Mahabubnagar
-
టైర్ పగిలి ఆర్టీసీ బస్సును ఢీకొన్న కారు .. తాత, మనవడు దుర్మరణం
జడ్చర్ల: ఆకస్మాత్తుగా టైర్ పగిలిపోవడంతో అదుపుతప్పిన కారు రోడ్డు డివైడర్ను దాటి అవతలి వైపు ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టగా ఈ ప్రమాదంలో తాతమనవడు దుర్మణం చెందారు. కూతురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు. వివరాలు.. నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం గంగారం గ్రామానికి చెందిన ఎం.వెంకట్రెడ్డి (76) మహబూబ్నగర్లోని ప్రేమ్నగర్లో నివాసం ఉంటున్నాడు. వెంకట్రెడ్డి కూతురు హైదరాబాద్లోని నార్సింగిలో నివాసం ఉంటున్నారు. సోమవారం వెంకట్రెడ్డి కూతురు శ్వేత(45), ఆమె కుమారుడు నిదయ్రెడ్డి (22)తో కలిసి హైదరాబాద్ నుంచి కారులో జడ్చర్ల వైపు వస్తున్నారు. మాచారం గ్రామం దాటాక జాతీయరహదారిపై ఆకస్మాత్తుగా కారు టైరు పగిలిపోయింది. దీంతో అదుపుతప్పిన కారు డివైడర్ను దాటుకుంటూ అవతలి వైపునకు దూసుకెళ్లింది. అదే సమయంలో జడ్చర్ల నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న మహబూబ్నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కారు ఎదురుగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవింగ్ చేస్తున్న శ్వేత, పక్క ఉన్న వెంకట్రెడ్డి తీవ్రగాయాలకు గురయ్యారు. నిదయ్రెడ్డి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. క్షతగాత్రులను వైద్యచికిత్స కోసం 108 అంబులెన్స్లో ఏనుగొండ ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించారు. కొనఊపిరితో ఉన్న వెంకట్రెడ్డి మార్గమధ్యలోనే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్రగాయాలకు గురైన శ్వేతను మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్కు తరలించారు. ప్రమాద సమయంలో కారులోని బెలూన్లు ఓపెన్ కావడంతో డ్రైవర్ సీట్లో ఉన్న శ్వేతకు ప్రాణాపాయం తప్పింది. ప్రమాదంలో దుర్మరణం చెందిన వెంకట్రెడ్డి సర్వేయర్గా పదవీ విరమణ పొందగా నిదయ్రెడ్డి బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. శ్వేత సొంత గ్రామం నల్గొండ జిల్లా చండూరు కాగా హైదరాబాద్లో ఉంటున్నారు. ఆమెకు భర్త శేఖర్రెడ్డి, ఇద్దరు కుమారులు ఉండగా మృత్యువాత పడిన నిదయ్రెడ్డి చిన్నవాడు. ప్రమాద సంఘటనతో ఆకుటుంబం ఒక్కసారిగా దుఖఃసాగరంలో మునిగిపోయింది. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కారు పూర్తిగా ధ్వంసం.. రోడ్డు ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసం అయ్యింది. కారు ఢీకొట్టడంతో ఆర్టీసీ బస్సు కూడా ముందు ఒక భాగం ధ్వంసమైంది. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ట్రాఫిక్ అంతరాయాన్ని తొలగించారు. కూతురి పరిస్థితి విషమం జడ్చర్ల మండలం మాచారం వద్ద దుర్ఘటన జాతీయ రహదారిపై స్తంభించిన ట్రాఫిక్ -
స్ప్రింక్లర్లతో ఉల్లి సాగు చేద్దాం
అలంపూర్: మైక్రో స్ప్రింక్లర్లతో ఉల్లి పంట సాగు చేయడంతో ఆశించిన దిగుబడి సాధించొచ్చని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి సక్రియానాయక్ రైతులకు సూచించారు. జిల్లాలో నీటి సౌకర్యం ఉన్న రైతులు యాసంగిలో ఉల్లిని సాగు చేయడం లాభదాయకమన్నారు. పంట సాగు చేసిన రైతులు మైక్రో స్ప్రింక్లర్లను వాడడం ద్వారా నీటి ఆదా అవుతుందని తెలిపారు. దీనితో పాటు వ్యవసాయ అధికారుల సూచనలతో ఎరువులు సరైన మోతాదులో వాడితే పంట నాణ్యత పెరుగుతుందని పేర్కొన్నారు. నాటులో జాగ్రత్తలు ఒక ఎకరానికి 1.4 లక్షల మొక్కల సాంద్రత ఉండేటట్లుగా నాటుకోవాలి. వరుసకు వరస 10 సెంటీమీటర్లు ఉండాలన్నారు. నారు నాటే సమయంలో వాటిని కార్బండిజమ్ 1 గ్రామును లీటర్ నీటికి, మోనోక్రోటోపాస్ 2 మి.లీ నీటితో కలిపిన ద్రావణంలో వేర్లను ముంచి నాటితే మొక్క పెరుగుదల బాగుందని వివరించారు. మైక్రో స్ప్రింక్లర్లు అమర్చే విధానం 16 మిల్లీ మీటర్ల లేటరల్స్ను ప్రధాన పీవీసీ పైపునకు ప్రతి నాలుగు మీటర్ల దూరంలో అమర్చాలి. ప్రతి లేటరల్ పైపు మీద 4 మీటర్ల దూరంలో 8 మి.లీ మీటర్ల ప్లాస్టిక్ పైప్ ద్వారా ఒక మైక్రో స్ప్రింక్లర్లను అమర్చాలి. దీనిని 3 అడుగుల ఎత్తులో అమర్చుకోవాలని సూచించారు. ప్రతి మైక్రో స్ప్రింక్లర్లు గంటకు 148 లీటర్ల నీటిని విడుదల చేస్తోంది. తెగుళ్ల నేలలో ఎల్లప్పుడు తగినంత తేమ ఉండటం వలన ఉల్లి గడ్డలు సమాన పరిమాణంలో పెద్దగా పెరుగుతాయి. పంటకాలం 15 నుంచి 17 రోజులు తగ్గుతుంది. నీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. నీటి తుంపర్ల వలన శీలింద్రపు తెగుళ్లు ఆశించవు. రసం పీల్చే పురుగులు తుంపర్లకు కొట్టుకొని పోతాయి. మొక్కల సంఖ్య పెరగడం వలన 30 నుంచి 40 శాతం అధిక దిగుబడి వస్తోంది. కలుపు నివారణ 2 నుంచి 3 సార్లు కలుపు తీయాల్సి ఉంటుంది. నారు నాటిన మూడు రోజుల తర్వాత పెండిమిథాలిన్ అనే లీటర్ మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. 40 నుంచి 45 రోజులకు ఒకసారి కలుపుతీయాలి. నీటి యాజమాన్యం పొలంలో నీటి నిల్వ ఉంచరాదు. నీరు నిలువ ఉంటే గడ్డ నాణ్యత తగ్గిపోతుంది. ఉల్లి వేరు 10–15 సెం.మీ వరకే ఉంటుంది. కాబట్టి అవసరం ఉన్నంత వరకే నీటిని పెట్టాలి. సస్యరక్షణ తామర పురుగుల నివారణకు పిప్రోనిల్ 2 మి.లీ లేదా మిథైల్ డెమటాన్ 2మి.లీలు ఒక లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఆకుమాడు తెగులు నివారణకు సాఫ్ ఒక గ్రాము ఒక లీటర్ నీటికి లేదా కిటాజెన్ ఒక మి.లీ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎరువులు ఉల్లి నాటిన 30 రోజులకు, 60 రోజులకు యూరియా లేదా సీఏఎన్ వేసుకోవాలి. ఎకరానికి 10–15 కిలోల సల్ఫర్ వాడాలి. దీనివలన నాణ్యమైన గడ్డలు వస్తాయి. 50 కిలోల భాస్వరం 60 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులు నాటే ముందు వేసుకోవాలి. పాడి–పంట -
సహాయక చర్యలు ముమ్మరం
అచ్చంపేట/ అచ్చంపేట రూరల్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో చిక్కుకున్న కార్మికుల జాడ సోమవారం కూడా దొరకలేదు. టన్నెల్లో గల్లంతైన వారి ఆచూకీ కోసం గత 24 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. గల్లంతైన ఎనిమిది మందిలో టీబీఎం ఆపరేటర్ మృతదేహం లభించగా.. మిగతా ఏడుగురు కార్మికుల జాడ కోసం సహాయక బృందాలు నిర్విరామంగా శ్రమిస్తున్నాయి. జీపీఆర్, కాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాల్లో సింగరేణి కార్మికులు షిఫ్ట్ల వారీగా సొరంగంలోకి వెళ్లి తవ్వకాలు జరుపుతున్నారు. డీ2 ప్రదేశంలో తవ్వకాలు చేపట్టినా కార్మికుల ఆచూకీ లభ్యం కాకపోవడంతో డీ1 ప్రదేశంలో ప్రధానంగా రెండు రోజుల నుంచి తవ్వకాలు అతికష్టంగా సహాయక బృందాలు చేపడుతున్నాయి. టీబీఎం విడి భాగాలను తొలగిస్తున్నా పురోగతి లేకపోతోంది. ఈ క్రమంలోనే సోమవారం మరోసారి కాడవర్ డాగ్స్ను సొరంగంలోని డీ–1, డీ–2 ప్రదేశాల్లో గాలింపు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు సొరంగంలోని డీ1, డీ2 ప్రదేశాల్లో టీబీఎం పరికరాలు మట్టిలో కూరుకుపోవడంతో పైనుంచి ఉబికి వస్తున్న ఊట నీటితో పనులకు ఆటంకం కలుగుతోంది. టీబీఎం ముందు భాగంలోని చివరి 40 మీటర్ల వద్ద మట్టి, రాళ్లు, టీబీఎం శకలాలను కదలిస్తే మరో ప్రమాదం జరిగే అవకాశం ఉందని సిబ్బంది అనుమానిస్తున్నారు. ఈ దశలో సహాయక చర్యలు సిబ్బందికి సవాల్గా మారాయి. ఇదిలా ఉండగా.. సహాయక చర్యలు వేగవంతం చేసేందుకు ఆరు రోజుల క్రితం ఇక్కడికి వచ్చిన రోబోల సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదు. అటానమస్ పవర్డ్ హైడ్రాలిక్ రోబో అనుసంధానంగా ఏర్పాటు చేసిన వాక్యూమ్ పంపు, వాక్యూమ్ ట్యాంకులు పనిచేయడంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో టెక్నీషియన్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్నతాధికారుల సమీక్ష.. టన్నెల్ డీ–1, డీ–2 ప్రదేశాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా చేపడుతున్నామని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం ఉదయం టన్నెల్ వద్ద పరిస్థితులపై కలెక్టర్ ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్తో కలిసి సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు నిర్విరామంగా సహాయక చర్యలు కొనసాగుతున్నామని చెప్పారు. టన్నెల్ బోరింగ్ మిషన్ విడి భాగాలను తొలగించే పనులు కొనసాగిస్తూ ఎస్కవేటర్ వద్ద మట్టి తొలగించే పనులు వేగవంతం చేసినట్లు వివరించారు. డీవాటరింగ్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, బృందాలకు అవసరమైన సామగ్రి, సిబ్బంది భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేశామన్నారు. మొరాయిస్తున్న కన్వేయర్ బెల్టు సొరంగంలో సహాయక బృందాలు చేపడుతున్న గాలింపు చర్యలకు ఊట నీరు ఆటంకం కలిగిస్తోంది. 13.5 కి.మీ., తర్వాత ఏర్పాటు చేసిన డీ–2 ప్రాంతంలో ఒక కాల్వలో నీళ్లు పెరుగుతున్నాయి. నీటిని డీవాటరింగ్ చేసేందుకు ప్రతి 2.5 కిలోమీటర్లకు ఒక పంపింగ్ మోటారు ఏర్పాటు చేసి నీటిని బయటికి పంపించే చర్యలు తీసుకుంటున్న నీటి ఊట తగ్గడం లేదు. సొరంగంలోని బురద, మట్టిని బయటకు పంపడానికి ప్రధానంగా కన్వేయర్ బెల్టు కీలకం. కానీ, ఈ కన్వేయర్ బెల్టు తరుచుగా మొరాయిస్తుండటం.. దాని స్థాయికి తగ్గట్టు పనిచేయకపోవడంతో సహాయ చర్యలకు విఘాతం కలుగుతున్నాయి. డీ–1 పాయింట్ వద్ద గత రెండు రోజుల నుంచి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. టీబీఎం వద్ద దక్షిణమధ్య రైల్వేకు చెందిన రెస్క్యూ బృందాలు శకలాలను కట్ చేస్తూ విడి భాగాలను బయటకి పంపిస్తున్నారు. అత్యంత ప్రమాదంగా గుర్తించిన డీ1 వద్ద ఆచితూచి వ్యవహరిస్తున్నారు. రోబో సేవలు అందుబాటులోకి రాకపోవడంతో కార్మికుల జాడ లభించేందుకు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. 24 రోజులు గడిచినా లభించని కార్మికుల ఆచూకీ నిర్విరామంగా శ్రమిస్తున్న రెస్క్యూ బృందాలు ఎస్ఎల్బీసీలో అందుబాటులోకి రాని రోబో సేవలు -
మహిళా సంఘాల బలోపేతం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగరంలో మహిళా సంఘాలను బలోపేతం చేయాలని మెప్మా స్టేట్ మిషన్ కో–ఆర్డినేటర్ (ఎస్ఎంసీ) సుజాత ఆదేశించారు. సోమవారం మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఆర్పీలు, ఓబీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం 2,858 ఎస్హెచ్జీలు ఉండగా కొత్తగా మరో 477 ఈనెలా ఖరులోగా ఏర్పాటు చేయాలన్నారు. కాగా, ఇప్పటివరకు 218 కొత్తవి అయ్యాయని ఇన్చార్జ్ డీఎంసీ ఎం.లక్ష్మి బదులిచ్చారు. అమృత్మిత్ర పథకం కింద నగరంలోని 49 డివిజన్లకు గాను నాలుగు ప్రాంతాల్లో ఒక్కొక్కటి చొప్పున ప్రత్యేక బృందా (ఎస్హెచ్జీ) లతో తాగునీటి పరీక్షలు చేయిస్తున్నామన్నారు. ఈ నాలుగు బృందాలలో సుమారు 25 మంది ఎస్హెచ్జీలు ఉన్నారని వివరించారు. గత నవంబర్ నుంచి బండ్లగేరి, మోతీనగర్, పద్మావతి కాలని, మర్లులో ఈ కార్యక్రమం కొనసాగుతోందన్నారు. కాగా, మరో పది డివిజన్లకు ఈ పథకం విస్తరింపజేయాలని ఎస్ఎంసీ సూచించారు. ఈ పరీక్షలు నిర్వహిస్తున్నందున ఒక్కో ఇంటికి రూ.20 చొప్పున బృందంలోని సభ్యురాలికి పారితోషికం ఇస్తామన్నారు. ముఖ్యంగా మిషన్ భగీరథ ద్వారా శుద్ధిచేసిన తాగునీరు సరఫరా అవుతోందా? లేదా? క్లోరినేషన్ చేస్తున్నది? లేనిది? ఈ పరీక్షల్లో బయట పడుతుందన్నారు. ఒకవేళ తాగునీటిలో ఒక శాతానికి మించి క్లోరిన్ ఉంటే కలుషితమైనట్లుగా భావించి వెంటనే ఇంజినీరింగ్ అధికారులకు నివేదించాలన్నారు. అనంతరం ఈ పరీక్షలు క్షేత్రస్థాయిలో ఎలా నిర్వహిస్తున్నది ప్రత్యేక బృందాలు ప్రయోగాత్మకంగా మెప్మా భవనంలో ఆమెకు వివరించారు. అంతకుముందు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డిని ఎస్ఎంసీ కలిసి నగరంలో మెప్మా కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయో ఆరా తీశారు. ఆయా సమావేశాల్లో ఇన్చార్జ్ ఎంఈ సందీప్, సీఓలు వరలక్ష్మి, నిర్మల, దేవమ్మ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మెప్మా స్టేట్ మిషన్ కో–ఆర్డినేటర్ సుజాత -
పీయూ సిబ్బంది వేతనాల పెంపుపై కమిటీ భేటీ
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో నాలుగేళ్లుగా తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న నాన్టీచింగ్ సిబ్బంది వేతనాల పెంపు లేకపోవడంతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. గతంలో 2018లో వైస్ చాన్స్లర్ రాజారత్నం ప్రతి సంవత్సరం 12 శాతం వేతనాలు పెంచేలా ప్రతిపాదనలు చేసి 2021 సంవత్సరం వరకు కొనసాగించారు. ఆ తర్వాత వీసీగా వచ్చిన లక్ష్మీకాంత్ రాథోడ్ వేతనాల పెంపుదలను ఉద్దేశపూర్వకంగా నిలిపివేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో నూతనంగా వైస్ చాన్స్లర్గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ సిబ్బంది వేతనాల పెంపుపై పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. అందుకోసం ఒక కమిటీని నియమించగా.. సోమవారం యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో భేటీ అయ్యింది. వేతనాల పెంపు ఎంత మేరకు ఉండాలి.. గతంలో ఎంత మేరకు పెంచారు అనే అంశాలపై చర్చించారు. ఈ కమిటీ త్వరలో నివేదిక సమర్పిస్తే దాని ఆధారంగా ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ సమావేశంలో ఆమోదం అనంతరం సిబ్బంది వేతనాలు పెంచేందుకు చర్యలు చేపడుతారు. కమిటీ భేటీలో పీయూ మాజీ రిజిస్ట్రార్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి, ప్రొఫెసర్ అప్పారావు, పీయూ అధ్యాపకులు కిషోర్కుమార్ తదితరులు పాల్గొన్నారు. 155 మందికి ప్రయోజనం.. యూనివర్సిటీలో తాత్కాలిక పద్ధతిలో 155 మంది నాన్ టీచింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో అటెండర్, స్వీపర్ స్థాయి వారికి రూ.7 వేలు, ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్లకు రూ.9 వేల చొప్పున వేతనాలు ఉన్నాయి. రెగ్యులర్ సిబ్బందికి రూ.50 వేలకుపైగా వేతనాలు ఉండగా.. తాత్కాలిక సిబ్బందికి అరకొర వేతనాలు అందుతున్నాయి. గత వీసీ హయాంలో వేతనాల పెంపుకోసం పలుమార్లు కౌన్సిల్ సమావేశాల్లో ప్రతిపాదనలు పెట్టినా పెంపు మాత్రం జరగలేదు. దీంతో చాలీచాలని వేతనాలతో కుటుంబాన్ని పోషించలేని పరిస్థితుల్లో పలువురు ఉద్యోగాలు మాని వెళ్లిపోగా.. పలువురు రిటైర్డ్ కూడా అయ్యారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని సిబ్బందికి త్వరగా వేతనాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని నాన్టీచింగ్ సిబ్బంది కోరుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
పెద్దకొత్తపల్లి: రోడ్డు ప్ర మాదంలో మహిళ మృతి చెందిన ఘటన దే వల తిరుమలాపూర్లో చోటు చేసుకున్నట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు. వివరాలు.. పెద్దకార్పాముల గ్రామానికి చెందిన సింగిల్విండో వైస్ చైర్మన్ మెరుగు రాజు, అతడి భార్య అనూష, కొడుకుతో కలిసి ఆదివారం బైక్పై వనపర్తికి వెళ్తున్నాడు. దేవల తిరుమలాపూర్ గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న బైక్ను తప్పించబోయాడు. బైక్ అదుపు తప్పి అనూష రోడ్డుపై పడటంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మరణించింది. రాజుకు, అతడి కుమారుడికి గాయాలయ్యాయి. సోమవారం మృతురాలి తండ్రి ఆనంద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. బాధిత కుటుంబాన్ని మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్ గౌడ్, జూపల్లి అరుణ్ కుమార్రావు పరామర్శించారు. చెరువులో పడి మహిళ.. తెలకపల్లి: చెరువులో పడి ఓ మహిళ మృతిచెందిన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకున్నట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. వివరాలు.. తెలకపల్లికి చెందిన రెడ్డపాకుల చంద్రమ్మ (35) అనే మహిళ కొంత కాలంగా మద్యానికి బానిసైంది. కుటుంబ సభ్యులు ఎంత చెప్పి నా వినిపించుకోలేదు, తన ప్రవర్తన మార్చుకోకుండా ఎప్పుడు చనిపోతానని అంటూ ఉండేదని తెలిపారు. ఈనెల 16న గ్రామ శివారు లో ఉన్న పెద్దచెరువు దగ్గరికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడింది. ఈత రాకపోవడంతో మృతిచెందింది. మృతురాలి భర్త రెడ్డపాకుల శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి.. జడ్చర్ల: తాగునీళ్లు అనుకొని ఫినాయిల్ తాగి వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు సీఐ కమలాకర్ తెలిపారు. వివరాలు.. మండలంలోని ఉదండాపూర్కి చెందిన గద్ద పెంటయ్య (62) అనే వ్యక్తి ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో బాత్రూంకు వెళ్లి అక్కడ తాగునీళ్లు అనుకొని బాటిల్లో ఉన్న ఫినాయిల్ తాగా డు. అపస్మారక స్థితికి చేరుకోగా గమనించిన కుటుంబీకులు హుటాహుటిన జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య నాగర్కర్నూల్ క్రైం: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నాగర్కర్నూల్ మండలం గుడిపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ గోవర్ధన్ వివరాల మేరకు.. గుడిపల్లికి చెందిన బాలస్వామి (36) హైదరాబాద్లో డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడి భార్య వనిత తన సోదరి భర్త శివతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటంతో ఇద్దరి మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. ఈ క్ర మంలో మనస్థాపానికి గురైన బాలస్వామి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా మా ర్చురీకి తరలించారు. మృతుడి తండ్రి ఈశ్వరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. శతాధిక వృద్ధుడుగుజ్జుల ఆశన్న మృతి మదనాపురం: మండలంలోని నరసింగాపురం గ్రామానికి చెందిన గుజ్జుల పెద్ద ఆశన్న(103) సోమవారం మృతిచెందారు. మొదటి పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికై మూడు పర్యాయాలు కొనసాగారు, ఐదు సార్లు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం కావడానికి కీలక పాత్ర పోషించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆయన కుటుంబానికి మాజీ సర్పంచ్ భాగమ్మ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
క్యాతూర్లో పేలిన 25 కేవీ ట్రాన్స్ఫార్మర్లు
అలంపూర్ రూరల్: మండలంలోని క్యాతూర్ గ్రామంలో 25 కేవీ మూడు నూతన ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయాయి. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన 25 కేవీ 3 ట్రాన్స్ఫార్మర్లు అకస్మాత్తుగా పేలిపోయి మంటల వ్యాపించాయి. ఈ ప్రమాదంలో విద్యుత్ తీగలపై మంటలు వ్యాపించి.. పలు ఇళ్లలో టీవీలు, ఫ్రిజ్లు, కరెంట్ మీటర్లు, సెల్ఫోన్ చార్జర్లు కాలిపోయాయి. దీంతో భారీగా శబ్దాఆలు రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. విద్యుత్ తీగలపై పెద్దఎత్తున మంటలు వ్యాపించి.. గంటపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సుమారు 50 ఇళ్లలో టీవీలు, ఫ్రిజ్లు ఇతరత్రా పరికరాలు కాలిపోయి రూ.లక్షల్లో నష్టం వాటిల్లిందని గ్రామస్తులు వాపోయారు. సమస్య పరిష్కరించిన అధికారులు షార్ట్సర్క్యూట్తో ట్రాన్స్ఫార్మర్లు పేలిన విషయం తెలుసుకున్న వెంటనే విద్యుత్ సిబ్బంది గ్రామానికి చేరుకుని సమస్యను పరిష్కరించి.. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని ఏఈ అఖిల్ తెలిపారు. గ్రామంలో లోఓల్టేజీ సమస్య ఉండడంతో సోమవారం 6 గంటల సమయంలో మరమ్మతు చేసిన 25 కేవీ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసిన కొద్దిసేపటికే ఇంటర్నల్ సమస్యతో ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయాయని చెప్పారు. వాటి స్థానంలో 15 కేవీ సామర్థ్యం గల మరో మూడు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు. అలాగే పేలిపోయిన మీటర్ల స్థానంలో తమ శాఖ తరపున నూతన మీటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదన్నారు. ఇళ్లలో కాలిపోయిన టీవీ, ఫ్రిజ్లు, కరెంట్ మీటర్లు -
ఊరూరా శ్రీరామోత్సవాలు నిర్వహించాలి
జడ్చర్ల: ఉగాది పర్వదినం మొదలుకొని హనుమాన్ జయంతి వరకు శ్రీరామ మహోత్సవాలను ఊరూరా అట్టహాసంగా నిర్వహించాలని వీహెచ్పీ కేంద్రీయ కార్యదర్శి సుధాంశు మోహన్ పట్నాయక్ పిలుపునిచ్చారు. సోమవారం జడ్చర్ల మాధవీయంలో ఏర్పాటుచేసిన సమావేశానికి ఆరు జిల్లాలకు చెందిన వీహెచ్పీ ముఖ్యకార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి వీహెచ్పీ కార్యకర్త కనీసంగా ఐదు గ్రామాలను ఎంపిక చేసుకుని ఉగాది నుంచి హనుమాన్ జయంతి వరకు శ్రీరాముడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు హిందూ సమాజాన్ని జాగృతం చేయాలన్నారు. వీహెచ్పీ బలోపేతం కోసం గ్రామ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇక ప్రతి దేవాలయాన్ని కేంద్రంగా చేసుకుని సత్సంగాలు నిర్వహించాలని తెలిపారు. ప్రతి కార్యకర్త రెండు సత్సంగాలు నిర్వహించే విధంగా చూడాలన్నారు. వీహెచ్పీతో పాటు భజరంగ్దళ్, మాతృశక్తి, దుర్గావాహిని కార్యకర్తల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. వీరికి వచ్చే రెండు నెలల్లో ప్రత్యేకంగా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. యువత భజరంగ్దళ్ శిక్షణ పొందే విధంగా, మిగతా వీహెచ్పీ కార్యకర్తలు శిక్షావర్గ పూర్తిచేసే విధంగా కృషి చేయాలన్నారు. అదే విధంగా యువతి విభాగానికి సంబంధించి దుర్గావాహణి ఆధ్వర్యంలో శిక్షావర్గలో పాల్గొనే విధంగా చూడాలని తెలిపారు. ఆత్మరక్షణ కోసం నేర్పించే విద్యలతో యువతులు సమాజంలోని సమస్యలను అధిగమించాలని కోరారు. సమావేశంలో వీహెచ్పీ ప్రాంత అధ్యక్షుడు నర్సింహామూర్తి, ఉపాధ్యక్షుడు జగదీశ్వర్, విభాగ్ కార్యదర్శి నరేందర్, సహకార్యదర్శులు లక్ష్మీనారాయణ, వేణుగోపాల్, పట్టణ అధ్యక్షుడు అఖిల్రెడ్డి పాల్గొన్నారు. -
గడ్డివాములు దగ్ధం
అయిజ: మున్సిపాలిటీ పరిధిలోని తుపత్రాల గ్రామంలో సోమవారం ప్రమాదవశాత్తు గడ్డివాములు దగ్ధమయ్యాయి. గ్రామంలోని కురువ బాలప్ప, వడ్డెర తిమ్మప్పలకు సంబంధించిన గడ్డివాముల నుంచి మంటలు చెలరేగడంతో స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లభించలేదు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైరింజన్లు మంటలు అదుపులోకి తెచ్చాయి. సుమారు రూ. 2 లక్షల నష్టం జరిగినట్లు బాధితులు వాపోయారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్షావలి ఆచారి బాధితులకు రూ. 10వేలు ఆర్థిక సహాయం చేశారు. -
జలాధివాసం వీడుతున్న సంగమేశ్వరాలయం
కొల్లాపూర్: సప్తనదీ సంగమ ప్రాంతంలోని సంగమేశ్వరాలయం జలాధివాసం వీడుతోంది. క్రమేణ కృష్ణానదిలో నీటిమట్టం తగ్గుతుండటంతో ఆలయం బయటపడుతోంది. సోమవారం ఆలయ ప్రాకారం పూర్తిస్థాయిలో తేలింది. ఆలయ ప్రాంగణంలో నడుము లోతు వరకు మాత్రమే నీళ్లు ఉన్నాయి. ఆలయ అర్చకులు రఘురామశర్మ గర్భగుడిలోకి వెళ్లి సంగమేశ్వరుడికి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. వారం రోజుల వ్యవధిలో నాలుగు అడుగుల మేరకు ఆలయ ప్రాంగణంలో నీటిమట్టం తగ్గింది. నీటి తగ్గింపు ఇలాగే కొనసాగితే.. ఈ నెలాఖరులోగా ఆలయం పూర్తిగా నీటి నుంచి బయటపడే అవకాశం ఉంది. ప్రస్తుతం శ్రీశైలం బ్యాక్వాటర్ లెవెల్స్ 842 అడుగులు ఉన్నాయి. నదిలో నుంచి బయటపడిన ఆలయ ప్రాంగణం -
భవనం పూర్తికాగానే తరలిస్తాం
టీడీగుట్ట సమీపంలోని మార్కెట్ ప్రాంతంలో కూరగాయలు, మాంసం, చేపల అమ్మకాల కోసం నిర్మిస్తున్న అతి పెద్ద భవనం పనులు త్వరలో పూర్తి చేయిస్తాం. కోస్గి రోడ్డుతో పాటు పాత బస్టాండు సమీపంలో, పాత రైతుబజార్లో అమ్మే వారినందరినీ అక్కడికి తరలిస్తాం. ఆయా రోడ్ల పైనే కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల అమ్మకంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతున్నది వాస్తవమే. గతంలో పలుసార్లు వీరిని తూర్పు కమాన్కు ఎదురుగా ఉన్న మోడ్రన్ రైతుబజార్కు వెళ్లాలని సూచించాం. – డి.మహేశ్వర్రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, మహబూబ్నగర్ వాహన రాకపోకలకు ఇబ్బందులు పాత బస్టాండు చుట్టుపక్కల, కోస్గి రోడ్డుపై కూరగాయలు, ఆకుకూరలు అమ్మడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ప్రాంతం నుంచే భారీ వాహనాలతో పాటు బస్సుల రాకపోకలు విరివిగా సాగుతున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఈ రోడ్లపై అమ్మే వర్తకులు గాని, రైతులు గాని తూర్పు కమాన్కు ఎదురుగా ఉన్న మోడ్రన్ రైతు బజార్కు వెళ్తే బాగుంటుంది. అక్కడ వినియోగదారులకు సైతం ఉపయోగకరంగానే ఉంది. – పగడం మల్లేష్, పద్మావతికాలనీ, మహబూబ్నగర్ మోడ్రన్ రైతు బజార్కు తరలించాలి కోస్గి రోడ్డుపై మలుపులో కూరగాయలు, ఆకుకూరలు, ఇతర నిత్యావ సర వస్తువులను కొనాలంటేనే భయమేస్తుంది. అటు వైపు చించోళి నుంచి పెద్ద లారీలు, ఇతర భారీ వాహనాలు వస్తున్నప్పుడు ఈ ప్రాంతంలో బైక్పై వెళ్లేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. టీడీగుట్ట వద్ద రైల్వే గేటు పడ్డప్పుడు ట్రాఫిక్జాం అవుతోంది. వందలాది వాహనాలు అటు కోయిల్కొండ ఎక్స్రోడ్డు వరకు ఇటు క్లాక్టవర్ వరకు ఆగిపోతున్నాయి. వీటి మధ్యన నడవడానికి కూడా వీలుండదు. రోడ్డుపై అమ్మే వారిని మోడ్రన్ రైతుబజార్కు తరలించాలి. అక్కడ కూడా గిరాకీ అవుతుంది. – వెంకటయ్య, రిటైర్డ్ ఉద్యోగి, లక్ష్మీనగర్కాలనీ, మహబూబ్నగర్ 20 ఏళ్లుగా ఇక్కడే అమ్ముతున్నాం.. 20 ఏళ్ల నుంచి భూత్పూర్ చౌరస్తాలో కూరగాయల అమ్ముతున్నాం. దుకాణాల ఎదుట కూరగాయలు పెట్టవద్దని వారు నిరాకరించడంతో కుటుంబ పోషణ కోసం రహదారిపైనే విక్రయాలు చేస్తున్నాం. ఇప్పుడు ఈ రహదారి విస్తరిస్తున్నట్లు తెలిసింది. తమకు కూరగాయలు అమ్మడానికి మార్కెట్ను ఏర్పాటు చేయాలి. – పి.బుచ్చయ్య, కూరగాయల వ్యాపారి, భూత్పూర్ -
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించండి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజల నుంచి 130 అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. అర్జీలను పెండింగ్లో పెట్టవద్దని కలెక్టర్ సూచించారు. ప్రజావాణి అనంతరం జిల్లా అధికారుల సమన్వయ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వేసవికాలం పూర్తయ్యే వరకు తాగునీటి, విద్యుత్ సరఫరాపై అధికారులు దృష్టిపెట్టాలని ఆదేశించారు. భూగర్భజలాలు ఇంకిపోయి పంటలు ఎండిపోకుండా రైతులతో మాట్లాడి నీటి వృథా, పొదుపు, ప్రత్యామ్నాయ నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాలు, కేజీబీవీలను రెగ్యులర్గా తనిఖీలు చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, పరిసరాలు పరిశుభ్రత ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్రావు, ఆర్డీఓ నవీన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తాగునీటి సరఫరాపై దృష్టి సారించాలి కలెక్టర్ విజయేందిర అదనపు తరగతులు మంజురు చేయాలి మహబూబ్నగర్ మండలంలోని గాజులపేట జెడ్పీహెచ్ఎస్లో అదనపు తరగతి గదులను మంజురు చేయాలని విద్యా కమిటీ మాజీ చైర్మన్ నర్సింహులు కోరారు. ఈ పాఠశాలలో తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో భోదన జరుగుతుంది. కానీ తరగతులు మాత్రం కేవలం నాలుగే ఉన్నాయని, ఈ తరగతుల్లోనే 10వ తరగతి వరకు కొనసాగడం విద్యార్థులకు ఇబ్బందిగా ఉంది. బోధన సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. బీజేపీ నాయకులు సతీష్కుమార్, నాగరాజు, రవికుమార్, నర్సింహులు, శ్రీనివాసులు పాల్గొన్నారు. క్యాలిఫర్ కేంద్రాన్ని ప్రారంభించాలి జిల్లా కేంద్రంలో ఉన్న జనరల్ ఆస్పత్రిలో ఉన్న క్యాలిఫర్ కేంద్రాన్ని పున: ప్రారంభించాలి. ఈ కేంద్రంలో టెక్నిషన్ లేక రెండు నెలల నుంచి కేంద్రం మూతపడింది. ఉమ్మడి జిల్లాలో ఏజిల్లాలో కూడా క్యాలిఫర్ కేంద్రం లేదని, ఉమ్మడి జిల్లా కేంద్రంలో మాత్రమే ఉన్న ఈకేంద్రం మూత పడడంతో దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్న పరికరానికై నా హైదరాబాద్కు పోవాల్సి వస్తుంది. -
కోర్టు ద్వారానే పరిష్కరించుకోవాలి
మహబూబ్నగర్ క్రైం: భూ తగాదాలు కోర్టు ద్వారా లేదా పరస్పర సహకారంతో పరిష్కరించుకోవాలని, అనవసరమైన ఆవేశాలకు వెళ్లి గొడవలు పెట్టుకోరాదని ఎస్పీ డి.జానకి వెల్లడించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 15 మంది బాధితుల నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించి సంబంధిత అధికారులకు సూచనలు అందించారు. బాధితుల ఫిర్యాదులపై దృష్టి పెట్టి సకాలంలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు పెండింగ్లో పెట్టకుండా తక్షణమే పరిష్కరించాలన్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు భరోసా కల్పించేలా న్యాయం అందించాలన్నారు. సైబర్ నేరాలు పెరుగుతున్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అత్యవసరం అయితే డయల్ 100 లేదా 1930 ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. అలివేలు మంగ హుండీ లెక్కింపు మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ అలివేలు మంగతాయారు హుండీ లెక్కింపు సోమవారం చేపట్టారు. ఈ ఏడాది అమ్మవారికి హుండీ ద్వారా రూ.9,73,440 ఆదాయం వచ్చింది. లెక్కింపులో ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు సుధా, అలివేలు మంగమ్మ, వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు. 336 మంది గైర్హాజరు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా మొత్తం 36 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ ఫస్టియర్ ఫిజిక్స్, ఎకానమిక్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 12,123 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 11,787 మంది హాజరై, 336 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఈ మేరకు పలు పరీక్ష కేంద్రాలను స్క్వాడ్ అధికారులు తనిఖీ చేశారు. వేరుశనగ క్వింటాల్ రూ.6,959 జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్యార్డులో సోమవారం వేరుశనగకు క్వింటాల్ గరిష్టంగా రూ.6,959, కనిష్టంగా రూ.5,311 ధరలు లభించాయి. కందులు గరిష్టంగా రూ.6,925, కనిష్టంగా రూ.5,200, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,329, కనిష్టంగా రూ.2,189, ఆముదాలు గరిష్టంగా రూ.6,160, కనిష్టంగా రూ.6,080, జొన్నలు గరిష్టంగా రూ.4,377, కనిష్టంగా రూ.4,277,పెబ్బర్లు రూ.5,771, మినుములు రూ.7,171 ధరలు లభించాయి. -
భవనం పూర్తికాగానే తరలిస్తాం
టీడీగుట్ట సమీపంలోని మార్కెట్ ప్రాంతంలో కూరగాయలు, మాంసం, చేపల అమ్మకాల కోసం నిర్మిస్తున్న అతి పెద్ద భవనం పనులు త్వరలో పూర్తి చేయిస్తాం. కోస్గి రోడ్డుతో పాటు పాత బస్టాండు సమీపంలో, పాత రైతుబజార్లో అమ్మే వారినందరినీ అక్కడికి తరలిస్తాం. ఆయా రోడ్ల పైనే కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల అమ్మకంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతున్నది వాస్తవమే. గతంలో పలుసార్లు వీరిని తూర్పు కమాన్కు ఎదురుగా ఉన్న మోడ్రన్ రైతుబజార్కు వెళ్లాలని సూచించాం. – డి.మహేశ్వర్రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, మహబూబ్నగర్ వాహన రాకపోకలకు ఇబ్బందులు పాత బస్టాండు చుట్టుపక్కల, కోస్గి రోడ్డుపై కూరగాయలు, ఆకుకూరలు అమ్మడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ప్రాంతం నుంచే భారీ వాహనాలతో పాటు బస్సుల రాకపోకలు విరివిగా సాగుతున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఈ రోడ్లపై అమ్మే వర్తకులు గాని, రైతులు గాని తూర్పు కమాన్కు ఎదురుగా ఉన్న మోడ్రన్ రైతు బజార్కు వెళ్తే బాగుంటుంది. అక్కడ వినియోగదారులకు సైతం ఉపయోగకరంగానే ఉంది. – పగడం మల్లేష్, పద్మావతికాలనీ, మహబూబ్నగర్ మోడ్రన్ రైతు బజార్కు తరలించాలి కోస్గి రోడ్డుపై మలుపులో కూరగాయలు, ఆకుకూరలు, ఇతర నిత్యావ సర వస్తువులను కొనాలంటేనే భయమేస్తుంది. అటు వైపు చించోళి నుంచి పెద్ద లారీలు, ఇతర భారీ వాహనాలు వస్తున్నప్పుడు ఈ ప్రాంతంలో బైక్పై వెళ్లేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. టీడీగుట్ట వద్ద రైల్వే గేటు పడ్డప్పుడు ట్రాఫిక్జాం అవుతోంది. వందలాది వాహనాలు అటు కోయిల్కొండ ఎక్స్రోడ్డు వరకు ఇటు క్లాక్టవర్ వరకు ఆగిపోతున్నాయి. వీటి మధ్యన నడవడానికి కూడా వీలుండదు. రోడ్డుపై అమ్మే వారిని మోడ్రన్ రైతుబజార్కు తరలించాలి. అక్కడ కూడా గిరాకీ అవుతుంది. – వెంకటయ్య, రిటైర్డ్ ఉద్యోగి, లక్ష్మీనగర్కాలనీ, మహబూబ్నగర్ 20 ఏళ్లుగా ఇక్కడే అమ్ముతున్నాం.. 20 ఏళ్ల నుంచి భూత్పూర్ చౌరస్తాలో కూరగాయల అమ్ముతున్నాం. దుకాణాల ఎదుట కూరగాయలు పెట్టవద్దని వారు నిరాకరించడంతో కుటుంబ పోషణ కోసం రహదారిపైనే విక్రయాలు చేస్తున్నాం. ఇప్పుడు ఈ రహదారి విస్తరిస్తున్నట్లు తెలిసింది. తమకు కూరగాయలు అమ్మడానికి మార్కెట్ను ఏర్పాటు చేయాలి. – పి.బుచ్చయ్య, కూరగాయల వ్యాపారి, భూత్పూర్ -
అన్ని సౌకర్యాలు కల్పించినా..
