breaking news
Mahabubnagar
-
ప్యాషన్ప్లస్ బైక్లో కట్లపాము
నాగర్కర్నూల్ జిల్లా: మండలంలోని ఎల్లూరుకుకి చెందిన యువకుడు గణేశ్ బైక్లో కట్లపాము దాక్కుంది. ఎల్లూరు నుంచి కొల్లాపూర్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు గణేశ్ ప్యాషన్ప్లస్ బైక్పై గురువారం ఉదయం భయలుదేరాడు. పట్టణంలోని ద్వారకా లాడ్జ్ ముందు రోడ్డుపై వెళ్తుండగా బైక్ ముందు భాగంలో ఏదో కదులుతున్నట్లు కనిపించింది. అనుమానం వచ్చి బైక్ను ఆపుకొని చూడగా కట్ల పాము కనిపించింది. దాన్ని భయటకు తీసేందుకు కొద్దిసేపు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో సమీపంలోని మెకానిక్ షాపు వద్దకు తీసుకెళ్లాడు. మెకానిక్ సద్దాం బైక్ పార్ట్స్ విప్పి పామును భయటికి లాగాడు. ఈ పాము దాదాపు మూడున్నర ఫీట్ల మేర పొడవు ఉంది. రాత్రి ఇంటిముందు పార్కుచేసిన సమయంలో బైక్లోకి పాము ఎక్కి ఉండొచ్చని గణేశ్ చెప్పాడు. పామువల్ల ఎటువంటి ప్రమాదం సంభవించకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. -
అనారోగ్యంతో కేజీబీవీ విద్యార్థి మృతి
● ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే! ● బాధిత కుటుంబ సభ్యుల నిరసన ● విచారణ చేస్తామన్న ఎస్ఐ నరేష్, డీటీ లక్ష్మీకాంత్ ఖిల్లాఘనపురం: మండల కేంద్రంలోని తెలుగు మీడియం కస్తూర్బాగాంధీ పాఠశాలకు చెందిన ఓ విద్యార్థి అనారోగ్యంతో ఈ నెల 17న మృతి చెందింది. పాఠశాల ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె మృతి చెందిందని విద్యార్థి తల్లిదండ్రులతో పాటుగా కుటుంబ సభ్యులు గురువారం పాఠశాల ఆవరణలో ఆందోళనకు దిగారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖిల్లాఘనపురం మండలంలోని కోతులకుంటతండాకు చెందిన కెతావత్ శ్రీను, కవిత బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లారు. వారి కుమార్తె జ్యోతి మండల కేంద్రంలోని తెలుగు మీడియం కస్తూర్బాగాంధీ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. జ్యోతితో పాటుగా పాఠశాలలోని 11 మంది ఈ నెల 8న అనారోగ్యం పాలవడంతో పాఠశాల అటెండర్ అనురాధ వారిని మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. జ్యోతికి జ్వరం ఎక్కువగా ఉందని వైద్యసిబ్బంది గ్లూకోజ్ పెట్టడంతో పాటుగా మొత్తం 11 మందికి మందులు ఇచ్చారు. విషయాన్ని జ్యోతి కుటుంబ సభ్యులకు చెప్పడంతో విద్యార్ధినికి అన్న వరసయ్యే జగదీష్ వచ్చి విద్యార్థిని ఇంటికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో విద్యార్థినికి తెల్ల పసరికలు వచ్చాయని తేలడంతో మొదట బిజినేపల్లికి, మహబూబ్నగర్ ఎస్వీఎస్ ఆస్పత్రి, హైదరాబాద్లోని ఆకృతి ఆస్పత్రి, యశోద ఆస్పత్రిలో చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఈ నెల 17న గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. ఈ క్రమంలో తమ కుమార్తె అనారోగ్యం పాలైన సరైన సమయంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే చనిపోయింది శుక్రవారం బాధిత కుటుంబ సభ్యులు పాఠశాల ఆవరణలో ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ నరేష్, డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మీకాంత్ పాఠశాల వద్దకు చేరుకుని వారితో మాట్లాడారు. పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని, ఉపాధ్యాయుల నిర్లక్ష్యం ఉంటే చర్యలు ఉంటాయని చెప్పడంతో విద్యార్థి బట్టలు, పుస్తకాలు తదితర వస్తువులు తీసుకుని కుటుంబ సభ్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. రిజిస్టర్లో నమోదు చేయలే.. ఎస్ఐ నరేష్, డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మీకాంత్ విద్యార్థి పాఠశాల నుంచి ఎప్పుడు వెళ్లిందని రిజిస్టర్లో పరిశీలించగా.. ఎవరు తీసుకెళ్లారు, ఏ రోజు వెళ్లిందనే ఎలాంటి వివరాలు నమోదు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. దీంతో ప్రిన్సిపాల్ ప్రశాంతి, ఉపాధ్యాయుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ప్రతి విద్యార్థి పాఠశాల నుంచి ఎప్పుడు, ఎవరితో బయటకు వెళ్లిందని, తిరిగి తీసుకొచ్చిన వివరాలు పూర్తిస్థాయిలో నమోదు చేయాలని ప్రిన్సిపాల్కు సూచించారు. -
జూరాలకు 3.65 లక్షల క్యూసెక్కుల వరద
ధరూరు: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు గురువారం వరద ఉధృతి మరింత పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. బుధవారం 2.92 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. గురువారం రాత్రి 8 గంటల సమయంలో 3.65 లక్షల క్యూసెక్కులకు పెరిగినట్లు వివరించారు. దీంతో ప్రాజెక్టు 41 క్రస్ట్గేట్లు పైకెత్తి 3,80,365 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఆవిరి రూపంలో 40 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 550, కుడి కాల్వకు 320 క్యూసెక్కులు వినియోగిస్తున్నట్లు వివరించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 5.885 టీఎంసీలు ఉన్నట్లు తెలిపారు. పెరిగిన వరద.. నిలిచిన విద్యుదుత్పత్తి... ఆత్మకూర్: జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండటంతో దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిలిపివేసినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. అత్యధికంగా వరద వస్తుండటంతో ఉత్పత్తి సాధ్యం కాదని ఇప్పటి వరకు 533.580 మి.యూ ఉత్పత్తి విజయవంతంగా చేపట్టామన్నారు. కోయిల్సాగర్ రెండు గేట్ల ఎత్తి.. దేవరకద్ర: కోయిల్సాగర్ జలాశయం రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. బుధవారం భారీగా వరద రావడంతో 5 గేట్లను ఎత్తగా.. గురువారం ఉదయం తగ్గడంతో రెండు గేట్ల ద్వారా, సాయంత్రం ఇన్ఫ్లో మరింత తగ్గడంతో ఒక గేటు నుంచి నీటి విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగా.. ప్రస్తుతం 32 అడుగులు ఉంది. 41 క్రస్ట్గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల -
జూరాల ప్రాజెక్టు సందర్శించిన సీఈ
● తెగిన రోప్ల ప్రాంతాన్ని పరిశీలించిన వైనం ● కొత్త రోప్లను బిగించేందుకు చర్యలు ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టును ఇరిగేషన్ సీఈ నాగేందర్రావు సందర్శించారు. గురువారం సాయంత్రం ఆయన పీజేపీ ఎస్ఈ రహీముద్దీన్తో కలిసి ప్రాజెక్టు వద్దకు చేరుకుని ప్రాజెక్టుకు వస్తున్న వరద వివరాలను తెలుసుకున్నారు. గేట్ల వద్ద వరద ప్రవాహాన్ని పరిశీలించారు. తెగిన క్రస్టు గేట్ల రోప్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పైభాగం నుంచి తెగిన రోప్లను పరిశీలించారు. ప్రతి ఐదేళ్లకు ఒక సారి రోప్లను మార్చాలని, తెగిన రోప్ల స్థానంలో కొత్త రోప్లను బిగించాలని ఆదేశించారు. ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద ప్రవాహం వస్తున్న నేపథ్యంలో మున్ముందు మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం వస్తే ఇబ్బంది పడకుండా ముందు జాగ్రత్తగా రోప్లను బిగించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఫ్లడ్ కంట్రోల్ రూం వద్దకు చేరుకుని ఎగువ నుంచి ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలను తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ప్రాజెక్టు నుంచి ఎంత మేర నీటిని దిగువకు విడుదల చేశారనే సమాచారం తెలుసుకున్నారు. వరదల సమయంలో ప్రాజెక్టు వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు. సందర్శకులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం గద్వాలకు వెళ్లిపోయారు. కార్యక్రమంలో గేట్స్ డివిజన్ ఈఈ కెబేర్ అహ్మద్, ఏఈలు, ఏఈలు ఉన్నారు. -
మన కలెక్టరేట్ భద్రమేనా..?
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లా అధికారుల సమీకృత భవనం(కలెక్టరేట్)లోని కొన్ని గదుల్లో పీఓపీ ఊడి పడడం, భవనానికి అక్కడక్కడ పర్రెలు రావడం చూస్తుంటే మన కలెక్టరేట్ భవనం భద్రమేనా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ భవనం నిర్మించి మూడేళ్లు కూడా పూర్తి కాలేదు.. అప్పుడే చిన్నపాటి వానలకు కురవడంతో ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలన్ని ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు గత ప్రభుత్వం ప్రతి జిల్లాకు జిల్లా అధికారుల సమీకృత భవనాలను నిర్మించింది. మహబూబ్నగర్ జిల్లా పాత కలెక్టరేట్ ఉండగా కొత్త కలెక్టరేట్ను జిల్లా కేంద్రంలోని పాలకొండ శివారులో నిర్మించారు. ఈ కొత్త కలెక్టరేట్ భవనం 2017 డిసెంబర్లో శంకుస్థాపన చేసి 2022 డిసెంబర్ 4వ తేదీన అప్పటి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. 2023 అగస్టులో కురిసిన వానలకు భవనం ముందు భాగంలో వాన నీరు దిగువకు కారగా.. ఇంత నాసీరకంగా పనులు చేయడం ఏంటని, ఆర్అండ్బీ అధికారులు సరిగ్గా పర్యవేక్షించలేదనే విమర్శలు వినిపించాయి. దీంతో హుటాహుటీన అధికారులు స్పందించి కలెక్టరేట్ భవనం ముందు, వెనుక భాగంలో మరమ్మతులు చేపట్టారు. మహబూబ్నగర్ కలెక్టరేట్లోని ఈఈ చాంబర్లో ఊడిపడిన పీఓపీ 18 ఎకరాలు.. రూ.55.5 కోట్లతో నిర్మాణం 18 ఎకరాల్లో రూ.55.5 కోట్ల వ్యయంతోకలెక్టరేట్ను నిర్మించారు. ఇందులో మొత్తం 34 శాఖలు ఒకే చోట పాలన అందిస్తున్నాయి. మొదటి అంతస్తులో 13 శాఖలతో పాటు మంత్రికి (స్టేట్ చాంబర్ పేరుతో) ప్రత్యేక చాంబర్ కేటాయించారు. రెండవ అంతస్తులో 15 శాఖతో పాటు 31 మంది కూర్చునేలా మీటింగ్ హాల్ ఏర్పాటు చేశారు. పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం కొత్త జిల్లాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఒక్క భవనంలో ఏర్పాటు చేయాలని భావించింది. అందులో భాగంగా ప్రతి జిల్లా కేంద్రంలో కొత్త కలెక్టరేట్ భవనాలను నిర్మించింది. ఇన్ని రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన భవనం అప్పుడే మరమ్మతులకు గురవడం, పీఓపీ ఊడిపడడం, విద్యుత్ లేని సమయంలో లిఫ్ట్ పనిచేయకపోవడంపై అటు ప్రజలు, ఇటు ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆర్అండ్బీ ఈఈ చాంబర్లో ఊడిపడిన పీఓపీ ఉద్యోగులకు తప్పిన ప్రమాదం చిన్నపాటి వానకు అక్కడక్కడ కురుస్తున్న వైనం -
కోర్టుకు హాజరైన తేజేశ్వర్ హత్య కేసు నిందితులు
గద్వాల క్రైం: జూన్17న గద్వాల పట్టణంలోని గంటవీధికి చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ సుపారీ గ్యాంగ్ చేతిలో దారుణహత్యకు గురైన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం విధితమే. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న నిందితులు ఏ1 తిరుమలరావు, ఏ2 ఐశ్వర్య అలియాస్ సహస్ర, ఏ3 కుమ్మరి నగేష్, ఏ4 చాకలి పరశురాముడు, ఏ5 చాకలి రాజు, ఏ6 ఎ.మోహన్, ఏ7 తిరుపతయ్య (తిరుమలరావు తండ్రి), ఏ8 సుజాతలను గద్వాల జూనియర్ సివిల్ కోర్టు నాయ్యమూర్తి ఉదయ్నాయక్ ఎదుట పోలీసులు గురువారం ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో కేసుకు సంబంధించిన వాదనలు వినిపించేందుకు న్యాయవాదులను నియమించుకున్నారా.. అని నిందితులను న్యాయమూర్తి ప్రశ్నించారు. అనంతరం నిందితులకు మరో 14 రోజుల పాటు రిమాండ్కు ఆదేశాలు జారీ చేయగా.. పోలీసులు వారిని జైలుకు తరలించారు. ఏ7 తిరుపతయ్య మాత్రం బెయిల్ మీద ఉన్నాడు. -
ప్రమాదవశాత్తు కుంటలో పడి వ్యక్తి మృతి
లింగాల: చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కుంటలో పడి వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని వల్లభాపూర్లో చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకటేశ్వర్గౌడ్ తెలిపిన వివరాలిలా.. వల్లభాపూర్కు చెందిన పిట్టల లక్ష్మయ్య(65) ఈ నెల 17న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు పలు ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. అయితే, గురువారం గ్రామ శివారులోని జంబులమ్మ కుంటలో లక్ష్మయ్య మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి వచ్చి పరిశీలించారు. చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కుంటలో పడి మృతిచెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతునికి భార్య రాములమ్మ, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య రాములమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య నవాబుపేట: కుటుంబంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన చెంచు రాజు(34) కొంతకాలంగా ఎలాంటి పనులు చేయకుండా మద్యం తాగి తిరుగుతుండేవాడు. భార్య కూలిపనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు అయ్యేవి. ఈ క్రమంలో మనస్థాపం చెందిన రాజు బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపులు వేసుకొని ఇంటిపైకప్పుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూలిపనికి వెళ్లిన భార్య లక్ష్మమ్మ ఇంటికొచ్చి చూడగా వేలాడుతున్న భర్త మృతదేహం కనిపించింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి మానవపాడు: ీఫట్స్ ట్యాబ్టెట్స్ ఎక్కువగా మింగి వ్యక్తి సృహ కోల్పోయి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందిన ఘటన మండలంలోని చెన్నిపాడులో చోటచేసుకుంది. ఎస్ఐ చంద్రకాంత్ కథనం ప్రకారం.. మానవపాడు మండలంలోని చెన్నిపాడుకు చెందిన ఉల్చా శ్రీరాములు(50) పెళ్లి అయిన నాటినుంచి ఫిట్స్ వస్తుండేవి. రెండేళ్లుగా మతిస్థిమితం లేకుండా ఉన్నాడు. అందుకు కర్నూల్ ప్రభుత్వ ఆరోగ్యకేంద్రంలో సైకియాట్రిస్ట్ దగ్గర చికిత్స పొందుతూ మందులు వాడుతున్నాడు. ఈనెల 20వ తేదీన ఉదయం భార్య కంగాలమ్మ కూలి పనులకు వెళ్లగా.. ఇంట్లో ఎవరూలేని సమయంలో శ్రీరాములు ఫిట్స్ వాడే ట్యాబ్లెట్లు అధిక మోతాదులో తీసుకోవడంతో స్రృహ కోల్పోయాడు. భార్య సాయంత్రం పనినుంచి ఇంటికి వచ్చి చూసి శ్రీరాములును కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స నుంచి కోలుకోలేక గురువారం రాత్రి మృతిచెందాడు. భార్య కంగాలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. చెరువులో పడి వ్యక్తి మృతి వనపర్తి రూరల్: చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన వనపర్తి పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ హరిప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని రాయిగడ్డ కాలనీకి చెందిన జానంపేట రమేష్ (36) బుధవారం రాత్రి పట్టణంలోని నల్ల చెరువు వద్ద కావలి ఉండడానికి వెళ్లాడు. గురువారం ఉదయం రమేష్ చెరువు అలుగు వద్ద బురదలో పడి ఉండడాన్ని చూసిన తోటి కావలి వారు వెంటనే ప్రభుత్వ ఆసుపతికి తీసుకెళ్లారు. డాక్డర్ పరిక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి భార్య జానంపేట రేణుక చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. హత్యాయత్నం కేసులో ఇద్దరికి రిమాండ్ గద్వాల క్రైం: ఈ నెల 18న పౌరహక్కుల నేత పై ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేసిన సంఘ టనపై మల్దకల్ పోలీసులు గురువారం ఉద యం అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. డీఎస్పీ మొగిలయ్య కథనం మే రకు.. మల్దకల్ మండలం ఎల్కూర్ గ్రామా నికి చెందిన పౌరహక్కుల నేత మహేష్కు అదే గ్రామానికి చెందిన బోయనీలి బీసన్న, బో యనీలి పాండులకు పలు విషయాలపై గొ డవలు ఉన్నాయి. ఈ క్రమంలో గత నాలు గు రోజుల క్రితం గ్రామంలో టీ స్టాల్ వద్ద మహేష్ టీ తాగుతుండగా ఇద్దరు వ్యక్తులు పాత కక్షలు మనస్సులో పెట్టుకుని కత్తితో దాడి చేశారు. ఈ సంఘటనపై అదేరోజు మ ల్దకల్ పోలీసుస్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ, హత్యాయ త్నం కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను గురువారం ఉద యం అరెస్టు చేసి విచారణ చేపట్టడంతో నే రం అంగీకరించారు. నిందితులను గద్వాల కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. -
నేరాలే ప్రవృత్తిగా.. దొంగతనాలే పనిగా..
వనపర్తి: నేరాలను ప్రవృత్తిగా మార్చుకుని దొంగతనాలు చేస్తున్న ఓ వ్యక్తిని వనపర్తి పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నేరస్తుడి వివరాలు మీడియాకు వెల్లడించారు. ఉదయం జిల్లా కేంద్రంలోని మర్రికుంట సమీపంలో రూరల్ ఎస్ఐ, సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా, ఓ వ్యక్తి బైక్కు సంబంధించిన పత్రాలు లేకపోవడంతో స్టేషన్కు తరలించారు. తమదైన శైలీలో విచారించగా దొంగతనాలు చేస్తున్నట్టు ఒప్పుడుకున్నాడు. పాన్గల్ మండలం బుసిరెడ్డిపల్లికి చెందిన మీనుగ రమేష్ కొంత కాలంగా దొంగతనాలు చేయడం ప్రవృత్తిగా మార్చుకుని జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో చోరీలు చేస్తున్నట్టు ఒప్పుకున్నాడు. అతని బైక్లో దొంగతనానికి వాడే వస్తువులతో పాటు అతని నుంచి రూ.11.43 లక్షల నగదు, 30గ్రాముల బంగారం, బైక్ను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. నేరస్తుడిని పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన వనపర్తి సీఐ కృష్ణయ్య, వనపర్తి రూరల్ ఎస్ఐలు జలంధర్ రెడ్డి, వేణుగోపాల్, పోలీసు కానిస్టేబుళ్లు రఫి, ఆంజనేయులు, నవీన్గౌడ్లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి నగదు రివార్డు అందజేశారు. -
విద్యుత్ కార్మికుల పక్షాన పోరాడుతం
● 1104 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబ ● ట్రాన్స్కో రీజినల్(ఉమ్మడి జిల్లా) అధ్యక్షుడిగా రఘువీర్రెడ్డి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): విద్యుత్ కార్మికుల పక్షాన యూనియన్లు నిరంతరం పోరాటం చేయాలని విద్యుత్ ఉద్యోగుల 1104 యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబ అన్నారు. గురువారం స్థానిక యూనియన్ కార్యాయలంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులకు ఎలాంటి కష్టం వచ్చినా వారి తరఫున పోరాటం చేయాలన్నారు. కార్మికుల హక్కులను కాపాడిన రోజే యూనియన్లకు మనుగడ ఉంటుందన్నారు. అనంతరం ట్రాన్స్కో రిజినల్(ఉమ్మడి జిల్లా)కమిటీని ఎన్నుకున్నారు. ట్రాన్స్కో రిజినల్(ఉమ్మడి జిల్లా) జిల్లా అధ్యక్షుడిగా రఘువీర్రెడ్డి, రీజినల్ సెక్రటరీగా రాఘవేందర్గౌడ్, రీజినల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా జితేందర్రెడ్డి, రీజనల్ అడిషనల్ సెక్రటరీగా స్వామిగౌడ్, రీజినల్ ఉపాధ్యక్షులుగా స్వాతి, శివకుమార్, రీజినల్ ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా సీహెచ్ చెన్నయ్య, ఎండీ ఇక్బాల్, రీజినల్ అసిస్టెంట్ సెక్రెటరీగా సత్యనారాయణ, రీజినల్ ట్రెజరర్గా ఎండీ మక్సూద్అలీ ఎన్నికయ్యారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు రఘువీర్రెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్శాఖ ఉద్యోగులు, కార్మికులకు తాము అండగా ఉంటామని, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషిచేస్తామన్నారు. కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగుల 1104 యూనియన్ జిల్లా అధ్యక్షుడు స్వామి పాల్గొన్నారు. -
వృద్ధుడి దారుణ హత్య
● ఘటన స్థలాన్ని పరిశీలించిన వనపర్తి ఎస్పీ ● ఆధారాల కోసం క్లూస్టీం, డాగ్ స్క్వాడ్ అన్వేషణ పాన్గల్: వనపర్తి జిల్లా పాన్గల్లో గురువారం ఎనుముల కిష్టయ్య (65)ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కుంటి కిష్టయ్య గొర్రెల బేరం చేస్తూ ఒంటరిగా జీవనం సాగిస్తుండేవాడు. బుధవారం బోనాల పండుగ సందర్భంగా గ్రామంలోని పెద్ద కోడలు వెంకటమ్మ ఇంటికెళ్లి భోజనం చేయగా ఫోన్ రావడంతో బయటకు వెళ్లాడు. రాత్రి ఇద్దరు వ్యక్తులు బైక్పై తీసుకొచ్చి ఇంటి వద్ద వదిలారు. ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు లోనికి ప్రవేశించి పప్పుగుత్తి, పదునైన ఆయుధంతో ముఖం, చేతులు, ఛాతిపై దాడి చేయడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. గురువారం ఉదయం అటుగా వెళ్తున్న ఓ మహిళ ఇంటి తలుపులు తెరిచి ఉండటం, కోతులు లోనికి వెళ్తుండటం చూసి పిలువగా ఎలాంటి స్పందన లేకపోవడంతో తలుపు దగ్గరకు వెళ్లి చూసింది. మంచంపై కిష్టయ్య ఎలాంటి కదలిక లేకుండా ఉండటంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. ఇద్దరు వ్యక్తులపై అనుమానం ఉన్నట్లు చిన్న కుమారుడు శివయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కృష్ణ వివరించారు. అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. ఘటనా స్థలాన్ని క్లూస్టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు ఆధారాలు సేకరించారు. ● ఎస్పీ రావుల గిరిధర్ ఘటనా స్థలాన్ని, ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలు, చుట్టుపక్కల పరిస్థితులను సిబ్బందితో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు. వివరాలు సేకరించి పలు సూచనలు చేశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేస్తున్నామని.. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. ఆయన వెంట డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ కృష్ణ, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, ఎస్ఐ శ్రీనివాసులు, సిబ్బంది ఉన్నారు. -
లైన్ల్లో నిలబడ్డా ఇవ్వట్లేదు..
రైతుకు అవసరం లేకున్నా అనవసరంగా ఎరువులు, పురుగు మందులను అంటగడుతున్నారు. ఆ డబ్బులతో ఇంకో యూరియా బస్తా కొనుక్కోవచ్చు. సొసైటీ నిర్వాహకులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. చేసేదేం లేక వారు చెప్పినట్టు కొంటున్నం. గతంలో కావాల్సినన్ని యూరియా బస్తాలను తీసుకెళ్లటోళ్లం. ఇప్పుడు కుటుంబం మొత్తం వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. తెల్లవారక ముందే లైన్లో ఉంటున్నా.. సరిపోను యూరి యా ఇవ్వట్లేదు. ఒకవైపు వ్యవసాయ పనులు ఆగుతుండగా, మరోవైపు పంటలు దెబ్బతింటున్నాయి. – గొల్ల మల్లయ్య, రైతు, ధర్మాపూర్ దొరకట్లేదు.. నాకు మూడెకరాల భూమి ఉంది. 20 రోజుల కిందట నాట్లు వేశాను. నాటేసిన 15 రోజుల్లోపే పొలానికి యూరియా వేస్తేనే పంట దిగుబడి వస్తుంది. వారం రోజులుగా యూరియా కోసం తిరుగుతున్నా.. దొరకటల్లేదు. అధికారులు స్పందించి రైతులకు సకాలంలో సరిపడా యూరియా ఇవ్వాలి. – వెంకటయ్య, రైతు, ఎదిర పది రోజులుగా తిరుగుతున్నా.. పది రోజులుగా యూరియా కోసం జిల్లా సహకార విక్రయ కేంద్రం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నాను. ఈ రోజూ కూడా పనులు మానుకుని విక్రయ కేంద్రం వద్దకు ఉదయం 5 గంటలకే వచ్చాను. ఆధార్ కార్డు మీద రెండు బస్తాలే ఇస్తామంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులతో ఆడుకుంటుంది. పంటలకు సకాలంలో ఎరువులు వేయకపోతే దిగుబడి రాదు. గత పదేళ్ల కాలంలో ఎప్పుడూ ఎరువుల కొరత లేదు. – చెన్నారెడ్డి, రైతు, గుడ్డి మల్కాపూర్ నెలాఖరులో 5వేల మెట్రిక్ టన్నులు జిల్లాలో ప్రస్తుతం 894 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉండగా.. ఈనెలాఖరుకు మరో 5,318 మెట్రిక్ టన్ను లు వస్తుంది. యూరియా నిల్వలను నిరంతరం పర్యవేక్షిస్తాం. ఆగస్టు మాసానికి 9,036 మెట్రిక్ టన్నులు అవసరం కాగా ఇప్పటి వరకు 3,718 మెట్రిక్ రైతులకు సరఫరా చేశాం. సన్న, చిన్నకారు రైతులకు ఎక్కువగా సరఫరా చేసేందుకు ప్రాధాన్యమిస్తున్నాం. అంతా ఒకేసారి కావాలంటే సరఫరా చేసేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. డీలర్లలో ఎవరైనా బ్లాక్ మార్కెట్కు తరలించినట్లు తేలితే చర్యలు తీసుకుంటాం. నానో యూరియాపై అవగాహన కల్పిస్తున్నాం. – బి.వెంకటేష్, డీఏఓ -
యూరియా ఇవ్వండి సారూ!
–8లో uమహబూబ్నగర్ (వ్యవసాయం): జిల్లావ్యాప్తంగా రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు సమృద్ధిగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో యూరియా వినియోగం అత్యవసరమైంది. దీంతో జిల్లాకేంద్రంతో పలు మండలాల్లో గురువారం ఎరువుల దుకాణాలు, సొసైటీల వద్ద బారులు తీరారు. పరిమితంగానే యూరియా ఇవ్వడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్ది మంది రైతులకే యూరియా లభించడంతో నిరాశతో వెనుదిరిగారు. సరిపడా నిల్వలు లేకపోవడంతో రైతులకు ఒకటి.. రెండు బస్తాలు అంటగట్టి వ్యాపారులు చేతులు దులుపుకుంటున్నారు. సరిపడా యూరియా రాలేదని అధికారులు చేతులెత్తేస్తున్నారు. జిల్లాలో వారం–పది రోజులుగా వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు ఈ సమయంలో యూరియా చల్లాల్సి ఉంటుంది. పంటల పచ్చదనంతో పాటు మొక్కల ఎదుగుదలకు యూరియా అవసరం ఉంది. కానీ ఇందుకు సరిపడా యూరియా నిల్వలను జిల్లాకు తెప్పించడంలో విఫలమయ్యారు. కేటాయింపు ఎక్కువ.. సరఫరా తక్కువ జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో ఇప్పటివరకు 2,67,352 ఎకరాల్లో వివిధ పంటలను రైతులు సాగు చేశారు. అందులో వరి 1,30,086 ఎకరాల్లో, పత్తి 78,107 ఎకరాల్లో, మొక్కజొన్న 35,894 ఎకరాల్లో, కంది 9,611 ఎకరాల్లో, జొన్న 13,550 ఎకరాల్లో, మిగతా జొన్న, పెసర ఇతర మెట్ట పంటలను సాగు చేశారు. సీజన్లో పత్తి, వరి పంటలకు రైతులు యూరియాను వినియోగిస్తున్నారు. జిల్లాకు ఈ వానాకాల సీజన్లో 38,783 మెట్రిక్ టన్నుల యూరియా వినియోగం ఉంటుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అయితే ఇప్పటివరకు 19,634 మెట్రిక్ టన్నుల యూరియాను ప్రభుత్వం కేటాయించింది. మరో 19,149 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రావాల్సి ఉంది. ఇప్పటివరకు ప్రభుత్వం సరఫరా చేసిన యూరియాను వ్యవసాయ సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాలకు, ప్రైవేట్ డీలర్లకు కేటాయించారు. సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాలు యూరియాను రైతులు వెంటవెంటనే కొనుగోలు చేస్తుండటంతో అక్కడ నాలుగు.. ఐదు రోజుల్లోనే యూరియా ఖాళీ అయింది. ఆలస్యమైతే అంతే సంగతి... యూరియా చల్లడం ఆలస్యమైతే పంట దిగుబడి తగ్గుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అందుకే యూరియా కోసం ఆరాటపడుతున్నారు. కాగా రైతులకు సరైన అవగాహన కల్పించడంలో అధికారుల వైఫల్యం ఉంది. విడతల వారీగా యూరియా వస్తుందని, కృత్రిమ కొరత లేదని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. అందుకే వరి పంటకు రెండో దఫా యూరియా వినియోగం కోసం ఇప్పటి నుంచే రైతులు తీసుకెళ్తున్నారు. ఫలితంగా ఈసారి యూరియా అవసరం ఉన్న వారికి నిరాశ తప్పడం లేదు. ఇలాంటి వాళ్లే రోడ్డెక్కుతూ ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుత వర్షాలకు యూరియా చల్లకుంటే పంటలు ఎర్రబారుతాయని, దిగుబడి తగ్గుతుందని ఎవరికి వారే రైతులు భావిస్తున్నారు. ఇందులో నిజనిజాలపై అధికారులు చైతన్యం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లాకు అవసరమైన యూరియా 38,783 మెట్రిక్ టన్నులు కేటాయించిన యూరియా 19,634 మెట్రిక్ టన్నులు అధికారులను వేడుకుంటున్న రైతాంగం దుకాణాలు, సొసైటీల వద్ద గంటల తరబడి నిరీక్షణ అయినా దొరకడం లేదంటున్నఅన్నదాతలు వరుస వర్షాలతో పెరిగిన డిమాండ్ తగినంత అందుబాటులో ఉంచడంలో యంత్రాంగం విఫలం చేతులెత్తేసిన వ్యాపారులు, అధికారులు -
జీజీహెచ్ సూపరింటెండెంట్గా రంగా ఆజ్మీరా
పాలమూరు: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్గా జనరల్ సర్జరీ విభాగం హెచ్ఓడీ డాక్టర్ రంగా ఆజ్మీరా గురువారం బాధ్యతలు తీసుకున్నారు. నారాయణపేట మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంపత్కుమార్సింగ్ కొత్త సూపరింటెండెంట్కు బాధ్యతలు అప్పగించారు. సంపత్కుమార్ నారాయణపేటకు బదిలీ అయిన తర్వాత అనస్తీషియా హెచ్ఓడీ డాక్టర్ మాధవి నెల రోజుల పాటు తాత్కాలిక సూపరింటెండెంట్గా కొనసాగారు. ప్రస్తుతం బాధ్యతలు తీసుకున్న డాక్టర్ రంగా ఆజ్మీరా 1995 నుంచి 2000 వరకు రాజాపూర్ పీహెచ్సీలో మెడికల్ ఆఫీసర్గా పని చేసిన చేశారు. పీజీ పూర్తి చేసి గాంధీ, ఉస్మానియాలో పనిచేశారు. ప్రొఫెసర్గా పదోన్నతి పొంది బదిలీపై మహబూబ్నగర్ జనరల్ సర్జరీ విభాగం హెచ్ఓడీగా వచ్చారు. సూపరింటెండెంట్గా బాధ్యతలు తీసుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రికి కొత్తగా లాప్రోస్కోపీ మిషన్ తీసుకొచ్చి సర్జరీలు చేస్తామన్నారు.ప్రైవేట్లో ల్యాప్రోస్కోపీ అయితే రూ.వేలు ఖర్చు అవుతాయని అలాంటి సర్జరీలు ఉచితంగా రోగులకు అందిస్తామన్నారు. అదే కోత ద్వారా అయితే రోగికి ఇబ్బందిగా ఉంటుందన్నారు. ఆధునిక పద్ధతుల్లో సర్జరీలు చేయడానికి పరికరాలు చాలా అవసరమన్నారు. ఆస్పత్రి పాత భవనం కావడం వల్ల ఆపరేషన్ థియేటర్లు, క్యాజువాలిటీ ఇతర చోట్ల వర్షం లీకేజీ అవుతుందని దానిపై దృష్టి పెట్టడంతో పాటు ఆస్పత్రిలో పేషెంట్ కేర్ బాగుందని, సర్జరీలు అవుతున్నాయని ఇంకా పెంచే విధంగా పని చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే, కలెక్టర్ సూచనలు, సహకారంతో రోగులకు ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా పని చేస్తానని తెలిపారు. కాగా కొత్త సూపరింటెండెంట్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం డాక్టర్ రంగా ఆజ్మీరాకు ఆస్పత్రిలో పనిచేసే అన్ని విభాగాల హెచ్ఓడీలు, వైద్యులు, సిబ్బంది శాలువలు కప్పి, పూలబొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. -
ధాన్యం సేకరణకు ముందస్తు కార్యాచరణ
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): వానాకాలంలో పండించే వరిధాన్యం సేకరణకు ముందస్తు కార్యాచరణ రూపొందించాలని అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ధాన్యం సేకరణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యవసాయశాఖ సమాచారం మేరకు జిల్లావ్యాప్తంగా 1,71,781 ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారని.. దాదాపు 4.60లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇందులో 3.60 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం, లక్ష మెట్రిక్ టన్నుల దొడ్డురకం ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు 3లక్షల మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నట్లు వివరించారు. ఈ మేరకు డీఆర్డీఓ ఆధ్వర్యంలో 110, డీసీఓ 79, మెప్మా ఒక కేంద్రంతో కలిపి మొత్తం 190 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ధాన్యం సేకరణకు అవసరమైన గన్నీ బ్యాగులు, మిల్లింగ్ సామర్థ్యం, స్టోరేజ్ తదితర వాటికి పక్కా ప్రణాళికలు రూపొందించుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులకు అదనపు కలెక్టర్ సూచించారు. జిల్లా పౌరసరఫరాల అధికారి గంప శ్రీనివాస్, మేనేజర్ రవినాయక్, జిల్లా సహకార అధికారి శంకరాచారి, మార్కెటింగ్ అధికారిణి బాలమణి, అడిషనల్ డీఆర్డీఓ శారద, వ్యవసాయశాఖ ఏడీ హైమావతి ఉన్నారు.చట్టాలను సద్వినియోగం చేసుకోవాలిజడ్చర్ల/జడ్చర్ల టౌన్: వృద్ధుల కోసం రూపొందించిన చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి ఇందిర సూచించారు. గురువారం జడ్చర్లలోని సీనియర్ సిటిజన్స్ ఫోరం కార్యాలయంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడారు. వృద్ధ తల్లిదండ్రులను అన్యాయానికి గురిచేసే వారి పై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. ఆస్తులను పిల్లల పేరున రిజిస్ట్రేషన్ చేసే సమయంలో తమ తదనంతరం అని పొందుపర్చాలని.. తద్వారా ఆస్తికోసమైన పిల్లలు తల్లిదండ్రుల బాగోగులు చూసుకుంటారని తెలిపారు. వృద్ధులకు న్యాయ సలహాలు అవసరమైతే తమను సంప్రదించాలని సూచించారు. జడ్చర్ల సీనియర్ సిటిజన్స్ ఫోరం చేస్తున్న కార్యక్రమాలను న్యాయమూర్తి ప్రశంసిస్తూ.. పలువురిని శాలువాలతో సత్కరించారు. అనంతరం రూరల్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ వృద్ధాశ్రమాన్ని న్యాయమూర్తి సందర్శించి వృద్ధులకు కల్పిస్తున్న వసతులను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ అధికారిణి జరీనాబేగం, ఫోరం అధ్యక్షుడు నయీమొద్దీన్, సభ్యులు శంకర్బాబు, ప్రకాశ్, వేణుగోపాల్, ఆశ్రమ నిర్వాహకుడు సంజీవ్ గుప్తా, తదితరులు పాల్గొన్నారు. -
అథ్లెట్లకు తిప్పలు..
