breaking news
Mahabubnagar
-
భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండండి
మహబూబ్నగర్ క్రైం: జిల్లాలో వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాల నేపథ్యంలో రైతు లు, వ్యవసాయ కూలీలు, గొర్రెల కాపర్లు ఇలా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డి.జానకి ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసు లు ఇతర శాఖల సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధానంగా చెరువులు, వాగులు, రోడ్లపై నీరుపారే చోట్ల ప్రత్యే క దృష్టి పెట్టాలన్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయరాదని, విద్యుత్ స్తంభాలు ఇతర పరికరాల ముట్టుకోవద్దని, ఏదై నా సమస్య ఉంటే విద్యుత్ అధికారులు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. వరద ముప్పు ఉన్న గ్రామాలు, పాత మట్టి ఇళ్లు ఉన్న గ్రామాల్లో పోలీసులు రెవెన్యూ అధికారులతో కలిసి పర్యవేక్షించాలన్నారు. రహదారులపై ఉధృతంగా నీరు ప్రవహిస్తుంటే అలాంటి చోట్ల రోడ్డు దాటరాదని, పోలీసులు ట్రాఫిక్ డైవర్షన్ అమలు చేయాలన్నారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వెంటనే డయల్ 100, లేదా పోలీస్ కంట్రోల్రూం 87126 59360కు సమాచారం ఇవ్వాలని సూచించారు. 14న జిల్లా సబ్ జూనియర్ కబడ్డీ ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఈనెల 14వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా సబ్ జూనియర్ బాలబాలికల కబడ్డీ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బి.శాంతికుమార్, కురుమూర్తిగౌడ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికలకు క్రీడాకారులు ఒరిజినల్ ఆధార్కార్డుతో హాజరుకావాలని కోరారు. ఎంపికయ్యే క్రీడాకారులు నిజామాబాద్లో ఈ నెల 25 నుంచి 28 వరకు రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీల్లో పాల్గొనాల్సి ఉందని తెలిపారు. మిగతా వివరాల కోసం 9491489852 నంబర్ను సంప్రదించాలని సూచించారు. డీవైఎస్ఓ బదిలీ ● కొత్త డీవైఎస్ఓగా ప్రశాంత్ మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్ బదిలీ అయ్యారు. 2019 డిసెంబర్లో విధుల్లో చేరిన ఆయన ఆరేళ్లుగా మహబూబ్నగర్ జిల్లా డీవైఎస్ఓగా పనిచేసి హైదరాబాద్లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ హెడ్ ఆఫీస్కు బదిలీ అయ్యారు. ఈయన స్థానంలో బాస్కెట్బాల్ కోచ్ కె.ప్రశాంత్ జిల్లాకు రానున్నారు. ఈ మేరకు రాష్ట్ర క్రీడాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఒకట్రెండు రోజుల్లో కొత్త డీవైఎస్ఓ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎన్ఎంఎంఎస్స్కాలర్షిప్కు దరఖాస్తులు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: నేషనల్ మెరిట్ మీన్స్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు డీఈఓ ప్రవీణ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు వచ్చేనెల 6వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలని, పరీక్షను నవంబర్ 23వ తేదీన నిర్వహిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా ఎంఈఓలు, హెచ్ఎంలు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాకు చేరిన ఎన్నికల సామగ్రి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు అధికార యంత్రాంగం సమాయత్తం అవుతుంది. అందులో భాగంగా ఇటీవల సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓటరు తుది జాబితాను విడుదల చేశారు. ఈ క్రమంలో జిల్లాకు ఎన్నికల సామగ్రి కూడా చేరింది. ఇందులో ఎన్నికలకు ఉపయోగించే 54 రకాల వస్తువులు ఉన్నాయి. పెన్ను, పెన్సిల్, ఇంక్ ప్యాడ్, స్కేల్, కాటన్, లక్క, స్టాప్లర్, చేయి సంచీ ఇలా 54 రకాల ఎన్నికల సామగ్రి ఉన్నాయి. సూపరింటెండెంట్ శ్రీహరి, సెక్షన్ అధికారి విజయ్భాస్కర్ సమక్షంలో సామగ్రిని పరిశీలించారు. జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో జెడ్పీ గెస్ట్హౌస్లో భద్ర పరిచారు. జెడ్పీ సీఈఓ వెంకట్రెడ్డి వచ్చిన ఎన్నికల సామగ్రిని పరిశీలించి...చాలా జాగ్రత్తగా భద్రపరచాలని అధికారులకు సూచించారు. కాగా.. ఇదివరకే సర్పంచ్ ఎన్నికల సామగ్రి జిల్లాకు చేరుకుంది. -
ఆర్టీసీ టూర్ ప్యాకేజీకి విశేష స్పందన: ఆర్ఎం
స్టేషన్ మహబూబ్నగర్: ఆర్టీసీ టూర్ ప్యాకేజీలకు ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తోందని రీజినల్ మేనేజర్ సంతోష్కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ రీజినల్ కార్యాలయంలోని తన చాంబర్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టూర్ ప్యాకేజీల్లో భాగంగా అరుణాచలం గిరి ప్రదక్షిణకు ప్రతి నెల పౌర్ణమిని పురస్కరించుకొని ప్రత్యేక బస్సుల ను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. మహబూబ్నగర్, నాగర్కర్నూల్ డిపోల నుంచి భక్తులతో అరుణాచలంకు రెండు బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా మరిన్ని నడుపుతామన్నారు. ఇప్పుడు ఆర్టీసీ ఆధ్వర్యంలో ‘యాత్రాదానం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. దేశంలోని ఏ ఆర్టీసీ సంస్థ ఇలాంటి వినూత్న కార్యక్రమం చేపట్టలేదన్నారు. అనాథలు, నిరాశ్రయులు, వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులను ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లడమే ఈ యాత్రదానం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. దాతలు అందజేసే విరాళాల ఆధారంగా ఆర్టీసీ యాత్రాదానం పేరిట సదుపాయాన్ని కల్పించనట్లు తెలిపారు. ప్రముఖులు, కార్పొరేట్ సంస్థలు లాంటి వారు స్పాన్సర్ చేస్తే పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు, విహారయాత్రలకు తీసుకెళుతామన్నారు. ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి పర్యాటక స్థలాలకు వెళ్లలేకపోయే వారికి ఈ యాత్రదానంతో అవకాశం కల్పించవచ్చని అన్నారు. జిల్లాలోని ఎన్నో పర్యాటక స్థలాలు ఉన్నాయని, ఈ యాత్రదానం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని పేర్కొన్నారు. యాత్రాదానం కార్యక్రమం మన రాష్ట్రానికే పరిమితం కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాల, విజ్ఞాన వినోదకేంద్రాలకు కూడా పంపుతామని అన్నారు. అనంతరం యాత్రాదానం పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎంలు లక్ష్మి ధర్మ, కవిత, అకౌంట్ ఆఫీసర్ గంగాధర్. పర్సనల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, మహబూబ్నగర్ డిపో మేనేజర్ సుజాత పాల్గొన్నారు. -
ఎకరాకు ఎంత యూరియా వాడుతున్నారు?
జడ్చర్ల: ‘ఎకరాకు ఎంత యూరియా వాడుతున్నారు’ అంటూ రైతులతో కలెక్టర్ విజయేందిర ఆరా తీశారు. పంటలకు అవసరం మేరకే యూరియా వినియోగించాలని సూచించారు. గురువారం జడ్చర్లలోని ఎరువుల దుకాణాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా నిల్వలు, పంపిణీ, ధరలు తదితర వివరాలు తెలుసుకున్నారు. జిల్లాకు 450 మె.ట., యూరియా రాగా 60 శాతం మార్క్ఫెడ్కు, మిగతా 40 శాతం డీలర్లకు కేటాయించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు వివరించారు. ఒక్కో రైతుకు 2 బస్తాల చొప్పున పంపిణీ చేస్తున్నామని, పట్టాదార్ పాసుపుస్తకంతోపాటు ఆధార్ నంబర్ నమోదు చేసుకుని పారదర్శకంగా అందజేస్తున్నట్లు చెప్పారు. ఎకరాకు ఎన్ని బస్తాల యూరియా వేస్తున్నారని రైతులను కలెక్టర్ ప్రశ్నించగా.. 3, 4 బస్తాలు వినియోగిస్తున్నట్లు చెప్పడంతో అలా చేయవద్దని వ్యవసాయ అధికారుల సూచనల మేరకు రెండు దఫాలుగా రెండు బస్తాలు వేయాలని సూచించారు. యూరియా కొరత లేదని, దశల వారిగా వస్తుందని రైతులు ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. అనంతరం మార్క్ఫెడ్ గోదాంలో ఎరువుల నిల్వలను పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నర్సింగ్రావు, ఏఓ గోపినాథ్, ఏఈఓలు నర్సింహులు, శారద తదితరులు పాల్గొన్నారు.మెనూ ప్రకారం భోజనం అందించాలివిద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని కలెక్టర్ ఆదేశించారు. జడ్చర్లలోని తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి.. వంటశాల, పరిసరాలను పరిశీలించారు. మెనూలో పేర్కొన్న విధంగా భోజనం లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది శుచి, శుభ్రతతో కూడిన రుచికరమైన భోజనం అందించాలన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని.. తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. -
అటవీ సిబ్బంది సేవలు అభినందనీయం
మహబూబ్నగర్ న్యూటౌన్: అడవులు, వన్యప్రాణు ల సంరక్షణ కోసం అటవీ సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువా రం జిల్లా ఫారెస్ట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ఆ యన ముఖ్య అతిథిగా హాజరై అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ.. జిల్లాలో విస్తారమైన అడవులు ఉండటంతో చిరుతల సంఖ్య పెరిగిందన్నారు. కొన్ని రోజులుగా జనావాసాల్లోకి సైతం వస్తున్నాయన్నా రు. ఈ క్రమంలో వన్యప్రాణుల సంరక్షణతో పాటు ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా అటవీ సిబ్బంది చర్యలు చేపట్టాల ని సూచించారు. విధి ని ర్వహణలో ఎంతో మంది అటవీ సిబ్బంది ప్రాణా లు కోల్పోతున్నారని.. వారి సేవలు చిరస్మరణీయ మన్నారు. అటవీశాఖ అధికారులతోనే టూరిజం శాఖ అభివృద్ధి చెందుతుందన్నారు. ఎకో టూరిజాన్ని ప్రచారం చేయడంలో అటవీశాఖ పాత్ర గొప్పదని అన్నారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కెరి అని త, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, డీఎఫ్ఓ సత్యనారాయణ, ఎఫ్డీఓ గణేశ్, ఎఫ్ఆర్ఓ అబ్దుల్ హాయ్, కమాలుద్దీన్, మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు పట్టణంలో అటవీ సిబ్బంది బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించారు. -
ఆరోగ్యశ్రీలో ఓపెన్ హార్ట్ సర్జరీ
పాలమూరు: జిల్లా కేంద్రంలోని సుశ్రుత ప్రజావైద్యశాల వైద్యబృందం ఓ పేద మహిళకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా ఓపెన్ హార్ట్ సర్జరీని విజయవంతంగా పూర్తిచేశారు. గురువారం ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆస్పత్రి ఎండీ డా.మధుసూదన్రెడ్డి, గుండైవెద్య నిపుణుడు భరత్ మాట్లాడుతూ.. దేవరకద్ర మండలం గోపన్పల్లికి చెందిన లక్ష్మి రెండు నెలల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిందని తెలిపారు. ఆమెకు మొదట ఈసీజీ, 2–డీ ఈకో,యాంజోగ్రామ్ పరీక్షలు చేయగా.. గుండెలోని ఎడమ కవటం పూర్తిగా మూసుకుపోవడంతో పాటు ఐదు సెం.మీ. వెడల్పులో రక్తం గడ్డకట్టి ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. ఆరు వారాల పాటు గడ్డకట్టిన రక్తం పలచబడటం కోసం మందులు, ఇంజక్షన్స్ ఇచ్చినట్లు వివరించారు. ఆ తర్వాత ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి ఎడమ కవటం మార్పిడి చేసినట్లు తెలిపారు. ఇదే సర్జరీ బయట చేయాలంటే దాదాపు రూ. 6లక్షలతో పాటు మెడిసిన్ ఖర్చు ఉంటుందన్నారు. కానీ సుశ్రుత ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా చేసినట్లు తెలిపారు. సీటీ సర్జన్స్ డా.హేమంత్, డా.ప్రవీణ్, మత్తుమందు డా.శ్రీధర్, గుండె వైద్యుడు భరత్ బృందం దాదాపు మూడున్నర గంటల పాటు శ్రమించి సర్జరీని విజయవంతంగా పూర్తిచేసినట్లు వివరించారు. ఈ ఆస్పత్రిలో ఇప్పటి వరకు వంద కేసుల వరకు స్టంట్ వేయడం జరిగిందని.. త్రంబో లైసిస్ వంటి సేవలు ఆరోగ్యశ్రీలో అందించినట్లు వెల్లడించారు. ప్రతి గురువారం ఆస్పత్రిలో గుండెకు సంబంధించిన సీటీ సర్జరీ ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. -
క్యాటరింగ్ వృత్తి.. చోరీలు ప్రవృత్తి
● ఈజీ మనీ కోసం పశువుల అపహరణ ● పలుల జిల్లాలో అపహరించిన గ్యాంగ్ ● క్యాటరింగ్ చేస్తూ ముఠాగా మారిన వైనం ● తొమ్మిది రోజుల్లో పట్టుకున్న పోలీసులు నవాబుపేట: జీవనోపాధికి క్యాటరింగ్ పనులు చేస్తూ హైదరాబాద్లో కలిసిన వారంత ఈజీమనీకి అలవాటు పడ్డారు. గ్యాంగ్గా మారి పగలు పని చేసుకుంటూ మారుమూల ప్రాంతాలను ఎంచుకొని ప్రధానంగా ఆవులు చోరీ చేసి విక్రయించే వారు. పాడి ఆవులకు డిమాండ్ ఉండటంతో వాటి ని అపహరించటం విక్రయించటం వృత్తిగా ఎంచుకొని నేరాలను విస్తరించినట్లు ఎస్పీ జానకి తెలిపారు. రాష్ట్రంలో పలు జిల్లాలో వరుస చోరీలు చేస్తూ పట్టుబడిన నిందితులకు గురువారం రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్లో విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. క్యాటరింగ్ పనులకు వెళ్లి జిల్లాలోని మహ్మదబాద్ మండలం జూలపల్లికి చెందిన కుమ్మరి అశోక్, కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్కు చెందిన అఖిల్, నల్లగొండ జిల్లా గుంతకల్ మండలం ముకుందాపూర్కు చెందిన సాయికుమార్, వరంగల్ జిల్లా జనగామ మండలం పాకాలకు చెందిన బుర్కసాయి హైదరాబాద్లో క్యాటరింగ్ పనులకు వెళ్తూ గ్యాంగ్గా ఏర్పడ్డారు. ఒకేసారి పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించాలని ఆవులు, ఇతర పశువు లు చోరీ చేసి విక్రయించాలని నిర్ణయించుకొని చో రీలు ప్రారంభించారు. కాగా ఈ గ్యాంగ్ వికారా బాద్, రంగారెడ్డి, మమాబూబ్నగర్, యాదగిరిగు ట్ట, సైబరాబాద్ తదితర జిల్లాలోని ప్రాంతాల్లో ఆ వులను చోరీ చేసి విక్రయించారు. చోరీ చేసిన ఆవు ల్లో రూ.లక్ష రూపాయలకు పైగా విలువ చేసే ఆవులతో పాటు దాదాపుగా రూ.14.50 లక్షల విలు వైన పశువులు చోరీ చేసినట్లు ఎస్పీ వివరించారు. సీసీ కెమెరాలే పట్టించాయి ఈ నెల 2న మండల పరిధిలోని మరికల్ గ్రామంలో రెండు ఆవులు చోరీ చేసినట్లు బాధితుడు పోలీ సులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేయగా కూపీ లాగితే డొంక మొత్తం కదిలి అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టయిందని ఎస్పీ తెలిపారు. చోరీ చేసిన ఆవులను వారు తరలించే బొలెరో వా హనం నంబర్ ప్లేట్ తరుచూ మారుస్తూ చోరీలకు పాల్పడిందని, చోరీ చేసిన ప్రాంతం సమీపంలోనే పోలీసులకు చిక్కినట్లు ఆమె తెలియజేశారు. పోలీసులకు రివార్డులు కేవలం 9 రోజుల వ్యవధిలో అంతర్రాష్ట్ర పశువుల ముఠాను పట్టుకొని కేసును చేధించిన నవాబుపేట ఎస్ఐ విక్రమ్, ఏఎస్ఐ జనార్ధన్, సిబ్బంది వెంకట్రా ములు, సురేష్బాబు, భాస్కర్, శెట్టినాయక్ను ఎస్పీ రివార్డులు అందజేసి అభినందనలు తెలియజేశారు. -
జర్నలిజంపై దాడి సరికాదు
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫోర్త్ ఎస్టేట్గా గుర్తింపు ఉన్న జర్నలిజంపై దాడి సరికాదు. ప్రజల పక్షాన గళం విప్పే పత్రికల గొంతు నొక్కడం ప్రజాస్వామ్య విరుద్ధం. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ ప్రధానమైనది. రాజ్యాంగం కల్పించిన హక్కులపై ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపడం సరికాదు. పత్రికలలో వచ్చిన వార్తలు అభ్యంతరకరంగా ఉంటే వివరణ కోరాలే తప్ప అక్రమ కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దు. జర్నలిజం విలువల పరిరక్షణకు ప్రభుత్వాలు పాటుపడాలి. ఏపీలో ‘సాక్షి’ ఎడిటర్పై అనుసరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉంది. – అనిరుధ్రెడ్డి, ఎమ్మెల్యే, జడ్చర్ల -
కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి..
ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను హరించేలా వ్యవహరించడం ఎవరికీ సమర్థనీయం కాదు. ప్రతిపక్షాలు మాట్లాడలేనప్పుడు కూడా ప్రజల సమస్యలు, ఇబ్బందులను పాలకుల దృష్టికి తీసుకొస్తాయి. అలాంటి పత్రికలు, మీడియాపై అణచివేతకు పాల్పడేలా దాడులకు దిగడం.. కేసులు నమోదు చేయడం అప్రజాస్వామిక చర్య. ప్రభుత్వాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. ఇప్పుడు ఒకరు అనైతిక చర్యలకు దిగారంటే.. ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం కూడా అలానే వ్యవహరించాల్సి ఉంటుంది. ఇలా చేస్తూ పోతే అభివృద్ధి కుంటుపడడమే కాకుండా రాష్ట్రం రావణకాష్టగా మారుతుంది. రాజకీయాల మాటున కక్షసాధింపు చర్యలు రాష్ట్రానికి, దేశానికి మంచిది కాదు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు. ఇప్పటికై నా పత్రికా స్వేచ్ఛను హరించే చర్యలకు ఫుల్ స్టాప్ పెట్టాలి. – శ్రీనివాస్గౌడ్, మాజీ మంత్రి, మహబూబ్నగర్ -
సమన్వయంతో మెలగాలి..
పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడం, జర్నలిస్టులను భయబ్రాంతులకు గురిచేయడం అప్రజాస్వామిక చర్య. భావ ప్రకటనను ఎవరై నా వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. ప్రభు త్వాలు కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడకుండా.. సమన్వయంతో మెలిగేందుకు ప్రయత్నించాలి. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేసే పత్రికలు, జర్నలిస్టులపై దాడులు చేయడం, కేసులు నమోదు చేయడం తగదు. – ఆల వెంకటేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, దేవరకద్ర తీవ్రంగా ఖండిస్తున్నాం.. ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డిపై అక్రమ కేసులు పెట్టడాన్ని మహబూబ్నగర్ ప్రెస్ క్లబ్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజా స్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ చాలా ముఖ్యమై నది. అభిప్రాయాలను పంచుకునేందుకు, ప్రభుత్వానికి ప్రజల వాణిని వినిపించడంలో పత్రికలు కీలకపాత్ర పోషిస్తాయి. పత్రికలపై, సంపాదకులపై పనిగట్టుకొని కేసులు నమోదు చేయడం దారుణం. ప్రజల గొంతుకగా నిలిచే మీడియా గొంతు నులిమే ప్రయత్నం చేయడం సరికాదు. పత్రికలు తమ పని తాము స్వేచ్ఛగా చేసినప్పుడే సమాజంలోని అన్నివర్గాల అభిప్రాయాలు ప్రజలకు చేరువవుతాయి. – వి.నరేందర్చారి, ప్రెస్క్లబ్ అధ్యక్షుడు, మహబూబ్నగర్ ప్రతిపక్ష పాత్ర పోషించాలి.. జర్నలిస్టులు ఎక్కడైనా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఏపీ లో ప్రశ్నిస్తున్న జర్నలిస్టులపై దాడులు, కేసు లు నమోదు చేయడం వంటివి పత్రికా స్వేచ్ఛను హరించడమే. ప్రశ్నిస్తున్న ‘సాక్షి’ ఎడిషన్ సెంటర్లపై దాడులు, ఆస్తులను ధ్వంసం చేయడం హేయమైన చ ర్య. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలు గెలిచిన తర్వాత నెరవేర్చకుంటే కచ్చితంగా జర్నలిస్టులు ప్రజల తరఫున ప్రశ్నించడం సహజం. జర్నలిస్టుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాల పేరుతో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదు. – చంద్రశేఖర్రావు, జిల్లా అధ్యక్షుడు, టీయూడబ్ల్యూజే (హెచ్–143), నాగర్కర్నూల్ -
కలానికి సంకెళ్లుఅప్రజాస్వామికం
ఏపీలో ‘సాక్షి’ దినపత్రికపై కొనసాగుతున్న కేసులు, దాడులను తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రజాస్వామ్యంలో పత్రికలపై అక్రమ కేసులు పెట్టి అడ్డుకోవాలనుకోవడం సిగ్గుమాలిన చర్య. 30 ఏళ్ల సీనియారిటీ అని చెప్పుకొనే చంద్రబాబు ఇలాంటి కక్షసాధింపు చర్యలకు పాల్పడటం సరైనది కాదు. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ పిల్లర్గా నిలిచి.. ప్రజాగొంతుకను వినిపించే పత్రికలపై దాడులు చేస్తూ, అక్రమ కేసులు బనాయించడం కలానికి సంకెళ్లు వేయడమే. దీనిని ప్రతిఒక్క ప్రజాస్వామికవాది ఖండించాలి. ఇప్పటికై నా చంద్రబాబు కక్షసాధింపు చర్యలు మానుకుని పత్రికా స్వేచ్ఛనుకాపాడాలి. – బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ఎమ్మెల్యే, గద్వాల -
అనుమానాస్పదంగా యువకుడి మృతి
● అమ్మాయితో చనువు వల్లే దాడి చేశారని ఆరోపణ ● డీఎస్పీకి ఫిర్యాదు మహబూబ్నగర్ క్రైం: ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్న యువకుడు తీవ్రగాయాలతో అనుమానాస్పదంగా ఉరి వేసుకొని మృతి చెందిన ఘట న కలకలం రేపుతోంది. మండల పరిధిలోని మాచన్పల్లి గ్రామానికి చెందిన దర్పల్లి వెంకటేష్(23) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన అమ్మాయితో చనువుగా ఉంటున్నాడని భావించిన సదరు అమ్మాయి కుటుంబ సభ్యులు ఈ నెల 8వ తేదీన రాత్రి 11 గంటల సమయంలో వెంకటేష్ ఇంటికి వచ్చి మా అమ్మాయి కన్పించడం లేదని అతడిని ఆటోలో తీసుకెళ్లారు. ఊరు శివారులో దాడి చేసి గాయపరిచారు. అప్పటికే అమ్మాయి ఇంటి వద్దే ఉన్నట్లు సమాచారం రావడంతో వెంకటేష్ను వదిలి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఈ నెల 9న మాచన్పల్లి శివారులోని పంట పొలంలోని చింతచెట్టుకు వెంకటేష్ ఉరి వేసుకొని ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వెంకటేష్ మృతదేహన్ని పరిశీలించి శరీరంపై తీవ్రంగా రక్తగాయాలు ఉన్నట్లు గు ర్తించారు. మృతదేహం జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఉండగా గురువారం మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, ముదిరాజ్ కులసంఘాల నాయకులు డీఎస్పీ వెంకటేశ్వర్లును కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మృతుడి తండ్రి దర్పల్లి పెంటయ్య రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యా దు చేశాడు. అమ్మాయి తరుఫు వాళ్లు వెంకటేష్పై దాడి చేశారని, వెంకటేష్ మృతిపై అనుమానం ఉందని డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని, పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా కేసు విచారణ సాగుతుందని డీఎస్పీ పేర్కొన్నారు. -
కామారెడ్డి జిల్లాలో మరికల్ గొర్రెల కాపరి మృతి
మరికల్: కామారెడ్డి జిల్లా దేవునిపల్లి పరిధిలోని జాతీయ ర హదారిపై గొర్రెల మందతో పాటు ఇద్దరి కాపరులను లారీ ఢీకొట్టిన ఘటనలో మరికల్కు చెందిన ఓ కాపరి మృతి చెందా డు. బాధిత కుటుంబ సభ్యు లు తెలిపిన వివరాల మేరకు.. మరికల్కు చెందిన కాపరులు మేత కోసం గొర్రెల ను శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సమీపంలో ఉన్న అడవులకు తీసుకెళ్లారు. తిరిగి బుధవారం మహబూబ్నగర్ జిల్లాకు వచ్చేందుకు గొర్రెల మందతో పాటు ఇద్దరు కాపరులు గుడిగండ్ల రామప్ప, బసయ్యపల్లి మల్లేష్ వస్తున్నారు. ఈ క్రమంలో సాయంత్రం 6 గంటల సమీపంలో ఎరుదుగా వచ్చిన లారీ గొర్రెల మందతో పాటు ఇద్దరి కాపరులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గుడిగండ్ల రామప్ప (56) అక్కడిక్కడే మృతి చెందగా.. 26 గొర్రెలు మృత్యువాత పడ్డా యి. గాయపడిన మల్లేష్ కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో మరికల్లో ని బాధిత కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎంట్రెన్స్ కోసం ఉచిత శిక్షణ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులకు జాతీయస్థాయిలో నిర్వహించే ఐఐటీ, డిగ్రీ విద్యార్థులకు సెట్, పీజీ ఎంట్రెన్స్ కోసం నిర్వహించే పోటీ పరీక్షలకు ఆన్లైన్ విధానంలో ఫెర్మాట్ ఎడ్యుకేషన్ ఆకాడమీ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు రీజినల్ కోఆర్డినేటర్ మధు మోటమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో శిక్షణ పొందిన వారు అనేక ఎంట్రెన్స్లో ఉత్తీర్ణత సాధించారని, ఆసక్తి గల రు 97012 75354, 91337 05933 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. అతిథి అధ్యాపకుల కోసం.. జడ్చర్ల టౌన్: పట్టణంలోని ప్రభుత్వ డా.బీఆర్ఆర్ డిగ్రి కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డా.సుకన్య ఓ ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్ సైన్స్ బోధించేందుకు అర్హులైన వారు శుక్రవారం సాయంత్రం లోగా దరఖాస్తులు చేసుకోవాలని, 15వ తేదీన నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు. -
జూరాలకు స్వల్పంగా పెరిగిన వరద
● 4 క్రస్ట్ గేట్లు తెరిచి దిగువకు నీటి విడుదల ధరూరు/ఆత్మకూర్/మదనాపురం/రాజోళి: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద మళ్లీ పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. బుధవారం 39 వేల క్యూసెక్కులు ఉండగా.. గురువారం రాత్రి 7.30 ప్రాంతంలో 62 వేల క్యూసెక్కులకు పెరిగిందన్నారు. విద్యుదుత్పత్తికి 43,640 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 71, ఎడ మ కాల్వకు 550, కుడి కాల్వకు 690 క్యూసెక్కుల నీటిని వినియోగించినట్లు వివరించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 9.070 టీఎంసీలు ఉందన్నారు. ● కొనసాగుతున్న విద్యుదుత్పత్తి.. జూరాల దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతుందని ఏఈ శ్రీధర్ తెలిపారు. గురువారం ఎగువ 6 యూనిట్ల నుంచి 234 మెగావాట్లు, 310.136 మి.యూ., దిగువ 6 యూనిట్ల నుంచి 240 మెగావాట్లు, 337.283 మి.యూ. విద్యుదుత్పత్తి చేపట్టామన్నారు. రెండు కేంద్రాల్లో ఇప్పటి వరకు 647.419 మి.యూ. విద్యుదుత్పత్తి సాధించామని చెప్పారు. -
ప్రజా సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలి
మన్ననూర్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల స్ఫూర్తితో సమాజంలోని సకల జనుల సమస్యల పరిష్కారానికి మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాల్నర్సింహ అన్నారు. గురువారం మన్ననూర్లోని సైమన్ రాములు స్మారక స్తూపం వద్ద అచ్చంపేట డివిజన్ సీపీఐ కార్యదర్శి పెర్ముల గోపాల్ అధ్యక్షతన తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల ప్రారంభ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్నర్సింహ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాలకు ఉమ్మడి జిల్లాతోపాటూ అచ్చంపేట, కొల్లాపూర్, నాగర్కర్నూల్, కల్వకుర్తి డివిజన్లోని ఏ మారుమూల పల్లెకు వెళ్లిన ఆనాటి వీరోచితమైన తెలంగాణ సాయుధ పోరాట త్యాగాలకు సంబంధించిన గుర్తులు కనిపిస్తాయన్నారు. సాయుధ పోరాటాల స్ఫూర్తిని నేటి తరాల వారికి తెలియజేసేందుకు ప్రతిఏటా సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు వారోత్సవాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు బాసటగా నిలిచిన తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను ప్రభుత్వం తరపున నిర్వహిస్తామని ప్రతిపక్షంలో ఉన్న సమయంలో హామీ ఇచ్చిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర సభ్యులు కేశవులుగౌడ్, నర్సింహ, విజయ్, కృష్ణాజీ, శంకర్గౌడ్, రవీందర్, శివశంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, శివుడు, కిరణ్కుమార్, శ్రీనివాసులు, లక్ష్మీపతి, అంజి, అశోక్గౌడ్, చంద్రయ్య, నాయకులు నర్సింహ, చందు, పర్వతాలు, కేశవులు, మధు, సర్వేశ్వర్ పాల్గొన్నారు. -
యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడి
పెద్దకొత్తపల్లి: రైతులు తమ వ్యవసాయ క్షేత్రాలలో విత్తనోత్పత్తి చేసుకునే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, తమ వ్యవసాయ క్షేత్రాలలో నాణ్యమై న విత్తనాలు ఎంచుకొని వాటి ద్వారా విత్తనోత్పత్తిని సాధించుకోవచ్చని పాలెం వ్యవసాయ శాస్త్రవేత్త రాజశేఖర్ అన్నారు. గురువారం మండల కేంద్రం పెద్దకొత్తపల్లిలో వరి, జొన్న పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రభుత్వం అందించిన వరి, జొన్న, కంది విత్తనాలను రైతులు వేసిన పంటలను వ్యవసాయ అధికారి శిరీషతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరిలో సూక్ష్మదాతు లోపం నివారణకు ఫారుమాల్–4ను 250 గ్రాము లు ఎకరాకు, కొనలు ఎర్రగా మారినందుకు సాప్ 450 మి.లీ. ఎకరాకు, కాండం తొలుచు పురు గు నివారణకు కాంట్రాక్టు 450 గ్రాములు ఎకరాకు పిచికారీ చేసుకోవాలని ఆయన సూచించారు. కా ర్యక్రమంలో ఏఈఓలు ముజీబ్, జానకీరామ్, మల్లేష్, రైతులు చెన్నమ్మ, రాములు పాల్గొన్నారు. -
వచ్చేనెల 16న పీయూ స్నాతకోత్సవం
● హాజరుకానున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ● పనులను పరిశీలించిన వీసీ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ నాలుగోవ స్నాతకోత్సవానికి వచ్చే నెల 16 తేదీన నిర్వహించనున్నారు. దీనికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరుకానున్నారు. గురువారం వీసీ శ్రీనివాస్ పీయూ లైబ్రరీ సెంట్రల్ హాల్లో నిర్వహించే స్నాతకోత్సవ వేడుక పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రధానం హాల్లో వేదికను మరింత పెద్దదిగా చేయించనున్నారు. అలాగే హాల్లో ఇటీవల చేసిన పలు మరమ్మతు పనులతో పాటు మరుగుదొడ్లు, ఇతర ఎలక్ట్రీషియన్ పనులను ఆయన పరిశీలించారు. స్నాతకోత్సవానికి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి లోటు పాట్లు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, వివిధ కమిటీల అధ్యాపకులకు ఆయన సూచించారు. వీసీ వెంట రిజిస్ట్రార్ రమేష్బాబు, కంట్రోలర్ ప్రవీణ, అడిషనల్ కంట్రోలర్ శాంతిప్రియ, అనురాధారెడ్డి, ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ కుమారస్వామి, సీనియర్ అధ్యాపకులు నూర్జహాన్, రాజ్కుమార్, జయనాయక్, రజిని, రమాదేవి, తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదం పొంచి ఉంది
సమీపంలోని ఎర్రకుంట చాలావరకు పూడుకపోయింది. సగం వర కు కట్టను అధికారులు మరమ్మతు చేయించారు. మిగతా భాగం అలాగే వదిలేశారు. పైనుంచి వరద ఉద్ధృతంగా వచ్చి ఈ కుంట తెగితే మా కాలనీలోని చాలా ఇళ్లు జలమయమవుతాయి. రైల్వేట్రాక్ వైపు ఉన్న తూమును మూసివేయడంతో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇళ్ల మధ్యలో నుంచి గణేష్నగర్ వైపు వెళ్తున్న పెద్దకాల్వ ప్రస్తుతం నిండుగా పారుతోంది. ఈ కాల్వను వెంటనే విస్తరించాలి. – ఎన్.నరేష్కుమార్, గణేష్నగర్, మహబూబ్నగర్ అన్ని జాగ్రత్తలుతీసుకుంటున్నాం ఇటీవలి భారీ వర్షాలకు నగరంలోని ఐదు చెరువులు, కుంటలు నిండాయి. మా సిబ్బంది తరచూ నీటివనరుల వద్దకు వెళ్లి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల సమన్వయంతో అన్ని చోట్ల తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ సీజన్ ఆరంభం నుంచే పెద్దచెరువు, ఎర్రకుంట, ఇమాంసాబ్కుంటల తూములను తెరిచి వరదను బయటకు వదులుతున్నాం. – వెంకటయ్య, ఈఈ, నీటిపారుదలశాఖ ● -
10 లక్షల ఎకరాల్లో పెరిగిన సాగు విస్తీర్ణం..
ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా వానాకాలం సీజన్కు సంబంధించి 2014లో 8.50 లక్షల ఎకరాల్లో మాత్రమే వివిధ పంటలు సాగు కాగా.. ప్రస్తుతం 18.50 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేశారు. ఈ లెక్కన 11 ఏళ్లలో 10 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెరిగినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో సాగు నీటి వసతి ఇంకా పెరగాల్సి ఉన్నప్పటికీ.. విస్తారంగా వర్షాలు కురవడం, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి సాయం ఇస్తుండడం, రుణమాఫీ వంటి చర్యలు ఉమ్మడి జిల్లాలో సాగు గణనీయంగా పెరిగేందుకు దోహదపడ్డాయని వ్యవసాయరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాగు పెరిగింది..పంట మార్పిడి చేయాలి పంటల సాగు గణనీయంగా పెరిగింది. ఏటేటా వరి, పత్తినే అధికంగా పండిస్తున్నారు. ప్రతిసారి ఒకే రకమైన పంటలను సాగు చేయడం వల్ల భూమి చౌడు పొలంగా మారుతుంది. అన్ని రకాల పంటలు సాగు చేస్తేనే లాభదాయకంగా ఉంటుంది. జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈ సీజన్లో మొక్కజొన్న సాగు పెరిగింది. పంట మార్పిడి చేసి కందులు, జొన్న, ఆముదం, ఇతర పంటలు కూడా సాగు చేస్తే.. భూసారం దెబ్బ తినదు. – బి.వెంకటేష్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, మహబూబ్నగర్ ● -
పిల్లల విషయంలోబాధ్యతగా ఉండాలి
పాలమూరు: బాలభవన్లో రక్షణ పొందుతున్న పిల్లల తల్లిదండ్రులు భిన్నమైన మానసిక స్థితిలో ఉన్నారని, వారందరూ మద్యానికి బానిసలుగా మారినట్లు గుర్తించామని జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అన్నారు. జిల్లాకేంద్రంలో ఉన్న బాలభవన్ను బుధవారం న్యాయమూర్తి సందర్శించి ఈ సందర్భంగా చిన్నారుల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. పిల్లల క్షేమం కోసం మద్యం అలవాటు ఉన్న తల్లిదండ్రులను వారిని డీ–అడిక్షన్ సెంటర్కు పంపిస్తామన్నారు. ● జిల్లాకేంద్రంలోని శ్రద్ధ జూనియర్ కళాశాలలో బుధవారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర హాజరై చట్టాలపై అవగాహన కల్పించారు. బాలల హక్కులు, చట్టాలు, బాల్య వివాహాలు, విద్య హక్కు చట్టం, పోక్సో చట్టం, బాలల సంరక్షణ, సైబర్ నేరాలు వంటి చట్టాలపై విద్యార్థులకు అవగాహన చేశారు. విద్యార్థులకు ఏదైనా సమస్యలు ఉంటే జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో సైబర్ క్రైం ఎస్ఐ శ్రవణ్కుమార్, చంద్రశేఖర్ పాల్గొన్నారు. మిషన్ భగీరథ నీళ్లు 36 గంటలు బంద్ జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఈ నెల 11వ తేదీన ఉదయం 8 గంటల నుంచి 12వ తేదీ రాత్రి 8 గంటల వరకు 36 గంటల పాటు మిషన్ భగీరథ నీళ్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు భగీరథ గ్రిడ్ ఈఈ శ్రీనివాస్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాకేంద్రంలోని క్రిష్టియన్పల్లి చించోళి జాతీయ రహదారి విస్తరణలో భాగంగా 1200 ఎంఎం పైప్లైన్ను మార్చడంతో ఈ అంతరాయం ఏర్పడనున్న ట్లు పేర్కొన్నారు. దీంతో మహబూబ్నగర్ నగరానికి పాక్షికంగా, మన్యంకొండ నీటి శుద్ధీకరణ ప్లాంట్ నుంచి సరఫరా అయ్యే మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లోని 258 గ్రామాలతో పాటు నారాయణపేట, మక్తల్, దేవరకద్ర మున్సిపాలిటీలకు పూర్తిగా నీళ్ల సరఫరా నిలిచిపోనున్నట్లు తెలిపారు. -
మళ్లీ చిరుత కలకలం
● కోస్గిరోడ్డులోని టీడీగుట్ట గుండుపైసంచారం ● చిరుతను బంధించేందుకు రెండు బోన్లు ఏర్పాటు మహబూబ్నగర్ న్యూటౌన్: ఇటీవల మహబూబ్నగర్ పట్టణ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న చిరుత బుధవారం సాయంత్రం మళ్లీ కనిపించింది. తిర్మల్దేవుని గుట్టపై కోస్గిరోడ్ సమీపంలోని గుండుమీద చిరుత సంచరిస్తూ కనిపించడం కలకలం రేపింది. గుండుపై చిరుత సంచరిస్తూ కనిపించిన వీడియోలు వైరల్ కావడంతో స్థానికుల సమాచారం మేరకు చిరుత సంచరిస్తున్న స్థలానికి చేరుకున్న మున్సిపల్, అటవీశాఖ అధికారులు డ్రోన్ కెమెరాలో చిత్రీకరిస్తూ అది వెళ్లేదారిని గమనించారు. అటవీశాఖ రేంజ్ ఆఫీసర్ అబ్దుల్హాయ్ ఆధ్వర్యంలో అటవీశాఖ, మున్సిపల్ సిబ్బంది చిరుతను బంధించేందుకు వెంటనే రెండు బోన్లు ఏర్పాటు చేశారు. కాగా చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చిరుతను చూసేందుకు ప్రజలు, వాహనాలపై వెళ్తున్న వారు గుమిగూడడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. -
ప్రజాస్వామిక పోరాటాలకు ఐలమ్మ స్ఫూర్తి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ‘భూమి కోసం భుక్తి కోసం నా పోరాటం’ అని చాటిచెప్పిన వీరవనిత చాకలి ఐలమ్మ అని జిల్లా కలెక్టర్ విజయేందిర అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని బుధవారం జిల్లాకేంద్రంలోని పద్మావతి కాలనీలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాటి తెలంగా సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహాసాలు, ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. ఐలమ్మ ఏ ఒక్క కులం కోసమో, వర్గం కోసమో పోరాటం చేయలేదని, పీడిత, పేద వర్గాల కోసం కొట్లాడిన ధీర వనిత అని కొనియాడారు. ఆనాటి దొరల అరాచకాలను ఎదురించి కొల్లాడిన మహా నాయకురాలని చెప్పారు. చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణ మట్టిలోనే పోరాటతత్వముందని చెప్పడానికి ఐలమ్మ జీవితమే నిదర్శనమని చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్, బీసీ సంక్షేమాధికారి ఇందిర తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం
స్టేషన్ మహబూబ్నగర్: ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తానని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ఎంప్లాయిస్ ఫోరం జిల్లా అధ్యక్షుడు రాజసింహుడు ఆధ్వర్యంలో జరిగిన ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికులది ప్రధానమైన పాత్ర అన్నారు. ప్రగతి రథ చక్రాలను ఆపేసిన ఆర్టీసీ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు మొండిచెయ్యి దక్కిందన్నారు. ఇది ఎవరు కాదన్నా.. నిజాయితీగా మాట్లాడుతానన్నారు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలని, తనవంతుగా రూ.5 లక్షలు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. టీజీఎంఎఫ్సీ చైర్మన్, ఫోరం గౌరవాధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ.. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతానన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ అఽధికార ప్రతినిధి జహీర్ అక్తర్, ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్, నాయకులు ఎన్పీ వెంకటేశ్, సిరాజ్ఖాద్రీ, గోపాల్యాదవ్, సీజే బెనహర్, రాములుయాదవ్, అజ్మత్అలీ, ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ఫోరంనాయకులు సుధాకర్, ఎంవీ.కృష్ణ, నాగేశ్వర్రావు, దేవదాస్, శ్రీనివాస్రెడ్డి, రవీందర్రెడ్డి పాల్గొన్నారు. -
బహిరంగ వేలం వాయిదా
● సిండికేట్ అవుతున్న టెండర్ దారులు ● ఇప్పటికే మూడుసార్లు వాయిదా చిన్నచింతకుంట: మండలంలోని అమ్మాపురం కురుమూర్తిస్వామి ఆలయం వద్ద బుధవారం కొబ్బరికాయలు, పూలు, పూలదండలు, పూజ సామగ్రి, వాహనపూజ సామగ్రికి నిర్వహించిన బహిరంగ వేలం మళ్లీ వాయిదా పడింది. వేలంలో టార్గెట్ రానందున అధికారులు వాయిదా వేశారు. వేలం పాటలు ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడ్డాయి. మార్కెట్లో కొబ్బరి కాయల రేట్లు పెరిగినందున ఆలయ సిబ్బంది నిర్ణయించిన రేటుకు గిట్టుబాటు కాదన్న ఉద్దేశంతో పాట దారులు సిండికేట్ అవుతున్నారన్నా ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత సంవత్సరం టెంకాయ రూ. 25కు విక్రయించగా ఈ సంవత్సరం రూ.30కు విక్రయించేందుకు అధికారులు ధర నిర్ణయించారు. అయినప్పటికీ గిట్టుబాటు కాదని టెండర్ దారులు వేలంలో పాల్గొంటూనే హెచ్చు పాట పాడకుండ అడ్డు వేస్తున్నారు. దీంతో అధికారులు వాయిదాలు వేస్తూ వస్తున్నారు. ఇట్టి విషయంపై ఈఓ మదనేశ్వరెడ్డిని వివరణ కోరగా.. కొబ్బరికాయల విక్రయాల ధర గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రూ.5 పెంచామన్నారు. కానీ టెంటర్ దారులు రూ.35 కావాలని కోరుతున్నట్లు సమాచారం ఉందన్నారు. ఉన్నతాధికారులు నిర్ణయం మేరకు త్వరలో వేలం నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గోవర్ధన్రెడ్డి, కమిటీ సభ్యులు భారతి, నాగరాజు, కమలాకర్, భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లాలో గణనీయంగా పెరిగిన సాగు విస్తీర్ణం
పదేళ్ల క్రితం ఎటు చూసినా ఎండిన పంటలు.. బీళ్లుగా మారిన భూములు. ఫలితంగా ఉపాధి కోసం కుటుంబాలతో సహా తట్ట, బుట్ట, పార పట్టుకుని ముంబై, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు బస్సుల్లో కిక్కిరిసి వెళ్తున్న హృదయ విదారక దృశ్యాలు ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతుంటాయి. అలా వలసలకు కేరాఫ్గా నిలిచిన పాలమూరు జిల్లా హరితవనంగా మారింది. సాగునీరు లేక నెర్రెలు బారిన వ్యవసాయ భూముల్లో సిరుల పంట పండుతోంది. ఏటేటా సాగు గణనీయంగా పెరుగుతుండగా.. భూమికి పచ్చని రంగు వేసినట్లు కొత్త శోభను సంతరించుకుంది. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ పచ్చందాలను సంతరించుకున్నపాలమూరు 2014లో కేవలం 8.5 లక్షల ఎకరాల్లోనే సాగు.. మూడేళ్లుగా అటూఇటు స్వల్పంగా మారుతున్న లెక్కలు ప్రస్తుతం అన్ని పంటలు కలిపి 18 లక్షల ఎకరాలకు పైగానే సాగు మూడేళ్లుగా 18 లక్షల ఎకరాలపైనే ఉమ్మడి పాలమూరు జిల్లాలో వానాకాలం సాగుకు సంబంధించి మొత్తంగా అన్ని పంటలు కలిపి 18 లక్షల ఎకరాలకు పైగా సాగయ్యాయి. మూడేళ్లుగా కొంత అటు ఇటుగా స్వల్పంగా లెక్కలు మారుతూ వస్తున్నాయి. 2023లో 18,24,268 ఎకరాలు కాగా.. 2024లో 18,11,953 ఎకరాల్లో పంటలు సాగైనట్లు అధికారిక రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది సాగు స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 18,07,052 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు. అదును దాటే సమయానికి అంటే వారం రోజుల్లో ఉమ్మడి జిల్లాలో మరో 50 వేల ఎకరాల్లో వరి నాట్లు పడే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో రైతులు ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న సాగుచేస్తున్నారు. ఏటేటా వీటి సాగు గణనీయంగా పెరుగుతూ వస్తోంది. వరి 2023 ఖరీఫ్ సీజన్లో 7,76,311 ఎకరాలు, గతేడాదిలో 8,09,784 ఎకరాల్లో సాగు కాగా.. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 7,90,515 ఎకరాల్లో సాగైంది. మరో 50 వేల ఎకరాల్లో వరి సాగు కానుండగా.. 8.40 లక్షల ఎకరాలకు చేరుకోనుంది. ఉమ్మడి పాలమూరులో 2023లో 6,67,824 ఎకరాల్లో, 2024లో 6,04,004 ఎకరాల్లో పత్తి సాగు కాగా.. ఈ ఏడాది 7,05,739 ఎకరాల్లో రైతులు తెల్లబంగారం పంట వేశారు. గతేడాదితో పోలిస్తే 1,01,735 ఎకరాల్లో పత్తి సాగు పెరిగినట్లు తెలుస్తోంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2023 వానాకాలంలో 1,00,816 ఎకరాల్లో, 2024లో 85,476 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేశారు. ఈ ఏడాది ఇదే సీజన్లో 1,09,708 ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. గతేడాదితో పోలిస్తే 24,232 ఎకరాల్లో మొక్కజొన్న సాగు పెరిగినట్లు స్పష్టమవుతోంది. గతేడాదితో పోలిస్తే నాగర్కర్నూల్ జిల్లాలో 28,634 ఎకరాల్లో పంటల సాగు పెరిగింది. మహబూబ్నగర్ జిల్లాలో 2,693 ఎకరాల్లో, నారాయణపేట జిల్లాలో 10,256 ఎకరాల్లో అధికంగా పంటలు సాగయ్యాయి. అదే వనపర్తిలో 28,216 ఎకరాల్లో, జోగుళాంబ గద్వాల జిల్లాలో 18,268 ఎకరాల్లో పంటల సాగు తగ్గినట్లు రికార్డులు చెబుతున్నాయి. గతేడాదితో పోలిస్తే మహబూబ్నగర్ జిల్లాలో పత్తి సాగు స్వల్పంగా తగ్గింది. నాగర్కర్నూల్ జిల్లాలో 40 వేలకు పైగా, గద్వాల జిల్లాలో 50 వేలకు పైగా ఎకరాల్లో అధికంగా రైతులు సాగు చేశారు. మొక్కజొన్నకు సంబంధించి మహబూబ్నగర్ జిల్లాలో గతేడాది కంటే 14 వేల ఎకరాల్లో, నాగర్కర్నూల్ జిల్లాలో 10 వేల ఎకరాల్లో అధికంగా సాగైంది. -
స్వయం సమృద్ధి సాధించాలి
● స్థానిక సంస్థలు సొంత ఆదాయ వనరుల పెంపుపై దృష్టి సారించాలి ● రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): స్థానికంగా ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ ఆదాయ వనరులను పెంపొందించుకునే దిశగా వినూత్న ఆలోచనలు, పద్ధతులతో స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో పని చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులతో పాటు అనవసర వ్యయాన్ని తగ్గించుకొని ఆదాయ వనరుల రాబడిని పెంచుకున్నప్పుడే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. బుధవారం మహబూబ్నగర్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల అధికారులతో రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యులు రమేష్, సంకిపల్లి సుధీర్రెడ్డితో కలిసి చైర్మన్ సమీక్ష నిర్వహించారు. మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల కలెక్టర్లు విజయేందిర బోయి, బదావత్ సంతోష్, ఆదర్శ్ సురభి, బీఎం సంతోష్, నారాయణపేట అదనపు కలెక్టర్ రెవెన్యూ జిల్లాల వారీగా స్థానిక సంస్థల పనితీరును చైర్మన్కు వివరించారు. మున్సిపాల్టీలు, గ్రామపంచాయతీల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధిదీపాలు, తడి, పొడి చెత్త సేకరణ, పచ్చదనం పెంపు, పన్ను వసూళ్లు, స్వయం ఉపాధి పథకాల అమలు, ప్రజల జీవన ప్రమాణాల పెంపునకు కొనసాగుతున్న కార్యక్రమాలు, గ్రాంట్స్ రూపంలో సమకూరుతున్న ఆదాయం, ఇతర మార్గాల ద్వారా స్థానిక సంస్థలకు అందుతున్న ఆదాయం తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా విడుదలైన నిధులు, వాటి ఖర్చు వివరాలను గణాంకాల ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా చైర్మన్ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మొదటగా రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్థానిక సంస్థలు ప్రజలకు సమర్థవంతంగా వసతులు, సేవలు అందించాలని.. ఇందుకు అధికారులు అంకితభావంతో పని చేయాలని కోరారు. తడి, పొడి చెత్త నిర్వహణ అవలంబించి మహబూబ్నగర్ నగరపాలక సంస్థను ఆదర్శంగా తీర్చిదిద్దాలని సూచించారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో అవలంబిస్తున్న ఉత్తమ పద్ధతులను కమిషన్ అధ్యయనం చేస్తోందని తెలిపారు. గ్రామపంచాయతీలు తడి, పొడి చెత్తతో సేంద్రియ ఎరువు తయారుచేసి మహిళా సంఘాల ద్వారా విక్రయించవచ్చని, తద్వారా ఆదాయంతో పాటు భూ సారం పెరుగుతుందని వివరించారు. మూడు, నాలుగు పంచాయతీలు కలిసి క్లస్టర్గా ఏర్పాటు చేసుకొని చికెన్ వ్యర్థాలకు టెండర్ వేసి వచ్చిన ఆదాయాన్ని జనాభా ప్రాతిపదికన పంచుకోవచ్చని సూచించారు. కొత్త గ్రామపంచాయతీలుగా మారిన తండాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వీధి దీపాలకు సోలార్ విద్యుత్ను వినియోగిస్తే విద్యుత్ బిల్లుల భారం తగ్గుతుందని.. ప్రయోగాత్మకంగా చిన్న గ్రామపంచాయతీల్లో అమలు చేస్తూ క్రమంగా అన్ని స్థానిక సంస్థలకు విస్తరించాలని తెలిపారు. పన్ను వసూళ్లు, ప్రకటనలపై వచ్చే రాబడి, వృత్తి పన్ను, వ్యాపార వాణిజ్య సముదాయాలు, ఇతర నిర్మాణాలకు సంబంధించి నిర్ణీత రుసుం వసూలు చేస్తూ ఆర్థిక పరిపుష్టి సాధించాలన్నారు. పదేళ్లలో కొత్త మండలాలు, గ్రామాలు ఏర్పాటయ్యాయని.. చాలాచోట్ల భవనాలు, సిబ్బంది లేరని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి తెలిపారు. సీనరేజ్, స్టాంపు డ్యూటీ స్థానిక సంస్థలకు రావడం లేదని, గ్రామపంచాయతీలకు నిధులు కేటాయించాలని కోరారు. అనంతరం కమిషన్ సభ్యుడు సంకిపల్లి సుధీర్రెడ్డి మాట్లాడుతూ .. స్థానిక సంస్థల్లో పని చేస్తున్న అనుభవం ఉన్న అధికారులు ఆదాయ వనరుల పెంపునకు సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. సమావేశంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు, కార్యదర్శి కాత్యాయని, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, దేవ సహాయం, యాదయ్య, నర్సింగ్రావు, ఉమ్మడి జిల్లా జెడ్పీ సీఈఓలు వెంకట్రెడ్డి, యాదయ్య, డివిజనల్ పంచాయతీ అధికారులు, పుర కమిషనర్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ పురాతనమైందని.. రాజీవ్గాంధీ 73, 74 రాజ్యాంగ సవరణలతో అధికారాలు బదలాయించి వికేంద్రీకరించారని రాష్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి తెలిపారు. గ్రామపంచాయతీ, మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ మూడంచెల వ్యవస్థ ఏర్పాటు చేశారని.. గ్రామపంచాయతీలకు కేంద్రం నుంచి నేరుగా నిధులు వస్తున్నాయన్నారు. గ్రామానికి ఒక మాస్టర్ ప్లాన్ తయారుచేసుకొని ప్రాధాన్యత ప్రకారం పనులు పూర్తిచేస్తే అభివృద్ధి చెందుతాయని సూచించారు. -
పాముకాటుతో వృద్ధుడు మృతి
మానవపాడు: పాము కాటుతో వృద్ధుడు మృతి చెందిన ఘటన మండలంలోని కొర్విపాడులో బుధవారం జరిగింది. ఎస్ఐ చంద్రకాంత్ తెలిపిన వివరాలు.. మండలంలోని కొర్విపాడు గ్రామానికి చెందిన వెంకట్రామిరెడ్డి(77) ఉదయం సొంత పొలంలో కాడెద్దులతో దున్నుతుండగా గుర్తు తెలియని పాము కాటు వేసింది. స్థానికులు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి కుమారుడు ప్రవీణ్కుమార్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి రాజాపూర్(బాలానగర్): పురుగుల మందుతాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేయగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన బాలానగర్ మండలంలో చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు, గ్రామస్తుల వివరాల ప్రకారం.. వీరన్నపల్లి గ్రామానికి చెందిన తెలుగు ఎల్లయ్య(57) భార్య పద్మమ్మ 4 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. భార్య మృతితో నాలుగు ఏళ్ల మనోవేదన వల్ల కుటుంబ సభ్యులతో బాధపడుతూ ఉండేవాడు. మంగళవారం ఉదయం తన పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. చుటుపక్కల రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో చికిత్స నిమిత్తం షాద్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. అతని కుమారుడు శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు బాలానగర్ ఎస్ఐ లెనిన్గౌడ్ తెలిపారు. బాలుడి మృతదేహం లభ్యం గద్వాల క్రైం: ఈనెల 7వ తేదీన చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు జూరాల లోయర్ జెక్(కృష్ణానది) గల్లంతైన మైనర్ బాలుడు బుధవారం రేకులపల్లి సమీపంలో లభ్యమైనట్లు రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. తెలుగు రాజేష్, తెలుగు చంద్రశేఖర్(13)లు చేపల వల వేసేందుకు వెళ్లారు. అనంతరం ఒడ్డుకు పుట్టిలో ఇద్దరు నిద్రపోయారు. జూరాలకు ఇన్ఫ్లో పెరగడంతో అలల తాకిడికి పుట్టి ముందుకు సాగుతూ కృష్ణానదిలో గల్లంతైయింది. తెలుగు రాజేష్ ఈత రావడంతో ప్రాణాలను కాపాడుకున్నాడు. నీటి ప్రవాహంలో గల్లంతైన చంద్రశేఖర్ ఆచూకీ లభించలేదు. బుధవారం నది నుంచి రెండు కిలో మీటర్ల దూరంలో ఉదయం మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. తల్లి పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. విద్యుదాఘాతంతో రైతు మృతి పాన్గల్: విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన బుధవారం మండలంలో చోటు చేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మాందాపూర్ గ్రామానికి చెందిన రైతు సంగనమోని రాములు (53) భీమా కాల్వలో ఉన్న బోరు మోటార్కు చుట్టుకున్న నాచు తొలగించేందుకు కాల్వలో దిగాడు. ఈ క్రమంలో విద్యుత్ షాక్కు గురై అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య బిచ్చమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు హెచ్సీ తెలిపారు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
మహాసభలను జయప్రదం చేయాలి
● వనపర్తిలో పీడీఎస్యూ నాలుగో రాష్ట్ర మహాసభలు ● అక్టోబర్ 28, 29, 30న నిర్వహణ వనపర్తి: జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న పీడీఎస్యూ నాల్గవ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మొగిలి వెంకట్రెడ్డి కోరారు. బుధవారం స్థానిక ఎంఎన్ఆర్ మినీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్రంలో అక్టోబర్ 28, 29, 30 తేదీల్లో మహాసభలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి, ప్రధాన కార్యదర్శి సాంబ తదితరులు పీడీఎస్యూ కార్యకర్తలతో మాట్లాడారు. 70 మందితో ఆహ్వాన కమిటీను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. విద్యా రంగంలో వస్తున్న మార్పులు, సమస్యలపై చర్చించి పరిష్కారాలు చూపే విధంగా మహాసభల్లో చర్చించి విద్యార్థి భవిష్యత్ ఉద్యమ కార్యచరణను ఎంచుకోవాలన్నారు. విద్యను పేద వర్గాలకు అందని ద్రాక్షగా మార్చేలా పాలకవర్గాలు, ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలకు విచ్చలవిడి అనుమతులు ఇస్తూ విద్యను వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. వీటికి వ్యతిరేకంగా పీడీఎస్యూ లాంటి విప్లవ విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామిక వాదులు, లౌకిక శక్తులు, మేధావులు, జర్నలిస్టులు, రచయితలు, కవులు, కళాకారులు, వ్యాపార వాణిజ్య వర్గాలు ఆదరించి మహాసభలను విజయవంతం చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు రాఘవాచారి, మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కవి జనజ్వల, జాతీయ నాయకుడు విజయ్ఖన్నా, పాలమూరు అధ్యయన వేదిక నాయకులు వెంకటేశ్వర్లు, నారాయణ, పవన్కుమార్, రంజిత్, గణేష్, సైదులు తదితరులు పాల్గొన్నారు. -
మార్కెట్లోకి హోండా సీబీ 125 హార్నెట్
పాలమూరు: హోండా కంపెనీ నుంచి మార్కెట్లోకి మరో రెండు నూతన మోడల్ ద్విచక్ర వాహనాలను విడుదల చేశారు. జిల్లా కేంద్రంలోని నర్మదా హోం షోరూంలో బుధవారం హోండా సీబీ 125 హర్నెట్, హోండా షైనీ 100డీఎక్స్ ద్విచక్ర వాహనాలను ఆర్టీఓ రఘుకుమార్, నర్మద హోండా ఎండీ వేణుగోపాల్సింగ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్పోర్ట్స్ బైక్ ప్రేమికుల కోసం హోండా సీబీ 125 హర్నెట్ అద్భుతంగా ఉంటుందని, ఐదు గేర్లు, సైలెంట్ స్టార్ట్ ఏసీజీ, 4.2అంగుళాల టీఎఫ్టీ డిస్ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్, ఎస్ఎంఎస్ అలర్ట్స్, నావిగేషన్ సదుపాయం ఉందన్నారు. యూఎస్బీ ఛార్జింగ్, ఎల్ఈడీ హెడ్లైట్లు ఇన్బిల్ట్గా వస్తాయన్నారు. షోరూం ధర రూ.1.12లక్షలు ఉండగా ఆన్రోడ్ ధర రూ.1,36,495లకు లభిస్తుందన్నారు. ఇక హోండా షైనీ 100డీఎక్స్ ఫ్యామిలీ వినియోగదారులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ ఇస్తూ చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. 65 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తోందని, 4 స్ట్రోక్ ఇంజిన్, 4 స్పీడ్ గేర్ బాక్స్, ఓబీడీ–2బీ కంప్లైంట్, డిజిటల్ క్లస్టర్, సైడ్ స్టాండ్ ఇంజిన్కట్ ఆఫ్ ఉంటుందన్నారు. షోరూం ధర రూ.75,950 ఉండగా ఆన్రోడ్ ధర రూ.92,172లకు లభిస్తుందన్నారు. కార్యక్రమంలో మేనేజర్ బాలీశ్వర్రెడ్డి ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
ఆకట్టుకున్న సాహిత్య అష్టావధానం
జడ్చర్ల టౌన్: కుతుబ్షాహి, అసఫ్జాహీల పరిపాలనలో దాదాపు 600 ఏళ్లు తెలుగు భాష నిరాధారణకు గురైనప్పటికీ తన ఔన్నత్యాన్ని కాపాడుకుందని అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని చంద్రగార్డెన్లో ఆత్మీయ మిత్రమండలి ఆధ్వర్యంలో బి.శివకుమార్ నిర్వహించిన సాహిత్య అష్టావధాని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వళన చేసి ప్రారంభించారు. వరంగల్ శ్రీరామ్ అవధానిగా, సంధానకర్తగా కంది శంకరయ్య వ్యవహరించగా 8 మంది సాహితి వేత్తలు పృచ్ఛకులుగా ప్రశ్నలు సంధించారు. పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 8, 9, 10వ వతరగతి విద్యార్థులు హజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అక్షరాస్యత లేని రోజుల్లోనూ తెలుగు భాష మనుగడ సాధించినా.. సంపూర్ణ అక్షరాస్యత సాధిస్తున్న ప్రస్తుతం సమాజంలో ఇంగ్లిష్ చదువుల వల్ల తెలుగు మాట్లాడే వారి సంఖ్య తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఏడు వేల భాషలుండగా తెలుగు 11వ స్థానంలో ఉందని, భారతదేశంలో గతంలో రెండో స్థానంలో ఉండగా నేడు 4వ స్థానానికి పడిపోయిందన్నారు. అష్టావధానం ఇలా.. అష్టావధానంలో మొదట నిషిద్ధాక్షరి అనే విభాగంలో కుంచకూరి బుచ్చిలింగం నిర్వహిస్తూ ఇప్పటి యువతకు ఆంజనేయుడు ఆదర్శం అనే అంశంపై పద్యం చెప్పమని కోరారు. ● సమస్యాపురాణం అనే రెండవ విభాగంలో.. చక్రవర్తుల రమణాచార్యులు నిర్వహిస్తూ హరిణము సమరమ్మునందు హస్తిని గూల్చెన్ (యుద్ధంలో జింక ఏనుగును చంపెన్) అనే సమస్యను ఇచ్చారు. కోరికయే ఏనుగుని మనసే జింక అని అవధాని సమస్యను పూరించారు. ● దత్తపది అనే విభాగంలో దార్ల రాఘవేంద్రచారి నిర్వహిస్తూ కల్లు, రమ్ము, బీరు, సారా అనే పదాలతో గణేషుడిని పూజించాలని చెప్పారు. ● న్యస్తాక్షరి అనే విభాగంలో యలకంటి భాస్కర్ నిర్వహిస్తూ య, ల, కం, టి అనే నాలుగు అక్షరాలు నాలుగు పాదాల్లో ఎక్కడెక్కడ రావాలో పేర్కొంటూ ప్రపంచ దేశాల్లో భారత ప్రధాని మోదీకి దక్కుతున్న గౌరవం గూర్చి శార్దూల వృత్తంలో చెప్పమన్నారు. ● వర్ణన అనే విభాగంలో కిరణ్మయి నిర్వహిస్తూ సభాధ్యక్షులు శివకుమార్ను శ్రీకృష్ణదేవరాయలుగా, పృచ్ఛకులను అష్టదిగ్గజాలుగా వర్ణించమన్నారు. ● ఆశువు అనే విభాగాన్ని మరింగంటి కృష్ణవేణి నిర్వహిస్తూ ప్రస్తుతం విద్యార్థులు ఎక్కువ సమయం సెల్ఫోన్లోనే గడుపుతున్నారని దాని దుష్ఫలితాల గూర్చి అప్పటికపుడు పద్యం చెప్పమన్నారు. అవధాని ఆశువుగా పద్యాన్ని చెప్పారు. ● చందోభాషణం అనే విభాగంలో పూదత్తు కృష్ణమోహన్ పద్యరూపంలో అవధానితో మాట్లాడారు. అప్రస్తుత ప్రసంగం అనే విభాగాన్ని సాకేత్ప్రవీణ్ నిర్వహించారు. -
ఆత్మహత్యాయత్నం ఘటనపై ఆర్డీఓ విచారణ
మిడ్జిల్: మండలంలోని వాడ్యాల్కు చెందిన రైతు గజ్జల జంగమ్మ, ఆమె కుమారుడు గజ్జల కృష్ణయ్య సోమవారం తహసీల్దార్ ఎదుట పురుగులమందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటనపై బుధవారం మహబూబ్నగర్ ఆర్డీఓ నవీన్కుమార్ బుధవారం గ్రామస్తుల సమక్షంలో సర్వేనెంబర్ 156 వద్ద విచారణ చేపట్టారు. తాత, ముత్తాతల కాలం నుంచి ఉడ్డాల లెక్కన పంచుకున్నామని, మూడు, నాలుగు సర్వే నంబర్లలో ఒక్కొక్కరికి ఒకటి, మూడు, నాలుగు గుంటల భూమి ఉండడంతో అప్పట్లో సాగు చేయడం ఇబ్బందిగా ఉంటుందని ముగ్గురు ముత్తాతలు మూడుచోట్ల పంచుకున్నారని, ఎవరి భూమిపై వారు మోఖాపై ఉన్నారని గ్రామస్తులు ఆర్డీఓకు వివరించారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ.. సమస్యను అందరు కూర్చొని మాట్లాడుకోవాలని సూచించారు. అలాగే రైతు జంగమ్మ కుమారుడు కృష్ణయ్య తాను ఈ విషయంలో తొందరపడ్డానని.. తనదే తప్పని తహసీల్దార్ యూపీరాజుకు లిఖిత పూర్వకంగా రాసిచ్చారు. ఆర్డీఓ వెంట రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
ఆత్మహత్య ప్రేరకాలను గుర్తించడం అవసరం
పాలమూరు: చిన్నచిన్న ప్రవర్తన మార్పులే వ్యక్తి మనోవేదనను సూచించవచ్చని, ఆత్మహత్య ప్రవర్తనకు దారితీసే ప్రారంభ సంకేతాలు, ప్రేరకాలను గుర్తించడం చాలా అత్యవసరం అని ఎస్వీఎస్ ఆస్పత్రి మానసిక వైద్య విభాగం హెచ్ఓడీ డాక్టర్ అశోక్రెడ్డి అన్నారు. ఎంతో ఒత్తిడిని ఎదుర్కొనే తర్వాతే ప్రాణం తీసుకోవాలనే ఆలోచన కల్గుతుందని, ఆత్మహత్యలను నివారించవచ్చని, మానసిక సమస్యలను గుర్తించి వాటికి సరిపడ వైద్య కౌన్సిలింగ్ తీసుకోవాలన్నారు. ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా బుధవారం ఎస్వీఎస్ మానసిక విభాగం ఆధ్వర్యంలో ఆత్మహత్యల నివారణపై ప్రత్యేక నాటక కార్యక్రమం నిర్వహించారు. మత్తు పదార్థాల దుర్వినియోగంపై అవగాహన పెంచుకోవాలన్నారు. మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తులు సాయం కోరే విధంగా భయపడకుండా ముందుకు రావడానికి సహాయక వాతావరణం సృష్టించాలన్నారు. ఆ తర్వాత మానసిక ఆరోగ్యంపై ఎంబీబీఎస్ విద్యార్థులు ప్రత్యేక నాటకం ద్వారా ఒత్తిడి, ఆందోళన ఎదుర్కొనే వ్యక్తులు ఎలా ఉంటారో ప్రదర్శించి చూపించారు. ఎస్వీఎస్ నర్సింగ్ విద్యార్థులు మైమ్ ప్రదర్శనలో ఆత్మహత్య ముప్పులో ఉన్న వ్యక్తుల మౌనవేదనను ప్రతిభింబించే విధంగా ప్రదర్శన చేశారు. కార్యక్రమంలో ఎస్వీఎస్ రెసిడెంట్ డైరెక్టర్ రాంరెడ్డి, ప్రిన్సి పాల్ డాక్టర్ కేపీ జోషి, డాక్టర్ హరిప్రసాద్, వెంకట్ రాహుల్, భార్గవ్ స్వరాజ్, వినీల్ పాల్గొన్నారు. ● ఆర్థిక ఇబ్బందులు, ఇతర సమస్యలను ఒంటరిగా మోయరాదని, ఒత్తిడిని ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల దగ్గర పంచుకోవాలని డీఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రధానంగా యువత చదువు, భవిష్యత్పై సోషల్ మీడియా ఒత్తిడి ఎక్కువగా పెరిగిందని పిల్లలతో పెద్దలు తరచూ మాట్లాడాలన్నారు. ఒత్తిడిలో ఉన్న వారి కోసం పోలీస్ శాఖ ప్రధానంగా హెల్ప్లైన్ నంబర్లు, కౌన్సిలింగ్ సౌకర్యం అందుబాటులో పెట్టడం జరిగిందన్నారు. సీనియర్ మానసిక వైద్యనిపుణుడు అశోక్రెడ్డి -
మోటార్ సైకిళ్ల దొంగల అరెస్ట్
మల్దకల్: కొంతకాలంగా గద్వాల, జడ్చర్ల, వనపర్తి, పెబ్బేరు, మహబూబ్నగర్ ప్రాంతాల్లో అపహరణకు గురైన మోటార్ సైకిళ్లను జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని అమరవాయిలో బుధవారం కర్నూల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అమరవాయిలో 25 బైక్లను పోలీసులకు పట్టుబడడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. వివరాలు ఇలా.. గద్వాల పట్టణానికి చెందిన జశ్వంత్ వారం రోజుల క్రితం కర్నూలు పట్టణంలో మోటార్ సైకిల్ను దొంగలించడంతో కర్నూలులోని టూటౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో సీఐ నాగరాజురావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం మోటారుసైకిల్ చోరీపై విచారణ చేపట్టి గద్వాల పట్టణానికి చెందిన జశ్వంత్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించగా 30కు పైగా బైక్లు చోరీ చేసినట్లు అంగీకరించాడు. దీంతో సీఐతో పాటు పోలీసు సిబ్బంది మహేందర్, రవి, శ్రీను అమరవాయికి చేరుకొని జశ్వంత్కు సహకరించిన బోయ వీరేష్, పాండు, బోయ పాండులను అదుపులోకి తీసుకున్నారు. వారి విచారణలో జశ్వంత్ చోరీ చేసిన బైక్లను గ్రామంలోని కొంతమంది రైతులు, వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయించి వచ్చిన డబ్బులతో జల్సాలు చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. దొంగలించిన బైక్లను కొన్న యజమానులకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించడంతో వారు బైక్లను పోలీసులకు అప్పగించారు. అమరవాయిలో 18, బిజ్వారంలో 2, సద్దలోనిపల్లి, అయిజ, మల్దకల్ తదితర గ్రామాల్లో 25 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన వాటిని త్వరలోనే స్వాధీనం చేసుకుంటామన్నారు. తక్కువ ధరకు వచ్చే వాహనాలను ఎవరూ కొనుగోలు చేయొద్దని ప్రజలకు సూచించారు. వాహనాలు కొనుగోలు చేసే సమయంలో అమ్మే వారి నుంచి ఆధార్, ఆర్సీ, లైసెన్సులు తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. -
గిరిజనుల సాధికారతకే ‘ఆదికర్మయోగి మిషన్’
● అన్నిశాఖల సమన్వయంతో పక్కాగా అమలు చేయాలి ● కలెక్టర్ విజయేందిర బోయి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఆదికర్మయోగి అభియాన్ మిషన్ను గ్రామస్థాయిలో అన్నిశాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్ విజయేందిర పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా గిరిజనులకు సాధికారత కల్పించడం, ప్రతిస్పందనాత్మక పాలన బలోపేతం చేయడం, స్థానిక నాయకత్వ అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ ఆది కర్మయోగి అభియాన్ను ప్రారంభించినట్లు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో ఆది కర్మయోగి అభియాన్ మిషన్పై మిషన్ భగీరథ, విద్య, వైద్య, డీఆర్డీఓ, గిరిజన సంక్షేమ, మహిళా సంక్షేమ, అటవీ తదితర శాఖల అధికారులతో జిల్లాస్థాయి అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో 10మండలాల్లోని 25 గిరిజన గ్రామాలను ఆది కర్మ యోగి అభియాన్ మిషన్ కింద ఎంపిక చేసినట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ప్రతిష్టాత్మకమైన సుపరిపాలనకు ఏడు శాఖల సమన్వయంతో ప్రతిపౌరుడికి పథకాలు అందేలా పర్యవేక్షణ చేయాలని తెలిపారు. డిస్ట్రిక్ ప్రాసెస్ ల్యాబ్గా ఎంపిక చేసిన సిబ్బందికి కార్యక్రమం అమలులో 15అంశాలపై అవగాహన ఉండాలని తెలిపారు. జిల్లా ట్రైనర్లు 10, 11, 12 తేదీల్లో మండల బ్లాక్ ట్రైనర్లకు శిక్షణ నిస్తారని, బ్లాక్ ట్రైనర్లు గ్రామస్థాయిలో శిక్షణ నిస్తారని తెలిపారు. అవగాహన పొందిన సిబ్బంది గిరిజనులకు మౌలిక సదుపాయాల కల్పనకు చేపట్టబడిన పథకాన్ని అన్నిశాఖల సమన్వయంతో గ్రామస్థాయిలో విజయవంతం చేయాలని సూచించారు. అన్నిశాఖల సిబ్బంది ఆదికర్మ యోగి మిషన్పై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని, ఎంపిక చేసిన గిరిజన గ్రామాల్లో కేంద్ర, రాష్ట్ర పథకాలు పక్కాగా అమలు చేయాలన్నారు. ఈ మూడు రోజుల అవగాహన కార్యక్రమంలో సమగ్ర కార్యాచరణ తయారు చేసి అన్ని జీపీల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. గిరిజన గ్రామాల్లో కమ్యూనిటీ భాగస్వామ్యంతో సాధికారత కల్పించే లక్ష్యంతో ఆదికర్మయోగి సిద్ధాంతం అమలు చేయనున్నామని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జిల్లా ప్రభారి ప్రదీప్కుమార్ సింగ్, జెడ్పీ సీఈఓ వెంకటరెడ్డి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి జనార్దన్, డీఈఓ ప్రవీణ్కుమార్, మహిళా, శిశు సంక్షేమ అధికారి జరీనాబేగం తదితరులు పాల్గొన్నారు. -
లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి
● అధికంగా కేసులు రాజీ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి ● ఇన్చార్జి న్యాయమూర్తి కల్యాణ్ చక్రవర్తి పాలమూరు: జిల్లా కోర్టుతో పాటు జడ్చర్లలో ఈనెల 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ కోసం ప్రత్యేకంగా 8 బెంచీలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కోర్టు ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్ చక్రవర్తి అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయమూర్తి చాంబర్లో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఇప్పటికే 1,748 కేసులు గుర్తించి నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు కోర్టు ఎదుటకు రాని కేసులు పరిష్కరించడానికి అవకాశం ఉన్న ప్రతి కేసు రాజీ చేసుకోవాలన్నారు. క్రిమినల్, సివిల్, రోడ్డు ప్రమాదాల కేసులు, చిట్ఫండ్, విద్యుత్, డ్రంకన్డ్రైవ్, చెక్బౌన్స్, బ్యాంకు కేసులు ఇలా అన్ని రకాల కేసులు కక్షిదారులు రాజీ చేసుకోవాలని సూచించారు. పోలీస్శాఖతో పాటు ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకు మేనేజర్లు ప్రత్యేక దృష్టి పెట్టి లోక్ అదాలత్కు అధికంగా కేసు లు వచ్చే విధంగా చర్య లు తీసుకోవాలన్నారు. వివరాలు వెల్లడిస్తున్న న్యాయమూర్తికల్యాణ్ చక్రవర్తి -
నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి
● స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్శివేంద్రప్రతాప్ ● ముగిసిన ‘100 రోజుల ప్రత్యేక కార్యాచరణ’ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగరాన్ని అందరూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్ సూచించారు. జూన్ 1 నుంచి చేపట్టిన ‘100 రోజుల ప్రత్యేక కార్యాచరణ’ మంగళవారంతో ముగిసింది. ఈ సందర్భంగా మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ వంద రోజుల పాటు పారిశుద్ధ్య కార్మికులు ఎంతగానో శ్రమించి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంపై సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం సుమారు 150 మంది కార్మికులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.ప్రవీణ్కుమార్ రెడ్డి, మేనేజర్ వెంకటేశ్వరరావు, హెల్త్ అసిస్టెంట్ వజ్రకుమార్రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్లు లక్ష్మయ్య, శ్రీనివాస్జీ తదితరులు పాల్గొన్నారు. -
వంతుల వారీగా క్యూలైన్లో పడిగాపులు కాస్తున్నా..
మూడెకరాల్లో వరి, జొన్న పంటలు సాగు చేశాను. యూరియా కోసం తిరగని చోటు లేదు.. సొసైటీ కాడా యూరియా ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క బస్తా కూడా దొరకలేదు. సొసైటీ వద్ద తెల్లవారుజాము నుంచి పడికాపులు కాసినా ఇవ్వలేదు. అధికారులు రేపుమాపు అని తిప్పుతున్నారు. వరినారు ముదిరిపోయింది. జొన్న పంట ఆశించినంతగా కాత కాయడం లేదు. చేసేది లేక భార్యాభర్తలం వంతుల వారీగా రైతు సొసైటీ వద్ద క్యూలైన్లో పడిగాపులు కాసి వస్తున్నాం. – లొడ్డ వెంకట్రాములు, సల్లోనిపల్లి, హన్వాడ మండలం -
పాలమూరును జిల్లా బిడ్డే ఎండబెడుతున్నారు..
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: సీఎం రేవంత్రెడ్డి 21 నెలల పాలనలో ఎక్కడ మాట్లాడినా.. నేను పాలమూరు బిడ్డను, నల్లమల బిడ్డను అని చెప్పుకుంటారని.. కానీ ఆయనే పాలమూరును ఎండబెడుతున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి భార్య శ్వేతారెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా మంగళవారం ఆయన మాజీ మంత్రి హరీశ్రావుతో కలిసి నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలంలోని ఆవంచ గ్రామానికి వచ్చారు. శ్వేతారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. ఆ తర్వాత వారు మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని లక్ష్మారెడ్డి ఇంట్లో భోజనం చేశారు. హరీశ్రావు తిరిగి హైదరాబాద్కు పయనమైన అనంతరం కేటీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాలమూరు వెనుకబాటుతనానికి టీడీపీ, కాంగ్రెస్ కారణమని ఆయన టీడీపీలో ఉన్నప్పుడే చెప్పారన్నారు. పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే తమ బతుకులు మారుతాయని.. ఆరు గ్యారంటీలు 100 రోజుల్లో అమలవుతాయనే ఆశతో ఇక్కడి ప్రజలు 12 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించారన్నారు. 21 నెలలుగా పడావు పెట్టారు.. బీఆర్ఎస్ హయాంలో పాలమూరులో వివిధ ప్రాజెక్ట్లను పూర్తి చేసి 8 లక్షల ఎకరాలకు నీళ్లు పారించినట్లు కేటీఆర్ వెల్లడించారు. పాలమూరును కోనసీమగా మార్చాలనే లక్ష్యంతో కేసీఆర్ నాయకత్వంలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ను 90 శాతం పూర్తి చేశామని.. కానీ పాలమూరుకు చెందిన సీఎం 21 నెలలు గడిచినా పనులు పూర్తిచేయడం లేదన్నారు. మిగతా పది శాతం పనులు పూర్తి చేసి.. నీళ్లు పారిస్తే కేసీఆర్కు పేరు వస్తుందనే భయంతో పాలమూరును పడావు పెట్టారని మండిపడ్డారు. పైసా పని చేయకుండా అదే పాలమూరు ప్రాజెక్ట్కు వారి మామ జైపాల్రెడ్డి పేరు పెట్టుకోవడంపై ప్రజలే ఆలోచన చేయాలన్నారు. దురాలోచనతో కొడంగల్కు శ్రీకారం.. పాలమూరు ఎత్తిపోతల్లో భాగంగా ఉమ్మడి పాలమూరు, కొడంగల్ నియోజకవర్గంతో పాటు రంగారెడ్డి జిల్లాకు ప్రయోజనం చేకూరేలా ప్లాన్ చేసి.. ప్రాజెక్ట్ను 90 శాతం పూర్తి చేశామని తెలిపారు. అయితే హడావుడిగా కొడంగల్, రంగారెడ్డికి నీరందించే సోర్స్ను శ్రీశైలం నుంచి జూరాలకు మార్చి రూ.4 వేల కోట్లతో సీఎం రేవంత్రెడ్డి టెండర్లు పూర్తి చేశారన్నారు. మనసులో ఏదో దురాలోచనతో పర్యావరణ అనుమతుల్లేకుండా టెండర్లు పూర్తి చేయడంతో రైతులు ఎన్జీటీని ఆశ్రయించగా.. స్టే ఇచ్చిందన్నారు. కొడంగల్ ఎత్తిపోతల కింద రైతులు కూడా పరిహారం కోసం రోడ్డెక్కుతున్నారన్నారు. చౌకబారు రాజకీయాలు చేస్తున్నారు.. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను కాంగ్రెస్ వాళ్లు వేధింపులకు గురి చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. దేవరకద్రలో మండల పార్టీ అధ్యక్షుడిపై లేని కేసు పెట్టి జైలుకు పంపించారని.. కాంగ్రెస్లో చేరితే కేసు తీసేస్తామంటూ బెదిరిస్తున్నారని తెలిపారు. చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వారు, క్రషర్ నిర్వాహకులపై జీఎస్టీ, పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని పార్టీ నాయకులు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను చైతన్యవంతం చేసేలా ఆలోచన చేసి ముందుకు సాగుతామన్నారు. ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు మర్రిజనార్దన్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, రాజేందర్రెడ్డి, రావుల చంద్రశేఖర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. చెప్పుకోలేనిదురావస్థలో ఉన్నారు.. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి బీఆర్ఎస్లోనే ఉన్నానని చెబుతున్నారు కదా అంటూ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి విలేకరులు అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిచ్చారు. ‘కృష్ణమోహన్రెడ్డి సమక్షంలోనే కేసీఆర్పై మంత్రులు పొంగులేటి, జూపల్లి ఆరోపణలు, విమర్శలు చేస్తుంటే ఆయన ఎందుకు మౌనం వహించారు.. కాంగ్రెస్లో చేరిన కొందరు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోలేని దురావస్థలో ఉన్నారు’ అని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో 90 శాతం పనులు పూర్తి మిగిలిన 10 శాతం పనులు ఎందుకు పూర్తి చేయడం లేదు కేసీఆర్కు పేరు వస్తుందనే పడావు పెట్టారు సీఎం రేవంత్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం -
మనకు మనమే పోటీ
విద్యార్థులు, రైతులు, యువకులు ఎవరికై నా మానసిక ఒత్తిడి పెరిగిన సందర్భంలో న్యూరో ట్రాన్స్మీటర్స్ దెబ్బతిని ఆ సమయంలో ఆత్మహత్య ఆలోచనలు వస్తాయి. అనుకున్న స్థాయికి రీచ్ కాలేకపోయిన క్రమంలో బాధ, దుఖంలో ఆసక్తి లోపిస్తాయి. చుట్టూ ఉండే వాతావరణం, ఇతరులతో పోలిక వంటి వాటి కారణంగా విద్యార్థులు ఒత్తిడిలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు వారిని అసవరమైన మేర ప్రోత్సహించాలి. చదువు విషయంలో ప్రణాళిక, సమయపాలన ఎంతో ముఖ్యం. కష్టమైన సబ్జెక్టు ఉంటే ప్రతి రోజూ సాధన చేయాలి. మెదడుకు చదువుపై ప్రణాళికబద్ధమైన అలవాటు చేయాలి. చదువుకునే సమయంలో సెల్ఫోన్, టీవీలు వంటి వాటి జోలికి వెళ్లకుండా పూర్తి ధ్యాసంతా పుస్తకాలపైనే ఉంచాలి. – డాక్టర్ భార్గవ స్వరాజ్, మానసిక వైద్య నిపుణుడు -
