breaking news
OTT
-
'కురుక్షేత్ర-2' స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
యానిమేషన్ చిత్రం'మహావతార్ నరసింహా' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. దీంతో ఇదే ట్రెండ్ను పలు సినిమాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కురుక్షేత్ర యానిమేటెడ్ చిత్రం కొద్దిరోజుల క్రితం నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. ఈ మూవీకి కూడా మంచి రెస్సాన్స్ వచ్చింది. దీంతో పార్ట్-2 ను దర్శకుడు ఉజాన్ గంగూలీ రూపొందించారు. తాజాగా కురుక్షేత్ర-2 ట్రైలర్ను షేర్ చేశారు. అక్టోబర్ 24న నెట్ఫ్లిక్స్లోనే ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగు వర్షన్ కూడా అందుబాటులో ఉంది.'కురుక్షేత్ర-1' కథేంటి?అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేసిన తర్వాత పాండవులకు ఇచ్చిన మాట ప్రకారం కౌరవులు.. రాజ్యంలో వాటా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మాట తప్పుతారు. ఐదుగురికి ఐదు ఊళ్లు ఇవ్వడానికి కూడా నిరాకరిస్తారు. కృష్ణుడి సూచన మేరకు పాండవులు ఓపిగ్గానే ఉంటారు. సంజయుడితో కౌరవులకు రాయబారం పంపిస్తారు. కానీ అది విఫలమవుతుంది. కౌరవులు.. యుద్ధం పట్ల ఉత్సాహంగా ఉన్నారనే విషయం పాండవులకు తెలుస్తుంది. దీంతో కృష్ణుడు, అర్జునుడు వైపు.. కృష్ణుడి సైన్యం దుర్యోధనుడికి దక్కుతుంది. అలా 'కురుక్షేత్రం' మొదలవుతుంది. ఆయుధాలే పట్టనని అనుకున్న అర్జునుడు.. కృష్ణుడి గీతోపదేశం తర్వాత ఎలా మారాడు? ఈ యుద్ధంలో అసలేం జరిగిందనేది అసలు కథ? -
ఓటీటీలో 'ఓజీ'.. అధికారికంగా ప్రకటన
టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ నటించిన‘ఓజీ’ (OG) సినిమా ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. కేవలం నెలరోజుల్లోనే ఓటీటీలోకి ఈ చిత్రం ఎంట్రీ ఇవ్వనుంది. సుజీత్ దర్శకత్వం వహించిన చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రకాశ్ రాజ్, శ్రియారెడ్డి, ప్రియాంక మోహన్ తదితరులు నటించారు. 'హరి హర వీరమల్లు' వంటి భారీ డిజాస్టర్ తర్వాత వచ్చిన ఓజీ కాస్త పర్వాలేదనిపించింది.ఓజీ సినిమా అక్టోబర్ 23 నుంచి ‘నెట్ఫ్లిక్స్’ (Netflix)లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ,తమిళ్, కన్నడ, మలయాళంలో విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మొదటిరోజు భారీ కలెక్షన్స్ రాబట్టిన ఓజీ ఆ తర్వాత ఆశించినంత రేంజ్లో కలెక్ట్ చేయలేదు. కాంతార సినిమా విడుదల తర్వాత చాలాచోట్ల ఓజీ చిత్రాన్ని తొలగించేశారు కూడా. దీంతో ఓజీ బయ్యర్లకు నష్టాలు తప్పలేదు.ఓజీ కథేంటి..?ఓజీ కథ అంతా 1970-90ల మధ్యకాలంలో జరుగుతుంది. జపాన్లో జరిగిన ఓ దాడి నుంచి బయటపడ్డ ఓజాస్ గంభీర (పవన్ కల్యాణ్) ఇండియాకు వెళ్లే ఓడ ఎక్కుతాడు. అక్కడ సత్యాలాల్ అలియాస్ సత్యదాదా(ప్రకాశ్రాజ్)పై అటాక్ జరిగితే.. రక్షిస్తాడు. దీంతో ఓజీని సత్యాదాదా బొంబాయి తీసుకొస్తాడు. అక్కడ ఓ పోర్ట్ని నిర్మించి.. సత్యదాదా డాన్గా ఎదుగుతాడు. అతనికి ఓజాస్ గంభీర తోడుగా నిలుస్తాడు. కొన్నాళ్ల తర్వాత ఓ కారణంగా గంభీర బొంబాయి వదిలి వెళ్తాడు. డాక్టర్ కన్మణిని పెళ్లి చేసుకొని నాసిక్లో కొత్త జీవితం ప్రారంభిస్తారు.ఓజీ బొంబాయి వీడిన తర్వాత సత్యదాదా స్నేహితుడు మిరాజ్ కర్(తేజ్ సప్రూ)తో పాటు తన కొడుకులు జిమ్మీ (సుదేవ్ నాయర్), ఓమీ (ఇమ్రాన్ హష్మీ) నగరాన్ని తమ గుప్పిట్లో పెటుకునేందుకు ప్రయత్నిస్తారు. సత్యదాదా పోర్ట్లో ఉన్న తన కంటేనర్ని స్వాధీనం చేసుకునేందుకు ఇస్తాంబుల్లో ఉన్న ఓమీ.. ముంబైకి వస్తాడు. సత్యదాదా పోర్ట్ని స్వాధీనం చేసుకొని.. అతడి మనుషులను దారుణంగా చంపేస్తాడు. అప్పటికే ఇద్దరు కొడుకుల్ని పోగొట్టుకున్న సత్యదాదాకు మళ్లీ ఓజీ అవసరం పడుతుంది. మరి ఓజీ తిరిగి బొంబాయి వచ్చాడా? అసలు ఓజీ బొంబాయిని ఎందుకు వదలాల్సి వచ్చింది? తండ్రిలా భావించే సత్యదాదాకు ఆయన ఎందుకు దూరంగా ఉన్నాడు? ఓమీ కంటేనర్లో ఉన్న విలువలైన వస్తుంలేంటి? సత్యాదాదా ఇద్దరు కొడుకులు ఎలా చనిపోయారు? దాదా మనవడు అర్జున్(అర్జున్ దాస్) ఓజీని ఎందుకు చంపాలనుకున్నాడు? ఓజీ ప్లాష్బ్యాక్ ఏంటి? ఈ కథలో శ్రీయారెడ్డి పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
నేరుగా ఓటీటీకే సూపర్ నేచురల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఓటీటీల హవా నడుస్తోంది. ఆడియన్స్ సైతం డిజిటల్ వైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో ఓటీటీలు సైతం సరికొత్త కంటెంట్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా మరో సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ వచ్చేస్తోంది. మానవ్ కౌల్, భాషా సుంబ్లి నటించిన ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు.దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. నవంబర్ 7న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుందని పోస్టర్ పంచుకున్నారు. ఈ సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీకి ఆదిత్య సుహాస్ జంభలే దర్శకత్వం వహించారు. కశ్మీర్లోని బారాముల్లా లోయ ప్రాంతానికి చెందిన డిఎస్పీ రిద్వాన్ సయ్యద్ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. రిద్వాన్ బదిలీపై వచ్చిన వెంటనే ఓ యువకుడు అదృశ్యమవుతాడు? ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అనేదే బారాముల్లా కథ. ఈ చిత్రాన్ని బీ62 స్టూడియోస్, జియో స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య, లోకేష్ ధార్తో కలిసి జ్యోతి దేశ్పాండే నిర్మించారు. Welcome to the town, where truth is a myth, and myths have truth. Enter the world of ‘Baramulla’ on 7th November. Only on Netflix.#BaramullaOnNetflix pic.twitter.com/pB7swLUIYm— Netflix India (@NetflixIndia) October 17, 2025 -
మెగా కోడలి సస్పెన్స్ థ్రిల్లర్.. సడన్గా ఓటీటీకి!
మెగా కోడలు లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటించిన చిత్రం టన్నెల్(Tunnel). కోలీవుడ్ హీరో అథర్వా మురళి సరసన ఈ చిత్రంలో కనిపించింది. తమిళంలో తనల్(Thanal) పేరుతో ఈ మూవీని తెరకెక్కించారు. సెప్టెంబర్ 19న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ మూవీకి రవీంద్ర మాధవ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను లచ్చురామ్ ప్రొడక్షన్స్పై ఎ. రాజు నాయక్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో అథర్వ పోలీస్ ఆఫీసర్గా నటించారు. అశ్విన్ కాకుమాను విలన్గా మెప్పించారు.తాజాగా ఈ చిత్రం నెల రోజులైనా కాకముందే ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీకి వచ్చేసింది. ఈ రోజు సాయంత్రం ఆరు గంటల నుంచే అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. క్రూరమైన హత్యలకు పాల్పడుతున్న ఓ సైకోను పోలీసులు ఎలా పట్టుకున్నారు? అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కించారు. కాగా.. ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. -
ఓటీటీలో భారీ యాక్షన్ సినిమా.. భాగీ-4 సడెన్గా స్ట్రీమింగ్
బాలీవుడ్ హిట్ ఫ్రాంచైజీలో భాగీ సినిమాకు ఎక్కువగానే ఫ్యాన్స్ ఉన్నారు. సెప్టెంబర్ 5న విడుదలైన భాగీ4 సడెన్గా ఓటీటీలోకి వచ్చేసింది. టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన ఈ భారీ యాక్షన్ చిత్రంలో హర్నాజ్ కౌర్ సంధూ, పంజాబీ బ్యూటీ సోనమ్ ప్రీత్ బజ్వా హీరోయిన్లుగా నటించారు. మితిమీరిన రక్తపాతంతో నిండిన ఈ మూవీ పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదు. కానీ, యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారిని మాత్రం నిరాశపరచలేదని చెప్పాలి.అమెజాన్ ప్రైమ్లో సడెన్గా భాగీ-4 స్ట్రీమింగ్కు వచ్చేసింది. అయితే, ఈ మూవీని అద్దె ప్రాతిపదికలో చూడొచ్చు. రూ. 349 అధనంగా చెల్లించి భాగీ-4 చూడొచ్చని ఆ సంస్థ ప్రకటించింది. ‘భీమా’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దర్శకుడు ఎ.హర్ష ఈ మూవీని తెరకెక్కించారు. ఇందులో సంజయ్ దత్ కీలక పాత్రలో నటించారు. 'భాగీ' తొలి భాగంలో జంటగా నటించిన టైగర్, శ్రద్ధా 'భాగీ 3'లో మళ్లీ కలిసి నటించారు. 'భాగీ 2'లో హీరోయిన్గా దిశా పటానీ కనిపించింది. అయితే, వీరిలో ఎవరూ భాగీ-4లో లేరు. -
వరుసగా మూడు రోజుల సెలవులు.. ఓటీటీల్లో ఒక్క రోజే 19 సినిమాలు!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. దీనికి తోడు వచ్చే సోమవారమే దీపావళి పండుగ. ఇంకేముంది వరుసగా మూడు రోజులు సెలవులు కూడా వచ్చేస్తున్నాయి. ఈ వారాంతానికి తోడు దీపావళి కలిసి రావడంతో ఫ్యామిలీతో చిల్ అయ్యేందుకు సినీ ప్రియులు సిద్ధమైపోయారు. మీ కోసమే ఈ వారంలో మిత్రమండలి, తెలుసుకదా, డ్యూడ్, కె ర్యాంప్ లాంటి థియేటర్లకు వరుసగా క్యూ కడుతున్నాయి.అదే సమయంలో థియేటర్లలో వెళ్లలేని వారు ఓటీటీ చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఫ్రైడే ఏయే సినిమాలు డిజిటల్గా స్ట్రీమింగ్ కానున్నాయోనని తెగ వెతికేస్తున్నారు. అలాంటి వారి కోసం రెండు టాలీవుడ్ మూవీస్ శుక్రవారం స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. మంచు లక్ష్మీ దక్ష, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కంధపురి ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. వీటితో పాటు ఆనందలహరి అనే వెబ్ సిరీస్ కూడా సందడి చేయనుంది. అంతేకాకుండా పలు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్లు శుక్రవారమే ఓటీటీలో అలరించనున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేసేయండి.ఓటీటీల్లో ఫ్రైడే మూవీస్నెట్ఫ్లిక్స్ 27 నైట్స్ (స్పానిష్ మూవీ) - అక్టోబర్ 17 గుడ్ న్యూస్ (కొరియన్ సినిమా) - అక్టోబర్ 17 గ్రేటర్ కాలేష్ (హిందీ సిరీస్) - అక్టోబర్ 17 షీ వాక్స్ ఇన్ డార్క్నెస్ (స్పానిష్ సినిమా) - అక్టోబర్ 17 ద ఫెర్ఫెక్ట్ నైబర్ (ఇంగ్లీష్ చిత్రం) - అక్టోబర్ 17 టర్న్ ఆఫ్ ది టైడ్- సీజన్ 2- (హాలీవుడ్ సిరీస్)- అక్టోబర్ 17 ది డిప్లొమాట్- సీజన్ 3- అక్టోబర్ 17 హౌటూ ట్రైన్ యువర్ డ్రాగన్(యానిమేషన్ మూవీ)- అక్టోబర్ 18అమెజాన్ ప్రైమ్దక్ష(తెలుగు సినిమా)- అక్టోబరు 17హాలీవుడ్ హస్లర్- గ్లిట్జ్, గ్లామ్, స్కామ్(డాక్యుమెంటరీ సిరీస్)- అక్టోబరు 17ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్- అక్టోబర్ 18 జియో హాట్స్టార్ఘోస్ట్స్ సీజన్-5(హాలీవుడ్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 17 ఆహా ఆనందలహరి (తెలుగు వెబ్ సిరీస్) - అక్టోబరు 17జీ5 కిష్కింధపురి (తెలుగు సినిమా) - అక్టోబరు 17 భగవాన్ ఛాప్టర్ 1: రాక్షస్ (హిందీ మూవీ) - అక్టోబరు 17 ఎలుమలే (కన్నడ సినిమా) - అక్టోబరు 17 మేడమ్ సేన్ గుప్తా (బెంగాలీ మూవీ) - అక్టోబరు 17 అభయంతర కుట్టవాళి (మలయాళ సినిమా) - అక్టోబరు 17సన్ నెక్స్ట్ ఇంబమ్ (మలయాళ మూవీ) - అక్టోబరు 17 మట్టా కుతిరై(మలయాల సినిమా)- అక్టోబర్ 19లయన్స్ గేట్ ప్లే సంతోష్ (హిందీ సినిమా) - అక్టోబరు 17 వుయ్ లివ్ ఇన్ టైమ్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 17 -
ఓటీటీకి తెలుగు రొమాంటిక్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చాక సినిమాలు చూసే ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఎంత పెద్ద సినిమాలైనా నెల రోజుల తర్వాత ఇంట్లోనే కూర్చుని ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక వెబ్ సిరీస్లకైతే కొదవే లేదు. వారంలో నాలుగైదు వెబ్ సిరీస్లే ఉంటున్నాయి. వీటిలో క్రైమ్, రొమాంటిక్ ఓరియంటేడ్ స్టోరీలకు ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగులో మరో ఆసక్తికర సిరీస్ అలరించేందుకు వచ్చేస్తోంది.తెలుగులో తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ఆనందలహరి (Ananda lahari). ఈ సిరీస్లో ఆనంద్, లహరి అనే యువ జంట చుట్టూ తిరిగే ప్రేమ కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. పాన్ గోదావరి అంటూ ఈస్ట్ అబ్బాయి, వెస్ట్ అమ్మాయి మధ్య జరిగే ప్రేమ, పెళ్లి నేపథ్యంలో తీశారు. ఇందులో అభిషేక్, భ్రమరాంబిక జంటగా నటించారు ఇప్పటికే ట్రైలర్ విడుదల చేయగా.. ఈ నెల 17 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ పోస్టర్ను పంచుకున్నారు. ఈ వెబ్ సిరీస్కు సాయి వానపల్లి దర్శకత్వం వహించారు.2 days to go!Not just another love story… it’s an Anandalahari of fun, drama & heart!Oct 17th, witness how East meets West — in love, war & Flexi Raju style! 😎@sureshProdns @SouthBayLive#aha #SureshProductionsmini pic.twitter.com/AuSbATe8uz— ahavideoin (@ahavideoIN) October 15, 2025 -
నెలలోపే ఓటీటీలోకి మంచు లక్ష్మీ థ్రిల్లర్ సినిమా
మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీలోకి వచ్చిన మంచు లక్ష్మీ.. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ చెప్పుకోదగ్గ సినిమాలే రీసెంట్ టైంలో ఏం రాలేదు. కొన్నాళ్ల క్రితం ఓటీటీ కోసం హిందీలో ఓ షో చేసింది గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. గత నెలలో లీడ్ రోల్ చేసిన ఓ తెలుగు సినిమా రిలీజైంది. ఇప్పుడది ఓటీటీలోకి కూడా వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి విజయ్ ఆంటోనీ పొలిటికల్ థ్రిల్లర్)మంచు లక్ష్మీ పోలీస్గా ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'దక్ష'. మోహన్ బాబు అతిథి పాత్రలో కనిపించారు. మర్డరీ మిస్టర్ థ్రిల్లర్ స్టోరీతో తీశారు. సెప్టెంబరు 19న థియేటర్లలోకి వస్తే.. వచ్చిన విషయం కూడా చాలామందికి తెలియనంత వేగంగా వెళ్లిపోయింది. ఇప్పుడు అక్టోబరు 17 నుంచి అంటే ఈ శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని మంచు లక్ష్మీనే ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. మరి బిగ్ స్క్రీన్పై తేలిపోయిన ఈ చిత్రం.. ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి?'దక్ష' విషయానికొస్తే.. హైదరాబాద్లో ఓ వ్యక్తి అనుమానాస్పద రీతిలో మరణిస్తాడు. ఆ కేసును సీఐ దక్ష (లక్ష్మీ మంచు) ఇన్వెస్టిగేట్ చేస్తుంది. తర్వాత అమెరికా నుంచి వచ్చిన ఓ ఫార్మా కంపెనీ ప్రతినిధి హత్యకు గురవుతాడు. ఈ రెండు కేసుల్లో క్లూస్ ఒకేలా ఉంటాయి. మరోవైపు దక్ష మీద డాక్యుమెంటరీ తీయాలని జర్నలిస్ట్ సురేష్ (జెమినీ సురేష్) ఆమెని ఫాలో అవుతూ ఉంటాడు. అతడు సేకరించిన సమాచారంతో నమ్మశక్యం కాని ఓ నిజం వెలుగులోకి వస్తుంది. ఇంతకీ హత్యలు చేసింది ఎవరు? దక్ష, మిథిలా (చిత్రా శుక్లా)కు సంబంధం ఏంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ సర్వైవల్ థ్రిల్లర్.. డోంట్ మిస్) -
ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ సర్వైవల్ థ్రిల్లర్.. డోంట్ మిస్
కల్పిత కథలతో సినిమాలు తీయడం సులభమే. కానీ నిజ జీవిత సంఘటనల ఆధారంగా మూవీస్ తీసి హిట్ కొట్టడం చాలా కష్టం. కొన్నిసార్లు మాత్రం ఇలా తీసి బ్లాక్ బస్టర్ కొడుతుంటారు లేదంటే చూసే ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ అందిస్తుంటారు. ఈ మధ్య అలా వచ్చిన 'ద లాస్ట్ బస్' అనే చిత్రం మూవీ లవర్స్కి మంచి అనుభూతి ఇస్తూ తెగ నచ్చేస్తోంది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి విజయ్ ఆంటోనీ పొలిటికల్ థ్రిల్లర్)కథేంటి?అది 2018. అమెరికాలోని కాలిఫోర్నియా. కెవిన్ (మాథ్యూ మెక్ కొనాగే) స్కూల్ బస్ డ్రైవర్. ఇతడికి నడవలేని స్థితిలో ఉండే తల్లి, టీనేజ్ కొడుకు ఉంటారు. ఓ రోజు డ్యూటీలో భాగంగా పిల్లల్ని స్కూల్లో దింపేసి కెవిన్.. ఇంటికి తిరిగొచ్చే దారిలో ఉంటాడు. అప్పుడే ఆ ప్రాంతమంతా కార్చిచ్చు అంటుకుంటుంది. దీంతో స్కూల్లో ఉన్న 22 మంది పిల్లల్ని మరోచోటకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కెవిన్పై పడుతుంది. ఓవైపు ఊళ్లకు ఊళ్లు తగలబడిపోతుంటాయి. మరోవైపు కెవిన్.. ఈ పిల్లలందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించాలి? మరి కెవిన్ ఏం చేశాడు? చివరకు పిల్లలతో పాటు బతికి బయటపడ్డాడా లేదా అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఈ సినిమాని నిజంగా జరిగిన సంఘటనల స్ఫూర్తితో తీశారు. 2018లో కాలిఫోర్నియాలో కార్చిచ్చులో 85 మంది చనిపోయారు. వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. వందలాది మంది నిరాశ్రయులు అయ్యారు. ఊళ్లకు ఊళ్లు బూడిదయ్యాయి. ఇదంతా జరుగుతున్న సమయంలోనే కెవిన్ అనే సాధారణ స్కూల్ బస్ డ్రైవర్.. ఊళ్లని తగలబెట్టేసే మంటల్ని దాటుకుని 22 మంది పిల్లల్ని సాహసోపేతంగా ఎలా కాపాడాడనేదే 'ద లాస్ట్ బస్' మూవీ.పేరుకే ఇది సినిమా. కానీ చూస్తున్నప్పుడు ఏ మాత్రం అలా అనిపించదు. చాలా రియలస్టిక్గా ఉంటుంది. మనం కూడా ఆ బస్సులోనే ఉన్నామా అని ఫీలింగ్ కలుగుతుంది. అసలు ఈ రేంజు విజువల్స్, గ్రాఫిక్స్ ఎలా తీశార్రా అని కచ్చితంగా సందేహం వస్తుంది. ఎందుకంటే ఏ ఒక్క సీన్ కూడా గ్రాఫిక్స్లా అనిపించదు. ఫస్టాప్ చూస్తున్నప్పుడు డాక్యుమెంటరీ ఫీలింగ్ వస్తుంది గానీ సెకండాఫ్కి వచ్చేసరికి సర్వైవల్ థ్రిల్లర్ జానర్లోకి వస్తుంది. తర్వాత ఏమవుతుందా అనే టెన్షన్ మనల్ని కుదురుగా కూర్చోనివ్వదు.ఏదైనా ఆపద వచ్చినప్పుడు 'ప్రెజెన్స్ ఆఫ్ మైండ్' అనేది చాలా కీలకం. ఇందులో బస్ డ్రైవర్ కెవిన్ ఆలోచన విధానం చూస్తే అదే గుర్తొస్తుంది. తొందరపడటం కంటే కొన్నిసార్లు ఏం చేయకుండా అలా ఉండటం కూడా ఒకందుకు మంచిదే అనేలా ఓ సీన్ ఉంటుంది. కానీ కార్చిచ్చు వీళ్ల దగ్గరకు కూడా వచ్చేసరికి మంటల్లోని బస్ పోనిచ్చే సీన్ అయితే ప్రీ క్లైమాక్స్లో గూస్ బంప్స్ తెప్పిస్తుంది. చివరకొచ్చేసరికి హ్యాపీ ఎండింగ్తోనే ముగించడం సంతోషం.సినిమాలో కనిపించిన నటీనటులు ఎవరూ మనకు తెలియదు. కానీ వాళ్లతో పాటు మనం కూడా ట్రావెల్ అవుతాం. అయితే సినిమాలో ఎమోషన్స్, డ్రామా లాంటివి ఇంకా పెట్టొచ్చు కానీ దర్శకుడు ఆ పనిచేయలేదు. అది మాత్రం కాస్త వెలితిగా అనిపిస్తుంది. సెప్టెంబరు 19న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కాగా.. అక్టోబరు 03 నుంచి ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఇంగ్లీష్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. కుటుంబంతోనూ చూడొచ్చు. ఒకవేళ మంచి సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ కావాలనుకుంటే మాత్రం దీన్ని అస్సలు మిస్ చేయొద్దు.- చందు డొంకాన(ఇదీ చదవండి: 'కురుక్షేత్ర' రివ్యూ.. ఓటీటీలో అస్సలు మిస్ అవ్వొద్దు) -
ఓటీటీలోకి విజయ్ ఆంటోనీ పొలిటికల్ థ్రిల్లర్
ఏడాదిలో కచ్చితంగా మూడు నాలుగు సినిమాలైన తీసే విజయ్ ఆంటోనీ.. ఈ ఏడాది ఇప్పటికే 'మార్గన్' అనే మూవీతో వచ్చాడు. థియేటర్లలో ఆడనప్పటికీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చింది. గత నెలలో 'భద్రకాళి' అనే డబ్బింగ్ బొమ్మతో వచ్చాడు. థియేటర్లలో దీనికి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. దీంతో ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది.(ఇదీ చదవండి: 'కురుక్షేత్ర' రివ్యూ.. ఓటీటీలో అస్సలు మిస్ అవ్వొద్దు)స్వతహాగా సంగీత దర్శకుడైన విజయ్ ఆంటోనీ.. 'బిచ్చగాడు'తో హిట్ కొట్టి తమిళంతో పాటు తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత చాలా సినిమాలు తీస్తున్నాడు గానీ వర్కౌట్ కావట్లేదు. ఇప్పుడు అరుణ్ ప్రభు దర్శకత్వంలో 'భద్రకాళి' అనే పొలిటికల్ థ్రిల్లర్ చేశాడు. ఇందులో హీరోగా నటించడంతో పాటు సంగీతం, నిర్మాణం కూడా విజయ్ ఆంటోనీదే. సెప్టెంబరు 5న ఈ చిత్రం థియేటర్లలోకి రాగా.. వచ్చే శుక్రవారం(అక్టోబరు 24) నుంచి హాట్స్టార్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు.'భద్రకాళి' విషయానికొస్తే.. కిట్టు (విజయ్ ఆంటోనీ) సెక్రటేరియట్లో ఓ పవర్ బ్రోకర్. ప్రభుత్వంలోని ఎలాంటి పని అయినా సరే చిటికలే చేసి పెడుతుంటాడు. అలా ఓసారి కేంద్ర మంత్రి లతకు సంబంధించిన రూ.800 కోట్ల భూముల వ్యవహారంలో వేలు పెడతాడు. అంతా సవ్యంగానే జరిగినా చివరలో ఓ ఎమ్మెల్యే హత్య జరగడం, దాని వల్ల లతకు రాజకీయంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఏం జరిగిందా అని ఆరా తీయగా.. కిట్టు గురించి, అతడు వెనకేసిన రూ.6,200 కోట్ల గురించి తెలుస్తుంది. అసలు కిట్టు ఎవరు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు) -
సస్పెన్స్కు తెర.. రూ.300 కోట్ల సినిమా ఓటీటీ ఫ్లాట్ఫామ్ ఫిక్స్!
కల్యాణి ప్రియదర్శన్ కీలక పాత్రలో వచ్చిన చిత్రం 'లోకా'. మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమాని తెలుగులో 'కొత్త లోక' పేరుతో రిలీజ్ చేశారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లు వసూళ్లు సాధించినట్లు ఇటీవలే పోస్టర్ పంచుకున్నారు మేకర్స్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ చిత్రం మలయాళంలో ఆగస్టు 28న రిలీజైంది. ఆ తర్వాత తెలుగులో ఒక రోజు ఆలస్యంగా విడుదలైంది. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా ఫర్వాలేదనిపించింది.అయితే ఈ సినిమా ఇప్పటి వరకు ఓటీటీకి రాలేదు. ఈ మూవీ రిలీజై 50 రోజులు కావొస్తోంది. పెద్ద పెద్ద సినిమాలే కేవలం నాలుగైదు వారాల్లోనే స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. అలాంటిది ఈ సినిమా ఇంకా ఓటీటీకి రాలేదు. ఈ మూవీ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలోనే ఓటీటీకి రానుందని వార్తలొచ్చినా అలాంటిదేం జరగలేదు. రూమర్స్ రావడంతో దుల్కర్ సైతం ఓటీటీ రిలీజ్పై క్లారిటీ ఇచ్చారు.తాజాగా కొత్త లోక స్ట్రీమింగ్ ఓటీటీ ఫ్లాట్ఫామ్ను రివీల్ చేశారు. జియో హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. త్వరలోనే రిలీజ్ తేదీని రివీల్ చేస్తామని పోస్టర్ పంచుకున్నారు. దీంతో కొత్త లోక మూవీ కోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్లో సస్పెన్స్కు తెరపడింది. (ఇది చదవండి: హీరోయిన్కి సూపర్ పవర్స్ ఉంటే.. 'కొత్త లోక' రివ్యూ)కొత్త లోక కథేంటంటే..'లోక' విషయానికొస్తే.. చంద్ర (కల్యాణి ప్రియదర్శన్) సూపర్ పవర్స్ ఉన్న ఓ అమ్మాయి. ఈమె గురించి కొందరికి తెలుసు. ఓ సందర్భంలో చంద్ర, బెంగళూరు రావాల్సి వస్తుంది. తన పవర్స్ బయటపెట్టకుండా సాధారణ అమ్మాయిలా బతుకుతుంది. రాత్రిపూట ఓ కేఫ్లో పనిచేస్తుంటుంది. ఎదురింట్లో ఉంటే సన్నీ(నస్లేన్).. ఈమెని చూసి లవ్లో పడతాడు. పరిస్థితులు కలిసొచ్చి ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. కానీ ఓ రోజు రాత్రి జరిగిన సంఘటనల దెబ్బకు చంద్ర జీవితం తలకిందులవుతుంది. ఇంతకీ చంద్ర గతమేంటి? ఎస్ఐ నాచియప్ప(శాండీ)తో గొడవేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. The beginning of a new universe.Lokah Chapter 1: Chandra — coming soon on JioHotstar.@DQsWayfarerFilm @dulQuer @kalyanipriyan @naslen__ @NimishRavi @SanthyBee#Lokah #LokahChapter1 #Wayfarerfilms #DulquerSalmaan #DominicArun #KalyaniPriyadarshan #Naslen #SuperheroFantasy… pic.twitter.com/BMlsbEJM0q— JioHotstar Malayalam (@JioHotstarMal) October 14, 2025 -
ఎన్టీఆర్ వార్-2.. బాక్సాఫీస్ నో క్రేజ్.. ఓటీటీలో సూపర్ రికార్డ్!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చిత్రం వార్-2((War2 Movie)). ఆగస్టు 14న థియేటర్లలోకి వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ మూవీలో హృతిక్ రోషన్ కూడా నటించారు. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా.. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో ఆదిత్య చోప్రా నిర్మించారు. ఈ సినిమాలో గేమ్ ఛేంజర్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా మెప్పించింది.అయితే ప్రస్తుతం వార్-2 ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అక్టోబరు 09 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కు వచ్చేసింది. తాజాగా ఈ చిత్రం డిజిటల్ ఫ్లాట్ఫామ్లో రికార్డ్ క్రియేట్ చేసింది. అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 12 వరకు ఇండియాలో అత్యధిక మంది వీక్షించిన సినిమాల జాబితాలో మొదటిస్థానంలో నిలిచింది. 3.5 మిలియన్ల వ్యూస్తో సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ క్రమంలోనే రజినీకాంత్ కూలీ, సన్ ఆఫ్ సర్దార్-2, మహావతార్ నర్సింహా, మదరాసి సినిమాలను దాటేసింది. ఈ విషయాన్ని ప్రముఖ ఆర్మాక్స్ మీడియా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.అయితే బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేని వార్-2 చిత్రానికి డిజిటల్ ఫ్లాట్ఫామ్లో మాత్రం ఆదరణ దక్కించుకుంటోంది. దీంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. ఈ చిత్రంలో అనిల్ కపూర్, అశుతోష్ రాణా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. Top 5 most-watched films on OTT in India, for the week of Oct 6-12, 2025, estimated based on audience researchNote: Estimated number of Indian audience (in Mn) who watched at least 30 minutes. pic.twitter.com/1a4ouoYh45— Ormax Media (@OrmaxMedia) October 13, 2025 -
ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
'దృశ్యం' సినిమా అనగానే చాలామందికి దర్శకుడు జీతూ జోసెఫ్ గుర్తొస్తాడు. ఎందుకంటే థ్రిల్లర్ జానర్లో ఈ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతడు ప్రస్తుతం మూడో పార్ట్ షూటింగ్తో బిజీగా ఉన్నాడు. అయితే జీతూ లేటెస్ట్ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కి సిద్దమైంది. ఇంతకీ ఈ థ్రిల్లర్ ఎప్పుడు ఓటీటీలోకి రానుంది? దీని సంగతేంటి అనేది చూద్దాం.జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'మిరాజ్'. అసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రలు పోషించారు. సెప్టెంబరు 19న రిలీజైన ఈ థ్రిల్లర్.. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అందుకుంది. ఇప్పుడు దీన్ని అక్టోబరు 20 నుంచి అంటే వచ్చే సోమవారం నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటనతో పాటు వీడియో కూడా విడుదల చేశారు. తెలుగులోనూ ఈ మూవీ అందుబాటులోకి రానుంది.(ఇదీ చదవండి: 'కురుక్షేత్ర' రివ్యూ.. ఓటీటీలో అస్సలు మిస్ అవ్వొద్దు)'మిరాజ్' విషయానికొస్తే.. ప్రేమించి పెళ్లి చేసుకుందామని అనుకున్న కిరణ్ (హకీమ్ షాజహాన్) సడన్గా అభిరామి (అపర్ణ బాలమురళి).. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తుంది. అప్పుడే కిరణ్.. రైలు ప్రమాదంలో చనిపోయాడనే విషయం తెలిసి షాక్ అవుతుంది. దీని నుంచి తేరుకునేలోపు ఓ పోలీస్ ఆఫీసర్ (సంపత్ రాజ్), ఓ రౌడీ (శరవణన్), ఓ ప్రైవేట్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ (ఆసిఫ్ అలీ).. అభిరామిని హార్డ్ డిస్క్ కోసం ప్రశ్నించడం మొదలుపెడతారు. ఇంతకీ ఆ హార్డ్ డిస్క్లో ఏముంది? కిరణ్కి ఏమైంది? వీళ్లందరి సాయంతో అభిరామి.. ఈ ప్రమాదం నుంచి బయటపడిందా లేదా అనేది మిగతా స్టోరీ.ఇకపోతే ఈ వారం 24 వరకు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో కిష్కింధపురి, హౌ టూ ట్రైన్ యువర్ డ్రాగన్, ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్, సంతోష్ చిత్రాలతో పాటు ఆనందలహరి అనే తెలుగు సిరీస్ ఉన్నంతలో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. ఇవి కాకుండా వీకెండ్లో సడన్ సర్ప్రైజులు కూడా ఉండొచ్చు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు) -
'కురుక్షేత్ర' రివ్యూ.. ఓటీటీలో అస్సలు మిస్ అవ్వొద్దు
మొన్నటివరకు సినిమా అంటే కచ్చితంగా నటీనటులు ఉండాలి, భారీ బడ్జెట్ పెట్టాలనేది అందరికీ తెలిసిన విషయం. కానీ 'మహావతార్ నరసింహా'.. దీన్ని బ్రేక్ చేసింది. సరికొత్త ట్రెండ్కి శ్రీకారం చుట్టింది. మొత్తం యానిమేషన్తో తీసిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించింది. వందల కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ తరహా యానిమేషన్తో ఇప్పుడు మహాభారతంలోని కురుక్షేత్ర ఘట్టానికి దృశ్యరూపం ఇచ్చారు. అలా 'కురుక్షేత్ర' పేరుతో వెబ్ సిరీస్గా ఓటీటీలోకి వచ్చింది.(ఇదీ చదవండి: Bigg Boss 9: వైల్డ్ కార్డ్స్ చేతిలో 'పవర్'.. ఆరోవారం నామినేషన్స్ లిస్ట్)ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో తెలుగులోనూ ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఉజాన్ గంగూలీ దర్శకుడు. 18 రోజుల పాటు జరిగిన కురుక్షేత్ర యుద్ధాన్ని 18 ఎపిసోడ్స్గా తెరకెక్కించారు. ఛాప్టర్-1 పేరుతో ఇప్పుడు తొమ్మిది ఎపిసోడ్స్ రిలీజ్ చేయగా.. ఈనెల 24న మిగిలిన తొమ్మిది ఎపిసోడ్స్ విడుదల చేయనున్నారు. మరి 'కురుక్షేత్ర' తొలి సీజన్ ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.'కురుక్షేత్ర' కథేంటి?అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేసిన తర్వాత పాండవులకు ఇచ్చిన మాట ప్రకారం కౌరవులు.. రాజ్యంలో వాటా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మాట తప్పుతారు. ఐదుగురికి ఐదు ఊళ్లు ఇవ్వడానికి కూడా నిరాకరిస్తారు. కృష్ణుడి సూచన మేరకు పాండవులు ఓపిగ్గానే ఉంటారు. సంజయుడితో కౌరవులకు రాయబారం పంపిస్తారు. కానీ అది విఫలమవుతుంది. కౌరవులు.. యుద్ధం పట్ల ఉత్సాహంగా ఉన్నారనే విషయం పాండవులకు తెలుస్తుంది. దీంతో కృష్ణుడు, అర్జునుడు వైపు.. కృష్ణుడి సైన్యం దుర్యోధనుడికి దక్కుతుంది. అలా 'కురుక్షేత్రం' మొదలవుతుంది. ఆయుధాలే పట్టనని అనుకున్న అర్జునుడు.. కృష్ణుడి గీతోపదేశం తర్వాత ఎలా మారాడు? ఈ యుద్ధంలో అసలేం జరిగిందనేది అసలు కథ?ఎలా ఉందంటే?మహాభారతం అంతులేని సబ్జెక్ట్. ఎంత చెప్పినా అస్సలు తరగదు. దీనిపై ఇప్పటికే పలు సినిమాలు, సీరియల్స్ వచ్చాయి. జనాలని అలరించాయి. నెట్ఫ్లిక్స్ మాత్రం 18 రోజుల పాటు జరిగిన యుద్ధాన్ని మాత్రమే తీసుకుని ఈ 'కురుక్షేత్ర' సిరీస్ తీసింది. ఒక్కముక్కలో చెప్పాలంటే అదిరిపోయింది. ముందే యానిమేటెడ్ సిరీస్ అని చెప్పేశారు కాబట్టి ఓ అంచనా ఉంటుంది. దాన్ని అందుకోవడంలో ఏ మాత్రం తగ్గలేదు. గ్రాఫిక్స్, తెలుగు డబ్బింగ్, కథని చెప్పే విధానం.. ఇలా ప్రతిదీ టాప్ రేంజులో ఉన్నాయి.(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'హృదయపూర్వం' సినిమా రివ్యూ (ఓటీటీ))అయితే ఉన్నది ఉన్నట్లు చెబితే చూసే ప్రేక్షకుడికి బోర్ కొట్టొచ్చు. అందుకే ఓవైపు యుద్ధాన్ని చూపిస్తూనే మరోవైపు ఫ్లాష్ బ్యాక్స్ కూడా చూపిస్తూ ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించారు. కౌరవుల దగ్గరకెళ్లి సంజయుడి రాయబారం చేసే సీన్స్తో తొలి ఎపిసోడ్ మొదలవుతుంది. రెండో ఎపిసోడ్కి యుద్ధం ప్రారంభమైపోతుంది. అక్కడి నుంచి భీష్ముడి మరణం, పద్మవ్యూహంలో బంధించి అభిమన్యుడిని కౌరవులు చంపడం, జయద్రధుడిని అర్జునుడు సంహరించే సీన్.. ఇలా గూస్ బంప్స్ ఇచ్చే సన్నివేశాలతో ఆద్యంతం అలరించేలా తీశారు.మహాభారతంలో పాత్రలు చాలా ఉంటాయి. వాటిని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. కానీ ఈ సిరీస్లో చాలా సులభంగా గుర్తుపెట్టుకునేలా అన్ని పాత్రల్ని తీర్చిదిద్దారు. ఎలాంటి సాగదీత లేకుండా క్లియర్ కట్గా సీన్స్ అన్ని చూపించారు. కాస్ట్యూమ్స్ గానీ కోటలు, రాజభవనాలు గానీ.. యుద్ధ సన్నివేశాలు గానీ ప్రతిదీ టాప్ క్వాలిటీతో తెరకెక్కించారు. తెలుగు డబ్బింగ్ కూడా ఫెర్ఫెక్ట్గా ఉంది. ఇప్పటి జనరేషన్కి మహాభారతం, కురుక్షేత్రం గురించి అస్సలు తెలియకపోవచ్చు. వాళ్లు గానీ ఈ సిరీస్ చూస్తే థ్రిల్ కావడంతో పాటు చాలా విషయాలు తెలుసుకుంటారు కూడా!ఈ సిరీస్లో మిగిలిన పాత్రల సంగతేమో గానీ కర్ణుడు పాత్ర చూస్తున్నప్పుడు మాత్రం ప్రభాస్ పోలికలు కనిపిస్తాయి. మరి మేకర్స్ కావాలని పెట్టారా లేదంటే అలా కుదిరేసిందో? ఏదేమైనా రీసెంట్ టైంలో 'మహాభారతం' ఆధారంగా సినిమాలు గానీ సిరీస్లు గానీ రాలేదు. ఓ రకంగా ఈ విషయం ఈ సిరీస్కి చాలా ప్లస్ పాయింట్. టైమ్ ఉంటే మాత్రం ఓటీటీలో ఉన్న ఈ జెమ్ని అస్సలు మిస్ కావొద్దు- చందు డొంకాన(ఇదీ చదవండి: ప్రతి 10 నిమిషాలకో ట్విస్ట్.. ఓటీటీలో పక్కా చూడాల్సిన సినిమా) -
కొత్త తెలుగు సినిమాలు.. డైరెక్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్
ఇప్పుడంతా ఓటీటీల జమానా నడుస్తోంది. థియేటర్లకు వెళ్లే జనాలు వెళ్తూనే ఉన్నారు. కాకపోతే చాలామంది.. ఓటీటీలో రిలీజైన తర్వాతే మొబైల్ లేదా టీవీల్లో కొత్త సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే పలు సంస్థలు కూడా కేవలం ఓటీటీల్లో కొన్నింటిని నేరుగా విడుదల చేస్తున్నాయి. ఇప్పుడు అలానే నెట్ఫ్లిక్స్ సంస్థ తమ దానిలో రాబోయే పలు తెలుగు, తమిళ చిత్రాలు, వెబ్ సిరీసుల గురించి అధికారిక ప్రకటన చేసింది.'ఓజీ'తో రీసెంట్గా హిట్ కొట్టిన ప్రియాంక మోహన్ చేసిన తమిళ మూవీ 'మేడ్ ఇన్ కొరియా'. గత కొన్నాళ్ల నుంచి కొరియన్ చిత్రాలు, సిరీస్లకు చాలామంది అమ్మాయిలు ఫ్యాన్స్ అయిపోతున్నారు. అలాంటి ఓ అమ్మాయి కొరియా వెళ్లిన తర్వాత ఏం జరిగిందనే కాన్సెప్ట్తో ఈ సినిమా తీసినట్లు కనిపిస్తుంది. ఆర్ఏ కార్తీక దీనికి దర్శకుడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు)ఆనంద్ దేవరకొండ, 'లాపతా లేడీస్' ఫేమ్ నితాన్షీ గోయల్ జంటగా నటించిన సినిమా 'తక్షకుడు'. వేటగాడి చరిత్రలో జింకపిల్లలే నేరస్థులు అనే ట్యాగ్ లైన్తో రాబోతుంది. పోస్టర్ చూస్తుంటే ఇదో రూరల్ బ్యాక్ డ్రాప్లో జరిగే యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. గతంలో ఆనంద్ దేవరకొండతోనే 'మిడిల్ క్లాస్ మెలోడీస్' అనే మూవీ తీసిన వినోద్ అనంతోజు దీనికి దర్శకుడు.సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటించిన తెలుగు సిరీస్ 'సూపర్ సుబ్బు'. మిథిలా పాల్కర్, మురళీ శర్మ ఇతర పాత్రలు చేస్తున్నారు. ఓ టీచర్.. పల్లెటూరికి వెళ్లి స్కూల్లో పిల్లలకు సె*క్స్ ఎడ్యుకేషన్ నేర్పించాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనేది ఫన్నీగా చూపించబోతున్నారు. ఎనిమిది నెలల క్రితం ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఈ చిత్రాలన్నీ కూడా త్వరలో నెట్ఫ్లిక్స్లో మాత్రమే స్ట్రీమింగ్ కాబోతున్నాయని చెప్పారు. మరి ఈ ఏడాదిలోనే రిలీజ్ చేస్తారా? వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకొస్తారా అనేది చూడాలి.(ఇదీ చదవండి: Bigg Boss 9: ఫ్లోరా ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతంటే?) -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు
వచ్చేవారం మొదట్లోనే దీపావళి పండగ ఉంది. దీంతో ఈ వీకెండ్ నాలుగు తెలుగు సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. వీటిలో మిత్రమండలి, తెలుసు కదా, డ్యూడ్, కె ర్యాంప్ చిత్రాలు ఉన్నాయి. వీటన్నింటిపైనా కాస్తోకూస్తో బజ్ ఉండనే ఉంది. మరోవైపు ఓటీటీల్లోనూ 24 వరకు కొత్త మూవీస్-వెబ్ సిరీసులు అందుబాటులోకి రానున్నాయి. వీటిలోనూ చూడదగ్గ చిత్రాలు కొన్ని ఉన్నాయండోయ్.(ఇదీ చదవండి: ఫ్లోరా ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతంటే?)ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోయే వాటిలో కిష్కింధపురి, హౌ టూ ట్రైన్ యువర్ డ్రాగన్, ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్, సంతోష్ చిత్రాలతో పాటు ఆనందలహరి అనే తెలుగు సిరీస్ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తోంది. ఇవి కాకుండా వీకెండ్లో సడన్ సర్ప్రైజులు కూడా ఉండొచ్చు. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందంటే?ఓటీటీల్లో ఈ వారం రిలీజయ్యే మూవీస్ (అక్టోబరు 13 నుంచి 19 వరకు)హాట్స్టార్హౌ టూ ట్రైన్ యువర్ డ్రాగన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబరు 13ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్ లైన్స్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - అక్టోబరు 16స్ట్రైకింగ్ రెస్క్యూ (చైనీస్ మూవీ) - అక్టోబరు 16నెట్ఫ్లిక్స్ఎవ్రిబడి లవ్స్ మూవీ వెన్ ఐయామ్ డెడ్ (థాయ్ సినిమా) - అక్టోబరు 14ఇన్సైడ్ ఫ్యూరియోజా (పోలిష్ మూవీ) - అక్టోబరు 15బ్యాడ్ షబ్బోస్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 16ద టైమ్ దట్ రిమైన్స్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 16ద ట్విట్స్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 1627 నైట్స్ (స్పానిష్ మూవీ) - అక్టోబరు 17గుడ్ న్యూస్ (కొరియన్ సినిమా) - అక్టోబరు 17గ్రేటర్ కాలేష్ (హిందీ సిరీస్) - అక్టోబరు 17షీ వాక్స్ ఇన్ డార్క్నెస్ (స్పానిష్ సినిమా) - అక్టోబరు 17ద ఫెర్ఫెక్ట్ నైబర్ (ఇంగ్లీష్ చిత్రం) - అక్టోబరు 17అమెజాన్ ప్రైమ్కల్ప నేస్ట్రా (స్పానిష్ మూవీ) - అక్టోబరు 16ఆహాఆనందలహరి (తెలుగు సిరీస్) - అక్టోబరు 17జీ5కిష్కింధపురి (తెలుగు సినిమా) - అక్టోబరు 17భగవాన్ ఛాప్టర్ 1: రాక్షస్ (హిందీ మూవీ) - అక్టోబరు 17ఎలుమలే (కన్నడ సినిమా) - అక్టోబరు 17మేడమ్ సేన్ గుప్తా (బెంగాలీ మూవీ) - అక్టోబరు 17అభయంతర కుట్టవాళి (మలయాళ సినిమా) - అక్టోబరు 17సన్ నెక్స్ట్ఇంబమ్ (మలయాళ మూవీ) - అక్టోబరు 17ఆపిల్ ప్లస్ టీవీలూట్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 15లయన్స్ గేట్ ప్లేసంతోష్ (హిందీ సినిమా) - అక్టోబరు 17వుయ్ లివ్ ఇన్ టైమ్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 17(ఇదీ చదవండి: నాలుగేళ్లుగా శ్రీనివాస్తోనే.. నరకం చూడని రోజంటూ లేదు: మాధురి) -
ఓటీటీల్లోకి వచ్చిన 37 సినిమాలు.. ఈ వీకెండ్ పండగే
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి పలు చిన్న సినిమాలు వచ్చాయి గానీ ఒక్కదానికి కూడా పాజిటివ్ టాక్ రాలేదు. మరోవైపు ఓటీటీల్లో మాత్రం ఈ శుక్రవారం(అక్టోబరు 10).. 35కి పైగా కొత్త మూవీస్-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్లోకి వచ్చేశాయి. (ఇదీ చదవండి: అక్క- బావ కాళ్లకు మొక్కిన నార్నె నితిన్.. వీడియో వైరల్)వీటిలో వార్ 2, మిరాయ్, లీగల్లీ వీర్, గది, త్రిబాణధారి బార్బరిక్ తదితర తెలుగు సినిమాలతో పాటు పరమ్ సుందరి అనే హిందీ మూవీ.. కురుక్షేత్ర, సెర్చ్ అనే తెలుగు డబ్బింగ్ సిరీస్లు ఉన్నంతలో ఆకట్టుకుంటున్నాయి. తెలుగువి మాత్రమే చూద్దామనుకుంటే వీటిని ట్రై చేయొచ్చు. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే?అమెజాన్ ప్రైమ్గది - తెలుగు సినిమాత్రిబాణధారి బార్బరిక్ - తెలుగు చిత్రంపరమ్ సుందరి - హిందీ మూవీబాంబ్ - తమిళ సినిమారిప్పన్ స్వామి - కన్నడ మూవీఎడ్ షరీన్ - ఇంగ్లీష్ సిరీస్ఎల్లిగే పయన ఎవుదో దారి - కన్నడ మూవీజాన్ క్యాండీ - ఇంగ్లీష్ సినిమాద హోమ్ - ఇంగ్లీష్ మూవీథిక్కర్ దాన్ వాటర్ - నైజీరియన్ సినిమాహాట్స్టార్మిరాయ్ - తెలుగు సినిమా9-1-1 సీజన్ 9 - ఇంగ్లీష్ సిరీస్గ్రేస్ అనాటమీ సీజన్ 22 - ఇంగ్లీష్ సిరీస్సెర్చ్: ద నైనా మర్డర్ కేస్ - తెలుగు డబ్బింగ్ సిరీస్సోలార్ ఆపోజిట్ సీజన్ 1-3 - ఇంగ్లీష్ సిరీస్టీమ్ మెక్బట్స్: ఎనిమల్ రెస్క్యూ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్నెట్ఫ్లిక్స్వార్ 2 - తెలుగు డబ్బింగ్ మూవీకురుక్షేత్ర - తెలుగు డబ్బింగ్ సిరీస్మై ఫాదర్ ద బీటీకే కిల్లర్ - ఇంగ్లీష్ సినిమాస్విమ్ టూ మీ - స్పానిష్ మూవీద చూజన్ - ఇంగ్లీష్ సిరీస్ద ఉమన్ ఇన్ కాబిన్ 10 - ఇంగ్లీష్ సినిమాఓల్డ్ మనీ - టర్కిష్ సిరీస్సన్ నెక్స్ట్రాంబో - తమిళ మూవీజీ5ఏ మ్యాచ్ - మరాఠీ సినిమాఅక్షర్ధమ్ - హిందీ మూవీవెదువన్ - తమిళ సిరీస్ఆహాగంధి కన్నడి - తమిళ సినిమామనోరమ మ్యాక్స్సాహసం - మలయాళ మూవీవన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వజ్ ఏ కల్లన్ - మలయాళ సినిమాఆపిల్ టీవీ ప్లస్నైఫ్ ఎడ్జ్ - ఇంగ్లీష్ సిరీస్ద లాస్ట్ ఫ్రంటియర్ - ఇంగ్లీష్ సిరీస్బుక్ మై షోవాళియే - కన్నడ సినిమాఎమ్ఎక్స్ ప్లేయర్జమ్నపార్ సీజన్ 2 - హిందీ సిరీస్వెడ్డింగ్ ఇంపాజిబుల్ - తెలుగు డబ్బింగ్ సిరీస్లయన్స్ గేట్ ప్లేలీగల్లీ వీర్ - తెలుగు మూవీఇన్టూ ద డీప్ - తెలుగు డబ్బింగ్ సినిమా(ఇదీ చదవండి: మొన్న విజయ్..నేడు రష్మిక.. అలా బయటపెట్టేశారుగా!) -
ఓటీటీలోకి సెడెన్గా వచ్చేసిన 'జాన్వీ కపూర్' సినిమా
రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో సిద్ధార్థ్ మల్హోత్రా( Sidharth Malhotra), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా నటించిన హిందీ చిత్రం ‘పరమ్ సుందరి’(Param Sundari). ఎలాంటి ప్రకటన లేకుండానే సడెన్గా ఓటీటీలోకి ఈ చిత్రం వచ్చేసింది. ఆగష్టు 29న విడుదలైన ఈ చిత్రం కేరళ ప్రేక్షకుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ అనుకున్నంత రేంజ్లో బాలీవుడ్లో కూడా మెప్పించలేదు. కానీ, కలెక్షన్స్ పరంగా మాత్రం పర్వాలేదనిపించింది. తుషార్ జలోటా దర్శకత్వం వహించగా దినేష్ విజన్ నిర్మించారు.‘పరమ్ సుందరి’ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన మాత్రమే అందుబాటులో ఉంది. పరమ్ సుందరిని చూడాలంటే రూ.349 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మూవీలో కేరళ అమ్మాయిగా జాన్వీ, ఢిల్లీ అబ్బాయిగా సిద్ధార్థ్ కనిపించారు. ఉత్తరాదికి చెందిన హీరోయిన్ను మలయాళ యువతిగా చూపించడంపై కేరళలో కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. దానికి జాన్వీ కూడా వివరణ ఇచ్చింది. మలయాళ సంస్కృతి అంటే తనకు చాలా ఇష్టమని పేర్కొంది. ఈ చిత్రంలో తమిళ యువతిగా కూడా ఆమె కనిపిస్తుంది. రూ. 60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 90 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. -
ఓటీటీలో హిట్ సినిమా'కిష్కింధపురి'.. స్ట్రీమింగ్ ప్రకటన
బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన హారర్ సినిమా 'కిష్కింధపురి'(Kishkindhapuri ) ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. సెప్టెంబర్ 12న విడుదలైన ఈ చిత్రం భారీ విజయం సొంతం చేసుకోవడంతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కించికుంది. దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ దుమ్మురేపింది.'కిష్కింధపురి' చిత్రం జీ5 వేదికగా అక్టోబర్ 17 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ఒక పోస్టర్ను విడుదల చేశారు. అయితే, సాయంత్రం 6 గంటల నుంచి స్ట్రీమింగ అవుతుందని ఆ సంస్థ పేర్కొంది. ఆపై అక్టోబర్ 19 సాయంత్రం జీ టీవీలో ఈ మూవీని ప్రదర్శించనున్నట్లు ప్రకటించింది. సుమారు రూ. 20 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 30 కోట్లకు పైగానే రాబట్టింది. ఇప్పుడు ఓటీటీ ఢీల్ కూడా భారీ ధరకే కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఏదేమైన బెల్లంకొండ శ్రీనివాస్ , అనుపమ పరమేశ్వరన్ మరోసారి మ్యాజిక్ చేశారని చెప్పవచ్చు.కథేంటి?రాఘవ్ (బెల్లంకొండ శ్రీనివాస్), మైథిలి (అనుపమ పరమేశ్వరన్) ప్రేమికులు. మరో స్నేహితుడితో కలిసి ఘోస్ట్ వాకింగ్ టూర్స్ చేస్తుంటారు. దీనికి బయట నుంచి కొందరు వ్యక్తులు వస్తుంటారు. వీళ్లందరూ కలిసి జన సంచారం లేని కొన్ని ప్రదేశాలకు వెళ్తుంటారు. ఓ సందర్భంలో 'సువర్ణమాయ' అనే పాడుబడ్డ రేడియో స్టేషన్కి 11 మంది వెళ్తారు. కానీ అక్కడికి వెళ్లొచ్చిన తర్వాత ఊహించని రీతిలో ముగ్గురు చనిపోతారు. అనంతరం ఈ బృందంలోని ఓ చిన్నారి.. దెయ్యానికి టార్గెట్ అవుతుంది. ఇంతకీ వీళ్లని చంపుతున్న దెయ్యం ఎవరు? రాఘవ ఏం చేశాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. -
ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్బస్టర్ మూవీ
కొన్ని సినిమాలు ఒక్కసారి చూస్తే చాలు.. కానీ, కొన్ని మాత్రం వన్స్మోర్ అనిపించేలా ఉంటాయి. మిరాయ్ మూవీ (Mirai Movie) కూడా అదే కోవలోకి వస్తుంది. యాక్షన్, ఎమోషన్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్.. ఇలా అన్నింటి మేళవింపులతో ఈ మూవీ తెరకెక్కింది. తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించగా రితికా నాయక్ హీరోయిన్గా యాక్ట్ చేసింది. మంచు మనోజ్ విలన్గా మెప్పించాడు. గౌర హరి సంగీతం అందించాడు. ఓటీటీలో మిరాయ్సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ముందస్తు డీల్ ప్రకారం నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జియోహాట్స్టార్లో శుక్రవారం (అక్టోబర్ 10) రిలీజైంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. శ్రియ, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరి ఓటీటీలో ఈ సినిమా ఏమేరకు అదరగొడుతుందో చూడాలి! ఈరోజు మిరాయ్ ఒక్కటే కాదు, సన్ నెక్స్ట్లో త్రిబాణధారి బార్బరిక్, నెట్ఫ్లిక్స్లో కురుక్షేత్రం అనే యానిమేడెట్ సిరీస్ కూడా రిలీజయ్యాయి. అటు వార్ 2 మూవీ గురువారమే (అక్టోబర్ 9) నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. వీకెండ్లో మీకు నచ్చిన సినిమాలపై ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by JioHotstar Telugu (@jiohotstartelugu) చదవండి: అందుకే బిగ్బాస్ ఇంటికి తాళం.. రెండురోజుల్లో మళ్లీ షురూ -
మహారాణి మళ్లీ వస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చాక వెబ్ సిరీస్లకు విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. క్రైమ్ థ్రిల్లర్ వాటికైతే ఎక్కువమంది ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. వీటితో పాటు పొలిటికల్ థ్రిల్లర్స్కు సైతం విశేష ప్రేక్షకాదారణ ఉంటోంది. అలా రాజకీయ కోణంలో వచ్చి.. సూపర్ హిట్గా నిలిచిన పొలిటికల్ సిరీస్ మహారాణి(Maharani Season4). ఇప్పటికే మూడు సీజన్స్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుంది. తాజాగా మరో సీజన్ స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది.బాలీవుడ్ స్టార్ హ్యుమా ఖురేషీ (Huma Qureshi) ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. చదువు రాని ఓ గృహిణి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన రాణి భారతి (హ్యుమా ఖురేషి) జీవిత ప్రయాణాన్ని ఇందులో చూపించారు. ఈ వెబ్ సిరీస్కు పునీత్ ప్రకాశ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా మహారాణి సీజన్ 4 స్ట్రీమింగ్ డేట్ను అనౌన్స్ చేశారు. నవంబర్ 7వ తేదీ నుంచి సోని లివ్లో ప్రసారం కానుందంటూ ట్రైలర్ను షేర్ చేశారు మేకర్స్.తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచింది. ఎలాంటి భయం లేకుండా ఉండే ముఖ్యమంత్రి రాణి భారతిగా హ్యుమా ఖురేషి తన రాష్ట్ర ప్రజలను కాపాడుకోవటానికి ఎంత దూరమైనా వెళ్లే పవర్ఫుల్ పాత్రలో అలరించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త సీజన్లో రాణి భారతి పాట్నాను వదిలి.. ఢిల్లీ రాజకీయాలకు వెళ్లనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. The lioness returns to defend her home! Rani gears up for her biggest battle yet.#Maharani4 streaming from 7th Nov only on Sony LIV#MaharaniOnSonyLIV pic.twitter.com/Xzkt7owqrp— Sony LIV International (@SonyLIVIntl) October 9, 2025 -
'అర్జున్ దాస్, శివాత్మిక'ల సినిమా ఆరు ఓటీటీల్లో స్ట్రీమింగ్
తమిళ నటుడు అర్జున్ దాస్, రాజశేఖర్ కూతురు శివాత్మిక నటించిన 'బాంబ్' సినిమా ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. విశాల్ వెంకట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కోలీవుడ్లో సెప్టెంబర్ 12న విడుదలై మంచి విజయం సాధించింది. కాళి వెంకట్, నాజర్, అభిరామి, సింగంపులి, బాలశరవణన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. పాజిటివ్ టాక్స్తో రన్ అయిన ఈ మూవీకి 8.2 ఐఎండీబీ రేటింగ్తో గుర్తింపు పొందింది.‘బాంబ్’ సినిమా ఏకంగా ఆరు ఓటీటీలలోకి రాబోతుంది. అమెజాన్ ప్రైమ్, ఆహా తమిళ్, సింప్తీ సౌత్, షార్ట్ఫ్లిక్స్, బ్లాక్షీప్, బ్రియో వంటి సంస్థలలో అక్టోబర్ 10న విడుదల కానుంది. అర్జున్ దాస్, శివాత్మిక రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ థ్రిల్లర్ మూవీ సరికొత్త కథతో మెప్పించింది.బాంబ్ సినిమా ఓ థ్రిల్లర్ కాన్సెప్ట్తో ఉంటుంది. ఒకే గ్రామం కాలపట్టి, కమ్మైపట్టి అనే రెండు చిన్న గ్రామాలుగా విడిపోయి గొడవలు పడుతుంటారు. ఆ గ్రామంలో దేవుణ్ని నమ్మని కతిరావన్ (కాళీ వెంకట్) అనుకోకుండా చనిపోతాడు. అయితే, అతణ్ని రెండు గ్రామాల మధ్యలో ఉన్న ఒక చెట్టు దగ్గర కూర్చోబెడుతారు. కానీ మణిముత్తు (అర్జున్ దాస్) మాత్రం తన ఫ్రెండ్ కతిరావన్ చనిపోలేదని నమ్ముతాడు. కానీ, మిగిలిన వారందరూ అతడు చనిపోయాడనుకుని ఏడుస్తుంటే.. అతడు సడన్గా అపానవాయువు(Fart) వదులుతుంటాడు. దీంతో అతడు చనిపోయాడా లేదా అనే ఆందోళనలో గ్రామస్థులు ఉంటారు. ఇంతకూ అతను చనిపోయాడా లేదా.. ఒకవేళ చనిపోతే అలా ఎందుకు చేస్తున్నాడు అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. -
OTT: ఓటీటీలో దూసుకెళ్తున్న తెలుగు హారర్ మూవీ
కొన్ని సినిమాలు థియేటర్స్లో కంటే ఓటీటీలోనే ఎక్కువ బాగా ఆడతాయి. ముఖ్యంగా చిన్న సినిమాలకు ఓటీటీ వరంలా మారింది. కంటెంట్ ఉంటే చాలు.. కాస్టింగ్ని పట్టించుకోకుండా సినిమాను ఆదరిస్తున్నారు. ఇప్పటికే పలు చిన్న చిత్రాలు ఓటీటీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ తెలుగు హారర్ సినిమా కూడా ఓటీటీలో రిలీజై సూపర్ హిట్గా నిలిచింది. అదే ‘బకాసుర రెస్టారెంట్’(Bakasura Restaurant ). పలు సినిమాల్లో కమెడియన్గా నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ ఈ చిత్రంలో లీడ్ రోల్ చేశాడు. ఈ ఏడాది ఆగస్ట్లో థియేటర్స్లో రిలీజై మంచి టాక్ని సంపాదించుకున్న ఈ చిత్రం..ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న టాప్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. కన్నప్ప, పరద, కూలి లాంటి సినిమాలను సైతం వెనక్కి నెట్టి, వరుసగా 24 రోజులుగా టాప్ 10లోనే ఉండడం గమనార్హం. అంతేకాదు ఇప్పటికే 250 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిందంటే.. ఈ సినిమాను ఓటీటీ ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆదరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చను.పెద్ద సినిమాల నడుమ నిలబడటం చాలా కష్టమని అందరూ అనుకునే పరిస్థితిలో, బకాసుర రెస్టారెంట్ మాత్రం ఆ అపోహను చెరిపేసింది. కంటెంట్ బలం ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే విషయాన్ని మరొకసారి నిరూపించింది.కథేంటంటే..పరమేశ్వర్(ప్రవీణ్) ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నలుగురు స్నేహితులతో కలిసి ఓ రూమ్లో ఉంటూ ఇష్టం లేకపోయినా డబ్బుల కోసం ఆ జాబ్ చేస్తుంటాడు. ఎప్పటికైనా ఓ రెస్టారెంట్ పెట్టాలనేది ఆయన కోరిక. ఓ సారి తన కోరికనే స్నేహితులతో పంచుకోగ.. డబ్బుల కోసం యూట్యూబ్ లో ఘోస్ట్ వీడియోలు చేద్దామని సలహా ఇస్తారు. అనుకున్నట్లే మొదటి వీడియో బాగా వైరల్ అవుతుంది. రెండో వీడియో కోసం ఓ హోస్ట్ హౌస్కి వెళ్తారు. అక్కడ వీరికి ఒక తాంత్రిక పుస్తకం దొరుకుతుంది. దాన్ని వాడి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటారు. అందులో రాసి ఉన్నట్లుగా మంత్ర పూజ చేయగా.. నిమ్మకాయలోకి 200 ఏళ్ల క్రితం నాటి ఆత్మ వస్తుంది. ఆ ఆత్మకు ఆకలి ఎక్కువ. ఇంట్లో ఉన్న ఫుడ్ అంతా తిసేస్తుంది.ఆ నిమ్మకాయలో ఉన్న ఆత్మను కట్టడి చేసేందుకు ప్రయత్నించగా.. పరమేశ్వర్ రూమ్లోకి వచ్చిన అంజిబాబు(ఫణి) శరీరంలోకి వెళ్తుంది. అంజిబాబు శరీరాన్ని ఆవహించిన ఆత్మను పొగొట్టేందుకు పరమేశ్వర్ గ్యాంగ్ చేసిన ప్రయత్నాలు ఏంటి? బక్క సూరి(వైవా హర్ష) ఎవరు? అతనికి ఉన్న రోగం ఏంటి? అంజిబాబులో ఉన్న ఆత్మ బక్క సూరిది అని తెలిసిన తర్వాత పరమేశ్వర్(ప్రవీణ్) గ్యాంగ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది. చివరకు అంజిబాబు శరీరం నుంచి ఆ ఆత్మ బయటకు వెళ్లిందా లేదా? రెస్టారెంట్ పెట్టాలన్న పరమేశ్వర్ కోరిక నెరవేరిందా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
పెళ్లి తర్వాత శోభిత తొలి సినిమా.. నేరుగా ఓటీటీలో రిలీజ్!
