breaking news
Mahabubnagar
-
సతాయిస్తోందంటూ.. అత్తను చంపిన కోడలు
మహబూబ్ నగర్ జిల్లా: ఇంట్లో నిత్యం గొణుగుతూ తనను సతాయిస్తోందంటూ వృద్ధురా లైన అత్తను ఓ కోడలు రాడ్డుతో కొట్టి చంపింది. ఈ అమానుష ఘటన వనపర్తి జిల్లా రేవల్లి మండలంలోని నాగపూర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. రేవల్లి ఎస్సై రజిత కథనం ప్రకారం నాగపూర్ గ్రామానికి చెందిన ఎల్లమ్మ (73), దసరయ్య దంపతులకు నలుగురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఎల్లమ్మ భర్త దసరయ్య కొన్నాళ్ల క్రితం మృతిచెందడంతో కుమారుడు మల్ల య్య వద్ద ఎల్లమ్మ ఉంటోంది. అయితే కోడలు బొగురమ్మతో తరచూ ఆమె గొడవ పెట్టుకొనేది. దీంతో ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమ యంలో ఎల్లమ్మను బొగురమ్మ రాడ్డుతో కొట్టగా ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలియజేయడంతో వారు ఘటనాస్థలికి చేరుకొని నిందితురాలిని అరెస్ట్ చేశారు. తనను ఇబ్బందులకు గురిచేస్తుండటంతో తానే చంపానని బొగురమ్మ పోలీసుల ఎదుట నేరం అంగీకరించింది. ఈ ఘటనపై ఎల్లమ్మ రెండో కూతురు బచ్చమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఇసుక తరలింపు గొడవలో రైతుపై దాడి
వీపనగండ్ల: మండలంలోని తూంకుంట గ్రామ సమీపంలోని ఇసుక రీచ్ నుంచి శనివారం సాయంత్రం అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను రైతు అడ్డగించి తన పంట పొలంలో వెళ్లొద్దని చెప్పడంతో ఆగ్రహించిన ట్రాక్టర్ యజమాని రైతుపై దాడి చేసి గాయపరిచిన ఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాలు.. తూంకుంట గ్రామానికి చెందిన చిన్న రాంబాబు అనే ట్రాక్టర్ యజమాని అదే గ్రామానికి చెందిన పోతుల రామకృష్ణారెడ్డి పొలం నుంచి ఇసుకను తరలిస్తున్నాడు. దీంతో రైతు ట్రాక్టర్ అడ్డుకొని తన పొలం గుండా రావొద్దని చెప్పడంతో ఆగ్రహించిన ట్రా క్టర్ యజమాని రైతుపై దాడి చేసి గాయపరిచారు. ఇసుక రీచ్కు అతి సమీపంలో దాదా పు 100 మంది రైతుల మోటా ర్లు ఉన్నాయని, యథేచ్ఛగా ఇసుకను తరలిస్తుండడంతో బోరుబావులు అడుగంటి పోతాయన్న విషయాన్ని ఇసుక అక్రమ తరలింపుదారులకు చెప్పినా పట్టించుకోవడంలేదని బాధితుడు వాపోయారు. తనపై దాడి చేసిన వ్యక్తిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఫిర్యాదు అందుకున్న ఎస్ఐ కె.రాణి విచారణ చేసి కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు. -
ద్రావణ తయారీలో నాణ్యత తప్పనిసరి
అలంపూర్: పంట సస్యరక్షణ చర్యల్లో భాగంగా పు రుగు మందు ద్రావణ తయారీలో నాణ్యత లోపించిన నీరు వాడితే ప్రతికూల మార్పులు జరిగి మందు ప్రభావం తగ్గుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియనాయక్ రైతులకు సూచించారు. నాణ్యత లేని నీటిని వినియోగిస్తే నష్టపోతారన్నా రు. మందు ద్రావణం చేయడానికి నాణ్యత గల నీరు వాడినప్పుడే మాత్రమే మందు శక్తివంతంగా పని చేసి ఫలితం పొందవచ్చని పేర్కొన్నారు. ఎలాంటి నీరు కావాలి..? ఏ లక్షణాలు ఉండాలి..? మందు ద్రావణ తయారీకి ముఖ్యంగా మూడు లక్షణాలు ఉండాలి. వీటిపై సరైన అవగాహన పెంచుకోవాలి. 1. పీహెచ్ ఉదజని సూచిక లేక రసాయన స్థితి : నీటిలో కరిగి ఉండే లవణాల స్వభావంపై ఆధారపడి ఉంటుంది. ఇది ఆమ్లం, తటస్థం, క్షారముగా ఉండవచ్చు. అయితే ఆమ్లగుణ తీవ్రత అధికంగా లేదా క్షారగుణ తీవ్రత అధికంగా ఉన్న నీటిని మందు ద్రావణం తయారు చేయడానికి ఉపయోగించ రాదు. దీని వలన రసాయన ప్రతికూల మార్పులు ఏర్పడతాయి. 2. సెలినిటీ లేక సాల్ట్ కంటెంట్ (లవణ పరిమాణ సూచిక) అన్ని రకాల నీటిలోను కొన్ని లవణాలు కరిగి ఉంటాయి. కొన్నింటిలో ఎక్కువగానూ కొన్నింటిలో తక్కువగాను ఉండవచ్చు. లవణాలు ఎంత తక్కువగా ఉంటే అంత మంచి నీరుగా భావించాలి. లవణాలు అధికంగా ఉన్న నీరు మందు ద్రావణంలో కలపడానికి పనికిరావు. 3. నీటి కాఠిన్యత : నీటిలో ఉండే లవణాల స్వభావాన్ని బట్టి పరస్పర అధిక్యతను బట్టి నీటిని రెండు రకాలుగా విభజించవచ్చు. సాఫ్ట్ వాటర్(మృదుజలం): సబ్బుతో సులభంగా నురగ వస్తుంది. దీంతో ఏ సమస్య ఉండదు. మందు ద్రావణ తయారీకి నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. హార్డ్ వాటర్ (కఠిన జలం): ఇందులో బై కార్పోనేట్స్, క్లోరైడ్స్, సల్ఫేట్లకు సంబంధించిన కా ల్షియం, మెగ్నీషియం లవణాలు అధికంగా ఉంటా యి. ఈ నీటిలో సబ్బు వినియోగించనప్పుడు నుర గ రాదు. నీరు విరిగిపోయినట్లు కనిపిస్తుంది. నుర గ బాగా రావడానికి అధిక పరిమాణంలో సబ్బు వా డాల్సి వస్తుంది. ఈ నీటిని మందు ద్రావణ తయారీకి వాడినప్పుడు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. రసాయన ప్రతికూల చర్య జరగడం వలన ద్రావణం విరిగిపోవడం గమనించవచ్చు. దీని వల్ల మందు క్రిమి సంహారక గుణం క్షీణిస్తోంది. పాడి–పంట -
ఊకచెట్టువాగులో మృతదేహం లభ్యం
మదనాపురం: సరళాసాగర్ ఊకచెట్టు వాగులో శుక్రవారం చేపల వేటకు వెళ్లిన శేఖర్ ప్రమాదవశాత్తూ నీటిలో పడి మృతి చెందాడు. శనివారం ఉదయం ఎన్టీఆర్ఎఫ్ అండ్ రెస్క్యూ బృందాలు వెలికితీసేందుకు చర్యలు చేపట్టగా ఎట్టకేలకు మృతదేహం లభ్యమైంది. అనంతరం పంచనామా నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ శేఖర్రెడ్డి తెలిపారు. బైకులపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు వనపర్తిటౌన్: వనపర్తి ఆర్టీసీ బస్టాండ్లో ఆగి ఉన్న డీలక్స్ బస్సు అకస్మాత్తుగా ముందుకు కదలడంతో ప్ర యాణికులు తీవ్రభయాందోళనకు లోన య్యారు. ఓ డీలక్స్ బస్సు శనివారం ఉద యం హైదరాబాద్ వెళ్లేందుకు వనపర్తి ఆర్టీసీ బస్టాండ్లో ఆగింది. పలువురు ప్రయాణికులు ఎక్కగా డ్రైవర్ టికెట్లు ఇస్తుండగా బస్సు దానంతట అదే ముందుకు కదిలింది. ఈ క్రమంలో బస్సు ముందు ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా పరిగెత్తారు. దీంతో అక్కడే ఆగి ఉన్న రెండు బైకులపైకి బస్సు దూసుకెళ్లడంతో అవి ధ్వంసమయ్యాయి. డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును అదుపు చేయడంతో ప్రాణాపాయం తప్పింది. బస్సులో సాంకేతిక కారణాల వల్లే ఇలా జరిగిందని ఆర్టీసీ సిబ్బంది చెబుతుండగా డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ డ్రైవర్ హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతోనే సమస్య తలెత్తిందని తెలిపారు. డ్రైవర్కు కౌన్సిలింగ్ ఇచ్చామని వాహనదారులు కూడా బస్టాండ్లో బైకులు ఆపడం సరికాదని సూచించారు. ఘటనపై పోలీసులు ఆరా తీసినట్లు డిపో అధికారులు తెలిపారు. -
తిరుగు ప్రయాణ పాట్లు
దసరా పండుగ, సెలవులు ముగియడంతో స్వగ్రామాలకు వెళ్లిన వారంతా తిరిగి పట్నం బాట పట్టారు. శుక్రవారంతోనే దసరా సెలవులు ముగియడంతో శనివారం కార్యాలయాలకు వెళ్లే వారితోపాటు, సోమవారం నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనుండగా హాస్టళ్లకు వెళ్లాల్సిన విద్యార్థులను పంపేందుకు ఉదయం నుంచే తల్లిదండ్రులు బయలుదేరారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బస్టాండ్లు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లు, ప్రయాణికులతో రద్దీగా మారాయి. ప్రధానంగా హైదరాబాద్ రూట్లో వెళ్లే బస్సుల కోసం ప్రయాణికులు గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది. జడ్చర్ల మున్సిపాలిటీలోని బాదేపల్లి సిగ్నల్గడ్డ, ఫ్లైఓవర్ సర్కిల్, బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడాయి. బస్సులు వచ్చిన వెంటనే సీట్ల కోసం ప్రయాణికులు పోటీపడటం కనిపించింది. ఇదిలా ఉండగా.. అలంపూర్ చౌరస్తాలో ప్రజలు ఎండలోనే బస్సుల కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. అలంపూర్ ఆలయాలకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి ప్రజలు ఎక్కువగా వస్తుంటారు. ఈ క్రమంలో అధికారులు స్పందించి ఇక్కడ మినీ బస్టాండ్ ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. – జడ్చర్ల టౌన్/ ఉండవెల్లి -
జూరాలకు 2.32 లక్షల క్యూసెక్కుల వరద
● ప్రాజెక్టు 11 క్రస్టు గేట్లు ఎత్తివేత ● 2.11 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల ధరూరు/ఆత్మకూర్: ఎగువ నుంచి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ఫ్లో స్వల్పంగా తగ్గి నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. శుకవారం రాత్రి 9 గంటల వరకు ప్రాజెక్టుకు 2.70 లక్షల క్యూ సెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. శనివారం రాత్రి 8 గంటల వరకు 2.32 లక్షల క్యూసెక్కులకు తగ్గినట్లు పేర్కొన్నారు. దీంతో ప్రాజెక్టు 11 క్రస్టు గేట్లు ఎత్తి 1.74 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆరు యూనిట్లలో 234 మెగా వాట్ల విద్యుదుత్పత్తి చేస్తూ 30,422 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 68 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 1,030 క్యూసెక్కులు, కుడి కాల్వకు 390 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–2కు 750 క్యూసెక్కులు కలిపి ప్రాజెక్టు నుంచి మొత్తం 2.11 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.690 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 37.64 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 33.173 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 45వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా 7గేట్లను ఎత్తి దిగువన ఉన్న జూరాలకు ప్రాజెక్టుకు 38,480 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటి వరకు 749.051 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. రెండ్లు గేట్ల ద్వారా.. రాజోళి: సుంకేసుల డ్యాంలో రెండు గేట్ల ద్వారా నీటి విడుదల చేస్తున్నట్లు జేఈ మహేంద్ర తెలిపా రు. శనివారం ఎగువ నుంచి 13,300 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా.. రెండు గేట్లను ఒక మీటర్ మేర తెరిచి 8,821 క్యూసెక్కులు, కేసీ కెనాల్కు 2,445 క్యూసెక్కులను వదిలినట్లు ఆయన పేర్కొన్నారు. రామన్పాడులో 1,021 అడుగుల నీటి మట్టం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులకు గాను శనివారం 1,021 అడుగులు వచ్చి చేరింది. జూరాల ఎడమ కాల్వ ద్వార 974 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సమాంతర కాల్వ ద్వారా వచ్చే నీటిని నిలిపి వేశారు. ఎన్టీఆర్ కాల్వ ద్వారా 875 క్యూసెక్కులు, కుడి ఎడమ కాల్వ ద్వారా 50 క్యూసెక్కులు, తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని ఏఈ వరప్రసాద్ తెలిపారు. శ్రీశైలంలో ఎనిమిది గేట్లు ఎత్తివేత దోమలపెంట: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటి ప్రవాహం కొంత తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం ఆనకట్ట వద్ద ఎత్తి ఉంచిన పది గేట్లలో శనివారం రెండు గేట్లను మూసి వేసి ఎనిమిది గేట్ల ద్వారా నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి 2.11 లక్షల క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 17,916, హంద్రీ నుంచి 250 మొత్తం 2,27,822 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. శ్రీశైలంలో ఆనకట్ట వద్ద ఎనిమిది గేట్లు ఒకొక్కటి పది అడుగుల మేర పైకెత్తి స్పిల్వే ద్వారా 2,21,664 క్యూసెక్కులు, కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 65,976 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 884.2 అడుగుల వద్ద 210.9946 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇరవై నాలుగు గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 5 వేలు, హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2,817 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ కేంద్రంలో 16.974 మిలియన్ యూనిట్లు, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో 15.317 మి.యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు. -
బారీకేడ్ను ఢీకొని యువకుడి దుర్మరణం
మరికల్: హోటల్ పనులు ముగించుకొని తిరుగు ప్రయాణంలో బైక్పై ఇంటికి వస్తుండగా బారీకేడ్ను ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన అర్ధరాత్రి మరికల్లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని మాధవరం గ్రామానికి చెందిన కురుమూర్తి(29) మూడు నెలల క్రితం మరికల్లోని రాయచూర్ రోడ్డు పక్కన నాటుకోడి హోటల్ పెట్టి జీవనం కొనసాగిస్తున్నాడు. దసరా పండుగ కావడంతో రాత్రి వరకు హోటల్ నడిపించాడు. హోటల్ పనులు ముగించుకొని బైక్పై మాధవరం వస్తున్నాడు. సబ్స్టేషన్ చౌరస్తాలో ప్రమాదాలను నివారించేందుకు పెట్టిన బారికేడ్ను వేగంగా వచ్చి ఢీకొనడంతో కిందపడి తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. మృతుడు అదే గ్రామానికి చెందిన యువతితో 5ఏళ్ల క్రితం వివాహం జరగా.. ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించామని ఎస్ఐ రాము తెలిపారు. చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి అడ్డాకుల: మండలంలోని శాఖాపూర్కు చెందిన వ్యక్తి పండుగ పూట చేపల వేట కు వెళ్లి మృత్యువాతపడ్డా డు. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన ఆకుల చెన్నయ్య (35), ఈదమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చెన్నయ్య గ్రామంలోనే కూలీ పనులు చేసి జీవనం సాగిస్తున్నాడు. దసరా పండుగ సందర్భంగా శుక్రవారం ఉదయం చేపల వేటకు గ్రామ సమీపంలోని చెరువు వద్దకు వెళ్లాడు. మధ్యాహ్నమైనా చెన్నయ్య ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చెరువు వద్ద వెతకగా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో శనివారం ఉదయం చెరువులో చెన్నయ్య మృతదేహం తేలడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. బాధిత కుటుంబ సభ్యు లు సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. చెన్నయ్య ఫిట్స్తో ఇబ్బంది పడేవాడని చెరువులోకి దిగిన తర్వాత ఫిట్స్ రావడంతో నీళ్లల్లో మునిగి చనిపోయి ఉంటాడని బంధువులు భావిస్తున్నారు. ఫాంపాండ్లో పడి బాలుడు మృతి అచ్చంపేట రూరల్: ప్రమాదవశాత్తు పొలంలోని ఫాంఫండ్లో పడి బాలుడు మృతి చెందిన ఘటన శనివారం మండలంలోని దర్గాతండాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. దర్గాతండాకు చెందిన అరుణ కు మారుడు నిహాల్(5)ను తీసుకొని పొలం వద్ద కు వెళ్లింది. పొలం పనుల్లో ఉండగా నిహాల్ ఆ డుకుంటూ పక్కనే ఉన్న ఫాంఫండ్ వద్దకు వెళ్లి కాలుజారి నీటిలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి మృతిపై ఎలాంటి కేసు నమో దు కాలేదని అచ్చంపేట పోలీసులు తెలిపారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి కొల్లాపూర్: విద్యుదాఘాతంతో ఒకరు మృతి చెందిన ఘటన పట్టణంలోని వరిదేల హనుమాన్ ఆల య సమీపంలో శనివా రం చోటుచేసుకుంది. స్థాని కుల వివరాల ప్రకా రం గ్రామానికి చెందిన సంగనమోని సత్తయ్య(58) ఇంటి వద్ద పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యాదాఘాతానికి గురయ్యాడు. కుటుంబసభ్యులు గమనించి వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్దారించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడికి కుటుంబాన్ని పలువురు నాయకులు పరామర్శించారు. షార్ట్ సర్క్యూట్తో గుడిసె దగ్ధం పాన్గల్: మండలంలోని కేతేపల్లి గ్రామానికి చెందిన గడమాల కుర్మయ్యకు చెందిన గుడిసె శనివారం షార్ట్ సర్క్యూట్కు గురై దగ్ధమైంది. గుడిసెలో గ్యాస్ సిలిండర్ ఉందని ఇంటి య జ మాని చెప్పడంతో చుట్టు పక్కల నివాస గృహాల వారు సిలిండర్ ఎక్కడ పేలుతుందోనని భయాందోళనకు గురయ్యారు. వెంటనే జిల్లా కేంద్రంలోని ఫైర్ స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో పైర్ ఇంజిన్ సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేయడంతో పె ను ప్రమాదం తప్పింది. ఫైర్ ఇంజిన్ వచ్చే లో పు గ్రామస్తులు, యువకులు మంటలు చుట్టు పక్కల వ్యాపించకుండా నీళ్లు చల్లుతూ కొంతమేర అదుపు చేశారు. అయితే ఈ ప్రమాదంలో ఇంటి నిర్మాణం కోసం దాచిన రూ.లక్ష నగ దు, రెండు క్వింటాళ్ల బియ్యం, దుస్తులు, వంట సామగ్రి మంటల్లో కాలి బూడిదయ్యాయి. దాదాపుగా రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు. ప్రభుత్వమే తనన ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. -
మద్దూరులో బైక్ బ్యాటరీల చోరీ
మద్దూరు: ఇళ్లు, దుకాణాల ఎ దుట ఉంచిన ద్విచక్ర వాహనా ల బ్యాటరీలను ఓ మెకానిక్ శుక్రవారం రాత్రి దొంగలించిన ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. ఓ షాపు ఎదుట ఉన్న సీసీ ఫుటేజీలో బైక్ నుంచి బ్యాటరీ చోరీ చేయడం రికార్డు అయ్యింది. అలాగే ఒకే రాత్రి దాదాపు 18బైక్ల నుంచి బ్యాటరీలు అపహరించడం కలకలం రేపింది. దీంతో రఘు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎస్ఐ విజయ్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మద్దూరులో మెకానిక్ షాపు నిర్వహించే నర్సింహులు ఈ దొంగతనం చేసినట్లు గుర్తించి అతని మెకానిక్ షాపు నుంచి దొంగిలించిన 18 బ్యాటరీలను రికవరీ చేసినట్లు తెలిపారు. నర్సింహులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. అతన్ని పట్టుకొని విచారించిన తర్వాత వివరాలు వెల్లడించనున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
దాడిచేసిన వారిపై కేసు నమోదు
అమరచింత: నాగల్కడ్మూర్ గ్రామానికి చెందిన అహ్మద్పాషాపై దాడి చేసిన నాగిరెడ్డిపల్లెకు చెందిన పలువురిపై శనివారం కేసునమోదు చేసినట్లు ఎస్ఐ స్వాతి తెలిపారు. శుక్రవారం రాత్రి నాగల్కడ్మూర్కు చెందిన అహ్మద్పాషా తన సొంత పనులు ముగించుకుని ఇంటికి వస్తున్నాడు. అంబేద్కర్ చౌరస్తా వద్ద నారాయణపేట మండలం నర్వ మండలం నాగిరెడ్డిపల్లెకు చెందిన కొంతమంది యువకులు నాగల్కడ్మూర్కు చెందిన చిన్నపిల్లలతో గొడవ పడుతుండగా వారించడానికి వెళ్లిన అహ్మద్పాషాపై కత్తితో దాడిచేసి గాయపరిచారన్నారు. దీంతో పెద్దగా అరవడంతో సమీపంలో ఉన్న వ్యక్తులు అక్కడికి రాగా దాడికి పాల్పడిన వారు అక్కడినుంచి పరారయ్యారన్నారు. రక్తగాయంతో బాధపడుతున్న పాషాను ఆత్మకూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మొసళ్ల సంచారంతో ఆందోళన వీపనగండ్ల: మండలంలోని రిజర్వాయర్, పలు చెరువులు, కుంటల్లో మొసళ్ల సంచారంతో ఆందోళన చెందుతున్నట్లు రైతులు వాపోతున్నారు. శుక్రవారం రాత్రి కల్వరాల్ల గ్రామ సమీపంలో రోడ్డుపై మొసలి సంచరిస్తుండటాన్ని గుర్తించారు. అదే విధంగా గోపల్దిన్నె రిజర్వాయర్, గోవర్ధనగిరికత్వా, పల్లెచెరువు పలు గ్రామాల్లోని ఊరచెరువులో తరచూ మొసళ్లు దర్శనమిస్తున్నాయని తెలిపారు. అధికారులు స్పందించి ఆయా చెరువుల వద్ద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
శ్రీశైలం ట్రస్టు బోర్డులోకి కట్టా సుధాకర్రెడ్డి
అచ్చంపేట: శ్రీశైలం దేవస్థానం ట్రస్టు బోర్డు ప్రత్యేక ఆహ్వానితులు గా ఉప్పునుంతల మండల కేంద్రానికి చెందిన కట్టా సుధాకర్రెడ్డిని నియమిస్తూ ఏపీ ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ప్రస్తుతం తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. ఏబీవీపీ, బీజేపీలో కీలకంగా పనిచేస్తున్న ఆయనకు అవకాశం రావడంపై నల్లమల్ల ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం బోర్డులో అచ్చంపేట ప్రాంతానికి అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తేందుకు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు విన్నవించారు. వారం రోజుల క్రితం అమరావతిలో కలిసి కూడా వినతిపత్రం అందజేశారు. మొదటిసారి అచ్చంపేట ప్రాంతానికి అవకాశం దక్కింది. కారు, బైక్ ఢీ.. వ్యక్తికి తీవ్రగాయాలు కొత్తకోట రూరల్: కారు, బైక్ ఢీకొని బైక్పై వెళ్తున్న వ్యక్తికి తీవ్రగాయాలైన ఘటన మండలంలోని కనిమెట్ట గ్రామ సమీపంలో ఎన్హెచ్–44పై శుక్రవారం రాత్రి చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కానాయపల్లి గ్రామానికి చెందిన నరేందర్ పెద్దమందడి మండలంలోని మోజర్ల గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి బైక్పై వెళ్తుండగా కనిమెట్ట సమీంలో ఫుడ్ పిరమిడ్ దగ్గర హైదరాబాద్ వైపు నుంచి కర్నూల్ వైపు వెళ్తున్న కారు డ్రైవర్ సడెన్బ్రేక్ వేయడంతో బైక్ కారును వెనుక నుంచి ఢీకొనడంతో బైక్పై ఉన్న నరేందర్ రోడ్డుపై కిందపడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే సమీపంలో ఉన్న కనిమెట్ట గ్రామస్తులు క్షతగాత్రుడిని 108లో వనపర్తి ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ ఆనంద్ తెలిపారు. -
పరిషత్కు నోడల్ ఆఫీసర్ల నియామకం
● 12 మంది అధికారులకు బాధ్యతల అప్పగింత జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): పరిషత్ ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో ఒక్కొక్క పని పూర్తి చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే జిల్లాలో ఓటరు, పోలింగ్ కేంద్రాల జాబితా సైతం విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ పరిషత్ స్థానాల వారిగా ఖరారు చేశారు. అలాగే ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే కలెక్టర్ విజయేందిర ఆయా శాఖల అధికారులతో సమీక్షించడంతోపాటు రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం సైతం నిర్వహించిచారు. అలాగే ఎన్నికల పర్యవేక్షణలో భాగంగా జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన 12 మందిని నోడల్ అధికారులుగా నియమించారు. 930 పోలింగ్ స్టేషన్లు.. జిల్లాలో 16 జెడ్పీటీసీ, 175 ఎంపీటీసీ స్థానాలకు గాను రెండు విడతల్లో ఎన్నికలు జరగనుండగా మొత్తం 930 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. మొదటి విడతలో బాలానగర్, భూత్పూర్, గండేడ్, మహమ్మదాబాద్, జడ్చర్ల, మిడ్జిల్, నవాబ్పేట, రాజాపూర్ మండలాల పరిధిలోని 8 జెడ్పీటీసీ, 89 ఎంపీటీసీ స్థానాలకు 484 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలు జరుగుతాయి. అలాగే రెండో విడతలో అడ్డాకుల, చిన్నచింతకుంట, దేవరకద్ర, హన్వాడ, కోయిల్కొండ, కౌకుంట్ల, మహబూబ్నగర్ రూరల్, మూసాపేట మండలాల పరిధిలోని 8 జెడ్పీటీసీ, 86 ఎంపీటీసీ సభ్యుల స్థానాలకు గాను 446 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలు నిర్వహిస్తారు. -
రేపు ‘ప్రజావాణి’ రద్దు
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని అనివార్య కారణాలతో రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ విజయేందిర శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయం గమనించి కలెక్టరేట్లో అర్జీలు సమర్పించేందుకు ఎవరూ రావొద్దని కోరారు. తిరుగు ప్రయాణంలో ప్రత్యేక బస్సులు స్టేషన్ మహబూబ్నగర్: దసరా పండుగ తిరుగు ప్రయాణం కోసం ఆదివారం ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ సుజాత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఉదయం నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతామన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. తల్లిదండ్రుల యోగక్షేమాలపై దృష్టిపెట్టాలి పాలమూరు: వయోవృద్ధులైన తల్లిదండ్రులను వారి పిల్లలు పట్టించుకోకుండా వదిలేయడం సరికాదని, ఉమ్మడి కుటుంబంలో ఉండటానికి ఇష్టం లేక చాలామంది అనాథ శరణాలయాల్లో వదిలిపెడుతున్నారని ఎకై ్సజ్ కోర్టు న్యాయమూర్తి రవిశంకర్ అన్నారు. శనివారం కోయిలకొండ మండల పరిషత్ కార్యాలయంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు చట్టాలు, రైతుల సంక్షేమ పథకాలు, లీగల్ సర్వీసెస్, సీనియర్ సిటిజన్ చట్టంపై అవగాహన కల్పించారు. పిల్లలు వారి తల్లిదండ్రుల బాగోగుల పట్టించుకోవాలన్నారు. కొందరు పెద్దవారి యోగక్షేమాలపై దృష్టి పెట్టకుండా చదువుల పేరుతో ఇతర దేశాలకు వెళ్లిపోతున్నారని, అలా కాకుండా వారి బాగోగుల గురించి కూడా బాధ్యతగా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజగణేష్, ఎంపీడీఓ ఆనంద్, రవీందర్నాయక్, యోగేశ్వర్రాజ్, చంద్రశేఖర్, తిరుపతయ్య, ఎస్ఐ తిరుపాజీ తదితరులు పాల్గొన్నారు. నేడు ‘అలయ్ బలయ్’ స్టేషన్ మహబూబ్నగర్: అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి పాలమూరు ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలోని క్లాక్టవర్లో దసరా ఆత్మీయ సమ్మేళనం అలయ్ బలయ్ నిర్వహిస్తున్నట్లు సమితి జిల్లా అధ్యక్షుడు నరేందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జరిగే కార్యక్రమంలో పార్టీలు, కులమతాలకతీతంంగా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. మొక్కజొన్న క్వింటాల్ రూ.2,067 జడ్చర్ల/ దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం మొక్కజొన్న క్వింటాల్ గరిష్టంగా రూ.2,067, కనిష్టంగా రూ.1,601 ధరలు లభించాయి. అలాగే ఆముదాలు క్వింటాల్ రూ.5,770, వేరుశనగ గరిష్టంగా రూ.5,112, కనిష్టంగా రూ.3,151 చొప్పున పలికాయి. ● దేవరకద్ర మార్కెట్ యార్డులో శనివారం జరిగిన టెండర్లలో హంస ధాన్యం ధర క్వింటాల్ రూ.1,719 ఒకే ధర లభించింది. ప్రస్తుతం సీజన్ లేకపోవడంతో కేవలం హంస ధాన్యం మాత్రమే అమ్మకానికి వచ్చింది. మార్కెట్కు వరుసగా నాలుగు రోజుల సెలవుల తర్వాత శనివారం తిరిగి లావాదేవీలు ప్రారంభించారు. -
ముప్పు.. తొలగింపు
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లాకేంద్రంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఆ శాఖ అధికారులు నివారణ చర్యలు చేపడుతున్నారు. పట్టణ విద్యుత్ శాఖ ఏడీ తౌర్యానాయక్ పర్యవేక్షణలో భూమికి తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి వాటి స్థానంలో ఎత్తు స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాకేంద్రంలో చాలాచోట్ల తక్కువ ఎత్తులో విద్యుత్ స్తంభాలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రధాన చౌరస్తాలు, రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్తంభాలు తక్కువ ఎత్తులో ఉండడాన్ని విద్యుత్ శాఖ అధికారులు గుర్తించారు. విద్యుత్ వైర్లు తక్కువ ఎత్తులో ఉండడంతో ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. ఇలాంటి వాటిని గుర్తించి వెంటనే వాటి స్థానాల్లో ఎక్కువ ఎత్తు స్తంభాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా కేంద్రంలో మొత్తం 67 తక్కువ ఎత్తులో (8 మీటర్ల ఎత్తు స్తంభాలు) ఉన్నట్లు విద్యుత్శాఖ పట్టణ ఏడీ తౌర్యానాయక్ తెలిపారు. ఈ మేరకు వాటి స్థానంలో 11 మీటర్ల ఎత్తు గల పెద్ద స్తంభాలను ఏర్పాటు చేస్తామని, ఇప్పటికే 57 స్తంభాలు మార్చామని పేర్కొన్నారు. మిగతా వాటిని సైతం రెండు, మూడు రోజుల్లో పూర్తిచేస్తామన్నారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు భూమికి తక్కువ ఎత్తులో ఉన్నవాటి స్థానంలో ఎత్తు స్తంభాల ఏర్పాటు జిల్లాకేంద్రంలో ఇప్పటికే 57 పోల్స్ మార్పు -
ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల ‘చలో హైదరాబాద్’
స్టేషన్ మహబూబ్నగర్: ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల హయ్యర్ పెన్షన్ సమస్యల పరిష్కారానికి సోమవారం హైదరాబాద్లోని భర్కత్పుర పీఎఫ్ కార్యాలయం ఎదుట మహాధర్నా చేపట్టేందుకు చలో హైదరాబాద్ కార్యక్రమం తలపెట్టినట్లు ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ ఫోరం జిల్లా అధ్యక్షుడు రాజసింహుడు, ఉపాధ్యక్షులు జీబీ పాల్, భగవంతు తెలిపారు. శనివారం స్థానిక ఫోరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పీఎఫ్ కార్యాలయం నుంచి వచ్చిన డిమాండ్ లేఖలపై అనేక మంది విశ్రాంత ఉద్యోగులు గతేడాది నుంచి హయ్యర్ పెన్షన్ మంజూరుకు రూ.లక్షలు డీడీల రూపంలో చెల్లించినా ఇంత వరకు పెన్షన్ మంజూరు చేయలేదన్నారు. అనేక మంది విశ్రాంత ఉద్యోగులకు ఇంత వరకు డిమాండ్ లేఖలను కూడా పంపలేదని, ఇంకొందరికి హయ్యర్ పెన్షన్ ఏరియర్స్ చెల్లించలేదని ఆరోపించారు. పెన్షనర్ల సమస్యల పట్ల కేంద్ర ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయ అధికారులు పూర్తిగా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని దుయ్యబట్టారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని లేకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో నారాయణ, నాగాంజనేయులు, అంజన్న, నర్సింహులు, బీహెచ్ కుమార్, సలీం, రియాజొద్దీన్, డేవిడ్, లలితమ్మ, చక్రధర్ తదితరులు పాల్గొన్నారు. -
కష్టపడిన వారికే మొదటి ప్రాధాన్యం
● స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూకీలకంగా వ్యవహరించాలి ● ఉమ్మడి జిల్లా నేతలతో ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని చెప్పారు. శనివారం ఆయన ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో హైదరాబాద్లోని తన నివాసంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, పర్ణికారెడ్డి, రాజేశ్రెడ్డి, మధుసూదన్రెడ్డి, మేఘారెడ్డి, యెన్నం శ్రీనివాస్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అవలంభించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, ప్రచార శైలి, ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలను తీసుకెళ్లడం, ప్రతిపక్షాల విమర్శలకు ఎప్పటికప్పుడు ధీటుగా బదులివ్వడం, సోషల్ మీడియాలో జరిగే అసత్య ప్రచారాలను ఎదుర్కొని ప్రజలకు నిజాలు తెలియజేసే అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ కాంగ్రెస్ నేతలకు పలు సూచనలు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు, నాయకులకు టికెట్ల కేటాయింపులో మొదటి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. టికెట్ల కేటాయింపు విషయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని, పార్టీ నాయకుల మధ్య సమన్వయలోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరేలా చూడాలన్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ఆరోపణలను బలంగా తిప్పికొడుతూ ప్రజలకు వాస్తవాలు తెలిపేలా కార్యకర్తలను సమాయత్తం చేయాలని మంత్రి సూచించారు. -
పకడ్బందీగా ఎన్నికల కోడ్ అమలు
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): స్థానిక సంస్థలైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో గ్రామాల్లో ఎన్నికల కోడ్ను పకడ్బందీగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ అన్నారు. శనివారం ఆయన తన చాంబర్ నుంచి తహసీల్దార్లతో వీసీ నిర్వహించి మాట్లాడారు. ఎలాంటి పక్షపాతం లేకుండా పారదర్శకంగా కోడ్ అమలు చేయాలన్నారు. అనుమతి తీసుకున్నాకే సభలు, సమావేశాలు నిర్వహించాలని సూచించారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను పెండింగ్లో పెట్టకుండా వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. భారత్మాల రోడ్డు వెళ్లే మహబూబ్నగర్ రూరల్, దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాల పరిధిలో భూ సేకరణ త్వరగా పూర్తిచేయాలని, ఇందుకోసం ఆయా మండలాల తహసీల్దార్లు చొరవ చూపాలనిఆదేశించారు. ● సీఎంఆర్ బియ్యం సరఫరాలో వేగం పెంచాలని అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ అన్నారు. శనివారం తన చాంబర్లో రైస్ మిల్లర్లు, సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రేషన్ బియ్యం సరఫరా చేయడంలో నిర్లక్ష్యం వహించకుండా పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. -
వామ్మో కుక్కకాట్లు..
