OTT
-
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్
తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఓటీటీ (OTT)లోకి వచ్చేస్తోంది. కమెడియన్ వెన్నెల కిషోర్ హీరోగా నటించిన థ్రిల్లర్ మూవీ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. రవితేజ మహాదాస్యం, అనన్య నాగళ్ల జంటగా, శియా గౌతమ్ కీలక పాత్రలు పోషించారు. మోహన్ రచన, దర్శకత్వం వహించారు. డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ అందుకుంది.తాజాగా ఈ చిత్రం సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతోంది. కామెడీ, థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారు ఓటీటీలో ఓ లుక్కేయండి. షెర్లాక్ హోమ్స్ అన్న టైటిల్ ఎందుకు పెట్టారంటే.. ఈ సినిమాలో డిటెక్టివ్ తల్లి పేరు షర్మిలమ్మ, నాన్న పేరు లోకనాథ్, హీరో పేరు ఓం ప్రకాశ్. ఈ మూడు పేర్లలో ఫస్ట్ లెటర్ సౌండింగ్ అన్నీ కలిపి షెర్లాక్ హోమ్స్ అని పెట్టారు.(చదవండి: ఛావా ప్రభంజనం.. శివాజీ సినిమా వస్తే ఏమైపోతారో?)కథేంటంటే?రాజీవ్ గాంధీ హత్య జరిగిన రోజు (1991 మే 21న) శ్రీకాకుళం బీచ్లో మేరీ అనే యువతి దారుణ హత్యకు గురవుతుంది. ఈ కేసును సీరియస్గా తీసుకున్న సీఐ భాస్కర్ (అనీష్ కురివెళ్ల) వారం రోజుల్లో హంతకుడిని పట్టుకుంటానని, లేదంటే ఉద్యోగానికే రాజీనామా చేస్తానని శపథం చేస్తాడు. కానీ రాజీవ్ గాంధీ హత్య కేసు గురించి ఢిల్లీ నుంచి అధికారులు రావడంతో సీఐ పోలీస్ స్టేషన్లోనే ఉండాల్సి వస్తుంది. కేసు పరిష్కరించకపోతే పరువు పోతుందని దాన్ని ప్రైవేట్ డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ (వెన్నెల కిషోర్)కి అప్పగిస్తాడు. ఈ హత్య వెనక మేరీ స్నేహితులు భ్రమరాంభ(అనన్య నాగళ్ల), ఆమె ప్రియుడు బాలు(రవితేజ మహద్యం), మేరిపై మోజు పడ్డ ఝాన్సీ, సస్పెండ్ అయిన పోలీసు అధికారి పట్నాయక్(బాహుబలి ప్రభాకర్)తో పాటు ముగ్గురు జాలర్లు ఉన్నట్లు అనుమానిస్తున్నాడు. వీరిలో మేరీని చంపిందెవరు? దానిక గల కారణమేంటి? షెర్లాక్ హంతకుడిని తనకిచ్చిన గడువులో పట్టుకుంటాడా? లేదా? అన్నది తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే!చదవండి: జ్యోతికను తీసేయమన్నా.. నా మాట వినలేదు: బాలీవుడ్ నటి -
ఓటీటీలో 'కీర్తీ సురేష్' బాలీవుడ్ సినిమా.. ఉచితంగానే స్ట్రీమింగ్
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్- కీర్తీ సురేష్ జోడీగా నటించిన చిత్రం ‘బేబీ జాన్’.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా మిగిలిపోయిన ఈ సినిమా భారీగా నష్టాలను మిగిల్చింది. తమిళ దర్శకుడు అట్లీ, సినీ1 స్టూడియోస్, ఏ ఫర్ యాపిల్ పతాకాలపై జ్యోతీ దేశ్పాండే, మురాద్ ఖేతనీ, ప్రియా అట్లీ నిర్మించిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా గతేడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఇప్పటికే అమెజాన్లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, రూ. 349 అద్దె చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. అయితే, నేటి నుంచి ఈ చిత్రాన్ని ఉచితంగానే ఓటీటీలో చూసే అవకాశం ఉంది. హిందీ,తమిళ వర్షన్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ చిత్రం ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో చూడొచ్చు.బేబీ జాన్తో కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అందువల్ల ఈ మూవీపై ఆమే చాలా ఆశలు పెట్టుకుంది. కానీ, ప్రేక్షకులకు ఈ సినిమాకు కనెక్ట్ కాలేదు. దీంతో తన ఫస్ట్ సినిమానే డిజాస్టర్గా మిగిలిపోయింది. 2016లో అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన 'తేరి' సినిమాలో విజయ్ దళపతి, సమంత నటించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇదే కథతో బేబీ జాన్ రీమేక్ అయింది. సుమారు రూ. 160 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం రూ. 60 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. నెట్ పరంగా రూ. 40 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్లో భారీ డిజాస్టర్ లిస్ట్లో బేబీ జాన్ చేరిపోయింది. -
OTT: తమిళ్ మూవీ ‘జే బేబీ’ రివ్యూ
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం జే బేబీ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఈ సినిమా చూసేముందు ఎవరికి వారు రెండు ప్రశ్నలు వేసుకోవాలి. అదేమంటే మనకిష్టమైన వారిపై మనకెంతకాలం ఇష్టం ఉంటుంది? అలాగే, మనకు ఇష్టం లేని వారిపై కష్టం ఎంతవరకు ఉంటుంది... ఈ రెండు ప్రశ్నలు కాస్త విచిత్రమైనవే. కానీ వాటికి మనం ఇచ్చే సమాధానాన్ని బట్టే ఉంటుంది మనతో ఉన్న వారి జీవితం. మనకు తోడుగా ఇష్టంగా ఉండేవారు ఎందరో ఉంటారు. అలాగే వారంటే మనకెంత ఇష్టమో వారికి తెలియజేయాలి. ఈ జీవితం మీ తల్లి మీకు ప్రసాదించింది. ఆ జీవితాన్ని సరైన మార్గంలో నడిపించేది మీ తండ్రి. మరి ఆ తల్లిదండ్రుల వయస్సు పైబడిన తర్వాత వారికి అండగా ఉండాల్సింది మీరే. అలాంటి అండ కోరుకున్న ఓ అమ్మ కథే జే బేబి. కథ లైను వినడానికి సింపుల్గా ఉన్నా సినిమా చూసినంతసేపు వయస్సు పైబడ్డ మన తల్లిదండ్రులకు మన అవసరం ఏపాటిదో మనకు అర్థమవుతుంది. ఇది అల్లుకున్న కథ కాదు. వాస్తవ సంఘటన ఆధారంగా తీసిన సినిమా. ఈ కథ సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది. కథలోని పాత్రలు, కథా పాత్రల్లా కాక మన కళ్ల ముందే కదలాడుతున్న అనుభూతిని కలిగిస్తాయి. ఓ రకంగా చెప్పాలంటే ఈ సినిమా తల్లిదండ్రులున్న ప్రతి కొడుకు, కూతుళ్లు చూడవలసిన సినిమా. అంతలా ఏముంది ఈ సినిమాలో... ఓ సారి కథ చెప్పుకుందామా మరి. జే బేబి ఓ తమిళ సినిమా. దీనికి సురేష్ మారి దర్శకుడు. జే బేబికి ముగ్గురు సంతానం. శంకర్, సెంథిల్, కవిత. జే బేబి తన భర్త చనిపోయిన తర్వాత కుటుంబాన్ని అతికష్టం మీద పైకి తీసుకువస్తుంది. కానీ జే బేబీ మానసికస్థితి కొంత దెబ్బతింటుంది. చికిత్సకోసం పిల్లలు ఆసుపత్రిలో చేర్పిస్తే అక్కడి నుంచి తప్పించుకుని తెలియకుండా చెన్నైనగరం నుండి కోల్కతా చేరుకుంటుంది. జే బేబీని వెతికే క్రమంలో శంకర్,సెంథిల్ బయలుదేరతారు. తల్లిని వెదికే క్రమంలో ఒకే ప్రయాణాన్ని ప్రారంభించిన ఇద్దరు కొడుకులు ఓ వివాదం వల్ల మాట్లాడుకోని స్థితిలో ఉంటారు. మాట్లాడుకోని వీళ్లు, మానసిక పరిపక్వత లోపించిన తమ తల్లిని తమకు భాష రాని నగరానికి వెళ్లి ఎలా వెదుకుతారు?, అసలు వాళ్లకి మళ్లీ జే బేబీ దొరుకుతుందా?. ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమ్ అవుతున్న జే బేబి చూడాల్సిందే. సినిమాలోని ప్రధానపాత్రలో నటించిన ప్రముఖ నటి ఊర్వశి జే బేబి పాత్రను పోషించలేదు, జీవించింది. సినిమా ఆద్యంతం ఉత్కంఠతో నడుస్తూ అప్పుడప్పుడూ చక్కటి హాస్యాన్ని జోడించి స్క్రీన్ ప్లే అద్భుతంగా రాసుకున్నాడు దర్శకుడు. ఈ సినిమా, రివ్యూ మమతానురాగాలకోసం వయస్సు పైబడిన పసి మనస్సులకు అక్షరాంకితం.– ఇంటూరు హరికృష్ణ -
ఈ వారం ఓటీటీలో 12 సినిమాలు/ సిరీస్లు రిలీజ్
వాలంటైన్స్ వీక్ అయిపోయింది. ఎన్నో ప్రేమ చిత్రాలు అటు థియేటర్లో, ఇటు ఓటీటీ (OTT)లో అలరించాయి. ఈ వారం కూడా అదే జోష్ కొనసాగేలా ఉంది. తెలుగు చిత్రాలతో పాటు డబ్బింగ్ సినిమాలు సైతం థియేటర్లో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మరి ఫిబ్రవరి మూడో వారంలో థియేటర్, ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలేంటో చూసేద్దాం..థియేటర్లో రిలీజవుతున్న సినిమాలు..బాపు - ఫిబ్రవరి 21రామం రాఘవం - ఫిబ్రవరి 21రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ - ఫిబ్రవరి 21జాబిలమ్మ నీకు అంత కోపమా - ఫిబ్రవరి 21ఓటీటీ రిలీజెస్..జీ5క్రైమ్ బీట్ (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 21 జియో హాట్స్టార్ది వైట్ లోటస్: సీజన్ 3 (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 17విన్ ఆర్ లూజ్ - ఫిబ్రవరి 19ఊప్స్! అబ్ క్యా? - ఫిబ్రవరి 20ఆఫీస్ (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 21నెట్ఫ్లిక్స్అమెరికన్ మర్డర్: గాబీ పెటిటో (డాక్యు సిరీస్) - ఫిబ్రవరి 17కోర్ట్ ఆఫ్ గోల్డ్ (డాక్యుమెంటరీ) - ఫిబ్రవరి 18జీరో డే (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 20డాకు మహారాజ్ - ఫిబ్రవరి 20 అమెజాన్ ప్రైమ్రీచర్ సీజన్ 3 (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 20ఆపిల్ టీవీ ప్లస్సర్ఫేస్ సీజన్ 2 (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 21హోయ్చోయ్చాల్చిత్రో: ద ఫ్రేమ్ ఫాటల్ - ఫిబ్రవరి 21చదవండి: ఓయ్.. బుజ్జి, బంగారం కాకుండా జింగిలేంటి?: హీరోయిన్ -
రూ.8 కోట్లు పెడితే రూ.75 కోట్లు.. ఓటీటీలో మిస్టరీ థ్రిల్లర్
ఓటీటీ (OTT)లో ఎప్పటికప్పుడు బోలెడన్ని సినిమాలు, సిరీస్లు రిలీజవుతూనే ఉన్నాయి. తాజాగా మలయాళ హిట్ మూవీ డిజిటల్ ఎంట్రీకి సిద్ధమైంది. అసిఫ్ అలీ (Asif Ali), అనస్వర రాజన్ ప్రధాన పాత్రల్లో నటించిన రేఖాచిత్రం మూవీ (Rekhachithram Movie) ఓటీటీలో రిలీజవుతోంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీలివ్ (SonyLiv) సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 'అందరూ మర్చిపోయిన నేరం.. పాతిపెట్టిన నిజాన్ని వెలికితీసే సమయం ఆసన్నమైంది. మార్చి 7న రేఖాచిత్రం సోనీలివ్లో చూసేయండి' అని ప్రకటించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది. జనవరి 9న ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. కేవలం రూ.8 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన రేఖాచిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.75 కోట్లు వసూలు చేసింది.కథేంటంటే?మలక్కప్పర ప్రాంతంలో జరిగే ఘటనలు.. పోలీస్ ఇన్స్పెక్టర్ వివేక్ను కలవరపరిచే ఆత్మహత్య కేసు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అయితే వివేక్ ఆ కేసుని ఎంతకీ ఛేదించలేకపోతాడు. ఎటు వెళ్లినా కేసు ఓ కొలిక్కి రాదు. చివరకు ఈ కేసు.. మరో కేసుకి లీడ్ ఇస్తుంది. సినిమా షూటింగ్, అందులో మిస్ అయిన ఓ వ్యక్తి.. పాతిపెట్టిన శవం దొరకడం వంటి ఘటనలతో ట్విస్టుల మీద ట్విస్టులు వస్తుంటాయి. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేఖాచిత్రం ఓటీటీలో చూడాల్సిందే!రేఖాచిత్రం విషయానికి వస్తే.. అసిఫ్, అనస్వరతో పాటు మనోజ్ కె.జయన్, సిద్దిఖి, జగదీశ్, సాయికుమార్, హరిశ్రీ అశోకన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జాఫిన్ టి.చాకో దర్శకత్వం వహించాడు. ముజీబ్ మజీద్ సంగీతం అందించాడు.చదవండి: నోరు జారిన రష్మిక.. ఫైర్ అవుతున్న కన్నడ ప్రజలు! -
ప్రపంచ క్రికెట్ క్రీడాభిమానులకు కనువిందైన కానుక
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్తాన్(The Greatest Rivalry: India vs Pakistan) సిరీస్ ఒకటి. ఈ సిరీస్ గురించి తెలుసుకుందాం.భారతదేశంలో సినిమా తరువాత ఏది ఇష్టం అంటే సగటు భారతీయుడు ఠక్కున చెప్పేది క్రికెట్ అనే. నాటి రేడియో రోజుల నుండి నేటి డిజిటల్ ప్రొజెక్షన్ రోజుల వరకు ఎదుగుతున్న సాంకేతికత కన్నా మెరుపు వేగంలో ఎదుగుతోంది ఈ క్రికెట్ అభిమానం. మరీ ముఖ్యంగా ఇండియా– పాకిస్తాన్ మ్యాచ్ అంటే దేశం మొత్తానికి ఆ రోజు అప్రకటిత సెలవు లాంటిది. దాయాదుల పోరు అని చాలామంది ముద్దుగా పిలుచుకునే ఈ మ్యాచ్ ఎప్పుడు ఎక్కడ జరిగినా ప్రపంచం నలుమూలల నుండి ఆకాశమంత ఆదరణ ఉంటుంది. ఈ క్రమంలోనే నెట్ఫ్లిక్స్ ఇరు దేశాల క్రికెట్ ఆటపై ‘ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్తాన్’ అనే సిరీస్ రూపొందించింది. నాలుగు భాగాలతో ఉన్న ఈ సిరీస్లో భారతదేశం సాధించిన నాటి ప్రపంచ కప్ నుండి నేటి ప్రపంచ కప్ వరకు ప్రతిదీ విశ్లేషించిన ప్రయత్నం అత్యంత ప్రశంసనీయం. సిరీస్లో పత్రికా విలేకరుల నుండి పరోక్ష, ప్రత్యక్ష ఆటగాళ్లతో వివరించిన విధానం ఓ అద్భుతమనే చెప్పాలి. ఈ సిరీస్ ద్వారా ప్రపంచ క్రికెట్ క్రీడాభిమానులకు ఎన్నో వివరణలు, విశ్లేషణలు, రహస్యాలు దృశ్య రూపంలో అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం ఇండియా– పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే ఎంత ఉత్కంఠగా ఉంటుందో అంతకు వేయి రెట్లు ఉత్కంఠ, ఉత్సాహం ఈ సిరీస్ చూస్తున్నంతసేపు ప్రేక్షకులకు కలుగుతుందనడంలో సందేహమే లేదు.క్రికెట్ మ్యాచ్ టీవీలలో ప్రసారమనేది మామూలే కానీ, అదే క్రికెట్ వెనుక జరిగిన తతంగం చూపడమనేది వంద క్రికెట్ మ్యాచులు ఒకేసారి చూడడం లాంటిది. ఓటీటీ వేదికైన నెట్ఫ్లిక్స్ ఈ విషయంలో మాత్రం ప్రేక్షకుల నాడి సరిగ్గా పట్టుకుంది. ఈ సిరీస్ మొత్తం తెలుగులోనూ లభ్యం. కాబట్టి కాసేపు ఈ క్రికెట్ రైవల్రీ ఏంటో చూసేయండి. – ఇంటూరు హరికృష్ణ -
బ్యూటీ టీజర్ చూశారా?
ఆయ్ ఫేమ్ అంకిత్ కొయ్య, నీలఖి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం బ్యూటీ. గీతా సుబ్రమణ్యం, హలో వరల్డ్, భలే ఉన్నాడే ఫేమ్ వర్ధన్ దర్శకత్వం వహించారు. వానరా సెల్యూలాయిడ్, మారుతీ టీం ప్రొడక్ట్, జీ స్టూడియోస్ బ్యానర్లపై అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కె ఆర్ బన్సాల్ నిర్మించారు. ఈ సినిమాకు బి.ఎస్. రావు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే సందర్భంగా ‘బ్యూటీ’ టైటిల్ను ప్రకటించడంతోపాటు ఫస్ట్లుక్ పోస్టర్, టీజర్ను కూడా విడుదల చేశారు. నరేష్, వాసుకి, నంద గోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న, మురళీ గౌడ్, ప్రసాద్ బెహరా వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్గా శ్రీ సాయి కుమార్ దారా పని చేస్తున్నారు. విజయ్ బుల్గనిన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్షన్: బేబీ సురేష్ భీమగాని, ఎడిటింగ్: ఎస్బి ఉద్ధవ్. చదవండి: -
ఓటీటీకి కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్.. మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్
శాండల్వుడ్ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మ్యాక్స్. గతేడాది డిసెంబర్లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో హనుమాన్ నటి వరలక్ష్మి శరత్కుమార్ కీలక పాత్ర పోషించారు. టాలీవుడ్ నటుడు సునీల్ ఈ మూవీతో కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఈ సినిమాను వి క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్ థాను నిర్మించారు.తాజాగా ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈ నెల 15 నుంచే జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానుంది. మొదట ఈ నెల 22 నుంచి స్ట్రీమింగ్కు రానుందని భావించారు. కానీ వారం రోజుల ముందుగానే ఓటీటీ ప్రియులను అలరించేందుకు వస్తోంది. ఈ మేరకు ప్రత్యేత పోస్టర్ను రిలీజ్ చేశారు. దీంతో మరికొన్ని గంటల్లోనే ప్రేక్షకులను అలరించనుంది మ్యాక్స్ మూవీ. ఈ చిత్రంలో అర్జున్ మహాక్షయ్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కిచ్చా సుదీప్ అభిమానులను మెప్పించారు.మ్యాక్స్ కథేంటంటే..సస్పెండ్ అయిన సీఐ అర్జున్ అలియాస్ మాక్స్(సుదీప్ కిచ్చా) తిరిగి తన డ్యూటీలో జాయిన్ అయ్యేందుకు వస్తుంటాడు. అదే సమయంలో ఓ లేడీ కానిస్టేబుల్తో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఇద్దరిని చితక్కొట్టి అరెస్ట్ చేస్తాడు. వారిద్దరు మంత్రుల కొడులని తర్వాత తెలుస్తుంది. ఆ మంత్రులు ఇద్దరు సీఎంను దించేందుకు కుట్ర పన్ని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంటారు. అదే రోజు రాత్రి పోలీసు స్టేషనల్లో ఉన్న మంత్రుల కొడుకులిద్దరు చనిపోతారు. వారిద్దరు ఎలా చనిపోయారు..? మినిస్టర్స్ కొడుకుల చనిపోయారనే విషయం బయటకు తెలియకుండా పోలీసులు ఆడిన డ్రామా ఏంటి? మాక్స్ దగ్గర బంధీగా ఉన్న మినిస్టర్స్ కొడుకులను బయటకు తెచ్చేందుకు క్రైమ్ ఇన్స్పెక్టర్ రూప(వరలక్ష్మీ శరత్ కుమార్), గ్యాంగ్స్టర్ గని(సునీల్) చేసిన ప్రయత్నం ఏంటి? తన తోటి సహచరుల ప్రాణాలను కాపాడేందుకు మాక్స్(Max Review) ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. The MAXxive blockbuster from Kannada cinema!Premieres 15th February@KicchaSudeep @theVcreations @Kichchacreatiin @vijaykartikeyaa @AJANEESHB @shekarchandra71 @ganeshbaabu21 @shivakumarart @dhilipaction @kevinkumarrrr @ChethanDsouza @shobimaster @saregamasouth @ZeeKannada pic.twitter.com/ox5wN6U4OO— ZEE5 Telugu (@ZEE5Telugu) February 13, 2025 -
OTT: పది రోజులుగా ఓటీటీలో ట్రెండ్ అవుతున్న వెబ్ సిరీస్
ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో రూపొందిన కోబలి వెబ్ సిరీస్కు ఓటీటీలో మంచి ఆదరణ లభించింది. రవి ప్రకాష్, రాకీ సింగ్ ప్రధాన పాత్రలు పోషించగా.. తరుణ్ రోహిత్, శ్రీతేజ్, శ్యామల, యోగి ఖత్రి, శ్రీ పవన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. రేవంత్ లేవాక దర్శకత్వం వహించారు. 'నింబస్ ఫిలిమ్స్', 'యు1 ప్రొడక్షన్స్', 'టి.ఎస్.ఆర్ మూవీ మేకర్స్' సంస్థలపై జ్యోతి మెగావత్ రాథోడ్, రాజశేఖర్ రెడ్డి కామిరెడ్డి, తిరుపతి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మించారు. ఫిబ్రవరి 4న హాట్స్టార్లో రిలీజైన ఈ సిరీస్ ఏడు భాషల్లో స్ట్రీమ్ అవుతోంది. ఇప్పటికీ నెంబర్ వన్ ప్లేస్లో ట్రెండ్ అవుతోంది. ఈ సందర్భంగా గురువారం నాడు కోబలి సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నటుడు రవి ప్రకాష్ మాట్లాడుతూ.. "నేను ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళయింది. కొత్తగా ఏదో ఒకటి చేయాలనే తపనతో 'కోబలి' మొదలుపెట్టాను. ఒక కాఫీ షాప్లో ఈ కథ విన్నాను. నచ్చింది. కానీ ఇది ముందుకు వెళ్తుందనే నమ్మకం కలగలేదు.ఎందుకంటే అంతా కొత్తవాళ్లే. ఈ కంటెంట్లో అమ్ముడు పోయే ముఖం ఒక్కటి కూడా లేదు. అయినప్పటికీ ఈ సిరీస్ను ప్రేక్షకులు ఆదరించారు. నిజాయితీగా పనిచేస్తే ఫలితం తప్పకుండా వస్తుందని నిరూపించారు" అంటూ చెప్పుకొచ్చారు. రాకీ సింగ్ మాట్లాడుతూ.. "చిన్న పాత్ర అయినా చేయడానికి ముందుకు వచ్చిన వెంకట్ గారికి థాంక్స్. కానీ సీజన్ 2 లో ఆయన పాత్ర ఎక్కువగా ఉంటుంది. అసలైన కథ అక్కడ మొదలవుతుంది. ఇది జస్ట్ ట్రైలరే" అన్నారు. సీనియర్ హీరో వెంకట్ మాట్లాడుతూ.. "నిజంగానే ఇందులో అంతా కొత్తవాళ్లే. కానీ హాట్ స్టార్ సంస్థ మమ్మల్ని నమ్మింది. ప్రేక్షకులు బాగా ఆదరించారు. 7 భాషల్లోనూ కోబలి మంచి విజయాన్ని అందుకుంది. రేవంత్, నాతో కూడా ఒక సినిమా చెయ్యి. అంతకు మించి నీ హార్డ్ వర్క్ గురించి పొగడలేను. స్టార్లు ఉంటేనే కంటెంట్ ని ప్రేక్షకులు ఆదరిస్తారు అనేది పాత మాట. ఇప్పుడు కాలం మారింది.కంటెంట్ బాగుంటే కొత్త, పాత తేడా లేదని ప్రేక్షకులు నిరూపిస్తూనే ఉన్నారు" అని చెప్పుకొచ్చారు. చదవండి: సుకుమార్ ఇంట వ్రతం.. ఫోటోలు షేర్ చేసిన తబిత -
ఓటీటీలో 'డాకు మహారాజ్' ఆలస్యం.. ఆ రూల్ పాటిస్తున్న బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించిన చిత్రం 'డాకు మహారాజ్'.. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 150 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటికే చాలాచోట్ల థియటర్ రన్ ముగిసింది. కానీ, ఓటీటీలో ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి రేసులో వచ్చిన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఇప్పటికే ఓటీటీలో రన్ అవుతుంది. వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా మరో రెండు రోజుల్లో స్ట్రీమింగ్కు రావచ్చని చిత్ర యూనిట్ సమాచారం ఇచ్చింది. కానీ, డాకు మహారాజ్( Daaku Maharaaj) ఓటీటీలోకి అడుగుపెట్టేందుకు మరింత సమయం పట్టేలా ఉంది.డాకు మహారాజ్ ఓటీటీ ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి రెండో వారంలో స్ట్రీమింగ్కు వస్తుందని నెట్టింట భారీగా వార్తలు వచ్చాయి. అయితే, అందులో నిజం లేదని తేలిపోయింది. డాకు మహారాజ్ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. కానీ, స్ట్రీమింగ్ వివరాలను ఎక్కడా కూడా ప్రకటించలేదు. అందుకు ప్రధాన కారణం సినిమా నిర్మాతలతో చేసుకున్న ఒప్పందమే అని తెలుస్తోంది.డాకు మహారాజ్ సినిమా విడుదలైన రోజు నుంచి 50 రోజుల థియేటర్ రన్ పూర్తయిన తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలనే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నిబంధనను చిత్ర యూనిట్ పాటిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ సినిమా తెలుగు, హిందీ వర్షన్లో విడుదలైంది. అయితే, ఓటీటీ కోసం తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్లో ఉన్నారు. ఆ భాషలకు సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా ప్రస్తుతం జరుగుతున్నాయట. అవి పూర్తి అయ్యేందుకు మరింత సమయం పట్టే ఛాన్స్ ఉంది. ఓటీటీ కోసం మరికొన్ని సీన్లు కూడా అధనంగా జోడించనున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా మార్చి 4న 'డాకు మహారాజ్' ఓటీటీ ఎంట్రీ ఉండొచ్చని తెలుస్తోంది.బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలకపాత్ర పోషించారు. వీరితో పాటు శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా, రిషి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందించగా భారీ బడ్జెట్తో నాగవంశీ నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. -
మరో ఓటీటీకి శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శాండల్వుడ్ స్టార్ హీరో శివరాజ్కుమార్ (Shiva Rajkumar) నటించిన యాక్షన్ థ్రిల్లర్ భైరాతి రణగల్ (Bhairathi Ranagal). గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. 2024లో శివరాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం ఇదే కావడం విశేషం. అయితే ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ ప్రియులకు అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. నర్తన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాహుల్బోస్, రుక్మిణి వసంత్, దేవరాజ్ కీలక పాత్రలు పోషించారు. అయితే తాజాగా భైరాతి రణగల్ మరో ఓటీటీకి రానుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ నెల 13 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు పోస్టర్ను విడుదల చేసింది.చికిత్స కోసం అమెరికాకు..ఈ మూవీ తర్వాతే శివరాజ్ కుమార్ అమెరికాకు వెళ్లి క్యాన్సర్ చికిత్స తీసుకున్నారు. క్యాన్సర్ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత యూఎస్ నుంచే అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. మీ అందరి ప్రేమతో త్వరగా కోలుకుని మీ ముందుకు వస్తానని శివరాజ్ కుమార్ అన్నారు. ఇటీవలే అమెరికా నుంచి బెంగళూరు చేరుకున్న ఆయనను పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కలిసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
విలేజ్లో మిస్టరీ సినిమా.. ఓటీటీలో స్ట్రీమింగ్
రవితేజ నున్నా, నేహ జురెల్ హీరో హీరోయిన్గా నటించిన చిత్రం ‘రాజుగారి అమ్మాయి.. నాయుడుగారి అబ్బాయి’. గతేడాది మార్చిలో విడుదలైన ఈ చిత్రం సుమారు పది నెలల తర్వాత సడెన్గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. మణికొండ రంజిత్ సమర్పణలో సత్యరాజు దర్శకత్వంలో ముత్యాల రామదాసు, నున్నా కుమారి నిర్మించిన ఈ చిత్రం ఒక విలేజ్ బ్యాక్డ్రాప్గా తెరకెక్కించారు.మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే కథతో వచ్చిన ‘రాజుగారి అమ్మాయి.. నాయుడుగారి అబ్బాయి’ సడెన్గా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. హీరోయిన్ హత్యతో సినిమా కథ మొదలౌతుంది. ఆపై ఒక్కసారిగా ఊహించని మలుపు తిరుగుతుంది. ఆమెను కథానాయకుడే చంపాడని, పోలీసులు అతని కోసం వెతుకుతుంటారు. అసలు రాజు గారి అమ్మాయి ఎలా చనిపోయింది? నాయుడు గారి అబ్బాయే ఆమెను హత్య చేశాడా? హత్యకు కారణమేంటి? అనే ఇంపాక్ట్తో కథ ఉంటుంది. లవ్ స్టోరీకి మర్డర్ మిస్టరీ అంశాలను జోడించారు. కానీ, ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది.చిన్న సినిమాగా విడుదలైన రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి టైటిల్ను షార్ట్ కట్లో రానా పేరుతో ప్రమోట్ చేశారు. ఐఎమ్డీబీలో 8.5 రేటింగ్ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో చాలామంది కొత్తవారే నటించారు. కానీ, నటన పరంగా వారికి మంచి మార్కులే పడ్డాయి. -
ఓటీటీకి 'సంక్రాంతికి వస్తున్నాం'.. ఇలాంటి ట్విస్ట్ ఊహించలేదు భయ్యా!