నాగచైతన్య గతేడాది డిసెంబరులో శోభితని పెళ్లి చేసుకున్నాడు. అప్పటినుంచి వీళ్లిద్దరూ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. అప్పటి నుంచి శోభిత కొత్త ప్రాజెక్టులు ఒప్పుకొన్నట్లు ఎలాంటి అప్డేట్ రాలేదు. రీసెంట్గా ఓ తమిళ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఇప్పటికే శోభిత.. ఓటీటీ మూవీని పూర్తి చేసిందని, వచ్చే నెలలోనే ఇది రిలీజ్ కానుందని ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.(ఇదీ చదవండి: నాగార్జునతో టబు.. మళ్లీ ఇన్నేళ్లకు జంటగా!)వైజాగ్కి చెందిన శోభిత.. తొలుత మోడలింగ్ చేసింది. 2016 నుంచి సినిమాలు చేస్తోంది. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. మేడ్ ఇన్ హెవెన్, బార్డ్ ఆఫ్ బ్లడ్, ద నైట్ మేనేజర్ లాంటి వెబ్ సిరీసుల్లోనూ యాక్ట్ చేసింది. అయితే 'చీకట్లో' అనే ఓటీటీ మూవీలో శోభిత నటించింది. కానీ దీని గురించి ఎక్కడా చిన్న అప్డేట్ కూడా లేదు. సురేశ్ ప్రొడక్షన్ నిర్మించిన ఈ చిత్రానికి శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించాడట.'చీకట్లో' పేరుతో తీసిన ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో నవంబరు 18న రిలీజ్ చేయబోతున్నారట. అయితే ఈ మూవీని ఏకంగా 18 భాషల్లో డబ్బింగ్ చేసి స్ట్రీమింగ్లోకి తీసుకురాబోతున్నారని తెలుస్తోంది. ఇదంతా అనధికారికంగా బయటకొచ్చిన ఇన్ఫర్మేషన్. త్వరలో ఈ మూవీ గురించి అధికారిక ప్రకటనతో పాటు ఇతర వివరాలు కూడా రావొచ్చు. శోభిత భర్త, హీరో నాగచైతన్య ప్రస్తుతం హారర్ జానర్లో ఓ సినిమా చేస్తున్నాడు.(ఇదీ చదవండి: క్రేజీగా ప్రదీప్-మమిత 'డ్యూడ్' ట్రైలర్) -
సర్ప్రైజ్.. స్టార్ హీరోని మళ్లీ బతికించారు
ఎవరైనా నటుడు లేదా నటి మరణిస్తే.. జ్ఞాపకాలుగా మిగిలేవి వాళ్లు చేసిన సినిమాలు మాత్రమే. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు టెక్నాలజీ చాలా మారిపోయింది. ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ని ఉపయోగించి మరణించిన గాయనీగాయకుల గాత్రాన్ని కొత్త పాటల్లో వినిపించేలా చేస్తున్నారు. నటీనటుల్ని కూడా మళ్లీ బతికిస్తున్నారు. ఇప్పుడు అలానే ఓ ఓటీటీ సిరీస్ కోసం కన్నడ పవర్స్టార్ పునీత్ రాజ్ కుమార్ని మళ్లీ తెరపై చూపించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్)కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన పునీత్ రాజ్ కుమార్.. చాలా చిన్న వయసులోనే కోట్లాది మంది అభిమానుల ప్రేమని సంపాదించుకున్నారు. తెలుగులోనూ ఇతడు నటించిన పలు చిత్రాలు డబ్బింగ్గా రిలీజ్ అయ్యాయి. 2021లో కేవలం 46 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మరణించాడు. ఈయన చనిపోయిన తర్వాత జేమ్ అనే సినిమా, గంధగ గుడి అనే డాక్యుమెంటరీ రిలీజయ్యాయి. తర్వాత నుంచి ఇప్పటికీ ఈయన్ని కన్నడ దర్శకనిర్మాతలు గుర్తుచేసుకుంటూనే ఉన్నారు.అయితే 'మారిగల్లు' అనే ఓటీటీ సిరీస్ కోసం ఇప్పుడు ఈయన్ని మరోసారి తెరపై చూపించారు. ఏఐ టెక్నాలజీ ఉపయోగించి పునీత్ రాజ్ కుమార్ని ఈ సిరీస్లో చూపించారు. కాదంబ రాజ్యానికి చెందిన మయూర వర్మ అనే రాజుగా పునీత్ కనిపించనున్నారు. మిగతా పార్ట్ అంతా నటీనటులే కనిపిస్తారు గానీ పునీత్కి సంబంధించిన సీన్స్ మాత్రం ఏఐ టెక్నాలజీతో తెరకెక్కించారు. ఈ సిరీస్ జీ5 ఓటీటీలో ఈనెల 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఒకవేళ ఈ సిరీస్ గనక వర్కౌట్ అయి పునీత్ పాత్రకు పేరొస్తే గనక రాబోయే రోజుల్లో ఈ తరహా ప్రయోగాలు చాలానే చూడొచ్చు. ఈ సిరీస్ నిర్మించింది పునీత్ కుటుంబ సభ్యులే కావడం విశేషం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు) -
ఓటీటీలోకి 'వార్ 2'.. అధికారిక ప్రకటన
ఈ ఏడాది ఎన్టీఆర్.. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా 'వార్ 2'. హృతిక్ రోషన్ మరో హీరోగా నటించాడు. ఆగస్టు 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర ఆకట్టుకోలేకపోయింది. తెలుగులో అయితే మరీ ఘోరమైన టాక్ వచ్చింది. హిందీలో ఓ మాదిరి కలెక్షన్స్ వచ్చాయి. గత కొన్నిరోజులుగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్పై పలు రూమర్స్ వస్తున్నాయి. ఇప్పుడ వాటికి చెక్ పెడుతూ అధికారిక ప్రకటన వెలువడింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్)'వార్ 2' డిజిటల్ హక్కుల్ని నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. థియేటర్లలో రిలీజైన 8 వారాల తర్వాత ఓటీటీల్లో స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు అలా రేపటి(అక్టోబరు 09) నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుందని పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే వారంనుంచి ఇదే తేదీన రానుందని ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే నిజమైంది. థియేటర్లలో అంతంత మాత్రంగా ఆడిన ఈ చిత్రం.. ఓటీటీలో ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి?'వార్ 2' విషయానికొస్తే.. రా మాజీ ఏజెంట్ కబీర్ (హృతిక్ రోషన్)ని తమ కార్టెల్లో భాగం చేసుకోవాలనేది కలి అనే విలన్ ప్లాన్. దీంతో టాస్క్ పేరు చెప్పి కబీర్తో తనకి గాడ్ ఫాదర్ లాంటి సునీల్ లుథ్రాని చంపించేస్తారు. దీంతో కబీర్ని పట్టుకునేందుకు రా కొత్త చీఫ్ విక్రాంత్ కౌల్ (అనిల్ కపూర్), భారత ప్రభుత్వం సోల్జర్ విక్రమ్ చలపతి (ఎన్టీఆర్) నేతృత్వంలో ఓ టీమ్ రంగంలోకి దింపుతుంది. ఆ బృందంలో లూథ్రా కూతురు, వింగ్ కమాండర్ కావ్య లూథ్రా (కియారా అడ్వాణీ) కూడా ఉంటుంది. అసలు కబీర్ దేశద్రోహిగా ఎందుకు మారాడు? కబీర్కి విక్రమ్ ఎవరో తెలిశాక ఏం చేశాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: హిట్ సినిమా.. ఇప్పుడు మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్)Double the rage. Double the rampage. Ready for the War? 🔥#War2OnNetflix pic.twitter.com/wkTWTIu0Wu— Netflix India South (@Netflix_INSouth) October 8, 2025 -
హిట్ సినిమా.. ఇప్పుడు మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అప్పుడప్పుడు ఒక దానిలో ఉన్న మూవీస్.. మరో ఓటీటీలోనూ అందుబాటులోకి వస్తుంటాయి. అలా ఇప్పుడు ఓ డబ్బింగ్ చిత్రం అమెజాన్ ప్రైమ్లోకి వచ్చేసింది. పెళ్లికి ముందే తొందరపడి పేరెంట్స్ అయిన ఓ జంట.. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారనే పాయింట్తో ఎమోషనల్ గా తీసిన ఈ మూవీ సంగతేంటి? ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతుందనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: వీడియో: పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ.. ముఖంలో పెళ్లికళ)2023లో తమిళంలో 'డాడా' టైటిల్తో ఓ సినిమా రిలీజైంది. హిట్ అయింది. కవిన్, అపర్ణా దాస్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఈ ఏడాది జూన్లో 'పాపా' పేరుతో థియేటర్లలో రిలీజ్ చేశారు. కాకపోతే డబ్బింగ్ బొమ్మ కావడం వల్ల ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. ఇది జరిగిన కొన్నాళ్లకు అంటే జూలై చివరలో ఆహా ఓటీటీలోకి వచ్చింది. తర్వాత మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఎలాంటి హడావుడి లేకుండా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.'పాపా' విషయానికొస్తే.. మణికంఠ (కవిన్), సింధు (అపర్ణ) క్లాస్మేట్స్. వీళ్ల మధ్య మొదలైన స్నేహం.. కొన్నాళ్లకు ప్రేమగా మారుతుంది. అయితే కాస్త తొందరపడేసరికి పెళ్లికి ముందే మణి వల్ల సింధు గర్భం దాల్చుతుంది. ఆ విషయం తెలిసిన కుటుంబ పెద్దలు వీళ్లని దూరం పెడతారు. దీంతో మణి- సింధు ఓ అద్దె ఇంట్లో ఉంటూ చదువు పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తారు. ఈ ప్రయాణంలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? జన్మనిచ్చిన వెంటనే బిడ్డను వదిలేసి సింధు ఎందుకు వెళ్లిపోయింది? ఆ చిన్నారిని పెంచేందుకు మణి ఎంతగా కష్టపడ్డాడు? మణి జీవితంలోకి మళ్లీ సింధు వచ్చిందా? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్) -
ఓటీటీలోకి తెలుగు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్
ఓటీటీల్లోకి ప్రతివారం కొత్త సినిమాలు, సిరీస్లు వస్తూనే ఉంటాయి. అయితే కొన్నిసార్లు థియేటర్లలో కాకుండా నేరుగా కొన్ని మూవీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయిపోతుంటాయి. ఇప్పుడు అలానే ఓ తెలుగు థ్రిల్లర్ సిరీస్ డిజిటల్గా అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. ఈ మేరకు అధికారిక ప్రకటనతో పాటు పోస్టర్ రిలీజ్ చేశారు. ఇంతకీ ఏంటా సిరీస్? ఎందులోకి రానుంది?రాజీవ్ కనకాల, ఉదయభాను ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు సిరీస్ 'డాటరాఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు'. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ స్టోరీతో దీన్ని తీశారు. ఇది ఇప్పుడు నేరుగా జీ5 ఓటీటీలో ఈ నెల 31వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. రెక్కీ, విరాటపాలెం తదితర సిరీసులు తీసిన సౌతిండియన్ స్క్రీన్స్ దీన్ని నిర్మించింది. పోలూరు కృష్ణ దర్శకుడు. రాజీవ్ కనకాల తండ్రిగా చేయనుండగా.. అతడి కూతురు స్వాతిగా వాసంతిక నటించింది. ఉదయభాను పోలీస్ పాత్రలో కనిపించనుంది.(ఇదీ చదవండి: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బ్యాచిలర్ పార్టీ!)ఈ ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్లో తండ్రైన రాజీవ్ కనకాల.. కనిపించకుండా పోయిన తన కూతురు స్వాతి కోసం వెతుకుతుంటాడు. తండ్రికి ఏం చేయాలో తెలియక అన్వేషిస్తుంటాడు. ఈ క్రమంలో నిజానికి దగ్గరయ్యే కొద్ది తనకు తెలిసే రహస్యాలు, మోసాలు వెనుక దాగిన ఊహించని నిజాలు ఏంటి? ప్రేమ, కోల్పోయినప్పుడు ఉండే వెలితి, మోసం మధ్య ఉండే సన్నని సరిహద్దులు కనిపించకుండా పోతాయి. బాధ, భావోద్వేగం కలగలిసిన ఈ ప్రయాణమే అసలు స్టోరీ.ఇకపోతే ఈ వారం 20కి పైగా కొత్త చిత్రాలు, సిరీసులు పలు ఓటీటీల్లోకి రాబోతున్నాయి. వీటిలో తేజా సజ్జా 'మిరాయ్', 'త్రిబాణధారి బార్బరిక్', ఎన్టీఆర్ 'వార్ 2', లీగల్లీ వీర్ అనే తెలుగు మూవీస్ ఉన్నాయి. వీటితో పాటు 'కురుక్షేత్ర' అనే యానిమేటెడ్ తెలుగు డబ్బింగ్ సిరీస్ కూడా ఈ వీకెండ్లోనే అందుబాటులోకి రానుంది. ఇవే కాకుండా శుక్రవారం నాడు ఏమైనా సడన్ సర్ప్రైజ్ ఉండొచ్చు! (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు) -
ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు
మరోవారం వచ్చేసింది. గత వీకెండ్ 'కాంతార 1', 'ఇడ్లీ కొట్టు' లాంటి డబ్బింగ్ చిత్రాలు ప్రేక్షకుల్ని పలకరించాయి. ఈసారి మాత్రం తెలుగు స్ట్రెయిట్ మూవీస్ కొన్ని థియేటర్లలోకి రాబోతున్నాయి. వీటిలో ఎర్రచీర, కానిస్టేబుల్, శశివదనే, అందెల రవమిది, అరి, మటన్ సూప్, ప్రేమతో దెయ్యం లాంటి సినిమాలతో పాటు 'బల్టీ' అనే డబ్బింగ్ బొమ్మ ఉన్నాయి. మరోవైపు ఓటీటీల్లోనూ 20కి పైగా కొత్త మూవీస్, వెబ్ సిరీసులు రాబోతున్నాయి.(ఇదీ చదవండి: 'బాహుబలి'ని తొలగించిన ప్రముఖ ఓటీటీ సంస్థ)ఓటీటీల్లోకి వచ్చే సినిమాల విషయానికొస్తే.. మిరాయ్, త్రిభాణదారి బార్బరిక్, లీగల్లీ వీర్ అనే తెలుగు చిత్రాలతో పాటు కురుక్షేత్ర అనే యానిమేటెడ్ డబ్బింగ్ సిరీస్ ఈ వారంలోనే రానుంది. అలానే ఎన్టీఆర్ నటించిన హిందీ మూవీ 'వార్ 2' కూడా ఈ వారాంతంలోనే స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. మరి ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ అందుబాటులోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (అక్టోబరు 06 నుంచి 12వ తేదీ వరకు)హాట్స్టార్మిరాయ్ (తెలుగు సినిమా) - అక్టోబరు 10సెర్చ్: ద నైనా మర్డర్ కేస్ (హిందీ సిరీస్) - అక్టోబరు 10నెట్ఫ్లిక్స్హోర్టన్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 06మ్యాట్ మక్కస్కర్: ఏ హంబుల్ ఆఫరింగ్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 07ట్రూ హాంటింగ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 07కారమెలో (పోర్చుగీస్ సినిమా) - అక్టోబరు 08ఈజ్ ఇట్ కేక్? హాలోవీన్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 08నెరో (ఫ్రెంచ్ సిరీస్) - అక్టోబరు 08బూట్స్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 08వార్ 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబరు 09 (రూమర్ డేట్)ద రీసరెక్టెడ్ (మాండరిన్ సిరీస్) - అక్టోబరు 09ద ఉమెన్ ఇన్ కాబిన్ 10 (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 09విక్టోరియా బెక్హమ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 09కురుక్షేత్ర (తెలుగు డబ్బింగ్ యానిమేటెడ్ సిరీస్) - అక్టోబరు 10స్విమ్ టూ మీ (స్పానిష్ మూవీ) - అక్టోబరు 10 అమెజాన్ ప్రైమ్మెయింటైనెన్స్ రిక్వైర్డ్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 08జాన్ క్యాండీ: ఐ లైక్ మీ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 10సన్ నెక్స్ట్త్రిభాణదారి బార్బరిక్ (తెలుగు మూవీ) - అక్టోబరు 10రాంబో (తమిళ సినిమా) - అక్టోబరు 10జీ5ఏ మ్యాచ్ (మరాఠీ సినిమా) - అక్టోబరు 10వెదువన్ (తమిళ సిరీస్) - అక్టోబరు 10లయన్స్ గేట్ ప్లేలీగల్లీ వీర్ (తెలుగు మూవీ) - అక్టోబరు 10ఆపిల్ ప్లస్ టీవీద లాస్ట్ ఫ్రంటియర్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 10(ఇదీ చదవండి: రచయిత కోన వెంకట్ కూతురి రిసెప్షన్.. హాజరైన చిరంజీవి) -
అందుకే ఎక్కువ సినిమాలు చేయడం లేదు: హీరోయిన్
దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ (Shraddha Srinath). ఈమె తొలిసారిగా నటించిన వెబ్ సిరీస్ 'ది గేమ్: యు నెవర్ ప్లే ఎలోన్' (The Game: You Never Play Alone Web Series). సంతోష్ ప్రతాప్ కథానాయకుడిగా నటించిన ఈ వెబ్ సిరీస్ను దర్శకుడు రాజేష్ ఎం.సెల్వ రూపొందించారు. దసరా పండుగ సందర్భంగా ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో విడుదలై స్ట్రీమ్ అవుతోంది. వెబ్ సిరీస్ఈ సందర్భంగా శ్రద్ధ శ్రీనాథ్ మాట్లాడుతూ.. ఈ సిరీస్లో తాను, సంతోష్ ప్రతాప్ గేమ్ డెవలపర్స్గా నటించామని చెప్పారు. గేమ్ డెవలపర్స్ అయిన తమను సామాజిక మాధ్యమాలు ఎలా బాధింపునకు గురిచేశాయి? తమ చుట్టూ ఉన్న వారిని ఎలా సమస్యల వలయంలో చిక్కుకునేటట్లు చేశాయి? అనే ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన వెబ్ సిరీస్ ది గేమ్ అని చెప్పారు. 7 ఎపిసోడ్స్తో కూడిన ఈ సిరీస్ కోసం యూనిట్ అంతా ఎంతగానో శ్రమించినట్లు చెప్పారు. నాకు అదే ముఖ్యంతాను అధికంగా పద్ధతిగల పాత్రల్లో నటించడానికి కారణం.. తనను ప్రేక్షకులు అలాంటి పాత్రల్లో చూడాలని కోరుకోవడమే అన్నారు. అయితే తనకు లవ్, రొమాన్స్తో పాటు సీక్రెట్ ఏజెంట్ వంటి అడ్వెంచర్, థ్రిల్లర్, యాక్షన్ కథాచిత్రాల్లోనూ యాక్ట్ చేయాలని ఆశగా ఉందన్నారు. ఎక్కువ సినిమాలు చేయడం లేదని కొందరు అడుగుతున్నారని.. తనకు ఎక్కువ చిత్రాలు నటించడం లక్ష్యం కాదని పేర్కొన్నారు. చేసింది తక్కువ సినిమాలే అయినా అందులో మంచిగా నటించి అభిమానులను అలరించడమే ముఖ్యమని పేర్కొన్నారు.చదవండి: రజినీకాంత్ను దృష్టిలో పెట్టుకుని ఈ కథ రాశా! -
ఓటీటీలో 'త్రిబాణధారి బార్బరిక్' సినిమా స్ట్రీమింగ్
త్రిబాణధారి బార్బరిక్( Tribanadhari Barbarik) సినిమా చుట్టూ చాలా ఆసక్తికరమైన విషయాలు జరిగాయి. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ఈ మూవీ విడుదల తర్వాత ఎవరూ చూడలేదని ఆ చిత్ర దర్శకుడు మోహన్ శ్రీవత్స (Mohan Srivatsa) సోషల్ మీడియాలో భావోద్వేగానికి గురైన సంగతి తెలిసిందే. తన కష్టానికి తగిన ఫలితం దక్కలేదని మీడియా ముందే చెప్పుతో కొట్టుకున్నారు. దీంతో ఈ మూవీ గురించి వైరల్ అయింది. ఆపై సినిమా ఫలితం చూసి ఉదయభాను కూడా గుక్కపెట్టి ఏడ్చింది. ఇలా త్రిబాణధారి బార్బరిక్ చుట్టూ అనేక సంఘటనలు జరిగాయి. ఇప్పుడు ఓటీటీలోకి రానున్నండంతో నెటిజన్లు ఈ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు.‘త్రిబాణధారి బార్బరిక్’.. సన్ నెక్స్ట్(Sun NXT)లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్ 10 నుంచి తెలుగుతో పాటు తమిళ్లో కూడా విడుదల కానుందని ఒక పోస్టర్ను పంచుకున్నారు. ఈ చిత్రంలో సత్య రాజ్, వశిష్ట ఎన్ సింహా, ఉదయ భాను, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్, మేఘన కీలక పాత్రల్లో నటించారు.కథేంటంటే..ప్రముఖ సైకాలజిస్ట్ శ్యామ్ కతు(సత్యరాజ్) మనవరాలు నిధి(మేఘన) కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయిస్తాడు. ఈ కేసుని కానిస్టేబుల్ చంద్ర(సత్యం రాజేశ్) డీల్ చేస్తుంటాడు. మరోవైపు మధ్యతరగతి కుటుంబానికి చెందిన రామ్(వశిష్ట సింహా) విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటాడు. దానికోసం రూ.30 లక్షల వరకు కావాల్సి ఉంటుంది. తన స్నేహితుడు, లేడీ డాన్ వాలికి పద్మ(ఉదయ భాను) మేనల్లుడు దేవ్(క్రాంతి కిరణ్)తో కలిసి ఇష్టం లేకపోయిన కొన్ని అసాంఘీక పనులు చేస్తుంటాడు.దేవ్కి జూదం అంటే పిచ్చి. అత్త వాకిలి పద్మకు తెలియకుండా డ్రగ్స్ మాఫియా లీడర్ దాస్(మొట్ట రాజేంద్రన్) దగ్గర లక్షల్లో అప్పు చేసి జూదంలో పొగొట్టుకుంటాడు. కొన్నాళ్ల తర్వాత దాస్ తన అప్పు తీర్చమని దేవ్పై ఒత్తిడి చేస్తాడు. దీంతో డబ్బు కోసం రామ్ ఓ ప్లాన్ వేస్తాడు. అదేంటి? నిధి మిస్సింగ్కి వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అసలు నిధిని కిడ్నాప్ చేసిందెవరు? ఎందుకు చేశారు? మనవరాలి కోసం శ్యామ్ ఏం చేశాడు? అనేది తెలియాంటే సినిమా చూడాల్సిందే. -
ట్రెండింగ్లో దెయ్యం సినిమా..'సుమతి వలవు' మూవీ రివ్యూ
తక్కువ బడ్జెట్లో క్వాలిటీ సినిమాలు తీయడం, భారీ వసూళ్లు రాబట్టడంలో మలయాళ ఇండస్ట్రీ దిట్ట! ఈ ఏడాది మాలీవుడ్లో అనేక సినిమాలు హిట్గా నిలిచాయి. అందులో ఒకటి సుమతి వలవు. హారర్ కామెడీ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా రూ.25 కోట్లు వసూలు చేసింది. ఈ మధ్యే ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5లోకి వచ్చేసింది. తెలుగులోనూ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఓటీటీలో టాప్ ట్రెండింగ్లో ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూసేద్దాం..రియల్ స్టోరీసుమతి వలవు (Sumathi Valavu Movie Review) అంటే తెలుగులో సుమతి మలుపు. ఇది సినిమాలోనే కాదు నిజంగా ఉంది. కేరళ రాష్ట్రం తిరువనంతపురం జిల్లాలోని మైలమ్మూడుకు సమీపంలో ఈ మలుపు ఉంది. 1950ల ప్రాంతంలో సుమతి అనే అమ్మాయిని అక్కడ చంపేశారని, తను దెయ్యమై అక్కడే తిరుగుతోందన్న కథ ప్రచారంలో ఉంది. దాన్ని ఆధారంగా చేసుకుని ఈ మూవీ తీశారు.కథఅడవిని ఆనుకుని కల్లేలి అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి వెళ్లాలంటే అడవి గుండా వెళ్లాలి. అక్కడే సుమతి వలవు అనే టర్నింగ్ పాయింట్ ఉంటుంది. అక్కడే సుమతి అనే దెయ్యం తిరుగుతూ ఉంటుంది. రాత్రి 8 గంటల తర్వాత ఎవరూ అక్కడకు వెళ్లరు. కానీ ఓ రోజు రాత్రి ఆ ఊర్లోని శేఖరన్ పెద్ద కూతురు ప్రేమించినవాడితో పారిపోతుంది. హీరో అప్పూ (అర్జున్ అశోకన్)యే ఏదో చేసుంటాడని శేఖరన్ కుటుంబం అతడిపై పగపెంచుకుంటుంది. ఈ క్రమంలో శేఖరన్ రెండో కూతురు భామ (మాళవిక మనోజ్)తో ప్రేమలో పడతాడు అప్పు. మరి వీరి ప్రేమకథను ఒప్పుకుంటారా? శేఖరన్ పెద్ద కూతురు పారిపోయిందా? లేదా దెయ్యం చంపేసిందా? అన్నది ఓటీటీలో చూసి తెలుసుకోవాల్సిందే!విశ్లేషణహీరో అప్పుకు చీకటంటే పిరికి. ఓరోజు రాత్రి ఊర్లోని నిండు గర్భిణి పురిటినొప్పులతో బాధపడుతుంటే ఆస్పత్రికి తీసుకెళ్లాలంటారు. అందరూ భయపడుతుంటే హీరో గ్యాంగ్ మాత్రం బండి సిద్ధం చేసుకుని తీసుకెళ్తారు. మలుపు దాకా వెళ్లాక బండి దానంతటదే ఆగిపోతుంది. ఈ ఇంటర్వెల్లో జరిగే సీన్లు బాగుంటాయి. కానీ సెకండాఫ్లో కాస్త పస తగ్గినట్లు అనిపిస్తుంది. ఏదేమైనా సినిమాను చాలా సహజంగా తెరకెక్కించారు. మూవీలో ఓ పక్క ప్రేమకథ.. మరోపక్క హారర్ రెండూ ఉంటాయి. మరీ ఎక్కువ భయపెట్టకుండా నవ్విస్తూ, అలరిస్తూ కథ అలా ముందుకు సాగుతుంది. ఫ్యామిలీతో కలిసి ఎంచక్కా చూసేయొచ్చు. అన్నట్లు దీనికి సీక్వెల్ కూడా ప్రకటించారు. The Curve That Everyone’s Talking About — 100 M+ Streaming Minutes Strong 🚀 #ArjunAshokan #SidharthBharathan #GokulSuresh #BaluVarghese #SaijuKurup #BobyKurian #MalavikaManoj #JoohiJu #SijaRoseGeorge #Shivada #GopikaAnil@GokulamMovies @DreamBig_film_s @jsujithnair… pic.twitter.com/0CjoYEX6EL— ZEE5 Malayalam (@zee5malayalam) October 3, 2025 -
నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న మిరాయ్.. ఎప్పుడంటే?
యంగ్ హీరో తేజ సజ్జ (Teja Sajja) వరుస బ్లాక్బస్టర్స్ అందుకుంటున్నాడు. గతేడాది హనుమాన్తో సూపర్ డూపర్ హిట్ అందుకున్న ఈ హీరో ఈ ఏడాది మిరాయ్ (Mirai Movie)తో మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. కేవలం రూ.60 కోట్ల బడ్జెట్తో విజువల్ వండర్గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించింది. ఏకంగా రూ.150 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం నెల తిరిగేలోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది.ఓటీటీలో మిరాయ్ఈ విషయాన్ని జియో హాట్స్టార్ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 10న హాట్స్టార్లో రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. మిరాయ్ విషయానికి వస్తే.. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. రితికా నాయక్ హీరోయిన్ కాగా మంచు మనోజ్ విలన్గా నటించారు. శ్రియ, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఓటీటీలో ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి! View this post on Instagram A post shared by JioHotstar Telugu (@jiohotstartelugu)చదవండి: సంజనా శాడిజం.. చచ్చినా, బతికినా తనతోనే.. ఇమ్మూ లవ్స్టోరీ -
ఓటీటీకి వెన్నులో వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలకు క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్స్కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి సినిమాలకు పెద్ద సంఖ్యలో ఆడియన్స్ ఉన్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి చిత్రాలు ఎక్కువగా వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా హాలీవుడ్ సినిమాల్లో ఫైనల్ డెస్టినేషన్ సిరీస్ చిత్రాలకు ఇండియాలోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ సిరీస్లో సుమారు 15 ఏళ్ల తర్వాత 'ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్ లైన్స్' పేరుతో ఆరో భాగాన్ని తెరకెక్కించారు. మే 15న భారత్లో రిలీజైన ఈ సినిమా ఆడియన్స్ను తెగ భయపెట్టేసింది.అయితే ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలో అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇండియా ఫ్యాన్స్కు మాత్రం వీక్షించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో మేకర్స్ మరో ఓటీటీలో ఫైనల్ డెస్టినేషన్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇండియా ఫ్యాన్స్ కోసం జియో హాట్స్టార్ వేదికగా అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 16 నుంచి తెలుగు ఇంగ్లీష్, హిందీ, తమిళం భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.కాగా.. రూ. 430 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 2300 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. జాక్ లిపోవ్స్కీ, అడమ్ స్టేయిన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సుమారు గంట 49 నిమిషాల రన్టైమ్ ఉన్న ఈ చిత్రంలో బ్రెక్ బసింగర్, విలియమ్ బ్లడ్వర్త్, రిచర్డ్ హార్మోన్, క్యాథలీన్ శాంటా జువానా, టియో బ్రియోన్స్ తదితరులు నటించారు. 2000లో తొలి పార్ట్ రాగా.. 2003, 2006, 2009, 2011లో మిగతా పార్ట్స్ వచ్చాయి. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఆరోది రిలీజ్ అయింది. -
ఓటీటీలోకి 'కురుక్షేత్ర'.. ట్రైలర్ రిలీజ్
కొన్నాళ్ల క్రితం థియేటర్లలోకి వచ్చిన యానిమేటెడ్ మూవీ 'మహావతార్ నరసింహా'.. ఊహించని విధంగా బ్లాక్బస్టర్ రెస్పాన్స్ అందుకుంది. కేవలం రూ.40 కోట్లు పెడితే రూ.300 కోట్ల పైగా కలెక్షన్ అందుకుని ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలోనే యానిమేటెడ్ ట్రెండ్ మొదలైపోయింది. తెలుగులోనూ రీసెంట్గానే 'వాయుపుత్ర' అనే యానిమేటెడ్ మూవీ ప్రకటించారు.(ఇదీ చదవండి: ధనుష్ 'ఇడ్లీ కొట్టు' సినిమా రివ్యూ)ఇది సినిమాల వరకే పరిమితం కాలేదు. ఇప్పుడు ఓటీటీలోనూ 'కురుక్షేత్ర' అనే యానిమేటెడ్ సిరీస్ రాబోతుంది. కొన్నిరోజుల క్రితం దీని స్ట్రీమింగ్ గురించి ప్రకటించారు. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే 18 రోజుల పాటు కురుక్షేత్ర సంగ్రామంలో ఏం జరిగిందో చూపించబోతున్నారని ట్రైలర్తో చూస్తే అర్థమైంది. కాకపోతే ట్రైలర్లో యానిమేషన్ ఏమంత గొప్పగా అనిపించలేదు.అక్టోబరు 10 నుంచి ఈ సిరీస్.. నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటితరానికి కురుక్షేత్రం గురించి పాండవులు, కౌరవుల మధ్య యుద్ధం గురించి చాలామందికి తెలియదు. ఒకవేళ యానిమేషన్ అంతంత మాత్రంగా ఉన్నాసరే మేకర్స్.. కంటెంట్ని ఎంగేజింగ్గా చెప్పగలిగితే ఈ సిరీస్ హిట్ కావొచ్చు. చూడాలి మరి ఏం చేశారో?(ఇదీ చదవండి: రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన 'జూనియర్') -
మరో ఓటీటీకి నయనతార వివాదాస్పద సినిమా.. వారికి మాత్రమే!
కోలీవుడ్ భామ నయనతార నటించిన వివాదాస్పద చిత్రం 'అన్నపూరణి-ది గాడెస్ ఆఫ్ ఫుడ్'. 2023లో వచ్చిన ఈ సినిమాకు నీలేశ్ కృష్ణ దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీకి థియేటర్ల వద్ద మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. ఇందులో నయన్ బ్రహ్మణి అమ్మాయి పాత్రలో కనిపించింది. అదే పెద్ద వివాదానికి దారితీసింది. ఈ చిత్రంలో ఓ బ్రహ్మణ అమ్మాయిని నాన్ వెజ్ వంటలు చేసే చెఫ్గా చూపించడం ఆ వర్గం మనోభావాలు దెబ్బతీసింది. దీంతో నెట్ఫ్లిక్స్ నుంచి ఈ సినిమాను తొలగించగా.. నయనతార క్షమాపణలు చెప్పింది.తాజాగా ఈ చిత్రం మరో భాషలో అందుబాటులోకి వస్తోంది. అక్టోబర్ 1 నుంచి జియో హాట్ స్టార్లో హిందీ వర్షన్ స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో రిలీజైన దాదాపు రెండేళ్లు పూర్తి కావొస్తోంది. ఇన్ని రోజుల తర్వాత హిందీ వర్షన్ అందుబాటులోకి తీసుకురావడం విశేషం. అన్నపూరణి సినిమాను జీ స్టూడియోస్, నాద్ స్టూడియోస్, ట్రైడెంట్ ఆర్ట్స్ బ్యానర్లపై ఆర్. రవీంద్రన్ మరియు జతిన్ సేథి నిర్మించారు. ఈ సినిమాకు టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ చిత్రం సింప్లీ సౌత్ అనే ఓటీటీలో అందుబాటులో ఉంది. అయితే ఈ ఓటీటీ ఫ్లాట్ఫామ్ కేవలం ఓవర్సీస్ ఆడియన్స్కు మాత్రం అందుబాటులో ఉంది. -
రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన 'జూనియర్'
కొన్నిరోజుల క్రితం వైరల్ వయ్యారి అంటూ శ్రీలీల తెగ వైరల్ అయిపోయింది. 'జూనియర్' సినిమాలోనిది ఆ పాట. అయితే దాదాపు రెండున్నర నెలల క్రితం థియేటర్లలోకి మూవీ వచ్చింది. కానీ ఓటీటీ సంగతి మాత్రం పూర్తిగా సైలెంట్గా ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఒకేసారి రెండింటిలో స్ట్రీమింగ్ అయిపోయింది. ఇంతకీ ఈ మూవీ వేటిలో చూడొచ్చు.గాలి జనార్ధన రెడ్డి కొడుకు కిరీటి హీరోగా పరిచయమైన చిత్రం 'జూనియర్'. కాలేజీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ కాగా జెనీలియా కీలక పాత్రలో నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. రాధాకృష్ణ రెడ్డి దర్శకత్వం వహించాడు. థియేటర్లలో మోస్తరు టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు ముందే ప్రకటించినట్లు డిజిటల్గా అందుబాటులోకి వచ్చింది.(ఇదీ చదవండి: 1,050 సినిమాల పైరసీ.. రూ.22,400 కోట్ల నష్టం)ముందే చెప్పినట్లు ఆహా ఓటీటీలోకి రాగా.. ఏ మాత్రం హడావుడి లేకుండా సైలెంట్గా అమెజాన్ ప్రైమ్లోకి కూడా వచ్చేసింది. ఈ రెండింటిలో తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతుండగా.. నమ్మ ఫ్లెక్స్ అనే ఓటీటీలో కన్నడ వెర్షన్ అందుబాటులో ఉంది.'జూనియర్' విషయానికొస్తే.. అభి (కిరీటి) జ్ఞాపకాలే ముఖ్యమనుకునే కుర్రాడు. అలా జాలీగా ఇంజినీరింగ్ చేస్తాడు. కాలేజీలో ఉన్నప్పుడు ప్రేమించిన స్పూర్తి(శ్రీలీల) పనిచేస్తున్న కంపెనీలోనే ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. అయితే అదే కంపెనీకి బాస్ అయిన విజయ(జెనీలియా)కి అభి అస్సలు నచ్చడు. అయితే వీళ్లిద్దరికీ ఓ గతం ఉంటుంది. ఒకరంటే ఒకరిని పడని అభి-విజయ.. విజయనగరం అనే ఊరికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది. చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ ఓజీకి బిగ్ షాక్..!) -
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు.. ఆ మూడు మాత్రం
మరోవారం వచ్చేసింది. ఈసారి దసరా పండగ హడావుడి తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది. ఈ వారంలో తెలుగు స్ట్రెయిట్ మూవీస్ ఏం విడుదల కావట్లేదు. ధనుష్ 'ఇడ్లీ కొట్టు', రిషభ్ శెట్టి 'కాంతార 1' లాంటి డబ్బింగ్ చిత్రాలు వరస రోజుల్లో బిగ్ స్క్రీన్పైకి రానున్నాయి. వీటిలో 'కాంతార' ప్రీక్వెల్పై ఓ మాదిరి బజ్ ఉంది.(ఇదీ చదవండి: Bigg Boss 9: ప్రియ ఎలిమినేట్.. ఎంత సంపాదించిందంటే?)మరోవైపు ఓటీటీల్లోనూ చెప్పుకోదగ్గ రీతిలో పలు చిత్రాలు స్ట్రీమింగ్ కానున్నాయి. మదరాసి, జూనియర్ మూవీస్ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు 'ద గేమ్' సిరీస్ కూడా కాస్తోకూస్తో ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఈ వారం ఓటీటీల్లోకి ఏయే మూవీస్ ఎందులో స్ట్రీమింగ్ కానున్నాయంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 5 వరకు)అమెజాన్ ప్రైమ్మదరాసి (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబరు 01ప్లే డర్టీమూవీ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 01నెట్ఫ్లిక్స్మిస్సింగ్ కింగ్ (జపనీస్ సిరీస్) - సెప్టెంబరు 29నైట్ మేర్స్ ఆఫ్ నేచర్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 30ద గేమ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబరు 02మాన్స్టర్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 03ఆహాజూనియర్ (తెలుగు సినిమా) - సెప్టెంబరు 30సన్ నెక్స్ట్సాహసం (తమిళ మూవీ) - అక్టోబరు 01గౌరీ శంకర (కన్నడ సినిమా) - అక్టోబరు 01టేల్స్ ఆఫ్ ట్రెడిషన్ (తమిళ సిరీస్) - అక్టోబరు 02జీ5చెక్ మేట్ (మలయాళ సినిమా) - అక్టోబరు 02డాకున్ డా ముందా 3 (పంజాబీ మూవీ) - అక్టోబరు 02సోనీ లివ్13th (హిందీ సిరీస్) - అక్టోబరు 01ఆపిల్ ప్లస్ టీవీద సిస్టర్ గ్రిమ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 02లాస్ట్ బస్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 03(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'వార్ 2'.. స్ట్రీమింగ్ డేట్ అదేనా?) -
ఓటీటీలోకి 'వార్ 2'.. స్ట్రీమింగ్ డేట్ అదేనా?
ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తీస్తున్న 'డ్రాగన్' మూవీ చేస్తున్నాడు. త్వరలో కొత్త షెడ్యూల్ మొదలుకానుంది. దీంతో దాదాపుగా షూటింగ్ పూర్తి కానుంది. మరోవైపు నెలన్నర క్రితం 'వార్ 2' చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించాడు. దీనికి మిశ్రమ స్పందన వచ్చింది. హిందీలో ఓ మాదిరిగా ఆడింది గానీ తెలుగులో చెప్పుకోదగ్గ వసూళ్లు వచ్చినట్లు కనిపించలేదు. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.'ఆర్ఆర్ఆర్' తర్వాత పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్.. హిందీలో 'వార్ 2' చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. స్పై యూనివర్స్లో వచ్చిన సినిమా ఇది. హృతిక్ రోషన్, తారక్ లీడ్ రోల్స్ చేశారు. కియారా అడ్వాణీ హీరోయిన్. అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఆగస్టు 14న దేశవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. అయితే టాక్ ఏ మాత్రం పాజిటివ్ రాకపోవడంతో వసూళ్లు కూడా తక్కువగానే వచ్చాయి.(ఇదీ చదవండి: నొప్పితోనే 'కాంతార 1' ఈవెంట్కు ఎన్టీఆర్)ఇకపోతే హిందీ సినిమాలు చాలావరకు 8 వారాల విండోతోనే ఓటీటీల్లోకి వస్తున్నాయి. ఇప్పుడు 'వార్ 2' కూడా అలానే నెట్ఫ్లిక్స్లోకి రాబోతుందని, అయితే దసరా సందర్భంగా ఈ వీకెండ్లో స్ట్రీమింగ్ అయినా సరే ఆశ్చర్యపోనక్కర్లేదని మరో మాట వినిపిస్తుంది. ఇదే జరిగితే అక్టోబరు 2న లేదంటే 9న రావొచ్చని టాక్ అయితే వినిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి?'వార్ 2' విషయానికొస్తే.. రా మాజీ ఏజెంట్ కబీర్ (హృతిక్ రోషన్)ని తమ కార్టెల్లో భాగం చేసుకోవాలనేది కలి అనే విలన్ ప్లాన్. దీంతో టాస్క్ పేరు చెప్పి కబీర్తో తనకి గాడ్ ఫాదర్ లాంటి సునీల్ లుథ్రాని చంపించేస్తారు. దీంతో కబీర్ని పట్టుకునేందుకు రా కొత్త చీఫ్ విక్రాంత్ కౌల్ (అనిల్ కపూర్), భారత ప్రభుత్వం సోల్జర్ విక్రమ్ చలపతి (ఎన్టీఆర్) నేతృత్వంలో ఓ టీమ్ రంగంలోకి దింపుతుంది. ఆ బృందంలో లూథ్రా కూతురు, వింగ్ కమాండర్ కావ్య లూథ్రా (కియారా అడ్వాణీ) కూడా ఉంటుంది. అసలు కబీర్ దేశద్రోహిగా ఎందుకు మారాడు? కబీర్కి విక్రమ్ ఎవరో తెలిశాక ఏం చేశాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: టాలీవుడ్ డైరెక్టర్ నిశ్చితార్థం.. చైతూ-శోభిత సందడి) -
'ద ట్రయల్ 2' రివ్యూ: ఈ సిరీస్ పెద్దల కోసమే!
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో ‘ది ట్రయల్’ రెండో సీజన్ ఒకటి. ఈ సిరీస్ గురించి తెలుసుకుందాం.ఏదైనా నేరం జరిగితే తగిన సాక్ష్యాలతో నేరస్థుడిని నిరూపించే ప్రక్రియలో న్యాయవాదులు ఉంటారు. ఆ న్యాయవాదుల సమూహంగా కొన్ని కంపెనీలు కూడా ఉంటాయి. ఆ కంపెనీలలో ఎంతో మంది న్యాయవాదులు తమ క్లయింట్ల తరఫున కోర్టులో విచారణకు హాజరవుతుంటారు. అటువంటి లా ఫర్మ్లపై తీసిన సిరీస్ ‘ది ట్రయల్’. 2023లో ఈ సిరీస్ మొదటి భాగం హాట్ స్టార్ వేదికగా రిలీజ్ అయింది. మళ్ళీ రెండేళ్ళకు దానికి కొనసాగింపుగా ఇప్పుడు 2025లో ‘ది ట్రయల్’ రెండో సీజన్ రిలీజ్ అయింది. కాజోల్ ప్రధాన పాత్రలో నటించగా ఆమె భర్త అజయ్ దేవగన్ ఈ సిరీస్కి నిర్మాతగా వ్యవహరించడం విశేషం.రెండు సిరీస్లు కలిపి 14 ఎపిసోడ్లతో ఉన్న ‘ది ట్రయల్’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్ కథాంశానికొస్తే... న్యోనికాసేన్ గుప్తా ఓ పేరున్న ఫర్మ్లో మంచి లాయర్. ఆమె భర్త రాజకీయ నాయకుడు. ఆమె చేస్తున్న లా ఫర్మ్లో ఎన్నో రాజకీయాలతో ఆమె ప్రమోషన్ని అడ్డుకుంటూ న్యోనికా కుటుంబానికి కూడా ఆపద కలిగిస్తుంటారు ఆమె ప్రత్యర్థులు. ఆ లా ఫర్మ్లోకి వచ్చే కేసులు కూడా ఈ భార్యాభర్తలకు లింకు అవుతుంటాయి. ఆ లింకులు పెద్ద పెద్ద కష్టాలనే తెచ్చిపెడతాయి. మరి... ఆ కష్టాలన్నింటినీ తట్టుకుని తన క్లయింట్ల కేసులను వాదిస్తూ, ఫర్మ్లోని రాజకీయాలను ఎదుర్కొంటూ న్యోనికా నిజంగా ట్రయల్ గెలుస్తుందా? లేదా అన్నది మాత్రం సిరీస్లోనే చూడాలి. హాట్ స్టార్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ‘ది ట్రయల్’ మంచి కాలక్షేపం. ఈ లా ఫర్మ్ కథలు పెద్దలు మాత్రమే చూడదగినవి. ఎంజాయ్..– హరికృష్ణ ఇంటూరు -
మోహన్ లాల్ 'హృదయపూర్వం' సినిమా రివ్యూ (ఓటీటీ)
ఓటీటీల్లోకి వచ్చే మలయాళ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. థ్రిల్లర్ చిత్రాలు ఎక్కువగా ఈ ఇండస్ట్రీ నుంచి వస్తుంటాయి. కానీ అప్పుడప్పుడు ఫీల్ గుడ్ ఎమోషనల్ మూవీస్ కూడా వస్తుంటాయి. అలాంటి ఓ చిత్రమే 'హృదయపూర్వం'. గత నెలలో థియేటర్లలో రిలీజై రూ.100 కోట్లకు పైగా కలెక్షన్ అందుకున్న ఈ సినిమా.. ఇప్పుడు హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఇది ఎలా ఉంది? చూడొచ్చా లేదా?కథేంటి?సందీప్ బాలకృష్ణన్(మోహన్ లాల్) కొచ్చిలో క్లౌడ్ కిచెన్ నడుపుతుంటాడు. ఇతడికి గుండె సమస్య. ఓ రోజు పుణెలో ఉండే కర్నల్ రవీచంద్రన్ ప్రమాదంలో చనిపోతాడు. దీంతో ఈయన గుండెని వైద్యులు.. సందీప్కి అమర్చుతారు. తర్వాత కొన్నిరోజులకు సందీప్ దగ్గరకు వచ్చిన కర్నల్ కూతురు హరిత(మాళవిక మోహనన్).. తన నిశ్చితార్థానికి రమ్మని ఆహ్వానిస్తుంది. అలా సందీప్.. పుణె వెళ్తాడు. అక్కడికి వెళ్లాక ఎదురైన పరిస్థితులు ఏంటి? రెండు రోజులు అనుకున్నది కాస్త రెండు వారాలు ఎందుకు ఉండాల్సి వచ్చింది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఇప్పుడొస్తున్న చాలా సినిమాలు ఫ్యామిలీ ఆడియెన్స్ని ఎంటర్టైన్ చేయడంలో ఫెయిల్ అవుతున్నాయి. కానీ ఈ చిత్రం ఫీల్ గుడ్ ఎమోషన్స్తో అందరినీ ఆకట్టుకుంటుంది. చెప్పుకోవాలంటే ఇందులో పెద్దగా కథేం ఉండదు కానీ పరిస్థితులకు తగ్గట్ల వచ్చే సింపుల్ కామెడీ, క్లైమాక్స్లో వచ్చే ఎమోషన్స్.. ఫెర్ఫెక్ట్ మూవీ చూశాం అనే ఫీలింగ్ కలిగిస్తాయి.సాధారణంగా అవయవాల ట్రాన్స్ప్లాంటేషన్ అనే మాటని అప్పుడప్పుడు వింటుంటాం. అలా ప్రమాదంలో చనిపోయిన ఓ వ్యక్తి గుండెని హీరోకి అమర్చుతారు. చెప్పుకొంటే ఇది సీరియస్ సబ్జెక్ట్. కానీ దర్శకుడు దీన్ని ఓ అందమైన ప్రయాణంలా చూపించాలని ఫిక్సయ్యాడు. ఆ విషయంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు.కర్నల్ గుండెని సందీప్కి అమర్చడంతో కథ నేరుగా మొదలవుతుంది. తర్వాత సందీప్ చుట్టూ ఉండే ప్రపంచాన్ని చూపిస్తారు. అనంతరం జెర్రీ అనే నర్స్తో కలిసి పుణె వెళ్లడం, అనుకోని పరిస్థితుల్లో హరిత నిశ్చితార్థం ఆగిపోవడం.. ఇలా స్టోరీలో సంఘర్షణ ఏర్పడుతుంది. అప్పటివరకు కామెడీగా వెళ్తున్నది కాస్త రొమాంటిక్ టర్న్ తీసుకుంటుంది. హరిత, అతడి తల్లి చూపించే కేరింగ్ హీరోకి మరోలా అర్థం కావడం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. చివరకొచ్చేసరికి ఎమోషనల్గా ముగించిన తీరు ఆకట్టుకుంటుంది.ప్రారంభంలో మొహమాటం, కాస్తంత అమాయకత్వం ఉన్న సందీప్... గుండె అమర్చిన తర్వాత పరిస్థితుల కారణంగా ఎలా మారుతాడు. చివరకు ధైర్యం, ముక్కుసూటితనం లాంటివి ఎలా నేర్చుకుంటాడు అనే విషయాన్ని చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. ఇందులో హీరో హీరోయిన్ అంటూ ఎవరూ ఉండరు. మోహన్ లాల్ పాత్ర అతి సామాన్యంగా ఉంటుంది. హరిత, ఆమె తల్లి పాత్రలు కూడా మన చుట్టూ మనుషుల్లానే అనిపిస్తారు.సందీప్ బాలకృష్ణన్ పాత్రని మోహన్ లాల్ సటిల్డ్గా చేసుకుంటూ వెళ్లిపోయాడు. హరితగా మాళవిక మోహనన్ అందంగా ఉంది. జెర్రీగా సంగీత్ ప్రతాప్, సందీప్ బావగా సిద్ధిఖీ కామెడీ చేసే బాధ్యత తీసుకున్నారు. వీళ్లతో పాటు మిగతా పాత్రధారులందరూ ఏ మాత్రం అతి చేయకుండా చాలా సహజంగా నటించారు. చూస్తున్నంతసేపు ఓ సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ రానంత సహజంగా అనిపిస్తుంది. పాటలు, సెకండాఫ్లో వచ్చే మెలోడ్రామా కాస్త సాగదీతగా అనిపిస్తుంది. తప్పితే ఓవరాల్గా మూవీ భలే అనిపిస్తుంది. కుటుంబంతో కలిసి నిరభ్యంతరంగా చూడొచ్చు.- చందు డొంకాన -
ఓటీటీకి వచ్చేస్తోన్న మదరాసి.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన చిత్రం మదరాసి. అమరన్ సూపర్ హిట్ తర్వాత వచ్చిన ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ఈ చిత్రం సెప్టెంబరు 5న బిగ్ స్క్రీన్పై సందడి చేసింది. అయితే ఫ్యాన్స్ అంచనాలు అందుకోలేకపోయినా.. ఉన్నంతలో ఫర్వాలేదనిపించింది. అయినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కోట్ల రూ.100 వసూళ్లు రాబట్టింది. కాగా.. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా మెప్పించింది.ఈ యాక్షన్ మూవీ కోసం ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియాలో వస్తోన్న ఓటీటీ స్ట్రీమింగ్ డేట్స్ వైరల్ కావడంతో అధికారిక ప్రకటన వచ్చేసింది. అక్టోబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు శివ కార్తికేయన్తో వీడియో రిలీజ్ చేసింది. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్లో విద్యుత్ జమాల్ విలన్గా మెప్పించగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు.మదరాసి కథేంటంటే?తమిళనాడులో గన్ కల్చర్ తీసుకురావాలనేది విరాట్(విద్యుత్ జమ్వాల్) అనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్లాన్. ఇందులో భాగంగా గన్స్ ఉన్న ఆరు కంటెయినర్లని రాష్ట్రంలోకి తీసుకొస్తుంటాడు. ఈ సంగతి ఎన్ఐఏ(NIA)కి తెలుస్తుంది. ఆఫీసర్ ప్రేమ్(బిజు మేనన్).. తన టీమ్తో కలిసి వీటిని ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ పెద్ద గొడవ. ఆఫీసర్ ప్రేమ్ తీవ్ర గాయాలపాలవుతాడు. మరోవైపు లవ్ ఫెయిలైందని రఘు(శివకార్తికేయన్) ఆత్మహత్యాయత్నం చేస్తాడు. ఫ్లైఓవర్ పై నుంచి దూకేస్తాడు. ఇతడికీ గాయాలవుతాయి. అనుకోకుండా ప్రేమ్-రఘని ఒకే అంబులెన్స్లో ఆస్పత్రికి తీసుకొస్తారు. తర్వాత ప్రేమ్ లీడ్ చేస్తున్న మిషన్లోకి రఘు ఎలా ఎంటర్ అయ్యాడు? రఘు ప్రేమించిన మాలతి (రుక్మిణి వసంత్) ఎవరు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. Brace yourself for a mad ride with yours truly Madharaasi ❤️🔫#MadharaasiOnPrime, Oct 1@SriLakshmiMovie @Siva_Kartikeyan @ARMurugadoss @anirudhofficial @VidyutJammwal #BijuMenon @rukminitweets @actorshabeer @vikranth_offl @SudeepElamon pic.twitter.com/McLGlMBEN4— prime video IN (@PrimeVideoIN) September 26, 2025 -
ఫ్రైడే ధమాకా: ఒక్కరోజే ఓటీటీలో 22 సినిమాలు
ఈ ఫ్రైడే ఓటీటీలో కిక్కిచ్చే సినిమాలు రిలీజవుతున్నాయి. యాక్షన్, హారర్, కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్.. ఇలా అన్నిరకాల చిత్రాలు ఓటీటీప్రియులను అలరించేందుకు రెడీ అయ్యాయి. వాటిలో ఘాటి, హృదయం పూర్వం, సుమతి వళవు చిత్రాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మరి రేపు (సెప్టెంబర్ 26) ఒక్కరోజే ఓటీటీలో రిలీజయ్యే సినిమాలేంటో చూసేద్దాం..జియోహాట్స్టార్👉 హృదయపూర్వం (మలయాళ మూవీ)అమెజాన్ ప్రైమ్👉 ఘాటి (తెలుగు మూవీ)👉 మాదేవా (కన్నడ మూవీ)నెట్ఫ్లిక్స్👉 ధడక్ 2 (హిందీ మూవీ)👉 సనాఫ్ సర్దార్ (హిందీ మూవీ)👉 ఒడుమ్ కుతిరా చడుమ్ కుతిరా (మలయాళ మూవీ)👉 ది గెస్ట్ (ఇంగ్లీష్ సిరీస్) 👉 అలైస్ (ఇంగ్లీష్ సిరీస్)👉 హౌస్ ఆఫ్ గిన్నీస్ (ఇంగ్లీష్ సిరీస్)👉 మాంటిస్ (దక్షిణ కొరియన్ సినిమా)👉 ఫ్రెంచ్ లవర్ (ఇంగ్లీష్ మూవీ)👉 రుత్ అండ్ బోజ్ (ఇంగ్లీష్ మూవీ)👉 క్రైమ్సీన్ జీరో (కొరియన్ వెబ్సిరీస్ - కొత్త ఎపిసోడ్)జీ5👉 జనావర్: ద బీస్ట్ వితిన్ (హిందీ సిరీస్)👉 సుమతి వళవు (మలయాళ సినిమా)సన్ నెక్స్ట్👉 మేఘాలు చెప్పిన ప్రేమకథ (తెలుగు మూవీ)👉 దూరతీర యానా (కన్నడ మూవీ)ఆపిల్ ప్లస్ టీవీ👉 ఆల్ ఆఫ్ యూ (ఇంగ్లీష్ మూవీ)👉 ద సావంత్ (ఇంగ్లీష్ సిరీస్)లయన్స్ గేట్ ప్లే👉 డేంజరస్ యానిమల్స్ (ఇంగ్లీష్ సినిమా)మనోరమ మ్యాక్స్👉 సర్కీత్ (మలయాళ మూవీ)హుళు👉 ద మ్యాన్ ఇన్ మై బేస్మెంట్ (ఇంగ్లీష్ మూవీ)చదవండి: OG మూవీలో హీరోయిన్కు అన్యాయం -
ఓటీటీలోకి అనుష్క ‘ఘాటీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
అనుష్క శెట్టి(Anushka shetty) నటించిన తాజా చిత్రం ‘ఘాటి’(Ghaati Movie). క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం ఈ చిత్రం సెప్టెంబర్ 5న విడుదలై మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. కథా నేపథ్యం బాగున్నా.. దాన్ని అంతే ఆకర్షనీయంగా తెరపై చూపించడంలో క్రిష్ సఫలం కాలేదు. ఫలితంగా రెండో రోజు నుంచే సినిమా కలెక్షన్స్ తగ్గిపోయాయి. దీంతో విడుదలైన 20 రోజుల్లోనే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తోంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ని అమెజాన్ ప్రైమ్(Amazon prime Video) రిలీజ్ చేసింది.స్ట్రీమింగ్ ఎప్పుడంటే..‘ఘాటి’ఓటీటీ రైట్స్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. అయితే రిలీజైన 8 వారాలకు ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలనుకున్నారు. కానీ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ముందుగానే ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. సెప్టెంబర్ 26 నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.ఘాటి కథేంటంటే..ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మాత్రమే ఖరీదైన గంజాయి పంట శీలావతి. ఆ పంటను కోసి, బయటకు తీసుకొచ్చే సత్తా ఘాటీలకు మాత్రమే ఉంటుంది. అలా బయటకు తీసుకొచ్చిన గంజాయిని డ్రగ్స్ మాఫీయా లీడర్ కాష్టాల నాయుడు (రవీంద్ర విజయ్), అతని తమ్ముడు కుందుల నాయుడు(చైతన్యరావు) ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తుంటారు. అలా ఘాటీలుగా పని చేసిన దేశిరాజు(విక్రమ్ ప్రభు), శీలావతి(అనుష్క).. ఓ కారణంగా ఆ పని వదిలేస్తారు... వేరే పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు.కట్ చేస్తే.. కుందుల నాయుడికి తెలియకుండా ఓ గ్యాంగ్ శీలావతి గంజాయిని లిక్విడ్గా మార్చి బయటి ప్రాంతాలకు సరఫరా చేస్తుంటుంది. ఈ ముఠాకి లీడర్గా దేశిరాజు ఉన్నట్లు కుందుల నాయుడికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఘాటీ పని వదిలిన దేశి రాజు, శీలావతి మళ్లీ గంజాయి స్మగ్లింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? శీలావతి క్రిమినల్గా ఎందుకు మారాల్సి వచ్చింది? దేశిరాజు లక్ష్యం ఏంటి? ఆ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు శీలావతి ఏం చేసింది? అనేదే మిగతా కథ. -
ఓటీటీలో 'జూనియర్'.. స్ట్రీమింగ్ కొత్త తేదీ ఇదే
ఓటీటీలో 'జూనియర్' సినిమా విడుదల గురించి మరోసారి అప్టేడ్ వచ్చింది. ఈనెల 22 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ఓటీటీ సంస్థ 'ఆహా' ఇప్పటికే ప్రకటించింది. కానీ, కొన్ని కారణాల వల్ల అందుబాటులోకి తీసుకురాలేదు. అయితే, తాజాగా మరోపోస్టర్తో కొత్త విడుదల తేదీని ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ నీరక్షణకు తెరపడింది.'జూనియర్' సినిమా సెప్టెంబర్ 30న ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని ఆహా సంస్థ పేర్కొంది. ‘సీనియర్కి సెమిస్టర్ పరీక్షలున్నాయి.. అందుకే జూనియర్ ఈ నెల 30న వస్తున్నాడు’ అని సరదాగ ఒక క్యాప్షన్ పెట్టింది. కిరీటి రెడ్డి హీరోగా నటించిన తొలి చిత్రం 'జూనియర్'(Junior Movie). ఇందులో ‘వైరల్ వయ్యారి..’ పాటకు శ్రీలీల, కిరీటి వేసిన స్టెప్పులు సినిమాకు భారీ హైప్ వచ్చింది. దీంతో ఈ మూవీ ఓటీటీ విడుదల కోసం అభిమానులు భారీగానే ఎదురుచూశారు. అయితే, విడుదల విషయంలో కాస్త ఆలస్యం అయినప్పటికీ దసరా సెలవుల్లో విడుదల చేయడంతో మరింత జోష్ పెరగనుంది. జెనీలియా కీలక పాత్ర పోషించింది. కాలేజీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో మొదలై ఎమోషనల్గా సాగే ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించాడు.కథేంటంటే..విజయనగరానికి చెందిన కోదండపాణి(రవి చంద్రన్)-శ్యామల దంపతులకు ఆలస్యంగా పుట్టిన బిడ్డ అభి(కిరీటీ రెడ్డి). తండ్రి-కొడుకు మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉండడం.. ఆయన చూపించే అతిప్రేమ అభికి చిరాకు తెప్పిస్తుంది. తండ్రికి దూరంగా ఉండాలనే పైచదువుల కోసం సిటీకి వెళ్తాడు. ‘అరవయ్యేళ్లు వచ్చాక మనకంటూ చెప్పుకోవడానికి కొన్ని మెమోరీస్ ఉండాలి కదా’ అంటూ స్నేహితులతో కాలేజీ లైఫ్ని ఎంజాయ్ చేస్తుంటాడు.తోటి విద్యార్థిని స్పూర్తి(శ్రీలీల)తో ప్రేమలో పడి.. ఆమె పని చేసే కంపెనీలోనే ఉద్యోగం సంపాదిస్తాడు. తొలిరోజే తన ప్రవర్తనతో బాస్ విజయ సౌజన్య (జెనీలియా)కు చిరాకు తెప్పిస్తాడు. ఆ తర్వాత విజయ సౌజన్య గురించి ఓ నిజం తెలుస్తుంది. ఓ కారణంగా ఆమెతో కలిసి తన సొంతూరు విజయనగరానికి వెళ్తాడు. అభికి తెలిసిన నిజం ఏంటి? విజయనగరం గ్రామంతో విజయ సౌజన్యకు ఉన్న సంబంధం ఏంటి? అభి తండ్రి సొంత ఊరిని వదిలి ఎందుకు నగరానికి వచ్చాడు? కోదండ పాణికి, విజయ సౌజన్యకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు రొమాంటిక్ సినిమా
మరో తెలుగు సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. థియేటర్లలోకి వచ్చిన నెలరోజుల్లోనే స్ట్రీమింగ్ కానుంది. మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా కాన్సెప్ట్తో తీసిన ఈ చిత్రానికి డీసెంట్ టాక్ వచ్చింది. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఏ ఓటీటీలోకి రానుంది?మత్తు వదలరా, పంచతంత్రం, పరువు, వికటకవి లాంటి సినిమాలు, వెబ్ సిరీస్ల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న నరేశ్ అగస్త్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'మేఘాలు చెప్పిన ప్రేమకథ'. ఆగస్టు 22న థియేటర్లలో రిలీజ్ కాగా ప్రేక్షకుల్లో పెద్దగా రిజిస్టర్ కాకుండానే మాయమైపోయింది. ఇప్పుడు సన్ నెక్స్ట్ ఓటీటీలో ఈ నెల 26 నుంచి అంటే శుక్రవారం నుంచే అందుబాటులోకి వచ్చేసింది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: రామ్ చరణ్ కోసం ఫ్లాప్ హీరోయిన్?) 'మేఘాలు చెప్పిన ప్రేమకథ' విషయానికొస్తే.. వరుణ్ (నరేశ్ అగస్త్య) విదేశాల్లో చదువుకుని తిరిగి ఇండియాకు వచ్చేస్తాడు. సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనేద ఇతడి కోరిక. దీని గురించి తండ్రికి(సుమన్) చెబితే కోప్పడతాడు. దీంతో వరుణ్ ఇంటి నుంచి బయటకొచ్చేస్తాడు. తమిళనాడులోని వాల్పరై అనే ఊరికి వెళ్తాడు. ఇక్కడ చిన్నప్పుడు నాయినమ్మ కాంచీపురం కామాక్షి శంకరమూర్తి(రాధిక శరత్ కుమార్)తో గడిపిన బంగ్లా, ఎస్టేట్ ఉంటాయి. మరోవైపు మేఘన(రబియా ఖాతూన్) కూడా ఈ ఊరికి వస్తుంది. అనుకోని పరిస్థితుల్లో వరుణ్-మేఘన ప్రేమలో పడతారు. మరి వీరిద్దరి మధ్య దూరం ఎందుకు పెరిగింది? గాయకుడు, సంగీత దర్శకుడిగా వరుణ్ సక్సెస్ అయ్యాడా లేదా అనేది మిగతా స్టోరీ.ఈ వారం ఓటీటీల్లో 'మేఘాలు చెప్పన ప్రేమకథ' కాకుండా జూనియర్, సుందరకాండ లాంటి స్ట్రెయిట్ తెలుగు మూవీస్ కూడా ఓటీటీలోకి వచ్చేశాయి. అలానే హృదయపూర్వం, ఒడుమ్ కుతిరా చడుమ్ కుతిరా, సుమతి వళవు తదితర డబ్బింగ్ సినిమాలు కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటితో పాటు సడన్ సర్ప్రైజులు లాంటి కొత్త చిత్రాలు కూడా ఏమైనా రావొచ్చు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 27 సినిమాలు)Two worlds, one bond.Together, they find something greater 💖💫Meghalu Cheppina Prema Katha premieres 26th September on SunNXT.Watch the journey unfold!#MeghaluCheppinaPremaKatha #Premieres26thSeptemberOnSunNXT #LoveStory #MusicalRomance pic.twitter.com/qbHwqVq0ZX— SUN NXT (@sunnxt) September 22, 2025 -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 27 సినిమాలు
మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి పవన్ కల్యాణ్ 'ఓజీ' మూవీ రానుంది. మరి ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి? మరోవైపు ఓటీటీల్లో 27 సినిమాలు, వెబ్ సిరీసులు రానున్నాయి. ఈ వీకెండ్ తెలుగు స్ట్రెయిట్ చిత్రాలతో పాటు పలు డబ్బింగ్లు కూడా ఉండటం ఆసక్తి రేపుతోంది.(ఇదీ చదవండి: 'ఓజీ'.. జస్ట్ మిస్ అయింది)ఓటీటీల్లో రిలీజయ్యే వాటి విషయానికొస్తే.. జూనియర్, సుందరకాండ లాంటి స్ట్రెయిట్ సినిమాలతో పాటు హృదయపూర్వం, ఒడుమ్ కుతిరా చడుమ్ కుతిరా, సుమతి వళవు తదితర డబ్బింగ్ చిత్రాలు రాబోతున్నాయి. వీటిపై కాస్తంత ఆసక్తి ఉండనే ఉంది. ఇవే కాకుండా వీకెండ్లో సడన్ సర్ప్రైజ్లు ఏమైనా ఉండొచ్చేమో చూడాలి? ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్ కానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు (సెప్టెంబరు 21 నుంచి 28 వరకు)ఆహాజూనియర్ (తెలుగు సినిమా) - సెప్టెంబరు 22అమెజాన్ ప్రైమ్హోటల్ కాస్టైరా (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 24కొకైనా క్వార్టర్ బ్యాక్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 25టూమచ్ విత్ కాజల్ అండ్ ట్వింకిల్ (హిందీ టాక్ షో) - సెప్టెంబరు 25మాదేవా (కన్నడ సినిమా) - సెప్టెంబరు 26నెట్ఫ్లిక్స్ఒడుమ్ కుతిరా చడుమ్ కుతిరా (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 26ది గెస్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 26అలైస్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 26మాంటిస్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 26హౌస్ ఆఫ్ గిన్నీస్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 26హాట్స్టార్సుందరకాండ (తెలుగు సినిమా) - సెప్టెంబరు 23ది డెవిల్ ఈజ్ బిజీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - సెప్టెంబరు 24హృదయపూర్వం (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 26మార్వెల్ జాంబియాస్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 24ద బల్లాడ్ ఆఫ్ వల్లిస్ ఐలాండ్ (ఇంగ్లీష్ చిత్రం) - సెప్టెంబరు 28ఉమన్ ఇన్ ద యార్డ్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 28ద ఫ్రెండ్ (ఇంగ్లీష్ చిత్రం) - సెప్టెంబరు 28డెత్ ఆఫ్ ఏ యూనికార్న్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 28సన్ నెక్స్ట్దూరతీర యానా (కన్నడ మూవీ) - సెప్టెంబరు 26జీ5జనావర్ (హిందీ సిరీస్) - సెప్టెంబరు 26సుమతి వళవు (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 26ఆపిల్ ప్లస్ టీవీస్లో హార్సస్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 24ఆల్ ఆఫ్ యూ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 26ద సావంత్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 26లయన్స్ గేట్ ప్లేడేంజరస్ యానిమల్స్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 26మనోరమ మ్యాక్స్సర్తీక్ (మలయాళ మూవీ) - సెప్టెంబరు 26ఎమ్ఎక్స్ ప్లేయర్సిక్సర్ సీజన్ 2 (హిందీ సిరీస్) - సెప్టెంబరు 24(ఇదీ చదవండి: మనీష్ ఎలిమినేట్.. రెండువారాల సంపాదన ఎంతంటే?) -
ఓటీటీలో కనిపించని 'జూనియర్'.. కారణం ఏంటి?
కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా నటించిన తొలి చిత్రం జూనియర్(Junior Movie).. థియేటర్స్లో మెప్పించిన ఈ సినిమా తాజాగా ఓటీటీ ప్రకటన కూడా చేసింది. ఇందులో ‘వైరల్ వయ్యారి..’ పాటకు శ్రీలీల, కిరీటి వేసిన స్టెప్పులు సినిమాకు భారీ హైప్ వచ్చింది. దీంతో ఈ మూవీ ఓటీటీ విడుదల కోసం అభిమానులు భారీగానే ఎదురుచూశారు. అయితే, ప్రకటన వచ్చినప్పటికీ ఈ చిత్రం అనుకున్న సమయానికి స్ట్రీమింగ్కు రాలేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.జూనియర్ మూవీ ఆహా ఓటీటీలోకి రాబోతుందనే ఇప్పటికే అధికారికంగా ప్రకటంచిన సంగతి తెలిసిందే. నేడు (సెప్టెంబర్ 22) నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ఒక పోస్టర్ను కూడా పంచుకున్నారు. అయితే, ఇప్పటికీ కూడా ఆహా తెలుగు ఓటీటీలో జూనియర్ కనిపించలేదు. దీంతో అభిమానులు సోషల్మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. ఇదే సమయంలో సెప్టెంబర్ 22 నుంచే నమ్మఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్లో జూనియర్ స్ట్రీమింగ్ కానుందని చెప్పారు. ఇది కన్నడ ఓటీటీ యాప్ అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం అందులో కూడా విడుదల కాలేదని తెలుస్తోంది.కిరిటీ, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించగా జెనీలియా కీలక పాత్ర పోషించింది. కాలేజీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో మొదలై ఎమోషనల్గా సాగే ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించాడు. వాస్తవంగా ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ మొదట దక్కించుకుంది. కానీ, ఇప్పటివరకు స్ట్రీమింగ్ గురించి ఆ సంస్థ పెద్దగా ప్రచారం చేయలేదు. ఈ క్రమంలో సడెన్గా ఆహా ఓటీటీ సంస్థ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ముందుగా అనుకున్న సమయానికి జూనియర్ ఓటీటీలోకి రాకపోవడంతో అమెజాన్, ఆహాలతో మేకర్స్ ఏమైనా డీలింగ్స్ విషయంలో ఇబ్బందులు వచ్చాయా అనే సందేహం వ్యక్తమౌతుంది. -
ఓటీటీలోకి 'లోక'.. దుల్కర్ ట్వీట్తో క్లారిటీ
రీసెంట్ టైంలో రెండు సూపర్ హీరో సినిమాలు వచ్చాయి. తెలుగులో వచ్చిన 'మిరాయ్' హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతానికి రూ.120 కోట్ల వరకు కలెక్షన్ సాధించింది. మరోవైపు గత నెల చివర్లో 'లోక' అనే మలయాళ ఫిమేల్ సూపర్ హీరో మూవీ ఒకటి వచ్చింది. కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలోకి రానుందనే రూమర్స్ వస్తున్నాయి. ఇప్పుడు వీటిపై నిర్మాత దుల్కర్ సల్మాన్ ఓ క్లారిటీ ఇచ్చాడు.కల్యాణి ప్రియదర్శన్ 'లోక' సినిమాని తెలుగులో 'కొత్త లోక' పేరుతో రిలీజ్ చేశారు. ఇక్కడ పర్లేదనే టాక్ వచ్చింది గానీ వసూళ్లు అంతంత మాత్రంగానే వచ్చాయి. కానీ ఒరిజినల్ వెర్షన్ మలయాళంలో మాత్రం అద్భుతమైన కలెక్షన్ వచ్చాయి. ప్రస్తుతం రూ.250 కోట్లకు పైనే వచ్చాయని, తద్వారా మలయాళ ఇండస్ట్రీ హిట్గా ఈ చిత్రం నిలిచింది. అయితే ఈ మూవీని ఇప్పట్లో ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశం లేదని నిర్మాత దుల్కర్ సల్మాన్ ట్వీట్ చేశాడు. రూమర్స్ను నమ్మొద్దు. అధికారిక ప్రకటన కోసం వేచి చూడండి అని విజ్ఞప్తి చేశాడు.(ఇదీ చదవండి: రాజమౌళి కంటే ధనుష్తోనే కష్టం: 'కట్టప్ప' సత్యరాజ్)ఈ శుక్రవారం నుంచే 'లోక' స్ట్రీమింగ్ ఉండనుందనే రూమర్స్ వచ్చేసరికి చాలామంది నెటిజన్లు సంతోషపడ్డారు. కానీ ఈ చిత్ర నిర్మాత దుల్కర్ ట్వీట్తో క్లారిటీ ఇచ్చేసరికి సైలెంట్ అయిపోయారు. ఈ మూవీ డిజిటల్ హక్కుల్ని నెట్ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకుంది. ఇప్పటికీ థియేటర్లలో ఇంకా ఒరిజినల్ వెర్షన్ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. కాబట్టి ఓటీటీ డేట్ అనుకున్న టైం కంటే కాస్త లేటుగా తీసుకురానున్నారు. అంటే అక్టోబరు రెండో వారం వస్తుందేమో చూడాలి?'లోక' విషయానికొస్తే.. చంద్ర (కల్యాణి ప్రియదర్శన్) సూపర్ పవర్స్ ఉన్న ఓ అమ్మాయి. ఈమె గురించి కొందరికి తెలుసు. ఓ సందర్భంలో చంద్ర, బెంగళూరు రావాల్సి వస్తుంది. తన పవర్స్ బయటపెట్టకుండా సాధారణ అమ్మాయిలా బతుకుతుంది. రాత్రిపూట ఓ కేఫ్లో పనిచేస్తుంటుంది. ఎదురింట్లో ఉంటే సన్నీ(నస్లేన్).. ఈమెని చూసి లవ్లో పడతాడు. పరిస్థితులు కలిసొచ్చి ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. కానీ ఓ రోజు రాత్రి జరిగిన సంఘటనల దెబ్బకు చంద్ర జీవితం తలకిందులవుతుంది. ఇంతకీ చంద్ర గతమేంటి? ఎస్ఐ నాచియప్ప(శాండీ)తో గొడవేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఐఫోన్తో తీసిన జాంబీ సినిమా.. ఓటీటీ రివ్యూ)Lokah isn't coming to OTT anytime soon. Ignore the fake news and stay tuned for official announcements! #Lokah #WhatstheHurry— Dulquer Salmaan (@dulQuer) September 21, 2025 -
ఐఫోన్తో తీసిన జాంబీ సినిమా.. ఓటీటీ రివ్యూ
ఓటీటీల్లో థ్రిల్లర్, హారర్ సినిమాలకు ఉండే డిమాండ్ వేరు. అందున హాలీవుడ్ నుంచి ఈ జానర్ మూవీస్ వస్తున్నాయి అంటే కచ్చితంగా భయపెట్టి తీరేలానే ఉంటాయి. అలా జూన్లో థియేటర్లలోకి వచ్చిన ఓ చిత్రం.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. అదే '28 ఇయర్స్ లేటర్'(28 ఏళ్ల తర్వాత). ప్రస్తుతం ఇది నెట్ఫ్లిక్స్లో తెలుగులో ఉచితంగానే స్ట్రీమింగ్ అవుతోంది. 'స్లమ్ డాగ్ మిలీయనీర్'ని తీసిన డేనీ బోయెల్ దీనికి దర్శకుడు. మరి ఈ సినిమా అంతలా భయపెట్టిందా అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: 'ఇలాంటి సినిమా మీరెప్పుడూ చూసుండరు'.. టాక్ ఏంటి?)కథేంటి?2002లో రేజ్ వైరస్ రాకతో ప్రపంచమంతా అతలాకుతలం అవుతుంది. అలా 28 ఏళ్లు గడిచిపోతాయి. బ్రిటన్లోని ఓ దీవిలో ఈ వైరస్ బారిన పడని కొంతమంది జీవిస్తుంటారు. హీరో జేమీ తన 12 ఏళ్ల కొడుకు స్పైక్, భార్యతో కలిసి బతుకుతుంటాడు. ఓ రోజు వేట కోసం జేమీ, స్పైక్.. మెయిన్ ల్యాండ్కు వెళ్తారు. ఇక్కడ మెయిన్ ల్యాండ్ అంటే జాంబీలు ఉండే ప్రదేశం. అక్కడ 'ఆల్ఫా' అనే బలమైన జాంబీ ఈ తండ్రి కొడుకులకు ఎదురుపడుతుంది. తర్వాత ఏమైంది? తిరిగి ద్వీపానికి చేరుకున్నారా లేదా అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఇదో జాంబీ సినిమా. అంటే వైరస్ సోకేసరికి చాలామంది మనుషులు రాక్షసుల్లా మారిపోతారు. వీళ్ల నుంచి తప్పించుకున్న కొందరు ఓ ద్వీపంలో తలదాచుకుంటారు. ఆ ద్వీపానికి జాంబీలు ఉండే ప్రదేశానికి మధ్యలో చిన్న దారి ఉంటుంది. కానీ రాత్రయితే ఆ దారి అంతా సముద్రంలో మునిగిపోతూ ఉంటుంది. అలాంటి వీళ్లలోని ఓ తండ్రి కొడుకు జాంబీల దగ్గరకు వెళ్తారు. తర్వాత ఊహించి పరిస్థితులు ఎదురవుతాయి. అక్కడి నుంచి పాత్రల మధ్య ఎలాంటి సంఘర్షణ ఏర్పడుతుంది. తర్వాత ఏమైందనేది మూవీ చూసి ఎక్స్పీరియెన్స్ చేయాలి.ఈ సినిమాని కచ్చితంగా ఒంటరిగానే చూడండి. అలా అని బూతు సన్నివేశాలు ఏం ఉండవు. జాంబీలన్నీ బట్టల్లేకుండానే ఉంటాయి. కానీ ఒంటిపై బురదలాంటిది ఉంటుంది. కానీ జాంబీలని భయంకరంగా చంపడం లాంటి సీన్స్ ఉంటాయి. ఇదో హారర్ మూవీ అయినప్పటికీ మరోవైపు థ్రిల్ పంచుతూ మానవ సంబంధాలు, భావోద్వేగాలని కూడా చూపిస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే సైకలాజికల్ హారర్ థ్రిల్లర్.రెండు గంటల్లోపే ఉండే ఈ సినిమా నెమ్మదిగానే ఉంటుంది గానీ విజువల్స్ గానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గానీ డిఫరెంట్ అనుభూతిని ఇస్తుంది. నటీనటుల ఫెర్ఫార్మెన్స్ కూడా మూవీలో మీరు లీనమయ్యేలా చేస్తుంది. తెలుగు డబ్బింగ్ పర్లేదు. అయితే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్ని ఐఫోన్తో తీయడం విశేషం. అమెజాన్ ప్రైమ్, జీ5 తదితర ఓటీటీల్లోనూ ఉంది గానీ వాటిలో రెంట్ పద్ధతిలో చూడొచ్చు. నెట్ఫ్లిక్స్లో ఫ్రీగా తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. హారర్ థ్రిల్లర్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే దీనిపై ఓ లుక్కేసేయండి.-చందు డొంకాన(ఇదీ చదవండి: రీసెంట్ టైంలో బెస్ట్ హాలీవుడ్ సినిమా.. 'ఎఫ్ 1' రివ్యూ (ఓటీటీ)) -
OTT: ఎలియో మూవీ రివ్యూ
హేయ్ కిడ్స్...మీకెవరికైనా ఏలియన్స్ ని చూడాలనుందా లేదా వాళ్ళ దగ్గరకి వెళ్ళాలనుందా. అమ్మో అస్సలు లేదు అనుకుంటున్నారా..కాని ఎలియోకి మాత్రం తనను ఎవరైనా ఏలియన్స్ తీసుకువెళితే బావుండు అని అనుకుంటున్నాడు, అది కూడా ఎంతలా అంటే రోజూ బీచ్ కి వెళ్ళి అలా ఒంటరిగా ఉండిపోయి పడుకుండి పోతాడు. ఎప్పుడైనా ఓ ఏలియన్ తనను చూసి ఎత్తుకెళ్ళకుండా ఉంటదా అన్న చిన్న ఆశ ఎలియోకి. తన పేరెంట్స్ ని పోగొట్టుకోని ఎయిర్ ఫోర్స్ మేజర్ అయిన తన పిన్ని దగ్గర ఉంటున్న ఎలియోకి చిన్నప్పటి నుండి ఈ ఏలియన్స్ అంటే పిచ్చి, అందుకే తనను ఎత్తుకుపొమ్మని కనిపించిన సిగ్నల్స్ కి మెసేజ్ పెడుతుంటాడు ఎలియో. ఆ రోజు రానే వస్తుంది. ఎలియోని ఓ ఏలియన్ గ్రూప్ ఎత్తుకువెళుతుంది. ఏలియన్స్ గ్రూప్ లో గ్లోర్డన్ ఎలియోకి మంచి ఫ్రెండ్ అవుతుంది. ఇక అక్కడ నుండి వీళ్ళు చేసే అల్లరి, ఫాంటసీ అడ్వెంచర్స్ మాత్రం హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న యానిమేటెడ్ ఫాంటసీ మూవీ ఎలియోని చూడాల్సిందే. కిడ్స్ ఎలియో ఈజ్ ఎ సూపర్ మూవీ. ఇంకెందుకాలస్యం గ్రాబ్ యువర్ రిమోట్ టు జాయిన్ ఎలియో ఎలాంగ్ విత్ ఏలియన్స్.- హరికృష్ణ ఇంటూరు -
ఓటీటీల్లోకి వచ్చేసిన రెండు తెలుగు సినిమాలు
ఈ వీకెండ్ ఓటీటీల్లోకి పలు సినిమాల వచ్చాయి. వాటిలో మహావతార్ నరసింహా, కన్యాకుమారి, కొత్త రంగుల ప్రపంచం లాంటి తెలుగు స్ట్రెయిట్ మూవీస్ రిలీజయ్యాయి. అలానే ఎలియో, 28 ఇయర్స్ లేటర్ తదితర హాలీవుడ్ డబ్బింగ్ బొమ్మలు కూడా డిజిటల్గా అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ఇవి కాకుండా మరో రెండు తెలుగు చిత్రాలు కూడా ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీల్లోకి రావడం విశేషం.(ఇదీ చదవండి: ఆస్కార్ రేసులో పుష్ప 2, సంక్రాంతికి వస్తున్నాం, కన్నప్ప)గత నెల 1వ తేదీన థియేటర్లలో రిలీజైన తెలుగు సినిమా 'నీ బంధీనైపోయా'. అసలు ఇది ఎప్పుడు వచ్చి వెళ్లిందో కూడా తెలీదు. చిన్న నటీనటులతో తీసిన ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 2 గంటల పాటు సాగే ఈ మూవీని క్రైమ్ థ్రిల్లర్ స్టోరీతో తెరకెక్కించారు. జానకి అనే అమ్మాయి.. తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ నుంచి దూరంగా వెళ్లిపోయి బతకాలనుకుంటుంది. కానీ ఓ వ్యక్తి ఈమెని కిడ్నాప్ చేస్తాడు. ఇంతకీ అతడెవరు? ఈమెనే ఎందుకు బంధించాడు? అనేదే మిగతా స్టోరీ.అలానే ఈ ఏడాదే థియేటర్లలో రిలీజైన '4 గర్ల్స్' అనే సినిమా కూడా అమెజాన్ ప్రైమ్లోకి వచ్చేసింది. కాకపోతే ఇది రెంట్ విధానంలో అందుబాటులో ఉంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ చూడొచ్చు. శ్రుతిక, ఆక్షణ, ప్రిన్స్, అంకుర్ ప్రధాన పాత్రల్లో నటించారు. శివ దర్శకత్వం వహించాడు. అయితే ఇవి చిన్న సినిమాలు. కంటెంట్ పరంగానే అంతంత మాత్రంగానే ఉందనే టాక్ వినిపిస్తుంది. ఆసక్తి బట్టి చూడండి.(ఇదీ చదవండి: ఓజీ.. జగనే కరెక్ట్: నట్టి కుమార్) -
మలయాళ బ్లాక్బస్టర్ మూవీ.. ఓటీటీలో ఎప్పుడంటే?
మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ (Mohanlal) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం హృదయపూర్వం (Hridayapoorvam Movie). సంగీత్ ప్రతాప్, ది రాజాసాబ్ బ్యూటీ మాళవిక కీలక పాత్రల్లో నటించారు. క్లాసిక్ సినిమాకు కేరాఫ్ అడ్రస్ అయిన సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించాడు. ఆశీర్వాద్ సినిమా బ్యానర్పై ఆంటొని పెరుంబవూర్ నిర్మించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించాడు. ఆగస్టు 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ హిట్ కొట్టింది. వచ్చేవారమే రిలీజ్కేవలం రూ.30 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.70 కోట్ల మేర కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికీ కేరళలోని పలు థియేటర్లలో ప్రదర్శితమవుతూనే ఉంది. సినిమా రిలీజై మూడువారాలు దాటిపోవడంతో ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు. జియో హాట్స్టార్లో సెప్టెంబర్ 26న విడుదల చేస్తున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.వరుస హిట్లుమోహన్లాల్ ఈ ఏడాది ఫుల్ జోష్లో ఉన్నాడు. ఈ ఏడాది మూడు సినిమాలు రిలీజవగా ఆ మూడు కూడా బ్లాక్బస్టర్ హిట్లు కొట్టాయి. ఎల్2: ఎంపురాన్ మూవీ ఏకంగా రూ.260 కోట్లు రాబట్టింది. మలయాళ సినీ చరిత్రలోనే రూ.250 కోట్లు దాటిన మొట్టమొదటి సినిమాగా రికార్డుకెక్కింది. తర్వాత తుడరుమ్ రిలీజ్ అవగా ఈ మూవీ కూడా రూ.230 కోట్లు వసూలు చేసింది. తర్వాత వచ్చిన హృదయపూర్వం రూ.70 కోట్లు కలెక్ట్ చేసింది. మరి మోహన్లాల్ మున్ముందు ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి! എന്ന് ഹൃദയപൂർവം ജിയോഹോട്ട്സ്റ്റാർ#Hridayapoorvam will be streaming from September 26 on JioHotstar. @mohanlal @antonypbvr @aashirvadcine @MalavikaM_#Hridayapoorvam #HridayapoorvamOnJioHotstar #Mohanlal #HridayapoorvamMohanlal #Family #Drama #Comedy #Malayalam #JioHotstar pic.twitter.com/r8Q1hL4JEv— JioHotstar Malayalam (@JioHotstarMal) September 19, 2025చదవండి: గాజులేసుకుని కూర్చో.. సుమన్పై సంజనా చీప్ కామెంట్స్ -
ఓటీటీలోకి 'జూనియర్'.. స్ట్రీమింగ్ డేట్ ప్రకటన
ఒక్క పాటతో గుర్తింపు తెచ్చుకున్న సినిమా 'జూనియర్'. శ్రీలీల వైరల్ వయ్యారి అని స్టెప్పులు వేసేసరికి ఈ చిత్రం అప్పట్లో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. గాలి జనార్ధన రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా పరిచయమైన ఈ మూవీ.. జూలైలోనే థియేటర్లలోకి వచ్చింది. కానీ ఓటీటీ రిలీజ్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. రీసెంట్గానే ఆహా లోకి వస్తుందని ప్రకటించారు. ఎప్పుడా అని నెటిజన్లు ఎదురుచూస్తుండగా ఇప్పుడు తేదీని కూడా అనౌన్స్ చేశారు.(ఇదీ చదవండి: సగం వయసున్న వాళ్లతో డేటింగ్.. నేను కూడా రెడీ: హీరోయిన్ అమీషా పటేల్)కిరిటీ, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించగా జెనీలియా కీలక పాత్రలో నటించింది. కాలేజీ బ్యాక్ డ్రాప్తో తీసిన ఎమోషనల్ మూవీ ఇది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. బాక్సాఫీస్ దగ్గర అంతంత మాత్రంగానే ఆడిన ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. తొలుత ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుందని టాక్ నడిచింది. కానీ ఇప్పుడు తెలుగు వెర్షన్ ఆహా ఓటీటీలో ఈనెల 22 నుంచి అంటే సోమవారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు. మరోవైపు కన్నడ వెర్షన్.. నమ్మ ఫ్లెక్స్ అనే ఓటీటీలో ఇదే రోజునుంచి అందుబాటులోకి రానుందని ప్రకటించారు.'జూనియర్' విషయానికొస్తే.. ఇంజినీరింగ్ చదివే అభి(కిరీటి) జ్ఞాపకాలే ముఖ్యమనుకుని నమ్ముతాడు. అందుకు తగ్గట్లే కాలేజీలో నాలుగేళ్లు సరదాగా గడిపేస్తాడు. మంచి జ్ఞాపకాల్ని దాచుకుంటాడు. చదువు పూర్తయిన తర్వాత తాను లవ్ చేసిన స్ఫూర్తి (శ్రీలీల) పనిచేసే కంపెనీలోనే ఉద్యోగంలో చేరతాడు. కానీ బాస్ విజయ సౌజన్య (జెనీలియా)కి ఇతడంటే నచ్చదు. అలాంటి అభితో కలిసి అనుకోని పరిస్థితుల్లో విజయనగరం అనే ఊరికి వెళ్లాల్సి వస్తుంది. మరి విజయనగరానికి, విజయకి సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: మౌళి.. రౌడీ టీ షర్ట్, మహేశ్ ట్వీట్.. ఇవన్నీ ఫేక్: బండ్ల గణేశ్) -
ఓటీటీకి రూ.340 కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ డేట్ రివీల్
ఎలాంటి అంచనాలు లేకుండా యానిమేషన్ చిత్రం మహావతార్ నరసంహా. జూలై 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా కలెక్షన్స్ రాబట్టింది. రెండురోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 7 కోట్ల నెట్ కలెక్షన్స్తో రికార్డ్ క్రియేట్ చేసింది. మహా విష్ణువు దశావతారాల ఆధారంగా 'మహావతార్' సినిమాటిక్ యూనివర్స్ (ఎమ్.సి.యు) పేరుతో తొలి చిత్రంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.అశ్విన్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధవాన్, కుశల్ దేశాయ్, చైతన్య దేశాయ్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం 200 థియేటర్స్కు పైగా 50 రోజులు పూర్తి చేసుకుందని ఇటీవలే మేకర్స్ ప్రకటించారు. రిలీజైన రోజు నుంచి ఏకంగా రూ. 340 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టినట్లు వెల్లడించారు. ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే.బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచిన ఈ మూవీ కోసం ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సూపర్ హిట్ మూవీ ఓటీటీ డేట్ మేకర్స్ రివీల్ చేశారు. ఈ శుక్రవారం(సెప్టెంబర్ 19న) మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు నెట్ఫ్లిక్స్ మహావతార్ నరసింహ పోస్టర్ను పంచుకుంది. ఇంకెందుకు ఆలస్యం రేపటి నుంచి ఫ్యామిలీతో కలిసి ఓటీటీలో ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
థియేటర్లలో దక్ష, బ్యూటీ.. మరి ఓటీటీలో ఏయే సినిమాలో తెలుసా?
