breaking news
OTT
-
ఓటీటీ తర్వాత థియేటర్లో.. కానీ ఎక్కడ తేడా కొట్టింది?
సాధారణంగా థియేటర్లలో రిలీజైన సినిమాలు కొన్నివారాల తర్వాత ఓటీటీలోకి వస్తుంటాయి. కొన్నిసార్లు మాత్రం బిగ్ స్క్రీన్స్పై కాకుండా నేరుగా స్ట్రీమింగ్ అవుతుంటాయి. ఇంకొన్నిసార్లు ఓటీటీల్లో హిట్ అయిన సిరీస్ల్లోని పాత్రలని తీసుకుని వాటిని సినిమాలుగా మార్చి థియేటర్లలో రిలీజ్ చేస్తుంటారు. రీసెంట్ టైంలో అలా 'మీర్జాపుర్', 'ఎపిక్' వచ్చాయి. కానీ ఓటీటీలో వీటికి దక్కిన ఆదరణకు.. థియేటర్లలో వచ్చిన రెస్పాన్స్కి ఏ మాత్రం సంబంధం లేదు. మరి వీటి విషయంలో ఎక్కడ తేడా కొట్టింది?(ఇదీ చదవండి: ఎమ్మెస్ సుబ్బలక్ష్మిగా రష్మిక.. అధికారిక ప్రకటన)'మీర్జాపుర్'.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే అమెజాన్ ప్రైమ్లో ఉన్న ఈ సిరీస్.. ఉత్తరప్రదేశ్లోని మీర్జాపుర్ అనే ఊరిలో జరిగే కల్పిత కథ. తెలుగుతో ఎలాంటి సంబంధం లేదు. అయినాసరే డబ్బింగ్ రూపంలో అందుబాటులోకి వచ్చిన తర్వాత మనోళ్లకు తెగ నచ్చేసింది. మున్నా భయ్యా, కాళీన్ భయ్యా, గుడ్డు భయ్యా, బబ్లూ భయ్యా.. ఇలా ఈ సిరీస్లోని పాత్రలు, కథాకథనాలు మర్చిపోలేనంతగా రిజిస్టర్ అయిపోయాయి.2018లో తొలి సీజన్ రిలీజ్ కాగా 2020లో రెండోది, 2024లో మూడో సీజన్ వచ్చాయి. తొలి సీజన్ అదరగొట్టినప్పటికీ మిగిలిన వాటికి మిశ్రమ స్పందన వచ్చింది. ఓటీటీలో అదరగొట్టిన ఈ సిరీస్ని సినిమాగా తీస్తున్నాం అనేసరికి ఇంకేం స్టోరీ చూపిస్తారా అని చాలామంది అనుకున్నారు. కానీ పాత్రల్ని మాత్రమే తీసుకుని కొత్త క్యారెక్టర్లని ప్రవేశపెట్టి భిన్నంగా ప్రెజెంట్ చేశారు. కానీ పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయారు. సిరీస్లో ఉన్నట్లు హై ఇచ్చే సీన్స్ పెద్దగా లేకపోయేసరికి ఓవరాల్గా ఓకే ఓకే అనిపించుకుంది.(ఇదీ చదవండి: ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్ మూవీ రివ్యూ)ఇక 'ఎపిక్' విషయానికొస్తే ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటించిన తెలుగు సినిమా ఇది. మన దగ్గరే హిట్ అయిన #90స్ వెబ్ సిరీస్లోని ఆదిత్య అనే పిల్లాడి పాత్రని తీసుకుని వాడు పెరిగి పెద్దయి.. పైచదువుల కోసం విదేశాలకు వెళ్లి, అక్కడ ఓ తెలుగమ్మాయితో ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? అనే పాయింట్తో మూవీ తీశారు. ట్రైలర్, పాటలతో కాస్త ఆసక్తి కలిగించారు గానీ మూవీని సరిగా తీయలేదు. దీంతో బాక్సాఫీస్ దగ్గర అడ్డంగా బోల్తా కొట్టేసింది.ప్రేమకథ అన్నారు గానీ ఏ మాత్రం రిలేటబుల్గా లేని సన్నివేశాలతో విసుగెత్తించారని 'ఎపిక్' చూసిన చాలామంది చెప్పారు. సిరీస్లో పాత్రని చూసి తమలా ఉందని చాలామంది అనుకున్నారు. అదే మూవీ చూస్తున్నప్పుడు మాత్రం అలాంటి ఫీలింగ్ రాకపోవడం పెద్ద మైనస్. ముద్దు, శృంగార సన్నివేశాలు కూడా మరీ ఎక్కువైపోవడం ఈ చిత్రానికి మరింత నెగిటివిటీకి కారణమైంది.ఈసారి ఎవరైనా దర్శకనిర్మాతలు.. ఓటీటీలో హిట్ అయిన సిరీస్లని స్ఫూర్తిగా తీసుకుని సినిమాలు తీద్దామనుకుంటే మాత్రం ఇలాంటి తప్పుల్ని రిపీట్ చేయకుండా కాస్త రిలేటబుల్ కంటెంట్తో వస్తే బెటర్. అలా కాదని క్రేజ్ని క్యాష్ చేసుకుందామనుకుంటే మాత్రం మొదటికే మోసపోవచ్చు!(ఇదీ చదవండి: నాయకత్వం అంటే ఇది కాదు.. తమిళ బిగ్బాస్లో రాజకీయ రగడ) -
సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ సినిమా
కొన్నిసార్లు చిన్న సినిమాలు ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చి హిట్ అయిపోతుంటాయి. అలాంటి ఓ తెలుగు చిత్రం 'హుషార్ పిట్టలు'. టీనేజీ రొమాంటిక్ కామెడీ మూవీగా దీన్ని తీశారు. థియేటర్లలోకి వచ్చినప్పుడు అదరగొట్టిన ఈ చిత్రం ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో చూడాలి?(ఇదీ చదవండి: 'రంగస్థలం' కోసం చరణ్ అన్నని బాగా టార్చర్ చేశా: శ్రీకాంత్ ఓదెల)వాసవి గణేశన్, అన్ష్ ప్రధాన పాత్రలు చేసిన రొమాంటిక్ కామెడీ సినిమా 'హుషార్ పిట్టలు'. ప్రోమోలతో వైరల్ అయిన ఈ చిత్రం గత నెల అంటే ఆగస్టు 15న పెద్దగా ప్రచారం లేకుండానే థియేటర్లలో రిలీజైంది. డబుల్ మీనింగ్ జోకులతో పాటు చివరలో యువతకు ఓ మెసేజ్ ఇచ్చేసరికి ప్రేక్షకులు బాగానే ఆదరించారు. పెట్టిన బడ్జెట్కి మించి కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడీ మూవీ సైలెంట్గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతోంది.'హుషార్ పిట్టలు' విషయానికొస్తే.. రవి(అన్ష్) పదో క్లాస్లో మంచి మార్కులతో పాస్ అవుతాడు. కానీ ఊరిలో కుర్రాళ్ల వల్ల చెడు ఆలోచనలు వస్తాయి. ఈ క్రమంలోనే తన ఊరిలోనే ఉండే చిట్టి(వాసవి గణేశన్)తో ప్రేమలో పడతాడు. టీనేజీ వయసులోనే వీళ్లిద్దరూ ఉన్నప్పటికీ ముద్దులు, హద్దులు దాటేస్తారు. ఓరోజు ఇలాంటి స్థితిలో ఉండగానే తల్లిదండ్రులకు పట్టుబడతారు. తర్వాత ఏం జరిగింది? చిట్టి, రవి చివరకు ఒక్కటయ్యారా లేదా అనేది మిగతా స్టోరీ.యుక్త వయసులో యువత చెడిపోవడానికి కారణాలేంటి? తల్లిదండ్రులు, అక్కలు, అన్నలు లాంటి పెద్దోళ్ల నుంచి స్నేహితుల వల్ల టీనేజీ పిల్లలు ఎలా చెడిపోతున్నారు? అనే అంశాల్ని ఇందులో చూపించారు. కాకపోతే మూవీ అంతా అడల్ట్ కామెడీ చూపించి చివరలో మెసేజ్ ఇవ్వడం కాస్త ఎబ్బెట్టుగా అనిపించింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 24 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
ఓటీటీలోకి వచ్చిన తర్వాత మరీ ఇంత ఘోరమా?
కొన్ని సినిమాలు థియేటర్లలో బాగా ఆడుతాయి. కానీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత అవే చిత్రాలకు రెస్పాన్స్ మరోలా ఉంటుంది. ఇది చాలా మూవీస్ విషయంలో జరిగింది. ఇప్పటికీ జరుగుతూనే ఉంది. కొన్నాళ్ల క్రితం 'చెన్నై లవ్ స్టోరీ'కి ఇలాంటి అనుభవమే ఎదురవగా.. ఇప్పుడీ లిస్టులో విశ్వనాథ్ అండ్ సన్స్, మకుటం వచ్చి చేరాయి.(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీకి 'ఇరుముడి'.. అధికారిక ప్రకటన)సూర్య హీరోగా చేసిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా గత నెలలో థియేటర్లలో రిలీజైంది. తెలుగులో హిట్ కాగా తమిళంలో పెద్దగా కలెక్షన్స్ రాలేదు. ఓవరాల్గా బాగానే ఉందనిపించుకుంది. కానీ వారం క్రితం ఓటీటీలో రిలీజైన తర్వాత పూర్తిగా సీన్ మారిపోయింది. అసలు ఈ మూవీ హిట్ ఎలా అయిందా అని నెటిజన్లు ట్వీట్స్ పెడుతున్నారు. మమిత బైజు సీన్స్ తప్పితే మిగతావి ఏమంత ఇంట్రెస్టింగ్గా లేవు కదా అని మాట్లాడుకుంటున్నారు. అదే టైంలో ప్రింట్ క్వాలిటీ కూడా భయంకరంగా ఉందని వీడియోలని ఫ్రూప్స్గా పెడుతున్నారు.సూర్య సినిమా విషయంలో ఇలా ఉంటే.. విశాల్ 'మకుటం' చిత్రానికి అయితే ఓటీటీలోకి వచ్చిన పోస్ట్మార్టం చేస్తున్నారు. పావుగంట కంటే ఎక్కువ చూడలేకపోయామని ఒకరు.. అసలు ఈ మూవీ ఎలా తీశార్రా బాబు అని మరొకరు పోస్టులు పెడుతున్నారు. ఈ చిత్ర మేకింగ్ వీడియోల్లో విశాల్ ప్రవర్తనకు సంబంధించిన బిట్స్ కట్ చేసి సోషల్ మీడియాలో దారుణంగా ఆడుకుంటున్నారు.గత కొన్నిరోజుల నుంచి ట్విటర్, ఇన్ స్టాలో ఈ రెండు సినిమాల గురించే చాలా చర్చ జరుగుతోంది. ఇదంతా చూసిన చాలామంది సినిమాలు నిజంగా బాగోలేవా? లేదంటే పనిగట్టుకుని నెటిజన్లు వీటిని ట్రోల్ చేస్తున్నారా? అని మరికొందరు మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా ఓటీటీ, సోషల్ మీడియా జమానా పెరిగిన తర్వాత మూవీస్ విషయంలో శూలశోధన ఎక్కువైంది. రాబోయే రోజుల్లో ఈ ట్రోలింగ్ బారిన ఇంకెన్ని పెద్ద సినిమాలు పడతాయో ఏంటో?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 24 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
ఈ వారం ఓటీటీల్లోకి 24 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా వినాయక చవితి సందడి కనిపిస్తోంది. మరోవైపు వర్షాలు దంచికొడుతున్నాయి. అలానే మరోవారం వచ్చేసింది. ఈ వీకెండ్ థియేటర్లలోకి అన్ని చిన్న చిత్రాలే రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో ముఖ్యంగా 'హనుమాన్ అంశ్' ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇప్పటికే హిందీలో అద్భుతమైన కలెక్షన్లతో అదరగొడుతున్న చిత్రం తెలుగులో ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 26 సినిమాలు)హనుమాన్ అంశ్(తెలుగు)తో పాటు దర్శకుడు ప్రశాంత్ నీల్ నిర్మించిన హారర్ సినిమా '418', కాగతం పడవలు, పిఠాపురంలో అలా మొదలైంది, మిస్సింగ్ మేఘన తదితర చిత్రాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. మరోవైపు ఓటీటీల్లో 24 వరకు మూవీస్, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో రీసెంట్ సెన్సేషనల్ హిట్ 'ఇరుముడి', మొదరాత్రి, తుడక్కం, లస్ట్ స్టోరీస్ 3 లాంటి డబ్బింగ్ బొమ్మలు చూడాలనే ఆసక్తి రేపుతున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (సెప్టెంబరు 14 నుంచి 20 వరకు)నెట్ఫ్లిక్స్ద డాల్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 16మాన్స్టర్: ద లిజీ బోర్డెన్ స్టోరీ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 17నాట్ ఏ స్ట్రేంజర్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 17ప్లాస్టిక్ బ్యూటీ (జపనీస్ సిరీస్) - సెప్టెంబరు 17స్ట్రేంజర్ థింగ్స్: టేల్స్ ఫ్రమ్ 85 సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 17ఇరుముడి (తెలుగు సినిమా) - సెప్టెంబరు 18లస్ట్ స్టోరీస్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - సెప్టెంబరు 18బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 18మొదరాత్రి (తెలుగు డబ్బింగ్ చిత్రం) - సెప్టెంబరు 18ద స్కాండల్ (కొరియన్ సిరీస్) - సెప్టెంబరు 18జాకీర్ ఖాన్: పాప యార్ (హిందీ స్టాండప్ కామెడీ షో) - సెప్టెంబరు 18ఫ్లాయిడ్ మేవెదర్ vs మేనీ పక్వివో (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 19స్టాప్! దట్! ట్రైన్! (ఇంగ్లీష్ చిత్రం) - సెప్టెంబరు 20అమెజాన్ ప్రైమ్ద ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 15 (రెంట్)నీగ్లే (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 16వెయిటింగ్ హై (హిందీ సిరీస్) - సెప్టెంబరు 16రామ్ అండ్ లీలా (తమిళ సినిమా) - సెప్టెంబరు 18యూ ప్లస్ మీ: ఎగైనిస్ట్ ద వరల్డ్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 18హాట్స్టార్78th ఎమ్మీ అవార్డ్స్ (అవార్డ్ షో) - సెప్టెంబరు 15లీ క్రోనిన్స్ ద మమ్మీ (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 17తుడక్కం (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 18మాబ్ ల్యాండ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 19సన్ నెక్స్ట్అంగీకారం (తమిళ మూవీ) - సెప్టెంబరు 18ఆపిల్ టీవీ ప్లస్స్లో హార్సెస్ సీజన్ 6 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 16(ఇదీ చదవండి: ఓటీటీ సినిమా 'ప్యార్ ప్రేమ కళ్యాణం' తెలుగు రివ్యూ) -
థియేటర్లలో ఉండగానే ఓటీటీకి 'ఇరుముడి'.. అధికారిక ప్రకటన
రీసెంట్ టైంలో అద్భుతమైన హిట్ అయి వందల కోట్ల కలెక్షన్స్ అందుకున్న తెలుగు సినిమా 'ఇరుముడి'. రవితేజ హీరోగా చేసిన ఈ చిత్రం ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ అయింది. రిలీజై దాదాపు మూడు వారాలు దాటిపోయినా సరే ఇంకా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అలా బిగ్ స్క్రీన్స్పై ఉండగానే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలో 'బందర్' సినిమా.. తెలుగు రివ్యూ)రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో చేసిన సినిమా 'ఇరుముడి'. తండ్రి కూతురు అనుబంధంతో తెరకెక్కిన స్టోరీకి అయ్యప్ప స్వామి మాల నేపథ్యాన్ని జోడించారు. గత నెల 21న థియేటర్లలో రిలీజైంది. తెలుగు రాష్ట్రాల్లో విశేషాదరణ దక్కించుకుంటోంది. ఇప్పుడీ చిత్రాన్ని ఈ శుక్రవారం(సెప్టెంబరు 18) నుంచి నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ మేరకు అప్డేట్ ఇచ్చారు.'ఇరుముడి' విషయానికొస్తే.. ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో సీలేరు దగ్గరలో ఉన్న ఓ పల్లెటూరిలో త్రినాథ్ (రవితేజ) తన భార్య కావేరి (ప్రియా భవానీ శంకర్), కూతురు మణి (బేబీ నక్షత్ర)తో కలిసి జీవిస్తుంటాడు. త్రినాథ్ అయ్యప్ప స్వామి భక్తుడు. అందుకు తగ్గట్లే ప్రతి ఏడాది మాల వేస్తుంటాడు. మరోవైపు ఊళ్లో ఓ రౌడీ గ్యాంగ్ బాగా రెచ్చిపోతుంటుంది. జనాలను ఇబ్బంది పెట్టడం, స్కూల్కి వెళ్లే అమ్మాయిలను వేధించడం వాళ్ల పని.త్రినాథ్ దీక్షలో లేనప్పుడు మందు కొడుతూ ఉంటాడు. అదే టైంలో ఊళ్లోని రౌడీలతో గొడవలకు దిగుతుంటాడు. అయితే త్రినాథ్ కూతురు మణికి గాయత్రి విషయంలో ఏదో తేడా జరుగుతోందని అనుమానం వస్తుంది. గాయత్రి.. గురుస్వామి (సాయి కుమార్) కూతురు. ఈ విషయం తన నాన్నకు చెప్పాలని మణి ప్రయత్నించినా చెప్పలేకపోతుంది. ఓ రోజు రాత్రి గాయత్రి అర్ధరాత్రి దాటినా ఇంటికి రాదు. అసలు ఆమెకు ఏమైంది? త్రినాథ్ ఆమెను వెతికి పట్టుకుంటాడా? ఆ రౌడీలకు తగిన బుద్ధి చెబుతాడా? లేదంటే కథలో ఇంకేదైనా పెద్ద ట్విస్ట్ ఉందా? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 26 సినిమాలు) -
వీకెండ్ ధమాకా.. ఓటీటీల్లోకి వచ్చేసిన 26 సినిమాలు
ఈ వారం థియేటర్లలోకి ఎపిక్, మారెమ్మ, మహేంద్ర గిరి వారాహి, మండాడి, సర్దార్ 2 సినిమాలు వచ్చాయి. అయితే వీటిలో దేనికి కూడా సూపర్ హిట్ అనే టాక్ రాలేదు. వీటిని చూసిన చాలామంది ఓకే పర్లేదని అంటున్నారు. మరోవైపు ఓటీటీల్లో ఈ వీకెండ్ ఏకంగా 26 సినిమాలు స్ట్రీమింగ్లోకి వచ్చేశాయి. వీటిలో పలు తెలుగు హిట్ సినిమాలతో పాటు డబ్బింగ్లు కూడా ఉన్నాయి.ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్', విశాల్ 'మకుటం', మహారాజా హాస్టల్, పంచనామా, కట్టాలన్, వరవు లాంటి చిత్రాలు, సిరీస్లు చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్లోకి వచ్చిందంటే?ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన సినిమాలు (సెప్టెంబరు 11)అమెజాన్ ప్రైమ్మకుటం -తెలుగు డబ్బింగ్ సినిమామహారాజ హాస్టల్ - తెలుగు డబ్బింగ్ మూవీమ్యాజిక్ మష్రూమ్స్ - మలయాళ చిత్రంఅచ్యుత అవతారం - మలయాళ సినిమాడియోల్ బాంద్ 2 - మరాఠీ చిత్రంసల్మోఖ్జీ - తెలుగు డబ్బింగ్ కొరియన్ సినిమారక్కసపురదోళ్ - కన్నడ మూవీద రివల్యూషనరీస్ - తెలుగు డబ్బింగ్ సిరీస్నెట్ఫ్లిక్స్విశ్వనాథ్ అండ్ సన్స్ - తెలుగు డబ్బింగ్ సినిమాగో టీమ్ - స్పానిష్ మూవీచుంబక్ - హిందీ సిరీస్కాల్ మై ఏజెంట్! ద మూవీ - ఇంగ్లీష్ సిరీస్హాట్స్టార్ద పేపర్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్అలీబాబా ఔర్ 40 భూత్ - హిందీ సిరీస్ప్రిన్స్ ఆఫ్ మాలీవుడ్ - తెలుగు డబ్బింగ్ సిరీస్వన్ నైట్ వోయెజ్ - జపనీస్ సిరీస్లిబాంగ్ లిబు - మలేషియన్ మూవీజంగిల్ టేల్స్ విత్ మౌగ్లీ - హిందీ సిరీస్ (సెప్టెంబరు 12)జీ5పంచనామా - తెలుగు సిరీస్ఘమసాన్ - హిందీ సిరీస్అద్కిట్టా - మరాఠీ మూవీఆహాకట్టాలన్ - తెలుగు డబ్బింగ్ సినిమావరవు - తెలుగు డబ్బింగ్ మూవీవెంజన్స్ - తమిళ చిత్రంసన్ నెక్స్ట్వివాహ్ - మలయాళ సినిమాలయన్స్ గేట్ ప్లేహంగ్రీ - తెలుగు డబ్బింగ్ మూవీ -
ఓటీటీలోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
సూర్య, మమితా బైజు జంటగా నటించిన తాజా చిత్రం‘విశ్వనాథ్ అండ్ సన్స్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్స్లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 260 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందకు రెడీ అయింది. సెప్టెంబర్ 11 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ కథేంటంటే.. సంజయ్ విశ్వనాథ్(సూర్య) ఓ వ్యాపారవేత్త, ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన షూటర్. 40 ఏళ్లు వయసొచ్చినా పెళ్లి చేసుకోడు. అమెరికాకి వెళ్లి సరోగసి ద్వారా మగబిడ్డని కని స్వదేశానికి తిరిగొస్తాడు. కొన్నాళ్ల తర్వాత పిల్లాడు ఓ అరుదైన వ్యాధి బారిన పడతాడు. బోన్ మారో(ఎముక గుజ్జు) ట్రాన్స్ ప్లాంట్ అవసరమవుతుంది. దీంతో బిడ్డకు జన్మనిచ్చిన తల్లి అవసరం ఏర్పడుతుంది. అమెరికాకు తిరిగెళ్లి సరోగసి మదర్ మ్యాడీ (మమిత)ని వెతికి భారత్కి తీసుకొస్తాడు. సర్జరీ తర్వాత ఆమె తిరిగి వెళ్ళిపోవాలని ముందే ఒప్పందం చేసుకుంటాడు.20 ఏళ్ల మ్యాడీ.. సంజయ్ ఇంటికి వచ్చిన తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అసలు సంజయ్ 40 ఏళ్లు వచ్చినా పెళ్లికి ఎందుకు దూరంగా ఉంటున్నాడు? తల్లి అవసరం లేకుండా తన కొడుకును పెంచుకోగలిగాడా? మ్యాడీ ప్రేమని సంజయ్ ఎందుకు తిరస్కరించాడు? చివరకు పెళ్లి విషయంలో సంజయ్ తన ఆలోచన మార్చుకున్నాడా లేదా? అనేది మిగతా స్టోరీ. -
ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు ఓ క్రైమ్ థ్రిల్లర్ వెబ్సిరీస్ సిద్ధమైంది. మోహన్ శ్రీనివాస్ దర్శకత్వంలో తమిళ నటుడు భరత్ కీలక పాత్రలో నటించిన తెలుగు సిరీస్ ‘పంచనామా’ ఉదయ భాను ప్రొడక్షన్స్ పతాకంపై విజయేంద్ర మౌళి, ఉదయభాను నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నారు. ఈ రోజు( ఆదివారం) ట్రైలర్ విడుదలైంది.సెప్టెంబర్ 11 నుంచి ప్రముఖ ఓటీటీ అయిన జీ5లో స్రీమింగ్ కానుంది. ఇదో క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్గా రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇందులో భరత్ పోలీస్ అధికారిగా కనిపించారు. ప్రవీణ్, ఆది, జోసఫ్ అనే ముగ్గురు ఎందుకు చెనిపోయారు.? కొద్ది రోజుల తరువాత దొరికిన చేతులు ఎవరివి? దొరికేలా ఎవరు చేశారు.? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే. ఇందులో శివాజీ రాజా, మేథారెడ్డి, రూప లక్ష్మి, శ్రీజ తదితరులు నటిస్తున్నారు. ఇదీ చదవండి: బిగ్బాస్పై అంచనాలు పెంచేస్తోన్న ప్రోమో -
ఓటీటీలో 'లస్ట్ స్టోరీస్ 3' స్ట్రీమింగ్.. అధికారిక ప్రకటన
ఓటీటీల్లో చాలామంది సినిమాలు చూస్తుంటారు. అదే టైంలో కొన్ని సిరీస్లు కూడా ప్రేక్షకుల్ని అలరించడంతో పాటు ఆశ్చర్యపరుస్తాయి. అలా దాదాపు ఎనిమిదేళ్ల క్రితం రిలీజై సెన్సేషన్ సృష్టించిన సిరీస్ 'లస్ట్ స్టోరీస్'. తర్వాత కాలంలో దీనికి రెండో పార్ట్ కూడా వచ్చింది. ఇప్పుడు మూడో సీజన్ కూడా సిద్ధం చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసి ఓ వీడియోని విడుదల చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)నెట్ఫ్లిక్స్ పాపులర్ ఆంథాలజీ ఫ్రాంచైజీ 'లస్ట్ స్టోరీస్' మూడో భాగాన్ని ఈనె 18 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సీజన్లో ఉండే నాలుగు కథలకు విక్రమాదిత్య మోత్వానే, కిరణ్ రావు, శకున్ బాత్రా, విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించారు. ప్రేమ, ఆకర్షణ, సంబంధాలు, అణచివేసిన కోరికలు అనే అంశాల ఆధారంగా వీటిని తెరకెక్కించారు. ఈ సీజన్లో రాధికా ఆప్టే, కొంకణా సేన్ శర్మ, అదితి రావు హైదరీ, రాధికా మదన్, సనా థంపి, విజయ్ వర్మ, అభిషేక్ బెనర్జీ, సిద్ధార్థ్, అలీ ఫజల్, గుర్ఫతేహ్ పిర్జాదా తదితరులు ప్రధాన పాత్రలు చేశారు.‘లస్ట్ స్టోరీస్’ ఫ్రాంచైజీ 2018లో ప్రారంభమైంది. తొలి భాగంలోని స్టోరీలకు అనురాగ్ కశ్యప్, జోయా అక్తర్, దిబాకర్ బెనర్జీ, కరణ్ జోహార్ దర్శకత్వం వహించారు. ఈ ఆంథాలజీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంతో పాటు ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్కు నామినేట్ అయింది. 2023లో ‘లస్ట్ స్టోరీస్ 2’ విడుదలైంది. ఇప్పుడు మూడో సీజన్ రానుంది.మరి ఇదెలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలో 'బందర్' సినిమా.. తెలుగు రివ్యూ)I won’t tell this to y’all but I am too excitedddd 🤭❤️🔥 pic.twitter.com/7jQlq9MAXw— Netflix India (@NetflixIndia) September 5, 2026 -
ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మలయాళ సూపర్స్టార్ మోహన్ లాల్ ఇప్పటికే వరస సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. ఈయన కొడుకు ప్రణవ్ ఇప్పటికే హీరోగా పలు చిత్రాలు చేశాడు. రీసెంట్గా మోహన్ లాల్ కూతురు విస్మయ కూడా ఇండస్ట్రీలోకి వచ్చేసింది. ఈమె ప్రధాన పాత్రలో చేసిన మూవీ థియేటర్లలోకి వచ్చి హిట్ కొట్టింది. ఇప్పుడు ఓటీటీలోనూ స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)విస్మయ మోహన్ లాల్ లీడ్ రోల్ చేసిన సినిమా 'తుడక్కం'. సర్వైవల్ థ్రిల్లర్ కథతో దీనిని తెరకెక్కించారు. '2018' మూవీతో జాతీయ అవార్డ్ దక్కించుతున్న జూడ్ ఆంటోని జోసెఫ్ దీనికి దర్శకుడు. ఆగస్టు 7న మలయాళం వరకు థియేటర్లలో రిలీజైంది. ప్రేక్షకుల్ని ఆకట్టుకుని హిట్ అయింది. ఇప్పుడీ చిత్రాన్ని ఈ నెల 18వ తేదీ నుంచి హాట్స్టార్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. తెలుగులోనూ అందుబాటులోకి రానుంది.'తుడక్కం' విషయానికొస్తే.. మీను (విస్మయ మోహన్ లాల్) తన తండ్రితో కలిసి ఓ కొత్త ప్రాంతానికి మారుతుంది. మార్షల్ ఆర్ట్స్ తెలిసిన మీను.. ఓ రోజు రాత్రి ఇద్దరు స్కూల్ అమ్మాయిలని ఆపద నుంచి కాపాడుతుంది. ఈ క్రమంలోనే ఓ ప్రమాదకర వ్యక్తి(ఆశిష్ జో ఆంటోనినీ)తో ఈమెకు శత్రుత్వం ఏర్పడుతుంది. తర్వాత ఈమెకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? వాటి నుంచి ఎలా తప్పించుకుందనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలో 'బందర్' సినిమా.. తెలుగు రివ్యూ) -
ది డికాయ్ ప్లేన్ రివ్యూ: ట్రంప్ ‘ఎస్కేప్’.. థ్రిల్ చేసిందా?
ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతను పొందే నేత.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అలాంటి వ్యక్తి ఓ దేశం నుంచి మరో దేశానికి వెళ్లేటప్పుడు అందరి కళ్లముందే కనిపించకుండా పోతే? అందులోనూ అధికారిక విమానం నుంచి మరో విమానంలో రహస్యంగా ప్రయాణించాల్సి వస్తే? వినడానికి హాలీవుడ్ థ్రిల్లర్లా అనిపించే ఈ ఘటన నిజంగానే జరిగింది. ఇప్పుడు అదే ఆసక్తికర ఉదంతాన్ని ‘ఇన్స్టాడాక్స్: ది డికాయ్ ప్లేన్’ పేరుతో నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీగా అందించింది. ఇంతకీ ఇది ఎలా ఉంది? థ్రిల్ పంచిందా?..స్టోరీ ఏంటంటే.. టర్కీలో జరిగిన నాటో సదస్సు అనంతరం డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు తిరిగి బయలుదేరిన సమయంలో అసలు కథ మొదలవుతుంది. అందరూ ట్రంప్ ఎయిర్ఫోర్స్ వన్లోనే ఉన్నారని భావించారు. కానీ భద్రతా కారణాలతో ఆయనను క్యాటరింగ్ ట్రక్ ద్వారా విమానం నుంచి బయటకు తీసుకొచ్చి.. చిన్నదైన మరో మిలిటరీ విమానంలో తరలించారు. అసలు విమానం మాత్రం ట్రంప్ అందులోనే ఉన్నట్టుగా నమ్మించే ‘డికాయ్’గా కొనసాగింది. అప్పట్లో విమానంలో ఉన్న జర్నలిస్టులు, కొందరు ఉన్నతాధికారులకు కూడా అసలు విషయం తెలియకపోవడం ఈ ఘటనను మరింత సంచలనంగా మార్చింది.ఫ్లస్ పాయింట్లు.. ఇన్స్టాడాక్స్: ది డికాయ్ ప్లేన్(Instadocs: The Decoy Plane) డాక్యుమెంటరీకి ప్రధాన బలం ఆ సమయంలో ప్రత్యక్షంగా ఉన్నవారి మాటలే. రాయిటర్స్ వైట్హౌస్ రిపోర్టర్ గ్రామ్ స్లాటరీ, ఏపీ ఫొటోగ్రాఫర్ అలెక్స్ బ్రాండన్, వాషింగ్టన్ పోస్ట్ రిపోర్టర్ డాన్ లామోత్తో పాటు మాజీ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ రాబర్ట్ మెక్డొనాల్డ్, మాజీ ఎయిర్ఫోర్స్ వన్ సిబ్బంది వాండా జోయెల్ తమ అనుభవాలను పంచుకున్నారు. ఆ సమయంలో విమానంలో ఉన్నవారికి ఎలా అనిపించిందో ప్రేక్షకుడు అర్థం చేసుకునేలా తెరకెక్కించారు.అయితే చిన్న నిడివి ఇక్కడ మైనస్ కాకుండా ప్లస్గా మారింది (Instadocs: The Decoy Plane Review). అనవసరమైన ఉపకథలు (Side Track) లేకుండా నేరుగా అసలు విషయానికే వెళ్లడం వల్ల ఆసక్తి నిలుస్తుంది. ముఖ్యంగా క్యాటరింగ్ ట్రక్, మూసిన కిటికీలు, అనుమానాస్పద కదలికలు.. ఆ తర్వాత వెలుగులోకి వచ్చిన అసలు విషయం.. ఇవన్నీ ఒక మిస్టరీని ఛేదిస్తున్న అనుభూతిని కలిగిస్తాయి.నెగెటివ్ ఏంటంటే.. అయితే ఇది(Trump The Decoy Plane Doc) పూర్తి స్థాయి పొలిటికల్ థ్రిల్లర్ అనుకోవద్దు. కేవలం అరగంటలో ఒకే ఘటనను చెప్పేయాలన్న ఉద్దేశంతో రూపొందించిన డాక్యుమెంటరీ కావడంతో.. లోతైన రాజకీయ విశ్లేషణకు పెద్దగా అవకాశం లేకుండా పోయింది. ఇరాన్ థ్రెట్.. ఇజ్రాయెల్ వార్నింగ్.. కనీసం వెరిఫై చేసుకోకుండా ట్రంప్ భద్రతా బలగాలు చేసిన పని.. ఇలా ఏవీ ఇందులో కనిపించవు. ట్రంప్ చుట్టూ ఉన్న రాజకీయ వివాదాల కంటే.. భద్రతా వ్యవస్థ ఎలా పనిచేసింది? మీడియాను ఎందుకు చీకట్లో ఉంచారు? అనే అంశాలపైనే ఎక్కువ దృష్టి పెట్టింది.ఓవరాల్గా.. రాజకీయాలు, అమెరికా అధ్యక్షుడి భద్రత, వైట్హౌస్ వ్యవహారాలు, నిజ జీవితంలోని విచిత్రమైన ఘటనలు ఆసక్తిగా చూసేవారికి ‘ది డికాయ్ ప్లేన్’ ఒక మంచి షార్ట్ వాచ్. పెద్ద సినిమా స్థాయి డ్రామా కోసం కాకుండా.. ‘అసలు ఆ రోజు ఏం జరిగింది?’ అనే కుతూహలంతో చూస్తే మాత్రం నిరాశపరచదు. -
ఓటీటీలో 'బందర్' సినిమా.. తెలుగు రివ్యూ
'యానిమల్' సినిమాలో విలన్గా అదరగొట్టిన బాబీ డియోల్.. చాన్నాళ్ల తర్వాత తనకొచ్చిన క్రేజ్తో హీరోగానూ మూవీస్ చేస్తున్నాడు. అలా చేసిన లేటెస్ట్ హిందీ చిత్రం 'బందర్'. జూన్ తొలి వారంలో థియేటర్లలో రిలీజైంది. రీసెంట్గా జీ5 ఓటీటీలోకి వచ్చేసింది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ రియలస్టిక్ క్రైమ్ డ్రామా ఎలా ఉంది? ఇంతకీ చూడొచ్చా లేదా? అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం.(ఇదీ చదవండి: ఓటీటీ సినిమా 'ప్యార్ ప్రేమ కళ్యాణం' తెలుగు రివ్యూ)కథేంటి?సమర్ మెహ్రా(బాబీ డియోల్) ఒకప్పుడు స్టార్ హీరో. కానీ ఇప్పుడు వయసైపోవడంతో ఎవరూ అవకాశాలివ్వరు. దీంతో తానే హీరోగా ఓ సినిమా చేయాలని ప్రయత్నిస్తుంటాడు. ఖుషి(షబా ఆజాద్)తో కలిసి లివ్ ఇన్ రిలేషన్లో ఉంటాడు. ఓ రోజు రాత్రి సమర్ తన ఇంట్లో ఉన్నప్పుడు పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. ఇతడి మాజీ ప్రియురాలు గాయత్రి(సప్న పబ్బీ) ఫిర్యాదు చేయడంతో సెక్షన్ 376 నమోదు చేసి అత్యాచార కేసు పెడతారు. ఇంతకీ గాయత్రి ఎవరు? సమర్కి ఈమెతో ఎలా పరిచయం? సమర్ నిజంగానే ఆమెని బలత్కారం చేశాడా? లేదంటే సమర్ని కావాలనే తప్పుడు కేసులో ఇరికించారా? చివరకు ఏమైందనదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?'తప్పుడు అత్యాచారం కేసులో చాలా ఏళ్లు జైలు శిక్ష అనుభవించారు' లాంటి వార్తలు గతంలో మీరు చూసే ఉంటారుగా. ఈ సినిమా అలాంటి ఓ కథతోనే తీశారు. సమర్ అనే ఒకప్పటి హీరో.. గాయత్రి అనే అమ్మాయిని డేటింగ్ యాప్ ద్వారా కలుస్తాడు. తర్వాత వీళ్లిద్దరూ హద్దులు దాటేసి శారీరకంగానూ ఒక్కటవుతారు. కానీ కొన్ని పరిస్థితులు వీళ్ల మధ్య దూరాన్ని పెంచుతాయి. ఆమె అసూయ కారణంగా ఊహించని సంఘటనలు జరుగుతాయి. దీంతో 'బందర్'లా అంటే బోనులో ఉంచిన కోతిలా హీరో పరిస్థితి తయారవుతుంది.సినిమా ఎలా ఉంది అని అడిగితే డిఫరెంట్గా బాగుంది. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లా ఉండదు. కాబట్టి ఎంతమందికి నచ్చుతుందని చెప్పలేం. బూతులు, అసభ్యకర సన్నివేశాలు చాలానే ఉన్నాయి. కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు వాంతి వచ్చేలా అనిపిస్తుంది. లగ్జరీ లైఫ్ అనుభవించే ఓ నటుడు అనుకోకుండా జైలులో దారుణమైన పరిస్థితుల్లో బతకాల్సి వస్తే అతడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అసలు జైలు జీవితం ఎలా ఉంటుంది? లాంటి అంశాల్ని రా అండ్ రస్టిక్గా చూపించారు. ఈ సీన్స్ చూసిన తర్వాత పొరపాటున కూడా జైలుకి వెళ్లకూడదు బాబోయ్ అనిపించకమానదు.అత్యాచార కేసు, కోర్ట్ ప్రొసీడింగ్స్ లాంటివి ఈ కథలో ఉంటాయి గానీ వాటిని పైపైనే చూపించారు. సమర్ గడిపిన దుర్భరమైన జైలు జీవితాన్ని వీలైనంత ఎక్కువగా ఫోకస్ చేశారు. అసలు జైలులో ఓ అండర్ ట్రయల్ ఖైదీని పోలీసుల దగ్గర నుంచి మిగతా ఖైదీల వరకు ఎలా ట్రీట్ చేస్తారు? మరీ ముఖ్యంగా అత్యాచార ఆరోపణలు ఎదుర్కొని అరెస్టయితే మిగతా ఖైదీలు వీళ్లని ఎలా వేధిస్తారు? జైలులో ప్రతి చిన్న విషయానికి లంచాలు తీసుకుని పోలీసులు ఎలా సాయం చేస్తారు? లాంటి సీన్స్ అయితే ఆలోచనలో పడేస్తాయి.ఇంకొన్ని సన్నివేశాలైతే జుగుప్సకరంగా కడుపులో తిప్పేసినట్లు అనిపిస్తాయి. ఓ రోజు సమర్ నిద్రపోతుంటాడు. ఏదో అలికిడి కావడంతో లేచి చూస్తే ఇద్దరు మగాళ్లు ఓ పక్కకు వెళ్లి శృంగారం చేసుకుంటూ ఉంటారు. ఇది చూసినప్పుడు.. వామ్మో జైలు జీవితంలో ఇలాంటి ఘోరాలు కూడా ఉంటాయా అని సందేహం కలుగుతుంది. అయితే ఈ మూవీ అంతా కూడా ఏదో ఫిల్మ్ ఫెస్టివల్స్ కోసం తీసినట్లు అనిపిస్తుంది తప్పితే రెగ్యులర్ ఆడియెన్స్ కోసమైతే తీయలేదని డౌట్ వస్తుంది.ఎవరెలా చేశారు?సమర్ మెహ్రాగా బాబీ డియోల్ అదరగొట్టేశాడు. ఎక్కడా బాబీ కనిపించడు. సదరు పాత్ర మాత్రమే కనిపిస్తుంది. 'సలార్', 'వారణాసి' ఫేమ్ పృథ్వీరాజ్ సుకుమారన్ సోదరుడు ఇంద్రజిత్ సుకుమారన్.. ఇందులో లిజో అనే ఖైదీగా నటించాడు. ఇద్దరు పురుషుల శృంగారం సీన్లోని ఒక పాత్రధారి ఇతడే. అసలు ఈ సన్నివేశాన్ని ఇతడెలా ఒప్పుకొన్నాడా అనిపిస్తుంది. సమర్ చెల్లెలు సుహానాగా సన్యా మల్హోత్రా, ఎక్స్ లవర్, బాధితురాలు గాయత్రిగా సప్నా పబ్బీ, ప్రియురాలు ఖుషీగా షబా ఆజాద్ డీసెంట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కన్నడ స్టార్ నటుడు, దర్శకుడు రాజ్ బి శెట్టి కూడా ఇందులో ఓ ఖైదీగా చేశాడు. కానీ గంజాయి తాగడం తప్పితే చెప్పుకోదగ్గ సీన్స్ ఏం లేవు. మిగిలిన వాళ్లు ఓకే ఓకే.టెక్నికల్ విషయాలకొస్తే జైలు సెట్టింగ్, సినిమాటోగ్రఫీ స్టోరీ మూడ్కి తగ్గట్లు ఉన్నాయి. దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఎప్పటిలానే ఓ భిన్నమైన కథని అంతే డిఫరెంట్గా ప్రెజెంట్ చేశాడు. అయితే సమర్ ఒక బాధితుడా లేదా తన అహంకారానికి శిక్ష అనుభవిస్తున్నాడా అనే సందేహం చివరివరకు అలాగే ఉంటుంది. క్లైమాక్స్లోనూ సరైన ముగింపు ఏం ఇవ్వకుండా వదిలేశారు. ఓవరాల్గా అయితే బాగుందీ మూవీ. హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది.- చందు డొంకాన, సాక్షి వెబ్డెస్క్(ఇదీ చదవండి: ఓటీటీలో 'ఆకలిరాజ్యం 2026' తెలుగు రివ్యూ) -
రంభ ఊర్వశి మేనక.. ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్..!
అల్లరి నరేశ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ రంభ ఊర్వశి మేనక. ఈ చిత్రానికి చింతాడ చంద్రమోహన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సురభి హీరోయిన్గా కనిపించింది. ఈ కామెడీ ఎంటర్టైనర్ ఇవాళే థియేటర్లలో విడుదలైంది. తొలి రోజే మిక్స్డ్ టాక్తో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఈ సినిమా థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలో సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్–హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండ, నిమ్మకాయ ప్రసాద్ నిర్మించారు. -
ఫ్రైడే ఓటీటీల్లో సందడి.. ఒక్కరోజే 12 సినిమాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ శుక్రవారం తెలుగులో నరేశ్ హీరోగా వస్తోన్న రంభ ఊర్వశి మేనక, ఐ యామ్ గేమ్, బెత్లెహోమ్ కుటుంబ యూనిట్, మీర్జాపూర్, మా రాముడు అందరివాడు, ధర్మస్థల నియోజకవర్గం, సహ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. వీటిలో నరేశ్ మూవీపై ఆడియన్స్లో బజ్ నెలకొంది.ఇక ఓటీటీల విషయానికొస్తే వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు, లోకేశ్ కనగరాజ్ డీసీ లాంటి ఆసక్తి పెంచేస్తున్నాయి. వీటితో పాటు పలు డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. జగమే సంగీతం అనే తెలుగు వెబ్ సిరీస్ సైతం మరింత ఆసక్తి పెంచుతోంది. ఈ ఫ్రైడే ఓటీటీ రిలీజెస్..నెట్ఫ్లిక్స్ ధమాల్ 4 (హిందీ మూవీ) - సెప్టెంబరు 04 కొరియన్ కనకరాజు (తెలుగు సినిమా) - సెప్టెంబరు 04 ఎర్లీ మీట్స్ వరల్డ్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 04 టీనేజ్ వేస్ట్ ల్యాండ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - సెప్టెంబరు 04జీడీఎన్(తమిళ సినిమా)- సెప్టెంబరు 04 అమినే క్రాఫ్ట్ మూవీ(హాలీవుడ్)- సెప్టెంబరు 04 ది బ్రెడ్ విన్నర్(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 06సన్ నెక్స్ట్ డిసి (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 04అమెజాన్ ప్రైమ్ జగమే సంగీతం (తెలుగు సిరీస్) - సెప్టెంబరు 04జియో హాట్స్టార్ ద కోర్ట్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - సెప్టెంబరు 04జీ5వీరభద్రుని రహస్యం సీజన్-1 పార్ట్-2(తెలుగు సిరీస్)- సెప్టెంబర్ 04సోనీ లివ్ ఉన్మాదం (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 04ఆపిల్ టీవీ ప్లస్ మే డే (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 04 -
ఓటీటీలోకి హారర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
90ల్లో పుట్టి పెరిగిన చాలామంది ఇప్పుడు 30స్లో ఉన్నారు. వీళ్లంతా చిన్నతంలో హాలీవుడ్ డబ్బింగ్ సినిమాలు చూస్తూ పెరిగారు. అయితే 'మమ్మీ' ఫ్రాంచైజీ వీళ్లని చాలానే భయపెట్టింది. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటికే పలు భాగాలు రిలీజయ్యాయి. కానీ అవన్నీ అడ్వెంచర్ కామెడీ తరహాలో తెరకెక్కాయి. ఈ ఏడాది ఈ జానర్ నుంచి హారర్ బ్యాక్డ్రాప్ స్టోరీతో ఓ మూవీ వచ్చింది. అదిప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రకటన చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)లీ క్రోనిన్ దర్శకత్వం వహించిన 'ద మమ్మీ' సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. హారర్ సినిమా లవర్స్ని ఆకట్టుకుని పర్లేదనిపించింది. అనంతరం మే నెలలో విదేశాల వరకు అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీల్లో అద్దె విధానంలో స్ట్రీమింగ్లోకి వచ్చింది. మన దేశంలో మాత్రం ఈ నెల 17 నుంచి హాట్స్టార్లో అందుబాటులోకి రానుంది. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో చూడొచ్చు.'ద మమ్మీ 2026' విషయానికొస్తే.. ఎనిమిదేళ్ల క్రితం కనిపించకుండాపోయిన తన కూతురు తిరిగి రావడం చూసి ఓ కుటుంబం చాలా ఆనందపడుతుంది. కానీ ఆమెలో ఉన్న రాక్షస శక్తులు సదరు కుటుంబాన్ని దారుణంగా ఇబ్బంది పెడతాయి. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ. ఇందులో హారర్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా భయపెట్టేలా ఉన్నాయి.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) View this post on Instagram A post shared by JioHotstar (@jiohotstar) -
నేరుగా ఓటీటీలోకి వచ్చిన తెలుగు డబ్బింగ్ థ్రిల్లర్ సినిమా
హాలీవుడ్ ప్రముఖ నటి, 'వండర్ ఉమన్' ఫేమ్ గల్ గడోట్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా 'ద రన్నర్'. ఇది ఇప్పుడు నేరుగా ఓటీటీలో రిలీజైపోయింది. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ చిత్రానికి కెవిన్ మెక్ డొనాల్డ్ దర్శకత్వం వహించాడు. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ఇరుముడి' పాప థ్రిల్లర్ సినిమా)గల్ గడోట్ 'ద రన్నర్' సినిమా నేటి(సెప్టెంబరు 02) నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం లాంటి ప్రాంతీయ భాషలతో పాటు ఇంగ్లీష్లోనూ స్ట్రీమింగ్లోకి వచ్చేసింది.'ద రన్నర్' విషయానికొస్తే.. లండన్లో కొడుకుతో జీవించే ఓ మహిళ.. ఆ పిల్లాడ్ని ఓ రోజు స్కూల్లో దిగబెట్టి వస్తుంది. కానీ కొంతసేపటి తర్వాత కిడ్నాపర్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఒక గంటలో తాను చెప్పిన పనులన్నీ చేస్తేనే కొడుకుని అప్పగిస్తానని ఆమెని బెదిరిస్తాడు. మరి సదరు మహిళ.. కిడ్నాపర్ చెప్పిన పనులన్నీ చేసిందా? ఈ క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొందనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
ఓటీటీలో మాధవన్ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన
ఓటీటీలోకి ప్రతివారం కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అలా ఈ వారం ఇప్పటికే 'పళ్లబురుసు' అనే తెలుగు మూవీ స్ట్రీమింగ్లోకి వచ్చేసింది. వీకెండ్లో కొరియన్ కనకరాజు, డిసి, ఉన్మాదం, గాంధారి, జగమే సంగీతం, ద కోర్ట్ లాంటి చిత్రాలు, సిరీస్లు అందుబాటులోకి రానున్నాయి. ఇవలా ఉండగానే మరొకటి కూడా రాబోతుందని అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: డైరెక్టర్ లేకుండానే సినిమా.. శ్రీకృష్ణ దేవరాయలుగా సుదీప్)మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జీడీఎన్'. గోపాలస్వామి దొరైస్వామి నాయుడు అలియాస్ జీడీ నాయుడు అంటే తమిళనాడులో తెలియనివాళ్లు లేరు. వందేళ్ల క్రితం దక్షిణ భారతదేశంలో వాణిజ్య, సాంకేతిక విప్లవానికి ఈయన ఆద్యుడు. ఇండియన్ ఎడిసన్గా పేరుగాంచాడు. తెలుగు మూలాలు ఉన్న నాయుడి జీవితాన్ని 'జీడీఎన్' పేరుతో గత నెల 7న థియేటర్లలో రిలీజ్ చేశారు. ఇప్పుడు నెలలోపే అంటే ఈ శుక్రవారమే (సెప్టెంబరు 04) నెట్ఫ్లిక్స్లోకి తీసుకొస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో అందుబాటులోకి రానుంది.'జీడీఎన్' విషయానికొస్తే.. కోయంబత్తూరులోని ఓ రైతు కుటుంబంలో పుట్టిన నాయుడు(మాధవన్) పెద్దగా చదువుకోలేదు. డిగ్రీల కంటే అనుభవం , జ్ఞానం ముఖ్యమని ఆయన నమ్మకం. ఒక బ్రిటీషర్ దగ్గర రూ.250తో మోటర్ సైకిల్ కొనాలని అనుకుంటాడు. కానీ ఆ డబ్బుని రైతు కూలీలకి ఇచ్చేస్తాడు. తనతో పాటు నలుగురూ బావుండాలనే తపన. తర్వాత ఒక హోటల్లో పనిచేసి డబ్బు సంపాదించి మోటర్ సైకిల్ కొని, అది ఎలా పని చేస్తుందో తెలుసుకుంటాడు. కొత్త వస్తువులు కనిపెట్టడం దగ్రి నుంచి ఒక బస్సుల కంపెనీ యజమాని వరకూ ఎదుగుతాడు.జర్మనీ వెళ్లి హిట్లర్తో ప్రశంసలు పొందుతాడు. ఈ క్రమంలో బ్రిటీష్ వాళ్లు ఒక ఇన్కమ్ట్యాక్స్ అధికారి సాయంతో నాయుడు మీద కుట్రలు చేస్తారు. దేశద్రోహిగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఆయన్ని వేధించి, ఆస్తుల జప్తు వరకు తీసుకొస్తారు. ఇవన్నీ జీడీఎన్ ఎలా ఎదుర్కొన్నాడు? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)Oru manushan oda vaazhkai indha naatu oda varalaaru 🙌🏼🔥 pic.twitter.com/Ga29ziMp1q— Netflix India South (@Netflix_INSouth) September 2, 2026SSS -
ఓటీటీలోకి వచ్చేస్తున్న ట్రంప్ ‘సీక్రెట్ జర్నీ’
తన ప్రాణాలకు ముప్పు లేదని తరచూ చెప్పే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భద్రత విషయంలో మాత్రం ఏమాత్రం రాజీపడరు. అలాంటిది ప్రాణభయంతో ప్రయాణిస్తున్న విమానాన్ని రహస్యంగా మార్చడం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. అసలు ఆ రోజు ఏం జరిగిందన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అయితే ఆ విషయాలు ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాటో సదస్సు కోసం జూలై 8న టర్కీలోని అంకారాకు వెళ్లారు. సదస్సు ముగించుకుని అమెరికాకు తిరుగు ప్రయాణంలో.. భద్రతా కారణాలతో ఎయిర్ ఫోర్స్ వన్ నుంచి రహస్యంగా మరో సైనిక విమానంలోకి మార్చారు. ఆ సందర్భంగా చోటుచేసుకున్న ఈ ఘటనను.. ‘ఇన్స్టాడాక్స్: ది డీకాయ్ ప్లేన్’ పేరుతో నెట్ఫ్లిక్స్ రూపొందించింది. ఈ ప్రత్యేక డాక్యుమెంటరీ సెప్టెంబర్ 4(ఎల్లుండి) నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఇందులో ఏం చూపించబోతున్నారు? ఇది ఎన్ని వివాదాలు.. అభ్యంతరాలకు దారి తీస్తుందో ? అనే ఆసక్తి నెలకొంది.డీకాయ్ ప్లేన్ అంటే.. ట్రంప్ ‘ఎయిర్ ఫోర్స్ వన్’లోనే ప్రయాణిస్తున్నారని బయటకు కనిపించేలా చేస్తూనే.. వాస్తవంగా ఆయనను మరో సైనిక విమానంలోకి తరలించడమే డీకాయ్ ప్లేన్. అసలు ట్రంప్ ఏ విమానంలో ఉన్నారో గుర్తించకుండా ఉండేందుకు ఈ ఏర్పాటు చేశారు. ఇరాన్ నుంచి ముప్పు ఉందని ఇజ్రాయెల్ హెచ్చరించిన నేపథ్యంలోనే అమెరికా భద్రతా అధికారులు ఈ ఏర్పాట్లు చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ ముప్పును నిర్ధారించుకోకుండానే అమెరికా బలగాలు ఈ సీక్రెట్ జర్నీ ఆపరేషన్ నిర్వహించినట్లు తర్వాత తేలింది.క్యాటరింగ్ ట్రక్కులో..ఈ రహస్య ఆపరేషన్లో అత్యంత ఆసక్తికరమైన అంశం ట్రంప్ విమానం మారిన విధానం. ఒక విమానం నుంచి మరో సైనిక విమానానికి ఆయనను సాధారణంగా విమానాశ్రయాల్లో ఆహారం, పానీయాలు తరలించే క్యాటరింగ్ ట్రక్కులో తీసుకెళ్లినట్లు రిపోర్టులు వెల్లడించాయి. ఈ రహస్య బదిలీ గురించి ట్రంప్ వెంట ఉన్న మీడియా ప్రతినిధుల్లో చాలామందికి కూడా సమాచారం లేదని కథనాలు పేర్కొన్నాయి.కొందరు మాత్రమే వెంట..ట్రంప్తో పాటు ఈ రహస్య బదిలీలో కొద్దిమంది మాత్రమే పాల్గొన్నట్లు సమాచారం. వైట్హౌస్ సిబ్బంది, అప్పటి రక్షణ శాఖ కార్యదర్శి పీట్ హెగ్సెత్ తదితరులు ఆయనతో వెళ్లినట్లు కథనాలు తెలిపాయి. మరోవైపు అప్పటి విదేశాంగ మంత్రి మార్కో రూబియో, స్టీఫెన్ మిల్లర్, అప్పటి వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తదితరులు డీకాయ్గా ఉన్న విమానంలోనే కొనసాగారు.బ్రిటన్లో మళ్లీ విమానం మార్పు?టర్కీ నుంచి ట్రంప్ ప్రయాణించిన సైనిక విమానం బ్రిటన్లోని రాయల్ ఎయిర్ఫోర్స్ మిల్డెన్హాల్ స్థావరానికి చేరినట్లు రిపోర్టులు పేర్కొన్నాయి. అక్కడ ఆయన మరోసారి విమానం మార్చి.. ఖతార్ నుంచి అందిన బోయింగ్ 747లో అమెరికాకు బయలుదేరినట్లు సమాచారం.ట్రంప్ ఏమన్నారు?ఈ వ్యవహారం బయటకు రావడంతో ట్రంప్ విమానం ఎందుకు మార్చారన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సోషల్ మీడియాలో మీమ్స్, ఊహాగానాలు వెల్లువెత్తాయి. అనంతరం ట్రంప్ దీనిపై స్పందిస్తూ.. తనకు ఇలాంటి ముప్పు పొంచి ఉండడం సహజమేనని, భయపడే రకం తాను కాదని.. అయితే సీక్రెట్ సర్వీస్, మిలిటరీ అధికారులు సురక్షితమైన మార్గమని సూచించడంతో తాను వారి ఆదేశాలను పాటించినట్లు చెప్పారు. ట్రంప్ మాత్రమే కాదు గతంలో ఎంతో మంది అమెరికా అధ్యక్షులు, ఆ మాటకొస్తే పలువురు ప్రపంచ అధినేతల కోసం ఇలాంటి సీక్రెట్ జర్నీలు ఏర్పాటు చేశారు.ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కథనం..ఇప్పటివరకు వార్తలు, ఊహాగానాలకే పరిమితమైన ఈ రహస్య ప్రయాణం వెనుక కథను Instadocs: The Decoy Plane పేరిట నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఘటనను తొలిసారి రిపోర్ట్ చేసిన జర్నలిస్టులతో పాటు వైట్హౌస్, విమానయాన రంగానికి చెందినవారు, మాజీ సీక్రెట్ సర్వీస్ సిబ్బందితో చేసిన ఇంటర్వ్యూలను ఇందులో చూపించనున్నారు. సెప్టెంబర్ 4న స్ట్రీమింగ్ ప్రారంభం కానుండటంతో.. ట్రంప్ ‘సీక్రెట్ జర్నీ’ మరోసారి ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఇదీ చదవండి: అమెరికా సైనికులొస్తున్నారు.. అలర్ట్This July, while flying back from a NATO summit in Turkey, President Trump slipped off Air Force One in a catering truck and secretly boarded a different aircraft — leaving traveling reporters to fly on, unaware the president was no longer with them.Instadocs: The Decoy Plane,… pic.twitter.com/iuADnXxMoV— Netflix (@netflix) September 1, 2026 -
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం అలానే కొరియన్ కనకరాజు, డిసి, ఉన్మాదం లాంటి పలు భాషల్లో హిట్ అయిన చిత్రాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. గాంధారి లాంటి ఓటీటీ మూవీతో పాటు జగమే సంగీతం, ద కోర్ట్ లాంటి డబ్బింగ్ సిరీసులు కూడా ఆసక్తి రేపుతున్నాయి. ఇవలా ఉండగానే హీరో నాగార్జున నిర్మించిన ఓ చిత్రం ఎలాంటి సౌండ్ లేకుండా స్ట్రీమింగ్లోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో ఉంది?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ఇరుముడి' పాప థ్రిల్లర్ సినిమా)గత కొన్నేళ్లుగా తెలంగాణ నేపథ్యంగా పలు సినిమాలు వస్తున్నాయి. అలా అన్నపూర్ణ సంస్థ నిర్మించిన చిన్న మూవీ 'పళ్లబురుసు'. బలగం చిత్రంలో నటనతో ఆకట్టుకున్న సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ఇందులో ప్రధాన పాత్రలు చేశారు. గత నెలలో అంటే ఆగస్టు 14న థియేటర్లలో రిలీజైంది. ప్రమోషన్లు పర్లేదనిపించారు గానీ కంటెంట్ ఓ మాదిరిగా ఉండేసరికి జనాలు దీన్ని పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు మూడు వారాల్లోపే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో స్ట్రీమింగ్ అవుతోంది.'పళ్లబురుసు' విషయానికొస్తే.. తెలంగాణలోని ఓ పల్లెటూరిలో ఉండే వృద్ధుడు శంభు(సుధ). ఓసారి పంటినొప్పితో ఆస్పత్రికి వెళ్లగా, చికిత్స చేసిన డాక్టర్.. వేపపుల్ల కాకుండా టూత్ బ్రష్ వాడాలని చెబుతుంది. దీంతో ఇది కొనివ్వమని శంభు, తన కొడుకు తిరుపతి(మురళీధర్ గౌడ్)ని అడుగుతాడు. కానీ వేరే పనుల్లో పడిపోయి తిరుపతి ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. దీంతో శంభుకి కోపమొస్తుంది.సరిగ్గా అదే టైంలో తనని పిలవకుండా మనవరాలి పెళ్లిని కొడుకు చేయడంతో శంభు అవమానంగా ఫీలవుతాడు. దీంతో పళ్లబురుసు కొనివ్వలేదని కొడుకుపై కేసు పెట్టేందుకు పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. ఈ కేసు వల్ల తండ్రీకొడుకుల జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? అసలు తిరుపతి తన తండ్రిని పట్టించుకోకపోవడానికి కారణమేంటి? చివరకు ఏమైందనేది మిగిలిన స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ఇరుముడి' వచ్చేది అప్పుడేనా?) -
ఓటీటీలోకి 'ఇరుముడి' వచ్చేది అప్పుడేనా?