అయితే సంక్రాంతి బ్లాక్బస్టర్గా నిలిచిన ఈ చిత్రం కోసం ఓటీటీ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓటీటీకి ఎప్పుడొస్తుందా అని నెట్టింట తెగ వెతికేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదలై దాదాపుగా నెల రోజులు కావొస్తోంది. దీంతో సినీ ప్రియులంతా ఓటీటీ రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్కు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ వచ్చేసింది. అయితే ఇక్కడ ఆడియన్స్కు బిగ్ ట్విస్టే ఇచ్చారు మేకర్స్. ఇంతకీ అదేంటో చూసేయండిట్విస్ట్ ఇచ్చిన మేకర్స్..అయితే ఓటీటీ రిలీజ్పై చిత్రబృందం నుంచి ఇప్పటి వరకైతే ఎలాంటి ప్రకటన రాలేదు. ఫిబ్రవరి రెండో వారంలోనైనా ఓటీటీకి వస్తుందేమోనని సినీ ప్రేక్షకులు భావించారు. కానీ స్ట్రీమింగ్కు సంబంధించిన ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో కాస్తా నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఆడియన్స్కు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది.ఓటీటీ రిలీజ్పై సస్పెన్స్..త్వరలోనే సంక్రాంతి వస్తున్నాం మీ ముందుకు వస్తుందని జీ తెలుగు ట్విటర్ ద్వారా వెల్లడించింది. మళ్లీ సంక్రాంతికి వైబ్స్ను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఫస్ట్ టీవీలో వస్తున్నాం అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఓటీటీ కంటే ముందుగా టీవీలోనే వెంకీమామ సంక్రాంతి బ్లాక్బస్టర్ ప్రేక్షకులు చూసే అవకాశం దక్కింది. అయితే ఓటీటీ విడుదలపై మాత్రం ఎలాంటి తేదీని రివీల్ చేయలేదు. ఈ లెక్కను చూస్తే ఈ వారంలోనే టీవీల్లో సంక్రాంతికి వస్తున్నాం సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. Get ready to relive the Sankranthi vibe again 💥😁#SankranthikiVasthunnam Coming Soon On #ZeeTelugu #SankranthiKiVasthunnamOnZeeTelugu#WorldTelevisionPremiereSankranthikiVasthunnam#FirstTVloVasthunnam #TVbeforeOTT #SVonTV@VenkyMama @anilravipudi @aishu_dil @Meenakshiioffl… pic.twitter.com/pIP6UUoNIY— ZEE TELUGU (@ZeeTVTelugu) February 10, 2025 -
వాలంటైన్స్ వీక్.. ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు రిలీజ్
ఈ వారం ప్రేమికులకు ఎంతో స్పెషల్. చాక్లెట్ డే, కిస్ డే, ప్రపోజ్ డే, టెడ్డీ డే, హగ్ డే, వాలంటైన్స్డే అని రోజుకో రకంగా సెలబ్రేషన్స్ చేసుకుంటారు. మరి ఈ వారం (ఫిబ్రవరి 10- 16 వరకు) అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో రిలీజయ్యే సినిమాలేంటో చూసేద్దాం..థియేటర్లో విడుదలయ్యే చిత్రాలు..లైలా - ఫిబ్రవరి 14బ్రహ్మా ఆనందం - ఫిబ్రవరి 14ఇట్స్ కాంప్లికేటెడ్ (గతంలో ఇది కృష్ణ అండ్ హిజ్ లీలా టైటిల్తో ఓటీటీలో రిలీజైంది) - ఫిబ్రవరి 14తల - ఫిబ్రవరి 14ఛావా - ఫిబ్రవరి 14ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, సిరీస్లు..అమెజాన్ ప్రైమ్ వీడియోమై ఫాల్ట్: లండన్ - ఫిబ్రవరి 13నెట్ఫ్లిక్స్బ్లాక్ హాక్ డౌన్ - ఫిబ్రవరి 10కాదలిక్క నేరమిల్లై - ఫిబ్రవరి 11ద విచర్: సైరెన్స్ ఆఫ్ ద డీప్ (యానిమేటెడ్ సిరీస్) - ఫిబ్రవరి 11డెత్ బిఫోర్ ద వెడ్డింగ్ - ఫిబ్రవరి 12ద ఎక్స్చేంజ్ సీజన్ 2 - ఫిబ్రవరి 13కోబ్రా కై సీజన్ 6, పార్ట్ 3 - ఫిబ్రవరి 13ధూమ్ ధామ్ - ఫిబ్రవరి 14మెలో మూవీ - ఫిబ్రవరి 14ఐయామ్ మ్యారీడ్.. బట్! - ఫిబ్రవరి 14హాట్స్టార్బాబీ ఔర్ రిషికి లవ్స్టోరీ - ఫిబ్రవరి 11ఆహాడ్యాన్స్ ఐకాన్ 2 (డ్యాన్స్ షో) - ఫిబ్రవరి 14జీ5ప్యార్ టెస్టింగ్ - ఫిబ్రవరి 14సోనీలివ్మార్కో - ఫిబ్రవరి 14హోయ్చోయ్బిషోహోరి - ఫిబ్రవరి 13లయన్స్గేట్ ప్లేసబ్సర్వియన్స్ - ఫిబ్రవరి 14చదవండి: హీరోలతో వన్స్మోర్.. హీరోయిన్లతో మాత్రం... అదన్నమాట సంగతి! -
ఓటీటీకి కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శాండల్వుడ్ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మ్యాక్స్. గతేడాది డిసెంబర్లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో హనుమాన్ నటి వరలక్ష్మి శరత్కుమార్ కీలక పాత్ర పోషించారు. టాలీవుడ్ నటుడు సునీల్ ఈ మూవీతో కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తాజాగా ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈ నెల 22 నుంచి జీ5 వేదికగా ఓటీటీలో అందుబాటులోకి రానుంది. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కిచ్చా సుదీప్ యాక్షన్ సీన్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. కాగా.. ఈ సినిమాను వి క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్ థాను నిర్మించారు.మ్యాక్స్ కథేంటంటే..సస్పెండ్ అయిన సీఐ అర్జున్ అలియాస్ మాక్స్(సుదీప్ కిచ్చా) తిరిగి తన డ్యూటీలో జాయిన్ అయ్యేందుకు వస్తుంటాడు. అదే సమయంలో ఓ లేడీ కానిస్టేబుల్తో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఇద్దరిని చితక్కొట్టి అరెస్ట్ చేస్తాడు. వారిద్దరు మంత్రుల కొడులని తర్వాత తెలుస్తుంది. ఆ మంత్రులు ఇద్దరు సీఎంను దించేందుకు కుట్ర పన్ని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంటారు. అదే రోజు రాత్రి పోలీసు స్టేషనల్లో ఉన్న మంత్రుల కొడుకులిద్దరు చనిపోతారు. వారిద్దరు ఎలా చనిపోయారు..? మినిస్టర్స్ కొడుకుల చనిపోయారనే విషయం బయటకు తెలియకుండా పోలీసులు ఆడిన డ్రామా ఏంటి? మాక్స్ దగ్గర బంధీగా ఉన్న మినిస్టర్స్ కొడుకులను బయటకు తెచ్చేందుకు క్రైమ్ ఇన్స్పెక్టర్ రూప(వరలక్ష్మీ శరత్ కుమార్), గ్యాంగ్స్టర్ గని(సునీల్) చేసిన ప్రయత్నం ఏంటి? తన తోటి సహచరుల ప్రాణాలను కాపాడేందుకు మాక్స్(Max Review) ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీలో 'మహేశ్ బాబు' మేనల్లుడి సినిమా స్ట్రీమింగ్
'దేవకీ నందన వాసుదేవ' మూవీ ఓటీటీలోకి రానుంది. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది. 'హీరో' అనే సినిమాతో మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ మూవీ పెద్దగా ఆడలేదు. ఇప్పుడు ఇతడు మరోసారి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీనే ఈ 'దేవకీ నందన వాసుదేవ'. ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ స్టోరీ అందించారు. మైథలాజికల్ యాక్షన్ సినిమాకు ఒక వర్గం ప్రేక్షకుల నుంచి పర్వాలేదనిపించింది. మేనల్లుడి కోసం మహేష్ బాబు కూడా ఇందులో నటించబోతున్నాడని నెట్టింట ప్రచారం దక్కడంతో ఈ సినిమాకు భారీ బజ్ క్రియేట్ చేసింది. అయితే, బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.ఫిబ్రవరి 8 నుంచి 'దేవకీ నందన వాసుదేవ' చిత్రం డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్కు రానుంది. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కానీ, హిందీ వర్షన్లో మాత్రమే విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అయితే, ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. అదే సమయంలో కలర్స్ సినీప్లెక్స్ ఛానెల్లోనూ ఈ చిత్రం ప్రసారం కానుంది. తెలుగు మూవీ అయినప్పటికీ ఓటీటీ, టీవీలో మొదట హిందీ వర్షన్ రావడం విశేషం. అయితే, తెలుగు వర్షన్ కూడా ఫిబ్రవరి 8 నుంచే అందుబాటులోకి రావచ్చని నెట్టింట ప్రచారం జరుగుతుంది.ప్రశాంత్ వర్మ పేరుతో ఈ సినిమాని పాన్ ఇండియాలో కూడా ప్రమోట్ చేశారు. 'ఆదిపురుష్'లో హనుమంతుడిగా చేసిన దేవదత్తా.. ఇందులో విలన్గా చేశాడు. 'దేవకి నందన వాసుదేవ' సినిమాలో కృష్ణుడు, కంసుడు రిఫరెన్స్లతో కథను రాసుకున్నారు. సాయి మాధవ్ చాలా అద్భుతమైన డైలాగ్స్ రాశారు. ఎమోషనల్ డెప్త్ పట్టుకుని కథకి తగ్గట్టుగా మాటలందించారు. భీమ్స్ ఈ సినిమాకి తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో మెప్పించాడు. -
నెల రోజుల్లోపే ఓటీటీకి సంక్రాంతి చిత్రం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కోలీవుడ్ స్టార్ జయం రవి, నిత్యామీనన్ జంటగా నటించిన చిత్రం కాదలిక్కా నేరమిల్లై(Kadhalikka Neramillai). ఈ సినిమాను కృతిక ఉదయనిధి తెరకెక్కించారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైంది. కోలీవుడ్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. జనవరి 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం తాజాగా ఓటీటీకి(OTT) వచ్చేందుకు సిద్ధమైంది.పొంగల్ కానుకగా థియేటర్లలో ఫ్యాన్స్ను అలరించిన కాదలిక్కా నేరమిల్లై ఈ నెల 11 నుంచే ఓటీటీలో సందడి చేయనుంది. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది. దీంతో నెల రోజుల్లోపే ఓటీటీ ప్రియులను అలరించనుంది కాదలిక్కా నేరమిల్లై మూవీ.(ఇది చదవండి: వారికేమో ముద్దులు, హగ్గులు.. అభిమానితో అలాగేనా?.. హీరోయిన్పై నెటిజన్స్ ఫైర్!)కాగా.. ఈ చిత్రానికి తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ నిర్మాతగా వ్యవహరించారు. ఆయన సతీమణి కృతిక ఉదయనిధి దర్శకత్వం వహించారు. దర్శకురాలిగా ఆమెకు ఇది మూడో సినిమా కావడం మరో విశేషం. ఈ చిత్రంలో జయం రవి, నిత్యతో పాటు యోగి బాబు, వినయ్, లాల్, లక్ష్మీ రామకృష్ణన్, వినోదిని, గాయకుడు మనో, టీజే బాను, జాన్ కోగన్ ప్రధాన పాత్రలు పోషించారు. రెడ్ జెయింట్ మూవీస్ నిర్మించనున్న ఈ చిత్రానికి మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రఘుమాన్ సంగీతం అందించారు.తెలుగులో నిత్యా మీనన్ కెరీర్..అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది నిత్యా మీనన్. అలా మొదటి చిత్రంతోనే జనాలకు బాగా నచ్చేసింది. 180, ఇష్క్, జబర్దస్త్, గుండె జారి గల్లంతయ్యిందే, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి, ఒక అమ్మాయి తప్ప, జనతా గ్యారేజ్, అ, నిన్నిలా నిన్నిలా, భీమ్లా నాయక్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తమిళంలో ఇడ్లీ కడాయ్, డియర్ ఎక్సెస్ సహా మరో సినిమా చేస్తోంది. Kadhalargal gavanathirkku 👀💕… kadhalikka neram odhikkirunga, yaena…Kadhalikka Neramillai is coming soon to Netflix on 11 February, in Tamil, Telugu, Malayalam, Kannada and Hindi!#KadhalikkaNeramillaiOnNetflix pic.twitter.com/nuAQsDsjy9— Netflix India South (@Netflix_INSouth) February 6, 2025 -
ఓటీటీలో 'ముఫాసా: ది లయన్ కింగ్' స్ట్రీమింగ్
హాలీవుడ్ బ్లాక్బస్టర్ ఫిల్మ్ ‘ది లయన్ కింగ్ (2019)’ సినిమాకు ప్రీక్వెల్గా ‘ముఫాసా: ది లయన్ కింగ్’ అనే చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. బారీ జెంకిన్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. వాల్ట్ డిస్నీ పిక్చర్స్ పతాకంపై అడెలె రోమన్ స్కీ, మార్క్ సెరియాక్ ఈ సినిమాను నిర్మించారు. డిసెంబరు 20న విడుదలైన ఈ సినిమా ఇండియాలో కూడా ప్రేక్షకులను మెప్పించింది. సుమారు రూ. 1260 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 3,200 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఓటీటీకి రానున్నడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.‘ముఫాసా: ది లయన్ కింగ్’ చిత్రం ఫిబ్రవరి 18న డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రీమియర్ అవుతుంది. అయితే, రెంటల్ విధానంలో అధనంగా డబ్బు చెల్లించి ఈ చిత్రాన్ని చూసే అవకాశం ఉంటుంది. ఆపై ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ, ఫాండాంగోతో సహా వీడియో-ఆన్-డిమాండ్ (VOD) ప్రాతిపదికన అందుబాటులో ఉంటుంది. ఇక్కడ కూడా అదనంగా రెంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి మాత్రమే ఈ చిత్రాన్ని ఉచితంగా చూసే అవకాశం ఉంటుందని డిస్నీ ప్లస్ హాట్స్టార్కు సంబంధించిన ఒకరు స్క్రీన్రాంట్ మీడియాతో తెలిపారు.ఇంగ్లిష్, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన ‘ముఫాసా: ది లయన్ కింగ్’ చిత్రంలో టైటిల్ రోల్కు టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో తెలుగు ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. హిందీ వెర్షన్లో ముఫాసా పాత్రకు షారుక్ ఖాన్, ముఫాసా చిన్నప్పటి పాత్రకు ఆయన కుమారుడు అబ్రం వాయిస్ అందించారు. ఈ చిత్రంలోని సింబా పాత్రకు షారుక్ పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్ వాయిస్ ఇవ్వడం విశేషం. -
ఓటీటీలో సెడెన్గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ 'బేబీ జాన్'
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటించిన తాజా హిందీ చిత్రం ‘బేబీ జాన్’. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం సడెన్గా ఓటీటీలోకి వచ్చేసింది. కాలీస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తీ సురేష్, వామికా గబ్బి హీరోయిన్లుగా నటించారు. తమిళ దర్శకుడు అట్లీ, సినీ1 స్టూడియోస్, ఏ ఫర్ యాపిల్ పతాకాలపై జ్యోతీ దేశ్పాండే, మురాద్ ఖేతనీ, ప్రియా అట్లీ నిర్మించిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న రిలీజ్ అయింది. అయితే బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్గా మిగిలింది. బేబీ జాన్తో కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అందువల్ల ఈ మూవీపై ఆమే చాలా ఆశలు పెట్టుకుంది. కానీ, ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ కాలేదు. దీంతో తన ఫస్ట్ సినిమానే డిజాస్టర్గా మిగిలిపోయింది.బేబీ జాన్ చిత్రం సడెన్గా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, ఈ చిత్రాన్ని చూడాలంటే అదనంగా రూ. 349 రెంట్ చెల్లించాల్సి ఉంటుంది. వాలెంటైన్స్ డే నుంచి ఈ చిత్రాన్ని ఉచితంగా చూసేందుకు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం హిందీ తమిళ్ వర్షన్లో మాత్రమే బేబీ జాన్ అందుబాటులో ఉంది. ఇంగ్లీష్తో పాటు మరో 9 భాషలలో సబ్ టైటిల్స్తో చూడొచ్చు. 2016లో అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన 'తేరి' సినిమాలో విజయ్ దళపతి, సమంత నటించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇదే కథతో బేబీ జాన్ రీమేక్ అయింది. సుమారు రూ. 160 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం రూ. 60 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. నెట్ పరంగా రూ. 40 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్లో భారీ డిజాస్టర్ లిస్ట్లో బేబీ జాన్ చేరిపోయింది.బేబీ జాన్ కోసం గ్లామర్ డోస్ పెంచిన కీర్తిబేబీ జాన్ మూవీ సాంగ్లో కీర్తి సురేష్ కాస్త గ్లామర్ డోస్ పెంచింది. ఇప్పటి వరకు డీసెంట్ రోల్స్ చేస్తూ.. ఎక్కడా హద్దులు దాటకుండా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు వాటిని క్రాస్ చేసినట్లు నెట్టింట వైరల్ అయింది. దీంతో సినిమాకు మరింత బజ్ క్రియేట్ అయింది. బేబీ జాన్ తర్వాత బాలీవుడ్లో అక్క పేరుతో ఓ వెబ్సిరీస్లో కీర్తి సురేష్ నటిస్తోంది. పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కనున్న ఈ సీరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. -
వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది: ప్రశాంత్ కార్తి
పృథ్వీ దండమూడి, విస్మయ శ్రీ, ప్రశాంత్ కార్తి, శత్రు, ఆడుకాలం నరేన్ ప్రముఖ పాత్రల్లో నటించిన చిత్రం ‘పోతుగడ్డ’. ఈ సినిమాకు రక్ష వీరమ్ దర్శకత్వం వహించారు. రాహుల్ శ్రీవాస్తవ్ కెమెరామెన్గా పని చేసిన ఈ చిత్రం ఇటీవలే ఓటీటీలోకి వచ్చింది. ఈ చిత్రంలో వెంకట్ అనే డిఫరెంట్ షేడ్స్ ఉన్న కారెక్టర్లో కనిపించిన ప్రశాంత్ కార్తి తన పాత్రకు వస్తోన్న స్పందన పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.కెమెరామెన్ రాహుల్ ద్వారా నాకు ఈ సినిమా అవకాశం వచ్చింది. అయితే ఈ చిత్రం కోసం గుబురు గడ్డం, పొడవాటి జుట్టు కావాలని అన్నారు. ఆ లుక్ కోసం ట్రై చేశాం. అయితే మధ్యలో కొన్ని కారణాల వల్ల నేను జుట్టు తీసేయాల్సి వచ్చింది. ఇక ఈ సినిమా ఆఫర్ పోయినట్టే అనుకున్న టైంలో డైరెక్టర్ రక్ష నుంచి కాల్ వచ్చింది. నా ఒరిజినల్ లుక్ని చూసి బాగుంది.. ఇదే ఫైనల్ చేద్దామని అన్నారు. అలా నా లుక్ ఇందులో చాలా నేచురల్గా కనిపిస్తుంది.పోతుగడ్డ సినిమాలో నా పాత్ర చాలా డిఫరెంట్గా ఉంటుంది. సినిమా ఆరంభం, ముగింపులో తన పాత్రలోని షేడ్స్ కనిపిస్తాయి. ఆ వేరియేషన్ నాకు చాలా నచ్చింది. అందుకే ఈ చిత్రానికి వెంటనే ఓకే చెప్పాను. ఇక ఇందులో నా పాత్రకి మంచి రెస్పాన్స్ వస్తోంది. అన్ని పాత్రలకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక ప్రత్యేకంగా నా పాత్రలోని వేరియేషన్, యాక్టింగ్ గురించి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. చంద్ర సిద్దార్థ, చంద్రశేఖర్ యేలేటి వంటి వారు ప్రశంసించడం ఆనందంగా ఉంది.పోతుగడ్డ షూటింగ్ మొత్తం కూడా నైట్ టైంలోనే జరిగింది. అది కూడా పూర్తి చలికాలంలోనే షూటింగ్ చేశాం. అంతటి చలిలోనూ మా టీంకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మా నిర్మాత అనుపమ గారు, మా దర్శకులు రక్ష గారు ఎంతో చక్కగా చూసుకున్నారు.టీం అంతా ఓ ఫ్యామిలీలా కలిసి ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేశాం. ఆర్టిసుల్ని, టెక్నీషియన్లి మా నిర్మాత గారు ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నారు. టీంను ఆమె సపోర్ట్ చేయడం వల్లే సినిమా ఇంత బాగా వచ్చింది. శ్రవణ్ భరద్వాజ్ గారి పాటలు, మార్కస్ గారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందరినీ ఆకట్టుకుంటోంది.పోతుగడ్డ సినిమాలో ఓ మంచి ప్రేమ కథ ఉంటుంది. యాక్షన్, ఎమోషన్స్ ఇలా అన్ని రకాల అంశాలు ఉంటాయి. రాజకీయం చుట్టూ కథ తిరిగినా కూడా ఓ అందమైన ప్రేమ కథను ఇందులో చూపించారు. ఎక్కడా బోర్ కొట్టించుకుండా అందరినీ ఎంటర్టైన్ చేసేలా మా సినిమా ఉంటుంది.రాయలసీమ బ్యాక్ డ్రాప్లో ఓ యాక్షన్ ప్యాక్డ్ మూవీని చేస్తున్నాను. దాని వివరాలు త్వరలోనే ప్రకటిస్తాను. మరిన్ని ప్రాజెక్టులు చర్చల దశల్లో ఉన్నాయి. -
ఓటీటీలోకి బిగ్గెస్ట్ హిట్ సినిమా.. 'డార్క్' పేరుతో తెలుగులో స్ట్రీమింగ్
కోలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'బ్లాక్' తెలుగు వర్షన్ ఓటీటీలో విడుదలైంది. ఎలాంటి ప్రకటన లేకుంగానే సడెన్గా 'డార్క్' టైటిల్తో స్ట్రీమింగ్ అవుతుంది. తమిళ్లో భారీ కలెక్షన్లతో దుమ్మురేపిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో విడుదల కావడంతో ఈ వీకెండ్ చూసేయవచ్చని సినీ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రంలో నటుడు జీవా(Jiiva), నటి ప్రియ భవానీశంకర్(Priya Bhavani Shankar) జంటగా నటించారు. ప్రొటాన్షియల్ స్టూడియోస్ పతాకంపై ఎస్ఆర్.ప్రభు, ఎస్ఆర్.ప్రకాశ్బాబు నిర్మించిన ఈ చిత్రానికి జీకే.బాలసుబ్రమణి దర్శకత్వం వహించారు.సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్తో పాటు మంచి థ్రిల్లర్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కించారు. బ్లాక్ (డార్క్) చిత్రాన్ని రూ. 5 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. అయితే, బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లకు పైగానే రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. అంతటి భారీ విజయం అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు తెలుగు వర్షన్ 'డార్క్' పేరుతో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతంది. ఈ సినిమా మొత్తం జీవా, ప్రియా భవానీ శంకర్ పాత్రల చుట్టూ ఓ విల్లా నేపథ్యంలోనే సాగడం గమనార్హం. 'కోహెరెన్స్ 'అనే హాలీవుడ్ మూవీ స్ఫూర్తితో దర్శకుడు బాలసుబ్రమణి డార్క్ మూవీని తెరకెక్కించినట్లు నెట్టింట భారీగా ప్రచారం జరిగింది.కథేంటి?వసంత్ (జీవా), అరణ్య (ప్రియా భవానీ శంకర్) భార్యభర్తలు. వీకెండ్ సరదాగా గడుపుదామని బీచ్ పక్కన తాము కొన్న కొత్త విల్లాలోకి వెళ్తారు. ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఇంకా పూర్తిగా పనులు జరగకపోవడం వల్ల వీళ్లు తప్పితే మరెవరు అక్కడ ఉండరు. పగలంతా బాగానే ఉంటుంది కానీ ఎప్పుడైతే రాత్రి అవుతుందో విచిత్రమైన సంఘటనలన్నీ జరుగుతుంటాయి. భయపడి పారిపోదామని ఎంత ప్రయత్నించినా.. తిరిగి తిరిగి అక్కడికి వస్తుంటారు. మరోవైపు తమ ఎదురుగా ఉన్న విల్లాలో ఎవరో ఉన్నారని అనిపిస్తుంది. వెళ్లి చూస్తే అచ్చుగుద్దినట్లు తమలాంటి ఇద్దరు వ్యక్తులే కనిపిస్తారు. ఇంతకీ వాళ్లెవరు? ఇలా జరగడానికి కారణమేంటి అనేదే మిగతా స్టోరీ. -
ఓటీటీలో 'గేమ్ ఛేంజర్'.. అనుకున్న దానికంటే ముందే స్ట్రీమింగ్
రామ్ చరణ్ (Ram Charan), శంకర్ (Shankar) కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'గేమ్ ఛేంజర్'. జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. అత్యంత భారీ బడ్జెట్తో ఈ మూవీని దిల్ రాజు నిర్మించారు. అయితే, సినిమా విడుదల రోజు నుంచే నెగటివ్ టాక్ రావడంతో భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. కలెక్షన్ల పోస్టర్ విషయంలోనూ తప్పుడు లెక్కలు వేశారంటూ పెద్ద ఎత్తున నెట్టింట ట్రోల్ జరిగిన విషయం తెలిసిందే.సినిమా విడుదలైన నెల రోజుల్లోనే గేమ్ ఛేంజర్ ఓటీటీలోకి వచ్చేస్తుంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఫిబ్రవరి 7న ఈ మూవీ విడుదల కానుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. వాస్తవంగా ఈ చిత్రం విడుదలైన 30 రోజుల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని డీల్ ఉంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 14న స్ట్రీమింగ్కు వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ, అనుకున్న సమయం కంటే ముందే గేమ్ ఛేంజర్ చిత్రాన్ని అమెజాన్ విడుదల చేస్తుండటంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. అయితే, హిందీ వర్షన్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు.కథేంటంటే..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి( శ్రీకాంత్) ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు పూర్తిగా మారిపోతాడు. రాష్ట్రంలో ఇకపై అవినీతి జరగొద్దని, నిజాయితీగా పని చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలను ఆదేశిస్తాడు. సీఎం నిర్ణయం ఆయన కొడుకు, మైనింగ్ మినిస్టర్ బొబ్బిలి మోపిదేవి(ఎస్జే సూర్య)కి నచ్చదు. ముఖ్యమంత్రికి తెలియకుండా అవినీతిని కొనసాగిస్తుంటాడు. అంతేకాదు తండ్రిని తప్పించి సీఎం సీటులో కూర్చోవాలని కుట్ర చేస్తుంటాడు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్లో ఐపీఎస్గా విధులు నిర్వర్తిస్తూ.. సివిల్స్ పరీక్ష మళ్లీ రాసి ఐఏఎస్గా సెలెక్ట్ అయిన రామ్ నందన్(రామ్ చరణ్).. విశాఖపట్నం కలెక్టర్గా బాధ్యతలు చేపడతాడు. జిల్లాలో అవినీతి, దౌర్జన్యాలు మానేయాలని రౌడీలకు, వ్యాపారులకు వార్నింగ్ ఇస్తాడు.ఈ క్రమంలో మంత్రి మోపిదేవి, కలెక్టర్ మధ్య వైరం ఏర్పడుతుంది. మరోవైపు సీఎం సత్యమూర్తి చివరి కోరిక అంటూ ఓ భారీ ట్విస్ట్ ఇస్తాడు. అదేంటి? అసలు సీఎం సత్యమూర్తిలో మార్పుకు గల కారణం ఏంటి? అప్పన్న(రామ్ చరణ్) ఎవరు? పార్వతి(అంజలి)తో కలిసి ఆయన పోరాటం ఏంటి? కలెక్టర్ రామ్కి అప్పన్నకు ఉన్న సంబంధం ఏంటి? సీఎం సీటు కోసం మోపిదేవి చేసిన కుట్రలను రామ్ ఎలా అడ్డుకున్నాడు? ఒక ఐఏఎస్ అధికారిగా తనకున్న పవర్స్ని ఉపయోగించి రాష్ట్ర రాజకీయాలను ఎలా మార్చాడు? దీపిక(కియారా అద్వానీ)తో రామ్ ప్రేమాయణం ఎలా సాగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
