Mahabubnagar
-
అమరేశ్వరాలయంలో వెండి ఆభరణాల చోరీ
అమ్రాబాద్: స్థానికంగా ప్రసిద్ధి గాంచిన అమరేశ్వరాలయంలో కిలోన్నర వెండి ఆభరణాలు చోరీకి గురై ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి ఆలయ కమిటీ సభ్యులు, పోలీసులు వివరాలు. ఆలయంలో ప్రతి సోమవారం పూజలు చేసిన అనంతరం రాత్రి భజన కార్యక్రమం ఉంటుంది. ఎప్పటిలాగే సోమవారం అర్ధరాత్రి వరకు గ్రామస్తులు భజన చేసి ఇళ్లకు వెళ్లారు. ముగ్గురు వృద్ధులు అక్కడే నిద్రించారు. వీరు నిద్రలోకి జారుకున్న అనంతరం మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు శివలింగం వెండితొడుగు, అమ్మవారి కిరీటం, అభయ అస్తం కలిపి మొత్తం కిలోన్నర వెండి ఆభరణాలు అపహరించారు. డాగ్స్క్వాడ్తో తనిఖీలు విషయం తెలుసుకున్న ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాసులు గ్రామ పెద్దలతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్ఐ హన్మంత్రెడ్డి తన సిబ్బందితో వచ్చి పరిశీలించారు. డాగ్స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించారు. శివలింగం, అమ్మవారి విగ్రహాల మీద ఉన్న వేలిముద్రల ఆధారంతో కేసును దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. యువకుడి బలవన్మరణం మన్ననూర్: మనస్థాపంతో యువకుడి బలవన్మరణానికి పాల్పడిన ఘటన మ న్ననూర్లో మంగళవారం చోటు చేసుకున్నది. స్థాని కుల వివరాల ప్రకారం అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలోని ఉమామహేశ్వర కాలనీకి చెందిన రామావత్ చోక నాయక్ (45) భార్య ఉమతో గొడవపడ్డాడు. దీంతో మనస్థాపానికి గురై కలుపు నివారణ మందు తాగాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో కుటుంబసభ్యులు అచ్చంపేట ఆస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చారు. అమ్రాబాద్ పోలీసులు మృతుడి ఇంటి వద్దకు వచ్చి వివరాలు సేకరించారు. మృతుడికి భార్యతో పాటు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. విద్యుదాఘాతంతో వలస కూలీ మృతి మదనాపురం: బతుకు దెరువు కోసం నగరం వెళ్లి న ఆ కూలీని విద్యుత్ షాక్ బలితీసుకుంది. భవన నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉండగా.. 11కేవీ వైర్లు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన ఘటన వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలోని తుర్కయాంజల్లో చోటుచే సుకుంది. మదనాపురం మండలం శంకరమ్మపేటకు చెందిన బొగ్గు నాగరాజు (35) కొంతకాలంగా హైదరాబాద్లో వలస కూలీగా పనిచేస్తున్నారు. మంగళవారం తుర్కయాంజల్లో ఓ ఇంటి పైకప్పు (స్లాబ్) కాంక్రీట్ పనులు చేస్తుండగా, పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలు ప్రమాదవశాత్తు తగిలాయి. తీవ్రమైన విద్యుత్ ఘాతానికి గురైన నాగరాజు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నాగరాజు మృతివార్త తెలియగానే స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నా యి. మృతుడికి భార్య నాగలక్ష్మితోపాటు ము గ్గురు కూతుర్లున్నారు. తల్లిదండ్రులు వృద్ధాప్యంతోపాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న నాగ రాజు మృతితో ఆ కుటుంబం దిక్కులేనిదయ్యింది. బంధువులు, గ్రామస్తుల మధ్య అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వం, విద్యుత్ శాఖ స్పందించి బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పురుగు మందు తాగి యువకుడు బలవన్మరణం మానవపాడు: పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని గోకులపాడులో చోటు చేసుకుంది. ఎస్ఐ స్వాతి వివరాల మేరకు.. గోకులపాడుకు చెందిన నర్సింహులు (28) ఈ నెల 4న కొర్విపాడు గ్రామ శివారులో పురుగు మందు తాగాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. మృతిడి సోదరుడు శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య సరస్వతి, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. అతడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. -
నేడు పీయూలో ఎన్ఎస్ఎస్ రాష్ట్రస్థాయి కాన్క్లెవ్
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూలో బుధవారం ఎన్ఎస్ఎస్ రాష్ట్ర స్థాయి కాన్క్లెవ్ను నిర్వహిస్తున్నట్లు పీయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రవీణ పేర్కొన్నారు. ఈమేరకు పీయూలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను గుర్తించి, వారికి తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలు తెలిసే విధంగా కాన్క్లెవ్ను నిర్వహించనున్నట్లు తెలిపారు. సమాజంలో ఉన్న రుగ్మతలు, మూఢనమ్మకాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రస్థాయిలో పలు యూనివర్సిటీలు, కళాశాలల నుంచి ఎన్ఎన్ఎస్ వలంటీర్లు, ప్రోగ్రాం అధికారులు కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ఇప్పటికే పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వారికి ఎటువంటి ఫీజులు లేవని, ప్రోగ్రాం అధికారులకు మాత్రం నామమాత్రపు ఫీజులతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. కార్యక్రమంలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఉపాన్యాసాలు, పోస్టర్ ప్రజెంటేషన్ ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, పీయూ వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్బాబు పాల్గొంటారని తెలిపారు. ఇటువంటి కాన్క్లెవ్ను రాష్ట్రంలోనే మొదటి సారిగా నిర్వహిస్తుందన్నందున పెద్ద సంఖ్యలో ఎన్ఎస్ఎస్ వలింటీర్లు హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పీఆర్వో గాలెన్న, ప్రోగ్రాం అధికారులు రవికుమార్, జ్ఙానేశ్వర్, రాఘవేందర్, సుదర్శన్, ఈశ్వర్ తదితరులుపాల్గొన్నారు. -
ప్రాణం తీసిన పాత కక్షలు