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ వారంలో పెద్ద సినిమాలేవీ థియేటర్ల రిలీజ్ కావడం లేదు. మంచు లక్ష్మీ లీడ్ రోల్లో వస్తోన్న దక్ష, అంకిత్ కొయ్య, నీలఖి పాత్ర నటించిన లవ్ స్టోరీ ఈ శుక్రవారం బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. వీటితో పాటు విజయ్ ఆంటోని భద్రకాళి, కన్నడ సినిమా వీర చంద్రహాస కూడా థియేటర్లలో రిలీజవుతున్నాయి.ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ శుక్రవారం కొత్త సినిమాలు అలరించేందుకు వచ్చేస్తున్నాయి. కాజోల్ వెబ్ సిరీస్ ద ట్రయల్ సీజన్- 2, వాటిలో శ్రీలీల, కిరిటీ నటించిన జూనియర్ కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. అయితే జూనియర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇంకా రివీల్ చేయలేదు. రేపటి నుంచి సడన్ స్ట్రీమింగ్కు వస్తుందో.. లేదో వేచి చూడాల్సిందే. వీటితో పాటు పలు డబ్బింగ్ సినిమాలు, హాలీవుడ్ చిత్రాలు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి.నెట్ఫ్లిక్స్సీ సెయిడ్ మేబీ- (హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 19హంటెడ్ హోటల్-(యానిమేషన్ హారర్ సిరీస్)- సెప్టెంబర్ 19బిలియనీర్స్ బంకర్- (హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 1928 ఇయర్స్ లేటర్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 20అమెజాన్ ప్రైమ్జూనియర్ (కన్నడ డబ్బింగ్ సినిమా)- సెప్టెంబర్ 19(రూమర్ డేట్)కాన్పిడెన్స్ క్వీన్ సీజన్-1(హాలీవుడ్ సిరీస్)- సెప్టెంబర్ 20జియో హాట్స్టార్పోలీస్ పోలీస్ (తమిళ వెబ్ సిరీస్) - సెప్టెంబరు 19ద ట్రయల్ సీజన్ -2 (హిందీ వెబ్ సిరీస్) - సెప్టెంబరు 19స్వైప్డ్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 19సన్ నెక్స్ట్ఇంద్ర (తమిళ సినిమా) - సెప్టెంబరు 19మాటొండ హెలువే (కన్నడ మూవీ) - సెప్టెంబరు 19ఆహాష్ సీజన్ 2 (తెలుగు సిరీస్) - సెప్టెంబరు 19జూనియర్- (కన్నడ సినిమా)- సెప్టెంబరు 19(రూమర్ డేట్)జీ5హౌస్మేట్స్ (తమిళ సినిమా) - సెప్టెంబరు 19లయన్స్ గేట్ ప్లేద సర్ఫర్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 19మనోరమ మ్యాక్స్రండం.. యామం(మలయాళ మూవీ)- సెప్టెంబరు 19 -
ఓటీటీలో సూపర్ హిట్ హారర్ సినిమా.. ఎక్కడంటే?
ఓటీటీలో మలయాళ సినిమాలకున్న క్రేజే వేరు. అయితే ఈసారి లవ్స్టోరీకి బదులుగా ఓ కామెడీ హారర్ మూవీ ఓటీటీ (OTT)లోకి రానుంది. ఆ సినిమాయే సుమతి వలవు (Sumathi Valavu Movie). ఇందులో అర్జున్ అశోకన్, సైజు కురుప్, గోకుల్ సురేశ్, మాళవిక మనోజ్, బాలు వర్గీస్ ప్రధాన పాత్రలు పోషించారు. విష్ణు శశి శంకర్ దర్శకత్వం వహించాడు. ఆగస్టు 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హారర్ కామెడీ చిత్రం దాదాపు రూ.25 కోట్లు రాబట్టింది.ఓటీటీలో హారర్ మూవీతాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు. సెప్టెంబర్ 26 నుంచి జీ5లో ప్రసారం కానుందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ సుమతి వలవు అందుబాటులోకి రానుంది. ఈ మూవీలో హారర్, కామెడీతో పాటు మిస్టరీ, ఎమోషన్స్, థ్రిల్ కూడా ఉందని చిత్రయూనిట్ చెప్తోంది. ఐఎమ్డీబీలో ఈ సినిమా 7.7 రేటింగ్ దక్కించుకోవడం విశేషం. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో దీనికి సీక్వెల్ కూడా ప్రకటించారు. വരുന്നു, "സുമതി വളവ്". സെപ്റ്റംബർ 26 മുതൽ നമ്മുടെ ZEE5 മലയാളത്തിൽ#SumathiValavu Premieres 26th September on ZEE5#ArjunAshokan #SidharthBharathan #GokulSuresh #BaluVarghese #SaijuKurup #BobyKurian #MalavikaManoj #JoohiJu #SijaRoseGeorge #Shivada pic.twitter.com/NGNr99ihOA— ZEE5 Malayalam (@zee5malayalam) September 18, 2025చదవండి: అమ్మ పేరుతో పేదలకు రుచికరమైన భోజనం: రాఘవ లారెన్స్ -
బాక్సాఫీస్ మాత్రమే కాదు.. ఓటీటీలోనూ సంచలనమే!
ఈ ఏడాది సూపర్ హిట్గా నిలిచన రొమాంటిక్ లవ్ స్టోరీ సైయారా. మోహిత్ సూరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.580 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. ఎలాంటి బజ్ లేకుండా వచ్చిన ఈ సినిమా ఊహించని విధంగా బాక్సాఫీస్ను షేర్ చేసింది. ఈ చిత్రం ద్వారా అహాన్ పాండే (Ahaan Panday), అనీత్ పడ్డా (Aneet Padda) బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. జులై 18న విడుదలైన ఈ సినిమా సంచనాలు క్రియేట్ చేసింది. కేవలం మౌత్ టాక్ పవర్తో బాక్సాఫీస్ రికార్డ్లను తిరగరాసింది. 60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం బాలీవుడ్లో అనేక చిత్రాల కలెక్షన్స్ను దాటి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ ఏడాది ఓవర్సీస్లో అత్యధిక వసూళ్లు సొంతం చేసుకున్న బాలీవుడ్ సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఈ ఏడాది బాలీవుడ్ హిట్ సినిమా ఛావా రికార్డ్ను కూడా దాటేసింది.ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో సందడి చేస్తోంది. సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద అదరగొట్టిన సైయారా ఓటీటీలోనూ తగ్గేదేలే అంటోంది. ఓటీటీకి వచ్చిన తొలి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న నాన్- ఇంగ్లీష్ చిత్రంగా నిలిచింది. వరల్డ్ వైడ్గా ఆంగ్లేతర చిత్రాల జాబితాలో అగ్రస్థానంలో సైయారా కొనసాగుతోంది. ఈ రొమాంటిక్ డ్రామా జర్మన్ చిత్రం 'ఫాల్ ఫర్ మీ', హిందీ మూవీ 'ఇన్స్పెక్టర్ జెండే'లను అధిగమించింది. ఈ చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే అగ్రస్థానానికి చేరుకుంది, 'ఫాల్ ఫర్ మీ' మూవీతో సహా అనేక చిత్రాలను దాటేసింది.ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో ప్రపంచవ్యాప్తంగా ఆంగ్లేతర చిత్రాల జాబితాలో సైయారా మొదటి స్థానంలో ఉంది. ఈ చిత్రం 3.7 మిలియన్ల వ్యూస్తో పాటు 9.3 మిలియన్ గంటల వీక్షణలతో దూసుకెళ్తోంది. జర్మన్ థ్రిల్లర్ మూవీ 'ఫాల్ ఫర్ మీ' 6.5 మిలియన్ గంటల వ్యూస్తో రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత మనోజ్ భాజ్పాయ్ నటించిన 'ఇన్స్పెక్టర్ జెండే' 6.2 మిలియన్ గంటల వీక్షణలతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ జాబితాలో విజయ్ దేవరకొండ నటించిన 'కింగ్డమ్' 2.5 మిలియన్ గంటల వ్యూస్తో తొమ్మిదో స్థానంలో ఉంది. -
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
లేటెస్ట్ తెలుగు సినిమా నెలలోపే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్దమైంది. నారా రోహిత్, శ్రీదేవి విజయ్ కుమార్, వర్తి వాఘని హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం.. మొన్నమొన్ననే థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకుల్ని అలరించేందుకు రెడీ అయిపోయింది. ఈ క్రమంలోనే అధికారికంగానూ ప్రకటించారు. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఏ ఓటీటీలోకి రానుంది?గత కొన్నేళ్లుగా నటనకు దూరంగా ఉన్న నారా రోహిత్.. ఈ ఏడాది 'భైరవం' మూవీతో వచ్చాడు. కానీ ఫలితం డిసప్పాయింట్ చేసింది. గత నెల 27న 'సుందరకాండ' అనే సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు. కామెడీ వర్కౌట్ అయింది అనే టాక్ వచ్చింది గానీ దీన్ని కూడా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఈనెల 23 నుంచి హాట్స్టార్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో అందుబాటులోకి రానుంది.(ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి 'జూనియర్' సినిమా)'సుందరకాండ' విషయానికొస్తే.. సిద్ధార్థ్ (నారా రోహిత్) 30 ఏళ్లు దాటిపోయి చాన్నాళ్లయినా సరే పెళ్లి చేసుకోడు. స్కూల్లో చదువుకునేటప్పుడు తన సీనియర్ వైష్ణవి(శ్రీదేవి)ని ప్రేమిస్తాడు. ఆమెలోని కొన్ని లక్షణాలు ఇతడికి నచ్చుతాయి. పెద్దయిన తర్వాత అలాంటి లక్షణాలున్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని తనకు తానే రూల్ పెట్టుకుంటాడు. సంబంధాలు వస్తుంటాయి, అమ్మాయిల్ని చూస్తుంటాడు కానీ అందరినీ రిజెక్ట్ చేస్తుంటాడు.ఓసారి ఎయిర్పోర్ట్లో ఐరా(వృతి వాఘని) అనే అమ్మాయిలో తను అనుకున్న క్వాలిటీస్ ఉన్నాయని సిద్దార్థ్ ఆమె వెంటపడతాడు. తనని ప్రేమించేలా చేస్తాడు. మరి ఈ ప్రేమకథ సుఖాంతమైందా? సిద్ధార్థ్ మళ్లీ వైష్ణవిని ఎందుకు కలవాల్సి వచ్చిందనేది మిగతా స్టోరీ. అయితే ఇందులో హీరో.. తల్లికూతురిని ప్రేమించడం అనే కాన్సెప్ట్ కాస్త విడ్డూరంగా ఉంటుంది. సత్య కామెడీ వర్కౌట్ అయినప్పటికీ.. ఈ కాన్సెప్ట్ ఓకే అనుకుంటేనే దీన్ని చూడండి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు ఇవే) -
ఎట్టకేలకు ఓటీటీలోకి 'జూనియర్' సినిమా
కొన్నాళ్ల క్రితం వైరల్ వయ్యారి అంటూ శ్రీలీల పాట ఒకటి తెగ వైరల్ అయిపోయింది. ఇది 'జూనియర్' అనే సినిమాలోనిది. ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధనరెడ్డి కొడుకు కిరీటి ఈ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. అయితే థియేటర్లలోకి వచ్చి దాదాపు రెండు నెలలు కావొస్తున్నా సరే ఇంకా ఓటీటీలోకి రాలేదు. అలాంటిది ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ గురించి ఓ అప్డేట్ వచ్చేసింది.కిరిటీ, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించగా జెనీలియా కీలక పాత్ర పోషించింది. కాలేజీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో మొదలై ఎమోషనల్గా సాగే ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించాడు. అయితే బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ అంతంత మాత్రంగానే ఆడింది. యావరేజ్ టాక్ దగ్గరే ఆగిపోయింది. లెక్క ప్రకారం ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. కానీ ఇప్పటివరకు స్ట్రీమింగ్ గురించి ఎలాంటి సౌండ్ లేదు. ఇప్పుడు ఆహా ఓటీటీ ఈ సినిమాని త్వరలోనే స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు ఇవే)అయితే ఈ శుక్రవారం(సెప్టెంబరు 19) నుంచే 'జూనియర్'.. ఆహా ఓటీటీలోకి రానుందని సమాచారం. ఒకవేళ ఇప్పుడు మిస్ అయితే మాత్రం వచ్చే వారం పక్కా. ఈ సినిమా విషయానికొస్తే.. జ్ఞాపకాలే ముఖ్యమనుకునే కుర్రాడు అభి(కిరీటి). కాలేజీలో నాలుగేళ్లు సరదాగా గడిపేస్తాడు. మంచి జ్ఞాపకాల్ని పోగుచేసుకుంటాడు. చదువు పూర్తయిన తర్వాత తాను ప్రేమించిన స్ఫూర్తి (శ్రీలీల) పనిచేసే కంపెనీలోనే జాబ్లో జాయిన్ అవుతాడు. కానీ అక్కడ బాస్ విజయ సౌజన్య (జెనీలియా)కి అభి అంటే నచ్చదు. విజయనగరం అనే ఊరు కూడా ఈమెకు నచ్చదు. అలాంటి ఇష్టం లేని ఊరికి, ఇష్టం లేని అభితో కలిసి విజయ్ వెళ్లాల్సి వస్తుంది. ఇంతకీ విజయనగరానికి, విజయకి సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. మరి ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్లోకి సినిమా ఒకేసారి వస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ సినిమా) View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ సినిమా
టాలీవుడ్లో 'థర్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ' అనే డైలాగ్తో పాపులారిటీ తెచ్చుకున్న నటుడు పృథ్వీరాజ్... కెరీర్ ప్రారంభంలో విలన్ తరహా పాత్రలు చేశాడు. గత కొన్నాళ్ల నుంచి మాత్రం కమెడియన్గా పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇతడు దర్శకుడిగా మారి తన కూతురిని హీరోయిన్గా పరిచయం చేస్తూ ఓ మూవీ తీశాడు. గతేడాది ఇది థియేటర్లలో రిలీజైంది. కాకపోతే ఎప్పుడొచ్చి వెళ్లిందో కూడా జనాలకు తెలియలేదు. అలాంటి చిత్రం ఇప్పుడు సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: మోదీ జీవితంపై మరో సినిమా.. హీరో ఎవరంటే?)పృథ్వీరాజ్ దర్శకుడిగా తీసిన సినిమా 'కొత్త రంగుల ప్రపంచం'. ఇతడి కూతురు శ్రీలు హీరోయిన్. క్రాంతి కృష్ణ హీరోగా నటించాడు. హారర్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ చిత్రం.. గతేడాది జనవరి 20న థియేటర్లలోకి వచ్చింది. ప్రేక్షకులు దీన్ని కనీసం పట్టించుకోలేదు. తర్వాత అందరూ ఈ మూవీ గురించి పూర్తిగా మరిచిపోయారు. అలాంటిది దాదాపు ఏడాదిన్నర తర్వాత అమెజాన్ ప్రైమ్లోకి వచ్చేసింది. అయితే అద్దె విధానంలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.'కొత్త రంగుల ప్రపంచం' విషయానికొస్తే.. షూటింగ్ కోసం ఓ ఫామ్ హౌస్కు డైరెక్టర్ పృథ్వీ తన బృందంతో వెళ్తాడు. ఈయన తీసే సినిమాలో శ్రీలు, క్రాంతి కృష్ణ హీరోహీరోయిన్లు. ఫామ్ హౌస్కి గురువయ్య అనే మేనేజర్ ఉంటాడు. అయితే షూటింగ్ టైంలో ఆ ఇంట్లో ఏదో ఉందనే అనుమానం అందరికీ వస్తుంది. హీరోయిన్ శ్రీలు నటించేటపుడు వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇది గమనించిన పృథ్వీ.. ఓ గురువు దగ్గరకు వెళ్తే శ్రీలుని ఓ ఆత్మ ఆవహించిందని చెబుతాడు. అసలు ఆత్మ ఎవరు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు ఇవే)అమెజాన్ ప్రైమ్లో ఈ రోజు నుంచే 'కన్యాకుమారి' అనే తెలుగు సినిమా కూడా స్ట్రీమింగ్లోకి వచ్చేసింది. ఆగస్టు 27న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. ఇప్పుడు మూడు వారాల్లోకి అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటీటీల్లోకి వచ్చింది. ఉచితంగానే చూడొచ్చు. -
ఓటీటీలో దూసుకెళ్తోన్న మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్..!
దసరా విలన్ షైన్ టామ్ చాకో నటించిన కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ సూత్రవాక్యం. ఈ మూవీ ఈ ఏడాది జూన్లో థియేటర్లలో విడుదలైంది. అయితే బాక్సాఫీస్ వద్ద అంతగా అభిమానులను మెప్పించలేకపోయింది. ప్రస్తుతం ఈ చిత్రంలో ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఓటీటీలో రిలీజయ్యాక 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్కు పైగా దూసుకెళ్తోంది. థియేటర్లలో అంతగా రాణించకపోయినా.. ఓటీటీలో మాత్రం అదరగొడుతోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీకి యూజీన్ జోస్ చిరమ్మెల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో షైన్ టామ్ చాకోతో పాటు విన్సీ అలోషియస్, దీపక్ పరంబోల్ నటించారు. ఈ సినిమాలో క్రిస్టో జేవియర్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో షైన్ టామ్ చాకో కనిపించారు. నిర్మాత శ్రీకాంత్ కండ్రాగుల నిర్మాత ఓ కీలక పాత్రలో కనిపించి, తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. -
ఒకేసారి రెండు ఓటీటీల్లోకి వచ్చేస్తున్న తెలుగు సినిమా
విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ ‘కన్యా కుమారి’ ఓటీటీలోకి రాబోతుంది. గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ జంటగా నటించిన వినాయక చవితి కానుకగా గత నెల 27న థియేటర్స్ లోకి వచ్చి ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. రేపటి నుంచి(సెప్టెంబర్ 17)ఈ చిత్రం అమోజాన్ ప్రైమ్ వీడియో, ఆహా ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రానికి ‘పుష్పక విమానం’ ఫేం సృజన్ దర్శకత్వం వహించారు. నటి మధు శాలిని ప్రెజెంటర్గా వ్యవహరించారు. ఈ సినిమా కథ విషయానికొస్తే.. తిరుపతి(శ్రీచరణ్), కన్యాకుమారి(గీత్ సైని) ఒకే స్కూల్. తిరుపతికి కన్యాకుమారి అంటే ఇష్టం. తిరుపతికి రైతు అవ్వాలి, వ్యవసాయం చేయాలని అనుకుంటాడు. కన్యాకుమారి మాత్రం పెద్ద సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అవ్వాలని అనుకుంటుంది. తిరుపతి చిన్నప్పుడే చదువు మానేసి రైతు అవుతాడు. దీంతో వీరిద్దరి మధ్య కనెక్షన్ కట్ అవుతుంది. ఇక కన్యాకుమారికి ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల డిగ్రీ చేసి బట్టల షాప్ లో పని చేస్తూ ఉంటుంది. కన్యాకుమారి పెళ్లి సంబంధాలు చూస్తుంటే.. అబ్బాయి జాబ్ చేయాలి, నన్ను సాఫ్ట్వేర్ ఇంజినీర్ చేయాలి, సిటీలో ఉండాలి అని కండిషన్స్ పెడుతుంది.తిరుపతికి ఏమో రైతు అని పెళ్లి అవ్వదు. అనుకోకుండా తిరుపతి ఫ్రెండ్ వల్ల కన్యాకుమారి – తిరుపతి కలుసుకుంటారు. తిరుపతి మళ్ళీ పాత ప్రేమని బయటకి తీసి కన్యాకుమారి వెంట తిరుగుతాడు. కన్యాకుమారి మాత్రం తిరుపతి రైతు అని పట్టించుకోదు. ఎలాగోలా తిరుపతి ఆమె వెనకాలే తిరిగి ప్రేమలో పడేస్తాడు. కానీ ఆ ప్రేమ బయటపడేలోపే తను సాఫ్ట్వేర్ ఇంజినీర్ అవ్వడానికి సపోర్ట్ చేస్తారన్నారని కన్యాకుమారి ఇంట్లో చూసిన సంబంధానికి ఓకే చెప్తుంది. కనీసం నీకు ఉద్యోగం కూడా లేదు అని తిరుపతిని ప్రశ్నిస్తుంది. దీంతో తిరుపతి కన్యాకుమారి కోసం వ్యవసాయం మానేసి ఇష్టం లేకపోయినా జాబ్ లో జాయిన్ అవుతాడు. మరి కన్యాకుమారి పెళ్లి ఏమైంది? తిరుపతి - కన్యాకుమారిల ప్రేమ ఫలించిందా? తిరుపతి వ్యవసాయంలో సెటిల్ అయ్యాడా? కన్యాకుమారి సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిందా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు ఇవే
మరోవారం వచ్చేసింది. ప్రస్తుతం థియేటర్లలో మిరాయ్, కిష్కింధపురి, లిటిల్ హార్ట్స్ అలరిస్తున్నాయి. ఈ వీకెండ్ చాలానే సినిమాలు రాబోతున్నాయి. మంచు లక్ష్మీ 'దక్ష', బ్యూటీ, ఇలాంటి సినిమా మీరు ఎప్పుడూ చూసుండరు తదితర తెలుగు చిత్రాలతో పాటు భద్రకాళి, వీరచంద్రహాస, టన్నెల్ తదితర డబ్బింగ్ మూవీస్ థియేటర్లలోకి రానున్నాయి. అయితే వీటిలో దేనిపైనా ఏ మాత్రం హైప్ లేదు. వీటిలో ఏది క్లిక్ అవుతుందో చూడాలి?(ఇదీ చదవండి: 'మిరాయ్'లో శ్రీరాముడు ఇతడే.. ఈ నటుడు ఎవరో తెలుసా?)మరోవైపు ఓటీటీల్లో 15కి పైగా సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో 28 ఇయర్స్ లేటర్, ఎలియో, ఇంద్ర, హౌస్ మేట్స్ తదితర మూవీస్తో పాటు ద బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్, ష్ సీజన్ 2, ద ట్రయల్ సీజన్ 2 సిరీస్లు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (సెప్టెంబరు 15 నుంచి 21 వరకు)నెట్ఫ్లిక్స్ద బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ (హిందీ సిరీస్) - సెప్టెంబరు 1828 ఇయర్స్ లేటర్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 20అమెజాన్ ప్రైమ్జెన్ వీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 17బెలెన్ (స్పానిష్ సినిమా) - సెప్టెంబరు 18హాట్స్టార్ఎలియో (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 17సిన్నర్స్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 18పోలీస్ పోలీస్ (తమిళ సిరీస్) - సెప్టెంబరు 19ద ట్రయల్ సీజన్ 2 (హిందీ సిరీస్) - సెప్టెంబరు 19స్వైప్డ్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 19సన్ నెక్స్ట్ఇంద్ర (తమిళ సినిమా) - సెప్టెంబరు 19మాటొండ హెలువే (కన్నడ మూవీ) - సెప్టెంబరు 19ఆహాష్ సీజన్ 2 (తెలగు సిరీస్) - సెప్టెంబరు 19జీ5హౌస్మేట్స్ (తమిళ సినిమా) - సెప్టెంబరు 19ఆపిల్ ప్లస్ టీవీద మార్నింగ్ షో సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 17లయన్స్ గేట్ ప్లేద సర్ఫర్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 19(ఇదీ చదవండి: శేఖర్ కమ్ముల హిట్ మూవీ హీరోయిన్.. ఇప్పుడేం చేస్తోంది?) -
ఓటీటీకి మరో మలయాళ మూవీ.. కేవలం వారికి మాత్రమే!
ఓటీటీలు వచ్చాక మలయాళ చిత్రాలకు ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. ఇటీవల ఓటీటీల్లో మాత్రమే కాకుండా థియేటర్లలో సూపర్ హిట్గా నిలుస్తున్నాయి. కంటెంట్ బాగుంటే చాలు ఆడియన్స్ తెగ చూసేస్తున్నారు. సినిమా ఎప్పుడు రిలీజ్ అన్నది ముఖ్యం కాదు.. స్టోరీ ముఖ్యమంటున్నారు. దీంతో ఓటీటీల్లో మలయాళ సినిమాలకు ఆడియన్స్లో ఫుల్ క్రేజ్ వస్తోంది.మలయాళంలో తెరకెక్కించిన మరో చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. అసిఫ్ అలీ, దివ్య ప్రభ జంటగా నటించిన సర్కీట్ మూవీ ఓటీటీలో సందడి చేయనుంది. ఈనెల 26 నుంచి సింప్లీ సౌత్లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అయితే కేవలం ఓవర్సీస్ ఆడియన్స్కు మాత్రమే అందుబాటులో ఉండనుందని ప్రకటించారు. 'ముగ్గురు ఆత్మలు. ఒక రోజు. ఒక మలుపు' అంటూ పోస్టర్ను పంచుకున్నారు.కాగా.. ఈ చిత్రం మే 8న థియేటర్లలో విడుదలైంది. రిలీజైన నాలుగు నెలల తర్వాత ఓటీటీకి వస్తోంది. అయితే బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయిన ఈ మూవీ.. ఓటీటీలోనైనా రాణిస్తుందేమో వేచి చూడాల్సిందే. ఈ మూవీని ఫుల్ కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.Three souls. One day. A turning point.#Sarkeet, streaming on Simply South from September 26 worldwide, excluding India. pic.twitter.com/YJjcbmJRwG— Simply South (@SimplySouthApp) September 12, 2025 -
మిరాయ్ కోసం ప్రభాస్ రెమ్యునరేషన్? ఓటీటీ ప్లాట్ఫామ్ ఇదే!
మిరాయ్ సినిమా (Mirai Movie)కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. తేజ సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మైథలాజికల్ యాక్షన్ మూవీలో మంచు మనోజ్ విలన్గా నటించగా, రితికా నాయక్ హీరోయిన్గా చేసింది. శ్రియ, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించారు.రికార్డులు తిరగరాయడం ఖాయంమిరాయ్కు తొలి రోజే రూ.27 కోట్లు రావడంతో చిత్రయూనిట్ 'బ్రహ్మాండ్ బ్లాక్బస్టర్ సక్సెస్' పేరిట విజయోత్సవాలు జరుపుకుంది. సినిమాకు వస్తున్న టాక్ చూస్తుంటే మిరాయ్ రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ తన గొంతు అరువిచ్చాడు. సినిమా ప్రారంభంలో ప్రభాస్ గొంతు వినిపించగానే ప్రేక్షకులు ఎగిరిగంతేస్తున్నారు. మిరాయ్ మూవీకి అంత బూస్ట్ ఇచ్చిన ప్రభాస్ దీనికోసం ఎంత డబ్బు తీసుకున్నాడని కొందరు చర్చలు మొదలుపెట్టారు. ఓటీటీ పార్ట్నర్అసలే ప్రభాస్ది వెన్నలాంటి మనసు. తన వల్ల సినిమాకు ప్లస్ అవుతుందంటే సరేనని గొంతు అరువిచ్చి సాయం చేశాడే తప్ప ఒక్క పైసా కూడా తీసుకోలేదట! దీంతో రెబల్ స్టార్ను అభిమానులు మరోసారి ఆకాశానికెత్తేస్తున్నారు. ఇకపోతే మిరాయ్ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్ సొంతం చేసుకుంది. నెల రోజుల తర్వాతే మిరాయ్ ఓటీటీలోకి వచ్చే అవకాశాలున్నాయి. అంటే అక్టోబర్ నెలలో మిరాయ్ ఓటీటీలో ప్రత్యక్షం కానుందని తెలుస్తోంది.చదవండి: ప్యారడైజ్లో విలన్గా మోహన్బాబు.. లీక్ చేసిన మంచు లక్ష్మి -
Lilo And Stitch: ఏలియన్తో స్నేహం.. ఓటీటీలోకి గిలిగింతలు పెట్టించే మూవీ!
హేయ్ కిడ్స్...జియో స్టార్ లో ఓ సూపర్ మూవీ వచ్చిందోచ్. అదే లిలో & స్టిచ్. ఇదో సైంటిఫిక్ కామెడీ మూవీ. ఎర్త్ కి దూరంగా ఓ ప్లానెట్ లో ఏలియన్స్ ఓ ఎక్సపరిమెంట్ చేస్తుంటారు. దాంట్లో 626 అనే సూపర్ పవర్స్ ఉన్న ఏలియన్ ను క్రియేట్ చేస్తారు. అయితే యాక్సిడెంటల్ గా ఆ 626 ఏలియన్ ఎర్త్ మీద పడుతుంది. అది కూడా సరిగ్గా లిలో అనే పాప ఇంటి దగ్గర పడుతుంది. ఏలియన్ ప్లానెట్ హెడ్ ఈ 626 ని ఎర్త్ నుండి తీసుకురావడానికి మరో రెండు ఏలియన్స్ ని భూమి మీదకు పంపిస్తారు. అయితే ఈ లోపు పేరెంట్స్ ,ఫ్రెండ్సూ లేని లిలో కి 626 దొరికి మంచి ఫ్రెండ్ అవుతుంది.లిలో దానికి స్టిచ్ అని పేరు పెడుతుంది. లిలో & స్టిచ్ చేసే అల్లరి ఈ సినిమాలో సూపర్ హైలైట్. మరీ ముఖ్యంగా స్టిచ్ చేసే అల్లరి మిమ్మల్ని గిలిగింతలు పెట్టిస్తుంది. స్టిచ్ ని ఎత్తుకెళ్ళడానికి వచ్చిన ఇద్దరు ఏలియన్లు మనుషుల్లా మారి చేసే అల్లరి ఇంకా సూపర్ గా ఉంటుంది. ఇంకో సూపర్ విషయం ఏంటో తెలుసా, ఈ సినిమాని రూ. 10 కోట్లు పెట్టి తీస్తే వచ్చిన వందల కోట్ల లాభాలు వచ్చాయి. సో కిడ్స్..హావ్ ఎ నైస్ జర్నీ విత్ లిలో & స్టిచ్ ఆన్ జియో స్టార్.- హరికృష్ణ ఇంటూరు -
ఓటీటీలోకి బోల్డ్ సిరీస్ కొత్త సీజన్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీల్లో థ్రిల్లర్ సినిమాలు, సిరీసులతో పాటు బోల్డ్, రొమాంటిక్ కంటెంట్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆడియెన్స్ వీటిని కూడా చూస్తుంటారు. అందుకు తగ్గట్లు అప్పుడప్పుడు ఈ తరహా కంటెంట్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా అలానే ఓ సిరీస్కి రెండో సీజన్ తీసుకొచ్చేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. స్ట్రీమింగ్ తేదీని ప్రకటించడంతో పాటు ఓ పోస్టర్ కూడా వదిలారు. ఇంతకీ ఈ సిరీస్ సంగతేంటి?(ఇదీ చదవండి: మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) నాలుగు వేర్వేరు కథలతో 'ష్' అనే సిరీస్ని తమిళంలో తీశారు. గతేడాది దీన్ని ఆహా ఓటీటీలో రిలీజ్ చేయగా రెస్పాన్స్ బాగానే వచ్చింది. దీంతో కొన్ని నెలల క్రితం ఈ ఏడాదిలోనే తెలుగు డబ్బింగ్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ ఆంథాలజీకి రెండో సీజన్ కూడా రెడీ చేశారు. సెప్టెంబరు 19 నుంచి తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.తొలి సీజన్లానే ఈసారి కూడా నాలుగైదు వేర్వేరు కథలు ఉండబోతున్నాయి. పోస్టర్ చూస్తుంటే ఈ విషయం అర్థమవుతోంది. తొలి భాగంలోని వాళ్లు కాకుండా ఈసారి జినాల్, ఉమ, ఐశ్వర్య దత్తా, వేదిక తదితరులు లీడ్ రోల్స్ చేశారు. తొలి సీజన్ విషయానికొస్తే ఇందులో లస్ట్, రొమాన్స్ తదితర అంశాలని చూపించారు. స్కూల్ ఏజ్లో సె*క్స్ ఎడ్యుకేషన్, ఇద్దరు మాజీ ప్రేమికులు మళ్లీ కలిస్తే, మిడిల్ ఏజ్ రొమాన్స్, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఓ కుర్రాడు అమ్మాయికి ఆకర్షితుడై ఏం చేశాడు తదితర స్టోరీలతో ఈ సిరీస్ తీశారు.(ఇదీ చదవండి: ఓటీటీ ట్రెండింగ్లో తెలుగు హారర్ కామెడీ సినిమా) -
ఓటీటీ ట్రెండింగ్లో తెలుగు హారర్ కామెడీ సినిమా
ఈ వీకెండ్ ఓటీటీల్లోకి చాలానే సినిమాలు వచ్చాయి. కూలీ, పరదా, సయారా, సు ఫ్రమ్ సో.. ఇలా చాలా హిట్ చిత్రాలు ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటితో పాటు ఓ తెలుగు హారర్ కామెడీ మూవీ కూడా రీసెంట్గానే డిజిటల్గా అందుబాటులోకి వచ్చింది. క్షుద్ర పూజలతో నిద్రలేచే ఆత్మ వల్ల వచ్చే ఇబ్బందులు అనే కాన్సెప్ట్తో తీసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్లో ఉండటం విశేషం. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?గత కొన్నేళ్లలో తెలుగులో కమెడియన్గా గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్.. లీడ్ రోల్ చేసిన సినిమా 'బకాసుర రెస్టారెంట్'. ఆగస్టు తొలివారం థియేటర్లలోకి వచ్చింది. ప్రేక్షకుల నుంచి ఓ మాదిరి రెస్పాన్స్ దక్కించుకుంది. అలాంటిది నెల తిరగకుండానే అమెజాన్ ప్రైమ్లోకి వచ్చేసింది. ఈ సోమవారం నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అలాంటిది ఈ చిత్రం ఇప్పుడు సదరు ఓటీటీలో ట్రెండింగ్లో ఉంది.(ఇదీ చదవండి: మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) 'బకాసుర రెస్టారెంట్' విషయానికొస్తే.. పరమేశ్వర్ (ప్రవీణ్) ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఉద్యోగం చేస్తుంటాడు కానీ వ్యాపారం చేయాలని కోరిక. దీంతో రెస్టారెంట్ పెట్టాలనుకుంటాడు. డబ్బులు సంపాదించేందుకు యూట్యూబ్ ఛానెల్ మొదలుపెడతాడు. ఓ దెయ్యంపై తొలి వీడియో చేస్తే అది తెగ వైరల్ అవుతుంది. అలాంటిదే మరో వీడియో చేసేందుకు ఓ పాత బంగ్లాకు తన స్నేహితులతో కలిసి వెళ్తాడు. అక్కడ కనిపించిన పుస్తకంతో క్షుద్రపూజ చేస్తాడు. కట్ చేస్తే బక్క సూరి (వైవా హర్ష) అనే ఆత్మ బయటకొస్తుంది.బక్క సూరి ఆత్మతో పరమేశ్వర్, అతడి స్నేహితులు ఆడుకునే ప్రయత్నం చేయగా.. పరమేశ్వర్ స్నేహితుడి శరీరంలోకి ఈ ఆత్మ ప్రవేశిస్తుంది. దీనికి ఆకలికి ఎక్కువ. ఆ ఆత్మని బయటకు పంపేందుకు పరమేశ్వర్ గ్యాంగ్ ఎలాంటి ప్రయత్నాలు చేసింది? అసలు ఆత్మ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'ఫ్రీ బర్డ్' గోల.. సంజన అలా ఎందుకు చేశావ్? ప్రోమో రిలీజ్) -
ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా.. మూడేళ్ల తర్వాత
ఈ వారం థియేటర్లలోకి వచ్చిన 'మిరాయ్', 'కిష్కింధపురి' చిత్రాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. అందుకు తగ్గట్లే ప్రేక్షకుల నుంచి స్పందన వస్తోంది. మరోవైపు ఓటీటీల్లోనూ కూలీ, సయారా, సు ఫ్రమ్ సో, పరదా లాంటి హిట్ చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇలా వీకెండ్ని ఆడియెన్స్ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మరో తెలుగు మూవీ కూడా డిజిటల్గా అందుబాటులోకి వచ్చింది. దాదాపు మూడేళ్ల తర్వాత స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం.(ఇదీ చదవండి: 'కూలీ'లో నటించి తప్పు చేశా.. ఆమిర్ అంత మాటన్నాడా?)ప్రముఖ సంగీత దర్శకుడు కోటి.. గతంలో ఓ సినిమాలో ప్రతినాయకుడిగా చేశారు. అదే 'పగ పగ పగ'. 2022 సెప్టెంబరు 22న ఇది థియేటర్లలో రిలీజైంది. స్టార్స్ ఎవరూ లేకపోవడం, కథాకథనాలు ఓ మాదిరిగా ఉండేసరికి ఈ చిత్రంపై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. తర్వాత ఇన్నాళ్లకు ఆహా ఓటీటీ దీన్ని కొనుగోలు చేసింది. ఇప్పుడు అంటే దాదాపు మూడేళ్ల తర్వాత ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.'పగ పగ పగ' విషయానికొస్తే.. జగదీశ్ (కోటి), కృష్ణ (బెనర్జీ) రౌడీలు. జగదీశ్ చెప్పడంతో కృష్ణ, ఓ కుర్రాడిని హత్య చేస్తాడు. జైలుకెళ్లిన కృష్ణకి జగదీశ్ ధైర్యం చెబుతాడు. కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటానని మాట ఇస్తాడు. కానీ కృష్ణ కుటుంబాన్ని జగదీశ్ గాలికొదిలేస్తాడు. మరోవైపు కృష్ణ కొడుకు అభి కాలేజీలో చదువుతుంటాడు. జగదీశ్ కూతురు సిరితో ప్రేమిస్తుంటాడు. కూతురి ప్రేమ విషయం జగదీశ్కి తెలుస్తుంది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగదని కూతురితో చెబుతాడు. దాంతో లేచిపోయి వెళ్లిపోయిన సిరి, అభిని పెళ్లి చేసుకుంటుంది. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'మిరాయ్'తో పోటీ.. 'కిష్కింధపురి' తొలిరోజు కలెక్షన్ ఎంత?) -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్
ఓటీటీలోకి మరో తెలుగు సినిమా ఎలాంటి ప్రకటన లేకుండా వచ్చేసింది. రొమాంటిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తీసిన ఈ చిత్రంలో బిగ్బాస్ 8 తెలుగు ఫేమ్ సోనియా ఆకుల కీలక పాత్రలో నటించింది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనేది ఇప్పుడు చూద్దాం.సంతోష్ కల్వచెర్ల, క్రిషికా పటేల్ జంటగా నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ 'కిల్లర్ ఆర్టిస్ట్'. సోనియా ఆకుల కీలకపాత్రలో నటించింది. రతన్ రిషి దర్శకుడు. మార్చి 21న ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. స్టార్స్ లేకపోవడం, మూవీ కూడా అంతంత మాత్రంగానే ఉండేసరికి ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడీ చిత్రం సైలెంట్గా అమెజాన్ ప్రైమ్లోకి వచ్చేసింది. కాకపోతే అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వారం దీనితోపాటు పరదా, కూలీ, సయారా, సు ఫ్రమ్ సో లాంటి సినిమాలు కూడా ఓటీటీల్లోకి వచ్చాయి.(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ 'పరదా' సినిమా)'కిల్లర్ ఆర్టిస్ట్' విషయానికొస్తే.. విక్కీ (సంతోష్), స్వాతి (స్నేహ మాధురి) అన్నాచెల్లెలు. ఇంట్లో ఉన్నప్పుడు గుర్తుతెలియని కొందరు వీరిపై దాడి చేస్తారు. స్వాతిని చంపేస్తారు. ఈ ఘటన విక్కీ జీవితాన్ని మార్చేస్తుంది. తన కళ్ల ముందే చెల్లెలు మరణించడం తట్టుకోలేడు. ఆమె గుర్తులు తనను వెంటాడుతూనే ఉంటాయి. జాను (క్రిషేక్ పటేల్) ఇతడి జీవితంలోకి వస్తుంది. మామూలు మనిషిగా చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. మరోవైపు ఓ హీరోయిన్ మాస్క్ ధరించి 'పిచ్చి రవి' అనే సైకో నగరంలోని అమ్మాయిలను టార్గెట్ చేస్తూ చంపేస్తుంటాడు.ఈ కేసును పోలీసులు ఛేదించి అతన్ని అరెస్ట్ చేస్తారు. టీవీలో వార్తలు చూసిన విక్కీకి ఆ సైకో ధరించిన మాస్క్ తన ఇంట్లో కూడా కనిపిస్తుంది. దీంతో తన చెల్లిని చంపింది ఈ సైకోనే అయ్యుంటాడని విక్కీ అనుకుంటాడు. ఇంతలో పోలీసుల నుంచి ఆ సైకో తప్పించుకుంటాడు. విక్కీ ప్రియిరాలు జాను పుట్టినరోజు వేడుకలో అతడు ప్రత్యక్షమవుతాడు. అయితే తన చెల్లిని చంపింది ఈ సైకో కాదని విక్కీకి తెలుస్తుంది. అసలు స్వాతిని చంపింది ఎవరు? సిటీలోని హత్యలు చేస్తున్నది ఒకరా? లేదా ఇద్దరా? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'కిష్కింధపురి' సినిమా రివ్యూ) -
సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా చేసిన హారర్ మూవీ 'కిష్కింధపురి' ఈ రోజే థియేటర్లలోకి వచ్చింది. మరోవైపు ఈమె నటించిన లేటెస్ట్ మూవీ ఒకటి ఓటీటీలోకి ఎలాంటి ప్రకటన లేకుండా అందుబాటులోకి వచ్చింది. కేవలం మూడు వారాల్లోనే స్ట్రీమింగ్ అవుతోంది. లేడీ ఓరియెంటెడ్ స్టోరీతో తీసిన ఈ చిత్రం సంగతేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందనేది ఇప్పుడు చూద్దాం.మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తరచుగా తెలుగు సినిమాలు చేస్తూనే ఉంది. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటూనే ఉంది. అలా ఈమె చేసిన ఫిమేల్ సెంట్రిక్ మూవీ 'పరదా'. తన కెరీర్లోనే బెస్ట్ మూవీని అనుపమ కూడా చెప్పింది. అలా ఆగస్టు 22న థియేటర్లలోకి వచ్చింది. అయితే ప్రేక్షకుల నుంచి భిన్నమైన రెస్పాన్స్ అందుకుంది. ఫలితంగా యావరేజ్గా మిగిలింది.(ఇదీ చదవండి: మిరాయ్ ట్విటర్ రివ్యూ)ఇప్పుడు ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో తెలుగు, మలయాళ వెర్షన్లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఒకవేళ లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ మూవీస్ అంటే ఇష్టముంటే దీనిపై ఓ లుక్కేయండి. కచ్చితంగా నచ్చేస్తుంది.'పరదా' విషయానికొస్తే.. పడతి అనే ఊరిలో మహిళలంతా పరదాలేసుకుని తిరుగుతుంటారు. ఇంట్లో తండ్రికి తప్పితే పరాయి పురుషుడు వాళ్ల ముఖాలు చూడకూడదు. చూస్తే ఊరికి అరిష్టం దాపురించి, ఇక్కడ పిల్లలు పుట్టకుండా పురిటిలోనే చనిపోతారని ఈ ఊరి ప్రజల నమ్మకం. దానికి జ్వాలమ్మ అనే ఓ కథ ఉంటుంది. ఇదే ఊరిలో పుట్టి పెరిగిన సుబ్బలక్ష్మి (అనుపమ) అదే ఊళ్లోని రాజేష్(రాగ్ మయూర్)ని ఇష్టపడుతుంది. నిశ్చితార్ధం టైంకి ఓ షాకింగ్ సంఘటన జరుగుతుంది. దాంతో గొడవ జరిగి ఆ శుభకార్యం ఆగిపోతుంది. సుబ్బు ఆత్మాహుతి చేసుకోవాలని ఊరంతా నిర్ణయిస్తారు. అసలేమైంది? సుబ్బు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది అనేది మిగతా సినిమా.(ఇదీ చదవండి: అమ్మవారికి రూ.4 కోట్ల కిరీటం సమర్పించిన ఇళయరాజా) -
థియేటర్లలో మిరాయ్, కిష్కింధపురి... ఓటీటీల్లో ఏకంగా 17 సినిమాలు!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక ఈ శుక్రవారం థియేటర్లలో రెండు సినిమాలు రిలీజ్ రెడీ అయిపోయాయి. బాక్సాఫీస్ వద్ద మిరాయ్, కిష్కింధపురి సందడి చేయనున్నాయి. ఈ చిత్రాలపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక ఓటీటీల విషయానికొస్తే ఫ్రైడే వచ్చిందంటే స్ట్రీమింగ్కు రెడీ అయిపోతున్నాయి. ఈ వారం హిందీలో బిగ్ హిట్ కొట్టిన సయారా, తెలుగులో బకాసుర రెస్టారెంట్, రాంబో ఇన్ లవ్ లాంటి వెబ్ సిరీస్లు ఆసక్తి పెంచుతున్నాయి. వీటితో పాటు తెలుగు డబ్బింగ్ సినిమాలు, పలు హాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్లు ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్సయారా (హిందీ సినిమా) - సెప్టెంబరు 12యూ అండ్ ఎవరిథింగ్ ఎల్స్(కొరియన్ సిరీస్)- సెప్టెంబర్ 12మాలెడిక్షన్స్-(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 12రటు రటు క్వీన్స్-(ఇండోనేషియా వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 12ది రాంగ్ పారిస్(హాలీవుడ్ సినిమా)- సెప్టెంబర్ 12మెటిరియలిస్ట్స్(హాలీవుడ్ చిత్రం)- సెప్టెంబర్ 14అమెజాన్ ప్రైమ్డూ యూ వాన్నా పార్టనర్ (హిందీ వెబ్ సిరీస్) - సెప్టెంబరు 12ఎవ్రీ మినిట్ కౌంట్స్ - సీజన్ 2 (స్పానిష్ వెబ్ సిరీస్) - సెప్టెంబరు 12ల్యారీ ద కేబుల్ గాయ్- (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 12జెన్ వీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 12స్క్రీమ్ బోట్- (ఇంగ్లీష్ మూవీ)-సెప్టెంబరు 12జియో హాట్ స్టార్రాంబో ఇన్ లవ్ (తెలుగు వెబ్ సిరీస్) - సెప్టెంబరు 12సన్ నెక్ట్స్మీషా (మలయాళ సినిమా) - సెప్టెంబరు 12బకాసుర రెస్టారెంట్ (తెలుగు మూవీ) - సెప్టెంబరు 12లయన్స్ గేట్ ప్లేడిటెక్టివ్ ఉజ్వలన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 12ద రిట్యూవల్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 12హులు అండ్ డిస్నీ ప్లస్లాస్ట్ ఇన్ ది జంగిల్- (డాక్యుమెంటరీ ఫిల్మ్)- సెప్టెంబర్ 12హెచ్బీవో మ్యాక్స్వార్ఫేర్-(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 12 -
ఓటీటీలో సెన్సేషనల్ హిట్ సినిమా 'సైయారా'
బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'సైయారా'(Saiyaara) ఓటీటీ ప్రకటన వచ్చేసింది. మోహిత్ సూరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.580 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. అహాన్ పాండే (Ahaan Panday), అనీత్ పడ్డా (Aneet Padda) జంటగా 'సైయారా'తో బాలీవుడ్కు పరిచయమ్యారు. వీరిద్దరూ క్రిష్, వాణి పాత్రలతో యూత్ను మెప్పించారు. ఎలాంటి అంచనాలు లేకుండా జులై 18న విడుదలైన ఈ సినిమా సంచనాలు క్రియేట్ చేసింది. కేవలం మౌత్ టాక్ పవర్తో బాక్సాఫీస్ రికార్డ్లను తిరగరాసింది.యూత్ఫుల్ ఎంటర్టైనర్గా విడుదలైన 'సైయారా' నెట్ఫ్లిక్స్(Netflix)లో స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 12న ఓటీటీలోకి రానుందని ఒక పోస్టర్ను కూడా విడుదల చేశారు. కేవలం రూ. 60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం బాలీవుడ్లో అనేక చిత్రాల కలెక్షన్స్ను దాటి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఓవర్సీస్లో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సొంతం చేసుకున్న బాలీవుడ్ సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఈ ఏడాది బాలీవుడ్ హిట్ సినిమా ఛావా రికార్డ్ను కూడా దాటేసింది. అందుకే ఈ చిత్రం ఓటీటీ విడుదల గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కథేంటి?వాణి బత్రా(అనీత్ పడ్డా) ఓ రైటర్. తన కాలేజీ సీనియర్ మహేశ్ అయ్యర్ని ప్రేమించి, ఇంట్లో వాళ్లని ఒప్పించి పెళ్లికి రెడీ అవుతుంది. కానీ చివరి నిమిషంలో అతడు తన స్వార్థం చూసుకుని ఈమెకు హ్యాండ్ ఇస్తాడు. దాదాపు ఆరు నెలల తర్వాత ఈ బాధ నుంచి కోలుకున్న వాణి.. ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరుతుంది. అదేరోజు అనుకోకుండా క్రిష్ కపూర్(అహన్ పాండే)ని కలుస్తుంది. ఇతడో యువ సింగర్. గుర్తింపు కోసం ప్రయత్నిస్తుంటాడు. ఊహించని పరిస్థితుల్లో క్రిష్-వాణి కలిసి ఓ పాట కోసం పనిచేయాల్సి వస్తుంది. అలా కొన్నాళ్లకు వీళ్లిద్దరూ ప్రేమలో పడతారు. కానీ వాణి జీవితంలోకి ఆమె పాత ప్రేమికుడు మహేశ్ వస్తాడు. మరి ఇద్దరిలో వాణికి ఎవరు దగ్గరయ్యారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. ఇందులో భారీ ఫైట్స్ లేవు. పవర్ఫుల్ డైలాగ్స్ లేవు. కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ కూడా లేవు. కేవలం ఎమోషన్ మాత్రమే ఈ చిత్రాన్ని నిలబెట్టింది. -
176 సినిమాలు చేశా కానీ, తిరుపతికి వెళ్తే ఓ పెద్దావిడ అలా అనేసింది: తమన్
తెలుగు ఇండియన్ ఐడల్ షో నాలో కొత్త మార్పుని తీసుకొచ్చింది. నేను సంగీతం అందించిన సినిమాలు నన్ను ప్రేక్షకుల ఇంటిదాక తీసుకెళ్తే.. ఈ షో ఇంటిలోపలికి తీసుకెళ్లేలా చేసింది. తెలుగు ఇండియన్ ఐడల్ కు పనిచేయడం ఒక బాధ్యతగా, గౌరవంగా భావిస్తున్నాం’ అన్నారు సంగీత దర్శకుడు తమన్. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.ఈ సంగీత కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకులు తమన్, గాయకులు కార్తీక్, గీతా మాధురి జడ్జెస్ గా, శ్రీరామచంద్ర హోస్ట్ గా, సమీరా భరద్వాజ్ కో హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్ లో టాప్ 12 కంటెస్టెంట్స్ గాన ప్రతిభను ఈ నెల 12వ తేదీ నుంచి ప్రతి శుక్రవారం, శనివారం సాయంత్రం 7 గంటల నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ రోజు హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 స్పెషల్ స్క్రీనింగ్ చేశారు. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ - ఈ షో తర్వాత మేము మ్యూజిక్ కన్సర్ట్స్ కు వెళ్తే ఇండియన్ ఐడల్ లో బాగా మాట్లాడుతున్నారు అని అంటున్నారు. మా కన్సర్ట్స్ కు హాజరయ్యే ప్రేక్షకుల సంఖ్య రెట్టింపు అవుతోంది. తిరుపతి దర్శనానికి వెళితే.. ఓ పెద్దావిడ క్యూలో నుంచి అందరిని పక్కకి నెట్టి నా దగ్గరకు వచ్చి ‘ఇండియన్ ఐడల్లో బాగా చేస్తున్నావు’ అని చెప్పి వెళ్లిపోయింది. ఇప్పటి వరకు నేను 176 సినిమాలకు సంగీతం అందించా.. వాటి గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా.. షో గురించి చెప్పి వెళ్లింది(నవ్వుతూ..). అలాంటి గుర్తింపు మాకు తెలుగు ఇండియన్ ఐడల్ తీసుకొచ్చింది. ఈ షోలో డల్లాస్ నుంచి కూడా కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఈ షోను ఆర్గనైజ్ చేయబోతున్నాం. అందుకే గల్లీ టు గ్లోబల్ అనే క్యాప్షన్ పెట్టాం. కంటెస్టెంట్స్ పాడటం ఒక్కటే కాదు వారి కుటుంబ సభ్యుల భావోద్వేగాలు, ఇక్కడ గెలుపు కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేవి అన్నీ క్యాప్చర్ చేస్తున్నాం. ఈ షోకు వస్తే మాకు హాలీడేకు వచ్చిన ఫీల్ కలుగుతుంటుంది. తెలుగు ఇండియన్ ఐడల్ ను ఒక ఆస్తిలా భావిస్తున్నాం. అన్నారు.నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ - తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 అద్భుతంగా వచ్చింది. అంత బాగా మీరు చేస్తానంటేనే సీజన్ 4కు ఇన్వెస్ట్ మెంట్ పెడదాం అని అన్నాను. ఇండియన్ ఐడల్ వారికి ప్రతి సీజన్ కు డబ్బు ఇచ్చి రైట్స్ తీసుకోవాల్సిఉంటుంది. గత సీజన్ కంటే ఈ సీజన్ 4 బాగా చేస్తున్నారు. ఇందుకు తమన్ కు థ్యాంక్స్ చెప్పాలి. ఈ షోకు తమన్ లైఫ్ తీసుకొచ్చాడు. స్కూల్ లో చదువుతున్న పిల్లలు కూడా వచ్చి బాగా పాడుతున్నారు. ఇతర రాష్ట్రాల పిల్లలు తెలుగు నేర్చుకుని పాడుతున్నారు. తెలుగు ఇండియన్ ఐడల్ క్రేజ్ ఎంతలా ఉందంటే అమెరికాలో ఈ కార్యక్రమాన్ని చూస్తూ అక్కడి నుంచి కంటెస్ట్ చేసేందుకు వచ్చారు. మనం గల్లీ టు ఢిల్లీ అంటాం, కానీ ఇది గల్లీ టు గ్లోబల్ అయ్యింది. ఆహా నుంచి తెలుగు ఇండియన్ ఐడల్ షో చేస్తున్నందుకు గర్వంగా ఉంది’అన్నారు. ఈ కార్యక్రమంలో సింగర్ సమీరా భరద్వాజ్, గీతా మాధురి పాల్గొని మాట్లాడారు. -
కొత్త ట్రెండ్.. ఓటీటీలో యానిమేషన్ 'కురుక్షేత్రం'
ఇప్పటి జనరేషన్కి పురాణాలు, ఇతిహాసాల గురించి కాస్త తక్కువగానే తెలుసు. అలానే రీసెంట్ టైంలో ఈ జానర్లో సినిమాలు తీసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. నెలన్నర క్రితం థియేటర్లలో రిలీజైన 'మహావతార్ నరసింహ' అనే యానిమేటెడ్ మూవీ ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీని దారిలోనే తెలుగులోనూ 'వాయుపుత్ర' అనే సినిమా రాబోతుంది. ఈ ట్రెండ్ ఇప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చేసినట్లు కనిపిస్తుంది.(ఇదీ చదవండి: 'మహావతార్ నరసింహా' స్పూర్తి.. తెలుగులోనూ యానిమేషన్ సినిమా)మహాభారతంలోని కురుక్షేత్రం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ ఘట్టాన్ని యానిమేషన్ రూపంలో ఓటీటీ సిరీస్గా తీసుకొచ్చేందుకు సిద్ధమైపోయారు. తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది. అక్టోబరు 10 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓ వీడియో ఇప్పుడు రిలీజ్ చేశారు. అను సిక్కా ఈ సిరీస్ క్రియేటర్ కాగా.. ఉజాన్ గంగూలీ దర్శకత్వం వహించారు. మరి ఈ 'కురుక్షేత్ర' సిరీస్.. ప్రేక్షకుల్ని ఎంతలా అలరిస్తుందో చూడాలి?Shankhnaad ke sath arambh hoga dharm aur adharm ka mahayudh ⚔🔥Watch Kurukshetra, out 10 October, only on Netflix.#KurukshetraOnNetflix pic.twitter.com/z4shkPyu1g— Netflix India (@NetflixIndia) September 10, 2025 -
హిందీ వెబ్ సిరీస్లో రాజమౌళి.. ట్రైలర్ రిలీజ్
రాజమౌళి పేరు చెప్పగానే బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు గుర్తొస్తాయి. ప్రస్తుతం మహేశ్ బాబుతో ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అదే టైంలో ఈ మధ్య కాలంలో యాడ్స్, ఈవెంట్స్లో తరుచుగా కనిపిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా ఓ హిందీ వెబ్ సిరీస్లోనూ జక్కన్న నటించడం విశేషం. తాజాగా రిలీజైన ట్రైలర్తో ఈ విషయం బయటపడింది.(ఇదీ చదవండి: మల్లెపూలు ఎంత పనిచేశాయ్.. నటికి రూ.1.14 లక్షల జరిమానా)షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్.. దర్శకుడిగా మారి తీసిన సిరీస్ 'ద బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్'. హిందీ చిత్రసీమలో తెరవెనక జరిగే సంగతుల్ని ఆధారంగా చేసుకుని కామెడీ ఎంటర్టైనర్గా దీన్ని తీశాడు. సెప్టెంబరు 18 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులోనే ఓ సీన్లో ఆమిర్ ఖాన్, రాజమౌళి కనిపించారు. వీళ్లతో పాటు దర్శకనిర్మాత కరణ్ జోహార్, దిశా పటానీ, షారుఖ్ ఖాన్, ర్యాపర్ బాద్ షా కూడా అతిథి పాత్రల్లో కనిపించారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) -
సడన్గా ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ తెలుగు సినిమా
సాధారణంగా వీకెండ్లో కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో గురువారం అందుబాటులోకి వస్తుంటాయి. కానీ కొన్నిసార్లు వారం మధ్యలోనే ఎలాంటి ప్రకటన లేకుండా వచ్చేస్తుంటాయి. ఇప్పుడు కూడా ఓ తెలుగు హారర్ కామెడీ మూవీ సడన్గా డిజిటల్ స్ట్రీమింగ్ అయిపోతోంది. లెక్క ప్రకారం ఈ వారాంతంలోనే డిజిటల్ రిలీజ్ ఉంది. కానీ ఇప్పుడు మరో ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో చూడొచ్చు?పలు సినిమాల్లో కమెడియన్గా నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ లీడ్ రోల్ చేసిన మూవీ 'బకాసుర రెస్టారెంట్'. గత నెల 8న థియేటర్లలో రిలీజైంది. ఓ మాదిరి రెస్పాన్స్ మాత్రమే వచ్చింది. దీన్ని సెప్టెంబరు 12న సన్ నెక్స్ట్ ఓటీటీలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లోకి వచ్చేసింది. ప్రస్తుతం తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. క్షుద్ర పూజలతో నిద్రలేచే ఆత్మ వల్ల ఇబ్బందులు, దాంతో వచ్చే భయం తదితర అంశాలతో ఈ సినిమాని తెరకెక్కించారు.(ఇదీ చదవండి: నటి సుధ ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు లీక్.. పోలీసులకు ఫిర్యాదు!)'బకాసుర రెస్టారెంట్' విషయానికొస్తే.. పరమేశ్వర్ (ప్రవీణ్) సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఉద్యోగం కంటే వ్యాపారం చేయడంపై ఆసక్తి. రెస్టారెంట్ పెట్టాలనుకుంటాడు. దాని కోసం డబ్బులు సంపాదించేందుకు యూట్యూబ్ ఛానెల్ పెడతాడు. దెయ్యంపై చేసిన తొలి వీడియో వైరల్ కావడంతో రెండో వీడియో కోసం పాత బంగ్లాకు స్నేహితులతో కలిసి వెళ్తాడు. అక్కడ కనిపించిన పుస్తకంతో క్షుద్రపూజ చేస్తారు. దీంతో బక్క సూరి (వైవా హర్ష) అనే ఆత్మ బయటకొస్తుంది.బక్క సూరి ఆత్మతో వాళ్లంతా ఆడే ప్రయత్నం చేయగా.. పరమేశ్వర్ స్నేహితుడి శరీరంలోకి ఈ ఆత్మ ప్రవేశిస్తుంది. దాని ఆకలికి హద్దుండదు. ఆ ఆత్మని బయటకు పంపేందుకు పరమేశ్వర్ గ్యాంగ్ ఎలాంటి ప్రయత్నాలు చేసింది? అసలు ఆత్మ నేపథ్యమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) -
ఈ వారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్
మరో వారం వచ్చేసింది. ఈ వీకెండ్ థియేటర్లలోకి తేజ్ సజ్జా 'మిరాయ్', బెల్లంకొండ శ్రీనివాస్ 'కిష్కంధపురి' చిత్రాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. ఈ రెండింటిపైన కాస్తోకూస్తో హైప్ ఉంది. మరి వీటిలో ఏది హిట్ అవుతుందో చూడాలి. అలానే ఓటీటీల్లోనూ తక్కువ మూవీస్ వస్తున్నప్పటికీ వాటిలో కొన్ని చూడదగ్గ హిట్ చిత్రాలు ఉండటం విశేషం.ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. రజినీకాంత్ 'కూలీ', హిట్ బొమ్మ 'సు ఫ్రమ్ సో' ఈ వీకెండ్ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటితో పాటు బాలీవుడ్ సెన్సేషనల్ హిట్ 'సయారా' కూడా ఇదే వారం రాబోతుందని సమాచారం. ఈ మూడు కచ్చితంగా చూడదగ్గ మూవీస్. అలానే బకాసుర రెస్టారెంట్, డిటెక్టివ్ ఉజ్వలన్ లాంటి చిత్రాలతో పాటు డు యూ వాన్నా పార్ట్నర్, రాంబో ఇన్ లవ్ తదితర సిరీస్లు కూడా ఆసక్తి రేపుతున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (సెప్టెంబరు 8 నుంచి 14 వరకు)అమెజాన్ ప్రైమ్హెల్లువా బాస్ సీజన్ 1 & 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 10ద గర్ల్ఫ్రెండ్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 10వెన్ ఫాల్ ఈజ్ కమింగ్ (ఫ్రెంచ్ సినిమా) - సెప్టెంబరు 10కూలీ (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 11డూ యూ వాన్నా పార్టనర్ (హిందీ సిరీస్) - సెప్టెంబరు 12ఎవ్రీ మినిట్ కౌంట్స్ సీజన్ 2 (స్పానిష్ సిరీస్) - సెప్టెంబరు 12ల్యారీ ద కేబుల్ గాయ్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 12జెన్ వీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 12నెట్ఫ్లిక్స్డాక్టర్ సెస్ రెడ్ ఫిష్, బ్లూ ఫిష్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 08సయారా (హిందీ సినిమా) - సెప్టెంబరు 12 (రూమర్ డేట్)హాట్స్టార్సు ఫ్రమ్ సో (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 09ఓన్లీ మర్డర్స్ ఇన్ ద బిల్డింగ్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 09రాంబో ఇన్ లవ్ (తెలుగు సిరీస్) - సెప్టెంబరు 12సన్ నెక్స్ట్మీషా (మలయాళ సినిమా) - సెప్టెంబరు 12బకాసుర రెస్టారెంట్ (తెలుగు మూవీ) - సెప్టెంబరు 12లయన్స్ గేట్ ప్లేడిటెక్టివ్ ఉజ్వలన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 12ద రిట్యూవల్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 12 -
థియేటర్స్లో రూ.2000 కోట్లు.. ఓటీటీలోకి వచ్చేసిన హారర్ థ్రిల్లర్!