ఈ ఏడాదిలో విడుదలై తొలి విజయాన్ని అందుకున్న మలయాళ సినిమా 'రేఖా చిత్రం' ఓటీటీలోకి రానుంది. మర్డర్ మిస్టరీని పోలీసులు ఎలా ఇన్వెస్టిగేటివ్ చేస్తారు..? అనే కాన్సెప్ట్తో ప్రతి సీన్ ఆసక్తిగా ఈ మూవీని తెరకెక్కించారు. క్రైమ్ థ్రిల్లర్ జానర్లో వచ్చే చిత్రాలు మీకు ఇష్టం అయితే.. 'రేఖా చిత్రం'ను చూసేయండి. మిమ్మల్ని ఎక్కడా కూడా నిరుత్సాహపరచదు. ఆసిఫ్ అలీ హీరోగా నటించిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ మమ్ముట్టి క్యామియో రోల్లో కనిపించడం విశేషం. ఈ మూవీకి జోఫిన్ టీ చాకో దర్శకత్వం వహించారు.జనవరి 9న మలయాళంలో మాత్రమే విడుదలైన రేఖాచిత్రం. మార్చి 7న ఓటీటీలోకి వచ్చేస్తుంది. సోనీ లివ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగులో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. ఈ సినిమాలో ఆసిఫ్ అలీతో పాటు అనస్వర రాజన్, మనోజ్ కే జయన్, సిద్ధిఖీ, జగదీశ్, సాయికుమార్ వంటి వారు నటించారు. కేవలం రూ. 10 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 25 రోజ్లులోనే రూ. 75 కోట్ల మేరకు కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.బాక్సాఫీస్ వద్ద ఇంకా థియేటరికల్ రన్ మంచిగానే కొనసాగుతుంది. అయినప్పటికీ ఓటీటీలో ఈ చిత్రం విడుదల కానున్నడం విశేషం. ఇదొక మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. కథలో భాగంగా ఒక ఆత్మహత్య కేసును సీఐ వివేక్ గోపీనాథ్ (ఆసిఫ్ అలీ) విచారణ చేపడుతాడు. గ్యాంబ్లింగ్ స్కామ్ లో దొరికిపోయి సస్పెండ్ అయిన ఈ కేసు కోసం మళ్లీ ఎంట్రీ ఇస్తాడు. ఈ క్రమంలో 40 ఏళ్ల కిందటి హత్య కేసుతో ఈ ఆత్మహత్యకు లింక్ ఉందని ఆయన గుర్తిస్తాడు. 1985 సమయంలో ఓ సినిమా షూటింగ్ లొకేషన్ నుంచి మిస్ అయిన బాలిక కేసును కూడా వివేక్ దర్యాప్తు చేస్తాడు. ఇలా ఒక సంఘటనతో ఎన్నో ట్విస్ట్లు వస్తూనే ఉంటాయి. ఫైనల్గా చిక్కుముడి లాంటి ఈ కేసులను ఆయన ఎలా ఛేదిస్తాడనేది కీలకంగా ఉంటుంది. పోలీస్ ఆఫీసర్గా వివేక్ దర్యాప్తు ఎలా ఉంటుందో తెలియాలంటే రేఖాచిత్రం చూడాల్సిందే. -
Rag Mayur: కంటెంట్ బేస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్
సినిమా బండి మూవీతో హీరోగా మారిన రాగ్ మయూర్ ఇటీవలే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. సివరపల్లి అనే వెబ్ సిరీస్లో హీరోగా నటించారు. ఇందులో పంచాయతీ కార్యదర్శి పాత్రలో మెరిశారు. ‘పంచాయత్’ అనే హిందీ వెబ్ సిరీస్ ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ సిరీస్కు ఆడియన్స్ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అమెరికా వెళ్లి పెద్ద చదువులు చదవాలి అనుకునే ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అనుకోకుండా పంచాయతీ సెక్రటరీగా మారితే ఎలా ఉంటుందనే కోణంలో తెరెకెక్కించారు. తెలంగాణలోని ఓ పల్లెలో జరిగిన కథగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది.అయితే అదే రోజు గాంధీ తాత చెట్టు అనే సినిమా రిలీజైంది. సుకుమాక్ కుమార్తె సుకృతి ప్రధాన పాత్రలో నటించిన గాంధీ తాత చెట్టు సినిమాలో ఒక ఇండస్ట్రియలిస్ట్ ఏజెంట్గా సతీష్ అనే పాత్రలో రాగ్ మయూర్ మరోసారి మెరిశాడు. నిజానికి అతనికి సినిమాలో ఉన్న స్క్రీన్ టైం తక్కువే అయినా తనదైన శైలిలో ఉన్న కాసేపు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లో రాగ్ మయూర్ ఉండడంతో అది మరింత బాగా కలిసొచ్చింది. ఒకేరోజు రిలీజ్ అయిన గాంధీ తాత చెట్టు సినిమాతో పాటు సివరపల్లి వెబ్ సిరీస్ రెండిటికి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు ఇలా భిన్నమైన పాత్రలు చేస్తూ తెలుగులో ఒక మంచి నటుడిగా స్థిరపడాలని భావిస్తున్న రాగ్ మయూర్.. ఇప్పటికే గీత ఆర్ట్స్2 లో ఒక పేరు పెట్టని సినిమాతో పాటు పరదా, అలాగే గరివిడి లక్ష్మి సినిమాలో కూడా నటిస్తున్నాడు.‘సివరపల్లి’ వెబ్ సిరీస్, గాంధీ తాత చెట్టు సినిమాలో విలన్గా రెండు భిన్న పాత్రలతో ఒకేరోజు ప్రేక్షకులు ముందుకు వచ్చిన రాగ్ మయూర్ బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు, మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ బాటలో దూసుకెళ్తున్నాడు. చదువులో స్టేట్ టాపర్ అయిన రాగ్ మయూర్ ప్రశాంతంగా చదువు పూర్తి చేసి తర్వాత నటన మీద శ్రద్ధ పెట్టాడు.. సినిమాల గురించి రివ్యూస్ రాసే స్థాయి నుంచి ఈరోజు అదే రివ్యూలలో తన గురించి రాయించుకునే స్థాయికి నటనతో ఎదిగి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.రాగ్ మయూర్ మొదటి సినిమా సినిమా బండిలో మరిడేష్ బాబు అనే పాత్రతో మెరిశాడు. ఆ పాత్రలో రాగ్ మయూర్ నటనతో సినిమా సక్సెస్ కావడంలో కీలక పాత్ర పోషించాయి. ఇక ఆ తర్వాత భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ వెళుతున్నాడు. భిన్నమైన జానర్ సినిమాలు చేస్తూ అందులో భాగంగానే కీడా కోలా అనే సినిమాలో లాయర్గా, బ్రహ్మానందం మనవడి పాత్రలో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన వీరాంజనేయులు విహారయాత్రలో కూడా ఒక స్టార్టప్ మొదలు పెట్టాలని పరితపించే సగటు కుర్రాడిగా ఆకట్టుకున్నాడు. అతని పాత్రల ఎంపిక చూస్తే ఏ ఒక్క దానికి మరో పాత్రకి సంబంధం ఉండదు. అలా భిన్నమైన పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. -
చూసి తెలుసుకోదగ్గ డాక్యుమెంటరీ
ఓటీటీలో ఇది చూడొచ్చు అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో బాలీవుడ్ చిత్రం ది రోషన్స్ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఈ జీవితమనే చక్రంలో కొందరి వంతు వస్తుంది, కొందరి వంతు ముగుస్తుంది. ముగిసిన వారి జ్ఞాపకాలు మన మనసులో పదిలంగా ఉంటాయి. వారిలో ఎందరో మహానుభావులుంటారు. వారి జ్ఞాపకాలైతే మనం నెమరువేసుకోవచ్చేమో కానీ ఆ కాలంలో వారు పడ్డ కష్టం, ఆనందం కానీ మనకు తెలియవు. అటువంటి వారి జీవిత చక్రానికి వెండితెర రూపమిస్తే మన ఆనందం అవధులు దాటుతుంది.ఆ కోవకు చెందినదే నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ‘ది రోషన్స్’ టీవీ షో. ఇదో డాక్యుమెంటెడ్ మినీ సిరీస్. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి జీవిత చక్రాలకు తెర రూపమే ఈ షో. బాలీవుడ్ దిగ్గజ రోషన్ కుటుంబానికి చెందిన నాటి సంగీత కళాకారులు రోషన్ లాల్ నాగ్రత్ నుండి నేటి తరం నటుడు హృతిక్ రోషన్(Hrithik Roshan) వరకు... వారి జీవిత ప్రయాణాన్ని ఎంతో అందంగా చూపించారు.ఈ డాక్యుమెంటరీలో. ఓ రకంగా చెప్పాలంటే మనం ఈ షో ద్వారా నాలుగు తరాలు ప్రయాణిస్తాం. ముందుగా రోషన్ కుటుంబం నుండి రోషన్ లాల్ నాగ్రత్ సంగీత ప్రయాణంతో ఈ షోప్రారంభమై ఆ పై అతని కొడుకు రాజేష్ రోషన్ బాలీవుడ్ ప్రయాణంతో సాగి, ఆ తరువాత ఆయన కొడుకు రాకేశ్ రోషన్ నటనా ప్రయాణంతో పాటు ప్రోడ్యూసర్గా ఎలా రాణించారు? అన్నది చూపిస్తూ నేటి తరం కథానాయకుడు హృతిక్ రోషన్ బాలీవుడ్ ప్రయాణంతో షో ముగుస్తుంది.ఈ షో ద్వారా నాటి బాలీవుడ్ సంగీతం నుంచి నేటి తరం సినిమాల వరకు మనకు తెలియని ఎన్నో రహస్యాలతో పాటు హిందీ చిత్ర పరిశ్రమలోని అప్పటి ఒడిదుడుకులను ఇప్పటి పట్టు విడుపులను సవివరంగా చూపించారు. ఈ రోషన్ కుటుంబానికి బాలీవుడ్ పరిశ్రమలో ఉన్న నాటి, నేటి దిగ్గజాలు తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ప్రేక్షకులకు చెప్పడం మరింత బావుంది. అందుకే ‘ది రోషన్స్’ చూసి నేర్చుకోదగ్గ, తెలుసుకోదగ్గ డాక్యుమెంటరీ. ఇది ప్రతి సినిమా ప్రేక్షకుడు తమ వ్యక్తిగత లైబ్రరీలో భద్రపరుచుకోదగ్గ డాక్యుమెంటెడ్ మినీ సిరీస్. వర్త్ఫుల్ టు వాచ్. – ఇంటూరు హరికృష్ణ -
సైఫ్ అలీఖాన్ కుమారుడి తొలి సినిమా.. నేరుగా ఓటీటీలో రిలీజ్
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) తనయుడు ఇబ్రహీం అలీఖాన్ నటుడిగా బిగ్ స్క్రీన్కు పరిచయం కాబోతున్నాడు. ఎంతోమంది స్టార్ కిడ్స్ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకనిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) బ్యానర్లో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి నడానియన్ (Nadaaniyan) అన్న టైటిల్ ఖరారు చేశారు. దివంగత నటి శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో సునీల్ శెట్టి, దియా మీర్జా, జుగల్ హన్సరాజ్, మహిమా చౌదరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఓటీటీలో రిలీజ్ కానున్న ఫస్ట్ మూవీఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. అయితే రిలీజ్ ఎప్పుడన్నది చెప్పకుండా త్వరలోనే అంటూ సస్పెన్స్లో ఉంచింది. ఈ సినిమాతో షావునా గౌతమ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈయన 'రాకీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహానీ' సినిమాకు కరణ్ జోహార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశాడు.ఇబ్రహీం..సైఫ్ అలీఖాన్, అతడి మాజీ భార్య అమృతా సింగ్ తనయుడే ఇబ్రహీం. మొదటి భార్యకు విడాకులిచ్చిన అనంతరం సైఫ్.. హీరోయిన్ కరీనా కపూర్ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి తైమూర్, జెహంగీర్ అని ఇద్దరు కుమారులు సంతానం. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) చదవండి: అంకుల్ అనొద్దన్నాడు.. కావాలంటే అలా పిలవమన్నాడు: కీర్తి సురేశ్ -
ఓటీటీకి వచ్చేసిన త్రిష థ్రిల్లర్.. వారం రోజుల్లోనే ఎంట్రీ
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష ప్రస్తుతం కోలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్గా ఉన్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో పెద్దగా కనిపించట్లేదు. గతేడాది విజయ్ సరసన ది గోట్ చిత్రంలో కనిపించిన త్రిష.. ప్రస్తుతం అజిత్ కుమార్ మూవీ విదాముయార్చితో ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతికే విడుదల కావాల్సిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.ఇదిలా ఉండగా.. త్రిష మలయాళంలో వరుస సినిమాలు చేస్తోంది. మాలీవుడ్లో ఐడెంటిటీ అనే మూవీలో నటించింది. క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రంలో టొవినో థామస్ హీరోగా నటించారు. సంక్రాంతికి కానుకగా మలయాళంలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ సినిమాకు అనాస్ ఖాన్ దర్శకత్వం వహించారు.మలయాళంలో హిట్ టాక్ రావడంతో తెలుగులోనూ ఈ చిత్రాన్ని విడుదల చేశారు. జనవరి 24న తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రిలీజైంది. ఈ మూవీకి టాలీవుడ్ ఆడియన్స్ నుంచి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే కలెక్షన్ల పరంగా పెద్దగా రాణించలేకపోయింది. రూ. 12 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఐడెంటిటీ సినిమాకు బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్గా రూ. 18 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది.వారంలోనే ఓటీటీకి..గత శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సడన్గా ఓటీటీకి వచ్చేసింది. కేవలం వారం రోజుల్లోనే ఓటీటీలో సందడి చేస్తోంది. జనవరి 31 నుంచే జీ5 వేదికగా అందుబాటులోకి వచ్చేసింది. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ వంటి నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.ఈ చిత్రంలో హనుమాన్ విలన్ వినయ్ రాయ్ ప్రధాన పాత్రలో నటించారు. -
డైరెక్ట్గా ఓటీటీలో రిలీజైన హీరోహీరోయిన్లు లేని సినిమా
ఆర్ పి పట్నాయక్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం "కాఫీ విత్ ఏ కిల్లర్"( Coffee With A Killer). సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సతీష్ నిర్మించిన ఈ చిత్రంలో టెంపర్ వంశీ, శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్, రవిబాబు, అంబటి శ్రీను, శ్రీరాప, జెమిని సురేష్ తదితరులు కీలకపాత్ర పోషించారు. నేటి నుంచి ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ‘ఆహా’(AHA)లో స్ట్రీమింగ్ కానుంది.ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఆర్ పి పట్నాయక్ మాట్లాడుతూ...‘హీరో హీరోయిన్ లేకుండా ఒక సినిమా తీయాలి అంటే ఎలా అని ఆలోచనతో ఈ కథ మొదలైంది. కథ హీరో అయితే ఎలా ఉండబోతుంది అని ఈ కథ రాశాము. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమాను మొత్తం దగ్గరుండి చూసుకున్నది మా అన్నయ్య గౌతమ్ పట్నాయక్ గ. ఈ చిత్రంలోని కీలక పాత్ర విషయానికి వస్తే నాకు వంశీ మాత్రమే కచ్చితంగా ఈ కథకు, పాత్రకు పర్ఫెక్ట్ అని అనిపించింది. వేరే ఎవరిని నేను ఆ పాత్రలో ఊహించుకోలేకపోయాను. జెమిని సురేష్ క్యారెక్టర్ ప్రత్యేకమైనది. నా ఆలోచనలు అర్థం చేసుకునే తిరుమల నాగ్ కలిసి ఈ చిత్రం కోసం పని చేశాను. డిఓపి అనూష్ ఎంతో సౌమ్యుడు. ఎంతో టాలెంట్ ఉన్న వ్యక్తి. చిత్రంలో నటించిన నటీనటుల క్యారెక్టర్లు చూస్తే కొన్ని ఎంతో ప్రత్యేకంగా అలాగే కొత్తగా ఉంటాయి. శ్రీనివాస్ రెడ్డి గారికి ఆయన కాకుండా ఇంకా ఎవరు అంత బాగా చేయలేరు అన్నట్లు వచ్చింది. ఆయన టైమింగ్ ప్రత్యేకం అని చెప్పుకోవాలి. ఈ చిత్రం ఎంతో శ్రద్ధగా టీమ్ అంతా కలిసి టీం వర్క్ గా చేసాము. సినిమాలో హీరో హీరోయిన్ ఉండరు కానీ విలన్ ఉంటాడు. ఈ సినిమాను ఎంతోమంది థియేటర్లో విడుదల చేయమని నన్ను అడిగారు కానీ నేను ఈ సినిమా ఖచ్చితంగా ఓటిటి లోనే విడుదల కావాలి అని పట్టు పట్టి ఆహాలో విడుదల చేస్తున్నాం’అన్నారు.నటుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ...‘కొన్ని కథలో మధ్య జరిగే కథలా ఈ చిత్రం ఉండబోతుంది. చూసి ప్రేక్షకులంతా ఎంతో ఎంజాయ్ చేస్తారు. ప్రతి సీన్ లోను ట్విస్టులు ఉంటాయి. డబ్బింగ్ కూడా ఎంతో బాగా వచ్చింది. ఆర్ బి గారితో పని చేయడమే కాదు ఆయన దగ్గర ఉండటం కూడా ఎంతో ఆనందకరం’ అన్నారు.టెంపర్ వంశీ మాట్లాడుతూ...‘ఆర్ పి గారు నన్ను ముఖ్య పాత్రలో ఒక సినిమా చేస్తున్నాము అని చెప్పగానే నేను నిజంగా ఆశ్చర్యపోయాను. నన్ను పెట్టి సినిమా తీయడం ఏంటి అని. ఆయన ఆలోచన చెప్పిన తర్వాత నాకు ఎంతో ఎక్సైట్ గా అనిపించింది. ఈ చిత్రానికి పనిచేసిన వారందరితో పనిచేయడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. అందరూ తప్పకుండా ఆహలో ఈ చిత్రాన్ని చూడండి’అన్నారు. -
ఓటీటీకి మోస్ట్ వయొలెంట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
గతేడాది రిలీజైన మోస్ట్ వయలెంట్ చిత్రం మార్కో(Marco). ఉన్ని ముకుందన్(Unni Mukundan) హీరోగా నటించిన ఈ చిత్రం మలయాళంలో బ్లాక్బస్టర్గా నిలిచింది. కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ చిత్రం.. మలయాళంలోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. దీంతో బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సృష్టించింది.అంతేకాకుండా మలయాళంతో(Malayalam Movie) పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా అంచనాలకు మించి వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ చిత్రం ఓటీటీ(OTT) విడుదల కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ను మేకర్స్ రివీల్ చేశారు. వచ్చేనెల 14న లవర్స్ డే సందర్భంగా స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని మార్కో ఓటీటీ రైట్స్ దక్కించుకున్న సోనీ లివ్(Sony Liv) సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.మార్కో కథేంటంటే..?జార్జ్ (సిద్దిఖ్ఖీ) గోల్డ్ బిజినెస్ చేస్తుంటాడు. ఈ వ్యాపారంలో తనకు మించినవాళ్లు ఉండరు. సిండికేట్ ఏర్పాటు చేసి.. దాని లీడర్గా వ్యవహరిస్తుంటారు. అతని తమ్ముడు విక్టర్(ఇషాన్ షౌకాత్) అంధుడు. కానీ చాలా టాలెంటెడ్. విక్టర్ స్నేహితుడు వసీమ్ను ఓ ముఠా చంపేస్తుంది. దానికి సాక్షి ఉన్నాడని విక్టర్ను కూడా ఆ ముఠా దారుణంగా హత్య చేస్తుంది. విదేశాలకు వెళ్లిన జార్జ్ మరో తమ్ముడు(జార్జ్ వాళ్ల నాన్న పెంచిన వ్యక్తి) మార్కో(ఉన్ని ముకుందన్)కు ఈ హత్య విషయం తెలిసి వెంటనే వచ్చేస్తాడు. తను ప్రాణంగా ఇష్టపడే సోదరుడు విక్టర్ హత్యకు కారణమైనవారిని వదిలిపెట్టనని చర్చిలోనే ప్రమాణం చేస్తాడు. అసలు విక్టర్ని హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? చివరకు మార్క్ వారిని ఎలా మట్టుపెట్టాడు?అనేదే మిగతా కథ. View this post on Instagram A post shared by Sony LIV (@sonylivindia) -
ఓటీటీలో 'హెబ్బా పటేల్' రొమాంటిక్ సినిమా
టాలీవుడ్లో భారీ తారాగణంతో గతేడాది నవంబర్లో విడుదలైన ‘‘ధూం ధాం’(Dhoom Dhaam Movie) సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ (hebah patel) జోడీగా నటించిన చిత్రాన్ని దర్శకుడు సాయి కిషోర్ మచ్చా ( Sai Kishore Macha) తెరకెక్కించారు. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్పై ఎంఎస్ రామ్ కుమార్ భారీ అంచనాలతో నిర్మించారు. థ్రిల్లర్, పేట్రియాటిక్, స్కామ్ సినిమా కథలకు కాస్త కామెడీ యాడ్ చేస్తే ఎలా ఉంటుందో ఇందులో 'ధూం ధాం'గా చూపించారు. గతంలో శ్రీను వైట్ల దగ్గర పనిచేసిన డైరెక్టర్ సాయి కిషోర్ ఈ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేయడంతో కాస్త బెటర్గానే ఓపెనింగ్స్ వచ్చాయి.ఎలాంటి ప్రకటన లేకుండానే సడెన్గా అమెజాన్ ప్రైమ్లో ధూం ధాం చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీలో హెబ్బా పటేల్ కాస్త గ్లామర్ రోల్లో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. మారుతి సినిమా 'రోజులు మారాయి'తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చేతన్ కృష్ణ ధూం ధాం అనేలా మెప్పించాడు. తండ్రీ కొడుకుల అనుబంధం కారణంగా నాయిక జీవితంలో ఒక అనుకోని ఘటన జరుగుతుంది. దాన్ని సరిదిద్దేందుకు హీరో ఎలాంటి ప్రయత్నం చేశాడు అనేది కథ. సినిమా సరదాగా మొదలై ఇంటర్వెల్ దాకా మంచి సాంగ్స్, లవ్ ట్రాక్ తో ప్లెజెంట్ గా వెళ్తుంది. ఇంటర్వెల్ నుంచి పెళ్లి ఇంట జరిగే సందడి మిమ్మల్ని హిలేరియస్ గా నవ్విస్తుంది. వెన్నెల కిషోర్ సెకండాఫ్ లో బాగా నవ్విస్తాడు.కథేంటంటే..రామరాజు(సాయి కుమార్)కి అతని కొడుకు కార్తిక్(చేతన్ కృష్ణ)అంటే చాలా ఇష్టం. కొడుకు సంతోషం కోసం ఏ పనైనా చేస్తాడు. అన్ని విషయాలు కొడుకుతో చర్చించుకుంటాడు. కార్తిక్ కూడా అంతే. నాన్నను చాలా ప్రేమిస్తాడు. అమ్మా నాన్న, స్నేహితులే ప్రపంచంగా బతుకున్న కార్తిక్ జీవితంలోకి సుహానా(హెబ్బా పటేల్) వస్తుంది. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడతారు. ఇంట్లో వాళ్లకి చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అప్పుడు ఇరు కుటుంబాల్లో కొన్ని సమస్యలు వస్తాయి. అవేంటి? కార్తిక్, సుహానా కుటుంబాల మధ్య ఉన్న వైరం ఏంటి? తండ్రి కోసం కార్తిక్ చేసిన తప్పేంటి? అంతకు ముందు కొడుకు కోసం రామరాజు చేసిన మిస్టేక్ ఏంటి? ఆ తప్పు కారణంగా సుహాన ఫ్యామిలీ పడిన ఇబ్బందులు ఏంటి? ఈ కథలో వెన్నెక కిశోర్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీలో రూ. 7 వేల కోట్ల ప్రాఫిట్ సినిమా
మోనా ఫ్రాంచైజీలో భాగంగా విడుదలైనా సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. మోనా-2 టైటిల్తో గతేడాదిలో నవంబర్ 27న ఈ చిత్రం విడుదలైంది. తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. యానిమేటెడ్ అడ్వెంచర్ థ్రిల్లర్గా ఈ మూవీని డేవిడ్ డెరిక్ జూనియర్, జాసన్ హ్యాండ్, డానా లెడౌక్స్ మిల్లర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ముఖ్యంగా చిన్నపిల్లలను బాగా ఆకట్టుకుంది. సుమారు రెండు నెలల తర్వాత ఈ యానిమేటెడ్ థ్రిల్లర్ ఇండియాలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుండటంతో నెట్టింట వైరల్ అవుతుంది.అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న మోనా 2 చిత్రాన్ని చూడాలంటే రెంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ యానిమేటెడ్ మ్యూజికల్ అడ్వెంచర్ కోసం రూ. 389 చెల్లించాలని మేకర్స్ ప్రకటించారు. మోనా 2 (Moana 2) చిత్రాన్ని సుమారు రూ.1300 కోట్ల బడ్జెట్తో వాల్ట్ డిస్నీ యానిమేషన్ స్టూడియోస్ నిర్మించింది. అయితే, ఈ చిత్రం కేవలం 50 రోజుల్లోనే వరల్డ్ బాక్సాఫీస్ వద్ద రూ. 8500 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. హాలీవుడ్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాప్ చిత్రాల లిస్ట్లో మోనా2 చేరిపోయింది. ఈ చిత్రం సుమారుగా రూ. 7000 కోట్లకు పైగానే లాభాలను గడించింది.మోనా2 మూవీలో డ్వేన్ జాన్సన్తో పాటు ఔలీ క్రావాలో, టెమూరా మోరిసన్, నికోల్ షెర్జింగర్ వంటి వారు తమ పాత్రలతో మరోసారి ప్రేక్షకులను మెప్పించారు. 2016లో వచ్చిన మోనా మూవీకి సీక్వెల్గా మోనా 2 చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమాకు కాస్త మిక్సిడ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం భారీ కలెక్షన్స్తో దుమ్మురేపింది. రెంటల్ కాకుండా ఉచితంగా ఈ చిత్రాన్ని అమెజాన్లో చూడాలంటే మార్చి 25 వరకు వేచి ఉండాల్సిందే. హాట్స్టార్లో తెలుగు వర్షన్ కూడా అదే సమయంలో రిలీజ్ కావచ్చు. -
హాలీవుడ్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్!
