Mahabubnagar
-
పంటల సాగు.. జాగ్రత్తలతో మేలు
● విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లలో అప్రమత్తంగా ఉండాలి ● లేదంటే నష్టపోయే అవకాశం అలంపూర్ : వర్షాలు ప్రారంభం కావడంతో రైతులు సాగు పనులు ముమ్మరం చేశారు. విత్తనాలు, ఎ రువులు, పురుగుల మందులు కొనుగోళ్లకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో నకిలీల బెడద అధికంగా ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని మండల వ్యవసాయ శాఖ అధికారి నాగార్జున రెడ్డి సూచిస్తున్నారు. అన్నదాతలు ఎరువులు, విత్తనాలు, పురుగుల మందుల కొనుగోళ్లలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని లేదంటే సాగు కష్టం బూ డిదలో పోసిన పన్నీరుగా మారుతుందని పేర్కొంటున్నారు. విత్తన, ఎరువుల కొనుగోళ్లలో రైతులు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలని వివరిస్తున్నారు. విత్తనాల కొనుగోళ్లలో... ● వ్యవసాయ శాఖ ద్వారా లైసెన్స్ పొందిన అధీకృత డీలర్ల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలి. ● విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో బిల్లులో విత్తనం రకం, నెంబర్, గడువు తేదీ, కొనుగోలు తేదీ, డీలరు సంతకం, రైతు సంతకం బిల్లులో ఉండే విధంగా చూసుకోవాలి. ● లూజుగా ఉన్న సంచులు, పగిలిన ప్యాకెట్లు, తెరచిన డబ్బాల నుంచి కొనకపోవడం మంచిది. గడవు దాటిన విత్తనాల జోలికి వెళ్లవద్దు. ● బిల్లుపై విక్రయదారుడి పేరు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అమ్మకపు నెంబర్, రైతు పేరు, గ్రామం పేరు,విక్రయదారుడి సంతకం, తేదీలు, రకం పేరు, బ్యాచ్ నెంబర్, గడువ తేదీలు, నికర తూకం, నికర ధర, కంపెనీ పేరు తప్పనిసరిగా నమోదు చేయాలి. ● కొనుగోలు చేసే విత్తన ప్యాకెట్, సీసా, సంచి, డబ్బాలపై సీలు ఉందా లేదా నిర్ధారించుకోవాలి. ● విక్రయదారుడు ఇచ్చే కరపత్రాలను తీసుకోని వాటిలో పేర్కొన్న అంశాలను పరిశీలించాలి. ● మొలకెత్తే దశలో, పూత దశలో లోపాలు కనిపిస్తే వ్యవసాయ శాఖ అధికారిని సంప్రదించాలి. ● విత్తనాలు కొనుగోలు చేసిన బి ల్లును పంట కాలంపూర్త య్యే వరకు దాచి పెట్టుకోవాలి. ● అరువు పద్ధతిలో కొనుగో లు చేసినప్పటికీ బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి. ● విత్తనాలు తీసుకున్న వెంటనే మొలక శాతాన్ని తీసుకోవాలి. మొలక శాతం సంతృప్తిగా ఉన్న విత్తనాలను వాడాలి. పురుగు మందుల కొనుగోలు సమయంలో... ● చీడ పీడల నివారణకు వినియోగించే క్రిమి సంహారక మందుల కొనుగోలు సమయాల్లో రైతులు అప్రమత్తంగా ఉండాలి. ● వ్యవసాయ, ఉద్యానవన, శాస్త్రవేత్తలు సూచించిన మందులను మాత్రమే వాడాలి. ● అవసరానికి మించి కొనుగోలు చేసిన, నిల్వ ఉంచిన పురుగుల మందులను వాడవద్దు. ● లైసెన్స్ ఉన్న దుకాణాల్లోనే కొనుగోలు చేయాలి. ● పురుగు మందుల డబ్బాపై వజ్రాకారంలో పురుగుల మందు స్థాయిని తెలిపే రంగులు ఉంటాయి. అత్యంత విష పూరితమైతే నీలం రంగు, స్వల్ప విష పూరితమైతే ఆకు పచ్చ రంగు గుర్తులు ఉంటాయి. ● పురుగుల మందులు రెండు మూడు రకాలు కలిపి వాడరాదు. ●వాడిన డబ్బాలు, సీసాలు, ధ్వంసం చేసి గుంతల్లో పూడ్చి పెట్టాలి. పురుగుల మందులు వాడటానికి వినియోగించిన పాత్రలను ఇతర అవసరాలకు వినియోగించ రాదు. ఎరువుల కొనుగోళ్లలో జాగ్రత్తలు : ● లైసెన్స్ దుకాణాల్లోనే ఎరువులు కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసిన బిల్లులు, ఖాళీ సంచులు పంట కాలం పూర్తయ్యే వరకు దాచుకోవాలి. ●మిషన్ కుట్టుతో ఉన్న ఎరువుల సంచులనే వాడాలి. ఒక వేళ చేతికుట్టుతో ఉంటే సీసం సీల్ ఉందో లేదో చూసుకోవాలి. ● ప్రామాణిక పోషకాల వివరాలు, ఉత్పత్తి సంస్థ, ఉత్పత్తిదారుడి పేరు ఖచ్చితంగా ఉండాలి. ● కొనుగోలు సమయంలో డీలర్ రశీదులో రైతు విధిగా సంతకం చేయాలి. ● ఎరువుల నాణ్యతపై అనుమానాలు ఉంటే వెంటనే వ్యవసాయ శాఖ అధికారుల సహకారంతో ఎరువులను పరీక్షలకు పంపాలి. ● చిల్లుపడిన, చిరిగిన బస్లాల్లోని ఎరువుల బస్తాలను కొనుగోళు చేయరాదు. అన్య పదార్థాలు కనిపిస్తే ఆ ఎరువులను కల్తీలుగా గుర్తించాలి. పాడి–పంట -
దివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: దివ్యాంగుల సంక్షేమమే ధ్యేయమని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. ఆదివారం డీసీసీ కార్యాలయంలో పార్టీ దివ్యాంగుల విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దివ్యాంగులను కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందన్నారు. రాష్ట్రంలోని ప్రతి దివ్యాంగుడి వద్దకు చేరుకుని సాధికారత కోసం కృషి చేస్తామన్నారు. అనంతరం ఎస్ఐఆర్పై అవగాహన కల్పించారు. అంతకు ముందు దివ్యాంగులతో ముఖాముఖి సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాగా.. కొందరు దివ్యాంగులు తమకు ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పింఛన్ మంజూరు చేయాలని, ఉపాధి కోసం మోటారు వాహనాలు కావాలని, సదరం ధ్రువపత్రాల కోసం ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. కార్యక్రమంలో పార్టీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు తెలుగు వెంకటేష్, కార్యదర్శి వీరేష్కుమార్, నాయకులు శ్రీనివాస్, బురానప్ప, ఇప్పటి నర్సింహులు పాల్గొన్నారు. -
కోచింగ్ బాగుంది
జాతీయ జట్టుకు ఆడాలని ఉంది గతేడాది సమ్మర్ క్రికెట్ శిబిరం ద్వారా శిక్షణ తీసుకొని జడ్చర్లలో జరిగిన రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొని సత్తా చాటా. అదేవిధంగా క్రికెట్లో మెళకువలు నేర్చుకొని జాతీయ జట్టుకు ఆడాలని ఉంది. – అఫాన్, అండర్–17 స్టేట్ ప్లేయర్, నారాయణపేట నెలరోజులుగా నిర్వహించిన ఉచిత సమ్మర్ క్రికెట్ క్యాంపు శిక్షణ చాలా బాగుంది. మా కోచ్ అజయ్ ఎంతో ఓపికతో టెక్నిక్స్ నేర్పుతున్నాడు. మా లాంటి ఆర్థిక పరిస్థితి బాలేని వారికి ఇలాంటి క్యాంపులు ఎంతో ఉపయోగకరం. – సాత్విక్, అండర్–12 డిస్ట్రిక్ ప్లేయర్, నారాయణపేట. -
రోడ్డు ప్రమాదంలో ఎల్లికల్ యువకుడి మృతి
కల్వకుర్తి రూరల్: నాగర్కర్నూల్ మెడికల్ కళాశాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కల్వకుర్తి మండలంలోని ఎల్లికల్ గ్రామానికి చెందిన దాదా మోని బాలకృష్ణ (21) అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు.. బాలకృష్ణ తండ్రి చంద్రయ్య వీఆర్వోగా తెలకపల్లి మండలంలో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో కుటుంబమంతా తెలకపల్లిలో నివాసముంటున్నారు. మృతుడు నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఒక హోటల్లో పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తూ బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వచ్చిన కారును వేగంగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఎల్లికల్ గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మృతుడికి ఇద్దరు సోదరీమణులు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనుమానాస్పద స్థితిలో.. మక్తల్: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మక్తల్కు చెందిన రాఘవేందర్రెడ్డి (30), తన అన్నకు మధ్య భూతగాదాలు ఉన్నా యి. ఈ క్రమంలో రాఘవేందర్రెడ్డి మృతి చెందడంలో అన్న వదినల ప్రమేయం ఉంద ని అనుమానం వ్యక్తం చేస్తూ.. మృతుడి అక్క నర్వకు చెందిన తిలేటి శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటనపై పూర్తి విచారణ చేపట్టి, మృతికి గల కారణాలు తెలుసుకుంటామని ఎస్ఐ తెలిపారు. పిడుగు పాటుకు పశువులు మృతి పెద్దకొత్తపల్లి: మండలంలోని మరికల్లో ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి పిడుగుపాటుతో దేవరపాగా జపాన్ తన వ్యవసాయ పొలం వద్ద ఉన్న నాలుగు పశువులు మృతిచెందాయి. పశువుల విలువ దాదాపుగా రూ.1.50లక్షలు ఉంటుందని రైతు తెలిపారు. వ్యవసాయ పొలం పనులు చేసే పశువులు మృతి చెందడంతో రైతు కుటుంబం బోరున విలపిస్తున్నారు. ఈ ఘటనపై సర్పంచ్ రాముడు, వార్డుసభ్యుడు ఈశ్వర్ ఘటనా స్థలానికి చేరుకొని మృతిచెందిన పశువులను పరిశీలించారు. ప్రభుత్వపరంగా ఆర్థిక సహాయం చేసి రైతును ఆదుకోవాలని వారు కోరారు. రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి వనపర్తి రూరల్: జాతీయ రహదారి 44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్ మృతిచెందిన ఘటన ఆదివారం పెబ్బేరు మండలం రంగాపురం సమీపంలో చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకటేష్గౌడ్ కథనం ప్రకారం.. జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి మరో లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉత్తరప్రదేశ్కు చెందిన లారీ డ్రైవర్ వినోద్కుమార్పాల్ (46) తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం 108లో వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. హత్య ఘటనపై కేసు నమోదు గోపాల్పేట: వుండల కేంద్రంలో శనివారం ఉదయం గొర్రెల కాపరిపై కొందరు దాడిచేసి, హత్య చేసిన ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేశామని గోపాల్పేట ఎస్ఐ శశిధర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. ఏదుల మండలంలోని మాచుపల్లికి చెందిన బూత్కూరి బాల్చంద్రి (50) గొర్రెల కాపరిగా మండల కేంద్రానికి చెందిన లక్ష్మి వద్ద జీతం కుదుర్చుకున్నాడు. వారి మంద వెంట తిరిగే మరో మందకు చెందిన మల్లేష్, ఆయన తల్లి నీలమ్మ, భార్య సుమతి వారి గొర్రెల కాపరిగా పనిచేయాలని కోరగా.. బాల్చంద్రి ఒప్పుకోలేదు. ఇది మనసులో పెట్టుకోవడంతో పాటు అప్పుడప్పుడు గొర్రెల దొంగతనం చేసే మల్లేష్ గురించి బయట చెబుతాడనే అనుమానంతో శనివారం ఉదయం గోపాల్పేట, చెన్నూరు శివారులో గొర్రెలు మేపుతున్న బాల్చంద్రి వద్దకు మల్లేష్, సుమతి, నీలమ్మ ముగ్గు రూ కలిసి కట్టెలతో కొట్టారు. అనంతరం మల్లే్ ష తన వెంట తెచ్చుకున్న కటింగ్ ప్లేయర్తో బాల్చంద్రి మర్మాంగాలపై దాడి చేశారు. దీంతో బాధితుడు అక్కడికక్కడే మరణించాడు. మృతుడి భార్య బూత్కూరి వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని, కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఎస్ఐ వివరించారు. -
జూరాలకు కొనసాగుతున్న ఇన్ఫ్లో
ధరూరు/ రాజోళి: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్ఫ్లో కొనసాగుతుంది. ఆదివారం సాయంత్రం వరకు ప్రాజెక్టుకు 1,972 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో నెట్టెంపాడు ఎత్తిపోతలకు సంబంధించి రెండు పంపులను రన్ చేసి గుడ్డెందొ డ్డి, ర్యాలంపాడు రిజర్వాయర్లను నింపుతున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 1,500 క్యూసెక్కులు వదలగా.. మరో 44 క్యూసెక్కులు ఆవిరైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.810 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఒక గేటు ద్వారా నీటి విడుదల సుంకేసుల డ్యాంలో ఆదివారం ఒక గేటు ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. స్థానికంగా కురుస్తున్న వర్షాల ఆధారంగా ఎగువనున్న వాగులు, వంకల నీరు వచ్చి చేరడంతో 3 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు డ్యాం అధికారులు తెలిపారు. -
బహుజన బలం.. అధికార పీఠం వైపు
మహబూబ్నగర్ రూరల్: రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రాజకీయంగా తగిన ప్రాధాన్యం ద క్కడం లేదని, జనాభాలో అత్యధిక శాతం ఉన్న ఈ వర్గాలు అధికారానికి దూరంగా ఉండటం సామా జిక న్యాయానికి విరుద్ధమని ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి మహబూబ్నగర్లో నిర్వహించిన సామాజిక న్యాయం–రాజ్యాధికారం సభలో ఆయ న ప్రసంగించారు. రాష్ట్ర జనాభాలో దాదాపు 90 శాతం మేర ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఇప్పటికీ రాజకీయ నిర్ణయాధికారానికి దూరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో మాత్రమే ఈ వర్గాలను గుర్తు చేసుకుంటున్న ప్రధా న రాజకీయ పార్టీలు, అధికారంలోకి వచ్చిన తర్వా త వారి సమస్యలను విస్మరిస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ సాధనలో వెనుకబడిన వర్గాలు కీలక పాత్ర పోషించినప్పటికీ, రాష్ట్ర నిర్మాణం అనంతరం వారికి తగిన రాజకీయ ప్రాతినిధ్యం లభించలేదన్నారు. సామాజిక సమానత్వం సాధించాలంటే రాజకీయ అధికారం కూడా సమానంగా పంచబడాలని పేర్కొన్నారు. ఈ దిశగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ఐక్యత అత్యంత అవసరమని పిలుపునిచ్చారు. ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో సామాజిక మార్పు కోసం ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థా యి వరకు ప్రజలను చైతన్యపరుస్తూ రాజ్యాధికార సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతామని చెప్పా రు. సామాజిక న్యాయం కోసం పోరాడే శక్తులన్నీ ఏకతాటిపైకి రావాలని కోరారు. ఈ సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల హక్కుల సాధనకు సంయుక్త కార్యాచరణ చేపడతామని వెల్లడించారు. రాష్ట్ర రాజకీయాల్లో బహుజన వర్గాలకు అధిక ప్రాధాన్యం కల్పించేలా ప్రజల్లో అవగాహన పెంచనున్నట్లు తెలిపారు. సమావేశంలో పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ కుమారస్వామి, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెస ర్ రామయ్య యాదవ్, తోట్ల రాఘవేంద్ర, జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అహ్మద్ పాషా, రాష్ట్ర కార్యదర్శి బాలయ్య పాల్గొన్నారు. -
పాలమూరులో దంచికొట్టిన వాన
● నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో రోడ్లపైకి మురుగు ● విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం మహబూబ్నగర్ (వ్యవసాయం)/ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పాలమూరు నగరంలో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. నగర పరిధిలోని లోతట్టు ప్రాంతాలైన గణేష్నగర్, రామయ్యబౌలి, శివశక్తినగర్, గచ్చిబౌలి, బీకేరెడ్డి కాలనీ, కుర్హినిశెట్టికాలనీ, కిసాన్నగర్, లక్ష్మీనగర్, వెంకటేశ్వరకాలనీ తదితర ప్రాంతాల్లో డ్రెయినేజీలు పొంగిపొర్లాయి. ముఖ్యంగా గల్లీ రోడ్లపైకి మురుగుతోపాటు వర్షపు నీరు ఏరులై పారింది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే 12 విలీన గ్రామాల్లోని మట్టి రోడ్లు బురదమయంగా మారి అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. కొద్దిసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లపాలయ్యారు. ఊరటనిచ్చిన వానలు ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో జిల్లావ్యాప్తంగా ఆదివారం మోస్తరు వర్షం కురిసింది. శనివారం అర్ధరాత్రి తర్వాత ప్రారంభమైన వర్షం ఆదివారం ఉదయం 15.3 మి.మీ., నమోదైంది. సాయంత్రం పలు మండలాల్లో కొనసాగింది. దీంతో ఎండల తీవ్రత తగ్గి ప్రజలు ఉపశమనం పొందారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జిల్లా అధికారుల గణాంకాల ప్రకారం ఆదివారం జిల్లాలో సగటున 15.3 మి.మీ., వర్షపాతం నమోదైంది. అత్యధికంగా బాలానగర్ మండలంలో 36.8 మి.మీ., అత్యల్పంగా హన్వాడలో 5.8 మి.మీ., వర్షపాతం నమోదైంది. గండేడ్, మూసాపేట, మహమ్మదాబాద్ మండలాల్లోనూ వర్షం కురిసింది. ఇప్పటికే వానాకాలం సాగుకు రైతులు సన్నద్ధమవుతుండగా.. తాజాగా కురుస్తున్న వర్షాలతో పొలాల్లో తేమ శాతం పెరిగింది. మరోవైపు వాతావరణ శాఖ రానున్న రోజుల్లోనూ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. -
చేపల వలకు చిక్కిన మొసలి
ఎర్రవల్లి: మండలంలోని తిమ్మాపురం పెద్ద చెరువులో చేప ల వలకు ఓ మొసలి చిక్కింది. మత్య్సకారుల సంఘం సభ్యు లు తెలిపిన వివరాల ప్రకారం.. చెరువులో స్థానిక మత్స్యకారులు రెండు రోజులుగా చేపలు పడుతుండగా ఆదివారం వలకు మొసలి చిక్కడంతో భయాందోళనకు గురయ్యారు. అనంతరం మత్స్యకారులు వలను ఒడ్డుకు తీసుకొచ్చి ఫారె స్ట్, పోలీస్ అధికారులకు సమాచారం అందించారు. స్థానిక పోలీసులతో పాటు ఫారెస్ట్ అధికారి మన్యమయ్య సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని మొసలిని బంధించి, బీచుపల్లి సమీపంలోని కృష్ణానది మడుగులో వదిలారు. ప్రమాదవశాత్తు జనరేటర్ దగ్ధం కోస్గి రూరల్: ప్రమాదవశాత్తు జనరేటర్ దగ్ధమైన ఘటన మ ండల పరిధిలో ఆది వారం చోటుచేసు కుంది. నాచారం గ్రా మంలోని శ్రీ వెంకటసాయి ఇండస్ట్రీస్–పారాబాయిల్డ్ రైస్మిల్లో జనరేటర్ రన్నింగ్లో ఉండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో రైస్మిల్ యజమాని చల్లా శ్రీరాములు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అప్పటికే మంటలు విస్తృతంగా వ్యాపించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైరింజన్ మంటలను అదుపుచేయగా అప్పటికే జనరేటర్ కాలిపోయింది. సుమారు రూ.6 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పురుషోత్తం తెలిపారు. -
క్రికెట్లో ఆణిముత్యాలు
నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని స్థానిక మినీ స్టేడియంలో విద్యార్థుల్లో దాగిన ఉన్న క్రికెట్ నైపుణ్యాలను వెలికితీసి వారు క్రికెట్లో రాణించడమే లక్ష్యంగా హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్, మహబూబ్నగర్ క్రికెట్ అసోషియేషన్ ఆధ్వర్యంలో గతనెల 12వ తేదీన కోచ్ అజయ్ ఆధ్వర్యంలో ఉచిత వేసవి క్రికెట్ శిబిరాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు శిక్షణ అందిచారు. ఈ శిక్షణ శిబిరాన్ని అడిషనల్ ఎస్పీ రియాజ్, ఉమ్మడి పాలమూర్ జిల్లా క్రికెట్ అసోషియేషన్ సెక్రెటరీ రాజశేఖర్, వైస్ ప్రెసిడెంట్ సురేష్కుమార్ ప్రారంభించారు. 100మందికి శిక్షణ స్థానికి మినీ స్టేడియంలో నిర్వహించిన సమ్మర్ క్యాంప్లో కోచ్ అజయ్ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం 6గంటల నుంచి 8గంటల వరకు విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. జిల్లాలోని గ్రామా ల్లో ఉండే క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీయడానికి ఉచిత శిక్షణ ఏర్పాటు చేసి 100మందికి శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ అండర్–12,14,19 విభాగా ల్లో ఇచ్చి 100మందిలో సత్తా చాటిన క్రీడాకారులను నారాయణపేట జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. కాగా దీనికోసం అండర్–16 ఇంట్రో డిస్ట్రిక్ క్రికెట్ మ్యాచ్లను హెచ్సీఏ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల మధ్య జిల్లా కేంద్రంలోని స్థానిక బాలాజీ ఐటీఐ కళాశాల గ్రౌండ్లో నిర్వహించి జిల్లాస్థాయిలో సత్తా చాటిన వారిని ఉమ్మడి మహబూబ్నగర్కు ఎంపిక చేసి అక్కడ సత్తా చాటిన వారిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. క్రికెట్ ఆడుతున్న క్రీడాకారులు క్రికెట్ శిబిరాన్ని ప్రారంభించి కిట్లు అందజేస్తున్న రాజశేఖర్(ఫైల్) ఎంతో ఉపయోగం గ్రామీణ విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీయడానికి ఇలాంటి శిబిరాలు ఎంతోగానో ఉపయాగపడతున్నాయి. నారాయణపేటకు చెందిన అఫాన్ గతంలో ఈ సమ్మర్ క్యాంపు ద్వారానే రాష్ట్రస్థాయికి ఎంపికై జడ్చర్లలో జరిగిన అండర్–17 రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. అదేవిధంగా శ్రీహరి కూడా ఈ క్యాంపు ద్వారానే శిక్షణ తీసుకొని నిజామాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. వేసవి శిక్షణ శిబిరం నుంచి రాష్ట్రస్థాయికి.. జూన్ 10న ముగిసిన వేసవి శిక్షణ శిబిరం మే 12నుంచి జూన్ 10వరకు నిర్వహణ హెచ్సీఏ, ఎంసీఏ ఆధ్వర్యంలో 100మందికి తర్ఫీదు -
పాలమూరు రెడ్క్రాస్కు మొదటి బహుమతి
పాలమూరు: రాష్ట్రంలో అత్యధికంగా 7323 యూనిట్ల రక్త నిల్వలు సేకరించి మొదటి స్థానంలో నిలిచిన మహబూబ్నగర్ ఇండియన్ రెడ్క్రాస్ రక్తనిధి కేంద్రానికి ఆదివారం హైదరాబాద్లోని లోక్భవన్లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేతులమీదుగా రెడ్క్రాస్ చైర్మన్ నటరాజ్ బహుమతి అందుకున్నారు. 2025– 26 సంవత్సరంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు, రక్తమార్పిడి సేవలలో విశేష సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు అందించారు. గత 24 ఏళ్లుగా రక్త సేకరణలో మహబూబ్నగర్ రెడ్క్రాస్ రక్తనిధి కేంద్రం అగ్రస్థానంలో నిలుస్తుందని నటరాజ్ వెల్లడించారు. నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లాలోని నిరుద్యోగ యువతకు అమర్రాజా ఈఎస్ఎస్సీఐ ఆధ్వర్యంలో ఉపాధి రంగాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ సెంటర్ మేనేజర్ ఆనంద్కుమార్ ఆదివారం ఒక ప్రకనటలో తెలిపారు. ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రిక్ వెహికిల్ సర్వీస్, ఏసీ టెక్నీషియన్ రంగాల్లో 90 రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వనునట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం సెల్ నంబర్లు 73034 44397, 73034 44561లను సంప్రదించాలని సూచించారు. రాజీ కేసుల సంఖ్య పెరగాలి మహబూబ్నగర్ క్రైం: ఈ నెల 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లో కక్ష్యిదారులు అధిక సంఖ్యలో హాజరై సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ డి.జానకి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. లోక్ అదాలత్లో తక్కువ ఖర్చుతో సత్వర న్యాయం లభిస్తుందన్నారు. న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న వివిధ కేసులను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవడానికి ఇది చక్కని వేదిక అన్నారు. ట్రాఫిక్ చలానాలు, క్రిమినల్ కేసులు, సివిల్ వివాదాలు, రాజీకి అనుకూలంగా ఉన్న ఇతర కేసులను పరిష్కరించుకోవడానికి అవకాశం ఉందన్నారు. ప్రతి పోలీస్స్టేషన్ నుంచి రాజీ చేసుకోవడానికి వీలున్న ప్రతి కక్షిదారుడు లోక్ అదాలత్కు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోర్టు డ్యూటీ పోలీస్ సిబ్బందికి సూచించారు. మార్కెట్కు తగ్గిన వరి ధాన్యం రాక నవాబుపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డుకు నెల రోజులపాటు భారీగా వచ్చిన వరిధాన్యం ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. గత వారం వరకు 15 వేల బస్తాలకు తగ్గకుండా ప్రతి ఆదివారం ధాన్యం వచ్చేది. కాగా ఈసారి కేవలం 4,882 బస్తాల ధాన్యం మాత్రమే వచ్చింది. అయితే ధాన్యం క్వింటాల్ గరిష్టంగా రూ.2,912, కనిష్టంగా రూ.2,892 ధర లభించిందని మార్కెట్ అధికారి రమేష్ తెలిపారు. -
క్రమశిక్షణతోనే ఉన్నత శిఖరాలకు..
● సినీనటుడు విజయ్ దేవరకొండ పిలుపు ● 188 మంది విద్యార్థులకు ప్రోత్సాహక స్కాలర్షిప్స్ చెక్కుల పంపిణీ బల్మూర్: తల్లిదండ్రుల్లోని మంచి నడవడికనే పిల్లల క్రమశిక్షణకు దోహదపడుతుందని సినీ నటుడు విజయ్ దేవరకొండ అన్నారు. ది దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అచ్చంపేట నియోజకవర్గంలోని 45 ప్రభుత్వ పాఠశాలల్లో గత విద్యా సంవత్సరంలో 9, 10 తరగతుల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ఆదివారం ఆయన స్వగ్రామం తుమ్మెన్పేటలో స్కాలర్షిప్స్ చెక్కులను ఆయన సతీమణి రష్మిక, కుటుంబ సభ్యులతోపాటు ఎమ్మెల్యే వంశీకృష్ణ, డీఈఓ రమేష్కుమార్తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ గత విద్యా సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో నాగర్కర్నూల్ జిల్లా ద్వితీయ స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. దీని వెనక ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కృషి ఎంతో ఉందన్నారు. ప్రస్తుతం విద్య కోసం తల్లిదండ్రులు ఎంతో శ్రమించి రూ.వేలల్లో ఫీజులు చెల్లిస్తున్నారని, విద్యార్థులు తమ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి క్రమశిక్షణతో చదివి వారి కలలను సాకారం చేయాలని సూచించారు. నటనలోనే కాకుండా నిజ జీవితంలో కూడా పుట్టిన ఊరిపై మమకారంతో పేద విద్యార్థులకు ప్రోత్సాహక స్కాలర్షిప్స్ అందజేసిన విజయ్ దేవరకొండ నిజమైన శ్రీమంతుడు అని ఎమ్మెల్యే వంశీకృష్ణ కొనియాడారు. విద్యార్థుల బంగారు భవిష్యత్కు బాటలు వేయడానికి.. వారి ప్రతిభను ప్రపంచానికి చాటేలా ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. అలాగే ఈ ప్రాంతంలో గుర్తుండిపోయేలా అత్యున్నత ప్రమాణాలతో కూడిన పాఠశాలను నిర్మించాలని ఎమ్మెల్యే విజయ్ దేవరకొండను కోరారు. -
వసతులు మెరుగుపర్చాలి..
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిచోట్ల బడులు శిథిలావస్థకు చేరాయి. ఏఐ, ప్రీప్రైమరీ విద్యను ప్రారంభించినా.. తరగతి గదులు లేకుంటే విద్యార్థులు ఎక్కడ కూర్చొని తరగతులు వినాలి. పూర్తిస్థాయిలో టీచింగ్ సిబ్బందిని నియమించడంతోపాటు అధికారులు వెంటనే స్పందించి పాఠశాలల్లో వసతులు కల్పించాలి. – అర్జున్, ఏబీవీపీ విభాగ్ కన్వీనర్ ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలను అధికారులు, ప్రభుత్వం పట్టించుకోకుండా గాలికి వదిలేసింది. ఇప్పటికీ కొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు లేకపోవడంతో బయటికి వెళ్లే దుస్థితి నెలకొంది. దేవరకద్ర, చిన్నచింతకుంట, వడ్డెమాన్, మాడల్ బేసిక్ పాఠశాలల్లో సమస్యలపై గతంలో ఫిర్యాదు చేస్తే ఎవరూ పట్టించుకోలేదు. తరగతి, వంట గదులు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలి. అధికారులు స్పందించకపోతే పీడీఎస్యూ ఆధ్వర్యమంలో ఉద్యమిస్తాం. – సీతారాం, పీడీఎస్యూ, జిల్లా ప్రధాన కార్యదర్శి -
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం దిశగా అడుగులు
అచ్చంపేట: శ్రీశైలం క్షేత్రానికి వెళ్లాలంటే నల్లమల ఘాట్ రోడ్డు ఒక్కటే మార్గం. అందులో అనేక మలుపులు, ఎత్తుపల్లాలు ఉంటాయి. దీనికితోడు ఘాట్ రోడ్డులో రాత్రిళ్లు ప్రయాణం నిషిద్ధం. ఈ నేపథ్యంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. అయితే ఈ ప్రాజెక్టు ఇంకా ప్రతిపాదన దశలోనే ఉండగా.. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రధాని నరేంద్రమోదీని కలిసి ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని విన్నవించారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం సైతం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలిసింది. ఈ కారిడార్ పూర్తయితే బ్రాహ్మణపల్లి (మన్ననూర్)– శ్రీశైలం, పెద్దదోర్నాల– శ్రీశైలం మార్గాల మధ్య దూరం తగ్గి.. రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి.. తెలంగాణ వైపు బ్రాహ్మణపల్లి నుంచి శ్రీశైలం వరకు 45.35 కి.మీ., ఏపీలోని పెద్ద దోర్నాల నుంచి శ్రీశైలం వరకు 41.39 కి.మీ.,తో కలిపి మొత్తం 86.74 కి.మీ. ఎత్తైన కారిడార్ నిర్మించనున్నారు. శ్రీశైలం ఆలయ సమీపం నుంచి వెళ్లేలా మార్పులతో కూడిన డీపీఆర్ ప్రతిపాదనలు కేంద్రానికి పంపించారు. ఇందుకు రూ.18,500 కోట్ల నిధులు అవసరం కాగా.. కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 2025 మార్చి 2న సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) పూర్తయింది. అలాగే ఈ ప్రాజెక్టులో భాగంగా ఈగలపెంట– సున్నిపెంటల (లింగాలగట్టు) మధ్య తెలంగాణ– ఏపీలను అనుసంధానిస్తూ.. కృష్ణానదిపై రూ.300 కోట్లతో ఐకానిక్ వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జాతీయ వన్యప్రాణి బోర్డు అనుమతుల కోసం.. ఈ ప్రాజెక్టు పర్యావరణ ప్రభావ అధ్యయనం కోసం భారత వన్యప్రాణి సంస్థ సహాయం తీసుకుంటున్నారు. వారి నివేదిక ఆధారంగా జాతీయ వన్యప్రాణి మండలి అనుమతులు పొంది.. త్వరలోనే పనులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అక్కడి నుంచి అనుమతులు వస్తే.. కారిడార్ పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. నల్లమల అభయారణ్యం ప్రాంతం కావడంతో వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 32 అడుగుల ఎత్తులో కారిడార్ నిర్మించనున్నారు. నిత్యం వెయ్యికిపైగా వాహనాలు.. హైదరాబాద్ నుంచి శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం నిత్యం వెయ్యికిపైగా వాహనాలు వస్తుంటాయి. శని, ఆది, సోమవారాల్లో రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోతుంది. గత ఏప్రిల్ 24న కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ సహాయ మంత్రి హర్ష మల్హోత్రా ఈ రహదారి మీదుగా శ్రీశైలం వెళ్తూ.. వాహనదారులు పడుతున్న అవస్థలను ప్రత్యక్షంగా చూశారు. ఈ క్రమంలోనే ఎలివేటెడ్ కారిడార్ మంజూరుకు సహకరిస్తామని చెప్పినట్లు తెలిసింది. భూ సేకరణే కీలకం.. ఎలివేటెడ్ కారిడార్ స్తంభాల ఆధారంగా నిర్మించడం వల్ల అటవీ భూమి వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. నల్లమలలో కారిడార్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కీలకంగా మారింది. బ్రాహ్మణపల్లి నుంచి మన్ననూర్, వటువర్లపల్లి, దోమలపెంట, పాతాళగంగ వరకు 147.31 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉండగా.. 128.63 హెక్టార్ల భూమి అటవీశాఖ పరిధిలోనే ఉంది. 18.68 హెక్టార్ల భూమి మాత్రమే పట్టాదారుల నుంచి సేకరించాల్సి ఉంది. ఈ మార్గంలో అనేక మూల మలుపులు, ఘాట్ రోడ్డు ఉండటంతో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. శ్రీశైలం దైవ దర్శనం కోసం వచ్చి రోడ్డు ప్రమాదాల్లో మరణించిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ నెల 7న కృష్ణగిరి (ఈగలపెంట) సమీపంలో మలుపు వద్ద ఓ ప్రైవేటు టూరిస్టు బస్సు రోడ్డు పక్కనున్న గోతిలో కూరుకుపోవడంతో 10 కి.మీ., మేర వాహనాలు నిలిచిపోయాయి. అటవీశాఖ సహకారంతో హైటికోస్ స్వచ్ఛంద సంస్థ శ్రీశైలం ప్రధాన రహదారిలో 2024 జూలై నుంచి 2025 జూన్ మధ్యకాలంలో ప్రమాదాలపై సర్వే నిర్వహించింది. ఏడాదిలో 51 రకాలకు చెందిన 456 వన్యప్రాణులు మృతిచెందినట్లు తేలింది. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు కారిడార్ ఒక్కటే మార్గమని నిపుణులు చెబుతున్నారు. ఎలివేటెడ్ కారిడార్కు కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్మించే కారిడార్ సమగ్ర ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) పూర్తయింది. కేంద్రం జాతీయ వన్యప్రాణి సంరక్షణ బోర్డు అనుమతుల కోసం నివేదిక పంపాం. బోర్డు అనుమతులు వస్తే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. అనుమతుల కోసం ఎంపీల బృందం కేంద్ర మంత్రి నితీన్ గడ్కరీని కలిసి ప్రతిపాదనలు అందజేయగా సానుకూలంగా స్పందించారు. – వంశీకృష్ణ, ఎమ్మెల్యే, వన్యప్రాణి సంరక్షణ బోర్డు సభ్యుడు రూ.18,500 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు తాజాగా ప్రధాని మోదీని కలిసిన సీఎం రేవంత్రెడ్డి కారిడార్ నిర్మాణంతో బ్రాహ్మణపల్లి– శ్రీశైలం, పెద్దదోర్నాల– శ్రీశైలం మధ్య రవాణా సౌకర్యం మెరుగు మరోవైపు ఏపీ ప్రభుత్వం సైతం కేంద్రంపై ఒత్తిడి -
కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలి
● బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ● మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా నేతలతో హైదరాబాద్లో సమీక్ష సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి పాలమూరు జిల్లాకు తీరని అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మండిపడ్డారు. చివరలో మిగిలిన పాలమూరు ప్రాజెక్టు పనులు చేపట్టకుండా.. రైతులకు సాగునీరు అందించకుండా ద్రోహం చేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి నివాసంలో ఆదివారం ఆయన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులపై సుదీర్ఘంగా సమీక్షించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సమావేశాలు, నియోజకవర్గ స్థాయిలో పార్టీ కార్యక్రమాల తీరుపై నేతల వద్ద ఆరా తీశారు. త్వరలో ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితా సవరణ, పార్టీ చేపట్టనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంపై చర్చించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్పై ప్రజల్లో భారీగా ఆదరణ పెరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిఒక్కరూ గుర్తించారని, ఆ పార్టీ అన్నివర్గాలకు చేస్తున్న మోసం పట్ల తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నారని జిల్లా నాయకులు కేటీఆర్కు వివరించినట్లు తెలిసింది. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ రానున్న ఎన్నికలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామంలో బూత్ల వారీగా పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో ఉన్న సానుకూలతను పార్టీకి అనుకూలంగా మలుచుకోవాలని.. ఆ దిశగా కలిసికట్టుగా.. పక్కా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామిరెడ్డి, నవీన్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, రాజేందర్రెడ్డి, హర్షవర్ధన్రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, జైపాల్యాదవ్, అంజయ్యయాదవ్, చిట్టెం రా మ్మోహన్రెడ్డి, రావుల చంద్రశేఖర్రెడ్డి, మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లాలో కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్లోని వీసీ హాల్ నుంచి అధికారులతో ఆయన వీసీ నిర్వహించి.. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇచ్చారు. మండల స్థాయిలో లైన్ డిపార్ట్మెంట్ అధికారులు సోమవారం సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని, గతేడాది ఎదురైన సవాళ్లను ముందుగానే పరిష్కరించుకునేలా అప్రమత్తం కావాలన్నారు. ప్రతి రెండు రోజులకు ఒకసారి గ్రామ స్థాయిలో టాం టాం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని, తహసీల్దార్, ఎంపీడీఓలు గ్రామాల్లో గజ ఈతగాళ్లు ఎంతమంది ఉన్నారో వారి పేర్లు, సెల్ నంబర్లు సేకరించాలని, ఎక్కడైనా ఏదైనా అనుకోకుండా సంఘటన జరిగితే తక్షణమే వారి సహాయం తీసుకొని ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో రోడ్ల మీద వర్షపు నీరు పారకుండా చూసుకోవాలన్నారు. గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు, వైర్లు ఏమైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారులు గ్రామాల్లో పర్యటించి పరిష్కరించేలా బాధ్యత వహించాలన్నారు. సోమవారం నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నందున, పరిసరాలను ఎంపీడీలు పారిశుద్ధ్య కార్మికులతో శుభ్రం చేయించాలని ఆదేశించారు. వర్షాకాలం దృష్ట్యా మండల స్థాయిలో ఎంపీడీఓ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని, గ్రామస్థాయి నుంచి ఏమైనా సమాచారం వస్తే వాటిని మండల, డివిజన్ స్థాయి అధికారులకు చేరవేసి సమస్య పరిష్కరించేలా చూడాలన్నారు. మండల స్థాయి అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, నిర్లక్ష్యం వహించే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
శిథిలబడినవే..!
●ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో సమకూరని వసతులు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థలు సోమవారం తెరుచుకోనున్నాయి. 45 రోజులపాటు వేసవి సెలవులు గడిపిన విద్యార్థులు ఇక పాఠశాలల బాట పట్టనున్నారు. అయితే మరో విద్యా సంవత్సరం 2026– 27 ప్రారంభమవుతున్నా.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం వసతులు, సౌకర్యాలు మెరుగుపడటం లేదు. జిల్లావ్యాప్తంగా మొత్తం 851 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. వీటిలో ప్రాథమిక 616, ప్రాథమికోన్నత 83, ఉన్నత పాఠశాలలు 152 ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో సుమారు 72 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే 2023– 24 విద్యా సంవత్సరంలో బడిబాట కార్యక్రమం ద్వారా తరగతి గదులు, మరుగుదొడ్లు వంటివి నిర్మించినా.. ప్రభుత్వం బిల్లులు విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్లు వాటిని అప్పగించకుండా తాళాలు వేశారు. బహుభాష బోధనా సమస్యే.. ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో తెలుగు మీడియంలో ఎక్కువగా బోధన జరుగుతుండగా.. గత ఐదేళ్ల నుంచి ఇంగ్లిష్ మీడియం సైతం ప్రవేశపెట్టారు. వీటికి తోడు కొన్ని పాఠశాలల్లో ఉర్దూ మీడియం కూడా బోధిస్తున్నారు. జిల్లాకేంద్రంలోని మాడ్రన్ బేసిక్ పాఠశాలలో 1వ తరగతి నుంచి 7 వరకు తరగతులు ఉండగా ఇందులో తెలుగు, ఇంగ్లిష్తోపాటు ఉర్దూ మీడియం విద్యార్థులు చదువుతున్నారు. మూడు భాషలలో కలిపి సుమారు 190 మందికిపైగా విద్యార్థులు ఉండగా.. తరగతి గదులు మాత్రం 6 ఉన్నాయి. దీంతో ఒకే గదిలో పలు తరగతుల విద్యార్థులకు బోధిస్తున్నారు. మరోవైపు ఉపాధ్యాయుల కొరత సైతం వేధిస్తోంది. తరగతి గదులు, మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలు లేక ఇక్కట్లు ఇంగ్లిష్, తెలుగు మీడియంతో తీవ్రమైన గదుల కొరత జిల్లాలో 851 పాఠశాలలు, 72 వేల మంది విద్యార్థులు నేటినుంచి పునఃప్రారంభం కానున్న విద్యాసంస్థలు -
ఇరువురి ఘర్షణలో గొర్లకాపరి హత్య
● కర్రతో విచక్షణారాహితంగా దాడి ● అనంతరం ఠాణాలో లొంగిపోయిన నిందితుడు గోపాల్పేట: ఇరువురి ఘర్షణలో గొర్లకాపరిని కర్రతో కొట్టిచంపి అనంతరం నిందితుడు పోలీస్స్టేషన్లో లొంగిపోయిన ఘటన మండల కేంద్రంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా గోపాల్పేట మండల కేంద్రానికి చెందిన మందడి లక్ష్మి వద్ద ఏదుల మండలం మాచుపల్లికి చెందిన బాల్చంద్రయ్య(55) గొర్లు మేపేందుకు రూ.2.20లక్షలకు జీతం కుదిరాడు. శుక్రవారంతో సంవత్సరం అయిపోగా.. శుక్రవారం రాత్రి పొద్దున్నే సొంతూరుకు వస్తానని కుటుంబ సభ్యులకు ఫోన్చేసి చెప్పాడు. శనివారం ఉదయం 7గంటల ప్రాంతంలో వర్షం కురిసి తగ్గిన తర్వాత గోపాల్పేట–చెన్నూరు శివారులో గొర్లు నిలిపిన వద్ద బాల్చంద్రయ్యకు గోపాల్పేటకు చెందిన పుట్టీల నీలమ్మ కుమారుడు మల్లేష్కు గొడవ చోటుచేసుకుంది. గొడవలో భాగంగా బాల్చంద్రయ్యపై మల్లేష్ కర్రతో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో బాల్చంద్రయ్య అక్కడికక్కడే హత్యకు గురయ్యాడు. అనంతరం మల్లేష్ గోపాల్పేట పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. అనంతరం సీఐ రత్నం, గోపాల్పేట ఎస్ఐ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్టీంను పిలిపించి బాడీని పరిశీలించి ఆధారాలు సేకరించారు. మృతుడికి భార్య వరమ్మ, కుమారుడు, కూతురు ఉన్నారు. మృతదేహాన్ని తరలించేందుకు వీల్లేదని.. తమకు రూ.50లక్షలు నష్టపరిహారం చెల్లిస్తేవరకు కదిలేదిలేదని బాధిత కుటుంబ సభ్యులు భీష్మించుకూర్చున్నారు. శనివారం రాత్రి 7గంటలకు పోలీసులు కల్పించుకొని మృతదేహాన్ని వనపర్తికి తరలించారు. -
పెండింగ్ కేసుల దర్యాప్తులో వేగం పెంచాలి
● డ్రగ్స్, పొగాకు ఉత్పత్తులపై నిఘా పెట్టాలి ● నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ డి.జానకి మహబూబ్నగర్ క్రైం: పోలీస్ స్టేషన్ వారీగా ఉన్న పెండింగ్ కేసులపై దర్యాప్తు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని, కోర్టు ట్రయల్ ఉన్న కేసుల పురోగతిపై నిత్యం అప్డేట్ చేస్తుండాలని పోలీస్ అధికారులను ఎస్పీ డి.జానకి ఆదేశించారు. ఎస్పీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శనివారం నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. మొదట స్టేషన్ వారీగా నమోదైన కేసులు, పనితీరు, ఇతర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలు, పోక్సో కేసులు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విద్య సంస్థల పరిసరా ప్రాంతాల్లో, అనుమానిత ప్రాంతాల్లో నిత్యం తనిఖీలు చేస్తూ డ్రగ్స్, ఇతర పొగాకు ఉత్పత్తులపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. ఆన్లైన్ మోసాలు, నకిలీ పెట్టుబడి పథకాలు, ఫోన్ కాల్స్, సోషల్ మీడియా ద్వారా జరిగే మోసాలపై ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. నేరస్తులపై ప్రత్యేక నిఘా పెంచడంతో పాటు రౌడీషీటర్లు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల కదలికలపై దృష్టి సారించాలన్నారు. వారెంట్ల అమలు, పరారీలో ఉన్న నిందితుల అరెస్టులు, కమ్యూనిటీ పోలీసింగ్పై కూడా ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. సమావేశంలో డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, సీఐలు అప్పయ్య, ఇజాజుద్దీన్, కమలాకర్, మహేష్, రామకృష్ణ. మోతీరాం, ఎస్ఐలు పాల్గొన్నారు. ● ఇటీవల జిల్లాలో బదిలీపై నూతనంగా బాధ్యతలు తీసుకున్న ఎస్ఐలు శనివారం ఎస్పీ డి.జానకిని మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే సీసీఎస్ సీఐగా ఉన్న కృష్ణయ్య నూతనంగా మహిళ పోలీస్ స్టేషన్ సీఐగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎస్పీని కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో నిబద్ధతో పని చేయాలని సూచించారు. -
మహిళ మెడలో బంగారు గొలుసు అపహరణ
కొత్తకోట రూరల్: నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తులు బైక్పై వచ్చి లాక్కెళ్లిన ఘటన కొత్తకోట మండల కేంద్రంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు రామనంతపురం గ్రామానికి చెందిన పసుపుల మన్నెమ్మ కొంత కాలంగా కొత్తకోట పట్టణంలో నివాసం ఉంటోంది. శనివారం సాయంత్రం పని నిమిత్తం ఇంటి నుంచి బయటకు వచ్చి పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్పై వచ్చి ఆమె మెడలోని రెండు తులాల బంగారు గొలుసును అపహరించి పరారయ్యారు. బాధితురాలి అరుపులు విని స్థానికులు అక్కడికి చేరుకునేలోపే నిందితులు తప్పించుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనాస్థల పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. -
రక్తదానంపై విస్తృత ప్రచారం
ఒక వైద్యుడిగా ఉంటూ రక్తదానంపై విస్తృతంగా ప్రచా రం చేయడంతో పాటు నేను కూడా స్వతహాగా ఇప్పటి వరకు 21సార్లు రక్తదానం చేశాను. రెడ్క్రాస్తో పాటు అత్యవసరంగా ఉన్న సందర్భంలో నా దృష్టికి వచ్చిన ప్రతిసారి రక్తదానం చేస్తూ వచ్చాను. భవిష్యత్లో కూడా అవసరమైన వారికి రక్తం ఇస్తాను. – డా.అశ్విని నవదీప్, మహబూబ్నగర్ ప్రాణాలు కాపాడాలి.. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ప్రతి మూడు నెలలకోసారి రక్తాన్ని ఇవ్వవచ్చు. నేను 21 ఏళ్ల వయసు నుంచి ప్రతి సంవత్సరం వరుసగా రక్తదానం చేస్తున్నాను. ఇప్పటివరకు 70 సార్లు రక్తదానం చేశాను. నా మిత్రులకు కూడా అవగాహన కల్పిస్తున్నా. రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేము. కేవలం దాతల ద్వారానే సేకరిస్తాం. ప్రతి ఒక్కరూ రక్తాన్ని ఇచ్చి ప్రాణదాతలుగా నిలవాలి. – రాధాకృష్ణ, లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్, నాగర్కర్నూల్ ఏ సమయంలోనైనా.. ఆరోగ్యంగా ఉన్న ప్రతి వ్యక్తి క్రమం తప్పకుండా రక్త దానం చేయడం ద్వారా సమాజానికి గొప్ప సేవ చేసినవారమవుతారు. నేను ఇప్పటి వరకు 10 సార్లు రక్తం ఇచ్చాను. ఏ సమయంలోనైనా రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. – కొట్ర గోపాల్రెడ్డి, లెక్చరర్, కల్వకుర్తి ● -
కొమ్ము పురుగును ఇలా నివారిద్దాం
● సలహాలు సూచనలు పాటిస్తే అధిక లాభాలు ● మధనాపురం కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ రాజేందర్రెడ్డి కొత్తకోట రూరల్: జిల్లాలో ఆయిల్ పాం పంట సాగు క్రమేణా పెరుగుతుంది. అయితే పంటలో కొమ్ము పురుగు వ్యాపించే అవకాశం ఉండడంతో మదనాపురం కేవీకే శాస్త్రవేత్త రాజేందర్ రెడ్డి పురుగు నివారణకు పలు సూచనలు చేశారు. కొమ్ము పురుగు (రైనోసిరస్ బీటిల్) 30–50 మి.మీ పొడవుతో ముదురు గోధుమ నుంచి నలుపు రంగులో ఉంటుందని, పురుగు 100–150 వరకు తెలుపు రంగు గుడ్లను 5–10 సెం.మీ లోతులో పశువుల పెండ కుప్పలో లేదా చనిపోయిన చెట్ల మొదళ్లలో సముదాయాలుగా పెరుగుతుందని సూచించారు. ఈ గుడ్లు 2–3 వారాలలో పొదుగుతాయి. పూర్తిగా ఎదిగిన లార్వాలు 30సెం.మీ లోతులో ఉండి కోశస్థ దశలుగా వృద్ది చెంది 3–4 వారాల తర్వాత రెక్కల పురుగు (బీటిల్స్)గా మారుతాయి. తల్లి రెక్ల పురుగులు 200 రోజులు బతికి ఉంటూ సంవత్సరానికి ఒకేసారి జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటాయి. ఈ బీటిల్స్ ఎక్కువగా మొక్క మొదలు దగ్గర అప్పుడే ఏర్పడుతున్న మొవ్వ, ఆకులను ఆశించి నష్టపరుస్తాయి. ఆకుల చివర గ ఆకారపు ఖాళీలు ఏర్పరుస్తాయి. మొవ్వ భాగంలోని ఆకులు కురసగా మెలికలు తిరిగినట్టు అవుతాయి. లేత మొవ్వభాగం ఆశించి లోపలికి చొచ్చుకొపోయి రంధ్రాలు చేసి మొవ్వ కుల్లిపోయేటట్లు చేయడం వల్ల మొక్కలు చనిపోతాయి. నివారణ... ● తోటల్లో చనిపోయిన చెట్లను తొలగించాలి. ఆయిల్పాం తోటలను కలుపు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తోటల్లో పశువుల ఎరువు(పేడ)ను నిల్వ ఉంచకూడదు. ● పశువుల ఎరువు టన్నుకు కిలో కార్పప్యూరాన్ 3 శాతం గుళికలు లేదా 2 కిలోల మలాథియాన్ పొడిని కలుపుకొని మొదలు దగ్గర చల్లాలి. ● మొవ్వలో రంధ్రాలు గుర్తించిన వెంటనే కిలో మట్టికి 30 గ్రాముల మ్యాంకోజోబ్, 100 గ్రాముల క్లోరోఫైరిపాస్ పొడి మందును కలిపి రంధ్రాలు పూడ్చాలి. ● సోలార్ దీపపు ఎరలను ఏర్పాటు చేసుకోవాలి. ● థైనోల్యూర్ కలిగిన లింగాకర్షక బుట్టలు (బకెట్ ఫిర్మోన్ ట్రాప్స్) ఎకరానికి 1–2 ట్రాప్స్ ఏర్పాటు చేసుకోవాలి. ● బీటాల్స్ ఎక్కువగా ఆకర్షించడానికి చెరుకు రసం, ఫైన్ యాపిల్ రసం, ఈస్టును బాగా పులియబెట్టి ఎకరం పొలంలో 5–6 చోట్ల అమర్చుకోవాలి. ● మెటారైజియం అనైసోప్లియా అనే జీవ సంబంధిత శిలీంద్రనాశిని 5గ్రా. లీటరు నీటిలో కలిసి మొవ్వ తడిచేలా పిచికారీ చేసుకుంటే ఫలితం ఉంటుంది. ● పురుగు నివారణకు తొలిదశలో వేప మందు 10,000 పీపీఎం, 1మి.లీ ల్యామ్దా సైహలోత్రిన్, 1మి.లీ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ● ఉధృతి ఎక్కువగా ఉంటే క్లోరాంట్రిన్ ప్రోల్ 0.3 మి.లీ లేదా స్పైనోశాడ్, 0.3 మి.లీ లేదా ట్రెట్రా టింనిప్రోల్ 1.మి.లీ నీటిలో కలిపి మొక్క సుడిలో పోసుకోవాలి. ● తేట తోటల్లో 10–20 గ్రా 3జీ కార్పోప్యూరాన్ గుళికలు లేదా 10గ్రాముల క్లొరాంట్రిన్ఫోల్ గుళి కలు కవర్లలో ఉంచి ఒక చెట్టుకు 4 కవర్లు మొవ్వ భాగంలో కడితే పురుగును నివారించవచ్చు. -
సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా మోదీ పాలన
వనపర్తిటౌన్: ప్రధాని మోదీ పాలనలో ప్రపంచ వ్యాప్తంగా భారత్ వికసిస్తుందని బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ అన్నారు. ప్రపంచ స్థాయిలో భారత దేశానికి గుర్తింపు పెంచిన నాయకుడిగా మోదీ దేశ చరిత్రలో నిలిచిపోవడం ఖాయమని కొనియాడారు. శనివారం జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు డి. నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ సంక్షేమం, అభివృద్ధి పాలన అందిస్తున్నాడని చెప్పారు. రాష్ట్రంలో 2500 కి.మీ జాతీయ రహదారుల నిర్మాణం డోర్నకల్ టు గద్వాల వయా వనపర్తి 290 కి.మీ దారుల నిర్మాణం ప్రారంభం కాబోతుందని, మహారాష్ట్ర నుండి నిజాంబాద్ మేడ్చల్ మీదుగా డోన్ వరకు 417 కిలోమీటర్లు రూ.4,686 కోట్ల నిధులతో డబ్లింగ్ పనులు 50 శాతం పూర్తయ్యాయని చెప్పారు. ఉపాధి హామీ కూలి రూ.155 నుంచి రూ.307 పెంచాడని, స్వామి నాథన్ కమిషన్ సిఫార్సు మేరకు పెట్టుబడి రూ.100 ఉంటే రూ.150 మద్దతు ధర కల్పించాలన్న నిర్ణయాన్ని మోదీ అనుసరిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో 54 కోట్ల ఆయుష్మాన్ భారత్ కార్డులతో 70 ఏళ్ల వరకు ప్రతి వ్యక్తికి రూ.ఐదు లక్షలు 70 ఏళ్లు దాటిన వ్యక్తికి అదనంగా రూ.ఐదు లక్షల బీమా లభిస్తుందని, దేశంలో 25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చారని కొనియాడారు. కార్యక్రమంలో మైనార్టీ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ అప్సర్ పాషా, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఆర్ లోకనాథ్ రెడ్డి, రాష్ట్ర నాయకుడు బి.శ్రీశైలం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్. వెంకటేశ్వర్ రెడ్డి, కేతూరి బుడ్డన్న, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనుజ్ఞా రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. -
పాముకాటుతోరైతు మృతి
పెద్దకొత్తపల్లి: మండలంలోని చంద్రబండ తండాకు చెందిన రైతు కేతావత్ శంకర్నాయక్ (47)ను శనివారం పాముకాటు వేయడంతో మృతి చెందాడు. తండావాసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం తన పొలంలో పనులు చేస్తుండగా పాము కాటు వేసింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వెంటనే కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఇంటి యజమాని అకాల మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుని భార్య మంగమ్మ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి కుటుంబాన్ని సర్పంచ్ చిట్టిశకంర్నాయక్, ఉప సర్పంచ్ శంకర్నాయక్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య నవాబుపేట: ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని కూచూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కూచూర్కు చెందిన కర్రె ప్రభాకర్ (34) లారీ నడుపుతూ జీవనం సాగించేవాడు. లంబాడి కులానికి చెందిన పద్మమ్మ అనే మహిళను నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. కాగా వీరికి సంతానం కలగలేదు. ఈ క్రమంలో ప్రభాకర్ మరో మహిళతో సహజీవనం చేస్తుండటంతో గొడవలు జరిగి భార్యతో విడాకులు తీసుకున్నాడు. అయితే ప్రస్తుతం కలిసి ఉంటున్న మహిళతో కూడా గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన ప్రభాకర్ శనివారం గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి కర్రె ఎల్లయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నరేందర్ తెలిపారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి అడ్డాకుల: మూసాపేట మండలం వేములలో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతిచెందిన ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. బాధితుల కథనంం ప్రకారం.. గ్రామానికి చెందిన హరిజన్ రాములు(58) శనివారం మధ్యాహ్నం ఇంటి వద్ద కరెంట్ మోటర్ ఆన్ చేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో కరెంట్ షాక్కు గురై కింద పడిపోయాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు జానంపేట పీహెచ్సీకి తీసుకెళ్లి అక్కడి నుంచి జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ రాములును పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతిచెందినట్లు ధృవీకరించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యుల రోధనలు కలచి వేశాయి. మృతుడికి భార్య నాగమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రాములు మృతితో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఇంటిపై తాటిచెట్టు కూలి వృద్ధురాలు మృతి ● మరో ఇద్దరికి గాయాలు మీర్పేట: ఈదురు గాలులకు తాటిచెట్టు కూలి ఇంటిపై పడడంతో ఓ వృద్ధురాలు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాజశేఖర్ కథనం ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా, లింగాల మండలం షాన్పేటకు చెందిన సభావత్ లక్ష్మీసేవ్య ఇద్దరు కుమారులు, కోడలుతో కలిసి కొంత కాలంగా జిల్లెలగూడ రాఘవేంద్రనగర్ కాలనీలోని ఓ అద్దె ఇంట్లో నివాసముంటూ కూలీ పనులు చేసుకుంటున్నారు. శుక్రవారం రాత్రి 10 గంటలకు బలమైన ఈదురు గాలులు వీయడంతో వెనకాల ఉన్న తాటిచెట్టు విరిగి ఇంటిపై పడింది. దీంతో పైకప్పు రేకులు విరిగి నిద్రిస్తున్న లక్ష్మి(75), కుమారుడు వెంకట్రాం, కోడలు లలితపై పడ్డాయి. వెంటనే స్పందించిన స్థానికులు చెట్టుతో పాటు రేకులు, శిథిలాలను తొలగించి, క్షతగాత్రులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా, తీవ్రగాయాలైన లక్ష్మి చనిపోయింది. కొడుకు, కోడలు చికిత్స పొందుతున్నారు. పని నిమిత్తం ఇతర గ్రామానికి వెళ్లిన చిన్నకొడుకు రమేశ్కు ప్రమాదం తప్పింది. రమేశ్ ఫిర్యాదు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. తొమ్మిది మందిపై పోక్సో కేసు నమోదు అమరచింత: మండలంలోని ఓ గ్రామంలో మైనర్ను ప్రేమ పేరుతో వేధించడంతో బాలుడితో పాటు మరో ఎనిమిది మందిపై పోక్సో కేసు నమోదు చేసి శనివారం రిమాండ్కు తరలించామని ఎస్ఐ స్వాతి తెలిపారు. గ్రామానికి చెందిన బాలికను బాలుడు గత కొన్ని నెలలుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని బాలిక తల్లితండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. -
మాకు న్యాయం చేయాలి..
మావి ఇనాం భూములు. 73 ఏళ్లుగా మేము సాగు చేసుకుంటున్నాం. వీటిపైనే ఆధారపడి మా కుటుంబాలు బతుకుతున్నాయి. 2012లో దేవాదాయ భూమిగా మార్చారంటూ నష్టపరిహారం ఇవ్వట్లేదు. మా మాటలను లెక్కచేయకుండా మా పొలంలో ప్రాజెక్ట్ పనులు చేస్తున్నారు. మాకు పరిహారం అందే వరకూ మా పొలంలో పనులు చేయొద్దని ఆర్డీఓకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. మాకు న్యాయం చేయాలి. – వైజునాధ్, కానుకుర్తి, దామరగిద్ద, నారాయణపేట పరిహారమిచ్చిన తర్వాతే స్వాధీనం చేసుకోవాలి.. కానుకుర్తి రిజర్వాయర్ ని ర్మాణంలో భాగంగా సర్వే నంబర్ 361, 383 381 382,387లో మొత్తం 10.6 ఎకరాల సాగు భూమిని కోల్పోయా. చివరగా ఉన్న మా భూముల్లో పనులు ఆలస్యంగా ప్రారంభమవుతాయి. ఈ వానాకాలం నారు పోసుకునేందుకు సిద్ధం చేస్తున్నా. పక్క గ్రామంలో ఈ సారి పంట వేయొద్దని చాటింపు వేశారట. మాకై తే ఎవ రూ చెప్పలేదు. పరిహారం పూర్తి స్థాయిలో అందజేసిన తర్వాతే భూమి స్వాధీనం చేసుకోవాలి. అప్పటివరకు సాగు చేస్తాం. – ప్రకాష్ రెడ్డి, కానుకుర్తి, దామరగిద్ద, నారాయణపేట -
భక్తిశ్రద్ధలతో శని త్రయోదశి పూజలు
కందనూలు: బిజినేపల్లి మండలంలోని నందివడ్డెమాన్లో శ్రీశనేశ్వరస్వామికి భక్తులచే శని గ్రహదోష నివారణకు స్వామివారికి తిలతైలా అభిషేకలు పూజలు భక్తితో వేదమంత్రోచ్ఛరణాల మధ్య ఘనంగా నిర్వహించారు. జేష్టమాత సమేత శనేశ్వరస్వామికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు ప్రత్యేకంగా తిలతైల అభిషేకాల పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి మాట్లాడుతూ జ్యేష్ఠ మాసంలో స్వామివారిని కొలిచిన అత్యధిక సంతృప్తి పొంది విశేష ఫలితాన్ని భక్తులకు ఇస్తారన్నారు. ప్రతి ఒక్కరు జన్మ, గోచార రీత్యా శనిగ్రహ దోష నివారణకు స్వామివారిని శక్తిమేరకు పూజించాలన్నారు. అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనం తీర్థ ప్రసాదాల, అల్పాహారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ ఆలయ చైర్మన్ గోపాల్రావు, సర్పంచ్ సుగుణమ్మ, కమిటీ సభ్యులు రాజేష్, ప్రభాకరచారి, పుల్లయ్య పాల్గొన్నారు బల్మూర్ ఎంపీడీఓ రాఘవులు సస్పెన్షన్ బల్మూర్: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎంపీడీఓ రాఘవులు సస్పెన్షన్ చేస్తూ కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ అధికారులు ఎవరైన విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. నూతన ఎంపీడీఓగా రేవతిరెడ్డి బాధ్యతలు బల్మూర్ మండల నూతన ఎంపీడీఓగా అమ్రాబాద్లో సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్న రేవతిరెడ్డిని నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వూలు అందజేశారు. ఈ మేరకు ఆమె శనివారం బాధ్యతలు స్వీకరించారు. -
అయిజలో సినీ దర్శకుడు అనిల్ రావిపూడి
అయిజ: ప్రముఖ సినీ దర్శకుడు అనిల్ రావిపూడి అయిజలో సందడి చేశారు. శనివారం తన మేనమామ ఆంధ్ర శేఖర్ ఇంట్లో బసచేసిన ఆయనను.. పలువురు మిత్రులు, బంధువులు మర్యాద పూర్వకంగా కలిశారు. త్వరలో కొత్త సినిమా చిత్రీకరిస్తున్న నేపథ్యంలో మంత్రాలయం గురు రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. తాను దర్శకత్వం వహించిన పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్–2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్–3, భగవంత్ కేసరి, సంక్రాతికి వస్తున్నాం, మన శంకరవరప్రసాద్ సినిమాల చిత్రీకరణకు ముందు మంత్రాలయం రాఘవేంద్ర స్వామికి ప్రత్యేక పూజలు చేయించానని.. అన్ని సినిమాలు హిట్ అయ్యాయని చెప్పారు. ప్రతి సినిమా చిత్రీకరణకు ముందు మంత్రాలయం గురు రాఘవేంద్ర స్వామికి ప్రత్యేక పూజలు చేయించడం సెంటిమెంట్ అని.. అది ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. త్వరలో కొత్త సినిమాకు దర్శకత్వం వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. -
అనుకున్న జీపీ రాలేదనే..
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో పంచాయతీ కార్యదర్శులు ఇటీవల జరిగిన బదిలీల్లో తాము అనుకున్న జీపీలు రాలేదని పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు. దీంతో బదిలీలు జరిగి పదిరోజులు కూడా కాలేదు. అప్పుడే డిప్యుటేషన్ల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. అనుకున్న, లాభసాటి కలిగిన జీపీల్లో పోస్టింగ్ రాకపోవడంతో పలువురు కార్యదర్శులు డిప్యుటేషన్ల కోసం జిల్లా పంచాయతీ కార్యాలయం (డీపీఓ) చుట్టూ తిరుగుతున్నారు. ఇలా కాదంటే పరస్పర బదిలీలు చేయాలని అధికారులను కోరుతున్నారు. మే చివరి వారంలో 151మంది కార్యదర్శుల బదిలీలకు కలెక్టరేట్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈనెల 1నుంచి ఆర్డర్ కాపీలతో కొత్త జీపీల్లో బాధ్యతలు చేపట్టారు. కొంతమందికి జీపీలు నచ్చకపోవడం, సర్పంచులతో కలిసి పనిచేసే వాతావరణం లేకపోవడం, విధులకు జీపీ దూరంగా ఉండడంతో వారం తిరగక ముందే డిప్యుటేషన్ల రాగం అందుకున్నారు. జీపీలను మార్చాలని డీపీవో ఆఫీసులో అధికారులను కలుస్తున్నారని సమాచారం. ఇటు బదిలీలపై కొత్తగా వచ్చిన కార్యదర్శులను తమకు వద్దంటూ కొందరు సర్పంచులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. తమకు అనుకూలంగా ఉండే వారికే పోస్టింగ్ ఇవ్వాలని లేదా పాతవారినే కొనసాగించాలని కోరుతూ ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇచ్చి అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అయితే బదిలీలు పూర్తయిన ఏడాది వరకు ఎలాంటి డిప్యుటేషన్లు ఇవ్వొద్దని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉండడం, కలెక్టర్ ఖుష్బూగుప్తా కూడా అధికారులకు స్పష్టంగా చెప్పడంతో డిప్యుటేషన్లను ముట్టుకోవడానికి వెనకాడుతున్నారు. డిప్యుటేషన్లు చేయలేమని డీపీవో అధికారులు సదరు కార్యదర్శులు, సర్పంచులకు సూచిస్తున్నారు. బదిలీ స్థానాల్లోనే కార్యదర్శులు పనిచేయాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఇటీవల జరిగిన బదిలీల ప్రక్రియలో పంచాయతీ కార్యదర్శులు గ్రామ పంచాయతీలుగా ఉన్న తండాల జోలికి వెళ్లలేదని తెలుస్తోంది. ఎమ్మెల్యేలు చెప్పడంతోనేనా..? తమ నియోజకవర్గంలో పనిచేసే చాలామంది పంచాయతీ కార్యదర్శులను తప్పించి పక్క నియోజకవర్గంలో పనిచేసేవారిని రప్పించుకోవాలని ఆయా ఎమ్మెల్యేలు అధికారులకు చెప్పినట్లు సమాచారం. ఆ మేరకు బదిలీలు చేయాలని జిల్లా ఉన్నతాధికారులపై ఎమ్మెల్యేలు ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. బదిలీల నిబంధనలకు విరుద్ధమని ఉన్నతాధికారులు చెప్పడంతో కనీసం ఇతర మండలానికై నా బదిలీలు చేయాలని సూచించినట్లు తెలుస్తుంది. దానికి అనుగుణంగా బదిలీలు జరిగినట్లు సమాచారం. కార్యదర్శుల ఇబ్బందులు తాము అనుకున్న జీపీ రాలేదనే భావనలో పంచాయతీ కార్యదర్శులు ఉన్నట్లు తెలుస్తుంది. బదిలీల సమయంలో తాము పనిచేస్తున్న మండలంలోనే చాలామంది ఆప్షన్లు ఇచ్చారు. తీరా కౌన్సెలింగ్ సమయంలో ఉన్న మండలం కాకుండా వేరే మండలాల్లోని జీపీలు కోరుకోవాలని అధికారులు చెప్పడంతో చేసేది లేక హడావుడిగా పక్క మండలాల్లోని జీపీలను కోరుకున్నారు. దీంతో పంచాయతీ కార్యదర్శులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తుంది. బదిలీ ఉంటే తాము కోరుకున్న స్థానాన్ని కోరుకునే హక్కు ఉద్యోగులకు ఉందని ప్రశ్నిస్తున్నారు. అందుకు భిన్నంగా బదిలీలు జరిగాయనే ఆరోపిస్తున్నారు. బదిలీ కాగానే కార్యదర్శుల డిప్యుటేషన్ రాగం నచ్చినచోట పోస్టింగ్కు పలువురి పావులు కొత్తవారు వద్దంటూ కొందరు సర్పంచుల సిఫార్సులు -
విలీనానికి ఉన్నత స్థాయి కమిటీ
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ప్రభుత్వంలో టీజీఆర్టీసీ విలీనం చేసేందుకు గాను ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటైందని ఆర్ఎం సంతోష్ కుమార్ తెలిపారు. శనివారం తన చాంబర్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ గత ఏప్రిల్లో కార్మికుల సమ్మె అనంతరం వివిధ డిమాండ్ల పరిష్కారంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీ ముఖ్యంగా మూడు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇందులో 2021 వేతన సవరణను ఈనెల నుంచే అమలు చేయడం, కార్మిక సంఘాల పునరుద్ధరణ.. గుర్తింపు సంఘం కోసం ఎన్నికలు, తదుపరి విలీన ప్రక్రియ ఉన్నాయన్నారు. దీనికి సంబంధించి ప్రతి కార్మికుడి అభిప్రాయానికి విలువ ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. త్వరలోనే అన్ని డిపోలలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో యూనియన్ వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుందన్నారు. ఎన్నికల్లో మెజారిటీ సాధించిన కార్మిక సంఘాల ప్రతినిధులను విలీన ప్రక్రియలో ప్రత్యక్ష భాగస్వాములుగా చేస్తారన్నారు. వారి సూచనలు, సలహాలను కేబినెట్ సబ్ కమిటీ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. మిగతా డిమాండ్లపై కార్మిక సంఘాలతో టీజీఆర్టీసీ ఈడీల కమిటీ చర్చలు జరుపుతుందన్నారు. కార్మికుల భవిష్యత్తుకు పూర్తి భద్రత కల్పించడమే ఆర్టీసీ ప్రధాన లక్ష్యమన్నారు. ఎప్పటిలాగే సంస్థ అభివృద్ధికి ఉద్యోగులు, కార్మికులందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ● 3 అంశాలపై కేబినెట్ సబ్ కమిటీ ప్రత్యేక దృష్టి ● మహబూబ్నగర్ ఆర్ఎం సంతోష్కుమార్ -
ఇప్పటికీ 32 సార్లు..
మొదట 2010లో ఒకరికి ఓ–పాజిటివ్ రక్తం అవసరం ఉందని తెలిస్తే వెంటనే రెడ్క్రాస్ వద్దకు చేరుకొని రక్తదానం చేశాను. ఇక అప్పటి నుంచి ప్రతి ఏడాది రెండుసార్లు రక్తదానం చేయాలని నిర్ణయించుకున్నాను. ఇప్పటి వరకు 32 సార్లు రక్తదానం చేశాను. మా పిల్లల పుట్టి న రోజుతో పాటు ప్రతి ఏడాది డిసెంబర్లో నేను పనిచేసే బ్యాంకులో రక్తదాన శిబిరంలో తప్పక చేస్తుంటాను. ఆరోగ్యవంతుడు రక్తదానం చేయడం వల్ల అత్యవసరంగా ఉన్న వారికి ఉపయోగపడుతుంది. – రజినీకాంత్, మహబూబ్నగర్ సహాయ ఫౌండేషన్ ఏర్పాటు.. మా నాన్నకు డయాలసిస్ రావడం.. అత్యవసరంగా రక్తం లభించకపోవడంతో చనిపోయారు. దీంతో ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ రక్తం అందించడానికి 2018లో సహాయ ఫౌండేషన్ ఏర్పాటు చేశాను. ఇప్పటి వర కు 5వేల మందికి రక్తం అందించాం. ఐదు రాష్ట్రాల్లో మా ఫౌండేషన్ సభ్యులు ఉన్నారు అత్యవసరం వస్తే అక్కడికి వెళ్లి రక్తదానం చేస్తారు. – టంకర శివప్రసాద్ ఎప్పుడు అవసరమైతే అప్పుడు.. నాది ఓ–నెగిటివ్ గ్రూప్. ఇది కొంత అరుదుగా లభిస్తుంది. దీంతో అత్యవసరం ఉన్న వారు ఎక్కువగా ఉంటారు. రెడ్క్రాస్ నుంచి కూడా ఫోన్ చేస్తారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రి, రెడ్క్రాస్, హైదరాబాద్ ఇలా అవసరం ఉన్నచోటకు వెళ్లి ఇచ్చి వస్తాను. నేను మొదట వాసవీమాత ఆలయం వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రక్తదానం చేశాను. ●– సుంకు రామ్మోహన్, బ్రాహ్మణవాడి -
జిల్లాలో మోస్తరు వర్షం
మహబూబ్నగర్ (వ్యవసాయం): జిల్లాలో ఓ మోస్తరు వర్షం కురిసింది. వాతావరణ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం జిల్లాలో శనివారం సగటున వర్షపాతం 17.3 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గండేడ్ మండలంలో 78.9 మి.మీ., నమోదు కాగా, మహ్మదాబాద్లో 52.5 మి.మీ., కోయిలకొండలో 44.6 మి.మీ, మిడ్జిల్లో 31.3 మి.మీ, రాజాపూర్లో 27.2 మి.మీ, బాలానగర్లో 17.9 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. ఈ వాన పంటల దుక్కులకు దోహద పడుతుండడంతో రైతులు ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని వీసీ హాల్నుంచి ఇందిరమ్మ ఇళ్ల మెటీరియల్ కాంపోనెంట్ ఎస్టిమేషన్ ప్రిపరేషన్, ఇందిరమ్మ ఇళ్ల ప్రపోజల్స్ స్టేటస్ రిపోర్ట్పై వీసీ నిర్వహించారు. ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరైన 90 రోజుల లోపల ఉపాధి హామీ పథకంలో భాగంగా పేమెంట్ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు 5,972 ఇళ్లకోసం 3,493 ఉపాధి హామీ పథకం కింద పేమెంట్ కోసం మస్టర్డ్ ఇవ్వడం జరిగిందన్నారు. మిగతా 2,478 ఇళ్లకు ఈ నెలాఖరి వరకు ఎస్టిమేషన్ పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. సమీక్షలో జెడ్పీ సీఈఓ వెంకట్రెడ్డి, డీఆర్డీఓ నర్సిములు, హౌసింగ్ పీడీ ఉపేందర్రెడ్డి, హౌసింగ్ డీఈ విజయ్కుమార్, ఎంపీడీఓలు, తదితరులు పాల్గొన్నారు. జూరాలకు 2,596 క్యూసెక్కుల ఇన్ఫ్లో ధరూరు/ రాజోళి: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్ఫ్లో కొనసాగుతుంది. కొన్ని రోజులుగా స్థానికంగా కురుస్తున్న వర్షాల ఆధారంగా ప్రాజెక్టుకు శనివారం సాయంత్రం వరకు 2,596 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో నెట్టెంపాడు ఎత్తిపోతలకు రెండు పంపులను రన్ చేసి గుడ్డెందొడ్డి, ర్యాలంపాడు రిజకర్వాయర్లను నింపుతున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 1,500 క్యూసెక్కులు వదలగా.. మరో 43 43 క్యూసెక్కులు ఆవిరైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.773 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులో దాదాపు 3 టీఎంసీల నీరు చేరినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. సుంకేసుల డ్యాంలో శుక్రవారం ఒక గేటు తెరిచి దిగువకు నీటిని వదిలిన అధికారులు శనివారం గేటును మూసేశారు. డ్యాంకు శనివారం ఎలాంటి ఇన్ఫ్లో లేకపోవడంతో గేటును మూసినట్లు అధికారులు తెలిపారు. -
రక్తదాతలకు సలాం
● అత్యవసర సమయంలో రక్తమిచ్చి ప్రాణాలు కాపాడుతున్న దాతలు ● ఏడాదికి రెండు, మూడుసార్లు రక్తదానంతో ఆదర్శంగా నిలుస్తున్న వైనం ● నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుడికి.. సర్జరీ కావాల్సిన రోగికి.. ప్రసవమయ్యే గర్భిణికి.. తలసేమియా బాధితులకు.. ఇలా అత్యవసరంగా రక్తం కావాల్సిన ప్రతి ఒక్కరికీ మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు రక్తదాతలు. కొందరు ఒకటి, రెండుసార్లు ఇచ్చి.. ఇక ఆ తర్వాత రక్తదానం చేయడం ఆపేస్తారు. కానీ మరికొందరు ప్రతి ఏడాది రెండు నుంచి మూడు సార్లు రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అత్యవసర సమయంలో రక్తం కొరత లేకుండా చూస్తూ.. ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నారు. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. – పాలమూరు/కందనూలు -
రక్తదాతలకు సలాం
మనుషుల మధ్య ఎన్నో బంధాలు ఉంటాయి.. కానీ ఎలాంటి పరిచయం లేకపోయినా కేవలం మానవత్వంతో రక్త బంధాన్ని ఏర్పరుచుకునేవారే రక్తదాతలు. అత్యవసర సమయాల్లో రక్తం అందక ఏ ఒక్క ప్రాణం పోకూడదనే సంకల్పంతో ఎంతోమంది దాతలు ముందుకు వస్తున్నారు. ప్రతి ఏటా రెండు నుంచి మూడుసార్లు క్రమం తప్పకుండా రక్తదానం చేస్తూ.. మరణం అంచుల్లో ఉన్నవారికి పునర్జన్మను ఇస్తున్నారు. కొందరు పదులు సంఖ్యలో రక్తదానం చేసి ఎందరికో జీవనదానం చేశారు. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం... – పాలమూరు– వివరాలు 8లో.. -
మన్యంకొండ సూపరింటెండెంట్కు గ్రేడ్–1 ఈఓగా పదోన్నతి
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్న నిత్యానందచారికి ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్–1 హోదాతో పదోన్నతి కల్పించింది. కౌకుంట్ల గ్రామానికి చెందిన నిత్యానందచారి 1993లో జూనియర్ అసిస్టెంట్గా దేవాదాయ శాఖలో సేవలు ప్రారంభించి, వివిధ హోదాల్లో సమర్థవంతంగా పనిచేస్తూ ఈ స్థాయికి చేరుకున్నారు. పదోన్నతి సందర్భంగా దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజుతో పాటు ఆలయ సిబ్బంది ఆయనను ఘనంగా సత్కరించి అభినందించారు. స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిత్యానందచారి మాట్లాడుతూ తనకు లభించిన పదోన్నతి పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, సహచర ఉద్యోగులు, అధికారులు, భక్తుల సహకారంతోనే ఈ స్థాయికి చేరుకోగలికానని అన్నారు. భవిష్యత్లోనూ భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. -
అతివేగానికి నిండుప్రాణం బలి
● ఆటోను ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి ● రామస్వామి మృతికి పోలీసుల దిగ్భ్రాంతి కొత్తకోట రూరల్: ముందు వెళ్తున్న ఆటోను అతివేగంగా వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొనడంతో ఆటో డ్రైవర్ దుర్మరణం చెందిన ఘటన మండలంలోని అమడబాకుల సమీపంలోని జాతీయ రహదారి–44పై శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. కొత్తకోట ఎస్ఐ శివానందంగౌడ్ కథనం ప్రకారం.. అమడబాకులకు చెందిన రామస్వామి(55) సొంత ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజువారీ పనిలో భాగంగా గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో ట్రాన్స్ఫార్మర్ను ఆటోలో తీసుకెళ్లి దించిన అనంతరం సమీపంలోని ఓ దాబాలో భోజనం చేసి ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు అతివేగంగా వచ్చిన కారు ఆటోను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఆటో పల్టీలు కొడుతూ రోడ్డు కింద బోల్తాపడింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఘటనా.. స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినప్పటికీ తీవ్రగాయాలు కావడంతో అప్పటికే రామస్వామి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వనపర్తి మార్చురీకి తరలించారు. మృతుడి కుమారుడు నవీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కాగా, కొత్తకోట పోలీస్స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు, ప్రమాదవశాత్తు మరణాలు సంభవించినప్పుడు తరచుగా పోలీసులకు సేవలందించేది రామస్వామి ఆటోనే కావడం గమనార్హం. ఎప్పుడూ ఇతరులకు సహాయం చేసే రామస్వామి ప్రమాదంలో మృతి చెందడంతో పోలీసులు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామస్వామి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
పాలమూరు రైతుకు ‘అభ్యుదయ’ పురస్కారం
మహబూబ్నగర్(వ్యవసాయం): వ్యవసాయ రంగంలో వినూత్న పద్ధతులు అనుసరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న పాలమూరు రైతుకు అరుదైన గౌరవం దక్కింది. మహబూబ్నగర్ మండలం కోటకదిర గ్రామానికి చెందిన రైతు జ్ఞానేశ్వర్రెడ్డికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మక ’అభ్యుదయ రైతు పురస్కారం ప్రదానం చేసింది. విశ్వవిద్యాలయం 62వ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా జ్ఞానేశ్వర్రెడ్డి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. వ్యవసాయ రంగంలో ఆయన చేస్తున్న విశేష కృషి, ముఖ్యంగా సేంద్రియ సాగులో అనుసరిస్తున్న ప్రయోగాత్మక విధానాలను గుర్తించి విశ్వవిద్యాలయం ఈ అవార్డుకు ఎంపిక చేసింది. జ్ఞానేశ్వర్రెడ్డి రసాయనిక ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గిస్తూ సహజ సిద్ధ పద్ధతుల్లో సాగు చేస్తున్నాడు. తక్కువ వ్యయంతో అధిక నాణ్యత గల పంటలను పండిస్తూ ఇతర రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో ఆయన చేస్తున్న కృషి విశేషమని విశ్వవిద్యాలయ అధికారులు పేర్కొన్నారు. పాలమూరు జిల్లాకు చెందిన రైతు రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని అందుకోవడంపై రైతు సంఘాల ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలోని రైతులకు ఇది మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. -
డీలర్లు వ్యవసాయ సలహాదారులుగా మారాలి
మహబూబ్నగర్ (వ్యవసాయం): వ్యవసాయ రంగంలో డీలర్ల పాత్ర రోజురోజుకూ పెరుగుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, రైతు శిక్షణ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ బి.వెంకటేష్ అన్నారు. వ్యవసాయ ఉత్పాదక డీలర్లను నైపుణ్యవంతమైన పారా ఎక్స్టెన్షన్ నిపుణులుగా తీర్చిదిద్దేందుకు నిర్వహిస్తున్న డీఏఈఎస్ఐ (డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్పుట్ డీలర్స్) కోర్సును పూర్తి చేసిన 40 మంది డీలర్లకు శుక్రవారం సర్టిఫికెట్లు అందజేశారు. హైదరాబాద్లోని మేనేజ్ సంస్థ ఆధ్వర్యంలో, మహబూబ్నగర్ రైతు శిక్షణ కేంద్రం (ఎఫ్టీసీ) ద్వారా నిర్వహించిన 2024–25 బ్యాచ్ (టీపీ నం 2969) శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఈ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు శాసీ్త్రయ సలహాలు అందించడంలో డీఏఈఎస్ఐ శిక్షణ పొందిన డీలర్లు కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. వ్యవసాయ సంబంధిత చట్టాలు, పంటల యాజమాన్య పద్ధతులు, ఎరువులు, పురుగు మందుల వినియోగంపై సమగ్ర అవగాహన కల్పించేందుకు ఈ కోర్సు దోహదపడుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఎరువులు, పురుగుమందుల లైసెన్స్లు పొందేందుకు, పునరుద్ధరించుకునేందుకు డీఏఈఎస్ఐ సర్టిఫికెట్ తప్పనిసరిగా మారిందని అన్నారు. డీలర్లు రైతులకు కేవలం ఉత్పత్తులు విక్రయించే వ్యాపారులుగా కాకుండా వ్యవసాయ సలహాదారులుగా మారాలని సూచించారు. పంటలలో చీడపీడల నివారణ, సమతుల్య ఎరువుల వినియోగం, నూతన సాంకేతిక పరిజ్ఞానాలపై రైతులకు అవగాహన కల్పించడంలో ముందుండాలని కోరారు. డీఏఈఎస్ఐ శిక్షణ ద్వారా పొందిన జ్ఞానాన్ని క్షేత్ర స్థాయిలో రైతుల ప్రయోజనాలకు వినియోగిస్తే వ్యవసాయ ఉత్పాదకత పెరగడంతో పాటు రైతుల ఆదాయం కూడా మెరుగుపడుతుందని అన్నారు. కార్యక్రమంలో ఏడీఎ మాధవి, ఏడీఎ (ఆర్) రాంపాల్, ఏఓలు మీనా, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా అథ్లెట్కు సిల్వర్ మెడల్
వనపర్తిటౌన్: హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఈనెల 11, 12వ తేదీల్లో నిర్వ హించిన తెలంగాణ రాష్ట్రస్థాయి సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్–2026 పోటీల్లో జిల్లా అథ్లెట్ కేతావత్ శంకర్ సిల్వర్ పథాకాన్ని సాధించారు. జావెలిన్ ఈవెంట్లో సిల్వర్ మెడల్ సాఽ దించడంతో జిల్లా క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి నందిమల్ల శ్రీకాంత్ అథ్లెట్కు మెడల్ ప్రధానం చేశారు. కార్యక్రమంలో మహబూబ్నగర్, నారాయణపేట జిల్లా కార్యదర్శులు శరత్, రమణ పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి క్రీడల్లో ప్రతిభ నారాయణపేట ఎడ్యుకేషన్: హైదరాబాద్లోని ఉస్మానియా మీట్లో శుక్రవారం జరిగిన సీనియర్, జూనియర్ మెన్, ఉమెన్ విభాగంలో నారాయణపేట క్రీడాకారులు సత్తా చాటి పతకాలు సాధించినట్లు నారాయణపేట జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమణ అన్నారు. మెన్ సీనియర్ విభాగంలో జనార్ధన్కు హై జంప్లో గోల్డ్ మెడల్ అలాగే 400 మీటర్ల పరుగు పందెంలో బ్రాంజ్ మెడల్ సాధించాడు. ఉమెన్ విభాగంలో అండర్–16 విభాగంలో పూజ సిల్వర్ మెడల్ సాధించింది. రాష్ట్ర సెక్రెటరీ, ప్రెసిడెంట్, సారంగపాణి, స్టాలిన్ చేతుల మీదుగా పతకాలు అందుకున్నారు. కార్యక్రమంలో శరత్ కుమార్, వెంకటేశ్వర్లు, అథ్లెటిక్ కోచ్ హారిక దేవి పాల్గొన్నారు. -
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
మన్ననూర్: చెంచు, గిరిజనుల అభివృద్ధి కోసం జిల్లాలోని అన్నిశాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆదేశించారు. శుక్రవారం మన్ననూర్లోని ఐటీడీఏ కార్యాలయం సమావేశం హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యంత వెనుకబాటు తనంలో ఉన్న చెంచు, గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల కార్యాచరణతో ముందుకు సాగాలన్నారు. విద్య, వైద్యం, పౌష్టికాహారం, తాగునీరు, ఉపాధి అవకాశాలు పూర్తిస్థాయిలో నేరుగా చెంచులకే అందించేవిధంగా క్షేత్రస్థాయిలో ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యంగా చెంచుపెంటల్లోని బడీడు, డ్రాప్ ఆవుట్స్ పిల్లలను బడిలో చేర్పించే విధంగా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలన్నారు. ఆశ్రమ, గిరిజన సంక్షేమ, జీవీవీకే పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థుల హాజరుశాతం పెంచడంతోపాటు చెంచు, గిరిజన విద్యార్థులు ఉన్నత చదువులను అభ్యశించే విధంగా ప్రోత్సహించాలన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అవసరమైన వైద్యం, టీకాలు, పౌష్టికాహారం క్రమం తప్పకుండా అందుబాటులో ఉంచాలన్నారు. చెంచుపెంటల్లో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా ఐటీడీఏ, అనుబంధ శాఖల సహకారంతో చెంచు యువతకు ఉపాధి కల్పన, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అలాగే చెంచుల జీవనోపాధులు మెరుగుపడేందుకు లైవ్లీహుడ్, సౌర గిరిజల పథకం, అందరికి ఆధార్ అప్డేట్, ఆధార్కు మొబైల్ అనుసంధానం వంటి కార్యక్రమాలను అమలు చేయాలన్నారు. ముఖ్యంగా మొబైల్ నెట్వర్క్ అందుబాటులో ఉన్న అటవీ లోతట్టు ప్రాంత చెంచుపెంటలను గుర్తించి అక్కడే ఆధార్ అప్డేట్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆధార్, రేషన్ కార్డులు అందించే ఏర్పాటు చేయాలన్నారు. చెంచుపెంటలు, గ్రామాలు, గూడాల్లో ఇప్పటికే చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ రేవంత్ చంద్ర, ఇన్చార్జి డీటీడీఓ ఉమాపతి, డీఆర్డీఏ పీడీ చిన్నఓబులేష్, మిషన్ భగీరథ డీఈ హేమలత, ఐటీడీఏ ప్రాజెక్టు మేనేజర్ జాఫర్ హుస్సేన్, ఎంపీడీఓ లింగయ్య, ఏపీఓ యాదమ్మ, సీడీపీఓ దమయంతి, వివిధ శాఖల జిల్లా, మండల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధుల కట్టడికి ప్రత్యేక ప్రణాళిక
● ఈ నెల 28న పల్స్ పోలియోకుసిద్ధం కావాలి ● డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాసులు పాలమూరు: రాబోయో వర్షకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు మలేరియా, డెండీ, చికెన్గున్యా, అతిసార వ్యాధుల కట్టడి కోసం నివారణ ప్రణాళికలతో మెడికల్ ఆఫీసర్లు సిద్ధంగా ఉండాలని డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం జాతీయ ఆరోగ్య కార్యక్రమాలతో పాటు సీజన్ వ్యాధులపై సమీక్ష నిర్వహించారు. సబ్ సెంటర్లతో పాటు పీహెచ్సీల నుంచి ప్రత్యేక కార్యాచరణ ఉండాలన్నారు. పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు, సురక్షితమైన తాగునీరు మొదలైన వాటిపై అవగాహన పెంచాలన్నారు. క్షేత్రస్థాయిలో గర్భిణీలను త్వరగా గుర్తించి రిజిస్ట్రేషన్ చేసుకొని వారికి కావాల్సిన పరీక్షలు, అనిమియా నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. సురక్షిత కాన్పు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అయ్యేటట్లు ప్రణాళిక చేసి దానిని అమలు చేయాలన్నారు. కుష్టు, క్షయ వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తిస్తే సులుభంగా వ్యాధి చికిత్సలతో నివారించనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 28న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ శైలజ, రాజు, శివకాంత్, డీపీఓ సీతరామ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నటికో..?!
కొల్లాపూర్: పర్యాటక ప్రియులను ఆకర్షించేలా.. కొల్లాపూర్ నుంచి సోమశిలకు వెళ్లే దారిలో నల్లమల అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఎకో పార్కు ప్రారంభం రెండేళ్లుగా పెండింగ్లో పడుతూ వస్తోంది. అడవులపై అవగాహన, జంతు సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి అందాల గురించి ప్రజలకు తెలియజేయాలనే లక్ష్యంతో దీనిని నిర్మించారు. నల్లమల అడవిలో ఏర్పాటు చేసిన ఈ పార్కులో వ్యూ పాయింట్ సైతం అందుబాటులో ఉంది. అమ్రాబాద్ వ్యూ పాయింట్ తరహాలో ఎత్తైన కొండపై నుంచి నల్లమల అందాలు, కృష్ణానది ప్రవాహం తిలకించేలా ఇక్కడ వ్యూ పాయింట్ నిర్మించారు. అయితే అన్నిరకాల పనులు పూర్తయ్యాయి అని అటవీ అధికారులు చెబుతున్నప్పటికీ పార్కు అధికారికంగా ప్రారంభానికి నోచుకోవడం లేదు. రూ.1.50 కోట్లతో నిర్మాణం కొల్లాపూర్ నుంచి సోమశిల వెళ్లే దారిలో అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు ఐదేళ్ల క్రితం పార్కు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తర్వాతి కాలంలో పార్కుకు సమీపంలోనే అటవీ ప్రాంతంలో వ్యూ పాయింట్ నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.1.50 కోట్ల నిధులను హరిత, టీకేహెచ్ఎస్ ద్వారా కేటాయించారు. ఈ పనులను అటవీ శాఖ ఆధ్వర్యంలోనే చేపట్టారు. రెండేళ్ల క్రితమే నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. అప్పట్లో భారీ వర్షాల కారణంగా పార్కు నుంచి వ్యూ పాయింట్కు వెళ్లే రోడ్డు కోతలకు గురికావడంతో ప్రారంభాన్ని వాయిదా వేసినట్లు సమాచారం. తర్వాతి కాలంలో రోడ్డుకు మరమ్మతు చేసినా.. పార్కు మాత్రం ప్రారంభానికి నోచుకోలేదు. షార్ట్ఫిల్మ్లకు వేదికగా.. పార్కు నుంచి అటవీ ప్రాంతం లోపల ఎత్తైన ప్రాంతంలో వ్యూపాయింట్ నిర్మించారు. పార్కు నుంచి వ్యూపాయింట్కు వెళ్లేందుకు వీలుగా కిలోమీటర్ మేర మట్టి రోడ్డు ఏర్పాటుచేశారు. రోడ్డుకు ఇరువైపులా ట్రెంచ్, కంచె నిర్మించారు. వ్యూ పాయింట్ వద్దకు పర్యాటకులను తీసుకువెళ్లేందుకు రెండు ప్రత్యేక వాహనాలను అందుబాటులో ఉంచారు. పార్కు నిర్వహణను పర్యవేక్షించేందుకు సిబ్బందిని సైతం ఏర్పాటు చేశారు. అధికారికంగా పార్కు ప్రారంభం కానప్పటికీ.. అనధికారికంగా పర్యాటకులు వ్యూ పాయింట్ వర కు వెళ్లేందుకు ఇటీవల కాలంలో అనుమతులు ఇస్తున్నారు. పార్కు ప్రారంభమైతే షార్ట్ఫిల్మ్ షూటింగ్లకు వ్యూపాయింట్ వేదికగా మారే అవకాశం ఉంటుంది. త్వరలోనే ప్రారంభిస్తాం.. ఎకో పార్కులో నిర్మాణ పనులన్నీ పూర్తయ్యాయి. వ్యూ పాయింట్ను తిలకించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం పర్యాటకుల కోసం తాగునీటి వసతులు ఏర్పాటు చేశాం. టాయిలెట్స్ నిర్మించాం. మట్టి రోడ్డు కోతలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పర్యాటకుల తాకిడిని బట్టి వసతుల కల్పనకు అవసరమైన చర్యలు చేపడతాం. వచ్చే నెలలో పార్కును అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉంది. – వాణికుమారి, ఫారెస్టు రేంజర్, కొల్లాపూర్ కనువిందు చేసే అందాలు.. కొల్లాపూర్లోని పర్యాటక ప్రాంతాలను తిలకించేందుకు ఆగస్టు నుంచి మార్చి నెల వరకు పర్యాటకులు వస్తుంటారు. సోమశిలకు వెళ్లే మార్గంలో కొల్లాపూర్ పట్టణానికి దగ్గరలోనే ఉన్న ఎకో పార్కు, నల్లమల వ్యూ పాయింట్ పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ కానుంది. వ్యూ పాయింట్ వద్ద నుంచి చూస్తే సోమశిల గ్రామం, సమీపంలోని కృష్ణానది, కర్నూలు జిల్లా పరిసర ప్రాంతాలు, నల్లమల అభయారణ్యం వంటి దృశ్యాలు కనువిందు చేస్తాయి. పక్షులు, జంతువుల కదలికలు కూడా పర్యాటకులను ఆహ్లాదపర్చనున్నాయి. సోమశిల వెళ్లే దారిలో అటవీ ప్రాంతంలో పార్కు ఏర్పాటు కృష్ణానది, నల్లమల అందాలుతిలకించేలా వ్యూ పాయింట్ నిర్మాణం ఇప్పటికే రోడ్డు నిర్మాణం, వసతుల కల్పన పూర్తి రెండేళ్లుగా ప్రారంభం కోసం ఎదురుచూపులు అందుబాటులోకి వస్తే పర్యాటకులకు మధురానుభూతి -
పురుగుమందు తాగి మహిళ ఆత్మహత్య
జడ్చర్ల: మండల పరిధిలోని నల్లకుంటతండా కు చెందిన సక్రిబాయి (53) శుక్రవారం పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ ఐ జయప్రసాద్ తెలిపారు. సక్రిబాయికి గత కొంత కాలంగా మతి స్థిమితం సరిగ్గా లేకపోవడం, తదితర అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది.ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగగా కుటుంబసభ్యులు గమనించి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.మృతురాలి భర్త చందర్ ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కుటుంబ కలహాలతో యువకుడి బలవన్మరణం ఉండవెల్లి: మండలంలోని మారమునగాల–2 గ్రామానికి చెందిన చాంద్ బాషా (26) జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. చాంద్బాషా, షబానా దంపతుల కు 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. కొద్ది నెలలుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈనె 7న కూడా గొడవ జరగగా చాంద్ బాషా పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు వెంటనే కర్నూలులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు ఎస్ఐ శేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైలు పట్టాలు దాటుతూ వ్యక్తి మృతి జడ్చర్ల: రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు కింద పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ రాజు తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు.. గురువారం జడ్చర్ల–గొల్లపల్లి రైల్వే స్టేషన్ల మధ్య గుర్తు తెలియని వ్యక్తి (50) రైలు పట్టాలు దాటుతుండగా అదే సమయంలో గూడ్సు రైలు రావడంతో అతడిని ఢీకొట్టింది. ప్రమాదంలో అక్కడికక్కడే మర ణించాడు. మృతుడి చేతిపై ఎల్లమ్మ అనే పేరు పచ్చబొట్టుగా ఉంది. మృతుడి గురించి తెలిసిన వాళ్లు ఎవరైనా ఉంటే 87126 58597 నంబరును సంప్రదించాలని ఎస్ఐ పేర్కొన్నారు. పాన్షాప్లలో విస్తృతంగా తనిఖీలు మహబూబ్నగర్ క్రైం: జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం మాద క ద్రవ్యాలు, గుట్కాలు, పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. కళాశాలలు, పాఠశాలల సమీపంలో ఉన్న పాన్ షాప్లు, ఇతర దుకాణాల్లో సోదాలు నిర్వహించారు. వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న దుకాణాల్లో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ అప్ప య్య ఆధ్వర్యంలో దుకాణాలు తనిఖీ గుట్కా లు, పొగాకు ఉత్పత్తులు, ఈ–సిగరేట్లను తదితర వాటిని పరిశీలించారు. ఆ తర్వాత దుకాణదారులకు, స్థానికులకు మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించారు. ఖమ్మం ఘటనలో నిందితుడికి శిక్ష విధించాలి మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఖమ్మం జిల్లాలో నాలుగు రోజుల క్రితం ఓ 12 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు మద్ది యాదిరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని గణేష్ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాధితురాలి చికిత్సకు అయ్యే ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వీహెచ్పీ నాయకులు ఎన్.లక్ష్మీనారాయణ, రాచాల జనార్దన్, లావణ్య, చాపల హనుమంతు, దర్శి గోవిందరెడ్డి, రెబ్బ విగ్నేష్, మిట్టె శ్రీశైలం, గుబ్బా భరత్ తదితరులు పాల్గొన్నారు. డ్రంకెన్డ్రైవ్లో 8రోజుల జైలుశిక్ష మహబూబ్నగర్ క్రైం: అధికంగా మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి న్యాయమూర్తి జైలు శిక్షతోపాటు జరిమానా విధించారు. టూటౌన్ పోలీసులు ఈనెల 8న నగరంలోని బోయపల్లి గేట్ దగ్గర చేసిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో చాకలిపల్లికి చెందిన తిరుపతయ్య అధికంగా మద్యం తాగి ద్విచక్రవాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. సదరు వాహనదారుడిని శుక్రవారం కోర్టులో హాజరు పర్చగా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శశిధర్ మద్యం తాగి పట్టుబడిన తిరుపతయ్యకు 7రోజుల జైలు శిక్షతోపాటు రూ.3 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. జరిమానా చెల్లించనందుకు మరోరోజు అదనంగా జైలు శిక్ష విధించారు. ఈ సందర్భంగా టూటౌ న్ సీఐ ఇజాజుద్దీన్ మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో మద్యం తాగి వాహనాలు నడపడంతో ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోవడం, క్షతగాత్రులుగా మిగలడంతో జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయని తెలిపారు. టూటౌన్ పరిధిలో నిత్యం డ్రంకెన్డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. -
ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం
అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద రూ.15కోట్లతో అండర్ డ్రెయిన్ నిర్మా ణం చేపట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం.మున్సిపాలిటీలో చాలామటుకు ఓపెన్ డ్రెయిన్లు ఉన్నాయి. ప్రతిపాదిత డబ్బులతో అంతా అండర్ డ్రెయిన్గా మార్చటం సాధ్యం కాదు. అందుకే ఎక్కడ సాధ్యపడుతుందో, అవసరం ఉందో అక్కడ నిర్మించటానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తాం. వాల్యుఫర్ మనీగా కొంత ప్రజల భాగ స్వామ్యం అవసరం పడవచ్చు. – గిరీష్, కమిషనర్, జడ్చర్ల మున్సిపాలిటీ ● -
నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
గద్వాల క్రైం: మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో పోక్సో కోర్టు న్యాయమూర్తి వి శ్రీనివాస్ శుక్రవారం నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.20 వేల జరిమాన విధించినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. అలంపూర్ మండలానికి చెందిన ఓ మైనర్ బాలికపై పింజరి పెద్దహుస్సేన్ అత్యాచారానికి పాల్పడాడ్డు. ఈ ఘటనపై 2021లో అలంపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని కోర్టులో చార్జ్షీట్ దాఖాలు చేశారు. అయితే కేసులోని సాక్షులను విచారించిన అనంతరం న్యాయమూర్తి నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార జైలు శిక్షతో పాటు రూ.20వేలు జరిమానా విధించారన్నారు. కేసు విచారణలో పోలీసు సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించి నిందితుడికి శిక్షపడేలా చర్యలు తీసుకున్నారన్నారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు దోషిని మహబూబ్నగర్ జిల్లా జైలుకు తరలించారు. యువకుడిపై పోక్సో కేసు నమోదు నవాబుపేట: మండలంలోని కాకర్లపహడ్ గ్రామంలో మే నెలలో 16 ఏళ్ల బాలిక అదృశ్యం కావడంతో గ్రామానికి చెందిన యువకుడు సురేష్పై నవాబుపేట పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు.తాజాగా గురువారం బాలిక, యువకుడి ఆచూకీ గుర్తించి న పోలీసులు అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు. కాగా మైనర్ బాలికను పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా యువకుడిపై గతంలో ఉన్న కిడ్నాప్ కేసుతో పాటు శుక్రవారం పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నరేందర్ తెలిపారు. చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి ఉండవెల్లి: మండలంలోని ప్రాగటూరుకు చెందిన విద్యార్థిని బోయ చామంతి (17) చికిత్స పొందుతూ శుక్రవారం మరణించింది. ఇంటర్ ఫలితాల్లో విద్యార్థిని గణితంలో ఫెయిల్ అయింది. సప్లిమెంటరీ రాయగా మళ్లీ ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై గురువారం పురుగుమందు తాగింది. వాంతులు చేసుకోవడంతో తల్లి రామేశ్వరమ్మ గ మనించి చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మృతి చెందింది. తండ్రి బోయరాముడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ వీరన్న తెలిపారు. -
ప్రభుత్వ, అద్దె స్థలాల్లో నర్సరీలు..