నవాబుపేట: అందరు దసర సందడిలో ఉంటే కుక్కలు సైతం వీధుల్లోకి వచ్చి స్వైర విహారం చేసి జనాలపై పడ్డాయి. మండలంలో వివిధ గ్రామాల్లో కేవలం రెండు రోజుల్లోనే 18 కుక్కకాట్ల కేసులు నవాబుపేట పీహెసీలో నమోదయ్యాయి. దీంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. పండగ కోసం గ్రామాలకు వచ్చిన వారికి కుక్కకాట్ల బయం తీవ్రంగా పెరిగింది. తాజాగా కామారం, కొల్లూర్, కాకర్లపహాడ్, ఫత్తేపూర్, మరికల్, కూచూర్, హన్మసానిపల్లి, కారుకొండలో కుక్కకాట్ల బాధితులు మండల కేంద్రంలోని ఆస్పత్రిలో చికిత్స చేసుకున్నారు. ఏకంగా 18మంది 2రోజుల్లోనే ఆస్పత్రికి రావడంతో ఆస్పత్రి వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. వచ్చినవారికి చికిత్స అందించి ఇంజక్షణ్ ఇచ్చి పంపిస్తున్నారు. కాగా దీనికిగానూ యాంటీ రేబీస్ ఇంజక్షన్ అందుబాటులో ఉంచారు. కాగా ఈ విషయంలో ఆరాతీస్తే ఇప్పటికే ఈ సంవత్సరంలో 263 కుక్కకాట్ల కేసులు నమోదైనట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ●మందులున్నాయి.. జాగ్రత్త అవసరం కుక్కకాట్లకు మందులు అందుబాటులో ఉంచాం. ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుక్కకాట్లు చాలా ప్రమాదకరం. వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రధానంగా పిల్లలను కుక్కల పట్ల చాలా జాగ్రత్తగా ఉంచాలి. అది పెంపుడు కుక్క అయిన సరే. మండలంలో రెండు రోజుల్లోనే ఇన్ని కేసులు రావడ చాలా విచారకరం. గ్రామాల్లో కుక్కలను కట్టడి చేయాలి. -
రోడ్డు ప్రమాదంలో డీఎస్పీకి గాయాలు
జడ్చర్ల: దసరా వేడుకల్లో సీఎం బందోబస్తులో భాగంగా గురువారం ట్రాఫిక్ పరిశీలనకు మిడ్జిల్ వైపు వెళ్తున్న మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఇన్నోవా వాహనాన్ని గంగాపూర్ శివారులో వేగంగా వచ్చిన లారీ ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా ఢీకొట్టింది. ప్రమాదంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, డ్రైవర్ రంగారెడ్డి, గన్మెన్ శ్రీనివాసులు గాయపడ్డారు. పోలీసు వాహనం ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. ఎయిర్ బెలూన్లు ఓపెన్ కావడంతో పోలీసులకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఏనుగొండ ఎస్వీఎస్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ లారీని విడిచి పెట్టి పరారయ్యాడు. డ్రైవర్ రంగారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు. ఎమ్మెల్యే , డీఎస్పీ పరామర్శ డీఎస్పీ వెంకటేశ్వర్లు రోడ్డు ప్రమాదానికి గురయ్యారన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి వారిని ఆస్పత్రిలో పరామర్శించారు. మహబూబ్నగర్ క్రైం: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఎస్వీఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డీఎస్పీ వెంకటేశ్వర్లు, సిబ్బందిని ఎస్పీ డి.జానకి పరామర్శించారు. రోడ్డు ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన లారీ -
అంత్యక్రియలకు మాజీ మంత్రులు హాజరు
తిమ్మాజిపేట: మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి మాతృమూర్తి చర్లకోల లక్ష్మమ్మ అంత్యక్రియలలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజలు పాల్గొని నివాళులర్పించారు. ఈనెల 1న హైదరాబాద్లో లక్ష్మారెడ్డి తల్లి మరణించారు. 2న విజయదశమి ఉండడంతో శుక్రవారం ఆయన స్వగ్రామం తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామంలో తన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించారు. లక్ష్మారెడ్డితో పాటు ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి, పలువురు నాయకులు లక్ష్మమ్మ పాడె మోశారు. అంతకు ముందు మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, రాజేందర్రెడ్డి, మాజీ ఎంపీ శ్రీనివాస్రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు ప్రదీప్, మాజీ ఎంపీపీ రవీంద్రనాథ్రెడ్డి, మోహనాచారి ఆవంచలో లక్ష్మారెడ్డిని పరామర్శించి ఆయన తల్లి అంత్యక్రియలలో పాల్గొని నివా ళుల ర్పించారు. -
చెరువులో మృతదేహం లభ్యం
గోపాల్పేట: రేవల్లి మండలంలోని నాగపూర్ గ్రామ సమీపంలోని చెరువులో దసరా పండుగ రోజు ఓ మృతదేహం లభ్యమైంది. రేవల్లి ఎస్ఐ రజిత తెలిపిన వివరాల మేరకు.. చెరువులో మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విచారణ జరపగా నాగర్కర్నూల్ జిల్లా గుడిపల్లికి చెందిన మధురాజు పర్వతాలు (40)గా గుర్తించారు. పర్వతాలు సెప్టెంబరు 30న ఇంటి నుంచి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో అతడి భార్య కవిత నాగర్ కర్నూల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈనెల 2న నాగపూర్ సమీపంలోని చెరువులో మృతదేహం కనిపించగా పోలీసులు.. కవితకు చూపించగా తన భర్తదేనని గుర్తించింది. భర్త మరణంపై అనుమానాలు ఉన్నాయని తెలుపగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మద్యం తాగి వృద్ధుడు మృతి ఖిల్లాఘనపురం: మద్యంతాగి ఓ వృద్ధుడు మృతిచెందిన ఘటన ఖిల్లాఘనపురం మండలం మల్కిమియాన్పల్లిలో గురువారం చోట్టు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఖిల్లాఘనపురం గ్రామానికి చెందిన పూల శ్రీశైలం(61) తన భార్య పూల సత్యమ్మతో కలిసి మెల్కిమియాన్పల్లి శివారులోని బాలాజీ రైస్మిల్లులో కూలిపనులు చేసుకుంటు జీవిస్తున్నారు. గురువారం దసరా పండుగ సందర్భంగా గ్రామంలోకి వెళ్లి మద్యం తాగాడు. సాయంత్రం వాంతులు చేసుకుని చాతిలో నొప్పి వస్తుందని చెప్పి ఇబ్బందిపడ్డాడు. వెంటనే అతన్ని ఓ ప్రైవేటు వాహనంలో ఖిల్లాఘనపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సలహామేరకు మెరుగైన వైద్యం కోసం మహబూబ్గనర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయమై శుక్రవారం మృతుడి భార్య పూల సత్యమ్మ తన భర్త మృతిపై ఎలాంటి అనుమానం లేదని మద్యం తాగడంతోనే మృతిచెందినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్ తెలిపారు. వ్యక్తి ఆత్మహత్య నవాబుపేట: కుటుంబ తగాదాలతో భార్య విడిచిపెట్టి వెళ్లిందని మనస్తాపంలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని ఊరంచుతండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన దీపక్(36) భార్య రెండేళ్ల క్రితం కుటుంబ తగాదాలతో విడిచిపెట్టి వెళ్లింది. దీంతో అప్పటి నుంచి ఒంటరిగా ఉంటూ తీవ్ర మనోవేదనతో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయంలో అతని మామ రాములు నాయక్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు. ఈతకు వెళ్లి వ్యక్తి మృతి మల్దకల్: పండగ పూట విషాదం నెలకొన్న ఘటన మండలంలోని దాసరిపల్లిలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బోయ పూజారి హన్మంతు(35)కు కల్లు తాగే అలవాటు ఉంది. గురువారం పండగ సందర్భంగా కల్లుతాగి తోటిమిత్రులతో కలిసి బావిలో ఈతకు వెళ్లాడు. మత్తులో ఉన్న హన్మంతు బావిలో ఈత కొట్టే క్రమంలో అపస్మారక స్థితిలోకి వెళ్లి బావిలోనే మునిగిపోయాడు. విషయం కుటుంబ సభ్యులకు తెలపడంతో ఘటనా స్థలానికి చేరుకుని హన్మంతు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడికి భార్య శంకరమ్మతోపాటు ఇద్దరు సంతానం ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ పురందర్ తెలిపారు. -
చికిత్స పొందుతూ బాలింత మృతి
నారాయణపేట: జిల్లా కేంద్రానికి చెందిన అనూష (22) అనే బాలింత చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. వివరాల్లోకి వెలితే... జిల్లా కేంద్రానికి చెందిన అశోక్ భార్య కాన్పు నిమిత్తం గత నెల 25న జిల్లా జనరల్ ఆస్పత్రిలో చేరింది. మగ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఫిడ్స్ రావడంతో వైద్యుల సూచన మేరకు మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి... అక్కడ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో శుక్రవారం కన్నుమూసింది. మృతిరాలికి ఇది వరకు ఓ బాబు ఉన్నాడు. పురుడు పోసుకున్న వారం రోజులకే మృతి చెందడంతో పసికందును చూసి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పళ్ల ఏరియాలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
గుమ్మకొండ వ్యక్తి మృతి
తిమ్మాజిపేట: మండల పరిధిలోని గుమ్మకొండకు చెందిన హుస్సేన్(40) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ హరిప్రసాద్రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు.. పోతిరెడ్డిపల్లికి చెందిన ఎడ్ల మైబుతో కలిసి హుస్సేన్ ఈ నెల 1న రాత్రి 10.15 గంటలకు బైక్పై పెట్రోల్ కోసం తిమ్మాజిపేట వైపు వెళ్లారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో హుస్సేన్, మైబుకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 అంబులెన్స్లో జడ్చర్ల ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మైబు ఎస్వీఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. మృతుడి అన్న అంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
చేపల వేటకు వెళ్లిన వ్యక్తి గల్లంతు
మదనాపురం: సరళసాగర్ సమీపంలోని ఊకచెట్టు వాగులో చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి నీటిలో మునిగి గల్లంతైన ఘటన మండలంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కొత్తకోటకు చెందిన పి.శేఖర్ (32) తన తమ్ముడు ఊషన్న, కుమారులు గణేష్, శ్రీనివాసులుతో కలిసి చేపల వేటకు ఊకచెట్టు వాగుకు వెళ్లాడు. చేపలు పడుతుండగా ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో నీట మునిగాడు. గుర్తించిన తోటి వారు వెంటనే సహాయక చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకపోయింది. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా.. భార్య భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. రాత్రి పొద్దుపోయే వరకు ముమ్మరంగా గాలించినా లభ్యం కాలేదు. ప్రాజెక్టు పరిధిలో ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడం, అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
పండుగకు వచ్చి.. భార్యను చంపేశాడు
మక్తల్: భర్త చేతిలో భార్య దారుణ హత్యకు గురైన ఘటన శుక్రవారం మండలంలో వెలుగుచూసింది. మండలంలోని సత్యవార్ గ్రామానికి చెందిన వినోద (35) కర్నూల్కు చెందిన కృష్ణారెడ్డి దంపతులు. వీరు హైదరాబాద్లో పనులు చేస్తూ జీవించేవారు. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో తండ్రి సత్యారెడ్డి కూతురు వినోదను ఇటీవల స్వగ్రామానికి తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టుకున్నారు. భర్త అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవాడు. దసరా పండుగ ఉండడంతో భర్త కృష్ణారెడ్డి శుక్రవారం కూడా భార్య దగ్గరకు వచ్చాడు. ఇద్దరు పొలానికి వెళ్లి మధ్యాహ్నం ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తున్న సమయంలో మార్గమధ్యలో ఒక్కసారిగా భార్యను కత్తితో పొడిచి అతి కిరాతకంగా హత్య చేశాడు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న తండ్రి సత్యారెడ్డి పొలానికి వెళ్లగా కూతురు కొన ఊపిరితో ఉండగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే మార్గమధ్యలోనే చనిపోవడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. వినోదకు 13 ఏళ్ల కొడుకు ఉన్నాడు. హత్య ఘటనపై ఎస్ఐ భాగ్యలక్ష్మారెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
జూరాలకు తగ్గిన వరద
ధరూరు/ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లో స్వల్పంగా తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. గురువారం రాత్రి 9 గంటలకు ప్రాజెక్టుకు 2.82 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు 2.70 లక్షలకు తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 15 క్రస్టు గేట్లను ఎత్తి 2.436 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆవిరి రూపంలో 70 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 1,030 క్యూసెక్కులు, కుడి కాల్వకు 410 క్యూసెక్కులు కలిపి ప్రాజెక్టు నుంచి మొత్తం 2.733 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 8.571 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. నారాయణపూర్ ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నీటి మట్టం 37.64 టీఎంసీలు కాగా ప్రస్తుతం 33.313 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 23వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. 2 గేట్లను ఎత్తి దిగువన ఉన్న జూరాలకు 17,600 క్యూసెక్కుల నీటిని దగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలంలో పది గేట్లు ఎత్తివేత దోమలపెంట: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటి ప్రవాహం తగ్గినా శుక్రవారం శ్రీశైలం ఆనకట్ట వద్ద పది గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాలలో ఆనకట్ట స్పిల్వే ద్వారా 2.436 లక్షల క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ 28,262 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 13,338 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 1,125 క్యూసెక్కులు మొత్తం 2.863 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం జలాశయానికి చేరుతుంది. శ్రీశైలంలో ఆనకట్ట పది గేట్లు ఒకొక్కటి పది అడుగుల మేర పైకెత్తి స్పిల్వే ద్వారా 2.76 లక్షల క్యూసెక్కులు, శ్రీశైలం కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 65,784 క్యూసెక్కుల నీళ్లు అదనంగా సాగర్కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 884.0 అడుగుల వద్ద 210.0320 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇరవై నాలుగు గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 5 వేల, హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2,817 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ కేంద్రంలో 17.732 మిలియన్ యూనిట్లు, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో 15.003 మి.యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు. 745.929 ఎంయూ విద్యుదుత్పత్తి జూరాల జలవిద్యుదుత్పత్తి కేంద్రంలో 6 యూనిట్ల ద్వారా 234 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటివరకు 745.929 మిలియన్ యూనిట్లు చేపట్టారు. 2.70వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో 15 క్రస్టు గేట్ల ఎత్తివేత 2.73 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు -
బాలింత మృతితో బంధువుల ఆందోళన
● ప్రసవం తర్వాత వేరే గ్రూప్ రక్తంఎక్కించడంతో ఇన్ఫెక్షన్ ● హైదరాబాద్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి ● ఆడబిడ్డ కోసం వెళ్తే ప్రాణం తీశారు.. కల్వకుర్తి టౌన్: ప్రసవం తర్వాత బాలింతకు తన గ్రూప్ రక్తం ఓ పాజిటివ్ కాకుండా ఇతర గ్రూప్ రక్తం ఎక్కించడంతో ఇన్ఫెక్షన్ అయి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. నల్గొండ జిల్లా డిండి మండల కేంద్రానికి చెందిన ఆంజనేయులు, అంజనమ్మ (25) భార్యభర్తలు. వీరికి గతంలోనే ఇద్దరు మగపిల్లలు పుట్టారు. కానీ ఆడబిడ్డ కోసం వేచి ఉన్న వారు మూడో కాన్పు కోసం సెప్టెంబర్ 6న పట్టణంలోని రమ్య ఆస్పత్రికి వచ్చారు. అంజనమ్మను పరీక్షించిన ఆస్పత్రి వైద్యురాలు రమ్య ఆమెకు కాన్పు చేసి, బాలింతకు రక్తం తక్కువగా ఉందని, ఎక్కించాలని సూచించారు. వెంటనే భర్త ఆంజనేయులు జిల్లా కేంద్రానికి వెళ్లి రక్తం తీసుకొని రాగా.. అదే రోజు రక్తాన్ని బాలింతకు ఎక్కించారు. అనంతరం ఆమెకు ఇన్ఫెక్షనై కాళ్లు, చేతులు వాయటంతో పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వారు మెరుగైన వైద్యం కోసం పేరొందిన మరో ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడే చికిత్స తీసుకుంటుండగా పరిస్థితి విషమించి శుక్రవారం బాలింత మృతి చెందింది. దీంతో బాలింత మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి పట్టణంలో కాన్పు చేసిన రమ్య ఆస్పత్రి ఎదుట ఉంచి బాధిత కుటుంసభ్యులు ఆందోళన చేపట్టారు. రూ. లక్షలు ఖర్చు చేసినా.. బాలింతకు హైదరాబాద్ ఆస్పత్రిలో దాదాపు 26 రోజుల చికిత్స కోసం రూ.30 లక్షల వరకు ఖర్చయ్యిందని బాధిత కుటుంబసభ్యులు తెలిపారు. రమ్య ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఉండటంతో ముందుగానే గమనించిన యాజమాన్యం బాధిత కుటుంబ సభ్యులను ఎప్పకప్పుడు వాకబు చేసేవారని భర్త ఆంజనేయులు తెలిపారు. ప్రతిరోజు యాజమాన్యం తరఫున హైదరాబాద్లోని ఆస్పత్రిలో ఓ సీఐ స్థాయి అధికారి పరామర్శించేవాడని, మానవతా ధృక్పథంతో రూ.50 వేలు ఇస్తున్నానని డబ్బులు కూడా ఇచ్చాడని భర్త అన్నారు. పూర్తిగా తన భార్య మరణానికి ఆస్పత్రి వైద్యురాలి నిర్లక్ష్యమే కారణమని వారు వాపోయారు. న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. పసికందును చూపిస్తూ బాధిత కుటుంబ సభ్యుల రోదనలు అక్కడి వారిని కలిచివేశాయి. ఒక్కసారిగా ఆస్పత్రి వద్ద జనం గుమిగూడటంతో కల్వకుర్తి సీఐ నాగార్జున, ఎస్ఐ మాధవరెడ్డి అక్కడికి చేరుకొని పరిస్థితిని తెలుసుకున్నారు. పట్టణానికి చెందిన పలువురు రాజకీయ నాయకులు, పోలీసుల సమక్షంలో బాధిత కుటుంబ సభ్యులతో రాజీ కుదిర్చేలా చర్చలు జరుపుతున్నారు. పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఎలాంటి మరణాలు సంభవించినా రాజకీయ నాయకులు, పోలీసులు వెంటనే ప్రత్యక్షమవ్వటంపై పట్టణంలోని ప్రజలు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. -
చెట్టును ఢీకొన్న కారు.. యువకుడు మృతి
ఖిల్లాఘనపురం: కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొన్న ఘటనలో యువకుడు మృతి చెందిన సంఘటన ఖిల్లాఘనపురం మండలం షాపురం గేటు సమీపంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు బిజినేపల్లి మండలం గౌరారం తండాకు చెందిన కేతావత్ సురేష్(21) గురువారం సాయంత్రం తన మిత్రుడి కారు తీసుకుని అడ్డాకుల మండలం తిమ్మాయిపల్లిలో మరో స్నేహితుడి దగ్గరకు వెళ్లాడు. తిరిగి స్వగ్రామానికి వస్తుండగా షాపురం స్టేజి వద్ద టర్నింగ్లో ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టాడు. ప్రమాదంలో కారులో ఉన్న సురేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుక్ను ఎస్ఐ వెంకటేష్ ఘటన స్థలానికి చేరుకుని జేసీబీ సాయంతో కారును తీయించారు. శుక్రవారం మృతుడి భార్య అనిత(లలిత) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
బడులు ఏర్పాటు చేయాలి..
గత 20 సంవత్సరాలలో పాలమూరు చాలా విస్తరించింది. కొత్త కాలనీలు ఏర్పాటయ్యాయి. కానీ, అక్కడ స్థానికంగా ఉండే వారి కోసం ప్రభుత్వ పాఠశాలలు లేవు. ఈ క్రమంలో చాలామంది పేద విద్యార్థుల తల్లిదండ్రలు ఫీజుల కట్టి తమ పిల్లలను ప్రైవేటుకు పంపిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన కాలనీల్లో ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. – రాఘవేందర్రెడ్డి, స్థానికుడు ప్రైవేటుకే వెళ్లే పరిస్థితి.. షాసాబ్గుట్ట, మర్లు, బీకేరెడ్డికాలనీలు కొత్తగా ఏర్పడగా.. ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా లేదు. దీంతో ఇక్కడ చాలా వరకు ప్రైవేటు పాఠశాలలు వెలిశాయి. ఈ ప్రాంతాల్లో నివశిస్తున్న వారు 90 శాతానికి పైగా ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్నారు. కాబట్టి ప్రభుత్వం కొత్త కాలనీల్లో పాఠశాలలు ఏర్పాటు చేస్తే.. దూరం వెళ్లలేని చాలా మంది తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గుతుంది. – నరేష్, స్థానికుడు మా దృష్టికి తీసుకువస్తే.. విద్యార్థులకు ఇబ్బంది ఉన్నచోట బడులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సమస్య ఎక్కడైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలి. ఇటీవల నవాబ్పేటలో 2, హన్వాడలో ఒక పాఠశాల ఏర్పాటు చేశాం. జిల్లాకేంద్రంలోని కొత్త కాలనీల్లో కూడా ఇలాంటి సమస్య ఉంటే తప్పకుండా బడులు ఏర్పాటు చేస్తాం. విద్యార్థులు చదువుకునేందుకు ఎక్కడా ఇబ్బంది రాకుండా చూస్తాం. – ప్రవీణ్కుమార్, డీఈఓ ● -
పులకించిన కొండారెడ్డిపల్లి
వంగూరు: దసరా పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం స్వగ్రామం కొండారెడ్డిపల్లికి రావడంతో గ్రామంలో సంబరాలు అంబరాన్నంటాయి. గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు హెలీకాప్టర్లో సీఎం కొండారెడ్డిపల్లికి చేరుకోగా.. ఎమ్మెల్యే వంశీకృష్ణ, రైతు కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి, బాలాజీసింగ్, గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆంజనేయస్వామి ఆలయం వరకు ప్రచార రథంపై వెళ్తుండగా బతుకమ్మ, కోలాటాలతో గ్రామస్తులు అభివాదం చేశారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ముఖ్యమంత్రి ఇంటికి చేరుకున్నారు. సాయంత్రం 5.30 గంటలకు సోదరులు తిరుపతిరెడ్డి, జగదీశ్వర్రెడ్డి, కొండల్రెడ్డి, కృష్ణారెడ్డి ఇతర కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి కోటమైసమ్మను దర్శించుకొని, భాజాభజంత్రీలతో భారీ ర్యాలీగా వెళ్లి జమ్మి చెట్టుకు పూజలు చేశారు. అనంతరం రాత్రి 8 గంటలకు రోడ్డు మార్గాన కొడంగల్కు బయలుదేరి వెళ్లారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో.. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందుకు కలెక్టర్ బదావత్ సంతోష్తోపాటు ఇతర అధికారులు ముఖ్యమంత్రి పర్యటనలో కనిపించలేదు. ఏర్పాట్లను మొత్తం గ్రామస్తులే చూసుకున్నారు. కేవలం భద్రతా ఏర్పాట్లను మాత్రమే పోలీసు అధికారులు పర్యవేక్షించారు. స్వగ్రామంలో సీఎం రేవంత్రెడ్డి దసరా వేడుకలు కుటుంబ సభ్యులతో కలిసి జమ్మి వేడుకలకు హాజరు ఘన స్వాగతం పలికిన ప్రజలు భారీగా తరలివచ్చిన అభిమానులు -
అంబరాన్నంటిన దసరోత్సవం
స్టేషన్ మహబూబ్నగర్: చేతులెత్తి ప్రణమిల్లేలా ఆకట్టుకున్న దేవతామూర్తుల వేషధారణలు.. నింగిలో మిరుమిట్లు గొలిపిన బాణాసంచా వెలుగులు.. నృత్యాలు, డప్పు మోతలు, పురవీధుల గుండా సాగిన శోభాయాత్ర, వేడుకలను తిలకించేందుకు వేలాదిగా తరలివచ్చిన జనాలతో పాలమూరు నగరం పరవశించిపోయింది. జిల్లాకేంద్రంలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గురువారం రాత్రి నిర్వహించిన దసరా సంబరాలు అంబరాన్నంటాయి. ముందుగా ఆర్యసమాజం మందిరంలో ఉదయం 8 గంటలకు దేవయజ్ఞం, వేదోపదేశం అనంతరం మధ్యాహ్నం ఊరేగింపు ప్రారంభమైంది. ధ్వజధారి కలకొండ సూర్యనారాయణ ధ్వజాన్ని ధరించి రాంమందిర్ చౌరస్తాలోని దసరా కట్ట దగ్గర జనసమ్మేళనాన్ని నిర్వహించి ధ్వజారోహణం చేశారు. ఉత్సవ జెండాతో పాన్చౌరస్తా గుండా సాగిన ర్యాలీకి క్లాక్టవర్లో ఖౌమీ ఏక్తా కమిటీ ఆధ్వర్యంలో టీజీఎంఎఫ్సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ఖౌమీ ఏక్తా కమిటీ కార్యదర్శి రఫీక్ పటేల్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించామని, పాలమూరు ప్రజలందరి పూజలు ఫలించాలని కోరారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ మనిషిలోని దుర్గుణాలను ఈ దసరా పండుగ సందర్భంగా దహనం చేద్దామన్నారు. అంతకు ముందు ప్రముఖ ధార్మికవేత్త వేదశ్రవ దసరా పండుగపై సందేశం ఇచ్చారు. అనంతరం పలు అస్త్రాల పేరుతో ఏర్పాటు చేసిన రంగురంగుల టపాసులను పేల్చగా ప్రజలు కేరింతలు కొడుతూ తిలకించారు. కార్యక్రమంలో మాజీమంత్రి శ్రీనివాస్గౌడ్, ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్గౌడ్, జేపీఎన్సీ చైర్మన్ రవికుమార్, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రాజేశ్వర్గౌడ్, డాక్టర్ భరద్వాజ్ నారాయణరావు, చంద్రకుమార్గౌడ్, డాక్టర్ చంద్రయ్య, గోపాల్యాదవ్, అంజయ్య, మోహన్యాదవ్, మాల్యాద్రిరెడ్డి, రాములు, లక్ష్మణ్, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాలుర కళాశాల మైదానంలో వైభవంగా వేడుకలు అబ్బురపరిచిన బాణాసంచా కాల్చివేత ఆకట్టుకున్న దేవతామూర్తుల వేషధారణ వేలాదిగా తరలివచ్చిన ప్రజలు -
బడి.. బహుదూరం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: మున్సిపాలిటీగా ఉన్న పాలమూరు పట్టణం ఏటికేడు నలుమూలల విస్తరిస్తూ మున్సిపల్ కార్పొషన్ స్థాయికి ఎదిగింది. బైపాస్ రోడ్డు రావడం, వాటి చుట్టూ వ్యాపార సముదాయాలు పెరగడం, రియల్ ఎస్టేట్ పుణ్యమా అని అనేక కొత్త ప్రాంతాలు, గల్లీలు విస్తరించాయి. దీంతో కొత్తగా అనేక గృహసముదాయాలు వెలిశాయి. ఈ కారణంగా జనాభా సైతం భారీగా పెరిగింది. ఈ క్రమంలో పెరిగిన జనాభాకు అనుగుణంగా ప్రభుత్వం 60కిపైగా మున్సిపల్ డివిజన్లను విస్తరించింది. కానీ, విద్యార్థులు చదువుకునేందుకు పాఠశాలలను మాత్రం ఏర్పాటు చేయలేదు. ప్రధానంగా వన్టౌన్ నుంచి మెట్టుగడ్డ, టీడీగుట్ట నుంచి అశోక్ టాకీస్ చౌరస్తా, న్యూటౌన్, పాతబస్టాండ్ నుంచి రైల్వేస్టేషన్ వంటి ప్రాంతాల్లో 15 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో ఉన్నాయి. కానీ, కొత్తగా ఏర్పడిన కాలనీలు, గల్లీల్లో ప్రభుత్వ బడుల ఊసేలేదు. దీంతో చాలామంది తల్లిదండులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆర్థికంగా అవస్థలు.. పట్టణ ప్రాంతాల్లో పిల్లలను చదివించాలంటే తల్లిదండ్రులకు ఆర్థికంగా భారంతో కూడుకున్న పని. వారు ఉంటున్న గృహ సముదాయాలకు ప్రభుత్వ పాఠశాలలు ఉంటే అక్కడే విద్యార్థులను చేర్పించేందుకు చాలామంది తల్లిదండ్రులు మొగ్గు చూపే అవకాశం ఉంది. కానీ, పాఠశాలలు అందుబాటులో లేకపోవడం, వారు ఉంటున్న ప్రాంతంలో పుట్టగొడుగుల్లా ప్రైవేటు పాఠశాలలు ఉండడంతో అధిక ఫీజులు చెల్లించి పిల్లల్ని పంపించే పరిస్థితి నెలకొంది. ఆర్థిక పరిస్థితి బాగోలేని చాలామంది తల్లిదండ్రులు దూరమైనా తమ పిల్లల్ని ప్రభుత్వ బడికి పంపించేందుకు నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాగా మున్సిపాలిటీ పరిధిలో కొన్ని అంగన్వాడీ కేంద్రాలు ఉన్నప్పటికీ ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ వంటి వాటిలో విద్యార్థులను చేర్పిస్తే ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా బోధించే పరిస్థితి లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వాటినే ఆశ్రయిస్తున్నారు. మూడు కొత్త బడులు.. ఈ సంవత్సరం విద్యార్థులకు అందుబాటులో బడులు లేని ప్రాంతాల్లో కొత్తవి ఏరా్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈ విద్యా సంవత్సరం కొత్తగా మూడు బడులను ఏర్పాటు చేశారు. ఇందులో 20 కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారని నవాబ్పేటలో 2, హన్వాడలో ఒక పాఠశాల కేటాయించారు. వీటితోపాటు జిల్లాకేంద్రంలోని రాజేంద్రనగర్లో బడి అందుబాటులో లేదని బడికి వెళ్లని 14 మందిని రిషి పాఠశాలలో, ఏనుగొండలో 16 మంది విద్యార్థులు చైతన్య సెంట్రల్ స్కూల్లో అధికారులు చేర్పించారు. విస్తరిస్తున్న పాలమూరు శివారు గల్లీలు అందుబాటులో లేని ప్రభుత్వ పాఠశాలలు.. ప్రైవేటును ఆశ్రయిస్తున్న విద్యార్థులు మర్లు, భగీరథకాలనీ, బీకేరెడ్డికాలనీల్లోనూ కనిపించని వైనం ఎటు చూసినా కిలోమీటరు మేర వెళ్లాల్సిన పరిస్థితి ఆర్థిక భారంతో తల్లిదండ్రుల అవస్థలు -
ఉమ్మడి జిల్లాలో ఎస్జీఎఫ్ జోష్
● అండర్–14, 17, 19 విభాగాలకు టోర్నీలు ● ఎనిమిది రాష్ట్రస్థాయి పోటీలకు ఆతిథ్యం మహబూబ్నగర్ క్రీడలు: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా జోష్ నెలకొనుంది. రాష్ట్రంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు క్రీడాటోర్నీల నిర్వహణలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతులు కల్పిస్తూ ఎస్జీఎఫ్ టోర్నీలను విజయవంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. దీంతో రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాటోర్నీల కేటాయింపులో ప్రతి ఏడాది ఉమ్మడి జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యత లభిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో మండలస్థాయిలో ఎస్జీఎఫ్ క్రీడలు ముగింపు దశకు చేరాయి. జిల్లాస్థాయి ఎంపికలు కూడా జరుగుతున్నాయి. త్వరలో ఉమ్మడి జిల్లా ఎంపికలు, టోర్నమెంట్లు నిర్వహించనున్నారు. ● కొన్నేళ్ల నుంచి పలు ఎస్జీఎఫ్ జాతీయ స్థాయి పోటీలకు ఉమ్మడి పాలమూరు జిల్లా అతిథ్యం ఇస్తోంది. గత ఏడాది జాతీయస్థాయి అండర్–19 ఎస్జీఎఫ్ వాలీబాల్ బాలుర టోర్నమెంట్, ఈ ఏడాది జనవరిలో జాతీయస్థాయి అండర్–17 విభాగం బాలబాలికల హ్యాండ్బాల్ టోర్నీలను విజయవంతంగా నిర్వహించారు. మళ్లీ ఈ ఏడాది జిల్లాలో 69వ నేషనల్ స్కూల్ గేమ్స్ క్రికెట్ అండర్–17 బాలుర, బాలికల చాంపియన్షిప్లు నిర్వహించనున్నారు. రాష్ట్రస్థాయి టోర్నీల అనంతరం జాతీయస్థాయి పోటీలు నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందులో భాగంగా అండర్–14, అండర్–17తో పాటు అండర్–19 విభాగాలకు ఈ ఏడాది స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఎనిమిది రాష్ట్రస్థాయి క్రీడా టోర్నీలు కేటాయించారు. ● మహబూబ్నగర్ జిల్లాకు అండర్–17 విభాగం బాలికల వాలీబాల్, అండర్–17 విభాగం బాలబాలికల క్రికెట్ టోర్నీలు, అండర్–19 విభాగం బాలబాలికల హ్యాండ్బాల్ రాష్ట్రస్థాయి టోర్నీలు కేటాయించారు. ● వనపర్తి జిల్లాకు అండర్–17 విభాగం బాలుర, బాలికల హాకీ రాష్ట్రస్థాయి టోర్నీ అతిథ్యం దక్కింది. ● నారాయణపేట జిల్లాకు అండర్–19 బాలుర, బాలికలు రెజ్లింగ్, అండర్–14 బాల, బాలికల హ్యాండ్బాల్ టోర్నీలు కేటాయించారు. ● నాగర్కర్నూల్ జిల్లాకు అండర్–19 విభాగం బాలబాలికల మల్కం టోర్నీ నిర్వహించనున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాకు అండర్–14 బాలబాలికల విభాగం బీచ్ వాలీబాల్ టోర్నీ కేటాయించారు. -
గోదారోళ్లకు ధీటుగా మనోళ్లు
101 రకాల వంటలతో కొత్త అల్లుడికి విందు భోజనం మేం తెలంగాణోళ్లం.. గోదారోళ్లకంటే తక్కువేం కాదంటూ నిరూపించారు కొత్తకోటకు చెందిన ఓ దంపతులు. దసరా పండుగకు ఇంటికొచ్చిన కొత్త అల్లుడికి 101 రకాల వంటలతో విందు భోజనం వడ్డించి ఆకట్టుకున్నారు. కొత్తకోట పట్టణానికి చెందిన గుంత సురేశ్, సహన దంపతుల కూతురు గుంత సింధును వరంగల్కు చెందిన నిఖిత్కు ఇచ్చి వివాహం జరిపించారు. పెళ్లయిన తర్వాత మొదటిసారి దసరా పండుగకు అల్లుడు ఇంటికి రాగా.. గోదావరి స్టైల్లో అల్లుడికి విందు భోజనం ఏర్పాటు చేయాలని భావించారు. ఈ క్రమంలోనే 101 రకాల శాకాహార పిండి వంటలను సిద్ధం చేసి కొత్త అల్లుడికి వడ్డించారు. అత్తామామలు ఎంతో ఇష్టంగా తయారు చేసిన 101 రకాల పిండివంటల్లో ఒక రకం తగ్గడంతో పెనాల్టీగా తనకు తులం బంగారం ఇవ్వాలని అల్లుడు మారం చేయగా.. కూతురికి, అల్లుడికి ఒక తులం బంగారం ఇవ్వక తప్పలేదు. ఈ విషయం శుక్రవారం కొత్తకోటలో చర్చనీయాంశంగా మారింది. – కొత్తకోట -
జోగుళాంబ.. నమామ్యహం
ధ్వజ అవరోహణం.. అలంపూర్: అలంపూర్ ఆలయాల్లో పదిరోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం ముగిశాయి. ఆలయ ఈఓ దీప్తి, ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వర్రెడ్డి, పాలకమండలి సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గురువారం దశమిరోజు యాగశాలలో పూర్ణాహుతి, జోగుళాంబ అమ్మవారు, బాలబ్రహ్మేశ్వరస్వామి నదీ స్నానం, అమ్మవారి ఆలయంలో ధ్వజ అవరోహణం తదితర కార్యక్రమాలు జరిగాయి. అర్చకుల వేద మంత్రోచ్ఛారణల నడుమ ఎమ్మెల్యే విజయుడు, ఆలయ అధికారుల సమక్షంలో ధ్వజ అవరోహణం నిర్వహించారు. అనంతరం దీక్షాపరులు కంకణ విసర్జన చేశారు. యాగశాలలో పూర్ణాహుతి.. ఉత్సవాల చివరిరోజు యాగశాలలో పుర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. అవాహిత దేవతలకు ఉద్యాసన పలుకుతూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. ఈఓ దీప్తి, పాలక మండలి సభ్యులు యాగశాలలో పూజలు నిర్వహించారు. జోగుళాంబ దీక్ష స్వాములు ఇరుముడులతో అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి యాగశాలకు తీసుకొచ్చారు. అక్కడ యాగపూజలు నిర్వహించిన అనంతరం పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం అర్చకులు, భక్తులు మంగళవాయిద్యాలతో యాగశాల ప్రదక్షిణలు చేశారు. పుష్కరఘాట్లో తీర్థావళి.. ఉత్సవాల చివరిరోజు త్రిశూల స్వామి, జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి వారి చక్ర తీర్థావళి జరిగింది. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని, త్రిశూల స్వామిని పల్లకీలో యాగశాలకు తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేసిన కలశాలను ఆలయ కమిటీ సభ్యులు, ఈఓ తలపై పెట్టుకొని నవధాన్యాల మొలకలతో మంగళ వాయుద్యాల నడుమ తుంగభద్ర పుష్కరఘాట్కు చేరుకున్నారు. అర్చకులు ఉత్సవ బలిభేరి, ఉత్సవ విగ్రహాలతో నదికి చేరుకొని పూజలు నిర్వహించారు. అనంతరం త్రిశూల స్వామికి, జోగుళాంబ మాతలకు చక్రతీర్థ స్నానాలు గావించారు. ఆ జలాల్లో భక్తులంతా పుణ్యస్నానాలు ఆచరించారు. అలంపూర్ ఆలయాల్లో ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు చివరిరోజు పూర్ణాహుతి, ఆది దంపతుల అవభృద స్నానం, ధ్వజ అవరోహణం భారీగా తరలివచ్చిన భక్తులు -
అలంపూర్ ఆలయాల్లో హైకోర్టు జడ్జి
అలంపూర్: అలంపూర్ క్షేత్ర ఆలయాలను శుక్రవారం హైకోర్టు జడ్జి ప్రవీణ్ కుమార్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన బాలబ్రహ్మేశ్వరస్వామి, జోగుళాంబ దేవికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శేషవస్త్రాలతో సత్కరించి అర్చక స్వాములు తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం పలికారు. ఆలయాల్లో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ పూజలు అలంపూర్/ చిన్నచింతకుంట: దక్షిణకాశీ అలంపూర్ క్షేత్ర ఆలయాలను రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి సతీసమేతంగా గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామివార్ల దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు శేషవస్త్రాలతో సత్కరించగా.. అర్చక స్వాములు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం పలికారు. ఆయన వెంట ఆలయ ధర్మకర్త, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాము, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి శ్యాం, నాయకులు నర్సింహ, సురేష్ న్నారు. ● కురుమూర్తిస్వామిని శివసేనారెడ్డి దంపతులు దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. ఈ సందర్భంగా శివసేనారెడ్డి దంపతులకు ఆలయ చైర్మన్ గోవర్ధన్రెడ్డి మర్యాదపూర్వకంగా ఆహ్వానించి శాలువాతో సత్కరించారు. కురుమూర్తిస్వామిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు శివసేనారెడ్డి తెలిపారు. -
ప్రజలు స్నేహభావంతో మెలగాలి
వీపనగండ్ల: పల్లెల్లోని ప్రజలు స్నేహభావంతో మెలిగినప్పుడే గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తాయని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం మండలంలోని కల్వరాలలో జరిగిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయను శాలువాలతో సత్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. దసరా ఉత్సవాల్లో యువత పాల్గొనడంతో పాటు చదువులోనూ రాణించాలని సూచించారు. కార్యక్రమంలో నాగర్కర్నూల్ జిల్లా పర్యాటకశాఖ అధికారి నర్సింహ, సింగిల్విండో డైరెక్టర్ నర్సింహ, నాయకులు రామేశ్గౌడ్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. -
కనువిందుగా తెప్పోత్సవం
● అశేష జనవాహినితోపులకించిన పుష్కరఘాట్ అలంపూర్ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి తెప్పోత్సవం గురువారం రాత్రి తుంగభద్ర తీరాన కనులపండువగా జరిగింది. అశేష జనవాహిని నడుమ ఆది దంపతుల నదీ విహారం నయననాందంగా సాగింది. బాలబ్రహ్మేశ్వరస్వామి వారు మంగళవాయిద్యాల నడుమ పల్లకీలో జోగుళాంబ అమ్మవారి ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారి ఆలయంలో విశేష సమర్పణలు అందజేసిన అర్చకులు నదీ విహారానికి పల్లకీలో బయల్దేరారు. ఎమ్మెల్యే విజయుడు, ఈఓ దీప్తి, పాలక మండలి చైర్మన్ నాగేశ్వర్రెడ్డి, గద్వాల సంస్థాన వారసుడు కృష్ణ రాంభూపాల్, పాలక మండలి సభ్యులు, అమ్మవారి దీక్ష స్వీకరించిన స్వాములు పల్లకీ సేవలో పాల్గొన్నారు. లోక రక్షకులు పుష్కరఘాట్కు చేరుకున్న అనంతరం అర్చకులు నదీ పూజ, నవక పూజలు చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను హంస వాహనంపై అర్చకులు కొలువుదీర్చి పూజలు చేశారు. మేళతాళాల నడుమ నదిలో మూడుసార్లు ప్రదక్షిణల అనంతరం హంస విహారం ముగిసింది. ఈ సందర్భంగా టపాసులు పేలుస్తూ ఆకాశాన్ని సైతం రంగురంగుల హరివిల్లుతో నింపేశారు. ఓవైపు విద్యుత్ కాంతులు, మరోవైపు టపాసుల పేలుళ్లతో తుంగభద్ర నది శోభాయమానంగా మారింది. హంసవాహన సేవ ప్రారంభానికి ముందు అర్చకులు పుష్కరఘాట్లో నదికి హారతులిచ్చారు. సీఐ రవిబాబు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. -
నాణ్యతకు తిలోదకాలు.!
● బాల సదనం భవన నిర్మాణంలో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం ● వాగు ఇసుకకు బదులుగా ఫిల్టర్ ఇసుక, డస్ట్ వినియోగం ● గాలికొదిలేసిన నిర్మాణ క్యూరింగ్ ● గడువుకు ముందే పని పూర్తిచేసిన కాంట్రాక్టర్ ● పట్టించుకోని ఐసీడీఎస్, ఈడబ్ల్యూఐడీసీ శాఖల అధికారులు మహబూబ్నగర్ రూరల్: అనాథ పిల్లలకు ఆశ్రమంగా ఉన్న బాల సదనం శిథిలావస్థకు చేరుకుంది. చిన్నారుల రక్షణ కోసం కొత్త భవనాన్ని నిర్మించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. మహిళా, శిశు సంక్షేమశాఖ అధీనంలో కొనసాగుతున్న మహబూబ్నగర్ పట్టణంలోని మెట్టుగడ్డ ప్రాంతంలోని బాల సదనం శిథిలావస్థకు చేరుకోవడం, అనాథ పిల్లలు ఇబ్బందులు పడటం గుర్తించిన కలెక్టర్ వెంటనే ఎస్టిమేట్ తయారు చేసి నూతన బాల సదనం భవనాన్ని నిర్మించేందుకు అధికారులను ఆదేశించారు. దీంతో టీఎస్ ఈడబ్ల్యూఐడీసీ ఇంజనీర్లు స్టేట్ హోమ్ ప్రాంగణంలో నూతన బాల సదనం భవన నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించి పనులు చేపట్టారు. రూ.1.36 కోట్లతో ప్రతిపాదించారు. ఇందులో రూ.1,34,93,500లు మంజూరయ్యాయి. నూతన బాల సదనం నిర్మాణానికి మొదటి విడతగా రూ.38,60,375లు విడుదలయ్యాయి. భవన నిర్మాణం కోసం కాంట్రాక్టర్కు ఏడాది గడువు విధించగా.. సదరు కాంట్రాక్టర్ గడువుకు ముందే భవనం పూర్తి చేయడం గమనార్హం. ఐసీడీఎస్ అధికారులు గానీ, టీఎస్ ఈడబ్ల్యూఐడీసీ ఇంజనీర్లు గానీ సరైన పర్యవేక్షణ చేయకపోవడంతోనే కాంట్రాక్టర్ తనకిష్టం వచ్చినట్లు పనులు నాసిరకంగా చకచక చేసి పెట్టారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కాంట్రాక్టర్కు అండగా ఓ ఇంజనీర్ బాల సదనం నూతన భవనం నిర్మాణం విషయంలో సంబంధిత టీఎస్ ఈడబ్ల్యూఐడీసీ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి ఉదాసీనత వల్లే పనుల్లో డొల్లతనం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు ఇంజనీర్ కాంట్రాక్టర్కు పూర్తి స్థాయిలో అండదండలు ఇవ్వడం వల్లే నాసిరకం పనుల పట్ల ఎవరు కూడా పట్టించుకోవట్లేదని స్టేట్ హోమ్ ప్రాంగణంలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులు పెదవి వేరుస్తున్నారు. నాణ్యతగానే పనులు ఉన్నాయి స్టేట్ హోమ్ ఆవరణలో నూతనంగా నిర్మించిన బాల సదనం పనులు నాణ్యతగానే ఉన్నాయి. ఇందులో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం గానీ, ఇంజనీర్ల పర్యవేక్షణ లోపం లేదు. కాంట్రాక్టర్ నిబంధనల ప్రకారమే పనులు చేపట్టారు. భవన నిర్మాణం పూర్తికి ఏడాది గడువు ఇస్తే ఆయన ఆరు నెలలోగా పూర్తి చేయించారు. -
దసరా కిక్..!