ఓటీటీలో ఇది చూడొచ్చు అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం బ్యాక్ ఇన్ యాక్షన్(Back in Action) ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.హాలీవుడ్ సినిమాలన్నీ ఏదైనా ఒక జోనర్కి సంబంధించనవి మాత్రమే ఎక్కువగా ఉంటాయి. అలాంటిది ఓ యాక్షన్ జోనర్ని ఫ్యామిలీతో కలిపి హాలీవుడ్లో సినిమా రావడమంటే అదో వింత. అదే ‘బ్యాక్ ఇన్’ యాక్షన్ సినిమా. నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమ్ అవుతోంది. తెలుగు వెర్షన్ కూడా లభ్యమవుతోంది. ఈ సినిమాకి సేత్ గార్డన్ దర్శకుడు . కేమరన్ డియాజ్, జెమీ ఫాక్స్ వంటి ప్రముఖ నటులతో పాటు జేమ్స్ బాండ్ సినిమాలలో సుపరిచితురాలైన గ్లెన్ క్లోజ్ ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపించడం విశేషం. ఇక కథ విషయానికొస్తే... అమెరికాలోని ప్రముఖ సీఐఎ సంస్థలో ప్రతినిధులుగా పని చేస్తున్న ఎమిలీ, మాట్ ప్రేమించుకుంటుంటారు. వారి ప్రేమకు ఫలితంగా ఎమిలీ గర్భవతి అవుతుంది. ఆ విషయాన్ని ఓ ఆపరేషన్లో భాగంగా మాట్కు చెబుతుంది ఎమిలీ. ఆ ఆపరేషన్ ఏంటంటే ప్రపంచంలోని ప్రముఖ పారిశ్రామిక, వాణిజ్య మరియు ప్రభుత్వ అధికార యంత్రాంగానికి సంబంధించిన ఓ డేటా డ్రైవ్ను తీసుకురావడం. ఈ దశలో ఇద్దరూ ఓ ఘోర విమాన ప్రమాదం నుండి తప్పించుకుంటారు. అలా తప్పించుకున్నవాళ్లు ఇక ప్రపంచానికి తమ ఉనికి తెలియకుండా దూరంగా పుట్టబోయే పిల్లలతో సంతోషంగా ఉండాలనుకుంటారు. అందుకే వాళ్లిద్దరూ 12 ఏళ్ళ దాకా అటు సీఐఎకి ఇటు ప్రపంచానికి తమ అసలు ఉనికి తెలియకుండా జాగ్రత్త పడతారు. ఈ 12 ఏళ్లలో వాళ్లకి ఇద్దరు పిల్లలు పుడతారు. తమ పిల్లలకు కూడా తమ అసలు ఐడెంటిటీ తెలియనివ్వరు. అయితే ఏ ఆపరేషన్ కోసం వీళ్లిద్దరూ అజ్ఞాతానికి వచ్చారో ఆ ఆపరేషన్ వల్లే మళ్లీ కథ మొదలవుతుంది. ఆ ఆపరేషన్లో శత్రువులకు దొరకకుండా ఉండాలని మాట్ తనతో పాటు ఆ డేటా డ్రైవ్ని ఎమిలీకి కూడా తెలియకుండా దాస్తాడు. ఆ డ్రైవ్ కోసం విలన్స్ వీళ్లిద్దరినీ మళ్లీ ట్రాక్ చేసి ఎటాక్ చేస్తారు. మరి విలన్స్ ఆ డ్రైవ్ చేజిక్కించుకుంటారా? తమ పిల్లలకు, సమాజానికి తమ ఐడెంటీటీని దాచి పెట్టిన ఎమిలీ, మాట్ విలన్స్ ఎటాక్ నుండి తప్పించుకున్నారా? లేదా అన్నది సినిమాలోనే చూడాలి. పైన చెప్పుకున్నట్టు ఇదో చక్కటి ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్. మంచి స్టంట్స్, విజువల్స్తో పాటు చక్కని కామెడీని ఈ సినిమాలో చూసి ఎంజాయ్ చేస్తారు. మరింకెందుకు ఆలస్యం... గ్రాబ్ యువర్ రిమోట్ టు ‘బ్యాక్ ఇన్ యాక్షన్’ ఫర్ వాచింగ్ దిస్ వీకెండ్.– ఇంటూరు హరికృష్ణ -
ప్రాణాలతో చెలగాటమాడే థ్రిల్లర్ వెబ్ సిరీస్.. సీజన్-3 స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
2021లో రిలీజై అభిమానుల ఆదరణ దక్కించుకున్న వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్'(Squid Game). తొలి సీజన్ సూపర్ హిట్ కావడంతో ఇటీవల మరో సీజన్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ కొరియన్ వెబ్ సిరీస్కు ఇండియాలోనూ విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. నెట్ఫ్లిక్స్ వేదికగా సీజన్-2 స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్కు కూడా ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. వరుసగా రెండు సీజన్స్ సూపర్ హిట్ కావడంతో మేకర్స్ మరో సీజన్ ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు.తాజాగా స్క్విడ్ గేమ్ సీజన్-3 ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఈ జూన్ 27న స్క్విడ్ గేమ్-3ని స్ట్రీమింగ్కు తీసుకు రానున్నట్లు ప్రకటించింది. దీంతో ఇలాంటి థ్రిల్లర్ వెబ్ సిరీస్లు ఇష్టపడే ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.స్క్విడ్ గేమ్ స్టోరీ ఏంటంటే..ఒక్కమాటలో ఈ సిరీస్ గురించి చెప్పాలంటే.. అప్పుల్లో కూరుకుపోయి, ఆర్థికంగా ఇక లేవడం కష్టమనే స్థితిలో ఉన్న పేదలను ఒక చోట చేర్చి.. వారితో ఆటలు ఆడిస్తుంటే బాగా డబ్బునోళ్లు వీళ్లని చూసి ఎంజాయ్ చేస్తుంటారు. వినడానికి చిన్న కథలా అనిపిస్తున్నా ఒక్కసారి సీజన్ మొదలెడితే పూర్తయ్యేదాకా చూడకుండా ఉండలేరు. కథ ప్రారంభం కాగానే దర్శకుడు ఏం చెప్పాలనుకొంటున్నాడో అర్థమవుతుంది. కానీ ఏం జరుగుతుందో ఉహించలేం!జీవితంలో అన్ని కోల్పోయిన 456 మందిని గుర్తుతెలియని వ్యక్తులు.. ఓ రహస్య దీవికి తీసుకెళ్తారు. వీళ్లకు రెడ్ లైట్ గ్రీన్ లైట్, గోళీలాట, టగ్ ఆఫ్ వార్ లాంటి పిల్లలు ఆడుకునే గేమ్స్ పెడతారు. మొత్తం ఆరు పోటీలు ఇందులో గెలిస్తే 45.6 బిలియన్ కొరియన్ వన్ (మన కరెన్సీ ప్రకారం 332 కోట్లు) సొంతం చేసుకోవచ్చు. గేమ్స్ సింపుల్గానే ఉంటాయి కానీ ఓడిపోతే మాత్రం ఎలిమినేట్ అవుతారు. ఇక్కడ ఎలిమినేట్ అంటే ప్రాణాలు తీసేస్తారు. తొలి గేమ్ ఆడుతున్నప్పుడు గానీ అందరికీ ఈ విషయం తెలియదు. అలాంటి ప్రాణాంతకమైన ఆటలను పూర్తి చేసింది ఎవరు? చివరకు ప్రైజ్మనీ గెలిచింది ఎవరు? అనేదే స్టోరీ.Press ⭕ for the final round.Watch Squid Game Season 3 on 27 June. #NextOnNetflix pic.twitter.com/SwdBVLB83f— Netflix India (@NetflixIndia) January 30, 2025 -
ఓటీటీలో ఆస్కార్ నామినేటెడ్ 'అనూజ' చిత్రం
ఓవైపు హాలీవుడ్లో వరుస చిత్రాలతో బిజీగా గడుపుతూనే.. మరోవైపు అవకాశం వచ్చినప్పుడల్లా నిర్మాతగా కూడా నిరూపించుకుంటుంది బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra). తాను నిర్మాతగా తెరకెక్కించిన 'అనూజ' (Anuja) ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. తాజాగా ఈ షార్ట్ ఫిలిం ఆస్కార్ షార్ట్ లిస్ట్లో స్థానం దక్కించుకొని సినీప్రియుల దృష్టిని ఆకర్షించింది. ఆడమ్ జే గ్రేవ్స్ ఈ లఘు చిత్రానికి దర్శకత్వం వహించారు. జీవిత గమనాన్ని మార్చే సినిమాగా అనూజ అందరినీ మెప్పిస్తుందని ప్రియాంక చోప్రా పేర్కొంది. ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్టులో తాను భాగమయ్యినందుకు గర్వపడుతున్నాని ఆమె తెలిపింది.ఈ ఏడాది జరగనున్న 97వ ఆస్కార్ నామినేషన్స్లో అనూజ చోటు దక్కించుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు అనూజ చిత్రం కోసం ఎదరుచూస్తున్నారు. అయితే, ఫిబ్రవరి 5 నుంచి నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుందని అధికారికంగా ఆ సంస్థ ప్రకటించింది. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో నామినేషన్స్లో చోటు దక్కించుకున్న ఈ చిత్రం తప్పకుండా అవార్డ్ సాధిస్తుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే తొమ్మిదేళ్ల బాలిక జీవితంగా ఆధారంగా ఈ మూవీని గునీత్ మోంగా, ప్రియాంక చోప్రా నిర్మాతలుగా తెరకెక్కించారు.బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో డోవ్ కోట్, ది లాస్ట్ రేంజర్, ది లియోన్, ది మ్యాన్ వు కుడ్నాట్ రిమేన్ సైలెంట్ చిత్రాలతో పోటీపడనుంది. ఈ కేటగిరీలో దాదాపు 180 సినిమాలు పోటీ పడగా..ఈ ఐదు చిత్రాలు నిలిచాయి. మన దేశం నుంచి రేసులో అనూజ చిత్రం ఉండటం విశేషం. -
ఓటీటీలోకి వచ్చేసిన పుష్పరాజ్.. ఫ్యాన్స్కు బోనస్
పుష్పగాడు ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేశాడు. దేశవ్యాప్తంగా సినిమా ప్రియులు పుష్ప2(Pushpa 2: The Rule) ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. అయితే, జనవరి 30 అర్ధరాత్రి నుంచే ఓటీటీలో 'పుష్పగాడి' రూల్ మొదలైంది. నెట్ఫ్లిక్స్ వేదికగా తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రీలోడెడ్ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతుంది. పాన్ ఇండియా రేంజ్లో అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా సుకుమార్(Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో అనేక రికార్డులను దాటేసింది. ఇప్పటికి 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రూ. 1896 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు.మరో నాలుగు నిమిషాలు అదనంగతేడాది డిసెంబరు 5న భారీ అంచనాలతో విడుదలైన పుష్ప2 మొత్తం రన్టైమ్ 3 గంటల 20 నిమిషాలుగా ఉంది. అయితే, సంక్రాంతి రేసులో ఈ సినిమా నిడివి అదనంగా మరో 20 నిమిషాలు జోడించారు. అప్పుడు పుష్ప రన్ టైమ్ 3:40 నిమిషాలు అయింది. ఫ్యాన్స్కు బోనస్గా ఇప్పుడు ఓటీటీ వర్షన్లో మరో 4 నిమిషాల సీన్లు అదనంగా మరోసారి జత చేశారు. దీంతో పుష్ప2 మొత్తం రన్ టైమ్ 3:44 గంటలు ఉంది. -
ఎట్టకేలకు ఓటీటీకి పుష్ప-2.. అఫీషియల్గా డేట్ ప్రకటించిన నెట్ప్లిక్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్'పుష్ప 2 ది రూల్'( (Pushpa 2: The Rule)) మూవీ ఓటీటీ డేట్ ఎట్టకేలకు ఫిక్స్ అయింది. గత రెండు రోజులుగా జరుగుతున్న చర్చకు నెట్ఫ్లిక్స్ ఫుల్స్టాప్ పెట్టింది. గతేడాది డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 30 నుంచే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ట్విటర్లో ట్రైలర్ వీడియోను పోస్ట్ చేసింది.రీ లోడెడ్ వర్షన్ కూడా..పుష్ప- 2 రీలోడెడ్ వర్షన్తో పాటు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు నెట్ఫ్లిక్స్ వెల్లడించింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి తీసుకు రానున్నట్లు ప్రకటించింది. అదనంగా 23 నిమిషాల రీలోడెడ్ వర్షన్ ప్రకారం మూడు గంటల 44 నిమిషాల నిడివితో పుష్ప 2 ఓటీటీలో సందడి చేయనుంది.బాక్సాఫీస్ షేక్ చేసిన పుష్పరాజ్..సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప-2 ది రూల్ (Pushpa 2: The Rule) బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ఊచకోత కోసింది. పుష్పరాజ్ దెబ్బకు పలు సినిమాల రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. గతేడాది డిసెంబర్ 5న రిలీజైన ఈ చిత్రం ఇప్పటివరకు ఏకంగా రూ.1896 కోట్లు రాబట్టింది. థియేటర్లలో విడుదలై ఏడు వారాల తర్వాత పుష్పరాజ్ ఓటీటీలో సందడి చేయనున్నాడు. Pushpa Bhau ne sun li aapki baat, ab Pushpa ka rule, Hindi mein bhi 🔥Watch Pushpa 2- Reloaded Version with 23 minutes of extra footage on Netflix, on 30 January in Hindi, Telugu, Tamil, Malayalam & Kannada!#Pushpa2OnNetflix pic.twitter.com/smPXn4IMD9— Netflix India (@NetflixIndia) January 29, 2025 -
ఓటీటీకి పుష్ప-2.. ఆడియన్స్కు మరో షాకిచ్చిన నెట్ఫ్లిక్స్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'పుష్ప-2 ది రూల్'. సుకుమార్- బన్నీ కాంబోలో వచ్చిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి రిలీజైంది. పుష్పకు సీక్వెల్గా వచ్చిన ఈ చిత్రంపై మొదటి నుంచే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఏకంగా బాహుబలి, బాహుహలి-2, కేజీఎఫ్ లాంటి సూపర్ హిట్ సినిమాల రికార్డులను ఒక్కసారిగా తుడిచిపెట్టేసింది. ప్రస్తుతం అమిర్ ఖాన్ నటించిన దంగల్ రికార్డ్పై కన్నేసిన పుష్పరాజ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.అయితే ఈ మూవీ బ్లాక్బస్టర్ హిట్ కావడంతో ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ డిజిటల్ రైట్స్ను సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ త్వరలోనే రానుందని ఫ్యాన్స్కు హింట్ ఇచ్చేసింది. అయితే ఎప్పుడనేది మాత్రం వెల్లడించలేదు. అంతకుముందు పుష్ప-2 జనవరి 30న రానుందని నెట్ఫ్లిక్స్లో కనిపించింది. దీంతో అందరూ ఆ తేదీనే ఫిక్సయిపోయారు. కానీ అది పొరపాటున అలా రివీల్ చేశారో తెలీదు.. కాసేపటికే కమింగ్ సూన్ అంటూ ఆడియన్స్కు షాకిచ్చింది.పుష్ప-2 ఫ్రీ కాదట..అయితే తాజాగా నెట్ఫ్లిక్స్ పుష్ప అభిమానులకు మరో షాకిచ్చింది. ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురూచూస్తున్న ఓటీటీ ప్రియులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. పుష్ప-2 ఓటీటీలో చూడాలంటే అదనంగా రూ.199 చెల్లించాలని ట్రైలర్ వీడియోను రిలీజ్ చేసింది. అంటే నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఉన్నప్పటికీ రెంట్ చెల్లించాల్సిందే. దీంతో ఓటీటీలో ఫ్రీగా చూసేద్దామని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది.బాక్సాఫీస్ వద్ద జోరు..పుష్ప 2 చిత్రం కేవలం 30 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,850 కోట్లు గ్రాస్ పైగా కలెక్షన్లు సాధించింది. ఆపై బాహుబలి2 రికార్డ్స్ను దాటేసింది. కేవలం హిందీలో రూ.800 కోట్లకు పైగా నెట్ వసూళ్లను సాధించిన ఏకైక తెలుగు సినిమాగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. హిందీ నెట్ వసూళ్లలో తొలిసారి ఈ మార్క్ చేరిన చిత్రంగా నిలిచింది. బాలీవుడ్ మూవీ కూడా సాధించలేని రికార్డ్స్ పుష్ప2 క్రియేట్ చేసింది.సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పుష్ప చిత్రానికి సీక్వెల్గా 2024 డిసెంబర్ 5న విడుదలైంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్,రష్మిక మందన్నా జోడీగా నటించారు. ఫాహద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, సునీల్, అనసూయ, జగదీశ్ వంటి నటీనటులు ఈ చిత్రంలో కీలకపాత్రలలో నటించారు. భారీ బడ్జెట్తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందించారు.Dabbante lekka ledhu… power ante bayam ledhu… adhey Pushpa 🔥 https://t.co/4qs7VtaTfQ— Netflix India South (@Netflix_INSouth) January 29, 2025 -
ఓటీటీలో థ్రిల్లర్ సినిమా.. ఫ్యామిలీతో మాత్రం చూడొద్దు
అమెరికన్ థ్రిల్లర్ సినిమా 'స్ట్రేంజ్ డార్లింగ్'(Strange Darling ) తెలుగు వర్షన్లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రం వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించబడిందని ప్రచారంలో ఉంది. కానీ, ఆ విషయాన్ని దర్శకుడు జె.టి. మోల్నర్ ధృవీకరించలేదు ఆపై తిరస్కరించలేదు. ఇప్పటికే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్తో (Amazon Prime Video) పాటు బుక్మైషోలో కూడా తెలుగు వర్షన్ రన్ అవుతుంది. అయితే తాజాగా జియో సినిమా(JioCinema) ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా స్ట్రేంజ్ డార్లింగ్ మూవీ తాజాగా తెలుగు స్ట్రీమింగ్కు వచ్చేసింది.గతేడాది ఆగస్టు 23న విడుదలైన స్ట్రేంజ్ డార్లింగ్ చిత్రానికి హాలీవుడ్లో మంచి రెస్పాన్సే వచ్చింది. ఐఎమ్బిడి రేంటిగ్ కూడా 7కు పైగా ఉండటంతో నెటిజన్లు కూడా ఆసక్తి చూపారు. కానీ, బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా కలెక్షన్స్ను అయితే రాబట్టలేకపోయింది. అయితే, థ్రిల్లింగ్తో పాటు బోల్డ్ సినిమాలను ఇష్టపడే వారిని మాత్రం నిరుత్సాహపరచలేదని చెప్పవచ్చు. జె.టి. మోల్నర్ తెరకెక్కించిన ఈ మూవీలో విల్లా ఫిజ్గెరాల్డ్, కైల్ గాల్నెర్ ప్రధాన పాత్రలలో మెప్పించారు.సినిమా నిడివి కేవలం 1:35 గంటలు మాత్రమే ఉంటుంది. ఇద్దరి మధ్య వన్ నైట్ స్టాండ్తో ప్రారంభమైన ఈ కథ ఫైనల్గా అనేక మలుపులు తిరుగుతుంది. ఫ్యామిలీతో పాటుగా కూర్చొని చూసే సినిమా ఎంతమాత్రం కాదు. అలాంటి పొరపాటైతే చేయకండని రివ్యూవర్లు కూడా చెప్పారు. స్ట్రేంజ్ డార్లింగ్ మూవీలో ది లేడీ పాత్రలో విల్లా ఫిట్గెరాల్డ్ నటించగా.. డెమోన్ క్యారెక్టర్ను గాల్నెర్ పోషించారు. సీరియల్ కిల్లర్ కాన్సెప్ట్తో చిత్రం ఉంటుంది. థియేటర్స్లో చూసేంత సినిమా అయితే కాదని చెప్పవచ్చు. కానీ, ఓటీటీలో మాత్రం పక్క చూసేయవచ్చు. చివరి 40 నిమిషాలు మరీ వైలెంట్గా మూవీ మారిపోతుంది. ఓటీటీలో ఔట్స్టాండింగ్ మూవీ అని చెప్పవచ్చు. ఈ వీకెండ్లో అమెజాన్, జియో సినిమాలో మీరూ చూసేయండి. -
ధనుష్ Vs నయనతార.. హీరోకు మద్దతిచ్చిన కోర్టు!
నయనతార (Nayanthara)పై ధనుష్ వేసిన పరువునష్టం దావాను సవాలు చేస్తూ నెట్ఫ్లిక్స్ (Netflix) వేసిన పిటిషన్ను మద్రాస్ న్యాయస్థానం కొట్టివేసింది. నటుడి అనుమతి లేకుండా అతడి సినిమా క్లిప్స్ వాడుకోవడాన్ని తప్పుపట్టింది. నయనతార బయోపిక్లో నానుమ్ రౌడీదాన్ సినిమా క్లిప్స్ వాడుకోవడంపై నిర్మాత ధనుష్ (Dhanush) అభ్యంతరం వ్యక్తం చేశాడు. రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోర్టుకెక్కాడు. దీన్ని సవాలు చేస్తూ నెట్ఫ్లిక్స్ ఓ పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా కోర్టు దీన్ని కొట్టిపారేసింది. మరోవైపు బయోపిక్పై మధ్యంతర నిషేధం విధేంచాలన్న ధనుష్ నిర్మాణ సంస్థ పిటిషన్పై ఫిబ్రవరి 5న విచారణ చేపడతామని కోర్టు వెల్లడించింది.అసలేం జరిగింది?నయనతార జీవితకథ ఆధారంగా నెట్ఫ్లిక్స్ నయతార: బియాండ్ ది ఫెయిరీటేల్(Nayanthara: Beyond the Fairytale) అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని తెరకెక్కించింది. ఇందులో నానుమ్ రౌడీదాన్ సినిమాలోని మూడు సెకన్ల సన్నివేశాన్ని వాడుకున్నారు. ఈ చిత్రానికి విఘ్నేశ్ శివన్ దర్శకుడు కాగా ధనుష్ నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమా సమయంలోనే విఘ్నేశ్, నయన్ ప్రేమలో పడ్డారు. అందుకని సదరు సినిమా క్లిప్స్ వాడుకున్నారు. అయితే దానికి ధనుష్ అభ్యంతరం చెప్పాడు. 24 గంటల్లో ఆ సన్నివేశాలను తొలగించాలని, లేదంటే రూ.10 కోట్లు జరిమానా విధిస్తానన్నాడు. ఆయన హెచ్చరికలను అటు నయనతార, ఇటు నెట్ఫ్లిక్స్ ఏమాత్రం లెక్కచేయలేదు. దీంతో ధనుష్ హైకోర్టును ఆశ్రయించాడు.చదవండి: ప్లాస్టిక్ సర్జరీ.. అవమానంగా ఫీలవడానికేముంది?: ఖుషీ కపూర్ -
ఓటీటీలో నిహారిక కొత్త సినిమా.. వచ్చేవారమే స్ట్రీమింగ్
ఒకప్పుడు హీరోయిన్గా సినిమాలు చేసిన నిహారిక (Niharika Konidela) తర్వాత సడన్గా యాక్టింగ్ను పక్కనపెట్టేసింది. మధ్యలో యాంకరింగ్ ట్రై చేసింది. అలాగే నిర్మాతగా మారి చిన్న చిత్రాలను ఎంకరేజ్ చేసింది. ఈ క్రమంలో పలు హిట్స్ అందుకుంది. చాలాకాలం తర్వాత ఆమె డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్లో యాక్ట్ చేసింది. అంతేకాకుండా తమిళంలోనూ ఓ సినిమా చేసింది. అదే మద్రాస్కారన్ (Madraskaaran Movie). షేన్ నిగమ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో నిహారిక కథానాయిక. నెల రోజుల్లోనే ఓటీటీలోకి..వాలిమోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్పై బి.జగదీష్ నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. పొంగల్ రేసులో ఉన్న విశాల్ మదగజరాజ మూవీ హిట్ టాక్తో దూసుకుపోయింది. కానీ మద్రాస్కారన్ మాత్రం వసూళ్లు రాబట్టడంలో వెనకబడిపోయింది. సామ్ సీఎస్ సంగీతం అందించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ (OTT)లోకి వచ్చేస్తోంది.వచ్చే వారంలో..ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో ఫిబ్రవరి 7 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా వెల్లడించింది. దీంతో నిహారిక సినిమా చూడాలనుకునేవారు ఎంచక్కా ఓటీటీలో చూసేయొచ్చు. అయితే ప్రస్తుతానికి ఇది తమిళ వర్షన్లో మాత్రమే అందుబాటులోకి రానుంది. Makkkale oru arumaiyana action block maatirku🤩#madraskaaran from Feb 7 only on #ahaTamil @SR_PRO_OFFL @SamCSmusic @vaali_mohandas@ShaneNigam1 @KalaiActor @IamNiharikaK @Aishwaryadutta6#Karunas @vaali_mohandas #actor_sharan @prasannadop @santhoshchoreo @DreamBig_film_s… pic.twitter.com/GovTbmKNoh— aha Tamil (@ahatamil) January 27, 2025 చదవండి: గేమ్ ఛేంజర్ డిజాస్టర్పై స్పందించిన అంజలి.. బాధేస్తోందంటూ.. -
ఇరుగుపొరుగు చూస్తున్నారు జాగ్రత్త!
ఓటీటీలో ఇది చూడొచ్చు అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం సూక్ష్మదర్శిని ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఈ ప్రపంచంలో దాచలేనిది ఏదైనా ఉందీ అంటే అది రహస్యమే. కానీ మనిషి తన రహస్యాన్ని బంధించగలనని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంటాడు. ఇప్పుడు కాకపోతే మరెప్పటికైనా రహస్యమనేది బహిర్గతమవ్వాల్సిందే. కాకపోతే ఆ రహస్యాన్ని మన ఊహకు కూడా అందనివాళ్లు బయటపెడితే అది పెద్ద విడ్డూరం. మన రహస్యాన్ని మన ఇరుగుపోరుగు వారు బయటపెడితే మనకెలా ఉంటుంది.. ఆ పంథాన రూపొందించిన సినిమానే ‘సూక్ష్మదర్శిని’(sookshmadarshini). ఓ రకంగా చెప్పాలంటే ఇదో వినూత్న కథ, కథతో పాటు స్క్రీన్ప్లే కూడా అంతే వైవిధ్యంగా నడుస్తుంది. ‘సూక్ష్మదర్శిని’ ఓ మళయాళ సినిమా.హాట్ స్టార్లో తెలుగు డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో ఉంది. ఇక కథ విషయానికొస్తే... ఇది ఓ కాలనీకి సంబంధించినది. ప్రియ తన భర్త ఆంటోని, కూతరు కాణితో అదే కాలనీలో నివసిస్తుంటుంది. ప్రియ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటుంది. ప్రియకి అదే కాలనీలో ఉంటున్న స్టెఫీ, అస్మా మంచి స్నేహితులు. ఓ రోజు ఆ కాలనీలోని ఓ ఇంట్లోకి మాన్యుల్ తన తల్లితో కొత్తగా చేరతాడు. తన తల్లికి అల్జీమర్స్ వ్యాధి ఉందని చెప్పి కొంత వింతగా ప్రవర్తిస్తుంటాడు మాన్యుల్. తన ప్రవర్తన ప్రియకి అనుమానాస్పదంగా అనిపిస్తుంది. ఈ విషయంపై ప్రియ ఫోకస్ చేసి స్టెఫీ, అస్మాతో కలిసి అసలు నిజం బయటపెడుతుంది.మాన్యుల్ ప్రవర్తించిన తీరు ఏంటి, ప్రియ వాళ్లు ఇన్వెస్టిగేట్ చేసి బయట పెట్టిన సంగతేంటి అన్న విషయాలు మాత్రం ‘సూక్ష్మదర్శిని’లో చూస్తే తెలిసిపోతుంది. సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ ఆఖరున వచ్చే అద్భుతమైన ట్విస్టులతో ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమాకి దర్శకుడు యం.సి. జతిన్. ఈ చిత్రంలో నజ్రియా నజీమ్(Nazriya Nazim), బాసిల్ జోసెఫ్(Basil Joseph) వంటి వారు ప్రధాన పాత్రల్లో నటించారు. ఆఖరుగా ఒక్క మాట... ఇరుగు పోరుగు వారు మనతో కలిసి ఉంటే మంచిదే, అలాగే వాళ్లు మనల్ని ప్రత్యేకంగా గమనిస్తున్నారో లేదో కూడా తెలుసుకోవాలి. అప్పుడే మనల్ని ఏ సూక్ష్మదర్శిని ఏమీ చేయదు. వర్త్ఫుల్ వాచ్ ఫర్ ది వీకెండ్. – ఇంటూరు హరికృష్ణ -
ఓటీటీకి పుష్ప-2.. ఆడియన్స్కు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన నెట్ఫ్లిక్స్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప-2 ది రూల్. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. ఇప్పటికే బాహుబలి, బాహుహలి-2, కేజీఎఫ్ లాంటి సినిమాల రికార్డులను తుడిచిపెట్టేసింది. అమిర్ ఖాన్ నటించిన దంగల్ రికార్డ్పై కన్నేసిన పుష్పరాజ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.ఈ నేపథ్యంలో పుష్ప-2 ఓటీటీకి సంబంధించి ఈ రోజు పెద్దఎత్తున వార్తలొస్తున్నాయి. దీనికి కారణం నెట్ఫ్లిక్స్లో పుష్ప-2 రీ లోడెడ్ వర్షన్ కమింగ్ ఆన్ థర్స్డే అనే పోస్టర్ కనిపించింది. దీంతో ఈ వారంలోనే పుష్ప-2 ఓటీటీకి రానుందని అంతా ఫిక్సయిపోయారు. ఈ నేపథ్యంలో నెట్ఫ్లిక్స్ ఆడియన్స్ను బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. అదేంటో చూసేద్దాం.ఉదయం నుంచి పుష్ప-2 ఓటీటీ రిలీజ్ డేట్ జనవరి 30 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని అంతా రాసుకొచ్చారు. కానీ తాజాగా నెట్ఫ్లిక్స్ ట్విటర్ వేదికగా పోస్ట్ పెట్టింది. పుష్ప-2 మూవీ త్వరలోనే ఓటీటీకి రానుందని ప్రకటించింది. అయితే స్ట్రీమింగ్ తేదీని మాత్రం ప్రకటించలేదు. ఇవాళ నెట్ఫ్లిక్స్లో గురువారం అని ఇచ్చారు కానీ.. ఈ వారంలోనా.. లేదంటే వచ్చేవారంలోనా అనేదానిపై ఎలాంటి క్లారిటీ లేదు. దీంతో ఆడియన్స్లో కన్ఫ్యూజన్కు తెరదించేందుకు నెట్ఫ్లిక్స్ పోస్టర్ను రిలీజ్ చేసింది. మరీ ఈ వారంలోనే ఓటీటీకి వస్తుందా? ఫిబ్రవరి 6న రానుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.ఫిబ్రవరి 6 నుంచే ఛాన్స్..పుష్ప-2 చిత్రం రిలీజైన ఫిబ్రవరి 6వ తేదీకి రెండు నెలలు పూర్తవుతుంది. ముందుగా చేసుకున్న డీల్ ప్రకారం 56 రోజుల తర్వాతే ఓటీటీకి రావాలి. ఈ లెక్కన చూస్తే ఈ వారంలో ఓటీటీకి వచ్చే ఛాన్స్ లేదు. నెట్ఫ్లిక్స్ చేసిన పొరపాటుకు ఆడియన్స్ ఈ వారంలోనే వస్తుందని ఫిక్స్ అయిపోయారు. మరి పుష్పరాజ్ ఈ నెలలోనే ఓటీటీలో సందడి చేస్తాడా? లేదంటే ఫిబ్రవరిలోనా అనేది మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ రానుంది.బాక్సాఫీస్ వద్ద జోరు..పుష్ప 2 చిత్రం కేవలం 30 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,850 కోట్లు గ్రాస్ పైగా కలెక్షన్లు సాధించింది. ఆపై బాహుబలి2 రికార్డ్స్ను దాటేసింది. కేవలం హిందీలో రూ.800 కోట్లకు పైగా నెట్ వసూళ్లను సాధించిన ఏకైక తెలుగు సినిమాగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. హిందీ నెట్ వసూళ్లలో తొలిసారి ఈ మార్క్ చేరిన చిత్రంగా నిలిచింది. బాలీవుడ్ మూవీ కూడా సాధించలేని రికార్డ్స్ పుష్ప2 క్రియేట్ చేసింది.సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పుష్ప చిత్రానికి సీక్వెల్గా 2024 డిసెంబర్ 5న విడుదలైంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్,రష్మిక మందన్నా జోడీగా నటించారు. ఫాహద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, సునీల్, అనసూయ, జగదీశ్ వంటి నటీనటులు ఈ చిత్రంలో కీలకపాత్రలలో నటించారు. భారీ బడ్జెట్తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందించారు.The man. The myth. The brAAnd 🔥 Pushpa’s rule is about to begin! 👊 Watch Pushpa 2- Reloaded Version with 23 minutes of extra footage on Netflix, coming soon in Telugu, Tamil, Malayalam & Kannada! pic.twitter.com/ZA1tUvNjAp— Netflix India (@NetflixIndia) January 27, 2025 -
ఈ వారం ఓటీటీలో 18 చిత్రాలు.. ఆ రెండు స్పెషల్!
