Mahabubnagar
-
జడ్చర్ల కాలనీల్లో వరద నీరు
జడ్చర్ల మున్సిపాలిటీ మరోమారు జలమయమైంది. గురువారం మధ్యాహ్నం రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి ప్రధాన రోడ్డుతో పాటు పలు కాలనీల్లోకి వరదనీరు చేరింది. బాదేపల్లి పైభాగం ఊరకుంట పద్మావతి కాలనీ నుంచి వచ్చిన వరద నీరు ప్రధాన రోడ్డుపైకి చేరడంతో చిన్నపాటి చెరువును తలపించింది. మోకాలు లోతుకుపైగా నీళ్లు నిలవడంతో ఇటు సిగ్నల్గడ్డ, అటు నేతాజీ చౌరస్తా వరకు వాహనాలు నిలిచిపోయాయి. సిగ్నల్గడ్డ నుంచి క్రాస్రోడ్డుకు వెళ్లే దారిలో జాతీయ రహదారి–167పై శ్రీకృష్ణ ఆలయం వద్ద సైతం వరద నీరు నిలిచి వాహనాల రాకపోకలకు తీవ్ర అసౌకర్యం కలిగింది. రోడ్డుపై వ్యాపారాలు చేసేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎస్వీపీనగర్ కాలనీలో సౌరమ్మ అనే మహిళ ఇళ్లు, రాజీవ్నగర్ కాలనీలోనూ ఇళ్లు, ప్రహరీ కూలిపోయాయి. మరో ఇంటి నిర్మాణానికి వేసిన పిల్లర్లు పడిపోయాయి. ఏరియా ఆస్పత్రి ఆవరణలోనూ భారీగా వర్షపు నీరు నిలిచింది. వర్షానికి కూలిన ఇంటిని మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి పరిశీలించారు. -
పాము కాటుతో యువకుడి మృతి
మల్దకల్: యువకుడు పాముకాటుకు గురై మృతి చెందిన ఘటన మండలంలోని అడివిరావల్చెర్వు గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. ఏఎస్ఐ ఈశ్వరయ్య తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన నాగరాజు (20) బుధవారం వ్యవసాయ పనులు ముగించుకొని అక్కడే ఉన్న గుడిసెలో నిద్రించాడు. తెల్లవారుజూమున నిద్రలేవకపోవడంతో కుటుంబసభ్యులు పాము కాటు వేసినట్లు గుర్తించి గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. తీర్థయాత్రలకు వెళ్లొస్తూ అనంతలోకాలకు మానవపాడు: మండల కేంద్రానికి చెందిన బోయ మూగి మద్దిలేటి అనే వ్యక్తి తీర్థయాత్రలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో అనారోగ్యంతో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. మద్దిలేటి మరో నలుగురు గ్రామస్తులతో కలిపి ఈ నెల 5న కాశీ, అయోధ్యను సందర్శించడానికి వెళ్లాడు. యాత్రలు ముగించుకొని రైలులో తిరిగి వస్తుండగా అనారోగ్యానికి గురై మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్ రైల్వేస్టేషన్లో మరణించాడు. పోలీసులు మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించి, అక్కడి నుంచి అంబులెన్స్ ద్వారా మానవపాడుకు పంపారు. మద్దిలేటి మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి మల్దకల్: విద్యుత్ సర్వీస్ వైర్ను సరిచేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్షాక్కు గురై వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని పావనంపల్లి గురువారం జరిగింది. వివరాలు.. పావనంపల్లి గ్రామానికి చెందిన తెలుగు పరుషరాముడు(45) ఇంటి ముందు ఉన్న విద్యుత్ స్తంభం నుంచి తన ఇంటికి తీసుకున్న సర్వీస్ వైర్ సరిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుని భార్య శారదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నందికర్ తెలిపారు. విషయం తెలుసుకున్న జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత, మండల నాయకులు ఆస్పత్రికి చేరుకొని మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య తెలకపల్లి: కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలకపల్లిలో చోటు చేసుకుంది. ఎస్ఐ నరేశ్ వివరాల మేరకు.. బల్మూరు మండలం జినుకుంటకు చెందిన కురాకుల మహేశ్ (32), తన భార్య విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత అతడికి దూరపు బంధువు అయిన తెలకపల్లి మండలం లక్ష్నారం గ్రామానికి చెందిన శివలీలతో పరిచయమైంది. ఆమె కూడా తన భర్తతో విడాకులు తీసుకొని ఒంటరిగా జీవిస్తున్న క్రమంలో ఇద్దరు వివాహం చేసుకున్నారు. ఇటీవల శివలీల మరో వ్యక్తితో ఫోన్లో మాట్లాడటాన్ని గమనించిన భర్త మహేశ్ నిలదీశాడు. అయితే తన ప్రవర్తన మార్చుకోని శివలీల.. కుటుంబ సభ్యులకు ఎవరికీ చెప్పకుండా 10 రోజులు ఎక్కడికో వెళ్లిపోయింది. ఆమె అదృశ్యం కావడంపై స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమె ఆచూకీని కనుగొని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి భార్యాభర్తలకు నచ్చజెప్పారు. ఆ తర్వాత తెలకపల్లిలో నివాసం ఉన్నప్పటికీ శివలీల తన ప్రవర్తన మార్చుకోకపోవడంతో మనస్తాపానికి గురైన భర్త మహేశ్.. తెలకపల్లిలో తన సోదరి అంజలి నివాసముంటున్న అద్దె ఇంట్లో బుధవారం అర్ధరాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి దాసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. యువకుడి బలవన్మరణం తెలకపల్లి: క్షణికావేశంలో ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ నరేష్ కథనం మేరకు.. మండలంలోని పెద్దూరుకు చెందిన పబ్బాల పరశురాములు (28) రెండు నెలలుగా ఎలాంటి పని చేయకుండా కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరుగుతుండటంతో భార్య, తల్లిదండ్రులు మందలించారు. దీంతో గురువారం ఉదయం ఇంట్లో సీసాలో ఉన్న పెట్రోల్ ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు హైదరాబాద్కు తీసుకెళ్తుండగా.. మార్గమధ్యంలో మృతిచెందాడు. తండ్రి పబ్బాల కురుమయ్య ఫిర్యాదు మేరకు సాయంత్రం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. పరశురాములుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
చరిత్రలో నిలిచిపోయేలా సంబరాలు చేద్దాం
జడ్చర్ల టౌన్: బాదేపల్లి బాలుర జెడ్పీ హైస్కూల్ శతాబ్ది ఉత్సవాలను చరిత్రలో నిలిచిపోయేలా చేసుకుందామని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్రెడ్డి అన్నారు. హైస్కూల్ ప్రారంభించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా పూర్వ విద్యార్థుల కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్, మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ హైస్కూల్లో చదివిన పూర్వ, ప్రస్తుత విద్యార్థులు, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కోఆర్డినేషన్ కమిటీ తేదీ నిర్ణయిస్తే మూడు రోజుల ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, గవర్నర్తో పాటు మంత్రులను ఆహ్వానించే బాధ్యత తీసుకుంటానన్నారు. వేడుకలకు తనవంతు పూర్తి సహకారం అందిస్తానన్నారు. అయితే శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు వచ్చే రాష్ట్రపతిని ఆహ్వానించి, అదే సమయంలో వేడుకలు నిర్వహించాలని కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు కోరుతున్నారని, అందుకోసం ముఖ్యమంత్రి ద్వారా ప్రయత్నిద్దామని తెలిపారు. మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణను సైతం కలుసుకుని రాష్ట్రపతిని ఆహ్వానిద్దామన్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు బి.రవిశంకర్, వి.కృష్ణ, రమణాచార్యులు, ఇబ్రహీం, వెంకటేశ్, పెద్దిబాలు, పరమటయ్య, శ్రీహరి, సంతోష్చారి, బాబర్, మార్కెట్ చైర్పర్సన్ జ్యోతి, వార్డుకౌన్సిలర్ రఘురాంగౌడ్, పట్టణ ప్రముఖులు బి.శివకుమార్, కె.లక్ష్మయ్య, ఎంఈఓ మంజులాదేవి, ప్రధానోపాధ్యాయురాలు చంద్రకళ, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ముఖ్యమంత్రి, గవర్నర్, మంత్రులను ఆహ్వానిద్దాం బాదేపల్లి హైస్కూల్ శతాబ్ది ఉత్సవాల ప్రారంభంలో ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి -
ముగిసిన అంత్యక్రియలు
అడ్డాకుల: మండలంలోని గుడిబండకు చెందిన ముగ్గురు యువకులు బుధవారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ పట్టణ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం పాఠకులకు విధితమే. కాగా వాస పవన్కుమార్ (26), వాస సాయితేజ (24), వాస రాఘవేంద్ర (22) మృతదేహాలకు శవ పరీక్షల అనంతరం బుధవారం రాత్రి స్వగ్రామానికి తీసుకొచ్చారు. గురువారం ఉదయం దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించి మృతదేహాలపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని భరోసానిచ్చారు. ఒకేరోజు వేర్వేరు కుటుంబాలకు చెందిన ముగ్గురు యువకుల అంత్యక్రియలు జరగడంతో గ్రామం దుఃఖ సాగరంలో మునిగిపోయింది. మృతుల్లో ఇద్దరికి వివాహం కాకపోవడం.. వాస పవన్కుమార్కు భార్య, ఏడాది వయసున్న చిన్నారి ఉన్నారు. ఒక్కగానొక్క కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంలో తల్లిదండ్రుల రోధనలు అందరినీ కంటతడి పెట్టించాయి. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు శ్రీహరి, నాగిరెడ్డి, శెట్టి శేఖర్, విజయమోహన్రెడ్డి, దశరథ్రెడ్డి, శరత్రెడ్డి, చెన్నకేశవులు, శకుంతల, జగదీశ్, భరత్ ఉన్నారు. -
ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీఫలితాలు విడుదల
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ సెమిస్టర్– 1, 3 సంబంధించి ఫలితాలను పీయూ వీసీ శ్రీనివాస్ గురువారం విడుదల చేశారు. ఈ మేరకు సెమిస్టర్–1లో 37.74 శాతం, సెమిస్టర్–3లో 42.11 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రవీణ తెలిపారు. ఫలితాలను పీయూ అధికార వెబ్సైట్లో చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, అడిషనల్ కంట్రోలర్ అనురాధ తదితరులు పాల్గొన్నారు.వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో వార్షిక పరీక్షస్టేషన్ మహబూబ్నగర్: జిల్లా కేంద్రంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో వివిధ స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ పొందిన 16వ బ్యాచ్ 86 మంది అభ్యర్థులకు హైదరాబాద్ సెట్విన్ ఆధ్వర్యంలో గురువారం వార్షిక పరీక్షలు నిర్వహించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు థియరీ, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షలను జిల్లా యు వజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్, ఇతర అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా డీవైఎస్ఓ మాట్లాడుతూ 16వ బ్యాచ్కు సంబంధించి ఫిబ్రవరి 2 నుంచి మే 16 వరకు 86 మంది యువతకు వివిధ స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు సెట్విన్ వారిచే సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. వార్షిక పరీక్షలను ఎగ్జామినర్లు హైదరాబాద్ సెట్విన్ కోఆర్డినేటర్ సత్యనారాయణరెడ్డి, అసిమ్, బిల్ఖిస్ సుల్తానా పర్యవేక్షించారు. కార్యక్రమంలో డీవైఎస్ఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ రవీందర్రెడ్డి, ఫ్యాకల్టీ సిబ్బంది హరిప్రసాద్, కౌసల్య, ఖలీల్, ఇమ్రాన్, అజహర్ తదితరులు పాల్గొన్నారు.అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానంమహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని బీఈడీ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి ఆసక్తి గల నూతన, రిటైర్డ్ గెస్టు లెక్చరర్ల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ గోవిందరాజులు ఒక ప్రకటనలో తెలిపారు. ఫిలాసఫీ సోషియాలజీ, జీవవశాస్త్రం, భౌతికశాస్త్రం, గణితం, సోషల్, తెలుగు, హిందీ, ఉర్దూ, ఐసీటీ, ఆరోగ్య వ్యాయామ విద్య, విజువల్ ఫర్మామింగ్ ఆర్ట్స్లో ఒక్కొక్క పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆసక్తి, అర్హత గలవారు ఈ నెల 19లోగా మెట్టుగడ్డ వద్ద ఉన్న బీఈడీ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.పిల్లలను పనిలో పెట్టుకుంటే చర్యలుపాలమూరు: బాల, బాలికలను దినసరి కూలీలుగా మార్చినా.. బలవంతంగా దుకాణాలు, ఇతర కర్మాగారాల్లో పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని, అలాంటి యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జ్ కార్యదర్శి ఈశ్వరయ్య అన్నారు. జిల్లాకేంద్రంలోని మాడ్రన్ హైస్కూల్లో గురువారం బాల కార్మిక చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల కార్మికుల చట్టాలు, బాల్య వివాహాలు, బాలల హక్కులపై ప్రతిఒక్కరు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బాల్య దశలో ఉన్న పిల్లలను పాఠశాలలకు పంపించాలని సూచించారు. -
573 బస్సులకు నో ఫిట్నెస్
పాలమూరు: ఉమ్మడి జిల్లాలో గురువారం నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభమయ్యాయి. అయితే జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించి బస్సులు ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకోలేదు. చాలా బస్సులు ఫిట్గా లేకుండానే విద్యార్థులను తరలించడానికి సిద్ధమయ్యాయి. ఉమ్మడి జిల్లాలో 1,336 స్కూల్ బస్సులు ఉండగా.. ఇందులో బుధవారం సాయంత్రం వరకు 763 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు పూర్తిచేయగా.. మరో 573 బస్సులు ఫిట్నెస్ పరీక్షలు చేసుకోలేదు. డీటీఓలకు ఆదేశాలు.. ఉమ్మడి జిల్లాలోని ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలల బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేసుకోవడానికి ఇచ్చిన గడువు బుధవారంతో ముగియడంతో జిల్లా ఆర్టీఏ అధికారులు గురువారం నుంచి ప్రత్యేక డ్రైవ్లు చేపడుతున్నట్లు డీటీసీ కిషన్ వెల్లడించారు. మొదట జిల్లాకేంద్రాలతో పాటు పాఠశాలలు అధికంగా నిర్వహించే పట్టణాల్లో ఆర్టీఏ బృందాలతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ఫిట్నెస్, పర్మిట్ ఇతర పత్రాలు పరిశీలిస్తామన్నారు. అన్ని స్కూల్ బస్సులు ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా రోడ్లపై తిరిగితే చర్యలు తీసుకోవడంతోపాటు కేసులు నమోదు చేస్తామన్నారు. దీంతోపాటు 15 ఏళ్లు దాటిన వాహనాలపై కూడా ప్రత్యేక దృష్టిసారించి తనిఖీ చేపడుతామన్నారు. జిల్లావ్యాప్తంగా తనిఖీలు చేయడానికి అధికారులు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి ఇప్పటికే ఆయా జిల్లాల డీటీఓలకు ఆదేశాలు ఇచ్చినట్లు డీటీసీ పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో పునఃప్రారంభమైనపాఠశాలలు నేటినుంచి స్కూల్ బస్సులపై ఆర్టీఏ ప్రత్యేక డ్రైవ్ ప్రారంభం ఫిట్నెస్ లేకుండా నడిపితే కేసులు నమోదు -
ఉత్సాహంగా టీజీపీఈ సెట్ ఈవెంట్స్
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో టీజీపీఈ సెట్–2025 ఈవెంట్స్ రెండో రోజు గురువారం ఉత్సాహంగా కొనసాగాయి. ఈవెంట్స్ను రాష్ట్ర హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వైస్చైర్మన్లు పురుషోత్తం, శ్రీరామ్ వెంకటేశ్తో పాటు పీయూ వీసీ శ్రీనివాస్ పరిశీలించారు. ముందుగా 100 మీటర్ల రన్నింగ్ను వారు గన్ పేల్చి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో వీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. మొదటి రోజు ఎంపికలను పూర్తి పాదర్శకంగా నిర్వహించామన్నారు. మిగతా ఈవెంట్స్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రెండో రోజు బీపెడ్లో 544 మందికి గాను 370 మంది, డీపెడ్లో 231 మందికి గాను 145 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కార్యక్రమంలో సెట్ కన్వీనర్ దిలీప్, రిజిస్ట్రార్ రమేశ్బాబు, పీడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
శిక్షణ పొందిన వారికి స్వయం ఉపాధి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ‘మహబూబ్నగర్ ఫస్ట్ – నవరత్నాలు’లో శిక్షణ పొందిన మహిళలకు 30 నుంచి 40 శాతం వరకు ఉద్యోగావకాశాలు లభించాయని పర్యవేక్షకుడు గుండా మనోహర్ తెలిపారు. ఇక మిగతా వారు ఇంటి వద్దే స్వయం ఉపాధి పొందుతున్నారన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని బీకేరెడ్డి కాలనీలోని ఈ శిక్షణ కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి సొంత నిధులతో కొనసాగుతున్న ‘నవరత్నాలు’ ముఖ్యంగా మహిళలకు వరంగా మారిందన్నారు. ఇక్కడ కంప్యూటర్, బ్యూటీషియన్, మగ్గంవర్క్, ఫ్యాషన్ డిజైనింగ్లో శిక్షణ ఉచితంగా ఇస్తున్నామన్నారు. మొదటి బ్యాచ్లో 217 మంది, రెండో బ్యాచ్లో 247 మంది విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారన్నారు. ఏదైనా యూనిట్ ఏర్పాటు చేసుకునే వారికి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించేందుకు యత్నిస్తున్నామన్నారు. మొదటి బ్యాచ్ పూర్తి చేసిన వారికి ఈనెల 17న ఎమ్మెల్యే చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. అదేరోజు రెండో బ్యాచ్ వారికి ఫేర్వెల్ పార్టీ ఉంటుందన్నారు. మూడో బ్యాచ్కు అడ్మిషన్లు జరుగుతున్నాయని 18న శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయన్నారు. అలాగే స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సును సైతం ప్రవేశపెట్టే ఆలోచన ఉందన్నారు. కార్యక్రమంలో శిక్షణ కేంద్రం ఇన్చార్జ్ నిజలింగప్ప, సెట్విన్ కో–ఆర్డినేటర్ విజయకుమార్, ‘నవరత్నాలు’ ఫ్యాకల్టీలు గౌతమి, భవాని, కవిత, అనూష తదితరులు పాల్గొన్నారు. 18 నుంచి మూడో బ్యాచ్ ప్రారంభం -
అసమానతలు లేని సమాజాన్ని నిర్మిద్దాం
మహబూబ్నగర్ న్యూటౌన్: సమాజంలో వెనుకబడిన జాతులు అణచివేతకు గురవుతూనే ఉన్నాయని, అభివృద్ధికి ఇంకా ఆమడ దూరంలోనే ఉన్నారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. అసమానతలు లేని సమాజ నిర్మాణమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పెండింగ్ కేసులు, భూ సమస్యలు నెల రోజుల్లోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసులు, భూ సమస్యలు, వివిధ శాఖల ద్వారా ఆయా వర్గాలకు అందుతున్న సంక్షేమ పథకాలపై కమిషన్ సభ్యులు నీలాదేవి, శంకర్, రాంబాబునాయక్, లక్ష్మీనారాయణతో కలిసి సమీక్ష నిర్వహించారు. పోలీస్ శాఖ ద్వారా నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసుల గురించి ఎస్పీ జానకి వివరించారు. ఈ ఏడాది 26 కేసులు నమోదు కాగా 6 చార్జీషీట్ చేశామని, 20 కేసులు విచారణలో ఉన్నాయన్నారు. గతేడాది 78 కేసులు నమోదైనట్లు చెప్పారు. 2014 సంవత్సరం నుంచి 2023 వరకు 530 కేసులకు గాను 90 కేసులు చార్జిషీట్ వేయలేదని, కారణాలు ఏమిటని చైర్మన్ ఆరాతీశారు. 2023– 24లో 27 అట్రాసిటీ కేసులకు సంబంధించి బాధితులకు పరిహారం చెల్లించామని, ఈ ఏడాది 71 మందికి రూ.78 లక్షలు పరిహారం చెల్లింపునకు నిధులు రావాల్సి ఉందన్నారు. సంబంధిత శాఖ రాష్ట్ర అధికారులు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రితో మాట్లాడి నిధులు విడుదల చేయిస్తానని చైర్మన్ తెలిపారు. అంబేడ్కర్ విదేశీ విద్యా నిధి కింద గతేడాది ఒక అమ్మాయికి రూ.20 లక్షలు విదేశాల్లో చదువుకునేందుకు మంజూరు చేశామని ఎస్సీ అభివృద్ధి అధికారి చెప్పారు. జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బాలయ్య, రవీంద్రబాబు, లక్ష్మణ్, మోహన్లాల్, కృష్ణయ్య, హన్వాడ నాగయ్య సమస్యలను కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోహన్రావు, ఆర్డీఓ నవీన్, ఎస్సీ అభివృద్ధి అధికారి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. నిధులు పక్కదారి పట్టించొద్దు చైర్మన్ బక్కి వెంటయ్య మాట్లాడుతూ జిల్లాలో జిల్లాలో ఎస్సీ, ఎస్టీల జనాభా ఎక్కువగా ఉందని, అదే స్థాయిలో వారికి లబ్ధి జరిగేలా చూడాలన్నారు. ప్రతినెల చివరి రోజున కచ్చితంగా పౌర హక్కుల దినోత్సవం నిర్వహించాలని, తహసీల్దార్, ఎస్ఐలు హాజరై ప్రజలకు చట్టంపై అవగాహన కల్పించాలన్నారు. సమావేశాల్లో ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఇందులో వారి వాటా గురించి అవగాహన కలిగించాలన్నారు. ప్రతి మూడు నెలలకోసారి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిపి సమీక్షించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించవద్దన్నారు. ఆర్అండ్బీ, పీఆర్ కాంట్రాక్టర్లకు ఇచ్చే పనుల్లో ఎస్సీ, ఎస్టీలకు వారి స్థోమతను బట్టి చిన్నపాటి పనులు కేటాయించాలని సూచించారు. ఉన్నత ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. వ్యవసాయ శాఖ ద్వారా నకిలీ విత్తనాలు బెడద అరికట్టాలని, వ్యవసాయ, పోలీస్ అధికారులు తనిఖీలు నిర్వహించాలన్నారు. రైతులకు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూడాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఎంప్లాయ్మెంట్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలలో అవకాశం కల్పించాలని జిల్లా ఉపాధి కల్పన అధికారికి సూచించారు. పెండింగ్ కేసులు, భూ సమస్యలునెలలోగా పరిష్కరించాలి ప్రతినెలా చివరి రోజు పౌర హక్కుల దినోత్సవం నిర్వహించాలి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య -
లారీ, ఓల్వో బస్సు ఢీ : 18 మందికి గాయాలు
మక్తల్: ఆగి ఉన్న లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో 18 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని బొందల్కుంట స్టేజీ వద్ద గురువారం తెల్లవారుజామున 5.30 గంటలకు చోటు చేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. కర్ణాటకలోని శివమొగ్గ నుంచి 29 మంది ప్రయాణికులతో ఓల్వో బస్సు బుధవారం రాత్రి హైదరాబాద్కు బయలుదేరింది. గురువారం తెల్లవారుజామున మండలంలోని బొందల్కుంట వద్ద 167 జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న లారీని బస్సు వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న లక్ష్మణ్, నవీన్, సంజీవ్, అన్నపూర్ణ, షరీఫ్, రహీం, మణెమ్మ, శంకర్, నర్సింహులు, రమేశ్ అనిత తదితరులు మొత్తం 18 మంది ప్రయాణికులతో పాటు డ్రైవర్ సంజీవ్కు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న మక్తల్ సీఐ రాంలాల్, ఎస్ఐ భాగ్యలక్ష్మిరెడ్డి ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను మక్తల్, రాయచూర్, మహబూబ్నగర్ ఆస్పత్రులకు తరలించారు. గురువారం ఉదయం ఎస్పీ యోగేష్ గౌతమ్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ వివరించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ యోగేష్ గౌతమ్ -
మహబూబ్నగర్ను క్రీడా హబ్గా తీర్చిదిద్దుతాం
మహబూబ్నగర్ క్రీడలు: రాష్ట్రంలో క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని మహబూబ్నగర్ను క్రీడా హబ్గా తీర్చిదిద్దుతామని ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్.పి వెంకటేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో గురువారం రాష్ట్రస్థాయి వాలీబాల్ సెలక్షన్స్ నిర్వహించగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి అనేక మంది బాల, బాలికలు పాల్గొన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకటేశ్ మాట్లాడుతూ విద్యార్థులు కేవలం చదువులోనే కాకుండా క్రీడల్లోనూ రాణించి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. సీఎం రేవంత్రెడ్డి, క్రీడా శాఖ మంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన వాకిట శ్రీహరి, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి జిల్లాకు చెందిన వారేనని, వీరి హయాంలో క్రీడారంగం అభివృద్ధి పథంలో వెళ్లడం ఖాయమన్నారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్ రవీందర్, డీవైఎస్ఓ శ్రీనివాస్, సరూర్నగర్ డీవైఎస్ఓ సెలక్షన్ కమిటీ నామినీ వెంకటేశ్వర్లు, ఎల్బీ స్టేడియం వాలీబాల్ కోచ్ ప్రవీణ, జింఖానా వాలీబాల్ కోచ్ రుషిందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
జూరాల నీటితో ప్రాజెక్టును నింపుతాం..
జూరాలకు ఇలాగే ఇన్ఫ్లో కొనసాగితే ఎత్తిపోతల పథకం ద్వారా కోయిల్సాగర్ను నింపుతాం. ప్రస్తుతం ఒక పంపును రన్ చేసి 315 క్యూసెక్కుల నీటిని విడుదల చేశాం. ముందుగా ఫర్దీపూర్ రిజర్వాయర్ను నింపాం. ఇక్కడి నుంచి తీలేర్ పంపుహౌస్కు నీటిని తరలించి.. అక్కడి నుంచి కోయిల్సాగర్కు పంపింగ్ చేస్తున్నాం. ప్రాజెక్టు పూర్తి స్థాయి కి చేరే వరకు నీటిని విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నాం. – ప్రతాప్సింగ్, ప్రాజెక్టు ఈఈ, కోయిల్సాగర్ వరుణుడు కరుణించాడు.. ఈ ఏడాది వరుణుడు కరుణించాడు. ముందస్తుగానే రుతుపవనాలు రావడంతో భారీ వర్షాలు కురిశాయి. వైఎస్ హయాంలో భారీ వర్షాలు నమోదు కాగా, ప్రస్తుతం రేవంత్రెడ్డి హయాంలో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. పంటలు సమృద్ధిగా పండించే అవకాశం ఉంది. ఈ సీజన్లో ఆయకట్టు లక్ష్యం చేరుకుంటాం. – మధుసూదన్రెడ్డి, ఎమ్మెల్యే, దేవరకద్ర ● -
రోటవేటర్ కింద పడి విద్యార్థి మృతి
కోడేరు: రోటవేటర్ కింద పడి ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలం జనుంపల్లిలో బుధవారం చోటుచేసుకున్నది. ఎస్సై గోకారి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కావలి నాగేంద్రం ఉదయం తన కుమారుడు సాయికుమార్(13)ను పొలం వద్దకు తీసుకెళ్లాడు. డ్రైవర్ సత్యనారాయణ నాగేంద్రం పొలంలో రోటవేటర్తో దుక్కి దున్నుతుండగా వెనకాల ఉన్న సాయికుమార్ ప్రమాదవశాత్తు ట్రాక్టర్ రోటవేటర్ కింద పడి మృతిచెందాడు. నాగేంద్రం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి రాజాపూర్: పరిశ్రమలో పైకప్పు షీట్వేస్తూ ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి కిందపడిపోగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన బుధవారం మండలంలోని గుండ్లపొట్లపల్లిలో చోటుచేసుకున్నది. రాజాపూర్ ఎస్సై శివానందంగౌడ్ కథనం ప్రకారం.. గుండ్లపొట్లపల్లి శివారులో బిన్జ్రాజ్కవలేవ్యు పరిశ్రమలో మంగళవారం సాయంత్రం పాతసీట్స్ తొలగించి కొత్తసీట్స్ వేసి వెల్డింగ్ చేస్తుండగా.. హైదరాబాద్కు చెందిన అబ్దుల్హమీద్ ప్రమాదవశాత్తు పైనుంచి కిందపడి గాయాలపాలయ్యాడు. వెంటనే అక్కడే ఉన్న అతని తమ్ముడు చికిత్స నిమిత్తం జడ్చర్ల ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి తండ్రి అబ్దుల్సలీం ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. తల్లితో గొడవ పడి యువతి.. ఎర్రవల్లి: చికిత్స పొందుతూ యువతి మృతి చెందిన సంఘటన ఇటిక్యాల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఏఎస్ఐ సుధాకర్ కథనం మేరకు.. మండలంలోని షాబాద్ గ్రామానికి చెందిన మహేశ్వరి(25)కి గతంలో వివాహం కాగా, భర్తతో విడాకులు తీసుకొని కొంత కాలంగా తల్లి పద్మమ్మతో కలిసి గ్రామంలో ఉంటోంది. ఈ క్రమంలో హైదరాబాద్ వెళ్లి పోటీ పరీక్షలకు చదువుకోవడం కోసం తనకు రూ.1లక్ష కావాలని ఈ నెల 2న తల్లిని కోరింది. ఆమె రెండు రోజుల్లో సమకూరుస్తానని చెప్పడంతో గొడవపడి మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కర్నూల్ ప్రభుత్వాసుపత్రికి ఆమెను తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బుధవారం మృతి చెందింది. ఆమె తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. బాలికపై లైంగికదాడికి యత్నం పాన్గల్: ఆరేళ్ల బాలికపై లైంగికదాడికి యత్నించిన సంఘటన బుధవారం మండలంలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా పాన్గల్ మండలం అన్నారం గ్రామంలో కోళ్ల షెడ్డు నిర్మాణం పనులు చేసేందుకు వనపర్తి జిల్లా కేంద్రంలోని పీర్లగుట్టకు చెందిన తిరుపతయ్య(65) కూలీగా పని చేస్తున్నాడు. బుధవారం షెడ్డు సమీపంలో ఓ ఇంటి ముందు ఊయల ఊగుతున్న బాలిక(6)ను మద్యం మత్తులో చేతిపట్టుకొని షెడ్డు లోపలికి తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించగా బాలిక గట్టిగా అరుస్తూ కేకలు వేసింది. దీంతో పక్కనే ఉన్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని వృద్ధుడికి దేహశుద్ధి చేశారు. ఈ సంఘటనపై కుటుంబ సభ్యులు 100 సమాచారం ఇవ్వడంతో వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వర్రావు, సీఐ కృష్ణ, ఎస్ఐ శ్రీనివాసులు గ్రామానికి చేరుకొని జరిగిన సంఘటనపై విచారణ చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వృద్ధుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఏడాది తర్వాత దొరికిన బాలుడు మిడ్జిల్: మండలంలోని కొత్తూర్ గ్రామానికి చెందిన ఎండీ సలీమా, జహంగీర్ దంపతుల పెద్ద కుమారుడు ఎండీ సమీర్ (15) గతేడాది 15 ఏప్రిల్ 2024న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లాడు. ఆ తర్వాత ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. అదే రోజు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివనాగేశ్వర్నాయుడు తెలిపారు. అదే రోజు బాలుని వివరాలు ఆన్లైన్ యాప్లో నమోదు చేశారు. కొన్ని రోజుల క్రితం ఆ యాప్ ద్వారా బాలుడు బెంగూళూర్లోని ఒక హాస్టల్లో ఉన్నాడని సమాచారం రావడంతో, ఆ బాలుని బెంగూళూర్ నుంచి తీసుకొచ్చి బుధవారం కుటుంబ సభ్యులకు అస్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. సంవత్సరం తర్వాత కుమారుడు ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. -
టీజీపీఈసెట్
పారదర్శకంగా ఈవెంట్కు 517మంది హాజరు పీయూలో సెట్ అభ్యర్థులు ఈవెంట్స్ను కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి, పీయూ వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేశ్బాబు, సెట్ కన్వీనర్ దిలీప్ ఉదయం 7:30గంటలకు సింథటిక్ ట్రాక్లో 100 మీటర్ల పరుగు పందేన్ని గన్ఫైర్ చేసి ప్రారంభించారు. అనంతరం ఇండోర్ స్టేడియం పక్కన ఏర్పాటు చేసిన రెండు క్రికెట్ నెట్లను ప్రారంభించగా.. వీసీ బౌలింగ్ చేస్తే కౌన్సిల్ చైర్మన్ బ్యాటింగ్తో అలరించారు. వీటితోపాటు పీజీ కళాశాల పక్కనున్న గ్రౌండ్లో ఏర్పాటు చేసిన పలు కోట్లను పరిశీలించారు. మొదటిరోజు ఈవెంట్స్కు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి 732మంది మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా.. 517మంది పాల్గొనగా.. 215మంది గైర్హాజరైనట్లు సెట్ కన్వీనర్ దిలీప్ పేర్కొన్నారు. అభ్యర్థులు రన్నింగ్ షార్ట్పుట్, లాంగ్జంప్ అనతతరం 11 క్రీడాంశాల్లో పాల్గొన్నారు.మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో నిర్వహిస్తున్న టీజీపీఈసెట్–2025ను పారద్శకంగా నిర్వహిస్తామని టీజీహెచ్ఈసీ (తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్) చైర్మన్ బాలకిష్టారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు పీయూలోని సింథటిక్ ట్రాక్ గ్రౌండ్స్లో సెట్ అభ్యర్థులకు నిర్వహిస్తున్న ఈవెంట్స్నుఆయన గన్పేల్చి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కొన్నేళ్లుగా ఎప్పుడూ పీయూకు రాలేదుని, ఇప్పుడు రావడం చాలా గొప్పగా భావిస్తున్నాని, పచ్చని చెట్లమధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో యూనివర్సిటీ ఉండడం విద్యార్థులకు ఎంతోమేలు చేస్తుందన్నారు. ముఖ్యంగా పీయూలో అందుబాటులో ఉన్న సింథటిక్ ట్రాక్, గ్రౌండ్స్ ఇతర సదుపాయాలను దృష్టిలో ఉంచుకొని సెట్ నిర్వహణ బాధ్యతలు అప్పగించామన్నారు. తాను పాలమూరుకు చెందిన వ్యక్తిని అయినప్పటికీ జిల్లాల మధ్య తారతమ్యాన్ని చూడనని పేర్కొన్నారు ఉన్నత విద్యామండలి అంటేనే అఫర్డబులిటీ, యాక్ససబిలిటీ, క్వాలిటీ అని, ఫిజికల్ ఎడ్యుకేషన్లో కూడా మంచి నాణ్యతా ప్రమాణాలను తీసుకొచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. దేశానికి నిజమైన ఆస్థి యువతనేనని.. నాణ్యమైన ఉన్నత విద్యను అభ్యసించిన వెంటనే ఉద్యోగ అవకాశాలు పొందేవిధంగా కోర్సుల్లో మార్పులు తీసుకొస్తున్నామని, సిలబస్లో కూడా మార్పులు ఉంటాయని పేర్కొన్నారు. సెట్ను సమర్థవంతంగా నిర్వహిస్తాం పాలమూరు యూనివర్సిటీ చరిత్రలో ఒక రాష్ట్రస్థాయి సెట్ నిర్వహణకు మొట్టమొదటిసారి అవకాశం ఇవ్వడం చాలా గొప్ప విషయమని పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. సెట్ నిర్వహణ బాధ్యతలను తమపై నమ్మకం ఉంచి అప్పగించినందుకు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. పాలమూరుపై మంచి అభిమానం ఉన్న ఆయన పీయూలో జరిగే సెట్ ఈవెంట్స్కు హాజరుకావడం గొప్ప విషయమన్నారు. ఈవెంట్స్ నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని, అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామన్నారు. గతంలో పనిచేసిన వీసీలు వసతుల కల్పనకు కృషిచేశారని, సింథటిక్ ట్రాక్, గ్రౌండ్ నిర్మించడంతో విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉందన్నారు. కార్యక్రమంలో సెట్ కన్వీనర్ దిలీప్కుమార్, పీయూ రిజిస్ట్రార్ రమేశ్బాబు, మాజీ వీసీ లక్ష్మీకాంత్రాథోడ్, ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రవీణ, ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి, పీడీ శ్రీనివాస్, భూమయ్య, అర్జున్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. టీజీహెచ్ఈసీ చైర్మన్ బాలకిష్టారెడ్డి పీయూలో 170ఎకరాల్లో ఆహ్లాదరకమైన వాతావరణం, వసతులు అందుకే టీజీపీఈసెట్ నిర్వహణ బాధ్యతలు అప్పగించాం విద్యార్థులకు అందుబాటులోకి ఉపాధి అధారిత కోర్సులు ఉత్సాహంగా ఈవెంట్స్లో పాల్గొన్న అభ్యర్థులు -
గుడిబండ.. శోకసంద్రం
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ వద్ద రోడ్డు ప్రమాదం అడ్డాకుల: బర్త్ డే సెలబ్రేషన్స్కు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం మండలంలోని గుడిబండలో మూడు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. మృతులు, క్షతగాత్రులందరూ ఒకే సామాజికవర్గానికి చెందిన అన్నదమ్ముల పిల్లలు కావడంతో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన వాస శివకుమార్ అలియాస్ కుమార్ హైదరాబాద్లో ప్రైవేట్లో కంప్యూటర్ ఆపరేటర్గా పని చేస్తున్నాడు. మంగళవారం అతడి బర్త్ డే ఉండటంతో అతనికి వరుసకు సోదరులయ్యే వాస పవన్కుమార్(25), వాస సాయితేజ (22), వాస రాఘవేంద్ర (23)తో పాటు సొంత తమ్ముడు సాయికుమార్, మూసాపేటకు చెందిన సందీప్, హైదరాబాద్కు చెందిన శివకుమార్గౌడ్ కలిసి ఉదయం కారులో హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ వద్ద ఉన్న వైజాగ్కాలనీకి వెళ్లారు. వేడుకలు జరుపుకొని అర్ధరాత్రి తిరిగి హైదరాబాద్కు వస్తుండగా రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ వద్ద ఎదురుగా వచ్చిన ప్రైవేటు బస్సు కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో వాస పవన్కుమార్, వాస సాయితేజ, వాస రాఘవేంద్ర అక్కడికక్కడే మృతిచెందగా.. కుమార్, అతడి తమ్ముడు సాయికుమార్, సందీప్, శివకుమార్గౌడ్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఒక్కగానొక్క కుమారుడు.. వాస బుర్రన్న, పద్మ దంపతులకు కుమారుడు వాస పవన్కుమార్, కుమార్తె ఉండగా. కుమార్తె వివాహం జరిగింది. పవర్కు భార్య వరలక్ష్మి, ఏడాది వయసున్న కుమార్తె ఉన్నారు. మధుమేహ వ్యాధి తీవ్రమై బుర్రన్నకు ఇటీవల కాలు తొలగించారు. పవన్ కొన్నాళ్లుగా హైదరాబాద్లో ఉంటూ భవన నిర్మాణాల వద్ద మిల్లర్ పని చేస్తూ జీవనం సాగించేవాడు. ఒక్కగానొక్క కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ పోషణ కాలు లేని తండ్రికి భారం కానుంది. పవన్ భార్య వరలక్ష్మి ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణి. కారు డ్రెవింగ్కు వెళ్లి.. వాస బాలస్వామి, గోవిందమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉండగా.. చిన్న కుమారుడు వాస సాయితేజ హైదరాబాద్లో కారు డ్రైవర్గా పని చేస్తుండేవాడు. సోదరుడు రవితేజ బెంగళూర్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. సాయితేజకు ఇంకా పెళ్లి కాలేదు. చేతికందిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆదుకుంటాడనుకుంటే.. వాస లక్ష్మయ్య, నాగమణి దంపతులకు ఇద్దరు కుమారులు ఉండగా.. పెద్ద కుమారుడు వాస రాఘవేంద్ర ప్రైవేట్లో ఎలక్ట్రీషియన్గా పని చేసేవాడు. తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తారు. హైదరాబాద్లో ఉంటున్న రాఘవేంద్రకు ఇంకా పెళ్లి కాలేదు. ఘటనపై ఎమ్మెల్యే ఆరా.. దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి స్థానిక పోలీసు అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. బాధితులకు తగిన సాయం అందించాలని సూచించారు. బాధిత కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన ముగ్గురి దుర్మరణం.. మరో నలుగురికి గాయాలు బర్త్ డే వేడుకలు ముగించుకొని వస్తుండగా ప్రమాదం -
ఎస్ఎల్బీసీ పనులపై ఎలక్ట్రో మ్యాగ్నటిక్ సర్వే
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ తవ్వకం పనులు తిరిగి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. టన్నెల్ ప్రాంతంలోని నేల స్వభావాన్ని కచ్చితంగా అంచనా వేసేందుకు ప్రత్యేక హెలికాప్టర్లతో ఎలక్ట్రో మ్యా గ్నటిక్ సర్వే చేయించాలని నిర్ణయించింది. అందుకోసం తక్కువ ఎత్తులో ఎగిరే సామర్థ్యం గల రక్షణ శాఖకు చెందిన రెండు హెలికాప్టర్లు వినియోగించనున్నారు. సర్వే పరికరాలను డెన్మార్క్ నుంచి ప్రత్యేకంగా తెప్పించనున్నారు. ఈ సర్వేపై బుధవారం నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఆ శాఖ కార్యదర్శి ప్రశాంత్ పాటిల్, సీఈ అజయ్కుమార్లు నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డైరెక్టర్ వీరేంద్ర తివారీ, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ డీజీగా పనిచేసిన హర్పాల్సింగ్, కల్నల్ పరీక్షిత్ మెహ్రాలతో విడివిడిగా భేటీ అయ్యారు. టన్నెల్ పునరుద్ధరణ, సర్వే, నిర్మాణ పనులపై వారితో చర్చించారు. సర్వే కోసం రెండు ప్రత్యేక హెలికాప్టర్లను ఇవ్వాలని కోరగా, రక్షణ శాఖ అధికారులు అంగీకరించినట్లు మంత్రి తెలిపారు. ఎలక్ట్రో మ్యాగ్నటిక్ పరికరాలతో జరిపే సర్వే భూ ఉపరితలం నుంచి ఒక కిలోమీటర్ లోతు వరకు నేల స్వభావంతో పాటు ఇతర సమాచారాన్ని అందిస్తుందని తెలిపారు. నేల స్వభావాన్ని తెలుసుకోవడం ద్వారా నిర్మాణ పనులు సులభతరం అవుతాయని పేర్కొన్నారు. జూలై 12న సర్వే మొదలై వారం రోజుల్లో పూర్తవుతుందని వెల్లడించారు. వచ్చే రెండేళ్లలో టన్నెల్ పనులను పూర్తిచేసి కృష్ణా జలాలను గ్రావిటీ ద్వారా నల్లగొండ జిల్లాకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. టన్నెల్ పనుల పూర్తికోసం కల్నల్ పరీక్షిత్ మెహ్రా డిప్యుటేషన్పై రెండేళ్లపాటు సాగునీటి శాఖలో స్పెషల్ సెక్రటరీ హోదాలో పనిచేస్తారని చెప్పారు. టన్నెల్ తవ్వకాల్లో అపార అనుభవం ఉన్న జనరల్ హర్పాల్ సింగ్ తెలంగాణ ప్రభుత్వానికి జీతం తీసుకోకుండా గౌరవ సలహాదారుగా సేవలు అందిస్తారని వివరించారు. టన్నెల్ ప్రాంతంలో నేల స్వభావాన్నికచ్చితంగా గుర్తించే ప్రయత్నం రక్షణ శాఖ హెలికాప్టర్లతో సర్వే నిర్వహిస్తాం: మంత్రి ఉత్తమ్ -
పాతికేళ్లకు వృద్ధ భారతం!
uమొదటి పేజీ తరువాయిరెట్టింపునకు మించి 34.7 కోట్లకు (జనాభాలో 20.8 శాతం) చేరుకుంటుందని అంచనా. ఇది దేశ ఆరోగ్య, ఆర్థిక, సామాజిక వ్యవస్థలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఇప్పటికే దేశంలో ఆర్థిక అభద్రత, కుటుంబపరమైన సహాయ సహకార వ్యవస్థ క్షీణత, వైద్య, ఆరోగ్య సేవల విషయంలో అసమానతల పెరుగుదల లాంటి తదితర కారణాల వల్ల వృద్ధుల సంఖ్య పెరుగుదల అనేది ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక అంశాలను ప్రభావితం చేస్తుండటం చర్చనీయాంశంగా ఉంది. భారత్ క్రమంగా వృద్ధ సమాజంగా మారనున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇది ఒక సంక్షోభంగా పరిణమించవచ్చుననే హెచ్చరికలు కూడా ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి. ఇటీవల విడుదలైన ‘ఇండియాస్ ఏజింగ్ సొసైటీ: ద ల్యాండ్ స్కేప్ టుడే’– గివ్ గ్రాంట్స్ ఇండియా’ నివేదిక’లో ఇందుకు సంబంధించిన అనేక అంశాలు వెల్లడయ్యాయి. ఇండియా ఏజింగ్ రిపోర్ట్ 2023 (యూఎన్ఎఫ్పీఏ ఇండియా, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సంయుక్త పరిశీలన), కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ, నీతి ఆయోగ్ పరిశోధనల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. 29 శాతం మందికే పెన్షన్ పెన్షన్ అందని వృద్ధుల బతుకు భారంగా మారుతోంది. ప్రస్తుతం దేశంలోని వృద్ధులలో 29% మందికే పెన్షన్ (వివిధ రూపాల్లో) లభిస్తోంది. దాదాపు 40% మంది వృద్ధులు అత్యల్ప ఆదాయ వర్గ కుటుంబాలకు చెందినవారు. వారి జీవితం.. భద్రమైన ఆదాయం, కుటుంబ మద్దతు తగ్గిపోతున్న ఈ కాలంలో మరింత కష్టతరంగా మారుతోంది. వృద్ధులపై జరిగే దౌర్జన్యాలలో 71% కేసులు మహిళలకు సంబంధించి ఉంటున్నాయి. దేశంలోని సగానికి పైగా వృద్ధులు మొబైల్ ఫోన్లు లేదా ఇంటర్నెట్ ఉపయోగించలేరు. ఇది వారిని సమాజం నుంచి పూర్తిగా వేరుచేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,000కు పైగా మాత్రమే వృద్ధుల వసతి గృహాలున్నాయి. దెబ్బతీస్తున్న దీర్ఘకాలిక వ్యాధులు... ప్రస్తుతం వృద్ధులలో..50% మందికి అధిక రక్తపోటు, 43% మందికి మధుమేహం (డయాబెటిస్) 33% మందికి అస్తమా వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. ఇవన్నీ నిత్యం వైద్య పర్యవేక్షణ అవసరమ య్యే పరిస్థితులు. కానీ దేశవ్యాప్తంగా తక్కువ సంఖ్యలో మాత్ర మే గెరియాట్రిక్ వైద్య నిపుణులున్నారు. పౌర ఆరోగ్య బీమా పథకం ద్వారా 25% వృద్ధులకు మాత్రమే బీమా లభిస్తోంది. వృద్ధులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అటల్ వయో అభ్యుదయ యోజన, జాతీయ వృద్ధుల ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం, రాష్ట్రీయ వయోశ్రీ పథకం. అయితే వీటిపై ప్రజల్లో అవగాహన లోపం, ఇవి సరిగా అమలు కాకపోవడం, గ్రామీణ ప్రాంతాలకు చేరిక తక్కువగా ఉండటం వంటి సమస్యలు ఉన్నాయి. ఏం చేయాలి? పెన్షన్ వ్యవస్థను విస్తరించాలి. అసంఘటిత రంగం వృద్ధులకు కూడా చేరుకునేలా చూడాలి. అత్యాధునిక వృద్ధుల నివాస గృహాలు స్థాపించాలి. సహాయ జీవన, ఆరోగ్య ఆధారిత సేవలు అందేలా జాగ్రత్తలు తీసుకోవాలి. జీరో టాలరెన్స్ పథకం – వృద్ధులపై దౌర్జన్యాలపై కఠినచర్యలు. డిజిటల్ సహిత వృద్ధులు – డిజిటల్ సాంకేతికతపై శిక్షణ. వృద్ధ మహిళల ప్రత్యేక పథకాల కు, ఆర్థిక స్వయం సాధన, భద్రతకు ప్రాధాన్యతనివ్వాలి. -
ఎట్టకేలకు..!