● జిల్లావ్యాప్తంగా గణనీయంగా మద్యం అమ్మకాలు ● భారీగా మటన్ విక్రయాలు, అమాంతం ధరలు పెంచిన వ్యాపారులు మహబూబ్నగర్ క్రైం: దసరా కర్రీ పండగ అంటేనే చుక్క.. ముక్క ఉండాల్సిందే. ఈ క్రమంలోనే మద్యం విక్రయాలు భారీ మొత్తంలో జరిగాయి. దసరా రోజు మద్యం దుకాణాలు బంద్ ఉన్న క్రమంలో మందుబాబులు శుక్రవారం ఉదయం నుంచే లిక్కర్ దుకాణాల దగ్గర క్యూ కట్టారు. ఒకవైపు అందుబాటులో ఉన్న మద్యంతో దుకాణాలతోపాటు బార్లు, బెల్ట్ దుకాణాల్లో సైతం భారీ స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. ప్రధానంగా కర్రీ నేపథ్యంలో పల్లెల్లోని బెల్ట్ దుకాణాల్లో ఒక్కో బాటిల్పై రూ.10– 20 వరకు అధికంగా తీసుకుంటూ అమ్మకాలు నిర్వహించారు. చాలా వరకు మందుబాబులు పట్టణంలో ఉన్న పలు దుకాణాల్లో కొనుగోలు చేయడం కనిపించింది. వారం రోజుల వ్యవఽ దిలో ఉమ్మడి జిల్లాలో రూ.వంద కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగినట్లు సమాచారం. నచ్చిన విధంగా ధరలు.. కర్రీ పండగ నేపథ్యంలో వ్యాపారులు నగరంలో మటన్ ధరలు పెంచేశారు. కొన్నిచోట్ల కిలో రూ.850 విక్రయిస్తే మరి కొన్నిచోట్ల రూ.900 వరకు విక్రయాలు జరిపారు. ఇక నాటుకోడి కిలో రూ.వెయ్యికి లభ్యం కాగా చికెన్ ధరలు కొంత ఇబ్బందికరంగానే అనిపించాయి. అతి పెద్ద పండగ నేపథ్యంలో మటన్ వ్యాపారులు వాళ్లకు నచ్చిన విధంగా ధరలు పెంచి విక్రయాలు జరిపారు. మధ్య తరగతి వారితోపాటు సామాన్యులు అధిక మొత్తంలో కొనుగోలు చేయలేక అవస్థలు పడ్డారు. అయితే కొంతమంది దావత్లు చేసుకోవడానికి ప్రత్యేకంగా మేకలు, పొట్టేళ్లను కొనుగోలు చేసి వేడుకలు జరుపుకొన్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలు, పల్లెలు, తండాల్లో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి కనిపించింది. ఈసారి బరిలోకి దిగాలని భావించే ఆశావహులు అక్కడక్కడ ప్రత్యేకంగా దావత్లు ఏర్పాటు చేశారు. కొన్ని కుటుంబాల వారైతే సొంత వ్యవసాయ క్షేత్రాల్లో కుటుంబాలతో కలిసి భోజనాలు చేసి సందడిగా గడిపారు. -
నిర్మాణం పనులు ఇలా..
స్టేట్ హోమ్ ప్రాంగణంలో కొత్తగా నిర్మిస్తున్న నూతన బాల సదనం పనుల్లో డొల్లతనం కనిపిస్తుంది. అధికారులు పట్టించుకోకపోవడం వల్ల సంబంధిత కాంట్రాక్టర్ రాత్రి పగలు అనక గడువులోగా అంటే ఆరునెలల కాలంలోనే భవన నిర్మాణం పూర్తి చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నాణ్యత లేని సిమెంట్ ఇటుకలు, ప్రతిష్టవంతం లేని ఫిల్టర్ ఇసుక, డస్ట్ (రాతి పొడి) మోతాదుకు మించి వాడటం వల్ల పనులు త్వరలో ముగిశాయని పలువురు అంటున్నారు. అసలే అనాధ పిల్లలు వారి బంగారు భవిష్యత్తు కోసం భవన నిర్మాణం పనుల్లో నాణ్యతగా చేయాల్సి ఉండగా అధికారుల నిర్లక్ష్యానికి కాంట్రాక్టర్ చేతివాటం తోడవడంతో భవన నిర్మాణంపై అనుమానాలకు దారి తీస్తుంది. కాంట్రాక్టర్ ఇష్టమొచ్చిన రీతిలో గడువుకు ముందే భవనం రెడీ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. -
పురాతన మానవులు గీసిన చిత్రాలు లభ్యం
దేవరకద్ర: మండలంలోని బస్వాయపల్లి శివారు చిన్నరాతిగుట్టపై పడిగెరాతి కింద గుండుపై పురాతన మానవులు గీసిన రాతి చిత్రాలు శుక్రవారం వెలుగు చూశాయి. ఈ ప్రాంతంలో జరిపిన అన్వేషణలో ఈ చిత్రాలు కనిపించాయని పరిశోధకుడు కావలి చంద్రకాంత్ తెలిపారు. రెండు జంతువులు పొడగాటి దేహలు, పెద్ద తోకలు, ఒంటిమీద చారలతో కనిపిస్తున్నాయని.. ఈ త్రాలు పెద్ద పులులవని తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్ వివరించారు. రాతి గుట్ట 12 అడుగుల ఎత్తులో ఉందని.. చిన్న గుహలా ఉందని, ఒకప్పటి పురాతన మానవుడి ఆవాసంగా ఉండవచ్చని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రాతి చిత్రాల తావులను పరీక్షించి భద్రపర్చాల్సినన అవసం ఉందని చెప్పారు. విద్యతోనే సమాజ అభివృద్ధి కందనూలు: విద్య ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని మాజీ డీజీపీ పుట్టపాక రవీంద్రనాథ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఐక్యత సమాజ సంస్థ ఆధ్వర్యంలో దసరా సంతోష కూట ఉత్సవాలు నిర్వహించారు. స్వర్గీయ మహేంద్రనాథ్ ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు విద్యార్థుల సంక్షేమానికి కృషి చేశారని కొనియాడారు. మహేంద్రనాథ్ ఆశయాలను భవిష్యత్లో కొనసాగించాలని ఆయన కుమారుడు పుట్టపాక రవీంద్రనాథ్ అన్నారు. అనంతరం ప్రముఖ రచయితలను సన్మానించారు. కార్యక్రమంలో ఐక్యత సమాజ సంస్థ అధ్యక్షుడు నరసింహ, నరసింహులు, కవులు కళాకారులు పాల్గొన్నారు. -
శ్రీశైలం ప్రాజెక్టుకు నిలకడగా వరద
దోమలపెంట: ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నిలకడగా కొనసాగుతుంది. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు 31 గేట్లు ఎత్తి స్పిల్వే ద్వారా 4,62,448, సుంకేసుల నుంచి 30,736, హంద్రీ నుంచి 10,300 మొత్తం 5,03,484 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం పది గేట్లు ఒక్కొక్కటి 23 అడుగుల మేర పైకెత్తి స్పిల్వే ద్వారా 5,76,940, కుడి, ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్తు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ అదనంగా 64,211 క్యూసెక్కుల నీటిని దిగువున సాగర్కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 883.1 అడుగుల వద్ద 205.2258 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 5,000, హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2,063 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎడమ భూగర్భ కేంద్రంలో 16.111 మిలియన్ యూనిట్లు, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో 14.590 మి.యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు. -
జంగిల్ సఫారీ పునఃప్రారంభం
మన్ననూర్: అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యంలో జంగిల్ సఫారీ బుధవారం పునఃప్రారంభం అవుతుందని మన్ననూర్ ఎఫ్ఆర్ఓ వీరేష్ తెలిపారు. వన్యప్రాణుల బ్రీడింగ్ సమయం అయినందున వాటి స్వేచ్ఛను దృష్టిలో ఉంచుకొని మూడు నెలలపాటు (జూలై, ఆగస్టు, సెప్టెంబర్) సఫారీ మూసి ఉంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్టోబర్ 1వ తేదీ మొదలుకొని ప్రతినిత్యం సఫారీ వాహనాలు సంబంధిత అటవీశాఖ అధికారులు నిర్దేశించిన ప్రాంతాలలో తిరుగుతాయని పేర్కొన్నారు. పర్యాటకులు సఫారీలో ఉన్న క్రమంలో సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ప్రతి వాహనం వెంట అనుభవజ్ఞులైన నేచర్ గైడ్స్ ఒకరు అందుబాటులో ఉండి వన్యప్రాణులు, అరుదైన వృక్షజాలం గురించి వివరిస్తారని చెప్పారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో అడవులు ఆకుపచ్చ రంగులో ఆహ్లాదంగా ఉండటంతోపాటు అధికంగా పెరిగిన వన్యప్రాణులు ముఖ్యంగా పెద్దపులులు దారిలో కనిపించి సఫారీ ట్రిప్ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని పేర్కొన్నారు. ఫర్హాబాద్, గుండం, అక్కమ్మదేవి గుహలు వంటి నిర్ణీత ప్రదేశాలలో సఫారీ ప్రయాణం కొనసాగుతుందన్నారు. సఫారీ వేళలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందని, సఫారీ రైడ్ కోసం ఒకరు రూ.2 వేల చొప్పున చెల్లించాలన్నారు. వాహనంలో ఏడుగురికి మాత్రమే అనుమతి ఉంటుంది. సఫారీ ప్రయాణం చేయాలనుకునేవారు జ్ట్టి ఞట: //్చఝట్చ ఛ్చఛ్టీజీజ్ఛటట్ఛట్ఛటఠ్ఛి.ఛిౌఝ/ వెబ్సెట్ను సంప్రదించాలని సూచించారు. సఫారీ ట్రిప్లో ఉన్న పర్యాటకులు ప్లాస్టిక్, చెత్తాచెదారం అటవీ ప్రాంతంలో వేయకూడదని, అలాగే వన్యప్రాణులకు ఎలాంటి ఆహారం అందించకూడదని కోరారు. -
వరద ఉధృతికి కొట్టుకుపోయిన ఎద్దుల బండి
● రెండు ఆవులు మృతి, ప్రాణాలతో బయటపడ్డ దంపతులు కోడేరు: వాగు ఉధృతికి రెండు ఎద్దులు మృతి చెందగా భార్యాభర్తలు ప్రాణపాయం నుంచి బయట పడిన ఘటన కోడేరు మండలం నాగులపల్లిలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలిలా.. గ్రామానికి చెందిన బోయ జక్కుల వెంకటస్వామి అతని భార్య అడివమ్మ ఉదయం రెండు ఆవులను బండికి కట్టుకొని వాగును దాటుతూ వ్యవసాయ పొలానికి వెళ్తున్నారు. ఉధృతంగా వాగు ప్రవహించడంతో బండి గుంతలో ఇరుక్కు పోయింది. రెండు ఎద్దులు అక్కడిక్కడే మృతిచెందాయి. భార్యాభర్తలు ఇద్దరు చెట్లను పట్టుకొని బయటకు వచ్చారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు చనిపోయిన ఆవులను తాళ్ల సహాయంతో బయటకు తీశారు. దాదాపు రూ.లక్ష వరకు నష్టం జరిగిందని బాధితులు రోదించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని కోరారు. -
రోడ్డుప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
అడ్డాకుల: 44వ నంబర్ జాతీయ రహదారి మరోసారి నెత్తురోడింది. బైక్పై వెళ్తున్న యువకులు అదుపుతప్పి కిందపడగా.. వారిపైనుంచి వెనకాలే వస్తున్న వాహనం దూసుకెళ్లడంతో శరీరాలు ఛిద్రమై అక్కడికక్కడే దుర్మరణం చెందిన ఘటన అడ్డాకుల మండలం శాఖాపూర్ వద్ద మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం చర్లపల్లికి చెందిన యువకుడు గణేశ్(20), ఖిల్లాఘనపురం మండలం అప్పారెడ్డిపల్లికి చెందిన రాజు(21) పల్సర్పై కొత్తకోట వైపు నుంచి హైవేపై వెళ్తున్నారు. శాఖాపూర్ వద్ద ద్విచక్రవాహనం అదుపు తప్పి రోడ్డుపై పడ్డారు. వారి వెనుకే వస్తున్న గుర్తు తెలియని వాహనం యువకుల పైనుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరి శరీరాలు చిధ్రమై అక్కడికక్కడే దుర్మరణం చెందారు. యువకులపై నుంచి వెళ్లిన వాహనం అక్కడి నుంచి తప్పించుకుపోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం గాలింపు చేపట్టారు. ఇద్దరు యువకుల మృతదేహాలను జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుల్లో రాజు చర్లపల్లికి చెందిన యువతితో వివాహమై అక్కడే ఉంటూ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వారికి కూతురు ఉంది. అదేవిధంగా గణేశ్ మత్స్యకారుడిగా పని చేస్తుండగా వివా హం కాలేదని సమాచారం. కాగా ఇద్దరు యు వకులు బైక్పై ఎక్కడికి వెళ్తున్నారన్న విషయం తెలియరాలేదు. ప్రమాదఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ● అదుపుతప్పిన బైకు.. యువకులపై వెళ్లిన వాహనం ● శాఖాపూర్ వద్ద ఎన్హెచ్–44పై దుర్ఘటన ● యువకులు వనపర్తి జిల్లా వాసులే.. -
సిద్ధిధాత్రి.. కరుణించమ్మా
● తొమ్మిదో రోజు సిద్ధిధాత్రిగా జోగుళాంబ ● పట్టువస్త్రాలు సమర్పించిన కర్నూలు కలెక్టర్ ● రమణీయంగా జోగుళాంబ అమ్మవారి రథోత్సవం ● ఆకట్టుకున్న కూచిపూడి సాంస్కృతిక కార్యక్రమాలు అలంపూర్: సకల సిద్ధులు ప్రసాదించే సిద్ధిధాత్రి నమోస్తుతే అంటూ భక్తులు జోగుళాంబ అమ్మవారిని శరణు కోరారు. అలంపూర్ క్షేత్రంలో వెలిసిన జోగుళాంబ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల తొమ్మిదోరోజు మంగళవారం జోగుళాంబ అమ్మవారు సిద్ధిధాత్రి మాతగా భక్తులకు దర్శనమిచ్చారు. నవరూపాల్లో చివరిరోజు సిద్ధిధాత్రిగా దర్శనమిచ్చి అమ్మవారిని ప్రత్యేక మండపంలో కొలువుదీర్చారు. ఈ సందర్భంగా అర్చక స్వాములు అమ్మవారికి కుమారి పూజ, సువాసినిపూజ, మంత్రపుష్ప నీరాజనం, దశవిధ హారతులను అందజేశారు. శరన్నవరాత్రుల్లో చివరిరోజు జోగుళాంబ అమ్మవారిని సిద్ధిధాత్రిగా ఆరాధిస్తారని అర్చక స్వాములు తెలిపారు. సకల సిద్ధులను ప్రసాదించే ఆ జగన్మాత సిద్ధిధాత్రిగా దర్శనమిస్తూ భక్తుల కోరికలను తీరుస్తుందని భక్తులకు ప్రగాఢ విశ్వాసంగా తెలిపారు. నవదుర్గలలో ఒకరైన సిద్ధిధాత్రిని ఆరాధించడంతో శరన్నవరాత్రుల శుభ ఫలితాలు కలుగుతాయని భక్తులకు వివరించారు. ఆలయాల్లో నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీబాలబ్రహ్మేశ్వర స్వామి జోగుళాంబ అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు కొనసాగాయి. కుంకుమార్చనలు, చండీహోమాలు, అభిషేకాలు, అర్చనలు, నిత్యహోమాలు, శ్రీచక్రార్చనలు, ఖడ్గమాల అర్చనలు, నవారణ అర్చనలు ప్రత్యేకంగా జరిగాయి. అనంతపూర్కు చెందిన అమృత కూచిపూడి డ్యాన్స్ అకాడమీకి చెందిన కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. క్షేత్రంలో రథోత్సవం దసర ఉత్సవాల్లో భాగంగా జోగుళాంబ అమ్మవారి రథోత్సవం కనులపండువగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో రథాన్ని రంగురంగుల పుష్పాలతో అలంకరించారు. అనంతరం జోగుళాంబ మాత ఉత్సవ విగ్రహాన్ని రథంలో కొలువుదీర్చారు. అర్చక స్వాములు వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చక స్వాములు గుమ్మడికాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. క్షేత్ర దర్శనానికి వచ్చిన భక్తులు అమ్మవారికి జేజేలు పలుకుతూ రథాన్ని ముందుకు నడిపించారు. రథోత్సవ కార్యక్రమాన్ని వీక్షించడానికి భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఏపీ ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు జోగుళాంబ అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలకు ఏపీ ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను కర్నూల్ కలెక్టర్ సిరి అందజేశారు. ప్రతిఏడాది నవరాత్రి ఉత్సవాల్లో ఏపీ ప్రభుత్వం అమ్మవారికి పట్టువస్త్రాలను అందజేయడం అనవాయితీ. అందులో భాగంగా కర్నూల్ కలెక్టర్ సిరి, దేవదాయ శాఖ సహాయ కమిషనర్ సుధాకర్రెడ్డి అలంపూర్ క్షేత్రానికి చేరుకున్నారు. ఈఓ దీప్తి వారికి స్వాగతం పలికారు. పట్టువస్త్రాలను శిరస్సున ధరించి అమ్మవారి ఆలయానికి చేరుకొని పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా స్వామివారి అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు వారిని శేషవస్త్రాలతో సత్కరించారు. అర్చక స్వాములు తీర్థప్రసాదాలను అందజేసి వేదాశీర్వచనం చేశారు. వీరితోపాటు పాలక మండలి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. -
‘అక్రమ బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీపై పోరాటం’
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా బ్యాక్లాగ్ ఉద్యోగులను భర్తీ చేస్తున్నారని.. ఆ అక్రమ భర్తీపై నిరుద్యోగ రక్షణ జేఏసీ పోరాటం చేస్తుందని తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మహిపాల్యాదవ్ హెచ్చరించారు. మంగళవారం స్థానిక ప్రెస్క్లబ్లో నిరుద్యోగులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్యాక్లాగ్ పోస్టులను కొంతమంది ఆయా శాఖ ఉన్నాధికారులు అక్రంగా నియామించారని, ఆ నియామకాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ పోరాటంతో అక్రమ నియామకాల ప్రక్రియ ప్రస్తుతానికి నిలిపివేశారన్నారు. అక్రమ నియామకాలతో నిజమైన నిరుద్యోగులు నష్టపోతున్నారని, వారి తరఫున తాము పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ శాఖల్లో పేరుకుపోయిన అవినీతితో రాష్ట్రం అథోగతి పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దొడ్డిదారిలో నియామకాలను అడ్డుకుని నిరుద్యోగులకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్న తనపై బెదిరింపులకు దిగుతున్నారని, ఆ బెదిరింపులకు ఏమాత్రం భయపడకుండా నిరుద్యోగ పక్షాన నిలబడి పోరాటం చేస్తానన్నారు. అక్రమ నియామకాలను ఆపే వరకు జేఏసీ పోరాటం ఆపదన్నారు. అక్రమ నియామకాలపై ప్రభుత్వం స్పందించి వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ నాయకులు రామకృష్ణ, మహేశ్, నరేందర్, ఆంజనేయులు, రాజు పాల్గొన్నారు. -
వాగులో యువకుడు గల్లంతు
● గజ ఈతగాళ్లు గాలించిన దొరకని ఆచూకీ ● తాళ్ల సాయంతో మహిళను కాపాడిన స్థానికులు దేవరకద్ర రూరల్: ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు దాటేందుకు ప్రయత్నించిన ఘటనలో వ్యక్తి గల్లంతు కాగా, స్థానికుల సాయంతో మహిళ ప్రాణాలతో బయటపడిన సంఘటన మంగళవారం కౌకుంట్ల మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఇస్రంపల్లికి చెందిన అలివేలు, మంగళి రమే ష్ (30) పనుల నిమిత్తం కౌకుంట్లకు వెళ్తున్నారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షానికి రెండు గ్రామాల మధ్య ఉన్న కల్వర్టుపై నీరు ఉధృతంగా పవహిస్తుంది. అధికారులు వారిస్తున్నా.. వాగు దాటేందుకు ప్రయత్నించడంతో నీటి ప్రవా హానికి వాగులో కొట్టుకుపోయారు. ఈ క్రమంలో అలివేలమ్మ వాగు లో ఉన్న ఓ చెట్టును పట్టుకొని ఉండటంతో గమనించిన స్థానికులు తాళ్ల సాయంతో కాపాడగా, రమేష్ గల్లంతయ్యాడు. అధికారులకు సమాచారం అందడంతో ఎస్డీఆర్ఎఫ్ గజ ఈతగాళ్లతో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎంతకీ ఆచూకీ లభించకపోవడం, చీకటి కావడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. కాగా నిన్న ఇదే బ్రిడ్జిపై ఇస్రంపల్లికి చెందిన యువకుడు దాటేందుకని ప్రయత్నించి వాగులో కొట్టుకపోగా కౌకుంట్లకు చెందిన మల్లేష్ ప్రాణాలకు తెగించి కాపాడాడు. ఈ సంఘటనతో అధికారులు ఎవ్వరూ వాగు దాటకుండా రెండు వైపులా చర్యలు తీసుకున్నారు. గాలింపు చర్యలు పర్యవేక్షించిన ఎమ్మెల్యే వాగులో వ్యక్తి గల్లంతైన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలను పర్యవేక్షించారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు, పాల్గొన్నారు. గాలింపు చర్యల గురించి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డివాగులో చెట్టును పట్టుకొని ఉన్న మహిళను రక్షిస్తున్న స్థానికులు -
పొలం పనులకు వెళ్తూ రైతు మృతి
మిడ్జిల్: పొలంలో వ్యవ సా య పనులు చేసేందు కు వె ళ్తూ రైతు మృతి చెందిన ఘ టన మంగళవారం మండ ల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రానికి చెంది న రాగుల బాలస్వామి (38) బుధవారం పొలంలో పంటకు మందు కొట్టేందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో దారిలో వరి పొలంలో ప్రమాదవశాత్తు కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు.స్థానికులు గుర్తించి పొలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమి త్తం ఆస్పత్రికి తరలించారు.మృతుడికి భార్య మంజుల, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి మహమ్మదాబాద్: పొలం దున్నుతున్న సమయంలో ట్రాక్టర్ ఢీకొనడంతో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పుట్టాపహాడ్కు చెందిన హన్మయ్య పొలంలో చిల్ల అంజయ్య(35) ఆదివారం రాత్రి మండల పరిధిలోని ఆముదాలగడ్డ తండాకు చెందిన హన్మ్యానాయక్తో ట్రాక్టర్తో దున్నిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు వెనుక ఉన్న అంజయ్యకు ట్రాక్టర్ తగలడంతో తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య మాధవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మహమ్మదాబాద్ ఎస్ఐ శేఖర్రెడ్డి తెలిపారు. విద్యుదాఘాతానికి యువకుడి బలి పాన్గల్: విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపి న వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెంది న మధుసూదన్యాదవ్ (28) విద్యుత్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి (స్పాట్ బిల్లర్)గా విధులు నిర్వహిస్తున్నాడు. సబ్స్టేషన్ సమీపంలో రైతుల పొలాల్లోని ట్రాన్స్ఫార్మర్ వద్ద సమ స్య ఉందని ఆ ప్రాంత రైతులు తెలుపడంతో దానిని సరిచేసేందుకు మంగళవారం సాయంత్రం వెళ్లాడు. ఈ క్రమంలో ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్కు గురై మృత్యువాత పడ్డాడు. ఏకై క కుమారుడు అకాల మరణం చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులను వివరణ కోరగా.. ఫిర్యాదు అందలేదన్నారు. పాముకాటుతో బాలుడి మృతి ఎర్రవల్లి: పాము కాటుకు గురై బాలుడు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని కొండపేట గ్రామంలో మంగళవారం చోటు చే సుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామాని కి చెందిన అభిరామ్ (9) ఇంటి పరిసరాల్లో ఆ డుకుంటుండగా పాము కాటు వేసింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం బా లుడిని గద్వాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. ఒక్కగానొక్క కుమారుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. బైక్ను ఢీకొట్టిన బస్సు: వ్యక్తి మృతి మహబూబ్నగర్ క్రైం: ముందు వెళ్తున్న బైక్ను వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో వ్యక్తికి గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. రూరల్ రెండో ఎస్ఐ భూపాల్ కథనం ప్రకారం.. హన్వాడ మండలం బుద్దారానికి చెందిన కమ్మరి రంగాచారి(36) మంగళవారం జడ్చర్లలో ఉన్న తమ్ముడు, తండ్రిని కలిసి తిరిగి బైక్పై మహబూబ్నగర్ వస్తుండగా మార్గమధ్యంలో తిరుమలహిల్స్ సమీపంలో ఆర్టీసీ బస్సు వెనకనుంచి బైక్ను ఢీకొట్టింది. కిందపడిన రంగాచారి పైనుంచి బస్సు వెనుక టైర్లు పోవడంతో తొడ భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడికి ఇద్దరూ కూతుర్లు, కొడుకు ఉన్నారు. భార్య సరిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రెక్కీ చేసి దోచేశారు..! మహబూబ్నగర్ క్రైం: జిల్లా కేంద్రంలోని గణేష్నగర్లో జరిగిన దొంగతనం కేసులో మూడు బృందాలుగా ఏర్పడి పోలీసులు మంగళవారం విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు.. గణేష్నగర్కు చెందిన నాగేశ్వర్రెడ్డి కుటుంబంతో కలిసి ఈ నెల 27న తిరుపతి దర్శనానికి వెళ్లాడు. ఈ క్రమంలో ఈ నెల 29 తెల్లవారు జామున దొంగలు ఇంట్లోకి ప్రవేశించి దొంగతనం చేశారు. ఉదయం పని మనిషి ఇళ్లు శుభ్రం చేయడానికి వచ్చిన సమయంలో ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో యాజమానికి సమాచారం ఇచ్చింది. బాధితుడు అతని అన్న రాజేశ్వర్రెడ్డికి సమాచారం ఇవ్వగా, అతను ఇంట్లో పరిశీలించగా 4 కేజీల వెండి, రూ.20 వేల నగదు అపహరించినట్లు గుర్తించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు వన్టౌన్ పోలీసులు, సీసీఎస్, ఫింగర్ ప్రింట్ బృందాలు విచారణ చేపట్టి అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వాహనాన్ని గుర్తించారు. కేసు విచారణలో ఉందని త్వరలో నిందితులను పట్టుకుంటామని సీఐ అప్పయ్య పేర్కొన్నారు. -
జూరాలకు 4.66 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో
● స్వల్పంగా తగ్గిన వరద ● ప్రాజెక్టు 31 క్రస్టు గేట్ల ఎత్తివేత ● 4.62 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల ధరూరు: ఎగువ నుంచి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ఫ్లో స్వల్పంగా తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి 8 గంటలకు ప్రాజెక్టుకు 5.37 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. మంగళవారం రాత్రి 8.30 గంటల వరకు 4.66 లక్షల క్యూసెక్కులకు తగ్గినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ప్రాజెక్టు 31 క్రస్టు గేట్లను ఎత్తి 4.62లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జెన్కో జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తిని నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఆవిరి రూపంలో 37 క్యూసెక్కులు, కుడి కాల్వకు 220 క్యూసెక్కులు కలిపి ప్రాజెక్టు నుంచి మొత్తం 4,62,703 క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 6.604 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. కోయిల్సాగర్లో.... దేవరకద్ర: మండలంలోని కోయిల్సాగర్ ప్రాజెక్టు రెండు గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు పెద్దవాగు నుంచి ఇన్ఫ్లో ప్రాజెక్టుకు చేరుతోంది. శనివారం భారీగా వచ్చిన వరదతో ప్రాజెక్టు 7 గేట్లను ఎత్తి నీటిని వదిలారు. ఆదివారం మూడు గేట్లను, సోమవారం, మంగళవారం రెండు గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 1,500 క్యూసెక్కుల నీటిని వాగులోకి వదుతున్నారు. సుంకేసులకు తగ్గిన ఇన్ఫ్లో రాజోళి: సుంకేసుల డ్యాంకు మంగళవారం ఇన్ఫ్లో తగ్గుముఖం పట్టింది. ఎగువ నుంచి 29,114 క్యూసెక్కులు రాగా.. 5 గేట్లను ఒక మీటర్ మేర తెరిచి 25,747 క్యూసెక్కులు, కేసీ కెనాల్కు 2,012 క్యూసెక్కుల నీటిని వదిలినట్లు జేఈ మహేంద్ర తెలిపారు. -
దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం
స్టేషన్ మహబూబ్నగర్: ఈనెల 2వ తేదీన జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని దసరా ఉత్సవ కమిటీ సభ్యులు అన్నారు. మహబూబ్నగర్లోని ఆర్యసమాజ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాకేంద్రంలో నిర్వహించే దసరా ఉత్సవాలకు ప్రత్యేకత ఉందన్నారు. ఎక్కడా లేని విధంగా కొన్నేళ్ల నుంచి ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గురువారం ఉదయం ఆర్యసమాజ్లో దేవయజ్ఞం ఉంటుందన్నారు. కలకొండ సూర్యనారాయణ ధ్వజధారిగా వ్యవహరిస్తారని తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆర్యసమాజ్ నుంచి ఊరేగింపు ఉంటుందన్నారు. దేవతామూర్తుల వేషధారణలు, కోలాట ప్రదర్శన, చెక్క భజనలతో శోభాయాత్ర బయలుదేరుతుందన్నారు. సాయంత్రం 4 గంటలకు దసరా కట్ట వద్ద ఓం పతాకాన్ని ఆవిష్కరించడం జరుగుతుందన్నారు. మైదానంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తిగీతాలు, శాసీ్త్రయ నృత్య ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. అనంతరం దసరా ఉత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్గౌడ్, దసరా ఉత్సవ కమిటీ సభ్యులు డాక్టర్ మురళీధర్రావు, డాక్టర్ భరద్వాల నారాయణరావు, సీహెచ్ చంద్రయ్య, చంద్రకుమార్గౌడ్, గోపాల్యాదవ్, కేఎస్ రవికుమార్, మాల్యాద్రిరెడ్డి, అంజయ్య, సుధాకర్రెడ్డి, మోహన్యాదవ్, సురేందర్రెడ్డి, నర్సింహారెడ్డి, రమేష్, లక్ష్మణ్, గౌలి వెంకటేశ్, రాంచంద్రయ్య, నిరంజన్చారి పాల్గొన్నారు. -
పోలీసు వాహనాలకు ఆయుధ పూజ
మహబూబ్నగర్ క్రైం: దుర్గాష్టమి సందర్భంగా జిల్లా పోలీస్శాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్న అన్ని రకాల వాహనాలకు మంగళవారం పరేడ్ మైదానంలో వాహన పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ డి.జానకి హాజరై వాహనాలకు పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వాహనాలు పోలీస్ విధి నిర్వహణలో ఒక భాగం మాత్రమే కాకుండా ప్రజల భద్రత కోసం మనతో పాటు నడిచే నమ్మకమైన సహచరులని తెలిపారు. ప్రతి వాహన డ్రైవర్ వాహనాన్ని కేవలం యంత్రంలా కాకుండా మన సేవా కార్యక్రమంలో భాగస్వామిగా భావించాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎన్బీ రత్నం, సురేష్కుమార్, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, శ్రీనివాసులు, సీఐలు పాల్గొన్నారు. ● ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మంగళవారం అన్ని రకాల ఆపరేషన్ థియేటర్లలో ప్రత్యేకంగా ఆయుధ పూజలు నిర్వహించారు. జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగా ఆజ్మీరాతో పాటు ఆయా విభాగాల హెచ్ఓడీలు పూజలో పాల్గొన్నా రు. అలాగే ఆస్పత్రి ఆవరణలో ఉన్న అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా హోమం నిర్వహించారు. -
పకడ్బందీగా ఎన్నికల నియమావళి అమలు
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని వీసీ హాల్ నుంచి ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎఫ్ఎస్టీ బృందాలు, సహాయ ఎన్నికల వ్యయ పరిశీలకులు, ఎంపీఓలతో కలెక్టర్ వెబెక్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల నియమ, నిబంధనలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని, ఎలాంటి వివాదాలు, తప్పిదాలకు తావులేకుండా నిబంధలను తూ.చ తప్పకుండా పాటిస్తూ ఎన్నికల విధులను జాగ్రత్తగా నిర్వర్తించాలని సూచించారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన హోర్డింగులు, వాల్పోస్టర్లు, ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో గోడలపై రాతలు ఉంటే తొలగించాలని ఆదేశించారు. నిబంధనల అమలుపై ప్రతిరోజు నివేదిక సమర్పించాలన్నారు. కలెక్టరేట్లో 24 గంటలు హెల్ప్లైన్, ఫిర్యాదుల పరిష్కార సెల్ ఏర్పాటు చేసి పౌర సరఫరాల సంస్థ డీఎంను నోడల్ అధికారిగా నియమించినట్లు చెప్పారు. అభ్యర్థులు నామినేషన్ వేసిన నుంచి ఎన్నికల ఖర్చు నమోదు చేయాలని, నిర్ణీత ప్రొఫార్మా ప్రకారం ఎన్నికలలో ప్రచార వ్యయం సమర్పించాలన్నారు. బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని జాగ్రత్తగా సరిచూసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎక్కడైనా సదుపాయాలు లేకపోతే యుద్ధప్రాతిపదికన కల్పించాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్, జెడ్పీసీఈఓ వెంకటరెడ్డి, డీపీఓ పార్థసారధి, నోడల్ అధికారులు పాల్గొన్నారు. గడువులోగా పరిశ్రమలకు అనుమతులు జిల్లాలో పరిశ్రమల స్థాపనకు వివిద శాఖల నుంచి అనుమతులను గడువులోగా మంజూరు చేయాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. పరిశ్రమలకు టీజీ ఐపాస్ కింద వివిధ శాఖల ద్వారా మంజూరు చేయాల్సిన అనుమతులను సమీక్షించి నిర్దేశిత గడువులోగా జారీ చేయాలన్నారు. అలాగే టీ ఫ్రైడ్ పథకం కింద షెడ్యూల్ కులాలకు చెందిన వారికి 7, షెడ్యూల్ ట్రైబ్ చెందిన వారికి 14 కలిపి మొత్తం 21 మందికి వాహన పెట్టుబడి సబ్సిడీ మంజూరుకు కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం యాదయ్య, ఎల్డీఓ చంద్రశేఖర్, గిరిజన సంక్షేమాధికారి జనార్దన్, కాలుష్య నియంత్రణ మండలి సహాయ పర్యవేక్షణ ఇంజినీర్ సాయిదివ్య, టీజీఐఐసీ జోనల్ కార్యాలయ అధికారులు పాల్గొన్నారు. -
అయ్యో.. అయ్యయ్యో!
