడ్డి ఎయిడెడ్ పాఠశాలలను తనిఖీ చేశారు. స్థానిక రంగరాజు ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలలో గత మూడేళ్లుగా విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, హాజరు, అడ్మిషన్లు, బదిలీ రికార్డులు తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి సిబ్బందికి సూచనలిచ్చారు. వసతులు, సౌకర్యాలు, క్రీడా పరికరాలు, మైదానం వాస్తవ స్థితిని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. -
జిల్లా విద్యాశాఖాధికారిగా రేణుక
ఒంగోలు సిటీ: జిల్లా విద్యాశాఖాధికారిగా సి.వి.రేణుక నియమితులయ్యారు. గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారిగా పనిచేస్తున్న ఆమె బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఇక్కడ డీఈఓగా విధులు నిర్వహించిన ఎ.కిరణ్కుమార్ గతంలో పనిచేసిన బోయపాలెం డైట్ కళాశాలలో సీనియర్ లెక్చరర్గా వెళ్లారు. కురిచేడు: మండలంలోని కల్లూరు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయుడు పీ సురేష్ ను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కిరణ్ కుమార్ మంగళవారం తెలిపారు. గత నెల 21న విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తన శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి స్పందించిన డీఈఓ ఉపాధ్యాయుడు సురేష్ ను క్రమశిక్షణ చర్యల కింద విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సింగరాయకొండ: విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలపై మండలంలోని పాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు సీహెచ్ మాధవరావును సస్పెండ్ చేసినట్లు డీఈఓ కిరణ్కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారని ఈ ఆదేశాలను వెంటనే అమలు చేశామని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రసాద్ తెలిపారు. గత జూలై 30వ తేదీ విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయులు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణపై పాఠశాలలో ఒంగోలు డిప్యూటీ డీఈఓ చంద్రమౌళీశ్వరరావు, జీసీడీఓ హేమలత విచారణ జరపగా సీహెచ్ మాధవరావుపై విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. దీనిపై నవంబరు 21వ తేదీ మాధవరావు పై సింగరాయకొండ పోలీస్స్టేషన్లో పోక్సో కేసు నమోదు కాగా అతనికి ఎస్సై బీ మహేంద్ర నిబంధనల ప్రకారం స్టేషన్ బెయిల్ ఇచ్చారు. తరువాత మాధవరావు విధులకు హాజరవుతున్నారు. ఈ ఘటనపై తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి రావటంతో డీఈఓ ఎట్టకేలకు సస్పెన్షన్ వేటు వేశారు. -
ఎన్జీజీఓ అసోసియేషన్ జిల్లా ఎన్నికలు ఏకగ్రీవం
ఒంగోలు సబర్బన్: ఏపీ ఎన్జీజీఓ జిల్లా కమిటీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. దాంతో వరుసగా నాలుగో సారి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా కే.శరత్ బాబు, కృష్ణారెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం ఎన్జీఓ హోంలో జిల్లా కమిటీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ జరిగింది. ఒక్కొక్క పోస్టుకు ఒక్కో అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నికలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి బి.వెంకటేశ్వర్లు ప్రకటించారు. సహాధ్యక్షులుగా ఎం.వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా బి.ఏడుకొండలు, తోట శ్రీనివాసులు, పి.రామాంజనేయులు, బి.విజయ్ కుమార్, ఆర్.దీపక్ కుమార్, ఉపాధ్యక్షురాలుగా (మహిళ) కె.కోటేశ్వరమ్మ, కార్యనిర్వాహక కార్యదర్శిగా బి.కృష్ణ కిశోర్, సంయుక్త కార్యదర్శులుగా ఎం.శ్రీనివాసరావు(వాసు), డి.వెంకటేశ్వర్లు, డి.మధుసూదన రెడ్డి, కె.రాజేష్ బాబు, హరిబాబు, సంయుక్త కార్యదర్శిగా (మహిళ) బి.పద్మ కుమారి, కోశాధికారిగా కె.శివ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి, అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీ వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఈ ఎన్నికలకు పరిశీలకులుగా రాష్ట్ర కార్యదర్శి రామ్ ప్రసాద్, సహాయ ఎన్నికల అధికారిగా నెల్లూరు జిల్లా కార్యదర్శి జీ రామకృష్ణ వ్యవహరించారు. తొలుత కలెక్టరేట్ నుంచి ఎన్జీజీఓ అసోసియేషన్ నాయకులు, సభ్యులు భారీ ర్యాలీగా బయలు దేరారు. ర్యాలీలో రాష్ట్ర అధ్యక్షుడు విద్యా సాగర్తో పాటు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈ ర్యాలీ ఎన్జీఓ హోం వరకు సాగింది. కమిటీ ఏకగ్రీవం అయిన తరువాత రాష్ట్ర అధ్యక్షుడు విద్యా సాగర్ అసోసియేషన్ చేపడుతున్న పలు కార్యక్రమాలు, ఉద్యోగుల కోసం చేస్తున్న పోరాటం గురించి మాట్లాడారు. నూతనంగా ఎన్నికై న కార్యవర్గాన్ని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీ రమణ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్జీజీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, పశ్చిమ గోదావరి జిల్లా ఎన్జీజీఓ సంఘ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస రావు, రాష్ట్ర ఎన్జీజీఓ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కె జగదీశ్వరరావు, మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్ పీ మాధవి ఒంగోలు పట్టణ అధ్యక్షులు కొత్తపల్లి మంజేష్, కార్యదర్శి షేక్ మగ్దుమ్ షరీఫ్, మహిళా విభాగం చైర్మెన్ కే కోటేశ్వరమ్మ, కన్వీనర్ సీహెచ్ శిరీష, వివిధ డిపార్ట్మెంట్స్ అధ్యక్ష కార్యదర్శులు, అన్ని తాలూకా అధ్యక్ష, కార్యదర్శలు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
17న శాసనసభ అంచనాల కమిటీ రాక
ఒంగోలు సబర్బన్: రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ ఈ నెల 17వ తేదీన జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ రాజాబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16 సాయంత్రం 6 గంటలకు నెల్లూరు నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి రాత్రికి ఒంగోలు చేరుకొని స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో బస చేస్తారు. 17వ తేదీ ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశమవుతారు. 2019–20, 2020–21, 2021–22 ఆర్థిక సంవత్సరాల బడ్జెట్ అంచనాలపై సమీక్షిస్తారు. అనంతరం గుంటూరుకు బయలుదేరి వెళతారని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఒంగోలు: కక్షిదారులు ఈనెల 13న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని ఇన్చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాఽధికార సంస్థ చైర్పర్సన్ టి.రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. జాతీయ లోక్ అదాలత్లో రాజీకి అర్హత కలిగిన అన్ని క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, చెక్బౌన్స్ కేసులు, మోటారు వాహన ప్రమాదబీమా వ్యాజ్యాలు, అన్ని రకాల బ్యాంకు కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. ప్రీలిటిగేన్ స్థాయిలో కూడా కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎకై ్సజ్ కేసులు, ట్రాఫిక్ కేసులు కూడా పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకుని సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. జిల్లావ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్లో కేసుల పరిష్కారం నిమిత్తం 29 బెంచీలను ఏర్పాటుచేశామన్నారు. దీనివల్ల వేగవంతంగా కేసులు పరిష్కరించుకునే సౌలభ్యం ఉందని, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బేస్తవారిపేట: మండలంలోని ఒందుట్లకు చెందిన శతాధిక వృద్ధుడు సూరం సుబ్బారెడ్డి (104) మంగళవారం మృతిచెందారు. ఇతడు మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో లా డిగ్రీ చదివారు. సోషల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్) గా గిద్ద లూరు, బేస్తవారిపేట, మార్కాపురం, యర్రగొండపాలెంలో పనిచేశారు. ఉద్యోగ జీవితంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఎస్ఈఓగా పేరు నిలిచిపోయింది. 1950–52లో గుంటూరు లో విద్యనభ్యసించే సమయంలో గుంటూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశారు. వ్యవసాయంపై మక్కువతో గిద్దలూరు నియోజకవర్గంలో మొదటగా బత్తాయి సాగు చేశారు. మృతుడికి ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. మాజీ సీఎం భవనం వెంకట్రామిరెడ్డి, కేంద్ర మంత్రి పులి వెంకటరెడ్డిలు ఇతని క్లాస్మేట్స్. బుధ వారం ఉదయం 10 గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మద్దిపాడు: డివైడర్ను ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం అర్ధరాత్రి ఏడుకొండలపాడు సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది. వివరాల్లోకి వెళితే.. కొరిశపాడు మండలం రావినూతల గ్రామానికి చెందిన దొప్పలపూడి నాగేశ్వరరావు(55) సోమవారం అర్ధరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో ఆటోలో ఒంగోలు వైపు వెళుతూ ఏడుగుండ్లపాడు ఫ్లైఓవర్ పై డివైడర్ను ఢీకొట్టారు. ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో అంబున్సెలో ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