అపోహలకు గురి కావద్దు
భార్యాభర్తలు ఒకరిపై ఒకరు నమ్మకంతో ఉండాలి. ఏదైనా సమస్య తలెత్తితే సామరస్యంగా పరిష్కరించుకోవాలి. సమస్యను జఠిలం చేసుకోవద్దు. పరస్పర అవగాహనతో మసులుకోవాలి. ఒకరికి తెలియకుండా మరొకరు గోప్యత పాటిస్తే సహజంగానే ఇంకొకరికి అనుమానం కలుగుతుంది. వివాహ బంధం భార్యాభర్తలిద్దరై సమానమే. ఏ ఒక్కరూ తాము పైచేయి సాధించాలని చూసినా ఆ కుటుంబంలో తరుచూ గొడవలు జరుగుతుంటాయి. దాన్ని ఆదిలోనే తుంచేయాలి. పిల్లల ఎదుట దంపతులు గొడవపడడం ద్వారా వారిలో అభద్రతాభావం పెరుగుతుంది. కుటుంబంపై ప్రేమ మమకారం కోల్పోతే చెడు ఆలోచనలు వస్తాయి. కుటుంబ సభ్యులు అన్నీ విషయాలను అందరితో చర్చించాలి. – వంగీపురం శ్రీనాథాచారి, ప్రముఖ మానసిక వ్యక్తిత్వ వికాస నిపుణుడు -
బైక్ పైనుంచి పడి వ్యక్తి దుర్మరణం
మహమ్మదాబాద్: ప్రమాదవశాత్తు బైక్ పైనుంచి పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. హన్వాడ మండలం నాయినోనిపల్లికి చెందిన వార్ల కృష్ణయ్య (53) అదే గ్రామానికి చెందిన లక్ష్మయ్యతో కలిసి సోమవారం బైక్పై మండలంలోని మొకర్లాబాద్కు వెళ్లారు. పని ముగించుకొని రాత్రి 10 గంటల సమయంలో తిరిగి స్వగ్రామానికి వస్తుండగా భారత్ రైస్మిల్ ఎదుట బైక్ అదుపుతప్పి కిందపడటంతో ఇద్దరికి గాయాలయ్యాయి. కృష్ణయ్య తలకు తీవ్ర గాయమై రక్తస్రావం కావడంతో స్థానికులు ఓ ప్రైవేట్ వాహనంలో మహబూబ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందాడు. కుమారుడు వేణుగోపాల్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శేఖర్రెడ్డి వివరించారు. బస్సు ఢీకొని కూలీ మృతి మానవపాడు: ఆర్టీసీ బస్సు ఢీకొని కూలీ మృతిచెందిన ఘటన మంగళవారం 44వ నంబర్ జాతీయ రహదారి బోరవెల్లి స్టేజీ సమీపంలో చోటుచేసుకుంది. ఎస్ఐ చంద్రకాంత్ కథనం మేరకు.. జోగుళాంబ గద్వాల జిల్లా అనంతపూర్కు చెందిన పెరుమాల గోవింద్ (51) నిత్యం జాతీయ రహదారిపై రోజువారి కూలీగా పని చేస్తున్నారు. రోజులాగే మంగళవారం కూడా బోరవెల్లి స్టేజీ సమీపంలోని హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద జాతీయ రహదారిపై పని చేస్తుండగా హైదరాబాద్ నుంచి నంద్యాల వైపు వెళ్తున్న నంద్యాల డిపో బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కుమారుడు పెరుమాల జగదీశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వివరించారు. అదృశ్యమైన వ్యక్తి మృతదేహం లభ్యం ఆత్మకూర్: ఓ వ్యక్తి కనిపించకుండా పోయి.. చెరువులో శవమై తేలిన ఘటన మంగళవారం ఆత్మకూర్లో చోటు చేసుకుంది. ఎస్ఐ నరేందర్ తెలిపిన వివరాల మేరకు.. పట్టణానికి చెందిన పోతు నరేష్కుమార్ అలియాస్ నాని (42) పుట్టుకతోనే మానసిక దివ్యాంగుడు. ఈ నెల 7న సాయంత్రం కుటుంబ సభ్యులకు సమాచారం అందించకుండా ఇంటి నుంచి వెళ్లాడు. కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్ల వద్ద ఆరా తీసినా ఆచూకీ లభ్యం కాలేదన్నారు. మంగళవారం ఉదయం స్థానిక పరమేశ్వరస్వామి చెరువులో శవం తేలడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీయగా.. అది నాని మృతదేహంగా కుటుంబసభ్యులు గుర్తించారన్నారు. బావ మ్యాడం శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, నాని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని ఎస్ఐ అన్నారు. విద్యార్థి అదృశ్యం చౌటుప్పల్ రూరల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ పాఠశాల నుంచి విద్యార్థి అదృశ్యమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని ముషీరాబాద్ మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ బాలుర పాఠశాలను కొంతకాలంగా చౌటుప్పల్ మండలం తూప్రాన్న్పేట గ్రామ పరిధిలోని నేతాజీ ఇంజనీరింగ్ కళాశాల భవనంలో నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలలో గద్వాల్ జిల్లా లతిపురం గ్రామానికి చెందిన గొల్లతిప్పడంపల్లి శ్రీకాంత్ 7వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం ఉదయం 9గంటలకు పాఠశాల ప్రారంభమైయ్యే సమయానికి శ్రీకాంత్ కనిపించలేదు. హాస్టల్ చుట్టుపక్కల ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించకపోవడంతో హిందీ టీచర్ ఖారత్మల్ దయవంతి చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ ఉపేందర్రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. దాడి కేసులో ఏడుగురికి రిమాండ్ గద్వాల క్రైం: జిల్లాకేంద్రంలో మాజీ కౌన్సిలర్, వారి కుటుంబ సభ్యులపై అకారణంగా దాడి చేసి కులం పేరుతో ధూషించిన ఏడుగురిని అదుపులోకి తీసుకొని మంగళవారం రిమాండ్కు తరలించినట్లు గద్వాల డీఎస్పీ మొగులయ్య తెలిపారు. పట్టణంలోని అంబేడ్కర్నగర్కాలనీకి చెందిన తాజా మాజీ కౌన్సిలర్ మహేష్, తండ్రి శ్రీనివాసులు, వినయ్పై చింతలపేటకాలనీకి చెందిన కొందరు యువకులు మద్యం మత్తులో అకారణంగా కర్రలు, రాళ్లతో దాడి చేసి కులం పేరుతో ధూషించారన్నారు. అంతటితో ఆగకుండా వినాయకుడి లడ్డును సైతం అపహరించి మురుగు కాల్వ సమీపంలో విసేరేసి వెళ్లారని.. బాధితుడు వినయ్ ఫిర్యాదు మేరకు వారిపై ఎస్సీ, ఎస్టీ కేసుతో పాటు దాడికి పాల్పడిన ఘటనలపై అదేరోజు పట్టణ పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు. మంగళవారం ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకొని గద్వాల కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించినట్లు వివరించారు. మరో నలుగురు పరారీలో ఉన్నారని.. వారిని సైతం త్వరలో అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. -
గురుకుల విద్యార్థుల ఆందోళన
● కలెక్టర్ను కలిసేందుకు ప్రహరీ దూకిన వైనం ● పాఠశాలకు చేరుకొని విద్యార్థులతో సమావేశమైన కలెక్టర్ వనపర్తి రూరల్: పాఠశాలలో నెలకొన్న సమస్యలను కలెక్టర్కు విన్నవించేందుకు మంగళవారం మండలంలోని చిట్యాల ఎంజేపీ గురుకుల బాలుర పాఠశాల పదోతరగతి విద్యార్థులు ప్రహరీ దూకి వనపర్తి వైపు పంట చేనుల్లో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పట్టణంలో తిరిగి వెదికి పట్టుకున్నారు. పాఠశాలకు రావాలని కోరగా కలెక్టర్ను కలిసేదాకా వచ్చేది లేదని పట్టుబట్టడంతో సర్ధిచెపి ఆటోలో పాఠశాలకు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు, ఆర్సీఓ శ్రీనివాసులు, సీఐ కృష్ణయ్య, తహసీల్దార్ రమేష్రెడ్డి పాఠశాలకు చేరుకొని విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం కలెక్టర్ ఆదర్శ్ సురభి పాఠశాలను సందర్శించి నేరుగా విద్యార్థులు, ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. పాఠశాలలో మెనూ సరిగా పాటించడం లేదని, ఆటలు ఆడించకుండా రాత్రి 10 వరకు చదివిస్తున్నారని, తల్లిదండ్రులను కలవనీవడం లేదని ఫిర్యాదు చేశారు. పాఠశాలో ఫిర్యాదు పెట్టె ఏర్పాటు చేయిస్తానని.. ఏవైనా సమస్యలుంటే అందులో వేయాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా కల్పించారు. విద్యార్థులకు స్వేచ్ఛాయుత వాతావరణంలో విద్యనందించాలని, సృజనాత్మకత, నైతిక విలువలు నేర్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. నాణ్యమైన బోధనతో పాటు ప్రేమాభిమానం చూపించాలన్నారు. క్రీడల్లో రాణించేలా తీర్చిదిద్దాలని, జాతీయ, అంతర్జాతీయస్థాయిలో పోటీపడేలా తయారు చేయాలని కోరారు. మధ్యాహ్న భోజనం పరిశీలించి విద్యార్థులతో కలిసి భుజించారు. -
9 ఏళ్ల వయసులో హాఫిజే ఖురాన్
స్టేషన్ మహబూబ్నగర్: జిల్లాకేంద్రం షాసాబ్గుట్టలోగల మదర్సా దారుల్ ఉలుమ్ అరబియా లిల్బనాత్ ఫౌండర్, డైరెక్టర్ హాఫిజ్ ఖాజా ఫైజొద్దీన్ కుమార్తె మ్ముల్ఖైర్ మాహిరా 9 ఏళ్లకు హిఫ్జే ఖురాన్ను పూర్తి చేశారు. మూడున్నరేళ్లలో ఆమె పట్టుదలతో కష్టపడి హాఫిజా ఖురాన్ అయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం బాలికను హైదరాబాద్లోని జామియా నిజామియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ముఫ్తి ఖలీల్ అహ్మద్ ఘనంగా సన్మానం చేశారు. పవిత్ర రబీలవల్ మిలాద్ ఉన్ నబీ మాసంలో హిఫ్జే ఖురాన్ కావడం సంతోషంగా ఉందన్నారు. ఈమెను స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది బాలికలు పట్టుదలతో చదివి హిఫ్జే ఖురాన్ కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డాక్టర్ ఖాజా మొయినుద్దీన్, సాజిదా బేగం, మదర్సా ప్రిన్సిపాల్ హాఫిజా హుస్నా ఫాతిమా, ఖాజా రియాజుద్దీన్, ఖాజా మొయిజుద్దీన్, ఖాజా సైఫుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. అభినందించిన జామియా నిజామియా చాన్సలర్ -
రాజ్యాంగ పరిరక్షణకు ఏకం కావాలి
అలంపూర్: రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలందరూ ఏకం కావాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి స్కైలాబ్బాబు పిలుపునిచ్చారు. మంగళవారం అలంపూర్ చౌరస్తాలోని విశ్వశాంతి డిగ్రీ కళాశాలలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు పరంజ్యోతి అధ్యక్షతన ‘రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు’ అనే అంశంపై నిర్వహించిన సెమినార్కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. భారత రాజ్యాంగం ఆవిర్భవించి 75 ఏళ్లు గడిచినా.. రాజ్యంగ ఫలాలు సామాన్యులకు దక్కడం లేదన్నారు. దేశంలోని 200 మంది కోటీశ్వరుల ఆస్తులు 40 శాతం ప్రజల ఆస్తితో సమానంగా ఉన్నాయని.. జనాభాలో ఒక శాతం ఉన్న వారి చేతిలో 50 శాతం ఆస్తులు ఉన్నాయని వివరించారు. ఓ వైపు సంపన్నుల ఆస్తులు పెరుగుతుండగా.. 42 కోట్ల మంది ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారని చెప్పారు. దేశంలో 80 కోట్ల మంది రేషన్ బియ్యం కోసం ఎదురు చూస్తున్నారంటే పేదరికం ఎలా ఉందో అర్థమవుతుందన్నారు. బీజేపీ 11 ఏళ్ల పాలనలో సామాజిక, ఆర్ధిక అంతరాలు మరింత పెరిగాయని.. కార్పొరేట్ శక్తులకు రూ.లక్షల కోట్ల రాయితీలిస్తూ సామాన్యులపై పెను భారం మోపుతోందని విమర్శించారు. మత విధ్వేషాలు రెచ్చగొట్టి మనుషుల మధ్య విభజన తెస్తోందని ఆరోపించారు. ప్రధాని మోదీ హయాంలో దళితులపై దాడులు, ధౌర్జన్యాలు 300 రేట్లు పెరిగాయని, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వివరాల ప్రకారం ఐదేళ్లలో 6,34,066 ఫిర్యాదులు నమోదైనట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 3.40 లక్షల ధౌర్జన్యాలు జరిగాయని.. బిహార్లో 65 లక్షల మందిని ఓటుకు అనర్హులుగా చేసిన ఘనత బీజేపీకే దక్కిందన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం జోక్యంతో ఆధార్తో ఓటు హక్కు నమోదు చేస్తున్నారని తెలిపారు. మహిళల భద్రతలో దేశం 135 స్థానంలో ఉందన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకానికి నిధులు తగ్గించి పని దినాలు కల్పించడం లేదని.. 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లుగా విభజించి కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని విమర్శించారు. ప్రైవేట్లో రిజర్వేషస్ల సాధనకు జరిగే ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విశ్వశాంతి విద్యాసంస్థల కరస్పాండెంట్ మురళీధర్రెడ్డి, ప్రజా నాట్యమండలి జిల్లా ప్రధానకార్యదర్శి ఆశన్న, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు పరంజ్యోతి, ప్రధానకార్యదర్శి రాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు గట్టు మారెన్న, వెంకటస్వామి, విజయ్కుమార్, సవరన్న, రాజు, సుధాకర్, సంజీవ, నాగరాజు, మద్దిలేటి, సామేలు, నర్సింహ, మౌలాలి, జయన్న, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి స్కైలాబ్బాబు -
ప్రాజెక్టులకు తగ్గిన ఇన్ఫ్లో
ధరూరు/ఆత్మకూరు/దోమలపెంట/రాజోళి: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లో వరద మరింత తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. సోమవారం ప్రాజెక్టుకు 65 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. మంగళవారం రాత్రి 7 గంటల వరకు ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ఫ్లో 45వేల క్యూసెక్కులకు తగ్గింది. విద్యుదుద్పత్తి నిమిత్తం 20,139 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 90 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 1,190 క్యూసెక్కులు, కుడి కాల్వకు 640 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 22,059 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.029 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాగా.. జూరాల ఎగువ, దిగువలో 12 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. రెండింటిలో కలిసి ఇప్పటి వరకు 632.233 ఎంయూ విజయవంతంగా విద్యుదుత్పత్తిని చేపట్టామన్నారు. ● శ్రీశైలం జలాశయంలో మంగళవారం 883.6 అడుగుల నీటిమట్టం వద్ద 207.8472 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జూరాలలో విద్యుదుత్పత్తి చేస్తూ 20,139, సుంకేసుల నుంచి 30,884 మొత్తం 51,023 క్యూసెక్కులఇ ఇన్ఫ్లో ఉంది. ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,215, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 30,884 మొత్తం 66,199 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా 32,000, హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2,824, ఎంజికెఎల్ఐకు 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సుంకేసులకు 43 వేల క్యూసెక్కులు రాజోళి: సుంకేసుల డ్యాంకు మంగళవారం ఎగువ నుంచి 43,450 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. 9 గేట్లను ఒక మీటర్ మేర తెరిచి 39,708 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కేసీ కెనాల్కు 2,445 క్యూసెక్కులు వదిలినట్లు జేఈ మహేంద్ర తెలిపారు. -
ఆదివాసీలకు ఉన్నత విద్య ఉచితం
మన్ననూర్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూని వర్శిటీ ద్వారా ఆదివాసి గిరిజనులకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నట్లు విశ్వవిద్యాలయం విశ్వవిద్యాలయం డీన్, స్టూడెంట్ ఎఫైర్, ప్రొఫెసర్ దయాకర్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఐటీడీఏ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన ఐటీడీఏ ఏఓ జాఫర్ఉసేన్తో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వివిధ కారణాలతో ఆదిమ జాతి చెంచులు, కోయ, కొల్లం, కొండ రెడ్లు, గోండులు విద్యాపరంగా ఉన్నత చదువుకు దూరమవుతున్నారని తెలిపారు. దీంతో వారు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబాటుకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని వైస్ చాన్స్లర్ గంట చక్రపాణి ఆదేశాల మేరకు సమతా సపోర్టు స్కీం ద్వారా ఆదివాసీలకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం రూ.500 మాత్రమే చెల్లించి ప్రవేశం పొందవచ్చని తెలిపారు. ఆదివాసి గిరిజనులతో పాటు దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, అక్రిడిటేషన్ కలిగి ఉన్న జర్నలిస్టులు, వారి పిల్లలకు కూడా ఉచితంగా విద్యా అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. అక్టోబర్ 13 వరకు ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్, 73829 29570/580/590/600 ఫోన్ నబర్లను సంప్రదించాలని కోరారు. అంతకు ముందు యూనివర్సిటీ బృందం సభ్యులు అమ్రాబాద్ మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాలను సందర్శించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ బృందం సభ్యుడు డాక్టర్ కంభంపాటి యాదగిరి, విజయ్, కళ్యాణ్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
మహిళలను అక్షరాస్యులుగా చేయాలి
● కలెక్టర్ విజయేందిరబోయి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): మహిళా సంఘాల్లోని మహిళలను అక్షరాస్యులుగా చేయాలని కలెక్టర్ విజయేందిర పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఉల్లాస్ కార్యక్రమం ద్వారా మహిళా సంఘాల మహిళలను అక్షరాసులుగా చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని మహిళా సంఘాల్లోని 65, 467, మెప్మా ఆధ్వర్యంలో 15వేలను కలిపి మొత్తం 79,467 మందిని ఈ విడతలో అక్షరాసులుగా మాచేందుకు ఉల్లాస్ యాప్లో నమోదు చేయాలన్నారు. వలంటీర్లను గుర్తించి ఒక్కో వలంటీరు పదిమందికి చదువు నేర్పాలని సూచించారు. ఇప్పటి వరకు జిల్లా, మండల స్థాయిలో వలంటీర్లకు నిరక్షరాసులకు ఏ విధంగా చదువు చెప్పాలనే దానిపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. తదుపరివారు గ్రామస్థాయిలో ఎంపిక చేయబడిన వలంటీర్లకు ఈనెల 12వ తేదీ నుంచి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రజావాణిలో 156 ఫిర్యాదులు ప్రజల నుంచి అందుకున్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్హాల్లో జరిగిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. సోమవారం 156 ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఫిర్యాదులను పెండింగ్లో పెట్టుకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శివేంద్ర ప్రతాప్, జెడ్పీ సీఈఓ వెంకట్రెడ్డి, డీఆర్డీఓ నర్సింహులు, నగర కమిషనర్ ప్రవీణ్కుమార్రెడ్డి, అర్బన్ తహసీల్దార్ ఘన్సిరాం ఇతర అధికారులు పాల్గొన్నారు. రేపు ఓటరు తుది జాబితా జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల తుది ఓటరు జాబితాను ఈనెల 10వ తేదీన ప్రచురించనున్నట్లు కలెక్టర్ విజయేందిర బోయి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోనీ వీసీ హాల్లో వివిధ పార్టీల నాయకులతో జరిగిన అఖిలపక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసినట్లు తెలిపారు. ముసాయిదా జాబితా, పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలుంటే తెలియజేయాలని పేర్కొన్నారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి అవసరమైన మార్పులు చేర్పుల అనంతరం తుది జాబితాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో కూడా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని తెలిపారు. ఓటర్ జాబితా తయారీలో పార్టీలు సహకరించాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, జెడ్పీ సీఈఓ వెంకట్రెడ్డి, అడిషనల్ డీఆర్డీఓ ముసాయిదాబేగం, కాంగ్రెస్ ప్రతినిధి సిరాజ్ఖాద్రి, సీపీఐ జిల్లా కార్యదర్శి బాలకిషన్, సీపీఎం ప్రతినిధి మోహన్, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. -
రీజినల్ రింగ్ రోడ్డు డిజైన్ మార్చాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): బాలానగర్ మండలం గుండా వెళుతున్న రీజినల్ రింగ్ రోడ్డు డిజైన్ మార్చాలని భూమూలు కోల్పోతున్న రైతులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణలో నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి రాములు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు ప్రకటించిన సర్వే నెంబర్లలో భూములు పేద దళిత, గిరిజన, బలహీన వర్గాలకు చెందినవే ఉన్నాయని, అందులో ఎకరం, రెండు ఎకరాల ఉన్న రైతులు సర్వస్వం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ డిజైన్ మార్చి పేద రైతుల బతుకుల్లో వెలుగులు నింపాలని కోరారు. ప్రభుత్వం మొండిగా అదే సర్వే నంబర్లలోని భూములను తీసుకుంటామంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. గతంలో ప్రభుత్వం చేసిన రీజినల్ రింగ్రోడ్డు అలైనమెంట్ను యథావిధిగా అమలు చేయాలని కోరారు. అనంతరం కలెక్టరేట్ ఏఓ సువర్ణరాజ్కు వినతిపత్రంఅందజేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు దీప్లానాయక్, రైతులు కృష్ణయ్యర సోమ్లానాయక్, రవి, యాదయ్య, ఎనిమిది గ్రామాల రైతులు పాల్గొన్నారు. -
జూరాలకు తగ్గిన వరద
ధరూరు/ఆత్మకూర్/శాంతినగర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద సోమవారం తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఆదివారం ప్రాజెక్టుకు 1.20 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో 65వేల క్యూసెక్కులకు తగ్గింది. దీంతో తెరిచి ఉంచిన క్రస్టు గేట్లను మూసివేశారు. విద్యుదుద్పత్తి నిమిత్తం 43,640 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 67, ఎడమ కాల్వకు 1,190, కుడి కాల్వకు 700.. ప్రాజెక్టు నుంచి మొత్తం 59,647 క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా 8.770 టీఎంసీలు ఉన్నట్లు తెలిపారు. 622 మి.యూ. విద్యుదుత్పత్తి.. జూరాల జల విద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుదుత్పత్తి వేగంగా కొనసాగుతుంది. సోమవారం ఎగువ 6 యూనిట్ల నుంచి 234 మెగావాట్లు, 298.473 మి.యూ, దిగువ 6 యూనిట్ల నుంచి 240 మెగావాట్లు, 324.683 మి.యూ. విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఆర్డీఎస్లో పెరిగిన నీటి ప్రవాహం శాంతినగర్: వడ్డేపల్లి మండలం జూలెకల్ సమీపంలో ఆర్డీఎస్ కెనాల్లో నీటి ప్రవాహం పెరిగింది. మూడు రోజుల క్రితం కెనాల్లో నీటి ప్రవాహం రెండు అడుగులకు పడిపోయిన విషయం తెలిసిందే. ఆది, సోమవారం ఎగువ నుంచి నీరు రావడంతో ఆరడుగులకు నీటి ప్రవాహం పెరిగింది. దీంతో ఆర్డీఎస్ ప్రధాన కాల్వ నిండుకుండను తలపిస్తుంది. ఇటీవల వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కెనాల్ పరివాహక ప్రాంతాల్లోని రైతులు వారి పంట పొలాలకు నీటి తడులు ఇస్తున్నారు. ఒక గేటు ద్వారా నీటి విడుదల దోమలపెంట: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం ఆనకట్ట మూడు గేట్లలో రెండు గేట్లను అధికారులు మూసి వేశారు. ఒక గేటు పది అడుగుల మేర ఎత్తి స్పిల్వే ద్వారా 27,616 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. జూరాలలో విద్యుదుత్పత్తి చేస్తూ 44,933, సుంకేసుల నుంచి 40,014 మొత్తం 84,947 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం జలాశయం వస్తుంది. మరోవైపు భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315, ఏపీ.జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 30,890 మొత్తం 66,205 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 884.0 అడుగుల వద్ద 210.0320 టీఎంసీల నీటి నిల్వ ఉంది. -
కేసులు సకాలంలో పరిష్కరించాలి: ఎస్పీ
మహబూబ్నగర్ క్రైం: పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇచ్చే బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయాలని ఎస్పీ డి.జానకి అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 18 మంది బాధితుల వద్ద ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. ఒక్కొక్కరి ఫిర్యాదును పరిశీలించి సదరు పోలీస్ అధికారులతో మాట్లాడుతూ తక్షణ చర్యలు తీసుకోడానికి ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ప్రతి సమస్యపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలన్నారు. పారదర్శకతతో పని చేయడం పోలీసు ప్రధాన ధ్యేయంగా ఉండాలన్నారు. బాధితులకు న్యాయం జరిగే విధంగా సరైన పర్యవేక్షణతో కేసులు పరిష్కరించాలన్నారు. ● ఈనెల 13న జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా రాజీ కావాల్సిన కేసులను గుర్తించి ఇరు వర్గాలను కోర్టుకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ సిబ్బందికి ఎస్పీ డి.జానకి ఆదేశాలు జారీ చేశారు. క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్, ఆస్తి విభజన, కుటుంబపరమైన కేసులు, బ్యాంకు రికవరీ, విద్యుత్, చెక్ బౌన్స్, ఎంవీఐ యాక్ట్ ఇలా అన్ని రకాల కేసులను గుర్తించాలన్నారు. కోర్టు డ్యూటీ సిబ్బందితో పాటు అధికారులు సైతం ఇరువర్గాల కక్షిదారులకు కౌన్సెలింగ్ ఇచ్చి రాజీ అయ్యే విధంగా చూడాలన్నారు. -
పాలమూరుకు మరో మణిహారం!
జడ్చర్ల: పాలమూరు జిల్లాకు మరో మణిహారం దక్కనుంది. ఇప్పటికే హైదరాబాద్ చుట్టూ నిర్మించిన ఔటర్ రింగ్రోడ్డు తరహాలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో చేపట్టనున్న ఆర్ఆర్ఆర్ (రీజినల్ రింగ్రోడ్డు) పరిధిలోకి ఉమ్మడి జిల్లా గ్రామాలు కూడా వెళ్లనున్నాయి. బాలానగర్ మీదుగా ట్రిపుల్ ఆర్ రోడ్డు విస్తరణ పనులు సాగనున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదిత నోటిఫికేషన్ను హెచ్ఎండీఏ ఇప్పటికే జారీ.. ఈ నెల 15వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణకు గడువిచ్చింది. రీజనల్ రింగ్రోడ్డు వంద మీటర్ల వెడల్పుతో ప్రతిపాదిత అలైన్మెంట్ కోసం మహబూబ్నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, యాదాద్రి జిల్లాలో పరిధిలోని 33 మండలాలు, 163 రెవెన్యూ గ్రామ పంచాయతీలను కలుపుతూ హెచ్ఎండీఏ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అలైన్మెంట్కు సంబంధించి ఇప్పటికే డిజిటల్ మ్యాప్లతో పాటు సర్వే నంబర్లు తదితర పూర్తి వివరాలను హెచ్ఎండీఏ వెబ్సైట్లో ప్రజలకు అందబాటులో ఉంచారు. ప్రజలు, సంస్థలు తమ అభ్యంతరాలను, సూచనలను రాత పూర్వకంగా సమర్పించాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, అభ్యంతరాలు, సూచనలను పరిశీలించిన తర్వాత హెచ్ఎండీఏ తుది నోటిఫికేషన్ను విడుదలచేయనుంది. ● ఉమ్మడి మహబూబ్నగర్లోని ఆమన్గల్, మాడ్గుల, కేశంపేట, తలకొండపల్లి, ఫరూఖ్నగర్, కొందుర్గు మండలాల్లో ఆర్ఆర్ఆర్ విస్తరించనుంది. తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మహబూబ్నగర్ జిల్లా బాలాగనర్ మండలంలోని అప్పాజీపల్లి, బోడజానంపేట, చిన్నరేవల్లి, గౌతాపూర్, గుండేడు, మాచారం, పెద్దరేవల్లి, పెద్దాయపల్లి, సూరారం, ఉడిత్యాల్, వనమోనిగూడలు ట్రిపుల్ ఆర్ పరిధిలోకి వెళ్లనున్నాయి. గతంలో ఫరూఖ్నగర్ మండలం బూర్గుల గ్రామం వరకే ట్రిపుల్ ఆర్ను పరిమితం చేశారు. డిజైన్ మార్పుతో బాలానగర్ మండలంలోని కొన్ని గ్రామాలను కలిపి పెద్దాయపల్లి క్రాస్ రోడ్ వద్ద 44 వ నంబర్ జాతీయ రహదారి వరకు ఇది విస్తరించనుంది. దీని నిర్మాణం పూర్తయితే తెలంగాణలోని ఇతర ప్రాంతాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, గోవా, కేరళ, రాష్ట్రాలకు రాకపోకలు సాగించే వారికి ఎంతో ఉపయోగపడుతుంది. కొందరికి మోదం.. మరికొందరికి ఖేదం ట్రిపుల్ ఆర్ నిర్మాణాన్ని కొందరు ఆమోదిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. రహదారి నిర్మాణానికి సేకరించే భూములకు సంబంధించి ఇప్పటికే ఆయా గ్రామాల వారీగా సర్వే నంబర్లను హెచ్ఎండీఏ విడుదల చేసింది. భూములు కోల్పోతున్న రైతులు ఆందోళన పడుతున్నారు. పెద్దాయపల్లి క్రాస్రోడ్డు వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిని అనుసరించి ఏర్పాటయిన వెంచర్లు కూడా ట్రిపుల్ ఆర్ పరిధిలోకి రావడంతో ఆయా వెంచర్ల నిర్వాహకులు, ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ మార్కెట్ విలువ ప్రకారంగా పరిహారం అందించే పరిస్థితి ఉండడంతో తాము నష్టపోతామని వాపోతున్నారు. కాగా.. ఆర్ఆర్ఆర్ను అనుసరించి ఉన్న భూముల విలువలు అమాంతంగా మూడు–నాలుగు రెట్లు పెరిగే అవకాశం ఉండడంతో ఆయా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామాల అభివృద్ధికి మహర్దశ పట్టనుందని భావిస్తున్నారు. న్యాయంగా పరిహారం ఇవ్వాలి ఎన్నో కష్టాలను అధిగమించి పైసాపైసా కూడగట్టి ప్లాట్లు కొనుగోలు చేశాం. నాతో పాటు ఎంతో మంది ఈ ప్రాంతంలోని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేశారు. ట్రిపుల్ ఆర్ నేరుగా ఆయా వెంచర్ల గుండా వెళ్తుంది. దీంతో తమ ప్లాట్లకు ప్రభుత్వ లెక్కల ప్రకారం పరిహారం ఇస్తే అన్యాయం జరుగుతుంది. మానవతా దృక్పథంతో మెరుగైన పరిహారం ఇచ్చే విధంగా ప్రభుత్వ పెద్దలు చర్యలు తీసుకోవాలి. – ఎస్వీ రామారావు, బాలానగర్ హర్షణీయం బాలానగర్ సమీపం గుండా ట్రిపుల్ ఆర్ ఏర్పాటు చేయడం హర్షణీయం. దీంతో వివిధ దూర ప్రాంతాలకు సంబంధించి రాకపోకలు, ఇతర రవాణా సులభతరం అవుతుంది. రవాణా సౌకర్యాలు బలపడితే అది అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. – బాదేపల్లి రంజిత్బాబు, జడ్చర్ల ఆర్ఆర్ఆర్ ఏర్పాటుతో మరింత అభివృద్ధి బాలానగర్ మండలం గుండా ట్రిపుల్ ఆర్ ఏర్పాటు కావడం వల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. అలాగే విద్యాసంస్థలు, పరిశ్రమల రాకతో పాటు వ్యాపార, వాణిజ్య సంబంధాలు మెరుగవుతాయి. ఆర్ఆర్ఆర్ చుట్టూ మాల్స్, వాణిజ్య భవనాలు ఏర్పాటవుతాయి. జడ్చర్ల నియోజకవర్గంతో పాటు పాలమూరు జిల్లాకు లాభం చేకూరుతుంది. – జనంపల్లి అనిరుధ్రెడ్డి, ఎమ్మెల్యేల, జడ్చర్ల ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి ప్రాథమిక నోటిఫికేషన్ జారీ ఈ నెల 15 వరకు అభ్యంతరాలకు గడువు డిజైన్ మార్పుతో ఉమ్మడి జిల్లాలో మరికొన్ని గ్రామాలకు విస్తరణ జంక్షన్గా మారనున్న పెద్దాయపల్లి క్రాస్రోడ్ -
ప్రజావాణి సమస్యల పరిష్కారం.. బూటకం
మహబూబ్నగర్ న్యూటౌన్: ఎన్నో ఆశలు పెట్టుకొని కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి వచ్చే ప్రజల సమస్యలను అధికారులు పరిష్కరిస్తారనేది ఒట్టి బూటకమని టీఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్ మండిపడ్డారు. సోమవారం టీఎఫ్టీయూ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజావాణి సమస్యల పరిష్కారంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూం సమస్యల పరిష్కారం కోసం ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోకపోవడం సరికాదన్నారు. అర్హులైన పేదలకు ఇళ్లు ఇవ్వాల్సిన మహబూబ్నగర్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం అధికారులు నాన్చుడు దోరణితో కాలయాపన చేస్తున్నారన్నారు. వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినా పట్టింపులేదన్నారు. సర్వే నంబర్ 523లో ఇళ్ల పట్టాలు స్వాధీనం చేసిన వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అర్హులకు న్యాయం చేయని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామన్నారు. సమావేశంలో టీఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గట్టన్న, జలాల్పాషా, బోయవెంకటమ్మ, కుమ్మరి పద్మ, బషీరుద్దీన్, తదితరులు పాల్గొన్నారు. -
‘రైల్వేగేట్ మూసివేతతో సంబంధం లేదు’
దేవరకద్ర రూరల్: కౌకుంట్ల రైల్వేస్టేషన్ పరిధిలో ఉన్న రైల్వేగేట్ మూసివేతకు తమకు ఎలాంటి సంబంధం లేదని శ్రీలక్ష్మి వేంకటేశ్వర రైల్వే గోదాముల మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం గోదాముల దగ్గర నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గోదాములు నిర్మించిన తర్వాతే రైల్వేగేట్ మూసివేశారని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని పలువురు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రైల్వేశాఖ భవిష్యత్ ప్రణాళికలో భాగంగా కాచిగూడ నుంచి కర్నూలు వరకు ఒకేరోజు అనేక రైల్వేగేట్లను మూసివేసిందని.. అందులో 81వ నంబర్ గేట్ కూడా ఉందని వివరించారు. రైల్వేగేట్ను తెరిపించాలని 2024, మార్చి 4న ఎమ్మెల్యేతో కలిసి తాము కూడా రైల్వే జీఎంను కలిసి వినతిపత్రం అందించామని చెప్పారు. అలాగే పుట్టపల్లి రోడ్పై గోదాములకు వచ్చే బియ్యం లారీలు తిరగడంతో దెబ్బతినలేదని.. వెంకంపల్లి సమీపంలో ఉన్న క్రషర్ వాహనాల రాకపోకలతోనే ఉండవచ్చని తెలిపారు. రోడ్డు తమ పరిధి సమస్య కానప్పటికీ గ్రామస్తుల ఇబ్బందులను గుర్తించి మరమ్మతుకు సహకరించామని తెలిపారు. స్థానికంగా గోదాములు ఉండటంతో అనేక మందికి ఉపాధి లభిస్తుందని.. కౌకుంట్ల అభివృద్ధికి ఇప్పటి వరకు రూ.10 లక్షలు అందజేశామని, ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులను నియమించి వారి వేతనాలు చెల్లిస్తున్నామని వివరించారు. గ్రామాభివృద్ధికి తమవంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాములు, భాస్కర్, నితిన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
క్యూ కట్టి.. రోడ్డెక్కి...
● యూరియా కోసం అన్నదాతల అవస్థలు ● జిల్లాలో యూరియా కొరతపై పెల్లుబికిన నిరసనలు ● సొసైటీల వద్ద రైతుల బారులు మహబూబ్నగర్ (వ్యవసాయం)/సాక్షి నెట్వర్క్: జిల్లాలో యూరియా కొరతతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటలకు యూరియా వేయాల్సిన సమయం ఆసన్నం కావడంతో ఎరువుల దుకాణాలు, సొసైటీల వద్ద రైతులు భారీగా క్యూ కడుతున్నారు. సోమవారం మండలకేంద్రాల్లోని పీఏసీఎస్లు, ఎరువుల దుకాణాల వద్ద రైతులు బారులు తీరారు. సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ పలుచోట్ల రైతులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. మహబూబ్నగర్లోని బోయపల్లి రోడ్లో గల హకా రైతు సేవా కేంద్రానికి సోమవారం 600 బస్తాల యూరియా రావడంతో రైతులు ఒక్కసారిగా తరలివచ్చారు. దీంతో అక్కడ తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. పోలీసులు వచ్చి రైతులను క్యూ లైన్లో నిలబెట్టారు. ఒక్కో రైతుకు ఒక బస్తా చొప్పున యూరియా పంపిణీ చేశారు. యూరియా దొరకని రైతులు నిరాశగా వెనుదిరిగారు. జిల్లాలో బాలానగర్, నవాబుపేట, దేవరకద్ర, భూత్పూర్, మూసాపేట, అడ్డాకులు, చిన్నచింతకుంట, మిడ్జిల్, జడ్చర్లలో మండలాల్లో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. యూరియా కోసం తెల్లవారుజాము నుంచే సహకార సంఘాల వద్ద బారులు తీరారు. పదేళ్లలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వరి పంటకు యూరియా వేయకపోతే దిగుబడి తగ్గుతుందని, పంటలు ఎర్రబారుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పనులు మానుకొని 15 రోజులుగా ఎరువుల కోసం ఎదురుచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మహమ్మదాబాద్లో రైతులు ధర్నా చేయడంతో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. హన్వాడ మండల కేంద్రంలో రోడ్డెక్కిన రైతులు చించోళి జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. -
ఉపాధ్యాయ వృత్తికి ప్రత్యేక స్థానం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి ప్రత్యేక స్థానం ఉందని పీయూ వీసీ శ్రీనివాస్ అన్నారు. ఇటీవల రాష్ట్రస్థాయి అధ్యాపక అవార్డును పొందిన పీయూ ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డికి సోమవారం సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించడం గొప్ప విషయమన్నారు. సమాజంలో అన్ని వృత్తుల వారిని తయారు చేసే ఏకై క వృత్తి ఉపాధ్యాయ వృత్తన్నారు. అనంతరం మధుసూదన్రెడ్డిని శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, ప్రిన్సిపాళ్లు కరుణాకర్రెడ్డి, రవికాంత్, పీడీ శ్రీనివాస్, హెచ్ఓడీలు పాల్గొన్నారు. -
వరిలో సస్యరక్షణ చర్యలు
● అధిక వర్షాలకు అప్రమత్తంగా ఉండాలి కోస్గి: ఈ ఏడాది జిల్లాలో పలు ప్రాంతాల్లో వరి పంట అధిక మొత్తంలో సాగు చేశారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట పొలాల్లో నీరు నిల్వ ఉండటంతో చీడపీడలు, పురుగుల ఉధృతి పెరిగే ప్రమాదం ఉండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెగుళ్లు, వివిధ రకాల పురుగులు ఆశించకుండా చేపట్టాల్సిన జాగ్రత్తలపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్ పలు సూచనలు వివరించారు. తెగుళ్ల యాజమాన్యం అగ్గి తెగులు: ఆకులపై నూలు కండె ఆకారంలో గోధుమరంగు మచ్చలు ఏర్పడి చివరి ఆకుల వరకు పూర్తిగా ఎండినట్లు కనిపిస్తాయి. పైరు పూతదశలో ఉన్నప్పుడు వెన్ను, మెడ భాగంలో తెగులు ఆశిస్తే వరికొమ్మ మెడ ఇరిగి తాలు గింజలు ఏర్పడతాయి. నివారణ: కేజీ విత్తనానికి 4 గ్రాముల కార్బెండిజ్ కలిపి విత్తనశుద్ధి చేయాలి. ట్రై సైక్లోజోల్ 75 శాతం మందును 6 గ్రాములు లేదా ఎడిఫెన్ఫాస్ 1 మి.లీ. లీటర్ నీటిలో కలిపి పంటపై పిచికారి చేయాలి. కాండం కుళ్లు తెగులు: కాండ ఏర్పడే దశ నుంచి పంట పాలు పోసుకునే వరకు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. నివారణ: తెగులు సోకిన పొలంలో పరిశుభ్రత పాటించాలి. విత్తనశుద్ధి చేయాలి. తెగులు లక్షణాలను గుర్తిస్తే వాలిడామైసిన్ 2 మి.లీ. లేదా హెక్సాకోనోజల్ 2 మి.లీ. మోతాదులో లీటరు నీటికి కలిపి 15 రోజుకోసారి రెండుసార్లు పిచికారీ చేయాలి. ఎండాకు తెగులు: తెగులు సోకిన పంటలో ఆకు అంచుల వెంబడి పసుపు రంగు మచ్చలు ప్రారంభమై చివరకు ఆకులు పూర్తిగా ఎండిపోతాయి. నివారణ: ప్రాపికోనోజల్ 1 మి.లీ. లేదా హెక్సాకోనోజల్ 2 మి.లీ. లేదా వాలిడామైసిన్ 2 మి.లీ. మోతాదులో ఏదేని మందును లీటరు నీటిలో కలిపి పొలంలో నీరు మొత్తం తీసివేసి మొదళ్ల వద్ద తడిచేటట్లు పిచికారీ చేయాలి. పొడ తెగులు, మానిపండు తెగులు: పంట పుష్పించే దశలో ఆశిస్తుంది. అండాశయం ఆకుపచ్చ రంగు ముద్దగా మారిన తర్వాత గింజలన్ని పసుపు రంగు ఉండల్లాగా మారి దిగుబడి తగ్గుతుంది. నివారణ: హెక్సాకోనోజల్ 2 మి.లీ. లేదా ప్రాపికోనోజల్ 1 మి.లీ. లేదా వాలిడామైసిన్ 2 మి.లీ. మోతాదులో లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే మోనోక్రోటోఫాస్ 2 మి.లీ. మోతాదులో లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పురుగులు.. నివారణ చర్యలు కాండం తొలిచే పురుగు: ఈ పురుగు సొకితే పిలకలు చనిపోతాయి. వెన్నులు తెల్ల కంకులుగా మారుతాయి. 5 శాతం పువ్వులు చనిపోయినట్లు గుర్తించిన వెంటనే సస్యరక్షణ చేపట్టాలి. నివారణ క్లోరోఫైరిపాస్ 2.5 మి.లీ. లేదా మోనో క్రోటోపాస్ 1.6 మి.లీ. లేదా ఎసిఫెట్ 1.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఉల్లికోడు: ఈ పురుగు సోకకముందే వరి పంట నాటిన 10 నుంచి 15 రోజుల వ్యవధి లో ఎకరాకు 10 కేజీల కార్బోప్యూరాన్ లేదా 6 కేజీల ఫోరేట్ గుళికల మందు వేయాలి. సుడిదోమ/దోమపోటు: వరిలో దోమపోటు నివారణకు నారు నాటే సమయంలో ప్రతి 2 మీటర్లకు 20 సెం.మీ. బాటలు వదిలి నాటు వేసుకోవాలి. దోమపోటు, సుడిదోమ గుర్తించిన వెంటనే ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రైడ్ 2.2 మి.లీ. మోతాదులో లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పాడి–పంట ,జిల్లా వ్యవసాయాధికారి, జాన్ సుధాకర్ -
గురుకులంలో ఎలుకల స్వైర విహారం
గోపాల్పేట: మండలంలోని బుద్దారం బాలికల గురుకుల పాఠశాలలో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. గదుల్లో నిద్రిస్తున్న విద్యార్థులను కరిచిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. విద్యార్థినులు, పీహెచ్సీ వైద్యుడు తెలిపిన వివరాలిలా.. బుద్దారం బాలికల గురుకుల పాఠశాలలో రోజులానే ఆదివారం రాత్రి భోజనాల తర్వాత విద్యార్థులు వారి వారి గదుల్లో నిద్రించారు. అయితే, పదో తరగతి విద్యార్థినులు శశిరేఖ, భవాణి, జ్యోత్స్న, కీర్తన, స్నేహ, ప్రసన్న, సౌమ్య ఒకే గదిలో నిద్రించగా.. తెల్లారేసరికి కాళ్లు, చేతులను ఏదో కరిచినట్లు గుర్తించారు. ఆ చుట్టుపక్కల పరిశీలించగా ఎలుకలు కనిపించాయి. వెంటనే విషయాన్ని టీచర్ల దృష్టికి తీసుకెళ్లగా వారు మొదట పాఠశాలలో ఉన్న ఆర్డీఎస్కే క్యాంపునకు, అనంతరం గోపాల్పేట పీహెచ్సీకి తీసుకెళ్లారు. వైద్యుడు డాక్టర్ చాంద్పాష విద్యార్థినుల గాయాలను పరిశీలించారు. ఆరుగురికి చిన్నగా, ఒకరికి మాత్రం సెంటీమీటర్ అంత ఎలుకలు కరిచినట్లు గుర్తించి టీటీ ఇంజక్షన్ ఇచ్చారు. ఇదే విషయమై గురుకుల ప్రిన్సిపాల్ను వివరణ కోరగా తాను నెల రోజుల నుంచి సెలవులో ఉన్నానని, ఇన్చార్జ్ చూసుకుంటున్నారని, ఎలుకల నివారణ కోసం మందు తీసుకువచ్చామని, సెలవు రోజుల్లో చల్లాలని ఉంచినట్లు తెలిపారు. జిల్లా అధికారుల సందర్శన విషయం తెలుసుకున్న డీఎంహెచ్ఓ శ్రీనివాసులు, డీఏఓ ఆంజనేయులుగౌడ్, తహసీల్దార్ పాండు నాయక్ సోమవారం రాత్రి గురుకుల పాఠశాలను సందర్శించారు. విద్యార్థులు పీహెచ్సీలో వైద్యం చేయించుకొని రాగా.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందని ఆరా తీశారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఏడుగురు విద్యార్థినులను గాయపర్చిన వైనం -
ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైంది
● విద్యార్థులు వివిధ రంగాల్లో రాణించేందుకు అందరూ గట్టిగా కృషి చేయాలి: కలెక్టర్ విజయేందిర జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనదని కలెక్టర్ విజయేందిర అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లో ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనది అని, తల్లి, తండ్రి తరువాత గురువే మనకు ప్రత్యక్ష దైవం అన్నారు. అందుకే ఉపాధ్యాయులందరూ ఆ స్థానానికి ఉనన విలువను కాపాడుకోవాలని సూచించారు. విద్యార్థులకు వివిధ రంగాల్లో రాణించేందుకు అందరూ గట్టిగా కృషి చేయాలని సూచించారు. డీఈఓ ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని విధాలా పాఠశాలలకు సౌకర్యాలు కల్పిందని, వీటిని ఉపయోగించుకొని ఫలవంతమైన బోధన చేయాలని కోరారు. ఏఎంఓ శ్రీనివాస్, సీఎంఓ సుధాకర్రెడ్డి, ఎంఈఓలు, హెచ్ఎంలు, ఉపాధ్యాయ సంఘం నాయకులు పాల్గొన్నారు. -
తెరుచుకున్న ఆలయాలు
అలంపూర్: రాహుగ్రస్త చంద్రగహణంతో ఆదివారం మధ్యాహ్నం అలంపూర్ ఆలయాలను అర్చకులు మూసివేశారు. సోమవారం తెల్లవారుజామున ఆలయ అధికారులు, అర్చకులు మూసిన ఆలయాల ద్వారాలను తెరిచి గర్భాలయాల్లో సంప్రోక్షణ చేపట్టారు. ఆలయ సిబ్బంది మండపాల్లో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి జోగుళాంబ అమ్మవారు, బాలబ్రహ్మేశ్వరస్వామి వారికి మహా మంగళహారతి ఇచ్చి ఆలయాల్లోకి భక్తులను అనుమతించారు. చంద్ర గ్రహణం ముగియడంతో ఆలయాల్లో పూజలు యధావిధిగా కొనసాగాయి. వివిధ ప్రాంతాల భక్తులు క్షేత్రానికి చేరుకొని అమ్మవారు, స్వామివారిని దర్శించుకున్నారు. మన్యంకొండలో దర్శనాలు ప్రారంభం.. మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో చంద్ర గ్రహణంతో ఆదివారం మధ్యాహ్నం నిలిచిన దర్శనాలను సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభించారు. అలాగే కొండ దిగువన ఉన్న అలివేలు మంగతాయారు ఆలయంలోనూ దర్శనాలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామునే ఆలయ శుద్ధి, పుణ్యాహవాచనం, సంప్రోక్షణ తదితర ప్రత్యేక పూజల అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఆయా పూజా కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందాచారి, పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. చంద్ర గ్రహణంతో ఆదివారం మధ్యాహ్నం మూసివేసిన అర్చకులు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ తదితర ప్రత్యేక పూజల నిర్వహణ మహా మంగళహారతితో భక్తులకు దర్శనాలు -