‘స్థానిక’ రిజర్వేషన్లలో పంచాయితీ ● ఎస్టీలు లేని చోట ఎస్టీకి.. ఎస్సీలు లేని చోట ఎస్సీకి.. ● పలు గ్రామాల్లో కిరికిరి.. కొన్ని చోట్ల అనివార్యంగా పదవులు ● నాగర్కర్నూల్ జిల్లాలో ఆ 4 గ్రామాల్లో ‘ప్రత్యేక’ పరిస్థితి ● ఎస్టీలు లేకున్నా సర్పంచ్ స్థానాలు ఆ వర్గానికే రిజర్వ్డ్ ● 2019లో జరగని ఎన్నికలు.. ఈ సారీ స్వయం పాలనకు దూరమేనా..? ఎస్సీలు లేని చోట ఎస్సీలకు.. ఎస్టీలు లేని చోట ఎస్టీలకు.. ఇలా ‘స్థానిక’ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు చేయడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా పలు గ్రామాల్లో సర్పంచ్, వార్డు పదవులకు కేటాయించిన రిజర్వేషన్లలో ఆ వర్గానికి చెందిన ఓటర్లే లేకపోవడంతో గందరగోళం నెలకొంది. మరోవైపు కొన్ని పల్లెల్లో ఒకరు, ఒకట్రెండు కుటుంబాలు ఉన్న సామాజిక వర్గాలకు అనివార్యంగా పదవులు దక్కనున్నాయి. ఇదేక్రమంలో ఎన్నో ఆశలతో బరిలో నిలిచేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న వివిధ పార్టీల్లోని ముఖ్య నేతల అనుచరులకు భంగపాటే ఎదురైంది. తారుమారైన రిజర్వేషన్లు దేవరకద్రతో పాటు అన్ని నియోజకవర్గాల్లోనూ ఆయా నాయకుల ఆశలపై నీళ్లు చల్లగా.. వారిలో నైరాశ్యం అలుముకుంది. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ -
శతశాతం కార్యక్రమంతో బలమైన పునాది
● రూ.3 కోట్లతో గిరిజన భవన్ నిర్మాణం ● ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి స్టేషన్ మహబూబ్నగర్: మన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో శతశాతం కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు బలమైన పునాది వేస్తే వారు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకునే అవకాశం ఉంటుందన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. 1976లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో గిరిజనులకు విద్య, ఉద్యోగ రిజర్వేషన్ అమలు చేశారని, దాని ఫలితంగా ఎంతో మంది గిరిజనులు ఉన్నత పదువులు నిర్వహించారని తెలిపారు. రూ.3 కోట్లతో గిరిజన భవన్ నిర్మాణం కోసం జీఓ విడుదల కావడం సంతోషంగా ఉందన్నారు. మూడు అంతస్తుల ఈ గిరిజన భవన్లో విద్యార్థుల కోసం ఒక అంతస్తులో గ్రంథాలయం ఏర్పాటు చేయాలని సూచించారు. ఏకాభిప్రాయం మేరకు అభ్యర్థుల ఎంపిక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గ్రామాల్లోని నాయకులు, కార్యకర్తల ఏకాభిప్రాయం మేరకు అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారని తెలిపారు. గ్రామాలు, మండలాల వారీగా సమావేశాలు ఉంటాయని, మా జోక్యం ఉండదన్నారు. ప్రజల్లో ఆదరణ ఉందని, గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, గ్రామాల్లో, మండలస్థాయిలో కూర్చొని ఎవరిని నిలబెట్టుకోవాలో నిర్ణయించుకుంటారన్నారు. సమావేశంలో గిరిజన నాయకులు రఘునాయక్, లింగంనాయక్, శేఖర్ నాయక్, లక్ష్మణ్నాయ్, రాజునాయక్, తులసిరామ్ నాయక్, కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ Vs కాంగ్రెస్.. కేటీఆర్కు అనిరుధ్ రెడ్డి కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. అధికార కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS) నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మాజీ మంత్రి కేటీఆర్(KTR) వ్యాఖ్యలకు తాజాగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కౌంటరిచ్చారు. కేటీఆర్ గారూ.. ప్రతీదీ రాజకీయం చేయవద్దు అంటూ వ్యాఖ్యలు చేశారు.జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి(MLA Anirudh Reddy) తాజాగా మాట్లాడుతూ.. ప్రతీ విషయాన్ని రాజకీయ కోణం చూడకండి కేటీఆర్. బీఆర్ఎస్లో ఒక ఎమ్మెల్యే ఏ రోజైనా తనకు సంబంధించిన విషయంపై మాట్లాడారా?. ప్రజలకు కావాల్సిన అంశంపై ఏ రోజైనా స్వేచ్ఛగా మాట్లాడారా?. మా పార్టీలో.. మా ప్రభుత్వంలో స్వేచ్ఛ ఎక్కువ. మా ప్రభుత్వానికి ప్రజలపై చిత్తశుద్ధి ఉంది. మీ పాలన నిరంకుశత్వ పాలన. మీ రౌడీయిజం అరాచకత్వ పాలన చూడలేకనే మీ పార్టీని బొంద పెట్టారు.నేను పోరాటం చేసేది రైతుల కోసం, నా జడ్చర్ల నియోజకవర్గం ప్రజల కోసం. మీ ఎమ్మెల్యేలు రౌడీయిజం చేసేది ఫ్యాక్టరీల్లో వసూళ్ల కోసం, కమీషన్లు, భూకబ్జాల కోసం అని మీరు గమనించాలి. నేను చెరువుల్లో చేపలు చనిపోతున్నాయని ముదిరాజుల కోసం ఫైట్ చేస్తున్నా. మీ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ఫ్యాక్టరీల్లో పొల్యూషన్ వచ్చినా వాళ్లకు కమీషన్ వస్తే చాలని ఎప్పుడు కూడా ఈ సమస్యపై మాట్లాడలేదు. ఈ విషయాన్ని మీరు గుర్తించాలి’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ సర్కార్ కాదు.. సర్కస్: కేటీఆర్ -
పెళ్లి బృందం వాహనం బోల్తా
● ప్రమాద సమయంలో 59 మంది ● 12 మందికి తీవ్రగాయాలు, కర్నూలుకు తరలింపు ● ఇటిక్యాలపాడు శివారులో జాతీయ రహదారిపై ఘటన ఉండవెల్లి: నిర్లక్ష్యపు డ్రైవింగ్, అతివేగం కారణంగా పెళ్లి బృందంతో వెళ్తున్న డీసీఎం బోల్తాపడిన సంఘటన మండలంలోని ఇటిక్యాలపాడు శివారులో జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన పెళ్లి కుమార్తె బంధువులు జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లిలో పెళ్లి కుమారుడి ఇంటికి సోమవారం వలిమా వేడుకల కోసం 59 మంది డీసీఎంలో వచ్చారు. రిసెప్షన్ అనంతరం రాత్రి 10 గంటల ప్రాంతంలో తిరుగు ప్రయాణమవగా.. ఇటిక్యాలపాడు శివారులో జాతీయ రహదారిపై పంక్చర్ కావడంతో లారీ ఆగి ఉండగా.. వేగంగా వచ్చిన డీసీఎం సడెన్ బ్రేక్ వేయడంతో రోడ్డు పక్కన అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12 మందికి తీవ్రగాయాలు, ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. డీసీఎంలో ఉన్న చిన్నారులు, పెద్దలు, మహిళలు పెద్దగా కేకలు వేయడంతో ఇతర వాహనదారులు వచ్చి వారిని బయటికి తీశారు. ఇందులో 12 మందికి తీవ్రగాయాలు కావడంతో రెండు 108 అంబులెన్స్లలో కర్నూలు ఆస్పత్రికి తరలించారు. డీసీఎం కింది బాగానా ఇద్దరు ఇరుక్కోగా.. క్రేన్ సహాయంతో బయటికి తీశారు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై నిలిచిపోయిన వాహనాలను ఎస్ఐ శేఖర్, హైవే సిబ్బంది ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. -
ఆది దంపతుల కల్యాణం
కమనీయం.. ● పట్టువస్త్రాలు సమర్పించిన దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ● భారీగా తరలివచ్చిన భక్తులు.. కిక్కిరిసిన ఆలయ పరిసరాలు అలంపూర్: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఎనిమిదో రోజు మూల నక్షత్రం పురస్కరించుకొని అలంపూర్ ఆలయాల్లో జోగుళాంబ అమ్మవారు, బాలబ్రహ్మేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం కనులపండువగా నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, దేవదాయశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి శైలజ రామయ్యర్, ఎమ్మెల్యే విజయుడు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారు, స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను పల్లకీలో మంగళవాయిద్యాలు, పండితుల వేదమంత్రోచ్ఛారణల నడుమ మండపానికి తీసుకొచ్చారు. అనంతరం అర్చకులు కల్యాణ వేడుకను వైభవోపేతంగా నిర్వహించారు. ఈ వేడుకను తిలకించడానికి వివిధ ప్రాంతాల భక్తులు వేలాదిగా తరలివచ్చారు. పూర్ణకుంభంతో స్వాగతం.. అలంపూర్కు వచ్చిన రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, దేవదాయశాఖ ప్రధాన కార్యదర్శి శైలజ రామయ్యర్, ఎమ్మెల్యే విజయుడికి ఆలయ ఈఓ దీప్తి, కమిటీ చైర్మన్ నాగేశ్వర్రెడ్డి, పాలక మండలి సభ్యులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రి, ప్రిన్సిపల్ కార్యదర్శి స్వామివారి ఆలయంలో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం పట్టువస్త్రాలను తలపై ఉంచుకొని అమ్మవారి ఆలయాలకు చేరుకొని సమర్పించి కుంకుమార్చన పూజలో పాల్గొన్నారు. అర్చకులు ఆలయ విశిష్టతను వివరించి తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం పలికారు. ఆలయ ఈఓ, పాలక మండలి సభ్యులు మంత్రికి పట్టువస్త్రాలు, జ్ఞాపిక అందజేశారు. వీరి వెంట జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత, గద్వాల సంస్థాన వారసుడు కృష్ణ రాంభూపాల్, కాంగ్రెస్ నాయకులు, భక్తులు ఉన్నారు. మహాగౌరిగా దర్శనం.. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఎనిమిదోరోజు జోగుళాంబ అమ్మవారు మహాగౌరిగా భక్తులకు దర్శనమిచ్చి విశేష పూజలు అందుకున్నారు. అర్చకులు అమ్మవారికి కొలువు, కుమారి, సువాసిని పూజలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారు చతుర్భుజాలు కలిగి ఉంటారని.. కుడి వైపు త్రిశూలం, అభయ హస్తం, ఎడమ వైపు ఢమరుకం, వరద ముద్ర ఆశీస్సులిస్తూ భక్తులకు దర్శనమిస్తారని అర్చకులు వివరించారు. అత్యంత శాంతమూర్తి అని.. ఈ మాతను ఆరాధించడంతో పాపాలు నశిస్తాయని, కష్టాలు తొలగుతాయని, సకల సౌభాగ్యాలతో పాటు మంగళం చేకూరుతుందని, కల్యాణప్రాప్తి కలుగుతుందని చెప్పారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల భక్తులు పెద్దసంఖ్యలో తరలి రావడంతో ఆలయాలు కిటకిటలాడాయి. -
డ్రగ్స్ రహిత సమాజం కోసం బైక్ యాత్ర
చారకొండ: గంజాయి, డ్రగ్స్ రహిత సమాజం కోసం సూర్యాపేట జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ చేపట్టిన బైక్ యాత్ర సోమవారం చారకొండకు చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు యువత బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. మత్తు పదార్థాలతో కలిగే అనర్థాలపై జన చైతన్యం కల్పించేందుకు ఈ నెల 21న సూర్యాపేట నుంచి బైక్ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 1400 కిలోమీటర్లు ప్రయాణించి ప్రజలను చైతన్యవంతం చేయడం జరిగిందన్నారు. యువత మత్తుకు బానిస కాకుండా ఉన్నత లక్ష్యం దిశగా ముందుకు సాగాలని కోరారు. ట్రాఫిక్ జాంతో ఆగిన వాహనాలుప్రమాదంలో బోల్తా పడిన వాహనం -
జూరాలకు భారీగా వరద
● ఎగువ నుంచి 5.37 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ● ప్రాజెక్టు 39 క్రస్టుగేట్ల ఎత్తివేత ధరూరు/రాజోళి: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ఉధృతి పెరిగింది. ఆదివారం రాత్రి 8గంటల వరకు ప్రాజెక్టుకు 5.7లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. సోమవారం రాత్రి 8:30 గంటల వరకు 5.37లక్షల క్యూసెక్కులకు ఇన్ఫ్లో పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఈ సీజన్లో ఇంత పెద్ద మొత్తంలో ఇన్ఫ్లో వచ్చి చేరడం ఇదే మొదటి సారి. దీంతో ప్రాజెక్టు 39 క్రస్టుగేట్లను ఎత్తి 5,60,83 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జెన్కో జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. ఆవిరి రూపంలో 41, కుడి కాల్వకు 300 క్యూసెక్కులతో కలిపి ప్రాజెక్టు నుంచి మొత్తం 5,60,524 క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 6.310 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ● సుంకేసుల డ్యాంకు ఎగువ నుంచి 71,114 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా.. 16 గేట్లను ఒక మీటర్ మేర తెరిచి 67,312 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నట్లు జేఈ మహేంద్ర తెలిపారు. కేసీ కెనాల్కు 2,012 క్యూసెక్కులు వదిలినట్లు పేర్కొన్నారు. -
పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధి కల్పించాలి
జడ్చర్ల: పరిశ్రమలలో స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని పోలేపల్లి సెజ్లో ఓ పరిశ్రమను పంజాబ్ డిప్యూటీ మాజీ సీఎం సుఖ్జిందర్సింగ్ రందావాతో కలిసి ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి, షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి, స్పోర్ట్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి మాట్లాడుతూ జడ్చర్ల ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు కావడం శుభపరిణామమని, పరిశ్రమల స్థాపనతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ చలువతో పోలేపల్లి సెజ్ ఏర్పాటైందని, అప్పుడే పరిశ్రమల స్థాపనకు పునాది పడిందని గుర్తుచేశారు. అదే ఒరవడితో జడ్చర్ల ప్రాంతానికి అనేక పరిశ్రమలు తరలివచ్చాయని, పారిశ్రామిక రంగానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. అలాగే పరిశ్రమలకు సంబంధించి సీఎస్ఆర్ నిధుల ద్వారా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, నిరుపేద విద్యార్థుల సంక్షేమానికి కృషి చేయాలని పరిశ్రమల యాజమాన్యాలను కోరారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్పర్సన్ జ్యోతి, వైస్ చైర్మన్ రాజేందర్గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్యాదవ్, నాయకులు నిత్యానందం, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. -
వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తి
● కాపాడిన యువకుడు దేవరకద్ర: కౌకుంట్ల, ఇస్రంల పల్లి గ్రామాల మధ్య ఉన్న వా గులో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కొట్టుకుపోతుండగా.. కౌకుంట్లకు చెందిన యువకుడు నీటి ప్రవాహంలో దూకి బాధితు డిని కాపాడిన ఘటన సోమ వారం జరిగింది. వివరాలు.. ఇస్రంపల్లికి చెందిన పాష పని మీద సోమవారం స్వగ్రామం నుంచి నుంచి వాగును దాటి కౌకుంట్లకు వచ్చాడు. తిరిగి గ్రామానికి వెళ్లడానికి వాగును దాటుతుండగా నీటి ప్రవాహం ఉధృతంగా కారణంగా పాష నీటిలో కొట్టుకుపోయాడు. అయితే వాగును చూడడానికి అక్కడికి వచ్చిన కౌకుంట్లకు చెందిన మల్లేశ్ వెంటనే అప్రమత్తం అయి వాగులోకి దూకి కొట్టుకుపోతున్న పాషను కాపాడి ఒడ్డుకు చేర్చాడు. ఎంతో ధైర్యంతో నీటి ప్రవాహంలో దూకి మరో వ్యక్తిని కాపాడినందుకు మల్లేశ్ను కౌకుంట్ల, ఇస్రంపల్లి గ్రామస్తులు అభినందించారు. లింక్ క్లిక్.. రూ.1.95 లక్షలు మాయం నాగర్కర్నూల్ క్రైం: ఫోన్కు వచ్చిన అనుమానాస్పద లింక్ను క్లిక్ చేయడంతో బ్యాంక్ ఖాతా నుంచి నగదు మాయమైన ఘటనపై కేసు నమోదైనట్లు ఎస్ఐ గోవర్ధన్ సోమవారం తెలి పారు. పూర్తి వివరాలు.. ఈ నెల 22న జిల్లా కేంద్రంలోని మటన్ వ్యాపారి సంపత్ ఫోన్కు వచ్చిన ఆర్టీఏ చానల్ లింక్ను క్లిక్ చేయడంతో బ్యాంక్ ఖాతాలోని రూ.1.95 లక్షల నగదు సైబర్ నేరస్తులు మాయం చేశారు. ఫోన్కు నగదు డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో మోసపోయినట్లు గుర్తించి, ఆన్లైన్లో సైబర్ క్రైంకు ఫిర్యాదు చేయడంతో సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ముగ్గురు యువకుల అరెస్టు గద్వాల క్రైం: పానీ పూరి బండి నిర్వాహకుడిపై ఆదివారం రా త్రి మద్యం మత్తులో దాడి చేసి బండి అద్దా లు ధ్వంసం చేసిన ఘటనలో ముగ్గురు యు వకులను పోలీసులు అరెస్టు చేశారు. పట్టణ ఎస్ఐ కల్యాణ్కుమార్ వివరాల మేరకు.. మధ్యప్రదేశ్కు చెందిన మంగళ్ గద్వాలకు వచ్చి పానీపూరి బండి ఏర్పాటు చేసుకొని ఊ పాధి పొందుతున్నాడు. పట్టణానికి చెందిన రాఘవేంద్ర అలియాస్ సోను, శశి, ఎస్కే నర్సింహాలు మద్యం సేవించి పానీపూరి తినేందుకు వచ్చారు. తిన్న తర్వాత డబ్బులు ఇచ్చే విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో శశి అనే యువకుడు బండి అద్దా లు ధ్వంసం చేసి, గ్యాస్ సిలిండర్ను తీసుకుని రోడ్డుపైకి విసిరేశాడు. స్థానికులు నిలువరించే ప్రయత్నం చేయగా వారిపై కూడా దాడి చేసే ప్రయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రాఘవేంద్ర ఓ ఘర్షణ కేసులో జైలుకు వెళ్లి రెండు రోజుల క్రితమే బెయిల్పై బయటకు వచ్చాడన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేశామన్నారు. కోర్టులో హజరు పరచి రిమాండ్కు తరలిస్తామన్నారు. పట్టణంలోని సీసీవై యూత్ యువకులు పానీపూరి బండి నిర్వాహకుడిపై దాడి చేసినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని ఎస్ఐ తెలిపారు. మనస్తాపంతో వ్యక్తి బలవన్మరణం చారకొండ: భార్య మరణంతో మనస్తాపాని కి గురై వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘట న మండలంలో చోటు చేసుకుంది. గ్రా మస్తులు, పోలీసులు తెలి పిన వివరాలు.. మండలంలోని జేపల్లికి చెందిన వంకేశ్వరం వెంకటయ్య (35) భార్య ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. ఈ నేపథ్యంలో మనస్తాపంతో వెంకటయ్య అనారోగ్యాకి గురై, అర్థిక ఇ బ్బందులతో ఆదివా రం రాత్రి ఇంట్లో పైకప్పు కు తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమ వారం తెల్లవారు జామున గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి ఎస్ఐ శంషోద్దీన్ చేరుకొని ఆత్మహత్యకు గల వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మృతుడికి ఒక కుమారుడు ఉన్నాడు. -
సంగమ క్షేత్రం.. జల దిగ్బంధం
● ఉగ్రరూపం దాల్చిన కృష్ణా, భీమా నదులు ● దత్త భీమేశ్వరాలయంలోకి చేరిన వరద కృష్ణా: మండలంలోని కృష్ణా, భీమా నదులు ఉగ్రరూపం దాల్చాయి. రెండు రోజులుగా ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద ఉధృతితో సోమవారం కృష్ణా మండలం తంగిడి సమీపంలోని సంగమ క్షేత్రంలో ఉన్న దత్త భీమేశ్వరాలయం జలదిగ్బంధనమైంది. కృష్ణా, భీమా నదీతీరంలోని గ్రామాల సమీపంలోకి వరద చేరుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వారం రోజులుగా కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణానదిపై ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, భీమా నదిపై ఉన్న సన్నత్తి, చిత్తాపూర్, యాద్గీర్, గూడూర్ బ్యారేజీల నుంచి 5.70లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో కృష్ణా, భీమా నదులకు వరద ఉధృతి పెరిగింది. దీంతో కృష్ణా మండలంలోని వాసుగనగర్, హిందూపూర్, గుర్జాల్ గ్రామాలతో పాటు ముడుమాల్, కృష్ణా, తంగిడి, సూకూర్ లింగంపల్లితో పాటు మాగనూర్, మక్తల్ మండలాల్లోని పలు గ్రామాలకు వరద ముంపు ముప్పు పొంచి ఉంది. వరద ఏమాత్రం పెరిగినా నదీ తీరంలోని గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధనమయ్యే అవకాశం ఉందని ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. -
ఈపీఎఫ్ సమస్యల పరిష్కారానికి కృషి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఉద్యోగులు, ఆయా సంస్థల యజమానులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఈపీఎఫ్ (ఎంప్లాయ్మెంట్ ప్రావిడెన్షియల్ ఫండ్) సంస్థ ఆధ్వర్యంలో ‘నిధి ఆప్కే నిఖత్ 2.0 ’ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఉద్యోగుల కోసం కార్యక్రమాన్ని జేపీఎన్సీ కళాశాలలో ఈపీఎఫ్ అధికారులు ఏర్పాటు చేశారు. అయితే ఉదయం 9 గంటలకే కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉండగా, అక్కడికి అధికారులు సకాలంలో రాకపోవడంతో సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ఆలస్యంగా అక్కడికి చేరుకున్న ఈపీఎఫ్ అధికారులు ఒక్కో ఉద్యోగి సమస్యను అడిగి తెలుసుకుని, వినతిపత్రాలను స్వీకరించారు. ఈ క్రమంలో పీఎఫ్ పెన్షన్ హయ్యర్ ఆప్షన్కు సంబంధించి ఆర్టీసీ కార్మికుల దరఖాస్తులు చిన్నపాటి కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి. అవగాహన శిబిరంలో అధికారులకు దరఖాస్తులు ఇచ్చిన వారిలో ఎక్కువ సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు ఉండటం గమనార్హం. హయ్యర్ పెన్షన్ డిమాండ్ లెటర్ రాని వారి దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని, ఒకసారి కార్మికులు వారి ఈపీఎఫ్ ఖాతా స్టేటస్ చెక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. -
మోగిన నగారా..
● 2 విడతల్లో ప్రాదేశిక.. 3 దఫాల్లో పంచాయతీ సమరం ● అక్టోబర్ 9 నుంచి నవంబర్ 11 వరకు కొనసాగనున్న ప్రక్రియ ● ఉమ్మడి జిల్లాలో 77 జెడ్పీటీసీ.. 800 ఎంపీటీసీ స్థానాలు ● 1,678 గ్రామ పంచాయతీలు.. 15,068 వార్డులకు ఎన్నికలు ● గ్రామాల్లో రాజకీయ సందడి.. గెలుపే లక్ష్యంగా పార్టీల కసరత్తు ఆశావహుల జోరు.. నేతల బేజారు స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ సందడి మొదలైంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో ఆ వర్గానికి చెందిన నాయకులు ఉత్సాహంలో ఉన్నారు. వీరితోపాటు రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన మండలాలు, గ్రామాల్లోని మిగతా వర్గాలకు సంబంధించిన ఆశావహులు ఎక్కువ సంఖ్యలో తమకే అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. వారికి సర్దిచెప్పలేక ముఖ్య నేతలు ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ఇదేక్రమంలో రిజర్వేషన్ల తారుమారుతో భంగపడిన ఆశావహులది మరో సమస్యగా మారినట్లు తెలుస్తోంది. చాలా మండలాల్లో పాత, కొత్త నాయకుల పంచాయితీలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. అధికార పార్టీ కాంగ్రెస్లో ఈ పరిస్థితి నెలకొనగా.. ముఖ్య నేతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్తోపాటు బీఆర్ఎస్, బీజేపీ నేతలు గ్రామాల్లో విస్తృత పర్యటనలకు రంగం సిద్ధం చేసుకుంటుండడంతో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది. పల్లె పోరుకు సై.. -
ఎన్నికలు సవ్యంగా నిర్వహిద్దాం
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను సవ్యంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ విజయేందిర అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి ఎన్నికల కమిషన్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీసీ నిర్వహించి సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ జిల్లాలో పంచాయతీల ఎన్నికలకు సంబంధించి మొదటి విడతలో 127 జీపీలు, 1,130 వార్డులు, రెండో విడతలో 157 జీపీలు, 1,356 వార్డులు, మూడో విడతలో 139 జీపీలు, 1,188 వార్డులకు ఎన్నికలు జరుగుతాయన్నారు. అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడతలో 89 ఎంపీటీసీ, 8 జెడ్పీటీసీ, రెండో విడతలో 86 ఎంపీటీసీ, 8 జెడ్పీటీసీ స్థానాలకు ఉంటాయన్నారు. ఎన్నికలపై ఆర్ఓ, ఏఆర్ఓలకు శిక్షణ ఇచ్చామని, బ్యాలెట్ బాక్స్లు, పోలింగ్ సిబ్బందికి సరిపడా ఉన్నారన్నారు. సమావేశంలో ఎస్పీ జానకి, అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్, ఏఎస్పీ రత్నం, జెడ్పీసీఈఓ వెంకట్రెడ్డి, డీపీఓ పార్థసారధి, ఆర్డీఓ నవీన్, డీఈఓ ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. పకడ్బందీగా కోడ్ అమలు.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినందున తక్షణమే ఎన్నికల ప్రవర్థనా నియామవలి అమలులోకి వచ్చిందని కలెక్టర్ విజయేందిర తెలిపారు. ఎన్నికల నియామావలి తూ.చ. తప్పకుండా పాటించాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా ఎలాంటి ప్రభుత్వ పథకాలు మంజూరు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, గ్రౌండింగ్ వంటివి చేయకూడదన్నారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలు పక్కాగా పనిచేయాలన్నారు. రాజకీయ పార్టీలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన హోర్డింగ్లు, కటౌట్లు, పోస్టర్లు, బ్యానర్లు తొలగించాలని చెప్పారు. -
మూడు దశల్లో ‘పంచాయతీ’
గ్రామ పంచాయతీకి సంబంధించి తొలి విడతలో అక్టోబర్ 17 నుంచి 31 వరకు 16 మండలాల పరిధిలోని 410 జీపీలతోపాటు 3,514 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడతలో అక్టోబర్ 21 నుంచి నవంబర్ 4 వరకు 28 మండలాల్లోని 611 జీపీలతోపాటు 5,546 వార్డులకు.. చివరి దశలో అక్టోబర్ 25 నుంచి నవంబర్ 8 వరకు 33 మండలాల పరిధిలోని 657 జీపీలతోపాటు 6,008 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో మాత్రం తొలి విడతలో పోలింగ్ నిర్వహించడం లేదు. రెండు, మూడో విడతల్లోనే ఆ రెండు జిల్లాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. కాగా.. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు జరిగిన రోజే ఓట్ల లెక్కింపు చేపడుతారు. కాగా.. పంచాయతీ ఎన్నికలకు గాను 2,363 పోలింగ్ కేంద్రాలు కేటాయించారు. -
అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి : ఎంపీ
జోగుళాంబ అమ్మవారి అశీస్సులు అందరిపై ఉండాలని రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్ అన్నారు. అలంపూర్ క్షేత్ర ఆలయాలను రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, గద్వాల సంస్థాన వారసుడు కృష్ణరామ్ భూపాల్తో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ ఈఓ దీప్తి, ఆలయ పాలక మండలి సభ్యులు అర్చకులతో కలిసి స్వాగతం పలికారు. ఈమేరకు అమ్మవారికి పట్టువస్త్రాలను అందజేశారు. అనంతరం బాలబ్రహ్మేశ్వర స్వామి, జోగుళాంబ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు, పాలక మండలితో చర్చించి ఆలయాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానన్నారు. అనంతరం ఆలయ అధికారులు వారిని శేషవస్త్రాలతో సత్కరించారు. -
కాళరాత్రిదేవీ.. నమోస్తుతే
● అలంపూర్ జోగుళాంబ క్షేత్రంలోవైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ● తరలివచ్చిన భక్తజనం అలంపూర్: మహిమాన్వితమూర్తి కాళరాత్రిదేవీ నమోస్తుతే.. అంటూ భక్తులు జోగుళాంబ అమ్మవారిని పూజించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అలంపూర్ ఆలయంలో ప్రత్యేక మండపంలో అమ్మవారు కొలువుదీరగా.. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజైన ఆదివారం అమ్మవారు కాళరాత్రిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈమేరకు అమ్మవారికి అర్చకులు ప్రేత్యక పూజలు, మహా మంగళహారతి ఇచ్చారు. ఆకాశంలో ఉండే మబ్బుల రంగును కలగలుపుకొని.. నల్లటి రూపంతో అతి భీకరంగా అమ్మవారు దర్శనిస్తారని అర్చకులు వివరించారు. అదేవిధంగా యాగశాలలో చండీహోమాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. ఇదిలాఉండగా, క్షేత్రానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు, ప్రముఖలు తరలివచ్చారు. దీంతో జోగుళాంబ అమ్మవారు, బాలబ్రహ్మేశ్వరస్వామి వార్ల ఆలయాల వద్ద పెద్దసంఖ్యలో క్యూలో బారులుతీరారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు అభిషేకాలు, అర్చనలు చేశారు. అలాగే, అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన నిర్వహించారు. బాలబ్రహ్మేశ్వరస్వామి నిత్య అన్నదాన సత్రంలో భక్తులకు అన్నదానం చేశారు. అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జోగుళాంబ క్షేత్రంలో సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. గద్వాల సంస్థానం అధ్వర్యంలో గుడి సంబురాల పేరిట సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. కళాకారులు వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించగా.. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై తిలకించారు. ఆలయ అధికారులు కళాకారులకు ప్రశంశా పత్రాలను అందజేశారు. -
జూరాలకు భారీగా వరద
● 5.07 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ● ప్రాజెక్టు 39 క్రస్టు గేట్ల ఎత్తివేత ● 6 యూనిట్లలో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి ధరూరు: కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో భారీగా ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. శనివారం రాత్రి 8 గంటల వరకు ప్రాజెక్టుకు 4.31 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. ఆదివారం రాత్రి 7.30 గంటల వరకు ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 5.07 లక్షల క్యూసెక్కులకు పెరిగిందన్నారు. ఈ సీజనలో ఇంత పెద్ద మొత్తంలో ఇన్ఫ్లో రావడం ఇదే మొదటిసారి. దీంతో ప్రాజెక్టు 39 క్రస్టు గేట్లను ఎత్తి 5.20 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. ఆవిరి రూపంలో 22 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 5.20 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.569 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 37.64 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 32.052 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా 25 గేట్లను ఎత్తి దిగువన ఉన్న జూరాలకు 95,900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రెండో రోజు నిలిచిన విద్యుదుత్పత్తి ఆత్మకూర్: జూరాల ప్రాజెక్టుకు ఎగువ కర్ణాటక నుంచి 5.07 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటంతో ఆదివారం రెండో రోజు ఎగువ, దిగువ ఉత్పత్తి కేంద్రాల్లో విద్యుదుత్పత్తిని నిలిపేసినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటి వరకు 741.652 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. సుంకేసులకు మళ్లీ పెరిగిన వరద రాజోళి: సుంకేసుల డ్యాంకు వరద భారీగా పెరిగింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో పాటు కురుస్తున్న వర్షాల కారణంగా డ్యాంలో నీటిమట్టం పెరుగుతుంది. ఆదివారం ఉదయం నాటికి 1.09 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా 24 గేట్లను మీటర్ మేర ఎత్తి 1.05 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు కేసీ కెనాల్కు 2,012 క్యూసెక్కులు వదిలినట్లు జేఈ మహేంద్ర తెలిపారు. రామన్పాడుకు కొనసాగుతున్న వరద మదనాపురం: రామన్పాడు జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. కోయిల్సాగర్, సరళాసాగర్ జలాశయాల ద్వారా వరద రావడంతో అధికారులు 3 గేట్లు ఎత్తి 18 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సరళాసాగర్ ప్రాజెక్టు ఒక ప్రైమరీ సైఫాన్, ఒక ఉడ్ సైఫాన్ ద్వారా 4 వేల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్లింది. వరద ప్రభావంతో మదనాపురం వద్ద కాజ్వే మునిగింది. మూడు గేట్లు ద్వారా నీటి విడుదల దేవరకద్ర: కోయిల్సాగర్ ప్రాజెక్టు మూడు గేట్ల ద్వారా 3 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. శనివారం వరద ఉధృతి భారీగా ఉండడంతో 7 గేట్లను తెరువగా ఆదివారం వరద తగ్గుముఖం పట్టడంతో నాలుగు గేట్లను మూసివేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగా ప్రస్తుతం 32.4 అడుగులుగా ఉంది. -
ఛాతిలో నొప్పి వస్తే జాగ్రత్త
ఆకస్మాత్తుగా ఛాతిలో నొప్పి వస్తే వెంటనే అప్రమత్తమవ్వాలి. గుండె రక్త నాళాలు మూసుకుపోయి రక్త ప్రసరణ తగ్గిపోవడంతోనే ఛాతిలో నొప్పి వస్తోంది. దీన్ని ‘ఎంజైనా’అంటారు. ఛాతిలో బరువుగా ఉండటం, నొప్పి వీపు వెనుక భాగంలోకి రావడం, గోంతులోకి, భుజం మీదికి పాకడం, ఆయాసం, కళ్లు తిరగడం, చెమటలు పట్టడం, కడుపులో గ్యాస్ ఏర్పడినట్లుగా మంట వస్తోంది. ఛాతిలో నొప్పి ప్రారంభమైన వెంటనే వైద్యుడిని సంప్రదించేలోగా ‘సార్బిట్రేట్, ఆస్ప్రిన్, స్టాటిన్ మాత్రలను వేయాలి. ఆ తర్వాత గంట వ్యవధిలోగా ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించగలిగితే ప్రాణాపాయ స్థితినుంచి కాపాడే అవకాశం ఉంది. -
కంటి వైద్య నిపుణుడి అదృశ్యం
● బాకీ తీర్చలేక 4 నెలల క్రితం స్నేహితుడి ఆత్మహత్య.. జామీనుగా ఉన్నందుకు అప్పులోళ్ల ఒత్తిడి ● 17 పేజీల ఆత్మహత్య లేఖ రాసి..సల్ఫోన్ వదిలి వెళ్లిన వైనం ● తల్లిదండ్రుల ఫిర్యాదు.. ఆచూకీ కోసం పోలీసుల గాలింపు మద్దూరు: అప్పు తీర్చలేక నాలుగు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్న స్నేహితుడు.. అతడికి జామీనుగా ఉన్న నేత్ర వైద్యుడిపై అప్పులోళ్ల తీవ్ర మైన ఒత్తిడి... దాన్ని తట్టుకోలేక 17 పేజీల సూసైడ్ నోట్ రాసి సెల్ఫోన్ ఇంటి దగ్గరే వదిలి అదృశ్యమయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ విజయ్కుమార్ కథనం ప్రకారం.. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలోని గోకపస్లావాద్ గ్రామ పరిధిలోని బోడమర్రిగడ్డతండాకు చెందిన పాత్లావత్ రమేష్నాయక్ పదేళ్ల నుంచి నారాయణపేట జిల్లా మద్దూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రం ఎదురుగా ఐ–మిత్ర కంటి పరీక్ష కేంద్రం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో మద్దూరుకు చెందిన రక్త పరీక్షలు చేసే రామచంద్రయ్య మిత్రుడుగా మారాడు. అయితే రామచంద్రయ్య స్థానిక ఆర్ఎంపీ వద్ద అప్పు తీసుకునేటప్పుడు రమేష్నాయక్ జామీను ఇచ్చాడు. ఈ క్రమంలో అప్పు తీర్చలేకపోయిన రామచంద్రయ్య ఈ ఏడాది మే 23న ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో తన అప్పు తీర్చాలని ఆర్ఎంపీ, అతని తమ్ముడు రమేష్నాయక్పై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో మనస్తాపం చెందిన రమేష్నాయక్ 17 పేజీల ఆత్మహత్య లేఖ రాసి సెల్ఫోన్ కంటి వైద్య కేంద్రంలోనే వదిలేసి మిత్రుడు చిన్నస్వామి బైక్పై వెళ్లి నారాయణపేట బస్టాండ్లో దిగాడు. తాను రాసిన ఆత్మహత్య లేఖను కొంతమంది సెల్ఫోన్లకు పంపించాడు. ఇది వైరల్గా మారి.. తల్లిదండ్రులకు తెలియడంతో మద్దూరు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ విజయ్కుమర్ కంటి పరీక్ష కేంద్రం చేరుకొని ఆత్మహత్య లేఖతోపాటు సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై రమేష్నాయక్ తండ్రి దామ్లానాయక్ ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేశారు. రమేష్నాయక్ ఆచూకీ కోసం రెండు పోలీసు బృందాలను పంపినట్లు ఎస్ఐ తెలిపారు. సీసీ టీవీ పుటేజీలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. -
ఫుట్బాల్ చాంపియన్గా వనపర్తి
● రన్నరప్గా నిలిచిన కరీంనగర్ ● సెమీస్లో పోరాడి ఓడిన మహబూబ్నగర్ ● ట్రోఫీలు అందజేసిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలో ముగిసిన రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల ఫుట్బాల్ పోటీల్లో విజేతగా వనపర్తి జిల్లా జట్టు నిలిచింది. ఆదివారం వర్షాల నేపథ్యంలో జడ్చర్ల పట్టణంలో నిర్వహించిన వనపర్తి, కరీంనగర్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. మ్యాచ్ ముగిసే సరికి ఇరు జట్లు గోల్స్ చేయకపోవడంతో టై బ్రేకర్ నిర్వహించారు. చివరకు వనపర్తి జట్టు 5–4 గోల్స్ తేడాతో కరీంనగర్ జట్టుపై విజయం సాధించి చాంపియన్షిప్ను కై వసం చేసుకుంది. మహబూబ్నగర్, గద్వాల జట్లు సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి. సెమీస్లో పోరాడి ఓడిన మహబూబ్నగర్ మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్లో వనపర్తి, మహబూబ్నగర్ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మ్యాచ్ ముగిసే సమయానికి రెండు జట్లు ఎలాంటి గోల్స్ చేయలేదు. దీంతో టై బ్రేకర్ నిర్వహించగా వనపర్తి జట్టు 4–2 గోల్స్ తేడాతో మహబూబ్నగర్ జట్టుపై గెలుపొందింది. రెండో సెమీఫైనల్లో కరీంనగర్ జట్టు 3– 2 గోల్స్ తేడాతో జోగులాంబ గద్వాల జట్టుపై విజయం సాధించింది. -
20 ఏళ్ల లోపు వ్యక్తులకు గుండెపోటు
20 ఏళ్ల కిందట 50 ఏళ్లు దాటిన వృద్ధులకు మాత్రమే వచ్చేది. నేడు మారిన జీవన శైలితో 20 ఏళ్ల యువకుల నుంచి 70ఏళ్ల వృద్ధుల వరకు వస్తోంది. 30 ఏళ్ల యువకులు అధికంగా ఉంటున్నారు. ఒత్తిడి, ధూ మపానం, మద్యం, షుగర్, బీపీ, లావు, చెడు కొలస్ట్రాల్ పెరగడం ప్రధాన కారణం. ప్రతి ఒక్కరూ జీవనశైలి, ఆహార అలవాట్లు మార్చుకోవాలి. – సంపత్కుమార్ సింగ్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, నారాయణపేటచిన్న వయస్సు వారికి పెరిగాయి గుండెపోటు ఒకటే సమస్య కాదు. లయబద్ధంగా కొట్టుకోకపోవడం, చిన్న వయసులో జనటిక్ సమస్యలతో గుండె బలహీనపడుతోంది. కరోనా తర్వాత చిన్న వయస్కులు, అందులో పురుషులకు ఎక్కువగా గుండెపోటు వస్తోంది. బేకరిఫుడ్, బిర్యానీ, మాంసం తక్కువగా తీసుకోవాలి. బరువును అదుపులో ఉంచుకోవాలి. జిల్లాలో కొవిడ్ కారణంగా ఽ50నుంచి 60శాతం గుండె నొప్పి సమస్యలు పెరిగాయి. – బాలశ్రీనివాస్, జనరల్ ఫిజిషియన్ పంచ సూత్రాలు పాటించాలి కొందరిలో పుట్టినప్పటి నుంచే గుండె కండరాలు కొంత లావుగా ఉండడంతో సడెన్గా రన్నింగ్, డ్యాన్స్, జిమ్ చేస్తే గుండెపోటు వస్తోంది. ప్రతిరోజూ 6నుంచి 7గంటల నిద్ర, గంట వ్యాయామం, సరైన ఆహారం, 3–4లీటర్ల నీరు తాగడం, ప్రశాంతమైన జీవనం గడపాలి. ప్రజావాసాల్లో ఎయిడ్ సిస్టమ్స్ ఏర్పాటుతోపాటు సీపీఆర్పై అవగాహన పెరగాలి. – మహేశ్బాబు, గుండె వైద్యునిపుణుడు ● -
స్పోర్ట్స్ హబ్గా అభివృద్ధి చేసుకుందాం
మహబూబ్నగర్ను స్పోర్ట్స్ హబ్గా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. స్థానిక మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల ఫుట్బాల్ టోర్నీలో విన్నర్, రన్నరప్, మూడోస్థానం నిలిచిన జట్లకు ఆయన ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహబూబ్నగర్లో ఈ ఏడాది పలు రాష్ట్రస్థాయి టోర్నీలు నిర్వహించినట్లు తెలిపారు. మహబూబ్నగర్లో క్రీడా వసతుల ఏర్పాటు కోసం సీఎం రేవంత్రెడ్డి, రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. రాబోయే రోజుల్లో టోర్నీలు నిర్వహించడానికి ముందుకు వచ్చే వారికి అన్ని విధాల వసతులు కల్పించేలా కృషి చేస్తానన్నారు. రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి జీపీ ఫాల్గుణ మాట్లాడుతూ.. వర్షం వచ్చినప్పటికీ టోర్నమెంట్ను విజయవంతంగా నిర్వహించిన మహబూబ్నగర్ అసోసియేషన్ సభ్యులను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఫుట్బాల్లో ప్రతిభ చాటే వారికి మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని కోరారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు, జిల్లా ఫుట్బాల్ సంఘం అధ్యక్షులు వెంకటేశ్, ప్రధాన కార్యదర్శి భానుకిరణ్, ఉపాధ్యక్షులు రమేష్, రంగారావు, శంకర్లింగం, గజానంద్కుమార్, రాష్ట్ర సంఘం కోశాధికారి గణపతి, వనపర్తి జిల్లా అధ్యక్షులు కృష్ణకుమార్రెడ్డి, నాగేశ్వర్, నందకిషోర్, జేమ్స్ ఇమ్మాన్యుయేల్, రామకృష్ణ, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్లో బతుకమ్మ వేడుకలు
బతుకమ్మ ఆడుతున్న మహిళ ఉద్యోగులు కలెక్టరేట్లో ఆదివారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీపీఆర్ఓ, మెప్మా, అగ్నిమాపక శాఖ, ఎస్సీ కార్పొరేషన్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీరింగ్ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మహిళా ఉద్యోగులు, చిన్నారులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి పాటలు పాడుతూ.. కోలాటం వేస్తూ సందడి చేశారు. ప్రకృతికే అందం మన బతుకమ్మ సంబురమని, సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు డీపీఆర్ఓ శ్రీనివాస్ తెలిపారు. – జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్) -
తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి
మోమిన్వాడి పాఠశాలకు వెళ్లే రోడ్డు ఎక్కడికక్కడ ధ్వంసమైంది. పెద్ద నాలాదీ అదే పరిస్థితి. తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ గల్లీ లోపలికి వెళ్లాలంటేనే ఆందోళనగా ఉంది. ముఖ్యంగా విద్యార్థులకు ఎప్పుడు ఏమవుతోందని భయమేస్తుంది. ఈ విషయమై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం దక్కడం లేదు. ఇప్పటికై నా సీసీరోడ్డుతో పాటు వరదకాల్వను పటిష్టంగా నిర్మించాలి. అవసరమైతే గోడ లేదా పెద్ద జాలీ ఏర్పాటు చేయాలి. – పాషా, రిటైర్డ్ కానిస్టేబుల్, గోల్ మసీదు ప్రాంతం అసలే మా ప్రాంతం గుట్టపై ఉంటుంది. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో మట్టిరోడ్డు కాస్తా బురదమయంగా మారుతోంది. మోరీలు లేకపోవడంతో అంతా అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. నెల రోజుల క్రితం మా పెద్దబ్బాయి డెంగ్యూ బారిన పడి.. ఇప్పుడే కోలుకున్నాడు. సీసీ రోడ్డు వేస్తామని ఇటీవల కాంట్రాక్టర్ వచ్చి కొంత భాగం చదును చేసి వెళ్లిపోయారు. ముందుగా డ్రెయినేజీ నిర్మించాలని కోరడంతో మళ్లీ ఇటువైపు రానేలేదు. ఈ విషయమై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు పలుసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదు. – రుక్మిణి, గృహిణి, కల్వరికొండ, న్యూమోతీనగర్ నగర పరిధిలో చేపట్టిన సీసీరోడ్లు, డ్రెయినేజీ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటాం. ఈ విషయమై సంబంధిత కాంట్రాక్టర్లకు తగు ఆదేశాలు జారీ చేస్తాం. ఆయా డివిజన్లలో కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రజల నుంచి అనేక విజ్ఞప్తులు వస్తున్నది వాస్తవమే. నిధుల మంజూరును బట్టి దశల వారీగా అన్ని పనులు చేపడతాం. ముఖ్యంగా ఆస్తిపన్ను, నల్లా బిల్లులను సకాలంలో చెల్లించి నగర అభివృద్ధికి అందరూ సహకరించాలి. – టి.ప్రవీణ్కుమార్రెడ్డి, కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్ ● -
కాంగ్రెస్ బకాయి కార్డు ఉద్యమం
కాంగ్రెస్ దోఖాను ప్రజలకు గుర్తుచేయడానికే ‘కాంగ్రెస్ బకాయి కార్డు’ ఉద్యమాన్ని ప్రారంభించామని కేటీఆర్ అన్నారు. స్థానిక ఎన్నికలకు ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను ప్రజలు ఈ బాకీ కార్డు చూపించి నిలదీయాలన్నారు. కాంగ్రెస్కు ఓటేసి మోసపోయిన తెలంగాణ ప్రజలు నేడు గోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో కనుమరుగైన యూరియా బస్తాల క్యూలైన్లు ఈ ప్రభుత్వ అసమర్థత వల్ల మళ్లీ వచ్చాయని, లైన్లలో నిలబడి రైతులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా ఇవ్వకుండా, రైతుబంధు వేయకుండా, వడ్లకు బోనస్ చెల్లించకుండా రేవంత్రెడ్డి రైతులను అరిగోస పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో నడుస్తున్నది కాంగ్రెస్– బీజేపీ జాయింట్ వెంచర్ ప్రభుత్వం అని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రం దివాలా తీసిందని చెబుతూ తెలంగాణ పరువును బజారుకీడుస్తున్నారని, హామీలపై నిలదీస్తే ‘నన్ను కోసుకు తింటారా?’ అని మాట్లాడటం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. మాట తప్పిన రేవంత్రెడ్డిని ఎన్నికల్లో రాజకీయంగా బొంద పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలను గాలికొదిలేసి, అడ్డగోలు మాటలతో తెలంగాణ పరువు తీస్తున్న రేవంత్ సర్కార్కు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ● అచ్చంపేటలో ఎవరో పార్టీ వీడారని బాధపడాల్సిన అవసరం లేదని, ప్రజల అభిమానం ఉన్న నాయకుడిని కేసీఆర్ త్వరలోనే పంపిస్తారని కేటీఆర్ భరోసా ఇచ్చారు. తిరిగి కేసీఆర్ సీఎం కావాలంటే అచ్చంపేటలో గులాబీ జెండా ఎగరాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామిరెడ్డి, నవీన్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, లక్ష్మారెడ్డి, రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్రెడ్డి, హర్షవర్ధన్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, నాయకులు మనోహర్, శ్రీకాంత్భీమ, నర్సింహగౌడ్, రమేష్రావు, రజినీ సాయిచంద్, తదితరులు పాల్గొన్నారు. బలహీన వర్గాల స్ఫూర్తిప్రదాత బీపీ మండల్ -
చోరీల కట్టడికి గస్తీలు
● రాత్రివేళ పెట్రోలింగ్, బ్లూకోర్ట్స్ వాహనాలు తిరిగేలా చర్యలు ● జిల్లాకేంద్రంలో 250 ఎన్పీఆర్, 110 వైర్లెస్ కెమెరాల ఏర్పాటు ● ప్రయాణాలు చేసేవారు విలువైన వస్తువులు మెడలో వేసుకోరాదు ● ఇళ్లకు తాళం వేసే దాంట్లో కూడా జాగ్రత్తలు అవసరం ● ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు మహబూబ్నగర్ క్రైం: దసరా పండగ నేపథ్యంలో ప్రతిఒక్కరూ స్వగ్రామాలు, ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ఇంట్లో విలువైన వస్తువులు చోరీ కాకుండా, ప్రయాణాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శనివారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో చేపట్టిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు పలువురు అడిగిన అనుమానాలను నివృత్తి చేశారు. వివరాలిలా.. ● ప్రశ్న: మహబూబ్నగర్ బైపాస్, ఏనుగొండ మార్గాల్లో రాత్రివేళ ఓపెన్ డ్రికింగ్ ఉంటుంది. దీంతో ఏనుగొండ నుంచి బైపాస్, హౌసింగ్ బో ర్డు, ఎదిర రోడ్డు మార్గాల్లో మహిళలు వెళ్లడం కష్టంగా ఉంది. – కల్యాణి, హౌసింగ్ బోర్డు ● డీఎస్పీ: ఏనుగొండ నుంచి బైపాస్, ఎదిర రోడ్డు మార్గాల్లో రాత్రివేళ పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారు. ఇకపై ప్రత్యేకంగా దృష్టిపెట్టి గస్తీ పెంచి ఆరుబయట మద్యం తాగకుండా చర్యలు తీసుకుంటాం. -
లక్కీడిప్ ద్వారా ‘ప్రాదేశిక’ రిజర్వేషన్లు
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మరో ముందడుగు పడింది. ఇందులో ముఖ్యమైనది రిజర్వేషన్ ప్రక్రియ. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ 9ని విడుదల చేసింది. దీనికి అనుగుణంగా రిజర్వేషన్లు అధికారులు ఖరారు చేశారు. శనివారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో కలెక్టర్ విజయేందిర ఆధ్వర్యంలో లక్కీడిప్ ద్వారా జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లు కేటాయించారు. ఈ ప్రక్రియ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు కొనసాగిన తర్వాత ఎంపీటీసీలు, సర్పంచ్ల రిజర్వేషన్ల ఎంపిక ప్రక్రియ చేపట్టారు. -
హోరాహోరీగా..