మహబూబ్నగర్ క్రీడలు: ఔత్సాహిక వాలీబాల్ క్రీ డాకారులను ప్రోత్సహించడానికి 2004లో రాష్ట్ర క్రీ డాపాధికారిక సంస్థ జిల్లాకు వాలీబాల్ అకాడమీ మంజూరు చేసింది. అకాడమీ నడిచిన నాలుగేళ్లలో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచేవారు. నిధుల నిర్వహణ భారంతో 2008లో వాలీబాల్ అకాడమీ ని మూసివేశారు.అప్పట్లో ఈ వాలీబాల్ అకాడమీ రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు సంతరించుకుంది. వా లీబాల్ అకాడమీలో శిక్షణ పొందిన జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదిగారు. మెయిన్ స్టేడియంలో ఏర్పాటు మెయిన్ స్టేడియంలో వాలీబాల్ అకాడమీని తిరిగి ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉండగా.. మూడేళ్ల కిందట పునఃప్రారంభ మైంది. రూ.19లక్షల70వేలతో వాలీబాల్ అకాడమీ ఏర్పాటు చేశారు. స్టేడియం ఆవరణలోని స్విమ్మింగ్ పూల్లోని పైఅంతస్తుల గదులను అకాడమీ క్రీడాకారుల వసతికి కేటాయించారు. గదుల ఆధునీకరణ పనులు చేపట్టి పూర్తి చేశారు. స్టేడియంలోని రెండు పాత వాలీబాల్ కోర్టులను ఆధునీకరించి వాటి స్థానంలో నూతన కోర్టులు ఏర్పాటు చేశారు. కోర్టుల చుట్టూ నాలుగు ఫ్లడ్లైట్లు, ప్రత్యేక షెడ్లు, గ్యాలరీ ఏర్పాటు చేశారు. వాలీబాల్ అకాడమీలో ప్రవేశాలు పొందే క్రీడాకారులకు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. క్రీడాకారులకు సంబంధించి కొంతమేర వసతి సౌకర్యాలు ఇప్పటికే అకాడమీకి చేరాయి. మంచాలు, టేబుల్స్, బీరువాలతోపాటు ఇతర వస్తువులు వచ్చాయి. అకాడమీలో ప్రవేశాలు పొందే బాల, బాలికలకు నిష్ణాతులైన కోచ్ల పర్యవేక్షణలో వాలీబాల్లో మెరుగైన శిక్షణ అందజేసి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచేలా క్రీడాకారులను తీర్చిదిద్దుతారు. నేడు, రేపు అకాడమీ ప్రవేశాల సెలక్షన్స్ మెయిన్ స్టేడియంలో ఏర్పాటు చేసిన నూతన వాలీబాల్ అకాడమీలో ప్రవేశాల కోసం 2022 డిసెంబర్ 1వ తేదీన రాష్ట్రంలోని బాల, బాలికలకు సెలక్షన్స్ నిర్వహించారు. అయితే సెలక్షన్స్ జరిగినప్పటికీ క్రీడాకారుల ప్రవేశాలు మాత్రం కల్పించలేదు. ఎట్టకేలకు వాలీబాల్ అకాడమీకి ముందడుగు పడింది. నేడు, రేపు రాష్ట్రస్థాయి వాలీబాల్ సెలక్షన్స్ చేపట్టనున్నారు. 14–16ఏళ్ల బాల, బాలికలు ఎంపికలకు అర్హులు. వాలీబాల్ అకాడమీకి కదలికలు నేడు, రేపు రాష్ట్రస్థాయి సెలక్షన్స్ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు సెలక్షన్స్కు అన్ని ఏర్పాట్లు చేశాం జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నేడు, రేపు జరిగే వాలీబాల్ అకాడమీ సెలక్షన్స్కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చే బాల, బాలికలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం. నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా సంబంఽధిత ధృవపత్రాలతో ఉదయం 8 గంటలకు మెయిన్ స్టేడియంలో రిపోర్టు చేయాలి. – శ్రీనివాస్, డీవైఎస్ఓ, మహబూబ్నగర్ -
కల్యాణం కమనీయం..
సైనిక్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోండి పాలమూరు: ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ను కలిశారు. ఈ సందర్భంగా నారాయణపేటలోని సైనిక్ స్కూల్ ఏర్పాటు ప్రక్రియపై చర్చించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అసమర్ధత వల్ల సైనిక్ స్కూల్ ఏర్పాటు ప్రక్రియ నిలిచిపోయిన విషయాన్ని కేంద్ర సహాయ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సాధ్యమైనంత త్వరగా సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రక్షణ శాఖ సహాయ మంత్రికి ఎంపీ డీకే అరుణ వినతి -
కాళేశ్వరం కమిషన్ విచారణ త్వరగా పూర్తి చేయాలి
మహబూబ్నగర్ న్యూటౌన్: రాష్ట్ర మంత్రులు సమష్టిగా పనిచేసి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాలలో పాల్గొనేందుకు జిల్లాకేంద్రానికి వచ్చిన ఆయన బుధవారం ఆ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడకపోతే పథకాలు పెట్టినా ప్రయోజనం లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద తప్పుల మీద తప్పులు చేసిందని ఆరోపించారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో నీళ్లు రావడం లేదన్నారు. కాళేశ్వరం కమిషన్ విచారణను త్వరితగతిన పూర్తి చేసి ప్రాజెక్టు భవితవ్యాన్ని తేల్చాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంవత్సరానికి రూ.10 వేల కోట్లు విద్యుత్ చార్జీలకు, మరో రూ.10 వేల కోట్లు అప్పులకు చెల్లించే పరిస్థితుల నుంచి బయటపడాలన్నారు. ఎక్కువ ఊహించుకొని పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును, పెండింగ్ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.ఉద్యోగ క్యాలెండర్ మాదిరి ప్రాజెక్టుల పూర్తికి క్యాలెండర్ విడుదల చేయాలని అన్నారు. వందేళ్ల పార్టీ సీపీఐ మాత్రమేనన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను చంపడం సరికాదన్నారు. సంబాల కేశవరావును చంపిన తర్వాత దేశంలోని కోట్లాది మంది ప్రజలు కేంద్ర ప్రభుత్వ చర్యను వ్యతిరేకించారన్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కేందుకు ప్రభుత్వాలు పనిచేయడం సరికాదన్నారు. మార్క్సిజం, లెనినిజం ద్వారానే పేదల బతుకుల్లో వెలుగులు.. భరత గడ్డ విముక్తి పోరులో భారత కమ్యూనిస్టు పార్టీ నడిపిన వీరోచిత కమ్యూనిస్టు ఉద్యమం చరిత్రాత్మకమని, కమ్యూనిజాన్ని అంతం చేయాలనుకుంటే కాలి బూడిదైపోతారని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సీపీఐ కార్యాలయం నుంచి తెలంగాణ చౌరస్తా, అశోక్టాకీస్ చౌరస్తా మీదుగా వందలాది మంది ప్రజలు, కార్మికులు, సీపీఐ శ్రేణులతో అల్మాస్ ఫంక్షన్ హాలు వరకు ఎర్రజెండాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అల్మాస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన శతాబ్దిఉత్సవాల సభలో కూనంనేని సాంబశివరావు మాట్లాడారు. కమ్యూనిస్టు పార్టీలో తుదిశ్వాస వరకు సొంత ఆస్తులు పంచుతూ జైలు నిర్బంధాలను, అక్రమ కేసులను లెక్కచేయకుండా ప్రాణ త్యాగాలకు సైతం వెనుకాడని నైజం కమ్యూనిస్టులేదే అన్నారు. శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని 2026 డిసెంబర్ 26న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాల్నర్సింహ, సీపీఐ జిల్లా కార్యదర్శి బాలకిషన్, ఆనంద్, పరమేశ్గౌడ్, ఉసేనయ్య, నరేందర్రెడ్డి, సురేశ్, రాము పాల్గొన్నారు. మంత్రులు సమష్టిగా పనిచేసి ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేయాలి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు -
పరిశ్రమలో అగ్ని ప్రమాదం
జడ్చర్ల: మండలంలోని పోలేపల్లి సెజ్ సమీపంలో బుధవారం ఓ పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చెట్టు కర్రలతో కాగితం అట్టలు తయారయ్యే డెక్కన్ గోల్డ్ ఇండస్ట్రీలో యంత్రాలలో సాంకేతిక సమస్యలు ఏర్పడి షార్ట్సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. ఒక్కసారిగా దట్టమైన పొగలు కమ్ముకోవడంతో చుట్టుపక్కల వారు అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే పరిశ్రమలో ముడిసరుకు అగ్నికి ఆహుతైంది. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి హాని జరుగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఈ విషయమై పరిశ్రమ నిర్వాహకులు ఎలాంటి వివరాలు వెళ్లడించలేదు. బావిలో జారిపడి వ్యక్తి మృతి అమరచింత: ప్రమావశాత్తు వ్యవసాయ బావిలో జారిపడి పట్టణానికి చెందిన బిందే కురుమన్న(45) మృతిచెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. కురుమన్న జములమ్మ ఆలయం సమీపంలో ఉన్న తన వ్యవసాయ పొలానికి వెళ్లాడు. బావిలో నీటిని తీసుకోచ్చేందుకు వెళ్లి కాలుజారి బావిలో పడి మృతిచెందాడు. పొలానికి వెళ్లిన కురుమన్న ఇంటికి రాకపోవడంతో పొలం, బావివద్ద గాలించగా.. బావిలో మృతదేహం కనిపించడంతో బయటకు తీశారు. మృతుడికి భార్య శంకరమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
విద్యాబోధనపై నిరంతర శోధన చేయాలి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యాబోధనపై నిరంతరం పరిశోధనలు చేయాలని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు పీయూలో మారిన నూతన విద్యావిధానం రీసెర్చ్ మెథడ్స్పై విద్యాకళాశాల అధ్యాపకులు ఏర్పాటు చేసిన వర్క్షాప్నకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆవిష్కరణలతో విద్యార్థులకు సులువైన పద్ధతుల్లో బోధించేందుకు అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా విద్యార్థుల్లో పరిశోధన ధృక్పథాన్ని పెంపొందించడంతో ఆలోచనా ధోరణి మారుతుందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేసేందుకు అధ్యాపకులు పాటుపాలని, బోధనలో సమర్థవంతమైన నైతిక విద్యను అందిచేందుకు కృషిచేయాలని పేర్కొన్నారు. పీయూ వీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. పరిశోధన కార్యక్రమాలతో విద్యాప్రమాణాలను గణనీయంగా పెంచుతుందని, వర్క్షాప్ల నిర్వహణతో అధ్యాపకులు, గణాంకసాధనాలు, డాటా విశ్లేషణ, విద్యారచణ వంటి అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెరుతుందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేశ్బాబు, ఐక్యూఏసీ డైరెక్టర్ మధుసూదన్రెడ్డి, ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, ప్రిన్సిపాల్ కరుణాకర్రెడ్డి, ఆంజనేయులు, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి -
ఇథనాల్ కంపెనీని రద్దు చేయాలి
పాలమూరు: పెద్ద ధన్వాడ వద్ద చేపడుతున్న ఇథనాల్ కంపెనీని రద్దు చేయాలని, ఇకపై తెలంగాణలో ఇథనాల్ కంపెనీల ఏర్పాటు మానుకోవాలని పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ రాఘవాచారి ఒక ప్రకటనలో తెలిపారు. రైతుల జీవితాలతో చెలగాటం ఆడేవిధంగా ఇథనాల్ కంపెనీలు ఏర్పాటు చేస్తామని, ఆందోళనకారులపై చర్యలు తీసుకుంటామని బెదిరింపు గొంతుతో మంత్రి శ్రీధర్బాబు మాట్లాడటం సరికాదని.. ఆయన వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలకు ముందు ఇథనాల్ కంపెనీల పాలసీపై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సమీక్ష చేస్తామని చెప్పి ఇప్పుడు ప్రజలు కన్పించడం లేదా అని ప్రశ్నించారు. నిర్మల్ జిల్లాలో రద్దు చేసినట్లు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎందుకు రద్దు చేయడంలేదనే విషయంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. 12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నా జిల్లాను కాలుష్యం నుంచి రక్షించడం లేదన్నారు. సెట్విన్ ఆధ్వర్యంలో ఫైనల్ పరీక్షలు మహబూబ్నగర్ మున్సిపాలిటీ: స్థానిక బీకేరెడ్డి కాలనీలోని ‘నవరత్నాలు’ శిక్షణ కేంద్రంలో బుధవారం సెట్విన్ ఆధ్వర్యంలో ఫైనల్ పరీక్షలు నిర్వహించారు. ఇక్కడ మూడు నెలలపాటు కంప్యూటర్, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం వర్క్ కోర్సులలో శిక్షణ పొందిన రెండో బ్యాచ్కు చెందిన 247 మంది మహిళా అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలను సెట్విన్ హైదరాబాద్ కో–ఆర్డినేటర్ సత్యనారాయణరెడ్డి, మహబూబ్నగర్ డీవైఎస్ఓ శ్రీనివాస్ తనిఖీ చేశారు. ఆయా కోర్సులలో ఉదయం థియరీ, మధ్యాహ్నం ప్రాక్టికల్స్ ప్రశాంతంగా జరిగాయి. ఇక డీవైఎస్ఓ సూపరింటెండెంట్ రవీందర్రెడ్డి, సెట్విన్ నిర్వాహకులు విజయకుమార్, ఎగ్జామినర్లు పి.వనజ, అజ్మత్ ఉన్సీస, తన్వీర్సుల్తాన్ పర్యవేక్షించారు. కాగా, కొత్తగా మూడో బ్యాచ్ ఈనెల 18 నుంచి ప్రారంభమవుతుందని ‘మహబూబ్నగర్ ఫస్ట్ – నవరత్నాలు’ పర్యవేక్షకులు గుండా మనోహర్ తెలిపారు. ఇప్పటివరకు సుమారు 550 మంది అభ్యర్థులు శిక్షణ పొందారని వివరించారు. ● పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి -
జిల్లాకే ‘ఆదర్శం’ వెన్నాచేడ్ స్కూల్
గండేడ్: పేరులోనే కాదు ఫలితాల్లో కూడా ఆదర్శంగా నిలుస్తోంది జిల్లాలో ఏకై న ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్). మారుమూల గ్రామంలో ఉన్నప్పటికీ ఈ పాఠశాలలో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. గండేడ్ మండలం వెన్నాచేడ్లో ఉన్న ఈ పాఠశాలను 2013లో అప్పటి హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. మోడల్ మంజూరైనప్పటికీ ప్రభుత్వ భూమి లేకపోవడంతో వెన్నాచేడ్లో పూర్వవిద్యార్థుల సమ్మేళనం ద్వారా వచ్చిన డబ్బు, గ్రామస్తుల సహకారంతో ఐదు ఎకరాల భూమిని సమకూర్చి.. పక్కా భనన నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు బోధన సాగుతోంది. 2016లో పదో తరగతి మొదటి బ్యాచ్ పదో తరగతి పరీక్షలు రాశారు. 64 మంది పరీక్ష రాయగా.. వందశాతం ఉత్తీర్ణత సాధించారు. 2017లో 93 శాతం 2019లో 98 శాతం ఉత్తీర్ణత సాధించింది. మిగతా అన్ని విద్యా సంవత్సరాల్లో 2025 వరకు వందశాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. ఈ ఏడాది 91 మంది పదోతరగతి పరీక్షలు రాయగా.. అందరూ ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్మీడియట్లోనూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలలో 483 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇంటర్లో 110 మంది ఉన్నారు. ప్రతి ఏటా వందశాతం ఉత్తీర్ణత -
బడికి పోదాం.. చలో
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: వేసవి సెలవుల్లో ఆడిపాడిన పిల్లలు గురువారం నుంచి బడిబాట పట్టనున్నారు. నెలన్నర రోజులుగా మూతబడిన పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు సర్కారు బడుల్లో అడ్మిషన్లు భర్తీ చేసేందుకు పది రోజులుగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే 3,360 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. కాగా.. విద్యార్థులకు మొదటి రోజే పాఠ్యపుస్తకాలు, నోట్బుక్కులు, యూనిఫాం పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేశారు. తరగతి గదులను శుభ్రం చేసి.. పాఠశాల అందంగా అలకరించాలని, అడ్మిషన్ల కోసం వచ్చే విద్యార్థులకు గతంలో పాఠశాల విద్యార్థులు సాధించిన విజయాలు, మార్కులతో బ్యానర్లు ఏర్పాటు చేయాలని విద్యాశాఖ అధికారులు ఆయా పాఠశాలల హెచ్ఎంను ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా 820 పాఠశాలలు ఉండగా.. అందులో 50 జీరో–టచ్ ఎన్రోల్మెంట్ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో కూడా అడ్మిషన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ● ఇప్పటి వరకు పార్ట్–1 పాఠ్య పుస్తకాలు 4,39,060 రావాల్సి ఉండగా 4,30,260 ప్రభుత్వం పంపిణీ చేసింది. ఎన్విరార్మెంటల్ సైన్స్కు సంబంధించి 2 టైటిల్స్ పెండింగ్లో ఉన్నాయి. హైస్కూల్ విద్యార్థులకు సంబంధించి నోటు పుస్తకాలు 1.40 లక్షలు రావాల్సి ఉండగా 1.10 లక్షలను ఆయా పాఠశాలలకు అందజేశారు. 66 వేల యూనిఫాంలు కుట్టేందుకు మహిళా సంఘాలకు అప్పజెప్పగా.. కుట్టే ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చింది. ఆటాపాటలకు బైబై జిల్లాలో నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం మొదటి రోజే విద్యార్థులకు యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ అందజేత సర్కారు బడుల్లో అడ్మిషన్లు పెంచేందుకు ఇంటింటి ప్రచారం బడిబాట ద్వారా 3,360 మంది చేరిక జిల్లాలో 50 పాఠశాలల్లో ఏఐ తరగతుల బోధన -
14న జాతీయ లోక్ అదాలత్
పాలమూరు: ఈనెల 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ అధిక సంఖ్యలో పెండింగ్ కేసులు రాజీ అయ్యే విధంగా ప్రతి ఒక్క విభాగం బాధ్యత తీసుకోవాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి అన్నారు. జిల్లా కోర్టులో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన లోక్ అదాలత్లో 17,431 కేసులు రాజీ చేశామని, ఈనెల 14న నిర్వహించనున్న లోక్ అదాలత్ అంతా కంటే ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ చేసే విధంగా కృషి చేస్తామన్నారు. ఇప్పటికే ఇన్సూరెన్స్ కంపెనీలు, పోలీస్శాఖ, బ్యాంకు నిర్వహకులతో సమావేశాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్స్ పరిధిలో పెండింగ్లో ఉన్న కేసులకు సంబంధించిన కక్షిదారులు కోర్టుకు హాజరయ్యే విధంగా చూడాలన్నారు. ఇప్పటికే చెక్ బౌన్స్పై వారం రోజుల పాటు ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించి కేసులు రాజీ చేయనున్నట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించి.. రాజీ చేసుకోవడానికి అవకాశం ఉన్న ప్రతి కేసులో కక్షిదారులు హాజరుకావాలని సూచించారు. 14న నిర్వహించే లోక్ అదాలత్లో భాగంగా మహబూబ్నగర్ కోర్టులో ఆరు బెంచీలు, జడ్చర్లలో రెండు బెంచీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే 3,010 కేసులలో ఉన్న కక్షిదారులకు నోటీసులు జారీ చేశామన్నారు. లోక్ అదాలత్లో కేసు దాఖలు చేసిన సందర్భంలో కోర్టు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. గతంలో కోర్టుకు చెల్లించిన ఫీజు సైతం తిరిగి చెల్లించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఇన్చార్జి కార్యదర్శి ఈశ్వరయ్య, తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో 8 బెంచీలు ఏర్పాటు ఇప్పటికే 3వేల కేసుల్లో కక్షిదారులకు నోటీసులు జారీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి -
పశుసంవర్ధక శాఖ మంత్రిగా వాకిటి
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రాష్ట్రంలో రెండో దఫా చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి పాలమూరులోని మక్తల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి చోటు దక్కిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన ఈ నెల 8న మరో ఇద్దరు మంత్రులతో కలిసి రాజ్భవన్లో ప్రమాణస్వీకారం చేశారు. అయితే రెండు రోజులుగా ఆయనకు ఏ శాఖలు కేటాయిస్తారనే అంశంపై ఉమ్మడి జిల్లాలో నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. బుధవారం రాత్రి శాఖల కేటాయింపు ప్రక్రియ పూర్తి కాగా.. వాకిటి శ్రీహరికి రాష్ట్ర పశుసంవర్ధకశాఖ, పాడి అభివృద్ధి, మత్స్యశాఖ, క్రీడలు, యువజన సర్వీసుల శాఖలు దక్కాయి. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మక్తల్ నుంచి మూడో వ్యక్తి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి హయాంలో తొలిసారిగా నారాయణపేటకు చెందిన రాంచందర్ కల్యాణి మార్కెటింగ్శాఖ మంత్రిగా పనిచేశారు. 1994లో టీడీపీ నుంచి మక్తల్ ఎమ్మెల్యేగా ఎల్లారెడ్డి గెలుపొందగా.. ఆయనకు 1997లో మార్కెటింగ్ శాఖ మంత్రి పదవి దక్కింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం మూడో పర్యాయం 2023లో జరిగిన ఎన్నికల్లో మక్తల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి ఈ నెల 8న మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ లెక్కన మక్తల్ నుంచి ముగ్గురికి మంత్రి పదవులు దక్కినట్లయింది. పాడి అభివృద్ధి, మత్స్య, క్రీడలు,యువజన సర్వీసుల శాఖలు కూడా.. మక్తల్కు మూడుసార్లు దక్కిన అమాత్యగిరి -
పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అన్నిశాఖలు సమన్వయంతో పనిచేసి.. ఔత్సాహికులను ప్రోత్సహించాలని అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో నిర్వహించిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమలశాఖ, మున్సిపల్, బీసీ, ఎస్సీ కార్పొరేషన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు భాగస్వామ్యంతో విరివిగా పరిశ్రమలు ఏర్పాటుచేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి.. నిబంధనల మేరకు అనుమతులు మంజూరు చేయాలని సూచించారు. గ్రీన్ ఇండస్ట్రీయల్ సెజ్, పోలేపల్లి సెజ్లో వీధిలైట్ల ఏర్పాటు, రోడ్డు మరమ్మతు పనులను జూలైలోగా పూర్తిచేయాలని టీజీఐఐసీ అధికారులను ఆదేశించారు. అనంతరం టీ ఫ్రైడ్ ద్వారా షెడ్యూల్డ్ కులాలు, తెగల వారికి వాహనాల మంజూరుకు కమిటీలో ఆమోదం తెలిపారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ వెంకట్రెడ్డి, జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ పి.ప్రతాప్, ఎల్డీఎం భాస్కర్, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ కె.నాగరాజు, డిప్యూటీ డైరెక్టర్ గణేశ్ ఉన్నారు. రైల్వే స్టేషన్లో నేస్తం ఫిర్యాదు కార్యక్రమం స్టేషన్ మహబూబ్నగర్: జిల్లాకేంద్రంలోని రైల్వే స్టేషన్లో బుధవారం నేస్తం ఫిర్యాదు పరిష్కార కార్యక్రమాన్ని చేపట్టారు. సీనియర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ ఆనంద్కట్టా, ఐఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నేస్తం కార్యక్రమం ద్వారా ఉద్యోగులు వ్యక్తిగతంగా శాఖ అధికారులను కలిసి తమ సేవా సంబంధిత సమస్యలు, ఫిర్యాదులను నేరుగా తెలియజేసే అవకాశాన్ని పొందుతారని అధికారులు తెలిపారు. సమస్యను బట్టి వాటిని తక్షణం, వారం, 15 లేదా 30 రోజుల్లో పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. వేగవంతమైన సమస్యల పరిష్కారం, సానుకూలమైన పని వాతావరణం కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని అన్నారు. 26న జిల్లాస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో ఈనెల 26వ తేదీన జిల్లాస్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. స్పోర్ట్స్ స్కూళ్లలో 4 తరగతిలో ప్రవేశాల కోసం జిల్లాస్థాయి ఎంపికలు జరగనున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులకు ఎత్తు, బరువు, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్, వర్టికల్ జంప్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, మెడిసన్ బాల్త్రో, 30 మీటర్ల ఫ్లైయింగ్, 6x10 మీటర్ల షటిల్ రన్, 800 మీటర్ల రన్నింగ్ అంశాల్లో పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. 4వ తరగతిలో ప్రవేశాల కోసం 8–9 సంవత్సరాలు 01.09.2016 నుంచి 31.08.2017 మధ్య జన్మించిన వారు ఎంపికలకు అర్హులని తెలిపారు. జిల్లా స్థాయి ఎంపికలకు హాజరయ్యే విద్యార్థులు పాఠశాల, మున్సిపాలిటీ, ఎంఆర్ఓ జారీచేసిన జనన ధ్రువీకరణ పత్రం, 10 పాస్పోర్టు సైజ్ ఫొటోలు, 3వ తరగతి ప్రొగ్రెస్ రిపోర్ట్, కమ్యూనిటీ సర్టిఫికెట్, ప్రస్తుత స్టడీ సర్టిఫికెట్, ఆధార్కార్డుతో ఉదయం 8 గంటలకు రిపోర్టు చేయాలని కోరారు. పైన పేర్కొన్న ధ్రువపత్రాల్లో ఏది లేకున్నా ఎంపికలకు అనుమతించమని తెలిపారు. రాష్ట్రస్థాయి ఎంపికలు జూలైలో ఉంటాయని, మిగతా వివరాల కోసం 94406 56162 నంబర్ను సంప్రదించాలని ఆయన సూచించారు. -
మొదటి రోజు పండగలా ఉండేది..
నేను మలక్పేట నెహ్రూ మెమోరియల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. కాలనీలో స్కూల్స్లో ఉండడం వల్ల పాఠశాలకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉండేది కాదు. సెలవుల తర్వాత మొదటి రోజు పాఠశాలకు వెళ్లాలి అంటే ఒక పండగా ఫీల్ అయ్యే వాళ్లం. బడి ప్రారంభం రోజు కొత్త టీచర్ ఎవరు వస్తారని ఆలోచించేవాళ్లం. పుస్తకాలు, నోటు బుక్కులు కొనుక్కోవడం ఉత్సాహంగా ఉండేది. – ప్రవీణ్కుమార్, డీఈఓ చాలా సంతోషంగా వెళ్లే వాళ్లం ఎండకాలం సెలవులు ముగిసిన తర్వాత తొలిరోజు సంతోషంగా స్కూల్కు వెళ్లేవాళ్లం. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని గుండుగుండ్లపాలెం మా సొంతూరు. మా ఊరి నుంచి పాలకవీడులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నా. మా ఊరి నుంచి స్కూల్కు మూడు కిలోమీటర్ల దూరం ఉండేది. ప్రతిరోజూ స్నేహితులతో కలిసి నడిచి వెళ్లే వాళ్లం. ఆ రోజులు గుర్తు చేసుకుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. స్కూల్ నాటి జ్ఞాపకాలు జీవితంలో మరిచిపోలేని తీపి గుర్తులు. – వెంకట్రెడ్డి, జెడ్పీ సీఈఓ ● -
బావిలో పడి మహిళ మృతి
బల్మూర్: బావిలో పడి ఓ మహిళ మృతిచెందిన ఘటన మండలంలోని బాణాలలో మంగళవారం వెలుగు చూసింది. ఎస్ఐ రాజేందర్, గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఇమ్మడి చిన్నమ్మ (45) మతిస్థిమితం కోల్పోయి తిరుగుతుండేది. రెండ్రోజులుగా కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు వెదుగుతుండగా సోమవారం రాత్రి గ్రామ సమీపంలోని ఓ పాడుబడ్డ వ్యవసాయ బావిలో మృతదేహం కనిపించింది. ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడి ఉంటుందని కుటుంబసభ్యులు తెలిపారు. కుమారుడు అర్జున్ ఫిర్యాదు మేరకు కేసు మంగళవారం నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ వివరించారు. ఉరేసుకుని వ్యక్తి మృతి గోపాల్పేట: వ్యక్తి ఉరేసుకుని మృతి చెందిన ఘటన ఏదుల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. గోపాల్పేట ఎస్ఐ నరేష్ కుమార్ తెలిపిన వివరాల మేరకు.. గుణమోని రేణుక, గుణమోని రాములు(40) భార్యాభర్తలు. మంగళవారం ఉదయం డబ్బుల విషయంలో ఇద్దరు గొడవపడ్డారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన రాములు పొలానికి వెళ్లి చెట్టుకు ఉరేసుకున్నాడు. కుటుంబసభ్యులు గమనించేలోపు మరణించడంతో చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. విద్యుదాఘాతంతో కార్మికుడు మృతి జడ్చర్ల: విద్యుదాఘాతానికి గురై ఓ కార్మికుడు మృతి చెందిన ఘటన మంగళవారం మండలంలోని గోప్లాపూర్లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కావేరమ్మపేటకు చెందిన వెంకటేశ్ యాదవ్ (45) టైల్స్ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. మంగళవారం గోప్లాపూర్లో నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో టైల్స్ పనులు ముగించుకొని ఇంటికి బయలుదేరేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో టైల్స్ వేసేందుకు వినియోగించిన యంత్రం వైర్ను ప్లగ్ తీయకుండా చుడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని జడ్చర్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. వెంకటేశ్ యాదవ్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. వివాహిత బలవన్మరణం లింగాల: ఆర్థిక ఇబ్బందులతో వివాహిత వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్ఐ వెంకటేష్గౌడ్ కథనం మేరకు.. మండలంలోని చెన్నంపల్లికి చెందిన వల్లెపు సుజాత (43) మండల కేంద్రం సమీపంలోని అప్పాయపల్లికి వెళ్లే మార్గంలో ఉన్న పెద్దవాగులో శవమై కనిపించింది. ఈ నెల 7న ఇంటి నుంచి వెళ్లిపోయిందని.. పెద్దవాగులో మృతదేహాన్ని గుర్తించిన రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె భర్త సలేశ్వరం పదేళ్ల కిందటే చనిపోగా.. అప్పులు చేసి పెద్దకుమార్తె పెళ్లి చేసిందని, పెళ్లికి చేసిన అప్పు ఎలా తీర్చాలి, రెండో కుమార్తె పెళ్లి ఎలా చేయాలనే బెంగతో ఆత్మహత్య చేసుకొని ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. కుమారుడు వెంకటేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య కొత్తకోట రూరల్: భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని అప్పరాలలో చోటు చేసుకుంది. ఎస్ఐ ఆనంద్ కథనం మేరకు.. మండలంలోని పాలెం గ్రామానికి చెందిన సువర్ణకు అప్పరాలకు చెందిన సందెపాగ రవితో 22 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి కుమార్తె, కుమారుడు ఉండగా.. ఇటీవల కుమార్తె వివా హం చేశారు. గత కొన్నేళ్లుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండగా ఓమారు సువర్ణ తల్లిగారింటికి వెళ్లింది. పెద్దమనుషులు ఆనంద్ను మందలించి సువర్ణను పంపించారు. ఈ నెల 8న గొడవ పడగా పురుగుమందు తాగింది. గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే వనపర్తి ఏరియా ఆసుపత్రికి, అటు నుంచి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అ క్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందింది. అన్న మూలింటి రాములు ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి శాంతినగర్ : తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ కొడుకు మృతి చెందిన ఘటన స్థానిక రాఘవేంద్ర కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ నాగశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. శాంతినగర్ రాఘవేంద్ర కాలనీలో ఉండే అమర్నాథ్ (53) తండ్రి గత నెలలో మరణించాడు. తండ్రి మరణాన్ని తట్టుకోలేక అమర్నాథ్ గత నెల 29న రాత్రి పొలం వద్ద గడ్డి మందు తాగి కూతురుకు ఫోన్చేసి విషయాన్ని చెప్పాడు. హుటాహుటిన పొలం వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు బాధితడిని చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
కొమ్మినేని అరెస్టు అప్రజాస్వామికం
నాగర్కర్నూల్: సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుపై ఏపీ ప్రభుత్వం అక్రమంగా కేసు పెట్టి జైలుకు తరలించడం అప్రజాస్వామికమైన చర్య అని పలువురు సీనియర్ జర్నలిస్టులు అన్నారు. మంగళవారం నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నల్లబ్యాడ్జీలు, ఫ్లకార్డులతో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమని చెప్పారు. జర్నలిజంలో 50 ఏళ్ల అపార అనుభవం ఉన్న కొమ్మినేనిని అన్యాయంగా అరెస్ట్ చేసి జైలులో పెట్టారని మండిపడ్డారు. టీవీ డిబేట్లో మాట్లాడే విశ్లేషకుల వ్యాఖ్యలను జర్నలిస్టులకు, మీడియా సంస్థలకు ఆపాదించడం ఏమిటని ప్రశ్నించారు. పాత్రికేసులపై ఏదైనా చర్యలు తీసుకునేందుకు చట్టబద్ధ సంస్థలు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంటుందని, అక్రమ కేసులతో జైలులో పెట్టడం దుర్మార్గమైన చర్య అని ఆక్షేపించారు. రాజకీయ కక్షలో భాగంగానే జర్నలిస్టులపై కేసులు, అరెస్ట్లకు పాల్పడుతూ పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో జర్నలిస్టులు పాదం వెంకటేశ్, కందికొండ మోహన్, బాదం పరమేశ్, కాణాపురం ప్రదీప్, శ్రీనుబాబు, మల్లేశ్, రామ్లక్ష్మణ్, వినయ్, శ్రీశైలం, సాధిక్ పాషా, పిన్నంశెట్టి సైదులు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వ తీరుపై నాగర్కర్నూల్లో జర్నలిస్టుల నిరసన -
కోనేరులో దూకి వ్యక్తి బలవన్మరణం
మాగనూర్: భార్యతో గొడవపడిన ఓ వ్యక్తి క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి ఏఎస్ఐ మన్నన్ కథనం ప్రకారం.. మాగనూర్కు చెందిన వాకిటి పరశురాం(39) అదే గ్రామానికి చెందిన ముత్యమ్మతో 13 ఏళ్ల క్రితం వివాహం కాగా.. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో పరశురాం తాగుడుకు బానిసై భార్యను వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి 10 గంటల సమయంలో తాగిన మైకంలో భార్యతో గొడవపడి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత కుటుంబ సభ్యులు అతడి కోసం వెతకగా ఎక్కడా కనిపించకపోవడంతో మంగళవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే స్థానిక లక్ష్మీనర్సింహస్వామి ఆలయ కోనేరులో పరశురాం మృతదేహం గుర్తించారు. ఈ మేరకు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పరశురాం భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పూర్తిస్థాయిలో ఏర్పాట్లు
ఈవెంట్స్కు హాజరయ్యే విద్యార్థులు తప్పకుండా బాలురు 100 మీటర్లు, 800 మీటర్లు రన్నింగ్, షార్ట్పుట్ 6 కేజీలు, లాంగ్జంప్ లేదా హైజంప్లో పాల్గొనాల్సి ఉంది. ఇక బాలికలకు సంబంధించి 100 మీటర్లు, 400 మీటర్లు, షార్ట్పుట్ 4 కే జీలు లాంగ్జంప్ లేదా హైజంప్లో పాల్గొనాలి. వీటికి సంబంధించి ఏర్పాట్లను ఇటీవల నిర్మించిన సింథటిక్ గ్రౌండ్లో ఏర్పాటు చేశారు. ఇక ఆప్షన్ కింద విద్యార్థులు ఎంచుకునేందుకు ఉన్న గేమ్స్లో మొత్తం 11కోట్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో కబడ్డీ 5 కోట్లు, వాలీబాల్ 3, లాన్ టెన్నీస్ 1, ఖోఖో 3, బాస్కెట్బాల్ 1, బ్యాట్మెంటన్ 3, బాల్ బ్యాట్మెంటన్ 1, హ్యాండ్బాల్ 1, హాకీ 1, ఫుట్బాల్ 1, క్రికెట్లు 2 నెట్లను ఏర్పాటు చేశారు. మొదటిరోజు ఈవెంట్స్కు 760 మంది విద్యార్థులు హాజరుకాన్నునారు. -
నల్లమల అభయారణ్యంలో చిరుత
మన్ననూర్: నల్లమలలోని అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యంలో సఫారీ ప్రయాణికులకు మంగళవారం చిరుత పులి కనిపించింది. నిజాం బంగ్లా (సికార్ఘర్) సమీపంలోని కొత్త రోడ్డు నుంచి చిరుత నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లడాన్ని సఫారీ వాహనం డ్రైవర్ గమనించి పర్యాటకులకు తెలియజేశారు. దీంతో సెల్ఫోన్లలో చిరుతను చిత్రీకరించుకున్నారు. అభయారణ్యంలో అతి సమీపంగా చిరుత పులి కనించడంతో సఫారీ పర్యాటకులు ఆనందం వ్యక్తం చేశారు. సంజీవగుట్టపై చిరుత సంచారం మరికల్: మండలంలోని పూసల్పహాడ్ శివారు సంజీవ గుట్టపై మంగళవారం చిరుత సంచరించింది. దీంతో అటు వైపు రైతులు, గ్రామస్తులు వెళ్లాలంటనే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సంజీవ గుట్టపై గత ఐదేళ్ల నుంచి చిరుత సంచరించడంతో పశువులను బలి తీసుకుందని రైతులు తెలిపారు. అటవీశాఖ అధికారులు స్పందించి చిరుతను బందించాలని కోరుతున్నారు. -
ఎండీసీఏ మైదానాన్ని అభివృద్ధి చేస్తాం
మహబూబ్నగర్ క్రీడలు: ఎండీసీఏ మైదానాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హెచ్సీఏ జాయింట్ సెక్రటరీ బస్వరాజు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎండీసీఏ మైదానంలో ఇటీవల నిర్వహించిన ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ లీగ్లో విజేతలుగా నిలిచిన జట్లకు ట్రోఫీలతో పాటు వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న బస్వరాజు మాట్లాడుతూ మహబూబ్నగర్లో పెద్ద క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. హెచ్సీఏకు హైదరాబాద్ తర్వాత తెలంగాణలో మహబూబ్నగర్, నిజామాబాద్లో క్రికెట్ మైదానాలు ఉన్నట్లు తెలిపారు. మహిళలు క్రికెట్లో పాల్గొంటుండడం సంతోషంగా ఉందన్నారు. క్రికెట్లో ప్రతిభ కనబరిచే మహిళలకు రైల్వేస్ ఉద్యోగవకాశాలు లభిస్తాయన్నారు. చదువుతో పాటు క్రికెట్ ఆడాలని కోరారు. ఇక్కడి మైదానంలో బీసీసీఐ మహిళ మ్యాచ్ పెడుతామని అన్నారు. జిల్లాలో రెండు క్రికెట్ అకాడమీలు లేదా 10 ఎకరాల్లో మరో క్రికెట్ స్టేడియం ఉండాలన్నారు. మహబూబ్నగర్ జిల్లాకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అపెక్స్ సమావేశంలో కూడా చర్చించినట్లు తెలిపారు. ఈ మైదానాన్ని అభివృద్ధి చేయడం తమవంతు బాధ్యత అని అన్నారు. ఈ మైదానంలో బీసీసీఐ, త్రీడే, టూడే లీగ్ మ్యాచ్లు జరిపిస్తామని అన్నారు. బీపీఎల్ కింద ఉన్న వారికి ఉచిత క్రికెట్ శిక్షణ అందజేస్తామన్నారు. హెచ్సీఏ ఉపాధ్యక్షుడు దల్జిత్సింగ్ మాట్లాడుతూ మైదనాంలో అండర్–16 మ్యాచ్ నిర్వహిస్తామని అన్నారు. క్రికెట్లో క్రీడాకారులు ప్రతిభ కనబరచాలని కోరారు. ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్లో మొదటిసారిగా ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ లీగ్లు నిర్వహించడం సంతోషంగా ఉందని, వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ఆరు ప్రాంతాల్లో అండర్–23 టూడే లీగ్, 19తో పాటు మహబూబ్నగర్లో ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ లీగ్లను విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. నిరుపేద క్రీడాకారులను గుర్తించి వారికి ఎండీసీఏ తరపున విద్యతోపాటు క్రికెట్లో కోచింగ్ అందజేస్తామని చెప్పారు. అనంతరం అండర్–23, అండర్–19 విభాగాల విన్నర్ జట్లు మహబూబ్నగర్, ఉమెన్స్ క్రికెట్ లీగ్ రెడ్ జట్లకు ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో ఎండీసీఏ చీఫ్ ప్యాట్రన్ మనోహర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, ఉపాధ్యక్షులు సురేష్కుమార్, వెంకటరామారావు, హెచ్సీఏ సభ్యులు శంకర్, కోచ్లు గోపాలకృష్ణ, అబ్దుల్లా, మన్నాన్, సీనియర్ క్రీడాకారులు ముఖ్తార్, ఆబెద్ హుస్సేన్, మహేష్, రంజిత్కుమార్, శంకర్ పాల్గొన్నారు. హెచ్సీఏ జాయింట్ సెక్రటరీ బస్వరాజు ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్ విన్నర్ జట్లకు ట్రోఫీలు ప్రదానం ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్లో ఉత్తమ ప్రతిభ క్రీడాకారులు అండర్–23 విభాగంలో ఉత్తమ బ్యాట్స్మెన్ కేతన్కుమార్–జడ్చర్ల (473 పరుగులు), ఉత్తమ బౌలర్ ముఖితుద్దీన్–మహబూబ్నగర్ (33 వికెట్లు), అండర్–19లో ఉత్తమ బ్యాట్స్మెన్ అబ్దుల్ రాఫే–మహబూబ్నగర్ (495 పరుగులు), ఉత్తమ బౌలర్ జశ్వంత్–నాగర్కర్నూల్ (11 వికెట్లు), ఉమెన్స్ లీగ్లో ఉత్తమ బౌలర్ దివ్యరాథోడ్ (7 వికెట్లు), ఉత్తమ ఆల్రౌండర్ అనిత (59 పరుగులు, 4 వికెట్లు). -
టీజీపీఈసెట్కు సర్వం సిద్ధం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: రాష్ట్ర వ్యాప్తంగా డీపెడ్, డీఎడ్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న టీజీపీఈసెట్–2025 అర్హత పరీక్షకు సర్వం సిద్ధమైంది. బుధవారం నుంచి మూడు రోజుల పాటు పాలమూరు యూనివర్సిటీలో పరీక్షకు సంబంధించిన ఈవెంట్స్ నిర్వహించేందుకు సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నిజిల్లాల నుంచి మొత్తం 2, 561 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఈవెంట్స్ను బుధవారం ఉదయం 11గంటలకు రాష్ట్ర హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి ప్రారంభించనున్నారు. ఉదయం అర్హత పరీక్షకు హాజరుకానున్న విద్యార్థులు రాత్రి పీయూకు చేరుకోనున్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. బాలుర, బాలికలకు వేర్వేరు హాస్టల్స్లో వసతి ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను మంగళవారం పీయూ వీసీ శ్రీనివాస్, కన్వీనర్ దిలీప్ పీయూలోని సింథటిక్ ట్రాక్, పీజీ కళాశాల గ్రౌండ్, ఇండోర్ స్టేడియం పరిశీలించారు. పకడ్బందీగా ఏర్పాట్లు టీజీపీఈసెట్ పరీక్ష నిర్వహణకు అన్నిఏర్పాట్లు పూర్తి చేశాం. ఈవెంట్స్ నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పీయూలో అథ్లెటిక్స్కి సింథటిక్స్ ట్రాక్ గ్రౌండ్, సాధారణ క్రీడలకు పీజీ కళాశాల గ్రౌండ్లో 11 కోట్లను ఏర్పాటు చేశాం. ఇతర జిల్లాల నుంచి వచ్చే అభ్యర్థులకు రాత్రికి ఉండేందుకు వివిధ హాస్టల్స్లో వసతి కల్పించాం. ఇప్పటికే హాల్టికెట్లను అభ్యర్థులకు జారీ చేశాం. అందులో సూచించిన తేదీలు, సమయం ఆధారంగా ఈవెంట్స్కు విద్యార్థులు రావాలి. – దిలీప్, టీజీపీఈసెట్ కన్వీనర్ నేటినుంచి పీయూలో పరీక్ష ఈవెంట్స్ నిర్వహణ రాష్ట్ర వ్యాప్తంగా హాజరుకానున్న 2, 561 మంది విద్యార్థులు ప్రారంభించనున్న హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి పీయూలో ఏర్పాట్లను పరిశీలించినవీసీ శ్రీనివాస్, సెట్ కన్వీనర్ దిలీప్ -
వేధింపులు సరికాదు..
సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు అప్రజాస్వామికం. రాజకీయ పార్టీలు జర్నలిస్టుల పట్ల కక్ష్య పూరితంగా వ్యవహరించవద్దు. పార్టీలు ఐదేళ్ల పాలన కోసం వచ్చి జర్నలిస్టులను వేధించడం సరికాదు. రెడ్బుక్ రాజ్యాంగం అభివృద్ధికి ఆటంకంగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాల అమలు నుంచి తప్పించుకొని ప్రజల దృష్టిని మరల్చేందుకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న కుటిల యత్నాలను అందరూ గమనిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు. కొమ్మినేని అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా. – వినోద్కుమార్, న్యాయవాది, మహబూబ్నగర్ ● -
యథేచ్ఛగా ఇసుక దందా
● రాత్రిపూట పట్టణంలోని పలు ప్రాంతాల్లో డంపింగ్ ● పట్టపగలు దర్జాగా పొక్లెయిన్లు, టిప్పర్లతో రవాణా ● వాహనాలను పట్టుకొని వదిలేసిన పోలీసులు అనుమతులు ఉన్నాయని వదిలేశాం బహార్పేటలో జేసీబీతో ఇసుకను టిప్పర్లో లోడ్ చేస్తున్న విషయంలో సమాచారం రాగానే ఘటనా స్థలానికి సిబ్బందిని పంపించా. అనుమతి తీసుకొని మాగనూర్ నుంచి తెచ్చి ఇక్కడ నిల్వ చేసినట్లు రశీదులు చూపించారు. రవాణా చేయడం కుదరదని టిప్పర్లో లోడ్చేసిన ఇసుకను ఖాళీ చేయించి జేసీబీ, టిప్పర్ను వదిలేశాం. – బాలరాజు, ఎస్సై, కోస్గి కోస్గి: కొన్నిరోజులుగా కోస్గి పట్టణం అక్రమ ఇసుక దందాకు కేరాఫ్ అడ్రస్గా మారింది. పట్టణంలోని బహార్పేట, సాయినగర్ కాలనీ, చెన్నారం రోడ్డు, సబ్స్టేషన్ ప్రాంతాల్లో రాత్రి పూట ఇసుకను డంపింగ్ చేసి పగలు జేసీబీలతో టిప్పర్ల ద్వారా బహిరంగంగా విక్రయిస్తున్నారు. మంగళవారం ఉదయం బహార్పేటలోని మహబూబ్నగర్–తాండూర్ ప్రధాన రహదారి పక్కనే నిల్వ చేసిన డంప్ నుంచి జేసీబీ, టిప్పర్ నుంచి ఇసుకను తరలిస్తున్నారు. గతకొన్ని రోజులుగా సాగుతున్న ఈ వ్యవహారంపై అటుగా వెళ్తున్న కొందరు యువకులు ప్రశ్నించగా హైదరాబాద్ వరకు అమ్ముకునేదుకు జీహెచ్ఎంసీ నుంచి అనుమతులున్నాయని, అపడానికి మీరెవరంటూ ఇసుక మాఫీయా ఎదురు తిరగడంతో యువకులు స్థానిక విలేకర్లు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టుకొని వదిలేసిన పోలీసులు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. వాహనాలను స్టేషన్కు తరలించకుండా టిప్పర్ నుంచి ఇసుకను ఖాళీ చేయించి వాహనాలను వదిలేశారు. ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం అక్రమ ఇసుక రవాణా విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలిస్తుండగా.. ఏకంగా ముఖ్యమంత్రి సొంత ఇలాఖాలోనే ఇసుక అక్రమ దందా జోరుగా కొనసాగుతుంది. అక్రమ రవాణాను నియంత్రించాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో హద్దూ అదుపు లేకుండా పట్టపగలే జేసీబీలు, టిప్పర్ల ద్వారా ఇసుకను తరలిస్తూ ఇసుక మాఫీయా అందినంతా దండుకుంటుంది. అక్రమ దందాను అడ్డుకునేందుకు ఫిర్యాదు చేస్తే పోలీసులు వచ్చి వాహనాలను వదిలేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
కార్మికుల హక్కుల సాధన కోసం నిరంతర పోరాటం
స్టేషన్ మహబూబ్నగర్: కార్మికుల హక్కుల సాధన కోసం ఐఎన్టీయూసీ నిరంతరం పోరాటం చేస్తోందని ఆసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్డి చంద్రశేఖర్ అన్నారు. జిల్లాకేంద్రంలోని రెడ్క్రాస్ భవన్లో మంగళవారం ఐఎన్టీయూసీ జిల్లా కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ డాక్టర్ సంజీవరెడ్డి నాయకత్వంలో ఐఎన్టీయూసీ అంచలంచెలుగా ఎదిగి ఈ రోజు పెద్ద సంఘంగా ఏర్పడినట్లు తెలిపారు. ప్రభుత్వ రంగ సెక్టార్లలో, అసంఘటితరంగ సెక్టర్లలో, బ్యాంకింగ్, ఎల్ఐసీ, పోస్టల్, బీఎస్ఎన్ఎల్ రంగాలతోపాటు అనేక ఫ్యాక్టరీలలో అనుబంధ సంఘాలను ఏర్పాటు చేసుకొని బలమైన సంఘంగా మారిందన్నారు. అనంతరం జిల్లా కమిటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రాములుయాదవ్, ఉపాధ్యక్షులుగా కావలి శ్రీనయ్య, దమ్మాయిపల్లి శ్రీనివాసులు, ఎండీ అలీం, రాంనాయక్, హాజీ, బలరాం, ప్రధాన కార్యదర్శిగా రాంమోహన్, కోశాధికారిగా విజయబాబు, ప్రచార కార్యదర్శిగా శర్వ లింగం, సలహాదారులుగా ఎస్.సాయిరెడ్డి, కొండ పురుషోత్తం, సహాయ కార్యదర్శులుగా సాయిబాబా, టి.నర్సింలు, బాబుమియాలను ఎన్నుకున్నారు. అనంతరం ఐఎన్టీయూసీకి సంబంధించిన పోస్టర్లను రాష్ట్ర నాయకులు వి.భాస్కర్రెడ్డి, బోరింగ్ శ్రీనివాసులు, బాలయ్య, పర్వతాజు, లక్ష్మణ్తోపాటు జిల్లా నాయకులు ఆవిష్కరించారు. -
చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలి: ఎస్పీ
జడ్చర్ల: మహిళా పోలీసులు విధుల నిర్వహణలో మరింత చిత్తశుద్ధి, నిబద్ధత కనబరిచి అంకితభావంతో పనిచేసి పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ జానకి పిలుపునిచ్చారు. మంగళవారం జడ్చర్ల శివారులోని పోలీసు శిక్షణకేంద్రంలో మహిళా పోలీసు అధికారులు, సిబ్బందితో ఆమె ప్రత్యేక సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోలీసుశాఖలో విధులు, బాధ్యతలు, ప్రవర్తన నియమావళి, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. శిక్షణలో నేర్చుకున్న విషయాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని, ప్రజలతో సత్సంబంధాలు కలిగి పోలీసులపై నమ్మకాన్ని పెంపొందించాలని సూచించారు. శిక్షణ దశ నుంచే ఉత్తమ సేవ ధ్యేయంతో ముందుకు సాగాలన్నారు. ప్రజలకు న్యాయం అందించాలన్న లక్ష్యంతో బాధ్యతగా ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు. ఎక్కడా ఆరోపణలకు, విమర్శలకు తావివ్వకుండా పారదర్శకంగా బాధితుల తరఫున నిలబడాలని సూచించారు. మహిళా సిబ్బంది సమర్థవంతంగా పనిచేసి ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీటీసీ డీఎస్పీ గిరిబాబు, ఇన్స్పెక్టర్ రవికుమార్, ఆర్ఐ రమేశ్, తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే
సాక్షి, నాగర్కర్నూల్: రానున్న రోజుల్లో రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ఎంపీ రఘునందన్రావు అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలన చూశామని, వీరి పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని చెప్పారు. విశ్వగురువుగా మోదీ పాలన ప్రపంచవ్యాప్తం అయిందని, రాష్ట్రంలోనూ బీజేపీ పాలనతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. 11 ఏళ్ల మోదీ పాలనలో చేసిన పనులను ప్రజలకు కులంకశంగా వివరించనున్నట్టు తెలిపారు. మోదీ పాలనలో దేశంలోని 21 కోట్ల ప్రజలను పేదరికం నుంచి విముక్తి కల్పించినట్టు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రపంచ బ్యాంకు నివేదికలోనే స్పష్టం చేసిందన్నారు. 11 ఏళ్ల కిందట ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో పదో స్థానంలో ఉన్న భారత్ నేడు నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా విధానంతో 95 శాతం ఆర్మీ సామగ్రి దేశంలోనే తయారవుతోందని వివరించారు. పహల్గాంలో దాడి చేసిన ఉగ్రమూకలకు సరైన సమయంలో భారత్ గట్టి గుణపాఠం చెప్పిందన్నారు. పాక్లోని ఉగ్రస్థావరాలపై దాడి ఘటనను పాక్ ప్రధానే ఒప్పుకున్నా.. ఇక్కడి ప్రతిపక్ష నాయకులకు మాత్రం కనిపించకపోవడం విడ్డూరమన్నారు. గత ఏడాదిన్నర పాలనలో సీఎం రేవంత్రెడ్డి తన సొంత జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల్లో తట్టెడు మట్టి కూడా తీయలేదని విమర్శించారు. మాజీ మంత్రి రాములు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దిలీపాచారి, ఆచారి, భరత్ప్రసాద్, ప్రమోద్కుమార్, తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు నాగర్కర్నూల్లో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు -
పెండింగ్ రైల్వే పనులు పూర్తి చేయాలని ఎంపీ వినతి
పాలమూరు: మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో పెండింగ్లో ఉన్న రైల్వే పనులపై మంగళవారం కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు ఢిల్లీలో ఎంపీ డీకే అరుణ వినతి పత్రం అందించారు. కృష్ణా–వికారాబాద్ రైల్వే లైన్ ప్రాజెక్ట్ పనులు త్వరగా ప్రారంభించాలని కోరారు. ఈ ప్రాజెక్టు వల్ల హుబ్లీతో పాటు ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ మరింత సులభతరం అవుతుందన్నారు. దీంతో పాటు పెండింగ్లో ఉన్న అండర్ రైల్వే బ్రిడ్జిలు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు నిర్మాణ పనులపై గతంలో ఇచ్చిన ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించి పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మొక్కజొన్న క్వింటాల్ రూ.2,256 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లిమార్కెట్కు మంగళవారం మొక్కజొన్నకు గరిష్టంగా రూ.2,256, కనిష్టంగా రూ.1,301 ధరలు లభించాయి. ఆముదాలు గరిష్టంగా రూ.6,257, కనిష్టంగా రూ.6,247, హంస రకం ధాన్యం గరిష్టంగా రూ.1,838, కనిష్టంగా రూ.1,621, ఆర్ఎన్ఆర్ రకం గరిష్టంగా రూ.2,209, కనిష్టంగా రూ.1,605 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్లో ఆర్ఎన్ఆర్ ధాన్యం గరిష్టంగా రూ.2,100 ఒకే ధర లభించింది. ఏరువాక పౌర్ణమి సందర్భంగా దేవరకద్ర మార్కెట్కు బుధవారం సెలవు ప్రకటించినట్లు మార్కెట్ కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. -
నేడు, రేపు ప్రత్యేక డ్రైవ్
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఈ నెల 11, 12 తేదీల్లో బాలకార్మికులను గుర్తించి పునరావాసం కల్పించేందుకు కార్మికశాఖ, పోలీస్ సంబంధిత శాఖలు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో బాలకార్మికులు, కౌమార దశ బాల కార్మికులపై ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో పోలీస్, కార్మిక శాఖ, బాలల సంరక్షణాధికారి, ఎన్జీఓలు ఇతర శాఖలతో మూడు బృందాలు ఏర్పాటు చేసి బాల కార్మికులను గుర్తించేందుకు తనిఖీలు చేపట్టాలన్నారు. జిల్లాలో 14 ఏళ్ల లోపు బాల కార్మికులు, 14–18 ఏళ్ల వయసు ఉన్న కౌమార దశ బాలలు హాట్ స్పాట్ ప్రాంతాలలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. పరిశ్రమలు, పారిశ్రామిక యూనిట్లు, ఇటుక బట్టీలు, కోళ్ల ఫారాలు, హోటళ్లలో వలస కుటుంబాలకు చెందిన బాలకార్మికులు ఎక్కువగా పనిచేస్తుంటారని, సంబంధిత యజమానులపై బాల, కౌమార బాల కార్మికుల చట్టం ప్రకారం వివిధ సెక్షన్ల కింద రెండేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించవచ్చని తెలిపారు. బాల కార్మికులను రక్షించి స్టేట్ హోంలో అప్పగించి వారికి కౌన్సెలింగ్ విద్య, వైద్య సదుపాయాలు అందించాలని ఆదేశించారు. వలస కుటుంబాలు పని చేస్తున్న ప్రదేశాలలో వారి పిల్లలకు అంగన్వాడీల ద్వారా పోషకాహారం అందించాలని సూచించారు. 1098 చైల్డ్ లైన్కు కూడా సమాచారం అందించాలన్నారు. అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్, డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి, డీఆర్డిఓ నర్సింహులు, డీఏఓ వెంకటేశ్, పరిశ్రమల శాఖ జీఎం ప్రతాప్, డీఈఓ ప్రవీణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. బాల కార్మికులకు పునరావాసంకల్పించాలి కలెక్టర్ విజయేందిర బోయి -
6 రోజుల్లో 29 దరఖాస్తులు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డివిజన్ల విభజన ముసాయిదా ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. కాగా, ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు, అభ్యంతరాల దరఖాస్తుల స్వీకరణకు గడువు బుధవారంతో ముగియనుంది. ఈ నెల 5 నుంచి ఇప్పటి వరకు 29 దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజు మరిన్ని వచ్చే అవకాశం ఉంది. ఇక క్షేత్రస్థాయిలో ఆయా డివిజన్ల సరిహద్దులను నక్షాలతో సరిచూసుకుంటున్న ప్రత్యేక బృందం తాజాగా 33 నుంచి 42వ డివిజన్ వరకు వెళ్లొచ్చింది. ఎక్కడికక్కడే టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది కలిసి వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో వార్డు ఆఫీసర్లు, ఇతర సిబ్బంది కలిసి సవరించిన ఓటరు జాబితాను ముందుంచుకున్నారు. కొత్తగా ప్రతిపాదించిన డివిజన్ల పరిధిలో ఇంటి నంబర్ల ప్రకారం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఓటర్లు ఉన్నారో పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా వారి పేర్లను పోలింగ్ కేంద్రం వారీగా విభజిస్తున్నారు. పారదర్శకంగా చేపట్టాలి: బీజేపీ మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డివిజన్ల విభజన ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్రెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవారం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. కేంద్ర, రాష్ట్ర రహదారులతో పాటు రైల్వేలైన్ విభజించకుండా అంతర్గత ప్రధాన రోడ్లను ఆధారంగా చేసుకొని జరగాలన్నారు. ముఖ్యంగా ఏ డివిజన్లో ఉన్న ఓటర్లు అదే డివిజన్లో వచ్చేలా చూడాలన్నారు. గతంలో ఓటరు ఒక వార్డులో ఉంటే ఓటు మాత్రం వివిధ చోట్ల ఉండేదన్నారు. ఇప్పుడు అలా జరగకుండా, ఎవరి ఒత్తిడి, ప్రమేయం లేకుండా విభజించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యురాలు పద్మజారెడ్డి, మాజీ కౌన్సిలర్లు రామాంజనేయులు, ఎ.అంజయ్య, జిల్లా నాయకులు నారాయణ, దర్పల్లి హరికృష్ణ, రఘు తదితరులు పాల్గొన్నారు. స్వీకరణకు నేటితో ముగియనున్న గడువు కొనసాగుతున్న డివిజన్ల విభజన ప్రక్రియ -
నీలినీడలు
మహబూబ్నగర్బుధవారం శ్రీ 11 శ్రీ జూన్ శ్రీ 2025● పాలమూరులోనిరుపయోగంగా చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలు ● కొత్త కేంద్రాల ఏర్పాటుపైనా అధికారుల నిర్లక్ష్య వైఖరి ● పుష్కలంగా నీటి వనరులున్నా నిష్ప్రయోజనం ● క్షేత్రస్థాయిలో సమస్యలపై దృష్టిపెట్టని ప్రభుత్వం ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగానష్టపోతున్న మత్స్యకారులు న్యూస్రీల్ ‘మీన’మేషాలు -
టీపీసీసీలో మనోళ్లు
● ఉమ్మడి పాలమూరు నుంచి ఆరుగురికి చోటు ● ఉపాధ్యక్షుడిగా అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ● ప్రధాన కార్యదర్శులుగా ‘పేట’ ఎమ్మెల్యే పర్ణికారెడ్డితోపాటు మరో నలుగురు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: టీపీసీసీ కార్యవర్గంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు పెద్దపీట వేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల నియామక జాబితాను సోమవారం ఏఐసీసీ విడుదల చేసింది. ఇందులో ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, నలుగురు నాయకులకు చోటు దక్కింది. గతంలో ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు టీపీసీసీ ఉపాధ్యక్షులుగా, ఐదుగురు ప్రధాన కార్యదర్శులుగా ఉండగా.. ఈసారి ఆరుగురికి కార్యవర్గంలో చోటు కల్పించారు. కార్యవర్గంలో ఇద్దరు ఎమ్మెల్యేలు రాష్ట్రవ్యాప్తంగా టీపీసీసీ ఉపాధ్యక్షులుగా 27 మందిని ఎంపిక చేయగా వీరిలో ఉపాధ్యక్షుడిగా అచ్చంపేట ఎమ్మెల్యే, నాగర్కర్నూల్ డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ నియమితులయ్యారు. అదేవిధంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శులుగా 69 మందితో జాబితా ప్రకటించగా ఉమ్మడి జిల్లా నుంచి నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, మహబూబ్నగర్ నియోజకవర్గానికి చెందిన సంజీవ్ ముదిరాజ్, ఏపీ మిథున్రెడ్డి, గద్వాల నియోజకవర్గానికి చెందిన యువజన కాంగ్రెస్లో పనిచేసిన ఎం.రాజీవ్రెడ్డి, వనపర్తి నియోజకవర్గానికి చెందిన నందిమల్ల యాదయ్య ముదిరాజ్లను ఎంపిక చేశారు. వీరిలో సంజీవ్ ముదిరాజ్ ప్రస్తుత కార్యవర్గంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతుండగా మళ్లీ అదే పదవిని కట్టబెట్టారు. కార్యకర్తల్లో హుషారు టీపీసీసీ కార్యవర్గాన్ని ఎంపిక చేయడంపై కాంగ్రెస్ కార్యకర్తల్లో హుషారు నింపింది. ఇప్పటికే మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి రాష్ట్ర మంత్రిగా అవకాశం కల్పించగా.. టీపీసీసీ కార్యవ ర్గంలో ఉమ్మడి జిల్లా నుంచి ఆరుగురు నాయకులకు చోటు దక్కడంతో కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే డీసీసీ అధ్యక్షుల ఎంపిక? టీపీసీసీ కార్యవర్గాన్ని నియమించడంతో త్వరలోనే డీసీసీ అధ్యక్షులు, ఇతర కార్యవర్గాన్ని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల పరిశీలకులు మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష పదవుల కోసం ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మరో వారంలో రోజుల్లో పూర్తిస్థాయిలో డీసీసీ కార్యవర్గాన్ని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
బడీడు పిల్లలు బడిలోనే ఉండాలి
నవాబుపేట: బడీడు పిల్లలంతా బడిలోనే ఉండాలని, అలాగే బాలికలు మధ్యలో డ్రాపౌట్ కాకుండా అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆర్జేడీ విజయలక్ష్మి అన్నారు. సోమవారం మండలంలో జరుగుతున్న బడిబాట కార్యక్రమాన్ని ఆమె డీఈఓ ప్రవీణ్కుమార్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివిధ రకాల కారణాలు చెప్పి వలస వెళ్లిన వారంతా ఎక్కడో ఒకచోట విధిగా బడిలో చేరాల్సిందేనని స్పష్టం చేశారు. అలాగే విద్యార్థులకు అందించాల్సిన యూనిఫాంలు సిద్ధం చేయాలని, మహిళా సంఘాలు క్లస్టర్ల వారిగా వాటిని ఏర్పాటు చేసి పాఠశాలలకు అందించాలన్నారు. గ్రామాల్లో ఉపాధ్యాయ, సిబ్బంది బడిబాటను మొక్కుబడిగా కాకుండా బాధ్యతగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంపై ప్రతిరోజు రాష్ట్ర, జిల్లాస్థాయిలో పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలో నవాబుపేటలో గతేడాది బడి మానేసిన బాలిక అనూషను తల్లిదండ్రులతో మాట్లాడి బడిలో చేర్పించారు. అలాగే కేజీబీవీ విద్యార్థులకు ఇవ్వాల్సిన యూనిఫాంలను ప్రిన్సిపల్కు అందజేశారు. అనంతరం నవాబుపేటలో అధికారులు, ఉపాధ్యాయులతో కలిసి బడిబాట ప్ర తిజ్ఞ చేశారు. కార్యక్రమంలో సీఎంఓ బాలునాయక్, ఎంపీడీఓ జయరాంనాయక్, ఎంఈఓ నాగ్యనాయక్, సీఆర్పీ జనార్దన్, కేజీవీవీ ప్రత్యేకాధికారి మాధవి, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిష్టాత్మకంగా టీజీపీఈసెట్ నిర్వహణ
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ బీపెడ్, డీపెడ్ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న టీజీపీఈ సెట్ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని పీయూ వీసీ శ్రీనివాస్ అన్నారు. సోమవారం పీయూ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రస్థాయి ప్రవేశ పరీక్షను నిర్వహించే బాధ్యతను ప్రభుత్వం పీయూకు మొదటిసారి అప్పగించిందని, దీనిని విజయవంతంగా నిర్వహిస్తే భవిష్యత్లో మరిన్ని పరీక్షలు నిర్వహించేందుకు అవకాశం లభిస్తుందన్నారు. ఈ నెల 11 నుంచి 14 వరకు పీయూలో నిర్వహించే ఈవెంట్స్కు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 11న ఉదయం 7 గంటలకు ఈవెంట్స్ను రాష్ట్ర హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి హాజరై ప్రారంభిస్తారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,700 సీట్లు ఉండగా.. 2,557 మంది దరఖాస్తు చేశారన్నారు. ఇందులో 1,496 మంది బాలురు కాగా.. 1,061 మంది బాలికలు ఉన్నారన్నారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, ఈవెంట్లో పాల్గొనే విద్యార్థులకు వైద్యసేవలు అందించేందుకు వైద్యులను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఈవెంట్స్కు హాజరయ్యే విద్యార్థులకు ఆన్లైన్లో హాల్టికెట్లు అందుబాటులో ఉన్నాయని, వాటి ఆధారంగా కేటాయించిన తేదీల్లో విద్యార్థులు ఈవెంట్స్కు హాజరుకావాలని కోరారు. సమావేశంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, సెట్ కన్వీనర్ దిలీప్, పీయూ ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాస్, పీఆర్వో రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నేటినుంచి.. అమ్మ మాట– అంగన్వాడీ బాట
మహబూబ్నగర్ రూరల్: జిల్లాలో ‘అమ్మ మాట– అంగన్వాడీ బాట’ కార్యక్రమాన్ని మంగళవారం నుంచి ఈ నెల 17 వరకు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించాలని జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారి జరీనాబేగం సూచించారు. కార్యక్రమంలో భాగంగా పిల్లలను గ్రామ పంచాయతీ కమ్యూనిటీ సహకారంతో ప్రతి అంగన్వాడీ కేంద్రంలో చేర్పించుకోవడం జరుగుతుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో సెల్ఫీ తీసుకొని అంగన్వాడీ కేంద్రాల్లో నమోదు చేయడానికి ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు స్వచ్ఛ అంగన్వాడీ కార్యక్రమంలో కేంద్రాలను, చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచి పిల్లలకు అనుకూలంగా ఉండే విధంగా కేంద్రాలను తీర్చిదిద్దాలన్నారు. మదర్ కమిటీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులతో కలిసి ప్రతి గ్రామంలో ర్యాలీలు చేపట్టి అంగన్వాడీ కేంద్రాల సేవలను వివరించాలని చెప్పారు. రోజువారీ కార్యక్రమాలు ఇలా.. 10న అంగన్వాడీ కేంద్రాలను అందంగా అలంకరించడం, తల్లిదండ్రులు, పిల్లలను స్వాగతించి సెల్ఫీ తీసుకొని ప్రోత్సహించడం, ప్రతి గ్రామ మహిళా సంఘాల సభ్యులు, ఏయే గ్రామ ప్రజలతో ఎన్నుకొనబడిన గ్రామ పెద్దలతో కలిసి సమావేశం నిర్వహించాలి. 11న సంవత్సరాల పిల్లలను టీచర్లు గుర్తించి, ఆ పిల్లల ఇంటిని సందర్శించడం, తల్లిదండ్రులకు అంగన్వాడీ కేంద్రంలో అడ్మిషన్స్ గురించి ఫ్రీ స్కూల్, అభివృద్ధి కార్యక్రమాలను వివరించి పిల్లలను నమోదు చేసుకోవాలి. గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఇందులో ఫ్రీ స్కూల్ విద్య అయిపోయిన వారికి సర్టిఫికెట్స్ అందించాలి. ఐదేళ్లు పైబడిన పిల్లలను ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించాలి. 12, 13, 16 తేదీల్లో పోషణ్ పట్టిక, కిచెన్ గార్డెన్ అభివృద్ధి చేయడం, లబ్ధిదారులకు ఆహార పోషకాల గురించి వివరించాలి. 17న పూర్వ ప్రాథమిక విద్య గురించి, సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించాల్సి ఉంటుంది. వారంరోజులపాటు ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ -
మహిళా శక్తిని వేగవంతం చేయాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ఇందిర మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా చేపట్టిన కార్యక్రమాలు వేగవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి ఆమె వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆయా కార్యక్రమాలను పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్లు సమన్వయం చేసుకుంటూ నిర్దేశించుకున్న గడువులోగా పూర్తయ్యేలా చూడాలన్నారు. మహిళా సంఘాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు ఏకరూప దుస్తులు కుట్టు పనులు వేగంగా జరిగాయని, దీనికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 12న పాఠశాల పునఃప్రారంభోత్సవం సందర్భంగా పండగ వాతావరణంలో పిల్లలకు ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలని మంత్రి ఆదేశించారు. అంగన్వాడీలను బలోపేతం చేయాలని, అన్నింటిలో మౌలిక వసతులు కల్పించాలని, రాష్ట్రంలో త్వరలో 1000 అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించనున్నామన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని లక్ష్యంతో సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేపట్టామని, ఇందులో భాగంగా మహిళా సంఘాల ద్వారా పెట్రోల్ పంప్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. మహిళా సంఘాల ద్వారా రైస్మిల్స్, సోలార్ విద్యుదుత్పత్తి ప్లాంట్ల స్థాపన, ఆర్టీసీకి అద్దె బస్సులు నడపడం వంటి అనేక కార్యక్రమాల అమలుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గర రుణాల కోసం మహిళలు పోయే దుస్థితి రాకుండా, జిల్లాలో పూర్తిస్థాయిలో నూతన మహిళా సంఘాలను తయారు చేసి మహిళలను చేర్పించాలన్నారు. మహిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుదుత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ గాంధీ జయంతి నాటికి పూర్తిచేయాలన్నారు. సీఎస్ కె.రామకృష్ణారావు మాట్లాడుతూ వందశాతం పిల్లలు బడుల్లో నమోదు కలిగి ఉండాలన్నారు. సమావేశంలో కలెక్టర్ విజయేందిర, అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, డీఆర్డీఓ నర్సింహులు, డీఈఓ ప్రవీణ్కుమార్, మహిళాశిశు సంక్షేమ శాఖాధికారి జరీనాబేగం తదితరులు పాల్గొన్నారు. -
ప్రజావాణికి 96 ఫిర్యాదులు
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. ప్రజావాణిలో భాగంగా సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజల నుంచి 96 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలను తిప్పుకోకుండా ఎప్పటి సమస్యలను అప్పుడే పరిష్కరించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మోహన్రావు, శివేంద్రప్రతాప్, జెడ్పీసీఈఓ వెంకట్రెడ్డి, డీఆర్డీఓ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 25.. మహబూబ్నగర్ క్రైం: పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదును చట్టపరంగా పరిష్కరించాల ని ఎస్పీ జానకి అన్నారు. ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి న 25 మంది బాధితుల నుంచి ఎస్పీ ఫిర్యా దులు స్వీకరించారు. పోలీస్ సేవలను ప్రజల కు మరింత చేరువ చేయాలన్నారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు ఎప్పటికప్పుడూ ఆన్లైన్లో నమోదు చేసి వాటి పరిష్కార స్థితిని సమీక్షించాలన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో అధికారులు, సిబ్బంది బాధితులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని సూచించారు. డీసీసీబీ విశ్రాంత ఉద్యోగుల కార్యవర్గం మహబూబ్నగర్ (వ్యవసాయం): జిల్లా సహకార కేంద్ర బ్యాంకు విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా అబ్దుల్ కరీం ఎన్నికయ్యారు. ఈ మేరకు స్థానిక డీసీసీబీ ఆడిటోరియంలో సోమ వారం జరిగిన ఎన్నికల్లో ఉపాధ్యక్షులుగా రాంమోహన్, అబ్దుల్ వాసిక్, కార్యదర్శిగా రాములు, సహాయ కార్యదర్శిగా యాదగిరి, కోశాధికారిగా కుబేరుడు, కార్యవర్గ సభ్యులుగా సుధాకర్రెడ్డి, ఓఎన్ మూర్తి, సత్యనారాయణ, రాములు, చంద్రశేఖర్రెడ్డి, వెంకటరమణచారి, బాపయ్య, భీమయ్య, జగన్నాథ్గౌడ్లను ఎన్నుకున్నా రు. ఈ సందర్భంగా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుబ్రమణ్యం మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులకు మెడికల్ ఎయిడ్ కోసం రూ.5 వేలను గ్రాంట్ చేసినందుకు డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డికి విశ్రాంత ఉద్యోగుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శాసీ్త్రయంగానే డివిజన్ల విభజన ముసాయిదా మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నిబంధనల మేరకు శాసీ్త్రయంగానే డివిజన్ల ముసాయిదాను తయారు చేశామని మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన చాంబర్లో విలేకరులతో మాట్లాడారు. గత జనవరి 27 నుంచి మహబూబ్నగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయిందన్నారు. గతంలో ఉన్న 49 వార్డులతోపాటు దివిటిపల్లి, జైనల్లీపూర్ విలీనం కావడంతో ప్రస్తుతం 60 డివిజన్లకు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. గత జనవరిలో సవరించిన ఓటర్ల జాబితా ప్రకారం నగరంలో ప్రస్తుతం 1,96,602 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఒక్కో డివిజన్లో సరాసరిగా 3,200 మంది ఓటర్లు ఉండేలా విభజన ముసాయిదాలో పొందుపరిచామన్నారు. జీఓ 12లో సూచించిన మేరకు ఆయా డివిజన్ల నక్షాలతోపాటు హద్దులను రూపొందించామన్నారు. ప్రజల సౌకర్యార్థం ఈ నెల 5న దినపత్రికలలో ముసాయిదాకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. అలాగే తమ కార్యాలయంలోని నోటీసు బోర్డులో ఉంచామన్నారు. వీటిపై ఏమైనా సూచనలు, సలహాలు, అభ్యంతరాలుంటే ఈ నెల 11లోగా లిఖిత పూర్వకంగా నేరుగా అందజేయవచ్చన్నారు. ఇప్పటివరకు ఆరు దరఖాస్తులు వచ్చాయని, గడువులోగా ఇంకేమైనా వస్తే అన్నింటినీ ఈ నెల 12 నుంచి 16 వరకు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో హద్దులు సరిగా.. ఉన్నాయో లేదో టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగం బృందం సరిచూస్తోందన్నారు. ఎక్కడా ఎలాంటి లోపాలు లేకుండా ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని, 21న తుది నోటిఫికేషన్ జారీ అవుతుందన్నారు. సమావేశంలో ఏసీపీ కరుణాకర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
అలంపూర్ ఆలయాల అభివృద్ధికి కృషి
అలంపూర్: జోగుళాంబ, బాలబహ్వ్రేశ్వరస్వామి ఆలయాల అభివృద్ధికి కృషి చేద్దామని ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వర్రెడ్డి కోరారు. సోమవారం ఆలయంలో జరిగిన ధర్మకర్తల కార్యవర్గ సమీక్షలో ఆయన మాట్లాడారు. ఆలయాల ప్రాంగణంలో సీసీ రహదారుల పనులు పునః ప్రారంభించాలని, గోశాలలో ఆవుల సంఖ్య పెరగడం.. సిబ్బంది కొరతతో నిర్వహణ భారంగా మారిందని.. కొన్నింటిని ఇతర గోశాలలకు విక్రయించడం లేదా తరలించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అదేవిధంగా 2024–25 ఆర్థిక సంవత్సరంలో నిర్వహించిన వివిధ టెండర్ల బకాయిలు త్వరగా వసూలు చేయాలని తీర్మానించినట్లు చెప్పారు. వీటితోపాటు ఆదాయ వ్యయాలు, వెండి, బంగారు ఆభరణాలు, ఆలయ భూముల వివరాలను పరిశీలించారు. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు అలంపూర్ ఆలయాల అభివృద్ధి హైలేవల్ కమిటీ సమావేశం ఉంటుందని ఈఓ పురేందర్కుమార్ చెప్పారు. సమావేశం ప్రసాద్ స్కీం భవనంలో కొనసాగనుండగా.. దేవాదాయ ధర్మాదాయశాఖ ఉన్నతాధికారులతో పాటు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, కలెక్టర్ హాజరవుతారని పేర్కొన్నారు. సమావేశ నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్షలో చర్చించారు. సమావేశంలో ధర్మకర్తల మండలి సభ్యులు నాగ శిరోమణి, గోపాల్, జగదీశ్వర్గౌడ్, అడ్డాకుల వెంకటేశ్వర్లు, విశ్వనాథరెడ్డి, వెంకటేశ్వర్లు, జయరాముడు తదితరులు పాల్గొన్నారు. -
కుంటలో పడి వ్యక్తి మృతి
పెద్దకొత్తపల్లి: కుంటలో పడి వ్యక్తి మృతిచెందిన ఘటన సోమవారం పెద్దకారుపాములలో చోటుచేసుకున్నది. ఎస్సై సతీశ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కాళ్లలింగస్వామి(37) సోమవారం ఉదయం బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు గ్రామంలోని ఈదోనికుంటలో పడిమృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు కుంటలో గాలించగా.. అప్పటికే మృతిచెందగా.. మృతదేహాన్ని బయటికి తీశారు. మృతుడి భార్య నిర్మలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగర్కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి కుమారుడు, కూతురు ఉన్నారు. టిప్పర్ ఢీకొని వృద్ధుడి దుర్మరణంమిడ్జిల్: మిడ్జిల్–కొత్తూర్ రోడ్డుకు మట్టి తరలిస్తున్న టిప్పర్ ఢీకొని మిడ్జిల్కు చెందిన వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకున్నది. ఎస్సై శివనాగేశ్వర్నాయుడు కథనం ప్రకారం.. మిడ్జిల్కు చెందిన మైసయ్య(65) సోమవారం ఉదయం కేఎల్ఐ కాల్వ సమీపంలోని వ్యవసాయ పొలానికి వెళ్తున్నాడు. మిడ్జిల్–కొత్తూర్ రోడ్డుకు మట్టి తరలిస్తున్న టిప్పర్ ఢీ కొట్టడంతో మైసయ్య తీవ్రగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి మహబూబ్నగర్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్ నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. వృద్ధుడిపై దాడి.. చికిత్స పొందుతూ మృతి బల్మూర్: పాత కక్షలతో తండ్రి, కుమారుడు కలిసి ఓ వృద్ధుడిపై దాడి చేయగా చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. అచ్చంపేట సీఐ నాగరాజు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కమ్మరి రేణయ్య (72)ను అదే గ్రామానికి చెందిన బోయ ఎర్ర య్య, అతడి కుమారుడు శివ కలిసి పాత కక్షలతో ఆదివారం ఇంట్లో నుంచి బయటకు లాగి తీవ్రంగా చితకబాదారు. దీంతో అతడి తలకు తీవ్ర గాయం కావడంతో కుటుంబ సభ్యులు 108 వాహనంలో అచ్చంపేటలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించి తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. సోమవారం ఉదయం చూడగా మృతిచెంది ఉన్నాడని.. సోదరుడు వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. రేణయ్య భార్య, కుమారుడు గతంలోనే మృతి చెందినట్లు తెలిపారు. వ్యక్తి బలవన్మరణం జడ్చర్ల: పట్టణంలోని వెంకటేశ్వరకాలనీలో నివాసం ఉంటున్న మహేశ్ కన్నారెడ్డి (30) ఆదివారం తన ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. తిమ్మాజీపేట మండలం ఇప్పలపల్లికి చెందిన మహేశ్ కన్నారెడ్డి జడ్చర్లలోని సాయినగర్లో నివాసం ఉంటూ జిమ్ నిర్వహిస్తుండేవాడు. ఆర్థిక ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య తగాదాలతో మనస్థాపానికి గురై ఆదివారం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత బెడ్రూమ్లోకి వెళ్లి టవల్తో ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. గుర్తించిన భార్య టవల్ను లైటర్తో కాల్చి కిందకు దించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మహేశ్ కన్నారెడ్డి తండ్రి మంద శేఖర్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. యువతిపై అత్యాచారం.. కేసు నమోదు నవాబుపేట: మండలంలోని ఓ గిరిజన తండాకు చెందిన 19 ఏళ్ల యువతిపై అదే తండాకు చెందిన ప్రేమ్కుమార్నాయక్ అత్యాచారం చేయగా కేసునమోదు చేసినట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు. సోమవారం బాధితురాలు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టినట్లు వివరించారు. ప్రేమ్కుమార్నాయక్ గిరిజన సంఘంలో జిల్లాస్థాయి హోదాలో ఉండటంతో పాటు అధికారపార్టీ నాయకుడని.. అతడికి పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారని చెప్పారు. భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య వనపర్తి రూరల్: భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. రూరల్ ఎస్ఐ జలేందర్రెడ్డి వివరాల మేరకు.. పెద్దగూడెం గ్రామానికి చెందిన కుమ్మరి రాములు (40 వ్యవసాయం చేసుకొని జీవనం సాగించే వాడు. అతడి భార్య వెంకటమ్మ ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. నాటి నుంచి అతడు తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి వెళ్లిన అతడు.. తన వ్యవసాయ పొలంలోని చెట్టుకు తాడుతో ఉరేసుకున్నాడు. ఆలస్యంగా గమనించిన స్థానికులు తాడును తొలగించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి కుమారుడు కుమ్మరి తరుణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఉత్సాహంగా మహిళా క్రికెట్ లీగ్
మహబూబ్నగర్ క్రీడలు: ఇంట్రా డిస్ట్రిక్ట్ ఉమెన్ క్రికెట్ లీగ్ అండర్– 25 జిల్లాకేంద్రం సమీపంలోని సమర్థ స్కూల్ మైదానంలో సోమవారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. తొలి మ్యాచ్లో ఎండీసీఏ ఉమెన్స్ రెడ్ టీం 53 పరుగుల తేడాతో ఎండీసీఏ ఉమెన్స్ బ్లూ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రెడ్టీం నిర్ణీత 25 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. కెప్టెన్ అనిత ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచింది. 45 బంతుల్లో 6 ఫోర్లతో 45 పరుగులు చేయడంతోపాటు రెండు వికెట్లు తీసి రెడ్ టీం గెలుపులో కీలకపాత్ర పోషించింది. ఇతర క్రీడాకారిణులు అక్షర 43, ప్రతీక 27 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన బ్లూ టీమ్ జట్టు 25 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. జట్టులో ప్రవళిక 24, స్రవంతి 21 పరుగులు చేశారు. రెడ్ జట్టు బౌలర్లు మహేశ్వరి 5 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి 4, సింధూజ 2 వికెట్లు తీశారు. 43 పరుగుల తేడాతో.. రెండో లీగ్ మ్యాచ్లో బ్లూ జట్టు 43 పరుగుల తేడాతో పింక్ జట్టుపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన బ్లూ జట్టు నిర్ణీత 25 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. జట్టులో కరీనా 34, ఆర్.స్వాతి 28, మంజుల 23 పరుగులు చేశారు. పింక్ జట్టు బౌలర్లు మేఘనాగౌడ్ 2, త్రివేణి, కవిత చెరో వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన పింక్ జట్టు బ్లూ బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లను కోల్పోయింది. 19.1 ఓవర్లలో 79 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో పవిత్ర 20 పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది. బ్లూ జట్టు బౌలర్ దివ్య రాథోడ్ 4.1 ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీయగా ప్రవళిక 2, నిర్మల, స్వాతి, తేజశ్రీ చెరో వికెట్ తీశారు. భారత జట్టుకు ఆడాలి జిల్లా క్రీడాకారిణులు క్రికెట్లో మెరుగైన ప్రతిభ కనబరిచి భారత జట్టుకు ఆడాలని ఎండీసీఏ చీఫ్ ప్యాట్రన్ వి.మనోహర్రెడ్డి అన్నారు. సమర్థ స్కూల్ మైదానంలో ఇంట్రా డిస్ట్రిక్ట్ ఉమెన్స్ క్రికెట్ లీగ్ను ప్రారంభించారు. క్రీడాకారిణులను ఆయన పరిచయం చేసుకొని మాట్లాడారు. క్రికెట్లో మహిళలకు మెరుగైన అవకాశాలు ఉన్నాయన్నారు. జిల్లాలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఉమెన్స్ క్రికెట్లో క్రీడాకారిణులు తమ ప్రతిభచాటాలని కోరారు. ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారిణులను క్రికెట్లో ప్రోత్సహించడం కోసం మొదటిసారిగా ఉమెన్స్ క్రికెట్ లీగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టోర్నీ నిర్వహిస్తున్నందుకు హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్కు కృతజ్ఞతలు తెలిపారు. లీగ్లో రాణించే క్రీడాకారిణులను త్వరలో హెచ్సీఏ టోర్నమెంట్కు ఎంపిక చేస్తామన్నారు. కార్యక్రమంలో సమర్థ స్కూల్ డైరెక్టర్ యాదయ్యగుప్తా, ఎండీసీఏ ఉపాధ్యక్షుడు సురేష్కుమార్, వెంకటరామారావు, కోచ్లు గోపాలకృష్ణ, అబ్దుల్లా, సీనియర్ క్రీడాకారుడు ఆబెద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు రెడ్, బ్లూ జట్ల గెలుపు పోటీలను ప్రారంభించిన ఎండీసీఏ చీఫ్ ప్యాట్రన్ మనోహర్రెడ్డి -
చోరీలకు పాల్పడిన నిందితుల రిమాండ్
మక్తల్: తాళాలు వేసిన ఇండ్లనే టార్గెట్ చేసి వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించిట్లు నారాయణపేట డీఎస్పీ లింగయ్య పేర్కొన్నారు. సోమవారం మక్తల్లో పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మక్తల్ మండలంలోని జక్లేర్కు చెందిన సుభమ్ విష్టువర్ధన్రెడ్డి నవంబర్ 11వ తేదీన ఇంటి తాళాలు విరగ్గొట్టి చోరీ చోటుచేసుకున్న ఘటనపై ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎస్పీ యోగేశ్గౌతమ్ ఆదేశాల మేరకు దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. సోమవారం నారాయణపేట క్రాసింగ్ వద్ద తనిఖీలు చేపడుతుండగా.. పోలీసులను చూసి పారిపోతున్న ఎండీ గౌస్, హన్మంతును మక్తల్ పోలీసులు పట్టుకొని విచారించారు. కర్ణాటకలోని సింధనూర్కు చెందిన ఎండీ గౌస్, రాయిచూర్లోని దేవదుర్గకు చెందిన హన్మంతుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. వీరు తాళాలు వేసిన ఇండ్లనే టారెట్ చేయడం చేసి చోరీలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. మహబూబ్నగర్, దేవరకద్ర, మరికల్, మక్తల్లో చోరీలు చేసినట్లు ఒప్పుకొన్నారు. వారినుంచి 5తులాల బంగారం రికవరీ చేశామని, సుమారు రూ.4లక్షల50వేలు ఉంటుందని పేర్కొన్నారు. సోమవారం వీరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. చోరీ కేసుల్లో మక్తల్ సీఐ రాంలాల్, ఎస్సై భాగ్యలక్ష్మిరెడ్డి, కృష్ణ ఎస్సై నవీద్, క్రైమ్ పోలీసులు అశోక్, శ్రీకాంత్, నరేశ్, శశి పనితీరును డీఎస్పీ అభినందించారు. పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందన్నారు. 5తులాల బంగారం రికవరీ నారాయణపేట డీఎస్పీ లింగయ్య -
ఎంపీడీఓ కార్యాలయానికి తాళం
అమరచింత: ఏళ్ల తరబడి భవనం అద్దె ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు.. బకాయిలు చెల్లించే వరకు తాళం తెరవనంటూ సోమవారం ఎంపీడీఓ కార్యాలయానికి యాజమాని మహంకాళి సురేందర్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. వివరాల్లోకి వెళ్తే.. పట్టణానికి చెందిన సురేందర్ ఇంటిని ప్రతి నెల అద్దె రూ.10 వేలకు తీసుకొని ఎంపీడీఓ కార్యాలయం కొనసాగిస్తున్నారు. గతంలో బకాయి ఉన్న అద్దె మొత్తానికి రూ.3 లక్షల చెక్కును ఎంపీడీఓ అందించారు. ఎస్టీఓకు పంపినా డబ్బులు మాత్రం నేటికీ చేతికందకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ బకాయిలతో పాటు ప్రస్తుతం చెల్లించాల్సిన 5 నెలల అద్దె ఇచ్చేవరకు కార్యాలయానికి వేసిన తాళం తీయనని భీష్మించుకు కూర్చున్నారు. దీంతో ఎంపీడీఓ చెన్నమ్మతో సహా సిబ్బంది కార్యాలయం బయటే ఉండిపోయారు. ఈ విషయాన్ని జిల్లా అధికారులు, మంత్రి వాకిటి శ్రీహరికి విన్నవించగా వారి ఆదేశాల మేరకు పట్టణంలోని ఉర్దూ మీడియం పాఠశాల గదుల్లోకి మార్చేందుకు సిద్ధమై సామగ్రి, రికార్డులను తరలించారు. మంగళవారం నుంచి అక్కడే కార్యకలాపాలు ప్రారంభిస్తామని ఎంపీడీఓ వివరించారు. పాఠశాలలో ఖాళీగా ఉన్న గదుల్లోకి ఎంపీడీఓ కార్యాలయం మార్చాలని గతంలో కలెక్టర్ సూచించడంతో అందుకు అనుగుణంగా మరమ్మతులు చేపట్టారు. ● అద్దె చెల్లించనందుకు తెరవని యజమాని ● ఉన్నతాధికారుల ఆదేశాలతో ఉర్దూ మీడియం పాఠశాలలోకి మార్పు -
‘ఇథనాల్’ అనుమతులు రద్దు చేయాలి
గద్వాల క్రైం: పచ్చని పల్లెలను కాలుష్యమయం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన సీపీఎం కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి హాజరైన ఆయన.. తిరుగు ప్రయాణంలో పార్టీ శ్రేణులతో కలిసి రాజోళి మండలం పెద్ద ధన్వాడ గ్రామ సందర్శనకు సిద్ధమయ్యారు. అయితే సమాచారం అందుకున్న పట్టణ ఎస్ఐ కళ్యాణ్కుమార్, పోలీసు సిబ్బంది వారిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసుల తీరును జాన్వెస్లీ తీవ్రంగా వ్యతిరేకించారు. పోలీస్స్టేషన్ ఆవరణలోనే ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన వ్యక్తినని చెప్పే సీఎం రేవంత్రెడ్డి పాలన ఇక్కడి ప్రజలకు శాపంగా మారిందన్నారు. పచ్చని పల్లెలు, వ్యవసాయ ఆధారిత కుటుంబాలు, కూలీలు జీవన మనుగడ కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మించవద్దని 11 గ్రామాల ప్రజలు శాంతియుతంగా ఆందోళన చేపడితే.. ఫ్యాక్టరీ నిర్వాహకులు బయటి వ్యక్తులతో దాడులు చేయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బయటి వ్యక్తుల దాడులను ప్రతిఘటించిన రైతులు, ప్రజలపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. ఈ ఘటనలో లేని వ్యక్తులపై రాజకీయ జోక్యంతో కేసులు నమోదు చేయడం చూస్తుంటే, వ్యూహాత్మకమైన కుట్ర జరిగిందని చెప్పవచ్చన్నారు. న్యాయబద్ధమైన హక్కుల కోసం ప్రజలు నిలదీస్తే.. అధికారం అడ్డుపెట్టుకుని రైతులపై బూటకపు కేసులు నమోదు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని విమర్శించారు. రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయడంతో పాటు ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వాలు పనిచేయాలే తప్ప.. స్వలాభాలు, వారి ఏజెండాల కోసం పనిచేయడం దుర్మార్గమైన చర్యన్నారు. శ్రామిక, కర్షక, కూలీలు, ప్రజలకు సీపీఎం అండగా నిలబడి పోరాడుతుందన్నారు. అరెస్టయిన వారిలో సీపీఎం నాయకులు శ్రీరాంనాయక్, వెంకటస్వామి, నాగర్దొడ్డి వెంకట్రాములు, ఈదన్న, రాజు, నర్సింహ తదితరులు ఉన్నారు. కేంద్రం సమాధానం చెప్పాలి గద్వాల టౌన్: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్– పాక్ మధ్య నెలకొన్న యుద్ధం తన చొరవతోనే ఆగిందన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. భారతదేశ విదేశాంగ విధానంలో అమెరికా పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. భారత్ జపాన్ను వెనక్కి నెట్టి ప్రపంచంలో నాలుగో ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని గొప్పలు చెబుతున్న ప్రధాని మోదీ దేశంలో పెరుగుతున్న ఆర్థిక, సామాజిక అంతరాలకు గల కారణాలు ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. గత 11 ఏళ్ల బీజేపీ పాలనలో దేశంలో అట్టడుగు కులాలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రజల మధ్య విద్వేషాలు నింపి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించారు. మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా లౌకిక శక్తులు ఏకం కావాలని, ప్రజాస్వామ్య శక్తుల బలోపేతంతోనే విద్వేశ రాజకీయాలకు చరమగీతం పాడగలమని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఆర్థిక పరిస్థితి పేరుతో వెనకడుగు వేయడం సరికాదన్నారు. గద్వాల జిల్లాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పేదలపై పెత్తనం చెలాయిస్తున్న బంగ్లా రాజకీయాలకు వ్యతిరేకంగా అట్టడుగు కులాలు ఐక్యమై ప్రజా పోరాటాల ద్వారా వారిని గద్దె దించాలని పిలుపునిచ్చారు. రైతులపై కేసులు ఎత్తివేయాలి పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ -
సినీఫక్కీలో నగదు చోరీ
కొత్తకోట రూరల్: బ్యాంకులో సీసీ కెమెరాల మధ్యన క్యాష్ కౌంటర్ నుంచి రూ.లక్ష నగదు డ్రా చేసుకొని జేబులో పెట్టుకున్న ఓ వ్యక్తి నుంచి గుర్తుతెలియని వ్యక్తి సినీఫక్కీలో అపహరించిన ఘటన సోమవారం వనపర్తి జిల్లా కొత్తకోట యూనియన్ బ్యాంకులో చోటుచేసుకున్నదని సీఐ సీఐ రాంబాబు తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. అడ్డాకుల మండలం కన్మనూర్కు చెందిన మోడల శ్రీనివా సులు ఏడాది క్రితం కొత్తకోటలోని యూనియన్ బ్యాంకులో గోల్డ్లోన్ రూ.2లక్షలు తీసుకున్నాడు. రెన్యూవల్ చేసేందుకు వచ్చి రూ.2లక్షలు చెల్లించాడు. అనంతరం మళ్లీ గోల్డ్లోన్ రూ.లక్ష క్యాష్ కౌంటర్ నుంచి డ్రా చేసి ప్యాంట్ జేబులో పెట్టుకున్నాడు. రద్దీ ఎక్కువగా ఉండటంతో కౌంటర్ నుంచి పక్కకు వచ్చి 5 నిమిషాల తర్వాత జేబులో చూసుకోగా.. డబ్బులు లేకపోవడంతో బ్యాంకు మేనేజర్ దృష్టికి తీసుకెళ్లడంతోపాటు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సీఐ రాంబాబు సిబ్బందితో బ్యాంకు దగ్గరకు వచ్చి సీసీ కెమెరాలను పరిశీలించారు. బ్యాంకులో సైరన్ పనిచేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా బ్యాంకులో సీసీ కెమెరాలు తక్కువగా ఉండడంతో దొంగను పట్టుకునేందుకు కాస్త ఇబ్బందిగా ఉందని, బ్యాంకులో సీసీ కెమెరాల సంఖ్య పెంచాలని మేనేజర్కు సూచించారు. బ్యాంకు సీసీ కెమెరాలతోపాటు చుట్టుపక్కల కెమెరాల్లో దొంగ వివరాలను పరిశీలిస్తున్నామని, బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆనంద్ తెలిపారు. బ్యాంకులో వ్యక్తి నుంచి రూ.లక్ష కొట్టేసిన అగంతకుడు గోల్డ్లోన్ రెన్యూవల్ చేసి బయటికొచ్చి చూసి కంగుతిన్న బాధితుడు -
అన్నదమ్ముళ్లను మింగిన పాంపాండ్
అచ్చంపేట రూరల్: తల్లిదండ్రులతో పాటు వ్యవసాయ పొలానికి వెళ్లిన ఇద్దరు అన్నదమ్ముళ్లను పాంపాండ్ (నీటి గుంత) రూపంలో మృత్యువు వెంటాడింది. కళ్లెదుట ఆడుకుంటూ కనిపించిన చిన్నారులు క్షణ కాలంలోనే విడతజీవులుగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోధన మిన్నంటింది. ఈ ఘటన అచ్చంపేట మండలం బొమ్మన్పల్లిలో తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికుల వివరాల మేరకు.. బొమ్మన్పల్లికి చెందిన కుంభం సుధాకర్ – ధరణి దంపతులకు ఇద్దరు కుమారులు అక్షిత్(8), చేతన్ (6) ఉన్నారు. తమకు ఉన్న వ్యవసాయ పొలంలో సోమవారం పత్తి విత్తనాలు విత్తడానికి సిద్ధమయ్యారు. తమతో పాటు ఇద్దరు కుమారులను పొలానికి తీసుకెళ్లారు. పొలంలో తల్లిదండ్రులు పత్తి విత్తనాలు విత్తడంలో నిమగ్నం కాగా.. ఇద్దరు చిన్నారులు అక్కడే ఆడుకుంటూ సమీపంలో ఉన్న పాంపాండ్ వద్దకు వెళ్లారు. మొదట చేతన్ కాలుజారి నీటిగుంతలో పడిపోగా.. తమ్ముడిని బయటకు తీసుకొద్దామనే క్రమంలో అన్న అక్షిత్ అందులో పడిపోయాడు. ఇద్దరు నీటిలో మునిగి ఊపిరాడక మృతిచెందారు. అయితే తల్లిదండ్రులకు తమ కుమారులు కనిపించక పోవడంతో కేకలు వేశారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో అనుమానం వచ్చి పాంపాండ్లోకి దూకి చూశారు. అందులో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. కళ్లెదుటే ఆడుకుంటున్న ఇద్దరు కుమారులు విగతజీవులుగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఇద్దరు చిన్నారుల మృతితో బొమ్మన్పల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిద్దాపూర్ ఎస్ఐ పవన్కుమార్ తెలిపారు. అచ్చంపేట మండలం బొమ్మన్పల్లిలో విషాదం -
పునరావాస పనుల్లో వేగం పెంచాలి
సాక్షి, నాగర్కర్నూల్: పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన నార్లాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితుల కోసం చేపట్టిన పునరావాస పనులను వేగంగా పూర్తిచేయాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర సచివాలయంలో ఇరిగేషన్ అధికారులతో సమీక్షించారు. ఎల్లూరు శివారులోని సొరంగం సమీపంలో పునరావాస కాలనీ ఏర్పాటు చేయాలని భావిస్తుండగా.. అందుకు బదులుగా మరో చోట ఎత్తైన ప్రాంతంలో చేపట్టాలన్న నిర్వాసితుల డిమాండ్ను పరిశీలించాలని సూచించారు. బోడబండతండా, సున్నపుతండా, దూల్యానాయక్తండా, అంజనగిరి తండా, వడ్డె గుడిసెలు తదితర గ్రామాలకు చెందిన 117 మంది నిర్వాసితుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే ఏర్పాటుచేసిన నార్లాపూర్, ఎల్లూర్ గ్రామాల నిర్వాసితులకు ఇంకా పూర్తిస్థాయిలో పరిహారం అందాల్సి ఉండగా, త్వరగా చెల్లించాలని ఆదేశించారు. -
తొలిసారి ఎమ్మెల్యే.. తొలిసారే మంత్రి..