రెండో వారాంతం పూర్తయినప్పటికీ 'ఇరుముడి' సినిమా థియేటర్లలో తెగ ఆడేస్తోంది. ఇప్పటికీ హౌస్ఫుల్స్ పడుతున్నాయి. దీంతో ట్రేడ్ సైతం ఆశ్చర్యపోతోంది. హీరో, దర్శకనిర్మాతల దగ్గర నుంచి ప్రేక్షకుల వరకు ఎవరూ ఊహించని విజయం ఇదని చెప్పొచ్చు. ఇప్పటికీ జనాలు థియేటర్లకు వెళ్లి ఈ మూవీ చూస్తున్నారు. అదే టైంలో ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ గురించి సోషల్ మీడియాలో ఓ తేదీ వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: 'టాక్సిక్' సినిమాకు నెగిటివ్ టాక్.. యష్ తల్లి ఆవేశం)రవితేజకు గత కొన్నాళ్ల నుంచి సరైన సక్సెస్ అనేది లేదు. దీంతో 'ఇరుముడి'పై కూడా హైప్ ఓ మాదిరిగానే ఉండేది. అయ్యప్ప స్వామి దీక్ష నేపథ్యం కావడంతో సెట్ ఆఫ్ ఆడియెన్స్ మాత్రం ఇది కచ్చితంగా హిట్ అవుతుందని నమ్మారు. వాళ్లకు నమ్మకాన్ని నిజం చేస్తూ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం రూ.150 కోట్లకు పైనే వసూళ్లు దక్కించుకుని విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.ఇకపోతే ఈ మూవీ డిజిటల్ హక్కుల్ని నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసుకునేలా ఒప్పందం చేసుకున్నారు. దీనిబట్టి చూస్తే సెప్టెంబరు 18 నుంచే ఓటీటీ రిలీజ్ కావొచ్చు. లేదంటే నిర్మాతలు.. ఓటీటీ సంస్థతో ఏమైనా మాట్లాడి ఇంకొన్ని వారాల స్ట్రీమింగ్ వాయిదా వేసేలా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. పరిస్థితులు చూస్తుంటే థియేటర్లలో మూవీ ఉన్నప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చేస్తుందా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: 'ఇరుముడి'లో అయ్యప్ప పాట.. ఫుల్ వీడియో రిలీజ్)(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ఇరుముడి' పాప థ్రిల్లర్ సినిమా) -
ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
రెండో వీకెండ్ అయిపోయినా సరే ఇంకా 'ఇరుముడి' సినిమా థియేటర్లలో అదరగొడుతోంది. గతవారం రిలీజైన 'టాక్సిక్' మాత్రం సైలెంట్ అయిపోయింది. ఇక ఈ వారం చాలానే మూవీస్ రాబోతున్నాయి. వాటిలో అల్లరి నరేశ్ 'రంభ ఊర్వశి మేనక', సందీప్ రెడ్డి వంగా నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న 'రోమాంచకం' చిత్రాలు ఉన్నంతలో కాస్త బజ్తో విడుదలవుతున్నాయి. వీటితో పాటు దుల్కర్ సల్మాన్ 'ఐ యామ్ గేమ్', మమిత బైజు 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్', మీర్జాపూర్, మా రాముడు అందరివాడు, ధర్మస్థల నియోజకవర్గం, సహ లాంటి మూవీస్ కూడా బిగ్ స్క్రీన్స్పైకి రాబోతున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ఇరుముడి' పాప థ్రిల్లర్ సినిమా)మరోవైపు ఓటీటీల్లోనూ 18 వరకు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో రీసెంట్ హిట్స్ అయిన డిసి, కొరియన్ కనకరాజు, ఉన్మాదం లాంటి చిత్రాలు ఉన్నాయి. అలానే 'జగమే సంగీతం' అనే సిరీస్ కూడా చూడాలనే ఆసక్తి రేపుతోంది. ఇంతకీ ఈ వీకెండ్ ఏ ఓటీటీలో ఏ మూవీ అందుబాటులోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 06 వరకు)సన్ నెక్స్ట్డిసి (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 04అమెజాన్ ప్రైమ్జగమే సంగీతం (తెలుగు సిరీస్) - సెప్టెంబరు 04హాట్స్టార్ద కోర్ట్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - సెప్టెంబరు 04సోనీ లివ్క్రైమ్ పాట్రోల్ (హిందీ సిరీస్) - ఆగస్టు 31ఉన్మాదం (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 04నెట్ఫ్లిక్స్అన్టోల్డ్ రేగన్: బ్రేకింగ్ బ్యాడ్లీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - సెప్టెంబరు 01జారెడ్ ఫ్రైడ్ (ఇంగ్లీష్ కామెడీ షో) - సెప్టెంబరు 011000 ఎల్బీ సీజన్ 9 (ఇంగ్లీష్ రియాలిటీ షో) - సెప్టెంబరు 01లవ్ సిక్ (మెక్సికన్ సిరీస్) - సెప్టెంబరు 02టర్నింగ్ పాయింట్: జనరేషన్ 9/11 (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - సెప్టెంబరు 02ఫిటో పాయెజ్: ద వరల్డ్ వితిన్ ఏ సాంగ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - సెప్టెంబరు 03గాంధారి (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 03ద జెంటిల్మెన్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 03ధమాల్ 4 (హిందీ మూవీ) - సెప్టెంబరు 04కొరియన్ కనకరాజు (తెలుగు సినిమా) - సెప్టెంబరు 04ఎర్లీ మీట్స్ వరల్డ్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 04టీనేజ్ వేస్ట్ ల్యాండ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - సెప్టెంబరు 04ఆపిల్ టీవీ ప్లస్మే డే (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 04(ఇదీ చదవండి: ఓటీటీలో 'ఆకలిరాజ్యం 2026' తెలుగు రివ్యూ) -
ఓటీటీలోకి 'కొరియన్ కనకరాజు'.. అధికారిక ప్రకటన
ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. మెగా హీరో వరుణ్ తేజ్ చేసిన హారర్ కామెడీ మూవీ 'కొరియన్ కనకరాజు'. గత నెలలో థియేటర్లలో రిలీజైంది. సూపర్ కాకపోయినప్పటికీ ప్రేక్షకుల్ని మంచి స్పందన రాబట్టుకుని చెప్పుకోదగ్గ వసూళ్లు కూడా సాధించింది. ఇదే ఇప్పుడు స్ట్రీమింగ్కి సిద్ధమైంది.(ఇదీ చదవండి: ఓటీటీలో 'ఆకలిరాజ్యం 2026' తెలుగు రివ్యూ)సాధారణంగా హారర్ అంటే మన దేశ నేపథ్యంగానే తీస్తుంటారు. కానీ ఈ సినిమాలో మాత్రం హీరో ఒంటిలోకి కొరియన్ ఆత్మ ప్రవేశిస్తుంది. తద్వారా వచ్చే కామెడీని బేస్ చేసుకుని తెరకెక్కించారు. వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ నటించింది. సత్య కీలక పాత్ర చేశాడు. మేర్లపాక గాంధీ దర్శకుడు. ఆగస్టు 07న థియేటర్లలో రిలీజ్ కాగా ఇప్పుడు సెప్టెంబరు 04 నుంచి నెట్ఫ్లిక్స్లోకి తీసుకురానున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ చేయనున్నారు. అధికారికంగా నెట్ఫ్లిక్స్ అప్డేట్ ఇచ్చేసింది.'కొరియన్ కనకరాజు' విషయానికొస్తే.. ఓ వ్యక్తి చనిపోతాడు. అతడి అస్తికల్ని కొరియన్ కుండలో ఉంచుతారు. అనుకోకుండా అగ్ని ప్రమాదం లాంటిది జరిగి ఆ కుండ కనిపించకుండా పోతుంది. అది అలా అలా చేతులు మారి అనూహ్యంగా అనంతపురం చేరుతుంది. కట్ చేస్తే పెనుకొండలో ఉండే కనకరాజు (వరుణ్ తేజ్)కి కోపం ఎక్కువ. ఆ కోపంలో ఎవర్నైనా చితకబాదుతాడు. అదే ఊరిలో చైత్ర (రితికా నాయక్) కియా కంపెనీలో ఉద్యోగం చేస్తుంటుంది. ఇదిలా ఉండగా ఆ అనంతపురం వచ్చిన అస్తికల కుండ ఒక బార్కి చేరుతుంది.అయితే ఒకరోజు గొడవలో కనకరాజు.. ఆ అస్తికల కుండతో ఒకడిని కొట్టడంతో దాని మూత ఊడుతుంది. దాని డిజైన్ ఎదో బాగుందనుకుని అందులో మందు మిక్స్ చేసుకుని తాగుతాడు. అంతే అందులో ఉన్న కొరియన్ ఆత్మ కనకరాజుని ఆవహిస్తుంది. తర్వాత ఏమైంది? ఆ కొరియన్ ఆత్మ ఎవరిది? అది చేసే పనులేంటి? కనకరాజు ఆ ఆత్మ బారి నుంచి ఎలా తప్పించుకున్నాడనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ఇరుముడి' పాప థ్రిల్లర్ సినిమా) -
ఓటీటీలోక్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. ట్విస్టులు ఊహించలేరు!
ప్రేక్షకులందు సినిమా ప్రేక్షకులు వేరయా...అది ఆటైనా, పాటైనా ...వేడుకేదైనా, వేదికేదైనా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కార్యక్రమం రూపుదిద్దుకుంటే మాత్రం చాలు ఆ కార్యక్రమం విజయవంతమైనట్లే. కాని సినిమా ప్రేక్షకులు మాత్రం వీటన్నిటికీ విభిన్నం. విషయాన్ని సూటిగా చెబితే సినీ ప్రేక్షకులు అలరించరు. అదే విషయానికి కాస్త మసాలా దట్టించి చెప్పాలనుకున్న విషయాన్ని వినూత్నంగా చివరాఖరిలో చెబితేనే సినిమా అలరిస్తుంది. మరీ ముఖ్యంగా ఇప్పటితరం వైవిధ్యానికి పెద్ద పీట వేస్తోంది.ఆ నేపధ్యంలో వచ్చిన సినిమా ఉయిర్. ప్రముఖ ఓటీటీ సంస్థ జియోహాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ఇది మళయాళ సినిమా అయినా హాట్ స్టార్ లో తెలుగులోనూ లభ్యమవుతోంది. ప్రముఖ మళయాళ రచయితలు షాజీ, నిఖిల్ రాసిన కథకు పద్మకుమార్ ప్రాణం పోసిన సినిమానే ఉయిర్. ఈ సినిమా ప్రారంభం నుండి శుభం కార్డు వరకు ప్రేక్షకుడిలో ఆమితాసక్తిని రేకెత్తిస్తూ ఆఖరి సన్నివేశం వరకూ ఉత్కంఠ రేపుతుంది. అంతలా ఈ సినిమా కథలో ఏముందో ఓ సారి చూద్దాం.కేరళలోని కన్నూర్ సమీప ప్రాంతంలో ఉన్న ఓ పాడుబడిన బావిలో కుళ్ళిపోయిన స్థితిలో ఒక గుర్తుతెలియని మహిళ మృతదేహం బయటపడటంతో కథ ప్రారంభమవుతుంది. కొత్తగా విధుల్లో చేరిన సబ్ఇన్స్పెక్టర్ అజీబ్కు ఈ కేసు దర్యాప్తు బాధ్యత అప్పగిస్తారు. సీనియర్ పోలీస్ ఆఫీసర్ జాయ్ పర్యవేక్షణలో అజీబ్ తన మొదటి పెద్ద కేసుగా దీన్ని తీసుకుంటాడు. ప్రారంభంలో ఎలాంటి క్లూస్ దొరకకపోయినా, ఆ శవం వేసుకోనున్న బట్టలు, చేతి గాజుల ఆధారంగా ఆ మహిళ కర్ణాటక సరిహద్దు ప్రాంతం నుంచి వచ్చిన వలస కార్మికురాలు 'శోభ' అని గుర్తిస్తారు.విచారణ ముందుకెళ్ళేకొద్దీ ఇది సాధారణ హత్య కాదని దీని వెనుక పెద్ద మోసపూరిత కుట్ర దాగుందని అజీబ్ కు అర్థమవుతుంది. శోభ హత్య సమయంలో తప్పిపోయిన శోభ పిల్లల గురించి అజీబ్ ఆరా తీస్తుంటాడు. మరో వైపు అజీబ్కు చిన్నతనంలోనే తన సొంత చెల్లెలు తప్పిపోయిన చేదు జ్ఞాపకం నిరంతరం వెంటాడుతూ ఉంటుంది. దానికి ఈ హత్యకు ఓ లింకు కూడా ఉంటుంది. మరి శోభను హత్య చేసిన అసలు నేరస్థుడిని అలాగే శోభ పిల్లలను అజీబ్ వెతికి పట్టుకుంటాడా లేదా అన్నది మాత్రం ఉయిర్ సినిమాలోనే చూడాలి. ఈ సినిమా స్క్రీన్ ప్లే మాత్రం ఊహకందని రీతిలో పరిగెడుతుంది. మస్ట్ వాచ్ థ్రిల్లర్ ఫర్ ది వీకెండ్. -
ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ వస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా వివిధ భాషల్లో రిలీజయ్యే థ్రిల్లర్స్ వీలైనంత ఎక్కువగా ప్రేక్షకుల్ని అలరిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే దాదాపు ఓటీటీ ఫ్లాట్ఫామ్స్ అన్నీ ఈ జానర్లోని సినిమాలు, సిరీస్లని స్ట్రీమింగ్లోకి తీసుకొస్తుంటాయి. ఇప్పుడు అలానే ఓ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు రిలీజ్ డేట్ ప్రకటించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ఇరుముడి' పాప థ్రిల్లర్ సినిమా)'ప్రేమిస్తే' లాంటి డబ్బింగ్ బొమ్మతోపాటు పలు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు భరత్.. ప్రధాన పాత్ర చేసిన తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్ 'పంచనామా'. మేధారెడ్డి, ఉదయభాను కీలక పాత్రలు చేశారు. సెప్టెంబరు 11 నుంచి జీ5 ఓటీటీలో దీన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ అనౌన్స్మెంట్ వీడియోని వదిలారు.యాంకర్గా చాలా గుర్తింపు తెచ్చుకున్న ఉదయభాను.. పెళ్లి తర్వాత కొంత గ్యాప్ ఇచ్చింది. చాన్నాళ్లకు మళ్లీ యాంకరింగ్, మరోవైపు యాక్టింగ్ చేస్తూ కాస్తంత బిజీ అయ్యే ప్రయత్నాల్లో ఉంది. అలా ఈ సిరీస్లోనూ నటించింది. మరి 'పంచనామా' ఏమైనా ఉదయభాను ఫేట్ మారుస్తుందేమో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలో 'ఆకలిరాజ్యం 2026' తెలుగు రివ్యూ)SEP 11th 💥💥THE INVESTIGATION BEGINS...🕵️♂️#Panchanama premieres on September 11th, only on #TeluguZee5#BharathNiwas #MedhaReddy #UdayaBhanu#PamchanamaFromSep11 #PanchanamaOnTeluguZee5 pic.twitter.com/NbpDV3v2HW— ZEE5 Telugu (@ZEE5Telugu) August 29, 2026 -
ఓటీటీలో 'ఆకలిరాజ్యం 2026' తెలుగు రివ్యూ
1980లో కమల్ హాసన్ హీరోగా 'ఆకలిరాజ్యం' సినిమా వచ్చింది. నిరుద్యోగుల బాధలు, కష్టాల గురించి ఇందులో చూపించిన విధానం ఇప్పటికీ రిలేటబుల్గానే ఉంటుంది. ఇదొచ్చి 45 ఏళ్లు గడిచిపోయినప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. లేటెస్ట్గా 'ఆకలిరాజ్యం 2026' పేరుతో తెలుగులో ఓ వెబ్ సిరీస్ తీశారు. ఆహా ఓటీటీలో ఈ రోజే(ఆగస్టు 28) స్ట్రీమింగ్లోకి వచ్చింది. మరి ఇదెలా ఉంది? ఇందులో ఎలాంటి కంటెంట్ చూపించారు? అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?రమేశ్(వికాస్ వశిష్ఠ), అరుణ(గీతా సైనీ), అక్షయ్(రాజేశ్ ఖన్నా) ఇంజినీరింగ్ చదివేటప్పటి నుంచి స్నేహితులు. హైదరాబాద్లో ఒకే గదిలో అద్దెకుంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరోవైపు సొంతంగా ఏదైనా చేయాలని తాపత్రయపడుతుంటారు. ఓ వైపు నిరుద్యోగ సమస్యతో బాధపడుతూ మరోవైపు వ్యక్తిగతంగానూ కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇలా నిరాశ, నిస్పృహలతో సాగుతున్న వీళ్ల జీవితం చివరకు ఏమైంది? అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఈ సిరీస్లో చూపించింది కొత్త కథేం కాదు. నిరుద్యోగ సమస్య అనేది రోజురోజుకీ చాలా పెరుగుతోంది. ఇంజినీరింగ్ పాస్ అయినప్పటికీ ఉద్యోగాలు రాని యువత కోట్లాదిమంది హైదరాబాద్ లాంటి మహానగరాల్లో బతుకీడుస్తూ కాలం వెల్లదీస్తున్నారు. అలాంటి ఓ ముగ్గురి జీవితమే ఈ సిరీస్. ప్రస్తుతానికి మూడు ఎపిసోడ్స్ మాత్రమే రిలీజ్ చేశారు. ఉన్నంతలో వీటిని బాగానే తీశారు.ఒక్కో ఎపిసోడ్ సగటుగా 35 నిమిషాల నిడివితో ఉంటుంది. నిరుద్యోగం అనే సీరియస్ అంశాన్ని హాస్యంతో చెప్పే ప్రయత్నం చేశారు. తొలి రెండు ఎపిసోడ్స్ నవ్వించినప్పటికీ మూడో ఎపిసోడ్ మాత్రం ఎమోషనల్ చేస్తుంది. ప్రస్తుత జనరేషన్ కనెక్ట్ అయ్యే అంశాల్ని ఇందులో చూపించిన దర్శకుడు నీలగిరి మామిళ్ల.. సిరీస్ ఆకట్టుకునేలా తీయడంలో కొంతమేర సక్సెస్ అయ్యారు. కాకపోతే అవసరమైన కొన్ని సీన్స్ సాగదీతగా అనిపిస్తాయి. అక్కడక్కడ వినిపించే కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఇబ్బంది పెడతాయి.ఉన్నంతలో హైదరాబాద్లోని రియల్ లొకేషన్లలోనే తీశారు. కాకపోతే ఇప్పటికే ఇలాంటి కథల్ని చాలా సినిమాల్లో, యూట్యూబ్ సిరీస్ల్లో చూసేశాం. కాబట్టి ఆ విషయంలో అయితే కొత్తగా అనిపించదు. ప్రస్తుతానికి రిలీజ్ చేసిన మూడు ఎపిసోడ్లు పర్లేదనిపించాయి. వచ్చే వారం స్ట్రీమింగ్ చేయబోయే ఎపిసోడ్లలో స్మార్ట్ ఫార్మింగ్(వ్యవసాయం) గురించి చూపించబోతున్నారు. అంటే పల్లెలో కథంతా ఉండబోతుంది.ప్రధాన పాత్రధారుల విషయానికొస్తే వికాశ్, రాజేశ్, గీతా ఉన్నంతలో బాగానే చేశారు. స్టోరీ రొటీన్గా ఉండటం వల్ల గుర్తుండిపోయే సీన్స్ అయితే వీళ్లకు పడలేదు. కొన్నిచోట్ల కన్వీనియంట్ రైటింగ్ కూడా మైనస్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా అయితే ఇదో టైంపాస్ సిరీస్. అసభ్యకర సీన్స్ ఏం లేవు. కుటుంబ సభ్యులతోనూ కలిసి చూడొచ్చు.-చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
దాదాపు 25 ఏళ్ల క్రితం తెలుగు సినిమాల్లో నటుడిగా కెరీర్ ప్రారంచిన వెంకట్.. ఇప్పటికీ అడపాదడపా మూవీస్ చేస్తూనే ఉన్నాడు. చాన్నాళ్ల తర్వాత హీరోగా చేసిన చిత్రం ఈ ఏడాది థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడీ చిత్రం మూడు నెలల తర్వాత పెద్దగా హడావుడి లేకుండానే స్ట్రీమింగ్లోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో ఉంది?(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి, అన్నయ్య, భలేవాడివి బాసు, శివరామరాజు తదితర సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న వెంకట్.. తర్వాత కాలంలో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోయాడు. రీసెంట్ టైంలో అయితే ఓజీ, మా నాన్న సూపర్ హీరో తదితర చిత్రాల్లో సహాయ పాత్రలు చేశాడు. ఇతడు హీరోగా నటించిన 'హరుడు' అనే పోలీస్ డ్రామా మే 15న థియేటర్లలో రిలీజైంది. ప్రేక్షకుల్ని ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడిది ఆహా ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. ఇందులో వెంకట్ సరసన హెబ్బా పటేల్, సలోనీ, నటాషా సింగ్ నటించారు.'హరుడు' విషయానికొస్తే.. ముంబైలో మాఫియాని వణికించిన డీసీపీ శంకర్ అలియాస్ ఎన్కౌంటర్ శంకర్.. బదిలీపై హైదరాబాద్కి వస్తాడు. రావడం రావడమే క్రిమినల్స్ ఆటకట్టించడం షురూ చేస్తాడు. ఈ క్రమంలోనే స్థానిక ఎమ్మెల్మే వరదరాజులు (శ్రీహరి పైలా) చేస్తున్న అరాచకాలు శంకర్ దృష్టిలో పడతాయి. నిరుద్యుగులైన కొందరు విద్యార్థులు.. 'ఫుడ్ కోర్ట్' పెట్టుకోవాలనే ఆశతో కార్ల ఇంజిన్స్ దొంగతనం చేస్తూ పోలీసులకు చిక్కుతారు. అయితే వీళ్ల వెనకున్నది ఎమ్మెల్మే అని శంకర్కి అర్థమవుతుంది. తన భార్య ప్రియ (నటాషా సింగ్) హత్యకు, ఈ ఇంజిన్ల దొంగతనానికి ఉన్న సంబంధమేంటి? వీటన్నిటిని శంకర్ ఎలా ఛేదించాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఈ సినిమాతో పాటు ఈ వారం కేజీక్యూ, ఐ నోబడీ, అన్బే డయానా, ఆల్ఫా, బబితా సింగ్ రిపోర్టింగ్, ఆకలిరాజ్యం 2026, పార్ట్ టైమర్స్, న్యూటన్స్ థర్డ్ లా తదితర చిత్రాలు, సిరీస్లు స్ట్రీమింగ్లోకి వచ్చాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ఇరుముడి' పాప థ్రిల్లర్ సినిమా) -
సడన్గా ఓటీటీకి టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
దీక్షిత్ శెట్టి, శశి ఓదెల, యుక్తీ తరేజా లీడ్ రోల్స్లో నటించిన మూవీ ‘కేజేక్యూ: కింగ్ జాకీ క్వీన్’. 1990 నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ క్రైమ్ డ్రామాకు కేకే దర్శకత్వం వహించారు. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు. ఆగస్టు 7న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ఆడియన్స్ను అంతగా మెప్పించలేకపోయింది.తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండానే అమెజాన్ ప్రైమ్లో సడన్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం థియేటర్లలో మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. కాగా.. ఈ సినిమాకు పూర్ణచంద్ర తేజస్వీ సంగీతమందించారు. -
శుక్రవారం ఓటీటీల్లో సందడి.. ఒక్కరోజే 17 సినిమాలు స్ట్రీమింగ్
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ వారంలో టాక్సిక్ థియేటర్లలో సందడి చేస్తోంది. ఇక ఈ ఫ్రైడే టాలీవుడ్లో కికు చిరంజీవి అనే మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాపై పెద్దగా బజ్ అయితే లేదు. దీంతో పాటు మరికొన్ని డబ్బింగ్ సినిమాలు రిలీజయ్యే ఛాన్స్ ఉంది.ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ శుక్రవారం బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఆలియా భట్ ఆల్ఫా మూవీతో పాటు తెలుగు వెబ్ సిరీస్ ఆకలిరాజ్యం -2026 ఓటీటీల్లో సందడి చేయనుంది. వీటితో పాటు పలు బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలతో పాటు డబ్బింగ్ సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించనున్నాయి. మరి ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్ ఆల్ ద ట్రూత్ ఇన్ మై లైస్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 28 న్యూటన్స్ థర్డ్ లా(తెలుగు సినిమా)- ఆగస్టు 28 చుంబక్ (హిందీ సిరీస్) - ఆగస్టు 28 గ్రేవ్ యార్డ్ సీజన్ 3 (టర్కిష్ సిరీస్) - ఆగస్టు 28 ద విస్పర్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 28 ఆల్ఫా (హిందీ మూవీ) - ఆగస్టు 28 గ్రాండ్ థెఫ్ట్ ఆటో యాన్ ఎక్సెండెడ్ లుక్(హాలీవుడ్ సినిమా)- ఆగస్టు 28 మౌస్ ట్రాప్(కొరియన్ సిరీస్)- ఆగస్టు 28 సీక్రెట్ ఉమెన్(హాలీవుడ్ మూవీ)- ఆగస్టు 28 ఫోర్ హ్యాండ్స్- టు సోనాటాస్(హాలీవుడ్ సిరీస్)- ఆగస్టు 29జియో హాట్స్టార్.. పార్ట్ టైమర్స్ (తెలుగు సిరీస్) - ఆగస్టు 28 మైఖేల్ (హిందీ డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 29అమెజాన్ ప్రైమ్బబితా సింగ్ రిపోర్టింగ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 28 బెట్టి లా ఫియా సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 28సోనీ లివ్ అన్బే డయానా (తెలుగు డబ్బింగ్ చిత్రం) - ఆగస్టు 28జీ5 బందర్ (హిందీ మూవీ) - ఆగస్టు 28ఆహా ఆకలిరాజ్యం 2026 (తెలుగు సిరీస్) - ఆగస్టు 28ఆపిల్ టీవీ ప్లస్ డార్క్ మేటర్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 28లయన్స్ గేట్ ప్లే హంగ్రీ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 28 -
ఓటీటీలోకి వచ్చేసిన 'ఇరుముడి' పాప థ్రిల్లర్ సినిమా
'ఇరుముడి' థియేటర్లలో అదరగొడుతోంది. నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్స్ సాధించి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే మరో వారం వరకు ఈ జోరు ఉండొచ్చనిపిస్తోంది. రవితేజ సహా ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి ప్రశంసలు దక్కుతున్నాయి. మరీ ముఖ్యంగా హీరోకి కూతురిగా నటించిన నక్షత్ర అయితే అందరికీ తెగ నచ్చేస్తోంది. థియేటర్లలో ఇదలా ఉండగానే ఓటీటీలోకి ఈమె నటించిన ఓ మలయాళ థ్రిల్లర్ వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఈ చిత్రమేంటి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్, పార్వతి ప్రధాన పాత్రలు చేసిన హీస్ట్ థ్రిల్లర్ 'ఐ నోబడీ'. గత నెలలో థియేటర్లలో రిలీజైంది. తాజాగా హాట్స్టార్ ఓటీటీలోకి వచ్చేసింది. బ్యాంక్ దొంగతనంలో మాయమైన రూ.17 కోట్లు ఎక్కడికి పోయాయి? అనే స్టోరీతో ఈ సినిమాని తీశారు. ఇందులోనే నక్షత్ర.. హీరో కూతురిగా నటించింది. కొన్ని సన్నివేశాలే ఉన్నప్పటికీ ఆకట్టుకుంది.'ఐ నోబడీ' విషయానికొస్తే.. రాజీవన్ (పృథ్వీరాజ్ సుకుమారన్) సెక్రటేరియట్లో పనిచేసే ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగి. భార్య మీరా(పార్వతి), ఇద్దరు కూతుర్లతో పెద్దగా హడావిడి లేకుండా బతికేస్తుంటాడు. ఓరోజు ఇదే ఊరిలో బ్యాంక్ దొంగతనం జరుగుతుంది. అయితే అదే టైంకి బ్యాంక్లో ఉన్న రాజీవన్ని కొట్టి, దొంగలు తమతోపాటు కారులో బందీగా తీసుకొని వెళ్తారు.దారిలో రాజీవన్ని వదిలేయాలని దొంగలు అనుకుంటారు కానీ అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్లో రాజీవన్ బతికిపోయి దొంగలు స్పాట్లోనే చనిపోతారు. పోలీసులు వచ్చి కేసు నమోదు చేస్తారు. అంతా ఓకే గానీ దోపీడికి గురైన రూ.17 కోట్ల డబ్బు మాత్రం మాయం అవుతుంది. మరి ఆ డబ్బు ఎక్కడుంది? ఎవరు తీశారు? ఇందులో రాజీవన్ హస్తం ఉందా? చివరకు పోలీసులు డబ్బు కనుగొన్నారా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: పృథ్వీరాజ్ 'ఐ, నోబడీ' సినిమా రివ్యూ) -
రవితేజ ఇరుముడి.. ఏ ఓటీటీకి రానుందంటే?
రవితేజ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ ఇరుముడి. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. తొలి మూడు రోజుల్లోనే ఏకంగా రూ.80 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తండ్రీ కూతుళ్ల కాన్సెప్ట్ ఆడియన్స్కు కనెక్ట్ కావడంతో థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ జోరు చూస్తుంటే ఇరుముడి వందకోట్లు కొల్లగొట్టేలా కనిపిస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ టాక్ న్యూస్ వైరల్గా మారింది. థియేటర్లలో అదరగొడుతున్న ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ ఏదనే విషయంపై ఆడియన్స్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరుముడి ఓటీటీ పార్ట్నర్ ఎవరనే విషయంలో ఓ క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ను నెట్ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ థియేట్రికల్ రన్ తర్వాత బుల్లితెరపై సందడి చేయనుంది. త్వరలోనే స్ట్రీమింగ్ ఎప్పుడనే విషయంపై ప్రకటన రానుంది. కాగా.. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. -
ఓటీటీలోకి తెలుగు మ్యూజికల్ డ్రామా.. ట్రైలర్ రిలీజ్
ఓటీటీల్లో కొన్ని సినిమాలు నేరుగా రిలీజ్ అవుతుంటాయి. అలానే సిరీస్లు కూడా తీస్తుంటారు. అలా ఇప్పుడు తీసిన మ్యూజికల్ డ్రామా సిరీస్ 'జగమే సంగీతం' స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేసి స్టోరీ ఏంటనేది చెప్పే ప్రయత్నం చేశారు. ఇందులో ప్రకాశ్ రాజ్, మధుబాల, శ్రీకాంత్ ప్రధాన పాత్రలు చేయగా.. మెగాస్టార్ చిరంజీవి కూతురు సుస్మిత నిర్మాతగా వ్యవహరించింది.(ఇదీ చదవండి: ఓటీటీ ప్రేక్షకులపై నటుడు శ్రీకాంత్ చిల్లర వ్యాఖ్యలు)వచ్చే నెల 04వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగు, తమిళ భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఆరేళ్ల క్రితం ఇదే ఓటీటీలో రిలీజైన 'బండిష్ బండిట్స్'కి ఇది తెలుగు రీమేక్. ట్రైలర్ బట్టి చూస్తే.. వైకుంఠపురం అనే ఊరిలో శాస్త్రి గారి కుటుంబం శాస్త్రీయ సంగీతం నేర్పిస్తూ ఉంటారు. ఈయన మనవడు కూడా తాత తగ్గ వారసుడు అయ్యే ప్రయత్నాల్లో ఉంటాడు. ఆ టైంలో వెస్ట్రన్ సంగీతంపై మక్కువ ఉండే ఒకమ్మాయి ఈ కుర్రాడికి పరిచయమవుతుంది. తర్వాత ఏమైందనదే స్టోరీలా అనిపిస్తుంది.ఇప్పటివరకు థ్రిల్లర్, రొమాంటిక్, యాక్షన్ జానర్లలో సిరీసులు వచ్చాయి. 'జగమే సంగీతం' పూర్తి మ్యూజిక్ నేపథ్యంగా తెరకెక్కించారు. ట్రైలర్లో విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం వినసొంపుగా ఉంది. మరి ఇది ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మలయాళ సినిమా అనగానే చాలామందికి థ్రిల్లర్సే గుర్తొస్తాయి. అంతలా ఈ జానర్లో మూవీస్ తీస్తుంటారు. ఈ మధ్య కాలంలో అలా వచ్చిన ధృడం, ఉయిర్ లాంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకుల్ని అలరించాయి. ఇప్పుడు మరో సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా తేదీని ప్రకటించారు.(ఇదీ చదవండి: థియేటర్లలో హిట్.. ఓటీటీకి వచ్చాక ఘోరంగా ట్రోల్స్)కుంచకో బోబన్, పోలీస్గా చేసిన సినిమా 'ఉన్మాదం'. 'జై భీమ్' ఫేమ్ లిజోమోల్ జోస్ కథానాయిక. కిరణ్ దాస్ దర్శకుడు. 'జోసెఫ్', 'నాయట్టు' లాంటి పోలీస్ థ్రిల్లర్స్కి రచయితగా చేసిన షాహీ కబీర్.. ఈ చిత్రానికి కథనందించారు. ఇది సాధారణ పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టోరీలా కాకుండా, సైకలాజికల్ డ్రామాగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. జూలై 31న థియేటర్లలో రిలీజైంది. సెప్టెంబరు 04 నుంచి సోనీ లివ్ ఓటీటీలోకి రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో చూడొచ్చు.'ఉన్మాదం' విషయానికొస్తే.. ఎప్పటికైనా సినిమా రైటర్ కావాలని కలలు కనే ఓ పోలీస్ అధికారి(కుంచకో బోబన్) ఓ పాత ఆత్మహత్య కేసుని మళ్లీ తెరుస్తాడు. కానీ దర్యాప్తు లోతుగా చేసేసరికి అది ఆత్మహత్య కాదు.. దాని వెనుక ఓ సైకోపాత్ మైండ్ దాగి ఉందని తెలుస్తుంది. ఆ మిస్టరీని చేధించే క్రమంలో ఇతడు చూసే నిజాలు పిచ్చి లేపుతాయి. కేసు క్లైమాక్స్కి వచ్చేసరికి, శత్రువుల కంటే సొంత బుర్రే అతడికి పెద్ద శత్రువులా మారుతుంది.ఒకవైపు ప్రాణాంతకమైన నేరస్తులు, మరోవైపు తనని మానసికంగా ముంచేస్తున్న భ్రమలు.. ఈ రెండింటి మధ్య నలిగిపోతూ సదరు పోలీస్ అధికారి అల్లాడిపోతాడు. తనే ఒక ఉన్మాదిలా మారే పరిస్థితి వచ్చినా, చివరి నిమిషం వరకు పోరాడి ఆ చీకటి రహస్యాన్ని అతడు ఎలా బయటపెట్టాడు అనేదే ఈ ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్) -
థియేటర్లలో హిట్.. ఓటీటీకి వచ్చాక ఘోరంగా ట్రోల్స్
కొన్ని సినిమాలు థియేటర్లలో హిట్ అవుతాయి. ఓటీటీకి వచ్చాక చాలా ట్రోలింగ్ ఎదుర్కొంటాయి. గతంలో పలు చిత్రాల విషయంలో ఇలా జరిగింది. ఇప్పుడు కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ'కి అదే రిపీటైంది. నాలుగు రోజుల క్రితం ఈ మూవీ సోనీ లివ్లో స్ట్రీమింగ్లోకి వచ్చింది. డిజిటల్ మాధ్యమాల్లో దీన్ని చూసిన చాలామంది ట్రోల్ చేస్తున్నారు తప్పితే బాగుందని మెచ్చుకోవట్లేదు. కొంతమంది మాత్రం బాగుందని అంటున్నారు. దీనికి కారణాలు కూడా ఉన్నాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)ప్రేమకథ, అందులో పాటలు, సీన్స్ చూసినప్పుడు థియేటర్లలో ఆ సౌండ్ సిస్టమ్ వల్ల పర్లేదు బాగానే ఉందనిపిస్తాయి. అదే సినిమా ఓటీటీకి వచ్చిన తర్వాత చూస్తే ఎక్స్పీరియెన్స్ మారుతుంది. 'చెన్నై లవ్ స్టోరీ'కి సరిగ్గా అదే జరుగుతోంది. అసలు ఈ మూవీ థియేటర్లలో ఎలా హిట్ అయిందా అని కొందరు నెటిజన్లు సందేహపడుతున్నారు. థియేటర్లలో చూసినవాళ్లకు ఫస్టాప్ నచ్చేయగా, సెకండాఫ్ ఓకే ఓకే అనిపించింది. ఓటీటీకి వచ్చిన తర్వాత చూసినవాళ్లు ఫస్టాప్ పర్లేదని, సెకండాఫ్ మాత్రం ఘోరాతి ఘోరంగా ఉందని పోస్టులు పెడుతున్నారు.మరికొందరు నెటిజన్లు అయితే సినిమా, అందులోని ఎమోషన్స్ అన్నీ కృత్రిమంగా ఉన్నాయని.. ఎక్కడా కూడా సహజంగా అనిపించలేదని కంప్లైంట్ చేస్తున్నారు. అదే టైంలో 'బేబి'లానే ఇది కూడా క్రింజ్గా ఉందని అంటున్నవాళ్లు లేకపోలేదు. ఓ ప్రేమకథకి ఈ రేంజ్ ట్రోల్స్ రావడం కాస్త చిత్రంగానే అనిపిస్తుంది. ఇలా ట్రోల్స్ చాలానే వస్తున్నప్పటికీ హీరోయిన్ గౌరిప్రియ నటన మాత్రం బాగుందని అంటున్నారు. ఈ విషయంపై దర్శకనిర్మాతలు ఓసారి ఆలోచించుకోవాలేమో!'చెన్నై లవ్ స్టోరీ' సినిమాలో ఫస్టాప్ అంతా హీరోహీరోయిన్ ప్రేమించుకుంటారు. కానీ ఇంటర్వెల్ వచ్చేసరికి ప్రమాదంలో హీరో చనిపోతాడు. ఆత్మ రూపంలో భూమ్మీదకు తిరిగొచ్చి హీరోయిన్తో కలిసి ఉంటాడు. దీనికి 'బేబి' దర్శకుడు సాయి రాజేశ్ కథ అందించగా, రవి నంబూరి దర్శకత్వం వహించాడు. ఎస్కేఎన్, సాయి రాజేశ్ కలిసి నిర్మించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా) -
ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా
అక్కినేని హీరోల్లో సుమంత్ ఒకడు. చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ సత్యం, మళ్లీ రావా లాంటి మూవీస్ తప్పితే చెప్పుకోదగ్గ హిట్స్ లేవు. 'సీతారామం' లాంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ చేశాడు. ఇతడు నటించిన ఓ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.(ఇదీ చదవండి: కియారా నువ్వు చాలా లక్కీ.. ఆ సినిమా చేయలేదు)సుమంత్, జగపతిబాబు ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'న్యూటన్స్ థర్డ్ లా'. గత నెల 31న థియేటర్లలోకి వచ్చింది. థ్రిల్లర్ అంశాలు ఓ మాదిరిగా ఉన్నాయంతే. దీంతో జనాలు పెద్దగా పట్టించుకోలేదు. బహుశా ఓటీటీకి వచ్చిన తర్వాత చూద్దామని అనుకున్నట్లున్నారు. ఈ క్రమంలోనే నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించింది. ఈ శుక్రవారం నుంచి మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుందని వెల్లడించింది.'న్యూటన్స్ థర్డ్ లా' విషయానికొస్తే.. వినయ్(త్రినాథ్ వర్మ) ఇంజినీరింగ్ స్టూడెంట్. ఓరోజు అనుమానాస్పద రీతిలో చనిపోతాడు. ఈ కేసుని పోలీసాఫీసర్ వాసుదేవ్(సుమంత్) దర్యాప్తు చేయడం మొదలుపెడతాడు. వినయ్ తల్లిదండ్రుల్ని విచారించగా కొన్ని విషయాలు బయటపడతాయి. వీళ్లు ఏదో దాస్తున్నారని వాసుదేవ్ అనుమానిస్తాడు. ఇంతకీ వినయ్ ఎవరు? ఇతడికి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మెర్క్యురి(జగపతిబాబు)కి సంబంధమేంటి? ఈ కేసుకి 'న్యూటన్ థర్డ్ లా' పుస్తకంతో సంబంధమేంటనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్) -
ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. ఈసారి యష్ 'టాక్సిక్', నయనతార 'హాయ్' లాంటి డబ్బింగ్ సినిమాలతో పాటు 'కికు చిరంజీవి' అనే తెలుగు మూవీ థియేటర్లలోకి రానుంది. వీటిలో యష్ చిత్రానికి మంచి హైప్ ఉంది. అందుకు తగ్గట్లే రెగ్యులర్గా శుక్రవారం నాడు కాకుండా బుధవారమే(ఆగస్టు 26) పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నారు. మరోవైపు ఓటీటీల్లోనూ చెప్పుకోదగ్గ మూవీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీ సినిమా 'ప్యార్ ప్రేమ కళ్యాణం' తెలుగు రివ్యూ)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. పృథ్వీరాజ్ సుకుమారన్ 'ఐ నోబడీ', మైఖేల్, బబితా సింగ్ రిపోర్టింగ్, అన్బే డయానా, ఆల్ఫా మూవీస్ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. దీనితో పాటు ఆకలిరాజ్యం 2026, పార్ట్ టైమర్స్ లాంటి తెలుగు సిరీసులు.. బంధర్ అనే హిందీ చిత్రం కూడా ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తోంది. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఆగస్టు 24 నుంచి 30 వరకు)హాట్స్టార్ఐ నోబడీ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 25అడల్ట్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 27పార్ట్ టైమర్స్ (తెలుగు సిరీస్) - ఆగస్టు 28మైఖేల్ (హిందీ డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 29నెట్ఫ్లిక్స్ద లాస్ట్ సెల్యూట్: ఏ లవ్ లెటర్ టూ MiG-21 (హిందీ డాక్యుమెంటరీ) - ఆగస్టు 26లిన్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 27బ్యూటీ ఇన్ బ్లాక్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 27ఆల్ ద ట్రూత్ ఇన్ మై లైస్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 28చుంబక్ (హిందీ సిరీస్) - ఆగస్టు 28గ్రేవ్ యార్డ్ సీజన్ 3 (టర్కిష్ సిరీస్) - ఆగస్టు 28ద విస్పర్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 28ఆల్ఫా (హిందీ మూవీ) - ఆగస్టు 28అమెజాన్ ప్రైమ్ద లాస్ట్ సన్రైజ్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 26బబితా సింగ్ రిపోర్టింగ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 28బెట్టి లా ఫియా సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 28సోనీ లివ్అన్బే డయానా (తెలుగు డబ్బింగ్ చిత్రం) - ఆగస్టు 28జీ5బంధర్ (హిందీ మూవీ) - ఆగస్టు 28ఆహాఆకలిరాజ్యం 2026 (తెలుగు సిరీస్) - ఆగస్టు 28ఆపిల్ టీవీ ప్లస్డార్క్ మేటర్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 28లయన్స్ గేట్ ప్లేహంగ్రీ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 28(ఇదీ చదవండి: దేశ విభజనతో నలిగిపోయిన 'ప్రేమ'కథ.. ఓటీటీ సినిమా రివ్యూ) -
ఓటీటీకి వచ్చేసిన హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీల్లో హారర్ థ్రిల్లర్ సినిమాలకు ప్రత్యేక డిమాండ్ ఉంది. ముఖ్యంగా మలయాళ చిత్రాలకు ఎక్కువగా ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. అలాంటి కంటెంట్ సినిమాలు ఏ భాషలో తెరకెక్కించినా తెగ చూసేస్తున్నారు. అలాంటి వారికోసమే మరో భయానక హారర్ థ్రిల్లర్ మూవీ వచ్చేసింది.హాలీవుడ్లో తెరకెక్కించిన హారర్ థ్రిల్లర్ మూవీ బ్యూరీ ది డెవిల్. ఆదం ఓబ్రియన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సడన్గా ఓటీటీకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్తో పాటు తమిళం, తెలుగు, హిందీలో అందుబాటులోకి వచ్చేసింది. ఈ సినిమా కథ నర్స్ జూలియా పాత్ర చుట్టు తిరుగుతుంది. ఒక పాత ఇంట్లో జరిగే ఈ కథ ఆడియన్స్ను ఒళ్లు గగుర్పొడ్చేలా చేస్తుంది. హారర్ సినిమాలు ఇష్టపడేవాళ్లు ఎంచక్కా ఈ మూవీని చూసేయండి. #BuryTheDevil (English)Now streaming on PrimeVideo in English, Tamil, Telugu, Hindi 🍿!!#OTT_Trackers pic.twitter.com/ZrFm0qm6CW— OTT Trackers (@OTT_Trackers) August 22, 2026 -
ఓటీటీ సినిమా 'ప్యార్ ప్రేమ కళ్యాణం' తెలుగు రివ్యూ
అప్పుడప్పుడు ఓటీటీలో నేరుగా కొన్ని సినిమాల్ని రిలీజ్ చేస్తుంటారు. అలా తాజాగా నెట్ఫ్లిక్స్లోకి 'ప్యార్ ప్రేమ కళ్యాణం' వచ్చింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కథతో తీశారు. తమిళ కుర్రాడు ఎలన్ హీరోగా నటించి దర్శకత్వం వహించాడు. తెలుగమ్మాయి శాన్వి మేఘన హీరోయిన్గా చేసింది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?దుబాయిలో సివిల్ ఇంజినీర్గా పనిచేసే ఎలన్(ఎలన్) ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని చెప్పి తనకు తానుగానే ఉద్యోగం మానేసి ఇంటికొచ్చేస్తాడు. అనుకోని పరిస్థితుల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ పవిత్ర అలియాస్ పర్పుల్ పవి(శాన్వి మేఘన)తో ప్రేమలో పడతాడు. పెద్దల్ని ఒప్పించి పెళ్లి కూడా చేసుకుంటాడు. కానీ పవి సొంతింటిని వదిలేసి రానని పట్టుబడుతుంది. దీంతో ఎలన్.. ఇల్లరికపు అల్లుడిగా అత్తారింట్లో అడుగుపెడతాడు. తర్వాత ఇతడికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?'ప్యార్ ప్రేమ కళ్యాణం'.. టైటిల్కి తగ్గట్లే ప్రేమ, పెళ్లి బంధంలోని ప్లస్ మైనస్సుల గురించి ఇందులో చూపించారు. మరి సినిమా ఎలా ఉంది అని అడిగితే ఓకే అంతే. చెబుదామనుకున్న పాయింట్ బాగున్నప్పటికీ విపరీతమైన తమిళ అతి ప్రతి సీన్లోనూ కనిపిస్తూ ఉంటుంది. హీరోయిన్ పాత్ర తప్పితే ప్రతి ఒక్కరూ చేయాల్సిన దానికంటే ఎక్కువ చేస్తుంటారు. ఇదంతా కామెడీ అనుకుని దర్శకుడు అనుకున్నాడు. కానీ కుదరలేదు. తమిళ ప్రేక్షకులకు నచ్చొచ్చేమో గానీ నాకైతే పెద్దగా నవ్వు రాలేదు.సంప్రదాయం ప్రకారం పెళ్లి తర్వాత అమ్మాయిలు అత్తారింటికి వెళ్తారు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రం అల్లుడు, అత్తారింటికి(ఇల్లరికం) వస్తాడు. ఈ సినిమాలో అలానే ఉద్యోగం లేని హీరో.. ఇల్లరికపు అల్లుడిలా వెళ్తాడు. ప్రారంభంలో మర్యాదలు ఓ రేంజులో ఉంటాయి. కానీ రానురాను మురిపెం తగ్గిపోయి అత్త అసలు రంగు బయటపడుతుంది. అప్పటినుంచి అల్లుడికి బ్యాండ్ బాజా బరాత్ మొదలవుతుంది. దీంతో కష్టాలు పడతాడు. ఈ పార్ట్ అంతా కూడా ఓకే ఓకే అనేలా ఉంటుంది. టైమ్ పాస్ అయిపోతుంది.చాలామంది గృహిణులు.. భర్త బయటకెళ్లి ఉద్యోగం చేస్తూంటే ఇంటిని చూసుకుంటూ ఉంటారు. ఈ సినిమా ఇదే రివర్స్లో జరుగుతుంది. ఓ సందర్భంలో హీరోకి జాబ్ వస్తే ఆ సంగతి హీరోయిన్కి చెబుతాడు. ఆమె ఏమో.. నువ్వు బయటకెళ్లి పనిచేయడం ఎందుకు, ఇంట్లో కంఫర్ట్బుల్గానే ఉన్నావ్గా, పైగా జీతం కూడా తక్కువే అని అతడిని నిరుత్సాహపరుస్తుంది. ఈ సీన్ చూస్తున్నప్పుడు ఏళ్లకేళ్లుగా చాలామంది భర్తలు.. ఉద్యోగం చేయాలనుకునే భార్యలకు ఇలానే చెబుతుంటారు కదా అనిపించింది. చాలామంది గృహిణులు ఇలా భర్తలు చెప్పే మాటల వల్ల ఎంతలా నిరుత్సాహపడుతున్నారనేది బాగా చూపించారు.అలానే ఫెమినిస్ట్ అని చెప్పుకొనే హీరోయిన్.. తాను సొంతింటిని, తల్లిదండ్రులని వదిలిరానని చెప్పి భర్తని తన ఇంటికి ఇల్లరికం రప్పించుకుంటుంది. తర్వాత ఈ విషయంలో ఆమె రియలైజ్ అయ్యే సీన్ ఉంటుంది. దీనిని బాగానే తీశారు. ఫస్టాప్లో హీరో, అతడి అత్త, భార్య మధ్యలో వచ్చే హంగామా, సెకండాఫ్లో హీరో తల్లి చేసే దొంగపనులు వల్ల హీరోయిన్ జాబ్ కోల్పోవడం లాంటివి పర్లేదనిపించాయి. క్లైమాక్స్ అయితే నిజంగా ఎక్కడైనా అలా జరుగుతుందా అని డౌట్ వస్తుంది. అదంతా సినిమాటిక్గా అనిపిస్తుంది.యాక్టింగ్ విషయానికొస్తే.. పవిత్రగా శాన్వి మేఘన పాత్రకు తగ్గట్లు చేసింది. హీరో కమ్ దర్శకుడు ఎలన్ కూడా బాగానే చేశాడు. కాకపోతే తన తమిళ ప్రేక్షకులకు నచ్చుతుందనో ఏమో గానీ మొత్తం అతితో నింపేశాడు. రాధిక, యోగిబాబు లాంటి సీనియర్ యాక్టర్స్ ఉన్నప్పటికీ వాళ్లని సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. వాళ్లకు సరైన సీన్స్ పడలేదు. మిగతా నటీనటులు ఓకే ఓకే. సినిమాటోగ్రఫీ రిచ్గా ఉన్నప్పటికీ మ్యూజిక్ ఏమంత గొప్పగా లేదు. నిడివి రెండు గంటలే కావడం కాస్త రిలీఫ్. ఓవరాల్గా చూసుకుంటే ఇదో యావరేజ్ సినిమా. అసభ్యకర సీన్స్ లేవు. కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు.- చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