● రాష్ట్రస్థాయి సీనియర్ ఫుట్బాల్ పోటీలు ● సెమీస్కు మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల, కరీంనగర్ జట్లు మహబూబ్నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల ఫుట్బాల్ పోటీలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. వర్షం కారణంగా మహబూబ్నగర్ మెయిన్ స్టేడియంలో జరగాల్సిన లీగ్ మ్యాచ్లను శనివారం జడ్చర్ల పట్టణంలో నిర్వహించారు. ఆతిథ్య మహబూబ్నగర్ పురుషుల జట్టు సెమీస్కు చేరింది. క్వార్టర్ఫైనల్ మ్యాచ్లో మహబూబ్నగర్ జట్టు 1–0 గోల్స్ తేడాతో రంగారెడ్డి జట్టుపై విజయం సాధించింది. క్వార్టర్ఫైనల్ మ్యాచ్లో కరీంనగర్ 1–0 గోల్స్ తేడాతో సిద్దిపేట జట్టుపై విజయం సాధించి సెమీస్కు చేరింది. టై బ్రేకర్ ద్వారా ఫలితాలు వనపర్తి–మెదక్ జట్ల మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠంగా సాగింది. మ్యాచ్ సమయానికి చెరో జట్లు రెండేసీ గోల్స్ కొట్టగా టై బ్రేకర్ నిర్వహించారు. ఈ టై బ్రేకర్లో వనపర్తి జట్టు 4–3 గోల్స్ తేడాతో మెదక్ జట్టుపై గెలుపొందింది. మరో క్వార్టర్ఫైనల్ మ్యాచ్లో గద్వాల–ఆదిలాబాద్ జట్లు గోల్స్ చేయకపోవడంతో టై బ్రేకర్ నిర్వహించారు. గద్వాల జట్టు 3–1 గోల్స్ తేడాతో ఆదిలాబాద్ జట్టుపై గెలుపొంది సెమీస్లో ప్రవేశించింది. సెమీఫైనల్ మ్యాచ్లు మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్లో మహబూబ్నగర్ వర్సెస్ వనపర్తి, రెండో సెమీస్లో గద్వాల వర్సెస్ కరీంనగర్ జట్లు తలపడనున్నాయి. లీగ్ మ్యాచ్ల ఫలితాలు అంతకుముందు జరిగిన లీగ్ మ్యాచుల్లో సిద్దిపేట జట్టు 2–1 గోల్స్ తేడాతో నల్గొండపై, మెదక్ జట్టు 2–0 గోల్స్ తేడాతో గద్వాల జట్టుపై, రంగారెడ్డి జట్టు 6–0 గోల్స్ తేడాతో సిద్దిపేట జట్టుపై, గద్వాల జట్టు 4–0 గోల్స్ తేడాతో వరంగల్ జట్టుపై విజయం సాధించాయి. వనపర్తి–ఆదిలాబాద్, మహబూబ్నగర్–కరీంనగర్ జట్ల మధ్య జరిగిన మ్యాచుల్లో నిర్ణీత సమయంలో జట్లు గోల్స్ చేయకపోవడంతో డ్రాగా ముగిశాయి. క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు ఉ మ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు, జిల్లా ఫు ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్పీ వెంకటేశ్ అ న్నారు. జడ్చర్లలో జరుగుతున్న రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల ఫుట్బాల్ టోర్నీలో శనివారం క్రీడాకారుల ను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి స్వ యంగా క్రీడాకారుడు అయినందున క్రీడలకు అ త్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. గ్రామీణస్థాయిలో క్రీడాకారుల ను ప్రోత్సహించడానికి సీఎం కప్ నిర్వహించినట్లు తెలిపారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటవుతున్నట్లు తెలిపారు. వర్షం పడుతున్నప్పటికీ క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో ఆడడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జిల్లా ఫుట్బా ల్ అసోసియేషన్ సభ్యులు గజానంద్కుమార్, నాగేశ్వర్, నంద కిషోర్, జడ్చర్లకు చెందిన కృష్ణయ్య, మోయిన్, శ్రీనివాస్, శ్రీహరి, జేమ్స్, రామకృష్ణ, రాంరెడ్డి, నిరంజన్ పాల్గొన్నారు. -
నగల దుకాణంలో చోరీ
● గోడకు కన్నం వేసిన దొంగలు ● 7 కేజీల వెండి, తులంన్నర బంగారం అపహరణ మక్తల్: గుర్తు తెలియని వ్యక్తులు జూవెలర్స్లో దొంగతనానికి పాల్పడిన ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పట్ట ణంలో బస్టాండ్ సమీపంలోని మహాలక్ష్మి జూవెలర్స్లో షాపు వెనుక భాగం గోడకు రంధ్రం చేసి లా కర్లలోని 7 కేజీల వెండి, తులంన్నర బంగారం, రూ.30 వేల నగదును దొంగలు దోచుకెళ్లారు. అదే విధంగా పక్కన ఉన్న పానీపూరి షాపులో రూ.6 వే లు నగదు ఎత్తుకెళ్లారు. శనివారం ఉదయం షాపుల యాజమానులు షాపు తెరిచి చూడగా దొంగతనం జరిగినట్లుగా గుర్తించారు. జూవెలర్స్ యాజమాని రఘు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ రాంలాల్, ఎస్ఐ భాగ్యలక్ష్మీరెడ్డి, నారాయణపేట క్లూటీం ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. జూవెలర్స్ యాజమాని రఘు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన్నట్లు ఎస్ఐ తెలిపారు. పట్టణంలో వరుస దొంగతనాలు జరుగుతుండటంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పర్యాటకరంగ అభివృద్ధికి ప్రాధాన్యం
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ అన్నారు. శనివారం ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లా డారు. ఉమ్మడి జిల్లాలో అనేక దర్శనీయ స్థలా లు, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, ప్రత్యేకించి నల్లమల అటవీ ప్రాంతం, జూరాల ప్రాజె క్టు, పిల్లలమర్రి, సోమశిల, కోయిల్సాగర్, సరళసాగర్, జోగుళాంబ శక్తిపీఠం, కురుమూర్తి, మన్యంకొండ వంటి ప్రసిద్ధ ఆలయాలు, దర్శనీయ స్థలాలు ఉన్నాయన్నారు. అలాగే సంస్థానాధీశులు కట్టించిన అనేక కోటలు, ప్రకృతి రమణీయ స్థలాలు, వ్యూ పాయింట్స్ సైతం అనేకం ఉన్నాయని పేర్కొన్నారు. పర్యాటక ప్రదేశాల ద్వారా ప్రాచీన చరిత్ర, వారసత్వ సంపద, సంస్కృతి భావితరాలకు తెలుస్తుందన్నారు. పర్యాటక ప్రదేశాలలో స్వచ్ఛత, పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించాలని, పర్యాటక ప్రాంతాలు స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉంటేనే ఎక్కువ మంది వస్తారన్నా రు. జిల్లా పర్యాటకశాఖ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన పిల్లలమర్రిని ఇటీవల ప్రపంచ సుందరీమణులు సందర్శించారని, బతుకమ్మ ఉత్స వాల్లో భాగంగా పర్యాటక కేంద్రం పిల్లలమర్రిలో ఈ నెల 22న బతుకమ్మ వేడుకలు నిర్వహించామన్నారు. అనంతరం బాలకేంద్రం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. టీఎస్ఎస్ కళాకారులు మహబూబ్నగర్ పర్యాటకంపై పాటలు పాడి అలరించారు. ఉపన్యాస, వ్యాసరచన, చిత్రలేఖన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు జ్ఞాపి కలు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో డీఐఎస్ఓ కౌసర్ జహాన్, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి జరీనాబేగం, పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్, పౌర సరఫరాల డీఎం రవి నాయక్, గిరిజన అభివృద్ధి అధికారి జనార్దన్, టీఎన్జీఓ అధ్యక్షుడు రాజీవ్రెడ్డి పాల్గొన్నారు. -
పెంకుటిల్లు కూలి బాలుడు మృతి
● ముగ్గురు చిన్నారులకు తప్పిన ముప్పు మక్తల్: జూరాల వెనుక జ లాల్లో ముంపునకు గురైన మండలంలోని అనుగొండలో శనివారం పెంకుటి ల్లు కూలి ఓ బాలుడు మృతిచెందాడు. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామాని కి చెందిన సురేష్, జమున దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నాయి. పెద్ద కుమా రుడు ఆదిత్య (10) హైదరాబాధ్లో అవ్వ దగ్గర ఉండి 5వ తరగతి చదువుకుంటుండగా.. దసరా సెలవులు రావడంతో స్వగ్రామానికి వచ్చాడు. శనివారం తోటి ముగ్గురు స్నేహితులతో కలిసి ఇంటి పక్కనే ఉన్న పెంకుటింట్లో ఆడుకుంటుండగా ఒక్కసారిగా కూలిపోయింది. ఆదిత్య పెంకుల మధ్యన ఇరుక్కుపోగా మిగతా వారు బయటకు పరుగెత్తారు. చుట్టపక్కల వారు అక్కడికి చేరుకొని తీవ్రంగా గాయపడిన బాలుడిని వెంటనే మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. తండ్రి సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ భాగ్యలక్ష్మిరెడ్డి తెలిపారు. విద్యార్థిపై దాడి కేసులో రిమాండ్ మహబూబ్నగర్ క్రైం: పాలిటెక్నిక్ విద్యార్థిపై జరిగిన దాడి కేసులో ఇద్దరిని రిమాండ్కు తరలించగా మరో యువకుడు పరారీలో ఉన్నాడు. దాడి కేసు వివరాలను శనివారం వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ అప్పయ్య వెల్లడించారు. మూసాపేటకు చెందిన సాయిచరణ్ తన స్నేహితులు అఖిల్, మూర్తి, రామ్చరణ్తో కలిసి ఈ నెల 16న సాయంత్రం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నుంచి బస్టాండ్కు వెళ్లడానికి బండ్లగేరి మీదుగా వస్తున్నారు. గణేష్నగర్ సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద శివ, మల్లేష్, హర్ష అనే ముగ్గురు యువకులతో పాటు మరికొందరు కలిసి సాయిచరణ్ అతని స్నేహితులను అడ్డగించి రూ.20 కావాలని అడిగారు. ఈ క్రమంలో విద్యార్థులు డబ్బులు లేవని వెళ్లిపోతుండగా సాయిచరణ్పై మల్లేష్, శివ దాడి చేశారు. బాధితుడికి తీవ్రగాయం కావడంతో స్నేహితులు ఆస్పత్రికి తరలించారు. శనివారం రైల్వే స్టేషన్లో దాడి చేసిన యువకులు శివ, హర్షను అదుపులోకి తీసుకోగా మరో యువకుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ శీనయ్య తదితరులు పాల్గొన్నారు. ముగ్గురు రిమాండ్ మహబూబ్నగర్ క్రైం: మద్యం తాగిన తర్వాత ఇంటి దగ్గర విడిచిపెడతాం అంటూ ముగ్గురు వ్యక్తులు కలిసి ఒకరిపై దాడి చేసి సెల్ఫోన్, బ్యాగ్ ఎత్తుకెళ్లిన కే సులో టూటౌన్ పోలీసులు ముగ్గురిని రిమాండ్కు తరలించారు. టూటౌన్ పోలీస్స్టేషన్లో శనివారం ఏర్పా టు చేసిన సమావేశంలో ఎస్ఐ విజయ్భాస్కర్ వివరాలు వెల్లడించారు. తిర్మలాయిపల్లికి చెందిన నరేష్, శ్రీకాంత్, రామస్వామి ముగ్గురు కలిసి ఈ నెల 26న రాత్రి మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని పాలమూరు మద్యం దుకాణంలో మద్యం తా గుతున్న క్రమంలో మె ట్టుగడ్డకు చెందిన బీఎంఎస్ వైద్యుడు నర్సింహతో పరిచయం పెంచుకున్నారు. ఆ తర్వాత నలుగురు కలిసి మద్యం తాగిన తర్వాత రాత్రి 10 గంటల సమయంలో నర్సింహను ఇంటి దగ ్గర విడిచిపెడుతాం అంటూ బైక్పై ఎక్కించుకుని ఎదిర శివారుకు తీసుకువెళ్లి అతనిపై దాడి చేసి ఫోన్, బ్యాగ్ ఎత్తుకువెళ్లారు. ఈ ఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ వెల్లడించారు. -
గంగమ్మ గలగల
● జూరాలకు భారీగా వరద ● ప్రాజెక్టు 39 క్రస్టుగేట్ల ఎత్తివేత ● 4.64లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల ధరూరు/దేవరకద్ర/మదనాపురం: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదకు అనుగుణంగా ప్రాజెక్టుల గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు శుక్రవారం రాత్రి 9 గంటల వరకు 2.41లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. శనివారం రాత్రి 7:30 గంటల వరకు ఇన్ఫ్లో 4.31లక్షల క్యూసెక్కులకు పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు వద్ద 39 క్రస్టుగేట్లను ఎత్తి 4,63,982 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.068 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. నిలిచిన విద్యుదుత్పత్తి ఆత్మకూర్: జూరాలకు భారీగా వరద వస్తుండటంతో జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఇప్పటి వరకు ఎగువ, దిగువ కేంద్రాల్లో 741.652 మి.యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ● భారీ వర్షాలతో కోయిల్సాగర్ ప్రాజెక్టుకు వరద పెరగడంతో 6 గేట్లను తెరిచి 10వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. శుక్రవారం నుంచి ప్రాజెక్టు గేట్లను తెరవడంతో సందర్శకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఓవైపు వర్షం కురుస్తున్నా సందర్శకులు మూసిన గేట్ల నుంచి జాలువారుతున్న నీటిలో మునిగి తేలారు. పిల్లలు, పెద్దలు నీటిలో ఈదుతూ సెల్ఫీలు దిగారు. కొందరు యువకులు చేపలు పడుతూ కనిపించారు. ● రామన్పాడు జలాశయానికి వరద ఉధృతి పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తో డు కోయిల్సాగర్, సరళాసాగర్ జలాశయాల నుంచి భారీగా వరద వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జలాశయం 6 గేట్లు ఎత్తి 36వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ● సరళాసాగర్ ప్రాజెక్ట్కు భారీగా వరద వచ్చి చేరడంతో సైఫాన్లు ఆటోమెటిక్గా తెరుచుకున్నాయి. 3 ప్రైమరీ, 3 వుడ్ సైఫన్ల ద్వారా 11,859 క్యూసెక్కుల నీరు దిగువకు పారుతోంది. మదనాపురం సమీపంలోని వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. మదనాపురం వద్ద కాజ్వే మునిగిపోయింది. వనపర్తి, ఆత్మకూర్, అమరచింత, చిన్నచింతకుంట, మదనాపూర్, కొత్తకోట మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
హైవేపై తప్పిన ప్రమాదం
ఎర్రవల్లి: 44వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ట్యాంకర్ను బొలెరో ఢీ కొట్టడంతో ఆరుగురికి తీవ్ర గాయాలైన ఘటన చోటు చేసుకుంది. కోదండాపురం ఎస్సై మురళి కథనం ప్రకారం.. ఘట్కేసర్ నుంచి తొమ్మిది మంది కూలీలతో బొలెరో బెంగళూరుకు వెళ్తుంది. శుక్రవారం అర్ధరాత్రి జాతీయ రహదారిపై వేముల స్టేజీ సమీపంలో వెళ్తుండగా.. బొలెరో బ్రేక్డౌన్ కావడంతో రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్యాంకర్ను అదుపు తప్పి వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరోలో ప్రయాణిస్తున్న ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా.. కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బొలెరో వెనకాలే 40మంది ప్రయాణికులతో వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి రోడ్డు కింద పల్టీ కొట్టడంతో అందులోని ప్రయాణికులంతా తేలికపాటి గాయాలతో బయటపడినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ● ట్యాంకర్ను ఢీకొన్న బొలెరో ● ఆరుగురికి తీవ్ర గాయాలు -
కాత్యాయని.. కనికరించమ్మా
● అలంపూర్ ఆలయాల్లో కొనసాగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు ● ఆరోరోజు ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు అలంపూర్: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం ఆరోరోజు జోగుళాంబ అమ్మవారు క్యాతాయని దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని ప్రత్యేక మండపంలో కొలువుదీరిన కాత్యాయనిదేవిని అర్చకులు విశేష పూజలతో ఆరాధించారు. కొలువు, కుమారి, సువాసిని పూజలతో పాటు దర్బారు సేవ, మంత్ర పుష్పములతో పూజించారు. అనంతరం మహా మంగళహారతినిచ్చారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో ఆరోరోజు జోగుళాంబ అమ్మవారిని కాత్యాయనిదేవిగా భక్తులు పూజిస్తారని.. వ్యాఘ్రవాహిణిగా(పులిని వాహనంగా ధరించి) భక్తులకు దర్శనమిస్తుందని అర్చకులు వివరించారు. మాతను ఆరాధించడంతో అనుష్టానపరులకు అతీత శక్తులు ప్రాప్తిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసంగా పేర్కొన్నారు. అలాగే జోగుళాంబ అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలు, సహస్రనామ అర్చన, చండీహోమాలు, నవావరణ అర్చనలు విశేషంగా జరిగాయి. అమ్మవారిని దర్శించుకోడానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం అమ్మవారి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. దర్శించుకున్న మహబూబ్నగర్ కలెక్టర్.. అలంపూర్ ఆలయాలను మహబూబ్నగర్ కలెక్టర్ విజయేందిర బోయి కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం పలికారు. -
ఏటీసీలో కార్పొరేట్ స్థాయి శిక్షణ
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: నూతనంగా ప్రారంభించిన ఏటీసీ సెంటర్లో విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య, శిక్షణ అందించనున్నట్లు ఎమ్మెల్యే యె న్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని మెట్టుగడ్డ వద్ద ఉన్న ఐటీఐ కళాశాలలో రూ.6.76 కోట్ల వ్య యంతో నిర్మించిన నూతన ఏటీసీ సెంటర్ను ఆన్లైన్ ద్వారా సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించగా.. నేరుగా కలెక్టర్ విజయేందిర, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది స్కిల్స్ ఉన్న యువత అవసరం ఉందని, కానీ, ఆ స్థాయిలో యువత అందుబాటులో లేరన్నారు. ఇందులో భాగంగా అవసరమైన స్కిల్స్ ఉన్న యువతను సిద్ధం చేసేందుకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 65 అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లను ప్రారంభించిందన్నారు. ఇక్క డ ఏర్పాటు చేసి దీన్ని స్కిల్ యూనివర్సిటీకి అనుసంధానం చేస్తామన్నారు. ఇక్కడ శిక్షణ తీసుకుంటున్న యువతకు వచ్చే సంవత్సరం నుంచి రూ.2 వేల స్టైఫండ్ కూడా ఇస్తామని, ఖర్చుతో కూ డుకున్న బీటెక్ లాంటి కోర్సుల ద్వారా వచ్చే శిక్షణ నేరుగా ఏటీసీ సెంటర్ ద్వారా పొందేందుకు అవకాశం లభిస్తుందన్నా రు. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీలు ఇక్కడ చదివిన విద్యార్థులను రిక్రూట్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అనిత, మధుసూదన్రెడ్డి, ప్రిన్సిపాల్ శాంతయ్య, ఆనంద్గౌడ్, సిరాజ్ఖాద్రీ, అజ్మత్ఆలీ, సాయిబాబ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం
● మరొకరికి తీవ్ర గాయాలు ● అడ్డాకుల వద్ద హైవేపై లారీని ఢీకొట్టుకున్న ట్రాలీ ఆటో ● యజమాని సహా 48 గొర్రె పొట్టేళ్ల మృతి అడ్డాకుల: అడ్డాకుల శివారులోని 44వ నంబర్ జా తీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక రు మృతి చెందగా.. ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడిన ఘటన శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని సత్యసాయి జిల్లా చెన్నకొత్తపల్లి మండలం దామా జుపల్లికి చెందిన ఆది నారాయణ(62) గొర్రె పొట్టేళ్లను పెంచాడు. దసరా పండగ సమీపిస్తున్న నేపథ్యంలో వాటిని అమ్ముకోవాలని ట్రాలీ ఆటోలో 84 గొర్రె పొట్టేళ్లను ఎక్కించుకుని శుక్రవారం డ్రైవర్ క మతం కాటమయ్యతో కలిసి హైదరాబాద్కు బయ లు దేరాడు. మార్గమధ్యంలో అడ్డాకుల శివారులోని శివయాదవ్ హోటల్ సమీపంలో తెల్లవారుజామున ముందు వెళ్తున్న రాజస్థాన్ లారీని వెనుకనుంచి ట్రాలీ ఆటో ఢీకొట్టుకుంది. దీంతో ఆటో క్యాబిన్ నుజ్జునుజ్జవడంతో ఇద్దరు అందులోనే ఇరుక్కుపోయారు. ఎడమ వైపు కూర్చున్న ఆది నారాయణ దుర్మరణం చెందాడు. ఆటో డ్రైవర్ కమతం కాటమయ్య అందులో ఇరుక్కుపోగా పోలీసులు అతికష్టం మీద బయటకు తీశారు. ప్రమాదంలో అతని కాలు విరిగింది. ప్రమాద ఘటనతో రోడ్డుపై చాలాసేపు ట్రా ఫిక్ నిలిచి పోయింది. టోల్ప్లాజా సిబ్బందితో కలిసి పోలీసులు ఆటోను రోడ్డు పక్కకు తీశారు. తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్ను అంబులెన్స్లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆది నారాయణ మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రి మార్చురీకి తీసుకెళ్లారు. మృతుడికి భార్య ఆదెమ్మ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఇదిలా ఉండగా ఆటోలో 84 గొర్రె పొట్టేళ్లు ఉండగా ప్రమాదంలో 48 గొర్రె పొట్టేళ్లు మృతి చెందాయని, వాటి విలువ సుమారు రూ.5లక్షల వరకు ఉంటుందని మృతుడి కుమారుడు శివ తెలిపారు. ప్రమాద ఘటనపై శివ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. -
బాలుడి శ్వాసనాళంలో సీతాఫలం గింజ
పాలమూరు: సీతాఫలం గింజ శ్వాసనాళంలో ఇరుక్కుపోయిన బాలుడి ప్రాణాలు కాపాడింది ఎస్వీఎస్ వైద్య బృందం. పూర్తి వివరాలు.. తిమ్మాజిపేట మండలం ఆవంచకు చెందిన రవీందర్రెడ్డి, నిర్మల మూడేళ్ల కుమారుడు హర్షవర్ధన్ శుక్రవారం సీతాఫలం తింటున్న క్రమంలో ప్రమాదవశాత్తు గింజ గొంతులోకి జారిపోవడంతో శ్వాస తీసుకోవడానికి అవస్థలు పడ్డారు. వెంటనే కుటుంబ సభ్యులు ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించడంతో చిన్న పిల్లల విభాగం హెచ్ఓడీ డాక్టర్ శైలజ, ప్రొఫెసర్ సోరేన్ సిటీస్కాన్ చేసి శ్వాసనాళంలో సీతాఫలం గింజ ఇరుక్కుపోయి ఊపిరితిత్తులు మూసుకుపోయినట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఊపిరితిత్తుల వైద్య నిపుణుడు తుమ్మూరు వెంకటేశ్వరరెడ్డి అత్యాధునిక పద్ధతి రిజిడ్ బ్రాంకోస్కోపీ ద్వారా శ్వాసనాళం నుంచి సీతాఫలం గింజ వెలికి తీశారు. క్లిష్టమైన చికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన వైద్య బృందానికి బాలుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. చికిత్సలో వైద్య నిపుణులు శరత్చంద్ర, రాజశేఖర్, సుమ్మయ్య, ఐశ్వర్య, నమ్రత, స్వాతి, కమల్, వీణామేరి, సౌమ్య, చైతన్య పాల్గొన్నారు. చికిత్స చేసి తొలగించిన వైద్యులు -
అందుబాటులో ఉంచాలి
చెంచు పెంటల్లోని చెంచులకు ప్రతినిత్యం ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండే విధంగా అప్పాపూర్లో ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలి. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినప్పుడే రోగాలు రావాలని లేదు. ఉపాధి కోసం తరచుగా అడవిలోకి వెళ్లినప్పుడు అనారోగ్యం భారిన పడే ప్రమాదం ఉన్నందున్న అప్పాపూర్లో కేంద్రం ఏర్పాటు చేస్తే అందరికీ మంచిగా ఉంటుంది. – నడిపి లింగయ్య, భౌరాపూర్ పెంట అందుబాటులోనే ఉంటున్నాం కొంతకాలంగా పీహెచ్సీలో 24 గంటలు రోగులకు అందుబాటులో ఉంటూ వైద్యసేవలు అందిస్తున్నాం. అదేవిధంగా పరిస్థితులను బట్టి, ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం తరచుగా చెంచుపెంటల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ వైద్యం అందుబాటులో ఉంచుతున్నాం. పరిస్థితులను బట్టి మరిన్ని సేవలు అందించేందుకు కృషిచేస్తాం. – సుధాకర్, వైద్యాధికారి, మన్ననూర్ పీహెచ్సీ ● -
దర్శించుకున్న ప్రముఖలు..