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో మరో పాలమూరు వాసికి చోటు దక్కింది. వ్యవసాయ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చి.. అంచెలంచెలుగా ఎదిగిన మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని అమాత్య పదవి వరించింది. ఈ మేరకు హైదరాబాద్ రాజ్భవన్లో ఆదివారం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు మంత్రి పదవి రావడంతో బీసీ సంఘాలతో పాటు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఉమ్మడి మహబూబ్నగర్ పరిధిలోని కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా, కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. తాజాగా వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కడం పాలమూరుకు వరమని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.తొలిసారి ఎమ్మెల్యే.. తొలిసారే మంత్రి.. 2023 ఎన్నికల్లో మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వాకిటి శ్రీహరి కాంగ్రెస్ అభ్యరి్థగా తొలిసారి పోటీచేసి గెలుపొందారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆయన.. వెంటనే మంత్రి పదవి చేపట్టి ఘనత సాధించారు. గతంలో ఉమ్మడి మహబూబ్నగర్ నుంచి ఎల్కోటి ఎల్లారెడ్డి (మక్తల్), పి.చంద్రశేఖర్ (మహబూబ్నగర్), చిత్తరంజన్దాస్ (కల్వకుర్తి), శ్రీనివాసరావు (నాగర్కర్నూల్), పులి వీరన్న (మహబూబ్నగర్)కు ఈ అవకాశం దక్కగా.. శ్రీహరి వారి సరసన చేరడం విశేషం. కాగా, వాకిటి శ్రీహరితో పాటు ఆయన కుటుంబసభ్యులందరూ విద్యావంతులే. శ్రీహరితో పాటు ఆయన భార్య, ఆయన తమ్ముడు, మరదలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ప్రజాసేవలోనే ఉన్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి.. మక్తల్ పట్టణం నేతాజీ నగర్కు చెందిన వాకిటి శ్రీహరిది తొలుత వ్యవసాయ కుటుంబం కాగా.. కాంగ్రెస్లో చేరి క్రమక్రమంగా రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్, గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉంటూ ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్తో పాటు పార్టీలో మండల, ఉమ్మడి జిల్లా, విభజన అనంతరం నారాయణపేట జిల్లాలో వివిధ హోదాల్లో సేవలందించారు. వాకిటి శ్రీహరి తల్లి రాములమ్మ స్టాఫ్ నర్స్గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. స్థానికంగా వేలాది మంది నిరుపేద మహిళలకు ఉచితంగా కాన్పులు చేసి రాములమ్మ సిస్టర్గా పేరు సాధించారు. తండ్రి వాకిటి నరసింహులు వ్యవసాయంతో పాటు చిన్నపాటి కాంట్రాక్టర్గా పనిచేశారు. వీరికి మొత్తం ఆరుగురు సంతానం కాగా.. నాలుగో కాన్పులో శ్రీహరి జని్మంచారు. విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకున్న ఆయన డిగ్రీ (బీఏ) దాకా విద్యాభ్యాసం కొనసాగించారు. 1996లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన మక్తల్ సర్పంచ్గా, జెడ్పీటీసీ సభ్యుడిగా, ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాజాగా సామాజిక సమీకరణాల్లో భాగంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయనను కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి వర్గంలోకి తీసుకుంది. మంత్రి శ్రీహరిని సన్మానించిన ఎమ్మెల్యే యెన్నం రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మక్తల్ ఎమ్మెల్యే వాకిట శ్రీహరిని ఆదివారం మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి అన్ని విధాలా సహకరించాలని మంత్రిని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్పీ వెంకటేశ్, నాయకులు బెక్కరి మధుసూదన్రెడ్డి, ముకుందం రమేష్ పాల్గొన్నారు. విధేయత.. సామాజిక సమీకరణాలు.. వాకిటి శ్రీహరి విద్యార్థి దశలో యూత్ కాంగ్రెస్లో చేరినప్పటి నుంచి ఆ పారీ్టలోనే కొనసాగారు. సుదీర్ఘకాలంగా పార్టీకి విధేయుడిగా ముద్రపడిన ఆయనకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో మంచి సాన్నిహిత్యం ఉంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను మక్తల్ నియోజకవర్గంలో విజయవంతం చేసి ప్రశంసలు పొందారు. దీంతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన క్రమంలో మంత్రివర్గంలో బీసీలకు, అందులోనూ ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన వారికి చోటు కలి్పంచాలన్న డిమాండ్ పెరిగింది. లోక్సభ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ సైతం ముదిరాజ్కు మంత్రి పదవి ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా గెలిచిన ఎమ్మెల్యేలలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే శ్రీహరి ఒక్కరే కాగా.. విధేయత, సామాజిక సమీకరణాలు ఆయనకు కలిసి వచ్చాయని.. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.రాజకీయ నేపథ్యం.. వాకిటి శ్రీహరి 1990 నుంచి 1993 వరకు ఎన్ఎస్యూఐ మక్తల్ మండల ప్రెసిడెంట్గా.. 1993–1996 వరకు యూత్ కాంగ్రెస్ మక్తల్ మండల అధ్యక్షుడిగా.. 1996 నుంచి 2001 వరకు మక్తల్ మండల కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశారు. 2001–2006 వరకు మక్తల్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అత్యధిక మెజార్టీ సాధించి రికార్డుల్లోకెక్కారు. 2001–2006 ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. 2006 నుంచి 2011 వరకు వాకిటీ శ్రీహరి సతీమణి వాకిటి లలిత దాసర్పల్లి ఎంపీటీసీ సభ్యురాలిగా ఉన్నారు. 2006 నుంచి 2011 వరకు ఆమె కాంగ్రెస్ మక్తల్ మండల అధ్యక్షురాలిగా పనిచేశారు. 2006 నుంచి 2012 వరకు వాకిటి శ్రీహరి సోదరుడు వాకిటి శేషగిరి మక్తల్ మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్గా.. 2006 నుంచి 2014 వరకు యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. 2014 నుంచి 2018 వరకు వాకిటి శ్రీహరి మక్తల్ జెడ్పీటీసీ సభ్యుడిగా సేవలందించారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోనే రెండో మెజార్టీ స్థానంలో నిలిచారు. 2014 నుంచి 2018 వరకు కాంగ్రెస్ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్గా.. 2014 నుంచి 2018 వరకు మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2018 నుంచి వాకిటి శ్రీహరి కృష్ణా జలాల పరిరక్షణ సమితి సభ్యుడిగా ఉన్నారు. పరిగి ఎమ్మెల్యే రాంమోహన్రెడ్డి, మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డితో కలిసి పనిచేశారు. 2019లో వాకిటి శ్రీహరి సోదరుడి భార్య రాధిక మక్తల్ మున్సిపాలిటీ కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్గా పనిచేశారు. 2022 సెపె్టంబర్ 03 నుంచి 2024 ఫిబ్రవరి వరకు నారాయణపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2023 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసి.. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్రెడ్డిపై 17,525 ఓట్లతో గెలుపొందారు. తాజాగా రెండో దఫాలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో కేబినెట్లో చోటుదక్కించుకున్నారు. -
జాడలేని వరుణుడు
తొలకరి వర్షాలకు విత్తనాలు నాటిన రైతులు ●జూలై 20 వరకు.. ఈ నెలలో సుమారు 60 మి.మీ., నుంచి 70 మి.మీ., వరకు వర్షపాతం నమోదైన పడిన తర్వాతే భూమిలో తేమ శాతం పెరుగుతుంది. అప్పుడు విత్తనాలు నాటితే మంచి మొలకలు వస్తాయి. జూన్ 15 నుంచి జూలై 15 వరకు పత్తి విత్తనాలు వేసుకునేందుకు సమయం ఉంది. జూలై 20 వరకు కూడా వేసుకోవచ్చు. రైతులు మంచి వర్షాలు కురిసిన తర్వాత విత్తనాలు నాటుకోవాలి. నాణ్యమైన వాటిని కొనుగోలు చేయాలి. అలాగే రశీదులు, విత్తన పాకెట్ కవర్లను రైతులు భద్రపరుచుకోవాలి. – వెంకటేష్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి మహబూబ్నగర్ రూరల్ మండలం పోతన్పల్లి గ్రామానికి చెందిన గొల్ల నరేష్ 12 రోజుల క్రితం తన రెండెకరాల పొలంలో పత్తి విత్తనాలు నాటాడు. ఆ తర్వాత వర్షాలు కురవకపోవడంతో పత్తి మొలకలు వాడుముఖం పట్టడంతో బోరుబావి ద్వారా ిస్ప్రింక్లర్లు నీటి తడులు అందిస్తూ మొక్కలను కాపాడుకుంటున్నాడు. ఒకవేళ సొంతంగా బోరుబావి లేకుంటే పత్తి మొలకలు ఎండిపోయి.. తీవ్రనష్టం వాటిల్లేదని రైతు చెప్పుకొచ్చాడు. మహబూబ్నగర్ (వ్యవసాయం): జిల్లాలో వర్షాధార పంటలు సాగు చేసే రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ముందస్తుగా మురిపించిన వరుణుడు ప్రస్తుతం ముఖం చాటేశాడు. ఈ ఏడాది రుతు పవనాలు ఆశాజనకంగా ఉంటాయని, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో రైతులు సంతోషపడ్డారు. ఈ క్రమంలోనే జిల్లాలోకి నైరుతి పవనాలు ముందుగానే ప్రవేశించడంతో తొలకరి జల్లులు పడ్డాయి. వారం రోజులపాటు వానలు విస్తారంగా కురవడంతో రైతన్నలు పొలంబాట పట్టారు. దుక్కులు దున్ని.. ఎరువులు, విత్తనాలు సిద్ధం చేసుకోగా.. కొందరు పత్తి విత్తనాలు నాటారు. విత్తనాలు మొలకెత్తే దశలో ఉండగా.. వరుణుడు ముఖం చాటేయడంతో నీరు అందక.. మొలకలను భూమిపై మొలిపించుకోవడానికి రైతులు నానాతంటాలు పడుతున్నారు. నాలుగైదు రోజులుగా వాన జాడ లేకపోవడంతో రైతులకు ఆదిలోనే కష్టాలు ఆరంభమయ్యాయి. ఎండలు భగ్గుమంటుండటంతో.. మొలకలు వాడిపోకుండా వాటర్ ట్యాంకర్లతో నీటిని అందిస్తూ కాపాడుకుంటున్నారు. చినుకు.. చింత ఎండలు, వడగాలులతో వాడుబడుతున్న మొక్కలు పంటను కాపాడుకునేందుకు అన్నదాతల అష్టకష్టాలు నాలుగైదు రోజుల్లో వర్షం రాకపోతే తీవ్రనష్టమే.. ఆకాశం వైపు ఆశగా చూస్తున్న రైతాంగం -
చదువుతోనే బంగారు భవిష్యత్కు బాటలు
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ముదిరాజ్ బిడ్డలు బాగా చదువుకొని బంగారు భవిష్యత్కు బాటలు వేసుకోవాలని తెలంగాణ ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలో పదో తరగతిలో ఏ–గ్రేడ్ సాధించిన ముదిరాజ్ విద్యార్థులకు ప్రతిభా అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువులో ముందంజ వేస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ముదిరాజుల సంక్షేమానికి కృషి చేస్తుందని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందన్నారు. అలాగే కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించిన విధంగా రాష్ట్రంలో కులగణన నిర్వహించి అత్యధిక జనాభా ముదిరాజులదే అని గణాంకాలతో నిరూపించింది అని పేర్కొన్నారు. ముదిరాజ్ సామాజికవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై న వాకిటి శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకున్నందుకు సీఎం రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జిల్లా ముదిరాజ్ సంఘం నాయకులు చైర్మన్ను ఘనంగా సన్మానించి జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అద్యక్షుడు జగన్మోహన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్య దర్శి సంజీవ్, జడ్చర్ల మున్సిపల్ మాజీ చైర్పర్సన్ విజయలక్ష్మి, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అఽ ద్యక్షుడు నారాయణ, నాయకులు పుష్పలత, శ్రీనివాస్, మనోహర్, బాలప్ప, పరమేశ్, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
జోగుళాంబ క్షేత్రంలో భక్తుల సందడి
అలంపూర్: అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన అలంపూర్ జోగుళాంబ అమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తుల పోటెత్తారు. సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. క్షేత్రానికి వచ్చిన భక్తులు జోగుళాంబ అమ్మవారి ఆలయాల్లో కుంకుమార్చన పూజలు, బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాల్లో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలల వేసవి సెలవులు ముగియనుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీనికి తోడు మృగశిరకార్తె కావడంతో రైతులు, వ్యవసాయ సంబంధిత వ్యాపారులు సైతం తెల్లవారుజాము నుంచే రావడం జరిగింది. దీంతో పట్టణ పురవీధులు వాహనాలతో రద్దీగా మారాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్థానిక పుష్కర ఘాట్లో స్నానాలు అచరించి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అర్చకులు భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం పలికారు. జోగుళాంబ రైల్వే హాల్ట్ వద్ద గేట్ పడిన ప్రతి సారి ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆలయ అధికారులు భక్తులకు తగు సౌకర్యాలు కల్పించారు. స్థానిక అన్నదాన సత్రంలో భక్తులకు అన్నప్రసాద వసతి కల్పించారు. -
అజిలాపూర్ లిఫ్ట్కు గ్రీన్సిగ్నల్
●కష్టాలు తీరుతాయి.. కోయిల్సాగర్ ప్రాజెక్టు మా ఊరి పొలాలకు ఆనుకొని ఉన్నా చుక్క నీరు అందని పరిస్థితి. దీంతో ఇక్కడి భూములు బీడుగా మారాయి. గత పాలకులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. అజిలాపూర్ లిఫ్ట్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలపడం సంతోషంగా ఉంది. లిఫ్ట్ పనులు పూర్తయితే మాకు సాగునీటి కష్టాలు తీరుతాయి. – రాజుగౌడ్, రైతు, అజిలాపూర్ వ్యవసాయం చేసుకుంటా.. నాకు ఆరెకరాల భూమి ఉన్నప్పటికీ సాగునీరు లేక వ్యవసాయం చేయడం లేదు. సాగునీటి కోసం కొన్నేళ్లుగా ఇబ్బంది పడుతున్నా. రైతుల కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం ఇక్కడ లిఫ్ట్ ఏర్పాటు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పనులు త్వరగా పూర్తిచేసి సాగునీరు అందిస్తే సంతోషంగా వ్యవసాయం చేసుకుంటా. – తిరుమలయ్య, రైతు, అజిలాపూర్ ఇచ్చిన మాట కోసం.. కోయిల్సాగర్ ప్రాజెక్టు పక్కనే ఉన్నప్పటికీ సాగునీరు అందక 6 గ్రామాల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాజెక్టు దిగువ వైపు పొలాలు ఉన్న రైతులు సాగు చేసుకుంటే.. ఎగువ వైపు ఉన్న రైతులకు సాగునీరు అందక వలసలు పోతున్నారు. రైతులందరికీ సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అజిలాపూర్ లిఫ్ట్ ఏర్పాటు చేస్తున్నాం. పనులు వేగంగా పూర్తిచేసి రైతులకు సాగునీరు అందిస్తాం. – మధుసూదన్రెడ్డి, ఎమ్మెల్యే, దేవరకద్ర దేవరకద్ర రూరల్: కోయిల్సాగర్ ప్రాజెక్టు కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ వేలాది ఎకరాలకు చుక్కనీరు అందడం లేదు. ఎత్తయిన ప్రదేశంలో పొలాలు ఉండటమే ఇందుకు కారణం. దీంతో వందలాది ఎకరాలు బీడు భూములుగా మారాయి. తమ భూములుకు సాగునీటిని అందించాలని రైతులు గత ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. అయితే ఎట్టకేలకు ఈ ప్రాంత రైతుల ఆకాంక్షకు మోక్షం లభించింది. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి కృషితో అజిలాపూర్లో లిఫ్ట్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పథకం నిర్మాణం కోసం రూ.32 కోట్లు మంజూరు చేస్తూ ఇటీవల జీఓ జారీ చేసింది. త్వరలోనే పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ నిర్వహించనున్నారు. రెండు దశల్లో పనులు.. ఎత్తిపోతల పథకం పనులను రెండు దశల్లో చేపట్టేందుకు సంబంధిత అధికారులు ప్రణాళిక రూపొందించారు. ముందుగా స్టేజ్–1లో భాగంగా కోయిల్సాగర్ ప్రాజెక్టు నుంచి కొంత దూరంలో ఉన్న జీలుగ గుట్ట వద్ద 0.05 టీఎంసీ సామర్థ్యంతో పంప్హౌజ్ నిర్మించనున్నారు. పంప్హౌజ్ నుంచి పైప్లైన్ ద్వారా వచ్చే నీటిని నింపేందుకు అజిలాపూర్ సమీపంలోని పూరికుంట వద్ద మినీ రిజర్వాయర్ ఏర్పాటు చేయనున్నారు. అనంతరం ఓపెన్ కాల్వలు, పిల్ల కాల్వల ద్వారా సమీప రైతుల పొలాలకు సాగునీరు అందించనున్నారు. రూ.32 కోట్లతో ఎత్తిపోతల పథకం మంజూరు 5 వేల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యం రెండు దశల్లో పనులు.. త్వరలోనే టెండర్లు స్టేజ్–2లో భాగంగా కోయిల్సాగర్ నుంచి గతంలో ఏర్పాటు చేసిన గ్రావిటీ కెనాల్ ద్వారా వచ్చే నీటి ఆధారంగా గద్దెగూడెం చెరువు నట్టలవానికుంట వద్ద 0.05 టీఎంసీ సామర్థ్యంతో రెండో పంప్హౌజ్ నిర్మించనున్నారు. కిలోమీటరు దూరంలో రెండో మినీ రిజర్వాయర్ ఏర్పాటుచేసి.. అక్కడి నుంచి పైప్లైన్ లేదా కాల్వల ద్వారా గద్దెగూడెం, వెంకటాయపల్లి గ్రామాల పరిధిలో ఉన్న 5 కుంటలను నీటితో నింపనున్నారు. అక్కడి నుంచి రైతుల పొలాలకు నేరుగా సాగునీరు అందించనున్నారు. -
కాల్వ ఇలా.. నీరు పారేదెలా?
నెట్టెంపాడులో భాగమైన ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి వచ్చే కాల్వ గట్టు మండలంలోని పెంచికలపాడు శివారులో మొదలై.. ఆరగిద్ద, గొర్లఖాన్దొడ్డి, గట్టు, మాచర్ల, బల్గెర, ఇందువాసి వరకు పారుతోంది. అయితే ఈ కాల్వలో జమ్మితోపాటుగా పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి నీటి ప్రవాహానికి ఆటంకంగా మారాయి. దీంతో కాల్వలో నీరు ముందుకు పారక తరుచుగా కోతకు గురవుతోంది. కాల్వ నీటిపై ఆధారపడి పంటలు పండించుకుంటున్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వచ్చే రెండు నెలల్లో కాల్వకు సాగునీటిని విడుదల చేస్తారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కాల్వ మరమ్మతు చేపట్టాలని స్థానిక రైతులు కోరుతున్నారు. – గట్టు -
బైక్ అదుపుతప్పి..
బైక్ అదుపుతప్పి కిందపడిన ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన మిడ్జిల్ మండలం వేముల శివారులో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. బాలానగర్ మండల పోచ్చమ్మగడ్డ తండాకు చెందిన చంద్రునాయక్ (42) మిడ్జిల్ మండలంలో జరిగిన వివాహ వేడుకలకు హాజరై తిరిగి స్వగ్రామానికి బైక్పై బయలుదేరాడు. ఈ క్రమంలో వేముల శివారులో బైక్ అదుపుతప్పి కిందపడటంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. అతడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివనాగేశ్వర్ నాయుడు తెలిపారు. అమ్మమ్మ అంత్యక్రియలకు కట్టెలు తెచ్చేందుకు వెళ్లి.. ● ట్రాక్టర్ బోల్తాపడి యువకుడి దుర్మరణం తన అమ్మమ్మ అంత్యక్రియలకు అవసరమైన కట్టెలు తీసుకురావడానికి ట్రాక్టర్పై వెళ్లిన మనువడు దుర్మరణం చెందిన ఘటన గండేడ్ మండలం బల్సుర్గొండ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. బల్సుర్గొండకు చెందిన మల్లెపల్లి పద్మమ్మ (70) అనారోగ్యంతో ఆదివారం మృతిచెందింది. ఆమె మృతదేహాన్ని దహనం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఇందుకు అవసరమైన కట్టెలు తీసుకురావడానికి పద్మమ్మ మనువడు మల్లెపల్లి బాలవర్ధన్రెడ్డి (40) ట్రాక్టర్ తీసుకొని గండేడ్కు వెళ్లాడు. కట్టెలు లోడు చేసుకొని తిరిగి వస్తుండగా.. కొండాపూర్ సమీపంలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో ట్రాక్టర్ నడుపుతున్న బాలవర్ధన్రెడ్డికి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. అమ్మమ్మ, మనువడు ఇద్దరు ఒకే రోజు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. మధ్యాహ్నం పద్మమ్మ అంత్యక్రియలు నిర్వహించగా.. సాయంత్రం బాలవర్ధన్రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. అతడికి భార్య ఉంది. గ్రామంలో వీబీకేగా పనిచేసే వాడని గ్రామస్తులు తెలిపారు. -
అతివేగానికి నిండు ప్రాణం బలి
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ అతివేగం, అజాగ్రత్తకు ఓ నిండు ప్రాణం బలైంది. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఎస్ఐ యుగంధర్రెడ్డి వివరాల మేరకు.. ఓ ట్రావెల్స్కు చెందిన బస్సు చిత్తూరు నుంచి హైదరాబాద్కు ప్రయాణికులతో బయలుదేరింది. డ్రైవర్ అతివేగం, అజాగ్రత్త కారణంగా పెబ్బేరు మండలం తోమాలపల్లి సమీపంలో బస్సు అదుపుతప్పింది. ఈ క్రమంలో ముందు వెళ్తున్న కర్ణాటకకు చెందిన బస్సును తప్పించబోయి పక్కనే వెళ్తున్న లారీని ఢీకొట్టాడు. ప్రమాదంలో ట్రావెల్స్ బస్సు హెల్పర్ నాగేంద్ర ప్రసాద్ (19) అనే యువకుడి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ సురేశ్తో పాటు ప్రయాణికులు స్వాతి, క్రాంతిలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న హైవే సిబ్బంది, పోలీసులు క్షతగాత్రులను అంబులెన్స్లో వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి సుబ్బారాయుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. -
పోలీస్స్టేషన్ వెనక ఇంట్లో చోరీ
జడ్చర్ల టౌన్: పోలీస్స్టేషన్కు ఆనుకుని ఉన్న ఇంట్లో దొంగలు పడి చోరీకి పాల్పడిన సంఘటన ఆదివారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. జడ్చర్ల పోలీస్స్టేషన్ వెనక వైపు ప్రహరీకి ఆనుకుని నిజాం అనే వ్యక్తికి చెందిన ఇళ్లు ఉంది. బక్రీద్ సందర్భంగా పట్టణంలోని హౌజింగ్బోర్డుకాలనీలో ఉంటున్న తన సోదరుడి ఇంటికి శనివారం వెళ్లారు. ఆదివారం ఇంటికి తిరిగి వచ్చి చూడగా ఇంట్లో బీరువా తాళం విరగ్గొట్టి ఉండటం, దుస్తులు చిందరవందరగా వేసి ఉండటాన్ని గుర్తించాడు. అందులో ఉన్న 6 తులాల బంగారు నగలు, 30 తులాల వెండి, రూ.40 వేల నగదు చోరీకి గురైందని గుర్తించి.. డయల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై పోలీసులు ఎవరూ స్పందించలేదని తెలిసింది. -
లారీల ఢీ.. తప్పిన ప్రమాదం
భూత్పూర్: దివిటిపల్లి వద్ద జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. జడ్చర నుంచి భూత్పూర్ వైపు పల్లిపొట్టు లోడ్తో వెళ్తున్న లారీ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి ఎదురుగా భూత్పూర్ వైపు నుంచి వస్తున్న లారీని సైతం ఢీకొట్టింది. భూత్పూర్ వైపు నుంచి వస్తున్న లారీ ప్రమాదానికి గురి కాగా డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో వెనకాల వస్తున్న ఓ కారు సైతం లారీని ఢీకొట్టింది. లారీ డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే పొట్టులారీ డ్రైవర్ పారిపోయాడు. రోడ్డు ప్రమాదం వల్ల రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు క్రేన్ సాయంతో లారీని పక్కకు లాగి రాకపోకలలను పునరుద్ధరించారు. -
క్రీడా పాఠశాల పిలుస్తోంది
మహబూబ్నగర్ క్రీడలు: రాష్ట్రంలోని మూడు ప్రాంతీయ క్రీడా పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరానికి 4వ తరగతిలో ప్రవేశాలకు త్వరలో మండల, జిల్లా, రాష్ట్రస్థాయి ఎంపికలు జరుగనున్నాయి. మేడ్చల్ జిల్లాలోని టీజీజీఎస్ఎస్ హకీంపేటతోపాటు కరీంనగర్, ఆదిలాబాద్లోని ప్రాంతీయ క్రీడాపాఠశాలల్లో 2025–26 సంవత్సరానికి 4వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఎంపికల్లో పాల్గొనే విద్యార్థులకు కొన్ని శారీరక, సామర్థ్యానికి పరీక్షలు నిర్వహిస్తారు. ఎవరైతే ఉత్తమ ప్రతిభ కనబరుస్తారో వారికి 4వ తరగతిలో ప్రవేశం లభిస్తుంది. రాష్ట్రంలో మూడు స్పోర్ట్స్ స్కూళ్లు ఉండగా ప్రతి పాఠశాలలో 4వ తరగతిలో 20మంది బాలుర, 20మంది బాలికలను ఎంపిక చేస్తారు. స్పోర్ట్స్ స్కూళ్లలో చోటుదొరికితే అంతర్జాతీయస్థాయికి ఎదగవచ్చని పలువురు క్రీడానిపుణులు పేర్కొంటున్నారు. మూడంచెల్లో ఎంపికలు స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశాల కోసం మూడంచెల్లో ఎంపికలు నిర్వహించనున్నారు. ఈనెల 16నుంచి 19 వరకు మండలస్థాయి, 23నుంచి 26వరకు జిల్లాస్థాయి, జూలై 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు రాష్ట్ర స్థాయిలో ఎంపికలు నిర్వహించనున్నారు. రాష్ట్రస్థాయిలో ఎవరైతే ఎంపికవుతారో వారికి స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశం కల్పిస్తారు. అథ్లెటిక్స్, ఆర్చరీ, ఫుట్బాల్, జిమ్నాస్టిక్, రోయింగ్, వాలీబాల్, జూడో, ఫెన్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, రెజ్లింగ్ క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వనన్నారు. కావాల్సిన ధ్రువపత్రాలు స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశ ఎంపికకు విద్యార్థులు పలు ధ్రువపత్రాలతో హాజరుకావాలి. ఒరిజినల్ ఆధార్కార్డు, 4వ తరగతి చదువుతున్న సర్టిఫికెట్, వయస్సు ధృవీకరణ పత్రం, 3వ తరగతి ప్రోగ్రెస్ రిపోర్ట్, కమ్యూనిటీ సర్టిఫికెట్, ఐదు పాస్ఫొటోలు, విద్యార్థులు 8నుంచి 9ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. 01.09.2016 నుంచి 31.08.2017 మధ్య పుట్టినవారు అర్హులు. సద్వినియోగం చేసుకోవాలి ఈనెల చివరి వారంలో జిల్లాస్థాయిలో స్పోర్ట్స్ స్కూళ్లకు ఎంపికలు నిర్వహిస్తాం. స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశాలు పొందితే విద్యార్థులకు మెరుగైన క్రీడా శిక్షణ లభిస్తుంది. వారు నైపుణ్యమైన క్రీడాకారులుగా ఎదగవచ్చు. ఎంపికల్లో అర్హులైన విద్యార్థులు పాల్గొని ప్రతిభచాటాలి. – శ్రీనివాస్, డీవైఎస్వో, మహబూబ్నగర్ శారీరక, సామర్థ్య పరీక్షలు విద్యార్థులకు శారీరక, సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఎత్తు, బరువు, 30మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, 800మీటర్ల రన్, 610 మీటర్ల షటిల్ రన్, మెడిసిన్ బాల్ త్రో, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీతోపాటు మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. వీటితోపాటు జిల్లాస్థాయిలో అదనంగా మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్లో స్పోర్ట్స్ స్కూళ్లు 4వ తరగతిలో విద్యార్థుల ప్రవేశాలకు ఎంపికలు ప్రతిపాఠశాలలో 20మంది బాలుర, 20 మంది బాలికలకు అవకాశం ఈనెల 16నుంచి వచ్చేనెల 5వరకు మూడంచెల్లో పరీక్షలు -
శుభకార్యానికి వెళ్లొస్తూ అనంతలోకాలకు..
బంధువుల ఇంట్లో వివాహ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు దుర్మరణం చెందిన విషాదకర ఘటన నవాబుపేట మండలం కొల్లూరు గేట్ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. నవాబుపేటకు చెందిన మరికంటి లక్ష్మమ్మ (52), ఆమె కుమారుడు యాదగిరి (20) కొందుర్గు మండలం ఆగిర్యాలలో జరిగిన బంధువుల వివాహ వేడుకకు హాజరయ్యారు. వేడుక అనంతరం అక్కడి నుంచి స్వగ్రామానికి బైక్పై బయలుదేరారు. అయితే మార్గమధ్యంలోని కొల్లూరు గేట్ సమీపంలో అతివేగంగా వస్తున్న ట్రాక్టర్ బైక్ను ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో తల్లీకొడుకుకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడగా.. డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జిల్లా ఆస్పత్రికి తరలించారు. తల్లీకొడుకు మృతితో నవాబుపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలు లక్ష్మమ్మకు మొత్తం ఐదుగురు సంతానం కాగా.. ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో మృతుడు యాదగిరి చివరి వాడు. మిగిలిన అందరి వివాహాలు జరిగాయి. మృతురాలి భర్త వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
మనస్తాపానికి గురై వ్యక్తి బలవన్మరణం
అయిజ: పంట పొలానికి బాట లేదని చెప్పినందుకు మనస్తాపానికి గురై వ్యక్తి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన ఆదివారం అయిజ మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. బంధువుల వివరాల ప్రకారం.. అయిజ పట్టణానికి చెందిన దేవర మహేష్ (45) 393 సర్వే నంబర్లో ఉన్న తన పొలానికి వెళ్లేందుకు ప్రయత్నించగా, కొందరు వ్యక్తులు మీకు ఇటువైపుగా బాట లేదని చెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన మహేష్ ఇంటికి వెళ్లి ఉరేసుకొని బలవన్మరణం చెందాడు. మహేష్ మృతదేహాన్ని బాట ఇవ్వమని చెప్పిన వారి ఇంటిముందు ఉంచి నిరసన తెలిపారు. ఎస్ఐ శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను శాంతింపజేశారు. సంఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించేందుకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మహేష్కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. చెరువులో మునిగి వ్యక్తి మృతి గండీడ్/మహమ్మదాబాద్: ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన ఆదివారం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. నారాయపేట జిల్లా కోస్గి మండలం మల్రెడ్డిపల్లికి చెందిన అలికె మొగులయ్య(45)ను అదే గ్రామానికి చెందిన గొల్ల నర్సయ్య గొర్రెలు కడగడానికి గండీడ్ మండలంలోని వెన్నాచేడ్లో పెద్దచెరువుకు వెళ్దామని చెప్పాడు. ముందుగా అనుకూలంగా ఉందో.. లేదో చూసి వద్దామని చెప్పాడు. ఆదివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో మరొకరితో కలిసి మొగులయ్య వెన్నాచేడ్లోని పెద్దచెరువుకు చేరుకున్నాడు. చెరువు పెద్ద తూము వద్ద లోతు చూద్దామని నీటిలోకి దిగాడు. అక్కడ ఎక్కువ లోతు ఉండడంతో మునిగిపోయాడు. బయట ఉన్న మిగతావారు మొగులయ్య పైకి రాకపోవడంతో అనుమానం వచ్చి నీటిలో దిగి బయటికి లాగారు. అప్పటికే మొగులయ్య మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. యువకుడి ఆత్మహత్య మన్ననూర్: అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలోని లింగమయ్య కాలనీకి చెందిన చంద్రకాంత్ (30) అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ రజిత తెలిపిన వివరాల మేరకు.. చంద్రకాంత్ శుక్రవారం ఇంట్లోనే ఉరి వేసుకుని మృతి చెందాడు. ఏడాది క్రితం కుటుంబ కలహాల నేపథ్యంలో మృతుడి భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో చంద్రకాంత్ జీవితంపై విరక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై ఆదివారం కేసు నమోదు చేసుకొని పోస్టుమర్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. వ్యక్తి బలవన్మరణం మహమ్మదాబాద్: తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మండలంలోని కంచన్పల్లిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పోతుల అశోక్(24) గత రెండేళ్ల క్రితం వివాహమైంది. అయితే గ్రామంలో చిన్నపాటి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసైన అశోక్ కొన్నిరోజులుగా మహబూబ్నగర్లో ఉంటూ ఎలాంటి కూలీ పనిచేయకుండా ఉంటున్నాడు. దీంతో కుటుంబం గడవని పరిస్థితి నెలకొని మనస్తాపానికి గుర య్యాడు. శనివారం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా కుటుంబ సభ్యు లు స్థానిక జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. పోస్టుమార్టం అనంతరం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. -
మూగజీవాల ఉసురుతీస్తున్న పిడుగులు
బిజినేపల్లి/ తాడూరు/ చారకొండ: అన్నదాతలకు వ్యవసాయంలో చేదోడువాదోడుగా ఉండే కాడెద్దులు, మూగజీవాలను పిడుగుపాట్లు బలి తీసుకుంటున్నాయి. రూ.వేలు విలువ చేసే కాడెద్దులు అకాల మృత్యువాత పడుతుండటంతో రైతన్నలు తల్లడిల్లిపోతున్నారు. ఈ క్రమంలో ఆదివారం బిజినేపల్లి మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన రైతు శ్రీశైలం కాడెద్దులను పొలం వద్ద చెట్టు కింద కట్టేశాడు. అయితే సాయంత్రం వర్షంతోపాటు పిడుగు పడటంతో కాడెద్దులు మృతిచెందాయి. వీటి విలువ రూ.1.50 లక్షలు ఉంటుందని బాధిత రైతు వాపోయాడు. అలాగే తాడూరు మండలంలోని చర్లఇటిక్యాలలోనూ రైతు బ్రహ్మానందరెడ్డికి చెందిన ఎద్దు పిడుగు పడి మృతిచెందింది. చారకొండ మండలంలోని సిర్సనగండ్ల గ్రామానికి చెందిన రైతు అంజయ్య వ్యవసాయ పొలంలో కట్టేసిన పాడిగేదెలు పిడుగు పడి మృతిచెందాయి. వీటి విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని బాధిత రైతు పేర్కొన్నాడు. బాధిత రైతులను ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
దుందుభిలో అక్రమ దందా!