ఈ పరిస్థితులను అధిగమించడానికి 2018 సెప్టెంబర్లో తూర్పు కమాన్కు ఎదురుగా కొత్త మోడ్రన్ రైతుబజార్ను నిర్మించారు. ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించినా ప్రయోజనం దక్కడం లేదు. సువిశాలమైన హాలులో కూరగాయలు, ఆకుకూరలు అమ్ముకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. మటన్, చికెన్ విక్రయానికి సైతం షాపులు కేటాయించారు. మొదట్లో కొన్ని నెలలపాటు క్రయ విక్రయాలు బాగానే సాగాయి. అయితే ఆ తర్వాత పాత రైతు బజార్కే ప్రజలు వెళ్లడం ఆరంభించడంతో అప్పటి నుంచి మోడ్రన్ రైతు బజార్ వెలవెలబోతోంది. చాలా తక్కువ మంది రావడంతో ప్రభుత్వ ఆశయం నెరవేరడం లేదు. మరోవైపు మెట్టుగడ్డలోని డైట్ కళాశాల వద్ద, న్యూటౌన్ హైస్కూల్ వద్ద మరికొందరు వక్ఫ్ స్థలంలో షెడ్లు వేసుకుని కూరగాయలు, ఆకుకూరలు అమ్ముతున్నారు. -
‘గుర్రంగడ్డ’ పనుల్లో కదలిక
గద్వాల: ఏడాదిలో ఆర్నెళ్లు దీవిలో.. మరో ఆర్నెళ్లు మైదాన ప్రాంతంలో జీవిస్తున్న గుర్రంగడ్డ వాసుల కష్టాలు త్వరలో తీరనున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కృష్ణానది మధ్యలో ఉన్న ఏకై క దీవి గ్రామం గుర్రంగడ్డ. ఈ గ్రామ ప్రజల రాకపోకలకు ఏకై క మార్గం నదిలో పుట్టీల ద్వారా ప్రయాణం చేయడం. దీవిగ్రామ ప్రజల కష్టాలు తీర్చాలని గత ప్రభుత్వం హయాంలో 2015లో రూ.12 కోట్ల అంచనాలతో వంతెన నిర్మాణ పనులను చేపట్టారు. అయితే పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ సకాలంలో పనులు మొదలు పెట్టకపోవడంతో ఏడేళ్లుగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా పనులు ముందుకు సాగలేదు. తాజాగా అధికారు లు పాత ఏజెన్సీని మార్చేసి కొత్త ఏజెన్సీకి పనులు అప్పచెప్పడంతో పనుల్లో కదలిక మొదలైంది. వచ్చే ఏడాది వరకు పనులు పూర్తి చేసి రాకపోకలు ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ● వానాకాలం సీజన్లో భారీగా కురిసే వర్షాలకు వరద వచ్చి చేరడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంటుంది. ఈ సమయంలో గుర్రంగడ్డ వాసులు పుట్టీలు, పడవల ద్వారా ప్రయాణించాల్సిందే. ఈక్రమంలో వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నది మీదుగా ప్రయాణించాల్సి వస్తుంది. ఈ గ్రామంలో మొత్తం 600 మంది నివాసం ఉంటుండగా 450 మంది వరకు ఓటర్లున్నారు. మొత్తం వ్యవసాయ భూమి విస్తీర్ణం 2,100 ఎకరాలు కాగా ఇందులో సుమారు 1,600 ఎకరాలకు పైగా వివిధ రకాల పంటలు సాగుచేస్తారు. ఇందులో ప్రధాన పంట వరి. ఇలాంటి పరిస్థితిలో నదిలో భారీగా వరద ప్రవహిస్తున్నప్పుడు బాహ్యప్రపంచంతోదీవి వాసులకు పూర్తిగా సంబంధాలు కోల్పోతాయి. ఏడాదిలో ఆర్నెళ్ల వరకు ఈ కష్టాలు వెంటాడుతుంటాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో.. గత ప్రభుత్వం 2018లో రూ.12 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని పనులు మొదలుపెట్టింది. అయితే పనుల దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ వచ్చాడు. దీనిపై అధికారులు పలుమార్లు నోటీసులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కాంట్రాక్టర్లో చలనం లేదు. దీంతో ఏడేళ్లుగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. తాజాగా సదరు కాంట్రాక్టర్పై అధికారులు వేటు వేశారు. 60సీ నోటీసులు జారీ చేసి పాత కాంట్రాక్టర్, కన్స్ట్రక్షన్ ఏజెన్సీని తొలగించి నూతనంగా మరో ఏజెన్సీకి పనులు అప్పగించారు. దీంతో కాంట్రాక్టు దక్కించుకున్న ఏజెన్సీ పనులు మొదలుపెట్టింది. ప్రస్తుతం పనులు వేగవంతంగా సాగుతున్నాయి. వేసవి కాలంలో పనులు వేగవంతం చేసి వంతెన నిర్మాణం పూర్తి చేయాలని.. తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని గుర్రంగడ్డ వాసులు కోరుతున్నారు. ఇన్చార్జి ఎస్ఈ రహీముద్దీన్ మాట్లాడుతూ ‘పనులు నిర్లక్ష్యంచేసిన పాత ఏజెన్సీకి 60సీ నోటీసులు ఇచ్చి తొలగించాం. కొత్త ఏజెన్సీకి వంతెన నిర్మాణ పనులు అప్పగించాం. వచ్చే ఏడాది నాటికి పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం.’ అని పేర్కొన్నారు. గుర్రంగడ్డ వంతెన నిర్మాణ పనులు నూతన ఏజెన్సీకి వంతెన నిర్మాణ పనులు కృష్ణానదిలో ఏకై క దీవి గ్రామం.. అత్యవసర పరిస్థితుల్లో నది దాటేందుకు తీవ్ర ఇబ్బందులు వంతెననిర్మాణంతో తీరనున్న కష్టాలు -
వందశాతం ఆస్తిపన్ను వసూలు చేయాలి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఈనెలాఖరులోగా వంద శాతం ఆస్తి పన్ను వసూలు చేయాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ఆదేశించారు. సోమవారం మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో రెవెన్యూ విభాగం అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంకా రూ.4.35కోట్లు వసూలైతేనే 16వ ఆర్థిక సంఘం గ్రాంట్స్కు అర్హత దక్కుతుందన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు వార్డు ఆఫీసర్లను సస్పెండ్ చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డిని ఆదేశించారు. మరో ఎనిమిది మందికి మెమోలు జారీ చేయాలన్నారు. కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.33.75 కోట్ల తో పాటు పాత బకాయిల కింద రూ.18.25కోట్లు రావాల్సి ఉందని, ఇప్పటివరకు రూ.18.75 కోట్లు వసూలైందని ఆర్ఓ మహమ్మద్ ఖాజా బదులిచ్చారు. సమావేశంలో ఆర్ఐలు అహ్మద్షరీఫ్, ముజీబుద్దీన్, టి.నర్సింహ, రమేష్, పెంటయ్య, బిల్ కలెక్టర్లు పాల్గొన్నారు. స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్ విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరి సస్పెన్షన్ మరో 8 మంది వార్డు ఆఫీసర్లకు మెమో జారీ -
నీటి తరలింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
నాగర్కర్నూల్: ఉమ్మడి జిల్లాలోని ఏదుల రిజర్వాయర్ నుంచి డిండికి నీటి తరలింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సాగునీటి విషయంలో పాలమూరుకు ఎప్పుడు అన్యాయమే జరుగుతుందన్నారు. సాగునీటి పోరాటం తర్వాత ప్రారంభమైన ఎస్సీ వర్గీకరణ, బీసీ గణన వంటి పోరాటాలు తది దశకు చేరుకోగా.. సాగునీటి పోరాటం మాత్రం ఇంకా కొనసాగుతుందన్నారు. నల్లగొండకు నాగార్జున సాగర్ నుంచి నీటిని తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి నీటిని తరలించడం అన్యాయం చేయడమేనన్నారు. ఏదుల రిజర్వాయర్కు ఒక టీఎంసీ మాత్రమే కేటాయించారని.. అందులో అర టీఎంసీ నీటిని డిండికి తరలించడం వల్ల ఉద్దండాపూర్, వట్టెం, కరివెన వరకు నీరు పారే అవకాశం లేకుండా పోతుందన్నారు. ఈ ప్రాంతంలో ఉద్యోగాలు, వ్యాపారాలు లేవని.. ఇప్పుడు నీళ్లు కూడా లేకుండా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు వ్యతిరేకించాలని కోరారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ విషయంపై ధర్నాలు చేసిన నాయకులు ప్రస్తుతం ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పాలమూరు జిల్లా నుంచి ఏ ప్రాజెక్టు మొదలుపెట్టినా భూములు నష్టపోయేది ఈ ప్రాంత రైతులేనని అన్నారు. ఇటీవల ప్రకటించన గ్రూప్–3 ఫలితాల్లో చాలా మంది విద్యార్థులు హాల్ టికెట్ నంబర్లు తప్పుగా వేసినందుకు వారిని పక్కన పెట్టారని.. మరోసారి పరిశీలించి మార్కుల ఆధారంగా ఫలితాలు విడుదల చేయాలన్నారు. సమావేశంలో టీడీఎఫ్ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్నాయక్, రాష్ట్ర కౌన్సిలర్ కృష్ణయ్య, పాలమూరు అధ్యయన వేదిక సభ్యులు విష్ణువర్ధన్రెడ్డి, మద్దిలేటి తదితరులు ఉన్నారు. -
ఆటంకంగా మారిన నీటి ఊట
అచ్చంపేట/మన్ననూర్: ఎస్ఎల్బీసీ సొరంగంలో ఉబికి వస్తున్న నీటి ఊటతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. నీటి ఊట వల్ల తవ్వేకొద్దీ బురద, మట్టి వస్తోంది. భారీగా వస్తున్న నీటి ఊటను మోటార్ల ద్వారా ఎప్పటికప్పుడు బయటికి పంపింగ్ చేస్తున్నారు. సొరంగంలో చిక్కుకుపోయిన ఏడుగురిని బయటికి తెచ్చేందుకు సహాయక బృందాలు 23 రోజులుగా శ్రమిస్తూనే ఉన్నాయి. కాడవర్ డాగ్స్ గుర్తించిన డీ1, డీ2 ప్రదేశాల్లో బిగుసుకుపోయిన బురద తొలగింపు ముమ్మరంగా సాగుతోంది. సింగరేణి, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, ఆర్మీ, ర్యాట్ హోల్ మైనర్స్, దక్షిణ మధ్య రైల్వేకు చెందిన 12 బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. తవ్వకాల్లో అడుగడుగునా టీబీఎం పైకప్పు మెటల్ ప్లాట్ఫాం, పెద్దపెద్ద ఇనుపరాండ్లు అడ్డుగా వస్తున్నాయి. చిన్నచిన్న వాటిని ఎప్పటికప్పుడు ప్లాస్మా కట్టర్తో కట్చేసి తొలగిస్తున్నారు. పెద్ద రాండ్లను కట్ చేయడం కొంత ఇబ్బందిగా ఉన్నట్లు సహాయక సిబ్బంది చెబుతున్నారు. రెండు జనరేటర్స్ సహాయంతో మట్టి, బుదరను కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి పంపిస్తున్నారు. సొరంగంలో అప్పుడప్పుడు వస్తున్న దుర్వాసనతో సహాయక చర్యలకు కొంత ఇబ్బంది కలుగుతున్నట్లు తెలిసింది. అందుబాటులోకి రాని రోబో సేవలు.. సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు ఐదు రోజుల క్రితం ఇక్కడికి చేరిన అటాన్మస్ పవర్డ్ హైడ్రాలిక్ రోబో సేవలు ఇంకా మొదలు కాలేదు. సొరంగం ఇన్లెట్ వద్ద నుంచే ఆపరేటింగ్(కమ్యూనికేషన్) చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ (ఏఐ) ఆధారిత మాస్టర్ రోబోతో పాటు పవర్డ్ హైడ్రాలిక్ రోబోకు అనుసంధానంగా ఏర్పాటుచేసిన 30 హెచ్పీ సామర్థ్యం కలిగిన వాక్యూమ్ పంపు, వాక్యూమ్ ట్యాంకు ఇన్స్టాలేషన్ పూర్తయినా ఆదివారం సాయంత్రం కూడా సొరంగం లోపలికి వెళ్లలేదు. సొరంగంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా హైడ్రాలిక్ రోబోకు ఆటంకం కలిగే అవకాశం ఉండటంతో జాప్యం జరుగుతోంది. ఇది నిరంతరాయం పనిచేసేందుకు అదనపు యంత్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. టీబీఎం శకలాలతో.. పూర్తిగా ఉక్కుతో తయారైన పవర్డ్ హడ్రాలిక్ రోబో హైడ్రాలిక్ వ్యవస్థతో పనిచేస్తోంది. రోబో ముందు భాగంలో ఉన్న గ్రైండర్ సహాయంతో పెద్దపెద్ద రాళ్లు, రప్పలు, శిథిలాలను ముక్కులుగా చేయడంతో పాటు బురదను వాక్యూమ్ పంపు సహాయంతో నేరుగా కన్వేయర్ బెల్టుపై వేస్తోంది. ఈ రెస్క్యూ ఆపరేషన్ను సొరంగం లోపల 200 మీటర్ల దూరం నుంచి పర్యవేక్షించేందుకు వీలుంటుంది. అయితే సొరంగంలో రాళ్లు, బురదతో పాటు టీబీఎం విడి భాగాలు ఉండటం వల్ల రోబోలకు కూడా సహాయక సిబ్బందికి ఎదురవుతున్న సమస్యే నెలకొంది. టీబీఎం శకలాలు పూర్తిగా తొలగిస్తే తప్ప రోబో సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిిపించడం లేదు. ఎస్ఎల్బీసీ సొరంగంలో 23 రోజులైనా లభించని ఏడుగురి ఆచూకీ -
వివాహేతర సంబంధమే కారణం
జడ్చర్ల: వావివరసలు మరిచి అత్త అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. భర్త చూసి మందలించాడు. విషయం బయటకు తెలుస్తుందనే భయంతో ఆ ఇద్దరు కలిసి భర్తను హత్య చేసి ఆకస్మికంగా మరణంగా చిత్రీకరించారు. తన పెదనాన్న మరణంపై అనుమానం ఉందని తమ్ముడి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఊపిరి ఆడకుండా చేయడంతోనే చనిపోయాడంటూ పోస్టుమార్టం రిపోర్టులో బయటపడటంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఆదివారం స్థానిక పోలీస్స్టేషన్లో సీఐ కమలాకర్ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. కావేరమ్మపేట శివారు రాజీవ్నగర్కాలనీలో మీనుగ కోటయ్య, మీనుగ అలివేలు తమ ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. అదే కాలనీలో ఉండే అల్లుడు వరుస అయ్యే మీనుగ రాజ్కుమార్తో అలివేలు వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా విషయం తెలిసిన భర్త కోటయ్య ఇద్దరిని మందలించాడు. ఈ ఏడాది జనవరి 23న రాత్రి మీనుగ కోటయ్య కులస్తులతో కలిసి షాద్నగర్లో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి రాగా అలివేలు, రాజ్కుమార్ కాలనీలోని తమ పాత ఇంట్లో కలిసి ఉండడాన్ని చూసి నిలదీశాడు. దీంతో విషయం అందరికి చెప్పి రచ్చ చేస్తాడని భావించిన నిందితులు మద్యం మత్తులో ఉన్న కోటయ్యను కింద పడేసి గొంతుకు చున్నీ బిగించి హత్య చేశారు. అనంతరం అక్కడే పడుకోబెట్టి ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. మరుసటి రోజు తన భర్త రాత్రి ఫంక్షన్కు వెళ్లి తిరిగిరాలేడంటూ అలివేలు పిల్లలను నిద్రలేపి బంధువులు, చుట్టుపక్కల వారిని వెంటపెట్టుకొని పాత ఇంటికి వచ్చింది. చలనం లేకుండా పడి ఉన్న భర్తను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. తమ పెద్దనాన్న మరణంపై అనుమానం ఉందని తమ్ముడి కుమారుడు మీనుగ నాగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా పోస్టుమార్టం రిపోర్టులో ఊపిరి ఆడకుండా చేయడంతోనే చనిపోయినట్లు బయటపడింది. ఆదివారం అలివేలును అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిదింతులు అలివేలు, రాజ్కుమార్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ వివరించారు. హత్య వివరాలు వెల్లడించిన జడ్చర్ల సీఐ -
మన్యంకొండలో వైభవంగా వసంతోత్సవం
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీఅలివేలు మంగతాయారు ఉత్సవాల్లో భాగంగా ఆదివారం వసంతోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్ణాహుతి, అవబృత స్నానం, నాకబలి (నాగవెల్లి), ద్వాదశరాధన, సప్తవరణులు, మహాదాశీర్వచనం చేశారు. స్వామివారి సుదర్శన పెరుమాళ్లకు దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ప్రత్యేక వాహనంలో సుదర్శన పెరుమాళ్లను ఊరేగింపుగా దిగువ కొండ వద్దనున్న అమ్మవారి దేవస్థానం నుంచి ఘాట్రోడ్డు గుండా గుట్టపైనున్న బావి వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి సుదర్శన పెరుమాళ్లకు పురోహితులు సంప్రదాయ రీతిలో శ్రీచక్రస్నానం నిర్వహించారు. అనంతరం సుదర్శన పెరుమాళ్లను పూలతో శోభాయమానంగా అలంకరించి దిగువ కొండ వద్దనున్న అమ్మవారి దేవస్థానం వద్దకు తీసుకురావడంతో అమ్మవారి ఉత్సవాలు ముగిశాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారికి విశేషోత్సవాల్లో పాల్గొని తరించారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు వెంకటాచారి, సురేందర్, గోవింద్, అలివేలమ్మ, సుధ, మంజుల తదితరులు పాల్గొన్నారు. -
వనపర్తిని క్రీడాహబ్గా మారుస్తాం
వనపర్తిటౌన్: క్రీడల్లో గెలుపు, ఓటమి సహజమని.. ఓటమిని ఆయుధంగా మలుచుకొని రెట్టింపు ఉత్సాహంతో గెలుపునకు ప్రయత్నించే వారే అసలైన క్రీడాకారులని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని డా. బాలకిష్టయ్య క్రీడా ప్రాంగణంలో రాష్ట్రస్థాయి అండర్–14 ఫుట్బాల్ క్రీడాపోటీల బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. వనపర్తిని క్రీడా హబ్గా మారుస్తామని, జిల్లాకేంద్రానికి జాతీయస్థాయిలో గుర్తింపు లభిస్తుందని చెప్పారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించేందుకు ప్రయత్నించాలన్నారు. త్వరలోనే రూ.7.50 కోట్లతో టర్ఫ్ మైదానం, ఫుట్బాల్ అకాడమీ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే క్రీడాకారుల కోసం 50 గదులతో వసతిగృహాన్ని సైతం నిర్మిస్తామని చెప్పారు. అండర్–14 ఫుట్బాల్ పోటీల్లో బాలికలు 20, బాలురు 20 జట్లు పాల్గొన్నాయి. బాలికల్లో నిజామాబాద్ జిల్లా మొదటి, అదిలాబాద్ జిల్లా రెండు, రంగారెడ్డి జిల్లా మూడోస్థానంలో నిలిచాయి. బాలుర విభాగంలో హైదరాబాద్ జిల్లా మొదటి, మహబూబ్నగర్ జిల్లా రెండో, రంగారెడ్డి జిల్లా మూడోస్థానంలో నిలిచినట్లు జిల్లా క్రీడాశాఖ అధికారులు సుధీర్కుమార్రెడ్డి, సురేందర్రెడ్డి వివరించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, కాంగ్రెస్పార్టీ పట్టణ అధ్యక్షుడు చీర్ల విజయచందర్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆదిత్య, లక్కాకుల సతీష్, క్రీడాకారులు, నాయకులు పాల్గొన్నారు. త్వరలో రూ.7.50 కోట్లతో టర్ఫ్ మైదానం ఏర్పాటు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి -
మహబూబ్నగర్ టు మక్కా షరీఫ్
స్టేషన్ మహబూబ్నగర్: పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు ఆధ్యాత్మికతకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ప్రార్థనలు, ఉపవాస దీక్షలు చేపడుతారు. ఈ మాసంలో నిర్వహించే ఆరాధనలకు దేవుడు 70 రెట్లు ఎక్కువ పుణ్యం ప్రసాదిస్తారని ముస్లింల నమ్మకం. ఏటా ఈ మాసంలోనే మక్కా, మదీనాలోని పుణ్య ప్రదేశాలైన కాబా ప్రదక్షిణ, మదీనాలోగల మసీదులోని ప్రార్థనల కోసం ముస్లింలు ఉమ్రా యాత్రకు బయలుదేరుతున్నారు. ప్యాకేజీల వారీగా కొంత మంది 15 రోజులు, నెలరోజులపాటు మక్కా, మదీనాలోనే ఉంటారు. సాధారణ రోజుల్లో కంటే రంజాన్ మాసంలో ఉమ్రాయాత్రకు ఎక్కువ పుణ్యం దక్కుతుందని భావిస్తారు. అక్కడే రంజాన్ ఉపవాస దీక్షలు పాటిస్తూ దైవస్మరణలో తరిస్తారు. వందల సంఖ్యలో.. కొన్నేళ్లుగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి పవిత్ర రంజాన్ మాసంలో ఉమ్రాయాత్రకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. మిగతా రోజుల్లో ఉమ్రాయాత్ర కంటే రంజాన్ మాసంలో ప్యాకేజీ ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ ముస్లింలు మక్కా, మదీనాకు వెళ్లడానికి ఇష్టపడుతున్నారు. ఈ ఏడాది ఉమ్మడి జిల్లా నుంచి వందల సంఖ్యలో ఉమ్రాయాత్రకు వెళ్తున్నారు. దాదాపు 300 నుంచి 400 వరకు ఉమ్రాయాత్రకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది మక్కా షరీఫ్ యాత్రకు వెళ్లారు. మహబూబ్నగర్, వనపర్తి, నాగర్కర్నూల్, గద్వాల, నారాయణపేట జిల్లా కేంద్రాల్లో పదుల సంఖ్యలో హజ్, ఉమ్రా ట్రావెల్స్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. కొంతమంది ఇక్కడి ట్రావెల్స్, మరికొంత మంది హైదరాబాద్లోని ట్రావెల్స్ల ద్వారా ఉమ్రాయాత్రకు వెళ్తున్నారు. మానసిక ప్రశాంతత.. కొన్నేళ్ల నుంచి రంజాన్ మాసంలో ఉమ్రాయాత్ర చేస్తున్న. ఉమ్రాయాత్రతో మనస్సుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. ఈ రంజాన్ మాసంలో 15 రోజులు మక్కా, మదీనా షరీఫ్లో దైవ ప్రార్థనలో నిమగ్నమై ఈ నెల 10న ఇంటికి వచ్చాను. ఆ అల్లా దయవల్లే ప్రతి ఏడాది రంజాన్లో ఉమ్రాయాత్ర చేయడానికి అవకాశం లభిస్తుంది. – అబ్దుల్ జకీ, ఉమ్రా యాత్రికుడు, మహబూబ్నగర్ అదృష్టంగా భావిస్తున్నా.. ఇప్పటి వరకు రెండుసార్లు ఉమ్రాయా త్ర చేశాను. 2018 సంవత్సరంలో పవి త్ర రంజాన్ మాసంలో ఉమ్రాయాత్రకు వెళ్లాను. రంజాన్లో ఉమ్రాయాత్ర చేయడానికి అవకాశం రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నా. కొన్నేళ్లుగా ఉమ్మడి జిల్లా నుంచి పలువురు ముస్లింలు రంజాన్లో ఉమ్రాయాత్ర చేయడానికి వెళ్తున్నారు. – మొహ్సిన్పాష ఖాద్రీ, మహబూబ్నగర్ రంజాన్లో ఉమ్రా యాత్రకు వెళ్తున్న ముస్లింలు -
ముగిసిన రామలింగేశ్వరుడి బ్రహ్మోత్సవాలు
అడ్డాకుల: మండలంలోని కందూరు సమీపంలో స్వయంభూగా వెలసిన శ్రీరామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం ముగిశాయి. చివరిరోజు ప్రధాన ఆలయంలోని శివలింగానికి అభిషేకం జరిపి.. స్వామివారి వెండి ముఖాన్ని పూలతో అలంకరించి పూజలు చేశారు. గౌరమ్మ ఆలయంలో గౌరమ్మ విగ్రహానికి చీర, పూలతో అలంకరించి పూజలు, రుద్రాభిషేకం, రుద్రహోమం తర్వాత మహాపూర్ణాహుతి కార్యక్రమం చేపట్టారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను పల్లకీలో ఆలయం ముందు ఊరేగించారు. కందూర్లో వసంతోత్సవం నిర్వహించిన తర్వాత గ్రామస్తులు ఆలయానికి చేరుకుని త్రిశూలస్నానం కార్యక్రమంలో పాల్గొన్నా రు. పవిత్రమైన కోనేరులో స్వామివారి ఉత్సవ విగ్రహాలకు అర్చకులు యాదగిరిశర్మ, తాళ్లపాక రామలింగశర్మ, శివశర్మ, మణికంఠశర్మ, రేవంత్శర్మ, వినయ్శర్మ త్రిశూల స్నానం చేయించి ఉత్స వాలను ముగించారు. రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ముగియగా.. సోమవారం నుంచి జాతర ప్రారంభం కానుంది. ప్రతిఏటా ఉగాది పండగ వరకు జాతర కొనసాగనుండగా.. ఈ సారి శ్రీరామ నవమి వరకు పొడిగించారు. కార్యక్రమంలో ఈఓ రాజేశ్వరశర్మ, గ్రామస్తులు నాగిరెడ్డి, శ్రీహరి, రవీందర్శర్మ, దామోదర్రెడ్డి, రాములు, బుచ్చన్నగౌడ్, దేవ న్నయాదవ్, మనోహర్, సత్తిరెడ్డి అర్చకులు పాల్గొన్నారు. -
‘10 శాతం రిజర్వేషన్లు కల్పించడం దుర్మార్గం’
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జనాభాలో కేవ లం 15 శాతం ఉన్న అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ పేరుతో 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం దుర్మార్గమని యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చలకాని వెంకటయాదవ్ అన్నారు. ఆదివారం సంఘం కార్యాలయంలో యాదవ విద్యావంతుల వేదిక జిల్లాస్థాయి అవగాహన తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్రకుల రిజర్వేషన్లు అతిపెద్ద తప్పిదమని, దీంతో బలహీనవర్గాలకు నష్టం జరుగుతుందన్నారు. సమాజంలో అణగారిన, బలహీన, పీడిత వర్గాలకు మాత్రమే సంఘాలు ఉండాలని, అలాంటిది పాలక పక్షంలో ఉన్న వ్యక్తులు కూడా సంఘాలను పెట్టుకొని వాళ్లకు అనుకూలమైన చట్టాలను రూపకల్పన చేసుకుంటున్నారని విమర్శించారు. జనాభా దామాషా ప్రకారం విద్య, ఉపాధి, రాజకీయ, సామాజిక రంగాల్లో ఎవరి వాటా వారికి దక్కాలని డిమాండ్ చేశారు. ప్రతి యాదవ బిడ్డ చదువుకోవాలని అందుకోసం వారి తల్లిదండ్రులు కృషి చేయాలన్నారు. రాజకీయాల్లో యాదవుల వాటా కోసం ప్రతిఒక్కరు పోరాటం చేయాలన్నారు. అలాగే రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాకేంద్రాల్లో రానున్న 15 రోజుల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలుయాదవ్, నాయకులు రవికుమార్యాదవ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణయాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి భరత్కుమార్, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలుయాదవ్ పాల్గొన్నారు. -
ప్రేమించి పెళ్లి చేసుకున్న 45 రోజులకే..
జడ్చర్ల: మండలంలోని రాళ్లగడ్డ తండాలో ఓ నవవధువు ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నెలన్నర రోజులకే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. స్థానికుల వివరాల మేరకు.. గొల్లపల్లి శివారులోని రాళ్లగడ్డ తండాకు చెందిన పవన్కుమార్, ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన చర్చిత (23) ఖమ్మంలో బీఫార్మసీ చదువుతున్న సమయంలో ప్రేమలో పడ్డారు. 45 రోజుల క్రితం ఆమె తన తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుంది. భార్యాభర్తలు ప్రస్తుతం రాళ్లగడ్డ తండాలో ఉంటున్నారు. ఆదివారం భర్త పవన్కుమార్ డ్యూటీకి వెళ్లి వచ్చి తండాలోని స్నేహితులతో మాట్లాడుతున్న సమయంలో చర్చిత ఇంట్లో ఒంటరిగా ఉంది. కొద్ది సేపటికే ఇంట్లోకి వెళ్లి చున్నీతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మృతిచెందింది. మృతురాలు ఎంఫార్మసీ పరీక్షలకు హాజరవుతుందని.. భర్త, ఇతర కుటుంబ సభ్యులతో అన్యూన్యంగా ఉంటున్న సమయంలో ఆత్మహత్యకు పాల్పడటానికి కారణాలు ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఉరేసుకుని నవవధువు ఆత్మహత్య -
చంద్రగఢ్ కోట అభివృద్ధికి కృషి
● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అమరచింత: చంద్రగఢ్ కోట చరిత్రను అధ్యయనం చేసి పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ప్రాచీన చంద్రగఢ్ కోటను ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి సందర్శించారు. కోట లోపల ఉన్న రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రాతి కొలనులు, కోటను పరిశీలించి మాట్లాడారు. కోట, ఆలయ ప్రాచుర్యం, చరిత్రను వెలికి తీసేందుకు కృషి చేస్తామని.. కోట వద్ద మౌలిక సౌకర్యాల కల్పనకు ముందస్తుగా రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. ఈ నిధులతో కోటపై భాగానికి వెళ్లడానికి సీసీ రహదారి నిర్మించాలని అధికారులను ఆదేశించారు. సమీపంలోనే ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఉందని.. అక్కడి పర్యాటకులతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి కోటను చూడటానికి వస్తుంటారని, పర్యాటక కేంద్రంగా గుర్తించాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంత్రిని కోరారు. స్పందించిన మంత్రి పురావస్తుశాఖ అధికారులను పంపించి చరిత్రను గుర్తించి కోట అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే ఆత్మకూర్లోని పరమేశ్వరస్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి సందర్శించారు. పరమేశ్వరస్వామి ఆలయ చరిత్ర ఎంతో ఘనమైందని.. ఆలయంతోపాటు చెరువు అభివృద్ధికి కృషిచేస్తానని, ఇందుకు కావాల్సిన ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని అధికారులను ఆదేశించారు. -
బెట్టింగ్ యాప్స్నుప్రోత్సహిస్తే కఠిన చర్యలు
మహబూబ్నగర్ క్రైం: జిల్లావ్యాప్తంగా అన్ని రకాల అక్రమ బెట్టింగ్, గేమింగ్ యాప్స్పై ప్రత్యేక నిఘా పెట్టడంతోపాటు అలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం, కేసులు నమోదు చేస్తామని ఎస్పీ జానకి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అక్రమంగా ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్స్ను ప్రోత్సహిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల యువత, విద్యార్థులు తక్కువ సమయంలో అధిక డబ్బులు సంపాదించాలనే ఆశతో బెట్టింగ్ యాప్స్లో పాల్గొంటూ అప్పులపాలై తీవ్ర ఒత్తిడికి గురై, చివరికి ప్రాణాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. పోలీస్ శాఖ ఆధునిక సాంకేతికతను వినియోగించి, అక్రమ బెట్టింగ్ యాప్స్పై ప్రత్యేక నిఘా పెట్టిందన్నారు. సోషల్ మీడియా వేదికగా వీటిని ప్రచారం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. అక్రమ యాప్స్ ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని సైబర్ మోసగాళ్లు అపహరించే ప్రమాదం ఉందని, అక్రమ యాప్స్లో డబ్బులు పెట్టి మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడైనా జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా సమీప పోలీస్స్టేషన్లో సమాచారం ఇవ్వాలని కోరారు. 2 వేల బస్తాల వేరుశనగ రాక నవాబుపేట: మండల కేంద్రంలోని మార్కెట్ యార్డుకు ఆదివారం 2,329 బస్తాల వేరుశనగ వచ్చింది. కాగా వేరుశనగ క్వింటాల్కు గరిష్టంగా రూ.6,990, కనిష్టంగా రూ.5,505 ధర లభించిందని మార్కెట్ కార్యదర్శి రమే్ష్ తెలిపారు. సీజన్ ముగుస్తున్న సమయంలో వేరుశనగ పోటెత్తడం గమనార్హం. నిర్వాసితులకు న్యాయం చేశాకే పనులు చేపట్టాలి జడ్చర్ల: ఉదండాపూర్ నిర్వాసితులకు న్యాయం చేశాకే రిజర్వాయర్ నిర్మాణ పనులు చేపట్టాలని బాధితులు డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో భాగంగా ఆదివారం ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ తదితర పరిహారం ఇచ్చాకే పనులు చేపట్టాలన్నారు. ఉదండాపూర్లో రీసర్వేకు సంపూర్ణంగా సహకరించామని, తమకు పూర్తిస్థాయిలో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ పెంచి అందించాలని కోరారు. అలాగే 18 ఏళ్లు వయస్సు నిండిన వారికి ప్యాకేజీ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. పనులు అడ్డుకున్నారన్న కారణాలు చూపుతూ తమపై పోలీసులు కేసులు నమోదు చేశారని, వాటిని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. -
అంతర్ జిల్లాల దారిలో.. అవస్థల ప్రయాణం
కేంద్రానికి ప్రతిపాదించాం.. స్టేట్ హైవేలను జాతీయ రహదారులుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. అందులో ప్రధానంగా నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో నాలుగు రోడ్లు ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదనల్లో ఉన్న రహదారుల మంజూరు కోసం కృషి చేస్తున్నాం. ఇప్పటికే కేంద్ర మంత్రులను కలిసి రోడ్ల ఆవశ్యకతను వివరించాం. వీటికి త్వరలోనే అనుమతులు వచ్చే అవకాశం ఉంది. – మల్లు రవి, ఎంపీ, నాగర్కర్నూల్ -
మైనార్టీ గురుకుల కళాశాలల్లో ప్రవేశాలు
స్టేషన్ మహబూబ్నగర్: మైనార్టీల విద్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గురుకులాలు ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 20 మైనార్టీ గురుకుల కళాశాలలు కొనసాగుతుండగా.. వీటిలో 10 బాలుర, 10 బాలికల జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో విద్యార్థులు ఇంగ్లిష్ మాధ్యమంలో విద్యనభ్యసిస్తున్నారు. కార్పొరేట్ స్థాయిలో నిష్ణాతులైన ఉపాధ్యాయులు చదువు చెబుతున్నారు. కాగా.. మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2025– 26 ప్రవేశాల కోసం ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 31 వరకు ఆన్లైన్లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే చాలామంది విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో.. ఉమ్మడి జిల్లాలోని 20 మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో 1,600 సీట్లు ఉన్నాయి. వీటిలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని రెండు ఒకేషనల్ మైనార్టీ బాలికల– 2 గురుకుల జూనియర్ కళాశాల (అడ్వాన్స్ అండ్ టాక్సేషన్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ), బాలుర– 3 జూనియర్ కళాశాలలో (ఎంఎల్టీ, కంప్యూటర్ సైన్స్) 80 సీట్లు, మిగతా 18 జనరల్ మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో చెరో 80 సీట్లు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో 20 కాలేజీలు.. 1,600 సీట్లు ఈ నెల 31 వరకు దరఖాస్తులకు అవకాశం నాణ్యమైన విద్య.. మైనార్టీ గురుకుల కళాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన వసతి సౌకర్యాలు అందిస్తున్నాం. విద్యార్థులు కళాశాలల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రవేశాలకు సంబంధించి మిగతా సమాచారాన్ని సంబంధిత కళాశాలల్లో సంప్రదించాలి. – ఖాజా బాహుద్దీన్, ఆర్ఎల్సీ, మహబూబ్నగర్ -
విస్తృతంగా ప్రచారం..
ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపులో 25 శాతం రాయితీ ప్రకటించింది. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు, మున్సిపల్, పంచాయతీ అధికారులు విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నారు. ఎల్ఆర్ఎస్పై ప్రతిరోజు అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ పర్యవేక్షిస్తున్నారు. రియల్ ఎస్టేట్, బిల్డర్లు, డాక్యుమెంట్ రైటర్లతో సమావేశాలు నిర్వహించి మరీ ఎల్ఆర్ఎస్ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎల్ఆర్ఎస్పై అవగాహన కల్పిస్తున్నా ప్రజల్లో స్పందన కనిపించడం లేదు. కలెక్టరేట్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో సైతం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి.. ఆటోల ద్వారా ప్రచారం చేస్తున్నారు. అయినా ఎల్ఆర్ఎస్ చెల్లించేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదని తెలుస్తుంది. -
మైసమ్మ చెంత భక్తుల కిటకిట
నవాబుపేట: మండలంలోని ఫత్తేపూర్ మైసమ్మ ఆలయం ఆదివారం వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కిటకిటలాడింది. ఈ ప్రాంతంలో నూతన వాహనాలు కొనుగోలు చేసిన వారు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా మారింది. స్థానికులు సైతం అమ్మవారికి బోనాలతో నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. ఇలా వచ్చిన అందరూ అడవిలో చెట్ల కింద సేదతీరి ప్రకృతిని ఆస్వాదించారు. కాగా ఆదివారంతోపాటు మంగళవారాలు ప్రత్యేక పూజలు జరుగుతుండగా.. మిగతా రోజుల్లో సైతం ఆలయం వద్ద భక్తుల రద్దీ కొనసాగుతుంది. -
ప్రేమించి పెళ్లి చేసుకున్న 45 రోజులకే..
మహబూబ్ నగర్ జిల్లా: మండలంలోని రాళ్లగడ్డ తండాలో ఓ నవవధువు ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నెలన్నర రోజులకే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. స్థానికుల వివరాల మేరకు.. గొల్లపల్లి శివారులోని రాళ్లగడ్డ తండాకు చెందిన పవన్కుమార్, ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన చర్చిత (23) ఖమ్మంలో బీఫార్మసీ చదువుతున్న సమయంలో ప్రేమలో పడ్డారు. 45 రోజుల క్రితం ఆమె తన తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుంది. భార్యాభర్తలు ప్రస్తుతం రాళ్లగడ్డ తండాలో ఉంటున్నారు. ఆదివారం భర్త పవన్కుమార్ డ్యూటీకి వెళ్లి వచ్చి తండాలోని స్నేహితులతో మాట్లాడుతున్న సమయంలో చర్చిత ఇంట్లో ఒంటరిగా ఉంది. కొద్ది సేపటికే ఇంట్లోకి వెళ్లి చున్నీతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మృతిచెందింది. మృతురాలు ఎంఫార్మసీ పరీక్షలకు హాజరవుతుందని.. భర్త, ఇతర కుటుంబ సభ్యులతో అన్యూన్యంగా ఉంటున్న సమయంలో ఆత్మహత్యకు పాల్పడటానికి కారణాలు ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
అత్తతో అల్లుడి అనైతిక బంధం.. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న మామ
జడ్చర్ల(మహబూబ్నగర్): వావివరసలు మరిచి అత్త అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. భర్త చూసి మందలించాడు. విషయం బయటకు తెలుస్తుందనే భయంతో ఆ ఇద్దరు కలిసి భర్తను హత్య చేసి ఆకస్మికంగా మరణంగా చిత్రీకరించారు. తన పెదనాన్న మరణంపై అనుమానం ఉందని తమ్ముడి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఊపిరి ఆడకుండా చేయడంతోనే చనిపోయాడంటూ పోస్టుమార్టం రిపోర్టులో బయటపడటంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఆదివారం స్థానిక పోలీస్స్టేషన్లో సీఐ కమలాకర్ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. కావేరమ్మపేట శివారు రాజీవ్నగర్కాలనీలో మీనుగ కోటయ్య, మీనుగ అలివేలు తమ ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు.అదే కాలనీలో ఉండే అల్లుడు వరుస అయ్యే మీనుగ రాజ్కుమార్తో అలివేలు వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా విషయం తెలిసిన భర్త కోటయ్య ఇద్దరిని మందలించాడు. ఈ ఏడాది జనవరి 23న రాత్రి మీనుగ కోటయ్య కులస్తులతో కలిసి షాద్నగర్లో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి రాగా అలివేలు, రాజ్కుమార్ కాలనీలోని తమ పాత ఇంట్లో కలిసి ఉండడాన్ని చూసి నిలదీశాడు. దీంతో విషయం అందరికి చెప్పి రచ్చ చేస్తాడని భావించిన నిందితులు మద్యం మత్తులో ఉన్న కోటయ్యను కింద పడేసి గొంతుకు చున్నీ బిగించి హత్య చేశారు. అనంతరం అక్కడే పడుకోబెట్టి ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. మరుసటి రోజు తన భర్త రాత్రి ఫంక్షన్కు వెళ్లి తిరిగిరాలేడంటూ అలివేలు పిల్లలను నిద్రలేపి బంధువులు, చుట్టుపక్కల వారిని వెంటపెట్టుకొని పాత ఇంటికి వచ్చింది. చలనం లేకుండా పడి ఉన్న భర్తను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. తమ పెద్దనాన్న మరణంపై అనుమానం ఉందని తమ్ముడి కుమారుడు మీనుగ నాగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా పోస్టుమార్టం రిపోర్టులో ఊపిరి ఆడకుండా చేయడంతోనే చనిపోయినట్లు బయటపడింది. ఆదివారం అలివేలును అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిదింతులు అలివేలు, రాజ్కుమార్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ వివరించారు. -
SLBC: రోబోలతో సెర్చ్ ఆపరేషన్.. టన్నెల్లో ప్రస్తుత పరిస్థితి ఇదే
సాక్షి, మహబూబ్నగర్ జిల్లా: ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం 23 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ కేవలం ఒక మృతదేహం మాత్రమే లభ్యం అయింది. మిగిలిన ఏడు మృతదేహాల కోసం నిరంతరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 12 ఏజెన్సీలకు చెందిన 650 మంది సభ్యులు షిఫ్టుల వారిగా సహాయక చర్యలు చేపడుతున్నారు. పెద్ద మొత్తంలో పేరుకుపోయిన బురద భారీగా ఉబికి వస్తున్న ఊటనీరు పనులకు ఆటంకంగా మారింది.రోబోల వినియోగంతో సహాయక చర్యలు ముమ్మరం అవుతాయని భావిస్తున్నా ఇంకా రోబోల పని ప్రారంభం కాలేదు. అటానమస్ హైడ్రాలిక్ పవర్ రోబోలు మూడింటిని వినియోగించనున్నారు. ఒక్కో మిషన్ నిమిషానికి వెయ్యి క్యూబిక్ మీటర్ల సామర్ద్యం గల బురద, మట్టిని తొలగిస్తోంది. మానవుల కంటే 15 రెట్లు అధికంగా ఈ రోబోల పని చేస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు. టన్నెల్ ప్రమాద జీరో పాయింట్ వద్ద 50 మీటర్ల పరిధిలో ప్రమాదకరంగా ఉండటంతో అక్కడ ఈ రోబోలు వినియోగించాలని నిర్ణయించారు.రోబోలు సమర్దవంతంగా పనిచేసేందుకు కావాల్సిన అదనపు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జీపీఆర్, క్యాడవర్ డాగ్స్ సూచించిన D1 నుంచి D2 అనుమానిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తవ్వకాలు జరుపుతున్నారు. అయినా మృతదేహాల ఆచూకీ లభించడం లేదు. మరో వైపు డిజాస్టర్ మెనేజ్మెంట్ కార్యదర్శి అరవింద్ కుమార్, జిల్లా కలెక్టర్ బాగావత్ సంతోష్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ నిత్యం ఉదయం, సాయంత్రం సహయ బృందాల హెడ్స్తో సమీక్షలు నిర్వహిస్తూ వారికి కావాల్సిన సూచనలు, సలహాలు, పరికరాలు సమకూర్చుతున్నారు.గడిచిన 23 రోజులుగా తమ వారి ఆచూకీ కోసం ఓవైపు జార్ఖండ్ పంజాబ్ జమ్మూకాశ్మీర్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన బాధిత కుటుంబ సభ్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు. భారీగా ఊరుతున్న సీపేజ్ వాటర్ బురదను తొలగించడం కష్టంగా మారింది. దక్షిణ మధ్య రైల్వే వారి సహకారంతో ప్లాస్మా కట్టర్స్ థర్మల్ కట్టర్స్తో టిబిఎం మిషన్ విభాగాలను కట్ చేసి లోకో ట్రైన్ ద్వారా బయటకు పంపిస్తున్నారు మొత్తంగా సహాయ చర్యలు ముమ్మరం చేసినా భారీగా పేరుకుపోయిన శిథిలాలు బురద ఊట నీరుతో సహాయక చర్యలకు అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి. -
కార్పొరేషన్లను నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్
స్టేషన్ మహబూబ్నగర్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం కార్పొరేషన్లను నిర్వీర్యం చేసిందని టీపీసీసీ ఉపాధ్యక్షులు, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లను పూర్తిగా విస్మరించిందన్నారు. పదేళ్లలో పట్టించుకోలేదని, కాని ఎన్నికల సంవత్సరం అరకొరగా ఆర్థికసాయం ఇచ్చి చేతులు దులుపుకుందని ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి సామాజిక విప్లవకారుడని, ఆయన నేతృత్వంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. రాజీవ్ యువ వికాస పథకంలో బ్యాంకు లింకేజీతో ఒక్కో లబ్ధిదారుడికి రూ.3లక్షల వరకు ఆర్థికసాయం అందజేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రూ.6 వేల కోట్లతో రాష్ట్రంలో 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతకు ఈ పథకం కింద లబ్ధిచేకూరుతుందన్నారు. ఈనెల 15న నోటిఫికేషన్ విడుదలైందని, వచ్చేనెల 5వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం ఏప్రిల్ నుచి 6 నుంచి మే 31 వరకు లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. జూన్ 2న లబ్ధిదారులకు చెక్కులు అందజేస్తామని తెలిపారు. మైనార్టీ కార్పొరేషన్కు రూ.800 కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎంలకు కృతజ్ఞతలు చెప్పారు. సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎస్.వినోద్కుమార్, నాయకులు ఎన్పీ.వెంకటేశ్, సీజే బెనహర్, నాగరాజు, రాములుయాదవ్, పీర్ సాధిక్ తదితరులు పాల్గొన్నారు. రూ.6 వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం టీజీఎంఎఫ్సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ -
ప్రాధాన్యం ఇస్తున్నాం..
యూనివర్సిటీలో అధ్యాపకులు, ఇటు రీసెర్చ్ స్కాలర్ ఎంతో ఉత్సహంగా పరిశోధనలపై దృష్టి సారిస్తున్నారు. ఇటీవల కొన్ని పేటెంట్లు కూడా వచ్చాయి. దీని ద్వారా పీయూకు ప్రాజెక్టులు, రీసెర్చ్ పరమైన అంశాల్లో ముందంజ వేస్తున్నాం. నిర్మాణంలో రీసెర్చ్ ఫెసిలిటీ భవనం ఉంది. అది అందుబాటులోకి వస్తే పీయూ రీసెర్చ్ హబ్గా మారనుంది. అందులో పూర్తిస్థాయిలో ల్యాబ్లో అధునాతన ప్రయోగ పరికరాలు అందుబాటులోకి తీసుకువస్తాం. – శ్రీనివాస్, వైస్ చాన్స్లర్, పాలమూరు యూనివర్సిటీ ● -
కొనసాగుతున్న సహాయక చర్యలు
● ఎస్ఎల్బీసీ టన్నెల్లో లభ్యం కాని కార్మికుల ఆచూకీ ● కనీసం ఆనవాళ్లు కూడా లభించని వైనం ● హైడ్రాలిక్ పవర్డ్ రోబో పనితీరుపైనే ఆశలు ● డీ1 జోన్ ప్రాంతంలో బలహీనంగా పైకప్పు ● 22 రోజులుగా శ్రమిస్తున్న సహాయక బృందాలు సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న అరవింద్కుమార్ – అచ్చంపేట/ ఉప్పునుంతల వివరాలు 8లో u -
ఉత్సాహంగా జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: హైదరాబాద్లో ఈనెల 23న జరిగే రాష్ట్రస్థాయి అంతర్ జిల్లా అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల ఎంపికలను శనివారం జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహించారు. అండర్–14, 16, 18, 20 విభాగాలతో పాటు పురుషులు, మహిళలకు 100 మీ., 400 మీటర్ల పరుగు, జావెలిన్ త్రో ఎంపికలు నిర్వహించారు. కార్యక్రమంలో కోచ్లు ఆనంద్, సునీల్కుమార్, జిల్లా అథ్లెటిక్స్ సంఘం సంయుక్త కార్యదర్శులు సి.శ్రీనివాసులు, పి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆస్తి పన్ను వసూలుపై దృష్టి మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఈ ఆర్థిక సంవత్సరం గడువు దగ్గర పడుతుండటంతో ఆస్తిపన్ను వసూళ్లపై స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు దృష్టి పెట్టారు. శనివారం నగరంలోని ఆయా డివిజన్ల పరిధిలో ఎనిమిది బృందాలు తిరిగి ఏకంగా రూ.29 లక్షల మేర రాబట్టగలిగారు. ఇక మార్కెట్ ఏరియాలోని వివిధ దుకాణదారులు నాలుగేళ్లుగా సుమారు రూ.పది లక్షల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో తాజాగా పది షాపులను సీజ్ చేశారు. అలాగే పాతబస్టాండు వద్ద ఆర్టీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంక్ సైతం రూ.5.57 లక్షల బకాయి పడింది. దీనిని ఓ ప్రైవేట్ వ్యక్తి లీజుకు తీసుకుని నడిపిస్తుండగా మున్సిపల్ అధికారులు అక్కడికి వెళ్లి సీజ్ చేశా రు. చివరకు ఈనెల 18వ తేదీలోగా మొత్తం చెల్లిస్తామని అతను చెప్పడంతో తిరిగి తెరిచారు. కార్యక్రమంలో ఆర్ఓ మహమ్మద్ ఖాజా తో పాటు ఏడుగురు ఆర్ఐలు పాల్గొన్నారు. భవిష్యత్లో మరిన్ని ఏఐ ల్యాబ్లు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని రాంనగర్ ప్రభుత్వ పాఠశాలలో శనివారం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ల్యాబ్ను డీఈఓ ప్రవీణ్కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో విద్యార్థులకు ఏఐ తరగతులు బోధించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పది ప్రభుత్వ పాఠశాలల్లో ల్యాబ్లను ఏర్పాటు చేసిందన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకు ఏఐ ల్యాబ్లు ఎంతో ఉపయోగపడతాయన్నారు. భవిష్యత్లో మరిన్ని ల్యాబ్లు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్, సీఎంఓ బాలుయాదవ్, ఎంఈఓ లక్ష్మణ్నాయక్, అంజలీదేవి పాల్గొన్నారు. వేరుశనగ క్వింటాల్ రూ.6,871 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం వేరుశనగకు క్వింటాల్ గరిష్టంగా రూ.6,871, కనిష్టంగా రూ.5,869 ధరలు లభించాయి. అదేవిధంగా కందులు రూ.6,971, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,321, కనిష్టంగా రూ.2,127, జొన్నలు రూ.3,817, ఆముదాలు గరిష్టంగా రూ.6,125, కనిష్టంగా రూ.6,060, పత్తి రూ.5,300 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్లో కందులు క్వింటాల్కు గరిష్టంగా రూ.6,041గా ఒకే ధర నమోదైంది. -
నైపుణ్య శిక్షణ కేంద్రం అభివృద్ధికి కృషి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలోని మెట్టుగడ్డలో నిర్మిస్తున్న నైపుణ్య శిక్షణ కేంద్రం అభివృద్ధికి ప్రముఖ పారిశ్రామికవేత్తల సహకారం తీసుకుంటామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేయనున్న ఈ కేంద్రాన్ని శనివారం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ కంట్రోల్స్ సంస్థ డైరెక్టర్ రాజీవ్ త్రివేదితో కలిసి పరిశీలించారు. ఇందులో విద్యార్థులకు అవసరమయ్యే తరగతి గదులు తదితర అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అనంతరం మున్సిపల్ నిధులతో క్లాక్టవర్ వద్ద వేసిన పవర్ బోరును పరిశీలించారు. ముడా నిధులతో ఆర్ఓ ప్లాంట్, ప్రత్యేక షెడ్ సైతం ఏర్పాటు చేయాలన్నారు. అలాగే కోయిల్కొండ ఎక్స్రోడ్డులోని జంతు వధశాల పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. అంతకుముందు మున్సిపల్ కార్యాలయంలో ఆర్పీలతో సమావేశమయ్యారు. ఎల్ఆర్ఎస్కు సంబంధించి ఫీజు చెల్లింపులో 25 శాతం రాయితీపై దరఖాస్తుదారులకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే ఆవరణలో నిర్మిస్తున్న కళాభారతి భవనాన్ని తనిఖీ చేశారు. అలాగే కల్వరిగుట్టపై తాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తనను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎస్.వినోద్కుమార్ ఆధ్వర్యంలో కలిసిన ఎంబీ చర్చి సంఘం సభ్యులకు హామీ ఇచ్చారు. ఉన్నత స్థితికి చేరుకోవాలి మహిళలు కుట్టు శిక్షణలో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. మెప్మా ఆధ్వర్యంలో కలెక్టర్ బంగ్లా సమీపంలోని వివేకానంద కమ్యూనిటీ హాలు టైలరింగ్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు నెలలపాటు శిక్షణ పూర్తి చేసుకున్న వారు సర్టిఫికెట్ పొందితే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ కె.లక్ష్మణ్యాదవ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎ.ఆనంద్కుమార్గౌడ్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డి, ఆర్అండ్బీ డీఈఈ సంధ్య, మెప్మా ఇన్చార్జ్ డీఎంసీ ఎం.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
రిమోట్ కంట్రోల్తో ఆక్సిజన్..