అలంపూర్ ఆలయాలను శుక్రవారం ముఖ్యమంత్రి సోదరుడు సోదరుడు తిరుపతిరెడ్డి, సినీనిర్మాత, నటుడు బండ్ల గణేష్, జెడ్పీ మాజీ చైర్పర్సన్, గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ సరిత, డీఎస్పీ మొగులయ్య వేర్వేరుగా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు వారికి స్వాగతం పలికి ఆలయాల్లోప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం అర్చకులు వారిని శేషవస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం పలికారు. అదేవిధంగా గద్వాల సంస్థానాధీశుల కుటుంబసభ్యులు అమ్మవారికి నవరాత్రుల్లో అలంకరించేందుకు చీరను అందజేశారు. వీరివెంట ఆలయ ఈఓ దీప్తి, పాలకమండలి సభ్యులు, ఆలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. -
అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు
మక్తల్: అంతర్ రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు నారాయణపట డీఎస్పీ లింగయ్య తెలిపారు. శుక్రవారం మక్తల్లో పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మక్తల్కు చెందిన రహ్మన్ ఇటీవల పట్టణంలో ఇంటి ఎదుట పార్కు చేసిన బైక్ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారన్నారు. పోలీసులకు ప్రత్యే టీంను ఏర్పాటు చేసి పూర్తి స్తాయిల్లో దర్యాప్తు జరపగా.. కర్ణాటకకు చెందిన దుర్గప్ప, యల్లప్ప ముఠాగా ఏర్పడి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తున్నారు. బైకులను చోరీ చేసి రాయిచూర్లో బైక్ మెకానిక్గా ఉన్న శంషోద్దీన్కు అప్పగించగా ఆయన వీటిని అమ్మేవాడు. దర్యాప్తులో ఈ విషయాలు వెల్లడికావడంతో శుక్రవారం నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించడంతో పాటు ఐదు బైకులను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బంది అశోక్, నరేష్, శ్రీకాంత్ను డీఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో సీఐ రాంలాల్, ఎస్ఐ భాగ్యలక్ష్మీరెడ్డి, ఏఎస్ఐ శంకరయ్య, ఆచారి, అరున్ తదితరులు పాల్గొన్నారు. ఐదు ద్విచక్రవాహనాలు స్వాధీనం -
వ్యక్తి ఆత్మహత్య
మక్తల్: ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా బొ బ్బిలి మండలం పిరిడికి చెందిన శ్రీనివాసనాయుడు(45) పట్టణంలో నివాసముంటూ కర్ణాటక శక్తినగర్లోని శిల్ప కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం విధులు ముగించుకొని ఇంటికి వచ్చాడు. భార్య విజయ పిల్లలతో కలిసి భూ లక్ష్మమ్మ ఆలయానికి వెళ్లి తిరిగి వచ్చేలోపు శ్రీనివాసనాయుడు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహ త్య చేసుకున్నాడు. మృతుడి సోదరుడు నవీన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ భాగ్యలక్ష్మీరెడ్డి తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బైక్ అదుపుతప్పి వ్యక్తి దుర్మరణం● తండ్రి మరణించిన 5 రోజులకే కుమారుడు సైతం.. గోపాల్పేట: బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని తాడిపర్తిలో శుక్రవారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం మేరకు.. నాగర్కర్నూల్ జిల్లా వడ్డెమాన్ గ్రామానికి చెందిన ఏటవాలు రవి(37) వనపర్తికి బైక్పై వెళ్తుండగా తాడిపర్తి వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన రవిని స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఐదు రోజుల క్రితమే మృతుడి తండ్రి మరణించినట్లు తెలిసింది. ప్రమాదంపై గోపాల్పేట ఎస్ఐ నరేష్కుమార్ వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయాలు.. కేసు నమోదు తిమ్మాజిపేట: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. ఏఎస్ఐ సాయి నిర్మలాదేవి వివరాల ప్రకారం.. పూర్తి వివరాలు వివరాలు.. బిజినేపల్లికి చెందిన మునవరోద్దీన్ ఈ నెల 25న గ్రామం నుంచి జడ్చర్లకు తన మిత్రుడితో కలిసి బైక్పై వెళ్తున్నాడు. మార్గ మధ్యలో తిమ్మాజిపేట పెట్రోల్ బంకు సమీపంలో వెంకటేష్ అనే వ్యక్తి వస్తున్న బైక్ను ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్ర మాదంలో గాయపడిన మునవరోద్దీన్ను చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి సోదరుడి అంజత్ ఫిర్యాదు మే రకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ తెలిపారు. కుక్క అడ్డు రావడంతో.. గండేడ్: కుక్క అడ్డం రావడంతో బైక్ అదుపుతప్పి తండ్రి కొడుకులకు గాయాలయ్యాయి. పూర్తి వివరాలు.. మండలంలోని పెద్దవార్వాల్ కు చెందిన ఆశన్న, కుమారుడు మల్లేశ్ శుక్రవా రం మధ్యాహ్నం బైక్పై జక్లపల్లి నుంచి పెద్దవార్వాల్ వెళ్తున్నారు. ఈ క్రమంలో జక్లపల్లి రాయికుంట వద్ద కుక్క అడ్డుగా రావడంతో బైక్ అదుపుతప్పి ఇద్దరు కిందపడ్డారు. ప్రమాదంలో మల్లేశ్కు ఎడమ కాలు విరగ్గా ఆశన్నకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు 108లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
గిరిపుత్రులకు ఆరోగ్య రక్ష
మన్ననూర్: నల్లమల అటవీ లోతట్టు ప్రాంతంలోని అడవి బిడ్డల కోసం తరచుగా ఏర్పాటు చేస్తున్న వైద్య శిబిరాలు ఆరోగ్య రక్షగా నిలుస్తున్నాయి. అటవీ సరిహద్దు ప్రాంతాల్లో అనుకూలించని వాతావరణంతో ఇబ్బందులు పడుతున్న ఆదివాసి చెంచులు తరచుగా అనేక వ్యాధులభారిన పడుతుంటారు. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రవేశపెట్టిన పీఎం జన్మన్, స్వస్త్నారీ పరివార్ అభియాన్తోపాటు అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్, పదర, వటవర్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆయూష్, సంచార వైద్య శిబ్బంది ఆధ్వర్యంలో అప్పాపూర్, భౌరాపూర్, మల్లాపూర్, కొమ్మెన్పెంట తదితర 11లోతట్టు ప్రాంత చెంచు పెంటలు ఉన్నాయి. ఆయా చెంచు పెంటల్లో నెలలో రెండు మూడుసార్లు వైద్య శిబిరాలు నిర్వహిస్తూ చెంచుల ఆరోగ్యాలకు భరోసా కల్పిస్తున్నారు. కొన్ని అత్యవసర పరిస్థితుల్లో 108, 102, ఆర్వీఎం వంటి అంబులెన్స్లు కూడా అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నాయి. పీఎం జన్మన్, స్వస్త్నారీ పరివార్తో వైద్యసేవలు నెలలో రెండుమూడుసార్లు శిబిరాల నిర్వహణ చెంచుల ఆరోగ్యాలకు భరోసా కల్పిస్తున్న వైనం వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు ఆయా చెంచు పెంటలు, గూడాలలోని ప్రజలకు సీజన్కు సంబంధించిన ఎలాంటి అంటువ్యాధులు ప్రభలకుండా ఎప్పటికప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ప్రత్యేక దృష్టి పెట్టి వ్యాధుల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. అదేక్రమంలో మన్ననూర్, అమ్రాబాద్, పదర, వటువర్లపల్లి ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బందిని అందుబాటులో ఉంచే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. – రవికుమార్, డీఎండీహెచ్ఓ నాగర్కర్నూల్ -
జలపాతం.. కనువిందు
నల్లమలలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీశైల ఉత్తర ముఖద్వారమైన ఉమామహేశ్వర క్షేత్రంలో వర్షానికి పాపనాశిని గుండం కొండపై నుంచి జాలువారుతున్న జలపాతం కనువిందు చేస్తోంది. అక్కడ ప్రకృతి రమణీయత సంతరించుకోవడంతో శుక్రవారం పర్యాటకులు అధిక సంఖ్యలో చేరుకొని సందడి చేశారు. యువత కేరింతలు కొడుతూ జలపాతం చిత్రాలను తమ సెల్ఫోన్లో బంధించారు. కాగా, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండటంతో పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని ఆలయ సిబ్బంది సూచించారు. – అచ్చంపేట రూరల్ -
స్కందమాత.. నమోస్తుతే
● అలంపూర్ ఆలయాల్లో ఘనంగా కొనసాగుతున్న నవరాత్రి ఉత్సవాలు ● శుక్రవారం కావడంతో పెరిగిన రద్దీ ● దర్శించుకున్న ప్రముఖులు అలంపూర్: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదోరోజు శుక్రవారం దక్షిణకాశీ అలంపూర్ క్షేత్రంలోని జోగుళాంబ అమ్మవారు స్కందమాతగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన మండపంలో రోజు వివిధ రూపాల్లో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా అర్చక స్వాములు అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలు, నవావరణ, సహస్రనామ అర్చనలు, చండీహోమాలు నిర్వహించడంతో పాటు మహా నివేదన, మహా మంగళహారతులిచ్చారు. స్కందమాత అమ్మవారికి కుమారి పూజ, సువాసిని పూజ విశేషంగా నిర్వహించారు. స్కందమాతను ఆరాధించడంతో షడ్గుణాలు, సత్ప్రవర్తనలు సిద్ధిస్తాయని అర్చకులు వివరించారు. నవరాత్రుల్లో ఐదోరోజు అమ్మవారిని స్కందమాతగా పూ జించడంతో ఒడిదుడుకులు తొలగిపోతాయన్నారు. సాంస్కృతిక ప్రదర్శన అలంపూర్ క్షేత్రంలో దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్కు చెందిన సాయి సన్నిధి కూచిపూడి డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారుల నృత్య ప్రదర్శన భక్తులను ఆహ్లాదపరిచాయి. ఉత్సవాలు ప్రారంభమైన రోజు నుంచి ప్రతిరోజూ సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆలయాల్లో భక్తుల రద్దీ.. నవరాత్రి ఉత్సవాల్లో ఐదోరోజు ఓ విశేషమైతే.. అమ్మవారికి శుక్రవారం ప్రత్యేకరోజు కావడంతో భక్తులు వర్షాన్ని సైతం లెక్కచేయక తరలివచ్చారు. ఆలయాల్లో కొనసాగుతున్న కుంకుమార్చనలు, అభిషేకాలు, అర్చనలు, చండీహోమాల్లో పాల్గొన్నా రు. అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం పలికారు. -
ప్రాజెక్టుల వద్ద జలసవ్వడి
● జూరాలకు 2.41లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ● ప్రాజెక్టు 35 క్రస్టుగేట్ల ఎత్తివేత ధరూరు/దేవరకద్ర/మక్తల్/రాజోళి/ఆత్మకూర్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రాజెక్టుల వద్ద జలసవ్వడి నెలకొంది. శుక్రవారం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు 2.41లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. ప్రాజెక్టు అధికారులు 35 క్రస్టుగేట్లను ఎత్తి 2,40,450 క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 26,817 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 69 క్యూసెక్కులతో కలిపి మొత్తం 2,67,336 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.241 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. 738.558 ఎం.యూ. విద్యుదుత్పత్తి ప్రియదర్శిని జూరాల జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లోని ఆరు యూనిట్లలో విద్యుదుత్పత్తి కొనసాగింది. ఎగువ కేంద్రంలోని 6 యూనిట్ల ద్వారా 234 మెగావాట్లు, 367.696 ఎం.యూ. విద్యుదుత్పత్తి చేసినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 738.558 ఎం.యూ. విద్యుదుత్పత్తిని విజయవంతంగా చేపట్టామన్నారు. కోయిల్సాగర్లో 7 గేట్లు ఎత్తివేత.. కోయిల్సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ఉధృతి పెరగడంతో 7 గేట్లను ఎత్తి 15వేల క్యూసెక్కుల నీటిని వాగులోకి వదిలారు. మిగతా 8 గేట్లపై నుంచి కూడా నీరు జాలువారింది. ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో పరిగి, కొడంగల్, కోస్గి ప్రాంతాల నుంచి పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తూ కోయిల్సాగర్కు చేరుతోంది. ఎగువ నుంచి వచ్చే ఇన్ఫ్లోకు సమానంగా ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ఈఈ ప్రతాప్ సింగ్ తెలిపారు. కాగా, కోయిల్సాగర్ నుంచి బండర్పల్లి వరకు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. చిన్నచింతకుంట మండలం కురుమూర్తి దేవస్థానం వరకు వాగుపై ఉన్న చెక్డ్యాంలన్నీ పొంగి పొర్లుతున్నాయి. సంగంబండలో 2 గేట్ల ద్వారా.. మక్తల్ మండలం సంగంబండలోని చిట్టెం రాంరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. కర్ణాటక రాష్ట్రం ఇడ్లూర్ పెద్దవాగు నుంచి నీటి ప్రవాహం అధికంగా వస్తుందని.. అందుకు అనుగుణంగా రిజర్వాయర్ గేట్లను ఎత్తి వరదను దిగువకు విడుదల చేస్తున్నట్లు డీఈ సురేశ్ తెలిపారు. కోయిల్సాగర్ ప్రాజెక్టు నుంచి 7 గేట్ల ద్వారా దిగువకు పారుతున్న నీరు -
సహజ వనరులను భవిష్యత్ తరాలకు అందించాలి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: సహజ వనరులను తరువాతి తరాలకు అందించాలని పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు పీయూలో బోటనీ, ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ‘సస్టేనబుల్ డవలప్మెంట్ గోల్స్’ అంశంపై ఏర్పాటు చేసిన సెమినార్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అభివృద్ధి జరగాలంటే సహజ వనరుల వినియోగం పూర్తిస్థాయిలో జరగాలని, వాటిద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. వాటితోపాటు పర్యావరణ పరిరక్షణతోపాటు సుస్థిరమైన అభివృద్ధి జరగాలని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కనీసం 10 మొక్కలను నాటాలని, వాటిని కాపాడే బాధ్యతను కూడా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేశ్బాబు, ఓయూ ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి, అర్జున్కుమార్, గాలెన్న, బృందాదేవి, రాణెమ్మ, వేణు, శ్రీనివాసులు పాల్గొన్నారు. పీయూ వీసీ శ్రీనివాస్ -
పాలమూరులో ఎరువుల కొరత నివారించాలి
స్టేషన్ మహబూబ్నగర్: ఉమ్మడి పాలమూరులో యూరియా కొరత నివారించాలని టీపీసీసీ అధికార ప్రతినిధి, పాలమూరు పునర్నిర్మాణ అధ్యక్షుడు హర్షవర్ధన్రెడ్డి శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు వినతిపత్రం అందజేశారు. యూరియా కొరతతో రైతులు అల్లాడిపోతున్నారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మే, జూన్ నెలల్లో విరివిగా భారీ వర్షాలు కురవడం వల్ల దాదాపు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2.5 లక్షల ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలు ఎక్కువ మోతాదులో వేశారని పేర్కొన్నారు. విస్తీర్ణంలో పెద్దదైన ఉమ్మడి మహబూబ్నగర్ కంటే ఇతర జిల్లాలు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ జిల్లాలకు ఎక్కువ టన్నుల యూరియా వెళ్లిందన్నారు. ఉమ్మడి జిల్లా రైతుల కష్టాలను గుర్తించి వెంటనే ప్రత్యేకంగా యూరియా కేటాయించి అందించాలని వినతిలో కోరారు. ఫుట్బాల్ పోటీలకు వర్షం అడ్డంకి మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలో రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల ఫుట్బాల్ టోర్నమెంట్కు శుక్రవారం వర్షం అడ్డంకిగా మారింది. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం పడడంతో మ్యాచ్లు నిర్వహించడానికి వీలులేకుండా పోయింది. పోటీలు జరిగే మెయిన్ స్టేడియం అంతా వర్షపు నీళ్లతో నిండి ఉండడంతో మ్యాచ్లు జరగలేదు. టోర్నీ మొదటి రోజు ఆరు మ్యాచ్లు నిర్వహించారు. నేడు(శనివారం) మ్యాచ్లు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
లోతట్టు ప్రాంతాలు జలమయం
జిల్లాకేంద్రంలో ఏకధాటిగా కురిసిన వర్షానికి పాటుకాల్వలు, డ్రెయినేజీలు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా గచ్చిబౌలి, లక్ష్మీనగర్కాలనీ, రామయ్యబౌలి, శివశక్తినగర్, బీకేరెడ్డికాలనీ, బీఎన్రెడ్డికాలనీ, నాగిరెడ్డికాలనీ, వెంకటరమణకాలనీ, బాలాజీనగర్, గణేష్నగర్, వల్లభ్నగర్, కిసాన్నగర్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై వరద పారింది. సంజయ్నగర్లో ఓ ఇల్లు శిథిలావస్థకు చేరుకోవడంతో మున్సిపల్ సిబ్బంది అక్కడికి వెళ్లి జేసీబీతో తొలగించారు. అలాగే పెద్దచెరువు (మినీ ట్యాంక్బండ్)లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో రామయ్యబౌలి వద్ద ఉన్న అలుగు ప్రాంతాన్ని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్కుమార్రెడ్డి, తహసీల్దార్ ఘాన్సీరాం, ఆర్ఓలు మహమ్మద్ ఖాజా, యాదయ్య తదితరులు పరిశీలించారు. -
ఎస్హెచ్జీలకు డ్రెస్ కోడ్
● ఒకే తరహాలో చీరల పంపిణీకి చర్యలు ● రేవంతన్న కానుక పేరిట త్వరలో అందజేత జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశ కార్యకర్తల మాదిరిగానే ఇక నుంచి స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) సభ్యులకు కూడా ప్రభుత్వం కొత్తగా డ్రస్ కోడ్ను తెచ్చింది. సంఘం సభ్యుల సమావేశాలు, అధికార కార్యక్రమాల్లో పాల్గొంటే ఇట్టే గుర్తు పట్టేందుకు ప్రభుత్వం రేవంత్ అన్న పేరుతో ఒక్కొక్కరికి రెండు చీరల చొప్పున పంపిణీ చేస్తుంది. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఈ బతుకమ్మ పండుగకు గాను అందజేసేందుకు శ్రీకారం చుట్టంది. ఇప్పటికే సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళల వివరాలను అధికారులు సేకరించారు. కాగా.. జిల్లాకు ఇప్పటికే 1,00,800 చీరలు జిల్లాకు వచ్చాయి. ఒక్కొక్కరికి రెండు చొప్పున.. గత ప్రభుత్వం రేషన్ కార్డులో పేరున్న ప్రతి మహిళకు డీలర్ల ద్వారా బతుకమ్మ చీరలు పంపిణీ చేసింది. అయితే ఈ చీరలు నాణ్యతగా లేవని, మహిళలు వీటిని ధరించడం లేదని భావించిన కాంగ్రెస్ ప్రభుత్వం గత బతుకమ్మ పండుగకు చీరల పంపిణీని నిలిపివేిసిన విషయం తెలిసిందే. అయితే కొంత వ్యతిరేకత వస్తుందని భావించిన ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళలకు చీరలు అందించి దానిని పోగొట్టుకోవాలని చూస్తుంది. అలాగే చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో పంపిణీ చేస్తున్నారు. ఒక్కొక్కరికి రెండు చీరల చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. అయితే మొదటి విడతగా ఒక్కో చీర మాత్రమే ఇవ్వనున్నారు. దీనికోసం మొదటి విడత ఇటీవల జిల్లాకు 1,00,800 చీరలు రాగా.. వీటిని బండమీదిపల్లిలోని జిల్లా మహిళ సమాఖ్య భవనంలో భద్రపరిచారు. ఇక్కడి నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామస్థాయికి తరలించనున్నారు. అయితే ఈ చీరలను స్వయం సహాయక సంఘాల మహిళలకు ఎలా ఇవ్వాలనే అంశంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలుస్తోంది. పూర్తిస్థాయిలో సమాచారం ఇవ్వడానికి అధికారులు జంకుతున్నారు. త్వరలోనే పంపిణీ చేస్తాం.. ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకు ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ అమలు చేయడానికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ప్రతి సంఘంలోని సభ్యురాలికి ఒక చీరను ఉచితంగా ఇవ్వనున్నాం. ఇందుకు సంబంధించి చీరలు సైతం ఇప్పటికే జిల్లాకు వచ్చాయి. త్వరలోనే వీటిని పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం. – నర్సింహులు, డీఆర్డీఓ -
నేటితరానికి స్ఫూర్తి చాకలి ఐలమ్మ
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): చాకలి ఐలమ్మ నేటితరానికి స్ఫూర్తి ప్రదాత అని కలెక్టర్ విజయేందిర అన్నారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం జిల్లాకేంద్రంలోని పద్మావతికాలనీ వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచానికి తెలంగాణ తెగువ, పోరాట పటిమను పరిచయం చేసిన చాకలి ఐలమ్మను స్మరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. చాకలి ఐలమ్మ ఆశయాలు కొనసాగిస్తామని, భావితరాలకు ఆమె చరిత్రను అందించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి ఇందిర తదితరులు పాల్గొన్నారు. ● కలెక్టరేట్లోని ఎన్ఐసీ హాల్లో అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఐలమ్మ ఆశయాలను కొనసాగించాలని, ఆమె ఆదర్శాలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమాధికారి జనార్దన్, డీఎంహెచ్ఓ పద్మజ, కలెక్టరేట్ ఏఓ సువర్ణరాజు తదితరులు పాల్గొన్నారు. వెయ్యి పడకల ఆస్పత్రి పరిశీలన పాలమూరు: జిల్లాకేంద్రంలోని పాత కలెక్టరేట్ స్థానంలో నూతనంగా నిర్మించిన వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని శుక్రవారం కలెక్టర్ విజయేందిర పరిశీలించారు. ఇంకా పూర్తి కావాల్సిన భవనాలు, పెండింగ్లో ఉన్న పనులపై కలెక్టర్ ఆరా తీశారు. వెయ్యి పడకల బోధన ఆస్పత్రి భవనం ప్లాన్, నిర్మాణం ప్రగతిపై తెలంగాణ వైద్య, మౌళిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఇంజినీరింగ్ అధికారులు కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో ఈఈ వేణుగోపాల్, ఏఈ శరత్ తదితరులు పాల్గొన్నారు. ప్రాధాన్యత రంగాలకు రుణాలు బ్యాంకర్లు ప్రాధాన్యత రంగాలకు వందశాతం రుణాలు అందించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. మార్చి 2025–జూన్ 2025 మొదటి త్రైమాసికంలో ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు, ఇతర బ్యాంకింగ్ సంబంధిత సమస్యలతో సహ వార్షిక క్రెడిట్ ప్లాన్ యొక్క వివిధ రంగాల కింద పథకం/ కార్యకలాపాల అమలులో జిల్లాలో సాధించిన పురోగతిని సమీక్షించి సూచనలు చేశారు. బ్యాంకుల్లో పెండింగ్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ రుణాలు మంజూరు చేయాలని, పీఎంఈజీపీ దరఖాస్తులను సాధారణ కారణాలతో తిరస్కరించకూడదని, పీడబ్ల్యూడీలకు ర్యాంప్ సౌకర్యాన్ని బ్యాంకు అందించాలన్నారు. -
ఏకధాటిగా వర్షం.. స్తంభించిన జనజీవనం
మహబూబ్నగర్ (వ్యవసాయం)/ మున్సిపాలిటీ: అల్పపీడన ప్రభావంతో జిల్లా అంతటా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాత్రి నుంచి మొదలైన వర్షం ఏకధాటిగా కురుస్తుండటంతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు, చెక్డ్యాంలలోకి వరద భారీగా చేరుకోవడంతో మత్తడి దూకాయి. కోయిల్సాగర్ ప్రాజెక్టులోకి అంతకంతకూ వరద నీరు పెరగడంతో ప్రాజెక్టు వద్ద 7 గేట్లు ఎత్తి 15 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. జిల్లాలో ప్రధానమైన ఊకచెట్టు వాగు, పెద్దవాగు, దుందుభీ వాగులు ఉగ్రరూపం దాల్చాయి. ఏకబిగిన వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. చాలా వరకు ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. జిల్లాలో సగటున 37.6 మి.మీ., వర్షపాతం నమోదైంది. అత్యధికంగా హన్వాడ మండలంలో 58.4 మి.మీ., అత్యల్పంగా అడ్డాకులలో 19.6 మి.మీ.., వర్షం కురిసింది. జలదిగ్బంధంలో గాధిర్యాల్ జిల్లాలోని మహమ్మదాబాద్ మండలంలో భారీ వర్షానికి అన్ని చెరువులు, కుంటలు అలుగులు పారుతూ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గాధిర్యాల్ గ్రామం చుట్టూ మూడు వైపులా వాగులు ఉండటంతో రాకపోకలు నిలిచిపోయి గ్రామం దిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. గండేడ్ మండలంలోని పెద్దవార్వాల్ గ్రామంలో ఎడతెరిపి లేని వర్షం కారణంగా నీరటి అంజయ్య ఇల్లు కూలిపోయింది. ఇల్లు కూలిన సమయంలో ఇంట్లోనే ఉన్న ఎలాంటి ప్రాణం నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మహబూబ్నగర్ రూరల్ మండలం రామచంద్రాపూర్ గ్రామ శివారులో గల కానుగుల వాగు ఉధృతంగా పారడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలి జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా అప్రమత్తంగా ఉంటూ ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో వివిధ శాఖల జిల్లా, మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లతో సమీక్షించారు. రానున్న 48 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాల వలన ఎలాంటి సంఘటనలు జరిగినా ఎస్పీ, ఎస్డీఆర్ఎఫ్, అధికార యంత్రాంగానికి సమాచారం ఇవ్వాలన్నారు. మండల స్థాయిలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి 24 గంటలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మండల స్థాయిలో ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు తగు చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టరేట్లో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూం 08542– 241165 ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్కు సంబంధించి ఎస్ఈ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం ఫోన్ నంబర్లు 87124 72127, 87124 72128లకు సమాచారం అందించాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్, ఆర్డీఓ నవీన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగావిస్తారంగా వర్షాలు పొంగిపొర్లిన వాగులు.. అలుగు పారిన చెరువులు ఉధృతమైన వరదలతో పలుచోట్ల నిలిచిన రాకపోకలు రోజంతా ముసురుతో ఇళ్లకే పరిమితమైన ప్రజలు జిల్లాలో మరో రెండురోజులపాటు భారీ వానలు -
పెండింగ్ కేసులు పరిష్కరించాలి
మహబూబ్నగర్ క్రైం: పోలీస్స్టేషన్లో ఉన్న పెండింగ్ కేసులు త్వరగా విచారించి పరిష్కరించాలని ఎస్పీ జానకి అన్నారు. కోయిలకొండ పోలీస్స్టేషన్ను శుక్రవారం ఆమె తనిఖీ చేసి.. ఇటీవల నమోదైన, పెండింగ్ కేసుల ఫైల్స్ పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఫిర్యాదుదారులతో ఓర్పుతో మాట్లాడాలని, పోలీస్ వ్యవస్థపై నమ్మకం పెంచేలా పనిచేయాలన్నారు. స్టేషన్ శుభ్రత, రికార్డులు నిర్వహణ పద్ధతి, సిబ్బంది క్రమశిక్షణపై మరింత దృష్టి పెట్టాలన్నారు. ● జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, మూడు రోజులు అతి భారీ వర్షాలు ఉన్న క్రమంలో జిల్లావాసులు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ జానకి తెలిపారు. చెక్డ్యాంలు, వాగులు, కాల్వలు దాటకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. విద్యుత్ తీగాలు, కరెంట్ స్తంభాలకు దూరంగా ఉండాలని, బావి దగ్గర వ్యవసాయదారులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితి వచ్చిన వెంటనే డయల్ 100 లేదా 87126 59360కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ డి.జానకి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ రైతు ఉద్యమంలో ప్రత్యేక స్థానం సంపాదించారని, ఆమె స్ఫూర్తితో సమాజంలో మహిళల పాత్ర మరింత బలోపేతం కావాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ సురేష్కుమార్, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఏవో రుక్మిణీబాయి, ఎస్బీ సీఐ వెంకటేష్, ఆర్ఐలు కృష్ణయ్య, నగేష్, సీసీ రాంరెడ్డి పాల్గొన్నారు. -
ఇక టెండర్ల జాతర
మహబూబ్నగర్ క్రైం: రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ ఉమ్మడి జిల్లాకు సంబంధించి మద్యం దుకాణాల కేటాయింపు చేసింది. ఈ ఏడాది నవంబర్ 30తో ప్రస్తుత ఎకై ్సజ్ మద్యం పాలసీ ముగియనున్న క్రమంలో డిసెంబర్ 1నుంచి కొత్త మద్యం దుకాణాలు అమల్లోకి రానున్నాయి. కొత్త మద్యం దుకాణాలకు సంబంధించి కులాల వారీగా దుకాణాల కేటాయించనున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 230 మద్యం దుకాణాలు కొనసాగుతుండే ఈసారి అలంపూర్, రాజోళి, చెన్నారం దగ్గర ఉన్న మద్యం దుకాణాలు తొలగించి.. ఈసారి 227 దుకాణాలకు టెండర్లు స్వీకరించనున్నారు. మూడు దుకాణాల్లో సరైన మద్యం అమ్మకాలు లేకపోవడంతో వాటిని రద్దు చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఉన్న టెండర్ ఫీజు రూ.2 లక్షల నుంచి ఈసారి రూ.3 లక్షలకు పెంచారు. ఒక్కో వ్యాపారి ఎన్ని మద్యం దుకాణాలకు అయినా టెండర్ వేసుకునే వెసులుబాటు కల్పించారు. ఆయా జిల్లాకేంద్రాల్లో ఉండే కలెక్టర్ కార్యాలయాల్లో ఉదయం నుంచి 10 గంటల నుంచి సాయంత్రం వరకు టెండర్లు స్వీకరించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. 2021లో మొత్తం 230 దుకాణాలకు 4,713 టెండర్లు వస్తే 2023లో 230 దుకాణాలకు 8,595 టెండర్లు వచ్చాయి. ఈ సారి పదివేలకు పైగా టెండర్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ● మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్లో గురువారం కలెక్టర్ విజయేందిర బోయి కులాల వారీగా రిజర్వేషన్కు సంబంధించిన దుకాణాలను కేటాయించారు. మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలో ఉన్న 90 మద్యం దుకాణాలు ఉంటే ఇందులో గౌడ్స్కు 14, ఎస్సీలకు 10, ఎస్టీలకు మూడు దుకాణాలు కేటాయించారు. ఈ మేరకు రిజర్వేషన్లు లాటరీ పద్ధతిలో కేటాయించారు. ● వచ్చే నవంబర్ 30తో ప్రస్తుత మద్యం దుకాణాల గడువు ముగిస్తున్న నేపథ్యంలో కొత్త దుకాణాల లైసెన్స్ కోసం ప్రభుత్వం టెండర్ల స్వీకరణకు సిద్ధమవుతోంది. డిసెంబర్ 1 నుంచి మళ్లీ కొత్త దుకాణాలు ప్రారంభం కానుంది. ఈ నెల 26 నుంచి (శుక్రవారం) నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 23న లక్కీ డ్రా నిర్వహించి దుకాణాలను కేటాయించనున్నారు. ఒక్కో దుకాణానికి టెండర్ ఫీజు రూ.3 లక్షలు కేటాయించారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న మద్యం దుకాణాలు నాలుగు స్లాబ్ల కిందట ఉన్నాయి. రూ.50 లక్షలు, రూ.55 లక్షలు, రూ.60 లక్షలు, రూ.65 లక్షల కింద దుకాణాలు ఉన్నాయి. కొత్త మద్యం పాలసీకి దుకాణాల కేటాయింపు నేటినుంచి దరఖాస్తుల స్వీకరణ ఉమ్మడి జిల్లాలో 227 దుకాణాలకు టెండర్ల ఆహ్వానం -
100 టీఎంసీల చొప్పున 3 చోట్ల రిజర్వాయర్లు నిర్మించాలి..
ప్రతి ఏటా వానాకాలం సీజన్లో సమృద్ధిగా వర్షాలు కురిసినప్పుడు సుమారు 3 వేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. ఆల్మట్టి ఎత్తు పెంచితే అక్కడ అదనంగా మరో 100 టీఎంసీల నీళ్లు నింపుకుంటారు. మిగిలిన 2,900 టీఎంసీల నీళ్లయితే మనకు వస్తాయి కదా. ఇక్కడ ఎత్తు తగ్గించడం అనే డిమాండ్ కంటే.. పాలమూరు జిల్లాలో భారీ నీటి నిల్వ సామర్థ్యం గల రిజర్వాయర్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలి. ఉమ్మడి జిల్లాలో జూరాల మినహా మిగతావన్నీ ఎత్తిపోతలే. జూరాల కూడా అంతంతమాత్రమే. ఇప్పటికై నా భీమా, కృష్ణా నదులు కలిసే ప్రాంతంలో, జూరాలకు కుడివైపున ర్యాలంపాడ్తో పాటు ఆర్డీఎస్కు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసి అక్కడ, కేఎల్ఐ వద్ద, లక్ష్మీదేవిపల్లి వద్ద.. ఈ మూడు చోట్ల 100 టీఎంసీల చొప్పున నీరు నిల్వ చేసేలా భారీస్థాయిలో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను నిర్మించాలి. అప్పుడే ఉమ్మడి జిల్లాలో సాగు, తాగు నీటికి ఇబ్బందులు తొలుగుతాయి. – రాఘవాచారి, ఉమ్మడి జిల్లా కన్వీనర్, పాలమూరు అధ్యయన వేదిక ● -
ఆర్టీసీ ప్రయాణికులకు లక్కీడ్రా
స్టేషన్ మహబూబ్నగర్: ఈనెల 27 నుంచి వచ్చేనెల 6వ తేదీ వరకు డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో (ఎలక్ట్రికల్ వాహనాలతో సహా) ప్రయాణించే వారికి లక్కీడ్రా నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మొదటి బహుమతి రూ.25 వేలు, ద్వితీయ బహుమతి రూ.15 వేలు, మూడో బహుమతి రూ.10 వేలు ఉంటుందని తెలిపారు. పై తేదీల్లో డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో ప్రయాణం చేసిన తర్వాత టికెట్ వెనుక పేరు, ఫోన్ నంబర్, చిరునామా రాసి బస్టాండ్లో ఏర్పాటు చేసిన లక్కీ డ్రా బాక్స్లో వేయాలని కోరారు. 8వ తేదీన డ్రా తీసి విజేతల పేర్లు ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
పింఛన్దారులను మోసం చేసిన రేవంత్ సర్కార్
● ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ దేవరకద్ర/మక్తల్: రాష్ట్రంలోని పింఛన్దారులను రేవంత్రెడ్డి సర్కారు దారుణంగా మోసం చేసిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. గురువారం దేవరకద్ర, మక్తల్ పట్టణాల్లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి పింఛన్దారుల సన్నాహక సదస్సులకు ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో 45లక్షల మంది పింఛన్ దారులు ఉండగా.. వికలాంగులకు రూ. 6వేలు, వితంతులు, ఒంటరి మహిళలు, వృద్ధుల పింఛన్ రూ. 4వేలకు పెంచుతామని, 10లక్షల కొత్త పింఛన్లు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. 22 నెలలు గడుస్తున్నా పింఛన్ల పెంపు మాట ఎత్తడం లేదన్నారు. వికలాంగులు, వృద్ధుల పింఛన్ పెంపు విషయాన్ని ప్రతిపక్షాలు కూడా పట్టించుకోవడం లేదన్నారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమంతో ఎస్సీ వర్గీకరణ సాధించామని.. అదే విధంగా పింఛన్ల విషయంలో కూడా ఉద్యమించి సాధించి తీరుతామన్నారు. అందులో భాగంగా వచ్చే నెల 6 నుంచి నవంబర్ 6వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా మండలస్థాయిలో రీలే దీక్షలు చేపట్టాలని మందకృష్ణ సూచించారు. ప్రభుత్వం దిగిరాకుంటే నవంబర్ 26న హైదరాబాద్లో పింఛన్దారులతో మహా గర్జనను నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశాల్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి నరేందర్, జాతీయ ఉపాధ్యక్షుడు నర్సింహం, నాయకులు భిక్షపతి, శివకుమార్, బాలరాజు, వెంకటేశ్, శ్రీలక్ష్మి, తిరుపతమ్మ, నాగేశ్, జ్ఞానప్రకాశ్, అంజప్ప తదితరులు పాల్గొన్నారు. -
నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు
● జనరల్ ఆస్పత్రిలో ఎంఆర్ఐ, క్యాథ్లాబ్కు రూ.18.76 కోట్లు మంజూరు ● ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి స్టేషన్ మహబూబ్నగర్: ప్రభుత్వ ఆస్పత్రిలో పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్థానిక ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఎన్నో ఏళ్లుగా అందుబాటులో లేని ఎంఆర్ఐ, క్యాథ్ లాబ్ పరికరాల కోసం రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లగా వాటి ఏర్పాటు కోసం రూ.18,76,80,000 మంజూరు చేస్తూ జీఓ పంపిచారన్నారు. 20 నెలల నుంచి విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చామని, ఈ రంగంపై ప్రజల్లో కూడా అవగాహన కల్పించడంలో సఫలీకృతమైనట్లు తెలిపారు. నియోజకవర్గంలో వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలో రైల్వే ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని ఇటీవలఎంపీ డీకే అరుణతో కలిసి రైల్వేశాఖ సహాయ మంత్రిని కోరినట్లు తెలిపారు. నగరం జనాభా 3 లక్షలు దాటిందని, ఈ మేరకు టీడీగుట్ట, తిమ్మిసానిపల్లి, బోయపల్లి రైల్వే గేటు వద్ద ఆర్ఓబీలు నిర్మించాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. రాజకీయ నాయకులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి సాధ్యమన్నారు. ఎవరైనా అధికారులపైనా దౌర్జన్యం చేసినా, దుర్భాషాలాడినా సహించేది లేదని, ఇది మహబూబ్నగర్ సంస్కృతి కాదన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే వ్యక్తులపైన తీవ్రమైన పరిణామాలు ఉంటాయన్నారు. సమావేశంలో ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, నాయకులు ఎన్పీ.వెంకటేశ్, సిరాజ్ఖాద్రీ, సీజే బెనహర్, గంజి ఆంజనేయులు పాల్గొన్నారు. -
ఆకతాయిలపై ప్రత్యేక నజర్
గద్వాల క్రైం: అల్లర్లకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఆకతాయిలపై పోలీసులు ప్రత్యేక నజర్ పెట్టారు. గతంలో కేసులు నమోదై పోలీసు రికార్డులో ఉన్న రౌడీలను అదుపులోకి తీసుకుని బెండు తీసే పనిలో జోగుళాంబ గద్వాల జిల్లా పోలీసుశాఖ నిమగ్నమైంది. మద్యం మత్తు, అకారణంగా ఇతరులపై దాడులకు తెగబడుతున్న నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలిస్తున్న తాజా ఘటనలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గద్వాల–అలంపూర్ సెగ్మెంట్లో గడచిన 15 రోజుల వ్యవధిలో 10మంది ఆకతాయిలు అరెస్ట్ చేసి మహబూబ్నగర్ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉంచారు. పరారీలో ఉన్న మరి కొంతమంది ఆకతాయిల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో నమోదైన రౌడీషీటర్లు, అనుమానిత వ్యక్తుల వివరాల గురించి ఆరా తీస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం త్వరలో స్థానిక ఎన్నికలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. సరిహద్దు ప్రాంతం కావడంతో.. జిల్లా రెండు రాష్ట్రాలతో సరిహద్దు పంచుకోవడంతో అల్లర్లు, హింసత్మక దాడులకు పాల్పడే నిందితులు తప్పించుకునేందుకు సులువుగా ఉంటుంది. మరోవైపు జిల్లాకు రైలు, రోడ్డు మార్గం ఉండడంతో ఇతర రాష్ట్రాలకు పారిపోతున్నారు. ఈ క్రమంలో బాధితులు తమపై జరిగిన దాడులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొస్తున్నా రు. దీంతో పోలీసు శాఖ అప్రమత్తమై నిందితులను గుర్తించి అరెస్ట్ చేస్తున్నారు. అయితే కేసుల్లోంచి తప్పించుకునేందుకు కొందరు రాజకీయ నాయకులను ఆశ్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మత్తు పదార్థాల కట్టడి జిల్లా పరిధిలో నిషేధిత మత్తు పదార్థాల విక్రయాలు కలవర పెడుతున్నాయి. ఇటీవల గట్టు మండలంలోని బోయలగూడెం శివారులో గుట్టుగా గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సాగు చేస్తున్న వారిలో యువతే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. మద్యం ధరలు అధికంగా ఉండడంతో కి క్కు కోసం యువత తక్కువ ధరకు దొరికే గంజాయికి బానిసలవుతున్నారు. నిషేధిత మత్తు పదార్థాల నిషేధానికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిరంతరం అవగాహన కల్పిస్తున్నా.. ఆశించిన స్థాయిలో ఫలితం ఉండట్లేదు. పోలీసులు గంజాయి విక్రయిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకుని.. వారి నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్న వారి వివరాలను తెలుసుకోగా ఎక్కువ సంఖ్యలో యువతే ఉండడం విస్మయానికి గురి చేస్తోంది. వారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ అందించారు. గంజా యి విక్రయించిన వారిని రిమాండ్కు తరలించారు. తలనొప్పిగా మారిన నేతల ఒత్తిళ్లు జిల్లాలో 20 రోజల క్రితం జరిగిన హింసాత్మక ఘటనలో పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో నిందితులు తమ వర్గానికి చెందిన వారు వదిలేయండి అంటూ.. ఓ వైపు మంత్రి, ఎంపీల నుంచి ఒత్తిళ్లు రావడంతో పోలీసులు మౌనం పాటించాల్సి వచ్చింది. అయితే స్థానికంగా బలమైన నాయకుడు నిందితులను శిక్షించాలని కోరడంతో పోలీసులు చట్టప్రకారం చర్యలు చేపట్టారు. ఆకతాయిలపై కఠినంగా వ్యవహరిస్తున్న పోలీసులకు ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కేసుల నమోదు.. రిమాండ్కు తరలింపు – పరారీలో పలువురు నిందితులు – ముమ్మరంగా గాలింపు – స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పటిష్ట చర్యలు -
జూరాలకు నిలకడగా వరద