నిబంధనలు అతిక్రమించి ఇసుక తరలింపు జడ్చర్ల: మిడ్జిల్ మండలం కొత్తపల్లి శివారు దుందుభి వాగులో ఇసుక అక్రమ దందా యథేచ్ఛగా కొనసాగుతుంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్నా.. సంబంధిత శాఖల అధికారులు అటువైపు కన్నెతి కూడా చూడటం లేదు. రోజు వందలాది టిప్పర్ల ఇసుక ఇతర ప్రాంతాలకు తరలుతుండగా.. ఇసుకాసురులకు అధికారులు, పోలీసులు వంత పాడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ) వే బిల్లులు ఇవ్వడానికి మాత్రమే పరిమితమైంది. మిగతా పర్యవేక్షణ తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తుండగా.. రెవెన్యూ, పంచాయతీరాజ్శాఖ అధికారులు జాడ లేకుండా పోయారు. ఆయా శాఖల నుంచి కూడా ఇక్కడ సిబ్బందిని ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. పట్టించుకోవడం లేదు. నీటిపారుదలశాఖ అధికారుల పర్యవేక్షణ మచ్చుకై నా లేదు. ఇచ్చిన అనుమతుల మేరకే తవ్వకాలు చేపడుతున్నారా.. బఫర్ జోన్లోకి వచ్చారా అన్న విచారణ చేయని దుస్థితి నెలకొంది. నిబంధనలు గాలికి.. కొత్తపల్లి ఇసుక క్వారీలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. నిబంధనల ప్రకారం 2.5 మీటర్లు తవ్వకాలు చేపట్టాల్సి ఉండగా.. సుమారు 9 మీటర్లకు పైగా తవ్వకాలు చేస్తున్నా అడిగే వారు కరువయ్యారు. ఇక సామర్థ్యానికి మించి ఇసుకను టిప్పర్లలో తరలిస్తున్నా పట్టించుకునే వారు లేరు. 10 టైర్ల లారీలో 12 క్యూబిక్ మీటర్లు (19.5 టన్నులు), 12 టైర్ల లారీలో 16 క్యూ.మీ (26 టన్నులు) మాత్రమే తరలించాల్సి ఉండగా అంతకుమించి లారీలపై చెక్కలు అడ్డుపెట్టి తరలిస్తున్నారు. టీజీఎండీసీ జారీ చేసే వేబిల్లులో 19.5 టన్నులని పేర్కొంటున్నా.. అధికంగా తరలిస్తున్నారు. అంతేగాక జిల్లా పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్ నిర్మాణాలకు మాత్రమే ఇసుకను రవాణా చేయాల్సి ఉండగా హైదరాబాద్, రంగారెడ్డి తదితర సుదూర ప్రాంతాలకు తరలించి హద్దులు దాటి సొమ్ము చేసుకుంటున్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఇసుక తరలించాల్సి ఉన్నా.. అందుకు విరుద్ధంగా రేయింబవళ్లు తరలిస్తున్నారు. ప్రతి వాహనాన్ని జీపీఎస్ ద్వారా ట్రాక్ చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. ఇసుకను లారీలో నింపడానికి సుమారు రూ.9 వేలు వసూలు చేస్తుండగా.. దూరభారాన్ని బట్టి రూ.30 వేల నుంచి రూ.40 వేలకు పైగా విక్రయిస్తున్నారు. పట్టించుకోని రవాణాశాఖ.. అధిక లోడ్తో వెళ్తున్న ఇసుక లారీలను రవాణాశాఖ అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. సామర్థ్యానికి మించి ఇసుకను తరలిస్తున్నా ఎక్కడకూడా రవాణాశాఖ అధికారులు తనిఖీలు చేసిన దాఖలాలు కనిపించడం లేదన్న విమర్శలున్నాయి. ఎమ్మెల్యే ఆదేశాలు బేఖాతర్.. ఇసుక తవ్వకాల్లో అక్రమాలు జరిగితే సహించేది లేదని, రెవెన్యూశాఖ అధికారులు నిబంధనల ఉల్లంఘనపై చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ఆదేశించినా.. ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. హద్దుల నిర్ధారణ వరకే మా బాధ్యత.. కొత్తపల్లి క్వారీకి సంబంధించి పట్టా భూముల హద్దుల నిర్ధారణ చేశామని, తదుపరి బాధ్యత టీజీఎండీసీ అధికారులదేనని తహసీల్దార్ రాజు తెలిపారు. హద్దుల లోపలే తవ్వకాలు చేస్తున్నారని, నిబంధనలు అతిక్రమిస్తే కలెక్టర్కు ఫిర్యాదు చేసి చర్యలు చేపడుతామని వివరించారు. టీజీఎండీసీ అధికారిని వివరణ కోరేందుకు ఫోన్లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. జాడలేని అధికారులు.. ఇసుక క్వారీ పర్యవేక్షణను సంబంధిత అధికారులు గాలికొదిలేయడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవినీతికి పాల్పడి అక్రమాలను ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 9 మీటర్ల మేర తవ్వకాలు.. పట్టించుకోని అధికారులు జాడలేని టీజీఎండీసీ అధికారులు కొత్తపల్లి క్వారీలో ఇదీ పరిస్థితి -
లూజ్ విత్తనాలతో జాగ్రత్త
అలంపూర్: వానకాలం పంటల సీజన్ ఆరంభమవుతోంది. అన్నదాతలు ఆరుగాళం కష్టించడానికి సిద్ధమవుతున్నారు. పంటసాగులో కీలక భూమికను నిర్వహించే విత్తనాల కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న వానకాలం సీజన్కు కావాల్సిన విత్తనాల కొనుగోలు చేసే రైతులు జాగ్రత్తలు పాటించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియానాయక్ సూచించారు. దళారులు రైతులకు లూజ్ విత్తనాలు విక్రయించి మోసం చేస్తారని హెచ్చరించారు. విత్తనాలు కొనుగోలు చేసే రైతులు లూజుకు కంపెనీ(ప్యాకెట్లలో) తేడాలు తెలుసుకుంటే మంచిదన్నారు. ఈ విషయంలో అవగాహన ఉంటే పంటసాగు నుంచే ఇలాంటి నష్టాలను నివారించుకోవచ్చని అవగాహన కల్పిస్తున్నారు. దళారులు అమ్మే లూజ్ విత్తనాలు ● విత్తనాలకు ఎటువంటి నాణ్యత ఉండదు. ● విత్తనాల తయారీలో కంపెనీ, ధృవీకరణ అధికారుల ప్రమేయం ఉండదు. ● లూజు విత్తనాలు కొనుగోలు చేసిన సమయంలో ఎటువంటి బిల్లు ఇవ్వరు. ● ప్రాసెసింగ్, శుద్ధి ఇతర ప్రమాణాలు ఉండవు. ● విత్తనాలు విత్తినప్పుడు, పంట మధ్యకాలంలో పూత, కాత దశలో ఏమైనా నష్టాలు జరిగితే రైతులకు న్యాయం జరగదు. ● విత్తనాలకు జన్యు నాణ్యత ఉండదు. ● విత్తనాలను దళారులు రైతులను మోసం చేసేవారు మాత్రమే విక్రయిస్తారు. పాడి–పంట కంపెనీ ప్యాకుడు విత్తనాలు విత్తనాలకు పూర్తి నాణ్యత ఉంటుంది. విత్తనాల తయారీలో వివిధ దశల్లో కంపెనీ, ధృవీకరణ అధికారులు పాల్గొంటారు. విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పకుండా బిల్లు ఇస్తారు. విత్తన తయారీలో ప్రాసెసింగ్, శుద్ధి, ఇతర నాణ్యత ప్రామాణాలు తప్పక పాటిస్తారు. విత్తనాలు కొనగోలు చేసిన సమయంలో రైతులకు బిల్లు ఇస్తారు. కాబట్టి పూర్తి న్యాయం జరుగుతుంది. విత్తనాలకు ఖచ్చితంగా జన్యు నాణ్యత ఉంటుంది. ఈ విత్తనాలు వ్యవసాయ శాఖవారిచే లైసెన్సు పొందిన డీలర్లు విక్రయిస్తారు. -
సర్పంచ్ టు మంత్రి..
అంచెలంచెలుగా ఎదిగిన ముదిరాజ్ బిడ్డ వాకిటి శ్రీహరి సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో మరో పాలమూరు వాసికి చోటు దక్కింది. వ్యవసాయ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చి.. అంచెలంచెలుగా ఎదిగిన మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని అమాత్య పదవి వరించింది. ఈ మేరకు హైదరాబాద్ రాజ్భవన్లో ఆదివారం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు మంత్రి పదవి రావడంతో బీసీ సంఘాలతో పాటు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఉమ్మడి మహబూబ్నగర్ పరిధిలోని కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా, కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు పర్యాటక, ఎకై ్సజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. తాజాగా వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కడం పాలమూరుకు వరమని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ నేపథ్యం.. ● వాకిటి శ్రీహరి 1990 నుంచి 1993 వరకు ఎన్ఎస్యూఐ మక్తల్ మండల ప్రెసిడెంట్గా.. 1993–1996 వరకు యూత్ కాంగ్రెస్ మక్తల్ మండల అధ్యక్షుడిగా.. 1996 నుంచి 2001 వరకు మక్తల్ మండల కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశారు. ● 2001–2006 వరకు మక్తల్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అత్యధిక మెజార్టీ సాధించి రికార్డుల్లోకెక్కారు. ● 2001–2006 ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. ● 2006 నుంచి 2011 వరకు వాకిటీ శ్రీహరి సతీమణి వాకిటి లలిత దాసర్పల్లి ఎంపీటీసీ సభ్యురాలిగా ఉన్నారు. 2006 నుంచి 2011 వరకు ఆమె కాంగ్రెస్ మక్తల్ మండల అధ్యక్షురాలిగా పనిచేశారు. ● 2006 నుంచి 2012 వరకు వాకిటి శ్రీహరి సోదరుడు వాకిటి శేషగిరి మక్తల్ మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్గా.. 2006 నుంచి 2014 వరకు యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ● 2014 నుంచి 2018 వరకు వాకిటి శ్రీహరి మక్తల్ జెడ్పీటీసీ సభ్యుడిగా సేవలందించారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోనే రెండో మెజార్టీ స్థానంలో నిలిచారు. 2014 నుంచి 2018 వరకు కాంగ్రెస్ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్గా.. 2014 నుంచి 2018 వరకు మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ● 2018 నుంచి వాకిటి శ్రీహరి కృష్ణా జలాల పరిరక్షణ సమితి సభ్యుడిగా ఉన్నారు. పరిగి ఎమ్మెల్యే రాంమోహన్రెడ్డి, మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డితో కలిసి పనిచేశారు. ● 2019లో వాకిటి శ్రీహరి సోదరుడి భార్య రాధిక మక్తల్ మున్సిపాలిటీ కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్గా పనిచేశారు. ● 2022 సెప్టెంబర్ 03 నుంచి 2024 ఫిబ్రవరి వరకు నారాయణపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ● 2023 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసి.. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్రెడ్డిపై 17,525 ఓట్లతో గెలుపొందారు. తాజాగా రెండో దఫాలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో కేబినెట్లో చోటుదక్కించుకున్నారు. వాకిటి శ్రీహరి విద్యార్థి దశలో యూత్ కాంగ్రెస్లో చేరినప్పటి నుంచి ఆ పార్టీలోనే కొనసాగారు. సుదీర్ఘకాలంగా పార్టీకి విధేయుడిగా ముద్రపడిన ఆయనకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో మంచి సాన్నిహిత్యం ఉంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను మక్తల్ నియోజకవర్గంలో విజయవంతం చేసి ప్రశంసలు పొందారు. దీంతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన క్రమంలో మంత్రివర్గంలో బీసీలకు, అందులోనూ ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన వారికి చోటు కల్పించాలన్న డిమాండ్ పెరిగింది. లోక్సభ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ సైతం ముదిరాజ్కు మంత్రి పదవి ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా గెలిచిన ఎమ్మెల్యేలలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే శ్రీహరి ఒక్కరే కాగా.. విధేయత, సామాజిక సమీకరణాలు ఆయనకు కలిసి వచ్చాయని.. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. వ్యవసాయ కుటుంబం నుంచి.. మక్తల్ పట్టణం నేతాజీ నగర్కు చెందిన వాకిటి శ్రీహరిది తొలుత వ్యవసాయ కుటుంబం కాగా.. కాంగ్రెస్లో చేరి క్రమక్రమంగా రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్, గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉంటూ ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్తో పాటు పార్టీలో మండల, ఉమ్మడి జిల్లా, విభజన అనంతరం నారాయణపేట జిల్లాలో వివిధ హోదాల్లో సేవలందించారు. వాకిటి శ్రీహరి తల్లి రాములమ్మ స్టాఫ్ నర్స్గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. స్థానికంగా వేలాది మంది నిరుపేద మహిళలకు ఉచితంగా కాన్పులు చేసి రాములమ్మ సిస్టర్గా పేరు సాధించారు. తండ్రి వాకిటి నరసింహులు వ్యవసాయంతో పాటు చిన్నపాటి కాంట్రాక్టర్గా పనిచేశారు. వీరికి మొత్తం ఆరుగురు సంతానం కాగా.. నాలుగో కాన్పులో శ్రీహరి జన్మించారు. విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకున్న ఆయన డిగ్రీ (బీఏ) దాకా విద్యాభ్యాసం కొనసాగించారు. 1996లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన మక్తల్ సర్పంచ్గా, జెడ్పీటీసీ సభ్యుడిగా, ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాజాగా సామాజిక సమీకరణాల్లో భాగంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయనను కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి వర్గంలోకి తీసుకుంది. మంత్రి శ్రీహరిని సన్మానించిన ఎమ్మెల్యే యెన్నం రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మక్తల్ ఎమ్మెల్యే వాకిట శ్రీహరిని ఆదివారం మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి అన్ని విధాలా సహకరించాలని మంత్రిని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్పీ వెంకటేశ్, నాయకులు బెక్కరి మధుసూదన్రెడ్డి, ముకుందం రమేష్ పాల్గొన్నారు. – స్టేషన్ మహబూబ్నగర్ విధేయత.. సామాజిక సమీకరణాలు.. తొలిసారి ఎమ్మెల్యే.. తొలిసారే మంత్రి.. వ్యవసాయ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి.. కుటుంబంలో అందరూ విద్యావంతులే.. తొలిసారి ఎమ్మెల్యే.. తొలిసారే అమాత్యగిరి గతంలో ఎల్లారెడ్డి, పి.చంద్రశేఖర్, పులి వీరన్న, చిత్తరంజన్దాస్, శ్రీనివాసరావుకు అవకాశం బీసీ వర్గాలతో పాటు ఉమ్మడి పాలమూరు కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షాతిరేకాలు 2023 ఎన్నికల్లో మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వాకిటి శ్రీహరి కాంగ్రెస్ అభ్యర్థిగా తొలిసారి పోటీచేసి గెలుపొందారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆయన.. వెంటనే మంత్రి పదవి చేపట్టి ఘనత సాధించారు. గతంలో ఉమ్మడి మహబూబ్నగర్ నుంచి ఎల్కోటి ఎల్లారెడ్డి (మక్తల్), పి.చంద్రశేఖర్ (మహబూబ్నగర్), చిత్తరంజన్దాస్ (కల్వకుర్తి), శ్రీనివాసరావు (నాగర్కర్నూల్), పులి వీరన్న (మహబూబ్నగర్)కు ఈ అవకాశం దక్కగా.. శ్రీహరి వారి సరసన చేరడం విశేషం. కాగా, వాకిటి శ్రీహరితో పాటు ఆయన కుటుంబసభ్యులందరూ విద్యావంతులే. శ్రీహరితో పాటు ఆయన భార్య, ఆయన తమ్ముడు, మరదలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ప్రజాసేవలోనే ఉన్నారు. -
పాలమూరు ఎవరికి వారు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి పాలమూరు కాంగ్రెస్ నేతలు పోట్ల గిత్తల్లా తలపడుతున్నారు. ఇతర పార్టీల నుంచి వచి్చన వారితో కుదురుకోలేక కొందరు, ఇతర పార్టీల నేత లను ప్రోత్సహిస్తూ మరికొందరు, పార్టీలోని వారితో కలిమి లేక ఇంకొందరు, గొంతెమ్మ కోర్కెలతో ఇంకా కొందరు ఎవరికి వారే వివాదాస్పదమవుతున్నారు. ఈ గ్రూపు గొడవలు, గట్టు పంచాయతీలు తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ నిర్వహించిన లోక్సభ నియోజకవర్గాల వారీ సమీక్షల్లో బట్టబయలు కావడం.. ఒకరిపై ఇంకొకరు ఫిర్యాదు చేసుకోవడం.. ఆమె ముందే వాదులాడుకోవడంలాంటి ఘటనలు సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీని సతమతం చేస్తున్నాయి. గద్వాల నుంచి ఆలంపూర్ వరకు, వనపర్తి నుంచి జడ్చర్ల వరకు అటు ఎమ్మెల్యేలు, ఇటు పార్టీ నేతలు వివాదాలకు కారణమవుతూ వీలున్నంత మేర పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు పోటీలు పడుతుండటం గమనార్హం. చాప కింద నీరులా.. చాలా కాలంగా ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ నేతలు బహిరంగ కొట్లాటలకు దిగుతున్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్రెడ్డి ఏకంగా రాష్ట్రంలోని ఓ కీలక మంత్రితో పంచాయతీకి దిగారు. అప్పట్లో ఆయన నేతృత్వంలోనే కొందరు ఎమ్మె ల్యేలు డిన్నర్ భేటీ అయ్యారన్న వార్త రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో సంచలనం సృష్టించింది. అయితే, టీకప్పులో తుపానులా ఆ వివాదం ముగిసినా, గద్వాల రాజకీయం గట్టు దాటింది. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేతో ఓ ఎంపీ ఘర్షణకు దిగారన్న వార్తలు కూడా హల్చల్ చేశాయి. అక్కడి ఎమ్మెల్యేకు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థికి మధ్య సఖ్యత కుదర్చడం రాష్ట్ర పార్టీకి కూడా సాధ్యం కావడం లేదు. ఇద్దరూ పట్టిన పట్టు వీడకుండా పార్టీని ఇరుకున పెడుతూనే ఉన్నారనేది బహిరంగ రహస్యమే. ఇక, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి మధ్య ఘర్షణ వాతావరణం నిత్యకృత్యమైందనే చర్చ జరుగుతోంది. ప్రొటోకాల్ మొదలు పార్టీ పదవుల వరకు ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూనే ఉంది. మహబూబ్నగర్ నియోజకవర్గంలోని పార్టీ నేతల మధ్య విభేదాలు లేకపోయినా డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న దేవరకద్ర ఎమ్మెల్యే జీఎమ్మార్, స్థానిక ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్రెడ్డి మధ్య ఆధిపత్యపోరు జరుగుతోందనే చర్చ ఉంది. మక్తల్ నియోజకవర్గంలో కూడా పార్టీ నేతలు సామాజిక వర్గాల వారీగా చీలిపోయారని, ఈ నేపథ్యంలోనే స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వొద్దంటూ పోస్టర్లు కూడా వేశారని తెలుస్తోంది. అవిగో నష్టాలు... ఇవిగో ఆధారాలు నాగర్కర్నూల్ జిల్లాలో బీఆర్ఎస్ సెగ కాంగ్రెస్ను గట్టిగానే తాకుతోంది. ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరడం ఆ నియోజకవర్గంలో తీవ్ర విభేదాలకు దారితీస్తోంది. దీనికి తోడు తాజాగా ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడుని ఇటీవల కాంగ్రెస్ ఎంపీ మల్లురవి సత్కరించడం దుమారానికి దారి తీసింది. ఈ విషయమై ఆలంపూర్ నియోజకవర్గ మండల కాంగ్రెస్ అధ్యక్షులు, ఇతర నేతలు కలిపి 26 మంది రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు చేశారు. నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవి, మాజీ జడ్పీ చైర్మన్ సరితా తిరుపతయ్య, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్దన్రెడ్డి కలిసి అటు ఆలంపూర్లోనూ, ఇటు జోగులాంబ గద్వాల జిల్లాలోనూ పార్టీకి నష్టం చేస్తున్నారని సంతకాలు చేసి మరీ ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నాయకులకు చెందిన పెండింగ్ బిల్లులను మంజూరు చేయించి 10 శాతం కమీషన్ తీసుకున్నారంటూ మల్లురవిపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఇక, కాంగ్రెస్ కేడర్ అడుగుతున్న విధంగా ఆలంపూర్ నియోజకవర్గంలో మల్లమ్మకుంట ప్రాజెక్టును కాకుండా బీఆర్ఎస్ నేతల మాటలు విని చిన్నోనిపల్లి రిజర్వాయర్ను తెరపైకి తెచ్చి కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని కూడా ఆరోపించారు. ఈ మేరకు ఇటీవలే టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్గా నియమితులైన మల్లురవి మీదనే కాంగ్రెస్ ఇంచార్జికి లిఖితపూర్వక ఫిర్యాదు ఇవ్వడం గాం«దీభవన్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. మంత్రులకు... మేం తక్కువా? పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు ఓ విచిత్ర డిమాండ్ను తెరపైకి తెస్తూ మంత్రివర్గాన్నే సవాల్ చేస్తున్నారు. మంత్రులకంటే తామేం తక్కువ కాదని, మంత్రుల నియోజకవర్గాలకు ఎన్ని నిధులిస్తారో అన్ని నిధులు తమ నియోజకవర్గాలకూ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల రెండు దఫాలుగా వారు మీనాక్షి నటరాజన్ను కలిసి ఈమేరకు వినతిపత్రం కూడా ఇచ్చారు. మంత్రులతో సమానంగా నిధులివ్వాలని అడిగినట్లు స్వయంగా వారు మీడియాకు వెల్లడించడం గమనార్హం. గాంధీభవన్లో జరిగిన లోక్సభ నియోజకవర్గ సమీక్షలోనూ వారు ఇదే అంశాన్ని ప్రస్తావించినట్టు తెలిసింది. అదేవిధంగా పాలమూరు లోక్సభ పరిధిలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా తమకు సహకరించడం లేదంటూ వారు కొత్త రాగాన్ని అందుకోవడం గమనార్హం. ఈవిధంగా సొంత పార్టీ నేతలతో, ఇతర పార్టీల నాయకులతో, మంత్రులతో, అధికారులతో పంచాయతీలు పెట్టుకుంటూ ముందుకు సాగుతున్న ఉమ్మడి పాలమూరు కాంగ్రెస్ రాజకీయం ఎటువైపునకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే! -
భక్తిశ్రద్ధలతో బక్రీద్ వేడుకలు
స్టేషన్ మహబూబ్నగర్: బక్రీద్ (ఈద్ ఉల్ అజ్హా) పండుగను ముస్లింలు శనివారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో ఉదయం నుంచే ఆనందోత్సాహాలతో ఈద్గాలు, మసీదుల వద్దకు చేరుకొని ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జిల్లాకేంద్రంలోని రహెమానియా ఈద్గాలో వేలాదిమంది ముస్లింలు ఈద్ ప్రార్థనలు చేశారు. జామియా మసీదు ప్రధాన ఇమామ్ మౌలానా మహ్మద్ హాఫిజ్ ఇస్మాయిల్ ప్రత్యేక ప్రార్థనలు జరిపించారు. పండుగ ప్రాశస్త్యాన్ని ఖుత్బా రూపంలో వివరించారు. అనంతరం లోక కల్యాణం కోసం దువా (ప్రార్థన) చేశారు. బక్రీద్ను పురస్కరించుకొని పలువురు ప్రముఖులు ముస్లింలకు ఈద్ ముబారక్ చెప్పారు. ఖ్వామీ ఏక్తా కమిటీ తరపున ఈద్గా ఆవరణలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద ప్రజాప్రతినిధులు, అధికారులు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. త్యాగాన్ని, క్షమను గుర్తుచేస్తూ స్వార్థాన్ని త్వజించాలన్నదే బక్రీద్ పండుగ మనకు ఇచ్చే సందేశం అన్నారు. ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్గౌడ్, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్పీ వెంకటేశ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు సంజీవ్ ముదిరాజ్, వినోద్కుమార్, భగవంతురావు ఉన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షబ్బీర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ఖాద్రీ, అబ్దుల్ జకీ, అజ్మత్అలీ, అవేజ్, ఫయాజ్, గులాం జహీర్, షాఫైసల్, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. బక్రీద్ను పురస్కరించుకుని ఈద్గాల వద్ద ప్రత్యేక పోలీసు బందోబస్తు నిర్వహించారు. -
‘పాలమూరు’కు మరో అమాత్యగిరి
కర్ణాటక సరిహద్దులో ఉన్న మక్తల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీహరికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో మంచి సాన్నిహిత్యం ఉంది. మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తారనే పేరు శ్రీహరికి ఉంది. సర్పంచ్గా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉండగా.. నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా సైతం బాధ్యతలు చేపట్టారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్రను మక్తల్ నియోజకవర్గంలో విజయవంతం చేసి ప్రశంసలు పొందారు. రాష్ట్రంలో బీసీ జనాభాలో అత్యధికంగా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటికి మంత్రి పదవి.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు మేలు చేస్తుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఇవన్నీ శ్రీహరికి కలిసి రాగా.. ఆయన పేరు ఖరారైనట్లు గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎలాంటి అవరోధాలు లేకుంటే ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే మంత్రి అయిన ఘనత శ్రీహరికి దక్కనుంది. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి పాలమూరుకు మరో అమాత్యగిరి దక్కనుంది. నారాయణపేట జిల్లా మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వాకిటి శ్రీహరిని మంత్రి పదవి వరించనుంది. కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ చేసిన జాబితాలో ఆయన పేరున్నట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. బీసీ కోటాలో వాకిటితో పాటు రాష్ట్రంలో పలు సామాజిక వర్గాలకు చెందిన మరో ముగ్గురు లేదా నలుగురికి సీఎం రేవంత్రెడ్డి కేబినెట్లో చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఆదివారం మధ్యాహ్నం తర్వాత ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్లో ఒకే ఒక్క ముదిరాజ్ ఎమ్మెల్యే.. రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గంలో అత్యధిక జనాభా ఉన్న ముదిరాజ్లకు మొదటి విడతలో మంత్రి పదవి లభించలేదు. దీంతో ముదిరాజ్ల నుంచి విమర్శలు వెల్లువెత్తగా.. రెండో విడతలో చేపట్టే మంత్రి వర్గ విస్తరణలో ఆ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఖాయమని కాంగ్రెస్ పెద్దలు సంకేతాలు ఇచ్చారు. గతేడాది లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలుమార్లు ఉమ్మడి జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్రెడ్డి.. ముదిరాజ్ల విజ్ఞప్తి మేరకు వారిని బీసీ–డీ నుంచి ఏ కేటగిరికి మారుస్తామని.. దీంతోపాటు ఈసారి మంత్రివర్గ విస్తరణలో ముదిరాజ్లకు స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఆ సామాజిక వర్గానికి చెంది.. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో వాకిటి శ్రీహరి మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ కూర్పులో ఆయనకు బెర్త్ ఖరారైంది. కాగా.. కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా, కొల్లాపూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జూపల్లి కృష్ణారావు మంత్రిగా ఉండగా ఇప్పుడు శ్రీహరికి బెర్త్ దక్కడంతో.. రాష్ట్ర కేబినెట్లో ఉమ్మడి పాలమూరు జిల్లాకు పెద్దపీట వేసినట్లయింది. ఖర్గేతో సాన్నిహిత్యం.. రాహుల్తో ప్రశంసలు.. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి కేబినెట్ బెర్త్ ఖరారు ఫైనల్ చేసిన కాంగ్రెస్ అధిష్టానం.. నేడు ప్రమాణస్వీకారం చేసే అవకాశం -
నెలకు మూడు చీరలు..
గతంలో మాస్టర్ వీవర్స్పై ఆధారపడి మగ్గాలపై చీరలు నేసి కుటుంబాన్ని పోషించుకునేవాడిని. ప్రస్తుతం కంపెనీ ద్వారా ముడి సరుకులతో పాటు మగ్గాన్ని ఇవ్వడం, తయారు చేసిన చీరలకు మాస్టర్ వీవర్స్ కంటే అధిక ధర వస్తుంది. దీంతో మూడేళ్లుగా నెలకు మూడు జరీ చీరల తయారీతో రూ.12 వేల ఆదాయం పొందుతున్నా. – దాస్పత్తి తిమ్ములు, నేత కార్మికుడు అత్యంత ప్రామాణికంతో.. చేనేత ఉత్పత్తుల సంఘం ఏర్పాటుతో తమకు జీవనోపాధి దొరికినట్లయింది. మాస్టర్ వీవర్స్ వద్ద చీరలు నేయడం వల్ల వారం, పక్షం రోజులకు వేతనాలు అందించేవారు. ప్రస్తుతం సంఘం ద్వారా చీరలు నేస్తూ నెలకు రెండు చీరలను అత్యంత ప్రామాణికంతో తయారు చేయడం వల్ల అధిక డబ్బులు వస్తున్నాయి. నెలలో రెండు చీరల తయారీతో రూ.20– 25 వేల ఆదాయం వస్తుంది. – స్వప్న, నేత కార్మికురాలు స్థల ప్రభావం లేదు.. ఇంట్లో మగ్గాల ఏర్పాటుకు స్థలాలు ఉండేవి కాదు. దీంతో కిరాయి ఇంట్లో ఉంటూ మగ్గాలను నేసుకొని చీరలు తయారు చేసేవాళ్లం. ప్రస్తుతం సంఘం ద్వారా భవనం నిర్మించడం, వీటిలోనే మగ్గాలు ఏర్పాటు చేయడంతో ప్రతిరోజు అక్కడికే వెళ్లి జరీ చీరలు నేస్తూ జీవనం సాగిస్తున్నా. – పద్మ, నేత కార్మికురాలు నెలవారీగా వేతనాలు.. అప్పట్లో యజమానుల ద్వారా డబ్బులు తీసుకుని చీరలు నేసి వాటి ద్వారా అడ్వాన్సుగా తీసుకున్న డబ్బులను చెల్లించేవాళ్లం. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. స్వయంగా తయారు చేసిన చీరలకు క్రమం తప్పకుండా నెలవారీగా వేతనాలు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నారు. – గంజి కృష్ణయ్య చేనేత అంతరించకుండా.. పుట్టి పెరిగిన ఊరిలో చేనేత కార్మికులు ఉపాధి కోల్పోవడం చూసి సగటు నేత కార్మికుడిగా ఎంతో బాధపడ్డా. ఇలాంటి పరిస్థితుల నుంచి చేనేత పరిశ్రమను కాపాడాలని భావించా. స్వయంగా నేత కార్మికులను యజమానులను చేయాలనుకున్నా. నాబార్డుతో సంప్రదించి కంపెనీ ఏర్పాటుకు ప్రయత్నించా. కార్మికులు, ప్రజల సహకారంతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధుల చొరవతో కంపెనీ ఏర్పాటు చేశాను. 40 మందితో ప్రారంభించి ఇప్పుడు 538 కార్మికులతో కొనసాగుతోంది. వచ్చిన ఆదాయంతో పాటు తయారు చేసిన చీరలకు నెలవారీగా వేతనాలు అందిస్తూ కార్మికుల ఆర్థిక పురోగతికి కృషి చేస్తున్నాం. – మహంకాళి శేఖర్, కంపెనీ సీఈఓ ● -
‘సీఈఐఆర్’తో పట్టేస్తున్నారు..!
మహబూబ్నగర్ క్రైం: ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో మనిషి రోజువారి దినచర్యలో సెల్ఫోన్ భాగమైంది. ప్రతిఒక్కరి దగ్గర విలువైన స్మార్ట్ఫోన్లు ఉంటున్నాయి. అయితే గతంలో ఫోన్లు చోరీకి గురైనా లేదా ఎక్కడైనా పోగొట్టుకున్నా తిరిగి దొరకడం చాలా కష్టంగా ఉండేది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కోల్పోయిన ఫోన్లను వెంటనే గుర్తించి బాధితులకు అప్పగిస్తున్నారు. సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో పోగొట్టుకున్న సెల్ఫోన్లను వెనువెంటనే గుర్తించి రికవరీ చేస్తున్నారు. జిల్లాలో ఇటీవల కాలంలో సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫోన్ల రికవరీ శాతం గణనీయంగా పెరిగింది. దీంతో రూ.వేలు వెచ్చించి కొనుగోలు చేసిన ఫోన్లు పలు సందర్భాల్లో చోరీలకు గురై కోల్పోయిన బాధితులు సకాలంలో తిరిగి లభించడం వల్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది చోరీకి గురైన సెల్ఫోన్ల వివరాలు పోలీస్స్టేషన్ మొత్తం రికవరీ ఫిర్యాదులు చేసిన ఫోన్లు అడ్డాకుల 12 1 బాలానగర్ 91 40 చిన్నచింతకుంట 41 30 భూత్పూర్ 101 27 దేవరకద్ర 99 31 హన్వాడ 29 20 జడ్చర్ల 284 103 కోయిలకొండ 13 4 మ.నగర్ రూరల్ 149 63 వన్టౌన్ 145 35 టూటౌన్ 224 103 మిడ్జిల్ 33 15 మహమ్మదాబాద్ 26 20 మూసాపేట్ 26 20 నవాబ్పేట 43 10 రాజాపూర్ 29 5 పోలీస్స్టేషన్ల వారీగా.. జిల్లాలో 2024లో 3,261 సెల్ఫోన్లు పోయినట్లు ఫిర్యాదులు అందగా ఇందులో సీఈఐఆర్ పోర్టల్ ద్వారా 1,141 ఫోన్లను గుర్తించి బాధితులకు అప్పగించారు. ఇందులో అత్యధికంగా జడ్చర్ల పోలీస్స్టేషన్ పరిధిలో 715, మహబూబ్నగర్ టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో 576 ఫిర్యాదులు, వన్టౌన్ 381, రూరల్ 337, దేవరకద్ర 230, బాలానగర్ 210 ఫిర్యాదులు వచ్చాయి. ఇక ఈ ఏడాది మే 31 వరకు 1,348 ఫిర్యాదులు రాగా.. ఇందులో 520 ఫోన్లను రికవరీ చేయడం జరిగింది. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు.. సీఈఐఆర్ పోర్టల్ వంటి సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత బాధితులు కోల్పోయిన సెల్ఫోన్లు త్వరగా రికవరీ చేసి తిరిగి అప్పగిస్తున్నాం. బాధితులు ఎవరైతే ఫోన్లు కోల్పోయిన వారు ఉంటే మొదట సీఈఐఆర్ పోర్టల్లో నమోదు చేసి తర్వాత సదరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. – వెంకటేశ్వర్లు, డీఎస్పీ చోరీకి గురైన సెల్ఫోన్ల గుర్తింపులోసాంకేతిక తోడ్పాటు రూ.వేల విలువైన ఫోన్లు తిరిగి వస్తుండటంతో బాధితుల ఆనందం -
మతసామరస్యాన్ని కాపాడుకోవాలి
మహబూబ్నగర్ క్రైం: బక్రీద్ పండగ సందర్భంగా శనివారం జిల్లాకేంద్రంలో ఉన్న ఈద్గాల దగ్గర ఎస్పీ డి.జానకి బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించారు. ముస్లింలు సామూహికంగా ప్రార్థనలు నిర్వహిస్తున్న సందర్భంలో అక్కడ ఏర్పాటు చేసిన పోలీస్ భద్రతను ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో శాంతి, సామరస్యం నిలుపుకోవడం అందరి బాధ్యత అని, వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. పోలీసులు ఎప్పుడూ కూడా ప్రజలతో స్నేహపూర్వకంగా ప్రవర్తించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు అప్పయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి పాలమూరు: జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఇథనాల్ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ చేసిన దీక్షల నేపథ్యంలో రైతులపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దధన్వాడ గ్రామంలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటు కోసం 2023లో అప్పటి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, కానీ, 12 గ్రామాల రైతులు, ప్రజలు కంపెనీ ఏర్పాటు చేయవద్దని కోరుతున్నారని చెప్పారు. సరైన న్యాయం కోసం శాంతియుతంగా దీక్షలు చేస్తున్నారన్నారు. ఇప్పటికే చిత్తనూర్లో ఇథనాల్ కంపెనీ వల్ల పెరిగిన కాలుష్య పరిస్థితిని అర్థం చేసుకుని కంపెనీ రద్దు చేయకపోతే తమ భవిష్యత్ కోల్పోవాల్సి వస్తోందని ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓపెన్ స్కూల్ ఫలితాలు విడుదల మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గత నెల మొదటి వారంలో జరిగిన ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. ఈ మేరకు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి 559 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 374 మంది (67.09 శాతం) ఉత్తీర్ణులయ్యారు. అలాగే జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలో 455 మంది పరీక్ష రాయగా.. 255 మంది (52.43 శాతం), వనపర్తి జిల్లా పరిధిలో 346 మందికి గాను 289 (88.59 శాతం), నాగర్కర్నూల్ జిల్లాలో 353 మందికి గాను 235 (67.10 శాతం), నారాయణపేటలో 503 మంది పరీక్ష రాయగా.. 424 మంది (84.48 శాతం) ఉత్తీర్ణత నమోదు చేశారు. ● ఇంటర్మీడియట్కు సంబంధించి మహబూబ్నగర్ జిల్లాలో 841 మంది పరీక్ష రాయగా.. 490 మంది (60.21 శాతం) ఉత్తీర్ణత సాధించారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 652 మందికి గాను 412 (63.12 శాతం), వనపర్తి పరిధిలో 510 మందికి గాను 370 మంది (72.84 శాతం), నాగర్కర్నూల్లో 746 మందికి గాను 546 మంది (73.30 శాతం), నారాయణపేట జిల్లాలో 897 మందికి గాను 528 మంది (59.62 శాతం) నమోదు చేసినట్లు డీఈఓ ప్రవీణ్కుమార్, ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ శివయ్య పేర్కొన్నారు. ‘పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి’ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఉపాధి హామీ కూలీలతోపాటు ఫీల్డ్ అసిస్టెంట్ల (ఎఫ్ఏ)కు వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్ అన్నారు. శనివారం సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూలీలకు తొమ్మిది వారాల నుంచి, ఎఫ్ఏలకు మూడు నెలల నుంచి వేతనాలు అందడం లేదన్నారు. ఈ విషయమై గత నెల 30న కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పెరుగుతున్న ధరలకనుగుణంగా ఉపాధి కూలీలకు రోజుకు రూ.600, పని దినాలు 200 రోజులకు పెంచాలని, ఎఫ్ఏలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని, 4 కి.మీ. దూరం పనికి వెళితే ఆటో చార్జీలు సైతం చెల్లించాలన్నారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 9న హైదరాబాద్లోని గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనరేట్ (సీఆర్డీ) ఎదుట నిర్వహించే ధర్నాలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. -
ప్లాస్టిక్ రహితం
మైసమ్మ అడవిఅటవీ సంరక్షణకు ప్రభుత్వం చర్యలు నవాబుపేట: నల్లమల అటవీ ప్రాంతం సరసన పర్వతాపూర్ మైసమ్మ అడవి నిలుస్తోంది. అక్కడ పెద్దపులులు ఇతర వన్యప్రాణులు ఉండగా.. ఇక్కడ చిరుతలకు ఆవాసంగా అటవీ ప్రాంతం ఉంది. అయితే అటవీ ప్రాంతాల్లోని మార్గాల్లో ప్రయాణించే వారు ప్లాస్టిక్ వ్యర్థాలు వేస్తుండటంతో వన్యప్రాణ్యుల మనుగడకు ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్లాస్టిక్ రహితంగా అడవులను తీర్చిదిద్దాలని సంకల్పించింది. నల్లమల తరహాలోనే మైసమ్మ అడవిని సైతం ప్లాస్టిక్ రహితంగా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, రాష్ట్రస్థాయిలో పర్వతాపూర్ మైసమ్మ అడవిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రతి ఆది, మంగళవారాల్లో మైసమ్మ దర్శనానికి వేలాది భక్తులు వస్తుంటారు. ఇతర రోజుల్లో సైతం అడవిలో రద్దీ ఉంటోంది. ఈ తరుణంలో అడవి సంరక్షణ కోసం అందరూ బాధ్యతగా ప్లాస్టిక్ నిషేధం పాటించాల్సిన అవసరం ఉంది. నల్లమలను తలపిస్తున్న మైసమ్మ అడవి అందరూ సహకరించాలి.. మైసమ్మ అడవిని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలి. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ప్లాస్టిక్ వ్యర్థాలను అడవిలో వేయొద్దు. ఆలయ ఆవరణలోని వ్యాపారులు సైతం ప్లాస్టిక్ వినియోగం మానుకోవాలి. అడవిలో ఆధ్యాత్మిక వాతావరణం కల్పించేందుకు అందరూ సహకరించాలి. – జగన్మోహన్రెడ్డి, మైసమ్మ ఆలయ కమిటీ చైర్మన్ ● -
9,10 తేదీల్లో ఇంట్రా డిస్ట్రిక్ట్ మహిళా క్రికెట్ లీగ్
మహబూబ్నగర్ క్రీడలు: ఎండీసీఏ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో మొదటిసారిగా ఇంట్రా డిస్ట్రిక్ట్ ఉమెన్స్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా అండర్–23, అండర్–19 ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ లీగ్లను విజయవంతంగా నిర్వహించారు. ఇప్పుడు మహిళా క్రికెట్ లీగ్ పోటీలకు శ్రీకారం చుట్టారు. 9, 10 తేదీల్లో మహిళా క్రికెట్ లీగ్ ఉమ్మడి జిల్లాలో మొదటిసారిగా మహిళా క్రికెట్ లీగ్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 9,10 తేదీల్లో మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని సమర్థ స్కూల్ మైదానంలో మహిళా క్రికెట్ లీగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎండీసీఏ ఆధ్వర్యంలో లీగ్కు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. లీగ్లో పాల్గొనే జట్లను ఈనెల 1న ఎంపిక చేశారు. బ్యాటింగ్, బౌలింగ్ అంశాల్లో పరీక్షించి క్రీడాకారిణులను ఎంపిక చేశారు. లీగ్లో ఎక్కువ పాయింట్లు సాధించిన జట్టు చాంపియన్గా నిలుస్తుంది. లీగ్ మ్యాచ్ల వివరాలు.. క్రికెట్ లీగ్ టోర్నమెంట్లో పాల్గొనే మహిళా క్రీడాకారిణులను మూడు జట్లుగా విభజించారు. 30 ఓవర్ల మ్యాచ్లు నిర్వహించనున్నారు. ఈనెల 9న రెడ్–బ్లూ జట్లు, బ్లూ–పింక్ జట్లు, 10న పింక్–రెడ్ జట్లు లీగ్ మ్యాచ్లు ఆడనున్నాయి. బ్లూ మహిళా జట్టు.. మంజుల (కెప్టెన్), స్వాతి, కరీనా, మనీషా, ప్రవళిక, శ్రవంతి, దివ్య, నిర్మల, తనుజశ్రీ, తేజశ్రీ, శారద, సాయిశృతి, సాయి ప్రణవి, స్పందన, సంజన. రెడ్ జట్టు... అనిత (కెప్టెన్), అక్షర రాథోడ్, వైశాలి, అనూష, మహేశ్వరి, మంజు, ప్రతీక, మీనాక్షి, సింధూజ, కీర్తన, గోపిక, యూ.కీర్తన, నందిని, లోకేశ్వరి, భానుమతి. పింక్ జట్టు.. త్రివేణి (కెప్టెన్), ఇందు, నిహారిక, చంద్రకళ, పవిత్ర, రిషికాసాయి, ఎన్.కవిత, మనీషా, వెన్నెల, శైలు, మేఘన, ఎం.నందిని, మౌనిక, పద్మ, ఐశ్వర్య. మూడు జట్లతో లీగ్ నిర్వహణ లీగ్లో అధిక పాయింట్లు సాధించిన జట్టు విజేత -
ప్రభుత్వ బడులను బలోపేతం చేద్దాం
కొత్తకోట రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపునకు ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) రాష్ట్ర అధ్యక్షుడు హన్మంతరావు కోరారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన బడిబాట కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మండలంలోని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నారని.. ఉచితంగా యూనిఫామ్స్, పాఠ్య, రాత పుస్తకాలు, సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు చెప్పారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన బోధన అందుతుందని.. బడిబాట ద్వారా బడిఈడు పిల్లలను పాఠశాలలో చేర్పించేలా ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టుల్లో వలంటీర్లను నియమించాలని, పెండింగ్లో ఉన్న ఐదు డీఏలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, పీఆర్సీ నివేదిక తెప్పించుకొని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎలాంటి అన్యాయం జరిగినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల అమరేందర్రెడ్డి, మండల విద్యాధికారి కృష్ణయ్య, నోడల్ అధికారి కుర్మయ్య, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వివేకానంద, తపస్ ప్రధానకార్యదర్శి విష్ణువర్ధన్, ఉపాధ్యక్షులు దేవన్న, శివ నారాయణ, లక్ష్మయ్య, రాములు, అరవింద్రెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, కిరణ్కుమార్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విత్తనంతో అధిక దిగుబడి
అలంపూర్: నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడి సాధ్యమని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి సక్రియ నాయక్ పేర్కొన్నారు. వర్షాలు ప్రారంభం కావడంతో రైతులు పంటల సాగుకు సన్నద్ధం అవుతుండడంతో ఆయన పలు సూచనలు చేశారు. బ్రీడర్, సర్టిఫైడ్, టూత్ ఫూల్ లేబుల్స్లో నాణ్యమైన విత్తనాలు లభిస్తాయని ఇందులో ఏ రకాన్ని సాగు చేసినా మంచి ఫలితం ఉంటుందన్నారు. వీటితో రైతులు విత్తన భారం తగ్గించుకోవడంతో పాటు తోటి రైతులకు అందించి అధిక రేటు పొందవచ్చన్నారు. బ్రీడర్ విత్తనం : ఇది అన్ని రకాల విత్తనాలకు మూల విత్తనం. దీన్ని కంపెనీలు ఆయా బ్రీడర్ల పర్యవేక్షణలో పండిస్తారు. వ్యవసాయ పరిశోధన స్థానాల్లో శాస్త్రవేత్తలు తయారు చేసేది ఇలాంటి విత్తనాలే. ఈ విత్తనం వంద శాతం జన్యు నాణ్యత కలిగి ఉంటుంది. బ్రీడర్ సీడ్కు బంగారు రంగు ట్యాగ్ వేస్తారు. సీడ్ ధర ఎక్కువ. రైతులకు రెండు కిలోలకు మించి ఇవ్వరు. ఫౌండేషన్ విత్తనం : ఈ విత్తనాన్ని బ్రీడర్ విత్తనం నుంచి ఉత్పత్తి చేస్తారు. వివిధ విత్తనోత్పత్తి సంస్థలు, సాంకేతిక నిపుణుల అధ్వర్యంలో వీటిని పండిస్తారు. దాదాపు వంద శాతం జన్యు నాణ్యత ఉంటుంది. ప్రైవేటు విత్తన కంపెనీలు వ్యవసాయ పరిశోధన సంస్థల నుంచి బ్రీడర్ విత్తనాలు తీసుకెళ్లి ఫౌండేషన్ విత్తనాన్ని తయారు చేస్తాయి. ఈ సీడ్కు తెలుపు రంగు ట్యాగ్ వేస్తారు. సర్టిఫైడ్ (ధ్రువీకరించిన) విత్తనం : దీన్ని ఫౌండేషన్ విత్తనం నుంచి వేరుగా ఉత్పత్తి చేస్తారు. వివిధ సంస్థలు, రైతుల పొలాల్లో విత్తన పర్యవేక్షకుల సమక్షంలో వీటిని తయారు చేస్తారు. ఈ విత్తనానికి నీలి రంగు ట్యాగ్ వేస్తారు. పాడి–పంట -
చిన్నరాజమూర్ గుట్టల్లో చిరుత సంచారం
దేవరకద్ర రూరల్: దేవరకద్ర మండలం, చిన్నరాజమూర్ సమీపంలోని పులిగుట్టపై శనివారం చిరుత సంచారం కలకలం రేపింది. సాయంత్రం సమయంలో రహదారిపై వెళ్తున్న గ్రామ యువకులకు గుట్టపై చిరుత సంచరిస్తూ కనిపించింది. కొద్దిసేపు గుట్టపై అటు, ఇటు తిరిగి అక్కడే ఉన్న చిన్న గుహలోకి వెళ్లిందని, చిరుతతో పాటు ఒక చిన్న చిరుత పిల్ల కూడా ఉండటం గమనించినట్లు యువకులు తెలిపారు. గుట్టపై చిరుత సంచరిస్తున్నట్లు ప్రచారం జరగడంతో స్థానికులు, సమీప వ్యవసాయ పొలాల రైతులు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయంపై అధికారులకు సమాచారం అందించినట్లు గ్రామస్తులు తెలిపారు. జూరాలకు నిలకడగా ఇన్ఫ్లో ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో నిలకడగా కొనసాగుతున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. శనివారం ప్రాజెక్టుకు 7,500క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా 1500 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–1కు 650 క్యూసెక్కులు, కోయిల్ సాగర్కు 315 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 68 క్యూ సెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 2,533 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 8.551 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. -
హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్కు కృతజ్ఞతలు..