పీయూ మ్యాథ్స్ విభాగంలో పేటెంట్ రైట్స్ దృష్టిసారించింది. ఇందులో డిజైన్ విభాగంలో శ్వాసకోశ రోగులకు ఆక్సిజన్ థెరపీ అందించేందుకు రిమోట్ కంట్రోలర్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ రూపొందించారు. ఇందులో పేషెంట్ ఆరోగ్యం, పరిస్థితి తదితర అంశాలను కాన్సన్ట్రేటర్ పరిశీలించిన తర్వాత రోగికి ఆక్సిజన్ అందిస్తుంది. అయితే రోగికి మ్యానువల్ పద్ధతిలో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ద్వారా ఆక్సిజన్ సరఫరా చేయాలంటే ఇబ్బందికర పరిస్థితులు ఉండే నేపథ్యంలో కేవలం రిమోట్ కంట్రోల్ ద్వారా ఆక్సిజన్ను అవసరం మేరకు అందిస్తే ఇబ్బందులు తప్పనున్నాయి. ఇందులో పలు యూనివర్సిటీలకు చెందిన అధ్యాపకులు శంకర్రావు, మధు, భారతి, సత్తమ్మ, లిపిక, అరుంధతి పాలుపంచుకున్నారు. -
మోదీ నాయకత్వంలో దేశాభివృద్ధి
మిడ్జిల్: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఎంతో అభివృద్ధి చెందుతోందని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. శనివారం సాయంత్రం మిడ్జిల్లో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను ఆమె ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే గ్రామాల్లోనే అభివృద్ధి జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పేదలకోసం ప్రవేశపెట్టిన ఫలాలు నేరుగా ప్రజలకు అందాలంటే గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యులు బీజేపీ వారై ఉండాలని సూచించారు. ఇది జరగాలంటే బీజేపీ గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ కు చెందిన వెంకటయ్య, బుచ్చయ్య, భీమయ్య, బాలమల్లయ్య, తదితరులు ఎంపీ సమక్షంలో బీజేపీలో చేరారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్, నాయకులు జనార్ధన్రెడ్డి, వేణుగోపాల్రెడ్డి, తిరుపతి, నరేష్నాయక్ పాల్గొన్నారు. -
కీలకంగా పర్యావరణహిత రీ ఏజెంట్లు
రసాయన పరిశ్రమలు, ట్యాబ్లెట్లు, ఇతర పరిశ్రమల్లో కెమికల్స్ తయారు చేసేందుకు రీ ఏజెంట్లు ఎంతో కీలకంగా మారనున్నాయి. ఇందులో రీ ఏజెంట్లు మొదట తయారు చేసేందుకు పెద్ద పరిశ్రమలను స్థాపించడం, పెట్టుబడి, ఇతర పర్యావరణానికి నష్టం చేసే విధంగా ప్రక్రియ చేయాల్సి ఉంటుంది. కానీ, పీయూ కెమిస్ట్రీ విభాగం అధ్యాపకులు చేసిన ప్రయోగాలు పూర్తిగా పర్యావరణ హితం కానున్నాయి. సాధారణ గది ఊష్టోగ్రతల వద్ద చిన్న గదుల్లో సైతం రీ ఏజెంట్లను శాసీ్త్రయ పద్ధతిలో తయారు చేసే విధానాన్ని కొనుగొనడంతో మూడు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం పేటెంట్ రైట్ ప్రకటించింది. ఇందులో అధ్యాపకులు చంద్రకిరణ్, సిద్ధరామగౌడ్, రీసెర్చి స్కాలర్ స్వాతి భాగస్వాములయ్యారు. వీటితోపా టు మరో 20 రీఏజెంట్లో పరిశోధనలో ఉన్నాయి. -
ఆవిష్కరణలకు గుర్తింపు
పీయూలో పరిశోధనలపై దృష్టి సారించిన అధ్యాపకులు ● ఇప్పటికే కెమిస్ట్రీ విభాగంలో పూర్తిస్థాయి పేటెంట్ హక్కులు ● డిజైన్ విభాగంలో రెండు, యుటిలిటీలో ఒకటి, పరిశీలనలలో మరొకటి ● గుర్తింపు వస్తే పూర్తిస్థాయిలో కొత్త ఆవిష్కరణలకు అవకాశం పాలమూరు యూనివర్సిటీ అధ్యాపకులు బోధనపైనే కాకుండా.. పరిశోధనలపై సైతం దృష్టిసారించారు. గత కొన్నేళ్లుగా సాగుతున్న పరిశోధనలతో పలు అంశాల్లో పేటెంట్ రైట్స్ సైతం సాధించారు. మొత్తం కెమిస్ట్రీ విభాగంలో అధ్యాపకులు పర్యావరణహిత రీ ఏజెంట్లు, ఎలాంటి కెమికల్స్ లేకుండా సాధారణ పర్యావరణానికి అనుకూలమైన విధానంలో తయారు చేయడం యూనివర్సిటీ చరిత్రలో ఓ మైలురాయి. దీనికి పేటెంట్ రైట్ రావడంతో టీచర్స్ అసోసియేట్ షిప్ ఫర్ రీసెర్చ్ ఎక్సలెన్స్ ఫెల్లోషిప్ అధ్యాపకులు చంద్రకిరణ్ ఎంపికయ్యారు. మ్యాథ్స్ విభాగంలో అధ్యాపకులు రిమోట్ కంట్రోల్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తయారీ, రోలర్ స్టాంప్ తయారీకి డిజైన్ విభాగంలో పేటెంట్ రాగా.. స్ట్రెచింగ్ షీట్పై కాసన్ నానోఫ్లూయిడ్స్ ప్రవాహంలో వేడి, ద్రవ్యరాశి బదిలీని పంచే పద్ధతి వంటివి ఇటీవలే ఆవిష్కరించారు. ఇవి పరిశీలన దశలో ఉండగా.. మరో ఆవిష్కరణను ఎంబీఏ అధ్యాపకులు ఆన్లైన్ ట్రేడింగ్ ప్రిడెక్టర్ వంటి పరికరాలు ఆవిష్కరించారు. దీంతో ఇటు అధ్యాపకులు రీసెర్చ్ స్కాలర్స్, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ విద్యార్థులు పరిశోధనల అనంతరం ఒక కొత్త యంత్రాల ఆవిష్కరణతో జరిగే ప్రయోజనం వంటి అంశాలపై దృష్టిసారించారు. – మహబూబ్నగర్ ఎడ్యుకేషన్● రోలర్ స్టాంప్ పరికరాన్ని మ్యాథ్స్ విభాగం అధ్యాపకులు మధు ఆవిష్కరించగా.. పేటెంట్ రైట్ లభించింది. గణితం అంటే భయపడే పాఠశాల స్థాయి విద్యార్థులకు ఈ పరికరం ఎంతో ఉపయోగపడనుంది. దీని ద్వారా గణిత ప్రక్రియలను సులభతరం చేసేందుకు అవకాశం ఉంది. ● రసాయన శాస్త్రంలో కెమికల్స్ ప్రాసెసింగ్, ఏరో స్పేస్, బయో మెడికల్ ఇంజినీరింగ్ పారిశ్రామిక అనువర్తనాల్లో వేడి, ద్రవ్యరాశి బదిలీలో కీలకపాత్ర పోషిస్తున్న స్ట్రెచింగ్ షీట్పై కానస్ నానోఫ్లూయిడ్ ప్రవాహంలో వేడి, ద్రవ్యరాశి బదిలీని పెంచే పద్ధతిలో కూడా మ్యాథ్స్ విభాగంలో పరిశోధనలు పూర్తి కాగా పేటెంట్ రైట్ పరిశీలనలో ఉన్నాయి. -
మూడు ఉద్యోగాలు సాధించిన యువతి
తెలకపల్లి: మండలంలోని గడ్డంపల్లి గ్రామానికి చెందిన మద్దెల పుల్లయ్య–బాలమ్మ దంపతుల కూతురు మద్దెల అరుణ మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. కుటుంబం, పిల్లలు ఉన్నా పట్టుదలతో చదివి ఉద్యోగాలు సాధించింది. 2018లో బీసీ పీజీటీ ఫిజిక్స్లో చేరి ఉద్యోగం సాధించింది. 2019లో గురుకుల డిగ్రీ కళాశాలలో లెక్చరర్గా (డీఎల్) సూర్యపేటలో విధులు నిర్వహించింది. 2025లో ఇటీవల జూనియర్ లెక్చరర్ ఫలితాల్లో నాగర్కర్నూల్ ప్రభుత్వ బాలికల కళాశాలలో జూనియర్ లెక్చరర్ ఉద్యోగం సాధించింది. ఉద్యోగాలు సాధించడంలో కుటుంబ సభ్యుల కృషి ప్రోత్సాహం ఎంతో ఉందని మద్దెల అరుణ తెలిపారు. -
పరిహారమిచ్చాకే పనులు చేపట్టాలి
జడ్చర్ల: ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులకు సంబంధించి తమకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, తదితర పరిహారమిచ్చాకే పనులు చేపట్టాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. శనివారం ఉదండాపూర్ రిజర్వాయర్ కట్టపై కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల్లో నిర్వాసితులు పాల్గొన్నారు. ఇటీవల ఉదండాపూర్లో రీసర్వేకు సంపూర్ణంగా సహకరించామని, తమకు పూర్తి స్థాయిలో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ పెంచి తమకు అందజేసిన తరువాతనే పనులు మొదలు పెట్టాలని కోరారు. తాజాగా 18 సంవత్సరాల వయస్సు నిండిన వారికి ప్యాకేజీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. పనులను అడ్డుకున్నారన్న కారణాలు చూపుతు తమపై పోలీసులు కేసులు నమోదు చేశారని, ఆయా కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. న్యాయపరమైన తమ డిమాండ్లను పరిష్కరించి న్యాయం చేయాలన్నారు. శ్రీను, వెంకటయ్య, రాములు, ఆంజనేయులు పాల్గొన్నారు. -
దారిదోపిడీకి యత్నించిన ముఠా అరెస్ట్
నాగర్కర్నూల్ క్రైం: జల్సాలకు అలవాటుపడి దారి దోపిడీకి యత్నించిన ఓ ముఠాను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో సమావేశం ఏర్పాటుచేసి వివరాలు వెల్లడించారు. వనపర్తికి చెందిన బొల్లెమోని బాబు, బొల్లెమోని అంజి, పుట్టపాకుల శ్రీకాంత్, హైదరాబాద్కు చెందిన నందిమళ్ల హరిగణేశ్, యాత రవి, పెంట్లవెల్లికి చెందిన గిరిధర్నాయుడు, సాయికుమార్, హరికృష్ణ, అఖిల్ జల్సాలకు అలవాటుపడి చోరీలకు పాల్పడుతుండేవారు. పెంట్లవెల్లికి చెందిన రాజవర్ధన్, వెంకటేశ్వర్లు, రమేష్, రాఘవేంద్రాచారి బంగారు వ్యాపారులు. వీరంతా ఈ నెల 6న బంగారు కొనుగోలుకు హైదరాబాద్ బయలుదేరారు. నిందితుడు సాయికుమార్ ఈ సమాచారాన్ని బొల్లెమోని బాబుకు అందించడంతో పాటు హరికృష్ణ, గిరిధర్ నాయుడుకు ఓ అద్దె కారు, సెల్ఫోన్ అప్పగించి బంగారు వ్యాపారస్తుల కారు వెంటే వెళ్తూ ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. ఆ వ్యాపారులు హైదరాబాద్లోని కాళీకమాన్ వద్ద బంగారు కొనుగోలు చేసి బయలుదేరగా నిందితులు మిగతా వారిని అప్రమత్తం చేయడంతో పాటు వారి వెంటే వచ్చారు. కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లి శివారు కేఎల్ఐ వంతెన వద్ద స్వామి, అంజి రాళ్లు అడ్డుపెట్టడంతో పాటు సిమెంట్ దిమ్మెలను, అఖిల్ తల్వార్ను చేతిలో పట్టుకోవడంతో పాటు హరిగణేష్, రవి, శ్రీకాంత్ రోడ్డు పక్కన నిలిచి ఉన్నారు. బంగారు వ్యాపారుల కారు అక్కడికి చేరుకోగానే నిందితులు కారుపై సిమెంట్ దిమ్మెలతో దాడి చేసేందుకు యత్నించగా అప్రమత్తమైన డ్రైవర్ చాకచక్యంగా అక్కడి నుంచి వేగంగా తప్పించుకొని వెళ్లిపోయారు. బంగారు వ్యాపారి రాజవర్ధన్ స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని గాలింపు చేపట్టారు. శుక్రవారం రాత్రి కొల్లాపూర్లో పెట్రోల్బంక్ వద్ద వాహన తనిఖీలు చేపడుతుండగా బొల్లెమోని బాబు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తమదైన శైలిలో విచారించగా నేరాన్ని అంగీకరించడంతో పాటు మిగతా వారి సమాచారం ఇవ్వడంతో ఏడుగురిని అరెస్టు చేశారు. వీరంతా వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల్లో 24 చోట్ల చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. నిందితుల నుంచి వేర్వేరు దొంగతనాలకు సంబంధించి 10 తులాల బంగారు, 22 తులాల వెండి ఆభరణాలు, దారి దోపిడీకి యత్నించిన కారు, రెండు మోటారు సైకిళ్లు, ఏడు సెల్ఫోన్లు, కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తామని.. కోర్టు అనుమతితో మరోమారు పోలీస్ కస్టడీకి తీసుకొని విచారిస్తామని చెప్పారు. 10 తులాల బంగారం, 22 తులాల వెండి ఆభరణాల స్వాధీనం వివరాలు వెల్లడించిననాగర్కర్నూల్ ఎస్పీ -
అఘోరిని అడ్డుకున్న పోలీసులు
అలంపూర్: అలంపూర్కు వెళ్లకుండా మహిళా అఘోరిని పోలీసులు అడ్డుకున్నారు. శాంతిభద్రతల్లో భాగంగా నాగసాధువు అఘోరిని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి టోయింగ్ వాహనం ద్వారా హైదరాబాద్కు తరలించారు. నాగసాధువు మహిళా అఘోరి ఇటీవలే అలంపూర్లోని దర్గాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగా మహిళా అఘోరి శనివారం అలంపూర్కు వచ్చారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఉదయం నుంచే పోలీసులు అలంపూర్ చౌరస్తా, డి.బూడిదపాడు, భైరాపురం స్టేజీ వద్ద పహారా కాశారు. డీఎస్పీ మొగులయ్య, అలంపూర్ సీఐ రవిబాబు, శాంతినగర్ సీఐ టాటబాబుతో పాటు ఎస్ఐలు, పోలీసులు భైరాపురం స్టేజీ వద్ద పహారా ఏర్పాటు చేశారు. మహిళా అఘోరి వాహనం భైరాపురం స్టేజీకి చేరుకున్న సమయంలో పోలీసులు అక్కడే నిలిపివేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అలంపూర్కు వెళ్లడానికి అనుమతి లేదని, వెనక్కి వెళ్లాలని సూచించారు. ఈక్రమంలో పోలీసులు వాహనాన్ని తనిఖీ చేశారు. అఘోరి దేవతా విగ్రహాలను బయటికి తీసి చూపించారు. వాటిని పరిశీలించడానికి వెళ్తున్న పోలీసులపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులు సైతం అదేస్థాయిలో స్పందించారు. డీఎస్పీ మొగులయ్య, సీఐ రవిబాబు మరోసారి అఘోరికి నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. కానీ అఘోరి కారులో కూర్చోని బయటికి రాలేదు. దీంతో మహిళా ఎస్ఐలు, పోలీసులు సైతం నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. దాదాపు గంటకుపైగా నిరీక్షించిన పోలీసులు చివరకు అఘోరి కూర్చున్న కారును జేసీబీ సాయంతో అక్కడికి నుంచి తొలగించడానికి ప్రయత్నించారు. కానీ ఆది సాధ్యపడకపోవడంతో ప్రైవేటు టోయింగ్ వాహనాన్ని పిలిపించారు. టోయింగ్ వాహన సాయంతో మహిళా ఆఘోరి కారును తరలించారు. టోయింగ్ వాహనంతో తరలించే క్రమంలో కారులోనే ఉన్న అఘోరి కిందకు దిగడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి వెళ్లడంతో తిరిగి కారులోనే కూర్చున్నారు. దీంతో ఉండవెల్లి మీదుగా జాతీయరహదారి ఎక్కి హైదారాబాద్ వైపు తీసుకెళ్లారు. టోయింగ్ వాహనంతో తీసుకెళ్తున్న క్రమంలో తన కారులోనే కూర్చున్న అఘోరిని గాలి కోసం అద్దం కిందికి దించుకోవాలని సూచించగా అసహనంతో అద్దం పగలగొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈవిషయమై సీఐ రవిబాబు మాట్లాడుతూ ఇటీవలే చేసిన వ్యాఖ్యల కారణంగా అఘోరిని అడ్డుకున్నట్లు తెలిపారు. ముందస్తు అరెస్టు చేసి తరలించినట్లు వెల్లడించారు. భైరాపురం స్టేజీ వద్దనే నిలిపివేత వెనక్కి వెళ్లాలని నచ్చజెప్పిన పోలీసులు ససేమీరా అంటూ అక్కడే ఉన్న అఘోరి వాహనంతో సహా టోయింగ్తో తరలింపు -
షార్ట్ సర్క్యూట్తో వస్త్ర దుకాణం దగ్ధం
మక్తల్: షార్ట్ సర్క్యూట్తో వస్త్ర దుకాణం దగ్దమైన ఘటన మక్తల్ పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. ఊట్కూరు మండలం తిప్రాస్పల్లికి చెందిన అశోక్ మక్తల్లోని సంగంబండ రోడ్డులో బట్టల షాపు నిర్వహిస్తున్నారు. రోజు మాదిరిగానే శనివారం రాత్రి 8 గంటలకు షాపును మూసివేసి ఇంటికి బయలుదేరారు. అతడు వెళ్లిన కొద్ది సేపటికే షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అశోక్ అక్కడికి చేరుకొని ఫైర్స్టేషన్కు సమాచారం ఇచ్చారు. ఫైర్స్టేషన్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే దుకాణంలోని సగానికి పైగా వస్త్రాలు కాలిపోయాయి. దాదాపు రూ. 3లక్షలకు పైగా ఆస్తినష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయారు. దగ్ధమైన షాపును సీఐ రాంలాల్, ఎస్ఐ బాగ్యలక్ష్మీరెడ్డి పరిశీలించారు. రూ. 3లక్షల ఆస్తినష్టం -
కొనసాగుతున్న సహాయక చర్యలు
మార్గనిర్దేశనం చేస్తున్నాం.. ప్రమాద ప్రదేశంలో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్ అన్నారు. శనివారం ఉదయం సొరంగంలోని పరిస్థితులపై కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘనాథ్తోపాటు సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. సొరంగంలో జరుగుతున్న పురోగతిపై సమీక్షించి అవసరమైన మార్పులను అమలు చేస్తూ మార్గనిర్దేశనం చేస్తున్నట్లు వెల్లడించారు. సహాయక బృందాల మధ్య సమన్వయంతో పనులు చేపడుతున్నామని, మరింత వేగవంతం చేసేందుకు అత్యాధునిక రోబోటిక్ పద్ధతులను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. అన్వి రోబోటిక్ సంస్థ అభివృద్ధి చేసిన అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబో ద్వారా 30 హెచ్పీ సామర్థ్యం గల పంపుతో అనుసంధానమైన వాక్యూమ్ ట్యాంకు ఉపయోగించి నీటితో కూడిన బురద, మట్టిని తొలగించనున్నట్లు తెలిపారు. సొరంగంలోని నీటిని తొలగించేందుకు డీ–వాటరింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా ఆధునిక పరికరాలు ఉపయోగించి శరవేగంగా సహాయక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ప్రత్యేకంగా ఆక్సిజన్ సరఫరా, వైద్యసేవలు, ఆహారం, మంచినీరు వంటి అవసరాలను నిరంతరం అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రాధాన్యంగా సహాయక బృందాల భద్రతకు దృష్టిలో పెట్టుకుని అత్యవసర అవసరాలపై ప్రత్యేక దృష్టిసారించామన్నారు. అనంతరం లిక్విడ్ రింగ్ వాక్యూమ్ పంపు, వాక్యూమ్ ట్యాంక్తో కూడిన మిషన్ పనితీరు పరిశీలించారు. అచ్చంపేట/ ఉప్పునుంతల: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల కోసం అడుగడుగునా అన్వేషిస్తున్నారు. 22 రోజులు గడుస్తున్నా ఇంత వరకు వారీ ఆచూకీ దొరకలేదు. మానవ ప్రయత్నంలో కొంత ఇబ్బందులు ఎదురవుతుండటంతో ఏఐ టెక్నాలజీ ద్వారా అన్వి రోబోటిక్ సంస్థ అభివృద్ధి చేసిన అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోకు అనుసంధానంగా 30 హెచ్పీ సామర్థ్యం గల పంపు, వాక్యూమ్ ట్యాంకు ద్వారా సహాయక చర్యలు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం వాటిని సొరంగం వద్ద సాంకేతిక పరిజ్ఞానంతో ఇన్స్టాలేషన్ చేసే ప్రక్రియ మొదలుపెట్టారు. మరోవైపు సాంకేతిక సమస్యలతో రోబో యంత్రాల పనితీరు ఇంకా ప్రారంభం కాలేదు. డీ2 ప్రదేశం నుంచి డీ1 వరకు సింగరేణి, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా, ర్యాట్ హోల్ మైనర్స్ ఇతర సహాయక బృందాలు మట్టి, బురద తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. టీబీఎం ఎర్త్ కట్టర్ ఉన్న ప్రాంతం పూర్తిగా 40 అడుగుల మేర కూరుకుపోయింది. అక్కడి వరకు మనుషులు వెళ్లి సహాయక చర్యలు చేపట్టడం ఇబ్బందికరంగా ఉంది. టీబీఎం విడి భాగాలను ప్లాస్మా కట్టర్తో తొలగిస్తున్నారు. డీ1 డేంజర్ జోన్ ప్రాంతంలో పైకప్పు బలహీనంగా ఉండటంతో కాంక్రీట్ సెగ్మెంట్ కూడా పడిపోయే పరిస్థితి గమనించి సింగరేణి గనుల్లో ఉపయోగించే టైగర్ కారడ్స్ కలప దుంగలను సపోర్టుగా చేసుకుంటూ తవ్వకాలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు వీటిని నాలుగు చోట్ల ఏర్పాటు చేశారు. వీటికి సుమారు 40 టన్నుల బరువు ఆపగలగే శక్తి ఉంది. ప్రమాదం జరిగే ముందు శబ్ధం వస్తుందని, దీని వల్ల కార్మికులు సురక్షితంగా తప్పించుకునే అవకాశం ఉంటుందని సింగరేణి కార్మికులు వెల్లడించారు. డీ1 ప్రదేశానికి వెళ్లడానికి ఇంకా 30 మీటర్ల మట్టిని తొలగిస్తే సహాయక బృందాలు అక్కడికి చేరకుంటాయి. డీ1 వద్దకు చేరుకుంటే తప్ప తప్పిపోయిన కార్మికుల ఆచూకీ లభ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. డీ1 వద్ద పూర్తిస్థాయిలో మట్టిని తీసేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. మరో రెండు, మూడు రోజుల్లో ఆచూకీ లభ్యమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో లభ్యం కాని కార్మికుల ఆచూకీ కనీసం ఆనవాళ్లు కూడా లభించని వైనం హైడ్రాలిక్ పవర్డ్ రోబో పనితీరుపైనే ఆశలు డీ1 జోన్ ప్రాంతంలో బలహీనంగా పైకప్పు 22 రోజులు శ్రమిస్తున్న సహాయక బృందాలు -
పండ్లకు భలే గిరాకీ
స్టేషన్ మహబూబ్నగర్: రంజాన్ మాసంలో పండ్లకు గిరాకీ ఎక్కువగా ఉంటోంది. మిగతా రోజుల కంటే ఈ మాసంలో పండ్ల వినియోగం అధికంగా ఉండడంతో ధరలు కూడా అంతేస్థాయిలో ఉన్నాయి. అరటి పండ్ల డజన్ ధర గత వారంతో పోలిస్తే రూ.5 నుంచి రూ.10 వరకు పెరిగింది. ద్రాక్ష పండ్లు అయితే కిలో రూ.80 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ద్రాక్ష పండ్ల ధరలు పెరగడానికి కారణమని వ్యాపారులు అంటున్నారు. రంజాన్ మాసంలో ఎక్కువగా వినియోగించే కర్బుజా (పుచ్చకాయ) పండు కిలో రూ.20 నుంచి రూ.25 వరకు విక్రయిస్తున్నారు. రిటైల్ మార్కెట్లో పండ్ల విక్రయాలు జోరందుకున్నాయి. రంజాన్ ఉసవాసదీక్షలో ముస్లింలు రోజు సాయంత్రం ఇఫ్తార్ వేళ పండ్లు ఎక్కువగా తీసుకుంటారు. యాపిల్, ఖర్జూర, పుచ్చకాయలు, పైనాపిల్, దానిమ్మ, ద్రాక్ష, బత్తాయి, బొప్పాయి, అరటి, సపోట వంటి పండ్ల వినియోగం పెరగడంతో వీటి ధరల్లో రోజురోజుకు మార్పు కనిపిస్తుంది. ముస్లింలకు ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులకు భారీఎత్తున పండ్లు అవసరమవుతాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని పండ్ల ధరలను అమాంతంగా పెంచేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్, అశోక్ టాకీస్ చౌరస్తా, జనరల్ ఆస్పత్రి, న్యూటౌన్, క్లాక్టవర్, అంబేడ్కర్ చౌరస్తా, పద్మావతికాలనీతోపాటు ఇతర ప్రాంతాల్లో పండ్ల స్టాళ్లను ఏర్పాటు చేశారు. రూ.20 నుంచి 25 వరకు ఉన్న యాపిల్ రంజాన్ మాసంలో రూ.30 నుంచి 35 వరకు, ఆరెంజ్ పండ్లు డజన్ ప్రకారం రూ.180 నుంచి 200 వరకు అమ్ముతున్నారు. ఉపవాసదీక్షలతో పెరిగిన వినియోగం రిటైల్గా జోరందుకున్న వ్యాపారం అమాంతంగా పెరిగిన ధరలు -
సంప్లో పడి చిన్నారి మృతి
బల్మూర్: అప్పటివరకు అందరిని నవ్విస్తూ ఆడుకుంటున్న చిన్నారి సంప్లో పడి దుర్మరణం పాలైన ఘటన మండలంలోని కొండనాగుల గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన చింత మహేష్, సుస్మిత దంపతులు. వీరికి నాన్సీ(2) అనే కూతురు ఉంది. పక్కనే ఉన్న తాత బాలయ్య ఇంటికి ఆడుకుంటూ వెళ్లింది. అక్కడ చిన్నారిని ఎవరూ గమనించకపోవడంతో ఇంటి ముందు ఉన్న సంప్లో పడింది. కొంత సేపటికి గమనించిన కుటుంబ సభ్యులు చిన్నారిని సంప్లో నుంచి తీయగా అప్పటికే నీళ్లు మింగి ఊపిరాడక మృతి చెందింది. చిన్నారి మృతితో ఆకుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. బావిలో పడి వ్యక్తి.. మిడ్జిల్: ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మిడ్జిల్ మండలం వేముల గ్రామంలో శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికుల వివరాల మేరకు.. వేములకు చెందిన రేవల్లి చంద్రయ్య (50) గురువారం రాత్రి గ్రామంలో నిర్వహించిన కాముడి దహనం కార్యక్రమానికి వెళ్లాడు. అర్ధరాత్రి 1గంటకు కాముడి దహనం ముగిసిన అనంతరం బుడిద తీసుకుని వస్తుండగా.. గ్రామ సమీపంలోని ఆలయం వద్ద ఉన్న బావిలో ప్రమాదవశాత్తు పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరూ గమనించలేదు. అతడి కోసం కుటుంబ సభ్యులు వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో శనివారం గ్రామ సమీపంలోని ఆలయం వద్ద ఉన్న బావిలో శవమై కనిపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటికి తీశారు. మృతుడికి భార్య కళమ్మ, కుమారుడు శివకుమార్ ఉన్నారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమర్టం నిమిత్తం జడ్చర్ల మార్చురీకి తరలించినట్లు ఎస్ఐ శివనాగేశ్వర్ నాయుడు తెలిపారు. బైక్ అదుపు తప్పి వ్యక్తి.. ఉండవెల్లి: మండలంలోని అలంపూర్ చౌరస్తా నుంచి చెన్నిపాడుకు బైక్పై వెళ్తున్న రవీంద్రనాథ్రెడ్డి(38) అనే వ్యక్తి పెద్దపోతులపాడు స్టేజీ సమీపంలో అదుపు తప్పి కిందపడటంతో తల కు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్పై అలంపూర్ చౌర స్తా నుంచి స్వగ్రామమైన చెన్నిపాడుకు బైక్పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో బైక్ అదుపు తప్పి కిందపడినట్లు చెప్పారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించి అంబులెన్స్లో కర్నూలు ఆస్పత్రికి తరలించారు. మహిళ ఆత్మహత్యపై కేసు నమోదు జడ్చర్ల: మండలంలోని కోల్బాయితండాకు చెందిన పాత్లావత్ శారద(45) తన ఇంటిలో శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు. సీఐ కథనం మేరకు.. కోల్బాయితండాకు చెందిన శారద భర్త శంకర్ ఆరేళ్ల క్రితం మృతిచెందగా ఆమె తన కుమారుడు సంతోష్, కోడలు జ్యోతిలతో కలిసి జీవిస్తుంది. అయితే కొడుకు, కోడలు తనను వేధిస్తున్నారని తన తండ్రి మునావత్ తథ్యుతో వాపోయింది. ఈ క్రమంలోనే శారద ఆత్మహత్యకు కుమారుడు, కోడలు కారణమని అనుమానంతో శనివారం ఆమె తండ్రి ఫిర్యా దు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
మహిళా కూలీలే లక్ష్యం
మహబూబ్నగర్ క్రైం: ముగ్గురు వ్యక్తులు కలిసి ఓ ముఠాగా ఏర్పడి.. అడ్డా మీద ఉండే మహిళా కూలీలను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్నారు. పూర్తిగా జల్సాలకు, అసాంఘిక కార్యక్రమాలకు అలవాటు పడి మహిళా కూలీలను తీసుకెళ్లి వారిపై ఉన్న బంగారం, వెండి ఆభరణాలు దోచుకుంటున్న ముఠాను వన్టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ డి.జానకి వెల్లడించారు. మహ్మదాబాద్ మండలం చౌడాపూర్ తండాకు చెందిన కట్రావత్ భరత్ ఆటో డ్రైవర్గా పని చేస్తున్నాడు. అతను కోస్గి మండలం మల్లారెడ్డిపల్లికి చెందిన కామారం నరేష్, టంకరకు చెందిన సామే శోభతో కలిసి ఓ ముఠాగా ఏర్పడి మద్యం తాగుతూ జల్సాలు చేయడం, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతుంటారు. ఈ క్రమంలో ఈనెల 12న ఉదయం 10 గంటల సమయంలో జిల్లాకేంద్రంలోని టీడీగుట్ట అడ్డా మీదకు కూలీ పని కోసం వచ్చిన వెంకటాపూర్ గ్రామానికి చెందిన అంజమ్మతో పాటు మరో మహిళను పని ఇప్పిస్తామని అని చెప్పి ఆటోలో ఎక్కించుకున్నారు. మొదట దొడ్డలోనిపల్లికి వెళ్లి అక్కడి నుంచి మయూరి పార్క్ సమీపంలో అడవిలోకి ఇద్దరూ మహిళలను తీసుకువెళ్లి వారిపై దాడి చేసి ఒంటిపై ఉన్న బంగారం, వెండి ఆభరణాలు తీసుకున్నారు. అదేవిధంగా మరో కేసులో కామారం నరేష్ ఈ నెల 13న టీడీగుట్ట దగ్గర కూలీ పని కోసం ఎదురుచూస్తున్న మరో మహిళను ఆటోలో కొత్త కలెక్టరేట్కు ఎదురుగా ఉన్న అడవిలోకి తీసుకువెళ్లి మెడలో ఉన్న పుస్తెలతాడు, కాళ్ల కడియాలు అపహరించాడు. ఈ రెండు కేసుల్లో ఏ1 కట్రావత్ భరత్, ఏ2 కామారం నరేష్, ఏ3 సామే శోభలను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ కేసు చేధించిన పోలీస్ అధికారులను ఎస్పీ అభినందించారు. సమావేశంలో అదనపు ఎస్పీ రాములు, డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ అప్పయ్య, ఎస్ఐ శీనయ్య పాల్గొన్నారు. దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసిన పోలీసులు వివరాలు వెల్లడించిన ఎస్పీ జానకి -
ఎన్నాళ్లీ అవస్థలు..
జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని సిగ్నల్గడ్డపై శనివారం భారీగా ట్రాఫిక్ స్తంభించింది. రోడ్డు విస్తరణ పనులు నెమ్మదిగా నడుస్తుండడంతో పాటు రెండు రోజులుగా ఒకే రోడ్డుపై రాకపోకలు సాగుతున్నాయి. శనివారం నుంచి పాఠశాలలకు ఒంటిపూట ప్రారంభమయ్యాయి. రోజువారీ ట్రాఫిక్తో పాటు మధ్యాహ్నం స్కూల్ బస్సులు, పాఠశాలల నుంచి బయటకు వచ్చే విద్యార్థులు ఒకేసారి రోడ్డుపైకి రావడంతో సిగ్నల్గడ్డపై ఒక్కసారిగా ట్రాఫిక్ స్తంభించింది. మరోవైపు ఎండలు పెరగటంతో రోడ్డుపై వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ సమస్య ఏర్పడుతున్నా మున్సిపల్ అధికారులు, పోలీసులు చోద్యం చూస్తున్నారని పలువురు వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. – జడ్చర్ల టౌన్ -
వైభవం.. అలివేలుమంగ రథోత్సవం
అశ్వవాహనసేవ.. అలివేలు మంగతాయారు ఆలయంలో శనివారం రాత్రి అశ్వవాహనసేవ నిర్వహించారు. శోభాయమానంగా అలంకరించిన అశ్వవాహనంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఉంచి గర్భగుడి నుంచి దేవస్థానం ముందున్న మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. భక్తుల హరినామస్మరణ, పురోహితుల వేదమంత్రాలు, సన్నాయి వాయిద్యాలు, కాగడాల వెలుతురులో అశ్వవాహనం ముందుకు కదిలింది. స్వర్ణాభరణాల అలంకరణలో వేంకటేశ్వరస్వామి సమేత అలివేలు మంగతాయారు అశ్వవాహనంపై ఊరేగుతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. విశేష దినోత్సవం సందర్భంగా గుట్టపైనున్న లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం వద్ద భక్తుల రద్దీ కనిపించింది. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందాచారి, పాలకమండలి సభ్యులు వెంకటాచారి, సురేందర్, గోవిందు, అలువేలమ్మ, సుధ, మంజుల తదితరులు పాల్గొన్నారు. ● ఉత్సవాల్లో భాగంగా ఆదివారం వసంతోత్సవం, పూర్ణాహుతి, అవభృతస్నానం, రాత్రికి నాగబలి (నాగవెల్లి), ద్వాదశ ఆరాధన, సప్తావరణాలు, మహ ఆశ్వీరచనం తదితర కార్యక్రమాలు జరగనున్నాయి. దీంతో అమ్మవారి ఉత్సవాలు ముగుస్తాయి. రథంపై ఉరేగుతున్న స్వామి, అమ్మవార్లు మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ అలివేలుమంగతాయారు రథోత్సవం (విమాన రథోత్సవం) శుక్రవారం అర్ధరాత్రి అంగరంగ వైభవంగా సాగింది. ముందుగా శోభాయమానంగా అలంకరించిన గరుడ వాహనంపై వేంకటేశ్వరస్వామి, అలివేలు మంగతాయారు దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలను ఉంచి సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రోచ్ఛారణల నడుమ గర్భాలయం నుంచి ప్రధాన ద్వారం మీదుగా ఆలయ ఆవరణలోని రథం వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం రంగురంగుల పూలు, విద్యుద్ధీపాలు, మామిడి తోరణాలతో ముస్తాబుచేసిన రథంపై ఉంచారు. రథం ముందు కుంభం పోసి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తుల గోవింద నామస్మరణలు చేస్తూ ముందుకు లాగారు. సాంప్రదాయ రీతిలో ఆలయం ముందున్న దేవగుండు వద్దకు లాగి తిరిగి ఆలయానికి తీసుకొచ్చారు. రథోత్సవానికి ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. బంగారు ఆభరణాలు, కాగడాలు, విద్యుద్ధీపాల వెలుతురులో స్వామి, అమ్మవార్లు ధగధగ మెరిసిపోతూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం మళ్లీ ఉత్సవ విగ్రహాలను గరుడ వాహనంపై గర్భగుడి తీసుకొచ్చారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ప్రత్యేక అభిషేకం, బలిహరణం, హోమం తదితర పూజా కార్యక్రమాలు కొనసాగాయి. ఘనంగా గరుడవాహన సేవ భక్తి పారవశ్యంతో పులకించిన భక్తులు -
రమణీయం.. రామలింగేశ్వరుడి రథోత్సవం
అడ్డాకుల: మండలంలోని కందూర్ రామలింగేశ్వరస్వామి రథోత్సవం శుక్రవారం అర్ధరాత్రి రమణీయంగా సాగింది. ముందుగా గ్రామం నుంచి రామలింగేశ్వరస్వామి వెండి ముఖం, నాగపడగను మంగళవాయిద్యాలు, డప్పుచప్పుళ్ల నడుమ బాణసంచా కాలుస్తూ భక్తుల శివనామస్మరణతో ఆలయానికి తీసుకొచ్చారు. అక్కడ పూజారులు వాటికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలోని ఉత్సవ విగ్రహాలను మంగళవాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆలయం వెలుపలకు తీసుకొచ్చి అలంకరించిన రథంపై ఉంచారు. తర్వాత రథం ముందు పోలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించి రథాంగ హోమం చేసి హారతులిచ్చారు. శనివారం తెల్లవారుజామున అశేష భక్తజనం శివనామస్మరణ చేస్తూ మేళతాళాల మధ్య స్వామివారి రథాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో ముందుకు లాగారు. రథం ముందు భక్తులు భజనలు, కోలాటాలు చేస్తూ అందరిని అలరించారు. రథోత్సవానికి వివిధ ప్రాంతాల భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. కార్యక్రమంలో ఆలయ ఈఓ రాజేశ్వరశర్మ, గ్రామపెద్దలు నాగిరెడ్డి, శ్రీహరి, రవీందర్శర్మ, దామోదర్రెడ్డి, రాములు, బుచ్చన్నగౌడ్, దేవన్నయాదవ్, మనోహర్, సత్తిరెడ్డి, అర్చకులు యాదగిరిశర్మ, తాళ్లపాక రామలింగశర్మ, శివశర్మ, మణికంఠశర్మ, రేవంత్శర్మ, వినయ్శర్మ, గ్రామస్తులు పాల్గొన్నారు. కందూర్లో మార్మోగిన శివనామస్మరణ భారీగా తరలివచ్చిన భక్తజనం -
నల్లగొండకు నీళ్లు.. పాలమూరుకు కన్నీళ్లు
కల్వకుర్తి రూరల్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్బవించి దాదాపు 12 ఏళ్లు కావొస్తున్నా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు ఇంకా అన్యాయమే జరుగుతుందని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి అన్నారు. శనివారం కల్వకుర్తిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలోని ఏదుల నుంచి నల్లగొండకు నీటిని తరలించేందుకు ప్రభుత్వం రూ.1,800 కోట్లు కేటాయిస్తూ గత జనవరి 22న జీఓ నంబర్ 11ను విడుదల చేయడం బాధాకరమన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడితే ఉమ్మడి పాలమూరు జిల్లాకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. గతంలో డిండి ప్రాజెక్టు ఎత్తు పెంచి నల్లగొండకు నీటిని తరలించే విషయంపై పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడంతో పాటు నార్లాపూర్ నుంచి నల్లగొండకు నీటిని తరలించేందుకు చేసిన ప్రయత్నాన్ని అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ, ప్రజాసంఘాలు వ్యతిరేకించడంతో ఆయా ప్రాజెక్టుల నిర్మాణాలను ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. ప్రస్తుతం నల్లగొండకు నీటిని తరలించేందుకు ప్రయత్నించడం పాలమూరు రైతుల పొలాలను బీడుగా మార్చడమేనని అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో ఉమ్మడి జిల్లా రైతులు లక్ష ఎకరాల భూములను కోల్పోయినా ఫలితం దక్కలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. అన్ని పార్టీలు నల్లగొండ జిల్లాకు చెందిన వారికి నాలుగు స్థానాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. నీరు ఉంటే రాజకీయాలను శాసించగల శక్తి ఉంటుందన్నారు. ప్రభుత్వాలు భూములను త్యాగం చేసిన రైతులను విస్మరిస్తుండటంతో.. ప్రాజెక్టులకు భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తూ ప్రభుత్వంపై తిరగబడుతున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో రైతులను చైతన్యం చేసి ఏదుల నుంచి నల్లగొండకు నీటి తరలింపును అడ్డుకుందామని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఏదుల ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలకు బహిరంగ లేఖ రాశామని తెలిపారు. ● మండలంలోని ముకురాలలో ఆత్మహత్య చేసుకున్న చంద్రశేఖర్ రెడ్డి కుటుంబాన్ని ఆయన పరామర్శించి.. ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు రాఘవాచారి చెప్పారు. ప్రభుత్వం స్పందించి ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకోవడంతో పాటు రాబోయే రోజుల్లో ఎవరూ ఆత్మహత్య చేసుకోకుండా చూడాలని కోరారు. సమావేశంలో అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్ వెంకట్ గౌడ్, సభ్యులు శ్రీను, సదానందం గౌడ్, మేకల రాజేందర్ పాల్గొన్నారు. ఏదుల ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాలి పాలమూరు అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్ రాఘవాచారి -
నాణ్యతపై గొంతు విప్పండి
నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంఇతని పేరు సురేష్బాబు, మహబూబ్నగర్లోని షాసాబ్గుట్ట ఏరియా శివాలయం వీధిలో ఉంటాడు. శేరీ ఫైనాన్స్ నుంచి టిప్పర్ కోసం రుణం తీసుకున్నాడు. కొంతకాలం తర్వాత పనులు నడవకపోవడంతో కిస్తీలు కట్టలేదు. దీంతో ఫైనాన్స్ వారు టిప్పర్ను సీజ్ చేశారు. కిస్తీలు కట్టలేనని ఒప్పుకొని వాహనానికి సంబంధించిన కాగితాలను ఫైనాన్స్ వారికి అప్పగించాడు. కొద్దిరోజుల తర్వాత సీజ్ చేసిన టిప్పర్ను ఫైనాన్స్ వారు ఇతరులకు అమ్మారు. అయినా వాహనానికి సంబంధించిన కాగితాలు కొనుగోలుదారులకు బదిలీ కాలేదు. ఆర్టీఏ మహబూబ్నగర్ కార్యాలయం నుంచి సంబంధిత టిప్పర్ ట్యాక్స్ డ్యూ ఉందని, చెల్లించాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ ఇతడికి నోటీసులిచ్చారు. వాహనాన్ని సీజ్ చేసి ఇతరులకు ఫైనాన్స్ వారు అమ్మినట్లు తెలిపాడు. ఎక్కడైనా వాహనం ప్రమాదానికి గురైనా, ఇతరత్రా ఏమైనా జరిగినా మీది బాధ్యత అవుతుందని, రిజిస్ట్రేషన్ పత్రాలు మీ పేరుపైనే ఉన్నాయని ఆర్టీఏ కార్యాలయం అధికారులు తెలిపారు. ఫైనాన్స్ వారికి ఎన్నిసార్లు చెప్పినా స్పందించలేదు. మహబూబ్నగర్ వినియోగదారుల ఫోరంలో 2023 డిసెంబర్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదును పరిశీలించిన వినియోగదారుల ఫోరం టిప్పర్ను కొనుగోలు చేసిన వారిపై వెంటనే రిజిస్ట్రేషన్ పత్రాలు బదిలీ చేయాలని, మానసికంగా ఇబ్బందులకు గురైనందున రూ.2 లక్షలు నష్టపరిహారం, రూ.2 వేలు కోర్టు ఖర్చులు బాధితుడికి చెల్లించాలని వినియోగదారుల ఫోరం జనవరి 22న తీర్పు ఇచ్చింది. మారిన చట్టం.. ● ప్రతి వస్తువు నాణ్యతను తెలుసుకోవాలి ● జిల్లాలో వినియోగదారుల హక్కుల కోసం ప్రత్యేక కోర్టు ● ఆశించిన స్థాయిలో ప్రచారం కల్పించని జిల్లా వినియోగదారుల కేంద్రం 1986 వినియోగదారుల రక్షణ చట్టం స్థానంలో 2019 వినియోగదారుల కమిషన్గా మార్పు చేశారు. 1986 నాటి వినియోగదారుల రక్షణ చట్టంలో ఆన్లైన్లో లేని వస్తువులను లేదా ఇతర ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా కొనుగోలు చేసిన వారికి హక్కులు వర్తించడం కోసం 2019 చట్టం పరిధిలో చేర్చారు. ఈ చట్ట ప్రకారం నాణ్యత లేని వస్తువులను ఉత్పత్తి చేసినందుకు, వాటిని విక్రయించడానికి ప్రకటనల్లో నటించే సెలబ్రెటీలకు సైతం రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల జరిమానా, రెండేళ్ల నుంచి పదేళ్ల కఠిన జైలు శిక్ష విధించే విధంగా రూపొందించారు. అలాగే ఆన్లైన్ ద్వారా విక్రయించే వస్తువులకు సంబంధించి పూర్తి వివరాలతో మార్కెట్లోకి విడుదల చేయాలి. నాణ్యత లేని వస్తువులు విక్రయిస్తే వస్తువులు ఉత్పత్తి చేసిన వారితో పాటు అమ్మిన వ్యక్తులపై కేసులు వేయడానికి చట్టంలో సవరణ తెచ్చారు. ఎలాంటి కేసులు వేయడానికి అవకాశం ఉంది వినియోగదారులు ఎయిర్లైన్స్, మెడికల్, రైల్వే, బ్యాంకులు, ఇన్సూరెన్స్, టెలికాం, పోస్టల్, విద్యుత్, రియల్ ఎస్టేట్, ఇళ్ల నిర్మాణం, రవాణా, చిట్ఫండ్స్, వ్యవసాయం, కస్టమర్ గూడ్స్, కొరియర్ సర్వీస్, విద్యారంగం, నాన్ బ్యాకింగ్ ఫైనాన్షియల్ సంస్థల వల్ల నష్టపోతే కేసులు వేయడానికి అవకాశం ఉంది. వినియోగదారుల్లోచైతన్యం రావాలి జిల్లాలో ప్రతిరోజు హక్కుల ఫోరానికి రెండు నుంచి మూడు వరకు కేసులు వస్తుంటాయి. ఎక్కువగా ఎలక్ట్రానిక్ వస్తువులు, జీవిత బీమా, చిట్ఫండ్, ఫైనాన్స్లో నష్టపోయిన వాళ్లు అధికంగా వస్తుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ఎవరూ రావడం లేదు. పట్టణ ప్రాంతాల నుంచి అవగాహన ఉన్న వ్యక్తులు మాత్రమే కేసులు వేయడానికి వస్తున్నారు. ఇంకా ప్రజల్లో దీనిపై చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. వచ్చిన కేసులు పెండింగ్లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి కృషి చేస్తున్నాం. జిల్లాలో వినియోగదారులు ఎలాంటి కేసులు వేయడానికి అవగాహన లేకుంటే 08542–245633 నంబర్కు ఫోన్ చేయాలి. – సృజన్కుమార్, వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సూపరింటెండెంట్ ఐదేళ్లుగా వినియోగదారుల ఫోరం కోర్టులో కేసుల వివరాలుపరిష్కరించినవినమోదైన కేసులుపెండింగ్ 202085 84 12021227 226 1202296 90 62023 80 57 232024101 29 72● జిల్లా వినియోగదారుల హక్కుల ఫోరంలో వినియోగదారులు ఒక్క రూపాయి నుంచి రూ.50 లక్షల వరకు కేసులు వేయడానికి అవకాశం ఉంది. దీంట్లో రూపాయి నుంచి రూ.5 లక్షల వరకు ఉన్న కేసులు కోర్టులో ఉచితంగా వాదిస్తారు. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు వరకు కోర్టు ఫీజు రూ.200, రూ.10 లక్షల నుంచి రూ.20లక్షల వరకు ఫీజు రూ.400 ఉంటుంది. రాష్ట్ర కమిషన్లో రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఉంటే కోర్టు ఫీజు రూ.వెయ్యి, రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంటే రూ.4వేలు ఉంటుంది. జాతీయ కమిషన్లో రూ.కోటికి పైగా ఉంటే ఫీజు రూ.5 వేలు ఉంటుంది. ఇదీ నేపథ్యం వినియోగదారుల హక్కుల ఫోరం ఉమ్మడి జిల్లాలో 1988 అక్టోబర్లో ప్రారంభించారు. ప్రస్తుతం దీనికి ప్రత్యేక న్యాయమూర్తితో పాటు, ఒకరు సభ్యులు ఉన్నారు. పరిపాలన కోసం ప్రత్యేక విభాగంతో పాటు ఒక కోర్టు కూడా అందుబాటులో ఉంది. వచ్చిన వినియోగదారుల కేసుల నమోదు చేసు కోవడం కోసం ప్రత్యే క భవనం ఉంది. ● ఏదైనా ఒక వస్తువులు కొనుగోలు చేసిన తర్వాత ఆ వస్తువు నాసిరకంగా ఉండటం లేదా మరమ్మతుకు గురైతే అప్పుడు సెక్షన్ 35 ప్రకారం వినియోగదారుల ఫోరం కోర్టులో ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన 30 రోజుల వ్యవధిలో సదరు వ్యక్తి లేదా సంస్థకు నోటీస్ ఇవ్వగా 45 రోజుల వ్యవధిలో దీనికి సమాధానం చెప్పాలి. లేకపోతే కోర్టు ఎక్స్పార్టీ చేసి ఆర్డర్ వన్సైడ్ చేసి కోర్టు తీర్పు ఇస్తుంది. ఇచ్చిన జడ్జిమెంట్పై ప్రతివాది 45 రోజుల్లో నష్టపరిహారం చెల్లించాలి.. లేకపోతే అప్పీల్ వేసుకోవాలి. ● వినియోగదారులఫోరం కోర్టులో ఎలాంటి కేసు వేయాలి, వాటి వివరాలు తెలుసుకోవడానికి స్థానికంగా ప్రత్యేక హెల్ప్ డెస్క్ అందుబాటులో ఉంది. ముఖ్యంగా వినియోగదారుడు ఎలాంటి న్యాయవాది లేకుండా కోర్టులో కేసు వేయడానికి అవకాశం కల్పించారు. ● ఎక్కువగా పాత బాట్లే, రాళ్లు వాడకం ● తక్కెడనే వినియోగిస్తున్న చిరు వ్యాపారులు ● కూరగాయల మార్కెట్లోనూ ఇదే పరిస్థితి ● తూనికలు, కొలతల అధికారుల పర్యవేక్షణ లోపం మహబూబ్నగర్ మున్సిపాలిటీ/రూరల్: జిల్లాకేంద్రంలో తూనికలు, కొలతల శాఖ అధికారుల పర్యవేక్షణ, అజమాయిషీ కరువైంది. దీంతో తూకం కోసం చాలా చోట్ల చిరు వ్యాపారులు, తోపుడుబండ్ల నిర్వాహకులు ఎక్కువగా తక్కెడ, పాత బాట్లు, రాళ్లు వాడుతున్నా పట్టించుకునేవారు లేదు. ఇక కూరగాయల, మాంసం మార్కెట్లో కిక్కిరిసిన జనం మధ్య ఈ వ్యవహారం బహిరంగంగా జరుగుతున్నా ఎవరూ ప్రశ్నించే పరిస్థితి లేదు. కిలోకు సుమారు వంద గ్రాములు తక్కువ వస్తుండటంతో వినియోగదారులు నష్టపోతున్నారు. మహబూబ్నగర్లోని ప్రధాన రోడ్లపై సుమారు వేయి మంది వరకు తోపుడు బండ్లలో పండ్లు, ఇతర నిత్యావసర వస్తువులు అమ్ముతుంటారు. ఇక టీడీ గుట్ట సమీపంలోని పెద్ద మార్కెట్లో రైతుబజార్తో పాటు చుట్టుపక్కల వందలాది మంది చిరు వ్యాపారులు, రైతులు రోడ్లపై కూరగాయలు, ఆకుకూరలు విరివిగా అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ ప్రాంతంలోనే మాంసం దుకాణాలు పదుల సంఖ్యలో వెలిశాయి. వీరిలో 90 శాతం తక్కెడ, పాత బాట్లు, బరువు కోసం రాళ్లనే వాడుతున్నారు. ఎలక్ట్రానిక్ కాంటాలు ఉపయోగించాలని తూనికలు, కొలతల శాఖ అధికారులు సూచిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికారులు ఈ ప్రాంతంలో తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. దీంతో సరైన ప్రమాణాలు పాటించకుండా తూకంలో వివిధ రకాలుగా దండెకొడుతూ లాభాలు గడిస్తున్నారు. తూకానికి వినియోగిస్తున్న పాత బాట్లు, రాళ్లు పెద్ద మార్కెట్లో చేయి ఆనించి కూరగాయల తూకంలో దండెకొడుతున్న మహిళలు సామర్థ్యాల మదింపు.. కిలో కొంటే 900 గ్రాములే.. షాసాబ్గుట్ట, వన్టౌన్ చౌరస్తా ప్రాంతాల్లో ఉన్న మాంసం దుకాణాల్లో కిలో మాంసం కొంటే 900 గ్రాములకు మించదు. ఇదేమిటని మాంసం విక్రయదారుడిని అడిగితే.. మీ ముందే తూకం వేశాను కదా అంటారు. మళ్లీ రెండు, మూడు ముక్కలు వేసి గొడవ జరగకుండా చూసుకుంటున్నారు. ఇదంతా సంబంధిత అధికారులకు తెలిసినా మాముళ్ల ముసుగులో మాంసం విక్రయదారులపై చర్యలు తీసుకోవడం లేదు. – వెంకటయ్యగౌడ్, ప్రభుత్వ ఉద్యోగి అవగాహనే అస్త్రంమనిషి సమగ్ర వికాసానికి న్యాయ పరిజ్ఞానం అవసరం అవుతుంది. సమాజంలో ప్రజలు ఉత్తమ వినియోగదారులుగా ఉండాలంటే చట్టాలను ఆయుధాలుగా ఉపయోగించుకోవాలి. మార్కెట్లో వ్యాపారులు చేసే మోసాలు గుర్తించి వాటిపై పోరాటం చేయడానికి ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. లోపాలు ఉన్న వస్తువులు కొనుగోలు చేసిన సమయంలో వాటి వల్ల వినియోగదారుడు నష్టపోతే దానిని ప్రశ్నించడానికి ఉన్న చట్టాలు ఉపయోగించుకోవాలి. మనుషులు ఉపయోగించే ప్రతి వస్తువును పరీక్షించి నాణ్యత తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎలాంటి వస్తువు అయినా సక్రమంగా లేకపోతే అలాంటి వస్తువు ఉత్పత్తి చేసిన కంపెనీపై పోరాటం చేసే అవకాశం వినియోగదారుడికి హక్కు ఉంది. శనివారం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. – మహబూబ్నగర్ క్రైం రాళ్లతో తూకాల్లో మోసాలు కూరగాయలు మొదలుకొని నిత్యావసర సరుకులు ఏవీ కావాలన్నా మహబూబ్నగర్లోని మార్కెట్కు వస్తాం. మార్కెట్లో వ్యాపారులు బాట్లకు బదులు రాళ్లను వినియోగిస్తూ తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. పండ్లు, కూరగాయలు విక్రయించే వ్యాపారులు అందినకాడికి దోచుకుంటున్నారు. రైతుబజార్, మార్కెట్లో అధికారుల ముందే వ్యాపారులు రాళ్లు వినియోగిస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. – అశోక్, ధర్మాపూర్ -
విజయవంతం చేస్తాం..
తక్కువ సామర్థ్యాలు ఉన్న విద్యార్థులను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం ఏఐ ల్యా బ్ అందుబాటులోకి తె చ్చింది. ఇందులో ఇంగ్లిష్, తెలుగు, మ్యాథ్స్పై ఏఐ ద్వారా సామర్థ్యాలను పెంచేందుకు వీలుంది. వారి సామర్థ్యం ఎంతో కంప్యూటర్ ఒక అంచనా రిపోర్టు ఇస్తుంది. దాని ఆధారంగా విద్యార్థిని మరింత మెరుగుపర్చే విధంగా చర్యలు ఉంటాయి. పైలెట్ ప్రాజెక్టు కింద శనివారం 10 పాఠశాలల్లో ప్రారంభిస్తున్నాం. జిల్లాలో ఈ కా ర్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తాం. – ప్రవీణ్కుమార్, డీఈఓ, మహబూబ్నగర్ సులభంగా ఉంది.. ఉపాధ్యాయులు పుస్తకాలతో ప్రతిరోజు పాఠ్యాంశాల బోధన చేస్తుంటారు. కానీ, ఇటీవల మా పాఠశాలలో కంప్యూటర్ ద్వారా చదువు చెబుతున్నారు. దీంతో పుస్తకాల్లోని అంశాలు చాలా సులభంగా అర్థమవుతున్నాయి. చదవాలనే ఉత్సాహం మరింత పెరిగింది. – మీనాక్షి, 5వ తరగతి, నారాయణపేట అర్థం అవుతున్నాయి.. మా తరగతిలో విద్యార్థులు చాలా వరకు పాఠశాలకు గైర్హాజరు అయ్యేవారు. పాఠాలు అర్థం కాక హోంవర్క్ చేసుకుని రాకపోతే టీచర్లు కొడతారని డుమ్మా కొట్టేవారు. విద్యార్థుల స్థాయిని బట్టి కంప్యూటర్లో బోధన వేగంగా, నిదానంగా జరుగుతుండటంతో అన్ని విషయాలు బాగా అర్థం అవుతున్నాయి. – భార్గవ్, 5వ తరగతి, నారాయణపేట -
జోగుళాంబ క్షేత్రంలో చండీహోమాలు
అలంపూర్ : అలంపూర్ క్షేత్రంలో వెలిసిన శ్రీజోగుళాంబ అమ్మవారి ఐద శక్తిపీఠ ఆలయంలో శుక్రవారం చండీహోమాలు నిర్వహించారు. జోగుళాంబ అమ్మవారి ఆలయంలో ప్రతి శుక్రవారం, పౌర్ణమి, అమావాస్యకు చండీహోమాలు నిర్వహిస్తారు. శుక్రవారం పౌర్ణమిని పురస్కరించుకొని చండీహోమా లు నిర్వహించారు. 117మంది భక్తులు ఈ హో మాల్లో పాల్గొన్నారు. పౌర్ణమి రోజు భక్తులు పెద్దసంఖ్యలో హాజరై శ్రీబాలబ్రహ్మేశ్వర స్వామి, జోగుళాంబ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. అర్చకులు భక్తులకు తీర్ధ ప్రసాదాలను అందజేసి అశీర్వచనం పలికారు. -
వైభవంగా అలివేలు మంగ కల్యాణం
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీఅలివేలు మంగతాయారు తిరుకల్యాణోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన వేలాదిగా భక్తులు తరలివచ్చారు. సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన శేషవాహనంలో వేంకటేశ్వరస్వామి, అలివేలు మంగతాయారు దేవతామూర్తులను ఉంచి దేవస్థానంలోని గర్భగుడి నుంచి పురోహితుల వేదమంత్రాలు, సన్నాయి వాయిద్యాల మధ్య ఊరేగిస్తూ కల్యాణకట్ట వద్దకు తీసుకొచ్చారు. భక్తుల హరినామ స్మరణల మధ్య ఈ ఊరేగింపు ముందుకు కదిలింది. కన్నుల పండువలా తిరుకల్యాణోత్సవం .. కల్యాణోత్సవం సందర్భంగా మామిడి తోరణాలు, వివిధ రకాల పూలు, శోభాయమానంగా అలంకరించిన కల్యాణకట్ట మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కల్యాణోత్సవంలో జిలకర్ర, బెల్లం తదితర పూజల అనంతరం శ్రీ అలివేలు మంగ మంగళసూత్రధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పురోహితుల వేదమంత్రాల మధ్య జరిగిన ఈ పవిత్ర ఘట్టాన్ని చూసి భక్తులు భక్తి పారవశ్యంతో పులకించిపోయారు. అనంతరం వేంకటేశ్వరస్వామి, అలివేలు మంగతాయారు దేవతామూర్తులకు పట్టు వస్త్రధారణ, తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ బంగారు, వెండి ఆభరణాలు, రకరకాల పూల మధ్య ఈ దేవతామూర్తుల దంపతులు దగదగ మెరిసిపోతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. భక్తులు ఈవేడుకలను కనులారా తిలకించి పునీతులయ్యారు. చాలా మంది దేవతామూర్తుల మీద వేసిన తలంబ్రాలను తీసుకెళ్లడానికి పోటీపడ్డారు. కల్యాణోత్సవానికి హాజరైన భక్తులకు దేవస్థానం తరఫున వారి చేతులకు పసుపుకొమ్మలను ధరింపచేశారు. కల్యాణోత్సవం అనంతరం ఈ దేవతామూర్తులను శేషవాహనంలో మళ్లీ కల్యాణ కట్ట నుంచి గర్భగుడిలోకి ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ ఉత్సవాలకు హాజరైన భక్తులు చాలా మంది దేవస్థానంలో కూడా అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. కొంత మంది భక్తులు దేవస్థానం ముందున్న ధ్వజస్తంభం వద్ద రూపాయి నాణేలను ఉంచి తమ అదృష్ట పరీక్షను చూసుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత, దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు వెంకటాచారి, సురేందర్, గోవింద్, అలువేలమ్మ, సుధా, మంజుల పాల్గొన్నారు. మంత్రోచ్ఛరణల నడుమ వేంకటేశ్వర, అలివేలు కల్యాణోత్సవం వేలాదిగా తరలివచ్చిన భక్తజనం అన్నదాన కార్యక్రమం -
ఆలయాభివృద్ధికి కృషి చేస్తా : ఎంపీ డీకే అరుణ
అడ్డాకుల: ప్రసిద్ధి చెందిన శ్రీరామలింగేశ్వరస్వామి దేవాలయం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. మండలంలోని కందూర్ సమీపంలో స్వయంభూగా వెలిసిన శ్రీరామలింగేశ్వరస్వామి దేవాలయం వద్ద రూ.7లక్షల ఎంపీ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాలును శుక్రవారం రాత్రి ఆమె ప్రారంభించి అందులో పూజలు చేశారు. అనంతరం ప్రధాన ఆలయంలోని శివలింగానికి అర్చకులు అభిషేకం, పూజలు చేయించారు. ఆలయ నిర్వాహకులు తీర్థప్రసాదాలను అందజేసి సత్కరించారు. రామలింగేశ్వరాలయం చరిత్ర చాలా గొప్పదని, ఇక్కడి భక్తులకు మౌలిక వసతులు కల్పించాలని బీజేపీ నాయకులు తన దృష్టికి తేవడంతో నిధులు మంజూరు చేసినట్లు ఎంపీ తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు వస్తున్నందున కమ్యూనిటీ హాలును వినియోగించుకోవాలని సూచించారు. పార్లమెంట్ కన్వీనర్ డోకూర్ పవన్కుమార్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, దేవరకద్ర ఇన్చార్జి కొండా ప్రశాంత్రెడ్డి, సీనియర్ నాయకుడు సుదర్శన్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి అరవింద్రెడ్డి, మండలాధ్యక్షుడు రమేష్, టీకే నర్సింహ్మ, నాయకులు గట్టు మల్లేష్ యాదవ్, కొండారెడ్డి, గోవర్ధన్రెడ్డి, రవీందర్గౌడ్, ఈఓ రాజేశ్వరశర్మ ఉన్నారు. -
తుంగభద్ర నదిలో నీటి కుక్కలు
అలంపూర్: తుంగభద్ర నదిలో శిరకుక్కలు అందరిని ఆకట్టుకున్నాయి. స్థానిక నదుల్లో చేపలు, తాబేలు, నీటి పాములను చూసి ఉంటారు. కానీ అరుదైన నీటి కుక్కలను చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. అలంపూర్ పట్టణంలోని తుందభద్ర నదీతీరంలో వింత జలజీవులు కనువిందు చేశాయి. దాదాపు 10వరకు ఉన్న జల జీవులు నది ఒడ్డులో గుట్టపక్కన నీటిలో ఈదుతూ కనిపించాయి. కొద్దిసేపు నదిలో ఉన్న గుట్టపైకి వచ్చిన జీవులు ఆతర్వాత నదిలోకి వెళ్లాయి. స్థానిక మత్స్యకారులు వీటిని శిరకుక్కలు అని పిలుస్తారని తెలిపారు. ఈ జాతి జీవులు శ్రీశైలం డ్యాంలో ఎక్కువగా సంచరిస్తుంటాయని పేర్కొన్నారు. ప్రస్తుతం కృష్ణా–తుంగభద్ర నదులు అడుగంటుతున్నాయి. నదిలో నీటి ప్రవాహం పూర్తిగా తగ్గిపోవడంతో అక్కడి నుంచి ఈ ప్రాంతానికి ఈ జీవులు వచ్చి ఉంటాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. సాధారణంగా నదిలో పెద్దచేపలు, తాబేలు, నీటిపాములను చూసిన స్థానికులు వింతగా ఉన్న జీవులు కనిపించేవరకు వాటిని తమ ఫోన్లలో వీడియోలు, ఫోటోలు తీసి సంబురపడ్డారు. -
కనులపండువగా అశ్వవాహన సేవ
అడ్డాకుల: మండలంలోని కందూర్ సమీపంలో స్వయంభూగా వెలిసిన శ్రీరామలింగేశ్వరస్వామి దేవాలయం వద్ద స్వామివారి బ్రహోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. గురువారం అర్ధరాత్రి దాటాక స్వామివారికి అశ్వవాహనసేవ నిర్వహించారు. ఆలయం ముందున్న చిన్నతేరును పూజారులు శుద్ధిచేశారు. ఆలయంలో ఉన్న స్వామివారి ఉత్సవ విగ్రహాలను పూజారులు తీసుకొచ్చి చిన్నతేరుపై ఉన్న అశ్వవాహనంపై అలంకరించారు. అనంతరం తేరు ముందు పండితులు హోమం నిర్వహించారు. భక్తులంతా కలిసి ఆలయం ముందున్న తేరును జయజయధ్వానాల మధ్య కొద్ది దూరం ముందుకు తీసుకెళ్లి అశ్వవాహనసేవను ముగించారు. శుక్రవారం ఉదయం స్వామి వారికి ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, బలిహరణ పూజా కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. గ్రామంలో ఉన్న స్వామి వారి వెండి ముఖం, నాగపడగలను రాత్రి పల్లికిలో ఉంచి గ్రామంలో ఊరేగింపు చేపట్టారు. మేళతాళాల సవ్వడిలో వెండి ముఖాన్ని ఆలయానికి తీసుకు వచ్చారు. అనంతరం ప్రధాన ఆలయంలో శివలింగానికి స్వామి వారి వెండి ముఖం, నాగపడగను అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత రథోత్సవం నిర్వహించనున్నారు. కార్యక్రమంలో ఈఓ రాజేశ్వరశర్మ, ఆలయ ఉద్యోగి అనంతసేన్శర్మ, అర్చకులు యాదగిరిశర్మ, తాళ్లపాక రామలింగశర్మ, శివశర్మ, మణికంఠశర్మ, రేవంత్శర్మ, వినయ్శర్మ, గ్రామస్తులు ఉన్నారు. హోమం నిర్వహించిన పండితులు స్వామివారి వెండి ముఖం, నాగపడగకు ప్రత్యేకపూజలు -
పొలం పనిచేస్తూ కుప్పకూలి..
● గుండెపోటుతో యువ రైతు మృతి దామరగిద్ద: పొలంలో పనిచేస్తూ కుప్పకూలి గుండెపోటుతో ఓ యువ రైతు మృతిచెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలో వత్తుగుండ్లకి చెందిన కొత్తమాలే మాణిక్యప్ప(35) శుక్రవారం తన పొలంలో సాగుచేసిన కీరదీస పంటను కోసేందుకు పొలానికి వెళ్లాడు. పొలం పనుల్లో ఉండగా మధ్యాహ్నం ఒక్కసారిగా గుండెలో నొప్పి రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. పొలంలోనే కుప్పకూలి అక్కడికక్కడే మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు మహేష్, గణేష్లు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానిక నాయకులు కోరుతున్నారు. అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి మహమ్మదాబాద్: మొకర్లాబాద్ శివారులో అనుమానాస్పదస్పద స్థితిలో ఓ గుర్తు తెలియని మహిళ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.. వివరాలు.. మండలంలోని మొకర్లాబాద్ రెవెన్యూ శివారులో ముందలితండా అటవీ ప్రాంతంలో 8రోజుల క్రితం గుర్తుతెలియని వృద్ధ మహిళ (65) అక్కడికెళ్లి మరణించింది. శుక్రవారం విషయం పోలీసులకు తెలియడంతో వారు అక్కడికెళ్లి చూడగా మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నది. మహిళకు సంబంధించిన ఆనవాళ్లు తెలియలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మహిళ వివరాలు తెల్పిన వాళ్లు మహమ్మదాబాద్ పోలీస్టేషన్ను సంప్రదించాలని పోలీసులు కోరారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం బిజినేపల్లి : మండలంలోని వెల్గొండకి చెందిన రమేష్ (38) అనే వ్యక్తి శుక్రవారం సాయంత్రం శాయిన్పల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదానికి గురై అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. వెల్గొండకి చెందిన రమేష్ అతని స్నేహితుడు కలిసి బైక్పై బుద్దారం నుంచి బిజినేపల్లికి వస్తున్నారు. శాయిన్పల్లి గ్రామంలో ఎత్తైన స్పీడ్బ్రేకర్ వద్ద బైక్ అదుపుతప్పి రమేష్ ఎగిరి కిందపడి అక్కడికక్కడే మరణించాడు. అతని స్నేహితుడికి గాయాలు కాగా చికిత్స కోసం నాగర్కర్నూల్లోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. శాయిన్పల్లిలోని ఈ ఎత్తైన స్పీడ్ బ్రేకర్ ప్రజల పాలిట మృత్యువుగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గొంతులో అన్నం ముద్ద ఇరుక్కొని వృద్ధురాలి మృతి మల్దకల్ : గొంతులో అన్నం ముద్ద ఇరుక్కొని శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన అమరవాయి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. అమరవాయికి చెందిన శాంతమ్మ(75) రోజు ఇంటి, కూలీ పనులు చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేది. శుక్రవారం హోలీ పండగ ఉండటంతో ఇంటి వద్ద ఉన్న ఆమె మధ్యాహ్న భోజనం సమయంలో అన్నం ముద్ద గొంతుల్లో ఇరుక్కోవడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు వెంటనే108అంబులెన్స్లో చికిత్స నిమిత్తం గద్వాల ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు. -
చికిత్స పొందుతూ మహిళ మృతి
గట్టు : మండలంలోని రాయాపురానికి చెందిన సరోజమ్మ(50) పాము కాటుకు గురై గద్వాలలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు ఎస్ఐ మల్లేష్ తెలిపారు. వివరాలు.. రాయాపురానికి చెందిన భార్యాభర్తలు సరోజమ్మ, హనుమంతు గురువారం వ్యవసాయ పొలానికి వెళ్లారు. సాయంత్రం ఇంటికొచ్చే క్రమంలో వంట చెరుకు కోసం కట్టెలను మూట కట్టుకుంటున్న తరుణంలో సరోజమ్మను పాము కాటేసింది. విషయం తెలుసుకున్న భర్త హనుమంతు హుటాహుటిన సరోజమ్మను గట్టులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి ఆందోళన కరంగా ఉండడంతో అక్కడి నుంచి గద్వాలకు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతిచెందగా భర్త హనుమంతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. నిప్పంటుకొని గొర్రె పిల్లలు.. ఊట్కూరు: ప్రమాదవశాత్తు నిప్పంటుకొని గొర్రెపిల్లలు మృతిచెందిన సంఘటన ఊట్కూరు శివారులో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. బాధితుల తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన గొర్రెల కాపర్లు అయ్యలప్ప, తిప్పన్న, కురువ బలరాం, చెన్నప్ప, కొండప్ప సుమారు 60 గొర్రె పిల్లలను గ్రామశివారులో ఓ రైతు పొలం దగ్గర ముళ్లతో కంచె ఏర్పాటుచేసి అందులో ఉంచారు. గొర్రెలను మేపడానికి వారంతా వెళ్లారు. మధ్యాహ్నం వేళ పొలాల గట్లకు నిప్పంటుకొని గొర్రెలు నిల్వఉన్న ప్రాంతానికి వ్యాపించింది. దీంతో సుమారు 50 గొర్రె పిల్లలు అక్కడికక్కడే మృతి చెందాయి. నిప్పంటుకున్న విషయాన్ని తెలుసుకున్న గొర్రెల కాపరులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మంటలు ఆర్పగా అప్పటికే 50 గొర్రెపిల్లలు మృతి చెందగా 10 గొర్రె పిల్లలు గాయాలతో మిగిలాయి. సుమారు రూ. 2లక్షల నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. గొర్రెల కాపర్లను ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు గ్రామస్తులు కోరారు. -
ఆర్థిక ఇబ్బందులతో యువకుడు బలవన్మరణం
నవాబుపేట: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన శుక్రవారం లింగంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు .. లింగంపల్లికి చెందిన బాల్రాజ్ (26) అనే యువకుడు శుక్రవారం తన బొలెరో గూడ్స్ వాహనాన్ని ఇంటి నుంచి తీసుకొని వ్యవసాయ పొలానికి వె ళ్లాడు. అక్కడే వాహనాన్ని నిలిపి వెనుకభాగంలో ఉన్న కొండికి తాడుతో ఉరేసుకొని ఆత్మహత్యకు పా ల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే మరణించాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు. నేత్రదానం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించిన అనంతరం మృతుడి తల్లి యా దమ్మ తన కుమారుడి కళ్లను దానం చేసేందుకు అంగీకరించింది. దీంతో ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి సిబ్బంది మృతుడు బాల్రాజ్ కళ్లను తీసుకొని కుటుంబ సభ్యులకు ధ్రువపత్రం అందించారు. నేత్రదానం చేసిన ఆకుటుంబాన్ని అందరూ అభినందించారు. కుమారుడి కళ్లను దానం చేసిన తల్లి -
SLBC టన్నెల్లోకి అటామనస్ హైడ్రాలిక్ పవర్ రోబో
సాక్షి, మహబూబ్నగర్/నాగర్ కర్నూల్: ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యు ఆపరేషన్ కొనసాగుతోంది. మనుషులకు బదులుగా రోబోలతో మట్టి తవ్వకాలు చేపట్టారు. టన్నెల్ లోపల సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు అటానమస్ హైడ్రాలిక్ పవర్డు రోబోకు అనుసంధానంగా ప్రత్యేకమైన యంత్రాలను ఉపయోగిస్తున్నారు. 30 HP సామర్థ్యం గల లిక్విడ్ రింగ్ వాక్యూమ్ పంపు, వాక్యూమ్ ట్యాంకుతో కూడిన మెషిన్ను వినియోగిస్తున్నారు.దీంతో మట్టిని త్వరగా తొలగించేందుకు, టన్నెల్ లోపల పనులను వేగవంతం చేయడానికి చర్యలు చేపట్టారు. వాక్యూమ్ ట్యాంక్ ద్వారా వచ్చిన మట్టిని గంటకు 620 క్యూబిక్ మీటర్ల బురదతో కూడిన మట్టిని కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు తరలించే అవకాశం ఉంది. కాగా, ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదవశాత్తు చిక్కుకుపోయిన కార్మికుల జాడ గుర్తించడానికి రోబో రెస్క్యూ కార్యక్రమాలకు రూ. 4 కోట్ల వ్యయం కానుంది. దానికి సంబంధించిన ఫైల్పై మంత్రి ఉత్తమ్ గురువారం సంతకం చేశారు.టన్నెల్లో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఏఐ ఆధారిత స్లడ్జ్ రిమూవల్ రోబో మిషనరీ ఇప్పటికే సొరంగంలో పనిచేస్తుండగా, నిన్న (శుక్రవారం) మరో రెండు రోబోలు సొరంగం వద్దకు చేరుకోనున్నాయి. ప్రమాదస్థలంలో కడావర్ డాగ్స్ గుర్తించిన డీ2, డీ1 పాయింట్ల మధ్య 12 మీటర్ల దూరం ఉంది. ఈ ప్రాంతంలోనే ఉన్న టీబీఎం పైకప్పుగా మెటల్ ప్లాట్ఫాం ఉంది. దాని కింద హోలో స్పేస్గా ఉన్న ఖాళీ ప్రదేశంలో కార్మికులు ఉండి ఉంటారని భావిస్తున్నారు.టీబీఎం లోపల ఖాళీ ప్రదేశమంతా మట్టి, బురద, శిథిలాలతో కూరుకొని ఉంది. వాటిని పూర్తిగా తొలగిస్తేనే కార్మికుల జాడ తెలిసే అవకాశముంది. డీ2, డీ1 మధ్య కార్మికులు నడిచేందుకు అవకాశమున్నట్టు భావిస్తున్న చోట ట్రెంచ్గా తవ్వకాలు జరుపుతున్నారు. గురువారం మధ్యాహ్నం కడావర్ డాగ్స్ను మరోసారి టన్నెల్లోకి తీసుకెళ్లారు. మట్టి, బురద తొలగించిన ప్రదేశాల్లో మరోసారి అన్వేషణ చేపట్టారు. -
కొనసాగుతున్న రామలింగేశ్వరుడి బ్రహ్మోత్సవాలు
అడ్డాకుల: మండలంలోని కందూరులో స్వయంభూగా వెలసిన రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం శైవాగమ పండితులు పుల్లేటికుర్తి గణపతిశర్మ ఆధ్వర్యంలో గురువారం ప్రధాన ఆలయంలోని శివలింగానికి గవ్యాంత పూజలు, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, నిత్యార్చన, నిత్యోపాసన, రుద్రహోమం, నిత్య బలిహరణ, నిరాజన మంత్రపుష్పాలు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా గౌరమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రుద్రాభిషేకం, రుద్రహోమాలు నిర్వహించారు. ఇదిలా ఉండగా శుక్రవారం అర్ధరాత్రి తర్వాత స్వామివారికి రథోత్సవం నిర్వహించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈఓ రాజేశ్వరశర్మ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఉద్యోగి అనంతసేన్శర్మ, అర్చకులు మణికంఠశర్మ, రేవంత్శర్మ తదితరులు పాల్గొన్నారు. -
వందోసారి తిరుమలకు కాలినడక
మక్తల్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తారు భక్తులు. కొందరు అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లి మొక్కులు తీర్చుకుంటారు. ఇదే కోవకు చెందిన మక్తల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రంజిత్కుమార్రెడ్డి ఏకంగా వందసార్లు అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లి భక్తిభావం చాటుకున్నారు. గురువారం వందోసారి తిరుమలకు కాలినడకన వెళ్లినట్లు ఆయన తెలిపారు. ప్రతినెలా అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లి స్వామివారిని దర్శించుకుంటున్నట్లు చెప్పారు. -
ఎస్ఎల్బీసీ ఘటన దురదృష్టకరం
అమ్రాబాద్: ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాద ఘటన దురదృష్టకరమని.. 8 మంది కార్మికుల ప్రాణాలు గాలిలో కలవడం వెనుక ప్రభుత్వ నిర్లక్ష్య వెఖరి ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డా. గడ్డం లక్ష్మణ్ ఆరోపించారు. గురువారం ఎస్ఎల్బీసీని పౌరహక్కుల సంఘం, కుల నిర్మూలన వ్యతిరేక పోరాట సమితి బృందంతో కలిసి సందర్శించారు. రెస్క్యూ బృందం, కలెక్టర్ బదావత్ సంతోష్తో మాట్లాడి సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడే మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలు వేగవంతంగా ఉన్నాయని.. సొరంగంలో ప్రమాదం జరగకముందే పరిస్థితిని పసిగట్టి ఉంటే ప్రాణనష్టం జరిగేది కాదన్నారు. గత ప్రభుత్వం 2019లో ఇన్లెట్ వన్ వద్ద పనులు ఎందుకు నిలిపివేసిందో ప్రస్తుత ప్రభుత్వానికి విషయం చెప్పలేదా అని ప్రశ్నించారు. నేటికీ ఏడుగురు కార్మికుల ఆచూకీ లభించకపోవడంతో ఆయా కుటుంబాల ఆవేదన వర్ణనాతీతమన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.కోటి, జేపీ కంపెనీ మరో రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట కులనిర్మూలన వ్యతిరేక సమితి రాష్ట్ర సభ్యుడు లక్ష్మీనారాయణ, పౌరహక్కుల సంఘం జిల్లా నాయకులు పి.బాలయ్య, జె.బాలయ్య, ఎన్.లక్ష్మీనారాయణ, వెంకటేష్ తదితరులు ఉన్నారు. 8 మంది కార్మికుల మృతి ప్రభుత్వ నిర్లక్ష్యమే.. పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యకుడు డా.గడ్డం లక్ష్మణ్ -
అందుబాటులోకి రాని సేవలు
అచ్చంపేట: శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చేపట్టిన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే టన్నెల్ చివరి 40 మీటర్ల వద్ద ప్రమాదకర స్థలంలో సహాయక చర్యల కోసం తీసుకొచ్చిన రోబోల సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదు. బుధవారం అన్వి రోబోటిక్ సంస్థకు చెందిన అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోను టన్నెల్ లోపలికి పంపించారు. కానీ, గురువారం సాయంత్రం వరకు 30 గంటలు గడిచినా ప్రమాద స్థలంలో రోబో పనితనం మొదలుకాలేదు. ఇప్పటి వరకు హైడ్రాలిక్ పవర్ రోబో లోపల ఏం చేస్తుందో అధికారులు వివరించలేదు. అత్యంత ప్రమాదకరమైన డీ– 1, 2 ప్రదేశాలకుి చేరుకోవడం ఎంతో క్లిష్టమైన పరిస్థితులు నెలకొన్నాయి. రోబోకు అవసరమైన సాంకేతిక లోపాలు ఎదరవుతున్నాయి. మొత్తం మూడు స్టేజీల్లో తవ్వకాలు చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం రెస్క్యూ బృందాలు మొదటి స్టేజీలోని శిథిలాలు, మట్టి, బురద, ఇనుప రాడ్లు, రాళ్లు తొలగిస్తున్నారు. సహాయక చర్యలు ఇలాగే కొనసాగితే మరో నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు రెస్క్యూ బృందాలు పేర్కొంటున్నాయి. టీబీఎం మిషన్ ఉన్న ప్రాంతానికి మినీ జేసీబీ వెళ్తుండటంతో సహాయక చర్యల్లో కొంత పురోగతి కనిపిస్తోంది. 200 మంది రెస్క్యూ బృందాలను తగ్గించి ఎక్కువగా సింగరేణి కార్మికులతో శ్రమిస్తున్నారు. సొరంగంలో దుర్వాసన కూడా తగ్గినట్లు సహాయక సిబ్బంది చెబుతున్నారు. పేరుకుపోయిన బురద, రాళ్లు తొలగిస్తూ దక్షిణ మధ్య రైల్వేకు చెందిన ప్లాస్మా కట్టర్స్, థర్మల్ గ్యాస్ కట్టర్తో టీబీఎం విడి భాగాలను కట్ చేస్తూ లోపలి నుంచి బయటికి తెస్తున్నారు. బుధవారం రాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు తీసిన శిథిలాలను బయటికి తీసుకొచ్చారు. సొరంగం పైకప్పు కూలిన ప్రదేశంలో భూగర్భ పరిస్థితులను తెలుసుకునేందకు జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) ప్రతినిధుల బృందం తొమ్మిది రోజుల వ్యవధిలో 200 మీటర్ల వరకు మాత్రమే సర్వే చేయగలిగారు. మరో 250 మీటర్లు సర్వే చేస్తే తప్ప సొరంగం పైభాగం కూలడానికి గల కారణాలు తెలియవు. టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారిలో ఒకరి మృతదేహం బయటికి తీసుకురాగా, మిగతా ఏడుగురి కోసం సర్వశక్తులు వడ్డుతున్నారు. అత్యున్నత సాంకేతికను వాడుతూ ఎన్డీఆర్ఎ్ఫ్, సింగరేణి, హైడ్రా, రాడర్ హోల్ మైనర్స్ వంటి 12 బృందాలు 20 రోజులుగా నిరంతరం శ్రమిస్తూ వారీ ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. రెండు రోజుల నుంచి కన్వేయర్ బెల్టుకు సరిపడా మెటీరియల్ లేక పనిచేయడం లేదు. మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్, కలెక్టర్ బదావత్ సంతోష్ గురువారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మరోసారి డాగ్స్ సాయం సొరంగంలో చిక్కుకున్న వారి ఆచూకీ కనుకొనేందుకు డీ– 1, 2 వద్ద సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్స్ బృందాలు తవ్వకాలు చేపడుతున్నారు. డీ–2 వద్ద కేరళకు చెందిన కాడవర్ డాగ్స్ పసిగట్టిన ప్రదేశంలో నాలుగు రోజులుగా తవ్వకాలు జరిపారు. ఇక్కడ టీబీఎం మిషన్కు చెందిన రాడ్లు, బేస్, శిథిలాలు కనిపించడంతో గురువారం వాటిని బయటికి తీసుకువచ్చారు. అక్కడ మిగతా ఎలాంటి ఆనవాళ్లు లభించకపోవడంతో మరోసారి డాగ్స్ను లోపలికి తీసుకెళ్లారు. అవి పసిగట్టే ప్రదేశాల్లో మరోసారి తవ్వకాలు చేపట్టి కార్మికుల ఆచూకీ గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. హైడ్రాలిక్ పవర్డ్ రోబో యంత్రానికి అవరోధం అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంలో సాంకేతిక సమస్యలు 30 గంటలు గడిచినా వివరాలు వెల్లడించని అధికారులు ఎస్ఎల్బీసీలో కొనసాగుతున్న సహాయక చర్యలు -
పదో బెటాలియన్ అభివృద్ధికి కృషి
ఎర్రవల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ సిబ్బందికి అవసరమైన పూర్తి వసతులు అందించి బెటాలియన్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తుందని తెలంగాణ స్పెషల్ పోలీస్ అదనపు డీజీపీ సంజయ్కుమార్ జైన్ అన్నారు. గురువారం స్థానిక పదో బెటాలియన్లో నూతనంగా ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్రీనివాసరావు, పటాలం కమాండెంట్ సాంబయ్యతో కలిసి నూతన చిల్డ్రన్స్ పార్క్, పరేడ్ గ్రౌండ్ గ్యాలరీలతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంబించారు. అనంతరం కమాండెంట్ కార్యాలయంలో సిబ్బందితో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే పటాలం అభివృద్ధితోపాటు సిబ్బందికి అందుతున్న వివిధ సంక్షేమ పథకాల గురించి కమాండెంట్తో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో బెటాలియన్ పోలీసులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివన్నారు. విధి నిర్వహణలో పటాలం సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించి పటాలానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. పటాలంలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు తనవంతు కృషిచేస్తానని సూచించారు. కార్యక్రమంలో అదనపు కమాండెంట్ జయరాజు, అసిస్టెంట్ కమాండెంట్లు నరేందర్రెడ్డి, శ్రీనివాసులు, పాణి, ఆర్ఐలు వెంకటేశ్వర్లు, రాజారావు, రాజేష్, రమేష్బాబు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు అదనపు డీజీపీకి ఎస్పీ శ్రీనివాసరావు ఎర్రవల్లిలో మర్యాద పూర్వకంగా కలిసి పూలబొకే అందించి స్వాగతం పలికారు. అదనపు డీజీపీ సంజయ్కుమార్ జైన్ పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం -
రైతు ఆత్మహత్యాయత్నం
గట్టు: మండలంలోని మిట్టదొడ్డికి చెందిన రైతు మారెప్ప గురువారం పురుగుమందు తాగి ఆత్మహత్యా యత్నానికి యత్నించారు. భార్య సరోజమ్మ కథనం మేరకు.. మారెప్పకు గ్రామ శివారులో పొలం ఉండగా, పక్కనే గ్రామానికి చెందిన సీడ్ ఆర్గనైజర్ నర్సింహారెడ్డి, నల్లారెడ్డి, కిష్టారెడ్డి వ్యవసాయ భూములున్నాయి. రెండు పొలాల మధ్య నక్ష బాట ఉండగా.. సదరు వ్యక్తులు బాటను ఆక్రమించే ప్రయత్నం చేశారు. బాట ఆక్రమణపై గతంలో రెవెన్యూ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండల, జిల్లా సర్వే అధికారులు వచ్చి సర్వే చేసినా ఆక్రమించుకునేందుకు యత్నిస్తే అడ్డుకోగా తమపై అట్రాసిటి కేసు నమోదు చేయించడంతో పాటు దాడిచేసి గాయపర్చినట్లు వివరించారు. దీంతో మానసిక వేధనకు గురై తన భర్త గడ్డి మందు తాగాడని తెలిపారు. వెంటనే చికిత్స నిమిత్తం కర్నూలు ఆస్పత్రికి తరలించామని, పోలీస్స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినట్లు సరోజమ్మ చెప్పారు. యువకుడి బలవన్మరణం ఉండవెల్లి: రైలు కిందపడి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉండవెల్లి శివారులో గురువారం చోటు చేసుకుంది. రైల్వే కానిస్టేబుల్ అశోక్ వివరాల మేరకు.. మండలంలోని కలుగొట్ల గ్రామానికి చెందిన గొల్ల మధు (21) కర్నూలులో జరిగిన వివాహానికి వెళ్లి.. స్వగ్రామానికి బైక్పై బయలుదేరాడు. ఉండవెల్లి శివారులో గుర్తుతెలియని రైలు వస్తుండగా.. రైల్వే బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడి మృతికిగల కారణాలు తెలియరాలేదు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అలంపూర్ మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు రైల్వే కానిస్టేబుల్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చిన్నచింతకుంట: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన చిన్నచింతకుంట మండలం పర్దీపురం గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాంలాల్ నాయక్ వివరాల మేరకు.. పర్దీపూర్కు చెందిన కుమ్మరి రాజు (31) స్వగ్రామం నుంచి లాల్కోటకు బైక్పై వెళ్తుండగా.. జల్మానాయక్ తండాకు చెందిన రమేష్ నాయక్ అతివేగంగా బైక్పై వచ్చి ఢీకొట్టాడు. ప్రమాదంలో రాజుకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం అంబులెన్స్లో జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మృతిచెందాడు. రమేష్ నాయక్కు స్వల్పగాయాలు కావడంతో జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
వైభవం.. ధ్వజారోహణం
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీఅలివేలు మంగతాయారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ధ్వజారోహణం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా దేవస్థానం సమీపంలోని పుట్ట వద్ద ప్రత్యేక పూజలు చేసి.. మట్టి తీసుకువచ్చారు. అనంతరం దేవస్థానం వద్ద ఉన్న మండపంలో పురోహితుల వేదమంత్రాల మధ్య హోమం నిర్వహించారు. ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజల అనంతరం ధ్వజారోహణం, అమ్మవారి సన్నిధిలో దేవతా ఆహ్వానం, బలిహరణం, ఎదుర్కోలు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి హనుమత్ వాహన సేవ.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి అమ్మవారికి హనుమత్ వాహన సేవ వైభవంగా జరిగింది. శోభాయమానంగా అలంకరించిన హనుమత్ వాహనంపై అమ్మవారిని గర్భగుడి నుంచి దేవస్థానం ముందున్న మండపం వరకు సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ సందర్భంగా భక్తుల హరినామస్మరణ మార్మోగింది. వివిధ రకాల పూలు, బంగారు ఆభరణాల అలంకరణలో అమ్మవారు భక్తకోటికి దర్శనమిచ్చారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందాచారి తదితరులు పాల్గొన్నారు. నేడు తిరుకల్యాణ మహోత్సవం.. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన తిరుకల్యాణ మహోత్సవాన్ని శుక్రవారం నిర్వహించనున్నారు. ప్రతి ఏడాది హోలీ పండుగ రోజు కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా దేవస్థానం వద్ద తిరుకల్యాణ వేడుకకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
నవ వధువు ఆత్మహత్య
కొందుర్గు: కాళ్ల పారాణి ఆరక ముందే ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొందుర్గు మండల పరిధిలోని వెంకిర్యాలలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలం ఎన్కెపల్లికి చెందిన కప్పరి మణ్యం, సుగుణమ్మల కూతురు సుజాత(21)ను మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం లింగంపల్లికి చెందిన రాములుకు ఇచ్చి గత నెల 7న వివాహం జరిపించారు. ఈ సమయంలో వరకట్నం కింద అర తులం బంగారు అభరణాలు, స్కూటీ కొనుక్కునేందుకు రూ.70 వేల నగదుతో పాటు వంట సామాగ్రి అందజేశారు. అయితే పెళ్లి జరిగిన రోజు నుంచి భర్త రాములుతో పాటు మామ పోచయ్య, బావ సైదులు మానసికంగా బాధపెడుతున్నారు. పెళ్లికి రూ.6 లక్షలు ఖర్చు అయిందని, ఈ మొత్తాన్ని మీ తల్లిదండ్రుల నుంచి తేవాలని సుజాతను ఒత్తిడి చేస్తున్నారు. ఇదిలా ఉండగా మణ్యం, సుగుణమ్మ వెంకిర్యాలలోని తమ సమీప బంధువు రామకృష్ణకు చెందిన టీ స్టాల్లో పని చేస్తూ ఇక్కడే ఉంటున్నారు. గురువారం వెంకిర్యాలకు వచ్చిన సుజాత రాత్రి వేళ వద్ద బాత్రూమ్లో చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి మణ్యం ఫిర్యాదు మేరకు తహసీల్దార్ రమేశ్కుమార్ సమక్షంలో షాద్నగర్ కమ్యూనిటీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ బాలస్వామి తెలిపారు. ఇదిలా ఉండగా సుజాత అంత్యక్రియలను అత్తగారి గ్రామమైన లింగంపల్లిలో నిర్వహించారు. వరకట్న వేధింపులతో మనస్థాపం ఉరేసుకుని బలవన్మరణం -
ఎల్ఆర్ఎస్ను సద్వినియోగం చేసుకోవాలి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఎల్ఆర్ఎస్పై కల్పించిన 25 శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. ఈ విషయంపై దరఖాస్తుదారులందరికీ పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. గురువారం మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఈ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా లే–అవుట్, ప్లాట్ యజమానులకు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ఫోన్ ద్వారా సమాచారం అందించి ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారో మెప్మా ఆర్పీలను అడిగి తెలుసుకున్నారు. ఎల్ఆర్ఎస్కు సంబంధించి ఏమైనా సందేహాలుంటే హెల్ప్డెస్క్ ద్వారా దరఖాస్తుదారులు నివృత్తి చేసుకోవాలన్నారు. ప్రభుత్వ నియమ, నిబంధనల ప్రకారమే ఈ నెల 31 లోగా రుసుం చెల్లించాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డి, మెప్మా ఇన్చార్జ్ డీఎంసీ ఎం.లక్ష్మి, సీఓలు వరలక్ష్మి, నిర్మల, దేవమ్మ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. చిరుధాన్యాలు ఆరోగ్యానికి మేలు చిరుధాన్యాల ఆహారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని కలెక్టర్ విజయేందిర అన్నారు. స్థానిక మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ‘ఆహారంతో ఆరోగ్యంశ్రీలో భాగంగా చిరు ధాన్యాల వంటకాలపై శిక్షణ, మానవ అక్రమ నివారణపై అవగాహన నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. మానవ అక్రమ రవాణా ప్రధాన సమస్యగా ఉందని, మహిళా సంఘాల సభ్యులు అప్రమత్తంగా గ్రామస్థాయిలో మహిళలకు అవగాహన కలిగిస్తూ ఐక్యంగా, సంఘటితంగా సామాజిక రుగ్మతలను రూపు మాపాలని తెలిపారు. చిరుధాన్యాలతో మిల్లెట్ రాంబాబు 10 రకాల వంటకాలు డెమో నిర్వహించారు. వంటకాలు మహిళా సభ్యులకు, అతిథులకు వడ్డించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ నర్సింహులు, అదనపుడీఆర్డీఓ జోజప్ప, డీఎఫ్ఓ సత్యనారాయణ, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రజిత, కార్యదర్శి సుమతి, కోశాధికారి అనిత, డీపీఎంలు నాగమల్లిక, చెన్నయ్య, సలోమి, ఏపీఎంలు మాధవి, నాగరాజు, అనురాధ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ విజయేందిర బోయి మున్సిపల్ కార్యాలయంలో ప్రక్రియ పరిశీలన నిబంధనల ప్రకారమే రుసుం చెల్లించాలి -
రూపాయి సాయం అందలేదు..
ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తాము సంతకాలు చేశాం. తమ బ్యాంకు ఖాతాల లో మూడు దఫాలుగా పరిహారాన్ని జమ చేస్తామని అధికారులు అప్పట్లో చెప్పారు. ఇప్పటి వరకు రూపాయి జమ చేయలేదు. రోజురోజుకు మార్కెట్ విలువ పెరిగిపోతుంది. ప్రస్తుతం ప్యాకేజీని రూ.25 లక్షలకు పెంచి ఇవ్వాలి. – రామాంజనేయులు, నిర్వాసితుడు, ఉదండాపూర్ నిధులు విడుదల కావాలి ఉదండాపూర్ రిజర్వాయర్కు సంబంధించి ఆర్అండ్ఆర్ అమలు పెండింగ్లో ఉంది. గి రిజన తండాలకు అవా ర్డ్ పాస్ కావడంతో రూ.42 కోట్లు నిర్వాసితుల ఖాతాలలో జమయ్యాయి. వల్లూరు, ఉదండాపూర్ ముంపు గ్రామాలకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించి అవార్డ్ సిద్ధం చేయాల్సి ఉంది. ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ఆదేశాలతో అక్కడక్కడా వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి ముందుకు వెళుతున్నాం. – నర్సింగరావు, తహసీల్దార్, జడ్చర్ల పదవీ త్యాగానికి సిద్ధం ఉదండాపూర్ నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతా. అవసరం అనుకుంటే పార్టీని, పదవీని పక్కన పెట్టి నిర్వాసితుల తరఫున నిలబడుతా. ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి నుంచి న్యాయం చేస్తామన్న హామీ దక్కింది. అవార్డు పాసైన తండాలకు ఆర్అండ్ఆర్ పరిహారంతో పాటు ప్లాట్లు త్వరలోనే అందజేస్తాం. – అనిరుధ్రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే ● -
గడువులోగా లక్ష్యం చేరుకోవాలి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఆర్థిక సంవత్సరం (2024–25) ముగియడానికి 17 రోజులే మిగిలి ఉందని.. ఆలోపు పట్టణాలలో ఆస్తిపన్ను, ఎల్ఆర్ఎస్కు సంబంధించి లక్ష్యం చేరుకోవాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్ ఆదేశించారు. గురువారం సాయంత్రం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మహబూబ్నగర్, జడ్చర్ల, భూత్పూర్ కమిషనర్లు, మెప్మా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్నగర్ నగరంలో ఇంకా రూ.నాలుగు కోట్ల ఆస్తి పన్ను వసూలైతేనే 16వ ఆర్థిక సంఘం గ్రాంట్కు అర్హత దక్కుతుందన్నారు. అలాగే జడ్చర్ల పట్టణంలో రూ.80 లక్షలు, భూత్పూర్లో రూ.60 లక్షల మేర ఆస్తిపన్ను ఎలాగైనా రాబట్టాలని సూచించారు. ఇక ఒక్కో ఆర్పీ కనీసం వంద మంది ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు ఫీజు చెల్లింపులో కల్పిస్తున్న 25 శాతం రాయితీపై అవగాహన కల్పించాలన్నారు. వీలైనంత ఎక్కువ మంది ఈ ప్రక్రియను పూర్తి చేసేలా చూడాలన్నారు. సమావేశంలో మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డితో పాటు జడ్చర్ల, భూత్పూర్ కమిషనర్లు లక్ష్మారెడ్డి, నూరుల్ అహ్మద్, ఆర్ఓ మహమ్మద్ ఖాజా, మెప్మా ఇన్చార్జ్ డీఎంసీ ఎం.లక్ష్మి, సీఓలు వరలక్ష్మి, నిర్మల, దేవమ్మ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్శివేంద్రప్రతాప్ మున్సిపల్ కమిషనర్లు, మెప్మా అధికారులతో సమీక్ష -
హోలీ సంబరాలు ప్రారంభం
పాలమూరు: హోలీ పండుగ సందర్భంగా మహబూబ్నగర్లోని పలు చౌరస్తాల్లో గురువారం రాత్రి కాముడి దహనం నిర్వహించారు. ప్రధానంగా బ్రహ్మణవాడి, రాంమందిర్ చౌరస్తాలో స్థానిక మహిళలతో పాటు యువకులు కాముడి దహనం చేశారు.సంజయ్నగర్, క్లాక్టవర్, పద్మావతి కాలనీ, శ్రీనివాస కాలనీ, మర్లు, సాంబశివ దేవాలయం వద్ద స్థానికులు పెద్ద పెద్ద మంటలు ఏర్పాటు చేసి కాముడి దహనంచేసి, ఆ మంటల చుట్టూ సందడి చేశారు. మరోవైపు రంగులు విక్రయించే దుకాణాలు జనంతో కిటకిటలాడాయి. శుక్రవారం హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు యువత ఏర్పాట్లు చేసుకుంది. కాగా.. వేడుకల్లో కాలుష్య కారకాలు లేని సహజసిద్ధమైన, పూల వ్యర్థాలతో తయారు చేసిన రంగులనే ఉపయోగించాలని అధికారులు, వైద్యులు చెబుతున్నారు. ● విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో క్లాక్టవర్ చౌరస్తాలో నిర్వహించిన కాముడి దహన కార్యక్రమానికి ఎస్పీ డి.జానకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి భారీగా ఏర్పాటు చేసిన కాముడిని దహనం చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాములు, డీఎస్పీ వెంకటేశ్వర్లు, వన్టౌన్ సీఐ అప్పయ్య, విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు యాదిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు విగ్నేష్కాంత్, లక్ష్మీనారాయణ, శ్రీధర్, ప్రభాకర్, మయూరీనాథ్, సుబ్రహ్మణ్యం, బాబుల్రెడ్డి పాల్గొన్నారు. జిల్లాకేంద్రంలో పలు చౌరస్తాల్లో కాముడి దాహనం -
క్రీడలతో ఉజ్వల భవిష్యత్
మహబూబ్నగర్ క్రీడలు: క్రీడలతో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని డీటీడీఓ ఛత్రునాయక్, డీవైఎస్ఓ ఎస్.శ్రీనివాస్ అన్నారు. మోడల్ స్పోర్ట్స్ స్కూల్, వాటర్ స్పోర్ట్స్ అకాడమీల్లో 5వ తరగతి ప్రవేశాలకు సంబంధించి జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో గురువారం ట్రైబల్ వెల్ఫేర్ విద్యార్థులకు ఆయా క్రీడాంశాల్లో ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ మోడల్ స్పోర్ట్స్ స్కూల్, వాటర్ స్పో ర్ట్స్ అకాడమీలకు ఎంపికై తే మెరుగైన క్రీడాశిక్ష ణ లభిస్తుందన్నారు. విద్యార్థులకు ఎత్తు, బరు వు, 30మీటర్ల ఫ్లయింగ్ స్టార్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, మెడిసిన్ బాల్, 6x10 మీటర్ల షటిల్ రన్, ఫ్లెక్సిబిలిటీ, వర్టికల్ జంప్, 800 మీటర్ల రన్ అంశాల్లో ఎంపికలు నిర్వహించా రు. కార్యక్రమంలో ఏటీడీఓ చిన్యనాయక్, వా ర్డెన్లు రాజేందర్, పద్మ, క్రీడాశాఖ కోచ్లు సునీల్కుమార్, పర్వేజ్పాష, అంజద్ పాల్గొన్నారు. ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్లో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ద్వారా నెలరోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ స్వప్న ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో ఈనెల 15 నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించిన స్క్రీనింగ్ టెస్టు వచ్చే నెల 12వ తేదీన నిర్వహిస్తామని పేర్కొన్నారు. 252 మంది గైర్హాజరు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్ష గురువారం ప్రశాంతంగా జరిగాయి. ప్రథమ సంవత్సరానికి సంబంధించి మ్యాథ్స్–2, జువాలజీ, హిస్టరీ సబ్జెక్టులకు సంబంధించి పరీక్ష జరిగింది. 36 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 10,599 మంది విద్యార్థులకు 10,347 మంది హాజరై, 252 మంది గైర్హాజరయ్యారు. స్క్వాడ్ అధికారులు పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. టెక్నీషియన్ విధులు కీలకం పాలమూరు: జిల్లా జనరల్ ఆస్పత్రిలోని సమావేశ మందిరంలో గురువారం ల్యాబ్ టెక్నీ షియన్ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్కుమార్ సింగ్ కేక్ కట్ చేసి ల్యాబ్ టెక్నీషియన్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్నీషియన్స్ విధులు చాలా కీలకంగా ఉంటాయని, వారు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే వైద్యులు రోగికి చికిత్స చేస్తారని తెలిపారు. అనంతరం ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ఆస్పత్రిలోని డయాలసిస్సెంటర్లో రోగులతో కూడా కేక్ కట్ చేయించారు. కార్యక్రమంలో వైద్యులు సునీల్, ఆర్ఎంఓ జరీనా, శిరీష, దుర్గ, శ్వేత, జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ అమరావతి, నోడల్ ఆఫీసర్ డాక్టర్ బాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వేరుశనగ క్వింటాల్ రూ.6,989 జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం వేరుశనగ క్వింటాల్కు గరిష్టంగా రూ.6,989, కనిష్టంగా రూ.5,363 ధరలు లభించాయి. కందులు గరిష్టంగా రూ.6,800, కనిష్టంగా రూ.4,000, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,304, కనిష్టంగా రూ.2,165, పెబ్బర్లు గరిష్టంగా రూ.6,010, కనిష్టంగా రూ.5,450, జొన్నలు రూ.3,889, పొద్దుతిరుగుడు రూ.4,250, ఆముదాలు రూ.6,151, మినుములు గరిష్టంగా రూ.7,262, కనిష్టంగా రూ.7,222 ధరలు లభించాయి. అలసందలు క్వింటాల్ రూ.7,072 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం అలసందలు క్వింటాల్కు గరిష్టం రూ.7,072, కనిష్టంగా రూ.6,982 ధర పలికాయి. అలాగే, శనగలు గరిష్ట, కనిష్టంగా రూ.5,680, వేరుశనగ గరిష్టం రూ.6,020, కనిష్టం రూ.4,110, జొన్నలు గరిష్టం రూ.4,640, కనిష్టం రూ.2,650, ఎర్ర కందులు గరిష్టం రూ.7,314, కనిష్టం రూ.6,339, తెల్ల కందులు గరిష్టంగా రూ.6,769, కనిష్టంగా రూ.6,650 ధరలు పలికాయి. -
మహిళలకే ఆరోగ్య సమస్యలు
మహబూబ్నగర్ రూరల్: దేశంలో ఎక్కువ ఆరోగ్య సమస్యలు మహిళలకే ఉన్నాయని, ప్రతిఒక్క మహిళ తినే ఆహారాన్ని పౌష్టికంగా తీసుకోవాలని సుశ్రుత ప్రజా వైద్యశాల ఎండీ డాక్టర్ ప్రతిభ సూచించారు. బుధవారం మండలంలోని మాచన్పల్లి గ్రామంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, మాచన్పల్లి గ్రామ మహిళా సమాఖ్య సంఘాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు–పరిష్కార మార్గాలు’ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రతిభ మాట్లాడుతూ భారతదేశంలో క్యాన్సర్ వ్యాధి అత్యధికంగా మహిళలకే వస్తుందన్నారు. దీన్ని అరికట్టడానికి ప్రతి మహిళా ముందుగానే పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. ప్రతిరోజు గుడ్లు, పాలు, ఆకు కూరలు అధిక శాతంలో తినాలని సూచించారు. అనంతరం డాక్టర్ ప్రతిభను శాలువతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడియాల మోహన్, మండల మహిళా సమాఖ్య ఏపీఎం మాధవి, సీసీ నాగలక్ష్మి, గ్రామ ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం అరుంధతి పాల్గొన్నారు. -
వర్గీకరణ తరువాతే ఫలితాలు విడుదల చేయాలి
జడ్చర్ల టౌన్: రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్–2 పరీక్షల ఫతితాలు నిలుపుదల చేసి ఎస్సీ వర్గీకరణ తరువాతే విడుదల చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మందకృష్ణ పిలుపుమేరకు నియోజకవర్గ కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలను బుధవారం ప్రారంభించారు.తెలంగాణలోని యావత్తు మాదిగ జాతి సమాజానికి ఇచ్చిన మాటను నిలుపుకోకుండా మాల లీడర్ల ఒత్తిడి మేరకే గ్రూప్ 2 ఫలితాలు విడుదల చేశారని దీక్షలో పాల్గొన్న నాయకులు ఆరోపించారు. మంత్రివర్గంలోనూ మాదిగలకు రెండు మంత్రి పదవులు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టి ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నిస్తామన్నారు. దీక్షలకు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పాలాది సారిక సంఘీభావం ప్రకటించారు. ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి జంగయ్య మాదిగ, సీనియర్ నాయకులు కొంగళి నాగరాజు, ధర్నాచౌక్లో.. మహబూబ్నగర్ రూరల్: ఎస్సీ వర్గీకరణ తర్వాతే ప్రభుత్వ ఉద్యోగ ఫలితాలను, నియామకాలను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎంఈఎఫ్ జాతీయ నాయకుడు పోలే బా లయ్య, బాలరాజు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ ఫలితాలను, నియామకాలను చేపట్టరాదన్నారు. ఫలితాలను వాయిదా వేయాలి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఎస్సీ వర్గీకరణ అయ్యేంత వరకు గ్రూప్స్ ఫలితాలు ఇవ్వకూడదని, తక్షణమే ఇచ్చిన ఫలితాలను వాయిదా వేయాలని ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కార్తీక్ డిమాండ్ చేశా రు. పీయూ ముఖద్వారం వద్ద ఏర్పాటుచేసిన ని రసనలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టే క్రమంలో ఇలాంటి పనులు చేయడంతో అన్యాయం చేయడమే అన్నారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు -
వర్గీకరణ తరువాతే ఫలితాలు విడుదల చేయాలి
జడ్చర్ల టౌన్: రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్–2 పరీక్షల ఫతితాలు నిలుపుదల చేసి ఎస్సీ వర్గీకరణ తరువాతే విడుదల చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మందకృష్ణ పిలుపుమేరకు నియోజకవర్గ కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలను బుధవారం ప్రారంభించారు.తెలంగాణలోని యావత్తు మాదిగ జాతి సమాజానికి ఇచ్చిన మాటను నిలుపుకోకుండా మాల లీడర్ల ఒత్తిడి మేరకే గ్రూప్ 2 ఫలితాలు విడుదల చేశారని దీక్షలో పాల్గొన్న నాయకులు ఆరోపించారు. మంత్రివర్గంలోనూ మాదిగలకు రెండు మంత్రి పదవులు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టి ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నిస్తామన్నారు. దీక్షలకు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పాలాది సారిక సంఘీభావం ప్రకటించారు. ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి జంగయ్య మాదిగ, సీనియర్ నాయకులు కొంగళి నాగరాజు, ధర్నాచౌక్లో.. మహబూబ్నగర్ రూరల్: ఎస్సీ వర్గీకరణ తర్వాతే ప్రభుత్వ ఉద్యోగ ఫలితాలను, నియామకాలను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎంఈఎఫ్ జాతీయ నాయకుడు పోలే బా లయ్య, బాలరాజు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ ఫలితాలను, నియామకాలను చేపట్టరాదన్నారు. ఫలితాలను వాయిదా వేయాలి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఎస్సీ వర్గీకరణ అయ్యేంత వరకు గ్రూప్స్ ఫలితాలు ఇవ్వకూడదని, తక్షణమే ఇచ్చిన ఫలితాలను వాయిదా వేయాలని ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కార్తీక్ డిమాండ్ చేశా రు. పీయూ ముఖద్వారం వద్ద ఏర్పాటుచేసిన ని రసనలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టే క్రమంలో ఇలాంటి పనులు చేయడంతో అన్యాయం చేయడమే అన్నారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు -
ఎల్ఆర్ఎస్పై విస్తృత ప్రచారం చేయాలి
భూత్పూర్: మున్సిపాలిటీలోని ప్రజలకు ఎల్ఆర్ఎస్పై విస్తృత ప్రచారం చేపట్టాలని అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ఆదేశించారు. బుధవారం మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. 2020లో ఎల్ఆర్ఎస్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి వివరాలను కమిషనర్ నూరుల్ నజీబ్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. 2020లో ఎల్ఆర్ఎస్కు రూ.1,000 చెల్లించి అప్పట్లో ఖాళీ స్థలం లబ్ధిదారులు తమ ప్లాట్లను రిజస్ట్రేషన్ చేయించుకున్న వారికి మాత్రమే ఈ నెల 31వ తేదీ వరకు పూర్తి ఫీజు చెల్లిస్తే 25 శాతం రాయితీ లభిస్తుందని తెలిపారు. మున్సిపాలిటీలోని 10 వార్డుల్లో ప్రజలకు ఎల్ఆర్ఎస్ రాయితీ కల్పిస్తున్నట్లు ప్రచారం నిర్వహించాలని, మున్సిపాలిటీలో హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేయాలని కమిషర్ను ఆదేశించారు. -
నేటి నుంచి ఆదిబసవేశ్వరస్వామి ఉత్సవాలు
నవాబుపేట: మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో పల్లెగడ్డ గ్రామ శివారులో స్వయంభూగా ఆదిబసవేశ్వరస్వామి వెలిశారు. స్వామివారి ఉత్సవాలు గురువారం నుంచి ప్రా రంభం కానున్నాయి. ప్రతి ఏటా ఉత్నవాలు హోలీకి ముందు రోజు ఉత్సవాలు ప్రారంభిస్తారు. గురువారం ప్రారంభమయ్యే సోమవా రం ముగుస్తాయి. 13న ప్రభోత్సవం, 14న రథోత్సవం, 15న శకటోత్సవం, 16న అగ్నిగుండం, 17న శివపార్వతుల కల్యాణంతో ఉత్సవాలు ముగుస్తాయని పూజారి శ్రీశైలం, కార్యక్రమ నిర్వాహకులు జంగయ్య, రాజలింగం, ధర్మకర్త భూపాల్రెడ్డి తెలిపారు. ఈ ఉత్సవాలకు చుట్టుపక్కల దాదాపుగా 70 గ్రామాల ప్రజలు వస్తుంటారు. దాదాపుగా 40 గ్రామల ప్రజలు ఇంటికి ఒకరు చొప్పున విధిగా వచ్చి దేవాలయంలో టెంకాయ కొట్టాలన్న ఆనవాయితీ ఇక్కడ ఉండటంతో అన్ని గ్రామాల ప్రజలు మా ఊరి జాతరగా పిలుస్తుంటారు. -
భూమాతను కాపాడుకుందాం
జడ్చర్ల టౌన్: ప్రతిఒక్కరం బాధ్యతగా భూమాతను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డా.సుకన్య పిలుపునిచ్చారు. తెలంగాణ బొటానికల్ గార్డెన్లో ప్రారంభమైన ఎన్ఎస్ఎస్3 యూనిట్ ప్రత్యేక శిబిరంను ఆమె బుధవారం ప్రారంభించి మాట్లాడారు. భూ మాతను కాపాడుకోవాలంటే మన జీవన విధానంలో సమూలమైన మార్పులు రావాలన్నారు. మన ప్రతిచర్య పర్యావరణ హితంగా ఉండాలన్నారు. శిబిరం 7రోజుల పాటు కొనసాగనున్నందున పర్యావరణ హిత కార్యక్రమాలు చేయాలన్నారు. చెట్లకు పాదులు చేయటం, ఔషధమొక్కల నర్సరీ ఏర్పా టు, చెత్తచెదారంతో కంపోస్ట్ తయారీ, మొక్కలు నాటాలన్నారు. న్నారు.ఎన్ఎస్ఎస్ యూనిట్–3 ప్రోగ్రాం అధికారి డా.సదాశివయ్య, వైస్ ప్రిన్సిపాల్ నర్మద, 50మంది వాలంటీర్లు పాల్గొన్నారు. డిగ్రి కళాశాల ప్రిన్సిపాల్ డా. సుకన్య -
బీసీలకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం
మహబూబ్నగర్ రూరల్: బీసీలకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం కావాలని బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు పాండుయాదవ్ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలో బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ‘ఓటుహక్కు బీసీల ఓటు బీసీలకే’ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలు రాష్ట్రంలో ఉన్నారన్న విషయాన్ని మరిచి కులగణనలో తప్పుడు లెక్కలు చూయించే ప్రయత్నిస్తుందని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సకల జనుల సర్వేలో ఏ లెక్కలు అయితే చూయించిందో వాటి ఆధారంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అత్యధిక శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. నేషనల్ జస్టిస్ ఫోరం చైర్మన్ నారగోని మాట్లాడారు. సంఘం మహిళావిభాగం రాష్ట్ర ప్రధా న కార్యదర్శి సంధ్యారాణి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయ్ మహేంద్ర, రాష్ట్ర కోశాధికారి అరుణ్కుమార్, నాయకులు భీమేష్, కృష్ణ, సుజిత్యాదవ్, మల్లేష్యాదవ్, దీపక్, ఎం.కృష్ణ, రాము పాల్గొన్నారు. -
పట్టాల పంపిణీలో నిర్లక్ష్యం
● ప్రజా సమస్యలపై సీపీఎం సర్వే మహబూబ్నగర్ రూరల్: సీపీఎం చేసిన పోరాటాల ఫలితంగా ప్రభుత్వం 310 డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేసిందని, కానీ నేటికీ ఇళ్ల యజమానులకు పట్టాలు పంపిణీ చేయడంలో నిర్లక్ష్యం చూపుతోందని ఆ పార్టీ పట్టణ కార్యదర్శి చంద్రకాంత్ ఆరోపించారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం క్రిష్టియన్పల్లి రెవెన్యూ వార్డు శివారులో గల డబుల్ బెడ్రూం కాలనీలో సర్వే నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారంటీల్లో సమస్యలు ఉన్నాయని, రేషన్ కార్డులు, గ్యాస్ సిలిండర్లు, ఉచిత విద్యుత్ వంటి పథకాలు అర్హులకు అమలు కావడం లేదన్నారు. ఆరు గ్యారెంటీలు అమలయ్యేదాకా అనేక రకాల పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. నాయకులు రాజ్కుమార్, అనురాధ, మాణిక్రావు, నర్సింగ్రావు, కొండమ్మ పాల్గొన్నారు. -
రేపు అయ్యప్ప ఆలయంలో రుద్రాభిషేకం
జడ్చర్ల టౌన్: గంగాపురం రోడ్డులోని అయ్యప్ప ఆలయంలో శుక్రవారం అయ్యప్పస్వామి జన్మదినం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు అయ్యప్ప సేవాసమితి అధ్యక్షుడు రంజిత్బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6గంటలకు విశేషంగా పంచామృత రుద్రాభిషేకం నిర్వహిస్తామని, భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు. పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లా కేంద్రంలోని బీకేరెడ్డి కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయ దంపతులు శోభ, కరుణాకర్గౌడ్ తమ పిల్లల పుట్టిన రోజును పురస్కరించుకొని బుధవారం 20 మంది పారిశుద్ధ్య కార్మికులకు ఉచితంగా చీరలు పంపిణీ చేశారు. జేఎల్ నియామకపత్రం అందుకున్న వెన్నచేడ్ వాసి గండేడ్: మండలంలోని వెన్నచేడ్ గ్రామానికి చెందిన రాజశేఖర్ బుధవారం సీఎం రేవంత్రెడ్డి చేతులమీదుగా జేఎల్(జూనియర్ లెక్చరర్) నియామక పత్రాన్ని అందుకున్నారు. సీఎంతో పోస్టింగ్ ఆర్డర్ను అందుకోవడం సంతోషంగా ఉందని రాజశేఖర్ తెలిపారు. ఆయన్ను గ్రామ మాజీ సర్పంచ్లు పుల్లారెడ్డి, గోపాల్ అభినందించారు. విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ.. నవాబుపేట: విద్యార్థులే ఉపాధ్యాయులై తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. బుధవారం మండలంలోని మెట్టుగడ్డతండా ప్రాథమిక పాఠశాలలో స్వయం పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తమ గురువుల పాత్రతో పాటు మండల, జిల్లా స్థాయి అధికారులు పాత్రలు వేసి అందరి మన్ననలు పొందారు. ప్రతిభ కనబర్చినవారికి బహుమతులు అందించారు. పాఠశాల హెచ్ఎం విష్ణు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
విద్యార్థి దశ కీలకమైంది
దేవరకద్ర: విద్యార్థి దశ ఎంతో కీలకమైందని, వ్యసనాలకు బానిస కావొద్దని ఎస్ఐ నాగన్న అన్నారు. బుధవారం దేవరకద్ర జెడ్పీహెచ్ఎస్(బాలికల)లో సైబర్ క్రైం అవేర్నెస్, 100 డయల్, పొదుపు, పౌష్టికాహారం వంటి అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రభుత్వం విద్య కోసం ఎంతో ఖర్చు చేస్తోందని, నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలల్లోనే లభిస్తుందన్నారు. ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. క్రమశిక్షణతో చదువుకోవాలని, సైబర్ నేరాలపై అవగాహన కలిగి సెల్ఫోన్లకు వచ్చే మెసేజ్లా పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ గీత, ట్రైనింగ్ ఎస్ఐ కృష్ణాజీ, హెచ్ఎమ్ నాగేంద్రమ్మ పాల్గొన్నారు. మెరుగైన విద్యా బోధన అందించేందుకు చర్యలు మిడ్జిల్: ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా బోధన అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఎంఈ వెంకటయ్య అన్నారు. వస్పుల ఉన్నత పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తున్న వెంకటయ్య మండల ఇన్చార్జి ఎంఈఓగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు.మండలంలోని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఎంఈఓను సన్మానించాయి. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం సరస్వతి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు రాజేందర్గౌడ్, నర్సింహులు, రమేష్, వెంకటేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. పది ఇసుక ట్రాక్టర్లపట్టివేత దేవరకద్ర: గూరకొండ, నార్లోనికుంట్ల సమీపంలోని కోయిల్సాగర్ వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఆరు ఇసుక ట్రాక్టర్ల పట్టుకున్నారు. బుధవారం తెల్లవారుజామున ఇసుకను నింపుకొని దేవరకద్ర వైపు వస్తుండగా పోలీసులు దాడిచేసి ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. గత కొన్ని రోజులుగా ఆయా గ్రామాలను అడ్డాగా చేసుకుని పెద్ద ఎత్తున ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రతి రోజు అర్థరాత్రి దాటితే వాగు ఇసుక ట్రాక్టర్లతో నిండి పోతుందని ఆరోపించారు. ఇసుక తరలింపును అరికట్టాలని పలువురు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రెండు ట్రాక్టర్లు.. మహమ్మదాబాద్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్ఐ శేఖర్రెడ్డి తెలిపారు. మండలంలోని గోవిందపల్లి గ్రామ సమీపంలోని వాగు నుంచి బుధవారం అర్ధరాత్రి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకొని పోలీసుస్టేషన్కు తరలించారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు మిడ్జిల్: మండలంలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవని ఎస్ఐ శివనాగేశ్వర్ నాయుడు హెచ్చరించారు. బుధవారం కొత్తూర్ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మండలంలో ఇసుక అక్రమ రవాణాపై గ్రామస్తులు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. -
యూనిఫాంలను నాణ్యతగా కుట్టాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): విద్యార్థులకు కుట్టే యూనిఫాంలను నాణ్యతగా కుట్టాలని డీఆర్డీఏ ఏపీడీ జొజప్ప అన్నారు. బుధవారం స్థానిక జిల్లా మహిళా సమాఖ్య భవనంలో మహిళలకు కుట్టులో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందజేసే యూనిఫాంలను మహిళా సంఘాల ద్వారా కుట్టించనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా మహిళలకు కుట్టులో శిక్షణ ఇస్తున్నామన్నారు. జిల్లాస్థాయిలో శిక్షణ పొందిన టీఓటీ శిక్షకులు మండలస్థాయిలో శిక్షణ ఇస్తారన్నాని అన్నారు. ఈ శిక్షణలో యూనిఫాంలు కుట్టడంతో పాటు బట్ట కట్టింగ్, కాజాలు తదితర అంశాలపై శిక్షణ ఇస్తారని తెలిపారు. కుట్టే క్రమంలో మహిళలు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో డీపీఎం ఆలూరిచెన్నయ్య, రమేష్ పాల్గొన్నారు. డీఆర్డీఏ ఏపీడీ జోజప్ప మహిళలకు కుట్టుపై శిక్షణ -
రక్తదాన శిబిరంవిజయవంతం చేయాలి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల 94వ వర్ధంతిని పురస్కరించుకొని అంతర్జాతీయ స్థాయిలో రెడ్క్రాస్, ఎన్వైపీఓ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రక్తదాన శిభిరాన్ని విజయవంతం చేయాలని పీయూ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు రక్తదాన శిభిరానికి సంబంధించిన బ్రోచర్ను బుధవారం ఆయన పీయూలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ చైర్మన్ నటరాజ్, వైస్ ప్రిన్సిపాల్ కృష్ణయ్య, కుమారస్వామి, పర్వతాలు, యాదరాజ్, గాలెన్న, రవికుమర్, ఈశ్వర్, జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు సీసీ రోడ్డు పనులు ప్రారంభం గండేడ్: మండలంలోని రెడ్డిపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు జితేందర్రెడ్డి భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈజీఎస్ నిధులు రూ.10 లక్షలతో సీసీ రోడ్డు పనులను చేపడుతున్నట్లు తెలిపారు. కృష్ణారెడ్డి, అంజిలయ్య, లింగయ్య, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు భగవంతురెడ్డి, రఘురాంరెడ్డి, సాయిలు, వేణుగోపాల్, గోవర్థన్రెడ్డి, కృష్ణయ్య, నారాయణ పాల్గొన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): రాష్ట్రంలోని ఉద్యోగుల పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని టీజీఓ జిల్లా అధ్యక్షుడు విజయ్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్ను వెంటనే ఏర్పాటు చేసి ఉద్యోగుల సమస్యలపై చర్చించాలని కోరారు. ఉద్యోగ ఉపాధ్యాయ, పెన్షనర్లకు సంబంధించిన ఆర్థికేతర డిమాండ్లు అన్నింటిని వెంటనే పరిష్కరించాలని పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు వివిధ రూ పాల్లో నిరసనలు చేపడుతామని హెచ్చరించారు. ఆశా వర్కర్కు న్యాయం చేయాలి నారాయణపేట టౌన్: జగిత్యాల జిల్లాలో లైంగిక దాడికి గురైన ఆశా వర్కర్కు న్యాయం చేయాలని జిల్లా ఆశా వర్కర్స్ యూనియన్ ( సీఐటీయూ) నాయకురాలు బాలమణి డిమాండ్ చేశారు. పట్టణంలోని ఆరోగ్యకేద్రం వద్ద ఆశా వర్కర్స్తో కలిసి ప్లకార్డులతో నిరసన తెలిపారు. దాడికి పాల్పడిన నిదితుడిని కఠినంగా శిక్షించాలన్నారు. -
విద్యార్థి కంటికి సురక్ష
జడ్చర్ల టౌన్: కంటి సమస్య ఉన్న విద్యార్థులకు ప్రభుత్వం చూపును ప్రసాదిస్తోంది. ఆర్బీఎస్కే ద్వారా ‘సమగ్ర కంటి పరీక్ష– ఉచిత కంటి అద్దాల పంపిణీ’లో పరీక్షలు నిర్వహించి సమస్యలున్న విద్యార్థులకు కంటి అద్దాలు మంజూరయ్యాయి. మహబూబ్నగర్ జిల్లాలో 2,355 మంది విద్యార్థులకు కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో విద్యార్థులకు కంటి సమస్యలు ఉన్నవారికి పరీక్షలు జరిపారు. ఫిబ్రవరి 28వ తేదీన మహబూబ్నగర్ జిల్లాలో 2,373 మందికి, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9,427 మంది విద్యార్థులు, రాష్ట్రవ్యాప్తంగా 89,105 మంది విద్యార్థులు కంటి సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వీరంతా చూపు మందగించి చదవడానికి ఇబ్బంది పడుతున్నట్లు నిర్ధారించారు. మహబూబ్నగర్ జిల్లాలో ఆర్బీఎస్కేకు చెందిన ఏడు బృందాలు 2,373 మందికి పరీక్షలు జరపగా.. వారిలో 2,355 మందికి అద్దాలు వచ్చాయి. వీరందరికి అద్దాల పంపిణీ చేస్తున్నారు. సమస్యలున్న వారికి అద్దాలు విద్యార్థులకు కంటి చూపు అందించే లక్ష్యంగా వైద్య పరీక్షలు నిర్వహించి సమస్యలున్న వారికి అద్దాలు పంపిణీ చేసినట్లు డీఐఓ డా.పద్మజ తెలిపారు. బుధవారం బాదేపల్లి జెడ్పీహెచ్ఎస్లో 14 మంది విద్యార్థులకు అద్దాలను ఆమె పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ మంజులాదేవి, ఆర్బీఎస్కే డాక్టర్లు సునీల్, లీల, కంటి వైద్యపరీక్ష నిపుణులు దత్తాత్రేయ రావు, అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్ మనుప్రియ, హెచ్ఎం చంద్రకళ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ‘సమగ్ర కంటి పరీక్ష– ఉచిత కంటి అద్దాల పంపిణీ’లో పరీక్షలు ఉమ్మడి జిల్లాలో 9,427మంది విద్యార్థులకు కంటి సమస్యలు మహబూబ్నగర్ జిల్లాలో 2,355 మందికి అద్దాలు పంపిణీ 310 మందికి అద్దాలు.. జడ్చర్ల, మిడ్జిల్ మండలాల్లో 310 మంది విద్యార్థులకు అద్దాలను పంపిణీ చేస్తున్నాం. ఫిబ్రవరి 28న హైస్కూళ్లు, గురుకులాల్లో చదవడానికి ఇబ్బంది పడే వారికి స్థానిక ఏరియా ఆస్పత్రిలో పరీక్షలు చేయించాం. వీరందరికీ అద్దాలను అందజేస్తాం. – డా.సునీల్, ఆర్బీఎస్కే, జడ్చర్ల -
కనులపండువగా కల్యాణోత్సవం
● భక్తులతో కిటకిటలాడిన రామలింగేశ్వరస్వామి ఆలయం అడ్డాకుల: కందూర్ శ్రీరామలింగేశ్వర క్షేత్రంలో బుధవారం కల్యాణోత్సాన్ని కనులపండువగా నిర్వహించారు. ముందుగా గ్రామంలో మహిళలు సిద్ధం చేసిన తలంబ్రాల బియ్యాన్ని ప్రత్యేక పల్లకిలో మేళతాళాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి తీసు కొచ్చారు. అనంతరం పురోహితుల వేదమంత్రాల మధ్య ఉత్సవమూర్తులకు కల్యాణ వేడుకను నిర్వహించారు. కారెడ్డి నాగిరెడ్డి, తోకల దామోద్రెడ్డిరెడ్డిలు స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయంలో అభిషేకాలు నిర్వహించి, శివలింగాన్ని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. ● ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి, కవిత దంపతులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామలింగేశ్వరాలయం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ఆలయ ఆవరణలో ఇటీవల పూర్తి చేసిన సీసీ రోడ్లు, మంచి నీటి కుళాయిలను ప్రారంభించారు. బ్రహ్మో త్సవాల ఏర్పాట్లను పరిశీలించి ఆలయ నిర్వాహకులతో మాట్లాడారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈఓ రాజేశ్వరశర్మ, జూనియర్ అసిస్టెంట్ అనంతసేన్రావు, నాయకులు అరవింద్రెడ్డి, నాగిరెడ్డి, తోట శ్రీహరి, జగదీశ్వర్, నాగార్జున్రెడ్డి, విజయమోహన్రెడ్డి పాల్గొన్నారు. -
డంపింగ్ యార్డులో ఇదీ పరిస్థితి
స్థానిక కోయిల్కొండ ఎక్స్రోడ్డులోని డంపింగ్ యార్డుకు ప్రతి నిత్యం 88 వాహనాల ద్వారా సుమారు 106 మెట్రిక్ టన్నుల తడి, పొడిచెత్తను మున్సిపల్ అధికారులు తరలిస్తున్నారు. ఇందులో సుమారు పది మెట్రిక్ టన్నుల వరకు కంపోస్టు యూనిట్ షెడ్డుకు, 12 మెట్రిక్ టన్నులు పొడి చెత్తను రీసైక్లింగ్ చేసే డీఆర్సీసీకి పంపిస్తున్నారు. మిగిలిన 84 మెట్రిక్ టన్నుల మిక్స్డ్ వేస్టేజీని డంపింగ్ యార్డులోని బహిరంగ ప్రదేశంలో వదిలేస్తున్నారు. ఇందులో ఎక్కువగా ప్లాస్టిక్ కవర్లే ఉంటున్నాయి. ఇవి భూమిలో ఇంకిపోక పోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కాల్చివేస్తున్నారు. -
గోధుమపిండి అక్రమంగా దిగుమతి
జడ్చర్ల: పట్టణంలోని కొందరు వ్యాపారులు ఇతర రాష్ట్రాల్లో మాత్రమే విక్రయించే గోధుమపిండిని అక్రమంగా దిగుమతి చేసుకుంటుండటంతో ప్రభుత్వం ఆదాయం కోల్పోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో విక్రయించడానికి ఉద్దేశించబడినది కాదని సదరు కంపెనీలు గోధుమపిండి పాకెట్లపై స్పష్టంగా రాసినా.. ఆ ఉత్పత్తులను వ్యాపారులు అక్రమంగా దిగుమతి చేసుకుంటున్నారు. తెలంగాణలో విక్రయించే 5 కిలోల గోధుమపిండి పాకెట్ ధర రూ.365 ఉండగా.. అక్రమంగా దిగుమతి చేసుకున్న పాకెట్లపై రూ.254 ఉంది. అంతేగాక జీఎస్టీ చెల్లించకుండా దిగుమతి చేసుకోవడంతో పన్నుల లాభం కలిసి వస్తుంది. ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇలా వెలుగులోకి.. జడ్చర్లలోని ఓ హోల్సేల్ వ్యాపారి బుధవారం గోధుమపిండి 5 కిలోల పాకెట్ల లోడ్ను అక్రమంగా తెప్పించారు. లోడ్ పట్టణానికి చేరిన వెంటనే తమ వ్యాపారులకు వాట్సాప్లో సమాచారం అందించారు. దీంతో రిటైల్ వ్యాపారులు ఒక్కసారిగా అక్కడికి చేరుకొని కావాల్సినంత సరుకు తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ఓ డీలర్ మీడియాకు చేరవేశారు. ప్రభుత్వాకి 5 శాతం జీఎస్టీ ఎగ్గొట్టి అక్రమంగా దిగుమతి చేసుకుంటున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
చెత్త శుద్ధి కరువు..!