ఉమ్మడి జిల్లాలో అందుబాటులో లేని సింథటిక్ ట్రాక్లు ●మెయిన్ స్టేడియంలో ఇప్పటికే అనేక క్రీడా సౌకర్యాలు ఉన్నాయి. సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ ఏర్పాటు చేస్తే క్రీడాకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సింథటిక్ ట్రాక్పై క్రీడాకారులు ప్రాక్టీస్ చేస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. – జి.శరత్చంద్ర, అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి, మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ కోసం రూ.10 కోట్లతో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు ప్రతిపాదనలు పంపాం. త్వరలో ట్రాక్ ఏర్పాటుకు సంబంధించి ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. సింథటిక్ ట్రాక్లో అంతర్జాతీయ స్థాయిలో సౌకర్యాలు ఉంటాయి. – ఎస్.శ్రీనివాస్, డీవైఎస్ఓ, మహబూబ్నగర్ సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ ఏర్పాటు వల్ల క్రీడాకారులకు మెరుగైన ప్రాక్టీస్ లభిస్తుంది. దీంతో జిల్లా క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దొచ్చు. సింథటిక్ ట్రాక్ కోసం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి దృష్టికి తీసుకెళ్తాం. – రమణ, జిల్లా అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి, నారాయణపేట మహబూబ్నగర్ క్రీడలు: ఉమ్మడి పాలమూరు జిల్లా క్రీడల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. జిల్లా నుంచి పలు క్రీడల్లో క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ఐదు చోట్ల ఖేలో ఇండియా సెంటర్లు, మహబూబ్నగర్లో వాలీబాల్ అకాడమీ, వనపర్తి పట్టణంలో హాకీ అకాడమీ ఉంది. ఉమ్మడి జిల్లాకు చెందిన క్రీడాకారులు అథ్లెటిక్స్లో పతకాలు సాధిస్తూ సత్తాచాటుతున్నారు. కానీ ఈ జిల్లాల్లో సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్లు లేకపోవడంతో చాలా మంది క్రీడాకారులు మట్టి గ్రౌండ్లోనే సాధన చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో 400 మీటర్ల 8 లైన్ల సింథటిక్ ట్రాక్ ప్రతిపాదనలకు సంబంధించి 2021 అక్టోబర్ 22న ఖేలో ఇండియా కేంద్ర పరిశీలన కమిటీ సభ్యులు పరిశీలించారు. స్టేడియం అంతా తిరిగి సింథటిక్ ట్రాక్ ఏర్పాటుకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై అంచనా వేశారు. అదే విధంగా మెయిన్ స్టేడియంలో 2023 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి పనులతో పాటు రూ.8కోట్ల నిధులతో చేపట్టనున్న సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అయితే ఇంత వరకు సింథటిక్ ట్రాక్ ఏర్పాటుపై ముందడుగు పడలేదు. దీంతో స్టేడియంలో ఉన్న మట్టి ట్రాక్పై అథ్లెట్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఐదు జిల్లాల్లో వందలాది మంది అథ్లెట్లు ఉమ్మడి జిల్లాలో ఎక్కడా ఊసే లేదు మెరుగైన క్రీడా శిక్షణకు ఇబ్బందులు ట్రాక్లు ఏర్పాటు చేయాలంటున్న క్రీడాకారులు సింథటిక్ ట్రాక్లు ఏర్పాటు అయితే ఔత్సాహిక క్రీడాకారులకు ఎన్నో మెరుగైన సౌకర్యాలు లభిస్తాయి. పరుగు పందెం పోటీల్లో క్రీడాకారుల్లో సరైన టైమింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ట్రాక్లపై నీళ్లు నిలిచే అవకాశం ఉండదు కాబట్టి వర్షాకాలంలో సైతం ఏ ఇబ్బంది లేకుండా అథ్లెట్లు సాధన చేసుకోవచ్చు. సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ల ఏర్పాటుతో జాతీయ, అంతర్జాతీయ టోర్నీలు జరిగే అవకాశం ఉంటుంది. -
‘కురుమూర్తి’లో పూర్తయిన బహిరంగ వేలం
చిన్నచింతకుంట: అమ్మాపురం కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించుకుందామని ఆలయ చైర్మన్ గోవర్దన్రెడ్డి, ఈఓ మదనేశ్వరెడ్డి అన్నారు. 2025–26 ఉత్సవాలకు సంబంధించి లడ్డు ప్రసాదం, కొబ్బరికాయలు, లైటింగ్, తలనీలాలు, కొబ్బరి చిప్పలు, పూజ సామగ్రి తదితర వాటి బహిరంగ వేగం బుధవారం ఆలయ ఆవరణలో నిర్వహించారు. లడ్డు ప్రసాదంను చిన్నకడుమూర్కు చెందిన వెంకట్రాంరెడ్డి రూ.46 లక్షలకు, తలనీలాలను మహబుబ్నగర్కు చెందిన రామన్గౌడ్ రూ.32 లక్షలకు, విద్యుత్ లైటింగ్ అమ్మాపురం గ్రామానికి చెందిన రవితేజ రూ.13.33 లక్షలకు, రంగుల రాట్నం హైదరాబాద్కు చెందిన జ్ఞానేశ్వర్ రూ.34.05 లక్షలకు కొబ్బరి చిప్పలు అల్లీపురం గ్రామానికి చెందిన ఆంజనేయులు రూ.4,06,200కు దక్కించుకున్నట్లు వారు వివరించారు. పూజా సామగ్రి, కొబ్బరికాయల విక్రయానికి సరైన పాట రానందున వాయిదా వేసినట్లు చెప్పారు. ఉత్సవాలు అక్టోబర్లో జరగనున్నాయని.. లక్షలాది మంది భక్తులు హాజరు కానున్నందున ఎలాంటి ఇబ్బదులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. పాటదారులు భక్తులకు నాణ్యమైన వాటిని విక్రయించాలని.. లేకుంటే తగిన చర్యలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ మాజీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, దేవరకద్ర మార్కెట్ కమిటీ చైర్మన్ కతలప్ప, ఆలయ కమిటీ సభ్యులు బాదం వెంకటేశ్వర్లు, భాస్కరాచారి, కమలాకర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. రూ.46 లక్షలు పలికిన లడ్డు ప్రసాదం -
ఆర్ఎంపీ క్లినిక్ సీజ్
గట్టు: మండలంలోని తుమ్మలచెరువుకు చెందిన పల్లె య్య, చిట్టెమ్మ దంపతుల మూడో కుమార్తె సంజు(5) మృతికి కారణమైన ఆలూరులో ఆర్ఎంపీ నర్సింహ నిర్వహిస్తున్న క్లినిక్ను జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు సీజ్ చేశారు. ఆరోగ్య శాఖ అధికారులు డాక్టర్ ప్రసూనరాణి, డాక్టర్ కిరణ్మయి, మెడికల్ అధికారులు బుధవారం ఆలూరులో పర్యటించి క్లినిక్ను తనిఖీ చేసి సీజ్ చేసినట్లు తెలిపారు. పూర్తి వివరాలు.. ఆలూరులో ఆర్ఎంపీగా నర్సింహ క్లినిక్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో తుమ్మలచెరువుకు చెందిన బాలిక సంజు (5)కు తట్టు పోయడంతో పాటు జ్వరం రాగా, రెండు రోజుల క్రితం బాలికను క్లినిక్ తీసుకెళ్లారు. నర్సింహ హైపవర్ కలిగిన ఇంజక్షన్ ఇవ్వడంతో బాలిక పరిస్థితి మరింత విషమంగా మారింది. వెంటనే బాలికను కు టుంబ సభ్యులు కర్నూలు ఆస్పత్రికి తరలించగా అక్క డే చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. గ్రామంలో పంచాయతీ నిర్వహించిన అనంతరం బా లిక అంత్యక్రియలు బుధవారం నిర్వహించారు. బాలికల తల్లిదండ్రులకు కొంత మేరకు నష్టపరిహారం ఇచ్చేలా పెద్దలు పంచాయతీ నిర్వహించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఘటన కలెక్టర్ బీఎం సంతోష్ దృష్టికి రాగా, ఆయన ఆదేశాల మేరకు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు ఆలూరు చేరుకుని విచారణ చేపట్టి క్లిని క్ను సీజ్ చేశారు. ఆర్ఎంపీ నర్సింహపై చట్టపరంగా చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. షార్ట్సర్క్యూట్తో గుడిసె దగ్ధం కేటీదొడ్డి: విద్యుత్ షార్ట్ సర్కూట్తో గుడిసె దగ్ధమైన ఘటన మండలంలోని ఎర్సన్దొడ్డి గ్రామంలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామంలో జంబయ్యకు చెందిన గుడిసె షార్ట్ సర్కూట్తో మంటలు చెలరేగి దగ్ధమైంది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమివ్వగా సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో సుమారు రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితుడు పేర్కొన్నారు. -
వైభవంగా రాములోరి కల్యాణం
ఎర్రవల్లి: శ్రీరాముడి జన్మ నక్షత్రం పునర్వసును పురస్కరించుకొని బీచుపల్లి పుణ్య క్షేత్రం కోదండరామస్వామి ఆలయంలో బుధవారం సీతారాముల కల్యాణ వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు సీతారాములను అందంగా ముస్తాబు చేసి వేదమంత్రాల నడుమ వైభవంగా కల్యాణం జరిపించారు. వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. భక్తులకు సంగాలకు చెందిన నల్లారెడ్డి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్రాజు, అర్చకులు భువనచంద్ర, దత్తుస్వామి, భానుమూర్తి, పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
మీ కొడుకు డ్రగ్ కేసులో దొరికాడు
మద్దూరు: ‘హలో.. మై డీఎస్పీ బాత్ కర్హ హు అప్ కా బేటా డ్రగ్స్ కేస్ మే మిల్ గయా. ఛోడ్దేనా బోలేతో థీస్ హజార్ అర్జెంట్ ఫోపే కరో.. నైతో కేసు హోయాతో 10 సాల్ సజా గిర్తా, ఫైన్బీ గిర్తా.. అర్జెంట్ ఫోన్ పే కరో..(హలో నేను డీఎస్పీని.. నీ కొడుకు డ్రగ్ కేసులో పట్టుబడ్డాడు. అతడిని విడిచి పెట్టాలంటే వెంటనే రూ.30 వేలు ఫోన్ పే చేయండి. లేదంటే కేసు చేస్తే 10 ఏళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా పడుతుంది) అంటూ వచ్చిన ఫోన్కాల్తో ఓ తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే మద్దూరు పట్టణానికి చెందిన నాగేందర్ పిండి గిర్ని నడిపిస్తున్నాడు. ఇతని పెద్ద కొడుకు విశాల్ షాద్నగర్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం 12.57 గంటలకు 923707509858 నెంబర్ నుంచి వాట్సప్ కాల్ వచ్చింది. దీంతో ఆయన భార్య భాగ్యమ్మ ఫోన్ ఎత్తింది. అవతలి వ్యక్తి హిందీలో మాట్లాడుతూ.. ‘నీ కొడుకు మరో 4 గురు డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారు. కేసు చేస్తే 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించడం జరుగుతుంది. మీ కుటుంబం ఎలాంటి కేసులో లేవు, ఉన్నతంగా జీవించే కుటుంబలా ఉంది. వెంటనే రూ.30 వేలు ఫోన్ పే చేస్తే కేసు నుంచి తప్పిస్తాం’అని తెలిపారు. ఆమె వెంటనే భర్త నాగేందర్కు ఫోన్ ఇచ్చింది. అవతలివైపు నుంచి దూరంగా పోలీసులు కొడుకును కొట్టుతున్న శబ్దాలను వినపడడంతో.. ‘మా ఫోన్లో అంత డబ్బు లేదు.. మీరు ఎక్కడ ఉన్నారో చెబితో డబ్బులతో అక్కడి వస్తాం’ అని భయపడుతూ చెప్పాడు. దీంతో అవతలి వ్యక్తి దంపతులను మరింత బెదిరించి, ఫోన్ కట్ చేశారు. విషయం చుట్టపక్కల వారికి తెలియడంతో వారు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఫోన్ కట్ చేయడంతో మళ్లీ ఫోన్ చేశాడు. దాదాపు 10 నిమిషాల పాటు వీళ్లను ఫోన్లో బెదిరించాడు. ఈ క్రమంలో ఇతర ఫోన్ నుంచి అతని కొడుకు ఫోన్ చేసి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. నాకు ఏమీ కాలేదని కొడుకు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయాన్ని ఎస్ఐ విజయ్కుమార్ తెలుపగా నంబర్లను వాటప్స్ కాల్స్ వస్తే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి విషయం తెలియజేయాలని సూచించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయాలని సూచించారు. రూ.30 వేలు ఫోన్పే చేస్తే వదిలేస్తాం సైబర్ నేరగాళ్ల బెదిరింపులు -
విద్యుత్ఘాతంతో ఎద్దులు మృత్యువాత
కోడేరు: విద్యుదాఘాతంతో ఎద్దులు మృత్యువాత పడిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని మాచుపల్లి గ్రామానికి చెందిన ఒగ్గు రాములు ఇంటి వద్ద పశువుల పాకలో ఎద్దులను కటేశాడు. ఉదయం 6 గంటల ప్రాంతంలో 11కేవీ విద్యుత్తీగలు తెగి ఎద్దులపై పడటంతో రెండు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. దాదాపు రూ. 2లక్షల వరకు ఆస్తినష్టం ఏర్పడిందని బాధితుడు పేర్కొన్నాడు.లభించని చిరుత ఆనవాళ్లుగండేడ్: వాహనదారుడిపై చిరుత దాడి చేసిన ప్రాంతాన్ని అటవీ శాఖ మహమ్మదాబాద్ రేంజ్ అధికారి అబ్దుల్హై ఆదేశాల మేరకు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాఘవేందర్ బుధవారం పరిశీలించారు. మంగళవారం మండలంలోని లింగాయపల్లి గ్రామ సమీపంలో నరేష్ అనే వ్యక్తి బైక్పై వస్తుండగా చిరుత అకస్మాత్తుగా దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు బాధితుడు నరేష్ వద్దకు వెళ్లి విచారించి సంఘటన జరిగిన ప్రాంతానికి వచ్చి చిరుత ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందని ఆరా తీశారు. బాధితుడు చింతగుట్ట వైపు వెళ్లినట్లు చెప్పడంతో అధికారులు పంట పొలాలతోపాటు ఖాళీ ప్రదేశాలను కలియదిరిగారు. అయితే చిరుతకు సంబంధించి పాదముద్రలు ఏమీ లభించలేదని అటవీ అధికారి తెలిపారు. చిరుతకు సంబంధించి ఆనవాళ్లు ఏమీ లేకపోవడంతో దాడి చేసింది కచ్చితంగా చిరుత అని చెప్పలేమని పేర్కొన్నారు. అయినప్పటికీ సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
జూరాలకు భారీగా వరద
ధరూరు: మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. మంగళవారం 2.45 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. బుధవారం రాత్రి 7.30 ప్రాంతంలో 2.92 లక్షల క్యూసెక్కులకు పెరిగినట్లు వివరించారు. దీంతో ప్రాజెక్టు 44 క్రస్ట్ గేట్లు పైకెత్తి 3,22,179 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 10,663 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 20, ఎడమ కాల్వకు 550 క్యూసెక్కులకు నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 6.585 టీఎంసీలు ఉన్నట్లు చెప్పారు. నిర్విరామంగా విద్యుదుత్పత్తి.. ఆత్మకూర్: జూరాల జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద చేరుతుండటంతో దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి వేగవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఎగువ 6 యూనిట్ల నుంచి 234 మెగావాట్లు, 247.422 మి.యూ., దిగువ 6 యూనిట్ల నుంచి 240 మెగావాట్లు, 286.158 మి.యూ. విద్యుదుత్పత్తి చేపట్టామని ఎస్ఈ శ్రీధర్ వివరించారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ కేంద్రాల్లో ఇప్పటి వరకు 533.580 మి.యూ. విజయవంతంగా చేపట్టామన్నారు. రామన్పాడు నుంచి 15 వేల క్యూసెక్కులు.. మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయానికి బుధవారం శంకరసముద్రం, సరళాసాగర్, ఊకచెట్టువాగు నుంచి వరద రావడంతో 7 గేట్లు ఎత్తి 15 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. సరళాసాగర్ సైఫన్ల నుంచి.. మదనాపురం: సరళాసాగర్ జలాశయానికి ఎగువ నుంచి వరద వస్తుండటంతో బుధవారం రెండు ఉడ్ సైఫన్లు, రెండు ప్రైమరీ సైఫన్ల నుంచి 7,800 క్యూసెక్కుల నీరు దిగువకు వదిలారు. మదనాపురం వద్ద వాగు పారి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కోయిల్సాగర్ జలాశయం వద్ద.. దేవరకద్ర: కోయిల్సాగర్ జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద రావడంతో బుధవారం ఉదయం 5 గేట్లను ఒక అడుగు మేర పైకెత్తి 4,500 క్యూసెక్కుల నీటిని వాగులోకి వదిలారు. మంగళవారం రెండు గేట్లను తెరవగా.. రాత్రి కురిసిన వర్షానికి జలాశయానికి భారీగా వరద చేరడంతో బుధవారం ఉదయం 5 గేట్లను తెరిచారు. సాయంత్రం నుంచి ఇన్ఫ్లో తగ్గడంతో రెండు గేట్లు, తర్వాత మరో గేటు మూసి వేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగా.. ప్రస్తుతం 32 అడుగులు ఉంది. నిండుకుండలా సుంకేసుల.. రాజోళి: సుంకేసుల జలాశయానికి వరద రోజురోజుకు పెరుగుతుండటంతో నిండుకుండను తలపిస్తోంది. బుధవారం ఎగువ నుంచి 1.45 లక్షల క్యూసెక్కుల వరద రాగా.. 19 గేట్లను రెండు మీటర్ల మేర, డ్యాంకు ఒక గేట్ను మీటర్ మేర తెరిచి 1, 39,100 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినట్లు జేఈ మహేంద్ర తెలిపారు. కేసీ కెనాల్కు విడుదల చేసి న 2,534 క్యూసెక్కులతో కలిపి డ్యాం నుంచి 1,41, 634 క్యూసెక్కులు దిగువకు పారినట్లు చెప్పారు. 2.92 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో.. 44 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల కొనసాగుతున్న విద్యుదుత్పత్తి -
త్వరలో సీఎంను కలిపిస్తాం
నారాయణపేట: నారాయణపేట– కొడంగల్ ఎత్తిపోతల పథకం కింద భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు న్యాయం చేయించేందుకు త్వరలో సీఎం రేవంత్రెడ్డిని కలిపిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర్ రాజనర్సింహ, జిల్లా మంత్రి వాకిటి శ్రీహరి భూ నిర్వాసితులకు భరోసా ఇచ్చారు. మంగళవారం రాత్రి మంత్రి వాకిటి శ్రీహరి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డి చొరవతో మంత్రి దామోదర రాజనరసింహాను నారాయణపేట, మక్తల్ నియోజకవర్గంలోని భూ నిర్వాసితుల సంఘం సభ్యులు, అఖిలపక్షం నాయకులు, భూ నిర్వాసితులు కలిసి తమ గోడును వినిపించారు. భూ నిర్వాసితులకు బేసిక్ ధరను 2013 భూ చట్టాన్ని, ప్రస్తుత మార్కెట్ ధరను పట్టించుకోకపోవడంతో భూ నిర్వాసితులకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరానికి రూ.2.25 లక్షలు ప్రభుత్వ మార్కెట్ ధర ఉందంటూ కేవలం రూ.14 లక్షలు చెల్లిస్తుండడంతో తీవ్ర అన్యాయం జరుగుతోందని వాపోయారు. కానీ మార్కెట్ ధర రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షలు పలుకుతుందన్నారు. కాస్తుకు, రికార్డు మధ్య పొరపాటు ఉందని వాటిని సరి చేయాలని, ఇంటికో ఉద్యోగం, పింఛన్ సౌకర్యం, ఇందిరమ్మ ఇల్లు, ప్రభుత్వ పథకాల్లో అవకాశం కల్పించాలని భూనిర్వాసితులు మంత్రులను కోరారు. తాము ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకం కాదని.. భూ పరిహారాన్ని రూ.35 లక్షలు పెంచి ఇవ్వాలనేదే తమ కోరిక.. డిమాండ్ అని తెలిపారు. అనంతరం మంత్రులు స్పందిస్తూ త్వరలోనే సీఎంతో మాట్లాడించి భూ నిర్వాసితులకు తగు న్యాయం చేసేందుకు కృషి చేస్తామన్నారు. మంత్రులను కలిసిన వారిలో భూ నిర్వాసితుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు జి వెంకట్రాంరెడ్డి , అధ్యక్షుడు మశ్చందర్, రైతు సంఘం నాయకులు వెంకోబ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాల్రామ్, భూ నిర్వాసితులు గోపాల్రెడ్డి, రమేశ్శెట్టి, బీజేపీ నాయకుడు భాస్కర్ తదితరులు ఉన్నారు. భూ నిర్వాసితులకు న్యాయం చేయిస్తాం భరోసానిచ్చిన మంత్రులు -
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు
స్టేషన్ మహబూబ్నగర్: దేశంలో కంప్యూటర్ యుగానికి నాంది పలికి శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది మాజీ ప్రధానమంత్రి రాజీవ్గాంధీ అని డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. బుధవారం రాజీవ్గాంధీ జయంతిని పురస్కరించుకొని జిల్లాకేంద్రంలో రాజీవ్గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే, ఇతర నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజీవ్గాంధీ తన హయాంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపారన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో 18 ఏళ్లకు ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్గాంధీకే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన రాజీవ్గాంధీ జయంతి వేడుకల్లో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ యువతకు స్ఫూర్తి ప్రదాత రాజీవ్గాంధీ అన్నారు. ఆయా కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నర్సింహారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్గౌడ్, నాయకులు సంజీవ్ ముదిరాజ్, చంద్రకుమార్గౌడ్, సీజే బెనహర్, సిరాజ్ఖాద్రీ, జహీర్ అఖ్తర్, వసంత, సాయిబాబా, అజ్మత్అలీ, రాములుయాదవ్, పీర్ సాధిక్, అవేజ్, జహీర్ తదితరులు పాల్గొన్నారు. -
బీఫార్మసీ ఫలితాలు విడుదల
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూ పరిధిలోని బీఫార్మసీ సెమిస్టర్–8 రెగ్యులర్, 1, 3, 5, 7 సెమిస్టర్లకు సంబంధించి బ్యాక్లాగ్ పరీక్షల ఫలితాలను వీసీ శ్రీనివాస్ బుధవారం విడుదల చేశారు. ఈ మేరకు 8వ సెమిస్టర్లో 82.74 శాతం, 7వ సెమిస్టర్లో 71.43 శాతం, 5వ సెమిస్టర్లో 50 శాతం, 3వ సెమిస్టర్లో 54.55 శాతం, 1వ సెమిస్టర్లో 58.33 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, కంట్రోలర్ ప్రవీణ, అడిషనల్ కంట్రోలర్ శాంతిప్రియ, ప్రిన్సిపాల్ రవికాంత్, ఈశ్వర్కుమార్, సురేష్, రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ప్రజలకు మెరుగైనవైద్యం అందించాలిరాజాపూర్: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం రాజాపూర్లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని లేబర్రూంతోపాటు పరిసరాలను పరిశీలించారు. ప్రతినెలా ఎన్ని కాన్పులు అవుతున్నాయి.. మేజర్ కేసులు ఎలా చేస్తున్నారు అని మండల వైద్యాధికారి సుశ్మితను అడగగా.. ప్రతినెలా 8 నుంచి 10 వరకు కాన్పులు అవుతున్నామని చెప్పారు. ముఖ్యంగా జాతీయ రహదారిపై ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని వైద్య సిబ్బందికి సూచించారు. అనంతరం రాజాపూర్ శివారులో ఉన్న కేజీబీవీని సందర్శించి స్టోర్ రూంను పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన విద్యతోపాటు నాణ్యమైన భోజనం అందించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ లక్ష్మిబాయిని ఆదేశించారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతంమహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగర పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ కమినర్ ప్రవీణ్కుమార్ రెడ్డి సూచించారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో మొదటిసారి ధరల నియంత్రణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ సామగ్రిని కనీస ధరకు విక్రయించేలా వ్యాపారులను ఒప్పించాలన్నారు. ముఖ్యంగా కూలీల వేతనం రోజుకు రూ.250 నుంచి రూ.300 వరకు చెల్లించాలన్నారు. ఇసుకను రీచ్ల నుంచి తెప్పించేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. వీలైనంత తొందరగా లబ్ధిదారులు ఈ ఇళ్లను పూర్తి చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఏఎంసీ అజ్మీరా రాజన్న, హౌసింగ్ డీఈఈ విజయ్, ఆర్ఓ మహమ్మద్ ఖాజా, మహబూబ్నగర్ అర్బన్ తహసీల్దార్ ఘాన్సీరాం, ఆర్ఐలు టి.నర్సింహ, రమేష్, ముజీబుద్దీన్, అహ్మద్షరీఫ్తో పాటు వార్డు ఆఫీసర్లు పాల్గొన్నారు. -
అమ్మాయిల రక్షణకు అధిక ప్రాధాన్యం
మహబూబ్నగర్ క్రైం: అమ్మాయిలు, మహిళల రక్షణ అంశంలో భరోసా సెంటర్ల ప్రాధాన్యత అధికంగా ఉండాలని, బలహీన వర్గాల రక్షణలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఇందిర అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన భరోసా కన్వర్జెన్సీ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. సమాజంలో జరిగే హింసాత్మక ఘటనల నివారణ, బాధితులకు న్యాయం అందించడంలో పోలీస్ శాఖ, లీగల్ సర్వీసెస్ అథారిటీ, మహిళా, శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ప్రతి కేసు పరిష్కారంలో మానవతా దృక్పథం అత్యంత ముఖ్యమని, బాధితులు భయపడకుండా ఫిర్యాదు చేసేలా అవగాహన కల్పించాలన్నారు. చిన్నారులపై లైంగిక దాడులు, మహిళలపై వేధింపులు, గృహహింస వంటి సమస్యలను ఎదుర్కొనేందుకు చట్టపరమైన సహాయం, కౌన్సెలింగ్, పునరావాసం ఒకే వేదికపై అందించబడితే సమాజం మరింత బలపడుతుందన్నారు. సమావేశంలో ఏఎస్పీ ఎన్బీ రత్నం, డీడబ్ల్యూఓ జరీనా, డీఎంహెచ్ఓ కృష్ణ, ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఎస్పీ శ్రీధర్, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, పీపీలు, సీఐలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
అత్యవసరసమయాల్లో ఇబ్బందులు
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పది రోజుల నుంచి హనుమాన్పురాలోని ఆర్యూబీ ద్వారా రాకపోకలు బంద్ అయ్యాయి. రైల్వే ట్రాక్ అవతల 2.5 కి.మీ. దూరంలో మా తండా ఉంటుంది. ప్రతి రోజూ బైక్ను ఇవతల ఉంచి న్యూటౌన్లో నేను పనిచేసే ప్రైవేట్ ఆస్పత్రికి వస్తున్నాను. తిరిగి రాత్రి రైల్వే ట్రాక్ వద్ద నిలిపి అవతలికి కాలినడకన వెళ్లి ఆ తర్వాత ఏదైనా ఆటో అందుబాటులో ఉంటే తండాకు చేరుకుంటున్నాను. అత్యవసర సమయాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాత గేటును వెంటనే తెరిస్తే సమస్య కొంత వరకు పరిష్కారమవుతుంది. – పి.మహేష్, ప్రైవేట్ ఉద్యోగి, గొల్లబండతండా వానొస్తే.. రాకపోకలు బంద్ వాన ఒచ్చిందంటే తమ ఊరుకు రాకపోకలు బంద్ అవుతాయి. జడ్చర్ల–ఆలూరు మధ్య రైల్వే ఆర్యూబీ వద్ద వరద నీరు నిలిచిపోవడంతో బైక్లు, ఆటోలు వెళ్లేందుకు వీలు పడదు. దీంతో జడ్చర్ల నుంచి బూర్గుపల్లి గ్రామం మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది. రైల్వే అధికారులు స్పందించి ఆర్యూబీ వద్ద వరద నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలి. – కృష్ణ, ఆటో డ్రైవర్, ఆలూరు ప్రణాళిక లోపంతో.. మా గ్రామంలో రైల్వే అండర్బ్రిడ్జి నిర్మాణం ప్రణాళిక లేకుండా చేస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు అండర్బ్రిడ్జిలో మొత్తం వర్షపు నీటితో నిండిపోయి.. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ విషయంపై గ్రామస్తులందరం కలిసి ఆందోళన చేసినప్పటికీ ప్రయోజనం లేదు. ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యంగా కనిపిస్తుంది. – కృష్ణ, డోకూర్, దేవరకద్ర ● -
రాకున్నా.. వచ్చినట్లే
గ్రామ పంచాయతీకార్యదర్శుల లీలలు ఎన్నో జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): సాంకేతిక లోపాలను అలుసుగా తీసుకున్న గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. కొందరు ఎక్కడో ఉండి యాప్లో హాజరు నమోదు చేసుకుంటుండగా.. మరికొందరు తమ స్థానంలో మరొకరితో అటెండెన్స్ కోసం సెల్ఫీ ఫొటో తీయిస్తున్నారు. జిల్లాలో ఇలా విధుల పట్ల 11 మంది కార్యదర్శులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు డీపీఓ అధికారులు గుర్తించి.. కలెక్టర్కు నివేదిక ఇచ్చారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో అన్నీ తామై వ్యవహరిస్తున్న పంచాయతీ కార్యదర్శులు ఇలా ఫేస్ రికగ్నిషన్ యాప్లో ఇతర వ్యక్తులతో అటెండెన్స్ నమోదు చేయించడం చర్చనీయాంశమైంది. ఎక్కడెక్కడ అంటే.. జిల్లావ్యాప్తంగా 11 మంది పంచాయతీ కార్యదర్శులు తప్పుడు అటెండెన్స్ వేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు సదరు 11 మందిపై అధికారులు నివేదిక తయారు చేశారు. గండేడ్ మండలంలో ఓ ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శి, కౌకుంట్ల మండలంలోని ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శి, కోయిలకొండ మండలంలో ఇద్దరు, అడ్డాకుల, నవాబ్పేటలో ఒక్కొక్కరు, దేవరకద్ర మండలంలో ఇద్దరు, జడ్చర్ల, మూసాపేట్, మిడ్జిల్ మండలాల్లో ఒక్కొక్కరు ఉన్నారు. వీరిలో ఒకరు ఏకంగా సీఎం రేవంత్రెడ్డి ఫొటోతో డీఎస్ఆర్ యాప్లో అటెండెన్స్ నమోదు చేస్తున్నట్లు తేలింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం అన్ని జిల్లాల్లో యాప్లో నమోదైన పంచాయతీ కార్యదర్శుల ఫొటోలను పరిశీలించాలని ఆదేశించింది. ఈ మేరకు పూర్తి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ విజయేందిర డీపీఓ అధికారులకు సూచించడంతో నకిలీ హాజరు నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను సర్వీసు నుంచి రిమూవ్ చేయాలని, నలుగురిని సస్పెండ్ చేయగా, మరో ఐదుగురికి చార్జీ మెమోలు జారీచేశారు. చర్యలు తీసుకున్నాం.. ఫేస్ అటెండెన్స్ యాప్లో టెక్నికల్ సమస్యలను ఆసరాగా చేసుకుని ఇతరులతో అటెండెన్స్ వేసిన వారిపై చర్యలు తీసుకున్నాం. ఇది జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగానూ ఇలాగే చేశారు. జిల్లాలో నలుగురిని సస్పెండ్ చేయడంతోపాటు ఐదుగురికి ఏఓసీ మెమో, ఇద్దరు ఓపీఎస్ను తొలగించడం జరిగింది. – పార్థసారధి, డీపీఓ కొందరు విధులకు రాకుండానే హాజరు నమోదు వరంగా మారిన సాంకేతిక లోపం తాజాగా 11 మంది కార్యదర్శులపై చర్యలు -
మోతెవరి లవ్స్టోరీలో అప్పాయిపల్లివాసి
సాక్షి, నాగర్కర్నూల్/ లింగాల: ఓటీటీ వేదికగా ఇటీవల విడుదలైన ‘మోతెవరి లవ్స్టోరీ’ వెబ్సిరీస్లో లింగాల మండలం అప్పాయిపల్లికి చెందిన చిరుతల బాలరాజు ముఖ్య పాత్రలో నటించారు. ‘తెలుగు జీ5’ ఓటీటీ ప్లాట్ఫాంలో విడుదలైన ‘మోతెవరి లవ్స్టోరీ’ వెబ్సిరీస్ వారం రోజుల్లోనే 50 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ వ్యూయర్స్ను అందుకుని ట్రెండింగ్లో నిలిచింది. ఈ వెబ్సిరీస్లో 70 ఏళ్ల వృద్ధుడు రాములు తాత పాత్రలో చిరుతల బాలరాజు మెప్పించారు. లింగాల జెడ్పీహెచ్ఎస్లో పదో తరగతి, కొండనాగుల జూనియర్ కళాశాలలో ఇంటర్, డిగ్రీ పూర్తిచేసిన బాలరాజు సినిమాలపై మక్కువతో సినీరంగంలో ప్రవేశించారు. పలు సీరియళ్లలో ఆర్టిస్టుగా, కో డైరెక్టర్గా పనిచేశారు. అల్లరే అల్లరి, సరదాగా కాసేపు, మిస్సమ్మ, ప్రతిఘటన, ప్రేమ ఎంత మధురం, అత్తో అత్తమ్మ కూతురో తదితర సీరియళ్లలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. తాజాగా ఓటీటీలో విడుదలైన మోతెవరి లవ్స్టోరీ వెబ్సిరీస్లో ముఖ్య పాత్ర రాములు తాతగా నటించి అలరించారు. నల్లమలలోని మారుమూల ప్రాంతానికి చెందిన బాలరాజు వెబ్సిరీస్లో అలరించడంతో గ్రామస్తులు అభినందనలు తెలిపారు. -
ఆలయాలే లక్ష్యంగా చోరీలు
భూత్పూర్: ఊరికి దూరంగా ఉన్న ఆలయాలనే లక్ష్యంగా చేసుకొని వెండి ఆభరణాలను దొంగిలించే నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 8 ఆలయాల్లో జరిగిన చోరీల్లో అతని ప్రమేయం ఉంది. ఈమేరకు మంగళవారం మహబూబ్నగర్ ఎస్పీ జానకి భూత్పూర్ సర్కిల్ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది జూలై 31న సీసీకుంట గంగాభవాని ఆలయంలోని గర్భగుడి తాళం విరగ్గొట్టి వెండి ఆభరణాలు దొంగతనం చేయగా.. ఆగస్టు 1న కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశామన్నారు. ఈక్రమంలో మంగళవారం సీసీకుంట మండలంలోని అమ్మాపూర్ గ్రామం వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ గ్రామానికి చెందిన తోక కర్ణాకర్ అనుమానాస్పదంగా కనిపించాడు. ఆలయ చోరీ సమయంలో సీసీ ఫుటేజీలో కనిపించిన అనుమానితుడిని.. ఇతడిని పోల్చి చూడగా ఒక్కరేనని గుర్తించారు. అదుపులోకి తీసుకొని ఆరా తీయగా గంగాభవాని ఆలయంలో చోరీ చేసింది తానేనని ఒప్పుకున్నాడు. 2024 జనవరి 24 నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామాలకు దూరంగా ఉన్న ఆలయాలను లక్ష్యంగా చేసుకొని వెండి ఆభరణాలను దొంగిలిస్తూ వచ్చాడు. మహబూబ్నగర్, వనపర్తి జిల్లాలోని పలు పోలీస్స్టేషన్ల పరిధిలో 8 ఆలయాల్లో జరిగిన దొంగతనాల్లో తన ప్రమేయాన్ని అంగీకరించాడు. ఇందులో సీసీకుంట మండలం మద్దూర్, పెద్దమందడి మండలం మద్దిగట్ల, వెల్టూర్, జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం అమరవాయి, ఇటిక్యాల మండలం షాబాద్, సాతర్ల, పెబ్బేర్ మండలం వైశాఖాపూర్, కొత్తకోట మండలం చర్లపల్లి, మదనాపూర్ మండలం అజ్జకొల్లు, వనపర్తి పట్టణంలో చోరీకి పాల్పడ్డాడు. నిందితుడి నుంచి రూ.3,96,200 నగదు, రెండు మోటార్సైకిళ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రతి ఆలయంలో విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకోవాలని ఎస్పీ సూచించారు. ఈ కేసు ఛేదించడంలో కృషి చేసిన సీసీకుంట ఎస్ఐ రామ్లాల్, నిరంజన్రెడ్డి, విష్ణు, బాల్రెడ్డి, రవిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ రామకృష్ణ పాల్గొన్నారు. ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా 8 ఆలయాల్లో వెండి ఆభరణాల అపహరణ -
జూరాలకు పోటెత్తిన వరద
ధరూరు/రాజోళి/మదనాపురం/దేవరకద్ర: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లో భారీగా పెరిగింది. సోమవారం ప్రాజెక్టుకు 2లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. మంగళవారం రాత్రి 7.30 గంటల వరకు 2.45 లక్షలకు చేరినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 38 క్రస్టు గేట్లను ఎత్తి 2.47 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే విద్యుదుత్పత్తి నిమిత్తం 24వేల క్యూసెక్కులు వదలగా.. 43 క్యూసెక్కులు ఆవిరైంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 6.987 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సుంకేసులకు లక్ష క్యూసెక్కులు.. సుంకేసుల డ్యాంకు లక్ష క్యూసెక్కులకు పైగా వరద వచ్చి చేరుతుంది. మంగళవారం ఎగువ నుంచి 1.30లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా..ఐదు గేట్లను ఒక మీటర్ మేర, 15 గేట్లను రెండు మీటర్ల మేర తెరిచి 1.25లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలారు. కేసీ కెనాల్కు 2,180 క్యూసెక్కులను వదిలినట్లు జేఈ మహేంద్ర తెలిపారు. 2.45 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో 38 క్రస్టు గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల -
చిరుత.. లింగాయిపల్లిలో ప్రత్యక్ష్యం
గండేడ్: ఇటీవల మహబూబ్నగర్ వాసులను కంటిమీద కునుకు లేకుండా చేసిన చిరుత తాజాగా గండేడ్ మండలంలో కలకలం రేపింది. మంగళవారం రోడ్డు దాటుతూ ఓ వాహనదారుడిని గాయపరిచింది. మండలంలోని లింగాయిపల్లికి చెందిన ఆటో డ్రైవర్ గత్ప నరేశ్ మంగళవారం సాయంత్రం 5:20 గంటల ప్రాంతంలో బైక్పై రంగారెడ్డిపల్లి నుంచి స్వగ్రామానికి వస్తున్నాడు. ఈ క్రమంలో లింగాయిపల్లి నుంచి చింతగుట్టకు వెళ్లేదారి వద్దకు రాగానే చిరుత అకస్మాత్తుగా రోడ్డు దాటేందుకు దూకింది. అదే సమయంలో బైక్పై అక్కడికి చేరుకున్న నరేశ్ చేతికి చిరుత కాలు గీసుకుపోవడంతో ఎడమ చెతికి గాయమైంది. చిరుత చింతగుట్ట వైపునకు వెళ్లినట్లు బాధితుడు తెలిపాడు. అనంతరం అతను గండేడ్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకొన్నాడు. అయితే మరోసారి చిరుత గండేడ్ మండలంలో సంచరించడం మండల వాసులను భయాందోళనకు గురిచేస్తుంది. చింతగుట్ట వైపు వెళ్లిన చిరుత అవతలికి దాటే అవకాశం లేదు. ఎందుకంటే సాలార్నగర్ ప్రాజెక్టు నిండి ఉధృతంగా అలుగు పారుతుండడంతో ఇటువైపే సంచరించే అవకాశం ఉంది. భయాందోళనతో పొలాల వద్ద కట్టేసిన పశువులను స్థానికులు ఇళ్లకు తీసుకొచ్చారు. రోడ్డు దాటుతూ వాహనదారుడికి గాయం రెండోసారి గండేడ్ మండలంలో సంచారం అప్రమత్తంగా ఉండాలి చిరుత సంచరించిన సమాచారం అందింది. బుధవారం ఉదయం ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తాం. అది చిరుతనా, పులినా, లేక ఇంకేమైనా తిరుగుతుందా పరిసరాలను పూర్తిగా పరిశీలిస్తాం. అప్పటి వరకు చుట్టుపక్క ల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. – మహమ్మద్ అబ్దుల్ హై, రేంజర్, మహమ్మదాబాద్ రేంజ్ -
కోయిల్సాగర్కు తగ్గిన ఇన్ఫ్లో
దేవరకద్ర: కోయిల్సాగర్ ప్రాజెక్టు నుంచి మంగళవారం 2 గేట్లను ఎత్తి 1400 క్యూసెక్కుల నీటిని వాగులోకి వదిలారు. సోమవారం ఇన్ఫ్లో భారీగా రావడంతో అయిదు గేట్లను తెరిచి నీటి విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 32.6 అడుగులు.. నీటి నిల్వ సామర్థ్యం 2.27 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 32 అడుగుల వద్ద 2.2 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కొనసాగుతున్న విద్యుదుత్పత్తి ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల దిగువ, ఎగువ జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో మొత్తం 12 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి కొనసాగుతుంది. మంగళవారం ఎగువలో 6 యూనిట్ల ద్వారా 234 మెగావాట్లు, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేపడుతున్నారు. ఇప్పటివరకు 529.752 మి.యూనిట్లను విజయవంతంగా విద్యుదుత్పత్తిని చేపట్టామని ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. -
పురుగుల మందు తాగి మహిళ మృతి
పెద్దకొత్తపల్లి: భార్యాభర్తల గొడవ కారణంగా మనస్తాపానికి చెందిన భార్య ఇటీవల పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. ఎస్ఐ సతీశ్ కథనం ప్రకారం.. మరికల్కు చెందిన ఏడుపుల గీత (22) ఈనెల 17న భార్య, భర్తలు గొడవ పడి మనస్తాపంతో కలుపునివారణ మందు తాగింది. అపస్మారకస్థితికి చేరుకోవడంతో నాగర్కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని ఉస్మానియాకు తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందినట్లు తెలిపారు. మృతురాలికి నాలుగునెలల పాప ఉంది. మృతురాలి తల్లి నీలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. యువతి అదృశ్యం ఉండవెల్లి: మండలంలోని మెన్నిపాడు గ్రామానికి చెందిన కస్తూరి(25) అనే యువతి నెల క్రితం నుంచి మండల కేంద్రంలోని పెద్దమ్మ సుగుణమ్మ ఇంట్లో ఉంటూ కూలి పనులకు వెళ్తుంది. ఈ క్రమంలో ఈ నెల 9వ తేదీన అదృశ్యమైంది. ఎంతకూ ఆచూకీ తెలియక పోవడంతో మంళగళవారం కస్తూరి అక్క సంధ్యపోగు సరస్వతి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శేఖర్ తెలిపారు. విద్యుత్షాక్తో గొర్రెలకాపరి మృతి కొత్తకోట రూరల్: పెద్దమందడి మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. గొర్రెలను మేతకు తీసుకెళ్లిన కాపరి రాగమోని మల్లయ్య(40) ప్రమాదవశాత్తు విద్యుత్షాక్కు గురై మృతిచెందాడు. అక్కడే మరో కాపరి గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో ఆర్ఐ గణేశ్ ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. గొర్రెలను మేపేందుకు వ్యవసాయ పొలాలకు వెళ్లడంతో అక్కడ బోరుబావి వద్ద విద్యుత్ తీగలు తగిలి మృతిచెందినట్లు ఆర్ఐ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నట్టు బంధులువు తెలిపారు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయిన మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. హత్యాయత్నం కేసులో మూడేళ్ల జైలుశిక్ష పాన్గల్: మండలంలోని గోప్లాపూర్లో జరిగిన ఓ హత్యాయత్నం కేసులో నిందితుడికి మూడేళ్ల కఠిన కారగార శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ మంగళవారం న్యాయమూర్తి కళార్చన తీర్పునిచ్చినట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. ఆయన కథనం మేరకు.. గ్రామానికి చెందిన బింగి రామదాసుకు, బింగి శ్రీశైలంకు కొన్నేళ్లుగా భూ తగాదాలు ఉన్నాయి. 2023, జూలై 14 రాత్రి రామదాసు గొర్రెల దగ్గరికి ఒంటరిగా వెళ్తుండగా గ్రామ శివారులో అప్పటికే మాటు వేసి ఉన్న శ్రీశైలం ఒక్కసారిగా గొడ్డలితో తలపై దాడి చేశాడు. అటుగా వెళ్తున్న గ్రామస్తులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ రవిప్రకాష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అనంతరం శ్రీశైలంను రిమాండ్కు తరలించారు. కోర్టులో విచారణ జరగగా మంగళవారం జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పునిచ్చినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. బైక్ చోరీకి యత్నం.. పోలీసులకు అప్పగింత జడ్చర్ల టౌన్: స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో బైక్ను చోరీ చేసేందుకు యత్నిస్తున్న వ్యక్తిని సెక్యూరిటీ నర్సింహులు పట్టుకొని పోలీసులకు అప్పగించాడు. పూర్తి వివరాలు.. ఆర్టీసీ క్యాంటీన్ ఎదుట పార్క్ చేసి ఉన్న బైక్ను ఎత్తుకెళ్లేందుకు నిందితుడిని గమనించి పట్టుకున్నట్లు ఆర్టీసీ సిబ్బంది పేర్కొన్నారు. -
ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు
కొల్లాపూర్: కొల్లాపూర్ రేంజ్ పరిఽధిలో ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ సునీతభగత్ తెలిపారు. మంగళవారం ఆమె అమరగిరి సమీపంలోని బలపాలతిప్ప వద్ద చేపట్టిన టూరిజం డెవలప్మెంట్ పనులు, అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాచ్ టవర్ను పరిశీలించారు. టూరిజం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు గూర్చి స్థానిక అధికారులకు సూచించారు. వన్యప్రాణుల మనుగడకు ఇబ్బందులు కలుగకుండా, పర్యాటక అభివృద్ధికి ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా సహకారం అందిస్తున్నట్లు వివరించారు. సోమశిలలోని లలితాంబికా సోమేశ్వరాలయాన్ని దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం కృష్ణానదిలో బోటులో విహరించారు. కార్యక్రమంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ సునీల్ హీరేమత్, డీఎఫ్ఓ రోహిత్గోపిడి, ఎఫ్డీఓలు రామ్మోహన్, చంద్రశేఖర్, రేంజర్ ఈశ్వర్, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ సునీత భగత్ -
కమనీయం.. జములమ్మ కల్యాణం
గద్వాలటౌన్: చూడముచ్చటైన అమ్మవారి దివ్యరూపం.. పక్కనే త్రిశూల రూపంలో పెళ్లి కుమారుడిగా ఆసీనులైన జమదగ్ని మహర్షి.. పచ్చటి తోరణాలు, మేళతాళాలు.. అర్చకుల వేదమంత్రోచ్ఛారణాల నడుమ మంగళవారం నడిగడ్డ ప్రజల ఇలవేల్పు జములమ్మ అమ్మవారి కల్యాణం కనులపండువగా జరిగింది. సాంప్రదాయబద్దంగా దేవతామూర్తులను పూజించి పుణ్యాహవాచనం నిర్వహించి కన్యాదానం కొనసాగించారు. అంతకుముందు ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో జములమ్మ అమ్మవారిని, వరుడిగా త్రిశూలాన్ని ఊరేగింపుగా పెళ్లిపీటలపైకి తీసుకొచ్చారు. అనంతరం అమ్మవారికి యోక్త్రధారణ, త్రిశూలానికి యజ్ఞోపవిత ధారణ, సమస్త మంగళ వాయిద్యాలు మార్మోగుతుండగా మధ్యాహ్నం 12.15కి మాంగళ్యధారణ నయనానందంగా సాగింది. కల్యాణోత్సవానికి ముందు పలువురు దంపతులు సంకల్పం నిర్వహించారు. ● ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత వేర్వేరుగా ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించించారు. ఎమ్మెల్యే అమ్మవారికి నిత్య విశేష పుష్పాలంకారం చేసి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కల్యాణోత్సవాన్ని తిలకించడానికి జిల్లా నలుమూలల నుంచేగాక కర్ణాటక నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జములమ్మ నామస్మరణంతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. కల్యాణోత్సవం సందర్భంగా ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జములమ్మ క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతూ రాష్ట్రంలోనే ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోందన్నారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత మాట్లాడుతూ.. జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో చల్లంగా జీవించేలా అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం పండితుల నుంచి ఇరువురు ఆశీస్సులు పొందారు. జములమ్మ కల్యాణంతో నడిగడ్డ సుభిక్షంగా వర్ధిల్లుతుందని పండితులు పేర్కొన్నారు. వివిధ హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధు లు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కల్యా ణ మహోత్సవంలో ఈఓ పురేంధర్ కుమార్, అల య కమిటీ చైర్మన్ వెంకట్రాములు, మాజీ చైర్మన్ సతీష్కుమార్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన భక్తులు పాల్గొన్న ఎమ్మెల్యే, జెడ్పీ మాజీ చైర్పర్సన్ -
స్కూల్ బస్సు ఢీకొని విద్యార్థి మృతి
ఇటిక్యాల/శాంతినగర్: ప్రైవేట్ పాఠశాల బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును రివర్స్ తీయడంతో మంగళవారం సాయంత్రం బాలుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు ఇటిక్యాల మండలంలోని శనిగపల్లికి చెందిన కుమ్మరి వెంకటేష్, కృష్ణవేణి దంపతుల కుమారుడు వీరేష్ (6) శాంతినగర్లోని సరస్వతి పాఠశాలలో నర్సరీ చదువుతున్నాడు. మూడు రోజులుగా పాఠశాలకు వెళ్లని వీరేష్ తన అక్క పాఠశాల నుంచి బస్సులో వస్తుందని మంగళవారం సాయంత్రం తల్లి వెంట బస్సు వద్దకు వెళ్లాడు. గ్రామానికి వచ్చిన సరస్వతి పాఠశాల బస్సును రివర్స్ తీసే క్రమంలో డ్రైవర్ అజాగ్రత్త కారణంగా బస్సు వెనక ఉన్న బాలుడికి రక్తగాయాలై, అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం కర్నూలు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. దీంతో ఆగ్రహించిన బాలుడి తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు బాలుడి మృతదేహాంతో మంగళవారం రాత్రి శాంతినగర్కు చేరుకొని, అలంపూర్–రాయిచూర్ ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. వారికి మద్దతుగా ప్రజాసంఘాల నాయకులు నిలిచారు. విషయం తెలుసుకున్న శాంతినగర్ ఎస్ఐ నాగశేఖర్రెడ్డి, పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్కు అంతరాయం కలుగుతుందని, ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, పాఠశాల యాజమాన్యంతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. పాఠశాల యాజమాన్యం, డ్రైవర్పై చర్యలకు డిమాండ్ అలంపూర్–రాయిచూర్ రోడ్డుపై బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన -
కొండచరియలు తొలగింపు
దోమలపెంట: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ఆనకట్ట ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. మంగళవారం ఈగలపెంట ఎస్ఐలు జయన్న, శ్రీను సిబ్బందితో కలిసి రోడ్డుపై పడిన రాళ్లను తొలగించారు. సోమవారం మధ్యాహ్న సమయంలో కొండచరియలు రోడ్డుపై పడ్డాయని పొక్లెయిన్ అందుబాటులో లేకపోవడంతో మంగళవారం ఉదయం తొలగించినట్లు పేర్కొన్నారు.గోల్డ్ మెడల్ అందుకున్న అశ్విని జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లా కేంద్రానికి చెందిన ఎస్జీటీ ఉపాధ్యాయురాలు పోలె అశ్విని ఎంఏ తెలుగులో సంప్రదాయ సాహిత్య పాఠ్యాంశాలలో అత్యధిక మార్కులు సాధించి ఉస్మానియ యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ సాధించారు. మంగళవారం ఓయూ 84వ స్నాతకోత్సవ కార్యక్రమంలో గవర్నర్ బిష్ణుదేవ్శర్మ, ఇస్రో చైర్మన్ నారాయణ్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఈ సందర్భంగా పాలమూర్ యువ కవుల వేదిక అధ్యక్షుడు బోలయాదయ్య పోలె అశ్వినికి అభినందనలు తెలియజేశారు. -
‘పల్లెగడ్డ’ గ్రామస్తులకు అండగా ఉంటాం
మరికల్: మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని చిన్నరాజమూరు ఆంజనేయస్వామి దేవాలయ భూమిలో నివాసముంటున్న నారాయణపేట జిల్లా మరికల్ మండలం పల్లెగడ్డ గ్రామస్తులకు అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు సూర్యమోహన్రెడ్డి అన్నారు. ‘సాక్షి’లో ఈ నెల 17, 18 తేదీల్లో వరుసగా ప్రచురితమైన ‘మేమెక్కడికి పోవాలె.. ఈ పల్లె.. మా గడ్డ’ ‘పల్లెగడ్డను వదులుకోం’ కథనాలకు స్పందించిన నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి.. పల్లెగడ్డ గ్రామాన్ని సందర్శించాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు. ఈ మేరకు మంగళవారం పల్లెగడ్డ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి శైలజ ఆధ్వర్యంలో గ్రామస్తులతో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు సూర్యమోహన్రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 2018 నుంచి గ్రామాన్ని ఖాళీ చేయాలని 36 మందికి దేవాదాయశాఖ అధికారులు నోటీసులు జారీ చేశారని.. ప్రభుత్వ నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నామని, రూ.లక్షలు వెచ్చించి నివాస గృహాలు నిర్మించుకున్నామని, ఇప్పుడు పొమంటే ఎక్కడికి వెళ్లాలని ఆయనతో గ్రామస్తులు గోడు వెల్లబోసుకున్నారు. ఆయన స్పందిస్తూ.. ఈ విషయంపై ఎమ్మెల్యే దేవాదాయశాఖ కమిషనర్తో మాట్లాడారని, ఇకపై గ్రామంలో ఎవరికి నోటీసులు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే నోటీసులు వచ్చి కోర్టుకు తిరుగుతున్న వారి తరపున ప్రభుత్వం నుంచి న్యాయవాదిని నియమించి కోర్టులో వాదన వినిపిస్తామని.. పల్లెగడ్డ గ్రామస్తులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఆయన వెంట నాయకులు రాయుడు, కుర్మయ్య, రాములు, నర్సప్ప తదితరులున్నారు. -
ఆశల సాగు
మహబూబ్నగర్ (వ్యవసాయం): అల్పపీడన ప్రభావంతో జిల్లాలో వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లా అంతటా వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా.. చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. ఇప్పటికే కోయిల్సాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండి జలకళ సంతరించుకుంది. చాలాచోట్ల భూగర్భ జలమట్టం పెరిగింది. మరోవైపు ఎడతెరిపి లేకుండా ఏకధాటిగా వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించింది. వర్షం కారణంగా విద్యార్థులు పాఠశాలలకు, ఉద్యోగులు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. వర్షం కారణంగా జిల్లాలోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మరో రెండు రోజులపాటు ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పంటలను ఆశిస్తున్న తెగుళ్లు వరితోపాటు ఆరుతడి పంటలకు తెగుళ్లు వెంటాడుతున్నాయి. వ్యవసాయానికి వాతావరణ పరిస్థితులు అనుకూలించడం లేదు. కొన్నిరోజులుగా ఎండలు లేకపోవడంతో అధిక వర్షాలు పంటలను దెబ్బతీస్తున్నాయి. ప్రస్తుతం పంట పొలాల్లో నీరు నిలుస్తుండటంతో తెగుళ్ల బారిన పడుతున్నాయి. ప్రస్తుతం పంట పొలాలపై పచ్చ పురుగు దాడి చేస్తుంది. దీంతో తెగుళ్ల నివారణకు రైతులు పురుగు మందు పిచికారీ చేస్తున్నారు. అయితే వర్షాలు తగ్గిన తర్వాతే మందులు పిచికారీ చేయాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. పత్తికి ఊపిరి.. వర్షాకాలం ప్రారంభంలోనే సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని భావించి పత్తి రైతులు ముందస్తుగా విత్తనాలు వేసుకున్నారు. ఆ తర్వాత వర్షాలు లేకపోవడంతో మొక్కలు వాడిపోయే దశకు చేరుకున్నాయి. రైతులు పత్తి పంటపై ఆశలు వదులుకుంటున్న తరుణంలో అల్పపీడనంతో వర్షాలు విస్తారంగా పడుతుండటంతో తెల్ల బంగారంగా భావించే పత్తి పంటకు ఊపిరిస్తున్నాయి. జిల్లాలో 85,000 ఎకరాల్లో పత్తి సాగు అంచనాలకు గాను ఇప్పటి వరకు 80,523 ఎకరాల్లో సాగు చేశారు. ప్రస్తుతం రైతులు కలుపు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. జోరుగా నాట్లు జిల్లాలో వానాకాలం సీజన్ ప్రారంభంలో వర్షాలు లేక వరినాట్లు మందకొడిగా సాగాయి. రైతులు కూడా నారుమడులు సిద్ధం చేసుకున్న నాట్లు వేసుకోలేక ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలు వరి సాగుపై ఆశలు పెంచాయి. జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో వరి సాగు అంచనా ఉండగా, ఇప్పటి వరకు 1,00,127 ఎకరాల్లో సాగు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో పంటలకు ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. జిల్లాలో విస్తారంగా వర్షాలు.. జోరుగా వరి నాట్లు ఇప్పటికే సగటుకు మించి వర్షపాతం నమోదు మత్తడి దూకుతున్న చెరువులు.. కోయిల్సాగర్కు జలకళ ఆరుతడి పంటలకు పొంచి ఉన్న తెగుళ్ల బెడద మరో రెండురోజులపాటు వర్ష సూచన నమ్మకం పెరిగింది.. వానాకాలం సీజన్ ఆరంభంలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో వరి పంట సాగు చేశాను. ఆ తర్వాత వరుణుడు ము ఖం చాటేయడంతో పంటపై పెట్టుకున్న ఆశలు వదులుకున్నా. ఇప్పుడు మళ్లీ విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వరి పంట చేతికొస్తుందనే నమ్మకం పెరిగింది. – వెంకటేశ్వర్రెడ్డి, రైతు, మాచన్పల్లి గ్రామం, మహబూబ్నగర్ రూరల్ భూగర్భజలాలు వృద్ధి.. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు మెట్ట పంటలకు ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా పత్తి చేలు వాడు దశలో ఉన్న సమయంలో వర్షాలు కురవడంతో ఆ పంటకు ప్రాణం పోసినట్లయింది. అయితే పంటలను ఆశిస్తున్న పచ్చ పురుగు నివారణకు కోరాజెన్ 60 మి.మీ., మందును ఎకరాకు పిచికారీ చేయాలి. అలాగే పంట పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. – వెంకటేష్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు
పాలమూరు: మహిళలకు ఎలాంటి సమస్యలు వచ్చినా ఆధైర్యపడకుండా, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందనే విషయాన్ని గ్రహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అన్నారు. జిల్లాకేంద్రంలోని ఫస్ట్ నవరత్నాలు శిక్షణ కేంద్రంలో మంగళవారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు అన్నిరంగాల్లో రాణించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు ఎప్పుడూ కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదని, ఆలోచించి న్యాయపరంగా పోరాటం చేయాలన్నారు. బాల్య వివాహాలు, పోక్సో చట్టాలపై మహిళలకు అవగాహన కలిగించారు.రేపు జాబ్మేళాజెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ప్రైవేట్ రంగ సంస్థల్లో నిరుద్యోగ యువతకు జాబ్లు కల్పించేందుకు గురువారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ బాలుర కళాశాలలో జాబ్మేళా నిర్వహిస్తున్నామని జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి మైత్రి ప్రియ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 340 ఉద్యోగాల కోసం నిర్వహించే జాబ్మేళాకు అభ్యర్థులు పూర్తి సర్టిఫికెట్లతోపాటు ఆధార్ కార్డు, బయోడేటాతో హాజరు కావాలని కోరారు. పూర్తి వివరాల కోసం సెల్ నంబర్లు 99485 68830, 89193 80410లను సంప్రదించాలని సూచించారు.ఉద్యోగ, పెన్షనర్లసమస్యలు పరిష్కరించాలిజెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు రాజీవ్రెడ్డి, కార్యదర్శి చంద్రనాయక్ మంగళవారం ఒక ప్రకనటలో డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ, పెన్షనర్ల సమస్యలపై వచ్చే నెల 8న వరంగల్ నుంచి బస్సుయాత్ర చేపడుతున్నట్లు వివరించారు. ఈ యాత్ర 16న జిల్లాకు చేరుకుంటుందని, ఈ బస్సు యాత్రకు టీఎన్జీఓ సంపూర్ణ మద్దతు పలుకుతుందని చెప్పారు. బస్సు యాత్రను ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.చిన్నారుల్లోని నైపుణ్యాలు వెలికితీయాలిదేవరకద్ర: ప్రభుత్వం ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసిందని, వీటి ద్వారా వారిలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీయాలని డీఈఓ ప్రవీణ్కుమార్ అన్నారు. మంగళవారం స్థానిక భవిత కేంద్రంలో ప్రత్యేక అవసరాల చిన్నారులకు ఉపకరణాల గుర్తింపు, నిర్ధారణ శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రత్యేక అవసరాల చిన్నారులకు కావాల్సిన వినికిడి యంత్రాలు, వీల్చైర్లు, ప్రైస్ రెంలేటర్సు, సీపీ చర్చ్, బ్రైలీ కిడ్స్, క్రష్ క్యాలిపర్స్, కృత్రిమ అవయవాలు అవసరమైన వారిని గుర్తించి త్వరలో అందించేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రత్యేక అవసరాల పిల్లలను తల్లిదండ్రులు భారంగా భావించరాదని, సాధారణ పిల్లల మాదిరిగానే వీరు కూడా చదువుకునేలా ప్రోత్సహించాలని కోరారు. భవిత సెంటర్లలో చదువుతోపాటు వారికి ఫిజియో, స్పీచ్ థెరపీ సేవలు, అవసరమైన ఉపకరణాలు అందిస్తామని చెప్పారు. అనంతరం డోకూర్ సమీపంలోని కేజీబీవీని డీఈఓ సందర్శించారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ బాలుయాదవ్, ఎంఈఓలు బలరాం, మంజులత, జిల్లా అధికారులు సుధాకర్రెడ్డి, స్పెషల్ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. -
అడవిలో తప్ప బయట బతకలేం
మేం ఏళ్లుగా మా తాత ముత్తాతల నుంచి అడవిలో ఉంటున్నాం. అడవిలో ఉన్న ఆధారం మాకు బయట దొరకదు. ఇక్కడ దొరికింది తిని బతుకుతున్నాం. బయటకు పోయినంక మాకు దిక్కు ఎవరు ఉంటరు. గ్రామాలు అన్నీ వెళుతున్నాయని అంటున్నరు. మేం అడవిలోనే ఉంటాం. – దంసాని లింగయ్య, కొల్లంపెంట, అమ్రాబాద్ మండలం పునరావాసం ఇచ్చాకే పోతాం.. మేం ఏళ్లుగా అడవినే నమ్ముకుని బతుకుతున్నాం. మాకు వేరే పని తెలువదు. పులులు, వన్యప్రాణుల కోసం మమ్మల్ని బయటకు పొమ్మని అంటున్నారు. మాకు చెప్పినట్టుగా పూర్తిగా పరిహారం, ఇల్లు, భూమి ఇచ్చాకనే ఇక్కడి నుంచి పోతాం. – గోరటి చంద్రమ్మ, కుడిచింతల్బైల్ మానవీయ కోణంలో చేపడతాం.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో రెండు దశల్లో గ్రామాల రీలొకేషన్ ప్రక్రియ ఉంటుంది. నిర్వాసితులకు ఎన్టీసీఏ ద్వారా పూర్తిస్థాయిలో పరిహారం అందించాకే రీలొకేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. రీలొకేషన్ కోసం స్వచ్ఛందంగా ముందుకువచ్చిన వారికే ప్యాకేజీ అందించి తరలింపు చేపడతాం. – రోహిత్ గోపిడి, ఐఎఫ్ఎస్, జిల్లా అటవీశాఖ అధికారి, నాగర్కర్నూల్ ● -
భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వలన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. మంగళవారం ఆమె కలెక్టరేట్లోని వీసీ హాల్ నుంచి వర్షాలు, సహాయక చర్యలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఇతర ప్రాధాన్య అంశాలపై ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎంపీఓలు, ఏపీఎంలు, ఏపీఓలు, పంచాయతీ కార్యదర్శులతో వెబెక్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వలన ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా అధికార, సిబ్బంది హెడ్క్వార్టర్లోనే ఉండాలని ఆదేశించారు. శిథిలావస్థకు చేరిన పాత భవనాల్లో ఉన్న వారిని సహాయక శిబిరాలకు తరలించి అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. వర్షాల వలన పాక్షికంగా, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు ప్రభుత్వం నుంచి సహాయం అందించేలా చూడాలని తహసీల్దార్లకు చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని, చెరువులకు గండ్లు పడితే మరమ్మతు చేపట్టేందుకు అవసరమైనవి సిద్ధం చేసుకోవాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పెట్టని వాటిని మార్కింగ్ చేసి గ్రౌండింగ్ చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించి ఓటర్ మ్యాపింగ్ నిర్వహించాలని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, జెడ్పీసీఈఓ వెంకటరెడ్డి, డీఆర్డీఓ నర్సింహులు, డీపీఓ పార్థసారథి, గృహ నిర్మాణ శాఖ పీడీ భాస్కర్, ఏపీడీలు ముసాయిదాబేగం, శారద తదితరులు పాల్గొన్నారు. -
శభాష్.. వెంకటేశ్
నారాయణపేట జిల్లా: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్న క్రమంలో చెరువు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభంపై వైరు తెగిపోయి తన పరిధిలో ఉన్న గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఈదుకుంటూ వెళ్లి వైర్లు సరిచేసి సరఫరా పునరుద్ధరించి శభాష్ అనిపించుకున్నాడు యువకుడు వెంకటేశ్. సంబంధిత గ్రామాలకు కొన్నేళ్లుగా విద్యుత్ శాఖ నుంచి అధికారికంగా లైన్మెన్ లేకపోయినా కరెంట్ బిల్లుల వసూలుకు నియమించబడిన సదరు యువకుడు తన పని కాకపోయినా ధైర్యం చేసి విద్యుత్ మరమ్మతులు చేశాడు. ముశ్రీఫా, ముంగిమళ్ల, ముక్తిపాడ్కు సంబంధించిన కరెంట్ బిల్లుల వసూలుకు స్పాట్బిల్లర్గా కొంతకాలంగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ముశ్రీఫా శివారులో ఉన్న చెరువు మధ్యలో విద్యుత్ వైరు తెగిపోయింది. దీంతో ముశ్రీఫా, ముంగిమళ్ల, ముక్తిపాడ్కు విద్యుత్ సరఫరా నిలిచి గ్రామాల్లో చీకటి అలుముకుంది. సోమవారం ఉదయం విద్యుత్ లైన్ను పరిశీలించగా.. చెరువు మధ్యలో వైరు తెగినట్లు గుర్తించారు. స్పాట్బిల్లర్ వెంకటేశ్ ఎల్సీ తీసుకొని చెరువులో ఈదుకుంటూ వెళ్లి మధ్యలో ఉన్న స్తంభం ఎక్కి వైర్లు సరిచేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరించాడు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు వెంకటేశ్ను అభినందించారు. ప్రమాదకరమని తెలిసినప్పటికీ ధైర్యం చేసి చెరువు మధ్యలోకి వెళ్లి మరమ్మతు పనులు పూర్తి చేసిన వీడియోలు వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేయడంతో వెంకటేశ్కు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. -
గొంతులో కోడిగుడ్డు ఇరుక్కొని వ్యక్తి మృతి
నాగర్కర్నూల్ జిల్లా: మండలంలోని ముకురాలలో గొంతులో గుడ్డు ఇరుక్కుని వ్యక్తి మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వింజమూరి ఈశ్వరయ్య (52) ఆదివారం రాత్రి భోజనం చేసే సమయంలో గుడ్డు తిన్నాడు. అందులోని పచ్చసోన గొంతులో ఇరుక్కుపోవడంతో భార్య ఈశ్వరమ్మ తలపై కొట్టి గుడ్డును కక్కించే ప్రయత్నం చేయడంతోపాటు నీళ్లు తాపినా ప్రయోజనం లేక అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా.. ఈశ్వరయ్యను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని చెప్పడంతో చేసేదేమి లేక ఇంటికి తీసుకెళ్లి సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వ్యక్తి హఠాన్మరణం పాన్గల్: కిందపడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన సోమవారం మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాసులు కథనం మేరకు.. మండలంలోని కేతేపల్లికి చెందిన తోకల కృష్ణ పబ్లిసిటీ పెయింటింగ్ కాంట్రాక్టర్. ఆయన దగ్గర ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణానికి చెందిన జానీ రంగరావు, సదరం రమణ (58) పెయింటర్స్గా పని చేస్తున్నారు. ఏపీలోని అనంతపూర్లో పెయింటింగ్ పని ముగించుకొని ఈ నెల 16న రాత్రి కేతేపల్లికి చేరుకున్నారు. 18వ తేదీన సదరం రమణ బహిర్భూమికి వెళ్తూ గ్రామపంచాయతీ కార్యాలయ భవనం దగ్గర కళ్లు తిరిగి కిందపడిపోయాడు. వెంటనే గ్రామంలోని ఆర్ఎంపీ దగ్గరకు అటు నుంచి జిల్లా ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. తోకల కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ వివరించారు. -
అనుమతుల్లో గారడీ.. ఆస్పత్రుల్లో దోపిడీ !