ఉమ్మడి జిల్లాలో తొలిసారిగా ఇంట్రా డిస్ట్రిక్ట్ ఉమెన్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నందుకు హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్కు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఉమ్మడి జిల్లాలో మూడు జట్లతో మహిళా లీగ్ నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నాం. ఈ అవకాశాన్ని మహిళా క్రికెటర్లు సద్వినియోగం చేసుకోవాలి. హెచ్సీఏ మహిళా లీగ్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారిణులు ప్రతిభ చాటాలి. త్వరలో జరిగే హెచ్సీఏ ఉమెన్స్ లీగ్లో పాల్గొనే ఉమ్మడి మహిళా జట్టును ఈనెల 10న ఎంపిక చేస్తాం. ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్లో మహిళా క్రీడాకారిణులు రాణించాలి. ఇటీవల అండర్–23 టూడేలీగ్, అండర్–19 లీగ్లను విజయవంతంగా నిర్వహించాం. మహిళా క్రికెట్ లీగ్ను కూడా అదే విధంగా నిర్వహిస్తాం. – ఎం.రాజశేఖర్, ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ● -
ఆర్టీసీ బస్సులో మహిళల సిగపట్లు
వనపర్తి రూరల్: పాన్గల్ మండలం బుసిరెడ్డిపల్లి నుంచి వనపర్తి జిల్లా కేంద్రానికి వస్తున్న ఆర్టీసీ బస్సులో శనివారం మహిళలు సిగపట్లు పట్టారు. బస్సులో సీటు కోసం మహిళల మధ్య మొదలైన గొడవ.. ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్థాయికి చేరింది. తోటి ప్రయాణికులతో పాటు బస్సు కండెక్టర్ సర్దిచెప్పినా ఫలితం లేకపోయింది. మహిళల మధ్య గొడవ తారస్థాయికి చేరుకోవడంతో రూరల్ పోలీస్స్టేషన్ వద్ద బస్సును డ్రైవర్ నిలిపారు. గొడవకు దిగిన మహిళలను బస్సులో నుంచి దించి అందరూ సర్దిచెప్పడంతో శాంతించారు. అదే బస్సులో బస్టాండ్కు వెళ్లిపోయారు. ఈ ఘటనపై ఎస్ఐ జలేందర్రెడ్డిని వివరణ కోరగా.. బాధితుల నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. -
ఏడు గంటల వ్యవధిలో కేసు ఛేదన
గద్వాల క్రైం: నిలిపి ఉంచిన 10 టైర్ల లారీని గుర్తు తెలియని దుండగులు అపహరించిన ఘటనలో పోలీసులు ఏడు గంటల వ్యవధిలోనే కేసును ఛేదించారు. పట్టణ ఎస్ఐ కళ్యాణ్కుమార్ శనివారం తెలిపిన వివరాల మేరకు. ఈ నెల 5వ తేదీన తెల్లవారుజామున గద్వాల పట్టణంలోని మార్కెట్ యార్డులో ఏపీ 39 వీడీ 6377 నంబర్ గల 10 టైర్ల గల లారీని నలిపి యాజమాని సాధిక్ ఇంటికి వెళ్లాడు. అయితే సాయంత్రం 3 గంటల సమయంలో వచ్చి చూడగా లారీ కనిపించలేదు. ఆందోళన చెందిన సాధిక్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సమీప సీసీ కెమెరాలను పరిశీలించగా లారీ ఎర్రవల్లి వైపుగా వెళ్తున్నట్లు రికార్డు అయ్యిందన్నారు. వాటి ఆధారంగా లారీని అపహరించిన దుండగులను పట్టుకునేందుకు సిబ్బంది టోల్ప్లాజాల వద్ద పహారాగా ఉండగా దుండగులు చాకచాక్యంగా వ్యవహరించారన్నారు. పెబ్బేరు, వనపర్తి, బిజనేపల్లి, బాలానగర్ మీదుగా రాయకల్ టోల్ప్లాజా సమీపంలోని ఓ దాబా వద్ద లారీని నిలిపిన దుండగులు నంబర్ను ఏపీ 39 డబ్ల్యూ 3553గా మార్పులు చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే సిబ్బంది లారీని గుర్తించి అక్కడికి చేరుకోవడంతో దుండగులు తప్పించుకున్నారన్నారు. శనివారం తెల్లవారుజామున లారీని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. లారీ విలువ రూ.15లక్షలు ఉంటుందన్నారు. కేసు చేధనలో సాంకేతిక విభాగ సిబ్బంది చంద్రయ్య, కిరణ్, రాజుయాదవ్ కీలకంగా వ్యవహరించారన్నారు. సీసీ కెమెరా రికార్డుల ద్వారా నిందితులను గుర్తించి త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు. చోరీకి గురైన రూ.15లక్షల విలువ గల లారీ స్వాధీనం పరారీలో నిందితులు -
ప్రపంచంతోనే పోటీ పడేలా తెలంగాణ
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘మాది ప్రజా ప్రభుత్వం..ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడమే మా అంతిమ లక్ష్యం. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో ప్రపంచంతోనే పోటీ పడేలా తెలంగాణను తీర్చిదిద్దుకుంటున్నాం’అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మహబూబ్నగర్ జిల్లాలోని మూసాపేట, నవాబ్పేటలలో శుక్రవారం మంత్రి జూపల్లితో కలిసి సబ్స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభల్లో భట్టి మాట్లాడుతూ తలాపున ఉన్న కృష్ణమ్మను ఈ ప్రాంతానికి మళ్లించడానికి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాలే అని గుర్తు చేశారు.గత పదేళ్లలో బీఆర్ఎస్ కాలం వెళ్లదీసిందే తప్ప గుక్కెడు నీళ్లు ఇవ్వలేదన్నారు. ఎన్నికలకు ముందుగా నార్లపూర్ పంప్ను ఆన్ చేసి అరచేతిలో వైకుంఠం చూపించారని విమర్శించారు. తామే పాలమూరు పనులను పూర్తి చేస్తామన్నారు.బీఆర్ఎస్ పాలనలో నీళ్లు రాలేదని.. నిధులు ఆవిరయ్యాయని.. దొంగల్లా అందిన కాడికి దోచుకున్నారని భట్టి మండిపడ్డారు. నాటి పాలకులకు ప్రజలపై ప్రేమ లేదని వారి కుటుంబసభ్యులే వాస్తవాలను బయటపెడుతున్నారని తెలిపారు.అధికారం పోయిందనే కేసీఆర్కు దుఃఖం: జూపల్లిరాష్ట్రంలో 17 నెలల పాలన చూస్తుంటే తనకు దుఃఖం వస్తోందని వరంగల్ సభలో మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడ డాన్ని మంత్రి జూపల్లి ప్రస్తావిస్తూ.. అధికారం పోయిందని, కుటుంబసభ్యులకు పదవులు పోయాయనే ఆయనకు దుఃఖం వస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో 22 మంది ముఖ్యమంత్రులు పాలన చేస్తే రూ.65 వేల కోట్ల అప్పు ఉండగా.. కేవలం పదేళ్ల పాలనలో కేసీఆర్ రూ.7.30 లక్షల కోట్ల అప్పు చేశారని మండిపడ్డారు.60 ఏళ్లు పరిపాలన చేసిన కాంగ్రెస్ వద్ద పార్టీ ఫండ్ రూ.15 కోట్లు ఉండగా, కేవలం పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్కు రూ.1,500 కోట్ల పార్టీ ఫండ్ ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు అనిరుధ్రెడ్డి, మధుసూదన్రెడ్డి, మేఘారెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నువ్వా.. నేనా!
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన అనంతరం సుమారు ఆరు నెలల వరకు గద్వాల జిల్లా కాంగ్రెస్లో పెద్దగా లుకలుకలు లేవు. బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి కాంగ్రెస్లో చేరడంతో వర్గ పోరు మళ్లీ తీవ్రమైంది. జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత, బండ్ల బీఆర్ఎస్లో ఉన్నంతకాలం ఇరువురి మధ్య ఆధిపత్య పోరు నడిచింది. 2023 ఎన్నికల ముందు సరిత కాంగ్రెస్లో చేరి.. ఎమ్మెల్యేగా పోటీ చేసిన విషయం తెలిసిందే. బండ్ల చేతిలో ఓటమి పాలైనప్పటికీ.. నియోజకవర్గంలో ఆమెదే పైచేయిగా నిలిచింది. ఎప్పుడైతే ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డిని మంత్రి జూప ల్లి కాంగ్రెస్లో చేర్పించారో.. అప్పటి నుంచి వర్గ పోరు మళ్లీ మొదలైంది. ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పర్యటనలో ఎమ్మె ల్యే ఏ పార్టీలో ఉన్నారంటూ సరిత వర్గీయులు నినాదాలు చేయడం, ప్రతిగా బండ్ల వర్గం వాదనకు దిగడం రాష్ట్రవ్యాప్తంగా హాట్టాపిక్గా మారింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేకు మంత్రి జూపల్లి.. సరితకు ఎంపీ మల్లురవి అండదండలు ఉ న్నట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్లో నేతల మధ్య తారస్థాయికి ఆధిపత్య ‘పోరు’ ● ఇప్పటికే గద్వాలలో సరిత, ఎమ్మెల్యే బండ్ల మధ్య వైరం ● తాజాగా తెరపైకి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడి ఎపిసోడ్.. ● సరిత ఇంట్లో తేనేటి విందుకు హాజరుకావడంపై దుమారం ● ఎంపీ మల్లు రవిపై మాజీ ఎమ్మెల్యే సంపత్ వర్గీయుల మండిపాటు ● పలువురికి షోకాజ్ నోటీసులు.. ప్రతిగా ఎంపీపై అధిష్టానానికి ఫిర్యాదు ● పోటాపోటీ పరిణామాలతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: నువ్వా.. నేనా అన్నట్లు నేతల మధ్య ఆధిపత్య పోరుతో జోగులాంబ గద్వాల జిల్లాలో అధికార పార్టీ కాంగ్రెస్ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. గద్వాల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ సరిత మధ్య వైరం ఇదివరకే పార్టీ అధిష్టానానికి సంకటంగా మారగా.. ఇటీవల అలంపూర్ సెగ్మెంట్కు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడి ఎపిసోడ్ మరిన్ని తలనొప్పులు తెచ్చిపెట్టింది. సరిత ఇంట్లో తేనీటి విందుకు నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి.. విజయుడిని వెంటబెట్టుకుని వెళ్లడంతో వివాదం తలెత్తింది. దీంతో మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మధ్య ఉన్న వైషమ్యాలు వీధికెక్కాయి. ఈ క్రమంలో పలువురు యువజన నాయకులకు షోకాజ్ నోటీసుల జారీ.. ప్రతిగా ఎంపీ వైఖరిపై సంపత్ అధిష్టానానికి ఫిర్యాదు చేయడం వంటి పోటాపోటీ పరిణామాలు కాంగ్రెస్ను కుదిపేస్తున్నాయి. తెరదించే ప్రయత్నం.. అంతలోనే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు ఎపిసోడ్ కాంగ్రెస్ లో కలకలం సృష్టించగా.. వివాదంపై ఎంపీ మల్లు రవి స్పందించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యాధృచ్ఛికంగా సరిత ఇంట్లో తేనేటి విందుకు విజయుడితో కలిసి హాజరయ్యామని.. మా మధ్య రాజకీయ పరమైన చర్చలు జరగలేదని వీడియోను పోస్టు చేశారు, సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం కల్పితాలేనంటూ కొట్టిపారేశారు. తాను డబ్బులు తీసుకున్నానని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతానని చెప్పారు. ఎంపీ స్పందనతో వివాదం సద్దుమణిగిందని భావిస్తు న్న తరుణంలో మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ వర్గీయులైన యువజన కాంగ్రెస్ నాయకులు కోల నర్సింహ, వరకుంట్ల గణేష్, కేఎంఆర్ యేసు, కాశపోగు శేఖర్ తదితరులకు షోకాజ్ నోటీసులు జారీ కావడం మళ్లీ మలుపు తిరిగినట్లయింది. ప్రతిగా సంపత్ తన వర్గీయులతో కలిసి మల్లురవితో పాటు సరితపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్కు పలువురు నాయకులు సంతకాలతో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులను ఇప్పించి.. వారి నుంచి 10 శాతం కమీషన్ వసూలు చేసినట్లు ఎంపీపై ఫిర్యాదు చేయడంతోపాటు ప్రజాభిప్రాయా నికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ పార్టీని అభాసుపాలు చేస్తున్నారని.. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరడం మరింత సెగ రాజేసినట్లు తెలుస్తోంది.ఈ పరిణామాలతో గద్వాల జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. నడిగడ్డలో ‘హస్త’వ్యస్తం గద్వాల -
మూడేళ్లలో పాలమూరు పూర్తి
అడ్డాకుల/నవాబుపేట: ‘కుట్రదారులు ఎన్ని కుతంత్రాలు పన్నినా.. తెలంగాణ రైజింగ్ను ఆపలేరని.. తెలంగాణ వెలుగుతోంది.. మనకు ఇక ప్రపంచంతోనే పోటీ’ అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్ర మార్క అన్నారు. తెలంగాణ ప్రజల అవసరాలు, ఆకాంక్షలే ఎజెండాగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు. ‘పాలమూరు– రంగారెడ్డి’ ఎత్తిపోతలను మూడేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. శుక్రవారం నవాబ్పేట, మూసాపేటలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. రాబోయే రోజుల్లో విద్యుత్ డిమాండ్ను బట్టి 2033– 35 సంవత్సరానికి ప్రణాళిక వేసుకుని 33,700 మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సంపద సృిష్టించి.. పారిశ్రామిక రంగంలో తెలంగాణను అభివృద్ధి చేసేందుకు విద్యుత్ పరంగా అన్ని ఏర్పాట్లు చేసి భవిష్యత్లో తెలంగాణ ప్రపంచంతోనే పోటీ పడేలా వివిధ దేశాల కంపెనీలు మన ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తున్నామన్నారు. ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తాం నిధులు ఆవిరైనా నీళ్లు రాలేదని..కాంగ్రెస్ ప్రభుత్వమే పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి కృష్ణా జలాలతో ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తుందని డిప్యూటీ సీఎం తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో పాలమూరులో ఒక్క ఎకరాకు అదనంగా నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి పాలమూరును సస్యశ్యామలం చేస్తారని, అందుకు కేబినెట్ కూడా పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. ఉదండాపూర్ ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి రూ.70 కోట్లు, శంకరసముద్రం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం రూ.32 కోట్లను విడుదల చేస్తామన్నారు. అలాగే చౌదర్పల్లి లిఫ్ట్కు సాధ్యమైనంత త్వరగా ఆర్థికపరమైన అనుమతులిస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రంలో దొంగలు పడ్డట్లు దోపిడీ చేశారని విమర్శించారు. లేనిది ఉన్నట్లు.. ఉన్నది లేనట్లు చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. దోపిడే లక్ష్యంగా పనిచేశారు బీఆర్ఎస్ హయాంలో పెద్దఎత్తున అవినీతి జరిగిందని, దోపిడే లక్ష్యంగా పనిచేసి అంతా దోచుకున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి విమర్శించారు. దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే చెరువుల్లో ఒండ్రుమట్టి అమ్ముకుని రూ.కోట్లు కూడబెట్టారని ఆరోపించారు. చెక్కులు మంజూరైన వారు కండువాలు కప్పుకొంటేనే బీఆర్ఎస్ నాయకులు చెక్కులు ఇచ్చారని విమర్శించారు. తమ ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను పేదలకు అందిస్తూ వారికి అండగా ఉంటున్నామన్నారు. విద్య, వైద్యానికి పెద్దపీట వేశామన్నారు. పారిశ్రామిక రంగంలో పరుగులు జడ్చర్ల పారిశ్రామిక రంగంలో మరింత ముందుకెళ్లేలా ప్రత్యేక ప్రణాళికతో విద్యుత్ ఏర్పాట్లు చేస్తున్నామని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి అన్నారు. గత పాలకులు ముందు వారి స్వార్థం చేసుకుని.. ఆ తర్వాత మిగతా పనులు చేసేవారని, తాను మాత్రం అలా కాదని, ప్రజాసేవకుడినని వివరించారు. తన పట్టుదలతోనే ఉదండాపూర్ నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో రూ.72 కోట్లు ప్రత్యేకంగా వచ్చాయన్నారు. పదేళ్లలో అభివృద్ధి కోసం రూ.120 కోట్లు వెచ్చిస్తే.. తాను కేవలం ఏడాదిన్నరలోనే రూ.181 కోట్లు మంజూరు చేయించానన్నారు. దెయ్యాలను గ్రామాల్లోకి రానివ్వొద్దు పదేళ్లు తెలంగాణను పట్టి పీడించిన దెయ్యాలను గ్రామాల్లోకి రానివ్వొద్దని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అన్నారు. తమ వారు దెయ్యాల ని సొంత పార్టీ నేతలు చెబుతున్నారని విమర్శించారు. తెలంగాణ పల్లెల్లో ఆంజనేయస్వామి గుడి, ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ విజయేందిర, అదనపు కలెక్టర్లు మోహన్రావు, శివేంద్రప్రతాప్, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ స్వర్ణమ్మ, ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, మార్కెట్ చైర్మన్లు ప్రశాంత్, కథలప్ప, వ్యవసాయాధికారులు వెంకటేష్, కృష్ణకిషోర్, నాయకులు అరవింద్రెడ్డి, నాగిరెడ్డి, శెట్టిశేఖర్, శ్రీహరి, శ్రీనివాస్రెడ్డి, జగదీశ్వర్, బాల్నర్సింహులు, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడి ఆర్అండ్ఆర్ ప్యాకేజీలకు రూ.102 కోట్లు విడుదల చేస్తాం చౌదర్పల్లి లిఫ్ట్కు త్వరలో అనుమతులిస్తాం తెలంగాణ రైజింగ్ను ఆపలేరు -
అలంపూర్ తేనేటి విందుతో ప్రకంపనలు
ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మధ్య కొన్నాళ్లుగా అంతర్గత వైరం కొనసాగుతున్నట్లు సమాచారం. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మల్లురవి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడితో కలిసి జెడ్పీ మాజీ చైర్పర్సన్న్ సరిత ఇంట్లో తేనేటి విందులో పాల్గొనడం కాంగ్రెస్లో ప్రకంపనలు సృష్ట్టించింది. దీంతో నేతల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. సంపత్కుమార్ వర్గీయులు మల్లు రవికి వ్యతిరేకంగా గళం వినిపించారు. అలంపూర్లో సంపత్ అన్నీ తానై ఎంపీగా మల్లు రవిని గెలిపించాడని.. ఆయనేమో సంపత్ను రాజకీయంగా దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కాంగ్రెస్లోకి రప్పించే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ అయి ఉండి క్రమశిక్షణ తప్పారని.. వివిధ ప్రభుత్వ, ఇతర పనుల్లో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని ఆరోపించడం పార్టీలో కాక రేపింది. -
ఆర్టీసీ టూర్ ప్యాకేజీ
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పుణ్యక్షేత్రాలు, దర్శనీయ స్థలాలకు వెళ్లే వారికి ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెస్తున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం సంతోష్కుమార్ చెప్పారు. శుక్రవారం ఆర్ఎం కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని పది డిపోల నుంచి ఈ బస్సు (సూపర్ లగ్జరీ, డీలక్స్)లను అవసరమైన చోటకు పంపడానికి సిద్ధంగా ఉంచుతామన్నారు. ఏడు రూట్లలో ఆయా ప్యాకేజీలను బట్టి చార్జీలు వసూలు చేస్తామని పేర్కొన్నారు. ఒకవేళ బస్సులో సామూహికంగా ఏదైనా సంస్థ (పాఠశాలలు, కళాశాలలు) లేదా ఇతర సంఘాల తరఫున ఒకేసారి 30 నుంచి 35 మంది వరకు వెళ్లొచ్చేందుకు బుక్ చేసిన వారి పేర ఒకరికి ఉచిత సౌకర్యం కల్పిస్తామన్నారు. అలాగే అందరికీ కలిపి పది శాతం రిబేటు ఇస్తామన్నారు. ఈ అవకాశాన్ని అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. పూర్తి వివరాలకు మహబూబ్నగర్ డిపో మేనేజర్ (ఫోన్ నం.99592 26286)ను సంప్రదించవచ్చన్నారు. దీనికి సంబంధించి ఈనెల 27న రాష్ట్రస్థాయిలో రోడ్లు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లాంఛనంగా ప్రారంభించనున్నారన్నారు. అంతకంటే ముందే ఎవరైనా ఈ ప్యాకేజీలను వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. అనంతరం ఈ ప్యాకేజీకి చెందిన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎం లక్ష్మీధర్మ, డీఎం బి.సుజాత, పీఓ వి.సుజాత, ఏఓ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ నుంచి పుణ్యక్షేత్రాలు, దర్శనీయ ప్రదేశాలకు ప్రత్యేక బస్సులు ఈ నెల 27వ తేదీన ప్రారంభం: ఆర్ఎం -
కేంద్ర సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి
పాలమూరు: ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో నాలుగో స్థానంలో భారత్ అవతరించిందని, వికసిత్ భారత్ లక్ష్యంతో మోదీ ముందుకు తీసుకువెళ్తున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ముఖ్య నేతల సదస్సులో ఆయన మాట్లాడారు. సమర్థవంతమైన నాయకత్వం, నిర్ణయాత్మకంగా నిర్ణయాలతో మోదీపాలన సాగుతుందన్నారు. ఎన్నో చారిత్రాత్మకమైన విజయాలతో మోదీ ప్రభుత్వం 11 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. జూన్ 21న ప్రపంచ యోగ దినోత్సవ ఘనంగా చేపట్టాలన్నారు. ఆపరేషన్ సిందూర్ ఒక గొప్ప విజయం అని, సైనికులు ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రతి ఒక్క భారతీయుడికి గర్వకారణమన్నారు. పర్యావరణం రక్షించడానికి ప్రతి ఒక్క కార్యకర్త బాధ్యతతో ఒక మొక్క నాటాలని పిలపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, నేతలు పద్మజారెడ్డి, సత్యం, కృష్ణవర్ధన్రెడ్డి, పాండురంగారెడ్డి, అంజయ్య, రమేష్, గంగన్న పాల్గొన్నారు. -
మహిళలకు న్యాయ సహాయం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: వృద్ధులు, మహిళలు న్యాయ సహాయం పొందేందుకు, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఇందిర అన్నారు. శుక్రవారం స్థానిక బీకేరెడ్డి కాలనీలోని మహబూబ్నగర్ ఫస్ట్– నవరత్నాలు’ శిక్షణ కేంద్రాన్ని సందర్శించి, ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన న్యాయ అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. మహిళలకు ఎలాంటి సమస్య ఎదురైనా ఆందోళన చెందవద్దని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. ముఖ్యంగా బాల్య వివాహాలు, గృహహింస, లింగ వివక్ష లాంటివి ఎదురైనప్పుడు బాధితులు వెంటనే న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని లేదా సఖీ కేంద్రంలో కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. చివరగా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో శిక్షణ కేంద్రం పర్యవేక్షకులు గుండా మనోహర్, సెట్విన్ నిర్వాహకుడు విజయ్కుమార్, పారా లీగల్ వలంటీర్ల ప్రతినిధి గన్నోజు చంద్రశేఖర్, పీఎల్వీలు రవికుమార్, నస్కంటి నాగభూషణం, ఎ.రాజసింహుడు తదితరులు పాల్గొన్నారు. ఖైదీల సమస్యలపై ఆరా.. పాలమూరు: జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు బెయిల్ కోసం లీగల్ ఎయిడ్ న్యాయవాదులు కావాలంటే జిల్లా న్యాయ సేవా అధికార సంస్థలో సంప్రదించి న్యాయ సహాయం పొందాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అన్నారు. జిల్లాకేంద్రంలోని జైలును శుక్రవారం న్యాయమూర్తి సందర్శించి మొదట జైలు బ్యారక్లు, కిచెన్, ఇతర పరిసరాలు పరిశీలించారు. జైలులో అన్ని వసతులు, సదుపాయాల సరిగ్గా అందుతున్నాయా లేదా అని అధికారులను, ఖైదీలను వేర్వేరుగా అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా బ్యారక్ల దగ్గరకు వెళ్లి నేరుగా ఖైదీలతో వారి సమస్యలపై ఆరా తీశారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ వెంకటేశం పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఇందిర -
వైభవంగా రంగనాథస్వామి కల్యాణం
కందనూలు: జిల్లాకేంద్రం శివారులోని శ్రీపురంలో రంగనాథస్వామి కల్యాణోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మూడు రోజులుగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారి ఎదుర్కోళ్లు, పల్లకీసేవ, అనంతరం భక్తుల సమక్షంలో రంగనాథస్వామి కల్యాణం కనుల పండువగా జరిపించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల గోవింద నామస్మరణతో శ్రీపురం మార్మోగింది. సాయంత్రం మాఢవీధుల్లో రథోత్సవం శోభాయమానంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, ఆలయ ధర్మకర్త రంగాచార్యులు, చైర్మన్ రామకృష్ణారెడ్డి, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
ఇంట్రా డిస్ట్రిక్ట్ చాంపియన్ పాలమూరు
మహబూబ్నగర్ క్రీడలు: అండర్–19 ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ లీగ్ చాంపియన్గా మహబూబ్నగర్ జట్టు నిలిచింది. లీగ్లో మొదటి నుంచి మెరుగైన ప్రదర్శన కనబరిచిన మహబూబ్నగర్ జట్టు.. వరుసగా ఐదు మ్యాచుల్లో విజయాలు సాధించి 15 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి చాంపియన్షిప్ కై వసం చేసుకుంది. జిల్లా కేంద్రం సమీపంలోని సమర్థ స్కూల్ మైదానంలో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్లో మహబూబ్నగర్ జట్టు 71 పరుగుల తేడాతో జడ్చర్ల జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన మహబూబ్నగర్ జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. జట్టులో కనిష్క్ ఆలౌ రౌండ్ ప్రతిభ కనబరిచాడు. 84 బంతుల్లో 6 ఫోర్లతో 51 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్లో 2 వికెట్లు తీశాడు. ఇతర బ్యాట్స్మన్లు యువన్ ముద్దనూరి 43, మనోజ్యాదవ్ 39, ఎండీ సోను 38, అబ్దుల్ రాఫే 35 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన జడ్చర్ల జట్టు 41.5 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో సంజయ్ 91 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్తో 73 పరుగులు, కేతన్కుమార్ 35 పరుగులు చేశారు. మహబూబ్నగర్ బౌలర్లు అంకిత్రాయ్ 10 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి 3, అభినవ్ 2, నవీన్కుమార్, ప్రణయ్, యువన్ చెరో వికెట్ తీశారు. జిల్లా క్రికెటర్లు అంతర్జాతీయ స్థాయిలో ఆడాలి.. జిల్లా క్రికెటర్లు ప్రతిభ కనబరుస్తూ భవిష్యత్లో రంజీ, భారత జట్టులో ఆడాలని ఎన్ఆర్ఐ, సీనియర్ క్రీడాకారుడు కేడం శ్రీనివాస్ అన్నారు. అండర్–19 ఇంట్రా డిస్ట్రిక్ట్ టూడే లీగ్ చాంపియన్గా నిలిచిన మహబూబ్నగర్ జట్టును ఆయన అభినందించి మాట్లాడారు. క్రీడాకారుల్లో క్రమశిక్షణ చాలా ముఖ్యమని.. క్రమశిక్షణ, పట్టుదలతో ఆడితే మెరుగైన విజయాలు సాధించవచ్చని అన్నారు. క్రికెట్లో ప్రతిభ కనబరిచే క్రీడాకారులకు తమవంతు సహకారం అందిస్తామని చెప్పారు. ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా క్రీడాకారులను ప్రోత్సహించడానికి మొదటిసారిగా ఆరు జట్లతో అండర్–19 క్రికెట్ లీగ్ నిర్వహించినట్లు తెలిపారు. ఇలాంటి లీగ్ మ్యాచ్లను క్రీడాకారులు సద్వినియోగం చేసుకొని తమ వ్యక్తిగత ప్రదర్శన చాటుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎండీసీఏ ఉపాధ్యక్షులు సురేష్కుమార్, కోచ్లు గోపాలకృష్ణ, అబ్దుల్లా, ఎండీ మన్నాన్, సీనియర్ క్రీడాకారుడు మహేష్ పాల్గొన్నారు. లీగ్లో ఐదు విజయాలు.. 15 పాయింట్లతో అగ్రస్థానం చివరి మ్యాచ్లో 71 పరుగుల తేడాతో జడ్చర్లపై గెలుపు -
కోయిల్సాగర్కు కృష్ణమ్మ పరుగులు
దేవరకద్ర/ మరికల్: జూరాల ప్రాజెక్టుకు వరదలు రావడంతో కృష్ణాజలాలు కోయిల్సాగర్కు పరుగులు పెడుతున్నాయి. కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకం కింద ఉంద్యాల వద్ద ఉన్న ఫేస్–1 పంప్హౌస్ నుంచి ఈ నెల 1న ఒక పంపును రన్ చేసి 315 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఆ నీటితో ముందుగా పర్దీపూర్ రిజర్వాయర్ను నింపిన తర్వాత అక్కడి నుంచి తీలేర్కు తరలించారు. దీంతో తీలేర్ ఫేస్–2 వద్ద ఒక పంపును రన్ చేసి కోయిల్సాగర్కు నీటిని వదిలారు. ఈ మేరకు శుక్రవారం తీలేర్ పంపుహౌస్ వద్ద నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ఒక మోటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జూరాలకు ఎగువ నుంచి వరద రావడంతో ప్రస్తుతం ఒక పంపు ద్వారా రోజుకు 315 క్యూసెక్కుల నీరు కోయిల్సాగర్కు చేరుతుందన్నారు. జూరాలకు వరద నీరు అలగే కొనసాగితే మరికల్ మండలంలోని చెరువులను నింపేందుకు 150 క్యూసెక్కుల నీటిని లింకు కెనాల్కు విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కోయిల్సాగర్ ప్రాజెక్టు ఒకసారి పూర్తిస్థాయిలో నిండితే రెండు పంటలకు సాగునీరు అందుతుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాంకోటి, ఆర్ఐ సుధాకార్రెడ్డి, నాయకులు సూర్యమోహన్రెడ్డి, వీర న్న, కృష్ణయ్య, హరీష్, రామకృష్ణ, రామకృష్ణారెడ్డి, రఘు, హర్షవర్ధన్రెడ్డి, నరహరి, శ్రీకాంత్రెడ్డి, ఆంజనేయులు, చిన్నబాలు, హన్మంతు పాల్గొన్నారు. ● కోయిల్సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 11 అడుగుల మేర నీటి మట్టం నిల్వ ఉండగా పాత అలుగు స్థాయి నీటిమట్టం 26.6 అడుగులు. కాగా గేట్ల స్థాయి వరకు 32.6 అడుగులు రావాల్సి ఉంటుంది. ఎత్తిపోతల పథకం నీటి విడుదల ఇలాగే కొనసాగితే ఈ నెలాఖరు వరకు పాత అలుగుకు నీటిమట్టం చేరే అవకాశం ఉంది. తీలేర్ దగ్గర పంపు ప్రారంభించిన ఎమ్మెల్యే పర్ణికారెడ్డి -
అనన్య.. ప్రతిభ
పలుసార్లు కేరళ జట్టుకు.. అనన్యశ్రీ రెండుసార్లు కేరళ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించడం విశేషం. దేశంలోనే క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే కేరళ రాష్ట్రంలో పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ.. తన ప్రతిభతో ఆ రాష్ట్ర జట్టుకు ఎంపికై సంచలనం సృష్టించారు. 2022లో కేరళ రాష్ట్రం తరఫున ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రాపూర్లో జరిగిన 23వ జాతీయస్థాయి, మహారాష్ట్ర సాంగ్లి జిల్లా ఇస్లాంపూర్లో జరిగిన 24వ జాతీయ యూత్ వాలీబాల్ పోటీల్లో ఆమె పాల్గొన్నారు. కేరళలో జరిగిన సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ, 2023లో అస్సాం రాష్ట్రం గౌవహాటిలో జరిగిన 71వ ఉమెన్ సీనియర్ నేషనల్ వాలీబాల్ పోటీలకు కేరళ రాష్ట్ర జట్టుకు అనన్యశ్రీ ప్రాతినిధ్యం వహించారు. సీనియర్ నేషనల్ వాలీబాల్ చాంపియన్షిప్లో కేరళ మహిళా జట్టు విజేతగా నిలవడంతో అనన్యశ్రీ బంగారు పతకం సాధించారు. పాండిచ్చేరిలో జరిగిన ఫెడరేషన్ కప్ వాలీబాల్ పోటీల్లో అనన్యశ్రీ పాల్గొనగా.. కేరళ రాష్ట్ర జట్టు రన్నరప్గా నిలిచింది. మహబూబ్నగర్ క్రీడలు: ఉమ్మడి జిల్లాలోని మక్తల్కు చెందిన అనన్యశ్రీ వాలీబాల్ క్రీడలో అత్యుత్తమ ప్రతిభ చాటుతూ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. తల్లిదండ్రులు పి.ఆనంద్, వరలక్ష్మి ప్రోత్సాహంతో వాలీబాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. 2018లో అప్పటి జిల్లా యువజన, క్రీడల అధికారిణి సత్యవాణి ఆధ్వర్యంలో పొడ గారి బాలికల క్రీడా నైపుణ్య శిక్షణ కార్యక్రమం నిర్వహించగా.. 180 సెం.మీ. ఎత్తు ఉన్న అనన్యశ్రీ వాలీబాల్ క్రీడకు ఎంపికయ్యారు. అనంతరం సరూర్నగర్ స్టేడియంలో జరిగిన వాలీబాల్ అకాడమీ ప్రవేశ సెలక్షన్స్లో ప్రతిభ కనబరిచారు. అక్కడ వాలీబాల్ క్రీడలో ప్రతిభ కనబరిచి.. 2019లో ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా అథ్లెట్ పథకం కింద కేరళలోని పట్టణమిట్టలో గల వాలీబాల్ అకాడమీకి అనన్యశ్రీ ఎంపికై 2024 ఆగస్టు వరకు శిక్షణ తీసుకున్నారు. గతేడాది క్రీడా కోటా కింద పూణెలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగం సాధించారు. మూడు సార్లు తెలంగాణకు ప్రాతినిధ్యం.. 2018 పంజాబ్ (చండీగఢ్)లో జరిగిన జూనియర్ నేషనల్ వాలీబాల్ టోర్నీలో సరూర్నగర్ వాలీబాల్ అకాడమీ తరఫున అనన్యశ్రీ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించారు. 2019 తమిళనాడు రాష్ట్రం ధర్మపురి, 2020 కడపలో జరిగిన జూనియర్ నేషనల్, మరో జూనియర్ నేషనల్ వాలీబాల్ పోటీల్లో తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఏషియన్ గేమ్స్లో ఆడాలన్నదే లక్ష్యం.. రెండోసారి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటున్నా. 2023లో చైనాలో జరిగిన వరల్డ్ యూనివర్సిటీ పోటీల్లో పాల్గొన్నాను. వియత్నాంలో జరిగే ఆసియా వాలీబాల్ టోర్నీలో పాల్గొనే భారత మహిళా జట్టుకు ఎంపికై నందుకు చాలా సంతోషంగా ఉంది. ఏషియన్ గేమ్స్లో ఆడాలన్నదే లక్ష్యం. అందుకోసం నిరంతరం ప్రాక్టీస్ చేస్తున్నా. – అనన్యశ్రీ, మక్తల్వాలీబాల్ క్రీడలో రాణిస్తున్న పాలమూరు బిడ్డ ఆసియా వాలీబాల్ టోర్నీకి ఎంపిక వియత్నాంలో నేటి నుంచి 14వ తేదీ వరకు పోటీలు రెండోసారి అంతర్జాతీయ పోటీలకు ప్రాతినిధ్యం ఆసియా వాలీబాల్ పోటీలకు ఎంపిక.. అనన్యశ్రీ రెండోసారి విదేశీ గడ్డపై వాలీబాల్ పోటీల్లో పాల్గొన్నారు. చైనా దేశం చెంగ్డు నగరంలో 2023 ఆగస్టులో జరిగిన ‘వరల్డ్ యూనివర్సిటీ చాంపియన్షిప్’లో కేరళ యూనివర్సిటీ జట్టు తరఫున పాల్గొన్న ఆమె.. ప్రస్తుతం మరోసారి అంతర్జాతీయ వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్లో జరిగిన ఇండియన్ వుమ న్ జట్టు శిక్షణ క్యాంపులో అనన్యశ్రీ పాల్గొ ని వియాత్నంలో ఈనెల 7 నుంచి 14 వరకు వియత్నాంలోని హనోయిలో జరిగే ఆసియా వాలీబాల్ టోర్నీలో భారత జట్టుకు ఎంపికై ంది. -
పాముకాటుతో మహిళ మృతి
పెద్దకొత్తపల్లి: పాముకాటుకు గురై మహిళ మృతిచెందిన ఘటన పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్లో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. సాతాపూర్కు చెందిన బద్దుల సాలమ్మ (40) శుక్రవారం తెల్లవారుజామున ఇంటి వాకిలిని ఊడుస్తున్న క్రమంలో పాముకాటుకు గురైంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే ఆమె పరిస్థితి విషమించడంతో మృతిచెందింది. మృతురాలికి భర్త చిన్నయ్య, ఇద్దరు కూతుళ్లు శిరీష, కృష్ణవేణి ఉన్నారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ సతీష్ తెలిపారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి ధన్వాడ: మండలంలోని చర్లపల్లికి చెందిన కరుణాకర్రెడ్డి (41) శుక్రవారం విద్యుదాఘాతానికి గురై మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వారి కథనం మేరకు.. పొలం వద్ద బోరుమోటార్ కేబుల్ వైరు తెగడంతో తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. భార్య వనజ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య ఎర్రవల్లి: కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్యహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని కొండేరులో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. కొండేరుకు చెందిన వడ్డె లక్ష్మన్న (32) మేసీ్త్ర పని చేసుకుంటూ కుటుంబంతో జీవనం సాగించే వాడు. కొంతకాలంగా మద్యానికి బానిసైన అతడు.. ఇంట్లో తరచుగా గొడవ పడుతుండటంతో ఇటీవల తన భార్య శివమ్మ పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన లక్ష్మన్న.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వంటగ్యాస్ లీకై ఐదుగురికి గాయాలు గట్టు: మండలంలోని ఆలూరులో వంటగ్యాస్ లీకై ఐదుగురు గాయపడిన ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల మేరకు.. ఆలూరుకు చెందిన పూలకుంట నర్సింహులు అలియాస్ దుబ్బన్న ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఖాళీ కావడంతో బుధవారం మరో సిలిండర్ను అమర్చేందుకు ఇంటి పక్కనున్న వెంకటేశ్ పిలిచారు. గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ను అమర్చుతున్న క్రమంలో గ్యాస్ లీక్ కావడంతో పక్కనే ఉన్న కట్టెల పొయ్యిలోని మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో ఇంట్లోనే ఉన్న వెంకటేశ్తో పాటు దుబ్బన్న, అతడి భార్య జయమ్మ, కోడలు మహేశ్వరి, మూడేళ్ల బాలుడు అభికి గాయాలయ్యాయి. స్థానికులు గమనించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని గ్రామస్తులు తెలిపారు. -
పిచ్చికుక్క స్వైర విహారం
ఎర్రవల్లి: పిచ్చికుక్క దాడిలో ఆరుగురు గాయపడిన ఘటన మండలంలోని వల్లూరులో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామంలోని వివిధ కాలనీలకు చెందిన గోపాల్, మద్దమ్మ, మాసుంబీ, గోపి, వెంకటేష్, వేణుగోపాల్ని కరిచింది. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం మద్దమ్మ, వెంకటేష్ ఇంటికి చేరుకోగా.. మిగిలిన నలుగురు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వారు వివరించారు. ఆరుగురిపై కుక్క దాడి చేసి గాయపర్చినట్లు తమకు సమాచారం వచ్చిందని.. బాధితులు ఇటిక్యాల ఆరోగ్య కేంద్రానికి రాలేదని మండల వైద్యాధికారి డా. రాధిక తెలిపారు. కేంద్రంలో రేబీస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉందని.. కుక్క కాటుకు గురైనవారు వచ్చి చికిత్స పొందవచ్చని సూచించారు. ఆరుగురికి గాయాలు.. ఆస్పత్రికి తరలింపు -
ఈద్ ముబారక్..
నేడు ఈద్–ఉల్–అజ్హా స్టేషన్ మహబూబ్నగర్: జిల్లావ్యాప్తంగా శనివారం బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకొనేందుకు ముస్లింలు సిద్ధమయ్యారు. ఇస్లామియా క్యాలెండర్ ప్రకారం చివరి మాసమైన జిల్హిజ్జా 10వ తేదీన జరుపుకొనే ఈ పండుగను ‘ఈద్–ఉల్–అజ్హా’గా వ్యవహరిస్తారు. సామూహికంగా ముస్లింలు ఈద్గా వద్దకు వెళ్లి ప్రత్యేక నమాజ్ చేయడం రివాజు. సర్వమానవ కల్యాణం కోసం నమాజ్ చేసి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. పేద, ధనిక తేడా లేకుండా అందరూ నూతన వస్త్రాలు ధరించి.. ఆనందోత్సాహాలతో పండుగ నిర్వహించుకోనున్నారు. ఉదయం 8 గంటలకు జిల్లా కేంద్రంలోని పాతపాలమూరు రియాజుల్ జన్నా మసీదు నుంచి ముస్లింలు ఊరేగింపుగా జామియా మసీదు, గడియారం చౌరస్తా మీదుగా స్థానిక రహెమానియా ఈద్గా వద్దకు చేరుకొని 9 గంటలకు ప్రత్యేక ఈద్ నమాజ్ చేస్తారు. అదే విధంగా పట్టణంలోని పలు మసీదుల్లో కూడా బక్రీద్ ప్రత్యేక ఈద్ నమాజ్కు ఏర్పాట్లు చేశారు. ఖౌమి ఏకతా కమిటీ ఆధ్వర్యంలో వేదిక.. బక్రీద్ సందర్భంగా ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు చెప్పడానికి ఈద్గా ఆవరణలో ఖౌమి ఏకతా కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. ఈ వేదిక వద్ద ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేయనున్నారు. ఈ వేదిక గంగాజమున తహ్జిబ్కు ప్రతీకగా నిలుస్తుంది. పండుగ ప్రాశస్త్యం.. ఇబ్రాహీం ఖలీలుల్లా రజియల్లాహు తాలా అనే పైగంబర్ (ప్రవక్త) దంపతులు చేపట్టిన నియమ నిష్టల ఫలితంగా వారికి ఇస్మాయీల్ జబీవుల్లా అనే ఏకై క కొడుకు జన్మిస్తాడు. అయితే వారి భక్తి, త్యాగాన్ని పరీక్షించడానికి అల్లా తన కొడుకును బలి ఇవ్వాల్సిందిగా ఇబ్రాహీం కలలో కనిపించి ఆజ్ఞాపిస్తాడు. దైవ నిర్ణయాన్ని శిరసావహించడమే మార్గదర్శకంగా భావించిన ఆ దంపతులు.. తమ కుమారుడిని బలి ఇవ్వడానికి నిర్ణయించి అంతా సిద్ధం చేస్తారు. దైవాదేశం మేరకు ఆ బాలుడిని సుదూర ప్రాంతమైన అడవుల్లోకి తీసుకెళ్లి బలి పీఠంపై పీక కోయడానికి తండ్రి సిద్ధమవుతుండగా.. ఆ ఖుర్బానీ ప్రక్రియను ఆపివేయాలని దైవవాణి వినిపిస్తుంది. దైవ వాక్కు వృథాగా పోకూడదని ఇస్మాయీల్ జబీవుల్లా స్థానంలో అటుగా వచ్చిన ఓ పొట్టేలును బలి ఇవ్వాలని ఆదేశిస్తుంది. మానవ కల్యాణం కోసమే ఈ సంఘటన జరిగిందని భావించి ముస్లింలు ఆ నాటి నుంచి బక్రీద్ పండుగ దినాల్లో ఖుర్బానీ ఇస్తారు. ఈద్గాలు, మసీదుల్లో నమాజ్కు ప్రత్యేక ఏర్పాట్లు ఖుర్బానీ కోసం పొట్టేళ్ల కొనుగోళ్లు కిటకిటలాడుతున్న మార్కెట్లు -
నిన్న రణరంగం.. నేడు నిశ్శబ్దం
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఇథనాల్ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు.. పోలీసుల నిర్భంధం.. ఇరు వర్గాల తోపులాటలతో అట్టుడికిన జోగుళాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడలో తాజాగా నిశ్శబ్దం అలుముకుంది. బుధవారం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో పోలీసులు గ్రామంలో నిఘా కట్టుదిట్టం చేశారు. ఆందోళనకారులపై డేగకన్ను వేసిన పోలీసులు పెద్ద ధన్వాడతో పాటు పరిసర గ్రామాల్లో మఫ్టీలో సంచరిస్తూ స్థానికుల కదలికలను గమనిస్తున్నారు. దీంతో ఎప్పుడు, ఏం జరుగుతుందోననే భయం ఆయా గ్రామప్రజల్లో నెలకొనగా.. ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఫ్యాక్టరీ పరిసరాలు, గ్రామాల్లోని వీధులు నిర్మానుష్యంగా మారాయి. 12 మందికి రిమాండ్.. పెద్ద ధన్వాడ శివారులో పచ్చని పొలాల మధ్య గాయత్రి ఇండస్ట్రీస్ రెన్యూవబుల్ ఫ్యూయల్స్ అండ్ అలైడ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ కంపెనీతో వాయు, జల కాలుష్యం బారిన పడతామని.. ఫ్యాక్టరీకి అనుమతులు రద్దు చేయాలంటూ బుధవారం ఆందోళనకు దిగిన రైతులను పోలీసులు రాత్రి వరకూ జల్లెడ పట్టారు. ఆందో ళనలో చురుగ్గా పాల్గొన్న 41 మందిని గుర్తించి.. ఆ రాత్రే 12 మందిని అరెస్టు చేసి మానవపాడు పోలీస్స్టేషన్కు తరలించారు. గురువారం ఉదయం ఆ రైతులను గద్వాల జిల్లా కోర్టులో హాజరుపరచగా.. వారికి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. కాగా.. మిగిలిన 29 మంది ఆందోళనకారుల కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు ‘జనంసాక్షి’ పత్రిక ఎడిటర్ రహమాన్తోపాటు నాగర్కర్నూల్ జిల్లా సబ్ జైలర్ నాగరాజుపై కూడా కేసులు నమోదు చేయడం చర్చనీయాంశంగా మా రింది. దాడుల సమయంలో వారు ఘటనా స్థలంలో లేరని.. అయినా వీరి పేరు చేర్చారంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. మరో పక్క పెద్ద ధన్వాడ ఘటనకు సంబంధించి న్యాయవాది రామారావు ఇమ్మానేని గురువారం జాతీయ మానవ హక్కుల కమిషన్లో పిటిషన్ దాఖలు చేశారు. 10 గ్రామాలపై మఫ్టీలో నిఘా.. ఇథనాల్ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న 10 గ్రామాలపై పోలీసులు ప్రత్యేక నజర్ వేశారు. పెద్ద ధన్వాడ, చిన్న ధన్వాడ, నసనూరు, మాన్దొడ్డి గ్రామాల్లో నిఘా కట్టుదిట్టం చేశారు. వీటితో పాటు పచ్చర్ల, తుమ్మిళ్ల, పెద్ద తాండ్రపాడుతోపాటు వడ్డేపల్లి మండలం తనగల, అయిజ మండలంలో తాండ్రపాడు, వేణిసోంపురంపైనా నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఆయా గ్రామాల్లో గ్రామస్తులు, రైతుల కదలికలను తెలుసుకునేందుకు పోలీసులు మఫ్టీలో సంచరిస్తున్నట్లు సమాచారం. మరోవైపు పెద్ద ధన్వాడ ఘటనకు సంబంధించి ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారినీ పోలీసులు ఉపేక్షించడం లేదు. వ్యతిరేక పోస్టులు పెట్టిన పలువురికి ఫోన్లు చేసి.. పిలిపించుకుని హెచ్చరించినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆయా గ్రామాల ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఒప్పుకునేది లేదు.. ‘మా పచ్చని పొలాలతో పాటు ఆరోగ్యాన్ని దెబ్బతీసే కాలుష్య కారక ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదు’అని రైతులు ముక్తకంఠంతో స్పష్టం చేశారు. గురువారం పెద్ద ధన్వాడలోని రైతు వేదిక వద్ద పలువురు గ్రామస్తులు, రైతులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోలీసుల తీరును ఖండించారు. 41 మంది రైతులపై అక్రమంగా కేసులు పెట్టారని మండిపడ్డారు. కంపెనీ యాజమాన్యం, బౌన్సర్లు దాడికి దిగినా.. వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అన్యాయమని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్రెడ్డి తమ జిల్లా వాసి అయి ఉండి.. పోలీసులు తమను ఇబ్బంది పెడుతున్నా స్పందించకపోవడం శోచనీయమని విచారం వ్యక్తం చేశారు. 41 మంది రైతులపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని ప్రదర్శించారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ తరహాలో ఇక్కడ కూడా ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. -
భూమి బదులు భూమి ఇవ్వాలి..