కల్వకుర్తి టౌన్: వారంతా ఒకే తండ్రి పిల్లలు.. కానీ ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకున్నారు. ఈ క్రమంలో ఏర్పడిన భూ తగాదా, పాత కక్షలతో ఒకరి ప్రాణం తీశారు. వెల్దండ మండల కేంద్రంలో ఈ నెల 3న చోటు చేసుకున్న యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం కల్వకుర్తిలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ వెంకట్రెడ్డి వెల్లడించారు. ఆయన వివరాల మేరకు.. వెల్దండకు చెందిన రుద్రాక్షల సాయిలుకు ముగ్గురు భార్యలు ఉన్నారు. మొదటి భార్య జంగమ్మకు రుద్రాక్షల కృష్ణయ్య, రెండవ భార్య అంజనమ్మకు శివశంకర్, మహేశ్, మూడవ భార్య మానుపాటి పెద్ద వెంకటమ్మకు అన్వేష్, శివ, పవన్ సంతానం ఉన్నారు. కల్వకుర్తిలో పెద్ద వెంకటమ్మకు ఉన్న పందుల షెడ్డును పలు కారణాలతో తీసివేయగా.. దాన్ని 2023లో రుద్రాక్షల సాయిలు తన వ్యవసాయ పొలంలో పెట్టించాడు. ఈ విషయంపై రెండవ భార్య పిల్లలైనా మహేశ్, శివశంకర్ అభ్యంతరం తెలిపారు. దీనిపై గొడవలు కూడా జరిగాయి. ఈ క్రమంలోనే సాయిలు తన కూతురుకు 20 గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేయడానికి వెల్దండలో స్లాట్ బుక్ చేయగా.. మహేశ్ అడ్డుకున్నాడు. ఈ విషయంలోనూ మొదటి, రెండో భార్య పిల్లలకు గొడవలు జరిగి.. వెల్దండ పోలీస్స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. అదే విధంగా కల్వకుర్తికి చెందిన బెల్లంకొండ రాములుకు చెందిన పందులను మానుపాటి పవన్, శివ, అన్వేష్ చోరీ చేసి వెల్దండలోని షెడ్డు వద్ద ఉంచారని మహేశ్ సమాచారం ఇవ్వడంతో కల్వకుర్తి పోలీస్స్టేషన్లో చోరీ కేసు నమోదైంది. ఆ తర్వాత తన పందులను తీసుకెళ్లేందుకు వెల్దండకు వెళ్లిన బెల్లంకొండ రాములును గతేడాది ఆగస్టు నెలలో పవన్, శివ, అన్వేష్ కలిసి హత్యచేశారు. ఈ కేసులో వారంతా జైలుకు వెళ్లగా.. అదే సమయంలో మహేశ్ను ఎరుకల సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అయితే అతడు ఎదిగితే తమను బతకనివ్వడని భావించిన చిన్నమ్మ పెద్ద వెంకటమ్మ, ఆమె కుమారులు అన్వేష్, శివ, పవన్ తమ సమీప బంధువు కృష్ణయ్యతో కలిసి మహేశ్ హత్యకు పథకం రచించారు. ● నిందితులు జైలుకు వెళ్లి వచ్చాక మహేశ్తో స్నేహం ఏర్పరచుకొని అతడి పూర్తి కదలికలను నిశితంగా గమనించారు. ఈ క్రమంలోనే కల్వకుర్తిలోని గాజులవాడకు చెందిన బురాన్ అనే టిప్పర్ డ్రైవర్కు రూ. 2లక్షలకు సుఫారీ ఇచ్చారు. రంజాన్ ముందు రోజు రూ.లక్ష, మరో 20 రోజుల తర్వాత రూ. 50వేలను అతడికి అందజేశారు. అనుకున్న పథకం ప్రకారం ఈ నెల 3న వెల్దండ నుంచి వ్యవసాయ పొలానికి కారులో వెళ్తున్న మహేశ్ను టిప్పర్తో ఢీకొట్టారు. అయినప్పటికీ అతడు చనిపోలేదు. ఈ క్రమంలో టిప్పర్ డ్రైవర్ బురాన్ మహేశ్ కాళ్లు పట్టుకోగా.. అన్వేష్, శివ బండరాయితో తలపై మోది హతమార్చారు. కుటుంబ సభ్యులే సుఫారీ ఇచ్చి హతమార్చిన వైనం హత్య చేసి.. రోడ్డుప్రమాదంగా చిత్రీకరించే యత్నం వెల్దండలో యువకుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు నిందితుల అరెస్టు.. రిమాండ్కు తరలింపు వివరాలు వెల్లడించిన కల్వకుర్తి డీఎస్పీ వెంకట్రెడ్డి వెల్దండ పోలీసులకు రోడ్డు ప్రమాదం జరిగిందని సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మొదటగా రోడ్డు ప్రమాదంగా కేసు నమోదు చేశారు. విచారణ ప్రారంభించిన పోలీసులు.. అనుమానంతో లోతుగా విచారణ చేపట్టడంతో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. గతంలో వీరి వ్యవసాయ పొలంలో రాములును హతమార్చిన నిందితులను తమదైన శైలిలో విచారించగా.. వారే హత్య చేశారని ఒప్పుకున్నారు. వెల్దండ సీఐ రఘువీర్రెడ్డి, ఎస్ఐ కురుమూర్తి నిందితులను కల్వకర్తిలోని పందుల షెడ్డు వద్ద అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులు అన్వేష్, శివ, పవన్, వెంకటమ్మ, కృష్ణయ్య, బురాన్ నుంచి ఆరు సెల్ఫోన్లు, టిప్పర్, కారును స్వాధీనం చేసుకొని సీజ్ చేశామని వెల్లడించారు. కేసును త్వరగా ఛేదించిన వెల్దండ సీఐ, ఎస్ఐ, సిబ్బందిని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్, డీఎస్పీ వెంకట్రెడ్డి అభినందించారు. -
ముగిసిన బ్రహ్మోత్సవాలు
చారకొండ: అపర భద్రాద్రి సిర్సనగండ్ల శ్రీసీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం ముగిశాయి. శ్రీరామనవమిని పురస్కరించుకొని గత నెల 26న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు పక్షం రోజులపాటు అంగరంగ వైభవంగా కొనసాగాయి. వివిధ ప్రాంతాల నుంచి వేలాది భక్తులు తరలివచ్చి సీతారామస్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. చివరిరోజు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయం నుంచి సిర్సనగండ్ల గ్రామంలోకి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తిసుకెళ్లారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రామశర్మ, ఈఓ ఆంజనేయులు, మేనేజర్ నిరంజన్, అర్చకులు లక్ష్మణ్ శర్మ, అనంత శర్మ, కోదండరామ శర్మ, మురళీధర్ శర్మ, ప్రవీణ్ శర్మ పాల్గొన్నారు. బావాజీ ఆలయ హుండీ లెక్కింపు కొత్తపల్లి: దక్షిణ భారతేశంలోనే అతిపెద్ద గిరిజన పుణ్యక్షేత్రం గురులోకా మసంద్ బావాజీ బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ సముదాయంలోని హుండీని మంగళవారం మద్దూరు పోలీసుల బందోబస్తులో మద్దూరు ఎస్బీఐ అధికారులు, ఎండోమెంట్ సిబ్బందితో లెక్కించారు. ఆలయంలో మూడు హుండీలు ఉండగా.. మొదటగా బావాజీ హుండీ లెక్కించగా 21, 20, 372, హనుమాన్ ఆలయ హుండీ లెక్కించగా 14, 8, 890 నగదు ఉన్నట్లు ఆలయ ఈఓ కోమల్ తెలిపారు. మొత్తంగా బావాజీ హుండీ, ఆంజనేయ స్వా మి హుండీ లెక్కించగా రూ.35,29, 262 వచ్చినట్లు తెలపారు. ఇంకా కాళికా దేవి ఆలయంలోని హుండీ లెక్కించాల్సి ఉందన్నారు. కేఎల్ఐ కాల్వలో బాలుడు గల్లంతు నాగర్కర్నూల్ క్రైం: కేఎల్ఐ కాల్వలో ఈతకు వెళ్లిన బాలుడు గల్లంతైన ఘటన మండలంలోని పెద్దాపూర్లో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు.. పెద్దాపూర్ గ్రామానికి చెందిన పులి రవీందర్ (16) స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని కేఎల్ఐ కాల్వలో ఈత పడేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు రవీందర్ కాల్వలో గల్లంతవడంతో గమనించిన స్నేహితులు పోలీసులు, అగ్నిమాపకశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకుని గాలింపు చేపట్టినప్పటికీ ఆచూకీ దొరకలేదు. రాత్రి కావడంతో గాలింపు నిలిపివేశారు. -
రాష్ట్రంలోనే పేట ఆస్పత్రిలో అత్యధిక ప్రసవాలు
పాలమూరు: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏడాది కాలంలో ఉత్తమ పనితీరు కనబరిచిన ఆరోగ్యశాఖ, జనరల్ ఆస్పత్రులకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను ప్రదానం చేసింది. ఉత్తమ పనితీరు కనబరిచిన బాదేపల్లి ఆర్బీఎస్కే బృందం రాష్ట్ర ఉత్తమ అవార్డు పొందగా.. నారాయణపేట జిల్లా జనరల్ ఆస్పత్రి రాష్ట్రంలోనే అత్యధికంగా సాధారణ ప్రసవాలు చేసినందుకు రాష్ట్ర ఉత్తమ అవార్డు దక్కించుకుంది. ఈ మేరకు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ సంపత్కుమార్ సింగ్కు హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదార రాజనర్సింహ అవార్డు అందజేశారు. -
వ్యభిచారం కేసులో ఇద్దరికి రిమాండ్