‘జిల్లా కేంద్రంలోని మోతీనగర్కు చెందిన ఓ 12 ఏళ్ల బాలుడికి జ్వరం వస్తే తల్లిదండ్రులు రాజేంద్రనగర్లో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సదరు బాలుడిని పరీక్షించిన వైద్యుడు డెంగీ పరీక్షతో పాటు ఇతర రక్త పరీక్షలు చేయించాలని టెస్ట్లు రాశాడు. అదే ఆస్పత్రిలో ఉన్న ల్యాబ్కు వెళ్లాగా..రక్త పరీక్షలకు రూ.3,500 వసూలు చేశారు. డెంగీ నిర్ధారణ కావడంతో ఆడ్మిట్ చేసుకొని చికిత్స చేయాలని చెప్పి దాదాపు మూడు రోజుల పాటు ఆస్పత్రిలో చేర్చుకొని వైద్యంచేసి..రూ.60 వేల వరకు బిల్లు తీసుకున్నారు.’ పాలమూరు: జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రులు యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయి. ఆస్పత్రుల్లో ఉండే వైద్యుల వివరాలు, సౌకర్యాలు తదితరలన్నీ జిల్లా వైద్యారోగ్యశాఖలో వివరాలను నమోదు చేసి అనుమతులు పొందాల్సి ఉంటుంది. డీఎంహెచ్ఓ కార్యాలయంలోని ప్రత్యేక విభాగం నుంచి ప్రతి ప్రైవేట్ ఆస్పత్రికి అనుమతులు పొందుతున్నప్పటికీ వారు సమర్పించిన వివరాల మేరకు తనిఖీల సందర్భంగా ఉండటం లేదు. తరచూ వైద్యులు మారుతున్నా వివరాలను నమోదు చేయడం లేదు. స్కానింగ్ కేంద్రాలతో పాటు ల్యాబ్ల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా రు. నిబంధనలను విస్మరించి యథేచ్ఛగా స్కానింగ్లు చేస్తున్నారు. దీంట్లో కొన్ని తనిఖీల్లో వెలుగులోకి రాగా.. మరికొన్ని బయటకు రాకుండా లోలోపల గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. ● జిల్లాలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రుల్లో చాలా వరకు అనుమతులు తీసుకున్న సమయంలో ఉన్న పడకలు (బెడ్స్) ఆ తర్వాత ఉండటం లేదు. 20 పడకలతో అనుమతి తీసుకుంటే కొన్ని రోజుల వ్యవధిలో వాటి సంఖ్య రెట్టింపు చేసుకుంటున్నారు. వాటికి ప్రత్యేకంగా ఎలాంటి అనుమతులు పొందడం లేదు. కొన్ని ఆస్పత్రుల్లో పడకల స్థాయి పెంచితే మరికొన్ని ఆస్పత్రుల్లో పడకల స్థాయి తగ్గిస్తున్నారు. ఇక ఆరోగ్య శ్రీ అనుమతులు తీసుకోవడానికి 35 పడకలతో పాటు మూడు రకాల విభాగాలు ఉండాల్సి ఉంటుంది. దోచుకుంటున్నారు.. జిల్లా కేంద్రంలోని ఉండే ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు సిండికేట్గా మారారు. అందరూ కలిపి ఒక ధరలు నిర్ణయించుకొని ఆ ప్రకారం వసూలు చేస్తున్నారు. సాధారణంగా చెస్ట్ సీటీ స్కాన్ చేయడానికి రూ.1,200 నుంచి రూ.1,500 వరకు తీసుకుంటే ఎంఆర్ఐ బ్రెయిన్లో పలు రకాల స్కానింగ్కు రూ.5,000నుంచి రూ.8,000 వరకు తీసుకుంటున్నారు. ఇక డెంగీ, మలేరియా, వైడల్, సీబీపీ, ఆర్ఎఫ్టీ, ఎల్ఫ్టీ, లిపిడ్ ప్రొపైల్, హార్మోన్స్ పరీక్షలు ఇలా కొన్ని రకాల రక్త పరీక్షలకు రూ.1,500 నుంచి రూ.2500 వరకు చార్జ్ చేస్తున్నారు. చాలా వరకు గ్రామాల నుంచి రోగులను ఆర్ఎంపీ రెఫర్ చేస్తుండగా.. ఇందులో ఆర్ఎంపీలకు 40 శాతం, స్కానింగ్ కేంద్రాలకు 60 శాతం లెక్కన కమీషన్లు పంచుకుంటున్నారు. తనిఖీల్లో గుర్తిస్తాం జిల్లాలో ఆరోగ్యశాఖ అనుమతి లేకుండా ఉన్న ఆస్పత్రులు, స్కానింగ్ కేంద్రాలు, ల్యాబ్లలో తనిఖీలు నిర్వహిస్తాం. ప్రోగ్రామ్ అధికారులకు, మెడికల్ ఆఫీసర్లకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చి వారి పరిధిలో లైసెన్స్ లేకుండా నిర్వహించే వాటిపై నివేదిక తయారు చేయాలని చూస్తాం. తనిఖీలు చేసి సదరు నిర్వహకులకు నోటీసులు ఇచ్చి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ కృష్ణ, డీఎంహెచ్ఓ పీఎన్డీటీ చట్టాన్ని ఉల్లంఘిస్తూ.. ఆస్పత్రుల నిర్వహణ, పీఎన్డీటీ(కాన్పుకు ముందు లింగ నిర్ధారణ) చట్టాలను కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. ‘ఇక్కడ లింగ నిర్ధారణ చేయబడదు’ బోర్డులను స్కానింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసి నిర్దిష్ట ధరల పట్టిక ప్రదర్శించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. మండలకేంద్రాల్లో కొందరు ఆర్ఎంపీ, పీఎంపీలు వారి పేరు ముందు డాక్టర్ అని రాసుకొని ఏకంగా ఆస్పత్రులు తెరిచి అర్హతకు మించి వైద్యం చేస్తున్నారు. అనుమతులు లేకుండా వ్యాధి నిర్ధారణ పరీక్ష కేంద్రాలను వారే ఏర్పాటు చేసుకొని నిర్వహిస్తున్నారు. ఆర్ఎంపీలు మండల కేంద్రాల నుంచి పట్టణంలో ఉండే అనుమతులు లేని ఆస్పత్రులకు వైద్యం కోసం రెఫర్ చేసి పంపుతున్నారు. ఇందులో నిర్వాహకులు పీఎన్డీటీ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఊరూ పేరు లేని వైద్యుల సిఫార్సుతో గర్భిణీలకు స్కానింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొన్నిసార్లు సొంతంగానే గర్భిణీలకు స్కానింగ్లు చేసి లింగ నిర్ధారణ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. స్కానింగ్ కేంద్రాలు, ల్యాబ్ల్లో ఇష్టారాజ్యంగా ధరలు అర్హులు లేకపోయినా వైద్యచికిత్సలు క్షేత్రస్థాయిలో అర్హత లేని, అనుమతి లేనికేంద్రాలు ఎన్నో.. తనిఖీలు మరిచిన ఆరోగ్యశాఖ -
గురుకులాలు, హాస్టళ్లను తనిఖీ చేయాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో గురుకులాలు, సంక్షేమ హాస్లళ్లను అధికారులు తనిఖీ చేయాలని కలెక్టర్ విజయేందిర ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేకాధికారు లు తమకు కేటాయించిన వాటిని తనిఖీ చేసి విద్య ఐ యాప్లో అప్లోడ్ చేయాలని సూచించారు. సమస్యలు గుర్తిస్తే మరమ్మతు, మౌలిక వసతులు, అత్యవసర పనులను వెంటనే అంచనా వేసి మంజూరు తీసుకుని పనులు చేయించాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు తనిఖీ చేపట్టకపోవడంతో కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేసి వారికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని అదనపు కలెక్టర్ను ఆదేశించారు. ఇందరిమ్మ ఇళ్లు పీఏఎంఏవై సర్వే చేసి యాప్లో అప్లోడ్ చేయాలన్నారు. ప్రాధాన్యతగా భావించి ప్రతి పంచాయతీ కార్యదర్శి ప్రతిరోజూ పదిఇళ్లు సర్వే చేయాలన్నారు. అప్పుడే కేంద్రం గ్రాంట్స్ మంజూవుతాయన్నారు. ఐదుశాతం కంటే తక్కువ సర్వే చేసి అప్లోడ్ చేసినవారికి షోకాజ్ జారీ చేయాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు ఈ అంశంపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. అలాగే వర్షాలు పడుతున్నందున ప్రత్యేకాధికారులు ఎండీపీఓలు, తహసీల్దార్లను జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉంచాలన్నారు. రోడ్లు, చెరువులు, గండి పడినా తక్షణ మరమ్మతు చేపట్టాలన్నారు. ప్రజావాణికి 82 ఫిర్యాదులు సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ప్రజల నుంచి 82 ఫిర్యాదులు రాగా.. కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలన్నారు. అర్జీలను పెండింగ్ పెట్టుకుండా పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, నర్సింహారెడ్డి, ఆర్డీఓ నవీన్, జెడ్పీ సీఈఓ వెంకట్రెడ్డి, డీఆర్డీఓ నర్సింహులు పాల్గొన్నారు. -
పనుల బాధ్యత మీది.. నిధుల బాధ్యత నాది
జడ్చర్ల: నియోజకవర్గంలో భారీ వర్షాల పట్ల సంబంధిత శాఖల అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, ఏఏ పనులు చేస్తారో ఆ బాధ్యత మీది.. అందుకు నిధులు తీసుకొచ్చే బాధ్యత నాదని ఎమ్మెల్యే అనిరధ్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక క్యాంప్ కార్యాలయంలో నీటిపారుదల, విద్యుత్, మున్సిపల్, వ్యవసాయ, రెవెన్యూ, ప్రజారోగ్య శాఖల అధికారులతో సమావేశమయ్యారు. అధిక వర్షాలు, ఇబ్బందులు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాటట్లాడుతూ.. చెరువులు, వాగులు, ప్రవాహాల ఉధృతి తీవ్రంగా ఉందని నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముందు జాగ్రత్తగా చెరువులను సందర్శించి బలహీనపడిన కట్టలను గుర్తించి నివేదికలు సిద్ధం చేయాలన్నారు. చెరువు కట్టల పటిష్టతపై సర్వేచేసి ప్రమాదం ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అదేవిధంగా విద్యుత్ ప్రమాదాలు జరుగకుండా సంబంధిత శాఖ అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పడు చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ ప్రమాదాల నివారణ పనులు చేపట్టేందుకు రూ.11కోట్లతో సేఫ్టీ బడ్జెన్ను ఇప్పటికే ప్రభుత్వానికి పంపామని సంబంధిత అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా.. వెంటనే ఆయన సీఎండీకి ఫోన్ చేసి విషయం చెప్పగా.. సానుకూలంగా స్పందించారు. జడ్చర్లలో నల్లకుంట, నల్లచెరువు, ఊరచెరువుకు సంబంధించిన వరద నీరు ప్రవహించే ఫీడర్ ఛానల్స్ను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. వర్షం నీరు రోడ్లపైకి రాకుండా, వరదల కారణంగా రాకపోకలకు ఇబ్బంది లేకుండా మరో 20ఏండ్ల వరకు సరిపోయే విధంగా ప్రణాళికలు రూపొందించాలని మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు. చెరువులు, కుంటల పరిధిలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో ఎక్కడైనా ఎవరైనా వెంచర్లు తదితర ప్లాటింగ్ చేస్తే నిర్మొహమాటంగా తొలగించాలన్నారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను అంచనా వేయాలని, రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. నియోజకవర్గం స్థాయిలో అన్నిశాఖల అధికారులకు సంబంధించి వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేసి అందులో సమస్యలపై స్పందించే విధంగా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి భారీ వర్షాల నేపథ్యంలోఅధికారులతో సమీక్ష వంతెన నిర్మించాలని వినతి పోలేపల్లి–కిష్టారం మధ్య పోలేపల్లి చెరువు అలుగు పారుతుండడంతో రాకపోకలు నలిచిపోయాయని వెంటనే అక్కడ వంతెన నిర్మించాలని కోరుతూ గ్రామస్తులు ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డికి వినతి పత్రం అందజేశారు. అలాగే అంబటాపూర్–కిష్టారం మధ్య బీటీరోడ్డు పనులను త్వరగా పూర్తిచేయాలని కోరారు. రాజాపూర్ పరిధిలోని సర్వే నంబర్ 284లో ఇచ్చిన ఎన్ఓసీ రద్దు చేసి నాగులకుంటను పునరుద్ధరించాలని, చెరువును ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సామాజికవేత్త వెంకటయ్య ఫిర్యాదు చేశాడు. -
జిల్లాలో మోస్తరు వర్షం
మహబూబ్నగర్ (వ్యవసాయం)/మహబూబ్నగర్ క్రైం/భూత్పూర్: జిల్లావ్యాప్తంగా సోమవారం ఓ మోస్తరు వర్షం కురిసింది. జిల్లాకేంద్రంలో అడపాదడపా వర్షం కురిసినా.. రోజంతా ముసురు కమ్మేసింది. జిల్లాలో అత్యధికంగా చిన్నచింతకుంటు మండలంలో 6.04 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మూసాపేటలో 5.16 సెంమీ, కౌకుంట్ల 4.48, కోయిలకొండ 4.02, గండేడ్ 4.16, హన్వాడ 4.46, భూత్పూర్ 4.15, అడ్డాకుల 3.64, మహహ్మదాబాద్ 3.94, జడ్చర్ల 3.83, మిడ్జిల్ 3.20, రాజాపూర్, బాలానగర్ 3.04, మహబూబ్నగర్ అర్బన్ 3.51, దేవరకద్ర 3.4, నవాబుపేట 3.48, మహబూబ్నగర్ రూరల్ 2.97 సెంమీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో మొత్తం 823 చెరువులు, కుంటలు ఉండగా.. 599 చెరువులు అలుగు పారుతున్నాయి. దుందుభీ నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పాటు పలు చెరువులు మత్తడి దూకుతుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో అధికారులు, ప్రజల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయేందిర సూచించారు. భూత్పూర్ మండలంలోని పోతులమడుగు–గోపన్నపల్లి గ్రామాల మధ్య కాజ్వేపై వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. సోమవారం కలెక్టర్ అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ప్రజలకు ఇబ్బందలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఏటా వర్షాకాలంలో రెండు గ్రామాల మధ్య రాకపోకలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. బ్రిడ్జి నిర్మాణానికి అంచనాలు రూపొందించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆమె ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ కిషన్, ఎంపీడీఓ ప్రభాకర్ ఉన్నారు. ఎస్పీ కార్యాలయంలో కంట్రోల్ రూం జిల్లాలో నిరంతరం భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేకంగా పోలీస్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి.జానకి ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసరంగా సహాయం అవసరం అయిన వాళ్లు 87126 59360 నంబర్తో పాటు డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. నిరంతరం ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ వర్షం ఎలాంటి ప్రమాదం సంభవించిన వెంటనే పోలీసులకు తెలపాలన్నారు. చేపల వేటకు వెళ్లొద్దు: ఎస్పీ జిల్లాకేంద్రంలోని అప్పన్నపల్లి బ్రిడ్జిపై వర్షాల కారణంగా గుంతలు ఏర్పడి ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో ఎస్పీ డి.జానకి సోమవారం పరిశీలించారు. మయూరి పార్క్–జాలీహిల్స్ మలుపు దగ్గర గుట్టపై నుంచి వచ్చే వర్షం వరద కారణంగా రోడ్డు అంచుభాగం కోతకు గురైంది. దీంతో కాంట్రాక్టర్తో కలిసి ఎస్పీ పరిశీలించారు. రోడ్డుకు వెంటనే అవసరమైన మరమ్మతు చేయాలని సూచించారు. నిరంతరం వర్షాలు వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వాహనదారులు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. డ్రెయినేజీలు, మ్యాన్హోల్స్ తెరిచి ఉంటాయని, పాదాచారులు జాగ్రత్తగా నడవాలన్నారు. అత్యవసరమైతే తప్ప రోడ్లపై ప్రయాణం చేయరాదని, ఇనుప తీగలపై దుస్తులు అరబెట్టరాదన్నారు. ప్రమాదకరంగా ప్రవహించే నదులు, వాగుల్లో చేపల వేటకు వెళ్లరాదన్నారు. ఆమె వెంట డీఎస్పీ వెంకటేశ్వర్లు, రూరల్ సీఐ గాంధీనాయక్, ట్రాఫిక్ సీఐ భగవంతురెడ్డి, ఎస్ఐ విజయ్కుమార్ పాల్గొన్నారు. పోలేపల్లి రంగనాయకమ్మ చెరువు మత్తడి దూకుతుండడంతో.. ఇలా అలుగుపై నుంచే రాకపోకలు సాగిస్తున్న పోలేపల్లి, కిష్టారం గ్రామస్తులు రోజంతా నగరాన్ని కమ్మేసిన ముసురు సీసీ కుంటలో అత్యధికంగా 6.04సెం.మీ వర్షపాతం నమోదు -
సమస్యల పరిష్కారానికి కృషి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్తామని మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో టీజీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను సంఘం గౌరవాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగా, సంఘం నాయకులు పలు తీర్మానాలు చేస్తూ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు రేషన్ కార్డులు, సకాలంలో వృద్ధాప్య పింఛన్లు ఇవ్వాలన్నారు. ముఖ్యంగా సంఘ భవనం నిర్మించుకునేందుకు స్థలం కేటాయించాలన్నారు. అనంతరం ఆనంద్గౌడ్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజయ్య, కార్యదర్శి బుచ్చిరెడ్డి, అదనపు కార్యదర్శి కె.సత్యన్నచారి, నాయకులు రహిమాన్సోఫి, భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు. -
రైతులు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ
మహబూబ్నగర్ క్రైం: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల చెరువులు, వాగులు ఉధృతంగా పారుతున్నాయని ఎస్పీ జానకి అన్నారు. వినాయక చవితి నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా ఆదివారం ఆమె హన్వాడ, చిన్నదర్పల్లి, బోయపల్లి, టంకర చెరువులను పరిశీలించారు. చెరువులలో నీటి మట్టం ఎలా ఉంది.. వర్షాల వల్ల ముంపు గ్రామాలు ఎలా ఉన్నాయో క్షేత్రస్థాయిలో ఆరాతీశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ వరద ప్రభావం ఉండే గ్రామాల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రధానంగా నిమజ్జనం సందర్భంలో యువకులు క్రమశిక్షణ పాటించాలని, చిన్నారులను చెరువుల దగ్గరకు తీసుకువెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మద్యం తాగి ఊరేగింపులో పాల్గొని.. నిమజ్జనం కోసం చెరువుల దగ్గరకు వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందన్నారు. భారీ వర్షాల కారణంగా చెరువులు, వాగులు నిండిన క్రమంలో వాటి పరిసర ప్రాంతాలకు వెళ్లరాదని, విద్యుత్ తీగలు తెగిపోవడం, చెట్లు పడిపోవడం జరుగుతాయని వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. రైతులు, పశువుల కాపరులు పొలాల దగ్గరకు వెళ్లే సమయంలో విద్యుత్ మోటార్ల దగ్గర, పాములతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో రూరల్ సీఐ గాంధీనాయక్, ఎస్ఐ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నిబంధనలు పాటించాలి జిల్లాలో గణనాథుడిని ఏర్పాటు చేసే మండపాల నిర్వాహకులు నిబంధనలు తప్పక పాటించాలని ఎస్పీ డి.జానకి ఒక ప్రకటనలో తెలిపారు. గణేష్ విగ్రహాల ఏర్పాటు, ఊరేగింపుల అనుమతి కోసం పోలీస్ శాఖ రూపొందించిన ఆన్లైన్ ప్రత్యేక పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్లైన్లో ఏర్పాటు చేసే సమాచారం కేవలం మండపం నిర్వహణ సమాచారం మాత్రమే ఉంటుందని, దీనివల్ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవచ్చన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి పోలీస్ శాఖ ఆన్లైన్లో అనుమతులు జారీ చేస్తుందని, ఆ తర్వాతే వినాయక మండపాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. -
ముకుందా.. ముకుందా
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం అర్ధరాత్రి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా ఉట్ల మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రావణ మాసంలోని చివరి శనివారం రాత్రి స్వామివారి సన్నిధిలో ఉట్ల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఉట్ల మహోత్సవంలో ఓబ్లాయపల్లి గ్రామానికి చెందిన భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని ముగించారు. ఉట్ల మహోత్సవం తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించి.. స్వామివారిని పల్లకీలో గర్భగుడి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. శ్రావణమాసం చివరి శనివారం సందర్భంగా ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు మన్యంకొండకు తరలిరావడంతో కిక్కిరిసిపోయింది. వైభవంగా శేషవాహనసేవ వేంకటేశ్వరస్వామివారి శేష వాహనసేవ వైభవంగా జరిగింది. దేవస్థానంలో ప్రతి శనివారం స్వామివారి తిరుచ్చిసేవ జరిపిస్తారు. ఈ సందర్భంగా శోభాయమానంగా అలంకరించిన శేషవాహనంలో స్వామివారి విగ్రహాలను ఉంచి గర్భగుడి నుంచి సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాల మధ్య మంటపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల బంగారు ఆభరణాలు, రకరకాల పూలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి తదితరులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలోని పద్మావతికాలనీ మురళీకృష్ణ మందిరంలో కృష్ణాష్టమి వేడుకలను రెండోరోజు ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం స్వామివారికి కలశాభిషేకం, పంచామృతాభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణం, అలంకారం తదితర పూజలు చేశారు. సాయంత్రం మురళీకృష్ణ మందిరం నుంచి పద్మావతికాలనీ కమాన్ వరకు స్వామివారిని రథంలో ఊరేగించి.. ఉట్ల ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మన్యంకొండలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు -
హేమసముద్రం చెరువుకు నిధులు కేటాయించాలి
హన్వాడ: జిల్లాలోనే అతి పెద్దది అయిన మండలంలోని హేమసముద్రం చెరువుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఈ చెరువును రిజర్వాయర్ చేద్దామనుకున్నా.. ఓ గ్రామం, రెండు తండాలు ముంపునకు గురవుతున్నాయన్న కారణంతో విరమించుకొని.. ఉదండాపూర్ రిజర్వాయర్ ద్వారా కృష్ణాజలాలతో నింపేందుకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఇబ్రహీంబాద్ హేమసముద్రం చెరువుకట్టకు ఏర్పడిన గండికి అధికారులు తీసుకున్న చర్యలపై ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కట్టకు ఏర్పడిన గండి కారణంగా చెరువులోని నీరు లీకై పంటతోపాటు ప్రాణనష్టం జరిగే ప్రమాదం పొంచి ఉందన్నారు. గతంలో తీవ్ర వర్షాలతో వచ్చే నీటిని ప్రాజెక్టులు, చెరువుల్లో నీరు నింపుకొనేవాళ్లమని, ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదని విమర్శించారు. అధికారులు తీసుకున్న చర్యలు సక్రమంగా లేవని, బుంగ మరమ్మతు కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. అలాగే చెరువులు, కుంటలపై అధికారులు పర్యవేక్షణ చేసి తక్షణమే మరమ్మతు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరుణాకర్గౌడ్, మాజీ ఎంపీపీ బాలరాజు, నాయకులు జంబులయ్య, లక్ష్మయ్య, శ్రీనివాసులు, నరేందర్, చెన్నయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
దేవరకద్రలో కార్డెన్సెర్చ్
దేవరకద్ర: మున్సిపాలిటీ కేంద్రంలో శాంతిపరిరక్షణలో భాగంగా ఆదివారం పోలీసులు కార్డెన్సెర్చ్ నిర్వహించారు. మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ రామకృష్ణ, ఎస్ఐ నాగన్నతోపాటు మరో 8మంది ఎస్ఐలు, 80 మంది పోలీసులు దేవరకద్రలోని అన్నివార్డుల్లో కవాతు నిర్వహించి ఇంటింటికి తిరిగి కార్డెన్సెర్చ్ నిర్వహించారు. కుటుంబ సభ్యుల వివరాలను తెలుసుకుని ఆధార్ కార్డులను పరిశీలించారు. కొత్తవారు, అనుమానితుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. సరైన పత్రాలు లేని 30 బైక్లు, కారును సీజ్ చేశారు. రాత్రి వేళ కొత్తవారు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని యువకులకు సూచించారు. -
శిక్షణ.. ఉపాధి
ఉన్నత చదువులు చదివేందుకు ఆర్థికంగా అండ లేని యువతకు.. సాంకేతిక విద్య అభ్యసించినా నైపుణ్యం లేని విద్యార్థులకు.. వివాహమై ఏదో ఒక పని చేసి కుటుంబానికి ఆసరాగా ఉండాలని పరితపించే అతివలకు.. డిమాండ్ ఉన్న రంగాల్లో పట్టు సాధించాలి అనే యువకులకు అండగా నిలుస్తోంది ప్రభుత్వ రంగ సంస్థ సెట్విన్. మహిళలకు బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్.. యువకులకు కంప్యూటర్ హార్డ్వేర్, సీసీ కెమెరాల రిపేర్, డ్రోన్ల నిర్వహణ.. ఇలా ఎన్నో అంశాల్లో శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధితోపాటు పలు పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందేలా తీర్చిదిద్దుతోంది. తాజాగా ఈ శిక్షణ కేంద్రం జడ్చర్లలో ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేశారు. – జడ్చర్ల నిరుద్యోగులకు ఆయా రంగాల్లో శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించడానికి 1978లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సెట్విన్ (సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ ప్రమోషన్, ట్రైనింగ్ ఇన్ ట్విన్ సిటీస్) ఏర్పాటు చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్ కేంద్రంగా యువతకు శిక్షణ ఇచ్చేది. అనంతరం తెలంగాణ ప్రభుత్వ యాజమాన్యంలోని ఈ సంస్థ 2007 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి అవకాశాలను మెరుగు పరుచడానికి జిల్లాలకు విస్తరించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024–25కు సంబంధించి జహిరాబాద్, జడ్చర్లలో మరో రెండు సెట్విన్ కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు సెట్విన్ చైర్మన్ గిరిధర్రెడ్డి ప్రకటించారు. ఈమేరకు గతేడాది ఆగస్టులో జడ్చర్లలోని జౌఖీనగర్లో నిరుపయోగంగా ఉన్న గురుకుల భవనాన్ని ఆయనతోపాటు ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి, సంస్థ ఎండీ వేణుగోపాల్ పరిశీలించారు. అక్టోబర్లో కేంద్రాన్ని ప్రారంభిస్తామని కూడా అప్పట్లో ప్రకటించారు. అయితే అనివార్య కారణాలతో ఆలస్యమైంది. ఎట్టకేలకు త్వరలో శిక్షణ కేంద్రం ఏర్పాటుకు సంబంధిత పాలకులు, అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎంతో మందికి ఉపాధి జడ్చర్లలోని జౌఖీనగర్ గురుకుల భవనాన్ని శిక్షణకు సిద్ధం చేశారు. రూ.20 లక్షల అంచనా వ్యయంతో మరుగుదొడ్లు, మూత్రశాలలు తదితర మౌళిక వసతులు కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా 23 శిక్షణా కేంద్రాల ద్వారా యువత, అతివలకు శిక్షణ అందిస్తున్నారు. ఇదిలాఉండగా, ఈ శిక్షణ కేంద్రంలో మూడు నెలల పాటు శిక్షణ పొందిన అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారు. ఆయా సర్టిఫికెట్లతో దేశంలోని ఎక్కడైన పరిశ్రమలు, తదితర యూనిట్లలో ఉపాధి పొందవచ్చు. సెట్విన్ అభ్యర్థులకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటారు. అంతేగాక స్వయం ఉపాధి అవకాశాలు కల్పించుకోవడానికి బ్యాంకులు రుణాలు ఇవ్వడంలో ఈ అభ్యర్థులకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంత ప్రాధాన్యత ఉన్న శిక్షణ కేంద్రం జడ్చర్లలో ఏర్పాటు కావడంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలు కోర్సులలో శిక్షణ రోజు రోజుకు పెరుగుతున్న సాంకేతికతకు అనుగుణంగా పలు రంగాల్లో నైపుణ్యతను పెంచేందుకు సెట్విన్ శిక్షణ ఉపయోగపడుతుంది. ప్రధానంగా యువతకు అక్కరకు వచ్చే వృత్తులలో సంతరించుకుంటున్న ఆధునిక సాంకేతికతపై శిక్షణ ఇవ్వనుంది. మహిళలకు బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైన్, జరీ అల్లడం వంటి ప్రాధాన్యత కోర్సులతో పాటు కంప్యూటర్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ హార్డ్ వేర్, ఎయిర్ లైన్ టికెటింగ్, సెల్ఫోన్ రిపేర్, స్పోకెన్ ఇంగ్లీష్, ప్రింటింగ్ ప్రెస్, సీసీ కెమెరాల మరమ్మతులతో పాటు ఏసీ, వాషింగ్మిషన్, ఆర్ఓ మిషన్స్, కటింగ్ అండ్ టైలరింగ్, డ్రోన్ నిర్వహణ, తదితర కోర్సులలో శిక్షణ ఇవ్వనుంది. అయితే మొదటగా కంప్యూటర్, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ గా ర్మెంట్ మేకింగ్, ఎలక్ట్రీషియన్, రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండీషనర్ కోర్సులలో శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అడ్మిషన్లు ప్రారంభం సెట్విన్ శిక్షణ కేంద్రంలో దాదాపు 400 మందికి శిక్షణ ఇవ్వనున్నాం. ఎంపిక చేసిన కోర్సులలో 3 నెలల పాటు శిక్షణ ఇస్తాం. ఇందుకు నామమాత్రంగా ఫీజు ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్లు ఇస్తాం. ఈ సర్టిఫికెట్లు పొందిన వారికి పరిశ్రమలలో, బ్యాంకు రుణాల మంజూరులో తగు ప్రాధాన్యత లభించే అవకాశాలు ఉన్నాయి. – విజయ్కుమార్, సెట్విన్ కోఆర్డినేటర్, జడ్చర్ల సద్వినియోగం చేసుకోవాలి ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఎందరో నిరుద్యోగ యువతీ,యువకులకు సెట్విన్ శిక్షణ కేంద్రం వరం లాంటింది. ఇక్కడ ఇచ్చే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి. శిక్షణ పొందిన వారికి ఉద్యోగ,ఉపాధి రంగాలలో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఉమ్మడి జిల్లాకు చెందిన వారు మాత్రమే కాకుండా ఎక్కడి వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. వారికి మెరుగైన శిక్షణ ఇవ్వడమే ధ్యేయంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. – అనిరుధ్రెడ్డి, ఎమ్మెల్యే, జడ్చర్ల నిరుద్యోగుల పాలిట వరం.. సెట్విన్ శిక్షణ కేంద్రం మహిళలు, యువతకు వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ జడ్చర్లలో ఏర్పాటుకు సర్వం సిద్ధం రూ.20 లక్షలతో భవనంలో మౌలిక వసతుల కల్పన -
జూరాలకు పెరిగిన వరద
ధరూరు/రాజోళి/ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లో భారీగా పెరిగింది. శనివారం రాత్రి 8 గంటలకు వరకు 85 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా ఆదివారం రాత్రి 8 గంటల వరకు ప్రాజెక్టుకు లక్ష క్యూసెకులకు పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ప్రాజెక్టు 11 గేట్లను ఎత్తి 77,946 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే విద్యుదుత్పత్తి నిమిత్తం 38,818 వదలగా.. 46 క్యూసెక్కులు ఆవిరైంది. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయినీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 8.989 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సుంకేసులకు 53వేల క్యూసెక్కులు.. సుంకేసులకు ఆదివారం ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లో 53వేల క్యూసెక్కులకు చేరింది. దీంతో 12 గేట్లను ఒక మీటర్ మేర తెరిచి 49,632 క్యూసెక్కులను దిగుకు, కేసీ కెనాల్కు 2,180 క్యూసెక్కులను విడుదల చేసినట్లు జేసీ మహేంద్ర తెలిపారు. 415 మి.యూనిట్ల విద్యుదుత్పత్తి.. జూరాలకు ఎగువ నుంచి భారీ వరద నీరు వస్తుండటంతో జల విద్యుత్ కేంద్రాల్లో ఈ ఏడాది లక్ష్యానికి చేరువగా విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. ఈ ఏడాది మే నుంచే విద్యుదుత్పత్తి ప్రారంభించారు. 2025 –26 కు సంబంధించి 610 మి.యూనిట్లు లక్ష్యం కాగా.. ఆగస్టు 17 నాటికి 415 మి.యూనిట్లు చేరుకుంది. ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో నారాయణపూర్, ఆల్మట్టి డ్యాంల నుంచి జూరాలకు వరద పోటెత్తుతోంది. త్వరలోనే లక్ష్యాన్ని చేరుకోనుంది. ఆదివారం ఎగువలో 6 యూనిట్ల ద్వార 234 మెగావాట్లు, 236.943 మెగావాట్లు, దిగువలో 6 యూనిట్ల ద్వార 240 మెగావాట్లు విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. లక్ష్యానికి చేరువలో విద్యుదుత్పత్తి -
జాతిపితకు అవమానం
కల్వకుర్తి టౌన్: జాతిపిత మహాత్మా గాంధీకి ఘోర అవమానం జరిగింది. మహాత్ముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన ఆదివారం పట్టణంలోని చోటు చేసుకుంది. మున్సిపల్ కమిషనర్ మహమూద్ షేక్ తెలిపిన వివరాలు.. పట్టణంలోని పాత మున్సిపాలిటీ కార్యాలయంలో ఉన్న గాంధీజీ విగ్రహాన్ని శనివారం అర్ధరాత్రి దాటాక గుర్తు తెలియని వ్యక్తులు కాళ్ల నుంచి ధ్వంసం చేసి పక్కనే పడేశారు. ఆదివారం ఉదయం గుర్తించిన స్థానికులు మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందించారు. స్పందించిన మున్సిపల్ కమిషనర్ స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని, నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. విగ్రహం ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు -
పోలేపల్లి–కిష్టారం మధ్య నిలిచిన రాకపోకలు
జడ్చర్ల టౌన్: భారీవర్షాల కారణంగా మండలంలోని పోలేపల్లి–కిష్టారం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పోలేపల్లి సమీపంలోని రంగనాయక చెరువు మత్తడి దూకడంతో భారీగా వరదనీరు రోడ్డుపై పారుతోంది. దీంతో జడ్చర్ల–నవాబుపేట మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ కారణంగా ఫార్మకంపెనీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కిష్టారం, ఖానాపూర్, ఉదండాపూర్ తోపాటు నవాబుపేట మండలంలో నివాసముంటున్న ఫార్మ ఉద్యోగులు విధుల్లోకి చేరేందుకు బయలుదేరగా రోడ్డుపై వరదనీరు పారుతుండడంతో ఆందోళనకు గురయ్యారు. చెరువు అలుగునీరు నుంచి ఇబ్బందులు తొలగించేందుకు రోడ్డ్యాం నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. రాయపల్లి, గుండ్లగడ్డతండాకు.. పోలేపల్లి నుంచి రాయపల్లి, గుండ్లగడ్డతండాకు సైతం రాకపోకలు నిలిచిపోయాయి. పోలేపల్లి నుంచి రాయపల్లికి వెళ్లేమార్గంలో దర్గావద్ద ఫీడర్చానల్ మూసివేయడంతో వరదనీరు ఎటూపోలేక గ్రామంచుట్టూ నీళ్లు నిల్చున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామానికి చెందిన వ్యక్తి ప్రహరీ నిర్మించడంతో వరదనీరు పోవడంలేదని, ఇదే విషయాన్ని ఆదివారం ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ప్రహరీ కూల్చివేసి నీళ్లువెళ్లిపోయేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ నర్సింగ్రావును ఆదేశించారు. మంగళవారం పోచమ్మ బోనాలు, శుక్రవారం దర్గా ఉర్సు ఉండగా రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
గద్వాల క్రైం: గుర్తు తెలియని వ్యక్తులు తాళం వేసిన ఇంట్లో చొరబడి 16 తులాల బంగారు ఆభరణాలను అపహరించిన ఘటన ఆదివారం సాయంత్రం జిల్లాకేంద్రంలో వెలుగు చూసింది. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని హమలీకాలనీలో ఉంటున్న ప్రభుత్వ ఉద్యోగి చిన్న రాములు ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలసి మూడురోజుల కిందట హైదరాబాద్లోని బంధువుల వద్దకు వెళ్లారు. ఆదివారం సాయంత్రం తిరిగి ఇంటికి రాగా తలుపునకు వేసిన తాళం తెరుచుకొని కనిపించింది. లోనికి వెళ్లి చూడగా సామగ్రి చిందరవందరగా పడి ఉండటంతో దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ మొగిలయ్య, సీఐ శ్రీను, పట్టణ ఎస్ఐ కళ్యాణ్కుమార్ ఘటన స్థలానికి చేరుకొని చోరీ ఘటనపై ఆరా తీశారు. సాంకేతిక నిపుణులు, క్లూస్ టీం ఆధారాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బెడ్రూంలోని బీరువాలో భద్రపర్చిన 16 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయని.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. 16 తులాల బంగారు ఆభరణాల అపహరణ -
కాల్పులు విరమించి.. శాంతి చర్చలు జరపాలి
అచ్చంపేట: కగార్ హత్యాకాండను నిలిపివేయాలని, శాంతి చర్చలు జరిపి.. కాల్పుల విరమణ పాటించాలని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక డిమాండ్ చేసింది. ఈమేరకు వరంగల్ అంబేడ్కర్ భవన్లో ఈ నెల 24న నిర్వహించే బహిరంగ సభకు సంబంధించి వాల్పోస్టర్లను ఆదివారం అచ్చంపేట అమరవీరుల స్థూపం వద్ద పలువురు నాయకులు విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండున్నర దశాబ్దాలుగా ఆదివాసీలను వెంటాడుతూ, హత్యలు చేస్తూ రూ.కోట్లాది విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్లకు అప్పగించడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఆదివాసి ఉద్యమాలు బలంగా కొనసాగుతున్న నేపథ్యంలో సల్వా –జుడుము, గ్రీన్ హంట్, సమాదాన్ ప్రహార్ ఆపరేషన్లు, కగార్ పేరుతో పాశవికమైన హత్యాకాండను కొనసాగిస్తున్నాయన్నారు. 70 ఎన్కౌంటర్లలో 600లకు పైగా ఆదివాసీలను, ఉద్యమకారులను హత్య చేసిందన్నారు. ఇది చాలదన్నట్లు ఇంకా దారుణ మారణకాండను కొనసాగిస్తూ 2026 మార్చి 31 వరకు మావోయిస్టు రహిత భారత్ను నిర్మిస్తామని కేంద్ర హోం శాఖమంత్రి అమిత్ షా ప్రగల్బాలు పలుకుతున్నారని, ఇది సరికాదన్నారు. కార్యక్రమంలో సీఎల్సీ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి జక్క బాలయ్య, టీపీఎప్ రాష్ట్రకో కన్వీనర్ ఎడ్ల అంబన్న, బయ్యని శ్రీశైలం, కులనిర్మూలన పోరాట సమితి రాష్ట్ర నాయకులు ముద్దునూరి లకీ్ష్మ్నారాయణ, జిల్లా కో–కన్వీనర్ పర్వతాలు, నల్లమల కళాకారులు జక్క గోపాల్, టీఎన్వీఎఫ్ కన్వీనర్ గోరటి అనిల్ కుమార్, సీఎల్సీ నాయకులు పంబలి బాలయ్య, బియ్యని వెంకటేష్, నారుమల్ల లకీ్ష్మ్నారాయణ, డీటీఎఫ్ నాయకులు చారగొండ శ్రీశైలం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
డ్రెయినేజీలో పడి పారిశుద్ధ్య కార్మికుడి మృతి
వనపర్తి రూరల్: మండలంలోని అంకూరులో డ్రెయినేజీలో పడి పారిశుద్ధ్య కార్మికుడు మృతిచెందిన ఘటన శనివారం చోటుచేసున్నట్లు ఎస్ఐ జలంధర్రెడ్డి తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొమ్ము రాములు(43) గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. శనివారం గ్రామంలోని రైతువేదిక దగ్గర డ్రెయినేజీని శుభ్రం చేస్తుండగా.. ప్రమాదవశాత్తు బోర్లపడి ఊపిరాడక మృతిచెందాడు. మృతుడి కుమారుడు కొమ్ము వెంకటేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి బల్మూర్: చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి చెందిన సంఘటన శనివారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాజేందర్ వివరాల ప్రకారం.. మండలంలోని గోదల్ గ్రామానికి చెందిన బాల్రాం(78) ఈనెల 13న ఇంట్లోని బాత్రూంలో కాలుజారి కిందపడ్డాడు. దీంతో వెంటనే హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహం అందజేశారు. అతని కుమారుడు చెన్నయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి తిమ్మాజీపేట: విద్యుదాఘాతంతో మండలంలోని మారేపల్లి చెందిన ఇప్పలపల్లి అంజలయ్య (68) మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ హరిప్రసాద్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అంజలయ్య ప్రతి రోజు తెల్లవారుజామున గ్రామ సమీపంలోని కావేరమ్మ చెరువుకు కాలకృత్యాలకు వెళ్లేవాడు. యథావిధిగా శనివారం కూడా బహిర్భూమికి వెళ్లిన అంజలయ్య దారి పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు తగిలి కుప్పకూలిపోయాడు. అటుగా వెళ్తున్న అదే గ్రామానికి చెందిన చిన్నయ్య బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. భార్య బుచ్చమ్మ, ఇద్దరు కుమారులు వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి చిన్న కుమారుడు శ్రీనాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆరోగ్యశ్రీ అధికారినని బురిడీ అచ్చంపేట రూరల్: తాము ఆరోగ్యశ్రీ అధికారులమని ఓ మహిళను బురిడీ కొట్టించిన ఘటన అచ్చంపేటలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ విజయభాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని మధురానగర్ కాలనీకి చెందిన ఓ మహిళకు గత నెలలో కొత్త నెంబర్ నుంచి కాల్ వచ్చింది. తాను ఆరోగ్యశ్రీ అధికారినని.. మీకు ఆరోగ్యశ్రీ నుంచి రూ.15వేలు రానున్నాయని చెప్పాడు. నిజమేనని నమ్మిన ఆ మహిళ అతనికి ఓటీపీ చెప్పింది. కాల్ ముగిసిన తర్వాత చూస్తే ఆమె ఖాతాలో రూ.16వేలు విత్డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. తిరిగి అతనికి కాల్ చేస్తే కలవలేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించి శనివారం అచ్చంపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ విజయభాస్కర్ కేసు నమోదు చేశారు. సైబర్ క్రైమ్ మోసానికి గురైతే వెంటనే జాతీయ హెల్ప్లైన్ నెంబర్ 1930కు కాల్ చేయాలని ఎస్ఐ సూచించారు. -
గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
జడ్చర్ల: రెండు రోజుల కిందట చేపల వేటకు వెళ్లి వరద ప్రవాహంలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యమైంది. పూర్తి వివరాలు.. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని బోయలకుంటకు చెందిన భాను(24) మిత్రులతో కలిసి ఈ నెల 14న జడ్చర్ల వంద పడకల ఆసుపత్రి సమీపంలో ఎగువ నుంచి వస్తున్న వరదలో చేపలు పట్టేందుకు వెళ్లి గల్లంతయ్యాడు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని యువకుడి కోసం గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. ఎట్టకేలకు శనివారం సమీప ముళ్ల పొదల్లో యువకుడి మృతదేహం ఉండడాన్ని ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది గుర్తించారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిర్వహించి బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి ఏడాది కిందటే వివాహమైందని మృతుడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఇంట్లో తయారీ.. పట్టణాల్లో విక్రయం
పాలకోవాను ఇంట్లోనే సిద్ధం చేస్తారు. ఉదయం పాలసేకరణ అనంతరం కట్టెలపొయ్యిపైనే పాలకోవను తయారు చేస్తారు. ఆ తర్వాత కర్నూల్, అయిజ, శాంతినగర్, అలంపూర్ వంటి ప్రాంతాల్లో విక్రయిస్తారు. మిఠాయి, ఇతర దుకాణాలకు సైతం పాలకోవాను సరఫరా చేస్తున్నారు. ఇళ్ల వద్ద కుటుంబ సభ్యులు ఉదయం నుంచి సాయంత్రం వరకు పాలకోవాను విక్రయిస్తారు. ఇళ్లు అలంపూర్– రాయచూరు రోడ్డుమార్గంలో ఉండడంతో ఈ మార్గాన ప్రయాణించేవారు కొనుగోళు చేస్తారు. పట్టణాల్లో సైతం వీళ్లు తయారు చేసే పాలకోవాను నిరంతరం కోనుగోళు చేసే వినియోగదారులు, ఉద్యోగులు ఉన్నారు. -
డీసీఎం బోల్తా.. తప్పిన ప్రమాదం
కొత్తకోట రూరల్: ఓ డీసీఎం అదుపుతప్పి బోల్తా పడటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన కొత్తకోట మండలం పాలెం సమీపంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు అనంతపురం నుంచి హైదరాబాద్కు ఇనుము లోడ్ తీసుకెళ్తున్న వాహనం శనివారం తెల్లవారుజామున పాలెం బ్రిడ్జి సమీపంలోకి రాగానే బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్ యాదగిరి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. డీసీఎం రోడ్డుకు అడ్డంగా పడటంతో సుమారు గంటల తరబడి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు, హైవే సిబ్బంది వచ్చి వాహనాన్ని పక్కకు తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ ఆనంద్ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