జిల్లాలోని ఆయా గ్రామ పంచాయితీల్లో ప్రభుత్వ స్థలాలతో పాటు రైతుల పొలాలను అద్దెకు తీసుకొని నర్సరీలు ఏర్పాటు చేశారు. నిబంధనల మేరకు బోరు బావులు, నీటి సదుపాయం కలిగిన రైతుల పొలాలను ఎంపిక చేశారు. మొక్కల పెంపకానికి మట్టి, ఇతర సామగ్రి రైతుల నుంచే సమీకరిస్తున్నారు. అద్దెల భారం తగ్గించుకునేందుకు గ్రామ కంఠం, ప్రభుత్వ స్థలాల్లో నర్సరీల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఉపాధిహామీ, పంచాయతీరాజ్, అటవీశాఖ అధికారుల పర్యవేక్షణలో నర్సరీలు కొనసాగుతున్నాయి. ప్రతి సంవత్సరం వర్షాకాలం సీజన్లో మొక్కలు నాటి.. వాటి నిర్వహణను రెండేళ్ల పాటు పర్యవేక్షిస్తున్నారు. -
జైల్లో ఖైదీలు సత్ప్రవర్తనతో ఉండాలి
పాలమూరు: జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్ని రకాల ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత అన్నారు. నగరంలోని జిల్లా జైలును శుక్రవారం న్యాయమూర్తి సందర్శించించారు. మొదట ఖైదీలు ఉండే అన్నిరకాల బ్యారక్లను పరిశీలించి శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలు, అండర్ ట్రయల్ ఖైదీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. న్యాయవాదులను నియమించుకోలేని ఖైదీలు సమాచారం ఇస్తే న్యాయసేవ అధికార సంస్థ ద్వారా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామన్నారు. కేసులు నమోదై జైలుకు వచ్చిన పలువురు యువతతో ప్రత్యేకంగా మాట్లాడి కే సుకు దారి తీసిన వివరాలపై అడిగి తెలుసుకు న్నారు. అనంతరం కిచెన్ సందర్శించి భోజనం నాణ్యతను పరిశీలించారు. లీగల్ ఎయిడ్ క్లినిక్ పనితీరును జైలు అధికారులతో అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట న్యాయమూర్తి ఇందిర, జైలు సూపరింటెండెంట్ శశికాంత్ ఉన్నారు. అటెండర్లకు పోస్టింగ్ జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో ఆరుగురు అటెండర్లకు పోస్టింగ్ ఇస్తున్నట్లు శుక్రవారం కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. 317 జీఓ ప్రకారం ఇతర జిల్లాల్లో పని చేస్తున్న వీరికి జిల్లాను కేటాయించడంతో పాటు మండలాలను కేటాయించారు. వనపర్తి నలుగురు, నాగర్కర్నూల్ నుంచి ఇద్దరు జిల్లాకు వచ్చారు. శ్రీకాంత్ను కోయిల్కొండ తహసీల్దార్ కార్యాలయం, లక్ష్మీనారాయణకు నవాబ్పేటతహసీల్దార్ కార్యాలయం, కల్పనకు అడ్డాకుల తహసీల్దార్ కార్యాలయం, నర్సింహులును డీసీఎస్ఓ కార్యాలయం, ఇలియాస్, అబ్దుల్ ఖాదర్కు కలెక్టరేట్ అటెండర్లుగా పోస్టింగ్ ఇచ్చారు. ఇజ్రాయిల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తుల ఆహ్వానం జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఇజ్రాయిల్ దేశంలో సంరక్షకుడు ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి మైత్రిప్రియ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు జిల్లా ఎంప్లాయిమెంట్ శాఖ కార్యాలయంలో కానీ, 94400 52081, 94400 51763 నంబర్లకు సంప్రదించాలన్నారు. బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ ఆర్ఎం జగన్ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: టీజీఆర్టీసీ మహబూబ్నగర్ డిప్యూటీ ఆర్ఎం (మెయింటెనెన్స్) గా జగన్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఇటీవల హైదరాబాద్లోని వర్క్షాపు నుంచి ఇక్కడికి బదిలీ అయిన విష యం విదితమే. అనంతరం ఆర్ఎం సంతోష్కుమార్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ధాన్యం @ రూ.2,926 జడ్చర్ల: బాదేపల్లిలో శుక్రవారం ఆర్ఎన్ఆర్ క్వింటా గరిష్టంగా రూ.2,926, కనిష్టంగా రూ. 1,741 ధరలు లభించాయి. మొక్కజొన్న క్వింటా గరిష్టంగా రూ.2,051, వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.6,956, కనిష్టంగా రూ.4,611, పొద్దుతిరుగుడు గరిష్టంగా రూ.6,950, కనిష్టంగా రూ.6,640 ధరలు పలికాయి. -
కూలిన వాటర్ట్యాంక్ పైకప్పు
కొత్తపల్లి (మద్దూరు): మద్దూరు పట్టణంలోని మూ డో వార్డులో వాటర్ ట్యాంక్ పైకప్పు గురువారం అర్ధరాత్రి ఒక్కసారిగా కుప్పకూలింది. ట్యాంక్ను 20 ఏళ్ల క్రితం నిర్మించగా పైకప్పు ఉన్నట్టుండి కూలిపోయినట్లు కాలనీవాసులు పేర్కొంటున్నారు. పై కప్పు కూలి వాటర్ ట్యాంక్లోనే పడిపోయినా అధికారులు మిషన్ భగీరథ నీటిని వాటర్ ట్యాంకులోకి అలాగే వదిలి కొళాయిలకు సరఫరా చేస్తున్నారని ఆ వేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ట్యాంక్ పైకప్పు కూలిన విషయాన్ని వార్డు కౌన్సిలర్ మౌనిక ప్రకాష్ దృష్టికి తీసుకెళ్లగా ఆమె పరిశీలించి కమిషనర్ శ్రీకాంత్కు తెలియజేయగా ట్యాంకులో కూలిపోయిన పైకప్పును సిబ్బందితో తొలగింపజేశారు. వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరుకోవడంతో ట్యాంకు కూడా ఏ క్షణంలోనైనా కూలిపోయే అవకాశం ఉందని, అధికారులు స్పందించి నూతన ట్యాంకును నిర్మించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. -
అర్బన్ చాలెంజ్ ఫండ్తో అండర్ డ్రెయిన్
● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మాణం ● వాల్యూఫర్ మనీ కింద ప్రజల భాగస్వామ్యం జడ్చర్ల టౌన్: జడ్చర్ల మున్సిపాలిటీలో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ద్వారా రూ.15కోట్లతో అండర్ డ్రెయిన్ నిర్మాణం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతోపాటు స్థానికంగా వనరుల సమీకరణ ద్వారా ఈ పథకాన్ని అమలు చేయాలని మున్సిపాలిటీ అధికారులు భావిస్తున్నారు. అయితే పథకం ద్వారా వాల్యూఫర్ మనీ కింద ప్రజలను భాగస్వాములు చేసి ప్రతినెలా తక్కువ మొత్తంలో వసూలు చేసేలా కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వివిధ పథకాల్లో అభివృద్ధికి నోచుకుంటున్న మున్సిపాలిటీలు, కా ర్పోరేషన్లను మరింత సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ.. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ను తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా కేంద్రం 50శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25శాతం నిధులు కేటాయిస్తాయి. మిగిలిన 25శాతం నిధులను మున్సిపాలిటీ, కార్పొరేషన్ స్థానికంగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇందులో ప్రధానంగా వాల్యూఫర్ మనీని ఆశిస్తున్నారు. పెట్టిన ఖర్చులకు కొంతైనా రాబడి రావాలన్న ఉద్దేశం ఉంది. రూ.15కోట్లతో ప్రతిపాదనలు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద రూ.15కోట్లతో అండర్ డ్రెయిన్ నిర్మాణం కోసం జడ్చర్ల మున్సిపాలిటీ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీలో అంతా ఓపెన్ డ్రెయిన్ ఉండటం దీనికి ఆటంకంగా మారింది. రూ.15కోట్లతో మున్సిపాలిటీ అంతా అండర్ డ్రెయిన్ నిర్మించడం సాధ్యం కాదు. ఈ కారణంగా కొత్తగా వెలుస్తున్న కాలనీల్లో అండర్ డ్రెయిన్ నిర్మాణం చేయా లని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. దీనివల్ల ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రతిపాదనలు సిద్ధం అయ్యాక అండర్ డ్రెయిన్ నిర్మాణాలు జరిగితే సంబంధిత కాలనీలో ప్రతిఇంటి నుంచి నామమాత్రంగా కొంత వసూలు చేయా లని భావిస్తున్నారు. వాల్యూ ఫర్ మనీగా కేంద్రం ఆశిస్తుండటంతో తప్పనిసరి చేయాల్సి వస్తుంది. -
నిధులున్నా.. నత్తనడకే!
అమరచింత/మదనాపురం: జిల్లాలోని సరళాసాగర్ ప్రధాన పైప్లైన్, అమరచింత ఎత్తిపోతల పథకానికి సంబంధించి సెక్షన్ పైపుల ఏర్పాటులో జాప్యం కారణంగా వానాకాలం పంటల సాగుపై ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. సరళాసాగర్ కింద 3,200 ఎకరాలు, అమరచింత ఎత్తిపోతల కింద 2,200 ఆయకట్టు ఉంది. మరమ్మతుల కారణంగా పూర్తి ఆయకట్టుకు సమృద్ధిగా సాగునీరు అందని పరిస్థితులు నెలకొన్నాయి. యాసంగి సీజన్లో క్రాప్ హాలిడే ప్రకటించడంతో సాగుకు దూరంగా ఉన్న ఆయకట్టు రైతులు వానాకాలం పంటల సాగు కోసం ఇప్పటికే పొలాలను దుక్కిదున్ని చదును చేసి సిద్ధంగా ఉంచారు. కానీ ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా పనులు పూర్తిగాకపోవడంతో వానాకాలం పూర్తి ఆయకట్టుకు నీరందని పరిస్థితి నెలకొంది. సరళాసాగర్ పైప్లైన్ నిర్మాణానికిగాను రూ.49.50 లక్షలు, అమరచింత ఎత్తిపోతల సెక్షన్ పైప్ల ఏర్పాటుకు రూ.46 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఆయా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా మరమ్మతులు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. అమరచింత ఎత్తిపోతల.. అమరచింత ఎత్తిపోతల పథకాన్ని 1999–2000 సంవత్సరంలో ప్రారంభించారు. ఎత్తిపోతల ఆయకట్టు 2,200 ఎకరాలు ఉండగా.. ప్రస్తుతం వెయ్యి ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుండటంతో రైతులు వరి, పత్తి, చెరుకు సాగు చేస్తున్నారు. 24 ఏళ్లుగా సాగునీటిని పంపింగ్ చేస్తున్న సెక్షన్ పైపులు తుప్పు పడుతుండటంతో వీటిని మార్చేందుకు ప్రభుత్వం రూ.46 లక్షలు మంజూరు చేసింది. ఐదు సెక్షన్ పైపులను యుద్ధప్రాతిపదినక ఏర్పాటు చేసి వానాకాలంలో రైతులకు సాగునీరు అందించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయినా.. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ అగ్రిమెంట్కు ముందుకు రాకపోవడంతో ఆలస్యమవుతుందని నీటిపారుదలశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఎత్తిపోతల ఆయకట్టు కింద మూలమళ్ల, మస్తీపురం, ఖానాపురం, సింగంపేట, అమరచింత, పాంరెడ్డిపల్లి గ్రామాలు ఉండగా.. 1,099 మంది రైతుల భాగస్వామ్యంతో ఎత్తిపోతల నిర్వహణ కొనసాగుతోంది. చిన్న చిన్న మరమ్మతులు తప్ప చెప్పుకోదగిన పనులు ఏవీ లేవని.. సెక్షన్ పైపులు మాత్రమే త్వరగా మార్చేస్తే సాగునీరు సకాలంలో రైతులకు అందించవచ్చని ఆయకట్టుదారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు చెబుతున్నారు. రైల్వే పనులతోనే ఆలస్యం.. రైల్వే అధికారులు వంతెన నిర్మాణం చేపట్టడంతో పైప్లైన్ పనుల్లో జాప్యం జరుగుతోంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు విన్నవించాం. వంతెన పనులు పూర్తయిన వెంటనే పైప్లైన్ ఏర్పాటు ప్రారంభించి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తాం. – వరప్రసాద్, ఏఈ, రామన్పాడ్ జలాశయం అగ్రిమెంట్ పూర్తి కాలేదు.. అమరచింత ఎత్తిపోతల సెక్షన్ పైపుల ఏర్పాటుకు రూ.46 లక్షలు మంజూరయ్యాయి. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంది. అగ్రిమెంట్ పూర్తయిన 15 రోజుల్లో సెక్షన్ పైపుల ఏర్పాటు పూర్తి చేస్తాం. – వంశీకృష్ణ, ఏఈఈ అమరచింత ఎత్తిపోతల పథకం ముందుకుసాగనిఎత్తిపోతల మరమ్మతు సరళాసాగర్ ప్రధాన పైప్లైన్.. ‘అమరచింత’ సెక్షన్ పైపుల ఏర్పాటులో ఆలస్యం మొదలైన వానాకాలం పంటల సాగు పనులు పూర్తయితేనే ఆయకట్టుకు నీటి విడుదల -
టీజీ టీ–20 లీగ్లో పాలమూరు ఆటగాళ్లు
● వేలంలో మెరిసిన నలుగురు ఉమ్మడి జిల్లా క్రీడాకారులు ● ఆల్రౌండర్ గణేష్కు రూ.3.25 లక్షలకు దక్కించుకున్న హైదరాబాద్ చాంపియన్స్ ● పాలమూరు స్ట్రైకర్కు షాదాబ్ అహ్మద్, హైదరాబాద్కు జశ్వంత్, రంగారెడ్డికి అరుణ్ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఉప్పల్ స్టేడియం వేదికగా ఈనెల 21 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు కొనసాగనున్న టీజీ టీ–20 క్రికెట్ లీగ్కు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన నలుగురు క్రికెటర్లు ఎంపికయ్యారు. ఇటీవలే దీనికి సంబంధించి నిర్వహించిన క్రీడాకారుల వేలం పాటలో పాలమూరు నగరానికి చెందిన ఆల్ రౌండర్ జి.గణేష్ రూ.3.25 లక్షలకు హైదరాబాద్ చాంపియన్స్ జట్టులో చోటు దక్కించుకున్నారు. గణేష్.. కొన్నేళ్లుగా హెచ్సీఏ లీగ్ మ్యాచ్లలో విశేష ప్రతిభ కనబరుస్తున్నారు. టూడే, త్రీ డే లీగ్లలో సెంచరీ, డబుల్ సెంచరీ, ట్రిపుల్ సంచరీలు చేశారు. అలాగే మహబూబ్నగర్కే చెందిన ఎడమచేతి బ్యాట్స్మన్ షాదాబ్అహ్మద్ రూ.75 వేలకు పాలమూరు స్ట్రైకర్ జట్టుకు ఎంపికయ్యారు. ఇటీవల హెచ్సీఏ టీ–20 లీగ్లో జిల్లా జట్టు తరఫున షాదాబ్ సెంచరీ చేయడం విశేషం. నాగర్కర్నూల్ జిల్లా తాడూరుకు చెందిన బౌలర్ జి.జస్వంత్ ఈ వేలంలో హైదరాబాద్ చాంపియన్స్ జట్టు రూ.75 వేలకు దక్కించుకుంది. ఇతడి ప్రతిభను గుర్తించిన ఎండీసీఏ (మహబూబ్నగర్ క్రికెట్ అసోసియేషన్) ఆధ్వర్యంలో గత ఏడాది నుంచి ఉచిత శిక్షణ ఇప్తిస్తున్నారు. అలాగే చదువుకయ్యే ఖర్చును సైతం ఎండీసీఏ కొంతవరకు భరిస్తోంది. దీంతో అనతి కాలంలోనే మెరుగైన బౌలర్గా ఎదిగారు. గద్వాల పట్టణానికి చెందిన ఆల్ రౌండర్ అరుణ్కుమార్ రూ.లక్షకు రంగారెడ్డి రైజర్స్ జట్టులో చోటు దక్కించుకున్నారు. అనంతరం ఈ నలుగురు క్రీడాకారులను ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ అభినందించారు. నాగర్కర్నూల్, గద్వాల వంటి ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులకు ఈ లీగ్ అవకాశం దక్కడం.. వేలాది గ్రామీణ ప్రాంత యువకులకు సరికొత్త నమ్మకాన్ని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. లీగ్లో అద్భుతంగా రాణించి ఐపీఎల్తో పాటు జాతీయ జట్టు రేసులోకి దూసుకెళ్లాలని ఆకాంక్షించారు. -
12 ఏళ్ల పాలనలో దేశ అభివృద్ధిలో కొత్త పుంతలు
● ఎంపీ డీకే అరుణ పాలమూరు: ఈనెల 10వ తేదీ నాటికి దేశానికి అత్యధిక కాలం 4,399 రోజుల పాటు ప్రధానిగా సేవలు అందించిన వ్యక్తిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారని ఎంపీ డీకే అరుణ అన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగిన మోదీపై ఉన్న విశ్వాసంతో కాషాయ జెండాను ప్రజలు ఎగురవేస్తున్నారన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా భావించి పరిపాలన అందిస్తున్నట్లు వెల్లడించారు. మోదీ 12 ఏళ్ల పాలనలో దేశం అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కిందన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో జమ్ముకశ్మీర్లో సాధారణ పరిస్థితులు కల్పించారని, 11 కోట్ల నిరుపేద కుటుంబాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఇచ్చినట్లు చెప్పారు. జనధన్ యోజన కింద 58 కోట్ల మందికి జీరో ఖాతాలు తెరవడంతో పాటు చిరు వ్యాపారులకు రూ.57 వేల కోట్ల రుణాలు, వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి కింద రుణాలిచ్చినట్లు గుర్తు చేశారు. పీఎం కిసాన్ కింద ఏడాదికి రూ.6 వేల నగదు, ఎరువులపై 90 శాతం సబ్సిడీని మోదీ ప్రభుత్వం అందిస్తోందని వివరించారు. జిల్లాలో గుడెబల్లూర్ నుంచి మహబూబ్నగర్కు నాలుగు లైన్ల రోడ్లు మంజూర, ఇతర జాతీయ రహదారులు, రింగ్రోడ్డు, బైపాస్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి దిలీపాచారి, పద్మజారెడ్డి, అంజయ్య, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
నర్వ: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘట న నర్వ మండలం రాంపూర్ గేట్ వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ పబ్బ తి రమేశ్ వివరాల మేరకు.. చిత్తనూర్కు చెందిన బండ రాంరెడ్డి (50) తన బైక్లో పెట్రోల్ పోయించుకునేందు కు రాంపూర్ గేట్ సమీపంలో ఉన్న బంక్కు వెళ్తుండగా.. పత్తి మిల్లు వద్ద వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు 108 అంబులెన్స్లో మరికల్కు, అటు నుంచి మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుమారుడు హర్షవర్ధన్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
వాటర్ ట్యాంకర్ను ఢీకొన్న లారీ
● అక్కడికక్కడే లారీ డ్రైవర్ మృతి.. ● ఇద్దరికి తీవ్ర గాయాలు.. ఊరుగొండ వద్ద ఘటన దామెర: వాటర్ ట్యాంకర్ను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన గురువారం హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ సమీపంలో చోటుచేసుకుంది. ఎస్సై కొంక అశోక్ కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా కిల్లా ఘనపురం మండలం రుక్కన్నపల్లికి చెందిన నక్క బాలయ్య (40) లారీపై హనుమకొండ నుంచి గూడెప్పాడ్ వైపునకు వెళ్తూ ఊరుగొండ వద్ద మొక్కలకు నీరు పడుతున్న వాటర్ ట్యాంకర్ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. వాటర్ ట్యాంకర్ డ్రైవర్ ముసూఫ్ కార్తీక్, క్లీనర్ గోపాల్కు తీవ్రగాయాలు కాగా 108లో ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్సై అశోక్ వెంటనే ఘటనా స్థలికి చేరుకుని క్రేన్ సాయంతో వాహనాలను పక్కకు తప్పించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. లారీ క్యాబిన్లో ఇరుక్కున్న బాలయ్య మృతదేహాన్ని సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్సై అశోక్ సిబ్బందితో కలిసి బయటకు తీసి అంబులెన్స్లో ఎంజీఎం మార్చూరీకి తరలించారు. మృతుడి భార్య అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
అనుమానాస్పదంగా యువతి బలవన్మరణం
చిన్నచింతకుంట: అనుమానాస్పదంగా యువతి ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకొని మృతి చెందిన ఘటన చి న్నచింతకుంట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్ఐ ఓబుల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నచింతకుంటకు చెందిన తేజశ్విని (19) ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. బుధవారం అర్ధరాత్రి కుటుంబ సభ్యు లు నిద్రిస్తుండగా ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకొ ని మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఉదయం ఘటన స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూ ర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.మృతురాలి తండ్రి కృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. -
ఎడమ కాల్వ వెలవెల.. సమాంతర కాల్వ కళకళ
నీటితో కళకళలాడుతున్న సమాంతర కాల్వ సాగునీరు లేక వెలవెలబోతున్న జూరాల ప్రధాన ఎడమ కాల్వ ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుంచి ప్రధాన ఎడమ కాల్వతో పాటు సమాంతర కాల్వలకు సాగునీటిని పూర్తిగా నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు కాల్వల షట్టర్లను మూసివేశారు. అయితే సమాంతర కాల్వ ప్రధాన షట్టర్ లీకేజీ కారణంగా నీరు పారుతూ కళకళలాడుతోంది. మరోవైపు ప్రధాన ఎడమ కాల్వ మాత్రం నీరు లేక వెలవెలబోతోంది. అతి సమీపంలో ఉన్న రెండు కాల్వలను చూస్తున్న రైతులు ఎంత తేడా.. ఇది ఎంత తేడా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. – అమరచింత -
అక్రమంగానే.. యథేచ్ఛగా
‘మన ఇసుక వాహనం’ ద్వారా సక్రమంగా సాగని సరఫరా తీరంలో యథేచ్ఛగా దందా.. జిల్లాలోని దుందుభీ వాగు తీరం వెంబడి గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఒకవైపు ప్రభుత్వ ఇసుక రవాణా సక్రమంగా చేపట్టి, ఇసుక అక్రమ రవాణాను అరికట్టాల్సిన అధికారులే అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని తిమ్మాజిపేట మండలం పోతిరెడ్డిపల్లి, కేసీతండా, తెలకపల్లి మండలం నడిగడ్డ, ఉప్పునుంతల మండలం దాసర్లపల్లి, వంగూరు మండలం ఉల్పర గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. ప్రభుత్వ సరఫరా కన్నా రెట్టింపు స్థాయిలో అక్రమ రవాణా సాగుతుండటంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ఇందిరమ్మ ఇళ్లకూ కొరతే.. జిల్లాలో ప్రభుత్వ ఇసుక సరఫరా సక్రమంగా అమలుకాక ఇళ్ల నిర్మాణదారులకు తీవ్రమైన ఇసుక కొరత నెలకొంది. ఇదే అదునుగా అక్రమార్కులు ఇష్టారీతిగా ధరలు పెంచుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వమే ఇసుక సరఫరా చేస్తామని చెబుతుండగా ఎక్కడా అమలుకావడం లేదు. సంబంధిత తహసీల్దార్ల ద్వారా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక సరఫరాకు ఏర్పాట్లు చేస్తామని చెప్పినా ఫలితం లేకపోయింది. దీంతో సమయానికి ఇసుక లభించక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ముందుకు సాగడం లేదు. సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలో మన ఇసుక వాహనం ద్వారా ప్రభుత్వం ప్రారంభించిన ఇసుక సరఫరా సక్రమంగా సాగడం లేదు. ఈసారి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇసుక సరఫరాను పకడ్బందీగా నిర్వహిస్తామని అధికారులు చెప్పినా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ ఇసుక సరఫరా కోసం ఆన్లైన్ ద్వారా ప్రయత్నిస్తే ఎన్ని రోజులైనా బుకింగ్ దొరకడం లేదు. మరోవైపు అక్రమ మార్గాల్లో ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులను సంప్రదిస్తే మాత్రం క్షణాల్లో ఇసుక అందుబాటులోకి వస్తోంది. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. అందుబాటులో ఆరు రీచులు.. జిల్లాలోని దుందుభీ వాగు పొడవునా ఇసుక సమృద్ధిగా అందుబాటులో ఉంది. ఈసారి జిల్లావ్యాప్తంగా మొత్తం 17 వరకు రీచుల నుంచి ఇసుక సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అమలులో మాత్రం ఆరు రీచుల్లోనే ఇసుక సేకరణకు ప్రయత్నాలను అధికారులు మొదలుపెట్టారు. ఇందు లో కల్వకుర్తి మండలం లింగసానిపల్లి, వంగూరు మ ండలం పోతిరెడ్డిపల్లి, ఉల్పర, తాడూరు మండలం ఏటిదారిపల్లి, తెలకపల్లి మండలం నడిగడ్డ, ఉప్పునుంతల మండలం మొల్గర గ్రామాల్లో ఇసుక రీచ్లు అందుబాటులో ఉన్నాయి. కానీ, ఇసుక సేకరణతోపాటు సరఫరాలో తీవ్ర జాప్యం కొనసాగుతోంది. ప్రభుత్వ ఇసుక కోసం రోజుల తరబడి ఎదురుచూపులు ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవడానికే తీవ్ర ఇబ్బందులు మరోవైపు అక్రమార్కుల ద్వారా పెద్దఎత్తున తరలుతున్న వైనం అక్రమ రవాణాను అరికడితేనే ప్రభుత్వానికి ఆదాయం -
పెట్రోల్ బంక్ యజమానిపై దాడి
● నగదు, బంగారు గొలుసు లాక్కెళ్లిన నిందితుడు ● పోలీస్స్టేషన్కు కూతవేటు దూరంలోనే ఘటన అమరచింత: పోలీస్స్టేషన్కు కూతవేటు దూరంలో కొంతమంది నిందితులు పెట్రోల్ బంక్ యాజమానిపై దాడిచేసి రూ.2.50లక్షలు, రెండున్నర తులాల బంగారు గొలుసును దోచుకెళ్లిన ఘటన పట్టణంలో కళకళం రేపింది. అమరచింత పట్టణానికి చెందిన బిలకంటి రామ్మోహన్శెట్టి తన పెట్రోల్ బంక్ వద్ద బుధవారం రాత్రి వర్కర్స్ నుంచి కలెక్షన్కు సంబంధించి రూ.2.50లక్షల నగదును తీసుకుని కారులో ఇంటికి బయలుదేరాడు. రామ్మోహన్ శెట్టి ఇంటికి వస్తున్నాడనే సమాచారంతో అదే గ్రామానికి చెందిన డీసీ.రాజశేఖర్ తన తమ్ముళ్లను వెంటపెట్టుకుని కాపు కాశా డు. కారు ఇంటి వద్దకు రాగానే డీసీ రాజశేఖర్ రాడ్డు, కత్తితో అకస్మాత్తుగా రామ్మోహన్శెట్టిపై దాడి చేసి గాయపర్చాడు. బ్యాగ్లో ఉన్న రూ.2.5లక్షల నగదుతోపాటు రెండు తులాల బంగారు గొ లుసు ను లాకెళ్లాడని బాధితుడు రాత్రికిరాత్రే పోలీసులకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. రామ్మోహన్శెట్టి ఇంటికి పోలీస్స్టేషన్కు కూతవేటు దూరమే ఉన్నా.. నిందితులు ఇ లా మారణాయుధాలతో దాడి చేయడం పట్టణంలో కళకళం రేపింది. ఈ ఘటనపై బాధితుడు రామ్మోహన్శెట్టి మాట్లాడుతూ.. రేషన్ బియ్యం కొనుగోలు చే యనని రాజశేఖర్కు తెలుపగా.. రేషన్ బియ్యం మీ రైస్మిల్లులో ఉంచి నీపై కేసు అయ్యేటట్లు చేస్తానని పలుమార్లు బెదిరించాడని తెలిపారు. ఇదే తరహాలో రాయచూరు, అమరచింత, ఆత్మకూర్, మదనాపురం, దేవరకద్ర, కొత్తకోటలోని రైస్మిల్ల యాజమానులపై బ్లాక్ మెయిల్ చేస్తూ తనను కూడా బ్లాక్ మె యిల్ చేశాడని ఆరోపించారు. తన రైస్మిల్లో రేషన్ బియ్యం దందా చేయనని పలుమార్లు చెప్పినా.. నిందితుడు రాజశేఖర్ దందా చేయకుంటే తనకు రూ. 5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వ ని పక్షంలో పలుమార్లు తన ఇంటిపై రాత్రిపూ ట రా ళ్లు రువ్వి భయపెట్టినా పట్టించుకోకపోవడంతో ఇలా కత్తితో దాడిచేసినట్లు ఆరోపించారు. డీసీ రాజశేఖర్ నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యా దు చేసినట్లు విలేకరులకు తెలిపారు.ఈ వ్యవహారంలో డీసీ రాజశేఖర్ పట్టణంలో రియల్ఎస్టేట్ వ్యాపా రి కాడ్గి గణేష్ ద్వారా తాము కొనుగో లు చేసిన ప్లాట్ల వ్యవహారంలో నష్టపోయామని తమకు రూ.36లక్షలు ఇవ్వాలని పలుమార్లు డీసీ రాజశేఖర్ తనను బెదిరించినట్లు పేర్కొన్నారు.ఈ వ్యవహారంపై పోలీసులను అడుగగా.. ఫిర్యాదు అందిందని విచారిస్తున్నామని ఎస్ఐ స్వాతి తెలిపారు. -
ఐకేపీనుంచి పాతవడ్లు తరలింపు!