కొత్త ఏడాదికి తెలుగు సినిమా గ్రాండ్గా వెల్కమ్ చెప్పింది. జనవరి 14న విడుదలైన విక్టరీ వెంకటేశ్ 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ (Sankranthiki Vasthunam Movie)తో బాక్సాఫీస్ ఇప్పటికీ కళకళలాడుతోంది. జనవరి 12న విడుదలైన నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్' సినిమా సైతం మంచి వసూళ్లు రాబట్టింది. జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్చరణ్ 'గేమ్ ఛేంజర్' ఆరంభంలో అదరగొట్టినా తర్వాత మాత్రం తడబడింది. ఈ సినిమాలు ఇప్పుడప్పుడే ఓటీటీ (OTT)లో వచ్చే సూచనలు కనిపించట్లేదు. అయితే జనవరి చివరి వారంలో అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో సందడి చేసేందుకు కొన్ని సినిమాలు, సిరీస్లు రెడీ అయ్యాయి. అందులో అల్లు అర్జున్ 'పుష్ప 2', త్రిష 'ఐడెంటిటీ' వంటి ఆసక్తికరమైన సినిమాలున్నాయి. ఆ పూర్తి జాబితా ఓసారి చూసేద్దాం..థియేటర్లో విడుదలమదగజరాజ (తెలుగు వర్షన్) - జనవరి 31రాచరికం - జనవరి 31మహిహ - జనవరి 31ఓటీటీనెట్ఫ్లిక్స్అమెరికన్ మ్యాన్హంట్: ఓజే సింప్సన్ (డాక్యుమెంటరీ సిరీస్) - జనవరి 29పుష్ప 2 - జనవరి 30ద రిక్రూట్ సీజన్ 2 (వెబ్ సిరీస్) - జనవరి 30లుక్కాస్ వరల్డ్ - జనవరి 31ది స్నో గర్ల్ సీజన్ 2 (వెబ్ సిరీస్) - జనవరి 31 హాట్స్టార్ద స్టోరీటెల్లర్ - జనవరి 28యువర్ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్మ్యాన్ (కార్టూన్ సిరీస్) - జనవరి 29ద సీక్రెట్ ఆఫ్ ద షిలేదార్స్ (వెబ్ సిరీస్) - జనవరి 31జీ5ఐడెంటిటీ - జనవరి 31 అమెజాన్ ప్రైమ్ర్యాంపేజ్ - జనవరి 26ట్రిబ్యునల్ జస్టిస్ సీజన్ 2 (రియాలిటీ కోర్ట్ షో) - జనవరి 27బ్రీచ్ - జనవరి 30ఫ్రైడే నైట్ లైట్స్ - జనవరి 30యు ఆర్ కార్డియల్లీ ఇన్వైటెడ్ - జనవరి 30 యాపిల్ టీవీ ప్లస్మిథిక్ క్వెస్ట్ సీజన్ 4 (వెబ్ సిరీస్) - జనవరి 29సోనీలివ్సాలే ఆషిక్ - ఫిబ్రవరి 1లయన్స్ గేట్ప్లేబ్యాడ్ జీనియస్ - జనవరి 31ముబిక్వీర్ - జనవరి 31చదవండి: రాజమౌళిపై ట్రోలింగ్.. 'మీరు ఇండియన్స్ కాదా?' -
పుష్ప 2 ఓటీటీ ప్రకటన.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
'పుష్ప 2' మూవీ (Pushpa 2: The Rule)తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరాచకం సృష్టించాడు. రికార్డులన్నీ రప్పారప్పా కొట్టుకుంటూ పోయాడు. గతేడాది డిసెంబర్ 5న రిలీజైన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.1896 కోట్లు రాబట్టింది. థియేటర్లలో విడుదలై ఏడు వారాలకు పైనే అవుతుండటంతో అభిమానులు ఓటీటీలో పుష్పరాజ్ రాక కోసం ఎదురుచూస్తున్నారు.ఈ వారమే ఓటీటీలో రిలీజ్ఈ క్రమంలో అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది. పుష్ప 2 ఈ గురువారం (జనవరి 30న) ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ వెల్లడించింది. పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ గురువారం రిలీజ్ కానున్నట్లు యాప్లో చూపిస్తోంది. అందులో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు రాసుంది. రీలోడెడ్ వర్షన్ ప్రకారం మూడు గంటల 44 నిమిషాల నిడివితో పుష్ప 2 ఓటీటీలో సందడి చేయనుంది.సినిమాపుష్ప 2 విషయానికి వస్తే ఇది 2021లో వచ్చిన పుష్ప మూవీకి సీక్వెల్గా తెరకెక్కింది. అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించారు. సుకుమార్ దర్శకత్వం వహించగా దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఫహద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, సునీల్, అనసూయ, జగదీశ్ కీలకపాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించారు.చదవండి: ఇండిగో సిబ్బంది ఓవరాక్షన్..: మంచు లక్ష్మి ఆగ్రహం -
ఓటీటీలోకి రూ.100 కోట్ల సంచలనం ‘మార్కో’.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
మార్కో(Marco Movie).. గతేడాది రిలీజైన మోస్ట్ వయలెంట్ చిత్రమిది. ఉన్ని ముకుందన్(Unni Mukundan) హీరోగా నటించిన ఈ చిత్రం మలయాళంలో సంచలనం సృష్టించింది. కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా..మలయాళంలోనే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డులు సృష్టించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ సినిమా అంచనాలకు మించి వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ చిత్రం ఓటీటీ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రముఖ ఓటీటీ సంస్థలన్నీ ఈ మూవీ రైట్స్ కొనేందుకు పోటీ పడ్డాయట. చివరకు సోనీలివ్ (Sony LIV) ఈ సినిమాను అన్ని భాషల హక్కులతో భారీ మొత్తంలో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.స్ట్రీమింగ్ అప్పుడేనా?మోస్ట్ వయలెంట్ చిత్రంగా చరిత్రకెక్కిన ఈ మూవీ అన్ని భాషల డిజిటల్ రైట్స్ని సోనీలివ్ కొనుగోలు చేసింది. మలయాళ ఇండస్ట్రీలోనే ఇంతవరకు ఏ సినిమాకు పెట్టని రేటు ఈ చిత్రానికి పెట్టారట. థియేటర్స్లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో..ఓటీటీలోనూ మంచి ఆదరణ ఉంటుందని భావిస్తున్నారట. అందుకే ఈ చిత్రంపై భారీ పోటీ ఏర్పడింది. (చదవండి: ఓటీటీలో రియల్ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా.. సడెన్గా తెలుగులో స్ట్రీమింగ్)అయితే ఇప్పుడప్పుడే కాకుండా కాస్త ఆలస్యంగానే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని సోనీలివ్ భావిస్తోందట. పిభ్రవరి మూడో వారంలో ఈ చిత్రం ఓటిటిలో వచ్చే అవకాసం ఉందంటోంది మాలీవుడ్ టాక్.త్వరలోనే ఓటీటీ రిలీజ్పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మార్కో చిత్రానికి హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు షరీఫ్ మహ్మద్ నిర్మాతగా వ్యవహరించారు. రవి బస్రూరు సంగీతం సమకూర్చారు. యుక్తి తరేజా, కబీర్ దుహన్ సింగ్ ఇతర కీలక పాత్రలు పోషించారు.మార్కో కథేంటి?జార్జ్ (సిద్దిఖ్ఖీ) గోల్డ్ బిజినెస్ చేస్తుంటాడు. ఈ వ్యాపారంలో తనకు మించినవాళ్లు ఉండరు. సిండికేట్ ఏర్పాటు చేసి.. దాని లీడర్గా వ్యవహరిస్తుంటారు. అతని తమ్ముడు విక్టర్(ఇషాన్ షౌకాత్) అంధుడు. కానీ చాలా టాలెంటెడ్. విక్టర్ స్నేహితుడు వసీమ్ను ఓ ముఠా చంపేస్తుంది. దానికి సాక్షి ఉన్నాడని విక్టర్ను కూడా ఆ ముఠా దారుణంగా హత్య చేస్తుంది. విదేశాలకు వెళ్లిన జార్జ్ మరో తమ్ముడు(జార్జ్ వాళ్ల నాన్న పెంచిన వ్యక్తి) మార్కో(ఉన్ని ముకుందన్)కు ఈ హత్య విషయం తెలిసి వెంటనే వచ్చేస్తాడు. తను ప్రాణంగా ఇష్టపడే సోదరుడు విక్టర్ హత్యకు కారణమైనవారిని వదిలిపెట్టనని చర్చిలోనే ప్రమాణం చేస్తాడు. అసలు విక్టర్ని హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? చివరకు మార్క్ వారిని ఎలా మట్టుపెట్టాడు?అనేదే మిగతా కథ.Both #Marco & #Rekhachithram OTT deals are closed with Sony Liv. Figures somewhat the same range only with #Marco slightly ahead. pic.twitter.com/FZl8oQvEIj— Friday Matinee (@VRFridayMatinee) January 25, 2025 -
ఓటీటీలో రియల్ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా తెలుగులో స్ట్రీమింగ్
వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘ది సబర్మతి రిపోర్టు’(The Sabarmati Report) సినిమా సడెన్గా తెలుగు వర్షన్ కూడా ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పటి వరకు కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ మూవీ.. తాజాగా తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో విక్రాంత్ మాస్సే(Vikrant Massey), రిథి దిగ్రా, రాశిల్ ఖన్నా(Raashii Khanna) ప్రధాన పాత్రలు పోషించారు. ఏక్తా కపూర్ నిర్మించిన ఈ చిత్రానికి ధీరజ్ శర్నా దర్శకత్వం వహించారు. గతేడాది నవంబర్ 15న ఈ సినిమా విడుదలైంది. ఇప్పుడు ఓటీటీలో విడుదలైంది.తెలుగులో స్ట్రీమింగ్ జీ5 ఓటీటీలో ‘ది సబర్మతి రిపోర్టు’ మూవీ జనవరి 10 నుంచే హిందీ వర్షన్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, తాజాగా ఎలాంటి ప్రకటన లేకుండా శుక్రవారం నుంచి తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. ఈమేరకు జీ5 ఒక పోస్టర్ను కూడా పంచుకుంది. 12th ఫెయిల్ మూవీతో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్న విక్రాంత్ మాస్సే.. ఈ సినిమాతో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు.మోదీ మెచ్చిన చిత్రంగుజరాత్ అల్లర్లు, గోద్రా రైలు దహన కాండను ఆధారంగా చేసుకొని ‘ది సబర్మతి రిపోర్ట్’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పార్లమెంట్ కాంప్లెక్స్లోని బాలయోగి ఆడిటోరియంలో వీక్షించనున్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సహా పలువురు సభ్యులతో మోదీ ఈ చిత్రాన్ని చూశారు. ఆపై చిత్ర యూనిట్ను ఆయన ప్రశంసించారు. ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఛత్తీస్గడ్, మధ్య ప్రదేశ్, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చిత్ర ప్రదర్శనకు పన్ను రాయితీ ప్రకటించాయి. గోద్రా రైలు దహనకాండపై.. ఫిబ్రవరి 27, 2002న జరిగిన గోద్రా రైలు దహనం సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. గోద్రా రైల్వేస్టేషన్లో ఆగివున్న సబర్మతి ఎక్స్ప్రెస్ రైలుకు నిప్పంటించడంతో ఎస్-6 బోగీలోని 59 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో గుజరాత్లో మతపరమైన అల్లర్లు చెలరేగాయి. దాదాపు 1,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఎక్కువగా ముస్లింలు ఉన్నారు. కాగా ఆ సమయంలో ప్రధాని మోదీ గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. 22ఏళ్లుగా చరిత్రలో దాగి ఉన్న రహస్యాలు, నిజాలు వెలుగులోకి రాబోతున్నాయని సినిమా విడుదల సమయంలో చిత్ర యూనిట్ భారీగా ప్రచారం చేసింది. ఆ ఘటనను ఆధారంగా చేసుకుని ‘ది సబర్మతి రిపోర్టు’ సినిమాని తెరకెక్కించారు. (ఇదీ చదవండి: సింహాన్ని లాక్ చేసిన రాజమౌళి.. స్పందించిన మహేశ్బాబు, ప్రియాంక) -
బీ కేర్ఫుల్...
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం డేంజరస్ వాటర్స్ (Dangerous Waters)ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.జీవితమన్నది క్షణభంగురం. ఏ క్షణానికి ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కాబట్టి అనుక్షణం అప్రమత్తత అవసరం. ఈ నేపథ్యంలోనే రూ΄పొందిన హాలీవుడ్ సినిమా ‘డేంజరస్ వాటర్స్’(Dangerous Waters ). ఇదో పూర్తి థ్రిల్లర్ జోనర్ మూవీ. సినిమా మొత్తం ఓ మూడు పాత్రలతో 90 శాతం సముద్రంలోనే జరిగిన కథ. సినిమాలో ఉన్నది మూడు పాత్రలే అయినా మంచి స్క్రీన్ప్లేతో చూసే ప్రేక్షకులను మాత్రం కట్టిపడేసే ప్రయత్నం చేశారు దర్శకుడు జాన్ బర్.ఈ సినిమా లయన్స్ గేట్ ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అవుతోంది. ఇది పెద్దవాళ్లు మాత్రమే చూసే సినిమా. ఇక ఈ చిత్రకథ విషయానికొస్తే... అల్మా తన కూతురు కోసం ఓ సూపర్ వెకేషన్ ప్లాన్ చేస్తుంది. తన బాయ్ ఫ్రెండ్ డెరెక్తో కలిసి కూతురుతో పాటు బోట్లో బెర్ముడా వరకు ట్రావెల్ చేసి, సముద్రం మధ్యలో తన బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవాలన్నది ప్లాన్. దీనికి కూతురు రోజ్ అయిష్టంగానే ఒప్పుకుంటుంది. ప్రయాణం మొదలైనపుడు అంతా బాగానే ఉంటుంది. దారి మధ్యలో వేరే ఒక బోట్ వీళ్లకు ఎదురుగా వచ్చి అల్మాను చంపేసి డెరెక్ను గాయపరుస్తారు. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనలో నడి సంద్రంలో రోజ్ ఒంటరిదైపోతుంది.దాడి చేయడానికి వచ్చినవాళ్లు బోట్లోని రేడియోను అలాగే బోట్ ఇంజన్ను ధ్వంసం చేసి వెళతారు. చుట్టూ నీళ్లు తప్ప ఏమీ లేని ఆ ప్రాంతం నుండి రోజ్ ఎలా బయటపడిందనేది సినిమాలోనే చూడాలి. ఈ సినిమా చాలా నెమ్మదిగా ప్రారంభమై, ఉత్కంఠభరితంగా సాగుతూ ఊహకందని క్లైమాక్స్ ట్విస్టులతో అద్భుతంగా ముగుస్తుంది. గంటా నలభై నిమిషాల నిడివితో సాగే ఈ సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. థ్రిల్లర్ జోనర్ ఇష్టపడేవాళ్లకి ఇదో సూపర్ సినిమా. మరింకేం... ఈ వీకెండ్ ‘డేంజరస్ వాటర్స్’లోకి మీరూ ట్రావెల్ చేయండి. – ఇంటూరు హరికృష్ణ -
హిట్ సినిమా.. వారంలోనే ఓటీటీలో తెలుగు వర్షన్
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్(Tovino Thomas), త్రిష(Trisha) కాంబినేషన్లో తెరకెక్కిన ఐడెంటిటీ(Identity Movie) సినిమా నేడు తెలుగులో విడుదలైంది. భారీ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ ప్రకటన కూడా అధికారికంగా వెలువడింది. వినయ్ రాయ్, మందిరా బేడి ప్రధాన పాత్రలలో కనిపించిన ఈ చిత్రాన్ని అఖిల్ బాయ్, అనాస్ ఖాన్ తెరకెక్కించారు. రాజు మల్లియాత్, సీజే రాయ్ నిర్మించారు. మలయాళంలో జనవరి 2న విడుదలైన ఈ చిత్రం అక్కడ మంచి కలెక్షన్స్ రాబట్టింది.'ఐడెంటిటీ' సినిమా ఓటీటీ రైట్స్ను జీ5 దక్కించుకుంది. అయితే, ఈ చిత్రం ఇప్పటికే మలయాళ వర్షన్ విడుదలై చాలారోజు అయింది. దీంతో తాజాగా ఓటీటీ విడుదలపై ప్రకటన చేశారు. అయితే, తెలుగులోనూ ఈరోజే (జనవరి 24) రిలీజ్ అయింది. ఇంతలోనే మరో వారం రోజుల్లోనే ఓటీటీలోకి అడుగుపెడుతుండటం విశేషం. జనవరి 31న జీ5లో మలయాళ, తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి రానుందని ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర యూనిట్ ఒక పోస్టర్ను పంచుకుంది.ఐడెంటిటీ చిత్రంలో స్కెచ్ ఆర్టిస్టుగా టొవినో థామస్ నటించారు. ఓ క్రైమ్ను చూసి త్రిష... నేరస్తుడిని పట్టుకునే క్రమంలో టొవినో థామస్తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె చెబుతున్న ఆధారాలతో అతను ఎవరి స్కెచ్ వేశారు అనేది చాలా ఆసక్తిగా సినిమా ఉంటుంది. సంచలనం సృష్టించిన ఒక మర్డర్ కేసును ఓ పోలీస్ ఆఫీసర్, స్కెచ్ ఆర్టిస్ట్ కలిసి ఎలా సాల్వ్ చేశారు అనే కథతో ఈ చిత్రం ఉంటుంది. సంక్రాంతికి ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. కానీ, టాలీవుడ్లో ఎక్కువ సినిమాలు ఉండటంవల్ల అవకాశం లేకుండాపోయింది. అందుకే ఈనెల 24వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారు ఐడెంటిటీకి ఫిదా అవుతారు. -
ఓటీటీలో 'శ్వేతా బసు' సినిమా.. టీజరే ఇలా ఉంటే..!
జార్ఖండ్ బ్యూటీ 'శ్వేతా బసు ప్రసాద్'(Shweta Basu Prasad) నటించిన మూవీ 'ఊప్స్ అబ్ క్యా' (Oops Ab Kya) ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈమేరకు తాజాగా అడల్ట్ రేటెడ్ డైలాగ్స్తో ఒక టీజర్ను కూడా మేకర్స్ విడుదల చేశారు. పెళ్లికాని ఒక యువతి అనారోగ్యంగా కారణంగా ఆస్పత్రికి వెళ్తే.. డాక్టర్స్ చేసిన చిన్న పొరపాటుతో ఆమె ప్రెగ్నెట్ అవుతుంది. ఇంతకూ ఆస్పత్రిలో జరిగిన సంఘటన ఏంటి..? అనే సరికొత్త కాన్సెప్ట్తో ఊప్స్ అబ్ క్యా చిత్రం రానుంది. అయితే, ఈ మూవీ డైరెక్ట్గా ఓటీటీలో విడుదల కానుంది.కొత్త బంగారులోకం సినిమాతో తెలుగు వారికి దగ్గరైన శ్వేతా బసు ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన ఊప్స్ అబ్ క్యా చిత్రం డైరెక్ట్గా డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో(Disney+ Hotstar) స్ట్రీమింగ్ కానుంది. సినిమా చాన్స్లు తగ్గిన తర్వాత శ్వేతా పలు వెబ్ సిరీస్లలో నటించింది. ఈ క్రమంలో ఆమె నుంచి వస్తున్న చిత్రం కావడంతో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ మూవీ ఫిబ్రవరి 20న విడుదల కానుంది. ప్రస్తుతం హిందీ వర్షన్లో మాత్రమే రిలీజ్ కానుంది. అయితే, తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది.( ఇదీ చదవండి: విజయ్తో చేయి కలిపేందుకు అడుగులేస్తున్న త్రిష)యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లిన ఓ అమ్మాయి అనుకోకుండా ప్రెగ్నెంట్ అయితే పరిస్థితి ఏంటి..? అనే కాన్సెప్ట్తో ఈ మూవీ వస్తోంది. తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే కాస్త ఆసక్తిగా, సరికొత్త కథతో మేకర్స్ తెరకెక్కించారని తెలుస్తోంది. టీజర్ ప్రారంభంలోనే ఒక పెద్దావిడ తన మనవరాలికి శీలం గురించి చెబుతుంది. పిగ్గీ బ్యాంక్లా జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచిస్తుంది. ఇంతలో ఒక అమ్మాయి పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అని తేలుతుంది. అయితే, ఆమెకు బాయ్ఫ్రెండ్ ఉండటం వల్ల ఇదంతా జరిగింది ఏమో అనుకుంటారు. కానీ, తమ మధ్య ఎలాంటి పొరపాటు జరగలేదని ఆ యువతి చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. అయితే, అసలు తప్పు డాక్టర్ దగ్గర జరిగిందని తర్వాత ఆమె తెలుస్తుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ చెకప్ కోసం వెళ్లిన ఆ అమ్మాయికి డాక్టర్ పొరపాటును మరొకరి స్పెర్మ్ ఇన్సర్ట్ చేస్తుంది. ఆసుపత్రిలో ఉన్న మరో అమ్మాయికి అందించాల్సిన చికిత్స పొరపాటున తనకు చేసినట్లు డాక్టర్ చెప్పడంతో ఖంగుతింటుంది. అయితే, ఆ ప్రెగ్నెన్సీని ఆమె కొనసాగించాలని నిర్ణయించుకుంటుంది. అందుకు కారణాలు ఎంటి..? ఆ తర్వాత కథలో అనేక మలుపులు. చివరకు ఏం జరిగిందన్నది తెలియాలంటే ఫిబ్రవరి 20న డిస్నీ ప్లస్ హాట్స్టార్లో చూసేయండి. -
'ది ఫ్యామిలీ మ్యాన్-3' గురించి గుడ్ న్యూస్
ఓటీటీలో భారీ విజయం అందుకున్న 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ నుంచి మూడో భాగం త్వరలో విడుదల కానుంది. ఓటీటీలో భారీగా ప్రేక్షకాదరణ పొందిన వెబ్సిరీస్ల్లో ‘ది ఫ్యామిలీమ్యాన్’ తప్పకుండా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన రెండు సీజన్లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూడో సీజన్ షూటింగ్ పనులను గతేడాదిలో ప్రారంభించారు. అయితే, తాజాగా ‘ఫ్యామిలీమ్యాన్ సీజన్3’ గురించి ఒక శుభవార్తను మేకర్స్ పంచుకున్నారు.ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఫ్యామిలీ మ్యాన్-3 షూటింగ్ పనులు పూర్తి అయ్యాయి అని మేకర్స్ అధికారికంగ ప్రకటించారు. అందుకు సంబంధించి వారు సెలబ్రేషన్ కూడా చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో దర్శకులు రాజ్ అండ్ డీకేతో పాటు మనోజ్ బాజ్పాయ్,గుల్పనాగ్, ప్రియమణి, సమంత పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్మీడియాలో వారు పంచుకున్నారు.ఈ సిరీస్ తొలి సీజన్ భారత్పై ఉగ్రవాదులు పన్నిన కుట్రలు, దాడులను అడ్డుకోవడం వంటి అంశాల చుట్టూ సాగుతుంది. రెండో సీజన్ తమిళ్ టైగర్స్పై చేసే ఆపరేషన్ వంటి కాన్సెప్ట్ ఉంటుంది. ఇందులో సమంత కూడా నటించిన విషయం తెలిసిందే. అయితే మూడో సీజన్.. కరోనా వ్యాక్సిన్ బ్యాక్ డ్రాప్, చైనా కుట్రలు అనే అంశంపై తీస్తామని రెండో సీజన్ చివర్లో చూపించారు. దేశభక్తుడైన గూఢచార పోలీసు అధికారి శ్రీకాంత్ తివారీగా మనోజ్ ప్రేక్షకులను మెప్పించగా. ఆయన సతీమణిగా ప్రియమణి ఆకట్టుకున్నారు. మూడో సీజన్లో ఈ జోడి మళ్లీ కనిపించనుంది. ఆపై ఇందులో షరీబ్ హష్మీ, శ్రేయా ధన్వంతరీ, వేదాంత్ సిన్హా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.2019 సెప్టెంబరు 20న అమెజాన్ ప్రైమ్లో తొలి సీజన్ రిలీజైంది. కామెడీ, యాక్షన్, దేశభక్తి ఇలా అన్ని అంశాలతో తీసిన ఈ సిరీస్.. జనాలకు తెగ నచ్చేసింది. రెండో సీజన్.. 2021 జూన్ 4న రిలీజ్ చేశారు. అయితే, రెండూ మంచి విజయాన్ని అందుకున్నాయి. 'ఫ్యామిలీ మ్యాన్ 3'లో కూడా మనోజ్ బాజ్పేయీ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ చిత్రీకరణ పూర్తి అయింది. కానీ, విడుదల తేదీని ప్రకటించలేదు. తెలుగు,తమిళ్,కన్నడ,మలయాళం,హిందీలో విడుదల కానుంది. It's a wrap on Season 3 of The Family Man! Thank you to the wonderful crew and cast for going through with the toughest shoot yet! ❤️#TFM #TheFamilyMan3 pic.twitter.com/WXogsICE6v— Raj & DK (@rajndk) January 23, 2025 -
ఓటీటీలో సడెన్గా ఎంట్రీ ఇచ్చిన తెలుగు 'సస్పెన్స్ థ్రిల్లర్' సినిమా
వేదిక(Vedhika) ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా ‘ఫియర్’ (Fear) ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఈ చిత్రం సడెన్గా ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతుంది. సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్గా మెప్పించిన ఈ సినిమాలో అరవింద్ కృష్ణ, జెపి ( జయప్రకాష్ ), పవిత్ర లొకేష్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి, షాని తదితరులు నటించారు. డాక్టర్ హరిత గోగినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్ ఏఆర్ అభి నిర్మించారు. విడుదలకు ముందే ఈ చిత్రం వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్ లో 60 కి పైగా అవార్డ్స్ లను గెల్చుకుని కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది . అయితే, ఈ చిత్రం టాలీవుడ్లో గతేడాది డిసెంబర్ 14న రిలీజైంది. (ఇదీ చదవండి: చనిపోయిన తర్వాత నా ఫోటోలు పెట్టకండి.. కన్నీళ్లతో గ్లామర్ క్వీన్ రిక్వెస్ట్)ఫియర్ సినిమా ఎలాంటి ప్రకటన లేకుండానే నేడు (జనవరి 22) ఓటీటీలో విడుదలైంది. 'అమెజాన్ ప్రైమ్'లో(Amazon Prime Video) ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. ఎక్కువగా థ్రిల్లర్ అంశాలతో పాటు హారర్ ఎలిమెంట్స్ జోడించి ఈ చిత్రాన్ని నిర్మించారు. టీనేజ్ పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రుల బాధ్యత ఎంతమేరకు ఉండాలి అనే కాన్సెప్ట్తో ఫియర్ చిత్రాన్ని తీశారు. సినిమా కాస్త పర్వాలేదనిపించేలా ఉంటుంది. కానీ, పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడంతో ప్రేక్షకులకు పెద్దగా రీచ్ కాలేకపోయింది.కథేంటంటే..సింధు(వేదిక) అనే అమ్మాయి సైకలాజికల్ డిజార్డర్తో బాధపడుతూ ఉంటోంది. లేనిది ఉన్నట్లు.. ఉన్నది లేనట్లు ఊహించుకుని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఒకరోజు తాను ప్రాణంగా ప్రేమించే అరవింద్ కృష్ణ(సంపత్) దూరం కావడంతో మరింత మనోవేదనకు గురి అవుతుంది. అంతేకాకుండా తన చెల్లి ఇందుతో గొడవ పడటం, పేరేంట్స్కు దూరంగా ఉండటం లాంటి సింధును మరింత కుంగదీస్తాయి. అసలు సింధు తన చెల్లితో ఎందుకు గొడవ పడింది? తల్లిదండ్రులకు దూరంగా ఉండటానికి కారణమేంటి? ఆమె ప్రియుడు సంపత్ తిరిగొచ్చాడా? అనేది తెలియాలంటే ఫియర్ చూడాల్సిందే. -
పోలీసు..సింగర్.. నటుడు.. ఎవరీ ప్రశాంత్ తమాంగ్?
చిత్ర పరిశ్రమలో అప్పుడప్పుడు కొన్ని విచిత్రాలు జరుగుతుంటాయి. కొంతమంది నటీనటులు వందల సినిమాలు చేసినా.. సరైన గుర్తింపు రాదు. మరికొంత మంది ఒక్క సినిమాతో ఫేమస్ అవుతారు. ఇది కేవలం హీరోహీరోయిన్లకు మాత్రమే కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా వర్తిస్తుంది. తాజాగా ఓ నటుడు అలాగే ఫేమస్ అయ్యాడు. వెబ్ సిరీస్లో చేసిన ఓ చిన్న పాత్ర అతన్ని ఫేమస్ చేసింది. అతనే ప్రశాంత్ తమాంగ్. అతన్ని ఫేమస్ చేసిన వెబ్ సిరీసే ‘పాతాళ్లోక్-2’(Paatal Lok Season 2 ).స్నిపర్ డేనియల్ లెచో..ఓటీటీలో సూపర్ హిట్గా నిలిచిన పాతాళ్లోక్ వెబ్ సిరీస్కు సీక్వెల్గా తెరకెక్కిన వెబ్ సిరీస్ పాతాళ్లోక్ సీజన్ 2. జైదీప్ అహ్లవత్, గుల్పనాగ్, ఇష్వాక్ సింగ్, విపిన్ శర్మ, తిలోత్తమ షోమీ, ప్రశాంత్ తమాంగ్ కీలక పాత్రలు పోషించారు.అవినాష్ అరుణ్, ప్రోసిత్ రాయ్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ చూసిన వారందరూ హాథీరామ్ చౌదరి పాత్రతో పాటు స్నిపర్ డేనియల్ లెచో పాత్ర గురించి కూడా ఎక్కువగా మాట్లాడుతున్నారు. నిడివి తక్కువే అయినా ఆ పాత్ర ఇచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. తనదైన నటనతో ఆ పాత్రకే వన్నె తెచ్చిన నటుడే ప్రశాంత్ తమాంగ్(Prashant Tamang). ఈ ఒక్క వెబ్ సిరీస్తో ఒక్కసారిగా ఆయన ఫేమస్ అయిపోయాడు. నెటిజన్స్ ఆయన గురించి సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. అతని నేపథ్యాన్ని చూసి షాకవుతున్నారు. మనోడిలో మంచి నటుడే కాదు.. సింగర్ కూడా ఉన్నాడంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూనే.. ప్రశాంత్ తమాంగ్ పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో జన్మించాడు. తండ్రి కానిస్టేబుల్. ప్రశాంత్ స్కూల్ ఏజ్లోనే ఓ ప్రమాదంలో తండ్రి చనిపోయాడు. దీంతో ప్రశాంత్ తన చదవుని మధ్యలోనే ఆపేసి తండ్రి ప్లేస్లో కానిస్టేబుల్గా చేరాడు. అయితే చిన్నప్పటి నుంచే సింగర్ కావాలని ప్రశాంత్ కోరిక. కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూనే.. అవకాశం ఉన్నప్పుడలా తన గాత్రాన్ని వినిపించేవాడు. పోలీసులు ఏర్పాటు చేసుకునే ఆర్కెస్ట్రాలో ప్రశాంత్ పాల్గొని అద్భుతమైన పాటలు ఆలపించేవారు.ఇండియన్ ఐడల్ విన్నర్తన పై అధికారులు ఎంకరేజ్ చేయడంతో కోల్ కత్తాలో జరిగిన ఇండియన్ ఐడల్ సీజన్ 3(2007)లో ప్రశాంత్ పాల్గొన్నాడు. తనదైన గాత్రంతో అలరించి.. సీజన్ 3 విన్నర్గా నిలిచాడు. నేపాలి ఫ్యామిలీస్కి చెందిన ప్రశాంత్.. 2009లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2010లో ఆయన నటించిన తొలి నేపాలీ సినిమా రిలీజైంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన అంతగా గుర్తింపు రాలేదు. కానీ పాతాళ్లోక్ 2లో పోషించిన చిన్న పాత్రతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు. Here's Daniel from Paatal Lok, Indian Idol 2007 winner Prashant Tamang pic.twitter.com/V5tyVmD4ut— Abhishek ✨ (@ImAbhishek7_) January 20, 2025 -
ఈ వారం ఓటీటీకి ఏకంగా 11 చిత్రాలు.. ఆ రెండే స్పెషల్..!