డబుల్ డోస్ వినోదం గ్యారెంటీ
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం ‘డబుల్ ఆక్యుపెన్సీ’ ఒకటి. ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఆలోచన అన్నది ప్రతి మనిషికీ ఉంటుంది. కానీ అదే ఆలోచన ఎంత వైవిధ్యంగా అవతలవారికి చెప్పామన్న దాంట్లోనే విషయం ఉంటుంది. అటువంటి ప్రయత్నం చేసేవారే సినీ దర్శకులు. ఇదే నేపథ్యంలో వచ్చిన ఓ వెరైటీ ఫ్యామిలీ డ్రామా ‘డబుల్ ఆక్యుపెన్సీ’. ఈ సినిమా టైటిల్తోనే దర్శకుడు తాను చెప్పాలనుకున్నపాయింట్ని ప్రేక్షకుడికి సూటిగా సుత్తి లేకుండా చెప్పారు. అశ్విన్ కందసామి తాను రాసుకున్న కథను తన దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమానే ఈ ‘డబుల్ ఆక్యుపెన్సీ’. తెలుగువారికి సుపరిచితురాలైన నటి ఖుష్బూ సుందర్ ఈ సినిమాని నిర్మించారు. సినిమా పేరు ‘డబుల్ ఆక్యుపెన్సీ’ లానే ఈ సినిమాలోని వినోదం డబుల్ డోస్ గ్యారెంటీ. అంతలా ఈ సినిమా కథలో ఏముందో ఓసారి చూద్దాం. ఈ సినిమా కథ రజనీది. పుట్టుక లోపం వల్ల ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే రజనీ ఆడపిల్లగా ఉంటుంది. ఆపై అబ్బాయిగా మారిపోతుంది. రజనీ కన్నతల్లిదండ్రులకు ఈ విషయం రజనీ పుట్టుకతోనే తెలిసి చాలా జాగ్రత్తగా పెంచుతారు. పగలు ఉన్న రజనీకి రాత్రి ఉన్న రజనీకి శరీరం ఒకటే అయినా ఎవరు ఏం చేస్తున్నారన్న విషయం ఇద్దరికీ తెలియదు. వారిద్దరినీ కలిపేది ఇద్దరూ కలిసి వాడే మొబైల్ ఫోన్ మాత్రమే. ఇదే సమయంలో అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదంలో రజనీ తల్లిదండ్రులు పగలు చనిపోతారు. అదే రోజు రాత్రి మారిపోయిన రజనీ ఈ విషయం తెలుసుకుని తనకి ఆఖరి చూపు కూడా దక్కనీయలేదని పగటి రజనీ పై ద్వేషం పెంచుకుంటాడు. ఇక ఆ పై కథ చాలా మలుపులు తిరుగుతూ ప్రేక్షకుల ఊహకందని విధంగా సాగుతుంది. క్లైమాక్స్లో పగటి రజనీని కొందరు దుండగులు కొన్ని కారణాల వల్ల కిడ్నాప్ చేస్తారు. కానీ అనుకున్నట్టుగా రాత్రి రజనీగా మారడు. ఆ పై ఏం జరుగుతుంది? అనేది మాత్రం ‘డబుల్ ఆక్యుపెన్సీ’ సినిమాలోనే చూడాలి. ఇటువంటి కథాంశం అడపా దడపా మనం చూస్తున్నప్పటికీ దర్శకుడు ఈ సినిమాని మలిచిన తీరు మాత్రం అద్భుతం. ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ తమిళ సినిమా తెలుగులోనూ లభ్యమవుతోంది. సో... మస్ట్ వాచ్ దిస్ డబుల్ డోస్ కామెడీ ఫర్ ది వీకెండ్. – హరికృష్ణ ఇంటూరు -
ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా
ఒకప్పటి హీరోయిన్ రోజా చాన్నాళ్ల తర్వాత తమిళ సినిమాలతో నటిగా రీఎంట్రీ ఇచ్చారు. ఈ ఏడాది అలా ఓ రొమాంటిక్ కామెడీ మూవీలో హీరోకు తల్లి పాత్ర చేసింది. థియేటర్లలో ఆడిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి తెలుగులోనూ స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగానూ ప్రకటించారు. ఇంతకీ దీని సంగతేంటి? ఎప్పుడు ఎందులోకి రానుంది?పారి ఎలవళగన్ హీరో కమ్ దర్శకుడిగా చేసిన 'అన్బే డయానా'. రమ్య రంగనాథన్ హీరోయిన్. రోజా కీలక పాత్ర చేశారు. జూలై 17న తమిళంలో థియేటర్లలో రిలీజైంది. హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రాన్ని ఈ నెల 28 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేశారు.'అన్బే డయానా' విషయానికొస్తే.. కృష్ణ(పారి ఎలవళగన్) ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు. ఆంగ్లో ఇండియన్ అమ్మాయి డయానా(రమ్య రంగనాథన్)తో ప్రేమలో పడతాడు. డయానా ఫ్రీ బర్డ్ అంటే మందు, సిగరెట్లు లాంటి అలవాట్లు ఉంటాయి. కానీ కృష్ణ భిన్నమైన వాతావరణంలో పెరుగుతాడు. డయానాతో ప్రేమకు కృష్ణ తల్లి సరళ(ఆర్కే రోజా) అడ్డు చెబుతుంది. తన కులానికే చెందిన మరో అమ్మాయితో కొడుకు పెళ్లి ఫిక్స్ చేస్తుంది. ఆ తర్వాత ఏమైంది? తను ప్రేమించిన డయానా కోసం కృష్ణ ఏం చేశాడు? కొడుకు ప్రేమ.. సరళలో ఎలాంటి మార్పును తీసుకొచ్చిందనేది మిగతా స్టోరీ. -
ఓటీటీలోకి మరో థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘గాంధారి’ ఓటీటీ ప్రేక్షకులకు అలరించేందుకు సిద్ధమైంది. కనికా ధిల్లాన్ రచించి, నిర్మించిన ఈ చిత్రానికి దేవాశిష్ మఖిజా దర్శకత్వం వహించారు. సెప్టెబర్ 3, 2026 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. భావోద్వేగాలతో పాటు హై- యాక్షన్ సన్నివేశాలతో ‘గాంధారి’ని రూపొందించినట్లు తెలుస్తోంది. తాప్సీ, కనికా ధిల్లాన్, నెట్ఫ్లిక్స్ కాంబినేషన్లో వస్తున్న మరో చిత్రమిది. గతంలో వీరి కలయికలో వచ్చిన ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా’ ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘గాంధారి’పై ఆసక్తి నెలకొంది.ఎలా ఉంటుందంటే..కల్పిత పట్టణం జయ్పుర్రా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తాప్సీ బాణి అనే తల్లి పాత్రలో కనిపించనుంది. తన కుమార్తెను వెతికి, ఆమెను కాపాడేందుకు బాణి చేసే పోరాటమే కథాంశం. కుమార్తెకు దగ్గరవుతున్న కొద్దీ ఆమెకు ఎదురయ్యే ప్రమాదాలు, సవాళ్లు మరింత తీవ్రమవుతాయి. ఈ సినిమా కోసం తాప్సీ అత్యంత కఠినమైన యాక్షన్ సన్నివేశాల్లో నటించినట్లు చిత్రబృందం తెలిపింది. ఇష్వాక్ సింగ్, ఛాయా కదమ్, స్వస్తికా ముఖర్జీ, మితా వశిష్ఠ్, జతిన్ సర్నా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఒక తల్లి తన పరిస్థితులకు తలొగ్గకుండా కూతురిని కాపాడుకునేందుకు చేసే పోరాటాన్ని ఈ సినిమాలో చూపించనున్నట్లు కనికా ధిల్లాన్ తెలిపారు. బాణి ప్రయాణం పచ్చిగా, పట్టుదలతో, వ్యక్తిగత భావోద్వేగాలతో సాగుతుందని ఆమె పేర్కొన్నారు. తాప్సీతో మరోసారి కలిసి పనిచేయడం ప్రత్యేకమైన అనుభూతి అని చెప్పారు. -
నేరుగా ఓటీటీలోకి మిస్టరీ థ్రిల్లర్ సినిమా.. ట్రైలర్ రిలీజ్
థియేటర్లలోకి వచ్చినవి తర్వాత స్ట్రీమింగ్ అవుతుంటాయి. కొన్నిసార్లు నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతుంటాయి. ఇలాంటి వాటిలో థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన సినిమాలు, సిరీస్లు ఉంటాయి. ఇప్పుడు అలా ఓ మూవీ నేరుగా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంతకీ దీని సంగతేంటి? ఎప్పుడు ఎందులోకి రానుంది?'ద గ్రేట్ ఇండియన్ కిచెన్' అనే మలయాళ సినిమాలో హీరోయిన్గా చేసిన నిమిషా సజయన్.. తెలుగులోనూ కాస్త గుర్తింపు తెచ్చుకుంది. ఈమె చేసిన ఓటీటీ మూవీ 'బబిత సింగ్ రిపోర్టింగ్'. ఇందులో ఈమె ఏఎస్ఐ పాత్రలో కనిపించనుంది. వచ్చే శుక్రవారం(ఆగస్టు 28) నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుందని చెబుతూ ట్రైలర్ వదిలారు. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథతో దీన్ని తెరకెక్కించారు. తెలుగులోనూ అందుబాటులోకి రానుంది.ట్రైలర్ బట్టి చూస్తే.. భోపాల్లోని పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగ పనిచేసే బబితా సింగ్ (నిమిషా సజయన్), కొన్ని పనుల వల్ల రెండు వారాలు సస్పెండ్ అవుతుంది. అదే టైంలో ఈమె చిన్ననాటి స్నేహితుడు బన్సి హత్యకు గురవుతాడు. హంతకుడిని పోలీసులు అరెస్ట్ కూడా చేస్తారు. అయితే తన ఫ్రెండ్ని ఎందుకు చంపారు? అసలు ఈ హత్య వెనక ఎవరెవరున్నారు? అనేది బబిత దర్యాప్తు చేస్తుంది. చివరకు ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది. -
రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం అలానే చెన్నై లవ్ స్టోరీ, శ్రీనివాస మంగాపురం, మిస్టర్ మిడిల్ క్లాస్ లాంటి తెలుగు మూవీస్తో పాటు జన నాయకుడు, ప్యార్ ప్రేమ కళ్యాణం లాంటి డబ్బింగులు స్ట్రీమింగ్లోకి వచ్చేశాయి. అయితే వీటికి తోడుగా ఓ తెలుగు చిత్రం కూడా సడన్గా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: ఓటీటీకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)రుత్విక్ అనే కుర్రాడు హీరోగా పరిచయమైన సినిమా 'రాజా ది రాజా'. విశాఖ ధీమాన్ హీరోయిన్. గత నెల 17న థియేటర్లలో రిలీజైంది. కంటెంట్ పెద్దగా మెప్పించకపోవడంతో జనాలు దీన్ని పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు నెల పూర్తయ్యేసరికి సన్ నెక్స్ట్, అమెజాన్ ప్రైమ్ ఓటీటీల్లోకి సైలెంట్గా అందుబాటులోకి వచ్చేసింది. పునర్జన్మల బ్యాక్ డ్రాప్ స్టోరీతో రొమాంటిక్ కామెడీ డ్రామాగా దీన్ని తీశారు.'రాజా ది రాజా' విషయానికొస్తే.. సీనియర్ డాక్టర్ అయిన సత్యం (నరేష్) కొడుకు రాజా (రుత్విక్). తన కొడుకుని పెద్ద డాక్టర్ చేయాలని సత్యం అనుకుంటాడు. కొడుక్కి మాత్రం గొప్ప ఫ్యాషన్ డిజైనర్ కావాలనేది డ్రీమ్. అలా తండ్రికి తెలియకుండానే ఓ ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాడు. రాజా డిజైన్స్కి తగ్గ అమ్మాయిని అతడే వెతకాలని కంపెనీ బాస్ చెబుతాడు. ఈ క్రమంలోనే రాజాకు ఆద్య (విశాఖ ధీమాన్)కనిపిస్తుంది. ఈమెనే తన డిజైన్స్కి పర్ఫెక్ట్ అని రాజా భావించి ఆమెతో స్నేహం చేస్తాడు. పోటీకి రెడీ అవుతున్న టైంలో ఇదంతా రాజా తండ్రికి తెలుస్తుంది. తర్వాత ఏమైంది? ఇంతకీ ఆద్య ఎవరు? పునర్జన్మ కథేంటి? రాజాతో ఈమె గత జన్మలో పరిచయం ఉందా? ఆద్యకు మణిగడ్కి చెందిన రాజ్యానికి సంబంధమేంటి?అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: థియేటర్ రిలీజ్కి ఒక్కరోజు ముందే ఓటీటీలో వచ్చేసిన సినిమా) -
నెట్ఫ్లిక్స్లో ప్రతివారం ఓ సౌత్ సినిమా స్ట్రీమింగ్
దక్షిణ భారతీయ సినీ ప్రియులకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ గుడ్ న్యూస్ చెప్పేసింది. సౌత్ ఇండస్ట్రీపై తన పెట్టుబడులని, భాగస్వామ్యాన్ని మరింత పెంచుతూ ఈ ఏడాది మిగిలిన సమయంలో ప్రతివారం ఒక కొత్త తెలుగు లేదా తమిళ లేదా మలయాళ సినిమాని స్ట్రీమింగ్ చేస్తామని చెన్నైలో తాజాగా జరిగిన ఈవెంట్లో సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. ఈరోజు(ఆగస్టు 21) ప్యార్ ప్రేమ కళ్యాణం అనే సినిమా నేరుగా ఈ ఓటీటీలో స్ట్రీమింగ్లోకి వచ్చింది. దీంతో పాటు థియేటర్లలో సందడి చేసిన రామ్ చరణ్ పెద్ది(ఆల్రెడీ స్ట్రీమింగ్), ధనుష్, విజయ్ దేవరకొండ, నాని తదితర హీరోల క్రేజీ ప్రాజెక్టులు నెట్ఫ్లిక్స్లోకి రానున్నాయని వివరించారు.కేవలం సినిమాలకే కాకుండా ఓటీటీ ఒరిజినల్స్ కూడా తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. తెలుగులో తొలి ఒరిజినల్ సిరీస్ సూపర్ సుబ్బు, తమిళంలో ద గేమ్తో పాటు స్టీఫెన్, తక్షకుడు, లెగసీ తదితర క్రేజీ ప్రాజెక్టులని రూపొందిస్తున్నట్లు తెలిపారు. 2023 నుంచి తెలుగు, తమిళ బాక్సాఫీస్ దగ్గర అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-10 సినిమాల్లో 50 శాతం కంటే ఎక్కువగా నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందని, 2025లో ఏకంగా 59 దేశాల్లో దక్షిణాది సినిమాలు టాప్-10 ట్రెండింగ్లో చోటు దక్కించుకుని అంతర్జాతీయంగా తమ సత్తా చాటాయని అన్నారు. -
థియేటర్ రిలీజ్కి ఒక్కరోజు ముందే ఓటీటీలో వచ్చేసిన సినిమా
ఓటీటీలో ప్రతివారం కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. కానీ కొన్నిసార్లు మాత్రం చిత్రవిచిత్రాలు జరుగుతుంటాయి. ఇప్పుడు కూడా అలానే ఓ సంఘటన జరిగింది. ఈ రోజు(ఆగస్టు 21) థియేటర్లలో రిలీజ్ కావాల్సిన ఓ మూవీని అమెజాన్ ప్రైమ్లో పొరపాటున స్ట్రీమింగ్లో పెట్టేశారు. దీంతో ఆశ్చర్యపోవడం మూవీ లవర్స్ వంతయింది. ఇంతకీ దీని సంగతేంటి?హాలీవుడ్ స్టార్ జేసన్ స్టాథమ్ హీరోగా నటించిన నిర్మించిన లేటెస్ట్ మూవీ 'మ్యూటిని'. లెక్క ప్రకారం ఆగస్టు 21న అంటే ఈరోజే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేశారు. అయితే ఇది జరగడానికి కొన్ని గంటల ముందు పొరపాటున అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సంస్థ మూవీని తమ దానిలో అప్లోడ్ చేసింది. ఈ తప్పుని సరిదిద్దుకునేలోపే చాలామంది పూర్తిగా చూసేశారు. అయితే ఈ స్ట్రీమింగ్ కొన్ని గంటలపాటు అమెరికాలో మాత్రం జరిగింది. మిగిలిన చోట్ల జరగలేదు.'మ్యూటిని' ఓ అడ్వెంచర్ సినిమా. తన కళ్లముందే యజమానిని చంపేయడంతో ఓ మాజీ ఆర్మీ అధికారి.. హంతకులపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలోనే సముద్రంలో వెళ్తున్న సదరు హంతకుల కార్గో షిప్లోకి వెళ్తాడు. తర్వాత ఏం జరిగింది? సదరు క్రిమినల్స్ నుంచి తప్పించుకున్నాడా లేదా? చివరకు ఏమైందనేదే స్టోరీ.ఇకపోతే ఓటీటీలో ఇలా పొరపాటున సినిమాని అప్లోడ్ చేసేయడం ఇదేం కొత్త కాదు. గతంలో అంటే 2019లో ఆర్కే నగర్ అనే తమిళ చిత్రాన్ని నెట్ఫ్లిక్స్ కూడా బై మిస్టేక్ స్ట్రీమింగ్ చేసేసింది. తర్వాత తప్పు తెలుసుకుని దాన్ని తొలగించింది. -
ఓటీటీలో మెగాస్టార్ కూతురి వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ప్రకాష్ రాజ్, మధుబాల, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న లేటేస్ట్ వెబ్ సిరీస్ 'జగమే సంగీతం'. హిందీలో వచ్చిన బందిష్ బాండిట్స్ సిరీస్ ఆధారంగా తెలుగులోనూ తెరకెక్కించారు. ఈ సిరీస్కు సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ను మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మించారు. తాజాగా ఈ ఆసక్తికర వెబ్ సిరీస్ ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయిపోయింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా సెప్టెంబర్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అఫీషియల్గా ప్రకటించారు మేకర్స్.కర్ణాటక సంగీతపు గొప్ప ప్రపంచ నేపథ్యంలో సాగే కథతో 'జగమే సంగీతం వెబ్ సిరీస్ రూపొందించారు. తన తాత శాస్త్రి గారి ప్రఖ్యాత సంగీత వారసత్వానికి వారసుడైన బాలు, సంప్రదాయ భారం, విచ్ఛిన్నమైన కుటుంబ బంధాలు, చిరకాలంగా దాచిపెట్టిన రహస్యాలతో సతమతమవడాన్ని ఈ సిరీస్లో చూపించనున్నారు. ఈ సిరీస్కు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. ఈ సిరీస్లో అక్షయ్ లగుసాని, సుస్మితా శెట్టి, సుమన్, సిజ్జు మీనన్, షఫీ, ఝాన్సీ, రఘు బాబు యెర్రా, రాకెట్ రాఘవ, నాగి జబర్దస్త్, మిర్చి నాకిరణ్, ప్రకావ్ కిరణ్, ప్రకావ్ కిరణ్, ప్రకావ్ కిరణ్, కేస్కావ్ రెడ్డి, రూప లక్ష్మి కీలక పాత్రలు పోషించారు.నిర్మాత సుస్మిత కొణిదెల మాట్లాడుతూ .. 'సంగీతం కేవలం వారి ప్రపంచంలో ఒక భాగం మాత్రమే కాకుండా ఆ కుటుంబం మాటల్లో చెప్పలేని ప్రేమ, సంఘర్షణ, ఆరాటం, గర్వం, ఆశ, చివరికి స్వస్థత వంటి భావాలను వ్యక్తపరిచే భావోద్వేగ భాషగా మారే కథను చెప్పడం మా ఉద్దేశం. ఈ సిరీస్ కర్ణాటక సంగీత ప్రపంచంలో లోతుగా పాతుకుపోయినప్పటికీ, వారసత్వం, అనుబంధం, మన స్వంత స్వరాన్ని కనుగొనడం వంటి విషయాలు ఇతివృత్తంగా సాగుతుంది. ఇంతటి అసాధారణమైన నటీనటులను, సృజనాత్మక బృందాన్ని ఒకచోట చేర్చడం మాకు ఎంతో సంతృప్తినిచ్చింది' అని అన్నారు. -
రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన తెలుగు సినిమా
ఈ వారం ఓటీటీల్లోకి చాలానే సినిమాలు రాబోతున్నాయి. వీటిలో విజయ్ 'జన నాయగన్', కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ', మహేశ్ అన్న కొడుకు హీరోగా చేసిన 'శ్రీనివాస మంగాపురం', ప్యార్ ప్రేమ కల్యాణం, వెల్కమ్ టూ ద జంగిల్ తదితర తెలుగు స్ట్రెయిట్, హిందీ చిత్రాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇవలా ఉండగానే లేటెస్ట్ తెలుగు మూవీ సడన్గా స్ట్రీమింగ్లోకి వచ్చింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో చూడొచ్చు?శ్రీకాంత్ హీరోగా చేసిన కొత్త సినిమా 'మిస్టర్ మిడిల్ క్లాస్'. రాజేంద్ర ప్రసాద్, వేంకటేశ్వర స్వామి పాత్రలో నటించాడు. గత నెల 17న థియేటర్లలో రిలీజైంది. కానీ కంటెంట్ అంతంత మాత్రంగానే ఉండటంతో జనాలు పట్టించుకోలేదు. ఇప్పుడు నెల పూర్తయ్యేసరికి ఆహా, అమెజాన్ ప్రైమ్ ఓటీటీల్లో స్ట్రీమింగ్లోకి వచ్చేసింది.'మిస్టర్ మిడిల్ క్లాస్' విషయానికొస్తే.. వెంకటరమణ (శ్రీకాంత్) మధ్యతరగతి వ్యక్తి. కుటుంబ బాధ్యతలు, డబ్బు సమస్యలు, రోజువారీ కష్టాలతో బతికేస్తుంటాడు. అలాంటి ఈయనకు ఓ రోజు ఊహించని విధంగా సాక్షాత్తూ వేంకటేశ్వరస్వామి (రాజేంద్ర ప్రసాద్) ప్రత్యక్షమై ఓ పుస్తకాన్ని ఇస్తాడు. అందులో ఏది రాస్తే అది నిజమవుతుంది. మొదట ఓ వరాన్ని తనకు నచ్చినట్టుగా ఉపయోగించుకుంటాడు. కానీ కోరికలు తీరుతున్నకొద్దీ రమణలో ఆశ కూడా పెరుగుతుంది. తాను రాసిన ప్రతి మాట నిజమవుతుందని నమ్మి తీసుకునే నిర్ణయాలు క్రమంగా కొత్త సమస్యలకు దారితీస్తాయి.ఇంతకీ ఆ పుస్తకానికి ఉన్న అసలు నిబంధన ఏంటి ? దేవుడు రమణకు ఆ వరాన్ని ఎందుకు ఇచ్చాడు? తన కోరికలను నిజం చేసుకునే క్రమంలో ఏ తప్పులు చేశాడు? చివరికి ఆ శక్తులున్న పుస్తకం రమణ కుటుంబానికి ఎలాంటి పరిస్థితులు తీసుకొచ్చింది? అనేది మిగతా స్టోరీ. -
20 రోజులకే ఓటీటీలోకి సూపర్ స్టార్ వారసుడి సినిమా!
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అయిన చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ‘మంగళవారం’ ఫేం అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూతురు రాషా తడాని హీరోయిన్గా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది. జులై 30న థియేటర్స్లో విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజే నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది. ఆగస్ట్ 20 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సంస్థ ఎక్స్ వేదికగా వెల్లడించింది.‘శ్రీనివాస మంగాపురం’కథేంటంటే..పెద్దిరెడ్డి(‘కిక్’శ్యామ్).. తిరుపతిలో మంచి పలుకుబడి, డబ్బు ఉన్న వ్యక్తి. ఆయన ఫ్యామిలీ వైపు కన్నెత్తి చూడడానికి కూడా జనాలు భయపడిపోతారు. అలాంటి వ్యక్తి కూతురు మంగ(రాషా తడాని)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు శ్రీనివాస్(జై కృష్ణ). అతనికి తిరుపతి కొత్త. జులాయిగా తిరిగే స్వతంత్ర బాబు(నరేశ్)తో స్నేహం ఏర్పరచుకొని మంగ చుట్టూ తిరుగుతుంటాడు. మంగ మాత్రం అతన్ని పట్టించుకోదు. కొన్నాళ్ల తర్వాత ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఇంతలోనే వేరే వ్యక్తితో మంగకు ఎంగేజ్మెంట్ కూడా జరుగుతుంది. అయినా కూడా తన ప్రేమ విషయాన్ని మంగతో పంచుకుంటాడు శ్రీనివాస్. ఆమె రిజెక్ట్ చేసినా..వదిలిపెట్టడు. ఎందుకలా? అసలు శ్రీనివాస్ ఎవరు? తిరుపతి ఎందుకు వచ్చాడు? నిజంగానే మంగతో తొలి చూపులోనే ప్రేమలో పడ్డాడా? వాసుబాబు ఎవరు? బళ్లారి డాన్ వెంకటప్పయ్యనాయుడు(మోహన్ బాబు)తో శ్రీనివాస్కి ఉన్న సంబంధం ఏంటి? మంగ ప్రేమ కోసం శ్రీనివాస్ ఏం చేశాడు? చివరకు మంగ, శ్రీను ఎలా కలిశారు? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.The MOST INTENSE LOVE STORY of the Season is Coming Home ❤️🔥#SrinivasaMangapuram Streaming on @PrimeVideoIN from Tomorrow, August 20th 🔥#JaiKrishnaGhattamaneni #RashaThadani @themohanbabu @DirAjayBhupathi @AshwiniDuttCh @gvprakash @gemini_kiran @sahisuresh @gullapallikumar… pic.twitter.com/gAmL53yUru— Vyjayanthi Movies (@VyjayanthiFilms) August 19, 2026 -
ఈ వారం ఓటీటీల్లోకి 19 మూవీస్.. ఆ మూడు డోంట్ మిస్
మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో రవితేజ హీరోగా నటించిన 'ఇరుముడి' రిలీజ్ కానుంది. దీనిపై ప్రస్తుతానికి బజ్ అయితే బాగానే ఉంది. తండ్రి కూతురు నేపథ్యానికి అయ్యప్ప స్వామి మాల, 41 రోజుల దీక్ష అనే పాయింట్ జోడించి దీన్ని తెరకెక్కించారు. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి? దీనితో పాటు అమీర్ లోగ్, ద రెడ్ బ్యాగ్ అనే చిత్రాలు కూడా రాబోతున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)మరోవైపు ఓటీటీల్లో 19 వరకు కొత్త మూవీస్, వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో దళపతి విజయ్ 'జన నాయగన్', కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ', ప్యార్ ప్రేమ కల్యాణం అనే సినిమాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటికి తోడుగా వెల్కమ్ టూ ద జంగిల్, టాయ్ స్టోరీ 5 లాంటివి కూడా చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ చిత్రం స్ట్రీమింగ్ కానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఆగస్టు 17 నుంచి 23 వరకు)జీ5జన నాయగన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 21ద గ్రేట్ గ్రాండ్ సూపర్ హీరో (హిందీ మూవీ) - ఆగస్టు 21నెట్ఫ్లిక్స్ఫ్రీ ఫాల్: ఏ రెకనింగ్ ఫర్ బోయింగ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - ఆగస్టు 19హియర్ ద హోల్ టైమ్ (బ్రెజిలియన్ సినిమా) - ఆగస్టు 19ఔటర్ బ్యాంక్స్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 20బ్లడ్ సాక్రిఫైస్ (స్వీడిష్ సిరీస్) - ఆగస్టు 20ఎస్&ఎక్స్ (జపనీస్ సిరీస్) - ఆగస్టు 20ప్యార్ ప్రేమ కళ్యాణం (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 21ఫేసింగ్ ఎల్ చాపో (స్పానిష్ సిరీస్) - ఆగస్టు 21హాట్స్టార్లాంటర్న్స్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఆగస్టు 17 (స్ట్రీమింగ్ అవుతోంది)వెల్కమ్ టూ ద జంగిల్ (హిందీ సినిమా) - ఆగస్టు 21సోనీ లివ్చెన్నై లవ్ స్టోరీ (తెలుగు సినిమా) - ఆగస్టు 21అమెజాన్ ప్రైమ్టాయ్ స్టోరీ 5 (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 18 (రెంట్తో స్ట్రీమింగ్)నోవాక్ జకోవిచ్: ద వోల్ఫ్ ఇన్ వింటర్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - ఆగస్టు 20క్లీనప్ కంపెనీ (హిందీ సిరీస్) - ఆగస్టు 21ఆపిల్ టీవీ ప్లస్ద డైనస్టీ: యూకాన్ హస్కీస్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 20లయన్స్ గేట్ ప్లేస్నేక్స్ 5 (చైనీస్ మూవీ) - ఆగస్టు 21మాంచెస్టర్ సిటీ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 21స్టిల్ వాటర్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 21(ఇదీ చదవండి: దేశ విభజనతో నలిగిపోయిన 'ప్రేమ'కథ.. ఓటీటీ సినిమా రివ్యూ) -
ఓటీటీలో దూసుకెళ్తున్న తెలుగు మిస్టరీ థ్రిల్లర్!
ఒకప్పుడు సినిమా అంటే థియేటర్స్కి వెళ్లి మాత్రమే చూసేవాళ్లు.కానీ ఇప్పుడు రోజులు మారాయి. ఓటీటీల ద్వారా నేరుగా ఇంట్లోనే కూర్చొని సినిమాలు చూస్తున్నారు. కొన్ని సినిమాలు అయితే నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అయి..మంచి విజయం సాధిస్తున్నాయి. అలా నేరుగా ఓటీటీలో విడుదలైన ఓ తెలుగు ఆంథాలజీ చిత్రం ఇప్పుడు డిజిటల్ తెరపై దూసుకెళ్తోంది. అదే ‘డార్క్ సీక్రెట్స్’.అప్సరరాణి, నైనిక అనసూయ, జయశ్రీ, నీలిమ చౌదరి ప్రధాన పాత్రలల్లో నటించిన ఈ చిత్రానికి అవినాష్ కొకటి దర్శకత్వం వహించారు. ఇటీవల అద్దె విధానంలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్లోకి వచ్చి..డిజిటల్ తెరపై దూసుకెళ్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అద్దె విధానంలో ఉన్న టాప్ 10 ఇండియన్ సినిమాల్లో నెంబర్ వన్ ప్లేస్లో ఈ చిత్రం ఉంది. వివిధ భాషల చిత్రాలతో పోటీ పడుతూ దేశవ్యాప్తంగా ఈ స్థాయికి చేరుకోవడం చిత్ర బృందానికి ప్రత్యేకమైన విజయంగా చెప్పవచ్చు. చిన్న చిత్రాలకు కూడా ఓటీటీ వేదికలు ఎంతటి అవకాశాలు కల్పిస్తున్నాయో ‘డార్క్ సీక్రెట్స్’ మరోసారి నిరూపిస్తోంది.‘డార్క్ సీక్రెట్స్’ కథ విషయానికొస్తే.. మానవ మనస్తత్వంలోని మరో కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసే చిత్రమిది. ఇదొక ఆంథాలజీ డ్రామా. సాధారణంగా కనిపించే మనుషుల జీవితాల్లో దాగి ఉన్న అసాధారణ రహస్యాలు, కోరికలు, భావోద్వేగాలు, సంబంధాల సంక్లిష్టతల చుట్టూ ఈ సినిమా కథలు తిరుగుతాయి. ప్రతి కథలో ఒక ప్రత్యేక పరిస్థితి, ఒక రహస్యం, ఆ రహస్యం బయటపడినప్పుడు జరిగే పరిణామాలను చూపించే ప్రయత్నం చేశారు. -
ఓటీటీకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి వచ్చే మలయాళ థ్రిల్లర్ సినిమాలకు తెలుగులో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకు తగ్గట్లే ఎప్పటికప్పుడు ఈ జానర్లో డిఫరెంట్ మూవీస్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు అలానే సలార్, వారణాసి చిత్రాల ఫేమ్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ఓ సినిమా.. స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులోకి ఎప్పుడు రానుంది?(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమా)పృథ్వీరాజ్ సుకుమారన్, పార్వతి తిరువత్తు ప్రధాన పాత్రలు చేసిన 'ఐ నోబడీ' సినిమాకు నిస్సామ్ బషీర్ దర్శకుడు. షార్ప్ సోషల్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో దీన్ని తెరకెక్కించారు. తెలుగులోనూ గత నెల 10న థియేటర్లలో రిలీజైనప్పటికీ పెద్దగా మెప్పించలేకపోయింది. ఓటీటీలో కాబట్టి కచ్చితంగా ఆడియెన్స్ చూసే అవకాశముంది. ఇప్పుడీ చిత్రం ఈనెల 25 నుంచి హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. దొంగతనం, డబ్బులు మాయం చేయడం లాంటి హీస్ట్ థ్రిల్లర్స్ ఇష్టముంటే దీన్ని మిస్ కావొద్దు.'ఐ నోబడీ' విషయానికొస్తే.. రాజీవన్ (పృథ్వీరాజ్ సుకుమారన్) సెక్రటేరియట్లో పనిచేసే ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగి. భార్య మీరా(పార్వతి), ఇద్దరు కూతుర్లతో పెద్దగా హడావిడి లేకుండా బతికేస్తుంటాడు. ఓరోజు ఇదే ఊరిలో బ్యాంక్ దొంగతనం జరుగుతుంది. అదే టైంకి బ్యాంక్లో ఉన్న రాజీవన్ని కొట్టి, దొంగలు తమతోపాటు కారులో బందీగా తీసుకొని వెళ్తారు. దారిలో ఇతడ్ని వదిలేయాలని అనుకుంటారు కానీ అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్లో రాజీవన్ బతికిపోయి దొంగలు స్పాట్లోనే చనిపోతారు. పోలీసులు వచ్చి కేసు నమోదు చేస్తారు. అంతా ఓకే గానీ దోపీడికి గురైన రూ.17 కోట్ల డబ్బు మాయమవుతుంది. ఆ డబ్బు ఏమైంది? ఎవరు తీశారు? రాజీవన్ హస్తం ఉందా? చివరకు పోలీసులకు డబ్బు దొరికిందా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: పృథ్వీరాజ్ 'ఐ, నోబడీ' సినిమా రివ్యూ) View this post on Instagram A post shared by JioHotstar Malayalam (@jiohotstarmalayalam)s -
వంటల ప్రోగ్రామ్లో సమంత.. ప్రెగ్నెన్సీతో చేస్తుందా?
అప్పట్లో హీరోయిన్గా తెలుగు, తమిళంలో స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసిన సమంత.. మధ్యలో అనారోగ్యం కారణంగా సినిమాలు తగ్గించింది. చేసినవి కూడా డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న సమంత.. నిర్మాతగా మారి 'శుభం' తీసింది. రెండు నెలల క్రితం వచ్చిన 'మా ఇంటి బంగారం'తో హీరోయిన్ కమ్ నిర్మాతగా అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చింది. రూ.100 కోట్ల కలెక్షన్స్ ఈ మూవీ సొంతం చేసుకుంది.(ఇదీ చదవండి: సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా రివ్యూ)'బంగారం' హిట్ అయ్యేసరికి వరస సినిమాలు చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ గతేడాది డిసెంబరులో దర్శకుడు రాజ్ నిడిమోరుని పెళ్లి చేసుకోగా.. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. దీంతో రాబోయే కొన్ని నెలల పాటు సామ్ ఇంటికే పరిమితం కానుంది. అలాంటిది ఉన్నట్టుండి ఈమె ఓ వంటల ప్రోగ్రామ్కి హోస్టింగ్ చేయబోతుందని ప్రకటించారు. ప్రోమో వీడియో కూడా రిలీజ్ చేశారు.గతంలో తెలుగులో హీరోయిన్గా వరస సినిమాలు చేస్తున్న టైంలోనే 'సామ్ జామ్' పేరుతో ఓ టాక్ షోకి హోస్టింగ్ చేసింది. మళ్లీ ఇన్నాళ్లకు బుల్లితెరపైకి రీఎంట్రీ ఇవ్వనుంది. తమిళంలో సోనీ సంస్థ ఛానెల్ ప్రారంభించింది. ఇందులో రెండు నెలల తర్వాత సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ ప్రోగ్రామ్ ప్రసారం కానుంది. దీనికి సమంత హోస్టింగ్ చేయనుంది. ప్రోమో చూస్తుంటే షూటింగ్ ఎప్పుడు జరిగిందా? అనిపిస్తుంది. ఎందుకంటే సమంత ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. బేబీ బంప్తో హోస్టింగ్ ఏమైనా చేస్తుందా అనేది చూాడాలి?.(ఇదీ చదవండి: విశాల్ సినిమాకు దారుణ పరిస్థితి.. రూ.కోటి కూడా రాలేదు!)The ultimate culinary face-off begins here, with @Samanthaprabhu2 leading the way.Celebrity MasterChef Tamil - Coming soon on Sony விழா and Sony LIV.#CelebrityMasterChefTamil #CMCTamil #Samantha #SonyVizha #SonyLIVTamil pic.twitter.com/sxHubOJ1dp— Sony Vizha (@sony_vizha) August 15, 2026 -
సమంత మా ఇంటి బంగారం.. మరో ఓటీటీలో స్ట్రీమింగ్
సమంత లీడ్ రోల్లో వచ్చిన లేటేస్ట్ మూవీ మా ఇంటి బంగారం. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. జూన్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ.. ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. జియో హాట్ స్టార్ వేదికగా సౌత్ భాషల్లో అందుబాటులో ఉంది.తాజాగా మా ఇంటి బంగారం క్రేజ్ దృష్ట్యా మరో ఓటీటీకి వచ్చేసింది. సోని లివ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమా కేవలం హిందీ భాషలో మాత్రమే స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఈ మూవీ హిందీ ఓటీటీ రైట్స్ను సోని లివ్ కొనుగోలు చేసింది. ఇక హిందీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. Ek parivaar. Ek raaz. Aur ek bangaaram bahu, jo sab badal degi 🔥Action Queen Samantha's Maa Inti Bangaaram (Hindi) is streaming now on SonyLIV pic.twitter.com/hyW4jWO7lm— Sony LIV (@SonyLIV) August 14, 2026 -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
ఈ వీకెండ్ ఓటీటీల్లోకి చాలానే సినిమాలు వచ్చాయి. జగపతిబాబు 'వదలా', హార్టిన్, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఫారెస్ట్ గార్డ్ లాంటి తెలుగు మూవీస్తో పాటు రష్మిక 'కాక్ టెయిల్ 2', కాటలన్, భారత భాగ్య విధాత, ఆరూపి లాంటి పరభాషా చిత్రాలు స్ట్రీమింగ్లోకి వచ్చేశాయి. వీటికి తోడుగా మరో తెలుగు మూవీ దాదాపు ఏడు నెలల తర్వాత అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ దీని సంగతేంటి?(ఇదీ చదవండి: దేశ విభజనతో నలిగిపోయిన 'ప్రేమ'కథ.. ఓటీటీ సినిమా రివ్యూ)'పల్సర్ బైక్' పాటతో ఫేమస్ అయిన సింగర్ రమణ, ప్రశాంత్ ప్రధాన పాత్రలు చేసిన రూరల్ యాక్షన్ డ్రామా 'వినరా ఓ వేమ'. ఈ ఏడాది జనవరి 2న థియేటర్లలో రిలీజైంది. ప్రశాంత్ కల్యాణ్-రాజు మద్దెల సంయుక్తంగా దర్శకత్వం వహించారు. కంటెంట్ ఓ మాదిరిగా ఉండటం, స్టార్స్ లేకపోవడంతో దీన్ని పట్టించుకోలేదు. ఇప్పుడిది ఏడు నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. కాకపోతే అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.గతేడాది నవంబరు 14న థియేటర్లలో రిలీజైన తెలుగు సినిమా 'గోపీగాళ్ల గోవా ట్రిప్'.రోహిత్ & శశి దర్శకత్వం వహించగా అజిత్ మోహన్, రాజు శివరాత్రి, క్యాంప్ శశి, సాయి కుమార్, పవోన్ రమేష్, మోనిక బుసం ముఖ్యపాత్రలు పోషించారు. ఇప్పుడీ కామెడీ చిత్రం ఆహా ఓటీటీలోకి వచ్చేసింది. ఉచితంగానే స్ట్రీమింగ్ అవుతోంది.(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ మిస్టరీ థ్రిల్లర్ 'ఉయిర్' తెలుగు రివ్యూ) -
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం అలా హార్టిన్, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఫారెస్ట్ గార్డ్ లాంటి తెలుగు మూవీస్తో పాటు.. కాక్ టెయిల్ 2, కాటలన్, భారత భాగ్య విధాత, ఆరూపి లాంటి వేరే భాషల చిత్రాలు స్ట్రీమింగ్లోకి వచ్చేశాయి. వీటితో పాటు ఓ తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా ఎలాంటి ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: 'అగధ' మూవీ రివ్యూ)జగపతిబాబు, లయ, హృతిక శ్రీనివాస్ ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'వదలా'. ఆల్రెడీ పెళ్లి చేసుకున్న ఓ మగాడిపై అతి వ్యామోహం అనే కాన్సెప్ట్తో దీనిని తీశారు. గత నెల 17న థియేటర్లలో రిలీజైంది. ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడిది సడన్గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.'వదలా' విషయానికొస్తే.. యోగి సిద్ధార్థ్ (జగపతిబాబు) ఓ డాక్టర్. భార్య ప్రియ (లయ). తన ఇద్దరు పిల్లలతో సంతోషంగా బతుకుతుంటాడు. 20 ఏళ్లుగా ఎలాంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా సాగిపోతున్న వీళ్ల దాంపత్య జీవితంలోకి అముద (హృతిక శ్రీనివాస్) అనే యువతి వస్తుంది. ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఈమెని సిద్ధార్థ్ చికిత్స చేసి కాపాడతాడు. అలా ఇతడిపై ఆరాధాన భావంతో ఆ కుటుంబానికి దగ్గరైన ఆమె.. తర్వాత సిద్ధార్థ్ని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది.ఈ క్రమంలోనే భార్యాభర్తల కాపురంలో చిచ్చుపెట్టేందుకు ఓ ప్లాన్ వేస్తుంది. గుర్తు తెలియని నంబర్ల నుంచి సిద్ధార్థ్.. అతని భార్యకి ఫోన్లు, సందేశాలు పంపుతూ సైకోలా వేధించడం మొదలు పెడుతుంది. మరి ఆ తర్వాత ఏమైంది? అసలు అముద ఎవరు? ఆమె కథేంటి? ఈ సైకో యువతి నుంచి తన కుటుంబాన్ని సిద్ధార్థ్ ఎలా కాపాడుకున్నాడు? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి రోజా రీఎంట్రీ సినిమా) -
రజినీకాంత్ సీక్వెల్.. భారీ ధరకు ఓటీటీ డీల్..!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న సీక్వెల్ మూవీ జైలర్-2. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో రిలీజై సూపర్ హిట్గా నిలిచిన జైలర్కు సీక్వెల్గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రం తలైవా ఫ్యాన్స్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరల్గా మారింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఈ మూవీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో బిగ్ డీల్ కుదుర్చుకుందని సమాచారం. దాదాపు డిజిటల్ హక్కులను ఏకంగా రూ. 160 కోట్లకు చేజిక్కించుకున్నట్లు ఇన్సైడ్ టాక్. జైలర్ రైట్స్ రూ.100 కోట్లకు అమ్ముడవ్వగా.. సీక్వెల్ మరింత భారీ ధరకు డీల్ సెట్ చేసుకున్నారు.కాగా.. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ అక్టోబర్ 15, 2026న థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, రమ్యకృష్ణ, యోగి బాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.#Jailer2 sets a new benchmark with the biggest-ever OTT deal in Tamil cinema! 🔥The previous record was held by #Coolie. pic.twitter.com/oSedexMvvR— Ramesh Bala (@rameshlaus) August 13, 2026 -
ఓటీటీల్లో సినిమాల సందడి.. ఒక్క రోజే 14 సినిమాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు బాక్సాఫీస్ వద్ద సినిమాల హడావుడి ఉంటుంది. ఈ వారంలో పెద్దఎత్తున మూవీస్ రిలీజవుతున్నాయి. వాటిలో సూర్య హీరోగా వస్తోన్న విశ్వనాథ్ అండ్ సన్స్ కూడా రిలీజ్ కానుంది. దీంతో పాటు అగధ, పళ్లబురుసు, అనకాపల్లి, మకుటం అనే డబ్బింగ్ చిత్రం కూడా విడుదల కానుంది. వీటిలో ఎక్కువగా విశ్వనాథ్ అండ్ సన్స్పైనే బజ్ క్రియేట్ అయింది.ఇక ఒటీటీల విషయానికొస్తే పలు చిత్రాలు ఈ ఫ్రైడే స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. వీటిలో కాక్టెయిల్-2, భారత్ భాగ్య విధాత లాంటి బాలీవుడ్ సినిమాలు ఆసక్తిగా ఉన్నాయి. అంతేకాకుండా పలు డబ్బింగ్ సినిమాలు కూడా స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ శుక్రవారం ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్ కాక్ టెయిల్ 2 (హిందీ సినిమా) - ఆగస్టు 14 మోరియా (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 14 ఉమెత్తో (ఆఫ్రికన్ సిరీస్) - ఆగస్టు 14 మై బెస్ట్ ఫ్రెండ్, హిస్ గర్ల్ఫ్రెండ్ అండ్ మీ (జర్మన్ మూవీ) - ఆగస్టు 14 డోంట్ సే గుడ్ లక్(హాలీవుడ్ మూవీ)- ఆగస్టు 14 టు ద మ్యాక్స్(స్పానిష్ మూవీ)- ఆగస్టు 14అమెజాన్ ప్రైమ్..హార్టిన్(తమిళ సినిమా)- ఆగస్టు 14ఆరూపి(మలయాళ మూవీ)- ఆగస్టు 14జియో హాట్స్టార్.. 108 బేస్ హాస్పిటల్: ఉరి (హిందీ సిరీస్) - ఆగస్టు 15జీ5 భారత భాగ్య విధాత (హిందీ మూవీ) - ఆగస్టు 14 నిబ్బానిబ్బీ (మరాఠీ సినిమా) - ఆగస్టు 14సన్ నెక్స్ట్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ (తెలుగు సినిమా) - ఆగస్టు 14లయన్స్ గేట్ ప్లే ఆఖరి సవాల్ (హిందీ సినిమా) - ఆగస్టు 14 పవర్ బుక్ -3 రైజింగ్ కనన్-సీజన్ 5(హాలీవుడ్ సిరీస్)- ఆగస్టు 14 -
బడా బాబులైనా శిక్ష పడాల్సిందే...