పాన్గల్: మండలంలోని మాందాపూర్లో ఐకేపీ ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రం నుంచి పాత ధాన్యం లోడ్తో శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని రైసుమిల్లుకు తరలించగా.. మిల్లు యజమాని పరిశీలించి పాత వడ్లు ఉన్నట్లు గుర్తించి జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వడంతో విచార ణకు ఆదేశించిన ఘటన గురువారం చోటుచేసుకుంది. తహసీల్దార్ కార్తీక్రావు, జిల్లా సివిల్ సప్లయ్ డీఎం ఆంజనేయులు, టెక్నికల్ అధికారులు మాందాపూర్లోని ఇషాన్ రైస్ మిల్లుకు చేరుకొని లారీలో లోడ్ చేసిన ధాన్యం, రైస్మిల్లులో నిల్వ ఉ న్న ధాన్యం ఒక్కటేనా అనే విషయాలను పరిశీలించి ధాన్యం శాంపిల్ తీసుకొని విచారణ చేస్తున్నామ ని పూర్తి నివేదికను జిల్లా అధికారులకు నివేదిస్తామ ని అధికారులు పేర్కొన్నారు. వాస్తవానికి మాందాపూ ర్ నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మండలంలో ని కేతేపల్లి రైస్మిల్లు, లేకుంటే గద్వాల రైస్మిల్లు కు పంపాల్సి ఉండగా శ్రీరంగాపూర్ రైస్ మిల్లుకు పంపడంపై పలు అనుమానాలకు తావిచ్చింది. ట్రక్ షీట్లో ధాన్యం కొనుగోలు చేసే కమి టీ సభ్యుల సంతకాలు లేకుండా పంపించడం కూ డా అనుమానాలకు తెరలేపింది.ఐకేపీ కొనుగోలు కేంద్రాల నుంచి సేకరించే ధాన్యంపై ఐకేపీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే అక్రమాలకు పాల్పడుతున్నారని పలువురు రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గుర్తించిన మిల్లు యజమాని, జిల్లా అధికారులకు సమాచారం విచారణ చేపట్టాలని తహసీల్దార్కు ఆదేశం మిల్లును సందర్శించిన రెవెన్యూ, సివిల్ సప్లయి అధికారులు -
డిండి కట్టమైసమ్మ ఆలయం వద్ద నిరసన
● శ్రీశైలం రోడ్డుపై బైఠాయించి శాలివాహనుల ధర్నా ● ఆలయం హక్కులు కుమ్మరులకే దక్కాలని డిమాండ్ ఉప్పునుంతల: మండలంలోని లత్తీపూర్ శివారు పరిధి డిండి ప్రాజెక్టు వద్ద కట్ట మైసమ్మ ఆలయం వద్ద గురువారం లత్తీపూర్కు చెందిన కుమ్మరి కులస్తులు రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కొంతసేపు ఆలయం ముందున్న శ్రీశైలం–హైదరాబాద్ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. 1947లో డిండి ప్రాజెక్టు నిర్మాణ సమయంలో మైసమ్మ ఆలయం ఏర్పాటు చేసినప్పటి నుంచి తాము పూజారులుగా వ్యవహరిస్తుండగా ఇటీవల ఆలయ కమిటీని నూతనంగా ఏర్పాటు చేసినప్పటి నుంచి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఆలయ కమిటీలో కూడా తమకు సరైన స్థానం కల్పించకుండా అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయం వద్ద రాజకీయం చేస్తూ మమ్ములను ఆలయం వద్దకు రాకుండా చేయాలనే కుట్ర చేస్తున్నారని తెలిపారు. ఆలయ కమిటీ చైర్మన్గా కుమ్మర కులస్తులను నియమించాలని, ఆలయం వద్ద పూజారులతోపాటు అన్ని హక్కులు కుమ్మరులకే దక్కాలని డిమాండ్ చేశారు. నిరసనలో రాష్ట్ర కుమ్మర సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఏడుకొండలు, గౌరవ సలహాదార్లు రామచంద్రయ్య, ప్రచార కార్యదర్శి శ్రీనివాసులు, వీరయ్య, సహాయ కార్యదర్శి శంకరయ్య, జిల్లా సంఘం అధ్యక్షుడు రఘుబాబు, ప్రధాన కార్యదర్శి వెంకటేష్, ఉపాధ్యక్షులు సుల్తాన్, జంగయ్య, మండల సీనియర్ నాయకులు బాలయ్య, మల్లయ్య, రమేష్, అంజి, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. కుమ్మరి కులస్తులపై కేసు నమోదు కట్ట మైసమ్మ ఆలయం వద్ద అన్ని హక్కులు తమకే దక్కాలని డిమాండ్ చేస్తూ ఎలాంటి అనుమతులు లేకుండా జాతీయ రహదారిపై బైఠాయించి వాహనదారులకు ఇబ్బంది కల్గించినందున లత్తీపూర్కు చెందిన కుమ్మరి కులస్తులు దేవర్ల మల్లయ్య, రమేష్, రవి, వెంకటేష్, అంజనమ్మ తదితర మొత్తం 12మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పుట్ట మహేష్ తెలిపారు. అనుమతులు లేకుండా ధర్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ హెచ్చరించారు. -
విత్తన శుద్ధితోనే అధిక దిగుబడి
అలంపూర్: ఆధునిక వ్యవసాయంలో నాణ్యమైన విత్తనాలు అధిక దిగుబడి సాధించడానికి దోహదపడుతాయి. పెరుగుతున్న విత్తన ధరలతో రైతు కుదేలవుతున్నాడు. విత్తనాల కొనుగోలు, పురుగు, తెగుళ్ల బారి నుంచి పంటను కాపాడుకోవడం రైతుకు తలకు మించిన భారంగా మారింది. ఈ క్రమంలో విత్తన శుద్ధితో పంటసాగులో ఎదురయ్యే సమస్యలను కొంత వరకు అధికమించడానికి అవకాశం ఉందని ఏఓ నాగార్జునరెడ్డి రైతులకు సూచించారు. విత్తన శుద్ధి చేయకపోతే పంటకు తెగుళ్లు, పురుగులు ఆశించి మొక్కల సాంద్రతను, దిగుబడిని గణనీయంగా తగ్గించే ప్రమాదం ఉంది. ఖరీఫ్లో పంటసాగు చేస్తున్న రైతులకు విత్తన శుద్ధి వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. లాభాలు: విత్తన శుద్ధితో మొలక శాతం పెరిగి సాంద్రత సిఫా ర్సు మేరకు ఉంటుంది. తొలి దశలో ఆశించే పురుగులు, తెగుళ్ల బారి నుంచి పంటలను కాపాడుతుంది. దీంతో మొక్క ఏపుగా పెరగడానికి అవకాశం ఉంది. చీడపీడల ఉధృతిని తగ్గించి, తర్వాత దశలో ఆశించే రసం పీల్చు పురుగులు, వైరస్ తెగుళ్ల నుంచి పంటలను కాపాడుకోవచ్చు. రైజోబియం వల్ల నత్రజని స్థిరీకరణ జరుగుతుంది. అంతేకాక వాతవరణ కాలుష్యం తగ్గి మిత్ర పురుగులు రక్షించబతాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు విత్తన శుద్ధిలో రైతులు తగు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. విత్తన శుద్ధికి సరైన మందులు ఎంపిక చే సుకోవాలి. విత్తనంలో తేమ శాతం ఎక్కువగా ఉండకుండా జాగ్రత్త పడాలి. సరైన మోతాదు మందులు వాడాలి. విత్తనం పై పొర ఊడిపోకుండా చూసుకోవాలి. అయితే విత్తన శుద్ధి చేసిన విత్తనాలను పశువుల దాణాగా వాడకూడదు. వివిధ పంటల విత్తన శుద్ధి : విత్తన శుద్ధికి ఒక్కొక్క పంటకు ఒక విధానం ఉంటుంది. వాటిని గమనించి రైతులు జాగ్రత్తలు పాటిస్తే ఆశించిన ఫలితాలు ఉంటాయి. వరి: ఒక కిలో వరి విత్తనంలో ఒక గ్రామ్ కార్టింజమ్ ఒక లీటర్ నీటిలో కలిపిన ద్రావణంలో ఒక రోజు నానబెట్టాలి. ఒక రోజు మండె కట్టి నారు మడిలో చల్లడం వలన అగ్గి తెగులు, ఆకుమచ్చ, పొడ తెగుళ్లను అదుపు చేయవచ్చు. మొక్కజొన్న: ఒక కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్ లేదా కాస్టాన్ కలిపి శుద్ధి చేస్తే ఎండు తెగులు, కాటక తెగులు, మచ్చ తెగుళ్లను అదుపు చేయవచ్చును. వేరుశనగ: కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజేబ్తో శుద్ధి చేస్తే తిక్కాకు, ఆకుమచ్చ, తుప్పు, కాంత కాళ్ల తెగుళ్ల వ్యాప్తిని అరికట్టవచ్చు. పత్తి: బ్యాక్టీరియా వల్ల నల్లమచ్చ ఆశించే ప్రాంతాల్లో లీటర్ నీటిలో 100 మిల్లీ గ్రాముల వైంసన్ లేదా ప్లాంటామైసిన్ గాని, ఒక గ్రామ్ బ్లైటాన్స్ కలిపిన ద్రావణంలో శుద్ధి చేసిన విత్తనాలను 6 నుంచి 8 గంటలు నానబెట్టి ఆ తర్వాత ఆరబెట్టుకొని విత్తుకుంటే ప్రయోజనం ఉంటుంది. మిరప : మిరపలోని వైరస్ తెగుళ్ల నివారణకు ఒక లీటర్ నీటిలో 150 గ్రాముల ట్రై సోడియం, ఆర్థ ఫాస్సేట్లో ఒక కిలో మిరప విత్తనాన్ని 12 గంటలు నానబెట్టి తర్వాత చల్లటి నీటిలో కడిగి విత్తుకోవాలి. దీంతో మంచి దిగుబడి సాధించవచ్చు. ముందస్తు జాగ్రత్తలు మంచిది చీడపీడలు వ్యాప్తి చెందిన తర్వాత సస్యరక్షణ పద్ధతులు పాటించడం కన్నా.. వాటిని ముందుగానే విత్తన శుద్ధితో అదుపు చేసుకోవాలి. దీని వల్ల పంట నాణ్యత పెరగడమే కాకుండా అధిక దిగుబడి సాధించి ఆదాయం పొందవచ్చు పాడి–పంట -
ఫస్టియర్లో 67.37%, సెకండియర్లో 47.37%
● ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: గత నెల రెండో వారంలో నిర్వహించిన ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. మొదటి సంవత్సరం జనరల్ కోర్సుల్లో 5,568 మంది పరీక్షలకు హాజరైతే 67.37శాతంతో 3,751 మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ కోర్సుల్లో 566 మంది హాజరైతే 74.38 శాతంతో 421 మంది ఉత్తీర్ణతను నమోదు చేశారు. రెండో సంవత్సరం జనరల్ కోర్సుల్లో మొత్తం 2,571 మంది హాజరు కాగా.. 1,218 మంది ఉత్తీర్ణులై 47.37 శాతం నమోదు చేశారు. ఒకేషనల్ కోర్సుల్లో 362 మంది పరీక్షలు రాయగా 55.80 శాతంతో 202 మంది ఉత్తీర్ణులయ్యారు. చిన్నారుల ఆరోగ్యంపై దృష్టి సారించండి పాలమూరు: శిశు గృహలో ఆశ్రయం పొందుతున్న చిన్నారుల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అన్నారు. నగరంలో ఉన్న బాలసదన్, బాల రక్ష భవన్, శిశు గృహను గురువారం సందర్శించి స్థానికంగా ఉన్న పరిస్థితులను పరిశీలించారు. ప్రధానంగా శిశు గృహలో ఉంటున్న చిన్నారులకు అందిస్తున్న ఆహారం, వారి ఆరోగ్య విషయంపై అడిగి తెలుసుకున్నారు. వర్షకాలం నేపథ్యంలో వాతావరణంలో చాలా మార్పులు వస్తాయని పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. డీఏఓగా గోవింద్ నాయక్ మహబూబ్నగర్ (వ్యవసాయం): జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ)గా గోవింద్ నాయక్ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఆయనకు జిల్లా వ్యవసాయ అధికారిగా బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఇన్చార్జి డీఏఓగా బి.వెంకటేష్ రైతు శిక్షణ కేంద్రంలో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ (డీడీఏ)గా పనిచేస్తూ అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. పూర్తిస్థాయి డీఏఓ నియమించడంతో వానాకాలం సాగు సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో ఎరువులు, విత్తనాల సరఫరా, పంటల ప్రణాళిక, రైతులకు సాంకేతిక సూచనల అమలులో మరింత సమన్వయం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తమవుతుంది. గురువారం గోవింద్నాయక్ బాధ్యతలు స్వీకరించారు. ధాన్యం @ రూ.2,891 జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో గురువారం వివిధ ప్రాంతాల నుంచి భారీగా ధాన్యం విక్రయానికి వచ్చింది. ధాన్యం ఆర్ఎన్ఆర్ రకం క్వింటా గరిష్టంగా రూ.2,891, కనిష్టంగా రూ.1,666 ధరలు లభించాయి. అదేవిధంగా మొక్కజొన్న క్వింటా గరిష్టంగా రూ.2,045, కనిష్టంగా రూ.1,747, ఆముదాలు క్వింటా గరిష్టంగా రూ.6,295, కనిష్టంగా రూ.6,280, పొద్దుతిరుగుడు గరిష్టంగా రూ.6,710, కనిష్టంగా రూ.6,680 ధరలు లభించాయి. -
మహాకేఫ్తో ఎంతో లబ్ధి
15 ఏళ్లుగా మహిళా సంఘంలో సభ్యురాలి ఉన్నాను. ఈ క్రమంలోనే ఇటీవల టీఎల్ఎఫ్కు అధ్యక్షురాలిగా ఎన్నుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మూడు నెలల క్రితమే నాకు ఆర్అండ్బీ జంక్షన్లోని మహాకేఫ్ నిర్వహణ బాధ్యతలను మెప్మా అధికారులు అప్పగించారు. ఇందులో బేకరీ ఐటమ్స్తో పాటు వివిధ తిను బండారాలు, కూల్డ్రింక్స్ తదితరాలు అమ్ముతున్నాను. దీనికోసం సీ్త్రనిధి నుంచి రూ.మూడు లక్షలు రుణం తీసుకున్నాను. అలాగే నా వంతుగా రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టాను. ప్రతిరోజూ ఖర్చులు పోను కనీసం రూ.వేయి ఆదాయం వస్తోంది. – వందన, అధ్యక్షురాలు, నవభారత్ పట్టణ సమాఖ్య, మహబూబ్నగర్ టైలరింగ్తో ఉపాధి నేను 12 ఏళ్లుగా మహిళా సంఘంలో సభ్యురాలిగా ఉంటున్నాను. మూడేళ్ల క్రితం ఇంటి వద్దే టైలరింగ్ యూనిట్ ఏర్పాటు చేసుకున్నాను. దీని కోసం మెప్మా ఆధ్వర్యంలో బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి ద్వారా రూ.లక్ష చొప్పున రుణం తీసుకున్నాను. క్రమం తప్పకుండా కిస్తీలు చెల్లిస్తూ వస్తున్నాను. ప్రస్తుతం ఈ బకాయిలు వూర్తి కావచ్చాయి. ఈ డబ్బులతో స్టిచ్చింగ్కు అవసరమయ్యే కుట్టు మిషన్లు 5 కొన్నాను. నాతో పాటు మా గ్రూపులోని మరో నలుగురికి ఉపాధి లభిస్తోంది. ఈ యూనిట్లో స్కూల్ యూనిఫాం కుట్టి ఇస్తున్నాం. ప్రైవేట్గా జాకెట్లు, మిడ్డీలు తదితరాలను కుడుతున్నాం. ఈ యూనిట్ ద్వారా మాకు ఎంతో లబ్ధి చేకూరుతోంది. – ఇమ్మడి సుమతి, వైఎస్ఆర్ మహిళా సంఘం సభ్యురాలు, పాతతోట, మహబూబ్నగర్ ● -
పోలీస్ సేవలు మరింత చేరువ చేస్తాం: ఎస్పీ
మహబూబ్నగర్ క్రైం: డీజీపీ ఆదేశాల మేరకు ఇకపై జిల్లా ఎస్పీ కార్యాలయంలో పనిదినాల్లో ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండనున్నట్లు జిల్లా ఎస్పీ డి.జానకి ఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదుదారులు నేరుగా కలిసి ఫిర్యాదులు, వినతిపత్రాలు తదితర అంశాలను దృష్టికి తీసుకు రావచ్చునని తెలిపారు. అదేవిధంగా ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం కూడా ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉండనున్నట్లు పేర్కొన్నారు. ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించడంతో పాటు పోలీస్సేవలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. ● అడ్డాకుల ఎస్ఐగా నూతనంగా బాధ్యతలు తీసుకున్న మురళి గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డి.జానకిని మర్యాదపూర్వకంగా కలిశారు. మురళి ఎస్ఐ ఉద్యోగం కంటే ముందు 18 ఏళ్ల పాటు భారత సైన్యంలో పని చేసి 2020లో తెలంగాణ పోలీస్ శాఖలో ఎస్ఐగా ఎంపిక అయ్యారు. ఇప్పటి వరకు మదనాపురం, మరికల్, కోదండపూర్లలో పని చేశారు. -
సీజన్కు అవసరమైన యూరియా సిద్ధం
● ‘యూరియా యాప్’ను ప్రారంభించినఅదనపు కలెక్టర్ ● జిల్లాలో 8,513 మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్: డీఏఓ జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): వానాకాలం–2026 సీజన్కు సంబంధించి రైతులు యూరియా ను సులభంగా పొందేందుకు రూపొందించిన ‘యూరియా యాప్’ను రెవెన్యూ అదనపు కలెక్టర్ జేఎల్బీ హరిప్రియ ప్రారంభించారు. గురువారం కలెక్టరేట్లోని జిల్లా వ్యవసాయ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె యాప్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో రైతులు యూరియా కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సి వచ్చేదని, ప్రస్తుతం యాప్ ద్వారా ముందస్తుగా బుకింగ్ చేసుకుని అవసరమైన ఎరువును పొందే అవకాశం కల్పించామని తెలిపారు. జిల్లాలోని 17 మండలాల్లో ఉన్న 250 అధీకృత ఎరువుల విక్రయ కేంద్రాల్లో ఎక్కడైనా యూరియాను బుక్ చేసుకుని కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొన్నారు. వానాకాలం సీజన్కు అవసరమైన మేరకు యూరియా నిల్వలు సిద్ధంగా ఉన్నాయని, రైతులు కొరతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. జిల్లా వ్యవసాయ అధికారి బి.వెంకటేష్ మాట్లాడుతూ ప్రస్తుతం 14,759 యూరియా బ్యాగులు (664 మెట్రిక్ టన్నులు) యాప్ ద్వారా బుకింగ్ కోసం అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అదనంగా మార్క్ఫెడ్లో 5,868 మెట్రిక్ టన్నులు, కంపెనీ గోదాముల్లో 2,339 మెట్రిక్ టన్నులు, హోల్సేల్ డీలర్ల వద్ద 306 మెట్రిక్ టన్నులు నిల్వ ఉన్నాయని చెప్పారు. మొత్తం 8,513 మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ జిల్లాలో అందుబాటులో ఉందన్నారు. కౌలు రైతులు, ఆర్ఎఎఫ్ఆర్ రైతులు కూడా ఈ యాప్ ద్వారా యూరియాను పొందవచ్చని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే పారదర్శకంగా ఎరువుల పంపిణీ జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏడీఏ బి.మాధవి, వ్యవసాయ అధికారి ఎంఎ బాసిత్, తదితరులు పాల్గొన్నారు. -
జూరాలకు 2,388 క్యూసెక్కుల ఇన్ఫ్లో
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్ఫ్లోలు కొనసాగుతుంది. స్థానికంగా కురుస్తున్న వర్షాల ఆధారంగా గురువారం సాయంత్రం వరకు ప్రాజెక్టుకు 2,388 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చిందని పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో నెట్టెంపాడు ఎత్తిపోతలకు నీటి పంపింగ్ను చేస్తున్నారు. రెండు పంపులను రన్ చేసి గుడ్డెందొడ్డి, ర్యాలంపాడు రిజకర్వాయర్లను నింపుతున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 1,500 క్యూసెక్కులు, క్యూసెక్కులు ఆవిరి రూపంలో 43 క్యూసెక్కులు మొత్తం 1,543 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.572 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులో దాదాపు 3 టీఎంసీల నీరు చేరినట్లు అధికారులు తెలిపారు. -
ధాన్యం పంచాయితీ.. రాజధానికి
వనపర్తి: జిల్లాలో గడిచిన పదేళ్లలో వరి సాగు, ఉత్పత్తి రికార్డుస్థాయిలో పెరగగా.. అంతేస్థాయిలో ధాన్యం నిల్వల మాయం, కేటాయింపుల్లో లోపాలు, రవాణా కాంట్రాక్టర్ల అక్రమాలు సైతం పెరిగాయి. కొంతకాలంలో జిల్లా నుంచి టాస్క్ఫోర్స్ అధికారులకు తరుచూ వెళ్తున్న ఫిర్యాదులతో వరుస దాడులు చేస్తుండగా విస్తుపోయే నిజాలు వెలుగు చూడటం గమనార్హం. కొన్ని మిల్లుల్లో రూ.కోట్ల విలువజేసే ధాన్యం కాగితాల్లో కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాయం చేస్తూ ప్రభుత్వానికి కుచ్చుటోపీ పెడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు శూన్యమనే చెప్పవచ్చు. ● 2025, నవంబర్ 13న పెద్దమందడి మోజర్ల సమీపంలోని రెండు మిల్లుల్లో టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించగా.. సుమారు రూ.12.50 కోట్ల విలువైన ధాన్యం నిల్వలు మాయమైనట్లు గుర్తించి మిగతా ధాన్యాన్ని సీజ్ చేశారు. గత నెల 22న తిరిగి అవే మిల్లుల్లో అధికారులు తనిఖీలు చేసి సీజ్ చేసిన మిగులు ధాన్యం నిల్వలను పరిశీలిస్తే సుమారు రూ.9 కోట్ల విలువజేసే ధాన్యం అక్కడ లేకపోవడం విస్మయానికి గురిచేసింది. సీజ్ చేసిన ధాన్యం ఎలా మాయమవుతుందనే విషయంపై ఇప్పటి వరకు జిల్లా అధికారులు ఎలాంటి విచారణ చేపట్టకపోవడం, రూ.కోట్ల విలువజేసే ధాన్యం సంరక్షించాల్సిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే విషయాన్ని ఉన్నతాధికారులు వెల్లడించడానికి విముఖత చూపిస్తున్నారు. ● కొత్తకోట మండలం నాచాంపేట శివారులోని ఓ కొత్త మిల్లుకు గత సీజన్లో రూ.6.50 కోట్ల వరి ధాన్యం అధికారులు కేటాయించారు. వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ నెల 9న టాస్క్ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయగా.. సుమారు రూ.2.50 కోట్ల విలువైన ధాన్యం మాయమైంది. ఇది చూసిన జిల్లా ఉన్నతాధికారులతో పాటు టాస్క్ఫోర్స్ అధికారులు అవాక్కయ్యారు. జిల్లాలో కొందరు అధికారులు, మిల్లర్లు కుమ్మకై ్క.. రూ.కోట్ల విలువజేసే వరి ధాన్యం బ్లాక్ మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకుంటూ బియ్యం అడిగినప్పుడు రీసైక్లింగ్ పద్ధతిన సీఎస్సీకి అప్పగిస్తూ ఒక ప్రణాళికతో అక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రచారం జోరందుకుంది. అధికారులపై ఫిర్యాదుల వెల్లువ.. జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులపై మొదటి నుంచి ఫిర్యాదు చేస్తున్న బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు వరుస టాస్క్ఫోర్స్ దాడులు జరిగిన మిల్లుల్లో వరి ధాన్యం నిల్వలు మాయం కావడంపై బుధవారం రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదు చేయడంతో జిల్లా అవినీతి బాగోతం రాజధాని చేరినట్లయింది. ఈ విషయంపై వారు స్పందించి సమగ్ర విచారణ చేస్తారా? లేక జిల్లా అధికారుల మాదిరిగానే నిమ్మకుంటారనే విషయంపై స్థానికంగా చర్చ జరుగుతోంది. రైస్మిల్లులపై వరుస టాస్క్ఫోర్స్ దాడులు కనిపించని రూ.కోట్ల విలువజేసే వరి ధాన్యం తూతూమంత్రంగా వనపర్తి అధికారుల చర్యలు చేసేది లేక రాష్ట్రస్థాయిఉన్నతాధికారులకు ఫిర్యాదులు -
సేవలు విసర్తిసాం..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా యూనివర్సిటీ సేవలను విస్తరించి.. జిల్లా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నాం. అందులో భాగంగా నాగర్కర్నూల్ జిల్లాలో పీజీ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించగా.. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆమోదం లభించింది. ప్రభుత్వం నుంచి జీఓ వస్తే ఏర్పాటు చేస్తాం. వీటితోపాటు వనపర్తి పీజీ కళాశాల హాస్టళ్ల నిర్మాణం కోసం 5 గుంటల భూమిని కేటాయిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. – జీఎన్ శ్రీనివాస్, వైస్ చాన్స్లర్, పీయూ ● -
పాముకాటుతో మహిళ మృతి
ఽదన్వాడ: పాముకాటుతో మహిళ మృతి చెందిన ఘటన మండలంలో బుధవారం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. మండల కేంద్రానికి చెందిన బొక్కి తిరుపతమ్మ (56) ఇంటి వద్ద తెల్లవారుజామున పాముకాటుకు గురైంది. గమనించిన కుటుంబ సభ్యులు నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అగ్నికి ఆహుతైన ఇల్లు ధరూరు: గ్రామానికి ఆనుకొని ఉన్న పంట పొలాల్లో వరికొయ్యలను అంటించగా నిప్పురవ్వలు ఎగిసిపడి ఓ ఇంటిపై పడి ఇల్లు దగ్ధమైన ఘటన మండల పరిధిలోని నెట్టెంపాడు గ్రామంలో చోటు చేసుకుంది. పూర్తి వివారలు.. బుధవారం గ్రామానికి ఆనుకొని పొలంలో వరికొయ్యలకు నిప్పంటించారు. రాత్రి వీచిన గాలులకు నిప్పరవ్వలు ఎగిసిపడి వెంకట్రెడ్డి అనే వ్యక్తి ఇంటిపై పడ్డాయి. దీంతో ఇంటి ముందు భాగంలో ఈతమట్టలు, ఈతవాట్లు ఇతర సామాగ్రి పూర్తి దగ్ధమయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ ఇల్లు పూర్తిగా కాలిపోయిందని బాధితులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చారు. -
మినీ స్టేడియానికి 4 ఎకరాల భూమి
కోడేరు/వీపనగండ్ల: వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలకేంద్రం సమీపంలో మినీ స్టేడియం నిర్మాణానికి రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తన సొంత భూమిని ఇచ్చారు. ఈ మేరకు బుధవారం జిల్లా స్పోర్ట్స్ అథారిటీ పేరుపై నాలుగెకరాల భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేశారు. స్థానిక యువతను క్రీడల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వీపనగండ్ల సమీపంలోని సర్వేనంబర్ 532లో దా దాపు రూ.1.50 కోట్ల విలువజేసే తన భూమి లో మినీ స్టేడియం నిర్మాణానికి స్పోర్ట్స్ అథారిటీ నుంచి రూ. 2కోట్ల నిధులు మంజూరు చేయిస్తానని గతంలో ఆయన హామీ ఇచ్చారు. అయితే సమయాభావం వల్ల వీపనగండ్ల తహసీల్దార్ డిజిటల్ లాగిన్ను కోడేరు మండల రెవెన్యూ కార్యాలయంలో ఓపెన్ చేయించి.. రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేశారు. ఇందుకు సాక్షులుగా జిల్లా పర్యాటకశాఖ అధికారి కల్వరాళ్ల నర్సింహ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు గోపి ఉన్నారు. రూ.కోట్ల విలువైన భూమిని క్రీడా అభివృద్ధి కోసం ఇవ్వడంతో యువకులు మంత్రి జూపల్లికి కృతజ్ఞతలు తెలిపారు. ● మాట నిలబెట్టుకున్న రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
రేర్ ఎర్త్ మూలకాలపై పరిశోధనకు ప్రశంస
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూని ర్సిటీ భౌతికశాస్త్రం విభాగంలో బేగరి ఉదయ్కుమార్ తన పరిశోధన పత్రాన్ని సమర్పించారు. ఈ మేరకు భౌతికశాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రవీణ ఆధ్వర్యంలో ఆయన ‘సింథసిస్, క్యారెక్టరైజేషన్, డైలెక్ట్రిక్ ఆండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ రేర్ ఎర్త్ డోప్డ్ జింక్ ఫెర్రిటైట్స్’ అనే అంశంపై కొన్నేళ్లుగా విస్తృత ప్రయోగాలు చేశారు. ఇందుకు సంబంధించిన పరిశోధన పత్రాన్ని బీఓఎస్ చైర్మన్ జైపాల్రెడ్డి, మధుసూదన్రెడ్డి, శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైఓఎస్ నిర్వహించడంతో ఆయన పరిశోధన పూర్తయింది. ఈ సందర్భంగా ఉదయ్కుమార్ను పీయూ వీసీ శ్రీనివాస్ అభినందించారు.యూనివర్సిటీలో అ రుదైన అంశాలపై పరిశోధన చేయడం గొప్ప విషయమని, పరిశోధనల వల్ల యూనివర్సిటీతో పాటు విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరమ న్నారు. పరిశోధన రంగంలో ఇది ఒక కీలక పరిశోధనగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రర్ రమేష్బాబు, చెన్నయ్య పాల్గొన్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి భూత్పూర్: మండలంలోని చౌళ్లతండా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పి.తవుర్య(49) అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. పూర్తి వివరాలు.. ఖిల్లాఘణపురం మండలం ఈర్లతండాకు చెందిన తవుర్యా ఈ నెల 6న పత్తి విత్తనాలు కొనుగోలు కోసం మోటర్సైకిల్పై వెళ్తుండగా చౌళ్లతండా మలుపు వద్ద అదుపుతప్పి కిందపడటంతో తలకు, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అదే రోజు హైదరాబాద్లో వెల్నెస్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య బుజ్జి ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
వనపర్తి మీనాలకు భలే క్రేజ్..
● రవ్వ, బొచ్చెల జోరు.. ● మార్కెట్లో కొరమ్రీను మేనియా ● రుచికి కేరాఫ్ అడ్రస్ వనపర్తి చేపలు మదనాపురం: పచ్చని పొలాలు.. గలగలపారే కృష్ణమ్మ అలలు.. చె రువుల ఆకుపచ్చని జిల్లా ఇ ప్పుడు జలసిరుల కాణాచి గా మారుతోంది. ఒకవైపు ఆకాశాన్నంటే ఆశలతో అన్నదాతలు సాగు చేస్తుంటే మరోవైపు జి ల్లాలోని అపార జల రాశి మత్స్యకారుల జీవితా ల్లో సరికొత్త కాంతులు నింపుతోంది. నీలి విప్లవానికి కేరా ఫ్ అడ్రస్గా నిలుస్తూ.. ఇక్క డి జలాశయాలు వేలా ది మత్స్య కార కుటుంబాలకు ఆర్థిక భరోసానిస్తున్నాయి.మార్కెట్లో కొరమ్రీనుకు ఉన్న విపరీతమైన క్రేజ్, మన చెరువుల చేపలకు ఉన్న ప్రత్యేక రుచి ఆక్వా రంగానికి సరికొత్త వైభవాన్ని తెచ్చిపెట్టా యి. జిల్లావ్యాప్తంగా విస్తరించి ఉన్న చిన్న, పెద్ద చెరువులు, కుంట లు నేడు నీలి విప్లవానికివేదికలయ్యాయి. మిషన్ కాక తీయతో పునరుజ్జీవం పొందిన చెరువుల్లో మ త్స్య శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా విడుదల చేస్తున్న చేపపిల్లలు ఇప్పుడు కో ట్లాది రూపాయల సంపదగా మారుతున్నాయి. రుచి.. ఎందుకంత క్రేజ్? సాధారణంగా ఆర్టిఫిషియల్ ఫీ డ్ (కృత్రిమ మేత) వేసి పెంచే చేపల కంటే వనపర్తి జలాశయాల్లో పె రిగే చేపలకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. జూరాల బ్యాక్ వాటర్ రామన్పాడు, గణపసముద్రం వంటి జలాశయాల్లో నీరు నిరంతరం కదులుతూ ఉంటుంది. ఇందులోని సహజ సిద్ధమైన నాచు, ప్లవకాలు తిని పెరగడంతో ఇక్క డి చేపల మాంసం గట్టిగా, అమృతప్రాయమైన రు చితో ఉంటుంది. ఇక్కడి నుంచి రోజూ టన్నుల కొద్దీ రవ్వ, బొ చ్చె, జెల్లలు హైదరాబాద్తోపాటు ప క్క రాష్ట్రమైన కర్ణాటకకు తరలిపోతుంటా యి.వనపర్తి చేప అంటే మార్కెట్లో వ్యాపారులు పోటీ పడి మరీ కొనుగోలు చేస్తారు. కొర్రమీను పెంచితే లాభాల పంటే! ప్రస్తుతం ఆక్వా రంగంలో అత్యఽ దిక లాభాలు తెచ్చిపెడుతున్న రకం కొరమ్రీను. దీనికి ఉన్న అద్భుతమైన డిమాండ్ కారణంగా కిలో ధర రూ.400నుంచి రూ. 600వరకు పలుకుతోంది. ఇది గాలిలోని ఆక్సిజన్ను నేరుగా తీసుకోగలదు. కాబట్టి నీటి లభ్యత తక్కువగా ఉన్న చిన్నచిన్న కుంటల్లో కూడా దీనిని అత్యధిక సాంద్రతతో పెంచి లాభాలు సాధించవచ్చు. ఇందులో ముళ్లు తక్కువ, ప్రొటీన్లు ఎక్కువ. శస్త్రచికిత్సలైనవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ చేపను తింటే త్వరగా కోలుకుంటారు. ఎముకల పుష్టికి, గుండె ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ డి, అధిక ప్రోటీన్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా, చిన్నపిల్లల్లో మెదడు చురుకుదనాన్ని పెంపొందిస్తాయి. వనపర్తి జిల్లాలో పెద్ద చెరువులు కుంటలు అన్ని కలిపి 943 ఉన్నాయి. 13,600 మంది మత్య్సకారులు ఉన్నారు. నీటివనరులు ప్రకృతి ప్రసాదించిన వరం. ప్రధాన జలాశయాలతోపాటు వందలాది చెరువులు ఈ రంగానికి కొండంత అండగా నిలుస్తున్నాయి. జిల్లాకు మకుటాయమానంగా నిలిచిన జూరాల ప్రాజెక్ట్, రామన్పాడు జలశయం, గోపాల్దిన్నె, గణపసముద్రం, రంగసముద్రం, సరళాసాగర్, శంకర సముద్రంతో వంటి ప్రసిద్ధ జలాశయాలు నిత్యం మత్స్య సంపదతో కళకళలాడుతున్నాయి. ఈ నీటి నిల్వల్లో పెరిగే చేపలకు సహజ సిద్ధమైన ఆహారం దొరకడంతో వీటి నాణ్యత అద్భుతంగా ఉంటుంది. జిల్లాలోని 943 పెద్ద, చిన్న చెరువులతోపాటు కుంట లు, జూరాల, రామన్పాడు జలాశయాల్లో నాణ్యమైన చేపల పెంపకానికి అన్నిరకా ల చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏటా కోట్లల్లో చేపపిల్లలను వదులుతున్నాం.వనపర్తి జలాశయాల్లో పెరిగే రవ్వ, బొచ్చె, కొరమ్రీనుకు మార్కెట్లో అద్భుతమైన డిమాండ్ ఉంది. మత్స్యకారులు ఆధునిక పద్ధ తులు అవలంబించి, డిమాండ్ ఉన్న రకాలను పెంచితే ఆర్థిక వృద్ధి సా ధించవచ్చు. మత్స్యశాఖ సాంకేతిక సహాయం అందించడానికి సిద్ధంగా ఉంటుంది. – లక్ష్మయ్య, ఏడీ మత్స్యశాఖ, వనపర్తి -
వర్షాకాలంలో రైతులు అప్రమత్తం
అలంపూర్: నైరుతి రుతుపవనాలు కేరళం తీరాన్ని తాకడంతో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. వర్షాకాలంలో పిడుగులు పడటం, ఈదురు గాలులు, పాములు వంటి ఆపదల్లో అన్నదాతలు చిక్కుకుంటున్నారు. వీటి నుంచి బయట పడటానికి రైతులు కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే మంచిదని వ్యవసాయ శాఖ ఏడీఏ సక్రియానాయక్ సూచిస్తున్నారు. వానకాలం పంట సాగులో రైతన్నలకు కింది జాగ్రత్తలు సూచించారు. నడకదారిలో విష సర్పాలు: వర్షాలు కురవగానే పాములు బయటికి వస్తాయి. గట్ల వెంట, చెట్లు, పిచ్చి మొక్కలు, బండరాళ్లు, గడ్డి వాములు ఉన్న చోట పాముల సంచారం ఎక్కువ గా ఉంటుంది. రైతులు పొలం పనులకు వెళ్లే దారిలోనూ, పనుల్లో నిమగ్నమై గట్ల వెంట నడుస్తూ పా ముకాటుకు గురైన ఘటనలు అనేకం ఉంటాయి. జాగ్రత్తలు : ● చీకటి సమయాల్లో టార్చి లైట్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ● చేతిలో కర్ర పట్టుకొని వెళ్లాలి. ● తప్పనిసరిగా పాదరక్షలు ధరించాలి. బూట్లు ధరిస్తే ఇంకా మంచిది. ● పొలం గట్లపై నడుస్తున్నప్పుడు చప్పుడు చేసుకుంటూ వెళ్లాలి. ● పాము కాటుకు గురైతే తక్షణమే సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స పొందాలి. ● మంత్రాలు, నాటు వైద్యంపై ఆధారపడొద్దు వాగులు.. వరద ఉధృతి : వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తాయి. వ్యవసాయ పనులకు వెళ్లే దారిలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులు పొలాల నుంచి వచ్చే సమయాల్లో ఇలాంటి పరిస్థితి ఎదురైతే చాకచక్యంగా వ్యవహరించాలి.వరద ఉధృతి ఎక్కు వగా ఉంటే వాగులు దాటేందుకు ప్రయత్నించొద్దు. జాగ్రత్తలు ● నీటి ఉధృతి ఎలా ఉందో ముందుగా గమనించాలి. ● ఒంటరిగా వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయరాదు. ● జట్టుగా తోటి రైతులతో కలిసి వెళ్లాలి. ● పశువులను దాటించే సమయాల్లో మరింత జాగ్రత్త అవసరం పిడుగులు, మెరుపులు : వ్యతిరేక విద్యుత్ అవేశాలు ఉన్న రెండు మేఘాలు ఢీకొన్నప్పుడు విద్యుత్ జనించి తక్కువ విద్యుత్ అవేశం ఉన్న మేఘం నుంచి ఎక్కువ ఆవేశం ఉన్న మేఘంలోకి విద్యుత్ ప్రవాహం వేగంగా జరుగుతుంది. అది వెంటనే ఉరుములు, మెరుపుల రూపంలో బయటికి వస్తోంది. కాంతికి వేగం ఎక్కువ కావడం వలన మెరుపు ముందుగా కనిపించి ఆ తర్వాత ఉరుము వినిపిస్తోంది. ఎక్కువ విద్యుత్ ఆవేశం ఉన్న మెరుపు తక్కువ ఆవేశం గల భూమి వైపుకు వస్తుంది. తేమ విద్యుత్ వాహకంగా పని చేయడం వలన అది పిడుగుగా మారి ఎత్తైన ప్రదేశాల వైపు దూసుకపోయి భూమిలోకి తటస్థంగా వెళ్తుంది. సహజంగా భూమిపై చెట్లు ఎత్తుగా ఉండటంతో వాటిపై పిడుగు పడుతుంది. పాడి–పంట వర్షాకాలంలో ఉరుములు, మెరుపులు పిడుగులు పడుతుంటాయి. అలాంటి సమయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆకాశం మేఘామృతం అయినప్పుడు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. వర్షంలో తడవకుండా ఉండటానికి చాల మంది చెట్లను ఆశ్రయిస్తారు. అది సరైంది కాదు. పిడుగులు ఎక్కువగా చెట్లపైనే పడతాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండటం మంచిది. ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ తీగలు ఉన్న ప్రాంతాల్లో ఉండరాదు. సెల్ఫోన్లు ఉంటే వాటిని స్విచ్చాఫ్ చేసుకోవాలి. -
ఆరోగ్యశాఖలో బదిలీల పర్వం
పాలమూరు: జిల్లా జనరల్ ఆస్పత్రితో పాటు పాలమూరు మెడికల్ కళాశాల నుంచి బదిలీ అయిన ప్రొఫెసర్ల స్థానంలో కొత్త వారికి పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనరల్ ఆస్పత్రిలో ఖాళీ అయిన విభాగాలకు నూతన ప్రొఫెసర్లను కేటాయించారు. ఆస్పత్రి, మెడికల్ కళాశాల కలిపి మొత్తం 12 విభాగాలకు నూతన హెచ్ఓడీలు రానున్నారు. ఇప్పటికే మూడు విభాగాలకు సంబంధించిన హెచ్ఓడీలు పోస్టింగ్ ఇచ్చారు. ఇక బుధవారం మరో ముగ్గురు హైదరాబాద్ నుంచి బదిలీపై జిల్లాకు వచ్చారు. దీంట్లో పీడియాట్రిక్ హెచ్ఓడీగా డాక్టర్ అజయ్ మోహన్, ఈఎన్టీ హెచ్ఓడీగా డాక్టర్ కబీర్, అనాటమీ హెచ్ఓడీగా డాక్టర్ జానకి, మైక్రోబయాలజీ హెచ్ఓడీగా డాక్టర్ పావని బదిలీపై రానున్నారు. అదేవిధంగా అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్లలో పీడియాట్రిక్ విభాగంలో డాక్టర్ ఉజ్మా తబాసుమ్, రేడియాలజీలో డాక్టర్ కె.పవన్కుమార్, అనస్తీషియాలో కె.సుధ, ఎం.జ్యోత్స్నాదేవి, డాక్టర్ జ్ఞానేశ్వరి, డీవీఎల్ విభాగంలో వి.దీప్తి, గైనిక్లో డాక్టర్ సీహెచ్ నిషితలు బదిలీపై జనరల్ ఆస్పత్రికి రానున్నారు. విధుల్లో చేరే వరకు అనుమానమే.. మొదటి నుంచి పాలమూరులో విధులు నిర్వహించడానికి వైద్యులు ఎక్కువ ఆసక్తి చూపడం లేదనే విషయం తెలిసిందే. చాలా మంది హైదరాబాద్ శివారు ప్రాంతాలకు వెళ్లడానికి ఆసక్తి చూపుతుంటారు. రోజు వారి రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తారు. ప్రస్తుతం జనరల్ ఆస్పత్రితో పాటు మెడికల్ కళాశాలకు బదిలీపై వచ్చిన నూతన ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్లు విధులు చేరే వరకు అనుమానమే. ఈ ప్రక్రియ మూడు రోజుల్లో పూర్తి కానున్న నేపథ్యంలో ఆ తర్వాత ఆస్పత్రిలో పని చేసే వారిపై స్పష్టత రానుంది. ● జిల్లా వైద్యారోగ్యశాఖలో పని చేస్తున్న మాస్ మీడియా అధికారిని మంజుల రంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు. అలాగే జనరల్ ఆస్పత్రిలో ఆర్ఎంఓగా పని చేసిన డాక్టర్ జరీనా భాను మహమ్మదాబాద్ పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్గా బదిలీపై వెళ్లారు. జనరల్ ఆస్పత్రికి హైదరాబాద్ నుంచి బదిలీపై వస్తున్న వైద్యులు విధుల్లో చేరే వరకు వీడని సస్పెన్స్ పాలమూరు అంటే వెనుకడుగు వేస్తున్న ఆచార్యులు హైదరాబాద్ శివారు ప్రాంతాలపై ఆసక్తి అధికం మూడు రోజుల్లో పూర్తికానున్న బదిలీల ప్రక్రియ -
అడవిలోకి అక్రమంగా ప్రవేశిస్తే చర్యలు
అచ్చంపేట రూరల్: అనుమతి లేకుండా అడవిలోకి ప్రవేశించడం, నాటు తుపాకులు, ఇతర ఆయుధాలు తీసుకెళ్లడం, వన్యప్రాణులను వేటాడడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని ఫారెస్ట్ డివిజనల్ అధికారులు చంద్రశేఖర్, రామ్మోహన్, రామమూర్తి హెచ్చరించారు. అల్లంగట్టు అటవీ ప్రా ంతంలో కెమెరా ట్రాప్లో చిక్కిన వేటగాళ్లు నాటు తుపాకి, మందుగుండ్లు, గొడ్డలితో అడవిలో సంచరిస్తున్న నలుగురిని అరెస్టు చేసి వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేశామన్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో వన్యప్రాణుల సంరక్షణ, అక్రమ వేట నియంత్రణకు అటవీశాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ.. చేపడుతున్న నిఘా చర్యలు మరోసారి ఫలితాన్నిచ్చాయ న్నారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆల్ఇండియా టైగర్ ఎస్టిమేషన్–2026లో భాగంగా అచ్చంపేట రేంజ్ పరిధిలోని రంగాపూర్ సెక్షన్, ఐనోల్ దక్షిణ బీట్లోని అల్లంగట్టు అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్లో కొందరు అనుమానాస్పదంగా ఆయుధాలతో సంచరిస్తున్న దృశ్యాలు నమోదయ్యాయన్నారు. కెమెరా ట్రాప్లో నమోదైన 30 ఫొటోలను విశ్లేషించగా, అచ్చంపేట మండలంలో ని చేదురుబావి తండాకు చెందిన ఇద్దరు, చందాపూర్కు చెందిన ఒకరు, లింగోటంకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. విచారణలో ముడావత్ బాలు, ధారంగుల నర్సింహ, సరియా, పాస్టర్ జాన్పాల్పై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేసి చట్ట పరమైన చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. టైగర్ రిజర్వ్లో కెమెరా ట్రాప్ల సంఖ్యను పెంచడంతోపాటు డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ విస్తరించినట్లు అధికారులు తెలిపారు.అడవిలోని కీలక మా ర్గాలు, నీటి వనరులు, వన్యప్రాణుల సంచార ప్రాంతాలు, వేటకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోందన్నారు.కార్యక్రమంలో ఫారె స్ట్ రేంజ్ ఆఫీసర్ సుబూర్, సిబ్బంది పాల్గొన్నారు. ట్రాప్ కెమెరాలకు చిక్కిన వేటగాళ్లను పట్టుకున్న అటవీ అధికారులు నలుగురిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు -
గద్వాలలో భారీ చోరీ
● 12 తులాల బంగారం, 60 తులాల వెండి, రూ.6వేల నగదు అపహరణ ● గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు గద్వాల క్రైం: పట్టణంలో భారీ ఎత్తున దొంగతనం జరిగిన ఘటన బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు.. గద్వాల పట్టణంలోని భీంనగర్ కాలనీలో నివాసం ఉటుంన్న రహిమ్మత్పాష వృత్తిరీత్యా ట్రావెల్స్ (కారు అద్దె)కు ఇస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఉదయం వ్యక్తిగత పనులపై ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లాడు. అయితే గుర్తుతెలియని దుండగులు తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడి బీరువాలో భద్రపరచిన 12 తులాల బంగారు ఆభరణాలు, 60 తులాల వెండి, రూ.6వేల నగదును అపహరించారు. పనులు ముగించుకుని ఇంటికి వచ్చి చూడగా దొంగతనం జరిగినట్లు గుర్తించిన బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ కల్యాణ్కుమార్, క్రైం విభాగం, క్లూస్, ఫింగర్ ప్రింట్ సిబ్బంది చోరీ జరిగిన ఇంటికి చేరుకుని వివరాలు సేకరించారు. కాలనీలో సీసీ కెమెరాల ఫుటేజీలను సాంకేతిక విభాగ సిబ్బంది పరిశీలించారు. చుట్టూ పరిసర ప్రాంతాల్లోని కాలనీవాసులతో మాట్లాడి కొత్త వ్యక్తుల కదలికలపై ఆరా తీశారు. స్థానికుల్లో ఆందోళన జిల్లా కేంద్రంలో నిత్యం పోలీసు నిఘా, పెట్రోలింగ్ గస్తీ నిర్వహిస్తున్నప్పటికీ చోరీ జరగడంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. కొన్ని నెలలుగా జిల్లా కేంద్రంలో ఇంత పెద్ద ఎత్తున చోరీ జరగడం ఇదే అని స్థానికులు చెబుతున్నారు. చోరీ ఘటనపై పోలీసులు పలు బృందాలుగా విడిపోయి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. చోరీ తీరును బట్టి చూస్తే అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు చేసి ఉంటారనే అనుమానం వ్యక్తమవుతుంది. ఘటనపై బాధితుడు రహిమ్మత్పాష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ కల్యాణ్కుమార్ తెలిపారు. త్వరలో నిందితులను గుర్తించి బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని పోలీసులు తెలిపారు. -
పెరిగిన ఉల్లి ధర
● క్వింటాకు గరిష్టంగా రూ.1700 ● కనిష్టంగా రూ.1000 దేవరకద్ర: దేవరకద్ర మార్కెట్ యార్డులో బుధవారం ఉల్లి వ్యాపారం జోరుగా సాగింది. ధాన్యం సీజన్ లేకపోవడంతో మార్కెట్కు కేవలం ఉల్లిపాయలు మాత్రమే అమ్మకానికి వచ్చింది. వివిధ గ్రామాల నుంచి దాదాపు వేయి బస్తాల ఉల్లి అమ్మకానికి రావడంతో వ్యాపారులు వేలం వేసి ధరలు నిర్ణయించారు. నాణ్యమైన ఉల్లి క్వింటాకు గరిష్టంగా రూ.1700 వరకు పలికింది. కొన్ని వారాలుగా రూ.వేయి నుంచి 12వందల వరకు ఉన్న ఉల్లి ధర కొంత వరకు పెరగింది. ఇక కనిష్టంగా రూ.వేయి వరకు పలికింది. కనిష్ట ధరలు నిలకడగానే ఉన్నాయి. మార్కెట్ నిబంధనల ప్రకా రం 50కేజీల ఉల్లి బస్తా గరిష్టంగా రూ. 850, కనిష్టంగా రూ. 500 వరకు అమ్మకాలు సాగించారు. మార్కెట్ బయట కూడ రైతులు నేరుగా మార్కెట్ ధరలకే ఉల్లిని విక్రయించారు. -
ప్రభుత్వ బడుల్లో ప్రీ ప్రైమరీకి సన్నద్ధం
● జిల్లాలో 85 పాఠశాలలు ఎంపిక ● ఇన్స్ట్రక్టర్లు, ఆయాల నియామకానికి నోటిఫికేషన్ జారీ ● ఈ నెల 12 వరకు దరఖాస్తుకు గడువు హన్వాడ: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 2026– 27 విద్యా సంవత్సరానికి గాను జిల్లాలోని 85 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో నూతంగా ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ సెక్షన్లలో పనిచేయడానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఇన్స్ట్రక్టర్లు, ఆయాల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అర్హతలు.. వేతనాలు ప్రీ ప్రైమరీ తరగతుల్లో చిన్నారులకు విద్యా బోధన చేసే ఇన్స్ట్రక్టర్ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతోపాటు ప్రీ ప్రైమరీ శిక్షణ లేదా టీటీసీ ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తూ.. గౌరవ భృతి నెలకు రూ.8 వేలు చెల్లించనున్నారు. ఆయా నియామకానికి కనీసం 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. గౌరవ భృతిగా నెలకు రూ.6 వేలు చెల్లించనున్నారు. ఈ వేతనాన్ని ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ’ ద్వారా చెల్లిస్తారు. నియామకాల్లో స్థానిక ఆవాస ప్రాంత అభ్యర్థులకే ప్రాధాన్యత ఉంటుంది. దరఖాస్తు విధానం ఇలా.. ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత పాఠశాల లేదా మండల విద్యాధికారి కార్యాలయంలో దరఖాస్తులు పొంది.. పూర్తిచేసిన ఫారాలకు అవసరమైన విద్యార్హతలు, ఆధార్, బోనోఫైడ్, నివాస ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ కాపీలు జత చేసి ఈ నెల 12లోగా అక్కడే సమర్పించాల్సి ఉంటుంది. కాగా.. జిల్లాలోని హన్వాడ, జడ్బర్ల, భూత్పూర్, దేవరకద్ర, అడ్డాకుల, బాలానగర్, చిన్నచింతకుంట, గండేడ్, కోయిలకొండ, కౌకుంట్ల, మిడ్జిల్, మహమ్మదాబాద్, మూసాపేట్, నవాబ్పేట, రాజాపూర్, మహబూబ్నగర్ రూరల్, అర్బన్ మండలాల్లోని ఎంపిక చేసిన పాఠశాలల్లో ఖాళీలు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తుల కోసం పూర్తి వివరాలకు మండల విద్యాధికారిని సంప్రదించవచ్చు. -
ఒక్క క్షణం.. అంతా శూన్యం!
మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని డోకూరుకు చెందిన నర్సింహులు ఇంటి నిర్మాణం కోసం అప్పులు పెరిగిపోయి నిండా మునిగిపోవడం... అప్పుల వాళ్ల నుంచి ఒత్తిళ్లు పెరిగిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం సల్కెలాపురం శివారులో తాను కౌలుకు తీసుకున్న మామిడి తోటలో తన ఇద్దరు పిల్లలతో సహా భార్య కాళ్లూ చేతులు కట్టేసి సంపులో పడేశాడు. ఈ సంఘటన గత నెల 27వ తేదీన చోటు చేసుకుంది.. అప్పుల బాధ తట్టుకోలేక ఇలా క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఎన్నో కుటుంబాలకు శోకాన్ని మిగిలిస్తుంది. మహబూబ్నగర్ క్రైం: క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిలిస్తోంది..అంతకు మించి అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు.. నమ్ముకున్న వారు అనాథలుగా మారుతున్నారు.. పచ్చని కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు వస్తున్నాయి.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆత్మహత్య ఘటనలు వరుసగా చోటు చేసుకుంటుండటం.. ఈ సంఖ్య ఏటా పెరుగుతుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల నిత్యం ఏదో ఒకచోట బలవన్మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఎక్కువ మంది మహిళలు చిన్నపాటి విషయానికి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. కుటుంబంలో వచ్చిన గొడవల కారణంగా భార్యాభర్తలు.. తల్లిదండ్రులు ఇలా ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకోవడంతో వందల సంఖ్యలో పిల్లలు అనాథలుగా మారుతున్నారు. తల్లి ఆత్మహత్య చేసుకున్నా.. తండ్రి బలవన్మరణానికి పాల్పడినా అనాథలుగా మారేది వారి పిల్లలే అన్న చిన్న విషయం గుర్తుకు వస్తే చాలా వరకు ఆత్మహత్యలు ఆలోచనలతోనే ఆగిపోతాయి. 2025 నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో 962 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. అందులో అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లాలోనే 332 మంది ఉన్నారు. ఈ ఏడాది ఈ జిల్లాలో ఇప్పటికే 149 మంది ఆత్మహత్యలకు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ● ఆత్మహత్య చేసుకోవడం వెనుక ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. తీవ్రమైన నిరసన తెలపడం.. అభద్రతాభావం.. తన బాధ వినేవారు ఎవరూ లేరు అనే బాధతో ఆత్మహత్య చేసుకోవడానికి పురిగొల్పుతుంది. ఆత్మహత్య చేసుకుంటున్న వారిలో ఎక్కువగా నడివయస్కులవారే. తన మాట వినేవారు ఉన్నారు అని వారు భావిస్తే ఆత్మహత్య ఆలోచన రాకుండా ఉంటుంది. ● చదువుల్లో వెనుకబాటుతోపాటు ఆశించిన మార్కులు సాధించలేమనే కారణాలతో బలవన్మరణం చెందుతున్న విద్యార్థులెందరో ఉన్నారు. ప్రవేశ పరీక్షలలో విఫలమయ్యానని, పరీక్షల్లో అనుకున్న ర్యాంకు రాలేదని.. ఆ కళాశాలలో వాతావరణం బాగా లేదని.. లెక్చరర్స్ తిట్టారని.. ఇంట్లో అమ్మానాన్న మందలించారని.. ఫోన్ చూడొద్దంటున్నారని.. ప్రేమలో విఫలమయ్యామని.. ఇలా చిన్నపాటి కారణాలతోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 28 నుంచి 30 శాతం మంది చదువులో ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. విద్యార్థి దశలో 14– 20 ఏళ్లలోపు వారు ఎక్కువగా మరణిస్తున్నట్లు జాతీయ నేర గణాంకాల సంస్థ లెక్కలు బహిర్గతం చేసింది. ఈ తరహా ఆత్మహత్యలు జిల్లాలోనూ ఏడాదికి పదుల సంఖ్యలో ఉంటున్నాయి. ఇవీ కారణాలు.. క్షణికావేశంలో తనువు చాలిస్తున్నారు.. బలవన్మరణాలు పాల్పడుతున్నవారిలో16 నుంచి 40 ఏళ్ల వారే అధికం అనాథలుగా మారుతున్న పిల్లలు.. ఆగమవుతున్న బతుకులు కుటుంబంలో వచ్చే విభేదాలే కారణంఅంటున్న నిపుణులు ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న ఆత్మహత్యలతో ఆందోళన -
ప్రజల నడ్డి విరుస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న ఎన్డీఏ ప్రభు త్వాన్ని గద్దె దించాలని ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్రెడ్డి, జి.మధుసూదన్రెడ్డి పిలుపునిచ్చారు. టీపీసీసీ ఆదేశాల మేరకు డీసీసీ అధ్యక్షుడు ఎ.సంజీవ్ ముదిరాజ్ అధ్యక్షతన బుధవారం జిల్లాకేంద్రంలోని అశోక్ టాకీస్ చౌరస్తాలోని గాంధీ విగ్రహం వద్ద కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ మహాధర్నా నిర్వహించారు. అంతకుముందు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా గాంధీ విగ్రహం వరకు చేరుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ నిరసన నిరంతర పోరాటానికి నాంది కావాలన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అందుకుంటున్నాయని పేర్కొన్నారు. ఈ పన్నెండేళ్ల పాలనతో మధ్య తరగతి, పేద వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థులను ఆందోళనకు గురిచేసిన నీట్ పరీక్ష పత్రాల లీకేజీ ఘటన కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని, కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా చేయాలన్నారు. వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం గతంలో ఓటు చోరీ, ప్రస్తుతం సీట్ చోరీకి పాల్పడిందని ఆరోపించారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ను తిరస్కరించడం ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. త్వరలో ఎస్ఐఆర్ ప్రారంభం అవుతున్న సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లాకొత్వాల్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ కె.లక్ష్మణ్యాదవ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, నగర మేయర్ జి.మమత, డిప్యూటీ మేయర్ ఎం.సురేందర్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎ.ఆనంద్కుమార్గౌడ్, నాయకులు సత్తూర్ చంద్రకుమార్గౌడ్, ఎస్.వినోద్కుమార్, సాయిబాబా, బుద్దారం సుధాకర్రెడ్డి, రాములుయాదవ్, సీజే బెన్హర్, ఫయాజ్, అజ్మత్అలీ పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్రెడ్డి, మధుసూదన్రెడ్డి జిల్లాకేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహా ధర్నా -
ప్రైవేట్ ఆస్పత్రులపై తనిఖీలు పెంచుతాం
● పీహెచ్సీల్లో నాణ్యమైన వైద్యసేవలు అందిస్తాం ● నూతన డీఎంహెచ్ఓగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ శ్రీనివాస్ పాలమూరు: జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి(ఇన్చార్జి)గా డాక్టర్ శ్రీనివాస్ బుధవారం కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు. గతంలో డీఎంహెచ్ఓగా ఉన్న డాక్టర్ కృష్ణ నాగర్కర్నూల్కు బదిలీ కావడంతో ఆయన స్థానంలో నారాయణపేట జనరల్ ఆస్పత్రిలో సివిల్ సర్జన్ ఆర్ఎంఓగా పని చేస్తున్న డాక్టర్ శ్రీనివాస్ జిల్లాకు బదిలీపై రాగా.. ఆయన 2016 నుంచి 2017 వరకు డీఎంహెచ్గా జిల్లాలో పని చేయడం విశేషం. ఆ తర్వాత బదిలీపై వనపర్తి డీఎంహెచ్ఓగా వెళ్లారు. నూతనంగా బాధ్యతలు తీసుకున్న డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా పీహెచ్సీల్లో మెరుగైన వైద్యసేవలు అందించే విధంగా కృషి చేస్తామని, మెడికల్ ఆఫీసర్లు సమయపాలన పాటించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటానని తెలిపారు. ప్రధానంగా జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్లు, నర్సింగ్ హోంలలో నిత్యం తనిఖీలు చేస్తూ నిబంధనల ప్రకారం నడిచే విధంగా దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు. అల్ట్రాసౌండ్ స్కానింగ్ దగ్గర ఫారమ్–ఎఫ్ ఎంత మంది సమర్పిస్తున్నారు అనే విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. -
మామిడి పండ్ల ఉత్పత్తుల తయారీపై శిక్షణ
కొత్తకోట రూరల్: పెద్దమందడి మండలంలో మోజర్ల సమీపంలో గల శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయ పరిధిలో మామిడి పండ్లతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై మూడు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని నాబార్డ్ ఆర్థిక సహకారంతో రాంకీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వీణ జోష్ మాట్లాడుతూ.. మామిడి పండ్ల నుంచి తయారయ్యే విలువ ఆధారిత ఉత్పత్తులకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉందన్నారు. మహిళలు ఈ శిక్షణలో పాల్గొని ఉత్పత్తుల తయారీ నైపుణ్యాలతో పాటు మార్కెటింగ్ మెలకువలను కూడా నేర్చుకోవచ్చని తెలిపారు. వ్యవసాయ రంగంలో మహిళల పాత్ర కీలకమైందని, ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు మహిళల సాధికారతకు దోహదపడతాయని పేర్కొన్నారు. అనంతరం రాంకీ ఫౌండేషన్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ చిదంబేశ్వర్రెడ్డి మాట్లాడుతూ చిన్నమందడి, పెద్దమందడి తదితర గ్రామాల్లో రైతులకు మామిడి మొక్కలను పంపిణీ చేసినట్లు తెలిపారు. వాటి ద్వారా లభించే మామిడి పంటను సద్వినియోగం చేసుకునేందుకు మహిళా రైతులకు కోతానంతర నిర్వహణ, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై శిక్షణ అందించడం ద్వారా ఆర్థికంగా లాభపడే అవకాశాలు పెరుగుతాయన్నారు. ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శంకర స్వామి మాట్లాడుతూ కోత అనంతరం పండ్లలో 20 నుంచి 30 శాతం వరకు నష్టం సంభవించే అవకాశం ఉంటుందన్నారు. ఈ నష్టాన్ని తగ్గించేందుకు మామిడి తాండ్రతో పాటు ఇతర విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయడం రైతులకు ప్రయోజనకరమన్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ శిక్షణలో ఉత్పత్తుల తయారీ, ప్యాకెజింగ్, డిజిటల్ మార్కెటింగ్ తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ షహనాస్, బేబీ రాణి, 35 మంది మహిళా రైతులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
‘భూదాన్ భూములను రక్షించాలి’
జడ్చర్ల: రాష్ట్రంలో భూదాన్ భూములు ఆక్రమణకు గురయ్యాయని ఆయా భూముల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సర్వ సేవా సంఘం జాతీయ ట్రస్ట్, తెలంగాణ సర్వోదయ మండల్ రాష్ట్ర ఇన్చార్జి షేక్ హుస్సేన్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక అంబేడ్కర్ కళా భవనంలో జరిగిన సర్వోదయ మండల్ జిల్లా మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నాడు వినోభా బావే గొప్ప సంకల్పంతో భూదాన ఉద్యమానికి శ్రీకారం చుట్టారని, భూస్వాముల నుంచి భూములను ప్రభుత్వానికి అప్పజెప్పి ఆయా భూములను భూమి లేని నిరుపేదలకు పంచాలన్న లక్ష్యంగా ఉద్యమాన్ని ముందుకు నడిపారని గుర్తు చేశారు. అయితే భూదాన్ భూములు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లడం వలన అసలు లక్ష్యం నీరుగారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో భూదాన్ పోచంపల్లి నుంచి పాదయాత్ర మొదలు పెట్టి మహబూబ్నగర్ జిల్లాలో వేల ఎకరాల భూములను సేకరించి పేదలకు పంచారన్నారు. జిల్లాలో దాదాపు 2 వేల ఎకరాల భూదాన్ భూములు ఉన్నాయని, ఒక్క భూత్పూర్ మండలంలోనే 700 ఎకరాల భూమి ఉందన్నారు. సర్వోదయ మండల్ ఆధ్వర్యంలో భూములను వెలికి తీసి పేదలకు పంపిణీ చేసే విధంగా చర్యలు చేపడుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో యువజన విభాగం జాతీయ అధ్యక్షుడు అవినాష్, రాష్ట్ర అధ్యక్షుడు శంకర్, కార్యదర్శులు శంకర్నాయక్, గిరిప్రసాద్, జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య, నాయకులు బాలనర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు. నూతన కమిటీ ఎన్నిక: సర్వోదయ మండల్ మహబూబ్నగర్ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా జి.సత్యనారాయణరెడ్డి, కార్యదర్శులుగా బాగి కృష్ణయ్య, ఎండీ ఖలీం, ఉపాధ్యక్షుడిగా తెలుగు సత్తయ్య, సహాయ కార్యదర్శిగా సుందర్రాజ్, కోశాధికారిగా శివకుమార్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస్, కార్యదర్శిగా సురేశ్ను ఎన్నుకున్నారు. -
బహిరంగ సభలను జయప్రదం చేయాలి
మహబూబ్ నగర్ న్యూటౌన్: తెలంగాణ వ్యవసా య కార్మిక సంఘం రాష్ట్ర నాల్గవ మహాసభలు మహబూబ్గర్లో ఈ నెల 20, 21, 22 తేదీల్లో జరగనున్నాయని, సభలను విజయవంతం చేయా లని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకట్ పిలుపునిచ్చారు. మంగళవారం మహబూబ్నగర్లోని సంఘం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వలసలకు నిలయమైన పాలమూరు జిల్లాలో రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నారని, అత్యంత కరువు సమయంలో వ్యవసాయ కార్మిక సంఘం అంబలి కేంద్రాలు, గంజి కేంద్రాలు ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. అలాంటి సంఘం మహాసభలు ఈ జిల్లా కేంద్రంలో జరుగుతున్నాయన్నారు. సభకు ముఖ్య అతిథిగా త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ హాజరవుతాని, రాష్ట్రం నలుమూలల నుంచి వెయ్యి మంది ప్రతినిధులు చుట్టుపక్కల ఐదు రాష్ట్రాల నుంచి నాయకత్వం పాల్గొంటారని పేర్కొన్నారు. మహాసభలకు పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆరోపించారు. కార్మిక చట్టాలను పూర్తిగా తొలగించి నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకొస్తుందన్నారు. ఉపాధి హామీ కూలీలకు వరం లాంటి చట్టాన్ని మార్చి వీబీజీ రామ్జీ పథకం పేరుతో పేదలను, కూలీలను కూలికి దూరం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో 90 శాతం నిధులు కేటాయించాల్సిన కేంద్ర ప్రభుత్వం కేవలం 60 శాతం కేటాయిస్తామని మిగతా 40 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించాలని చెప్పడం సిగ్గుచేటన్నారు. కేంద్రం తీసుకొచ్చిన ఇలాంటి విధానాలకు వ్యతిరేకంగా వ్యవసాయ కార్మిక సంఘం రాబోయే కాలంలో పెద్దఎత్తున పోరాటాలు చేయడానికి ఈ మహాసభలు పునాదిగా మారుతాయని పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ఆర్ వెంకట్రాములు, ఏఐటీయూ సీనియర్ నాయకులు కిళ్లే గోపాల్, రైతు సంఘం రాష్ట్ర నాయకులు రాములు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఇయాల మోహన్, నాయకులు రాజకుమార్, శివవర్మ తదితరులు పాల్గొన్నారు. -
డ్రాగన్ ఫ్రూట్ తోట అగ్నికి ఆహుతి
– 10 లక్షల నష్టం వనపర్తి రూరల్: గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో డ్రాగన్ ఫ్రూట్ తోట దగ్ధమైన ఘటన శ్రీరంగాపురం మండలంలోని తాటిపాములలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన అంకె బాలయ్య తనకున్న ఎకరన్నర పొలంలో డ్రాగన్ ఫ్రూట్ తోట సాగు చేశారు. సోమవారం రాత్రి తోట వద్ద ఉన్న గడ్డికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పట్టించడంతో తోటలో ఉన్న గడ్డికి మంటలు చెలరేగి తోటంతా మంటలు వ్యాపించి మొక్కలు దగ్ధమయ్యాయి. దీంతో సుమారు రూ.10 లక్షలు నష్టపోయినట్లు బాధిత రైతు వాపోయాడు. ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని వేడుకున్నాడు. భార్యకు వీడియో కాల్ చేసి భర్త ఆత్మహత్య పహాడీషరీఫ్: ‘నేను చనిపోతున్నా.. నాకు బతకాలని లేదు’ అంటూ ఓ యువ కుడు భా ర్యకు వీడియో కాల్ చేసి, ఆత్మహత్య చేసుకున్న సంఘటన పహా డీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం జకినాలపల్లికి చెందిన పెరుమాళ్ల నరేష్(37) జీహెచ్ఎంసీలో పనిచేస్తూ తుక్కుగూడలో నివాసం ఉంటున్నాడు. ఇతనికి పదిహేనేళ్ల క్రితం శంషాబాద్కు చెందిన శ్రీలతతో వివాహం జరగగా ఇద్దరు కుమారులు ఉన్నారు. పది రోజుల క్రితం భార్యాభర్తలు గొడవ పడడంతో శ్రీలత తన పెద్ద కుమారుడిని తీసుకొని పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి తనతో పాటే ఉన్న చిన్న కుమారుడిని నరేష్ ఈనెల 8న భార్య వద్ద వదిలేసి వచ్చాడు. రాత్రి 12:30 గంటలకు శ్రీలతకు వీడియో కాల్ చేసి ‘నేను చనిపోతున్నా.. నాకు బతకాలని లేదు’ అని ఫోన్ కట్ చేశాడు. ఈ విషయాన్ని ఆమె నరేష్ మేనమామ రవీందర్కు చెప్పి, తుక్కుగూడకు వెళ్లి చూడగా అప్పటికే ఇంట్లోని ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రవీందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కూరగాయ తోటల్లో కలుపు నివారణ చర్యలు
అలంపూర్: వానాకాలం పంట సాగు చేసేందుకు అన్నదాతలు సిద్ధం అవుతున్నారు. ఈ సీజన్లో వివిధ రకాల పంటలతో పాటు కూరగాయలు, పప్పుదినుసుల పంటలు అధికంగా సాగు చేస్తారు. వీటి సాగులో కలుపు నివారించగలిగితేనే ఆశించిన దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుందని వ్యవసాయ శాఖ ఏడీఏ సక్రియానాయక్ రైతులకు వివరించారు. కలుపు నివారణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గుర్తించి వివరించారు. కూరగాయల పంట సాగులో.. వంగ, టమాట, ఉల్లి, వెల్లుల్లి పంటలు నాటడానికి ముందు ఎకరాకు 1 నుంచి 1.3 లీ పెండామిథాలిన్ లేదా 200 మి.లీ ఆక్సీఫ్లోరాపెన్ పిచికారీ చేయాలి. ఉల్లి, వెల్లుల్లి నాటిన 15–20 రోజులకు నేలలో తేమ చూసుకొని 200 మి.లీ ఆక్సీఫ్లోరోఫెన్ కూడా వాడవచ్చు. బెండలో విత్తిన వెంటనే లేదా 12 రోజుల్లో ఎకరాకు 1–1.3 లీటర్ల పెండిమిథాలిన్ లేదా 1.5–2 లీటర్ల అలాక్లోర్ చల్లాలి. క్యాబేజి, కాలిఫ్లవర్ నాటడానికి 1 లేదా 3 రోజుల ముందు ఎకరాకు 200 మి.లీ ఆక్సీఫ్లోరోఫెన్ చల్లాలి. కంద, చేమ పెండలం వేస్తే కలుపు ఎక్కువగా వచ్చే భూముల్లో మొదటి దపా తడిచ్చాక ఎకరాకు 1.3 లీటర్ల పెండిమిథాలిన్ లేదా ఆక్సీఫ్లోరోఫెన్ పిచికారీ చేయాలి. కంది: కంది విత్తిన వెంటనే 1 లేక 2 రోజుల్లో ఎకరాకు 1–1.3 లీ పెండిమిథాలిన్ వాడాలి. విత్తిన 30 లేక 60 రోజుల్లో గొర్రు గుంటకతో అంతర్ కృషి చేయాలి. లేదా ఇమజితాపీర్ ఎకరాకు 200 మి.లీ పిచికారీ చేయాలి. మినుము/పెసర: విత్తిన 1 లేక 2 రోజుల్లో ఎకరాకు 1–1.3 లీ పెండిమిథాలిన్ను, విత్తిన 20 రోజులకు గడ్డి జాతి కలుపు నివారణకు 250 మి.లీ పెనాక్స్ ప్రాప్ ఇథైల్ 5 శాతం మందును 200 లీటర్ల నీటిలో కలిపి చల్లాలి. మినుములు : పొలంలో గడ్డిజాతి వెడల్పాకు ఉంటే ఎకరాకు 200 మి.లీ ఇమిజితాపిర్ 10 శాతం పొడి పిచికారీ చేయాలి. ఈ మందు చల్లితే మినుము పెరుగుదల వారంపాటు ఆగినప్పటికి తిరిగి మాముల స్థితికి వస్తోంది. శనగ : పైర్లు విత్తిన వెంటనే లేదా ఒకటి లేక రెండు రోజుల్లో ఎకరాకు 1–1.3 లీ. పెండిమిథాలిన్ పిచికారీ చేయాలి. సోయా చిక్కుడులో విత్తిన 20 రోజుల సమయంలో 250 మి.లీ ఇమజితాపిర్ మందు కూడా పిచికారీ చేయవచ్చు. వేరుశనగ : విత్తిన వెంటనే లేదా 1 లేక 2 రోజుల్లో ఎకరాకు 1–1.6 లీ పెండిమిథాలిన్ లేదా 1.5–2 లీ. బుటాక్లోర్ 50 శాతం విత్తిన 20 లేక 25 రోజుల సమయంలో గడ్డి జాతి కలుపు నిర్మూలనకు ఎకరాకు పైనక్సాప్రాప్ ఇథైల్ పిచికారీ చేయాలి. పొలాల్లో పెరిగే పల్లేరు పొలాల్లో పెరిగే తిక్కబెండ పాడి–పంట -
ప్రాణం ఖరీదు రూ.9.50 లక్షలు!
●పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట 8గంటలపాటు ఉద్రిక్తత ● చర్చలకు వచ్చి ముఖం చాటేసిన డాక్టర్ అసోసియేషన్ పెద్దలు ● బాలింత శవంతో భజనలు.. అర్ధరాత్రి వరకు చర్చలు.. చివరకు రాజీ నారాయణపేట: ఓ మహిళ ప్రాణం పోయింది.. ఇద్దరు చిన్నారులు తల్లిని కోల్పోయారు.. ఓ కుటుంబం మానని విషాదంలో మునిగిపోయింది. చివరకు జరిగిన చర్చలన్నీ ఒకే సంఖ్య వద్ద ఆగిపోయా యి. అదే రూ.9.50 లక్షలు. నారాయణపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వద్ద సోమవారం రాత్రి 8గంటల నుంచి అర్ధరాత్రి 3:30గంటల వరకు కొనసాగిన పరిణామాలు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మృతురాలు బాలింత నవనీత(25) మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. దాదాపు ఏడున్నర గంటలపాటు మృతదేహాన్ని అక్కడే ఉంచి భైటాయించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. శవంతో భజనలు చేస్తూ.. న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదంటూ కుటుంబ సభ్యులు పట్టుబట్టడంతో ఆస్పత్రి యాజమాన్యంతోపాటు ప్రైవేట్ వైద్యవర్గాలపై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. అసలేం జరిగింది? కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. నవనీత రెగ్యులర్ చెకప్ కోసం ఆస్పత్రికి వస్తూ ఉండేది. ప్రసవ సమయంలో పరిస్థితి విషమించడంతో వైద్యులు సిజేరియన్ చేశారు. దాదాపు 3గంటలపాటు కొనసాగిన శస్త్రచికిత్స అనంతరం పసికందును సురక్షి తంగా బయటకు తీశారు. అయితే ఆ తర్వాత నవనీతకు తీవ్రమైన రక్తస్రావం ఆగకపోవడంతో పరిస్థి తి క్లిష్టంగా మారింది. ఆమెకు పది యూనిట్ల వరకు రక్తం ఎ క్కించినట్లు సమాచారం. రక్తస్రావం నియంత్రణలో కి రాకపోవడంతో వైద్యులు మళ్లీ శస్త్రచికిత్స చేసి గర్భసంచిని తొలగించినట్లు కుటుంబ సభ్యు లు ఆ రోపిస్తున్నారు. అనంతరం నవనీత ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందని వైద్యులు చెప్పారు. ఆస్పత్రి వాదన ఇదే.. మరోవైపు నవనీత ఆరోగ్య పరిస్థితి ముందే క్లిష్టంగా ఉందని కుటుంబ సభ్యులే తమకు చెప్పారని ఆస్ప త్రి వర్గాలు పేర్కొంటున్నాయి. ‘ప్రభుత్వ ఆ స్పత్రికి వెళితే పరిస్థితి చేయి దాటిపోతుంది.. మీరే ఎలా గైనా కాపాడాలని కుటుంబ సభ్యులు కోరడంతోనే తాము సిజేరియన్ చేశామని..అనంతరం రక్తం ఎ క్కించి ప్రాణాలు కాపాడేందుకు అన్ని ప్ర యత్నా లు చేశామని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నట్లు తెలిసింది. రూ.55లక్షల డిమాండ్తో ప్రారంభమైన చర్చలు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ప్రైవేట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రంగంలోకి దిగారు. సో మవారం రాత్రి 11గంటల ప్రాంతంలో ప్రారంభమై న చర్చల్లో మృతురాలి కుటుంబ సభ్యుల తరఫున కొంతమంది పెద్దలు మొదట రూ.55లక్షల పరిహారం కోరినట్లు సమాచారం. మృతురాలి ఇద్దరు చిన్నారుల పేర్లపై చెరో రూ.20 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని, ఆస్పత్రికి ఖర్చు అయినా రూ.15లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అర్థరాత్రి వరకు సాగిన రాజీ ప్రయత్నాలు మొదట రూ.5లక్షల వరకు పరిహారం ఇవ్వడానికి సిద్ధమయ్యారని, అనంతరం చర్చలు నిలిచిపోగా.. మృతురాలి కుటుంబ సభ్యులు ససేమీరా అనడంతో రాత్రివేళల్లో మరో మధ్యవర్తిని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. ఒక పోలీసు అధికారి కూడా సంధానకర్తగా వ్యవహరించినట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి. సుదీర్ఘ చర్చల అనంతరం రూ.9. 50లక్షల పరిహారంపై ఇరు వర్గాలు అంగీకరించినట్లు సమాచారం. అందులో భాగంగా రూ.లక్ష అడ్వాన్స్గాన అందజేసినట్లు విశ్వసనీయ సమాచారం. అనంతరం వారం రోజుల్లో మిగతా డబ్బు లు ఇచ్చేందుకు రాజీ కుదిరినట్లు తెలుస్తోంది. చివరకు అంత్యక్రియలకు తరలింపు రాజీ కుదరడంతో కుటుంబ సభ్యులు ఆందోళన విరమించి మతదేహాన్ని అంత్యక్రియల కోసం స్వగ్రామానికి తరలించారు. అయితే ఈ ఘటన జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో అత్యవసర వైద్య సదుపాయాల పరిస్థితిపై మరోసారి చర్చకు దారితీసింది. -
విమానం ఎక్కినప్రతిభావంతులు
కల్వకుర్తి రూరల్: పదో తరగతిలో 550కి పైగా మార్కులు సాధించిన 14 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మంగళవారం విద్యా స్వేచ్ఛ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో విమానం ఎక్కారు. వీరు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో పలు ప్రాంతాలను సందర్శించి తిరుగు ప్రయాణంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలులో తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. విద్యార్థులతో పాటు ఫౌండేషన్ బాధ్యులు వాసుదేవ్, శేషగిరి ఉపాధ్యాయులు నిర్మల, శ్రీనివాసులు, రాధిక పలువురు విహారయాత్రకు వెళ్లినట్లు ఫౌండేషన్ సభ్యులు పేర్కొన్నారు. -
రైలుకింద పడి వ్యక్తి దుర్మరణం
జడ్చర్ల: కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ ప్రయాణికుడు ప్రమాదవశాత్తు జారి కిందపడి దుర్మరణం చెందిన ఘటన స్థానిక రైల్వేస్టేషన్లో మంగళవారం చోటు చేసుకుంది. రైల్వే ఎస్ఐ రాజు కథనం మేరకు.. నవాబ్పేట మండలం తిమ్మాయిపల్లికి చెందిన బొట్టు శ్రీను(30) జడ్చర్ల రైల్వేస్టేషన్లో మహబూబ్నగర్ వెళ్లేందుకు గుంతకల్ వెళ్లే రైలు ఎక్కుతుండగా రైలు కదలడంతో ప్రమాదశాత్తు జారి ప్లాట్ఫాం మధ్యలో పడి మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యం కొల్లాపూర్: మండలంలోని జటప్రోల్ గ్రామ సమీపంలో పల్లెరామయ్య చెరువు సమీపంలో స్థానికులు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీఐ శంకర్, ఎస్ఐ పవన్కుమార్, క్లూస్ టీం సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మృతదేహన్ని పరిశీలించారు. దీనిపై సీఐ మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన రైతు కుర్వ రామస్వామి పొలం వద్ద గుర్తుపట్టలేనంతగాఎముకలు తేలిన మృతదేహం లభ్యమైందన్నానరు. చనిపోయిన వ్యక్తికి సుమారు 40 నుంచి 50 ఏళ్ల వయస్సు ఉండొచ్చని అంచనా వేశారు. మృతుడు గులాబీ రంగు టీషర్ట్ ధరించిన ఆనవాళ్లు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. మృతదేహనికి పోర్టుమార్టం చేయడం ద్వారా మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని, ఎవరైనా గుర్తిస్తే స్థానిక పోలీస్స్టేషన్ను సంప్రదించాలని కోరారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కిరాణానికి వెళ్తే.. 12తులాల బంగారం చోరీ మక్తల్: మక్తల్ పట్టణంలో ఓ కిరాణంలో సరుకులు తీసుకునేందుకు వెళ్లిన ఓ మహిళ చేతి హ్యాండ్బ్యాగ్ నుంచి గుర్తుతెలియని మహిళ 12తులాల బంగారం అపహరణకు గురైనట్లు ఆలస్యంగా బయటపడింది. మక్తల్లో ఆదివారం సంత ఉండటంతో నారాయణపేట మండలం అప్పిరెడ్డిపల్లెకు చెందిన శృతి మక్తల్కు వచ్చింది. హ్యాండ్బ్యాగ్ తగిలించుకోని కిరాణంలోకి వెళ్తుండగా.. గుర్తుతెలియని మహిళ 12తులాల బంగారం ఎత్తుకెళ్లినట్లు మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మక్తల్ మండలం దాదన్పల్లి తల్లిదండ్రుల వద్దకు వెళ్లి తిరిగి వద్దామని ఆదివారం అప్పిరెడ్డిపల్లి నుంచి తన దగ్గరున్న బంగారం తీసుకొని హ్యాండ్బ్యాగ్లో వేసుకొని వచ్చింది. బస్టాండ్లో బస్సు దిగి మారుతి కిరాణం వద్దకు చేరుకొని తమ పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్తోపాటు మరికొన్ని సామాన్లను తీసుకొందామని వెళ్లారు. అక్కడ తీసుకొన్న తర్వాత తండ్రికి ఫోన్ చేసి అక్కడి నుంచి బైక్పై తండ్రీకూతురు దాదన్పల్లికి చేరుకొన్నారు. అయితే సోమవారం బంగారం తీసుకోందామంటే బ్యాగ్లో చూసే సరికే లేకపోవడంతో అశ్యర్యపడింది. వెంటనే అప్పిరెడ్డిపల్లిలో తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి మక్తల్లో మారుతి కిరాణంకు చేరుకుని సీసీ ఫుటేజీలను పరిశించారు. శృతి సామాన్లను తీసుకుంటుండగా గుర్తుతెలియని మహిళ ఆమె వెంట తిరుగుతూ గమనిస్తుంది. సీసీ ఫుటేజీల్లో కన్పిస్తున్న మహిళ ఎవరని గుర్తుపడటంలేదు. ఆదివారం సంత కావడంతో షాపు రద్దీ అధికంగా ఉండటంతో చోరీ చేసేందుకు అనుకూలంగా ఉండేది. నడిబొడ్డున చోరీ కావడం విశేషంగా మారింది. ఈ విషయమై బాధితురాలు మంగళవారం మక్తల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
గ్రామీణ క్రీడాకారులకు అవకాశం కల్పిస్తాం
● భారత జట్టు మాజీ క్రికెటర్, హెచ్సీఏఆపరేషన్స్ హెడ్ అంబటి రాయుడు మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాలోని గ్రామీణ క్రీడాకారులకు భవిష్యత్లో మంచి అవకాశాలు కల్పిస్తామని భారత జట్టు మాజీ క్రికెటర్, హెచ్సీఏ ఆపరేషన్స్ హెడ్ అంబటి రాయుడు అన్నారు. జిల్లాకేంద్రం బోయపల్లి సమీపంలోని ఎండీసీఏ మైదానం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్ జిల్లా అండర్–14, 16 వన్ డే క్రికెట్ టోర్నీ మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్సీఏ నుంచి భారత జట్టుకు అధిక సంఖ్యలో క్రీడాకారులను ఎంపిక చేసేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ ఇప్పిస్తామన్నారు. గ్రామీణ క్రీడాకారులు భారత జట్టుకు ఆడాలన్నదే హెచ్సీఏ లక్ష్యం అన్నారు. ముఖ్యంగా క్రికెట్ అభివృద్ధికి, ఆట ప్రమాణాల పెంపునకు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. హెచ్సీఏ కార్యదర్శి మన్నె జీవన్రెడ్డి మాట్లాడుతూ మొదటిసారిగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ టీ–20 క్రికెట్ ప్రారంభం కానుందన్నారు. ప్రతి జట్టులో నలుగురు గ్రామీణ క్రీడాకారులకు అవకాశం కల్పిస్తామన్నారు. వచ్చే రెండేళ్లలో తెలంగాణ టీ–20 లీగ్ నుంచి రాష్ట్ర, జిల్లా క్రీడాకారులు భారత జట్టుతోపాటు ఐపీఎల్ తరపున ఆడ తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ క్రికెటర్లను తయారు చేసే కేంద్రంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతామన్నారు. ఎండీసీఏ మైదానంలో ఫ్లడ్ లైట్లు, అకాడమీ ఏర్పాటుకు కృషి చేస్తామన్నా రు. అనంతరం ఉమ్మడి జిల్లా క్రికెట్ టోర్నీ అండర్ –14లో విజేతగా మహబూబ్నగర్, రన్నర్గా జడ్చ ర్ల, అండర్–16లో విజేతగా జడ్చర్ల, రన్నర్గా నిలిచిన మహబూబ్నగర్ బాలుర జట్లకు బహుమతు లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎండీసీఏ చీఫ్ ప్యాట్రన్, న్యాయవాది మనోహర్రెడ్డి, కార్యదర్శి రాజశేఖర్, ప్రతినిధులు సురేష్కుమార్, వెంకటరామారావు, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కేసుల పరిష్కారంలో జాప్యం చేయొద్దు : ఎస్పీ
మహబూబ్నగర్ క్రైం: పోలీస్స్టేషన్ పరిధిలో అతి సున్నితమైన కేసులపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం లేకుండా స్పందించాలని ఎస్పీ జానకి అన్నారు. మహబూబ్నగర్ రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని మంగళవారం రాత్రి వార్షిక తనిఖీ నిర్వహించారు. సర్కిల్ పరిధిలోని రూరల్, హన్వాడ, నవాబ్పేట, కోయిలకొండ, మహమ్మదాబాద్ స్టేషన్లకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే నేర నియంత్రణ చర్యలు, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, వారెంట్లు అమలు, రౌడీషీటర్ల, హిస్టరీ షీటర్ల పర్యవేక్షణ, కమ్యూనిటీ పోలీసింగ్పై తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఒక ఎస్హెచ్ఓగా అన్ని పోలీస్ స్టేషన్ల పనితీరును నిత్యం పర్యవేక్షించాలన్నారు. కేసుల దర్యాప్తులో నాణ్యత మెరుగుపరచాలని, గ్రేవ్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. నేరాల కట్టడి కోసం గస్తీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, పెండింగ్ వారెంట్ల అమలు వేగవంతం చేయాలన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం తనిఖీలు చేపట్టాలన్నారు. సీసీ టీవీ నిఘా వ్యవస్థ విస్తరణకు కృషి చేస్తూ ప్రజలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ గాంధీనాయక్ పాల్గొన్నారు. 25 మంది డీటీలకు పదోన్నతులు జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 25 మంది డిప్యూటీ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు మంగళవారం సీసీఎల్ఏ కమిషనర్ లోకేష్కుమార్ ఉత్తర్వులు జారీ చేస్తూ జిల్లాలకు కేటాయించారు. ఇందులో నాగర్కర్నూల్ జిల్లాకు రాజీవ్రెడ్డి, రామకృష్ణ, రవి, పుష్పలత, మహబూబ్నగర్ జిల్లాకు సుజాతమ్మ, హరిందర్రెడ్డి, శ్రీను, సుదర్శన్రెడ్డి, బాలరాజు, నారాయణపేట జిల్లాకు గాయత్రి, రాజ్గోపాల్, కిషోర్కుమార్, దీపిక, వియోచన, వనపర్తి జిల్లాకు వెంకటేశ్, వేణుగోపాల్రెడ్డి, విజయ్కుమార్, కరుణాకర్, నదీమ్, గద్వాల జిల్లాకు రాఘవేందర్, తిలక్రెడ్డి, లక్ష్మీకాంత్, శ్రీనివాస్, వాసుదేవరావులను కేటాయించారు. వీరికి ఆయా జిల్లాలోని మండలాలను కలెక్టర్లు కేటాయిస్తారు. అయితే మహబూబ్నగర్లో చాలామంది డీటీలు ప్రమోషన్ను తీసుకోవడానికి ఇష్టంగా లేరని సమాచారం. మహబూబ్నగర్ను విడిచి ఉమ్మడి జిల్లాలోని ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు సుముఖంగా లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఆర్ఎన్ఆర్ క్వింటా రూ.2,846 జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో మంగళవారం వివిధ ప్రాంతాల నుంచి భారీగా ధాన్యం విక్రయానికి వచ్చింది. కాగా.. ఆర్ఎన్ఆర్ రకం క్వింటా గరిష్టంగా రూ.2,846, కనిష్టంగా రూ.1,681 ధరలు లభించాయి. అలాగే మొక్కజొన్న క్వింటా గరిష్టంగా రూ.2,016, కనిష్టంగా రూ.1,667, ఆముదా లు క్వింటా గరిష్టంగా రూ.6,275, కనిష్టంగా రూ.6,249, వేరుశనగ గరిష్టంగా రూ.3,100, కనిష్టంగా రూ.3,051 చొప్పున వచ్చాయి. -
‘చేనేత’ ఎన్నికలు
అమరచింత: చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఎట్టకేలకు పచ్చజెండా ఊపింది. మొదటి విడతలో 50 మంది సభ్యులున్న సంఘాలకు ఈ నెల 12న ఎన్నికలు నిర్వహించేందుకు చేనేత, జౌళిశాఖ అధికారులు ప్రకటన జారీ చేశారు. దీంతో ఉమ్మడి జిల్లాలో చేనేత సహకార సంఘాల్లో ఎన్నికల వేడి రాజుకుంది. ● చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు ఏప్రిల్ 4 నుంచి మే నెల 15 వరకు సహకార సంఘాల సభ్యుల ఓటరు జాబితా తయారు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా.. చేనేత జౌళిశాఖ అధికారులు ఓటరు జాబితా సవరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. అయితే సంఘాల్లో ఎలాంటి అప్పులు లేని సభ్యులు మాత్రమే పోటీ చేసే, ఓటు వేసే హక్కు ఉంటుందని ప్రకటించడంతో ఆశావహులు సంఘాలు, బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను చెల్లించారు. ఈ నెల 12న 9 మంది డైరెక్టర్లను ఎన్నుకోవడంతో పాటు వారిలో అధ్యక్షుడు, ఉపాధ్యక్షులను ప్రకటిస్తారు. ఈ వ్యవహారమంతా అభ్యర్థికి సభ్యులు చేతులెత్తి ఓటేసే ప్రక్రియతో కొనసాగనుందని అధికారులు తెలిపారు. 100 మంది కంటే ఎక్కువ మంది సభ్యులున్న సంఘాలకు ఇదే నెల చివరి వారంలో ఓటింగ్ విధానంలో ఎన్నికలను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. 2013లో చివరిసారి.. రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాల ఎన్నికలు 2013, ఫిబ్రవరిలో చివరిసారి జరగగా.. 2018లో వీటి కాల పరిమితి ముగిసింది. ఆ తర్వాత మళ్లీ ఎన్నికలు జరగలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ఎనిమిది ఏళ్ల పాటు పాత పాలకవర్గాల పదవీ కాలన్ని మొత్తం 16 పర్యాయాలు పొడిగించింది. చివరిసారి 2026, మార్చి 9 నుంచి మే నెల 10 వరకు పదవీ కాలం పొడిగించారు. జిల్లాలోని పలు సొసైటీల్లో అక్రమాలు జరిగాయని తేలడంతో పీఏసీఎస్ చట్టం సెక్షన్ 51 కింద అధికారులను పర్సన్ ఇన్చార్జ్లుగా నియమించారు. మొదటి దశలో 10 సంఘాలకు... చేనేత సహకార సంఘాల ఎన్నికలు దశల వారీగా నిర్వహించనున్నారు. మొదటి విడతలో 50 ఓట్ల కంటే తక్కువ ఉన్న సంఘాలకు ఈ నెల 12న నిర్వహించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని 10 సంఘాలకు ఎన్నికలు జరగనుండగా.. చేతులెత్తే పద్ధతిలో 9 మంది డైరెక్టర్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. అదేరోజు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక ఉండనుంది. నారాయణపేటలోని చేనేత సంఘం, మార్కండేయ మహిళా సంఘం, శ్రీలక్ష్మి సిల్క్స్ సంఘం, ఆదర్శ చేనేత సంఘాలతో పాటు చిన్నజట్రం, కోటకొండ, మద్దూరులోని శ్రీబాలాజీ, పోతిరెడ్డిపల్లిలోని టసర్ ఖాదీ సిల్క్ బోర్డు, గద్వాల జిల్లాలో అనంతపురం పవర్లూమ్ సంఘం, నాగర్కర్నూల్ జిల్లాలోని బిజినేపల్లి సంఘాలకు మొదటి విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఇలా.. జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్, నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం 54 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో కొన్ని సంఘాలు పనిచేస్తుండగా.. మరికొన్ని అప్పుడప్పుడు పని చేస్తున్నాయని, కొన్ని సంఘాలు మూతబడ్డాయని చేనేత, జౌళిశాఖ అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 25 వేల మంది చేనేత కార్మికులు ఉన్నారు. ఈ నెల 12న నిర్వహణకు ప్రభుత్వం పచ్చజెండా మొదటివిడతలో 50 మంది సభ్యులున్న సంఘాలకే.. ఓటరు జాబితా సిద్ధం చేసిన అధికారులు డిఫాల్టర్లు, మృతిచెందిన వారి ఓటుహక్కు తొలగింపు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 54 చేనేత సహకార సంఘాలు -
పేదలకు భరోసా సీఎంఆర్ఎఫ్: యెన్నం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో భరోసా కల్పిస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం 80 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రెండున్నర ఏళ్లలో సుమారు మూడు వేల మందికి ఈ నిధి నుంచి ఆర్థికసాయం చేశామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలను పెంచుతూ, వైద్యులను నియమిస్తూ రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. అలాగే విద్య, సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. నాలెడ్జ్ సెంటర్ పనుల పరిశీలన.. అనంతరం నగరంలోని ఆర్అండ్బీ అతిథి గృహం ప్రాంగణంలో నిర్మిస్తున్న పూలె–అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ పనులను నాణ్యతగా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.రామాంజులరెడ్డి, పబ్లిక్ హెల్త్ ఈఈ విజయభాస్కర్రెడ్డి, ఎంఈ మురళీమోహన్రెడ్డి, ముడా చైర్మన్ కె.లక్ష్మణ్యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్పన్ బెక్కరి అనిత, నగర డిప్యూటీ మేయర్ ఎం.సురేందర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాములుయాదవ్, అజ్మత్అలీ, రఘు, శరత్, రమేష్నాయక్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు..
చేనేత సహకార సంఘా ల ఎన్నికల నిర్వహణకుగాను ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. మొదటి విడతలో 50 మంది సభ్యులున్న సంఘాలకు ఈ నెల 12న ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. మిగిలిన సంఘాల ఎన్నికలు ఉన్నతాధికారుల నుంచి నోటిఫికేషన్ వెలువడగానే నిర్వహిస్తాం. సంఘాల వారీగా ఓటరు జాబితా సిద్ధం చేసి సంఘాలకు పంపించాం. యాక్టివ్గా ఉన్న చేనేత సహకార సంఘా ల్లో చనిపోయిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశాం. – ఇందిర, ఏడీ, చేనేత జౌళిశాఖ, గద్వాల జిల్లా ● -
డీఎంహెచ్ఓ కృష్ణ బదిలీ
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని బదిలీ చేయడం జరిగింది. అలాగే డీఎంహెచ్ఓగా డిప్యూటేషన్పై పనిచేస్తున్న కృష్ణ నాగర్కర్నూల్ డీఎంహెచ్ఓగా బదిలీ కాగా.. ఆయన స్థానంలో జిల్లాకు ఇంకా ఎవరిని కేటాయించలేదు. అలాగే జిల్లా అంధత్వ నివారణ సంస్థ అధికారిగా డాక్టర్ సునీతరెడ్డి వికారాబాద్ నుంచి బదిలీపై వచ్చారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి (డీఐఓ)గా డాక్టర్ శైలజ నారాయణపేట నుంచి బదిలీపై వచ్చారు. ఇక పీహెచ్సీల్లో పనిచేస్తున్న వైద్యాధికారులు, ఫార్మాసిస్ట్లు, 24 మంది ఏఎన్ఎంలు, ముగ్గురు ఎంపీహెచ్ఓలు, నలుగురు హెల్త్ ఎడ్యుకేటర్లు, సూపర్వైజర్లు, సీనియర్ అసిస్టెంట్స్, జూనియర్ అసిస్టెంట్స్, సీహెచ్ఓలు బదిలీ కావడం జరిగింది. కిందిస్థాయి సిబ్బందికి జిల్లాలోని ఆయా పీహెచ్సీలు, మెడికల్ కళాశాల, జనరల్ ఆస్పత్రిలో పోస్టింగ్ ఇవ్వగా.. కొందరు ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లారు. -
గిరిజన యువత వృత్తి నైపుణ్యం పెంచుకోవాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): గిరిజన యువత వృత్తి నైపుణ్యం పెంచుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి ఛత్రునాయక్ అన్నారు. గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో ట్రైకార్ ద్వారా నిర్వహిస్తున్న నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన కార్యక్రమాలపై గిరిజన యువతకు అవగాహన కల్పించారు. గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ఉచిత నైపుణ్య శిక్షణ అందిస్తున్నట్లు చెప్పారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించడం, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా చేయడం, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగావకాశాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు పొందాలంటే సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్, వ్యక్తిత్వ వికాసం, వృత్తిపరమైన శిక్షణ ఎంతో అవసరమన్నారు. ముఖ్యంగా యువతకు నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా వారికి ఉపాధి అవకాశాలు కల్పించి, ఉజ్వల భవిష్యత్కు బలమైన పునాది వేయగలమని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న గిరిజన యువతీ, యువకులకు నిపుణులు ప్రేరణాత్మక శిక్షణ ఇచ్చారు. ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన 18–35 ఏళ్లలోపు నిరుద్యోగ గిరిజన యువతకు హైదరాబాద్లోని మెగా స్కిల్ సెంటర్లో నైపుణ్య శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు. కోర్సును బట్టి శిక్షణ కాలవ్యవధి 3 నుంచి 6 నెలల వ్యవధి ఉంటుందని, శిక్షణ కాలంలో అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ నిర్మల, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఛత్రునాయక్, నిపుణులు రవిశంకర్, రాంబాబు, నేహా డాలీ తదితరులు పాల్గొన్నారు. -
జనరల్ ఆస్పత్రిలో భారీగా బదిలీలు
పాలమూరు: మహబూబ్నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రిలోపాటు పాలమూరు మెడికల్ కళాశాల లో పనిచేస్తున్న అన్నివిభాగాల హెచ్ఓడీలు హైదరాబాద్కు బదిలీ అయ్యారు. మొత్తం 9 విభాగాల ప్రొఫెసర్ల (హెచ్ఓడీ)లకు స్థానం చలనం కావడం విశేషం. మత్తు విభాగం హెచ్ఓడీ డాక్టర్ మాధవి ఉస్మానియా, రేడియాలజీ విభాగం హెచ్ఓడీ హన్మంతు ప్రసాద్ గాంధీ ఆస్పత్రి, ఈఎన్టీ హెచ్ఓడీ డాక్టర్ శ్రీకాంత్ కోఠి, చిన్నపిల్లల విభాగం (పీడియాట్రిక్) హెచ్ఓడీ డాక్టర్ సురేష్ శ్రీనివాస్ నిలోఫర్, జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ డాక్టర్ అమరావతి ఉస్మానియా, ఎస్పీఎం హెచ్ఓడీ డాక్టర్ ఉషారాణి ఉస్మానియా, ఫిజియాలజీ హెచ్ఓడీ డాక్టర్ సునందిని ఉస్మానియా, ఫోరెన్సిక్ హెచ్ఓడీ డాక్టర్ పార్వతి ఉస్మానియా, మైక్రోబయాలజీ హెచ్ఓడీ డాక్టర్ రమాదేవి నిలోఫర్కు బదిలీ అయ్యారు. అదేవిధంగా జనరల్ ఆస్పత్రిలోని గైనిక్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ లక్ష్మీపద్మప్రియ నారాయణపేట, జనరల్ మెడిసిన్లో అసోసియేట్ ప్రొఫెసర్ స్వప్న ఉస్మానియాకు, జనరల్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బాల శ్రీనివాస్ నాగర్కర్నూల్కు బదిలీ అయ్యారు. ఇక జిల్లాకు వచ్చిన వారిలో ఎస్పీఎం హెచ్ఓడీగా డాక్టర్ కోటేశ్వరమ్మ గాంధీ నుంచి బదిలీపై వచ్చారు. మైక్రోబయాలజీ హెచ్ఓడీగా డాక్టర్ శ్రీవాణి, జనరల్ మెడిసిన్ హెచ్ఓడీగా డాక్టర్ శకుంతల రావడం జరిగింది. కొత్తవారు ఎప్పుడో..? జిల్లా జనరల్ ఆస్పత్రితోపాటు మెడికల్ కళాశాలలోని ఆయా విభాగాల్లో పనిచేసే హెచ్ఓడీలు (ప్రొఫెసర్లు) బదిలీ కావడంతో సదరు పోస్టులు ఖాళీ అయ్యాయి. దీంతో ఖాళీ అయిన పోస్టుల్లో కొత్తవారు వచ్చి విధుల్లో చేరే వరకు ఎన్ని రోజులు పడుతుందనే విషయం తెలియడం లేదు. సాధారణంగా హైదరాబాద్ నుంచి బదిలీ అయ్యి వచ్చే వారిలో ఇక్కడ విధుల్లో చేరడానికి ఆసక్తి చూపారు. ఒకవేళ చేరిన నిత్యం హైదరాబాద్ నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో స్థానికంగా వారు అందుబాటులో ఉండే అవకాశం లేదు. రోగులకు దిక్కెవరు..? ప్రస్తుతం జిల్లా జనరల్ ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లు, అసోసియేట్లు, అసిస్టెంట్లకు బదిలీ అయిన నేపథ్యంలో కొత్త వారు వచ్చి విధుల్లో చేరడానికి ఇంకా సమయం పట్టనుంది. అలాగే కొంతమందిని ఇక్కడికి బదిలీ చేసిన విధుల్లో చేరడానికి ఏమాత్రం ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో జనరల్ ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చే రోగులకు అవస్థలు తప్పవు. అందరూ విధుల్లో ఉన్న రోగులకు సరైన వైద్యం అందక ఇబ్బందులు పడేవారు ప్రస్తుతం అందరూ బదిలీ హడావుడిలో ఉండటంతో రోగులను పట్టించుకునే నాథుడే ఉండరు. దీంతో అడ్మిట్ అయిన రోగులతోపాటు అవుట్ పేషెంట్లకు మెరుగైన చికిత్స అందడం కష్టసాధ్యమే అనిపిస్తోంది. 9 విభాగాల హెచ్ఓడీలు, అసోసియేట్లకు స్థానచలనం డీఎంహెచ్ఓ కృష్ణ నాగర్కర్నూల్కు.. ఆరోగ్య శాఖలో వైద్యాధికారులు,ఏఎన్ఎంలు అందరూ బదిలీ జనరల్ ఆస్పత్రిలో కొత్త వైద్యులు విధుల్లో చేరే వరకు రోగులకు తప్పని అవస్థలు -
వైవిధ్యమే లాభదాయకం
జిల్లాలో రైతులు కేవలం వరి, పత్తికే పరిమితం కాకుండా కందులు, జొన్న, నువ్వులు, వేరుశనగ, కూరగాయల వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టిసారించాలి. ఈ పంటలు తక్కువ నీటితో సాగవడంతోపాటు మార్కెట్లో మంచి ధరలు లభించే అవకాశం ఉంది. భూసార పరీక్షలు చేయించుకొని, మట్టి ఆరోగ్య కార్డు సూచనల మేరకు ఎరువులు వినిగియోగిస్తే ఉత్పత్తి వ్యయం తగ్గి దిగుబడి పెరుగుతుంది. వర్షపాతం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని శాసీ్త్రయ పద్ధతుల్లో సాగు చేపడితే రైతులు మెరుగైన ఆదాయం పొందగలరు. – వెంకటేష్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ● -
కూలీలు రావడం లేదు..
మా పొలంలో వరి, బెండ పంటలను సాగు చేశాను. మా పొలం సమీపంలోనే పెద్ద మొత్తంలో చేపల చెరువులను సాగుచేస్తున్నారు. చేపలకు నిత్యం కుళ్లిన చికెన్ వ్యర్థాలను, కుళ్లిన కోడిగుడ్లను ఉడికించి ఆహారంగా వేస్తున్నారు. దీంతో దుర్వాసన అధికంగా వస్తుండటంతో అనారోగ్యాలకు గురవుతున్నాం. వాసన వల్ల కూలీలు సైతం మా పొలానికి రావడంలేదు. – వెంకట్రాముడు, రైతు, జింకలపల్లి. ఆరోగ్యంతో చెలగాటమాడితే చర్యలు చేపలకు ఆహారంగా కోళ్ల వ్యర్థాలు, కుళ్లిన కోడిగుడ్లు వేయడం చట్టరీత్యా నేరం. ప్రభుత్వం నిషేధించిన వ్యర్థాలతో చేపలను సాగుచేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవు. – శ్రీకాంత్రెడ్డి, తహసీల్దార్, ఇటిక్యాల కేసులు నమోదు చేస్తాం.. కోళ్ల వ్యర్థాలను చేపల చెరువులకు తరలిస్తే క ఠిన చర్యలు తీసుకుంటాం. పలుమార్లు చికె న్ వ్యర్థాలను తరలిస్తూ పట్టుబడిన వాహనాల ను అదుపులోకి తీసుకొని పీఎస్లకు తరలించి మత్స్యశాఖ అధికారులకు సమాచారం అందించాం. – ప్రదీప్కుమార్, సీఐ, అలంపూర్ ● -
నదిలో పడి వ్యక్తి మృతి
మక్తల్: నదిలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని పంచదేవ్పాడు గ్రామంలో సొమవా రం చోటుచేసుకుంది. పో లీసుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన బాల ప్ప (48) మద్యం మత్తులో ఆదివారం సాయంత్రం నది దగ్గరకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కా లు జారి నదిలో పడిపోయాడు. అక్కడ ఉన్న వారు గమనించి అధికారులకు సమాచారం అందించగా వారు వచ్చి గాలించినా ఫలితం లేదు. సోమవారం నది పక్కన ఉన్న గుంత దగ్గర మృతదేహం లభ్యం కావడంతో బయట కు తీశారు. భార్య శంకరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించిన్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు. పాన్షాప్ల్లో మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠినచర్యలు మహబూబ్నగర్ క్రైం: పాన్షాప్లలో మత్తు పదార్థాల విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీ సుకుంటామని డీఎస్పీ వెంకటేశ్వర్లు దుకాణాదారులను హెచ్చరించారు. వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న దుకాణదారులతో సోమవారం రాత్రి వన్టౌన్ స్టేషన్లో అవగాహన సమావేశం నిర్వహించారు. పాన్షాప్లలో గుట్కాలు, ఖైనీ, నిషేధిత పొగాకు ఉత్పత్తులు, మత్తు పదార్థాలు విక్రయించి యువతను వ్యసనాలకు గురిచేస్తే చట్ట ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నా రు. పాఠశాలలు, కళాశాలల సమీ పం ప్రాంతాల్లో ఉన్న దుకాణదారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మైనర్లకు పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే కేసులు మరింత కఠినంగా ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో సీఐ అప్పయ్య, ఎస్ఐ శీనయ్య పాల్గొన్నారు. రాజ్యాంగ హక్కులపై అవగాహన కొల్లాపూర్ రూరల్: మండలంలోని అమరగిరి గ్రామంలో చెంచు కాలనీలో రాజ్యాంగ హక్కులపై చెంచులకు నాగర్ కర్నూల్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో లీగల్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సులో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీరామ్ ఆర్య పాల్గొని ఆదివాసీల యోగక్షేమాలు, జీవన పరిస్థితులు, సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్యం, విద్యా సదుపాలయాలపై ఆరా తీశారు. ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి సంస్థ తరఫున పూర్తి సహకారం అందిస్తామన్నారు. చిన్నారులు బాగా చదివి ఉన్నత లక్షా లు సాధించాలని ప్రోత్సహించారు. విద్యార్థుల జీవి త లక్ష్యాలను తెలుసుకుని వారిక మార్గనిర్దేశం, చేశా రు. ఆర్థికంగా బలహీనులైన న్యాయవాదిని నియమించుకోలేని వారికి ఉచిత న్యాయ సహయం అందిస్తామని హమీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ లింగమ్మ, మాజీ సర్పంచ్ నిరంజన్, వార్డు మెంబర్ భరత్, నేషనల్ ఆదివాసీ హక్కుల సంఘం సభ్యు లు, చెంచుకుటుంబాలు, గ్రామస్తులు పాల్గోన్నారు. -
ఎన్నాళ్లీ వ్యర్థాలతో సాగు?