మహబూబ్నగర్ క్రైం: ఇటీవల అపార్ట్మెంట్లో వ్యభిచారం నడుపుతున్న ముఠాను అరెస్టు చేసిన టూటౌన్ పోలీసులు నిర్వాహకులను మంగళవారం రిమాండ్కు తరలించారు. టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ ఇజాజుద్దీన్ వివరాలు వెల్లడించారు. ఈ నెల 1న నగరంలోని అశోక్టాకీస్ చౌరస్తా సమీపంలోని శ్రీసాయి బాలాజీ టవర్స్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడులు చేసి ఇద్దరు మహిళలు, ఐదుగురు విటులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వ్యభిచారం నడిపే అసలు సూత్రధారి అయిన సంతోష్రెడ్డి పరారీలో ఉండగా.. మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఏ1 సంతోష్రెడ్డి, ఏ2 ఆంజనేయులు రిమాండ్కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. సంతోష్రెడ్డిపై గతంలో మహబూబ్నగర్ రూరల్ పోలీస్స్టేషన్లో సైతం వ్యభిచారం కేసు నమోదైందని తెలిపారు. రెండు నెలల నుంచి బాలాజీ టవర్స్ అపార్ట్మెంట్లో 309 ప్లాట్ను అద్దెకు తీసుకుని వ్యభిచారం నడిపిస్తున్నట్లు తేలిందన్నారు. ఇతడి స్వస్థలం నల్గొండ కాగా నగరంలో హౌజింగ్ బోర్డులో అద్దెకు ఉంటున్నట్లు తెలిపారు. -
ఫలాలనిచ్చే మొక్కలు నాటితే మంచిది
మహమ్మదాబాద్/గండేడ్: అటవీ ప్రాంతంలోని ఖాళీస్థలాల్లో ఫలాలనిచ్చే మొక్కలు నాటితే చాలా మంచిదని జోగుళాంబ సర్కిల్ కన్జర్వేటర్ ఆఫ్ పారెస్ట్ అధికారి శివాల రాంబాబు తెలిపారు. మంగళవారం ఆయన మహమ్మదాబాద్ రేంజ్ పరిధిలోని జూలపల్లి అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన గతంలో నాటిన మొక్కలు ఎలా ఉన్నాయి.. ఏ రకమైన మొక్కలు ఉన్నాయి.. మంచి ఫలాలనిచ్చే మొక్కలు నాటారా అన్న కోణంలో పరిశీలించారు. రెండు సంవత్సరాల క్రితం నాటిన మొక్కలు ఏపుగా ఎదగడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం కూడా ఇలాంటి ప్లాంటేషన్ చేయాలని సూచించారు. కాగా అటవీ ప్రాంతంలో గతంలో లక్షలు ఖర్చుచేసి నాటిన మొక్కలు పాడవకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. ఏపుగా పెరిగిన మొక్కలను అనుమతులు లేకుండా తీసి వేయరాదని అలాంటి పొరపాట్లు అటవీశాఖ అధికారులు చేయరాదని సూచించారు. ముఖ్యంగా నర్సరీల్లో మొక్కలు ఆరోగ్యంగా పెరిగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి సత్యనారాయణ, ఫ్లయింగ్ స్క్వాడ్ గణేష్, మహమ్మదాబాద్ రేంజ్ అధికారి అబ్దుల్హై, డిప్యూటీ రేంజ్ అధికారి రాఘవేందర్, ఉదయ్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
మూల్యాంకన కేంద్రం వద్ద టీచర్ల నిరసన
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని మహబూబ్నగర్ గ్రామర్స్కూల్ వద్ద నిర్వహిస్తున్న పదో తరగతి మూల్యాంకన కేంద్రం వద్ద ఉపాధ్యాయులు నిరసనకు దిగారు. తమకు గతేడాది మూ ల్యాంకనానికి సంబంధించి డబ్బులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరో వారం పదిరోజుల్లో ఈ ఏడాది స్పాట్ వ్యాలువేషన్ కూడా పూర్తి అవుతుందన్నారు. అలాగే కులగణనకు సంబంధించిన నిధులను కూడా ఇవ్వాలని కోరారు. ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు, ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. విషయం తెలుసుకున్న ఆర్జేడీ సోమిరెడ్డి అక్కడికి చేరుకొని ఉపాధ్యాయులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వీలైనంత త్వరగా డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం డీఈఓ ప్రవీణ్కుమార్కు వినతిపత్రం అందజేశారు. యూటీఎఫ్ వెంకటేష్, రవికుమార్, పీఆర్టీయూ మదన్మోహన్, సుధాకర్రెడ్డి, రవీందర్గౌడ్, ప్రభాకర్, మహమూద్ పాల్గొన్నారు. -
బాలకార్మికులను రక్షించే చర్యలు చేపట్టాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో వలస బాలకార్మికులను రక్షించి వారికి విద్య, ఆరోగ్య సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలన లక్ష్యంగా జిల్లాస్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ కార్మికశాఖ అధికారులు రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్, ఆరోగ్య, సంక్షేమ, విద్యశాఖలతో సమన్వయం చేసుకుని ఇటుక బట్టీలు, పౌల్ట్రీ ఫారాలలో, హోటళ్లు, ఇళ్లలో పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించి, బాలల హక్కులను ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 14 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టడం చట్టవిరుద్ధమని, అలాంటి సందర్భాలు కనిపిస్తే వెంటనే గుర్తించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో పర్యటించి రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. వలస కార్మికులకు రేషన్ సౌకర్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వ తీసుకొచ్చిన ‘ఒక దేశం – ఒక రేషన్ కార్డు‘ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ జేఎల్బీ హరిప్రియ, ఏఎస్పీ ఎన్బీ రత్నం, జెడ్పీ వెంకట్ రెడ్డి, ఉప కార్మిక కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్, డీఆర్డీఓ నరసింహులు, డీడబ్ల్యూఓ జరీనా బేగం, డీఎంహెచ్ఎం కృష్ణ పాల్గొన్నారు. -
ఆరోగ్యకరమైన జీవన విధానం అలవర్చుకోవాలి
పాలమూరు: సాధారణ వ్యక్తుల నుంచి ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరిలో ఒత్తిడి పెరిగిందని, ఈ క్రమంలో నాణ్యమైన ఆహారం, నిత్యం వాకింగ్, యోగా, ధ్యానం చేయాలని, ఆరోగ్యంగా ఉండటం అంటే శారీరకంగా మానసికంగా భావోద్వేగపరంగా సంతోషంగా ఉండటం అని జిల్లా వైద్యారోగ్యశాఖ డాక్టర్ కృష్ణ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పాత డీఎంహెచ్ఓ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన ర్యాలీని డీఎంహెచ్ఓ పాటు 56 డివిజన్ కార్పొరేటర్ ఫర్హాత్ బేగం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుత జీవన విధానంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ కలిగి ఉండాలని సూచించారు. అందుకోసం ఆరోగ్యకమైన జీవన విధానం అలవర్చుకోవాలన్నారు. వైద్యారోగ్యశాఖలో పని చేసే సిబ్బంది సైతం ముందుగా వ్యక్తిగత ఆరోగ్యంపై దృష్టిసారించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ శశికాంత్, ప్రోగ్రామ్ అధికారులు శివకాంత్, పులి విద్య, మంజుల,హెల్త్ ఎడ్యుకేటర్లు హన్మంతు, నాగరాజు శెట్టి, సుభాష్, పట్టణ ఆరోగ్య వైద్యాధికారులు పాల్గొన్నారు. -
నైపుణ్యాభివృద్ధికి శిక్షణ