ధరూరు: కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన భారీ వ ర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లో స్వల్పంగా తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి 8గంటల వరకు ప్రాజెక్టుకు 3లక్షల 32వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. బుధవారం రాత్రి 9 గంటల వర కు ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ఫ్లోలు 2లక్షల 55వేల క్యూ సెక్కులకు తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 32 క్రస్టు గేట్లను ఎత్తి గేట్ల ద్వారా 2లక్షల 21వేల 120 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జెన్కో జల విద్యుత్ కేంద్రంలో ఆరు యూనిట్లలో విద్యుదుత్ప త్తిని కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 27వేల 927 క్యూసెక్కులు, నెట్టెపాడుకు 750 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 45 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 1,030 క్యూసెక్కులు, కుడి కాల్వకు 550 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–2కు 750 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 2లక్షల 51వేల 422 క్యూసెక్కుల నీటిని దిగువనున్న శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నా రు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 8.377 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఆల్మట్టి ప్రాజెక్టుకు పూర్తిస్థాయి నీటిమట్టం 129.72 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ఈ ప్రాజె క్టులో పూర్తిస్థాయిలో 126.73 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 37,098 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా.. ప్రాజెక్టు నుంచి దిగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టుకు 39వేల 135 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టుకు పూ ర్తిస్థాయి నీటిమట్టం 37.64 టీఎంసీలు కాగా.. ప్రస్తు తం ఈ ప్రాజెక్టులో 37.51 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 46వేల 167 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. దిగువనున్న జూరాలకు ప్రాజెక్టుకు లక్షా 45,075 క్యూసెక్కుల నీటిని దగువకు విడుదల చేస్తున్నారు. 732.426 ఎంయూ విద్యుదుత్పత్తి ఆత్మకూర్: జూరాలకు ఎగువ నుంచి వరదనీరు భా రీగా చేరుతుండడంతో జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో ఆరు యూనిట్లలో విద్యుదుత్పత్తి కొనసాగుతుంది. ఈ మేరకు బుధవారం 6 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 6 యూనిట్ల ద్వారా 234 మెగావాట్లు, 361.564 ఎంయూ విద్యుదుత్పత్తిని చేపడుతున్నారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్ప త్తి కేంద్రాల్లో ఇప్పటివరకు 732.426 మిలియన్ యూనిట్లను విజయవంతంగా చేపట్టామన్నారు. సుంకేసులకు 25వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో రాజోళి: సుంకేసుల డ్యాంకు బుధవారం ఇన్ఫ్లో వ చ్చి చేరుతున్నట్లు జేఈ మహేంద్ర తెలిపారు. ఎగు వ నుంచి 25,350 క్యూసెక్కులు ఇన్ఫ్లో రాగా.. 5గేట్లను ఒక మీటర్ మేర ఎత్తి 22,395 క్యూసెక్కులు దిగువకు వదిలినట్లు తెలిపారు. కేసీ కెనాల్కు 1,058క్యూసెక్కులు వదిలినట్లు పేర్కొన్నారు. – ప్రాజెక్టుకు 2లక్షల 55వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో – 32గేట్లు ఎత్తి 2లక్షల 51వేల 422క్యూసెక్కుల విడుదల – జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి -
చేపల ప్రాసెసింగ్ కేంద్రం ఏర్పాటుకు స్థల పరిశీలన
వనపర్తి: జిల్లాలో అంతర్జాతీయ మత్స్య రవాణా, ప్రాసెసింగ్ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ ఆదర్శ్సురభి తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం పెబ్బేరు మండలంలోని వై.శాఖాపురం గ్రామ శివారులోని సర్వే నంబరు 163, 162, 143లో గల పది ఎకరాల ప్రభుత్వ ఖాళీ స్థలాన్ని తహసీల్దార్ మురళితో కలిసి పరిశీలించారు. అదేవిధంగా మహిళా సంఘాల సభ్యులకు పెట్రోల్ బంకు ఏర్పాటు కోసం పెబ్బేరు మండలం తోమాలపల్లి శివారులో జాతీయ రహదారి పక్కన సర్వే నంబర్ 104లో ఖాళీగా ఉన్న 30 గుంటల ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం పెబ్బేరు మున్సిపాలిటీలో మల్లికార్జున ఫర్టిలైజర్ షాపును ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణానికి ఇప్పటి వరకు సరఫరా అయిన యూరియా, పంపిణీ చేసిన వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు అవసరమైన యూరియాను పారదర్శకంగా అందించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెబ్బేరు, శ్రీరంగాపూర్లో ఎరువుల అవసరాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
కఠినంగా వ్యవహరిస్తాం
జిల్లాలో శాంతిభద్రతలకు వి ఘాతం కలిగిస్తే సహించేది లేదు. హింసాత్మక దాడులు, అల్లర్లకు పాల్పడిన వారు ఎవ రైనా ఉపేక్షించం. మద్యం, నిషేధిత మత్తు పదార్థాలకు యువత ఆకర్షితులవడం ఆందోళన కలిగిస్తోంది. వారి భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని పట్టు బడిన యువతకు కౌన్సిలింగ్ అందిస్తున్నాం. మత్తు పదార్థాల వల్లన జరిగే నష్టాల గురించి వివరిస్తున్నాం. గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నాం. క్రయ, విక్రయాలకు పాల్పడిన వ్యక్తులపై కే సులు నమోదు చేసి జైలుకు పంపుతున్నాం. పాత నేరస్తులు, రౌడీషీటర్ల వివరాలను గుర్తించి బైండోవర్ చేస్తున్నాం. – శ్రీనివాసరావు, ఎస్పీ -
వైద్యులు అందుబాటులో ఉండాలి
దేవరకద్ర: గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అన్నారు. బుధవారం మండలంలోని గూరకొండలోని ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురవడం వల్ల ప్రజలు వైరల్ ఫీవర్, ఇంకా ఇతర అంటువ్యాధులతో బాధపడుతున్నారని వారికి సరైన వైద్య సేవలు అందించడంతోపాటు ప్రతిరోజు అందుబాటులో ఉండాలని సూచించారు. ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు గ్రామాల్లో తిరిగి వ్యాధులు సోకిన వారిని గుర్తించి మందులు పంపిణీ చేయాలన్నారు. సీజనల్ వ్యాధులకు కావాల్సిన మందులను ఆరోగ్య ఉపకేంద్రాల్లో అందుబాటులో, నీటి నిల్వలు లేకుండా చూడాలని, దోమల నివారణ చర్యలు తీసుకోవాలని, పరిశుభ్రత విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. అనంతరం దేవరకద్ర మహిళా సమాఖ్యకు మంజూరైన పెట్రోల్ బంకును ఏర్పాటు చేయడానికి అదనపు కలెక్టర్ స్థల పరిశీలన చేశారు. మండల పరిషత్ కార్యాలయం ముందున్న పాత క్వార్టర్ స్థలాన్ని పరిశీలించి అనువుగా లేదని తేల్చారు. జాతీయ రహదారి పక్కన ప్రభుత్వ స్థలం ఉంటే చూడాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు, తహసీల్దార్ దీపిక పాల్గొన్నారు. -
జీపీఓలు వచ్చేశారు
● 191 మందికి గాను 145 మందికి ఆర్డర్లు జారీ ● రెవెన్యూ శాఖలో తగ్గనున్న పని ఒత్తిడి ● భూ భారతి అమలులో కీలక ముందడుగు మహబూబ్నగర్ న్యూటౌన్: చట్టం, నియమాలు, వ్యవస్థ, పోర్టల్ అనే నాలుగు మూలస్తంభాల ద్వారానే రెవెన్యూ శాఖ ముందడుగు సాధిస్తుందనే ప్రభుత్వ ఆలోచనతో ఒక్కొక్కటిగా ఆచరణకు నోచుకుంటోంది. వ్యవస్థలో ఓ స్తంభంగా గ్రామ పాలన అధికారుల పాత్ర కీలకంగా ఉండనుంది. ఈ క్రమంలో జీపీఓల నియామకంతో గ్రామాల్లో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఆశించిన పురోగతి సాకారం కానుందనే ఆశలు రేకెత్తుతున్నాయి. రెవెన్యూ శాఖలో పలు మార్పులకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం భూ భారతి అమలులో జీపీఓల నియామకంతో మరో కీలక ముందడుగు వేసింది. రెవెన్యూ సదస్సులు, ప్రజావాణితోపాటు రోజువారిగా పలు అంశాలపై వస్తున్న ఫిర్యాదులకు వేగవంతంగా పరిష్కారం చూపేందుకు మార్గం సుగమమైంది. గ్రామాల్లో పాలన అధికారుల ద్వారా రెవెన్యూ శాఖలో సమూల మార్పులు తీసుకొచ్చి పని ఒత్తిడి తగ్గించడంతోపాటు ప్రజలకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటోంది. విచారణ మొదలుకొని రెవెన్యూ పరమైన అంశాల్లో పారదర్శకతతోపాటు సమస్యలకు శాశ్వత పరిష్కారం క్షేత్రస్థాయిలోనే చూపాలన్నది ప్రభుత్వ ఆలోచన. పరిపాలన సౌలభ్యం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా జీపీఓల నియామకంతో చర్యలు చేపడుతోంది. గతంలో రెవెన్యూ శాఖలో గ్రామాల్లో పనిచేసిన వీఆర్ఓ, వీఆర్ఏలను తొలగించి ఇతర శాఖల్లో సర్దుబాటు చేసింది. దీంతో ఆ శాఖలో పనిచేస్తున్న అధికారులపై తీవ్రమైన పని ఒత్తిడి నెలకొంది. దీన్ని మళ్లీ ప్రక్షాళణ చేస్తామన్న హామీలో భాగంగా వారిని వెనక్కి తీసుకొచ్చి జీపీఓలుగా నియమించింది. జీపీఓల నియామకంలో భాగంగా ప్రభుత్వం వీఆర్ఓ, వీఆర్ఏలకు ఆప్షన్లు ఇచ్చి ఎంపిక చేసింది. ఈ మేరకు మహబూబ్నగర్ జిల్లాకు కేటాయించిన వారికి జీపీఓలుగా నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో 191 క్లస్టర్లు జిల్లాలో మొత్తం 316 రెవెన్యూ గ్రామాలుండగా అందులో ప్రభుత్వం 191 క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. ప్రతి క్టస్టర్లోని రెండు, మూడు గ్రామాలకు ఒక జీపీఓను నియమించింది. ఈ మేరకు జిల్లాకు కేటాయించిన 191 మంది జీపీఓలలో ఇప్పటి వరకు 145 మందికి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు అందుకున్న 145 మందిలో 135 మంది జీపీఓలు ఆయా మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో రిపోర్టు చేశారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖలో పనిచేస్తూ గతంలో వీఆర్ఏలుగా పనిచేసిన మరో 54 మందిని జీపీఓలుగా నియమించనున్నారని తెలిసింది. ఇతర జిల్లాలలో కౌన్సెలింగ్ ద్వారా గతంలో పనిచేసిన వీఆర్ఏలను జీపీఓలుగా నియమించినట్లు సమాచారం. ప్రభుత్వ ఆదేశాల మేరకు.. గతంలో వీఆర్ఓలు, వీఆర్ఏలుగా పనిచేసిన వారికి ఆప్షన్లు ఇస్తూ జీపీఓల నియామకానికి దరఖాస్తులు స్వీకరించింది. వారందరికీ పరీక్షలు సైతం నిర్వహించడం జరిగింది. ఇందులో అర్హులైన వారిని జీపీఓలుగా నియమిస్తూ జిల్లాకు 191 మందిని కేటాయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ 145 మందికి నియామక ఉత్తర్వులు జారీ చేయగా.. అందులో 135 మంది ఆయా మండలాల్లో రిపోర్టు చేశారు. – సువర్ణరాజు, కలెక్టరేట్ పరిపాలనాధికారి -
పాలమూరు చుట్టే రాజకీయం!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సెగ రాజేసింది.. తెలంగాణ మలి దశ పోరులో రణనినాదమై నిలిచింది పాలమూరే. తలాపున కృష్ణమ్మ ఉన్నా.. సాగు, తాగునీరు లేక వలసలతో తండ్లాడిన ఇక్కడి ప్రజల దీనగాధ, వెనుకబాటుతనమే ప్రతి ఒక్కరి గళమైంది. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమానికి ఊపిరిలూదింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైనా, ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ‘పాలమూరు’దే కీలక భూమిక. అలాంటి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు పదేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 2015లో ఈ ఎత్తిపోతలకు అడుగులు పడగా.. అప్పుడు, ఇప్పుడూ దీని చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. అధికార, విపక్ష నేతలకు పాలమూరు ప్రచారాస్త్రంగా మారగా.. రైతాంగానికి మాత్రం సాగునీటి కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. పీఆర్ఎల్ఐ కేంద్రంగా పాలి‘ట్రిక్స్’ పాలక, ప్రతిపక్షాల పోటాపోటీ విమర్శలు 90 శాతం పనుల పూర్తి.. మిగిలిన 10% పూర్తి చేయాలి.. ఇదే డిమాండ్తో పోరుబాటకు బీఆర్ఎస్ సన్నాహాలు దీటుగా స్పందించేలా కాంగ్రెస్ కార్యాచరణ ‘స్థానిక’ ఎన్నికల వేళ రాజుకున్న వేడి -
నిబంధనల మేరకే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
జడ్చర్ల: ప్రభుత్వం రూపొందించిన డిజైన్కు అనుగుణంగానే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. బుధవారం ఆమె మండలంలోని మల్లెబోయిన్పల్లి, మాచారం గ్రామాల్లో ఆకస్మికంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. నిబంధనల మేరకు సూచించిన కొలతల ప్రకారమే ఇళ్లు నిర్మించకోవాలన్నారు. అలాగే వ్యయప్రయాసాల కోర్చి ఇబ్బందులు పడి.. అప్పుల పాలు కావొద్దన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వమే ఉచితంగా ఇసుక సరఫరా చేస్తుందని, ఇంటి నిర్మాణం దశల వారిగా బిల్లులు చెల్లిస్తామని వివరించారు. అయితే బేస్మెంట్ పనులు పూర్తయినా తమకు బిల్లు రాలేదని లబ్ధిదారు అంజమ్మ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని గృహ నిర్మాణ శాఖ అధికారి, పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. తమకు రెండు బిల్లులు మాత్రమే వచ్చాయని స్లాబ్ నిర్మాణం పూర్తి చేసినా మూడో బిల్లు ఇప్పటి వరకు రాలేదని మరొకరు కలెక్టర్కు చెప్పారు. ఎన్ని ఇళ్లు మంజూరయ్యాయి.. ఎన్ని ప్రగతిలో ఉన్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ జడ్చర్ల రైల్వేస్టేషన్లో రేక్ పాయింట్కు వచ్చిన యూరియాను పరిశీలించారు.జిల్లాకు తాజాగా 529 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చినట్లు తెలిపారు. యూరియాను రైతులకు అందుబాటులో అన్ని మండలాలకు పంపుతున్నట్లు చెప్పారు. మంగళవారం 786 మె.ట., యూరియా రాగా.. అన్ని మండలాలకు సరఫరా చేశామన్నారు. మరో ఐదు రోజుల్లో 1,500 మె.ట., వస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని చెప్పారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్, డీఏఓ వెంకటేశ్ తదితరులున్నారు. -
ఆహార పదార్థాల తయారీలో జాగ్రత్తలు తీసుకోవాలి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: తిను బండారాలు, వివిధ ఆహార పదార్థాలతో వంటల తయారీలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మెప్మా పీడీ మహమ్మద్ యూసుఫ్ సూచించారు. బుధవారం మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో సుమారు 80 మంది వీధి వ్యాపారులకు ఒకరోజు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ వంటకాలు నాణ్యంగా ఉండాలని, శుచి–శుభ్రత పాటించాలన్నారు. చేతికి గ్లౌజ్లతో పాటు ఆఫ్రాన్ ధరించాలన్నారు. ఆయా వంటల్లో మేలురకమైన మంచినూనెను వాడాలన్నారు. వివిధ పదార్థాల కొనుగోలు సమయంలో వాటి గడువు తేదీని గమనించి బ్రాండెడ్వి మాత్రమే తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ అజ్మీర రాజన్న, ఇన్చార్జ్ డీఎంసీ ఎం.లక్ష్మి, సీఓలు, ఆర్పీలు పాల్గొన్నారు. -
ఎన్ఎస్ఎస్తో విద్యార్థులకు బాధ్యత
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఎన్ఎస్ఎస్తో విద్యార్థులు పాల్గొంటే సామాజిక బాధ్యత పెరుగుతుందని పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈమేకు పీయూ ఫార్మసీ ఆడిటోరియంలో బుధవారం ఎన్ఎస్ఎస్ డేను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వీసీ హాజరై విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. ఎన్ఎస్ఎస్ వలంటీర్లు గ్రామాలను దత్తత తీసుకుని, వాటిలో అనేక సామాజిక కార్యక్రమాలు, పచ్చదనం పరిశుభ్రత వంటి కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. బాల్య వివాహా లు, పారిశుద్ధ్యం, అక్షరాస్యత, ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో ప్రజలకు ఎంతో ప్రయోజనం ఉందన్నా రు. గ్రామాల్లో 7 రో జులపాటు నిర్వహించే కార్యక్రమాల్లో ఎన్నో అనుభవాలను నేర్చుకునేందుకు అవకాశం ఉందన్నారు. పీయూలో నిర్వహించిన క్యాంపులో పరిసరాలను పరిశుభ్రంగా చేయడం అభినందించ విషయమన్నా రు. రిజిస్ట్రార్ రమేశ్బాబు మాట్లాడుతూ.. వలంటీర్స్ మొక్కలను నాటి వాటిని సంరక్షించాల ని, వాటిద్వారా ప్రకృతికి మేలు జరుగుతుందన్నా రు. చురుకుగా యువ వలంటీర్లు పీయూ ఎన్ఎస్ఎస్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా వ్యాసరచన, పాటల పోటీ ల్లో ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులను ప్రదా నం చేశారు. అనంతరం వీసీని ప్రోగ్రామ్ అధికారు లు సన్మానించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ ప్రవీణ, ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, వైస్ ప్రిన్సిపాల్ కృష్ణయ్య, ప్రోగ్రాం అధికారులు రవికుమార్, గాలెన్న, అర్జున్కుమార్, రాఘవేందర్, ఈశ్వర్, శివకుమార్, చిన్నాదేవి పాల్గొన్నారు. -
అక్టోబర్ 22 నుంచి కురుమూర్తి జాతర
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): వచ్చేనెల 22 నుంచి నవంబర్ 7 వరకు నిర్వహించనున్న కురుమూర్తిస్వామి (జాతర) బ్రహ్మోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. కురుమూర్తిస్వామి జాతర ఏర్పాట్లపై బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డితో కలిసి కలెక్టర్ జిల్లాస్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించి.. జాతర వాల్పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు. బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 22న ప్రారంభమవుతాయని, 26న స్వామివారి అలంకారోత్సవం, 28న ఉద్దాల ఉత్సవం, నవంబర్ 2న స్వామివారి కల్యాణోత్సవం ఉంటుందన్నారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తాగునీరు, పారిశుద్ధ్యం, ఆహారం, ఫెస్టివల్, లా అండ్ ఆర్డర్ తదితర ముఖ్యమైన కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. జాతరకు వచ్చే భక్తుల కోసం తాగునీరు, పారిశుధ్యం, టాయిలెట్లు, బందోబస్తు, రవాణా సౌకర్యాలు, వాహనాల పార్కింగ్ ఏర్పాటుకు ఆయా శాఖల అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ● బందోబస్తులో భాగంగా ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ తరపున ప్రథమ చికిత్స, అంబులెన్స్లు అందుబాటులో ఉంచాలన్నారు. ● ఆర్అండ్బీ ద్వారా బారికేడింగ్, రహదారులకు ప్యాచ్ వర్కు, మరమ్మతు చేయించాలని ఆదేశించారు. పీఆర్ పరిధిలోని రోడ్లపై గుంతలు పూడ్చాలని, రోడ్డు పొడవునా జంగిల్ కటింగ్ చేయాలన్నారు. ● మిషన్ భగీరథ శాఖ ద్వారా తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మించాలని, షవర్లు పెట్టాలని, భక్తులకు అసౌకర్యం లేకుండా తాగునీరు సరఫరా చేయాలన్నారు. ముఖ్యమైన రోజులలో అవసరమైతే ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేపట్టాలన్నారు. ● 24 గంటలు విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని, జనరేటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ● ఎకై ్సజ్ శాఖ ద్వారా అవసరమైనంత సిబ్బందిని ఏర్పాటు చేసి బెల్ట్ షాపులను మూసివేయడమే కాకుండా, మద్యం అమ్మకాలు లేకుండా చూసుకోవాలన్నారు. ● భక్తులకు అన్ని విషయాలు తెలిసేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని, ఆర్టీసీ ద్వారా తగినన్ని బస్సులు నడిపించాలని, పంచాయతీ శాఖ ద్వారా శానిటేషన్కు ఎక్కువ మంది సిబ్బందిని ఏర్పాటు చేసి పారిశుద్ధ్య సమస్య రాకుండా చూసుకోవాలన్నారు. ● బ్రహ్మోత్సవాలపై జిల్లాలోని ప్రజలతోపాటు ఇతర ప్రాంతాలకు తెలిసే విధంగా విస్తృత ప్రచారం చేయాలని డీపీఆర్ఓను ఆదేశించారు. ● ఎస్పీ జానకి మాట్లాడుతూ జాతరలో బందోబస్తు, శాంతిభద్రతల పర్యవేక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదుపాయం పోలీస్ శాఖ ద్వారా నిర్వహించనున్నట్లు చెప్పారు. షీ టీం, మఫ్టీ టీంలను ఏర్పాటు చేసి చోరీలు, ఇతరత్రా అవాంచనీయ ఘటనలు జరగకుండా చూస్తామన్నారు. బ్రహ్మోత్సవాలకు పకడ్బందీగా ఏర్పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో కలెక్టర్ విజయేందిర ఆదేశం విజయవంతం చేద్దాం.. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సమ్మక్క, సారలమ్మ జాతర తర్వాత కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారని, ఆయా శాఖల అధికారులు సమన్వయంతో జాతరను విజయవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరారు. దేవరకద్ర నుంచి కురుమూర్తి ఆలయానికి వచ్చే దారిలో రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి వద్ద రెండు చోట్ల డైవర్షన్ చేసిన సర్వీస్ రోడ్లకు మరమ్మతు చేపట్టాలని సూచించారు. సామాన్య భక్తుల దర్శనానికి ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, కురుమూర్తిస్వామి ఆలయ చైర్మన్ గోవర్ధన్రెడ్డి, ఈఓ మదన్రెడ్డి, జిల్లా, చిన్నచింతకుంట మండల అధికారులు పాల్గొన్నారు. -
పెండింగ్ వేతనాలు ఇవ్వాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): గ్రామ పంచాయతీ వర్కర్స్కు పెండింగ్లో ఉన్న మూడు నెలల వేతనాలను వెంటనే ఇవ్వాలని తెలంగా ణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియర్ రా ష్ట్ర అధ్యక్షుడు నరసింహారెడ్డి కోరారు. ఈ మే రకు బుధవారం హైదరాబాద్లో పీఆర్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సృజనకు వినతిప త్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా పండుగకు తమతోపా టు తమ కుటుంబ సభ్యులు మొత్తం పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు పంచాయతీ సిబ్బందికి గ్రీన్ చానల్ ద్వారా బ్యాంక్ అకౌంట్లలో జమ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరాజ్యం, ఉప ప్రధాన కార్యదర్శి రామచంద్రయ్య, మహిళా కన్వీనర్ పద్మమ్మ, జిల్లా నాయకులు ఆంజనేయులు పాల్గొన్నారు.పెరగని ఉల్లి ధరదేవరకద్ర: పట్టణంలోని మార్కెట్ యార్డులో బుధవారం ఉల్లి వేలం నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి రైతులు దాదాపు వేయి బస్తా ల ఉల్లిని అమ్మకానికి తెచ్చారు. ఉల్లి క్వింటాల్ ధర గరిష్టంగా రూ.1,700, కనిష్టంగా రూ. 1,200 ధరలు నమోదయ్యాయి. కర్నూలు, రాయచూర్ ప్రాంతాలకు కొత్త ఉల్లి రాకతో ధరలు బాగా పడిపోయాయి. దీంతో దేవరక ద్ర మార్కెట్పై కూడా ఆ ప్రభావం కనిపించింది. 50 కిలోల బస్తా ధర గరిష్టంగా రూ.850, కనిష్టంగా రూ.600 చొప్పున విక్రయించారు.ఆముదాల ధర రూ.5,709దేవరకద్ర మార్కెట్ యార్డులో బుధవారం మధ్యాహ్నం జరిగిన టెండర్లలో ఆముదాల ధర క్వింటాల్ రూ.5,709, హంస ధాన్యం ధర క్వింటాల్ రూ.1,701 ఒకే ధర లభించింది.మొక్కజొన్న క్వింటాల్ రూ.1,913జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో బుధవారం మొక్కజొన్న క్వింటాల్ గరిష్టంగా రూ.1,913, కనిష్టంగా రూ.1,601 ధరలు లభించాయి. అలాగే ఆముదాలకు గరిష్టంగా రూ.5,906, కనిష్టంగా రూ.5,856, ఉలువలు రూ.3,501 చొప్పున వచ్చాయి. -
పాలమూరుకు క్రీడాకళ
● నేటినుంచి సీనియర్ పురుషుల ఫుట్బాల్ పోటీలు ● నాలుగు రోజులపాటు మెయిన్ స్టేడియంలో నిర్వహణ ● 240 మంది క్రీడాకారులు, 40 మంది అఫీషియల్స్ మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా కేంద్రం రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల ఫుట్బాల్ పోటీలకు వేదిక కానుంది. మెయిన్ స్టేడియంలో గురువారం నుంచి ఈనెల 28వ తేదీ వరకు ఫుట్బాల్ పోటీలు జరగనున్నాయి. జిల్లాలో మూడోసారి రాష్ట్రస్థాయి సీనియర్ ఫుట్బాల్ పోటీలు నిర్వహించనున్నారు. టోర్నీలో పాల్గొననున్న 12 జట్లు రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల ఫుట్బాల్ చాంపియన్ షిప్లో ఉమ్మడి జిల్లాలైన మహబూబ్నగర్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, మెదక్, నల్గొండ జట్లతోపాటు వనపర్తి, జోగుళాంబ గద్వాల, సిద్దిపేట జట్లు పాల్గొంటున్నాయి. 240మంది క్రీడాకారులు, 24మంది కోచ్, మేనేజర్లు, 10 మంది టెక్నికల్ అఫీషియల్స్ హాజరవుతున్నారు. టోర్నీలో పాల్గొనే క్రీడాకారులకు లిటిల్ స్కాలర్స్, రెయిన్ బో, మాడ్రన్ స్కూల్లో వసతి, మెయిన్ స్టేడియంలో భోజన సౌకర్యం కల్పించనున్నారు. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో మ్యాచ్లు ఫుట్బాల్ టోర్నీలో లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో మ్యాచ్లు జరగనున్నాయి. టోర్నీలో మొత్తం 19 మ్యాచ్లు నిర్వహించనున్నారు. టోర్నీలో పాల్గొనే జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. గ్రూప్–ఏలో వనపర్తి, నిజామాబాద్, ఆదిలాబాద్, గ్రూప్–బిలో మహబూబ్నగర్, ఖమ్మం, కరీంనగర్, గ్రూప్–సిలో సిద్దిపేట, నల్గొండ, రంగారెడ్డి, గ్రూప్–డిలో గద్వాల, మెదక్, వరంగల్ జట్లు ఉన్నాయి. నేడు ఉదయం 11గంటలకు స్టేడియంలో రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల ఫుట్బాల్ చాంపియన్ షిప్ను క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి ప్రారంభించనున్నారు. ఈనెల 28న సాయంత్రం 3గంటలకు జరిగే ముగింపు వేడుకల్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. టోర్నమెంట్ ఏర్పాట్ల పరిశీలన మెయిన్ స్టేడియంలో జరిగే ఏర్పాట్లను ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు, జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్పీ వెంకటేశ్, ప్రధాన కార్యదర్శి భానుకిరణ్ తదితరులు పరిశీలించారు. అదేవిధంగా జిల్లా జట్టుకు క్రీడాదుస్తులు అందజేశారు. కార్యక్రమంలో సభ్యులు గజానంద్కుమార్, సూర్యప్రకాశ్, ఇమాన్యుయెల్ జేమ్స్, రామేశ్వర్, నగేశ్, రామకృష్ణ పాల్గొన్నారు. ఫుట్బాల్ పురుషుల జిల్లా జట్టు అరుణ్, నికేశ్, దినేశ్, రాములు, కృష్ణ, శ్రీకాంత్, ప్రకాశ్, నరేష్, స్నేహిత్, సాయికృష్ణ, సామెలు, కల్యాణ్, జహంగీర్, శివప్రసాద్, సూర్యప్రకాశ్, ఆర్య, హిమకిరణ్, సమీర్ బిన్ మహ్మద్ సిద్దిఖ్, లక్ష్మణ్గౌడ్, ప్రేమ్కుమార్, కోచ్ మీర్ వాజిద్ అలీ, మేనేజర్ రాజేందర్. -
పల్లెగడ్డ ప్రజలకు ఇచ్చిన నోటీసులు రద్దు చేయాలి
మరికల్: పల్లెగడ్డ గ్రామాన్ని ఖాళీ చేయాలని దేవాదాయ శాఖ గ్రామస్తులకు ఇచ్చిన నోటీసులను వెంటనే రద్దు చేయాలని బుధవారం సీపీఐఎమ్ఎల్, మాస్లైన్ పార్టీల ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. సీపీఐఎమ్ఎల్ జిల్లా కార్యదర్శి కాశీనాథ్, మాస్లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి రాము మాట్లాడుతూ పల్లెగడ్డ గ్రామంలో తరతరాలుగా ఉంటున్న 280 కుటుంబాలకు అన్ని రకాల హక్కులు కల్పించాలన్నారు. అన్ని కుటుంబాలు ఏళ్లుగా ఇంటి, నీటి, కరెంట్ బిల్లులు చెల్లిస్తున్నారని గుర్తు చేశారు. అనంతరం తహసీల్దార్ రాంకోటి మాట్లాడుతూ గ్రామస్తులకు న్యాయం జరిగేలా చూస్తానన్నారు. కార్యక్రమంలో నాయకులు సలీం, హన్మంతు, చెన్నయ్య, రాములు, కుర్మయ్య, యాదగిరి, రాము, రామాంజనేయులు, వెంకట్రాములు, హాజిమలాంగ్ పాల్గొన్నారు. మహిళా కానిస్టేబుల్కు కాంస్యం మహబూబ్నగర్ క్రైం: హర్యానా రాష్ట్రంలో ఈ నెల 20నుంచి 24 వరకు జరిగిన ఆల్ ఇండియా 74వ పో లీస్ రెజ్లింగ్ క్లస్టర్లో జిల్లా పో లీస్ శాఖకు చెందిన కానిస్టేబుల్ రాధిక కాంస్య పత కం సాధించారు. తెలంగాణ పోలీస్ మహిళా ఆర్మ్ రెజ్లింగ్ క్రీడకారిణి అడ్డాకుల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే కానిస్టేబుల్ రాధిక క్యాంస పతకం సాధించింది. దీంతో కానిస్టేబుల్రాధికను ఎస్పీ జానకి అభినందించారు. షార్ట్సర్క్యూట్: రూ.లక్ష నష్టం కల్వకుర్తి టౌన్: పట్టణంలోని టైలర్ దుకాణంలో షార్ట్సర్క్యూట్తో అగ్ని ప్రమాదం బుధవారం చోటుచేసుకుంది. పట్టణంలోని తిలక్గనర్ కాలనీలో నివాసముండే మురళి ఇంటి వద్ద బాలాజీ టైలర్ దుకాణాన్ని నడిపిస్తున్నాడు. మంగళవారం రాత్రి దుకాణం మూసి నిద్రించాడు. తెల్లవారుజామున ఒక్కసారిగా ఇంటిచుట్టూ పొగ కమ్ముకోవడంతో కిందకు వెళ్లి చూశాడు. దుకాణంలో మంటలు వ్యాపించినట్లు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో రూ.లక్ష వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
చంద్రఘంటాదేవి.. పాహిమాం
● వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ● ప్రముఖులు, దాతల ప్రత్యేక పూజలు అలంపూర్: చంద్రఘంట మాతా.. పాహిమాం అంటూ భక్తులు అమ్మవారిని శరణు కోరారు. అలంపూ ర్ క్షేత్రంలో శరన్న నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా కొనసాగాయి. ఉత్సవాల మూడో రోజు బుధవారం జోగుళాంబ మాత చంద్రఘంట దేవీగా భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి తరలొచ్చిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూ జలు చేశారు. చంద్రఘంట మాతను ప్రత్యేక మండపంలో కొలువుదీర్చగా.. అర్చక స్వాములు కొలువుపూజ, దర్బారు సేవ, కుమారి పూజ, సువాసిని పూజ, మహామంగళహారతి, నీరజన మంత్ర పుష్పములు వంటి విశేష పూజలు నిర్వహించారు. అదేవిధంగా అమ్మవారి సన్నిధిలో ఉదయం నుంచి ని రంతరాయంగా నిత్యానుష్ఠానం, అవాహిత దేవతా హోమాలు, కుంకుమార్చనలు, శ్రీచక్రనవావరణ అర్చనలు, సహస్రనామర్చన దశవిధ హారతులను అందజేశారు. శరన్నవరాత్రుల్లో జోగుళాంబను మూడోరోజు చంద్రఘంట మాతగా ఆరాధిస్తారని అర్చకస్వామలు తెలిపారు. అమ్మవారు శిరస్సుపై అర్ధచంద్రుడు అర్ధాకృతిలో ఉండడంతో చంద్రఘంట దేవీగా పేరుగాంచినట్లు భక్తులకు వివరించారు. అమ్మవారు చేతుల్లో శస్త్ర, అస్త్రాలను ధరించి ఉంటారని, చంద్రఘంట అమ్మవారిని ఆరాధించిన వారికి మంగళం సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఉత్సవాల్లో భాగంగా ఆలయాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. క్షేత్రానికి తరలి వచ్చిన భక్తులకు ప్రసాద్ స్కీం భవనంలో బాలబ్రహ్మేశ్వరస్వామి నిత్యాన్నదాన సత్రంలో అన్నప్రసాదం అందజేశారు. ఉత్సవాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనపు ఎస్పీ శంకర్ ఎస్ఐ వెంకటస్వామితో కలిసి పరిశీలించారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి అలంపూర్: జోగుళాంబ అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. అలంపూర్ క్షేత్ర ఆలయాలను ఎంపీ డీకే అరుణ కుటుంబ సమేతంగా బుధవారం దర్శించుకున్నారు. ఈఓ దీప్తి అర్చకులతో కలిసి ఆలయ మర్యాదలతో ఎంపీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె బాలబ్రహ్మేశ్వర, జోగుళాంబ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు శేషవస్త్రాలతో సత్కరించారు. అర్చక స్వాములు తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం పలికారు. వీరితోపాటు బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. జోగుళాంబ అమ్మవారి ఆశీర్వాదం రాష్ట్ర, దేశ ప్రజలపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నాయకత్వంపై ఉండాలని ఆకాంక్షించినట్లు తెలిపారు. శక్తిపీఠ క్షేత్ర అభివృద్ధికి కేంద్రం ద్వారా గతంలోనే నిధులు వచ్చాయన్నారు. ఇంకా కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయన్నారు. పెండింగ్ పనులకు సంబంధించి ప్రతిపాదనలు పంపిస్తే నిధులు మంజూరు కావడానికి అవకాశం ఉంటుందన్నారు. దేవదాయ, పర్యాటక శాఖ అధికారులు సమన్వయంతో ఉమ్మడి ప్రతిపాదనలు చేయడానికి చొరవ తీసుకోవాలన్నారు. గతంలో అన్ని పనులకు కలిపి నిధులు మంజూరయ్యాయని, పెండింగ్కు పనులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలన్నారు. నిధుల మంజూరుపై సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకరావాలని సూచించారు. ఎంపీకి వినతులు అలంపూర్ క్షేత్ర ఆలయాలను దర్శించుకున్న మహబుబ్నగర్ ఎంపీ డీకే అరుణకు పలువురు వినతులు అందజేశారు. క్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం బాలబ్రహ్మేశ్వర, జోగుళాంబ రైల్వే స్టేషన్లో అన్ని రైళ్లు నిలిపేలని పాలక మండలి సభ్యులు వినతి పత్రం అందజేశారు. రైల్వేస్టేషన్ మీదుగా రాకపోకలు సాగించే ఒక రైలుకు జోగుళాంబ ఎక్స్ప్రెస్ పేరుగా నామకరణ చేయాలని కోరారు. అలంపూర్ క్షేత్రానికి దర్శనానికి వచ్చే క్రమంలో పలువురు నాయకులు డీకే అరుణ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. నాయకులు శరత్బాబు, రంగస్వామి, నరేశ్, లక్ష్మణ్, మద్దిలేటి, వెంకటస్వామి తదితరులు ఉన్నారు. అమ్మవారికి మకరతోరణం అలంపూర్: జోగుళాంబ అమ్మవారికి భక్తులు మకరతోరణం బహూకరించినట్లు ఈఓ దీప్తి తెలిపారు. హైదరాబాద్కు చెందిన భక్తులు తీగల క్రాంతిరెడ్డి, లక్ష్మీస్రవంతి అమ్మవారికి బంగారం పూతతో మకరతోరణం పీఠం తొడుగులను బహూకరించినట్లు పేర్కొన్నారు. వీటి విలువ దాదపు రూ.55లక్షల వరకు ఉంటుందన్నారు. తీగల క్రాంతిరెడ్డి, లక్ష్మీస్రవంతికి ఈఓ స్వాగతం పలికి జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం వారిని శేషవస్త్రాలతో సత్కరించగా అర్చకులు తీర్థప్రసాదాలను అందజే ఆశీర్వచనం పలికారు. -
ప్రజలకు నమ్మకం కల్పించాలి
రాజాపూర్ (బాలానగర్)/ అడ్డాకుల/ భూత్పూర్: సమస్యలతో పోలీస్స్టేషన్కు వచ్చే ప్రజలకు భద్రత, నమ్మకం కల్పించాలని జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ అన్నారు. బుధవారం బాలానగర్, మూసాపేట మండల కేంద్రాల్లో పోలీస్స్టేషన్లను ఆయన ఎస్పీ జానకితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్లోని రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రోడ్డు ప్రమాదాలు జరిగే స్పాట్లను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. సైబర్ నేరాలపై సిబ్బంది ప్రత్యేక శిక్షణ పొందుతూ ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పోలీస్స్టేషన్కు వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించి వారి సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. అలాగే భూత్పూర్ సీఐ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్స్టేషన్లలో రికార్డుల నిర్వహణ, పరిశుభ్రత, కేసుల దర్యాప్తు తదితర వాటిపై సమీక్ష నిర్వహించారు. విలేజ్ పోలీసు ఆఫీసర్లు వారికి కేటాయించిన గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకొని, తక్షణమే స్పందించాలని డీఐజీ సూచించారు. వారి వెంట డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు నాగార్జునగౌడ్, రామకృష్ణ, ఎస్ఐలు లెనిన్గౌడ్, శివకుమార్నాయుడు, శివానందంగౌడ్, వేణు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఖైదీలకు మెరుగైన సేవలు అందించాలి
నాగర్కర్నూల్ క్రైం: సబ్జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ నసీం సుల్తానా అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సబ్ జైలును ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ ఖైదీలకు కల్పిస్తున్న వసతుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేని వారికి న్యాయసేవాధికార సంస్థ తరఫున ప్రభుత్వ న్యాయవాదిని ఉచితంగా నియమిస్తామన్నారు. వంటశాల, ఆహార పదార్థాలు, వంట సరుకులను పరిశీలించారు. ఖైదీలకు మెనూ ప్రకారం ఆహారాన్ని అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. జైలు పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సబ్ జైలర్ గుణశేఖర నాయుడు, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీరామ్ ఆర్య పాల్గొన్నారు. -
మాజీ కౌన్సిలర్పై కేసు నమోదు
● నగర కమిషనర్పై అసభ్య పదజాలం ● ఆడియో వాట్సాప్లో హల్చల్ ● ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన కమిషనర్ మహబూబ్నగర్ క్రైం/మున్సిపాలిటీ: మున్సిపల్ కమిషనర్కు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించిన వ్యవహారంలో మాజీ కౌన్సిలర్పై వన్టౌన్ పోలీస్స్టేషన్లో పలు రకాల సెక్షన్స్ కింద కేసు నమోదైనట్లు వన్టౌన్ సీఐ అప్పయ్య పేర్కొన్నారు. సీఐ కథనం ప్రకారం.. మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో 7వ వార్డు శ్రీనివాసకాలనీకి చెందిన మాజీ కౌన్సిలర్ కట్టా రవికిషన్రెడ్డి మంగళవారం సాయంత్రం మహబూబ్నగర్ నగర కమిషనర్ ప్రవీణ్కుమార్రెడ్డికి ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు కార్యాలయం వద్దకు వచ్చి తన విధులకు అటకం కల్గించేలా ప్రవర్తించాడని కమిషనర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ప్రభుత్వ అధికారి విధులకు అటంకం కలిగించిన క్రమంలో సెక్షన్ 221, 132, 133, 352 బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు. ● ఉన్నత అధికారులకు ఫిర్యాదులు మహబూబ్నగర్ నగర కమిషనర్ ప్రవీణ్కుమార్రెడ్డి మంగళవారం సాయంత్రం శ్రీనివాసకాలనీలో ఆయన అద్దెకు ఉన్న ఇంట్లో ఉండగా.. మాజీ కౌన్సిలర్ కట్టా రవికిషన్రెడ్డి పలుమార్లు ఫోన్ చేయగా.. లిఫ్ట్ చేసిన వెంటనే వ్యక్తిగతంగా దూషించారు. ఆ తర్వాత కమిషనర్ ఆఫీస్ వద్దకు వెళ్లాగా.. అప్పటికే అక్కడ ఉన్న రవికిషన్రెడ్డి గేట్ దగ్గర ఎదురుపడ్డారు. అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతోపాటు హైడ్రామా కొనసాగింది. అప్పటికే వన్టౌన్ ఎస్ఐ శీనయ్యతోపాటు పోలీసులు అక్కడికి చేరుకుని కట్టా రవికిషన్రెడ్డిని అదుపులోకి తీసుకుని అక్కడినుంచి వన్టౌన్కు తరలించారు. ఈ వ్యవహారంపై కమిషనర్ ఎస్పీ జానకి, అదనపు కలెక్టర్కు శివేంద్రప్రతాప్కు ఫోన్ద్వారా ఫిర్యాదు చేశారు. డీఎస్పీ వెంకటేశ్వర్లుకు రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని డీఎస్పీ వెల్లడించారు. -
900 కేజీల నల్లబెల్లం పట్టివేత
లింగాల: అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లాన్ని సోమవారం రాత్రి స్వాధీనం చేసుకొని వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎకై ్సజ్ సీఐ సుబ్రమణ్యం, ఎస్ఐ జనార్ధన్ మంగళవారం తెలిపారు. మండల కేంద్రానికి సమీపంలోని మగ్దూంపూ ర్ చౌరస్తాలో వాహనంలో తరలిస్తున్న 900 కేజీ ల నల్లబెల్లాన్ని పట్టుకొని నల్లపోతుల హరీశ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి తహసీల్దార్ పాండునాయక్ ఎదుట బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు. లింక్ ఓపెన్.. రూ.3 లక్షలు మాయం నాగర్కర్నూల్ క్రైం: ఫోన్కు వచ్చిన అపరిచిత లింక్ ఓపెన్ చేయడంతో బ్యాంక్ ఖాతా నుంచి రూ.3 లక్షలు సైబర్ నేరస్తులు చోరికీ పాల్పడిన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకోగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. బాధితు డు తెలిపిన వివరాలు.. జిల్లా కేంద్రంలోని శ్రీ పురం రోడ్డులో నివాసం ఉంటున్న వసంత్ ఫో న్కు సైబర్ నేరగాళ్లు ఓ లింక్ను పంపించారు. ఈ క్రమంలో లింక్ ఓపెన్ చేయగా బ్యాంకు ఖాతా నుంచి రూ.3 లక్షలు విత్డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో మోసపోయినట్లు గుర్తించినట్లు తెలిపారు. అనంతరం సైబర్ పోర్టల్కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. చిన్నారుల అశ్లీల చిత్రాలు ఫార్వర్డ్ ● ముగ్గురిపై కేసు నమోదు వెల్దండ: మండలానికి చెందిన చిన్నారి బాలబాలికల అశ్లీల చిత్రాలను సామాజిక మాధ్యమా ల్లో ఫార్వర్డ్ చేసిన ముగ్గురిపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కురుమూర్తి తెలి పారు. చిన్నారుల అశ్లీల చిత్రాలు చూసినా.. వాట్సప్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్ తదితర సా మాజిక మాధ్యమాల్లో ఇతరులకు పంపించినా చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఇలాంటి వాటిని గుర్తించేందుకు ప్రత్యేకంగా నిఘా విభాగం పనిచేస్తుందని తెలిపారు. వారి సమాచారం మేరకు ముగ్గురిని గుర్తించి కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సెల్ఫోన్కు దూరంగా ఉంచాలని సూచించారు. రహస్యంగా మహిళల వీడియోల చిత్రీకరణ ధన్వాడ: మహిళలు స్నానం చేసే సమయంలో రహస్యంగా వీడియోలు చిత్రీకరించిన వ్యక్తిపై కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. మండలంలోని హన్మాన్పల్లి గ్రా మానికి చెందిన కుర్వ సత్తయ్య మంగళవారం ఉదయం ఓ మహిళ బాత్రూంకు వెళ్లగా పైన ఉన్న వెంటిలేటర్ కిటికీలో నుంచి వీడియో తీ శాడు. ఫోన్ ఫ్లాష్ లైట్ పడటంతో సదరు మహి ళ గుర్తించి అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా చేతిలో ఉన్న ఫోను జారి కిందపడగా.. వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో బాధితులు ఈ విషయం భర్తకు చెప్పడంతో ఫోన్ ఎవరిది అని ఆరాతీయగా గ్రామానికి చెందిన కుర్వ సత్తయ్యగా గుర్తించారు. ఫోన్ అన్లాక్ చేసి చూడగా అందులో మరో ఆరుగురు మహిళలు బాత్రూం వెళ్లినప్పుడు తీసిన వీడియోలు ఉండటంతో వెంటనే ధన్వాడ పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఎస్ఐ రాజశేఖర్ స్పందిస్తూ.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి అలంపూర్ రూరల్: రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటస్వామి తెలిపిన వివరాలు.. పెబ్బేర్ మండలం చెలిమిల్లకు చెందిన నాగమణి(48) భర్త గోపాల్తో కలిసి బొంతల వ్యాపారం చేసేవారు. ఈ క్రమంలో మంగళవారం లింగన్వాయికి భర్తతో కలిసి బైక్పై వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో నాగమణి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు ఊట్కూర్కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ సమీర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