గట్టు: మరో గంటన్నర ప్రయాణిస్తే క్షేమంగా ఇంటికి చేరుకునే వారు. తెల్లారక ముందే ఆ ఇద్దరు ప్రాణాలు సిమెంట్ (సిమెంట్ తయారి కోసం బూడిదను తీసుకెళ్లే లారీ) లారీ రూపంలో గాలిలో కలిశాయి. తెలంగాణ–కర్ణాటక సరిహద్దుల్లో రాయచూర్ జిల్లా పరిధిలోని సైదాపూర్ వద్ద కారును సిమెంట్ లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలైన సంఘటన చోటుచేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. మాచర్లకు చెందిన చేనేత వస్త్ర వ్యాపారి పీజీ రాఘవేంద్ర(42)తో పాటుగా ఇదే గ్రామానికి చెందిన అల్లుడు తౌడు నాగన్న అలియాస్ నాగేష్(50)లు మాచర్లకు చెందిన చేనేత కార్మికుడు వస్త్రా వ్యాపారి పీజీ మాసుమన్న, పీజీ రాఘవేంద్ర తండ్రీకొడుకులు సొంతకారులో రెండు రోజుల క్రితం మహారాష్ట్రలోని పూనేకు వస్త్రాల కొనుగోలు కోసం వెళ్లారు. శుక్రవారం వారు తిరుగు ప్రయాణమయ్యారు. దారిలో మహారాష్ట్రలోని షోలాపూర్లో మాచర్లకు చెందిన భార్యాభర్తలు ఈరమ్మ అలియాస్ జయంతి, ఆమె భర్త నాగన్న, అలియాస్ నాగేష్లను కారులో మాచర్లకు రావడానికి ఎక్కించుకున్నారు. వారి ప్రయాణిస్తున్న కారు తెలంగాణలోని మక్తల్ నియోజకవర్గం దాటి కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా పరిధిలోని సైదాపూర్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న సిమెంట్ లారీ కారును ఢీ కొట్టింది. డ్రైవింగ్ సీటులో ఉన్న రాఘవేంద్ర (42)తో పాటు పక్క సీటులో కూర్చున్న మాచర్ల అల్లుడు నాగేష్(50)అక్కడికక్కడే మృతి చెందారు. కారులో వెనుక సీటులో కూర్చున్న తండ్రి పీజీ మాసుమన్న, జయంతి గాయాలతో బయట పడ్డారు. జయంతికి కాళ్లు, చేతులు విరిగాయి. ప్రస్తుతం ఆమె రాయచూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సంఘటనపై కర్ణాటకలోని సైదాపూర్ ఎస్ఐ వినయ్బడిగేర కేసు నమోదు చేసి మృతదేహాలను రాయచూర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాఘవేంద్రకు భార్య సరస్వతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మహారాష్ట్రకు చెందిన నాగన్నకు ఇద్దర కుమారులు ఉన్నారు. ఈ సంఘటన రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. భర్త మరణం భార్యకు తెలియకుండా.. లారీ రూపంలో మృత్యువు కబళించగా, కర్ణాటకలోని సైదాపూర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో జయంతి భర్త నాగేష్ అక్కడికక్కడే మృతి చెందిన విషయం జయంతికి తెలియకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్త పడ్డారు. కాళ్లు, చేతులు విరిగి ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోస్టుమార్టం అనంతరం రాఘవేంద్ర మృతదేహాన్ని మాచర్లకు, నాగేష్ మృతదేహాన్ని మహారాష్ట్రలోని షోలాపూర్కు తరలించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు సైదాపూర్ వద్ద కారును ఢీకొట్టిన లారీ కర్ణాటక సరిహద్దులో ప్రమాదం మాచర్లలో విషాదఛాయలు -
జూరాలకు 95వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో
ధరూరు/ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 95వేల క్యూసెక్కులకు వరద వస్తున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 6 క్రస్టు గేట్లను ఎత్తి 41,112 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 38,879 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 45 క్యూసెక్కులు, కుడి కాల్వకు 338 క్యూసెక్కులు కలిపి ప్రాజెక్టు నుంచి మొత్తం 80,374 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.184 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు పేర్కొన్నారు. ప్రాజెక్టు ఎగువలో 6 యూనిట్ల ద్వారా 230.683 ఎంయూ, దిగువలో 6 యూనిట్ల ద్వారా 273.706 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఏఈ శ్రీధర్ తెలిపారు. సుంకేసులకు 32 వేల క్యూసెక్కులు రాజోళి: సుంకేసుల డ్యాంకు ఎగువ నుంచి 32 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా.. 7 గేట్లను తెరిచి 30,653 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినట్లు జేఈ మహేంద్ర తెలిపారు. అలాగే కేసీ కెనాల్కు 2,180 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు 6 క్రస్టు గేట్ల ఎత్తివేత ప్రాజెక్టు నుంచి 80,374 క్యూసెక్కుల నీరు దిగువకు.. -
పాలమూరులోభారీ వర్షం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి 9.30 నుంచి పది గంటల వరకు భారీ వర్షం కురిసింది. నగరంలోని డ్రెయినేజీలు నిండి పొంగి పొర్లడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలలో వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాలీబాల్ జిల్లా జట్ల ఎంపిక మహబూబ్నగర్ మున్సిపాలిటీ: రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు శనివారం జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో అండర్–15 బాలబాలికల జిల్లా జట్లను ఎంపిక చేశారు.జిల్లాలోని అన్ని పాఠశాలల నుంచి సుమారు 150 విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ప్రతిభ చూపిన 20 మంది ఈ నెల 18, 19న హైదరాబాద్లోని సరూర్నగర్ స్టేడియంలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారు. కార్యక్రమంలో జిల్లా పాఠశాలల క్రీడల కార్యదర్శి ఆర్.శారదాబాయి, మాజీ కార్యదర్శి కె.రమేష్ బాబు, సీనియర్ పీఈటీలు నిరంజన్రావు, శైలజ, శ్రీనివాసులు, రాంచందర్, ఖాజామైనొద్దీన్ పాల్గొన్నారు. -
ఊడ్చడానికి ఎవరూ రారు
మా ప్రాంతంలో ఊడ్చడానికి నెలల తరబడి ఎవరూ రావడం లేదు. చుట్టుపక్కల అంతా అపరిశుభ్ర వాతావరణం అలుముకుంది. మోరీలను శుభ్రం చేయకపోవడంతో దోమలు, ఈగలకు నిలయంగా మారాయి. ఇంట్లోని చిన్నపిల్లలను ఆడుకోవడానికి ఆరు బయటకు పంపించాలంటేనే భయంగా ఉంది. ఇప్పటికే మా కాలనీకి చెందిన ఇద్దరు డెంగీ బారిన పడి ఆస్పత్రి పాలయ్యారు. – మేఘన, గృహిణి, క్రిస్టియన్కాలనీ, సుభాష్నగర్ వరద కాల్వతో ఎన్నో ఇబ్బందులు మా స్కూల్ వెనుకనే పెద్దచెరువుకు వెళ్లే వరద కాల్వ ఉంది. అందులో చెత్తాచెదారం, మురుగు పారుతుండటంతో దుర్గంధం వెదజల్లుతోంది. పక్కనే ఉన్న ఓపెన్ ప్లాట్లో చుట్టుపక్కలవారు వచ్చి చెత్తాచెదారం వేసి పోతున్నారు. ముళ్లకంప, పొదలతో నిండిపోయింది. దీంతో ఇక్కడి మదర్సాలలో చదువుకుంటున్న చిన్నారులకు రోగాలు సోకే ప్రమాదం పొంచి ఉంది. మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలి. – మొహమ్మద్ హమీద్, మదర్సా వాచ్మన్, పీర్లబాయి, మహబూబ్నగర్ చుట్టూ కార్ఖానాలతో కాలుష్యమయం మా గేరి చుట్టూ వాహనాల మరమ్మతు చేసే కా ర్ఖానాల నుంచి వెలువడే కాలుష్యంతో ఇబ్బందు లు తప్పడం లేదు. వీధి లోపలికి ఎవరూ ఊడ్చ డానికి రావడం లేదు. ఎవరి ఇళ్ల ముందు వారే శుభ్రం చేసుకునే పరిస్థితి తలెత్తింది. మెయిన్ రోడ్డు నుంచి కార్ఖానాలు ఉండే షాపుల వరకు మాత్రమే పారిశుద్ధ్య కార్మికులు వచ్చి ఊడ్చిపో తున్నారు. థియేటర్ పక్కన మోరీ వద్ద ఎవరిబడితే వారు మూత్రం చేస్తున్నారు. – యాదగిరి, ఆటో డ్రైవర్, కొమ్ముగేరి, మహబూబ్నగర్ ● -
కేంద్రం నిధులతోనే అభివృద్ధి పనులు: ఎంపీ
చిన్నచింతకుంట: కేంద్ర ప్రభుత్వం నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. శనివారం చిన్నచింతకుంటలో వాల్మీకి, ముదిరాజ్ సంఘాల కమ్యూనిటీ భననాల నిర్మాణాలకు భూమి పూజ చేయడంతో పాటు ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ కేంద్రం నిధులు లేనిదే రాష్టంలో ఎలాంటి అభివృద్ధి పనులు కొనసాగవని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. గ్రామాల్లో సీసీరోడ్లు, అంగన్వాడీలు, శ్మశాన వాటికలు, పీఎం ఆవాస్యోజన కింద నిరుపేదలకు ఇళ్లు, మధ్యాహ్న భోజనం, పేదలకు రేషన్, రైతులకు కిసాన్సమ్మాన్, ఎరువలపై సబ్సిడీ..తదితర వాటిని అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. పదేళ్ల పాటు బీఆర్ఎస్తో పాటు ప్రభుత్వం అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రంలో చేసింది ఏమీ లేదన్నారు. ప్రజలను నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. వారి మోసపూరిత పాలనను ప్రజలు చూస్తున్నారని తెలిపారు. తెలంగాణలో ఒక్కసారి బీజేపీకి అధికారం ఇస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు. కేంద్రం నుంచి ప్రతి రూపాయి ప్రజలకు చేరవేసే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. మోదీ వికసిత్ భారత్ లక్ష్యానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలన్నారు. గ్రామస్థాయి నుంచే పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. అందుకు స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా కృషి చేయాలన్నారు. వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని పార్లమెంట్లో ప్రతిపాదన పెట్టమని, అందుకు ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పద్మజారెడ్డి, పవన్కుమార్రెడ్డి, కొండా ప్రశాంత్రెడ్డి, కుర్వ రమేష్, భరత్ భూషన్, నంబిరాజు, బోయ రాము, దశరథ్, తదితరులు పాల్గొన్నారు. -
మేమెక్కడికి పోవాలె.. ఈ పల్లె.. మా గడ్డ!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఆ పల్లెలో మూడు తరాల ప్రజలు ఉన్నంతలో సుఖంగా జీవించారు. ప్రస్తుతం నాలుగో తరం జీవనం సాగిస్తోంది. 200 ఏళ్లకు పైగా అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్న ఆ పల్లె వాసులకు దేవాదాయ శాఖ రూపంలో ఆపద ముంచుకొచ్చింది. ఆలయ మాన్యం భూమిలో ఊరు ఉందంటూ.. గ్రామాన్ని ఖాళీ చేయాలని అధికారులు హుకుం జారీచేశారు. దీంతో గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. నారాయణపేట జిల్లాలోని పల్లెగడ్డ వాసుల దీనగాథపై ‘సాక్షి’గ్రౌండ్ రిపోర్ట్..250కి పైగా కుటుంబాలు.. 16,124 జనాభాపర్వత ప్రాంతమైన పల్లెగడ్డ మొదట నారాయణపేట జిల్లా మరికల్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది. 2018లో ఇది నూతన జీపీగా ఆవిర్భవించింది. ప్రస్తుతం ఈ పల్లెలో 250 కుటుంబాలకు పైగా నివాసం ఉంటున్నాయి. మొత్తం 16,124 మంది జనాభా.. 745 మంది ఓటర్లు ఉన్నారు. 20 ఎకరాలు గ్రామకంఠం భూమిగా రికార్డులో నమోదై ఉంది. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని చిన్న రాజమూరు ఆంజనేయ స్వామి ఆలయం పేరిట సర్వే నంబర్ 269, 270, 271లో 69 ఎకరాల మాన్యం భూమి ఉంది. దీనికి పైభాగాన మరికల్లో నివసిస్తున్న కాట్టెకొండ వంశీయుల భూములు ఉన్నాయి. సుమారు 200 ఏళ్ల క్రితం ఆ వంశస్తులైన హన్మన్న, ముసిలన్న, చిన్న రాజన్న, తిమ్మన్న సదరు ఆలయ భూమిలో గుడిసెలు వేసుకుని కుటుంబాలతో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. కాలక్రమంలో వారి వారసులు సైతం అక్కడే వ్యవసాయం చేసుకుంటూ స్థిరపడ్డారు. క్రమక్రమంగా జనాభా పెరుగుతూ వచ్చింది. పక్కా ఇళ్ల నిర్మాణాలు కూడా జరిగాయి. దీంతో అప్పటి పెద్దలు గ్రామానికి పల్లెగడ్డగా నామకరణం చేశారు.2018లో 11 మందికి... ఇటీవల 25 మందికి..ఆలయ మాన్యం భూమిలో నిర్మించుకున్న ఇళ్లు తొలగించాలని 2018లో దేవాదాయ శాఖ అధికారులు పల్లెగడ్డ వాసులు 11 మందికి నోటీసులు జారీ చేశారు. దీంతో వారు నారాయణపేట జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది జూన్, జూలైలో మరో 25 మందికి నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 18న దేవాదాయ శాఖ ట్రిబ్యునల్ కోర్టుకు హాజరుకావాలని అందులో పేర్కొనడంతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొందిఏడేళ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నా..అధికారులు గ్రామాన్ని ఖాళీ చేయా లంటున్నారనే విషయాన్ని ప్రజా ప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ఏడేళ్లుగా నారాయణపేట కోర్టు చుట్టూ తిరుగుతున్నా. గ్రామం ఖాళీ చేసి పోతే మా బతు కులేం కావాలి? మాకు అన్యాయం జరగకుండా చూడా ల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. – హన్మంతు, పల్లెగడ్డముత్తాతల కాలం నుంచి ఇక్కడే ఉన్నాం..నేనొక్కడినే కాదు.. చాలా మంది అప్పులు చేసి ఇళ్లు కట్టుకున్నారు. మా ముత్తాతల కాలం నుంచి ఇక్కడే ఉన్నాం. ఇప్పుడు ఖాళీ చేయాలంటూ నాతో పాటు 25 మందికి నోటీసులిచ్చారు. మాకు ప్రభుత్వం ఎక్కడైనా ఇళ్లు నిర్మించి ఇస్తే.. ఊరు ఖాళీ చేయడానికి అభ్యంతరం లేదు. – గోవింద్, పల్లెగడ్డ ఆధారాలుంటే కోర్టుకు సమర్పించాలి..చిన్నరాజమూరు ఆంజనేయ స్వామి ఆలయ భూమిలో ఇళ్లు నిర్మించడం వల్లే పల్లెగడ్డ గ్రామస్తులకు దశల వారీగా నోటీసులిస్తున్నాం. వారి వద్ద ఏమైనా ఆధారాలుంటే కోర్టులో సమర్పించాలి. లేకుంటే కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. – కవిత, దేవాదాయ శాఖ ఈఓ, మహబూబ్నగర్ -
ఏఎస్ఐ మహ్మద్ మోయిజుద్దీన్కి ఇండియన్ పోలీస్ మెడల్
మహబూబ్నగర్ క్రైం: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మహబూబ్నగర్ పోలీస్ శాఖలోని డీసీఆర్బీలో ఏఎస్ఐగా పనిచేస్తున్న మహ్మద్ మోయిజుద్దీన్కు ఇండియన్ పోలీస్ మెడల్ను భారత ప్రభుత్వం గురువారం ప్రకటించింది. 1989లో పోలీస్ కానిస్టేబుల్గా ఎంపికై న మోయిజుద్దీన్ ఉమ్మడి జిల్లాలోని అలంపూర్, తిమ్మాజిపేట, జడ్చర్ల, పెద్దకొత్తపల్లి, కోస్గి పోలీస్స్టేషన్లలో విధులు నిర్వహించాడు. 2012లో హెడ్కానిస్టేబుల్గా పదోన్నతి పొంది డీసీఆర్బీలో పనిచేశారు. 2018లో ఏఎస్ఐగా పదోన్నతి వచ్చిన తర్వాత సీసీఎస్ మహబూబ్నగర్, హన్వాడ, ట్రాఫిక్ పోలీస్స్టేషన్, కోయిలకొండ పోలీస్స్టేషన్లో విధులు నిర్వహించాడు. తన విశిష్ట సేవలకు గాను ఇప్పటి వరకు 70 క్యాష్ రివార్డులు, 18 జీఎస్ఈ, 12 ప్రశంసాపత్రాలు, ఒక సేవా పతకం, 2017లో టీఎస్ ముఖ్యమంత్రి సర్వోన్నత పోలీస్ పథకం, 2019లో ఉత్తమ పోలీస్ పతకం అందుకున్నారు. ఇండియ పోలీస్ మెడల్ వచ్చిన మోయిజుద్దీన్ను ఎస్పీ జానకి అభినందించారు. జాతీయ రహదారిపై నిఘా : డీఐజీ మహబూబ్నగర్ క్రైం: జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో భూత్పూర్– షేర్పల్లి మధ్యలో జాతీయ రహదారిపై వర్షపు నీరు రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడి వాహనాలు నిలిచిపోయాయి. షేర్పల్లి పరిధిలో ఉన్న కోమటికుంట చెరువు అలుగు పారడంతో వరద నీరు అధికంగా జాతీయ రహదారి–44పైకి వచ్చింది. దీంతో వాహన రాకపోకలకు అడ్డుగా మారడంతో డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, ఎస్పీ జానకి గురువారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. జాతీయ రహదారి కావడంతో పోలీసులు దాదాపు గంటపాటు శ్రమించి సమస్యను పరిష్కరించారు. అనంతరం డీఐజీ మాట్లాడుతూ భారీ వర్షాలు కురుస్తుండటంతో జాతీయ రహదారి వంటి రద్దీ మార్గాలపై నిరంతరం నిఘా పెట్టామన్నారు. వరదలలో మనుషులు, మూగజీవాలు చిక్కుకుంటే వెంటనే డయల్ 100కి లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే జిల్లాకేంద్రంలో పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లే అండర్పాస్ పూర్తిగా వర్షపు నీటితో మునిగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్పీ డి.జానకి అక్కడికి చేరుకుని మోటార్లతో నీటిని బయటకు పంపించి రాకపోకలకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం దివిటిపల్లి సమీపంలో అమర్రాజా బ్యాటరీ కంపెనీ దగ్గర తెగిపోయిన రోడ్డులో పడిపోయిన బస్సును ఎస్పీ పరిశీలించారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం ఎర్రవల్లి: ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని అతివేగంగా వచ్చిన బొలెరో ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈఘటన బీచుపల్లి స్టేజీ దగ్గర గురువారం చోటుచేసుకుంది. ఇటిక్యాల ఎస్ఐ రవి నాయక్ కథనం మేరకు వివరాలిలా.. పెబ్బేరు మండలంలోని రంగాపురం గ్రామానికి చెందిన అల్లాడి భాస్కర్గౌడ్ (54), అదే గ్రామానికి చెందిన మినిగోలు ఎల్లమ్మ (46) పొలం పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై బీచుపల్లికి బయల్దేరారు. ఈ క్రమంలో బీచుపల్లి స్టేజీ దగ్గర వారు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు వెళ్తున్న బొలెరో వాహనం అతివేగంతో వచ్చి వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇరువురికి తీవ్రగాయాలు కాగా.. అల్లాడి భాస్కర్గౌడ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఎల్లమ్మను గద్వాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతుడి కుమారుడు అల్లాడి కిరణ్గౌడ్ ఫిర్యాదు మేరకు బొలెరో డ్రైవర్ రెడ్డిగారి రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నాడు. పోలీసుల అదుపులో ఇద్దరు యువకులు గద్వాల క్రైం: నిషేధిత మత్తు పదార్థాలను విక్రయిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. పట్టణానికి చెందిన యువకులు ఇతర రాష్ట్రాల నుంచి రహస్యంగా గంజాయి కొనుగోలు చేసి వాటిని మైనర్లకు, విద్యార్థులకు విక్రయిస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు వారం రోజుల నుంచి పోలీసులు నిఘా ఉంచారు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం జిల్లా కేంద్రం శివారు కాలనీలో ముగ్గురు యువకులు గంజాయి తీసుకుంటున్నట్లు తెలియగా.. పట్టణ ఎస్ఐ కళ్యాణ్కుమార్ వారిని పట్టుకున్నారు. ముగ్గురిని డీ అడిక్షన్ సెంటర్కు తరలించి కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు ఆరా తీశారు. దీంతో గద్వాల పట్టణానికి చెందిన ఇద్దరు యువకులు గంజాయి విక్రయినట్లు వివరించారు. నిఘా ఉంచిన పోలీసులు బుధవారం రాత్రి సదరు ఇద్దరు యువకులను పట్టుకున్నారు. గంజాయి ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారు, ఎప్పటి నుంచి విక్రయిస్తున్నారని, ఎంతమంది తీసుకుంటున్నారు అనే విషయాలపై ఆరా తీశారు. అయితే ఆన్లైన్, ఇన్స్ర్ట్రాగాం సాయంతో రాయచూర్కు చెందిన గుర్తుతెలియని వ్యక్తుల నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు విచారణలో తేలింది. పట్టుబడిన ఇద్దరి వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉండడంతో పలు అంశాలపై ఆరా తీస్తున్నారు. ఈ విషయంపై పట్టణ ఎస్ఐను సంప్రదించగా.. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని ఆరా తీస్తున్నామని, తాజాగా ముగ్గురు యువకులను డి అడిక్షన్ సెంటర్కు తరలించి కౌన్సెలింగ్ ఇస్తున్నామన్నారు. నిషేధిత మత్తు పదార్థాలు ఎవరైన గుట్టుగా విక్రయించిన, నిల్వ ఉంచుకున్నట్లు తెలిస్తే డయల్ 100 లేదా పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. ఉరేసుకొని విద్యార్థి ఆత్మహత్య వెల్దండ: ఇటీవల ఇంటర్ పూర్తయి.. బీటెక్లో చేరాల్సిన ఓ విద్యార్థి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వెల్దండలో గురువారం చోటుచేసుకుంది. బంధువులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా.. వెల్దండకు చెందిన భారతమ్మ, కృష్ణయ్య దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు శివకుమార్(17) సంతానం. కుమార్తె బీఈడీ చదువుతుండగా.. కుమారుడు శివకుమార్ హైదరాబాద్లోని నారాయణ కళాశాలలో ఇటీవల ఇంటర్ పూర్తి చేశాడు. బీటెక్లో చేరాల్సి ఉండగా.. ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఇద్దరు పిల్లలను ఉన్నత చదువులు చదివించేందుకుగాను తండ్రి కృష్ణయ్య హైదరాబాద్లోని ఓ స్వీట్షాపులో పనిచేస్తున్నాడు. ఇదిలాఉండగా, తల్లి భారతమ్మ గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో నాగర్కర్నూల్కు సొంత పని మీద వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కుమారుడు శివకుమార్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చుట్టుపక్కల వారు ఇంటి తలుపులు తీసి ఉండడం చూసి లోపలికి వెళ్లి చూడగా.. అప్పటికే మృతిచెందాడు. చేతికి అందివచ్చిన కుమారుడు మృతిచెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మృతికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులను సంప్రదించగా.. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. ఇదిలాఉండగా, విషయం తెలుసుకున్న కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతులు భాస్కర్గౌడ్, ఎల్లమ్మ -
డీసీసీబీ పదవీకాలం పొడిగింపు
● ఆరు నెలలపాటు కొనసాగనున్న ప్రస్తుత పాలకవర్గాలు ● మరోసారి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం మహబూబ్నగర్ (వ్యవసాయం): జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పాలకవర్గాల కాల పరిమితి ప్రభుత్వం పొడిగించింది. మరో ఆరు నెలలపాటు ప్రస్తుతం ఉన్న పాలక వర్గాలే కొనసాగేలా నిర్ణయం తీసుకుంది. ఐదేళ్ల క్రితం (2020 ఫిబ్రవరి 15న) సహకార సంఘాల ఎన్నికలు జరిగి పాలకవర్గాలు ఏర్పాటయ్యాయి. వీటి గడువు శుక్రవారంతో ముగియడంతో ప్రభుత్వం పాలకవర్గాల గడువును రెండోసారి మరో ఆరు నెలలు పెంచింది. ఈ మేరకు రాష్ట్ర కో ఆపరేషన్, సహకార సంఘాల రిజిస్ట్రార్ కమిషనర్ కె.సురేంద్ర మోహన్ గురువారం జీఓ 386 జారీ చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 78 పీఏసీఎస్లు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం సహకార సంఘాల గడువును పెంచడంతో డీసీసీబీ చైర్మన్గా మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి మరో ఆరునెలల పాటు కొనసాగనున్నారు. అలాగే ఉమ్మడి జిల్లాలోని పీఏసీఎస్ల చైర్మన్లు కూడా యథావిధిగా కొనసాగుతారు. రైతులకు మరో ఆరు నెలలు సేవ చేసే అవకాశం లభించింది. పదవీకాలం పొడిగించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇందుకు సహకరించిన సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, తుమ్మల నాగేశ్వర్రావుకు కృతజ్ఞతలు. ఈ అవకాశంతో రైతులకు మరింతగా మెరుగైన సేవలు అందించేందుకు కృషిచేస్తా. – మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి, చైర్మన్, డీసీసీబీ -
ఈజీ మనీ ఆశచూపి రూ.2 లక్షలు మోసం
● ప్రధాన సూత్రదారుడు స్నేహితుడే.. ● ఇద్దరు నిందితులను రిమాండ్కు తరలింపు మహబూబ్నగర్ క్రైం: నా దగ్గర రాజకీయ నాయకులకు సంబంధించిన బ్లాక్ మనీ చాలా ఉందని.. రూ.లక్ష ఇస్తే రూ.5లక్షలు ఇస్తానని స్నేహితుడిని నమ్మించారు. రూ.2లక్షలు తీసుకొని.. డమ్మీ నోట్లు ఇచ్చి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఒక్క రోజులోనే ఇద్దరు నిందితులను పట్టుకొని రిమాండ్కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గురువారం టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. నారాయణపేట జిల్లాకు చెందిన ఆశప్పకు 20రోజుల కిందట నవాబ్పేట మండలం పోమాలి గ్రామానికి చెందిన కె.రాములు ఫోన్ చేసి పరిచయం ఉన్న వ్యక్తి మాదిరిగా మాట్లాడాడు. నా దగ్గర రాజకీయ నాయకులు ఎన్నికల్లో ఉపయోగించే, పంపిణీ చేసే బ్లాక్మనీ ఉందని, మీరు రూ.2లక్షలు ఇస్తే రూ.10లక్షలు ఇస్తానని చెప్పాడు. జరిగిన విషయాన్ని ఆశప్ప అతని స్నేహితుడు అయిన వెంకటరాములుకు చెప్పాడు. దీంతో ఇద్దరూ కలిసి ఈనెల 10న మహబూబ్నగర్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఎల్లమ్మ గుడి దగ్గరకు వచ్చారు. రూ.2లక్షలు తీసుకొని.. డమ్మీ నోట్లు ఇచ్చి.. ఈమేరకు కె.రాములు వారిని కలిసి వారి ఇద్దరికి చేరో రూ.500 నోట్ ఇచ్చి ఇలాంటి డబ్బులు నా దగ్గర చాలా ఉన్నాయని నమ్మించాడు. దీంతో కె.రాములు ఇచ్చిన నోట్లు తీసుకుని కోస్గికి వెళ్లిన ఆ ఇద్దరూ నోట్లు చెక్ చేసుకోగా ఒరిజినల్ అని తేలడంతో నమ్మారు. దీంతో ఈ నెల 12న ఆశప్ప రూ.2 లక్షల నగదు తీసుకుని రాగా వెంకట్రాములు రూ.2లక్షల విలువ చేసే డమ్మి(ఫేక్) నోట్లు తీసుకుని మహబూబ్నగర్ బస్టాండ్కు వచ్చారు. ఆశప్ప అతని దగ్గర ఉన్న రూ.2లక్షల నగదు, వెంకటరాములు తన వెంట తెచ్చిన రూ.2లక్షల డమ్మీ నోట్ల కట్టాలను కవర్లో పెట్టి కె.రాములుకు అందించారు. ఆ డబ్బులు తీసుకున్న కె.రాములు మీకు ఇవ్వాల్సిన రూ.10లక్షలు కారులో ఉన్నాయని చెప్పి తెస్తానని రోడ్డు దాటివెళ్లిపోయి తన ఫోన్ స్వీచ్ ఆఫ్ చేశాడు. దీంతో మోసపోయిన అని గ్రహించిన ఆశప్ప టూటౌన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి ఒక్కరోజు వ్యవధిలో కేసు చేధించినట్లు డీఎస్పీ తెలిపారు. -
దేశాభివృద్ధికి సమష్టిగా కృషి
ఆగని అవినీతి..మహబూబ్నగర్కోయిల్సాగర్ 5 గేట్లు ఎత్తివేత తెగిన కల్వర్టు.. పడిన బస్సు ● సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అభివృద్ధి సాధించాలి ● కులం, మతం, భాష, ప్రాంత భేదాభిప్రాయాలు ఉండొద్దు ● జిల్లాకేంద్రంలోని వాసవీ డిగ్రీ, పీజీ కళాశాలలో ‘సాక్షి’ టాక్షో ● అభిప్రాయాలు వెలిబుచ్చిన విద్యార్థులు ● పొంగిన వాగులు.. నిండిన చెరువులు, కుంటలు ● జడ్చర్ల వద్ద ఎన్హెచ్ సర్వీస్ రోడ్డుపై పోటెత్తిన వరద ● చిక్కుకున్న 2 బస్సులు.. ప్రయాణికులు సురక్షితం ● భూత్పూర్లోని శేరిపల్లి వద్ద జాతీయ రహదారిపై భారీగా నీరు.. ● దెబ్బతిన్న రహదారులు.. జలదిగ్బంధంలో ఆర్యూబీలు ● పలు చోట్ల నీటమునిగిన కాలనీలు.. రాకపోకలకు అంతరాయం ● వివిధ ప్రాంతాలను సందర్శించిన కలెక్టర్, డీఐజీ, ఎస్పీ ‘స్వతంత్ర భారతదేశంలో అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట పడడం లేదు. దాదాపు అన్ని రంగాల్లోనూ అవే రాజ్యమేలుతున్నాయి. స్వేచ్ఛ.. సమానత్వం అనేవి మాటలకే పరిమితమయ్యాయి. విద్య, వైద్యం అంటే కాసులు కుమ్మరించాల్సిందే. సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఆయా విభాగాల్లో మెరుగైన ఫలితాల సాధనకు ప్రజాప్రతినిధులు మరింత కృషి చేయాలి. ఈ మేరకు చట్టసభలతో పాటు అధికార యంత్రాంగంలో మార్పు రావాలి. మరింత నీతి, నిజాయితీగా పనిచేస్తూ స్వాతంత్య్ర ఫలాలను ప్రతిఒక్కరికీ అందించాలి.’ అనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో 78 ఏళ్లు పూర్తి చేసుకుని శుక్రవారం 79వ వసంతంలోకి అడుగిడుతున్న స్వతంత్ర భారతావనిలో స్వాతంత్య్ర ఫలాలు అందుతున్నాయా? వంటి పలు అంశాలపై ‘సాక్షి’ గురువారం సర్వే చేపట్టింది. పలు వర్గాల ప్రజలు ఉత్సాహంగా తమ అభిప్రాయాలను వెల్లడించారు. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ శుక్రవారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2025రిజర్వేషన్లుఉండవద్దు.. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు గడుస్తున్నా దేశంలో ఇంకా సమానత్వం అనేది మచ్చుకై నా కనిపించడం లేదు. నిజమైన సమానత్వం రావాలంటే కులం, మతం పేరిట ఉన్న రిజర్వేషన్లను తక్షణమే రద్దు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – అశ్విని, రెండో సంవత్సరం సర్వే సాగిందిలా.. ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో మొత్తం 150 మంది నుంచి ‘సాక్షి’ బృందం శాంపిళ్లు సేకరించింది. ఒక్కో జిల్లా నుంచి 30 మంది (పురుషులు 15, మహిళలు 15) చొప్పున అభిప్రాయాలు తీసుకుంది. ఎంచుకున్న మూడు ప్రశ్నలకు ఒక్కొక్కరి నుంచి సమాధానాలను రాబట్టింది. ఈ సందర్భంగా పలువురు తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ వ్యవస్థలోని కాలానుగుణ మార్పులు, లోపాలతో పాటు ఇంకా మెరుగు కావాల్సిన అంశాలను ప్రస్తావించారు. మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 79 ఏళ్లు గడుస్తున్నా.. సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంకేతిక పరంగా పూర్తిస్థాయిలో మార్పులు చోటు చేసుకున్నప్పటికి మరింత మార్పు రావాలని, కులం, మతం, భాష, ప్రాంతం అనే భేదాభిప్రాయాలు లేకుండా సమష్టిగా దేశాభివృద్ధికి పాటుపడాలని విద్యార్థులు పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని వాసవి డిగ్రీ, పీజీ కళాశాలలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన టాక్ షోలో విద్యార్థులు పాల్గొని తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. 78 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత మీరు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏమిటి? పర్యావరణ సమతుల్యత.. దేశం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ముందుకెళ్తున్నా.. స్థిరమైన అభివృద్ధి సాధించలేకపోయాం. ఇష్టానుసారంగా ప్లాస్టిక్ వినియోగించడం వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. భవిష్యత్లో పెద్దఎత్తున చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడాలి. – అనూష, మొదటి సంవత్సరం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో.. దేశంలో ప్రతిభ ఉన్న వారు ఇతర దేశాలకు వలస వెళ్లి అక్కడ రాణిస్తుండటంతో మన దేశంలో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మరింత వెనకబడిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడే మంచి ఉద్యోగాలు సృష్టించి.. దేశాభివృద్ధికి దోహదపడాలి. – హిమబిందు, మొదటి సంవత్సరం ఉచితాలు ఇవ్వకూడదు.. ప్రభుత్వాలు ప్రజలకు ఉచిత పథకాల పేరుతో ఇచ్చే వాటిని నిలిపివేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా సామాజిక స్పృహ కలిగి ఉండి, ఓటింగ్ సమయంలో కేవలం డబ్బులు ఇవ్వకుండా నిజాయితీగా ఉండే వారికి మాత్రమే ఓటు వేయాలి. – శ్రవంతి, రెండో సంవత్సరం విద్యార్థుల భవిష్యత్.. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా అవన్నీ ప్రజలను మభ్యపెట్టేలా ఉంటున్నాయి. కాబట్టి చదువుకునే విద్యార్థుల భవిష్యత్ బాగుండాలంటే తప్పకుండా కొత్త పథకాలు తీసుకువచ్చి మెరుగ్గా చదువుకునేలా కృషిచేయాలి. – లక్ష్మీ, రెండో సంవత్సరం స్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కాలంటే మరింత నీతి, నిజాయితీగా పనిచేయాల్సిన రంగాలు ఏవి ? స్వేచ్ఛ– సమానత్వం నిజంగానే అందరికీ చేరుతోందా? చట్ట సభలు న్యాయ స్థానాలు అధికార యంత్రాంగం మీడియా వసతులుకల్పించాలి.. ప్రజలు పన్నులు చెల్లిస్తున్నా అనుకున్న స్థాయిలో వసతులు మాత్రం లేవు. పేదరికంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యం, ఇన్యూరెన్సు సౌకర్యం కలిస్తే పేదలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. – మహ్మద్ అఫ్రోజ్, మొదటి సంవత్సరం అదే భారత్ గొప్పతనం దేశంలో అనేక మతాలు, కులాలు, సంప్రదాయాలు ఉన్నప్పటికీ.. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పడమే భారత్ గొప్పతనం. అన్ని మతాల వారు పరస్పరం గౌరవించుకుంటూ జీవిస్తున్నారు. వచ్చే 20 ఏళ్లలో దేశం మరింత వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలవాలి. – అబ్దుల్లా, మొదటి సంవత్సరం అవునులేదుకొద్దిగా.. అంతరాలు తొలగించాలి.. సుపరిపాలన అందించే దిశగా ప్రధానంగా చట్టసభలు, అధికార యంత్రాంగంలో మార్పు రావాలనే ఆకాంక్ష ప్రజల్లో వ్యక్తమవుతోంది. పేదలు, సంపన్నుల మధ్య అంతరాలు తొలగేలా ప్రభుత్వాలు స్పష్టమైన వైఖరితో ముందుకుసాగాలని.. వ్యవస్థలను నిర్వీర్యం చేసే శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. రాజకీయ నేతల ప్రమేయం గానీ, వారి ప్రభావం గానీ లేకుంటే అధికార యంత్రాంగం బాగానే పనిచేస్తుందని.. అప్పుడు న్యాయస్థానాలు, మీడియా అవసరం ఉండదని పలువురు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. శేరిపల్లి వద్ద హైవే–44పైభారీగా వరద.. దేవరకద్ర నియోజకవర్గంలోని భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలో శేరిపల్లి వద్ద కోమటికుంట చెరువు నిండి వరద నీరు జాతీయ రహదారి–44పైకి పారడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మూసాపేట మండలంలోని పోల్కంపల్లి వద్ద పెద్దవాగు మధ్యలో గొర్రెలు, మేకలు, కాపరులు చిక్కుకుపోయారు. మూగజీవాలతో పాటు కాపరులను రెస్క్యూ బృందం సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. దేవరకద్ర మండలంలో జీనుగురాల, దేవరకద్ర పట్టణం మధ్య ఉన్న లింక్ రోడ్ వరద ఉధృతితో తెగిపోయింది. డోకూర్లో నిర్మిస్తున్న ఆర్యూబీలో వరద నీరు నిలిచి రాకపోకలు బంద్ అయ్యాయి. చిన్నచింతకుంట మండలంలోని ముచ్చింతల గ్రామ గొలుసుకట్టు చెరువు కాల్వకు గండి పడింది. అడ్డాకుల మండలం పెద్దవాగు వరద ఉప్పొంగడంతో గౌరీదేవిపల్లి, కొమిరెడ్డిపల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి జిల్లావ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద పోటెత్తింది. పొంగిన వాగులు, అలుగు పారుతున్న చెరువులు, కుంటలతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కల్వర్టులపై నుంచి నీరు ప్రవహిస్తుండడం, రోడ్లు దెబ్బతినడం.. రైల్వే అండర్ బ్రిడ్జిలు జలదిగ్బంధంలో చిక్కుకోగా వివిధ గ్రామాలు, కాలనీలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రభావ ప్రాంతాల్లో కలెక్టర్ విజయేందిర బోయి, ఐజీ ఎల్ఎస్ చౌహాన్, ఎస్పీ జానకి పర్యటిస్తూ.. సహాయక చర్యలను పర్యవేక్షించారు. అల్పపీడన ప్రభావంతో జిల్లాలో మరో నాలుగు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/మహబూబ్నగర్ మున్సిపాలిటీ/మహబూబ్నగర్ వ్యవసాయం అలుగుపారిన 599 చెరువులు.. రైతుల్లో హర్షం భారీ వర్షాలతో చెరువులు, కుంటల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. జిల్లాలో చెరువులు, కుంటలు కలిపి 823 ఉండగా.. ఇందులో 599 అలుగు పారుతున్నాయి. 25 శాతం నిండినవి 44.. 50 శాతం నిండినవి 72.. 75 శాతం నిండినవి 69.. 100 శాతం నిండినవి 39 చెరువులు కాగా.. వాటికింద ఆయకట్టులోని రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఈ వర్షాలు ప్రస్తుతం పంటలకు ఊపిరిపోసినట్లయిందని.. రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందని ద్రాక్షగానే స్వేచ్ఛ.. సమానత్వం చట్టసభలు, అధికారుల్లో మార్పు రావాలి మరింత నీతి, నిజాయితీగా పనిచేయాలి ‘సాక్షి’ సర్వేలో ప్రజల అభిమతం -
స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం
పాలమూరు: జిల్లాకేంద్రంలోని పరేడ్ మైదానం 79వ స్వాతంత్య్ర వేడుకలకు సిద్ధమైంది. శుక్రవా రం ఉదయం 9.30 గంటలకు రాష్ట్ర ఎకై ్సజ్, పర్యా టక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కలెక్టర్ విజయేందిర, ఎస్పీ జానకితో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. వేడుకల నిర్వహణ కోసం అర్బన్ తహసీల్దార్ కార్యాలయ అధికారులతోపాటు ఎస్పీ కార్యాలయ ఏఆర్ సిబ్బంది ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం రాత్రి విద్యుత్ దీపాల అలంకరణతో కలెక్టరేట్, జెడ్పీ ఇతర ప్రభుత్వ కార్యాలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. వేడుకలలో భాగంగా జిల్లా పోలీస్ అధికారులు కవాత్తు సాధన చేశారు. కలెక్టరేట్తోపాటు ఎస్పీ కార్యాలయం ఇతర ప్రాంతాల్లో బాంబ్, డాగ్ స్క్వాడ్తో పోలీసులు తనిఖీలు చేశారు. కార్యక్రమాలు ఇలా.. ● ఉదయం 9.20 గంటలకు ఎస్పీ జానకి పరేడ్ మైదానానికి చేరుకుంటారు ● ఉదయం 9.25 గంటలకు కలెక్టర్ విజయేందిర రాక ● ఉదయం 9.29 గంటలకు మంత్రి జూపల్లి కృష్ణారావు రాక ● ఉదయం 9.30 గంటలకు మంత్రిచే పతాకవిష్కరణ, వందన స్వీకారం ● ఉదయం 9.32 గంటలకు పోలీస్ కవాతు ● ఉదయం 9.45 నుంచి 10.15 గంటల వరకు మంత్రి సందేశం ● 10. 15 గంటలకు స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం ● 10.20 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ● 10.50 నుంచి 11.20 వరకు శకటాల ప్రదర్శన ● 11.20 నుంచి 11.40 గంటల వరకు ప్రశంసాపత్రాల పంపిణీ ● 11.40 నుంచి 11.50 గంటల వరకు స్టాళ్ల సందర్శన ● మధ్యాహ్నం 12 గంటలకు కార్యక్రమం ముగింపువిద్యుత్ కాంతులతో కలెక్టరేట్ -
అధికారులు, ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ
వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ విజయేందిర, ఎస్పీ జానకి, అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ పర్యటించారు. జడ్చర్ల, భూత్పూర్ మండలం శేరిపల్లి, వన్ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాల వెళ్లే రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ఉధృతిని పరిశీలించి.. చేపట్టాల్సిన సహాయక చర్యలపై ఆయా శాఖల అధికారులకు సూచనలు చేశారు. పోల్కంపల్లి వాగులో చిక్కుకున్న గొర్రెల కాపరులను రెస్క్యూ బృందం రక్షించే చర్యలను పర్యవేక్షించారు. దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి పోల్కంపల్లి, శేరిపల్లిలో పర్యటించగా.. మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మహబూబ్నగర్లోని ఓ ప్రైవేట్ ఆస్ప్రతిలో చికిత్స పొందుతున్న అమరరాజా కంపెనీ సిబ్బందిని పరామర్శించారు. శేరిపల్లి వద్ద వరద నీరు మళ్లింపు ఏర్పాట్లను ఎస్పీ జానకితో కలిసి ఐజీ చౌహాన్ పరిశీలించారు. -
మహబూబ్నగర్లో ఘోర రోడ్డు ప్రమాదం
మహబూబ్నగర్,సాక్షి: మహబూబ్ నగర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ జాతీయ రహదారిపై జడ్చర్లలోని మాచారం ఫ్లైఓవర్పై లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. 15మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో బస్సు డ్రైవర్ ఇద్దరు మహిళలున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 35మంది ప్రయాణికులున్నారు.ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు,పోలీసులు క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా ప్రేవేట్ ట్రావెల్స్ బస్సు మితిమీరిన వేగం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. -
పాలమూరులో దంచికొట్టిన వాన
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. జోగుళాంబ గద్వాల జిల్లా మినహా మిగిలిన అన్ని చోట్ల వాగులు, కాల్వలు పొంగిపొర్లాయి. రహదారులు దెబ్బతిన్నాయి. చెరువులు, కుంటలు అలుగు పారాయి. ⇒ మహబూబ్నగర్లోని హనుమాన్పురా, అప్పన్నపల్లిలోని రైల్వే అండర్ బ్రిడ్జీలకు ఉన్న రిటైనింగ్ వాల్స్ కూలిపోయాయి. దీంతో పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లే 1,000 మంది విద్యార్థులతోపాటు అటు వైపు ఉన్న గొల్లబండతండాకు రాకపోకలు నిలిచిపోయాయి. జడ్చర్ల పరిధిలోని కావేరమ్మపేట వద్ద నల్లచెరువు కట్ట తెగి సమీపంలోని ఇళ్లలోకి వరదనీరు చేరింది. ⇒ జడ్చర్ల, మిడ్జిల్తోపాటు నాగర్కర్నూల్ జిల్లా తాడూరు, కల్వకుర్తి, ఉప్పునుంతల మండలాల్లో దుందుభి నది ఉధృతంగా ప్రవహించింది. మూసాపేట మండలంపోల్కంపల్లి వద్ద పెద్దవాగు మధ్యలో గొర్రెలు, వాటి కాపరులు చిక్కుకుపోగా రిస్క్ బృందం వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ⇒ మహబూబ్నగర్ మున్సిపాలిటీ సమీపంలో దివిటిపల్లి నుంచి అమర్రాజా బ్యాటరీ కంపెనీకి వెళ్లే రోడ్డు వర్షం నీటికి పూర్తిగా ధ్వంసం కాగా.. గురువారం తెల్లవారుజామున సిబ్బందిని తీసుకువెళ్తున్న కంపెనీ బస్సు అందులో బోల్తా పడడంతో 11 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ⇒ జడ్చర్ల వద్ద సర్వీస్రోడ్డుపై మోకాళ్లలోతు నీటి ప్రవాహంలో హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ బస్సుతోపాటు, ఓ ప్రైవేట్ బస్సు తెల్లవారుజామున నిలిచిపోయాయి. దీంతో వరద నీటిలో చిక్కుకున్న 50 మంది ప్రయాణికులను అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా రోడ్డుపైకి తీసుకొచ్చారు. ⇒ నాగర్కర్నూల్ జిల్లాలోని శ్రీశైల ఉత్తర ముఖద్వారమైన ఉమామహేశ్వర క్షేత్రం వద్ద కొండ చరియలు విరిగి పడ్డాయి. ⇒ నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలో 14.46 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నారాయణపేట జిల్లాలో మరికల్ 12.62, మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో 12.3 సె.మీ. వనపర్తి జిల్లాలో ఖిల్లాలాఘనపురంలో 11.68, పెద్దమందడిలో 10.33, వనపర్తిలో 9.88, సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.వరద బీభత్సంహుజూర్నగర్, కోదాడ ప్రాంతాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. లోలెవల్ బ్రిడ్జీల వద్ద వరద ప్రమాదకరంగా మారింది.నెమ్మికల్ దండుమైసమ్మ ఆలయ సమీపంలో సూర్యాపేట–దంతాలపల్లి రహదారిపైకి వరద భారీగా చేరింది. మేళ్లచెర్వు– కోదాడ ప్రధాన రహదారిపై కందిబండ సమీపంలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్డి వద్ద తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉద్యాన తోటలు నీట మునిగి రైతులకు తీరని నష్టం వాటిల్లింది. పరిగి మండలం బసిరెడ్డిపల్లి, రంగాపూర్, న్యాయత్నగర్, హనుమాన్గండి గ్రామాల్లో గురువారం తెల్లవారుజామున 3.55 గంటలకు 3 నుంచి 4 సెకన్ల పాటు భూమి కంపించింది. గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దవాగు పరీవాహక ప్రాంతాల్లో ఉన్న పత్తి చేలను వరద ముంచెత్తింది. -
స్పందించారు.. సీజ్ చేశారు
● కర్రీపఫ్లోపాము ఘటనపై ఫుడ్సేఫ్టీ అధికారుల తనిఖీ ● వెలుగులోకి విస్తుపోయే వాస్తవాలు ● అనుమతి లేకుండా బేకరీ నిర్వహణ ● కాలం చెల్లిన పదార్థాలు, రసాయనాల వినయోగం ● పలు కారణాలతో బేకరీ సీజ్, ల్యాబ్కు నమూనాలు జడ్చర్ల: బేకరీలో కొనుగోలు చేసిన కర్రీపప్లో పాము వచ్చిన ఘటనపై జిల్లా ఆహార భద్రత అధికారులు స్పందించారు. బుధవారం జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ నీలిమ సిబ్బందితో కలిసి జడ్చర్ల పోలీస్స్టేషన్కు చేరుకుని పాము ఉన్న కర్రీ పఫ్ను పరిశీలించి షాంపింల్ తీసుకుని ల్యాబ్కు పంపుతున్నట్లు తెలిపారు. అనంతరం పఫ్ను విక్రయించిన శ్రీలక్ష్మి బెంగళూరు బేకరీలో తనిఖీలు చేశారు. తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. అసలు బేకరీ నిర్వహణకు సంబంధించి ఎలాంటి అనుమతిలేదు. అంతేకాక కాలంచెల్లిన ఆహార పదార్థాలు, రసాయనాలు, క్రీములు వినియోగించడాన్ని గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. అపరిశుభ్రమైన పరిసరాల మధ్య బేకరీ ఉత్పత్తులు ఉండడంపై విస్మయం వ్యక్తం చేశారు. ఫుడ్ లైసెన్స్ లేకపోవడం, గడువు ముగిసిన పదర్థాలను ఉపయోగిండం, పరిశుభ్రత పాటించక పోవడంపై బేకరీ నిర్వాహకులకు నోటీస్ను జారీ చేసి దుకాణాన్ని సీజ్ చేశారు. ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. హోటళ్లు, బేకరీలు తదితర ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయించే వారు ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలని, అదేవిధంగా నాణ్యత కలిగిన ముడి సరుకును వినియోగించాలని తెలిపారు. ఫ్రీజర్లో దాచి వాటినే వేడిచేసి వినియోగదారులకు అందించడం చట్టవిరుద్ధమన్నారు. పరిశుభ్రత పాటించాలని, వంటపాత్రలను శుభ్రంగా ఉంచడంతోపాటు ఆహార పదార్థాల తయారీపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే హోటళ్లు, బేకరీలు, దాబాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీలో ఫుడ్ సేఫ్టీ సిబ్బంది శ్రీలత తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