పీయూ పరిధిలో చదువుతున్న విద్యార్థులకు స్కిల్స్ అందించేలా అధికారుల కసరత్తు ● టీసీఐఎల్తో ఒప్పందం, పోటీ పరీక్షలు ఇతర స్కిల్ డెవలప్మెంట్కు ఆన్లైన్ శిక్షణ ● ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న 32,892 మంది విద్యార్థులు ● పీఎంఐఎస్ ద్వారా ఇంటర్న్షిప్, స్కాలర్షిప్ పొందే అవకాశం ● డీట్ యాప్లో దరఖాస్తు చేసుకుంటే ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు –8లో uమహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థులు వారు చదివిన కోర్సులకు అనుగుణంగా ఉద్యోగాలు సాధించేందుకు యూనివర్సిటీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కళాశాల స్థాయిలో ఉన్నప్పుడే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు సాధించేలా ఇంటర్వ్యూ, కమ్యూనికేషన్ స్కిల్స్, కాగ్నిటివ్ స్కిల్ పెంపొందించేలా పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. వీటితో పాటు టెక్నికల్ ఎడ్యుకేషన్, ఫార్మ, ఎంబీఏ, ఎంసీఏతో పాటు ఇతర కోర్సుల విద్యార్థులకు కళాశాల స్థాయిలోనే ఇంటర్న్షిప్కు అవకాశం కల్పించనునున్నారు. వీటి ద్వారా స్కాలర్షిప్తో పాటు విద్యార్థి అనుభవం కూడా పొందనున్నారు. డీట్ (డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ తెలంగాణ) యాప్నకు సంబంధించి పీయూ పరిధిలోని వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లతో ఆన్లైన్ సమావేశం నిర్వహించగా.. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి పాల్గొన్నారు. డీట్తో ఉద్యోగాలు.. విద్యార్థులు చదువు పూర్తయిన వెంటనే ప్రైవేటు సెక్టార్లో, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం డీట్ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. విద్యార్థులు యాప్ను డౌన్లోడ్ చేసుకుని వారి పేరు, కోర్సుతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో యాప్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు కంపెనీలు యాప్లో ఇందులో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండడం ద్వారా విద్యార్థి అర్హతను బట్టి ఏ ఉద్యోగం కావాలో యాప్లో పొందే అవకాశం లభిస్తుంది. ఈ క్రమంలో యాప్లో విద్యార్థులు దరఖాస్తులు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి, వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్బాబు ఆన్లైన్ ద్వారా సమావేశం ఏర్పాటు చేయగా.. పీయూ పరిధిలోని 80 కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం.. విద్యార్థులకు ఇంటర్వ్యూలు, పోటీ పరీక్షలకు సిద్ధమవడంతోపాటు పలు రకాల శిక్షణ అందించేందుకు కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ టీసీఐఎల్ (టెలీకమ్యూనికేషన్ కన్సల్టెన్సీ ఇండియా లిమిటెడ్)తో అధికారులు ఒప్పందం చేసుకున్నారు. దీని ద్వారా పీయూ పరిధిలోని 112 కళాశాలల్లో చదువుతున్న 32,892 మంది విద్యార్థులు ఆన్లైన్ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. విద్యార్థి టెక్నికల్, నాన్ టెక్నికల్ వంటి వివరాలను వెబ్సైట్లో పొందుపరిస్తే వారికి అవసరమైన కోర్సులు చూపిస్తుంది. విద్యార్థి ఏ రకమైన కోర్సు కావాలో ఎంపిక చేసుకుంటే అందుకు సంబంధించి వివరాలు వస్తాయి. ఇలా విద్యార్థికి వచ్చిన స్టడీ మెటీరియల్, కంటెంట్ను పూర్తి చేయాల్సి ఉంటుంది. విద్యార్థి దీన్ని ఖాళీ సమయంలో ల్యాప్టాప్, సెల్ఫోన్లో కూడా చేయవచ్చు. -
విద్యతో పాటు నైపుణ్యఅంశాల్లో శిక్షణ తీసుకోవాలి
స్టేషన్ మహబూబ్నగర్: ప్రస్తుత కాలంలో బాలికలు విద్యతో పాటు నైపుణ్య అంశాల్లో తీసుకోవాలని ఎస్పీ డి.జానకి సూచించారు. జిల్లాకేంద్రం మర్లులో అన్వారే మదీనా ఎడ్యుకేషనల్, వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 60 మంది బాలికలకు కంప్యూటర్, టైలరింగ్, మెహిందీ డిజైన్ వంటి అంశాల్లో శిక్షణ అందజేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న బాలికలకు మంగళవారం ఎస్పీ తన కార్యాలయంలో సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నైపుణ్య శిక్షణతో స్వయం ఉపాధి ఏర్పరుచుకొని ముందుకు సాగవచ్చని అన్నారు. బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. బాలికలు నైపుణ్య అంశాల్లో శిక్షణ తీసుకునేలా తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. చదువుకున్న బాలిక కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తారన్నారు. కార్యక్రమంలో సొసైటీ ప్రధాన కార్యదర్శి మహ్మద్ మక్బూల్, మహ్మద్ సిరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఉదండాపూర్ నిర్వాసితుల ఖాతాల్లోకి రూ.150 కోట్లు జడ్చర్ల: ఉదండాపూర్ నిర్వాసితుల ఖాతాల్లోకి రూ.150 కోట్లు పరిహారం జమ చేసే విధంగా చర్యలు తీసుకున్నామని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ నిర్వాసితుల నిర్మాణాలకు సంబంధించిన పరిహారాన్ని వారి ఖాతాలలో జమ చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ నిధుల విడుదల ప్రక్రియను పూర్తి చేశారన్నారు. మిగతా నిధులను కూడా ఈ నెలాఖరు వరకు విడుదల చేసేందుకు కృషి చేస్తామన్నారు. నిధుల విడుదలకు సంబంధించి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఈ మేరకు హామీ ఇచ్చారని అన్నారు. అదేవిధంగా అవార్డు పాస్ కాని నిర్వాసితులకు సంబంధించి కూడా త్వరితగతిన పూర్తి చేసి పరిహారం అందించే విధంగా చూస్తామన్నారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీని పూర్తిస్థాయిలో అమలు చేస్తామని, ప్రతి నిర్వాసిత కుటుంబానికి కొత్త ప్యాకేజీ ప్రకారంగా రూ.18 లక్షలు పరిహారం అందజేస్తామని పేర్కొన్నారు. వేరుశనగ క్వింటా రూ.7,968 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో మంగళవారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.7,968, కనిష్టంగా రూ.5,666 ధరలు లభించాయి. కందులు గరిష్టంగా రూ.6,226, కనిష్టంగా రూ.6,100, ఆముదాలు గరిష్టంగా రూ.6,370, కనిష్టంగా రూ.6,048, జొన్నలు గరిష్టంగా రూ.6,020, కనిష్టంగా రూ.4,297, చింతగింజలు రూ.2,676, ఉలువలు రూ.4,101, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,892, కనిష్టంగా రూ.1,650 ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్లో ఆర్ఎన్ఆర్ ధాన్యం ధర క్వింటా గరిష్టంగా రూ.2,243, కనిష్టంగా రూ.2,029, హంస ధాన్యం గరిష్టంగా రూ.1,779, ఆముదాలు గరిష్టంగా రూ.6,139, కనిష్టంగా రూ.6,089గా ధరలు నమోదయ్యాయి. మార్కెట్కు దాదాపు రెండు వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. -
స్పోర్ట్స్ స్కూల్కు 20 మంది ఎంపిక