రైతు ఆత్మహత్యాయత్నం
మిడ్జిల్: తన తల్లి పేరిట ఉన్న సర్వేనంబర్లో తమకు మోఖా చూపించి అప్పగించాలంటూ మండలంలోని వాడ్యాలకు చెందిన రైతు గజ్జల కృష్ణయ్య సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో పురుగుమందు తాగి ఆత్మహత్య యత్నానికి యత్నించారు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన జంగమ్మకు గ్రామంలోని సర్వేనంబర్ 156లో 3 గుంటల భూమి ఉంది. ఆ సర్వేనంబర్ జడ్చర్ల–కల్వకుర్తి ప్రధాన రహదారిని అనుసరించి ఉండటం.. ఆ నంబర్లో ఉన్న పట్టాదారులు మోఖా ఇవ్వకపోవడంతో పట్టాదారు పాసు పుస్తకంలో ఉన్న ప్రకారం భూమి హద్దులు నిర్ధారించి అప్పగించాలంటూ తల్లి జంగమ్మతో కలిసి కృష్ణయ్య కొన్నిరోజులుగా తహసీల్దార్ కార్యాలయానికి తిరుగుతున్నారు. సోమవారం మధ్యాహ్నం తహసీల్దార్ రాజు దగ్గరకు వచ్చి తమకు మోఖా చూపించాలని లేదంటే వెంట తెచ్చుకున్న పురుగుమందు తాగి చనిపోతానంటూ డబ్బా మూత తీస్తుండగా అక్కడే ఉన్న రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. అనంతరం తహసీల్దార్ ఎస్ఐకు ఫోన్చేసి సమస్య పరిష్కరించాలని సూచించారు. దీంతో వారు పోలీస్స్టేషన్కు వెళ్లారు. -
తండ్రి తల నరికి వాగులో పారేసిన కొడుకు
కల్వకుర్తి టౌన్: మూఢనమ్మకాల అనుమానంతోనే కన్నతండ్రిని హత్య చేయాలని కుమారుడు పథకం రచించాడని.. ఈ ప్రణాళికలో భాగంగానే పొలం వద్ద పంచాయితీ పెట్టుకొని హత్య చేశాడని.. అనంతరం తల, మొండెంను వేరుచేసి డిండిచింతపల్లి, డీఎల్ఐ కాల్వలో పారవేశారని కల్వకుర్తి డీఎస్పీ వెంకట్రెడ్డి తెలిపారు. సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ఆయన ఆదివారం కల్వకుర్తిలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. కల్వకుర్తి పట్టణంలోని వాసవినగర్ కాలనీలో నివాసం ఉండే బాలయ్య (70)కు ముగ్గురు కుమారులు ఉండగా.. ఇందులో ఒకరు గతంలో చనిపోయారు. మిగిలిన ఇద్దరిలో చిన్న కుమారుడు బీరయ్య. అయితే, బీరయ్యకు ఒక కుమార్తె ఉండగా.. మూడు నెలల క్రితం బాలిక ఆత్మహత్య చేసుకుంది. నాటి నుంచి బాలిక తండ్రి బీరయ్య నిత్యం ఆలోచనలో ఉంటూ.. కూతురి మృతికి గల కారణాలను అన్వేషిస్తూ ఉన్నాడు. ఈక్రమంలో ఓ మాంత్రికుడి వద్దకు వెళ్లిన బీరయ్యకు నీ కూతురి మృతికి నీ తండ్రి బాలయ్యనే కారణమని చెప్పాడు. దీంతో నాటి నుంచి తండ్రిపై పగ పెంచుకున్నాడు బీరయ్య ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈక్రమంలో ఈ నెల 3వ తేదీన పొలం వద్ద పశువులను మేపుకుంటూ ఉన్న తండ్రి బాలయ్య గొడవకు దిగాడు. పంచాయితీ కాస్త పెద్దగా కావడంతో అక్కడే ఉన్న కర్రతో తండ్రి బాలయ్య తలపై కుమారుడు బీరయ్య విచక్షణారహితంగా దాడి చేశాడు. రక్తపు మడుగులో ఉన్న బాలయ్య స్పృహతప్పి పడిపోయాడు. ఇదే అదునుగా అతన్ని చనిపోయే వరకు దాడిచేశాడు. ఈ దాడిని బాలయ్య వద్ద పనిచేసే రామచంద్రి చూడగా, అతని వద్దకు వెళ్లి ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే నిన్ను కూడా చంపేస్తా అనడంతో అతడు అక్కడి నుంచి భయపడి పారిపోయాడు. హత్యకు ముందు నుంచే ప్రణాళిక.. ఇదిలాఉండగా, తండ్రి బాలయ్యని ఎలాగైనా చంపాలని బీరయ్య ముందే పక్కా ప్రణాళిక వేశాడు. గొడవ చోటుచేసుకోవడంతో ఇదే అదునుగా హత్య చేశాడు. అయితే, వరుసకు మేనల్లుడు అయిన వంగూర్ మండలం రంగాపూర్కు చెందిన అంజికి బీరయ్య విషయాన్ని అంతా ఫోన్ ద్వారా వివరించాడు. తండ్రిని హత్య చేసిన తర్వాత అంజి అప్పటికే సిద్ధంగా ఉండటంతో అతని కారు డిక్కీలో బాలయ్య మృతదేహాన్ని వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదిలాఉండగా, పొలం వద్దకు వెళ్లిన తండ్రి బాలయ్య రాత్రి అయినా ఇంటికి రాకపోవటంతో మరో కుమారుడు మల్లయ్య పొలం వద్దకు వెళ్లి వెతికాడు. ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఉన్న రక్తపు మరకలు, రామచంద్రి తెలిపిన వివరాలతో విచారణ చేపట్టారు. నిందితులు బీరయ్య, అంజి ఫోన్ లొకేషన్ ద్వారా వారు పట్టణంలోని జేపీనగర్ నుంచి కొట్రకు వెళ్లే దారిలో అనుమానంతో సంచరిస్తుండగా వారిని పట్టుకొని విచారించగా తండ్రిని హత్య చేశానని ఒప్పుకున్నాడు.విచారణలో విస్తుపోయే విషయాలుపోలీసుల విచారణలో తండ్రి బాలయ్యపై దాడి చేసి తానే హత్య చేశానని, మృతిచెందాడని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని కారు డిక్కీలో తీసుకెళ్లామని బీరయ్య ఒప్పుకున్నాడు. అనంతరం శరీరం నుంచి తలను చిన్న రంపంతో వేరుచేసి, మొండెంను వంగూర్ మండలం డిండిచింతపల్లి కాల్వలో, తలను డీఎల్ఐ కెనాల్లో పడేశానని తెలిపాడన్నారు. తలను వేరు చేసే సమయంలో బాలయ్య చెవికి ఉన్న బంగారు రింగులను రంపంతోనే కట్చేసి వారితో పాటుగా తీసుకెళ్లారు. ఈ వివరాలతో రెండు కాల్వల్లో గాలింపు చర్యలు చేపట్టి మొండెం, తలను స్వా«దీనం చేసుకొని పోస్టుమార్టం నిర్వహించి వారి కుటుంబసభ్యులకు అందజేశామన్నారు. నిందితులు ఇద్దరిని కల్వకుర్తి జడ్జి ఎదుట హాజరుపర్చగా వారి ఆదేశానుసారంగా రిమాండ్కు తరలించామని డీఎస్పీ తెలిపారు. హత్యకు ఉపయోగించిన కర్రతో పాటుగా, రంపం, కారు, బైక్, బంగారు చెవిపోగులు, సెల్ఫోన్లు స్వా«దీనం చేసుకున్నామన్నారు. హత్య కేసును చేదించిన కల్వకుర్తి సీఐ నాగార్జున, ఎస్ఐలు మాధవరెడ్డి, మహేష్, వెంకట్రెడ్డి, సిబ్బంది, గ్రామస్తులకు నగదు రివార్డులను అందజేశారు. -
జూరాలకు స్వల్పంగా పెరిగిన వరద
ధరూరు/ఆత్మకూర్/దోమలపెంట: ప్రియదర్శిని జూరాల జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద ఆదివారం స్వల్పంగా పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. శనివారం 1,10,500 క్యూసెక్కులు ఉండగా... ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో 1,20,500 క్యూసెక్కులకు పెరిగినట్లు వివరించారు. దీంతో ప్రాజెక్టు 12 క్రస్ట్ గేట్లు ఎత్తి 85,104 క్యూసెక్కులు దిగువకు వదిలినట్లు చెప్పారు. అలాగే విద్యుదుద్పత్తి నిమిత్తం 39,351 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 71, ఎడమ కాల్వకు 920, కుడి కాల్వకు 700, సమాంతర కాల్వకు 400, భీమా లిఫ్ట్కు 750 క్యూసెక్కులు వినియోగించినట్లు వివరించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 9.009 టీఎంసీలు ఉన్నట్లు తెలిపారు. 613 మి.యూ. విద్యుదుత్పత్తి.. జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి వేగంగా కొనసాగుతోంది. ఆదివారం ఎగువ 6 యూనిట్ల నుంచి 234 మెగావాట్లు, 292.964 మి.యూ., దిగువ 6 యూనిట్ల నుంచి 240 మెగావాట్లు, 320.595 మి.యూ. విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. శ్రీశైలంలో మూడు గేట్లు ఎత్తి.. ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహం పెరగడంతో ఆదివారం శ్రీశైలం ఆనకట్ట మూడు గేట్లను పైకెత్తి దిగువనున్న నాగార్జునసాగర్కు నీటిని విడుదల చేశారు. జూరాల ఆనకట్ట స్పిల్వే నుంచి 85,104 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ 39,351 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 48,906 క్యూసెక్కులు జలాశయానికి చేరుతుండగా.. శ్రీశైలం ఆనకట్ట మూడు గేట్లు ఒక్కొక్కటి పది అడుగుల మేర ఎత్తి స్పిల్వే ద్వారా 82,986 క్యూసెక్కులు దిగవకు వదిలారు. -
మృతదేహంతో బైఠాయింపు
బల్మూర్: మండలంలోని బాణాలలో ఈనెల 4న ఆత్మహత్యకు పాల్పడిన సంపంగి పార్వతమ్మ మృతి ఘటనకు కారణమైన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం మృతురాలి కుటుంబ సభ్యులు గ్రామంలో ఆందోళన చేపట్టారు. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. బాణాలకు చెందిన పార్వతమ్మకు మూడేళ్ల నుంచి అదే గ్రామానికి చెందిన శరత్తో వివాహేతర సంబంధం కొనసాగుతుండగా.. గురువారం భర్త నరేశ్ ఇద్దరు కలిసి ఉండటాన్ని గమనించి నిలదీయగా.. శరత్ పారిపోవడంతో పార్వతమ్మ పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి ఆమెను నాగర్కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఈనెల 5న మృతి చెందింది. పార్వతమ్మ మృతికి కారణమైన శరత్పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం బాణాలలో మృతదేహంతో శరత్ ఇంటి ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో అచ్చంపేట సీఐ నాగరాజ్, బల్మూర్ ఎస్ఐ రాజేందర్, లింగాల ఎస్ఐ వెంకటేష్గౌడ్లు బాణాల గ్రామంలో బంధోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి ఆవాంచనియ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబసభ్యులకు హమీ ఇవ్వడంతోవారు శాంతించారు. -
చేపల వేటకు వెళ్లి
● వలలు చుట్టుకొని మృతిచెందిన వైనం ● ఎన్డీఆర్ఎఫ్ బృందం గాలింపు చర్యలు ● వరద తగ్గితే ఆచూకీ లభించే అవకాశం ఆశిరెడ్డిపల్లిలో.. చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని ఆశిరెడ్డిపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గత్ప లక్ష్మయ్య (40) రెడ్డిపిల్లి రెడ్డిచెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఉదయం 11గంటల ప్రాంతలో తన అన్న కృష్ణయ్యకు చెప్పి వల తీసుకొని చేపల వేటకు వెళ్లాడు. మధ్యాహ్న ఒంటి గంట అయినా.. తిరిగి రాకపోవడంతో కృష్ణయ్య చెరువు దగ్గరకు వెళ్లి చూడగా లక్ష్మయ్య వల చుట్టుకొని మృతిచెంది నీటిపై తెలియాడుతున్నాడు. దీంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందిచాడు. మృతుడికి భార్య, కూతురు, కూమారుడు ఉన్నారు. ఇద్దరు మృతి, విద్యార్థి గల్లంతు ఇద్దరు మైనర్లు శనివారం రాత్రి చేపల వేటకు పుట్టి సహాయంతో నదిలోకి వెళ్లి వలవేసి ఒడ్డుకు చేరుకున్నారు. రాత్రి కావడంతో ఇద్దరు ఒడ్డుకు చేర్చుకున్న పుట్టిలోనే నిద్రకు ఉపక్రమించారు. నదీ ప్రవాహం క్రమేపీ పెరగడంతో నీటి ప్రవాహంలో పుట్టి కొట్టుకుపోతన్నట్లు గుర్తించిన ఓ బాలుడు తేరుకుని బయటపడ్డాడు. మరో బాలుడు పుట్టితో సహా గల్లంతైన ఘటన గద్వాల మండలం రేకులపల్లిలో చోటు చేసుకుంది. బంధువులు, పోలీసుల కథనం మేరకు.. తెలుగు రాజేశ్, తెలుగు చంద్రశేఖర్(13) తొమ్మిదో తరగతి. గ్రామంలోని కృష్ణానది (లోయర్ జెన్కో) ప్రాంతంలో శనివారం రాత్రి చేపల వల వేసేందుకు వెళ్లారు. పుట్టిలో వెళ్లిన ఇద్దరు వలలు వేసిన తర్వాత నదీ ఒడ్డుకు వచ్చి అదే పుట్టిలో నిద్రపోయారు. ఒడ్డుకు చేరుకున్న క్రమంలో పుట్టిని తాడుతో కట్టివేయడం మరచిపోయారు. రాత్రి 10గంటల సమయంలో జూరాలకు కొంత మేర ఇన్ఫ్లో పెరగడంతో అధికారులు 8 నుంచి 11గేట్లు తెరిచ్చారు. వరద ప్రవాహం పెరగడంతో అలల తాకిడికి పుట్టి ముందుకు సాగుతూ లోయర్ జెన్కో స్పిల్వే నుంచి జారి పడింది. నిద్రలోంచి తెరుకున్న రాజేశ్ ఈత రావడంతో బయట్టపడ్డాడు. అయితే చంద్రశేఖర్ ప్రమాదవశాత్తు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాడు. గల్లంతైన బాలుడుకి ఈత రాదనే విషయం తెలుసుకున్న వెంటనే బంధువులు, గ్రామస్తులు నదీ వద్దకు చేరుకున్నా ఫలితం లేకపోయింది. రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ ఎన్డీఆర్ఎఫ్ బృందంతో అక్కడికి చేరుకున్నారు. 1.20లక్షల క్యూసెకుల వరద ఉండడంతో వెలుపలికి వెళ్లినప్పటికీ సాధ్యం కాలేదు. గల్లంతైన విద్యార్థి కోసం అధికారులు శ్రమిస్తున్నారు. గల్లంతైన విద్యార్థి ఎప్పుడూ చేపల వేటకు వెళ్లలేదని ప్రస్తుతం ఎందుకు వెళ్లాడో తెలియదని బంధువులు చెబుతున్నారు. విద్యార్థి తండ్రి ఎనిమిదేళ్ల క్రితమే విద్యుత్ షాక్కు గురై మృతిచెందడంతో తల్లి పద్మ తన ముగ్గురు పిల్లలతో కలసి జీవిస్తున్నది. గల్లంతైన చిన్న కుమారుడు గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. సెలవులు ఉండడంతో ఇంటికి వచ్చి వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడని తల్లి కంటతడి పెట్టింది. ఈ ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. వరద ప్రవాహం తగ్గుముఖం పడితే ఆచూకీ లభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతిచెందగా.. ఒక విద్యార్థి గల్లంతైన ఘటన ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆదివారం చోటుచేసుకున్నది. చేపల కోసం విసిరే వల చుట్టుకొని ఇద్దరు మృతిచెందగా.. పుట్టి జూరాల వరద ప్రవాహంలో కొట్టుకుపోయి లోయర్ జెన్కో ప్రాంతంలో గల్లంతైన బాలుడి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందం గాలింపు చర్యలు చేపట్టగా.. ఫలితం లేకపోయింది. – గద్వాల క్రైం/గండేడ్/నాగర్కర్నూల్ క్రైం విద్యార్థి గల్లంతైప లోయర్ జూరాల -
చాంపియన్లుగా శివాంశ్, శాన్వి
● ముగిసిన రాష్ట్రస్థాయి అండర్–13బ్యాడ్మింటన్ టోర్నీ మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న 11వ రాష్ట్రస్థాయి జూనియర్ (అండర్–13) బాల, బాలికల బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ ఉత్సాహంగా ముగిసింది. చివరి రోజు ఆదివారం బాల, బాలికల సింగిల్స్, డబుల్స్ విభాగాల ఫైనల్స్ మ్యాచ్లు హోరాహోరీగా సాగాయి. ● సింగిల్స్ చాంపియన్లు శివాంశ్, నిమ్మశాన్వి బ్యాడ్మింటన్ టోర్నీ సింగిల్స్ విభాగంలో చాంపియన్లుగా పబ్బు శివాంశ్ (మేడ్చల్ మల్కాజ్గిరి), కంజుల జస్ప్రిత్ (వరంగల్) నిలిచారు. ఫైనల్ మ్యాచ్లో శివాంశ్ పబ్బు 15–8, 15–4 సెట్ల తేడాతో కంజుల జస్ప్రిత్పై విజయం సాధించాడు. అదేవిధంగా బాలికల ఫైనల్ నిమ్మశాన్వి (సంగారెడ్డి) 15–8, 15–7 సెట్ల తేడాతో అనుముల శ్రీవైభవి (నిజామాబాద్)పై గెలుపొందింది. సింగిల్స్ బాలుర మూడో స్థానంలో అద్వైత్ సత్తు (వికారాబాద్), నాలుగో స్థానంలో రాంచరణ్ తేజ ఆకుల (మేడ్చల్ మల్కాజ్గిరి), బాలికల విభాగంలో మూడో స్థానంలో దియా ఆనంద్ (వికారాబాద్), నాలుగో స్థానంలో మనస్విని భూక్య (వరంగల్) నిలిచారు. హోరాహోరీగా డబుల్స్ మ్యాచ్లు డబుల్స్ విభాగం ఫైనల్ మ్యాచ్లు హోరాహోరీగా సాగాయి. బాలుర మ్యాచ్లో కార్తీకేయ మహర్షి (రంగారెడ్డి)– శివాంశ్ పబ్బు (మేడ్చల్ మల్కాజ్గిరి) 15–11, 15–9 తేడాతో రాంచరణ్తేజ ఆకుల–శౌర్య ప్రతాప్సింగ్ (మేడ్చల్ మల్కాజ్గిరి)పై విజయం సాధించారు. మూడో స్థానంలో అద్వైత్ సత్తు (వికారాబాద్)–సుహిత్ యాదవ్ (రంగారెడ్డి), నాలుగో స్థానంలో అభిషిక్త్ (కరీంనగర్)–కంజుల జస్ప్రిత్ (వరంగల్) నిలిచారు. బాలికల డబుల్స్ విభాగం ఫైనల్ మ్యాచ్లో ఆభాజాదవ్ (రంగారెడ్డి)–దియా ఆనంద్ (వికారాబాద్) 15–4, 15–8 సెట్ల తేడాతో దీక్ష సహస్ర బండ (వికారాబాద్)–నిమ్మశాన్వి (సంగారెడ్డి)పై గెలుపొందారు. మూడో స్థానంలో తిరిణిచిత భూషణ్ (వికారాబాద్)– అన్విరెడ్డి (సంగారెడ్డి) నిలిచారు. జాతీయస్థాయిలో ప్రతిభచాటాలి రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో విజేతలుగా నిలిచినవారు రానున్న జాతీయ స్థాయి టోర్నీలో ప్రతిభచాటాలని ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ అన్నారు. ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విన్నర్, రన్నరప్, మూడో స్థానం వారికి ట్రోఫీలు, మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ టోర్నీలో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. ఇదేస్ఫూర్తితో బ్యాడ్మింటన్లో పతకాలు సాధించి రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అమరేందర్రాజు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సురేందర్రెడ్డి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సంయుక్త కార్యదర్శి యూవీఎన్ బాబు, మహబూబ్నగర్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్యాంసుందర్గౌడ్, రవికుమార్, నెట్బాల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు విక్రం ఆదిత్యరెడ్డి, డాక్టర్ దీపక్, ప్రవీణ్కుమార్, నాగరాజుగౌడ్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. -
‘వంద కవులు–ఐదొందల మొగ్గలు’ పుస్తకావిష్కరణ
స్టేషన్ మహబూబ్నగర్: ప్రపంచా కవితా దినోత్సవాన్ని పురస్కరించుకొని వందమంది కవులు రాసిన ఐదొందలు మొగ్గలు పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్లోని బిర్లా ప్లాంటోరియల్లోని ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించారు. ప్రముఖ సాహితీవేత్త, ఆంధ్రప్రదేశ్ జానపద అకాడమీ, అధికారభాషా సంఘం మాజీ చైర్మన్ పొట్లూరి హరికృష్ణ సంపాదకత్వంలో రూపొందిన ‘వంద కవులు–ఐదొందల మొగ్గలు’ పుస్తకాన్ని పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షులు డాక్టర్ నందిని సిధారెడ్డి, పాలమూరు సాహితీ అధ్యక్షుడు, మొగ్గలు ప్రక్రియ రూపకర్త డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నారంశెట్టి ఉమామహేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కవులకు కాళోజీ పురస్కారాలు తెలంగాణ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని కాళోజీ జయంతి సందర్భంగా పాలమూరు జిల్లా కవులకు ఆర్ట్ ఫౌండేషన్ కాళోజీ పురస్కారాలను అందజేశారు. జిల్లాకు చెందిన కవులు కోట్ల వెంకటేశ్వరరెడ్డి, డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్కు ఆదివారం హైదరాబాద్లోని బిర్లా ప్లాంటోరియం ఆడిటోరియంలో మెమెంటో, శాలువాతో సత్కరించారు. -
మన్యంకొండవాసుడి కల్యాణ వైభోగమే..
మహబూబ్నగర్ మున్సిపాలిటి: మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతినెలా పౌర్ణమి రోజు స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని కనులపండువగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శోభాయమానంగా అలంకరించిన శేషవాహనంలో స్వామి దంపతులను గర్భగుడి నుంచి దేవస్థానం సమీపంలోని మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాల మధ్య ఊరేగింపు ముందుకు కదిలింది. అనంతరం స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని ప్రారంభించారు. ప్రత్యేక పూజల అనంతరం జీలకర్ర, బెల్లం ఉంచారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ఆశేష భక్తలు తిలకిస్తుండగా పురోహితుల మంత్రోచ్చరణలు, సన్నాయి వాయిద్యాల మధ్య అమ్మవారి మంగళసూత్రధారణ కార్యక్రమం కనులపండువగా నిర్వహించారు. అనంతరం తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వహించారు. కల్యాణం అనంతరం స్వామి దంపతులను మళ్లీ పల్లకీలో గర్భగుడి వద్దకు తీసుకెళ్లి పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రకరకాల పూలు, వివిధ ఆభరణాల అలంకరణలో స్వామి దంపతులు ధగధగ మెరిసిపోతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. ఈ దృశ్యాన్ని చూసి భక్తులు భక్తిపారవశ్యంతో పులకించిపోయారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి తదితరులు పాల్గొన్నారు. -
పేరుకే వన మహోత్సవం
● జంగిల్ కటింగ్ పేరిట హరిత హననం ● పర్యావరణ అసమతౌల్యంతో ఇబ్బందులు భూత్పూర్ రోడ్డులోని పాతపాలమూరు వద్ద గతేడాది నాటిన పెద్ద మొక్కలను ఇటీవల జంగిల్ కటింగ్ పేరుతో మొదలు వరకు నరికేశారు. పైన విద్యుత్ తీగలకు తగులుతాయనే ఉద్దేశంతో వీటిని ఇలా తొలగించారు. నాటినప్పుడు పైన విద్యుత్ తీగలు ఉన్నాయనే విషయం తెలిసినప్పటికీ అలాగే గుంతలు తీసి ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వాటి ఆనవాళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. భగరీథ కాలనీకి ఎదురుగా ఉన్న ఓ ఫంక్షన్ హాలు వద్ద పచ్చని మొక్కల మధ్య నరికివేసిన పెద్ద చెట్లు ఇలా కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా విద్యుత్ తీగలకు తగులుతాయని సగానికి సగం నరికేయడం గమనార్హం. మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాలోని మహబూబ్నగర్ నగరంతో పాటు జడ్చర్ల, భూత్పూర్ పట్టణాలలో పేరుకే వన మహోత్సవం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వర్షాకాలం సీజన్ సగం రోజులు దాటింది. ఒకవైపు మొక్కల పెంపకానికి స్థలాలు గుర్తించాలని ఉన్నతాధికారులు ఆదేశించినా కిందిస్థాయిలో చలనం లేదు. దీంతో ఈ కార్యక్రమం నామమాత్రంగానే సాగుతోంది. మరోవైపు విద్యుత్శాఖ ఆధ్వర్యంలో జంగిల్ కటింగ్ అంటూ చెట్లను ఎక్కడికక్కడ నరికివేస్తున్నారు. గతంలో రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు పెద్దవిగా మారిన తర్వాత వాటిని కొట్టేయడంతో పర్యావరణ అసమతౌల్యం ఏర్పడి ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొనడం గమనార్హం. ● మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లకు గాను 8 నర్సరీలు ఉన్నాయి. వీటిని కోయిల్కొండ ఎక్స్రోడ్డు, బండమీదిపల్లి లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, పాల్కొండ బైపాస్, భూత్పూర్ రోడ్డులోని సాయిబాబా ఆలయం ఎదుట, రూరల్ పీఎస్ ఎదురుగా బృందావన్కాలనీ, ఎదిర, మర్లు, తిరుమల హిల్స్లో ఒక్కొక్కటి ఏర్పాటు చేశారు. వీటిలో సుమారు నాలుగు లక్షల మొక్కలు పెంచుతున్నారు. మరో 5.31 లక్షల మొక్కలను అటవీ, డీఆర్డీఓ నుంచి సేకరిస్తున్నారు. ఇందులో పూలు, పండ్ల మొక్కలతో పాటు వివిధ రకాలవి ఉన్నాయి. ఇలా ఈసారి 9.31లక్షలు మొక్కలు నాటాలని ఉన్నతాధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. గత జూన్ 3న లాంఛనంగా వనమహోత్సవం ప్రారంభించి.. ఇప్పటివరకు కేవలం 50,900 వేల మొక్కలు మాత్రమే పలు చోట్ల నాటారు. ఇక ఇంటింటికీ ఆరు మొక్కల చొప్పున మొత్తం 1.20 లక్షల వరకు పంపిణీ చేయాల్సి ఉన్నా దాని ఊసేలేదు. 2025–26 బడ్జెట్లో వనమహోత్సవం కోసం రూ.ఐదు కోట్లకు పైగా కేటాయించారు. 7 చోట్ల స్థలాలను గుర్తించినా.. ఈసారి జిల్లా కేంద్రంలోని ఏనుగొండ నుంచి బైపాస్ (భూత్పూర్) ఎక్స్రోడ్డు వరకు, ఎదిర ఎక్స్ రోడ్డు నుంచి దివిటిపల్లి వరకు, కొత్త కలెక్టరేట్ నుంచి పోతుగుట్టతండా వరకు, బండమీదిపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నుంచి గొల్లబండతండా వరకు, మరో మార్గంలోని నర్సాయిపల్లి వరకు, హనుమాన్నగర్ నుంచి కొత్తచెరువు వరకు, ఎన్హెచ్–167 రోడ్డు నుంచి మౌలాలిగుట్ట డబుల్ బెడ్రూం ఇళ్ల వరకు మొక్కలు నాటాలని మున్సిపల్ అధికారులు నిర్ణయించారు. అయితే ఆయా ప్రాంతాల్లో గుంతలు తీసి నామమాత్రంగానే నాటారు. ● భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలో గోప్లాపూర్ వద్ద నర్సరీ ఉంది. ఇందులో పది వేల మొక్కలు పెంచుతున్నామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. మరో 23 వేల వరకు అటవీ శాఖ, డీఆర్డీఓకు ఇండెంట్ పెట్టారు. ఇలా ఈసారి 33 వేల మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఇప్పటివరకు కేవలం పది వేల మొక్కలే నాటారు. ● జడ్చర్ల పట్టణ పరిధిలోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్ సమీపంలో నర్సరీ ఉంది. ఇందులో సుమారు లక్ష మొక్కలు పెంచుతున్నారు. ఈసారి 2.03 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు కేవలం 50 వేల వరకు మాత్రమే నాటారు. వనమహోత్సవం కోసం ఈ బడ్జెట్లో రూ.ఐదు లక్షలు కేటాయించారు. జిల్లాకేంద్రంలోని టీచర్స్ కాలనీలోని ఓ వీధిలో ఏపుగా పెరిగిన చెట్లను ఇలా నరికివేశారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో పలు వీధుల వెంట పదుల సంఖ్యలో మొక్కలు నాటడంతో అవి పెరిగి పెద్దవయ్యాయి. చివరకు విద్యుత్ తీగలకు అడ్డం వస్తాయనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ నరికేశారు. దీంతో ఆయా చోట్ల పచ్చదనం కనుమరుగైంది. నగర పరిధిలో ఇప్పటివరకు 50 వేల పైచిలుకు మొక్కలను గుర్తించిన వివిధ ప్రాంతాలలో నాటాం. ప్రస్తుతం నర్సరీలలో పూలు, పండ్ల మొక్కలు చిన్నవిగా ఉన్నాయి. ఈ నెలాఖరు వరకు వాటిని మొత్తం 60 డివిజన్లలో ఇంటింటికీ పంపిణీ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ వర్షాకాలం సీజన్లోగా లక్ష్యాన్ని చేరుకుంటాం. – టి.ప్రవీణ్కుమార్రెడ్డి, కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్, మహబూబ్నగర్ -
వంద రోజుల్లో
రికార్డుస్థాయిలో జూరాలకు పోటెత్తిన వరద గద్వాల: ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తుండడంతో జూరాలకు భారీగా వరద వచ్చి చేరుతుంది. దీంతో ఉమ్మడి జిల్లాకు పెద్దదిక్కుగా ఉన్న కృష్ణానదిపై నిర్మించిన తొలి ప్రాజెక్టు జూరాలకు జలకళ సంతరించుకుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు నీటిని ఎత్తిపోస్తూ దానికిందున్న ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేస్తున్నారు. ఈసారి జూరాలకు ముందస్తుగానే మే నెలలో 29వ తేదీన వరద మొదలవగా సెప్టెంబర్ 6వ తేదీ వరకు 918 టీఎంసీల వరద వచ్చింది. ● గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వానాకాలంలో ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో కృష్ణాబేసిన్కు భారీగా వరదనీటితో నిండిపోయింది. కృష్ణాబేసిన్లో ఉన్న మహారాష్ట్రలోని ఉజ్జయిని, కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు భారీ వరదనీరు వచ్చి చేరుతుండడంతో నీటిని దిగువనున్న జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు విడుదల చేస్తున్నారు. మన రాష్ట్రంలో కృష్ణాబేసిన్లో తొలిప్రాజెక్టు ప్రియదర్శిని జూరాల పాజెక్టుకు మే 29వ తేదీన మొదటిసారిగా వరద మొదలైంది. అప్పటి నుంచి ఈ నెల 6వ తేదీ వరకు ప్రాజెక్టుకు గరిష్టంగా 4.18 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరగా, ప్రాజెక్టులోని 44 గేట్లు ఎత్తి దిగువనున్న శ్రీశైలానికి నీటిని విడుదల చేశారు. జూరాలకు వరద మొదలైనప్పటి నుంచి ప్రాజెక్టుకు మొత్తం 918 టీఎంసీల నీరు వచ్చింది. జూన్, జూలైలో మాసాల్లో వర్షాలు లేకపోవడంతో చాలా రోజులు జూరాలకు వరద పూర్తిగా తగ్గిపోయింది. తిరిగి జూలై చివరి వారంలో వరద ప్రారంభం కావడంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి, నీటిని విడుదల చేశారు. వానాకాలం సీజన్లో జూరాల ప్రాజెక్టుకు 894 వరద వచ్చి చేరగా ప్రాజెక్టుకు ఇరువైపులా ఉన్న ఎగువ, దిగువ జలవిద్యుత్ ప్రాజెక్టులకు 218 టీఎంసీల నీటిని వినియోగించి 586.515 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టారు. ఎగువ జలవిద్యుత్ కేంద్రంలో 6 యూనిట్ల ద్వారా విద్తుదుత్పత్తి కొనసాగుతుండగా సెప్టెంబర్ 4వ తేదీ వరకు 279.387 మి.యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు. ఇక దిగువ జలవిద్యుదుత్పత్తి కేంద్రంలో 6 యూనిట్ల ద్వారా 307.128 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. వానాకాలంలో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చిచేరుతుండడంతో ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. జూరాల నుంచి 17.2 టీఎంసీలు సాగునీటి ప్రాజెక్టులకు వినియోగించుకుని మిగతా 675 టీఎంసీల నీటిని నదిలోకి వదిలేశారు. ఇందులో నెట్టెంపాడు ప్రాజెక్టుకు (4.3 టీఎంసీలు), భీమా–1 (2.6 టీఎంసీలు), భీమా–2, (2.9 టీఎంసీలు) కోయిల్సాగర్కు (1.9 టీఎంసీలు), కల్వకుర్తి ఎత్తిపోతలకు (4 టీఎంసీలు), జూరాల కుడి, ఎడమ, సమాంతర కాల్వలకు (1.50 టీఎంసీలు) ఎత్తిపోయగా.. మిగిలిన 659టీఎంసీలను నదిలోకి వదిలేశారు. 918 టీఎంసీలు 675 టీఎంసీలు నదిలోకి.. ఎత్తిపోతల పథకాల కోసం 17.2 టీఎంసీలు విడుదల సెప్టెంబర్ మొదటి వారంలోనే విద్యుదుత్పత్తి లక్ష్యం పూర్తి -
యోగా పోటీల్లో 5 పతకాలు
మహబూబ్నగర్ క్రీడలు: నిర్మల్లో ఈనెల 5 నుంచి ఆదివారం ముగిసిన రాష్ట్రస్థాయి యోగాసన స్పోర్ట్స్ చాంపియన్షిప్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభచాటి పతకాలు సాధించినట్లు జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె.సురేష్, ప్రధాన కార్యదర్శి కె.సాయికుమార్, కోశాధికారి యూ.సురేష్ తెలిపారు. సబ్ జూనియర్, జూనియర్ క్రీడాకారులు బి.కవిత ఓ బంగారం, కాంస్య పతకాలు, కీర్తనారెడ్డి బంగారు, రజతం, సుప్రజ కాంస్య పతకం సాధించగా కె.సృజన నాలుగో స్థానం నిలిచినట్లు తెలిపారు. వీరికి కోచ్గా ఉన్న సాయికుమార్ను వారు అభినందించారు. -
ఉత్కంఠగా బ్యాడ్మింటన్ పోటీలు
● సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్లో సెమీస్ మ్యాచ్లు ● నేటితో ముగియనున్న టోర్నీ మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న 11వ రాష్ట్రస్థాయి జూనియర్ (అండర్–13) బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ ఉత్కంఠగా కొనసాగుతోంది. అకాడమీ క్రీడాకారుల మధ్య పోటీ రసవత్తరంగా సాగింది. క్వార్టర్, సెమీ ఫైనల్ మ్యాచ్లు హోరాహోరీగా సాగాయి. హోరాహోరీగా సెమీస్ శనివారం బాలుర, బాలికల విభాగం సింగిల్స్, డబుల్స్ సెమీ ఫైనల్ మ్యాచ్లు హోరాహోరీగా సాగాయి. బాలుర సింగిల్స్ మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్లో పబ్బు శివాన్ష్ (మేడ్చల్– మల్కాజ్గిరి) 15–11, 15–10 సెట్ల తేడాతో అద్వాత్ సత్తు (వికారాబాద్)పై, రెండో సెమీస్లో కంజుల జస్ప్రీత్ (వరంగల్) 15–9, 15–11 సెట్ల తేడాతో రామ్చరణ్ తేజ ఆకుల (మేడ్చల్ మల్కాజ్గిరి)పై, బాలికల సింగిల్స్ మొదటి సెమీ ఫైనల్లో నిమ్మ శాన్వి (సంగారెడ్డి) 15–10, 15–12 పాయింట్ల తేడాతో దియా ఆనంద్ (వికారాబాద్)పై, రెండో సెమీస్లో అనుముల శ్రీవైభవి(నిజామాబాద్) 15–11, 8–15, 15–11 పాయింట్ల తేడాతో మనస్విని భూక్య (వరంగల్)పై గెలుపొంది ఫైనల్కు చేరుకున్నారు. డబుల్స్లో సెమీఫైనల్ మ్యాచ్లు బాలుర డబుల్స్ విభాగం మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్లో కార్తికేయ మహర్షి (రంగారెడ్డి), శివాన్ష్ (మేడ్చల్, మల్కాజ్గిరి) 16–14, 15–12 సెట్ల తేడాతో అద్వైత్ సత్తు– సుహిత్యాదవ్ (వికారాబాద్)పై, రెండో సెమీస్లో రామ్చరణ్తేజ (మేడ్చల్, మల్కాజ్గిరి)– శౌర్యప్రతాప్సింగ్ (మేడ్చల్, మల్కాజ్గిరి) 15–12, 15–5 సెట్ల తేడాతో అభిషిక్త్ (కరీంనగర్)– కంజుల జస్ప్రీత్(వరంగల్)పై, బాలికల డబుల్స్ విభాగం మొదటి సెమీ ఫైనల్లో అభాజాదవ్ (రంగారెడ్డి)– దియా ఆనంద్ (వికారాబాద్) 17–15, 15–7 పాయింట్ల తేడాతో భూషణ్ త్రినితి (వికారాబాద్)– గాదె అన్విరెడ్డి (సూర్యాపేట)పై, రెండో సెమీఫైనల్ మ్యాచ్లో దీక్ష సహస్ర బండ (మహబూబ్నగర్)– నిమ్మ శాన్వి(సంగారెడ్డి) 8–15, 15–13, 12–15 తేడాతో ల్యోష కోరుకొండ (వికారాబాద్)– మనస్విని భూక్య (వరంగల్)పై గెలుపొంది ఫైనల్కు చేరుకున్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
● డివైడర్ను బైక్ ఢీకొట్టడంతో.. జడ్చర్ల: గణేశ్ నిమజ్జన ఉత్సవంలో పాల్గొని తిరిగి వెళ్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందగా మరొకరు గాయపడిన ఘటన పట్టణంలో శుక్రవారం రాత్రి చోటు చోసుకుంది. సీఐ కమలాకర్ కథనం మేరకు.. దేపల్లి త్రిశూల్నగర్కు చెందిన ప్రమోద్(24) మిత్రుడు ప్రభుకుమార్తో కలిసి బైక్పై నిమజ్జనంలో పాల్గొని సిగ్నల్గడ్డ వైపు నుంచి కొత్త బస్టాండ్ వైపు వెళ్తున్న క్రమంలో చర్చి సమీపంలోని మలుపు వద్ద అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టాడు. ప్రమాదంలో ప్రమోద్ తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న ప్రభుకుమార్ గాయపడ్డాడు. ఒక్కగానొక్క కుమారుడు ప్రమోద్ మృతితో తల్లిదండ్రులు సావిత్రి, యాదయ్య కన్నీరు మున్నీరయ్యారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. కేఎల్ఐ కాల్వలో పడి వృద్ధుడి మృతి నాగర్కర్నూల్ క్రైం: మతిస్థిమితం లేని వృద్దుడు కెఎల్ఐ కాల్వలో పడి మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ గోవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీపురం గ్రామానికి చెందిన గునగంటి బొజ్జయ్య (65)కు మతిస్థిమితం సరిగ్గా లేదు. గత నెల 28న కుటుంబసభ్యులు పొలం వద్దకు వెళ్లారు. ఆ సమయంలో బొజ్జయ్య ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆయన కోసం ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదు. శనివారం శ్రీపురం గ్రామంలోని కేఎల్ఐ కాల్వలో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రికి తరలించారు. అతని కుమారుడు ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కోతుల దాడిలో వృద్ధురాలికి గాయాలు తిమ్మాజిపట: వృద్ధురాలిపై కోతులు దాడి చేసిన ఘటన మండల పరిధిలోని చేగుంట గ్రామంలో శనివారం జరిగింది. గడ్డం బాలక్రిష్ణమ్మ అనే వృద్ధురాలు శనివారం ఇంట్లో వంట చేసుకుంటుండగా కోతుల గుంపు ఇంట్లోకి దూరి ఆమైపె దాడి చేసింది. మెడ, వీపు, కాళ్లు, చేతులపై కరువగా కేకలు వేయడంతో భర్త మైబు కర్ర తీసుకురావడంతో కోతులు పారిపోయాయి. బాలక్రిష్ణమ్మ వెంటనే బిజినపల్లి ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. కోతుల బెడద ఎక్కువ కావడంతో తీవ్ర అవస్థలు పడుతున్నామని అటవీశాఖ అధికారులు స్పందించి కోతుల నుంచి తమను రక్షణ కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఊరేగింపులో ఘర్షణ ధరూరు: గణేశ్ నిమజ్జన ఊరేగింపులో జరిగిన ఘర్షణలో యువకుడు గాయపడిన ఘటన మండల పరిధిలోని ద్యాగదొడ్డిలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. గ్రామానికి చెందిన యువకులు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో గణేశ్ నిమజ్జనం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో డీజే కోసం కిరాయికి తీసుకొచ్చిన బొలెరో డ్రైవర్ చంద్రశేఖర్ ముఖ్య కూడలి వద్ద వాహనం నిలిపి వాహనంలోనే నిద్రకు ఉపక్రమించాడు. నిద్రిస్తున్న డ్రైవర్ను డ్యాన్స్ చేయాలని యువకులు బలవంతం చేశారు. ఈ నేపథ్యంలో మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఘర్షణలో డ్రైవర్ చంద్రశేఖర్కు తలకు గాయాలయ్యాయి. మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు దాడి చేసినట్లు బాధితుడు తెలిపారు. శనివారం రేవులపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నాడు. -
జూరాలకు మళ్లీ పెరిగిన వరద
● 1,10,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో.. ● 8 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల ధరూరు/ఆత్మకూర్/దోమలపెంట: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద మళ్లీ పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. శుక్రవారం ప్రాజెక్టుకు 76,800 క్యూసెక్కుల వరద రాగా.. శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో 1,10,500 క్యూసెక్కులకు పెరిగినట్లు వివరించారు. దీంతో ప్రాజెక్ట్ 8 క్రస్ట్గేట్లు ఎత్తి 56,648 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నామని.. విద్యుదుద్పత్తి నిమిత్తం 40,978 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 69, ఎడమ కాల్వకు 920, కుడి కాల్వకు 700, భీమా లిఫ్ట్కు 750 క్యూసెక్కులు వినియోగించినట్లు చెప్పారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.969 టీఎంసీలు ఉన్నట్లు తెలిపారు. 606 మి.యూ. విద్యుదుత్పత్తి.. జూరాల దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి వేగవంతంగా కొనసాగుతోంది. శనివారం ఎగువ 6 యూనిట్ల నుంచి 234 మెగావాట్లు, 289.616 మి.యూ., దిగువ 6 యూనిట్ల నుంచి 240 మెగావాట్లు, 316.385 మి.యూ. విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఇప్పటి వరకు రెండు కేంద్రాల్లో 606.001 మి.యూ. విజయవంతంగా పూర్తి చేశామన్నారు. శ్రీశైలం జలాశయం ఒక గేటు ఎత్తి.. శ్రీశైలం ఆనకట్ట వద్ద శనివారం ఒక గేటు పైకెత్తి దిగువన ఉన్న నాగార్జునసాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల స్పిల్వే ద్వారా 56,648 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ 40,978 క్యూసెక్కులు, సుంకేసుల జలాశయం నుంచి 35,832 క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలం జలాశయానికి చేరింది. ఆనకట్ట ఒక గేట్ పది అడుగుల మేర పైకెత్తి 27,662 క్యూసెక్కులు నాగార్జునసాగర్కు విడుదల చేశారు. భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులు, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 30,665 క్యూసెక్కులు అదనంగా విడుదలవుతున్నాయి. ప్రస్తుతం జలాశయంలో 884.1 అడుగుల నీటిమట్టం.. 210.5133 టీఎంసీల నీటి నిల్వ ఉంది. భూగర్భ కేంద్రంలో 16.973 మి.యూ., కుడిగట్టు కేంద్రంలో 15.265 మి.యూ. విద్యుదుత్పత్తి చేశారు. -
యువకుల వీరంగం
రాళ్లు, కర్రలతో దాడి : ముగ్గురికి గాయాలు గద్వాల క్రైం: మద్యం మత్తులో యువకులు చేసిన వీరంగంతో ముగ్గురు తీవ్రంగా గాయపడిన ఘటన శనివారం తెల్లవారుజామున గద్వాలలోని అంబేడ్కర్నగర్ కాలనీలో చోటు చేసుకుంది. బాధితులు, స్థానికుల కథనం మేరకు.. జిల్లాకేంద్రంలోని చింతలపేటకాలనీకి చెందిన రఫీ, నవీన్, నర్సింహ మద్యం కొనుగోలుకు శుక్రవారం రాత్రి హట్కర్పేటకాలనీలో ఉన్న బెల్ట్ దుకాణానికి వెళ్లారు. అప్పటికే అంబేడ్కర్నగర్కాలనీకి చెందిన రంజిత్ సైతం మద్యం కొనుగోలుకు వేచి ఉన్నాడు. మద్యం మత్తులో ఉన్న యువకులు రంజిత్తో అకారణంగా ఘర్షణ పడగా తోటి స్నేహితులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకొని ముగ్గురు యువకులను మందలించగా గొడవ సద్దుమణిగింది. గొడవ జరిగిన విషయం తెలుసుకున్న ఆ కాలనీ మాజీ తాజా కౌన్సిలర్ మహేశ్ అర్ధరాత్రి 12 గంటల సమయంలో సదరు యువకులను అంబేడ్కర్నగర్ వినాయక మండపాం వద్ద గమనించి గొడవకు గల కారణాలు తెలుసుకొని వారిని ఇళ్లకు పంపించారు. శనివారం తెల్లవారుజామున అంబేడ్కర్కాలనీ ఎంబీ మిస్పా చర్చి సమీపంలో తాజా మాజీ కౌన్సిలర్ మహేశ్ను చూసిన రఫీ, నవీన్, నర్సింహ మరికొందరితో కలిసి రాళ్లు, కర్రలతో దాడి చేయగా కేకలు వేయడంతో దగ్గరలో ఉన్న మహేశ్ తండ్రి శ్రీనివాసులు, వినయ్ గమనించి అక్కడకు చేరుకొని నిలువారించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఈ దాడిలో మహేష్, శ్రీనివాసులు, వినయ్కు తీవ్ర గాయాలయ్యాయి. కాలనీవాసులు యువకులను పట్టుకునే ప్రయత్నం చేయగా తప్పించుకుని పరారయ్యారు. బాధితులను వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మహేశ్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి, మాజీ తాజా మున్సిపల్ చైర్పర్సన్ కేశవ్, నాయకులు బాధితులను పరామర్శించారు. బాధితుడు శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పట్టణ ఎస్ఐ కళ్యాణ్కుమార్ తెలిపారు. -
శ్రీశైలం రహదారిలో ట్రాఫిక్ జామ్
దోమలపెంట: శ్రీశైలం రహదారిపై శనివారం వాహనాల రద్దీ పెరిగింది. దోమలపెంట నుంచి శ్రీశైలం వరకు వందల సంఖ్యలో వాహనాలు బారులు తీరడంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. మరోవైపు ఈగలపెంట సమీపంలో ఓ బస్సు ముందు టైర్లు పంక్చర్ కావడంతో రోడ్డుపైనే నిలిచింది. దీంతో వాహనాల రాకపోకలన్నీ స్తంభించిపోయాయి. ఈగలపెంట ఎస్ఐ అక్కడికి చేరుకొని ట్రాఫిక్ను నియంత్రించారు. 10 నిమిషాలు పైకి వచ్చే వాహనాలకు, మరో 10 నిమిషాలు దిగువకు వెళ్లే వాహనాలకు అనుమతులిచ్చారు. కానీ ముందుగానే బస్సు వెనుక భాగం నుంచి దోమలపెంట వరకు వాహనాలు నిలిచి ఉండటం.. మరోవైపు శ్రీశైలం దేవస్థానం నుంచి హైదరాబాద్కు వెళ్లే వాహనాలు బారులు తీరారు. ట్రాఫిక్ క్లియర్ కావడానికి సుమారు 4గంటల సమయం పట్టింది. తప్పిన ప్రమాదం.. హైదరాబాద్ నుంచి శ్రీశైల క్షేత్రం వెళ్తున్న పికెట్ డిపోకు చెందిన ఆర్టీసి బస్సుకు ప్రమాదం తప్పింది. ఈగలపెంట వద్ద ప్రయాణిస్తున్న బస్సు ముందు టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. బస్సు డ్రైవర్ యాదగిరి చాకచక్యంగా వ్యవహరించి బస్సును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. మరో 100మీటర్ల దూరంలో ఘాట్రోడ్డు ఉండటం.. ఆ ప్రాంతంలో బస్సు టైర్లు పేలి ఉంటే పెను ప్రమాదం జరిగేది. బస్సులోని ప్రయాణికుల మరో బస్సులో శ్రీశైలం బయల్దేరి వెళ్లారు. -
డిండి కెనాల్లో బాలయ్య తల లభ్యం
కల్వకుర్తి టౌన్: కొడుకు చేతిలో హత్యకు గురైన బాలయ్య తల హత్య చేసిన మూడు రోజులకు లభ్యమైంది. శుక్రవారం రాత్రి సమయంలో అతని మృతదేహం లభ్యం కాగా, శరీరానికి తల లేకపోవటంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఉప్పునుంతల మండలం కొరటికల్ వద్ద వాగులో లభ్యమైన మృతదేహాన్ని శుక్రవారం అర్థరాత్రి పట్టణంలోని సీహెచ్సీకి తరలించి, అక్కడే మార్చూరీలో ఉంచారు. తల కోసం గాలిస్తున్న పోలీసులకు వంగూర్ మండలం డిండి చింతపల్లి వద్ద గజ ఈతగాళ్లతో వెతుకుతుండగా, అక్కడే ఉన్న ఓ సబ్కెనాల్లో తల లభ్యమైనట్లుగా పోలీసులు తెలిపారు. తలను గుర్తించి దానిని సీహెచ్సీ మార్చూరీకి తరలించి, వైద్యుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హత్యకు సంబంధించి ఆదివారం పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించనున్నట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే పరామర్శ బాలయ్య కుటుంబాన్ని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పట్టణంలోని సీహెచ్సీలో పరామర్శించారు. అనంతరం వైద్యులతో మాట్లాడి తదుపరి చర్యలపై ఆరా తీశారు. -
మార్కెట్లోకి రెనాల్ట్ కిగర్ టర్పో
పాలమూరు: రెనాల్ట్ కంపెనీ నుంచి మరో న్యూ మోడల్ కారు మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. జిల్లా కేంద్రంలోని యుక్తా మోటార్స్లో శనివారం రెనాల్ట్ కిగర్ టర్పో కారును కరూర్ వైశ్యా బ్యాంక్ మేనేజర్ మాధురి, ట్రెండ్ గ్రూప్ ఎండీ గట్టు శ్రీహర్షిత్రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ.. నూతన టర్పోలో ఎనర్జీ ఇంజిన్ కలిగి.. సరికొత్త భద్రతా ప్రమాణాలతో ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయని తెలిపారు. క్రూజ్ కంట్రోల్ సిస్టంతో గ్రామీణ రోడ్లపై అనుకూలంగా వెళ్తుందన్నారు. గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి.. మల్టీవ్యూ కెమెరా, ఆటో హెడ్ల్యాంప్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఉన్నాయని తెలిపారు. 40.64 సెంటీమీటర్ల డైమండ్ కట్ అలాయ్ వీల్స్తో ఆరు రంగుల్లో పెట్రోల్ వెర్షన్తో అందుబాటులో ఉందన్నారు. లీటర్ 20.38 కి.మీ. మైలేజ్ ఇస్తోందని తెలిపారు. ఎక్స్షోరూం ధర రూ. 6.29లక్షలు ఉందన్నారు. కార్యక్రమంలో సేల్స్ మేనేజర్ రమేశ్, సర్వీస్ మేనేజర్ సందీప్ పాల్గొన్నారు. -
గణేశుడి లడ్డును దక్కించుకున్న ముస్లిం
మక్తల్: మండలంలోని ముస్టిపల్లి గ్రామంలో గణేశ్ ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి లడ్డు వేలం నిర్వహించగా ముస్లిం వ్యక్తి దక్కించుకున్నాడు. వేలంలో దాదాపు 10 మంది పాల్గొనగా గ్రామానికి చెందిన ఎండీ పాషా రూ.26,116కు లడ్డును దక్కించుకొని మతసామరస్యానికి ప్రతీకగా నిలిచాడు. ఉత్సవాల్లో ముస్లిం వ్యక్తి భాగం కావడం పట్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం గ్రామంలో ప్రతిష్ఠించిన గణేశుడి దగ్గర అతడు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం విశేషం. దీంతో ఎండీ పాషాను గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు అభినందించారు. -
యథేచ్ఛగా వసూళ్ల దందా?