మద్దూరు: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందిన ఘటన మండలంలోని పిల్లిగుండుతండా సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు.. హన్మనాయక్ తండాకు చెందిన గణేష్నాయక్ (26) అదే గ్రామానికి చెందిన హర్జ్యనాయక్ వద్ద ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తుండేవాడు. ఈ క్రమంలో బుధవారం ఇంటి నిర్మాణానికి గ్రానైట్ రాయిని ట్రాక్టర్పై హన్మనాయక్తండా నుంచి నందిపాడ్కు తరలిస్తుండగా పిల్లిగుండతండా సమీపంలో అదుపు తప్పడంతో గణేష్నాయక్ ట్రాక్టర్ వదిలి కిందకు దూకుతూ వెనుక టైర్ కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ విజయ్కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆటో బోల్తా: డ్రైవర్ మృతి కొల్లాపూర్ రూరల్: ఆటో బోల్తాపడి డ్రైవర్ మృతిచెందిన ఘటన మండలంలో చోటుచేసుకున్నది. ఎస్ఐ హృషికేశ్ కథనం ప్రకారం.. మండలలోని నార్లాపూర్కు చెందిన దాసరి రాజు(24) నార్లాపూర్ – చెంచుగూడెంకు ఆటో నడుపుకుంటూ వెళ్తుండగా.. అదుపు తప్పి ప్రమాదవశాత్తు వ్యవసాయ పొలంలోకి దూసుకెళ్లింది. రాజుకు తీవ్ర గాయాలు కావడంతో కొల్లాపూర్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆటోలో మృతుడితోపాటు మల్లేశ్ అనే యువకుడు ఉన్నాడు. అతడికి స్వల్ప గాయా లయ్యాయి. మృతుడి తల్లి నాగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పిడుగుపాటుతో ఆవు మృతి కేటీదొడ్డి: పిడుగుపాటుతో ఆవు మృతిచెందిన ఘటన మండలంలోని పాగుంటలోని చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన స్వామి ఆవును పొలం వద్ద కట్టేశాడు. మంగళవారం రాత్రి పిడుగుపాటుకు ఆవు మృతిచెందింది. బుధవారం ఉదయం పొలం దగ్గరికెళ్లి చూడగా ఆవు మృతి చెందింది. రూ.60వేలతో ఆవు మృతి చెందడంతో రైతు స్వామి బోరున విలపించాడు. ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని కోరాడు. పెబ్బేరులో నగదు చోరీ వనపర్తి రూరల్: పట్టణంలోని పీజేపీ క్యాంప్ కార్యాలయం వద్ద బైక్లో ఉన్న నగదును గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ యుగేంధర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరంగాపురం మండల కేంద్రానికి చెందిన బుల్లెదుల ఆంజనేయులు బుధవారం ఉదయం 11.30 గంటలకు పెబ్బేరు పట్టణంలోని ఎస్బీఐలో రూ.2.20లక్షలు విత్డ్రా చేశాడు. మొత్తం నగదును బైక్ టూల్ బాక్స్లో పెట్టి లాక్ చేసి కార్యాలయంలోకి వెళ్లాడు. తిరిగి బైక్ దగ్గరకు వచ్చి చూడగా టూల్ బాక్స్ ఓపెన్ చేసి ఉండడంతో గుర్తు తెలియని వ్యక్తులు నగదును ఎత్తుకెళ్లారని గుర్తించి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. కేజీబీవీ ఘటనపై అధికారుల విచారణ బల్మూర్: స్థానిక కస్తూర్బాగాంధీ విద్యాలయంలో కార్మికుల మధ్య దాడి ఘటనపై జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బుధవారం తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీఓ రాఘవులు, ఎస్ఐ రాజేందర్, ఎంఈఓ విష్ణుమూర్తి విచారణ చేపట్టారు. విద్యార్థినులతో మాట్లాడి వివరాలు అడిగి తెసుకున్నారు. వాచ్మేన్తో పాటు ఇద్దరు కార్మికులు నిత్యం తాగొచ్చి మద్యం మత్తులో రాత్రిళ్లు అసభ్యకరంగా మాట్లాడుతున్నారని తెలిపారు. వాచ్మేన్పై ఎస్ఓకు ఫిర్యాదు చేసినా ప్రవర్తనలో మార్పు లేదని వాపోయారు. కాగా ఎస్ఓ పర్యవేక్షణ లోపంతోనే ఉపాధ్యాయులు, సిబ్బంది మధ్య సమన్వయం లోపించి ఇష్టానుసారంగా వ్యవరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అధికారులు విచారణ చేసి తగిన న్యాయం చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. స్వల్పంగా పెరిగిన ఉల్లి ధర దేవరకద్ర: స్థానిక మార్కెట్ యార్డులో బుధవారం ఉల్లి ధరలు స్వల్పంగా పెరిగాయి. గత వారం కన్నా గరిష్టంగా రూ.60, కనిష్టంగా రూ. 50 వరకు ధర పెరిగింది. సీజన్ ముగిసినప్పటికీ రైతులు యాసంగిలో పండించిన ఉల్లిని నిల్వ చేసుకొని ప్రస్తుతం మార్కెట్కు అమ్మకానికి తెస్తున్నారు. దాదాపు వేయి బస్తాల ఉల్లి అమ్మకానికి రావడంతో వ్యాపారులు పోటా పోటీగా వేలంలో పాడి ఉల్లిని కొనుగోలు చేశారు. వేలంలో క్వింటాల్ ఉల్లి ధర గరిష్టంగా రూ.1,860 , కనిష్టంగా రూ.950 వరకు ధర వచ్చింది. 50 కేజీల ఉల్లి బస్తాను గరిష్ట ధర రూ.950, కనిష్టంగా రూ.500 వరకు విక్రయించారు. -
ఉద్రిక్తత మధ్య విగ్రహాల తొలగింపు
జడ్చర్ల, జడ్చర్ల టౌన్: 167వ నెంబరు జాతీయ రహదారిపై మున్సిపాలిటీ పరిధిలోని సిగ్నల్గడ్డ రైల్వే బ్రిడ్జ్కు రెండువైపులా ఉన్న మహానీయుల విగ్రహాల తొలగింపు ఉద్రిక్తతకు దారి తీసింది. రోడ్డు విస్తరణ పనులకు ఆటంకంగా ఉన్న విగ్రహాలను తొలగించాలని పలుమార్లు ప్రయత్నించినప్పటికీ బుధవారం కార్యరూపం దాల్చింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలిలా.. సిగ్నల్ గడ్డ బ్రిడ్జ్కు ఒకవైపు నెహ్రూ, ఇందిరాగాంధీ విగ్రహాలతోపాటు పైలాన్ ఉంది. వాటిని బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 2:30గంటల వరకు రెండు క్రేన్ల సహాయంతో సాఫీగానే తొలగించారు. రెండు విగ్రహాలు కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధానులు కావడంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఆటంకం కలిగించలేదు. అయితే ఇందిరాగాంధీ విగ్రహం తొలగించేందుకు 4గంటల సమయం పట్టడం మున్సిపాలిటీ అధికారులు, సిబ్బందిని కొంత ఇబ్బందులకు గురిచేసింది. విగ్రహాల తొలగింపు ముందుగానే ప్రచారం కావడంతో రైల్వేబ్రిడ్జ్కు ఇవతల ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద దళితసంఘాల నాయకులు గుమిగూడారు. ఉదయం 10గంటలనుంచే అధికారుల రాకకోసం వేచి చూశారు. టెంట్ వేసి దీక్షకు కూర్చునేందుకు యత్నించగా సీఐ కమలాకర్ జోక్యం చేసుకుని టెంట్ వేయకుండా అడ్డుకున్నారు. బ్రిడ్జ్కు మరోవైపు ఉన్న విగ్రహాల తొలగింపు పూర్తయ్యాక కమిషనర్ లక్ష్మారెడ్డి, చైర్పర్సన్ పుష్పలత, వార్డు కౌన్సిలర్లు క్రేన్లను తీసుకుని అంబేద్కర్, ఫూలే, శ్రీకాంతాచారి విగ్రహాలను తొలగించేందుకు వచ్చారు. ఈ సదర్భంగా దళిత సంఘాల నాయకులు కమిషనర్, చైర్పర్సన్తో వాగ్వాదానికి దిగారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విగ్రహం తొలగించేదిలేదని వాదనకు దిగారు. ప్రస్తుతం విగ్రహం తొలగించి రోడ్డు పనులు పూర్తయ్యాక కొద్దిగా పక్కకు ప్రతిష్ఠిస్తామని కమిషనర్, చైర్పర్సన్ హామీ ఇచ్చినప్పటికీ వారు వినలేదు. కావేరమ్మపేట రోడ్డులో ఇదివరకు అంబేడ్కర్ విగ్రహం తొలగించి ఎందుకు పునఃప్రతిష్ఠ చేయలేకపోయారని మండిపడ్డారు. జాతీయ రహదారుల శాఖ ఏఈ రవి సైతం విగ్రహాన్ని తిరిగి అక్కడే ప్రతిష్ఠిస్తామని హామీ ఇచ్చినప్పటికీ అంగీకరించలేదు. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అక్కడికి చేరుకుని దళిత సంఘాల నాయకులు, అధికారులతో మాట్లాడారు. విగ్రహం పునఃప్రతిష్ఠ చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నందున విగ్రహం తొలగించేందుకు సహకరించాలని కోరారు. ఈ క్రమంలోనే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వరకు గడువు ఇవ్వాలని సూచించారు. ఇదిలా కొనసాగుతుండగానే అధికారులు పక్కనే ఉన్న ఫూలే విగ్రహం తొలగించేందుకు క్రేన్ను ఉంచగా.. బీసీ సంఘాలు అడ్డుపడ్డాయి. విగ్రహం ఎక్కడ ప్రతిష్ఠిస్తారో చెప్పాలని, ముందు అంబేడ్కర్ విగ్రహం తొలగించాకే ఫూలే విగ్రహం తీయాలని పట్టుబట్టారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి కలెక్టర్తో సంప్రదింపు లు జరిపి విగ్రహాలను ఇదేరోజు తొలగించాలని సూ చించారు. దీంతో ముందుగా అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించి అనంతరం ఫూలే, శ్రీకాంతాచారి విగ్రహాలను తొలగించారు. తొలగించిన విగ్రహాలు డీసీఎంలో మున్సిపల్ కార్యాలయానికి తరలించా రు. రోడ్డు పనులు పూర్తయ్యాకే పునఃప్రతిష్ఠ చేయనున్నారు. ఎట్టకేలకు ఉద్రిక్తత మధ్య రోడ్డు పనులకు ఆటంకంగా ఉన్న విగ్రహాలను తొలగించడంతో చైర్పర్సన్, కమిషనర్, పాలకవర్గం ఊపిరిపీల్చుకున్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ విగ్రహాలు సాఫీగా.. అంబేడ్కర్ విగ్రహం తీయొద్దంటూ దళిత సంఘాల ఆందోళన మొదట అంబేడ్కర్ విగ్రహం తొలగించాలని పట్టుబట్టిన బీసీలు రోడ్డు పనులు పూర్తయ్యాక పునఃప్రతిష్ఠాపనకు హామీ ఆందోళనకారులను బుజ్జగించిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి -
స్కూల్ బస్సు బోల్తా.. విద్యార్థులకు స్వల్ప గాయాలు
నాగర్కర్నూల్ క్రైం: ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి ఓ ప్రైవేటు పాఠశాల బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటన మండలంలోని గన్యాగుల గ్రామ శివారులో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. పెద్దకొత్తపల్లిలోని ఆల్ సెయింట్స్ మోడల్ స్కూల్కు చెందిన పాఠశాల బస్సు నాగపూర్, రాయిపాకుల గ్రామాల్లోని విద్యార్థులను ఎక్కించుకొని పాఠశాలకు వెళుతుండగా గన్యాగుల శివారులో మూలమలుపు వద్ద ద్విచక్రవాహనం అడ్డురావడంతో దానిని తప్పించబోయి బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. అక్కడే వరి నాట్లు వేస్తున్న కూలీలు అప్రమత్తమై బస్సులో నుంచి పాఠశాల విద్యార్దులను బయటకు తీశారు. బస్సులో మొత్తం 20 మంది విద్యార్థులు ఉండగా కొందరికి స్వల్పగాయాలయ్యాయి. ఎవరికీ ఎలాంటి హానీ కలగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం విద్యార్థులను ఆటోల్లో ఇంటికి పంపించారు. సంఘటనకు సంబంధించి ఎస్ఐ గోవర్ధన్ను వివరణ కోరగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
జలాశయాలకు జలకళ
● 90వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో, 91,340 ఔట్ఫ్లో ● 8క్రస్టుగేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల ● 12 యూనిట్లలో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లో స్వల్పంగా తగ్గినట్ల్లు పీజేపీ అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి 7గంటల వరకు ప్రాజెక్టుకు లక్షా5వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. బుధవారం సాయంత్రానికి ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ఫ్లో 90వేలకు తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 8 క్రస్టుగేట్లను ఎత్తి 54, 352 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జెన్కో జల విద్యుత్ కేంద్రంలో 12 యూనిట్లలో విద్యుదుత్పత్తిని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 36, 628 క్యూసెక్కులు, కోయిల్సాగర్కు 315 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 45క్యూసెక్కులు, ఆర్డీఎస్ లింక్ కెనాల్కు 50 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 91, 340 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 7.991 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. 29.6 అడుగులకు కోయిల్సాగర్ దేవరకద్ర: కోయిల్సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం చేరడానికి కేవలం మూడు అడుగుల దూరంలో నీటిమట్టం నిలిచింది. బుధవారం సాయంత్రం వరకు ప్రాజెక్టులో 29.6 అడుగలకు నీటిమట్టం చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగా.. మరో మూడు అడుగుల నీరు చేరితే ప్రాజెక్టు గేట్లను తెరిచేందుకు వీలుంది. పెద్దవాగు ప్రవాహం భారీగా వస్తే ఒక్కరోజులో ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. 12 యూనిట్లలో విద్యుదుత్పత్తి ఆత్మకూర్: జూరాలకు పైనుంచి వరద వచ్చి చేరుతుండడంతో ఎగువ, దిగువ జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుదుత్పత్తి వేగవంతంగా కొనసాగుతుంది. ఈ మేరకు బుధవారం 12యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 6 యూనిట్ల ద్వారా 234 మెగావాట్లు, దిగువలో 6యూనిట్ల ద్వారా 240మెగావాట్లు విద్యుదుత్పత్తిని చేపడుతున్నారు. రామన్పాడు ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్న నీరు -
ఉపాధ్యాయుడి సస్పెన్షన్
గద్వాల: మద్యంతాగి విధుల్లో నిర్లక్ష్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు రవిచందర్ను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ ఉత్తర్వులు జారీ చేశారు. రవిచందర్ రాజోళి మండలం చిన్నధన్వాడ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం పాఠశాలలో విధులు నిర్వహిస్తూ.. మద్యం తాగి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నతాధికారులను సంభోదిస్తూ మాట్లాడిన వైనం సోషల్ మీడియాలో వైరలైంది. స్పందించిన కలెక్టర్ సంతోష్ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా ఎవరైనా విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. -
ఈజీ మనీ కోసం దారిదోపిడీ
● బైక్ను వెంటాడి క్యాష్ బ్యాగ్ ఎత్తుకెళ్లిన నిందితుల అరెస్ట్ ● డీఎస్పీ వెంకటేశ్వర్లు జడ్చర్ల: జడ్చర్ల కొత్త బస్టాండ్ సమీపంలోని రిధి మద్యం దుకాణాన్ని బంద్ చేసి ఆరోజు వచ్చిన కలెక్షన్ తీసుకుని బైక్పై ఏనుగొండకు వెళ్తున్న వైన్స్ క్యాషియర్ అరుణ్రెడ్డిని ఈనెల 7న రాత్రి ఇద్దరు గుర్తు తెలియని యువకులు స్కూటీపై వెంబడించి కొత్తతండా వద్ద బైక్ను అడ్డగించి కళ్లల్లో కారంపొడిజల్లి చేతిలో ఉన్న నగదు బ్యాగును అపహరించిన దారిదోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. దోపిడీ దొంగలను గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం పోలీస్స్టేషన్లో డీఎస్పీ విలేకరులకు వెల్లడించారు. మహబూబ్నగర్లోని వీరన్నపేటకు చెందిన మూలింటి బాలాజీ, మూలింటి రవితేజ పతకం ప్రకారం.. దోపిడీకి పాల్పడ్డారు. దోపిడీ రోజు స్థానిక లాడ్జీలో తలదాచుకుని వైన్స్ వద్ద నగదుతో బయటకు వస్తున్న క్యాషియర్ను గమనించి స్కూటీపై బైక్ను వెంబడించారు. రూ.1.44 లక్షల క్యాష్ బ్యాగును ఎత్తుకెళ్లిన అనంతరం బాధితుడు ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా బుధవారం జడ్చర్ల–మహబూబ్నగర్ ప్రధాన రహదారిపై జాలీ హిల్స్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా స్కూటీపై వచ్చిన నిందితులు అనుమానాస్పదంగా కనిపించారు. అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితుల నుంచి రూ.72,500తోపాటు మొబైల్ ఫోన్, స్కూటీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దోచుకున్న డబ్బుతో కొత్తగా మొబైల్ ఫోన్ను కొనుగోలు చేశారని పేర్కొన్నారు. నిందితుల్లో బాలాజీ ఓ సంస్థలో డెలివరీ బాయ్గా, రవితేజ ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితులను కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సీఐ కమలాకర్, సిబ్బంది విష్ణుమూర్తి, కాశీ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
ఆ ఊళ్లో 2 కుటుంబాలే..
వనపర్తి జిల్లా రేవల్లి మండలం పాత బండరాయిపాకులలో గతంలో 480 కుటుంబాలు నివసించేవి. సుమారు నాలుగు వేల మంది జనాభా ఉండగా.. 1,800 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఏదుల రిజర్వాయర్ నిర్మాణంలో ఈ గ్రామం ముంపునకు గురవుతుండగా.. 2021లో ప్రజలను ఖాళీ చేయించారు. పునరవాసం కింద కొత్తగా నిర్మించిన బండరాయిపాకులకు తరలించారు. అందరూ వెళ్లగా ప్రస్తుతం పాత గ్రామంలో రెండు కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నాయి. అన్నాదమ్ములైన మిద్దె పెద్ద లక్ష్మయ్య (మృతుడు హరిబాబు తండ్రి), మిద్దె చిన్న లక్ష్మయ్య కుటుంబాలు పక్కపక్కన గుడిసెలు వేసుకుని ఉంటున్నాయి. ఊరంతా నిర్మానుష్యం కాగా.. ప్రస్తుతం అడవిలా తయారైన ఈ పాత ఊళ్లో దొరికే ఆకులు, అలుములతోనే ఆ రెండు కుటుంబాలు జీవిస్తున్నాయి. -
ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు
మహబూబ్నగర్ క్రైం: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు పోలీసు బందోబస్తు నిర్వహించాలని ఎస్పీ డి.జానకి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కొత్త చెరువు, మినీ ట్యాంక్బండ్ వద్ద వరద ప్రవాహాన్ని ఎస్పీ పరిశీలించారు. క్రమంగా వరద ఉధృతి పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్లపై విద్యుత్ తీగలు తెగిపోవడం, చెట్లు కూలడం, రహదారులు దెబ్బతినడం వంటి అవకాశాలు ఉన్నాయని.. అత్యవసర పరిస్థితుల్లో రెస్క్యూ బృందాలు, పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఎస్పీ వెంట సీఐలు ఇజాజుద్దీన్, అప్పయ్య ఉన్నారు. ● నషాముక్త్ భారత్ అభియాన్ వార్షికోత్సవం సందర్భంగా ధర్మాపూర్ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో మాదకద్రవ్యాల నిర్మూలనపై ఎస్పీ డి.జానకి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. యువత, విద్యార్థులు డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. కాగా, జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ ఎన్బీ రత్నం ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ సురేశ్కుమార్, డీఎస్పీలు రమణారెడ్డి, శ్రీనివాసులు, ఏఓ రుక్మిణి, ఆర్ఐలు కృష్ణయ్య, నగేశ్, రవి, ఎస్బీ సీఐ వెంకటేశ్ పాల్గొన్నారు. ● స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా టీనేజర్స్, యువత బైక్లపై ముగ్గురు, నలుగురు వెళ్తూ.. అధిక శబ్ధాలతో రాష్ డ్రైవింగ్ చేస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్పీ డి.జానకి హెచ్చరించారు. స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా పాఠశాల విద్యార్థులు, చిన్నారులు రోడ్లపై ర్యాలీలు నిర్వహిస్తారని.. అతివేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయన్నారు. దురుసుగా, హారన్స్ కొడుతూ బైక్లను నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
● లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలనుపునరావాస కేంద్రాలకు తరలించాలి ● కలెక్టర్ విజయేందిర జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. బుధవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. వర్షాల నేపథ్యంలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. గ్రామస్థాయి సిబ్బందితో మొదలుకుని జిల్లా అధికారి వరకు అందరూ క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితి దృష్ట్యా అధికారులు, సిబ్బంది సెలవులను రద్దు చేసినట్లు చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలను పునరావాస కేంద్రాల్లోకి తరలించాలని సూచించారు. అన్ని గ్రామాల్లో పునరావాస సహాయ కేంద్రాలను గుర్తించి.. శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉంటున్న వారిని తక్షణమే ఖాళీ చేయించాలని తెలిపారు. అత్యవసర సమయంలో ఎస్డీఆర్ఎఫ్, ఆపదమిత్ర వలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చేపల వేట, ఈత కోసం చెరువులు, కాల్వలు, రిజర్వాయర్లలోకి ఎవరూ దిగకుండా కట్టడి చేయాలని.. అవసరమైన చోట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కాజ్వేల వద్ద వాగులను దాటకుండా భారికేడ్స్ ఏర్పాటు చేయాలన్నారు. అదే విధంగా సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. అన్ని పీహెచ్సీలు, సబ్ సెంటర్లు, ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని.. అవసరమైన ఔషధ నిల్వలను సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని 27 ప్రాంతాల్లో డెంగీ కేసులు ఎక్కువగా వస్తున్నాయని.. ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు విస్తృతంగా చేపట్టాలన్నారు. భారీ వర్షాల వల్ల ఎక్కడైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే తక్షణమే స్పందించి పునరుద్ధరించాలని ట్రాన్స్కో ఎస్ఈ రమేశ్ను కలెక్టర్ ఆదేశించారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ.. జిల్లాలో ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. ఏమైనా ప్రమాదాలు సంభవించినా, అత్యవసర పరిస్థితుల్లో కలెక్టరేట్ కంట్రోల్రూం 08542 – 241165 నంబర్కు సమాచారం అందించాలన్నారు. వీసీలో అడిషనల్ కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, నర్సింహారెడ్డి, డీపీఓ పార్థసారధి, జెడ్పీ సీఈఓ వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు. సత్వరం పరిష్కరించాలి.. మహబూబ్నగర్ రూరల్: వృద్ధులు, దివ్యాంగుల సమస్యలను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర సంబంధిత అధికారులను ఆదేశించారు. అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 19 మంది కలెక్టర్కు ఫిర్యాదులు అందజేశారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ జరీనాబేగం, డీఎంహెచ్ఓ డా.కృష్ణ, ఏపీడీ శారద, గృహనిర్మాణ శాఖ పీడీ వైద్యం భాస్కర్, అర్బన్ తహసీల్దార్ ఘన్సీరామ్ పాల్గొన్నారు. యూరియాను పక్కదారి పట్టిస్తే సహించం.. మహబూబ్నగర్ (వ్యవసాయం): యూరియా ను ఎవరైనా పక్కదారి పట్టిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ విజయేందిర అన్నారు. జిల్లా కేంద్రంలోని డీసీఎంఎస్, మన గ్రోమర్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాయితీ యూరియాను కేవలం వ్యవసాయానికి మాత్రమే వినియోగించాలని, ఇతరాత్ర అవసరాలకు కాదన్నారు. పీఏసీఎస్లు, రైతు సేవా కేంద్రాల్లో విక్రయించే ఎరువులు, యూరియాపై అధికారులు నిఘా ఏర్పాటుచేయాలని సూచించారు. కలెక్టర్ వెంట డీఏఓ బి.వెంకటేశ్, ఏఓ శ్రీనివాసులు ఉన్నారు. -
రికవరీ అయ్యేనా..?
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): అత్యవసర పరిస్థితుల్లో మహిళా సంఘాల సభ్యులను సీ్త్రనిధి రుణాలు ఆదుకుంటున్నాయి. అయితే వాటిని తిరిగి చెల్లించడంలో అంత శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో సీ్త్రనిధి రుణాల తిరిగి చెల్లింపులో సంఘాల సభ్యులు మొండికేసినట్లు కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల కొత్త వారికి అవకాశం లేకుండాపోతుందని పలువురు వాపోతున్నారు. జిల్లావ్యాప్తంగా రూ.16.61 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. వీటిని రికవరీ చేసేందుకు డీఆర్డీఓ ఆధికారులు తలలు పట్టుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో గట్టిగా అడిగినా వసూలు చేయలేని పరిస్థితి నెలకొంది. ఏడాది కాలంగా సీ్త్రనిధి రుణాలు పెండింగ్లో పడటంతో జిల్లాలో స్వయం సహాయక సంఘాల్లోని మిగతా సభ్యులకు కొత్త రుణాలు అందని పరిస్థితి నెలకొంది. సంఘాల్లో ఒకరిద్దరు కిస్తులు కట్టని కారణంగా మిగతా ఎవరికీ రుణాలు అందవు. సంఘాల్లో లావాదేవీలు సక్రమంగా కొనసాగితేనే బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తాయి. తీసుకున్న రుణాలను కొందరు కట్టకపోయినా ఆ ప్రభావం అందరిపై పడుతుంది. ప్రత్యేక డ్రైవ్కు ఆదేశాలు.. ఈ శాఖపై ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ముఖ్యంగా సీ్త్రనిధి రుణాల రికవరీపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని ఆదేశాలు ఇస్తున్నారు. ఈ మేరకు సీ్త్రనిధి రుణాల రికవరీపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. మొండి బకాయిలను రికవరీ చేసేందుకు జిల్లాలో ఆరుగురు సీఆర్పీలను నియమించారు. వీరు బకాయిలు ఉన్న మండలాల్లో పర్యటించి వసూలుపై దృష్టిసారిస్తారు. అత్యధికంగా హన్వాడలో.. వాస్తవంగా సీ్త్రనిధి రుణాలను ప్రతినెల సక్రమంగా చెల్లించే గ్రూపులకే ఇస్తారు. వారి పొదుపు మూలధనం ఆయా కిస్తులకు క్రమం తప్పకుండా జమ అయ్యే వారికే వడ్డీలేని రుణాలు అందిస్తారు. క్రమం తప్పక రుణాలు చెల్లించిన వారు కూడా ప్రస్తుతం మొండికేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 6,737 సంఘాల నుంచి రూ.33.76 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. ఇందులో ఇప్పటి వరకు రూ.17.06 కోట్లు వసూలు కాగా.. మరో రూ.16.61 కోట్ల బకాయిలు ఉన్నాయి. జిల్లాలోని ఇతర మండలాలతో పోల్చితే హన్వాడలో అత్యధికంగా సీ్త్రనిధి బకాయిలు ఉన్నాయి. ఏకంగా రూ.2.01 కోట్ల మేర పేరుకుపోయాయి. ఈ మొత్తం 366 సంఘాలు చెల్లించాల్సి ఉన్నాయి. జిల్లాలో మొండికేసిన ‘సీ్త్రనిధి’ బకాయిలు పాతవి పేరుకుపోవడంతో కొత్త రుణాలకు బ్రేక్ స్పెషల్ డ్రైవ్ నిర్వహణకు ఉన్నతాధికారుల ఆదేశాలు ఆరుగురు ఏపీఎంలతో క్షేత్రస్థాయిలో వసూలుకు చర్యలు -
మనసు దోచే మయూరి గార్డెన్
మహబూబ్నగర్ న్యూటౌన్: పర్యాటక పరంగా మహబూబ్నగర్ జిల్లా దూసుకెళ్తోంది. మయూరి నర్సరీ నుంచి మయూరి ఎకో అర్బన్ పార్క్గా రూపాంతరం చెందిన మహా వనమే ఇందుకు నిదర్శనం. 2,087 ఎకరాల విస్తీర్ణంలో పచ్చదనాన్ని పరుచుకుని ఆహ్లాదం పంచుతోంది. చిన్నపిల్లల నుంచి మహిళలు, పురుషులు తేడా లేకుండా వృద్ధులు.. ఇలా అన్నివర్గాల వారికి వినోదం, విజ్ఞానం, ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. సాహస క్రీడలకు వేదికగా పర్యాటకులను ఆకట్టుకుంటోంది. పట్టణ ప్రాంతంలో అద్భుతమైన పిక్నిక్ స్పాట్గా విరాజిల్లుతున్న సహజసిద్ధ వనక్షేత్రంపై ‘సాక్షి’ప్రత్యేక కథనం. » మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అప్పనపల్లి సమీపంలో మయూరి ఎకో అర్బన్ పార్క్కు 2015 జూన్ 3న శంకుస్థాపన చేశారు. 2017 ఏప్రిల్ 17న ప్రారంభించిన ఈ పార్క్ పర్యాటకులతో నిత్యం సందడి చేస్తోంది. సెలవు, వారాంతపు రోజుల్లో మరీ ఎక్కువగా పర్యాటకుల తాకిడితో కళకళలాడుతోంది. రాష్ట్రంలోని పెద్ద నగరాలతో పాటు కర్ణాటక, ఏపీ నుంచి పర్యాటకులు.. మయూరి అర్బన్ ఎకో పార్కును సందర్శిస్తూ ఆహ్లాదాన్ని పొందుతున్నారు. » పర్యాటకులు సేదదీరేందుకు ఏర్పాటు చేసిన పచ్చదనం.. తివాచీని తలపిస్తూ సందర్శకులను ఆకట్టుకుంటోంది. కుటుంబ సమేతంగా వచ్చే పర్యాటకులు గార్డెన్లో కూర్చొని సేదదీరుతున్నారు. యోగా చేసుకునే వారికి పార్క్లో ప్రత్యేక షెడ్డును ఏర్పాటు చేశారు. రోజూ ఇక్కడికి వందలాది మంది వచ్చి యోగ సాధన చేసుకునేందు కు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పార్క్లో చిన్నారు లు, పెద్దలకు ప్రత్యేకంగా ఓపెన్ ఎయిర్ జిమ్ ఏ ర్పాటు చేశారు. వివిధ రకాల వ్యాయామాలకు ఆరు పరికరాలను సమకూర్చారు. వెయిస్ట్ టర్న్ ట్విస్టర్, సిట్ అప్ బెంచ్, రోవర్, బాక్ పుల్ డౌన్, రైడర్, హెల్త్ వాకర్ ఉన్నాయి. సీతాకోకచిలుకల గార్డెన్ ప్రవేశద్వారం ఎదుట మొదట కనిపించేది బట్టర్ఫ్లై గార్డెన్. ఇందులో ఎన్నో రకాల మొక్కలు నాటారు. గతంలో నాటినవి.. ఇప్పుడు ఏపుగా పెరిగి ఆకట్టుకుంటున్నాయి. సీతాకోకచిలుకలను ఆకట్టుకునేలా స్వర్ణ గన్నేరు, పారిజాతం, విష్ణుశంఖం, మందారం వంటి 45 రకాల మొక్కలు ఉన్నాయి. 12 రాశులు.. 12 మొక్కలు తెలుగు రాశులు 12 ఉంటాయి. ఈ మేరకు పార్క్లో రాశి నవగ్రహ వనం ఏర్పాటు చేశారు. రాశుల పేర్లతోపాటు మొక్కలు వాటి సాంస్కృతిక నామాలను బోర్డుపై కనిపించేలా రాశారు. ఏడాకుల పాలు (వృషభం), అశోక/వెదురు (మిథునం), ఎర్రచందనం (మేషం), మర్రి (మీనం), జమ్మి (కుంభం), సిస్సు (మకరం), రావి (ధనస్సు), సండ్ల (వృశి్చకం), పొగడ (తుల), మామిడి (కన్య), రేగు (సింహం), మోదుగల (కర్కాటకం) నాటారు. అడల్ట్ వాటర్ బోటింగ్ పార్క్ చివరి భాగంలో చెక్డ్యాం నిర్మించి అందులో వాటర్ బోటింగ్ ఏర్పాటు చేశారు. బోటింగ్కు పర్యాటకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇద్దరు కూర్చుని సైకిల్లా తొక్కుతూ ముందుకు సాగవచ్చు. పచ్చని అందాల మధ్య నీటిలో విహారం ప్రత్యేక అనుభూతి మిగులుస్తోందని పర్యాటకులు చెబుతున్నారు. పది నిమిషాలకు ఒక్కొక్కరికి పది నిమిషాలకు రూ.100 వసూలు చేస్తున్నారు. పల్లె వాతావరణం ఆధునిక కాలంలో పిల్లలు ఎక్కువగా పట్టణాలు, నగరాల్లో నే విద్యనభ్యసిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల పై వారికి అవగాహన కరువవుతోంది. ఈ నేపథ్యంలో పల్లె వాతావరణం ప్రతిబింబించేలా పార్క్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్టింగ్ పర్యాటకులకు ఆకట్టుకుంటోంది. మనిషి ఎద్దులబండిని నడిపేలా చిత్రం, వీటి వెనుక గుడిసె, చేదు డుబావి ఏర్పాటు చేశారు. వెదురు ఉత్పత్తులతో తయారు చేసిన వన కుటీరం అమితంగా ఆకట్టుకుంటోంది. రెయిన్ ఫారెస్ట్, వాటర్ ఫాల్స్ అద్భుతం పార్క్లో రెయిన్ ఫారెస్ట్ ప్రత్యేక అనుభూతిని మిగులుస్తోంది. సహజసిద్ధ వాతావరణంలో వర్షం పడుతున్నట్లు కృత్రిమంగా ఏర్పాటు చేశారు. చెరువు నుంచి పైపుల ద్వారా నీటిని పంపింగ్ చేసేలా ప్రత్యేకమైన సెట్టింగ్ ఏర్పాటు చేయడం ఆకర్షిస్తోంది. గుట్టపై జాలువారుతున్న జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. చెరువు నుంచి పైకి నీళ్లు పంపింగ్ చేసి.. అక్కడ నిల్వ చేసి.. వదిలిపెడుతున్నారు. ఇలా ఏర్పడిన వాటర్ ఫాల్స్ సందర్శకులను మైమరిపింపజేస్తోంది. సాహస విన్యాసాలకు వేదిక మయూరి ఎకో అర్బన్ పార్క్ సాహస విన్యాసాలకు వేదికగా నిలుస్తోంది. రూ.50తో టైర్ బ్రిడ్జి, బాంబో బ్రిడ్జి, వాల్ క్లైంబింగ్ చేయవచ్చు. రూ.200తో సైక్లింగ్, రూ.100తో జిప్లైన్, వర్షాకాలం తర్వాత ఫారెస్ట్ ట్రెక్కింగ్ చేసే అవకాశం కల్పిస్తారు. యువకులు, విద్యార్థులు, పిల్లలు ఎక్కువగా ఈ ఈవెంట్లలో పాల్గొంటున్నారు. కరెన్సీ పార్క్ వివిధ దేశాలకు సంబంధించిన కరెన్సీ నోట్లను వృత్తాకారంలో ఏర్పాటు చేశారు. ఒక్కో కరెన్సీ నోటు వద్ద సంబంధిత దేశం పేరు, ఏమని పలకాలో వివరంగా రాశారు. భారతదేశం, ఉత్తర కొరియా, ఆస్ట్రేలియా, అమెరికా, జర్మనీ, ఫిన్లాండ్, సింగపూర్, దక్షిణాఫ్రికా, క్యూబా, వెనిజులా దేశాలకు చెందిన కరెన్సీ నోట్ల వివరాలు పిల్లలు గుర్తుంచుకునేలా ఏర్పాటు చేశారు. క్రీడాభిమానుల వేదిక ఆర్చరీ జోన్ పార్క్లో ఏర్పాటు చేసిన ఆర్చరీ జోన్ క్రీడాకారులతోపాటు క్రీడాభిమానులను ఆకర్షిస్తోంది. సెలవుల్లో మినహా రోజూ ఇది అందుబాటులో ఉంటోంది. ఈ ఆర్చరీ జోన్లో ఐదు విల్లులు కొట్టడానికి రూ.50 వసూలు చేస్తారు. ఏటా వేసవిలో ఇక్కడ ప్రత్యేకంగా ఆర్చరీ శిక్షణ ఇస్తున్నారు. జంగిల్ సఫారీ మయూరి అటవీ ప్రాంతంలో జంగిల్ సఫారీకి అవకాశముంది. అందుకు అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒక ట్రిప్కు రూ.2వేల చార్జితో ఎనిమిది మంది వరకు వాహనంలో అడవి మొత్తం చుట్టి రావొచ్చు. అడవి జంతువులతోపాటు రకరకాల చెట్లను చూడవచ్చు. నైట్ క్యాంపింగ్కు ప్రత్యేక ప్యాకేజీ ఎకో పార్క్లో ఒకరోజు, రాత్రివేళలో ప్రత్యేక నైట్ క్యాంపింగ్కు ఏర్పాట్లు చేశారు. ఒక్కొక్కరికి రూ.1,500 ప్యాకేజీతో డిన్నర్, భోజనంతో పాటు హైకింగ్ ఫారెస్ట్, జిప్లైన్ అండ్ రోప్ విన్యాసాలు, రెయిన్ ఫారెస్ట్, వాటర్ఫాల్, జిప్ సైక్లింగ్కు అవకాశం కల్పించారు. కొంతకాలంగా ఈ ప్యాకేజీ కొనసాగడం లేదు. త్వరలో పునఃప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. పిల్లలు కేరింతలు కొట్టాల్సిందే.. మయూరి ఎకో అర్బన్ పార్క్లో ఆడుకోవడానికి వీలుగా చిల్డ్రన్ పార్క్కు అన్ని హంగులు అద్దారు. చూడగానే ఆకట్టుకునేలా పార్క్ ముఖద్వారాన్ని తీర్చిదిద్దారు. లోపలికి ప్రవేశించారో.. లేదో.. పిల్లలు కేరింతలు కొట్టాల్సిందే. జారుబండలు, ఊయలలు, రోలింగ్, టైర్ స్వింగ్, అప్ అండ్ డౌన్ బల్లలు, అంబరిల్లా ఆటలు ఆడుకునేలా ఏర్పాట్లు ఉన్నాయి. కోతులు, చింపాంజీల బొమ్మలు ఆకట్టుకుంటున్నాయి. చిన్నారుల వాటర్ బోటింగ్కు విశేష స్పందన వస్తోంది. వాటర్ బోటింగ్కు 10 నిమిషాలకు రూ.50 చార్జి వసూలు చేస్తున్నారు.‘మకావ్’అదరహో.. పార్క్లో ఏర్పాటు చేసిన చిలుక జాతికి చెందిన గ్రీన్వింగ్డ్ మకావ్ పక్షి సందర్శకులను ఆకట్టుకుంటోంది. దక్షిణ అమెరికా అడవుల్లో గుంపులుగా నివసించే ఈ పక్షిని ఎన్క్లోజర్లో పెట్టారు. ఈ పక్షి జీవితకాలం 60 నుంచి 80 ఏళ్లు అంటూ వివరాలు తెలిపేలా బోర్డు ఏర్పాటు చేయడంతో.. పిల్లలకు వినోదంతోపాటు విజ్ఞానం అందుతోంది. బ్లాక్ అండ్ వైట్ స్వాన్ పార్క్లో ఏర్పాటు చేసిన కొలనులో నలుపు, తెలుపు రంగుల హంసల సందడి ఆకట్టుకుంటోంది. ఆ్రస్టేలియా ఖండానికి చెందిన ఈ హంసలు ఎక్కువ సేపు నీటిమీద విహరిస్తూ గడుపుతాయి. ఆకులు, గింజలు వీటి ఆహారం. జీవిత కాలం 30 నుంచి 40 ఏళ్లు అన్న వివరాలను బోర్డుపై రాసి పెట్టారు. చెట్ల మధ్య నడక వంతెన పార్క్ మధ్యభాగంలో ఏర్పాటు చేసిన నడక వంతెన విశేషంగా ఆకట్టుకుంటోంది. ఒక పక్క నడక వంతెన ఎక్కి.. మరోచోట దిగేలా ఏర్పాటు చేశారు. ఈ నడక వంతెనపై చిన్నారులతోపాటు పెద్దలు వాకింగ్ చేస్తున్నారు. వంతెన వద్ద ఏర్పాటు చేసిన డైనోసర్ల ప్రతిమలు అలరిస్తున్నాయి. పార్క్లో భారీ పరిమాణంలో ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటెన్ ఆకట్టుకుంటోంది. చుట్టూ నాటిన వివిధ రకాల మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఎంత పెద్ద ఆ్రస్టిచ్ పక్షులో.. అర్బన్ పార్క్కే హైలెట్గా ఆ్రస్టిచ్ పక్షులు నిలుస్తున్నాయి. పొడవైన కాళ్లు, భారీ ఆకారంతో కూడిన ఆ్రస్టిచ్ పక్షులు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఆఫ్రికా, ఆస్ట్రేలియా అడవుల్లో ఈ పక్షులు ఎక్కువగా కనిపిస్తాయి. వీటి గుడ్డు 32 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. బరువు కిలో 400 గ్రాములు ఉంటుంది.. అన్న వివరాలు ఉన్నాయి. మూడు వ్యూ పాయింట్లు పార్క్లో మూడు వ్యూ పాయింట్లు ఉన్నా యి. హిల్ వ్యూపాయింట్, ఫ్లాగ్ పాయింట్తో పాటు మరో సాధారణ వ్యూ పాయింట్ను ఏర్పాటు చేశారు. హిల్ వ్యూపాయింట్ నుంచి చూస్తే ఇటు పక్క జడ్చర్ల, మరోపక్క మహబూబ్నగర్ రహదారి అద్భుతంగా కనిపిస్తోంది. వ్యూ పాయింట్లో పార్క్ అందాలు ఆకట్టుకుంటున్నాయి. ఫొటో షూట్లకు క్రేజీ మయూరి ఎకో అర్బన్ పార్క్ ఫొటో షూట్కు వేదికగా నిలుస్తోంది. కొత్తగా పెళ్లి చేసుకునేవారు, చేసుకున్న జంటలు ఇక్కడికి వచ్చి ప్రకృతి అందాల మధ్య ఫొటోలు తీసుకుంటుండడంతో సందడి నెలకొంటోంది.ఆహ్లాదంగా ఉంది సెలవు రోజుల్లో కుటుంబంతో కలిసి పార్క్కు వస్తుంటాం. పార్క్ రోజురో జుకూ అభివృద్ధి చెందుతోంది. పా ర్క్లో కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతాం. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. పెద్దలు సంతోషంగా గడిపేందుకు అవకాశముంది. – రాజేశ్వర్, ఉపాధ్యాయుడుపిల్లలకు చూపాలి చి్రల్డన్ పార్కులో ఏర్పాటు చేసిన సెట్టింగ్లు, బొమ్మలు కచి్చతంగా పిల్లలకు చూపాలి. సీతాకోక చిలుకల గార్డెన్లో రకరకాల మొక్కలు, వాటి పేర్లు తెలియడంతో విజ్ఞానం పెరుగుతుంది. సెలవులు ఉంటే తప్పకుండా మా పిల్లలతో ఇక్కడికొస్తాం. – శంకర్, మహమ్మదాబాద్ హైదరాబాద్ తరహాలో.. హైదరాబాద్లోని పార్క్ల తరహాలో ఇక్కడే పలు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. పచ్చదనంతో కూడిన పార్క్ అందాలు చాలా బాగున్నాయి. జీవితంలో గుర్తుండిపోయేలా ఉంది. పిల్లలకు ఆడుకునేందుకు, విజ్ఞానం పొందేందుకు ఇక్కడి ఏర్పాట్లు బాగున్నాయి. – దీపిక, మహబూబ్నగర్ రాబోయే రోజుల్లో మరిన్ని ఏర్పాట్లు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సెంటర్ ఏర్పాటుతోపాటు రాక్ గార్డెన్, కాక్టస్ గార్డెన్ వంటివి ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించాం. త్వరలో ఏర్పాటు చేసి పర్యావరణ విద్యపై శిక్షకుడిని ఏర్పాటు చేసి పార్కుకు వచ్చే సందర్శకులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోబోతున్నాం. – వాసవి, అటవీ సెక్షన్ ఆఫీసర్ -
నీటి ఉధృతికి కొట్టుకుపోయిన బైక్
నాగర్కర్నూల్ క్రైం: నీటి ఉధృతికి ద్విచక్రవాహనం కొట్టుకుపోయిన ఘటన మున్సిపాలిటీ పరిధిలోని నాగనూలు సమీపంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకోగా.. ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు నాగనూలు సమీపంలోని కల్వర్టులో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో నాగనూలు గ్రామానికి చెందిన శివ ద్విచక్రవాహనంతో రోడ్డు దాటేందుకు ప్రయత్నించగా.. ప్రమాదవశాత్తు నీటిలో పడిపోవడంతో అక్కడే ఉన్న స్థానికులు బాధితుడిని కాపాడగా ద్విచక్రవాహనం కొట్టుకుపోయింది. ఘటనకు సంబంధించి ఎస్ఐ గోవర్ధన్ను వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. -
భక్తుల ఆరాధ్యదైవం గెల్వలాంబమాత
వంగూరు: మండల కేంద్రంలో కొలువుదీరిన గెల్వలాంబమాత ఉత్సవాలు ఈనెల 13 నుంచి 17 వరకు ఐదు రోజులపాటు నిర్వహించనున్నారు. ఉత్సవాలకు సంబంధించి దేవస్థాన కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ అలంకరణ, విద్యుద్ధీకరణ, తాగునీరు, ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 13న అమ్మవారి మేలుకొలుపు, తోరణ అలంకరణ, గణపతి పూజ, సాయంత్రం నజర్ బోనాలు, వైశ్యుల బోనాలు, అనంతరం బండ్లు, వాహనాలు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తాయి. 14న అమ్మవారికి గండదీపం, సాయంత్రం రెడ్లు, పద్మశాలిలు, బోయ, గౌడ్స్, యాదవుల బోనాలు అమ్మవారికి సమర్పిస్తారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో బతుకమ్మ, కోలాటాలు, భజనలు ఉంటాయి. 15 ఉదయం పూజా కార్యక్రమాలు, సాయంత్రం ముదిరాజ్ల బోనాలు, బండ్లు తిరుగుతాయి. 16 తెల్లవారుజామున రథోత్సవం, శ్రీకృష్ణ జననం, డోలారోహణం ఉంటుంది. 17 సాయంత్రం యాదవులు ఉట్టి కొట్టుట, బాలబాలికల చేత శ్రీకృష్ణ, గోపికల వేషాధారణ. అనంతరం మహామంగళహారతితో జాతర ముగుస్తుంది. ● ఉత్సవాల్లో భాగంగా 14న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హాజరవుతారని దేవస్థాన కమిటీ ఛైర్మన్ నకిరమోని శేఖర్ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ దంపతులు రెండు రోజులపాటు ఉత్సవాల్లో పాల్గొంటారు. ● బ్రహ్మోత్సవాల్లో భాగంగా 14న రాత్రి పలువురు ప్రత్యేక ఫోక్ సింగర్లచేత ఆటాపాట నిర్వహించనున్నారు. ఆలయ ప్రాంగణంలో దేవస్థానం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 13 నుంచి 17 వరకు బ్రహ్మోత్సవాలు ఐదు రోజులపాటు బోనాలు, ఉత్సవాలు ఏర్పాట్లు చేస్తున్న దేవస్థాన కమిటీ -
చెంచు మహిళకు అరుదైన గౌరవం
మన్ననూర్/జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): నల్లమల్ల చెంచు మహిళకు అరుదైన గౌరవం దక్కింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకొండ వద్ద 15వ తేదీన జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనేందుకు నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ చెంచు మహిళా సమాఖ్య నుంచి అటవీ లోతట్టు ప్రాంతం కుడిచింతలబైలు గ్రామానికి చెందిన భౌరమ్మ పాల్గొననుంది. సెర్ప్ సీఈఓ ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం సికింద్రాబాద్ నుంచి రైలులో భౌరమ్మ ఆమె భర్త వెంకటయ్య ఢిల్లీకి బయలుదేరారు. డీఆర్డీఓ అధికారులు ఆమెకు అభినందనలు తెలిపారు. గొప్ప వాళ్లకు లభించే అవకాశం తనకు రావడం సంతోషంగా ఉందని.. అవకాశం కల్పించిన సెర్ప్ అధికారులు, డీఆర్డీఓ అధికారులకు భౌరమ్మ ధన్యవాదాలు తెలిపారు. -
మహబూబ్నగర్ ఆర్టీసీకి గి‘రాఖీ’
స్టేషన్ మహబూబ్నగర్: రాఖీ పండుగకు మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్ రికార్డుస్థాయి ఆదాయం సమకూరింది. పండుగ వేళ వరుస సెలవులు రావడంతో ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు రీజియన్ పరిధిలోని డిపోల నుంచి ప్రత్యేక అదనపు బస్సు సర్వీసులు నడిపారు. ఆయా డిపోల నుంచి హైదరాబాద్ మార్గంలో ఎక్కువ బస్సులు నడపడంతో రీజియన్కు అధిక ఆదాయం సమకూరింది. ● ఈ ఐదు రోజుల్లో ఆక్యుపెన్షి రేషియాలోనూ రాష్ట్రస్థాయిలో మహబూబ్నగర్ రీజియన్ 139 శాతం సాధించి మొదటి స్థానంలో నిలవడం విశేషం. బస్సులు 19.56 లక్షల కిలోమీటర్లు తిరిగి 26.63 లక్షల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చాయి. గతేడాది కంటే ఈసారి 15 వేల మంది ప్రయాణికులు అదనంగా ప్రయాణం చేశారు. డిపోల పరంగా చూస్తే మహబూబ్నగర్ రూ.2,54,98,000, వనపర్తి డిపో రూ.2,26,70,000 అధిక ఆదాయాన్ని పొందాయి. డ్రైవర్లు, కండక్టర్లు, సూపర్వైజర్లు, ఇతర ఉద్యోగుల సమష్టి కృషితోనే ఆక్యుపెన్సి రేషియో 139 శాతం సాధించి రాష్ట్రంలోనే మహబూబ్నగర్ రీజియన్ మొదటిస్థానంలో నిలవడం సంతోషంగా ఉంది. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు వరలక్ష్మీ వ్రతం, రాఖీ పండుగలకు దూరంగా ఉండి విధులకు హాజరవడం గర్వకారణం. పండుగ రోజుల్లో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బస్టాండ్లలో పర్యవేక్షణ నిర్వహించాం. ఆర్టీసీపై ఆదరణ చూపించిన ఉమ్మడి జిల్లా ప్రయాణికులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. – పి.సంతోష్కుమార్, రీజినల్ మేనేజర్ తేదీల వారీగా ఇలా.. వచ్చిన ఆదాయం (రూ.లలో..) 8 తేదీన 2,48,37,000 7 తేదీన 2,16,31,000 9 తేదీన 3,70,74,000 10 తేదీన 3,85,60,000 11తేదీన 3,94,34,000 డిపో తిరిగిన కిలోమీటర్లు ఆదాయం (లక్షల్లో..) (రూ.లక్షల్లో..) మహబూబ్నగర్ 3.00 254.98 వనపర్తి 2.54 226.70 కల్వకుర్తి 2.16 182.29 షాద్నగర్ 1.86 169.65 నారాయణపేట 2.03 163.90 గద్వాల 2.31 159.68 అచ్చంపేట 1.97 157.90 నాగర్కర్నూల్ 1.81 151.94 కొల్లాపూర్ 1.54 122.57 కోస్గి 0.34 25.75 డిపోల వారీగా ఆదాయం ప్రతి ఉద్యోగి కృషితోనే సాధ్యమైంది.. 5 రోజులు.. రూ.16.15 కోట్ల ఆదాయం 11వ తేదీన అధికంగా రూ.3.94 కోట్లు ఆక్యుపెన్షి రేషియాలో రాష్ట్రంలోనే మొదటిస్థానం -
సస్పెండ్ అయినా.. సగం జీతం వస్తుందిలే!