మహబూబ్నగర్ క్రీడలు: రాష్ట్రంలోని క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కోసం జిల్లాకేంద్రంలోని ప్రధాన స్టేడియంలో గతనెల 31వ తేదీన నిర్వహించిన జిల్లాస్థాయి స్పోర్ట్స్ ఎంపిక ఫలితాలను మంగళవారం జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్ ప్రకటించారు. రాష్ట్రస్థాయి 4వ తరగతిలో ప్రవేశాల కోసం 10 మంది బాలురు, 10 మంది బాలికలను ఎంపిక చేశామని తెలిపారు. ఎంపికై న విద్యార్థులకు హైదరాబాద్లోని హకీంపేట క్రీడా పాఠశాలలో వచ్చేనెల 1వ తేదీన రాష్ట్రస్థాయి సెలక్షన్స్ ఉంటుందని తెలిపారు. ఎంపికై న విద్యార్థులు 10 పాస్ ఫొటోలు, పాఠశాల, మున్సిపాలిటీ లేదా తహసీల్దార్ కార్యాలయం నుంచి జనన ధ్రువీకరణ పత్రం, ప్రస్తుత పాఠశాల నుంచి స్టడీ సర్టిఫికెట్, 3వ తరగతి ప్రోగ్రెస్ రిపోర్ట్, ఆధార్ కార్డు, కమ్యూనిటీ సర్టిఫికెట్తో హకీంపేట స్పోర్ట్ స్కూల్లో ఎంపికలకు హాజరుకావాలని డీవైఎస్ఓ సూచించారు. ఇతర వివరాలకు జిల్లా యువజన, క్రీడల కార్యాలయంలో సంప్రందించాలని సూచించారు. ఎంపికై న విద్యార్థులు బాలురు: ఎం.సాయిచంద్ర (హన్వాడ), జి.గగన్, సమర్థ్ (మహబూబ్నగర్ అర్బన్), పాల శివసాయిరెడ్డి (గండీడ్), ఎ.శ్రీవర్ధన్ (హన్వాడ), వి.ధృవన్ (నవాబ్పేట), ఎ.అశ్విత్రాణసాయి (మహబూబ్నగర్ అర్బన్), ఎండీ అవేజ్ (చిన్నచింతకుంట), ఎర్పుల వర్షిత్ (మహబూబ్నగర్ రూరల్), హృతిక్ క్రిష్ణ యాదవ్ (హన్వాడ). బాలికలు: వి.సాయి వైష్ణవి (మహబూబ్నగర్ అర్బన్), వి.అఖిరాబాయి(బాలానగర్), కొత్త కీర్తన (అడ్డాకుల), కాట్రావత్ సింధ ు(హన్వాడ), మెగావత్ ఆరాధ్య (కోయిలకొండ), బి.జాహ్నవి (జడ్చర్ల), పానుగంటి తన్మయి (కోయిలకొండ), ఎం.జ్యోతిక శ్రీ (మహబూబ్నగర్ అర్బన్), నేనావత్ శైలజ (బాలానగర్), జె.అన్విక (కోయిలకొండ). -
కేంద్రంలో అధికారంలోకి వస్తే పాలమూరుకు జాతీయ హోదా
సాక్షిప్రతినిధి, మహబూబ్నగర్/స్టేషన్ మహబూబ్నగర్: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ఆ తర్వాత మూడు నెలల్లో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేష్కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ అధ్యక్షతన నూతన జిల్లా కమిటీ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే మహబూబ్నగర్ జిల్లా సస్యశ్యామలం అవుతుందని, లక్షలాది సాగునీటితో పాటు పక్కనే ఉన్న హైదరాబాద్కు తాగునీటి అవసరాలను తీర్చే అవకాశం ఉంటుందన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని మన ఎంపీలు కోరుతున్నా బీజేపీ ప్రభుత్వం పెడచెవిన పెడుతుందన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్గాంధీ ప్రధానమంత్రి అయితే ఈ ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పిస్తామన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన యువకుడైన సీఎం రేవంత్రెడ్డి అహర్నిశలు ఈ జిల్లా అభివృద్ధికి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. మొదటిస్థానంలో టీపీసీసీ.. సంఘటన్ సృజన్ అభియాన్ ద్వారా దేశంలోని 20 రాష్ట్రాల్లో డీసీసీ అధ్యక్షుల ఎంపిక జరిగిందని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. సంస్థాగతంగా పార్టీ బలోపేతం చేయడంలో తెలంగాణలో మన టీపీసీసీ మొదటిస్థానంలో ఉండడం మనందరికి గర్వకారణమని అన్నారు. ప్రతి నెల కచ్చితంగా డీసీసీ ఎగ్యిక్యూటివ్ సమావేశం నిర్వహించాలన్నారు. నేను ఎక్కడా ఉన్నా ఈ సమవేశంలో పాల్గొంటానని తెలిపారు. డీసీసీ కమిటీపై గురుతరమైన బాధ్యత అని అన్నారు. గ్రామ, బూత్స్థాయిల్లో పార్టీ బలోపేతం చేయాలని, ప్రజలకు సంక్షేమ పథకాలు వివరించాలని కోరారు. ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను అక్కున చేర్చుకుంటుందన్నారు. అందరికి సమాన అవకాశాలు కల్పించాలన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని అన్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ వర్గాలకు తావు లేకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా రానున్న రెండున్నర ఏళ్లు పని చేద్దామని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ పార్టీ పటిష్టత కోసం పని చేయాలని, ఏఐసీసీ ఏ పిలుపునిచ్చినా ఆ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ డీసీసీ ప్రమాణాస్వీకారానికి టీపీసీసీ అధ్యక్షుడు రావడం చాలా సంతోషంగా ఉందని, ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. సమష్టిగా నిర్ణయాలు తీసుకొని పార్టీ బలోపేతం కోసం కలిసికట్టుగా పనిచేద్దామని కోరారు. సమావేశంలో టీజీఎంఎఫ్సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, మేయర్ గుమ్మల మమత, డిప్యూటీ మేయర్ సురేందర్రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, నారాయణపేట డీసీసీ అధ్యక్షులు ప్రశాంత్రెడ్డి, నాయకులు వినోద్కుమార్, ఆనంద్కుమార్గౌడ్, ఎన్పీ వెంకటేశ్, జహీర్ అఖ్తర్, చంద్రకుమార్గౌడ్, హర్షవర్ధన్రెడ్డి, ఏపీ మిథున్రెడ్డి, జంగారెడ్డి, పృథ్వీ, అమరేందర్రాజు, వసంత, బెక్కరి అనితతోపాటు జిల్లాలోని మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. పార్టీకి సంబంధం లేని వ్యక్తికి పదవి ఎందుకిచ్చారు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తికి డీసీసీ కమిటీలో పదవి ఎందుకిచ్చారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహరెడ్డి టీపీసీసీ అధ్యక్షులు దృష్టికి తీసుకొచ్చారు. మహబూబ్నగర్ రూరల్ మండలంలో గత ఎంపీ ఎన్నికల్లో వేరే పార్టీకి పనిచేసిన వ్యక్తికి పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీంతో ఆయనను టీపీసీసీ అధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు తదితరులు సముదాయించారు. ఉమ్మడి జిల్లాలో వందశాతం గెలుస్తాం గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో రెండు మినహా 12 సీట్లను గెలిచామని, ఈసారి ఎన్నికల్లో వందశాతం సీట్లు గెలుస్తామని ఆయన పేర్కొన్నారు. డీలిమిటేషన్ వల్ల నాలుగైదు సీట్లు పెరిగినా వాటిని కూడా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మనం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్ల ఉన్న ఫలంగా ఎన్నికలు వచ్చినా 85 నుంచి 90 శాతం సీట్లు వస్తాయన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో 70 శాతం, మున్సిపల్ ఎన్నికల్లో 80 శాతం మనం గెలుచుకున్నామని అన్నారు. కాంగ్రెస్ పునాదులను మరింతగా పటిష్టం చేస్తున్నామని అన్నారు. మహబూబ్నగర్ రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లా అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కమిటీపై ఉందన్నారు. ప్రతి నెలలో జిల్లా కమిటీ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. మహబూబ్నగర్ రాజకీయ చైతన్యవంతమైన జిల్లా ఉమ్మడి జిల్లాలో వందశాతం సీట్లు గెలుస్తాం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ -
‘పేదల కోసం పనిచేసే పార్టీ మాది’
మహబూబ్నగర్: గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబమని, పేదల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే జిల్లా సస్య శ్యామలం అవుతుందన్నారు. కేంద్రంలో కాంగ్రేస్ అదికారంలోకి వచ్చిన 3 నెలల్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తెస్తామన్నారు. కేటీఆర్, హరీష్ రావు తప్పుడు,అబద్దాలు ప్రచారం చేస్తున్నారని,రేవంత్ కోట్ల రూపాయల విదేశి పెట్టుబడులు తీసుకొచ్చారని, కష్టపడి పని చేసే వారికి కాంగ్రెస్లో పదవులు వస్తాయన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఆర్దిక విద్వంసం జరిగిందని, అప్పుల పాలు చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నాసిరకంగా పనులు చేయటం వల్ల కూలేశ్వరంగా మారిపోయిందని ఎద్దేవా చేశారు మహేష్కుమార్ గౌడ్. -