డంపింగ్ యార్డులో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన ప్లాస్టిక్ కవర్లు, చెత్త మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంతో పాటు దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీల్లో ‘చెత్త’శుద్ధి కరువైంది. మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కొందరు ఎక్కడబడితే అక్కడ చెత్తను కుప్పలుగా వదిలేస్తున్నారు. కొన్నేళ్లుగా నగరంలో ఒకవైపు అధికారులు స్వచ్ఛత కార్యక్రమాలు చేపడుతున్నా.. మరోవైపు కొందరు వ్యక్తుల అవగాహన లోపంతో ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు. వాస్తవానికి చెత్త సేకరణకు గాను 69 స్వచ్ఛ ఆటోలు, 19 మున్సిపల్ ట్రాక్టర్లను ఏర్పాటు చేశారు. ఇంటింటికీ వచ్చే స్వచ్ఛ ఆటోలకు వేరు చేసిన తడి, పొడి చెత్త ఇవ్వాల్సి ఉన్నా కొన్ని ప్రాంతాల్లో ప్రజల నుంచి సహకారం లభించడం లేదు. ఎక్కడబడితే అక్కడ చెత్త వేస్తున్న వైనం ● అధికారులు అవగాహన కల్పిస్తున్నా ప్రయోజనం దక్కని వైనం ● కొందరు ఇప్పటికీ స్వచ్ఛ ఆటోలకు ఇవ్వనితడి, పొడి చెత్త ● మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో నిత్యం 106 మెట్రిక్ టన్నుల సేకరణ ● ప్లాస్టిక్ కవర్లతో గుట్టలుగా పేరుకుపోతున్న డంపింగ్ యార్డు -
రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
అడ్డాకుల: మండలంలోని కందూర్ శివారులో స్వయంభూగా వెలిసి దక్షిణకాశీగా పేరొందిన శ్రీరామలింగేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు గోపూజతో మంగళవారం రాత్రి ప్రారంభమయ్యాయి. ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన యాగశాలలో భూతబలి కార్యక్రమం నిర్వహించి యాగశాల ప్రవేశం చేశారు. విఘ్నేశ్వర పూజ, అగ్నిప్రతిష్ఠ, అంకురారోహణ, ధ్వజారోహణం, బలిహరణ కార్యక్రమాలను పండితులు ఘనంగా నిర్వహించారు. ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజ స్థాపన చేసి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఆలయ ఆవరణలో స్వామి వారి ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం ఉదయం ఆలయంలో పార్వతి సమేత రామలింగేశ్వరస్వామి కల్యాణాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయం వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కల్యాణానికి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయంలో చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. ఈఓ రాజేశ్వరశర్మ, జూనియర్ అసిస్టెంట్ అనంతసేన్రావు, ఆలయ నిర్వాహకులు రవీందర్శర్మ, కారెడ్డి నాగిరెడ్డి, తోట శ్రీహరి, దామోదర్రెడ్డి, రవీందర్రెడ్డి, విజయలక్ష్మి, కారెడ్డి లత, దేవన్న యాదవ్, ఆలయ పూజారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నేడు పార్వతి సమేత రామలింగేశ్వరుడి కల్యాణ మహోత్సవం -
పొలం కబ్జా చేశారు.. న్యాయం చేయండి
● తహసీల్దార్ కార్యాలయం ఎదుట కుటుంబంతో కలిసి మహిళా రైతు ధర్నా రాజాపూర్(బాలానగర్): రెండెకరాల్లో ఒక ఎకరా పొలం రోడ్డులో పోగా.. మరో ఎకరా ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేశారని.. తనకు న్యాయం చేయాలంటూ ఓ మహిళా రైతు కుటుంబంతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగింది. బాలానగర్ మండలకేంద్రానికి చెందిన సులోచనదేవికి సర్వే నంబర్ 139/1, 139/2లో రెండెకరాల పట్టా పొలం ఉండేది. ఒక ఎకరా రోడ్డు విస్తరణలో పోగా మరో ఎకరా పొలం ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేశారు. ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా తమకు న్యాయం జరగకపోవడంతో ఆమె తన కుమారులతో కలిసి మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ధర్నా దిగింది. జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ఆల్వాల్రెడ్డి మద్దతు తెలిపారు. రైతు కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. అవసరమైతే హైదరాబాద్లో నిరాహార దీక్ష చేపడతామని పేర్కొన్నారు. -
నాగుపాముకు చికిత్స
జడ్చర్ల టౌన్: మండలంలోని ఆల్వాన్పల్లిలో పట్టుకునే క్రమంలో గాయపడిన నాగుపాముకు సర్ప రక్షకుడు డా.సదాశివయ్య చికిత్స అందించి కాపాడారు. వివరాలు.. ఆల్వాన్పల్లిలో నాగుపామును గుర్తించిన యువకులు సర్పరక్షకుడు డా. సదాశివయ్యకు ఫోన్ద్వారా సమాచారం అందించారు. దీంతో ఆయన తన శిష్యులైన రాహుల్, రవీందర్ అక్కడికి చేరుకునేలోపు నాగుపాము సమీపంలోని రంధ్రంలోకి వెళ్లింది. దాన్ని తవ్వి పామును బయటకు తీసేందుకు యువకులు గడ్డపారతో తవ్వుతుండగా పాము నడుములో దిగబడింది. అది ఒక్కసారిగా బుసలు కొడుతూ బయటికొచ్చింది. అదిగమనించిన యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. అక్కడికి చేరుకున్న రాహుల్, రవీందర్ చాకచక్యంగా పామును పట్టుకొని జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల జీవ వైవిధ్య సంరక్షణ కేంద్రానికి తీసుకొచ్చారు. అక్కడ డా.సదాశివయ్య పాముకు చికిత్స అందించి కట్టువేసి కాపాడారు. ప్రస్తుతం గాయపడిన పాము ఇదే కేంద్రంలో ఉంచారు. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు
కోస్గి: స్కానింగ్ కేంద్రాల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్యశాఖ అధికారి డా. జయంతిరెడ్డి హెచ్చరించారు. మంగళవారం పట్టణంలోని పలు స్కానింగ్ కేంద్రాలను జిల్లా వైద్యాధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. స్కానింగ్ చేసే వారి వివరాలు విధిగా సమగ్రంగా నమోదు చేయాలని, ఆధార్కార్డు, పూర్తి చిరునామా, స్కానింగ్ తీయడానికి గల కారణాలు ఉండాలని సూచించారు. రేడియాలజిస్టులే స్కానింగ్ తీయాలన్నారు. ఆమె వెంట జిల్లా ఉప వైద్యాధికారి డా. శైలజ తదితరులు ఉన్నారు. -
ఉదండాపూర్ నిర్వాసితులకు మేలు జరిగేలా చర్యలు
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసిత కుటుంబాలకు అన్ని విధాల మేలు జరిగేలా చూస్తామని కలెక్టర్ విజయేందిర అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డితో కలిసి రెవెన్యూ, ఇరిగేషన్, సర్వే ల్యాండ్ రికార్డ్స్, సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉదండాపూర్ రిజర్వాయర్ కింద వల్లూరు, ఉదండాపూర్, తుమ్మలకుంట తండా, రేగడిపట్టి తండా, చిన్నగుట్టతండా, శామగడ్డతండా, ఒంటి గుడిసె తండా, పోలేపల్లి వ్యవసాయక్షేత్రంలో ఇళ్లు కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు అవార్డు అందుకున్న వారందరికీ పునరావాసం కింద మూడు వందల గజాల స్థలం, వారి అవసరాలకు ప్రైమరీ హెల్త్ సెంటర్, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రా లు, వెటర్నరీ హాస్పిటల్, కమ్యూనిటీ హాల్స్, పార్కులను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ వాటర్ పైపు లైన్లు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి మాట్లాడుతూ ప్రభు త్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు కొందరు అడ్డుపడుతున్నారని, భూమి కోల్పోయిన వారికి అపోహలు, భయాన్ని కలగజేస్తున్నారని, ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు. ఉదండాపూర్ రిజర్వాయర్లో భూమి కోల్పోయిన వారికి ఎక్కువ మొత్తంలో నష్టపరిహారం అందేలా చూడాలని అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించినట్లు తెలిపారు. ఆర్అండ్ఆర్ విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే ఆర్డీఓ దృష్టికి తీసుకురావాలన్నారు. సమావేశంలో స్పెషల్ కలెక్టర్ మధుసూదన్నాయక్, ఆర్డీఓ నవీన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
సాగునీరు, పర్యాటక రంగం..
అచ్చంపేట నియోజకవర్గానికి సాగునీరు తేవడంపైనే ప్రధానంగా అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తా. ఉన్నత విద్యపై దృష్టిపెడతాం. ఈ ప్రాంతంలో 3.50 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టుల నిర్మాణం, ఇప్పటికే మంజూరైన అమ్రాబాద్ లిఫ్టుల ఏర్పాటు త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతాను. సీఎం సహకారంతో నల్లమల ప్రాంతాన్ని మరో కోనసీమగా మార్చడమే నా లక్ష్యం. నల్లమలలోని వనరుల ద్వారా ఉపాధి అవకాశాలు, పరిశ్రమలు, పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై గళం వినిపిస్తాను. – వంశీకృష్ణ, ఎమ్మెల్యే, అచ్చంపేట -
‘ఇంటర్’ వాల్యూయేషన్ ప్రారంభం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ పరీక్షల జవాబు పత్రాల వాల్యూయేషన్ను అధికారులు మంగళవారం ప్రారంభించారు. జిల్లాకేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాలలో వాల్యూయేషన్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి 20 వేలకు పైగా సంస్కృతం సబ్జెక్టుకు సంబంధించిన జవాబుపత్రాలు క్యాంప్నకు చేరాయి. తెలుగు, ఇంగ్లిష్ సబ్జెక్టులకు సంబంధించిన జవాబుపత్రాలు ఒకట్రెండు రోజుల్లో రానున్నాయి. వీటికి అధికారులు కోడింగ్ ప్రక్రియ చేపట్టారు. మొత్తంగా అన్ని సబ్జెక్టులకు సంబంధించి రెండు లక్షలకు పైగా జవాబు పత్రాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులను క్యాంప్నకు రావాలని ఆదేశించారు. మొత్తంగా రెండు వారాల్లో వాల్యూయేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 11,690 మంది హాజరు జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు మ్యాథ్స్–1 ఏ, బోటనీ–1, పొలిటికల్ సైన్స్–1 పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా జరిగాయి. ఈ మేరకు మొత్తం 36 పరీక్ష కేంద్రాల్లో 11,690 మంది విద్యార్థులు హాజరయ్యారు. మరో 326 మంది గైర్హాజరయ్యారు. పలు కేంద్రాల్లో సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులతో పాటు ఇంటర్ బోర్డు అధికారులు పరిశీలించారు. కాగా.. మంగళవారం జరిగిన పరీక్షలో కూడా తప్పులు వచ్చినట్లు పలువురు విద్యార్థులు పేర్కొన్నారు. -
అనుమానాస్పదంగా వృద్ధురాలి మృతి
గద్వాల క్రైం: అనుమానాస్పదంగా వృద్ధురాలు మృతి చెందిన ఘటన గద్వాలలో చోటుచేసుకున్నట్లు పట్టణ ఎస్ఐ కల్యాణ్కుమార్ తెలిపారు. వివరాలు.. మోమిన్ మహాల్ల కాలనీకి చెందిన చిన్నమ్మ(85) కొన్ని రోజుల క్రితం కిందపడి తీవ్ర అనారోగ్యానికి గురైంది. కుటుంబ సభ్యులు ఉన్నా ఆమె బాగోగులను పట్టించుకునే వారు కాదు. రాఘవేంద్ర కాలనీలోని అనాథశ్రమంలో ఉండేది. వారం రోజుల క్రితం వృద్ధురాలిని కుమారులు జలదుర్గం రమేష్, రాజు మోమిన్ మహాల్లలోని స్వంత ఇంట్లో(పాడుబడ్డ)కి తీసుకొచ్చారు. ఆమెకు వంతులవారీగా ఆహారం అందించేవారు. అయితే సోమవారం రాత్రి కుటుంబ సభ్యులు వృద్ధురాలికి ఆహారం అందించి చీకటి గది కావడంతో వెలుతురు కోసం కొవ్వొత్తిని వెలిగించి మంచం సమీపంలో పెట్టి వెళ్లారు. ఆమె నిద్రించే క్రమంంలో కొవ్వొత్తికి దుప్పటి తగిలి మంటలు వ్యాపించి ఉండొచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. అయితే స్థానికులు మాత్రం ఆమెను కుటుంబ సభ్యులే హత్య చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. ఘటనాస్థలికి గద్వాల సీఐ శ్రీను చేరుకొని పరిశీలించారు. కేసు విచారణలో నిజనిజాలు నిర్ధారణ అవుతాయని ఆయన వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుమారుడు రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. రైలు నుంచి పడి వ్యక్తి.. ఆత్మకూర్: ప్రమాదవశాత్తు రైలులో నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మంగళవారం వెలుగు చూసింది. రైల్వే హెడ్కానిస్టేబుల్ అశోక్ కథనం మేరకు.. సోమవారం అర్ధరాత్రి మండల పరిధిలోని శ్రీరాంనగర్ రైల్వేస్టేషన్ – గద్వాల రైల్వేస్టేషన్ మధ్య 184వ కిలోమీటరు వద్ద పట్టాలపై 45 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు సమాచారం అందింది. మంగళవారం ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు వివరించారు. మరిన్ని వివరాలకు సెల్నంబర్లు 87126 58608, 83412 52529 సంప్రదించాలని సూచించారు. బావిలో పడి.. శాంతినగర్: ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన వడ్డేపల్లి పుర పరిధిలోని శాంతినగర్ జములమ్మ ఆలయ సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. బంధువులు జములమ్మ దేవర చేస్తున్నారని కలుకుంట్లకు చెందిన మద్దిలేటి (36) ఆలయానికి వచ్చి వెనక ఉన్న బావిలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. బంధువుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు శాంతినగర్ పోలీసులు వివరించారు. లారీ బోల్తా.. తప్పిన ప్రమాదం తాడూరు: మండల కేంద్రానికి సమీపంలోని మల్కాపూర్ గేట్ కాజ్వే బ్రిడ్జి వద్ద మంగళవారం సాయంత్రం కోళ్ల ఎరువుతో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం వాటిల్లలేదు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. మామిడితోట దగ్ధం రాజాపూర్: మండలంలోని రాయపల్లికి చెందిన మహిళా రైతు మాధవి మామిడితోట సోమవారం రాత్రి అగ్నికి ఆహుతైంది. గ్రామస్తుల కథనం మేరకు.. పోలేపల్లి శివారులోని పరిశ్రమల నుంచి వెలువడే పొగతో పాటు నిప్పు రవ్వలు వచ్చి రైతు పొలంలో పడి ఎండిన గడ్డి అంటుకొని మంటలు వ్యాపించి మామిడి తోట కాలిపోయిందన్నారు. రైతులను నష్టపరుస్తున్న పరిశ్రమలపై అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జడ్చర్లలో పశుగ్రాసం.. జడ్చర్ల: పట్టణంలోని శ్రీనివాసనగర్లో కౌలు రైతు సంజీవ్ నిల్వ చేసిన పశుగ్రాసం ప్రమాదవశాత్తు నిప్పంటుకొని కాలి బూడిదైంది. వరి గడ్డివాము నుంచి మంగళవారం ఒక్కసారిగా పొగలు రావడంతో రైతు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేసి పొక్లెయిన్తో చెల్లాచెదురు చేసినా ఫలితం లేకపోయింది. సుమారు రూ.2 లక్షల నష్టం వాటిల్లిందని.. ప్రభుత్వపరంగా సాయం అందించి ఆదుకోవాలని బాధితుడు విజ్ఞప్తి చేశారు. -
ముమ్మరంగా సహాయక చర్యలు
అచ్చంపేట/మన్ననూర్: ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరుగుతున్న సహాయక చర్యలకు రోబోలను ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు మంగళవారం ఉదయం హైదరాబాద్కు చెందిన అన్వి రోబోటిక్స్ సంస్థకు చెందిన ఏఐ బేస్డ్ కెమెరా సదుపాయం గల రోబోటిక్లను తీసుకెళ్లారు. సంస్థ ప్రతినిధులు విజయ్, అక్షయ్ లోకో ట్రైన్లో సొరంగంలోకి వాటిని తీసుకెళ్లారు. అన్వి రోబోటిక్ సంస్థకు చెందిన ప్రతినిధులు టన్నెల్ దగ్గర ఆఫీసులో కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాట్లను ప్రారంభించారు. ప్రమాద ప్రదేశంలో చేపట్టే సహాయక చర్యల్లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకుండా రోబోలను ఉపయోగించుకుంటున్నట్లు డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్ తెలిపారు. సహాయక చర్యల్లో కావాల్సిన సామగ్రితోపాటు సహాయక బృందాలు మరోమారు కాడవర్ డాగ్స్ ప్రమాద ప్రదేశానికి వెళ్లాయని తెలిపారు. సమావేశంలో ప్రస్తుత సహాయక చర్యల పురోగతిని సమీక్షించి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. టన్నెల్ సహాయక చర్యలలో అనుసరించాల్సిన విధివిధానాలు, రోబోటిక్స్, మెకానికల్ పరికరాల వినియోగం, మట్టి తొలగింపు ప్రక్రియ, భద్రతా చర్యలపై విస్తృతంగా చర్చించిన అధికారులు సహాయక చర్యలను మరింత వేగవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు వివరించారు. సమావేశంలో కలెక్టర్ బదావత్ సంతోష్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అన్వి రోబోటిక్స్, హైడ్రా, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ర్యాట్ మైనర్స్, దక్షిణ మధ్య రైల్వే తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లోకి రోబోటిక్ సంస్థ ప్రతినిధులు కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాట్లు -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
నవాబుపేట: బైక్ అదుపు తప్పి కింద పడి తీవ్ర గాయాలపాలైన వ్యక్తి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు. గత నెల 27న పత్తేపూర్కి చెందిన కమ్మరి శ్రీనివాస్చారి(40) అనే వ్యక్తి బైక్పై జిల్లా కేంద్రానికి వెళ్లాడు. పని ముగించుకొని తిరిగి ఇంటికి వస్తుండగా కాకర్లపహాడ్ సమీపంలో బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. తీవ్రగాయాలు కావటంతో స్థానికులు 108 వాహనంలో జిల్లా ఆస్పత్రిలో చేర్పించి కుటుంబీకులకు సమాచారం అందించారు. వారు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. మృతుడి సోదరుడు కమ్మరి రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కొప్పునూరులో మరొకరు.. చిన్నంబావి: పురుగుమందు తాగి చికిత్స పొందుతూ కోలుకోలేక ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని కొప్పునూరులో చోటుచేసుకున్నట్లు ఎస్ఐ జగన్మోహన్ తెలిపారు. వివరాలు.. కొప్పనూరుకి చెందిన బంకుమిది నరసింహారెడ్డి (56) అనారోగ్య సమస్యలతో సోమవారం పురుగుమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కొల్లపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నాగర్ కర్నూలు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడి భార్య అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. బైక్పై నుంచి కిందపడి.. చిన్నచింతకుంట: మోటార్ సైకిల్ అదుపు తప్పి కిందపడి గాయాలపాలై చికిత్స పొందుతూ ఓ వ్యక్తి చెందినట్లు ఎస్ఐ రామ్లాల్నాయక్ తెలిపారు. వివరాలు.. మండలంలోని లక్ష్మీదేవ్పూర్కి చెందిన పల్లె పాగు ఆనందం(50) ఈ నెల 7న తన బైక్పై చిన్నచింతకుంటకు వచ్చాడు. కూరగాయలు తీసుకొని గ్రామానికి తిరుగు ప్రయాణం అయ్యాడు. మార్గమధ్యలో బైక్ అదుపు తప్పి కిందపడగా ఆనందంకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆత్మకూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మహబూబ్నగర్ ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మంగళవారం మృతి చెందాడు. మృతుడి తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
ప్రధాన సమస్యలపై దృష్టి
అలంపూర్ రైతులు ప్రధానంగా సాగునీటిని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల ద్వారా పూర్తిస్థాయిలో సాగునీరు అందించడానికి మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తి చేయాలి. అలాగే వంద పడకల ఆస్పత్రిని నిర్మించి ప్రారంభించినా.. ప్రస్తుతం వైద్య సేవలు అందించడం లేదు. దీంతో వైద్యం కోసం ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. అలాగే అసంపూర్తిగా ఉన్న రోడ్ల పనులు పూర్తి చేయాలని, అధ్వానంగా ఉన్న రోడ్ల ఆధునీకరణ అంశాలను అసెంబ్లీలో ప్రస్తావిస్తాను. – విజయుడు, ఎమ్మెల్యే, అలంపూర్ సాగునీరు, విద్య, వైద్యం గద్వాల నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టు గుడ్డెందొడ్డి జలాశయం సామర్థ్యం పెంపు, ర్యాలంపాడు మరమ్మతుతోపాటు జలాశయం పెంపుపై కూడా ప్రధానంగా ప్రస్తావిస్తాను. అదేవిధంగా మెడికల్ కాలేజీలో స్టాఫ్ నియామకం, జిల్లా ఆస్పత్రిని 500 బెడ్లకు పెంచాలని కోరుతాను. ఇదివరకే దీనిపై పలుమార్లు సీఎం, సంబంధిత మంత్రులు, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు వ్యక్తిగతంగా లేఖలు రాశాను. అసెంబ్లీ సమావేశాల్లో వీటిపైనే మరోసారి ప్రస్తావించి ప్రభుత్వ సాయంతో వీటిని సాధించేలా కృషి చేస్తాను. – బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ఎమ్మెల్యే, గద్వాల -
గళం విప్పుతాం.. నిధులు రాబడతాం
పరిశ్రమల ఏర్పాటు కోసం పేట నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించవచ్చు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణం, నియోజకవర్గంలో ప్రైవేట్ అద్దె భవనాల్లో కొనసాగుతున్న డిగ్రీ, జూనియర్ ప్రభుత్వ కళాశాలలకు సొంత భవనాలకు నిధులు కావాలని, ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా ప్రాజెక్టుల రూపకల్పన చేయాలని కోరుతాను. – చిట్టెం పర్ణికారెడ్డి, ఎమ్మెల్యే, నారాయణపేట ముంపు గ్రామాలపై.. మక్తల్ నియోజవర్గంలో ఏళ్ల తరబడిగా ముంపు గ్రామాల ప్రజల సమస్యలు తీరడం లేదు. ఈ సమస్యలను తీర్చాలని అసెంబ్లీలో చర్చిస్తా. జూరాల బ్యాక్ వాటర్లో ముంపునకు గురైన అనుగొండ, గడ్డంపల్లి, దాదాన్పల్లి, అంకేన్పల్లి గ్రామాలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. సంగంబండ, భూత్పుర్ రిజర్వాయర్ కింద ముంపునకు గురైన ఉజ్జెల్లి, గార్లపల్లి, నేరడుగం, భూత్పుర్లో ఊట నీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అసెంబ్లీలో చర్చించి శాశ్వత పరిష్కారానికి కృషిచేస్తా. – వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే, మక్తల్అసెంబ్లీ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో నెలకొన్న దీర్ఘకాల సమస్యలు, ప్రాజెక్టుల నిర్మాణాలు, సాగునీటి సరఫరా, నిర్వాసితుల నష్టపరిహారం, రోడ్ల విస్తరణ, విద్యాసంస్థలు, పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పన తదితర వాటిపై తమ గళం వినిపించి పరిష్కారానికి కృషిచేస్తామని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం నిర్వహించేది బడ్జెట్ సమావేశాలు కావడంతో అధికంగా నిధులు మంజూరుకు కృషిచేస్తామని పేర్కొన్నారు. – సాక్షి నెట్వర్క్ -
నిధుల కేటాయింపు..
అసెంబ్లీ సమావేశాల్లో విద్య, వైద్యం, ఉపాధి కల్పనపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా. నూతనంగా ఏర్పడిన మహబూబ్నగర్ కార్పొరేషన్కు ప్రత్యేక నిధుల కేటాయింపు, ఏదైనా ఉన్నత విద్యా సంస్థ మంజూరు, విద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పన, జిల్లాలో పరిశ్రమలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటు, ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం, పెద్ద గ్రామాల్లో హెల్త్సెంటర్ల ఏర్పాటు గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. – యెన్నం శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే, మహబూబ్నగర్ -
‘కల్వకుర్తి’ని పూర్తి చేయడమే ధ్యేయం
నియోజకవర్గ రైతులకు వరప్రదాయిని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం. ఈ ప్రాజెక్టు ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని, డిస్ట్రిబ్యూటరీ కాల్వలు పూర్తి చేయాలని శాసనసభలో ప్రభుత్వాన్ని కోరుతాను. దీంతోపాటు విద్య, వైద్యం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయించడంతోపాటు.. మంజూరైన పనులకు టెండర్లు వేయాలని ప్రభుత్వాన్ని కోరుతా. అలాగే ఇప్పటికే మంజూరైన రోడ్ల నిర్మాణం వెంటనే చేపట్టాలని సభ దృష్టికి తీసుకెళ్తాను. – కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే, కల్వకుర్తి -
గొల్లపల్లి రిజర్వాయర్ప్రతిపాదనలపై..
నియోజకవర్గంలో మరో పదివేల ఎకరాలకు సాగునీరందించేందుకు రేవల్లి మండలం గొల్లపల్లి వద్ద నూతనంగా మినీ రిజర్వాయర్ నిర్మాణం కోసం ప్రతిపాదనను ప్రభుత్వానికి అందజేశాం. ఈ అంశంపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా. ఇప్పటికే కేఎల్ఐ, భీమా, జూరాల సాగునీటి కాల్వలతో చాలా మేరకు సాగునీరు అందుతుంది. ప్రభుత్వం, ఫారెస్ట్ అధికారుల నుంచి అనుమతులు లభిస్తే గొల్లపల్లి రిజర్వాయర్ పనులు వేగంగా పూర్తిచేస్తాం. రింగ్ రోడ్డు, సాగునీటి కాల్వల పనులు పెండింగ్లో ఉన్నాయి. దరఖాస్తు చేసుకున్న 2,713 మంది రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని విన్నవిస్తాం. – తూడి మేఘారెడ్డి, ఎమ్మెల్యే, వనపర్తి -
కంపుకొడుతున్న కాలనీలు
డ్రెయినేజీలు అస్తవ్యస్తం ● దోమలు, ఈగలకు ఆవాసంగామురుగు కాల్వలు ● వివిధ డివిజన్లలో దుర్వాసనతో ప్రజల నరకయాతన ● ముక్కు మూసుకుని వెళ్తున్న వైనం ● పట్టించుకోని మున్సిపల్ అధికారులు మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలో చాలా చోట్ల డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఇన్నాళ్లు స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న మహబూబ్నగర్ కాస్తా ఇటీవల కార్పొరేషన్గా మారింది. స్థాయి పెరిగినా కొత్తగా ఎలాంటి నిధులు కేటాయించకపోవడంతో నగర పరిధిలోని 49 డివిజన్లలో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయి. వాస్తవానికి మున్సిపల్ పాలకవర్గం పదవీకాలం గత జనవరి 26న ముగిసి ప్రత్యేక అధికారి పాలనలోకి వచ్చినా ఎలాంటి ప్రయోజనం దక్కడం లేదు. ముఖ్యంగా మురుగుకాల్వలు కంపు కొడుతున్నాయి. ఏ వీధి చూసినా చిన్న, చిన్న కాల్వలతో మురుగు పేరుకుపోయి పరిసరాలు అపరిశుభ్రంగా తయారవుతున్నాయి. మర్లు, శాంతినగర్, విఘ్నేశ్వరకాలనీ తదితర ప్రాంతాల్లో అన్నీ చిన్న గల్లీలే ఉన్నాయి. చాలాచోట్ల డ్రెయినేజీలు కనిపించవు. ఎవరికి వారు ఇళ్ల యజమానులు మురుగు కాల్వలు తాత్కాలికంగా నిర్మించినవే ఉన్నాయి. దీంతో దుర్గంధం మధ్య సహవాసం చేస్తున్నామని స్థానికులు వాపోతున్నారు. 13 ఏళ్ల క్రితం మున్సిపాలిటీలో కలిసిన అప్పన్నపల్లి, ఎనుగొండ, ఎదిర, పాలకొండ, క్రిష్టియన్పల్లి, బండమీదిపల్లి, చిన్నదర్పల్లి, బోయపల్లి, దొడ్డలోనిపల్లి, తిమ్మసానిపల్లితో పాటు ఇటీవల కార్పొరేషన్లో విలీనమైన జైనల్లీపూర్, దివిటిపల్లిలో పరిస్థితి దారుణంగా ఉంది. ఆయా గ్రామాలలో డ్రెయినేజీలు ఎక్కడా సరిగా లేవు. ఎక్కడికక్కడ రోడ్లపై మురుగు పారుతుండటంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇన్నేళ్లయినా మున్సిపల్ అధికారులు డ్రెయినేజీ నిర్మాణం గురించి పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మంగళవారం పలు డివిజన్లను ‘సాక్షి’ పరిశీలించగా ఈ విషయాలు వెలుగు చూశాయి. ఎవరూ పట్టించుకోరు.. మా ప్రాంతంలో ఇళ్ల మధ్య నుంచి ప్రవహిస్తున్న పెద్ద కాల్వతో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నెలకోసారి మాత్రమే అందులోని చెత్తను పారిశుద్ధ్య కార్మికులు తొలగిస్తున్నారు. డ్రెయినేజీ నిర్మించాలని మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఉపయోగం దక్కలేదు. ఎస్సీ కమ్యూనిటీ హాలు మొదలుకుని రైసా మసీదు వరకు అటు, ఇటు మోరీలు నిర్మించకపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. దోమలు, ఈగల సైర విహారంతో తరచూ రోగాల బారిన పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. – కౌకుంట్ల మహేష్, పాతపాలమూరు మురుగుతో దుర్గంధం మా ఇంటి ముందున్న చౌరస్తాలో మురుగు ఏరులైపారుతోంది. గట్టు ప్రాంతంలో నివసిస్తున్న ఇళ్లవారు కిందికి అలాగే మురుగును బయటకు వదిలేస్తున్నారు. డ్రెయినేజీ నిర్మించాలని ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఉపయోగం లేదు. అప్పట్లో మున్సిపల్ కమిషనర్, ఇంజినీరింగ్ అధికారులు వచ్చి చూసి పోయారు. ఎగువ నుంచి దిగువకు కొంత దూరం సీసీరోడ్డును తొలగించి అండర్గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మిస్తే సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుంది. – వారాల కృష్ణ, కృష్ణ టెంపుల్చౌరస్తా, పద్మావతికాలనీ ● -
ఎల్ఆర్ఎస్ఎంతవరకు వచ్చింది?
● ఆర్పీలతో ఆరా తీసిన స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ● మున్సిపల్ కార్యాలయంలో మరో హెల్ప్లైన్ సెంటర్ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ‘జిల్లా కేంద్రంలో ఎల్ఆర్ఎస్ ఎంతవరకు వచ్చింది.. నిత్యం దరఖాస్తుదారులకు ఫోన్లు చేస్తున్నారా? లేదా?.. వారి నుంచి సరైన స్పందన ఎందుకు రావడం లేదు’ అని ఆర్పీలతో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్ ఆరా తీశారు. మంగళవారం మహబూబ్నగర్ మున్సిపల్ కార్యాలయ ఆవరణ లోని మెప్మా భవనంలో ఆర్పీలతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెలాఖరు వరకే ఎల్ఆర్ఎస్కు గడువు ఉందన్నారు. వీలైనంత వరకు ఎక్కువ మంది దరఖాస్తుదారులతో ఫోన్లో మాట్లాడి అవగాహన కల్పించి పూర్తి ఫీజు చెల్లించేలా చూడాలన్నారు. కేవలం 20 రోజులే మిగిలిందని, 25 శాతం రాయితీ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాగా, సమావేశానికి ఆలస్యంగా హాజరైన ఆర్పీలనుద్దేశించి విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఇక దరఖాస్తుదారులకు సంబంధించిన నమోదు రికార్డుల తనిఖీతో పాటు ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేశారా? లేదా? అని ర్యాండమ్గా కొందరి ఫోన్లలో వివరాలు పరిశీలించారు. అనంతరం టౌన్ ప్లానింగ్ విభాగం, పౌరసేవా కేంద్రాన్ని పరిశీలించి ఎల్ఆర్ఎస్పై సిబ్బందికి తగు సూచనలిచ్చారు. అలాగే రూంనం.2లో మరో హెల్ప్లైన్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డిని ఆదేశించారు. కార్యక్రమంలో మెప్మా ఇన్చార్జ్ డీఎంసీ ఎం.లక్ష్మి, సీఓలు వరలక్ష్మి, నిర్మల, దేవమ్మ, ఆంజనేయులు, టీపీఎస్ విశాల్కుమార్, సీనియర్ అటౌంటెంట్ ఇందిర తదితరులు పాల్గొన్నారు. వేరుశనగ క్వింటాల్ రూ.7,061 జడ్చర్ల: బాదేపల్లి మార్కెట్లో మంగళవారం వేరుశనగకు క్వింటాల్ గరిష్టంగా రూ.7,061, కనిష్టంగా రూ.5,649 ధరలు లభించాయి. అదేవిధంగా కందులు గరిష్టంగా రూ.6,930, కనిష్టంగా రూ.4,656, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,337, కనిష్టంగా రూ.2,051, ఆముదాలు రూ.5,873, రాగులు రూ.4,211, మినుములు రూ.7,117, పొద్దుతిరుగుడు రూ.4,316 పలికాయి. -
పీయూలో 27, 28 తేదీల్లో వర్క్షాప్
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో ఈ నెల 27, 28 తేదీల్లో ఎంబీఏ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రీసెర్చ్ మెథడాలజీ, ప్రాజెక్టుపై రాష్ట్రస్థాయి వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. అందుకు సంబంధించిన బ్రోచర్ను ఆయన మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఎంబీఏ చివరి సంవత్సరం విద్యార్థులకు ఈ వర్క్షాప్ ఎంతో ఉపయోగకరం అని, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ చెన్నప్ప, ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి, కన్వీనర్ అర్జున్కుమార్, కో కన్వీనర్ నాగసుధ, జావిద్ఖాన్, అరుంధతి, గాలెన్న తదితరులు పాల్గొన్నారు. 31 లోగా చెల్లించి రాయితీ పొందండి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న ప్లాట్ యజమానులు మార్చి 31లోగా క్రమబద్ధీకరణ రుసుం చెల్లిస్తే ప్రభుత్వం 25 శాతం రాయితీ కల్పించినట్లు కలెక్టర్ విజయేందిర మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎల్ఆర్ఎస్కు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే కలెక్టరేట్ టోల్ ఫ్రీ నంబర్ 08542–241165, మహబూబ్నగర్ నగర పాలక సంస్థలో హెల్ప్లైన్ నంబర్ 7093911352ను సంప్రదించవచ్చని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సమాచారం పొందవచ్చని ప్లాటు యజమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. 2020 ఆగస్టు 26 నాటికి లేఔట్లో 10 శాతం ప్లాట్లు రిజిస్టర్ అయితే మిగిలిన వాటికి కూడా ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్ధీకరణ అవకాశం కల్పించినట్లు తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ ద్వారా నిర్ణీత నమూనాలో నూతన దరఖాస్తులు స్వీకరించి ఎల్ఆర్ఎస్ కోసం మున్సిపల్ శాఖకు వివరాలు పంపించి క్రమబద్ధీకరిస్తారని పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణాను అరికట్టాలి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): సమాజంలో జరుగుతున్న మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని డీఆర్డీఓ నర్సిములు అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా మహిళా సమాఖ్య భవనంలో మానవ అక్రమ రవాణా నివారణపై ఏపీఎంలు, సీసీలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా, శ్రమ దోపిడీ, లైంగిక దోపిడీపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. పని ఉందని మాయమాటలు చెప్పి నిర్మానుష ప్రదేశాలకు తీసుకుపోయి లైంగికదాడికి గురిచేస్తే వారి నుంచి జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎవరిపైనా అనుమానాలు వస్తే వెంటనే పోలీసులకు 100 నంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. శిక్షణ పొందిన ఏపీఎంలు సీసీలు స్థానికంగా ఉంటే వీఓలకు అవగాహన కల్పిస్తారని కోరారు. కార్యక్రమంలో డీపీఎం ఆలూరి చెన్నయ్య టీఓటీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్ల ఖరారు తర్వాతే ఫలితాలివ్వాలి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించి, వాటిని ఖరారు చేసే వరకు గ్రూప్–1, 2, 3 ఫలితాలను ప్రకటించవద్దని ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కార్తీక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పీయూ మెయిన్ గేట్ వద్ద మంగళవారం చేపట్టిన రిలే నిరాహార దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వంలో ఉన్న కొంత మంది స్వార్థపరుల ఒత్తిడి మేరకు మాదిగ విద్యార్థుల భవిష్యత్ను దెబ్బతీయాలన్న కుట్రతో ముందస్తుగా గ్రూప్స్ ఫలితాలను విడుదల చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణలో ఏబీసీడీ వర్గీకరణ అనంతరం మాత్రమే ఫలితాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెడతామని ప్రభుత్వం చెబుతూనే ఫలితాల విడుదలకు కసరత్తు చేయడం బాధాకరమని, రిజర్వేషన్ల బిల్లు పెట్టి వర్గీకరణ చేసే వరకు నిరసన చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో ఎంఎస్పీ అధ్యక్షుడు టైగర్ అంజయ్య, వీరస్వామి, జేఏసీ చైర్మన్ రాము, దాసు, శ్రీను, రవితేజ, రాము, నాగేందర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
SLBC Tunnel: టన్నెల్లోకి ప్రవేశించిన రోబోలు
సాక్షి, నాగర్కర్నూల్/మహబూబ్నగర్: ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ 18వ రోజు కొనసాగుతోంది. సహాయ చర్యల్లోకి రోబోలతో పాటు వాటి బృందాలు అనుమానిత ప్రాంతాల్లో విస్తృతంగా తవ్వకాలు కొనసాగుతున్నాయి. నేడు ఒకటో, రెండో మృతదేహాలు బయటపడే అవకాశం ఉంది. మంగళవారం ఉదయం అన్వి రోబో బృందంతో పాటు మొదటి షిప్ట్లో 110 మంది ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లోకో ట్రైన్లో బృందాలు టన్నెల్ లోపలికి వెళ్లాయి. టన్నెల్ నుంచి ఇప్పటికే ఒక మృతదేహాన్ని వెలికితీశారు. మిగిలిన ఏడుగురి కోసం గాలింపు కొనసాగుతోంది. మినీ జేసీబీలతో శిథిలాలను తొలగిస్తున్నారు.ఇప్పటికే 14 బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటుండగా.. సింగరేణి కారి్మకులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. సొరంగం లోపల చిక్కుకున్న వారిని గుర్తించేందుకు కేరళ రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా వచ్చిన కాడవర్ డాగ్స్ తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. జీపీఆర్, కాడవర్ డాగ్స్ చూయించిన ప్రదేశంలోనే ప్రధానంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. ఆదివారం రాబిన్స్ కంపెనీలో టీబీఎం ఆపరేటర్గా పనిచేస్తున్న గురుప్రీత్సింగ్ మృతదేహం లభించింది. దీంతో మిగతా 7 మంది కోసం సహాయక బృందాలు అన్వేషణను ముమ్మరం చేశాయి. టీబీఎం విడి భాగాలను తొలగిస్తూనే ఆ ఏడు మంది కోసం సొరంగంలో గాలిస్తున్నారు. స్థానిక యంత్రాంగం గంటగంటకూ సొరంగంలో జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తున్నారు.ఎస్ఎల్బీసీ సొరంగంలో 13.850 కి.మీ. వద్ద ప్రమాదం చోటుచేసుకోగా, అక్కడి చేరుకుని సహాయక చర్యలు చేపట్టడమే రెస్క్యూ బృందాలకు ప్రతిరోజు క్లిష్టతరమవుతోంది. సొరంగంలో 13 కి.మీ. లోపల రెస్క్యూ నిర్వహించే సిబ్బందికి సైతం ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. 16 రోజుల పాటు నిరంతరం శ్రమించిన రెస్క్యూ బృందాలకు ఆదివారం ఒక కారి్మకుడి మృతదేహం లభ్యమైంది. సమీపంలో గాలిస్తున్నా మిగతా వారి ఆచూకీ లభించడం లేదు. సోమవారం రెస్క్యూ బృందాలతో కలసి సొరంగంలోని ప్రమాదస్థలం వద్దకు ‘సాక్షి’ వెళ్లి పరిశీలించింది.సొరంగం ఇన్లెట్ నుంచి 13.850 కి.మీ. దూరంలో ఉన్న ప్రమాదస్థలం వద్దకు రెస్క్యూ బృందాలు చేరుకునేందుకే కనీసం 1.45 గంటలు పడుతోంది. లోకోట్రైన్ ద్వారా రాకపోకలకే కనీసం 3›–4 గంటలు పడుతోంది. ఒక్కో షిఫ్టులో సహాయక బృందాలు 12 గంటల పాటు పనిచేస్తున్నారు. సొరంగంలో 12 కి.మీ. వద్దకు చేరుకున్నాక సీపేజీ నీరు, బురద వస్తోంది. 13.200 కి.మీ. పాయింట్ వరకూ లోకో ట్రైన్ వెళ్లగలుగుతోంది. లోకో ట్రైన్ ట్రాక్ తర్వాత రెండు ఎస్కవేటర్లు మట్టి, శిథిలాలను తొలగిస్తున్నాయి.13.400 వద్ద టీబీఎం భాగాలు టన్నెల్ నిండా చిక్కుకుని ఉండగా, సహాయక బృందాలు లోపలికి వెళ్లేందుకు వీలుగా కుడివైపు నుంచి మిషిన్ భాగాలను కట్చేసి దారిని ఏర్పాటుచేశారు. అక్కడి నుంచి ప్రమాదస్థలం 13.850 వరకూ కాలినడకన బురద, శిథిలాల మధ్య జాగ్రత్తలు పాటిస్తూ చేరుకోవాల్సి ఉంటుంది. సొరంగానికి కుడివైపున కన్వేయర్ బెల్టు అందుబాటులోకి తీసుకురాగలిగారు. సుమారు 150 మీటర్ల విస్తీర్ణంలో 15 ఫీట్ల ఎత్తులో టన్నెల్ నిండా మట్టి, బురద పేరుకుని ఉండటంతో వాటిని తొలగించేందుకు రోజులు పట్టే అవకాశం ఉంది. దీంతో కడావర్ డాగ్స్ సూచించిన ప్రాంతాల్లోనే తవ్వకాలను జరిపి కార్మికుల జాడ కోసం అన్వేషణ చేపడుతున్నారు.సొరంగంలో చిక్కుకున్న 8 మందిలో గురుప్రీత్సింగ్ మృతదేహం లభ్యమైన ప్రదేశంలో పక్కనే ఆదివారం, సోమవారం సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కేరళ నుంచి వచ్చిన కడావర్ డాగ్స్, జీపీఆర్ సిస్టం ద్వారా గుర్తించిన డీ1, డీ2 లొకేషన్లలో సింగరేణి కార్మికులు, ర్యాట్ హోల్ మైనర్లు, ఇతర సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సోమవారం పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ సహాయక బృందాలకు దిశానిర్దేశం చేస్తూ డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్ పలు సూచనలు చేశారు. మంగళవారం సొరంగం వద్ద సహాయక చర్యల్లో భాగంగా రోబోలు రంగంలోకి దిగనున్నాయి. హైదరాబాద్కు చెందిన అన్వి రోబో నిపుణులు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించనున్నారు. -
సెర్ప్లో.. మెప్మా విలీనం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): పట్టణ ప్రాంతాల్లో పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకుల్లో రుణాలు ఇప్పించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న మెప్మా.. ఇక నుంచి డీఆర్డీఏలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో విలీనం కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేయడంతో పాటు ఇటీవల నిర్వహించిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి నిర్ణయం వెలువడగానే జిల్లాలోని మహబూబ్నగర్, భూత్పూర్, జడ్చర్ల, దేవరకద్ర మున్సిపాలిటీల్లోని మెప్మా ఉద్యోగులు, సిబ్బందితో పాటు జిల్లాకేంద్రంలోని మెప్మా జిల్లా కార్యాలయం ఉద్యోగులు అందరూ సెర్ప్ పరిధిలోకి వెళ్లనున్నారు. పట్టణాల్లో సర్వేలకు ఇబ్బందే.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు, ఇతరత్రా పనులను క్షేత్రస్థాయిలో మెప్మా ఆర్పీలు సీఓలు సర్వే చేస్తుంటారు. మెప్మా ఆర్పీలకు కాలనీల్లో ఉండే వివరాలు తేలికగా తెలిసే అవకాశం ఉంటుందని.. ప్రతి సర్వేకు వారి సేవలను వినియోగించుకున్నారు. ఇక నుంచి వారు ఇతర శాఖ పరిధిలోకి వెళ్తే.. మున్సిపాలిటీ సేవలకు వారు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ప్రభుత్వం చేపట్టే సర్వే చేయాలంటే ఇక నుంచి మున్సిపల్ యంత్రాంగానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మర్గదర్శకాలు రాలేదు.. డీఆర్డీఏలో మెప్మాను విలీనం చేస్తున్నట్లు ప్రభుత్వం నుంచి ఇప్పటి దాక మాకు ఎలాంటి మర్గదర్శకాలు రాలేదు. ప్రభుత్వం నుంచి వచ్చే మార్గ దర్శకాల మేరకు నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతానికి డీఆర్డీఏ, మెప్మాలు వేరువేరుగా విదులు నిర్వహిస్తున్నాయి. – నర్సిములు, డీఆర్డీఏ ఒకే గొడుగు కిందికి రానున్న మహిళా సంఘాలు డీఆర్డీఏ పరిధిలోకి రిసోర్స్పర్సన్లు ప్రతిపాదనలు రూపొందించిన ప్రభుత్వం -
మిగిలింది 20 రోజులే..