రాజోళి: ‘‘సస్పెండ్ అయితే ఏంటి.. సగం జీతం వస్తుంది కదా.. దాంతో జీవితాన్ని సరదాగా గడిపేస్తా’’ అని చిన్నధన్వాడ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రవిచందర్ సమాధానమివ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మంగళవారం ‘సాక్షిశ్రీలో ప్రచురితమైన ‘లంచం ఇచ్చే విధుల్లోకి వచ్చా’ కథనానికి ఎంఈఓ భగీరథరెడ్డి స్పందించారు. ఈ మేరకు చిన్నధన్వాడ ప్రాథమిక పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడు రవిచందర్ తీరుపై విచారణ చేపట్టారు. అప్పటికే సదరు ఉపాధ్యాయుడు ఫూటుగా మద్యం తాగి వాటర్ట్యాంక్ వద్ద ఏదీ గుర్తులేకుండా నిద్రించాడు. ఎంఈఓ విద్యార్థులతో వివరాలు సేకరించగా.. తరగతి గదిలోనే మద్యం తాగి నిద్రిస్తాడని.. మద్యం మత్తులో తమను ఇష్టం వచ్చినట్లు తిడతాడని విద్యార్ధులు ఎంఈఓతో వాపోయారు. ఈ క్రమంలోనే వాటర్ట్యాంక్ వద్ద మద్యం మత్తులో నిద్రిస్తున్న సదరు ఉపాధ్యాయుడిని పాఠశాల వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎంఈఓతో అతడు మాట్లాడుతూ.. ప్రకృతిలో ఉన్న సమస్యల కారణంగా పిల్లల సంఖ్య తగ్గుతుందని, అందుకు తామేమి చేస్తామని బదులిచ్చారు. అయితే విద్యార్థులతో పుస్తకాలు చదివించవమని ఎంఈఓ సూచించగా, మద్యం మత్తులో ఊగుతూ.. తూగుతూ నానా తంటాలు పడ్డాడు. పాఠశాలలోనే మద్యం తాగే నీపై చర్యలు తప్పవని ఎంఈఓ అనగా.. పర్లేదు సార్ సస్పెండ్ అయినా సగం జీతం వస్తుందిలే అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. అనంతరం ఎంఈఓ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. తమ విచారణలో సదరు ఉపాధ్యాయుడిపై వచ్చిన ఆరోపణలన్నీ వాస్తవాలే అని అన్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే, గతంలో కూడా విచారణ చేసి వదిలేశారని.. ఇప్పటికై నా కఠిన చర్యలు తీసుకుంటారో లేదోనని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. మద్యం మత్తులో మాస్టరు సమాధానానికి అవాకై ్కన ఎంఈఓ -
జూరాలకు కొనసాగుతున్న వరద
ధరూరు: ఎగువన కురస్తున్న వర్షాల కారణంగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు మంగళవారం రాత్రి 7 గంటల వరకు 1.05 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 10 క్రస్టు గేట్లను ఎత్తి 68,580 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 36,541 క్యూసెక్కులు, కోయిల్సాగర్కు 315 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 45 క్యూసెక్కులు, కుడి కాల్వకు 236 క్యూసెక్కులు, ఆర్డీఎస్ లింక్ కెనాల్కు 50 క్యూసెక్కులు కలిపి ప్రాజెక్టు నుంచి మొత్తం 1.057 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.203 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆల్మట్టి ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నీటి మట్టం 129.72 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 121.957 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 1.22 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. 10 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నీటి మట్టం 37.64 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 32.74 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 25వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. 4 క్రస్టు గేట్లను ఎత్తి 19,920 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మూడేళ్ల అనంతరం.. ఎగువ జూరాల జలవిద్యుదుత్పత్తి కేంద్రంలో 2023లో మొరాయించి పని చేయకుండా ఉన్న మూడో యూనిట్ ఎట్టకేలకు మంగళవారం వినియోగంలోకి వచ్చింది. తెల్లవారుజామున ఎస్ఈ శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మూడో యూనిట్ ద్వారా విద్యుదుత్పత్తిని విజయవంతంగా ప్రారంభించారు. సుంకేసులకు.. రాజోళి: సుంకేసుల ప్రాజెక్టుకు 60వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా.. 13 గేట్లను ఒక మీటర్ మేర తెరిచి 56,927 క్యూసెక్కులను దిగువకు, కేసీ కెనాల్ 2,012 క్యూసెక్కులను విడుదల చేసినట్లు జేఈ మహేంద్ర తెలిపారు. 473.254 ఎంయూ విద్యుదుత్పత్తి ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు జల విద్యుదుత్పత్తి కేంద్రాల్లో మంగళవారం 12 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 6 యూనిట్ల ద్వారా 216.545 ఎంయూ, దిగువలో 6 యూనిట్ల ద్వారా 256.709 మిలియన్ యూనిట్లు కలిపి 473.254 ఎంయూ విద్యుదుత్పత్తిని చేపట్టామన్నారు. 1.05 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ప్రాజెక్టు 10 క్రస్టు గేట్ల ఎత్తివేత 1.05లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు.. -
ప్రజలు సురక్షితంగా ఉండాలి: కలెక్టర్
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): రానున్న 72 గంటలు మోతాదుకు మించి భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయేందిర ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల ఆిస్తి, ప్రాణ, పశు నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు ప్రతిశాఖ అధికారులు వారి పరిధిలో విధులను, బాధ్యతలను సజావుగా నిర్వహించాలన్నారు. పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, వైద్య, ఆరోగ్యం, పంచాయతీరాజ్, విద్యుత్, వ్యవసాయ, మిషన్ భగీరథ శాఖలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వానలకు నీళ్లు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి శాఖ అధికారులు తమ పరిధిలో ఉన్న సిబ్బందితో వెంటనే సమావేశం పెట్టుకుని తగు చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితులు ఎదురైన వెంటనే స్పందించేందుకు కలెక్టర్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వరదలు, ఇళ్లకు నష్టం, రోడ్లు ధ్వంసం, చెట్లు కూలిపోవడం వంటి విపత్కర పరిస్థితులు ఎదురైన సందర్భంగా వెంటనే కలెక్టరేట్లోని కంట్రోల్రూమ్ నంబర్ 08542–241165కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమావేశంలో ఎస్పీ జానకి, అడిషనల్ కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, నర్సింహారెడ్డి, జెడ్పీ సీఈఓ వెంకట్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్కుమార్, సీపీఓ రవీందర్, డీఎంహెచ్ఓ కృష్ణ, మిషన్ భగీరథ ఈఈ పుల్లారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. -
500 మీటర్ల జెండాతో తిరంగా ర్యాలీ
79వ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం జడ్చర్ల పట్టణంలో భారతీయ జనతా యువమోర్చా తిరంగార్యాలీ నిర్వహించారు. 500 మీటర్ల త్రివర్ణ పతాకాన్ని కళాశాల, హైస్కూల్ విద్యార్థులు పట్టుకుని అంబేద్కర్ చౌరస్తా నుంచి నేతాజీచౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర నాయకుడు ముచ్చర్ల జనార్దన్రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చిన ‘హర్ ఘర్ తిరంగా అభియాన్’ కార్యక్రమం జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పేద, ధనికులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని సూచించారు. కార్యక్రమంలో యువమోర్చా జిల్లా అధ్యక్షుడు తిరుపతి, కిసాన్మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యంబీ బాలకృష్ణ, నాయకులు రాపోతుల శ్రీనివాస్గౌడ్, ఎడ్ల బాలవర్దన్గౌడ్, సాహితీరెడ్డి, కొంగళి శ్రీకాంత్, అమర్నాథ్గౌడ్, నరేష్నాయక్, శ్రీనాథ్, లక్ష్మారెడ్డి, రేఖ, పిట్టల నరేష్, జగదీశ్సింగ్, వివ్వనాథ్, నరేందర్, నవీన్లు పాల్గొన్నారు. – జడ్చర్ల టౌన్ -
జిల్లాకేంద్రంలో గంట పాటు భారీ వర్షం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లా కేంద్రంలో ఉదయం 6.30 నుంచి 7.30 గంటల వరకు కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో ఎస్.ఆర్.నగర్, బీకే రెడ్డి, కాలనీ, నాగిరెడ్డికాలనీ, వెంకటరమణకాలనీ, రామయ్యబౌలి, శివశక్తినగర్, పాల్కొండ బైపాస్, రాయచూర్ రోడ్డు తదితర ప్రాంతాలతో పాటు కొత్త బస్టాండు ప్రాంగణంలో వరద ఏరులై పారింది. ఆయా చోట్ల వెంటనే మున్సిపల్ కార్మికులు వరదనీటిని కాల్వల ద్వారా మళ్లించడంతో పరిస్థితి యధాస్థితికి చేరింది. ఇక పెద్దచెరువు (మినీ ట్యాంక్బండ్) లోకి వస్తున్న వరద ఉద్ధృతిని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.ప్రవీణ్కుమార్రెడ్డి పరిశీలించి సిబ్బందికి తగు సూచనలిచ్చారు. లోతట్టు ప్రాంతాలు జలమయం వరద నీటిని మళ్లించిన మున్సిపల్ కార్మికులు -
కానరాని పురోగతి!
గద్వాల: పదేళ్ల క్రితమే పూర్తికావాల్సిన ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనులు పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. ఏళ్ల తరబడి పెండింగ్లోనే కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్ పనులను వచ్చే ఏడాది నాటికి పూర్తిచేసి.. ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని చెబుతున్న అమాత్యుల హామీలు కేవలం సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనల్లో ప్రకటనలకే పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్లో ఇరిగేషన్శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధ్యక్షతన జరిగే ఉమ్మడి జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల పనుల సమీక్షకు ప్రాధాన్యత సంతరించుకుంది. నెరవేరని లక్ష్యం బీడు భూముల్లో సాగునీటిని పారించి వలసల పాలమూరు రూపురేఖలు మార్చాలని అప్పటి ముఖ్యమంత్రి దివంగత డా.వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం కింద కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టారు. ఆ ప్రాజెక్టుల ద్వారా 1 0లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని సంకల్పించారు. అయితే వైఎస్సార్ అకాల మరణాంతరం పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టుల పనులను పూర్తిచేయకుండా వదిలేయడంతో పెండింగ్లోనే కొనసాగుతున్నాయి. ఫలితంగా 10 లక్షల ఎకరాలకు నీరందించాల్సిన ప్రాజెక్టుల కింద 6 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగునీరు పారుతోంది. కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించినా.. గతేడాది సెప్టెంబర్లో జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రులకు జడ్చర్ల వద్ద పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితుల నుంచి పెద్దఎత్తున నిరసన సెగలు తగిలాయి. పెండింగ్ పనులు పూర్తి చేయాలంటే భూసేకరణ సమస్యను పరిష్కరించాలని గ్రహించిన మంత్రులు.. భూసేకరణ ప్రక్రియతో పాటు పెండింగ్ పనులను ఎప్పటికప్పు డు పర్యవేక్షించి వేగం పెంచాలని కలెక్టర్లకే బాధ్యత లు కట్టబెట్టారు. అయితే 10 నెలల కాలంలో ప్రాజెక్టుల పనుల్లో ఆశించిన పురోగతి కనిపించడం లేదు. ● 4.50 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో నిర్మాణం చేపట్టిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులు అసంపూర్తిగానే ఉండగా.. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు కింద 2.50 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నారు. ఇందుకోసం మొత్తం 5 పంపులు ఏర్పాటు చేయగా.. వివిధ కారణలతో రెండుపంపులు మరమ్మతుకు గురై మూలకు చేరాయి. ● నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం పనులు పదేళ్ల క్రితమే 90 శాతం పూర్తయ్యాయి. మొత్తం 2 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉండగా.. గూడ్డెందొడ్డి, ర్యాలంపాడు జలాశయాల కింద 1.45 ఎకరాలకు సాగునీరు అందుతోంది. మోటార్ల నిర్వహణ కొరవడటంతో తరచుగా సాంకేతిక సమస్యలు తలెత్తి నీటి పంపింగ్కు ఆటంకాలు ఏర్పడటం పరిపాటిగా మారింది. ● నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి ర్యాలంపాడు జలాశయం గుండెకాయలాంటిది. అయితే రాక్టోల్, తూములు, ఆనకట్ట బండ్లో లీకేజీలు ఏర్పడటంతో నాలుగేళ్లుగా 2 టీఎంసీలు మాత్రమే నిల్వచేస్తూ వస్తున్నారు.గతేడాది పుణెకు చెందిన ఇంజినీరింగ్ నిపుణుల బృందం ర్యాలంపాడు రిజర్వాయర్ను సందర్శించి.. మరమ్మతుకు రూ.185 కోట్లు వ్యయం అవుతుందని నివేదించారు. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి చలనం లేదు. కొనసా..గుతున్న ‘పాలమూరు’ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. సివిల్, మెకానికల్ పనులు పూర్తిచేయాల్సి ఉంది. అదే విధంగా పలు రిజర్వాయర్ల కింద భూ సేకరణకు సంబంధించి సమస్యలు పెండింగ్లో కొనసాగుతున్నాయి. ● మరికల్, ధన్వాడ, చిన్నచింతకుంట, దేవరకద్ర మండలాల పరిధిలో 50 వేల ఎకరాలకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టారు. గత పాలకులు కోయిల్సాగర్ పనులను పూర్తిచేయకపోవడంతో నేటికీ పెండింగ్లోనే ఉంది. మరోవైపు జూరాల ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతున్న క్రమంలో మోటారు పంపులలో తరచుగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక్కడ కూడా నిర్వహణ లోపమే ప్రధాన కారణం. ● నారాయణపేట జిల్లాలో 4లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో చేపట్టిన భీమా ఎత్తిపోతల పథకం పనులు సైతం పెండింగ్లో కొనసాగుతున్నాయి. ఫలితంగా పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీటిని అందించలేని పరిస్థితి నెలకొంది. నాలుగేళ్లుగా మరమ్మతుకు నోచుకోని ర్యాలంపాడు రిజర్వాయర్ నేడు సమీక్ష.. హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో ఇరిగేషన్శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై సమీక్షించనున్నారు. ఉదయం సెషన్లో నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని ప్రాజెక్టులు, మఽధ్యాహ్నం సెషన్లో మహబూబ్నగర్ పార్ల మెంట్ పరిధిలోని ప్రాజెక్టులపై సమీక్షిస్తారు. సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులపై కాలయాపన వచ్చే ఏడాది నాటికి పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరు అందడం గగనమే ఊసేలేని ర్యాలంపాడు రిజర్వాయర్ మరమ్మతు మంత్రుల సమీక్షలు, క్షేత్రస్థాయిపర్యటనల్లో ప్రకటనలకే పరిమితం నేడు రాష్ట్ర సచివాలయంలో ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష -
కదిలిస్తే కన్నీరే..
వీరందరూ వనపర్తి జిల్లా రేవల్లి మండలంలో ముంపు గ్రామమైన బండరాయిపాకులకు చెందిన సామాన్య, మధ్య తరగతికి చెందిన ప్రజలు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన ఏదుల ప్రాజెక్ట్ నిర్మాణంలో వ్యవసాయ భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులు. ప్రభుత్వం ఇచ్చిన అరకొర పరిహారాన్ని ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ కంపెనీ నిర్వాహకులు గద్దలా తన్నుకుపోవడంతో గుండెలు బాదుకుంటున్నారు. నెలనెలా వడ్డీ వస్తుందనే ఆశ నిండా ముంచడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. తాము చెల్లించిన డబ్బులను ఇవ్వాలని ఐదేళ్లుగా ఆందోళన చేస్తున్నా.. ఫలితం లేకపోవడంతో వారిలో ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. ..ఇలా మోసపోయింది ఈ ఒక్క గ్రామస్తులే కాదు. వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల పరిధిలో దాదాపు 50 గ్రామాలకు చెందిన పీఆర్ఎల్ఐ నిర్వాసితులు 2,500 మంది ఉన్నట్లు అంచనా. డబ్బులు వస్తలేవనే మనోవేదనతో ఇప్పటికే పలువురు బలవన్మరణాలకు పాల్పడగా.. కొందరు గుండెనొప్పితో తనువు చాలించారు. ఈ నేపథ్యంలో బాధిత నిర్వాసితులను ‘సాక్షి’ పలకరించగా.. కన్నీళ్లే మిగిలాయి. అనారోగ్య కారణాలతో మంచమెక్కిన వారు.. వైద్య చికిత్సలకు డబ్బులు లేక విలవిల్లాడుతున్నారు. ఇళ్లు కట్టుకోలేక, సంతానాన్ని పోషించలేక, చదివించలేక నరకయాతన అనుభవిస్తున్నారు. బాధితులు ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాధ కాగా.. వారి ఆవేదన వారి మాటల్లోనే.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ ఎవరైనా పెడితేనే తింటున్న.. నేను పని చేయలేను కాబట్టి నెలనెలా మిత్తి వస్తే ఖర్చులకు సరిపోతాయి.. బతకొచ్చు అనుకుని వచ్చిన డబ్బులను నా పేరు మీద రూ.5 లక్షలు ఫైనాన్స్లో పెట్టాను. నా కూతుళ్లు లక్ష్మీ రూ.5 లక్షలు, రుక్మమ్మ రూ.6 లక్షలు.. మొత్తం రూ.16 లక్షలు పెట్టాం. మొదట్లో మిత్తి డబ్బులు 2 నెలలు ఇచ్చాడు. ఆ తర్వాత మిత్తి లేదు.. అసలు లేదు నాకు ప్రస్తుతం అన్నం కూడా సరిగా పెట్టడం లేదు. ఎవరైనా బయట పెడితే తింటున్న.. గుడిసెలో వెళ్లి పడుకుంటున్నా. – భగవంతు, బాధితుడు క్యాన్సర్ పేషంట్ను..గోలీలకూ డబ్బుల్లేవు.. పాత బండరాయిపాకులలో మాకు ఐదెకరాల భూమి ఉండేది. పాలమూరు ప్రాజెక్ట్తో ఉన్నది పోయింది. ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చాక సాయిరాం ఫైనాన్స్ వాళ్లు నా కొడుకును కలిసిండ్రు. మిత్తి ఎక్కువగా వస్తుందని మాయమాటలు చెప్పి బాగా నమ్మించిండ్రు. దీంతో నా కొడుకు రాములు పేరిట రూ.10 లక్షలు, నా కోడలు గోపాల శివశీల పేరిట రూ.5 లక్షలు, నేను దాచుకున్న రూ.1.50 లక్షలు.. మొత్తం రూ.16.50 లక్షలను 2021లో ఫైనాన్స్ కంపెనీలో డిపాజిట్ చేశాం. ఒకసారి రూ.60 వేలు, మరోసారి రూ.30 వేలు వడ్డీ కింద ఇచ్చారు. ఆ తర్వాత ఆరోగ్యం బాలేదని డబ్బులు అడిగితే ఇవ్వడం లేదు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ ఆస్పత్రికి వెళ్తే క్యాన్సర్ వచ్చిందని చెప్పారు. మళ్లీ ఆస్పత్రికి వెళ్లేందుకు, గోలీలకు డబ్బుల్లేవ్. ఫికరుతో ఎప్పుడు సచ్చిపోతనో నాకే తెలుస్తలేదు. – గోపాల బొజ్జమ్మ, బండరాయిపాకుల, రేవల్లి, వనపర్తి డబ్బుల్లేక మందులు తెచ్చుకోలేకపోతున్నాం.. నా భార్య పేరు మీద రూ.11 లక్షలు, నా పేరు మీద రూ.2 లక్షలు.. మొత్తం రూ.13 లక్షలు ఫైనాన్స్లో పెట్టాం. మాకు నలుగురు కూతుళ్లు. అందరి పెళ్లిళ్లు అయ్యాయి. ప్రస్తుతం మమ్మల్ని ఎవరూ చూడనీకే రావడం లేదు. నా భార్యకు చేయి విరిగింది. డబ్బుల్లేక మందులు తెచ్చుకోలేకపోతున్నాం. మా డబ్బులు మాకివ్వమని ఎవర్ని అడగాలో తెలియడం లేదు. మా మీద కనికరం చూపించి డబ్బులు ఇప్పించాలి. – బింగి లింగయ్య, పాపమ్మ దంపతులు కిరాయి ఇంట్లో ఉంటున్నాం.. తెలిసిన వాళ్లు మిత్తి వస్తుందని చెబితే.. మాకు పునరావాసం కోసం వచ్చిన డబ్బులు మొత్తం రూ.24 లక్షలను ఓం శ్రీ సాయిరాం చిట్ఫండ్లో నాలుగేళ్ల క్రితం పెట్టాం. ఇప్పటివరకు మాకు చిల్లిగవ్వ ఇవ్వలేదు. డబ్బులు లేక మేము ఇల్లు కట్టుకోలేదు. కిరాయికి వేరొకరి ఇంట్లో ఉంటున్నాం. నేనూ మా ఆయన ఇద్దరం కూలీ చేసుకుని బతుకుతున్నాం. మా పరిస్థితి ఇలా ఉంటే.. దుడ్డు మల్లయ్య అనే వాళ్లతో రూ.2.60 లక్షలు కట్టించాను. ఇప్పుడు వాళ్లు డబ్బులు ఇవ్వాలని నన్ను టార్చర్ పెడుతున్నారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలి. – గోపాల పార్వతమ్మ, బాధితురాలు నాన్న దూరమయ్యాడు.. కుటుంబం రోడ్డున పడింది.. మా నాన్న రాంచంద్రయ్య ఓం శ్రీ సాయిరాం చిట్ఫండ్లో రూ.13 లక్షలు పెట్టాడు. ఆ తర్వాత ఆయనకు ఆరోగ్యం బాగాలేకపోతే ఆస్పత్రికి తీసుకెళ్లాం. ఫైనాన్సోళ్లను ఎన్నిసార్లు అడిగినా డబ్బులు ఇవ్వకపోయేసరికి మనోవేదనతో మంచానపడ్డాడు. దీంతో వైద్య ఖర్చులకు ఆయనపై ఉన్న ప్లాటు అమ్మాల్సి వచ్చింది. ఈ క్రమంలో మా నాన్న గుండెపోటు వచ్చి మరణించాడు. ఇప్పుడు మాకు ఇల్లులేదు. డబ్బుల కోసం నా భార్యకు నాకు గొడవ జరిగింది. వీళ్లతో డబ్బులు పెట్టడం వల్ల మా నాన్న నాకు దూరమాయ్యాడు. నా కుటుంబం రోడ్డున పడింది. ప్రస్తుతం ఉండేందుకు ఇంటి స్థలం కూడా లేదు. – కుర్మయ్య, బాధితుడు అతికష్టం మీద బతుకుతున్నాం.. నా పేరు, నా భర్త మీద రూ.6 లక్షలను 2021లో ఓం శ్రీసాయిరాం ఫైనాన్స్ కంపెనీలో పెట్టాం. మాకు నలుగురు కొడుకులు ఉండగా.. ముగ్గురు మరణించారు. ఒక్క కొడుకు మాత్రమే ఉన్నాడు. మాతో డబ్బులు లేకపోయేసరికి మమ్మల్ని ఎవరూ చూసుకోవడం లేదు. ఉన్న కొడుకు కూడా విడిగా ఉంటున్నాడు. నాకు పక్షవాతం వచ్చింది. ఒక కన్ను సరిగా కనిపించడం లేదు. అతికష్టం మీద బతుకుతున్నాం. డబ్బులు అనవసరంగా ఎవరికో ఇచ్చి ఇలా చేశారని కొడుకు, కోడలు నిత్యం తిడుతూనే ఉన్నారు. మాకు డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలి. – మిద్దె నాగమ్మ, బాధితురాలు ఫైనాన్స్ మోసంతో పీఆర్ఎల్ఐ నిర్వాసితుల విలవిల ఇప్పటికే కొందరి బలవన్మరణం..గుండెనొప్పితో తనువు చాలించిన మరికొందరు.. వైద్య చికిత్సలకు డబ్బుల్లేక మంచానికే పరిమితమైన ఇంకొందరు.. ఇళ్లు కట్టుకోలేక..పిల్లలను చదివించలేనిదుస్థితిలో పలువురు.. ఆలనాపాలన కరువై ఆదుకునే వారి కోసం వృద్ధుల ఎదురుచూపులు.. -
సస్పెండ్ అయినా.. సగం జీతం వస్తుందిలే!
నారాయణపేట: ‘‘సస్పెండ్ అయితే ఏంటి.. సగం జీతం వస్తుంది కదా.. దాంతో జీవితాన్ని సరదాగా గడిపేస్తా’’ అని చిన్నధన్వాడ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రవిచందర్ సమాధానమివ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘లంచం ఇచ్చే విధుల్లోకి వచ్చా’ కథనానికి ఎంఈఓ భగీరథరెడ్డి స్పందించారు. ఈ మేరకు చిన్నధన్వాడ ప్రాథమిక పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడు రవిచందర్ తీరుపై విచారణ చేపట్టారు. అప్పటికే సదరు ఉపాధ్యాయుడు ఫూటుగా మద్యం తాగి వాటర్ట్యాంక్ వద్ద ఏదీ గుర్తులేకుండా నిద్రించాడు. ఎంఈఓ విద్యార్థులతో వివరాలు సేకరించగా.. తరగతి గదిలోనే మద్యం తాగి నిద్రిస్తాడని.. మద్యం మత్తులో తమను ఇష్టం వచ్చినట్లు తిడతాడని విద్యార్ధులు ఎంఈఓతో వాపోయారు. ఈ క్రమంలోనే వాటర్ట్యాంక్ వద్ద మద్యం మత్తులో నిద్రిస్తున్న సదరు ఉపాధ్యాయుడిని పాఠశాల వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎంఈఓతో అతడు మాట్లాడుతూ.. ప్రకృతిలో ఉన్న సమస్యల కారణంగా పిల్లల సంఖ్య తగ్గుతుందని, అందుకు తామేమి చేస్తామని బదులిచ్చారు. అయితే విద్యార్థులతో పుస్తకాలు చదివించవమని ఎంఈఓ సూచించగా, మద్యం మత్తులో ఊగుతూ.. తూగుతూ నానా తంటాలు పడ్డాడు. పాఠశాలలోనే మద్యం తాగే నీపై చర్యలు తప్పవని ఎంఈఓ అనగా.. పర్లేదు సార్ సస్పెండ్ అయినా సగం జీతం వస్తుందిలే అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. అనంతరం ఎంఈఓ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. తమ విచారణలో సదరు ఉపాధ్యాయుడిపై వచ్చిన ఆరోపణలన్నీ వాస్తవాలే అని అన్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే, గతంలో కూడా విచారణ చేసి వదిలేశారని.. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకుంటారో లేదోనని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. -
గంటన్నరపాటు ఎదురు చూసినా రాని 108
మహబూబాబాద్ జిల్లా: పురుగు మందు తాగిన ఓ యువతిని మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తీసుకెళ్లేందుకు గంటన్నరపాటు ఎదురుచూసినా 108 వాహనం రాకపోవడంతో, బాధితురాలికి సెలైన్ బాటిల్ పెట్టుకొని బైక్పై ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పినిరెడ్డిగూడెం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుగులోత్ మేఘమాల (18) ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాత్రూం క్లీన్చేసే యాసిడ్ తాగడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఇరుగుపొరుగు వారు గమనించి ఆ యువతిని బైక్పై గార్ల సీహెచ్సీకి తీసుకొచ్చి ప్రథమ చికిత్స చేయించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో సీహెచ్సీలో అందుబాటులో ఉన్న 108 వాహనం రమ్మంటే కాసేపు డ్రైవర్ లేడని, కాసేపు మరమ్మతుకు గురైందని సిబ్బంది పొంతన లేని సమాధానం చెప్పారు. దీంతో వారు మరో 108 వాహనా నికి ఫోన్ చేశారు. గంటన్నర అయినా రాకపో వడంతో గత్యంతరం లేక మేఘమాలకు సెలైన్ బాటిల్ పెట్టించి తన బాబాయ్ బైక్పై ఖమ్మం తీసుకెళ్తుండగా మార్గమధ్యలో 108 వాహనం వచ్చింది. దీంతో అంబులెన్స్ సిబ్బంది తీరుపై యువతి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, యువతి పురుగుల మందు తాగడానికి గల కారణాలు తెలియరాలేదు. -
కర్రీ పఫ్లో పాము
మహబూబ్ నగర్ జిల్లా: ఆకలిగా ఉందన్న పిల్లల కోసం ఒక మహిళ బేకరీలో కొని తీసుకొచ్చిన కర్రీ పఫ్ తింటుండగా.. అందులో పాము కనిపించడంతో హడలిపోయారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో జరిగిన ఈ సంఘటనపై సీఐ కమలాకర్ కథనం మేరకు.. పట్టణంలోని జౌఖీనగర్లో నివాసం ఉంటున్న శ్రీశైలమ్మ మంగళవారం సాయంత్రం కూతురు, కొడుకు కోసం శ్రీలక్ష్మి అయ్యంగార్ బేకరీలో పిల్లలకు ఒక ఎగ్ పఫ్, కర్రీ పఫ్ కొనుగోలు చేశారు. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత కర్రీ పఫ్ను తింటుండగా.. పంటికి ఏదో గట్టిగా తగిలింది. దీంతో అనుమానం వచ్చి కర్రీ పఫ్ను తెరిచి చూసి బిత్తరపోయారు. నిశితంగా పరిశీలించగా అందులో చనిపోయిన చిన్న పాము కనిపించింది. దీంతో ఒక్కసారిగా భయాందోళన చెందిన తల్లి శ్రీశైలమ్మ.. కర్రీ పఫ్ను తీసుకుని సంబంధిత బేకరీ దగ్గరకు వెళ్లి విషయం చెప్పారు. అయితే ఇవన్నీ మామూలేనని.. తమకు వచ్చిన కూరగాయల్లో చనిపోయిన పాము ఉండి ఉంటుందని బేకరీ నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో బాధితురాలు తన భర్త శ్రీశైలంతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇచ్చామని సీఐ తెలిపారు. -
ఆధునికతకు ఆమడదూరం!
జడ్చర్ల టౌన్: స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన గ్రంథాలయాలు నేటికీ సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో పూర్తిగా వెనకబడి ఉండగా.. అందులో పనిచేస్తున్న గ్రంథపాలకుల పరిస్థితి అయోమయంగా మారింది. విజ్ఞాన భాండాగారాలుగా పిలుచుకుంటున్న గ్రంథాలయాల్లో వేలాది పుస్తకాలు ఉన్నప్పటికీ మనకు కావాల్సిన పుస్తకాలను వెంటనే అందించే అద్భుతమైన ప్రావీణ్యం మన గ్రంథపాలకుల్లో ఉంది. ఎస్ఆర్ రంగనాథన్ జయంతిని పురస్కరించుకొని జాతీయ లైబ్రేరియన్స్ డే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే తమకు సరైన గుర్తింపు లభించడంలేదని, గ్రంథాలయాలు ఆధునీకరణకు నోచుకోవడంలేదని వాపోతున్న లైబ్రేరియన్స్ గూర్చి తెలుసుకుందాం. తండ్రిపేరిట రెనోవేషన్ డా.బీఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో గ్రంథాలయం ఇరుకుగదుల్లో ఉండేది. రెండేళ్లక్రితం లైబ్రేరియన్గా బదిలీపై వచ్చిన ఆంజనేయులు ఎలాగైనా ఆధునీకరించాలని లక్ష్యంగా ముందడుగు వేశాడు. అందుకు దాతల సహాయం ఆర్జించినప్పటికీ ఎవరు సహకరించలేదు. ఇదే సమయంలో కళాశాలలోని రెండు గదులు అందుబాటులోకి రావడంతో దాంట్లోకి లైబ్రరీని మార్చాలని నిర్ణయించుకుని తన తండ్రి ఇప్పల నాగభూషణం స్మారకార్థం రూ.లక్ష వెచ్చించి గదులను తనకు అనుకూలంగా మార్చుకుని గ్రంథాలయాన్ని కిందకు బదలాయించారు. ప్రస్తుతం రెండు పెద్ద గదుల్లో 108 ర్యాక్స్లో 26వేల పుస్తకాలు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. నిరుపయోగంగా ఉన్న మూడు కంప్యూటర్లను ప్రిన్సిపాల్ అనుమతితో గ్రంథాలయంలో ఏర్పాటు చేశారు. నిత్యం 150నుంచి 200మంది విద్యార్థులు ఆన్లైన్, ఆఫ్లైన్లో పుస్తకపఠనం చేసేందుకు వస్తున్నారు. డిజిటలైజేషన్కు నోచుకోని గ్రంథాలయాలు గుర్తింపునకు తాపత్రయ పడుతున్న గ్రంథపాలకులు నేడు జాతీయ గ్రంథాలయ అధికారుల దినోత్సవం ఉమ్మడి జిల్లాలో ఇలా.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం 69 శాఖ గ్రంథాలయాలు ఉన్నాయి. వీటిలో కేవలం 14గ్రంథాలయాలకు మాత్రమే లైబ్రేరియన్స్ ఉన్నారు. మిగిలిన వాటిలో ఇన్చార్జిలు, ఔట్సోర్సింగ్తో నెట్టుకొస్తున్నారు. ఇక 68 జూనియర్ కళాశాలలకుగానూ 44 కళాశాలల్లో మాత్రమే లైబ్రేరియన్ పోస్టులున్నాయి. వాటిలో కేవలం 22మంది లైబ్రేరియన్లు మాత్రమే పనిచేస్తున్నారు. శాఖ గ్రంథాలయాలు, జూనియర్ కళాశాలల్లోని గ్రంథాలయాల్లో ఎక్కడ డిజిటలైషన్ జరగలేదు. పాత పద్ధతిన పంచసూత్రాల ఆధారంగానే పుస్తకాల అమరిక, పాఠకుడికి అందించడం జరుగుతుంది. డిజిటలైజేషన్ కావాలి సాంకేతికతకు అనుగుణంగా లైబ్రరీలు డిజిటలైజేషన్కు నోచుకోవాలి. ప్రభుత్వం ఇందుకు దృష్టిసారించాలి. మా డిగ్రీ కళాశాలలోని లైబ్రరీకి మరిన్ని కంప్యూటర్లు వస్తే విద్యార్థులకు ఎంతో ప్రయోజనంగా ఉంటుంది. అలాగే లైబ్రేరియన్స్ డేను అధికారికంగా నిర్వహించి ఉత్తమ పురస్కారాలు అందిస్తే మరింత ఉత్సాహంతో పనిచేయటానికి వీలుంటుంది. – ఆంజనేయులు, లైబ్రేరియన్, జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల అమలుకాకుండానే పదవీ విరమణ లైబ్రేరియన్స్ డేను ప్రభుత్వం అధికారికంగా జరుపుతుందని ఆశించినప్పటికీ అది జరగకుండానే పదవీ విరమణ పొందాను. ఇప్పటికై నా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. శాఖ, కళాశాలల్లోని గ్రంథాలయాల్లో డిజిటలైజేషన్ అమలు చేయాలి. పూర్తిస్థాయి నియామకాలు జరిపితే విజ్ఞానాన్ని ప్రజలకు చేరువ చేసే ఆస్కారం కలుగుతుంది. – జయప్రకాశ్, రిటైర్డ్ లైబ్రేరియన్, జడ్చర్ల -
జూరాలకు 1.35 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో
ధరూరు/ఆత్మకూర్: కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు సోమవారం రాత్రి 7.30 గంటల వరకు 1.35 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు15 క్రస్టు గేట్లను ఎత్తి గేట్ల ద్వారా 1.06లక్షల క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 30,422 క్యూసెక్కులు, కోయిల్సాగర్కు 315 క్యూసెక్కులు, నెట్టెపాడుకు 750 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 45 క్యూసెక్కులు, కుడి కాల్వకు 290 క్యూసెక్కులు, ఆర్డీఎస్ లింక్ కెనాల్కు 50 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–2కు 750 క్యూసెక్కులు కలిపి ప్రాజెక్టు నుంచి మొత్తం 1.38 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 8.969 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 129.72 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 121.606 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 1.32 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. నారాయణపూర్ ప్రాజెక్టుకు 30,370 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 37.64 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 32.60 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 60వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. 14 క్రస్టు గేట్లను ఎత్తి 54,720 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 465.133 ఎంయూ విద్యుదుత్పత్తి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎగువ విద్యుదుత్పత్తి కేంద్రంలో 5 యూనిట్ల ద్వారా 213.031 ఎంయూ, దిగువలో 6 యూనిట్ల ద్వారా 252.102 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని చేపడుతున్నట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. శ్రీశైలానికి 2లక్షల క్యూసెక్కుల వరద దోమలపెంట: ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి సోమవారం 2.14 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తుంది. జూరాలలో ఆనకట్ట స్పిల్వే ద్వార 1.06లక్షల క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ 30,422 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 67,312 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 10,040 క్యూసెక్కుల వరద శ్రీశైలానికి చేరుకుంటోంది. శ్రీశైలం భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పతి చేస్తూ 35,315, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 30,887 మొత్తం 66,202 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 881.8 అడుగుల నీటిమట్టం వద్ద 197.9120 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇరవై నాలుగు గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వార 32 వేలు, హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2,818, ఎంజీకేఎల్ఐకు 1,160 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ కేంద్రంలో 16.626 మిలియన్ యూనిట్లు, కుడిగట్టు కేంద్రంలో 15.049 మి.యూనిట్ల విద్యుదుత్పుత్తి చేశారు. ప్రాజెక్టు 15 క్రస్టు గేట్ల ఎత్తివేత 1.38 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు.. -
పోలీసుల అదుపులో ఇద్దరు యువకులు
గద్వాల క్రైం: జిల్లాకు చెందిన ఇద్దరు యువకులను సోమవారం ఉదయం హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. స్థానికుల కథనం మేరకు.. గద్వాల మండలంలోని వీరాపురం, లత్తీపురం గ్రామాలకు చెందిన ఇద్దరు యవకులు ఆన్లైన్ నగదు చెల్లింపుల విషయంలో సమస్యాత్మకంగా వ్యవహరించినట్లు అక్కడి పోలీసులకు ఫిర్యాదులు అందాయి. అందుల్లో భాగంగానే హైదరాబాద్కు చెందిన పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని హైదరాబాద్కు తరలించారు. ఈ విషయంపై రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ను ‘సాక్షి’ వివరణ కోరగా.. హైదరాబాద్కు చెందిన పోలీసులు వచ్చిన విషయం వాస్తవామేనని, అదుపులోకి తీసుకున్న యువకులను ఎందుకు తీసుకున్నారనే విషయంపై స్పష్టత లేదన్నారు. భిక్షాటన చేసి ఆలయానికి రూ.1.83 లక్షలు విరాళం కృష్ణా: ఓ మహిళా యాచకురాలు బిక్షాటన చేస్తూ ఏకంగా రూ.1.83 లక్షలు పోగు చేసింది. ఆ మొత్తాన్ని ఓ ఆలయ నిర్మాణానికి విరాళంగా ఇచ్చి ఎందరికో ఆదర్శంగా నిలిచింది. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణకు చెందిన వృద్ధురాలు రంగమ్మ కొన్నేళ్ల క్రితం కర్ణాటక రాష్ట్రం రాయచూరుకు చేరుకుంది. ఆమెకు ఎవరూ లేకపోవడంతో బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుంది. తన అవసరాలను తీర్చుకోగా మిగిలిన డబ్బును కొద్ది కొద్దిగా జమ చేస్తూ వచ్చింది. ఇలా కొన్నేళ్లపాటు జమ చేయగా.. మొత్తం రూ.1.83 లక్షలు అయ్యింది. ఈ మొత్తాన్ని రాయచూర్ జిల్లాలోని బిజనగేరి ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి విరాళంగా ఇచ్చి దేవుడిపై తన భక్తిని చాటుకుంది. రూ.కోట్లు సంపాయిస్తున్న వారు సైతం రూ.వెయ్యి విరాళం ఇచ్చేందుకు వెనకాడే ఈ రోజుల్లో ఏళ్ల తరబడి రూపాయి రూపాయి కూడబెట్టుకొని రూ.లక్షలు జమ చేసి ఆలయానికి విరాళంగా ఇవ్వడంపై ఇరు రాష్ట్రాల ప్రజలు రంగమ్మ పెద్ద మనస్సును కొనియాడుతున్నారు. -
ట్రాఫిక్ నియంత్రణ కోసమే..
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం స్పెషల్ ఆపరేషన్స్ ఉన్నప్పుడు వన్ సైడ్ ట్రాఫిక్ ఉంటుంది. అందువల్ల కొంచెం చార్జీలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. దానికనుగుణంగా దసరా, సంక్రాంతి, రాఖీ పండుగ రోజుల్లో స్పెషల్ ఆపరేషన్స్లో వన్సైడ్ ట్రాఫిక్ను నియంత్రించడం కోసం ప్రత్యేక బస్సుల వరకు అదనంగా 30 శాతం పెంచుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోని 97 ఆర్టీసీ డిపోల్లో ఇదే పద్ధతిని అవలంభిస్తున్నాం. ఈ నెల 9 నుంచి 11 వరకు మాత్రమే అదనపు చార్జీలు ఉంటాయి. – సంతోష్కుమార్, ఆర్ఎం, మహబూబ్నగర్ ఇప్పటికే పాస్ ధరలు పెంచారు నేను డిగ్రీ చదువుతున్నా. ఇప్పటికే స్టూడెంట్ పాస్కు సంబంధించి ధరలు పెంచారు. ఇప్పుడు ప్రత్యేక బస్సుల్లో చార్జీలు పెంచడం బాధాకరం. మహబూబ్నగర్ నుంచి హైదరాబాద్కు వెళ్లడానికి ఎక్ప్రెస్ బస్సుల్లో గతం కంటే ఎక్కువ పెంచారు. ఆదాయం కోసం ఇలా ప్రయాణికులపై అదనపు భారం వేయడం సరికాదు. – శ్రీనునాయక్, పెద్దతండా, కోయిలకొండ మండలం అదనపు చార్జీలు సరికాదు రాఖీ పండుగ అయిపోయిన తర్వాత కూడా అదనపు చార్జీలు తీసుకోవడం సరికాదు. మహబూబ్నగర్ నుంచి హైదరాబాద్ వెళ్లడానికి డీలక్స్ బస్సులో గతంలో రూ.190 ఉంటే రూ.250 టికెట్ తీసుకోవడం ఎంతవరకు సమంజసం. చార్జీలు పెంచడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. చార్జీలు పెంచకూడదని నా విజ్ఞప్తి. – శేఖర్రెడ్డి, మహబూబ్నగర్ ● -
ట్రాఫిక్ నియంత్రణ కోసమే..
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం స్పెషల్ ఆపరేషన్స్ ఉన్నప్పుడు వన్ సైడ్ ట్రాఫిక్ ఉంటుంది. అందువల్ల కొంచెం చార్జీలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. దానికనుగుణంగా దసరా, సంక్రాంతి, రాఖీ పండుగ రోజుల్లో స్పెషల్ ఆపరేషన్స్లో వన్సైడ్ ట్రాఫిక్ను నియంత్రించడం కోసం ప్రత్యేక బస్సుల వరకు అదనంగా 30 శాతం పెంచుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోని 97 ఆర్టీసీ డిపోల్లో ఇదే పద్ధతిని అవలంభిస్తున్నాం. ఈ నెల 9 నుంచి 11 వరకు మాత్రమే అదనపు చార్జీలు ఉంటాయి. – సంతోష్కుమార్, ఆర్ఎం, మహబూబ్నగర్ ఇప్పటికే పాస్ ధరలు పెంచారు నేను డిగ్రీ చదువుతున్నా. ఇప్పటికే స్టూడెంట్ పాస్కు సంబంధించి ధరలు పెంచారు. ఇప్పుడు ప్రత్యేక బస్సుల్లో చార్జీలు పెంచడం బాధాకరం. మహబూబ్నగర్ నుంచి హైదరాబాద్కు వెళ్లడానికి ఎక్ప్రెస్ బస్సుల్లో గతం కంటే ఎక్కువ పెంచారు. ఆదాయం కోసం ఇలా ప్రయాణికులపై అదనపు భారం వేయడం సరికాదు. – శ్రీనునాయక్, పెద్దతండా, కోయిలకొండ మండలం అదనపు చార్జీలు సరికాదు రాఖీ పండుగ అయిపోయిన తర్వాత కూడా అదనపు చార్జీలు తీసుకోవడం సరికాదు. మహబూబ్నగర్ నుంచి హైదరాబాద్ వెళ్లడానికి డీలక్స్ బస్సులో గతంలో రూ.190 ఉంటే రూ.250 టికెట్ తీసుకోవడం ఎంతవరకు సమంజసం. చార్జీలు పెంచడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. చార్జీలు పెంచకూడదని నా విజ్ఞప్తి. – శేఖర్రెడ్డి, మహబూబ్నగర్ ● -
కమాలొద్ధీన్పూర్ బ్రాంచ్కెనాల్కు కోత
అప్పారెడ్డిపల్లి కాల్వకు.. మండలంలోని అప్పారెడ్డిపల్లికి సాగునీందించే కాల్వకు బుడ్డఏనె దగ్గర ఏర్పాటు చేసిన పైపు మరీ చిన్నదిగా ఉండడంతో పాటుకాల్వలోకి నీళ్లు నేరుగా వెళ్లకుండా పిచ్చిమొక్కలు ఉండడంతో ఆదివారం కురిసిన వర్షానికి నీళ్ళు పంటపొలాల మీదుగా పారాయి. ఆ ప్రాంతంలోని చెన్నకేశవులు, చెన్నయ్య తదితర రైతులకు సంబంధించిన పత్తి, వరి పంటలు దెబ్బతిన్నాయి. వెంటనే కాల్వ వద్ద మరమ్మతు పనులు చేపట్టి నీళ్లు పొలాలకు రాకుండా చూడాలని, లేకుంటే తమ పంటలు పూర్తిగా నీటిలో మునిగి నష్టపోతామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు వచ్చాం.. చూశాం.. వెళ్లాం అన్నట్లు కాకుండా మరమ్మతులు చేసి రైతులను ఆదుకోవాలని ఆయా గ్రామాల రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఖిల్లాఘనపురం: మండలంలోని పలు గ్రామాలకు సాగునీరందించే కమాలోద్ధీన్పూర్ బ్రాంచ్కెనాల్ తెగిపోవడంతో వరి, పత్తి పంటలు పాడైపోయాయి. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి బ్రాంచ్కెనాల్ అల్లమాయపల్లి శివారులో నూతన విద్యుత్ సబ్స్టేషన్ వద్ద తెగిపోయింది. కాల్వ, వర్షపు నీళ్లు పెద్దఎత్తున పంట పొలాల్లో పారడంతో రైతు శేషయ్యకు చెందిన వరిపంట పెద్దఎత్తున నీటిలో మునిగిపోయింది. పొలంలో ఇసుక మేటలు వేయడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నాడు. రూ.లక్షలు వెచ్చించి ఇటీవలు వరి సాగుచేయగా.. కాల్వ తెగి ఇసుక మేటలు వేయడంతో ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు పరిశీలించి కాల్వ నీళ్లు రాకుండా చేయాలని ప్రభుత్వం నుంచి తనకు ఆర్థిక సాయం అందేలా చూడాలని వేడుకొంటున్నాడు. పంటపొలాల్లో పారిన కాల్వనీళ్లు ఇసుక మేటలతో దెబ్బతిన్న వరి పంట ఆదుకోవాలని అన్నదాతల వేడుకోలు -
రోడ్డు ప్రమాదంలో ఏఈ దుర్మరణం
ఊట్కూర్: నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని బిజ్వార్కి చెందిన విద్యుత్శాఖలో పనిచేస్తున్న ఏఈ శివరాజ్ (26) తెలంగాణ సరిహద్దు గ్రామం పులిచింతల వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా.. ఉదయం కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని తన ఇంటి నుంచి ద్విచక్ర వాహనం పై వెళ్తుండగా విధులు ర్వహించేందుకు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అంబులెన్స్ సహాయంతో జగ్గయ్యపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో విజయవాడలోని మెట్రో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. ఉద్యోగంలో చేరిన 7 నెలలకే.. గత 7 నెలల క్రితం సూర్యపేట జిల్లా పులిచింతల జల విద్యుత్ కేంద్రంలో ఏఈగా విధుల్లో చేరాడు. బిజ్వార్ గ్రామంలోని దళితవాడకు చెందిన బాబు, వెంకటమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. తండ్రి బాబు పిల్లలు చిన్నతనంలోనె గుండెపోటుతో మృతిచెందాడు. తల్లి వెంకటయ్య, అన్నయ్య వెంకటేశ్ తమ్ముడు శివరాజ్కు చదువుపై ఉన్న ఆసక్తిని గమనించి ప్రోత్సహించారు. 10వ తరగతి వరకు బిజ్వార్ ప్రభుత్వ పాఠశాలలో చదివి, మహబూబ్నగర్ పాలిటెక్నిక్ కళాశాలలో త్రిబుల్ ఈ పూర్తి చేశాడు. అనంతరం హైదరాబాద్లోని జేఎన్టీయూలో బిటెక్ పూర్తి చేశారు. టీఎస్పీఎస్సీ నిర్వహించిన ఉద్యోగ పరీక్షల్లో విద్యుత్ ఏఈగా పులిచింతల ప్రాజెక్టులో విధుల్లో చేరాడు. బతుకు తెరువు కోసం వెళ్లిన శివరాజ్ ఉద్యోగంలో చేరిన 7 నెలలకే మృత్యువాత పడడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. కృష్ణానదిలో గుర్తుతెలియని మృతదేహం దోమలపెంట: శ్రీశైలం ఆనకట్ట దిగువన ఎడ మ పాతాళగంగ స్నానాల ఘట్టం సమీపంలో గుర్తుతెలియని మృతదేహాం లభ్యమైనట్లు ఈగలపెంట ఎస్ఐ జయన్న సోమవారం తెలిపా రు. ఎస్ఐ వివరాల ప్రకారం.. కృష్ణానదిలో వ్య క్తి మృతదేహం తేలియాడుతుండడం గమనించిన మత్స్యకారులు పోలీసులకు సమాచారం ఇచ్చారన్నారు. మృతదేహం కుళ్లిపోవడంతో పోస్ట్మార్టం నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. ఒంటి మీద ఫు ల్ డ్రాయర్ తప్ప మరేమి లేవన్నారు. ఎటువంటి వివరాలు తెలియరాలేదన్నారు. కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. వాగులో కొట్టుకుపోయి వలస కూలీ మృతి తెలకపల్లి: వాగులో కొట్టుకుపోయి వలస కూలీ మృతి చెందిన సంఘటన మండలంలో సోమ వారం చోటు చేసుకుంది. హెడ్కానిస్టేబుల్ పరశురాములు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్త్రం బలియా జిల్లాకు చెందిన బి నర్సు (66) నెల్లికుదురు సమీపంలో క్రషర్ వద్ద వలసకూలీగా పని చేస్తున్నాడు. గట్టునెల్లికుదురు గ్రామానికి వెళ్లి నిత్యవసర సరుకులు తీసుకొని తిరిగి క్రషర్ వద్దకు వస్తున్నాడు. ఈ క్రమంలో గట్టురాయిపాకుల–నెల్లికుదురు గ్రా మాల మధ్య ప్రవహిస్తున్న వాగు దాటుతుండగా ప్రమాద వశాత్తు వాగులో కొట్టుకుపోయా డు. సోమవారం ఉదయం ఒడ్డుకు చేరుకున్న బి నర్సు మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతని సహ చరుడు మనోజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చేపల వేటకు వెళ్లి వృద్ధుడి మృతి పాన్గల్: చేపల వేటకు వెళ్లిన ఓ వృద్ధుడు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ శ్రీనివాసులు కథనం ప్రకారం.. కేతేపల్లి గ్రామానికి చెందిన చికిరాల బిచ్చయ్య(62) కూలి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రెండు రోజుల క్రితం చేపల వేట కోసం గ్రామ శివారులోని చిన్నపులికుంటకు వెళ్లి చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. ఈ విషయం ఎవరూ గుర్తించకపోవడంతో సోమ వారం ఉదయం కుంటలో మృతదేహం తేలియాడగా గ్రామస్తులు గమనించి నీటిలో నుంచి మృతదేహాన్ని బయటికి తీసి చికిరాల బిచ్చయ్యగా గుర్తించారు. ఈ విషయమై బిచ్చయ్య చిన్నమ్మ కుమారుడు గడమాల బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొ ని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. చికిత్స పొందుతూ మహిళ మృతి మల్దకల్: పురుగుల మందు తాగిన మహిళ చికి త్స పొందుతూ సోమవారం మృతి చెందిన సంఘటన మల్దకల్లో చోటు చేసుకుంది. హె డ్కానిస్టేబుల్ గోపాల్నాయక్ వివరాల మేరకు.. మల్దకల్ గ్రామానికి చెందిన జయలక్ష్మి (26) గత నెల 26న వ్యవసాయ పొలంలో పనులు చేస్తుండగా ఆమెతో భర్తకు సెల్ఫోన్ లభించింది. దీంతో భర్త ఆమెను మందలించాడు. దీంతో మనస్థాపం చెందిన భార్య వ్యవసాయ పొలంలోనే గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే కుటుంబీకులు ఆమెను గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. భర్త నర్సింహులు, కుమార్తె ఉన్నారు. -
ఆర్టీసీ ‘స్పెషల్’ బాదుడు
స్టేషన్ మహబూబ్నగర్: రాఖీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ సంస్థ ప్రత్యేక అదనపు బస్సు సర్వీసులను నడిపింది. ఇదే అదునుగా అదనపు బస్సు సర్వీసుల టికెట్పై దాదాపు 30 శాతం చార్జీలు పెంచారు. అయితే చాలామంది ప్రయాణికులకు పెంచిన ధరలు తెలియకపోవడంతో బస్సు ఎక్కిన తర్వాత తీరా టికెట్ తీసుకునే సమయంలో కంగుతింటున్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి 11 వరకు ప్రత్యేక బస్సు సర్వీసుల్లో అదనపు చార్జీలు వసూలు చేశారు. దీనికితోడు ఒక్కో బస్సులో ఒక్కో రకంగా చార్జీలు తీసుకోవడం గమనార్హం. అదనపు చార్జీలు ఇలా.. మహబూబ్నగర్ టు హైదరాబాద్కు సంబంధించి ఎక్స్ప్రెస్లో గతంలో రూ.160 ఉండగా ఈ మూడు రోజుల్లో రూ.220, డీలక్స్ బస్సులో రూ.190 ఉంటే రూ.250 వరకు తీసుకున్నారు. ఇలా ప్రతి డిపో పరిధిలో రాఖీ పండుగ వేళ నడిపిన ప్రత్యేక అదనపు బస్సు సర్వీసుల్లో అదనపు చార్జీలు తీసుకున్నారు. అయితే భారీ మొత్తంలో అదనపు చార్జీలు తీసుకోవడంపై ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రతి పండుగకు ప్రత్యేక బస్సులు నడిపి అదనపు చార్జీలు తీసుకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. బస్టాండ్లలో పెరిగిన రద్దీ రెండు రోజుల నుంచి ఆర్టీసీ బస్టాండ్లలో విపరీతమైన రద్దీ పెరుగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ రూట్లోని బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసి రాకపోకలు సాగిస్తుతున్నాయి. బస్సులు ప్లాట్ఫాం వద్దకు రాకముందే ప్రయాణికులు ఎగబడి ఎక్కుతున్నారు. ఈ నెల 9 నుంచి 11 వరకు అదనపు సర్వీసులపై చార్జీల పెంపు ఒక్కో బస్సులో ఒక్కోరకంగా వసూలు పెంచిన చార్జీలతో ప్రయాణికుల ఆవేదన -
ఆలయాల అభివృద్ధికి అహర్నిశలు కృషి
జడ్చర్ల: ఆలయాల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి అన్నారు. సోమవారం బాదేపల్లి పెద్దగుట్టపై శ్రీరంగనాయకస్వామి ఆలయాన్ని ఆయన సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పెద్దగుట్టను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. అంతకు ముందు ఆలయ చైర్మన్ రాంరెడ్డి, అర్చకులు ఆయనకు పూర్ణకుంభం, మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం మండలంలోని ఆల్వాన్పల్లి గ్రామ సమీపంలో మీనాంబరం వద్ద శ్రీపరుశవేదీశ్వరస్వామి ఆలయ గాలిగోపురం నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఆలయాలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు. ప్రతి ఒక్కరు దైవచింతన కలిగి ఉండాలని, మానసిక ప్రశాంతతకు ఆలయాలు చక్కటి ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఉపయోగపడతాయన్నారు. ఆలయాల వద్ద భక్తులకు కనీస సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అభివృద్ధి కమిటీలు ఆలయాల పరిరక్షణకు కృషి చేయడం అభినందనీయమని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్పర్సన్ జ్యోతి, మున్సిపల్ చైర్పర్సన్ పుష్పలత, అభివృద్ధి కమిటీ చైర్మన్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
రాహుల్గాంధీ అరెస్టు రాజ్యాంగ విరుద్ధం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ ని అరెస్టు చేయడం రాజ్యాంగ విరుద్ధమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్రంలోని బీజేపీ వచ్చే ఎన్నికల్లో దొడ్డిదారిన గెలిచేందుకు ఎన్నో కుయుక్తులు పన్నుతోందని విమర్శించారు. ఎన్నికల కమిషన్ను అడ్డం పెట్టుకుని ఆ పార్టీ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో లక్షలాది నకిలీ ఓటర్లను సృష్టించిందని ఆరోపించారు. ఇదే విషయాన్ని రాహుల్గాంధీ వివిధ ఆధారాలతో సహా నిరూపించడమేగాక న్యాయ పోరాటానికి సైతం సిద్ధమయ్యారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం) లను తొలగించి బ్యాలెట్ పేపర్ ఆధారంగానే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. జాతీయ జెండా ఆడియో పాట ఆవిష్కరణ జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ప్రముఖ కవి, రిటైర్డ్ జీహెచ్ఎం దేవదానం రచించిన జాతీయ జెండా పాట సీడీని సోమవారం తన చాంబర్లో అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి ఆవిష్కరించారు. ఈ పాటకు గన్నోజు నర్సింహాచారి సంగీతం సమకూర్చారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఓ త్రివర్ణ పతాకమా.. నీవు ఎగురుతుంటే ఆకాశ మే చిన్నబోతోందని పింగలి వెంకయ్య ఎంచుకున్న భావాలకు అనుగుణంగా ఈ పాట ఉందన్నారు. ఈ పాట అందరి మన్ననలు చూరగొని విశేష ఆదరణ పొందాలని ఆకాంక్షించారు. -
చిరుత సంచారంపై పరిశీలన
మహబూబ్నగర్ న్యూటౌన్: జిల్లాకేంద్రం సమీపంలోని తిర్మల్దేవునిగుట్ట, శ్మశానవాటిక ప్రాంతాల్లో కొంతకాలంగా సంచరిస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్న చిరుత ఈ నెల 11న తెల్లవారుజామున ట్రాప్ కెమెరాకు చిక్కిన ప్రదేశాన్ని సోమవారం సాయంత్రం జిల్లా అటవీ శాఖాధికారి సత్యనారాయణ పరిశీలించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ట్రాప్ సీసీ కెమెరాకు గతంలోనూ కనిపించడంతో చిరుతను పట్టుకునే సాధ్యాసాధ్యాలపై సిబ్బందితో చర్చించి సూచనలు చేశారు. చుట్టుపక్కల మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు బోను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పరిసర ప్రాంతాల ప్రజలు చిరుత సంచారం పట్ల అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని కోరారు. -
అప్పుల రాష్ట్రంగా మార్చారు
● ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాం ● రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అచ్చంపేట/బల్మూర్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీఎం రేవంత్రెడ్డి ఓవైపు ప్రజాసంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేస్తూనే, మరోవైపు అప్పులు తిరిగి చెల్లిస్తున్నారని రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. సోమవారం అచ్చంపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యేలు డా.చిక్కుడు వంశీకృష్ణ, కూచుకుళ్ల రాజేశ్రెడ్డి, కలెక్టర్ బదావత్ సంతోష్తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. అర్హులైన పేదలకు కొత్త రేషన్కార్డులు ఇవ్వడంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజా సంక్షేమం, గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వ నిర్వాకంతో ఆర్థిక సంక్షోభం నెలకొన్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నట్లు చెప్పారు. మరోవైపు ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తున్నామన్నారు. రాష్ట్రంలో పండించిన సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వడమే కాకుండా.. రేషన్ దుకాణాల్లో పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. అచ్చంపేట అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. టీయూఎఫ్డీసీ నుంచి మరో రూ. 16కోట్ల నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రజలకు మేలుచేసే విధంగా ప్రతి అధికారి పనిచేయాలని సూచించారు. ● బల్మూర్ మండలం కొండనాగులలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. బాబా సాహెబ్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా విద్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ అంబేడ్కర్ అడుగుజాడల్లో నడుద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ గార్లపాడు శ్రీనివాసులు, కమిషనర్ మురళి, ఆర్డీఓ మాధవి, తహసీల్థార్ సైదులు, జిల్లా గ్రంథాయాల సంస్థ చైర్మన్ జి.రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
భూములు కోల్పోయి.. మోసపోయి.. గుండె పగిలిపోయి..