హారర్ సినిమాకు థియేటర్స్లో మంచి ఆదరణ ఉంటుంది. ప్రేక్షకులను కాస్త భయపెట్టాలే కానీ.. ఆ చిత్రాలకు బ్రహ్మరథం పడతారు. అందుకే అన్నిభాషల్లోనూ ఈ జానర్ సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే ఈ మధ్యకాలంలో ప్రేక్షకులను అతిగా భయపెట్టే సినిమాలు పెద్దగా రాలేదు. చాలా రోజుల తర్వాత హాలీవుడ్లో ఓ డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ వచ్చింది. అదే వెపన్స్. . జాక్ క్రెగర్ దర్శకత్వం వహించిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీలో జోష్ బ్రోలిన్, జూలియా గార్నర్, ఆస్టిన్ అబ్రామ్స్, కేరీ క్రిస్టోఫర్, టోబీ హస్ లాంటి స్టార్స్ నటించారు. ఆగస్ట్ 8న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఈ చిత్రం..తొలి రోజే బ్లాక్బస్టర్ హిట్ టాక్ సంపాదించుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద కనీవినీ ఎరుగని కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పటి వరకు 23.5 కోట్ల డాలర్లు అంటే దాదాపు రూ. 2 వేల కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ఈ చిత్రం.. సడెన్గా ఓటీటీలోకి వచ్చి సర్ప్రైజ్ చేసింది.ఒకేసారి నాలుగు ఓటీటీల్లోకి.. ఈ మిస్టరీ హారర్ థ్రిల్లర్ సెప్టెంబర్ 9 నుంచి నాలుగు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోతోపాటు ఆపిల్ టీవీ ప్లస్, వుడు, గూగుల్ ప్లేలలోకి ఈ మూవీ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది. అయితే ఈ చిత్రాన్ని ఉచితంగా చూసేందుకు వీల్లేదు. ఓటీటీలో చూడాలంటే రెంట్ చెల్లించాల్సిందే. థియేటర్స్లోకి వెళ్లి చూసేంత సమయం లేని హారర్ ప్రియుల కోసం రెంట్ విధానంలో ఓటీటీల్లోకి తీసుకొచ్చారు. థియేటర్స్లో బాగా ఆడుతున్న ఈ సినిమాను అప్పుడే ఓటీటీలోకి తీసుకొచ్చి మేకర్స్ పెద్ద సాహసమే చేశారని చెప్పాలి. ఓటీటీలోనూ అదే స్థాయి కలెక్షన్స్ రాబటితే ఇబ్బంది లేదు..కానీ ఏమాత్రం తేడా జరిగినా..అది మేకర్స్ స్వయంకృత అపరాధమే అవుతుంది. వెపన్స్ కథేంటంటే.. ఇదొక డిఫరెంట్ హారర్ థ్రిల్లర్. ఒక రోజు తెల్లవారుజామున 2:17 గంటలకు ఒకే క్లాస్కు చెందిన ఒక్క స్టూడెంట్ తప్ప మిగిలిన వారంతా కనిపించకుండా పోతారు. వాళ్లు ఎలా వెళ్లారు? ఎక్కడికి వెళ్లారు? అనేది తెలుసుకోవడమే ఈ సినిమా కథ. రూ. 335 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే రూ. 2 వేల కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. -
OTT: రొమాన్స్ కాదు.. బ్రొమాన్స్.. ఎలా ఉందంటే..?
టైటిల్ : బ్రొమాన్స్నటీనటులు: మాథ్యూ థామస్, అర్జున్ అశోకన్, మహిమా నంబియార్, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్ తదితరులుదర్శకత్వం: అర్జున్ డి. జోస్ఓటీటీ: సోనీ లివ్ఓటీటీలు వచ్చాక ఎంటర్టైన్మెంట్ను ఆస్వాదించడం మరింత సులభతరం అయిపోయింది. ఏ కొత్త సినిమా వచ్చినా నెల రోజుల్లోపే ఇంట్లోనే కూర్చుని చూసేస్తున్నారు. ఓటీటీలు రావడంతో కంటెంట్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. కంటెంట్ బాగుంటే ఏ మూవీనైనా ఆడియన్స్ వదలడం లేదు. ఏ భాషలో వచ్చినా కథ బాగుంటే ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. ఇక మలయాళ సినిమాలు థియేటర్ల కంటే ఓటీటీల్లోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటున్నాయి. క్రైమ్, కామెడీ జోనర్ చిత్రాలకు ఓటీటీలో ఫుల్ డిమాండ్ ఉంటోంది. అలాంటి జోనర్లో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో స్ట్రీమింగ్కు వచ్చేసిన మలయాళ సినిమా బ్రొమాన్స్. టైటిల్తోనే ఆసక్తి పెంచేసిన బ్రొమాన్స్.. సినిమా ఆడియన్స్ను ఎంతవరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..షింటో (శ్యామ్ మోహన్), బింటో (మాథ్యూ థామస్) ఇద్దరు అన్నదమ్ములు. అమ్మా, నాన్నతో కలిసి సంతోషంగా జీవిస్తుంటారు. అయితే ప్రతి విషయంలో అన్నతో తమ్ముడు బింటోను పోలుస్తూ ఉంటారు. ఇది నచ్చని బింటో అన్న అంటే అంతగా ఇష్టముండదు. ఇద్దరు కలిసి అప్పుడప్పుడు చిల్ అవుతూ ఉంటారు. బింటో ఎప్పుడు రీల్స్ పిచ్చిలో పడి లైఫ్ను అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కానీ ఊహించని విధంగా బింటో అన్న షింటో మిస్సింగ్ అవుతాడు. ఆ తర్వాత తనకు అంతగా ఇష్టం లేని అన్న కోసం తమ్ముడు ఏం చేశాడు? చివరికీ అన్న షింటోను కనిపెట్టాడా? లేదా? అన్నదే అసలు కథ.ఎలా ఉందంటే..సాధారణంగా అన్నదమ్ముల స్టోరీ అనగానే సగటు ఆడియన్స్ ఎమోషనల్ డ్రామా అనుకుంటే పొరపాటే. కథ ప్రారంభంలో ఫ్యామిలీ లైఫ్, అన్నదమ్ముల అనుబంధం చూడగానే ఫుల్ ఫ్యామిలీ ఎమోషనల్ కథ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. కానీ డైరెక్టర్ ఇక్కడ తీసుకున్న పాయింట్ ఏంటంటే.. ఎమోషనల్ టచ్ ఇచ్చి.. కామెడీ పండించాడు. ఒకవైపు అన్న అంటే పడని తమ్ముడు.. అతను మిస్సింగ్ అయ్యాడని తెలిశాక జరిగే పరిణామాలు అన్నదమ్ముల అనుబంధాన్ని గుర్తుచేస్తాయి. ఆ తర్వాత అన్న కోసం ఆరా తీసే క్రమంలో షింటో స్నేహితుడు షబీర్ (అర్జున్ అశోకన్) బింటోకు సాయం చేస్తాడు. ఈ క్రమంలో వీరిద్దరికీ డాక్టర్ ఐశ్వర్య, ఎస్సై టోనీ నుంచి ఊహించని ట్విస్ట్లు ఎదురవుతాయి. ఈ సన్నివేశాలు సీరియస్గా అనిపించినా.. ప్రతి సీన్లో కామెడీ పండించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.అన్నదమ్ముల సెంటిమెంట్ అనే లైన్ తీసుకున్న డైరెక్టర్.. కథను పూర్తిగా కామెడీ యాంగిల్లోనే తీసుకెళ్లాడు. అన్న కోసం వెతుకుతున్న బింటో.. ఎథికల్ హ్యాకర్ హరిహరసుధన్ సాయం తీసుకుంటాడు వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ ఆడియన్స్ను తెగ నవ్విస్తాయి. అలా బింటో అన్న కోసం వెతుకున్న టీమ్లో కీలక మెంబర్ పాత్ర పోషిస్తాడు. తన అన్నను ఏమైనా అంటే విపరీతమైన కోపంతో ఊగిపోయే బింటోకు కొరియర్ బాబు రూపంలో గట్టి షాక్ తగులుతుంది. ఆ తర్వాత ఎస్సై ఎంట్రీ ఇవ్వడంతో కథ కామెడీతో పాటు ఆసక్తికరంగా మారుతుంది. కేరళలో మొదలైన కథ.. కర్ణాటకకు షిప్ట్ అయ్యాక కథలో వచ్చే సీన్స్ ఆడియన్స్లో నవ్వులు పూయిస్తాయి. ప్రతి సీన్లో కామెడీని ఇరికించే ప్రయత్నం చేశాడు. ఎమోషనల్కు ముడిపెట్టి ఫుల్ కామెడీ వైపు నడిపించిన దర్శకుడు ఆ విషయంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. అయితే కేవలం కామెడీపైనే దృష్టి పెట్టడంతో సగటు ప్రేక్షకుడికి కథతో ఎమోషనల్ టచ్ మిస్సయింది. ఆ విషయంలో డి జోస్ మరింత ఫోకస్ చేయాల్సింది. ఇక క్లైమాక్స్ విషయానికొస్తే అక్కడ కూడా సీరియస్నెస్ ఉన్నప్పటికీ.. ఫైట్ సీన్ ఆద్యంతం నవ్వులు తెప్పించాడు. క్లైమాక్స్లో ఎమోషనల్ టచ్ ఇచ్చినా.. అంతగా ఆడియన్స్కు కనెక్ట్ చేయడంలో భావోద్వేగాలు పండించలేకపోయాడు. చివర్లో చిన్న ట్విస్ట్ ఇచ్చి.. నవ్విస్తూనే ఎండ్ కార్డ్ పడేశాడు. ఓవరాల్గా చూస్తే సీరియస్ కామెడీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. ఈ వీకెండ్లో ఫుల్గా నవ్వుకోవాలంటే..ఈ మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు. అభ్యంతరకర సన్నివేశాలు లేనందున ఫ్యామిలీతో చూసేయొచ్చు.ఎవరెలా చేశారంటే...ప్రేమలు మూవీతో తెలుగు ఆడియన్స్కు దగ్గరైన మాథ్యు థామస్ తన పాత్రలో మెప్పించాడు. షింటోగా శ్యామ్ మోహన్ తన పాత్రలో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఎథికల్ హ్యాకర్ హరిహరసుధన్గా సంగీత్ ప్రతాప్ పాత్ర కామెడీ టైమింగ్తో అదరగొట్టేశాడు. అర్జున్ అశోకన్, మహిమా నంబియార్, శ్యామ్ మోహన్ తమ పాత్రల పరిధిలో మెప్పించారు. గోవింద్ వసంత నేపథ్య సంగీతం బాగుంది. అఖిల్ జార్జ్ సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. చామన్ చాకో కొన్ని అనవసర సీన్స్ను కట్ చేయాల్సింది. నిర్మాణ విలువల పరంగా ఫర్వాలేదపించారు. -
ఓటీటీల్లోకి వచ్చేసిన మూడు తెలుగు సినిమాలు
ఎప్పటిలానే మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి వచ్చిన వాటిలో 'లిటిల్ హార్ట్స్' అనే చిన్న సినిమాకు హిట్ టాక్ వచ్చింది. అనుష్క 'ఘాటీ'కి నెగిటివ్ టాక్ రాగా.. తమిళ డబ్బింగ్ 'మదరాసి' యావరేజ్ అనిపించుకుంది. మరోవైపు ఓటీటీల్లోనూ పలు స్ట్రెయిట్, డబ్బింగ్ చిత్రాలు-వెబ్ సిరీసులు వచ్చాయి. అవి కాకుండా మరో మూడు తెలుగు మూవీస్ కూడా ఎలాంటి హడావుడి లేకుండా స్ట్రీమింగ్లోకి రావడం విశేషం. ఇంతకీ ఏంటా చిత్రాలు? ఎందులోకి వచ్చాయి?'ఆదిత్య విక్రమ వ్యూహ' పేరుతో తీసిన ఓ తెలుగు చిత్రం నేరుగా ఆహా ఓటీటీలోకి వచ్చింది. నిన్నటి (సెప్టెంబరు 05) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తొమ్మిది మందిని హత్య చేసి, జైలుకెళ్లిన ఓ ఖైదీ అక్కడి నుంచి తప్పించుకుంటాడు. దీంతో వాడిని పట్టుకునేందుకు హీరోలిద్దరూ కలిసి ఓ మిషన్ చేపడతారు. తర్వాత ఏమైంది? హంతకుడిని పట్టుకున్నారా లేదా అనేదే మిగతా స్టోరీ. శ్రీ హర్ష, అరవింద్ ప్రధాన పాత్రలు పోషించగా.. శ్రీహర్షనే దర్శకత్వం కూడా వహించాడు.(ఇదీ చదవండి: ఘాటీ, మదరాసి, లిటిల్ హార్ట్స్.. తొలిరోజు కలెక్షన్ ఎంతొచ్చాయ్?) అలానే 2021 డిసెంబరులో థియేటర్లలో రిలీజైన తెలుగు సినిమా 'బుల్లెట్ సత్యం'. దేవ్ రాజ్, సోనాక్షి వర్మ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం.. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇప్పడు ఓటీటీలోకి వచ్చింది. ఆహా ఓటీటీలో నిన్నటి (సెప్టెంబరు 05) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే చిత్రమిది. బుల్లెట్ సత్యం చేసిన రాజకీయం ఏంటనేదే మూవీ స్టోరీ. కుటుంబ బంధాలతోపాటు రాజకీయ నేరాలు, థ్రిల్లర్ అంశాలు ఇందులో ఉన్నాయి.ఈ ఏడాది ఏప్రిల్ 18న రిలీజైన 'జగమెరిగిన సత్యం' సినిమా.. థియేటర్లలో పెద్దగా నిలబడలేదు. ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. ఇప్పుడు దాదాపు ఐదు నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. హీరో రవితేజ మేనల్లుడు అవినాష్ వర్మ ఈ మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. తెలంగాణలోని ఓ చిన్న ఊరిలో సత్యం (అవినాష్ వర్మ) అనే యువకుడి జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చాయి? వాటిని అతడు ఎలా ఎదుర్కొన్నాడు అనే పాయింట్తో దీన్ని తెరకెక్కించారు.(ఇదీ చదవండి: 46 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న స్టార్ కమెడియన్) -
ఓటీటీలో అదరగొడుతున్న స్పై సిరీస్.. రెండు కథలు ఒకటే!
ఏ ఎండకాగొడుగు అన్న నానుడి వినే ఉంటారు. కాని ఇప్పుడు ఓటిటిల్లో దీనినే ఏ ట్రెండ్ కా స్టోరీ అన్న విధంగా నడుస్తోంది. ఆగష్టు 15 అనగానే , ఆ తేదీకి ముందు తరువాత నెలల్లో దేశభక్తి సినిమాలు రావడం పరిపాటే. ఇలా ప్రస్తుతం ఓటిటి సిరీస్ లు కూడా విడుదలవుతున్నాయి. ఇదే నేపధ్యంలో సరిగ్గా వారం రోజుల వ్యవధిలో రెండు దిగ్గజ ఓటిటిల్లో రెండు సిరీస్ లు రిలీజ్ అయ్యాయి. వాటిలో జియో హాట్ స్టార్ వేదికగా సలాక్కార్ ఒకటి అయితే నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన సారే జహా సే అచ్చా మరొకటి. వీటిలో విశేషం ఏమిటంటే రెండు కథాంశాలు దాదాపు ఒకటే. పాత్రలు, కథను నడిపించిన తీరు తప్ప రెండూ అన్నిటికీ అన్నీ సమానమే.అంతలా వీటిలో ఉన్న కథాంశమేమిటో ఓ సారి చూద్దాం.1960 నుండి 1990 సంవత్సర కాలంలో భారతదేశానికి యుద్ధాలు, ఇతర దేశాల నుండి కవ్వింపు చర్యలు లాంటివి ఎన్నో జరిగాయి. సరిగ్గా పాకిస్తాన్ భారత్ తో యుద్ధం జరిగిన ఆ సమయంలో పాకిస్తాన్ దేశం న్యూక్లియార్ బాంబును తయారు చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది. కాని ఆ ప్రయత్నాలన్నీ మన దేశానికి సంబంధించిన గూఢాచార సంస్థ రా నాశనం చేసింది. తమ సంస్థ ద్వారా పాకిస్తాన్ లోకి గూఢాచారులను పంపి పాకిస్తాన్ న్యూక్లియార్ బాంబు తయారీని సమర్ధవంతంగా ఎదుర్కుంది.ఇప్పుడు పైన చెప్పుకున్న రెండు టీవి సిరీస్ లలో ఇదే కథా నేపధ్యం. 1978 లో పాకిస్తాన్ దేశం జనరల్ జియా నేతృత్వంలో ఉంది. ఆ సమయంలో ఆదిర్ దయాళ్ అనే గూఢాచారి ఇండియన్ ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ గా పాకిస్తాన్ లో ప్రవేశిస్తాడు. పాకిస్తాన్ లోని ఓ ప్రాంతంలో న్యూక్లియార్ బాంబు తయారవుతుందని తెలుసుకోని ఆ ప్రయత్నాలను నాశనం చేయడమే జియో హాట్ స్టార్ లో 5 ఎపిసోడ్లతో స్ట్రీమ్ అవుతున్న సలాక్కార్ కథ.1972 లో పాకిస్తాన్ దేశం భారత్ తో షిమ్లా ఒప్పందం తరువాత ఆ దేశ నేత అయిన జుల్ఫికర్ అలీ భుట్టో వేరే దేశాల నుండి విడిభాగాలు తెప్పించి పాకిస్తాన్ లో న్యూక్లియార్ బాంబు తయారు చేయాలనుకుంటాడు. ఈ ఆపరేషన్ కి ఐయస్ఐ హెడ్ అయిన ముర్తజా మాలిక్ ని నియమిస్తాడు. మాలిక్ ఆపరేషన్ ని పాకిస్తాన్ లోనే ఉన్న భారత గూఢాచారి విష్టు సర్వనాశనం చేస్తాడు.ఇదే నెట్ ఫ్లిక్స్ లో 6 ఎపిసోడ్లతో స్ట్రీమ్ అవుతున్న సారే జహా సేఅచ్ఛా సిరీస్ కథ.రెండు సిరీస్ లు థ్రిల్లర్ జోనర్ తో వచ్చినవే.చూసే ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తాయనడంలో సందేహమే లేదు. చరిత్రలో కనమరుగైన మన గూఢాచారుల కథలు ఇవి. వర్త్ ఫుల్ వాచ్ -
రెండు వారాలకే ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
ఈ వీకెండ్ థియేటర్లలోకి ఘాటీ, మదరాసి, లిటిల్ హార్ట్స్ సినిమాలు వచ్చాయి. వీటిలో లిటిల్ హార్ట్స్ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. మరోవైపు ఓటీటీల్లోనూ 20కి పైగా మూవీస్ వచ్చాయి. అయితే ఓ మూవీ మాత్రం థియేటర్లలోకి వచ్చిన రెండు వారాల్లోనే స్ట్రీమింగ్లోకి రావడం విశేషం. రొమాంటిక్ కామెడీ కథతో తీసిన ఈ చిత్రం సంగతేంటి? ఎందులో అందుబాటులోకి వచ్చిందనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: శివకార్తికేయన్ 'మదరాసి' సినిమా రివ్యూ)రాజు జయమోహన్, ఆద్య ప్రసాద్, భవ్య త్రిఖ హీరోహీరోయిన్లుగా నటించిన తమిళ సినిమ 'బన్ బటర్ జామ్'. ప్రేమ, పెళ్లి, స్నేహం అనే కాన్సెప్ట్తో తీశారు. 'ప్రేమలో ఓడిపోతే అక్కడే ఆగిపోవాలా? తిరిగి లైఫ్ ఎలా స్టార్ట్ చేయాలి?' అనే పాయింట్ బాగా చెప్పారు. అలానే స్నేహం, నిజమైన ప్రేమ మధ్య తేడా చూపించిన విధానం కూడా బాగుంది. జూలై 18న ఈ చిత్రం తమిళంలో రిలీజ్ కాగా దాదాపు నెల తర్వాత అంటే ఆగస్టు 22న తెలుగులో థియేటర్లలో రిలీజ్ చేశారు.స్టార్స్ లేకపోవడం, ప్రచారం చేయకపోవడం వల్ల ఈ సినిమా అనేది ఒకటి తెలుగులో థియేటర్లలో రిలీజైందని విషయం కూడా ప్రేక్షకులకు రీచ్ కాలేదు. ఇప్పుడు రెండు వారాలు తిరిగేసరికల్లా ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. 'బన్ బటర్ జామ్' ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది.(ఇదీ చదవండి: ‘లిటిల్ హార్ట్స్’ మూవీ రివ్యూ)'బన్ బటర్ జామ్' విషయానికొస్తే.. చంద్రు (రాజు జయమోహన్), మధుమిత (ఆద్య ప్రసాద్) ఇంటర్ పూర్తి చేస్తారు. వీళ్ల తల్లిదండ్రులు ఓ పెళ్లిలో కలిసి క్లోజ్ అవుతారు. ప్రస్తుత జనరేషన్లో ప్రేమ, అరేంజ్డ్ పెళ్లిళ్లు నిలబడట్లేదని మాట్లాడుకున్న వీళ్లు ఓ ప్లాన్ వేస్తారు. ఈ క్రమంలోనే చంద్రు పక్కింట్లో మధుమిత కుటుంబం దిగుతుంది. ఇంజినీరింగ్ చేరిన చంద్రు.. నందిని(భవ్య త్రిఖ)తో ప్రేమలో పడతాడు. నందినిని చంద్రు స్నేహితుడు శ్రీనివాస్ (మైఖేల్ తంగదురై) కూడా ప్రేమిస్తుంటాడు. మరోవైపు మధుమిత.. ఆకాష్ (వీజే పప్పు) అనే కుర్రాడిని ప్రేమిస్తుంది. ఒకరంటే ఒకరు పడని చందు, మధుమితలను కలిపేందుకు వాళ్ల తల్లిదండ్రులు ఎలాంటి ప్రయత్నాలు చేశారు? చివరకు ఎవరి ప్రేమ సుఖాంతమైంది అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: అనుష్క శెట్టి ‘ఘాటి’ మూవీ రివ్యూ) -
ఓటీటీలో హారర్, కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ ప్రవీణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘బకాసుర రెస్టారెంట్’.. ఆగష్టు 8న థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ఎస్జే శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్ రోల్లో నటించాడు. కృష్ణభగవాన్ ,షైనింగ్ ఫణి, కేజీఎఫ్ గరుడరామ్ ముఖ్యపాత్రల్లో నటించారు.‘బకాసుర రెస్టారెంట్’ హారర్, థ్రిల్లర్, మైథాలజీ కాన్సెప్ట్తో స్టోరీ ఉంటుంది. అయితే, ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేదు. కానీ, ఓటీటీ ప్రేక్షకులకు నచ్చే ఛాన్స్ ఉంది. సెప్టెంబర్ 12న 'సన్నెక్స్ట్' (Sun NXT)లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటన వచ్చేసింది. మన స్నేహితుడు అనివార్య కారణాల వల్ల మనకు దూరమైతే ఎంతటి బాధ ఉంటుందో ఈ సినిమాలో చూపించారు. ఆపై కామెడీ ఎటూ ఉండటంతో ఓటీటీ ప్రేక్షకులకు మంచి కాలక్షేపాన్ని ఇచ్చే సినిమా అని చెప్పవచ్చు.కథేంటంటే..పరమేశ్వర్(ప్రవీణ్) ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నలుగురు స్నేహితులతో కలిసి ఓ రూమ్లో ఉంటూ ఇష్టం లేకపోయినా డబ్బుల కోసం ఆ జాబ్ చేస్తుంటాడు. ఎప్పటికైనా ఓ రెస్టారెంట్ పెట్టాలనేది ఆయన కోరిక. ఓ సారి తన కోరికనే స్నేహితులతో పంచుకోగ.. డబ్బుల కోసం యూట్యూబ్ లో ఘోస్ట్ వీడియోలు చేద్దామని సలహా ఇస్తారు. అనుకున్నట్లే మొదటి వీడియో బాగా వైరల్ అవుతుంది. రెండో వీడియో కోసం ఓ హోస్ట్ హౌస్కి వెళ్తారు. అక్కడ వీరికి ఒక తాంత్రిక పుస్తకం దొరుకుతుంది. దాన్ని వాడి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటారు. అందులో రాసి ఉన్నట్లుగా మంత్ర పూజ చేయగా.. నిమ్మకాయలోకి 200 ఏళ్ల క్రితం నాటి ఆత్మ వస్తుంది. ఆ ఆత్మకు ఆకలి ఎక్కువ. ఇంట్లో ఉన్న ఫుడ్ అంతా తినేస్తుంది.ఆ నిమ్మకాయలో ఉన్న ఆత్మను కట్టడి చేసేందుకు ప్రయత్నించగా.. పరమేశ్వర్ రూమ్లోకి వచ్చిన అంజిబాబు(ఫణి) శరీరంలోకి వెళ్తుంది. అంజిబాబు శరీరాన్ని ఆవహించిన ఆత్మను పొగొట్టేందుకు పరమేశ్వర్ గ్యాంగ్ చేసిన ప్రయత్నాలు ఏంటి? బక్క సూరి(వైవా హర్ష) ఎవరు? రెస్టారెంట్ పెట్టాలన్న పరమేశ్వర్ కోరిక నెరవేరిందా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
వరుసగా మూడు రోజుల సెలవులు.. ఓటీటీల్లో ఒక్కరోజే 15 సినిమాలు!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. అంతేకాకుండా వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చేశాయి. దీంతో సినీ ప్రియులు కొత్త మూవీస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక థియేటర్ల విషయానికొస్తే అనుష్క శెట్టి ఘాటి, శివ కార్తికేయన్ మదరాసితో పాటు లిటిల్ హార్ట్స్ లాంటి చిత్రాలు సందడి చేయనున్నాయి. వీటిలో అనుష్క ఘాటిపైనే ఎక్కువగా అంచనాలు నెలకొన్నాయి. ఇక వీటి సంగతి పక్కనపెడితే శుక్రవారం వచ్చిందంటే చాలు.. ఓటీటీలకు సినిమాలు క్యూ కడుతుంటాయి. ఈ శుక్రవారం కూడా బోలెడు సినిమాలు, వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్కు వచ్చేందుకు రెడీ అయిపోయాయి. ఇప్పటికే కన్నప్ప ఓటీటీలో సందడి చేస్తుండగా.. మాలిక్, ఇన్స్పెక్టర్ జెండే లాంటి సినిమాలు ఆసక్తి పెంచుతున్నాయి. వీటితో మరికొన్ని డబ్బింగ్ చిత్రాలు, వెబ్ సిరీస్లు అలరించేందుకు వచ్చేస్తున్నాయి. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్ఇన్స్పెక్టర్ జెండే (హిందీ మూవీ) - సెప్టెంబరు 05క్వీన్ మాంటిస్-(కొరియన్ మూవీ)- సెప్టెంబరు 05లవ్ కాన్ రివేంజ్-(డాక్యుమెంటరీ సిరీస్)- సెప్టెంబరు 05డాక్టర్ సెస్ రెడ్ ఫిష్, బ్లూ ఫిష్(యానిమేషన్ చిత్రం)- సెప్టెంబరు 05జియో హాట్స్టార్సు ఫ్రమ్ సో(సులోచన ఫ్రమ్ సోమేశ్వరం)- సెప్టెంబర్ 05(రూమర్ డేట్)ఎన్సీఐఎస్-టోని అండ్ జీవా(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 05ఏ మైన్క్రాఫ్ట్ -(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 05ది పేపర్- (హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 05అమెజాన్ ప్రైమ్మాలిక్- (హిందీ మూవీ)- సెప్టెంబర్ 05డిష్ ఇట్ అవుట్-(ఒరిజినల్ సిరీస్)-సెప్టెంబర్ 05సన్ నెక్స్ట్ ఫుటేజ్ (మలయాళ సినిమా) - సెప్టెంబరు 05జీ5 అంఖోన్ కీ గుస్తాకియాన్ (హిందీ మూవీ) - సెప్టెంబరు 05 కమ్మట్టం (మలయాళ సిరీస్) - సెప్టెంబరు 05ఆపిల్ ప్లస్ టీవీ హైయస్ట్ టూ లోయెస్ట్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 05ఎమ్ఎక్స్ ప్లేయర్ రైజ్ అండ్ ఫాల్ (హిందీ సిరీస్) - సెప్టెంబరు 06లయన్స్ గేట్ ప్లేలాక్డ్- (హాలీవుడ్ థ్రిల్లర్ మూవీ)- సెప్టెంబరు 05 -
జెర్సీ హీరోయిన్ తొలి వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఈ ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ ప్రియులను అలరించిన హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్. బాలయ్య హీరోగా వచ్చిన డాకు మహారాజ్ చిత్రంతో అభిమానులను ఆకట్టుకుంది. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్న ముద్దుగుమ్మ.. ఓటీటీలోనూ ఎంట్రీ ఇస్తోంది. శ్రద్ధా శ్రీనాథ్ నటించిన లేటేస్ట్ వెబ్ సిరీస్ ది గేమ్: యు నెవర్ ప్లే అలోన్. ఈ సిరీస్కు రాజేశ్ ఎం. సెల్వ దర్శకత్వం వహించారు.తాజాగా ది గేమ్ యు నెవర్ ప్లే అలోన్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ ఓరిజినల్ సిరీస్గా తెరకెక్కించారు. దసరా కానుకగా అక్టోబర్ 2న ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ఫ్లిక్స్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. గేమ్ డెవలపర్ జీవితంలో ఇది క్లిష్టమైన సమయం అంటూ శ్రద్ధా శ్రీనాథ్ పోస్టర్ను పంచుకుంది. అయితే ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందనేది మాత్రం చెప్పలేదు. తనకు ఎదురైన సవాళ్లను మహిళా గేమ్ డెవలపర్ ఎలా అధిగమించిందన్న పాయింట్తో రూపొందిన సిరీస్ను రూపొందించారని పోస్టర్ చూస్తేనే అర్థమవుతోంది. ఈ సిరీస్లో సంతోశ్ ప్రతాప్, చాందిని కీలక పాత్రలు పోషించారు.Oru game developer oda life la hardest level idhuva thaan irukum. Watch The Game, out 2 October, only on Netflix.#TheGameOnNetflix@NetflixIndia @ApplauseSocial @nairsameer @SegalDeepak @CheruvalathP #AmalgaCreationsMedias @RajeshMSelva @ShraddhaSrinath @ActorSanthosh pic.twitter.com/hKFzPxFMIU— Shraddha Srinath (@ShraddhaSrinath) September 4, 2025Oru game developer oda life la hardest level idhuva thaan irukumWatch The Game, out 2 October, only on Netflix.#TheGameOnNetflix pic.twitter.com/Op3JfnSWWv— Netflix India South (@Netflix_INSouth) September 4, 2025 -
అఫీషియల్: ఓటీటీలో 'కూలీ' రిలీజ్ ఎప్పుడంటే?
రజనీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కూలీ (Coolie Movie). టాలీవుడ్ నుంచి నాగార్జున, బాలీవుడ్ నుంచి ఆమిర్ ఖాన్, మాలీవుడ్ నుంచి సౌబిన్ షాహిర్, సాండల్వుడ్ నుంచి ఉపేంద్ర కీలక పాత్రలు పోషించారు. భారీ తారాగణంతో ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ను అందుకుంది. టాక్ సంగతి ఎలా ఉన్నా.. కలెక్షన్లు మాత్రం బాగానే వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఓటీటీ డేట్ వచ్చేసిందిఅయితే వెయ్యికోట్ల మైలురాయి మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు. సెప్టెంబర్ 11న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ వదిలారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూలీ అందుబాటులోకి రానుందని తెలిపారు. అయితే హిందీ రిలీజ్ గురించి మాత్రం ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. అంటే కూలీ హిందీ వర్షన్ మరో ఓటీటీ ప్లాట్ఫామ్లోకి రానుందని తెలుస్తోంది.సినిమాకూలీ సినిమా విషయానికి వస్తే.. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీ హీరోగా నటించాడు. సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ నిర్మించాడు. శృతి హాసన్, సత్యరాజ్, రచిత రామ్ ముఖ్య పాత్రలు పోషించారు. హీరోయిన్ పూజా హెగ్డే మోనికా అనే స్పెషల్ సాంగ్లో స్టెప్పులేసింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. View this post on Instagram A post shared by prime video IN (@primevideoin) చదవండి: అల్లు అర్జున్ సినిమాలో యాక్ట్ చేశా.. నా భార్య తిట్టింది: నిర్మాత -
రూ. 9 వేల కోట్ల కలెక్షన్స్.. సడెన్గా తెలుగులో స్ట్రీమింగ్
హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ హిట్ సినిమా 'లిలో అండ్ స్టిచ్' ఎట్టకేలకు ఓటీటీలో విడుదలైంది. మే 23న థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు భారత అభిమానుల కోసం స్ట్రీమింగ్ అవుతుంది. కేవలం ఇంగ్లీష్, హిందీ, తమిళం, కన్నడలో మాత్రమే అందుబాటులో ఉండనుందని మొదట ప్రకటించారు. అయితే, ఇప్పుడు సడెన్గా తెలుగు వర్షన్ కూడా వచ్చేసింది. దీంతో ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.'లిలో అండ్ స్టిచ్' చిత్రాన్ని వాల్ట్ డిస్నీ పిక్చర్స్, రైడ్బ్యాక్ సంయుక్తంగా నిర్మించాయి. అమెరికన్ సైన్స్ ఫిక్షన్ కామెడీ చిత్రంగా డీన్ ఫ్లీషర్ క్యాంప్ దర్శకత్వం వహించారు. 2002లో ఇదే టైటిల్తో విడుదలైన సినిమాకు లైవ్-యాక్షన్ రీమేక్గా తెరకెక్కించారు. సెప్టెంబర్ 3 నుంచి జియోహాట్స్టార్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ప్రకటనలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, కన్నడ భాషలలో మాత్రమే విడుదల కానుందని జియోహాట్స్టార్ మొదట చెప్పింది. తన టాలీవుడ్ సబ్స్క్రైబర్లను నిరాశపరచకూడదని సడెన్గా తెలుగు వర్షన్ను కూడా అందుబాటులోకి తెచ్చింది.'లిలో' జీవితం కోట్ల కలెక్షన్స్ రాబట్టిందిప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీసు వద్ద రూ. 8800 కోట్ల వసూళ్లను రాబట్టిన ‘లిలో అండ్ స్టిచ్’ చిత్రం రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ యానిమేటెడ్ క్లాసిక్ లైవ్ యాక్షన్ సినిమాలో మైయా కీలోహా, సిడ్నీ అగుడాంగ్, క్రిస్ సౌండర్స్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కుటుంబ సమస్యలతో ఒంటరిగా బాధపడుతున్న లిలో అనే అమ్మాయి జీవితంలోకి స్టిచ్ అనే గ్రహాంతరవాసి ఎంటర్ అవుతుంది. వారిద్దరి మధ్య స్నేహం మొదలౌతుంది. దీంతో లిలో జీవితం అనేక మలుపులు తిరుగుతుంది. వయసుతో సంబంధం లేకుండా అందరి హృదయాన్ని తాకే చిత్రంగా ప్రశంసలు దక్కించుకుంది. -
ఓటీటీలో 'కన్నప్ప' స్ట్రీమింగ్..
మంచు విష్ణు (Manchu Vishnu) నటించిన 'కన్నప్ప' (Kannappa) సెప్టెంబర్ 4న ఓటీటీలోకి రానుందని అధికారికంగా ప్రకటించారు. అయితే, అనుకున్న సమయానికి స్ట్రీమింగ్కు రాకపోడంతో నెటిజన్లు పోస్టులు షేర్ చేశారు. దీంతో కాస్త ఆసల్యంగా ఓటీటీలోకి ఈ చిత్రం వచ్చేసింది. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 27న విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్, మోహన్లాల్, అక్షయ్కుమార్ వంటి స్టార్స్ నటించారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత రేంజ్లో మెప్పించలేకపోయింది.'కన్నప్ప' సెప్టెంబర్ 4నుంచి స్ట్రీమింగ్కు రానున్నట్లు సోషల్మీడియా ద్వారా మంచు విష్ణు ప్రకటించారు. అయితే, ఈ చిత్రం మొదట అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి రాకపోడంతో నెటిజన్లు సదరు ఓటీటీ సంస్థను ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేశారు. దీంతో కాస్త ఆలస్యంగా కన్నప్ప చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేశారు. ఈ క్రమంలో మరో పోస్టర్ను విడుదల చేశారు. థియేటర్లో చూడనివారు ఈ వీకెండ్లో చూసేయండి. -
ఓటీటీకి సూపర్ హిట్ దెయ్యం సినిమా.. పోస్టర్ వైరల్
కన్నడలో ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజై సూపర్ హిట్గా నిలిచిన హిలారియస్ కామెడీ ఎంటర్టైనర్ సు ఫ్రమ్ సో(సులోచన ఫ్రమ్ సోమేశ్వరం). కేవలం నాలుగు కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.40 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. శాండల్వుడ్లో సూపర్ హిట్గా నిలిచిన ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోనూ విడుదల చేశారు. ఈ హారర్ కామెడీ మూవీ ఆగస్టు 8న థియేటర్లలో సందడి చేసింది.తాజాగా ఈ మూవీ ఓటీటీకి రానుందని సోషల్మీడియాలో పలు పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. ఈ నెల ఐదో తేదీ నుంచి జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే, ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. ఈ చిత్రానికి జేపీ తుమినాద్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని లైటర్ బుద్ధ ఫిల్మ్స్ బ్యానర్పై శశిధర్ శెట్టి బరోడా, రాజ్ బీ శెట్టి, రవి రాయ్ కలిసి నిర్మించారు. సు ఫ్రమ్ సో కథేంటంటే?కర్ణాటక తీరప్రాంతంలోని ఓ పల్లెటూరు. అశోక్(జేపీ తుమినాడు) అనే కుర్రాడికి ఓ రోజు దెయ్యం పడుతుంది. దగ్గరలోని సోమేశ్వరం అనే ఊరికి చెందిన సులోచన అనే దెయ్యమే ఇతడికి ఆవహించిందని ఊరి ప్రజలందరూ అనుకుంటారు. దీంతో ఎలాగైనా సరే ఈ దెయ్యాన్ని వదిలించాలని ఊరి పెద్ద రవన్న (షనీల్ గౌతమ్).. ఓ స్వామిజీని(రాజ్ బి శెట్టి) తీసుకొస్తాడు. ఆత్మని వదిలించే క్రమంలో ఇది కాస్త ఊరి సమస్యగా మారుతుంది. ఇంతకీ ఆ యువకుడికి నిజంగానే దెయ్యం పట్టిందా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. -
2 వారాలకే ఓటీటీలోకి వచ్చేసిన యాక్షన్ థ్రిల్లర్
ఓటీటీల్లో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. వీటిలో థ్రిల్లర్, హారర్, యాక్షన్.. ఇలా వివిధ జానర్స్ ఉంటాయి. అయితే చాలామంది యాక్షన్ లేదా థ్రిల్లర్స్ చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడు అలాంటి ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీ సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన రెండు వారాలకే అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది.(ఇదీ చదవండి: మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)యాక్షన్ సినిమాలనగానే చాలామందికి హాలీవుడ్ గుర్తొస్తుంది. అందుకు తగ్గట్లే 2021లో వచ్చిన 'నోబడీ'.. ఈ జానర్లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రాల్లో ఇది టాప్-10లో ఉండటం విశేషం. దీనికి సీక్వెల్ 'నోబడీ 2'.. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజైంది. మంచి టాక్ వచ్చింది. మరి ఏమైందో ఏమో గానీ రెండు వారాలు తిరిగేసరికల్లా ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు యూఎస్, యూకే లాంటి దేశాల్లో అందుబాటులో ఉంది. మరి వారం పదిరోజుల్లో మన దగ్గర కూడా రావొచ్చు.'నోబడీ 2' విషయానికొస్తే.. భార్య, పిల్లలతో కలిసి హీరో విహారయాత్రకు వెళ్తాడు. అక్కడ సంతోషంగా ఎంజాయ్ చేస్తారు. కానీ పిల్లలు అనుకోకుండా చేసిన ఓ పని వల్ల చిన్న గొడవ జరుగుతుంది. అది కాస్త పెద్దది అయి.. ఓ కోటీశ్వరుడి సామ్రాజ్యాన్ని నేలకూల్చే వరకు వెళ్తుంది. మరి హీరో.. తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. ప్రారంభం నుంచి చివరివరకు కళ్లు చెదిరే యాక్షన్ సీన్స్ ఉంటాయి. చిన్న గ్యాప్ అనేది లేకుండా యమ స్పీడుగా వెళ్తుంది. నిడివి కూడా గంటన్నర కావడం ఇక్కడ విశేషం.(ఇదీ చదవండి: 'వీరమల్లు'కు జీఎస్టీ చెల్లించలేదు.. ఎలా అనుమతిచ్చారు?) -
బిగ్బాస్ నుంచి ఇద్దరు అవుట్.. ఈ షోకి పనికిరావంటూ రెడ్ కార్డ్!