నారాయణపేట: మున్సిపాలిటీల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులతోపాటు ఆస్తి పన్నుల రాబడితో పట్టణాల్లో ప్రగతి పరుగులు పెడుతుంది. మున్సిపాలిటీల్లోని నివాసగృహాలు, వాణిజ్య సముదాయ భవనాలకు 2024– 25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆస్తిపన్ను వసూలుపై మున్సిపల్ అధికార యంత్రాంగం డిజిటల్ చెల్లింపు (టెక్నాలజీ)లపై దృష్టిసారించింది. క్యూఆర్ కోడ్ స్కాన్, డెబిట్, క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, వాట్సప్ నంబర్, ఏటీఎం ద్వారా నేరుగా ఆయా మున్సిపాలిటీ ఖాతాల్లో జమ చేయవచ్చని చెబుతోంది. అయితే ప్రభుత్వం చేపట్టిన సర్వేలతోనే మున్సిపాలిటీల్లో పన్నుల వసూళ్లకు అధికారులు ఒక అడుగు ముందుకు.. మూడు అడుగులు వెనక్కి పడినట్లు చెబుతున్నారు. అయితే మున్సిపాలిటీల్లో ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు వసూలు అంతంత మాత్రమే ఉండటం.. టార్గెట్ చేరుకునేందుకు కేవలం 20 రోజులే ఉండటంతో అధికారులు సిబ్బందిని పరుగులు పెట్టిస్తున్నారు. 80 శాతంతో నాలుగో స్థానం.. రాష్ట్రస్థాయిలో పన్నులు వసూలు చేయడంలో ఉమ్మడి జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీ నాలుగో స్థానంలో నిలిచింది. సుమారు 4 వేల ఆస్తులకు రూ.98 లక్షలు వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటికే రూ.78 లక్షలు (80 శాతం) వసూలు చేశారు. అదనపు కలెక్టర్లకు బాధ్యతలు.. ఈ ఏడాది జనవరి 26తో మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో అదనపు కలెక్టర్లు (లోకల్ బాడీస్) ప్రత్యేకాధికారులుగా బాధ్యతలు అప్పగించింది. వీరు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను వసూళ్లపై ఎప్పటికప్పుడు మున్సిపల్ రెవెన్యూ, బిల్ కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లు, కమిషనర్లకు ఆదేశాలు ఇస్తున్నారు. వారం రోజులుగా ప్రత్యేక దృష్టిసారిస్తూ రోజూవారిగా పన్నుల వసూళ్లపై నివేదిక తెప్పించుకుంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పన్నుల వసూళ్లకు మిగిలింది కేవలం 20 రోజులేనని.. అంతలోపే లక్ష్యం చేరుకోవాలని ప్రత్యేకాధికారులు మున్సిపల్ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆస్తి, నీటి పన్ను చెల్లింపులు, రివిజన్ పిటిషన్ సహా ఇతర సమస్యల పరిష్కా రం కోసం సోమ, గురువారాల్లో ఉద యం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మున్సి పాలిటీల్లో రెవెన్యూమేళా నిర్వహించేందుకు చర్యలు చేప ట్టారు. ఈ మేళా ద్వారా ప్రజలకు అ నేక రకాల సేవలు అందుబాటులో ఉంటాయని అధికారు లు చెబుతున్నారు. మున్సిపాలిటీల పరిధిలో ఆస్తి, నీటి పన్ను చెల్లింపులు, ఇతర సమస్యలకు పరిష్కారం పొందవచ్చు. ప్రాపర్టీ పేరు మార్పు, మ్యూటేషన్, ఇంటి నంబర్ కేటాయింపు లేదా మార్పు వంటి సేవలు పొందవచ్చు. రాష్ట్రస్థాయిలో 63వ స్థానం.. సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మున్సిపాలిటీలో 5,332 ఆస్తులకు రూ. 1.94 కోట్లు వసూలు చేయా ల్సి ఉండగా.. ఇప్పటి వరకు రూ.1.10 కోట్లు (57 శాతం) వసూలు చేశా రు. దీంతో ఈ మున్సిపాలిటీ రాష్ట్రస్థాయిలో 63వ స్థానంలో నిలిచింది. అలాగే ఉమ్మడి జిల్లాకు చెందిన ఎక్సైజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లపూర్లో సైతం 6,406 ఆస్తుల కు రూ.1.28 కోట్లకు రూ.72 లక్షలు వసూలు (56 శాతం) చేశారు. ఈ మున్సిపాలిటీ రాష్ట్రస్థాయిలో 68వ స్థానంలో నిలిచింది. మున్సిపాలిటీల్లో పన్నుల వసూళ్లు అంతంతే సీఎం ఇలాఖాలో 57 శాతమే వసూలుతో రాష్ట్రస్థాయిలో 63వ స్థానం ఉమ్మడి జిల్లాలో వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లే దిక్కు ప్రత్యేకంగా సోమ, గురువారాల్లో రెవెన్యూ మేళాలు గడువు నేపథ్యంలో పరుగులు పెట్టిస్తున్న ప్రత్యేకాధికారులు -
ఆహార భద్రతకు పకడ్బందీ చర్యలు
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన ఆహారం అందించి ఆహార భద్రతకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కలెక్టర్ చైర్మన్గా వివిధ శాఖల అధికారులతో జిల్లా ఆహార భద్రత సలహా మండలి ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కమిటీలో రెవెన్యూ అదనపు కలెక్టర్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి, వైద్య ఆరోగ్య శాఖ, వ్యవసాయ, పరిశ్రమలశాఖ జీఎంలు, డీఈఓ, జిల్లా పౌరసరఫరాల అధికారి, ఫుడ్ ఇన్స్పెక్టర్ తదితరులు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. ఆహార భద్రత చట్టం అనుసరించి జిల్లాలో ఆహార భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. జిల్లాకు నూతనంగా రీజనల్ ఫుడ్ లేబరేటరీ, ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ వెహికల్ కూడా రాబోతుందని పేర్కొన్నారు. వీటి ద్వారా జిల్లాలో మరింత మెరుగ్గా ఆహార కల్తీ నిరోధానికి పాటుపడాలని, ప్రభుత్వ పాఠశాలల్లో, వసతిగృహాల్లో, గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా పాఠశాలల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి పరీక్షించాలని, రక్తహీనత, ఐరన్ లోపం ఉన్న వారికి తగు చికిత్స అందించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మోహన్రావు, శివేంద్ర ప్రతాప్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మనోజ్, డీఈఓ ప్రవీణ్ కుమార్, అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ శశికాంత్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి జరీనా బేగం, తదితరులు పాల్గొన్నారు. తాగునీటి సమస్యపై దృష్టి సారించాలి జిల్లాలో తాగునీటి సమస్య, విద్యుత్ సరఫరాపై అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. కలెక్టరేట్లో జిల్లా అధికారుల సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామాల్లో తాగునీటి సమస్య, విద్యుత్ సరఫరాలో సమస్య ఉంటే వెంటనే పరిష్కరించాలని సూచించారు. భూగర్భ జల వనరులు తగ్గినా పంటలు ఎండిపోకుండా రెవెన్యూ, వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా కలిసి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. -
మహబూబ్నగర్కే ఎక్కువ నిధులా?
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ముడా నుంచి జిల్లాలోని మహబూబ్నగర్ నియోజకవర్గానికే ఎక్కువ నిధులు కేటాయిస్తే ఎలా అని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అధికారులను ప్రశ్నించారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక ముడా కార్యాలయంలో చైర్మన్ కె.లక్ష్మణ్యాదవ్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మిగతా నియోకవర్గాలకూ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఇక నుంచి మహబూబ్నగర్ (పరిగి నియోజవకర్గంలోని రెండు మండలాలు కలుపుకొని)కు 40 శాతం, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాలకు 30 శాతం చొప్పున మంజూరు చేస్తే బాగుంటుందన్నారు. అందుకు వైస్ చైర్మన్ డి.మహేశ్వర్రెడ్డి అంగీకారం తెలిపారు. ఇక గతంలోనూ మహబూబ్నగర్కు తప్పా ఇతర నియోజకవర్గాలకు అసలు కేటాయింపులే జరగలేదని ఆయన వాపోయారు. జిల్లాకేంద్రంలోని పది పార్కుల అభివృద్ధికి అయ్యే రూ.3.30 కోట్లను కేవలం మున్సిపల్ కార్పొరేషన్ నిధుల నుంచి కేటాయించాలన్నారు. ఇదివరకే చేపట్టిన పనుల్లో తన నియోజకవర్గంలో 34 పెండింగ్లో ఉన్నాయని, ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరుగుతోందన్నారు. కాగా, జిల్లాలో ఏఈల కొరత తీవ్రంగా ఉందని, చాలా చోట్ల డిప్యూటేషన్పై పని చేస్తున్నందున ఈ పరిస్థితి నెలకొందని పబ్లిక్ హెల్త్ ఈఈ విజయభాస్కర్రెడ్డి బదులిచ్చారు. ముడాకు ప్రత్యేకంగా ఈఈ, ఇద్దరు డీఈఈలు, నియోజవర్గానికి ఒక్కొక్కరు చొప్పున ఏఈ పోస్టులు కేటాయిస్తే పనులు త్వరగా చేపట్టడానికి వీలవుతుందని సమావేశం దృష్టికి తెచ్చారు. కాగా, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి, ముడా పాలకవర్గం అమోదంతో రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సూచించారు. కేటాయింపులు ఇలా.. ఇక మహబూబ్నగర్ నియోజకవర్గానికి రూ.14,05,06,000లతో 108 పనులు, జడ్చర్లకు రూ.8,21,50,000లతో 142, దేవరకద్రకు రూ.8,20,00,000లతో 192, పరిగి నియోజకవర్గంలోని మహమ్మదాబాద్, గండేడ్ మండలాలకు రూ.1,54,10,000లతో 77 పనులు (ఇలా మొత్తం రూ.32,00,66,000) చేపట్టేందుకు ప్రతిపాదనలు చేయగా పాలకవర్గం ఆమోదం తెలిపింది. అలాగే కార్పస్ఫండ్ కింద ముడాకు రూ.500 కోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని తీర్మానించింది. జిల్లాకేంద్రంలోని బైపాస్, భూత్పూర్ రోడ్డు, ఎన్హెచ్–167లపై ఐదు చోట్ల మొక్కల పెంపకం, సంరక్షణకు గాను నిర్వహణ ఖర్చుల కింద రూ.1.84 కోట్లు కేటాయించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్రెడ్డి, అనిరుధ్రెడ్డి, చిట్టెం పర్ణికారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని మిగతా నియోకవర్గాలకూ ప్రాధాన్యం ఇవ్వాలి పార్కుల అభివృద్ధిని మున్సిపల్ కార్పొరేషన్ చూసుకోవాలి ముడా సమావేశంలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి -
ఆ ఏడుగురి కోసం అన్వేషణ
ఆ చోటనే గాలింపు సొరంగంలో చిక్కుకున్న 8 మందిలో గురుప్రీత్సింగ్ మృతదేహం లభ్యమైన ప్రదేశంలో పక్కనే ఆదివారం, సోమవారం సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కేరళ నుంచి వచ్చిన కడావర్ డాగ్స్, జీపీఆర్ సిస్టం ద్వారా గుర్తించిన డీ1, డీ2 లొకేషన్లలో సింగరేణి కార్మికులు, ర్యాట్ హోల్ మైనర్లు, ఇతర సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సోమవారం పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ సహాయక బృందాలకు దిశానిర్దేశం చేస్తూ డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్ పలు సూచనలు చేశారు. మంగళవారం సొరంగం వద్ద సహాయక చర్యల్లో భాగంగా రోబోలు రంగంలోకి దిగనున్నాయి. హైదరాబాద్కు చెందిన అన్వి రోబో నిపుణులు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించనున్నారు. సాక్షి, నాగర్కర్నూల్ /అచ్చంపేట రూరల్: దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న వారి కోసం 17 రోజులుగా చేపడుతున్న సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్లో చిక్కుకున్న 8 మందిలో ఒకరి మృతదేహం ఆదివారం లభించడంతో సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. ఇప్పటికే 14 బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటుండగా.. సింగరేణి కార్మికులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. సొరంగం లోపల చిక్కుకున్న వారిని గుర్తించేందుకు కేరళ రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా వచ్చిన కాడవర్ డాగ్స్ తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. జీపీఆర్, కాడవర్ డాగ్స్ చూయించిన ప్రదేశంలోనే ప్రధానంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. ఆదివారం రాబిన్స్ కంపెనీలో టీబీఎం ఆపరేటర్గా పనిచేస్తున్న గురుప్రీత్సింగ్ మృతదేహం లభించింది. దీంతో మిగతా 7 మంది కోసం సహాయక బృందాలు అన్వేషణను ముమ్మరం చేశాయి. టీబీఎం విడి భాగాలను తొలగిస్తూనే ఆ ఏడు మంది కోసం సొరంగంలో గాలిస్తున్నారు. స్థానిక యంత్రాంగం గంటగంటకూ సొరంగంలో జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తున్నారు. సహాయక చర్యలకు అన్నీ సవాళ్లే.. ఎస్ఎల్బీసీ సొరంగంలో 13.850 కి.మీ. వద్ద ప్రమాదం చోటుచేసుకోగా, అక్కడి చేరుకుని సహాయక చర్యలు చేపట్టడమే రెస్క్యూ బృందాలకు ప్రతిరోజు క్లిష్టతరమవుతోంది. సొరంగంలో 13 కి.మీ. లోపల రెస్క్యూ నిర్వహించే సిబ్బందికి సైతం ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. 16 రోజుల పాటు నిరంతరం శ్రమించిన రెస్క్యూ బృందాలకు ఆదివారం ఒక కార్మికుడి మృతదేహం లభ్యమైంది. సమీపంలో గాలిస్తున్నా మిగతా వారి ఆచూకీ లభించడం లేదు. సోమవారం రెస్క్యూ బృందాలతో కలసి సొరంగంలోని ప్రమాదస్థలం వద్దకు ‘సాక్షి’ వెళ్లి పరిశీలించింది. సొరంగం ఇన్లెట్ నుంచి 13.850 కి.మీ. దూరంలో ఉన్న ప్రమాదస్థలం వద్దకు రెస్క్యూ బృందాలు చేరుకునేందుకే కనీసం 1.45 గంటలు పడుతోంది. లోకోట్రైన్ ద్వారా రాకపోకలకే కనీసం 3–4 గంటలు పడుతోంది. ఒక్కో షిఫ్టులో సహాయక బృందాలు 12 గంటల పాటు పనిచేస్తున్నారు. సొరంగంలో 12 కి.మీ. వద్దకు చేరుకున్నాక సీపేజీ నీరు, బురద వస్తోంది. 13.200 కి.మీ. పాయింట్ వరకూ లోకో ట్రైన్ వెళ్లగలుగుతోంది. లోకో ట్రైన్ ట్రాక్ తర్వాత రెండు ఎస్కవేటర్లు మట్టి, శిథిలాలను తొలగిస్తున్నాయి. 13.400 వద్ద టీబీఎం భాగాలు టన్నెల్ నిండా చిక్కుకుని ఉండగా, సహాయక బృందాలు లోపలికి వెళ్లేందుకు వీలుగా కుడివైపు నుంచి మిషిన్ భాగాలను కట్చేసి దారిని ఏర్పాటుచేశారు. అక్కడి నుంచి ప్రమాదస్థలం 13.850 వరకూ కాలినడకన బురద, శిథిలాల మధ్య జాగ్రత్తలు పాటిస్తూ చేరుకోవాల్సి ఉంటుంది. సొరంగానికి కుడివైపున కన్వేయర్ బెల్టు అందుబాటులోకి తీసుకురాగలిగారు. సుమారు 150 మీటర్ల విస్తీర్ణంలో 15 ఫీట్ల ఎత్తులో టన్నెల్ నిండా మట్టి, బురద పేరుకుని ఉండటంతో వాటిని తొలగించేందుకు రోజులు పట్టే అవకాశం ఉంది. దీంతో కడావర్ డాగ్స్ సూచించిన ప్రాంతాల్లోనే తవ్వకాలను జరిపి కార్మికుల జాడ కోసం అన్వేషణ చేపడుతున్నారు. సొరంగంలో కాడవర్ డాగ్స్ స్క్వాడ్ ప్రమాద స్థలంలో గుర్తించిన డీ2 పాయింట్ వద్ద సింగరేణి బృందాలు టన్నెల్లో కాడవర్ డాగ్స్తో గాలింపు ముమ్మరం కీలకంగా వ్యవహరిస్తున్న సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్లు ఇప్పటికే ఒక కార్మికుడి మృతదేహం లభ్యం ఎస్ఎల్బీసీలో కొనసాగుతున్న సహాయక చర్యలు అభినందనల వెల్లువ.. ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న 8 మందిలో ఒకరి మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చిన సహాయక బృందాలను ప్రజాప్రతినిధులు, వివిధ విపత్తుల ఉన్నతాధికారులు అభినందించారు. సోమవారం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గురుప్రతీసింగ్ మృతిచెందడం బాధాకరమని, తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మున్ముందు జరగబోయే సహాయక చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్, కలెక్టర్ బదావత్ సంతోష్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స్ఫూర్తితో మిగిలిన సహాయక చర్యలను మరింత వేగంగా, సమర్థవంతంగా కొనసాగించాలని సూచించారు. సహాయక బృందాలు పూర్తిస్థాయిలో పాల్గొని పనులను వేగంగా ముగించాలని ఆదేశించారు. అలాగే టన్నెల్ వద్ద సహాయక సిబ్బందికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించినట్లు వివరించారు. సహాయక చర్యల్లో పాల్గొనే బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. సమావేశంలో ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి మైన్స్, ర్యాట్ మైనర్స్, దక్షిణ మధ్య రైల్వే, కేరళకు చెందిన కాడవర్ డాగ్స్ స్క్వాడ్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రేషన్ బియ్యం పట్టివేత
కొత్తపల్లి: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు మద్దూర్ ఎస్ఐ విజయ్కుమార్ తెలిపారు. వివరాలు.. కర్ణాటక రాష్ట్రం గుర్మిట్కాల్కు బొలెరోలో తరిలిస్తున్నట్లు సమాచారం అందింది. సోమవారం తెల్లవారుజామున కొత్తపల్లి మండలం భూనీడు గ్రామ శివారులో వాహనంలో బియ్యాన్ని గుర్తించి పోలీస్స్టేషన్కు తరలించారు. ఈవిషయమై కోస్గి ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు సమాచారమివ్వగా పట్టుబడిన బియ్యాన్ని పంచనామా నిర్వహించారు. వాహనంలో 57బస్తాలు 28 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. వాహనాన్ని పోలీసులకు అప్పగించి డ్రైవర్ పరశురాం, యజమానికి శ్రీనివాస్ఐ కేసు నమోదుచేశారు. ఈ బియ్యం దేవరకద్ర మండలం పూసలపహాడ్ నుంచి కర్ణాటకకు తరలిస్తున్నట్లు ఎస్ఐ విజయ్కుమార్ తెలిపారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
పెద్దకొత్తపల్లి: పంటకు నీరందించేందుకు వెళ్లిన ఓ రైతు విద్యుదాఘాతానికి గురై మృతిచెందిన ఘటన పెద్దకొత్తపల్లి మండలం యాపట్ల గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. యాపట్లకు చెందిన రైతు బక్కయ్యగౌడ్ (60)కు మూడెకరాల పొలం ఉండగా.. వేరుశనగ పంట సాగుచేశాడు. ఆదివారం రాత్రి పంటకు నీరందించేందుకు వెళ్లిన అతడు.. విద్యుత్ బోరుమోటారు ఆన్ చేస్తుండగా షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. అతడికి భార్య కిష్టమ్మ, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. మృతుడి కుమారుడు శివుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య అడ్డాకుల: మూసాపేట మండలం మహ్మదుస్సేన్పల్లికి చెందిన రైతు కుర్వ పూల మహేష్(39) పురుగుల మందు తాగిన ఘటనలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మూసాపేట ఎస్ఐ ఎం.వేణు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం...మహ్మదుస్సేన్పల్లి గ్రామానికి చెందిన మహేష్ ఐదేళ్ల క్రితం రూ.30 లక్షలు ఫైనాన్స్ తీసుకుని రెండు హార్వేస్టర్లు కొనుగోలు చేశాడు. వాటి ద్వారా నష్టం వాటిల్లడంతో వాటిని అమ్మేశాడు. తర్వాత గ్రామంలో కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని పంటలు సాగు చేశాడు. పంటల సాగుకు చేసిన అప్పులు కూడా తీరకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈక్రమంలో జీవితంపై విరక్తి చెందిన మహేష్ ఈనెల 9న ఉదయం ఇంటి వద్ద పురుగుల మందును తాగాడు. కొద్దిసేపటికే గమనించిన తల్లి నారమ్మ వెంటనే జిల్లాకేంద్రంలోని ఆస్పత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఆదివారం రాత్రి హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు ఎస్ఐ ఎం.వేణు తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నట్లు తెలిసింది. మృతుడి తల్లి నారమ్మ సోమవారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. అన్నదమ్ముల గొడవలో తమ్ముడిపై కేసు నమోదు అడ్డాకుల: మండలంలోని తిమ్మాయిపల్లికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు పొలానికి నీళ్లు పెట్టుకునే క్రమంలో జరిగిన గొడవలో అన్నపై దాడి చేసిన తమ్ముడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. గ్రామానికి చెందిన బాలకిష్టయ్య ఆదివారం సాయంత్రం తన పొలానికి నీళ్లు పారిస్తున్నాడు. అదే సమయంలో అక్కడికి వెళ్లిన తమ్ముడు రవి నీళ్లు పారించుకునే వంతుల విషయంలో గొడవపడ్డారు. ఈక్రమంలో రవి కర్రను తీసుకొని బాలకిష్టయ్యపై దాడి చేసి గాయపర్చాడు. దీంతో బాలకిష్టయ్య సోమవారం అడ్డాకుల ఠాణాలో ఫిర్యాదు చేశాడు. గాయపడిన బాలకిష్టయ్యను పోలీసులు ఆస్పత్రికి పంపించారు. తమ్ముడు రవిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఆన్లైన్లో పెట్టుబడి.. మోసపోయిన యువకుడు కొత్తకోట రూరల్: సైబర్ నేరాలపై పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ.. ఎక్కడో చోట ఆన్లైన్లో పెట్టుబడి పెట్టి మోసపోతున్న వారు వెలుగులోకి వస్తూనే ఉన్నారు. తాజాగా కొత్తకోటకు చెందిన ఓ యువకుడు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయాడు. ఎస్ఐ ఆనంద్ వివరాల మేరకు.. కొత్తకోటకు చెందిన డి.ఉదయ్కుమార్ను ఈ నెల 3న గుర్తుతెలియ ని వ్యక్తి టెలిగ్రామ్ యాప్లో ‘బిట్ కై న్ ఇన్వెస్టర్’ గ్రూప్లో యాడ్ చేశారు. ఆ గ్రూప్లో ఒక లింక్ను పంపించి.. అందులో డబ్బులు పె ట్టుబడిగా పెడితే రెట్టింపు అవుతాయని చెప్పా రు. నమ్మిన ఉదయ్కుమార్.. అదే రోజు తన బ్యాంక్ ఖాతా నుంచి రూ.70వేలు పెట్టుబడి పెట్టాడు. డబ్బులు పెద్ద మొత్తంలో రావడంతో సైబర్ నేరగాడు రాత్రికి రాత్రే ఆ టెలిగ్రామ్లో ఉన్న ఇన్వెస్టర్ గ్రూప్ మొత్తాన్ని తొలగించాడు. మోసపోయానని తెలుసుకున్న ఉదయ్కుమార్.. 1930కు కాల్ చేయడంతో పాటు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. నవజాత శిశువును కాపాడిన 108 సిబ్బంది నర్వ: నవజాత శిశువుకు 108 సిబ్బంది సీపీఆర్ చేసి కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని రాయికోడ్కు చెందిన గర్భిణి అఖిల మొదటి కాన్పు నిమిత్తం సోమవారం నర్వ పీహెచ్సీకి వచ్చింది. మధ్యాహ్నం సాధారణ ప్రసవమై మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే శిశువు ఉమ్మనీరు మింగడంతో శ్వాస తీసుకోలేకయింది. ఈ క్రమంలో శిశువు మరణించిందని అందరూ భావించారు. అయితే ప్రసవం చేసిన నర్సు 108 అంబులెన్స్కు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్నారు. శిశువు అంబులెన్స్లోకి తీసుకొని ఆర్సీపీ డాక్టర్ శివ, మరో డాక్టర్ మౌనిక సూచనలతో సీపీఆర్ చేశారు. నవజాత శిశువుకు మందులు, ఆక్సిజన్ అందిస్తూ.. మహబూబ్నగర్ ఆస్పత్రికి తరలించారు. నవజాత శిశువును సీపీఆర్తో కాపాడిన 108 సిబ్బందిని చిన్నపిల్లల వైద్యురాలు మమత అభినందించారు. -
మంటల వ్యాప్తికి కారణమైన వ్యక్తి అరెస్టు
దోమలపెంట: అమ్రాబాద్ టైగర్ రిజర్వు పరిధిలోని దోమలపెంట రేంజ్ అటవీ ప్రాంతంలో మంటల వ్యాప్తికి కారణమైన వ్యక్తి శీలం బయన్నను సోమవారం కోర్టులో హాజరుపర్చినట్లు దోమలపెంట ఎఫ్ఆర్ఓ గురుప్రసాద్ తెలిపారు. ఈ నెల 2, 3 తేదీల్లో దోమలపెంట రేంజ్ పరిధిలోని దూబోడు, ఉల్లిందలూట బీట్లలో రాత్రివేళలో వ్యాపించిన మంటలను జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో 7 బృందాలు శ్రమించి అదుపులోకి తెచ్చాయి. అయితే ఇతర ప్రాంతాల్లో మంటలు, పొగలు వస్తుండటంతో అడవిలో అన్ని బ్లాక్లను కాలినడక ద్వారా వెళ్లి ఆర్పుతుండగా సమీపంలో నివాసముంటున్న పదర మండలం చిట్లంకుంట గ్రామానికి చెందిన శీలం బయన్న మేకలను కాయడం తారసపడిందన్నారు. అతన్ని విచారించగా లింగాలగట్టుకు చెందిన బాలచెన్నయ్యకు చెందిన మేకలు కాస్తున్నట్లు చెప్పారని, బయన్న వద్ద అగ్గిపెట్టె, బీడీలు, పొగాకును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సుమారు 150 హెక్టార్ల విస్తీర్ణం మేర అడవిలో మంటలు వ్యాపించడానికి శీలం బయన్న కారణమని, కేసు నమోదు చేసి అచ్చంపేట కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి చార్జీషీటు దాఖలు చేయాలని సూచించారన్నారు. -
నల్లమలలో కార్చిచ్చు
కొల్లాపూర్: నియోజకవర్గ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కార్చిచ్చు రాజుకుంది. 15 రోజుల క్రితం జాలుపెంట, చుక్కలపెంట ప్రాంతాల్లో అడవి అంటుకొని మంటలు చెలరేగాయి. వాటిని ఆర్పివేయడంలో కొల్లాపూర్ అటవీ శాఖాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వాతావరణ మార్పుల కారణంగా మంటల వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. చిన్నపాటి మంటలే కదా అనుకున్న అటవీ అధికారులకు కార్చిచ్చు తలనొప్పిగా మారింది. కొన్ని రోజులుగా అధిక వేడితో పాటు గాలులు వీస్తుండడంతో మంటల సమీప ప్రాంతాలకు వ్యాపించాయి. జాలుపెంట, చుక్కలపెంట, పెగ్గర్లపెంట, తొంగిచూపులు ప్రాంతాల్లో మంటలు చెలరేగుతున్నాయి. మంటలను అదుపుచేయలేక సమస్యను ఉన్నతాధికారులకు నివేదించారు. దీంతో వారి ఆదేశానుసారం మంటలను ఆర్పేందుకు బ్లోయర్స్ను వినియోగిస్తున్నారు. అయినా కూడా మంటలు అదుపులోకి రావడం లేదు. శివరాత్రి సందర్భంగా అటవీ మార్గంగుండా శ్రీశైలం వెళ్లిన శివస్వాములే మంటల వ్యాప్తికి కారణమై ఉంటారని ఫారెస్టు రేంజర్ చంద్రశేఖర్ అనుమానం వ్యక్తం చేశారు. అడవిలో మంటలు వ్యాప్తి చెందుతున్నాయని గొర్రెలు, పశువుల కాపరులతో పాటు ఇతరులు ఎవరూ అనుమతుల్లేకుండా అడవిలోకి ప్రవేశించరాదని ఆయన హెచ్చరించారు. అగ్ని ప్రమాదం కారణంగా అడవిలో జీవజాలం చనిపోతుందని, దీనివల్ల జీవ వైవిధ్యం దెబ్బతింటుందని ఆయన వివరించారు. మంటలను అదుపుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జాలుపెంట, చుక్కలపెంటల్లో 15 రోజుల క్రితం అంటుకున్న అడవి రోజురోజుకూ వ్యాప్తి చెందుతున్న మంటలు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అటవీ శాఖాధికారులు ఉన్నతాధికారుల ఆదేశంతో వినియోగంలోకి బ్లోయర్స్ -
అలంపూర్ క్షేత్రం అభివృద్ధికి ప్రణాళికలు
అలంపూర్: అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి క్షేత్రం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి అన్నారు. ఆలయ సముదాయంలోని చైర్మన్ చాంబర్లో సోమవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జోగుళాంబ ఆలయ అభివృద్ధిపై ఈ నెల 7న హైదరాబాద్లోని ప్రజాభవన్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి, దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా జోగుళాంబ ఆలయ సమగ్ర అభివృద్ధికి తాత్కాలిక, దీర్ఘకాలిక పనుల జాబితాను సిద్ధం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటికీ అలంపూర్లో ఐదవ శక్తిపీఠం ఉన్నట్టు చాలా మందికి తెలియని పరిస్థితి ఉందన్నారు. ఆలయ చరిత్రతో కూడిన ప్రచార బోర్డులు పెట్టడానికి ప్రధాన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ముఖ్య ప్రదేశాలను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఇటీవల ఆలయాల్లో అవినీతి జరిగిందని.. అర్చకుల పనితీరుపై మీడియాలో కథనాలు వస్తున్నాయన్నారు. అందుకు సంబంధించిన రికార్డులను దేవదాయశాఖకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. అవినీతికి పాల్పడిన వారిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయన్నారు. ఆలయాల ప్రతిష్ట దెబ్బతిసే విధంగా ఎవరూ ప్రయత్నించవద్దని కోరారు. సమావేశంలో ఆలయ ధర్మకర్తలు నాగశిరోమణి, జగన్మోహన్ నాయుడు, జగన్గౌడు, గోపాల్, అడ్డాకుల రాము ఉన్నారు. -
సప్లయర్ ఇంట్లో అంగన్వాడీ సరుకులు
జడ్చర్ల టౌన్: అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేయాల్సిన సరుకులు సప్లయర్ ఇంట్లో నిల్వ ఉండటంతో జడ్చర్ల సీడీపీఓ శోభారాణి సోమవారం పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. అంగన్వాడీ కేంద్రాలకు బాలామృతం, పప్పు, నూనెలను జడ్చర్ల వెంకటేశ్వరకాలనీకి చెందిన కృష్ణారెడ్డి సరఫరా చేసే సప్లయర్గా పనిచేస్తున్నాడు. అయితే ప్రతి సరుకు గోదాం నుంచి మాత్రమే కేంద్రాలకు తరలించాల్సి ఉంది. అలాంటిది అతడి ఇంట్లో అక్రమంగా సరుకులు నిల్వ ఉన్నాయని ఆదివారం రాత్రి అంగన్వాడీ అధికారులకు సమాచారం అందింది. దీంతో అదేరోజు రాత్రి ఆప్రాంత అంగన్వాడీ టీచర్, సూపర్వైజర్లు వెళ్లి పరిశీలించగా 111 కిలోల బాలామృతం 80కిలోల కందిపప్పు, 8లీటర్ల వంటనూనెలు ఉండటాన్ని గుర్తించి సీడీపీఓకు సమాచారమిచ్చారు. సోమవారం ఉదయం సీడీపీఓ శోభారాణి, ఆర్ఐ హర్షవర్దన్రెడ్డిలతోపాటు పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేసి సరుకులను ఐసీడీఎస్ కార్యాలయానికి తరలించారు. గోడౌన్లో ఉండాల్సిన సరుకు ఇంట్లో ఎందుకు ఉంచుకున్నారని సప్లయర్ను ప్రశ్నించగా కేంద్రాలకు సప్లయ్ చేయగా మిగిలినది ఇక్కడ నిల్వచేసినట్లు చెప్పుకొచ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన సీడీపీఓ -
ట్రాక్టర్ను ఢీకొట్టి.. బోల్తా పడిన బొలెరో
గద్వాల క్రైం: స్వగ్రామంలో ఉపాధి లేకపోవడంతో కొందరు వ్యవసాయ కూలీలు మరో ప్రాంతానికి కూలీ పనుల కోసం బొలెరో వాహనంలో బయలుదేరారు. ఈ క్రమంలో ఓ ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడుపుతూ అకస్మాత్తుగా రోడ్డుపైకి రావడంతో.. కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాదంలో 26 మంది కూలీలకు గాయాలు కాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన గద్వాల మండలం జమ్మిచేడ్ స్టేజీ సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. కేటీదొడ్డి మండలం పాతపాల్లెం, గంగన్పల్లి, జాంపల్లి గ్రామాలకు చెందిన 26 మంది కూలీలు మానవపాడు మండలం ధర్మవరం గ్రామంలో మిర్చి తెంచేందుకు బొలెరో గూడ్స్ వాహనంలో బయలుదేరారు. మార్గమధ్యంలోని జమ్మిచేడ్ స్టేజీ వద్ద క్రాస్రోడ్డు దాటేందుకు ట్రాక్టర్ వేగంగా రావడంతో బొలెరో వాహనం అదుపుతప్పి వెనక నుంచి ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాదంలో జాంపల్లికి చెందిన సవారన్న, పాతపాలెంకు చెందిన కృష్ణ, పావని, శాంతమ్మ, పద్మలకు తీవ్ర గాయాలయ్యాయి. మిగతా వారికి స్వల్పగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో సవారన్న, కృష్ణ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కాగా.. ట్రాక్టర్, బొలెరో వాహనం డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగంతో కూడిన డ్రైవింగ్ కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. విషయం తెలుసుకున్న జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత, నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు రంజిత్ కుమార్, పీఏసీఎస్ చైర్మన్ సుభాన్ తదితరులు జిల్లా ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. కూలీలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ ఘటనపై గద్వాల సీఐ శ్రీను, ఎస్ఐలు శ్రీకాంత్, కళ్యాణ్కుమార్ విచారణ చేపట్టారు. ట్రాక్టర్ డ్రైవర్ నవీన్, బొలెరో వాహన డ్రైవర్ మహబూబ్ పరారీలో ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. ఐదుగురు కూలీలకు తీవ్రగాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం నిర్లక్ష్యం, అతివేగంతో కూడిన డ్రైవింగ్తోనే ప్రమాదం -
శాంతికుమార్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ పరామర్శ
పాలమూరు: బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ను ఆదివారం జిల్లాకేంద్రంలోని ఏనుగొండలోని ఆయన నివాసంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ పరామర్శించారు. శాంతికుమార్ తండ్రి బండారి లక్ష్మణ్ మృతిచెందడంతో ఆయన చిత్రపటానికి బండి సంజయ్ పువ్వులు వేసి నివాళులర్పించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్యాహ్నం 12 గంటలకు పట్టణంలోని శాంతికుమార్ ఇంటికి చేరుకోగా బీజేపీ నేతలు స్వాగతం పలికారు. నేరుగా ఇంట్లోకి వచ్చిన బండి సంజయ్ బండారి లక్ష్మణ్ చిత్రపటం దగ్గరకు వెళ్లి నివాళులర్పించారు. ఆ తర్వాత శాంతికుమార్ను పరామర్శించారు. పార్టీ శ్రేణులు, నేతలు, కార్యకర్తలతో ఫొటోలు దిగారు. అనంతరం పార్టీ నేతలతో మాట్లాడిన మంత్రి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మహబూబ్నగర్ నుంచి తిరిగి హైదరాబాద్ వెళ్లారు. అలాగే శాంతికుమార్ను మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీజేపీ ఎస్సీ మోర్చ జాతీయ అధ్యక్షుడు ఎస్.కుమార్, సంగప్ప, ఎన్వీ సుభాష్, బీసీ సంఘాల నాయకులు పరామర్శించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, నాగూరావు నామాజీ, మయూర్నాథ్, రాములు తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా రాములోరి కల్యాణం
ఎర్రవల్లి: శ్రీరాముని జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో ఆదివారం సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించా రు. ఆలయ ప్రధాన అర్చకులు భానుమూర్తి, దత్తుస్వాముల ఆధ్వర్యంలో సీతారాములను ముస్తాబుచే సి వేదమంత్రాల నడుమ వైభవంగా కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో బీచుపల్లికి చేరుకొని సీతారాముల కల్యాణాన్ని కనులారా తిలకించారు. భక్తులకు ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో అన్నదానం చేసినట్లు ఆలయ మేనేజర్ సురేందర్రాజు పేర్కొన్నారు. -
కష్టం బీసీలది.. అధికారం రెడ్డీలదా?
మహబూబ్నగర్ న్యూటౌన్: ‘ఏళ్లకు ఏళ్లుగా భుజాలు కాయలు కాసేలా బీసీలు పార్టీల జెండాలు మోస్తూనే ఉన్నారు.. అధికారం అనుభవిస్తున్నది మాత్రం రెడ్డీలు’ అని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ఆదివారం మహబూబ్నగర్లో నిర్వహించిన బీసీ రాజకీయ చైతన్య సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడ అవకాశముంటే అక్కడ బీసీలు అధిక సంఖ్యలో పోటీ చేసి సత్తాచాటాలని పిలుపునిచ్చారు. పాలమూరు జిల్లాలోని అగ్రకుల నాయకులైన సీఎం రేవంత్రెడ్డి, ఎంపీ డీకే అరుణ, యెన్నం శ్రీనివాస్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి పార్టీలు మారుతూ అధికారాన్ని అనుభవిస్తున్నారన్నారు. బీసీ బిడ్డ ముదిరాజ్ సింహంగా పేరొందిన ఎర్రసత్యంను బుల్లెట్లతో కాల్చి చంపిన వారే ఆయన ఆశయాలను కొనసాగిస్తామని కపట ప్రేమ చూపుతున్నారని, బీసీలంతా ఈ విషయాన్ని గమనించాలన్నారు. రాష్ట్రంలో బీసీలపై జరుగుతున్న కుట్రలను దృష్టిలో ఉంచుకొని ఒక బీసీ అభ్యర్థికి ఏ పార్టీ నుంచి అవకాశం వచ్చినా బీసీలంతా ఐక్యంగా ఉండి గెలిపించుకోవాలని అన్నారు. 70 ఏళ్ల పాలనలో అధికారాన్ని అనుభవించి అగ్రకులాలు ఆస్తులు కూడగట్టుకుంటే వెనుకబడిన కులాలపై అప్పులు మోపారని మండిపడ్డారు. మీ ఓట్లు మాకొద్దని, దమ్ముంటే మా బీసీల ఓట్లు మీకొద్దని చెప్పాలని సవాల్ విసిరారు. ఇది బీసీల రాజకీయ చైతన్య సదస్సు కాదని.. రెడ్లకు, బీసీలకు విడాకుల సభ అన్నారు. 2028లో ముఖ్యమంత్రిగా బీసీలు అయి తీరుతారన్నారు. ● పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాలుంటే 9 నియోజకవర్గాల్లో మీరే ఉన్నారని, పార్టీలు మారుతూ అధికారాన్ని అనుభవిస్తున్నారని, మీరు బీసీలు పార్టీలు మారొద్దని నీతులు చెబుతున్నారని విమర్శించారు. బీసీ ప్రజా ప్రతినిధులారా ఎక్కడ అవకాశమున్నా పోటీ చేయాలని, తీన్మార్ మల్లన్న పూర్తి మద్దతుతో గెలుపులో భాగమవుతామన్నారు. బీసీ రాజ్యంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను ఎత్తివేస్తామని, దొంగదారిన వచ్చిన ఉద్యోగాలను రద్దు చేసి రికవరీ చేస్తామన్నారు. ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి గెలిచిన మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి, రజక బిడ్డ వీర్లపల్లి శంకరయ్య మంత్రి ఎందుకు కావడం లేదని ప్రశ్నించారు. సమావేశంలో బీసీ టైమ్స్ అధినేత సంగెం సూర్యారావు, సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థి వడ్డే జానయ్య, సర్పంచ్ల సంఘం రాష్ట్ర నాయకుడు ప్రణీల్చందర్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు రాజు, నిర్మల, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య, బీసీ రాజ్యాధికార సమితి ఉమ్మడి జిల్లా కన్వీనర్ మైత్రి యాదయ్య, బీసీ సమాజ్ అధ్యక్షుడు శ్రీనివాస్సాగర్, తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు రవి ముదిరాజ్, ముదిరాజ్ మహాసభ మహిళా అధ్యక్షురాలు లక్ష్మీదేవి, లక్ష్మణ్, వన్నాడ అంజన్న, కావలి శంకర్ పాల్గొన్నారు. ‘స్థానికం’లో బీసీలు సత్తా చాటాలి అప్పులు మాకు.. ఆస్తులు మీకు పార్టీలు మారొద్దని మీరు నీతులు చెబుతారా 2028లో బీసీయే రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీ రాజకీయ చైతన్య సదస్సులో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న -
రోడ్డు ప్రమాదంలోవ్యక్తి
రాజాపూర్: మండలంలోని ముదిరెడ్డిపల్లి గ్రామంలో ఓ శుభకార్యంలో పూజ చేసేందుకు స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని వెనకనుంచి మోటార్సైకిల్పై వచ్చి ఢీకొట్టింది. తీవ్రగాయాల పాలైన వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందినట్లు ఎస్ఐ శివానంద్గౌడ్ తెలిపారు. వివరాలు.. జడ్చర్లకు చెందిన ఓరుగంటి సత్యనారాయణశర్మ(71) ఆదివారం తన స్కూటీపై ముదిరెడ్డిపల్లిలో ఓఇంట్లో బాసింగపు పూజ చేయించేందుకు వెళ్తున్నాడు. ముదిరెడ్డిపల్లి ఎక్స్రోడ్డులో గ్రామంలోకి వెళ్లేందుకు మళ్లుచుండగా వెనకనుంచి ఓమోటార్సైకిల్ వేగంగా వచ్చి ఢీకొన్నది. తీవ్రగాయాల పాలైన సత్యనారాయణను స్థానికులు చికిత్స నిమిత్తం 108లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుమారుడు ఓరుగంటి ఆదిత్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
పాలమూరు యువకుడి ఘనత
స్టేషన్ మహబూబ్నగర్: జిల్లాకేంద్రం బోయపల్లి 16వ వార్డుకు చెందిన మల్లేష్గౌడ్ దేశంలోని జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోవడానికి సైకిల్పై సాహస యాత్రకు పూనుకున్నాడు. ఈ క్రమంలో గతేడాది అక్టోబర్ 17న బోయపల్లి నుంచి సైకిల్యాత్ర చేపట్టి తాండూరు మీదుగా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రంలోని రక్సౌల్ బార్డర్ మీదుగా నేపాల్లోకి ఈ ఏడాది జనవరి 23న ప్రవేశించాడు. 45 రోజులపాటు సైకిల్పై నేపాల్ దేశంలో తిరిగి అక్కడి నయాపూల్ ప్రాంతం నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ 4,130 మీటర్ల ఎత్తుగల అన్నపూర్ణ బేస్క్యాంప్ వద్దకు ఈ నెల 8న చేరాడు. మల్లేష్గౌడ్ ఇప్పటి వరకు 7,500 కిలోమీటర్ల యాత్ర పూర్తి చేసి భీమా శంకర్, త్రయంభకేశ్వర్, గ్రిస్నెశ్వర్, సోమనాథ్, నాగేశ్వర్, ఓంకారేశ్వర్, ఉజ్జయిని, కాశీ జ్యోతిర్లింగాలతోపాటు గుజరాత్లోని ధామ్ ద్వారకదేశ్ను దర్శించుకున్నాడు. ఈ నెల 15న నేపాల్ నుంచి బయలుదేరి ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్, బద్రినాథ్, గంగోత్రి, యమునోత్రిని దర్శించుకుంటానని మల్లేష్గౌడ్ తెలిపారు. నా సైకిల్ యాత్రలో నీటి పొదుపు, మొక్కల పెంపకంపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు వివరించారు. సైకిల్ తొక్కడం ద్వారా ఇప్పుడున్న కలుషిత వాతావరణాన్ని కొంతమేర తగ్గించవచ్చనే ప్రధాన అంశాన్ని వివరించడం జరిగిందన్నారు. సైకిల్పై యాత్రను కొనసాగిస్తూ దేశం మొత్తం తిరగడమే తన ధ్యేయమన్నారు. సైకిల్పై ఇప్పటి వరకు 7,500 కిలోమీటర్ల ప్రయాణం ట్రెక్కింగ్ ద్వారా నేపాల్లోని అన్నపూర్ణ బేస్క్యాంప్ చేరిక -
ఆర్టీసీ బస్సు కిందపడి వృద్ధురాలు..