● కుళ్లిన మాంసంతో చేపల పెంపకం ● ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ● మామూళ్ల మత్తులో అధికారులు ● ఉమ్మడి ఇటిక్యాలలో వందల ఎకరాల్లో చేపల సాగు ఇటిక్యాల: తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందాలనే దురుద్దేశంతో కొందరు అక్రమార్కులు చేపల చెరువులను సాగుచేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. కుళ్లిన కోడిగుడ్లు, కోడిపేగులు, ఈకలు, కుళ్లిన మాంసం, చనిపోయిన ఇతర జంతువులను సైతం చేపలకు ఆహారంగా వేస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో పాటు పర్యావరణానికి ముప్పు వాటిల్లుతున్నా మత్స్యశాఖ అధికారులు మామూళ్ల మత్తులో చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో.. ఉమ్మడి ఇటిక్యాల మండలంలోని తిమ్మాపురం, సాసనూలు, కొండేరు, జింకలపల్లి, మొగిళిరావులచెర్వు, షేక్పల్లి తదితర గ్రామాల్లో ప్రభుత్వ అనుమతులు లేకుండానే విచ్చలవిడిగా వందల ఎకరాల్లో చేపల సాగును చేపట్టారు. చేపలకు మేతగా వేరుశనగచెత్త, తవుడు, సోయాబీన్ మిలెడ్లను వాడాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చేపలకు కుళ్లిన కోడిగుడ్లతో పాటుగా కోళ్ల వ్యర్థాలను మేతగా వేస్తున్నారు. పట్టపగలే ఆటోలు, వ్యాన్లలో కోళ్ల వ్యర్థాలను కర్నూలు, గద్వాల, వనపర్తి, కొల్లాపూర్, జడ్చర్ల, మహబూబ్నగర్, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి విచ్చలవిడిగా చేపల చెరువులకు తరలిస్తున్నారు. స్థానిక గ్రామాల ప్రజలతో పాటు చేపల చెరువులకు చుట్టు పక్కల వ్యవసాయ పంటలు సాగు చేస్తున్న రైతులు సైతం కుళ్లిన కంపును భరించలేక చర్యలు తీసుకోవాలని పలుమార్లు సంభందిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
సఖి కేంద్రంపై విచారణ
● మహిళ అదృశ్యంపై ఆగ్రహం ● పనిచేయని సీసీ కెమెరాలు ● సిబ్బంది పనితీరుపై విస్మయం గద్వాల క్రైం: భద్రత లేని సఖి కేంద్రం కథనం ఈ నెల 4న సాక్షి వెలుగులోకి తీసుకొచ్చిన నేపథ్యంలో కలెక్టర్ రిజ్వాన్ బాషాషేక్ నేరుగా స్పందించారు. సో మవారం జిల్లా కేంద్రంలోని సఖి సెంటర్ను స్వయంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో సిబ్బంది విధుల నిర్వహణ విషయంలో పూర్తిస్థాయిలో అలసత్వం వహించినట్లు బహిర్గతం కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 1న గట్టు మండలానికి చెందిన ఓ మహిళ సఖి సెంటర్ నుంచి అదృశ్యమైన విషయం మూడు రోజులు గోప్యంగా ఉంచారు. మహిళ అదృశ్యమైన విషయాన్ని సాక్షి దినపత్రికలో ప్రచురించడం తెలిసిందే. పని చేయని సీసీ కెమెరాలు.. సఖి సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించేందుకు కలెక్టర్ వాకబు చేయగా చేదు అనుభవం ఎదురైంది. కొన్ని రోజులుగా మరమ్మతుకు గురైనట్లు సిబ్బంది ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బాధ్యత లేకుండా విధులు నిర్వహిస్తున్నారని, బాధింపబడిన మహిళల విషయంలో ఎంత మేర విధులు నిర్వహించారనేది తెలుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సఖి తరఫున సంరక్షించిన కేసులు చాలా తక్కువగా ఉన్నాయని, పోలీసు శాఖ రెఫర్ చేసిన కేసులు మాత్రమే ఉన్నాయన్నారు. సఖి నిర్వాహకులు తీసుకోవాల్సిన కేసులు లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. రెండు నెలల్లో సిబ్బంది తమ పనితీరును మెరుగుపర్చుకోవాలన్నారు. లేని పక్షంలో ఉద్యోగం నుంచి తొలగించి అర్హులైన వారిని ఏర్పాటు చేస్తామన్నారు. మహిళల సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. -
కాన్పు అనంతరం బాలింత మృతి
● వైద్యుల నిర్లక్ష్యమే ప్రాణం తీసిందా? ● ఆస్పత్రి ఎదుట యువతి బంధువుల ఆందోళన నారాయణపేట: వైద్యుల నిర్లక్ష్యం వలనే బాలింత మృతి చెందిందని ఆరోపిస్తూ బంధువులు, గ్రామస్తులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి ఎదుట ఆందోళన దిగిన ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. కాన్పు కోసం వెళ్లి.. ప్రాణాలు పోయిన వైనం మండలంలోని పేరపల్లి గ్రామానికి చెందిన నవనీత (25)కు బండగొండ గ్రామానికి చెందిన నరేష్తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. మొదటి కాన్పు ప్రభుత్వ ఆస్పత్రిలో సాఫీగా జరిగి ఆడపిల్లకు జన్మనిచ్చింది. నాలుగేళ్ల అనంతరం మళ్లీ గర్భం దాల్చిన నవనీత ప్రతి నెలా కరుణ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంటూ వచ్చింది. ఈ నెల 5న సాధారణ చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లగా, రక్తస్రావం జరుగుతుందని గుర్తించిన వైద్యులు వెంటనే సిజేరియన్ చేయాలని సూచించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం శస్త్రచికిత్స నిర్వహించగా మరో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రక్తస్రావం ఆగకపోవడంతో పరిస్థితి విషమం.. సిజేరియన్ అనంతరం నవనీతకు రక్తస్రావం ఆగకపోవడంతో పరిస్థితి క్రమంగా విషమించిందని కు టుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దాదాపు పది యూనిట్ల రక్తం ఎక్కించినప్పటికీ ఆరోగ్య పరిస్థితిలో మెరుగుదల కనిపించలేదన్నారు. గుండె సంబంధిత సమస్యలు, రక్తపోటు పెరగడం వల్ల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారడంతో వైద్యులు హైదరాబాద్కు తరలించాలని సూచించినట్లు తెలిపారు. మొదట మహబూబ్నగర్లోని మారుతి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించగా, అక్కడి నుంచి హైదరాబాద్లోని యశోద ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం నవనీత మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యమే అంటూ ఆగ్రహం.. నవనీత మృతి వార్త గ్రామానికి చేరుకోవడంతో పేరపల్లి, బొమ్మపాడు గ్రామాలకు చెందిన యువకులు, బంధువులు రాత్రి కరుణ ఆస్పత్రి వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. సరైన చికిత్స అందించడంలో వైద్యులు విఫలమయ్యారని, నిర్లక్ష్యం కారణంగానే ఓ నిండు ప్రాణం బలైందని ఆరోపించారు. ఆస్పత్రి యాజమాన్యం బాధిత కుటుంబ సభ్యులను కలిసి వివరణ ఇవ్వకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన విషయం తెలుసుకున్న నారాయణపేట ఎస్ఐ వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి అదుపులోకి తెచ్చారు. బాధిత కుటుంబ సభ్యులు అధికారికంగా ఫిర్యాదు చేస్తే చట్టపరమైన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. డాక్టర్స్ అసోసియేషన్తో చర్చలు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆస్పత్రి యాజ మాన్యం డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధుల ద్వారా చర్చలు జరిపి నట్లు సమాచారం.ఈ ఘటనపై అధికారిక ఫిర్యాదు అందిన తర్వాత పూర్తిస్థాయి విచారణ జరిగే అవకాశం ఉంది. తల్లిలేని ఇద్దరు చిన్నారులు నాలుగేళ్ల కుమార్తెతో పాటు పుట్టిన కొద్ది రోజులే అయిన నవజాత శిశువు ఇద్దరూ తల్లిలేని అభాగ్యులయ్యారు. పుట్టిన చంటిబిడ్డను చూసిన ఆనందం కుటుంబంలో నిలవకముందే ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. -
భూసార సంరక్షణలో జీవన ఎరువులే కీలకం
కొత్తకోట రూరల్: ఆధునిక వ్యవసాయంలో రసాయనిక ఎరువులు, కీటక, శిలీంధ్ర నాశిని మందులు వాడడం వల్ల భూ భౌతిక పరిస్థితి దెబ్బతినడం, నేలలో జీవకోటి మరణించడం, నీరు, వాయు కాలుష్యం పెరగడం చీడపీడల బెడద ఎక్కువై పంట, నేల ఉత్పాదకత క్షీణిస్తున్నాయి. అయితే రైతాంగం ‘జీవన ఎరువులను’ వాడి నేల సమతుల్యత కాపాడి దిగుబడులను పెంచుకోవచ్చని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. జీవన ఎరువులు: ఇవి సహజంగా సూక్ష్మజీవుల సముదాయం. ప్రకృతిలో విరివిగా లభ్యమయ్యే ఉపయోగకరమైన సూక్ష్మజీవులు. ఇందులో కొన్ని మొక్కలతో సహజీవనం చేస్తూ నత్రజని మొక్కకు అందించడం, మరి కొన్ని భూమిలోని భాస్వరం కరిగించి ఎక్కువగా లభ్యమయ్యేటట్లు చేస్తాయి. జీవన ఎరువుల రకాలు: నత్రజనిని స్థీరికరించే జీవన ఎరువులు ప్రకృతిలో సహజంగా ఉండే సూక్ష్మజీవులు ఈ నత్రజనిని స్థిరీకరించి మొక్కలకు అందజేస్తాయి. వీటి వల్ల పంటలలో దిగుబడి బాగా పెరుగుతుంది. ● సహజీవన నత్రజని జీవన ఎరువులు: రైడోబియం ● స్వేచ్ఛ జీవిత జీవన ఎరువులు: అజటం బాక్టర్, అజోస్పైరిల్లం, అజాల్లా మరియు నీలిపచ్చనాచు (బీజీఏ) భాస్వరం కరిగించే జీవన ఎరువులు నేలలో లభ్యం కాని స్థితిలో ఉన్న భాస్వరాన్ని మొక్కలకు కొన్ని రకాల సూక్ష్మ జీవులు అందుబాటులోకి తెస్తాయి. ఈ సూక్ష్మ జీవులైన బాసిల్లాస్, సుదోమొనాస్ సేంద్రియ పదార్థం వల్ల సమృద్ధిగా అందడం అలాగే భాస్వరం ఉన్న నేలల్లో వాడటం వల్ల ‘భాస్వరం’ లభ్యత మొక్కకు అధికంగా ఉంటుంది. జీవన ఎరువులను వాడే విధానం.. జీవన ఎరువులను పంటల ఆధారంగా నాలుగు రకాలుగా వాడవచ్చు. (1) విత్తనశుద్ధి: విత్తన మోతాదు, పరిమాణం బట్టి 200గ్రాముల నుంచి 500 గ్రాముల జీవన ఎరువును చిక్కటి బెల్లం, గంజి ద్రావణంలో కలిపి నీటిలో 20 నుంచి 30నిమిషాల వరకు ఆరబెట్టి విత్తుకోవాలి. (2) నారు ముంచే పద్ధతి: నారు పంటలైన వరి, మిచ్చి, వంకాయ, టమోట, ఉల్లి మొదలైన పంటలకు అజోస్పైరిలం/అజటో బాక్టర్, ఫాస్పో బాక్టీరియా 1–2 కిలోల మిశ్రమాన్ని చిన్న బురద నీటి మడిలో కలిపి నారు వేర్లను 15–20 నిమిషాల వరకు ఉంచి తర్వాత ప్రధాన పొలంలో నాటాలి. (3) నేరుగా భూమిలో వాడే పద్ధతి: ఎకరాకు 4కిలోల ఫాస్పో బాక్టీరియా, అజైస్పెరిల్లమ్ మిశ్రమాన్ని 50 కిలోల మక్కిన పశువుల ఎరువులో కలిపి చెట్టుకు 1–2 కిలోల మిశ్రమాన్ని 2కిలోల జీవన ఎరువును 10కిలోల పశువుల ఎరువుతో కలిపి ఒక ఎకరా పంట పొలంలో చల్లుకుంటే ఫలితం ఉంటుంది. జీవన ఎరువు పంటలు నత్రజని స్థిరీకరణ కిలోలు దిగుబడి పెరుగుదల శాతం (1)నత్ర జని ఎరువులు: రైజోబియం వేరు శనగ, సోయ చిక్కుడు, 50–60 10–30 కంది, పెసర, మినుము, పెసర్లు అజటో బాక్టర్ జొన్న, వరి ప్రొద్దుతిరుగు, పత్తి చెరుకు, రాగి అజోస్పైరిల్లంఆముదం, 20–40 10–20 కూరగాయలు పండ్ల తోటలు పూలతోటలు అడోల్లా వరి 20–30 10–15 నీలి ఆకుపచ్చ నాచువరి 20–30 10–15 (2)భాస్వరం కరిగించే ఎరువులు: బసిల్లస్, సూడ్మిమోస్, అన్ని పంటలకు స్థిరపడిన భాస్వరాన్ని కరిగించి బయోఫాస్ మొక్కలకు అందిస్తాయి పాడి–పంట -
దేశీ విత్తనాలతో ప్రకృతి వ్యవసాయానికి కొత్త ఊపు
● పేట వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ జయచంద్రమోహన్ నారాయణపేట/మక్తల్: విత్తనం రైతు భవిష్యత్ను నిర్ణయిస్తుంది.. అదే విత్తనం దేశీయంది అయితే ప్రకృతి వ్యవసాయానికి బలమైన పునాది అవుతుంది. ఈ ఆలోచనతో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లాలో దేశీ విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించి రైతుల్లో సేంద్రియ సాగుపై అవగాహన కల్పిస్తున్నామని డీఎంహెచ్ఓ జయచంద్రమోహన్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో గ్రామ భారతి, సత్య దర్శనం ఫౌండేషన్ల సహకారంతో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ ఆధ్వర్యంలో మక్తల్ మండలం బోందల్కుంట గ్రామంలో దేశీ విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయన వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా ప్రకృతి వ్యవసాయాన్ని గ్రామీణ స్థాయిలో మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రైతులకు నాణ్యమైన దేశీ విత్తనాలను అందించడంతో పాటు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించడం ద్వారా సుస్థిర వ్యవసాయానికి బాటలు వేయాలని ఆకాంక్షించారు. అదే విధంగా సుభిక్ష అగ్రి ఫౌండేషన్, నారాయణపేట జిల్లా మండల వ్యవసాయ అధికారులు, అమాలిక ఎఫ్పీఓ, బీటీఎం ఫౌండేషన్లు భాగస్వాములై మాట్లాడారు. రైతులకు దేశీ విత్తనాల ప్రాముఖ్యత, ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే ఆర్థిక, పర్యావరణ ప్రయోజనాలపై అధికారులు వివరించారు. ప్రస్తుతం పెరుగుతున్న సాగు వ్యయాలు, నేల శక్తి క్షీణత, రసాయనాల అధిక వినియోగం వంటి సమస్యలకు ప్రకృతి వ్యవసాయం సమర్థవంతమైన పరిష్కారమని పేర్కొన్నారు. దేశీ విత్తనాలు స్థానిక వాతావరణ పరిస్థితులను తట్టుకుని నిలకడైన దిగుబడులు అందించడమే కాకుండా రైతుల విత్తన స్వావలంబనకు దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు సుదర్శన్, గణేష్ రెడ్డి, గ్రామ భారతి ప్రతినిధులు శివకుమార్, సత్యనారాయణ, ఉపేందర్, సుభిక్ష అగ్రి ఫౌండేషన్ ప్రతినిధి ఉమేష్, బీటీఎం ఫౌండేషన్కు చెందిన సోఫి, కురుమయ్య, సుధీర్, శ్యామ్, బాలకృష్ణ రెడ్డి, అశోక్, రవి తదితరులు పాల్గొన్నారు. -
చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు
టిప్పర్లో మట్టి నింపుతున్న జేసీబీ టిప్పర్ల ద్వారా మట్టి తరలింపు చారకొండ: మండలంలోని జూపల్లి గ్రామ శివారు పరిఽఽధిలోని చింత చెరువులో నుంచి కొందరు అక్రమార్కులు అనుమతి లేకుండా అక్రమంగా ఒండ్రుమట్టిని తరలిస్తున్నారు. జేసీబీతో తవ్వకాలు జరిపి టిప్పర్ల ద్వారా తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండు రోజులుగా చెరువు నుంచి రాత్రి వేళ గుట్టు చప్పుడు కాకుండా మట్టిని తరలిస్తునట్లు సమాచారం. సమీప వ్యవసాయ పొలాల రైతులు రాత్రి సమయాల్లో గమనించి అక్రమంగా మట్టి తరలిస్తున్నారని 100కు సమాచారం ఇచ్చారు. దీంతో మరల ఏకంగా సోమవారం పట్టపగలు చెరువు నుంచి తవ్వకాలను కొనసాగిస్తుండడంతో సమీప రైతులు ,గ్రామస్తులు చెరువులో ఒండ్రు మట్టిని తరలించొద్దని రైతులు అడ్డుకొని ఆందోళన చేశారు. మట్టి తరలింపుపై అనుమతులు ఉన్నాయా అని నిలదీశారు. దీంతో రైతులు మట్టిని తరలించకుండా అడ్డుకొని ఆందోళన చేశారు. విషయాన్ని స్థానిక రైతులు చారకొండ పొలీసులకు సమాచారం ఇవ్వడంతో చెరువు వద్దకు పోలీసులు చేరుకొని మట్టి తవ్వకాలను నిలిపివేసి అక్కడి నుంచి వాహనాలు స్టేషన్కు తరలించకుండా వదిలేశారు. అనుమతులు లేకుండా మట్టి తరలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంపై ఉన్నత అధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచాలి
● ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్నాయుడు కందనూలు: జిల్లాలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచి.. త్వరగా పూర్తిచేయాలని ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ వీసీ హాల్లో కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్తో కలిసి ఇరిగేషన్, రెవెన్యూశాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ పురోగతి, పెండింగ్ సమస్య లు, రైతులకు పరిహారం చెల్లింపులు, పునరావాస చర్యలు, అవార్డుల జారీ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదే శాల మేరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించి.. సాగునీటి ప్రాజెక్టు ల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలిస్తున్న ట్లు తెలిపారు. ప్రభుత్వం సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని.. రైతాంగ అభ్యున్నతికి కీలకమైన ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలనే లక్ష్యంతో పనిచేస్తోందన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, ఎంజీకేఎల్ఐ, అచ్చంపేట లిఫ్ట్తో పాటు ఇత ర సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన భూ ముల సేకరణలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ మాట్లాడుతూ.. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు వ్యవసాయాభివృద్ధికి వెన్నెముకలాంటివని అన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే వేలాది ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని పే ర్కొన్నారు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు పరస్ప ర సమన్వయంతో పనిచేసి.. భూసేకరణ ప్రక్రియను వేగ వంతం చేయాలని ఆదేశించారు. అనంతరం ప్రాజెక్టుల వారీగా భూ సేకరణ స్థితిగతులను అధికారులు వివ రించారు. సమావేశంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు ఉన్నారు. మౌలిక వసతుల కల్పనకు చర్యలు కందనూలు:బిజినపల్లి మండలంలోని వట్టెం గ్రామం వద్ద నూతనంగా నిర్మించిన పునరావాస, పునర్నిర్మాణ (ఆర్అండ్ఆర్) కాలనీలో అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని రాష్ట్ర ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు అన్నారు. సోమ వారం కాలనీని చేపట్టిన పనులను అదన పు కలెక్టర్ అమరేందర్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీలో నిర్మించిన గృహాలు, అంతర్గత రహదారు లు, తాగునీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్య వ్యవస్థతో పాటు ఇత ర మౌలిక వసతులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. కాలనీలో చేపట్టిన అభివృద్ధి పను ల పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో కొనసాగుతున్న పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పునరావాస కాలనీల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. ఆ యన వెంట సంబంధిత శాఖల అధికారు లు, ఇంజినీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. -
హిందూ ధర్మ పరిరక్షణకు అందరూ కృషి చేయాలి
అడ్డాకుల: హిందూ ధర్మం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రముఖ అధ్యాత్మిక ప్రవచనకర్త, పద్మశ్రీ గరికపాటి నరసింహారావు అన్నా రు. అడ్డాకుల మండల కేంద్రంలో సోమవారం రాత్రి జరిగిన జరిగిన హిందూ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సనాతన ధర్మం ప్రపంచానికి శాంతి, సహనం, మావనవతా విలువలను అందించిందన్నారు. భారతీయ సంస్కృతి చాలా గొప్పదన్నారు. భావితరాలకు దాన్ని చేరవేయాలని సూచించారు. యువత ధార్మిక విలువలను అలవర్చుకోవాలని చెప్పారు. కుటుంబ వ్యవస్థ బలోపేతానికి సనాతన ధర్మ బోధనలు ఎంతో ఉపయుక్తమన్నారు. హిందూ దేవాలయాలు కేవలం పూజా స్థలాలు మాత్రమే కాకుండా సమాజానికి మార్గనిర్ధేశనం చేసే కేంద్రాలన్నారు. నేటి యువత భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన పెంచుకోవాలని చెప్పారు. సమాజ సేవ, గో సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో యువత ముందుండాలని సూచించారు. కార్యక్రమంలో హిందూ సమ్మేళనం నిర్వాహకులు తదితరులు ఉన్నారు. క్రీడాకారులు ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలిగద్వాలన్యూటౌన్: ప్రతి క్రీడాకారుడు ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకొని సాధన చేయడంతోనే అనుకున్న ఫలితం వస్తుందని డీవైఎస్ఓ రామలింగేశ్వర్గౌడ్ అన్నారు. స్థానిక ఇండోర్ స్టేడియంలో ఏప్రిల్ 28 నుంచి నిర్వహించిన వేసవి కబడ్డీ శిక్షణ శిబిరం సోమవారం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన క్రీడాకారులకు సర్టిఫికెట్లను ప్రధానం చేసి మాట్లాడారు. క్రీడల్లో గెలుపోటములు సహజమన్నారు. ఓటమిని పాఠంగా తీసుకొని, గెలుపు కోసం ప్రయత్నించాలని క్రీడాకారులకు సూచించారు. మంచి అలవాట్లతో శారీరక దారుఢ్యం పెంపొందించుకోవడంతో పాటు క్రీడల్లో రాణించి స్పోర్ట్స్ కోటాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం రిటైర్డ్ డీవైఎస్ఓ కృష్ణయ్య 25మంది క్రీడాకారులకు క్రీడా దుస్తులను అందజేశారు. కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ అబ్రహం, స్టేడియం ఇన్చార్జి బషీర్, కోచ్ రజనీకాంత్, తిరుపతి, రాజశేఖర్, సర్వేష్రెడ్డి, సురేశ్ పాల్గొన్నారు. -
పీపీఎల్ చాంపియన్గా మీడియా స్ట్రైకర్స్
● రన్నరప్గా ప్రెస్క్లబ్ వారియర్స్ ● ఉత్సాహంగా సాగిన క్రికెట్ టోర్నీజెడ్పీసెంటర్(మహబూబ్నగర్): మహబూబ్నగర్ ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పీపీఎల్ (ప్రెస్క్లబ్ ప్రీమియర్ లీగ్) క్రికెట్ టోర్నమెంట్ ఉత్సహభరితంగా సాగింది. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ టోర్నీలో మీడియా స్ట్రైకర్స్ చాంపియన్గా నిలిచింది. చివరి రోజు సోమవారం జరిగిన సెమీ ఫైనల్స్, ఫైనల్స్ మ్యాచ్లు హోరాహోరీగా సాగాయి. తొలిసెమీఫైనల్లో పాలమైరు బుల్డోజర్స్పై ప్రెస్క్లబ్ వారియర్స్ గెలుపొందగా.. రెండో సెమీస్లో మహబూబ్నగర్ లెజండ్స్పై మీడియా స్ట్రైకర్స్ విజయం సాధించి ఫైనల్ పోరుకు అర్హత సాధించారు. చివరి ఓవర్ వరకు హోరాహోరీగా సాగిన తుది సమయంలో ఏడు వికెట్ల తేడాతో మీడియా స్ట్రైకర్స్ గెలుపొందింది. టాస్గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన నిర్ణీత 12 ఓవర్లలో ఐదు వికెట్ల కోల్పోయి 92 పరుగులు చేసింది. 93 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మీడియా స్ట్రైకర్స్ 11.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. అంతకుముందు ఎస్పీ డి.జానకి టాస్ వేసి ఫైనల్ మ్యాచ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జర్నలిస్టులు నిరంతరం వార్తలతో బిజీగా ఉంటూ మానసిక ఇత్తిడికి గురవుతుంటారని, క్రీడల్లో ప్రశాంతత లభిస్తుందని.. కొంత సమ యం ఆటలు, వ్యా యామానికి కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. మ్యాచ్ ముగిసిన అనంతరం గెలుపొందిన జట్లకు నగర మేయ ర్ గుమ్మాల మమత, డిప్యూటీ మేయర్ సురేందర్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చెరుకుపల్లి రాజేశ్వర్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ జర్నలిస్టులు మానసిక ఒత్తిడికి గురికాకుండా ఇలాంటి క్రీడాపోటీల్లో పాల్గొంటే ఎంతో ఉత్సాహంగా ఉంటుందని పేర్కొన్నారు. టోర్నీలో విశేష ప్రతిభ కనబర్చిన మీడియా స్ట్రైకర్స్ కెప్టెన్ నరేష్కు మ్యాన్ ఆఫ్ది సిరీస్ దక్కగా.. ఫైనల్ మ్యాచ్ అద్భుతంగా ఆడిన శేఖర్గౌడ్ మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ సొంతం చేసుకున్నాడు. ముగింపు కార్యక్రమంలో ప్రెస్క్లబ్ అధ్యక్షుడు నరేందర్చారి, కార్యదర్శి నరేందర్గౌడ్, సభ్యులు యాదయ్య, వెంకటేష్, మోహన్దాస్, సతీష్, సాయికుమార్, సీనియర్ జర్నలిస్టులు కిషోర్కుమార్, హరిప్రసాద్సాగర్, బండి విజయ్కుమార్, రఫీయోద్దీన్, బస్వరాజు, రవికుమార్, ఇతర జర్నలిస్టులు పాల్గొన్నారు. -
కాగితాలకు చెల్లుచీటి
● మీసేవ సేవలన్నీ ఆన్లైన్లోనే.. ● ఈఎస్డీ నుంచి ఉత్తర్వులు.. కలెక్టర్ నుంచి ఆదేశాలు ● ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని ఒత్తిడి తేవొద్దని సూచన హన్వాడ: రాష్ట్రంలోని మీసేవా కేంద్రాల ద్వారా వివిధ ప్రభుత్వ సేవల కోసం దరఖాస్తు చేసుకునే వారికి ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. ఆదాయం, కుల, నివాస, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రాలు, ఈబీసీ, ఓబీసీ వంటి రెవెన్యూ శాఖ సేవల వెరిఫికేషన్ కోసం ఇకపై ఎలాంటి ఫిజికల్ డాక్యుమెంట్లను సమర్పించాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఈఎస్డీ (మీసేవ) కమిషనర్ రవికిరణ్ సర్క్యూలర్ జారీ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో కలెక్టర్ ఖుష్చూగుప్తా స్పందిస్తూ సోమవారం జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయి పరిశీలన కోసం దరఖాస్తుదారులపై భౌతిక పత్రాల సమర్పణ కోసం ఎలాంటి ఒత్తిడి తీసుకురావొద్దని ఆమె స్పష్టం చేశారు. మొబైల్ యాప్ ద్వారానే.. రెవెన్యూ సేవల ధ్రువీకరణ ప్రక్రియలో పారదర్శకత, వేగం పెంచేందుకు ఈఎస్డీ సంస్థ ‘జీపీఓ మరియు ఎమ్మార్ఐ వెరిఫికేషన్ మొబైల్ అప్లికేషన్’ను రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది. ప్రారంభంలో ఈ మొబైల్ యాప్ విధానాన్ని కేవలం ఆదాయం ధ్రువీకరణ పత్రాల జారీకే పరిమితం చేసినప్పటికీ.. ప్రస్తుతం దీనిని రెవెన్యూ శాఖలోని అన్ని కేటగిరీ–బీ సేవలకు విస్తరించారు. ఈ యాప్ ద్వారా క్షేత్రస్థాయి అధికారులు మీసేవ దరఖాస్తు వివరాలను, ఆన్లైన్లో అప్లోడ్ చేసిన పత్రాలను నేరుగా మొబైల్లోనే పరిశీలించవచ్చు. దరఖాస్తును ఆమోదించాలా.. లేదా తిరస్కరించాలా అనే నిర్ణయాన్ని అధికారులు ఈ యాప్ ద్వారానే తీసుకుంటారు. దీంతో ఇకపై కులం, నివాసం, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ, ఈబీసీ, ఓబీసీ ఇతర సర్టిఫికెట్లను పొందేందుకు ప్రజలు కార్యాలయాల చుట్టూ కాగితాలు పట్టుకుని తిరగాల్సిన అవసరం లేదు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు వెరిఫికేషన్ పేరుతో దరఖాస్తుదారుల నుంచి భౌతిక పత్రాలు తీసుకోవద్దని జిల్లా, మండల, గ్రామస్థాయిలోని తహసీల్దార్లు, ఎమ్మార్ఐలు, జీపీఓలందరికీ సీసీఎల్ఏతో పాటు జిల్లా యంత్రాంగం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. అదేవిధంగా మీసేవ కేంద్రాల నిర్వాహకులు కూడా దరఖాస్తుదారులను భౌతిక పత్రాల కోసం ఇబ్బంది పెట్టకూడదని స్పష్టం చేశారు. ఒక వేళ నిబంధనలకు విరుద్ధంగా మీసేవ నిర్వాహకులు భౌతిక పత్రాలను సేకరించి అధికారులకు సమర్పిస్తే దాన్ని అక్రమాలకు పాల్పడడంగా భావించి ఈఎస్డీ నిబంధనలు క్లాజ్ 23(5) ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు ఈ సరికొత్త డిజిటల్ నిబంధనలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు అవుతున్నాయో లేదో పరిశీలించేందుకు జిల్లా మేనేజర్లు (డీఎంలు), జిల్లా కోఆర్డినేటర్లు (డీసీలు) నిరంతరం తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. వీరు ప్రతి వారం నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఆదేశాలను ఉల్లంఘించే అధికారులపై ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండానే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కమీషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ఆకాశవీధిలో విహారం
● ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రతిభ తెచ్చిన అవకాశం ● విమానం ఎక్కనున్న 14 మంది విద్యార్థులు ● 15 ఏళ్లుగా సేవలందిస్తున్న విద్యా స్వేచ్ఛ ఫౌండేషన్ కల్వకుర్తి రూరల్: విద్యార్థులు తమ ఉత్తమ భవిష్యత్ను ఊహించుకోవడంతో పాటు ఎన్నో విషయాలపై మరెన్నో కలలు కంటారు. ఆ కలలను సాకారం కొందరే చేసుకుంటారు. సమాజంలో పేద మధ్యతరగతి ప్రజలే అధికంగా ఉండటం.. వారిలో పలువురికి రైలు ఎక్కడమే గగనమైతే విమానం ఎక్కడం అద్భుతమనే చెప్పాలి. అలాంటిది పేద విద్యార్థులకు గగనతలంలో విహరించేలా విద్యా స్వేచ్ఛ ఫౌండేషన్ అవకాశం కల్పించింది. ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. విద్యా స్వేచ్ఛ ఫౌండేషన్ ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలో దాదాపు 22 జిల్లా పరిషత్ బాలుర, బాలికల పాఠశాలలను దత్తత తీసుకున్నారు. ఆ పాఠశాలలో విద్యార్థులకు కావాల్సిన వసతులను కల్పించడంతోపాటు విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతస్థాయి చేరుకోవాలని లక్ష్యాన్ని వారికి నిర్దేశిస్తున్నారు. పదో తరగతి పరీక్షలకు ముందు 550 మార్కులు సాధించిన విద్యార్థులను విమానంలో ప్రయాణించే అవకాశం కల్పిస్తామన్నారు.దీంతో విద్యార్థులు బాగా కష్టపడి 14 మంది విద్యార్థులు ఆ అవకాశాన్ని దక్కించుకున్నారు. వీరందరిని మంగళవారం విమానంలో శంషాబాద్ నుంచి విశాఖపట్నం తీసుకెళ్లి రెండు రోజులపాటు అక్కడ విద్యార్థులకు ఉపయోగప డే కార్యక్రమాలను నిర్వహిస్తూ విద్యార్థులందరూ తమలోని భావాలను ఇతర విద్యార్థులతో పంచుకునే విధంగా వారికి శిక్షణ ఇవ్వనున్నారు. 15 సంవత్సరాలుగా సేవ.. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, మండలంలోని మార్చాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు రంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లా పరిధిలోని 22 పాఠశాలలలో విద్యార్థులకు ఫౌండేషన్ ద్వారా నోటుపుస్తకాలతో పాటు పాఠశాలలలో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. విమానం ఎక్కే విద్యార్థులతో ఫౌండేషన్ సభ్యులు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు రూ.10 లక్షలతో వసతులు కల్పించారు. డిజిటల్ తరగతితో పాటు, లైబ్రరీ విద్యార్థులకు అవసరమైన మెటీరియల్ను పంపిణీ చేశారు. సోమవారం కల్వకుర్తి జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో 14 మంది విద్యార్థులను ఫౌండేషన్ లోగోతో సత్కరించారు. ప్రధానోపాధ్యాయుడు నాగార్జునతో పాటు ఉపాధ్యాయులు, ఫౌండేషన్ బాధ్యులు వాసుదేవ్, శేషగిరిరావు, జోసెఫ్, శ్రీనివాసులు, శోభ రాణి, రాధిక తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
వనజ.. యోగాలో ఘనత
● ప్రపంచ యోగాసన చాంపియన్షిప్లోమెరిసిన జిల్లా క్రీడాకారిణి ● ట్విస్టింగ్ యోగాసనంలో బంగారు పతకం కై వసం మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా కేంద్రానికి చెందిన వనజ యోగాలో మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నారు. పోలీస్శాఖలో ఏఎస్ఐ కేడర్గా ఉన్న ఆమె ప్రస్తుతం అప్పా అకాడమీలో యోగా ట్రైనర్గా పనిచేస్తున్నారు. ఇటు ఉద్యోగ ధర్మం నిర్వరిస్తూనే యోగా, మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో రాణిస్తున్నారు. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పతకాలు సాధిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది వనజ. 2012లో గచ్చిబౌలిలో జరిగిన రాష్ట్రస్థాయి పోలీస్స్పోర్ట్స్ మీట్లో అథ్లెటిక్స్లో రజతం పతకం, 2014లో విశాఖపట్నంలో జరిగిన పోలీస్ మీట్లో 10 కిలోమీటర్ల నడకలో బంగారు పతకం పొందింది. అదే ఏడాది ఆదిలాబాద్ (బాసర)లో జరిగిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో రజతం, 2016లో కర్ణాటక (ఉడిపి)లో జరిగిన జాతీయస్థాయి యోగాలో బంగారు పతకం సొంతం చేసుకున్నారు. వైజాగ్లో జరిగిన పోలీస్ స్పోర్ట్స్ మీట్లో యోగాలో రజతం పొందింది. 2017 జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో జరిగిన ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్ యోగా విభాగంలో బంగారు పతకం సాధించింది. 2018 పంజాబ్ రాష్ట్రం పటియాలో జరిగిన జాతీయస్థాయి యోగా పోటీల్లో రజత పతకం అందుకున్నారు. 2018లో పోలీస్సేవ పతకాన్ని అందుకున్నారు. అదేవిధంగా 2019లో పలుసార్లు యోగా పోటీల్లో పాల్గొంది. 2023 ఏపీ రాష్ట్రంలో తాడేపల్లిగూడెంలో జరిగిన యోగా పోటీల్లో వనజ రాణించింది. గోవాలో జరిగిన ఆరో నేషనల్ మాస్టర్స్ గేమ్స్లో పాల్గొని బంగారు పతకం సాధించగా గచ్చిబౌలీ స్టేడియంలో పాన్ ఇండియా మాస్టర్స్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఫెడరేషన్ కప్ నేషనల్ మాస్టర్స్ క్రీడల్లో వనజారెడ్డి ప్రతిభచాటి 45+ ఏళ్ల విభాగంలో లాంగ్జంప్, హైజంప్, 800 మీటర్ల పరుగులో మూడు పతకాలు సాధించారు. వరల్డ్ యోగాసనలో బంగారు పతకం అహ్మదాబాద్ వేదికగా ఈనెల 3వ తేదీ నుంచి జరుగుతున్న మొదటి వరల్డ్ యోగాసన చాంపియన్షిప్లో వనజ పాల్గొంటున్నారు. సీనియర్ –సి మహిళల ట్విస్టింగ్ యోగాసన వ్యక్తిగత విభాగంలో ఆమె ప్రతిభ కనబరిచారు. 42.75 స్కోర్ సాధించి బంగారు పతకం సాధించారు. ఈ విభాగంలో 12 దేశాల క్రీడాకారిణులు పాల్గొనగా పాలమూరు క్రీడాకారిణి వనజా ప్రథమస్థానంలో నిలవడం విశేషం. వనజారెడ్డి తొలిసారిగా అంతర్జాతీయస్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించారు. దేశంలో జరుగుతున్న మొదటి వరల్డ్ యోగాసన పోటీల్లో నేను పాల్గొనడంతో పాటు దేశానికి బంగారు పతకం తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం యోగాసన క్రీడకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. వంటింటికే పరిమితం కాకుండా క్రీడల్లో రాణించి పతకాలు సాధించే సత్తా మహిళలకు ఉంది. ఇంటిపనులు చేసుకుంటూనే కొంత సమయాన్ని కేటాయించి యోగా చేస్తూ మంచి మెరుగైన ఆరోగ్యం లభిస్తుంది.యోగా విద్యను ప్రతి ఒక్కరికి అందించాలి. ముఖ్యంగా మహిళలు, బాలికలు యోగా శిక్షణ తీసుకోవాలి. – వనజ, యోగా క్రీడాకారిణి -
గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం
నేను చిన్నప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గ్రామీణ ప్రాంత పాఠశాలలో చదివే విద్యార్థులకు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు సహకరిస్తే సేవలందించాలనే సంకల్పంతో శేషగిరిరావు తదితరులతో కలిసి ఫౌండేషన్ 15 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశాం. అప్పటి నుంచి వేలాది మంది విద్యార్థులకు, పాఠశాలల అభివృద్ధికి సహకారం అందిస్తున్నాం. చదువుకునే లక్ష్యానికి పేదరికం అడ్డు కాకూడదని తాము విద్యార్థులకు చెబుతుంటాం.వారికి ఏ సహాయం కావాలన్నా సహకరిస్తున్నాం. పట్టణాలు పారిశ్రామిక ప్రాంతాల్లో ఉండే పాఠశాలలకు దాతలు ఉంటారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం ఫౌండేషన్ సహకారం అందిస్తుంది. – వాసుదేవ్, స్వేచ్ఛ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు -
బలహీనపడుతున్న మత్స్య సొసైటీలు
మహబూబ్నగర్ న్యూటౌన్: జిల్లాలో మత్స్యపారిశ్రామిక సహకార సొసైటీలు బలహీనపడుతున్నాయి. సొసైటీల బలోపేతానికి మత్స్యశాఖ ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. కొత్త సంఘాల నిర్మాణం అటుంచితే గతంలో ఉన్న సంఘాలను బలోపేతం చేయడంలో జిల్లా మత్స్యశాఖ ఽఅధికారులు అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. కుటుంబాల సంఖ్య పెరగడం, నీటి వనరుల విస్తీర్ణంలో తేడాలు లేకపోవడంతో కొత్త సభ్యుల చేర్పులు, మార్పులకు అవకాశం లేకుండా పోయింది. మత్స్యపారిశ్రామిక సహకార సంఘాల్లోని సభ్యులు వయోభారంతో తమ స్థానంలో వారసుల పేర్లు ఎక్కించాలన్నా.. చనిపోయిన సభ్యుల స్థానంలో కుటుంబంలోని వారసులకు అవకాశం కల్పించాలన్నా సాధ్యపడటం లేదు. సాంకేతిక సమస్యలతో పాటు వారసుల ఎంపిక సంఘాల బలోపేతానికి సవాల్ విసురుతున్నాయనే చెప్పవచ్చు. మత్స్యకార కుటుంబాలు గ్రామాల్లో గణనీయంగా పెరగడంతో సంబంధిత మత్స్యపారిశ్రామిక సహకార సంఘాల్లో నూతన సభ్యత్వాలు కల్పించాలనే డిమాండ్ పెరుగుతోంది. ఇదిలా ఉండగా చనిపోయిన సభ్యుల స్థానంలో వారసుల ఎంపిక తలకు మించిన భారంగా మారింది. జిల్లాలో మొత్తం 242 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు, 13,066 మంది సభ్యులు ఉన్నారు. అందులో 22 మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలుండగా 817 మంది సభ్యులున్నారు. అవకాశమున్న చోట స్కిల్ టెస్టు.. జిల్లాలోని ఆయా గ్రామాల్లో మత్స్యపారిశ్రామిక సహకార సంఘాల్లో కొత్త సభ్యుల చేరికకు అవకాశమున్న ప్రాంతాల్లో నీటి వనరుల విస్తీర్ణానికి అనుగుణంగా స్కిల్ టెస్టు నిర్వహించి చేర్చుకుంటున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజు చెల్లించి స్కిల్ టెస్టులో పాల్గొని అర్హత సాధిస్తే సంఘంలో సభ్యత్వం ఇస్తున్నారు. కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పడిన ఆయా గ్రామాల్లో కొత్త సొసైటీల ఏర్పాటుకు డిమాండ్ పెరిగినా నీటివనరులు అందుబాటులో లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. హన్వాడ మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో మొత్తం 95 మంది సభ్యులకు 80 మంది చనిపోగా మిగతా 15 మంది సభ్యులున్నారు. చనిపోయిన వారి స్థానంలో వారసులకు సభ్యత్వం కల్పించాలని ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నా కార్యరూపం దాల్చలేదు. ఇదిలా ఉండగా.. కుటుంబాల సంఖ్య సైతం పెరిగింది. కొత్తవారికి అవకాశం కల్పించాలని మత్స్యశాఖ అధికారులకు దరఖాస్తులు పెట్టుకున్నా ఫలితం లేకపోయింది. హన్వాడ, సల్లోనిపల్లి గ్రామాల్లోని మత్స్యకార కుటుంబాలకు చెందిన వారితో ఉమ్మడి హన్వాడగా ఉన్న సమయంలో మూడు దశాబ్దాల క్రితం ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారు. చనిపోయిన వారి స్థానంలో వారసులకు, కొత్త వారికి సభ్యత్వాలు కల్పించాలని ఆయా గ్రామాల మత్స్యకారులు కోరుతున్నారు. చనిపోయిన సభ్యుల స్థానంలో వారసుల ఎంపికపై అయోమయం నూతన సభ్యత్వాల కోసం పెరుగుతున్న డిమాండ్ జిల్లాలో 242 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు, 13,066 మంది సభ్యులు -
ఇద్దరు డిప్యూటీ ఆర్ఎంల బదిలీ
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: టీజీఆర్టీసీ మహబూబ్నగర్ రీజియన్ పరిధిలోని ఇద్దరు డిప్యూటీ ఆర్ఎంలతో పాటు ఆరుగురు డీఎంలు బదిలీ అయ్యారు. ఈ మేరకు తాజాగా సంస్థ ఎండీ నాగిరెడ్డి నుంచి ఉత్తర్వులు జారీ అయ్యా యి. ఇంతవరకు మహబూబ్నగర్లో డిప్యూటీ ఆర్ఎం (మెయింటెనెన్స్)గా పనిచేసిన కవిత హైదరాబాద్ లోని హయత్నగర్–1 డీవీఎంగా వెళుతున్నారు. ఆమె స్థానంలో జగన్ హైదరాబాద్లోని వర్క్షాపు నుంచి వస్తున్నారు. అలాగే ఇంతవరకు మహబూబ్నగర్లో డిప్యూటీ ఆర్ఎం (ఆపరేషన్స్) గా పనిచేసిన లక్ష్మీధర్మ హైదరాబాద్లోని కూకట్పల్లి డీవీఎంగా బదిలీ అయ్యారు. ఈయన స్థానంలో పరిగి డీఎంగా పనిచేస్తున్న కె.కె.మూర్తి పదోన్నతిపై ఇక్కడికి వస్తున్నారు. ఇక అచ్చంపేట డిపో మేనేజర్ (డీఎం) గా పనిచేస్తున్న ప్రసాద్ హైదరాబాద్లోని హయత్నగర్–2కు వెళుతున్నారు. ఈయన స్థానంలో హైదరాబాద్ నుంచి బి.శ్రీనివాసులు వస్తున్నారు. షాద్నగర్ డీఎంగా పనిచేస్తున్న ఉషా జనగామకు, ఈమె స్థానంలో హైదరాబాద్ నుంచి కరుణశ్రీ వస్తున్నారు. గద్వాల డీఎంగా పనిచేస్తున్న సునీత హైదరాబాద్లోని కూకట్పల్లికి, ఈమె స్థానంలో రాణిగంజ్ నుంచి ఎ.శ్రీధర్ వస్తున్నారు. నారాయణపేట డీఎంగా పనిచేస్తున్న లావణ్య హైదరాబాద్లోని హయత్నగర్–1కు, ఈమె స్థానంలో ఏటీఎం కార్గో నుంచి డీఎన్ రాజు వస్తున్నారు. కొల్లాపూర్ డీఎంగా పనిచేస్తున్న ఉమాశంకర్ హైదరాబాద్లోని హెడ్ ఆఫీసుకు, ఈయన స్థానంలో వరంగల్ బస్స్టేషన్ ఏటీఎం నుంచి మల్లేషం వస్తున్నారు. కల్వకుర్తి డీఎంగా పనిచేస్తున్న సుభాషిణి ఎల్లందుకు, ఈమె స్థానంలో హైదరాబాద్లోని డిప్యూటీ సీటీఎం–ఏఎంటీ షాలిని పదోన్నతిపై వస్తున్నారు. -
నిబంధనలు ఏం చెబుతున్నాయి..
ఏడాదిన్నర క్రితం 185వ చట్టం క్లాజ్ (ఎఫ్) తర్వాత క్లాజ్ (జీ) ప్రకారం విద్యాసంస్థల బస్సుల కోసం అదనపు నిబంధనలు జోడించారు. స్కూల్ బస్సుపై కళాశాల/పాఠశాల పేరు, ఫోన్, సెల్ నంబర్లతో పాటు పూర్తి చిరునామాను బస్సు ఎడమవైపు, బస్సు ముందు భాగంలో స్పష్టంగా కనిపించేలా రాయాల్సి ఉంటుంది. ● 60ఏళ్లు దాటిన డ్రైవర్ను నియమించుకోరాదు. పాఠశాల యాజమాన్యం, బస్సు డ్రైవర్, బస్సుకు సంబంధించిన పూర్తి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలి. ● బస్సు డ్రైవర్ను నియమించే సమయంలో అతడి లైసెన్స్ను ఆర్టీఏ కార్యాలయంలో ఒకసారి సరిచూసుకోవడంతో పాటు బస్సును ఐదేళ్ల పాటు నడిపిన అనుభవం ఉండాలి. ● బస్సులో ఒక అత్యవసర ద్వారం ఉండాలి. దానిపై పెద్ద అక్షరాలతో అత్యవసర ద్వారం అని రాయాలి. -
ప్రజావాణి దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ప్రజావాణి దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని రెవెన్యూ అదన పు కలెక్టర్ జేఎల్బీ హరిప్రియ అధికారులను ఆదే శించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్ర జల నుంచి ఆమె ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో ఎక్కడైనా సమస్య లు ఉన్నట్లయితే ఆలస్యం చేయకుండా వెంటనే సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా సీఎం ప్రజావాణికి సంబంధించిన దరఖాస్తులను ప్రాధాన్యతనిచ్చి సకాలంలో పరిష్కరించాలని సూచించారు. అలాగే మండలస్థాయి ప్రజావాణి దరఖాస్తులను కూడా పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి, వాటి వివరాలను ప్రజావాణి ఆన్లైన్ పోర్టల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆదేశించారు. త్వరలో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నందున, దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ వారం వివిధ శాఖలకు సంబంధించి ప్రజల నుంచి 104 వినతులను అధికారులు స్వీకరించారు. 82.17 శాతం జనగణన పూర్తి ప్రజావాణి అనంతరం జిల్లాలో నమోదుతున్న జనాభా గణన పురోగతిపై వెబెక్స్ ద్వారా మండల తహసీల్దార్లతో అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు జిల్లాలో 82.17 శాతం జనగణన పూర్తయిందన్నారు. హన్వాడ, చిన్నచింతకుంట, మహమ్మదాబాద్, గండేడ్ మండలాలు, భూత్పూర్, జడ్చర్ల మున్సిపాలిటీలు జనగణన నమోదులో వెనకబడి ఉన్నాయని, ఆయా మండలాల తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఈ రోజు సాయంత్రం లోగా 100 శాతం పూర్తిచేసి సమర్పించాలని ఆదేశించారు. ప్రక్రియలో ఎక్కడైనా ఆన్లైన్ చేయడంలో చేయడంలో సాంకేతిక కారణాల వల్ల ఇబ్బందులు తలెత్తితే వాటిని తహసీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులు, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారితో సమన్వయం చేసుకొని పరిష్కరించుకోవాలన్నారు. అలాగే మున్సిపాలిటీల కమిషనర్లతో వందశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రాంరెడ్డి, డీఆర్ఓ నిర్మల, జెడ్పీసీఈఓ వెంకట్రెడ్డి, డీఆర్డీఓ నర్సింహులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
బస్సులో తప్పనిసరిగా ఉండాల్సినవి..