‘‘ఒక్కరోజులో మా భవిష్యత్తు కళ్లెదుటనే కుప్పకూలిపోయింది. డాక్టరుగా పుట్టిన గడ్డకు ఎంతో సేవ చేయాలని తపించిన మా కూతురిని మాకు లేకుండా చేశారు. తప్పతాగి .. రోడ్ల మీదకు వచ్చి, ఇతరుల బిడ్డలను పొట్టన పెట్టుకోకండి..’’ అంటూ పుట్టెడు దుఃఖంతో వేడుకుంటున్నారు డాక్టర్ ప్రియాంక తల్లిదండ్రులు వెంకటేష్, చంద్రమ్మ. రాజమండ్రి జీఎస్ఎల్ మెడికల్ కాలేజీలో పీజీ చదువుతున్న డాక్టర్ ప్రియాంక, మూడు రోజుల క్రితం మద్యం మత్తులో కారుతో ఉన్మాదులు ఆమె స్కూటర్ను ఢీకొట్టి, చేసిన వీరంగానికి బలైపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటన కలకలం రేపింది. తెలంగాణలోని గద్వాల్ జిల్లా అయిజ మండంలోని ఎక్లాస్పురంలో పుట్టి పెరిగిన పెరిగింది ప్రియాంక. దోషులకు శిక్ష పడాలని, సమాజంలో మార్పు రావాలని, ప్రభుత్వాలు తమ బిడ్డకు న్యాయం చేయాలని వెంకటేశ్, చంద్రమ్మలు ‘సాక్షి’తో తమ ఆవేదనను పంచుకున్నారు..చదువులో టాపర్గా ఉండే ప్రియాంక మెడిసిన్లో ర్యాంకు తెచ్చుకొని ఫ్రీ సీట్ సంపాదించింది.. మరికొన్నాళ్లలో పీజీ పూర్తి చేసి, వైద్యరంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనుకుంది. ‘‘కానీ ఆ కలలను కొందరు దుర్మార్గులు గద్దల్లా ఎత్తుకుపోయారు. మా అమ్మాయి మరణాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాం. ఎన్ని చేసినా మా అమ్మాయి తిరిగి రాదు. కానీ, వాళ్లను శిక్షిస్తేనే మా అమ్మాయికి న్యాయం జరుగుతుంది. పిల్లల భవిష్యత్తు బాగుండాలని తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడతారు. ఉన్న ఊరును వదిలి, అయినవారందకీ దూరంగా పిల్లల చదువుల కోసం శ్రమిస్తాం. ఎంతో కష్టపడి బిడ్డలను చదివించుకుంటున్నాం. కానీ, కొందరు తమ తండ్రులకు, కుటుంబాలకు పలుకుబడి ఉందని, ఏం చేసినా చెల్లుతుందనే ఆలోచనల్లో ఉంటారు. తాగినవాళ్లు ఇంటిదగ్గర ఉండకుండా బయట పెద్ద పెద్ద కార్లు వేసుకొని షికార్లు చేస్తారు. డబ్బు, హోదా ఉందనే పొగరు, సంపన్నులకు శిక్షలు ఉండవనే ధైర్యం వారిది. రాజకీయ పలుకుబడి ఉందనే ధీమా వారిది. కొవ్వెక్కి చేసిన పనులకు తగిన శిక్ష పడాలి. ప్రాణాలను తీసే హక్కు మీకు ఎవరిచ్చారు. దోషులను కఠినంగా శిక్షించి, ఉరి తీయందే మా కడుపు మంట చల్లారదు’ అని తెలిపారు చంద్రమ్మ.చట్టపరంగా శిక్షించాల్సిందే..! వెంకటేష్ మాట్లాడుతూ –‘‘దోషులకు మరణ శిక్ష పడాల్సిందే. ఇలాంటి శిక్షలు అమలు చేస్తేనే సమాజంలో భయం అనేది ఉంటుంది. అప్పుడే మాలాంటి తల్లిదండ్రుల కడుపుకోతలు, ఆర్తనాదాలు ఉండవు. ఇంకా ఎంతమందికి ఇలాంటివి జరుగుతాయో. దోషులకు సరైన శిక్ష పడకపోతే ‘మేం ఏం చేసినా చెల్లుతుంది’ అని తేలిక భావనతో ఉంటారు. ఇలాంటి పోకిరీగాళ్లు ‘మాకు ఏమవుతుందిలే, మా దగ్గర డబ్బు ఉంది, పలుకుబడి ఉంది’ అనుకుంటారు. చట్టపరంగా కఠినంగా శిక్షిస్తే భయం ఉంటుంది. ఇలాంటి దోషులకు మరణశిక్ష , యావజ్జీవ కారాగార శిక్ష పడితేనే సమాజంలో కూడా మార్పు వస్తుంది. శిక్షలు కరెక్ట్గా అమలు అవ్వాలి. రాజకీయ ఒత్తిడి లేకుండా చూస్తాం అని పోలీసులు చెప్పారు. ప్రజలు కూడా ఇలాంటి అన్యాయాలు జరగడం సరికాదని పదే పదే చెబుతున్నారు. కరెక్ట్గా శిక్షలు పడితే సరే, లేదంటే మా గొంతు, మా కడుపుకోత, మా బాధ రాజమండ్రి వేదికగా పోరాటం చేస్తాం. మాకు న్యాయం జరగకపోతే మా ప్రాణాలు పోయేంతవరకు పోరాడుతూనే ఉంటాం. మాలాంటి ఎంతోమంది తల్లిదండ్రల మద్దతుతో అందరి ముం దుకు వస్తాం’’ అన్నారు వెంకటేష్.తీరని లోటు...తల్లితండ్రులు ఇద్దరూ తమ కూతురు గురించి వివరిస్తూ –‘‘మా ప్రియాంక ఎవరినీ నొప్పించేది కాదు. అందరితో కలివిడిగా ఉండేది. తొందరపడి ఎవరినీ ఎమీ అనేది కాదు. ప్రాపర్గా పనులు జరగాలి. ఒక మంచి డాక్టర్గా పేరు తెచ్చుకోవాలని ఉండేది. మా ఊరు నుంచి కానీ, మా కుటుంబంలో కానీ ఎవరూ డాక్టర్లు లేరు. అలాంటిది ప్రియాంక డాక్టర్ అయి ఆ పేరు నేను నిలబెడతా అనేది. కర్నూలు మెడికల్ కాలేజీలో ఫ్రీ సీటు వచ్చింది. పీజీ సీటు కూడా మంచి ర్యాంకుతో తెచ్చుకుంది. ఎక్కడా ఒక్క రిమార్క్ లేదు. చదువు చక్కగా సాగుతున్న సమయంలో, మరో రెండేళ్లలో స్పెషలిస్ట్గా బయటకు వచ్చేది. ఇలాంటి సమయంలో ఇలాంటి దారుణం జరిగింది. మా జీవితాంతం తీరని లోటు మిగిలింది. మాకు ఏ మాత్రం అన్యాయం జరుగుతుందని తెలిసినా ఊరుకోం. మా ప్రాణాలను పణంగా పెట్టి అయినా మా బిడ్డకు ఆత్మ శాంతి కలిగిస్తాం’’ అని తమ ఆవేదనను, ఆవేశాన్ని మన ముందు ఉంచారు వెంకటేష్, చంద్రమ్మలు. ఏ మాత్రం సహించం..మా కమ్యూనిటీలోనే డాక్టర్లు ఎవరూ లేరు. అమ్మాయిలను చదివించడం అనేది ఇప్పటి వరకు మా దగ్గర ఏ కుటుంబంలోనూ 28 ఏళ్లుగా లేదు. ఇరవై ఏళ్లు రాగానే పెళ్లి చేసి, అత్తారింటికి పంపించేస్తారు. అలాంటిది ప్రియాంకకు చదువు మీద ఉన్న శ్రద్ధతో ఆమె కలకే ప్రాముఖ్యం ఇచ్చాం. తను మా ఊరుకు పెళ్లి చూపులకని వచ్చి, తిరిగి కాలేజీకి వెళ్లిపోయింది. ఇంకో ఆర్నెల్లలో పెళ్లి అవుతుందని, అమ్మాయి జీవితం బాగుంటుందని ఎన్నో కలలు కన్నాం. ఊరు నుంచి వెళ్లిన ఒక్కరోజులోనే.. ‘మీ అమ్మాయి ప్రియాంకకు యాక్సిడెంట్ అయ్యింది, తీవ్ర రక్త స్రావం అవుతోంది’ అని ఫోన్ వచ్చింది. ఆ తర్వాత బ్రెయిన్ డెడ్ అయ్యిందని చెప్పారు. ఇన్నాళ్లూ తను పడిన కష్టానికి తగిన ఫలితం రాకుండానే దుర్మార్గులు మాకు దూరం చేశారు. తనకు సరైన న్యాయం జరగకపోతే ఏ మాత్రం సహించం. – చంద్రమ్మ, ప్రియాంక తల్లి– నిర్మలారెడ్డి, ఇన్పుట్స్ వాగు గడ్డ నరసింహారెడ్డి, సాక్షి, గద్వాల్ -
ఓటీటీకి రష్మిక మందన్నా లేటేస్ట్ మూవీ.. అఫీషియల్ ప్రకటన
రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన లేటేస్ట్ బాలీవుడ్ మూవీ కాక్టెయిల్-2. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ హీరోగా నటించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కృతి సనన్ మరో హీరోయిన్గా మెప్పించింది. ఈ సినిమాకు హోమీ అదజానియా దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది.అయితే బాక్సాఫీస్ వద్ద అంతగా అభిమానులను మెప్పించలేకపోయింది. తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. దీనిపై అఫీషియల్గా ప్రకటన వచ్చేసింది. ఈ మూవీని ఇద్దరమ్మాయిలతో ఓ అబ్బాయి రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కించారు. గతంలో దీపికా పడుకోన్, డయానా పెంటీ, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలలో నటించిన 'కాక్టెయిల్' (2012) చిత్రానికి సీక్వెల్గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 📢 Official Announcement ▶️#CockTail2 (Hindi) Streaming from August 14 on Netflix 🍿!!#OTT_Trackers pic.twitter.com/jpeSMvWDvR— OTT Trackers (@OTT_Trackers) August 12, 2026 -
నేరుగా ఓటీటీలోకి కామెడీ సినిమా.. ట్రైలర్ రిలీజ్
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు మాత్రం నేరుగా వీటిలోనే రిలీజ్ చేస్తుంటారు. అలా ఓ క్రేజీ లవ్ స్టోరీ కామెడీ మూవీ డైరెక్ట్ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేసి చిత్రం ఎలా ఉండబోతుందో చెప్పేశారు. ఇంతకీ దీని సంగతేంటి? ఎప్పుడు ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)ఎలన్ హీరో కమ్ దర్శకుడిగా చేసిన తమిళ సినిమా 'ప్యార్ ప్రేమ కళ్యాణం'. తెలుగమ్మాయి శాన్వి మేఘన హీరోయిన్. రాధిక కీలక పాత్ర చేసింది. దీనిని వచ్చే శుక్రవారం(ఆగస్టు 21) నుంచి నెట్ఫ్లిక్స్లో నేరుగా స్ట్రీమింగ్ చేయనున్నారు. తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకురానున్నారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.'ప్యార్ ప్రేమ కళ్యాణం' విషయానికొస్తే.. ఓ అబ్బాయి, అమ్మాయి పెళ్లి చేసుకుంటారు. సాధారణంగా వివాహం తర్వాత అమ్మాయి అత్తగారింటికి వెళ్తుంది. కానీ ఇక్కడ అమ్మాయి, తన భర్తని ఇల్లరికం రమ్మని అడుగుతుంది. భార్యనే కదా అని అంగీకరిస్తాడు. అక్కడ నుంచి కష్టాలు మొదలు. మరి ఈ అబ్బాయి.. అత్తారింట్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ. సీరియస్ విషయమే అయినప్పటికీ కామెడీగా దీనిని చూపించబోతున్నారని ట్రైలర్ బట్టి అర్థమవుతుంది.(ఇదీ చదవండి: హీరో సూర్య ముందు అద్భుతమైన అవకాశం) -
ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా
ఓటీటీలోకి ఈ వారం చాలానే సినిమాలు రాబోతున్నాయి. వాటిలో కాక్ టెయిల్ 2, భారతభాగ్య విధాత, కాటలన్, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ తదితర మూవీస్ ఉన్నాయి. వీటితో పాటు 20కి పైగా చిత్రాలు, సిరీస్లు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా ఓ తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా రిలీజ్కి సిద్ధమైంది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: దేశ విభజనతో నలిగిపోయిన 'ప్రేమ'కథ.. ఓటీటీ సినిమా రివ్యూ)సనత్, మడోన్నా సెబాస్టియన్, ఎమాయా ప్రధాన పాత్రలు చేసిన చిత్రం 'హార్టిన్'(Heartin Movie). జూన్ 26న తమిళం వరకు మాత్రమే రిలీజైంది. ఓ మాదిరి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడీ సినిమా ఈ శుక్రవారం(ఆగస్టు 14) నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి తీసుకురానున్నారు. అలానే విదేశాల వరకు సింప్లీ సౌత్ ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు.'హార్టిన్' విషయానికొస్తే.. శివ(సనత్) కాలేజీ చదువుతున్నప్పుడు సాహిత్య(మడోన్నా సెబాస్టియన్)ని ప్రేమిస్తాడు. రిలేషన్షిప్ కూడా మెంటైన్ చేస్తాడు. తర్వాత కొన్నాళ్లకు సాధన(ఎమాయా)తో ప్రేమలో పడతాడు. ఇలా ఒకేసారి ఇద్దరిని లవ్ చేస్తాడు. తర్వాత ఏమైంది? ఈ ట్రయాంగిల్ ప్రేమకథలో ఎవరు ఒక్కటయ్యారు? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి రోజా రీఎంట్రీ సినిమా) -
ఓటీటీలోకి రోజా రీఎంట్రీ సినిమా
ప్రముఖ నటి, వైఎస్సార్సీపీ నేత ఆర్కే రోజా గత పదిపదకొండేళ్ల నుంచి సినిమాలు చేయట్లేదు. అడపాదడపా షోల్లో మాత్రమే కనిపిస్తున్నారు. ఓ తమిళ సినిమాతో నటిగా రీఎంట్రీ ఇచ్చింది. తమిళంలో హిట్ అయిన చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇంతకీ ఈ చిత్రం సంగతేంటి? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: దేశ విభజనతో నలిగిపోయిన 'ప్రేమ'కథ.. ఓటీటీ సినిమా రివ్యూ)రోజా రీఎంట్రీ ఇచ్చిన తమిళ సినిమా 'అన్బే డయానా'. పారి ఎలావళగన్ హీరో కమ్ దర్శకుడు. రమ్య రంగనాథన్ హీరోయిన్. జూలైలో తమిళం వరకు థియేటర్లలో రిలీజైంది. హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రాన్ని ఈ నెల 28 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకురానున్నారు.'అన్బే డయానా' విషయానికొస్తే.. కృష్ణ ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు. ఆంగ్లో ఇండియన్ అమ్మాయి డయానాతో ప్రేమలో పడతాడు. డయానా ఫ్రీ బర్డ్ అంటే మందు, సిగరెట్లు లాంటి అలవాట్లు ఉంటాయి. కానీ కృష్ణ భిన్నమైన వాతావరణంలో పెరుగుతాడు. డయానాతో ప్రేమకు కృష్ణ తల్లి సరళ(ఆర్కే రోజా) అడ్డు చెబుతుంది. తన కులానికే చెందిన మరో అమ్మాయితో కొడుకు పెళ్లి ఫిక్స్ చేస్తుంది. ఆ తర్వాత ఏమైంది? తను ప్రేమించిన డయానా కోసం కృష్ణ ఏం చేశాడు? కొడుకు ప్రేమ.. సరళలో ఎలాంటి మార్పును తీసుకొచ్చిందనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) -
ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్
మరో వారం వచ్చేసింది. ఈసారి ఇండిపెండెన్స్ డే-వీకెండ్ కలిసొచ్చింది. దీంతో పలు తెలుగు సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. వాటిలో సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' స్పెషల్ అట్రాక్షన్ కాగా.. అగధ, పళ్లబురుసు, అనకాపల్లి లాంటి తెలుగు మూవీస్ అలానే విశాల్ 'మకుటం' అనే డబ్బింగ్ చిత్రం కూడా విడుదల కానుంది. వీటిలో దేనిపైనా పెద్దగా బజ్ అయితే లేదు.(ఇదీ చదవండి: దేశ విభజనతో నలిగిపోయిన 'ప్రేమ'కథ.. ఓటీటీ సినిమా రివ్యూ)మరోవైపు ఓటీటీల్లో 22 వరకు సినిమాలు, సిరీస్ ఈ వారం స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో రష్మిక 'కాక్ టెయిల్ 2', భారతభాగ్య విధాత లాంటి హిందీ చిత్రాతో పాటు మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే తెలుగు మూవీ కూడా ఉంది. ఉన్నంతలో ఇవే కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. వీకెండ్లో ఏమైనా సర్ప్రైజ్ స్ట్రీమింగ్లు ఉండొచ్చు. ఇంతకీ ఏ సినిమా ఏ ఓటీటీలోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఆగస్టు 10 నుంచి 16 వరకు)హాట్స్టార్హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 3 ఫినాలే (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 10108 బేస్ హాస్పిటల్: ఉరి (హిందీ సిరీస్) - ఆగస్టు 15జీ5భారత భాగ్య విధాత (హిందీ మూవీ) - ఆగస్టు 14నిబ్బానిబ్బీ (మరాఠీ సినిమా) - ఆగస్టు 14సన్ నెక్స్ట్మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ (తెలుగు సినిమా) - ఆగస్టు 14ఆహాచెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె-యూఎస్ఏ (తెలుగు కుకింగ్ షో) - ఆగస్టు 13నెట్ఫ్లిక్స్మిడ్ వింటర్ బ్రేక్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 10రోరీ స్కోవెల్: షో మస్ట్ గో ఆన్ (ఇంగ్లీష్ షో) - ఆగస్టు 11మౌరిన్హో (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - ఆగస్టు 11నాండో బిట్వీన్ టూ వరల్డ్స్ (బ్రెజిలియన్ సిరీస్) - ఆగస్టు 12ఏ చైల్డ్ ఆఫ్ మై ఓన్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 13డోంట్ సే గుడ్ లక్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 13మై బ్రిలియంట్ కెరీర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 13కాక్ టెయిల్ 2 (హిందీ సినిమా) - ఆగస్టు 14మోరియా (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 14ఉమెత్తో (ఆఫ్రికన్ సిరీస్) - ఆగస్టు 14మై బెస్ట్ ఫ్రెండ్, హిస్ గర్ల్ఫ్రెండ్ అండ్ మీ (జర్మన్ మూవీ) - ఆగస్టు 14అమెజాన్ ప్రైమ్ద ట్రెయిటర్స్ సీజన్ 2 (హిందీ రియాలిటీ షో) - ఆగస్టు 13సోనీ లివ్కౌన్ బనేగా కరోడ్పతి 18వ సీజన్ (హిందీ రియాలిటీ షో) - ఆగస్టు 10ఆపిల్ టీవీ ప్లస్ఉమెన్ ఇన్ బ్లూ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 12లయన్స్ గేట్ ప్లేఆఖరి సవాల్ (హిందీ సినిమా) - ఆగస్టు 14మనోరమ మ్యాక్స్కాట్టలన్ (మలయాళ మూవీ) - ఆగస్టు 13(ఇదీ చదవండి: ఓటీటీలో సైకలాజికల్ హారర్ సినిమా 'బ్యాక్ రూమ్స్' తెలుగు రివ్యూ) -
మూడు నెలల తర్వాత ఓటీటీలోకి తెలుగు సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా తెలుగువి ఎప్పుడొస్తుంటాయా అని ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. అలా మూడు నెలల క్రితం థియేటర్లలో రిలీజైన ఓ తెలుగు మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: ఇప్పుడు రోడ్డుపై నడవలేకపోతున్నా: అల్లు అర్జున్)త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ జంటగా నటించిన మూవీ 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్'. రైతుల నేపథ్య కథతో దీన్ని తీశారు. ఈ ఏడాది మే 15న థియేటర్లలోకి వచ్చింది. పెద్దగా పేరున్న నటీనటులు లేకపోవడం, కంటెంట్ కూడా ఓ మాదిరిగా ఉండటంతో ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు దీనిని ఈ శుక్రవారం(ఆగస్టు 14) నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు.'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' విషయానికొస్తే.. అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే అరవింద్ (త్రిగుణ్).. తన జాబ్కి రాజీనామా చేసి స్వదేశానికి తిరిగొస్తాడు. ఆ తర్వాత ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని ఫిక్స్ అవుతాడు. ఇందులో కొత్త పద్దతులు ప్రవేశపెట్టడమే కాకుండా రైతులు ఆదాయం పెంచడానికి 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' యాప్ తీసుకొస్తాడు. దీనితో రైతుల జీవితం ఎలా మారింది? మహి(పాయల్ రాధాకృష్ణ)తో అరవింద్ ప్రేమ సంగతేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: కంటతడి పెట్టించే ప్రేమకథా సినిమా.. ఓటీటీ సినిమా తెలుగు రివ్యూ) -
దేశ విభజనతో నలిగిపోయిన 'ప్రేమ'కథ.. ఓటీటీ సినిమా రివ్యూ
ప్రేమకథలకు భాషతో సంబంధం లేదు. బాగుండాలే గానీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. అలా రీసెంట్ టైంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన హిందీ సినిమా 'మై వాపస్ ఆవుంగా'. జూన్లో థియేటర్లలో రిలీజైంది. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నసీరుద్దీన్ షా, దిల్జిత్ దోసాంజ్, వేదాంగ్ రైనా, శార్వరి వాఘ్ ప్రధాన పాత్రధారులు. రెండు రోజుల క్రితం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్లోకి వచ్చింది. ఇంతకీ ఇదెలా ఉంది? ఏడిపించేంతలా ఇందులో ఏముందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ మిస్టరీ థ్రిల్లర్ 'ఉయిర్' తెలుగు రివ్యూ)కథేంటి?చంఢీగడ్లో ఉండే 95 ఏళ్ల కీను అలియాస్ ఇషార్ సింగ్ గ్రెవాల్ (నసీరుద్దీన్ షా) ఎలాగైనా సరే పాకిస్థాన్లోని సర్గోదా నగరానికి వెళ్లాలని పట్టుబడుతుంటాడు. అదలా ఉండగానే స్ట్రోక్ వస్తుంది. దీనికి తోడు మెల్లమెల్లగా జ్ఞాపకశక్తిని కోల్పోతుంటాడు. చివరదశలో తాతకు తోడుగా ఉండేందుకు ఇంగ్లాండ్లో నుంచి మనవడు నిర్వార్(దిల్జీత్ దోసాంజ్)స్వదేశానికి తిరిగొస్తాడు. తాతతో మాట్లాడుతూ ఆయన గతం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఇంతకీ కీను.. పాక్ ఎందుకు వెళ్లాలనుకుంటున్నాడు? ఎవరిని కలవాలనుకుంటున్నాడు? అసలు 1947 దేశ విభజన టైంలో ఏం జరిగింది? అనేది అసలు స్టోరీ.ఎలా ఉందంటే?భారత్-పాక్ విడిపోయి 78 ఏళ్లు అయిపోయింది. అప్పుడేం జరిగిందో కళ్లారా చూసిన సరిహద్దు రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు చాలావరకు జీవించిలేరు. ఇప్పటితరానికి ఆ సంగతులేవి పెద్దగా తెలీదు. చరిత్ర పుస్తకాల్లోని ఫొటోలుగా మాత్రమే చూశారు, చూస్తున్నారు. కానీ దేశవిభజన జరిగినప్పుడు నరకాన్ని అనుభవించిన ఆనాటి తరం పరిస్థితి ఏంటి? తమ సొంత ఇళ్లని, ప్రాణానికి ప్రాణమైన మనుషుల్ని వదిలేసి ఇక్కడికి వచ్చినవాళ్ల బాధేంటి? వారు తమ జీవితాంతం మోసిన ఆ గుండెకోత, గాయాల విలువెంత? అనేది ఓ ప్రేమకథతో చూపించిన సినిమానే 'మై వాపస్ ఆవుంగా'.సినిమా మొదలైన నిమిషాల్లోనే స్టోరీలోకి నేరుగా వెళ్లిపోతాం. 1947లో మన దేశంలోని పంజాబ్కి వలస వచ్చిన ఓ కుర్రాడు.. తిరిగి పాకిస్థాన్లోని పంజాబ్కి వెళ్లాలని ప్రయత్నం చేసే సీన్తో కథ మొదలవుతుంది. అసలు ఇంతకీ ఇతడెవరు? దేశ విభజన జరగకముందు ఎలా ఎక్కడ ఉండేవాడు? ఎవరిని ప్రేమించాడు? అసలు 1947లో ఏం జరిగింది? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన జియా అనే అమ్మాయిని వదిలేసి ఎందుకు రావాల్సి వచ్చింది? అనే విషయాల్ని ఒక్కొక్కటిగా చూపించారు.మూవీ ప్రారంభమైన కాసేపటికి స్క్రీన్ప్లే కాస్త నెమ్మదిస్తుంది. ఇంటర్వెల్ వచ్చేసరికి ఈ పాత ప్రేమకథలో ఇక చెప్పడానికి ఏముంది? అనిపించింది. ఎప్పుడైతే సెకండాఫ్ మొదలవుతుందో మన మదిలో మెదిలిన ఒక్కో ప్రశ్నకు సమాధానాలు కనిపిస్తాయి. అప్పటివరకు సరదాగా, థ్రిల్లింగ్గా సాగిన సినిమా కాస్త గుండెల్ని పిండేసేలా మారుతుంది. క్లైమాక్స్లో అయితే ఏడిపించేసింది. అంతా అయిపోయిన తర్వాత అద్భుతమైన ప్రేమకథ చూశామే అని అనుభూతి కలిగింది.1947 విభజన అనగానే చాలామంది దాన్ని రాజకీయంగానే చూస్తారు. కానీ ఈ సినిమాలో ఆ సంఘటనని మనుషుల జీవితాలని శాశ్వతంగా మార్చిన విషాదంగా చూపించారు. మతాలు వేరు అయినప్పటికీ కీను-జియా ప్రేమించుకుంటూ ఉంటారు. అమాయకమైన ప్రేమ, చిలిపితనం, దొంగచూపులతో సాగుతున్న వీరి బంధాన్ని 1947 విభజన ఛిద్రం చేస్తుంది. రాడ్క్లిఫ్ అనే బ్రిటీషర్ గీసిన విభజన రేఖ కారణంగా కీను తప్పనిసరి పరిస్థితుల్లో భారత్కు రావాల్సి వస్తుంది. జియా పాక్లోనే ఉండిపోతుంది. తిరిగి కలుస్తానని ఆమెకు మాట ఇచ్చిన కీను.. ఆ జ్ఞాపకంతోనే జీవితాన్ని కొనసాగిస్తాడు. కానీ కలవలేకపోతాడు.ఇది జరిగిన 78 ఏళ్ల తర్వాత కీను మనవడు.. తాత కోరికని ఎలా నెరవేర్చాడు? ఈ క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడనేది ఇందులో హృద్యంగా చూపించారు. దేశం కోసం చేసే త్యాగం మాత్రమే గొప్పది కాదు, స్వస్థలాన్ని వదిలి వెళ్లాల్సిన శరణార్థి కన్నీటిలోనూ అపారమైన విలువ ఉందని ఇందులో అద్భుతంగా చూపించారు.ప్రస్తుత సమాజంలో ప్రేమకు విలువ లేకుండా చేశారు. కానీ అప్పట్లో ప్రేమ అంటే ఎలా ఉండేదో తెలియాలంటే ఈ మూవీ చూడండి. ఓ సీన్లో కీను, జియాని ముద్దుపెట్టుకుంటాడు. ఆమె ఇబ్బందిపడేసరికి ఇక జీవితంలో ఎప్పుడు ఇలా చేయనని అంటాడు. పెళ్లయినా సరే నన్ను ముద్దుపెట్టుకోవా అని జియా గోముగా అడుగుతుంది. ఈ సీన్ చూస్తున్నప్పుడు భలే క్యూట్గా అనిపిస్తుంది. అలానే రాజకీయాల కోసం రెండు మతాలు, దేశాల మధ్య చిచ్చుపెట్టి బ్రిటీషర్లు ఎలాంటి దమనకాండ సృష్టించారో ఇందులో కంటతడి పెట్టించేలా చూపించారు. 'శత్రువు వెళ్లిపోయాడు.. మనలో మనల్ని శత్రువులుగా మార్చాడు' అనే డైలాగ్ అప్పటి పరిస్థితులకు అద్దం పడుతుంది.ఎవరెలా చేశారంటే?ఇందులో 95 ఏళ్ల వృద్ధుడిగా చేసిన నసీరుద్దీన్ షా కళ్లతోనే హావాభావాలు పలికించాడు. తన నటన అనుభవం ఏంటో ఇందులో మరోసారి చూపించాడు. యుక్త వయసు కీనుగా చేసిన వేదాంగ్ రైనా, జియాగా చేసిన శార్వరి వాఘ్ కూడా వాళ్ల పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేశారని చెప్పొచ్చు. చూస్తున్నంతసేపు వీళ్లు కనిపించరు సదరు పాత్రలే దర్శనమిస్తాయి. దిల్జీత్ దోసాంజ్ కూడా తాత కోరికని నెరవేర్చే మనవడి పాత్రలో పర్లేదనిపించాడు. మిగిలిన వాళ్లు కూడా తమకిచ్చిన రోల్స్కి న్యాయం చేశారు.ఈ సినిమాలో నటీనటులు ఎంత తోడ్పాటు అందించారో డైరెక్టర్ ఇంతియాజ్ అలీ, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అంతకుమించి కష్టపడ్డారు. విజయానికి మూలకారకులు వీళ్లే. తనదైన టేకింగ్తో దర్శకుడు.. కథలో లీనమయ్యేలా రెహమాన్ తన మ్యూజిక్తో ప్రేమకథకు ప్రాణం పోశాడు.ఈ సినిమా నిడివి 2 గంటల 46 నిమిషాలు. హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. కానీ స్క్రీన్ మీదున్న పాత్రలతో ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యేలా చేయడంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్ అయ్యాడు. అందువల్ల సినిమా చూస్తున్నప్పుడు టైమ్ ఎలా గడిచిపోయిందో కూడా మనకు తెలియదు. గడియారంలోని ముల్లుల కంటే పాత్రల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ మనల్ని కట్టిపడేస్తుంది. ఎలాంటి అసభ్యకర సీన్స్ లేవు. కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీలో సైకలాజికల్ హారర్ సినిమా 'బ్యాక్ రూమ్స్' తెలుగు రివ్యూ) -
ఓటీటీలో సైకలాజికల్ హారర్ సినిమా.. తెలుగు రివ్యూ
అప్పుడప్పడు క్రేజీ కాన్సెప్ట్తో సినిమాలు వస్తుంటాయి. చూస్తున్నంతసేపు వావ్ అనిపిస్తాయి. అలాంటి ఓ మూవీనే 'బ్యాక్ రూమ్స్'. 20 ఏళ్ల అమెరికన్ యూట్యూబర్ కేన్ పార్సన్స్ దీనికి దర్శకుడు. ఈ హాలీవుడ్ చిత్రం మన దగ్గర ఈ ఏడాది జూన్లో థియేటర్లలో రిలీజైంది. సరికొత్త హారర్ ఫీల్తో భయపెట్టింది. ఇప్పుడిది సోనీ లివ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఈ చిత్రం ఎలా ఉంది? అంతగా ఇందులో ఏముందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: 'కొరియన్ కనకరాజు' మూవీ రివ్యూ)కథేంటి?క్లార్క్(చివటేల్ ఎజియోఫోర్) ఓ ఆర్కిటెక్ట్. కానీ పరిస్థితుల కారణంగా ఓ ఫర్నీచర్ స్టోర్లో పనిచేస్తుంటాడు. భార్య నుంచి విడిపోయి ఒంటరిగా స్టోర్లోనే బతికేస్తుంటాడు. ఇతడి థెరపిస్ట్ మేరీ(రెనే రెయిన్స్వ్). ఓ రోజు క్లార్క్.. అనుకోకుండా తన స్టోర్లోనే ఉన్న ఓ రహస్య ప్రదేశాన్ని చూస్తాడు. అనుకోని పరిస్థితుల్లో దాని లోపలికి వెళ్తాడు. అదో అనంతమైన పసుపు గదుల సమూహం. ఇంతకీ ఇవేంటి? ఈ 'బ్యాక్ రూమ్స్' నుంచి క్లార్క్ బయటపడ్డాడా? ఇతడి కోసం వెతుకుతూ అందులోకి వెళ్లిన మేరీకి ఏమైంది? అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఇది రెగ్యులర్ సినిమా కాదు. దెయ్యాల్లాంటివి లేకపోయిప్పటికీ భయపెడుతుంది. చిత్రమైన సీన్స్ దెబ్బకు జుగుప్సకరంగానూ అక్కడక్కడ అనిపిస్తుంది. అదే టైంలో తర్వాత ఏం జరుగుతుందనే థ్రిల్ పంచుతుంది. ఓవరాల్గా ఈ మూవీ మీకో చిత్రమైన అనుభూతిని కలుగజేస్తుంది.మనిషి తన ట్రామా నుంచి పారిపోతూ తన తప్పుల్ని అంగీకరించకుండా అదే జ్ఞాపకాలతో బతికితే చివరకు తనలోని డార్క్నెస్సే మనల్ని ఎలా మింగేస్తుంది అనే అంశాన్ని సైకలాజికల్ హారర్ థ్రిల్లర్గా ఇందులో చూపించారు. ప్రధాన పాత్రధారి అయిన క్లార్క్ ట్రామాకు బలవగా.. మేరీ మాత్రం దాన్ని ఎదురించి బయటపడుతుంది. అయితే ఈ మూవీ హారర్ కంటే సైకలాజికల్ హారర్ అనుభవాన్ని అందిస్తుంది. ట్రామా ఎదురైతే బాధపడటం కంటే దాన్ని ఎదుర్కోండి అనే సత్యాన్ని విజువల్గా చూపిస్తుంది.ఇంగ్లీష్లోనే స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాలో స్టోరీ చాలా సాధారణంగా మొదలవుతుంది. కానీ ప్రధాన పాత్రధారి అయిన క్లార్క్.. ఎప్పుడైతే అనంతమైన పసుపు గదుల్లోకి అడుగుపెడతాడో నెక్స్ట్ ఏం జరుగుతుంది? అసలు దీని నుంచి ఎలా బయటపడతాడు? అనిపిస్తుంది. స్టోరీకి కనెక్ట్ అయితే మనం కూడా అతడితో అందులో చిక్కుకుపోయామా అనే ఫీలింగ్ కలుగుతుంది.'అబ్సెషన్' తరహాలోనే ఈ సినిమాలోనూ ప్రధానంగా రెండే పాత్రలు కనిపిస్తాయి. ఇవి కాకుండా మరో మూడు నాలుగు ఉంటాయంతే. అమెరికాతో పాటు విదేశాల్లో సెన్సేషన్ సృష్టించింది. గంట 50 నిమిషాల పూర్తి మూవీ చూసినా సరే చాలా సందేహాలు మిగిలిపోతాయి. అసలు అలా ఎందుకు జరిగింది? చివరకు ఏమైందనే ప్రశ్నలు ఉండిపోతాయి.సినిమాలో చూపించిన అనంతమైన పసుపు గదుల్ని గ్రాఫిక్స్లో కాకుండా నిజంగానే సృష్టించారు. అసలు ఇవన్నీ ఎలా తయారు చేశారు? అసలు ఇలాంటి ఆలోచన దర్శకుడికి ఎలా వచ్చిందా? అని సందేహం కలగకమానదు. ప్రధాన పాత్రలు చేసిన ఎజియోఫర్, రెయిన్స్వ్ అద్భుతంగా నటించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సన్నివేశాలకు తగ్గట్లు మూడ్ని ఎలివేట్ చేసింది. మీరు సరికొత్తగా ఉండే మూవీ ఏదైనా చూద్దామనుకుంటే మాత్రం దీన్ని అసలు మిస్ కావొద్దు.- చందు డొంకాన(ఇదీ చదవండి: లోకేశ్ కనకరాజు ‘డీసీ’ మూవీ రివ్యూ) -
నేరుగా ఓటీటీలోనే రిలీజైన తెలుగు సినిమా
ఈ వారం ఓటీటీల్లో చాలా సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో లెనిన్, ఓ సుకుమారి, ఎమ్మార్పీ లాంటి తెలుగు చిత్రాలు ఉండగా హృదయం మురళి, వంద దేవుళ్లు, ఉయిర్, మై వాపస్ ఆవుంగా లాంటి డబ్బింగ్లు.. వదంది 2, ఆపరేషన్ సఫేద్ సాగర్ తదితర తెలుగు డబ్బింగ్ సిరీస్లు కూడా వచ్చాయి. ఇలా చూసేందుకు బోలెడన్ని ఉండగా మరో తెలుగు మూవీ నేరుగా స్ట్రీమింగ్లోకి వచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ మిస్టరీ థ్రిల్లర్ సినిమా 'ఉయిర్' తెలుగు రివ్యూ)రాము, శివకృష్ణ, ప్రదీప్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'పంచనామా'. లెక్క ప్రకారం గత నెలలో థియేటర్లలో రిలీజ్ కావాలి. కానీ అది జరిగినట్లు లేదు. దీంతో తాజాగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. కాకపోతే అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ థ్రిల్లర్ స్టోరీతో తీసిన ఈ మూవీకి జాన్ రమేశ్ దర్శకత్వం వహించాడు.'పంచనామా' విషయానికొస్తే.. నగరంలో వరస హత్యలు జరుగుతాయి. ఇవి ఎవరు చేస్తున్నారో తెలీక పోలీసులు తలలు పట్టుకుంటారు. హంతకుడి గురించి ఒక్క క్లూ కూడా దొరకదు. దీంతో స్పెషల్ ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. ఇంతకీ ఈ హత్యలకు కారణం ఎవరు? పోలీసులు చివరకు నిందితుడిని పట్టుకున్నారా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి కంగనా రనౌత్ థ్రిల్లర్ సినిమా.. అధికారిక ప్రకటన) -
ఓటీటీలో దూసుకెళ్తున్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్
ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు రఘు కుంచే ప్రధాన పాత్రలో నటించి, సంగీతాన్ని అందించిన ‘గేదెలరాజు’ ఓటీటీలో విశేష ఆదరణ పొందుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 24న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఆహాలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అత్యధికంగా రీ-వాచ్ అవుతున్న చిత్రాల్లో ఒకటిగా కొనసాగుతుండగా, ఆహాలో కూడా ట్రెండింగ్లో నిలిచింది. మోటూరి క్రియేషన్స్ బ్యానర్పై రఘు కుంచే సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి చైతన్య మోటూరి దర్శకత్వం వహించారు. ఆయన నాన్-లీనియర్ స్క్రీన్ప్లే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.గేదెల రాజు కథేంటంటే..కాకినాడకు చెందిన రౌడీ షీటర్ గేదెల రాజు(రఘు కుంచె) కార్పోరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటాడు. స్థానిక ఎమ్మెల్యే గేదెల రాజుకే టికెట్ కేటాయిస్తాడు. అదే పార్టీకి చెందిన దుర్గ(శ్రీకాంత్ అయ్యంగార్) కూడా టికెట్ ఆశిస్తాడు. వీరిద్దరికి పడకపోవడంతో..ఎమ్మెల్యే ఇంటికి పిలిపించుకొని కలిసి పని చేయాలని చెబుతారు. అందుకు ఇద్దరు నిరాకరించి..అక్కడ నుంచి వెళ్లిపోతారు. అదే రోజు రాత్రి గేదెల రాజు హత్యకు గురవుతాడు.ఎమ్మెల్యే మనిషి కావడంతో పోలీసులు ఈ కేసుని సీరియస్గా తీసుకుంటారు. గేదెర రాజు సోదరుడు శ్యాంబాబుతో పాటు దుర్గను కూడా పిలిచి విచారిస్తారు. అయితే ఈ కేసుతో వాళ్లకు సంబంధం లేదని తెలుస్తుంది. మరి గేదెల రాజుని చంపిందెవరు? ఎందుకు చంపారు? రిచ్ (వికాస్)-మీరా(మౌనిక), విజయ్ (రామచంద్రం)-సత్య(టీనా శ్రావ్య)లతో గేదెల రాజుకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు హంతకులను పోలీసులు కనిపెట్టారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీలోకి కొత్త థ్రిల్లర్ సినిమా.. అధికారిక ప్రకటన
ప్రస్తుతం లోక్సభ ఎంపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్.. మరోవైపు సినిమాలు కూడా చేస్తోంది. అలా ఈ ఏడాది ఈమె నుంచి వచ్చిన మూవీ 'భారత భాగ్య విధాత'. 26/11 దాడుల నేపథ్య కథతో తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ మిస్టరీ థ్రిల్లర్ సినిమా 'ఉయిర్' తెలుగు రివ్యూ)కంగనా రనౌత్ ప్రధాన పాత్ర చేసి ఓ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు మనోజ్ తపాడియా దర్శకుడు. 26/11 దాడులు జరిగినప్పుడు ముంబైలోని కామా ఆస్పత్రిలో అంజలి అనే నర్స్, 20 మంది గర్భిణిలని రక్షించింది. ఆమె జీవితకథ స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తీశారు. జూన్ 12న థియేటర్లలో రిలీజైంది గానీ జనాలు పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చే శుక్రవారం (ఆగస్టు 14) నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు.26/11 టెర్రర్ ఎటాక్ సమయంలో ఆస్పత్రిలో రోగులని కాపాడిన గీతా మాధవ్ (కంగనా రనౌత్) అనే నర్స్ పోరాటం, ఆమె ధైర్యం, అలానే ఈమెకు తోడుగా మరికొందరు నర్సులు కూడా ఎలాంటి సాహసం చేశారు? చివరకు ఏమైందనేదే 'భారత భాగ్య విధాత' స్టోరీ.ఇకపోతే ఓటీటీల్లో ఈ వారం బోలెడన్ని కొత్త సినిమాలు వచ్చేశాయి. వీటిలో లెనిన్, ఓ సుకుమారి, ఎమ్మార్పీ, హృదయం మురళి, వంద దేవుళ్లు, డార్క్ సీక్రెట్స్, వదంది 2, సఫేద్ సాగర్, ఉయిర్, మై వాపస్ ఆవుంగా లాంటి స్ట్రెయిట్, డబ్బింగ్ తెలుగు మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు కామెడీ సినిమా)An untold story of ordinary nurses who stood with extraordinary courage on the darkest night of 26/11.Some heroes were never seen. Their stories were never told.Until now.Bharat Bhhagya Viddhaata Trailer Out Now.#BharatBhhagyaViddhaata premieres on 14th Aug on Hindi Zee 5… pic.twitter.com/gq6b61Piet— ZEE5Official (@ZEE5India) August 7, 2026 -
ఓటీటీలో రికార్డ్.. ఆ జాబితాలో మొదటి చిత్రంగా దురంధర్
ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసిన చిత్రాల్లో దురంధర్ ముందు వరుసలో ఉంటుంది. దంగల్, బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప చిత్రాల సరసన చేరింది. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద రూ.3 వేల కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్లో రణ్వీర్ సింగ్ హీరోగా మెప్పించారు. సారా అర్జున్ హీరోయిన్గా కనిపించింది.తాజాగా ఈ మూవీ మరో రికార్డ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోన్న దురంధర్ అరుదైన రికార్డ్ సాధించింది. ఈ ఏడాది ప్రపంచంలో అత్యధికంగా వీక్షించిన ఆంగ్లేతర చిత్రాల జాబితాలో మొదటిస్థానంలో నిలిచింది. కాగా.. ఈ మూవీకి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేష్ బేడీ, సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటించారు. ధురందర్ పార్ట్-1 డిసెంబర్ 2025లో థియేటర్లలో విడుదలైంది. ఆ తర్వాత ఈ ఏడాది మార్చిలో సీక్వెల్ దురంధర్ ది రివెంజ్ రిలీజైంది. -
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు కామెడీ సినిమా
ఓటీటీల్లో ఈ వారం బోలెడన్ని కొత్త సినిమాలు వచ్చేశాయి. వీటిలో లెనిన్, ఓ సుకుమారి, హృదయం మురళి, వంద దేవుళ్లు, డార్క్ సీక్రెట్స్, వదంది 2, సఫేద్ సాగర్, ఉయిర్, మై వాపస్ ఆవుంగా లాంటి స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పుడు వీటికి తోడు ఓ తెలుగు క్రైమ్ కామెడీ చిత్రం ఎలాంటి ప్రకటన లేకుండా రెండు ఓటీటీల్లో అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ దీని సంగతేంటి?నరేశ్ అగస్త్య, సుదర్శన్, రాజ్ కసిరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ఎమ్మార్పీ'. గత నెల 17న థియేటర్లలో రిలీజైంది కానీ సరైన కంటెంట్ లేకపోవడంతో దీన్ని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో మూడు వారాలు తిరిగేసరికల్లా అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.'ఎమ్మార్పీ' విషయానికొస్తే.. మనోహర్(నరేష్ అగస్త్య), రవి(కసిరెడ్డి రాజ్ కుమార్), పరమేశ్వరరావు(సుదర్శన్) ఫ్రెండ్స్. కలిసి ఓ బిజినెస్ చేద్దామని ఓ రౌడీ షీటర్ రూ.50 లక్షలు అప్పు తీసుకుంటారు. బిజినెస్లో నష్టాలు రావడంతో వడ్డీ కూడా కట్టలేకపోతారు. అనుకోని పరిస్థితుల్లో వీళ్లు సదరు రౌడీ షీటర్ ఇంటికెళ్లిన టైంలో అతడి తండ్రి చనిపోతాడు. అయితే ఆ శవాన్ని కిడ్నాప్ చేసి డబ్బులు సంపాదించి తమ అప్పు తీర్చాలని వీళ్లు ముగ్గురు అనుకుంటారు. తీరా కిడ్నాప్ చేసిన తర్వాత చూస్తే ఓ మహిళ శవం ఉంటుంది. ఇంతకీ ఆమె ఎవరు? చివరకు వీళ్ల ముగ్గురి పరిస్థితి ఏమైందనేదే మిగతా స్టోరీ. -
శాన్వీ మేఘన లేటేస్ట్ మూవీ.. నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్
టాలీవుడ్ నటి శాన్వీ మేఘన, ఎలన్ జంటగా వస్తోన్న లవ్ అండ్ రొమాంటిక్ మూవీ క్రేజీ లవ్. ఈ చిత్రానికి ఎలన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని ప్రేమ, పెళ్లి కాన్సెప్ట్తో తెరకెక్కించినట్లు పోస్టర్స్ చూస్తే తెలిసిపోతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.ఈ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 21 నుంచి ఓటీటీకి రానుందని తేదీని రివీల్ చేశారు. తాజాగా ఈ మూవీ నుంచి ప్యార్ప్రేమకల్యాణ్ అనే సాంగ్ కూడా రిలీజ్ చేశారు. ఈ పాటను మ్యూజిక్ ఫ్లాట్ఫామ్స్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. కాగా.. ఈ చిత్రంలో రాధిక శరత్కుమార్, యోగి బాబు, సెంథిల్, కుమారవేల్, మారన్, గీతా కైలాస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. #CrazyLove song from #PyaarPremaKalyanam is streaming now! 🎶🔗 https://t.co/gZqMcWraOpStreaming on Netflix from Aug 21 pic.twitter.com/37VAgu5Nlj— Sathish Kumar M (@sathishmsk) August 6, 2026 -
ఫ్రైడే ఓటీటీల్లో సందడి.. ఒక్క రోజే 17 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల హడావుడి ఉంటుంది. ఈ ఫ్రైడే వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో పాటు కేజేక్యూ, అనకాపల్లి, అమ్మ నాకు అబ్బాయి కావాలి అనే తెలుగు మూవీస్ రిలీజ్ కానున్నాయి. అలానే లోకేశ్ కనగరాజ్ హీరోగా పరిచయమవుతున్న 'డిసి', మాధవన్ 'జీడీ నాయుడు' లాంటి డబ్బింగ్ చిత్రాలు సందడి చేయనున్నాయి. అంతేకాకుండా మహేశ్ బాబు దూకుడు చిత్రం(ఆగస్టు 09) రీ రిలీజ్ కానుంది.ఇక ఓటీటీల విషయానికొస్తే అక్కినేని హీరో అఖిల్ మూవీ లెనిన్ సందడి చేయనుంది. జీ5 వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. దీంతో పాటు విజయ్ ఆంటోనీ వంద దేవుళ్లు, మలయాళ చిత్రం హృదయం మురళి ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. అంతేకాకుండా పలు హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్లు ఈ శుక్రవారమే ఓటీటీకి రానున్నాయి. ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్ ఇదయం మురళి (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 07 ఆపరేషన్ సఫేద్ సాగర్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఆగస్టు 07 ద లాస్ట్ హౌస్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 07 మై వాపస్ ఆవుంగా (హిందీ సినిమా) - ఆగస్టు 07 రికీ గెర్వైస్ ఆలే క్యాట్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 07 అవర్ స్టిక్కీ లవ్ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 07 డెత్ ఇంక్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 07బిగ్చికెన్.. ఏ ఫాస్ట్ ఫుడ్ కాన్స్పరసీ(హాలీవుడ్)- ఆగస్టు 07 లవ్ హర్ట్స్(హాలీవుడ్ మూవీ)- ఆగస్టు 07 ద రిబ్బన్ హీరో (జపనీస్ ఏనిమే మూవీ) - ఆగస్టు 08జీ5 లెనిన్ (తెలుగు మూవీ) - ఆగస్టు 07 వంద దేవుళ్లు (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 07 తుంబడ్ చీ మంజులా (మరాఠీ మూవీ) - ఆగస్టు 07అమెజాన్ ప్రైమ్ ఓ సుకుమారి(తెలుగు సినిమా)- ఆగస్టు 07 వదంది 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఆగస్టు 07జియో హాట్స్టార్ ద సూపర్ మారియో గెలక్సీ (ఇంగ్లీష్ చిత్రం) - ఆగస్టు 07మనోరమ మ్యాక్స్ పొంగళ (మలయాళ మూవీ) - ఆగస్టు 07సన్ నెక్ట్స్..సత్యతిల్ సంబవిచతు(మలయాళ మూవీ)- ఆగస్టు 07 -
ఓటీటీకి జన నాయగన్.. స్ట్రీమింగ్ డేట్ వైరల్..!