ఆత్మకూర్: ఆర్టీసీ బస్సు ఎక్కే క్రమంలో వృద్ధురాలు బస్సు కింద పడి తీవ్ర గాయాలపాలై మృతి చెందిన సంఘటన ఆత్మకూర్లో చోటుచేసుకుంది. ఎస్సై నరేందర్ తెలిపిన వివరాలు.. చిన్నచింతకుంట మండలం అప్పంపల్లికి చెందిన తిమ్మమ్మ(67) ఆదివారం గ్రామస్తులతో కలసి ఆత్మకూర్లో జరిగే సంతలో కూరగాయలు కొనేందుకు వచ్చింది. సాయంత్రం 4 గంటల సమయంలో స్థానిక గాంధీచౌక్లో బస్సుకోసం ఎదురు చూస్తుండగా మహబూబ్నగర్ డిపోకు చెందన బస్సు వచ్చింది. బస్సు ఎక్కుతుండగా ముందుకు కదలడంతో తిమ్మమ్మ వెనుక టైర్ల కింద పడి గాయాల పాలైంది. గమనించిన తోటి ప్రయాణికులు 108లో స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. బస్సు డ్రైవర్ అజాగ్రత్తతోనే తిమ్మమ్మ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
సొరంగంలో ర్యాట్ మైనర్స్
సాక్షి, నాగర్కర్నూల్: ఎస్ఎల్బీసీ సొరంగంలోపల 13.85 కి.మీ. వద్ద జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసేందుకు మొత్తం 18 బృందాలు పని చేస్తున్నాయి. 16 రోజులుగా నిరంతరం సహాయక చర్యలు చేపడుతున్నా వారి ఆచూకీ లభ్యం కావడం లేదు. సొరంగంలో 13 కి.మీ. అవతల సొరంగ పైకప్పు కుప్పకూలడంతో సుమారు 18 ఫీట్ల ఎత్తులో 200 మీటర్ల విస్తీర్ణం వరకూ మట్టి, బురద, శిథిలాలు మేట వేశాయి. మట్టిని తొలగిస్తే పైనుంచి మరింత కుంగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ ఇన్లెట్ టన్నెల్లో ఎలాంటి ఆడిట్, ఎస్కేప్ టన్నెల్స్ లేకపోవడం, నిత్యం నీటి ఊట, బురద ఉంటుండటంతో ఇంతటి క్లిష్ట పరిస్థితి ఎక్కడా చూడలేదని రెస్క్యూ నిపుణులు అంటున్నారు. ఆయా రెస్క్యూ బృందాలతో పాటు ఢిల్లీ నుంచి వచ్చిన ర్యాట్ హోల్ మైనర్స్ బృందం వినూత్న పద్ధతిలో సేవలు అందిస్తోంది. రైల్వేలైన్లు, రహదారుల పనుల్లో సేవలు.. మేఘాలయా, ఈశాన్య రాష్ట్రాల్లోని బొగ్గు గనుల్లో ఎలుక బొరియలుగా సొరంగాలు తవ్వుతూ ర్యాట్ హోల్ మైనర్స్ బొగ్గును బయటకు వెలికితీస్తారు. ప్రమాదకరమైన ఈ మైనింగ్ను సుప్రీంకోర్టు నిషేధించింది. అయితే రైల్వే లైన్ల నిర్మాణం, జాతీయ రహదారులు, రోడ్ల నిర్మాణంలో వీరు సేవలందిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. సాధారణంగా రోడ్డు, రైల్వేలైన్ కిందుగా పైప్లైన్ వేయాలంటే జేసీబీల సాయంతో తవ్వుతూ రోడ్డును కట్ చేయాల్సి ఉంటుంది. ర్యాట్ హోల్ మైనర్స్ రవాణాకు ఆటంకం కలిగించకుండా, రోడ్డును తవ్వాల్సిన పని లేకుండానే కింద నుంచి సొరంగం తవ్వి పైప్లైన్ వేస్తారు. నిత్యం రద్దీగా ఉండే ఢిల్లీ రోడ్లపై వాహనాల రాకపోకలు కొనసాగుతుండగానే, రోడ్డు కింద నుంచి సొరంగం తవ్వి పైప్లైన్ వేయడంలో వీరి సేవలు విశేషంగా ఉపయోగపడుతున్నాయి. దారి ఏర్పాటు చేస్తూ తవ్వకాలు.. ప్రమాద స్థలంలో సుమారు 8 మీటర్ల మేర మట్టి, బురద, మిషిన్ శిథిలాలు మేట వేసి ఉన్నాయి. బురద, కాంక్రీట్ కలసి గట్టిగా ఉంది. ఒక్క పక్కగా దారి ఏర్పాటు చేస్తూ తవ్వకాలు కొనసాగిస్తున్నాం. రోజంతా అక్కడే ఉండి పనులు నిర్వహిస్తున్నాం. – మహమ్మద్ రషి, ర్యాట్హోల్ మైనర్ సభ్యుడు●వినూత్న సేవలందిస్తున్న 24 మంది సభ్యులు కార్మికుల జాడ కోసం నిరంతరం అన్వేషిస్తున్న బృందం రాత్రింబవళ్లు ప్రమాదస్థలంలోనే తవ్వకాలు జరుపుతున్న వైనం తవ్విన కొద్దీ ఊటనీరు వస్తోంది.. మేం మొత్తం 24 మంది ర్యాట్ హోల్ మైనర్స్ బృందం రెస్క్యూ పనుల్లో పాల్గొంటున్నాం. ఒక్కో షిప్టులో ఆరుగురు చొప్పున 24 గంటల పాటు ప్రమాద స్థలం వద్ద తవ్వకాలు జరుపుతున్నాం. ఇనుప కడ్డీలు, పారలతో మట్టిని తొలగించిన కొద్దీ ఊటనీరు పెరుగుతోంది. – ఖలీల్ ఖరేషి, ర్యాట్హోల్ మైనర్ సభ్యుడు 24 గంటల పాటు సొరంగంలోని ప్రమాద స్థలం వద్దే.. సొరంగంలో మట్టి కింద చిక్కుకున్న కార్మికులను బయటకు తీసేందుకు ర్యాట్ హోల్ మైనర్స్ బృందం గతనెల 25న రంగంలో దిగింది. మొత్తం 24 మంది సభ్యులు ఉండగా, వీరిలో ఎల్లప్పుడూ ఐదు, ఆరుగురు సొరంగంలోని ప్రమాదస్థలం వద్ద మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. కేవలం ఇనుప కడ్డీలు, తట్టా, పారల సాయంతో తవ్వకాలు చేపడుతూ, మట్టిని పక్కకు వేస్తున్నారు. టన్నెల్ నిండా మట్టి పేరుకుపోయిన నేపథ్యంలో రాడార్ గుర్తించిన చోటుతో పాటు అనుమానాస్పద ప్రాంతాల్లో తవ్వకాల చేపట్టి కార్మికుల జాడను అన్వేషిస్తున్నారు. వంతుల వారీగా సొరంగంలోకి వెళుతూ రాత్రింబవళ్లు ప్రమాద స్థలంలోనే తవ్వకాలు చేపడుతున్నారు. భోజనం సైతం అక్కడే చేస్తూ మళ్లీ తవ్వకాలకు ఉపక్రమిస్తున్నారు. -
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
మదనాపురం: చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మృతిచెందిన ఘటన మదనాపురం మండలం రామన్పాడులో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. రామన్పాడుకు చెందిన మత్స్యకారుడు వాకిటి గిరన్న (55) రోజు మాదిరిగానే తెల్లవారుజామున రామన్పాడు జలాశయంలో చేపల వేటకు వెళ్లాడు. ఉదయం 10 గంటలు దాటినా అతడు ఇంటికి రాకవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు.. జలాశయంలో గాలింపు చేపట్టడంతో మృతదేహం లభ్యమైంది. అతడి రెండు కాళ్లకు వల చుట్టుకోవడంతో నీటిలో మునిగి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య వాకిటి కుర్వతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శేఖర్రెడ్డి తెలిపారు. -
అసంపూర్తి పనులతో అవస్థలు
జడ్చర్ల: పట్టణంలోని సిగ్నల్గడ్డ వద్ద రహదారి విస్తరణ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పని ప్రదేశంలో యంత్రాలు, కార్మికులు, సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్ సుమారు మూడు నెలలుగా కనిపించడం లేదు. రోడ్డు, రైల్వే వంతెన ఇరుకుగా ఉండడంతో దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో రాకపోకలకు ఇబ్బందిగా ఉండేది. మూడేళ్ల కిందట రహదారి విస్తరణకు అంకురార్పణ జరిగింది. నాటి నుంచే మరిన్ని కష్టాలు మొదలయ్యాయి. రూ.45.81 కోట్ల వ్యయం.. ఈ ప్రాంతంలో రహదారి విస్తరణ పనులకు కేంద్రం రూ.45.81 కోట్లు మంజూరు చేసింది. వంతెన నిర్మాణానికి రైల్వే విద్యుత్లైన్ ఆటంకంగా ఉండటంతో పనుల్లో జాప్యం జరిగింది. రెండునెలల కిందట రైల్వేశాఖ అధికారులు అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించినా.. ఇప్పటి వరకు పనులు తిరిగి ప్రారంభం కాలేదు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవరిస్తుండటంతో పనులు ముందుకు సాగడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ● సిగ్నల్గడ్డ ప్రాంతం పట్టణానికి కూడలిలా ఉంది. అటు హైదరాబాద్తో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గోవా తదితర దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాలు, ఇటు ఉమ్మడి జిల్లాలోని నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, వనపర్తి తదితర ప్రాంతాలకు వెళ్లాలంటే ఈ కూడలి నుంచే వెళ్లాల్సి ఉంటుంది. నిత్యం వెయ్యికిపైగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ ప్రాంతంలో పనులు చేపట్టేందుకు పాలకులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో స్థానికంగా ఉండే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ చిన్న సమస్య ఎదురైనా గంటల తరబడి రాకపోకలకు నిలిచిపోతున్నాయి. రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారడం, విస్తరణ పనులు చేపట్టకపోవడంతో భారీ వాహనాలు వెళ్లే సమయంలో దుమ్ము లేస్తోంది. ఫిబ్రవరి నెలాఖరు వరకు ఒకవైపు రహదారి పనులు పూర్తి చేస్తామని స్థానిక నాయకులు, ప్రజలకు కాంట్రాక్టర్ చెప్పినా ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. మరో రెండునెలల్లో వర్షాకాలం ప్రారంభమైతే పనులు చేసే పరిస్థితి ఉండదు. ఇప్పటికై నా ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి, కలెక్టర్ స్పందించి రోడ్డు పనులపై దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. పనుల్లో వేగం పెంచాలి.. కూడలిలో ఎక్కడికక్కడ గుంతలు ఉన్నాయి. దుమ్ము విపరీతంగా వస్తుండటంతో రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణదారులు, పాదచారులు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలి. – బాలవర్ధన్న్గౌడ్, జడ్చర్ల దుకాణాలు మూసుకోవాల్సి వస్తుంది.. సిగ్నల్గడ్డ వద్ద రహదారి విస్తరణ పనులు ఏళ్లుగా కొనసాగుతున్నాయి. దుమ్ము విపరీతంగా వస్తుండటంతో వ్యాపారాలు సాగడం లేదు. దుమ్ము కారణంగా దుకాణాలు మూసుకోవాల్సి వస్తోంది. అధికారులు ఎంతమాత్రం స్పందించడం లేదు. త్వరగా రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాలి. – అబిదాలి మహ్మద్ ,జడ్చర్ల త్వరలో బీటీ పనులు చేపడతాంబీటీ రోడ్డు పనులు త్వరలోనే చేపడతాం. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అదేవిధంగా రహదారి విస్తరణ పనులు పూర్తి చేసేందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటాం. బ్రిడ్జి కూడా త్వరితగతిన నిర్మిస్తాం. – రవి, ఏఈ, నేషనల్ హైవే అథారిటీ జడ్చర్ల సిగ్నల్గడ్డ వద్ద నిలిచిన రహదారి పనులు మట్టి, దుమ్ముతో రాకపోకలకు ఇబ్బందులు ట్రాఫిక్ సమస్యలు.. చోద్యం చూస్తున్న అధికారులు -
తగ్గిన దూకుడు
ఉమ్మడి జిల్లాలో పన్ను వసూళ్లలో ఆర్టీఏ వెనుకంజ ● ఈ ఏడాది జిల్లాలో నామమాత్రంగా తనిఖీలు ● ఫీజు, జీవితకాల పన్ను రాకపోవడంతో అంతంతగానే రాబడి ● ఆ శాఖలో వేధిస్తున్న సిబ్బంది కొరత ● గడిచిన మూడేళ్లతో పోల్చితే మహబూబ్నగర్ క్రైం: ఉమ్మడి జిల్లా రవాణా శాఖలో పూర్తిస్థాయిలో ఎంవీఐ, ఏఎంవీఐలు, ఇతర సిబ్బంది లేకపోవడంతో ఆశించిన స్థాయిలో పన్ను వసూలు కావడం లేదు. ప్రతి జిల్లాలో ఒకే ఒక్క ఎంవీఐ ఉండటంతో కార్యాలయంలో విధులు నిర్వహించడానికే సమయం సరిపోకపోవడంతో ఎన్ఫోర్స్మెంట్పై సరైన దృష్టిపెట్టడం లేదు. దీంతో బయట తనిఖీలు, ఇతర రూపాల్లో వచ్చే పన్నుల్లో జాప్యం ఏర్పడుతోంది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 118 మంది ఏఎంవీఐలకు పోస్టింగ్ ఇవ్వగా.. ఇందులో వనపర్తికి ఒకరు, నారాయణపేటకు ఒకరిని కేటాయించగా వారు సైతం ప్రస్తుతం శిక్షణలో ఉన్నారు. గత మూడేళ్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం కంటే ఎక్కువ మొత్తంలో పన్ను వసూలు చేసి రాష్ట్రస్థాయిలో ఉమ్మడి జిల్లాకు మొదటి స్థానం వచ్చేది. కానీ, పరిస్థితులు ఇప్పుడు జిల్లా లక్ష్యం వసూలు శాతం చేసిన పన్ను (రూ.కోట్లలో..) మహబూబ్నగర్ 90.08 82.00 89.05 నాగర్కర్నూల్ 58.14 48.04 82.63 వనపర్తి 39.76 32.63 82.07 గద్వాల 43.09 35.87 83.24 నారాయణపేట 32.65 28.16 86.25 తారుమారైన పరిస్థితులు పూర్తిగా తారుమారు అయ్యాయి. నంబర్ 1 స్థానంలో ఉన్న పాలమూరు ఇప్పుడు ఏకంగా మూడు స్థానాలు దిగజారి నాలుగో స్థానానికి పడిపోయింది. ఇక నాగర్కర్నూల్ 24, వనపర్తి 28, గద్వాల 22, నారాయణపేట 8వ స్థానంలో ఉన్నాయి. -
బ్రహ్మోత్సవాలకు ‘దక్షిణకాశి’ ముస్తాబు
● రేపటి నుంచి కందూరు రామలింగేశ్వరుడి ఉత్సవాలు ● 12న స్వామివారి కల్యాణం, 14న రథోత్సవం అడ్డాకుల: కందూరు శివారులో స్వయంభూగా వెలసి ‘దక్షిణకాశి’గా గుర్తింపు పొందుతున్న శ్రీరామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. మంగళవారం నుంచి ఈ నెల 16 వరకు కొనసాగే స్వామివారి ఉత్సవాల కోసం ఇప్పటికే ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. శైవులకు నిజకాశీలాంటి ఆలయం వద్ద మొదలయ్యే ఉత్సవాలు ఏప్రిల్ 6న జరిగే శ్రీరామ నవమిన ముగుస్తాయి. కాశీలో తప్ప మరెక్కడా లేని కల్పవృక్షాలు (కబంధ) కందూరు రామలింగేశ్వరస్వామి ఆలయం ఆవరణలో కనిపిస్తాయి. కాశీ తర్వాత కల్ప వృక్షాలు ఇక్కడే ఉన్నాయని పురాణం చెబుతోంది. కార్యక్రమాలు ఇలా.. ● ఈ నెల 11న భూతబలి, యాగశాల ప్రవే శం, అంకురార్పణం, అగ్ని ప్రతిష్ఠాపన, ధ్వజారోహణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ● 12న పార్వతీసమేత శ్రీరామలింగేశ్వరస్వామి కల్యాణం జరిపిస్తారు. ● 13న స్వామివారి ప్రభోత్సవం నిర్వహిస్తారు. ● 14న అర్ధరాత్రి రథోత్సవం (తేరు) వైభవంగా కొనసాగుతుంది. ● 15న గవ్యాన్తం, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, వృషభవాహన సేవ ఉంటుంది. ● 16న రుద్రహోమం, మహాపూర్ణాహుతి, త్రిశుల స్నానం కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఈఓ రాజేశ్వరశర్మ తెలిపారు. మరుసటి రోజు నుంచి మొదలయ్యే జాతర ఏప్రిల్ 6న జరిగే శ్రీరామ నవమి రోజున ముగియనుంది. నేడు జడ్చర్ల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జడ్చర్ల టౌన్: మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సోమవారం నిర్వహిస్తున్నట్లు చైర్పర్సన్ పుష్పలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం సమావేశం జరగాల్సి ఉండగా.. 15వ ఆర్థిక సంఘం నిధుల కేటాయింపులో తేడాల వల్ల కొందరు వార్డు కౌన్సిలర్లు అసంతృప్తి వ్యక్తం చేయడంతో వాయిదా వేశారు. తాజాగా నిధుల కేటాయింపు సమానంగా చేస్తూ.. సోమవారం సమావేశం నిర్వహిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. -
SLBC: నేడు మరో రెండు మృతదేహాలు వెలికితీత!
సాక్షి, మహబూబ్నగర్: ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు 17వ రోజు కొనసాగుతున్నాయి. సొరంగంలో చిక్కుకున్న వారిని ఒక్కొక్కరికిగా గుర్తిస్తున్నారు. సహాయక చర్యల్లో భాగంగా ఆదివారం ఎట్టకేలకు ఒక మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. ఎత్తు, చేతి కడియం తదితర ఆనవాళ్లను బట్టి పంజాబ్కు చెందిన టీబీఎం ఆపరేటర్ గుర్ప్రీత్సింగ్ (40)గా గుర్తించారు. గురుప్రీత్ సింగ్ మృతదేహాం లభ్యమైన చోటే మరో ఇద్దరి ఆనవాళ్లు గుర్తించినట్టు తెలుస్తోంది. నేడు ఇద్దరి మృతదేహాలను వెలికి తీసే అవకాశం ఉంది.గత నెల 22న ఎస్ఎల్బీసీ సొరంగంలో చోటుచేసుకున్న ప్రమాదం కారణంగా ఎనిమిది మంది టన్నెల్లో చిక్కుకుపోయారు. అప్పటి నుంచి సొరంగంలో సహాయచర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం టీబీఎం ఆపరేటర్ గుర్ప్రీత్సింగ్ మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం, బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల పరిహారం అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించనున్నట్లు తెలిపారు.సహాయచర్యల్లో భాగంగా సొరంగం లోపల పేరుకుపోయిన మట్టి, టీబీఎం యంత్రం దిగువన డాప్లర్ సంకేతాలతో కొన్ని ప్రాంతాలను గుర్తించారు. కేరళకు చెందిన క్యాడవర్ డాగ్స్ (స్నిఫర్స్) కూడా పలువురి ఆనవాళ్లను పసిగట్టాయి. దీంతో, శనివారం రాత్రి సహాయక బృందాలు టీబీఎం ఎడమవైపు భాగంలో తవ్వుతుండగా ఆరు అడుగుల లోతులో మొదట కుడిచేతి వేళ్లు, చేతి కడియం కనిపించాయి. అధికారుల సూచనల మేరకు గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని వెలికితీశారు. దాదాపు 12 గంటల పాటు శ్రమించి మృతదేహాన్ని జాగ్రత్తగా వెలికితీశారు. ఇంజినీర్ ఆచూకీని కనుగొన్న ప్రాంతానికి కొంచెం అటూ ఇటూ మరో ముగ్గురి జాడ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈరోజు మరో ఇద్దరి జాడ లభించే అవకాశం ఉందని సహాయ బృందాలు తెలిపాయి. మిగిలినవారు సొరంగం చిట్టచివరి భాగం వద్ద టీబీఎం కట్టర్ సమీపంలో చిక్కుకుని ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.మూడేళ్లుగా గుర్ప్రీత్సింగ్ విధులు ఎస్ఎల్బీసీ సొరంగంలో మృతదేహం లభ్యమైన గుర్ప్రీత్సింగ్ స్వస్థలం పంజాబ్ రాష్ట్రంలోని తరన్తరాన్. రాబిన్స్ సంస్థలో 2022 నుంచి టీబీఎం ఆపరేటర్గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య రాజేందర్ కౌర్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్యాపిల్లలు స్వస్థలంలో ఉండగా.. గుర్ప్రీత్సింగ్ మూడేళ్లుగా దోమలపెంటలోని రాబిన్స్ క్యాంపులో ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. ప్రమాదం జరిగాక బంధువులు వచ్చి కొన్ని రోజులు వేచిచూశారు. ఆచూకీ తెలియకపోవడంతో స్వస్థలానికి వెళ్లిపోయారు. -
భర్త మటన్ కట్టింగ్.. ప్రియుడు కిరాణం షాపు.. చివరికి..
సాక్షి, నాగర్ కర్నూల్/మహబూబ్నగర్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపించిన భార్య కటకటాల పాలైంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలను శుక్రవారం విలేకరుల సమావేశంలో వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వర్రావు వెల్లడించారు. పాన్గల్కు చెందిన ఎండీ పర్వీన్బేగం 12 ఏళ్ల క్రితం ఏపీలోని కర్నూలుకు చెందిన ఎండీ రహమతుల్లాకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి సంతానం. వివాహమైన రెండేళ్లపాటు పాటు కర్నూలులోనే ఉండగా.. సంసారం విషయంలో గొడవలు వచ్చాయి. దీంతో పదేళ్ల క్రితమే భార్యాభర్తలు, పిల్లలు కలిసి ఆమె తల్లిగారి గ్రామమైన పాన్గల్కు వచ్చి సంతబజార్లో కిరాయి ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. భర్త రహమతుల్లా పెయింటింగ్, మటన్ కట్టింగ్ పనిచేస్తుండగా.. భార్య టైలర్ పనిచేస్తుంది. ఈ క్రమంలో పక్కనే ఉన్న కిరాణం షాపు నడుపుతున్న కుమ్మరి రాఘవేందర్(ఎ1)తో పరిచయం ఏర్పడి.. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం పసిగట్టిన రహమతుల్లా ఇరు కుటుంబ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. ఆ తర్వాత కూడా రహమతుల్లా తరుచుగా ఆమెను వేధించేవాడు. దీంతో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన వారు రహమతుల్లాను హత్య చేయడానికి నిర్ణయించారు. ఈ క్రమంలోనే రాఘవేంద్ర తనకు పరిచయం ఉన్న కురుమూర్తితో కలిసి ఒప్పందం కుదుర్చుకున్నారు. పథకం ప్రకారం ఈ నెల 1న తెల్లవారుజామున 4 గంటల సమయంలో కురుమూర్తిని రహమతుల్లా ఇంటికి పంపించి గొర్రెను కోసేది ఉంది అని చెప్పి వెంట తీసుకొని పాన్గల్ గ్రామ శివారులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని కేఎల్ఐ కాల్వ దగ్గరకు వెళ్లగా అప్పటికే రాఘవేంద్ర తన బైక్పై అక్కడికి వచ్చి హతమార్చారు. చదవండి: తెల్లారితే పెళ్లి.. అంతలోనే బలవన్మరణంరాఘవేంద్ర రహమతుల్లా గొంతు పిసకగా.. కురుమూర్తి అతని చేతులు పట్టుకున్నాడు. కొద్దిసేపటికి రహమతుల్లా మృతదేహం, అతని వెంట తెచ్చుకున్న కత్తిని పక్కనే ఉన్న కేఎల్ఐ కాల్వలో పడేసి రాఘవేంద్ర, కురుమూర్తి కలిసి మోటార్ సైకిల్పై వెళ్లిపోయారు. ఈ మేరకు నిందితులు ఉపయోగించిన మోటార్ సైకిల్, 3 సెల్ఫోన్లు స్వాదీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హత్య కేసులో ఎ1 కుమ్మరి రాఘవేంద్ర, ఎ2 ప్యాట కురుమూర్తి, ఎ3 పర్వీన్బేగంను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. కేసు ఛేదనలో ప్రతిభచూపిన వనపర్తి సీఐ కృష్ణ, స్థానిక ఎస్ఐ శ్రీనివాసులును, పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
SLBC: కాంక్రీట్లో కూరుకుపొయిన మృతదేహం గుర్తింపు
Slbc Tunnel Rescue Operation Updates:👉జీపీఆర్, కేడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాలలో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం తవ్వకాలు ముమ్మరం చేశారు. టీబీఎంకు ఎడమ పక్కన కనిపించిన ఓ మృతదేహానికి సంబంధించిన చేయిని గుర్తించారు. మృతదేహం పూర్తిగా కాంక్రీట్లో కూరుకుపోయింది. డ్రిల్లింగ్ ద్వారానే బయటికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నేడు రెస్క్యూ ఆపరేషన్లో 130 మంది నిపుణుల బృందం పాల్గొంటున్నారు.👉ఎస్ఎల్బీసీ టన్నెల్లో 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇంకా 8 మంది కార్మికుల జాడ తెలియలేదు. ఇక రోబోల వినియోగం తప్పదని అధికారులు అంటున్నారు. ఆ మేరకు చర్యలకు ఉపక్రమిస్తున్నారు. చివరి 50 మీటర్ల ప్రాంతంలో సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి. టెన్నెల్ ఎండ్ పాయింట్లో కీలక స్పాట్స్ను గుర్తించారు. కీలకమైన స్పాట్స్లో ర్యాట్ హోల్ మైనర్ల తవ్వకాలు చేపట్టారు. రెస్య్కూలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పాల్గొంటున్నారు.👉కాగా, ఎనిమిది మందిని గుర్తించేందుకు చేపడుతున్న సహాయక చర్యలకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇప్పటి వరకు 13.50 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లిన రెస్క్యూ బృందాలు మిగిలిన 50 మీటర్ల ముందుకు వెళ్లడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. సొరంగంలోకి నీటి ఊట వేగంగా వస్తుండటంతో ప్రత్యేక మోటార్ల ద్వారా నీటిని బయటికి తోడేస్తున్నారు. 👉కన్వేయర్ బెల్ట్ పూర్తిగా మరమ్మతు జరగడంతో.. పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. సొరంగంలో పేరుకుపోయిన మట్టి, బురద, రాళ్లు, టీబీఎం విడిభాగాలు (ఇనుము), ఊడిపోయిన కాంక్రీట్ సెగ్మెంట్లను తొలగించే రోబోలు తయారు చేసేందుకు కనీసం వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే రోబోలు సాయం వారం రోజుల తర్వాతే వినియోగంలోకి వస్తోంది. 👉ప్రమాదం జరిగిన సొరంగంలో పరిశోధన చేసేందుకు కేరళ నుంచి వచ్చిన కాడవర్ డాగ్స్ కూడా ఇది వరకు గుర్తించిన డాగ్స్ స్థానాల్లోనే గుర్తించాయి. 13.500 కి.మీ., అవుతల ఒకే దగ్గర ముగ్గురు వ్యక్తుల అవశేషాలు ఉన్నట్లు నిర్ధారించాయి. కారి్మకులు చిక్కుకున్నట్లు డాగ్స్ చూపించిన ప్రదేశాల్లో శనివారం రెస్క్యూ బృందాలు తవ్వకాలు ప్రారంభించాయి. టీబీఎం పరికరాలు గ్యాస్ కట్టర్తో కత్తిరించి లోకో ట్రైన్ ద్వారా సొరంగం బయటికి పంపించారు. కూలిపడిన పైకప్పు మట్టి దిబ్బలను హిటాచీతో ఒకవైపు తరలిస్తున్నారు. రోజుకో బృందాన్ని సింగరేణి నుంచి రప్పించి సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు. సొరంగంలో వస్తున్న దుర్వాసన సహాయక చర్యలకు ఇబ్బంది కలిగిస్తోంది.👉టన్నెల్లో జరిగిన ప్రమాదం జాతీయ విపత్తు అని, అందులో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి ప్రపంచంలోని అత్యుత్తమ సాంకేతికత ఉపయోగిస్తున్నామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. శనివారం టన్నెల్ను సందర్శించిన ఆయన రెస్క్యూ బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.👉సొరంగంలో చిక్కుకున్న కార్మికులను గుర్తించేందుకు ఇప్పటి వరకు జరిగిన పురోభివృద్ధి గురించి రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి అరవింద్కుమార్, ఆర్మీ కమాండెంట్ పరీక్షిత్ మెహ్రా మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సహాయక చర్యల్లో అవంతరాలను అధిగమిస్తూ వేగంగా ముందుకెళ్తున్నామని, సొరంగం లోపల ఆక్సిజన్ సరిగా లేకపోవడం, నీటి ఊట అధికంగా రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. 👉టీబీఎం దృఢమైన లోహ శకలాలు, రాళ్లు, మట్టితో కూరుకుపోయి ఇబ్బందులు ఉన్నప్పటికీ సహాయక చర్యలు కొనసాగించేందుకు ప్రభుత్వం కృతనిత్చయంతో ఉందన్నారు. రెస్క్యూ ఆపరేషన్లో పనిచేసే కారి్మకులకు, అధికారులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘనాథ్, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, మిలటరీ ఇంజినీర్ వికాస్సింగ్, ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ ప్రసన్నకుమార్, ఎస్డీఆర్ఎఫ్ కమాండెంట్ ప్రభాకర్, సింగరేణి, రైల్వే, ఎన్జీఆర్ఐ, హైడ్రా తదితర బృందాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్స్ పరిశ్రమలకు ప్రోత్సాహం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్స్ పరిశ్రమలకు అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తున్నామని కేంద్ర రైల్వే, ఐటీ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ అన్నారు. శనివారం మహబూబ్నగర్ నగర శివారులోని దివిటిపల్లి ఐటీ పార్కు ఆవరణలో అధునాతన టెక్నాలజీతో రూ.3,225 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కాను న్న నాలుగు పరిశ్రమలకు ఆయన శంకుస్థాపన చేశా రు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యుత్ వాహనాలకు ఎంతో డిమాండ్ ఉందన్నారు.వీటికి అవసరమ య్యే లిథియం అయాన్ గిగా బ్యాటరీలను తయా రు చేసే అమరరాజా కంపెనీకి దివిటిపల్లిలో మహి ళా దినోత్సవం రోజే శంకుస్థాపన చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ పరిశ్రమలతో వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఈసారి కేంద్ర బ డ్జెట్లో తెలంగాణకు రైల్వేశాఖ పరంగా రూ.5,337 కోట్లు కేటాయించామని, గత పదేళ్ల కంటే ఇది ఆరు రెట్లు ఎక్కువ అని తెలిపారు. అలాగే గత 11 సంవత్సరాల్లో మహిళలకు 10 కోట్ల వంటగ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని, 14 కోట్ల తాగునీటి కుళాయి కనెక్షన్లు మంజూరు చేశామని, 54 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిపించామని వివరించారు.ఇక్కడి ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని దివిటిపల్లి రైల్వే స్టేషన్ను ఆధునీకరిస్తామని చెప్పారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు మాట్లాడుతూ, తెలంగాణ బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేస్తామని పేర్కొన్నారు. పారిశ్రామికాభివృద్ధిలో మరింత ముందుకు వెళ్లేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో సెమీ కండక్టర్స్, ఇతర పరిశ్రమల అభివృద్ధికి అన్ని విధాలా సహకరించాలని ఆయన అశ్వినీవైష్ణవ్ను కోరారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల, మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి శంకుస్థాపన చేసిన పరిశ్రమలు ఇవే.. రూ.1,900 కోట్లతో నిర్మించే అమరరాజా గిగా ఫ్యాక్టరీ–1 మూడో దశ యూనిట్, రూ.800 కోట్లతో లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ (ఎల్ఎఫ్పీ) టెక్నాలజీతో బ్యాటరీలు, ఇతర కీలకమైన పదార్థాలను రూపొందించే (అల్ట్మిన్ ప్రైవేట్ లిమిటెడ్) ఫ్యాక్టరీ, రూ.502 కోట్లతో చేపట్టే వ్యర్థాల ప్రాసెసింగ్ (లోహమ్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్) కంపెనీ, రూ.23 కోట్లతో తలపెట్టిన ప్రత్యేక క్యాన్, క్యాప్లను తయారు చేసే (సెల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్) పరిశ్రమలు ఉన్నాయి. -
బ్యాటరీ, సెల్ టెక్నాలజీపై పరిశోధన
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ప్రస్తుతం బ్యాటరీ, సెల్ టెక్నాలజీపై పరిశోధనలు, అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినివైష్ణవ్ అన్నారు. శనివారం మధ్యాహ్నం మహబూబ్నగర్ నగర శివారులోని దివిటిపల్లి ఐటీ పార్కు ఆవరణలో మొత్తం రూ.3,225 కోట్లతో ఏర్పాటు చేయనున్న అమరరాజా గిగా ఫ్యాక్టరీ–1, అల్టమిన్, లోహం మెటీరియల్స్, ఎస్సెల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్లకు ఆయనతో పాటు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం కేంద్ర మంత్రి తన ప్రసంగాన్ని తెలుగులో ‘నమస్తే.. బాగున్నారా..!’ అని ప్రారంభించారు. ఈ సందర్భంగా పుష్ప సినిమాలోని ‘పుష్ప తగ్గేలే..’ డైలాగ్ను ప్రస్తావిస్తూ ‘దివిటిపల్లి అభివృద్ధి ఆగదు.. ఇక నిరంతర అభివృద్ధే..’ అని చెప్పా రు. ప్రధాని నరేంద్రమోదీ మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. ఇక్కడి అమరరాజా కంపెనీలో 80 శాతం మహిళలే పనిచేస్తుండటం అభినందనీయమన్నారు. కాగా మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల, కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ డి.జానకితో పాటు మహిళా ఉద్యోగులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని రకాలుగా అండగా ఉంటాం: మంత్రి శ్రీధర్బాబు సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వంపై విశ్వాసం ఉంచి పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ డి.శ్రీధర్బాబు అన్నారు. ఇటీవల దావోస్ సమ్మిట్లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వివిధ పెద్ద సంస్థలు సుమారు రూ.78 వేల కోట్లకు ఎంఓయూ కుదుర్చుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. వారికి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. ఇతర రాష్ట్రాలకు దీటుగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. దివిటిపల్లిలో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ) కోసం భూములిచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ధ్యేయమన్నారు. పరిశ్రమలను అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు. పెద్ద పరిశ్రమలు రావడానికి గ్రీన్ ఎనర్జీ పాలసీ అమలు చేస్తున్నామన్నారు. అమరరాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ, చైర్మన్ గల్లా జయదేవ్ మాట్లాడుతూ దివిటిపల్లిలో ఏర్పాటు చేస్తున్న గిగా ఫ్యాక్టరీ ద్వారా సుమారు 4,500 మందికి ప్రత్యక్షంగా, మరో పది వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. కార్యక్రమంలో మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర మైనారిటీ ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, టీజీఐఐసీ వీసీ అండ్ ఎండీ విష్ణువర్ధన్రెడ్డి, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్, పరిశ్రమల శాఖ జీఎం ప్రతాప్రెడ్డి, మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డి, ముడా చైర్మన్ కె.లక్ష్మణ్యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినివైష్ణవ్ సెమీ కండక్టర్స్ అభివృద్ధికి సహకరించాలి: మంత్రి శ్రీధర్బాబు దివిటిపల్లిలో 4 పరిశ్రమలకు శంకుస్థాపన -
జొన్నరొట్టెలతో జీవనోపాధి
బ్రహ్మణవాడికి చెందిన అలివేలమ్మకు భర్త యాదయ్యతో పాటు నలుగురు సంతానం ఉన్నారు. ఈమె 20 ఏళ్ల క్రితం శ్రీరాఘవేంద్ర మహిళా సంఘంలో సభ్యురాలిగా చేరి ప్రస్తుతం అధ్యక్షురాలిగా వ్యవహరిస్తోంది. మేసీ్త్ర పనిచేస్తున్న భర్త రెండేళ్ల క్రితం కాలు విరగడంతో ఇంటికే పరిమితమయ్యారు. అప్పటి నుంచి భార్య రాంనగర్ గ్రంథాలయానికి ఎదురుగా ఓ దుకాణానికి కిరాయికి తీసుకుని జొన్నరొట్టెలు అమ్ముతోంది. నిత్యం 80 నుంచి వంద వరకు అమ్ముతుండగా రూ.1,500 గిరాకీ వస్తోంది. వీటిని తయారీ చేసే మరో ముగ్గురు మహిళలకు ఉపాధి కల్పిస్తూ ఒక్కొక్కరికి రూ.200 చొప్పున చెల్లిస్తోంది. వీరు కూడా మహిళా సంఘాల సభ్యులే. ఇక పొదుపు నుంచి రూ.50 వేలు, సీ్త్రనిధి నుంచి రూ.లక్ష, బ్యాంకు లింకేజీ ద్వారా రూ.రెండు లక్షల చొప్పున రుణాలు తీసుకుంది. ప్రతినెలా కిస్తీలు క్రమం తప్పకుండా చెల్లిస్తూ వస్తోంది. అన్ని ఖర్చులు పోను రూ.10 వేలు సంపాదిస్తూ కుటుంబానికి ఎంతో ఆసరాగా ఉంటోంది. -
నేడు బీసీ రాజకీయ సదస్సు
స్టేషన్ మహబూబ్నగర్: జిల్లాకేంద్రంలో ఆదివారం నిర్వహించనున్న బీసీ రాజకీయ చైతన్య సదస్సును జయప్రదం చేయాలని, ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముఖ్యఅతిథిగా హాజరవుతారని బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంగెం సూర్యారావు అన్నారు. జిల్లాకేంద్రంలోని బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నేడు బీసీ భావజాలం బలంగా ఉందని, భవిష్యత్తులో మన ఓటు మనకే వేసుకొని బీసీ రాజ్యాధికారం సాధించుకుందామని పిలుపునిచ్చారు. బీసీ రాజకీయ సదస్సుకు బీసీలు పెద్దలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్సాగర్ మాట్లాడుతూ రాజకీయ సదస్సులో ఉమ్మడి జిల్లాలోని బీసీలందరూ హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సమాజ్ నల్గొండ జిల్లా కన్వీనర్ బొడ్డుపల్లి చంద్రశేఖర్, దేవరకద్ర నియోజకవర్గ కన్వీనర్ బి.శేఖర్, భూత్పూర్ కన్వీనర్ ఆంజనేయులుసాగర్ తదితరులు పాల్గొన్నారు. -
నెలకు సుమారు రూ.లక్ష ఆదాయం
కోయిలకొండ మండలం సూరారానికి చెందిన అనసూయ, కేశవులు దంపతులకు ముగ్గురు సంతానం ఉన్నారు. పొట్టకూటి కోసం 2008లో మహబూబ్నగర్లోని హౌసింగ్ బోర్డు కాలనీకి మకాం మార్చారు. ఈమె ఆరాధన మహిళా సంఘంలో చేరి పొదుపు చేయసాగింది. 2020లో స్థానికంగా రెండు షెట్టర్లను రూ.3,500కు అద్దెకు తీసుకుని ఎంబ్రాయిడరీ, టైలరింగ్, గాజులు, చీరల దుకాణం ఏర్పాటు చేసుకుంది. ఇప్పటివరకు రూ.10 లక్షలకు పైగానే పెట్టుబడి పెట్టింది. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్, పీకో మిషన్, కుట్టుమిషన్లు కొనుగోలు చేసింది. తొమ్మిది నెలల క్రితం పొదుపు నుంచి రూ.లక్ష, నాలుగు నెలల క్రితం రూ.50 వేలు అప్పుగా తీసుకుని క్రమం తప్పకుండా కిస్తీలు చెల్లిస్తోంది. బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి నుంచి సైతం రుణాలు తీసుకుంది. సీజన్లో ప్రతిరోజూ రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు గిరాకీ అవుతుండటంతో అన్ని ఖర్చులు పోను నెలకు సుమారు రూ.లక్ష ఆదాయం వస్తోందని ఆమె చెబుతున్నారు. ● 3 మున్సిపాలిటీల పరిధిలో3,781 మహిళా గ్రూపులు ● 15 ఏళ్ల క్రితం సుమారు రూ.50 లక్షలతో ప్రారంభం ● పెద్ద, చిన్న సంఘాలతో కలిపి రూ.54.35 కోట్లకు చేరిక -
రేషన్ బియ్యం పట్టివేత
జడ్చర్ల: మండలంలోని నసరుల్లాబాద్ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు. వివరాలు.. నసరుల్లాబాద్లోని రేషన్ డీలరు అన్వర్ పాష నిర్వహిస్తున్న రేషన్ దుకాణం దగ్గర ఓ బొలెరో వాహనంలో 40బస్తాల రేషన్ బియ్యం ఉండగా గ్రామస్తులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో ఎస్ఐ జయప్రసాద్ వెంటనే గ్రామానికి చేరుకొని సివిల్ సప్లయ్ అధికారులకు సమాచారమిచ్చి వాహనాన్ని పోలీస్స్టేషన్కు తరలించారు. వాహనంలో మొత్తం 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసల్దార్ ఆదిత్యగౌడ్ వివరాలు సేకరించి పంచనామ నిర్వహించారు. నసరుల్లాబాద్కు చెందిన కురుమూర్తి రేషన్ బియ్యాన్ని సేకరించి తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. డ్రైవర్ రాజును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. 25 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత లింగాల: స్థానిక ఎస్సీ వాడలో ఉన్న కమ్యూనిటీ భవనంలో అక్రమంగా తరలించుటకు నిల్వ ఉంచిన 25 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని శనివారం స్వాధీన పర్చుకున్నట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు. వివిధ రేషన్ షాపుల ద్వారా అక్రమంగా కొనుగోలు చేసిన బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలించుటకు సిద్ధంగా ఉంచినట్లు సమాచారం అందింంది. అచ్చంపేట సీఐ రవీందర్ ఆకమ్యూనిటీ భవనాన్ని పరిశీలించి బియ్యాన్ని స్వాధీనం చేసుకొని సివిల్ సప్లై అధికారులకు సమాచారమిచ్చినట్లు ఎస్ఐ తెలిపారు. -
పొదుపు సంఘంలో తక్కువ వడ్డీ
నేను 25 ఏళ్లుగా మహి ళా సంఘంలో సభ్యురాలిగా ఉంటున్నాను. సుమారు పదేళ్లుగా గ్రైండింగ్ షాపు నిర్వహిస్తున్నాను. మూడేళ్ల క్రితం పొదుపు సంఘం నుంచి రూ.లక్ష అప్పు తీసుకుని ప్రతినెలా కిస్తీలు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాను. కేవలం రూపాయి మిత్తీ మాత్రమే పడుతుండటం ఎంతో వెసులుబాటు కలిగింది. అదే బయట ప్రైవేట్ వ్యక్తుల వద్ద అయితే రూ.3 వడ్డీకి అప్పు తీసుకోవాల్సి ఉండేది. హోల్సేల్ షాపుల వారు కొబ్బరి, ఆవాలు, వివిధ రకాల దినుసులకు పొడుల కోసం తీసుకొచ్చి గ్రైండింగ్ పట్టిస్తుండటం కలిసి వచ్చింది. మరో ఇద్దరు మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాను. అన్ని ఖర్చులు పోను నెలకు రూ.30 వేలు మిగులుతుంది. – ఎ.పద్మ, జైసంతోషిమాత మహిళా సంఘం సభ్యురాలు, రాంనగర్ టైలరింగ్ యూనిట్స్థాపించా.. మహిళా సంఘంలో 2005 నుంచి సభ్యురాలిగా కొనసాగుతున్నా ను. ఇంటి వద్ద 2018 లో టైలరింగ్ యూనిట్ స్థాపించాను. ప్రభుత్వపరంగా హాస్టళ్లు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు సంబంధించి యూనిఫాం ఆర్డర్లు వస్తున్నాయి. క్లాత్ కటింగ్ చేసే మిషన్లు ఏర్పా టు చేసుకున్నాను. స్టిచ్చింగ్ కోసం మహిళా సంఘాల సభ్యులకు ఇంటి వద్దకే ఇస్తున్నాను. వీటితో పాటు ఆఫ్రాన్, గాగ్రా, పెట్టికోట్స్, ప్యాంటీ తయారు చేయించి అమ్ముతున్నాను. పొదుపు సంఘంతో పాటు అవసరమైనప్పుడు బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి ద్వారా రుణాలు తీసుకుని కిస్తీలు చెల్లిస్తున్నాను. – సౌధామిని, మైసమ్మ మహిళా సంఘం సభ్యురాలు, శ్రీనివాసకాలనీ ●