● ప్రతి స్కూల్ బస్సులో అవసరమైన మందులు, పరికరాలతో కూడిన ప్రథ మ చికిత్స బాక్స్ ఉండాలి. ● బస్సులో తప్పకుండా ఒక అటెండర్ను ఉంచాలి. అతను తప్పనిసరిగా యూనిఫాం ధరించాలి. ● బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థుల పూర్తి వివరాలు ఉంచాలి. విద్యార్థి ఎక్కాల్సిన ప్రదేశం, దిగాల్సిన ప్రదేశం నమోదు చేయాలి. ● బస్సులో ఉన్న విద్యార్థులు కిందకు దిగే సమయంలో డ్రైవర్కు వారు కనిపించే విధంగా మిర్రర్ ఏర్పాటుచేయాలి. ● ముఖ్యంగా బస్సు ఇంజిన్ కంపార్ట్మెంట్లో అగ్నిమాపక పరికరం ఉండేలా చూసుకోవాలి. ● బస్సు సీట్ల కింద విద్యార్థుల బ్యాగులు పెట్టుకునేందుకు గాను ర్యాక్ ఉండాలి. ● బస్సు పాఠశాల కమిటీ పేరుమీద రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. ● బస్సు తయారీ సంసవత్సరం నుంచి 15 ఏళ్లు మించరాదు ● ప్రతి బస్సుకు హ్యాండ్బ్రేక్, పూర్తిస్థాయిలో బీమా, రవాణా పన్నులు చెల్లించి ఉండాలి. ● బస్సు అద్దాలకు ఆనుకుని అడ్డంగా ఇనుప గ్రిల్స్ ఏర్పాటుచేయాలి. ● నాణ్యమైన ఇంజిన్, స్టీరింగ్, రూఫ్, టైర్లు తదితర ప్రభుత్వం గుర్తించిన పూర్తి సౌకర్యాలు కల్పించాలి. ● విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండేలా తక్కువ ఎత్తులో సీట్లు బిగించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు ప్రైవేటు స్కూల్ బస్సులకు గడవులోపు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలి. లేనిచో రవాణాశాఖ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్లు చేపట్టి.. నిబంధనలు పాటించని స్కూల్ బస్సులపై చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం ఫిట్నెస్ పరీక్షలకు వచ్చిన ప్రతి బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేసి.. ఫైర్ సేఫ్టీ, ప్రాథమిక చికిత్స బాక్స్, బస్సు బ్రేక్, కండీషన్ ఇలా ప్రతీది పరిశీలిస్తున్నాం. ఏదైనా బాగాలేకపోతే వెంటనే రిటన్ పంపిస్తున్నాం. కనీసం లైట్ లేకపోయినా సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. అనుమతులు లేకుండా స్కూల్ బస్సులను నడిపితే కఠిన చర్యలు తప్పవు. అవసరమైతే బస్సుల డ్రైవర్లు, యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తాం. – నర్సింహస్వామి, ఎంవీఐ, మహబూబ్నగర్ ● -
సైబర్ మోసాలపై ప్రత్యేక దృష్టి సారించాలి: ఎస్పీ
మహబూబ్నగర్ క్రైం: ప్రజావాణిలో వచ్చిన ప్రతి ఫిర్యాదుపై సత్వర చర్యలు తీసుకోవడంతో పాటు బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ డి.జానకి అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం పోలీసు ప్రజావాణి సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల సమస్యలపై మొదట వినాలని, ఆ తర్వాత వాటికి పరిష్కారం చూపాలన్నారు. ఫిర్యాదులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళలు, వృద్ధులు, సైబర్ మోసాలకు గురైన బాధితుల ఫిర్యాదులను ప్రత్యేక ప్రాధాన్యతతో పరిశీలించాలన్నారు. బాదేపల్లి యార్డులో జోరుగా క్రయవిక్రయాలు జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో సోమవారం వివిధ ప్రాంతాల నుంచి భారీగా ధాన్యం విక్రయానికి వచ్చింది. 4,601 బస్తాల ధాన్యం విక్రయానికి రాగా ఆర్ఎన్ఆర్ రకం క్వింటా గరిష్టంగా రూ.2,806, కనిష్టంగా రూ.1,699 ధరలు లభించాయి. అదేవిధంగా 3609 బస్తాల మొక్కజొన్న మార్కెట్కు రాగా క్వింటాకు గరిష్టంగా రూ.2,002, కనిష్టంగా రూ.1,601 ధరలు లభించాయి. ఇక ఆముదాలు క్వింటా గరిష్టంగా రూ.6,315, కనిష్టంగా రూ.6,255, వేరుశనగ రూ.4,921, పొద్దుతిరుగుడు గరిష్టంగా రూ.6,780, కనిష్టంగా రూ.3,780 ధరలు పలికాయి. గుర్తింపులేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలలపై తగు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో డీఈఓ విజయకుమారిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనీసం కిలోమీటరు దూరం ఉంటేనే అనుమతి ఇవ్వాలన్నారు. విద్యార్థులు వేరే పాఠశాలల్లో చేరేటప్పుడు పూర్వపు పాఠశాల బోనఫైడ్, టీసీ తప్పనిసరిగా ఉండాలన్నారు. ముఖ్యంగా జిల్లాలో కిడ్స్ ప్లే స్కూల్స్ పేరిట ఎక్కడబడితే అక్కడ ఏర్పాటు చేస్తున్నారని వీటిని నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కొన్నిచోట్ల ప్రైవేట్ స్కూళ్లపై వివిధ విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు దాడులకు పాల్పడటం తగదన్నారు. అనంతరం ఆమెకు పూలబొకే ఇచ్చి సన్మానించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు బి.రాంచందర్, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మాజీ సైనికుల సంక్షేమానికి కృషి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): మాజీ సైనికుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ సైనిక సంక్షేమ డైరెక్టర్, బ్రిగేడియర్ ఎన్ఆర్ బాబు అన్నారు. సోమవారం స్థానిక సైనిక సంక్షేమ శాఖ కార్యాలయంలో మాజీ సైనికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంతో చర్చించి మాజీ సైనికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. రిజర్వేషన్ను 2 నుంచి 5 ఏళ్లు పెంచాలని మాజీ సైనికులు అడుగుతున్నారని, ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. అనంతరం మాజీ సైనికుల సంఘం నాయకులు ఆయనకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో సైనిక శాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి, మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్రెడ్డి, కార్యదర్శి నాగేశ్వర్, ఎమ్మార్కే రెడ్డి, వెంకటయ్యగౌడ్, రాములు పాల్గొన్నారు. -
రోడ్లను కమ్మేసిన ఇసుక మేటలు
● ఇబ్బందులు పడుతున్న వాహనదారులు ● చోద్యం చూస్తున్న ఆర్అండ్బీ, మున్సిపల్ అధికారులు అచ్చంపేట: పట్టణంలో బీటీ రోడ్లపై ఇసుక, మట్టి చేరి రహదారి కుదించుకుపోతున్నాయి. ఇసుక మేటలు తొలగించడంలో అర్ఆండ్బీ, మున్సిపల్ అధికారులు చొరవ చూపడంలేదు. దీంతో ఈ రోడ్లపై వెళ్లేందుకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలను తప్పించబోయి ఇసుక, మట్టిలో వాహనం అదుపుతప్పి కిందపడి ప్రమాదాలకు గురవుతున్నారు. అచ్చంపేట–నాగర్కర్నూల్–శ్రీశైలం ప్రధాన రహదారి నాలుగు వరుసలు, అచ్చంపేట– ఉప్పునుంతల, అచ్చంపేట–లింగాల రోడ్లు రెండు వరుసల రహదారిని పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతోంది. డబుల్ రోడ్లు కూడా ఇసుక మేటలు కమ్మేయడంతో సింగిల్ రోడ్లుగా కనిపిస్తున్నాయి. పట్టణంలోని ఉప్పునుంతల రోడ్డు మార్గంలో పశువైద్యశాల నుంచి భారత్గ్యాస్, మార్కెట్ వరకు రోడ్డుకు ఇరువైపులా మట్టి పేరుకుపోయింది. ప్రధాన రహదారి నాగర్కర్నూల్, శ్రీశైలం వైపు అదే పరిస్థితి నెలకొంది. మున్సిపల్ సిబ్బంది ప్రధాన రహదారులను నిత్యం శుభ్రం చేస్తున్నా.. ఎత్తుగా పేరుకుపోయిన మట్టి, ఇసుక మేటలను తొలగించడం వారికి సాధ్యం కావడం లేదు. ప్రభుత్వం రూ.లక్షలు ఖర్చు చేసి బీటీ రోడ్లు వేస్తే.. అధికారులు మాత్రం పేరుకుపోయిన మట్టి తొలగించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాదారులు, ఇళ్ల యాజమానులు ఇంటి ఎదుట ఎత్తుగా మట్టి పోయడం వల్ల బీటీ రోడ్లు కుచించుకుపోతున్నాయి. అధికారులు ఇప్పటికై నా పట్టణంలో బీటీ రోడ్లపై కుప్పలుగా ఉన్న మట్టి, ఇసుక మేటలు తొలగించడంపై దృష్టి పెట్టాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. వర్షాకాలంలో.. రోడ్డుకు ఇరువైపులా మట్టి కుప్పలు పేరుకోవడంతో వర్షాకాలంలో అది బురదమయంగా మారుతుంది. దీనికి తోడు రోడ్లపై వర్షపు నీరు నిలిచి డ్రెయినేజీలుగా మారుతున్నాయి. దీంతో వాహనాలు సాఫీగా వెళ్లే వీలు లేకపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. బీటీ రోడ్డుకు ఇరువైపుల వాహనాలు నిలిపేందుకు వీలుగా పది ఫీట్ల రోడ్డును వెడల్పు చేయావల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. రోడ్ల పక్కనే ఉండే చిరువ్యాపారులను ఇతర ప్రాంతాలకు తరలించడం వల్ల పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీరుతుంది. పోలీసులు, మున్సిపల్ అధికారులు సంయుక్తంగా పనిచేసి ఆక్రమణలు తొలగించడంతో పాటు ప్రధాన రోడ్లపై వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ప్రధాన రహదారిపై మట్టిని తీసేయాలని ఆర్అండ్బీ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రధాన రహదారి వంద ఫీట్లతో పాటు వాహనాల పార్కింగ్కు ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
పత్తి సాగుపైనే ఆశలు
మా ప్రాంతంలో ఎక్కువ మంది రైతులు పత్తి సాగు చేస్తారు. ఇప్పటికే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేశాం. వర్షాలు సకాలంలో పడితే దిగుబడులు బాగుంటాయి. కానీ వర్షాలు ఆలస్యమైతే ఖర్చు లు పెరుగుతాయి. మృగశిర కార్తె రైతులకు ఆశల కాలం. – నర్సింహులు, ఉడ్మల్గిద్ద, దామరగిద్ద మండలం మృగశిర కార్తె మొదలైన రోజు దగ్గరపడగానే పల్లెల్లో ఒక కొత్త వాతావరణం మొదలవుతుంది. వరణుడి కోసం రైతు చూపు పెరుగుతుంది. మృగశిర కార్తెలో విత్తనం నేలలో పడితే దిగుబడి ఆశించిన మేర వస్తుంది. – కృష్ణయ్య, రాకొండ, మరికల్ మండలం మృగశిర కార్తె అంటే రైతుకు కేవలం పంచాంగంలో ఒక పేరు కాదు. అది వానాకాలం సీజన్కు ప్రధాన ముఖద్వారం. కార్తె వచ్చిందంటే అన్నదాతకు ఆశలు చిగురిస్తాయి. ఈపాటికే సిద్ధం చేసుకున్న దుక్కులు తొలకరి జల్లు కోసం ఎదురుచూస్తున్నాయి. సరైన సమయంలో వర్షం పడిదంటే రైతులకు పండగే. – ఎల్లప్ప, మాద్వార్, మక్తల్ మండలం కార్తె ప్రారంభం నాడు చేపలు తింటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఏడాదంతా ఆరోగ్యంగా ఉంటామని విశ్వాసం. మిరియాలు, అల్లం, శొంఠి తింటే వర్షాల నుంచి వచ్చే చల్లని గాలులతో సోకే జ్వరం, జలుబు వంటి రోగాలు దరిచేరకుండా రక్షణనిస్తాయి. – నామాల వెంకటయ్య, మరికల్● -
నకిలీ విత్తనాలతో మోసపోవద్దు
● మూస పద్ధతులతో సాగు వద్దు ● నాణ్యమైన విత్తనాలు, పంట వైవిధ్యీకరణే రక్షణ కవచం ● శాస్త్రవేత్త డాక్టర్ భవాని మదనాపురం: ఖరీఫ్ సాగు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులు సాంప్రదాయ పద్ధతులకే పరిమితం కాకుండా, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ముందస్తు ప్రణాళికలతో ముందుకు సాగాలని మదనపురం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ భవాని పిలుపునిచ్చారు. నాణ్యమైన విత్తనాల ఎంపిక, సకాలంలో ప్రత్యామ్నాయ పంటల వైవిధ్యీకరణ ద్వారానే వాతావరణ గండాల నుంచి గట్టెక్కి లాభసాటి దిగుబడులు సాధించవచ్చని స్పష్టం చేశారు. విత్తనమే పంటకు పునాది.. విత్తనం నాణ్యతపైనే పంట ఉత్పాదకత ఆధారపడి ఉంటుందని డాక్టర్ భవాని పేర్కొన్నారు. ధృవీకరించిన నాణ్యమైన విత్తనాలను నాటడం ద్వారా పంట దిగుబడిని 15 నుంచి 20 శాతం వరకు పెంచుకోవచ్చు.దీనికి శాసీ్త్రయ పంట యాజమాన్య పద్ధతు లు తోడైతే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయి. విత్తనాల్లో కనీసం 98 శాతం భౌతిక స్వచ్ఛత ఉండాలి. కలుపు విత్తనాలు, ఇతర రకాల గింజలు, పురుగు ఆశించినవి లేదా విత్తన జనిత వ్యాధులు ఉన్న వా టిని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. విత్తనాల్లో తేమ శాతం 8 నుంచి 10 శాతం లోపు మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువ తేమ ఉంటే నిల్వ సా మర్థ్యం తగ్గడమే కాకుండా, బూజు (శిలీంధ్రాలు) ముక్కు పురుగుల సమస్య ఎక్కువవుతుంది. కొనుగోలు సమయంలో జాగ్రత్తలు తప్పనిసరి.. నకిలీ విత్తనాల బారిన పడకుండా ఉండేందుకు రైతులు కింది అంశాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. లైసెన్స్ పొందిన డీలర్లు, ప్రభుత్వ సంస్థలు లేదా గుర్తింపు పొందిన విక్రయ కేంద్రాల నుంచే విత్తనాలు కొనాలి. విత్తన సంచిపై రకం పేరు, లాట్ నంబర్, మొలకశాతం, భౌతిక స్వచ్ఛత, తేమ శాతం, గడువు తేదీ అలాగే ధృవీకరణ (సర్టిఫికేషన్) ట్యాగ్ కచ్చితంగా చూసుకోవాలి. చిరిగిన, తెరిచి మళ్లీ కుట్టిన సంచులను నమ్మి మోసపోవద్దు. కొనుగోలు చేసిన విత్తనాలకు సంబంధించి రశీదు (బిల్లు)ను పంట కాలం పూర్తయ్యే వరకు భద్రపరుచుకోవాలి. ఇంటి వద్ద నిల్వ ఉంచుకున్న విత్తనాలను నాటడానికి ముందే ఇంట్లోనే మొలకశాతం పరీక్ష చేసుకుని, సంతృప్తికరంగా ఉంటేనే వాడుకోవాలి. వివిధ పంటల కనీస మొలక శాతాలు.. రైతులు తాము కొనుగోలు చేసే విత్తనాలకు కనీసం ఈ కింది స్థాయిలో మొలకశాతం ఉండేలా చూసుకోవాలి. వరి 80% మొక్కజొన్న 90% జొన్న సజ్జ 75% పప్పు ధాన్యాలు మినుము కంది 75% వేరుశనగ 70% సోయబీన్ 70 శాతం పత్తి హైబ్రిడ్ 75 శాతం ఉండాలి. ఒకే రకమైన సాంప్రదాయ పంటలపై పెట్టుబడి పెట్టి నష్టపోవద్దు. తక్కువ నీటితో, తక్కువ కాలవ్యవధిలో చేతికొచ్చే పప్పుధాన్యాలు నూనెగింజలు (వేరుశనగ, పొద్దుతిరుగుడు) తోటపంటలు మరియు కూరగాయల సాగు వైపు పంట వైవిధ్యీకరణ చేపట్టాలి. ఇది వాతావరణ నష్టాల నుంచి రక్షణ కల్పించడమే కాకుండా, మార్కెట్లో నిరంతర ఆదాయాన్ని అందిస్తుంది.తమ ప్రాంత నేల స్వభావం, నీటి లభ్యత మార్కెట్ డిమాండ్ను బట్టి వ్యవసాయ విశ్వవిద్యాలయాలు పరిశోధన సంస్థలు సిఫారసు చేసిన రకాలను ఎంపిక చేసుకోవాలని, సం దేహాలుంటే అధికారులను సంప్రదించాలన్నారు. పాడి–పంట -
మృగశిర.. వచ్చిందోచ్
నారాయణపేట శివారులో దుక్కులు సిద్ధం చేస్తున్న రైతు నారాయణపేట: రోళ్లు పలిగే రోహిణి కార్తె ఆదివారంతో ముగిసి.. మురిపెంతో మృగశిర సోమవారంతో మొదలవుతుంది. మృగశిర కార్తె అంటే రైతు కళ్లలో కనిపించే ఆశ.. పొలంలో పడే తొలి విత్తనం.. వంటింట్లో ఘుమఘుమలాడే నాటుకోడి కూర, చేపల పులుసు.. వరుణుడి కటాక్షం కోసం ఎదురుచూసే నేలమ్మ. చినుకు పడితే మట్టి పరిమళిస్తుంది. ఎండలతో పగిలిన నేలలు తడి తాకిడికి మళ్లీ శ్వాస తీసుకుంటాయి. ఇది కేవలం వాతావరణ మార్పు కాదు గ్రామీణ జీవనానికి ఓ పండుగ. జోరుగా సాగు పనులు మృగశిర కార్తె వచ్చిందంటే వర్షాకాలం ప్రారంభమైనట్లే. రైతులు సాగు పనులకు సిద్ధమవుతారు. ఆకాశంలో మేఘాలు కమ్ముకుని తొలి జల్లులు పడగానే రైతు గుండెల్లో ఆశల మొగ్గలు చిగురిస్తాయి. ఈ కార్తెలో విత్తనాలు విత్తితే ఇంటికి సిరుల పంట వస్తుందని అనాదిగా అన్నదాతల నమ్మకం. ఇప్పటి నుంచి కొన్ని రోజుల వరకు ఏ రైతు నోట విన్నా.. విత్తనాల ఎంపిక, దుక్కలు సిద్ధం చేసుకోవడం, విత్తనాలు విత్తే సమయం, వర్షం గురించిన మాటలే వస్తుంటాయి. కంది, పెసర, మినుములు, పత్తి వంటి పంటల సాగుకు అనుకూలం. ఆహారం.. ఆరోగ్యం కార్తె మొదటి రోజున మాంసాహారులైతే చేపలు, నాటుకోడి తింటారు. శాఖాహారులు అయితే ఇంగువ–బెల్లం కలిపిన మిశ్రమం, అల్లం, శొంఠి ఆహారంలో భాగంగా తీసుకుంటారు. వర్షాకాలంలో వచ్చే జబ్బులు, శ్వాస సమస్యల, ఆస్తమా నుంచి ఇవి రక్షణ కల్పించి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. అస్తమా రోగులు మృగశిర కార్తె రోజున అందించే చేప మందు తీసుకుంటే ఉపశమనం కలుగుతుందని విశ్వాసం. ● నారాయణపేట జిలాల్ల ప్రధానంగా కంది, పెస ర, మినుములు, పత్తి, వరి పంటలు సాగు చేస్తారు. వర్షాధార వ్యవసాయం కావడంతో మొదటి వర్షాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అంతర పంటల విధానం ఎక్కువగా కొనసాగుతోంది. ● గద్వాల జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న పంటలు ప్రధానంగా సాగవుతున్నాయి. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వరి సాగు ఎక్కువగా ఉంటుంది. వర్షం ఆధారంగా పత్తి సాగు ప్రారంభమవుతోంది. ● వనపర్తి జిల్లాలో వరి సాగు ప్రధానంగా ఉండగా.. పత్తి, కంది పంటలు విస్తృతంగా సాగవుతున్నాయి. బోరు నీటి ఆధారిత వ్యవసాయం ఎక్కువగా కనిపిస్తోంది. ● మహబూబ్నగర్ జిల్లాలో వరి, పత్తి, జొన్న, కంది పంటలు ప్రధానంగా సాగవుతున్నాయి. మార్కెట్ పంటలపై రైతులు ఎక్కువగా ఆధారపడుతున్నారు. ● నాగర్కర్నూల్ జిల్లాలో నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉండటంతో వరి పంట ప్రధానంగా సాగుతోంది. పత్తి, కంది, మొక్కజొన్న ముఖ్య పంటలుగా ఉన్నాయి. సాగు పనుల్లో నిమగ్నం కానున్న అన్నదాతలు ఈ కార్తెలో విత్తనాలు నాటితేనే మంచిదని నమ్మకం నేడు చేపలు తింటే ఆరోగ్యం సిద్ధిస్తుందని విశ్వాసం -
ఎద్దుల బండిని ఢీకొన్న లారీ
● ఎద్దు మృతి.. రైతుకు గాయాలు చిన్నచింతకుంట: వేగంగా దూసుకొచ్చిన లారీ ఎద్దుల బండిని ఢీకొట్టిన ప్రమాదంలో ఓ ఎద్దు మృతి చెందగా రైతుకు గాయాలైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. మండలంలోని ఉంధ్యాల గ్రామానికి చెందిన గొల్ల శేషన్న పొలం నుంచి పనులు ముగించుకొని ఎద్దుల బండిపై ఇంటికి వస్తున్న క్రమంలో గ్రామ సమీపంలోని బీటీరోడ్డుపై ఆత్మకూర్ వైపు వెళ్తున్న లారీ అతివేగంతో ఎద్దుల బండిని ఢీకొట్టింది. దీంతో బండి ముక్కలవగా ఓ ఎద్దు అక్కడికక్కడే మృతి చెందగా, శేషన్నకు గాయాలయ్యాయి. శేషన్నను చికిత్స నిమిత్తం మహబుబ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం చోటు చేసుకుందని గ్రామస్తులు ఆరోపించారు. దాదాపు రూ.2 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఈతకు వెళ్లి వ్యక్తి మృతి తిమ్మాజిపేట: బావిలో ఈత పడేందుకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. వడ్ల చెన్నకేశవులు (54) ఆదివారం కొందరితో కలిసి తిమ్మాజిపేట సమీపంలోని గుండోని బావికి ఈతకు వెళ్లాడు. కొంతసేపు బావిలో ఈత పడిన తర్వాత చెన్నకేశవులు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తోటి వ్యక్తులు నాగర్కర్నూల్లోని ఫైర్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది బావిలో గాలించి చెన్నకేశవులును బయటికి తీసి పరీక్షించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహన్ని నాగర్కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి గద్వాల క్రైం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కేటీదొడ్డి మండలంలోని గువ్వలదిన్నె గ్రామానికి చెందిన బోయ శివ (28) వ్యక్తిగత పనుల నిమిత్తం బొలెరో వాహనంలో గద్వాలకు వస్తున్నాడు. ఈ క్రమంలో గోనుపాడు సమీపంలో బొలెరోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిన క్రమంలో శివకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు చికిత్స నిమిత్తం క్షతగాత్రుడిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తీసుకెళ్లాలని సూచించారు. అయితే కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం శివ మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు రూరల్ పోలీసులు విచారణ చేపట్టారు. వ్యక్తిపై కత్తితో దాడి ఘటనలో కేసు నమోదు జడ్చర్ల: ఓ వ్యక్తి మరో వ్యక్తిపై కత్తితో దాడి చేసి గాయపరిచిన ఘటన మండలంలోని చిన్నఆదిర్యాల్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. శనివారం రాత్రి చిన్నఆదిర్యాల్ గ్రామానికి చెందిన చీరాల శ్రీకాంత్, అతని స్నేహితుడు శివ గ్రామంలోని కిరాణంలో ఉండగా.. అదే గ్రామానికి చెందిన దుబ్బా సుధాకర్ వచ్చి శివతో గొడవపడ్డాడు. దీంతో శ్రీకాంత్ వారిని వారించాడు. కానీ సుధాకర్ శ్రీకాంత్తో సైతం గొడవకు దిగడంతో అక్కడే ఉన్న స్థానికులు వారిని సముదాయించి, ఇంటికి పంపించారు. కాగా కొద్దిసేపటికే సుధాకర్ కత్తితో తిరిగి వచ్చి కిరాణం వద్ద ఉన్న శ్రీకాంత్పై దాడి చేసి వీపుభాగంలో పొడిచాడు. మరోసారి పొడవబోతుండగా అదే గ్రామానికి చెందిన కొందరు అడ్డుకుని బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై బాధితుడు శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు. -
నడిగడ్డలో ఏపీ సర్కార్ జులుం
రాజోళి: పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అడుగడుగునా గద్వాల జిల్లాపై అక్కసు వెళ్లగక్కుతోంది. నదిలో హద్దులు దాటి.. ఇసుక అక్రమ రవాణా పేరుతో సాధారణ ట్రాక్టర్ డ్రైవర్లపై కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అనుమతించిన చోట ఇసుక తీసినా కేసులు నమోదు చేస్తున్నారు. తమ హద్దులో ఉన్నారనుకుని కేసులు చేస్తే సరేలే అని జరిమానాలు కడుతుంటే.. ఏకంగా హద్దులు దాటి గ్రామాల్లోకి వచ్చి మరీ దాడులు చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. తుంగభద్ర సరిహద్దుగా.. రాజోళి మండలం, ఏపీలోని కర్నూలు జిల్లా మధ్యలో తుంగభద్ర నది సరిహద్దుగా ఉంది. దీంతో నీటి అవసరాలే కాక, ఇసుకను ఇక్కడి నుంచే సేకరిస్తున్నారు. కాగా ఏపీ అవసరాలకు ఇసుక తీసే క్రమంలో జిల్లా సరిహద్దులోకి వచ్చి ఇసుకను కొ ల్లగొట్టారు. అప్పుడు వారికి గుర్తు లేని సరిహద్దు, జిల్లా నుంచి ఏ ట్రాక్టరైనా అటుగా వెళ్తే వెంటనే మా హద్దులోకి వచ్చారంటూ మైనింగ్ అధికారులు, పోలీసులు వచ్చి కేసులు నమోదు చేస్తున్నారు. ఇదంతా చూస్తూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గతేడాది 50 ట్రాక్టర్లపై.. గతేడాది జిల్లాకు చెందిన 50 ట్రాక్టర్లు తమ హద్దు లోకి వచ్చాయని ఏపీ మైనింగ్ అధికారులు రాజోళి మండలం తూర్పు గార్లపాడులోకి వచ్చి ఒక్కో ట్రాక్టర్కు రూ.5 వేల చొప్పున జరిమానా విధించారు. ‘మా జిల్లాలోకి వచ్చి ఎలా జరిమానా వేస్తా రు’ అని ప్రశ్నించేవారు లేకపోయారు. పది రోజుల కిందట మన సరిహద్దులో ఇసుక రీచ్ పరిశీలించేందుకు వెళ్లిన మైనింగ్ అధికారులపై కర్నూలు జిల్లా టీడీపీ నాయకుడు బెదిరింపులకు దిగారు. ఇది మరువక ముందే శనివారం రాత్రి ఏపీ పోలీసులు నేరుగా రాజోళి మండల కేంద్రానికి వచ్చి ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు ఇసుక తీసుకునేందుకు నదిలోకి వచ్చారంటూ స్థానిక ట్రాక్టర్ల యజమానులపై జులుం ప్రదర్శించి, వాహనాలను నిలిపేశారు. దీంతో స్థానికులు ఒక్కసారిగా వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదలు వస్తే నష్టపోతున్నాం.. ఇరు ప్రాంతాల నడుమ నది ఉన్నప్పుడు ఇసుక తీసుకునేందుకు మాకు అవకాశం ఉందని, మీ ప్రాంతానికి చెందినవారు తమ హద్దులో ఎన్నోసార్లు ఇసుక తరలించినా మేము పట్టించుకోలేదని స్థాని కులు ఏపీ అధికారులను నిలదీశారు. నదిలో వరద లు వస్తే కర్నూలుతోపాటు తాము కూడా నష్ట పోతున్నామని, అప్పుడు నదిపై మాకెందుకు హక్కు ఉండదని ప్రశ్నించారు. అనుకువగా ఉన్నామని పదే పదే జిల్లా సరిహద్దులు దాటి వచ్చి కేసులు నమోదు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అనుమతి లేకుండా.. ఈ విషయం తెలుసుకున్న రాజోళి ఎస్ఐ గోకారి ఘటనా స్థలానికి చేరుకుని, కర్నూలు జిల్లా పోలీసుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని, అంతే కానీ.. హద్దులు దాటి, తమ పరిధిలోకి వచ్చి జిల్లా ట్రాక్టర్లను నిలిపేయడం ఏమిటని మండిపడ్డారు. ఇలాంటి తీరుతో ఇరు ప్రాంతాల నడుమ విద్వేషాలు పెరుగుతాయని, ఇది సరైన పద్ధతి కాదని వారించడంతో కర్నూలు పోలీసులు వెనుదిరిగారు. ఏపీలో ఉచిత ఇసుక పేరుతో జిల్లాలోని నదీతీర గ్రామాల్లోకి వచ్చి వారు తీసుకుంటే పట్టించుకోని జిల్లా అధికార యంత్రాంగం.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక తీసేందుకు ఎద్దుల బండి నదిలోకి వెళ్లినా కేసు నమోదు చేస్తుంది. ప్రభుత్వానికి ఆన్లైన్ చార్జీలు చెల్లించినా కూడా ఇసుక తీసుకునేందుకు భయపడాల్సి వస్తుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మన ప్రభుత్వానికి చార్జీలు చెల్లించి.. కర్నూలు నాయకులకు భయపడి ఇసుక తీసుకోకుండా నిర్మాణాలు ఆపేయాల్సిన పరిస్థితి పట్టిందని, దీనిపై జిల్లా నాయకులు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని వాపోతున్నారు. జిల్లాలో ఇప్పటికీ ఏపీ నాయకుల పెత్తనమే నడుస్తుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక రవాణా అడ్డుకునే నెపంతో సరిహద్దు దాటుతున్న పోలీసులు తాజాగా శనివారం రాత్రి అక్రమ కేసులు పెట్టేందుకు యత్నం చోద్యం చూస్తున్న గద్వాల జిల్లా అధికారులు -
కార్పొరేట్కు దీటుగా..!
● ఉమ్మడి జిల్లాలో రెండో విడతలో 292 పాఠశాలలు ఎంపిక ● తరగతి గది, సామగ్రి కొనుగోలుకు నిధులు మంజూరు ●నారాయణపేట రూరల్: ఐదేళ్లలోపు చిన్నారులకు సైతం ప్రైవేట్, కార్పొరేట్ విద్యాలయాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే ఆటపాటలతో చదువుపై ఆసక్తి పెంపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గతేడాది ప్రీ ప్రైమరీ పాఠశాలలు ప్రారంభించింది. చిన్నారుల మనోవికాస అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేసి పాఠశాల విద్యాశాఖ, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల సమన్వయంతో ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించింది. గతేడాది కార్యాచరణలో భాగంగా పాఠశాలలకు ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణకు అనుమతులు మంజూరు చేసింది. సత్ఫలితాలతో ముందుకు.. గతేడాది ప్రారంభించిన ప్రీ ప్రైమరీ పాఠశాలలు సత్ఫలితాలు ఇవ్వడంతో 2026–27 విద్యా సంవత్సరంలో మరిన్ని పాఠశాలలకు విస్తరించాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు కొత్తగా మంజూరు చేసిన పాఠశాలల్లో అవసరమైన సౌకర్యాలు కల్పిస్తోంది. ఇప్పటికే ఒక్కో పాఠశాలకు రూ.లక్ష మంజూరు చేసి సామగ్రి కొనుగోలు, పెయింటింగ్ కోసం వినియోగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మొదటి విడత 94 పాఠశాలల్లో ప్రారంభించగా.. తాజాగా వాటి సంఖ్య మూడింతలు చేసి 292 పాఠశాలలకు అనుమతినిచ్చింది. దీంతో ఇప్పటి వరకు 386 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్య అందనుంది. ప్రవేశాలు ఇలా.. వచ్చే ఏడాది ఒకటో తరగతిలో చేరడానికి అర్హులైన పిల్లలను 2026–27 విద్యా సంవత్సరంలో ప్రీ ప్రైమరీ విభాగంలో చేర్చుకోవాలి. ఆయా చిన్నారులను పాఠశాలలకు సిద్ధం చేయడం, పూర్వ ప్రాథమిక విద్య అందించడం ముఖ్య ఉద్దేశం. వయస్సు, నివాస ధ్రువీకరణతో సహా అవసరమైన అన్ని పత్రాలను సేకరించి ప్రవేశాలు కల్పించాలి. విద్యాహక్కు చట్టం ప్రకారం అట్టడుగు వర్గాల పిల్లలు, ప్రత్యేక అవసరాల పిల్లలను మొదట చేర్చుకుంటారు. ప్రీ ప్రైమరీ విభాగానికి ప్రత్యేక గదిని కేటాయిస్తారు. అందులో పిల్లలకు అవసరమైన ఫర్నీచర్, వాల్ పెయింటింగ్, సామగ్రి తగిన వాటిని సమకూరుస్తారు. సరైన వెలుతురు, ఇండోర్, అవుట్ డోర్ ఆట వస్తువులు, నిద్రించడానికి ప్రత్యేక స్థలం ఉండేలా చర్యలు తీసుకున్నారు. అల్పాహారం.. మధ్యాహ్న భోజనం పూర్తిగా ఎన్సీఈఆర్టీ రూపొందించిన పాఠ్య ప్రణాళికలను అనుసరిస్తారు. ఇది నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ ఫర్ ది ఫౌండేషన్ స్టేజ్తో అనుసంధానం చేసి ఉంటుంది. బోధనకు నియమించిన ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణనిచ్చారు. ప్రీ ప్రైమరీ విభాగాల్లోని పిల్లలందరికీ మధ్యాహ్న భోజనం, అల్పాహారం అందిస్తున్నారు. జిల్లాల వారీగా ప్రీ ప్రైమరీ పాఠశాలల మంజూరు ఇలా.. జిల్లా పాఠశాలలు మహబూబ్నగర్ 85 నాగర్కర్నూల్ 74 నారాయణపేట 44 వనపర్తి 48 జో. గద్వాల 41 ప్రభుత్వం పేద, మధ్య తరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు డబ్బులు వెచ్చించకుండా ప్రీ ప్రైమరీ తరగతులు ఏర్పాటు చేసింది. ప్రత్యేక నిధులు కేటాయించి తరగతి గదులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతోపాటు అదనంగా బోధకులు, ఆయాలను కేటాయించింది. విడతల వారీగా అన్ని గ్రామాలకు విస్తరించి వంద శాతం ప్రీ ప్రైమరీ పాఠశాలలు ఉండేలా చర్యలు తీసుకుంటుంది. – విద్యాసాగర్, జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి, నారాయణపేట -
కుర్చీ వదలరే..!
మున్సిపల్ కార్పొరేషన్లో తిష్టవేసిన పలువురు ఉద్యోగులు ● 10–15 ఏళ్లుగా ఒకేచోట విధుల నిర్వహణ ● ఇటీవల బదిలీల్లోనూ మారని సీనియర్ ఉద్యోగులు ● ఏళ్లుగా ఉండటంతో అన్ని వ్యవహారాల్లో తలదూర్చుతున్నట్లు ఆరోపణలు ● కార్పొరేషన్లో విచిత్ర పరిస్థితిపై సర్వత్రా చర్చ ●ఇటీవల జరిగిన బదిలీలు నిబంధనల ప్రకారమే చేశాం. ఉన్న కేడర్లో కనీసం 40 శాతం బదిలీలు చేయాలని ప్రభుత్వం సూచించింది. కొంతమంది సీనియర్లు కూడా పనిచేస్తూ ఉండవచ్చు. ఓ వ్యక్తి కోర్టు కేసు వల్ల ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. వివిధ పనుల నిమిత్తం వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా చూస్తాం.. – రామాంజులారెడ్డి, కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్, మహబూబ్నగర్ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: సాధారణంగా ఎవరైనా ఉద్యోగి రెండేళ్లకో.. మూడేళ్లకో.. మహా అంటే ఐదేళ్లకో బదిలీ అవుతారు. కానీ, మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో కొంతమంది ఉద్యోగులు ఏళ్లతరబడిగా తమ కుర్చీ వదలకుండా అలాగే అంటిపెట్టుకొని ఉండటం పెద్ద చర్చకు తావిస్తోంది. ఇటీవల ప్రభుత్వం బదిలీలకు అవకాశం కల్పించినప్పటికీ చాలామంది సీనియర్లు ఇక్కడే పాతుకుపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఒక ఉద్యోగి కనీసం 4 నుంచి 8 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పనిచేస్తే వెంటనే బదిలీ కావాలన్న నిబంధనలు ఉన్నప్పటికీ కార్పొరేషన్లో పనిచేస్తున్న పలువురు సిబ్బందికి మాత్రం ఈ నిబంధనలు వర్తించడం లేదు. ఏళ్ల తరబడిగా ఒకేచోట పనిచేస్తున్న వీరు తమదైన శైలిలో కార్పొరేషన్లో చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం కార్పొరేషన్ పరిధిలో 330 మందికిపైగా సిబ్బంది పనిచేస్తుండగా.. మరికొన్ని పోస్టు లు ఖాళీగా ఉన్నాయి. అయితే కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న సిబ్బంది పూర్తి వివరాలు, సీనియార్టీ జాబితా అధికారుల వద్ద లేకపోవడం గమనార్హం. తీవ్రస్థాయిలో ఆరోపణలు.. కార్పొరేషన్లో చాలా ఏళ్లుగా ఒకేచోట విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. కార్పొరేషన్ పరిధిలో జరిగే టెండర్లు, కాంట్రాక్టుల విషయంలో వీరు తలదూర్చుతున్నట్లు తెలుస్తుంది. పలు సెక్షన్లకు సంబంధించి కీలకమైన అధికారులు పౌర సేవల కోసం వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని, ఫీల్డ్ వర్క్ పేరుతో ఎక్కువ సమయం బయటే ఉంటున్నట్లు సమాచారం. దీంతో వివిధ పనుల నిమిత్తం దరఖాస్తు చేసుకునే ఫైల్స్ ఉద్దేశ పూర్వకంగానే పలువరు సిబ్బంది ఆలస్యం చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం గత నెలలో కార్పొరేషన్లో పనిచేస్తున్న సిబ్బందికి బదిలీల ప్రక్రియ చేపట్టగా అందులో ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు, ఒక సీనియర్ అకౌంటెంట్, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, ఒక వార్డు ఆఫీసర్, ఒక వాచ్మెన్, లైన్మెన్, ఇద్దరు అటెండర్లు బదిలీపై వెళ్లగా.. వారి స్థానంలో మరో ఇద్దరు మాత్రమే కార్పొరేషన్కు బదిలీపై వచ్చారు. -
అసమగ్ర ఐటీడీఏ
రెగ్యులర్ పోస్టులకు నోచుకోని మన్ననూర్ ప్రాజెక్టు ● పన్నెండేళ్లు గడిచినా సిబ్బంది నియామకంలో కాలయాపన ● ఇన్చార్జి పీఓలతో నెట్టుకొస్తున్న ప్రభుత్వం ● చెంచుల ఆర్థికాభివృద్ధి పథకాల అమలులో ఆటంకం ● నెరవేరని ప్రజాప్రతినిధుల హామీలు.. అధికారుల ప్రతిపాదనలు అచ్చంపేట: ప్రభుత్వాల పట్టింపులేని ధోరణి.. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం.. వెరసీ మన్ననూరులోని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) అంపశయ్యపై కొట్టుమిట్టాడుతోంది. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఐటీడీఏలను చక్కదిద్ది పూర్వవైభవం తెస్తామని చెప్పిన నేతల మాటలు నీటి మూటలుగానే మారిపోతున్నాయి. ఉమ్మడి ఏపీలో శ్రీశైలం (సున్నిపెంట) ఐటీడీఏలో భాగంగా ఉండి.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మన్ననూర్లో ఏర్పాటైంది. అయితే ఐటీడీఏగా అవతరించి పన్నెండేళ్లు గడిచినా ప్రభుత్వం ఇప్పటి వరకు రెగ్యులర్ ప్రాజెక్టు అధికారి, ప్రధాన పోస్టులు మంజూరు చేయలేదు. నల్లమలలోని చెంచులు, ఆదివాసీల జీవనోపాధి, ఆర్థికాభివృద్ధికి తోడ్పడే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఐటీడీఏ కార్యకలాపాలకు పీఓనే కీలకం. అలాంటిది ఏళ్ల తరబడి ప్రాజెక్టు అధికారి, ఇతర సిబ్బందిని నియమించకపోవడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకే ఒక్కడు.. చెంచులకు అన్ని సంక్షేమ పథకాలు, అధికారులను అందుబాటులోకి తెచ్చి వారికి సేవలను విస్తృతపర్చడమే ఐటీడీఏ లక్ష్యం. సున్నిపెంట నుంచి ప్రాజెక్టు విభజన సమయంలో 57:43 నిష్పత్తిలో ఉద్యోగులను నియమిస్తే అన్ని విభాగాల్లో కలిపి 20 పోస్టులు ఉండాలి. విలీనమైన తర్వాత రికార్డులతోపాటు సీనియర్ అసిస్టెంట్ జాఫర్ను నియమించారు. అతను ఇప్పుడు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ విభాగం, డీఎస్ఓ, మేనేజర్, సీఎస్ఓ, హెచ్ఓలు, మత్య్సశాఖ, హార్టికల్చర్, పశువైద్యం, ఇద్దరు పర్యవేక్షకులు, ముగ్గురు సీనియర్ అసిస్టెంట్లు, ముగ్గురు జూనియర్ అసిస్టెంట్లు, వ్యవసాయాధికారి, ఏఈఓ, కార్యాలయ సిబ్బంది పోస్టులకు గాను ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. పీఎం జన్మన్కే పరిమితం.. అత్యంత దర్భర జీవితం గడుపుతున్న చెంచులకు చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం జన్ మన్ కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పీఎం కిసాన్, ఆయుష్మాన్ భారత్, జాతీయ ఉపాధి హామీ పథకం తదితర పథకాల ప్రయోజనాలను పొందేందుకు అవసరమైన ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం, జన్ధన్ బ్యాంకు ఖాతా వంటి మౌళిక సదుపాయాలు ప్రతి చెంచుకు అందించాల్సి ఉంటుంది. దీనికోసం ప్రత్యేక ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి అందిస్తున్నారు. ఇవీ మినహా గిరిజనుల కోసం చేపట్టే మిగతా ఏ పథకాలు సక్రమంగా అమలు కావడం లేదు. ఐటీడీఏలో అంతర్భాగంగా.. గతంలో ఐటీడీఏ ప్రాజెక్టు కార్యాలయం కలెక్టరేట్ను తలపించేంది. సున్నిపెంట కేంద్రంగా ఉన్నప్పుడు వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో కళకళాడేది. మన్ననూర్ ఐటీడీఏ పరిధిలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్తోపాటు 11 ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలు, 46 ఆరోగ్య ఉప కేంద్రాలు, 56 ప్రాథమిక పాఠశాలలు, 16 ఆశ్రమ పాఠశాలు, చెంచులకు ఉపాధి కల్పించేందుకు జాతీయ ఉపాధి హామీ పథకం, వ్యవసాయ, గిరిజన సహకార సంస్థతోపాటు ఐకేపీ, టీపీఎంయూ ఐటీడీఏలో అంతర్భాగంగా ఉన్నాయి. నేటికీ వందలాది మంది చెంచులకు వ్యవసాయ భూమి లేదు. అటవీ ప్రాంతంలో ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్నా భూమిపై హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నా అతీగతీ లేదు. అటవీ ఉత్పత్తుల సేకరణతోపాటు వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్న చెంచులకు భూ పంపిణీ జరగడం లేదు. మన్ననూర్ ఐటీడీఏను 2015 నుంచి ఒకే ఒక్కరితో నెట్టుకొస్తున్నారు. ఈ విషయమై ఎన్నోసార్లు గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. దీని వల్ల చెంచులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. అధికారులు లేకపోవడంతో సకాలంలో పనులు కావడం లేదు. బడ్జెట్ కేటాయింపులు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. – శ్రీనివాసులు, ఆదివాసీ చెంచు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గిరిజనులకు సంబంధించి విద్య, వైద్యం, ఇతర మౌళిక సదుపాయాల కల్పన, నీటి పారుదల, వ్యవసాయం, రాయితీపై వ్యవసాయ పరికరాల పంపిణీ, ట్రైకార్ రుణాలు, మత్స్యశాఖ పరిధిలో చేపపిల్లల పెంపకం వంటి పథకాలు సరిగా అమలు కావడం లేదు. ఇందుకు ఏటా నిధులు కేటాయిచడం లేదని చెంచులు వాపోతున్నారు. చెంచు మహిళలు, చిన్నారులకు పోషకాహారం అందించేందుకు గిరిపోషణ పథకం కింద రూ.కోటి నిధులు మంజూరైనా రూ.20 లక్షలకు మించి ఖర్చు కావడం లేదని తెలుస్తోంది. గిరివికాసం కింద గిరిజనులు వ్యవసాయం చేసుకునేందుకు ఉచితంగా బోర్లు వేసి మోటార్లు ఇవ్వాల్సి ఉండగా చాలామందికి ఈ పథకం అందడం లేదు. పశుసంవర్ధక శాఖ ద్వారా గొర్రెలు, మేకలు, పశువులు సబ్సిడీపై అందించేది. కానీ, ఆ శాఖ అధికారులు లేకపోవడంతో పూర్తిగా మరుగున పడింది. ప్రభుత్వం ఇప్పటికై నా రెగ్యులర్ పీఓతోపాటు మిగతా పోస్టులు భర్తీ చేస్తేనే చెంచులకు ప్రాజెక్టు సేవలు అందుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
‘పాలమూరు’పై మాట్లాడే హక్కు బీఆర్ఎస్కు లేదు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదని టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. ఆదివారం వారు జిల్లాకేంద్రంలోని పీసీసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పదేళ్లు అధికారంలో ఉండి ఈ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయిన వారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఉమ్మడి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి పాలమూరు అభివృద్ధికి పెద్దపీట ఇవేమీ చర్చించకుండా మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి తదితరులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 2016లో పాలమూరును ప్రారంభిస్తే 2022 వరకు కేంద్రానికి డీపీఆర్ ఎందుకు సమర్పించలేదన్నారు. వరద ఆధారంగా కాకుండా మిగులు జలాలతో చేపడుతున్నామని అప్పట్లో నివేదించింది వాస్తవమా.. కాదా.. అని ప్రశ్నించారు. ఇది సాగునీటి ప్రాజెక్టు కాదు.. తాగునీటి ప్రాజెక్టు అని.. కేవలం 7.15 టీఎంసీలు మాత్రమే వాడుకుంటామని సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించడం ఎవరూ మరిచిపోలేదన్నారు. వీటన్నింటికీ బీఆర్ఎస్ నేతలు సరైన సమాధానం చెప్పిన తర్వాతే ప్రజల్లోకి రావాలన్నారు. సమావేశంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి రాములుయాదవ్, నాయకులు కృష్ణయ్య, అక్బర్ తదితరులు పాల్గొన్నారు. -
అధిక సంఖ్యలో కేసులు రాజీ చేయాలి : ఎస్పీ
మహబూబ్నగర్ క్రైం: జిల్లా కోర్టుతోపాటు జడ్చర్లలో ఈ నెల 20న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ డి.జానకి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తక్కువ సమయంలో ఎలాంటి ఖర్చు లేకుండా కేసులు రాజీ అయ్యే ఏకై క మార్గం లోక్ అదాలత్ అన్నారు. పోలీస్ శాఖ పరిధిలో పెండింగ్ కేసులు, ట్రాఫిక్ చలానాలు, రాజీకి అవకాశం ఉన్న క్రిమినల్, సివిల్, కుటుంబ వివాదాల కేసుల కక్షిదారులు పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవాలన్నారు. లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం చేసుకుంటే దీర్ఘకాలిక న్యాయ ప్రక్రియ నుంచి ఉపశమనం లభిస్తుందన్నారు. ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలో రాజీ అయ్యే అవకాశం ఉన్న ప్రతి కేసు గుర్తించి లోక్ అదాలత్లో హాజరయ్యేలా కోర్టు డ్యూటీ కానిస్టేబుళ్లు, సదరు ఎస్హెచ్ఓలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ముగిసిన సాఫ్ట్బాల్ సమ్మర్ క్యాంప్ మహబూబ్నగర్ క్రీడలు: నగరంలోని మెయిన్ స్టేడియంలో జిల్లా క్రీడాప్రాధికారిక సంస్థ, మహబూబ్నగర్ జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాఫ్ట్బాల్ సమ్మర్ క్యాంప్ ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా మెయిన్ స్టేడియంతోపాటు కొతలాబాద్ (రూరల్)లో నిర్వహించిన సాఫ్ట్బాల్ సమ్మర్ క్యాంప్ల క్రీడాకారులకు టోర్నమెంట్ నిర్వహించి విన్నర్, రన్నరప్ జట్లకు మెడల్స్, ట్రోఫీలు అందజేశారు. అనంతరం అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ జిల్లా సాఫ్ట్బాల్ క్రీడాకారులు మరింత ప్రతిభచాటి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శరత్చంద్ర, జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ సభ్యులు రాఘవేందర్, నాగరాజు పాల్గొన్నారు. ఉల్లాసంగా ‘హ్యాపీ సండే’ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ప్రతి ఆదివారం నగరంలోని జిల్లా ప్రధాన స్టేడియం కమాన్ వద్ద నిర్వహిస్తున్న ‘హ్యాపీ సండే’ ఉల్లాసంగా ముగిసింది. ఈ మేరకు ఆదివారం చివరిరోజు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు ఉత్సాహంగా.. కోలాహలంగా కొనసాగింది. ఎస్హెచ్జీ మహిళలతో కలిసి నగర మేయర్ మమత తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పాటలకు ఉత్సాహంగా నృత్యం చేశారు. పలు డాన్స్ అకాడమీలకు చెందిన విద్యార్థులతోపాటు సీనియర్ సిటిజన్స్ సాంస్కృతిక ప్రదర్శనలిచ్చి తమలోని ప్రతిభను చాటారు. అలాగే మ్యాజిక్, కరాటే విన్యాసాలు అలరించాయి. అనంతరం అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్న కళాకారులను ఘనంగా సత్కరించారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రామాంజులరెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్జీ, లక్ష్మయ్య పాల్గొన్నారు. -
అధికార లాంఛనాలతో కానిస్టేబుల్ అంత్యక్రియలు
వంగూరు: ఉప్పునుంతల మండలంలోని మామిళ్లపల్లి సమీపంలో విధి నిర్వహణలో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ రాజు పిడుగుపాటుకు గురై శుక్రవారం మృతి చెందాడు. ఎస్పీ సంగ్రామ్సింఘ్జీ పాటిల్ ఆదేశాల మేరకు రాజు స్వగ్రామం వంగూరు మండలంలోని ఉల్పర గ్రామంలో శనివారం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు హాజరైన అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు రాజు పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రూ.30 వేల ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజు కుటుంబానికి పోలీస్ శాఖ అండగా ఉంటుందన్నారు. అంత్యక్రియల్లో ఆర్ఐ జగన్, ఆర్ఎస్ఐ ప్రశాంత్, ఎస్ఐ మహేష్ తదితరులు పాల్గొన్నారు. లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం జడ్చర్ల: పట్టణంలో ఉన్న తన కుమార్తెను చూసేందుకు వచ్చిన తండ్రి లారీ ఢీకొని మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. బిజినపల్లి మండలం వెలుగొండకు చెందిన ఈర్ల సంజీవ(51) జడ్చర్లలో ఉన్న తన కుమార్తెను చూసేందుకు భార్యతో కలిసి వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. కాగా శనివారం సాయంత్రం కుమార్తెకు పండ్లు తీసుకొని రావటానికి బైకుపై వెళ్తుండగా ఫ్లైవర్ సమీపంలో ఓ లారీ వేగంగా ఢీకొట్టింది ప్రమాదంలో లారీ చక్రాలు అతనిపై వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఈర్ల మల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ కమలాకర్ తెలిపారు. -