మాకు అనంతవరం శివారులో ఉన్న మూడెకరాల భూమిని రిజర్వాయర్ కింద తీసుకుంటున్నారు. ఇప్పటివరకు మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. మేం అంగీకారం తెలపకపోయినా మా భూములు తీసుకుంటాం అంటున్నారు. మేం కోల్పోయే భూములకు బదులుగా మరో చోట భూమిని కేటాయించాలి. మా జీవనోపాధి కోల్పోకుండా చూడాలి. – సుక్కమ్మ, మహిళా రైతు, బల్మూరు కేవలం సర్వే పనులు చేపడుతున్నాం.. రిజర్వాయర్ నిర్మాణం కోసం అవసరమైన సర్వే పనులను మాత్రమే చేపట్టాం. రైతుల భూములను స్వాధీనం చేసుకోలేదు. రిజర్వాయర్ నిర్మాణ ప్రాంతాల్లో మార్కింగ్ చేపడుతున్నాం. ప్రభుత్వం చట్టప్రకారం రైతులకు పరిహారం చెల్లిస్తుంది. – బాలస్వామి, డీఈ, నీటిపారుదల శాఖ ● -
మామిడి తోటలో భారీ కొండచిలువ
కొత్తకోట రూరల్: పెద్దమందడి మండలం చిలకటోనిపల్లి గ్రామ శివారులో గల సర్వేశ్వర్ రెడ్డికి చెందిన మామిడి తోటలో 15 అడుగుల భారీ కొండచిలువ దదర్శనమిచ్చింది. తోటలో పనికి వెళ్లిన కూలీలకు కొండచిలువ కనబడడంతో వెంటనే తోట యజమాని సర్వేశ్వర్ రెడ్డికి విషయాన్ని తెలుపగా ఆయన ఎస్ఐ శివకుమార్కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఎస్ఐ స్నేక్ సొసైటీ నిర్వాహకులు కృష్ణసాగర్కు విషయం తెలుపగా అతను వచ్చి కొండ చిలువను పట్టుకున్నారు. కొండచిలువ 15 అడుగుల పొడవు, 30 కిలోల బరువు ఉందని కృష్ణసాగర్ తెలిపారు. పట్టుకున్న కొండచిలువను ఫారెస్ట్ అధికారుల సూచన మేరకు అడవి ప్రాంతంలో వదిలివేస్తామన్నారు. ఎవరికై నా పాములు కనిపిస్తే చంపొద్దని, తనకు సమాచారం ఇస్తే పట్టుకుని అడవిలో వదిలేస్తానన్నారు. ఆయన వెంట స్నేక్ సొసైటీ సభ్యులు ఏర్పుల గోపాల్ యాదవ్, కావలి భాస్కర్, మహబూబ్, మైనుద్దీన్, భాగ్యలక్ష్మి, పెంటన్న, పల్లవి, వనజ, ఫాతిమా, ఉన్నారు. -
శిక్షణ.. సాధన
●స్పోర్ట్స్ స్కూల్ ఎంపికకు.. స్పోర్ట్ స్కూల్లో ఎంపికకు వేసవి శిబిరంలో అథ్లెటిక్స్లో శిక్షణ తీసుకుంటున్నా. సునీల్ సార్ చాలా బాగా శిక్షణ ఇస్తున్నారు. పెద్దయ్యాక క్రీడల్లో రాణించాలని ఉంది. – ప్రేమ్కుమార్, మహబూబ్నగర్ మొదటిసారి హాజరు.. హ్యాండ్బాల్ శిక్షణకు మొదటిసారి వచ్చాను. చాలా బాగా శిక్షణ ఇస్తున్నారు. రోజు మైదానానికి వచ్చి శిక్షణ తీసుకుంటా. – సత్య అజిత్, మహబూబ్నగర్ మహబూబ్నగర్ క్రీడలు: పాలమూరులోని ప్రధాన స్టేడియానికి ఉమ్మడి జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ స్టేడియం ఎన్నో జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడలకు వేదికై ంది. వేసవి వచ్చిందంటే చాలు ఈ స్టేడియంలో పలు రకాల క్రీడల్లో శిక్షణనిస్తారు. ఈ ఏడాది కూడా జిల్లా యువజన, క్రీడలశాఖ ఆధ్వర్యంలో గత నెల 1వ తేదీన శిక్షణ శిబిరాలు ప్రారంభించగా.. జూన్ 6 (శుక్రజువారం)తో ముగి యనున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు సంబంధించిన వెబ్సైట్ ద్వారా క్రీడాకారుల వివరాల నమోదుతో పాటు నామమాత్రపు ఫీజు వసూలు చేశారు. ఫుట్బాల్ శిక్షణకు రూ.300, హ్యాండ్బాల్కు రూ.100, అథ్లెటిక్స్కు రూ.400, వాలీబాల్కు రూ.100, బాస్కెట్బాల్కు రూ.400, ఆర్చరీకి రూ.200, చెస్కు రూ.300, బ్యాడ్మింటన్కు రూ.వెయ్యిగా నిర్ణయించారు. సుమారు 200కిపైగా విద్యార్థులు, యువత ప్రత్యేక శిక్షణకు హాజరయ్యారు. ఉదయం 6 నుంచి 9 వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు శిక్షణ ఇచ్చారు. అలాగే కబడ్డీ, యోగా శిబిరాలు సైతం నిర్వహించారు. ప్రతిభ చాటేందుకు.. వేసవి శిబిరాలు ప్రతిభ కనబర్చేందుకు వేదికలా ఉపయోగపడుతున్నాయి. గతంలో శిక్షణలో పాల్గొన్న చాలామంది క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను గుర్తించి వారికి నిరంతరం శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని క్రీడా పాఠశాలలు, అకాడమీలో ప్రవేశాల కోసం తల్లిదండ్రులు తమ చిన్నారులను వేసవి శిక్షణా శిబిరానికి పంపిస్తున్నారు. పాలమూరు ప్రధాన స్టేడియంలో పలు క్రీడల్లో శిక్షణ 200కుపైగా విద్యార్థులు హాజరు నేటితో ముగియనున్న శిబిరాలు -
‘బడిబాట’ను విజయవంతం చేద్దాం
కొత్తకోట: నేటి నుంచి ప్రారంభమయ్యే బడిబాట కార్యక్రమంలో ప్రతి ఉపాధ్యాయుడు పాల్గొని విజయవంతం చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి కోరారు. గురువారం కొత్తకోట పట్టణ కేంద్రంలోని పీఆర్టీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు గతేడాది కంటే ఈ ఏడాది విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 16,80,000 మంది విద్యార్థులు ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలల్లో చదువుతున్నారని, ఒకప్పుడు ఈ సంఖ్య 32లక్షలు ఉండేదని, నేడు గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులతో కలిపిన కూడా 23 లక్షల మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారన్నారు. ఈ కమ్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమం నేటి నుంచి ఈనెల 19 వరకు నిర్వహిస్తుండగా, ప్రతి ఉపాధ్యాయుడు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలన్నారు. అలాగే మౌళిక సదుపాయాల కల్పన, చాలా పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని, ఖాళీలను భర్తీ చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించేందుకు పీఆర్టీయూ పక్షాన శాసనమండలిలో వినిపిస్తానన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి దామోదర్రెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పేరి వెంకట్రెడ్డి, వనపర్తి జిల్లా అధ్యక్షులు మోరెడ్డి బౌద్దారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి -
అండర్–19 లీగ్లో మహబూబ్నగర్ విజయభేరీ
మహబూబ్నగర్ క్రీడలు: ఉమ్మడి జిల్లా అండర్–19 ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ లీగ్లో మహబూబ్నగర్ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. గురువారం జిల్లా కేంద్రానికి సమీపంలోని సమర్థ స్కూల్లో జరిగిన లీగ్ మ్యాచ్లో మహబూబ్నగర్ జట్టు 254 పరుగుల తేడాతో నారాయణపేట జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన మహబూబ్నగర్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 343 పరుగుల భారీ స్కోర్ చేసింది. జట్టులో ఓపెనర్ అబ్దుల్రాఫే మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 127 బంతుల్లో 3 సిక్స్లు, 25 ఫోర్లతో 165 పరుగులు, ప్రణయ్ 52 పరుగులు చేశారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నారాయణపేట జట్టు పాలమూరు బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లను కోల్పోయింది. 31.1 ఓవర్లలో 89 పరుగులకు ఆలౌట్ అయింది. పాలమూరు బౌలర్ కిషోర్ 9.1 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీయగా ఇతర బౌలర్లు మనోజ్ యాదవ్ 2, అభినవ్ 2 వికెట్లు తీశారు. అండర్–19 లీగ్లో ప్రతిభచాటాలి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఉమ్మడి జిల్లాలోని ఆరు ప్రాంతాల్లో అండర్–19 ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ లీగ్ నిర్వహిస్తున్నట్లు ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ తెలిపారు. లీగ్ మ్యాచ్ను గెలిచిన మహబూబ్నగర్ జట్టును ఆయన అభినందించారు. ఓడినవారు నిరాశ చెందకుండా మళ్లీ గెలుపు కోసం ఆడాలని కోరారు. అండర్–19 లీగ్లో రాణించే క్రీడాకారులను త్వరలో జరిగే హెచ్సీఏ రాష్ట్రస్థాయి టోర్నీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. అండర్–19 లీగ్లో క్రీడాకారులు తమ వ్యక్తిగత ప్రదర్శనను చాటుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎండీసీఏ ఉపాధ్యక్షులు సురేష్కుమార్, కోచ్లు అబ్దుల్లా, మన్నాన్ పాల్గొన్నారు. -
సీనియర్ సిటిజన్స్ ఫోరం కొత్త కార్యవర్గం ఎన్నిక
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: స్థానిక మెట్టుగడ్డలోని సర్వశిక్షా అభియాన్ ఆర్వీఎం సమావేశ మందిరంలో గురువారం సీనియర్ సిటిజన్స్ ఫోరం కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జగపతిరావు, ప్రధాన కార్యదర్శిగా నస్కంటి నాగభూషణం, కోశాధికారిగా కేవీ అశోక్, ఈసీ సభ్యుడిగా జి.నాగభూషణం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఫోరంలో మొత్తం 163 మంది సభ్యులు ఓటు హక్కు కలిగి ఉండగా.. 101 ఓట్లు పోలయ్యాయి. ఇందులో ఉపాధ్యక్ష పదవికి ముగ్గురు పోటీలో నిలవగా.. ఎ.రాజసింహుడు 81 ఓట్లతో, అలాగే సంయుక్త కార్యదర్శి పదవికి ముగ్గురు పోటీలో ఉండగా.. ఎల్.గంగాధర్ 45 ఓట్లతో, మరో ఈసీ పదవికి ఇద్దరు రంగంలో నిలవగా.. చివరకు రాములు 57 ఓట్లతో గెలుపొందారు. పోలింగ్ అధికారులుగా సాయిలుగౌడ్, అంజయ్యచారి, బాలకిషన్, బురానుద్దీన్, కృష్ణయ్య వ్యవహరించారు. -
చెట్టుపై నుంచి కిందపడి గీత కార్మికుడి మృతి
తాడూరు: తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి చెందిన ఘటన గురువారం నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండలంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. సిర్సవాడ గ్రామానికి చెందిన చింతకింది మల్లేష్గౌడ్ రోజులాగానే కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కాడు. చెట్టుపైకి పూర్తిగా ఎక్కిన తర్వాత అతని నడుముకు కట్టుకున్న మోపు ఉడిపోవడంతో చెట్టుపై నుంచి కింద పడిపోయాడు. దీంతో వెంటనే అతన్ని జిల్లా ఆస్పత్రికి తీసుకురాగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముఉంది. మృతుడికి భార్య, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. 500 గ్రాముల ఆల్బజోలం పట్టివేత వనపర్తి రూరల్: పెబ్బేరు పట్టణ కేంద్రంలోని మార్కెట్ యార్డులో గురువారం కొందరు వ్యక్తులు ఆల్బజోలం మత్తు పదార్థం విక్రయస్తున్నారని ముందస్తు సమాచారంలో పోలీసులు అక్కడికి చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ యుగేంధర్రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలంలోని బింగిదొడ్డి గ్రామానికి చెందిన నరసింహాగౌడ్, గట్టు మండలంలోని తుమ్మలపల్లికి చెందిన భాస్కర్గౌడ్ పెబ్బేరు మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఆల్బజోలం విక్రయిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని భాస్కర్గౌడ్, నరసింహాగౌడ్ను అదుపులోకి తీసుకోగా.. మిగిలిన వారు పరారయ్యారు. అదుపులోని తీసుకున్న నరసింహాగౌడ్ను విచారించగా కర్నూల్ జిల్లాకు చెందిన హర్షవర్ధన్గౌడ్, జగదీశ్గౌడ్, గోపాల్గౌడ్ అనే ముగ్గురు వ్యక్తుల నుంచి అల్బజోలం తీసుకొచ్చి భాస్కర్గౌడ్ ఇస్తున్నానని తెలిపాడు. భాస్కర్గౌడ్ కల్లు దుకాణాలకు నడుపుతున్న అనంతపురం జిల్లాకు చెందిన కుమార్గౌడ్, కర్నూల్ జిల్లాకు చెందిన లక్ష్మన్నగౌడ్, పండ్ల రమేష్, గజేంద్రగౌడ్, నాగర్కర్నూల్ చెందిన యుగంధర్గౌడ్లకు విక్రయిస్తున్నాడని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 500 గ్రాముల ఆల్బజోలం స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
పాలమూరు: పర్యావరణం పరిరక్షించడంతో పాటు పరిసరాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా కోర్టు ఆవరణలో న్యాయమూర్తులు మొక్కలు నాటారు. అనంతరం కోర్టు సముదాయం నుంచి తెలంగాణ చౌరస్తా వరకు పర్యావరణంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలని, అదేవిధంగా ఆ మొక్కను బాధ్యతగా సంరక్షించాలన్నారు. ప్లాస్టిక్ వస్తువులను, వ్యర్థాలను పూర్తిగా తగ్గించడానికి ప్రయత్నించాలని కోరారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు కల్యాణ్ చక్రవర్తి, ఇందిర, శారదాదేవి, రాజేశ్వరి, రాధిక, ఈశ్వరయ్య, మునవర్ హుస్సేన్, రవిశంకర్, న్యాయవాదులు పాల్గొన్నారు. -
అక్రమ కేసులతో భయపెడుతున్నారు
ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మించవద్దని 12 గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్న కూడా బలవంతంగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనుకోవడం అవివేకం. దీన్ని నిరసిస్తున్న క్రమంలో చోటు చేసుకున్న ఉద్రిక్తతల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేశామంటున్నారు. ఆ కేసులు వెంటనే ఎత్తివేయాలి. అమాయక రైతులను జైలుకు పంపి వారి జీవితాలతో ఆడుకోవడం సరికాదు. – శ్రీనువాసులు, బీఆర్ఎస్ నాయకుడు, రాజోళి పొలం వద్దకు వెళ్లి అరెస్టు చేశారు.. పొలంలో బోర్ మోటార్ ఆన్ చేసి వస్తానని చెప్పిన మా బాబును పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. పని చేసుకుని జీవించే మా ఇంట్లో వాళ్లను ఇలా అరెస్టు చేస్తే మేము బతికేది ఎలా. వెంటనే మా బాబు చిన్న నాగేంద్రంను వదిలిపెట్టాలి. – నర్సమ్మ, చిన్న నాగేంద్రం తల్లి ఆధారాలు ఉంటేనే కేసులు గ్రామస్తులు మమ్మల్ని లెక్కచేయకుండా వందలాదిగా ఫ్యాక్టరీ దగ్గర ఉన్న వాహనాలను ధ్వంసం చేసి, వ్యక్తులపై కూడా దాడులు చేసే ప్రయత్నం చేశారు. వారిని ఆపే ప్రయత్నంలో పోలీసులకు కూడా గాయాలయ్యాయి. దాడులకు సంబందించి ఆధారాలను చూసే కేసులు నమోదు చేస్తున్నాం. వారు చేస్తున్న నేరం తీవ్రతను బట్టే సెక్షన్లను పెడుతున్నాం. అమాయక రైతులు, దాడుల్లో పాల్గొనని వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – జగదీశ్, ఎస్ఐ రాజోళి ● -
బాస్కెట్బాల్ చాంపియన్ హైదరాబాద్
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న అండర్–23 విభాగం 3గీ3 పురుషుల, మహిళల బాస్కెట్బాల్ చాలెంజర్ టోర్నీ గురువారం ముగిసింది. టోర్నీలో పలు జట్లు నువ్వా.. నేనా అనే రీతిలో తలపడ్డాయి. ఫైనల్లో హైదరాబాద్ పురుషుల, మహిళల జట్లు మెరుగైన ప్రదర్శన కనబరిచి చాంపియన్లుగా నిలిచాయి. ఉత్కంఠ పోరులో హైదరాబాద్ పురుషుల జట్టు 14–12 పాయింట్ల తేడాతో రంగారెడ్డి జట్టుపై విజయం సాధించింది. అదే విధంగా మహిళల విభాగం ఫైనల్ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు 21–4 పాయింట్ల తేడాతో మహబూబ్నగర్ జట్టుపై విజయం సాధించింది. పురుషుల విభాగం మూడో స్థానంలో హన్మకొండ, మహిళల మూడో స్థానంలో రంగారెడ్డి జట్లు నిలిచాయి. టోర్నీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులుగా గౌతమ్ (హైదరాబాద్), జాహ్నావి (హైదరాబాద్), ఉత్తమ షూటర్లుగా శ్రీకాంత్ (రంగారెడ్డి), భువనేశ్వరి (మహబూబ్నగర్) నిలిచారు. ● శాట్ చైర్మన్ శివసేనారెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో క్రీడాభివృద్ధి కోసం రూ. 110కోట్లు కేటాయించినట్లు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో రెండేళ్లలో క్రీడల కోసం రూ. 850కోట్లు కేటాయించినట్లు చెప్పారు. మహబూబ్నగర్లో రూ. 2.50కోట్లతో జిమ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇండోర్ స్టేడియంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఉమ్మడి జిల్లాకు స్పోర్ట్స్ స్కూల్ తీసుకొచ్చినట్లు తెలిపారు. దేశంలోనే తెలంగాణను క్రీడల హబ్గా తీర్చిదిద్దుతామని అన్నారు. టీబీఏ రాష్ట్ర అధ్యక్షుడు రావుల శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ.. టోర్నీలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జాతీయస్థాయికి ఎంపికవుతారని అన్నారు. జాతీయస్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం నంబర్వన్గా ఉండాలని ఆకాంక్షించారు. కాగా, రాష్ట్రస్థాయి అండర్–23 విభాగం 3గీ3 బాస్కెట్బాల్ టోర్నీలో 18 జిల్లాల నుంచి 180 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మక్సూద్ బిన్ అహ్మద్ జాకీర్ తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్రట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీశ్వర్రెడ్డి, జిల్లా కార్యదర్శి నసరుల్లా హైదర్, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఎన్పీ.వెంకటేశ్, కురుమూర్తిగౌడ్, మహబూబ్నగర్ బార్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీధర్రావు, రిటైర్డ్ పీడీ చెన్న వీరయ్య, సజ్జాద్అలీ, సుబాన్జీ, మీర్ ఖాలెద్అలీ, గీత, ఎండీ ఇలియాజ్, ఫారుఖ్ ముకర్రం, బాల్రాజు, గోపాలకృష్ణ, ఎండీ షకీల్, సోహెల్, జియావుద్దీన్ పాల్గొన్నారు. ట్రోఫీలు ప్రదానం టోర్నీ విన్నర్, రన్నరప్ జట్లకు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి ట్రోఫీలు, మెడల్స్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలని క్రీడాకారులకు సూచించారు. రన్నర్గా నిలిచిన జట్లు మళ్లీ గెలవడానికి ప్రయత్నం చేయాలన్నారు. పురుషుల, మహిళా విభాగాల్లో హవా మహిళల రన్నరప్గా నిలిచిన మహబూబ్నగర్ జట్టు ముగిసిన అండర్–23 (3గీ3) బాస్కెట్బాల్ టోర్నీ -
మొసలి దర్శనం.. భయాందోళనలో ప్రజలు
వీపనగండ్ల: మండల కేంద్రంలోని ఊరు చెరువులో మొసలి కనిపించడంతో స్థానిక రైతులు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు. వారం రోజులుగా తరచూ కనిపిస్తుండడంతో రైతులు, పశువుల కాపరులు అటుగా వెళ్లేందుకు జంకుతున్నారు. అధికారులు స్పందించి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బాలుడి ప్రతిభ మహబూబ్నగర్ క్రీడలు: సికింద్రాబాద్లోని జింఖానా మైదానంలో ఇటీవలే జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారుడు ఎం.రిథిన్ ప్రతిభ చాటాడు. 8 ఏళ్లలోపు బాలుర విభాగంలో 200 మీటర్ల పరుగును 34.4 సెకన్లలో పూర్తి చేసి కాంస్య పతకం సాధించాడు. ఈ క్రమంలో గురువారం జిల్లా కేంద్రంలో రిథిన్ను జిల్లా అథ్లెటిక్స్ సంఘం ఉపాధ్యాక్షుడు రాజేంద్రకుమార్ శాలువాతో సత్కరించి రూ.1500 నగదు పారితోషికం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్చంద్ర, జడ్చర్ల అథ్లెటిక్స్ కోచ్ ఎం.శ్రీనివాసులు పాల్గొన్నారు. విద్యుదాఘాతంతోరెండు గేదెలు మృతి కోయిల్కొండ: విద్యుదాఘాతంతో రెండు పాడి గేదెలు మృతిచెందిన ఘటన కోయిల్కొండ మండలం కొత్లాబాద్లో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. కొత్లాబాద్కు చెందిన రైతు దస్తగిరి నర్సింహులు రోజు మాదిరిగానే తన గేదెలను గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో మేపేందుకు తీసుకెళ్లాడు. అక్కడ మేత మేస్తున్న క్రమంలో రెండు గేదెలు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వైర్లకు తగలడంతో షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాయి. సమాచారం అందుకున్న వెటర్నరీ డాక్టర్ సమీర్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుకున్నారు. రెండు గేదెల విలువ రూ. 2లక్షల వరకు ఉంటుందని.. బాధిత రైతును ప్రభుత్వపరంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
24.728 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి
ధరూరు/దోమలపెంట/ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు గురువారం సాయంత్రం 10వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. విద్యుదుత్పత్తి కోసం 9,446 క్యూసెక్కులు, నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా 1,500 క్యూసెక్కులు, కోయిల్సాగర్కు 315 క్యూసెక్కులు కలిపి ప్రాజెక్టు నుంచి 11,328 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తుండగా.. 67 క్యూసెక్కులు ఆవిరి అవుతుందన్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.261 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ, దిగువలోని 6 యూనిట్ల ద్వారా 24.728 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. శ్రీశైలానికి 9,446 క్యూసెక్కులు జూరాలలో విద్యుదుత్పత్తి చేస్తూ గురువారం 9,446 క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 835.5 అడుగుల వద్ద 55.7729 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రేగుమాన్గడ్డ నుంచి ఎంజీకేఎల్ఐకు 867 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ కేంద్రంలో 0.842 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసి 1,856 క్యూసెక్కులు, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో 0.906 మి. యూనిట్లు ఉత్పత్తి చేసి 1,875 క్యూసెక్కుల నీటిని దిగువున సాగర్కు విడుదల చేశారు. -
మొదటి రోజు ఒకే దరఖాస్తు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పాలమూరు కార్పొరేషన్ పరిధిలో మొత్తం 60 డివిజన్లకు పెరగడంతో పూర్తి వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచారు. వీటికి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని నోటీస్ బోర్డులో అతికించారు. ప్రజల నుంచి ఏమైనా సూచనలు, సలహాలు, అభ్యంతరాలు ఉంటే ఈ నెల 11వ తేదీ వరకు స్వీకరించనున్న విషయం విదితమే. అయితే మొదటిరోజు గురువారం ఒకే దరఖాస్తు వచ్చింది. పాత వార్డు నం.28 పరిధిలోని కుమ్మరివాడి వీధిని ప్రతిపాదిత డివిజన్ నం.40లోనే ఉంచాలని కొత్తగా మదీనా మసీదు ప్రాంతం (డివిజన్ నం.41)లో కలపవద్దని మాజీ కౌన్సిలర్ ఎస్.పద్మ విన్నవించారు. అలాగే గణేష్నగర్, వల్లభ్నగర్లోని కొంత భాగాన్ని ప్రతిపాదిత డివిజన్ నం.40లో ఉంచవద్దన్నారు. గతంలో ఉన్న వీధులనే యథావిధిగా కొనసాగించాలని అందులో కోరారు. మరోవైపు ఆయా డివిజన్లకు సంబంధించిన నక్షాలు, ఓటరు జాబితాలను కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారులతో పాటు వార్డు ఆఫీసర్లు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏయే డివిజన్ పరిధిలో ఏ ఓటరు ఉంటారో గతంలో నమోదు చేసుకున్న వారి వివరాలను సరిచూస్తున్నారు. ఈ ప్రక్రియలో ఎలాంటి తప్పులు దొర్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పాతకాలం ఆహార పద్ధతులతో ఆరోగ్యం పాలమూరు: మానవ శరీరంలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి చిరుధాన్యాలు, కలి, చింతకాయ పచ్చడి వంటి పాతకాలం ఆహార పద్ధతులు పాటించడం ఎంతో ముఖ్యమని పాలమూరు మెడికల్ కళాశాల డైరెక్టర్ డా.రమేశ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని మెడికల్ కళాశాలలో గురువారం బయో కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన సీపీడీ ఆన్గట్ మైక్రోబయోమ్ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రేగులు, జీర్ణాశయ వ్యవస్థలో సూక్ష్మజీవులు ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తాయనే విషయాలను వివరించారు. కార్యక్రమంలో నారాయణపేట మెడికల్ కళాశాల డైరెక్టర్ డా.రాంకిషన్, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.సంపత్కుమార్, వైద్యులు లత, శశి, శిల్పారెడ్డి, యశ్వంత్రెడ్డి, అవినాష్రెడ్డి, సందీప్, కిరణ్మయి, రేణుక పాల్గొన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని నివారించడమే లక్ష్యం మహబూబ్నగర్ మున్సిపాలిటీ: వంద రోజుల కార్యాచరణతో పాటు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఎన్సీసీ వలంటీర్లు, మహిళా సంఘాల సభ్యులు, మెప్మా సిబ్బంది సుమారు 450 మందితో కలిసి రాయచూర్ మెయిన్ రోడ్డులోని పాత ఆర్టీఏ కార్యాలయం నుంచి బండమీదిపల్లి శివారులోని శిశుమందిర్ స్కూల్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం వన మహోత్సవంలో భాగంగా ఈ పాఠశాల ఆవరణలో అందరూ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని నివారించడమే తమ లక్ష్యమని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎన్సీసీ 8వ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ సంజీవ్, శానిటరీ ఇన్స్పెక్టర్లు రవీందర్రెడ్డి, వాణికుమారి, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ చరణ్, ఎస్బీఎం కన్సల్టెంట్ సుమీత్రాజ్, ఇన్చార్జ్ డీఎంసీ ఎం.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
నిరసనల పర్వం..
● ఉమామహేశ్వర రిజర్వాయర్ భూసేకరణకు సర్వే పనులను అడ్డుకున్న రైతులు ● పోలీసుల బందోబస్తు మధ్య సర్వే నిర్వహణ ● నోటీసులు లేకుండా భూసేకరణపై రైతుల ఆగ్రహం ● ప్రాజెక్ట్ సర్వే దశలోనే నిర్వాసితుల నుంచి నిరసనలు ● ఉమామహేశ్వర ప్రాజెక్ట్ పూర్తయితేనే చెన్నకేశవ ఎత్తిపోతల పనులకు మార్గం సుగమం సాక్షి, నాగర్కర్నూల్: నల్లమల ప్రాంతంలోని అచ్చంపేట నియోజకవర్గంలో చేపట్టనున్న ఉమామహేశ్వర ఎత్తిపోతల పథకానికి ప్రారంభ దశలోనే నిర్వాసిత రైతుల నుంచి నిరసనలు ఎదురవుతున్నాయి. గురువారం ఉమామహేశ్వర రిజర్వాయర్ నిర్మాణం కోసం సర్వే చేపట్టేందుకు వెళ్లిన అధికారులను బల్మూరు మండలం అనంతవరం రైతులు అడ్డుకున్నారు. తమకు నోటీసులు ఇవ్వకుండా భూముల్లో సర్వే పనులు చేపట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసుల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నడుమ అధికారులు సర్వే పనులు నిర్వహించారు. ఇప్పటికే ప్రాజెక్ట్ భూసేకరణ కోసం గ్రామంలో అధికారులు గ్రామసభను నిర్వహించగా, నిర్వాసిత రైతులు సగానికి పైగా సమావేశానికి గైర్హాజరయ్యారు. తాజాగా ప్రాజెక్ట్ సర్వే పనుల అడ్డంగితకు ప్రయత్నించడంతో అధికారులకు, రైతులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. మూడు మండలాలు.. 50 వేల ఎకరాలు అచ్చంపేట నియోజకవర్గంలోని బల్మూరు, లింగాల, అచ్చంపేట మండలాల్లోని సుమారు 50 వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఉమామహేశ్వర ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్లో భాగమైన ఏదుల రిజర్వాయర్ నుంచి ఒక స్లూయిస్ నిర్మించి దీని ద్వారా వెయ్యి క్యూసెక్కుల నీటిని తీసుకెళ్తూ బల్మూర్ వరకు 22 కి.మీ. మేర గ్రావిటీ కెనాల్ తవ్వాల్సి ఉంది. బల్మూరు వద్ద పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేసి అక్కడ నిర్మించనున్న రిజర్వాయర్లోని నీటిని ఎత్తి పోస్తారు. బల్మూరు, అనంతవరం, మైలారం గ్రామాల మధ్య నిర్మించనున్న రిజర్వాయర్ నుంచి మెయిన్, డిస్ట్రిబ్యూటరీ కెనాల్ నెట్వర్క్ ద్వారా మూడు మండలాల రైతులకు సాగునీటిని అందిస్తారు. ఈ ప్రాజెక్ట్లో భూములు కోల్పోతున్న రైతులు తమకు జీవనోపాధి కోసం మరో చోట భూమికి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ప్రస్తుత విలువ ప్రకారం ఎకరాకు కనీసం రూ.30 లక్షలు చెల్లించాలని కోరుతున్నారు. భూసేకరణకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ భూముల్లో పనులు చేపడితే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితేనే చెన్నకేశవ ఎత్తిపోతలకు అవకాశం.. ఉమామహేశ్వర రిజర్వాయర్ నుంచి అనుసంధానంగా ప్రభుత్వం చెన్నకేశవ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. బల్మూరులో నిర్మించనున్న రిజర్వాయర్ నుంచి స్లూయిస్ ఏర్పాటుచేసి కెనాల్ ద్వారా చంద్రవాగుకు నీటిని తరలిస్తారు. వాగు ద్వారా నీటి సరఫరాతో చంద్రసాగర్ చెరువును నింపుతారు. అక్కడ పంపింగ్ స్టేషన్ ఏర్పాటుచేసి మన్ననూర్ వద్ద నిర్మించే 1.5 టీఎంసీ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్ను నీటితో నింపుతారు. అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ద్వారా అప్పార్ ప్లాట్లోని అమ్రాబాద్, పదర మండలాల పరిధిలో సుమారు 25 వేల ఎకరాలకు నీరందించాల్సి ఉంది. అయితే ఉమామహేశ్వర ఎత్తిపోతల పథకం, రిజర్వాయర్ పనులు పూర్తయితేనే చెన్నకేశవ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి అడుగులు పడనున్నాయి. -
అలజడి.. ఆందోళన
జోగుళాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలోని పెద్దధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నారని తెలిసినప్పటి నుంచి ఆ చుట్టు పక్కల 12 గ్రామాల ప్రజల్లో కునుకులేకుండా పోయింది. తాజాగా బుధవారం ఫ్యాక్టరీ వద్ద జరిగిన దాడులు, నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో పెద్ద ధన్వాడతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజల్లో కూడా ఆందోళన మొదలైంది. రైతులు చేసిన దాడికి సంబంధించి కంపెనీకి చెందిన సీఏఓ మంజునాథ్ రాజోళి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాడుల్లో తమ సిబ్బంది పలువురికి గాయాలు కావడంతో పాటు కంపెనీకి చెందిన వాహనాలు, సామగ్రి ధ్వంసమైనట్లు అందులో పేర్కొన్నారు. దాడులకు దిగిన 41 మందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు మేరకు పోలీసులు 41 మందిపై కేసులు నమోదు చేయగా.. ఇందులో జనం సాక్షి పత్రిక ఎడిటర్ రహమాన్తో పాటు నాగర్కర్నూల్ జిల్లా సబ్ జైలర్ నాగరాజు ఉండడం చర్చనీయాంశంగా మారింది. దాడుల సమయంలో వారు ఘటన స్థలంలో లేరని.. అయినా వీరి పేరు చేర్చడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీనిపై రాజోళి ఎస్సై జగదీష్ని సంప్రదించగా.. దాడులకు ప్రేరేపించింది రహమాన్, నాగరాజు అని, మంజునాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. మానవపాడు మండలానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కేఎంఎస్ శ్రావణ్పై కేసు నమోదైంది. 191(2), 191(3), 329(3), 329(4), 324(5), 126(1), 326(జీ), 115(2), 118(1), 121(1), 132, 126(2), 109, 61(2), 199బీఎన్ఎస్, 0 సీఎల్ఏఏ–2013 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా.. కేసులు నమోదైన వారిలో 12 మందిని పోలీసులు గద్వాల జిల్లా కోర్టులో హాజరుపర్చగా.. వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. రిమాండ్కు తరలించిన వారిలో పెద్ద ధన్వాడకు చెందిన రైతులు నర్సింహులు, కె.నర్సింహులు, భరత్ కుమార్, చిన్న నాగేంద్ర, నల్లబోతుల కాటన్, శివ గౌడ్, సూర్యప్రకాష్, భీమన్న, మనోహర్, యేసన్న, నాగేంద్రంతోపాటు చిన్న ధన్వాడకు చెందిన పరుషరాముడు ఉన్నారు. జడ్జి తీర్పు అనంతరం పోలీసులు వీరిని ప్రత్యేక వాహనంలో మహబూబ్నగర్లోని జిల్లా జైలుకు తరలించారు. ఎన్హెచ్ఆర్సీలో కేసు నమోదు ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన రైతులపై దాడి చేయడం తగదని.. సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది రామారావు ఇమ్మానేని గురువారం జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ)లో పిటిషన్ దాఖలు చేశారు. నిరసన తెలుపుతున్న రైతులపై అక్రమంగా కేసులు పెట్టి తీవ్రంగా కొట్టారని.. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుని అడ్డుకోవడం రైతుల ప్రాఽథమిక హక్కు అని.. ఓ మైనర్పై కేసులు పెట్టారని అందులో పేర్కొన్నారు. ఇథనాల కంపెనీ ఏర్పాటుతో పర్యావరణ ప్రభావం అంచనాను తాజాగా చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలని, రాజోళి ఎస్సై జగదీశ్వర్తో పాటు గాయత్రి ఇండస్ట్రీస్ అండ్ రెన్యువేబుల్ ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్పై తగిన చర్యలు చేపట్టాలని కోరారు. అదేవిధంగా పోలీస్ హింసలో గాయపడిన రైతులకు నష్టపరిహారం చెల్లించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పిటిషన్ను స్వీకరించిన కమిషన్ 13030/ ఐఎన్/2025 నంబర్తో కేసు నమోదు చేసింది. ● కాగా.. ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన వ్యక్తులు దాడి చేయడం వల్ల తాము గాయపడ్డామని పెద్ద ధన్వాడకు చెందిన మరియమ్మ, కుర్వ క్రిష్ణ, కుర్వ లింగన్న గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జగదీశ్ తెలిపారు. నిర్మానుష్యంగా మారిన పెద్ద ధన్వాడ గ్రామం వ్యవసాయం.. పాడి పశుపోషణ.. కూలీ పనులు.. ఇవే వారి ప్రధాన జీవనోపాధి.రెక్కల కష్టాన్ని నమ్ముకొని.. వచ్చిన కొంత డబ్బుతో కాలం గడిపే ఆ గ్రామస్తుల జీవితం ఒక్కరోజులోనే తలకిందులైంది. పోలీస్స్టేషన్లు.. కేసులు.. జైలు.. ఇలా మారింది. ఇథనాల్ ఫ్యాక్టరీ చిచ్చు దాదాపు 12 గ్రామాల్లో అలజడి.. వందల కుటుంబాల్లో భయాందోళన సృష్టిస్తోంది. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/రాజోళి ఇథనాల్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త ఘటనలతో గ్రామాల్లో అలజడి అరెస్టులతో 12 గ్రామాల్లో ఆందోళన 41 మందిపై కేసు.. 12 మంది రిమాండ్ ఘటనపై మానవ హక్కుల కమిషన్లో పిటిషన్ దాఖలు -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఆయా శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. గురువారం కలెక్టరేట్లో ఎస్పీ జానకితో కలిసి పోలీస్, రవాణా, జాతీయ రహదారులు, వైద్యారోగ్య శాఖ, ఆర్అండ్బీ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని రాష్ట్ర, జాతీయ రహదారులపై ఎక్కువగా ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్ గుర్తించి.. నివారణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎదిర క్రాస్రోడ్డు, పాలకొండ బైపాస్, పిస్తాహౌస్ క్రాస్రోడ్లపై నిర్వహణ నిధులతో ఆగస్టులోగా రంబుల్ స్ట్రిప్, సైన్బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్హెచ్–167 బండమీదిపల్లి, ధర్నాపూర్, ఓబ్లాయిపల్లి, మన్యంకొండ వద్ద వారం రోజుల్లోగా, ఎన్హెచ్–44 బాలానగర్ క్రాస్రోడ్డు, రాజాపూర్ వద్ద రంబుల్ స్ట్రిప్, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ముదిరెడ్డిపల్లి వద్ద సర్వీస్ రోడ్డు, లైటింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. పోలేపల్లి సెజ్ వద్ద రంబుల్ స్ట్రిప్, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు. కాగా, జిల్లాలో 447 స్కూల్ బస్సులకు పిట్నెస్ సర్టిఫికెట్లు లేవని.. వాటిని అనుమతించవద్దని రవాణా, పోలీస్శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పాఠశాలల్లో విద్యార్థులకు రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఆర్అండ్బీ ఈఈ దేశ్యానాయక్, రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ కిషన్ తదితరులు ఉన్నారు. -
డిప్యూటీ సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
జడ్చర్ల/అడ్డాకుల/నవాబుపేట: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం దేవరకద్ర నియోజకవర్గంలోని మూసాపేట, జడ్చర్ల నియోజకవర్గంలోని నవాబుపేటలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మూసాపేటలో ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి, కలెక్టర్ విజయేందిర, నవాబుపేటలో అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్ సభ ఏర్పాట్లను పరిశీలించారు. జడ్చర్ల నియోజకవర్గానికి సంబంధించి రూ.108 కోట్ల వ్యయంతో కొత్తగా 33/11కేవీ విద్యుత్ సబ్స్టేషన్లు 16, నవాబుపేటలో కొత్తగా 132/33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లకు శుక్రవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేయనున్నారని ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి తెలిపారు. కాగా.. దేవరకద్ర నియోజకవర్గంలోని మూసాపేట మండలంలో 132/33 కేవీ సబ్స్టేషన్తో పాటు మరో ఎనిమిది సబ్స్టేషన్లకు కూడా డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేయనున్నారు. మూసాపేట సభలో మైనార్టీ కార్పోరేషన్ ద్వారా మంజూరైన కుట్టు మిషన్లను లబ్ధిదారులకు అందజేయడంతో పాటు రైతులకు మంజురైన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పంపిణీ చేస్తారని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన ఇలా: శుక్రవారం ఉదయం 11 గంటలకు హెలికాప్టర్లో మూసాపేటకు రానున్నారు. 12 గంటల వరకు అక్కడే పలు సబ్స్టేషన్లకు సంబంధించి శంకుస్థాపన చేయడంతో పాటు అధికారులు, నాయకులను కలుస్తారు. 12 నుంచి ఒంటి గంట వరకు బహిరంగసభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు మూసాపేట నుంచి నవాబుపేటకు బయల్దేరుతారు. అక్కడ 17 సబ్స్టేషన్లకు శంకుస్థాపనలు చేయడంతో పాటు అధికారులతో సమావేశం అవుతారు. సాయంత్రం 4.15 నుంచి 5 గంటలకు నవాబుపేటలో బహిరంగసభలో పాల్గొంటారు ● డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క సభ ఏర్పాట్లను అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్ పరిశీలించారు. నవాబుపేట సమీపంలోని రైస్మిల్లు ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగసభకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఆర్డీఓ వెంకట్రెడ్డి, మార్కెట్ చైర్మన్ లింగం, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ జయరాంనాయక్, తదితరులు ఉన్నారు. జడ్చర్ల పరిధిలో 16, దేవరకద్ర పరిధిలో8 సబ్స్టేషన్లకు శంకుస్థాపన మరో రెండు 132/33 కేవీ సబ్స్టేషన్లకు శ్రీకారం నేడు మూసాపేట, నవాబుపేటలో మల్లు భట్టి విక్రమార్క పర్యటన -
నగదు ఇప్పించాలని ఎస్పీకి ఫిర్యాదు
నాగర్కర్నూల్ క్రైం: మొక్కజొన్న కొనుగోలు చేసిన వ్యక్తి నుంచి తమకు నగదు ఇప్పించాలని పలువురు రైతులు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్కు బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. బిజినేపల్లి మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన ఆంజనేయులు అనే వ్యక్తి నంది వడ్డెమాన్, నల్లవెల్లి, ఖానాపూర్ గ్రామాల్లోని పలువురు రైతుల నుంచి మొక్కజొన్న కొనుగోలు చేశాడు. అయితే మూడు నెలలు అయినా నగదు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. దీంతో బాధితులు తమకు న్యాయం చేయాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దాదాపు 60 మంది రైతులకు రూ. కోటి నగదు ఇవ్వాలని బాధితులు తెలిపారు. -
జడ్చర్లలో అర్ధరాత్రి కారు బీభత్సం
● మద్యం మత్తులో డ్రైవర్ ● బెలూన్లు తెరుచుకోవడంతో తప్పిన ప్రాణాపాయం జడ్చర్ల: స్థానిక సిగ్నల్గడ్డ ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. ఐపీఎల్లో ఆర్సీబీ జట్టు విజయం సాధించడంతో సంబరాలు చేసుకున్న కొందరు యువకులు మద్యం తాగి కారులో సిగ్నల్గడ్డ నుంచి నేతాజీ చౌరస్తా వైపునకు వెళ్తున్న క్రమంలో రాఘవేంద్రస్వామి ఆలయం వద్ద అదుపు తప్పి ఆలయం వైపునకు దూసుకొచ్చింది. రోడ్డు పక్కన ఉన్న చెరుకు రసం యంత్రాన్ని ఢీకొట్టడంతో కారు ముందు భాగంతో పాటు యంత్రం పూర్తిగా ధ్వంసమైంది. అయితే కారులో బెలూన్లు తెరుచుకోవడంతో చర్లపల్లి, కావేరమ్మపేటకు చెందిన నలుగురు యువకులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని స్థానికులు తెలిపారు. జేసీబీ సహాయంతో కారును అక్కడి నుంచి తరలించారు. అయితే ప్రమాదానికి సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ మల్లేష్ తెలిపారు. -
పల్లెల్లో ఇథనాల్ చిచ్చు
ఫ్యాక్టరీ వద్దంటూ గ్రామస్తుల ఆందోళన రాజోళి/మానవపాడు: ‘12 గ్రామాలకు ఇబ్బందిగా మారిన ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ మాకొద్దు.. పచ్చని పల్లెల్లో ఫ్యాక్టరీ చిచ్చు పెట్టొద్దు.. ఈ విషయం ఎన్నో సార్లు ఫ్యాక్టరీ వారికి చెప్పాం.. శాంతియుతంగా నిరసన దీక్షలు చేపట్టాం.. ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులకు విన్నవించాం.. అయినా మా మాట లెక్కచేయకుండా పనులు ఎలా ప్రారంభిస్తారు’ అంటూ సహనం కోల్పోయిన స్థానికులు సదరు ఫ్యాక్టరీకి సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేశారు. సామగ్రితో వచ్చిన కంటైనర్తో పాటు అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లు, షెడ్లకు నిప్పు పెట్టారు. ఇతర వాహనాలను ధ్వంసం చేశారు. గతేడాది అక్టోబర్ నుంచి శాంతియుతంగా కొనసాగుతున్న ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేక నిరసన కాస్తా.. బుధవారం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. గతేడాది అక్టోబర్ నుంచి రిలే దీక్షలు.. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్దధన్వాడలో 27.5 ఎకరాల భూమిని గాయిత్రి ఇథనాల్ ప్యూయల్స్ ఫ్యాక్టరీ కొనుగోలు చేసింది. అక్కడ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారనే విషయం అప్పటి వరకు ఎవరికీ తెలియదు. గతేడాది అక్టోబర్లో ఫ్యాక్టరీ యాజమాన్యం అక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నామని గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా గ్రామస్తులు కొన్ని రోజుల తర్వాత, ఇతర గ్రామాలతో కలిసి ఫ్యాక్టరీ ఏర్పాట్లుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటుతో తమకు ఇబ్బంది కలుగుతుందని చుట్టు పక్కల 12 గ్రామాల ప్రజలతో కలిసి తమ కార్యాచరణను ప్రకటించారు. అందులో భా గంగా నిరసనలు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు విన తులు అందజేశారు. అనంతరం ఈ ఏడాది జనవరి 23న రిలే నిరాహార దీక్షను ప్రారంభించి ఫిబ్రవరి 11న విరమించారు. ఆ సమయంలో అధికార పార్టీ నాయకులు, అధికారులు ఫ్యాక్టరీ విషయంలో తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా కృషి చేస్తామని మాట ఇచ్చి తమతో దీక్ష విరమింపచేశారని.. కానీ ప్రస్తుతం పరిస్థితి ఇంతదాకా వచ్చిందని వ్యతిరేక పోరాట సమితి సభ్యులు పేర్కొన్నారు. పరిశ్రమకు సంబంధించి కంటైనర్,టెంట్లు, షెడ్లకు నిప్పు..వాహనాలు ధ్వంసం పచ్చని పల్లెల్లో చిచ్చుపెట్టొద్దంటూ ఆగ్రహం రాజోళి మండలం పెద్ద ధన్వాడలో తీవ్ర ఉద్రిక్తత -
తెలంగాణను స్పోర్ట్స్ హబ్గా చేస్తాం