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి ముగిసింది. ఈ ఏడాది థియేటర్లలో మూడు తెలుగు సినిమాలను సినీ ప్రియులను అలరించాయి. బాలయ్య డాకు మహారాజ్, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. వీటిలో వెంకీమామ మూవీకి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.అయితే చూస్తుండగానే మరోవారం వచ్చేసింది. దీంతో ఈ వారంలో ఏయే సినిమాలు వస్తున్నాయని ఆడియన్స్ ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి సినిమాల సందడి ముగియడంతో ఓటీటీల వైపు చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ వారంలో చాలా సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైపోయాయి. వాటిలో ముఖ్యంగా రజాకార్, బరోజ్ 3డీ ఆడియన్స్లో ఆసక్తి పెంచుతున్నాయి. వీటితో పాటు పలు బాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్లు ఈ వారంలోనే సినీ ప్రియులను అలరించనున్నాయి. ఏయే మూవీ ఓ ఓటీటీలో రానుందో మీరు ఓ లుక్కేయండి.ఈ వారం ఓటీటీ సినిమాలు..నెట్ఫ్లిక్స్..ది నైట్ ఏజెంట్- సీజన్ 2(వెబ్ సిరీస్) -జనవరి 23షాఫ్డెట్( కామెడీ సిరీస్)- జనవరి 24ది శాండ్ క్యాస్టిల్(హాలీవుడ్ మూవీ)- జనవరి 24ది ట్రామా కోడ్: హీరోస్ ఆన్ కాల్(కొరియన్ సినిమా)- జనవరి 24అమెజాన్ ప్రైమ్ వీడియో..హర్లీమ్- సీజన్ 3 (వెబ్ సిరీస్)- జనవరి 23జీ5..హిసాబ్ బరాబర్-(హిందీ మూవీ)- జనవరి 24ఆహా..రజాకార్(టాలీవుడ్ సినిమా)- జనవరి 24డిస్నీ ప్లస్ హాట్స్టార్...బరోజ్ 3డీ(మలయాళ మూవీ)- జనవరి 22స్వీట్ డ్రీమ్స్- జనవరి 24జియో సినిమా..దిది-(హాలీవుడ్ సినిమా)- జనవరి 26యాపిల్ టీవీ ప్లస్..ప్రైమ్ టార్గెట్..(హాలీవుడ్ మూవీ) జనవరి 22 -
ఓటీటీకి మోహన్ లాల్ డిజాస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్(Mohan Lal) నటించిన చిత్రం 'బరోజ్ 3డీ'(Barroz 3D Movie). ఈ మూవీని తన డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కించారు. ఈ సినిమాకు ఆయనే స్వీయ దర్శకత్వం వహించారు. ఈ ఎపిక్ డ్రామా ఫాంటసీ సినిమాని ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోని పెరుంబవూర్ నిర్మించారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్ చేశారు. గతేడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది. ఈ మూవీ మోహన్ లాల్ కెరీర్లో మరో డిజాస్టర్గా నిలిచింది.తాజాగా ఈ మూవీ ఓటీటీకి(OTT) వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈనెల 22 నుంచే స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. కాగా.. బరోజ్ కథ నచ్చడంతో తొలిసారిగా మోహన్లాల్ దర్శకత్వం వహించారు. మైథలాజికల్ థ్రిల్లర్గా జీజో పున్నూసే రచించిన నవల ఆధారంగా బరోజ్ చిత్రాన్ని తెరకెక్కించారు. వాస్కోడిగామాలో దాగి ఉన్న నిధిని 400 ఏళ్లుగా కాపాడే జినీగా మోహన్ లాల్ కనిపించారు. ఈ మూవీని తొలిసారిగా 3డీ వర్షన్లో తెరకెక్కించారు.బరోజ్ 3డీ కథేంటంటే..ఒకప్పుడు గోవాని పాలించిన పోర్చుగీస్ రాజు డి గామా (ఇగ్నాసియో మతయోస్)కు బరోజ్ (మోహన్ లాల్) నమ్మిన బంటు. ఆయన నిధిని అంతా బరోజ్ కాపాడుతూ ఉంటాడు. భూతంలా మారి వాళ్ల వంశస్థులకు ఇదంతా అప్పగించేందుకు గత 400 ఏళ్లుగా కాపాలా కాస్తూనే ఉంటాడు. అలా వాస్కోడిగామా వంశంలోని 13వ జనరేషన్కి చెందిన ఇసబెల్లా (మాయా రావ్) గోవా వస్తుంది. ఆమె బరోజ్ని శాపవిముక్తుడిని చేస్తుంది. ఇసబెల్లాకు బరోజ్ నిధి అప్పగించాడా లేదా? 400 ఏళ్ల పాటు నిధిని కాపాడుకునే క్రమంలో బరోజ్ ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నాడు? ఇసబెల్లాకు మాత్రమే బరోజ్ ఎందుకు కనిపిస్తాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ. Step into the magical world of Barroz: The Guardian of Treasures, streaming from January 22nd on Disney+ Hotstar.@mohanlal @antonypbvr @aashirvadcine @santoshsivan @aaroxstudios#DisneyPlusHotstar #DisneyPlusHotstarMalayalam #Barroz #Mohanlal #TheCompleteActor #Fantasy… pic.twitter.com/azNNowsbSw— DisneyPlus Hotstar Malayalam (@DisneyplusHSMal) January 20, 2025 -
ఓటీటీలో భయపెడుతూ నవ్వించే సినిమా
సాధారణంగా సినిమాలలో ఓ రెండింటికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఒకటి హ్యూమర్ అయితే మరొకటి హారర్ జోనర్. కానీ ఆ రెండూ కలిపి సినిమా తీస్తే అదే ఈ సినిమా ‘భూల్ భులయ్యా 3’(Bhool Bhulaiyaa 3). ఇది ‘భూల్ భులయ్యా’ సిరీస్లో వచ్చిన మూడవ సినిమా. నిజానికి మొదటి భాగానికి, మిగతా రెండు భాగాలకి కథతో పాటు పాత్రధారులలో కూడా తేడా ఉంది. ‘భూల్ భులయ్యా’ మొదటి భాగం ‘చంద్రముఖి’ సినిమా ఆధారంగా తీసింది. కానీ మిగతా రెండు భాగాలను మాత్రం అదే థీమ్తో కాస్త విభిన్నంగా రూపొందించారు. ఇప్పుడు ‘భూల్ భులయ్యా 3’ సినిమా కథ విషయానికి వస్తే... 200 సంవత్సరాల క్రితం రక్తఘాట్ రాజ్యంలో జరిగిన కథ. అప్పటి రాజ కుటుంబం వల్ల జరిగిన సంఘటనలో మంజులిక అనే ఓ దెయ్యం కనిపిస్తుంది. ఈ దెయ్యాన్ని అదే రాజ్యంలోని అంతఃపుర గదిలో భద్రంగా బందిస్తారు ఆ రాజ్యానికి చెందిన రాజగురువు. 2024లో వారసత్వ సంపదగా ఆ అంతఃపురాన్ని ఓ హోటల్గా మార్చాలని రాజకుటుంబం వారసులు ప్రయత్నించగా బందీగా ఉన్న మంజులిక దెయ్యం బయటపడి వారిని చాలా ఇబ్బంది పెడుతుంది. ఆ విషయం చూసే ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టిస్తుంది. ఈ మంజులికను కట్టడి చేయడానికి ఫేక్ మాంత్రికుడైన రూహాన్ను ఆ రాజ్యానికి తెప్పించుకుంటారు. రూహాన్ రక్తఘాట్కు వచ్చినప్పటి నుండి కథ అనేక మలుపులు తిరగుతూ ఊహించని క్లైమాక్స్ ట్విస్ట్తో ముగుస్తుంది. ఈ సినిమాలో ముఖ్యంగా ముగ్గురి గురించి చెప్పుకోవాలి. అందులో మొదటగా హీరో రోల్ వేసిన కార్తీక్ ఆర్యన్(Kartik Aaryan)... తన ఈజ్ ఆఫ్ యాక్టింగ్తో హారర్ ఎమోషన్ని కూడా హ్యూమర్ ఎమోషన్తో చక్కగా పలికించాడు. ఇక విశేష పాత్రలలో నటించిన నాటి తార మాధురీ దీక్షిత్(Madhuri Dixit), నేటి వర్ధమాన తార విద్యాబాలన్(Vidya Balan) వారి నటనతోనే కాదు అద్భుత నాట్యంతోనూ సినిమాని ప్రేక్షకులకు మరింత దగ్గర చేశారు. దర్శకుడు అనీస్ ఈ సినిమాని ఎక్కడా బోర్ కొట్టించకుండా ఓ పక్క భయపెడుతూ మరో పక్క గిలిగింతలు పెడుతూ ప్రేక్షకులను కదలనివ్వకుండా స్క్రీన్ప్లే నడిపించాాడు. నెట్ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ ‘భూల్ భులయ్యా 3’ వీకెండ్ వాచబుల్ మూవీ. – ఇంటూరు హరికృష్ణ -
ఓటీటీలో డైరెక్ట్గా విడుదల కానున్న నయనతార, సిద్ధార్థ్ సినిమా
నయనతార(Nayanthara) నటించిన ‘ది టెస్ట్’(The Test) సినిమా డైరెక్ట్గా ఓటీటీలో (OTT) విడుదల కానుంది. వైనాట్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుంది. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతారతో పాటు మాధవన్, సిద్ధార్థ్ (Siddharth) లీడ్ రోల్స్ చేశారు. మీరా జాస్మిన్ ఓ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాతో నిర్మాత శశికాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సుమారు రెండు దశాబ్దాలుగా కథానాయకిగా వెలుగొందుతున్న నటి నయనతార. వృత్తి పరంగానూ వ్యక్తిగతంగానూ ఈమె చూడాల్సిన ఎత్తుపల్లాలు లేవని చెప్పవచ్చు. వృత్తిపరంగా ఎన్నో అవమానాలను ఎదుర్కొని లేడి సూపర్ స్టార్ స్థాయికి ఎదిగారు. ఇక వ్యక్తిగతం గాను పలుమార్లు ప్రేమలో విఫలం అయ్యారు. అయినప్పటికీ మనోధైర్యంతో ముందుకు సాగుతూ ఇప్పుడు భార్యాగానూ ఇద్దరు కవల పిల్లలకు తల్లిగానూ అందమైన సంసార జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అయితే వివాదాస్పద నటి అన్నది నయనతార పేరుకు ముందు అంటి పెట్టుకునే ఉంటుంది. అయినప్పటికీ కథానాయకిగా ఇప్పటికీ బిజీ నటినే. చిత్రానికి రూ.12 నుంచి రూ. 15 కోట్లు పారితోషికం తీసుకుంటూ అగ్ర కథానాయకిగా రాణిస్తున్నారు. పలు చిత్రాలు చేతిలో ఉన్నాయి. వాటిలో ఒకటి టెస్ట్. నిర్మాత శశికాంత్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం కొన్ని నెలల క్రితమే నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. దీంతో చిత్ర విడుదల కోసం నయనతార అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా తాజా సమాచారం ప్రకారం టెస్ట్ చిత్రాన్ని థియేటర్లో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల కానుందని తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే నిలబడే అవకాశం ఉంది. చెన్నైలో జరిగిన ఓ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ముగ్గురు వ్యక్తుల జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనే ప్రధాన కాన్సెప్ట్తో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో 'కుముధ' అనే పాత్రలో నయన్ కనిపించనుంది. ఇకపోతే ఇంతకుముందు కూడా నయనతార ప్రధాన పాత్రను పోషించిన మూకుత్తి అమ్మన్(అమ్మోరు తల్లి), నెట్రికన్ చిత్రాలు నేరుగా ఓటీటీలోనే విడుదల కావడం గమనార్హం. ఈ సినిమా తర్వాత నయన్ చేతిలో డియర్ స్టూడెంట్స్, అమ్మోరు తల్లి 2 చిత్రాలు ఉన్నాయి. -
'పాతాళ్ లోక్'తో ట్రెండ్ అవుతున్న నగేశ్ కుకునూర్ ఎవరో తెలుసా..?
పాతాళ్ లోక్-2 (Paatal Lok-2) వెబ్ సిరీస్ ఓటీటీలో ట్రెండ్ అవుతుంది. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారు ఈ సిరీస్కు ఫిదా అవుతున్నారు. 2020లో వచ్చిన మొదటి సీజన్కు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. జనవరి 17న రెండో సీజన్ విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ టెన్లో ఈ సిరీస్ కొనసాగుతోంది. అనుష్క శర్మ నిర్మించిన ఈ వెబ్ సిరీస్లో ఓ కేసును దర్యాప్తు చేసే పోలీసు అధికారి హాథీరామ్ చౌదరి పాత్రకు మంచి పేరొచ్చింది. మన తెలుగు దర్శకుడు, నటుడు నగేష్ కుకునూర్ (Nagesh Kukunoor) కూడా ఇందులో ఓ బిజినెస్ మ్యాన్గా కనిపించాడు. ఆయన పాత్రకు కూడా మంచి గుర్తింపు దక్కుతోంది. దీంతో ఆయన గురించి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.హైదరాబాద్లో జన్మించిన నగేశ్ కుకునూర్.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కెమికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఉన్నత విద్యనభ్యసించేందుకు యునైటెడ్ స్టేట్స్లోని అట్లాంటా వెళ్లి తన చదువు పూర్తి అయిన తర్వాత కొన్నాళ్లు అక్కడే ఉద్యోగం చేశారు. తనకు ఉద్యోగం కంటే సినిమాలపై ఉన్న ఆసక్తితో అక్కడే నటన, దర్శకత్వ విభాగాల్లో శిక్షణ తీసుకున్నారు. అక్కడే ఉంటూ ఉద్యోగం ద్వారా సంపాధించిన డబ్బుతో 1998లోనే 'హైదరాబాద్ బ్లూస్' అనే ఆంగ్ల చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి స్వదేశానికి తిరిగి వస్తున్న భారతీయుల గురించి అట్లాంటాలో వ్రాసిన స్క్రిప్ట్ ఆధారంగా రూపొందించబడింది.హైదరాబాద్ బ్లూస్ (1998), రాక్ఫోర్డ్ (1999), ఇక్బాల్ (2005), దోర్ (2006), ఆశేయిన్ (2010), లక్ష్మి (2014), ధనక్ (2016) చిత్రాలకు గాను ఏడు అంతర్జాతీయ అవార్డులతో పాటు రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకున్నారు. కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో ‘గుడ్లక్ సఖి’ అనే తెలుగు చిత్రాన్ని కూడా ఆయన డైరెక్ట్ చేశారు. నగేశ్ ఇప్పటికే అక్షయ్ కుమార్, అయేషా టాకియా,జాన్ అబ్రహం, సోనాల్ సెహగల్ వంటి బాలీవుడ్ స్టార్స్ను డైరెక్ట్ చేశారు.‘పాతాళ్ లోక్-2’లో నగేశ్ వ్యాపారవేత్త పాత్రలో మెప్పించారు. అనుష్క శర్మ మొదటిసారి నిర్మాతగా ఈ వెబ్ సిరీస్ రంగంలోకి అడుగుపెట్టారు. ఫస్ట్ సీజన్కు వచ్చిన రెస్పాన్స్ రెండో సీజన్కు కూడా వచ్చింది. ఇందులో జైదీప్ అహ్లావత్, నగేశ్ కుకునూర్, గుల్ పనాగ్, ఇశ్వక్ సింగ్ ముఖ్యపాత్రలు పోషించారు. అనివాష్ అరుణ్ దర్శకత్వం వహించారు.చదవండి: సైఫ్ అలీ ఖాన్పై దాడి.. అసలైన నిందితుడి అరెస్టు -
ఓటీటీలో విడుదల 2.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
తమిళ నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi), స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ కాంబినేషన్లో వచ్చిన విడుదల 1 ఘన విజయం సాధించింది. దీనికి కొనసాగింపుగా వచ్చిన చిత్రమే విడుదల పార్ట్ 2. విజయ్ సేతుపతి, సూరి, మంజు వారియర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, భవానీ శ్రీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. జనవరి 19 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి రానుంది. తమిళంతో పాటు తెలుగు ఆడియోలోనూ అందుబాటులో ఉండనుంది. విడుదల పార్ట్ 1 కూడా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే!సినిమా కథప్రజాదళం నాయకుడు పెరుమాళ్ (విజయ్ సేతుపతి) అరెస్టుతో విడుదల 1 కథ ముగుస్తుంది. జైల్లో ఉన్న పెరుమాళ్ విచారణతో విడుదల పార్ట్ 2 ప్రారంభమవుతుంది. పెరుమాళ్ అరెస్టు విషయం బయటకు తెలియడంతో అతడిని మరో క్యాంపుకు తరలించి అక్కడే ఎన్కౌంటర్ చేయాలని పథకం రచిస్తారు. కొమరన్ (సూరి)తో కలిసి మరికొంతమంది పోలీసులు పెరుమాళ్ను అడవి మార్గం గుండా క్యాంపుకు తీసుకెళ్తారు.ఈ ప్రయాణంలో పెరుమాళ్ తన ఫ్లాష్బ్యాక్ కథ చెప్తాడు. ప్రజాదళంలోకి ఎలా వచ్చాడు? అతడి ఆశయం ఏంటి? పార్ట్ 1లో జరిగిన రైలు ప్రమాదం వెనక ఉన్న నిజమేంటి? పోలీసుల కస్టడీ నుంచి పెరుమాళ్ తప్పించుకున్నాడా? లేదా? అన్న విషయాలు తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే!చదవండి: రామ్ చరణ్ గొప్ప మనసు.. కష్టాల్లో ఉన్న అభిమానికి.. -
ఓటీటీలో సడన్ సర్ప్రైజ్ 'సింగం అగైన్' తెలుగు వర్షన్ స్ట్రీమింగ్
బాలీవుడ్ భారీ యాక్షన్ సినిమా 'సింగం అగైన్'(Singham Again). ఇది సింగం మూవీ బ్లాక్బస్టర్ సిరీస్లో మూడో భాగంగా గతేడాదిలో విడుదలైంది. భారీ కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం ఇప్పటికే ఓటీటీలో హిందీ వర్షన్ రన్ అవుతుంది. అయితే, తాజాగా తెలుగు వర్షన్ కూడా సడెన్గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అజయ్ దేవ్గణ్(Ajay Devgn), అక్షయ్ కుమార్(Akshay Kumar), రణ్వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, కరీనా కపూర్, దీపికా పదుకొణె, అర్జున్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 2024 నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సింగం అగైన్ దాదాపు రూ.372 కోట్లు రాబట్టింది.సింగమ్, సింగమ్ రిటర్న్స్, సింబా, సూర్యవన్షీ వంటి పోలీస్ కాప్ చిత్రాలతో దర్శకుడు రోహిత్శెట్టి ( Rohit Shetty) హిట్స్ కొట్టాడు. ఇప్పుడు అదే ఊపులో సింగం అగైన్ తెరకెక్కించాడు. అయితే, ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో కూడా మంచి ఆదరణ లభించింది. సడెన్గా అమెజాన్ ప్రైమ్లో తెలుగుతో పాటు తమిళ్ వర్షన్ను మేకర్స్ విడుదల చేశారు. 2011లో సింగం సినిమా రాగా దానికి సీక్వెల్గా 2014లో సింగం రిటర్న్స్ వచ్చింది. దశాబ్దకాలం తర్వాత దీనికి కొనసాగింపుగా సింగం అగైన్ తెరకెక్కించారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రవి బర్సూర్,థమన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్తో నిర్మించారు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ వర్ధంతి.. ఘాట్ వద్ద జూ. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళి)బాలీవుడ్ అగ్ర దర్శకుడు రోహిత్ శెట్టి... కాప్ యూనివర్స్లో పోలీసు బ్యాక్డ్రాప్ చిత్రాలను తెరకెక్కించాలంటే ఆయన తర్వాతే ఎవరైనా అనే ట్యాగ్ ఉంది. ఈ క్రమంలో ఆయన నుంచి వచ్చిన సింగమ్, సింగమ్ రిటర్న్స్, సింబా, సూర్యవన్షీ వంటి చిత్రాలే అని చెప్పవచ్చు. తన చిత్రాలలోని పాత్రలకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ‘సింగమ్ అగైన్’లో దీపికా పదుకొణెని (Deepika Padukone) డి.సి.పి శక్తి శెట్టిగా అతిథి పాత్రలో ఆయన చూపించారు. కానీ లేడీ సింగమ్తో పూర్తిస్థాయి ప్రాధాన్య ఉన్న ఒక చిత్రం చేయాలనే ఆలోచన ఉన్నట్లు రోహిత్ చెప్పారు. చాలా రోజులుగా ఇదే విషయంపై ఆయన పలు వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే, అది పట్టాలెక్కడం లేదు. కానీ, సింగం అగైన్ విడుదల తర్వాత దీపిక పదుకొణెతో లేడీ సింగమ్ తరహా సినిమాకచ్చితంగా ఉంటుందన క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఆ కథకు సంబంధించిన బలమైన ఆలోచన ఉందని పేర్కొన్నారు. కానీ దాన్ని స్క్రిప్ట్గా మార్చడానికే కుదర లేదని చెప్పారు. ఏది ఏమైనా లేడీ సింగమ్ సినిమా అయితే కచ్చితంగా ఉంటుందని చెప్పడంతో ప్రకటన కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. -
ఓటీటీకి మోహన్ లాల్ ఫాంటసీ మూవీ.. పార్ట్నర్ ఫిక్స్
మలయాళీ స్టార్ మోహన్లాల్(Mohan Lal) నటించిన లేటేస్ట్ మూవీ 'బరోజ్ 3డీ'(Barroz 3D Movie). ఈ సినిమాకు ఆయన దర్శకత్వం వహించారు. ఈ ఎపిక్ డ్రామా ఫాంటసీ సినిమాని ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోని పెరుంబవూర్ నిర్మించారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా తెలుగులో రిలీజ్ చేశారు. గతేడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది.తాజాగా ఈ మూవీ ఓటీటీకి(OTT) వచ్చేందుకు సిద్ధమైంది. త్వరలోనే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుందని ఓటీటీ సంస్థ పోస్టర్ను రిలీజ్ చేసింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. కాగా.. బరోజ్ కథ నచ్చడంతో తొలిసారిగా మోహన్లాల్ దర్శకత్వం వహించారు. వాస్కోడిగామా నిధిని కాపాడే జినీగా మోహన్ లాల్ ఈ చిత్రంలో కనిపించారు.(ఇది చదవండి: 'బరోజ్ 3డీ’లో కొత్త ప్రపంచాన్ని చూస్తారు: మోహన్ లాల్)బరోజ్ 3డీ కథేంటంటే.. ఒకప్పుడు గోవాని పాలించిన పోర్చుగీస్ రాజు డి గామా (ఇగ్నాసియో మతయోస్)కు బరోజ్ (మోహన్ లాల్) నమ్మిన బంటు. ఆయన నిధిని అంతా బరోజ్ కాపాడుతూ ఉంటాడు. భూతంలా మారి వాళ్ల వంశస్థులకు ఇదంతా అప్పగించేందుకు గత 400 ఏళ్లుగా కాపాలా కాస్తూనే ఉంటాడు. అలా వాస్కోడిగామా వంశంలోని 13వ జనరేషన్కి చెందిన ఇసబెల్లా (మాయా రావ్) గోవా వస్తుంది. ఆమె బరోజ్ని శాపవిముక్తుడిని చేస్తుంది. ఇసబెల్లాకు బరోజ్ నిధి అప్పగించాడా లేదా? 400 ఏళ్ల పాటు నిధిని కాపాడుకునే క్రమంలో బరోజ్ ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నాడు? ఇసబెల్లాకు మాత్రమే బరోజ్ ఎందుకు కనిపిస్తాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ. View this post on Instagram A post shared by Disney+ Hotstar Malayalam (@disneyplushotstarmalayalam) -
నెట్ఫ్లిక్స్లో పవన్ కల్యాణ్ ‘ఓజీ’.. రాబోయే తెలుగు సినిమాలివే!
కరోనా తర్వాత ఓటీటీల వాడకం దేశవ్యాప్తంగా ఎక్కువైంది. థియేటర్కి వెళ్లి సినిమా చూడడం తగ్గించి.. ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి ఓటీటీలో సినిమాను వీక్షిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్తో పాటు నెట్ఫ్లిక్స్లోనూ ఇండియన్ సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్కి చెందిన స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా నెట్ఫ్లిక్స్లోనే స్క్రీమింగ్ అవుతున్నాయి. అయినప్పటికీ మిగతా భాషలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల నుంచి నెట్ఫ్లిక్స్ ఖాతాదారులు తక్కువగానే ఉన్నారు. అందుకే ఆ సంస్థ టాలీవుడ్పై ఫోకస్ చేసింది. అందుకే తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఏడాది మరింత మందిని తమ ఖాతాదారులుగా చేర్చుకునేందుకు గాను నెట్ఫ్లిక్స్ పదులకొద్ది సినిమాలను కొనుగోలు చేసింది. టాలీవుడ్ చిత్రాలపై ఫోకస్ఒకప్పుడు నెట్ఫ్లిక్స్ టాలీవుడ్తో పాటు దక్షిణాది చిత్రాలకు కాస్త దూరంగా ఉండేది.ఏడాది మూడు నాలుగు చిత్రాలు మాత్రమే రిలీజ్ చేసేది. కానీ ఇప్పుడు దక్షిణాది చిత్రాలపై ఫుల్ ఫోకస్ చేసింది. ముఖ్యంగా టాలీవుడ్ చిత్రాలను వరుసగా రిలీజ్ చేస్తుంది. గతేడాది బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకున్న అనేక చిత్రాల స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకుంది.ఇక 2025లోనూ నెట్ఫ్లిక్స్ అదే ఒరవడి కొనసాగించనుంది. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న తెలుగు సినిమా జాబితాను ప్రకటించింది. ఈ సారి నెట్ఫ్లిక్స్ ఖాతాలో పవన్ కల్యాణ్ ‘ఓజీ’, నాగచైతన్య ‘తండేల్’తో సహా క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. దాదాపు రూ.1000 కోట్లు ఖర్చు పెట్టి ఈ చిత్రాలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. థియేటర్స్లో విడుదలైన తర్వాత ఒప్పందం చేసుకున్న ప్రకారం ఈ చిత్రాలు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతాయి. ఆ క్రేజీ ప్రాజెక్ట్స్పై ఓ లుక్కేద్దాం.OG is back, and everybody is about to feel the heat! 💥 OG is coming to Netflix in Telugu, Tamil, Malayalam, Kannada & Hindi, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/TawVw3QavA— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025పవన్ ‘ఓజీ’.పవన్ కల్యాణ్ నటించాల్సిన సినిమాల్లో ఓజీ ఒకటి. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. అయితే రాజకీయాల్లో పవన్ బిజీ కావడంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఈ ఏడాదిలో మాత్రం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. ఆ దిశగా పనులు కూడా ప్రారంభించారు. ఈ చిత్రంతో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించగా.. ఇమ్రాన్ హష్మి కీలక పాత్ర పోషించబోతున్నారు.నాగచైతన్య ‘తండేల్’ When fate drags them across borders, only courage can bring them home. 🌊❤️Thandel, coming to Netflix in Telugu, Tamil, Malayalam, Kannada & Hindi, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/uRMGVxk43n— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025 నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన తండేల్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ సైతం నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. తండేల్ సినిమాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటకు యూట్యూబ్లో మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. ఫిబ్రవరి 7న ఈ చిత్రం థియేటర్స్లో విడుదల కానుంది.Brace yourself for a mass jathara from the one and only Mass Maharaja! Mass Jathara, coming to Netflix in Telugu, Tamil, Malayalam & Kannada, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/FCCbwWHdcm— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025 రవితేజ ‘మాస్ జాతర’రవితేజ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘మాస్ జాతర’. రవితేజ కెరీర్లోని ఈ 75వ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ‘ధమాకా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత రవితేజ, శ్రీలీల మళ్లీ జంటగా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఎస్ఐ లక్ష్మణ్ భేరీ పాత్రలో రవితేజ నటిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న థియేటర్స్లో విడుదల కానుంది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. A man without a side and betrayal without limits.VD12, coming to Netflix in Telugu, Tamil, Malayalam, Kannada & Hindi, after its theatrical release!#NetflixPandaga pic.twitter.com/WugL3yTprB— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025వీడి12విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘వీడీ 12’ (వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కుతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే, రుక్మిణీ వసంత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ని కూడా నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. దీంతో పాటు నాని హిట్ 3, మ్యాడ్ స్క్వేర్, జాక్, అనగనగా ఒక రాజు సినిమాలను సైతం నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. The boys are back with double the MADness! 🔥 Mad Square, coming to Netflix, in Telugu, Tamil, Kannada, Malayalam & Hindi, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/vW4nedPEsB— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025Grab your gold, the King is getting married! 🤭 Anaganaga Oka Raju, coming to Netflix, in Telugu, Tamil, Malayalam & Kannada, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/fewgneVXv8— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025 -
ఓటీటీకి టాలీవుడ్ మూవీ.. మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్!
యాటిట్యూడ్ స్టార్గా పాపులర్ అయిన సీరియల్ నటుడు ప్రభాకర్ తనయుడైన చంద్రహాస్ తొలి సినిమానే 'రామ్ నగర్ బన్నీ'. ఈ చిత్రంలో విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్గా నటించారు. ఈ మూవీకి శ్రీనివాస్ మహత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మించారు. గతేడాది అక్టోబర్లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అభిమానులను పెద్దగా మెప్పించలేకపోయింది.తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 17 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీ సంస్థ పోస్టర్ను రిలీజ్ చేసింది. దీంతో థియేటర్లలో రిలీజైన మూడు నెలల తర్వాత ఓటీటీలో సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రంలో మురళీధర్, సలీమ్, మధునందన్, సుజాత, విజయలక్ష్మి, సమీర్, లక్ష్మణ్ టేకుముడి, ప్రణయ్ గణపూర్, శివ, హృశికేష్ గజగౌని కీలక పాత్రలు పోషించారు.రామ్ నగర్ బన్నీ కథేంటంటే..?రామ్నగర్ ఏరియాలో ఉండే బన్నీకి లేడీస్ వీక్నెస్. చూసిన ప్రతి అమ్మాయితో ప్రేమలో పడుతుంటాడు. అలా ఒకరు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురితో ఒకరి తర్వాత ఒకరు అన్నట్లు ప్రేమ కహానీ నడిపిస్తాడు. అమ్మాయిల వరకు అయితే ఏదో అనుకోవచ్చు. అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటానని ఓ ఆంటీకి మాటిస్తాడు. ఆమె కంపెనీలో చేరతాడు. అయితే ఈమెపై తనకు ఎలాంటి ఇష్టం లేదని, తను నిజంగా ప్రేమిస్తుందని శైలు(విస్మయ శ్రీ)ని అని తెలుసుకుంటాడు. కానీ అప్పటికే ఆమెకు మరొకరితో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అవుతుంది. చివరకు బన్నీ, శైలు ఒక్కటయ్యారా అనేది మిగతా స్టోరీ.Relationships, responsibilities, and redemption—Attitude star's emotional rollercoaster begins on from Jan 17 #RamNagarBunny @parkyprabhakar #Chandrahass@DivijaPrabhakar @vismayasri #RichaJoshi #ambikavani @Rithumanthra @iammadhunandan #ActorSameer #aslisaleempheku… pic.twitter.com/klP7FtkTjB— ahavideoin (@ahavideoIN) January 14, 2025 -
సంక్రాంతి స్పెషల్.. పండుగ రోజే ఓటీటీకి వచ్చేసిన కొత్త సినిమా!
సంక్రాంతి పండుగ అంటే కేవలం పిండి వంటలే కాదు.. మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి. కోడి పందేలతో పాటు సినిమాలు కూడా ఎంజాయ్ చేయాలి. ఇప్పటికే థియేటర్లలో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు సందడి చేస్తున్నాయి. స్టార్ హీరోల ఫ్యాన్స్ అంతా ఇప్పటికే థియేటర్లకు క్యూ కడుతున్నారు.మరి ఫ్యామిలీతో ఎంచక్కా ఇంట్లోనే సినిమాలు వీక్షించాలనుకునే వారికి ఓటీటీలు రెడీ బోలెడు ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయి. ఇటీవల విడుదలైన సినిమాలతో పాటు మీకిష్టమైన చిత్రాలు చూసేయొచ్చు. అలాంటి వారికోసమే సంక్రాంతి పండుగ సందర్భంగా ఓటీటీకి వచ్చేసింది తెలుగు సినిమా. అదేంటో మీరు ఓ లుక్కేయండి.సంక్రాంతి పండుగ రోజున ఓ తెలుగు చిత్రం డైరెక్ట్గా ఓటీటీలోకి అడుగుపెట్టేస్తోంది. యంగ్ హీరో తిరువీర్ నటించిన చిత్రం మోక్ష పటం. ఈ సినిమా ఇప్పటి వరకు థియేటర్లలో రిలీజ్ కాలేదు. ఈ సంక్రాంతి ఫెస్టివల్ స్పెషల్ నేరుగా ఓటీటీలోనే అడుగుపెట్టింది. ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఈ రోజు నుంచే ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా.. ఈ చిత్రానికి రాహుల్ వనజ రాజేశ్వర్ దర్శకత్వం వహించారు.ఈ చిత్రంలో పూజా కిరణ్, తరుణ్ పొనుగోటి, జెన్నిఫర్ ఇమ్మూన్యుయేల్, శాంతి రావ్ కీలక పాత్రలు పోషించారు. కామెడీ అండ్ క్రైమ్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని దర్శకుడు రాజేశ్వర్ తెరకెక్కించారు. ఈ చిత్రానికి రవి గోలీ, లక్ష్మణా, రాహుల్ కథను అందించారు. నేస్తమా మూవీ మేకర్స్ పతాకంపై ప్రవీణ్ గడ్డం, సాయి, తారపరెడ్డి నిర్మించారు. ఈ సినిమాకు కమ్రాన్ సంగీతమందించారు. A mysterious bag changes Gayatri's life forever. Will it bring fortune or trouble? Watch #Mokshapatam now!▶️https://t.co/xnqpEPAm3H#MokshapatamOnAha #Trailer #Comedy #Crime @iamThiruveeR @ShantiRaoDqd @pooja_kiran @JeniferEmmanu11 @hithisistarun @ursguruofficial @syedkamran… pic.twitter.com/LBiE7fjgqx— ahavideoin (@ahavideoIN) January 14, 2025 -
థియేటర్లలో రిలీజ్కు ముందే ఓటీటీ ఫిక్స్.. ఆ టాలీవుడ్ సినిమాలివే!