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/సాక్షి, నాగర్కర్నూల్: ఆరుగాలం కష్టించి జీవనోపాధి పొందుతున్న వ్యవసాయ భూములతో పాటు ఉంటున్న ఇళ్లు, జ్ఞాపకాలన్నీ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ నిర్మాణంలో పోయాయి. ఆ తర్వాత వచ్చిన అరకొర పరిహారంతోనైనా కుటుంబ పరిస్థితులు చక్కదిద్దుకోవాలన్న వారి ఆశలను బోగస్ ఫైనాన్స్ కంపెనీ గండి కొట్టింది. అధిక వడ్డీ చెల్లిస్తామనే పేరిట నిర్వాసితుల నుంచి భారీగా డబ్బులు సేకరించి.. చివరకు బోర్డు తిప్పేసింది. ఈ క్రమంలో రైతులు అంతకుముందు నుంచే అంటే నాలుగేళ్లుగా వారి చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఫలితం లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురై అనారోగ్యం పాలవుతున్నారు. బాధితుల్లో ఇప్పటివరకు పలువురు ఆత్మహత్య చేసుకోగా.. హార్ట్ అటాక్తో సుమారు 20 మంది.. కిడ్నీ ఇతర ఆరోగ్య కారణాలతో మరో 120 మంది వరకు మృత్యు కౌగిలికి చేరారు. ఇంకా కొందరు చికిత్సకు డబ్బులు లేక మరణశయ్యపై కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. 14 మందిపై కేసు.. రూ.50 కోట్ల ఆస్తి జప్తు డిపాజిట్ల అనంతరం కొన్ని రోజుల తర్వాత ఫైనాన్స్ నిర్వాహకులు సక్రమంగా వడ్డీ చెల్లించకపోవడంతో నిర్వాసితులు నాగర్కర్నూల్ మార్కెట్ సెంటర్లోని ఫైనాన్స్ కార్యాలయం వద్దకు క్యూకట్టారు. ఇలా 2020 నుంచి 2023 వరకు చక్కర్లు కొట్టారు. అప్పుడు, ఇప్పుడు అంటూ ఫైనాన్స్ నిర్వాహకుడు సాయిబాబు, అతడి కుటుంబ సభ్యులు మాయమాటలు చెబుతూ చివరకు కంపెనీని ఎత్తివేశారు. దీంతో 2023 ఫిబ్రవరి 13న బాధితులు నాగర్కర్నూల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది. ఇందులో ఇత్యాల సాయిబాబు (ఏ–1)తో పాటు ధనుంజయ్ (ఏ–2), బాలేశ్వర్ (ఏ–3), ఇత్యాల రజిత (ఏ–4), యామిని (ఏ–5), శారద (ఏ–6), సాయిదివ్య (ఏ–7), సాయి దీక్షిత్ (ఏ–8) అనుపటి శ్రీనివాసులు, తాడూరు మాజీ సర్పంచ్(ఏ–9), ఆర్అండ్ఆర్ కమిటీ చైర్మన్గా ఉన్న నాగం బుచ్చిరెడ్డి అలియాస్ సురేందర్రెడ్డి (ఏ–10), జానకీ రాంరెడ్డి (ఏ–11), కరుణాకర్రెడ్డి (ఏ–12), గువ్వ వెంకటేశ్వర్లు (ఏ–13), ఉర్సు హుస్సేన్ (ఏ–14)పై కేసు నమోదైంది. వీరిలో సాయిబాబు, సాయిదీక్షిత్, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, హుస్సేన్ను అరెస్ట్ చేశారు. మిగిలిన వారు ముందస్తు బెయిల్ పొందారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం సాయిబాబు కుటుంబసభ్యుల ఆస్తులను జప్తు చేయాలని.. ఈ ఏడాది జూన్ 17న జీఓ నంబర్ 562ను విడుదల చేసింది. ఈ మేరకు తెలంగాణ మార్కెట్ వాల్యు ప్రకారం ఇప్పటివరకు సదరు ఫైనాన్స్ కంపెనీ నిర్వాహకులకు సంబంధించి రూ.50 కోట్ల ఆస్తిని జప్తు చేశారు. 2 వేల మంది.. సుమారు రూ.180 కోట్ల డిపాజిట్ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ముంపునకు గురవుతున్న ప్రజలకు సంబంధించి గత ప్రభుత్వం పరిహారం అందజేసింది. నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో సుమారు 50 గ్రామాలు ముంపునకు గురి కాగా.. నిర్వాసితులకు సంబంధించి ఎకరా పట్టా భూమికి రూ.5.50 లక్షలు, లావణి పట్టా భూమికి రూ.3.50 లక్షలు.. ఇల్లు కోల్పోయిన వారికి ఒక్కొక్కరికి రూ.12.50లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం పంపిణీ చేసింది. అయితే ముంపు గ్రామమైన వనపర్తి జిల్లా రేవల్లి మండలంలోని నాగపూర్కు చెందిన సాయిబాబా తన కుటుంబసభ్యులతో కలిసి నాగర్కర్నూల్ మార్కెట్ యార్డు సమీపంలో ఓం శ్రీసాయిరాం ఫైనాన్స్ పేరుతో 1995 నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ప్రైవేట్ ఫైనాన్స్ను నడిపిస్తున్నాడు. మొదట రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు చిట్టీల వ్యాపారం చేసి నమ్మకం కలిగించాడు. ఈ క్రమంలో రైతులకు ఒక్కసారిగా వచ్చిన నష్ట పరిహారంపై అతడి కన్ను పడింది. రూ.2 చొప్పున వడ్డీ చెల్లిస్త్తామని.. మీరు భూములు, ప్లాట్లు కొన్నప్పుడు 15 రోజుల ముందు చెబితే మీ డబ్బులు మీకు ఇస్తామని నమ్మబలికి 2018 నుంచి 2020 వరకు డిపాజిట్ చేయించుకున్నాడు. తొలుత వడ్డీ సక్రమంగా చెల్లిస్తూ రాగా.. సుమారు 2,500 మంది దాదాపు రూ.150 నుంచి రూ.180 కోట్ల వరకు సదరు ఫైనాన్స్ కంపెనీలో నిర్వాసితులు పరిహారం డబ్బులను జమ చేశారు. ఒక్కొక్కరుగా ‘పాలమూరు–రంగారెడ్డి’ నిర్వాసితుల మృత్యువాత వడ్డీ ఆశతో వచ్చిన పరిహారం డబ్బులుఓం శ్రీసాయిరాం ఫైనాన్స్లో జమ వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల్లో సుమారు 2,500 మంది బాధితులు రూ.180 కోట్ల మేర కంపెనీలో డిపాజిట్.. బోర్డు తిప్పేయడంతో రైతుల గగ్గోలు మోసంతో చితికిన కుటుంబాలు.. అనారోగ్యంతో మంచం పాలు ఇప్పటికే ఒకరు ఆత్మహత్య.. హార్ట్ ఎటాక్తో 20 మంది వరకు మృతి వివిధ ఆరోగ్య కారణాలతో మరో 120 మంది కూడా.. -
మహబూబ్నగర్
మంగళవారం శ్రీ 12 శ్రీ ఆగస్టు శ్రీ 2025వచ్చేనెల 3న సీఎం రేవంత్రెడ్డి రాక అడ్డాకుల: వచ్చే నెల 3న మూసాపేటకు సీఎం రేవంత్రెడ్డి రానున్నారు. మూసాపేటలో నిర్మాణాలు పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలకు హాజరు కానున్నారు. ఇందులో భాగంగా సోమవారం దేవరకద్రలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి మూసాపేట గ్రామస్తులతో సమావేశమయ్యారు. మూసాపేటలో చివరి దశలో ఉన్న ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని లబ్ధిదారులకు సూచించారు. వచ్చేనెల ప్రారంభం నాటికి ఇళ్ల పనులను పూర్తి చేస్తే గృహ నిర్మాణ శాఖ మంత్రి పొగులేటి శ్రీనివాస్రెడ్డితో కలిసి సీఎం రేవంత్రెడ్డి వాటిని ప్రారంభిస్తారని ఎమ్మెల్యే గ్రామస్తులకు తెలిపారు. అలాగే మూసాపేటలో ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనంలో కొనసాగుతున్నందున వాటికి కొత్త భవనాలు, మండల కాంప్లెక్స్ నిర్మాణం పనులకు సీఎం శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. అలాగే వేముల శివారులోని ఎస్జీడీ ఫార్మా పరిశ్రమ రెండో యూనిట్ను సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు శెట్టిశేఖర్, నాయకులు మశ్చందర్నాథ్, శ్రీనివాస్శర్మ, నారాయణ, విజయ్కుమార్, కలీం, జమీర్, సత్యనారాయణ, పాష, సలాం, రామస్వామి తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదులు సకాలంలో పరిష్కరించాలి: ఎస్పీ మహబూబ్నగర్ క్రైం: పోలీసులు ఎప్పుడూ పౌరుల సమస్యలను సావధానంగా విని, మర్యాదపూర్వకంగా స్పందించాలని ఎస్పీ డి. జానకి అన్నారు. ఎస్పీ కార్యాలయంలో సోమ వారం నిర్వహించిన ప్రజావాణిలో 13 మంది బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. బాధితులు ఒక్కొక్కరితో మాట్లాడుతూ వారి సమస్య తెలుసుకుని ఆయా పోలీస్ అధికారు లతో మాట్లాడి వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేసి, పరిష్కార స్థితిని క్రమం తప్పకుండా సమీక్షించాలన్నారు. బాధితుల సమస్యలను పరిష్కరించడానికి పోలీస్ యంత్రాంగం 24 గంటలు పని చేస్తోందని పేర్కొన్నారు. యూరియా అందుబాటులో ఉంచాలి జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): వానాకాలం సీజన్లో రైతులకు అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడియాల మోహన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ ప్రధాన గేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేత కాని తనం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. రైతులు నారుమళ్లు పోసుకుని నాట్లు వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని, రైతులకు అవసరమైన యూరియా, డీఏపీ, పురుగు మందు, కాంప్లెక్స్ ఎరువులను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ‘స్పెషల్’ బాదుడు రాఖీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా స్పెషల్ సర్వీసుల పేరిట ఆర్టీసీ టికెట్పై 30 శాతం చార్జీలు పెంచారు. –8లో uన్యూస్రీల్ -
91.12 శాతం ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ
పాలమూరు: జిల్లా ఆరోగ్య శాఖ ఇమ్యూనైజేషన్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో 1–19 ఏళ్లలోపు బాల, బాలికలకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ చేపట్టారు. పిల్లల్లో నులి పురుగుల నిర్మూలన కోసం ఈ మాత్రలను అందజేశారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 2,54,210 మంది బాల, బాలికలను గుర్తించగా మొదటిరోజు 2,31,646 మంది (91.12 శాతం)కి మాత్రలు పంపిణీ చేశారు. మిగిలిన 22,564 మందికి ఈ నెల 18 వరకు మాప్ఆప్ కింద ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నారు. మంచి ఆరోగ్యం అవసరం విద్యార్థులకు చదువుతోపాటు మంచి ఆరోగ్యం అవసరమని, ఆరోగ్యంగా ఉన్న విద్యార్థులకు చదువు చక్కగా అర్థమవుతుందని కలెక్టర్ విజయేందిర అన్నారు. జిల్లా కేంద్రంలోని గాంధీ రోడ్ హైస్కూల్లో ఆమె విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసి మాట్లాడారు. విద్యార్థులు భవిష్యత్, జీవిత లక్ష్యం కోసం అడుగులు వేయాలని, ఉన్నత చదువులలో రాణించాలని సూచించారు. అనంతరం శివశక్తినగర్లోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ సెంటర్ ఆవరణలో ఉన్న చెత్తాచెదారం వెంటనే తొలగించాలని ఆదేశించారు. పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు ఇచ్చారా లేదా అడిగి తెలుసుకున్నారు. గుడ్లను సక్రమంగా ఉండికించి ఇవ్వాలని సూచించారు. అనంతరం తెలుగుగేరిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ కృష్ణ, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి పద్మజా, వైద్యులు రఫీక్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ● జిల్లాలోని గంగాపూర్, అమిస్తాపూర్, హన్వాడ పీహెచ్సీలను డీఎంహెచ్ఓ తనిఖీ చేయడంతోపాటు విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. -
కొత్త సంఘాలు ఏర్పాటు చేయాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లాలో కొత్త స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. సోమావారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో నూతన స్వయం సహాయక సంఘాల ఏర్పాటుపై శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మహిళా, వృద్ధ, దివ్యాంగ, కిశోర బాలికల సంఘాలను ఏర్పాటు చేసి, వీటిలో పేదవారిని చేర్చించాలన్నారు. అలాగే 60 ఏళ్లు పైబడిన వారు, దివ్యాంగులు, కిశోర బాలికలను గుర్తించి సంఘాలలో చేరేలా ప్రోత్సహించాలన్నారు. వారితో బ్యాంకు ఖాతాలు, తెరిపించాలని, ఇందులో ఏమైనా సమస్యలు ఎదురైతే ఏపీఎంల సహకారం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం ఈ నెలాఖరు వరకు పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో సెర్ప్ అధికారి వసంతసేనా, డీఆర్ఈఓ నర్సింహులు, ఏపీడీ శారద, డీపీఎంలు లక్ష్మయ్య, అరుణదేవి, రామునాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణికి 76 ఫిర్యాదులు ప్రజల నుంచి అందిన ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. ప్రజావాణిలో భాగంగా కలెక్టరేట్లోని మీటింగ్హాల్లో ప్రజల నుంచి 76 ఫిర్యాదులు స్వీకరించారు. అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, నర్సింహారెడ్డి, జెడ్పీసీఈఓ వెంకట్రెడ్డి, ఆర్డీఓ నవీన్, హౌజింగ్ పీడీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
చిక్కని చిరుత
● రెస్క్యూ బృందాలకు సవాల్ ● నిపుణుల సహకారం తీసుకున్నా ఫలితం శూన్యం ● భయాందోళనలో పట్టణవాసులు మహబూబ్నగర్ న్యూటౌన్: హైదరాబాద్ నుంచి రప్పించిన రెస్క్యూ టీం, అటవీ, పోలీసు బృందాలు నిరంతరాయంగా శ్రమిస్తున్నా చిరుత బోనుకు చిక్కడం లేదు. మహబూబ్నగర్ పట్టణానికి అతి సమీపంలోని తిర్మల్దేవునిగుట్ట, డంపింగ్ యార్డుల్లో కలియ తిరుగుతూ పరిసర ప్రాంతాల ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. రెస్క్యూ బృందం చిరుతను పట్టుకునేందుకు 40 రోజులుగా తమదైన శైలిలో ప్రయత్నిస్తున్నా వారి కళ్లుగప్పి మరో చోట మెరుపులా కనిపిస్తూ దడ పుట్టిస్తోంది. స్వయంగా కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ డి.జానకి చిరుత సంచరిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. చిరుతను పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలేలా చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించడంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీంతో సెర్చ్ బృందాలు ఎప్పటికప్పుడు చిరుత కదలికలను పర్యవేక్షిస్తూ పట్టుకునేందుకు తమదైన శైలిలో ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయినా ఫలితం లేకపోవడంతో చిరుతను పట్టుకునేదెలా అనే అయోమయంలో పడ్డాయి. దట్టమైన పొదలు, రాళ్ల మధ్య.. టీడీగుట్ట, స్మశానవాటిక ఏరియాల్లో దట్టమైన చెట్ల పొదలు, పెద్ద పెద్ద రాళ్ల మధ్య గుహలే చిరుతను పట్టుకునేందుకు అడ్డంకిగా మారాయి. స్మశానవాటిక, టీడీగుట్ట ప్రాంతాల్లో చిరుతకు ఆహారం దొరకని సమయంలో పరిసర ప్రాంతాల్లోకి వచ్చి కుక్కలను పట్టుకొని వెళ్తుందని అటవీశాఖ అధికారుల అంచనా. ఏదైనా ఆహారం దొరికిన సమయంలో కనీసం మూడు రోజులు బయటికి రాకుండా ఉంటుంది. ఆ తర్వాత ఆహారం కోసం సంచరిస్తున్న సమయంలో అక్కడక్కడా ట్రాప్ కెమెరాలకు చిక్కుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు మరింతగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నా చిక్కడం లేదు. 5 డ్రోన్లు, 20 ట్రాప్ కెమెరాలు, 4 బోన్లు చిరుతను పట్టుకునేందుకు ఆయా ప్రాంతాల్లో 4 బోన్లు ఏర్పాటుచేశారు. చిరుత సంచరిస్తున్న దారుల్లో 20 ట్రాప్ కెమెరాలు ఏర్పాటుచేసి కదలికలను గమనిస్తున్నారు. అంతే కాకుండా 4 డ్రోన్ కెమెరాలతో పై నుంచి చిరుత కదలికలను పర్యవేక్షిస్తున్నారు. దట్టమైన పొదలు, చెట్లు, రాళ్లు ఉండటం కారణంగా డ్రోన్ కెమెరాలకు చిరుత ఆనవాళ్లు ఏమాత్రం కనిపించడం లేదు. అయితే గుట్టపైనున్న గుండ్లపై ఎక్కి కిందకు దిగిన చిరుతను సమీప ప్రాంతాల ప్రజలు గమనించి అధికారులకు సమాచారం చేరవేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. నిపుణుల సూచనల మేరకు.. భయాందోళకు గురిచేస్తున్న చిరుతను బంధించేందుకు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో నిపుణుల సూచనల మేరకు సరికొత్త ఆలోచనలకు పదును పెట్టారు. చిరుత సంచరిస్తున్నా ప్రాంతాల్లో మేకలను చెట్టుకు కట్టి ఉంచడం, మత్తు ఇంజక్షన్లతో రెడీగా కాపలా కాయడం వంటి చర్యలు చేపడుతున్నారు. జిత్తులమారి చిరుతను పట్టుకునేందుకు అధికార యంత్రాంగం చేస్తున్న కృషి ఫలించాలని ఆశిద్దాం. నిరంతర పర్యవేక్షణ.. చిరుత సంచారంపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచనలు చేస్తూనే ఉన్నాం. బోన్లు ఏర్పాటు చేసి ట్రాప్ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నాం. నిపుణుల సూచనలు అమలు చేస్తున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మూడు షిఫ్టులుగా అటవీ బృందాలు పనిచేస్తున్నాయి. – కమాలుద్దీన్, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ -
పాలమూరుకు సాగునీరు
● కొండాపూర్ వద్ద లిఫ్ట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు ● మనికొండ మీదుగా 25 చెరువులను నీటితో నింపేందుకు చర్యలు ● జిల్లా రైతులకు తీరనున్న సాగునీటి కష్టాలు మహబూబ్నగర్ ప్రజల నీటి కష్టాలు తీర్చనున్న కోయిల్సాగర్ ఒకప్పుడు నీటి ఎద్దడితో అల్లాడుతున్న మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజలకు తాగునీరు అందించిన కోయిల్సాగర్ ప్రాజెక్టు.. ఇప్పుడు సాగునీటి అవసరాలు సైతం తీర్చనుంది. కొండాపూర్ వద్ద కొత్తగా లిఫ్ట్ ఏర్పాటు చేసి కోయిల్సాగర్ నుంచి నీటిని ఎత్తిపోయనున్నారు. మహబూబ్నగర్ రూరల్ మండలంలోని 25 చెరువులను నీటితో నింపి వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో పనులు షరవేగంగా కొనసాగుతున్నాయి. మహబూబ్నగర్ రూరల్: జిల్లాలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టు కోయిల్సాగర్ నుంచి పాలమూరుకు సాగునీరు అందబోతుంది. ఇందుకు సర్వే కూడా దాదాపు పూర్తయింది. కోయిల్సాగర్ నుంచి కొండాపూర్ వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేసి కేశ్వాపూర్, మనికొండ మీదుగా మహబూబ్నగర్ రూరల్ మండలంలోని 25 చెరువులను నీటితో నింపనున్నారు. ఈ పనులు పూర్తయితే రైతులకు సాగునీటి కష్టాలు తీరనున్నాయి. 5వేల ఎకరాలకు.. జిల్లాలో ఏకై క సాగునీటి వనరు అయిన కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాకు సాగునీరు అందించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. మహబూబ్నగర్ నియోజకవర్గానికి పెద్దగా సాగునీటి ప్రాజెక్టులు లేవు. దీంతో కోయిల్సాగర్ నుంచి నీటిని లిఫ్ట్ చేసి రూరల్ మండలానికి అందించవచ్చనే ఉద్దేశంతో మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి ఈ మేరకు ప్రతిపాదించారు. కోయిల్సాగర్ రిజర్వాయర్ దేవరకద్ర నియోజకవర్గ పరిధిలో ఉంది. ఈ రిజర్వాయర్ కింద లిఫ్ట్ ద్వారా మహబూబ్నగర్ రూరల్ మండలంలోని 25 చెరువులను నింపి వాటి పరిధిలో 5వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ప్రతిపాదనలకు మంత్రి సానుకూలంగా స్పందించి ఆ దిశగా పనులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. జూరాల బ్యాక్ వాటర్తో రన్ అవుతున్న కోయిల్సాగర్ రిజర్వాయర్ ద్వారా కొత్తగా లిఫ్ట్ ఏర్పాటు చేసి సమీప చెరువులను నింపి సాగునీరు ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి ఇరిగేషన్ అధికారులు చెరువుల గుర్తింపు పనిలో నిమగ్నమై సర్వే చేస్తున్నారు. కొండాపూర్ వద్ద లిఫ్ట్ ఏర్పాటు ఒకప్పుడు నీటి ఎద్దడితో అల్లాడుతున్న మహబూబ్నగర్ నియోజకవర్గానికి తాగునీటి అవసరం తీర్చిన కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకం ఇప్పుడు సాగునీటి అవసరాలు తీర్చనుంది. కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా కొండాపూర్ వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేసి రూరల్ మండలంలోని 25 చెరువులకు సాగునీరు పారించనున్నారు. చౌదర్పల్లి, బొక్కలోనిపల్లి, మనికొండ, రామచంద్రాపూర్, మాచన్పల్లి, కోటకదిర, పోతన్పల్లి, దేవరకద్ర మండలంలోని వెంకటాయపల్లి గ్రామాల చెరువులను కోయిల్సాగర్ బ్యాక్ వాటర్తో నింపనున్నారు. ఎనిమిది గ్రామాలను కలుపుతూ ఈ చెరువులు ఉండటంతో దాదాపు 5 వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది. దీంతో యాసంగి పంటలకు సాగునీటి ఇబ్బందులు తప్పే అవకాశం ఉంది. పాలమూరు– రంగారెడ్డి ద్వారా.. దీంతోపాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మహబూబ్నగర్ జిల్లాకు సాగునీరు అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కర్వెన రిజర్వాయర్ కింద మహబూబ్నగర్ రూరల్ మండలంలో 9,750 ఎకరాలు, హన్వాడ మండలంలోని 14,852 ఎకరాలకు సాగునీరు అందించే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. కర్వెన కెనాల్ ద్వారా మహబూబ్నగర్ రూరల్ మండలానికి, ఉదండాపూర్ రిజర్వాయర్ ద్వారా హన్వాడ మండలానికి సాగునీరు అందించనున్నారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు.. కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా మహబూబ్నగర్ రూరల్ మండలంలోని పొలాలకు సాగునీరు అందిస్తాం. సుమారు 25 చెరువులను నింపి ఐదువేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి సంకల్పించారు. ఆ మేరకు సర్వే కూడా పూర్తయింది. మరో పది రోజుల్లో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించి నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తున్నారు. ఈ పనులు పూర్తయితే మండల రైతులకు సాగునీటి కష్టాలు తీరనున్నాయి. – మల్లు నర్సింహారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సర్వే పూర్తయింది కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా మహబూబ్నగర్ రూరల్ మండలంలో సుమారు 5 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే ప్రతిపాదనల మేరకు సర్వే చేయించాం. కొండాపూర్ వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేసి మనికొండ మీదుగా కెనాల్ ద్వారా చెరువులను నింపుతాం. తద్వారా భూగర్భ జలమట్టం పెరగడంతో పాటు పంటల సాగుకు పుష్కలంగా నీరు అందనుంది. – మనోహర్, డీఈ, చిన్ననీటి పారుదల శాఖ -
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా సైకిల్ యాత్ర
చారకొండ: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఏపీ రాష్ట్రం కడప జిల్లా మైదుకూరు మండలం బస్వాపూర్కు చెందిన యువకుడు కార్తిక్రెడ్డి సైకిల్ యాత్ర చేపట్టారు. ఫిబ్రవరి 6న స్వగ్రామం నుంచి సేవ్ ట్రీ.. సేవ్ లైఫ్ అనే నినాదంతో సైకిల్ యాత్ర చేపట్టగా.. ఆదివారం చారకొండ మండలానికి చేరుకున్నాడు. ఈసందర్భంగా కార్తిక్రెడ్డి మట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు అందరం కృషి చేయాలన్నారు. పర్యావరణం ఎందుకు, ఎలా దెబ్బ తింటుంది, ఎలా సంరక్షించుకోవాలి తదితర అంశాలపై స్థానిక యువకులతో చర్చించారు. మానవాళి మనుగడకు చెట్లు చాలా అవసరమని వాటి ప్రాధాన్యతపై వివరించారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, గోవా, ఒడిశా రాష్ట్రాల మీదుగా దాదాపు 4200 కి.మీ సైకిల్యాత్ర పూర్తి చేశానని, మిగతా రాష్ట్రాల్లో తిరిగి ప్రజల్లో చైతన్యం కల్గించి యాత్ర ముగిస్తానని తెలిపారు. అనంతరం చారకొండ నుంచి దేవరకొండకు బయల్దేరారు. -
‘ఓట్లు అడిగే హక్కు బీజేపీకే ఉంది’
జడ్చర్ల టౌన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలకు దగ్గరగా ఉన్నవారికే విజయం వరిస్తుందని, అందుకోసం బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు చేరువగా ఉండి వారి సమస్యల పరిష్కారానికి పాటుపడాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆదివారం జడ్చర్లలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఓట్లు అడిగే హక్కు కేవలం బీజేపీకి మాత్రమే ఉందన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అనేక హామీలిచ్చి నెరవేర్చలేదని, కేంద్రం నిధులు కేటాయించిన గ్రామాలకు ఇవ్వకుండా ఇబ్బందులు చేసిందని ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సైతం పంచాయతీలకు పూర్తిస్థాయిలో నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు. గ్రామాల్లో జరిగిన అభివృద్ధి మొత్తం కేంద్రం నిధులతోనే జరిగిందని ప్రజలకు వివరించాలన్నారు. నియోజకవర్గంలోని అన్ని జెడ్పీటీసీ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని సూచించారు. పార్లమెంట్ ఇన్చార్జి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా జాప్యం చేస్తుందన్నారు. కేంద్రం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. సమావేశంలో జాతీయ కౌన్సిలర్ సభ్యురాలు పద్మజారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కృష్ణయ్య, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, నాయకులు బాలవర్ధన్గౌడ్, అమర్నాథ్గౌడ్, శ్రీనివాస్రెడ్డి, నర్సింహులు, నవీన్, జనార్దన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించొద్దు
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): గురుకుల మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించవద్దని కలెక్టర్ విజయేందిర అన్నారు. ఆదివారం గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి.. మధ్యాహ్నం విద్యార్థుల కోసం వండిన ఆహారాన్ని పరిశీలించారు. మెనూ గురించి విద్యార్థినులను అడగగా.. ఆదివారం బగారా అన్నం, చికెన్ పెడుతున్నట్లు చెప్పారు. వంట గదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. భోజనం చేయడానికి వచ్చిన విద్యార్థులతో మాట్లాడి మౌలిక వసతులు, ఆహారం ఎలా ఉంది అని ఆరా తీశారు. ఎలా చదువుతున్నారు.. డిగ్రీ తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారని విద్యార్థులను అడిగారు. 18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకుని తమ భవిష్యత్కు బంగారు బాటలు వేసుకోవాలని ఆకాంక్షించారు. చదువు ద్వారానే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని, పోటీ ప్రపంచంలో బాగా చదివిన వారికి మాత్రమే గుర్తింపు ఉంటుందని చెప్పారు. విద్యార్థులతో మాట్లాడుతున్న కలెక్టర్ విజయేందిర -
నాణ్యతకు తిలోదకాలు!
పాతపాలమూరులోని శ్రీ శివరామాంజనేయ ఆలయం ఎదురు వీధిలో ఎస్సీకాలనీ నుంచి రైసా మసీదు వరకు యూడీజీ కోసం ఏడాది క్రితం శంకుస్థాపన చేశారు. ఈ పనుల కోసం రూ.పది లక్షలు కేటాయించారు. అయితే కాంట్రాక్టర్ కొన్ని రోజుల క్రితమే పాత మురుగు కాల్వలోనే పనులు ఆరంభించారు. మధ్యలో ఉన్న నలుకూడలిలో మిషన్ భగీరథ పథకం పైపులైన్ అడ్డం వచ్చింది. ఈ పనులు పూర్తి కాకముందే ఈ ప్రాంతంలో రెండు, మూడు చోట్ల సిమెంట్ పైపులు పగిలిపోయాయి. నాసిరకమైనవి వినియోగించడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఇదే మార్గంలో తాగునీటి కోసం పీవీపీ పైపులైన్ వేశారు. ఈ క్రమంలోనే ఎక్కడికక్కడ బీటీ రోడ్డంతా ధ్వంసమైంది. ఇటీవల వరుసగా కురిసిన వర్షాలకు మొత్తం బురదమయంగా మారింది. వాహనాల రాకపోకలకు, పాదచారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్థానిక ఏనుగొండలోని సాంబ శివాలయం దేవునిగుట్టపై సీసీ రోడ్డు వెంట 15 రోజుల క్రితమే వంద మీటర్ల మేర యూజీడీ నిర్మించారు. ఇక్కడ కనీస ప్రమాణాలు పాటించకుండా మ్యాన్హోళ్ల వద్ద అటు, ఇటు సిమెంటు పైపులను ఒకదానికొకటి కలిపేసి వాటికి పెద్ద రంధ్రాలు పెట్టి వదిలేశారు. వాస్తవానికి ఈ పైపుల మధ్య కొంత ఖాళీ స్థలం వదిలి చుట్టూ ఇటుకలు, సిమెంట్తో కలిపి మ్యాన్హోళ్లను ఏర్పాటు చేయాలి. అలాగే ఇళ్ల నుంచి బయటకు వచ్చే పైపుల కంటే పైకి ఎత్తుగా వీటిని నిర్మించడంతో వరదతో పాటు మురుగు కాస్తా ఇళ్ల లోపలికి వచ్చే ప్రమాదం పొంచి ఉంది. ఇలా అస్తవ్యస్తంగా యూజీడీని సుమారు పది ఇళ్ల వరకు వేశారు. దీంతో పై నుంచి మురుగుతో పాటు వర్షాకాలంలో వరద మొత్తం ఇళ్లలోకి వచ్చేలా ఉంది. ఇదంతా చూస్తుంటే.. జనాల అవసరాల కోసం కాకుండా బిల్లుల కోసమే వీటిని నిర్మించినట్లు తేటతెల్లమవుతోంది. విఘ్నేశ్వరకాలనీలో ఇటీవల రెండు చోట్ల మొత్తం 300 మీటర్ల యూడీజీ నిర్మించారు. దీనికి ఒక ఫీటు సైజు సిమెంటు పైపులు వాడారు. అయితే పై నుంచి వచ్చే వరద ఉద్ధృతితో పాటు మురుగు ధాటికి తట్టుకోవని స్థానికులు వాపోతున్నారు. వీటి స్థానంలో పెద్ద పైపులు వేసి ఎలైన్మైంట్ మార్చాలని కోరుతున్నారు. మరికొన్ని వీధుల్లోనూ విస్తరించి వీటికి కలిపితే సమస్య పరిష్కారమవుతుందని వారు చెబుతున్నారు. మహబూబ్నగర్ మున్సిపాలిటీ: కార్పొరేషన్ పరిధిలోని వివిధ కాలనీలలో ఏడాది కాలంగా చేపట్టిన అండర్గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) పనుల్లో నాణ్యత లోపించింది. ఈ టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించి నాసిరకం పైపులను తమకు తోచిన విధంగా వేస్తుండటంతో కొన్నిచోట్ల పగిలిపోతున్నాయి. వాస్తవానికి నగరంలోని చాలా ప్రాంతాలు ఎత్తు పల్లాలతో ఎగుడుదిగుడుగా ఉన్నాయి. అసలే వర్షాకాలం కావడంతో వరదతో పాటు మురుగు ముందుకు కదలడం లేదు. అంతటా ఫీటు మేర సైజు కలిగిన పైపులనే వాడటం.. ఆపై సరైన పద్ధతిలో మ్యాన్హోళ్లను ఏర్పాటు చేయకపోవడంతో పైనుంచి వచ్చే వరదకు అవి తట్టుకునే పరిస్థితులు లేవు. ముఖ్యంగా మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో యూజీడీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. గతేడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది జూలై వరకు నగరంలోని దాదాపు అన్ని డివిజన్ల పరిధిలో 54 చోట్ల సుమారు ఆరు వేల మీటర్ల యూజీడీ పైపులైన్ వేయాలని నిర్ణయించారు. దీని కోసం రూ.4,96,69,000 కేటాయించారు. ఇందులో ఇప్పటివరకు 50 శాతం మేర పనులు పూర్తి కాగా, మిగతావి ఇంకా పురోగతిలోనే ఉండటం గమనార్హం. నడవడానికి ఇబ్బందులు మా ప్రాంతంలో నెల రోజులుగా యూజీడీ పనులు కొనసాగుతున్నాయి. రోడ్డుకు ఒకపక్క మిషన్ భగీరథ పథకం, మరోపక్క యూజీడీ పనులతో బీటీ రోడ్డు మొత్తం ధ్వంసమైంది. వర్షం కురిసినప్పుడు బురదమయంగా మారుతోంది. కనీసం నడవడానికి కూడా వీలు లేకుండా ఉంది. సిమెంట్ పైపులు పాతకాల్వలో అస్తవ్యస్తంగా వేయడంతో మురుగు ముందుకు కదలని పరిస్థితి ఏర్పడింది. ఈ పనులు త్వరగా పూర్తి చేసి కొత్త సీసీరోడ్డు నిర్మించాలి. – భారతమ్మ, గృహిణి, పాతపాలమూరు, మహబూబ్నగర్ బయటి మురుగు ఇంట్లోకి వచ్చేలా ఉంది ఈ ప్రాంతంలో ఇటీవల అండర్గ్రౌండ్ డ్రెయినేజీ పైపులైన్ సరిగా వేయకపోవడం వల్ల బయట నుంచి మురుగు, వరద నీరు ఇంట్లోకి వచ్చేలా ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఈ పైపులైన్ను తూతూమంత్రంగా వేసి వెళ్లారు. ఇక్కడి సుమారు పది ఇళ్లకు సంబంధించి బయటకు వెళ్లే పైపుల కన్నా యూడీజీ పైపులైన్ పైకి ఎత్తుగా ఉంది. దీనిని వెంటనే సరి చేయించాలి. – నాగరాజు, దేవునిగుట్ట, సాంబ శివాలయం ప్రాంతం, ఏనుగొండ పరిశీలించి చర్యలు తీసుకుంటాం.. నగరంలోని వివిధ డివిజన్ల పరిధిలో నిర్మిస్తున్న అండర్గ్రౌండ్ డ్రెయినేజీ పనులను త్వరలో మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం. ఎక్కడైనా నాసిరకం పనులు ఉన్నట్లు తేలితే సంబంధిత కాంట్రాక్టర్లపై తగు చర్యలు తీసుకుంటాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిని వదిలిపెట్టేది లేదు. పాత పాలమూరులో పగిలిపోయిన సిమెంట్ పైపులను తొలగించి కొత్తవి వేయిస్తాం. – టి.ప్రవీణ్కుమార్రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, మహబూబ్నగర్ నగరంలో యూజీడీ వ్యవస్థ అస్తవ్యస్తం నాసిరకం పనులతో ధ్వంసమవుతున్న పైపులు ఆయా పనుల్లో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం కొరవడిన మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ అసలే వర్షాకాలం.. ఆపై ముందుకు పారని మురుగు -
‘బీజేపీ కనుసన్నల్లోనే స్వతంత్ర వ్యవస్థలు’
స్టేషన్ మహబూబ్నగర్: బీజేపీ కనుసన్నల్లోనే దేశంలోని స్వతంత్ర వ్యవస్థలు నడుస్తున్నాయని డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డిజిటల్ ఓటర్ లిస్టు, సీసీ పుటేజ్లు ఇవ్వాలని రాహుల్గాంధీ కోరుతున్నా ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అధికారం కోసం బీజేపీ వ్యవస్థలను వాడుకొని తప్పిదాలు చేసిందని ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును దొంగతనానికి పాల్పడటం దుర్మార్గమని అన్నారు. అంతకుముందు ప్రొజెక్టర్ ద్వారా రాహుల్గాంధీ ప్రజెంటేషన్ను ఎమ్మెల్యే, ఇతర నాయకులు తిలకించారు. సమావేశంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్గౌడ్, టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అఖ్తర్, ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్,, నాయకులు వినోద్కుమార్, ఎన్పీ వెంకటేశ్, సిరాజ్ఖాద్రీ, సీజే బెనహర్, జహీర్ అఖ్తర్ తదితరులు పాల్గొన్నారు. -
‘నులి’పేస్తోంది..!
పాలమూరు: కడుపులో నులిపురుగులతో పిల్లలు అనేక అనారోగ్య సమస్యలతో సతమతం అవుతుంటారు. వారి శారీరక, మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో నులిపురుగులను నివారించడమే లక్ష్యంగా జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు సోమవారం జిల్లావ్యాప్తంగా 13 మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లోని 1 నుంచి 19 ఏళ్లలోపు ఉండే చిన్నారులు, యువతీ, యువకులకు ఆల్బెండజోల్ మాత్రలు వేయనున్నారు. సిబ్బందికి ప్రత్యేక శిక్షణ నులి పురుగుల నివారణ మాత్రల పంపిణీకి ఇప్పటికే వైద్య ఆరోగ్య సిబ్బంది, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల హెచ్ఎంలు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. మాత్రలను సబ్సెంటర్లు, ఏఎన్ఎం, ఆశాలకు అందజేశారు. వెద్య, ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం జిల్లాలో 1 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు గలవారు 2.54 లక్షల బాల, బాలికలు ఉన్నారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే సుమారు లక్ష మంది వరకు రక్తహినత, పోషకాహార లోపంతోపాటు ఇతర సమస్యలతో బాధపడుతున్నారు. రక్తహీనత ఉన్నవారిలో ఆకలి లేకపోవడం, బలహీనంగా, నీరసంగా, ఆందోళన ఉండటం లాంటి సమస్యలు వస్తాయి. తరచూ కడుపునొప్పి వస్తుంది. వికారంగా ఉడటంతోపాటు విరేచనాలు, మలంలో రక్తం రావడం జరుగుతుంది. సమస్యలు.. జాగ్రత్తలు నులిపురుగులతో బాధపడేవారు ప్రధానంగా ఎనిమియా (రక్తహీనత) వ్యాధి బారినపడతారు. శరీరంలో పదేపదే నీరసం వస్తూ నీరసించిపోతారు. శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. ఆకలి మందగించి జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయి. పిల్లలు మందబుద్ధిగా తయారవుతారు. మలవిసర్జన ప్రదేశంలో, చర్మంపై దురదలు వస్తుంటాయి. కొందరు పిల్లల్లో దీర్ఘకాలంపాటు ఇవి ఉన్నప్పటికి వ్యాధి లక్షణాలు కనిపించకపోవచ్చు. కానీ, ఈ సమస్య వారి ఆరోగ్యం, విద్య ఇలా అన్ని రకాల ఎదుగుదలపై ప్రభావితం చూపుతాయి. నులిపురుగుల ఎక్కువగా ఉంటే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. మల విసర్జన, బహిర్భూమికి వెళ్లివచ్చాక కాళ్లు, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పాదాలకు బూట్లు తప్పనిసరిగా ధరించాలి. దీంతోపాటు ఆహార పదార్థాలను శుభ్రంగా కడగాలి. ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం వల్ల నులిపురుగులు రాకుండా నియంత్రించవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలకు, యువకులకు తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని వైద్యాధికారులు చెబుతున్నారు. దీంతో సంక్రమణాన్ని నియంత్రించడంతోపాటు శారీరక, మానసిక అభివృద్ధికి దోహదపడుతుందని సూచిస్తున్నారు. అయితే రెండేళ్లలోపు పిల్లలకు సగం మాత్రలు, 3–19 ఏళ్ల వారికి ఒక మాత్ర వేయాలని వైద్యులు చెబుతున్నారు. మాత్రలు వేసే సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని పేర్కొంటున్నారు. వైద్య సిబ్బంది పర్యవేక్షణలో మాత్రమే వేయాలని సూచిస్తున్నారు. కాగా.. జిల్లాలో దాదాపు 70 శాతం కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు లేకపోవడంతో నులిపురుగుల వ్యాప్తి పెరిగిపోతుంది. జిల్లాలో నులి పురుగుల నివారణ కోసం 1–19 ఏళ్ల బాల, బాలికలకు ఇచ్చే ఆల్బెండజోల్ ట్యాబ్లెట్స్ పంపిణీ చేయాడానికి ఏర్పాట్లు చేశాం. నేడు తప్పిపోయిన విద్యార్థులకు ఈ నెల 18న మాప్ఆప్ కింద పంపిణీ చేస్తాం. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలలో బడి బయట చిన్నారులు కలిపి జిల్లాలో 2,54,000 మంది ఉండగా వీరందరికీ మాత్రలు ఇవ్వడానికి సిద్ధం చేశాం. ఆహారం తీసుకున్న తర్వాత ట్యాబ్లెట్ ఇవ్వాలి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న చిన్నారులకు ఇవ్వరాదు. – కృష్ణ, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి 2,83,700 జిల్లాలో 70 శాతానికిపైగానే నులి పురుగుల బాధితులు 2.54 లక్షల మంది బాల, బాలికలను గుర్తించిన వైద్యాధికారులు వీరికి 2.83 లక్షల ఆల్బెండజోల్ మాత్రల పంపిణీకి సిద్ధం ఏర్పాట్లు పూర్తిచేసిన వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు నేడు జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం -
జూరాలకు 90 వేల క్యూసెక్కుల వరద
ధరూరు: ప్రియదర్శిని జూరాల జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద ఆదివారం తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. శనివారం రాత్రి 8 గంటల సమయంలో 1.15 లక్షల క్యూసెక్కులు ఉండగా.. ఆదివారం సాయంత్రం 6.30 సమయంలో 90 వేల క్యూసెక్కులకు చేరినట్లు చెప్పారు. దీంతో 8 క్రస్ట్ గేట్లు పైకెత్తి 52,758 క్యూసెక్కులు దిగువకు వదిలామన్నారు. అలాగే విద్యుదుత్పత్తి నిమిత్తం 32,399 క్యూసెక్కులు, కోయిల్సాగర్కు 315, ఆవిరి రూపంలో 47, కుడి కాల్వకు 470, ఆర్డీఎస్ లింక్ కెనాల్కు 50 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు వివరించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.531 టీఎంసీల నీటినిల్వ ఉన్నట్లు తెలిపారు. విద్యుదుత్పత్తి వేగవంతం.. ఆత్మకూర్: జూరాల దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతోంది. ఎగువన 5 యూనిట్ల నుంచి 195 మెగావాట్లు, 208.889 మి.యూ, దిగువన 6 యూనిట్ల నుంచి 240 మెగావాట్లు, 248.715 మి.యూ. విద్యుదుత్పత్తి చేపడుతున్నామని ఎస్ఈ శ్రీధర్ వివరించారు. ఎగువ, దిగువ కేంద్రాల్లో ఇప్పటి వరకు 457.604 మి.యూ. విద్యుదుత్పత్తి విజయవంతంగా చేపట్టామని తెలిపారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 32 వేల క్యూసెక్కులు వినియోగించినట్లు చెప్పారు శ్రీశైలం జలాశయానికి.. దోమలపెంట: శ్రీశైలం జలాశయానికి ఆదివారం జూరాల ఆనకట్ట స్పిల్వే ద్వారా 52,758 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ 32,399 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 66,176 క్యూసెక్కుల వరద చేరింది. శ్రీశైలం భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులు, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 32,399 క్యూసెక్కులు నాగార్జునసాగర్కు వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయంలో 880.6 అడుగుల నీటిమట్టం.. 191.2118 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 24 గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడుకు 32 వేల క్యూసెక్కులు, హెచ్ఎన్ఎస్ఎస్ ఎత్తిపోతలకు 2,818, ఎంజీకేఎల్ఐకు 2,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ కేంద్రంలో 16.232 మి.యూ., కుడిగట్టు కేంద్రంలో 14.741 మి.యూ. విద్యుదుత్పత్తి చేపట్టారు. 8 క్రస్ట్ గేట్లు పైకెత్తి దిగువకు నీటి విడుదల -
పరిశీలించి చర్యలు తీసుకుంటాం..