మరో నాలుగు రోజుల్లో బిగ్బాస్ 9 తెలుగు (Bigg Boss 9 Telugu) ప్రారంభం కాబోతోంది. ఈసారి ఇంకా కంటెస్టెంట్ల ఎంపికపై టీమ్ తర్జనభర్జన పడుతూనే ఉంది. మొదటినుంచి నేను రెడీ అంటూ ముల్లెమూట సర్దేసుకున్నవారు పారితోషికం, నెగెటివిటీ గురించి ఆలోచించి ఓ అడుగు వెనక్కు వేస్తున్నారు. మరికొందరేమే ఓసారి ట్రై చేస్తే పోలా అని షోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు.ఇద్దరు ఎలిమినేట్ఇదిలా ఉంటే కామన్ మ్యాన్ కోసం బిగ్బాస్ అగ్నిపరీక్ష అనే షో నిర్వహిస్తున్నారు. ఈ షోలో 15 మందిని సెలక్ట్ చేశారు. వారిలో ఐదుగురిని హౌస్కు పంపించనున్నారు. జడ్జిలు బిందుమాధవి, నవదీప్, అభిజిత్.. వారిని సానబెట్టి రాటుదేలుస్తున్నారు. అలాగే సరిగా పర్ఫామెన్స్ ఇవ్వనివారిని బయటకు పంపించేస్తున్నారు. అలా లేటెస్ట్ ఎపిసోడ్లో ప్రసన్నకుమార్, శ్వేతను ఎలిమినేట్ చేశారు. ఈ పంచాయితీ సెట్టవదుఅయితే ప్రసన్నకు రెడ్ కార్డ్ ఇవ్వగానే అతడు నా జర్నీ ఇంతటితో ఆగిపోదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక్కడున్న అందరికంటే నువ్వు వెయ్యి రెట్లు స్ట్రాంగ్.. నిన్ను చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యా.. కానీ, ఈ షో నీ వల్ల కాదు, ఈ లొల్లి, ఈ పంచాయితీ నీతో కాదు.. అని నవదీప్ చెప్పాడు. అభిజిత్ సైతం.. నేను రియాలిటీ షో గెలిచుండొచ్చు, కానీ నువ్వు రియాలిటీలో గెలిచావు అని అభినందించాడు.చదవండి: మర్యాదగా నా ఫోటోలను డిలీట్ చేయండి: హీరోయిన్ వార్నింగ్ -
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
రీసెంట్గా 'త్రిబాణధారి బార్బరిక్' సినిమా రిలీజైంది. పాజిటిక్ టాక్ వచ్చినా సరే దీన్ని జనాలు పట్టించుకోవట్లేదు. ఈ క్రమంలోనే చిత్ర దర్శకుడు మోహన్ శ్రీవత్స.. తన చిత్రం చూసేందుకు ఎవరూ థియేటర్లలోకి రావట్లేదని బాధపడుతూ చెప్పుతో కొట్టుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతడు గతంలో తీసిన మరో మూవీ మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది.(ఇదీ చదవండి: 120 దేశాలు.. 100 కోట్ల మంది.. కెన్యా మంత్రితో రాజమౌళి)డైరెక్టర్ మోహన్ శ్రీవత్స 'బార్బరిక్' కంటే ముందు 'కరణ్ అర్జున్' అనే సినిమా తీశాడు. 2022 జూన్లో ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. స్టార్స్ లేకపోవడం, కంటెంట్ కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో థియేటర్లలో పెద్దగా ఫెర్మార్మ్ చేయలేదు. జనాలు ఆ చిత్రం గురించి మర్చిపోయారు. అలాంటిది దాదాపు మూడేళ్ల తర్వాత ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.'కరణ్ అర్జున్' విషయానికొస్తే.. కరణ్ (నిఖిల్ కుమార్) తనకు కాబోయే భార్య వృషాలి(షిఫా)తో కలిసి ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం పాకిస్తాన్ బోర్డర్లో ఉన్న జైసల్మేర్ ఎడారి ప్రాంతానికి వెళ్తాడు. ఆ దారిలో అర్జున్ (అభిమన్యు) వీళ్లిద్దరినీ వెంటాడుతూ ఇబ్బందులకు గురి చేస్తుంటాడు. ఒకానొక సమయంలో అర్జున్ ఆ ఇద్దరిని షూట్ చేసి చంపాలనుకుంటాడు. అర్జున్ నుంచి తప్పించుకోవడానికి ఎడారి ప్రాంతంలో అనేక పాట్లు పడతారు కరణ్, వృషాలి. వీరిద్దరిని అర్జున్ ఎందుకు వెంబడించాడు? చివరకు ఏమైందనేదే మిగతా సినిమా.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలివే) -
ఓటీటీలో దూసుకెళ్తోన్న టాలీవుడ్ థ్రిల్లర్.. ఏకంగా టాప్-3లో ట్రెండింగ్!
కంటెంట్ బాగుంటే చాలు సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు ఆడియన్స్. మరికొన్ని చిత్రాలేమో థియేటర్లలో అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నాయి. ఇక థియేటర్ల సంగతి పక్కనపెడితే.. ఓటీటీలో ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఫుల్ డిమాండ్ ఉంటోంది. ఆ జోనర్లో వచ్చిన చిత్రాలు డిజిటల్గా దూసుకెళ్తున్నాయి. ఇటీవల ఆర్కే సాగర్, మిషా నారంగ్ జోడీగా నటించిన టాలీవుడ్ థ్రిల్లర్ మూవీ ది 100. ఈ మూవీలో ధన్యా బాలకృష్ణ కీలకపాత్రలో నటించింది. జూలై 11న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ పోలీస్ థ్రిల్లర్ మూవీకి రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను రమేశ్ కరుటూరి, వెంకీ పుషడపు నిర్మించారు.ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఆగస్టు 29 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మెప్పించిన ఈ సినిమా ఓటీటీలోనూ దూసుకెళ్తోంది. ఇండియా వ్యాప్తంగా టాప్-3లో ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. కాగా.. ఈ చిత్రంలో ఆర్కే సాగర్ ఐపీఎల్ అధికారి విక్రాంత్ పాత్రలో మెప్పించారు.ఈ విషయాన్ని దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. మా సినిమా ది 100 అమెజాన్ ప్రైమ్లో భారతదేశంలో టాప్ -3లో ట్రెండింగ్ అవుతోంది. మా సినిమాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మీ ప్రేమ, ప్రోత్సాహమే ఈ ఘనతకు కారణమని సంతోషం వ్యక్తం చేశారు. View this post on Instagram A post shared by Sasidhar P (@raghavomkarsasidhar) -
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలివే
మరోవారం వచ్చేసింది. గత వీకెండ్ చిన్న సినిమాలే థియేటర్లలోకి వచ్చాయి. వాటిలో డబ్బింగ్ చిత్రం 'కొత్త లోక'.. ఉన్నంతలో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మిగిలినవి తేలిపోయాయి. మరోవైపు ఈసారి అనుష్క శెట్టి చాన్నాళ్ల తర్వాత లీడ్ రోల్ చేసిన 'ఘాటీ' విడుదలకు సిద్దమైంది. దీనికి పోటీగా తమిళ డబ్బింగ్ మూవీ 'మదరాశి' రాబోతుంది. దీనిపై పెద్దగా అంచనాలు లేవు. ఎందుకంటే హీరో శివకార్తికేయన్ అయినాసరే దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కావడమే దీనికి కారణం. ఇది కాకుండా 'లిటిల్ హార్ట్స్' ఓ తెలుగు మూవీ కూడా విడుదల కానుంది.(ఇదీ చదవండి: దీనస్థితిలో 'కేజీఎఫ్' నటుడు.. సాయం చేయాలని వేడుకోలు)మరోవైపు ఓటీటీల్లోనూ మరీ ఎక్కువ సినిమాలేం రావట్లేదు. 10కి పైగా స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో ఇన్స్పెక్టర్ జెండే, ద ఫాల్ గాయ్ చిత్రాలు ఉన్నంతలో కాస్త ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు వీకెండ్ అయ్యేసరికి కొత్త చిత్రాలు సడన్ సర్ప్రైజ్ ఇవ్వొచ్చు. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (సెప్టెంబరు 1 నుంచి 7వ తేదీ వరకు)నెట్ఫ్లిక్స్ద ఫాల్ గాయ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 03ఇన్స్పెక్టప్ జెండే (హిందీ మూవీ) - సెప్టెంబరు 05హాట్స్టార్ట్రేడ్ అప్ (హిందీ రియాలిటీ షో) - సెప్టెంబరు 01లిలో అండ్ స్టిచ్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 03అమెజాన్ ప్రైమ్ఔట్ హౌస్ (హిందీ సినిమా) - సెప్టెంబరు 01సన్ నెక్స్ట్సరెండర్ (తమిళ మూవీ) - సెప్టెంబరు 04ఫుటేజ్ (మలయాళ సినిమా) - సెప్టెంబరు 05జీ5అంఖోన్ కీ గుస్తాకియాన్ (హిందీ మూవీ) - సెప్టెంబరు 05కమ్మట్టం (మలయాళ సిరీస్) - సెప్టెంబరు 05ఆపిల్ ప్లస్ టీవీహైయస్ట్ టూ లోయెస్ట్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 05ఎమ్ఎక్స్ ప్లేయర్రైజ్ అండ్ ఫాల్ (హిందీ సిరీస్) - సెప్టెంబరు 06(ఇదీ చదవండి: 'జెర్సీ' వదులుకున్నా.. ఇప్పటికీ బాధపడుతున్నా: జగపతి బాబు) -
కన్నీళ్లు పెట్టించే మూవీ.. చేయని తప్పుకు అమ్మాయి జీవితం బలి!
హీరోహీరోయిన్ల లవ్స్టోరీ, విలన్ ఎంట్రీ, నాలుగు ఫైట్లు, డ్యుయెట్లు.. శుభం పలికే క్లైమాక్స్.. దాదాపు అన్ని సినిమాల్లో ఇవే ఉంటాయి. కానీ ఇప్పుడు చెప్పబోయే సినిమాలో ఇవేవీ ఉండవు. అయినా ఎంతోమందిని ఈ చిత్రం కదిలించింది. సూపర్స్టార్ రజనీకాంత్ ఈ సినిమా చూసి నవ్వుతూనే ఏడ్చేశారు. అందుకే హీరోయిన్ అదితి బాలన్, దర్శకుడు అరుణ్ ప్రభును ఇంటికి పిలిచి మరీ బంగారు గొలుసులు బహుకరించారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం సినిమా అద్భుతమని, చివరి పావుగంట నమ్మలేకుండా ఉంటుందని ప్రశంసలు కురిపించారు. ఇంతకీ ఆ సినిమా పేరు అరువి. 2017లో వచ్చిన ఈ తమిళ చిత్రం రూ.1 కోటితో తెరకెక్కి రూ.35 కోట్లకు పైగా వసూలు చేసింది. దర్శకుడు అరుణ్ ప్రభుకు, హీరోయిన్గా అదితి బాలన్కు ఇదే మొదటి సినిమా కావడం విశేషం. ఈ సినిమాలో ఏముందో చూద్దాం..కథఏ అమ్మాయికైనా తండ్రంటే పంచ ప్రాణాలు. తల్లి కోప్పడినా తండ్రి మాత్రం గారాబం చేస్తుంటాడు. అరువి అనే అమ్మాయి కూడా తండ్రి చేతిలో అల్లారుముద్దుగా పెరిగింది. కానీ ఓ యాక్సిడెంట్ వల్ల తన జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది. తనకో సమస్య ఉందని ఇంట్లోవాళ్లే ఆమెను ఛీ కొడతారు. తాను ఏ తప్పూ చేయలేదని చెప్పినా ఎవరూ లెక్కచేయరు. ఇంట్లో నుంచి గెంటేస్తారు. కన్నీళ్లతో ఇంటినుంచి బయటకు వస్తుంది. (Aruvi Movie Review)హృదయ విదారక కథకానీ, ఆ కన్నీళ్లను చూసి సమాజం జాలిపడదు సరికదా! దాన్నే అలుసుగా తీసుకుంటుంది. అలా ముగ్గురు మగవారి చేతిలో మోసపోతుంది. ఎమిలీ అనే ట్రాన్స్జెండర్ స్నేహితురాలితో కలిసి ఈ విషయాన్ని ఓ టీవీ డిబేట్లో వెల్లడిస్తుంది. అక్కడి నుంచి సినిమా మరో మలుపు తిరుగుతుంది. అసలు అరువి జీవితాన్ని తలకిందులు చేసిన సమస్య ఏంటి? కంటిరెప్పలా చూసుకున్న కన్నతండ్రే ఆమెను ఎందుకు గెంటేశాడు? చావు తథ్యమని తెలిసి ఆమె ఏం చేసింది? అనేది తెలియాలంటే అమెజాన్ ప్రైమ్లో అరువి చూడాల్సిందే!క్లైమాక్స్లో ఏడ్చేస్తారుసినిమా ప్రారంభంలో కాస్త బోరింగ్గా అనిపిస్తుంది. కానీ ఒక్క సంఘటన తర్వాత కథ ఇంట్రస్టింగ్గా మారుతుంది. చేయని తప్పుకు అరువి జీవితాంతం శిక్ష అనుభవిస్తుంది. ఎవరూ తనను నమ్మకపోవడమనేది ఆమెను మానసికంగా చిత్రవధ చేస్తుంది. సినిమా చివర్లో హీరోయిన్ మాట్లాడే మాటలు కంటతడి పెట్టిస్తాయి. ఐఎమ్డీబీలో 8.3 రేటింగ్ ఉన్న ఈ సినిమా తప్పకుండా చూడండి! -
ఓటీటీలో 'ట్వెల్త్ ఫెయిల్' హీరో కొత్త సినిమా
'ట్వెల్త్ ఫెయిల్' సినిమాతో ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్ అందుకున్న విక్రాంత్ మాస్సే రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆ చిత్రం తర్వాత ఆయన నటించిన 'ఆంఖో కి గుస్తాఖియాన్' మూవీ ఓటీటీలోకి రానుంది. ప్రముఖ రచయిత రస్కిన్ బాండ్ రాసిన "The Eyes Have It" అనే కథ ఆధారంగా ఈ సనిమాను దర్శకుడు సంతోష్ సింగ్ రూపొందించారు. అయితే, బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత రేంజ్లో మెప్పించలేకపోయింది.'ఆంఖో కి గుస్తాఖియాన్' చిత్రం ఓటీటీలో విడుదల కానున్నట్లు జీ5 ప్రకటించింది. సెప్టెంబర్ 5నుంచి స్ట్రీమింగ్ అవుతుందని ఒక పోస్టర్ను విడుదల చేసింది. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్ కుమార్తె శనయా కపూర్ హీరోయిన్గా నటించింది. ఈమెకిదే తొలి చిత్రం కావడం విశేషం. ఈ చిత్రంలో శనయా థియేటర్ ఆర్టిస్ట్గా నటించగా.. విక్రాంత్ అంధ సంగీతకారుడి పాత్రలో మెప్పించారు. భావోద్వేగపూరితమైన వారి ప్రేమకథకు యూత్ బాగానే కనెక్ట్ అయింది. -
ఓటీటీలో తమన్నా 'బీర్' స్టోరీ.. ట్రైలర్ రిలీజ్
కొన్నేళ్ల ముందు వరకు హీరోయిన్గా తమన్నా వరస సినిమాలు చేసింది. తర్వాత ట్రెండ్కి తగ్గట్లు ఐటమ్ సాంగ్స్ చేసింది. ఓటీటీల్లో పలు సిరీస్లు కూడా చేసింది. ఇప్పుడు కూడా ఓ కొత్త సిరీస్తో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైంది. బీర్ తయారు చేయడం బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తీశారు. తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు.(ఇదీ చదవండి: హీరోయిన్ తో నిశ్చితార్థం చేసుకున్న హీరో విశాల్)పెద్ద కంపెనీలో పనిచేసే తమన్నా ఉద్యోగం ఊడిపోతుంది. ఈమె ఫ్రెండ్ది కూడా సేమ్ పరిస్థితి. దీంతో డబ్బు సంపాదించేందుకు బీర్ తయారు చేసి అమ్మాలని నిర్ణయించుకుంటారు. దీని కోసం బీర్ తయారు చేసే ఒకడిని వెతికిపట్టుకుంటారు. తయారు చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి వీళ్లకు సమస్యలు ఎదురవుతుంటాయి. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీలా అనిపిస్తుంది.కామెడీ సిరీస్లా అనిపిస్తున్నప్పటికీ తమన్నా తన గ్లామర్ విషయంలో ఏ మాత్రం తగ్గలేదు. ఈమెతో పాటు డయానీ పెంటీ, నకుల్ మెహతా, శ్వేత తివారీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కరణ జోహర్ నిర్మించిన ఈ సిరీస్.. సెప్టెంబరు 12 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.(ఇదీ చదవండి: వినాయకుడి సాక్షిగా విడాకులపై హన్సిక క్లారిటీ) -
ఓటీటీలో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్.. ఉచితంగానే చూసేయండి
బాలీవుడ్ నటుడు రాజ్కుమార్ రావ్ కీలక పాత్రలో నటించిన గ్యాంగ్స్టర్ డ్రామా చిత్రం ‘మాలిక్’ (Maalik). గతేడాది స్త్రీ-2తో సూపర్ హిట్ కొట్టిన నటుడు.. ఇటీవల భూల్ చుక్ మాఫ్ అనే మూవీతో ప్రేక్షకులను పలరించారు. ఈ క్రమంలోనే జులై 11న మాలిక్ చిత్రం విడుదలైంది. అయితే, ఈ సినిమా అనుకున్నంత రేంజ్లో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దర్శకుడు పుల్కిత్ తెరకెక్కించిన ఈ మూవీలో మానుషి చిల్లర్ కథానాయికగా నటించారు.మాలిక్ చిత్రం ఇప్పటికే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, సెప్టెంబర్ 5 నుంచి ఎలాంటి అద్దె చెల్లించకుండా ఈ చిత్రాన్ని చూడొచ్చని ఒక పోస్టర్ను విడుదల చేశారు. అమెజాన్ చందాదారుల ఎలాంటి అదనపు రుసుము చెల్లించకుండా ఈ మూవీని చూడొచ్చు. పొలిటికల్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం కొన్ని వర్గాలను అయితే మెప్పించింది. 1988లో అలహాబాద్లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. రాజ్కుమార్ రావు గ్యాంగ్స్టర్గా మెప్పించిన ఈ చిత్రాన్ని టిప్స్ ఫిల్మ్స్, నార్తర్న్ లైట్స్ ఫిల్మ్స్ బ్యానర్లపై కుమార్ తౌరానీ, జే షెవాక్రమణి నిర్మించారు. -
సడన్గా ఓటీటీకి వచ్చేసిన తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆర్కే సాగర్, మిషా నారంగ్ జోడీగా నటించిన చిత్రం ది 100. ఈ మూవీలో ధన్యా బాలకృష్ణ కీలకపాత్ర పోషించింది. జూలై 11న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు. పోలీస్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీని రమేశ్ కరుటూరి, వెంకీ పుషడపు నిర్మించారు.తాజాగా ఈ చిత్రం సడన్గా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ విషయాన్ని డైరెక్టర్ రాఘవ్ ఓంకార్ శశిధర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అమెజాన్ ప్రైమ్తో పాటు లయన్స్ గేట్ ప్లే ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోందని తెలిపారు. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో ఆర్కే సాగర్ ఐపీఎల్ అధికారి విక్రాంత్ పాత్రలో మెప్పించారు. పోలీస్ యాక్షన్ చిత్రాలు ఇష్టపడేవారు ది 100 చూసి ఎంజాయ్ చేయండి. (ఇది చదవండి: ‘ది 100’ మూవీ రివ్యూ)గతంలో దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ మాట్లాడుతూ–'సమాజంలోని సవాళ్ల గురించి తీసిన సినిమా ఇది. ప్రతి ఇంట్లో విక్రాంత్లాంటి క్యారెక్టర్ ఉండాలని ప్రేక్షకులు కోరుకోవడం నాకు నచ్చింది. మా చిత్రానికి ముఖ్యంగా మహిళలు చాలా కనెక్ట్ అవుతున్నారు. ప్రేక్షకులు పతాక సన్నివేశాల్లో చప్పట్లు కొడుతుండటం సంతోషంగా ఉంది' అని అన్నారు. View this post on Instagram A post shared by Sasidhar P (@raghavomkarsasidhar) -
ఈ వీకెండ్ ఓటీటీల్లో పండగే.. శుక్రవారమే 18 చిత్రాలు స్ట్రీమింగ్!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ వినాయక చవితి పెద్ద సినిమాలేవీ రాలేదు. థియేటర్లలో సుందరకాండ, కన్యాకుమారి లాంచి చిన్న చిత్రాలు సందడి చేశాయి. ఈ శుక్రవారం కూడా తెలుగులో పెద్ద మూవీస్ రావడం లేదు. త్రిబాణధారి బార్బరిక్, అర్జున్ చక్రవర్తి లాంటి సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి.ఇక వీకెండ్లో ఓటీటీ సినిమాలకు సైతం ఫుల్ డిమాండ్ ఉంటుంది. దాదాపు ఓటీటీల్లోనూ ఫ్రైడే రోజే ఎక్కువ చిత్రాలు స్ట్రీమింగ్కు వస్తుంటాయి. ఈ వారాంతంలో మిమ్మల్ని అలరించేందుకు పలు హిట్ సినిమాలు రెడీ అయిపోయాయి. బాలీవుడ్కు చెందిన మెట్రో ఇన్ డినో, సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ సినిమాలతో పాటు రాంబో ఇన్ లవ్ అనే తెలుగు వెబ్ సిరీస్ కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. వీటితో పాటు సౌత్, హాలీవుడ్కు చెందిన చిత్రాలు, వెబ్ సిరీస్లు అలరించేందుకు వచ్చేస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేసేయండి.నెట్ఫ్లిక్స్మెట్రో ఇన్.. డైనో (హిందీ మూవీ) - ఆగస్టు 29టూ గ్రేవ్స్ (స్పానిష్ సిరీస్) - ఆగస్టు 29అన్నోన్ నంబర్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 29లవ్ అన్ ట్యాంగిల్డ్(కొరియన్ మూవీ)- ఆగస్టు 29కరాటే కిడ్: లెజెండ్స్ (హాలీవుడ్ చిత్రం) - ఆగస్టు 30అమెజాన్ ప్రైమ్సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ (హిందీ సినిమా) - ఆగస్టు 29జియో హాట్స్టార్అటామిక్- వన్ హెల్ ఆఫ్ ఏ రైడ్(హాలీవుడ్ చిత్రం)- ఆగసటు 29హౌ ఐ లెఫ్ట్ ద ఓపస్ దే (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 29రాంబో ఇన్ లవ్ (తెలుగు సిరీస్) - ఆగస్టు 29జీ5శోధా (కన్నడ సిరీస్) - ఆగస్టు 29సోనీ లివ్సంభవ వివరణమ్ నలరసంఘం (మలయాళ సిరీస్) - ఆగస్టు 29ఆహాఇండియన్ ఐడల్ సీజన్ 4 (తెలుగు సింగింగ్ షో) - ఆగస్టు 29లయన్స్ గేట్ ప్లేబెటర్ మ్యాన్ (హాలీవుడ్ మూవీ) - ఆగస్టు 29ఎరోటిక్ స్టోరీస్ (హాలీవుడ్ వెబ్ సిరీస్) - ఆగస్టు 29ఆపిల్ టీవీ ప్లస్కే పాప్డ్(కొరియన్ సిరీస్)- ఆగస్టు 29క్రాప్డ్ (హాలీవుడ్ వెబ్ సిరీస్) - ఆగస్టు 29షేర్ ఐలాండ్ సీజన్ 2 (హాలీవుడ్ వెబ్ సిరీస్) - ఆగస్టు 29మనోరమ మ్యాక్స్సార్కిట్- (మలయాళ సినిమా)- ఆగస్టు 29సైనా ప్లేరవీంద్ర నీ ఎవిడే-(మలయాళ సినిమా)- ఆగస్టు 29 -
ఓటీటీలోకి వచ్చేసిన 'కింగ్డమ్'.. కానీ అది మిస్
విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. గత నెల చివరలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి తొలిరోజు మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ తర్వాత సీన్ మారిపోయింది. ప్రేక్షకులు పెదవి విరిచారు. అయితే హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సేని తీసుకున్నారు కానీ ఒకటి రెండు సీన్లు తప్పితే చిత్రంలో అస్సలు ఈమెని సరిగా ఉపయోగించుకోలేదు. సరే డిజిటల్ స్ట్రీమింగ్లోనైనా సరే హ్యాపీ అవుతుందనుకుంటే ఇక్కడా డిసప్పాయింట్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలో తమిళ హిట్ సినిమా.. ఇప్పుడు తెలుగులోనూ)ఈ సినిమాలో 'హృదయం లోపల' అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ ఉంది. మూవీ రిలీజ్కి ముందే ఈ పాట వీడియో రిలీజ్ చేశారు. తీరా చూస్తే థియేటర్లలో ఈ గీతం కనిపించలేదు. దీనికి కారణాన్ని చెబుతూ స్టోరీలో సెట్ కాలేదు కాబట్టి తీసేశాం అని నిర్మాత నాగవంశీ చెప్పారు. సరే ఓటీటీలోకి వచ్చాక అయినా సరే ఉంటుందిలే అనుకుంటే ఇక్కడ కూడా తీసేశారు. దీంతో భాగ్యశ్రీ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో దీని గురించి మాట్లాడుకుంటున్నారు.'కింగ్డమ్' మూవీ నెట్ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చింది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ సినిమా విషయానికొస్తే.. సూరి (విజయ్ దేవరకొండ) ఓ కానిస్టేబుల్. చిన్నప్పుడు దూరమైన అన్న శివ(సత్యదేవ్) కోసం వెతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో పోలీస్ అధికారులతో సూరికి గొడవ. దీనిపై విచారణ సాగుతున్న సమయంలోనే సూరి.. ఓ అండర్ కవర్ మిషన్ బాధ్యతల్ని భుజాన వేసుకోవాల్సి వస్తుంది. శ్రీలంకలోని ఓ దీవిలో శివ ఉన్నాడని, అక్కడికి గూఢచారిగా వెళ్లాలనే పని సూరికి అప్పజెబుతారు. మరి ఆ ద్వీపంలో ఉన్న తెగకు, శివకీ సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'సుందరకాండ' సినిమా రివ్యూ) -
ఓటీటీలో భారీ యాక్షన్ సినిమా.. సడెన్గా తెలుగులో స్ట్రీమింగ్
హాలీవుడ్ భారీ యాక్షన్ సినిమా 'థండర్ బోల్ట్స్' ఓటీటీలోకి వచ్చేసింది. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం మే 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. జేక్ ష్రియర్ (Jake Schreier) దర్శకత్వం వహించిన ఈ మూవీ భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీకి న్యూ అవేంజర్స్ (New Avengers) అనే ట్యాగ్లన్ ఉండటంతో ఫ్యాన్స్లో కూడా ఆసక్తి పెరిగింది. అవెంజర్స్ లేని సమయంలో దేశాన్ని కాపాడేందుకు వాలంటీనా టీమ్ 'థండర్ బోల్ట్స్'ని రెడీ చేస్తుంది. ఈ పాయింట్తోనే సినిమా ప్రారంభమౌతుంది.'థండర్ బోల్ట్స్: న్యూ అవేంజర్స్' చిత్రాన్ని మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగానే తెరకెక్కించారు. మార్వెల్ కామిక్స్లోని సూపర్ విలన్లు ఒక టీమ్గా ఏర్పడటాన్ని ఇందులో చూపిస్తారు. అయితే, సడెన్గా జియోహాట్స్టార్ ((JioHotstar))లో ఈ చిత్రం ఆగష్టు 27 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, ఇంగ్లీష్లో అందుబాటులో ఉంది. రెంట్ విధానంలో ఇప్పటికే జూలై 1 నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, ఇతర దేశాల్లోని అభిమానులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు జియోహాట్స్టార్ ఇండియాలోని ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.థండర్ బోల్ట్స్ చిత్రంలో ఫ్లోరెన్స్ పగ్, సెబాస్టియన్ స్టాన్, డేవిడ్ హార్బర్, వ్యాట్ రస్సెల్, హన్నా జాన్-కామెన్, గెరాల్డిన్ విశ్వనాథన్, లూయిస్ పుల్మాన్ వంటి హాలీవుడ్ స్టార్స్ నటించారు. -
ఓటీటీలో తమిళ హిట్ సినిమా.. ఇప్పుడు తెలుగులోనూ
ఓటీటీలోకి మరో హిట్ సినిమా వచ్చేసింది. తమిళంలో సూపర్ హిట్ అయిన ఓ చిత్రాన్ని కొన్నిరోజుల క్రితం ఒరిజినల్ వెర్షన్ మాత్రమే డిజిటల్ రిలీజ్ చేశారు. దీంతో చాలామంది తెలుగు ఆడియెన్స్.. మన భాషలో ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూ వచ్చారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు వినాయక చవితి కానుకగా తెలుగు, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది.కమెడియన్ నుంచి హీరోగా మారిన తమిళ నటుడు సూరి.. ఈ ఏడాది 'మామన్' అనే సినిమా చేశాడు. మే నెలలో థియేటర్లలో రిలీజ్ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రశాంత్ పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. కుటుంబ బంధాల్ని, మేనమామ రిలేషన్ గొప్పదనాన్ని చూపించిన ఈ చిత్రం జీ5 ఓటీటీలో ఆగస్టు తొలివారం రిలీజ్ చేశారు. అయితే అప్పుడు తమిళ వెర్షన్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది.(ఇదీ చదవండి: బాలీవుడ్ స్టార్స్ 'భగ్న' ప్రేమకథ!)ఇప్పుడు తెలుగు, కన్నడ డబ్బింగ్ కూడా స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేసి ప్రకటించారు. అక్కా తమ్ముడు బంధాన్ని చాలా ఎమోషనల్గా ఈ చిత్రంలో చూపించారు. అక్క బిడ్డల కోసం మేనమామగా చేయాల్సిన బాధ్యతలను నేటి సమాజానికి గుర్తుచేసేలా మూవీని తెరకెక్కించారు. తెలుగు, కన్నడ కూడా జీ5 ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఓ లుక్కేయండి.'మామన్' విషయానికొస్తే.. తమిళనాడులోని తిరుచ్చి ప్రాంతంలో ఇన్బా, గిరిజ అక్కా తమ్ముడు. ఇన్బాకు అక్కంటే ప్రాణం. అక్కకు పెళ్ళైన చాలా కాలం తరువాత అతి కష్టం మీద ఓ బిడ్డ పుడతాడు. ఆ బిడ్డ పేరు లడ్డూ. అక్క బిడ్డను ఇన్బా అపురూపంగా చూసుకుంటుంటాడు. ఎంతలా అంటే తాను ప్రేమించి పెళ్ళి చేసుకున్న అమ్మాయి రేఖకన్నా లడ్డూ మీదే మమకారం పెంచుకునేంతలా. అదే సమయంలో ఇన్బా తండ్రి అవుతాడు. ఇక అక్కడి నుండి అసలు సిసలైన కథ మొదలవుతుంది. అదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'సుందరకాండ' సినిమా రివ్యూ) -
మిల్కీ బ్యూటీ తమన్నా లేటేస్ట్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయట్లేదు. ఈ ఏడాది ఓదెల-2 మూవీతో అలరించిన ముద్దుగుమ్మ.. అంతకుముందు ఒకట్రెండు స్పెషల్ సాంగ్స్లో మెరిసింది. ప్రస్తుతం బాలీవుడ్కే పరిమితమైన తమన్నా ఆసక్తికర వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు రానుంది తమన్నా భాటియా, డయానా పెంటీ నటించిన కామెడీ-డ్రామా వెబ్ సిరీస్ 'డూ యు వన్నా పార్టనర్'. ఈ సిరీస్కు అర్చిత్ కుమార్, కాలిన్ డికున్హా దర్శకత్వం వహించారు. కరణ్ జోహార్, అదార్ పూనవల్లా, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మించారు.తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగా కానుందని వెల్లడించారు. ఇద్దరు ప్రాణ స్నేహితుల కథ ఆధారంగా ఈ సిరీస్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇద్దరు ఫ్రెండ్స్ సొంత ఆల్కహాల్ వెంచర్ను స్థాపించాలనే సాహసోపేతమైన నిర్ణయం ఎలాంటి మలుపులు తిరిగిందనేది ఈ సిరీస్లో చూపించనున్నారు. ఈ వెబ్ సిరీస్లో జావేద్ జాఫ్రే, నకుల్ మెహతా, సూఫీ మోతీవాలా, నీరజ్ కబీ, శ్వేతా తివారీ, రణ్విజయ్ సింఘా కీలక పాత్రల్లో నటించారు.raising a toast because they’re here with something brew-tiful 🍺#DoYouWannaPartnerOnPrime, New Series, September 12 pic.twitter.com/NM9tLCKPRG— prime video IN (@PrimeVideoIN) August 25, 2025 -
ఓటీటీలోకి దేవరకొండ 'కింగ్డమ్'.. అధికారిక ప్రకటన
విజయ్ దేవరకొండ గత నెలలో 'కింగ్డమ్' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పలుమార్లు వాయిదా పడిన చిత్రం.. గత నెల చివరలో థియేటర్లలోకి వచ్చింది. అయితే రిలీజైన ఒకటి రెండు రోజులు హడావుడి నడిచింది. కానీ తర్వాత నెగిటివ్ టాక్ వచ్చింది. కలెక్షన్స్ కూడా పెద్దగా రాలేదు. దీంతో నష్టాలు మూటగట్టుకుంది. అలాంటిది ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఏ ఓటీటీలోకి రానుందంటే?విజయ్ దేవరకొండ-భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన 'కింగ్డమ్' చిత్రాన్ని యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. సత్యదేవ్ కీలక పాత్ర పోషించాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. నాగవంశీ నిర్మాత. జూలై 31న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కాగా.. ఇప్పడు ఆగస్టు 27న వినాయక చవితి సందర్భంగా నెట్ఫ్లిక్స్లోకి రానుంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 27 సినిమాలు) 'కింగ్డమ్' విషయానికొస్తే.. సూరి (విజయ్ దేవరకొండ) ఓ కానిస్టేబుల్. చిన్న వయసులోనే కుటుంబానికి దూరమైన తన అన్న శివ (సత్యదేవ్) కోసం వెతుకుతుంటాడు. ఆ ప్రయత్నంలోనే పోలీస్ అధికారులతో సూరికి గొడవ జరుగుతుంది. అయితే ఉద్యోగం నుంచి తీసేయకుండా ఓ సీక్రెట్ మిషన్ అప్పజెబుతారు. శివ ఆచూకీ శ్రీలంక సమీపంలోని ఓ ద్వీపంలో ఉందని, గూఢచారిగా అక్కడ పనిచేయాలని చెబుతారు.అన్న కోసం ఎక్కడికైనా వెళ్లేందుకు సిద్ధమైన సూరి.. శ్రీలంకలో అడుగుపెడతాడు. మరి సూరికి తన అన్న శివ దొరికాడా లేదా? అక్కడి తెగ 70ఏళ్లుగా ఎవరి రాకకోసం ఎదురు చూస్తోంది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓం రౌత్ నిర్మాతగా ఓటీటీ సినిమా.. ట్రైలర్ రిలీజ్)Bangaram tho, raktham tho, nippu tho kattina ee Kingdom ni yelladaniki oka naayakudu osthunnadu!🤴🔥 pic.twitter.com/F7NKRYwXEg— Netflix India South (@Netflix_INSouth) August 25, 2025 -
ఓం రౌత్ నిర్మాతగా ఓటీటీ సినిమా.. ట్రైలర్ రిలీజ్
తెలుగులో తక్కువ గానీ బాలీవుడ్లో కొత్త సినిమాల్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తుంటారు. ఇప్పుడు కూడా ఓ మూవీని అలానే స్ట్రీమింగ్కి సిద్ధం చేశారు. 'ఆదిపరుష్' దర్శకుడు ఓం రౌత్.. మరో ఇద్దరితో కలిసి నిర్మించిన కామెడీ థ్రిల్లర్ సినిమా ఇది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంతకీ ఈ చిత్రం సంగతేంటి? ఏ ఓటీటీలోకి రానుంది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 27 సినిమాలు)'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్తో మంచి గుర్తింపు తెచ్చుకున్న మనోజ్ బాజ్పాయ్.. 'ఇన్స్పెక్టర్ జెండే' పేరుతో తీసిన ఈ చిత్రంలో పోలీసుగా నటించాడు. ముంబైకి చెందిన పోలీస్ అధికారి మాధవ్ జెండే జీవితం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. 1970-80ల్లో మాధవ్ జెండే పనిచేస్తున్న టైంలో ఛార్లెస్ శోభరాజ్ సీరియల్ కిల్లర్గా వార్తల్లో నిలిచాడు. అయితే మాధవ్.. శోభరాజ్ని రెండుసార్లు పట్టుకున్నాడు. 1971లో తొలిసారి అరెస్ట్ చేయగా 1986లో తిహార్ జైలు నుంచి తప్పించుకున్నాడు. తర్వాత మళ్లీ గోవాలో అదుపులోకి తీసుకున్నారు.ఇప్పుడు ఈ స్టోరీని కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్గా తీశారు. డైరెక్టర్ ఓం రౌత్.. దీనికి ఓ నిర్మాతగా వ్యవహరించారు. అయితే థియేటర్లలోకి కాకుండా నేరుగా నెట్ఫ్లిక్స్లో సెప్టెంబరు 05 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే మంచి మూవీ చూడబోతున్నామనే ఫీల్ అయితే కలిగించారు. ఇది తెలుగులోనూ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మూవీలో ఛార్లెస్ శోభరాజ్ పాత్రలో 'కుబేర' ఫేమ్ జిమ్ షర్బ్ నటించడం విశేషం.(ఇదీ చదవండి: విషాదం.. 'కేజీఎఫ్' నటుడు కన్నుమూత) -
ఈ వారం ఓటీటీల్లోకి 27 సినిమాలు
మరోవారం వచ్చేసింది. ఈసారి వినాయక చవితి పండగ కూడా ఉంది. కానీ థియేటర్లలో చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. 'సుందరకాండ', 'త్రిబాణధారి బార్బరిక్', 'అర్జున్ చక్రవర్తి', 'కన్యాకుమారి' లాంటి చిన్న సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. వీటిపై పెద్దగా బజ్ లేదు. జాన్వీ కపూర్ హిందీ మూవీ 'పరమ్ సుందరి' కూడా ఇదే వీకెండ్లో బిగ్ స్క్రీన్పైకి రానుంది. మరోవైపు ఓటీటీల్లో మాత్రం 27 వరకు కొత్త చిత్రాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి.(ఇదీ చదవండి: జీవిత కోసం రాజశేఖర్ ఓవరాక్టింగ్.. కావాలనే గొడవ : డైరెక్టర్)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. ఉన్నంతలో మెట్రో ఇన్ డైనో అనే హిందీ మూవీ ఆసక్తి రేపుతోంది. దీంతో పాటు అబిగైల్, కరాటే కిడ్స్ లెజెండ్స్, సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ చిత్రాలతో పాటు రాంబో ఇన్ లవ్ అనే తెలుగు సిరీస్, ఇండియన్ ఐడల్ 4 కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. ఇంతకీ ఏ సినిమా ఏ ఓటీటీలోకి రానుందంటే?ఈ వారం రిలీజయ్యే సినిమాల జాబితా (ఆగస్టు 25 నుంచి 31 వరకు)నెట్ఫ్లిక్స్అబిగైల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 26క్రిస్టోఫర్ (డానిష్ మూవీ) - ఆగస్టు 27కత్రినా: కమ్ హెల్ అండ్ హై వాటర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 27మై లైఫ్ విత్ ద వాల్టర్ బాయ్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 28ద థర్స్డే మర్డర్ క్లబ్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 28మెట్రో ఇన్.. డైనో (హిందీ మూవీ) - ఆగస్టు 29టూ గ్రేవ్స్ (స్పానిష్ సిరీస్) - ఆగస్టు 29అన్నోన్ నంబర్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 29కరాటే కిడ్: లెజెండ్స్ (ఇంగ్లీష్ చిత్రం) - ఆగస్టు 30అమెజాన్ ప్రైమ్సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ (హిందీ సినిమా) - ఆగస్టు 29హాట్స్టార్మాల్డిటొస్ (ఫ్రెంచ్ సిరీస్) - ఆగస్టు 25పటి సీజన్ 2 (పొలిష్ సిరీస్) - ఆగస్టు 26థండర్ బోల్ట్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 27డే ఆఫ్ రెకనింగ్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 28మై డెడ్ ఫ్రెండ్ జో (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 28హౌ ఐ లెఫ్ట్ ద ఓపస్ దే (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 29రాంబో ఇన్ లవ్ (తెలుగు సిరీస్) - ఆగస్టు 29సన్ నెక్స్ట్మాయకూతు (తమిళ సినిమా) - ఆగస్టు 27గెవి (తమిళ మూవీ) - ఆగస్టు 27జీ5సోదా (కన్నడ సిరీస్) - ఆగస్టు 29సోనీ లివ్సంభవ వివరణమ్ నలరసంఘం (మలయాళ సిరీస్) - ఆగస్టు 29ఆహాఇండియన్ ఐడల్ సీజన్ 4 (తెలుగు సింగింగ్ షో) - ఆగస్టు 29లయన్స్ గేట్ ప్లేబెటర్ మ్యాన్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 29ఎరోటిక్ స్టోరీస్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 29ఆపిల్ ప్లస్ టీవీక్రాప్డ్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 29షేర్ ఐలాండ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 29ఎమ్ఎక్స్ ప్లేయర్హాఫ్ సీఏ సీజన్ 2 (హిందీ సిరీస్) - ఆగస్టు 27(ఇదీ చదవండి: భిక్షాటన చేశా, వేశ్యగా పని చేశా.. బిగ్బాస్లో ఛాన్స్: అంకిత నాయుడు) -
ఇది భావావేశాల అల
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో అరేబియా కడలి సిరీస్ ఒకటి. ఈ సిరీస్ గురించి తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో కష్టాల్లేని మనుషులు ఉండరు. లేనివాడైనా, ఉన్నవాడికైనా కష్టమనేది ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది. ఆ కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొని జీవించగలిగినవాడే హీరో. అలాంటి హీరోలను వెండితెర మీద మనం ఇప్పటికే ఎన్నోసార్లు చూసుంటాం, చూస్తున్నాం... అలాగే చూడబోతున్నాం. నిజానికి ఆ వెండితెర మీద హీరో పడే కష్టం మన జీవితాల నుండి తీసుకున్నదే. వెండితెర మీద హీరో పాత్రధారి తన కష్టాన్ని ఎదుర్కోవడం రెండు గంటలకు పైగా మన నిజమైన కష్టాన్ని మరిచి ఆనందంగా చూడడమే విడ్డూరం. అలాంటి కొందరి కష్టాన్ని మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపే ప్రయత్నం చేశారు ‘అరేబియా కడలి’ అనే సీరీస్ ద్వారా. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి అందించిన రచనకు దర్శకుడు వీవీ సూర్యకుమార్ తీర్చిదిద్దిన కళా కష్టమే ఈ ‘అరేబియా కడలి’. నేటి మేటి విలక్షణ కథానాయకుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో అలరించగా మరో పాత్రకు వర్ధమాన నటి ఆనంది ప్రాణం పోశారు. అంతలా ఆ కష్టం కథేంటో ఓసారి చూద్దాం. ముఖ్యంగా ఇది తీర ప్రాంతాలకు సంబంధించిన జాలర్ల కథ. సముద్రంలోకి తమ ప్రాణాలు పణంగా పెట్టి రోజుల తరబడి చేపల వేటకు వెళ్ళే జాలరుల కష్టాల ప్రతిరూపమే ఈ కథ. సముద్ర తీర ప్రాంతాలలో దగ్గరగా ఉన్న రెండు జాలర్ల గ్రామాలకు ఓ కారణంతో అస్సలు పడదు. కానీ మరో కారణంతో ఆ రెండూళ్ళ నుండి ఒకే పడవలో జాలర్లు వేటకు వెళ్ళవలసి వస్తుంది. అలా వెళ్ళిన ఆ ఓడ తుఫాను కారణంగా పాకిస్తాన్ తీర ప్రాంతానికి చేరుతుంది. అక్కడ ఈ జాలర్లందరినీ పాకిస్తాన్ దేశం బంధించి నానా హింసలు పెడుతుంది. మరి... వారి ఊళ్ళలోనే కలవని వీళ్ళు పరాయి దేశంలో బందీలై తిరిగి భారతదేశానికి వస్తారా? లేదా అన్నది సిరీస్లోనే చూడాలి. మొత్తం 8 ఎపిసోడ్లతో కథాంశం పక్కకి పోకుండా ఎంతో చక్కగా తీశారు దర్శకుడు. సముద్రంలో అల ఎంత ఉవ్వెత్తున ఎగసిపడుతుందో అంతకు మించి మనలోని కష్టం మన భావావేశాలను ప్రతిబింబిస్తుంది అని నొక్కి చెప్పే సన్నివేశాలు ఈ సిరీస్లో మెండుగా ఉన్నాయి. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ మంచి కాలక్షేపం. – హరికృష్ణ ఇంటూరు -
ఓపక్క ఓటీటీలో.. మరోపక్క బాక్సాఫీస్ వద్ద సెంచరీ
థియేటర్లో రిలీజైన సినిమాలు నాలుగైదు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. విజయ్ సేతుపతి- నిత్యామీనన్ ప్రధాన పాత్రలో నటించిన సార్ మేడమ్ మూవీ (Sir Madam Movie) కూడా నెలరోజుల్లోనే ఓటీటీలో ప్రత్యక్షమైంది. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో తలైవాన్ తలైవి పేరిట జూలకై 25న విడుదలైంది. తెలుగులో సార్ మేడమ్ పేరిట ఆగస్టు 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సెంచరీ క్లబ్లో మూవీబాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సంపాదించుకున్న ఈ మూవీ ఆగస్టు 22న అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి వచ్చింది. తెలుగు, తమిళంతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ అందుబాటులో ఉంది. అయితే ఓటీటీలోకి వచ్చినా ఇంకా కొన్నిచోట్ల ఈ సినిమా ఆడుతూనే ఉంది. ఈ క్రమంలోనే సార్ మేడమ్ రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. ఈ విషయాన్ని చిత్రనిర్మాణ సంస్థ సత్యజోతి ఫిలింస్ ఎక్స్ (ట్విటర్) వేదికగా వెల్లడించింది.సినిమాసార్ మేడమ్ విషయానికి వస్తే.. యోగిబాబు, చెంబన్ వినోద్ జోస్, శరవణన్, కాళి వెంకట్, ఆర్కే సురేశ్, మైనా నందిని తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎమ్.సుకుమార్ సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. ప్రదీప్ రాఘవ్ ఎడిటర్గా పని చేశాడు. భార్యాభర్తల మధ్య జరిగే కొట్లాటల సమూహారమే సార్ మేడమ్ సినిమా కథ! Families’ favourite #ThalaivanThalaivii marks 100 CR worldwide gross with your endless love & support ❤️🫶@VijaySethuOffl @MenenNithya @pandiraaj_dir @iYogiBabu@Music_Santhosh @SathyaJyothi @Lyricist_Vivek @thinkmusicindia @studio9_suresh@Roshni_offl @kaaliactor @MynaNandhini… pic.twitter.com/VdDkK7opoL— Sathya Jyothi Films (@SathyaJyothi) August 24, 2025 చదవండి: భిక్షాటన చేశా, వేశ్యగా పని చేశా.. బిగ్బాస్లో ఛాన్స్, మా వాళ్లే.. -
భిక్షాటన చేశా, వేశ్యగా పని చేశా.. బిగ్బాస్లో ఛాన్స్, మా వాళ్లే వెనక్కులాగారు!