సినీ ఇండస్ట్రీలో ఇప్పుడంతా ఓటీటీల హవానే నడుస్తోంది. దీంతో సినీ ప్రియులంతా కుటుంబంతో కలిసి మూవీ వీక్షించేందుకు సరికొత్త వేదికగా మారింది. ఈ నేపథ్యంలో కొత్త కొత్త చిత్రాలు ఓటీటీల్లో ఇప్పటికే సందడి చేస్తున్నాయి. అయితే ఈ రోజుల్లో కొన్ని థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఓటీటీకి వస్తే.. మరికొన్ని చిన్న చిత్రాలు డైరెక్ట్గా ఓటీటీలోనే విడుదల చేస్తున్నారు.అయితే ఈ సంక్రాంతి సందర్భంగా టాలీవుడ్ సినిమాలు రిలీజ్కు ముందే ఓటీటీ ఫ్లాట్ఫామ్ను ఫిక్స్ చేసుకున్నాయి. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ప్లిక్స్ వెల్లడించింది. ఇంతకీ ఆ సినిమాలేవో మీరు ఓ లుక్కేయండి.గతంలో విడుదలైన మ్యాడ్ మూవీ సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి సీక్వెల్గా మ్యాడ్ స్క్వేర్ కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా థియేటర్లో ఇంకా విడుదల కాలేదు. రిలీజ్ తర్వాత నెట్ఫ్లిక్స్లోనే స్ట్రీమింగ్ కానుంది. సంక్రాంతి సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు.దీంతో పాటు డీజే టిల్లు ఫేమ్ హీరో సిద్ధు జొన్నల గడ్డ నటిస్తోన్న తాజా చిత్రం జాక్. ఈ సినిమా కూడా నెట్ఫ్లిక్స్లోనే స్ట్రీమింగ్ కానుందని పోస్టర్ రిలీజ్ చేశారు. మరో టాలీవుడ్ హీరో ప్రియదర్శి పులికొండ నటిస్తోన్న కోర్టు మూవీ కూడా ఈ ఓటీటీలోనే రానుంది. అలాగే రవితేజ హీరోగా వస్తున్న మాస్ జాతర, నవీన్ పొలిశెట్టి హీరోగా వస్తోన్న అనగనగా ఒక రాజు, పవన్ కల్యాణ్ ఓజీ చిత్రాల హక్కులను కూడా నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. పొంగల్ కానుకగా ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ రివీల్ చేసింది.Brace yourself for a mass jathara from the one and only Mass Maharaja! Mass Jathara, coming to Netflix in Telugu, Tamil, Malayalam & Kannada, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/zUpUbt2SdV— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025 Grab your gold, the King is getting married! 🤭 Anaganaga Oka Raju, coming to Netflix, in Telugu, Tamil, Malayalam & Kannada, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/fewgneVXv8— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025 The truth is on trial, and one lawyer is determined to prove it. ⚖️ Court: State vs A Nobody, coming to Netflix, in Telugu, Tamil, Kannada, Malayalam & Hindi, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/HzHtBdITgc— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025 No plan, no limits, only guts 💥 Jack, coming to Netflix in Telugu, Tamil, Malayalam, Kannada & Hindi, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/90hJsZEYKd— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025The boys are back with double the MADness! 🔥 Mad Square, coming to Netflix, in Telugu, Tamil, Kannada, Malayalam & Hindi, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/vW4nedPEsB— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025 -
యూట్యూబ్లో ఫ్రీగా ‘మిస్టరీ’
ఓటీటీల వాడకం పెరిగిన తర్వాత ప్రేక్షకుడు థియేటర్స్కి వెళ్లడం తగ్గించాడు. సినిమాలో స్పెషల్ కంటెంట్ ఉంటే తప్ప థియేటర్స్కి వెళ్లడం లేదు. అందుకే రిలీజ్కు ముందే కొత్త కొత్త పంథాలో ప్రమోషన్స్ చేస్తూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్తున్నారు. అయితే కొన్ని చిన్న చిత్రాలు బాగున్నప్పటికీ సరైన ప్రమోషన్స్ లేకపోవడంతో థియేటర్లో ఆశించిన స్థాయిలో ఆడడం లేదు. కానీ ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మంచి స్పందన లభిస్తుంది. అందుకే కొంతమంది చిన్న నిర్మాతలు ఓటీటీ కోసమే సినిమాలను నిర్మిస్తున్నారు. అయితే ఇటీవల ఓటీటీ సంస్థలు కూడా అన్ని సినిమాలను కొనడం లేదు. ముఖ్యంగా చిన్న సినిమాల విషయంలో పరిస్థితి దారుణంగా ఉంది. థియేటర్లో మోస్తరుగా ఆడినా కూడా ఓటీటీకి అమ్ముడు పోవడం లేదు. అందుకే కొన్ని సినిమాలను డైరెక్టుగా యూట్యూబ్లో రిలీజ్ చేస్తున్నారు. ఫ్రీగా ‘మిస్టరీ’తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వం చేస్తూ నటించిన కామెడీ థ్రిల్లర్ సినిమా "మిస్టరీ". సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాను య్యూట్యూబ్లో రిలీజ్ చేశారు. నేటి(జనవరి 13) నుంచి ఈ సినిమా యూట్యూబ్లో స్ట్రీమింగ్ అవుతోంది. తనికెళ్ళ భరణి, అలీ, సుమన్, తల్లాడ సాయికృష్ణ, స్వప్న చౌదరి, వెంకట్ దుగ్గిరెడ్డి , రవి రెడ్డి, సత్య శ్రీ, ఆకెళ్ల, గడ్డం నవీన్, శోభన్ బొగరాజు, ఎం.ఎస్ నాయుడు , లు ఇలా ప్రముఖ తారాగణం తో తెరకెక్కిన ఈ సినీమా థియేటర్లలో విడుదలైన చాలా రోజులకి ఓటీటీలోకి వచ్చేసింది. తన సినిమా యూట్యూబ్లో స్ట్రీమింగ్ అవుతున్నట్లు తల్లాడ సాయికృష్ణ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.‘మిస్టరీ’ కథేంటి?ఒక మర్డర్ జరగడం, అసలు ఎలా ఆ క్రైం జరిగిందీ అనే కోణం లో సినిమా మొదలు అవుతుంది.కామెడీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మంచి స్క్రీన్ ప్లే తో సినిమా సాగుతోంది.మల్టీ లినియర్ స్క్రీన్ ప్లే ని ఈ సినిమా కి ఉపయోగించారు. మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా కి సంగీతం అందించిన పవన్ ఈ సినిమా కి బ్యాక్రౌండ్ సంగీతం అందించారు. ఒక గంట 50 నిమిషాలు నిడివిగల ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా నేటి నుంచి యూట్యూబ్లో స్ట్రీమింగ్ అవుతుందని, సినిమా చివర వరకు ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ పొందుతారని సాయికృష్ణ అన్నారు. -
సంక్రాంతికి సినిమాల జాతర.. ఓటీటీల్లో ఏకంగా 16 చిత్రాలు!
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. నగరాలు వదిలి పల్లె చేరుకున్న ప్రజలు పండుగ సెలబ్రేషన్స్లో మునిగిపోయారు. ఇవాల్టి నుంచి భోగితో మొదలైన.. కనుమతో ఈ సంక్రాంతి మూడు రోజుల పాటు సాగనుంది. ఇంకేముంది కుటుంబంతో కలిసి ఎంచక్కా ఎంటర్టైన్మెంట్ చేసే సినిమాలు కూడా రెడీ అయ్యాయి. ఈ సంక్రాంతిని మరింత సంతోషంగా సెలబ్రేట్ చేసుకునేందుకు థియేటర్లలో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ ఇప్పటికే విడుదలయ్యాయి. వెంకటేశ్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం పండుగ రోజే బిగ్ స్క్రీన్పై సందడి చేయనుంది.ఈ పండుగ వేళ కుటుంబంతో కలిసి సినిమాలను ఆస్వాదించేందుకు ఓటీటీలే సరైన వేదిక. ఈ సంక్రాంతి వేళ సినీ ప్రియులను అలరించేందుకు ఓటీటీ సినిమాలు సిద్ధమైపోయాయి. అయితే ఈ పండుగు ఓటీటీల్లో పెద్ద సినిమాలు లేకపోవడం మైనస్. విజయ్ సేతుపతి కీలక పాత్రలో మెప్పించిన విడుదల పార్ట్-2 మాత్రమే కాస్తా ఇంట్రెస్టింగ్ మూవీ. దీంతో బాలీవుడ్ ఐ వ్యాంట్ టు టాక్ అనే సినిమాతో పాటు పలు హాలీవుడ్ సిరీస్లు స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. ఈ వారంలో ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్సింగిల్స్ ఇన్ఫెర్నో(కొరియన్ రియాలిటీ షో) సీజన్ 4- 14 జనవరివిత్ లవ్ మెగాన్- హాలీవుడ్- జనవరి 15జో కిట్టీ సీజన్-2 - కొరియన్ వెబ్ సిరీస్- 16 జనవరిబ్యాక్ ఇన్ యాక్షన్-(హాలీవుడ్ మూవీ)- 17 జనవరిది రోషన్స్- హిందీ డాక్యుమెంటరీ సిరీస్- 17 జనవరిఅమెజాన్ ప్రైమ్ వీడియోఐ వ్యాంట్ టు టాక్- హిందీ సినిమా- జనవరి 17పాతల్ లోక్ సీజన్-2- 17 జనవరిడిస్నీ ప్లస్ హాట్స్టార్పవర్ ఆఫ్ పాంచ్- (హిందీ వెబ్ సిరీస్)- 17 జనవరిజీ5విడుదల పార్ట్-2- తమిళ సినిమా- జనవరి 17 సోని లివ్పణి- మలయాళ సినిమా- 16 జనవరిఅమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్చిడియా ఉద్- హిందీ సిరీస్- జనవరి 15ఎపిక్ ఆన్గృహ లక్ష్మి- హిందీ సిరీస్- జనవరి 16జియో సినిమాస్పీక్ నో ఈవిల్- హాలీవుడ్ సినిమా- జనవరి 13హర్లీ క్వీన్- సీజన్ -5(హాలీవుడ్)- జనవరి 17లయన్స్ గేట్ ప్లేహెల్ బాయ్- ది క్రూక్డ్ మ్యాన్-(హాలీవుడ్ మూవీ)- జనవరి 17మనోరమ మ్యాక్స్ఐ యామ్ కథలాన్(మలయాళ సినిమా)- జనవరి 17 -
బాలయ్య 'డాకు మహారాజ్'.. ఏ ఓటీటీకి రానుందంటే?
నందమూరి బాలకృష్ణ నటించిన యాక్షన్ మూవీ డాకు మహారాజ్. బాలీ కొల్లి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాకు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. బాలయ్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడిదంటూ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రంతో తమన్ మరోసారి తనదైన బీజీఎంతో అదరగొట్టేశాడని చెబుతున్నారు.డాకు మహారాజ్కు సక్సెస్ టాక్ రావడంతో సినీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ మూవీ ఓటీటీ గురించి అప్పుడే చర్చ మొదలెట్టారు. బాలయ్య మూవీ ఏ ఓటీటీకి రానుందని తెగ వెతికేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్లో ఓ టాక్ నడుస్తోంది. బాలకృష్ణ డాకు మహారాజ్ హక్కులను ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం. భారీ ధరకు ఈ మూవీ ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. బాబీ కొల్లి దర్శకత్వంలో ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. అంతేకాకుండా ఈ సినిమాలో బాబీ డియోల్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. (ఇది చదవండి: ‘డాకు మహారాజ్’ మూవీ రివ్యూ)టికెట్ ధరల పెంపు..జనవరి 12న విడుదల కానున్న మూవీకి బెనిఫిట్ షోలతో పాటు టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. 12వ తేదీ ఉదయం 4 గంటల ప్రత్యేక షో కోసం అనుమతితో పాటు ఒక్కో టికెట్ రూ.500కు విక్రయించేందుకు అనుమతిచ్చింది. రోజుకు ఐదు షోలతో పాటు ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలపై అదనంగా మల్టీప్లెక్స్లో రూ.135, సింగిల్ థియేటర్స్లలో రూ.110 వరకు పెంచుకోవచ్చని చెప్పింది. జనవరి 26 వరకు ఈ ధరలు అమల్లో ఉండనున్నాయి.ఈ సారి డాకు మహారాజ్ సినిమాపై అమెరికాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. అమెరికాలో ఇప్పటికే టికెట్స్ ఇప్పటి వరకు రికార్డ్ స్థాయిలో 10 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. అమెరికాలోని 125 లోకేషన్స్లలో 350 షోలు ప్రదర్శించారు.ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుజనవరి 9న జరగాల్సిన డాకు మహారాజ్ (Dsaku Maharaaj) చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ (Pre Release Event) రద్దయింది. శ్రీవారి దర్శనం కోసం వెళ్లిన భక్తులు తిరుపతిలో టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాట జరగడంతో ఆరుగురు భక్తులు మరణించారు. ఇలాంటి విషాధ ఘటన సమయంలో సినిమా ఈవెంట్ను నిర్వహించడం సరైన నిర్ణయం కాదని చిత్ర యూనిట్ రద్దు చేసింది. ఈ నిర్ణయంతో బాలయ్య ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. డైరెక్టర్ బాబీ ఈ సినిమా గురించి మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రం రాబోయే రోజుల్లో పలు సినిమాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని నమ్ముతున్నా. యాక్షన్తోపాటు మంచి వినోదం, భావోద్వేగాలతో కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమా ఉంటుంది' అని అన్నారు. ఈ నెల 12న నా బర్త్ డే కానుకగా ఈ చిత్ర విజయాన్ని అందించాలని కోరుకుంటున్నట్లు హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కోరారు. -
ఓటీటీలో మాధవన్ ‘హిసాబ్ బరాబర్’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
విలక్షణ నటుడు ఆర్.మాధవన్ (R Madhavan) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘హిసాబ్ బరాబర్’. నీల్ నితిన్, కీర్తి కుల్హారి ఇతర పాత్రలు పోషించిన ఈ మూవీ నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుంది. జీ5లో జనవరి 24 నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో తాజాగా సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఓ బ్యాంక్ చేసే చిన్న పొరపాటు ఓ వ్యక్తి జీవితాన్ని తలకిందులు చేస్తే .. అతనెలా స్పందించాడు? న్యాయం కోసం ఎలాంటి పోరాటం చేశాడనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఆర్థిక మోసం, అవినీతి, న్యాయం కోసం చేసే పోరాటం ఇవన్నీ ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి. అశ్విన్ ధీర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, ఎస్పి సినీకార్ప్ నిర్మించాయి. దర్శకుడు అశ్విన్ ధీర్ మాట్లాడుతూ .. సమాజంలో అవినీతి, మోసాలను ఓ సామాన్యుడు ఎలా ఎదుర్కొన్నాడనే కథాంశంతో రూపొందిన ‘హిసాబ్ బరాబర్’ అందర్నీ ఆలోచింపజేసే చిత్రం. సామాజిక అంశాలతో పాటు ప్రేక్షకులకు కావాల్సిన డ్రామా, కామెడీ, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. మాధవన్, నీల్ నితిన్, కీర్తి కుల్హారి వంటి వారు తమదైన నటనతో మెప్పిస్తారు. జనవరి 24న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అన్నారు.ఆర్.మాధవన్ మాట్లాడుతూ.. జీ5తో నేను చేసిన తొలి సినిమా ఇది. ఇలాంటి ఓ సినిమాలో భాగం కావటం ఎంతో సంతోషంగా ఉంది. సామాన్యుడైన రాధే మోహన్ శర్మ పాత్రలో నటించటాన్ని ఎంజాయ్ చేశాను. ఈ పాత్ర నాకు ఛాలెంజింగ్గా అనిపించింది. మనలో ఉండే కామన్మ్యాన్ అవినీతికి వ్యతిరేకంగా ఎలా పోరాటం చేశాడనేదే కథ. ఇలాంటి వాస్తవ కథనాలతో మరిన్ని సినిమాలు రావాలని కోరుకుంటున్నాను అన్నారు.నీల్ నితిన్ మాట్లాడుతూ.. హిసాబ్ బరాబర్ చిత్రంలో మిక్కీ మెహతా అనే బ్యాంకర్ పాత్రతో మెప్పిస్తాను. యాక్టర్గా నాకు సవాలు విసిరిన పాత్ర ఇది. మాధవన్ వంటి నటుడితో కలిసి యాక్ట్ చేయడం చాలా సంతోషం. తనొక అద్భుమైన వ్యక్తి. స్క్రీన్పై మా ఇద్దరి మధ్య పోటాపోటీగా ఉండే సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి అన్నారు.కీర్తి కుల్హారి మాట్లాడుతూ ‘‘హిసాబ్ బరాబర్ వంటి చిత్రంలో నటిగా సవాలు విసిరిన వైవిధ్యమైన పాత్రలో నటించటం ఎంతో సంతోషంగా ఉంది. మాధవన్గారితో నటించటం మంచి ఎక్స్పీరియె్స్. అశ్విన్ ధీర్ సినిమాను ఎంతో గ్రిప్పింగ్గా తెరకెక్కించారు. అన్నీ అంశాలను మేళవించి తెరకెక్కించిన ఎంటైర్టైనర్ ఇది. అందరినీ ఆలోచింప చేసే చిత్రం. జనవరి 24 నుంచి ప్రీమియర్ కానున్న ఈ సినిమాను ఆదరించాలని కోరుకంటున్నాను’’ అన్నారు. చదవండి: ప్రముఖ కమెడియన్కు బ్రెయిన్ స్ట్రోక్ -
ఓటీటీలో 'రియల్ స్టోరీ' సినిమా స్ట్రీమింగ్
'ప్రేమించొద్దు' (Preminchoddu ) అనే చిన్న సినిమా ఓటీటీలోకి (OTT) వచ్చేసింది. ‘బందూక్, శేఖరంగారి అబ్బాయి’ చిత్రాల ఫేమ్ అనురూప్ రెడ్డి హీరోగా నటించిన ఈ చిత్రంలో దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించారు. శిరిన్ శ్రీరామ్ (Shirin Sriram) స్వీయ దర్శకత్వంలో 5 భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా గతేడాది జూన్ 7న విడుదలైంది. బస్తీ నేపథ్యంలో సాగే ప్రేమకథతో ఈ మూవీ నిర్మించారు. యువతలో చాలామంది నిజమైన ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలియకుండా తప్పటడుగులు వేస్తుంటారు. ఇది వారి జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందనే కోణంలో ‘ప్రేమించొద్దు’ అనే శీర్షికతో ఈ సినిమాను తెరకెక్కించనట్లు శిరిన్ శ్రీరామ్ తెలిపారు.ఐఎమ్డీబీలో 8 రేటింగ్తో ప్రేమించొద్దు చిత్రం ఉంది. అయితే, ఎలాంటి ప్రకటన లేకుండా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. జనవరి 10 నుంచి రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్తో పాటు బీసినీట్ (Bcineet OTT) ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా అందుబాటులో ఉంది.(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్' ఫస్ట్ డే కలెక్షన్స్.. ఫ్యాన్స్లో నిరాశ)వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు డైరెక్టర్ శిరిన్ శ్రీరామ్ గతంలో తెలిపాడు. ట్రైలర్ కూడా చాలా ఆసక్తిగానే ఉండటంతో థియేటర్స్లో కాస్త పర్వాలేదనిపించింది. బస్తీ నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రంగా ఉంటుంది. నేటి తరం తల్లిదండ్రులు, పిల్లలు చూసేలా ఈ సినిమా ఉంటుందని చెప్పవచ్చు. పాఠశాల నుంచి కాలేజీ స్థాయిలో ఉండే లవ్ స్టోరీలు.. వాటి వల్ల చదువుల్ని నిర్లక్ష్యం చేయడంతో వచ్చే నష్టాలు, తెలియని వయసులో ప్రేమిస్తే ఎదురయ్యే పరిణామాలను కళ్ళకు కట్టినట్లు 'ప్రేమించొద్దు' చిత్రంలో చూపించారు.బేబి సినిమా వివాదంతో శిరిన్ శ్రీరామ్ వైరల్తన ఐడియాను కాపీ కొట్టి సాయి రాజేశ్ బేబి సినిమా తీశాడని దర్శకుడు శిరిన్ శ్రీరామ్ గతంలో తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయంపై సాక్ష్యాలతో సహా సాయి రాజేష్ మీద ‘బేబీ లీక్స్ అనే బుక్ అందుబాటులోకి కూడా ఆయన తీసుకోచ్చారు. ఆ సమయంలో ఈ టాపిక్ టాలీవుడ్లో చర్చనీయాశంగా మారింది. తన కథను కాపీ కొట్టి బేబీ సినిమా తీశారని ఆయన చాలా సార్లు చెప్పారు. తనకు దర్శకత్వం అవకాశం ఇస్తానని తన వద్ద ఉన్న కథను కాపీ కొట్టి అదే బస్తీ అమ్మాయి.. ఇద్దరబ్బాయిల్ని ప్రేమించే కథతో బేబీ అనే సినిమా తీశాడని శిరిన్ ఆరోపించారు. అయితే, తాజాగా ఓటీటీలోకి వచ్చేసిన ప్రేమించొద్దు సినిమా స్టోరీ కూడా బేబీ సినిమాకు దగ్గరగానే ఉంటుంది. అందువల్ల సోషల్మీడియాలో ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయింది. -
ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
మీకు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు అంటే అంచే ఇష్టమా..? అయితే, మలయాళ ( Malayalam) ఇండస్ట్రీలో గదేడాదిలో వచ్చిన ఈ చిత్రాన్ని వదులుకోకండి. కేవలం 1:40 గంటల పాటు ఉండే ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ ఈ చిత్రం మలయాళ వర్షన్ అమెజాన్ ప్రైమ్లో రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, తాజాగా తెలుగు వర్షన్ను ఉచితంగా చూసే అవకాశం వచ్చింది. అది కూడా యూట్యూబ్లో కావడంతో ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.మలయాళంతో తెరకెక్కిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా 'కురుక్కు' (Kurukku) తెలుగులో 'V2 డబుల్ మర్డర్' ( V2 Double Murder) అనే టైటిల్తో డబ్ అయ్యింది. తాజాగా ఈ హిట్ మూవీ తెలుగు వెర్షన్ను ఉచితంగా యూట్యూబ్లో (YouTube) చూడొచ్చు. ఈ మూవీలో పెద్ద స్టార్స్ లేరు. అనిల్ ఆంటో, బాలాజీ శర్మ, మీరా నాయర్, శ్రీజీత్ కీలక పాత్రలు పోషించారు. అభిజీత్ నూరానీ దర్శకత్వం వహించాడు. గతేడాది జూన్లో చిన్న సినిమాగా థియేటర్లలో రిలీజైన కురుక్కు బ్లాక్ బాస్టర్ టాక్ తెచ్చుకుంది.కురుక్కు ప్రేక్షకులను మెప్పింస్తుంది. ఇందులో ఎలాంటి కామెడీ, సాంగ్స్ అనేవి ఉండవు.. కేవలం యాక్షన్ సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అంతేకాకుండా సినిమా నిడివి తక్కువ. దీంతో ప్రేక్షకులలో ఎక్కడా కూడా బోర్ ఫీల్ కలగకుండా సినిమా సాగుతుంది. ఒక డబుల్ మర్డర్ కేసును పోలీస్ టీమ్ ఎలా ఛేదించింది అన్నదే 'వీ2 డబుల్ మర్డర్' కథ. పోలీసుల ఇన్విస్టిగేషన్లో కిల్లర్ ఎవరన్నది చివరి వరకు రివీల్ కాదు. వరుస ట్విస్ట్లతో దర్శకుడు ఈ మూవీని నడిపించిన తీరును ఎవరైనా ప్రశంసించాల్సిందే.(ఇదీ చదవండి: గేమ్ ఛేంజర్ తర్వాత స్టార్ హీరో బయోపిక్ ప్లాన్ చేస్తున్న శంకర్)ఈ సినిమా కథలో రూబిన్, అతడి వైఫ్ స్నేహ ఇద్దరు అతి దారుణంగా హత్యకు గురువుతారు. ఇద్దరి మృతదేహాలు వేరువేరు చోట్ల ఉంటాయి. అయితే, వారి హత్యను జార్జ్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రత్యక్షంగా చూస్తాడు. కానీ, అతను మద్యం మత్తులో ఉండటంతో హంతకుడిని సరిగ్గా గుర్తు పట్టకలేక పోతాడు. సంచలనంగా మారిని ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా మారుతాడు. ఈ కేసు ఇన్వేస్టిగేషన్ చేసే బాధ్యతను సజన్ అనే పోలీస్ ఆఫీసర్ చేస్తుంటాడు. ఈ హత్యలో జార్జ్ నిరపరాధి అని సజన్ నమ్ముతాడు. కానీ, సాక్ష్యాలు మాత్రం అతడే హత్య చేసినట్లుగా కనిపిస్తాయి. చివరికి ఈ హత్య కేసును పోలీసులు ఎలా ఛేదించారు అనేది స్టోరీ. మర్డర్ మిస్టరీగా మారిన కురుక్కు తెలుగులో 'V2 డబుల్ మర్డర్' చిత్రాన్ని యూట్యూబ్లో ఉచితంగా చూసేయండి. -
నాటి రామాయణం నేటి పాత్రలతో.....
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం సింగమ్ ఎగైన్ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.మన ఇతిహాసాలలో గొప్ప విలువలతో కూడుకున్న కథ రామాయణం. నాటి రామాయణాన్ని నేటి నేటివిటీతో ప్రస్తుత ప్రముఖ నటీనటులతో మళ్లీ మన ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి. ఇదే ప్రయత్నాన్ని గతంలో చాలా మందే చేసినా యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ‘సింగమ్’ సిరీస్ చిత్రానికి ఈ తరహా ప్రయోగం చేయడం మొదటిసారి. అందులోనూ బాలీవుడ్లో భారీ తారాగణంతో ఇలాంటి అంశంతో కూడిన కథ తీయడమనేది నిజంగా సాహసమనే చెప్పాలి. ముందుగా ‘సింగమ్’ సిరీస్ గురించి చెప్పుకుందాం. ఈ సిరీస్లో వచ్చిన మూడో చిత్రం ‘సింగమ్ ఎగైన్’. సిరీస్లో ఈ భాగం ప్రేక్షకుల ముందు రావడా నికి దాదాపు పదేళ్లు పట్టింది. 2011లో ‘సింగమ్’ మొదటి చిత్రం రాగా 2014లో రెండో భాగంగా ‘సింగమ్ రిటర్న్స్’ విడుదలైంది. ఆ తరువాత మూడో భాగం 2024లో ‘సింగమ్ ఎగైన్’గా వచ్చింది.అన్ని సిరీస్లలో కథానాయకుడిగా ప్రముఖ స్టార్ అజయ్ దేవగన్ నటించారు. ఇకపోతే ప్రస్తుత ‘సింగమ్ అగైన్’ చిత్రంలో అజయ్ దేవగన్తో పాటు కరీనా కపూర్, దీపికా పదుకోన్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్ తదితర ప్రముఖ నటులు నటించారు. రామాయణ కథనే ఇతివృత్తంగా అల్లుకున్న కథ ఇది. రామాయణంలోని పాత్రలను రిలేట్ చేస్తూ ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ స్క్రీన్ప్లే కొనసాగుతుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే సినిమాలో రామాయణ కథను టీవీ షో రూపంలో చూపిస్తూ కథను నడిపిస్తారు. అప్పటి రామాయణ కథ చరిత్రతో మనకు పరిచయం.అందుకే అది రమణీయ కావ్యం. కానీ ఇప్పటి ‘సింగమ్ ఎగైన్’ రణరంగమే ప్రధాన సూత్రంగా నడిచిన కథ. ఆఖరుగా ఒక్క మాట... రామాయణ కథను నేటి తరానికి మళ్లీ చెప్పడమనేది మంచిదే కానీ, ఎన్నో భావావేశాలున్న రామాయణ మూల కథలోంచి ఒక్క శౌర్య, వీర రసం మాత్రం తీసుకుని సినిమా రూ΄పొందించడం ఏమాత్రం సమంజసమో సినిమా తీసిన దర్శక–నిర్మాతలు, చూస్తున్న మనలాంటి ప్రేక్షకులు ఆలోచించాల్సిందే. ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికగా ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది. మీరు కూడా చూసి ఆలోచించడం మొదలు పెట్టండి. – ఇంటూరు హరికృష్ణ -
ఓటీటీకి హ్యాపీ డేస్ హీరో మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
హ్యాపీ డేస్లో నటించిన హీరో రాహుల్ టైసన్, చేతన్ కుమార్, సాక్షి చౌదరి, అమీ ఏల, ఐశ్వర్య రాజ్ నటించిన చిత్రం "100 క్రోర్స్"(100 crores). గతేడాది సెప్టెంబర్ 20న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఎస్ ఎస్ స్టూడియోస్ పతాకంపై దివిజ కార్తీక్, సాయి కార్తీక్ నిర్మించారు. ఈ చిత్రానికి విరాట్ చక్రవర్తి దర్శకత్వం వహించారు.తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 11 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సినిమా ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుందో ప్రేక్షకులు ఊహించలేరు. ఊహించని మలుపులతో, థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్సులతో కథ నడుస్తుంది. 2016లో జరిగిన యథార్థ కథ ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతాన్ని అందించారు. నేనే నా, కాజల్ కార్తీక, కాళరాత్రి, లిటిల్ హార్ట్స్, టీనెజర్స్, శాకాహారి లాంటి మంచి చిత్రాలని ఆహా ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు అందించిన హనుమాన్ మీడియా ఇప్పుడు "100 క్రోర్స్" చిత్రంతో మీ ముందుకు వస్తోంది.ఈ సందర్భంగా హనుమాన్ మీడియా అధినేత బాలు చరణ్ మాట్లాడుతూ..'100 క్రోర్స్ ఒక అద్భుతమైన యాక్షన్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్. జనవరి 11న ఆహా లో విడుదలయ్యే ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుంది. అందరూ తప్పక చూడండి. థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన వారు, మళ్లీ చూడాలనుకునే వారు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. 100 క్రోర్స్ ఆహాలో సూపర్ హిట్ అవుతుంది" అని తెలిపారు. -
ఓటీటీకి వచ్చేసిన బచ్చలమల్లి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ నటించిన సినిమా 'బచ్చల మల్లి'(Bachalamalli Movie). గతేడాది డిసెంబర్లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఆడియన్స్ను పెద్దగా మెప్పించలేకపోయింది. 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సుబ్బు మంగదేవి ఈ ప్రాజెక్ట్ను తెరకెక్కించారు. ఈ చిత్రంలో అమృత అయ్యర్ కథానాయికగా మెప్పించింది.తాజాగా ఈ చిత్రం ఓటీటీలో(OTT) సందడి చేస్తోంది. ఎలాంటి ప్రకటన లేకుండానే అమెజాన్ ప్రైమ్లో(Amazon Prime Video) అందుబాటులోకి వచ్చేసింది. జనవరి 10 నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీని థియేటర్లలో చూడడం మిస్సయినవారు.. ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. కాగా.. ఈ చిత్రంలో రావు రమేశ్,రోహిణి, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరితేజ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాను రాజేశ్ దండా, బాలాజీ గుత్తా సంయుక్తంగా నిర్మించారు. బచ్చలమల్లి అసలు కథేంటంటే..ఈ సినిమా కథ 1985-2005 మధ్య కాలంలో సాగుతుంది. తుని మండలం సురవరానికి మల్లి అలియాస్ బచ్చల మల్లి (అల్లరి నరేశ్) చాలా తెలివైన వాడు. పదో తరగతి పరీక్షల్లో టాపర్గా నిలిచి తండ్రి(బలగం జయరామ్) గర్వపడేలా చేస్తాడు. మల్లికి తండ్రి అంటే ప్రాణం. కానీ ఆయన తీసుకున్న ఓ నిర్ణయం మల్లి మనసును గాయపరుస్తుంది. అప్పటి నుంచి తండ్రిపై అసహ్యం పెంచుకుంటాడు. అప్పటి వరకు మంచి బాలుడిగా ఉన్న మల్లి.. చెడ్డవాడిగా మారుతాడు. చదువు మానేసి ట్రాక్టర్ నడుపుతూ మద్యానికి బానిసవుతాడు.నిత్యం తాగుతూ ఊర్లో వారితో గొడవ పడుతూ మూర్ఖుడిగా తయారవుతాడు. అదే సమయంలో మల్లీ లైఫ్లోకి కావేరి(అమృతా అయ్యర్) వస్తుంది. ఆమెతో ప్రేమలో పడిన తర్వాత మల్లి లైఫ్లో వచ్చిన మార్పులు ఏంటి? మల్లి తండ్రి తీసుకున్న నిర్ణయం ఏంటి? మంచి వ్యక్తిగా ఉన్న మల్లి మూర్ఖుడిలా మారడానికి గల కారణం ఏంటి? కావేరితో ప్రేమాయణం ఎలా సాగింది? గోనె సంచుల వ్యాపారి గణపతి రాజు(అచ్యుత్ కుమార్), మల్లికి మధ్య వైరం ఎందుకు వచ్చింది? మూర్ఖత్వంతో తీసుకున్న నిర్ణయాల వల్ల మల్లి కోల్పోయిందేంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
గేమ్ ఛేంజర్ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్..