దళపతి విజయ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ జన నాయగన్(తెలుగులో జన నాయకుడు). పొలిటికల్ ఎంట్రీ ముందు నటించిన చివరి సినిమా ఇదే. రాజకీయాల్లోకి వచ్చేముందే ఇదే తన చివరి చిత్రమని ప్రకటించారు. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం.. సెన్సార్ సమస్యలతో వాయిదా పడింది. ఎట్టకేలకు విజయ్ సీఎం అయ్యాక ఈ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. జూలైలో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ.. అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది. విజయ్ ఫ్యాన్స్లో క్రేజ్ ఉండడంతో కలెక్షన్స్ పరంగా ఫర్వాలేదనిపించింది. దీంతో థియేటర్లలో ఓ మాదిరిగా ఆకట్టుకున్న జన నాయగన్ ఓటీటీ రిలీజ్ కోసం సినీ ప్రియులు ఎదురు చూస్తున్నారు.ఈ నేపథ్యంలోనే జన నాయగన్ ఓటీటీ రిలీజ్కు సంబంధించి క్రేజీ న్యూస్ వైరలవుతోంది. ఈ మూవీ ఓటీటీ ప్రియులను అలరించేందుకు నెల రోజుల్లోపే రానుందని తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ జీ5 సొంతం చేసుకుంది. ఈ నెల 21 నుంచి తమిళంతో పాటు హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. కాగా.. ఈ మూవీకి హెచ్. వినోద్ దర్శకత్వం వహించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రియమణి, రేవతి, సునీల్, నాజర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. -
ఓటీటీలో మలయాళ మిస్టరీ థ్రిల్లర్.. తెలుగు రివ్యూ
ఓటీటీల్లోకి వచ్చే మలయాళ థ్రిల్లర్ సినిమాలకు తెలుగులో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కొత్తవి రావడం లేటు చూసేస్తుంటారు. అందుకు తగ్గట్లే డబ్బింగుల రూపంలో ప్రతివారం వస్తూనే ఉంటాయి. అలా ఈ మంగళవారం(ఆగస్టు 04) 'ఉయిర్' అనే మలయాళ మిస్టరీ థ్రిల్లర్ హాట్స్టార్లో రిలీజైంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?అజీబ్ (రోషన్ మాథ్యూ) ప్రొబేషనరీ ఎస్సైగా ఓ పోలీస్ స్టేషన్కి వస్తాడు. కొన్నిరోజుల తర్వాత ఊరి చివరన ఉండే పాడుబడ్డ బావిలో ఓ మహిళ శవం బయటపడుతుంది. దర్యాప్తు చేయగా ఆమె పేరు శోభ అని, రోజు కూలీ అని తెలుస్తుంది. తొలుత ఈమెది ఆత్మహత్య అనుకుంటారు. మరోచోట ఉన్న భర్తని పిలిపించి శోభ కాదా అని ధ్రువీకరించుకున్న తర్వాత అంత్యక్రియలు కూడా పూర్తిచేస్తారు. కట్ చేస్తే పోలీస్ స్టేషన్కి వచ్చిన శోభ బంధువులు షాకింగ్ విషయాలు చెబుతారు. దీంతో కేసు మలుపు తిరుగుతుంది. ఇంతకీ ఇది ఆత్మహత్య లేదా హత్య? అసలు ఈమె భర్త, పిల్లలు ఏమయ్యారు? చివరకు అజీబ్ ఈ కేసుని పరిష్కరించాడా లేదా అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?మలయాళంలో పోలీస్ నేపథ్యంతో ఎన్ని సినిమాలు తీస్తారో ఏమో గానీ ప్రతి నెల ఒకటి రెండు చొప్పున వస్తున్నట్లే ఉంటాయి. అలా రీసెంట్గా రిలీజైన మూవీ 'ఉయిర్'. ఈ పదానికి తెలుగులో 'ప్రాణం' అని అర్థం. సినిమా విషయానికొస్తే చాలా సహజంగా ఉంది. అదే టైంలో థ్రిల్ కూడా పర్లేదు. ఇక్కడ పర్లేదు అని ఎందుకున్నానంటే కథ పరంగా మంచి లైన్. కాకపోతే ట్విస్టులు, హై మూమెంట్స్ వచ్చినా మనం ఫీల్ కాలేకపోతాం. ఫ్లాట్గా అనిపిస్తుంది. ఓ మహిళ శవం దొరికిన తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుందనుకుని అంత్యక్రియలు చేసేస్తే తర్వాత అది హత్య అని తేలితే.. కొత్తగా పోలీస్ అయి, ఈ కేసుని విచారించిన అధికారి ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటాడు? దీనిని ఎలా పరిష్కరిస్తాడు? అనే విషయాలే ఈ సినిమా స్టోరీ. హీరో చిన్నప్పుడు ట్రైన్లో తన కుటుంబంతో కలిసి ప్రయాణించే సీన్తో మూవీ మొదలవుతుంది. అప్పుడు తన సోదరి తప్పిపోతుంది. కట్ చేస్తే ప్రస్తుతానికి స్టోరీ వచ్చేస్తుంది.అజీబ్.. ప్రొబెషనరీ ఎస్సైగా విధుల్లో చేరడం, ఓ శవం దొరకడం, పై అధికారులు ఈ కేసుని ఇతడికి అప్పగించడం.. ఇలా ఏదో జరగబోతుందనే ఆసక్తితో స్టోరీ వెళ్తూ ఉంటుంది. ఏంటి ఇంత సింపుల్గా వెళ్తుందా అని అనుకుంటాం. ఇంటర్వెల్ టైంకి కేసు పరిష్కారం కూడా అయిపోతుంది. అదేంటి ఇంతేనా అనుకునే టైంకి ట్విస్ట్. ఆమె వ్యక్తిగత జీవితం తెరపైకి వస్తుంది. దాన్ని చూపించిన విధానం పర్లేదనిపించేలా ఉంది.సినిమా ఓవరాల్గా బాగుంది కానీ ఫస్టాప్లో పాత్రల మార్పుతో వచ్చే సీన్లు ఉంటాయి. మొదటిది చూపించిన తర్వాత మళ్లీ పాత్రలని మార్చి రిపీట్ చేస్తారు. దానిని మాంటేజ్ రూపంలో సింపుల్గా తేల్చేస్తే సరిపోతుంది. కానీ మళ్లీ చూపించేసరికి సాగదీసినట్లు అనిపిస్తుంది. కథలో భాగంగానే వచ్చే ఐటమ్ సాంగ్ కూడా స్టోరీకి అవసరం లేదు. ఇక ప్రీ క్లైమాక్స్ వరకు పెద్దగా హడావుడి లేకుండానే వెళ్లిన స్టోరీ.. క్లైమాక్స్కి వచ్చేసరికి ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. గుండె బరువెక్కిస్తుంది.క్లైమాక్స్లో ముంబై నేపథ్యంగా సాగే పిల్లల సీన్స్ అయితే చిన్నపాటి భయాన్ని కలిగిస్తాయి. సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలని ఆయా సన్నివేశాల్లో చూపించిన విధానం, ఎంత పెద్ద పోలీసులైనా సరే నిస్సహయులుగా ఎలా ఉండాల్సి వస్తుందో చూపించారు. ఈ సినిమాలో పోలీస్ పాత్రలు తెలుగులోనే మాట్లాడుతుంటాయి. చనిపోయిన మహిళ, ఆమె భర్త, మిగతా కొన్ని పాత్రధారుల నేపథ్యం తమిళనాడు, కర్ణాటక అన్నట్లు చూపించిన కారణంగా డబ్బింగ్ సినిమా అయిప్పటికీ కన్నడ, తమిళ డైలాగ్స్ వినిపిస్తుంటాయి. మూవీ అంతా అయిపోయిన తర్వాత ఇదంతా నిజంగానే జరిగిందనే సంగతి బయటపెడతారు.యాక్టింగ్ వియానికొస్తే అజీబ్ అనే పోలీస్గా చేసిన రోషన్ మాథ్యూ ఆకట్టుకున్నాడు. మిగిలిన పాత్రధారులు కూడా కథకు తగ్గట్లు నటించారు. ఎవరూ కూడా యాక్టర్స్ అనే ఫీలింగ్ రాదు. అంతలా జీవించేశారు. సినిమాటోగ్రఫీ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పాతదిలా అనిపిస్తుంది గానీ పర్లేదు బాగానే ఉంది. ఓ పావు గంట నిడివి కట్ చేసినా పర్లేదనిపించింది. అసభ్యకర సీన్స్ ఏం లేవు. కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు. ఓవరాల్గా ఇదో పర్లేదనిపించే థ్రిల్లర్.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఒకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు) -
ఒకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం అలా.. ఓ సుకుమారి, లెనిన్, హృదయం మురళి, వంద దేవుళ్లు, ఉయిర్, మై వాపస్ ఆవుంగా లాంటి స్ట్రెయిట్, డబ్బింగ్ చిత్రాలు రాబోతున్నాయి. వదంది 2, ఆపరేషన్ సఫేద్ సాగర్ లాంటి డబ్బింగ్ సిరీస్లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇవలా ఉండగానే సడన్గా రెండు తెలుగు మూవీస్ ఓటీటీలోకి వచ్చేశాయి.(ఇదీ చదవండి: ఇది తెలుసా? ప్రదీప్ రావత్ తెలుగింటి అల్లుడే)ఈ ఏడాది మార్చి 05న థియేటర్లలో రిలీజైన 'విధాత' (2026) ఓ తెలుగు యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. భావోద్వేగాలతో పాటు క్రైమ్, సస్పెన్స్ అంశాలు ఇందులో ఉన్నాయి. మణికాంత రాజేంద్రబాబు దర్శకత్వం వహించగా భాస్కరాచారి, శ్రీనివాసులు నాయుడు, సురేష్ అప్పలబట్ల ప్రధాన పాత్రలు చేశారు. ఇప్పుడీ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి రెంట్ విధానంలో స్ట్రీమింగ్లోకి వచ్చింది.అప్సరరాణి, నైనిక అనసూయ, జయశ్రీ, నీలిమ చౌదరి ప్రధాన పాత్రలు చేసిన ఆంథాలజీ తెలుగు మిస్టరీ థ్రిల్లర్ సినిమా 'డార్క్ సీక్రెట్స్'. ఇదయితే నేరుగా హంగామా ఓటీటీలో రిలీజైంది. అద్దె విధానంలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోనూ స్ట్రీమింగ్లోకి వచ్చింది. నలుగురు అమ్మాయిల జీవితాల్లోని రహస్యాల నేపథ్య కథతో దీన్ని తెరకెక్కించారు.'అన్ ఐడెంటిఫైడ్' అనే అరబిక్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా గతేడాది సెప్టెంబరులో సౌదీ అరేబియాలోని థియేటర్లలో రిలీజైంది. ఈ ఏడాది జూన్లో మిగతా దేశాల్లో విడుదలైంది. ఇప్పుడీ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతుంది. సౌదీలో జరిగిన నిజజీవిత సంఘటనల ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. ఎడారిలో దొరికిన టీనేజీ అమ్మాయి అనాథ శవం నేపథ్యం దీని స్టోరీ. (ఇదీ చదవండి: విజయ్ కాదు మహేశ్ ఆ సినిమా చేయాలి.. ఒక్క సీన్ కారణంగా) -
బిగ్బాస్ తనూజ ఓటీటీ ఎంట్రీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
బిగ్బాస్ రియాలిటీ షోతో మరింత ఫేమస్ వారిలో తనూజ ఒకరు. బిగ్బాస్ తెలుగు సీజన్- 9లో ఆమె రన్నరప్గా నిలిచారు. తాజాగా ఈ బ్యూటీ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. తనూజ లీడ్ రోల్లో సరికొత్త వెబ్ సిరీస్ రానుంది. పార్ట్ టైమర్స్ పేరుతో ఈ సిరీస్ను తెరకెక్కించారు. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని ఖరారు చేశారు.ఈ టాలీవుడ్ వెబ్ సిరీస్ ఆగస్టు 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అఫీషియల్గా ప్రకటించింది. జియో హాట్స్టార్ వేదికగా ఈ వెబ్ సిరీస్ సినీ ప్రియులను అలరించనుంది. ఈ సిరీస్లో తనూజతో పాటు జ్ఞానేశ్వరి కాండ్రేగుల కీలక పాత్రలో కనిపించనుంది. 30 ఏళ్లలోపే బిజినెస్లో సక్సెస్ కావాలని ఇద్దరు యువతుల కథగా ఈ సిరీస్ను తెరకెక్కించినట్లు పోస్టర్స్ చూస్తే అర్థమవుతోంది. -
ఓటీటీలో క్రేజీ సైకలాజికల్ హారర్ సినిమా
ఎప్పుడూ రెగ్యులర్ కామెడీ, థ్రిల్లర్స్ కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్ సినిమాలు కూడా వస్తుంటాయి. అలాంటి ఓ చిత్రమే ఇది. దెయ్యమే ఉండదు కానీ భయపెడుతుంది. సైన్స్ ఫిక్షన్ సైకలాజికల్ హారర్ కాన్సెప్ట్తో తీశారు. థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)కొన్ని నెలల క్రితం వచ్చిన 'అబ్సెషన్' ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీన్ని తీసింది ఓ యూట్యూబర్. అలానే అమెరికాకు చెందిన 21 ఏళ్ల మరో యూట్యూబర్ కేన్ పర్సన్సో తీసిన సైకలాజికల్ హారర్ మూవీ 'బ్యాక్ రూమ్స్'. విదేశాల్లో మే నెల చివరలో థియేటర్లలో రిలీజ్ కాగా మన దగ్గర జూన్ 12న విడుదలైంది. ప్రేక్షకులని భయపెడుతూనే చిత్రమైన అనుభూతినిచ్చింది. ఇప్పుడీ చిత్రాన్ని సోనీ లివ్ ఓటీటీలో ఈ నెలలోనే స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. తేదీ చెప్పలేదు. అయితే ఈనెల 14న లేదంటే 21న అందుబాటులోకి వచ్చే అవకాశముంది.'బ్యాక్ రూమ్స్' విషయానికొస్తే.. క్లార్క్ (ఎజియోఫర్) ఓ ఫర్నీచర్ దుకాణంలో పనిచేస్తుంటాడు. ఓ రోజు ఇదే షాపులో దిగువన ఉండే ఓ రహస్య ప్రదేశంలోకి అనుకోకుండా వెళ్తాడు. మొత్తం పసుపు రంగులోనే ఉన్న అంతులేని ఖాళీ గదులు దర్శనమిస్తాయి. ఆ వింత ప్రదేశం నుండి బయటపడే క్రమంలో ఊహించని ప్రమాదాలు, విచిత్రమైన శబ్దాలు, భయపెట్టే అనుభవాలు ఎదురవుతాయి. ఇంతకీ ఈ ఖాళీ గదుల సంగతేంటి? దీని నుంచి క్లార్క్ ఎలా బయటపడ్డాడు అనేది మిగతా స్టోరీ.ఈ మూవీ రెగ్యులర్ చిత్రాలతో పోలిస్తే సరికొత్త అనుభూతి కలిగిస్తుంది. దెయ్యం లాంటివి ఏం లేనప్పటికీ హారర్ ఫీల్ తీసుకురాగలిగింది. పసుపు గదుల సెటప్ అయితే భయపెట్టేలా ఉంటుంది. అసలు ఇదంతా ఎలా డిజైన్ చేశారా అని సందేహం కలుగుతుంది. మరి ఓటీటీలో ఇంగ్లీష్ వెర్షనే రిలీజ్ చేస్తారా? తెలుగులోనూ డబ్బింగ్ చేసి తీసుకొస్తారా అనేది చూడాలి? ఇదివరకే ఇది అమెజాన్ ప్రైమ్లోకి వచ్చింది గానీ అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది!(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా)Not every place wants to be found......but this one might just find you.Backrooms. Streaming Soon on Sony LIV.#Backrooms #KaneParsons #A24 #SonyLIV pic.twitter.com/XZ57uhRoHZ— Sony LIV (@SonyLIV) August 4, 2026 -
ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా
ప్రతివారం ఓటీటీలోకి కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. దాదాపు నెల, ఆ తర్వాతే స్ట్రీమింగ్ అవుతుంటాయి. కొన్నిసార్లు మాత్రం మరీ మూడు వారాలకే డిజిటల్ రిలీజ్ చేసేస్తుంటారు. ఇప్పుడు అలానే ఓ తెలుగు మూవీకి సంబంధించిన ఓటీటీ అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎప్పుడు ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: తెలుగులో స్ట్రీమింగ్లోకి వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)'సంక్రాంతి వస్తున్నాం'తో మంచి ఫేమ్ తెచ్చుకున్న తెలుగమ్మాయి ఐశ్వర్యా రాజేశ్.. తర్వాత పలు చిత్రాలు చేసింది. వాటిలో 'ఓ సుకుమారి' ఒకటి. తిరువీర్ హీరో కాగా భరత్ దర్శన్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. రూరల్ కామెడీ రొమాంటిక్ కథతో తీసిన ఈ చిత్రం గత నెల 17న థియేటర్లలో రిలీజైంది. ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు మూడు వారాలు తిరిగేసరికల్లా అంటే ఈ శుక్రవారం (ఆగస్టు 07) నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు.'ఓ సుకుమారి' విషయానికొస్తే.. యాదగిరి(తిరువీర్) తన పక్క ఊరిలోని ఓ అమ్మాయిని చూడటానికి వెళ్లి దామిని(ఐశ్వర్య రాజేశ్)పై మనసు పడతాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు. ఆ ఊళ్లో కూడా ఎలాగైనా దామినికి పెళ్లి చేసి సాగనంపాలనేది గ్రామస్తుల ప్లాన్. దానికి కారణం ఆమెకొక విచిత్రమైన సమస్య ఉండటమే. ఆమెను ముట్టుకోగానే షాక్ కొడుతుంది. ఆ సమస్య వల్ల ఊళ్లో వాళ్లు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతుంటారు. అందుకే యాది ఇష్టపడటమే ఆలస్యం... ఊరంతా కలిసి దామిని పెళ్లిని ఘనంగా చేసి సాగనంపుతుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన ఫీల్ గుడ్ సినిమా.. 'చిన్న చిన్న ఆశై' తెలుగు రివ్యూ)అసలు చిక్కులు తర్వాతే మొదలవుతాయి. ముట్టుకుంటేనే షాక్ కొట్టే దామినితో యాదగిరి కాపురం ఎలా చేశాడు? అత్తారింట్లో దామిని ఎలా కలిసిపోయింది? ఆమెకున్న షాక్ సమస్యని తన భర్త, ఊరి జనాలు ఎప్పుడు ఎలా తెలుసుకున్నారు? యాది పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం వెనకున్న బలమైన ఆ కారణాలేమిటి? అనేది మిగతా స్టోరీ.ఇకపోతే ఈ వారం ఈ సినిమాతో పాటు లెనిన్, హృదయం మురళి, వంద దేవుళ్లు, ఉయిర్, మై వాపస్ ఆవుంగా తదితర హిట్ చిత్రాలు.. అలానే వదంది 2, ఆపరేషన్ సఫేద్ సాగర్ లాంటి డబ్బింగ్ సిరీస్లు కూడా స్ట్రీమింగ్ కానున్నాయి. మొత్తంగా 23 వరకు మూవీస్, సిరీస్లు అందుబాటులోకి రాబోతున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలో భార్యభర్తల కామెడీ సినిమా 'గట్ట కుస్తీ 2' తెలుగు రివ్యూ) -
ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో పాటు కేజేక్యూ, అనకాపల్లి, అమ్మ నాకు అబ్బాయి కావాలి అనే తెలుగు మూవీస్ రిలీజ్ కానున్నాయి. అలానే లోకేశ్ కనగరాజ్ హీరోగా పరిచయమవుతున్న 'డిసి', మాధవన్ 'జీడీ నాయుడు' లాంటి డబ్బింగ్ చిత్రాలు రాబోతున్నాయి. మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా దూకుడు రీ రిలీజ్ (ఆగస్టు 09) కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.(ఇదీ చదవండి: ఓటీటీలో భార్యభర్తల కామెడీ సినిమా 'గట్ట కుస్తీ 2' తెలుగు రివ్యూ)మరోవైపు ఓటీటీల్లో ఈ వీకెండ్ చాలానే క్రేజీ సినిమాలు రాబోతున్నాయి. జాబితాలో దాదాపు 23 వరకు మూవీస్, సిరీస్లు ఉన్నాయి. వాటిలో లెనిన్, హృదయం మురళి (ఇదయం మురళి), వంద దేవుళ్లు (నూరు సామి), మై వాసప్ ఆవుంగా లాంటి హిట్స్ ఉన్నాయి. వీటికి తోడు ఆపరేషన్ సఫేద్ సాగర్, వదంది 2 లాంటి డబ్బింగ్ సిరీస్లు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఆగస్టు 03 నుంచి 09 వరకు)జీ5లెనిన్ (తెలుగు మూవీ) - ఆగస్టు 07వంద దేవుళ్లు (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 07తుంబడ్ చీ మంజులా (మరాఠీ మూవీ) - ఆగస్టు 07అమెజాన్ ప్రైమ్ఈవిల్ డెడ్ బర్న్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 04 (రెంట్)స్టెర్లింగ్ పాయింట్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 05వదంది 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఆగస్టు 07నెట్ఫ్లిక్స్బ్యాడ్లీ ఇన్ లవ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 04బిగ్ చికెన్: ఏ ఫాస్ట్ఫుడ్ కాన్సిపరసీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - ఆగస్టు 05ఇన్సైడ్ ద ట్రస్టెడ్ స్కాండల్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - ఆగస్టు 05మై లైఫ్ విత్ ద వాల్టర్ బాయ్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 06ఇదయం మురళి (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 07ఆపరేషన్ సఫేద్ సాగర్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఆగస్టు 07ద లాస్ట్ హౌస్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 07మై వాపస్ ఆవుంగా (హిందీ సినిమా) - ఆగస్టు 07రికీ గెర్వైస్ ఆలే క్యాట్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 07అవర్ స్టిక్కీ లవ్ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 07డెత్ ఇంక్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 07ద రిబ్బన్ హీరో (జపనీస్ ఏనిమే మూవీ) - ఆగస్టు 08హాట్స్టార్ఉయిర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 04ద షార్డ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 05ద సూపర్ మారియో గెలక్సీ (ఇంగ్లీష్ చిత్రం) - ఆగస్టు 07మనోరమ మ్యాక్స్కాట్టలన్ (మలయాళ మూవీ) - ఆగస్టు 07ఆపిల్ టీవీ ప్లస్టెడ్ లాసో సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 04(ఇదీ చదవండి: తెలుగులో స్ట్రీమింగ్లోకి వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా) -
ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వీకెండ్ అలా బాలన్, గట్ట కుస్తీ 2, చిన్న చిన్న ఆశై, రావు బహదూర్, సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం, లవ్ ఓ లవ్, పోలీస్ కంప్లైంట్, దీవాన, హై జవానీ తో ఇష్క్ హోనా హై తదితర తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ స్ట్రీమింగ్లోకి వచ్చాయి. వీటి సంగతి పక్కనబెడితే ఇప్పుడో తమిళ రొమాంటిక్ కామెడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది.(ఇదీ చదవండి: ఓటీటీలో భార్యభర్తల కామెడీ సినిమా 'గట్ట కుస్తీ 2' తెలుగు రివ్యూ)అధర్వ, తమన్, ఫహాద్ ఫాజిల్, నిహారిక ఎన్ఎమ్, ప్రీతి ముకుందన్, కాయదు లోహర్ ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'ఇదయం మురళి'. తెలుగులో దీన్ని 'హృదయం మురళి' పేరుతో గత నెల 10వ తేదీన రిలీజ్ చేశారు. ప్రేమకథతో తీసిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ మూవీ శుక్రవారం(ఆగస్టు 07) నుంచి నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగులోనూ అందుబాటులోకి రానుంది.'హృదయం మురళి' విషయానికొస్తే.. హృదయ(అధర్వ) అనే కుర్రాడు మామయ్య దగ్గర పెరుగుతాడు. స్కూల్లో ఉన్నప్పుడు గీత టీచర్(జోనితా గాంధీ), ట్యూషన్లో సమంత (ప్రీతి ముకుందన్), కాలేజీ టైంలో అముద (కయాదు)ని ప్రేమిస్తాడు. కానీ ఒక్కరికీ తన ప్రేమని వ్యక్తపరచలేకపోతాడు. అదితి (మాళవిక మోహనన్)ని పెళ్లి చేసుకోవడానికి మరో పదిరోజులు ఉందనగా తన మనసులో ఉండిపోయిన ప్రేమని వ్యక్తపరిచేందుకు ఫ్రెండ్స్తో కలిసి న్యూయార్క్ వెళ్తాడు. తర్వాత ఏమైంది? సమంత, అముద, అదితిల్లో ఎవరిని పెళ్లాడాడు? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: పూజా హెగ్డే.. పెద్దలు కుదిర్చిన పెళ్లి?) -
ఓటీటీలో భార్యభర్తల కామెడీ సినిమా.. తెలుగు రివ్యూ
సాధారణంగా హిట్ అయిన సినిమాలకు సీక్వెల్ తీస్తుంటారు. కానీ నాలుగేళ్ల క్రితం థియేటర్లలో రిలీజై పెద్దగా ఆడని చిత్రానికి రెండో భాగాన్ని తీశారు. అదే 'గట్ట కుస్తీ 2'. గత నెలలో తమిళంలో విడుదలై ఊహించని సక్సెస్ అందుకుంది. రూ.50 కోట్లకు పైగా కలెక్షన్ సాధించింది. రెండు రోజుల క్రితం నెట్ఫ్లిక్స్లో తెలుగులోనూ స్ట్రీమింగ్లోకి వచ్చింది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి అఖిల్ 'లెనిన్'.. అధికారిక ప్రకటన)కథేంటి?తన భార్య కీర్తి(ఐశ్వర్య లక్ష్మి)ని రెజ్లింగ్ ఛాంపియన్ చేస్తానని మాట ఇచ్చిన వీర(విష్ణు విశాల్) దాన్ని నిలబెట్టుకుంటాడు. రైల్వేలో ఆమె ఉద్యోగం చేస్తుండటంతో వీర, హౌస్ హజ్బెండ్గా మారి ఇంటి పనులన్నీ చూసుకుంటూ ఉంటాడు. కూతురు మది(జారా)కి స్నానం చేయించడం, స్కూల్లో దిగబెట్టడం, మళ్లీ తీసుకురావడం లాంటివన్నీ చేస్తుంటాడు. ఇలా ఎంతో అన్యోన్యంగా ఉన్న వీళ్ల సంసారంలో రెజ్లింగ్ కోచ్(తారక్ పొన్నప్ప) కారణంగా మనస్పర్థలు వస్తాయి. కీర్తి-వీర విడివిడిగా ఉండాల్సి వస్తుంది. అసలేమైంది? చివరకు భార్యభర్తలిద్దరూ ఒక్కటయ్యారా లేదా అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?భార్యభర్తల నేపథ్యంగా సాగే కామెడీ సినిమాలకు పెద్దగా కథ అవసరం లేదు. కుటుంబ ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా గిల్లికజ్జాలు, హాస్యం, ఎమోషన్స్, గ్లామర్ టచ్ ఇస్తే చాలు. 'గట్ట కుస్తీ 2' విషయంలో అలానే చేశారు. నాలుగేళ్ల క్రితం వచ్చిన తొలి పార్ట్ ఓ మాదిరిగా ఆడింది. అయితే అందులో ఉన్నట్లే ఇందులోనూ భార్యభర్తల కామెడీ చూపిస్తూ రెండున్నర గంటలు ఎంటర్టైన్ చేసేశారు.వీర తన ఇంటి బాధ్యతల్ని చూసుకోవడంతో సినిమా మొదలవుతుంది. ఓవైపు కీర్తి రెజ్లింగ్లో రోజురోజుకు ఎదుగుతుండగా.. మరోవైపు వీర డైలీ రొటీన్ సాగుతూ ఉంటుంది. అయితే తన భర్త.. కూతురి స్కూల్ టీచర్ వైపు ఆకర్షితుడవుతున్నాడని తెలిసి రుసరుసలు మొదలవుతాయి. అలా సరదాసరదాగా ఫస్టాప్ సాగిపోతుంది. ఎప్పుడైతే వీర అనుకోకుండా చేసిన ఓ పనివల్ల కీర్తి ఓ మ్యాచ్లో ఓడిపోతుందో కథలో సంఘర్షణ మొదలవుతుంది.ఫస్టాప్ అంతా కామెడీగా సాగతుంది. ఇంటర్వెల్ తర్వాత మాత్రం ఎమోషనల్, కామెడీ, కోర్టు, లాయర్ తదితర సన్నివేశాలు మరింతగా ఎంటర్టైన్ చేస్తాయి. ముఖ్యంగా తండ్రీకూతుళ్ల మధ్య వచ్చే సీన్స్, స్కూల్ టీచర్తో వీర చేసే డ్యాన్స్, హంగామా నవ్విస్తుంది. స్టోరీ అంతా కామెడీగా చూపిస్తున్నప్పటికీ ప్రస్తుత సమాజంలో మహిళలు ఎలాంటి వేధింపులు ఎదుర్కొంటున్నారు. తమని తాము కాపాడుకునేందుకు చిన్నప్పటి నుంచే వాళ్లకు ఆత్మరక్షణ ఎందుకు అవసరం? లాంటి విషయాల్లో ఇచ్చిన మెసేజ్ కూడా బాగుంది.విడాకుల కోసం నిర్వహించే కుస్తీ పోటీని క్లైమాక్స్లో రొమాంటిక్గా డిజైన్ చేయడం మంచి వినోదాన్ని పంచుతూనే మాస్ ఆడియెన్స్ని ఆకట్టుకుంటుంది. భార్య లేదా భర్త గెలిస్తే కథలో మజాపోయే అవకాశముంటుంది. అందుకే ఇద్దరికీ సమప్రాధాన్యం ఇచ్చేలా చేయడం ఆసక్తికరంగా అనిపించింది. అయితే భార్యభర్తల గొడవలోకి మూడో వ్యక్తి రాకూడదనే సందేశాన్ని చివరలో చూపించడం బాగుంది. తర్వాత ఏం జరుగతుందో ఊహించేలా ఉండటం ఈ మూవీకి మైసన్.వీరగా విష్ణు విశాల్ ఆకట్టుకున్నాడు. చెప్పాలంటే ఇతడి కంటే కీర్తి పాత్ర చేసిన ఐశ్వర్య లక్ష్మిని బాగా చూపించారు. గ్లామర్ పరంగా చీరలో ఈమెని, స్కూల్ టీచర్గా చేసిన మోక్షని భలే గ్లామరస్గా చూపించారు. వీళ్ల తర్వాత వీర-కీర్తి కూతురిగా చేసిన జారా క్యూట్గా అదరగొట్టేసింది. మూవీ మొత్తం అయిపోయిన తర్వాత వీళ్ల ముగ్గురితో ప్రేమలో పడిపోతాం. మిగిలిన వాళ్లలో కరుణాస్, మునిష్కాంత్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమాటోగ్రఫీ బాగుంది. పాటలు సందర్భానికి తగ్గట్లు సాగిపోయాయి. తెలుగు డబ్బింగ్ సరిగ్గా సరిపోయింది. ఓవరాల్గా చెప్పుకొంటే మంచి టైమ్ పాస్ మూవీ ఇది. కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన ఫీల్ గుడ్ సినిమా 'చిన్న చిన్న ఆశై' తెలుగు రివ్యూ) -
ఓటీటీలో దూసుకెళ్తోన్న హిట్ మూవీ.. నంబర్వన్గా ట్రెండింగ్
విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన స్పోర్ట్స్ కామెడీ చిత్రం గట్ట కుస్తీ-2. ఈ సినిమాకు చెల్లా అయ్యావు దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూలై 3న థియేటర్లలో విడుదలైంది. ఈ కామెడీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద సినీ ప్రియులను మెప్పించింది. ఈ చిత్రంలో రమ్య కృష్ణన్, యోగి బాబు, కరుణాస్ కీలక పాత్రల్లో నటించారు.ఈ మూవీ జూలై 31 నుంచే నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం ఓటీటీలోనూ అదరగొడుతోంది. స్ట్రీమింగ్కు వచ్చిన రెండు రోజుల్లోనే నంబర్వన్ ప్లేస్లో ట్రెండ్ అవుతోంది. ఇండియావ్యాప్తంగా ట్రెండింగ్ సినిమాల లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతోంది. కాగా.. గతంలో వచ్చిన మట్టి కుస్తీకి సీక్వెల్గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈ చిత్రాన్ని థియేటర్లలో కేవలం తమిళంలోనే విడుదల చేశారు. అయితే ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. -
ఓటీటీలో ఇంటెన్స్ ప్రేమకథా సినిమా.. అధికారిక ప్రకటన
ప్రేమకథలు సరిగా తీయాలే గానీ ప్రేక్షకుల్ని అలరిస్తాయి. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తాయి. అలా రీసెంట్ టైంలో ఆకట్టుకున్న చిత్రం 'మై వాపస్ ఆవుంగా'. హిందీ భాషలో తీసిన ఈ మూవీ ఇంటెన్స్ ఎమోషనల్ ప్రేమకథగా తెరకెక్కించారు. బిగ్ స్క్రీన్ పై అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. అధికారికంగా అప్డేట్ ఇచ్చేశారు.(ఇదీ చదవండి: తెలుగులో స్ట్రీమింగ్లోకి వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)ఈ చిత్రంలో నసీరుద్దీన్ షా, దిల్జీత్ దోసాంజే, వేదాంగ్ రైనా, శార్వరి వాఘ్ తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించాడు. జూన్ 11న పెద్దగా అంచనాల్లేకుండానే థియేటర్లలో రిలీజై ఇప్పటికీ ప్రదర్శితమవుతూ మంచి వసూళ్లు సాధిస్తోంది. ఇప్పుడీ చిత్రాన్ని ఈ నెల 07వ తేదీ నుంచి అంటే వచ్చే శుక్రవారం నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ చేయనున్నారు.భారత్-పాక్ విభజన జరిగిన టైంలో ఇద్దరు ప్రేమికులు విడిపోతారు. ఏళ్లు గడిచిపోయిన తర్వాత సదరు ప్రేమికుడు.. వృద్ధుడు అవుతాడు. ప్రియురాలిని మళ్లీ కలవాలనే ఇతడి ఆశయాన్ని నెరవేర్చేందుకు మనవడు సరిహద్దులు దాటి పాకిస్తాన్ వెళ్తాడు. తర్వాత ఏమైంది? చివరకు అనుకున్నది చేశారా లేదా అనేదే మిగతా స్టోరీ. (ఇదీ చదవండి: ఓటీటీలోకి అఖిల్ 'లెనిన్'.. అధికారిక ప్రకటన) -
తెలుగులో స్ట్రీమింగ్లోకి వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా
ఓటీటీలు అనగానే దాదాపు అందరికీ థ్రిల్లర్ సినిమాలే గుర్తొస్తాయి. అందుకు తగ్గట్లే మలయాళీ దర్శకులు ఎక్కువగా ఈ జానర్ మూవీస్ తీస్తుంటారు. వీటికి ఓటీటీల్లో అద్భుతమైన ఆదరణ దక్కుతూ ఉంటుంది. అప్పుడప్పుడు కన్నడం నుంచి థ్రిల్లర్స్ వస్తుంటాయి. అలాంటి ఓ మూవీనే 'సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం'. చాన్నాళ్ల క్రితమే ఇది ఓటీటీలోకి వచ్చినప్పటికీ ఇప్పుడు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ దీని సంగతి ఏంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: విజయ్ సీఎం కావడంపై ఎట్టకేలకు స్పందించిన కొడుకు)2021లో రిలీజైన 'సీతారాం బెనోయ్: కేస్ నంబర్ 18' సినిమాకు సీక్వెల్ ఇది. విజయ్ రాఘవేంద్ర హీరో కాగా దేవిప్రసాద్ శెట్టి దర్శకుడు. సస్పెన్స్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కథతో ఈ మూవీని తెరకెక్కించారు. కొన్నాళ్ల క్రితం తొలుత అమెజాన్ ప్రైమ్ ఓటీటీ కన్నడలో ఆపై హిందీ, తమిళంలో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్నట్లు ప్రకటించారు.'సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం' విషయానికొస్తే.. మొదటి కేసులో భాగంగా భార్యని పోగొట్టుకొని ఒంటరిగా జీవిస్తుంటాడు పోలీస్ అధికారిక సీతారాం(విజయ్ రాఘవేంద్ర). ఆనెగడ్డ గ్రామంలోనే పనిచేస్తూ ఉంటాడు. అంతా ప్రశాంతంగా ఉందనుకునే టైంలో మళ్లీ వరస హత్యలు కలకలం రేపుతాయి. గుర్తు తెలియని వ్యక్తి కొందరు వ్యక్తుల మెడ, చేతులకు గొలుసులు కట్టి అతి కిరాతకంగా చంపేస్తుంటాడు. దీంతో గ్రామస్థులు హడలిపోతారు. ఈ హత్యల్ని సీతారాం ఇన్వెస్టిగేట్ చేస్తాడు. మరి వీటి వెనుకున్న సైకో కిల్లర్ ఎవరు? అసలెందుకు చేస్తున్నాడు? చివరకు ఈ కిల్లర్ని సీతారాం పట్టుకున్నాడా? లేదా అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి అఖిల్ 'లెనిన్'.. అధికారిక ప్రకటన) -
ఓటీటీలోకి అఖిల్ 'లెనిన్'.. అధికారిక ప్రకటన
అక్కినేని హీరో అఖిల్ కెరీర్లో అందుకున్న తొలి సక్సెస్ 'లెనిన్'. గత నెలలో థియేటర్లలో రిలీజై ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ ఓవరాల్గా రూ.100 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. ఈ విషయాన్ని రెండు రోజుల క్రితమే నిర్మాతలు ప్రకటించారు. ఇకపోతే ఇప్పుడీ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇంతకీ ఎందులోకి రానుంది?అఖిల్, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా నటించిన రూరల్ యాక్షన్ సినిమా 'లెనిన్'. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకుడు కాగా నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు. జూలై 10న థియేటర్లలో రిలీజైంది. బాగానే అలరించింది. ఇప్పుడీ చిత్రాన్ని ఈనెల 7వ తేదీ నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు.'లెనిన్' విషయానికొస్తే.. చిత్తూరు జిల్లాలోని శ్రీరామాపురం అనే ఊరిలో ప్రతి ఏటా ద్రౌపది అమ్మ గుడిలో పద్దెనిమిదిరోజుల జాతర జరుగుతుంది. అనాథ అయిన లెనిన్ (అఖిల్) చిన్నతనంలో అక్కడికి వస్తాడు. ఓ సందర్భంలో జయంతి(ఈశ్వరీరావు) ఇతడి గురించి కనుక్కొని అనాథ అని తెలిసి తన ఇంటికి తీసుకెళ్తుంది. తన కన్న కొడుకు వసంత్ (ప్రమోద్)తో పాటే పెంచి పెద్దచేస్తుంది. వసంత్ మద్రాసులో చదువుకొని డాక్టర్ అయి ఊరికి తిరిగొస్తాడు. లెనిన్ మాత్రం చదువుకోకుండా ఊరిలో ఉండిపోతాడు.ఓ ఏడాది జాతర టైంలో భారతి(భాగ్యశ్రీ బోర్సే)ని చూసి లెనిన్ ప్రేమలో పడతాడు. ఆమె కూడా లెనిన్ని ఇష్టపడుతుంది. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా భారతిని వసంత్కి ఇచ్చి పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయిస్తారు. మరి దీని తర్వాత ఏమైంది? ఈ కథలో యతిరాజులు (శివాజీ), దామోదర్ (బ్రహ్మాజీ), పార్థసారథి(సునీల్) ఎవరు? ఈ మహాభారతంలో అసలు విలన్స్ ఎవరు? లెనిన్ చివరకు ఏమయ్యాడు? అనేది మిగతా స్టోరీ.The roar begins. 🔥A story of love, revenge, and revolution is all set to take over your screens.#Lenin premieres on August 7, exclusively on Telugu ZEE5.#BlockbusterLENIN@akkineniakhil @BhagyashriBose @nagavamsi19 @KishoreAbburu @MusicThaman pic.twitter.com/erTH7OLf5W— ZEE5 Telugu (@ZEE5Telugu) August 1, 2026 -
ఓటీటీకి వంద దేవుళ్లు.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘వంద దేవుళ్లు’. ఈ మూవీకి శశి దర్శకత్వం దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య జూన్ 19న రిలీజైన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. బిచ్చగాడు కాంబో రిపీట్ అయిన అంతగా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. అయితే ఈ సినిమా ద్వారా ఇచ్చిన సందేశం బాగుందనే ప్రశంసలు దక్కించుకుంది.తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ మూవీ రైట్స్ను జీ5 దక్కించుకోగా.. స్ట్రీమింగ్ తేదీని కూడా ఖరారు చేసింది. ఈ చిత్రాన్ని ఆగస్టు 7 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ ప్రత్యేక పోస్టర్ షేర్ చేసింది. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది.వంద దేవళ్లు కథేంటంటే..పాతికేళ్ల వయసులోనే వాసవి(శ్వాసిక) భర్తను కోల్పోతుంది. దీంతో ఇద్దరు పిల్లలకు అన్నీ తానై పోషించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సొంత కుటుంబం నుంచి ఎలాంటి సపోర్ట్ దక్కదు. మరోవైపు మగ దిక్కులేని ఆడదనే అలుసుతో వంకర బుద్ది ఉన్న మగాళ్లంతా ఆమె గురించి మరోలా మాట్లాడతారు. అర్థరాత్రి ఇంట్లో లైట్ వెలిగినా అనుమానిస్తారు. ఇవన్నీ భరిస్తూ ఇద్దరు కొడుకులు భాస్కర్(అజయ్ దిషాన్), వివేక్ (శక్తి)లను పెంచి పెద్ద చేస్తుంది. భాస్కర్ బీటెక్ చేస్తున్న సమయంలోనే మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన చేస్తుంది వాసవి. ఈ విషయాన్ని స్కూల్ మాస్టర్ ద్వారా కొడుకులను చెప్పిస్తుంది. అమ్మ మళ్లీ పెళ్లి చేసుకోవాలనే నిర్ణయాన్ని ఇద్దరు కొడుకులు స్వాగతించారా లేదా? 42 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోతుందనే విషయం తెలిసిన తర్వాత బంధువులు, సమాజం నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? వాసవి జీవితంలోకి ఏడు కొండలు(విజయ్ ఆంటోనీ) వచ్చిన తరువాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? చివరకు వాసవి మళ్లీ పెళ్లి చేసుకుందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. An emotional family entertainer is ready to warm your heart...❤️🔥Family blockbuster of the year #NooruSaami premieres on August 7th on Tamil Zee5.❤️@vijayantony #Sasi @vijayantonyfilm @AJDhishan990 #Swasika @karunaasethu @jose_lijomol @Sakthi_Raj7 #BalajiSakthivel @kavyaanil_… pic.twitter.com/WT3yOeUIH9— Zee 5 Tamil (@ZEE5Tamil) July 31, 2026 -
'చిన్న చిన్న ఆశై' క్లైమాక్స్కి అర్థమేంటి?
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అలా ఈ వారం హాట్స్టార్లోకి వచ్చిన మలయాళ ఫీల్ గుడ్ మూవీ 'చిన్న చిన్న ఆశై'. ఒకప్పటి హీరోయిన్ మధుబాల, ఇంద్రాన్స్ ఇందులో ప్రధాన పాత్రలు చేశారు. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం వారణాసి నేపథ్యంలో సాగే మిడిల్ ఏజ్(ప్రేమ) కథ. ఒంటరితనం, జీవితంలో రెండో అవకాశం, మానవ సంబంధాలు లాంటి ఎమోషనల్ అంశాన్ని ఇందులో సున్నితంగా చూపించారు. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ కంటతడి పెట్టించడంతో పాటు ప్రేక్షకుల్లో చాలా సందేహాలని రేకెత్తించింది. మాధవన్ మాస్టర్, లీలా బంధానికి అసలు అర్థమేంటి? లాంటి ప్రశ్నలు మనసులో ఉండిపోతాయి.(ఇదీ చదవండి: ప్రియుడిని పరిచయం చేసిన తెలుగు సీరియల్ హీరోయిన్)క్లైమాక్స్లో ఏం జరిగింది?చివరలో మాధవన్, లీలా ఇద్దరూ గంగా నదిపై ఉన్న పడవలో పడుకుని రాత్రంతా కబుర్లు చెప్పుకొంటారు. కానీ ఇక్కడ ప్రేమ లేదా పెళ్లి గురించి ఎలాంటి మాటలు ఉండవు. రెగ్యులర్ సినిమాల్లో కనిపించే హ్యాపీ ఎండింగ్ కూడా ఉండదు. కానీ ఎన్నో ఏళ్లుగా వెతుకుతున్న అర్థం చేసుకునే మనిషిని కనుగొన్నాననే భావన ఇద్దరిలోనూ కలుగుతుంది. అదే విషయాన్ని దర్శకురాలు చూపించారు. వీళ్లిద్దరి బంధం స్నేహమా, ప్రేమా అనే విషయాన్ని మాత్రం ప్రేక్షకుల ఊహకే వదిలేశారు.'చిన్న చిన్న ఆశై' క్లైమాక్స్లో మాధవన్, లీలా ఇద్దరూ.. ఎన్నో ఏళ్లుగా వారిని వెంటాడిన ఒంటరితనం, బాధలు, మనసులోని భారాన్ని నెమ్మదిగా వదిలిపెడతారు. చివరికు ఒకరికొకరు అండగా నిలిచే మనుషులుగా మారతారు. లీలా ఎన్నో ఏళ్లుగా తన మనసులోని కోరికలను పక్కన పెట్టి, పక్కనోళ్ల ఆశలకే ప్రాధాన్యం ఇస్తూ బతుకుతూ ఉంటుంది. అలాంటిది వారణాసిలో మాధవన్ మాస్టర్ని కలిసిన తర్వాత తన జీవితంపై ఆలోచన మారుతుంది. నవ్వడం, చిన్న చిన్న విషయాల్ని ఆస్వాదించడం లాంటి వాటిలో ఆనందాన్ని వెతుక్కోవడం నేర్చుకుంటుంది.చివర్లో ఆమె గతాన్ని మర్చిపోదు కానీ ఆ బాధల్లోనూ ఆనందాన్ని వెతుక్కోవచ్చని తెలుసుకుంటుంది. మరోవైపు మాధవన్ మాస్టర్ పాత్ర ఆసాంతం చిరునవ్వుతో కనిపించినప్పటికీ, మనసులో ఎన్నో ఏళ్ల ఒంటరితనం ఉంటుంది. తన కుమార్తెతో మాట్లాడే సన్నివేశాల్లో అతని అంతర్మథనం స్పష్టంగా కనిపిస్తుంది. లీలను కలిసిన తర్వాత జీవితంలో నిజమైన తోడు ఎప్పుడు వస్తుందో చెప్పలేమని గ్రహిస్తాడు. వయసు పెరిగినా కొత్త బంధాలు ఏర్పడతాయని, జీవితానికి కొత్త అర్థం దొరుకుతుందని తెలుసుకుంటాడు. 'చిన్న చిన్న ఆశై' క్లైమాక్స్లో ఎలాంటి కమర్షియల్ హంగులు ఉండవు. అన్ని సమస్యలు ఒక్కసారిగా పరిష్కారమైపోయాయని కూడా చూపించరు. చిన్న చిన్న అనుబంధాలే జీవితాన్ని ఎంత అందంగా మార్చగలవో అని చెప్పే హత్తుకునే ముగింపుతో ఈ చిత్రం ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన ఫీల్ గుడ్ సినిమా.. 'చిన్న చిన్న ఆశై' తెలుగు రివ్యూ) -
ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్
ఓటీటీలు అనగానే దాదాపుగా థ్రిల్లర్ సినిమాలు,సిరీస్లే గుర్తొస్తుంటాయి. అందుకు తగ్గట్లే ప్రతివారం తమిళ, మలయాళ భాషల నుంచి ఈ జానర్ కంటెంట్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా అలానే ఓ క్రేజీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేసి స్టోరీ ఏంటనేది చూచాయిగా చెప్పేశారు. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన కొరియన్ హారర్ సినిమా.. తెలుగులోనూ)ఎస్జే సూర్య ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్ సిరీస్ 'వదంది'. 2022లో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. ఇప్పుడు దీనికి రెండో సీజన్ కూడా రెడీ చేశారు. ఇందులో శశికుమార్ పోలీస్ అధికారిగా ప్రధాన పాత్ర చేశారు. ఓ మర్డర్ కేసులో జైలుపాలైన మణి అనే కుర్రాడు.. నిజంగా ఈ హత్యలు చేశాడా? ఇంతకీ ఈ మర్డర్స్ వెనకున్న కారణమేంటి? ఎవరు చేశారు? అనేదే స్టోరీ.'వదంది 2' సిరీస్కి ఆండ్రూ లూయిస్ దర్శకుడు కాగా స్టార్ దర్శకద్వయం పుష్కర్-గాయత్రి నిర్మాతలుగా వ్యవహరించారు. వచ్చే శుక్రవారం(ఆగస్టు 07) నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఇది స్ట్రీమింగ్ కానుంది. అపర్ణ దాస్, రేవతి శర్మ తదితరులు ఇందులో ప్రధాన పాత్రలు చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన ఫీల్ గుడ్ సినిమా 'చిన్న చిన్న ఆశై' తెలుగు రివ్యూ) -
థియేటర్లలో శ్రీనివాస మంగాపురం.. ఓటీటీల్లో ఒక్క రోజే 14 సిినిమాలు
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ రోజే శ్రీనివాస మంగాపురం, స్పైడర్ మ్యాన్ సినిమాలు థియేటర్లలోకి వచ్చేశాయి. ఈ వారాంతంలో ఈ రెండు చిత్రాలతో పాటు కర్మాఖ్య, రోమియో జూలియట్ అనే తెలుగు మూవీస్ రిలీజ్ కానున్నాయి. అలానే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే, సిగ్మా, 418 లాంటి డబ్బింగ్ చిత్రాలు సందడి చేయనున్నాయి.ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ ఫ్రైడే పలు సూపర్ హిట్ సినిమాలు స్ట్రీమింగ్కు రానున్నాయి. తెలుగులో సత్యదేవ్ హీరోగా వచ్చిన రావు బహదూర్, దీవానా, పోలీస్ కంప్లైంట్ లాంటి చిత్రాలు ఓటీటీల్లోకి రానున్నాయి. వీటితో పాటు పలు హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. ఈ శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 14 సినిమాలు స్ట్రీమింగ్కు రాబోతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి. నెట్ఫ్లిక్స్..రావు బహదూర్(తెలుగు మూవీ)- జూలై 31గట్ట కుస్తీ 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 31ఆవోసి(జపనీస్ సిరీస్)- ఆగస్ట్ 01చికాగో పీడీ(హాలీవుడ్ సిరీస్)- ఆగస్ట్ 01మైఖేల్ పెంబురు దువా ఆలమ్- ఆగస్ట్ 02 అమెజాన్ ప్రైమ్పోలీస్ కంప్లైంట్(తెలుగు సినిమా)- జూలై 31లవ్ ఓ లవ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 31బ్యాట్మన్: కేప్ట్ క్రూసేడర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 31జియో హాట్స్టార్ భోజ్పురి బవాల్ (హిందీ రియాలిటీ సిరీస్) - ఆగస్టు 02ఆహా దీవానా (తెలుగు సినిమా) - జూలై 31జీ5 బాలన్ ద బాయ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూలై 31 అబ్జెక్షన్ మై లార్డ్ (తెలుగు సిరీస్) - జూలై 31 హై జవానీ తో ఇష్క్ హోనా హై (హిందీ సినిమా) - జూలై 31 వంద దేవుళ్లు (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూలై 31 (రూమర్ డేట్)సోనీ లివ్ద లెజెండ్ ఆఫ్ కర్ణ (హిందీ సిరీస్) - జూలై 31సన్ నెక్ట్స్..పైతాలట్టం(మలయాళ సినిమా)- జూలై 31లయన్స్ గేట్ ప్లే..చుమ్(హాలీవుడ్ మూవీ)- జూలై 31హెచ్బీవో మ్యాక్స్..ది డ్రామా(హాలీవుడ్ మూవీ)- జూలై 31 -
ఓటీటీలో సూపర్ హిట్ సిరీస్ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలు వచ్చాక కంటెంట్కు కొదువ లేకుండా పోయింది. ప్రతివారంలో సరికొత్త వెబ్ సిరీస్లు, సినిమాల ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. సూపర్ హిట్ అయిన సిరీస్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీజన్ల మీద సీజన్స్ అలా స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. తాజాగా మరో సూపర్ హిట్ కామెడీ సిరీస్ హార్ట్ బీట్ సీజన్-3 స్ట్రీమింగ్కు వచ్చేసింది.గతంలో రిలీజైన రెండు సీజన్స్ సక్సెస్ఫుల్ కావడంతో మేకర్స్ మరో సిరీస్ తెరకెక్కించారు. ఈ హార్ట్ బీట్ వెబ్ సిరీస్ ఈ రోజు నుంచే ఓటీటీలో సందడి చేస్తోంది. జియో హాట్స్టార్ వేదికగా అందుబాటులోకి వచ్చేసింది. ఈ సూపర్ హిట్ సిరీస్ తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఓ ఆస్పత్రి నేపథ్యంలో సాగే ఈ వెబ్ సిరీస్లో కుటుంబ అంశాలు, ప్రేమ, ఒక తల్లి ప్రేమ కోసం యువతి పడే ఆరాటం కథాంశంగా తెరకెక్కించారు. గతంలో రిలీజైన ఈ హార్ట్బీట్ సిరీస్కు ఓటీటీ ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అలా ఇప్పటికే రెండు సీజన్స్ ఆడియన్స్ ఆదరణ దక్కించుకున్నాయి. ఈ సిరీస్కు దీపక్ సుందర రాజన్ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్లో దీపా బాలు, అనుమోన్, యోగలక్ష్మీ, శర్వ, శబరీశ్, చారుకేశ్, రామ్, చంద్రశేఖర్, గిరి ద్వారకేశ్, రేయ ముఖ్య పాత్రలు పోషించారు. -
ఓటీటీలోకి వచ్చిన ఫీల్ గుడ్ సినిమా.. తెలుగు రివ్యూ
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. వాటిలో ఎక్కువగా థ్రిల్లర్, హారర్, యాక్షన్ జానర్సే ఉంటాయి. కొన్నిసార్లు మాత్రం సున్నితమైన కథతో సాగిపోయే ఫీల్ గుడ్ మూవీస్ రిలీజ్ అవుతుంటాయి. అలాంటి ఓ చిత్రమే 'చిన్న చిన్న ఆశై'. ఒకప్పటి హీరోయిన్ మధుబాల ఇందులో ప్రధాన పాత్ర చేసింది. మలయాళ సీనియర్ నటుడు ఇంద్రాన్స్ (Indrans) మరో ప్రధాన పాత్రధారి. వర్ష వాసుదేవ్ దర్శకురాలు. హాట్స్టార్లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?తంజావూర్కి చెందిన లీల(మధుబాల) ఓ బృందంతో కలిసి వారణాసి యాత్రకు వస్తుంది. ఉదయం తిరగడానికి బయలుదేరిన కొద్దిసేపటికే టీమ్ నుంచి తప్పిపోతుంది. ఈమె పర్స్, మొబైల్ ఎవరో దొంగిలిస్తారు. దీంతో ఏం చేయాలో తెలీక గంగానది ఒడ్డున కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అలాంటి టైంలో ఈమెకు మాధవన్ మాస్టర్ (ఇంద్రాన్స్) పరిచయమవుతారు. తిరిగి తన బృందం దగ్గరకు చేరేందుకు లీలకు సాయం చేస్తానని అంటాడు. తర్వాత ఏమైంది? రోజంతా కలిసి తిరిగిన లీల-మాధవన్ మాస్టర్ మధ్య ఎలాంటి బంధం ఏర్పడింది? అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?కొన్ని సినిమాల్లో కథ ఉండదు. 'చిన్న చిన్న ఆశై' అలాంటి మూవీనే. అనుకోకుండా కలిసిన ఇద్దరు అపరిచిత వ్యక్తులు, రోజంతా కలిసి మాట్లాడుకుంటూ కాశీ అంతా తిరుగుతారు. ఇదే స్టోరీ. ఏంటి ఇంతేనా? ఇద్దరు మనుషులు మాట్లాడుకోవడం ఒక సినిమానా? అసలు దీన్ని ఎవరు చూస్తారు? ఎందుకు చూడాలి? అని మీకు చాలా సందేహాలు రావొచ్చు. కానీ రెండు గంటలు టైమ్ మీది కాదనుకుని చూస్తే ఓ మంచి ఫీల్ గుడ్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది.డిష్యుం డిష్యుం అంటూ యాక్షన్ సినిమాలు, టెన్షన్తో పోయే థ్రిల్లర్ చిత్రాలే కాదు మనసుకు హాయిగా అనిపించే మూవీస్ కూడా అప్పుడప్పుడు చూడాలి. ఇది అలాంటిదే. అలా అని ఇదేదో గొప్ప అద్భుతమైన చిత్రం మాత్రం కాదు. కాకపోతే చూసిన తర్వాత మీ మనసులో కచ్చితంగా నిలిచిపోతుంది. మూవీ, ఇందులోని పాత్రల గురించి ఆలోచించేలా చేస్తుంది.వైవాహిక జీవితంలో గొడ్డు చాకిరీ చేసి అలసిపోయిన లీల.. భర్త చనిపోయిన ఏడాదిన్నరకు కాశీ యాత్రకు వస్తుంది. వచ్చిందనే మాటే గానీ తన బృందంతో కలవదు. నోరు విప్పి ఏం మాట్లాడదు. ప్రతిదానికి భయపడుతూ ఉంటుంది. అలాంటి ఈమె జీవితంలోకి మాధవన్ మాస్టర్ రావడంతో ఏం జరిగింది? ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? ఈమె మనసులోని 'చిన్న చిన్న ఆశలు' ఆయన వల్ల ఎలా నెరవేరాయి? ఈ క్రమంలో మాస్టర్పై ఆమె పెంచుకున్నది ఇష్టమా? ప్రేమా? ఆప్యాయతా? అనేది మూవీ చూసి మీరు తెలుసుకోవాలి.జీవితం సమస్యలతో సతమతమైనప్పుడు.. విధి ఒంటరిని చేసినప్పుడు ఏ మనసయినా ప్రశాంతతని కోరుకుంటుంది. స్వచ్ఛమైన మరో మనసు తోడుని కాంక్షిస్తుంది. అలాంటి తోడు అనుకోకుండా కనిపిస్తే ప్రతి చిన్న సంఘటన ఓ అందమైన జ్ఞాపకంలా నిలిచిపోతుంది. ఇలాంటి పరిస్థితులున్న ఇద్దరి మనుషుల కథే ఇది.సినిమాలో చాలా లోతైన భావన ఉంటుంది కానీ దాన్ని చూపించే విధానం సాగదీతలా అనిపిస్తుంది. ఇది మీకు ఓకే అనుకుంటే మూవీ నచ్చేస్తుంది. లీల పాత్రలో మధుబాల, మాధవన్ మాస్టర్గా ఇంద్రాన్స్ జీవించేశారు. సినిమా అంతా అలా అలా సాగిపోతూ హాయిగా ఉంటుంది. క్లైమాక్స్ మాత్రం మనసుని బరువెక్కిస్తుంది. మూవీ అయిపోయినా సరే కచ్చితంగా ఆ ట్రాన్స్లో ఉండిపోతారు.పేరుకే తెలుగు డబ్బింగ్ అన్నారు గానీ లీల పాత్రకు తమిళ నేపథ్యం పెట్టారు. దీంతో ఈమె చాలావరకు తమిళంలోనే డైలాగ్స్ చెబుతూ ఉంటుంది. ఇవి అర్థం కావాలంటే సబ్ టైటిల్స్ పెట్టుకుని చూడాల్సి ఉంటుంది. ఇది పర్లేదనుకుంటే 'చిన్న చిన్న ఆశై' చూడొచ్చు. అసభ్యకర సన్నివేశాలేం లేవు. కుటుంబంతోనూ కలిసి వీక్షించొచ్చు. అలానే మూవీ అంతా చూసిన తర్వాత కచ్చితంగా కొంతమందికైనా కాశీ వెళ్లి, ఆ ఘాట్స్ అన్ని తిరిగి రావాలని అనిపిస్తుంది!- చందు డొంకాన -