రాష్ట్రంలో ఫిఫా సదరన్ అకాడమీ మహబూబ్నగర్ క్రీడలు: తెలంగాణను స్పోర్ట్స్ హబ్గా తయారు చేయడమే సీఎం రేవంత్రెడ్డి కల అని, రాష్ట్ర ప్రభుత్వం క్రీడాభివృద్ధికి కృషి వేస్తున్నట్లు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, రాష్ట్ర ప్రభుత్వ క్రీడల వ్యవహారాల సలహాదారులు ఏపీ జితేందర్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో బుధవారం మొదటి రాష్ట్రస్థాయి అండర్–23 విభాగం 3 ్ఠ3 పురుషుల, మహిళా అంతర్ జిల్లాల బాస్కెట్బాల్ చాంపియన్షిప్ను ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో 3 ్ఠ3 రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ చాలెంజర్ పోటీలు నిర్వహిస్తుండడం సంతోషంగా ఉందన్నారు. పదేళ్లలో క్రీడలను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి స్వయంగా ఫుట్బాల్ క్రీడాకారుడని, క్రీడాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది రూ.360 కోట్లు, ఈ ఏడాది అధికంగా రూ.460 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అన్ని జిల్లాల్లో క్రీడా మైదానాలు అభివృద్ధి, అకాడమీలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్లో ఎన్నో క్రీడల టోర్నమెంట్లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 35 ఏళ్ల తర్వాత సంతోష్ట్రోఫీతో పాటు సబ్ జూనియర్ హాకీ, ఇటీవల రోయింగ్ పోటీలు కూడా నిర్వహించినట్లు తెలిపారు. ఇంటర్నేషనల్ టెన్నిస్ మ్యాచ్లు నిర్వహించడానికి డబ్ల్యూటీఓతో చర్చిస్తున్నట్లు వివరించారు. ఫిఫాతో కలిసి గచ్చిబౌలిలో సదరన్ అకాడమీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మహబూబ్నగర్ జట్ల శుభారంభం ఈ టోర్నమెంట్లో 18 జిల్లాల జట్లు పాల్గొన్నాయి. తొలి రోజు మ్యాచుల్లో మహబూబ్నగర్ పురుష, మహిళా జట్లు శుభారంభం చేశాయి. మహబూబ్నగర్ పురుషులు 11–1 పాయింట్ల తేడాతో కరీంనగర్పై, 13–12 తేడాతో ఖమ్మంపై, జిల్లా మహిళా జట్టు 11–8 పాయింట్ల తేడాతో ఖమ్మంపై, 11–1 తేడాతో కరీంనగర్పై విజయాలు నమోదు చేసుకున్నాయి. ఇతర పురుషుల విభాగం మ్యాచుల్లో హైదరాబాద్ 21–10 తో జయశంకర్ భూపాలపల్లిపై, రంగారెడ్డి 22–6 తేడాతో మెదక్పై, హైదరాబాద్ 18–11 తేడాతో మెదక్పై, హన్మకొండ 16–14తో మహబుబాబాద్పై, హైదరాబాద్ 21–12తో నిజామాబాద్పై, ఖమ్మం 16–8తో గద్వాలపై, మేడ్చల్ మల్కాజ్గిరి 21–8తో నిజామాబాద్పై, నల్లగొండ 18–8తో జగిత్యాలపై, రంగారెడ్డి 16–9తో మహబూబ్నగర్పై, హన్మకొండ 17–9తో కామారెడ్డిపై గెలుపొందాయి. మహిళా విభాగం మ్యాచుల్లో మేడ్చల్ మల్కాజ్గిరి 11–10 తో మహబూబ్నగర్పై, ఖమ్మం 15–2తో కరీంనగర్పై, హైదరాబాద్ 2–0 తేడాతో జయశంకర్ భూపాలపల్లిపై, హైదరాబాద్ 21–8తో నిజామాబాద్పై విజయం సాధించాయి. రూ.16 కోట్లతో క్రీడాభివృద్ధి మహబూబ్నగర్ జిల్లాలో క్రీడల అభివృద్ధి కోసం రూ.16 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు జితేందర్రెడ్డి తెలిపారు. ఇండోర్ స్టేడియంలో ఏసీ సౌకర్యం, ఇతర మౌలిక సౌకర్యాలు, సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చేనెలలో ఫుట్బాల్ మైదానాలను పరిశీలించేందుకు స్పెయిన్కు వెళుతున్నట్లు తెలిపారు. నైపుణ్యం గల కోచ్లతో మెరుగైన క్రీడాశిక్షణ అందజేస్తామన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు రావుల శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ జాతీయస్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో తెలంగాణ నంబర్వన్గా ఉండాలన్నారు. రాష్ట్రస్థాయి టోర్నీలో ప్రతిభ కనబరిచేవారు జాతీయస్థాయి ఎంపికవుతారని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృద్వీశ్వర్రెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మక్సూద్ బిన్ అహ్మద్ జాకీర్, నసరుల్లా హైదర్, చీఫ్ ప్యాట్రన్ మనోహర్రెడ్డి, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్, సుబాన్జీ, మీర్ఖాలెద్ అలీ, ఎండి.ఇలియాజ్, ఫారుఖ్ ముకర్రం, బాల్రాజు, గోపాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ క్రీడల వ్యవహారాల సలహాదారుడు ఏపీ జితేందర్రెడ్డి అట్టహాసంగా రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ చాంపియన్షిప్ పోటీలు ప్రారంభం -
మహబూబ్నగర్కు హ్యాట్రిక్ విజయం
మహబూబ్నగర్ క్రీడలు: ఉమ్మడి జిల్లా అండర్–19 ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ లీగ్లో మహబూబ్నగర్ జట్టు హ్యాట్రిక్ విజయం సాధించింది. జిల్లా కేంద్రానికి సమీపంలోని సమర్థ స్కూల్ మైదానంలో బుధవారం జరిగిన మూడో లీగ్ మ్యాచ్లో మహబూబ్నగర్ జట్టు 170 పరుగుల తేడాతో గద్వాల జట్టుపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన మహబూబ్నగర్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 360 పరుగులు చేసింది. జట్టులో ఓపెనర్ అబ్దుల్ రాఫే అద్భుతమైన బ్యాటింగ్తో అజేయ డబుల్ సెంచరీ చేశాడు. 173 బంతుల్లో 6 సిక్స్లు, 31 ఫోర్లతో 243 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. కనిష్క్ 62, సోను 23 పరుగులు చేశారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గద్వాల 48.1 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో తల్హ 37, గోపిచంద్ 34 పరుగులు చేశారు. మహబూబ్నగర్ బౌలర్లు యువన్ ముద్దనూరి 3, అభినవ్ 2, కనిష్క్ 2 వికెట్లు తీశారు. అండర్–19 లీగ్లో నైపుణ్యాన్ని చాటుకోవాలి అండర్–19 ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ లీగ్లో క్రీడాకారులు తమ క్రీడా నైపుణ్యాన్ని చాటుకోవాలని ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ అన్నారు. మహబూబ్నగర్–గద్వాల జట్ల మధ్య మ్యాచ్ను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా గెలుపొందిన మహబూబ్నగర్ జట్టును అభినందించారు. ఓడిన వారు గెలుపు కోసం పట్టుదలతో ఆడాలని పిలుపునిచ్చారు. అండర్–19 లీగ్ను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కోచ్ అబ్దుల్లా, సీనియర్ క్రీడాకారులు ముఖ్తార్, శ్రీనివాసులు, రంజిత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. అజేయ డబుల్ సెంచరీ చేసిన అబ్దుల్ రాఫె -
పుంజుకున్న ఉల్లి ధరలు
దేవరకద్ర: స్థానిక మార్కెట్లో బుధవారం జరిగిన వేలంలో ఉల్లి ధరలు పుంజుకున్నాయి. ప్రస్తుతం సీజన్ తగ్గిపోయి మార్కెట్కు తక్కువ మొత్తంలో ఉల్లి అమ్మకానికి వచ్చింది. సీజన్ ప్రారంభం నుంచి గత వారం వరకు ఉల్లి ధర రూ.2వేలు దాటని పరిస్థితి ఉండేది. కానీ మార్కెట్కు ఉల్లి బస్తాలు తక్కువగా వస్తుండడంతో క్రమంగా ధరలు పెరుగుతున్నాయి. జోరుగా కొనుగోళ్లు.. మార్కెట్కు వివిధ గ్రామాల నుంచి దాదాపు రెండు వేల బస్తాల ఉల్లి అమ్మకానికి వచ్చింది. వ్యాపారులు నిర్వహించన వేలంలో ఉల్లి ధర గరిష్టంగా రూ. 2వేలు, కనిష్టంగా రూ. 1100 వరకు పలికాయి. గత వారంతో పోల్చితే ధరలు స్వల్పంగా పెరిగాయి. గతంలో 50 కిలోల ఉల్లి బస్తా గరిష్టంగా రూ. వెయ్యి, కనిష్టంగా రూ. 600 వరకు విక్రయించారు. చిన్నగా పేడు ఉల్లికి గరిష్టంగా రూ. 750 నుంచి కనిష్టంగా రూ. 250 వరకు ధరలు వచ్చాయి. ఆర్ఎన్ఆర్ ధర రూ. 1659 దేవరకద్ర మార్కెట్ యార్డులో బుధవారం మధ్యాహ్నం జరిగిన టెండర్లలో ఆర్ఎన్ఆర్ ధా న్యం ధర క్వింటాల్కు రూ. 1,659 పలికింది. ప్రస్తు తం ధాన్యం సీజన్ కూడా బాగా తగ్గినందున కేవ లం వంద బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. క్వింటాల్కు గరిష్టంగా రూ.2వేలు కనిష్టంగా రూ.1100 -
వైద్యుడి నిర్లక్ష్యం: బాలింత మృతి
నాగర్కర్నూల్ క్రైం: ప్రసవం అనంతరం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలింత మృతి చెందిన ఘటన జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి చోటు చేసుకోగా.. ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన సమాచారం మేరకు.. కొల్లాపూర్ మండలంలోని ముక్కిడిగుండం గ్రామానికి చెందిన వనజ (25) రెండో కాన్పు కోసం ఈ నెల 1న జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. మంగళవారం ఉదయం గర్భిణికి ఆపరేషన్ చేయడంతో మగశిశుకు జన్మనిచ్చింది. ఇదే క్రమంలో మహిళ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ప్రైవేటు ఆస్పత్రి నుంచి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి అటు నుంచి హైదరాబాద్కు తరలించడంతో బాలింత మృతి చెందింది. బాలింత మృతికి వైద్యుడి నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యులు బుధవారం స్థానిక అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ గోవర్ధన్ ధర్నా వద్దకు చేరుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఘటనకు సంబంధించి ఎస్ఐ గోవర్ధన్ మాట్లాడుతూ మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యుల ధర్నా -
గ్రామస్తులకు గాయాలయ్యాయి
పనులు చేపట్టవద్దని అడగడానికి వెళితే వారు చెప్పిన సమాధానాలు, మాట్లాడిన తీరు వల్ల ఇంతటి పరిస్థితికి దారి తీసింది. ప్రైవేట్ వ్యక్తులు దాడులు చేశారు. అందులో గ్రామస్తులకు గాయాలయ్యాయి. పచ్చని పంటలను దెబ్బతీసే ఫ్యాక్టరీ వద్దని చెబుతుంటే, వారు మాపై దాడులు చేస్తే భవిష్యత్తులో మా పరిస్థితి తలుచుకుంటే భయమేస్తుంది. – శ్యాం ప్రసాద్, పెద్ద ధన్వాడ పికెటింగ్ ఏర్పాటు చేశాం ఫ్యాక్టరీకి సంబందించిన వారు అన్ని అనుమతులు తెచ్చుకున్నారు. వాటి ఆధారంగా పెద్దధన్వాడలో పనులు చేసుకునేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఇలాంటి ఘటన చోటుకుంది. మళ్లీ గ్రామంలో అలజడి రేగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశాం. – మొగిలయ్య, డీఎస్పీ, గద్వాల ● -
నేడు సీనియర్ సిటిజన్స్ ఫోరం ఎన్నికలు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలో వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న సీనియర్ సిటిజన్స్ ఫోరం ఎన్నికలు గురువారం జరగనున్నాయి. ఉదయం పది గంటలకు స్థానిక మెట్టుగడ్డలోని బీఈడీ కళాశాల ఆవరణలో ఉన్న సర్వశిక్షా అభియాన్ ఆర్వీఎం హాల్ నిర్వహించే ఓటింగ్లో అర్హులైన 163 మంది సభ్యులు పాల్గొనాలని ప్రధాన కార్యదర్శి నస్కంటి నాగభూషణం ఒక ప్రకటనలో కోరారు. కాగా, ఈ ఫోరం 2015 జూన్లో 15 మంది సభ్యులతో ప్రారంభం కాగా ప్రస్తుతం 407 మంది ఉన్నారు. 2018 ఆగస్టు 5న ఎన్నికై న కార్యవర్గమే ఇప్పటివరకు కొనసాగుతోంది. తిరిగి ఏడేళ్ల తర్వాత ఇప్పుడు ఎన్నికలు జరగనుండటం గమనార్హం. దరఖాస్తుల ఆహ్వానం మహబూబ్నగర్ మున్సిపాలిటీ: స్వయం ఉపాధి కోర్సులకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని మహబూబ్నగర్ ఫస్ట్ – నవరత్నాలు కేంద్రం పర్యవేక్షకులు గుండా మనోహర్ ఒక ప్రకటనలో తెలిపారు. పదోతరగతి పాస్ లేదా ఫెయిల్ అయిన వారికి ఇక్కడ మూడు నెలల పాటు ఉచితంగా కంప్యూటర్ (ఎంఎస్ ఆఫీస్), ఫ్యాషన్ డిజైనింగ్ – గార్మెంట్ తయారీ, బ్యూటీషియన్, మగ్గం వర్క్పై శిక్షణ ఇప్పిస్తామని పేర్కొన్నారు. ఈనెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని, పూర్తి వివరాలకు ఫోన్ నం.94404 10459, 94415 65895లలో సంప్రదించాలని సూచించారు. కాంగ్రెస్ నాయకులకు షోకాజ్ నోటీసులు గద్వాల: నడిగడ్డలో అధికార పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరు అధిష్టానానికి తీవ్ర తలనొప్పిగా మారింది. ఇది వరకే గద్వాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, సరిత వర్గాల మధ్య వైరం నడుస్తోంది. ఈ క్రమంలో ఇటీవల అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిని తీసుకొని నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవి సరిత ఇంటికి వెళ్లడం కలకలం సృష్టించింది. ఈ క్రమంలో ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ఎంపీ మల్లు రవి మధ్య ఉన్న వైషమ్యాలు వీధికెక్కాయి. మల్లురవి ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని స్పందించగా..సర్దుమణిగినట్లయింది. ఈ నేపథ్యంలో తాజాగా సంపత్ వర్గీయులైన యువజన కాంగ్రెస్ నాయకులకు బుధవారం రాత్రి అనూహ్యంగా షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. గద్వాల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోల నర్సింహ, అలంపూర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వరకుంట్ల గణేష్, గద్వాల జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేఎంఆర్ యేసు, మానవపాడు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాశపోగు శేఖర్కు నోటీసులు జారీ చేశారు. తన వర్గీయులకు నోటీసులు ఇవ్వడంపై సంపత్ ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. -
రూ.లక్ష చోరీ.. కేసు నమోదు
మక్తల్: రూ.లక్ష చోరీకి పాల్పడిన ఘటన మక్తల్ పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. మాగనూర్ మండలం మందిపల్లికి చెందిన కుర్వనాగప్ప బ్యాంకులో ఉన్న నగదు డ్రా చేసుకుని ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో నారాయణపేట క్రాసింగ్ దగ్గర ఉన్న ఎచ్డీఎఫ్ బ్యాంకు ఎదరుగా ఉన్న ఎస్ఆర్ఎస్ హోటల్లో భోజనం చేసేందుకు వెళ్లాడు. భోజనం చేసి చేతులు కడుక్కొని వచ్చే లోగా నగదు సంచి కనిపించలేదు. బాధితుడు డబ్బులు చోరీకి గురైనట్లు గ్రహించి వెంటనే మక్తల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ భాగ్యలక్ష్మిరెడ్డి కేసు నమోదు చేసుకొని ఘటనా స్థలంలోని సీసీ పుటేజీను పరిశీలించారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని తెలిపారు. బైక్ను ఢీ కొట్టిన లారీ.. యువకుడి మృతి కల్వకుర్తి రూరల్: మండలంలోని తాండ్ర గ్రామ సమీపంలో లారీ బైక్ను ఢీ కొట్టిన ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న కొప్పుల చరణ్ కుమార్ (22) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. చరణ్ కుమార్ తన ద్విచక్రవాహనంపై పని నిమిత్తం జూపల్లి నుంచి కల్వకుర్తి వైపు బయలుదేరాడు. ఈ క్రమంలో కల్వకుర్తి నుంచి దేవరకొండ వైపు వెళ్తున్న లారీ తాండ్ర గ్రామ సమీపంలో ఢీకొట్టడంతో చరణ్ తలకు గాయమై అక్కడికక్కడే మరణించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలా న్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతుడి తల్లి నెల క్రితం గుండెపోటుతో మరణించిందని ప్రస్తు తం కుమారుడు కూడా మృతి చెందడంతో జూపల్లి గ్రామంలో విషాదఛాయాలు అలుముకున్నాయి. రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం గద్వాల క్రైం: రెండు బైక్లు ఎదురెదుగా ఢీకొడంతో బుధవారం సాయంత్రం ఓ మహిళ మృతి చెందింది. రూరల్ ఏఎస్ఐ వెంకటేశ్వరెడ్డి కథనం మేరకు.. మానవపాడు మండలంలోని మద్దూరు గ్రామానికి చెందిన కుర్వ రంగమ్మ(60) గద్వాల మండలంలోని పుడూరు గ్రామానికి తన కుటుంబ సభ్యులను చూసేందుకు వచ్చి తిరుగు ప్రయాణంలో తెలిసిన వ్యక్తి బైక్పై వెళ్తుంది. గోపాల్దిన్నె గ్రామానికి చెందిన ఆనంద్ బైక్పై అతి వేగంగా వస్తూ పూడూరు గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రంగమ్మకు తీవ్ర రక్త గాయాలయ్యాయి. స్థానికులు గమనించి బాధితురాలిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఘటనపై మృతురాలి కుమారుడు సుంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. -
విద్యార్థులను భావిపౌరులుగా తీర్చిదిద్దాలి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులను భావిపౌరులుగా తీర్చిదిద్దాలని డీఈఓ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని ఏనుగొండ పాఠశాలలో ప్రజ్వల సంస్థ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్ను నిర్ణయించే స్థాయికి ఆడపిల్లలు ఎదగాలని, వారి అభివృద్ధిలో ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషిస్తారని తెలిపారు. విద్యార్థినీలు బాల్యవివాహాల బారిన పడకుండా పూర్తిస్థాయిలో అప్రమత్తత వ్యవహరించాలని సూచించారు. సైబర్ ట్రాఫికింగ్ అనేది చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందని, విద్యార్థులు సెల్ఫోన్కు దూరంగా ఉండాలన్నారు. సోషల్ మీడియా వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను విద్యార్థులకు వివరించాల్సిన అవసరం ఉందని, పిల్లలకు ఏదైనా ప్రమాదం జరిగితే 1098, 181, 100, 1930 వంటి టోల్ ప్రీ నంబర్లు ఉపయోగించుకునేలా సూచించాలన్నారు. కార్యక్రమంలో ఏఎంఓ శ్రీనివాస్, జీహెచ్ఎం అరుణ్కుమార్, కోఆర్డినేటర్ మల్లేష్, మిథాలీరాజ్, తదితరులు పాల్గొన్నారు. -
పాలమూరుపై కక్షగట్టిన పాలకులు
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): సాగునీటిని ఇతర జిల్లాలకు తరలించడం, ఇథనాల్ కంపెనీలను పెట్టించి ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తున్న తీరును చూస్తుంటే.. పాలకులు కక్ష గట్టినట్టుగా ఉందని పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ రాఘవాచారి విమర్శించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని టీఎఫ్టీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయిని అయిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన ఏదుల రిజర్వాయర్ నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని డిండి ప్రాజెక్టుకు నీరు తరలించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జిల్లాకు దక్కాల్సిన నీటిని డిండికి తరలించుకుపోతుంటే ఇక్కడి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు పట్టనట్టుగా ఉండటం దారుణమన్నారు. ఈ పరిణామాలు జిల్లా ప్రజలు బతుకనిచ్చేలా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి తరలింపు చర్యలను ఆపకపోతే మరో పోరాటం చేస్తామన్నారు. అదే విధగా వ్యవసాయ భూములు, ప్రజల జీవనాన్ని నాశనం చేసే ఇథనాల్ కంపెనీలను పెట్టనిచ్చేది లేదని జిల్లా ప్రజలు, రైతులు పోరాటం చేస్తుండగా.. ప్రభుత్వం మాత్రం బలవంతంగా ఫ్యాక్టరీలు పెట్టాలని చూస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో ఇథనాల్ కంపెనీ పాలసీని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తుంగభద్ర నది ఒడ్డున టీజీ వెంకటేశ్ విషపూరితమైన కంపెనీ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కంపెనీ ఏర్పాటుతో అలంపూర్ ప్రాంతంతో పాటు కృష్ణానది విషపూరితం అవుతుందన్నారు. బనకచర్ల నుంచి ఆంధ్రాకు గోదావరి నీరు తరలించుకుపోతుంటే తెలంగాణ ప్రజాప్రతినిధులు ప్రశ్నించకపోవడం దుర్మార్గమన్నారు. చంద్రసాగర్ లిఫ్ట్ ద్వారా అమ్రాబాద్ ప్రాంత రైతులకు సాగునీటిని అందించాలని కోరారు. సమావేశంలో టీఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్, చైతన్య మహిళా సంఘం నాయకురాలు శ్రీదేవి, విజయ్కుమార్, తిమ్మప్ప, బాలకృష్ణ, జలీల్ పాషా తదితరులు ఉన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీల ఏర్పాటు,సాగునీటి తరలింపుతో అన్యాయం ప్రజావ్యతిరేక విధానాలను విరమించుకోవాలి పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ రాఘవాచారి -
మనస్తాపంతో మహిళ ఆత్మహత్య
హన్వాడ: మండలంలోని వేపూర్లో ఉరేసుకొని ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటేష్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన మాల శిరీష (30)కు భర్త నర్సింలు ఏడు నెలల క్రితం అనారోగ్యంతో మృత్యువాత పడ్డాడు. దీంతో ఒంటరిగా జీవిస్తున్న శిరీష తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో శిరీష ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మరిది సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ వెంకటేష్ తెలిపారు. వ్యక్తి బలవన్మరణం బల్మూర్: మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఉరేసుకోని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని గోదల్లో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ రమాదేవి, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గోదల్ గ్రామానికి చెందిన వెంకటయ్య(40) భార్య లలిత ఏడాది క్రితం అతడిని వదిలి పుట్టింటికి వెళ్లి అక్కడే ఉంటుంది. దీంతో మనస్తాపానికి గురైన వెంకటయ్య మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై మృతుడి సోదరుడు చంద్రయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినటు్ల్ ఎస్ఐ తెలిపారు. విద్యుత్ షాక్తో యువకుడి దుర్మరణం దేవరకద్ర: దేవరకద్ర మండలం వెంకటాయపల్లి గ్రామంలో బుధవా రం ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్ఐ నాగన్న కథనం ప్రకారం.. వెంకటాయపల్లికి చెందిన శివమల్లేశ్ (24) బుధవారం ఉదయం బహిర్భూమికి వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి విద్యుత్ షాక్కు గురయ్యాడు. గమనించిన గ్రామస్తులు వెంటనే విద్యుత్ను నిలిపి వేయించారు. అయితే అప్పటికే శివమల్లేశ్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బైక్ పైనుంచి జారిపడి వృద్ధురాలు మృతి ఎర్రవల్లి: ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం పైనుంచి జారిపడి వృద్ధురాలు మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. ఇటిక్యాల ఎస్ఐ వెంకటేష్ తెలిపిన వివరాలు మేరకు గద్వాల మండలం బీరెల్లికి చెందిన గొల్ల దాయేదమ్మ (65) మంగళవారం వీపనగండ్ల మండలం గోపత్దిన్నెకు దేవర నిమిత్తం వెళ్లింది. బుధవారం తిరిగి స్వగ్రామానికి వస్తుండగా తిమ్మాపురం వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్ర వావానం ఎక్కి ప్రమాదవశాత్తు జారి కిందపడింది. తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం కర్నూల్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యు లు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలి అల్లుడు గొల్ల బీచుపల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
ట్రాక్టర్ బోల్తా : డ్రైవర్ మృతి
ఎర్రవల్లి: జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. రాజోలి మండల పరిధిలోని తుమ్మిళ్ల గ్రామానికి చెందిన కుర్వ వెంకటేశ్ ట్రాక్టర్పై పనినిమిత్తం ఎర్రవల్లికి బయలుదేరాడు. ఈ క్రమంలో కొట్టం కాలేజీ సమీపంలో ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ప్రమాదంలో వెంకటేశ్కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న ఇటిక్యాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత మక్తల్: మండలంలో అక్రమంగా తరలిస్తున్న 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. నర్వ మండలం పెద్దకడ్మూర్ గ్రామంలో ఎరుకలి నర్సింహ తన ఇంట్లో 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా దాచి ఉంచాడు. సమాచారం అందుకున్న నర్వ పోలీసులు తనిఖీలు నిర్వహించి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కుర్మయ్య తెలిపారు. -
రైతులకు అవగాహన కల్పించాలి
కోయిల్కొండ: భూభారతి ద్వారా గ్రామాల్లో నెలకొన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ విజయేందిర బోయి పేర్కొన్నారు. నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ విజయేందిరబోయి అన్నారు. బుధవారం కోయిల్కొండ మండలం చంద్రాస్పల్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆమె పాల్గొని, భూసమస్యల దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో రైతులందరూ పాల్గొనేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. రెవెన్యూ సదస్సుల్లో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేసి దరఖాస్తుదారులకు ఏవిధంగా దరఖాస్తు పూరించాలని సూచనలు, సలహాలు అందజేయనున్నట్లు తెలిపారు. అధికారులు స్వీకరించిన దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిష్కారం చేయనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం అదే గ్రామంలో పల్లె దవాఖానాను కలెక్టరతనిఖీ.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. రక్తహీనత ఉన్న మహిళలపై ప్రత్యేక శ్రద్ధ చూపి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ రాజాగణేష్, తదితరులు ఉన్నారు. -
రేపు డిప్యూటీ సీఎం పర్యటన
అడ్డాకుల: మూసాపేట మండలకేంద్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుక్రవారం పర్యటించనున్నారని, దీనిని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి కోరారు. మూసాపేటలోని అయ్యప్పగుట్ట పక్కన ఏర్పాటు చేయనున్న 132/33కేవీ విద్యుత్ సబ్ స్టేషన్తో పాటు అడ్డాకుల, మూసాపేట, భూత్పూర్ మండలాల్లోని గ్రామాలకు మంజూరైన 33/11కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లకు కూడా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇక్కడే శంకుస్థాపన చేయన్నుందున వాటికి సంబంఽధించిన ఏర్పాట్లను బుధవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. సబ్ స్టేషన్ స్థలంలో పాటు బహిరంగ సభ ఏర్పాట్లపై విద్యుత్ శాఖ అధికారులు, పార్టీ నేతలతో చర్చించారు. డిప్యూటీ సీఎం సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తరలిరావాలని కోరారు. అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజునాయక్, పార్టీ మండలాధ్యక్షుడు శెట్టిశేఖర్, నాగిరెడ్డి, బాలనర్సిములు, బగ్గి కృష్ణయ్య, సుధాకర్రెడ్డి, రాంచందర్, ఎన్టీగౌడ్, కృష్ణయ్య, రవి, సుధాకర్ ఉన్నారు. -
కొనసాగుతున్న ‘స్వచ్ఛత’ కార్యక్రమాలు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: వంద రోజుల ప్రత్యేక కార్యాచరణ లో భాగంగా నగరంలో ఈనెల 2 నుంచి ముమ్మరంగా ‘స్వచ్ఛత’ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇంటింటికీ వచ్చే స్వచ్ఛ ఆటోలకే తడి, పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని ప్రజలకు పారిశుద్ధ్య విభాగం అధికారులు, సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. ఓపెన్ ప్లాట్ల లో చెత్తాచెదారం ఉంటే తొలగించి ఆ వెంటనే యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నారు. అలాగే ఆయా డివిజన్ల పరిధిలోని వివిధ దుకాణాల వద్ద నిషేధించిన ప్లాస్టిక్ కవర్లు అమ్మవద్దని స్టిక్కర్లు అంటిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.వేయి నుంచి రూ.పది వేల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో శానిటరీ ఇన్స్పెక్టర్లు గురులింగం, రవీందర్రెడ్డి, వజ్రకుమార్రెడ్డి, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ చరణ్, ఎస్బీఎం కన్సల్టెంట్ సుమీత్రాజ్తో పాటు జవాన్లు పాల్గొంటున్నారు. -
ఉత్సాహంగా బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపిక
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో బుధవారం ఉమ్మడి జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికలకు 100మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్యాంసుందర్గౌడ్, ఎల్.రవికుమార్ మాట్లాడుతూ జిల్లా క్రీడాకారులు బ్యాడ్మింటన్లో జాతీయ, అంతర్జాతీయస్థాయిల్లో రాణించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం ఎంపికలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారికి మెమోంటోలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి సాదత్ఖాన్, ఉపాధ్యాక్షుడు శివప్రసాద్, ప్రవీణ్, సీనియర్ క్రీడాకారుడు సయ్యద్ పాల్గొన్నారు. ఎంపికై న క్రీడాకారులు అండర్–13 విభాగం బాల, బాలికలు సింగిల్స్లో ఆర్.అభిజిత్, రోహన్ రాఘవ, రిషిక. శ్రీహాస, డబుల్స్లో రోహన్ రాఘవ–విగ్నేష్, శ్రేష్ఠ–హేమలత, అండర్–15 విభాగంలో సింగిల్స్లో శివశంకర్, వినుథన్రెడ్డి, టి.రిషిత, వర్షిని, డబుల్స్లో ఆర్.అభిజిత్–వినుథన్రెడ్డి, వర్షిని–మీనాక్షి, మిక్స్డ్ డబుల్స్లో శివశంకర్–వర్షిని, అండర్–17లో సింగిల్స్లో ఎన్జే.జోయల్, సంతోష్కుమార్, రిషితా, సర్వఘ్న, డబుల్స్లో భీమ్ చరణ్–అనిరుధ్, అరుణ–మీనాక్షి, మిక్స్డ్ డబుల్స్లో రాఘవేంద్ర–శ్రీనిధి, అండర్–19లో సింగిల్స్లో ఎన్జే.జోయల్ ప్రసూన్, సంతోష్కుమార్, శ్రీనిధి, రిషిత, డబుల్స్లో ఎన్జే. జోయల్–సంతోష్కుమార్, రిషితా–శ్రీనిధి, సీనియర్ పురుషుల సింగిల్స్లో జీషాన్, సుమిత్కుమార్, మహిళల్లో సైరబాను, వర్ధిని, డబుల్స్లో సయ్యద్ ఎజాస్అలీ–జీషాన్, సైరబాను–వర్ధిని, మిక్స్డ్ డబుల్స్లో సయ్యద్ అంజద్–సైరబాను ఎంపికయ్యారు. -
అమాయక రైతులపైఅక్రమ కేసులు పెడతారా?
వ్యవసాయ పనులు చేసుకుని జీవనం సాగించే అమాయక రైతులపై కేసులు పెట్టడం తగదని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. ఇథనాల్ కంపెనీ ఘటనలో అరెస్టు చేసిన రైతులను మానవపాడు పోలీస్స్టేషన్కు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్యాక్టరీ వద్దని చెబితే రైతులను తీసుకొచ్చి అక్రమంగా కేసులు నమోదు చేస్తారా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. పెద్ద ధన్వాడలో జరిగిన ఘటనలో రైతులకు దెబ్బలు తగిలాయని చెప్పారు. రైతులకు తగిలిన దెబ్బలను పోలీసులకు చూపుతూ...వారి నిర్లక్ష్యాన్ని దుయ్యబట్టారు. ఫ్యాక్టరీకి కాంగ్రెస్ ప్రభుత్వం తొత్తుగా మారిందని, అందుకే రైతులపై దాడులు చేయిస్తోందని విమర్శించారు. మండలంలో 45 మంది రైతులపై అక్రమంగా కేసులు పెట్టారని, వాటిని వెంటనే ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. 12 గ్రామాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా దానికి ప్రభుత్వం, పోలీసులే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. -
లీగ్ కం నాకౌట్ మ్యాచ్లు...
టోర్నీలో లీగ్కం నాకౌట్ పద్ధతిలో మ్యాచ్లను నిర్వహించనున్నారు. దాదాపు 75 లీగ్ మ్యాచ్లు జరగనున్నాయి. ఔట్ డోర్, మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో పగలు, సాయంత్రం ఫ్లడ్లైట్ల వెలుతురులో మ్యాచ్లు జరగనున్నాయి. బుధవారం ఉదయం 12 గంటలకు స్టేడియంలో రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ టోర్నీ ప్రారంభం కానునుంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, రాష్ట్ర క్రీడావ్యవహారాల సలహాదారులు ఏపీ జితేందర్రెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. మంగళవారం ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లను జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మక్సూద్ బిన్ అహ్మద్ జాకీర్, నసరుల్లా హైదర్ పరిశీలించారు. కార్యక్రమంలో మీర్ ఖాలెద్అలీ, సుబాన్జీ, మహ్మద్ ఇలియాజ్, గోపాలకృష్ణ, ఫారుఖ్ ముకర్రం, షకీల్, వినోద్కుమార్, బాల్రాజు తదితరులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ జట్టు: అలీ అబ్దుల్ బాసిత్, జి.రోహిత్, టి.వివేక్, ఎస్.ఆదిత్య నారాయణ్, భువనేశ్వరి, పి.అర్చిత, ప్రియాంక, స్టాండ్బై భాను, తనుశ్రీ. -
దేశం తరఫున ఆడటం జిల్లాకే గర్వకారణం
మహబూబ్నగర్ క్రీడలు: అనన్యశ్రీ అంతర్జాతీయస్థాయి వాలీబాల్ పోటీల్లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుండడం ఉమ్మడి జిల్లాకే గర్వ కారణమని ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్పీ వెంకటేశ్ అన్నారు. మక్తల్కు చెందిన అనన్యశ్రీ వియాత్నంలో ఈనెల 7 నుంచి 14 వరకు జరిగే ఆసియా వాలీబాల్ పోటీలకు ఎంపికకావడంపై ఆమె తల్లిదండ్రులు పి.ఆనంద్, వరలక్ష్మిలను మంగళవారం జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో సన్మానం చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ వాలీబాల్లో అనన్యశ్రీని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను అభినందించారు. ఆమె గతంలో చైనాలో జరిగిన వరల్డ్ యూనివర్సిటీ పోటీల్లో ఆడడం సంతోషంగా ఉందన్నారు. మరింత మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్, జిల్లా వాలీబాల్ సంఘం ప్రతినిధులు చెన్న వీరయ్య, గులాం దస్తగిర్ఖాన్, జిల్లా కబడ్డీ సంఘం ఉపాధ్యక్షులు దామోదర్రెడ్డి, జిల్లా యోగా సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్.బాల్రాజు తదితరులు పాల్గొన్నారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
ఉండవెల్లి: మండలంలోని పుల్లూరు గ్రామ శివారులో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఎస్ఐ మహేష్ వివరాల ప్రకారం పంట పొలాల్లో దుస్తులు లేని వ్యక్తి మృతదేహం కన్పించిందని తెలిపారు. ఐడీ కార్డులు, ఎటువంటి గుర్తులు లేకపోవడంతో మృతదేహాన్ని అలంపూర్ ఆస్పత్రిలోని మార్చురికి తరలించారు. ఎవరైన గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అప్పు ఇచ్చినోళ్లకు కుచ్చుటోపి అయిజ: చిరు వ్యాపారాల పేరుతో అనేక మందితో అప్పులు చేసిన ఓ వ్యక్తి కనిపించకుండా పోయాడు. వివరాల్లోకి వెళ్తే.. అయిజకు చెందిన ఓ వ్యక్తి కొన్నేళ్లుగా చిరు వ్యాపారాలు చేసుకుంటూ తెలిసిన వారితో వడ్డీకి అప్పు తీసుకున్నాడు. కొంతకాలం పాటు అప్పు ఇచ్చిన వారికి వడ్డీతో సహా అసలు చెల్లించి నమ్మకం పెంచుకున్నాడు. ఈ క్రమంలో సుమారు రూ. 3కోట్ల మేర అప్పుచేసిన అతడు.. కుటుంబ సభ్యులతో సహా ఇక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో అప్పు ఇచ్చిన వారు ఆందోళన చెందుతున్నారు. పది రోజుల క్రితం పట్టణంలో ఓ చిరువ్యాపారి సుమారు రూ. కోటి అప్పుచేసి ఐపీ పెట్టిన ఘటన మరువకముందే మరో వ్యక్తి అదే బాటలో నడవడం చర్చనీయాంశంగా మారింది. అదే విధంగా గతేడాది ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో ఓ వ్యక్తి వడ్డీ వ్యాపారుల నుంచి సుమారు రూ. 50కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశాడు. రెండేళ్ల క్రితం స్వీట్ హౌస్ నడుపుకుంటున్న వ్యాపారి రూ. కోటికి పైగా అప్పులుచేసి పరారు కావడాన్ని ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. వరుస ఘటనలతో అప్పులు ఇచ్చేందుకు ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. షార్ట్సర్క్యూట్తో పూరి గుడిసె దగ్ధం లింగాల: మండలంలోని అంబట్పల్లిలో షార్ట్సర్క్యూట్తోపూరి గుడిసె దగ్ధమైన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పూర్ణకంటి దేవయ్య పని నిమిత్తం గుడిసెకు తాళం వేసి భార్య, కూతురుతో కలిసి పొలానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు షార్ట్సర్క్యూట్ జరిగి గుడిసెకు నిప్పు అంటుకొని పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో వంటసామాగ్రి, దుస్తులు, తిండి గింజలు, వ్యవసాయ పనులకు కోసం ఉంచుకున్న డబ్బులు కాలిపోయాయి. దాదాపుగా రూ.50 వేలు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు తెలిపాడు. -
హమాలీ కాలనీలో మొసలి సంచారం
గద్వాల క్రైం: గద్వాల పట్టణంలోని హమాలీ కాలనీలో మొసలి కలకలం సృష్టించింది. కాలనీ వాసుల కథనం మేరకు.. మంగళవారం తెల్లవారు జామున మొసలి సంచారిస్తుండగా కుక్కలు గుర్తించి వెంటపడ్డాయి. దీంతో కాలనీ వాసులు నిద్ర లేచి చూడగా మొసలి ఇళ్ల మధ్యలోకి వచ్చింది. వెంటనే దానిని అతి కష్టం మీద తాళ్లతో బంధించారు. ఉదయమే ఆటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు అక్కడికి చేరుకుని మొసలిని జూరాల ప్రాజెక్టు నీళ్లలో విడిచి పెట్టారు. జూరాల ప్రాజెక్టుకు ఇటీవల ఎగువ ప్రాంతం నుంచి భారీ ఎత్తున వరద జూరాలకు చేరడంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేసిన క్రమంలో కుడి కాలువ మీదుగా మొసలి సమీపంలో జమ్ములమ్మ రిజర్వాయర్ ఉండడం, చుట్టూ పరిసర ప్రాంతాల్లో నీటి మడుగులు ఉండడం ద్వారా మొసలి వచ్చి ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. -
పశువుల కంటైనర్ పట్టివేత
అలంపూర్: పశువులను అక్రమంగా తరలిస్తున్న కంటైనర్ను పోలీసులు పట్టుకున్నారు. అతి క్రూరంగా పశువులను తరలిస్తుండటంతో కంటైనర్లోనే మూడు కోడెదూడలు, ఒక ఆవు మృత్యువాత పడ్డాయి. ఉండవెల్లి ఎస్ఐ మహేష్ వివరాల మేరకు.. అలంపూర్ చౌరస్తా సమీపంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న పుల్లూరు టోల్ప్లాజా వద్ద పశువుల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి సరిహద్దు చెక్పోస్టు ఏర్పాటు చేశారు. ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు చెక్పోస్టు వద్ద పోలీసులు, పశుసంవర్ధక శాఖ అధికారులు నిత్యం తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున కర్నూల్ వైపు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఓ కంటైనర్లో పశువులను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్కు చెందిన ఎండీ ఖలీల్ అనే వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా కంటైనర్లో 48 కోడెదూడలు, 31 ఆవులు తరలిస్తుండగా.. పట్టుకొని గోశాలకు తరలించారు. కాగా, కంటైనర్లో పశువులు కదలకుండా గట్టిగా కట్టివేయడం.. నీరు, ఆహారం లేకుండా క్రూరంగా తరలిస్తుండటంతో అందులోనే మూడు కోడె దూడలు, ఒక ఆవు మృతిచెందాయి. పట్టుబడిన పశువుల విలువ రూ. 6,75,000 ఉంటుందని ఎస్ఐ తెలిపారు. పశువులను అక్రమంగా తరలిస్తున్న ఎండీ ఖలీల్, కంటైనర్ డ్రైవర్ అబ్దుల్ అజీజ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
బిందె నీటి కోసం 2 కి.మీ. నడవాల్సిందే
మిషన్ భగీరథ తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రామాల్లో తాగు నీటి కోసం జనం నానా తంటాలు పడ్డారు. మండల పరిధిలోని కొత్తపాలెం తండాలో 5 రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో తండా వాసులు 2 కి.మీ దూరంలో ఉన్న వ్యవసాయ బోరు వద్దకు కాలి నడకన వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తండాలో ప్రతి 15 రోజులకు ఒక సారి నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని మహిళలు పేర్కొంటున్నారు. మిషన్ భగీరథ తాగునీటి సరఫరా సక్రమంగా నిర్వహించి తమ సమస్యను పరిష్కరించాలని మహిళలు కోరుతున్నారు. ఇదిలా ఉండగా.. మండల పరిధిలోని జూరాల వద్ద ఉన్న మిషన్ భగీరథ హెడ్ వర్క్స్లో సంపుల క్లీనింగ్లో భాగంగా మంగళవారం జిల్లాలోని అన్ని మండాల్లో తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ధరూరులో కూడా నీటికష్టాలు మొదలవడంతో జనం ఏకంగా మిషన్ భగీరథ ట్యాంకు ఎక్కి నీటిని తెచ్చుకునే ప్రయత్నం చేశారు. అందులోనూ నీళ్లు లేకపోవడంతో కిందికి దిగిపోయారు. ప్రాణాలకు తెగించి మరీ ఇలా ట్యాంకులు ఎక్కిన మహిళల ఫోటోలు సామాజిక మాద్యమాల్లో వైరల్ అయ్యాయి. – ధరూరు -
జూరాలకు తగ్గిన ఇన్ఫ్లో
ధరూరు/ ఆత్మకూరు/ రాజోళి/ దోమలపెంట: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ఫ్లో స్వల్పంగా తగ్గింది. సోమవారం ప్రాజెక్టుకు 24 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా.. మంగళవారం సాయంత్రానికి 17 వేల క్యూసెక్కులకు తగ్గినట్లు అధికారులు తెలిపారు. జెన్కో జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తిని కొనసాగిస్తున్నారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 16,752 క్యూసెక్కులు, నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా 750, కోయిల్సాగర్కు 315 వదలగా.. 68 క్యూసెక్కులు ఆవిరైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.454 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ● జల విద్యుత్ కేంద్రాల్లో మంగళవారం 6 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 3 యూనిట్ల ద్వారా 117 మెగావాట్లు, దిగువలో 3 యూనిట్ల ద్వారా 120 మెగావాట్లు ఉత్పత్తి సాధించామన్నారు. ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఇప్పటి వరకు 15.948 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టామన్నారు. శ్రీశైలానికి 18,964 క్యూసెక్కులు జూరాల, సుంకేసుల నుంచి కలిపి 18,964 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం జలాశయానికి వస్తుంది. ప్రస్తుతం శ్రీశైలంలో 833.2 అడుగుల వద్ద 52.8918 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గత 24 గంటల వ్యవధిలో రేగుమాన్గడ్డ నుంచి ఎంజీకేఎల్ఐకి 480 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ కేంద్రంలో 0.372 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసి 830 క్యూసెక్కులు, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో 1.182 మి.యూనిట్లు ఉత్పత్తి చేసి 2,465 క్యూసెక్కుల నీటిని దిగువన నాగార్జునసాగర్కు విడుదల చేశారు. సుంకేసులకు స్వల్ప వరద సుంకేసుల డ్యాంకు మంగళవారం స్వల్పంగా ఇన్ఫ్లో కొనసాగుతుంది. ఎగువ నుంచి 2,248 క్యూసెక్కులు రాగా.. ఒక గేటును తెరిచి అంతే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేశారు. అలాగే కేసీ కెనాల్కు 159 క్యూసెక్కులు విడుదల చేసినట్లు జేఈ మహేంద్ర తెలిపారు. -
నేటినుంచి బాస్కెట్బాల్ టోర్నీ
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రం రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు వేదికకానుంది. మెయిన్ స్టేడియంలో నేడు (బుధవారం), గురువారం మొదటి రాష్ట్రస్థాయి అండర్–23 విభాగం (3 ్ఠ3) పురుషుల, మహిళా అంతర్ జిల్లాల చాలెంజర్ బాస్కెట్బాల్ చాంపియన్షిప్ జరగనుంది. ఈ పోటీలకు రాష్ట్రంలోని 20 జిల్లాల పురుషుల, మహిళా జట్లు పాల్గొంటున్నాయి. ఆయా జిల్లాల నుంచి 180 మంది క్రీడాకారులు, 50 మంది అధికారులు హాజరవుతున్నారు. టోర్నీలో పాల్గొనే పురుషులకు లిటిల్ స్కాలర్స్ స్కూల్, మహిళలకు చైతన్య స్కూల్, ఇండోర్ స్టేడియంలో వసతి సౌకర్యం ఏర్పాటు చేశారు. ఇండోర్ స్టేడియంలో భోజన వసతి కల్పించనున్నారు. విజయవంతంగా నిర్వహిస్తాం.. జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ టోర్నీ నిర్వహిస్తున్నాం. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. అందరి సహకారంతో రాష్ట్రస్థాయి టోర్నీని విజయవంతంగా నిర్వహిస్తాం. గత ఏడాది ఆగస్టు చివరివారంలో రాష్ట్రస్థాయి యూత్ బాస్కెట్బాల్ టోర్నీని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాం. – మక్సూద్బిన్ అహ్మద్ జాకీర్, అధ్యక్షుడు, జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్, మహబూబ్నగర్ ఔట్ డోర్, ఇండోర్ స్టేడియంలో మ్యాచ్లు హాజరుకానున్న 20 జిల్లాల నుంచి 180 మంది క్రీడాకారులు