బిగ్బాస్ అగ్నిపరీక్ష (Bigg Boss Agnipariksha)కు వేలాదిమంది అప్లై చేశారు. వారిలో ట్రాన్స్జెండర్ అంకితనాయుడు ఒకరు. పలు రౌండ్లలో ముందుకు వెళ్లిన ఆమె అగ్నిపరీక్ష స్టేజీపై మాత్రం కనిపించలేదు. అందుకు గల కారణాన్ని, తన జర్నీని తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. అంకిత నాయుడు మాట్లాడుతూ.. చిన్నప్పుడు ఇంట్లో ఎవరూ లేనప్పుడు చీరకట్టుకుని, బొట్టు పెట్టుకుని గాజులు వేసుకునేదాన్ని. అక్కల పెళ్లయ్యాకే..18 ఏళ్ల వయసు వచ్చేసరికి నేను అమ్మాయిలా మారాలని నిర్ణయించుకున్నాను. ఇద్దరు అక్కల పెళ్లయ్యే వరకు ఆగి ఆ తర్వాతే అమ్మాయిగా మారాను. ఈ మధ్య నాకు బిగ్బాస్ షోలో ఛాన్స్ వచ్చింది. బిగ్బాస్ షో చాలా పెద్ద ప్లాట్ఫామ్. అలాంటి ప్లాట్ఫామ్కు నేను సెలక్ట్ అయ్యానని తెలిసి సంతోషపడ్డాను. నాకు మొదటి నుంచీ ఈ షో అంటే ఇష్టం!భిక్షాటన చేశా.. తర్వాత..అయితే గతంలో నేను భిక్షాటన చేశాను, వేశ్యగా మారాను, షాప్ ఓపెనింగ్స్కు వెళ్లాను. ఇవన్నీ దాటుకుని వచ్చాను. ఇప్పుడు బిగ్బాస్లో ఛాన్స్ వస్తే అక్కడ నన్ను నేను నిరూపించుకోవచ్చనుకున్నాను. నేను వెళ్లి నా కమ్యూనిటీకి ఆదర్శంగా నిలవాలనుకున్నాను. గతంలో బిగ్బాస్ (Bigg Boss Reality Show)కు వెళ్లిన ప్రియాంక సింగ్.. చాలామందికి డ్రీమ్గర్ల్ అయిపోయారు. తను నాకు రోల్మోడల్. స్టేజీపైకి వెళ్లకుండానే..ఈ సీజన్లో నాకు ఆఫర్ వచ్చింది. కానీ, నా కమ్యూనిటీ వాళ్లు నన్ను వెనక్కు లాగేశారు. అగ్నిపరీక్ష షోలో శ్రీముఖి నన్ను స్టేజీపైకి రమ్మని ఆహ్వానించింది. ఓ పాట కూడా ప్లే చేశారు. ఇంతలో వెళ్లకుండానే ఆపేశారు. మా కమ్యూనిటీ వాళ్లు.. బిగ్బాస్ టీమ్కు నేను వేశ్యగా పనిచేసినప్పటి వీడియోలు పంపారు. దాంతో వాళ్లు నన్ను తీసుకోవడానికి ఇష్టపడలేదు. దీనివల్ల మీకే కాదు, షోకి సైతం నెగెటివిటీ వస్తుందన్నారు. వాళ్ల ఆలోచనప్రకారం వాళ్లు కరెక్టే! ఎప్పుడో జరిగినదాన్ని..మా కమ్యూనిటీ వాళ్లే ఇలా చేయడం నాకు నచ్చలేదు. ఎప్పుడో జరిగినదాన్ని ఇప్పుడు తీసి చూపించడం నచ్చలేదు. మా వర్గాన్ని ముందుకు తీసుకెళ్తాం అని బీరాలు పలికే లీడర్స్.. నేను సెలక్ట్ అయితే ఎందుకు జీర్ణించుకోలేకపోయారు? పైగా అదే లీడర్ అక్కడ సెలక్ట్ అయ్యారన్న ప్రచారం జరిగింది. కానీ, ఆమె ఎంపికవలేదు. మా వాళ్లు నన్ను నెగిటివ్ చేసి ఇంకెప్పుడూ బిగ్బాస్కు వెళ్లకుండా చేశారు అని అంకిత నాయుడు చెప్పుకొచ్చింది.చదవండి: సీక్రెట్గా వీడియో షూట్.. కోపంతో ఊగిపోయిన దీపికా పదుకొణె -
ఓటీటీలో 'సూపర్ మ్యాన్'.. తెలుగులోనూ స్ట్రీమింగ్
హాలీవుడ్లో సూపర్ హీరో తరహా క్యారెక్టర్స్ ఇప్పుడు బోలెడన్ని కనిపిస్తున్నాయి. అయితే 90స్ కిడ్స్ ఇష్టమైన పాత్ర అంటే చాలామంది చెప్పే పేరు 'సూపర్ మ్యాన్'. 1984 నుంచి ఈ జానర్ మూవీస్.. ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నాయి. బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీ నుంచి రిలీజైన లేటెస్ట్ మూవీ.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఎందులో ఉంది?(ఇదీ చదవండి: రీసెంట్ టైంలో బెస్ట్ హాలీవుడ్ సినిమా.. 'ఎఫ్ 1' రివ్యూ (ఓటీటీ))డీసీ యూనివర్స్లోని లేటెస్ట్ మూవీ 'సూపర్ మ్యాన్'. గతనెల 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రిలీజైంది. మిగతా వాటితో పోలిస్తే యావరేజ్ టాక్ వచ్చింది. మన దేశంలోనూ తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ రిలీజై ఓ మాదిరిగా ఆడింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఓటీటీలోకి అద్దె విధానంలో తీసుకొచ్చేశారు. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఇది అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతానికి ఔట్ సైడ్ ఇండియాలో అందుబాటులో ఉంది.'సూపర్ మ్యాన్' విషయానికొస్తే.. జహ్రాన్పూర్పై బొరేవియా తన సైన్యంతో దాడి చేయగా.. దాన్ని సూపర్ మ్యాన్ అడ్డుకుంటాడు. టెక్నాలజీతో ప్రయోగాలు చేసే లెక్స్ లూథర్.. సూపర్ మ్యాన్పై వ్యతిరేకత వచ్చేలా అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు కొన్ని మాయమాటలు చెబుతాడు. వీడియోలు చూపిస్తాడు. దీంతో సూపర్ మ్యాన్పై అందరికీ నమ్మకం పోతుంది. మరి అలాంటి పరిస్థితి నుంచి అందరూ తనని నమ్మేలా ఎలా చేశాడు? ఎదురైన సవాళ్లు ఏంటి? అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: తండ్రయిన టాలీవుడ్ కమెడియన్.. ఫొటో వైరల్) -
ఓటీటీకి మరో హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీకి మరో హిట్ సినిమా వచ్చేందుకు సిద్ధమైంది. జూలై 18న విడుదలైన కోలీవుడ్ సోషల్ డ్రామా గెవి డిజిటల్ ప్రీమియర్కు వచ్చేస్తోంది. ఈ చిత్రంలో షీలా, జాక్విలిన్ లిడియా ముఖ్య పాత్రల్లో నటించారు. కోలీవుడ్ డైరెక్టర్ దయాలన్ దర్శకత్వం వహించారు. తమిళంలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. ఐఎండీబీలో 9.2 రేటింగ్ సాధించింది.ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు. ఈ వినాయక చవితి కానుకగా ఆగస్టు 27న స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మూవీ సన్ నెక్స్ట్ ఓటీటీలో వచ్చే బుధవారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు పోస్టర్ను రిలీజ్ చేస్తూ ఓటీటీ సంస్థ ట్వీట్ చేసింది. న్యాయం కోసం పోరాటం అనే కాన్సెప్ట్తో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఆధవన్, చార్లెస్ వినోద్, జీవా సుబ్రమణియన్, గాయత్రి, వివేక్ మోహన్, ఉమర్ ఫరూక్, జగత్రామన్, అభిమన్యు మీనా కీలక పాత్రలు పోషించారు.Landslides may bury lives, but not courage.Gevi streams Aug 27 on SunNXT.#Gevi #SunNXT #StreamingFromAug27 #PoliticalDrama #MustWatch #FightForJustice pic.twitter.com/1HhqtYWDhJ— SUN NXT (@sunnxt) August 22, 2025 -
రీసెంట్ టైంలో బెస్ట్ హాలీవుడ్ సినిమా.. 'ఎఫ్ 1' రివ్యూ (ఓటీటీ)
ఓటీటీలో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. కొన్ని మాత్రం సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అలా రీసెంట్ టైంలో 'ఎఫ్ 1' అనే హలీవుడ్ మూవీ అద్భుతమైన అనుభూతి అందిస్తోంది. థియేటర్లలో ఉండగానే ఇప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?సన్నీ హేన్ (బ్రాడ్ పిట్) ఓ 'ఎఫ్ 1' రేసర్. కుర్రతనంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంటాడు. కానీ ఓసారి రేసింగ్ చేస్తుండగా పెద్ద ప్రమాదం జరుగుతుంది. చావు వరకు వెళ్లి బతికి బయటపడతాడు. డాక్టర్స్ హెచ్చరించడంతో తనకు ఎంతో ఇష్టమైన రేసింగ్ని పక్కనబెట్టేస్తాడు. డబ్బుల కోసం చిన్న రేసుల్లో పాల్గొంటూ ఉంటాడు. దాదాపు 30 ఏళ్ల తర్వాత 'ఎఫ్ 1' రేసింగ్ ఛాంపియన్షిప్లో పాల్గొనే అవకాశం వస్తుంది. వెళ్తాడు కూడా. ఇతడితో పాటే టీమ్లో మరో కుర్ర డ్రైవర్ జోషువా పియర్స్ (డామ్సన్ ఇడ్రిస్) ఉంటాడు. వీళ్లిద్దరికీ ఒకరంటే ఒకరు పడని పరిస్థితులు ఏర్పడతాయి. ఇలాంటి దశని దాటి సన్నీ.. ఎఫ్ 1 ఛాంపియన్ అయ్యాడా లేదా అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?అసలు సినిమా అంటే ఎలా ఉండాలి? దీనికి ఒక్కొక్కరు ఒక్కో థియరీ చెబుతారు. కొందరు ఫైట్స్ కావాలంటారు. మరికొందరు రొమాన్స్ కోరుకుంటారు. కానీ చాలామంది మాత్రం సరైన కథ ఉండాలి, మనసుని తాకే ఎమోషన్స్ ఉండాలని అంటుంటారు. అలా అన్ని రకాల ఎమోషన్స్ బ్యాలెన్స్ చేస్తూ తీసిన చిత్రం 'ఎఫ్ 1'. సినిమా చూస్తున్నంతసేపు మీరు కూడా రేస్ ట్రాక్పైనే ఉన్నట్లు ఫీల్ అవుతారు. ఓ మంచి మూవీ చూశామనే అనుభూతిని దక్కుతుంది.ఇది రెండున్నర గంటల సినిమా. కానీ మొదటి నిమిషం నుంచే ఏ మాత్రం బోర్ కొట్టకుండా, రేస్ ట్రాక్పై కారు దూసుకెళ్లినంత వేగంగా వెళ్తుంది. డబ్బుల కోసం ఓ రేసింగ్ పోటీలో సన్నీ పాల్గొని గెలిచే సీన్తో సినిమా ప్రారంభమవుతుంది. తర్వాత రూబెన్ అనే పాత్ర ఎంటరవుతుంది. ఇతడు అప్పట్లో సన్నీకి ప్రత్యర్థి రేసర్. ఇప్పుడు మాత్రం ఓ రేసింగ్ జట్టుకు యజమాని. తన టీమ్ భారీ నష్టాల్లో ఉందని, డ్రైవర్గా రావాలని సన్నీని అడుగుతాడు. దీంతో ఎఫ్ 1 పోటీలో పాల్గొనేందుకు సన్నీ, లండన్ వెళ్తాడు. తొలి రేసులో పాల్గొంటాడు. కానీ తన టీమ్లోని కుర్ర డ్రైవర్ జోషువాతో రేసింగ్ ట్రాక్పైనే గొడవ పెట్టుకుంటాడు. అలా కలవడం కలవడంతోనే శత్రువుల్లా మారిన వీరిద్దరూ తర్వాత తర్వాత ఎలా ఫ్రెండ్స్ అయ్యారు. చివరకు ఒక్క రేసులోనైనా గెలిచారా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.30 ఏళ్ల పాటు 'ఎఫ్ 1' రేసింగ్కి దూరంగా ఉన్న ఓ వ్యక్తి.. ఆరోగ్యం సహకరించనప్పటికీ ఎలా విజేత అయ్యాడు అనే కాన్సెప్ట్తో తీసిన సినిమా ఇది. ఈ లైన్ వినగానే తెలుగులో వచ్చిన 'జెర్సీ' గుర్తురావొచ్చు. అయితే నాని సినిమాలో బాధాకరమైన ముగింపు ఉంటుంది. ఇందులో మాత్రం హ్యాపీ ఎండింగే ఉంటుంది లెండి.'ఎఫ్ 1' రేసింగ్ అంటే ఏంటి? ఎలాంటి రూల్స్ ఉంటాయి? లాంటి వాటి గురించి మీకు ఏ మాత్రం అవగాహన లేకపోయినా సరే ఈ సినిమా చూడొచ్చు. చూస్తే చాలావరకు అర్థమైపోతుంది. టీవీల్లో రేసింగ్ చూసి ఎంజాయ్ చేస్తుంటాం. కానీ తెర వెనక ఏమేం జరుగుతుంటాయి? అనే అంశాల్ని కూడా ఇందులో చాలా చక్కగా చూపించారు. చూస్తున్నంతసేపు ఓ ప్రేక్షకుడిలా కాకుండా మీరు కూడా రేసర్ అయిపోయారేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. మొదటి నుంచి చివరివరకు మిమ్మల్ని స్క్రీన్కి అతుక్కుపోయాలా చేస్తుంది.ఎవరెలా చేశారు?సన్నీగా చేసిన బ్రాడ్ పిట్.. సెటిల్డ్ యాక్టింగ్తో మెస్మరైజ్ చేశాడు. సినిమా చూశాక ఇతడికి ఫ్యాన్ అయిపోతారేమో? జోషువా క్యారెక్టర్ చేసిన డామ్సన్, బ్రాడ్ పిట్తో పోటీపడి మరీ నటించాడు. మిగిలిన యాక్టర్స్ అందరూ ఎక్కడా తగ్గకుండా ఆకట్టుకున్నారు. టెక్నికల్ టీమ్ గురించి ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఎందుకంటే హ్యాన్స్ జిమ్మర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. సినిమాని మరో లెవల్కి తీసుకెళ్లింది. ఇంటర్వెల్, క్లైమాక్స్లో సైలెన్స్తోనూ వాహ్ అనిపించాడు. సినిమాటోగ్రఫీ కూడా నెక్స్ట్ లెవల్.ఓవరాల్గా చెప్పుకొంటే 'ఎఫ్ 1' మూవీ రీసెంట్ టైంలో వచ్చిన బెస్ట్ హాలీవుడ్ మూవీ. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్, ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీల్లో అద్దె విధానంలో అందుబాటులో ఉంది. త్వరలో ఉచితంగానూ స్ట్రీమింగ్ కావొచ్చు. ఏదైనా మంచి సినిమా చూద్దామనుకుంటే మాత్రం దీన్ని అస్సలు మిస్ కావొద్దు.- చందు డొంకాన(ఇదీ చదవండి: అనుపమ 'పరదా' సినిమా రివ్యూ) -
తమన్, కార్తీక్ల మంచి మనసు.. అంధుడి కంటిచూపుకి హామీ!
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (S Thaman) తనది మంచి మనసు అని మరోసారి నిరూపించుకున్నాడు. కళ్లు లేని వ్యక్తికి చూపు ప్రసాదిస్తానని మాటిచ్చాడు. ఇతడు జడ్జిగా వ్యవహరిస్తున్న సింగింగ్ కాంపిటీషన్ షో తెలుగు ఇండియన్ ఐడల్ నాలుగో సీజన్ రాబోతోంది. ఆగస్టు 29న ఈ షో ప్రారంభం కానుంది. ఇందులో తమన్, గీతా మాధురి, కార్తీక్ జడ్జిలుగా వ్యవహరిస్తుండగా సింగర్స్ శ్రీరామచంద్ర, సమీరా యాంకరింగ్ చేయనున్నారు.టాలెంట్కు ఫిదాఈ మేరకు తాజాగా ఓ ప్రోమో రిలీజ్ చేశారు. అందులో ఆడిషన్స్ నిర్వహించారు. వారిలో ఓ అంధుడు కూడా ఉన్నాడు. అతడి టాలెంట్కు జడ్జిలు ఫిదా అయ్యారు. చిన్నప్పటి నుంచే కంటిచూపు లేదా? అని తమన్ అడగ్గా.. పుట్టినప్పటినుంచే గుడ్డివాడిని అని తెలిపాడు. అందుకు తమన్.. నేను, కార్తీక్ కలిసి నీకు కళ్లు కనిపించేలా చేస్తామని హామీ ఇచ్చాడు. ఆ మాటకు అంధుడు ఎంతగానో సంతోషించాడు. కళ్లు లేని వ్యక్తికి ఆపరేషన్ ద్వారా చూపు ప్రసాదించేందుకు ముందుకు వచ్చిన తమన్, కార్తీక్పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: ఓటీటీలో 'కుబేర' విలన్ మూవీ.. ఎక్కడంటే? -
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
మిస్టరీ, థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీలో సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. మరోవైపు చిన్న సినిమాలు థియేటర్లలో రిలీజైనప్పుడు పెద్దగా ఎవరూ పట్టించుకోరు. ఒకవేళ ఓటీటీలోకి వస్తే మాత్రం టైమ్ పాస్ కోసం అలా చూస్తుంటారు. ఇప్పుడు సినీ ప్రేమికుల కోసం అలాంటి ఓ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. దాదాపు ఏడాది తర్వాత స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఏంటా సినిమా?గతేడాది ఆగస్టు 23న థియేటర్లలో రిలీజైన తెలుగు మూవీ 'బ్రహ్మవరం పీఎస్ పరిధిలో'. గురు చరణ్, సూర్య శ్రీనివాస్, స్రవంతి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. థియేటర్లలోకి వచ్చినప్పుడు పర్లేదనిపించే రెస్పాన్స్ అందుకుంది. మరోవైపు స్టార్స్ ఎవరూ లేకపోవడంతో దీనికి పెద్దగా ఆదరణ దక్కలేదు. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి అద్దె విధానంలో అందుబాటులోకి వచ్చింది. ఆసక్తి ఉంటే ఓ లుక్కేయొచ్చు.(ఇదీ చదవండి: అనిరుధ్కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్)'బ్రహ్మవరం పీఎస్ పరిధిలో' విషయానికొస్తే.. చైత్ర (స్రవంతి బెల్లంకొండ) అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్. తాను ఇష్టపడటం కంటే తనని ప్రేమించే కుర్రాడు తనకు భర్తగా రావాలని కోరుకుంటుంది. సూర్యలో (సూర్య శ్రీనివాస్) అలా కనిపించేసరికి అతడితో ప్రేమలో పడుతుంది. గౌతమ్ (గురుచరణ్) ఓ జులాయి. ఇతడి తండ్రి పట్టాభి పోలీస్ కానిస్టేబుల్. తన కళ్ల ఎదుట తప్పు జరిగితే గౌతమ్ సహించలేడు.ఓ సందర్భంలో బ్రహ్మవరం ఎస్ఐని ఎదురించిన గౌతమ్.. అతడికి శత్రువుగా మారుతాడు. అనుకోకుండా ఓ రోజు బ్రహ్మవరం పోలీస్ స్టేషన్ దగ్గరలో ఓ శవం దొరుకుతుంది. ఆ కేసు సంచలనంగా మారుతుంది. దీంతో పోలీసులు విచారణ మొదలుపెడతారు. సరిగ్గా అదే సమయంలో గౌతమ్ని కలవడం కోసం చైత్ర, అమెరికా నుంచి స్వదేశానికి వస్తుంది. ఆ శవానికి చైత్ర, గౌతమ్లకు సంబంధమేంటి? హంతుకుడు దొరికాడా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ప్రేమ కోసం లండన్ నుంచి చెన్నై.. విజయ్ భార్య బ్యాక్ గ్రౌండ్ తెలుసా?) -
ఓటీటీలో 'కుబేర' విలన్ మూవీ.. ఎక్కడంటే?
అటు థియేటర్లో ఈ మధ్య అన్నీ పెద్ద సినిమాలే రిలీజవ్వగా ఇటు ఓటీటీ (OTT)లో చిన్నాపెద్ద తేడా లేకుండా అన్నిరకాల చిత్రాలు విడుదలవుతున్నాయి. ఈ క్రమంలోనే మరో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. బాలీవుడ్ నటులు మనోజ్ బాజ్పాయ్, జిమ్ సర్బ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ఇన్స్పెక్టర్ జెండే (Inspector Zende). మనోజ్.. మధుకర్ జెండె అనే పోలీస్గా నటించగా జిమ్ సర్బ్.. కార్ల్ భోజ్రాజ్ అనే స్విమ్సూట్ కిల్లర్గా కనిపించనున్నాడు.ఓటీటీలోబాలచంద్ర కడం, సచిన్ ఖేడెకర్, గిరిజ, హరీశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. చిన్మయి మండ్లేకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 5 నుంచి అందుబాటులోకి రానున్నట్లు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ వదిలింది. ఈ మూవీని ఓం రౌత్, జే షెవక్రమణి నిర్మించారు. ఇకపోతే మనోజ్ బాజ్పాయ్ చివరగా డిస్పాచ్ మూవీలో నటించాడు. ఓటీటీలో కిల్లర్ సూప్ సిరీస్లోనూ యాక్ట్ చేశాడు. ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాన్ 3 సిరీస్ చేస్తున్నాడు. జిమ్ సర్బ్ విషయానికి వస్తే.. ఇతడు చివరగా బ్లాక్బస్టర్ మూవీ కుబేరలో నటించాడు. ఇందులో విలన్గా నటించి మెప్పించాడు. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in)చదవండి: బతికుండగానే చంపుతారా? సిగ్గు లేదు!: నటుడి ఆగ్రహం -
ఎమోషనల్ స్టోరీ మామన్ మూవీ రివ్యూ
మన జీవితంలో మనల్ని బాగా ఇష్టపడేవాళ్ళు ఉంటారు, అలాగే ద్వేషించే వాళ్ళు కూడా ఉంటారు. సాధారణంగా మనల్ని ద్వేషించే వారికి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాం. అదే మనల్ని ఇష్టపడేవాళ్ళకు దగ్గరగా ఉండాలనుకుంటాం. అయితే అదే ఇష్టం ఎక్కువై, ఆ ఇష్టం మనకి కష్టం తెచ్చిపెడితే ఎలా ఉంటుంది? అన్న సున్నితమైన పాయింట్తో తీసిన ఓ భావోద్వేగంతో కూడిన అద్భుతమైన కుటుంబ కథా చిత్రం ‘మామన్’. ఓటీటీలో సూపర్ హిట్ మూవీఓటీటీ ప్లాట్ఫామ్ జీ5 వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ తమిళ సినిమా తెలుగులోనూ లభ్యమవుతోంది. ప్రశాంత్ పాండ్యరాజన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిన్న సినిమా బాక్సాఫీస్ సూపర్ హిట్. అలా అని దీంట్లో పెద్ద స్టార్, గ్లామర్ యాక్షన్ ఇటువంటివి ఏమీ లేకపోయినా సినిమా చూస్తున్నంతసేపు సీటులోంచి కదలలేరు. అంతలా కట్టిపడేస్తుంది. ప్రముఖ తమిళ కమెడియన్ సూరి కథానాయకుడిగా ఈ సినిమాలో నటించి, మెప్పించారు. ఇంకా చెప్పాలంటే సినిమా చూసే ప్రేక్షకుల మనస్సులను కదిలించారు. అంతలా ఏముందో ఈ సినిమాలో ఓసారి చూద్దాం (Maaman Movie Review). కథ‘మామన్’ సినిమా కథ ప్రకారం తమిళనాడులోని తిరుచ్చి ప్రాంతంలో ఇన్బా, గిరిజ అక్కా తమ్ముళ్ళు. ఇన్బాకు అక్కంటే ప్రాణం. అక్కకు పెళ్ళైన చాలా కాలం తరువాత అతి కష్టం మీద ఓ బిడ్డ పుడతాడు. ఆ బిడ్డ పేరు లడ్డూ. అక్క బిడ్డను ఇన్బా అపురూపంగా చూసుకుంటుంటాడు. ఎంతలా అంటే తాను ప్రేమించి పెళ్ళి చేసుకున్న అమ్మాయి రేఖకన్నా లడ్డూ మీదే మమకారం పెంచుకుంటాడు. అయితే అదే సమయంలో ఇన్బా తండ్రి అవుతాడు. ఇక అక్కడి నుండి అసలు సిసలైన కథ మొదలవుతుంది. ఎలా ఉందంటే?అక్క బిడ్డా లేక తనకు పుట్టబోయే బిడ్డా అన్న సంఘర్షణలో కథ ఏ మలుపు తిరుగుతుందో సినిమాలోనే చూడాలి. చాలా సున్నితమైన అంశాన్ని ఎంతో భావుకతతో ప్రేక్షకుడికి ఎక్కడా బోర్ కొట్టనీయకుండా చక్కటి స్క్రీన్ప్లేతో సినిమాని నడిపిన విధానం నిజంగా అభినందనీయం. ఈ భూమ్మీద భావావేశాలున్న ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన అంశం ఈ సినిమాలో ఉంది. సకుటుంబ సపరివార సమేతంగా ఈ సినిమాని చూడవచ్చు, చూసి చాలా నేర్చుకోవచ్చు. ఆఖరుగా ‘మామన్’ మామూలు సినిమా అయితే కాదు. మస్ట్ వాచ్ ఫర్ ది వీకెండ్.– హరికృష్ణ ఇంటూరు -
ఓటీటీకి పరదా హీరోయిన్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చాక సినిమాల చూసే తీరు పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్కు ఫుల్ డిమాండ్ ఉంటోంది. ఆడియన్స్ అభిరుచికి తగినట్లుగానే ఓటీటీలు సైతం అలాంటి కంటెంట్తోనే ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఇక మలయాళ చిత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాలకు ఓటీటీల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.తాజాగా మరో మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేస్తోంది. పరదాలో నటించిన దర్శన రాజేంద్రన్ లీడ్ రోల్లో ఈ వెబ్ సిరీస్ను తెరెకెక్కించారు. క్రిషంద్ దర్శకత్వంలో వస్తోన్న ఈ 4.5 గ్యాంగ్ సిరీస్ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఆగస్టు 29 నుంచి సోనీలివ్లో స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు.ట్రైలర్ చూస్తే క్రైమ్, కామెడీ రొమాంటిక్ థ్రిల్లర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ను తిరువనంతపురంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించారు. పరదా సినిమా హీరోయిన్ దర్శన రాజేంద్రన్ కీలక పాత్ర పోషించడంతో ఈ సిరీస్పై ఆసక్తి నెలకొంది. ఆమె లేడీ విలన్గా కనిపించనుంది. ఈ సిరీస్ మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. -
ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ కొత్త సినిమా.. తెలుగులోనూ
అనుపర పరమేశ్వరన్ వరస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈమె లీడ్ రోల్ చేసిన 'పరదా'.. ఈ రోజే(ఆగస్టు 22) థియేటర్లలోకి వచ్చింది. మరో మూడు వారాల్లో 'కిష్కిందకాండ' అనే హారర్ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించనుంది. ఇకపోతే కొన్నిరోజుల క్రితం ఈమె ప్రధాన పాత్రలో నటించిన మలయాళ సినిమా.. పలు వివాదాల్లో చిక్కుకుంది. తర్వాత థియేటర్లలో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. ఇంతకీ ఏంటా సినిమా?(ఇదీ చదవండి: అనుపమ 'పరదా' సినిమా రివ్యూ)కోర్ట్ రూమ్ థ్రిల్లర్ స్టోరీతో తీసిన 'జానకి వి vs స్టేట్ ఆఫ్ కేరళ'.. గతవారం ఓటీటీలోకి వచ్చింది. అయితే మలయాళ, కన్నడ, తమిళ, హిందీ వెర్షన్స్ మాత్రమే స్ట్రీమింగ్ చేశారు. దీంతో తెలుగు ఆడియెన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు వారం లేటుగా తెలుగు వెర్షన్ తీసుకొచ్చేశారు. ఈ సినిమా జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది. ఆసక్తి ఉంటే ఓ లుక్కేయండి.'జానకి వి vs స్టేట్ ఆఫ్ కేరళ' విషయానికొస్తే.. జానకి విద్యాధరన్(అనుపమ పరమేశ్వరన్) బెంగళూరులో ఐటీ జాబ్ చేస్తుంటుంది. పండగ జరుపుకొనేందుకు కేరళలోని సొంతూరికి వస్తుంది. స్నేహితులతో కలిసి బేకరీకి వెళ్లినప్పుడు ఈమెపై లైంగిక దాడి జరుగుతుంది. దీంతో పోలీసులని ఆశ్రయిస్తుంది. ఈ న్యాయ పోరాటంలో జానకి ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంది? ఈ కేసులో అడ్వకేట్ డేవిడ్(సురేశ్ గోపి) ఎవరివైపు నిలిచారు? తన ప్రమేయం లేకుండా కడుపులో పెరుగుతున్న బిడ్డని ప్రభుత్వమే చూడాలనే జానకి విజ్ఞప్తిపై కేరళ హైకోర్ట్ ఎలా స్పందించింది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: బాగా చూసుకుంటా.. కిరణ్ అబ్బవరం గురించి భార్య పోస్ట్)JSK – Janaki V/s State of Kerala is now streaming on ZEE5. A powerful courtroom drama where truth takes the spotlight. Watch it now in Telugu! 🎬⚖️Don’t miss it!"#JanakiVsStateOfKeralaOnZEE5@TheSureshGopi @anupamahere @jsujithnair @DreamBig_film_s#PravinNarayanan pic.twitter.com/375xPZL7lm— ZEE5 Telugu (@ZEE5Telugu) August 22, 2025 -
హృతిక్ రోషన్ ప్రియురాలి మూవీ.. నేరుగా ఓటీటీలో రిలీజ్!
బాలీవుడ్ నటి, హృతిక్ రోషన్ ప్రియురాలు సబా ఆజాద్ నటించిన తాజా చిత్రం సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్. ఈ చిత్రాన్ని కశ్మీర్కు చెందిన ప్రముఖ సింగర్ రాజ్ బేగం జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి డానిష్ రెంజు దర్శకత్వం వహించారు. ఆపిల్ ట్రీ పిక్చర్స్ ప్రొడక్షన్, రెంజు ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు.తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు మేకర్స్. ఆగస్టు 29 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్కు రానున్నట్లు వెల్లడించారు. కాగా.. ఈ చిత్రంలో సోనీ రజ్దాన్ కీలక పాత్రలో కనిపించారు.సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ చిత్రం ద్వారా కాశ్మీర్కు చెందిన దిగ్గజ సింగర్ రాజ్ బేగం జీవిత కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కశ్మీర్ లోయ నుంచి సంగీతంలోకి అడుగుపెట్టిన మొదటి మహిళగా రాజ్ బేగం నిలిచింది. తన కెరీర్లో ఆమెకు ఎదురైన అడ్డంకులు, తను ఎలా విజయం సాధించన్నదే సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ కథ. View this post on Instagram A post shared by prime video IN (@primevideoin) -
Bigg Boss Agnipariksha: ప్రోమో సూపర్.. కానీ టైమింగే తేడా!
బిగ్బాస్ 9 కంటే ముందు వస్తోన్న బిగ్బాస్ అగ్నిపరీక్ష షో (Bigg Boss Agnipariksha)పై మంచి బజ్ ఉంది. ఇప్పటికే ఫస్ట్ ఎపిసోడ్ గురించి రెండు ప్రోమోలు రిలీజ్ చేయగా తాజాగా మూడో ప్రోమో విడుదల చేశారు. ఇందులో ఫేమస్ యూట్యూబర్ గంగవ్వ వయసులో ఉన్న ఓ ముసలమ్మ స్టేజీపై అడుగుపెట్టింది. నెత్తిన బోనంతో పాటలు పాడుకుంటూ జోష్గా వచ్చింది. నల్గొండ దగ్గర కొండతిరుమలగిరి మా ఊరు.. చాలా కష్టాలు పడ్డాను సర్.. నా చిన్నబిడ్డ నన్ను, నా భర్తను పోషిస్తోంది. నా భర్తకు పక్షవాతం వచ్చింది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. మీ అందరినీ కలిశా.. ఈ జన్మకు ఇంతే చాలు అని ఎమోషనలైంది.మాకు నిద్రుండదుఆయన స్టోరీ విన్న అభిజిత్.. మీ జీవితంలో సగం కూడా నేను చూడలేదు, కానీ లోపల ఆట నేను చూశాను. ఆ గేమ్ మీకు చాలా కష్టంగా ఉంటుందవ్వా.. అన్నాడు. అందుకామె మాత్రం నాకు తోచినంత ఆడతా.. అని తన ఆసక్తిని చూపించింది. తర్వాత దివ్యాంగుడు ప్రసన్నకుమార్ స్టేజీపైకి వచ్చాడు. అతడి స్టోరీ విన్న నవదీప్.. ఈ కథను మేము ప్రపంచానికి చూపించకపోతే మాకు నిద్ర ఉండదు అంటూ గ్రీన్ సిగ్నల్ చూపించాడు.అర్ధరాత్రి షోఇదంతా బాగానే ఉంది కానీ షో టైమింగ్స్ మాత్రమే కాస్త తేడాగా ఉంది. ఎప్పుడూ బిగ్బాస్ రాత్రి 9 లేదా 9.30 గంటల ప్రాంతంలో వచ్చేది. కానీ ఈ అగ్నిపరీక్ష మాత్రం ఎటూ కాకుండా అర్ధరాత్రి 12 గంటలకు రానుంది. ప్రతిరోజు రాత్రి 12 గంటలకు జియో హాట్స్టార్లో కొత్త ఎపిసోడ్ అప్లోడ్ చేస్తారు. ఫలానా సమయం అని లేకుండా రోజులో మీకు నచ్చినప్పుడు దాన్ని చూసుకోవచ్చన్నమాట! ఇది చాలామందికి నచ్చడం లేదు. అగ్నిపరీక్షకు ప్రత్యేక సమయం కేటాయిస్తేనే బాగుంటుంది, ఇలా అర్ధరాత్రి అప్లోడ్ చేయడం అనవసరం అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చదవండి: చెత్త ఎఫైర్లు పెట్టుకున్నా.. మగ తోడు అవసరం లేదు : సీనియర్ నటి -
కోపమొస్తే కొట్టేస్తా.. మీరేమైనా దేవుళ్లా?.. నోరెళ్లబెట్టిన జడ్జిలు
వచ్చే నెలలో తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss 9 Telugu) ప్రారంభం కానుంది. అయితే అప్పటివరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మరో రెండు రోజుల్లో బిగ్బాస్ అగ్నిపరీక్ష (Bigg Boss 9 Agnipariksha) మొదలుకానుంది. సామాన్యుల ఎంపిక కోసం ఈ షో డిజైన్ చేశారు. వేలాదిమంది అప్లై చేసుకుంటే బిగ్బాస్ టీమ్ వారిని జల్లెడపట్టి 45 మందిని సెలక్ట్ చేశారు. వారి మాట, ఆట తీరు బట్టి తొమ్మిదో సీజన్కు ఎవర్ని సెలక్ట్ చేయాలి? ఎవర్ని రిజెక్ట్ చేయాలన్నది బిందు మాధవి, నవదీప్, అభిజిత్ చేతిలో పెట్టారు.నీకొక్కడికే హృదయం ఉందా?ఈ క్రమంలో తాజాగా ఓ ప్రోమో రిలీజ్ చేశారు. అందులో ఓ మాస్క్ మ్యాన్ స్టేజీపై ఎంట్రీ ఇచ్చాడు. నీ పేరేంటని జడ్జిలు అడగ్గా.. స్కిన్ నేమ్ మానవ్.. సోల్ నేమ్ హృదయ్ మానవ్ అన్నాడు. హృదయ్ మానవ్ పేరుకు అర్థమేంటన్న ప్రశ్నకు.. హృదయమున్న మానవుడు అని సింపుల్గా రిప్లై ఇచ్చాడు మాస్క్ మ్యాన్. అంటే మా అందరికీ హృదయాలు లేవా? అని నవదీప్ అడగ్గా పోనీ, అలాగే అనుకోండి అని ర్యాష్ ఆన్సరిచ్చాడు. కోపమొస్తే కొట్టేస్తా..చిన్నప్పటి నుంచి కోపిష్టిని, కోపమొస్తే ఆగను.. కొట్టేస్తా! అనడంతో జడ్జిలు షాక్తో నోరెళ్లబెట్టారు. బిగ్బాస్ హౌస్లోకి వెళ్లేది ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి కాదన్న మాటకు అభిజిత్ ఏకీభవించలేదు. ఫ్రెండ్స్ ఎందుకు చేసుకోకూడదు? అని అడిగితు.. ఫ్రెండ్స్కు ట్రోఫీ ఇచ్చేస్తామా? అని మాస్క్ మనిషి సెటైర్ వేశాడు. ఇతడి తీరు నచ్చక అభిజిత్ రెడ్ సిగ్నల్ చూపించాడు. దీంతో అతడు నాకు ఛాన్సివ్వాలని లేకపోతే ఓకే.. కానీ నా క్యారెక్టర్ను డిసైడ్ చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చాడు.జడ్జి చేయడానికి దేవుళ్లా?జడ్జి చేయడానికే ఇక్కడ కూర్చున్నామని నవదీప్ కౌంటరిచ్చాడు. అప్పటికీ అతడు మీరేమైనా దేవుళ్లా అంటూ.. మాట్లాడుతూనే పోయాడు. ఇక బిందు మాధవి.. అతడి మెడలో లూజర్(ఓటమిపాలు) బోర్డు తగిలించింది. ఈ ప్రోమో చూసిన జనాలు.. మాస్క్ మనిషి ఇలా ఉన్నాడేంట్రా బాబూ.. అని కామెంట్లు చేస్తున్నారు. ఈ అగ్నిపరీక్ష షో హాట్స్టార్లో ఆగస్టు 22 నుంచి ప్రసారం కానుంది. చదవండి: నాగచైతన్యపై సెటైర్లు వేసిన ఈ బుడ్డొడు..ఇలా మారిపోయాడేంటి? -
సడన్ సర్ప్రైజ్.. ఓటీటీలోకి 'వీరమల్లు'
పవన్ కల్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు'.. థియేటర్లలో ఫ్లాప్ అయింది. సోషల్ మీడియాలో సీన్లపై బీభత్సమైన ట్రోలింగ్ నడిచింది. ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఇప్పుడు మరోసారి ట్రోల్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఓటీటీలో స్ట్రీమింగ్ తేదీని సడన్ సర్ప్రైజ్ అన్నట్లు వదిలారు. ఇంతకీ ఏ ఓటీటీలోకి ఈ సినిమా రానుంది? ఏంటి సంగతి అనేది ఇప్పుడు చూద్దాం.దాదాపు ఐదేళ్ల పాటు అష్టకష్టాలు పడి థియేటర్లలోకి వచ్చిన సినిమా 'హరిహర వీరమల్లు'. గత నెల 24న థియేటర్లలోకి వచ్చింది. అయితే అప్పుడు కూడా రిలీజ్ అవుతుందా లేదా అనుకున్నారు గానీ ఎలాగోలా విడుదలైంది. తొలి ఆట నుంచి నెగిటివ్ టాక్ రావడంతో నిర్మాతకు భారీ నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఓటీటీలోకి రావడంపై గత కొన్నిరోజులుగా పలు రూమర్స్ వినిపించాయి. కానీ ఇప్పుడు అధికారిక ప్రకటన వచ్చేసింది.'హరిహర వీరమల్లు' సినిమాని 20వ తేదీ అంటే రేపటి(బుధవారం) నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్ వదిలారు. మరి థియేటర్లలో వచ్చినప్పుడు అంతలా ట్రోల్ అయింది. ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఇంకెంత ట్రోల్స్కి గురవుతుందో ఏంటో?'హరిహర వీరమల్లు' విషయానికొస్తే.. 16వ శతాబ్దంలో నదిలో కొట్టుకొచ్చిన ఓ పిల్లాడు ఓ అగ్రహారం వాసులకి దొరుకుతాడు. వాళ్లు ఆ బాలుడికి వీరమల్లు అని పేరు పెడతారు. పెద్దయ్యాక వజ్రాల దొంగ అవుతాడు. మచిలీపట్నంలో తాను చేసిన దొంగతనం గురించి విని దొర (శరత్ ఖేదేకర్).. ఓ వజ్రాల దొంగతనం కోసం తనని పిలిపిస్తాడు. ఆ దొర దగ్గర పంచమి (నిధి అగర్వాల్) ఉంటుంది. ఆమె వీరమల్లు ప్రేమలో పడుతుంది. వీరమల్లు కూడా ఆమెని ఇష్టపడతాడు. దొర చెప్పిన వజ్రాలని దొంగిలించడంతో పాటు పంచమిని తీసుకెళ్లిపోయే క్రమంలో గోల్కండ నవాబుకి వీరమల్లు చిక్కుతాడు. ఆ నవాబు (దలిప్ తాహిల్) వీరమల్లుకి ఓ పని అప్పజెబుతాడు. కొల్లూరులో దొరికి అలా అలా చేతులు మారి ఔరంగజేబు దగ్గరకు చేరిన కోహినూర్ వజ్రాన్ని తీసుకురమ్మని. మరి వీరమల్లు ఆ వజ్రాన్ని తీసుకొచ్చాడా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. -
అఫీషియల్ ప్రకటన.. ఓటీటీలో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్
ఓటీటీలు వచ్చాక సరికొత్త సినిమాలు, సిరీస్లు సినీ ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ అందిస్తూ ఆడియన్స్ను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా క్రైమ్ జోనర్లో వచ్చే సిరీస్లకు ఓటీటీలో విపరీతమైన డిమాండ్ ఉంటోంది. ఇప్పటికే ఆ జోనర్లో వచ్చిన చిత్రాలు, సిరీస్లు చాలా వరకు సూపర్ హిట్గా నిలిచాయి.తాజాగా మరో క్రైమ్ థ్రిల్లర్ మిమ్మల్ని అలరించేందుకు వస్తోంది. మీర్జాపూర్ నటుడు అలీ ఫజల్ లీడ్ రోల్లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ అఫీషియల్గా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ను రిలీజ్ చేసింది.రాఖ్ (Raakh) పేరుతో ఈ ఆసక్తికర వెబ్ సిరీస్ను ప్రొసిత్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. గతంలో పాతాళ్ లోక్ అనే వెబ్ సిరీస్ను రూపొందించారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ క్రైమ్ థ్రిల్లర్ వచ్చే ఏడాది ప్రేక్షకులను అలరించనుంది. ఈ ఆసక్తికర వెబ్ సిరీస్లో సోనాలి బింద్రే, ఆమిర్ బషీర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సిరీస్ను అనూష నందకుమార్, సందీప్ సాకేత్ నిర్మిస్తున్నారు. JUSTICE will rise from the ashes 🔥#RaakhOnPrime, New Original Series, Coming 2026#AliFazal #SonaliBendre @prosit_roy @EndemolShineIND @anusha_nkumar #AyushTrivedi #AamirBashir @sandeepsaket83 @deepak30000 @NegiR @sunandagj @BhaDiPa pic.twitter.com/mLulmaXj8X— prime video IN (@PrimeVideoIN) August 18, 2025 -
బిగ్బాస్ అగ్నిపరీక్ష.. అయ్యో, అతడ్ని ఎలిమినేట్ చేశారా?
జనాల దృష్టిని ఆకర్షించేందుకు బిగ్బాస్ అగ్నిపరీక్ష (Bigg Boss Agnipariksha) అంటూ ఈసారి కొత్తగా ట్రై చేస్తున్నాడు. కామన్ మ్యాన్గా షోలో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ మీదే అంటూ ఊరించడంతో దాదాపు 20 వేల మంది అప్లై చేసుకున్నారు. దశలవారీగా వారిని ఫిల్టర్ చేసి చివరకు 45 మందిని ఎంపిక చేశారు. వీరికి అగ్నిపరీక్ష అనే కార్యక్రమంలో రకరకాల టాస్కులు పెట్టి అందులో కనీసం ఐదుగురిని బిగ్బాస్ 9వ సీజన్ (Bigg Boss 9 Telugu)కు సెలక్ట్ చేయనున్నారు.దివ్యాంగుడి పేరిట రికార్డులుఈ షో ఆగస్టు 22 నుంచి ప్రసారం కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రోమోలో దివ్యాంగుడు ప్రసన్నకుమార్ సహా పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కనిపించారు. అందులో గంగవ్వ వయసులో ఉన్న మహిళ, మాస్క్ మ్యాన్.. ఇలా విభిన్న వ్యక్తులున్నారు. అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించిన వ్యక్తి ప్రసన్నకుమార్. ఇతడు ఫోటోగ్రాఫర్, ట్రావెలర్, బైక్ రైడర్, లెక్చరర్ కూడా! మారథాన్లో పరిగెత్తి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నాడు.అగ్నిపరీక్ష నుంచి ఎలిమినేట్ఇలాంటి వ్యక్తి.. షోలో అడుగుపెడితే చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటుందని అందరూ భావించారు. అతడు కచ్చితంగా బిగ్బాస్ 9వ సీజన్లో ఉండాల్సిందేనని బలంగా కోరుకున్నారు. కానీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం అతడు ఎలిమినేట్ అయ్యాడట! శ్వేతాశెట్టి అనే అమ్మాయితో పాటు ప్రసన్నకుమార్ ఎలిమినేట్ అయినట్లు ఓ వార్త వైరలవుతోంది. ఇది చూసిన జనాలు నిరాశచెందుతున్నారు. ప్రసన్న కుమార్ను కనీసం బిగ్బాస్ హౌస్ వరకైనా పంపించాల్సిందని అభిప్రాయపడుతున్నారు. మరి ప్రసన్న ఎలిమినేషన్ నిజమేనా? అతడు 9వ సీజన్లో అడుగుపెడతాడా? అనేది రానున్న రోజుల్లో తేలనుంది. View this post on Instagram A post shared by prasanna kumar aliga (@prasanna_kumar_aliga)చదవండి: ఇండస్ట్రీలో మా పరిస్థితి చాలా దారుణం: ప్రముఖ సింగర్ ఆవేదన -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు
మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి అనుపమ పరమేశ్వరన్ 'పరదా', 'మేఘాలు చెప్పిన ప్రేమకథ', 'త్రిబాణధారి బార్బరిక్' తదితర చిత్రాలు రిలీజ్ కానున్నాయి. మరోవైపు ఓటీటీల్లో 31కి పైగా మూవీస్-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో కొన్ని స్ట్రెయిట్ తెలుగు చిత్రాలతో పాటు పలు డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయండోయ్.(ఇదీ చదవండి: చిరుతో సినిమా.. క్లర్క్ నన్ను చూసి జాలిపడ్డాడు: టాలీవుడ్ నిర్మాత)ఓటీటీల్లోకి వచ్చే సినిమాల విషయానికొస్తే.. సార్ మేడమ్, మిషన్ ఇంపాజిబుల్- ద ఫైనల్ రికనింగ్, మా, మారిషన్, కొత్తపల్లిలో ఒకప్పుడు చిత్రాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇవి కాకుండా మరేవైనా సర్ప్రైజ్ స్ట్రీమింగ్లు కూడా ఉండొచ్చు. ఇంతకీ ఏ ఓటీటీల్లో ఏ మూవీ రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు (ఆగస్టు 18 నుంచి 24 వరకు)అమెజాన్ ప్రైమ్మిషన్ ఇంపాజిబుల్: ద ఫైనల్ రికనింగ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 18సార్ మేడమ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 22ఎఫ్ 1 (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 22నెట్ఫ్లిక్స్కోకోమెలన్ లేన్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 18ఎక్స్టాంట్ సీజన్ 1 & 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 18అమెరికాస్ టీమ్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 19ఫిస్క్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 20రివర్స్ ఆఫ్ ఫేట్ (పోర్చుగీస్ సిరీస్) - ఆగస్టు 20డెత్ ఇంక్ సీజన్ 3 (స్పానిష్ సిరీస్) - ఆగస్టు 21ఫాల్ ఫర్ మీ (జర్మన్ సినిమా) - ఆగస్టు 21గోల్డ్ రష్ గ్యాంగ్ (థాయ్ మూవీ) - ఆగస్టు 21హోస్టేజ్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 21వన్ హిట్ వండర్ (తగలాగ్ సినిమా) - ఆగస్టు 21ద 355 (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 21అబాండడ్ మ్యాన్ (టర్కిష్ సినిమా) - ఆగస్టు 22ఏయిమా (కొరియన్ సిరీస్) - ఆగస్టు 22లాంగ్ స్టోరీ షార్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 22మా (హిందీ సినిమా) - ఆగస్టు 22మారిషన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 22ద ట్రూత్ అబౌట్ జెస్సీ స్మోలెట్? (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 22బాన్ అపెట్టీ, యువర్ మెజస్టీ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 23హాట్స్టార్స్టాకింగ్ సమంత (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 19ద ట్విస్టెడ్ టేల్ ఆఫ్ అమండా నాక్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 20ఏనీ మేనీ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 22పీస్ మేకర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 22జీ5ఆమర్ బాస్ (బెంగాలీ సినిమా) - ఆగస్టు 22సోదా (కన్నడ సిరీస్) - ఆగస్టు 22ఆపిల్ ప్లస్ టీవీఇన్వేజన్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 22ఆహాకొత్తపల్లిలో ఒకప్పుడు (తెలుగు మూవీ) - ఆగస్టు 22సన్ నెక్స్ట్కపటనాటక సూత్రధారి (కన్నడ మూవీ) - ఆగస్టు 22లయన్స్ గేట్ ప్లేవుడ్ వాకర్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 22(ఇదీ చదవండి: బిగ్బాస్ 9 తెలుగు అగ్నిపరీక్ష.. ప్రోమో రిలీజ్) -
తండ్రి వేదన... తనయుడి ఆవేదన
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం సర్ జమీన్ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.మనవాడు అనేవాడు మనకోసం ఎప్పటికీ నిలబడతాడు. పగవాడు మన పతనం కోసం ఆరాటపడతాడు. మంచిని దూరం చేసుకుని చెడు మార్గాన వెళుతూ మనవాడు కూడా పగవాడైతే... అదే ‘సర్ జమీన్’ సినిమా. ఇదో దేశభక్తి స్ఫూర్తిగా అల్లుకున్న కథ. దర్శకుడు కాయోజీ ఇరానీ తెరకెక్కించిన ఈ సినిమాలో ముఖ్యపాత్రధారులుగా మలయాళ నటుడు పృథ్వీరాజ్, బాలీవుడ్ నటి కాజోల్, నటుడు సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం అలీఖాన్ నటించారు. నాలుగు ముఖ్యపాత్రలు, రెండున్నర గంటల నిడివితో దేశ సరిహద్దు వివాదాంశంపై సైనిక నేపథ్యంలో కూడిన సినిమా తీయడం అంటే మాటలు కాదు. ఈ సినిమా స్క్రీన్ప్లేతో ప్రేక్షకుడిని ఉర్రూతలూగించారు దర్శకుడు. అంతలా ఏముందీ కథలో ఓసారి చూద్దాం. జమ్ము కాశ్మీర్ ప్రాంతంలో కల్నల్ విజయ్ మీనన్పోస్టింగ్ జరుగుతుంది. విజయ్ మీనన్ మహా దేశభక్తుడు. అతనికి హర్మన్ అనే కొడుకుంటాడు. దేశమా,ప్రాణమా అంటే నిర్మొహమాటంగా దేశం అని ఎంచుకునే రకం విజయ్. ఈ విషయంలోనే తన తండ్రి విజయ్ పై ద్వేషం పెంచుకుంటాడు హర్మన్. పైగా తను భయస్తుడు కూడా. ఓసారి తీవ్రవాదుల ఘర్షణలో హర్మన్ను టెర్రరిస్టులు కిడ్నాప్ చేస్తారు. తమ ముఖ్య అనుచరుడిని విడిపించాలని... లేదంటే నీ కొడుకుని చంపేస్తామని టెర్రరిస్టులు విజయ్ని హెచ్చరిస్తారు. ఇవన్నీ పట్టించుకోకుండా తాను బంధించిన టెర్రరిస్టులపై కాల్పులు జరుపుతాడు విజయ్. ఆ తరువాత విజయ్, అతని భార్య మెహర్ తమ బిడ్డ చనిపోయాడని భావిస్తారు. కానీ తీవ్రవాదులు హర్మన్కి తండ్రి మీదున్న ద్వేషాన్ని ఆయుధంగా చేసుకుని హర్మన్ని తీవ్రవాదిగా తయారు చేసి, మళ్ళీ విజయ్ దగ్గరకు పంపుతారు. ఆ తరువాత విజయ్, అతని భార్య తమ కొడుకు టెర్రరిస్ట్ అని కనిపెడతారా? లేదా అన్నదే సినిమా. దేశం మీద మమకారం పెంచుకున్న తండ్రి వేదన గెలుస్తుందా... లేక తండ్రి మీద తనయుడు పెంచుకున్న ద్వేషం గెలుస్తుందా? అన్నది హాట్ స్టార్లోనే చూడాలి. ఈ సినిమా ఓ సూపర్ పేట్రియాటిక్ థ్రిల్లింగ్ ఫీలింగ్ ఇస్తుంది. ఆఖర్లో వచ్చే ట్విస్ట్ సినిమా మొత్తానికే హైలైట్. మస్ట్ వాచ్. – హరికృష్ణ ఇంటూరు -
ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్బస్టర్ మూవీ... తెలుగులోనూ
సాధారణంగా స్పోర్ట్స్ డ్రామా సినిమాలంటే అంతంత మాత్రంగానే వర్కౌట్ అవుతుంటాయి. కొన్నిసార్లు మాత్రం బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుంటాయి. అలా కొన్నాళ్ల క్రితం థియేటర్లలోకి వచ్చిన ఓ హాలీవుడ్ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల్ని అలరించింది. రిలీజై దాదాపు నెలన్నర కావొస్తున్న ఇప్పటికీ ప్రేక్షకుల్ని రప్పిస్తోంది. అలాంటిది ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులోకి రానుంది?హాలీవుడ్ సినిమాలు అప్పుడప్పుడు చూసినా సరే నటుడు బ్రాడ్ పిట్ కాస్త పరిచయం ఉండే ఉంటాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'ఎఫ్ 1'. కార్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ కథతో తెరకెక్కించగా.. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. తెలుగులోనూ రిలీజ్ చేయగా.. మన ఆడియెన్స్ కూడా చూసి ప్రశంసించారు. ఇప్పుడు ఈ చిత్రం ఆగస్టు 22 నుంచి అమెజాన్ ప్రైమ్, ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీల్లో అందుబాటులోకి రానుంది.(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)'ఎఫ్ 1' విషయానికొస్తే.. ఫార్ములా వన్ రేసులో డ్రైవర్గా అదరగొట్టిన సన్నీ హెయస్ (బ్రాడ్ పిట్).. కెరీర్కి రిటైర్మెంట్ ఇచ్చి, వ్యాన్ డ్రైవర్ పనిచేస్తుంటాడు. అలా వయసు పైబడిన సన్నీకి ఏపీఎక్స్జీపీ (APXGP) అనే టీమ్లో రేసర్గా పనిచేయాలని అవకాశం ఇస్తారు. అయితే రేసింగ్ నుంచి తప్పుకొని చాలారోజులు అయిపోవడంతో సన్నీకి ఇప్పుడు చాలా సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా తన జట్టులోని యువకుడైన జోషువా పియర్స్ (డామ్సన్ ఐడ్రీస్) దూకూడు తట్టుకోవడం, అతడి నుంచి ఎదురైన అవమానాలు భరించడం కష్టంగా ఉంటుంది.అసలు స్పానిష్ గ్రాండ్ ప్రీ రేసింగ్ తర్వాత సన్నీ.. ఎందుకు రేసింగ్ నుంచి తప్పుకొన్నాడు? మళ్లీ ఫార్ములా వన్ రేసింగ్ ట్రాక్ పైకి వచ్చిన సన్నీకి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? చివరకు విజేతగా నిలిచాడా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఫహాద్ ఫాజిల్ కామెడీ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
కామెడీ థ్రిల్లర్ సినిమా.. తెలుగులో కూడా స్ట్రీమింగ్
కోలీవుడ్లో పలు చిత్రాల్లో నటించి మెప్పించిన మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil), వడివేలు నటించిన చిత్రం 'మారీశన్'(Maareesan).. జులైలో విడుదలైన ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. కామెడీ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ చిత్రం తమిళ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఈ మూవీ సుదీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కింది. థియేటర్స్లో ప్రేక్షకులను నవ్వించడంతో పాటు ఉత్కంఠతకు గురిచేసింది. కోవై సరళ, వివేక్ ప్రసన్న, సితార, లివింగ్స్టన్, తీనప్పన్, రేణుక, శరవణన్ సుబ్బయ్య వంటి వారు నటించారు. సంగీతం యువన్ శంకర్ రాజా అందించారు.ఆగష్టు 22 నుంచి నెట్ఫ్లిక్స్లో మారీశన్ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. తమిళ్తో పాటు తెలుగు, హిందీ,కన్నడ, మలయాళంలో విడుదల కానున్నట్లు ఒక పోస్టర్ను విడుదల చేశారు. ఈ సినిమా ఫహాద్ ఫాజిల్కి మరో విభిన్న పాత్రను అందించగా, వడివేలు హాస్యంతో పాటు భావోద్వేగాన్ని కూడా చూపించారు. మీరు కామెడీ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడితే.. మారీశన్ తప్పక చూడవచ్చు.దయాలన్ (ఫహాద్ ఫాజిల్) అనే దొంగ, వేలాయుధం పిళ్లై (వడివేలు) అనే అల్జీమర్స్ బాధితుడి వద్ద చాలా డబ్బు ఉందని తెలుసుకుంటాడు. వేలాయుధం తన స్నేహితుడిని కలవడానికి ఊరికి బయలుదేరుతాడు. దయాలన్ అతన్ని మాటలతో మాయ చేసి, తన బైక్పై తీసుకెళ్తాడు. ఆ ప్రయాణంలో ఏం జరిగింది? దయాలన్ దోచుకున్నాడా..? లేక వేలాయుధం పరిస్థితిని చూసి మారిపోయాడా..? అనే ప్రశ్నలకి సమాధానం ఈ సినిమాలో ఉంటుంది. -
ఓటీటీ సిరీస్లో లెస్బీయన్ లిప్లాక్.. అవసరమా?