ఓటీటీలోకి లేటెస్ట్ ఎమోషనల్ లవ్ సినిమా
ప్రేమకథలకు భాషతో సంబంధం లేదు. తెరపై భావం పలికితే చాలు ఏ భాషా ప్రేక్షకులకైనా సరే నచ్చేస్తుంది. అలా రీసెంట్ టైంలో దేశవ్యాప్తంగా చాలామందిని ఆకట్టుకుని మెప్పించిన సినిమా 'మై వావస్ ఆవుంగా'. గత నెలలో థియేటర్లలో రిలీజై ఇప్పటికీ అలరిస్తున్న ఈ చిత్రం తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులోకి రానుంది?లవ్ ఆజ్ కల్, రాక్ స్టార్, జబ్ ఉయ్ మెట్ లాంటి ప్రేమకథా సినిమాలతో సెపరేట్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'. నసీరుద్దీన్ షా, దిల్జీత్ దోసాంజే, వేదాంగ్ రైనా, శార్వరి వాఘ్ తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. జూన్ 11న పెద్దగా అంచనాల్లేకుండానే థియేటర్లలో రిలీజై ఇప్పటికీ ప్రదర్శితమవుతూ మంచి కలెక్షన్స్ సాధిస్తోంది.దేశ విభజన జరిగిన టైంలో విడిపోయిన ఇద్దరు ప్రేమికుల కథని ఈ సినిమాలో చూపించారు. ఏళ్లు గడిచిపోయిన తర్వాత సదరు ప్రేమికుడు కాస్త వృద్ధుడు అవుతాడు. ఇతడి ఆశయాన్ని నెరవేర్చేందుకు మనవడు సరిహద్దులు దాటి పాకిస్తాన్ వెళ్తాడు. తర్వాత ఏమైంది? చివరకు ఏమైంది అనేదే మిగతా స్టోరీ. తాత పాత్రలో నసీరుద్దీన్ షా చేయగా.. ఇతడి యుక్త వయసు పాత్రని వేదాంగ్ రైనా, ప్రియురాలి పాత్రని శార్వరి పోషించారు. మనవడి పాత్రలో దిల్జీత్ దోసాంజే కనిపించారు. ఈ మూవీ ఆగస్టు 07 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. అధికారిక ప్రకటన రానప్పటికీ ఈ తేదీనే ఫైనల్! -
ఓటీటీకి లేటేస్ట్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన స్పోర్ట్స్ కామెడీ చిత్రం గట్ట కుస్తీ-2. ఈ సినిమాకు చెల్లా అయ్యావు దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూలై 3న థియేటర్లలో విడుదలైంది. ఈ కామెడీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద సినీ ప్రియులను మెప్పించింది. ఈ చిత్రంలో రమ్య కృష్ణన్, యోగి బాబు, కరుణాస్ కీలక పాత్రల్లో నటించారు.తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్దమైంది. ఈ నెల 31 నుంచే నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. గతంలో వచ్చిన మట్టి కుస్తీకి సీక్వెల్గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈ చిత్రాన్ని థియేటర్లలో కేవలం తమిళంలోనే విడుదల చేశారు. అయితే ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. Biggest Blockbuster of the season 🔥 #GattaKusthi2 (Tamil)Streaming from July 31 on Netflix in Tamil, Telugu, Kannada, Malayalam Hindi 🍿!!#OTT_Trackers pic.twitter.com/EIPUelKlU8— OTT Trackers (@OTT_Trackers) July 28, 2026 -
ఓటీటీలోకి వచ్చేసిన కొరియన్ హారర్ సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా విదేశీ భాషలకు చెందిన హారర్, థ్రిల్లర్ మూవీస్ కూడా అందుబాటులోకి వస్తుంటాయి. అలా ఇప్పుడు ఓ కొరియన్ హారర్ చిత్రం దాదాపు రెండేళ్ల తర్వాత తెలుగులోనూ స్ట్రీమింగ్కి వచ్చింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: ఓటీటీలోకి బ్లాక్బస్టర్ 'మైఖేల్'.. అధికారిక ప్రకటన)2024లో రిలీజైన కొరియన్ హారర్ సినిమా 'ఘోస్ట్ ట్రైన్'. ఇప్పుడు ఇది అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. దాదాపు గంటన్నర నిడివితో ఉండే ఈ మూవీలో సోషల్ మీడియా, మనుషుల్ని ఎలా తయారు చేస్తుంది? లైక్స్, వ్యూస్ కోసం ప్రాణాలు ఎలా రిస్క్లో పెడుతున్నారు? అనే అంశాన్ని ఇందులో చూపించారు.'ఘోస్ట్ ట్రైన్' విషయానికొస్తే.. హారర్, సూపర్ నేచురల్ స్టోరీలపై ఓ యూట్యూబర్ వీడియోలు చేస్తూ ఉంటుంది. కానీ పెద్దగా వ్యూస్ రావు. ఓసారి భయంకరమైన కొన్ని రూమర్స్ వినిపించే స్టేషన్కి వెళ్తుంది. ఆ స్టేషన్ మాస్టర్ ఈమెకు నాలుగు స్టోరీలు చెబుతాడు? ఇంతకీ అవేంటి? చివరకు ఈమెకు ఏమైంది? అనేది మిగతా స్టోరీ.ఇక ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే రావు బహదూర్, చిన్న చిన్న ఆశై, బాలన్ ద బాయ్, దీవాన, లవ్ ఓ లవ్ లాంటివి స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అలానే అబ్జెషన్ మై లార్డ్, ఆజాదీ 501, హార్ట్ బీట్ సీజన్ 3 లాంటి డబ్బింగ్ మూవీస్ కూడా ఈ వీకెండే అందుబాటులోకి రానున్నాయి.(ఇదీ చదవండి: రామ్ చరణ్కి సర్జరీ.. కోయంబత్తూరులోనే ఎందుకంటే?) -
ఓటీటీలోకి బ్లాక్బస్టర్ 'మైఖేల్'.. అధికారిక ప్రకటన
పాప్ సాంగ్స్ అనగానే చాలామంది మైఖేల్ జాక్సన్ గుర్తొస్తాడు. 90ల్లో తనదైన గొంతుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నాడు. 2009లో చనిపోయాడు. ఇకపోతే ఈయన జీవితం ఆధారంగా బయోపిక్ తీశారు. ఈ ఏడాది ఏప్రిల్లో థియేటర్లలో రిలీజై అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇదెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్న వాళ్ల కోసమా అన్నట్లు అధికారికంగా స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు.(ఇదీ చదవండి: అఫిషియల్ : నెలలోలోపే ఓటీటీలోకి ‘రావు బహదూర్’)ప్రపంచ ప్రఖ్యాత పాప్ దిగ్గజం మైఖేల్ జాక్సన్ జీవిత కథతో తీసిన సినిమాకు 'మైఖేల్ అని పేరు పెట్టారు. ఇందులో ఇతడి మేనల్లుడు జాఫర్ జాక్సన్.. టైటిల్ రోల్ చేశాడు. ఈ ఏడాది ఏప్రిల్ 24న బిగ్ స్క్రీన్స్పై రిలీజైంది. కొందరికి నచ్చితే మరికొందరికి నచ్చలేదు. ఏదైతేనేం దాదాపు రూ.10 వేల కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. మన దేశంలో అయితే రూ.54 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ డాలర్ మార్క్ని దాటిన తొలి హాలీవుడ్ బయోపిక్గానూ రికార్డు సృష్టించింది.ఇకపోతే గత నెల 9నే అమెజాన్ ప్రైమ్, ఆపిల్ ప్లస్ టీవీ, బుక్ మై షో లాంటి ఓటీటీల్లో అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా.. ఆగస్టు 29 నుంచి హాట్స్టార్లో ఉచితంగానే స్ట్రీమింగ్ కానుంది. కాకపోతే ఇంగ్లీష్, హిందీ భాషల్లో మాత్రమే రిలీజ్ కానుందని ప్రకటించారు.'మైఖేల్' విషయానికొస్తే.. అమెరికాలోని ఇండియానా గ్యారీలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన మైఖేల్ జాక్సన్ (జాఫర్ జాక్సన్) తన తల్లి ప్రోత్సాహంతో, సోదరులతో కలిసి 'జాక్సన్ 5' బ్యాండ్తో తన ప్రతిభని చాటుకుంటాడు. అయితే తన తండ్రి జోసెఫ్ జాక్సన్ (కోల్మన్ డొమింగో) కఠినమైన ప్రవర్తన మైకేల్ని మానసిక వేదనకు గురిచేస్తుంది. ఆ భయం నీడలోనే ఒంటరిగా కెరీర్ ప్రారంభించి అంతర్జాతీయ స్థాయికి ఎలా ఎదిగాడు? తన బాల్యాన్ని వెతుక్కుంటూ అతడు నిర్మించుకున్న 'నెవర్ ల్యాండ్' వెనుక ఉన్న ఎమోషన్ ఏంటి? అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
అఫిషియల్ : నెల లోపే ఓటీటీలోకి ‘రావు బహదూర్’
సత్యదేవ్ కలల ప్రాజెక్టు, ఎంతో కష్టపడి నటించిన చిత్రం ‘రావు బహదూర్’. వెంకట్ మాహా దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య జులై 3న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. సత్యదేవ్ నటనపై ప్రతిఒక్కరు ప్రశంసలు కురిపించారు కానీ.. కథ, కథనంపై మాత్రం పెదవి విరిచారు. ఫలితంగా ఆశించిన స్థాయిలో ఈచిత్రం ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్షకుల దగ్గర తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. థియేటర్స్లో రిలీజై నెల కూడా పూర్తికాకముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది. జులై 31 నుంచి ప్రముఖ ఓటటీటీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ ఎక్స్ వేదికగా అధికారిక ప్రకటనను విడుదల చేసింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ బాషల్లోనూ ఈ చిత్రం అందుబాటులో ఉండనుంది.కథేంటంటే...1991 నేపథ్యంలో ఈ కథనం సాగుతుది. భువన వంశానికి చెందిన రామప్పరావు బహదూర్ అలియాస్ రాముడు(సత్యదేవ్) లివర్ క్యాన్సర్ బారిన పడతాడు. నాలుగు నెలలకు మించి బతకడని ఓ డాక్టర్ రిపోర్ట్ ఇస్తాడు గానీ ఏడాది దాటిపోయినా సరే రామప్ప అలానే ఉంటాడు. పైపెచ్చు రోజూ తాగుతూ బతికేస్తుంటాడు. నిద్రలో నుంచి లేచి అప్పుడప్పుడు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు. ఇలా జరగడానికి కారణం ఎప్పుడో చనిపోయిన రామప్ప చిన్న కొడుకు కుసుమప్ప. వీడు తనకు పుట్టలేదని రామప్ప 'అనుమానం'. ఇదే విషయాన్ని చెబుతూ తన స్నేహితుడు, డాక్టర్ ఆచారి(వికాస్ ముప్పల) బుర్ర తినేస్తూ ఉంటాడు. మరి రావు బహదూర్ అనుమానం నిజమేనా? కుసుమప్ప ఎందుకు ఎలా చనిపోయాడు? ఈ కథలో రామప్ప భార్య రేణుక (దీపా థామస్) సంగతేంటి? చివరకు ఏమైందనదే మిగతా స్టోరీ.Samajika nibandhanalatho mee burrani kadagadaniki Rao Bahadur osthunnadu! 😎👑 pic.twitter.com/A97zYKYU8i— Netflix India South (@Netflix_INSouth) July 28, 2026 -
ఓటీటీకి వచ్చేసిన మలయాళ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీల్లో మలయాళ సినిమాలకు ప్రత్యేక డిమాండ్ ఉంటోంది. ఈ చిత్రాలకు ఇతర భాషల్లో ఆడియన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే సరికొత్త కంటెంట్ సినిమాలు వస్తూనే ఉన్నాయి. మలయాళంలో హిట్ మూవీస్ తెలుగులోనూ ఆదరణ దక్కించుకుంటున్నాయి. తాజాగా మరో మలయాళ సినిమా ఓటీటీకి వచ్చేసింది.ఈ ఏడాది మలయాళంలో రిలీజై హిట్గా నిలిచిన చిన్న చిన్న ఆసై ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఈ రోజు నుంచే నుంచి జియో హాట్స్టార్ వేదికగా అందుబాటులోకి వచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రానికి వర్ష వాసుదేవ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ఇంద్రన్స్, మధు బాల, అపర్ణ బాలమురళి, జాఫర్ సాదిక్, విష్ణు అగస్త్య కీలక పాత్రల్లో నటించారు. -
ఓటీటీలో క్రేజీ క్రైమ్ థ్రిల్లర్.. అధికారిక ప్రకటన
ఓటీటీల్లోకి వచ్చే సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో కొన్ని కొన్ని వెబ్ సిరీస్లు కూడా అలానే రెస్పాన్స్ అందుకుంటాయి. అలా నాలుగేళ్ల క్రితం వచ్చిన ఓ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్కి సంబంధించి కొత్త సీజన్ గురించి అధికారిక ప్రకటన వచ్చింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుంది?(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి లవ్ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)2022లో ఎస్జే సూర్య ప్రధాన పాత్రలో 'వదంది' అనే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ వచ్చింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అయిన దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరోయిన్ మర్డర్ నేపథ్యంగా దాన్ని తెరకెక్కించారు. ఆ సీజన్ అక్కడితో ముగిసిపోయింది. అయితే ఈ సిరీస్లో రెండో సీజన్ని కొత్త స్టోరీ, కొత్త పాత్రలతో తెరకెక్కించారు. ఆగస్టు 07 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.'వదంది : ది మిస్టరీ ఆఫ్ మణి' పేరిట తీసిన ఈ సిరీస్లో శశి కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. ఆండ్రూ లూయిస్ ఈ సీజన్కు దర్శకుడు కాగా స్టార్ డైరెక్టర్స్ పుష్కర్-గాయత్రి క్రియేటివ్ ప్రొడ్యూసర్స్గా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్లో ప్రధాన పాత్రధారి అయిన ఎస్సై చేసిన తప్పు వల్ల ఓ అమాయకుడు జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. తన తప్పు తెలుసుకున్న ఎస్సై.. సదరు వ్యక్తిని జైలు నుంచి ఎలా విడిపించాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
నేరుగా ఓటీటీలోకి లవ్ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. అంటే చాలావరకు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నప్పటికీ కొన్ని మాత్రం నేరుగా స్ట్రీమింగ్ అవుతుంటాయి. ఇప్పుడు కూడా అలానే ఓ మూవీకి సంబంధించిన ఓటీటీ రిలీజ్ తేదీని ప్రకటించారు. తెలుగమ్మాయి శాన్వి మేఘన హీరోయిన్గా చేసిన చిత్రమిది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులోకి ఎప్పుడు రానుంది?(ఇదీ చదవండి: ఓటీటీలో క్రైమ్ కామెడీ సినిమా 'కాన్ సిటీ' తెలుగు రివ్యూ)తమిళ నటుడు ఎలన్.. హీరోగా పరిచయమవుతూ దర్శకుడిగా మారి తీసిన సినిమా 'ప్యార్ ప్రేమ కళ్యాణం', తెలుగమ్మాయి శాన్వి మేఘన హీరోయిన్. గతేడాది ఈ మూవీ గురించి న్యూస్ వచ్చింది. ఇప్పుడు దీన్ని వచ్చే నెల 21న నేరుగా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఇది అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు.'ప్యార్ ప్రేమ కళ్యాణం' విషయానికొస్తే.. పెళ్లి తర్వాత అత్తారింటికి వెళ్లకుండా తన ఇంట్లోనే ఉండాలని ఓ అమ్మాయి(శాన్వి మేఘన) నిర్ణయించుకుంటుంది. దీంతో ఆమె భర్త (ఎలన్) ఇల్లరికం రావాల్సి వస్తుంది. ఈ కారణంగా ఇరు కుటుంబాల్లో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? చివరకు తమ జీవితాన్ని తాము ఎలా మలుచుకోవాలనే విషయాన్ని ఈ జంట ఎలా తెలుసుకుంటుంది? అనేదే స్టోరీలా అనిపిస్తుంది.ఈ సినిమాలో రాధికా శరత్కుమార్, యోగి బాబు, ఎం.ఎస్. భాస్కర్, గీతా కైలాసం తదితరులు కీలక పాత్రలు చేశారు. యువన్ శంకర్ రాజా సంగీతమందించాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)Indha maari oru save the date ah neenga paathrukave maateenga 🤭🤣 pic.twitter.com/XLS3oR38Nd— Netflix India South (@Netflix_INSouth) July 27, 2026 -
ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి మహేశ్ బాబు అన్న కొడుకు జయకృష్ణ హీరోగా పరిచయమవుతున్న 'శ్రీనివాస మంగాపురం' రాబోతుంది. దీనితో పాటు కర్మాఖ్య, రోమియో జూలియట్ అనే తెలుగు మూవీస్ రిలీజ్ కానున్నాయి. అలానే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే, సిగ్మా, 418 లాంటి డబ్బింగ్ చిత్రాలు కూడా ఈ వీకెండే బిగ్ స్క్రీన్స్పైకి రానున్నాయి.(ఇదీ చదవండి: ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు.. తెలుగు రివ్యూ)మరోవైపు ఓటీటీల్లో ఏకంగా 21 వరకు సినిమాలు, సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. లిస్టులో యూట్యూబర్ నాగదుర్గ 'లవ్ ఓ లవ్', తమిళ హిట్ 'చిన్ని చిన్ని ఆశై', బాలన్ ది బాయ్, దీవాన ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు అబ్జెక్షన్ మై లార్డ్, ఆజాదీ 501, హార్ట్ బీట్ సీజన్ 3 లాంటి డబ్బింగ్ సిరీస్లు చూడాలనే కుతుహలాన్ని రేపుతున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలోకి ఏ మూవీ రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జూలై 27 నుంచి ఆగస్టు 02 వరకు)నెట్ఫ్లిక్స్రాత్ (బ్రెజిలియన్ సిరీస్) - జూలై 29ఫైనల్ ప్రాజెక్ట్ (మెక్సికన్ సిరీస్) - జూలై 29ద ఇదో కాలేజీ మర్డర్స్: కాలేజ్ నైట్మేర్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 29ద బాంబింగ్ ఆఫ్ పాన్ ఏఎమ్ 103 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 30గట్టకుస్తీ 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 31 (రూమర్ డేట్)అమెజాన్ ప్రైమ్సూపర్ గర్ల్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - జూలై 28ద డెవిల్స్ మౌత్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 29లవ్ ఓ లవ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 31బ్యాట్మన్: కేప్ట్ క్రూసేడర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 31హాట్స్టార్కూలిన్ ఫ్రమ్ అకౌంట్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 27చిన్ని చిన్ని ఆశై (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూలై 28ద డెవిల్ వేర్స్ ప్రదా 2 (ఇంగ్లీష్ సినిమా) - జూలై 29హార్ట్ బీట్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూలై 30భోజ్పురి బవాల్ (హిందీ రియాలిటీ సిరీస్) - ఆగస్టు 02ఆహాఆజాదీ 501 (తెలుగు సిరీస్) - జూలై 29దీవానా (తెలుగు సినిమా) - జూలై 31జీ5బాలన్ ద బాయ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూలై 31అబ్జెక్షన్ మై లార్డ్ (తెలుగు సిరీస్) - జూలై 31హై జవానీ తో ఇష్క్ హోనా హై (హిందీ సినిమా) - జూలై 31వంద దేవుళ్లు (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూలై 31 (రూమర్ డేట్)సోనీ లివ్ద లెజెండ్ ఆఫ్ కర్ణ (హిందీ సిరీస్) - జూలై 31(ఇదీ చదవండి: ఓటీటీలో క్రైమ్ కామెడీ సినిమా 'కాన్ సిటీ' తెలుగు రివ్యూ) -
ఓటీటీలో క్రైమ్ కామెడీ సినిమా.. తెలుగు రివ్యూ
ఖైదీ, మాస్టర్, విక్రమ్, ఓజీ తదితర సినిమాల్లో విలన్గా నటించి ఆకట్టుకున్న తమిళ నటుడు అర్జున్ దాస్.. హీరోగానూ అప్పుడప్పుడు మూవీస్ చేస్తుంటాడు. అలా చేసిన చిత్రమే 'కాన్ సిటీ'. చెప్పాలంటే గత నెలలో తెలుగులోనూ థియేటర్లలో రిలీజ్ కావాలి. కానీ ఎందుకనో అది జరగలేదు. ఇప్పుడు నేరుగా నెట్ఫ్లిక్స్లోకి తెలుగు డబ్బింగ్ వెర్షన్ తీసుకొచ్చేశారు. క్రైమ్ కామెడీగా తీసిన ఈ మూవీ ఎలా ఉందనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు.. తెలుగు రివ్యూ)కథేంటి?శరవణన్ (అర్జున్ దాస్) ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటాడు. పేరుకే ప్రభుత్వ ఉద్యోగి గానీ చేతినిండా అప్పులే. ఐశ్వర్య(సాక్షి వైద్య)తో ప్రేమలో ఉంటాడు గానీ అప్పుల కారణంగా అది బ్రేకప్ అయిపోతుంది. మరోవైపు ప్రెగ్నెన్సీతో ఉన్న మిత్ర(అన్నా బెన్) కూడా ఓ సంస్థ చేతిలో మోసపోతుంది. అదే టైపులో తన కూడా ఇతరులని మోసం చేయడం మొదలుపెడుతుంది. ఇంకోవైపు జానకి(వడిఉక్కరుసు), తన కొడుకు(యోగిబాబు)తో కలిసి ట్రస్ట్ పేరిట జనాల నుంచి డబ్బులు వసూలు చేస్తూ మోసం చేస్తుంటుంది. వీళ్లందరి మోసాలు ఎలా బయటపడ్డాయి? డబ్బు గురించి వీళ్లంతా చివరకు ఏం తెలుసుకున్నారు? అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ప్రపంచంలో అందరికీ కావాల్సింది ఏదైనా ఉందంటే అది డబ్బు మాత్రమే. అవసరాలు ఊరికే ఉండవుగా! బతకడం కోసం 'డబ్బు' మనతోనే ఎలాంటి మోసాన్ని అయినా చేయిస్తుంది. కష్టపడి సంపాదించుకున్నది మాత్రమే ఎప్పటికైనా నిలుస్తుంది మోసం చేసి సంపాదించుకున్నది ఎలా వచ్చిందో అలానే వెళ్లిపోతుంది అనే సత్యాన్ని చూపిస్తూ తీసిన సినిమా ఇది.అప్పులు.. అవస్థలు.. అవసరం.. ఈజీ మనీ కోసం ప్రధాన పాత్రలన్నీ మోసాలు చేసే సీన్లతో ఫస్టాప్ బాగానే ఉంటుంది. శరవణన్ పాత్ర ఆఫీస్లో పనిచేయడం, చిన్నపాటి టెక్నిక్ వాడి అక్కడ డిపాజిట్ చేయాల్సిన డబ్బులు కొట్టేయడం లాంటి సీన్లు చూస్తుంటే 'లక్కీ భాస్కర్' సినిమా గుర్తొస్తుంది. కానీ మోసాలు చేసినందుకు బాధపడుతూ ఇక మారిపోవాలనుకున్నప్పుడు ఇదే బ్యాచ్కి గతంలో కంటే పెద్ద నేరం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు వాళ్లు ఏం చేస్తారనే అంశాలతో సెకండాఫ్ ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత నుంచి చూస్తున్నప్పుడు 'బ్లఫ్ మాస్టర్' మూవీ గుర్తొస్తుంది.ఫస్టాప్ సహజంగా అనిపిస్తుంది గానీ సెకండాఫ్లో మాత్రం ప్రధాన పాత్రలు చేసే పనులన్నీ లాజిక్స్ దూరంగా ఉన్నట్లు అనిపిస్తాయి. కాకపోతే కథ, స్క్రీన్ ప్లే లాంటి వాటి వల్ల ఉన్నంతలో చూడాలనిపించేలా అనిపించడం మూవీకి ప్లస్ పాయింట్. మరీ గొప్ప మూవీ అయితే కాదు గానీ చూస్తున్నంతసేపు టైమ్ పాస్ అయిపోతుంది. గతంలో ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసినప్పుడు.. బిల్లింగ్ మెషీన్ నుంచి డబ్బులు వస్తున్నట్లు చూపించి ఆసక్తి రేపారు. కానీ అసలు ఈ సీన్ సినిమాలో పెట్టకుండా భలే మోసం చేశారు. స్టోరీ మార్చి తీశారా? లేదంటే పబ్లిసిటీ కోసమే ఈ టీజర్ వదిలారా అనేది అర్థం కాని ప్రశ్న.ఎవరెలా చేశారు?శరవణన్గా చేసిన అర్జున్ దాస్, మిత్రగా చేసిన అన్నాబెన్, మిగతా పాత్రల్లో నటించిన వడి ఉక్కరుసు, యోగిబాబు, వీటీవీ గణేష్ తదితరులు తమ స్టైల్ ఆఫ్ యాక్టింగ్కి భిన్నమైన పాత్రల్లో ఇందులో కనిపించారు. అలానే ఆకట్టుకున్నారు. కానీ స్టోరీ పరంగా యావరేజ్గా అనిపించింది. సినిమాటోగ్రఫీ బాగుంది గానీ మ్యూజిక్ అయితే గుర్తుంచుకునేంతలా లేదు. అసభ్యకర సీన్స్ లేవు. కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీలో తమిళ కామెడీ థ్రిల్లర్ సినిమా 'పరిమిళ అండ్ కో' తెలుగు రివ్యూ) -
ఓటీటీలోకి గుండెల్ని పిండేసే లవ్స్టోరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ యంగ్ హీరో హర్షిత్ రెడ్డి నటించిన తాజా చిత్రం ‘దీవాన’. ఈ చిత్రంలోన బ్యూటిఫుల్ హీరోయిన్ స్మేహ మణిమేఘలై తెలుగు తెరకు పరిచయం అయింది. శ్రీకాంత్ సంఘిశెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీని అర్హ మీడియా, వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవీ కార్యంపూడి నిర్మించారు. ఎలాంటి అంచనాలు లేకుండా జూన్ 20న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి కలెక్షన్స్ని అందుకుంది. సినిమాలో కొన్ని సన్నివేశాలు గుండెల్ని పిండేస్తాయి. అంతగా ఆకట్టుకున్న ఈ ప్రేమ కథ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.ఈ జులై 31వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. 'మిస్ అయితే మస్త్ ఫీల్ అయితవ్' అంటూ మేకర్స్ ఈ రోజు ‘దీవాన’ ఓటీటీ రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు. ఆహా గోల్డ్ సబ్ స్క్రైబర్స్ 24 గంటల ముందుగానే ఎర్లీ యాక్సెస్ లో ఈ సినిమాను చూడొచ్చు. తెలుగుతో పాటు తమిళంలో ఈ సినిమా వ్యూయర్స్ కు అందుబాటులో ఉండనుంది.‘దీవాన’ కథేంటంటే.. డిగ్రీ పూర్తి చేసిన మున్నా (హర్షిత్ రెడ్డిద) ఇంట్లో ఖాళీగా ఉంటాడు. ఫ్రెండ్స్తో కలిసి తిరగడం, తాగడం తప్పా ఇంటి బాధ్యతల్ని పట్టించుకోడు. తండ్రి శేఖర్(నరేష్) పడే కష్టం గురించి మున్నా ఏ మాత్రం ఆలోచించడు. అసలు తల్లిదండ్రులు, ఇంటి బాధ్యత అన్నదే మున్నాకి పట్టదు. ఎప్పుడూ గాలి తిరుగుడు తిరుగుతూ ఉంటాడు. అలాంటి మున్నా ఓ సారి ఓ అమ్మాయిని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఇక ఆ అమ్మాయి మీ సేవా కేంద్రంలో పని చేస్తుంటుందని, ఆమె పేరు అమూల్య (స్మేహా మణిమేఘలై) అని తెలుసుకుంటాడు. ఇక ప్రతీ రోజూ మీ సేవాలో ఏదో ఒక పని అడ్డం పెట్టుకుని అమూల్య వద్దకు వెళ్లడం చేస్తుంటాడు మున్నా. అయితే కొన్ని రోజులకు మున్నా చేష్టలకు అమూల్య విసిగిపోతుంది. నేను నెలకి రూ. 20 వేలు సంపాదిస్తున్నా.. నువ్వు మాత్రం రూ. 20 కూడా సంపాదించలేవు.. ముందు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుని కనపడు.. ఆ తరువాత చూద్దాం అని మున్నాతో అమూల్య చెబుతుంది. దీంతో మున్నా ఓ గాడిన పడతాడు. అమూల్య చెప్పినట్టుగా జాబ్ సంపాదించుకునే క్రమంలో ప్రయత్నాలు మొదలు పెడతాడు. అసలు అమూల్య అలాంటి ఓ కండీషన్ ఎందుకు పెట్టింది? మరి మున్నా చివరకు తన ప్రయత్నంలో సఫలం అవుతాడా? వీరి ప్రేమ కథకు అడ్డుగా నిలిచే ఆ కారణాలు ఏంటి? చివరకు మున్నా ప్రేమ గెలుస్తుందా? లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీలోకి తెలుగు టెక్ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్
గుర్తుందా? సరిగ్గా పదేళ్ల క్రితం 'ఫ్రీడమ్ 251' పేరుతో ఓ స్కామ్ జరిగింది. అంటే రూ.251 చెల్లిస్తే స్మార్ట్ ఫోన్ ఇస్తామని నమ్మబలికించారు. తర్వాత ఇదో పెద్ద మోసమని తేలింది. ఇప్పుడీ కాన్సెప్ట్ ఆధారంగా తెలుగులో తీసిన టెక్ థ్రిల్లర్ సిరీస్ 'ఆజాదీ 501'. తాజాగా దీని ట్రైలర్ రిలీజ్ చేసి స్టోరీ ఏంటనేది చెప్పేశారు.(ఇదీ చదవండి: 3 వారాలలోనే ఓటీటీలోకి నాగదుర్గ కొత్త సినిమా)వచ్చే బుధవారం(జూలై 29) నుంచి ఆహా ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తేజ, హర్షవర్ధన్, శశాంక్ తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. ట్రైలర్ బట్టి చూస్తే రూ.20 వేల సంపాదించే ఓ మధ్య తరగతి కుర్రాడు, ఏదైనా బిజినెస్ చేద్దామని అనుకుంటాడు. కానీ ఎవరి నుంచి ప్రోత్సాహం ఉండదు. అలాంటి కుర్రాడికి రూ.501 ఫోన్ ఇవ్వాలనే ఆలోచన ఎందుకొచ్చింది? తర్వాత ఏమైంది? ఇందులో స్కామ్ ఏంటి? అనేది స్టోరీలా అనిపిస్తుంది.ట్రైలర్ అయితే పర్లేదనిపించేలా ఉంది. నటీనటులు కూడా మొత్తం తెలుగువాళ్లే. మరి ఇది ఏ మేరకు ఆకట్టుకుంటుందనేది చూడాలి? ఇకపోతే ఈ వారం ఓటీటీల్లోకి చాలానే సినిమాలు, సిరీస్లు వచ్చాయి. వీటిలో నాగబంధం, పురుషః లాంటి తెలుగు చిత్రాలతో పాటు కాన్ సిటీ, పల్లిచట్టంబి లాంటి డబ్బింగ్ మూవీస్.. ఆదర్శ బాలవిద్యాలయ లాంటి సిరీస్లు కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీల్లో రిలీజయ్యే వాటిలో మలయాళ థ్రిల్లర్ సినిమాలకు స్పెషల్ క్రేజ్ ఉంది. అందుకు తగ్గట్లే ఎప్పటికప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ అయితే లెక్కకు మించి తీస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా అలానే ఒకటి ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇంతకీ ఈ చిత్రమేంటి? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: 3 వారాలలోనే ఓటీటీలోకి నాగదుర్గ కొత్త సినిమా)గతంలో 'ఎల వీజ పూంచిర' అనే సినిమాకు రచయితగా పనిచేసిన నిజమైన పోలీస్ అధికారి షాజీ మారడ్.. ఈ 'ఉయిర్' సినిమాకు స్టోరీ, డైలాగ్స్ అందించారు. పోలీస్ శాఖలో నిజమైన విచారణ విధానాలు ఎలా ఉంటాయో రియలస్టిక్గా చూపించారు. రోషన్ మ్యాథ్యూ హీరో కాగా బైజు సంతోష్, అతుల్య చంద్ర, శ్రుతి మేనన్, సయామి ఖేర్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.గత నెల 26న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడీ చిత్రం వచ్చే నెల 4వ తేదీ నుంచి హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.'ఉయిర్' విషయానికొస్తే.. అజీబ్(రోషన్ మ్యాథ్యూ) ప్రొబెషనరీ ఎస్సైగా ఓ స్టేషన్లో చేరతాడు. కొన్నాళ్లకే పాడుబడిన బావిలో ఓ మహిళ మృతదేహం కనిపిస్తుంది. సాధారణంగా చనిపోయిందని అనుకుని విచారణ ప్రారంభిస్తారు. అయితే ఇది హత్య మాత్రమే కాదని, దీని వెనక పెద్ద క్రైమ్ నెట్వర్క్ ఉందని అజీబ్ గుర్తిస్తాడు. ఇంతకీ ఆ మహిళ ఎవరు? ఎందుకు హత్య చేశారు? చివరకు హంతకుడు దొరికాడా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ సినిమా) -
ఓటీటీలోకి ‘వంద దేవుళ్లు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘వంద దేవుళ్లు’. బిచ్చగాడు ఫేం శశి దర్శకత్వం ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల మధ్య జూన్ 19న రిలీజ్ అయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. మంచి వసూళ్లతో పాటు ఈ సినిమా ద్వారా ఇచ్చిన సందేశం బాగుందనే ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ని ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సొంతం చేసుకుంది. విజయ్ ఆంటోని బర్త్డే సందర్భంగా ఈరోజు(జులై 24) ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలను పంచుకుంది. ఆగస్టులో తమ ప్లాట్ఫామ్లో ఓటీటీ ప్రీమియర్ కానుందని జీ5 తెలుగు ప్రకటించింది.అధికారిక స్ట్రీమింగ్ తేదీని త్వరలో ప్రకటించనున్నారు.వంద దేవళ్లు కథేంటంటే..పాతికేళ్ల వయసులోనే వాసవి(శ్వాసిక) భర్తను కోల్పోతుంది. దీంతో ఇద్దరు పిల్లలకు అన్నీ తానై పోషించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సొంత కుటుంబం నుంచి ఎలాంటి సపోర్ట్ దక్కదు. మరోవైపు మగ దిక్కులేని ఆడదనే అలుసుతో వంకర బుద్ది ఉన్న మగాళ్లంతా ఆమె గురించి మరోలా మాట్లాడతారు. అర్థరాత్రి ఇంట్లో లైట్ వెలిగినా అనుమానిస్తారు. ఇవన్నీ భరిస్తూ ఇద్దరు కొడుకులు భాస్కర్(అజయ్ దిషాన్), వివేక్ (శక్తి)లను పెంచి పెద్ద చేస్తుంది. భాస్కర్ బీటెక్ చేస్తున్న సమయంలోనే మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన చేస్తుంది వాసవి. ఈ విషయాన్ని స్కూల్ మాస్టర్ ద్వారా కొడుకులను చెప్పిస్తుంది. అమ్మ మళ్లీ పెళ్లి చేసుకోవాలనే నిర్ణయాన్ని ఇద్దరు కొడుకులు స్వాగతించారా లేదా? 42 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోతుందనే విషయం తెలిసిన తర్వాత బంధువులు, సమాజం నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? వాసవి జీవితంలోకి ఏడు కొండలు(విజయ్ ఆంటోనీ) వచ్చిన తరువాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? చివరకు వాసవి మళ్లీ పెళ్లి చేసుకుందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీలోకి నాగదుర్గ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన
తెలంగాణ ఫోక్ సాంగ్స్తో తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యూట్యూబర్ నాగదుర్గ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఈమె గతంలో 'కలివనం' సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. గతేడాది ఇది థియేటర్లలో ఆపై ఓటీటీలోకి వచ్చింది గానీ జనాలకు దీని గురించి అస్సలు తెలీదు. అయితే ఈమె రీసెంట్గా తమిళంలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ధనుష్ మేనల్లుడు మూవీలో చేసింది. ఇప్పుడీ చిత్ర ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.(ఇదీ చదవండి: 'జన నాయగన్' తొలిరోజు కలెక్షన్ ఎన్ని కోట్లు?)నాగదుర్గ తమిళంలో చేసిన తొలి సినిమా 'లవ్ ఓ లవ్'. పవిష్ హీరో. ఈ నెల 10న తమిళంతో పాటు తెలుగులనూ రిలీజైంది గానీ జనాలు అస్సలు పట్టించుకోలేదు.. దీంతో డిజాస్టర్ అయింది. ఇప్పుడీ చిత్రం ఈ నెల 31 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుందని పోస్టర్ రిలీజ్ చేశారు.'లవ్ ఓ లవ్' విషయానికొస్తే.. రఘు(పవిష్), అవంతిక(నాగదుర్గ)ని ప్రేమిస్తాడు. ఆమె కూడా ఇష్టపడుతుంది. అయితే ప్రేమలో పడిన తర్వాత సినిమాలు, షికార్లు, షాపింగ్ పేరుతో రఘు డబ్బులన్నీ అవంతిక అవగొట్టేస్తుంది. చివరుు క్రెడిట్ కార్డులు, అప్పులు తీసుకునేలా చేస్తుంది. కానీ కొన్నాళ్ల తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్లిన రఘు.. అవంతిక తనకు లవ్, రఘు వద్దని ఓ బ్రేకప్ లెటర్ మీద సంతకం పెట్టాలని లేదంటే ప్రేమలో తనకు చేసినవన్నీ ఓ నాలుగు నెలలు తన స్థానంలో ఉండి తను చేసినవన్నీ చేయాలని అడుగుతాడు. దీంతో అవంతిక రఘుని చూసుకుంటానని చెబుతుంది. తర్వాత ఏమైంది? ఈ క్రమంలో అవంతిక ఎదుర్కున్న ఇబ్బందులేంటి? చివరకు వీళ్లిద్దరూ ఒక్కటయ్యారా అనేది మిగతా స్టోరీ.ఇక ఈ వారం ఓటీటీల్లో రిలీజైన సినిమాల విషయానికొస్తే నాగబంధం, పురుషః లాంటి తెలుగు సినిమాలతో పాటు కాన్ సిటీ, పల్లిచట్టంబి తదితర డబ్బింగ్ చిత్రాలు.. ముసాఫిర్ కేఫ్, ఆదర్శ్ బాలవిద్యాలయ లాంటి డబ్బింగ్ సిరీస్లు స్ట్రీమింగ్లోకి వచ్చాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ సినిమా) -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ సినిమా
ఈ వారం ఓటీటీల్లోకి చాలానే సినిమాలొచ్చాయి. వాటిలో నాగబంధం లాంటి స్ట్రెయిట్ తెలుగు మూవీతో పాటు కాన్ సిటీ, పల్లిచట్టంబి లాంటి డబ్బింగ్ చిత్రాలు స్ట్రీమింగ్లోకి వచ్చేశాయి. మరోవైపు ముసాఫిర్ కేఫ్, ఆదర్శ్ బాలవిద్యాలయ లాంటి డబ్బింగ్ సిరీస్లు వచ్చాయి. వీటికి తోడుగా ఓ తెలుగు కామెడీ సినిమా ఎలాంటి ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి మృణాల్ థ్రిల్లర్ సినిమా)కమెడియన్స్ సప్తగిరి, రాజ్ కసిరాజుతో పాటు పవన్ కల్యాణ్ అనే కొత్త కుర్రాడు హీరోగా నటించిన కామెడీ మూవీ 'పురుషః'. ఈ ఏడాది మే 22న థియేటర్లలో రిలీజైంది. ఓ మాదిరిగా ఉన్నప్పటికీ జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడీ చిత్రం సడన్గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది.'పురుషః' విషయానికొస్తే..చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులైన గోవింద్ (పవన్ కల్యాణ్), సత్తిబాబు (సప్తగిరి), శ్రీను (కసిరెడ్డి రాజన్ కుమార్), కిస్ (వెన్నెల కిశోర్) ప్రతి విషయాన్ని పంచుకుంటూ ఉంటారు. పెద్దయ్యాక వీళ్లకు పెళ్లిళ్లు అవుతాయి. గోవింద్.. కమల (రాయంచ)ని ప్రేమించి పెళ్లి చేసుకోగా, సత్తిబాబుకు లక్ష్మి (హాసిని)తో, శ్రీనుకు గీత (విషిక)తో వివాహమవుతుంది. అయితే వీరి వైవాహిక జీవితం సవ్యంగా సాగదు. నిత్యం గొడవలతో విసిగిపోయిన భార్యలే.. తమకు విడాకులు కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కుతారు.విడాకుల కోసం భర్తలు కూడా కోర్టు చుట్టూ తిరుగుతుంటారు కానీ భార్యలు మాత్రం రారు. దీంతో కేసు వాయిదాల మీద వాయిదా పడుతుంటుంది. వీరి బాధను అర్థం చేసుకున్న జడ్జి (వీటీవీ గణేష్) అసలు సమస్య ఏంటో తెలుసుకోవాలని డిసైడ్ అవుతాడు. ఇంతకీ గోవింద్, కమల ప్రేమ కథ ఎలా మొదలైంది? ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు. సత్తిబాబు, శ్రీనులపై వారి భార్యలకు ఎందుకు అంత అనుమానం? వీరి కాపురం కూల్చడంలో స్నేహితుడు 'కిస్' పాత్ర ఏంటి? చివరికి ఈ భార్యాభర్తల కథ ఎలాంటి ముగిసిందనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: చెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూ) -
మూడు వారాల్లోనే ఓటీటీకి నాగబంధం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విరాట్ కర్ణ, నభా నటేశ్ హీరో హీరోయిన్లుగా నటించిన సోషియో ఫాంటసీ మూవీ నాగబంధం. ఈ చిత్రానికి అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. అనంత పద్మనాభ స్వామి బ్యాక్డ్రాప్లో సోషియో ఫాంటసీ కథగా వచ్చిన ఈ సినిమా గ్రాఫిక్స్ పరంగా అభిమానుల్ని ఆకట్టుకుంది. అయితే కంటెంట్ పరంగా అంతగా ప్రేక్షకులను మెప్పించలేకరపోయింది. ఈ సినిమాలో ఫైట్స్తో పాటు కొన్ని సన్నివేశాలు అనవసర నిడివిని పెంచాయనే కామెంట్స్ కూడా వినిపించాయి.అయితే జూలై 3న రిలీజైన ఈ మూవీ అప్పుడే ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. విడుదలైన మూడు వారాల్లోనే ఓటీటీలో సందడి చేయనుంది. ఈ చిత్రం జూలై 24 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అఫీషియల్గా ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. అసలు కథేంటంటే..ఈ సినిమా కథంతా 1756-1962 నేపథ్యంలో అనంత పద్మనాభస్వామి ఆలయం చుట్టూ సాగుతుంది. ఇండియన్ ప్రముఖ ఆర్కియాలజిస్ట్ ప్రభాకర్(జగపతి బాబు) తన 30 ఏళ్ల కెరీర్లో ఎన్నో రహస్యాలను ఛేదించినా.. నాగబంధం రహస్యాన్ని మాత్రం కనిపెట్టలేకపోతాడు. దీనిపై తన శిష్యులు టెస్లా, అలీ(రిషబ్ సాహ్నీ) పరిశోధన చేస్తూ హిమాలయాలకు వెళ్తారు . అక్కడ ఎన్నో ఏళ్లుగా బంధించబడి ఉన్న బైరాగి(గరుడ రామ్) తన మంత్ర శక్తితో అలీ గతాన్ని గుర్తు చేసి తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. ప్రపంచాన్ని జయించాలంటే నాగ బంధాన్ని విడిపించాలని అందుకోసం బ్రహ్మ కమలం తీసుకురావాలని ఆలీని ఆదేశిస్తాడు. అలీ తన అనుచరులతో బ్రహ్మకమలం వెతుకుతూ.. అడ్డుకున్న వాళ్లను, దానికి సంబంధించిన వివరాలు తెలిసి చెప్పని వాళ్లను క్రూరంగా చంపుతుంటాడు. చివరకు ఆ బ్రహ్మకమలం శ్రీరంగపురంలోని రంగనాథ స్వామి ఆలయంలో ఉన్న స్వామివారి నాభిలో ఉండే పద్మంలో ఉందని తెలిసి.. ఓ ప్లాన్ ప్రకారం ఆలయం నుంచి బయటకు తీసుకురాగా.. ఓ కారణంగా అది భైరవకోన సమీపంలోని సముద్రంలో పడిపోతుంది. దాన్ని తీసుకొచ్చింది అలీ మనుషులు తులసీవనం గ్రామానికి వెళ్తారు. అక్కడ డబ్బు ఆశ చూపి రుద్ర(విరాట్ కర్ణ) సహాయంతో పడవలో భైరవకోనకు బయలుదేరుతారు. మరి ఆ స్వర్ణ కమలం అలీ మనుషులకు దొరికిందా లేదా? రుద్ర వాళ్లకు సహాయం చేశాడా లేదా? ఆ బ్రహ్మకమలానికి రుద్రకు ఉన్న సంబంధం ఏంటి? అతను ప్రాణంగా ప్రేమించే చెల్లి మాసస(సోనియా సింగ్) చావుకు కారణం ఎవరు? పార్వతి(నభా నటేష్) ఎవరు? రుద్రతో ఆమెకు ఉన్న సంబంధం ఏంటి? 1956లో ఏం జరిగింది? ముస్లిం రాజుతో కలిసి భైరాగి పన్నిన కుట్ర ఏంటి? అసలు నాగబంధం నేపథ్యం ఏంటి?చివరకు బైరాగి నాగబంధాన్ని విడిపించాడా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీల్లో ఫ్రైడే సందడి.. ఒక్క రోజే 17 చిత్రాలు స్ట్రీమింగ్
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల సందడి ఉండనే ఉంటుంది. ఈ రోజు నుంచే థియేటర్లలో విజయ్ జన నాయగన్ సందడి చేస్తోంది. సంక్రాంతికి రావాల్సిన ఈ మూవీ దాదాపు ఏడు నెలల గ్యాప్ తర్వాత రిలీజైంది. అంతేకాకుండా ఈ వారంలో టాలీవుడ్ నుంచి కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ' రిలీజ్ కానుంది. దీంతో పాటు కాజల్ 'ద ఇండియా స్టోరీ' సహా హే చికితా, చంద్రప్పన్, కాగితం పడవలు లాంటి చిన్న చిత్రాలు బిగ్ స్క్రీన్స్పైకి రానున్నాయి.ఇక ఈ ఫ్రైడే ఓటీటీల రిలీజ్ విషయానికొస్తే పల్లిచట్టంబి, కాన్ సిటీ లాంటి డబ్బింగ్ సినిమాలతో పాటు ముసాఫిర్ కేఫ్, ఆదర్శ్ బాలవిద్యాలయ లాంటి సిరీస్లు సందడి చేయనున్నాయి. వీటితో పాటు పలు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్ ద ట్రూతర్స్ (స్పానిష్ మూవీ) - జూలై 24 72 అవర్స్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 24 లాస్ క్రెయంటస్ (స్పానిష్ మూవీ) - జూలై 24 ముసాఫిర్ కేఫ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 24 కాన్ సిటీ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూలై 24జియో హాట్స్టార్ స్టువర్ట్ ఫెయిల్స్ టూ సేవ్ యూనివర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 24 ది డెవిల్ వియర్స్ ప్రద-2(హాలీవుడ్ సినిమా)- జూలై 24 స్టార్ ట్రెక్ స్ట్రేంజ్ న్యూ వరల్డ్స్(హాలీవుడ్ సిరీస్)- జూలై 24 బ్లీచ్: థౌజండ్-ఇయర్ బ్లడ్ వార్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 25అమెజాన్ ప్రైమ్ ఆదర్శ్ బాల్ విద్యాలయ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూలై 24 ఈగో రామన్(తమిళ మూవీ)- జూలై 24జీ5 అగ ఆయ్ అహో ఆయ్ (మరాఠీ సిరీస్) - జూలై 24 ప్రేమ్ షాట్స్ (బెంగాలీ సిరీస్) - జూలై 24సోనీ లివ్ పల్లిచట్టంబి (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 24లయన్స్ గేట్ ప్లే ప్రొటెక్టర్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 24ఆపిల్ ప్లస్ టీవీ ద డింక్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 24సన్ నెక్స్ట్ సీక్రెట్ ఆఫ్ కళింగ (మలయాళ మూవీ) - జూలై 24మనోరమ మ్యాక్స్ట్రిపుల్ డెక్కర్(మలయాళ సినిమా)- జూలై 24 -
ఓటీటీలోకి వచ్చేసిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమా
80.90ల్లో పిల్లల్ని ఎంతగానో అలరించిన చాలా యానిమేటెడ్ పాత్రల్ని రీసెంట్ టైంలో లైవ్ యాక్షన్ సినిమాలుగా తీస్తున్నారు. హౌ టూ ట్రెయిన్ యువర్ డ్రాగన్, డోరా, మోగ్లీ లాంటివి ఇలానే వచ్చాయి. ప్రేక్షకుల్ని అలరించాయి. ఇదే దారిలో వచ్చిన మరో మూవీ 'హీ మ్యాన్ మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్'. గత నెలలో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ఓ మాదిరిగా ఆకట్టుకుంది. ఇప్పుడిది ఓటీటీలోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: రూ.251 ఫోన్ స్కామ్ గుర్తుందా? ఈ కాన్సెప్ట్తో ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ తెలుగు సిరీస్)ట్రావిస్ నైట్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ కథతో తెరకెక్కించారు. ప్రస్తుతం ఇది అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇంగ్లీష్తో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో హీరో పాత్రకు తెలుగులో హీరో నిఖిల్ డబ్బింగ్ చెప్పాడు. డంకన్కు రావు రమేశ్, విలన్ పాత్రకు ఆదిత్య మీనన్ గాత్రమందించారు.'హీ మ్యాన్ మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్' విషయానికొస్తే.. విశ్వాన్ని శాసించాలనే కోరికలున్న స్కెలిటార్ అనే రాక్షసుడు.. అద్భుత శక్తులున్న ఓ ఆయుధం కోసం ఎటర్నియా గ్రహంపై దాడి చేస్తాడు. దీంతో ఆ సామ్రాజ్యం చెల్లాచెదురవుతుంది. రాజు, రాణి.. ఆ ఆయుధాన్ని పిల్లాడిగా ఉన్న తన కొడుకు ఆడమ్కి ఇచ్చి భూమిపైకి పంపేస్తారు. కానీ ఆ ఆయుధం పిల్లాడి దగ్గర నుంచి మిస్ అవుతుంది. భూమిపై పెరిగి పెద్దవాడైన ఆడమ్.. ఎలాగైనా సరే తన గ్రహానికి వెళ్లాలని అనుకుంటూ ఉంటాడు. ఓ సందర్భంగా తన దగ్గర నుంచి మిస్ అయిన ఆయుధం ఆచూకీ లభిస్తుంది. కానీ దాన్ని పొందే క్రమంలో ఇతడిపై ఓ వింత జంతువు దాడి చేస్తుంది.ఈ జంతువు నుంచి తప్పించుకున్న ఆడమ్.. తన చిన్నప్పటి ఫ్రెండ్, సేనాధిపతి కూతురు తీలా సాయంతో తిరిగి తన గ్రహానికి చేరుకుంటాడు. కానీ అప్పటికే ఆ గ్రహం మొత్తం నాశనమైపోయింటుంది. తన తల్లిదండ్రులతో పాటు మరికొందరు.. స్కెలిటార్ దగ్గర బందీగా ఉంటారు. వీళ్లని రక్షించేందుకు ఆడమ్ రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలోనే ఆడమ్ తన శక్తిని తిరిగి ఎలా పొందగలిగాడు. హీ-మ్యాన్ ఎలా అయ్యాడు? చివరకు శత్రువులని మట్టుబెట్టాడా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా) -
రూ.251 ఫోన్ స్కామ్ గుర్తుందా? ఈ కాన్సెప్ట్తో తెలుగు సిరీస్
సరిగ్గా పదేళ్ల క్రితం 'ఫ్రీడమ్ 251' పేరుతో ఓ స్కామ్ జరిగింది గుర్తుందా? రూ.251కే స్మార్ట్ ఫోన్ ఇస్తామని చెప్పి నోయిడాకు చెందిన కంపెనీ ప్రకటించుకుంది. జనాలు కూడా దీని కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు. డబ్బులు కూడా కట్టారు కానీ తర్వాత ఇదో పెద్ద స్కామ్ అని తేలింది. ఇప్పుడీ కాన్సెప్ట్తో తెలుగులో ఓ వెబ్ సిరీస్ రానుందని ప్రకటించారు. ఈ మేరకు స్ట్రీమింగ్ డేట్ కూడా ప్రకటించారు.(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి మృణాల్ ఠాకుర్ థ్రిల్లర్ సినిమా)'ఆజాదీ 501' పేరుతో తీసిన ఈ సిరీస్.. ఆహా ఓటీటీలో ఈ నెల 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అంటే వచ్చే బుధవారం నుంచి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో తీసిన ఈ సిరీస్కి శివతేజ దర్శకుడు. పోస్టర్, ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే ఇందులో పేరున్న నటీనటులు అయితే ఎవరూ నటించలేదు. మరి ఇది ఏ మేరకు ప్రేక్షకుల్ని మెప్పిస్తుందో చూడాలి?ఇకపోతే ఈ వారం ఓటీటీల్లోకి చెప్పుకోదగ్గ తెలుగు సినిమాలేం రావట్లేదు. ఉన్నంతలో పల్లిచట్టంబి, కాన్ సిటీ అనే డబ్బింగ్ మూవీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటికి తోడుగా ముసాఫిర్ కేఫ్, ఆదర్శ్ బాలవిద్యాలయ లాంటి డబ్బింగ్ సిరీస్లు ఈ వీకెండ్ అందుబాటులోకి రాబోతున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా) -
ఆపరేషన్ సఫేద్ సాగర్.. ఆమె మాటలకు సిద్ధార్థ్ ఎమోషనల్