శక్తిస్వరూపిణి.. బ్రహ్మచారిణి
● శరన్నవరాత్రి ఉత్సవాల్లో విశేష పూజలు ● అమ్మవారి దర్శనానికి తరలివచ్చిన భక్తులు నిత్యపూజల్లో అర్చక స్వాములు జోగుళాంబ అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు అలంపూర్: జోగుళాంబ అమ్మవారు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు మంగళవారం బ్రహ్మచారిణి దేవిగా దర్శనమిచ్చి భక్తుల చేత విశేష పూజలందుకున్నారు. బ్రహ్మచారిణి మాతగా కొలువుదీరిన అమ్మవారికి అర్చక స్వాములు ప్రత్యేక మండపంలో కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చక స్వాములు కొలువు పూజ, దర్బారు సేవ, కుమారి పూజ, సువాసినీ పూజ అనంతరం మహామంగళ హారతి, నీరజన మంత్ర పుష్పములు వంటి విశేష పూజలు చేశారు. నవరాత్రుల్లో రెండో రోజు జోగుళాంబ అమ్మవారిని బ్రహ్మచారిణి మాతగా ఆరాధిస్తారని అర్చక స్వాములు తెలిపారు. అమ్మవారు దేవత శుద్ధస్పటిక వర్ణములతో ప్రకాశించే స్వభావాన్ని కలిగి ఉంటారని వివరించారు. అమ్మవారి చేతిలో పుస్తకం, జపమాల, కమండలం, దండం కలిగి ఉంటారని భక్తులకు తెలిజేశారు. అమ్మవారిని పూజించిన వారికి జీవితంలో వచ్చే అనేక ఒడిదుడుకులను ధైర్యంగా ఎదర్కొనే శక్తి లభిస్తుందన్నారు. ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జోగుళాంబ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిత్యానుష్ఠానం, ఆవాహితా దేవత హోమా లు, నిత్య బలిహరణ, అర్చనలు, నీరాజన మంత్ర పుష్పములు, అమ్మవారికి నవాన్న సహిత మహాని వేదన, బలిహరణ సమర్పణ వంటి పూజలు ప్రత్యేకంగా చేశారు. యాగశాలలో నిత్యానుష్ఠానం, ఆవాహిత దేవత హోమాలు, నిత్య బలిహరణ పూజలతో ఆరాధించారు. అదేవిధంగా కుంకుమార్చన మండపంలో కుంకుమార్చనలు, యాగశాలలో చండీహోమాలు కొనసాగాయి. తరలివచ్చిన భక్తులు అలంపూర్ క్షేత్ర ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. జోగుళాంబ అమ్మవారి బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావడ తో క్యూలైన్ల వద్ద బారులుదీరారు. ఆలయ ప్రాంగణాలు భక్తుల సందడితో రద్దీగా మారాయి. భక్తులకు ఆలయ అధికారులు నిత్యాన్నదాన సత్రంలో అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ పెరగడంతో అ న్నప్రసాదం కోసం భక్తులు వెచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. సీఐ రవిబాబు ఆధ్వరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సమస్య లు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఆయా శాఖల అధికారులు భక్తుల సేవలో నిమగ్నమ య్యారు. -
ముగిసిన రెండో దశ ఐసెట్ అడ్మిషన్లు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో సీట్ల భర్తీకి ప్రభుత్వం నిర్వహించిన ఐసెట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు పీయూలో రెండు దశల్లో అడ్మిషన్ల ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. ఈ మేరకు ఈ నెల మొదటి వారంలో మొదటి దశ అడ్మిషన్లు కల్పించిన ప్రభుత్వం ఈ నెల 18 నుంచి రెండో దశ చేపట్టగా.. ఎంబీఏలో 60 సీట్లు ఉండగా 57 సీట్లు, అలాగే ఎంసీఏలో 60 సీట్లకు గాను 47 సీట్లు భర్తీ అయ్యాయి. మంగళవారం చివరిరోజు 30 మంది విద్యార్థులు పీయూలో రిపోర్టు చేసి అడ్మిషన్లు పొందారు. 18 సీట్లు ఖాళీగా ఉండడంతో మరోమారు కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు భర్తీ చేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. -
మెరుగైన వైద్యసేవలు అందించాలి
మన్ననూర్: ఐటీడీఏ పరిధి, నల్లమల పరీవాహక ప్రాంతంలోని చెంచుపెంటలు, గూడేల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ రోహిత్రెడ్డి అన్నారు. మంగళవారం మన్ననూర్లోని ఐటీడీఏ కార్యాలయ సమావేశం హాలులో సంబంధిత వైద్య అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్రాబాద్, పదర, అచ్చంపేట, బల్మూర్, లింగాల, ఉప్పునుంతల, పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్ అనుసంధానంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పీఎం జన్మన్, మొబైల్ టీం, ఎంసీహెచ్ అపిడెమిక్ టీం అధికారులు, సిబ్బందితో చర్చించారు. సీజనల్ వ్యాధులు, టీబీ, గర్భిణిలు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న వైద్య సేవల గురించి వివరాలు అడిగి తెలుసున్నారు. ముఖ్యంగా మారుమూల చెంచు పెంటల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఎండీహెచ్ఓ రవికుమార్, ఎంహెచ్ఎం ప్రోగ్రాం అధికారి లక్ష్మణ్, పీఎం జన్మన్ జిల్లా ఇన్చార్జ్ కృష్ణమోహన్, మాతా శిశు సంక్షేమం, ఎన్సీడీ, ఆర్బీఎస్కె అధికారులు, పీహెచ్సీ వైద్యులు తదితరులు పాల్గొన్నారు. -
రైల్వే బ్రిడ్జిలు నిర్మించండి
కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రికి ఎంపీ, ఎమ్మెల్యే వినతి పాలమూరు: మహబూబ్నగర్ కార్పొరేషన్లో రైల్వే ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని కోరుతూ మంగళవారం ఢిల్లీలో ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డిలు కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి సోమన్నకు వినతిపత్రం అందించారు. పాలమూరులో రైల్వే గేట్ల వల్ల నిత్యం ట్రాఫిక్ నిలిచిపోతుండటంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నగరం రోజురోజుకు విస్తరిస్తున్న క్రమంలో రైల్వే గేట్లు సమస్యగా మారాయని.. సరైన రోడ్డు విభజన లేకపోవడం వల్ల గేట్ పడిన ప్రతిసారి ట్రాఫిక్ సమస్య తలెత్తుతోందని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే టీడీగుట్ట, బోయపల్లి గేట్, తిమ్మసానిపల్లి రైల్వేగేట్ల వద్ద కేంద్రం నిధులతో రైల్వే ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని కోరారు. అదే విధంగా సద్దలగుండు, దివిటిపల్లిలో పాదాచారుల కోసం ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని కోరారు. -
కొండారెడ్డిపల్లిని అగ్రస్థానంలో నిలుపుదాం
వంగూరు: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిని దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలని స్థానిక ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ అన్నారు. మంగళవారం కొండారెడ్డిపల్లిలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్ల మంజూరు పత్రాలతో పాటు రేషన్కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 26న మెగా జాబ్మేళా ఏర్పాటుచేసినట్లు చెప్పారు. ఉద్యోగాలు వచ్చిన వారంతా హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదని.. కొండారెడ్డిపల్లి నుంచి కంపెనీ వరకు బస్సు ఏర్పాటు చేస్తారని తెలిపారు. అదే విధంగా మహిళా సంఘాలకు పెద్ద మొత్తంలో వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తామన్నారు. దేశంలోని ఏ గ్రామంలో జరగని అభివృద్ధి కొండారెడ్డిపల్లిలో జరుగుతుందని.. ఇప్పటికే దాదాపు రూ. 100 కోట్లతో అభివృద్ధి పనులను పూర్తిచేయడం జరిగిందన్నారు. కొండారెడ్డిపల్లి నుంచి డిండిచింతపల్లి వరకు ఫోర్లైన్స్ నిర్మాణానికి దాదాపు రూ. 56కోట్లు మంజూరైనట్లు తెలిపారు. అదే విధంగా గ్రామంలో పాఠశాల భవనం, పాలసేకరణ కేంద్రం, పోస్టాఫీస్ నిర్మాణాలతో పాటు శ్రీశైలం హైవేలోని రాంనగర్ గేట్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ. 34కోట్లు మంజూరయ్యాయని వివరించారు. ఈ నెల 29న రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి చేతుల మీదుగా అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి సోదరుడు కృష్ణారెడ్డి, రైతు కమిషన్ సభ్యుడు కేవీఎన్ రెడ్డి మాట్లాడుతూ.. కొండారెడ్డిపల్లిలో అవసరమైన వసతులు కల్పించడం జరిగిందని.. ఇంకా ఏ అవసరాలు ఉన్నా తీర్చడానికి ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని అన్నారు. సమావేశంలో కృష్ణారెడ్డి, వేమారెడ్డి, రాఘవేందర్, సురేందర్రెడ్డి, మల్లయ్య తదితరులు ఉన్నారు. -
జూరాలకు 3.32 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో
● ప్రాజెక్టు 45 క్రస్టుగేట్ల ఎత్తివేత ● జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి ● 3.42 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు.. ధరూరు/ఆత్మకూర్: కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీ వరద వస్తోంది. సోమవారం రాత్రి 8 గంటల వరకు ప్రాజెక్టుకు 2.82 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. మంగళవారం రాత్రి 8 గంటలకు 3.32 లక్షల క్యూసెక్కులకు పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 45 క్రస్టు గేట్లు ఎత్తి 3.14 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి ద్వారా 25,676 క్యూసెక్కులు, నెట్టెంపాడుకు 750 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 69 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 390 క్యూసెక్కులు, కుడి కాల్వకు 580 క్యూసెక్కులు కలిపి ప్రాజెక్టు నుంచి మొత్తం 3.42 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9. 657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.651 టీఎంసీల నీ రు నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు వెల్లడించారు. ఆరు యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి ప్రాజెక్టులోని 6 యూనిట్ల ద్వారా 6 యూనిట్ల ద్వారా 358.673 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువ, దిగువ కేంద్రాల్లో ఇప్పటి వరకు 729.535 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేశామని పేర్కొన్నారు. జూరాలకు వరద ప్రవాహం పెరగడంతో దిగువ ఉత్పత్తి కేంద్రంలో విద్యుదుత్పత్తి చేపట్టలేదన్నారు. రెండు గేట్లు తెరిచి.. దేవరకద్ర: కోయిల్సాగర్ ప్రాజెక్టు నుంచి రెండు గే ట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. సోమ వారం 6 గేట్లను తెరిచి నీటిని విడుదల చేయగా.. మంగళవారం ఎగువ నుంచి వచ్చే ఇన్ఫ్లో తగ్గడంతో నాలుగు గేట్లను మూసి 2 గేట్లను రెండు అడుగు ల మేర పైకెత్తి 1,400 క్యూసెక్కుల నీటిని వాగులోకి వదిలారు. పెద్దవాగు ఇన్ఫ్లో పెరిగితే మరిన్ని గేట్ల ను తెరిచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సుంకేసులకు స్వల్పంగా.. రాజోళి: సుంకేసుల డ్యాంకు ఎగువ నుంచి 21,350 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. నాలుగు గేట్లను ఒక మీటర్ మేర తెరిచి 17,916 క్యూసెక్కులు, కేసీ కెనాల్కు 2,445 క్యూసెక్కులను వదిలినట్లు జేఈ మహేందర్ పేర్కొన్నారు. -
ప్రజా సమస్యలపైనిరంతరం పోరు
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ప్రజా సమస్యలపై చైతన్య మహిళ సంఘం నిరంతరం పోరాటం చేస్తోందని చైతన్య మహిళ సంఘం రాష్ట్ర కో–కన్వీనర్ శ్రీదేవి అన్నారు. తాటికొండలో మంగళవారం చైతన్య మహిళా సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చైతన్య మహిళ సంఘం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేశామని, మహిళల హక్కుల సాధన కోసం పోరాటం చేసినట్లు పేర్కొన్నారు. చైతన్య మహిళ సంఘం ఆవిర్భవించి 30 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఏపీలోని ప్రొద్దుటూర్లోని తొగటవీర క్షత్రియ కల్యాణ మండపంలో ఆవిర్భవసభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభను విజయవంతం చేసేందుకు పెద్దఎత్తున మహిళలు హాజరు కావాల ని కోరారు. అనంతరం సభ కరపత్రాన్ని విడుదల చేసి సభను విజయవంతం చేయాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కస్తూరి, దీపమ్మ, శాంత, మహేశ్వరి, పద్మ పాల్గొన్నారు. -
గెలుపోటములను సమానంగా తీసుకోవాలి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని చాటాలని పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. పీయూలో ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ పోటీలకు ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో విద్యార్థులు గెలుపోటములను సమానంగా తీసుకోవాలని సూచించారు. నిరంతర ప్రాక్టీస్ ద్వారా క్రీడల్లో రాణించేందుకు అవకాశం ఉందన్నారు. కేవలం ఎంపికలు ఉన్నప్పుడు మాత్రమే ప్రాక్టీస్ చేయకుండా.. కొత్త మెళకువలు నేర్చుకోవడం ద్వారా రాణించేందుకు ఆస్కారం ఉందన్నారు. ఈ పోటీల్లో విద్యార్థులు తమ పూర్తి ప్రతిభను కనబర్చి తప్పకుండా యూనివర్సిటీకీ పతకాలు సాధించాలని సూచించారు. ఎంపికై న విద్యార్థులకు మంచి శిక్షణ అనంతరం క్రీడల్లో పాల్గొనే విధంగా యూనివర్సిటీ వసతులు కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, ప్రిన్సిపాల్ కరుణాకర్రెడ్డి, పీడీసత్యభాస్కర్, శ్రీనివాస్, బాల్రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీసులు ప్రజలతో మమేకం కావాలి: డీఐజీ
నర్వ/మక్తల్/మాగనూర్: పోలీసు సిబ్బంది గ్రామాల్లో ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం ఆయన నర్వ, మక్తల్, మాగనూర్ పోలీస్స్టేషన్లను ఆయన సందర్శించారు. అధికారులతో సమీక్ష నిర్వహించి కేసుల దర్యాప్తు, రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల పరిష్కారం, క్రైమ్ ప్రివెన్షన్ చర్యలపై పలు సూచనలు చేశారు. సిబ్బంది విధుల గురించి అడిగి తెలుసుకొని సమయపాలన పాటించాలని సూచించారు. డయల్ 100 సేవలపై వేగవంతంగా స్పందించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. వీపీఓలు కేటాయించిన గ్రామాల్లో విధిగా పర్యటించాలన్నారు. క్రమశిక్షణతో మెలుగుతూ ప్రజలకు సేవలు అందించాలని.. ఠాణాకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, నేరాల నియంత్రణపై దృష్టి సారించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి సంబంధిత అధికారులతో కలిసి భద్రత చర్యలు తీసుకోవాలని తెలిపారు. కాలనీలు, గ్రామాల్లో గస్తీ నిర్వహిస్తూ పాత నేరస్తులపై నిఘా ఉంచాలని, దొంగతనాల నియంత్రణకు కృషి చేయాలన్నారు. -
కవులు, కవయిత్రులకు నిలయం పాలమూరు
స్టేషన్ మహబూబ్నగర్: పాలమూరు జిల్లా ప్రము ఖ కవలు, కవయిత్రులకు నిలయమని ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ పూర్వ అధ్యక్షుడు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ పాలమూరు, ప్రమీలాశక్తి పీఠం హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో రావూరి వనజ అధ్యక్షతన మంగళవారం జిల్లాకేంద్రంలోని భారత్ స్కౌట్స్, గైడ్స్ భవన్లో సాహి తీ పురస్కారాల ప్రదానోత్సవంతో పాటు ఉపాధ్యా య సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కాళోజీ పురస్కారాన్ని ప్రముఖ కవి డాక్టర్ గంటా మనోహర్రెడ్డికి, పాకాలా యశోధారెడ్డి పురస్కారాన్ని తెలంగాణ జానపద సాహిత్య పరిషత్ అధ్యక్షులు చింతపల్లి వసుంధరారెడ్డిలకు అందజేశారు. మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు రావూరి వనజ, జి.శాంతారెడ్డిలు దాదాపు 25 మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కసిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ పాకాల యశోధారెడ్డి తెలంగాణ యాసలో అద్భుతమైన రచనలు చేసి పాలమూరు జిల్లాకు తలమానికంగా నిలిచారని అన్నారు. ఆకాశవాణి కేంద్రంలో మొట్టమొదట ప్రసంగాలు చేసిన తెలంగాణ మహిళ అని కొనియాడారు. ఆచార్య మసన చెన్నప్ప మాట్లాడుతూ తిరుపతి కవులకు సమానమైన కవులు ఉన్న జిల్లా పాలమూరు అని పేర్కొన్నారు. అనంతరం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు రావూరి వనజ, జి.శాంతారెడ్డి, డాక్టర్ ప్రమీలారెడ్డి, లక్ష్మణ్గౌడ్, బాలస్వామి, డాక్టర్ చందోజీ, డాక్టర్ గన్నోజు శ్రీనివాసాచారి, మేకల అనురాధ, డాక్టర్ క్రిష్ణవేణి, కేఎల్.సత్యవతి, పద్మావతి, సక్కుబాయి, డాక్టర్ భారతి పాల్గొన్నారు. -
నిధులు విడుదల చేశాం
2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి క్యాంపుల నిర్వహణ ప్రారంభమైంది. మొత్తం పీయూ పరిధిలో 100 యూనిట్లు ఉండగా వాటిలో మొదటి దశలో ఎంపిక చేసి 51 యూనిట్లకు రూ.17.75 లక్షలను విడుదల చేశాం. మరో 49 యూనిట్లకు వచ్చే నెల నిధులు కేటాయిస్తాం. ఈ క్యాంపుల ద్వారా విద్యార్థులకు సామాజిక అవగాహన పెరడంతో పాటు ప్రజలకు సైతం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. – ప్రవీణ, పీయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ అవగాహన పెంపు విద్యార్థులకు యూజీ, పీజీ స్థాయిలో ఎన్ఎస్ఎస్ క్యాంపులు నిర్వహిచడం వల్ల వారికి సామాజిక అంశాలపట్ల అవగాహన పెరుగుతుంది. క్యాంపులో భాగంగా వారం రోజుల పాటు విద్యార్థులు అక్కడే ఉండి ఉదయం వేలల్లో పరిశుభ్రత, స్వచ్ఛత కార్యక్రమాలు, రాత్రి వేళల్లో పలు అంశాలపై నాటికలు, కథల రూపంలో ప్రజలకు అవగాహన కల్పిస్తాం. – గాలెన్న, ఎన్ఎస్ఎస్ ప్రోగాం అధికారి ● -
గత పాలకుల నిర్లక్ష్యంతోనే అసంపూర్తిగా ‘పాలమూరు’
● మెయిన్ కెనాల్ను గాలికొదిలేశారు.. ● వచ్చే జూన్ నాటికి కర్వెన పనులుపూర్తి చేస్తాం ● దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి భూత్పూర్: గత పాలకుల నిర్లక్ష్యంతోనే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు అసంపూర్తిగా మిగిలాయని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి ఆరోపించారు. మంగళవారం కర్వెన రిజర్వాయర్ వద్ద ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ ఎ.సత్యనారాయణ, ఎస్ఈ జగన్మోహన్ శర్మ, ఈఈ దయానంద్, డీఈఈలు విజయేందర్, ప్రభాకర్రెడ్డి, అబ్బు సిద్ధిఖీలతో కలిసి పాలమూరు ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై సమీక్షించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. 2015 జూన్లో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శంకుస్ధాపన చేసిన కేసీఆర్.. మూడేళ్లలో పూర్తి చేస్తామని చెప్పారన్నారు. అయితే పాలమూరు పనులను నిర్లక్ష్యంచేసి.. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసుకున్నారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో రూ. 29,600 కోట్లు ఖర్చు చేశారే తప్ప ఒక ఎకరాకు కూడా సాగునీరు అందించలేదని.. మెయిన్ కెనాల్ను గాలికొదిలేశారని ఎద్దేవా చేశారు. 13, 14,15 ప్యాకేజీల పనులు పూర్తి కావడానికి రూ. 450 కోట్లు అవసరం ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులు వెల్లడించాలని ఎమ్మెల్యే చెప్పారు. మెయిన్ కెనాల్కు అప్పట్లోనే భూ సేకరణ చేసి ఉంటే వ్యయం పెరిగేది కాదని.. భూ సేకరణ సమస్య కూడా ఉత్పన్నమయ్యేది కాదన్నారు. పాలమూరు ఎత్తిపోతల పూర్తి కావాలంటే రూ. 12వేల కోట్లు అవసరమని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అధికారుల నివేదిక ఆధారంగా సీఎం రేవంత్రెడ్డితో చర్చించి, ప్రధాన కాల్వకు భూ సేకరణ పూర్తిచేయడంతో పాటు వచ్చే జూన్ నాటికి కర్వెన పనులు పూర్తిచేసేందుకు కృషి చేస్తానని అన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కేసిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు లిక్కి నవీన్గౌడ్, నాయకులు అరవింద్కుమార్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, తిరుపతిరెడ్డి, భూపతిరెడ్డి తదితరులు ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో బావ, మరదలు మృతి
మహబూబ్ నగర్ జిల్లా: సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరేందుకు విమానాశ్రయానికి కారులో వెళ్తున్న బావ, మరదలిని రోడ్డు ప్రమాదంలో మృత్యువు కాటేసిన ఘటన మండల కేంద్రంలో జాతీయ రహదారిపై సోమవారం జరిగింది. పూర్తి వివరాలు.. వనపర్తి జి ల్లా పాన్గల్ మండలం చిక్కేపల్లి గ్రామానికి చెందిన బీరం రంజిత్కుమార్రెడ్డి (35) హైదరాబాద్లోని ఓ లిక్కర్ పరిశ్రమలో అకౌంటెంట్గా పని చేస్తున్నా డు. ఆదివారం పెత్తరామావాస్యకు అత్తగా రి ఊరైన వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్కు భార్య చైతన్యతో కలిసి వెళ్లాడు. ఈ క్రమంలో సోమ వారం భార్య సోదరి హారిక(25) బెంగళూర్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరేందుకు వెళ్లా ల్సి ఉండగా, శంషాబాద్ విమానాశ్రయంలో డ్రాప్ చేస్తానని బావ, మరదలు రెనాల్ట్ కారు నంబర్ టీ ఎస్ 07ఎఫ్ఎన్ 9768లో బయలుదేరారు. ఉదయం 6 గంటల సమయంలో రాజాపూర్ పోలీస్స్టేషన్ ఎదురుగా వీరు ప్రయాణిస్తున్న కారును హైదరాబాద్ నుంచి జడ్చర్ల వైపు వెళ్తున్న కియా సెల్టాస్ ఏపీ 39జీఏ 2782 కారు డివైడర్ను ఢీకొట్టి రోడ్డుకు ఇవతల వైపు వీరు ప్ర యాణిస్తు న్న కారుపై పడింది. దీంతో రంజిత్కుమార్రెడ్డి, హారిక కారులోనే ప్రాణా లు విడిచారు. సంఘటనా స్థలానికి చేరుకున్న బాలానగర్ ఎస్ఐ లెనిన్గౌడ్ మృతదేహాలను జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య చైతన్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ లక్ష్మయ్య తెలిపారు. సుదర్శన్రెడ్డి, రాధమ్మలకు ఒక్కగానొక్క కుమారుడు రంజిత్కుమార్రెడ్డి, మృతుడి భార్య చైతన్య ప్రస్తుతం గర్భిణిగా ఉండటంతో పాటు 18 నెలల కుమార్తె ఉంది. -
కుక్కలు ఎక్కువగా ఉన్నాయి
మా కాలనీలో ఎక్కడ బడితే అక్కడ వీధి కుక్కలు ఎక్కువగా తిరుగుతున్నాయి. రాత్రివేళ గుంపులు గుంపులుగా ఒకచోట చేరి అరుస్తున్నాయి. పిల్లలను బయటకు పంపాలంటేనే భయమేస్తుంది. వీటిని వెంటనే పట్టుకుని కు.ని. శస్త్ర చికిత్సలు చేయించి సుదూర ప్రాంతాలకు తరలిస్తే బాగుంటుంది. ఇప్పటికై నా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలి. – బుగిడి వనజ, గృహిణి, భాగ్యనగర్ కాలనీ, మహబూబ్నగర్ గుంపులు గుంపులుగాతిరుగుతున్నాయి మా కాలనీలో వీధికుక్కలు దాదాపు 30 వరకు గుంపులు.. గుంపులుగా సంచరిస్తున్నా యి. ఉదయం, రాత్రి వేళ రోడ్డుపైకి వచ్చి వెంబడిస్తున్నాయి. చేతిలో ఏమైనా వస్తువులతో కనిపిస్తే చాలు లాక్కుపోతున్నాయి. చిన్నపిల్లలను బయటకు పంపాలంటేనే భయమేస్తుంది. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం దక్కడం లేదు. వీటిని పట్టుకుని వ్యాక్సినేషన్ వేయించాలి. – సి.భారతి, గృహిణి, ఎస్ఆర్ నగర్, మహబూబ్నగర్ నివారణ చర్యలుతీసుకుంటున్నాం ఫిర్యాదులు అందుతున్న కాలనీలలో నిత్యం ప్రత్యేక బృందం ద్వారా వీధికుక్కలను పట్టుకుని మౌలాలిగుట్టలోని ఏబీసీసీకి తరలిస్తున్నాం. అక్కడ వాటికి కు.ని. శస్త్రచికిత్సలు చేసి ఐదు రోజుల తర్వాత తిరిగి వదిలివేస్తున్నార. జంతు సంరక్షణ చట్టం మేరకు వాటికి ఎలాంటి హాని తలపెట్టవద్దు. తమ పిల్లలను ఎప్పుడుబడితే అప్పుడు బయటకు పంపకుండా తల్లిదండ్రులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. – టి.ప్రవీణ్కుమార్రెడ్డి, కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్, మహబూబ్నగర్ ● -
పింఛన్లు పెంచేవరకు పోరాటం చేస్తాం
● ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ కొల్లాపూర్: సామాజిక పింఛన్లు పెంచే వరకు రేవంత్ సర్కారుపై పోరాటం కొనసాగిస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణమాదిగ వెల్లడించారు. దివ్యాంగులు, చేయూత పింఛనుదారులతో సోమవారం కొల్లాపూర్లోని ఓ ఫంక్షన్హాల్లో ఎమ్మార్పీఎస్, వీహెచ్పీఎస్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు మందకృష్ణ హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో సామాజిక పింఛన్ల పెంపు కూడా ఉందన్నారు. తాము అధికారంలోకి వస్తే దివ్యాంగులకు రూ.6వేలు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు రూ.4వేలకు పెంచుతామని రేవంత్రెడ్డి ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి 22నెలలు కావస్తున్నా.. ఎందుకు పింఛన్లు పెంచడంలేదని ప్రశ్నించారు. పింఛనుదారులను రేవంత్రెడ్డి మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 45లక్షల మంది పింఛన్దారులు ఉన్నారని, వారందరికీ పెంచాలని, కొత్తగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న 10లక్షల మందికి పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పేదల పక్షాన తాను రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తూ వస్తున్నానని వివరించారు. పింఛన్లు పెంచేవరకు రేవంత్ సర్కారును ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పర వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ కాలయాపన చేస్తున్నాయని, ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడంలో ప్రతిపక్షాలు నిర్లక్ష్యం కనబరుస్తున్నాయన్నారు. సదస్సు ప్రారంభానికి ముందు జగ్జీవన్రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాదిగ ఉద్యోగ సంఘాల నాయకులు మందకృష్ణను సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు కిరణ్చారి, బాలకృష్ణ, సంగెం, మద్దిలేటి, కుర్మయ్య, రాములు, చందన్గౌడ్, పరమేశ్, రాము తదితరులు పాల్గొన్నారు. -
కోయిల్సాగర్ 6 గేట్ల ద్వారా నీటివిడుదల
దేవరకద్ర: కోయిల్సాగర్ ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు భారీగా వరద జలాలు వచ్చి ప్రాజెక్టులో చేరుతుండడంతో సోమవారం 6గేట్లను రెండు అడుగుల మేర తెరిచి 4200 క్యూసెక్కుల నీటిని వాగులోకి వదిలారు. కోస్గి, కొడంగల్, దౌల్తాబాద్, పరిగి తదితర ప్రాంతాల్లో భారీగా కురిసిన వర్షాలకు పెద్దవాగు ప్రవహం ఉరకలు వేస్తున్నది. శనివారం మూడు గేట్లను తెరువగా ఆదివారం ఒకగేటును తెరిచి నీటిని వదిలారు. సోమవారం ఏకంగా 6గేట్లను తెరవడం ఈ ఏడాది ఇదే మొదటిసారి. ఆగస్టు నుంచి వరద ప్రవాహం పెరిగినప్పుడల్లా తరచూ గేట్లను తెరిచి నీటిని వదులుతున్నారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. పెద్దవాగు ప్రవాహం పెద్ద ఎత్తున తరలి రావడంతో ప్రాజెక్టులో నీటిమట్టం గణనీయంగా పెరగడం ప్రారంభమైంది. అప్రమత్తమైన అధికారులు ఆరుగేట్లను తెరిచారు. ప్రస్తుతం పైనుంచి వస్తున్న ఇన్ఫ్లోకు అనుగుణంగా నీటిని విడుదల చేస్తున్నారు. బండర్పల్లి వద్ద ఉరకలు వేస్తున్న చెక్డ్యామ్ కోయిల్సాగర్ 6గేట్లను తెరవడంతో దిగువ ప్రాంతంలోకి వాగు ఉరకలు వేస్తున్నది. బండర్పల్లి వద్ద పాత వంతెనపై నిర్మించిన చెక్డ్యామ్ ఉప్పొంగుతున్నది. కొత్త వంతెన కింద నుంచి భారీగా వాగు ప్రవాహం రావడంతో పలువురు వాహనదారులు వాహనాలను నిలిపి నీటి ప్రవాహాన్ని చూస్తూ కనిపించారు. -
ఉత్సవాలకు అంకురార్పణ
● అలంపూర్లో అట్టహాసంగా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం ● వేదమంత్రాలతో మార్మోగిన ఆలయాలు ● భారీగా తరలి వచ్చిన భక్తులు అమ్మవారి అలంకరణఅలంపూర్: అలంపూర్ క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాలకు సోమవారం అంకుర్పారణ చేశారు. జోగుళాంబ అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం వైభవోపేతంగా ప్రారంభించారు. సంప్రదాయానికి స్వాగతం పలుకతూ ఈఓ దీప్తి, పాలక మండలి సభ్యులు అర్చక స్వాములతో కలిసి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. అమ్మవారి ఆలయం అర్చక స్వాములు ఈఓతో కలిసి మంగళవాయిద్యాలు, పట్టువస్త్రాలతో బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ స్వామివారి అనతీ స్వీకరణ పూజలు చేశారు. అనంతరం స్వామివారి ఉత్సవ బలిభేరీ తీసుకొని అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఆలయం తరఫున పట్టువస్త్రాలు, మంగళ ద్రవ్యాలను సమర్పించారు. ఈ సందర్భంగా యాగశాల ప్రదక్షిణ, ప్రవేశం, మహా గణపతిపూజ, పుణ్యాహవచనం, ఋత్విక్ వరణ, రక్షాబంధనం, మహా కలశస్థాపన, అగ్నిముఖం చేశారు. యాగశాలలో చండీహోమం, సహాస్రనామార్చనలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నవాన్న సహిత మహానివేదన, బలిహరణ సమర్పణ కార్యక్రమాలు కొనసాగాయి. మృతసంగ్రహణంలో భాగంగా స్వామి వారి ఉద్యానవనంలో పట్టుమట్టికి పూజలు చేశారు. అనంతరం మహిళలు పుట్టమట్టిని మంగళవాయిద్యాల మధ్య యాగశాలకు చేర్చారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు నాగశిరోమణి, సరస్వతి, జగదీశ్వర్ గౌడ్, గోపాల్, జగన్మోహన్ నాయుడు, చంద్రశేఖర్రెడ్డి, విశ్వనాథ్రెడ్డి, అడ్డాకుల వెంకటేశ్వర్లు, పులేందర్, సురేందర్ స్వామి, ఆలయ ఉప ప్రధాన అర్చకుడు, ఎక్అఫిషీయో సభ్యులు ఆనంద్ శర్మ, ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు. దేవతలకు ఆవాహనం పలుకుతూ.. దేవీశరన్న నవరాత్రిని పురస్కరించుకొని ఆలయాల్లో జరిగే ఉత్సవాలకు ప్రతీకగా ధ్వజా రోహణ కార్యక్రమం నిర్వహించారు. ప్రధానంగా అమ్మవారి ఆలయంలో ధ్వజారోహణం చేశారు. శక్తిని ప్రేరేపించేందుకు దేవతలకు ఆవాహనం పలుకుతూ ఉత్సవానికి గుర్తుగా ధ్వజాన్ని ఆరోహణ చేస్తారని అర్చక స్వాములు తెలిపారు. ఎమ్మెల్యే విజయుడు హాజరై అర్చకస్వాములతో కలిసి ధ్వజారోహణం చేశారు. అంతకుముందు ఈఓ దీప్తి అర్చకులతో కలిసి స్వాగతం పలికారు. శైలపుత్రిగా జోగుళాంబ దేవిఅష్టాదశ శక్తి పీఠాల్లో ఐదో శక్తి పీఠంలో శరన్న నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జోగుళాంబ అమ్మవారు సోమవారం శైలపుత్రి మాతగా భక్తులకు దర్శనమిచ్చి విశేష పూజలందుకున్నారు. మొదటిరోజు సువాసినీ, కుమారి పూజలు చేశారు. -
వైభవంగా నిర్వహిస్తాం: ఈఓ
జోగుళాంబ అమ్మవారి దేవీశరన్న నవరాత్రి ఉత్సవాలను నయనానందంగా నిర్వహిస్తామ ని ఆలయ కార్యనిర్వాహన అధికారిణి దీప్తి పేర్కొన్నారు. అలంపూర్ క్షేత్రంలోని కార్యాలయంలో ఈఓ సోమవారం దేవీశరన్న నవరాత్రి ఉత్సవాలపై మాట్లాడారు. జోగుళాంబ అమ్మ వారి ఆలయాల్లో శరన్ననవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనట్లు తెలిపారు. అమ్మవారు నవరాత్రులు నవరూపాల్లో దర్శనం ఇవ్వనున్నట్లు తెలిపారు. 10వ రోజు జోగుళాంబ మాతగా దర్శనమిస్తారన్నారు. భక్తులు, వీఐపీలకు ప్ర త్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సాధారణ భక్తులకు ప్రతిరోజూ మధ్యాహ్నం 2:30గంటల నుంచి 3:30 గంటల వరకు ఎలాంటి రుసుము లేకుండా కుంకుమార్చనలకు ప్రత్యేక సదుపాయం కల్పించినట్లు తెలిపారు. సాయంత్రం 5గంటల నుంచి 7గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. గద్వాల సంస్థానదీశులు అందజేసిన చీరలతో తొమ్మిది రోజులు ప్రత్యేకంగా అలంకరణ చేయనున్నట్లు తెలిపారు. శని, ఆదివారాల్లో సాయంత్నం 5గంటల నుంచి 7గంటల వరకు సాంస్కృతిక సంబరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్నిశాఖల సమన్వయంతో ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తామన్నారు. -
రోడ్డు ప్రమాదంలో బావ, మరదలు మృతి
● కారుపై పడిన మరోకారు ● ఉద్యోగంలో చేరేందుకు వెళ్తూ అనంత లోకాలకు రాజాపూర్/పాన్గల్: సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరేందుకు విమానాశ్రయానికి కారులో వెళ్తున్న బావ, మరదలిని రోడ్డు ప్రమాదంలో మృత్యువు కాటేసిన ఘటన మండల కేంద్రంలో జాతీయ రహదారిపై సోమవారం జరిగింది. పూర్తి వివరాలు.. వనపర్తి జి ల్లా పాన్గల్ మండలం చిక్కేపల్లి గ్రామానికి చెందిన బీరం రంజిత్కుమార్రెడ్డి (35) హైదరాబాద్లోని ఓ లిక్కర్ పరిశ్రమలో అకౌంటెంట్గా పని చేస్తున్నా డు. ఆదివారం పెత్తరామావాస్యకు అత్తగా రి ఊరైన వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్కు భార్య చైతన్యతో కలిసి వెళ్లాడు. ఈ క్రమంలో సోమ వారం భార్య సోదరి హారిక(25) బెంగళూర్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరేందుకు వెళ్లా ల్సి ఉండగా, శంషాబాద్ విమానాశ్రయంలో డ్రాప్ చేస్తానని బావ, మరదలు రెనాల్ట్ కారు నంబర్ టీ ఎస్ 07ఎఫ్ఎన్ 9768లో బయలుదేరారు. ఉదయం 6 గంటల సమయంలో రాజాపూర్ పోలీస్స్టేషన్ ఎదురుగా వీరు ప్రయాణిస్తున్న కారును హైదరాబాద్ నుంచి జడ్చర్ల వైపు వెళ్తున్న కియా సెల్టాస్ ఏపీ 39జీఏ 2782 కారు డివైడర్ను ఢీకొట్టి రోడ్డుకు ఇవతల వైపు వీరు ప్ర యాణిస్తు న్న కారుపై పడింది. దీంతో రంజిత్కుమార్రెడ్డి, హారిక కారులోనే ప్రాణా లు విడిచారు. సంఘటనా స్థలానికి చేరుకున్న బాలానగర్ ఎస్ఐ లెనిన్గౌడ్ మృతదేహాలను జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య చైతన్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ లక్ష్మయ్య తెలిపారు. సుదర్శన్రెడ్డి, రాధమ్మలకు ఒక్కగానొక్క కుమారుడు రంజిత్కుమార్రెడ్డి, మృతుడి భార్య చైతన్య ప్రస్తుతం గర్భిణిగా ఉండటంతో పాటు 18 నెలల కుమార్తె ఉంది. హారిక(ఫైల్) రంజిత్కుమార్ రెడ్డి(ఫైల్) -
మళ్లీ పోటెత్తిన వరద
ధరూరు: కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీ ఎత్తున వరద వచ్చి చేరుతుందని పీజేపీ అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి 8గంటల వరకు ప్రాజెక్టుకు 2లక్షల 20వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. సోమవారం రాత్రి 8గంటల వరకు ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ఫ్లోలు 2లక్షల 82వేల క్యూసెక్కులకు పెరిగినట్లు పేర్కొన్నారు. దీంతో ప్రాజెక్టు 37గేట్లను ఎత్తి 2. 56లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. జెన్కో జల విద్యు త్ కేంద్రంలో విద్యుదుత్పత్తిని కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 29, 075 క్యూసెక్కులు, నెట్టెపాడుకు 750 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–1కు 650 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 67 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 390 క్యూసెక్కులు, కుడి కాల్వవకు 560 క్యూసెక్కులు కలిపి ప్రాజెక్టు నుంచి మొత్తం 2, 89, 434 క్యూసెక్కుల నీటిని దిగువనున్న శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తు తం ప్రాజెక్టులో 8.551 టీఎంసీల నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఎగువనున్న నారాయణపూర్ ప్రాజెక్టుకు పూర్తిస్థాయి నీటి మట్టం 37.64 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 32.98 టీఎంసీల నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 80వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. 15గేట్లను ఎత్తి దిగువనున్న జూరాలకు 75, 600 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. 726.371 ఎంయూల విద్యుదుత్పత్తి ఆత్మకూర్: జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరదనీరు భారీగా చేరుతుండడంతో జూరాల జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతుంది. ఈ మేరకు సోమవారం 6 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 6 యూనిట్ల ద్వారా 234 మెగావాట్లు, 355.509 ఎంయూ విద్యుదుత్పత్తిని చేపడుతున్నారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటివరకు 726.371 ఎంయూ విజయవంతంగా విద్యుదుత్పత్తిని చేపట్టామన్నారు. జూరాలకు అత్యధికంగా వరద చేరుతుండడంతో దిగువ ఉత్పత్తి కేంద్రంలో విద్యుదుత్పత్తి చేపట్టలేక పోయామని వివరించారు. జూరాల ప్రాజెక్టు 37గేట్ల ద్వారా దిగువకు నీటివిడుదల ఇన్ఫ్లో 2.82 లక్షలు, అవుట్ ఫ్లో 2.89లక్షల క్యూసెక్కులు కొనసాగుతున్న విద్యుదుత్పత్తి -
టీజీపీఎస్సీ మెంబర్గా లక్ష్మీకాంత్ రాథోడ్
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: తెలంగాణ స్టేట్ ప బ్లిక్ కమిషన్ చైర్మన్గా పీ యూ మాజీ వీసీ లక్ష్మీకాంత్రాథోడ్ను నియమి స్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జా రీ చేసింది. ఈ మేరకు నారాయణ్పేట్ జిల్లా, తిమ్మారెడ్డిపల్లికి చెందిన ఆయన నిజాం కళాశాల ప్రిన్సిపాల్, ఓ యూ పీడీతో 2021–24 మధ్య పీయూకు వీసీతో పాటు వివిధ స్థాయి ల్లో బాధ్యతలు నిర్వహించారు. ఈ మేరకు ఆయనను టీజీపీఎస్సీ మెంబర్గా ప్ర భుత్వం నియమించడంపై లక్ష్మీకాంత్ రాథోడ్ ము ఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఫోన్ ఇప్పించలేదని యువకుడి ఆత్మహత్య లింగాల: తల్లి సెల్ఫోన్ ఇప్పించలేదని క్షణికావేశానికై గురైన యువకుడు ఆత్మహత్యకు పా ల్పడిన ఘటన మండల కేంద్రంలో సోమవారం చోటు చే సుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన చరణ్(18) ఇటీవల జరిగిన గణేశ్ నిమజ్జనంలో ఫోన్ పోగొట్టుకున్నా డు. మరో ఫోన్ ఇప్పించాలని తల్లి గీతను కోరగా.. వేతనం వచ్చిన వెంటనే ఇప్పిస్తానని చెప్పింది. తల్లి మండల కేంద్రంలోని సీహెచ్సీలో పనిచేస్తుంది. ప ని నిమిత్తం నాగర్కర్నూల్కు వెళ్లగా.. ఇద్దరు అన్నదమ్ములు ఇంటిలోనే ఉన్నారు. ఒక గదిలో తమ్ముడు ఉండగా.. మరో గదిలో ఉన్న చరణ్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి దేవేందర్ ఇదివరకే మృతిచెందాడు. ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి ● ఆటోను ఢీకొట్టిన డీసీఎం కొత్తకోట రూరల్: ఆటోను డీసీఎం ఢీకొట్టిన ఘటనలో యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. కొత్తకోట ఎస్ఐ ఆనంద్ తెలిపిన వివరాలు.. అలంపూర్ మండలం సింగవరానికి చెందిన దూదేకుల రహీంబాష జిల్లా కేంద్రంలో ఓ ఇంట్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురితో కలిసి టైల్స్ వర్క్ చేస్తున్నారు. రోజువారీ పనిలో భాగంగా ఆదివారం మదనాపురం మండలం గోవిందహళ్లి(అగ్రారం)లో టైల్స్ వేసేందుకు ఆటోలో వెళ్లి రాత్రి కొత్తకోట సమీపంలో ఓ దాబా వద్ద భోజనం చేసి తిరిగి వనపర్తికి వెళ్తుండగా గుంపుగట్టు సమీపంలో ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని డీసీఎం ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో దూదేకుల రహీం బాష(25)కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో ఉన్న మిగిలిన ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.