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మారని తీరు ● ప్రతి పనికి ఓ రేటు ● దస్తావేజు లేఖరుల కనుసన్నల్లోనే.. ● ఏసీబీ దాడులు జరుగుతున్నా.. మారని వైనం డాక్యుమెంట్ రైటర్లే దళారులుగా మారి..? ఉమ్మడి జిల్లాలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఆయా కార్యాలయాల వద్ద డాక్యుమెంట్ రైటర్లు పెద్దఎత్తున దుకాణాలు తెరిచారు. వీరిలో చాలామంది అధికారులు, క్రయ విక్రయదారులకు దళారులుగా మారి అక్రమ వసూళ్లకు తెర లేపారు. పబ్లిక్ డాటా ఎంట్రీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానం అమలులో ఉన్నప్పటికీ పాత పద్ధతిలోనే డాక్యుమెంట్ రైటర్ల ద్వారానే రిజిస్ట్రేషన్లు సాగుతున్నాయంటేనే క్రయ విక్రయదారులు ఎంత దోపిడీకి గురవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. కొందరు సబ్ రిజిస్ట్రార్లు కొందరు డాక్యుమెంట్ రైటర్లకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ వారి ద్వారానే లావాదేవీలు కొనసాగిస్తున్నట్లు బాహాటంగా మాట్లాడుకుంటున్నారు. మెట్టుగడ్డ: ఉమ్మడి జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం అన్ని పత్రాలున్నా.. పైసలివ్వనిదే పని కావడం లేదు. డాక్యుమెంట్ ఛార్జీలతో పాటు కార్యాలయంలో ఇవ్వాలంటూ దస్తావేజు లేఖరులు అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు. సాధారణంగా గ్రామకంఠం భూములకు సర్వేనంబర్లు ఉండవు. అసెస్మెంట్ నంబరు, గ్రామపంచాయతీలో చెల్లించిన పన్ను రసీదు చూపితే రిజిస్ట్రేషన్ చేయాలి. తండ్రి నుంచి కుమారుడికి, భర్త నుంచి భార్యకు గిఫ్ట్ డీడ్ డాక్యుమెంట్లు వచ్చినప్పుడు ఇష్టారీతిన డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నాలా అయితే ఒక రేటు, అపార్ట్మెంట్, ఇళ్లు అయితే మరోరేటు.. ఇలా ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి దండుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఏసీబీ దాడులు జరుగుతున్నా.. జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతికి అడ్డు లేకుండా పోయింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్యాలయాలపై ఓ పక్క ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నా అధికారులు మాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తుండటం విశేషం. ఫిర్యాదులతో జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు దాడులు ప్రారంభించగా.. దళారులను పెట్టుకొని దోపిడీ కొనసాగిస్తున్నారు. తాజాగా జిల్లాలోని ఓ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దళారుల వద్ద దొరికిన అదనపు సొమ్ములే ఇందుకు నిదర్శనం. అవసరాలను ఆసరా చేసుకొని క్రయ విక్రయదారుల జేబులను గుల్ల చేస్తున్నారు. గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ విధానం అమలు చేయడంతో అనధికార ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు బ్రేక్ పడినట్లయింది. కానీ దీన్ని ఆసరా చేసుకొని కొందరు సబ్–రిజిస్ట్రార్లు ఇష్టారాజ్యంగా జీపీ లే అవుట్ల(అనధికార ప్లాట్లు)లో రిజిస్ట్రేషన్లు చేసినట్లు తెలియడంతో మరోసారి ఏసీబీ అధికారులు కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఎలాంటి ఫిర్యాదులు లేవు.. ప్రజల నుంచి ప్రభుత్వ ఫీజు కంటే అదనంగా డబ్బులు వసూలు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు అలాంటి ఫిర్యాదులు అందలేదు. ఫిర్యాదుల స్వీకరణకు పెట్టె ఏర్పాటు చేశాం.. దానిలో వేయాలని సూచిస్తున్నాం. కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవు. డాక్యుమెంట్ రైటర్లు డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. క్రయ విక్రయదారులు కార్యాలయాల్లో కానీ, ఎవరైనా డబ్బు అడిగితే నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు. జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తాం. – డి.ఫణీందర్, జిల్లా రిజిస్ట్రార్ (స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ) కాసులు కురిపిస్తున్న ఈసీ, సీసీ.. ఆస్తుల లావాదేవీల్లో ఈసీ (ఎన్కంబెన్స్ సర్టిఫికేట్) కీలకం. ఈ ధ్రువపత్రం కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఈసీ కావాలంటే ప్రభుత్వ ఫీజు కంటే అదనపు రుసుం చెల్లించాల్సిందే. మాన్యువల్ ఈసీ కావాలంటే అడిగినంతా ఇచ్చుకోవాల్సిందే. డాక్యుమెంట్ల సీసీ (సర్టిఫైడ్ కాపీ) కావాలంటే ప్రభుత్వ ఫీజు కంటే రూ.300 అదనపు డబ్బు చెల్లించాల్సిందే. వివాహ రిజిస్ట్రేషన్లకు సైతం ప్రభుత్వ ఫీజు కంటే అదనంగా రూ.600 అదనంగా వసూలు చేస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. ప్రతి పనికి ప్రభుత్వానికి చెల్లించిన రుసుంతో పాటు అదనపు దోపిడీ పక్కాగా జరుగుతోంది. -
నూతన విద్యా విధానాన్ని విరమించుకోవాలి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలనే ఆలోచనలను విరమించుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర కిరణ్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం సెకండరీ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఇంటర్మీడియట్ బోర్డును విలీనంచేసే మార్గదర్శకాల రూపకల్పనకు కసరత్తు చేస్తోందన్నారు. సంస్కరణల పేరుతో 42,000 ప్రభుత్వ పాఠశాలలను 6వేలకు కుదించే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం నూతన విద్యావిధానం అమలు చేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలన్నారు. సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్, కార్యదర్శి భరత్, శ్రీనాథ్, రమేశ్, రాజేశ్ ఉన్నారు. వాహనాల అద్దె చెల్లించండి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ప్రభుత్వ కార్యాలయాలకు అద్దెకు ఇచ్చిన వాహనాల బిల్లులను వెంటనే చెల్లించాలని తెలంగాణ ఫోర్ వీలర్స్, డ్రైవర్స్ హైర్ వెహికిల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం డీఎంహెచ్ఓ కృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వైద్యారోగ్యశాఖలో ఏడు వాహనాలు నడుస్తున్నాయని.. వాటికి సంవత్సరం నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. తమకు బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ శాఖలోనే కాకుండా వివిధ శాఖల్లో నడుస్తున్న వాహనాలకు బిల్లులు రెండేళ్లుగా పెండింగ్లో ఉన్నాయని.. వాహనాల బిల్లులు రాకుంటే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షుడు రమేశ్నాయక్, షకీల్, శేఖర్, శ్రీశైలం, తిరుపతి, సూర్య పాల్గొన్నారు. నేడు ఆలయాల మూసివేత చిన్నచింతకుంట/మహబూబ్నగర్ రూరల్: సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం నుంచి జిల్లాలోని ప్రధాన పుణ్యక్షేత్ర ఆలయాలను మూసివేయనున్నారు. అమ్మాపురంలోని శ్రీకురుమూర్తిస్వామి, మన్యంకొండ ఆలయాలను ఆదివారం మధ్యాహ్నం నుంచి మూసివేయనున్నారు. ఆలయ శుద్ధి తర్వాత భక్తులకు సోమవారం ఉదయం 9 గంటల నుంచి మన్యంకొండ, సాయంత్రం 5 గంటల నుంచి కురుమూర్తిస్వామి వారి దర్శనం కల్పిస్తారు. -
కేసీఆర్కు పదిసార్లు చెప్పినా పట్టించుకోలేదు: జూపల్లి
పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. కేసీఆర్ చేసిన అప్పులకు ఇప్పుడు సంవత్సవానికి రూ.75 వేల కోట్ల అప్పు కడుతున్నామని తెలిపారు. ఆనాటి ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు నా నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇళ్లకు ఏడుసార్లు టెండర్లు వేస్తే ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందుకు రాలేదని చెప్పారు. ఒక్క ఇంటికి మరో రూ.లక్ష పెంచమని కేసీఆర్ను పదిసార్లు చెప్పినా పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడంతో పాటు కుటుంబ పాలనతో ప్రజాస్వామ్యాన్ని పాతరేశారని చెప్పారు. అప్పుల్లో ఉన్నా హామీలు నెరవేరుస్తున్నాం: వాకిటి నల్లమల ముద్దుబిడ్డ రేవంత్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే మన పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసుకుని బాగు పడదామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రాష్ట్రం అప్పుల పాలైనా సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని చెప్పారు. రైతులకు రుణమాఫీ, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. కోటి మంది మహిళలకు కోటీశ్వరులను చేస్తామనే సంకల్పంతో సీఎం ఉన్నారని పేర్కొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్లతో పేదోళ్ల ఆత్మగౌరవం నిలబెడతాం
అడ్డాకుల: ‘పేదోడి ఆత్మగౌరవం, భరోసా, భద్రత, గుండె నిండా ధైర్యం కావాలంటే ప్రతి ఒక్కరికి చిన్న ఇళ్లు ఉండాలనేది చిరకాల కోరిక. ఆనాటి ప్రభుత్వం పదేళ్లలో 94 వేల ఇళ్లకు టెండర్లు పిలిచి 76 వేల ఇళ్లను మాత్రమే పూర్తి చేసింది. మిగతావన్ని మొండి గోడలతో ఉంటే వాటిని పూర్తి చేసి బేషజాలకు పోకుండా వాటిని లబ్ధిదారులకు ఇస్తున్నాం. పేదోడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ఇందిరమ్మ ఇళ్లను ఇస్తున్నాం.’ అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా మూసాపేటలో శనివారం ప్రమీల, పర్వతాలు దంపతుల ఇందిరమ్మ ఇళ్లును రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డితో కలిసి ప్రారంభించారు. లబ్ధిదారు ప్రమీలతో కలిసి గృహప్రవేశం చేయించారు. అనంతరం వారి కుటుంబసభ్యులకు కొత్తబట్టలిచ్చి.. పాయసం తినిపించారు. ఆ తర్వాత జరిగిన సభలో ఆయన మాటల్లోనే.. ‘రాష్ట్రంలో మొదటి విడత కింద ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం. ఒక్కసారి ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చి ఇక అయిపోయిందనే కార్యక్రమం ఇది కాదు. ఇంకా మూడు విడతల్లో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. ఈ మూడు విడతల్లో అర్హులైన పేద వాళ్లను ఏ పార్టీ అని అడగం. మీది ఏ కులమని అడగం. ఇళ్లిచ్చిన తర్వాత మాకు ఓటేస్తావా అని కూడా అడగం. వాళ్ల గుండెల్లో మేమిచ్చింది మంచి అని అనుకుంటే మాకు ఓటేస్తారు. ఓటు కోసం ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే ప్రసక్తే లేదు. ఏప్రిల్ నెలలో మరో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తాం. ప్రతి సోమవారం నిర్మాణ దశల ప్రకారం బిల్లులను చెల్లిస్తున్నాం. ఆనాడు కమీషన్లు రావని డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టలేదు. ఆనాడు హౌసింగ్ డిపార్టుమెంట్ను ముక్క చెక్కలు చేసి కకావికలం చేశారు. ఒక్కొక్క ఇటుక పేరుస్తూ హౌసింగ్ డిపార్టుమెంట్ను మరింత బలోపేతం చేస్తాం. ఆనాటి పెద్దలకు కళ్లు కుట్టే విధంగా చిన్న అవినీతికి తావు లేకుండా చేస్తాం. ధరణిని బంగాళాఖాతంలో వేసి భూభారతిని తెచ్చాం. ఇప్పటికే జీపీఓలను ఇచ్చాం. దసరా నాటికి లైసెన్సుడు సర్వేయర్లను తెస్తాం. మీ కష్టార్జితంతో సంపాదించిన భూములకు భూభారతి ద్వారా భద్రత కల్పించే విధంగా రాబోయే రోజుల్లో భూభారతిని తీర్చిదిద్దుతాం’ అని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. నియోజకవర్గానికి ఒక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, మండల కాంప్లెక్స్లను త్వరలో మంజూరు చేసి వాటి శంకుస్థాపన కార్యక్రమానికి వస్తానని మంత్రి ప్రకటించారు. కార్యక్రమంలో కలెక్టర్ విజయేందిర, అడిషనల్ కలెక్టర్లు శివేంద్రప్రతాప్, నర్సింహారెడ్డి, హౌసింగ్ పీడీ భాస్కర్, డీఆర్డీఓ నర్సిములు, ఆర్డీఓ నవీన్, తహసీల్దార్లు కిషన్నాయక్, రాజునాయక్, శేఖర్, పార్టీ మండలాధ్యక్షుడు శెట్టిశేఖర్, అరవింద్రెడ్డి, నాగిరెడ్డి, బగ్గి కృష్ణయ్య, రామన్గౌడ్, బోయిని చంద్రశేఖర్ పాల్గొన్నారు. మరో మూడు విడతల్లో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం హౌసింగ్ వ్యవస్థను బలోపేతం చేస్తాం రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు: మంత్రి జూపల్లి రేవంత్రెడ్డితోనే జిల్లా సస్యశ్యామలం:మంత్రి వాకిటి శ్రీహరి -
యూరియా కోసం రోడ్డెక్కారు
గండేడ్: యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. గండేడ్ మండల కేంద్రంలో రాస్తారోకోకు దిగగా.. పోలీసులు జోక్యం చేసుకొని అధికారులతో మాట్లాడి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. మండలంలోని ఆయా గ్రామాల రైతులు శనివారం యూరియా కోసం మండల కేంద్రానికి చేరుకున్నారు. తమకు యూరియా కావాలని పలు దుకాణాల్లో ఆరాతీశారు. యూరియా రాలేదని.. వచ్చినప్పుడు ఇస్తామని ఎరువుల దుకాణాల యజమానులు సమాధానమిచ్చారు. గంటల తరబడి వేచిచూసిన రైతులు సహనం నశించి ఆందోళనకు దిగారు. భూత్పూర్–చించోళి జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రైతులను సముదాయించే ప్రయత్నం చేయగా.. తాము రోజుల తరబడి తిరగుతున్నా.. బస్తా యూరియా కూడా దొరకడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా వచ్చే వరకు పక్కకు తప్పుకొనే ప్రసక్తేలేదని మొండికేశారు. పీఏసీఎస్ చైర్మన్ లక్ష్మీనారాయణ అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడినా.. ససేమిరా అన్నారు. తాము ఎన్నిరోజులు తిరగాలని ప్రశ్నించారు. ఎప్పుడు వచ్చినా యూరియా రాలేదని చెబుతున్నారు. యూరియా వచ్చినప్పుడు కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని.. తెలుసుకుని వచ్చేలోపే యూరియా అయిపోతుందని చెబుతున్నారని వాపోయారు. దాదాపు అరగంటకుపైగా కావడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. రైతులు ఆందోళన విరమించకపోవడంతో మహమ్మదాబాద్ ఎస్ఐ శేఖర్రెడ్డి అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. అనంతరం యూరియా సరఫరా లేక రైతుల ఇక్కట్లపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఆది, సోమవారాల్లో యూరియా వచ్చే అవకాశం ఉందని, రాగానే ప్రతిరైతుకు రెండు బస్తాల చొప్పున ఇస్తామని వ్యవసాయ అధికారులు చెప్పారని ఎస్ఐ చెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు. చించోళి జాతీయ రహదారిపై రైతుల రాస్తారోకో అర గంట పాటు నిలిచిన వాహనాల రాకపోకలు పోలీసుల జోక్యంతో ఆందోళన విరమణ -
రేపు ఆలయాల మూసివేత
అలంపూర్: చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాలోని ఆలయాలను ఆదివారం మూసివేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామివార్ల ఆలయ తలుపులు మూసివేస్తామని ఆలయ ఈఓ దీప్తి, కమిటీ చైర్మన్ నాగేశ్వర్రెడ్డి తెలిపారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని, భక్తుల దర్శనాలు సైతం కొనసాగుతాయని, పౌర్ణమిని పురస్కరించుకొని జోగుళాంబ ఆలయంలో చండీహోమాలు నిర్వహిస్తామన్నారు. మధ్యాహ్నం నుంచి ఉభయ ఆలయాల తలుపులు మూసివేసి.. సోమవారం ఉదయం ఆలయాల సంప్రోక్షణ తర్వాత 8.30 గంటలకు మహా మంగళ హారతితో ఉభయ ఆలయాల తలుపులు తెరిచి భక్తుల దర్శనాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. మన్యంకొండ ఆలయం.. మహబూబ్నగర్ మున్సిపాలిటీ: చంద్రగ్రహణం కారణంగా మన్యంకొండలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సోమవారం ఉదయం 8.30 గంటల వరకు మూసి (ద్వార బంధనం) వేయనున్నట్లు దేవస్థానం చైర్మన్ అలహరి మధుసూదన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వామివారికి సంప్రోక్షణ, అభిషేకం తర్వాత సోమవారం ఉదయం 9 గంటల నుంచి భక్తులు తిరిగి దర్శనం చేసుకోవచ్చన్నారు. -
నిమజ్జనం చేసి వస్తుండగా..అపశ్రుతి
● జాతీయ రహదారిపై ట్రాక్టర్ను వేగంగా ఢీకొన్న డీసీఎం ● అర్ధరాత్రి పెబ్బేర్ మండలం రంగాపురం వద్ద ప్రమాద ఘటన ● ఒకే గ్రామానికి చెందిన ఇద్దరి దుర్మరణం, మరొకరి పరిస్థితి విషమం ● వనపర్తి మండలం నాచహళ్లిలో మిన్నంటిన కుటుంబ సభ్యుల రోధనలు గ్రామంలో విషాదఛాయలు వినాయకుడి నిమజ్ఙనంలో అపశృతి చోటు చేసుకొని గ్రామంలో ఇద్దరు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బోయ శ్రీనివాసులు, భార్య మొగులమ్మకు సాయితేజ ఒక్కరే సంతానం కావడంతో ఉన్న ఒక్కగానొక్క కొడుకు మృతిచెందడంతో వారి రోధనలు మిన్నంటాయి. సాయితేజకు వివాహమై భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. గోవిందుకు ముగ్గురు కుమారులుండగా.. రెండో కుమారుడైన శంకర్ మృతితో కుటుంబం, బంధువుల రోధనలు పలువురిని కంటతడి పెట్టించాయి. శంకర్కు వివాహం కాలేదు. వనపర్తి రూరల్: కృష్ణానదిలో వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేసి ట్రాక్టర్పై వస్తుండగా.. వెనుక నుంచి వేగంగా వస్తున్న డీసీఎం ఢీకొట్టడంతో అక్కడిక్కడే ఇద్దరు దుర్మరణం చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా కాగా.. నలుగురికి గాయాలైన ఘటన పెబ్బేరు మండలం రంగాపురం జాతీయ రహదారిపై శక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పెబ్బేరు ఎస్ఐ యుగేంధర్రెడ్డి కథనం ప్రకారం.. వనపర్తి మండలం నాచహళ్లికి చెందిన సాయితేజ(25), శంకర్(26) అదే గ్రామానికి చెందిన ఎనిమిది మందితో కలిసి గ్రామంలోని కాలనీలో ప్రతిష్ఠించిన వినాయకుడి విగ్రహాన్ని బీచుపల్లి వద్ద కృష్ణానదిలో నిమజ్ఙనం చేయడానికి ట్రాక్టర్లో బయలుదేరారు. నదిలో వినాయకుడిని నిమజ్జనం చేసి తిరిగి వస్తుండగా రంగాపురం శివారులోని జాతీయ రహదారిపై వస్తుండగా అనంతపూర్ జిల్లా నుంచి టమోటా లోడుతో హైదరాబాద్ వెళ్తున్న డీసీఎం వెనుక నుంచి అతివేగంగా ఢీకొట్టింది. డ్రైవర్ నరేశ్, సాయితేజ, శంకర్, విష్ణు, అబ్దుల్లా ముందుభాగంలో కూర్చోగా.. మిగతా వారు ట్రాలీలో కూర్చున్నారు. ముందుభాగంలో కూర్చున్న సాయికృష్ణ, శంకర్, డీసీఎం కింద పడడంతో అక్కడిక్కడే మృతిచెందారు. విష్ణు, అబ్దుల్లా రోడ్డుపై పక్కకు పడడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఇంజన్తోపాటు ట్రాలీ 300 మీటర్లు దూరం దూసుకెళ్లి డివైడర్ను ఢీకొట్టి ఆగిపోయింది. ట్రాలీలో ఉన్నవారికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని అంబులెన్సులో వనపర్తి ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన విష్ణు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు సూచించడంతో కుటుంబ సభ్యులు హైదారాబాదులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అబ్దుల్లా తలకు తీవ్ర గాయం కాగా.. మిగతా వారికి స్వల్ప గాయాలతో వనపర్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రి ఆవరణలో మృతుల బంధువులు, గ్రామస్తులు చేరుకోవడంతో పరిసరాలు అర్థనాదాలతో నిండిపోవడంతో పలువురిని కలిచి వేశాయి. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు డీసీఎం డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుల కుటుంబాలకు పరామర్శ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డితోపాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ, రాష్ట్ర నాయకులు అయ్యంగారి ప్రభాకర్రెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి ఆస్పత్రికి చేరుకొని మృతులకు నివాళులర్పించి బాధిత కుంటుబాలను పరామర్శించారు. -
అట్టహాసంగా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్
● 11వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ పోటీలు ● టోర్నీని ప్రారంభించిన ఎమ్మెల్యే ● ఉత్కంఠంగా మెయిన్ డ్రా మ్యాచ్లు మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో 11వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాల, బాలికల (అండర్–13) బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో మెయిన్ డ్రా మ్యాచ్లు ఉత్కంఠ భరితంగా జరిగాయి. తొలిరోజు ఫలితాలు బాలుర సింగిల్స్లో పబ్బు శివంశ్ (మేడ్చల్) 15–8, 15–8 సెట్ల తేడాతో ఈకాంశ్ (వరంగల్)పై, రిషిశ్రీరాం (మేడ్చల్) 15–6, 15–3 తేడాతో ఆరుష్ నడింపల్లిపై, అద్వైత్ సత్తు (వికారాబాద్) 15–6, 15–7 తేడాతో అభినిత్ అసోల్లపై, కార్తీకేయ (రంగారెడ్డి) 15–9, 15–8 తేడాతో జార్జి నిశ్చయ్పై, బాలికల సింగిల్స్లో అభజాదవ్ (రంగారెడ్డి) 15–8, 15–9 తేడాతో వేదితరెడ్డి (వరంగల్)పై, దియా ఆనంద్(వికారాబాద్) 10–15, 15–6, 15–12 తేడాతో జోవిత దేబ్నాత్పై, అన్విరెడ్డి (సూర్యాపేట)15–1, 15–1 తేడాతో ప్రకృతి (భద్రాద్రి)పై గెలుపొందింది. పలువురు క్రీడాకారులు సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు. ఎమ్మెల్యే అసహనం రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఫ్లెక్సీలో ఫొటోల ప్రొటోకాల్ విషయంలో నిర్వాహకులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. టోర్నీ వేదికపై ఉన్న ఫ్లెక్సీలో రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి ఫోటో ఎందుకు పెట్టలేదని, అదే విధంగా ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడి ఫోటోలు పెట్టకపోవడంపై అసహసనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వసతుల్లో టోర్నమెంట్లు నిర్వహిస్తే ఖచ్చితంగా ప్రొటోకాల్ పాటించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. బ్యాడ్మింటన్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 7 వ తేదీ వరకు నిర్వహించనున్న చాంపియన్షిప్లో రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది క్రీడాకారులు పాల్గొనున్నట్లు తెలిపారు. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ క్రీడాకారులకు అన్ని రకాల వసతులు కల్పించి టోర్నీని విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. క్రీడాకారులకు ప్రత్యేక కోచింగ్ ఇచ్చి వారి నైపుణ్యాన్ని వెలికితీయడానికి నూతన క్రీడా పాలసీ తీసుకొచ్చినట్లు తెలిపారు. మహబూబ్నగర్ స్టేడియంలో క్రీడాభివృద్ధి కోసం ఇటీవల రూ.16.50 కోట్లు కేటాయించామన్నారు. త్వరలో క్రీడాశాఖ మంత్రితో క్రీడాభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఇండోర్ స్టేడియంలో ఏసీ, స్పోర్ట్స్ హాస్టల్ నిర్మాణంతోపాటు మూడు, నాలుగు క్రీడలను ఎంపిక చేసుకొని క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి జాతీయస్థాయిలో చాంపియన్లుగా తీర్చిదిద్దడానికి కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు ఎమ్మెల్యే సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్, కురుమూర్తిగౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్కుమార్గౌడ్, డీసీసీ కార్యదర్శి సిరాజ్ఖాద్రీ, టోర్నీ పరిశీలకుడు సుధాకర్, రెఫరీ కిషోర్, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్యాంసుందర్గౌడ్, రవికుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శులు నాగరాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
యూరియా చల్లేందుకు వెళ్లి వ్యక్తి మృతి
గోపాల్పేట: యూరియా చల్లేందుకు కూలీకి వెళ్లిన ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన వనపర్తి జిల్లా రేవల్లి మండలంలోని నాగపూర్లో శుక్రవారం చోటుచేసుకుంది. రేవల్లి ఎస్ఐ రజిత కథనం ప్రకారం.. నాగపూర్ గ్రామానికి చెందిన ఎండీ మైను(49) కుటుంబ పోషణ కోసం కూలీ పనులకు వెళ్తుంటాడు. ఈ క్రమంలో శుక్రవారం అదే గ్రామానికి చెందిన మధుకర్రెడ్డి పొలంలో యూరియా చల్లేందుకు మైను మద్యం తాగి కూలీకి వెళ్లాడు. యూరియా చల్లుతుండగా బోర్లా పడ్డాడు. కొద్దిసేపు ఎవరూ గమనించకపోవడంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై మైను భార్య నూర్జహాన్బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
జూరాలకు 76,800 క్యూసెక్కుల వరద
ధరూరు/ఆత్మకూర్/రాజోళి/దోమలపెంట: ప్రియదర్శిని జూరాల జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. గురువారం 92 వేల క్యూసెక్కులు ఉండగా... శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో 76,800 క్యూసెక్కులకు చేరినట్లు వివరించారు. దీంతో ప్రాజెక్టు 4 క్రస్ట్గేట్లను పైకెత్తి 27,504 క్యూసెక్కులు దిగువకు, విద్యుదుద్పత్తి నిమిత్తం 41,602, ఆవిరి రూపంలో 67, ఎడమ కాల్వకు 920, కుడి కాల్వకు 620, భీమా లిఫ్ట్కు 750 క్యూసెక్కులు వినియోగించినట్లు చెప్పారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.261 టీఎంసీలు ఉన్నట్లు తెలిపారు. లక్ష్యానికి చేరువలో విద్యుదుత్పత్తి.. జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో ఈ ఏడాది రికార్డుస్థాయిలో ఉత్పత్తి కొనసాగుతోంది. మే నెలలోనే విద్యుదుత్పత్తి ప్రారంభించగా.. శుక్రవారం నాటికి 597 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి సాధించారు. కాగా ఈ ఏడాది లక్ష్యంగా 610 మి.యూ.గా ఉంది. శుక్రవారం ఎగువ 6 యూనిట్ల నుంచి 234 మెగావాట్లు, 285.025 మి.యూ., దిగువ 6 యూనిట్ల నుంచి 240 మెగావాట్లు, 311.995 మి.యూ. ఉత్పత్తి చేపట్టామని ఎస్ఈ శ్రీధర్ వివరించారు. సుంకేసులకు కొనసాగుతున్న వరద సుంకేసుల జలాశయానికి శుక్రవారం ఎగువ నుంచి 54 వేల క్యూసెక్కుల వరద రాగా.. 12 గేట్లను మీటర్ మేర తెరిచి 50,484 క్యూసెక్కులు దిగువకు వదిలినట్లు జేఈ మహేంద్ర వివరించారు. అలాగే 2,626 క్యూసెక్కులు కేసీ కెనాల్కు వదిలినట్లు పేర్కొన్నారు. 4 క్రస్ట్గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల -
తండ్రిని చితకబాది కారు డిక్కీలో తీసుకెళ్లిన కుమారుడు
● డిండిచింతలపల్లి వద్ద వాగులో పడేసినట్లు గుర్తింపు ● డిండి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పొలాల వద్ద దొరికిన మృతదేహం కల్వకుర్తి టౌన్: కొడుకు చేతిలో దారుణ హత్యకు గురైన బాలయ్య(70) మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని వాసవీనగర్కు చెందిన బాలయ్యను బుధవారం సాయంత్రం ఆయన కుమారుడు తండ్రిని తీవ్రంగా కొట్టి కారు డిక్కీలో వేసుకుని వెళ్లిన విషయం తెలిసిందే. సీసీ కెమెరాలను పరిశీలించగా కుమారుడు బీరయ్యనే దాడి చేసి కారులో తీసుకెళ్లినట్లు గుర్తించి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో బాలయ్య మృతదేహాన్ని మండలంలోని డిండిచింతపల్లి వద్ద బ్రిడ్జిపై నుంచి అక్కడ ఉన్న వాగులో పడేసినట్లు గుర్తించి.. శుక్రవారం ఉదయం నుంచి కల్వకుర్తి సీఐ నాగార్జున ఆధ్వర్యంలో ఎస్ఐలు మాధవరెడ్డి, వెంకట్రెడ్డి, నరేష్ ఆధ్వర్యంలో డ్రోన్, గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చేపట్టారు. చివరకు ఉప్పునుంతల మండలం కొరటికల్ వద్ద డిండి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వెంట పొలాల వద్ద ఉండే వారు మృతదేహం ఒడ్డుకు వచ్చిందని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి వెళ్లి పరిశీలించగా.. బాలయ్య మృతదేహంగా గుర్తించారు. ఈ మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎక్కడకు తరలించాలన్న విషయాన్ని గురించి పోలీస్ ఉన్నతాధికారుల సూచనల మేరకు తరలిస్తామని పోలీసులు తెలిపారు. తండ్రిని హత్య చేసిన బీరయ్య ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడని, అతనికి సహకరించిన బీరయ్య బావమరిది సైతం అదుపులో ఉన్నాడని సమాచారం. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
వనపర్తి రూరల్: తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన శ్రీరంగాపురం మండలం శేరుపల్లిలో శుక్రవారం జరిగింది. శ్రీరంగాపురం ఎస్ఐ రామకృష్ణ తెలిపిన వివరాలు.. శేరుపల్లికి చెందిన వెంకటయ్య ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలసి పొలం దగ్గరకు వెళ్లాడు. తిరిగి సాయంత్రం 4 గంటలకు ఇంటికి వచ్చి చూడగా బీరువా తెరచి ఉంచడాన్ని గమనించారు. రూ.80 వేల నగదు 2.7 తులాల బంగారం చోరీ జరిగినట్లు ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. వివాహిత ఆత్మహత్య బల్మూర్: మండలంలోని బాణాల గ్రామానికి చెందిన సంపంగి పార్వతమ్మ(28) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్ఐ రాజేందర్ తెలిపిన వివరాలు.. ఎనిమిదేళ్ల కిందట నల్లగొండ జిల్లా నేరోడిగోమ్కు చెందిన నరేష్తో పార్వతమ్మకు వివాహమైంది. భార్య ప్రవర్తనపై భర్త మందలించాడు. దీంతో మనస్తాపానికి గురై ఆమె గురువారం రాత్రి పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు నాగర్కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ తెలిపారు. -
కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా
– గట్టుఅమరచింత: రాష్ట్రంలోని చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేవిధంగా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీరభాస్కర్ తెలిపారు. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి శుక్రవారం అమరచింతకు వచ్చిన ఆయన భక్త మార్కండేయ ఆలయంలో చేనేత కార్మికులతో సమావేశమయ్యారు. ప్రభుత్వ పరంగా చేనేత కార్మికులకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. చాలామంది కార్మికులు మగ్గాలపై జరీ చీరలను తయారు చేస్తున్న నేటికీ జౌళిశాఖ అధికారులు జియోట్యాగ్ నంబర్లను ఇవ్వకపోవడంతో పథకాలకు కార్మికులు దూరమవుతున్నారని తెలిపారు. పక్కనున్న జోగుళాంబ గద్వాల జిల్లాలో మగ్గానికి ముగ్గురు కార్మికులకు నేతన్నకు చేయూత పథకాన్ని వర్తింపజేశారని, ఇక్కడమాత్రం మగ్గానికి ఇద్దరు కార్మికులనే ఎందుకు పరిమితం చేశారో అర్థం కావడం లేదన్నారు. చేనేత సహకార సంఘాలను బలోపేతం చేస్తూ కార్మికులు రాయితీలను పొందేలా ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లి కార్మికులు లబ్దిపొందేలా తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం రాష్ట్రస్థాయి చేనేత అవార్డులను అందుకున్న పట్టణానికి చెందిన దేవరకొండ లచ్చన్న, మహాంకాళి సులోచనను సన్మానించారు. కార్యక్రమంలో చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, సత్యన్న, నాగరాజు, చింతన్న, రాములు, సత్తి, కురుమన్న, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీరభాస్కర్ -
నేడు మూసాపేటకు మంత్రి పొంగులేటి
అడ్డాకుల: మూసాపేట మండల కేంద్రానికి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి శనివారం రానున్నారు. మూసాపేటలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇళ్లను మంత్రులు ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి వేర్వేరుగా వచ్చి మంత్రుల పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. గృహ ప్రవేశ కార్యక్రమం అనంతరం జరిగే బహిరంగసభ ఏర్పాట్లను పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులతో చర్చించారు. మధ్యాహ్నం 2 గంటలకు మంత్రులు ఇక్కడికి రానున్నట్లు ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి తెలిపారు. మంత్రులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కార్యక్రమానికి హాజరు కానున్నారు. జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిర్మిస్తున్న ఇళ్లలో మూసాపేటలోనే మొదటి ఇళ్లు ప్రారంభోత్సవం జరుగుతుండడం విశేషం. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, హౌసింగ్ పీడీ భాస్కర్, తహసీల్దార్ రాజునాయక్, ఎంపీడీఓ కృష్ణయ్య, పార్టీ మండలాధ్యక్షుడు శెట్టిశేఖర్, వివిధ గ్రామాల నాయకులు తదితరులు ఉన్నారు. మైక్రో బ్రూవరీ ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం ● ఈ నెల 25వ తేదీ వరకు అవకాశం మహబూబ్నగర్ క్రైం: మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో మైక్రో బ్రూవరీ(చిన్న తరహా బీరు పరిశ్రమ) ఏర్పాటు చేసుకోవడానికి తెలంగాణ ఆబ్కారీ శాఖ నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఎకై ్సజ్ డీసీ విజయ భాస్కర్ రెడ్డి, మహబూబ్నగర్ ఎకై ్సజ్ సీఐ వీరారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మొదటిసారి జిల్లాకేంద్రంలో కార్పొరేషన్లలో బీరు తయారు చేసి విక్రయాలు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మైక్రో బ్రూవరీ ఏర్పాటుకు వెయ్యి చదరపు మీటర్లతో కూడిన ప్రాంగణం అవసరం ఉంటుందని, దీనికి రూ.1లక్ష డీడీ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. దీని ద్వారా బీరు తయారు చేసి అక్కడే విక్రయాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని, ఆసక్తి కలిగిన వారు దరఖాస్తుతో పాటు రూ.1లక్ష డీడీ, ఆధార్ కార్డు, ప్రస్తుతం బార్, క్లబ్, రెస్టారెంట్ ఉంటే వాటి లైసెన్స్ జిరాక్స్ జత చేసి ఈ నెల 25లోగా వరకు ఎనుగొండలోని డీసీ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. ఎంపికై నా వారు 180 రోజుల్లో చిన్న తరహా బీరు పరిశ్రమ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని, లైసెన్స్ ఫీజు రూ.5 లక్షలతో పాటు ఎకై ్సజ్ డ్యూటీ చెల్లించాలని కోరారు. ఇతర వివరాలకు 87126 58872 సంప్రదించాలని సూచించారు. 8న కలెక్టరేట్ ఎదుట మహా ధర్నా మహబూబ్నగర్ మున్సిపాలిటీ: దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత, బీడీ కార్మికులకు ‘చేయూత’ పింఛన్లు పెంచాలని కోరుతూ ఈనెల 8న కలెక్టరేట్ ఎదుట మహా ధర్నా నిర్వహించనున్నామని ఎంఆర్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి బొర్రా భిక్షపతి, రాష్ట్ర కార్యదర్శి భైరపోగు శివకుమార్ తెలిపారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్లో సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పింఛన్ల పెంపుతో పాటు కొత్తవారికి సైతం మంజూరు చేయాలన్నారు. ఈ విషయంలో ప్రభుత్వంపై పోరాడటంలో ప్రతిపక్ష పార్టీలన్నీ విఫలమయ్యాయని ఆరోపించారు. అందుకే ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో పింఛనుదారుల కోసం పోరాటం చేస్తున్నామన్నారు. ఈనెల 12న తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా, 20న హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారి దిగ్బంధం, 21 నుంచి 26 వరకు గ్రామపంచాయతీ కార్యాలయాల ఎదుట ధర్నా, 27న రాష్ట్రవ్యాప్తంగా రహదారుల దిగ్భందం ఉంటుందన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు నరేందర్, శ్రీరామ్, కమలాకర్, పోలె బాలయ్య, జె.బాలరాజు, సుజాత, లక్ష్మి పాల్గొన్నారు. -
అందుబాటులోకి కొత్త కాలేజీలు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వం పాలమూరు యూనివర్సిటీలో ఈ విద్యా సంవత్సరం నుంచే లా, ఇంజినీరింగ్ కళాశాలల ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో పీయూలోని అకాడమిక్ భవనం పైభాగంలో ఎడమ వైపు ఉన్న తరగతి గదులు ఇంజినీరింగ్, కుడి వైపు ఉన్న గదులు లా కళాశాల విద్యార్థులకు కేటాయించారు. కాగా ఆరు నెలల క్రితమే గదుల నిర్మాణం ప్రారంభించగా ఇటీవల పూర్తయ్యాయి. వీటిలో విద్యార్థులకు అవసరమైన డ్యూయెల్ డెస్క్లు, టేబుళ్లు తదితర వాటిని అధికారులు ఏర్పాటు చేశారు. ఆయా కోర్సుల్లో కలిపి మొత్తం 191 మంది విద్యార్థులను ప్రభుత్వం అలాట్ చేసింది. ఇంజినీంగ్లో చేరిన విద్యార్థులకు కళాశాలతోపాటు హాస్టల్లో చేరేందుకు అధికారులు అవకాశం కల్పించారు. వీరికి కృష్ణవేణి బాలికల హాస్టల్ కొత్త భవనంలో వసతి ఏర్పాటు చేశారు. అలాగే వీరు కళాశాలలో ఎలా ఉండాలి.. ఎలా నడుచుకోవాలని అనే అంశాలపై ఓరియంటేషన్ కార్యక్రమాలు సైతం నిర్వహించారు. త్వరలో రెండు కళాశాలల తరగతులు ప్రారంభించనున్నారు. సిబ్బంది నియామకం.. లా, ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు తరగతులు బోధించేందుకు గెస్టు ఫ్యాకల్టీని అధికారులు నియమించారు. ఇందులో ఇంజినీరింగ్ విభాగంలో మొత్తం మూడు గ్రూప్లకు సంబంధించి 11 మందిని అధ్యాపకులకు ఇంటర్వ్యూలు, డెమో చేపట్టిన తర్వాత నియమించారు. అలాగే లా కళాశాలకు సంబంధించి 6 పోస్టుల భర్తీకి బుధవారం అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. మొత్తం 6 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే 10 మందిని షార్ట్లిస్టు చేశారు. త్వరలోనే ఈ ఫలితాలు వెలువడనున్నాయి. వీటితోపాటు లా, ఇంజినీరింగ్ కళాశాలలకు నాన్ టీచింగ్ సిబ్బందిని వివిధ డిపార్ట్మెంట్లలో ఉన్నవారిని సర్దుబాటు చేయనున్నారు. మొత్తం 6 మందిని కేటాయించనున్నట్లు తెలుస్తుంది. ఇక లా విద్యార్థులు మొత్తం 120 మంది లా సెట్ ద్వారా ఎంపికై , ఆన్లైన్ వెబ్ ఆప్షన్ పెట్టుకున్న వారి లిస్టును ప్రభుత్వం పీయూకు పంపించింది. 45 విద్యార్థుల బుధవారం సాయంత్రం నాటికి దరఖాస్తు చేసుకోగా.. మిగతా వారికి గురువారం వరకు పీయూలో చేరేందుకు అధికారులు అవకాశం కల్పించారు. అధునాతన సౌకర్యాలతో.. పీయూలో నూతనంగా ప్రారంభించనున్న లా, ఇంజినీరింగ్ కళాశాలల్లో అన్ని వసతులు కల్పించి ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నాం. ఇంజినీరింగ్లో గదులతోపాటు డ్యూయెల్ డెస్కుల్, టేబుల్స్ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. త్వరలో తరగతులు కూడా ప్రారంభం కానున్నాయి. రెండు కళాశాలలకు సంబంధించి సిబ్బంది నియామకం ప్రక్రియ సైతం పూర్తయ్యింది. – శ్రీనివాస్, వైస్ చాన్స్లర్, పీయూ అడ్మిషన్లు కొనసాగుతున్నాయి పీయూ లా కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. 120 మందితో పీయూను ఆన్లైన్లో ఎంపిక చేసుకున్నారు. ఇప్పటికే 45 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు. విద్యార్థులకు కళాశాలలో పూర్తిస్థాయిలో నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నాం. – మాళవి, లా కళాశాల ప్రిన్సిపాల్ పీయూలో లా, ఇంజినీరింగ్ కళాశాలల ముస్తాబు పూర్తయిన తరగతి గదుల నిర్మాణం, డ్యూయెల్ డెస్కుల ఏర్పాటు ఆయా కోర్సులో ఇప్పటికే పూర్తయినఅడ్మిషన్ల ప్రక్రియ ‘లా’లో 45 మంది, ఇంజినీరింగ్లో 191 మంది చేరిక ఓరియంటేషన్ క్లాస్లు పూర్తి..త్వరలో తరగతులు ప్రారంభం -