కార్గిల్ యుద్ధ నేపథ్యంలోనే వస్తోన్న సరికొత్త వెబ్ సిరీస్ ఆపరేషన్ సఫేద్ సాగర్. 1999లో జరిగిన కార్గిల్ వార్ ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కించారు. ఈ సిరీస్కు ఓని సేన్ దర్శకత్వం వహించారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేశారు. యుద్ధం నేపథ్యంలోనే వస్తోన్న సిరీస్ కావడంతో వైమానికి విన్యాసాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రైలర్ రిలీజ్ వేడుక ముంబయిలో నిర్వహించారు.ఈ సందర్భంగా హీరో సిద్ధార్థ్ ఎమోషనలయ్యారు. దివంగత స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహుజా భార్య అల్కా అహుజా ట్రైలర్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్కా అహుజాను వేదికపైకి ఆహ్వానించారు. అదే సమయంలో ప్రేక్షకులంతా ఆమెకు గౌరవసూచకంగా లేచి నిలబడ్డారు. తన భర్త కథను తెరపైకి తీసుకువచ్చినందుకు నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాటలు స్పష్టంగా సిద్ధార్థ్ను కదిలించాయి.. దీంతో ఆయన వేదికపై కన్నీళ్లను ఆపుకోలేకపోయారు.ఈ సిరీస్పై నమ్మకం ఉంచినందుకు సిద్ధార్థ్ ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. నిజ జీవిత యుద్ధ వీరుడి పాత్రను పోషించడానికి తాను మొదట్లో సంకోచించానని సిద్ధార్థ్ తెలిపారు. ప్రస్తుతం మన మధ్య లేని వారి పాత్రను.. ముఖ్యంగా ఒక అమరవీరుడి పాత్రను పోషించినప్పుడు మనపై చాలా పెద్ద బాధ్యత ఉంటుందని అన్నారు. హీరోలు ఎప్పుడూ హీరోల్లా కనిపించరు. వారు తమ చర్యల వల్లే హీరోలవుతారని ప్రశంసించారు. ఈ ప్రాజెక్ట్ అంగీకరించే ముందు తాను ఈ సిరీస్ నిర్మాతలతో చాలాసార్లు చర్చించానని వెల్లడించారు. ఆయన భార్య అల్కా అహుజా అనుమతించారా?' అదే నాకు అత్యంత ముఖ్యమని మేకర్స్తో చెప్పానని గుర్తు చేసుకున్నారు. కాగా.. ముంబయిలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రస్తుత, పదవీ విరమణ పొందిన భారత వైమానిక దళ అధికారులు కూడా హాజరయ్యారు.అజయ్ అహుజా ఎవరంటే..స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహుజా 1999 కార్గిల్ యుద్ధంలో మరణించిన ఒక భారత వైమానిక దళ అధికారి. కూలిపోయిన విమానంలో తోటి పైలట్ను గుర్తించే మిషన్లో ఉండగా ఆయన విమానం కూల్చివేశారు. అహుజాకు ఆయన ధైర్యసాహసాలకు, సేవకు గాను మరణానంతరం వీరచక్ర పురస్కారం లభించింది. ఆయనను ఆపరేషన్ సఫేద్ సాగర్లోని కీలక వ్యక్తులలో ఒకరిగా గుర్తుంచుకుంటారు. ఈ సిరీస్ కార్గిల్ యుద్ధ సమయంలో భారత వైమానిక దళం పోషించిన పాత్ర ఆధారంగా రూపొందించారు. ఈ నెట్ఫ్లిక్స్ సిరీస్లో అభయ్ వర్మ, దియా మీర్జా, ప్రాజక్త కోలి, ఆదిల్ హుస్సేన్, మిహిర్ అహుజా, తారుక్ రైనా కీలక పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ ఆగస్టు 7 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఓటీటీలోకి వచ్చేసిన సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా
సాధారణంగా ఓ వయసొచ్చిన తర్వాత దర్శకులు దాదాపుగా సినిమాలు చేయడం తగ్గించేస్తుంటారు. కానీ రీసెంట్ టైంలో టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు, 94 ఏళ్ల వయసులోనూ 'సింగ్ గీతం' అనే చిత్రం తీసి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఇది ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈయనలానే హాలీవుడ్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్బర్గ్ కూడా 79 ఏళ్ల వయసులోనూ ఇంకా చలాకీగా మూవీస్ చేస్తున్నారు. ఈయన తీసిన లేటెస్ట్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)జురాసిక్ పార్క్, క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్, మ్యూనిచ్, ద టెర్మినల్, ఇండియానా జోన్స్ తదితర సినిమాలతో అద్భుతమైన గుర్తింపు సాధించిన స్టీవెన్ స్పీల్బర్గ్ తీసిన లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ 'డిస్క్లోజర్ డే'. గత నెల 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. ఓ మేరకు ఆకట్టుకుంది. ఏలియన్స్ కాన్పెప్ట్తో తీసిన ఈ చిత్రం ఇప్పుడు విదేశాల్లో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. కాకపోతే అద్దె విధానంలో ఇంగ్లీష్, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.డిస్క్లోజర్ డే విషయానికొస్తే.. ఓ సైబర్ సెక్యూరిటీ విజిల్ బ్లోయర్ డేనియల్ (జోష్ ఓ కానర్), వాతావరణ శాస్త్రవేత్త మార్గెట్(ఎమిలీ బ్లంట్).. అమెరికా ప్రభుత్వం దాచిపెట్టిన గ్రహాంతరవాసుల రహస్య ఆధారాలని బయటపెట్టాలనుకుంటారు. ఈ క్రమంలోనే ఏజెన్సీ చీఫ్ నోవా (కోలిన్ ఫెర్త్) నుంచి వీళ్లిద్దరూ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. గ్రహాంతరవాసులు నిజంగానే భూమిపైకి వస్తే మానవాళి ఎలా స్పందిస్తుందనేది ఇందులో చూపించే ప్రయత్నం చేశారు.(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి మృణాల్ థ్రిల్లర్ సినిమా) -
నేరుగా ఓటీటీలోకి మృణాల్ థ్రిల్లర్ సినిమా
ప్రతి భాషలోనూ ప్రతి ఏడాది వందలకొద్ది సినిమాలని తీస్తుంటారు. అయితే వీటిలో నుంచి థియేటర్లలోకి కొన్ని వస్తుంటాయి. మరికొన్ని మాత్రం ల్యాబ్ల్లోనే మగ్గుతుంటాయి. చిన్న నటీనటులు చేసిన మూవీస్ విషయంలో ఇలా జరిగితే ఏదోలే అనుకోవచ్చు. కొన్నిసార్లు స్టార్స్ చేసిన చిత్రాలకు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. అలాంటిదే మృణాల్ ఠాకుర్ విషయంలో జరిగింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)మృణాల్ ఠాకుర్ ప్రధాన పాత్రలో నటించిన హిందీ సినిమా 'పూజా మేరీ జాన్'. హ్యుమా ఖురేషీ కీలక పాత్ర చేసింది. అప్పుడెప్పుడో 2022లోనే మూవీ సిద్ధం చేసినప్పటికీ థియేటర్లలో రిలీజ్ మాత్రం అవ్వలేదు. తొలుత దీని హక్కుల్ని హాట్స్టార్ దక్కించుకుంది. కానీ జియో సంస్థతో విలీనం కావడం లాంటివి జరగడంతో ఈ ప్రాజెక్ట్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.మళ్లీ ఇన్నాళ్లకు 'పూజా మేరీ జాన్' సినిమా సంగతి బయటకొచ్చింది. దీని డిజిటల్ హక్కుల్ని జీ5 ఓటీటీ సంస్థ దక్కించుకుంది. తాజాగా రిలీజ్ చేసిన వీడియోతో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. చూస్తుంటే దీనిని నేరుగా స్ట్రీమింగ్లోకి తీసుకొచ్చే అవకాశముంది. కానీ తేదీ అయితే ప్రకటించలేదు. నవజ్యోత్ గులాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాని థ్రిల్లర్ స్టోరీతో తెరకెక్కించారు.'పూజా మేరీ జాన్' విషయానికొస్తే.. పూజా అనే సాధారణ అమ్మాయి జీవితంలోకి ఒక అపరిచిత వ్యక్తి ఎంట్రీ ఇస్తాడు. అతను పూజాను పిచ్చిగా ప్రేమిస్తూ, ఆమె ప్రతి కదలికను గమనిస్తూ ఉంటాడు. పూజాని ఫోన్ కాల్స్, మెసేజ్లు, ఇంటర్నెట్ ద్వారా తీవ్రంగా భయభ్రాంతులకు గురిచేస్తుంటాడు. ఈ డిజిటల్ వేధింపుల వల్ల పూజ జీవితం ఎలా నరకంగా మారింది? ఆ అజ్ఞాత వ్యక్తి నుండి తనని తాను కాపాడుకోవడానికి ఏం చేసిందనేది? స్టోరీలా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: జీ5 ఓటీటీలోకి ఏకంగా 60 సినిమాలు.. తెలుగు నుంచి తొమ్మిది) -
ఓటీటీకి ఆపరేషన్ సఫేద్ సాగర్.. ట్రైలర్ అదుర్స్
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్లు వస్తూనే ఉంటాయి. సరికొత్త కంటెంట్తో ప్రేక్షకులను అలరిస్తుంటాయి. తాజాగా మరో ఆసక్తికర కథనంతో వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. 1999 కార్గిల్ యుద్ధం బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఆపరేషన్ సఫేద్ సాగర్ సిరీస్ తెరకెక్కించారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా.. తాజాగా ట్రైలర్ కూడా విడుదల చేశారు.కార్గిల్ యుద్ధం నేపథ్యంలోనే వస్తోన్న ఆపరేషన్ సఫేద్ సాగర్ ట్రైలర్లో యుద్ధ సన్నివేశాలు, వైమానిక దాడులు ఆకట్టుకునేలా ఉన్నాయి. 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్ సైన్యాన్ని తరిమికొట్టేందుకు భారత వైమానిక దళం చేపట్టిన ఆపరేషన్ పేరే సఫేద్ సాగర్. పాకిస్తాన్పై వైమానిక దాడులతో మంచు కొండలపై భారత్ విరుచుకుపడినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. 1999 మే 26న ప్రారంభమైన ఈ ఆపరేషన్లో ది గోల్డెన్ యారోస్ కీలక పాత్ర పోషించింది.కాగా.. ఈ సిరీస్లో సిద్దార్థ్, జిమ్మీ షెర్గిల్, అభయ్ వర్మ కీలక పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 7వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ మూవీలో ఎయిర్ఫోర్స్ కమాండర్గా కనిపించనున్నారు. -
ఓటీటీకి లేటేస్ట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అర్జున్దాస్, అన్నాబెన్ జంటగా నటించిన చిత్రం కాన్ సిటీ. కమెడియన్ యోగిబాబు, వీటీవీ గణేశ్ కీలక పాత్రల్లో కనిపించారు. హరీష్ దురైరాజ్ దర్శకత్వంతో పాటు నిర్మాతగా వ్యవహరించారు. ఈ ఏడాది జూన్ 26న తెలుగు, తమిళంలో రిలీజైంది. మనీ కాన్సెప్ట్తో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది.తాజాగా ఈ సినిమా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 24 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు. ఈ చిత్రం తెలుగు, తమిళంతో పాటు కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా? అన్న డైలాగ్ ఎప్పుడో ఒకసారి వినే ఉంటారు. ఆ మాట నిజమైతే బాగుండు అనుకునేవాళ్లూ లేకపోలేదు.. దాదాపు అలాంటి కాన్సెప్ట్తో వచ్చిన చిత్రమే "కాన్ సిటీ". ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. -
ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ నటించిన చిట్టచివరి సినిమా 'జన నాయగన్' ఈ గురువారం థియేటర్లలోకి రానుంది. తెలుగులో అయితే కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ' రిలీజ్ కానుంది. దీనితో పాటు కాజల్ 'ద ఇండియా స్టోరీ' సహా హే చికితా, చంద్రప్పన్, కాగితం పడవలు లాంటి చిన్న చిత్రాలు బిగ్ స్క్రీన్స్పైకి రానున్నాయి.(ఇదీ చదవండి: ఒకే ఓటీటీలోకి ఏకంగా 60 సినిమాలు.. తెలుగు నుంచి తొమ్మిది)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. ఈ వీకెండ్ చెప్పుకోదగ్గ తెలుగు మూవీస్ అయితే లేవు. ఉన్నంతలో పల్లిచట్టంబి, కాన్ సిటీ లాంటి డబ్బింగ్ సినిమాలతో పాటు ముసాఫిర్ కేఫ్, ఆదర్శ్ బాలవిద్యాలయ లాంటి సిరీస్లు కాస్తోకూస్తో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు ఇంకేమైనా సర్ప్రైజ్ స్ట్రీమింగ్ లాంటివి ఉంటాయేమో చూడాలి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ రిలీజ్ కానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జూలై 20 నుంచి 26 వరకు)నెట్ఫ్లిక్స్ఏ టాక్సిక్ లవ్ స్టోరీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - జూలై 22ఎలైట్ ఫోర్స్ (ఫ్రెంచ్ సిరీస్) - జూలై 22రాన్సమ్ కెన్యన్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 23ద డెట్ కలెక్టర్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 23ద ట్రూతర్స్ (స్పానిష్ మూవీ) - జూలై 2472 అవర్స్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 24లాస్ క్రెయంటస్ (స్పానిష్ మూవీ) - జూలై 24ముసాఫిర్ కేఫ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 24కాన్ సిటీ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూలై 24 (రూమర్ డేట్)హాట్స్టార్స్టువర్ట్ ఫెయిల్స్ టూ సేవ్ యూనివర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 24బ్లీచ్: థౌజండ్-ఇయర్ బ్లడ్ వార్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 25అమెజాన్ ప్రైమ్ఆదర్శ్ బాల్ విద్యాలయ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూలై 24జీ5అగ ఆయ్ అహో ఆయ్ (మరాఠీ సిరీస్) - జూలై 24ప్రేమ్ షాట్స్ (బెంగాలీ సిరీస్) - జూలై 24సోనీ లివ్పల్లిచట్టంబి (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 24లయన్స్ గేట్ ప్లేప్రొటెక్టర్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 24ఆపిల్ ప్లస్ టీవీద డింక్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 24సన్ నెక్స్ట్సీక్రెట్ ఆఫ్ కళింగ (మలయాళ మూవీ) - జూలై 24(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు కోర్ట్ రూమ్ థ్రిల్లర్) -
ఒకే ఓటీటీలోకి ఏకంగా 60 సినిమాలు.. తెలుగు నుంచి తొమ్మిది
ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. థియేటర్లకు వెళ్లే విషయంలో ప్రేక్షకుల ఆసక్తి రోజురోజుకీ తగ్గిపోతుంది. మరోవైపు ఓటీటీ సంస్థలు తమ దానిలో స్ట్రీమింగ్ ప్రాజెక్టుల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తుంటాయి. ఇదివరకే నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్ మూవీస్ లిస్ట్ ప్రకటించగా.. ఇప్పుడు జీ5 కూడా తమ దానిలో ఏకంగా 60 వరకు చిత్రాలు, వెబ్ సిరీస్లు రాబోతున్నాయని వెల్లడించింది.(ఇదీ చదవండి: సల్మాన్ ఖాన్కి ఏమైంది? ఇలా మారిపోయాడేంటి?)తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఇవన్నీ రాబోయే రోజుల్లో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. తెలుగు వరకు అయితే ఈ ఓటీటీలోకి నాగచైతన్య 'వృషకర్మ', బాలకృష్ణ 111వ సినిమా, అనిల్ రావిపూడి-వెంకటేశ్ కొత్త మూవీ, నివేదా థామస్ 'శ్రీమతి', భూతం భయ్యం తదితర మూవీస్.. అలానే శ్రీకాంత్ 'అబ్జెక్షన్ మై లార్డ్', అనంతకాలం సిరీస్లు.. జగపతిబాబు 'జయమ్ము నిశ్చయమ్మురా 2' టాక్ షో ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే అన్ని భాషలు కలిపి 21 సినిమాలు 27 సిరీస్లు... చెరో ఆరు యానిమేషన్, ఏఐ మూవీస్ జాబితాలో ఉన్నాయి.జీ5 ఓటీటీలోకి వచ్చే సినిమాలు,సిరీస్లుఘమాశాన్ - హిందీ సినిమాబంధర్ - హిందీ మూవీకాంబ్లీ - హిందీ సిరీస్ద స్కామ్ లీక్డ్ - హిందీ సిరీస్బకైటీ 2 - హిందీ సిరీస్దలింబ్ - హిందీ మూవీరంగబాజ్ 4 - హిందీ సిరీస్లాల్ బజార్ 2 - హిందీ సిరీస్రావడి - తమిళ సినిమాతుంబచ్చి మంజుల - మరాఠీ మూవీకాఫీ కింగ్ - హిందీ సిరీస్హాయ్ - తమిళ సినిమాసుమో దీదీ - హిందీ మూవీకేరళ అండర్ గ్రౌండ్ - మలయాళ సిరీస్ఇక్ రూప్ - హిందీ మూవీశ్రీమతి - తెలుగు సినిమాఅబ్జెక్షన్ మై లార్డ్ - తెలుగు సిరీస్కూసే మునుస్వామి వీరప్పన్ 2 - తమిళ సిరీస్జాన్వర్ 2 - హిందీ సిరీస్హేయ్ కాయ్ నవీన్ 2 - హిందీ సిరీస్పూజా మేరీ జాన్ - హిందీ సినిమాహై జవానీ తో ఇష్క్ హోనా హై - హిందీ మూవీజీనా ఇసీ కా నామ్ హై 2.0 - హిందీ సిరీస్భారత భాగ్య విధాత - హిందీ సినిమాసర్వగుణ్ సంపన్న్ - హిందీ మూవీప్రియో బొందు - బెంగాలీ సిరీస్తడయమ్ 2 - తమిళ సిరీస్మలబార్ కప్ - మలయాళ సిరీస్కుడ్ల కప్ - తమిళ సిరీస్అగ ఆయ్ ఆహో ఆయ్ - హిందీ సిరీస్జయమ్ము నిశ్చయమ్మురా 2 - తెలుగు రియాలిటీ షోవెంకటేశ్ - అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ - తెలుగు సినిమాథీ కురల్ - తమిళ సిరీస్స్వేట్కళి 2 - హిందీ సిరీస్భూతం భయ్యం - తెలుగు సినిమాఏ క్వీన్ - తమిళ సిరీస్వృషకర్మ - తెలుగు మూవీడీమోంటే కాలనీ 3 - తమిళ సినిమాఎన్బీకే 11 - తెలుగు మూవీజీ హారర్ షో - హిందీ సిరీస్ద డెవిల్ - కన్నడ సినిమాబిట్ కాయిన్ స్కామ్ - హిందీ సిరీస్ఆపరేషన్ బంగారా - హిందీ సిరీస్బాలన్ ద బాయ్ - మలయాళ సినిమాకరావళి - కన్నడ మూవీఅయ్యన మానే 2 - కన్నడ సిరీస్టీన్ టిగాడా - హిందీ సిరీస్అనంతకాలం - తెలుగు సిరీస్ఏఐ సినిమాలుశివశక్తి కీ అనంత్ కహానీపరమ్ సుందరి చంద్రకాంత కీ అమర్ ప్రేమకథ నర్మద మానస సుందరిగరుడ్ ఏక్ యోధ కీ కథతిరుపతి బాలాజీవిక్రమ్ బేతాళ్యానిమేషన్అయ్యప్పన్బార్బరిక్రామ్ ఆంజనేయ్ యుద్ధ్శివలోక్ కీ కుండక్క మండక్కబందబుద్ధి బుడబక్ 2.0టేల్స్ ఆఫ్ కృష్ణ(ఇదీ చదవండి: నిర్మాతతో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫొటోలు వైరల్) -
ఓటీటీలోకి తెలుగు కోర్ట్ రూమ్ థ్రిల్లర్
ఈ వీకెండ్ ఓటీటీల్లోకి బోలెడన్ని సినిమాలొచ్చాయి. వాటిలో మా ఇంటి బంగారం, ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు, ఏక్ దిన్, గేదెల రాజు, చాంద్ మేరా దిల్, ది డెవిల్ తదితర తెలుగు, డబ్బింగ్ మూవీస్ స్ట్రీమింగ్లోకి వచ్చాయి. వీటి సంగతి కాసేపు పక్కనబెడితే ఇప్పుడో తెలుగు సిరీస్ గురించి అధికారిక ప్రకటన చేశారు. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలో తమిళ కామెడీ సినిమా 'పరిమళ అండ్ కో' తెలుగు రివ్యూ)తెలుగు సీనియర్ నటుడు శ్రీకాంత్, అనన్య శర్మ ప్రధాన పాత్రలు చేస్తున్న కోర్ట్ రూమ్ డ్రామా/థ్రిల్లర్ 'అబ్జెక్షన్ మై లార్డ్'. జీ5 ఓటీటీలో ఈ నెల 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు. త్వరలో రిలీజ్ చేయబోయే టీజర్ లేదా ట్రైలర్తో స్టోరీ ఏంటనేది తెలిసే అవకాశముంది.ఇక రీసెంట్ టైంలో తెలుగు దర్శకులు కూడా ఒరిజినల్ వెబ్ సిరీస్లు తీస్తూ ఆకట్టుకుంటున్నారు. సందీప్ కిషన్ ప్రధాన పాత్ర చేసిన 'సూపర్ సుబ్బు'.. రీసెంట్ టైంలో అలా అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. ఈ క్రమంలోనే మరిన్ని తెలుగు సిరీస్లు రెడీ అవుతున్నాయి.(ఇదీ చదవండి: నిర్మాతతో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫొటోలు వైరల్) -
ఓటీటీలోకి మలయాళ బ్లాక్ బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
చిన్న సినిమాలో థియేటర్స్లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచన మలయాళ చిత్రం ‘బాలన్-ది బాయ్’. ‘మంజుమ్మల్ బాయ్స్’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన చిత్రం ఇది. రోమాంచం.. ఆవేశం లాంటి వైవిధ్యమైన కామెడీ చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు జీతు మాధవన్ ఈ చిత్రానికి కథను అందించాడు.ఫర్జానా పాలత్గింగల్, ఆది శేషన్, ముహమ్మద్ జినన్, డాలీ జూన్, టోవినో థామస్ కీలక పాత్రల్లో నటించారు. తల్లీకొడుకుల అనుబంధం నేపథ్యంలో తీర్చిదిద్దిన ఈ సినిమా జూన్ 19న థియేటర్స్లో రిలీజ్ హిట్ టాక్ సంపాదించింది. రూ. 18 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 30 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇప్పుడీ ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. జులై 31 నుంచి ప్రముఖ ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్ కానుంది.మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు సంస్థ అధికారిక ప్రకటన చేస్తూ ట్రైలర్ని రిలీజ్ చేసింది. బాలన్-ది బాయ్ కథేంటే..ఒక హత్య కేసులో జైలు శిక్ష అనుభవించి, తన కొడుకు(ఆది శేషన్)తో బయటకు వచ్చిన ఓ మహిళ(ఫర్జానా పాలత్గింగల్) చుట్టూ ఈ కథ తిరుగుంది. బయటకు వచ్చిన ఆ మహిళ..పేర్లను మార్చుకుంటూ కొడుకుతో కలిసి పలు చోట్ల పని చేస్తుంది. అంతా సవ్యంగా జరుగుతుందన్న సమయంలో ఆ మహిళ మరో హత్య చేయాల్సి వస్తుంది. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేస్తారు. రోవైపు స్కూల్కి వెళ్లిన కొడుకు అమ్మ రాక కోసం ఒక చోట ఎదురు చూస్తూ ఉంటాడు. తప్పిపోయిన బాలుడు అనుకొని పోలీసులు అతన్ని స్టేషన్కి తీసుకెళ్తాడు. అయితే తల్లి ఇచ్చిన ట్రైనింగ్ కారణంగా ఆ బాలుడు తన అడ్రస్ని పోలీసులకు చెప్పడు. అంతేకాదు చాలా చాకచక్యంగా స్టేషన్ నుంచి తప్పించుకుంటాడు. ఆ తర్వాత ఆ బాలుడు ఎక్కడికి వెళ్లాడు? తల్లిని కలుసుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయా లేదా? తల్లి కొడుకుల కథలోకి టొవినో థామస్ ఎలా వచ్చాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీకి మలయాళ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీల్లో మలయాళ సినిమాలకు ప్రత్యేక డిమాండ్ ఉంటోంది. ఈ చిత్రాలకు ఇతర భాషల్లో ఆడియన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే సరికొత్త కంటెంట్ సినిమాలు వస్తూనే ఉన్నాయి. మలయాళంలో హిట్ మూవీస్ తెలుగులోనూ ఆదరణ దక్కించుకుంటున్నాయి. తాజాగా మరో మలయాళ సినిమా ఓటీటీకి వచ్చేస్తోంది.ఈ ఏడాది మలయాళంలో రిలీజైన చిన్న చిన్న ఆసై ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు చేశారు. ఈనెల 28 నుంచి జియో హాట్స్టార్ వేదికగా అందుబాటులోకి రానుంది. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రానికి వర్ష వాసుదేవ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ఇంద్రన్స్, మధు, అపర్ణ బాలమురళి, జాఫర్ సాదిక్, విష్ణు అగస్త్య కీలక పాత్రల్లో నటించారు. Every little wish has a story worth telling.Chinna Chinna Aasai streams from July 28 in Malayalam, Tamil, Telugu, Kannada, and Hindi, exclusively on JioHotstar.@Aparnabala2#ChinnaChinnaAasai #JioHotstar #MalayalamCinema pic.twitter.com/ZLvfrvCZIl— JioHotstar Malayalam (@JioHotstarMal) July 17, 2026 -
సన్నీడియోల్ ‘ఇక్కా’ మూవీ రివ్యూ
ఉన్నావాడికైనా, లేనివాడికైనా , ఎవ్వరికైనాసరే ఉండేది స్వార్ధం. ఈ సమాజంలో జరుగుతున్న వందశాతం నేరాలు స్వార్ధంతో చేసేవే. అటువంటి నేరాలకు కొమ్ము కాస్తూ అన్యాయంగా న్యాయాన్ని తమ స్వార్ధానికి వాడుకుంటున్న వారికి సరైన పద్ధతిలో బుద్ధి చెప్పిన ఆటే ఈ ఇక్కా. తెలుగులో ఇక్కా అంటే పేకాటలో వచ్చే ఆసు ముక్క అని అర్ధం. పేకాటలో ఆసు ముక్కకు ఎంత యుక్తి శక్తి ఉందో అంతకంటే వందలరెట్లు తెలివిగలవాడు ఈ సినిమా హీరో. ఈ సినిమాలో వచ్చే పాత్రలు, చేసే పనులన్నీ చూసే ప్రేక్షకుడికి వినోదంతో పాటు కాస్త విజ్ఞానాన్ని కూడా అందిస్తుదనడంలో సందేహం లేదు. ఇంకా చెప్పాలంటే ఇక్కా సినిమా ప్రేక్షకులకు కనువిందుతో పాటు కనువిప్పు కూడా కలిగిస్తుంది. అంతలా ఏముందో ఈ సినిమాలో ఓ సారి చూద్దాం.సోమా మిట్టల్ అనే యువతి ప్రముఖ వ్యాపారవేత్త శౌర్యమాన్ గౌర్ కారు నుండి విసిరివేయబడి దారుణ హత్యకు గురవుతుంది. అక్కడ నుండే ఈ సినిమా మొదలవుతుంది. కేసు విచారణ చేపట్టిన పోలీసులు శౌర్యమాన్ గౌర్ ను అరెస్ట్ చేస్తారు. శౌర్యమాన్ తండ్రి పెద్ద రాజకీయనాయకుడు కావడం వల్ల నగరంలోని ప్రముఖ లాయర్ అయిన అర్జున్ మెహరాను ఈ కేసు తీసుకోవాలని ఒత్తిడి తీసుకువస్తారు. కాని న్యాయానికి కట్టుబడ్డ అర్జున్ మెహరా ముందు ఈ కేసును తీసుకోనని ససేమిరా తిరస్కరిస్తాడు. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల కేసును అర్జున్ మెహరా శౌర్యమాన్ తరపున వాదించడానికి ఒప్పుకుంటాడు. తన జీవిత కాలంలో న్యాయనికి కట్టుబడ్డ అర్జున్ మెహరా మొట్టమొదటిసారిగా అన్యాయం తరపున వకాల్తా పుచ్చుకోవడం మొత్తం కోర్టు సమాజాన్ని ఉలిక్కి పడేలా చేస్తుంది. అన్యాయం వైపు నిలబడ్డ అర్జున్ మెహరా న్యాయం కోసం తన ఆసు ముక్కని ఎలా ఆడతాడో ఇక్కా సినిమాలోనే చూడాలి. ఈ సినిమా ఓ మండి డ్రమెటిక్ థ్రిల్లర్.అల్తియా కౌశల్ అందించిన ఇక్కా కథను ప్రముఖ దర్శకుడు సిద్ధార్ధ మల్హోత్రా తెరకెక్కించారు. ప్రముఖ నటులు సన్నీడియోల్, అక్షయ్ ఖన్నా తో పాటు దియా మర్జా వంటి వర్ధమాన తారలు ఈ ఇక్కా సినిమాలో తమ పాత్రలకు పక్కా న్యాయం చేశారు.విశేషంగా సినిమా ఆఖర్లో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను మంచి థ్రిల్లింగ్ కు గురిచేస్తాయి. ఈ ఇక్కా సినిమా మాతృక హిందీ అయినా నెట్ ఫ్లిక్స్ లో తెలుగులోను లభ్యమవుతోంది. మస్ట్ వాచ్ ఫర్ ది వీకెండ్. ప్లే జాయ్ ఫుల్లీ విత్ యువర్ ఇక్కా.-హరికృష్ణ ఇంటూరు -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా
ఓటీటీల్లోకి ఈ వారం చాలానే సినిమాలు వచ్చాయి. సమంత 'మా ఇంటి బంగారం', సాయిపల్లవి 'ఏక్ దిన్', వడ్డే నవీన్ 'ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు', దర్శన్ 'ద డెవిల్'తో పాటు చాలా డబ్బింగ్ చిత్రాలు, వెబ్ సిరీసులు కూడా స్ట్రీమింగ్లోకి వచ్చేశాయి. వీటితో పాటు తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఒకేసారి రెండింటిలో అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ దీని సంగతేంటి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ థ్రిల్లర్ సినిమా.. తెలుగు రివ్యూ)సింగర్ రఘు కుంచె, వికాస్ ముప్పల ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'గేదెల రాజు కాకినాడ తాలూకా'. ఈ ఏడాది ఏప్రిల్ 24న థియేటర్లలో రిలీజైంది. కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇదో మూవీ ఉందని కూడా జనాలకు తెలీదు. ఇప్పుడీ చిత్రం ఎలాంటి ప్రకటన లేకుండా అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటీటీల్లో స్ట్రీమింగ్లోకి వచ్చేసింది.'గేదెల రాజు' విషయానికొస్తే.. కాకినాడ ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్ 'గేదెల రాజు', తన పలుకుబడితో రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తాడు. కార్పొరేషన్ ఎన్నికల టైంలో ఇతడిని ఎవరో హత్య చేస్తారు. ఈ సంఘటన తర్వాత రాజుతో శత్రుత్వం ఉన్నవాళ్లు, స్నేహితులు, అతడి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వ్యక్తులు అనుమానితులుగా మారతారు. ఇంతకీ గేదెల రాజుని చంపింది ఎవరు? దాని వెనుకున్న కారణాలేంటి? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సాయిపల్లవి సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
ఓటీటీలోకి వచ్చేసిన సాయిపల్లవి సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
సాయిపల్లవి పేరు చెప్పగానే ఫిదా, ప్రేమమ్, అమరన్ లాంటి సినిమాలు, అందులో ఆమె చేసిన అద్భుతమైన యాక్టింగ్ గుర్తొస్తుంది. ఇప్పటివరకు దక్షిణాదిలోని పలు భాషల్లో నటించిన ఈమె.. ఈ ఏడాది హిందీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ హీరోగా చేసిన మూవీతో పరిచయమైంది. రెండున్నర నెలల క్రితం థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులోనూ చూడొచ్చు.(ఇదీ చదవండి: సోనమ్ వాంగ్చుక్కు '3 ఇడియట్స్'తో సంబంధం లేదు: ఆమిర్ ఖాన్)సాయిపల్లవి, జునైద్ ఖాన్ జంటగా నటించిన సినిమా 'ఏక్ దిన్'. థాయ్ భాషకు చెందిన 'వన్ డే'కి ఇది అఫీషియల్ రీమేక్. పెద్దగా బజ్ లేకుండానే ఈ ఏడాది మే 01న థియేటర్లలో రిలీజైంది. సాయిపల్లవి తప్పితే ఇందులో చెప్పుకోదగ్గ మరో ప్లస్ పాయింట్ లేదు. ఆమిర్ కొడుకు జునైద్ యాక్టింగ్ అయితే మరీ దారుణంగా ఉందని విమర్శలు వచ్చాయి. దీంతో ఈ మూవీని జనాలు మర్చిపోయారు. తెలుగు డబ్బింగ్ రిలీజ్ చేసినప్పటికీ ఇదొచ్చిన సంగతి కూడా ఎవరికీ తెలియనంతలా వచ్చి వెళ్లిపోయింది.ఇకపోతే రెండు రోజుల క్రితం ఈ సినిమాని విదేశాల్లో అద్దె ప్రాతిపదికన స్ట్రీమింగ్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మన దేశంలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఉచితంగానే అందుబాటులోకి తెచ్చారు. హిందీతో పాటు తెలుగు, తమిళంలో స్ట్రీమింగ్ అవుతోంది.'ఏక్ దిన్' విషయానికొస్తే.. ఐటీ ప్రొఫెషనల్ అయిన దినేశ్ (జునైద్ ఖాన్) తనతో పనిచేసే మీరా(సాయిపల్లవి)ని రహస్యంగా ప్రేమిస్తుంటాడు. కానీ ఈ విషయం ఆమెతో చెప్పే ధైర్యముండదు. ఆఫీస్ పనిమీద జపాన్ వెళ్లినప్పుడు కనీసం ఒక్కరోజైనా ఆమెతో గడపాలని కోరుకుంటాడు. కట్ చేస్తే మీరాకు 'ట్రాన్సియంట్ గ్లోబల్ అమ్నీషియా' అనే అరుదైన వ్యాధి వస్తుంది. అంటే ఒకరోజుపాటు ఆమె తన జ్ఞాపకశక్తిని కోల్పోతుంది. మరి ఆ రోజు ఏం జరిగింది? దినేశ్ తన ప్రేమ విషయాన్ని ఆమెకు చెప్పగలిగాడా లేదా? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ థ్రిల్లర్ సినిమా.. తెలుగు రివ్యూ) -
ఓటీటీలో సరికొత్త యానిమేషన్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీల్లో ఎప్పటికప్పుడు వినూత్నమైన కంటెంట్ను ప్రేక్షకులకు అందిస్తున్నారు. తాజాగా మరో ఆసక్తికర వెబ్ సిరీస్ ఓటీటీ ప్రియుల ముందుకు రానుంది. తాజాగా సరికొత్త యానిమేటెడ్ సిరీస్ ‘శివలోక్ కె కుండక్క మండక్క’ స్ట్రీమింగ్కు రెడీ అయిపోయింది. ప్రముఖ రచయిత ఆనంద్ నీలకంఠన్ పిల్లల పుస్తకం ‘ ది వెరీ ఎక్స్ట్రీమ్లీ, మోస్ట్ నాటీ అసుర టేల్స్ ఫర్ కిడ్స్ ఆధారంగా ఈ సిరీస్ రూపొందించారు. ఈ సిరీస్ జూలై 17 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది.మన అందరికీ తెలిసిన పౌరాణిక ప్రపంచాన్ని ఈ యానిమేటెడ్ సిరీస్ ద్వారా స్క్రీన్పై సరికొత్తగా అందించనున్నారు. కథ విషయానికి వస్తే.. కుండక్క, మండక్క అనే ఇద్దరు అల్లరి అసుర జంట చుట్టూ తిరుగుతుంది. వాళ్ల అల్లరి పనులు ధైర్యం, స్నేహం, తమను తాము తెలుసుకునే ఒక అద్భుతమైన అడ్వెంచర్లోకి తీసుకెళ్తాయి. రామాయణం, మహాభారతం వంటి తెలిసిన కథలకే పరిమితం కాకుండా, ఈ సిరీస్ భారతీయ పౌరాణిక సంపదలోని కొత్త పాత్రలు, ఇంకా అన్వేషించని లోకాలు, మాయాజాలంతో నిండిన అడ్వెంచర్లను పిల్లలకు, కుటుంబాలకు పరిచయం చేయనుంది.వినోదం, యాక్షన్, ఆకర్షణీయమైన యానిమేషన్ కలయికతో రూపొందించిన ఈ సిరీస్ నేటి పిల్లల కోసం పౌరాణిక కథలను సరికొత్తగా ఆవిష్కరించనుంది. హీరో అనే పదం ఓ వ్యక్తి తను తీసుకునే నిర్ణయాలతో నిర్ణయించబడుతాడనే అభిప్రాయాన్ని అందంగా అందరికీ తెలియజేస్తుంది. ఇదొక పెద్ద యూనివర్స్కు ఆరంభం మాత్రమే. ‘శివలోక్ కె కుండక్క మండక్క’ భవిష్యత్తులో కొత్త పాత్రలు, కొత్త అడ్వెంచర్లు, మరిన్ని కథలతో విస్తరించనుంది. పిల్లలు భారతీయ పౌరాణిక కథలను వినోదాత్మకంగా, కొత్త కోణంలో ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఈ కతలో ఇద్దరు అల్లరి అసుర పాత్రలను పెట్టడం ద్వారా, అల్లరి పిల్లలకు విలువలు లేదా క్రమశిక్షణ ఉండవనే అభిప్రాయాన్ని ప్రశ్నిస్తుంది. కుండక్క, మండక్క చేసే సాహసాల ద్వారా ఆసక్తి, అల్లరి కూడా దయ, ధైర్యం, అనుభూతితో కలిసి ఉంటుందని మనకు అవగతమవుతుంది. ఈ సిరీస్ సిరీస్ హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులోకి రానుంది.రైటర్ ఆనంద్ నీలకంఠన్ మాట్లాడుతూ..'నా పుస్తకం ‘ ది వెరీ, ఎక్స్ట్రీమ్లీ, మోస్ట్ నాటీ అసుర టేల్స్ ఫర్ కిడ్స్’ ను ‘శివలోక్ కె కుండక్క మండక్క’ రూపంలో కిడ్స్ జెడ్ జీవం పోసి కొత్త తరం పిల్లలకు పరిచయం చేయడం చూసి నాకు ఎంతో ఆనందంగా ఉంది. భారతీయ పౌరాణిక సంపదలో నాటుకుపోయిన కథలను పిల్లలకు ఆకట్టుకునే విధంగా మళ్లీ ఆవిష్కరించడం..వాటిని జీ5 వంటి పెద్ద స్థాయి ప్లాట్ఫామ్స్ రూపొందించటం అనందంగా ఉంది. నేను ఈ పాత్రలను సృష్టించినప్పుడు ఎంత ఆనందించానో, కుండక్క, మండక్కల అడ్వెంచర్లను స్క్రీన్పై చూస్తూ చిన్నారులు కూడా అంతే ఆనందిస్తారని ఆశిస్తున్నా. ఈ అల్లరి పాత్రలు వారి ప్రపంచం యానిమేషన్ రూపంలో కొత్త జీవం పొందడం నిజంగా ఆనందించదగ్గ విషయం' అని అన్నారు -
ఓటీటీకి మా ఇంటి బంగారం.. ఒక్క రోజే 14 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల హడావుడి ఉండనే ఉంటుంది. ఈ వారంలో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఐశ్వర్య రాజేశ్ 'ఓ సుకుమారి', మాధవన్ 'జీడీఎన్', వదలా, రాజా ది రాజా, ఆపరేషన్ అరుణారెడ్డి, మహేంద్రగిరి వారాహి లాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అంతేకాకుండా హాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ లేటెస్ట్ మూవీ 'ద ఒడిస్సీ' థియేటర్లలో సందడి చేయనుంది.ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ వారంలో సమంత మా ఇంటి బంగారం స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. ఈ మూవీ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా వడ్డే నవీన్ మూవీ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ఓటీటీలోకి రానుంది. వీటితో పాటు కన్నడ మూవీ ది డెవిల్ ఆసక్తిని పెంచుతోంది. దీంతో పాటు ఈ శుక్రవారం పలు హిందీ, బాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్లు సందడి చేయనున్నాయి. మరి ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్ ద మ్యాప్ ఆఫ్ లాంగింగ్ (స్పానిష్ సిరీస్) - జూలై 17 ద ఈస్ట్ ప్యాలెస్ (కొరియన్ సిరీస్) - జూలై 17 డిజైర్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 17 23000 లైవ్స్ (జర్మన్ మూవీ) - జూలై 17 హార్ట్ స్టాపప్ ఫరెవర్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 17 25 ఇయర్క్ ఆఫ్ యూ(జపనీస్ సినిమా)- జూలై 17 స్పూకీ ఇన్ లవ్ (కొరియన్ సిరీస్) - జూలై 18అమెజాన్ ప్రైమ్..ది బే (హాలీవుడ్ మూవీ)- జూలై 17ఆహాఓవెల్స్(తమిళ సినిమా)- జూలై 17జియో హాట్స్టార్.. మా ఇంటి బంగారం (తెలుగు మూవీ) - జూలై 17 టెస్ట్ సబ్జెక్ట్ వీ (హిందీ డాక్యుమెంటరీ) - జూలై 18జీ5 ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు (తెలుగు సినిమా) - జూలై 17 ది డెవిల్(కన్నడ సినిమా)- జూలై 17శివలోక్ కె కుండక్క మండక్క(యానిమేషన్ సిరీస్)- జూలై 17లయన్స్ గేట్ ప్లే..డెజర్ట్ వారియర్(హాలీవుడ్ మూవీ)- జూలై 17టెక్సాస్ చైన్ సా(హాలీవుడ్ మూవీ)- జూలై 17 -
ఓటీటీలోకి రొమాంటిక్ డ్రామా.. ట్రైలర్ రిలీజ్
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు వస్తూనే ఉంటాయి. రీసెంట్ టైంలో అలా ప్రీతమ్ అండ్ పెడ్రో, సూపర్ సుబ్బు తదితర సిరీస్లు సినీ ప్రేమికుల్ని ఆకట్టుకున్నాయి. వీటిలానే ఎంటర్టైన్ చేసేందుకు ఓ రొమాంటిక్ డ్రామా సిరీస్ రెడీ అయింది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసి స్టోరీ ఏంటనేది చెప్పేశారు. ఇంతకీ ఈ సిరీస్ సంగతేంటి? ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్)విక్రాంత్ మస్సే, వేదిక పింటో, మహిమా మక్వానా ప్రధాన పాత్రలు చేసిన సిరీస్ 'ముసాఫిర్ కేఫ్'. దివ్య ప్రకాశ్ దూబే అనే రచయిత్రి రాసిన 'ముసాఫిర్ కేఫ్' నవల ఆధారంగా ఈ రొమాంటిక్ డ్రామాని తెరకెక్కించారు. నెట్ఫ్లిక్స్లో ఈ నెల 24 నుంచి అంటే వచ్చే శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగులోనూ అందుబాటులోకి రావొచ్చు.'ముసాఫిర్ కేఫ్' ట్రైలర్ బట్టి చూస్తే.. చందర్(విక్రాంత్ మస్తే) కుర్రతనంలో ఉన్నప్పుడు సుధ(వేదిక పింటో)ని ప్రేమిస్తాడు. రిలేషన్లోకి వెళ్తాడు. కానీ కొన్ని కారణాలతో వాళ్లు విడిపోతారు. కొన్నేళ్లు గడిచిపోయిన తర్వాత చందర్.. ప్రీతి(మహిమా మక్వానా)తో ప్రేమలో పడతాడు. తర్వాత ఏమైంది? ప్రీతికి సుధ గురించి తెలిసినప్పుడు చందర్ ఎలా రియాక్ట్ అయ్యాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీలా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం అలానే సమంత మా ఇంటి బంగారం, ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు తదితర తెలుగు చిత్రాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటికి తోడుగా మరికొన్ని సిరీస్లు, డబ్బింగ్ మూవీస్ కూడా అందుబాటులోకి రానున్నాయి. వీటి సంగతి పక్కనబెడితే ఓ మలయాళ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ దాదాపు మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: ఓటీటీలో తమిళ కామెడీ థ్రిల్లర్ సినిమా 'పరిమళ అండ్ కో'.. తెలుగు రివ్యూ)లేటెస్ట్ సెన్సేషన్ కాయదు లోహర్.. మలయాళంలో చేసిన తొలి మూవీ 'పల్లిచట్టంబి'. టొవినో థామస్ హీరో. 1957లో కేరళలో జరిగిన భూసంస్కరణ బిల్లు నేపథ్యంగా తీసిన చిత్రమిది. తెలుగులోనూ ఏప్రిల్ 15న థియేటర్లలో రిలీజైంది. కానీ ఎక్కడా ఆకట్టుకోలేక ఫ్లాప్ అయింది. ఇప్పుడీ చిత్రాన్ని మూడు నెలల తర్వాత అంటే వచ్చే శుక్రవారం (జూలై 24) నుంచి సోనీ లివ్ ఓటీటీలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.'పల్లిచట్టంబి' విషయానికొస్తే.. 1957లో కేరళంళో కమ్యూనిస్ట్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. తర్వాత ఏడాది భూసంస్కరణల బిల్లు అమల్లోకి తీసుకొస్తుంది. దీంతో ఊళ్లలోని భూస్వాములు, వలసదారుల నుంచి వ్యతిరేకత మొదలవుతుంది. మరోవైపు తమ చర్చిల్ని కాపాడుకునేందుకు వాటి మత పెద్దలు ప్రత్యేక రక్షక దళాల్ని తయారు చేసుకోవడం ప్రారంభిస్తారు. అలా కణియార్లోని కున్నంపురం చర్చి భూముల రక్షణ కోసం పోతన్ క్రిస్టోఫర్ (టొవినో థామస్)ని 'చట్టంబి'గా(చర్చి రక్షకుడు లేదా రౌడీ) నియమిస్తారు.నిజానికి పోతన్ ఓ హిందూ కుర్రాడు. అసలు పేరు కృష్ణ పిళ్లై. కానీ మారుపేరుతో ఆ చర్చిలోకి అడుగు పెట్టి, వాళ్లకి అండగా నిలుస్తాడు. కమ్యూనిస్ట్ భావజాలమున్న రెబెక్కా (కయాదు లోహర్)తో అనుకోకుండా ప్రేమలోనూ పడతాడు. తర్వాత ఏమైంది? అసలు కృష్ణ పిళ్లై గతమంటి? చర్చి భూముల రక్షణ కోసం ఎందుకు నిలబడ్డాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్) -
జైలులోనే స్టార్ హీరో.. ఏడు నెలల తర్వాత ఓటీటీలోకి సినిమా
అభిమాని రేణుకాస్వామిని హత్య చేసిన కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న కన్నడ స్టార్ హీరో దర్శన్.. ఎప్పుడు బయటకొస్తాడనేది తెలియదు. మరోవైపు ఈ హడావుడి జరుగుతున్న టైంలోనే ఇతడు హీరోగా నటించిన ఓ మూవీ రిలీజైంది. కానీ యావరేజ్గా నిలిచింది. ఇప్పుడీ చిత్రం ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులోకి రానుందంటే?(ఇదీ చదవండి: కొత్తింట్లోకి అడుగుపెట్టిన శ్రుతి హాసన్.. ఫొటోలు వైరల్)దర్శన్, రచనా రాయ్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'ద డెవిల్'. గతేడాది డిసెంబరులో థియేటర్లలో రిలీజైంది. ఆ టైంలోనే దర్శన్ జైలులో ఉండటంతో అభిమానులు ఈ మూవీకి వెళ్లారు. అయితే నెలనెలన్నరకే ఓటీటీలోకి వచ్చేస్తుందని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ నెలలు గడిచిపోతున్న స్ట్రీమింగ్ డేట్ ప్రకటించలేదు. అలాంటిది ఇప్పుడు దాదాపు ఏడు నెలల తర్వాత ఈ శుక్రవారం(జూలై 17) నుంచి జీ5 ఓటీటీలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారికంగా వీడియో రిలీజ్ చేశారు. అయితే కన్నడలో మాత్రమే స్ట్రీమింగ్ కానుంది.'ద డెవిల్' విషయానికొస్తే.. రాజశేఖర్ అనే ముఖ్యమంత్రి ఓ నేరం కారణంగా జైలుపాలవుతాడు. అతడి కొడుకు ధనుష్, లండన్లో ఉంటాడు. అతడిని తీసుకురమ్మని రాజశేఖర్, ఓ ఐఏఎస్కి బాధ్యత అప్పగిస్తాడు. కానీ ధనుష్ రానంటాడు. దీంతో ఒకే పోలికలతో ఉన్న కృష్ణ అనే వ్యక్తిని.. ధనుష్లా మారుస్తారు. కట్ చేస్తే డెవిల్ తిరిగొస్తాడు. తర్వాత ఏమైంది? అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్)ನಿಯಮಗಳನ್ನ ಬರೆದವನಲ್ಲ ಮುರಿದವನು - 'ದಿ ಡೆವಿಲ್'.ಜುಲೈ 17ರಿಂದ ಕನ್ನಡ Zee 5ನಲ್ಲಿ.#darshanthoogudeepasrinivas #dboss #thedevil #kannadazee5 #thedevilonzee5 pic.twitter.com/cAA1MDSS5L— ZEE5 Kannada (@ZEE5Kannada) July 11, 2026 -
ఓటీటీలోకి తమిళ కామెడీ థ్రిల్లర్ సినిమా.. తెలుగు రివ్యూ
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా మిగతా భాషల్లో ప్రేక్షకులని అలరించిన చిత్రాలు, డబ్బింగ్ల రూపంలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంటాయి. అలా గత వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన తమిళ కామెడీ థ్రిల్లర్ మూవీ 'పరిమిళ అండ్ కో'. జీ5 ఓటీటీలో తెలుగులో అందుబాటులో ఉన్న ఈ సినిమా ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్)కథేంటి?మిడిల్ క్లాస్కి చెందిన పరిమిళ(జయరాం).. తన భార్య స్వరాజ్యం(ఊర్వశి), కూతుళ్లు పరాశక్తి, మధుమితతో కలిసి ఓ అద్దె ఇంట్లో బతికేస్తుంటాడు. ప్రశాంతంగా ఉన్న వీళ్ల జీవితంలోకి వర్గీస్ (శాండీ మాస్టర్) అనే లోకల్ రౌడీ ఎంట్రీ ఇస్తాడు. పరిమళ చిన్న కూతురు మధుమిత వెంటపడుతూ పెళ్లి చేసుకుంటానని ఇబ్బందిపెడుతుంటాడు. ఈ టార్చర్ భరించలేక అతడిని చంపేస్తే బాగుంటుందని కుటుంబమంతా ఓ రోజు అనుకుంటారు. సీన్ కట్ చేస్తే తర్వాత రోజు తెల్లారేసరికి వర్గీస్ హత్యకు గురవుతాడు. ఇంతకీ ఇతడిని చంపిందెవరు? పరిమళ కుటుంబానికి ఈ హత్యకు సంబంధముందా? లేదా? అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?'దృశ్యం' వచ్చిన తర్వాత ఈ తరహా కాన్సెప్ట్లతో చాలా సినిమాలు వస్తున్నాయి. ఇది కూడా అలాంటి ఓ మూవీనే. కాకపోతే అది సీరియస్, దీన్ని మాత్రం కామెడీగా తీశారు. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకోకుండా ఓ హత్య కేసులో ఇరుక్కుంటే ఏమవుతుంది? అనే సింపుల్ కాన్సెప్ట్ ఈ చిత్రంలోనూ చూపించారు. ఇక ఎలా ఉందంటే ఓటీటీలో చూస్తున్నప్పుడు అయితే ఓకే ఓకే అనిపించింది.మొదలైన అరగంట పాటు సినిమా చకచకా వెళ్తుంది. తర్వాత హత్య ఎవరు చేశారు? అనే దగ్గర పరిమిళ కుటుంబంలోని ఒక్కొక్కరిపై అనుమానం వచ్చేలా సీన్స్ వస్తుంటాయి. వీళ్లతో పాటు పరిమళ తమ్ముడు, బావమరిదిపై కూడా అనుమానం వస్తుంది. ఒకానొక దశలో ఎవరో చంపారనేది పరిమిళ కుటుంబానికి తెలిసిపోతుంది. కానీ పోలీసులకు మాత్రం అంతుచిక్కదు. మరోవైపు ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న ఏడుకొండలు అనే సీఐ.. నిందితుడిని కనిపెట్టకుండా ఆలస్యం చేస్తుంటాడు. ఇలా ఎందుకు చేస్తున్నాడనే దానికి చివరలో వివరణ ఇస్తారు.సినిమాలో కామెడీ.. పార్ట్స్ పార్ట్స్గానే వర్కౌట్ అయింది. హత్య ఎవరు చేశారనే విషయంలో చాలామందిపై అనుమానం వచ్చేలా సీన్స్ చూపిస్తారు కానీ చివరలో అసలు వర్గీస్ని ఎవరు? ఎందుకు చంపారనేది ఊహించని ట్విస్టు రూపంలో బయటపెడతారు. అయితే అది మూవీలో ఇరికించిన ఫీలింగ్ కలుగుతుంది తప్పితే సహజంగా అనిపించదు. సెకండాఫ్లో స్టోరీ అంతా అక్కడక్కడే తిరుగుతున్నట్లు అనిపించడం ఓ మైనస్.నటన విషయానికొస్తే.. పరిమళ, స్వరాజ్యం అనే భార్యభర్తలుగా చేసిన జయరాం, ఊర్వశి తమ అనుభవం చూపించి నవ్వించారు. వీళ్ల కూతుళ్లుగా చేసిన సంజన, అనంతిక కూడా బాగానే చేశారు. పోలీస్ అధికారిగా మిస్కిన్, వర్గీస్ అనే రౌడీగా శాండీ మాస్టర్.. పరిమిళ పెద్ద కూతురి ప్రియుడిగా తెలుగు హీరో సంతోశ్ శోభన్ ఆకట్టుకున్నారు. మిగిలిన వాళ్లు ఓకే.టెక్నికల్ అంశాలకొస్తే మ్యూజిక్ గుర్తుంచుకునేంత గొప్పగా ఏం లేదు. సినిమాటోగ్రఫీ కూడా పర్లేదు. దర్శకుడు పాండిరాజ్ ఓ పాయింట్ అనుకున్నారు కానీ దాన్ని తీసే క్రమంలో సాగదీసి వదిలారు. పేరుకే రెండున్న గంటల మూవీ గానీ మూడు గంటల నిడివిలా అనిపిస్తుంది. మీకు బాగా ఖాళీ ఉండి ఏదో టైమ్ పాస్ చేద్దామనుకుంటే ఈ చిత్రం చూడొచ్చు. అసభ్యకర సన్నివేశాలేం లేవు. కుటుంబంతోనూ వీక్షించొచ్చు.- చందు డొంకాన(ఇదీ చదవండి: అనాథకి అద్భుత దీపం దొరికితే.. ఫహాద్ ఫాజిల్ హీరోగా తెలుగు సినిమా) -
ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్
గత వీకెండ్ థియేటర్లలోకి వచ్చిన 'లెనిన్'.. ప్రేక్షకుల్ని అలరిస్తోంది. మరోవైపు ఈ వారం బిగ్ స్క్రీన్స్పైకి ఐశ్వర్యా రాజేశ్ 'ఓ సుకుమారి', మాధవన్ 'జీడీఎన్', వదలా, రాజా ది రాజా, ఆపరేషన్ అరుణారెడ్డి, మహేంద్రగిరి వారాహి తదితర తెలుగు మూవీస్ రిలీజ్ కానున్నాయి. అలానే హాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ లేటెస్ట్ మూవీ 'ద ఒడిస్సీ' ఇదే వీకెండ్ రాబోతుంది.(ఇదీ చదవండి: నేనేం చేస్తున్నానో నాకు తెలుసు: నాగ్ అశ్విన్)ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ విషయానికొస్తే.. సమంత 'మా ఇంటి బంగారం', వడ్డే నవీన్ 'ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ' ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు సెకండ్ లవ్, రెడీ ఆర్ నాట్ 2 తదితర రియాలటీ షో, డబ్బింగ్ చిత్రాలు కూడా ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ సినిమా స్ట్రీమింగ్లోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జూలై 13 నుంచి 19 వరకు)హాట్స్టార్సెకండ్ లవ్ (తమిళ రియాలటీ సిరీస్) - జూలై 13పవిత్రం (మలయాళ సిరీస్) - జూలై 13వుథరింగ్ హైట్స్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 13రెడీ ఆర్ నాట్ 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 16మా ఇంటి బంగారం (తెలుగు మూవీ) - జూలై 17టెస్ట్ సబ్జెక్ట్ వీ (హిందీ డాక్యుమెంటరీ) - జూలై 18నెట్ఫ్లిక్స్ద హాక్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 15మీ బిఫోర్ మీ (ఇండోనేసియన్ మూవీ) - జూలై 16ద మ్యాప్ ఆఫ్ లాంగింగ్ (స్పానిష్ సిరీస్) - జూలై 17ద ఈస్ట్ ప్యాలెస్ (కొరియన్ సిరీస్) - జూలై 17డిజైర్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 1723000 లైవ్స్ (జర్మన్ మూవీ) - జూలై 17హార్ట్ స్టాపప్ ఫరెవర్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 17స్పూకీ ఇన్ లవ్ (కొరియన్ సిరీస్) - జూలై 18అమెజాన్ ప్రైమ్మర్డర్ 101 (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - జూలై 13బ్యాక్ రూమ్స్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 14 (రెంట్)రైడ్ ఆర్ డై (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 15జీ5ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు (తెలుగు సినిమా) - జూలై 17ఎమ్ఎక్స్ ప్లేయర్రక్తాంచల్ సీజన్ 3 (హిందీ సిరీస్) - జూలై 16ఆపిల్ టీవీ ప్లస్లక్కీ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 15(ఇదీ చదవండి: ఇప్పుడు వాళ్ల కళ్లు చల్లబడ్డాయి.. జానకి మరణంపై సుశీల) -
మా ఇంటి బంగారం వచ్చేస్తోంది.. నెల రోజుల్లోపే స్ట్రీమింగ్