భారీ అంచనాల మధ్య వచ్చిన గేమ్ ఛేంజర్ మూవీ (Game Changer Movie)కి అంతటా మిక్స్డ్ టాక్ లభిస్తోంది. రామ్చరణ్ (Ram Charan) నటన బాగున్నప్పటికీ పాత కథే అవడంతో జనాలు బోరింగ్గా ఫీల్ అవుతున్నారు. పైగా ట్రైలర్లో చెప్పినట్లుగా అన్ప్రిడిక్టబుల్గా ఏదైనా ఉందా? అని చూస్తే ఒకటీ రెండు ట్విస్టులు మినహా కథ మొత్తం ఊహించినట్లే సాగుతోంది. దీంతో జనాలు గేమ్ ఛేంజర్పై పెదవి విరుస్తున్నారు.బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?అభిమానులు మాత్రం రామ్ చరణ్ నటన బాగుందని సంబరపడుతున్నారు. ఇండియన్ 2 డిజాస్టర్తో చతికిలపడ్డ శంకర్ ఈ చిత్రంతోనైనా కమ్బ్యాక్ ఇస్తాడనుకుంటే అది అయ్యే పనిలా కనిపించడం లేదు. దాదాపు రూ.400 -450 కోట్లు గుమ్మరించి తెరకెక్కించిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయినా అవుతుందా? అని పలువురూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఓటీటీ వివరాలుఇదిలా ఉంటే గేమ్ ఛేంజర్ ఓటీటీ పార్ట్నర్ షిప్ వివరాలు బయటకు వచ్చాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime Video) భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. థియేటర్లో రిలీజైన ఎనిమిది వారాల తర్వాత ఈ మూవీ డిజిటల్ ప్లాట్ఫామ్లో అందుబాటులోకి రానుంది. అయితే నెగెటివ్ టాక్ ఇలాగే కొనసాగితే మాత్రం ఓటీటీలో నెల రోజుల్లోనే రిలీజ్ కావడం ఖాయం!గేమ్ ఛేంజర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండిగేమ్ ఛేంజర్ సినిమా..రామ్ చరణ్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం గేమ్ ఛేంజర్. వినయ విధేయ రామ తర్వాత చరణ్- కియారా కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రమిది. శంకర్ దర్శకత్వం వహించగా అంజలి, ఎస్జే సూర్య, శ్రీకాంత్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించారు. 2.45 గంటల నిడివితో జనవరి 10న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజైంది. దిల్రాజు బ్యానర్లో నిర్మితమైన 50వ సినిమా ఇది. అందుకే ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించారు.పాటల కోసమే కోట్లు ఖర్చుకేవలం పాటలకే కోట్లు ఖర్చుపెట్టారు. ఓ ఈవెంట్లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ఐదు పాటలకు రూ.75 కోట్లు ఖర్చయ్యాయి. కొన్ని విదేశాల్లో షూట్ చేశాం. ఒక్కో పాట పది రోజులకుపైగా చిత్రీకరించారు అని చెప్పుకొచ్చాడు. డిసెంబర్ 29న విజయవాడ బృందావన కాలనీలో ఉన్న వజ్రా మైదానంలో రామ్చరణ్ భారీ కటౌట్ ఆవిష్కరించారు. 256 అడుగుల ఎత్తుతో ఉన్న ఈ కటౌట్ దేశంలోనే అతి పెద్దదిగా చరిత్రకెక్కింది.పొరపాటు చేసిన చిత్రయూనిట్ప్రీరిలీజ్, ప్రమోషన్స్ అన్నీ పెద్ద ఎత్తున చేశారు కానీ రిలీజ్ రోజే చిన్న పొరపాటు చేశారు. సినిమాకు హైప్ ఇచ్చిన నానా హైరానా సాంగ్ను థియేటర్లలో ప్రదర్శించలేదు. సాంకేతిక సమస్యల కారణంగా పాటను యాడ్ చేయలేని మరో నాలుగు రోజుల్లో నానా హైరానా థియేటర్లో వేస్తామని చిత్రయూనిట్ వివరణ ఇచ్చింది. కానీ నాలుగురోజుల్లో సినిమా ఫలితం తేలిపోతుందని, ఆ తర్వాత పాటను యాడ్ చేస్తే ఉపయోగమేముంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన సిద్దార్థ్ మూవీ -
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన సిద్దార్థ్ మూవీ
హీరో సిద్దార్థ్ (Siddharth).. ఒకప్పుడు టాప్ హీరో! ప్రేమకథా చిత్రాలకు పెట్టింది పేరు! తమిళ, తెలుగు భాషల్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేసిన ఇతడు ఈ మధ్యకాలంలో మాత్రం హిట్లు లేక అవస్థలు పడుతున్నారు. కొన్నేళ్లుగా సక్సెస్కు దూరంగా ఉన్న సిద్దార్థ్ రెండేళ్లక్రితం చిత్తా (చిన్నా) మూవీతో విజయం అందుకున్నాడు. అయినప్పటికీ ఈ సినిమాకు తమిళంలో వచ్చినంత ఆదరణ తెలుగులో రాకపోవడం గమనార్హం.ఓటీటీలో సిద్దూ మూవీసిద్దార్థ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ మిస్ యూ. గతేడాది డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ అందుకుంది. తెలుగు, తమిళ భాషల్లో రిలీజైన మిస్ యు ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా మిస్ యు మూవీని ఓటీటీలో రిలీజ్ చేశారు. జనవరి 10 నుంచి మిస్ యు.. అమెజాన్ ప్రైమ్లో తమిళ, తెలుగు భాషల్లో ప్రసారమవుతోంది. రాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిద్దార్థ్, ఆషిక రంగనాథ్ జంటగా నటించారు. శామ్యూల్ మాథ్యూస్ నిర్మించారు. గిబ్రాన్ సంగీతం అందించారు.(గేమ్ ఛేంజర్ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)సిద్దార్థ్ కెరీర్ అలా మొదలైందిబాయ్స్ సినిమాతో హీరోగా ప్రయాణం మొదలుపెట్టాడు సిద్దార్థ్. తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీతో సెన్సేషన్ అయ్యాడు. బొమ్మరిల్లుతో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నాడు. తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తూనే బాలీవుడ్లోనూ అడుగుపెట్టాడు. అతడు హిందీలో నటించిన తొలి చిత్రం రంగ్ దే బసంతి. బాలీవుడ్ స్ట్రైకర్, చష్మే బద్దూర్ సినిమాలు చేశాడు. హిందీలోనూ లక్ పరీక్షించుకున్న సిద్దార్థ్కానీ అక్కడ పెద్దగా గుర్తింపు లేకపోవడంతో సౌత్లోనే తన స్టార్డమ్ను కొనసాగించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కొన్ని విజయాలను సాధించగా మరికొన్ని అపజయాలను మూటగట్టుకున్నాడు. తెలుగులో కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్, బావ, ఆట, అనగనగా ఓ ధీరుడు, ఓ మై ఫ్రెండ్, లవ్ ఫెయిల్యూర్, జబర్దస్త్, మహా సముద్రం సినిమాలు చేశాడు. గత కొన్నేళ్లుగా తమిళంపైనే పూర్తిగా ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం టెస్ట్, ఇండియన్ 3 సహా మరో తమిళ చిత్రంలో యాక్ట్ చేస్తున్నాడు.సింగర్ కూడాసిద్దార్థ్ హీరో మాత్రమే కాదు.. నిర్మాత, సింగర్ కూడా! లవ్ ఫెయిల్యూర్, జిల్ జంగ్ జుక్, చిత్తా (చిన్నా) చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన ఇతడు ఎన్నో పాటలు పాడాడు. అపుడో ఇపుడో ఎపుడో.. (బొమ్మరిల్లు మూవీ), నిను చూస్తుంటే.. (ఆట), ఓయ్ ఓయ్ (ఓయ్ మూవీ), మా డాడీ పాకెట్స్.. (ఓ మై ఫ్రెండ్), ఎక్స్క్యూజ్ మీ రాక్షసి.. (నిను వీడని నీడను నేనే) ఇలా ఎన్నో పాటలు ఆలపించాడు.గతేడాది పెళ్లిసిద్ధార్థ్ 2024 సెప్టెంబర్లో తన ప్రేయసి, హీరోయిన్ అదితిరావు హైదరిని పెళ్లి చేసుకున్నాడు. కొన్నేళ్ల పాటు సీక్రెట్ డేటింగ్లో ఉన్న ఈ జంట వనపర్తిలోని ఓ పురాతన ఆలయంలో మొదటగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో అదే ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఇద్దరికీ ఇది రెండో పెళ్లే!చదవండి: భార్య కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకున్న కమెడియన్ -
థియేటర్లలో గేమ్ ఛేంజర్.. ఓటీటీల్లో ఏకంగా 7 చిత్రాలు రిలీజ్!
అప్పుడే సంక్రాంతి సీజన్ మొదలైంది. వరుసగా పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రానున్నాయి. అంతేకాకుండా ఈ శుక్రవారం నుంచే పొంగల్ సినిమాల సందడి స్టార్ట్ అయింది. థియేటర్లలో రామ్ చరణ్ గేమ ఛేంజర్, బాలయ్య డాకు మహారాజ్, వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు రెండు రోజుల గ్యాప్లో వరుసగా రిలీజ్ కానున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రాలు పోటీపడనున్నాయి.అయితే ఈ సెలవుల్లో ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూసేందుకు మంచి సమయం. అందరికీ సెలవులు రావడం, పండుగ వాతావరణంలో కుటుంబంతో మూవీని వీక్షించడం మంచి ఎక్స్పీరియన్స్. అందుకే ఈ సంక్రాంతికి మీకోసం సరికొత్త కంటెంట్ అందించేందుకు ఓటీటీలు సిద్ధమయ్యాయి. థియేటర్లలో వచ్చే చిత్రాలపై బజ్ ఉన్నప్పటికీ.. అందరికీ వీలుపడదు. ఎంచక్కా ఇంట్లోనే కుటుంబంతో కలిసి సినిమాలు చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు.ఈ సంక్రాంతికి తెలుగు చిత్రం హైడ్ అండ్ సీక్ ఓటీటీకి రానుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో విశ్వంత్, శిల్పా మంజునాథ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు బసిరెడ్డి రానా దర్శకత్వం వహించారు. ఈ మూవీ జనవరి 10 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. దీంతో పాటు బాలీవుడ్ నుంచి విక్రాంత్ మాస్సే నటించిన సబర్మతి రిపోర్ట్, విక్రమాదిత్య మోత్వానే డైరెక్షన్లో తెరకెక్కించిన బ్లాక్ వారెంట్ అనే మరో మూవీ ఓటీటీకి రానున్నాయి. దీంతో ఈ శుక్రవారం ఒక్కరోజే దాదాపు 7 చిత్రాలు రానున్నాయి. థియేటర్లలో గేమ్ ఛేంజర్, సోనూ సూద్ ఫతే సందడి చేయనున్నాయి. ఏయే మూవీ ఏ ఓటీటీలో రానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.ఈ శుక్రవారం ఓటీటీ, థియేటర్ చిత్రాలు..థియేటర్స్..గేమ్ ఛేంజర్(తెలుగు సినిమా)-జనవరి 10ఫతే(హిందీ సినిమా)-జనవరి 10ఓటీటీ సినిమాలు..నెట్ఫ్లిక్స్యాడ్ విటమ్- జనవరి 10బ్లాక్ వారెంట్ -జనవరి 10ఆల్ఫా మేల్స్ సీజన్ 3- జనవరి 10డిస్నీ+ హాట్స్టార్గూస్బంప్స్: ది వానిషింగ్ -జనవరి 10జీ5సబర్మతి రిపోర్ట్- జనవరి 10ఆహాహైడ్ అండ్ సీక్- జనవరి 10 హోయ్చోయ్నిఖోజ్- సీజన్ 2-(బెంగాలీ వెబ్ సిరీస్) జనవరి 10 -
ఓటీటీకి వచ్చేస్తోన్న ప్రధాని మెచ్చిన సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
12th ఫెయిల్ మూవీతో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్న నటుడు విక్రాంత్ మాస్సే. గతేడాది విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాతో విక్రాంత్ పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చి వ్యక్తి ఐఏఎస్గా ఎదిగిన రియల్ స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.ఇటీవల విక్రాంత్ మాస్సే నటించిన చిత్రం సబర్మతి రిపోర్ట్. బాలీవుడ్లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. 2002లో గుజరాత్లో జరిగిన గోద్రా రైలు దహనం ఘటన ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. గతేడాది నవంబర్ 15న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు ధీరజ్ సర్నా దర్శకత్వం వహించారు.జీ5లో స్ట్రీమింగ్..తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. జనవరి 10న నుంచి జీ5లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్న తెలియజేస్తూ వీడియోను పోస్ట్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో విక్రాంత్ మాస్సే జర్నలిస్ట్ పాత్రలో కనిపించారు.సబర్మతి రిపోర్ట్పై ప్రధాని మోదీ ప్రశంసలు..ఈ చిత్రాన్ని మన ప్రధాని మోదీ సైతం ప్రశంసించారు. పలు రాష్ట్రాల్లో ఈ సినిమాకు పన్ను నుంచి మినహాయింపు కూడా ఇచ్చారు. వివిధ వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ.. అనేక రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం పన్ను రహితంగా ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, ఇతర సీనియర్ బీజేపీ రాజకీయ నాయకులు ఈ చిత్రాన్ని వీక్షించారు.సిబ్బందితో పాటు హాజరయ్యారు.రిటైర్మెంట్ అంటూ రూమర్స్..అయితే ఈ చిత్రం విడుదలైన తర్వాత విక్రాంత్ మాస్సే నటనకు విరామం ప్రకటించారని వార్తలొచ్చాయి. కానీ కొద్ది రోజులు మాత్రమే విశ్రాంతి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇది చూసిన కొందరు పర్మినెంట్గా సినిమాలకు గుడ్ బై చెప్పారని కథనాలు రాసుకొచ్చారు. ఆ తర్వాత దీనిపై విక్రాంత్ మాస్సే క్లారిటీ కూడా ఇచ్చారు.తన కుమారుడు వర్దన్తో సహా తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నట్లు విక్రాంత్ మాస్సే పోస్ట్ చేశాడు. ప్రస్తుతం అతను రొమాంటిక్ కామెడీ చిత్రం ఆంఖోన్ కి గుస్తాఖియాన్లో షానాయ కపూర్ సరసన కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని ఏక్తా కపూర్, శోభా కపూర్ నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్ బ్యానర్లో తెరకెక్కిస్తున్నారు. విక్రాంత్ మాస్సే సినీ కెరీర్..బాలికా వధు (చిన్నారి పెళ్లికూతురు) సీరియల్స్తో కెరీర్ ప్రారంభించిన విక్రాంత్.. 2017లో 'ఎ డెత్ ఇన్ ది గంజ్' వెండితెరపై హీరోగా కనిపించారు. సుమారు 20కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. అయితే, 12th ఫెయిల్ సినిమాతో ఆయన దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఫిలిం ఫేర్ అవార్డ్తో పాటు 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్'గా కూడా గుర్తింపు పొందారు.పర్సనల్ లైఫ్విక్రాంత్, షీతల్ ఏళ్ల తరబడి ప్రేమించుకున్న వారిద్దరూ.. 2022 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కుమారుడు జన్మించగా అతడికి వర్దన్ అని నామకరణం చేశారు. The nation’s biggest cover-up unravels, revealing the truth—only on #ZEE5. 📰Watch #TheSabarmatiReport premiering on 10th Jan, only on #ZEE5!#TheSabarmatiReportOnZEE5@VikrantMassey #RaashiiKhanna @iRidhiDogra @balajimotionpic @VikirFilms @ZeeMusicCompany @ZeeStudios… pic.twitter.com/4QggdFUSDT— ZEE5 (@ZEE5India) January 8, 2025 -
Vaazha Review : పిల్లలకో పాఠం.. పెద్దలకో గుణపాఠం
ఈ సినిమా తప్పనిసరిగా తమ పిల్లలతో కలిసి తల్లిదండ్రులు చూడవలసిన సినిమా. మనిషి జీవితంలో యవ్వన దశకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. పిల్లలకు మాత్రం బళ్ళో, ఊళ్ళో సరదాగా స్నేహితులతో గడిచిపోయే స్థితి అది. కాని తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లల యవ్వన దశ అనేది కత్తి మీద సాములాంటిదే. పిల్లల భవిష్యత్తు పై ఆశతో అతి గారాబంగా తమ పిల్లలను చూసుకునే వారు కొందరైతే, తమ పిల్లలు దేనికీ పనికిరారని మరికొందరు వారి యవ్వన దశను వారిగనుణంగా అనుభవించనీయకుండా చేస్తుంటారు. సరిగ్గా అలాంటి వారికే ఈ సినిమా వాఝా(Vaazha : Biopic of a Billion Boys). బయోపిక్ ఆఫ్ బిలియన్ బాయ్స్ అన్నది దీని టాగ్ లైన్.ఈ టాగ్ లైన్ సినిమాకి సరిగ్గా సరిపోవడమే కాదు, నిజజీవితంలో యవ్వన దశ దాటిన ప్రతి ఒక్కరికీ రిలేట్ అవుతుంది. ఈ సినిమాకి దర్శకుడు ఆనంద్ మీనన్. ప్రముఖ నటుడు బసిల్ జోసెఫ్(Basil Joseph) ఓ ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే తమ కెరీర్ పరంగా నలుగురు ఓడిపోయిన స్నేహితుల కథ ఇది. ఈ నలుగురు తమ స్కూల్ నుండి కాలేజ్ వరకు చేసే ప్రయాణం చూసే ప్రతి ప్రేక్షకుడి యవ్వనాన్ని తప్పకుండా గుర్తు చేస్తుంది.ఈ నలుగురు స్కూలు, కాలేజ్ అన్నింటిలోనూ ఫెయిలవుతారు. కాని ఆ ఫెయిలయిన వాళ్ళు తమ తల్లిదండ్రులకు మాత్రం సినిమా ఆఖర్లో చక్కటి సందేశమిస్తూ అదే తల్లిదండ్రుల దృష్టిలో పాస్ అవుతారు. అసలు ఈ పిల్లలు ఎందుకు ఫెయిల్ అవుతారు, పరీక్షలో కాక తల్లిదండ్రుల విషయంలో ఎలా పాస్ అవుతారన్నది మాత్రం మీరు ఈ సినిమాలోనే చూడాలి. తామొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లు తమ పిల్లలు వాళ్ళ కెరీర్ ని ఎలా ఎంచుకుంటారు అన్నది వాళ్ళకే వదిలేయాలి కాని తమ ఆలోచనలను వాళ్ళ మీద రుద్ద కూడదన్న అంశం మీద తీసిన ఈ సినిమా నిజంగా అభినందనీయం. సినిమాలో తీసుకున్న పాయింట్ సీరియస్ దే అయినా సినిమా మొత్తాన్ని చక్కటి స్క్రీన్ ప్లే తో మంచి కామెడీని మేళవించి కుటుంబమంతా కలిసి చూసే విధంగా రూపొందించాడు దర్శకుడు. మనం వినోదం కోసం ఎన్నో సినిమాలు చూస్తాం. కాని కొన్ని సినిమాలు మనకు మార్గదర్శకమవుతాయి. అటువంటి సినిమానే ఈ వాఝా... బయోపిక్ ఆఫ్ బిలియన్ బాయ్స్. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ హాట్ స్టార్లో అందుబాటులో ఉంది. మస్ట్ వాచ్. -
ఓటీటీకి రజాకార్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
తెలంగాణ చరిత్రలో జరిగిన కొన్న సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రం 'రజాకార్'(Razakar Movie). ఈ చిత్రాన్ని దర్శకుడు యాటా సత్యనారాయణ తెలిపారు. మార్చి 15న విడుదలైన ఈ మూవీ ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. ఓ వర్గం వారిని కించపరిచే విధంగా ఉందంటూ విమర్శలు కూడా వచ్చాయి. థియేటర్లో కాస్త పర్వాలేదని మెప్పించిన ఈ మూవీ విమర్శల కారణంగా ఇప్పటి వరకు ఓటీటీలో(OTT Streaming) రిలీజ్ కాలేదు.అయితే ఇప్పటికే ఓటీటీ పార్ట్నర్ను ఫిక్స్ చేసుకున్న ఈ చిత్రం స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారు అయింది. ఈ నెల 24 నుంచి ఆహాలో(Aha) స్ట్రీమింగ్ కానున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ మేరకు రజాకార్ మూవీ పోస్టర్ను షేర్ చేశారు. ఈ ప్రకటనతో దాదాపు 10 నెలల తర్వాత ఓటీటీలో విడుదల కానుంది. కాగా.. గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, హిందీ భాషల్లో విడుదలయింది. తెలంగాణ పోరాట యోధుల గురించి రాబోయే తరాలకు చెప్పాలనే 'రజాకార్' నిర్మించినట్లు ఆయన చెప్పారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ హక్కులను 'ఆహా' సంస్ధ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ ఓటీటీ ప్రియులను అలరించేందుకు వస్తోంది. థియేటర్లలో మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. డిసెంబర్లోనే ఓటీటీ ప్రకటన..అయితే ఇంతకు ముందే రజాకర్ చిత్రాన్ని స్ట్రీమింగ్కు తీసుకురానున్నట్లు ఆహా (Aha) ప్రకటించింది. దీంతో ఈ సినిమా చూడాలని కోరుకునేవారు ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో ఎప్పుడు విడుదల చేస్తామనే విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు. అప్పట్లోనే డిసెంబర్ 20న ఓటీటీలో విడుదల కానుందని సోషల్మీడియాలో ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు. కొత్త ఏడాదిలో రజాకార్ మూవీని ఆడియన్స్కు అందుబాటులోకి రానుంది.కాగా.. ఈ చిత్రంలో బాబీ సింహా, అనసూయ, వేదిక, అనుష్యా త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్ పాండే వంటి ముఖ్య నటీనటులు రజాకర్ చిత్రంలో నటించారు. భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం కావడానికి ముందు రజాకార్లు సాగించిన అకృత్యాలను ఆవిష్కరిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు దర్శకుడు యాటా సత్యనారాయణ వెల్లడించారు. చరిత్ర తెలియజేసే చిత్రం.. ఆర్.నారాయణ మూర్తిరజాకార్ ఎవరికీ వ్యతిరేకమైన సినిమా కాదు. మన చరిత్ర గురించి తెలియజేసే చిత్రమని.. నాటి కాలంలో జరిగిన దుర్మార్గాలను ప్రజలకు తెలియజేసేలా తెరకెక్కించిన మూవీ అని ఆర్. నారాయణమూర్తి అన్నారు. ఇలాంటి సినిమా తీయాలంటే ధైర్యం కావాలి దర్శక, నిర్మాత ఆర్. నారాయణమూర్తి అన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు సత్యనారాయణ, నిర్మాత నారాయణరెడ్డిలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.తెలంగాణ చరిత్రపై రజాకార్ చేసే చాన్స్ ఇచ్చిన నిర్మాత గూడూరు నారాయణరెడ్డిగారికి దర్శకుడు యాటా సత్యనారాయణ ధన్యవాదాలు తెలిపారు. మన పోరాట యోధుల గురించి రాబోయే తరాలకు చెప్పాలనే ‘రజాకార్’ నిర్మించినట్లు నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి వెల్లడించారు. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
OTT: ఓటీటీలో భయపెడుతూ నవ్విస్తున్న సినిమా!
సాధారణంగా సినిమాలలో ఓ రెండిటికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఒకటి హ్యుమర్ అయితే మరోటి హారర్. కాని ఆ రెండూ కలిపి సినిమా తీస్తే అదే ఈ సినిమా భూల్ భులయ్యా3. ఇది భూల్ భులయ్యా(Bhool Bhulaiyaa 3) సిరీస్ లో వచ్చిన మూడవ సినిమా. నిజానికి మొదటి భాగానికి మిగతా రెండు భాగాలకి కథతో పాటు పాత్రధారులలో కూడా తేడా ఉంది. భూల్ భులయ్యా మొదటి భాగం చంద్రముఖి సినిమా ఆధారంగా తీసింది. కాని మిగతా రెండు భాగాలు మాత్రం అదే థీమ్ తో కాస్త విభిన్నంగా రూపొందించారు. ఇప్పుడు భూల్ భులయ్యా 3(Bhool Bhulaiyaa-3) సినిమా కథ విషయానికొస్తే 200 సంవత్సరాల క్రితం రక్తఘాట్ రాజ్యంలో జరిగిన కథ. అప్పటి రాజ కుటుంబం వల్ల జరిగిన సంఘటనలో మంజులిక అనే ఓ దెయ్యం తయారవుతుంది. ఈ దేయ్యాన్ని అదే రాజ్యంలోని అంతఃపుర గదిలో భద్రంగా భద్రపరుస్తారు ఆ రాజ్యానికి చెందిన రాజగురువు. 2024 సంవత్సరంలో వారసత్వ సంపదగా ఆ అంతఃపురాన్ని ఓ హోటల్ గా మార్చాలని రాజకుటుంబం వారసులు ప్రయత్నించగా బందీగా ఉన్న మంజులిక దెయ్యం బయటపడి వారిని చాలా ఇబ్బంది పెడుతుంది. ఆ విషయం చూసే ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టిస్తాయి. మరి ఈ మంజులికను కట్టడి చేయడానికి ఫేక్ మాంత్రికుడైన రూహాన్ ను ఆ రాజ్యానికి తెప్పించుకుంటారు. రూహాన్ రక్తఘాట్ కు వచ్చినప్పటి నుండి కథ అనేక మలుపులు తిరగుతూ ఊహించని క్లైమాక్స్ ట్విస్ట్ తో ముగుస్తుంది. ఈ సినిమా లో ముఖ్యంగా ముగ్గురి గురించి చెప్పుకోవాలి. అందులో మొదటగా హీరో రోల్ వేసిన రోహాన్. తన ఈజ్ ఆఫ్ యాక్టింగ్ తో హారర్ ఎమోషన్ ని కూడా హ్యుమర్ ఎమోషన్ తో చక్కగా నటించాడు. ఇక విశేష పాత్రలలో నటించిన నాటి తార మాధురీ దీక్షిత్, నేటి వర్ధమాన తార విద్యాబాలన్ వారి నటనతోనే కాదు అద్భుత నాట్యంతో కూడా సినిమాని ప్రేక్షకులకు మరింత దగ్గర చేశారు. దర్శకుడు అనీస్ ఈ సినిమాని ఎక్కడా బోర్ కొట్టించకుండా ఓ పక్క భయపెడుతూ మరో పక్క గిలిగింతలు పెడుతూ ప్రేక్షకులను కదలినివ్వకుండా స్క్రీన్ ప్లే నడిపాడు. నెట్ ఫ్లిక్స్ ఓటిటి వేదికగా స్ట్రీమ్ అవుతున్నఈ భూల్ భులయ్యా వీకెండ్ వాచబుల్ మువీ. - ఇంటూరు హరికృష్ణ.