వినాయకా..సెలవిక
పాలమూరు/ స్టేషన్ మహబూబ్నగర్: మహిళల కోలాటాలు.. పెద్దల చెక్క భజనలు.. యువకుల కర్రసాము.. డప్పుల శబ్ధాలు.. బ్యాండు మేళాలకు అనుగుణంగా తీన్మార్ స్టెప్పులు.. మిరుమిట్లు గొలిపే లైట్ల మధ్య గణనాథుడు నిమజ్జనోత్సవం శోభాయమానంగా సాగింది. జిల్లాకేంద్రంలో తొమ్మిది రోజులపాటు విశేష పూజలందుకొన్న విఘ్నాధిపతి.. ఇక వెళ్లొస్తా అంటూ గంగమ్మ ఒడికి చేరాడు. శుక్రవారం రాత్రి క్లాక్టవర్ చౌరస్తా నుంచి అటు పాత గ్రంథాలయం దాకా.. ఇటు పాత బస్టాండు, రాయచూరు రోడ్డు, జడ్చర్ల హైవే తదితర ప్రాంతాలు నిమజ్జనానికి తరలివెళ్లే గణపతి విగ్రహాల ఊరేగింపులతో పులకించిపోయాయి. విభిన్న, విచిత్ర రూపాలు, ఆకర్షణీయమైన సెట్టింగ్లతో కూడిన తీర్చిదిద్దిన ప్రత్యేక రథాలు అందరినీ అలరించాయి. ● జిల్లాకేంద్రంలో దాదాపు 400 విగ్రహాలు నిమజ్జనం కోసం తరలివచ్చాయి. స్వాగత వేదిక దగ్గర ఒక్కొ విగ్రహానికి హారతి ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి గణనాథులను నిమజ్జనం వైపు కదిలించారు. ఇటూ పాతపాలమూరు, రామందిర్ చౌరస్తా, బ్రహ్మాణవాడి తదితర ప్రాంతాల నుంచి పాన్ చౌరస్తా మీదగా సభా వేదిక దగ్గరకు చేరుకోగా ఏనుగొండ, హౌసింగ్బోర్డు, శ్రీనివాసకాలనీ, పద్మావతికాలనీ, వెంకటేశ్వరకాలనీ, టీచర్స్కాలనీ, న్యూటౌన్, రాజేంద్రనగర్ వైపు నుంచి వచ్చిన గణనాథులు అశోక్ టాకీస్ చౌరస్తా మీదుగా స్వాగత వేదిక దగ్గరకు చేరుకున్నాయి. సత్యంచౌరస్తా, సంజయ్నగర్, బోయపల్లిగేట్, న్యూగంజ్, సుభాష్నగర్ ప్రాంతాలకు చెందిన గణనాథులు పాత బస్టాండ్ మీదగా స్వాగత వేదిక వద్దకు చేరుకున్నాయి. క్లాక్టవర్ నుంచి పాలకొండ, చిన్నదర్పల్లి, వెంకటాపూర్ చెరువులతో పాటు బీచుపల్లి, రంగాపూర్ వద్ద కృష్ణానదిలో విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు తరలించారు. ఎస్పీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్, నిఘా కెమెరాల ద్వారా ప్రత్యేక సిబ్బంది నిఘా పెట్టారు. ఎస్పీ జానకి ఎప్పటికప్పుడు బందోబస్తు, నిఘాను పర్యవేక్షించారు. ● నిమజ్జనం వేడుకల్లో ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గణేశ్ చౌక్ వద్ద సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆహ్వాన వేదిక నుంచి గణనాథుల శోభాయాత్రను తిలకించారు. ఈ సందర్భంగా వినాయకులకు ప్రత్యేక జలు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్కుమార్గౌడ్, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్పీ వెంకటేశ్, శ్రీగణేశ్ ఉత్సవ సమితి అధ్యక్షుడు మద్ది యాదిరెడ్డి, సభ్యులు నాగరాజు, గోపాల్యాదవ్, ఆయా పార్టీల నాయకులు పద్మజారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు. ● జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం రాత్రి గణేశ్ శోభాయాత్ర అట్టహాసంగా సాగింది. నేతాజీ చౌరస్తాలో గణనాథులకు ఉత్సవ కమిటీ స్వాగతం పలికింది. అక్కడి నుంచి శోభాయాత్రగా తరలించి నాగసాల చెరువులో విగ్రహాలను నిమజ్జనం చేశారు. -
మహబూబ్నగర్
గంగమ్మ ఒడికి గణనాథుడు ● శోభాయమానంగా సాగిన నిమజ్జనోత్సవం ● కోలాటాలు, భజనలతో సందడిగా మారిన పాలమూరు ● క్లాక్టవర్లో విగ్రహాలకు స్వాగతం పలికిన ఉత్సవ కమిటీ ● హాజరైన ప్రజాప్రతినిధులు.. వేలాది మంది ప్రజలు శనివారం శ్రీ 6 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025పాలమూరు క్లాక్టవర్ సర్కిల్లోని గణేశ్ ఉత్సవ స్వాగత వేదిక వద్దకు వస్తున్న గణనాథులను చూసేందుకు వచ్చిన భక్తజనం -
చివరి విగ్రహం నిమజ్జనం అయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలి
మహబూబ్నగర్ క్రైం: జిల్లాకేంద్రంలో శోభాయాత్ర సందర్భంగా 280మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పా టు చేస్తున్నామని, నగరంలో ఎక్కడా ట్రాఫిక్ సమస్య రాకుండా చూడాలని ఎస్పీ డి.జానకి అన్నారు. ఎస్పీ కార్యాలయంలోని పరేడ్ మైదానంలో శుక్రవారం శోభాయాత్ర విధులు కేటాయించిన పోలీస్ అధికారులు, సిబ్బందికి సూచనలు అందించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సీసీ కెమెరాల ద్వారా నిమజ్జన ప్రదేశాల పరిస్థితులను పర్యవేక్షించాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో పికెటింగ్, రూఫ్టాప్ బందోబస్తు, పెట్రోలింగ్, స్ట్రైకింగ్ ఫోర్స్ అమలు చేయాలన్నారు. మఫ్టీలో 20 మంది స్పెషల్ బ్రాంచ్ పోలీస్ సిబ్బందిని నియమించి అప్రమత్తంగా ఉండే విధంగా చూడాలన్నారు. డీజేలు, లేజర్ లైట్స్, పేపర్ సెల్ యంత్రాలకు అనుమతి లేదనే విషయం తెలియ చెప్పాలన్నారు. ప్రజలతో సహనంతో, ప్రశాంతంగా వ్యవహరించాలన్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రజలు సౌకర్యంగా ప్రయాణం చేయడానికి భారీ వాహనాలు, ఇతర వాహనదారులను డైవర్షన్ చేసిన పాయింట్ల వైపు మళ్లించాలన్నారు. చెరువుల దగ్గర నిమజ్జనం కోసం వచ్చే వాహనాలను క్యూలైన్లో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని, చివరి విగ్రహం నిమజ్జనం అయ్యే వరకు డ్యూటీలో ఉండే పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో ఏఎస్పీలు ఎన్బీరత్నం, సురేష్కుమార్, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, ఎస్బీ సీఐ వెంకటేష్, సీఐలు ఇజాజుద్దీన్, అప్పయ్య, గాంధీనాయక్, శ్రీనివాసులు, ట్రాఫిక్ సీఐ ఇతర ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
రైతులకు ఇబ్బంది లేకుండా పంపిణీ చేయాలి
మహబూబ్నగర్ (వ్యవసాయం): రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యూరియా పంపిణీ చేయాలని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం మహబూబ్నగర్ అర్బన్ మండల పరిధిలోని బోయపల్లిరోడ్లో గల హకా రైతు సేవా కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా యూరియా పంపిణీ ప్రక్రియను మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసులును అడిగి తెలుసుకున్నారు. యూరియా కొరత లేకుండా చూసుకోవాలని, రైతులు గంటల తరబడి క్యూ లైన్లో నిలబడకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఒకరోజు ముందుగానే టోకన్లు ఇచ్చి యూరియా పంపిణీ చేస్తున్నామని అధికారులు కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. అందరికీ టోకెన్లు వచ్చేలా చూడాలని, మహిళలకు, వృద్ధులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. యూరియా పక్కదారి పట్టకుండా పంపిణీ చేయాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారికి చైర్మన్ ఫోన్ చేసి యూరియా పంపిణీ, భూ భారతి చట్టం అమలు తీరుపై ఆరా తీశారు. రైతులకు ఒకే కేంద్రానికి కేంద్రానికి రాకుండా ఎక్కడి వారికి అక్కడే పంపిణీ జరిగేలా చూడాలని కలెక్టర్, డీఏఓలకు సూచించారు. రాష్ట్రంలో యూరియా కొరత లేకుండా ప్రభుత్వం, అధికార యంత్రాంగం చర్యలు చేపడుతున్న విషయాల గురించి రైతులకు వివరించారు. కార్యక్రమంలో అధికారులు, సేవా కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి -
మైసమ్మ ఆలయానికి అటవీ భూమి
నవాబుపేట: జిల్లాలో ప్రసిద్ధిచెందిన పర్వాతాపూర్ మైసమ్మ ఆలయానికి అటవీ భూమి కోసం జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ద్వారా ప్రత్యేక ప్రతిపాదన చేసినట్లు మైసమ్మ ఆలయ చైర్మన్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. గురువారం ఆయన ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. మైసమ్మ ఆలయానికి అదనంగా 4.0889 హెక్టార్ల (దాదాపు పది ఎకరాలు)అటవీ భూమి కోసం ప్రత్యేక వినతిని జడ్చర్ల ఎమ్మెల్యే ప్రతిపాదించినట్లు తెలిపారు. దీనికి సంబంధించి కలెక్టర్ అటవీ భూమిలో సంబంధిత అధికారులతో సర్వే చేయించి అనుమతులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కాగా, కేంద్ర కార్యాలయం తుది అనుమతి రావాల్సి ఉందని.. దీనికి త్వరలోనే అనుమతులు తీసుకొచ్చేలా చేస్తానని జడ్చర్ల ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు తెలియజేశారు. ఆలయ సిబ్బందికి పెరిగిన వేతనాలు కొన్నేళ్లుగా ఆలయంలో వివిధ రకాల పనులు చేస్తున్న వారికి కనీస వేతనాలు పనికి తగ్గట్లుగా అందేవి కావు. దీంతో వారు చాలా ఏళ్లుగా కనీస వేతనం కోసం జడ్చర్ల ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించడంతో తాజాగా 6 కూలీలకు కనీస వేతనం అందించే జీఓ బుధవారం వచ్చిందని మైసమ్మ ఆలయ చైర్మన్ తెలిపారు. దీంతో గతంలో నెలకు రూ.7500 అందించే వేతనాన్ని రూ.12వేలకు పెంచినట్లు పేర్కొన్నారు. అలాగే వంశపారంపర్యంగా ఆలయంలో పనులు చేసే మరో వ్యక్తికి సంబంధించి పర్మినెంట్ వేతనం మంజూరు చేస్తూ ప్రభుత్వం గజిట్ ఇచ్చిందని తెలిపారు. దీంతో ఆలయంలో ఉన్న పెండింగ్ సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నాయని వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు చైర్మన్తోపాటు సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ కమిటీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి -
పాడైన రోడ్ల మరమ్మతు చేయాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): వర్షాలకు పాడైన రోడ్లు, ప్రభుత్వ భవనాలను గుర్తించి మరమ్మతులు చేయాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ విజయేందిర ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ గతేడాది విపత్తు నిర్వహణ కింద వరదలు, వర్షాలు దెబ్బతిన్న భవనాలు, రోడ్లకు మరమ్మతుల మంజూరు, వ్యయం వివరాలు, బ్యాలెన్స్ నిధులపై సమీక్షించారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ప్రస్తుతం 2025 వర్షాలకు గుంతలు పడిన రోడ్లను వెంటనే వాటిని గుర్తించి ప్యాచ్ వర్క్ చేయాలని, ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్, గ్రామ పంచాయతీ భవనాలు, వార్డ్ ఆఫీసర్ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రైమరీ హెల్త్ సెంటర్లకు మరమ్మతులు అవసరం ఉంటే అంచనాలు పంపించాలన్నారు. ఎస్డీఆర్ఎఫ్ నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారం మరమ్మతులు చేయాల్సిందిగా సూచించారు. భూ భారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి భూ భారతి రెవెన్యూ సదస్సులలో స్వీకరించిన పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. తిరస్కరించిన, పరిష్కరించిన, పెండింగ్లో ఉన్న దరఖాస్తుల వివరాలను మండలాల వారీగా సంబంధిత తహసీల్దార్లను అడిగి తెలుసుకున్నారు. ఒక్క దరఖాస్తును కూడా పెండింగ్లో పెట్టకుండా వెంటనే పూర్తి చేయాలని సూచించారు. మూసాపేట మండలంలో నిర్మాణం పూర్తి చేసిన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయాలని గృహ నిర్మాణ, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, నరసింహారెడ్డి, ఆర్డీఓ నవీన్, డీఆర్డీఓ నర్సింహులు, హౌసింగ్ పీడీ భాస్కర్, డీఈఓ ప్రవీణ్కుమార్, డీఎంహెచ్ఓ కృష్ణ, మహిళ శిశు సంక్షేమ అధికారిని జరీనా బేగం, జిల్లా వెటర్నరీ అధికారి మధుసూదన్ గౌడ్, డీపీఓ పార్థసారథి, డీఏఓ వెంకటేష్, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. లంచం అడిగితే సమాచారం ఇవ్వండి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ‘ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే అవినీతి నిరోధక శాఖకు సమాచారం ఇవ్వండి’ అనే స్టిక్కలు అతికించారు. కలెక్టరేట్లో ఉన్న ప్రతి శాఖ కార్యాలయం ప్రధాన డోర్కు ఈ స్టిక్కర్లు అతికించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మిమ్మల్ని ఎవరైనా లంచం ఇవ్వమని వేధిస్తున్నారా..? అయితే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేయండి అని ఉన్న స్టిక్కర్లను అతికించారు. ఏదిఏమైనా ఈ స్టిక్కర్లు ప్రభుత్వ ఉద్యోగుల్లో కొంత భయాన్ని రేపుతున్నాయి. -
జగదీశ్వర్రెడ్డి సేవలు చిరస్మరణీయం
● రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ● ఆయనది ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నైజం: మంత్రి వాకిటి శ్రీహరి ● పాలమూరులో మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్రెడ్డి విగ్రహావిష్కరణ స్టేషన్ మహబూబ్నగర్: మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్రెడ్డి ఉమ్మడి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా పదేళ్లపాటు సుదీర్ఘకాలంగా పని చేశారని, పార్టీ యంత్రాంగాన్ని నడపాలంటే ఆయన్ను చూసి నేర్చుకోవాలని, పార్టీకి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మహబూబ్నగర్ పద్మావతీకాలనీలోని గ్రీన్బెల్టులో గురువారం మాజీ ఎమ్మెల్సీ ఎస్.జగదీశ్వర్రెడ్డి విగ్రహావిష్కరణలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ పార్టీ పరమైన అంశాల్లో, ఇతర సమస్యల్లో ఎవరి మనసు నొప్పించక ప్రజాస్వామికబద్దంగా వ్యవహరించేవారని అన్నారు. ఆనాడు పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో జిల్లా నుంచి ప్రధాన పాత్ర పోషించారని అన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ జగదీశ్వర్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో అంచలంచెలుగా ఎదిగారని అన్నారు. రాజకీయాలకు సరైన వ్యక్తిగా ఆయన జీవన ప్రయాణం కొనసాగిందన్నారు. జీవితంలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ఆయననే చూసే నేర్చుకోవడం జరిగిందన్నారు. ఎంపీ డాక్టర్ మల్లురవి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి మాట్లాడుతూ జగదీశ్వర్రెడ్డి ఆదర్శప్రాయుడని, కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు అందించారని అన్నారు. సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్రెడ్డి మాట్లాడుతూ జగదీశ్వర్రెడ్డితో తనకు ఎంతో ఆత్మీయత అనుబంధం ఉందన్నారు. మొదట్లో నాకు రాజకీయాలు వద్దని చెప్పారని, తర్వాత నాకున్న ఆసక్తితో రాజకీయాల్లో ఎంతో ప్రోత్సహించారని గుర్తుచేశారు. మాజీ ఎంపీ వి.హనుమంతురావు మాట్లాడుతూ జగదీశ్వర్రెడ్డి నిరుపేదలకు సహాయం చేయడంలో ముందుండేవారని అన్నారు. ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్రెడ్డి, జి.మధుసూదన్రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, యశస్వినిరెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు గురునాథ్రెడ్డి, ఒబేదుల్లా కొత్వాల్, కోదండారెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు భానుప్రకాశ్, యాదవరెడ్డి తదితరులు జగదీశ్వర్రెడ్డి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, బెక్కరి మధుసూదన్రెడ్డి, డాక్టర్ నందిని, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, సంజీవ్ ముదిరాజ్, వినోద్కుమార్, ఎన్పీ. వెంకటేశ్, చంద్రకుమార్గౌడ్, భగవంతురావు, సీజే బెనహర్, ప్రశాంత్రెడ్డి, మిథున్రెడ్డి, జహీర్ అఖ్తర్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. -
జూరాలకు కొనసాగుతున్న వరద
ధరూరు/ఆత్మకూర్/రాజోళి/దోమలపెంట: ప్రియదర్శిని జూరాల జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద నిలకడగా కొనసాగుతోందని పీజేపీ అధికారులు తెలిపారు. బుధవారం 1,02,950 క్యూసెక్కులు ఉండగా.. గురువారం రాత్రి 8.30 ప్రాంతంలో 92 వేల క్యూసెక్కుల తగ్గినట్లు చెప్పారు. దీంతో ప్రాజెక్టు 8 క్రస్ట్గేట్లను ఎత్తి 55,928 క్యూసెక్కులు, విద్యుదుద్పత్తికి 40,324, ఆవిరి రూపంలో 70, ఎడమ కాల్వకు 920, కుడి కాల్వకు 670, భీమా లిఫ్ట్కు 750 క్యూసెక్కులు వినియోగిస్తున్నట్లు వివరించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.651 టీఎంసీలు ఉన్నట్లు తెలిపారు. 586.515 మి.యూ. విద్యుదుత్పత్తి.. జూరాల దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో గురువారం ఉత్పత్తి వేగవంతంగా కొనసాగిందని ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 6 యూనిట్ల నుంచి 234 మెగావాట్లు, 279.387 మి.యూ., దిగువ 6 యూనిట్ల నుంచి 240 మెగావాట్లు, 307.128 మి.యూ. విద్యుదుత్పత్తి చేపట్టామని, ఇప్పటి వరకు 586.515 మి.యూ. విజయవంతంగా పూర్తి చేసినట్లు వివరించారు. సుంకేసులకు కొనసాగుతున్న వరద.. సుంకేసుల జలాశయానికి గురువారం ఎగువ నుంచి 73 వేల క్యూసెక్కుల వరద రాగా.. 17 గేట్లను మీటర్ మేర తెరిచి 70,312 క్యూసెక్కులు దిగువకు వదిలినట్లు జేఈ మహేంద్ర వివరించారు. అలాగే 2,626 క్యూసెక్కులు కేసీ కెనాల్కు సరఫరా చేసినట్లు తెలిపారు. 8 క్రస్ట్గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల -
‘కాళేశ్వరం’ అవినీతిని నిగ్గు తేల్చేందుకే సీబీఐ విచారణ
స్టేషన్ మహబూబ్నగర్: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన ప్రజాధనం దుర్వినియోగం, అవినీతిని నిగ్గుతేల్చేందుకే సీబీఐ విచారణ కోరినట్లు రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలశాఖ మంతి వాకిటి శ్రీహరి అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన ఎమ్మెల్యేలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందమని, చేతగాకనే కాళేశ్వరంను సీబీఐ విచారణకు ఇచ్చారని ఎంపీ డీకే అరుణ అనడం అర్థరహితమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్తో సమగ్ర విచారణ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక, విజిలెన్స్ కమిషన్పై అసెంబ్లీలో చర్చ పెట్టిన తర్వాత అందరి సమ్మతితో సీబీఐకు అప్పగించినట్లు తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీల బంధం ఎలాంటిదో పార్లమెంట్ ఎన్నికల్లో చూశామన్నారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం నూటికి నూరుశాతం కాళేశ్వరంలో జరిగిన అవినీతిని కూకటివేళ్లతో బయటకు తీస్తుందన్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబం దోచుకున్న సొమ్ము పంపకాల్లో తేడాలు రావడంతోనే గొడవలు జరగుతున్నాయని అన్నారు. సీఎం పేరును వారి కుటుంబ గొడవల్లోకి లాగుతున్నారని, సీఎంకు ఎలాంటి సంబంధం లేదన్నారు. బీజేపీ డిమాండ్ చేసినట్టే కాళేశ్వరంపై విచారణ సీబీఐకి అప్పగించామని, విచారణ పూర్తి చేసి బీజేపీ చిత్తశుద్ధి చాటుకోవాలన్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపైన విచారణ చేసి దోషులను సత్వరమే శిక్షించేందుకే సీబీఐకి కేసును అప్పగించారని అన్నారు. తప్పు చేసిన దోషులను శిక్షించాలంటే జరిగిన అవినీతిపైన సమగ్ర విచారణ వేగవంతం చేయాలని సీఎం ఆలోచన చేశారని అన్నారు. ఘోష్ కమిటీ ఇచ్చిన నివేదికలో అంతరాష్ట్ర నదీ జలాలకు సంబంధించి విషయం ఉందని, తుమ్మిడిగడ్డ ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చడం, సీడబ్ల్యూసీ ఇచ్చిన లేఖల ఆధారం, నేషనల్ డ్యాంసేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టులు, అన్ని రిపోర్టుల ఆధారంగా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రిపోర్టు ఇచ్చిందన్నారు. సీబీఐ పరిధిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయని, కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎన్నో ఏజన్సీలు ఫండింగ్ చేశాయని అన్నారు. సత్వర విచారణకు సీబీఐ కరెక్ట్ అని, టెక్నికల్ అంశాల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవని, సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. టీజీఎంఎఫ్సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, నాయకులు వినోద్కుమార్, ఎన్పీ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
కంటైనర్ను ఢీకొట్టిన కారు
జడ్చర్ల: పట్టణంలోని 44వ నంబర్ జాతీయ రహదారి ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై ముందు వెళ్తున్న కంటెయిర్ను వెనుక నుంచి కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు గాయాల పాలైన ఘటన గురువారం చోటు చేసుకుంది. సీఐ కమలాకర్ కథనం మేరకు హైదరాబాద్ వైపు నుంచి కర్నూల్ వైపునకు వెళ్తున్న కంటెయినర్ను బ్రిడ్జిపై వెనుక నుంచి అతి వేగంగా కారు ఢీకొట్టింది. ప్రమాదంలో డ్రైవర్ పక్క సీటులో కూర్చున్న రోహిత్ (30) అక్కడికక్కడే మృత్యువాత పడగా.. డ్రైవర్తో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారందరూ హైదరాబాద్లోని కొంపల్లికి చెందిన వారిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఒకరి దుర్మరణం, ఇద్దరికి గాయాలు -
మధ్యాహ్న భోజనంలో బల్లి కలకలం
● ఆహారం పారబోత.. మళ్లీ వండి విద్యార్థులకు అందజేత ● ఉప్పేరు ఉన్నత పాఠశాలలో ఘటన.. ఎంఈఓ విచారణ ధరూరు: విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో బల్లి పడిన ఘటన మండలంలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ధరూరు మండలంలోని ఉప్పేరు ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్నం విద్యార్థులకు వంట ఏజెన్సీ వారు రోజులాగే భోజనం సిద్ధంచేసి ప్లేట్లలో వడ్డించారు. అనంతరం విద్యార్థులు చెట్ల కింద కూర్చొని భోజనం చేస్తుండగా ఓ విద్యార్థి ప్లేట్లో బల్లి కనిపించింది. దీంతో వెంటనే విషయాన్ని ఇతర విద్యార్థులకు తెలియజేయడంతో ప్లేట్లలో ఉన్న భోజనాన్ని పారబోశారు. అయితే, చెట్ల కింద కూర్చుని తింటుండగా పైనుంచి బల్లి పడి ఉండవచ్చునని ఉపాధ్యాయులు, వంట ఏజెన్సీ వారు చెబుతుండగా.. విద్యార్థులు కూరలోనే వచ్చిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు వైరల్ అయ్యింది. విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఎంఈఓ రవీంద్రబాబు గురువారం పాఠశాలకు చేరుకుని సంఘటనపై ఆరా తీశారు. పిల్లలు చెట్ల కింద కూర్చుని తింటుండగానే చెట్టు పైనుంచి బల్లి పడి ఇలా జరిగిందని ఉపాధ్యాయులు, వంట ఏజెన్సీ మహళలు వివరించారు. ఎవరికీ ఎలాంటి ఆరోగ్య సమస్య తలెత్తలేదని తెలిపినట్లు ఎంఈఓ తెలిపారు. ఇదిలా ఉండగా.. పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు హలీంపాష, యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి రంగస్వామి తదితరులు పాఠశాలకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. వంట ఏజెన్సీ నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని, సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని రామాంజనేయులు, మనోజ్ కుమార్, గోపాల్, విజయ్ తదితరులు ఎంఈఓకు వినతిపత్రాన్ని అందజేశారు. -
గల్లంతైన దంపతుల మృతదేహాలు లభ్యం
మల్దకల్: రిజర్వాయర్లో పుట్టీ సాయంతో చేపలు పట్టేందుకు వెళ్లిన దంపతులు గల్లంతుకాగా.. గురువారం వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. పూర్తి వివరాలిలా.. మల్దకల్ మండలంలోని తాటికుంట రిజర్వాయర్లో మంగళవారం సాయంత్రం దంపతులు బోయ దుబ్బోనిబాయి రాముడు, సంధ్య చేపలవేటకు ఎంతకూ తిరిగి ఇంటికి రాకపోవడంతో వారి ఆచూకీ కోసం రెండు రోజుల పాటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, గజ ఈతగాళ్లు రిజర్వాయర్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు గురువారం తెల్లవారుజామున దంపతుల మృతదేహాలు నీటిలో తేలుతూ కనిపించడంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అఽధికారులకు సమాచారం అందించారు. అనంతరం మల్దకల్ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నందీకర్ తెలిపారు. విద్యుదాఘాతంతో మహిళ మృతి నవాబుపేట: పంట పొలానికి వేసిన విద్యుత్ కంచె తగిలి మహిళ మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని జంగమయ్యపల్లికి చెందిన కంచె కిష్టమ్మ(40) గ్రామ సమీపంలో కుమ్మరి రాములు వ్యవసాయ పొలంలో మొక్కజొన్న పంటకు వేసిన విద్యుత్ కంచె వల్ల షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు కుటుంబ సభ్యులు సమాచారం అందించగా కిష్టమ్మ కుమారుడు నరేష్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్ల్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు. తండ్రిపై కుమారుడి దాడి: కారు డిక్కీలో తరలింపు కల్వకుర్తిటౌన్: వ్యవసాయ పొలం వద్ద ఉన్న కన్నతండ్రిపై కర్రతో దాడిచేసి అక్కడి నుంచి కారులో డిక్కీలో తరలించిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లో వెళ్తే.. పట్టణంలోని వాసవీనగర్లో నివాసముంటున్న రైతు బాలయ్య(70) పొలం వద్ద ఉండగా.. బుధవారం సాయంత్రం కుమారుడు బీరయ్య తండ్రిపై కర్రతో దాడిచేసి కారు డిక్కీలో వేసుకొని పరారయ్యాడు. రాత్రివరకు బాలయ్య ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికినా.. ఎక్కడా ఆచూకీ దొరకలేదు. దీంతో గురువారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా.. రక్తపు మరకలు ఉన్నట్లు గుర్తించారు. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా.. కుమారుడు బీరయ్యనే దాడి చేసి కారులో తీసుకెళ్లినట్లు గుర్తించి అతనికోసం గాలిస్తున్నారు. 24గంటలు గడిచినా వృద్ధుడి ఆచూకీ లభించకపోవడం, దాడికి పాల్పడిన కుమారుడు పరారీలో ఉండడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై కల్వకుర్తి సీఐ నాగార్జునను వివరణ కోరగా.. గాయపడ్డ వృద్ధుడిని ఆస్పత్రిలో చేర్పించాడా? లేదా ఏమైనా చేశాడనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
గురువులే మార్గదర్శకులు
పాఠానికి ప్రాణం పోసి.. జడ్చర్ల మండలంలోని రామస్వామిగుట్టతండా పాఠశాల ఎస్జీటీ ఉపాధ్యాయుడు రవి విద్యార్థులకు సులువైన పద్ధతిలో వినోదాత్మకంగా బోధించాలని సంకల్పించారు. అందుకోసం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు దాదాపు కథల రూపకంగానే ఎక్కువ సిలబస్ ఉంటుంది. దీంతో ఆయన విద్యార్థులకు పాఠ్యాంశాలు అర్థమయ్యే విధంగా బోధన ప్రారంభించారు. పాఠ్యాంశంలో చిలుక, లేదా పిల్లి పేరుతో కథ ఉంటే విద్యార్థులకు ఆ వేషాలు వేయించి బోధించడం ఎంతగానో ఆకర్షిస్తుంది. పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధించే పద్ధతిని ఆయన తీసుకువచ్చారు. వీటితోపాటు సైన్స్లో మానవ శరీర భాగాలను మనిషి ఎత్తులో చిత్రీకరించి విద్యార్థులకు సులభమైన పద్ధతిలో బోధిస్తూ ఔరా అనిపిస్తున్నారు. మూస ధోరణిలో కాకుండా.. విద్యార్థులకు మూస ధోరణిలో కాకుండా వినూత్నమైన పద్ధతిలో బోధించడం వల్ల సులువుగా అర్థమవుతుంది. అందుకోసం విద్యార్థులకు పాఠ్యాంశాల్లో ఉన్న క్యారెక్టర్లకు అనుగుణంగా వేషాలు వేయించి బోధిస్తే వారు ఎప్పటికీ పాఠ్యాంశాలను మర్చిపోలేరు. ఈ విధానం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. – జి.రవి, ఎస్జీటీ ఉపాధ్యాయుడు, ఎంపీపీఎస్ రామస్వామిగుట్టతండా, జడ్చర్ల మండలం బోధనలోవినూత్నం.. వరించిన పురస్కారం -
డైవర్షన్ పనులుపక్కాగా చేపట్టాలి
మహబూబ్నగర్ న్యూటౌన్: చిన్నదర్పల్లి ఫారెస్ట్ బీట్ పరిధిలోని జాతీయ రహదారి విస్తరణలో ఫారెస్ట్ డైవర్షన్ పనులు పక్కాగా చేపట్టాలని కేంద్ర అటవీశాఖ డీజీ చంద్రశేఖర్ జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రానికి సమీపంలోని చిన్నదర్పల్లి ఫారెస్ట్ బీట్ పరిధిలో జాతీయ రహదారి విస్తరణలో కోల్పోతున్న అటవీ భూమి, చెట్లను ఆయన పరిశీలించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల నష్టానికి సంబంధించి ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా డైవర్షన్ పనులు పక్కాగా చేపట్టాలని డీఎఫ్ఓ సత్యనారాయణకు సూచించారు. విస్తరణలో పోతున్న అటవీ భూమికి బదులుగా మరోచోట ఇవ్వడం, చెట్లకు బదులుగా మరోచోట నాటడం వంటి పనుల్లో ఎలాంటి జాప్యం జరగరాదని సూచించారు. అనంతరం మహబూబ్నగర్ సమీపంలోని దొడ్డలోనిపల్లి ఫారెస్ట్ బీట్ పరిధి ప్లాంటేషన్, మయూరీ పార్క్ను సందర్శించారు. పార్క్లో ఏర్పాట్లు, మొక్కలు, అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో రేంజ్ అధికారి అబ్దుల్హాయ్, జాతీయ రహదారి ఈఈ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర అటవీశాఖ డీజీ చంద్రశేఖర్ -
దిగువ జూరాలలో సోలార్ కేంద్రం
ఆత్మకూర్: రాష్ట్రంలోని విద్యుదుత్పత్తి కేంద్రాల వద్ద అవకాశం ఉన్నచోట సోలార్ కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని టీఎస్ జెన్కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డా. హరీశ్ తెలిపారు. గురువారం జూరాల ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాలను సందర్శించారు. దిగువ జూరాల వద్ద 100 ఎకరాల స్థలం అందుబాటులో ఉందని.. 20 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. అలాగే కొత్తగూడెంలో కూడా సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయని, త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది దిగువ జూరాలలో రికార్డుస్థాయిలో విద్యుదుత్పత్తి చేపట్టి లక్ష్యాన్ని అధిగమించడం అభినందనీయమన్నారు. ఎగువన కూడా లక్ష్యానికి చేరువలో ఉన్నారని చెప్పారు. బదిలీలు చేపట్టాలని, ఖాళీలను భర్తీ చేయాలని ఉద్యోగులు సీఎండీని అభ్యర్థించగా త్వరలో చేపడతామని హామీ ఇచ్చారు. ఆయన వెంట డైరెక్టర్ బాలరాజు, ఎస్ఈలు శ్రీధర్, సురేష్, సిబ్బంది ఉన్నారు. జెన్కో సీఎండీ డా. హరీశ్ -
ఉత్సాహంగా బ్యాడ్మింటన్ పోటీలు
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో 11వ రాష్ట్రస్థాయి జూనియర్ (అండర్–13) బ్యాడ్మింటన్ చాంపియన్షిప్కు సంబంధించి 225 క్యాలిఫైయింగ్ రౌండ్ మ్యాచ్లు గురువారం ఉత్సాహంగా జరిగాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. క్వాలిఫైయింగ్ మ్యాచ్ల్లో ప్రతిభ కనబరిచిన వారు శుక్రవారం నుంచి జరిగే మెయిన్ డ్రాకు అర్హత సాధించారు. శుక్రవారం ఉదయం ప్రారంభోత్సవం... రాష్ట్రస్థాయి అండర్–13 బ్యాడ్మింటన్ పోటీలు శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్నాయని మహబూబ్నగర్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్యాంసుందర్గౌడ్, రవికుమార్ తెలిపారు. ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న క్యాలిఫైయింగ్ మ్యాచ్లను వారు పరిశీలించారు. నాలుగు సింథటిక్ కోర్టుల్లో సింగిల్, డబుల్స్ పోటీలు జరుగుతాయని, ఈ నెల 7న చాంపియన్షిప్ ముగింపు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించామన్నారు. కార్యక్రమంలో టోర్నీ పరిశీలకుడు సుధాకర్, రెఫరీ కిషోర్, జిల్లా సంయుక్త కార్యదర్శులు నాగరాజుగౌడ్, విజయ్రెడ్డి, ఎంపీ.ప్రవీణ్, సభ్యులు శశాంక్ పాల్గొన్నారు. క్వాలిఫైయింగ్ రౌండ్ మ్యాచ్లు పూర్తి నేటి నుంచి మెయిన్ డ్రా పోటీలు ప్రేక్షకులతో కిటకిటలాడిన ఇండోర్ స్టేడియం -
సమస్యలపరిష్కారానికి అంగీకారం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: రీజియన్లో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ఆర్ఎం సంతోష్కుమార్ అంగీకరించారని ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫోరం అధ్యక్షుడు రాజసింహుడు, నాయకులు జె.ఎన్.రెడ్డి, భగవంతు తెలిపారు. ఈ విషయమై గురువారం ఆయనకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ లీవ్ ఎన్క్యాష్మెంట్ లో కోత విధించిన 30 శాతం ఆదాయపు పన్ను తిరిగి చెల్లించేందుకు ఒప్పుకొన్నారన్నారు. ఎలక్ట్రికల్ డీలక్స్ బస్సుల్లో రిటైర్డ్ ఉద్యోగుల భార్యాభర్తల ప్రయాణ ం, ఆర్టీసీ క్లినిక్లో ల్యాబ్ టెక్నీషియన్ నియామకానికి, మందుల సరఫరాకు అంగీకరించారన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు రామాంజనేయులు, అంజన్న, మనోహర్, రియాజొద్దీన్, బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు. కురుమూర్తి స్వామి హుండీ లెక్కింపు చిన్నచింతకుంట: అమ్మాపురం శ్రీ కురుమూర్తి స్వామి ఆలయంలో స్వామి హుండీని గురువారం లెక్కించారు. రూ.7,03,116 ఆదాయం వచ్చిందని, ఇది గత నెల అమావాస్య, శని, సోమవారాలను పురస్కరించుకొని భక్తులు స్వామివారికి కానుకలు సమర్పించుకున్నారని ఆలయ కమిటీ చైర్మన్ గోవర్ధన్రెడ్డి, ఈఓ మధనేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో సిబ్బంది తిరుపతయ్య, కమిటీ సభ్యులు బాదం వెంకటేశ్వర్లు, కమలాకర్, నాగరాజు, అర్చకులు వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు. 7న ఆలయం మూసివేత ఈ నెల 7వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా కురుమూర్తిస్వామి ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం మూసివేయనున్నారు. తిరిగి సోమవారం సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తెరిచి, శుద్ధి చేసిన తర్వాత భక్తులకు దర్శనం కల్పించనున్నారు. రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చాటాలి మహబూబ్నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి యోగాసన పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభచాటి పతకాలు సాధించాలని ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్పీ వెంకటేశ్ అన్నారు. నిర్మల్లో ఈనెల 5 నుంచి 7వ తేదీ వరకు జరిగే రాష్ట్రస్థాయి యోగాసన స్పోర్ట్స్ చాంపియన్షిప్కు వెళుతున్న జిల్లా క్రీడాకారులను గురువారం జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో అభినందించారు. ఈ సందర్భంగా ఎన్పీ.వెంకటేశ్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించి జాతీయస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్, జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.సాయికుమార్, కోశాధికారి యూ.సురేష్, నారాయణపేట జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి బాల్రాజు తదితరులు పాల్గొన్నారు. -
అవగాహన కల్పిస్తున్నాం..
జిల్లాలో భావి సైంటిస్టులను తయారు చేసేందుకు కృషి చేస్తున్నాం. అందుకోసం పాఠశాల విధులతో పాటు పిల్లలమర్రి సైన్స్ ఫోరం ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాలు, ఎస్సెస్సీ వారికి ముందే సిలబస్పై అవగాహన కల్పిస్తున్నాం. ల్యాబ్లో ఉచితంగా ప్రయోగాలు చేసుకునేందుకు ఉమ్మడి జిల్లా నుంచి విద్యార్థులు వస్తారు. చాలా మందికి ప్రముఖ సైంటిస్టులతో ముఖాముఖి సైతం నిర్వహిస్తున్నాం. – శ్రీధర్, స్కూల్ అసిస్టెంట్, నవాబ్పేటఇంట్లోనే సైన్స్ ల్యాబ్ సైన్స్ ఉపాధ్యాయుడు శ్రీధర్ అందరి ప్రశంసలు పొందుతున్నారు. గతంలో ఆయన గైడ్ టీచర్గా వ్యవహరించి విద్యార్థుల ద్వారా చేసిన పలు ప్రయోగాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. చివరికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును సైతం అందుకున్నారు. పిల్లలమర్రి సైన్స్ ఫోరం ఆధ్వర్యంలో వేసవి సెలవుల్లో సైతం పిల్లలకు సైన్స్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అబ్దుల్ కలాం డ్రీం ఫోర్సు ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఒక కమిటీ ఆధ్వర్యంలో తన ఇంటిపైనే పలువురి సహకారంతో సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. ఇందులో సైన్స్ పట్ల ఆసక్తి ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు నేరుగా వెళ్లి ల్యాబ్లో ప్రయోగాలు తదితర అంశాలను ఉచితంగా నేర్చుకోవచ్చు. -
మహిళ మెడలో మంగళసూత్రం చోరీ
జడ్చర్ల టౌన్: మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట ఫ్రీజన్ రోడ్డులో గురువారం గోదా నాగలక్ష్మి అనే మహిళ మెడలో గుర్తు తెలియని దుండగులు పుస్తెలతాడు (బంగారుగొలుసు) చోరీ చేశారు. స్థానికంగా నివాసముంటున్న నాగలక్ష్మి రేషన్ దుకాణానికి వెళ్లి ఇంటికి తిరిగి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆమెను ఫాలో అవుతూ వచ్చాడు. నిర్మానుష ప్రాంతంలో మెడలోని గొలుసు చోరీ చేసినట్లు బాధితురాలు తెలిపారు. అనంతరం ఎన్ఎస్125 బైక్పై సిద్ధంగా ఉన్న మరో దుండగుడితో కలసి పరారైనట్లు పేర్కొన్నారు. బాధితురాలు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ మల్లేష్ సంఘటనా స్థలానికి చేరుకొని సమీపంలోని సీసీ కెమెరాల రికార్డులు పరిశీలించారు. చోరీ అయిన గొలుసు మూడు తులాలు ఉంటుందుని బాధితురాలు వాపోయింది. బైక్పై పరారైన దొంగలు -
ప్లీజ్ నాన్న.. చంపొద్దు..