సమంత లీడ్ రోల్లో వచ్చిన లేడీ ఓరియంటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మా ఇంటి బంగారం. జూన్ 19న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. కేవలం మౌత్ టాక్తో మూడు వారంలోనూ వసూళ్లపరంగా రాణిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్తో దూసుకెళ్తోంది. ఇప్పటికే తెలుగు సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన లేడీ ఓరియంటెడ్ చిత్రంగా ఘనత సాధించింది.తాజాగా ఈ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్ చేశారు. జియో హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. జూలై 17 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ విషయాన్ని జియో హాట్స్టార్ ప్రకటించింది. థియేటర్లలో వందకోట్లు కొల్లగొట్టిన మా ఇంటి బంగారం ఓటీటీలోనూ దూసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. July 17th Okokkodni kodathamu chudu... Prematho abbaaa ❤️🔥#MaaIntiBangaaram streaming from July 17th on JioHotstar! 💫 #MaaIntiBangaaramOnJioHotstar@Samanthaprabhu2 @TralalaPictures #RajNidimoru #NandiniReddy @himankd @gulshandevaiah @diganthmanchale @gautamitads… pic.twitter.com/0pgDLow1n4— JioHotstar Telugu (@JioHotstarTel_) July 12, 2026 -
ఓటీటీలో తెలుగు హారర్ సినిమా.. మూడింటిలో స్ట్రీమింగ్
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన మైథలాజికల్ డార్క్ థ్రిల్లర్గా రూపొందిన 'త్రికాల' సినిమా థియేటర్లలో మంచి స్పందన అందుకుని ఇప్పుడు ఓటీటీల్లోనూ ట్రెండింగ్ అవుతోంది. ప్రస్తుతం జియో హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్, సన్నెక్ట్స్లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతూ టాప్ రేటింగ్తో ట్రెండ్ అవుతోంది. ఐఎండీబీలోనూ 9.1 రేటింగ్ అందుకుని హాట్ టాపిక్గా నిలుస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మిలిటరీ యాక్షన్ డ్రామా.. స్ట్రీమింగ్పై ప్రకటన)శ్రద్ధా దాస్, మహేంద్రన్, అజయ్ ప్రధాన పాత్రల్లో.. మణి తెల్లగూటి దర్శకత్వం వహించిన ఈ సినిమా.. కేవలం డైలాగులకే పరిమితం కాకుండా కర్మ సిద్ధాంతం, గో సంరక్షణ అవసరాన్ని, పునర్జన్మల వైవిధ్యాన్ని విజువల్గా ఆవిష్కరించారు. పౌరాణికతను ఆధునిక ప్రపంచంతో మేళవిస్తూ మైథాలజీ, సైకాలజికల్ హారర్, డార్క్ ఫాంటసీ అంశాలను సమన్వయం చేసి చూపించారు.(ఇదీ చదవండి: అఖిల్ హిట్ కొడితే శ్రీలీల టార్గెట్ అయింది) -
ఓటీటీలోకి మిలిటరీ యాక్షన్ డ్రామా.. స్ట్రీమింగ్పై ప్రకటన
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్లు వస్తూనే ఉంటాయి. అయితే కొన్నిసార్లు మూవీస్ని తలపించే కథలని సిరీస్లుగా తీస్తుంటారు. అలా రాబోతున్నదే 'ఆపరేషన్ సఫేద్ సాగర్'. 1999 కార్గిల్ యుద్ధం బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. కొన్నిరోజుల క్రితం ఓ టీజర్ రిలీజ్ చేయగా ఇప్పుడు మరొకటి వదిలారు. అలానే స్ట్రీమింగ్ తేదీ గురించి అధికారిక ప్రకటన కూడా చేశారు.(ఇదీ చదవండి: 'జన నాయగణ్' అప్డేట్ ఇచ్చిన సీఎం విజయ్)హీరో సిద్దార్థ్తో పాటు జిమ్మీ షెర్గిల్, అభయ్ వర్మ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్.. వచ్చే నెల 7వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్లోకి రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా రిలీజ్ చేసిన టీజర్లో చూస్తే విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. చూడాలనే కుతుహలాన్ని కలిగిస్తున్నాయి. ఇందులో సిద్ధార్థ్.. ఎయిర్ఫోర్స్ కమాండర్గా నటించాడు.ఆపరేషన్ సఫేద్ సాగర్ అనేది 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్ సైన్యాన్ని తరిమికొట్టేందుకు భారత వైమానిక దళం చేపట్టిన చారిత్రక వైమానిక దాడికి పెట్టిన పేరు. 1999 మే 26న ప్రారంభమైన ఈ ఆపరేషన్లో 'ది గోల్డెన్ యారోస్' కీలక పాత్ర పోషించింది. శత్రువులు దాక్కున్న మంచు కొండలపై భారత బలగాలు జరిపిన ఈ సాహసోపేతమైన పోరాటం ఆధారంగా ఈ పేట్రియాటిక్ మిలిటరీ వార్ డ్రామా తీయడం విశేషం.(ఇదీ చదవండి: ఉదయం అమ్మాయిలా, రాత్రి మగాడిలా.. ఓటీటీలోకి వచ్చేసిన ఫాంటసీ కామెడీ సినిమా) -
ప్రభాస్ ఫౌజీ.. భారీ ధరకు ఓటీటీ డీల్..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న పీరియాడికల్ బ్యాక్డ్రాప్ మూవీ ఫౌజీ. ఈ మూవీకి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఓ టాక్ వైరల్గా మారింది. ఈ భారీ ప్రాజెక్ట్ కోసం బిగ్ డీల్ కుదిరినట్లు టాక్ వినిపిస్తోంది.భారీ ధరకు డిజిటల్ రైట్స్..ఈ మూవీని ఓటీటీ డీల్ భారీ ధరకు అమ్ముడైనట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ కోసం ఏకంగా రూ.180 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. సౌతిండియా స్ట్రీమింగ్ హక్కుల కోసం నెట్ఫ్లిక్స్ ఈ మొత్తాన్ని చెల్లించనుందని సమాచారం. అంతేకాకుండా హిందీ హక్కులను ఏఏ ఫిల్మ్స్ రూ. 60 కోట్లకు థియేట్రికల్ రైట్స్ను దక్కించుకుంది.అయితే హిందీకి సంబంధించిన ఓటీటీ డీల్ ఇంకా కుదరలేదని తెలుస్తోంది. ఇప్పటి వరకు కేవలం సౌత్ ఇండియా భాషలకే డీల్ ఓకే చేశారని టాక్. ఈ మూవీలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, జయప్రద, మిథున్ చక్రవర్తి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. -
ఓటీటీలోకి వచ్చేసిన ఫాంటసీ కామెడీ సినిమా.. తెలుగులోనూ
ఓటీటీలోకి ప్రతివారం కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా పెద్ది, సింగ్ గీతం, పరిమళ అండ్ కో, బల్టీ తదితర చిత్రాలు స్ట్రీమింగ్లోకి వచ్చేశాయి. వీటితో పాటు ఓ తమిళ ఫాంటసీ కామెడీ మూవీ కూడా తెలుగులోనూ స్ట్రీమింగ్లోకి వచ్చేసింది. ఖుష్బూ నిర్మించిన ఈ సినిమా సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: అఖిల్ 'లెనిన్' ట్విటర్ రివ్యూ)సంతోష్, రేష్మ, వెంకటేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'డబుల్ ఆక్యుపెన్సీ'. అశ్విన్ కందసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత నెల 12న తమిళంలో రిలీజైంది. ప్రేక్షకుల్ని అలరించింది. ఇప్పుడీ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.'డబుల్ ఆక్యుపెన్సీ' విషయానికొస్తే.. రజనీ అనే అమ్మాయికి వింత జబ్బు ఉంటుంది. పగలు అమ్మాయిలా ఉండే ఈమె రాత్రయితే అబ్బాయిలా మారిపోతుంది. ఉదయం ఓ బయోటెక్ కంపెనీలో ఉద్యోగం చేసే ఈమె.. రాత్రి ఓ బార్లో పనిచేస్తూ ఉంటుంది. అనుకోకుండా ఈమె జీవితంలోకి ఉదయం ఓ అబ్బాయి, రాత్రి ఓ అమ్మాయి వస్తారు. మరి ఈ జండర్ స్వాప్ ప్రేమకథ చివరకు ఏమైంది? అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'ఐ, నోబడీ' మూవీ రివ్యూ) -
ఓటీటీల్లో వీకెండ్ ఎంటర్టైన్మెంట్.. ఏకంగా 14 సినిమాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ శుక్రవారం థియేటర్లలో అఖిల్ అక్కినేని సందడి చేయనున్నారు. ఆయన హీరోగా వస్తోన్న లెనిన్ మూవీ జూలై 10న బాక్సాఫీస్ బరిలో నిలవనుంది. రాయలసీమ బ్యాక్డ్రాప్లో వస్తోన్న ఈ యాక్షన్ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. లెనిన్తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నటించిన తమిళ మూవీ హృదయం మురళి థియేటర్లలో అలరించనుంది.ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ ఫ్రైడే కొత్త సినిమాలు స్ట్రీమింగ్కు రెడీ అయిపోయాయి. ఇప్పటికే పెద్ది నెట్ఫ్లిక్స్లో అలరిస్తుండగా.. పతి పత్ని ఔర్ వో దో , ఇక్కా లాంటి బాలీవుడ్ మూవీస్ సందడి చేయనున్నాయి. వీటితో పాటు డోస్ లాంచి మలయాళ థ్రిల్లర్ సినిమా ఓటీటీకి రానుంది. అంతేకాకుండా పలు వెబ్ సిరీస్లు, హాలీవుడ్ సినిమాలతో పాటు డబ్బింగ్ చిత్రాలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్పెద్ది(తెలుగు సినిమా)- జూలై 09సింగ్ గీతం(తెలుగు సినిమా)- జూలై 09లిటిల్ హౌస్ ఆన్ ది ప్రైయరీ(హాలీవుడ్)- జూలై 09 గుర్తుకొస్తున్నాయి(తెలుగు వెబ్ సిరీస్)- జూలై 10 పతి పత్ని ఔర్ వో దో (హిందీ మూవీ) - జూలై 10 ఇక్కా (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూలై 10 షిప్ రెక్డ్: నైట్ మేర్ ఎట్ సీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - జూలై 10 ద అపార్ట్మెంట్ జాబ్ (కొరియన్ సిరీస్) - జూలై 11 సుసాన అండ్ ఎల్విరా: నో ప్లాన్ బి (కొలంబియన్ మూవీ) - జూలై 12జియో హాట్స్టార్ ద ఫైవ్ స్టార్ వీకెండ్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 10 ల్యాండ్ ఆఫ్ ఫుట్బాల్(మలయాళ సినిమా)- జూలై 10సోనీ లివ్ బల్టీ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 10అమెజాన్ ప్రైమ్ డోస్(మలయాళ సినిమా)- జూలై 10 ద వెస్టీస్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 12జీ5 ఫ్రేమ్ (మరాఠీ సినిమా) - జూలై 10 పరిమిళ అండ్ కో (తమిళ మూవీ) - జూలై 10లయన్స్ గేట్ ప్లే ద సెంటినల్స్ (ఫ్రెంచ్ సిరీస్) - జూలై 10 -
ఓటీటీలోకి వచ్చేసిన 'పెద్ది'.. ఆ సీన్లు మార్చేశారు
రామ్ చరణ్ హీరోగా నటించిన 'పెద్ది' ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో తెలుగుతో పాటు మిగతా దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే థియేటర్లలో చూసి మళ్లీ ఇప్పుడు ఓటీటీలో చూసిన వాళ్లు చాలానే తేడాలు గమనిస్తున్నారు. అందుకు సంబంధించి సోషల్ మీడియాలో డిస్కషన్స్ కూడా మొదలుపెట్టేశారు. ఇంతకీ ఏంటి విషయం?(ఇదీ చదవండి: ఓటీటీలో సైకలాజికల్ డార్క్ కామెడీ సినిమా 'మాలీవుడ్ టైమ్స్' తెలుగు రివ్యూ)'పెద్ది' సినిమా తెలుగులో తప్పితే మరెక్కడ అస్సలు ఆడలేదు. హిందీ, నార్త్ అమెరికా ఇలా అన్నిచోట్ల దారుణంగా ఫ్లాప్ అయింది. అయితే తెలుగులో కలెక్షన్స్ వచ్చినప్పటికీ జాన్వీ కపూర్ సన్నివేశాలపై విపరీతమైన విమర్శలు వచ్చాయి. మరీ ముఖ్యంగా ఈమె శరీరాన్ని గ్లామరస్గా చూపించడానికి తప్పితే మరో ఉద్దేశంతో తీసుకోలేదని ట్రోల్ చేశారు. ఓ సీన్లో అనుమతి లేకుండా జాన్వీని హీరో ముద్దు పెట్టే సీన్పైనా విమర్శలు వచ్చాయి.హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్ర ఓ సన్నివేశంలో భాగంగా మార్కెట్లో మాట్లాడుతుంటే.. అక్కడికి వచ్చిన పెద్ది పాత్ర ఆమెని వర్ణిస్తూ 'కాటుకే అక్కర్లేని ఆ కళ్లు, ముక్కుపుడకే అక్కర్లేని ఆ ముక్కు, అసలు అలంకరణే అక్కర్లేని అరుదైన చికిరి రా ఇది' అని అంటాడు. ఈ టైంలో జాన్వీ రొమ్ము, నడుము భాగాన్ని చూపించారు. దీంతో ట్రోలర్స్ దర్శకుడు, కెమెరామ్యాన్ని గట్టిగానే తలంటారు. థియేటర్లలో ఇలా చూపించారు గానీ ఓటీటీలో మాత్రం కేవలం జాన్వీ ముఖాన్ని చూపించి సరిపెట్టారు. లేదంటే మరోసారి దారుణమైన ట్రోలింగ్కి గురయ్యేవారు.నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న మూవీ.. 3 గంటల 5 నిమిషాల నిడివితో అందుబాటులోకి వచ్చింది. రామ్ చరణ్, జాన్వీ కపూర్, జగపతిబాబు, శివరాజ్ కుమార్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించగా బుచ్చిబాబు దర్శకత్వం వహించాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా) -
ఓటీటీలోకి తెలుగు మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా హారర్, థ్రిల్లర్ కాన్సెప్ట్తో తీసినవి కూడా స్ట్రీమింగ్లోకి వచ్చేస్తుంటాయి.ఇప్పుడు అలానే ఓ తెలుగు మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ రిలీజ్ గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇంతకీ ఈ చిత్రం సంగతేంటి? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: మళ్లీ పెళ్లి చేసుకున్న హీరోయిన్ 'కలర్స్' స్వాతి.. ఫొటోలు వైరల్)మాస్టర్ మహేంద్రన్, శ్రద్ధా దాస్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'త్రికాల:స్క్రిప్ట్ ఆఫ్ గాడ్'. ఈ ఏడాది మే 28న థియేటర్లలోకి వచ్చింది. కానీ స్టార్స్ లేకపోవడం వల్ల దీన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడీ చిత్రం గురువారం(జూలై 09) నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. సినిమాటిక్ యూనివర్స్గా రూపొందుతున్న దానిలో తొలి భాగం ఇది.'త్రికాల' విషయానికొస్తే.. ఓ రాజ వంశీకుల కుటుంబానికి తరతరాలుగా శాపం ఉంటుంది. దీని కారణంగా చీకటిలో తప్ప సూర్యుడు వెలుగు చూడలేని వైతరణ్(అజయ్) పుడతాడు. చిన్నప్పుడు తల్లి చనిపోవడంతో సవతి తల్లి (ఆమని) ఇతడిని పెంచుతుంది. ఇతడి జీవితంలో అనుహ్య సంఘటనలు జరుగుతాయి. సైకలాజికల్ బైపోలార్ డిజార్డర్ సమస్యతో బాధపడుతున్న వైతరణ్కి వైద్యం చేయడం కోసం సైకియాట్రిస్ట్ మాయ (శ్రద్ధాదాస్) రంగంలోకి దిగుతుంది.ఈ క్రమంలో వైతరణ్ జీవితానికి సంబంధించి ఆమెకు ఎలాంటి విషయాలు తెలిశాయి? శంకరంపల్లి ఊరిలో కాటేరమ్మ తల్లి పేరుతో చోటు చేసుకున్న సంఘటనలు ఎలాంటివి? వైతరణ్ కుటుంబాన్ని వెంటాడుతున్న శాపం వెనుక కథేంటి? శివ (మాస్టర్ మహేంద్రన్), నిధి (సాహితి అవంచ) జంటకు వైతరణ్కీ మధ్య సంబంధం ఏమిటి? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలో సైకలాజికల్ డార్క్ కామెడీ సినిమా 'మాలీవుడ్ టైమ్స్' తెలుగు రివ్యూ)(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
ఓటీటీలో సైకలాజికల్ డార్క్ కామెడీ సినిమా.. తెలుగు రివ్యూ
ఓటీటీల్లో రిలీజయ్యే మలయాళ డబ్బింగ్ సినిమాలకు తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అందుకు తగ్గట్లే డిఫరెంట్ థ్రిల్లర్, కామెడీ చిత్రాలు ఎప్పటికప్పుడు స్ట్రీమింగ్లోకి వస్తుంటాయి. అలా రీసెంట్గా హాట్స్టార్లో అందుబాటులోకి వచ్చిన సైకలాజికల్ డార్క్ కామెడీ మూవీ 'మాలీవుడ్ టైమ్స్'. 'ప్రేమలు' ఫేమ్ నస్లేన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఇంతకీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఈ సిరీస్ చూశాక ఫోన్ వాడాలంటే భయపడతారు.. తెలుగు రివ్యూ)కథేంటి?వినీత్ మాధవన్ (నస్లేన్).. చిన్నప్పటి నుంచి హారర్ పుస్తకాలు చదువుతూ ఎప్పటికైనా గొప్ప హారర్ ఫిలిం మేకర్ కావాలని కలలు కంటూ ఉంటాడు. కాలేజీలో ఉన్నప్పుడు ఓ హారర్ షార్ట్ ఫిల్మ్ తీసి ఇంట్లో వాళ్లకు చూపించి భయపెడతాడు. తర్వాత ఓ షార్ట్ ఫిల్మ్ పోటీలో పాల్గొని అందులో సెకండ్ ప్రైజ్ సొంతం చేసుకుంటాడు. అలా కొన్నాళ్లకు ఇండస్ట్రీలోకి వస్తాడు. మరి తన పంతం, ఇగో వల్ల ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు? చివరకు తను అనుకున్నట్లు గొప్ప దర్శకుడు అయ్యాడా లేదా? ఈ క్రమంలో ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నాడనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?తెలుగులో చాలా ఏళ్ల క్రితం 'నేనింతే', 'కథ స్క్రీన్ప్లే దర్శకత్వం అప్పల్రాజు' అని టాలీవుడ్ గురించి తీసిన సినిమాలు వచ్చాయి. ఇవి రెండూ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ఫెయిలయ్యాయి. ఇందులో 'నేనింతే' కొందరికి నచ్చొచ్చేమో గానీ ఇవి అందరికీ నచ్చే మూవీస్ అయితే కావు. ఎందుకంటే ఇండస్ట్రీలోని కష్టాల్ని, బాధల్ని ఇందులో చూపించారు. సగటు ప్రేక్షకుడికి ఇవేం అక్కర్లేదు! తెరపై ఓ సినిమాతో ఎంటర్టైన్ చేశారా లేదా అనేది మాత్రం చూస్తాడు. కానీ సినిమా తీయడం వెనుకున్న కష్టాలు కూడా చూపిద్దామనుకుంటే చూసే ఓపిక అందరికీ ఉండకపోవచ్చు. 'మాలీవుడ్ టైమ్స్' విషయంలోనూ ఇదే జరిగింది.ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని ఓ కుర్రాడు.. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి కష్టనష్టాల్ని చవిచూశాడు అనేది సింపుల్గా స్టోరీ లైన్. 2 గంటల 47 నిమిషాల నిడివితో సహనానికి విపరీతమైన పరీక్ష పెట్టారు. మూవీ మొదలైన తర్వాత తొలి 20 నిమిషాలు చూస్తే ఏదో కొత్తగా ఉండబోతుందే అనిపిస్తుంది కానీ తర్వాత ఉండే సాగదీత వల్ల ఓ దశలో చిరాకొచ్చేస్తుంది.చాలా సినిమాల్లో కష్టపడితే సక్సెస్ సులభంగా వస్తుందన్నట్లు చూపిస్తారు. కానీ నిజ జీవితంలో ప్రతిభ ఒక్కటే పనికిరాదు. ఇండస్ట్రీలో ఉండే రాజకీయాలు, బడ్జెట్ పరిమితులు, నిర్మాతల ఈగోలు.. ఇవన్నీ దాటుకుని ఒక మూవీ తీయడం అంటే సాధారణమైన విషయం కాదు. ఇలా సినీ పరిశ్రమలోని సమస్యలను డార్క్ కామెడీ యాంగిల్లో చూపించే ప్రయత్నం చేశారు. కానీ అది అక్కడక్కడ మాత్రమే వర్కౌట్ అయింది.సినిమా పిచ్చిలో పడిన ఓ కుర్రాడు తనకున్న జాలి, మానవత్వం లాంటివి గాలికి వదిలేసి ఓ రకమైన సైకోలా ఎలా మారాడనేది రియలిస్టిక్గా చూపించారు. కాకపోతే అది కొంతవరకు పర్లేదనిపించింది. సినిమా ఇండస్ట్రీ గురించి కాస్తోకూస్తో తెలిసి, ఈ రంగంలో ఇప్పటికే పనిచేస్తున్న వాళ్లకు ఇది నచ్చొచ్చేమో గానీ సగటు ప్రేక్షకుడికి నచ్చుతుందా అంటే డౌటే. నిడివి కూడా పెద్ద సమస్య. ఓ 20 నిమిషాలు తగ్గిస్తే బాగుండేది. ఈ మూవీ తీసిన దర్శకుడు అభినవ్ సుందర్ నాయక్.. తనకెదురైన ఇండస్ట్రీ కష్టాల్ని చూపించడం కోసం ఏమైనా ఈ చిత్రాన్ని తీశాడా అని సందేహం కూడా కలుగుతుంది.అన్ని మైనస్లేనా ప్లస్సులేం లేవా అంటే ఉన్నాయి. వినీత్కి సినిమాపై ఆసక్తి కలగడానికి కారణమైన థియేటర్లో డీటీఎస్ అనుభవానికి చాలామంది 90స్ కిడ్స్ రిలేట్ అవ్వొచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి కొందరు నిర్మాతలు కావాలనే ఎందుకు ఫ్లాప్ సినిమాలు తీస్తారు? కథనే కాకుండా స్టైల్ని కూడా కొందరు దర్శకులు.. మిగతా వాళ్ల నుంచి ఎలా కాపీ కొడతారు? లాంటి సీన్స్ బాగున్నాయి.నటీనటుల విషయానికొస్తే నస్లేన్ బాగా చేశాడు. ఇతర పాత్రల్లో సంగీత్ ప్రతాప్, షరాఫుద్దీన్, వినీత్ శ్రీనివాసన్ తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సెట్ వర్క్, సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే సినిమా ఇండస్ట్రీ కష్టాలు చూద్దామనే ఆసక్తి ఉండి, చాలా టైమ్ ఉంటే దీన్ని చూడండి. లేదంటే లైట్ తీసుకోండి. అసభ్యకర సీన్స్ ఏం లేవు కాబట్టి కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు.- చందు డొంకాన(ఇదీ చదవండి: పలు దేశాల్లో నిషేధం.. సిటిజన్ విజిలాంట్ సినిమా తెలుగు రివ్యూ) -
ఓటీటీకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్.. ఏకంగా 5 ఓటీటీల్లోకి..!
ఓటీటీలు వచ్చాక సినిమాలు తెగ చూసేస్తున్నారు. కొత్త కంటెంట్ దొరికితే చాలు భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తున్నారు. ఓటీటీల్లో ముఖ్యంగా మలయాళ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటోంది. తాజాగా మరో మలయాళ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు వస్తోంది. ఇటీవలే రిలీజైన మలయాళ మిస్టరీ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ డోస్. ఈ చిత్రానికి అభిలాష్ ఆర్ నాయర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సిజు విల్సన్, జగదీష్, అశ్విన్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. గోపీసుందర్ ఈ సినిమాకు సంగీతం అందించారు.తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు చేశారు మేకర్స్. జూలై 10 నుంచి స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. అమెజాన్ ప్రైమ్తో పాటు సింప్లీ సౌత్, ఆహా తమిళం, మనోరమ మ్యాక్స్, లయన్స్ గేట్ ప్లే ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది.#Dose (Malayalam) streaming from July 10 on PrimeVideo, SimplySouth, AhaTamil, ManoramaMax,LionsGatePlay 🍿!!#OTT_Trackers pic.twitter.com/0fKM8KFcYY— OTT Trackers (@OTT_Trackers) July 7, 2026 -
ఓటీటీలో పెద్ది.. ఆ విషయంలో నో క్లారిటీ..!
రామ్ చరణ్ హీరోగా వచ్చిన రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీ ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డ్ క్రియేట్ చేసింది. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించింది.ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈనెల 9 నుంచే నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ కోసం ఆడియన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో ప్రేక్షకులు పెద్ది ఓటీటీ వర్షన్పై క్లారీటీ కోరుకుంటున్నారు. ఈ మూవీలోని జాన్వీ కపూర్ అచ్చియమ్మ పాత్రపై విమర్శలు రావడంతో కొన్ని సీన్స్ తొలగించారు. ఆ తర్వాత మరిన్ని యాడ్ చేసి థియేటర్లలో రిలీజ్ చేశారు.ఇదే విషయంపై ఓటీటీ ప్రియులు క్లారిటీ కోరుతున్నారు. ఓటీటీలో జాన్వీ కపూర్ పాత సీన్స్తోనే పెద్దిని స్ట్రీమింగ్ చేస్తారా అనే సందేహం ఆడియన్స్లో నెలకొంది. లేదంటే కొత్త సీన్స్ యాడ్ చేసిన పెద్దిని స్ట్రీమింగ్కు తీసుకొస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. ఈ విషయంలో నెట్ఫ్లిక్స్తో పాటు మేకర్స్ కూడా ఎలాంటి అనౌన్స్ చేయలేదు. ఈ విషయంలో సినీ ప్రియులకు పెద్ది ఓటీటీ వర్షన్పై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.కాగా.. గతంలో రామ్ చరణ్ నటించిన గత సినిమా గేమ్ ఛేంజర్ కూడా ఇలాంటి పరిస్థితే చూసింది. థియేటర్స్ లో మొదట వచ్చినా వర్షన్ తర్వాత కొన్ని సీన్స్ తీసేసి నానా హైరానా సాంగ్ పెట్టి తగ్గించేశారు. ఆ తర్వాత ఓటీటీలోకి వచ్చాక ఆ సీన్స్ ఏవీ కూడా అందులో లేవు. అలాగే పెద్ది సినిమాకి కూడా ఇలానే జరుగుతుందా? అని ప్రేక్షకులు భావిస్తున్నారు. -
48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్’ వివాదం ఏంటి?
ఒక సినిమా థియేటర్స్లో రిలీజ్ అవ్వాలంటే సెన్సార్ బోర్డ్ అనుమతి ఉండాలి. సరైన సమయానికి సెన్సార్ పూర్తికాక రిలీజ్ వాయిదా వేసుకున్న సినిమాలెన్నో ఉన్నాయి. అయితే ఓటీటీలో అలాంటి అడ్డంకులేమి ఉండవు. డైరెక్టర్గా రిలీజ్ చేసుకోవచ్చు. అభ్యంతరాలు రావడం.. నిషేదానికి గురికావడం చాలా అరుదుగా జరుగుతుంటాయి. అలాంటి పరిస్థితి ఇప్పుడు బాలీవుడ్ చిత్రం ‘సట్లజ్’కి వచ్చింది.బాలీవుడ్ నటుడు దిల్జీత్ దొసాంజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఎలాంటి హడావుడి లేకుండా జులై 3న డైరెక్ట్గా ప్రముఖ ఓటీటీ జీ5(ZEE5)లో రిలీజ్ అయింది. ఆ తర్వాత జూలై 5న దాని స్ట్రీమింగ్ను నిలిపివేసింది. జూలై 6, సోమవారం నాడు, ఈ చిత్రాన్ని తిరిగి ప్లాట్ఫామ్పైకి తీసుకురావడానికి తాము శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని ఆ ప్లాట్ఫామ్ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. కానీ అది జగలేదు.భారతదేశంలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కోసం ఎందుకు అందుబాటులో లేదనే కారణాన్ని వెల్లడించకుండా, జీ5 ఇలా పేర్కొంది. ‘ప్రస్తుత పరిణామాల దృష్ట్యా, తదుపరి ప్రకటన వచ్చేవరకు ‘సట్లజ్’ భారతదేశంలో అందుబాటులో ఉండదు. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని మా ప్రేక్షకుల ముందుకు తిరిగి తీసుకురావడానికి, సరైన ప్రక్రియ ద్వారా సాధ్యమైన అన్ని మార్గాలను అన్వేషించడానికి మేము కట్టుబడి ఉన్నాం’ అని ఒక ప్రకటన జారీ చేసింది.నిషేదం ఎందుకు?పంజాబ్కు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ 'జస్వంత్ సింగ్ ఖల్రా' జీవితం ఆధారంగా తెరకెక్కించిన చిత్రమే ఈ సట్లజ్. ఇందిరా గాంధీ హత్య, సిక్కు వ్యతిరేక ఆందోళనల తర్వాత 1980-90ల్లో పంజాబ్లో వేలాది మంది అదృశ్యమయ్యారని... వారిని పోలీసులు వివిధ కారణాలతో అదుపులోకి తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. అనుమానం వస్తే చాలు పిట్టల్లా కాల్చిచంపేశారు. ఈ దమనకాండకు వ్యతిరేకంగా పోరాడిన సామాజిక కార్యక్తర జస్వంత్ సింగ్ ఖల్రా.1995 వరకు ఆయన చాలా యాక్టివ్గా పోరాటాలు చేశాడు. ఎన్నో నిజాలను బయటకు తీసి అప్పటి ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించాడు. అయితే 1995 సెప్టెంబర్లో ఆయనను కిడ్నాప్ చేసి హత్య చేశారు. మృతదేహం దొరక్కుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. శవం లేకపోవడంతో కేసు ముందుకు కదల్లేదు. అంతర్జాతీయ సంస్థల ఒత్తిడి మేరకు సిబిఐ సంస్థ రంగంలోకి దిగాక అసలు దోషులు పట్టుకొకొని.. 2007లో వాళ్లకు యావజ్జీవ కారాగార శిక్ష పడేలా చేశారు. ఈ విషయాలనే సట్లజ్ సినిమాలో చూపించాడు దర్శకుడు హనీ ట్రెహాన్. ఈ చిత్రం దేశ భద్రత, సార్వభౌమత్వానికి భంగం కలిగించే విధంగా లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉందనే కారణంతో కేంద్ర ప్రభుత్వం ఐటీ రూల్స్ 2021 (IT Rules 2021) మరియు ఐటీ యాక్ట్ సెక్షన్ 69A కింద ఉన్న అధికారాలను ఉపయోగించి జీ5 సంస్థను ఈ సినిమాను తొలగించాల్సిందిగా ఆదేశించింది. అయితే జీ5 సంస్థ మాత్రం ఈ విషయాలేవి చెప్పకుండా.. ‘ప్రస్తుత పరిణామాల దృష్ట్యా’ అని ప్రస్తావిస్తూ చట్టపరమైన ప్రక్రియను అనుసరించి సినిమాను తిరిగి ఇండియాలో స్ట్రీమింగ్ చేయడానికి తమ వంతు కృషి చేస్తున్నామని వెల్లడించింది.సెన్సార్ బోర్ట్ అభ్యంతరం..ఈ సినిమా నిజానికి 2022లోనే పూర్తయింది. మొదట దీనికి 'ఘల్లుఘరా' (మారణకాండ) అని, ఆ తర్వాత 'పంజాబ్ 95' అని పేర్లు పెట్టారు. థియేటర్ రిలీజ్ కోసం సెన్సార్ బోర్డు (CBFC) వద్దకు వెళ్లినప్పుడు.. బోర్డు ఇందులో 127 సీన్లను కట్ చేయాలని సూచించింది. అయితే ఆ కట్స్కు ఒప్పుకోని చిత్రబృందం, ఓటీటీలకు సెన్సార్ బోర్డు పరిధి ఉండదు కాబట్టి, ఎలాంటి కట్స్ లేకుండా నేరుగా 'సట్లజ్' అనే కొత్త పేరుతో జీ5 లో విడుదల చేసింది. ఇది ప్రభుత్వం దృష్టికి రావడంతో వెంటనే చర్యలు తీసుకున్నారు. ఈ సినిమా కంటెంట్ను పూర్తిగా పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. భారతదేశంలో దీని స్ట్రీమింగ్ నిలిచిపోయినప్పటికీ, మిగిలిన దేశాల్లో అందుబాటులో ఉంది. -
పలు దేశాల్లో నిషేధించిన వివాదాస్పద సినిమా.. తెలుగు రివ్యూ
వివాదాస్పద అంశాల్ని చూపించారనే కారణాలతో కొన్నిసార్లు కొన్ని సినిమాల్ని ప్రభుత్వాలే నిషేధిస్తుంటాయి. రీసెంట్గా మన దేశంలో 'సత్లుజ్'కి అలాంటి పరిస్థితే ఎదురైంది. గత మూడేళ్లుగా సెన్సార్ బోర్డ్ దగ్గర ఇబ్బందులు పడ్డ ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు. కానీ రెండు రోజుల్లోనే దాని నుంచి కూడా తీసేశారు. ఇంతకు మించి ఇబ్బందులు ఎదుర్కొంది 'సిటిజన్ విజిలాంట్' అనే ఇంగ్లీష్ మూవీ. యూరప్లోని జర్మనీ, యూకే, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో దీనిని అస్సలు విడుదల కానివ్వలేదు. మరి అంతలా ఇందులో కాంటవర్సీ ఏముంది? దీనిని ఎక్కడ చూడొచ్చు?(ఇదీ చదవండి: ఈ సిరీస్ చూశాక ఫోన్ వాడాలంటే భయపడతారు.. తెలుగు రివ్యూ)కథేంటి?క్రొయేషియాలో స్థిరపడిన అమెరికన్ బిలినీయర్ శాండర్స్ (ఆర్మీ హామర్).. తన దేశంలో అక్రమ వలసదారుల కారణంగా జరుగుతున్న హింస, అత్యాచారాలు, హత్యలు లాంటి దారుణాలు చూసి చలించిపోతాడు. న్యాయవ్యవస్థ, పోలీసులు.. సదరు నేరస్తులని ఎలాంటి శిక్ష విధించకుండా విడిచిపెట్టేయడం లాంటివి చూస్తాడు. దీంతో కోపమొచ్చి విజిలెంట్గా మారి సదరు నేరస్తులని, వాళ్లని రక్షిస్తున్న నాయకుల్ని చంపడం మొదలుపెడతాడు. మరి చివరకు ఏమైంది? శాండర్స్ అనుకున్నది సాధించాడా లేదా అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతిదేశం 'అక్రమ వలసలు' అనే అతిపెద్ద సమస్యని ఎదుర్కొంటోంది. అయితే చాలా దేశాలు ఇలాంటి వాళ్లని గుర్తించి తిరిగి వారి సొంత ప్రాంతాలకు పంపించేస్తుండగా యూరోప్లో మాత్రం వీళ్లని చూసిచూడనట్లు వదిలేస్తున్నారు! పైపెచ్చు సకల సౌకర్యాలు ఇస్తున్నారు. దీంతో వాళ్ల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. ఆశ్రయిమిచ్చిన దేశంలోని ఆడపిల్లల్ని, మహిళల్ని లైంగికంగా వేధిస్తూ అశాంతి కలిగిస్తున్నారు. అలాంటి వాళ్లని నిర్ధాక్షిణ్యంగా చంపుకొంటూ, గాయపరుస్తూ వెళ్లే ఓ కడుపు మండిన వ్యక్తి కథే ఈ సినిమా.అంతర్జాతీయ వార్తలు చదివే వాళ్లకు యూరోపియన్ దేశాల్లో పాక్ గ్రూమింగ్ గ్యాంగ్ చేసే అరాచకాల గురించి తెలిసే ఉంటుంది. ఆయా దేశాల్లోని టీనేజీ అమ్మాయిలని కిడ్నాప్ చేసి లేదంటే వల వేసి అత్యాచారాలకు తెగబడటం లాంటివి ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. కానీ వీళ్లపై అక్కడి న్యాయస్థానాలు గానీ పోలీసులు గానీ సరైన చర్యలు తీసుకోవడం లేదు. చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇదే విషయాన్ని ఈ మూవీలోనూ పచ్చిగా చూపించారు. వలసదారుల నేరాలను అరికట్టడంలో తాము విఫలమవుతున్నామని చూపిస్తే ప్రభుత్వం, న్యాయస్థానాలు ఊరుకుంటాయా? అస్సలు ఊరుకోవు. మూవీని మొత్తానికే నిషేధించారు.నిషేధం అయితే విధించారు కానీ మిగిలిన దేశాలకు చెందిన వాళ్లు చూడకుండా యూరోపియన్ ప్రభుత్వం, న్యాయస్థానాలు ఆపలేకపోయాయి. ప్రస్తుతం అమెరికాలో అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీల్లో అద్దె విధానంలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. మరోవైపు ట్విటర్లో ఈ సినిమా మొత్తాన్ని వివిధ హ్యాండిల్స్లో పోస్ట్ చేసేశారు. మన దేశంలోనూ అందుబాటులో ఉంది.యూరోపియన్ దేశాల్లో భద్రత అనేది గాల్లో దీపంలా ఎలా తయారైంది? ఆయా దేశాలకు చెందిన వేలాది మంది అమ్మాయిలు.. పాక్, ఆఫ్రికా నుంచి అక్రమంగా వలస వెళ్లిన యువకుల కారణంగా ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటారనేది ఇందులో రా గా చూపించారు. ఇక క్లైమాక్స్లో హీరో.. ఓ ఫ్యామిలీతో పాటు కొందరు కుర్రాళ్లని చంపే సీన్ అయితే ఒళ్లు జలదరించేలా చేస్తుంది. సదరు అత్యాచారాలు చేసే యువకుల మనసులని వాళ్ల కుటుంబాలే ఎలా కలుషితం చేస్తున్నాయనేది కూడా ఇందులో క్లియర్ గా చూపించారు. కేవలం గంటన్నర నిడివితో ఉండే ఈ సినిమా ప్రారంభంలో కాస్త సాగదీతగా అనిపిస్తుంది కానీ కాస్త ఓపికతో చూస్తే యూరోపియన్ దేశాల అసలు స్వరూపం బయటపడుతుంది.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీలో కామెడీ సిరీస్.. 'సూపర్ సుబ్బు' రివ్యూ) -
ఓటీటీలోకి 'సూపర్ గర్ల్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సూపర్ హీరో కాన్సెప్ట్ అనగానే చాలామందికి హాలీవుడ్ సినిమాలే గుర్తొస్తాయి. స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్, హల్క్, అవెంజర్ తదితర స్టోరీలతో ఇప్పటికే చాలా చిత్రాలు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. అలా ఈ తరహా కథతో వచ్చిన లేటెస్ట్ మూవీ 'సూపర్ గర్ల్'. ఇప్పుడీ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కావడంపై అధికారిక ప్రకటన ఇచ్చేశారు. ఇంతకీ ఇది ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు.. తెలుగు రివ్యూ)మిల్లీ ఆల్కాక్ లీడ్ రోల్ చేసిన సినిమా 'సూపర్ గర్ల్'. డీసీ సంస్థ నిర్మించింది. గత నెల 26న థియేటర్లలోకి వచ్చింది. అయితే 100 మిలియన్ డాలర్లకు పైగా నష్టాలు చవిచూసింది. టాక్ కూడా యావరేజ్ వచ్చింది. విజువల్స్, నటి ఫెర్ఫార్మెన్స్ బాగున్నప్పటికీ స్టోరీలో పెద్ద పస లేకపోవడం, ఎమోషన్స్ వర్కౌట్ కాకపోవడంతో జనాలకు పెద్దగా నచ్చలేదు. ఇప్పుడీ చిత్రాన్ని ఈనెల 28వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. తెలుగులోనూ స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది.'సూపర్ గర్ల్' విషయానికొస్తే.. క్రిప్టన్ గ్రహం నాశనమైన తర్వాత భూమికి చేరిన కరా జోర్ ఎల్ (సూపర్ గర్ల్)కి చెందిన స్పేస్ డాగ్ క్రిప్టో.. విలన్ (క్రిమ్) చేతిలో విషప్రయోగానికి గురవుతుంది. దీంతో అతడిని కాపాడుకోవడానికి సూపర్ గర్ల్.. అంతరిక్ష ప్రయాణం చేస్తుంది. ఈ ప్రయాణంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంది? చివరకు క్రిప్టోని కాపాడిందా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు.. తెలుగు రివ్యూ
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు సినిమాలు, సిరీస్లు వస్తూనే ఉంటాయి. తెలుగు ప్రేక్షకుల కోసమా అన్నట్లు డబ్బింగ్ల రూపంలోనూ స్ట్రీమింగ్ అవుతుంటాయి. రీసెంట్ టైంలో అలా 'సూపర్ సుబ్బు' సిరీస్ మన ఆడియెన్స్ని ఫుల్గా ఎంటర్టైన్ చేస్తోంది. దీనితో పాటు హాట్స్టార్లో తెలుగులోనూ అందుబాటులోకి వచ్చిన 'ప్రీతమ్ అండ్ పెడ్రో' అనే క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సిరీస్ కూడా మెప్పిస్తోంది. ఇంతకీ దీని సంగతేంటి? ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలో క్రేజీ మిస్టరీ థ్రిల్లర్ సినిమా.. గొర్రెలు డిటెక్టివ్స్ అయితే?)కథేంటి?ప్రీతమ్(వీర్ హిరానీ) గోవాలో తాతతో కలిసి జీవిస్తుంటాడు. వాక్యూమ్ క్లీనర్స్ సేల్స్మ్యాన్గా పనిచేస్తుంటాడు. తన తాతకు ఎంతో ఇష్టమైన టేప్ రికార్డర్ ఎవరో దొంగిలించారని పోలీస్ స్టేషన్కి వెళ్లి ఓ రోజు ప్రీతమ్ కంప్లైంట్ చేస్తాడు. అనుకోని పరిస్థితుల్లో అదే స్టేషన్కి చెందిన క్రైమ్ బ్రాంచ్ పోలీస్ అధికారి పెడ్రో(అర్షద్ వార్సి)కి ఓ ఏటీఎం దొంగతనం విషయంలో ఇతడు సాయం చేస్తాడు. మరోవైపు కేంద్ర మంత్రి కొడుకు కిడ్నాప్ కేసు పెడ్రో దగ్గరకు వస్తుంది. దీని విషయంలో తనకు కాస్త సాయం చేయాలని, అప్పుడే టేప్ రికార్డర్ వెతికి పెడతానని ప్రీతమ్కి పెడ్రో కండీషన్ పెడతాడు. ఇంతకీ మంత్రి కొడుకుని కిడ్నాప్ చేసింది ఎవరు? ప్రీతమ్ గతేమేంటి? గతంలో పెడ్రో కొడుకు చనిపోవడానికి కారణం ఎవరు? ఈ కథలో హ్యాకర్ మార్టిన్(విక్రాంత్ మస్సే) ఎవరు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?సినిమా అయినా సిరీస్ అయినా చూస్తున్నంతసేపు ఎంటర్టైన్ లేదా థ్రిల్ చేసిందా? అనేది కీలకం. అలాంటి వాటికే ఓటీటీలో మంచి రెస్పాన్స్ ఉంటుంది. 'ప్రీతమ్ అండ్ పెడ్రో' అలా పూర్తిస్థాయిలో ఆకట్టుకుంది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ దీనికి స్టోరీ అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించారు. సిరీస్ చూస్తున్నప్పుడు ఈయన గతంలో తీసిన మూవీస్ స్టైల్ అడుగడుగునా కనిపిస్తుంది. క్రైమ్ అనే పాయింట్కి క్రేజీ కామెడీ మిక్స్ చేయడం సరిగ్గా కుదిరింది.ఓ ఏటీఎం దొంగతనంతో మొదలైన ఈ సిరీస్లో తొలి రెండు ఎపిసోడ్ల కాస్త నిదానంగా సాగినట్లు అనిపిస్తాయి కానీ మిగిలిన నాలుగు ఎపిసోడ్లు మాత్రం ఆద్యంతం ఆకట్టుకుంటాయి. ఓ కిడ్నాప్ కేసు కారణంగా ఇద్దరు హ్యాకర్లు ఒకరితో ఒకరు తలపడి, ఎత్తుకు పైఎత్తులు వేయడం కూడా ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఈ సిరీస్ మొత్తం చూసిన తర్వాత ఫోన్ ఉపయోగించాలంటేనే కచ్చితంగా భయమేస్తుంది. ఎందుకంటే మన ఫోన్ని కూడా ఎవరైనా హ్యాక్ చేసి మనకు సంబంధించనవన్నీ గమనిస్తున్నారా అనే సందేహం కలుగుతుంది.ఇదే సిరీస్లో ఇప్పటితరం పిల్లలు ఎంత దారుణంగా తయారయ్యారు? బ్లూ వేల్ అనే గేమ్ కారణంగా ఎలా ప్రాణాలు తీసుకుంటున్నారు? ఈ విషయంలో తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉండాలి? అనే అంశాల్ని ఏదో మెసేజ్ ఇచ్చినట్లు కాకుండా బాగా చూపించారు. అలానే ప్రీతమ్, మార్టిన్ మధ్య సాగే హ్యాకింగ్ సీన్స్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. మనం కూడా హ్యాకింగ్ నేర్చుకుంటే ఎలా ఉంటుంది అనిపించేలా ఈ సిరీస్ చేస్తుంది.నటీనటుల విషయానికొస్తే ప్రీతమ్గా చేసిన వీర్ హిరానీకి నటుడిగా ఇదే అరంగేట్రం. అక్కడక్కడ అనుభవ లేమి కనిపిస్తుంది గానీ ఓవరాల్గా బాగా నటించాడు. పెడ్రో అనే పోలీస్ అధికారిగా అర్షద్ వార్సి మెప్పించాడు. హ్యాకర్ మార్టిన్గా విక్రాంత్ మస్సే సీన్స్ తక్కువే గానీ ఆకట్టుకున్నాడు. మిగిలిన నటీనటులు కూడా తమ వరకు న్యాయం చేశారు. ఇక చివరలో రెండో సీజన్ కూడా ఉంటుందనే హింట్ ఇచ్చారు. ఇప్పుడొచ్చిన దానిలో కిడ్నాప్ కామెడీ చూపించారు. రెండో సీజన్లో రూ.100 కోట్ల బ్యాంక్ దొంగతనం కేసుని పరిష్కరించేది చూపించబోతున్నారు.చివరి ఎపిసోడ్లో వీరేంద్ర సెహ్వాగ్, సంజయ్ దత్ అతిథి పాత్రలు తెగ నవ్విస్తాయి. ఆరు ఎపిసోడ్లు, క్రేజీ ట్విస్టులతో దాదాపు మూడున్నర గంటల నిడివి ఉన్న ఈ సిరీస్ తెలుగు డబ్బింగ్ కూడా బాగా చేశారు. కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు. ఈ వీకెండ్ ఏదైనా క్రైమ్ కామెడీ థ్రిల్లర్ చూద్దామనుకుంటే ఇది మంచి ఆప్షన్.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీలో కామెడీ సిరీస్.. 'సూపర్ సుబ్బు' రివ్యూ) -
ఓటీటీలోకి వచ్చేసిన సింగర్ సునీత కొడుకు సినిమా
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అయితే దాదాపుగా వీకెండ్లోనే రిలీజ్ అవుతూ ఉంటాయి. కానీ సింగర్ సునీత కొడుకు హీరోగా చేసిన ఓ మూవీ తాజాగా సోమవారం ఎలాంటి హడావుడి లేకుండా స్ట్రీమింగ్లోకి వచ్చేసింది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వడ్డే నవీన్ రీఎంట్రీ సినిమా)టాలీవుడ్లో ఎన్నో ఏళ్లుగా అద్భుతమైన పాటలు పాడుతున్న సింగర్ సునీత.. పలువురు హీరోయిన్లకు డబ్బింగ్ కూడా చెప్పింది. ఈమె కొడుకు ఆకాశ్..'సర్కౌర్ నౌకరి' అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. తర్వాత 'కొత్త మలుపు' అనే మూవీ కూడా చేశారు. గత నెల 12న థియేటర్లలో రిలీజైంది. ఇదొచ్చిన సంగతి కూడా జనాలకు తెలియదు. ఇప్పుడు అలానే సైలెంట్గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది.'కొత్త మలుపు' విషయానికొస్తే.. బాధ్యతలు లేని హైదరాబాదీ కుర్రాడు కమల్ (ఆకాశ్).. ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ బతికేస్తుంటాడు. ఓసారి ఫ్యామిలీలో జరిగే ఓ పెళ్లి కోసం కోనసీమ జిల్లాలోని ఓ పల్లెటూరికి వెళ్తాడు. అక్కడ వరలక్ష్మి (భైరవి ఆర్థ్యా)ని చూసి తొలి చూపులోనే మనసు పారేసుకుంటాడు. ఓరాత్రి అవమానకర పరిస్థితుల్లో చిక్కుకున్న కమల్ని గుర్తు తెలియని యువతి కాపాడుతుంది. ఆమెను వెతికి పట్టుకునేందుకు వరలక్ష్మితో కలిసి అన్వేషణ ప్రారంభిస్తాడు. అలా మొదలైన వీళ్లిద్దరి ప్రయాణం ఎన్ని మలుపులు తిరిగింది?ఈక్రమంలో కమల్కి కనిపించిన ఓ ఫొటో వల్ల వీళ్ల మధ్య ఎలాంటి అనుమానాలు, అపార్థాలు తలెత్తాయి? తాను వెతుకున్న అమ్మాయికి తను మనసు పారేసుకున్న వరలక్ష్మికీ ఏమైనా సంబంధం ఉందా? లేదా? ఆఖరికి ఈ ప్రేమకథ గెలిచిందా? అనేది మిగతా స్టోరీ. ఇద్దరి మధ్య ప్రేమలో ఓ అనుమానం మొదలైతే.. అదెంతటి ప్రమాదకర పరిస్థితులకు కారణమవుతుందో ఇందులో చూపించారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో అక్కినేని అఖిల్ హీరోగా నటించిన 'లెనిన్' రిలీజ్ కానుంది. దాదాపు మూడేళ్ల తర్వాత అఖిల్ బాక్సాఫీస్ బరిలో ఉన్నాడు. అంచనాలైతే పర్లేదనిపించేలా ఉన్నాయి. దీనితోపాటు వసుదేవసుతం, చంద్రప్పన్ అనే తెలుగు చిత్రాలు కూడా లిస్టులో ఉన్నాయి. అలానే పృథ్వీరాజ్ సుకుమారన్ 'ఐ నోబడీ', 'హృదయం మురళి', నాగదుర్గ 'లవ్ ఓ లవ్', ధమాల్ 4 అనే డబ్బింగ్, హిందీ చిత్రాలు కూడా విడుదల కానున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వడ్డే నవీన్ రీఎంట్రీ సినిమా)ఓటీటీ రిలీజుల విషయానికొస్తే.. ఈ వారమే 'పెద్ది' రానుంది. దీనితో పాటు మ్యూజికల్ మూవీ 'సింగ్ గీతం' కూడా స్ట్రీమింగ్ కానుంది. బల్టీ, పరిమళ అండ్ కో చిత్రాలు కూడా ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు పలు సిరీస్లు, సినిమాలు కూడా ఉన్నాయండోయ్. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్ కానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జూలై 06 నుంచి 12వ తేదీ వరకు)నెట్ఫ్లిక్స్సింగ్ గీతం (తెలుగు మూవీ) - జూలై 08ఐ యామ్ నాట్ అఫ్రైడ్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 08సల్సేడో, లెదర్ అండ్ బోగాలో (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 08నథింగ్ టూ లూజ్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 08పెద్ది (తెలుగు సినిమా) - జూలై 09లిటిల్ హౌస్ ఆన్ ద ప్రయిరే (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 09పతి పత్ని ఔర్ వో దో (హిందీ మూవీ) - జూలై 10ఇక్కా (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూలై 10షిప్ రెక్డ్: నైట్ మేర్ ఎట్ సీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - జూలై 10ద అపార్ట్మెంట్ జాబ్ (కొరియన్ సిరీస్) - జూలై 11సుసాన అండ్ ఎల్విరా: నో ప్లాన్ బి (కొలంబియన్ మూవీ) - జూలై 12హాట్స్టార్ద ఫైవ్ స్టార్ వీకెండ్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 10సోనీ లివ్బల్టీ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 10అమెజాన్ ప్రైమ్ద వెస్టీస్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 12జీ5ఫ్రేమ్ (మరాఠీ సినిమా) - జూలై 10పరిమిళ అండ్ కో (తమిళ మూవీ) - జూలై 10లయన్స్ గేట్ ప్లేద సెంటినల్స్ (ఫ్రెంచ్ సిరీస్) - జూలై 10ఆపిల్ టీవీ ప్లస్ట్రైయింగ్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 08(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన వివాదాస్పద సినిమా) -
ఓటీటీలోకి 'సింగ్ గీతం' సినిమా.. అధికారిక ప్రకటన
రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో పోలిస్తే అప్పుడప్పుడు కాస్త డిఫరెంట్ మూవీస్ కూడా రిలీజ్ అవుతుంటాయి. అలాంటి వాటిలో 'సింగ్ గీతం' ఒకటి. 94 ఏళ్ల వయసులోనూ సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని తీశారు. ఇప్పుడీ సినిమాకు సంబంధించిన ఓటీటీ అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇంతకీ ఇది ఎందులోకి ఎప్పుడు రానుంది?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వడ్డే నవీన్ రీఎంట్రీ సినిమా)అయానే, అహల్య, షాలినీ అని కొత్త నటీనటులు ప్రధాన పాత్రలు చేసిన మూవీ 'సింగ్ గీతం'. సింగీతం శ్రీనివాసరావు దర్శకుడు కాగా కల్కి, మహానటి మూవీస్ తీసిన నాగ్ అశ్విన్ నిర్మాతగా వ్యవహరించాడు. ఇందులో డైలాగ్స్ తక్కువగా ఉంటాయి. పాటలే ఎక్కువగా ఉంటాయి. అత్యాశ అనే కాన్సెప్ట్తో దీన్ని తెరకెక్కించారు. గత నెల 11వ తేదీన థియేటర్లలో రిలీజైంది. పర్లేదనిపించింది. ఇప్పుడు ఈ బుధవారం(జూలై 08) నుంచి నెట్ఫ్లిక్స్లోకి రానుంది. ఈ మేరకు అధికారికంగా అప్డేట్ ఇచ్చారు.'సింగ్ గీతం' విషయానికొస్తే.. జైలు నుంచి బయటకొచ్చిన ప్రతాప్, తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన భూములు కుబేరపురం అనే ఊరిలో ఉన్నాయని తెలుసుకుని అక్కడికి వెళ్తాడు. అయితే అవి సాధారణ భూములు కాదని వాటిలో బంగారు గనులున్నయాని తెలుస్తుంది. అయితే ఇదే ఊరిలో ఉన్న ఏకైక చెట్టుని తల్లిలా చూసుకుంటుంది గౌరి(అహల్య). బంగారం తవ్వేందుకు ఈ చెట్టుని కొట్టేసిన తర్వాత ఊరంతటికి శాపం తగులుతుంది. దీంతో అందరి నోటి నుంచి మాటలకు బదులు పాటలు వస్తుంటాయి. మరి ఈ శాపం నుంచి విముక్తి ఎలా పొందారు? మనుషుల్లోని అత్యాశ వల్ల ఎన్ని ఇబ్బందులొచ్చాయి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన వివాదాస్పద సినిమా) -
నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన వివాదాస్పద సినిమా
ప్రతివారం ఓటీటీల్లోకి పదుల సంఖ్యలో సినిమాలు వస్తూనే ఉంటాయి. వీటిలో దక్షిణాది చిత్రాలతో పాటు హిందీ, ఇతర భాషలకు చెందిన మూవీస్ కూడా ఉంటూనే ఉంటాయి. అయితే కొన్నిసార్లు మాత్రం స్టార్స్ నటించినవి కూడా నేరుగా ఓటీటీలో రిలీజైపోతుంటాయి. ఇప్పుడు కూడా అలానే ఓ వివాదాస్పద చిత్రం పెద్దగా హడావుడి లేకుండానే అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: ఓటీటీలో కామెడీ సిరీస్.. 'సూపర్ సుబ్బు' రివ్యూ)పంజాబ్కి చెందిన మానవ హక్కుల నేత జస్వంత్ సింగ్ ఖల్రా జీవితం ఆధారంగా 'పంజాబ్ 95' పేరుతో దర్శకుడు హనీ టెహ్రాన్ ఓ సినిమా తీశారు. ప్రముఖ సింగర్ దిల్జిత్ దోసాంజ్ ఇందులో లీడ్ రోల్ చేశాడు. పంజాబ్లో 25,000 మందిని అన్యాయంగా పోలీసులు చంపిన సంగతి.. తన పరిశోధన ద్వారా వెలుగులోకి తెచ్చిన జస్వంత్ సింగ్.. 1995లో హత్యకు గురయ్యారు. ఈయన్ని పోలీసులే చంపారనే ఆరోపణలు ఉన్నాయి.ఈ సినిమాని మూడేళ్ల క్రితమే తీసినప్పటికీ సెన్సార్ బోర్డ్.. తీవ్ర అభ్యంతరాలు చెప్పింది. ఏకంగా 127 కట్స్ సూచించింది. మూవీ టీమ్ కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా ఫలితం లేకపోవడంతో ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయలేదు. దీంతో 'సత్లుజ్'గా టైటిల్ మార్చి నేరుగా జీ5 ఓటీటీలోకి రెండు రోజుల క్రితమే స్ట్రీమింగ్లోకి తీసుకొచ్చారు. నార్త్ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. కానీ దక్షిణాది ఆడియెన్స్కి నచ్చుతుందా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వడ్డే నవీన్ రీఎంట్రీ సినిమా)