నగరంలోని వివిధ డివిజన్ల పరిధిలో నిర్మిస్తున్న అండర్గ్రౌండ్ డ్రెయినేజీ పనులను త్వరలో మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం. ఎక్కడైనా నాసిరకం పనులు ఉన్నట్లు తేలితే సంబంధిత కాంట్రాక్టర్లపై తగు చర్యలు తీసుకుంటాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిని వదిలిపెట్టేది లేదు. పాత పాలమూరులో పగిలిపోయిన సిమెంట్ పైపులను తొలగించి కొత్తవి వేయిస్తాం. – టి.ప్రవీణ్కుమార్రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, మహబూబ్నగర్ -
నడవడానికి ఇబ్బందులు
మా ప్రాంతంలో నెల రోజులుగా యూజీడీ పనులు కొనసాగుతున్నాయి. రోడ్డుకు ఒకపక్క మిషన్ భగీరథ పథకం, మరోపక్క యూజీడీ పనులతో బీటీ రోడ్డు మొత్తం ధ్వంసమైంది. వర్షం కురిసినప్పుడు బురదమయంగా మారుతోంది. కనీసం నడవడానికి కూడా వీలు లేకుండా ఉంది. సిమెంట్ పైపులు పాతకాల్వలో అస్తవ్యస్తంగా వేయడంతో మురుగు ముందుకు కదలని పరిస్థితి ఏర్పడింది. ఈ పనులు త్వరగా పూర్తి చేసి కొత్త సీసీరోడ్డు నిర్మించాలి. – భారతమ్మ, గృహిణి, పాతపాలమూరు, మహబూబ్నగర్ బయటి మురుగు ఇంట్లోకి వచ్చేలా ఉంది ఈ ప్రాంతంలో ఇటీవల అండర్గ్రౌండ్ డ్రెయినేజీ పైపులైన్ సరిగా వేయకపోవడం వల్ల బయట నుంచి మురుగు, వరద నీరు ఇంట్లోకి వచ్చేలా ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఈ పైపులైన్ను తూతూమంత్రంగా వేసి వెళ్లారు. ఇక్కడి సుమారు పది ఇళ్లకు సంబంధించి బయటకు వెళ్లే పైపుల కన్నా యూడీజీ పైపులైన్ పైకి ఎత్తుగా ఉంది. దీనిని వెంటనే సరి చేయించాలి. – నాగరాజు, దేవునిగుట్ట, సాంబ శివాలయం ప్రాంతం, ఏనుగొండ ● -
వైభవంగా రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు
స్టేషన్ మహబూబ్నగర్: జిల్లాకేంద్రంలోని పరిమళగిరిపై వెలసిన రాఘవేంద్రస్వామి మఠంలో 354వ ఆరాధన ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పూర్వారాధన వేడుకలు, వివిధ పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం సుప్రభాతసేవ, పాదపూజ, కనకాభిషేకం, వివిధ రకాల ఫలాలతో కూడిన ఫలపంచామృతాభిషేకం చేశారు. అర్చకులు స్వామివారి బృందావనానికి అభిషేకం జరిపారు. అలాగే అష్టోత్తర పారాయణం, తులసి అర్చన, నైవేద్యం, అనంతరం స్వామివారిని సుగంధ పుష్పాలతో అలంకరించారు. హస్తోదకం, మహామంగళహారతి ఇచ్చి.. సాయంత్రం స్వామివారిని మఠం ప్రాంగణంలో ఊరేగించారు. స్వామివారి ఆరాధనోత్సవాల్లో ఎంపీ డీకే అరుణ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కాగా.. ఆరాధనోత్సవాల్లో భాగంగా సోమవారం మధ్యారాధన వేడుకలు జరపనున్నారు. స్వామివారికి క్షీరాభిషేకం, ఫలపంచామృతాభిషేకం, సుగంధ పుష్పాలతో అలంకరణ తదితర పూజాది కార్యక్రమాలు నిర్వహించనున్నారు. -
శాస్త్రీయ విద్యా విధానాన్ని అమలు చేయాలి
మహబూబ్నగర్ న్యూటౌన్: ప్రైవేటు విద్యా వ్యవస్థను రద్దు చేసి శాస్త్రీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాల్నర్సింహ అన్నారు. స్థానిక సురవరం వెంకటరామిరెడ్డి భవన్లో ఆదివారం ఏఐఎస్ఎఫ్ 90వ వ్యవస్థాపక దినోత్సవాలను పురస్కరించుకొని ఉద్యమ యాదిలో గాయని రచయిత శ్యామల రూపొందించిన వీడియో ఆల్బమ్ సీడీ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని, విద్య వ్యాపార ధోరణితో పేదలకు అందని ద్రాక్షగా మారిందన్నారు. మోదీ ప్రభుత్వంలో కార్పొరేట్ శక్తులు విద్యను లాభాపేక్షగా మార్చి యాజమాన్యాలకు అనుకూలంగా విద్యారంగంలో సంస్కరణలు తెస్తూ కాషాయీకరణను పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. శాస్త్రీయ విద్యా విధానం ద్వారానే అంధ, మూఢ విశ్వాసాలు తొలగుతాయన్నారు. గాయని శ్యామల రచించి పాడిన పాట విద్యార్థుల్లో చైతన్యాన్ని నింపుతుందని అభినందించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బాలకిషన్, ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజు, జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సురేష్, శేఖర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీ రిజర్వేషన్లను కేంద్రం ఆమోదించాలి
అడ్డాకుల: తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని, లేదంటే బీజేపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయాలని సీఐటీయూ రాష్ట్ర నాయకుడు కిల్లె గోపాల్, కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుర్మయ్య అన్నారు. బీసీ బిల్లును ఆమోదించాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం అడ్డాకులలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ పేదల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉందని, ఆర్ఎస్ఎస్ అజెండాను అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదించకుండా అడ్డుపడుతుందని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లను ఆమోదిస్తే ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్ అందుతుందనే అబద్ధపు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ ఎంపీలు కల్లబొళ్లి మాటలు చెబుతూ మోసం చేస్తున్నారని చెప్పారు. పార్లమెంట్లో 42 శాతం బీసీ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని, లేదంటే కపట నాటకాన్ని ప్రదర్శిస్తున్న బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఆనాడు మండల్ కమిషన్కు వ్యతిరేకంగా రథయాత్రలు తీసుకువచ్చి బీసీ ఉద్యమాన్ని బీజేపీ పక్కకు నెట్టిందని విమర్శించారు. అణగారిన వర్గాలు అట్టడుగునే ఉండాలనుకునే బీజేపీ దాని మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ చెప్పినట్లే వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కార్యక్రమంలో కేవీపీఎస్ మండలాధ్యక్షుడు బాలరాజు, నాయకులు ప్రసాద్, ప్రశాంత్, ఆంజనేయులు, నర్సింహ, మోష, రాజేష్, శ్రీకాంత్, ప్రేమ్కుమార్, శంకర్ తదతరులు పాల్గొన్నారు. -
శాసీ్త్రయ విద్యా విధానాన్ని అమలు చేయాలి
మహబూబ్నగర్ న్యూటౌన్: ప్రైవేటు విద్యా వ్యవస్థను రద్దు చేసి శాసీ్త్రయ విద్యా విధానాన్ని అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాల్నర్సింహ అన్నారు. స్థానిక సురవరం వెంకటరామిరెడ్డి భవన్లో ఆదివారం ఏఐఎస్ఎఫ్ 90వ వ్యవస్థాపక దినోత్సవాలను పురస్కరించుకొని ఉద్యమ యాదిలో గాయని రచయిత శ్యామల రూపొందించిన వీడియో ఆల్బమ్ సీడీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని, విద్య వ్యాపార ధోరణితో పేదలకు అందని ద్రాక్షగా మారిందన్నారు. మోదీ ప్రభుత్వంలో కార్పొరేట్ శక్తులు విద్యను లాభాపేక్షగా మార్చి యాజమాన్యాలకు అనుకూలంగా విద్యారంగంలో సంస్కరణలు తెస్తూ కాషాయీకరణను పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. శాసీ్త్రయ విద్యా విధానం ద్వారానే అంధ, మూఢ విశ్వాసాలు తొలగుతాయన్నారు. గాయని శ్యామల రచించి పాడిన పాట విద్యార్థుల్లో చైతన్యాన్ని నింపుతుందని అభినందించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బాలకిషన్, ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజు, జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సురేష్, శేఖర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీ రిజర్వేషన్లను కేంద్రం ఆమోదించాలి
అడ్డాకుల: తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని, లేదంటే బీజేపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయాలని సీఐటీయూ రాష్ట్ర నాయకుడు కిల్లె గోపాల్, కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుర్మయ్య అన్నారు. బీసీ బిల్లును ఆమోదించాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం అడ్డాకులలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ పేదల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉందని, ఆర్ఎస్ఎస్ అజెండాను అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదించకుండా అడ్డుపడుతుందని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లను ఆమోదిస్తే ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్ అందుతుందనే అబద్ధపు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ ఎంపీలు కల్లబొళ్లి మాటలు చెబుతూ మోసం చేస్తున్నారని చెప్పారు. పార్లమెంట్లో 42 శాతం బీసీ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని, లేదంటే కపట నాటకాన్ని ప్రదర్శిస్తున్న బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఆనాడు మండల్ కమిషన్కు వ్యతిరేకంగా రథయాత్రలు తీసుకువచ్చి బీసీ ఉద్యమాన్ని బీజేపీ పక్కకు నెట్టిందని విమర్శించారు. అణగారిన వర్గాలు అట్టడుగునే ఉండాలనుకునే బీజేపీ దాని మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ చెప్పినట్లే వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కార్యక్రమంలో కేవీపీఎస్ మండలాధ్యక్షుడు బాలరాజు, నాయకులు ప్రసాద్, ప్రశాంత్, ఆంజనేయులు, నర్సింహ, మోష, రాజేష్, శ్రీకాంత్, ప్రేమ్కుమార్, శంకర్ తదతరులు పాల్గొన్నారు. -
ఎత్తంలో తుపాకీ కలకలం
కోడేరు: ఓ వ్యక్తి తుపాకీతో తిరుగుతూ కలకలం సృష్టించిన సంఘటన మండలంలోని ఎత్తం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మండ్ల లక్ష్మయ్య శనివారం అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అతడిని పట్టుకుని విచారించగా జేబులో తుపాకీ కనిపించింది. వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ జగదీశ్వర్ తెలిపారు. ఇదిలా ఉండగా.. ఇదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కృష్ణయ్య తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. లక్ష్మయ్య నుంచి స్వాధీనం చేసుకున్న తుపాకీ ఇదే.. -
జూరాలకు మళ్లీ పెరిగిన వరద
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద మళ్లీ పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో 40 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. శనివారం రాత్రి 8.30 ప్రాంతంలో 1.15 లక్షల క్యూసెక్కులకు పెరిగినట్లు వివరించారు. దీంతో 8 క్రస్ట్ గేట్లు ఎత్తి 57,136 క్యూసెక్కులు దిగువకు వదిలినట్లు చెప్పారు. అలాగే విద్యుదుత్పత్తికి 33,419 క్యూసెక్కులు, కోయిల్సాగర్కు 315, భీమా లిఫ్ట్–1కు 650, ఆవిరి రూపంలో 46, కుడి కాల్వకు 700, ఆర్డీఎస్ లింకు కెనాల్కు 50 క్యూసెక్కులు విడుదల చేస్తున్నామని తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.193 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు వివరించారు. విద్యుదుత్పత్తి వేగవంతం.. ఆత్మకూర్: జూరాల దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోంది. శనివారం ఎగువన 5 యూనిట్ల నుంచి 195 మెగావాట్లు, 205.877 మి.యూ, దిగువన 6 యూనిట్ల నుంచి 240 మెగావాట్లు, 244.102 మి.యూ. విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ వివరించారు. ఎగువ, దిగువ కేంద్రాల్లో ఇప్పటివరకు 449.979 మి.యూ. విద్యుదుత్పత్తి చేపట్టామని చెప్పారు. ‘సంగంబండ’ ఒక గేట్ ఎత్తి.. మక్తల్: మండలంలోని సంగంబండ వద్ద ఉన్న చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు నీటి ప్రవాహం అధికం కావడంతో శనివారం ఒక గేట్ పైకెత్తి 500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఇరిగేషన్ డీఈ సురేష్ తెలిపారు. కర్ణాటకలోని ఇడ్లూర్ పెద్దవాగు నుంచి నీటి ప్రవాహం అధికంగా రావడంతో రిజర్వాయర్లో నీటిమట్టం పెరిగిందని చెప్పారు. శ్రీశైలం జలాశయానికి.. దోమలపెంట: కృష్ణా బేసిన్లో వరద పెరగడంతో జూరాల ఆనకట్ట గేట్లు పైకెత్తి స్పిల్వే ద్వారా శనివారం శ్రీశైలం జలాశయానికి నీటి విడుదల చేస్తున్నారు. జూరాల స్పిల్వే ద్వారా 57,136 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 53,768, హంద్రీ నుంచి 1,125 క్యూసెక్కుల వరద జలాశయానికి చేరుతోందన్నారు. శ్రీశైలం భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులు, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 30,465 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 879.1 అడుగుల నీటిమట్టం.. 183.4198 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 24 గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 32,750 క్యూసెక్కులు, హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2,818, ఎంజీకేఎల్ఐకు 2,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ కేంద్రంలో 15.776 మి.యూ., కుడిగట్టు కేంద్రంలో 14.982 మి.యూ. విద్యుదుత్పత్తి చేశారు. 1.15 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో 8 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల -
కల్యాణ.. వైభోగమే
ఆడపడుచులకు సోదరులపై ఉండే ఎల్లలు లేని ప్రేమ, ఆప్యాయత నిదర్శనమే రాఖీ. రాఖీ పండుగను పురస్కరించుకొని శనివారంమంత్రి వాకిటి శ్రీహరికి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వారి సోదరీమణులు రాఖీ కట్టారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి ఆయన సోదరి కుమార్తె సరళ, అచ్చంపేట ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణకు సోదరీమణులు, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డికి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డికి బ్రహ్మకుమారీస్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి బీకే మహాదేవి, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్కు సోదరి శ్రీదేవి రాఖీ కట్టి ఆశీర్వదించారు. వారు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. – సాక్షి, నెట్వర్క్ రాఖీ కట్టి.. నిండుగా ఆశీర్వదించి.. మహబూబ్నగర్ రూరల్: పౌర్ణమిని పురస్కరించుకొని మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శోభాయమానంగా అలంకరించిన పల్లకీలో స్వామి దంపతులను సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాల మధ్య గర్భగుడి నుంచి దేవస్థానం సమీపంలోని మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం స్వామివారి కల్యాణ వేడుక జరిగింది. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రధారణ, తలంబ్రాల కార్యక్రమాలను కనులపండువగా నిర్వహించారు. కల్యాణం అనంతరం స్వామి దంపతులను మళ్లీ పల్లకీలో గర్భగుడిలోకి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందాచారి పాల్గొన్నారు. వైభవంగా లక్ష్మీ హయగ్రీవుల కల్యాణం ఎర్రవల్లి: శ్రావణ పౌర్ణమిని పురష్కరించుకొని బీచుపల్లి క్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో శనివారం శ్రీలక్ష్మీ హయగ్రీవుల కల్యాణ మహోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి.. సన్నాయి వాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య కల్యాణ వేడుక జరిపారు. కాగా, పవిత్రోత్సవాల చివరిరోజు ఆలయంలో వేద దివ్యప్రభంద పారాయణం, యాగశాలలో చుతుస్థానార్చన, మూలమంత్ర మూర్తి హోమాలు, శాంతిహోమం, మహా పూర్ణాహుతి, పవిత్ర విసర్జన, కుంభప్రోక్షణ, మహానివేదన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్రాజు పాల్గొన్నారు. రాఖీ పండుగను పురస్కరించుకొని శనివారం ఉమ్మడి జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులు కిటకిటలాడాయి. మహబూబ్నగర్ ఆర్టీసీ బస్టాండ్తో పాటు ఆరుబయట సైతం జనం రద్దీ కనిపించింది. ప్లాట్ఫాంపైకి బస్సు రాగానే ప్రయాణికులు ఎగబడి ఎక్కారు. ప్రయాణికుల రద్దీ దృష్టా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మరోవైపు స్వగ్రామాలకు వెళ్లే వారితో రోడ్లన్నీ జనసంద్రంగా మారాయి. జాతీయ రహదారులపై వాహనాల రద్దీ పెరిగింది. జడ్చర్ల ఫ్లైఓవర్ వద్ద ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం వరకు, తిరిగి సాయంత్రం ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఏర్పడింది. పెద్దఎత్తున వాహనాలు రోడ్డుపైకి రావడంతో క్రమబద్ధీకరించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. జడ్చర్ల సిగ్నల్గడ్డ వద్ద సైతం షరా మామూలే అన్నట్టుగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. – సీనియర్ ఫొటోగ్రాఫర్, మహబూబ్నగర్/జడ్చర్ల టౌన్ కురుమూర్తికి పోటెత్తిన భక్తజనం చిన్నచింతకుంట: శ్రావణ రెండో శనివారం, పౌర్ణమిని పురస్కరించుకొని కురుమూర్తి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. అర్చకులు ఆలయాన్ని శుద్ధిచేసి.. స్వామివారికి అభిషేకాలు, పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనాలు కల్పించారు. స్వామివారి దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. ఈ సందర్భంగా గోవిందనామస్మరణ మార్మోగింది. కొందరు భక్తులు సామూహికంగా సత్యనారాయణస్వామి వ్రతాలు ఆచరించారు. అమ్మాపురం సంస్థానాధీశుడు రాజ శ్రీరాంభూపాల్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పరిసరాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గోవర్ధన్రెడ్డి, ఈఓ మధనేశ్వరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘రాఖీ’ సందడి మన్యంకొండలో వైభవంగా వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం -
ముదురు నారులో యాజమాన్య పద్ధతలు
అలంపూర్: జిల్లాలో వరిసాగు విస్తారంగా ఉందని కొన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో వరినాట్లు వేసే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియానాయక్ అన్నారు. ఈ నేపథ్యంలో ముదురు నారులో యాజమాన్య పద్ధతులపై రైతులకు పలు సూచనలు సలహాలు అందజేశారు. నీటి విడుదలలో జాప్యం నీటి విడుదల్లో జాప్యం, వర్షాభావ పరిస్థితులు, బోరు బావు కింద సాగు చేయడంలో సమస్యలు వంటివి కారణాలతో వరినాట్లు వేయడంలో జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. దీంతో ముందుగా వేసుకున్న నారుమడ్లలో వరినారు ముదిరే అవకాశాలు లేకపోలేదు. ముదిరిన నారు వేసుకోనే యాజమాన్య పద్ధతుల్లో కేవలం సన్నరకం వరి వంగడాలకు మాత్రమే వర్తిస్తోందని వివరించారు. 30 రోజులు దాటితే సాధారణంగా 30 రోజుల నారును నాటు వేస్తారు. సాలుకు మధ్య 20 సెంటిమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 15 సెంటిమీటర్ల దూరంతో నాటు వేసుకోవాలి. నారువేసి 30 రోజులు దాటిందంటే దానిని ముదిరిన నారుగా పరిగణించాలి. 30 నుంచి 40 రోజుల నారును నాటేటప్పుడు సాలుకు సాలుకు మధ్య 15 సెంటిమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 15 సెంటిమీటర్లు దూరంతో నాటుకోవాలన్నారు. 40 నుంచి 50 రోజుల నారును నాటేటప్పుడు సాలుకు మధ్య 15 సెంటిమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 10 సెంటిమీటర్లు స్థలాన్ని వదులుకోవాలన్నారు. ముదిరిన నారు నాటేటప్పుడు నారు పిలకలు ఎక్కువగా నాటాలి. కుదురుకు 4 లేదా 5 మొక్కల చొప్పున నాటు వేసుకోవాలి. రెట్టింపుతో ఎరువుల వాడకం ముదురు నారు పొలానికి రెండు దఫాలుగా మాత్రమే ఎరువులు వేయాలి. అది కూడా రెట్టింపుతో వాడాలి. ముదురు నారు నాటినప్పుడు నత్రజని ఎరువు అధికంగా వాడాలి, 70 శాతం దమ్ము దశలో 30 శాతం అంకుర దశలో వాడాలి. భాస్వరం ఎరువు 50 శాతం పొటాష్తో ఎరువుతో కలిపి మొదటిసారి దమ్ములో వేయాలి. ఇలా చేయడం వలన పిలకలు తొందరగా వేసి దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది. మొదటి దఫా (నాటు వేసే సమయంలో) 50 కేజీల యూరియా, 50 కేజీల డీఏపీ, 15 కేజీల పొటాష్ వేస్తే సరిపోతుంది. ఇలా చేయడంతో దిగుబడి తగ్గకుండా ఉంటుంది. వరినాటు సమయంలో 2 మీటర్ల తర్వాత 20 సెంటిమీటర్ల చొప్పున తూర్పు, పడమరలుగా కాలిబాటలు వదలడం మంచిది. దీంతో పంటకు గాలి బాగా తగులుతుంది. పైగా తెగుళ్లు సోకకుండా ఉంటుంది. జిల్లాలో వరి సాగు జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్లో దాదాపు 55 వేల ఎకరాల్లో పంట సాగు చేపడుతున్నట్లు తెలిపారు. గతేడాది 80 వేల ఎకరాల్లో పంట సాగు జరిగింది. కానీ ఈ ఏడాది వరిసాగు 55 వేల ఎకరాల్లో జరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. -
ప్రభుత్వ భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్లు
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): గ్రామ పంచాయతీ భవనం మొదలుకొని రాష్ట్ర సెక్రెటరియేట్ వరకు అన్ని ప్రభుత్వ భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోలార్ విద్యుత్ను పెద్దఎత్తున ఉత్పత్తి చేయడానికి రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. ఇందుకోసం సోలార్ పవర్ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సోలార్ పవర్ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. అలాగే ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, కలెక్టర్లు ఎక్కువ అలసత్వం ప్రదర్శించకుండా వారంలోగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సమావేశంలో కలెక్టర్ విజయేందిర, ఆర్అండ్బీ ఈఈ దేశ్యానాయక్, రెడ్కో ఉమ్మడి జిల్లా మేనేజర్ మనోహర్రెడ్డి, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఆదివాసీల హక్కులను కాపాడాలి జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ఆదివాసీల హక్కులు కాపాడే బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని గిరిజన సంక్షేమాధికారి జనార్దన్ అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లాకేంద్రంలోని గిరిజన బాలుర హాస్టల్లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అంతకు ముందు ఆదివాసీ హక్కుల కోసం పోరాటం చేసిన మహనీయుల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీలు మైదాన ప్రాంతానికి దూరంగా జీవిస్తుంటారని, ప్రభుత్వం వారి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆదివాసీలు తమ హక్కులను తెలుసుకోవాలని వారికి అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఏటీడబ్ల్యూఓ చీన్యానాయక్, వార్డెన్ సబియాసుల్తానా, జ్ఞానేశ్వర్, గోపాల్, అర్చన తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్రోద్యమంలో క్విట్ ఇండియా కీలకపాత్ర స్టేషన్ మహబూబ్నగర్: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించడంలో క్విట్ ఇండియా ఉద్యమం కీలకపాత్ర పోషించిందని డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం క్విట్ఇండియా దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమం కీలకదశకు చేరినప్పుడూ మహాత్మగాంధీ ఇచ్చిన పిలుపుమేరకు యావత్ దేశంలోని ప్రజలు క్విట్ ఇండియా ఉద్యమంలో పెద్దఎత్తున పాల్గొన్నారన్నారు. దేశాభివృద్ధి కోసం తొలి ప్రధానమంత్రి నెహ్రూ అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తుచేశారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రజా పాలనలో అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు వివరించారు. -
అడ్డగోలుగా హాస్టళ్లు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరులో ప్రభు త్వ, ప్రైవేటు విద్యాసంస్థలు విస్తరించడం, ఎడ్యుకేషన్ హబ్గా మారడంతో ఉమ్మడి జిల్లా నుంచి పె ద్దసంఖ్యలో విద్యార్థులు ఇక్కడ చదువుకునేందు కు వస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థుల సంఖ్యకు అ నుగుణంగా ప్రభుత్వ వసతి గృహాల్లో సీట్లు ఇవ్వక పోవడంతో వారు ప్రైవేటు హాస్టళ్లను ఆశ్రయిస్తున్నా రు. దీనిని ఆసరాగా చేసుకున్న పలు హాస్టళ్ల నిర్వాహకులు సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నా రు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇష్టారీతిగా ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాకేంద్రంలో సుమారు 30 నుంచి 40 వరకు ప్రైవేటు హాస్టళ్లు ఉండగా.. చాలా వాటికి పూర్తిస్థాయిలో అనుమతులు, ఫుడ్సేఫ్టీ, శానిటేషన్, ఫైర్సేఫ్టీ, ట్రేడ్ లైసెన్స్ వంటివి లేకుండానే అడ్డగోలుగా నిర్వహిస్తున్నారు. కానీ, వీటివైపు ఇటు విద్యా శాఖ గాని, అటు మున్సిపల్ యంత్రాంగం గాని కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కనిపించని భద్రతా చర్యలు జిల్లాకేంద్రంలో ఎక్కువ సంఖ్యలో బాలికల హాస్ట ల్స్ ఉన్నాయి. వీటిలో చాలా హాస్టల్స్ దగ్గర నిర్వాహకులు సరైన భద్రతా పరమైన చర్యలు తీసుకోవ డం లేదన్న ఆరోపణలు లేకపోలేదు. కొన్ని బాలిక ల హాస్టళ్ల దగ్గర రాత్రి 10 నుంచి 11 గంటల వరకు యువకులు హల్చల్ చేస్తారని, ఆ సమయంలో కూడా బాలికలు బయటికి వస్తున్నారని తెలుస్తుంది. కొంతమంది బాలికలు రాత్రి ఎక్కువ సమయం బయటికి వచ్చినా పట్టించుకోకుండా తిరిగి హాస్టల్స్ లోకి రానిస్తున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలో యాజమాన్యాలు కేవలం ఫీజుల కోసం మాత్రమే హాస్టల్స్ నిర్వహిస్తున్నారని, బాలికల భద్రతను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. దీనికితోడు బాలికల హాస్టల్స్లో కేవలం చదువుకునే విద్యార్థినులు మాత్రమే ఉంటున్నారా.. లేక ఇతరులు ఎవరైనా ఉండి వెళ్తున్నారా అనే ప్రశ్న కు సమాధానం ఏ ఒక్కరి వద్ద సరైన సమాధానం లేదు. అలాగే ఎవరైనా ఒకరు హాస్టల్లో చేరిన వారం రోజులు ఉండి హాస్టల్ నచ్చక వెళ్లిపోతే నెల రోజులకు సంబంధించిన ఫీజు మొత్తం చెల్లించాలని ఇబ్బందులకు గురిచేసినట్లు తెలుస్తుంది. జిల్లాకేంద్రంలో ఇష్టారీతిగా ప్రైవేట్ వసతి గృహాల నిర్వహణ అనుమతులు లేకుండానే పదుల సంఖ్యలో ఏర్పాటు రూ.వేలల్లో ఫీజులు.. నాణ్యత లేని భోజనం వడ్డింపు రాత్రివేళలో మచ్చుకై నా కనిపించని భద్రతా చర్యలు అటువైపు కన్నెత్తి చూడని అధికార యంత్రాంగం -
రైతు సమస్యల పరిష్కారానికి పోరాటం
మహబూబ్నగర్ న్యూటౌన్: జిల్లాకేంద్రంలో ఈ నెల 25, 26 తేదీల్లో నిర్వహించే అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రథమ మహాసభలను విజయవంతం చేయాలని ఏఐయూకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాము అన్నారు. శనివారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతు సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామన్నారు. అలాగే మహాసభల్లో రైతాంగం కోసం చేసిన పోరాటాలను సమీక్షించుకొని నూతన కర్తవ్యాలను రూపొందించుకోవడం జరుగుతుందన్నారు. మొదటి రోజు మహాసభలకు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, సీపీఐ (ఎంఎల్ మాస్లైన్) రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, అధ్యక్ష, కార్యదర్శులు రంగయ్య, ప్రభాకర్ హాజరవుతారన్నారు. మొదటి రోజు మెట్టుగడ్డ ఐటిఐ కాలేజీ నుండి బాయ్స్ కాలేజీ గ్రౌండ్ వరకు ప్రధర్శన ఉంటుందని, అన ంతరం బహిరంగ సభ ఉంటుందన్నారు. రెండోరోజు నిర్వహించే ప్రతినిధుల సభకు హైకోర్టు జస్టిస్ చంద్రకుమార్ పాల్గొని ప్రసంగిస్తారన్నారు. సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ, టీయూసీఐ నాయకులు వెంకటేశ్, అరుణ్కుమార్, సాంబశివుడు తదితరులు పాల్గొన్నారు. -
ఫిర్యాదులు వస్తే..
జిల్లాకేంద్రంలో ప్రైవేటు హాస్టల్స్కు సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఉంటే ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న వాటిపై నిఘా పెడతాం. ట్రేడ్ లైసెన్స్తోపాటు హాస్టల్స్ ఏర్పాటుకు అవసరమైన అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న వాటిని పరిశీలిస్తాం. – ప్రవీణ్కుమార్రెడ్డి, మున్సిపల్ కమిషనర్, మహబూబ్నగర్ భద్రతా లోపం ఉంది.. జిల్లాకేంద్రంలోని అనేక ప్రైవేటు హాస్టళ్లలో భద్రతా పరమైన లోపాలు చాలా ఉన్నాయి. బాలికలు అర్ధరాత్రి వరకు బయటికి వెళ్లి తిరిగి వచ్చినా హాస్టల్స్కు అనుమతిస్తున్నారు. చాలా చోట్ల ఫీజులు కట్టిన నాణ్యమైన ఆహారం పెట్టడం లేదు. అలాగే కొన్ని రోజులున్నా నెల మొత్తం ఫీజు కట్టాలని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వీటిపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. – భరత్, జిల్లా కార్యదర్శి, ఎస్ఎఫ్ఐ● -
వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపాలి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: అమరరాజా కంపెనీ ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు కల్పించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి సూచించారు. మహబూబ్నగర్ నగర పరిధిలోని దివిటిపల్లి ఐటీ పార్క్లో రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఇక్కడ యువతకు మూడు నెలలపాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో శిక్షణ ఇస్తారన్నారు. కేవలం అమరరాజా కంపెనీ కోసమే కాకుండా అభ్యర్థులు ఎక్కడైనా ఉపాధి అవకాశాలు పొందేలా శిక్షణ ఇవ్వాలని నిర్వాహకులకు సూచించారు. మహబూబ్నగర్ను విద్య, వైద్య, రవాణా రంగాల్లో అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. అందులో భాగంగానే ప్రభుత్వ ఇంజినీరింగ్, లా, ఐఐఐటీ కళాశాలలను మంజూరు చేశారన్నారు. మహబూబ్నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో ఇన్ఫోసిస్ సహకారంతో మహిళలకు స్పోకెన్ ఇంగ్లిష్, సాఫ్ట్ స్కిల్స్లో శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. రానున్న పదేళ్లలో కనీసం 20 వేల మంది యువత నైపుణ్య శిక్షణ పొందేలా యత్నిస్తున్నామన్నారు. అనంతరం శిక్షణ పొందే అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో టాస్క్ సీఈఓ సుంకిరెడ్డి రాఘవేందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్గౌడ్, రాజన్న ఫౌండేషన్ డైరెక్టర్ జయకృష్ణ, ఓఎస్ఎస్ఐ సీఈఓ సలీంఅహ్మద్, నాయకులు సిరాజ్ఖాద్రీ, అజ్మత్అలీ, అవేజ్, హన్మంతు, శివశంకర్, రాషెద్ఖాన్, ఖాజాపాషా, శివప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి -
ఉద్యోగం సాధించడమే లక్ష్యం..
వాలీబాల్ అంటే చాలా ఇష్టం. వాలీబాల్ అకాడమీకి ఎంపికై నందుకు చాలా ఆనందంగా ఉంది. గతంలో ఎస్జీఎఫ్ అండర్– 14, అండర్– 14 రాష్ట్రస్థాయి టోర్నీల్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహించాను. గతేడాది సీఎం రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొనగా ద్వితీయ స్థానం వచ్చింది. భవిష్యత్లో ప్రొఫెషనల్ క్రీడాకారుడిగా ఎదగడంతోపాటు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నా. – ప్రశాంత్, పల్లెగడ్డ, మహబూబ్నగర్ రెండేళ్ల నుంచి ప్రాక్టిస్ మొదటిసారి వాలీబాల్ అకాడమీకి ఎంపికయ్యాను. రెండేళ్ల నుంచి ప్రాక్టిస్ చేస్తున్న. సిద్ధిపేట, మహబూబ్నగర్లో జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్ సెలక్షన్స్కు వెళ్లాను. ఈ రెండింట్లో కూడా ఎంపికయ్యాను. కానీ, మహబూబ్నగర్ అకాడమీలో చేరాను. ఇక్కడ వసతులు బాగున్నాయి. అటాకర్గా శిక్షణ తీసుకుంటున్న. – నరేష్, ఇప్పలపల్లి, రంగారెడ్డి -
అమెరికా టు పాలమూరు
మహబూబ్నగర్ జిల్లా: జిల్లాకేంద్రానికి చెందిన ఆర్.రాంకోటి, ప్రభావతి దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు. వీరిలో పెద్ద అమ్మాయి సౌమ్య పెళ్లి అనంతరం గత ఐదేళ్ల నుంచి అమెరికాలో ఉంటున్నారు. మూడేళ్లు చికాగోలో ఉండగా రెండేళ్ల నుంచి డల్లాస్లో ఉంటున్నారు. చెల్లి, తమ్ముడితో కలిసి ప్రతి రాఖీ పండుగను ఎంతో ఆనందోత్సవాల మధ్య జరుపుకొనేవారు. అయితే ఇప్పుడున్న సాంకేతిక రోజుల్లో డల్లాస్ నుంచి కొరియర్ ద్వారా తమ్ముడికి రాఖీ పంపిస్తోంది. వినయ్కుమార్ అక్క సౌమ్య పంపిన రాఖీతోపాటు మరో సోదరి విష్ణుప్రియతో రాఖీ కట్టించుకొని పండుగను సంతోషంగా జరుపుకొంటున్నాడు. అయితే ఈసారి నాలుగు రోజుల ముందే డల్లాస్ నుంచి రాఖీ వచ్చిందని, పండుగ రోజు వీడియో కాల్ ద్వారా అక్కతో మాట్లాడుతూ రాఖీ పండుగను జరుపుకొంటానని వినయ్కుమార్ పేర్కొన్నాడు.తమ్ముడిని మిస్సవుతున్న.. చిన్నప్పటి నుంచి రాఖీ పండుగ అంటే ఎంతో ఇష్టం. ప్రస్తుతం డల్లాస్లో ఉండడం వల్ల తమ్ముడిని రాఖీ కట్టలేకపోతున్న. రెండేళ్ల క్రితం రాఖీ పండుగ రోజు అక్కడే ఉండి తమ్ముడికి రాఖీ కట్టాను. ఈసారి రాఖీ పండుగ రోజు తమ్ముడిని ఎంతగానో మిస్ అవుతున్నా. కానీ, నేను పంపే రాఖీ తమ్ముడికి అందాలనే ఉద్దేశంతో నాలుగేళ్ల నుంచి కొరియర్ ద్వారా పంపుతున్న. ఆ రోజు వీడియో కాల్లో తమ్ముడికి రాఖీ పండుగ శుభాకాంక్షలు చెబుతాను. – సౌమ్య, ఎన్ఆర్ఐ (డల్లాస్) -
శబ్ధం.. కర్ణ కఠోరం
జడ్చర్ల: ఒకవైపు బైక్ సైలెన్సర్ల మోత.. మరోవైపు డీజే సౌండ్స్ కర్ణ కఠోరంగా మారుతున్నాయి. చెవులకు చిల్లులు పడేలా వినిపిస్తున్న భారీ శబ్ధాలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు అనారోగ్యం భారినపడే పరిస్థితులు నెల కొ న్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ధ్వని కాలు ష్యంతో వాహనదారులు అదిరిపడుతున్నారు. ఇటీ వల యువత తమ బైక్స్ సైలెన్సర్లను మార్చి భారీ శబ్ధం వచ్చేవాటిని అమర్చుకుని నయా ట్రెండ్ను సృష్టిస్తున్నారు. అతివేగంగా ప్రయాణిస్తూ దారినపోయేవారికి ఇక్కట్లు తెచ్చిపెడుతున్నారు. మార్కెట్లోకి రోజురోజుకు కొత్తగా వస్తున్న బైక్ సైలెన్సర్ల మోతతో ప్రశాంతంగా ఉండే కాలనీలు దడదడ శబ్ధాలతో జళ్లుపడుతున్నాయి. వీటికితోడు విచిత్రమైన హారన్ శబ్ధాలతో చుట్టుపక్కల వారిని హడలెత్తిస్తున్నారు. కొందరు ఆకతాయిలు బస్టాండ్, రద్దీ ప్రదేశాల్లో విన్యాసాలు చేస్తూ తోటివారు పడుతున్న ఇబ్బందులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రాత్రి, పగలు తేడాలేదు రోడ్డు రవాణా శాఖ వద్ద మోటర్ బైక్లను రిజిస్ట్రేషన్ చేసుకున్న అనంతరం సైలెన్సర్, హారన్లను మార్చుకుంటున్నారు. తదుపరి రాత్రి పగలు తేడా లేకుండా మితిమీరిన వేగంతో భారీ శబ్ధాలు చేస్తున్నారు. దీంతో చుట్టుపక్కల జనం శబ్దాల మోతకు జంకుతున్నారు. పసిపిల్లలయితే శబ్దాలకు మరింత భయాలకు లోనై అనారోగ్యం భారిన పడుతున్నారు. ఈ కారణంగా రాత్రి వేళ నిద్రలు పట్టక పోవడంతో వ్యవహారం తలనొప్పిగా మారింది. మత్తులో మోతమోగిస్తున్నారు ప్రధానంగా యువత మద్యం, గంజాయి తదితర మత్తు పదార్థాలను సేవించి విచ్చలవిడిగా బైక్లు నడుపుతున్నారు. ఆ సమయంలో మితిమీరిన వేగంతోపాటు హారన్ల మోతకు తోడు ఒక్కోసారి కేరింతలతో హడలెత్తిస్తున్నారు. ర్యాష్ డ్రైవింగ్తో రహదారులపై రాకపోకలు సాగించే వారు వీరి కారణంగా అదిరిపడుతున్నారు. ఎక్కడపడితే అక్కడ హారన్ల మోత నిబంధనల మేరకు ఆస్పత్రులు, విద్యాసంస్థలు, ఆలయాలు, కోర్టులు, పోలీస్స్టేషన్ తదితర ప్రార్థన స్థలాల వద్ద హారన్ మోగించవద్దు. ఆయా ప్రదేశాల ను సైలెన్స్ జోన్గా పరిగణిస్తారు. వాహనాల డ్రైవ ర్లు ఇవేమీ పట్టించుకోకుండా విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ హారన్ల మోత మోగిస్తున్నారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఇతర వాహనదారులు చికాకు పడే పరిస్థితి నెలకొనడమేగాక అనారోగ్యంబారిన పడే ప్రమాదముంది. డీజే సౌండ్లతో ఇబ్బందులు వేడుకల్లో జోష్ కోసం మితిమీరిన శబ్ధాలతో పెడు తున్న డీజేలు మరణ మృదంగాలవుతున్నాయి. ర్యాలీలు తదితర వేడుకలతోపాటు ఫంక్షన్ హాళ్లలో డీజేల మోతతో చెవులు చిల్లులు పడుతున్నాయి. శబ్ధాల హోరులో వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇండ్లలోని తలుపులు, కిటికీలు గడగడలాడుతున్నాయి. రోడ్లపై నిర్వహించే డీజేలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అనారోగ్యంతో ఆస్పత్రుల పాలవుతున్నారు. నిబంధనలు ఇలా.. రాత్రి సమయంలో 10గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు భారీ శబ్ధాలు నిషేధం. ఈ సమయంలో ఎలాంటి ర్యాలీలు తదితర శబ్దాలతో వేడుకలు నిర్వహించకూడదు. 70 డీజేబుల్స్ స్థాయిని మించి శబ్దాలు చేయకూడదన్న నిబంధనలు ఉన్నాయి. కానీ నిబంధనలను బేఖాతరు చేస్తూ భారీ సౌండ్స్ తో ప్రజలను తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఎక్కడికక్కడ చర్యలు చేపట్టి ప్రజలకు మేలు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. విచ్చలవిడిగా డీజేల వినియోగం జడ్చర్లలో విచ్చలవిడిగా డీజేలను వినియోగిస్తున్నారు. ర్యాలీలు, వేడుకలల్లో డీజేల సౌండ్తో ఉక్కిరిబిక్కరి అవుతున్నాం. బైక్ సైలెన్సర్లు, హారన్ శబ్ధాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. రోడ్డు రవాణా శాఖ అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవాలి. – శ్రీనివాసులు, జడ్చర్ల నరం దెబ్బతింటే వినికిడి లోపం భారీ శబ్ధాలతో చెవి నరాలు దెబ్బతింటాయి. వినికిడి కోసం మిషన్ వాడాల్సి వస్తుంది. మానవుల చెవులు 25 నుంచి 35 డిజెబుల్స్ వరకు మాత్రమే వినగలుగుతాయి. హారన్స్, సైలెన్సర్ల మోత, డీజే సౌండ్లో 50నుంచి 70 డిజెబుల్స్ సామర్థ్యానికి పైగా వస్తుంది. – కుమార్, ఈఎన్టీ, జడ్చర్ల చర్యలు చేపడుతాం పట్టణంలో శబ్ధ కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటాం. బైక్ సైలెన్సర్లను మార్చి ఇబ్బందులు కలిగించే వారిని గుర్తిస్తాం. అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా డీజేలు, హారన్లను వినియోగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – కమలాకర్, సీఐ, జడ్చర్ల దడ పుట్టిస్తున్న బైక్ సైలెన్సర్లు, హారన్లు జనం గుండెల్లో డీజే సౌండ్స్ మోత ఆకతాయిల చేష్టలతో అదిరిపడుతున్న ప్రజానీకం చోద్యం చూస్తున్న పోలీసులు, అధికారులు -
పీయూ అధ్యాపకుడికి డాక్టరేట్
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని వనపర్తి పీజీ సెంటర్లో భౌతికశాస్త్ర విభాగం అధ్యాపకుడు తలారి కృష్ణమూర్తికి ‘ఫిజికల్ అండ్ స్పెక్ట్రోస్కోపిక్ స్టడీస్ ఆఫ్ బిస్మత్ జింక్ లిథియం బోరేట్ గ్లాస్సెస్ డోపేడ్ విత్ రేర్ ఎర్త్ (గడోలినియం– జీడీ3 ప్లస్, టెర్బీయం– టీబీ3 ప్లస్) అయాన్స్శ్రీపై చేసిన పరిశోధనకు గాను ఓయూ నుంచి డాక్టరేట్ దక్కింది. ఈ సందర్భంగా ఆయనను శుక్రవారం పీయూ వీసీ శ్రీనివాసులు, రిజిస్ట్రార్ రమేష్బాబు అభినందించారు. -
పోలీసుల అదుపులో ‘ఘరానా దొంగ’
గండేడ్: గండేడ్ మండలంలో ఘరానా మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మండలంలోని రెడ్డిపల్లికి చెందిన ఘరానా దొంగ బాగోతంపై ‘సాక్షిశ్రీలో వరుసగా ఈ నెల 5న ‘గండేడ్లో ఘరానా దొంగ’, 6న ‘లీలలు చూడతరమా’, 7న ‘కలకలం.. కలవరం’ శీర్షికన వెలువడిన కథనాలు సంచలనం సృష్టించాయి. ఆధార్, రేషన్ కార్డుల మార్ఫింగ్తో మాయచేసి.. బతికున్న వారి పేరిట తప్పుడు డెత్ సర్టిఫికెట్లతో ఇన్సూరెన్స్ సొమ్ము, భూమి లేకున్నా ఉన్నట్లు సృష్టించి బ్యాంకుల్లో రుణాలు, రైతు బీమా స్వాహా చేయడంతోపాటు అమాయక రైతులను బురిడీ కొట్టించి, వారికి తెలియకుండానే వారి పేరిట పలు బ్యాంకుల్లో రుణాలు కాజేసిన ఆ ఘనుడి లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారంపై కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పోలీసులు శుక్రవారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పీఏసీఎస్ వద్ద ఉండగా మహమ్మదాబాద్ పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం మహమ్మదాబాద్ పోలీస్స్టేషన్కు తరలించినట్లు ఎస్ఐ శేఖర్రెడ్డి తెలిపారు. జిల్లా అధికారుల విచారణ.. ఆర్డీఓ నవీన్, జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశం, ఏడీఏ రాంపాల్, లీడ్బ్యాంకు మేనేజర్ గండేడ్ తహసీల్దార్ కార్యాలయంలో అక్రమాలపై విచారణ చేపట్టారు. బాధితులను పిలిపించి వారి వద్ద ఏయే ఆధారాలు ఉన్నాయో ఆరాతీశారు. భూమి విస్తీర్ణం మార్చడంపై ఆర్డీఓ నవీన్ రికార్డులు పరిశీలించారు. ఆరోపణలు వచ్చిన సర్వే నంబర్లలో ఎంతెంత భూమి ఉందన్న వివరాలు తెలుసుకున్నారు. అలాగే రైతు బీమా ఏమైనా కాజేశారా అన్న విషయాలను కూడా జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశం, ఏడీఏ రాంపాల్ పరిశీలించారు. నకిలీ మరణ ధ్రువపత్రాల జారీకి సంబంధించి వాస్తవాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆర్డీఓ నవీన్ ఎంపీడీఓ హరిశ్చంద్రారెడ్డిని ఆదేశించారు. ఈ మేరకు ఆన్లైన్ రికార్డులు పరిశీలించి సోమవారం నివేదిక ఇస్తామని ఎంపీడీఓ పేర్కొన్నారు. ‘సాక్షి’లో వచ్చిన అన్ని అంశాలపై సంబంధిత అధికారులు శాఖల వారిగా విచారణ కొనసాగించారు. అనంతరం గండేడ్ ఎస్బీఐలోనూ వివరాలు సేకరించారు. పీఏసీఎస్లో సైతం జిల్లా అధికారులు రుణాల దుర్వినియోగంపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ మల్లికార్జున్రావు, ఏఓ నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనాలు వరుస కథనాలకు స్పందించినజిల్లా యంత్రాంగం తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలు, బ్యాంకుల్లో విచారణ -
రక్షానుబంధం
ప్రేమానుబంధాలను చాటుతున్న రాఖీ పండుగ ● ఆధునిక కాలంలోనూ తగ్గని ఆదరణ ● కొరియర్ల ద్వారా తమ వారికి రాఖీలు పంపిస్తూ సంబరం ● సోషల్ మీడియాలోనూ శుభాకాంక్షల వెల్లువ ● నేడు రక్షాబంధన్ వేడుకలు జిల్లాకేంద్రానికి చెందిన చిట్టెమ్మ 1997లో మహబూబ్నగర్ ఆర్టీసీ డిపోలో కండక్టర్గా నియామకమైంది. తనకు ఎంతో ఇష్టమైన రాఖీ పండుగను తోటి కండక్టర్లు, డ్రైవర్లతో జరుపుకోవాలనే ఉద్దేశంతో అదే ఏడాది నుంచి రాఖీలు కట్టడం ప్రారంభించింది. డిపోలోని దాదాపు 220 మందికిపైగా డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బందికి కులమతాలకతీతంగా రాఖీలు కట్టి సోదరభావాన్ని చాటుతోంది. రాఖీపండుగ వచ్చిందంటే డిపోలోని అందరూ చిట్టెమ్మ కట్టే రాఖీ కోసం ఎదురుచూస్తుంటారు. ఈ సందర్భంగా చిట్టెమ్మ ‘సాక్షి’తో మాట్లాడుతూ ప్రతి ఏడాది రాఖీ పండుగ రోజు ఆర్టీసీ ఉద్యోగులందరికీ రాఖీలు కడతానని, రిటైర్డ్ అయ్యే వరకు రాఖీ పండుగ రోజు ఎంత బిజీగా ఉన్నా డిపోలోని ఉద్యోగులందరికి రాఖీలు కడతానని పేర్కొన్నారు. 28 ఏళ్ల నుంచి..