పారాక్వాట్పై నిషేధం
మహబూబ్నగర్ (వ్యవసాయం): రైతులు, ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాదకర రసాయన పురుగు మందుగా గుర్తించిన పారాక్వాట్, ఉత్పత్తులపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణ ప్రభావంతో 60 రోజుల పాటు పూర్తి నిషేధం విధించింది. అన్ని దశల్లో నిషేధం అమ్మకం, నిల్వ, పంపిణీ, తయారీ, వినియోగం వంటి అన్ని దశల్లో పారాక్వాట్పై ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. ఇన్సక్టిసిడ్స్ యాక్ట్– 1968 ప్రకారం అధికారాలను వినియోగించి ఈ ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి బి.వెంకటేష్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కట్టుదిట్టంగా అమలు వ్యవసాయ శాఖ అధికారులు గ్రామస్థాయిలో ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేయనున్నారు. ఇన్పుట్ డీలర్లు, పురుగు మందుల దుకాణాలపై ప్రత్యే క తనిఖీలు నిర్వహించనున్నారు. ఎక్కడైనా ఉల్లంఘనలు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సిబ్బందికి సూచనలు జారీ చేశారు. రైతులకు అవగాహన ప్రతి గ్రామంలో రైతులకు పారాక్వాట్ ప్రమాదాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని వ్యవసాయ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. రైతులు ఈ రసాయన వినియోగాన్ని పూర్తిగా నిలిపివేసి, భద్రమైన ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరించాలని సూచించారు. హానికర రసాయనం పారాక్వాట్ మనుషుల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతోంది. శ్వాసకోశ సమస్యలు, ఊపిరితిత్తుల దెబ్బతినడం, లంగ్ ఫైబ్రోసిస్ వంటి ప్రమాదాలు ఉన్నట్లు వైద్య నివేదికలు సూచిస్తున్నాయి. అదే విధంగా కాలేయం, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు విష ప్రభావం వల్ల ప్రాణాపాయం కూడా సంభవించే అవకాశం ఉంది. పర్యావరణానికి ముప్పు పారాక్వాట్ కారణంగా పశువులు, పక్షులు విష ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఉంది. నేల నాణ్యత తగ్గిపోవడం, నీటి కాలుష్యం పెరగడం, ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశించడం వంటి ప్రతికూల ప్రభావాలు కూడా కనిపిస్తున్నాయి. రైతుల ఆరోగ్యం, పర్యావరణ రక్షణే లక్ష్యం -
ఉత్సాహంగా ‘అథ్లెటిక్స్’ ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: హనుమకొండలో ఈనెల11, 12 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి ఫెడరేషన్ కప్అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల ఎంపికలను సోమవారం స్థానిక మెయిన్ స్టేడియంలో నిర్వహించారు. ఎంపికలను జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్చంద్ర ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా అథ్లెట్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎంపికల్లో దాదాపు 50 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు తెలిపారు. 20 ఏళ్లలోపు బాలబాలికలు, పురుషులు, మహిళలకు ఆయా అథ్లెటిక్స్ అంశాల్లో ఎంపికలు నిర్వహించినట్లు చెప్పారు. ఎంపికై న తుది జట్టును త్వరలో ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో కోచ్లు ఆనంద్కుమార్, సునీల్కుమార్, శ్రీనివాస్, పీడీలు రాజు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
‘ఫీజు రీయింబర్స్మెంట్’ రద్దుకు ప్రభుత్వం కుట్ర
మెట్టుగడ్డ: రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయంబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేసేందుకే కుట్రలు చేస్తోందని బీసీ జాగృతిసేన రాష్ట్ర అధ్యక్షుడు బి.కృష్ణయాదవ్ ఆరోపించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు బకాయిలను సకాలంలో విడుదల చేయకపోవడంతో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై భారం మోపాలనే ఆలోచనకు రావడం దుర్మార్గమైన చర్యన్నారు. మరోవైపు చాలా ప్రైవేటు కళాశాలలను మూసివేసే దిశగా అడుగులు వేస్తున్నాయని.. అదే జరిగితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత విద్య అభ్యసిస్తున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రకుల పేద విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఫీజు రీయంబర్స్మెంట్ పథకాన్ని నిలిపివేసే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని.. లేనిచో బీసీ జాగృతిసేన ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. తక్షణమే ఫీజు బకాయిలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో నరేందర్, కేశవులు, శివకుమార్, భాస్కర్, నవీన్, వీరేశ్ ఉన్నారు. -
పాలమూరు కోర్టులో చలివేంద్రం ప్రారంభం
పాలమూరు: వేసవి కాలం నేపథ్యంలో జిల్లా కోర్టు ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ కోర్టుకు వచ్చే ప్రజలు, సిబ్బంది ప్రతి ఒక్కరూ చలివేంద్రం సేవలు వినియోగించుకోవాలన్నారు. తాగునీరు సకాలంలో అందుబాటులో ఉంచి వచ్చిన ప్రతి ఒక్కరికి నీరు ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు కల్యాణ చక్రవర్తి, ఇందిర, శారదాదేవి, శ్రీదేవి, రాధిక, రాజా రాజేశ్వరి, మమతారెడ్డి, రవిశంకర్, మునవార్ హుస్సేన్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనంద్రావు పాల్గొన్నారు. ●జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర సోమవారం కేజీబీవీలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోక్సో చట్టం, బాలల హక్కులతో పాటు బాల్య వివాహాలుపై అవగాహన కల్పించారు. అనంతరం శిశు గృహను సందర్శించి వేసవి నేపథ్యంలో చిన్నారుల ఆరోగ్యం పట్ల తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. చిన్నారుల కోసం ఎలాంటి సౌకర్యాలు కల్పించారు అనే అంశంపై పరిశీలించారు. -
ఉపాధి పనులను పరిశీలించిన రాష్ట్ర బృందం
ధన్వాడ: మండలంలోని మందిపల్లిలో కొనసాగుతున్న వీబీజీ రాంజీ ఉపాధి పనులను సోమవారం రాష్ట్ర బృందం పరిశీలించింది. ప్రోగ్రాం అధికారి మురళి ఎన్ఎంఎంఎస్లోని ఇబ్బందులను స్వయంగా తెలుసుకొని మస్టర్ డౌన్లోడ్, పని ప్రదేశంలో కూలీల హాజరు, ఫొటో అప్లోడ్ను స్వయంగా చేశారు. అనంతరం కూలీలతో మాట్లాడి హాజరు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కంసాన్పల్లిలో కొనసాగుతున్న సీసీ రహదారి నిర్మాణాన్ని పరిశీలించారు. వారి వెంట డీఆర్డీఓ మొగులప్ప, ఎంపీఓ వెంకటేశ్వర్రెడ్డి, సర్పంచ్ సురేందర్రెడ్డి, ఏపీఓ సిద్ధేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
పాత నేరస్తుడే హంతకుడు..!