నాగర్కర్నూల్ జిల్లా: తెలంగాణలో దారుణం జరిగింది. నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన గుత్తా వెంకటేశ్వర్లు తన ముగ్గురు పిల్లల్ని చంపి ఆపై తానుకూడా ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యతో గొడవపడి తన ముగ్గురు పిల్లలతో సహా అదృశ్యమైన వ్యక్తి మూడు రోజుల తర్వాత శవమై కనిపించాడు. తనతో పాటు వచ్చిన ముగ్గురు పిల్లల ప్రాణాలు తీసిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామశివారులో వెలుగుచూసింది. కుటుంబసభ్యులు, పోలీసుల వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం పెద్దబోయలపల్లికి చెందిన గుత్తా వెంకటేశ్వర్లు (36) ఫర్టిలైజర్ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. గతనెల 30న తన భార్య దీపికతో ఇంట్లో గొడవపడ్డాడు. ఈ క్రమంలో తన ముగ్గురు పిల్లలు మోక్షిత (8), రఘువర్షిణి (6), శివధర్మ (4) పాఠశాల నుంచి ఇంటికి రాగానే.. ద్విచక్ర వాహనంపై వారిని ఎక్కించుకొని బయలుదేరాడు. వారంతా శ్రీశైలం మీదుగా తమ ప్రయాణాన్ని సాగించారు. చివరకు నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ శివారులో హైదరాబాద్–శ్రీశైలం రహదారి పక్కనున్న వ్యవసాయం పొలంలో వెంకటేశ్వర్లు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకంటే ముందే తన ముగ్గురు పిల్లల ప్రాణాలు తీశాడు. పొలంలో వెంకటేశ్వర్లు మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని వెల్దండ ఎస్ఐ కురుమూర్తి పరిశీలించి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.బైక్ నంబర్ ఆధారంగా వివరాల గుర్తింపు..ఇంట్లో గొడవపడి పిల్లలతో సహా వెంకటేశ్వర్లు అదృశ్యం కావడంతో అతడి కుటుంబసభ్యులు అక్కడి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామశివారులో వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు పాల్పడగా.. అక్కడ ఉన్న బైక్ నంబర్ ఆధారంగా ఇక్కడి పోలీసులు మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అప్పటికే వెంకటేశ్వర్లు, అతడి పిల్లల ఆచూకీ కోసం గాలిస్తున్న కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి వచ్చి చూడగా.. అక్కడ పిల్లలు లేకపోవడంతో ఆందోళనకు గురయ్యారు.శ్రీశైలం నుంచి హైదరాబాద్ రోడ్డులో వారు ప్రయాణించినట్లు తెలుసుకొని మార్గమధ్యంలోని పలుచోట్ల సీసీ కెమెరాలను పరిశీలించారు. శ్రీశైలం–హైదరాబాద్ మార్గంలోని అజీపూర్ వద్ద ముగ్గురు పిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్లినట్లు గుర్తించారు. నాగర్కర్నూల్ జిల్లా కోనేటీపూర్ టోల్ప్లాజా వద్ద మాత్రం పెద్ద కుమార్తెతో మాత్రమే కనిపించాడని పోలీసులు నిర్ధారించారు. మిగిలిన మరో కూతురు, కుమారుడు కనిపించకపోవడంపై విచారణ చేస్తున్నారు. వెల్దండ పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తూ.. పిల్లల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురు పిల్లల ఆచూకీ మిస్టరీగా మారింది. మృతుడి తమ్ముడు మల్లికార్జున్రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ కురుమూర్తి తెలిపారు. -
ఉత్సాహంగా కొనసాగుతున్న పోటీలు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూలో టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బందికి టీచర్స్ డేను పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఆటల పోటీలు రెండో రోజు ఉత్సాహంగా సాగాయి. సింధటిక్ ట్రాక్, ఇండోర్ స్టేడియంలో జరిగిన పోటీలను వీసీ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. పని ఒత్తిడి తగ్గించుకునేందుకు తప్పకుండా ఆటల్లో పాల్గొనాలన్నారు. ముఖ్యంగా మహిళా సిబ్బంది అధిక సంఖ్యలో పోటీల్లో పాల్గొనడం గొప్ప విషయమన్నారు. గెలుపోటములను సమానంగా తీసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం విజేతల వివరాలను పీయూ పీడీ శ్రీనివాస్ వెళ్లడించారు. పురుషుల విభాగం 100 మీటర్ల పరుగు పందెంలో ఈశ్వర్, విజయ్, కరుణాకర్రెడ్డి, షార్టపుట్ విభాగంలో శ్రీనివాస్, సాయికిరణ్, రాఘవేందర్, కరుణాకర్రెడ్డి, గాలెన్న, అర్జున్, రిజిస్ట్రార్ రమేష్బాబు, వీసీ శ్రీనివాస్, క్యారమ్స్లో రాజశేఖర్, శ్రీశైలం, రెండో బహుమతి విజయభాస్కర్, ఈశ్వర్కుమార్ గెలుపొందారు. టెన్నికాయిట్ మహిళా విభాగంలో మొదటి బహుమతి స్వాతి, శ్రీలత, రెండో బహుమతి రజిని, మధులిక, 100 మీటర్ల మహిళా విభాగంలో సంధ్యా, రామంజమ్మ, రజిని, చిన్నదేవి, అరుంధతి, పుష్పలత, షార్ట్పుట్ మహిళా విభాగంలో రామాంజమ్మ, స్రవంతి, రజిని, చిన్నాదేవి, మధులిక, శ్రీలత తదితరులు విజేతలుగా నిలిచారు. -
చిన్నారికి తప్పిన ప్రమాదం
● కారులోపల నాలుగేళ్ల చిన్నారి ● ఆటోమెటిక్గా లాకయిన కారు ● అద్దాలు పగులగొట్టి డోర్లు ఓపెన్ జడ్చర్ల టౌన్: కారు ఆటోమేటిక్గా డోర్లు మూసుకుపోయిన నేపథ్యంలో నాలుగేళ్ల చిన్నారి ప్రమాదం నుంచి తప్పించుకొన్న ఘటన మున్సిపాలిటీ పరిధిలోని ఎల్ఐసీ కార్యాలయం సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. బూరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రవితేజ భార్య, కుమారుడు తన్విక్రెడ్డితో కలిసి షాపింగ్కు ఎల్ఐసీ కార్యాలయం సమీపంలో ఉన్న దుకాణానికి కారులో వచ్చారు. పిల్లాడిని కారులోనే విడిచి ఇంజిన్ రన్నింగ్లో ఉంచి భార్యతో కలిసి దుకాణంలోకి వెళ్లాడు. కొద్దిసేపటి తరువాత కారు డోర్లు ఆటోమెటిక్గా లాక్ అయ్యాయి. ఈ నేపథ్యంలో పిల్లాడు కారు అద్దాన్ని కొడుతుండటంతో స్థానికులు గమనించి కారు తలుపు తీసేందుకు యత్నించారు. కారు లోపల నుంచి లాక్ కావడంతో చుట్టుపక్కల ఆరా తీశారు. విషయం తెలుసుకొన్న రవితేజ కారు వద్దకు చేరుకొని ఆటోమెటిక్ లాక్ కావటం గమనించారు. అనంతరం కారు అద్దం పగులగొట్టి పిల్లాడిని బయటకు తీశారు. దీంతో తల్లిదండ్రులతో పాటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
జగదీశ్వర్రెడ్డి ఆదర్శప్రాయుడు
● నేటి విగ్రహావిష్కరణను విజయవంతం చేయాలి ● ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మహబూబ్నగర్ క్రైం: జిల్లాకేంద్రంలో ఈనెల 5న నిర్వహించే గణనాథుడి నిమజ్జనం శోభాయాత్ర కోసం పోలీస్శాఖ భారీ పోలీస్ భద్రతను ఏర్పాటు చేయనుంది. మొత్తం 250 మంది పోలీస్ బలగాలు బందోబస్తు నిర్వహించనున్నారు. జిల్లా ఎస్పీ డి.జానకితో పాటు అదనపు ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, 8 మంది సీఐలు, 20 మంది ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్కానిస్టేబుల్స్ కలిపి 50, 120 మంది కానిస్టేబుల్స్, 20 మంది స్పెషల్ పార్టీ, 30 మంది హోంగార్డులను బందోబస్తు కోసం ఉపయోగించనున్నారు. ప్రతి విగ్రహాం దగ్గర ఒక కానిస్టేబుల్ను ఏర్పాటు చేయగా మజీద్, ఆలయాల దగ్గర పికెట్ నిర్వహించారు. ప్రతి విగ్రహానికి జియోట్యాగ్ చేసిన పోలీసులు రూట్ మ్యాప్ ప్రకారం తరలించనున్నారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసే బాధ్యతలను పోలీసు అధికారులు తీసుకుంటున్నారు. అందుకనుగుణంగా భారీగా పోలీసులను మెహరించనున్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి శాంతి భద్రతలను పర్యవేక్షించనున్నారు. శోభాయాత్రను ఎప్పటికప్పుడు డేగకళ్లతో పరిశీలించడం, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, ఇంటెలిజెన్స్ పోలీసులు నిశితంగా పర్యవేక్షించనున్నారు. ఎస్పీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్, నిఘా కెమెరాల ద్వారా సమీక్షించనున్నారు. మహబూబ్నగర్లో గణనాథుల శోభయాత్ర సందర్భంగా ప్రధానంగా నగరంలో క్లాక్టవర్, అంబేద్కర్ చౌరస్తా, పాతపాలమూరు. పాన్ చౌరస్తాలలో ఊరేగింపు దగ్గర ప్రత్యేక బందోబస్తు కేటాయించనున్నారు.మహబూబ్నగర్ మున్సిపాలిటీ: తెలంగాణ మొదటి దశ పోరాటంలో కేంద్ర మాజీ మంత్రి పి.మల్లికార్జున్తో కలసి దివంగత మాజీ ఎమ్మెల్సీ ఎస్.జగదీశ్వర్రెడ్డి పాల్గొని ఎందరికో ఆదర్శంగా నిలిచారని నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పార్టీలకు అతీతంగా అందరూ కలసి వచ్చేందుకు ఎంతో సహకరించారన్నారు. పాజిటివ్ దృక్ఫథం కలిగిన ఆయన సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉండి అన్ని వర్గాలను కలుపుకొని ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. అధికారంలో ఉన్నా, లేకున్నా ఉమ్మడి జిల్లా అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేశారన్నారు. అప్పట్లో మాకు మార్గదర్శకంగా ఉన్నారని, విశిష్ట వ్యక్తిత్వం కలిగిన ఆయన ఆశయాలను కొనసాగిస్తామన్నారు. గురువారం పద్మావతీకాలనీలోని గ్రీన్బెల్ట్లో జగదీశ్వర్రెడ్డి విగ్రహావిష్కరణకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులందరూ తప్పకుండా హాజరై విజయవంతం చేయాలన్నారు. అనంతరం పద్మావతీకాలనీలో విగ్రహావిష్కరణ ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్.వినోద్కుమార్, సంజీవ్ ముదిరాజ్, హర్షవర్ధన్రెడ్డి, సీజే బెన్హర్ పాల్గొన్నారు. -
విద్యార్థులు ఏకాగ్రతతో చదవాలి
అడ్డాకుల: మూసాపేట మండలం సంకలమద్ది శివారులో ఉన్న కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని బుధవారం కలెక్టర్ విజయేందిర బోయి సందర్శించారు. పదో తరగతి విద్యార్థుల తరగతి గదికి వెళ్లి బాలికలతో మాట్లాడారు. విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. విద్యార్థులకు కంప్యూటర్పై ఎంత అవగాహన ఉందన్న దానిపై ఆరా తీశారు. పదో తరగతి విద్యార్థులపై అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. విద్యార్థులు ఏకాగ్రతతో చదవాలని చెప్పారు. అలాగే కస్తూర్భాలో విద్యార్థుల వసతి, ఇతర సౌకర్యాల గురించి కలెక్టర్ ఆరా తీశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు శివేంద్రప్రతాప్, నర్సింహారెడ్డి, డీఈఓ ప్రవీణ్కుమార్, ఎంఈఓ రాజేశ్వర్రెడ్డి ఉన్నారు. -
నేటి నుంచి రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో గురువారం నుంచి ఈ నెల 7వ తేదీ వరకు రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అండర్–13 బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించనున్నారు. పట్టణంలో రెండోసారి మహబూబ్నగర్ జిల్లా బ్యాడ్మింటన్ (ఎండీబీఏ) ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇండోర్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఆరు కోర్టుల్లో మ్యాచ్ల నిర్వహణ రాష్ట్రస్థాయి అండర్–13 బ్యాడ్మింటన్ చాంపియన్షిప్కు మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలోని నాలుగు సింథటిక్ కోర్టుల్లో మ్యాచులు జరగనున్నాయి. గురువారం క్యాలిఫైయింగ్ రౌండ్, 5 నుంచి 7 వరకు సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో మెయిన్డ్రా పోటీలు జరుగుతాయి. పోటీలో ఉమ్మడి జిల్లాల నుంచి 350 మంది క్రీడాకారులు, 11 మంది అఫీషియల్స్ పాల్గొంటున్నారు. 5వ తేదీన ఉదయం 10 గంటలకు టోర్నీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి హాజరుకానున్నారు. స్టేడియంలో ఏర్పాట్లను మహబూబ్నగర్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం పరిశీలించారు. కార్యక్రమంలో టోర్నీ పరిశీలకుడు సుధాకర్, టెక్నికల్ అషీషియన్ జి.కిషోర్, రెఫరీలు తదితరులు పాల్గొన్నారు. 4రోజుల పాటు పాలమూరులోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో నిర్వహణ మొదటగా క్యాలిఫైయింగ్ రౌండ్ మ్యాచ్లు 5 నుంచి మెయిన్ డ్రా పోటీలు ఏర్పాట్లు చేసిన జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ -
ఎడ్యుకేషన్.. ఇరిగేషన్
ఇవే పాలమూరు తలరాతను మారుస్తాయి ● ఏ అవకాశం వచ్చినా మొదటి ముద్ద పాలమూరుకే.. ● ఇదే లక్ష్యంతో ముందుకు సాగుతున్నా.. ● అప్పుడే వలసలు ఆగుతాయి.. ● ఎస్జీడీ ఫార్మా 2వ యూనిట్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్రెడ్డి ● ‘కొడంగల్’ భూనిర్వాసిత రైతులకు న్యాయం చేస్తాం ●పేదరికం, వలసలు, సమస్యలను చూపించడానికి నాటి పాలకులు ప్రపంచ నాయకులను పాలమూరు జిల్లాకు తీసుకొచ్చేవారు. భవిష్యత్లో మన అభివృద్ధి, పరిశ్రమలు, యూనివర్సిటీలు, సాగునీటి ప్రాజెక్ట్లను సందర్శించేలా అభివృద్ధి చేసుకోవాలి. వీటిని చూసేందుకు దేశ, విదేశాల నుంచి పర్యాటకులు రావాలి. పరిశ్రమలు కావాలంటే భూములు కావాలి. ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో వాటి వివరాలను అధికారులు నాకు పంపాలి. ఏ పరిశ్రమ వచ్చినా మొదటగా పాలమూరుకు పంపుతాను. నాకు ఏ అవకాశం వచ్చినా మొదటి ముద్ద పాలమూరు ప్రజలకు పెడుతా. మంత్రి వర్గంలోని మంత్రులు ఏమనుకున్నా మంచిదే. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘పాలమూరు జిల్లా అంటే ఒకనాడు వలసలకు మారుపేరు. ఈ దేశంలో భాక్రానంగల్, నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ.. ఇలా ఏ మూలన ప్రాజెక్ట్లు కట్టినా తట్ట పని, మట్టి పని చేయాలంటే పాలమూరు బిడ్డలే కావాలి. వారి భాగస్వామ్యం లేకుంటే ఏ నిర్మాణాలు పూర్తి కాలేదు. దీనికి ప్రధానం కారణం చదువులో వెనకబాటు, సాగు నీరు అందుబాటులో లేకపోవడమే. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వాల్లోని పెద్దలు ప్రయత్నం చేయకపోవడంతో ఇప్పటికీ వలసలు ఆగలేదు. అందుకే పాలమూరు బిడ్డగా నా బాధ్యత నెరవేరుస్తా. ఎడ్యుకేషన్, ఇరిగేషన్ లక్ష్యంగా పాలమూరు జిల్లా ప్రజల తలరాతలు మార్చేందుకు కృషి చేస్తా.’ అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల శివారులోని ఎస్జీడీ ఫార్మా కార్నింగ్ టెక్నాలజీస్ రెండో యూనిట్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నిర్వహించిన ఫర్నేస్ లైటింగ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ‘పాలమూరు బిడ్డల చదువు కోసం ఏది కావాలన్నా.. ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. పాలమూరు ప్రాజెక్ట్లకు గ్రీన్చానల్ ద్వారా నిధులు అందించి పూర్తి చేస్తాం. రాజకీయ కారణాలతో అభివృద్ధిని అడ్డుకుంటే మనకు మనమే మరణ శాసనం రాసుకున్నవాళ్లమవుతాం.’ అని పేర్కొన్నారు. ఇంకా రేవంత్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే మళ్లీ 75 ఏళ్ల తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రానికి పాలమూరు నాయకత్వం వహిస్తున్నది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే.. విద్య, ఇరిగేషన్, ఉపాధి రంగాల్లో సరైన ప్రణాళికతో జిల్లాను అభివృద్ధి చేసుకోకపోతే శాశ్వాతంగా మన జిల్లాకు తీరని అన్యాయం జరుగుతుంది. అందుకే ఇంజనీరింగ్, లా కాలేజీ, డిగ్రీ కాలేజీలతో పాటు ట్రిపుల్ ఐటీని పాలమూరు జిల్లాకు మంజూరు చేశాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ఒక్కో నియోజకవర్గానికి రూ.200 కోట్ల చొప్పున రూ.2,800 కోట్లతో ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. అంతేకాకుండా ఉమ్మడి పాలమూరులో 14 అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ల (ఏటీసీ)ను ఏర్పాటు చేస్తున్నాం. దేశ, విదేశాల్లో ఉద్యోగాలు చేసుకునే విధంగా ఆ సెంటర్లలో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇస్తాం. విద్య ఒక్కటే మన తలరాతలు మారుస్తుంది. పాలమూరు బిడ్డలు వలసల బారి నుంచి బయటపడాలంటే చదువొక్కటే మార్గం. పాలమూరు జిల్లా నుంచి ఇంజినీర్లు, డాక్టర్లే కాదు, ఐఏఎస్లు, ఐపీఎస్లుగా ఎదగాలి. నూతన పరిశ్రమలకు వేదిక మహబూబ్నగర్ కాబోతోంది. -
జూరాలకు తగ్గుతున్న వరద
ధరూరు/ఆత్మకూర్/రాజోళి/దోమలపెంట: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. మంగళవారం 1.26 లక్షల క్యూసెక్కులు ఉండగా.. బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో 1,02,950 క్యూసెక్కులకు తగ్గినట్లు చెప్పారు. దీంతో ప్రాజెక్టు 10 క్రస్ట్గేట్లను ఎత్తి 66,776 క్యూసెక్కులు దిగువకు వదిలామన్నారు. విద్యుదుద్పత్తికి 38,225 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 70, ఎడమ కాల్వకు 920, కుడి కాల్వకు 700, భీమా లిఫ్టుకు 750 క్యూసెక్కులు వినియోగించినట్లు వివరించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.571 టీఎంసీలు ఉన్నట్లు తెలిపారు. 474 మెగావాట్ల విద్యుదుత్పత్తి.. జూరాల దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో బుధవారం విద్యుదుత్పత్తి కొనసాగిందని ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువ 6 యూనిట్ల నుంచి 234 మెగావాట్లు, 276.486 మి.యూ., దిగువ 6 యూనిట్ల నుంచి 240 మెగావాట్లు, 303.685 మి.యూ. ఉత్పత్తి జరినట్లు చెప్పారు. ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఇప్పటి వరకు 580.171 మి.యూ. ఉత్పత్తి చేపట్టామన్నారు. సుంకేసు జలాశయం.. సుంకేసుల జలాశయం 18 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసినట్లు జేఈ మహేంద్ర తెలిపారు. బుధవారం ఎగువ నుంచి 80 వేల క్యూసెక్కుల వరద రాగా.. 18 గేట్లను మీటర్ మేర తెరిచి 76,356 క్యూసెక్కులు దిగువకు, కేసీ కెనాల్కు 2,095 క్యూసెక్కులు వదిలినట్లు వివరించారు. 10 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల -
నీటి గుంతలో పడి అన్నదమ్ములు మృతి
ఊట్కూరు: నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలంలో ఇంటిపక్కన ఉన్న నీటి గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతిచెందిన సంఘటన చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. తిమ్మారెడ్డిపల్లి తండాకి చెందిన పూనియానాయక్, జయమ్మ దంపతులకు కుమారులు అభిషేక్(5) ఆకాష్(4) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వెళ్లి జీవనం కొనసాగిస్తున్నారు. సొంత గ్రామం తిమ్మారెడ్డిపల్లి తండాలో వినాయక నిమర్జనం కోసం రెండు రోజుల క్రితం వచ్చారు. బుధవారం మధ్యాహ్నం ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఇంటి పక్కనే కాస్త దూరంలో ఉన్న నీటి గుంతలో పడిపోయారు. పిల్లలు కనపడడం లేదంటూ కుటుంబసభ్యులు గ్రామం మొత్తం వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో ఇంటి పక్కనే ఉన్న గంత వద్దకు వెళ్లి చూడగా అందులో చిన్నారులు తెలుతూ కనిపించారు. వెంటనే వారిని బయటికి తీసి ఆస్పత్రకి తీసుకెళ్లగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఒకేసారి ఇద్దరన్నదమ్ములు మృతిచెందడంతో తల్లిదండ్రులు దుఖఃసాగరంలో మునిగారు. ఈ ఘటనపై ఎస్ఐ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వినాయక నిమర్జనానికి వచ్చిన చిన్నారులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
అన్నదాతల అరిగోస
● మళ్లీ రోడ్డెక్కి ఆందోళనకు దిగిన రైతులు ● ఎరువుల విక్రయ కేంద్రాల వద్ద తగ్గని బారులు జడ్చర్ల/మహమ్మదాబాద్/మిడ్జిల్/చిన్నచింతకుంట/నవాబుపేట/రాజాపూర్/భూత్పూర్: రెండు బస్తాల యూరియా కోసం అన్నదాతలు అరిగోస పడుతున్నారు. భార్యాపిల్లలు, పంట పొలాలను వదిలి ఎరువుల విక్రయ కేంద్రాల వద్ద పొద్దస్తమానం పడిగాపులు కాస్తున్నారు. కొన్ని చోట్ల అరకొరగా పంపిణీ చేయడం.. మరికొన్ని చోట్ల మొత్తానికే స్టాక్ లేదని చెబుతుండటంతో అసహనానికి గురవుతున్నారు. బుధవారం జడ్చర్ల సిగ్నల్గడ్డలో ఉన్న ఆగ్రో రైతు సేవాకేంద్రానికి వేకువజామునే రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తీరా అక్కడ స్టాక్ లేదని సిబ్బంది చెప్పడంతో ఆగ్రహానికి గురయ్యారు. సమీపంలోని 167వ నంబర్ జాతీయ రహదారిపైకి చేరుకొని నిరసన వ్యక్తంచేశారు. యూరియా అందించి తమ పంటలను కాపాడాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ● మహమ్మదాబాద్ మండలం నంచర్లగేట్ వద్ద రైతులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. రెండు, మూడు రోజులుగా రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తుండగా.. అధికారులు, ఫర్టిలైజర్ దుకాణాల యజమానులు స్టాక్ లేదని చెబుతుండటంతో ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. అరగంటకు పైగా నిర్వహించిన ధర్నాతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ● మిడ్జిల్ మండలంలోని రాణిపేటకు, మిడ్జిల్ ఆగ్రోస్, సింగిల్విండో కార్యాలయాలకు నాలుగు లారీల యూరియా వచ్చింది. రైతులు వేకువజామునే అక్కడికి చేరుకొని క్యూ కట్టారు. చివరకు చాలా మంది రైతులకు యూరియా లభించకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. ● చిన్నచింతకుంట మండలం లాల్కోట పీఏసీఎస్ వద్ద రైతులు చెప్పులను క్యూలో పెట్టి యూరియా కోసం నిరీక్షించారు. మొత్తం 300 బస్తాల యూరియాను ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు. ● నవాబుపేటలో పోలీసులు భారికేడ్లు ఏర్పాటుచేసి యూరియా పంపిణీ చేపట్టారు. వివిధ గ్రామాల నుంచి రైతులు వందలాదిగా తరలిరాగా.. పోలీసులు మహిళలు, పురుషులను వేర్వేరు లైన్లలో నిలబెట్టారు. ● రాజాపూర్ మండలకేంద్రంతో పాటు తిర్మలాపూర్ ఆగ్రో రైతు సేవా కేంద్రాలకు యూరియా రావడంతో రైతులు ఒక్కసారిగా ఎగబడ్డారు. లైన్లో ఉన్న చాలా మందికి యూరియా దొరక్కపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. ● భూత్పూర్లోని ఆగ్రో రైతు సేవాకేంద్రం, సింగిల్విండోల వద్ద ఉదయం 6 గంటల నుంచే రైతులు బారులు తీరారు. పోలీసు బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేపట్టారు. -
‘జీవిత బీమా’తో ఆర్థిక భద్రత
జడ్చర్ల టౌన్: ప్రతి ఒక్కరికీ జీవిత బీమా ద్వారా రక్షణ కల్పించి వారికి ఆర్థిక భద్రతను ఇవ్వడమే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ముఖ్య ఉద్దేశమని ఎల్ఐసీ ఆఫ్ ఇండియా ముంబై సెంట్రల్ కార్యాలయ క్లియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పైక్రే అన్నారు. బుధవారం జడ్చర్ల ఎల్ఐసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జడ్చర్ల ఎల్ఐసీ బ్రాంచ్ పరిధిలోని కేశంపేట మండలాన్ని రెండు తెలుగు రాష్ట్రాలను కలిపి పైలెట్ ప్రాజెక్ట్గా ప్రకటించిన సందర్భంగా సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని ప్రతి ఒక్కరికీ బీమా సదుపాయం కల్పించాలనే సంకల్పంతో 1956లో కేంద్ర ప్రభుత్వం జీవిత బీమా సంస్థ ప్రారంభించిందన్నారు. నాటి నుంచి ఎంతగానో విస్తరించినా ఇంకా అనేక మందికి పాలసీని అందించలేక పోయిందన్నారు. ఈ నేపథ్యంలో కేశంపేట మండలాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపికి చేసి ప్రతి ఇంట్లో ఒక పాలసీ నినాదంతో ముందుకెళ్తున్నట్లు ప్రకటించారు. ఎల్ఐసీ కుటుంబమంతా విశేషంగా కృషి చేసి ప్రాజెక్ట్ను విజయవంతం చేయాలన్నారు. 2026 మార్చి 26 నాటికి అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని కోరారు. కార్యక్రమంలో హైదరాబాద్ జోనల్ మేనేజర్ పునీత్రాజ్కుమార్, డివిజనల్ మేనేజర్ సంధ్యారాణి, క్లియా ఆర్ఎం రాజశేఖర్, ఎంఎం ప్రసాదరావు, మేనేజర్ రవిశంకర్, బీడీబీఎస్ మేనేజర్ జగన్నాథం, జడ్చర్ల బ్రాంచ్ మేనేజర్ శంకర్నాయక్ తదితరులు పాల్గొన్నారు. పైలెట్ ప్రాజెక్ట్గా కేశంపేట మండలం ఎంపిక ప్రతి ఇంట్లో ఒక పాలసీ ఉండాలి ఎల్ఐసీ ఆలిండియా క్లియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పైక్రే -
ఆర్థిక సమస్యలతో రైతు ఆత్మహత్య
ఇటిక్యాల: ఆర్థిక సమస్యలతో రైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఇటిక్యాల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రవినాయక్ కథనం మేరకు.. మండలంలోని చాగాపురం గ్రామానికి చెందిన కుర్వ రాముడు (50) కొంత కాలంగా మద్యానికి బానిసై ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం మనస్థాపానికి గురై తన వ్యవసాయ పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కర్నూల్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు తెలిపారు. అతని భార్య కుర్వ సుజాత ఫిర్యాదు మేరకు బుధవారం సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి కొల్లాపూర్ రూరల్: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన కొల్లాపూర్ మండలంలో బుధవారం చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. రామాపురం గ్రామానికి చెందిన భాస్కర్ (35) బుధవారం ఉదయం గ్రామ సమీపంలోని వాగు దగ్గరకు బహిర్భూమికి వెళ్తుండగా, అక్కడే వేలాడుతున్న విద్యుత్ తీగలు తలకు తాకి విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన వెంటనే గ్రామస్తులు విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని విద్యుత్ అధికారులు పరిశీలించారు. అనంతరం అక్కడికి చేరుకున్న డాక్టర్లు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. భాస్కర్కు భార్య రేణుక, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేఎల్ఐ కాల్వలో పడి రైతు మృతి గోపాల్పేట: పొలం సమీపంలో ఉన్న కేఎల్ఐ కాల్వలో పెట్టిన మోటారు చుట్టూ చేరిన నాచును తీసేందుకెళ్లి రైతు మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. రేవల్లి మండలంలోని తల్పునూరు గ్రామానికి చెందిన చాగల రాములు (58) బుధవారం ఉదయం ఎప్పటిలాగే పొలానికి వెళ్లి, ఇంటికి తిరిగి రాలేదు. ఈ క్రమంలో ఆందోళన చెందిన ఆయన చిన్న కుమారుడు ఆంజనేయులు మధ్యాహ్నం నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాములు ఫోన్ ఎత్తలేదు. దీంతో అనుమానం వచ్చి పొలం వద్దకు వెళ్లి వెతికినా ఎక్కడా కనిపించలేదు. కేఎల్ఐ కాల్వలో ఉన్న వారి మోటారు వద్ద చూడగా నీటిపై తేలుతూ రాములు మృతదేహాం కనిపించింది. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై రేవల్లి ఎస్ఐ రజితను వివరణ కోరగా.. రాములు కుటుంబ సభ్యులు మృతికి సంబంధించి సమాచారం ఇచ్చారని, ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని తెలిపారు. మృతుడు భార్య మణెమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి దేవరకద్ర రూరల్: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి చెందిన ఘటన మండలంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ నాగన్న కథనం మేరకు వివరాలిలా.. గూరకొండ సమీపంలోని కుర్వ శ్రీను రైస్మిల్లు వద్ద ఉన్న గదిలో రక్తపు మరకలు, ఫోన్ పడి ఉందని స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు అక్కడికి చేరుకొని లభించిన ఆధారాలతో విచారణ చేయగా.. అవి ఊట్కూర్ మండలం మల్లెపల్లి గ్రామానికి చెందిన రాములు(60)విగా గుర్తించారు. వెంటనే విషయాన్ని సదరు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబసభ్యులు స్థానికుల సహాయంతో చుట్టుపక్కల రాములు కోసం వెతకగా.. పెద్దగోప్లాపూర్ దగ్గర రోడ్డు పక్కన పండ్ల షాపు వెనకల గాయాలతో మృతిచెంది పడి ఉండటాన్ని గుర్తించారు. -
రిజర్వాయర్లో దంపతుల గల్లంతు
● చేపల వేటకు వెళ్లిన క్రమంలో చోటుచేసుకున్న ఘటన ● ఎన్డీఆర్ఎఫ్ బృందాల గాలింపు.. ఎమ్మెల్యే, ఎస్పీ పరిశీలన మల్దకల్: రిజర్వాయర్లో చేపలు పట్టేందుకు వెళ్లిన భార్యాభర్తలు ప్రమాదవశాత్తు పుట్టి బోల్తా పడడంతో గల్లంతయ్యారు. ఈ ఘటన మల్దకల్ మండలం తాటికొండ రిజర్వాయర్లో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. తాటికుంటకు చెందిన దుబ్బన్బోయి బోయ రాముడు(36), సంఽధ్య(34) భార్యభర్తలు. చేపలు పట్టుకొని విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. రోజులాగే మంగళవారం సాయంత్రం ఇరువురు చేపల వేటకు వెళ్లారు. రాత్రయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వెంటనే రిజర్వాయర్ వద్దకు చేరుకుని పరిశీలించగా అక్కడ రాముడు బైక్, చెప్పులు, వస్తువులు లభించడంతో ఇద్దరు రిజర్వాయర్లో చేపల కోసం పుట్టీలో వెళ్లారని గుర్తించారు. రిజర్వాయర్లో అలల తాకిడి ఎక్కువ కావడంతో పుట్టి బోల్తా పడి ఉండవచ్చునని గ్రామస్తులు తెలిపారు. భార్యకు ఈత రాకపోవడంతో ఆమెను రక్షించే క్రమంలోనే భర్త మృతి చెంది ఉంటాడని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. మంగళవారం రాత్రి 11గంటల సమయంలో మల్దకల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు జిల్లా ఉన్నతాధికారులకు విషయాన్ని తెలిపారు. దీంతో బుధవారం ఉదయం గల్లంతైన వారి కోసం 50మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం రిజర్వాయర్లో గాలింపు చర్యలు చేపట్టింది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీ మొగులయ్య, సీఐ శ్రీను అక్కడికి చేరుకొని గాలింపు చర్యలను పర్యవేక్షించారు. చేపల వేటకు ఎప్పుడు వెళ్లారు, పూర్తి వివరాలను కుటుంబ సభ్యులు, గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఇదిలాఉండగా, వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. సాయంత్రం వెళ్లిన తల్లిదండ్రులు ఎంతకూ తిరిగి రాకపోవడంతో ఆ చిన్నారుల రోదనలు మిన్నంటాయి. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. గల్లంతైన భార్యాభర్తలు రాముడు, సంధ్య (ఫైల్) అన్నివిధాలుగా ఆదుకుంటాం.. : ఎమ్మెల్యే బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి వారి కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం నుంచి అందే రైతు బీమాతోపాటు ఇద్దరు చిన్నారులకు రూ.5లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. ఇద్దరి ఆచూకీ తెలిసే వరకు గాలింపు చర్యలు చేపడతామని ఆయనతోపాటు అధికారులు తె లిపారు. గాలింపు చర్యల్లో తహసీల్దార్ ఝాన్సీరాణి, గట్టు ఎస్ఐ మల్లేష్, ఆర్ఐ మద్దిలేటి, మహేందర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
నగరంలో పారిశుద్ధ్యం మెరుగుపడాలి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగర పరిధిలో పారిశుద్ధ్యం ఇంకా మెరుగుపడాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాకాలం కావడంతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సీజనల్ వ్యాధులైన డెంగీ, మలేరియా, విషజ్వరాలు సోకకుండా, అలాగే వీధి కుక్కల నియంత్రణకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఇటీవలి భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు శాశ్వత ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టాలన్నారు. మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ల నుంచి అద్దె బకాయిలను వసూలు చేయాలన్నారు. స్థానిక ఆర్అండ్బీ జంక్షన్లో ఏర్పాటు చేసిన మహాకేఫ్లో ఆహార పదార్థాలను తయారీ చేసి అమ్ముకోవడానికి శిక్షణ పొందిన ఎస్హెచ్జీ మహిళలు ముందుకు రావాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.ప్రవీణ్కుమార్రెడ్డి, ఏఎంసీ అజ్మీరా రాజన్న, ఏసీపీ జ్యోత్సా ్నదేవి, ఇన్చార్జ్ ఎంఈ నర్సింహ, డీఈఈ హేమలత, ఏఈలు వైష్ణవి, వసంత, నుస్రత్, రాగవనిత, ఆర్ఓ–2 యాదయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్లు లక్ష్మయ్య, శ్రీనివాస్జీ, హెల్త్ అసిస్టెంట్ వజ్రకుమార్రెడ్డి, ఇన్చార్జ్ డీఎంసీ ఎం.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
నిజాయితీ చాటుకున్న రైతు
అమరచింత: నిజాయితీ కరువైన ఈ రోజుల్లో సమాజంలో ఇంకా నీతి నిజాయితీ ఉందని నిరూపించాడు అమరచింతకు చెందిన రైతు కొండన్న. వ్యవసాయ రుణం రెన్యూవల్ కోసం బుధవారం పట్టణంలోని యూనియన్ బ్యాంక్కు వెళ్లిన కొండన్నకు బ్యాంక్ లోపల 5 తులాల బంగారు గొలుసు కిందపడి ఉండటం గమనించాడు. వాటిని చేతిలోకి తీసుకుని చూడగా బంగారు నానుగా గుర్తించాడు. ఎవరైనా రైతులు పారేసుకున్నారని బావించి అక్కడే ఉన్న బ్యాంక్ మెనేజర్ రామకృష్ణకు బంగారు గొలుసు అందించాడు. సుమారు రూ.5 లక్షల పైగా విలువైన బంగారు గొలుసును నిజాయితీగా బ్యాంక్ మెనేజర్కు అప్పగించడంతో పలువురు అభినందించారు. ఈ విషయంపై మేనేజర్ను అడుగగా బ్యాంకులో బంగారు గొలుసు దొరికిందని రైతు కొండన్న తమకు అప్పగించాడన్నారు. గొలుసు పోగొట్టుకున్న రైతు వస్తే విచారించి వారికి అందిస్తామన్నారు. -
మీ పంచాయితీల్లోకి మమ్మల్ని లాగొద్దు
సాక్షి ప్రతినిధులు, భద్రాద్రి కొత్తగూడెం/మహబూబ్నగర్: ‘ఏమైనా సమస్యలు ఉంటే కుటుంబంలో కూర్చుని చర్చించుకుని పరిష్కరించుకోండి.. కాదంటే కుల పెద్ద దగ్గరకు వెళ్లండి.. అదీ కుదరకపోతే మంత్రగాన్ని సంప్రదించండి. అంతేతప్ప మీ గొడవల మధ్యకు మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు? ఒకప్పుడు రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ఉండకూడదని చూశారు. అక్రమ కేసులు పెట్టి ఎంతోమందిని జైళ్లకు పంపించారు. ఇప్పుడు వాళ్లకు వాళ్లే కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారు. నేను హరీశ్రావు, సంతోష్రావు వెనుక ఉన్నానని ఒకరు.. కవిత వెంట ఉన్నానని మరొకరు అంటున్నారు. పదేళ్లలో దోచుకున్న అవినీతి సొమ్మును పంచుకోవడానికి వాళ్లు కొట్లాడుకుంటున్నారు. ఆ చెత్తగాళ్ల వెనుక నేనెందుకుంటా? మిమ్మల్ని ఎప్పుడో ప్రజలు తిరస్కరించారు. నేను నాయకుడిని.. ఉంటే ముందే ఉంటా. పాలమూరు వెనుక, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల వెనుక ఉంటా. వారికి తోడుగా ఉంటా. ప్రజల అభివృద్ధికి కృషి చేస్తా. మీ కుటుంబ, మీ కుల పంచాయితీల్లోకి మమ్మల్ని లాగొద్దు. మాకు ఎలాంటి ఆసక్తి లేదు..’ అని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడులో ఆయన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం నిర్వహించారు. అనంతరం దామరచర్లలో నిర్వహించిన సభలో ప్రసంగించారు. అలాగే మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల శివారులోని ఎస్జీడీ ఫార్మా కార్నింగ్ టెక్నాలజీస్ రెండవ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..చచ్చిన పామును నేనెందుకు చంపుతా..లక్షల కోట్లు దోచుకున్న నాయకుని ఇంట్లో ఈ రోజు నోట్ల కట్టల కోసం పొడుçచుకుంటున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్లకు ఫామ్హౌస్లు, టీవీ చానళ్లు, వార్తా పత్రికలు, బంగ్లాలు ఎన్నో ఆస్తులు సంపాదించి ఇచ్చాడు. కానీ ఈ రోజు ఆ ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయింది. కుటుంబ సభ్యులే ఒకరితో ఒకరు కొట్లాట పెట్టుకుంటున్నారు. ఆ గొడవల వెనక మనం ఉన్నామంటున్నారు. 2023 డిసెంబర్లోనే ఆ కాలనాగును తెలంగాణ ప్రజలు కర్రలతో కొట్టారు. అది ప్రజలను దోచుకుంటున్న అనకొండ అని పెద్ద బండరాయితో తలమీద కొట్టి బొంద పెట్టారు. ఆ చచ్చిన పామును నేను ఎందుకు చంపుతాను.ప్రకృతి శిక్షిస్తూనే ఉంటుంది..ఒకప్పుడు జనతాపార్టీకి గొప్ప పేరు ఉండేది. అది కనుమరుగైంది. కొంతమంది కుట్రల వల్ల తెలుగుదేశం పార్టీ తెలంగాణలో సమస్యను ఎదుర్కొంటోంది. ఇన్ని దుర్మా ర్గాలు చేసిన మీరు ఎట్లా మనుగడ సాగిస్తారు? ప్రకృతి అనేది ముందుంది.. అది శిక్షిస్తూనే ఉంటుంది. చేసిన పాపా లు వెంటాడుతూనే ఉంటాయి. అనుభవించి తీరాల్సిందే. శీనన్నపై నా అంచనాలు తప్పలేదుఈ రోజు నాయకపోడు మహిళ రమణమ్మకు చెందిన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆమె కళ్లలో కనిపించిన ఆనందం చూస్తుంటే.. గతంలో జూబ్లీహిల్స్లో డూప్లెక్స్ ఇల్లు కట్టుకున్నప్పుడు నేను పడిన సంతోషం గుర్తుకొచ్చింది. ఆ సంతోషం డబ్బుతో వచ్చేది కాదు. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేందుకు నాకు బలమైన మనిషి అవసరం పడింది. అందుకే హైకమాండ్ దగ్గర పట్టుబట్టి మరీ గృహ నిర్మాణ శాఖను పొంగులేటి శీనన్నకు కేటాయించా. నా అంచనాలు తప్పలేదు.. ఢిల్లీ ముందు తలదించుకోవాల్సిన అవసరం లేకుండా అప్పగించిన పనిని 99.99 శాతం శీనన్న నెరవేరుస్తాడనే నమ్మకం ఉంది. వైఎస్సార్ హయాంలో 2004లో మొదలైన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా 20 లక్షల ఇళ్లు కట్టించాం. హనుమాన్గుడి లేని ఊరు ఉంటుందేమో కానీ ఇందిరమ్మ ఇళ్లు లేని ఊరు ఉండదు.పాలమూరును చూడటానికి విదేశీయులు రావాలిఒకప్పుడు పాలమూరులో మన కరువును, పేదరికాన్ని, వెనుకబాటుతనాన్ని చూపించడానికి అప్పటి ముఖ్యమంత్రు లు విదేశాల నుంచి పర్యాటకులు, ప్రెసిడెంట్లను తీసుకొచ్చా రు. టోనీబ్లెయిర్ వచ్చిండంటే మన పేదరికం ఎగ్జిబిషన్గా ఉండే. ఇప్పుడు ప్రజలు, మన సాగునీటి ప్రాజెక్టులు, విద్యావసతులు చూడడానికి విదేశాల నుంచి రావాలి. దేవరకద్ర ఎమ్మెల్యే కోరినట్లు డ్రైపోర్టు ఏర్పాటు అంశాన్ని పరిగణనలోకి తీసుకొంటాం. విదేశాల నుంచి మేధావులు ఇక్కడి ట్రిపుల్ ఐటీని చూసేందుకు రావాలి.దత్తత గ్రామానికే న్యాయం చేయలేదు: మంత్రి పొంగులేటిదామరచర్ల సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ..ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని వాసాలమర్రి గ్రామాన్ని సీఎం హోదాలో కేసీఆర్ దత్తత తీసుకున్నారని, ఆ గ్రామంలో ఓ 90 ఏళ్ల అవ్వకు ఇల్లు కట్టించి ఇస్తానని హామీ ఇచ్చి నిలుపుకోలేదని విమర్శించారు. కానీ తమ ప్రభుత్వం ఆ అవ్వకు ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇచ్చిందని తెలిపారు. గృహ ప్రవేశం చేసి.. పట్టు వస్త్రాలు అందజేసి..సీఎం బెండాలపాడు చేరుకోగానే స్థానికులు ఆయనకు కొమ్ముకోయ నృత్యాలతో స్వాగతం పలికారు. నాయక్పోడు మహిళ బచ్చల రమణ ఇంటికి సీఎం వెళ్లారు. రిబ్బన్ కట్ చేసి లోపలికి వెళ్లి అన్ని గదుల్లో కలియదిరిగారు. దేవుడి పటాల ముందు జ్యోతి వెలిగించి కుటుంబ సభ్యులకు పట్టు వస్త్రాలు అందజేశారు. ఇంటి ఆవరణలో మొక్కలకు నీరు పోశారు. అనంతరం కుటుంబ సభ్యులతో గ్రూప్ ఫొటో దిగారు. ఆ తర్వాత బచ్చల నర్సమ్మ ఇంటి గృహప్రవేశంలో సీఎం పాల్గొన్నారు. ముందు గదిలో చాపపై కూర్చుని మిఠాయిలు తిన్నారు. ఇంటి యజమానురాలి మనవరాలికి పాయసం తినిపించారు. వారికి వస్త్రాలు అందజేసి గ్రూప్ ఫొటో దిగారు. కాగా సీఎం రేవంత్రెడ్డిని, మంత్రి పొంగులేటిని ఇందిరమ్మ ఇంటి యజమానులు సత్కరించారు.మీ పిల్లలకు కొరియా, జపాన్లో ఉద్యోగాలు ఇప్పిస్తా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బహిరంగ సభలో సీఎం రేవంత్రెడ్డి సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘ఐటీ చదివిన వారు అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అందరికీ ఐటీ కోర్సులు చదివే అవకాశం రాకపోవచ్చు. సాధారణ విద్యతోనే సరిపెట్టుకోవాల్సి రావొచ్చు. ఇ లాంటి వారికి కూడా ఏటీసీలతో స్కిల్స్ నేర్పించి సింగపూర్, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో ఉద్యోగం చేసే అవకాశాన్ని మా ప్రభుత్వం కల్పిస్తుంది’అని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. దామరచర్ల సభలో రేవంత్ బుధవారం మాట్లాడుతూ.. గత సీఎం ప్రజలను గొర్రెలు కాసుకోమని, చేపలు పట్టుకోమని, చెప్పులు కుట్టుకోమని చెప్పి.. ఆయన పిల్లలను రాజ్యాలు ఏలాలి, ప్రజా సంపద దోచుకోవాలని చెప్పారని విమర్శించారు. తమ ప్రభుత్వం అలా ఉండదని, పేదరికం రూపుమాపే, తలరాతను మార్చే శక్తి ఉన్న విద్యను అందించడంపై దృష్టి పెడుతోందని తెలిపారు. కొందరు నాయకులకు పేదరికం ఎక్స్కర్షన్ వంటిదని, కానీ తనతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పేదరికంలోనే పుట్టి, అందులోనే పెరిగామని చెప్పారు. అది తమ జీవన విధానంలో ఓ భాగమని అన్నారు. తల్లులూ సంతోషంగా ఉన్నారా?!చండ్రుగొండ: ‘తల్లులూ.. సంతోషంగా ఉన్నారా? మేం వచ్చాక రేషన్కార్డులు, సన్న బియ్యం ఇచ్చాం.. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం.. మీ ఊర్లో ఎందరికి ఇళ్లు వచ్చాయి?’అని చండ్రుగొండ మండలం బెండాలపాడులో గృహప్రవేశాల సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మహిళలను ఆరా తీశారు. సీఎం ప్రశ్నకు మహిళలంతా ముక్తకంఠంతో 310 మందికి వచ్చాయని సమాధానం చెప్పారు. దీంతో సీఎం స్పందిస్తూ ‘మీ కళ్లల్లో సంతోషమే మీరు ఎంత ఆనందంగా ఉన్నారో చెబుతోంది’అని అన్నారు. మీ ఇంటి మంత్రి ఎవరు? అని సీఎం ప్రశ్నించగా.. ఆదివాసీ మహిళలు ‘పొంగులేటి అన్న’అని చెప్పారు. ‘దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు ఇళ్లు కట్టుకుంటే.. మళ్లీ ఇప్పుడు ఇళ్ల నిర్మాణాలతో కళ కనిపిస్తోంది’అని సీఎం తెలిపారు. బెండాలపాడులో బచ్చల రమణ, బచ్చల నరసమ్మ ఇళ్ల గృహప్రవేశాలు చేయించిన సీఎం పూజ చేశారు. ఇల్లు రావడమే గొప్ప అనుకున్నాం.. ఇందిరమ్మ ఇల్లు రావడమే గొప్ప అనుకున్నా. అలాంటిది ఇంటి నిర్మాణం పూర్తి కావడం.. స్వయంగా ముఖ్యమంత్రి మాకు బట్టలు పెట్టి గృహప్రవేశం చేయించడాన్ని నమ్మలేకపోతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం మేలు మరిచిపోలేము. సీఎం సార్ను శాలువాతో సన్మానించాం. నా కూతురు ఝాన్సీ, ఆమె బిడ్డ వెన్సికతో సీఎం మాట్లాడి పేర్లు అడిగారు. – బచ్చల నరసమ్మ, లబ్దిదారు, బెండాలపాడు ఈ సంతోషం మాకెప్పటికీ పదిలం రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా మా ఇంటికి వచ్చి మాతో గృహప్రవేశం చేయించడం ఆనందంగా ఉంది. ఈ సంతోషాన్ని జీవితకాలం పదిలంగా గుండెల్లో దాచుకుంటాం. మా ఇంట్లో సీఎం రేవంత్రెడ్డి పూజ చేశారు. మేము వండిపెట్టిన పాయసం, గారెలు తిన్నారు. ఇలాంటి పాలన ఉంటే పేదల బతుకులు మారినట్లే. – బచ్చల రమణ, లబి్ధదారు, బెండాలపాడు -
పీయూలో హెచ్ఓడీల నియామకం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూలో పలు డిపార్ట్మెంట్లకు సంబంధించి హెచ్ఓడీలను నియమిస్తూ మంగళవారం వీసీ శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. కెమిస్ట్రీ హెచ్ఓడీగా విజయలక్ష్మి, ఫిజిక్స్ హెచ్ఓడీగా అంకం భాస్కర్, పొలిటికల్ సైన్స్ హెచ్ఓడీగా కుమారస్వామి, ఇంగ్లిష్ హెచ్ఓడీగా మాలవి, మైక్రో బయోలజీ హెచ్ఓడీగా మధుసూదన్రెడ్డిని ఫాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ డీన్గా ఓయూ అధ్యాపకుడు ఎం.రాములును, ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ డీన్గా కృష్ణచైతన్య, ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ డీన్గా రామకృష్ణను నియమించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, ఆడిట్సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
13న జాతీయ లోక్ అదాలత్
పాలమూరు: జిల్లా ప్రధాన కోర్టుతో పాటు జడ్చర్లలో ఈనెల 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో పెండింగ్లో ఉన్న కేసులు రాజీ చేసుకోవాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి అన్నారు. జిల్లా కోర్టులో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జాతీయ లోక్ అదాలత్పై వివరాలు వెల్లడించారు. కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు, ఇప్పటి వరకు కోర్టు ముందుకు రాని కేసులు పరిష్కరించుకోవడానికి ఈ వేదిక ఉపయోగపడుతుందన్నారు. న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న సివిల్ కేసులు లోక్ అదాలత్కు పంపిన తర్వాత పరిష్కారం అయితే చెల్లించిన కోర్టు ఫీజు సైతం కక్షిదారులకు తిరిగి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. లోక్ అదాలత్ ద్వారా ఇరువర్గాలు తక్షణ పరిష్కారం పొందవచ్చునని, దీంతో ఇరువర్గాలు గెలుపొందినట్లు అవుతుందన్నారు. డబ్బు వృథా కాకుండా ఈ తీర్పుతో ఇరు పక్షాల మధ్య మంచి సంబంధాలు ఏర్పడుతాయని తెలిపారు. క్రిమినల్, సివిల్, భూతగాదాలు, డబ్బు రికవరీ, రోడ్డు ప్రమాదాలు, చిట్ఫండ్, విద్యుత్, ప్రిలిటిగేషన్ కేసులు, ఈ–పెట్టీ, డ్రంకెన్డ్రైవ్, చెక్ బౌన్స్, బ్యాంకులు, బీఎస్ఎన్ఎల్, ఇన్సూరెన్స్, స్పెషల్ ఎన్ఐ యాక్ట్ కేసులు రాజీ చేసుకోవడానికి వీలుంటుందన్నారు. మహబూబ్నగర్లో ఆరు బెంచీలు, జడ్చర్లలో రెండు బెంచీలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 1,748 కేసులను గుర్తించి కక్షిదారులకు నోటీసులు జారీ చేశామన్నారు. సమావేశంలో న్యాయమూర్తి డి.ఇందిర పాల్గొన్నారు. ఇద్దరు సీఎంలు కలిసి కేసీఆర్పై కుట్ర జడ్చర్ల: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్పై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ను ఎలాగైనా బద్నాం చేయాలనే దురుద్దేశంతోనే సీబీఐకి అప్పగించిందన్నారు. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు కేంద్ర ప్రభుత్వ జేబు దర్యాప్తు సంస్థలని చెప్పిన సీఎం రేవంత్రెడ్డి.. రాత్రికి రాత్రి సీబీఐకి కేసును అప్పగించడం వెనుక ఉన్న మర్మమేమిటని ప్రశ్నించారు. తెలంగాణ గోదావరి జలాలను ఆంధ్రాకు తరలించే కుట్రలో భాగమే ఈ కేసు అన్నారు. తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా ఏర్పాటైన బీఆర్ఎస్ను ఎవరూ ఏమీ చేయలేరన్నారు. గత కాంగ్రెస్ పాలనలో కనీసం తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టిన దాఖలాలు లేని పరిస్థితులు ఉండేవని గుర్తుచేశారు. ఇలాంటి నేపథ్యంలో మిషన్ భగీరథ ద్వారా నిరంతరాయంగా తాగునీటిని అందించిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. రాష్ట్రంలో రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. డ్రామాలు చేస్తున్నారని పాలకులు అంటున్నారని మండిపడ్డారు. తమ పాలనలో ఎక్కడా యూరియా కష్టాలు రానివ్వకుండా చర్యలు చేపట్టామన్నారు. సీఎం రేవంత్కు పరిపాలన చేయడం రావడం లేదన్నారు. ఆయన ఎప్పుడు ఢిల్లీ, ఇతర రాష్ట్రాలు, విదేశాల్లోనే ఎక్కువ కాలం ఉంటున్నారన్నారు. రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. కవితను సాగనంపడం సబబే.. ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెన్షన్ చేయడం సబబేనని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. తప్పు చేస్తే కుటుంబ సభ్యులైనా సహించేది లేదంటూ గతంలోనే అధినేత కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు. దీంతో పార్టీ కంటే ఎవరూ పెద్ద కారన్నది స్పష్టమైందని అన్నారు. ఆనాడు తెలంగాణ కోసం చావు నోట్లో తలపెట్టిన కేసీఆర్.. నేడు పార్టీ పరిరక్షణ కోసం కన్నబిడ్డనే పార్టీ నుంచి బహిష్కరించడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, జెడ్పీ మాజీ వైస్చైర్మన్ యాదయ్య పాల్గొన్నారు. -
జిల్లాకు చేరిన 450 మె.ట. యూరియా
జడ్చర్ల టౌన్: జిల్లాకు 450 మెట్రిక్ టన్నుల క్రిబ్కో యూరియా రేక్తో కూడిన గూడ్స్ రైలు మంగళవారం జడ్చర్ల రైల్వేస్టేషన్కు చేరుకుంది. మండలాల వారీగా కేటాయింపుల ప్రకారం లారీల ద్వారా యూరియా సరఫరా చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. యూరియా వచ్చిన సమాచారం అందుకున్న కలెక్టర్ విజయేందిర.. జడ్చర్ల రైల్వేస్టేషన్కు చేరుకొని యూరియా రేక్ను పరిశీలించారు. జిల్లాలోని అన్ని మండలాలకు సరఫరా చేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వెంకటేశ్వర్లును ఆదేశించారు. అనంతరం కలెక్టర్ విలేకర్లతో మాట్లాడారు. ప్రస్తుతం 450 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని.. త్వరలోనే మరింత యూరియా రానుందన్నారు. యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కాగా, యూరియా రేక్ పరిశీలనకు వచ్చిన కలెక్టర్ను స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి కలిశారు. యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను కలెక్టర్కు వివరించారు. జడ్చర్ల నియోజకవర్గానికి 200 మెట్రిక్ టన్నులు కేటాయించాలని కోరారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఇన్చార్జీ ఏడీ గోపినాథ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జ్యోతి, మున్సిపల్ చైర్పర్సన్ పుష్పలత ఉన్నారు. ● జిల్లాకు కేటాయించిన యూరియాను లారీల ద్వారా ఆయా ప్రాంతాలకు సరఫరా చేయడాన్ని డీఏఓ వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూరియా విక్రయాల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అన్నారు. జూన్, జూలైలో యూరియా పక్కదారి పట్టిందని ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి కలెక్టర్కు ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకురాగా.. పై విధంగా స్పందించారు. జడ్చర్ల పరిధిలో జరిగిన యూరియా పంపిణీపై విచారణ చేయాలని ఇన్చార్జి ఏడీ గోపినాథ్ను ఆయన ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా వానాకాలంలో 3,64,523 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు కాగా.. 38,787 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమన్నారు. ఇదివరకే 21,376 మెట్రిక్ టన్నులు వచ్చిందని.. ప్రస్తుతం మరో 450 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని తెలిపారు. -
ధర్నాలు.. రాస్తారోకోలు
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు జడ్చర్ల మండలం ఈర్లపల్లి తండాకు చెందిన మేఘావత్వాల్యానాయక్. తనకున్న 20 ఎకరాల్లో వరిపంట సాగుచేస్తున్నాడు. ఇప్పటి వరకు తిరిగి తిరిగి 10 బస్తాల యూరియాను తీసుకెళ్లాడు. మరో 10 బస్తాల యూరియా అవసరం ఉంది. దీంతో కుటుంబసభ్యులతో కలిసి ఆగ్రో రైతు సేవాకేంద్రం వద్దకు రోజూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. 10 రోజులుగా తిరుగుతున్నా యూరియా దొరక్కపోవడంతో నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోతున్నాడు. యూరియా వేయక పైరు పాడైపోతుందని ఆయన వాపోతున్నాడు. మహబూబ్నగర్ (వ్యవసాయం)/ జడ్చర్ల/ జడ్చర్లటౌన్/ దేవరకద్ర/ నవాబుపేట/ హన్వాడ: జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా యూరియా కొరత వేధిస్తోంది. ప్రభుత్వ వైఫల్యమో.. అధికారుల అలసత్వమో.. యూరియా బ్లాక్ మార్కెట్కు తరలడమో.. కారణం ఏదైనా కానీ, రైతులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల పరిధిలో యూరియా కోసం రైతులు పడే తిప్పలు వర్ణణాతీతంగా మారాయి. తెల్లవారుజాము నుంచే పీఏసీఎస్, ఆగ్రోస్ కేంద్రాల వద్ద రైతులు క్యూకడుతున్నారు. యూరియా కోసం గంటల తరబడి రైతులు, మహిళలు క్యూలైన్లలో నిలబడాల్సిన దుస్థితి దాపు రించింది. ఈ క్రమంలో యూరియా కోసం రైతుల నిరసనలు, ధర్నాలతో మంగళవారం జిల్లా అట్టుడికింది. జాతీయ రహదారిపై రాస్తారోకో దేవరకద్రకు మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకే వచ్చిన రైతులు రోడ్లపై తిరుగుతూ షాపులు ఎప్పుడు తెరుస్తారా అని ఎదురుచూస్తూ కనిపించారు. ఈ క్రమంలో కొందరు వ్యాపారులు రైతులను రెచ్చగొట్టడంతో కొత్త బస్టాండ్ సమీపంలోని జాతీయ రహదారిపైకి వచ్చి నినాదాలు చేశా రు. ఉదయం 6గంటల నుంచి దాదాపు గంట పాటు రాస్తారోకో చేయడంతో రాయిచూర్– మహబూబ్నగర్ రహదారికి ఇరువైపులా వందలాది వాహనాలు నిలిచిపోయాయి. విష యం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో అక్కడి కి వ్యవసాయాధికారి రావడంతో రైతులు వారిని నిలదీశారు. యూరియా ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదలమని భీష్మించి కూర్చున్నారు. అయితే రైతులను సముదాయించి పీఏసీఎస్ వద్ద టోకెన్లు జారీ చేస్తామని, తర్వాత యూరియా ఇస్తామని చెప్పడంతో రైతులు పీఏసీఎస్ వద్దకు పరుగులు తీశారు. అక్కడ తోపులాటల మధ్య రైతులు టోకెన్లు తీసుకున్నారు. రోజంతా పడిగాపులు నవాబుపేటలో యూరియా కోసం రైతులు రోజంతా పడిగాపులు కాయాల్సి వచ్చింది. స్థానిక కొండాపూర్ చౌరస్తాలో రైతులు నిరసనకు దిగడంతో రాకపోకలు నిలిచిపోవడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. యారియా వచ్చే దాకా ఆందోళన చెస్తామని తేల్చిచెప్పడంతో ఎస్ఐ విక్రమ్, మండల వ్యవసాయాధికారి కృష్ణకిషోర్తో వచ్చి మాట్లాడారు. రాత్రి వరకు స్థానిక పీఏసీఎస్కు యూరియా వస్తుందని, బుధవారం పంపిణీ చేస్తామని నచ్చజెప్పడంతో ఆందోళన విరమింపజేశారు. స్టాకు రావడంతో బుధవారం ఉదయమే యూరియా పంపిణీ చేస్తారనే ఉద్దేశంతో కొందరు రైతులు నవాబుపేట పీఏసీఎస్ కేంద్రం రాత్రి నుంచే వేచి ఉన్నారు. వర్షంలోనూ రైతుల నిరీక్షణ హన్వాడ తెల్లవారుజాము నుంచే రైతుసేవా సహకారం కేంద్రం వద్ద పడిగాపులు కాశారు. ఉదయం యూరియా అందుబాటులో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. సాయంత్రం మూడు లారీల యూరియా రావడంతో ఒక్కసారిగా 1,500 మంది రైతులు ఎగబడ్డారు. పోలీసులు వచ్చి క్యూలైన్లు ఏర్పాటు చేయించి.. యూరియా ఇప్పించారు. వర్షం పడుతున్నా.. క్యూలైన్లో వేచి ఉన్నారు. ఎన్నాళ్లీ నిరీక్షణ -
మానసిక దివ్యాంగులను మనసుతో చూడాలి
మహబూబ్నగర్ రూరల్: మానసిక దివ్యాంగులను మనసుతో చూడాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఇందిర అన్నారు. జిల్లా కేంద్రం టీచర్స్ కాలనీలోని బ్రహ్మ మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలను జడ్జి సందర్శించి న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలలో వసతి సౌకర్యాలు ఎలా ఉన్నాయో పరిశీలించారు. అన్ని సదుపాయాలు అందుతున్నాయా లేవా అని పాఠశాల నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అఽధికారులకు సూచించారు. అలాగే సమస్యలుంటే జిల్లా న్యాయసేవాధికార సంస్థ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. దివ్యాంగుల తల్లిదండ్రులకు వైకల్యం ఉన్న పిల్లలను ఉత్సాహం, ధైర్యం కలిగించడం కోసం లీగల్ సర్వీసెస్ యూనిట్ ఫర్ మనోన్యాయ, దివ్యాంగన్ కౌశల్ వికాస్, దివ్యాంగన్ రోజ్గార్ సేతు వంటి స్కీం అందుబాటులో ఉన్నాయన్నారు. బ్రహ్మ మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల మానసిక దివ్యాంగులకు ఒక ఆలయం లాంటిదన్నారు. ఇక్కడి పిల్లలు విద్యాబుద్ధులతోపాటు ఒకేషనల్, కంప్యూటర్ శిక్షణ మొదలగునవి పొందుతున్నారని, రోజువారి దినచర్యలో చేపట్టే కార్యక్రమాలు, ఫిజియోథెరపి, స్పీచ్థెరపి, బిహేవర్ మోడిఫికేషన్ చేస్తున్నారని తెలిపారు. వీటిద్వారా మానసిక దివ్యాంగులు సెరిబ్రల్ పాలసీ చిల్డ్రన్స్ ఫిజియోథెరపి ద్వారా ప్రయోజనం పొందుతున్నారని చెప్పారు. ఈ విధమైన శిక్షణ ఇవ్వడం ద్వారా పిల్లల్లో మనోధైర్యంతోపాటు తెలివితేటలు కూడా మెరుగుపడుతాయన్నారు. కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకుడు గన్నోజు చంద్రశేఖర్, ప్రిన్సిపాల్ సుజాత తదితరులు పాల్గొన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఇందిర -
జూరాలకు తగ్గిన వరద
శ్రీశైలం గేట్లు మూసివేత దోమలపెంట: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో మంగళవారం సాయంత్రం గేట్లన్నీ మూసివేశారు. సాయంత్రం వరకు మూడు గేట్లు తెరిచి దిగువన నాగార్జునసాగర్కు నీటిని విడుదల చేశారు. జూరాల ఆనకట్ట స్పిల్వే నుంచి 69,630, విద్యుదుత్పత్తి చేస్తూ 36,674, సుంకేసుల నుంచి 71,519 క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలం జలాశయానికి చేరింది. ప్రస్తుతం జలాశయంలో 881.8 అడుగుల నీటిమట్టం, 197.9120 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 24 గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడుకు 28,500, హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2,817, ఎంజీకేఎల్ఐకు 417 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ కేంద్రంలో 16.758 మి.యూ., కుడిగట్టు కేంద్రంలో 15.152 మి.యూ. విద్యుదుత్పత్తి చేశారు. ధరూరు/ఆత్మకూర్/మదనాపురం: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద క్రమంగా తగ్గుముఖం పట్టినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. సోమవారం 1,56,615 క్యూసెక్కులు ఉండగా... మంగళవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో 1.26 లక్షలకు తగ్గినట్లు చెప్పారు. దీంతో ప్రాజెక్టు 10 క్రస్ట్గేట్లను పైకెత్తి 69,630 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. విద్యుదుద్పత్తి నిమిత్తం 36,674 క్యూసెక్కులు, నెట్టెంపాడుకు 750, ఆవిరి రూపంలో 67, ఎడమ కాల్వకు 920, కుడి కాల్వకు 500, భీమా లిఫ్ట్కు 750 క్యూసెక్కులు వినియోగించినట్లు చెప్పారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.048 టీఎంసీలు ఉన్నట్లు తెలిపారు. కొనసాగుతున్న విద్యుదుత్పత్తి.. జూరాల దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో మంగళవారం ఉత్పత్తి కొనసాగినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 6 యూనిట్ల నుంచి 234 మెగావాట్లు, 272.587 మి.యూ, దిగువ 6 యూనిట్ల నుంచి 240 మెగావాట్లు, 299.688 మి.యూ. విద్యుదుత్పత్తి జరిగిందన్నారు. రెండు కేంద్రాల్లో ఇప్పటి వరకు 572.275 మి.యూ. ఉత్పత్తి చేపట్టినట్లు వివరించారు. రామన్పాడులో 1,020 అడుగులు.. మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో మంగళవారం సముద్రమట్టానికి పైన 1,020 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు అధికారులు తెలిపారు. జూరాల ఎడమ కాల్వ ద్వారా 798 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో సరఫరా లేదన్నారు. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 55 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 763 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగించినట్లు చెప్పారు. 10 క్రస్ట్ గేట్లు పైకెత్తి దిగువకు నీటి విడుదల -
రేపు మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్రెడ్డి విగ్రహావిష్కరణ
● హాజరుకానున్న డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ స్టేషన్ మహబూబ్నగర్: ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పటిష్టత, ఈ ప్రాంత అభివృద్ధి కోసం దివంగత మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్రెడ్డి చేసిన సేవలు మరువలేనివని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థిదశ నుంచి రాష్ట్ర, జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. టీడీపీ హయాంలో ఈ ప్రాంతంలో సాగు, తాగునీటి కోసం ఎన్నో ఉద్యమాలు చేశారని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం పార్టీకి చెందిన ఇతర నాయకులతో కలిసి కొల్లాపూర్ నుంచి నారాయణపేట, అలంపూర్ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్రలు చేసినట్లు తెలిపారు. ఈనెల 4న గురువారం జిల్లా కేంద్రం పద్మావతీకాలనీలోని గ్రీన్బెల్టులో మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్రెడ్డి విగ్రహాష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు మహేష్కుమార్గౌడ్, ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, నాయకులు సంజీవ్ ముదిరాజ్, వినోద్కుమార్, చంద్రకుమార్గౌడ్, సీజే బెనహర్, సిరాజ్ఖాద్రీ, రాజేందర్రెడ్డి, గోపాల్యాదవ్, జహీర్ అఖ్తర్, లింగం నాయక్, అజ్మత్అలీ తదితరులు పాల్గొన్నారు. -
15 రోజులుగా పడిగాపులే..