అద్దెకు తీసుకుంటాడు..ఆపై విక్రయిస్తాడు
మహబూబ్నగర్ క్రైం: సులువుగా డబ్బు సంపాదించడానికి కొత్తకొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు కేటుగాళ్లు. ఇంట్లో ఫంక్షన్ ఉందని చెబుతూ టెంట్హౌజ్ దగ్గరకు వెళ్లి పలు సామగ్రిని(అన్ని రకాల గిన్నెలు) అద్దెకు తీసుకొని ఇతర వ్యక్తులకు విక్రయిస్తున్న ఘటన నగరంలో చోటు చేసుకుంది. టూటౌన్ సీఐ ఇజాజుద్దీన్ కథనం ప్రకారం.. నగరంలోని రాజీవ్ గృహకల్పలో నివాసం ఉండే ఎండీ బాసిత్ అలీ క్యాటరింగ్ చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. తను చేస్తున్న వృత్తిలో ఆదాయం లేకపోవడంతో సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో టెంట్ హౌజ్ల్లో అద్దెకు సామగ్రిని తీసుకోవడం వాటిని ఇతరులకు విక్రయించడం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 15న విష్ణు టెంట్ హౌజ్ వద్ద, మార్చి 17న దొడ్డలోనిపల్లిలో ఉన్న ఖాజా టెంట్ హౌజ్, మార్చి 2న షాషాబ్గుట్టలోని షా టెంట్హౌజ్లో, మార్చి 5న షాషాబ్గుట్టలోని ఏఆర్ టెంట్హౌజ్ వద్ద ఇంట్లో ఫంక్షన్ ఉందని చెప్పి సామగ్రి అద్దెకు తీసుకొని వెళ్లాడు. దీనిపై అనుమానం వచ్చిన శ్రీవిష్ణు టెంట్ హౌజ్ యాజమాని విష్ణు ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి శనివారం బాసిత్ అలీని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. అతని వద్ద రూ.2.95 లక్షల విలువ చేసే బొగనాలు 20, లగాన్లు 4, హండీలు ఒకటితో పాటు ఇతర సామగ్రిని రికవరీ చేసి అలీని రిమాండ్కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. విలువైన వస్తువులు కానీ వాహనాలు అద్దెకు ఇచ్చే సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సీఐ సూచించారు. టెంట్ హౌజ్ సామగ్రితో కొత్త రకం మోసం -
గట్టు లిఫ్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి
గట్టు: గట్టు ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, బీడు భూములకు సాగునీరు అందించాలని ఉమ్మడి పాలమూరు జిల్లా జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం గట్టు ఎత్తిపోతల పథకాన్ని ఉమ్మడి పాలమూరు జిల్లా జేఏసీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లా జేఏసీ కన్వీనర్ రాఘవాచారి మాట్లాడుతూ దశాబ్దాల పాటు గట్టు ప్రాంతం కరువు కోరల్లో చిక్కుకుని విలవిలలాడిందన్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టు ద్వారా గట్టు ప్రాంతానికి పూర్తి స్థాయిలో సాగునీటిని అందించలేదని మండిపడ్డారు. గట్టు ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఆర్డీఎస్ను ఆధునీకరించి, సాగునీటిని చివరి ఆయకట్టు వరకు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కో కన్వీనర్ బెక్కం జనార్దన్, జేఏసీ చైర్మన్ వీరభద్రప్ప, కన్వీనర్ ఆలూరు ప్రకాష్గౌడు, కోఆర్డినేటర్ మధుసూదన్బాబు, నాయకులు హనీఫ్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, చెన్నకిష్టప్ప, పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. నీరు ఎత్తిపోసేందుకు టెక్నాలజీని వాడుకోలేరా? రాజోళి: సాంకేతికంగా ఎంతో పరిజ్ఞానం ఉండి, అన్ని రంగాల్లో దాన్ని వినియోగిస్తుంటే నడిగడ్డలో మాత్రం నీటిని ఎత్తిపోసేందుకు టెక్నాలజీ ఎందుకు వాడట్లేదని ఉమ్మడి మహబూబ్నగర్ పెండింగ్ ప్రాజెక్టుల సాధన సమితి సభ్యులు ప్రశ్నించారు. పెండింగ్ ప్రాజెక్టుల పర్యటనలో భాగంగా శనివారం తుమ్మిళ్ల ఎత్తిపోతలను పరిశీలించారు. అనంతరం వడ్డేపల్లిలో సమావేశం చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న ప్రాజెక్టులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కర్ణాటక మంత్రితో కలిసి జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి ఆర్డీఎస్ దుస్థితిపై ఎందుకు ఆయనను ప్రశ్నించలేదన్నారు. ఆర్డీఎస్ కెనాల్ను ఆధునీకరించి, కేసీ కెనాల్ లాగా మార్పు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గోపాల్రెడ్డి, ప్రకాష్ గౌడ్, మధుసూదన్ బాబు, రామ్మోహన్, బెక్కెం జనార్దన్, రాఘవాచారి, పరమేశ్వర్ గౌడ్, వీరభద్రప్ప తదిదరులు పాల్గొన్నారు. -
పెరటిలో అక్షయ సంజీవని
● రామన్పాడులో పచ్చని విప్లవం! ● ఆయుర్వేద వనంగా శ్రీధర్రెడ్డి పెరడు ● ప్రకృతి ఒడిలో వ్యాధులకు విరుగుడు ● సేంద్రియ సాగుతో నేటితరానికి ఆరోగ్యబాట మదనాపురం: నేటి యాంత్రిక జీవనంలో ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్న వేళ ప్రకృతిని నమ్ముకుంటేనే శాశ్వత పరిష్కారం దొరుకుతుందని చాటి చెబుతున్నారు రామన్పాడుకు చెందిన శ్రీధర్ రెడ్డి. తన ఇంటి ఆవరణను ఒక చిట్టి ఆయుర్వేద వనంగా మార్చి, వందలాది మందికి ఆరోగ్య ప్రదాతగా నిలుస్తున్నారు. రసాయనాలతో నిండిన ఆహారం కల్తీ మందులకు దూరంగా స్వచ్ఛమైన ఆయుర్వేద మొక్కల పెంపకంలో ఆయన చేస్తున్న కృషి ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ● సభావ్ స్నేక్ గ్రాస్ ప్లాంట్, ప్రొస్టేడ్ గ్రంది నియంత్రణకు, క్యాన్సర్, లివర్ తదితర సమస్యలకు పనిచేస్తుంది. రణపాల మూత్రపిండాల సమస్యల నివారణ, లక్ష్మణ ఫలం క్యాన్సర్ కణాలను ఎదుర్కోవడంలో కీలకం. వీటితోపాటు పారిజాతం, రుద్రాక్ష, తెల్లేశ్వరి, లక్ష్మితార వంటి అరుదైన మొక్కలు తోటలో సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. 2018లో మొదలైన అడుగు నేడు ఆయుర్వేద ధామం 2018లో కేవలం మొక్కలపై ఉన్న మక్కువతో మొదలైన ఆయన ప్రయాణం నేడు ఒక గొప్ప సేవా కార్యక్రమంగా రూపుదిద్దుకుంది. దేశవ్యాప్తంగా పర్యటిస్తూ మహారాష్ట్ర, ఒరిస్సా, చత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాలకు వెళ్లి, అరుదైన విశిష్టమైన ఆయుర్వేద మూలికలను సేకరించి తన పెరటిలో నాటారు. నేడు తోటలో సుమారు 20నుంచి 30రకాల అత్యంత విలువైన ఆయుర్వేద మొక్కలు అలరారుతున్నాయి. -
తుఫాన్ ఢీకొని 15 గొర్రెలు మృతి
ఎర్రవల్లి: జాతీయ రహదారిపై తుఫాన్ వాహనం ఢీకొని 15 గొర్రెలు మృతి చెందిన ఘటన ఇటిక్యాల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన శివ శనివారం జాతీయ రహదారిపై కొండేరు సమీపంలో గొర్రెల గుంపును రోడ్డు దాటిస్తున్నాడు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న ఓ తుఫాన్ వాహనం అతివేగంతో గొర్రెల గుంపును ఢీకొట్టడంతో 15 గొర్రెలు మృతి చెందగా మరికొని తీవ్రంగా గాయపడ్డాయి. వాటి విలువ సుయారు రూ.2.50 లక్షలు ఉంటుందని బాధితుడు బోరున విలపించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు తుఫాన్ డ్రైవర్ గిర్వార్ సింగ్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
గ్రామీణార్థిక వ్యవస్థ బలోపేతమే లక్ష్యం
ఇటిక్యాల: దేశంలోని రైతులు, మహిళా స్వయం సహాయక సంఘాలు, వ్యవసాయ పారిశ్రామికవేత్తలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా పెద్దఎత్తున మెగా అగ్రి క్రెడిట్ అవుట్రీచ్ క్యాంప్ నిర్వహిస్తుందని హైదరాబాద్ రీజినల్ హెడ్ గజేంద్రసింగ్చౌహన్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని సీబీఐ బ్యాంక్ ఆవరణలో రైతులకు, ఖాతాదారులకు రుణ సదుపాలయపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు బ్యాంకుల చుట్టూ తిరిగి రుణాలు పొందడం సమస్యగా మారిందన్నారు. ఈ ఇబ్బందిని తొలగించడానికి బ్యాంకే నేరుగా రైతుల వద్దకు వెళ్లేలా ఈ కార్యక్రమాన్ని రూపొందిచామన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయాల పరిధిలో ఒకేసారి వందలాది చోట్ల వ్యవసాయ రుణాల పంపిణీ శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్యాంపులో రైతుల దరఖాస్తులను, భూమి పత్రాలను అక్కడికక్కడే పరిశీలించి అతి తక్కువ సమయంలో (అన్ది స్పాట్) రుణాలను మంజూరు చేస్తారన్నారు. రైతులు దళారీలను ఆశ్రయించి మోసపోకుండా, నేరుగా బ్యాంక్ అధికారుల ద్వారానే పారదర్శకంగా సేవలు అందిస్తామన్నారు. వ్యవసాయ రంగాలన్నింటికీ పెద్దపీట వేస్తామని, కిసాన్ క్రెడిట్ కార్డు ఉపయోగించి తక్కువ వడ్డీరేట్టకే ప్రభుత్వ రాయితీ రుణాలు అందించున్నట్లు తెలియజేశారు. హైదరాబాద్ రీజియన్లో సుమారు రూ.50 కోట్ల విలువైనా వ్యవసాయ రుణ మంజూరు పత్రాలను రైతులకు అందజేయగా, ఇందులో ఇటిక్యాల శాఖకు ఒక్కటే రూ.2 కోట్ల విలువైన రుణాలను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా మేనేజర్ శ్రీనివాసరావు, ఎమ్మార్వో శ్రీకాంతరెడ్డి, సర్పంచ్ జీవేందర్రెడ్డి, ప్రాజెక్ట్ మేనేజర్ సలోమి, బ్యాంక్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
హాలియా: వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణాన్ని బలిగొంది. నల్లగొండ జిల్లా త్రిపురారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 2న వ్యవసాయ బావిలో లభ్యమైన మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. శనివారం హాలియా పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు వివరాలు వెల్లడించారు. ఈ నెల 2న త్రిపురారం గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలంలో లభ్యమైన చెప్పులు, చీర పిన్నులతో పాటు సీసీ కెమెరాల ఫుటేజీ, కాల్ డేటా ఆధారంగా మృతురాలు మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలానికి చెందిన తిరుపతమ్మ(40) పోలీసులు గుర్తించారు. హాలియా సీఐ సతీష్రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మృతురాలు తిరుపతమ్మతో వివాహేతర సంబంధం పెట్టుకుని సహజీవనం చేసిన నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం పెద్దజత్రం గ్రామానికి చెందిన కూలూర్ లింగప్పను శనివారం ఉదయం పెద్దవూర మండలంలోని సమ్మక్క, సారక్క జంక్షన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఉరి వేసి.. బావిలో పడేసి.. తిరుపతమ్మ గొర్రెలు మేపేందుకు ఆంధ్రా ప్రాంతానికి వెళ్లగా.. అదే ప్రాంతంలో కూలూర్ లింగప్పతో ఏర్పడిన పరిచయం వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. తిరుమతమ్మ భర్త కూర్మప్పకు అనుమానం రావడంతో ఆంధ్రా నుంచి సొంతూరుకు వెళ్లారు. భర్తతో కలిసి ఉండలేని తిరుపతమ్మ కొద్దిరోజుల తర్వాత ఇంట్లో ఎవరికీ చెప్పకుంగా వెళ్లిపోగా ఆమె భర్త కూర్మప్ప దేవరకద్ర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కూలూర్ లింగప్పతో తిరుపతమ్మ ఉండగా ఆమెను తీసుకొచ్చి భర్త కూర్మప్పకు అప్పగించారు. అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. 20 నెలల క్రితం ఇంట్లో ఎవరికి చెప్పకుండా మరోసారి తిరుపతమ్మ ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె కోసం కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. నాటి నుంచి తిరుపతమ్మ లింగప్పతోనే సహజీవనం చేస్తూ సుమారు 20 నెలల పాటు ఆంధ్రా ప్రాంతంలోని దుర్గి గ్రామంలో ఉంది. గత నెల లింగప్పకు వేరే మహిళతో వివాహం జరిగింది. నాటి నుంచి తిరుపతమ్మ, లింగప్ప మధ్య గొడవులు జరుగుతున్నాయి. ఎలాగైనా తిరుపతమ్మను అడ్డును తొలగించుకోవాలనే లింగప్ప పథకం వేశాడు. గత నెల 27న లింగప్ప మాచర్లకు వెళ్లి తిరుపతమ్మను తీసుకొచ్చి కొండమల్లేపల్లి, దేవరకొండ, మిర్యాలగూడ ప్రాంతాల్లో పర్యటించారు. గత 29న త్రిపురారం గ్రామ శివారులోని విద్యుత్ సబ్స్టేషన్ వెనుక వ్యవసాయ బావి వద్దకు తిరుపతమ్మను లింగప్ప తీసుకొచ్చాడు. తిరుపతమ్మను మాటల్లోకి దించి ఆమె రెండు చేతులను చున్నీతో కట్టేసి, మెడకు చీరతో ఉరి వేశాడు. చీరలో బండరాయి కట్టి ఆమెను బావిలో పడేసి అక్కడి నుంచి పారిపోయినట్లు నిందితుడు నేరం అంగీకరించాడు. నిందితుడి వద్ద నుంచి మృతురాలి సెల్ఫోన్, బంగారు పుస్తెలతాడు స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన సీఐ సతీష్రెడ్డి, ఎస్ఐలు నరేష్, విజయ్కుమార్, సాయి ప్రశాంత్తో పాటు పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. చున్నీతో చేతులు కట్టేసి, మెడకు చీర బిగించి మహిళ దారుణ హత్య -
నల్లమల ప్రకృతిలో ట్రెక్కింగ్
ప్రతాపరుద్రుడి కోటపైన వాకర్స్ మన్ననూర్: నల్లమల ప్రకృతిలో స్వచ్ఛమైన ఆక్సిజన్ను ఆస్వాదిస్తూ అటవీ మార్గంలో మార్నింగ్ వాక్ చేస్తే రోగ నిరోధక శక్తి పెరిగి ప్రశాంతమైన ఆరోగ్యంతో పాటూ ఆహ్లాదంగా ఉంటుందని అచ్చంపేట ఎఫ్డీఓ చంద్రశేఖర్ అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో శనివారం వాకర్స్ అసోసియేషన్ సభ్యులు అచ్చంపేట నుంచి ప్రత్యేక వాహనంలో మన్ననూర్ సమీపంలోని నిరంజన్ షావలీ దర్గా వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి సఫారీ కోసం వచ్చిన పర్యాటకులు కూడా వీరితో కలిసి సుమారు 3 గంటల పాటూ ట్రెక్కింగ్ చేశారు. ఈ సందర్భంగా ప్రతాపరుద్రుడి కోట చారిత్రక విశిష్టతను ఎఫ్డీఓ వివరించారు. అదే విధంగా అటవీశాఖ ఆధ్వర్యంలో నల్లమల, అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యంలో సింగిల్ వినియోగం ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. వాకర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు చందునాయక్ మాట్లాడుతూ.. అటవీ మార్గంలో కొండలు, గుట్టలు దాటుతూ ప్రకృతిలో మమేకమై నడుస్తుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ ట్రెక్కింగ్ జీవితాంతం గుర్తుండి పోతుందని సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ ఎండీ సుబూర్, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేశ్, ఎఫ్బీఓలు ఆశ, రజిత, శోభారాణి, పార్వతి, హన్మంత్, రమేశ్, సభ్యులు పోల శ్రీను, నిరంజన్, బషీర్ తదితరులు పాల్గొన్నారు. -
20న జాతీయ లోక్ అదాలత్
పాలమూరు: జిల్లాలో ఉన్న కోర్టులలో ఈనెల 20న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత వెల్లడించారు. జిల్లా కోర్టులో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ లోక్ అదాలత్లో కేసు దాఖలు చేసినప్పుడు రుసుం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. పెండింగ్లో ఉన్న సివిల్ కేసును లోక్ అదాలత్కు పంపిన తర్వాత అక్కడ కేసు పరిష్కరిస్తే కోర్టులో చెల్లించిన ఫీజు సైతం తిరిగి ఆయా పార్టీలకు ఇచ్చేస్తామన్నారు. లోక్ అదాలత్ వల్ల ఇరువర్గాలకు తక్షణ పరిష్కారం లభిస్తుందని, దీని వల్ల సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుందన్నారు. జిల్లాలో ఈనెల 20న నిర్వహించనున్న లోక్ అదాలత్ కోసం 9 బెంచీలు ఏర్పాటు చేసి కేసులు రాజీ చేయడం జరుగుతుందని ఇప్పటికే 1,689 కేసులు గుర్తించి సంబంధిత కక్షిదారులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. పోలీస్శాఖ అధికారులతో పాటు అన్ని రకాల బ్యాంకు అధికారులు, ఇన్సూరెన్స్ సంస్థలు వారి పరిధిలో పెండింగ్లో ఉన్న కేసులు గుర్తించి లోక్ అదాలత్కు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయమూర్తి ఇందిర పాల్గొన్నారు. చల్లబడిన వాతావరణం మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లావ్యాప్తంగా శనివారం మధ్యాహ్నం 15 నిమిషాల పాటు ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఉదయం నుంచి ఎండ వేడిమికి తల్లడిల్లిన ప్రజలు ఈ వర్షం కారణంగా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఉమ్మడి జిల్లాలోని నవాబుపేట మండలంలో 24 మి.మీ., నారాయణపేట జిల్లాలోని మద్దూరు మండలంలో 18 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఆరుగురు ఆర్టీసీ డిపో మేనేజర్ల బదిలీ నారాయణపేట రూరల్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆరుగురు ఆర్టీసీ డిపో మేనేజర్లను బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. నారాయణపేట డీఎం టి.లావణ్య హైదరా బాద్లోని హయత్నగర్ డిపో–1కు బదిలీ కాగా.. ఆమెస్థానంలో హెడ్ఆఫీస్లోని ఏటీఎం కార్గో ఇన్చార్జి డీఎన్ రాజన్ను కేటాయించారు. షాద్నగర్ డీఎం ఉషను జనగాంకు బదిలీ చేయగా.. ఆమెస్థానంలో హైదరాబాద్ డిపో–2 నుంచి కరుణశ్రీ రానున్నారు. అచ్చంపేట డీఎం పీఎండీ ప్రసాద్ హయత్నగర్ డిపో–2కు బదిలీ కాగా.. ఆయన స్థానంలో డిప్యూటీ ఈ–ఎలక్ట్రికల్ హెచ్ఆర్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ను కేటాయించారు. గద్వాల డీఎం సునీతను కూకట్పల్లి డిపోకు బదిలీ చేయగా.. ఆమె స్థానంలో రాణిగంజ్ డిపో నుంచి శ్రీధర్ వస్తున్నారు. కొల్లాపూర్ డిపో మేనేజర్ ఉమాశంకర్గౌడ్ను ఐటీ డిపార్ట్మెంట్కు బదిలీ చేయగా.. ఆయన స్థానంలో వరంగల్ బస్టాండ్ ఏటీఎం మల్లేశ్వరయ్యను కేటాయించారు. కల్వకుర్తి డీఎం సుహాసినిని ఇల్లందు డిపోకు కేటాయించగా.. ఆమె స్థానంలో ఎవరినీ నియమించలేదు. -
పిల్లల హక్కుల పరిరక్షణకే బాలపంచాయతీలు
మహమ్మదాబాద్: బాలల గొంతుకను వినిపించేందుకు వారికి అన్ని హక్కులు వర్తించేలా తెలుసుకునేందుకు బలమైన వేదికలుగా బాల పంచాయతీలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ జానకి తెలిపారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం నంచర్లలో తెలంగాణ పోలీస్ ఉమెన్ సేఫ్టీ ఆధ్వర్యంలో యంగిస్తాన్ స్వ చ్ఛంద సంస్థ బాలపంచాయతీ కార్యక్రమం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలల భవిష్యత్ నాయకుల తయారీకి, బాలల హక్కులు, భద్రత, సంక్షేమ పరిరక్షణలో బాలపంచాయతీలు కీలకపాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. నాయకత్వం, ఆత్మవిశ్వాసం, బాధ్యతాయుత ఆలోచనలతో సమాజమార్పునకు పిల్లలే వారధులని పేర్కొన్నారు. గ్రామాల్లోని బాలబాలికల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ పంచాయతీలు పనిచేసేలా బాలపంచాయతీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. బాలల విద్య. ఆరోగ్యం, భద్రత, పరిశుభ్రత, బాల్యవివాహాలు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గ్రామాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పిల్లలను భాగస్వాములు చేయడం ద్వారా వారిలో నాయకత్వ సామర్థ్యాలు మరింత పెరుగుతాయని, సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా ఎదగడానికి దోహదపడుతుదన్నారు. కార్యక్రమంలో బాలలకు అనుకూల వాతావరణం కల్పించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూఓ జరీనా, డిప్యూటీ ఈఓ శ్రీనివాస్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి, సీడబ్ల్యూసీ చైర్మన్ నయీమోద్దీన్, తహసీల్దార్ విద్యాసాగర్రెడ్డి, ఎంపీడీఓ నరేందర్, ఎస్ఐలు కృష్ణయ్య, సైదారావు, శేఖర్రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు కేఎం నారాయణ పాల్గొన్నారు. -
దత్తతకు పారదర్శక విధానం అమలు
సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (కారా) ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దత్తత ప్రక్రియను పారదర్శక విధానంలో నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం మహబూబ్నగర్ శిశుగృహలో 22 మంది పిల్లలను దత్తత ఇచ్చేందుకు అధికారులు సన్నద్ధమవుతుండగా 66 మంది దంపతులు దత్తత కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ మొదలుకుని దత్తత కోరుకునే జంటలకు పిల్లలను అప్పగించడం వరకు అన్ని ప్రక్రియలను ఆన్లైన్ విధానంలోనే సీ్త్ర, శిశు సంక్షేమశాఖ నిర్వహిస్తుంది. దరఖాస్తు చేసుకున్న తేదీ నుంచి జాబితాలో సీనియారిటీ ప్రకారం చట్టపరమైన జాగ్రత్తలు పాటిస్తూ పిల్లలను దత్తత ఇస్తున్నారు. దత్తతకు వెళ్లిన పిల్లలు తాము వెళ్లిన చోట ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నారా లేదా తెలుసుకునేందుకు రెండేళ్ల పాటు సంబంధిత శాఖ పర్యవేక్షిస్తుంది. దత్తతకు వెళ్తున్న వారిలో ఆడ పిల్లల సంఖ్యే ఎక్కువగా ఉండటం విశేషం. -
బైక్పై వెళ్లి ఉపాధి పనులు పరిశీలించిన అదనపు కలెక్టర్
మహబూబ్నగర్ రూరల్: పని ప్రదేశానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అధికారులే వెనక్కి తగ్గే పరిస్థితుల్లో అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ స్వయంగా బైక్ నడుపుకుంటూ కూలీల వద్దకు చేరుకుని మాట్లాడిన ఘటన శనివారం మహబూబ్నగర్ రూరల్ మండలంలోని పోతన్పల్లిలో ఆసక్తికరంగా మారింది. గ్రామానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో ఉపాధి పనులు జరుగుతుండగా.. అక్కడికి కారు వెళ్లేందుకు అనుకూల పరిస్థితుల్లేవు. ఫీల్డ్ అసిస్టెంట్ బైక్ను అదనపు కలెక్టర్ స్వయంగా నడుపుకుంటూ పని ప్రదేశానికి చేరుకున్నారు. ఉపాధి కూలీలు చేస్తున్న పనులను పరిశీలించి కొలతల విధానంపై ఆరా తీశారు. కూలీలు స్పందిస్తూ అధికారులిచ్చిన కొలతల ప్రకారమే పనులు చేస్తున్నామని, ఒక్కొక్కరికి సగటున రోజుకు రూ. 300 వరకు కూలి వస్తుందని వివరించారు. అంతకుముందు పోతన్పల్లిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి పనుల పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం గ్రామ నర్సరీతోపాటు ఓబ్లాయిపల్లి, కోటకదిర, మాచన్పల్లి నర్సరీలు పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీఓ కరుణశ్రీ, ఎంపీఓ శంకర్నాయక్, ఏపీఓ రాజశేఖర్రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ రాజురెడ్డి, పంచాయతీ కార్యదర్శి కృష్ణయ్య తదితరులు ఉన్నారు. -
అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: క్రికెట్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఎండీసీఏ చీఫ్ ప్యాట్రన్, న్యాయవాది వి.మనోహర్ రెడ్డి అన్నారు. అండర్–16 ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ టోర్నీలో భాగంగా నగర శివారులోని సమర్థ స్కూల్ మైదానంలో శనివారం మహబూబ్నగర్ – నారాయణపేట జట్ల మధ్య మ్యాచ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇరు జట్ల క్రీడాకారులను పరిచయం చేసుకుని అనంతరం ఆయన మాట్లాడారు. క్రమశిక్షణతో ఆడితే విజయం సాధించవచ్చన్నారు. జిల్లా క్రీడాకారులు ఐపీఎల్, రంజీ, భారత జట్టుకు ఆడాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్, ఉపాధ్యక్షుడు సురేష్కుమార్, సీనియర్ క్రీడాకారుడు రంజిత్కుమార్ పాల్గొన్నారు. మహబూబ్నగర్ విజయం నారాయణపేటతో జరిగిన మ్యాచ్లో మహబూబ్నగర్ 74 పరుగుల తేడాతో నారాయణపేటపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన మహబూబ్నగర్ 28 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. జట్లులో సయ్యద్ హమేద్ 52 పరుగులు చేశాడు. నారాయణపేట బౌలర్లు సాయిహర్షిత్ 2, యెహెతేశామ్ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన నారాయణపేట జట్టు 23.5 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌట్ అయింది. బౌలర్లు ధనుష్ 4 వికెట్లు, సబిల్ 3 వికెట్లు తీశారు. -
పాదయాత్ర అంటే ప్రభుత్వం ఉలిక్కిపడింది
● మూడు నెలల్లో పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయకుంటే పోరాటమే ● మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ను పూర్తిచేయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ తలపెట్టిన పాదయాత్ర ప్రకటనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉలిక్కిపడిందని మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం పార్టీ కా ర్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రెండున్నరేళ్లయినా పాలమూరు ప్రాజెక్ట్పై ప్రభుత్వానికి చల నం లేదని, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పాదయాత్ర చేస్తామని ప్రకటన చేయగానే ముఖ్యమంత్రి పర్యటనలు, సమీక్షలు, మంత్రుల పర్యటన ప్రా రంభించారన్నారు. ప్రభుత్వం అనుకున్న రీతిలో పనులు చేయకుంటే పాదయాత్ర చేపడుతామన్నా రు. మేము ప్రాజెక్టు పూర్తి చేస్తే తుది మెరుగులు ది ద్దేందుకు ఏడాది పడుతది అంటున్నారన్నారు. ప్రా జెక్టు పూర్తి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో సీఎం స్పష్టంగా చెప్పలేదని ఆరోపించారు. ● పాదయాత్ర చేస్తామంటే ప్రభుత్వం భయపడి సీఎం రేవంత్రెడ్డి పాలమూరు ప్రాజెక్ట్ను సందర్శించి 6 నెలల్లో పూర్తి చేస్తామని ప్రకటించారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. 90 శాతం పనులు పూర్తయిన పాలమూరు ఎత్తిపోతల పనులు మూడునెలల్లో పూర్తి చేయాలని లేకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ీసీఎం రెండురోజుల పర్యటనలో జిల్లాకు ఒరిగిందేమి లేదని, ఏదైనా వరాలు కురిపిస్తారని ప్రజలు ఆశించారని విమర్శించారు. నిలిచిన పనులు పూర్తి చేసేందుకు నిధులు ఇవ్వకుండా బీఆర్ఎస్పై విమర్శించడానికే ప్రాజెక్టుల సందర్శన పెట్టుకున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. ‘పాలమూరు’ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి చేస్తామో కూడా స్పష్టంగా చెప్పలేదని ఆరోపించారు. జూరాల పరిధిలో చెక్ డ్యామ్ కట్టేందుకు ఏరియల్ సర్వే రేవంత్రెడ్డి చేశారని, కర్ణాటక వైపు వెళ్లిండు అక్కడ పనులు చెక్ డ్యామ్లు చూసిండని దాంతో తెలంగాణకు ఒరిగిందేమి లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేవలం కేసీఆర్ను తిట్టడానికి ప్రజాధనం ఖర్చు చేశారన్నారు. ప్రాజెక్ట్ల వారీగా ఎంత పని అయింది, మిగిలిన పనులు ఎప్పుడు చేస్తారో జిల్లా పర్యటనలో చెప్పలేదని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వ సమయంలోనే పంట ఎక్కువ పెరిగిందన్నారు. కేసీఆర్ సాగునీరు ఇవ్వడంతోనే సాధ్యమైందన్నారు. అనంతరం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ఎంతవరకు పూర్తిచేశారో వివరిచే చిత్రాలను విడుదల చేశారు. సమావేశంలో మాజీ ఎంపీ శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రామ్మోహన్రెడ్డి, అంజయ్య, నాయకులు వాల్యానాయక్, ఇంతియాజ్ ఇసాక్, శ్రీనివాస్ యాదవ్, యాదయ్య, రాజేశ్వర్గౌడ్, వెంకన్న, నర్సింహులు పాల్గొన్నారు. -
ఆరునెలలకోసారి పర్యవేక్షణ
శిశుగృహ నుంచి దత్తత వెళ్లిన పిల్లలను మా సిబ్బంది ఆధ్వర్యంలో ప్రతి ఆరునెలలకోసారి పర్యవేక్షిస్తాం. దత్త త తీసుకున్న దంపతులు వారి ఆలనాపాలన సరిగా చూసుకుంటున్నారా.. లేదా.. అనేది తెలుసుకుంటాం. రెండేళ్లలో నాలుగు సార్లు పిల్లలను పర్యవేక్షిస్తాం. పిల్లలను సక్రమంగా చూసుకోకపో తే కారా చట్టం ప్రకారం దత్తత తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు అలాంటి సమస్య ఎదురుకాలేదు. – జరీనాబేగం, జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారి -
నీట్కు పకడ్బందీ ఏర్పాట్లు
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): రాష్ట్రంలో జూన్ 21న నిర్వహించనున్న నీట్–2026 రీ పరీక్షకు ఏర్పాట్లను పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి కలెక్టర్, జిల్లా ఉన్నతాధికారులతో వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశ్నపత్రాల తరలింపు, అభ్యర్థుల రిజిస్ట్రేషన్, బయోమెట్రిక్ వెరిఫికేషన్, అభ్యర్థుల తనిఖీ, బందోబస్తు తదితర ఏర్పాట్లను ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేపట్టాలని ఆదేశించారు. జూన్9న సీఎం చేతుల మీదుగా సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్స్లో మహిళా సమాఖ్య సభ్యులకు ఆర్టీసీ బస్సులు అందజేసే కార్యక్రమం జరుగనుందని, ఈ సభకు మహిళాసభ్యుల తరలింపుపై ఆయా జిల్లాల గ్రామీణాభివృద్ధి అధికారులు, ఆర్టీసీ ఆర్ఎంలు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ జిల్లాలో మహబూబ్నగర్లో 12, జడ్చర్లలో ఒకటి చొప్పున మొత్తం 13 పరీక్ష కేంద్రాల్లో నీట్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. జిల్లాలో 4,291 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని, అందుకోసం సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని, విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వీసీలో అదనపుకలెక్టర్లు మధుసూదన్నాయక్, హరిప్రియ, ఏఎస్పీ ఎన్బీ రత్నం, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ సురేందర్, అధికారులు పాల్గొన్నారు. -
పాలమూరులో నీ జెండా ఎగరనియ్య
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘పాలమూరు బిడ్డలకు తట్టపని, మట్టిపనే కాదు... అడ్డమొస్తే పండబెట్టి తొక్కి మట్టి కప్పేది కూడా తెలుసు. కేసీఆర్ గుర్తుపెట్టుకో.. నిన్ను ఇక్కడ మొలక కూడా ఎత్తనియ్యం. రాసిపెట్టుకో.. పాలమూరు జిల్లాలో నీ జెండాను ఎగరనియ్యం. గద్దెలు దిగాలె.. దిమ్మెలు కూలాలె. పాలమూరు గడ్డ మీద నీ గుర్తు ఇక మర్చిపో. నీ గుర్తు, నీ ఎమ్మెల్యే ఇక గతమే. భవిష్యత్తులో ఒక్కడిని కూడా గెలవనియ్యను. పాలమూరు గడ్డ నుంచి జడ్చర్ల వేదికగా కేసీఆర్కు ఇదే నా సవాల్. నీకు చేతనైతే రా చూసుకుందాం. 1994 నుంచి 2004 వరకు టీడీపీ రెండుసార్లు అధికారంలో ఉంది.2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్, 2014 నుంచి 2024 వరకు బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయి. రాష్ట్రంలో రెండోసారి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత నాది. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్సే అధికారంలో ఉంటుంది’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రెండో రోజు శుక్రవారం సాగునీటి ప్రాజెక్టుల సందర్శన అనంతరం జడ్చర్లలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.వెనుకబడ్డ పాలమూరు జిల్లాను దేశానికే ఆదర్శ జిల్లాగా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. పాలమూరు బిడ్డలు ఇచ్చిన ధైర్యంతోనే తాను ఎవరితోనైనా కొట్లాడుతానని స్పష్టం చేశారు. పాలమూరుతో సంబంధం లేకపోయినా ఇక్కడి నుంచి కేసీఆర్ను ఎంపీగా గెలిపిస్తే ఇక్కడి కష్టాలు చూడలేదని, కన్నీళ్లు తుడవలేదని ఆక్షేపించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పెండింగ్లో ఉన్న ఒక్క సాగునీటి ప్రాజెక్టును కూడా పూర్తిచేయలేదని సీఎం విమర్శించారు. గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై ఏడాదికి రూ. 5 వేల కోట్లు ఖర్చు చేసినా పదేళ్లలో 30 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవన్నారు. మీ పదేళ్ల పాలన, మా రెండున్నరేళ్ల పాలనపై చర్చిద్దాం బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై, కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ‘రెండున్నరేళ్లలో 15 లక్షల రేషన్ కార్డులు, 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు, 45 లక్షల కుటుంబాలకు రూ. 500కే సిలిండర్, 50 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్, ఆరీ్టసీలో ఉచిత ప్రయాణానికి రూ. 10 వేల కోట్లు, 67,616 మందికి ఉద్యోగాలు, 25.35 లక్షల మంది రైతులకు రుణమాఫీ, రైతు భరోసా కోసం రూ. 27 వేల కోట్లు, వ్యవసాయం కోసం రూ. 1.56 లక్షల కోట్లు ఖర్చుచేశాం. నీ పేరు కేసీఆర్ అయితే అసెంబ్లీకి రావాలి. ఈ విషయంపై చర్చ చేద్దాం. ఓడితే క్షమాపణ చెప్తా. నువ్వు ఓడిపోతే ఫాంహౌస్లో పడుకో. బిల్లా, రంగాలను ఊరిపై వదిలిండు. ఒకడు పొద్దున ప్రెస్మీట్ పెడితే, మరొకడు సాయంత్రం ట్విట్టర్లో పెడతడు. మీ మధ్యలోనే పొంతన లేదు. మాకు సుద్దులు చెబుతారా?’అని మండిపడ్డారు. కృష్ణా, గోదావరి నీటికి శాశ్వత పరిష్కారం చూపుతాం.. ‘గోదావరిపై తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు కడతాం. బీజేపీ నేతలు తమాషా చేయడం కాదు. మహారాష్ట్ర సీఎం చర్చలకు రాకుండా దాగుడుమూతలు ఆడి పారిపోతుండు. మర్యాదగా పట్టుకురండి. ఈ ప్రాజెక్టుతో ఎల్లంపల్లికి 100 టీఎంసీల నీళ్లు తీసుకొస్తాం. కృష్ణా నీటిపై 60 ఏళ్ల రావణకాష్టానికి శాశ్వత పరిష్కారం చూపుతాం. పగోడైనా, పక్క దేశమైనా చర్చలు లేకుండా పరిష్కారం కావు. ఆలీ, పాలీ పంచాయితీకైనా పెద్ద మనిషి కావాలి. నాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నరు. డిసెంబర్లోగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 టీఎంసీల కోసం ఎన్ఓసీ తీసుకొచ్చే బాధ్యత నాది. మరో రెండున్నరేళ్లలో కృష్ణాపై కొత్త రిజర్వాయర్, బ్రిడ్జి కం బరాజ్ నిర్మాణం చేపడతాం. ఏడాదిలోగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తాం’అని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. బహిరంగ సభలో మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు జి.మధుసూదన్రెడ్డి, అనిరు«ద్రెడ్డి, కూచుకుళ్ల రాజేశ్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, మేఘారెడ్డి, వంశీకృష్ణ, వీర్లపల్లి శంకర్, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, పలు కార్పొరేషన్ల చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. -
మరో అడుగు ముందుకు..!
● పెట్రోల్ బంక్ నుంచి పరిశ్రమల దిశగా.. ● భారీ ప్రాజెక్టును చేపట్టేందుకు పేట మహిళా సమాఖ్య సిద్ధం ● వేరుశనగ ఉత్పత్తుల తయారీ కేంద్రం ఏర్పాటుకు కసరత్తు ● మార్కెట్ చైర్మన్తో చర్చించిన హైదరాబాద్ బృందం నారాయణపేట: ఒకప్పుడు కేవలం పొదుపుకే పరిమితమైన మహిళా సంఘాలు నేడు వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో తమ సామర్థ్యాన్ని నిరూపిస్తున్నాయి. నారాయణపేట జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్ రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన నేపథ్యంలో ఇప్పుడు మరో భారీ ప్రాజెక్టును చేపట్టేందుకు జిల్లా మహిళా సమాఖ్య సిద్ధమవుతోంది. జిల్లాలో విస్తారంగా పండే వేరుశనగ పంటకు విలువ జోడిస్తూ రూ.కోటితో వేరుశనగ ఉత్పత్తుల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనతో శుక్రవారం హైదరాబాద్ నుంచి వచ్చిన నిపుణుల బృందం ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు హైదరాబాద్ నుంచి ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు, చిన్న తరహా పారిశ్రామిక శాఖ అధికారుల బృందం జిల్లాకు చేరుకుంది. సెర్ప్ ఆధ్వర్యంలో మద్దూర్, దామరగిద్ద ప్రాంతాల్లో పర్యటించి ముడిసరుకు లభ్యత, మార్కెట్ అవకాశాలు, రవాణా సౌకర్యాలు, మహిళా సంఘాల భాగస్వామ్యం వంటి అంశాలను అధ్యయనం చేసింది. పల్లీలకు విలువ.. రైతులకు లాభం నారాయణపేట జిల్లాలో మద్దూర్, దామరగిద్ద, మక్తల్, మరికల్, ఊట్కూర్ తదితర మండలాల్లో వేల ఎకరాల్లో వేరుశనగ సాగు జరుగుతోంది. పంట దిగుబడి బాగున్నప్పటికీ రైతులు తరచూ మార్కెట్ ధరల హెచ్చుతగ్గులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పల్లీలను ముడి రూపంలో విక్రయించడంతో రైతులకు పరిమిత లాభాలే మిగులుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతుల నుంచి నేరుగా వేరుశనగను కొనుగోలు చేసి, పల్లీ నూనె, చిక్కీలు, పల్లీ లడ్డూలు, పల్లీ పొడి, పల్లీ మిఠాయిలు, పశువుల దాణా వంటి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేస్తే రైతులకు అదనపు ఆదాయం లభించడమే కాకుండా స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. మహిళా సమాఖ్యకు మరో భారీ బాధ్యత జిల్లా మహిళా సమాఖ్య ఇప్పటికే పెట్రోల్ బంక్ నిర్వహణలో రాష్ట్రస్థాయిలో ప్రశంసలు అందుకుంది. మహిళల నిర్వహణ సామర్థ్యానికి ఇది నిదర్శనంగా నిలిచింది. ఈ విజయాన్ని దృష్టిలో ఉంచుకుని వేరుశనగ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించాలనే ప్రతిపాదనకు అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది అమలైతే వందలాది మంది మహిళలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది. ఉత్పత్తుల తయారీ నుంచి ప్యాకేజింగ్, మార్కెటింగ్ వరకు మహిళలే కీలక పాత్ర పోషించనున్నారు. -
భయపెడుతున్న పెద్దపులి
అమ్రాబాద్: పెద్దపులిదాడిలో మరో పాడి గేదె మృతి చెందిన ఘటన శుక్రవారం పదర మండలం ఇప్పలపల్లి గ్రామశివారులోని పెద్దగూడెపంపు అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇప్పలపల్లి గ్రామానికి చెందిన బిలావత్ తావుర్యానాయక్ చెందిన పాడిగేదె గ్రామ శివారులోని పెద్దగూడెపంపు అటవీలో మేతకు వెళ్లగా పెద్దపులి దాడిచేసి చంపేసిందని గ్రామస్తులు తెలిపారు. బాధిత రైతు తావుర్యా సమాచారంతో ఎఫ్బీఓ రవీందర్ సిబ్బందితో వెళ్లి పంచనామా నిర్వహించారు. అయితే అదే గ్రామమైన ఇప్పలపల్లి గ్రామానికి చెందిన అల్లు రామకృష్ణారెడ్డి గేదె పెద్దపులి దాడిలో మృతి చెందగా శుక్రవారమే మరో గేదె పెద్దపులి దాడిలో మృతి చెందడంతో పశువుల పెంపకందారులు, స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పులి దాడిలో మరో పాడిగేదె మృతి -
వాగు వద్దకే మా ప్రయాణం
మాగనూర్: మండలంలో నడుస్తున్న ఇసుక రీచ్లతో అటు ప్రజలు.. ఇటు విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పైచదువుల కోసం ఆధాయ, కుల ధ్రువపత్రాల కోసం మాగనూర్ తహసీల్దార్ కార్యాలయానికి వస్తున్న విద్యార్థులకు సంబంధిత అధికారులు అందుబాటులో ఉండడంలేదని వాపోతున్నారు. చివరికి అత్యవసరమైతే విద్యార్థులు వాగుల వద్దకు చేరుకుని అక్కడ పత్రాలను నింపుతున్నారు. దీంతో సమయంతోపాటు అదనపు ఖర్చులవుతున్నాయని వాపోతున్నారు. ఇదే విషయంపై సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికై నా అధికారులు జీపీవోలకు ఇసుక రీచ్ల దగ్గర డ్యూటీలు వేయకుండా ఉండాలని పలువురు కోరుతున్నారు. అయితే ప్రస్తుతం నియోజకవర్గంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లు సగానికి పైగా పూర్తయ్యాయని, మిగతావి కూడా 80శాతం కుపైగా నిర్మాణ దశలో ఉన్న ఇప్పటికీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇన్ని ట్రాక్టర్లకు అనుమతులు ఎలా పొందుతున్నారని ఆయా గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కావున అధికారులు స్పందించి అర్హులైనవారికి మాత్రమే అనుమతులివ్వాలని కోరుతున్నారు. నిప్పంటిచుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం తిమ్మాజిపేట: భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ కారణంగా ఓ వ్యక్తి నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మండలంలోని గుమ్మకొండలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివారలు.. ధన్వాడ గ్రామానికి చెందిన తిమ్మయ్య భార్య లక్ష్మి గ్రామ సమీపంలో ఓ ప్రైవేట్ కంపెనీలో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గురువారం రాత్రి భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఈ క్రమంలో క్షణికావేశంలో తిమ్మయ్య డీజిల్ ఒంటిపై పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. చుట్టుపక్కల వారు గమనించి మంటలు ఆర్పివేసి చికిత్స నిమిత్తం మహబూబ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇసుక ట్రాక్టర్ పట్టివేత మిడ్జిల్: వుండలంలోని కొత్తపల్లి సమీపంలోని దుంధుబీ వాగు నుంచి శుక్రవారం అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకొని పోలీసుస్టేషన్కు తరలించినట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. తిమ్మాజిపేట్ మండలంలోని ఆర్సీ తండాకు చెందినదిగా గుర్తించి ట్రాక్టర్ డ్రైవర్ రాహుల్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ● ఆదాయ, కుల ధ్రువపత్రాలకు ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు ● ఇసుక రీచ్ల వద్ద జీపీవోల డ్యూటీ -
బిజీబిజీగా రెండు రోజులు
సాక్షి, నాగర్కర్నూల్/జడ్చర్ల: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు రోజులపాటు పర్యటించి పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్ట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గురువారం మధ్యాహ్నం ఉమ్మడి జిల్లాలోని మక్తల్కు హెలికాప్టర్ ద్వారా చేరుకున్న ఆయన శుక్రవారం రాత్రి వరకు ఉమ్మడి జిల్లాలోనే పూర్తిసమయం కేటాయించారు. మొదటి రోజున జోగుళాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్ట్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో కృష్ణానదిపై నిర్మించ తలపెట్టిన బ్రిడ్జి కం బ్యారేజ్ ప్రతిపాదిత స్థలాన్ని ఏరియల్వ్యూ ద్వారా పరిశీలించారు. సాయంత్రం 6గంటలకు నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో కృష్ణాతీరంలోని సోమశిలకు చేరుకున్నారు. రాత్రి 7గంటల నుంచి 10గంటల వరకు సుమారు 3గంటలపాటు ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై సమీక్షించారు. అనంతరం సోమశిలలోని మృగవాణి రిసార్ట్లో బసచేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు బిజీబిజీ ఉమ్మడి పాలమూరు జిల్లా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి ఉదయం నుంచి రాత్రి వరకు ప్రాజెక్టుల సందర్శనలు, పంప్హౌస్లు, లిఫ్టులు, రిజర్వాయర్లు, టన్నెల్ పరిశీలన, ప్రెస్మీట్, బహిరంగ సభలతో తీరిక లేకుండా గడుపుతూనే హుషారుగా కనిపించారు. శుక్రవారం ఉదయం సోమశిల నుంచి కొల్లాపూర్లోని మంత్రి జూపల్లి కృష్ణారావు నివాసానికి చేరుకుని మంత్రులు, ఎమ్మెల్యేలతో కలసి బ్రేక్ఫాస్ట్ చేశారు. ఉదయం 9:30 గంటలకు కృష్ణాతీరంలోని నార్లాపూర్ పంప్హౌస్ చేరుకుని పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ మొదటి లిఫ్టు, మోటారు బిగింపు, హెడ్ రెగ్యులేటరీ, ప్రధాన కాల్వ, పెండింగ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడే ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంప్హౌస్, సర్జ్పూల్, మోటార్లు, ఎల్లూరు రిజర్వాయర్ను సందర్శించి వేసవి సందర్భంగా తాగునీటి సరఫరాకు తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా కుమ్మెర పంప్హౌస్కు చేరుకుని మూడో లిఫ్టు మోటార్లు, సొరంగంలోకి వెళ్లి పంప్హౌస్ నిర్మాణ పనులను పరిశీంచారు. వట్టెం రిజర్వాయర్ను సందర్శించారు. అక్కడి నుంచి నేరుగా భూత్పూర్ సమీపంలోని కరివెన రిజర్వాయర్ పనులను పరిశీలించిన అనంతరం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా ఉదండాపూర్ రిజర్వాయర్ చేరుకుని కొనసాగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సాయంత్రం 7గంటలకు జడ్చర్లలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు చేరుకుని ప్రసంగించారు. సభ అనంతరం రాత్రి 9 గంటల సమయంలో రోడ్డుమార్గంలో హైదరాబాద్కు తిరుగుపయనమయ్యారు. ఉమ్మడి జిల్లాలో ముగిసిన సీఎం పర్యటన