సినిమాల్లో ఇప్పుడు లిప్లాక్ సీన్స్ కామన్ అయిపోయాయి. అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని చిత్రాల్లో ముద్దు సన్నివేశాలను జోడిస్తున్నారు. ఇక వెబ్ సిరీస్లలో అలాంటి సన్నివేశాలకు అడ్డూ అదుపే లేదు. ప్రేక్షకులు కూడా వాటిని రొటీన్ సీన్లలాగే ట్రీట్ చేస్తున్నారు. ఒకప్పటిలా ఆ సన్నివేశాలపై చర్చించడం.. ఖండించడం జరగట్లేదు. కానీ చాలాకాలం తర్వాత మళ్లీ ఓ ముద్దు సీన్పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆ వెబ్ సిరీస్లో లెస్బియన్ మధ్య కిస్ సీన్ పెట్టడం అవసరమా అని ఓ వర్గం ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. వివరాల్లోకి వెళితే..హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘అంధేరా’ ఆగస్ట్ 14న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయింది. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్లో ప్రియా బాపట్, కరణ్వీర్ మల్హోత్రా, ప్రజక్తా కోలి, సుర్వీన్ చావ్లా తదితరులు కీలక పాత్రలు పోషించారు. రాఘవ్ ధర్ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్కి మంచి టాక్ వచ్చినప్పటికీ.. ఇందులో ఇద్దరు నటీమణుల మధ్య వచ్చే లెస్బియన్ ముద్దు సన్నివేశంపై కొంతమంది విమర్శలు చేస్తున్నారు. కథలో భాగంగా సుర్వీన్ చావ్లా- ప్రియా బాపట్ మధ్య ముద్దు పెట్టుకోవాలి. ఇద్దరూ ఈ సీన్లో అద్భుతంగా నటించారు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. చాలా నేచురల్గా నటించారని కొంతమంది వారిపై ప్రశంసలు కురిపిస్తుంటుంటే.. మరికొంతమంది మాత్రం ఆ సీన్ అనవసరంగా పెట్టారని విమర్శిస్తున్నారు. అలాగే ఇలాంటి మెయిన్ స్ట్రీమ్ షోల్లో ఇటువంటి సీన్స్ అవసరం లేదని వాదిస్తున్నారు. -
సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
ఈ వారం థియేటర్లలోకి వచ్చిన 'కూలీ', 'వార్ 2'కి మిశ్రమ స్పందన వచ్చింది. కానీ వీకెండ్, సెలవులు కలిసి రావడంతో జనాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు ఓటీటీల్లోనూ పలు కొత్త సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో చాలా వరకు డబ్బింగ్ చిత్రాలే ఉన్నాయి. అయితే ఎలాంటి ప్రకటన లేకుండా రెండు తెలుగు మూవీస్ కూడా స్ట్రీమింగ్లోకి వచ్చేశాయి. ఇంతకీ ఏంటవి? ఎందులో చూడొచ్చు?గత నెల తొలివారం థియేటర్లలోకి వచ్చిన 'వర్జిన్ బాయ్స్' సినిమా.. బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది. కాకపోతే ఐఫోన్, డబ్బులు గిఫ్ట్స్ అనే ప్రమోషన్లతో వార్తల్లో నిలిచింది. అడల్ట్ కాన్సెప్ట్, యువతని టార్గెట్ చేసుకుని తీసిన ఈ చిత్రం.. ఇప్పుడు ఆహా, అమెజాన్ ప్రైమ్ ఓటీటీల్లోకి వచ్చేసింది. తెలుగులోకి అందుబాటులో ఉంది.(ఇదీ చదవండి: విజయ్తో రొమాంటిక్ స్టిల్.. ‘చాలా స్పెషల్’ అంటూ రష్మిక పోస్ట్)మరోవైపు ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజైన 'సూర్యాపేట్ జంక్షన్' అనే తెలుగు సినిమా కూడా ఎలాంటి హడావుడి లేకుండానే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ విషయానికొస్తే.. అర్జున్ (ఈశ్వర్) కాలేజీలో చదువుతూ స్నేహితులతో జాలీ లైఫ్ గడుపుతుంటాడు. జ్యోతితో(నైనా సర్వర్) ప్రేమలో పడతాడు. మరోవైపు నరసింహ (అభిమన్యు సింగ్) ఎమ్మెల్యే అయ్యే ప్రయత్నాల్లో ఉంటాడు.అయితే అర్జున్ స్నేహితుల్లో ఒకడైన శీను.. ఓ రోజు హత్యకు గురవుతాడు. శీనుని ఎవరు చంపారు? ఆ ఘటన వెనకున్న రాజకీయ కుట్ర ఏంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ. ఈ రెండు సినిమాలతో పాటు వీకెండ్ ఓటీటీల్లో రిలీజైన వాటిలో 'జానకి.వి vs స్టేట్ ఆఫ్ కేరళ', 'గ్యాంబ్లర్స్', 'సూపర్ మ్యాన్' తదితర చిత్రాలు కూడా ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. (ఇదీ చదవండి: రజినీకాంత్ 'కూలీ' సినిమా రివ్యూ) -
భార్యాభర్తల కొట్లాటే 'సార్ మేడమ్'.. వచ్చేవారమే ఓటీటీలో..
డిఫరెంట్ రోల్స్తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi). ఈయన నటించిన లేటెస్ట్ మూవీ సార్ మేడమ్ (Sir Madam Movie). నిత్యామీనన్ (Nithya Menen) కథానాయికగా యాక్ట్ చేసింది. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ తమిళంలో తలైవాన్ తలైవి పేరిట జూలై 25న రిలీజైంది. సార్ మేడమ్ పేరిట తెలుగులో ఆగస్టు 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓటీటీలో సార్ మేడమ్దాదాపు నెల రోజుల తర్వాత ఈ మూవీ డిజిటల్ ప్లాట్ఫామ్లోకి వచ్చేస్తోంది. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. సార్ మేడమ్ ఆగస్టు 22 నుంచి అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి రానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది.భార్యాభర్తల స్టోరీఈ మూవీలో నిత్యామీనన్- విజయ్ భార్యాభర్తలుగా నటించారు. దాంపత్య జీవితంలో వచ్చే సమస్యలను ఫన్నీగా చూపించారు. ఫ్యామిలీ ఎమోషన్స్తోపాటు కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కించారు. పెళ్లి చేసుకునేవారు, చేసుకున్నవారు ఈ సినిమాను ఓసారి ఓటీటీలో చూడాల్సిందే! Get ready to fall in love with Aagasaveeran and Perarasi... twice 👀#ThalaivanThalaiviiOnPrime, Aug 22@VijaySethuOffl @MenenNithya @pandiraaj_dir @iYogiBabu@Music_Santhosh @SathyaJyothi @Lyricist_Vivek @studio9_suresh@Roshni_offl @kaaliactor @MynaNandhini @ActorMuthukumar pic.twitter.com/VqI3bn7zqP— prime video IN (@PrimeVideoIN) August 15, 2025చదవండి: పెళ్లిపందిట్లో టాలీవుడ్ హీరో చిరుదరహాసం.. ఆ చూపుల్లోనే..! -
కూలీ మూవీ ఓటీటీ పార్ట్నర్ ఇదే!
రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమా (Coolie Movie)కు భారీగా ప్రమోషన్లు చేశారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున తొలిసారి విలన్గా నటించడం.. ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ కీలక పాత్రలు పోషించడంతో ఈ మల్టీస్టారర్ మూవీ బాక్సాఫీస్ను షేక్ చేస్తుందని అంతా ఊహించారు. కానీ అందరి అంచనాలు తలకిందులయ్యాయి. ఆగస్టు 14న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వస్తోంది.ఓటీటీ వివరాలుఇకపోతే ఈ సినిమా డిజటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ (OTT) ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. దాదాపు రూ.120 కోట్లకు ఈ హక్కుల్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్లో రిలీజైన ఎనిమిది వారాల తర్వాతే కూలీ ఓటీటీలోకి రానుంది. అయితే సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుందంటే మాత్రం ఇంకా ముందే ఓటీటీలోకి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.చదవండి: రజినీకాంత్ 'కూలీ' సినిమా రివ్యూ -
మళ్లీ సెలవులొచ్చాయ్.. ఈ శుక్రవారం ఓటీటీల్లో 26 సినిమాలు!
చూస్తుండగానే వీకెండ్ వచ్చేస్తోంది. గతవారం లాగే ఈసారి కూడా వరుసగా మూడు రోజులు రావడం సినీ ప్రియులకు పండగే. ఈ వారం థియేటర్లలో రెండు పెద్ద సినిమాలు కూలీ, వార్-2 ఇప్పటికే సందడి చేస్తున్నాయి. ఓకే రోజు రిలీజైన ఈ చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ వస్తోంది. ఈ వారాంతంలో మూడు రోజుల పాటు సెలవులు రావడం ఈ చిత్రాలకు కలిసొచ్చే అవకాశముంది.మరోవైపు ఈ శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవం, ఆ తర్వాత శ్రీ కృష్ణ జన్మాష్టమి, సండే సెలవులు కావడంతో ఓటీటీ ప్రియులు సైతం చిల్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. ఈ వారంలో వీకెండ్లో ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు ఒక్క రోజే సందడి చేసేందుకు సిద్ధమైపోయాయి. ఈ ఫ్రైడే ఓటీటీ మూవీస్లో కాజోల్ నటించిన మా, అనుపమ పరమేశ్వరన్ కోర్ట్ డ్రామా జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. వీటితో సూపర్ మ్యాన్ హాలీవుడ్ మూవీ, పలు వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. మీకు నచ్చిన సినిమా ఏయే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందో చూసేయండి మరి.నెట్ఫ్లిక్స్రోల్ మోడల్స్(మూవీ)- ఆగస్టు 15అవుట్ ల్యాండర్(వెబ్ సిరీస్) సీజన్-7- ఆగస్టు 15ఫిట్ ఫర్ టీవీ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 15సెల్ఫ్ రిలయన్స్ (మూవీ)-ఆగస్టు 15లవ్ ఈజ్ బ్లైండ్ యూకే(సీజన్-2)- ఆగస్టు 15సాంగ్స్ ఫ్రమ్ ది హోల్(మూవీ)- ఆగస్టు 15ఫిక్స్డ్(మూవీ)- ఆగస్టు 15ఫిట్ ఫర్ టీవీ(రియాలిటీ షో)- ఆగస్టు 15మిస్ గవర్నర్- (సీజన్-1)- ఆగస్టు 15ద ఎకోస్ ఆఫ్ సర్వైవర్స్ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 15ద నైట్ ఆల్వేస్ కమ్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 15మా(హిందీ మూవీ)- ఆగస్టు 15అమెజాన్ ప్రైమ్సూపర్ మ్యాన్(హాలీవుడ్ మూవీ)- ఆగస్టు 15ఎంఎక్స్ ప్లేయర్సేనా గార్డియన్స్ ఆఫ్ ది నేషన్- ఆగస్టు 15జియో హాట్స్టార్కృష్ణ కో లవ్ స్టోరీ(మూవీ)- ఆగస్టు 15మోజావే డైమండ్స్ (మూవీ)- ఆగస్టు 15బ్యూటీఫుల్ డిజాస్టర్ (మూవీ)- ఆగస్టు 15ఏలియన్ ఎర్త్ (మూవీ)- ఆగస్టు 15లిమిట్లెస్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 15బ్లడీ ట్రోఫీ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 17జీ5జానకి వి vs స్టేట్ ఆఫ్ కేరళ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 15సన్ నెక్స్ట్..గుడ్ డే-(తమిళ మూవీ) ఆగస్టు-15గ్యాంబ్లర్స్ (తమిళ మూవీ)- ఆగస్టు 15అక్కేనామ్ (తమిళ మూవీ)- ఆగస్టు 15ఆహా తమిళం..యాదుమ్ అరియాన్- ఆగస్టు 15మూవీ సెయింట్స్ కట్లా కర్రీ (గుజరాతీ మూవీ) - ఆగస్టు 15ఆపిల్ ప్లస్ టీవీ స్నూపీ ప్రెజెంట్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 15 -
'సితారే జమీన్ పర్' మూవీ ఆఫర్.. రెండు రోజులు మాత్రమే
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ నటించిన ‘సితారే జమీన్ పర్’ (Sitaare Zameen Par) చిత్రం ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. యూట్యూబ్లో రన్ అవుతున్న ఈ సినిమాను చూడాలంటూ రూ. 100 చెల్లించాల్సి ఉంది. పే-పర్-వ్యూ (Pay-per-view) మోడల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం రెంట్ తాజాగా తగ్గించారు. థియేటర్లో ప్రదర్శన అనంతరం నేరుగా యూట్యూబ్లోనే ఈ మూవీని ఆయన విడుదల చేశారు. హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం వంటి భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంది.ఇండిపెండెన్స్ డే కానుకగా సితారే జమీన్ పర్ సినిమాను కేవలం రూ. 50లకే చూడొచ్చని నిర్మాణ సంస్థ పేర్కొంది. ఈ చిత్రాన్ని చూడాలని ఆసక్తి ఉంటే యూట్యూబ్లో కేవలం రూ. 50 చెల్లిస్తే సరిపోతుంది. అయితే, ఈ ఆఫర్ కేవలం ఆగష్టు 15 నుంచి 17 వరకు మాత్రమే ఉంటుంది. ఇదే విషయాన్ని చెబుతూ ఆమిర్ ఖాన్ ఒక వీడియో విడుదల చేశారు. ఆర్.ఎస్. ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ కామెడీ డ్రామా మూవీ జూన్ 20న థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రం గురించి మహేశ్బాబు ప్రశంసలు కురిపించారు. సితారే జమీన్ పర్ అందరి మనసులు దోచుకుంటోందని ఆయన అన్నారు. ఈ మూవీ మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. అలాగే చప్పట్లు కొట్టేలా చేస్తుందని చెప్పారు. ఈ సినిమా చూశాక కచ్చితంగా చిరునవ్వుతో బయటకు వస్తారని ఆయన అన్నారు.సితారే జమీన్ పర్ మూవీలో ఆమిర్ ఖాన్, జెనీలియా జంటగా నటించారు. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించగా ఆమిర్ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఆమిర్ఖాన్, అపర్ణ పురోహిత్ నిర్మించారు. ఈ చిత్రంలో ఆరోష్ దత్తా, గోపీకృష్ణ వర్మ, సంవిత్ దేశాయ్, వేదాంత్ శర్మ, ఆయుష్ భన్సాలీ, ఆశిష్ పెండ్సే, రిషి షహానీ, రిషబ్జైన్ , నమన్ మిశ్రా, సిమ్రాన్ మంగేష్కర్ వంటి వారు కీలకపాత్రల్లో నటించారు. -
బిగ్బాస్ అగ్నిపరీక్ష డేట్ వచ్చేసింది.. హోస్ట్ నాగార్జున కాదు
ప్రతి ఏడాది బిగ్బాస్ షో (Bigg Boss Reality Show) కోసం ఎదురుచూస్తారు. కానీ ఈసారి సీజన్ 9 కన్నా ముందు బిగ్బాస్ అగ్నిపరీక్ష కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సీజన్లో ఏదో తూతూమంత్రంగా కామనర్స్ను సెలక్ట్ చేయడం లేదు. వారికంటూ ప్రత్యేకంగా ఓ షో పెట్టి.. అందులో పోటీలు నిర్వహించి, జడ్జిల నిర్ణయాల ఆధారంగా సామాన్యులను ఎంపిక చేస్తారన్నమాట!వచ్చేవారమే అగ్నిపరీక్షతాజాగా ఈ అగ్నిపరీక్ష వివరాలు వెల్లడిస్తూ ఓ ప్రోమో రిలీజ్ చేశారు. బిగ్బాస్ 4వ సీజన్ విన్నర్ అభిజిత్, నాన్స్టాప్ (ఓటీటీ) సీజన్ విజేత బిందు మాధవి, ఫస్ట్ సీజన్ థర్డ్ రన్నరప్ నవదీప్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నట్లు చూపించారు. ఈ షో ఆగస్టు 22నుంచి సెప్టెంబర్ 5 వరకు ప్రతిరోజు హాట్స్టార్లో ప్రసారం కానున్నట్లు వెల్లడించారు. ఈ అగ్నిపరీక్షకు యాంకర్ శ్రీముఖి హోస్ట్గా వ్యవహరించనుంది. మరి ఈ షోలో ఎవరెవరు పాల్గొననున్నారు? ఎలా ఉండబోతోంది? అన్నది తెలియాలంటే ఇంకో 9 రోజులు ఆగాల్సిందే! చదవండి: థైరాయిడ్ క్యాన్సర్.. సర్జరీ తర్వాత గొంతు మూగబోయింది: యాంకర్ -
ఓటీటీలోకి 'సూపర్ మ్యాన్' లేటెస్ట్ సినిమా
ఇప్పుడంటే కాస్త తగ్గిపోయాయి గానీ అప్పట్లో హాలీవుడ్లో సూపర్ హీరో జానర్లో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. ప్రత్యేకించి 'సూపర్ మ్యాన్' ఫ్రాంచైజీ చిత్రాలకు ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. 1984 నుంచి ఈ మూవీస్ వస్తూనే ఉన్నాయి. బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టిస్తూనే ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీ నుంచి రిలీజైన లేటెస్ట్ మూవీ ఇప్పుడు నెల అయ్యేసరికి ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇంతకీ ఎందులో స్ట్రీమింగ్ కానుంది? ఈ మూవీ సంగతేంటి?డీసీ యూనివర్స్లోని లేటెస్ట్ 'సూపర్ మ్యాన్' సినిమా జూలై 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. కాకపోతే మరీ సూపర్ అనిపించేలా టాక్ తెచ్చుకోలేకపోయింది. మన దేశంలోనూ ఓ మాదిరిగా ఆడింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు డైరెక్టర్ జేమ్స్ గన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీ, ఫాండంగో ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ఏలియన్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)'సూపర్ మ్యాన్' విషయానికొస్తే.. జహ్రాన్పూర్పై బొరేవియా తన సైన్యంతో దాడి చేయగా.. దాన్ని సూపర్ మ్యాన్ అడ్డుకుంటాడు. అయితే టెక్నాలజీతో ప్రయోగాలు చేసే లెక్స్ లూథర్.. సూపర్ మ్యాన్పై వ్యతిరేకత వచ్చేలా అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు కొన్ని మాయమాటలు చెబుతాడు. వీడియోలు చూపిస్తాడు. దీంతో సూపర్ మ్యాన్పై అందరికీ నమ్మకం పోతుంది. మరి అలాంటి పరిస్థితి నుంచి అందరూ తనని నమ్మేలా ఎలా చేశాడు? ఎదురైన సవాళ్లు ఏంటి? అనేదే మిగతా స్టోరీ.సూపర్ మ్యాన్తో పాటు ఈ వారం 30కి పైగా సినిమాలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో జానకి వి vs స్టేట్ ఆఫ్ కేరళ, గ్యాంబ్లర్స్, టెహ్రాన్ చిత్రాలతో పాటు సారే జహాసే అచ్చా, అంధేరా లాంటి సిరీసులు కూడా ఉన్నంతలో ఆసక్తి రేపుతున్నాయి. వీటితోపాటే ఏమైనా సడన్ సర్ప్రైజ్ స్ట్రీమింగ్లు ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.(ఇదీ చదవండి: 'కూలీ' రెమ్యునరేషన్.. ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ?) -
ఓటీటీలోకి వచ్చేసిన ఏలియన్ సిరీస్.. తెలుగులోనూ
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా 30కి పైగా లేటెస్ట్ చిత్రాలు రానున్నాయి. వీటిలో కొన్ని తెలుగు స్ట్రెయిట్ మూవీస్ ఉండగా.. మరికొన్ని డబ్బింగ్ సినిమాలు, సిరీసులు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు ఓ క్రేజీ సిరీస్ తెలుగు వెర్షన్.. ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటది? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?(ఇదీ చదవండి: శ్రీదేవి జయంతి.. ఎంతమంది హీరోయిన్లు వచ్చినా ఆ రికార్డ్ ఈమెదే)హాలీవుడ్లో డైనోసార్లు, ఏలియన్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీలతో సినిమాలు, సిరీసులు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. కొన్నిరోజుల క్రితమే 'జురాసిక్ వరల్డ్ రీ బర్త్' అనే మూవీ ఓటీటీలోకి వచ్చింది. ఇప్పుడు 'ఏలియన్: ఎర్త్' పేరుతో తీసిన ఓ సిరీస్ సైలెంట్గా స్ట్రీమింగ్లోకి వచ్చేసింది. ఇంగ్లీష్తో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఇది అందుబాటులోకి రావడం విశేషం.కొన్నాళ్ల క్రితం రిలీజైన ట్రైలర్ బట్టి చూస్తే.. 2120 సంవత్సరం. భూమ్మీదకు ఏలియన్స్ వస్తారు. మరోవైపు శాస్త్రవేత్తలు వాటిని కట్టడి చేసేందుకు ప్రయోగాలు కూడా చేస్తారు. మరి ఈ సమరంలో ఎవరు పైచేయి సాధించారు? చివరకు ఏమైందనేదే సిరీస్ స్టోరీలా అనిపిస్తుంది. ప్రస్తుతానికి రెండు ఎపిసోడ్స్ని హాట్స్టార్లో రిలీజ్ చేశారు. విజువల్స్, స్టోరీ టెల్లింగ్ అదిరిపోయిందని రివ్యూలు కూడా వస్తున్నాయి. ఆసక్తి ఉంటే ఈ సిరీస్పై లుక్కేయండి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు) -
ఓటీటీకి ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీల్లో క్రైమ్ థ్రిల్లర్స్కు ఫుల్ డిమాండ్ ఉంటోంది. దీంతో ఓటీటీలు సైతం అలాంటి కంటెంట్పైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. తాజాగా మరో థ్రిల్లర్ మూవీ బుల్లితెర ప్రియులను అలరించేందుకు వస్తోంది. డిఫరెంట్ స్టోరీ లైన్ తో తెరకెక్కించిన గుడ్ డే (Good Day) మూవీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయింది. ఓ తాగుబోతు క్రైమ్ ఇన్స్టిగేషన్లో ఎలా సాయపడ్డాడనే కోణంలో ఈ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఆగస్టు 15 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్కు రానుంది. సన్ నెక్ట్స్లో ఓటీటీ ప్లే ప్రీమియం ద్వారా అందుబాటులోకి రానుంది. ఈ ఏడాది జూన్ 27న గుడ్ డే థియేటర్లలో రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పోర్ణా జేఎస్ మైఖేల్ కథ అందించగా.. ఈ సినిమాకు ఎన్ అరవిందన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ రామలింగం, మైనా నందిని, ఆదుకలం మురుగదాస్, కాళి వెంకట్, భగవతి పెరుమాల్, వేళ రామమూర్తి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి గోవింద్ వసంత గుడ్ డేకు సంగీతం అందించారు.Freedom to binge exactly what you want – Good Day, Gamblers, Akkenam. Why choose one when Ungal Screen, Ungal Choice on Ungal Sun NXT!! #UngalScreenUngaChoice #SunNXT #GoodDay #Gamblers #Akkenam #WeekendBinge #MovieDrop #IndependenceDayWeekend #FreedomToBinge,… pic.twitter.com/JEieC1LhJv— SUN NXT (@sunnxt) August 10, 2025 -
ఓటీటీలోకి 'మ్యాడ్' హీరో కొత్త సినిమా
మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో ఆకట్టుకున్న నటుడు సంగీత్ శోభన్. ఇతడు ప్రస్తుతం మెగా డాటర్ నిహారిక నిర్మిస్తున్న ఓ మూవీలో హీరోగా లీడ్ రోల్ చేస్తున్నాడు. అయితే ఇతడు నటించిన ఓ చిత్రం ఇదే ఏడాది మరొకటి రిలీజైందని తెలుసా? అవునా ఏ సినిమా అది అని ఆశ్చర్యపోతున్నారా? అదే ఇప్పుడు దాదాపు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో స్ట్రీమింగ్ కానుంది?(ఇదీ చదవండి: ఏపీ ప్రభుత్వ వాహనంలో హీరోయిన్ నిధి అగర్వాల్ షికార్లు)డైరెక్టర్ శోభన్కి ఇద్దరు కొడుకులు. పెద్దోడు సంతోష్ శోభన్ ఇదివరకే తెలుగులో ఆడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. చిన్నోడు సంగీత్ శోభన్ మాత్రం తొలుత ఓ వెబ్ సిరీస్ చేశాడు. తర్వాత 'మ్యాడ్' రెండు చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతడు ప్రధాన పాత్రలో 'గ్యాంబ్లర్స్' అనే మూవీ చేశాడు. జూన్ 6న థియేటర్లలోకి కూడా వచ్చింది. కానీ కంటెంట్పైన నమ్మకం లేదో ఏమో గానీ ప్రమోషన్స్ చేయలేదు. దీంతో మూవీ అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది.ఇప్పుడు ఈ చిత్రం సన్ నెక్స్ట్ ఓటీటీలో ఆగస్టు 14 అంటే ఈ గురువారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. 'గ్యాంబ్లర్స్' విషయానికొస్తే.. కార్డ్ క్యాజిల్ క్లబ్లో చాలామంది పేకాట ఆడుతుంటారు. ఆంటోని(మధుసూధనరావు) అలానే ఆడి తన వంశ గౌరవమైన లేడీ బర్డ్ అనే డైమండ్ కోల్పోతాడు. ఆ లేడీ బర్డ్ తర్వాత మిస్ అవుతుంది. దీంతో ఆంటోని కొడుకు ఏంజిల్ (సంగీత్ శోభన్)ని చిదంబరం (శ్రీకాంత్ అయ్యంగర్) తన చెప్పచేతుల్లో పెట్టుకుంటాడు. ఇంతకీ కార్డ్ క్యాజిల్ క్లబ్ సంగతేంటి? ఆ డైమండ్ కథేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ధనుష్తో డేటింగ్? ఎట్టకేలకు స్పందించిన మృణాల్) -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు
మరో వారం వచ్చేసింది. ఈసారి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రజినీకాంత్ 'కూలీ', ఎన్టీఆర్ 'వార్ 2' సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. వీటికోసం అభిమానులు ఆత్రుతగానే ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఓటీటీల్లోనూ ఈ వీకెండ్ ఏకంగా 30 వరకు కొత్త మూవీస్-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో తెలుగు డబ్బింగ్ చిత్రాలే కొన్ని ఉన్నాయి.(ఇదీ చదవండి: ఆయన దీవెనలు ఉన్నంత కాలం నన్నెవరూ ఆపలేరు: ఎన్టీఆర్)ఓటీటీల్లో రిలీజయ్యే కొత్త సినిమాల విషయానికొస్తే జానకి వి vs స్టేట్ ఆఫ్ కేరళ, టెహ్రాన్ మూవీస్తోపాటు సారే జహాసే అచ్చా, అంధేరా సిరీస్లు ఉన్నంతలో కాస్త ఆసక్తి రేపుతున్నాయి. కొత్త చిత్రాలు.. వీకెండ్లో ఏమైనా సడన్ స్ట్రీమింగ్ ఉండొచ్చు. ఇంతకీ ఏ ఓటీటీల్లో ఏ మూవీ రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు (ఆగస్టు 11 నుంచి 17వరకు)జీ5టెహ్రాన్ (హిందీ సినిమా) - ఆగస్టు 14జానకి వి vs స్టేట్ ఆఫ్ కేరళ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 15నెట్ఫ్లిక్స్సులివన్ క్రాసింగ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 11ఔట్ ల్యాండర్ సీజన్ 7 పార్ట్ 1 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 11ఫైనల్ డ్రాఫ్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 12జిమ్ జెఫ్రీస్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 12ఫిక్స్డ్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 13లవ్ ఈజ్ బ్లైండ్: యూకే సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 13సారే జహాసే అచ్చా (హిందీ సిరీస్) - ఆగస్టు 13సాంగ్స్ ఫ్రమ్ ద హోల్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 13యంగ్ మిలీయనీర్స్ (ఫ్రెంచ్ సిరీస్) - ఆగస్టు 13ఇన్ ద మడ్ (స్పానిష్ సిరీస్) - ఆగస్టు 14మోనోనొక్ మూవీ ద సెకండ్ ఛాప్టర్ (జపనీస్ సినిమా) - ఆగస్టు 14ఫిట్ ఫర్ టీవీ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 15ద ఎకోస్ ఆఫ్ సర్వైవర్స్ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 15ద నైట్ ఆల్వేస్ కమ్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 15అమెజాన్ ప్రైమ్అంధేరా (హిందీ సిరీస్) - ఆగస్టు 14హాట్స్టార్డ్రాప్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 11డాగ్ మ్యాన్ (ఇంగ్లీష్ యానిమేషన్ సినిమా) - ఆగస్టు 11ఐరన్ మ్యాన్ అండ్ హిజ్ ఆసమ్ ఫ్రెండ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 12ఏలియన్: ఎర్త్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 13లిమిట్లెస్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 15బ్లడీ ట్రోఫీ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 17సోనీ లివ్కౌన్ బనేగా కరోడ్పతి సీజన్ 17 (రియాలిటీ షో) - ఆగస్టు 11కోర్ట్ కచేరి (హిందీ సిరీస్) - ఆగస్టు 13బుక్ మై షోఈజ్ లవ్ ఇనఫ్? సర్ (హిందీ సినిమా) - ఆగస్టు 11లయన్స్ గేట్ ప్లేద క్రో (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 14మనోరమ మ్యాక్స్వ్యసనసమేతం బంధుమిత్రధికళ్ (మలయాళ సినిమా) - ఆగస్టు 14మూవీ సెయింట్స్కట్లా కర్రీ (గుజరాతీ మూవీ) - ఆగస్టు 15ఆపిల్ ప్లస్ టీవీస్నూపీ ప్రెజెంట్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 15(ఇదీ చదవండి: ఉపాసన పెట్టిన 'లవ్ టెస్ట్'.. చరణ్ ఏం చేశాడంటే?) -
పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తే..? పరంతు పో మూవీ చూడాల్సిందే!
టైటిల్: పరంతు పో..నటీనటులు: శివ, గ్రేస్ ఆంటోని,, మిథుల్ అంజలి తదితరులుడైరెక్టర్: రాముఓటీటీ: జియో హాట్స్టార్ఓటీటీలు వచ్చాక సినిమాలు చూసే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కంటెంట్ బాగున్న సినిమాలను ఓటీటీ ప్రియులు ఆదరిస్తున్నారు. ముఖ్యంగా చిన్న సినిమాలు థియేటర్లలో అంతగా రాణించలేకపోయినా.. ఓటీటీకి వచ్చేసరికి దూసుకెళ్తున్నాయి. అలాంటి మరో సందేశాత్మక చిత్రమే పరంతు పో. జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.అసలు కథేంటంటే..గోకుల్ (శివ), గ్లోరీ ( గ్రేస్ ఆంటోనీ) లవ్ మ్యారేజ్ చేసుకుని జీవిస్తుంటారు. వీరికి ఓ కుమారుడు జన్మిస్తాడు. వాడి పేరు అన్బుల్(మిథుల్). అసలే ప్రేమ పెళ్లి కావడంతో వీరికి ఇరు కుటుంబాల నుంచి ఎలాంటి మద్దతు లభించదు. ఫ్యామిలీ నడవాలంటే భార్యాభర్తలిద్దరూ తప్పక పని చేయాల్సిన పరిస్థితి. వీళ్లది మిడిల్ క్లాస్ కావడంతో జీవనం సాగించేందుకు చిన్నపాటి బిజినెస్ చేస్తుంటారు. గ్లోరీ బట్టల షాపు రన్ చేస్తుండగా.. గోకుల్ సైతం కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసే పనిలో బిజీగా ఉంటారు. ఇద్దరు కూడా బిజీగా ఉండడం వల్ల ఈ ఎఫెక్ట్ పిల్లాడిపై పడుతుంది. దీంతో అన్బుల్ ఒక్కడే ఇంట్లో ఉంటూ టీవీకి పరిమితమైపోతాడు. ఒకసారి సడన్గా గ్లోరీ బిజినెస్ పనిమీద కోయంబత్తూరు వెళ్తుంది. అప్పుడు పిల్లాడి బాధ్యత తండ్రి గోకుల్ మీదే పడుతుంది. ఇంట్లో కొడుకు అల్లరిని తట్టుకోలేక రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తాడు గోకుల్. ఇంతకీ వాళ్ల ట్రిప్ సజావుగా సాగిందా? ఇంట్లో ఉన్నప్పుడు టీవీ తప్ప మరో ప్రపంచం తెలియని అన్బుల్ ఆ తర్వాత ఎలా మారిపోయాడన్నదే అసలు కథ.ఎలా ఉందంటే..ఒక్క మాటలో చెప్పాలంటే నేటి యువ జంటలు చేస్తున్న పొరపాటునే డైరెక్టర్ సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. పెళ్లి తర్వాత జీవనోపాధి కోసం నగరాలకు వచ్చి చేరుతున్న యువ జంటలు.. పనిలో పడి పిల్లలను పట్టించుకోవడం మానేశారు. నగరాల్లో దాదాపు అందరివీ ఒంటరి జీవితాలే. ఎందుకంటే ఇక్కడ ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు. ఎవరి పనిలో వాళ్లుండి ఫుల్ బిజీగా లైఫ్ను సాగదీస్తుంటారు. పిల్లలకు టైమ్ కేటాయించడమనేది చాలా అరుదు.స్కూల్కు వెళ్లి వచ్చిన పిల్లాడు.. ఇంట్లో ఎవరు లేకపోతే అతని మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ పాయింట్నే ప్రధానంగా చూపిస్తూ కథ రాసుకున్నారు. ఈ జనరేషన్ పిల్లలపై ఆ ప్రభావం ఏంటనేది పరతు పోలో చక్కగా చూపించారు. ఈ కథ మొత్తం చెన్నై చుట్టుపక్కల ప్రాంతాల్లోనే జరుగుతుంది. ఈ కథ ప్రారంభంలో గ్లోరీ, గోకుల్ బిజినెస్తో బిజీగా ఉండడం చూపించారు. గ్లోరీ తన బట్టల షాప్ బిజినెస్లో పడి పిల్లాడితో ఇంటరాక్షన్ తగ్గిపోతుంది. దీంతో పిల్లాడి లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోతుంది. స్కూల్కి వెళ్లి రావడం, టీవీకి అతుక్కుపోవడం అదే అతని దినచర్యగా మారుతుంది. అలా ఫస్టాఫ్లో వారి బిజీ లైఫ్, పిల్లాడి చుట్టూ కథ తిరుగుతుంది. గ్లోరీ తన బిజినెస్ పనిమీద కోయంబత్తూరు వెళ్లడంతో ఇంట్లో పిల్లాడిని కంట్రోల్ చేయలేక తండ్రి గోకుల్ రోడ్ ట్రిప్ కోసం బయలుదేరతాడు. ఆ తర్వాత జరిగే పరిణామాలు కామెడీతో పాటు కొత్త లైఫ్ స్టైల్ను పరిచయం చేసే సన్నివేశాలు అంతా రోటీన్గానే ఉంటాయి. తండ్రీ, కుమారుల మధ్య వచ్చే సంభాషణలు ఫుల్ కామెడీగా అనిపిస్తాయి.అయితే ఈ రోడ్ ట్రిప్ మధ్యలో ఎప్పుడో ఐదో క్లాస్ చదివిన అంజలి.. గోకుల్ను చూసి వెంటనే గుర్తు పడుతుంది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య జరిగే సంభాషణలు, స్కూల్ లవ్ స్టోరీ చాలా ఫన్నీగా చూపించాడు డైరెక్టర్. ఎప్పుడు ఇంట్లో ఒక్కడే ఉండే అన్బుల్కు ట్రిప్లో కొత్త దోస్తులు పరిచయమవుతారు. అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ.. కొత్త ఫ్రెండ్స్ తోడు కావడంతో అన్బుల్లో ఊహించని మార్పు రావడాన్ని దర్శకుడు చూపించిన విధానం బాగుంది. ట్రిప్ మధ్యలో అన్బుల్ తల్లి గ్లోరీ ఫోన్ చేసి కొడుకు గురించి ఆరా తీయడం, భార్య, భర్తల మధ్య సంభాషణలతో కామెడీ పండించారు డైరెక్టర్. ఈ కథలో సందేశం ఇస్తూనే ఎంటర్టైనింగ్తో పాటు పల్లె జీవితాన్ని ఆడియన్స్కు పరిచయం చేశాడు. కథనం నెమ్మదిగా సాగినాప్పటికీ.. క్లైమాక్స్ చివరి పదిహేను నిమిషాలు పరుగులు పెట్టించిన తీరు ఆకట్టుకుంది. ఓవరాల్గా నేటి జనరేషన్ జాబ్, బిజినెస్ అంటూ పిల్లల్ని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారనే విషయాన్ని తెరపై కళ్లకు కట్టినట్లుగా ఆవిష్కరించాడు. ఈ మూవీ చూసిన తర్వాతనైనా తల్లిదండ్రుల్లో కాస్త మార్పు రావాలని ఆశిద్దాం.నటీనటుల విషయానికొస్తే శివ, గ్రేస్ ఆంటోనీ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. చిన్న పిల్లాడు మిథుల్ తన పాత్రలో అదరగొట్టేశాడు. అంజలి పాత్ర కొద్దిసేపే కనిపించినా తన నటనతో ఆకట్టుకుంది. సాంకేతికత పరంగా ఫర్వాలేదనిపించేలా ఉంది. లోకేషన్స్, కొండ ప్రాంతాల విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సినిమా చూస్తున్నంత సేపు నేచురల్ ఫీలింగ్ కలుగుతుంది. నేపథ్య సంగీతం ఫర్వాలేదు. -
ఓటీటీకి క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళ చిత్రాలకు ఓటీటీల్లో ఫుల్ డిమాండ్ ఉంటోంది. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్స్కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పటికే తెలుగులో డబ్బింగ్ అయిన పలు మలయాళ చిత్రాలు, వెబ్ సిరీస్లు ఓటీటీ ప్రియులను అలరించాయి. ఇలాంటి జోనర్లో ఎక్కువగా ఆడియన్స్ కనెక్ట్ కావడంతో మరో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సుదేవ్ నాయర్, జిన్స్, జియో బేబీ కీలక పాత్రల్లో ఈ సిరీస్ను రూపొందించారు.కేరళ త్రిస్సూర్లోని అత్యంత వివాదాస్పద కేసు ఆధారంగా కమ్మటం అనే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ను తెరకెక్కించారు. ఓ వ్యక్తి అనుమానాస్పద రీతిలో రోడ్డు ప్రమాదంలో మరణించడం.. ఈ కేసు చుట్టు జరిగిన పరిణామాలే కమ్మటం వెబ్ సిరీస్. యదార్థ సంఘటనలతో ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ సిరీస్ను రూపొందించారు. ఈ సిరీస్లో మొత్తం ఆరు ఎపిసోడ్స్ ఉండనున్నాయి.ఈ క్రైమ్ ఇన్స్టిగేటివ్ వెబ్ సిరీస్ ఈ నెలలోనే ఓటీటీలో సందడి చేయనుంది. ఆగస్టు 29 నుంచి జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ ప్రత్యేక పోస్టర్ను పంచుకున్నారు. ఈ సిరీస్లో అజయ్ వాసుదేవ్, అఖిల్ కవలయూర్, అరుణ్ సోల్, శ్రీరేఖ, జోర్డీ పొంజా కీలక పాత్రలు పోషించారు. -
ఓటీటీలోకి డిఫరెంట్ స్టోరీతో తీసిన తెలుగు సినిమా
అప్పుడప్పుడు తెలుగులో డిఫరెంట్ కథలతో సినిమాలు వస్తుంటాయి. కాకపోతే స్టార్స్ లేకపోవడం వల్ల, మరేదైనా కారణం వల్లనో తెలియదు గానీ వాటికి పెద్దగా గుర్తింపు దక్కదు. అలాంటి ఓ మూవీనే 'కొత్తపల్లిలో ఒకప్పుడు'. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసి మరీ ప్రకటించారు. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఏ ఓటీటీలోకి రాబోతుంది?కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య సినిమాలని నిర్మించిన డాక్టర్ ప్రవీణ.. దర్శకురాలిగా మారి చేసిన తొలి మూవీ 'కొత్తపల్లిలో ఒకప్పుడు'. రూరల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ చిత్రం జూలై 18న థియేటర్లలోకి వచ్చింది. డీసెంట్ ప్రయత్నం అనే పేరు తెచ్చుకుంది. కాకపోతే బిగ్ స్క్రీన్పై నిలబడలేదు. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఆహా ఓటీటీలో ఆగస్టు 22 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. 'దేవుడంటే నిజమో అబద్దమో కాదు ఒక నమ్మకం' అనే కాన్సెప్ట్తో తీసిన చిత్రమిది.(ఇదీ చదవండి: 'అరేబియా కడలి' తెలుగు సిరీస్ రివ్యూ)'కొత్తపల్లిలో ఒకప్పుడు' విషయానికొస్తే.. కొత్తపల్లిలో అప్పన్న(రవీంద్ర విజయ్) ఊరందరికీ అప్పులిచ్చి వడ్డీల మీద వడ్డీలు కట్టించుకుంటూ ఉంటాడు. ఇతడి దగ్గరే రామకృష్ణ(మనోజ్ చంద్ర) సహాయకుడు. ఇదే ఊరిలో ఉండే రెడ్డి(బెనర్జీ) మనవరాలు సావిత్రిని(మౌనిక) రామకృష్ణ చిన్నప్పటి నుంచి ప్రేమిస్తుంటాడు. రికార్డింగ్ డ్యాన్సులు కూడా చేయించే రామకృష్ణ.. సావిత్రితో పక్క ఊరిలో డ్యాన్స్ చేయించాలని అనుకుంటాడు. నేరుగా ఆమెతో మాట్లాడే ధైర్యం లేక సావిత్రి ఇంట్లో పనిచేసే అందం(ఉషా) సాయం తీసుకుంటాడు. కానీ అనుకోని సంఘటనల కారణంగా అందంని రామకృష్ణ పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. మరోవైపు అప్పన్న చనిపోతాడు. తర్వాత ఊరిలో జరిగిన పరిణామాలేంటి? చివరకు రామకృష్ణ సావిత్రి ఒక్కటయ్యారా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'సు ఫ్రమ్ సో' రివ్యూ.. కన్నడలో బ్లాక్బస్టర్ మరి తెలుగులో?) -
'అరేబియా కడలి' తెలుగు సిరీస్ రివ్యూ
ఈ మధ్యే వచ్చిన 'కింగ్డమ్' సినిమాతో నటుడిగా మరోసారి ఆకట్టుకున్న సత్యదేవ్.. ఓ తెలుగు వెబ్ సిరీస్ చేశాడు. అదే 'అరేబియా కడలి'. ఆనంది హీరోయిన్. ప్రముఖ దర్శకుడు క్రిష్.. షో రన్నర్గా వ్యవహరించిన ఈ సిరీస్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో థియేటర్లలో రిలీజైన 'తండేల్' సినిమాతో ఈ సిరీస్ని పోల్చి చూస్తున్నారు. మరి రెండు ఒకే కథతో తీశారా? ఇంతకీ ఈ సిరీస్ ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?విశాఖ భీమిలిపట్నంలో మత్స్యవాడ, చేపలవాడ గ్రామాల ప్రజలు చాన్నాళ్లుగా గొడవపడుతుంటారు. జెట్టీలు లేకపోవడంతో చేపల వేటకు సరైన సదుపాయాలు ఉండవు. దీంతో బతుకు దెరువు కోసం గుజరాత్ వలస వెళ్తుంటారు. చేపలవాడ గ్రామానికి చెందిన బద్రి(సత్యదేవ్).. మత్స్యవాడకు చెందిన గంగని ప్రేమిస్తుంటాడు. మరోవైపు గుజరాత్ వెళ్లిన బద్రి.. తన బృందంతో కలిసి అనుకోకుండా పాకిస్థాన్ జలాల్లోకి వెళ్తాడు. దీంతో ఆ దేశ ఆర్మీ.. వీళ్లని బంధిస్తుంది. మరి బద్రితో పాటు ఉన్నవాళ్లని తీసుకొచ్చేందుకు ఊరి ప్రజలు ఎలాంటి ప్రయత్నాలు చేశారు? చివరకు ఏమైందనదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఈ సిరీస్ చూస్తున్నంతసేపు నాగచైతన్య 'తండేల్' సినిమానే గుర్తొస్తుంది. ఆల్రెడీ తెలిసిన కథ అయినప్పటికీ.. బాగానే తీశారు. చూస్తున్నంతసేపు ఎంగేజ్ అయ్యేలా చేశారు. కాకపోతే సినిమా రెండు-రెండున్నర గంటల్లోనే చెప్పేయాల్సి ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాల్ని అందులో సింపుల్గా చూపించేశారు. కానీ ఇది వెబ్ సిరీస్ కావడంతో చాలా డీటైల్డ్గా చూపించారు. అసలేం జరిగింది? జాలర్లు ఎలాంటి ఇబ్బందులు పడ్డారనేది విడమరిచి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ప్రతి ఎమోషన్ని చూపించారు.మొదట్లో చేపలవాడ, మత్స్యవాడ గ్రామాల మధ్య గొడవలు.. తర్వాత వేటకు వెళ్లడం, బద్రి-గంగ మధ్య లవ్ స్టోరీ. జాలర్ల కుటుంబాల్లోని బాధలు చూపిస్తూ కథని నిదానంగా తీసుకెళ్లారు. సహజత్వానికి దగ్గరగా సీన్లు చూపించారు. సముద్రంలోని జరిగే సన్నివేశాలు ఆసక్తి రేపుతూనే, ఉత్కంఠగానూ అనిపించాయి. పాక్ పోలీసులకు దొరికిపోయి అక్కడి జైల్లో మన జాలర్లు పడే ఇబ్బందులు ఎమోషనల్ అయ్యేలా చేశాయి.'తండేల్'ని ప్రేమకథగా తీస్తే.. ఈ సిరీస్ని మాత్రం కాస్త డిఫరెంట్ యాంగిల్లో చూపించారు. ప్రేమించినవాడితో కలిసి ఊరికి మంచి చేయాలనుకోవడం, జెట్టీ వస్తే తమ ఊరిప్రజలు వలస వెళ్లాల్సిన అవసరం లేదని హీరో భావించడం.. ఇలా హీరోహీరోయిన్లకు ఓ కారణాన్ని చూపించడం.. సినిమాని ఈ సిరీస్ని వేరు చేసి చూపించిందని చెప్పొచ్చు.ఎవరెలా చేశారు?స్వతహాగా సత్యదేవ్ ఉత్తరాంధ్రకు చెందినవాడు కావడంతో బద్రి పాత్రలో విశాఖ యాసలో ఆకట్టుకున్నాడు. గంగ రోల్ చేసిన ఆనంది కూడా పూర్తి న్యాయం చేసింది. 'కోర్ట్' ఫేమ్ రోషన్, చింతకింది శ్రీనివాసరావు, నాజర్ తదితరులు తమ పాత్రల ఫరిది మేరకు నటించారు. ఇది సిరీస్ కావడంతో కమర్షియల్ హంగులు లేకుండానే తెరకెక్కించారు. స్టోరీ పరంగా కొత్తగా ఆశిస్తే మాత్రం అసంతృప్తికి గురయ్యే అవకాశముంది. టెక్నికల్ అంశాలు కూడా బాగున్నాయి. ఫైనల్గా చెప్పాలంటే ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా చూస్తే ఈ సిరీస్ నచ్చేయొచ్చు. -
ఓటీటీలో హారర్ వెబ్ సిరీస్.. ఎప్పటినుంచంటే?
హారర్ సినిమాలకు క్రేజ్ ఎప్పుడూ ఉండేదే! తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ హారర్ వెబ్ సిరీస్ను ప్రకటించింది. అదే "అంధేరా" (Andhera). ఈ వెబ్ సిరీస్ను ఆగస్టు 14 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. అంధేరా విషయానికి వస్తే.. ప్రియా బాపత్, కరణ్వీర్ మల్హోత్రా, ప్రజక్త కోలి, సుర్వీన్ చావ్లా ప్రధాన పాత్రల్లో నటించారు. గౌరవ్ దేశాయ్ కథ అందించగా రాఘవ్ దర్ దర్శకత్వం వహించాడు. ఇది ఎనిమిది ఎపిసోడ్లుగా ప్రసారం కానుంది. Brace yourself, this Andhera doesn’t just haunt, it hunts 🫣#AndheraOnPrime, New Series, Aug 14 pic.twitter.com/vg5IAB3TgX— prime video IN (@PrimeVideoIN) August 6, 2025 చదవండి: 'గుడిసెలో జీవితం.. ఇంట్లోకి పాములు..' సూర్య ఎమోషనల్