15రోజులుగా యూరియా కోసం తిరుగుతున్నా. ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నా. పంటకు యూరియా వేయకుంటే ఆశలు వదులుకునే పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం ఇంత కష్టం వస్తుందని తెలిస్తే పంటల జోలికి వెళ్లేవాడిని కాదు. – రాజు, రైతు, చెన్నారెడ్డిపల్లి, నవాబుపేట అప్పులు చేసి పంటసాగు.. అప్పులు చేసి వరిపంట వేసుకున్నా. యూరియా వేసుకునే అదును వచ్చింది. ఇక్కడ చూస్తే ఎవరు యూరియా అమ్ముతారో తెలియని పరిస్థితి ఉంది. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకే వచ్చా. వారం రోజులుగా వస్తున్నా కావాల్సిన యూరియా దొరకడం లేదు. – ఉంద్యాల లక్ష్మి, మహిళా రైతు, గోపన్పల్లి, దేవరకద్ర చేతకావడం లేదు.. అయ్యా.. చేత కావడం లేదు. రెండు సంచుల యూరియా ఇప్పించండి. రోజు వచ్చి పడిగాపులు పడుతున్నా. లైన్లో నిలబడలేకపోతున్నా. వచ్చినప్పుడల్లా లైన్ చూసి వెళ్లిపోతున్నా. పంటకు యూరియా చల్లాలి. ఎవరైనా కనికరించండి. – వెంకటమ్మ, వృద్ధ మహిళా రైతు, చిన్నచింతకుంట ● -
భాషా పండితుల పాత్ర కీలకం: ఎమ్మెల్యే
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో భాషాపండిత్ల పాత్ర కీలకమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. స్థానిక బీకేరెడ్డి కాలనీలోని మహబూబ్నగర్ ఫస్ట్–నవరత్నాలు శిక్షణ కేంద్రంలో రెండోరోజు మంగళవారం ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మ్యాథ్స్, సైన్స్, బయాలజీ, సోషల్ స్టడీస్ సబ్జెక్టులలో పట్టు సాధించేందుకు ల్యాంగ్వేజెస్ ప్రధాన భూమిక పోషిస్తాయన్నారు. వీటి ద్వారా ఇతర సబ్జెక్టులను సులభంగా అర్థం చేసుకోవచ్చన్నారు. ‘శత శాతం’తో పాఠశాలల్లో విద్యార్థుల డ్రాపౌట్స్ తగ్గాయని పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు పుస్తక పఠనం అలవాటు చేయాలని, ముఖ్యంగా స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిజిస్టర్ (ఎస్ఐఆర్) నిర్వహించాలన్నారు. అనంతరం ఇక్కడి ఆవరణలో ఏర్పాటుచేసిన గణేష్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో డీఈఓ ప్రవీణ్కుమార్, సీఎంఓ బాలుయాదవ్, ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్, వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రవీందర్, మహబూబ్నగర్ ఫస్ట్ కేంద్రం ఇన్చార్జ్ నిజలింగప్ప తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ బాంబు తుస్సుమంది
● కాళేశ్వరం అవినీతిని వెలికితీయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం ● కవిత రాజకీయ జిమ్మిక్కులు చేస్తోంది: ఎంపీ డీకే అరుణ పాలమూరు: అంతా.. ఇంతా అంటూ గొప్పలు చెప్పి ఇప్పుడు చేసేదేమి లేక సీబీఐ విచారణ అంటున్నారని, కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన అవినీతిని వెలికితీయడంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, ఆపార్టీ వ్యవహారం చూస్తుంటే అవినీతికి పాల్పడిన వాళ్లను కాపాడుతున్నట్లు ఉందని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు ఆరోపించారు. కాంగ్రెస్ బాంబు పేలలేదని, కాంగ్రెస్ చెప్పే ఏ బాంబు అయినా ఇలాగే తుస్సు మంటుందన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత మొత్తం సొమ్ము కక్కిస్తామని చెప్పిన మాటలు ఎక్కడపోయాయని విమర్శించారు. విచారణ కమిటీ రిపోర్ట్ నివేదికలు అంటూ తాత్సరం చేసి ఇప్పుడు అర్ధరాత్రి వరకు సభ ఏర్పాటు చేసి 20 నెలల తర్వాత సీబీఐ విచారణ అంటున్నారన్నారు. ‘మీరు వేసిన కమిషన్ మీద మీకు నమ్మకం లేదా? మీ మీద మీకు నమ్మకం లేదా..’ అంటూ హేళన చేశారు. ఆ కమిటీ నివేదిక ద్వారా ఏం తేల్చారని, ఎవరిని దోషులుగా చూపారో ఎందుకు బయటపెట్టాలేదని ప్రశ్నించారు. కమిటీ సూచనల ప్రకారం నిందితులపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. దొంగలు దొంగలు గట్టు పంచుకున్నట్లు, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దొందు దొందుగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. కాళేశ్వరం విషయంలో ఎమ్మెల్సీ కవిత డైలాగ్స్ చెబుతోందని, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని స్వయంగా కవిత ఒప్పుకోవడం జరిగిందన్నారు. కానీ ఆ అవినీతిలో కేసీఆర్కు సంబంధం లేదంటూ చెప్పడం.. ఇదేక్కడి చోద్యం అన్నారు.ఈ రాష్ట్రాన్ని పదేళ్లు పాలించింది వాళ్ల కుటుంబమే కదా, కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్ కుటుంబసభ్యులు అందరికీ సంబంధం ఉందన్నారు. కవిత రాజకీయ జిమ్మిక్కులు చేస్తోందని, పదేళ్లు వన్సైడ్ రాజకీయం చేసిన కేసీఆర్కు ఇందులో భాగస్వామ్యం లేదని చెప్పాడం హాస్యాస్పదంగా ఉందన్నారు. -
నేడు సీఎం రేవంత్ పర్యటన
● వేముల ఎస్జీడీ ఫార్మా పరిశ్రమ రెండో యూనిట్ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి ● ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే మహబూబ్నగర్ క్రైం/ అడ్డాకుల: మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల శివారులోని ఎస్జీడీ ఫార్మా కార్నింగ్ టెక్నాలజీస్ రెండో యూనిట్ను బుధవారం ఉదయం 11.30 గంటలకు సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి పరిశ్రమ వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు మంగళవారం కంపెనీ ముందున్న స్థలంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ను కలెక్టర్ విజయేందిర, ఎస్పీ జానకి, ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి పరిశీలించారు. అలాగే పరిశ్రమ లోపల జరిగే కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించి కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. సుమారు 1.45 గంటల పాటు సీఎం ఇక్కడ ఉండనున్నారు. మధ్యాహ్నం 12.45 గంటలకు హెలీకాప్టర్లో తిరిగి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమానికి వెళ్లనున్నారు. సీఎంతోపాటు పలువురు మంత్రులు, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. కాగా.. కొత్తగా ఏర్పాటు చేసిన రెండో యూనిట్ ద్వారా మరో 200 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. 956 మందితో భద్రతా ఏర్పాట్లు ఎస్జీడీ ఫార్మాలో రెండో యూనిట్ ప్రారంభానికి సీఎం రేవంత్రెడ్డి రానుండటంతో ఎస్పీ డి.జానకి బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించారు. హెలిప్యాడ్, ట్రాఫిక్, వీఐపీ రాకపోకల మార్గాలను పరిశీలించి తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై అధికారులతో చర్చించారు. అనంతరం బందోబస్తు విధులు నిర్వహించనున్న పోలీస్ అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. ఆయా విభాగాల నుంచి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రధానంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాతో పాటు నల్లగొండ, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి పోలీస్ బలగాలు విధులు నిర్వహించడానికి వేములకు చేరుకున్నారు. ఇద్దరు ఎస్పీలు, ఒక ఏఎస్పీ, ఐదుగురు డీఎస్పీలు, 27 మంది సీఐలు, 69 మంది ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్కానిస్టేబుళ్లు 173 మంది, కానిస్టేబుళ్లు 461 మంది, మహిళా సిబ్బంది 129, హోంగార్డులు 89 మందికి విధులు కేటాయించారు. -
6న ‘సివిల్ సర్వీసెస్’క్రీడాకారుల ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్లో పాల్గొనే జిల్లాస్థాయి క్రీడాకారుల ఎంపికలను ఈనెల 6న స్థానిక మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే ఉద్యోగులు తమ ఉద్యోగ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డుతో పాటు ఉదయం 7.30 గంటలకు స్టేడియంలో అథ్లెటిక్స్ కోచ్ సునీల్కుమార్ (9440656162) వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. ఈనెల 9, 10 తేదీల్లో రాష్ట్రస్థాయి ఎంపికలు ఉంటాయని ఆయన తెలిపారు. యూరియాపై ప్రతిపక్షాల రాద్ధాంతం దేవరకద్ర: యూరియాపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన దేవరకద్రలో విలేకరులతో మాట్లాడారు. కావాలని సమస్యను సృష్టిస్తున్నాయని భూత్పూర్లో కూడా తూతూ మంత్రంగా ధర్నాలు చేశారని విమర్శించారు. రైతులు లేకుండా వారి కార్యకర్తలతో ధర్నాలు చేస్తూ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. అక్కడక్కడ చిన్నచిన్న కొరత ఏర్పడుతుందని, అది కూడా లేకుండా చూడాలని అధికారులకు చెప్పినట్లు పేర్కొన్నారు. రెండు రోజుల్లో ఎలాంటి కొరత లేకుండా యూరియా పంపిణీ చేస్తామని చెప్పారు. రైతు బిడ్డగా రైతుల బాధలు తెలిసిన తాను రైతులకు కొరత లేకుండా చూస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. లైసెన్స్డ్ సర్వేయర్లకు ప్రాక్టికల్ మహబూబ్నగర్ న్యూటౌన్: జిల్లాలో గత మే నెలలో స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగా అర్హులైన అభ్యర్థులకు లైసెన్స్డ్ సర్వేయర్లుగా నియమించేందుకు అవసరమైన శిక్షణను జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో శిక్షణ అందిస్తున్నారు. చైన్ సర్వే, టోటల్ సర్వే వంటి వాటిపై అవగాహన కల్పిస్తూ హద్దుల గుర్తింపు, సర్వే నంబర్లలోని సబ్డివిజన్ సమస్యపై చేపట్టాల్సిన అంశాలపై అవగాహన కల్పించారు. జిల్లాలో 230 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా మొదటి బ్యాచ్ 98 మంది అభ్యర్థులకు క్షేత్రస్థాయిలో భూ సర్వేపై శిక్షణ అందించి పరీక్షలు నిర్వహించారు. రెండో బ్యాచ్ 132 మంది అభ్యర్థులకు గాను 109 మంది ఏనుగొండ శివారు బైపాస్ సమీపంలో క్షేత్రస్థాయి శిక్షణకు హాజరవుతున్నారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ఎండీ మూసా, రిటైర్డ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే అధికారి పర్వతాలు ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి భూసర్వేపై అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నారు. రెండో బ్యాచ్ శిక్షణ ఆగస్టు 9 నుంచి అక్టోబర్ 22 వరకు కొనసాగనుంది. శిక్షణ అనంతరం ఈ నెల 23న పరీక్ష నిర్వహించి.. ఇందులో అర్హత సాధించిన వారికి లైసెన్స్డ్ సర్వేయర్లుగా సర్టిఫికెట్లు అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి ఆర్వోఆర్–2025 చట్టం అమలులో వీరి సేవలు వినియోగించుకోనున్నారు. -
అమృత్ భారత్ స్కీం పనుల్లో వేగం పెంచాలి
గద్వాల న్యూటౌన్/స్టేషన్ మహబూబ్నగర్/అలంంపూర్: మహబూబ్నగర్, గద్వాల రైల్వేస్టేషన్లో అమృత్ భారత్ స్కీం కింద చేపడుతున్న పనులను వేగంగా పూర్తి చేయాలని దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ మేనేజర్ సంతోష్కుమార్ సూచించారు. మంగళవారం ఆయన గద్వాల రైల్వేస్టేషన్ను సందర్శించారు. ప్రత్యేక రైలులో వచ్చిన డీఆర్ఎం వస్తూనే రైల్వేట్రాక్ను చూసి, పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అధికారులతో కలిసి స్టేషన్, ప్లాట్ ఫాం విస్తీర్ణం, ఆర్చి, వెహికిల్ పార్కింగ్, రోడ్ల పనులను పరిశీలించారు. ఆవరణలో మొక్కలు నాటారు. క్రూలాబీ (ట్రైన్ మేనేజర్ల రెస్ట్రూం) తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమృత్ భారత్ స్కీం కింద చేపడుతున్న పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన నూతనంగా నిర్మించిన రైల్వే ఆఫీసర్ల రెస్ట్ హౌస్ను ప్రారంభించారు. డీఆర్ఎం వెంట రైల్వే డివిజనల్ ఇంజినీర్ అరుణ్కుమార్ శర్మ, డివిజనల్ ఎలక్ట్రిక్ ఇంజినీర్ కిరణ్కుమార్, డివిజనల్ సిగ్నల్ టెలికాం ఇంజినీర్ సృజన్కుమార్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ సురేష్కుమార్ ఉన్నారు. జోగుళాంబ రైల్వే హాల్ట్ పరిశీలన జోగుళాంబ రైల్వే హాల్ట్ పనులను సౌత్ సెంట్రల్ రైల్వే డీఆర్ఎం సంతోష్కుమార్ శర్మ పరిశీలించారు. రైల్వే స్టేషన్లో విశ్రాంతి, స్టేషన్ గదులను, హై లెవల్ ప్లాట్ఫాం, షెడ్డు పనులను పరిశీలించారు. అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జోగుళాంబ అమ్మవారి దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. డీఆర్ఎం సంతోష్కుమార్ వర్మ -
స్కాలర్షిప్లు విడుదల చేయాలి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు వెంటనే స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రశాంత్, భరత్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.8 వేల కోట్ల వరకు స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయన్నారు. చాలా మంది పేద విద్యార్థులు స్కాలర్షిప్పై ఆధార పడిచదువుతున్నారని, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చాలా మంది విద్యార్థులు విద్యకు దూరం అవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి స్కాలర్షిప్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా గురుకులాలకు సొంత భవనాలు, కేజీబీవీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, ఏఎన్ఎం పోస్టులను భర్తీ చేయాలని, జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అందించి, అధ్యాపక, ఎంఈఓ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు శ్రీనాథ్, రమేష్, ఈశ్వర్, సాయి, మణికంఠ, హేమలత, జ్ఞాపిక తదితరులు పాల్గొన్నారు. పట్టపగలే ఇంట్లో చోరీ ధన్వాడ: మండలంలోని ఎమ్మెనోనిపల్లిలో ఓ ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. ఎమ్మెనోనిపల్లికి చెందిన కావలి నర్సింహులు మంగళవారం ఇంటికి తాళంవేసి.. కుటుంబ సభ్యులతో కలిసి ఊట్కూర్కు వెళ్లాడు. తిరిగి సాయంత్రం వచ్చి చూడగా.. తలపులు ధ్వంసమై కనిపించాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా.. వస్తువులన్నీ చిందర వందరగా పడి ఉన్నాయి. ఇంట్లో ఉంచిన రూ. 10లక్షల నగదు, 2 తులాల బంగారం, 50 తులాల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. 10రోజుల క్రితం పొలం విక్రయించగా వచ్చిన సొమ్మును ఇంట్లో పెట్టినట్లు తెలిపారు. కాగా, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. ఫోన్ కొనివ్వలేదని.. కృష్ణానదిలో దూకాడు ● యువకుడి ఆత్మహత్యాయత్నం ● ప్రాణాలు కాపాడిన పోలీసులు కృష్ణా: మొబైల్ ఫోన్ కొనివ్వలేదని కృష్ణానదిలో దూకి యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన రాష్ట్ర సరిహద్దులో మంగళవారం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. రాయచూర్ జిల్లా గుంజళ్లి గ్రామానికి చెందిన ఉషెనప్ప(22) కొంత కాలంగా ఫోన్ కొనివ్వడం లేదని తన తల్లితో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి మండల పరిధిలోని బ్రిడ్జి వద్దకు చేరుకొని నదిలోకి దూకాడు. స్పందించిన స్థానికులు శక్తినగర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడిని రక్షించి రాయచూర్ రిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ విషయమై శక్తినగర్ ఎస్ఐ నారాయణను వివరణ కోరగా ఫోన్ ఇప్పించాలని ఇంట్లో తల్లితో గొడవపడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. యువకుడికి ఇటీవల వివాహం జరిగినట్లు పేర్కొన్నారు. -
రేపటి నుంచి రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ టోర్నీ
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఈనెల 4 నుంచి 7వ తేదీ వరకు జరిగే రాష్ట్రస్థాయి సబ్జూనియర్ (అండర్–13 )బ్యాడ్మింటన్ టోర్నమెంట్ బ్రోచర్లను జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి ఆవిష్కరించారు. టోర్నమెంట్ను విజయవంతంగా నిర్వహించాలని కోరారు. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ 4వ తేదీన క్యాలిఫైయింగ్ మ్యాచ్లు, 5 నుంచి మెయిన్డ్రా పోటీలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్యాంసుందర్గౌడ్, ఎల్.రవికుమార్, సంయుక్త కార్యదర్శులు నాగరాజుగౌడ్, ఉదయ్, భాను ప్రకాశ్, సభ్యులు సతీష్ పాల్గొన్నారు. -
గ్రామీణ ఓటర్లు 4,99,582
● 423 గ్రామపంచాయతీల్లో 3,674 పోలింగ్ కేంద్రాలు ● తుది జాబితాను విడుదల చేసిన అధికారులు జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సమాయత్తం అవుతోంది. ఎన్నికలకు ముఖ్యమైన ఓటరు తుది జాబితా కూడా మంగళవారం విడుదల చేశారు. అలాగే పోలింగ్ కేంద్రాలను కూడా విడుదల చేశారు. ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా వెంటనే నిర్వహించేందుకు అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. సర్పంచ్గా పదవీ కాలం 2024 జనవరి 31తో పూర్తయింది. సర్పంచ్లు లేకపోవడంతో గ్రామాలకు వచ్చే నిధులు రాకుండా ఆగిపోయాయి. తుది జాబితా ప్రకారం జిల్లాలో 4,99,582 మంది గ్రామీణ ఓటర్లు ఉన్నారు. 423 గ్రామపంచాతీల్లో 3,674 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. డీపీఓ పార్థసారథి మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎన్నికలునిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్నామని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎప్పుడు ఆదేశించినా ఎన్నికలు నిర్వహించేందుకు సర్వం సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. -
గొప్ప పోరాట యోధుడు.. సురవరం
● సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి ● ఆయన ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి : మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ ● సురవరం సుధాకర్రెడ్డి స్వగ్రామం కంచుపాడులో సంస్మరణ సభ ● నివాళులర్పించినపలు పార్టీల నాయకులు ఉండవెల్లి: గ్రామీణ ప్రాంతం నుంచి జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించి, నింగికెగిసిన నిస్ప్రుహుడు, తెలంగాణ పోరాట యోధుడు సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్రెడ్డి అని ఆ పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు చాడ వెంకట్రెడ్డి అన్నారు. సోమవారం ఉండవెల్లి మండలం కంచుపాడు గ్రామంలోని సురవరం వెంకట్రామిరెడ్డి విజ్ఞాన కేంద్రంలో సురవరం సుధాకర్రెడ్డి సంస్మరణ సభను ఉమ్మడి జిల్లా సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చాడా వెంకట్రెడ్డితోపాటు మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, మాజీ మంత్రి నిరంజన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సంపత్కుమార్, అబ్రహం తదితరులు హాజరయ్యారు. ముందుగా సురవరం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చాడా వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. సురవరం సుధాకర్రెడ్డి జన్మభూమిని, కన్నతల్లిని మరువలేదని, సొంత గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని, గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయిలో సామాన్యుడి సమస్యలపై గళం విప్పాడని కొనియాడారు. దేశంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో.. దేశానికి ప్రమాదం పొంచి ఉందని, మతోన్మాద, నియంతృత్వ పాలన సాగిస్తారని ముందే హెచ్చరించారని, అలాగే జరిగిందన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి, పోరాటానికి వామపక్షాలు ఒకే వేదిక మీదికి రావాలన్నారు. ఆయన పేరు చరిత్రలో నిలిచేలా చేస్తాం : సంపత్కుమార్ సురవరం సుధాకర్రెడ్డి ఆశయ సాధనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, ఆయన పేరును చరిత్రలో నిలిచేలా చేస్తామని మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ అన్నారు. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన సంస్మరణసభలో సీఎం రేవంత్రెడ్డి దృష్టికి కంచుపాడులోని పలు సమస్యలను సురవరం సుధాకర్రెడ్డి భార్య విజయలక్ష్మి తీసుకురాగా 24 గంటల్లో ఆయా పనులు మంజూరు చేశారన్నారు. గ్రామంలోని యూపీఎస్ను హైస్కూల్గా అప్గ్రేడ్ చేస్తామని, రూ.కోటితో భవనం, హాస్టల్ నిర్మిస్తామని అన్నారు. సురవరం ఆశయ సాధన కోసం కృషిచేస్తున్న ఐదుగురికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, జాతీయ రహదారి నుంచి కంచుపాడుకు బీటీరోడ్డుకు రూ.3 కోట్లు మంజూరు చేశామన్నారు. ఈ అభివృద్ధి పనులకు సంబంధించి ప్రొసీడింగ్ కాపీలను ఈసందర్భంగా విజయలక్ష్మికి అందజేశారు. -
అతివేగమే ప్రమాదానికి కారణమా..?
మహబూబ్నగర్ క్రైం/అడ్డాకుల: అడ్డాకుల మండల సమీపంలోని కాటవరం స్టేజీ వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. అయితే ట్రెయిలర్ లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన ఘటనలో బస్సును డ్రైవర్ అతివేగంగా నడపడమే కారణంగా తెలుస్తోంది. ప్రమాదం ప్రయాణికులు ఎక్కించే డోర్ వైపు జరగడం వల్ల డ్రైవర్కు ఎలాంటి గాయాలు కాలేదు. బస్సు ముందు వరుస భాగంలో కూర్చున్న వారికే ఎక్కువ నష్టం జరిగింది. లారీ వెనుక బస్సు ఢీకొట్టిన సమయంలో బస్సు లెఫ్ట్ సైడ్ ఎక్కువ భాగం లోపలి వరకు దెబ్బతింది. దీంతో పాటు చాలా వరకు లారీలను రాత్రివేళ దాబాల వద్ద నిలుపుతుంటారు. అయితే ప్రమాద స్థలం వద్ద కూడా దాబా హోటల్ ఉండటంతో లారీని ఇక్కడ నిలిపేందుకు డ్రైవర్ దాన్ని స్లో చేసి ఉంటాడనే అనుమానం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే వేగంగా వచ్చిన బస్సు అదుపు తప్పి లారీని ఢీకొట్టి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. మధ్య తరగతి కుటుంబాలే.. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో హసన్ పెయింటర్గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ఇతడి మృతితో పిల్లలు అనాథలుగా మారారు. నంద్యాలకు చెందిన అస్రాప్ ఉన్నీసా హైదరాబాద్లోని హాఫీజ్ పేట్లో ఉండే కొడుకు ఫిరోజ్ భాష దగ్గరి నుంచి నంద్యాలకు వెళ్తూ మృతి చెందింది. నంద్యాలకు చెందిన సుబ్బరాయుడు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇక ఎల్లమ్మ హైదరాబాద్లో ఓ హోటల్లో దినసరి కూలీగా పనిచేస్తూ కొడుకును చదివిస్తోంది. ఆమె కుమారుడు పదేళ్ల సంతోష్ నాలుగో తరగతి చదువుతుండగా.. ఇటీవల తండ్రి కూడా చనిపోవడంతో అనాథగా మారాడు. ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిన ట్రావెల్ బస్సు -
నిమజ్జనానికి వెళ్తుండగా అపశ్రుతి
● హైవేపై ట్రాక్టర్ను ఢీకొన్న డీసీఎం ● ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం.. మరొకరి పరిస్థితి విషమం ఎర్రవల్లి: వినాయకుడి నిమజ్జనానికి వెళ్తున్న ట్రాక్టర్ను డీసీఎం వేగంగా వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. అలాగే మరొకరి పరిస్థితి విషమంగా ఉండగా.. ఆరుగురికి గాయాలైన సంఘటన మండలంలోని కొట్టం కాలేజీ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఇటిక్యాల ఎస్ఐ రవినాయక్ కథనం ప్రకారం.. ఇటిక్యాలకు చెందిన బోయ జమ్మన్న(50), బోయ నర్సింహులు(48), అదే గ్రామానికి చెందిన మరో ఏడు మందితో కలిసి చెన్నకేశవస్వామి ఆలయం దగ్గర ఏర్పాటు చేసిన వినాయకుడిని బీచుపల్లి వద్ద కృష్ణానదిలో నిమజ్జనం చేసేందుకు ఆదివారం రాత్రి ట్రాక్టర్లో బయలుదేరారు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై అర్ధరాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో కొట్టం కాలేజీ సమీపంలో వెళ్తుండగా కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తున్న డీసీఎం వేగంగా వచ్చి ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ పల్టీలు కొట్టి రోడ్డు కిందకు దూసుకుపోవడంతో వినాయకుడితోపాటు అందులో ఉన్న వారంతా చెల్లాచెదురుగా పడిపోయారు. ప్రమాదంలో తీవ్ర రక్త గాయాలు కావడంతో బోయ జమ్మన్న అక్కడికక్కడే మృతిచెందగా, ఆస్పత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించి బోయ నర్సింహులు మృత్యువాత పడ్డారు. అలాగే ప్రమాదంలో గాయాలపాలైన జ్ఞానేశ్వర్, నరేందర్, మహేందర్, రమేష్, రాముడు, యశ్వంత్, మధులను అంబులెన్స్లో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇందులో నరేందర్ తలకు తీవ్ర రక్త గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటనపై జమ్మన్న భార్య పార్వతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. వినాయకుడి నిమజ్జనోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకొని ఇద్దరు మృతిచెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మెడికల్ కళాశాలకు నేత్రాల అప్పగింత రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నర్సింహులు నేత్రాలను కుటుంబ సభ్యులు కర్నూలు మెడికల్ కళాశాలకు అందజేశారు. నర్సింహులు భార్య లక్ష్మి, కుమారుడు నవీన్, కుమార్తె పూజిత తమ కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్నా దుఃఖాన్ని దిగమింగుకొని మరో వ్యక్తి జీవితంలో వెలుగులు నింపడం కోసం మృతుని నేత్రాలను దానం చేసి మానవత్వం చాటుకున్నారు. -
యోగాసనాలలోఏఎస్ఐ వనజ ప్రతిభ
మహబూబ్నగర్ క్రైం: తెలంగాణ యోగాసన అసోసియేషన్ ఆధ్వర్యంలో అదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన 6వ రాష్ట్రస్థాయి సీనియర్ యోగాసన స్పోర్ట్స్ చాంపియన్ షిప్– 2025 ట్విస్టింగ్ బాడీ– ఫార్వర్డ్ బెండింగ్ ఈవెంట్లో ఏఎస్ఐ వనజ ప్రతిభచాటారు. మొదటి స్థానంలో నిలిచిన ఆమెను సోమవారం ఎస్పీ డి.జానకి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ సేవలతోపాటు క్రీడారంగంలో కూడా ప్రతిభ కనబరచడం గర్వకారణం అన్నారు. ప్రతిభావంతులైన సిబ్బందికి పోలీస్ శాఖ ఎప్పుడూ ప్రోత్సాహం ఉంటుందని భవిష్యత్లో ఇంకా మంచి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. 65 మంది సీసీల బదిలీ జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): డీఆర్డీఓ శాఖ సెర్ప్ పరిధిలో పనిచేస్తున్న 65 మంది సీసీలను బదిలీ చేశారు. సోమవారం డీఆర్డీఓ నర్సింహులు వారికి కౌన్సెలింగ్ ద్వారా పోస్టింగ్లను కేటాయించారు. ఇందులో క్లస్టర్ల పరిధిలో కౌన్సెలింగ్ ద్వారా వారు కోరుకున్న స్థానాలకు బదిలీ చేసినట్లు తెలిపారు. కౌన్సెలింగ్ అనంతరం ఆయా స్థానాల్లో జాయిన్ కావాలని డీఆర్డీఓ సూచించారు. భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలి కోడేరు: పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఏదుల రిజర్వాయర్లో భూములు కోల్పోయిన తీగలపల్లి గ్రామ భూ నిర్వాసితులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు డిమాండ్ చేశారు. సోమవారం కోడేరు మండలం తీగలపల్లిలో భూ నిర్వాసితులు నష్టపరిహారం చెల్లించాలని నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్ద కాలంగా భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం ఇప్పటి వరకు నష్టపరిహారం ఇవ్వకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. దాదాపు 70మంది రైతులు పరిహారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టు తిరిగినా అధికారులు స్పందించడం లేదన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించి నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 2013 భూసేకరణ చట్ట ప్రకారం భూ నిర్వాసితులకు ఎకరాకు రూ.60 లక్షలు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జల్లా కార్యదర్శి నర్సింహ, భూ నిర్వాసితులు ఆంజనేయులు, వెంకటయ్య, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శివశంకర్ వరప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
పోలీసులు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలి
● జోగుళాంబ జోన్– 7 డీఐజీ ఎల్ఎస్ చౌహన్ వనపర్తి: పోలీసులు ఎల్లవేళలా స్టేషన్లలో అందుబాటులో ఉండి బాధితులకు రక్షణగా ఉండాలని జోగుళాంబ జోన్– 7 డీఐజీ ఎల్ఎస్ చౌహన్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం ఆయన జిల్లాలోని పెబ్బేరు, చిన్నంబావి, పెద్దమందడి పోలీస్స్టేషన్లను తనిఖీ చేశారు. అంతకముందు ఎస్పీ రావుల గిరిధర్ పుష్పగుచ్ఛం అందించి డీఐజీకి స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, పోలీస్స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. ఈ సందర్భంగా స్టేషన్లో రికార్డులు, రిసెప్షన్, లాకప్, మెన్ బ్యారెక్, టెక్నీకల్ రూం, పరిసరాలను పరిశీలించారు. ఎక్కువగా జరిగే నేరాలు, వాటి ప్రాంతాలు, కేసుల నమోదు వివరాలు, నేరస్తుల ప్రస్తుత పరిస్థితుల గురించి ఆయా స్టేషన్ల ఎస్ఐలతో ఆరా తీశారు. గ్రామాల్లో, పట్టణాల్లో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే తనిఖీ చేయాలని సూచించారు. నిరంతరం పెట్రోలింగ్ చేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం విజిబుల్ పోలీసింగ్లో భాగంగా వాహనాల తనిఖీలు నిర్వహించాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు. విధి నిర్వహణలో ప్రతి పోలీసు నిబద్ధతతో ఉండాలని, తమకు కేటాయించిన విధిని సక్రమంగా నిర్వహించినప్పుడే అధికారులు, ప్రజల నుంచి మన్ననలు పొందుతారని, చేసిన పనికి గుర్తింపు లభిస్తుందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరావు, సీఐలు కృష్ణయ్య, రాంబాబు, ఎస్ఐలు యుగంధర్రెడ్డి, జగన్, శివకుమార్, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు. -
జలాశయాలకు నిలకడగా వరద
● జూరాలకు 1,56,615 క్యూసెక్కుల ఇన్ఫ్లో ● 20 గేట్లు ఎత్తి దిగువకు 1,70,534 క్యూసెక్కులు ● కొనసాగుతున్న విద్యుదుత్పత్తి ధరూరు/ఆత్మకూర్/మదనాపురం/దేవరకద్ర/దోమలపెంట: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పడుతున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఆదివారం ప్రాజెక్టుకు 2లక్షల 14వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. సోమవారం సాయంత్రం 7:30 గంటల వరకు ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ఫ్లో లక్షా 56వేల 615 క్యూసెక్కులకు తగ్గినట్లు పేర్కొన్నారు. దీంతో ప్రాజెక్టు 20 క్రస్టు గేట్లను ఎత్తి గేట్ల ద్వారా లక్షా 36వేల 240 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుద్పత్తి నిమిత్తం 32వేల 171 క్యూసెక్కులు, నెట్టెంపాడుకు 750 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 67 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 920 క్యూసెక్కులు, కుడి కాలువకు 386 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం లక్షా 70వేల 534 క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9,657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 8,048 టీఎంసీల నిల్వ ఉన్నట్లు తెలిపారు. శ్రీశైలం నుంచి సాగర్కు పరుగులు ఎగువ ప్రాంతాల నుంచి నీటిప్రవాహం కొనసాగుతుండడంతో శ్రీశైలం ఆనకట్ట వద్ద ఎత్తి ఉంచిన పదిగేట్లు సోమవారం కొనసాగుతున్నాయి. జూరాలలో ఆనకట్ట గేట్లు పైకెత్తి స్పిల్వే ద్వారా 1,36,240, విద్యుదుత్పత్తికి 32,171, సుంకేసుల నుంచి 66,752 మొత్తం 2,35,163 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం జలాశయం వస్తున్నాయి. శ్రీశైలంలో ఆనకట్ట పదిగేట్లు పైకెత్తి స్పిల్వే ద్వారా 2,67,440 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. మరోవైపు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 30,288 మొత్తం 65,603 క్యూసెక్కులను అదనంగా సాగర్కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 882.1 అడుగుల నీటిమట్టం వద్ద 199.7354 టీఎంసీల నిల్వ ఉంది. 24గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 27,000, హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2,489 క్యూసెక్కులను విడుదల చేశారు. భూగర్భకేంద్రంలో 16.765 మిలియన్ యూనిట్లు, కుడిగట్టు కేంద్రంలో 15.215 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు. పూర్తిస్థాయి నీటిమట్టానికి రామన్పాడు రామన్పాడు జలాశయంలో సోమవారం నాటికి పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులు వచ్చి చేరింది. జూరాల ఎడమ కాల్వ ద్వారా 390 క్యూసెక్కులను వదులుతూ సమాంతర కాల్వ ద్వారా వచ్చే నీటిని నిలిపివేశారు. ఎన్టీఆర్ కాల్వ ద్వారా 925 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వ ద్వారా 55 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. ఊకచెట్టు వాగు, సరళాసాగర్ ద్వారా వరద వస్తుండడంతో ఒక గేటు ఎత్తి 2,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నామని ఏఈ వరప్రసాద్ తెలిపారు. కోయిల్సాగర్ గేట్ల బంద్ కోయిల్సాగర్ గేట్లను సోమవారం ఉదయం నుంచి మూసి వేశారు. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న ఇన్ఫ్లో తగ్గి పోవడంతో ఆదివారం తెరిచిన ఒక గేటును మూసి వేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు ఉండగా ప్రస్తుతం 32అడుగులుగా ఉంది. నీటి సామర్థ్యం 2.27 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.2 టీఎంసీల నిల్వ ఉంది. -
ఆకాశం.. ‘వర్ణ’నాతీతం
అప్పటి దాకా నీలివర్ణంలో ప్రశాంతంగా కనిపించిన ఆకాశం ఒక్కసారిగా ఎరుపు, పసుపు రంగుల్లోకి మారి చూపరులను కట్టిపడేసింది. సోమవారం సాయం సంధ్య వేళలో భానుడు వివిధ వర్ణాలతో మెరిసిపోతూ ఆకట్టుకున్నాడు. మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలో సాయంత్రం 6.45 నుంచి 7.20 గంటల ప్రాంతంలో వర్ణనాతీతంగా కనిపించిన ఆకాశాన్ని ‘సాక్షి’ కెమెరా క్లిక్మనిపించింది. – సాక్షి, సీనియర్ ఫొటోగ్రాఫర్, మహబూబ్నగర్