నారాయణపేట రూరల్: ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి, హతమార్చిన కామాంధుడు కటకటాలపాలయ్యాడు. వారం రోజుల క్రితం అనుమానాస్పదంగా మృతి చెందిన బాలిక కేసును పోలీసులు చేధించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ డా.వినీత్ వెల్లడించారు. నారాయణపేట మండలంలోని బసిరెడ్డిపల్లికి చెందిన శిరీష, ఆంజనేయులు దంపతులు బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్లో ఉంటుండగా.. వారి కుమార్తె తేజశ్రీ (5) గ్రామంలోనే నాయనమ్మ, తాతతో కలిసి నివాసం ఉంటుంది. గతనెల 31న రాత్రి భోజనం అనంతరం చిన్నారితో కలిసి అవ్వ, తాత ఆరుబయట నిద్రించగా.. అదే గ్రామానికి చెందిన బక్క చిన్న నర్సింహులు మద్యం తాగి అటువైపు వచ్చాడు. నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం గొంతు నులిమి హతమార్చి, సమీపంలోని చెరువు కట్టపై పాడేశాడు. ఈ క్రమంలో కాళ్లకు ఉన్న పట్టీలను తీసుకుని.. ఇది దొంగల పనిగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అదే రోజు రాత్రి పొలం పనులు పూర్తిచేసుకుని అటుగా వస్తున్న రైతులు చంద్రప్ప, కేశవులు అచేతన స్థితిలో ఉన్న చిన్నారిని గమనించి.. గ్రామస్తులకు చెప్పడంతో పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన డీఎస్పీ లింగయ్య, సీఐ శివకుమార్, ఎస్ఐ గాయత్రి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. చిన్నారి తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న ఎస్పీ వినీత్.. 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి విచారణను వేగవంతం చేశారు. చిన్నారి మృతదేహానికి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. రిపోర్టు ఆధారంగా లైంగిక దాడి జరిగినట్టు గుర్తించారు. ఈ క్రమంలో విచారణ బృందాలు పాత నేరస్తుల జాబితాను పరిశీలించి.. గ్రామానికి చెందిన బక్క చిన్న నర్సింహులును అదుపులోకి తీసుకొని విచారించారు. అతడు చేసిన తప్పును ఒప్పుకొని జరిగిందంతా పోలీసులకు వివరించారు. అతడి నుంచి కాళ్ల పట్టీలను రికవరీ చేశారు. 48 గంటల్లో నిందితుడిని పట్టుకొని రిమాండ్కు తరలించడంలో కృషిచేసిన పోలీస్ అధికారులను ఎస్పీ అభినందించారు. కాగా, నిందితుడు నర్సింహులుకు రెండు పెళ్లిళ్లు జరిగాయి. ఇద్దరు భార్యలు సైతం ఆయనతో కాపురం చేయకుండా పుట్టింటికి వెళ్లారు. అతడు 2014లో ఓ అమ్మాయిపై అత్యాచార యత్నానికి పాల్పడటంతో పట్టణ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. బెయిల్పై బయటకు వచ్చిన అతడు.. మార్చి 31న అర్ధరాత్రి చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఎస్పీ వివరించారు. నిందితుడిని అరెస్టు చేసి.. కోర్టులో హాజరుపర్చగా రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో డీఎస్పీలు లింగయ్య, మహేశ్, సీఐ శివకుమార్, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, గాయత్రి, సతీశ్కుమార్రెడ్డి ఉన్నారు. ఐదేళ్ల చిన్నారిపై లైంగికదాడి చేసి హతమార్చిన కామాంధుడు 48 గంటల్లోనే నిందితుడినిపట్టుకున్న పోలీసులు చిన్నారి కాళ్ల పట్టీలు స్వాధీనం వివరాలు వెల్లడించిన నారాయణపేట ఎస్పీ డా.వినీత్ -
బ్రిడ్జి కమ్ బరాజ్
జూరాల ఎగువ భాగాన నిర్మించేందుకు నిర్ణయం హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం.. జూరాల ప్రాజెక్టుకు సమాంతరంగా సేఫ్టీ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ముందు నుంచి ప్రభుత్వం వద్ద ప్రతిపాదన ఉంది. అయితే గతేడాది జూలైలో ప్రాజెక్టు గేట్లు దెబ్బతిని లీకేజీలు ఏర్పడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన నేపథ్యంలో సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి జూరాలను సందర్శించారు. ఈ క్రమంలోనే జూరాల ప్రాజెక్టుకు సమాంతరంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నట్లు ఇందుకోసం రూ.100 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ప్రాజెక్టు సమీపంలో 900 మీటర్ల పరిధిలో దిగువ భాగాన ధరూరు మండలం చింతరేవుల, ఆత్మకూరు మండలం అమరచింతల మధ్య బ్రిడ్జి నిర్మాణం చేపట్టేలా సాగునీటి పారుదల శాఖ అధికారులు సర్వే చేశారు. ఇందుకోసం రూ.100 కోట్లపైనే వ్యయం అవుతున్నట్లు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే బ్రిడ్జి నిర్మాణాన్ని ఆర్అండ్బీ శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత బ్రిడ్జి నిర్మాణ స్థల మార్పిడి జరగడం, జూరాల సమీపంలో కాకుండా గద్వాల మండలం కొత్తపల్లి, ఆత్మకూరు జూరాల మధ్య బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టడంతో వివాదాస్పదంగా మారింది. ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఇరిగేషన్ శాఖకు చెందిన నిధులు వ్యయం చేయనున్నారు. దీంతో ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఇరిగేషన్ శాఖ అనుమతులు ఇవ్వడంలో తాత్సారం జరగడం, ఎన్ఓసీ సర్టిఫికెట్ ఇవ్వడానికి వెనకంజ వేయడంతో గందరగోళంగా మారింది. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు గద్వాల: కృష్ణాబేసిన్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే తొలి ప్రాజెక్టు అయిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ భాగాన మరో బరాజ్ నిర్మాణంతో పాటు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా జూరాల ప్రాజెక్టుకు సంబంధించి చేపడుతున్న మరమ్మతు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాల నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారులు బ్రిడ్జి కమ్ బరాజ్ నిర్మాణం చేసే స్థల ఎంపిక, బ్రిడ్జి నిర్మాణం ఎన్ని కిలోమీటర్ల మేర నిర్మించాలి అనే అంశాలపై కసరత్తు మొదలుపెట్టారు. ఈ మేరకు అధికారులు సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థలం గుర్తించాలని మంత్రి ఉత్తమ్ ఆదేశాలు ఇరిగేషన్ శాఖకు నిర్మాణ పనుల అప్పగింత? తక్షణమే జూరాల గేట్లకు మరమ్మతు చేపట్టాలని సూచన స్థలం ఎంపిక, నది మధ్య నుంచి బ్రిడ్జి నిర్మాణంపై అధికారుల కసరత్తు -
ఎల్లూరు పంపుహౌజ్లో..
కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు సమీపంలో కేఎల్ఐ ప్రాజెక్టు నిర్మించారు. ఇక్కడి నుంచే సింగోటం, జొన్నలబొగుడ, గుడిపల్లిగట్టు రిజర్వాయర్లకు నీటిని పంపింగ్ ద్వారా తరలిస్తారు. ఎల్లూరు పంప్హౌజ్లో ఐదు మోటార్లు ఏర్పాటు చేశారు. వీటిలో ఒక మోటారు 5 ఏళ్ల క్రితం, మరో మోటారు రెండేళ్ల క్రితం దెబ్బతింది. నాటినుంచి మిగిలిన మూడు మోటార్లతోనే ఎత్తిపోతలు చేపడుతున్నారు. ఒక్కో పంపు ద్వారా రోజూ 800 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. దీంతో వాటిపై భారం పడుతోంది. -
అన్నీ అనుకూలిస్తే..
కొల్లాపూర్: గత కొన్నేళ్లుగా మరమ్మతుకు నోచుకోని కేఎల్ఐ మోటార్లకు ఈసారి తప్పనిసరిగా చేపట్టాలనే పట్టుదలతో అధికారులు ఉన్నారు. దశాబ్దకాలంలో ఎన్నడూ లేనంతగా ఈసారి శ్రీశైలం బ్యాక్వాటర్ మార్చి నెలలోనే భారీగా తగ్గుముఖం పట్టింది. దీంతో మోటార్ల మరమ్మతుకు ఇదే అనువైన సమయం అని నీటిపారుదల శాఖ భావిస్తోంది. అన్నీ అనుకూలిస్తే వచ్చే నెలలో మరమ్మతు చేపట్టే అవకాశం ఉందని, లేదంటే మరో ఏడాది ఆగాల్సిందేనని వారు పేర్కొంటున్నారు. నిధుల కేటాయింపు కేఎల్ఐలో పాడైన మోటార్ల మరమ్మతుకు గతేడాది ప్రభుత్వం రూ.18.80 కోట్లు మంజూరు చేసింది. ఇందులో మూడో నంబర్ మోటార్ మరమ్మతు కోసం రూ.15 కోట్లు కేటాయించగా.. ఐదో నంబర్ మోటార్కు స్పిల్ భీమ్, కాంక్రీట్ వర్క్స్, సర్జిపూల్లోకి నీళ్లు రాకుండా అడ్డుకట్ట ఏర్పాటు కోసం రూ.3.80 కోట్లు కేటాయించింది. మిషన్ భగీరథ కారణంగా.. ఉమ్మడి మహబూబ్నగర్– రంగారెడ్డి జిల్లాలకు ఎల్లూరు సమీపంలోని మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఈ స్కీంకు కేఎల్ఐ ప్రాజెక్టు నుంచే నీటిని ఎత్తిపోస్తున్నారు. మిషన్ భగీరథ స్కీం లేక ముందు ఎల్లూరు పంపుహౌజ్లోని మోటార్లకు వేసవిలో రెండు నెలలపాటు విరామం ఇచ్చేవారు. మిషన్ భగీరథ స్కీం వచ్చాక విరామం లేకుండా ఏడాది మొత్తం ఎల్లూరు పంప్హౌజ్ ద్వారా నీటి ఎత్తిపోతలు చేపడుతున్నారు. దీంతో పాడైన మోటార్లకు సకాలంలో మరమ్మతు చేపట్టేందుకు వీలు కావడం లేదు. బ్యాక్వాటర్ తగ్గుముఖం.. దశాబ్దకాలంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది మార్చి నెల నుంచే శ్రీశైలం బ్యాక్వాటర్ భారీగా తగ్గుతూ వస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలు నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేపట్టడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం బ్యాక్ వాటర్ లెవెల్స్ 821 అడుగులుగా ఉండగా.. 805 అడుగుల వరకు కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసుకునే వెసులుబాటు ఉంది. మిషన్ భగీరథ స్కీంకు నార్లాపూర్ రిజర్వాయర్లోని నీటిని మళ్లిస్తే కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతలకు విరామం లభిస్తుంది. ఉన్నతాధికారులు అనుమతిస్తే వచ్చే నెలలో నీటి ఎత్తిపోతలు నిలిపివేసి.. మోటార్లకు మరమ్మతు చేపట్టే యోచనలో అధికార యంత్రాంగం ఉంది. వచ్చే నెలలో కేఎల్ఐ మోటార్ల మరమ్మతుకు అధికారుల చర్యలు రూ.18.80 కోట్లు కేటాయించిన ప్రభుత్వం మరోవైపు మిషన్ భగీరథకు కొనసాగుతున్న ఎత్తిపోతలు ప్రస్తుతం 821 అడుగుల ఎత్తులోశ్రీశైలం బ్యాక్వాటర్ బ్యాక్వాటర్ భారీగా తగ్గిపోవడంతోఅనుకూలంగా భావన -
‘కాంగ్రెస్ పార్టీలో చేరితే పనులు ఇస్తారంట’
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): బీఆర్ఎస్ కార్పొరేటర్లు పనికోసం పోతే కాంగ్రెస్ పార్టీలో చేరితేనే పనులు, నిధులు ఇస్తామని ఆ పార్టీ ప్రజాప్రతినిధులు చెప్పడం దుర్మార్గమని మండిపడ్డారు. సోమవారం స్థానిక తన క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఎన్ని గొడవలు ఉన్నా.. తమ పార్టీ మాట్లాడ లేదన్నారు. ప్రజాతీర్పుకు అనుగుణంగా ముందుకు పోయామన్నారు.మేయర్ ఎన్నిక సమయంలో బీఆర్ఎస్లోకి వస్తామని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక వర్గం చెప్పినా ప్రజాస్వామ్యానికి విలువ ఇచ్చి సున్నితంగా తిరస్కరించినట్లు తెలిపారు. ఒక మహిళ కార్పొరేటర్ భర్తకు ఫోన్ చేసి పార్టీలోకి వస్తే ముడా చైర్మన్ ఇస్తామని ఆఫర్ ఇస్తున్నారని ఆరోపించారు. ముందుగా మీ పార్టీ కోసం కష్టపడిన వారికి, ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేకపోయిన వారికి బీఆర్ఎస్ నుంచి మీ పార్టీలోకి తీసుకొని టికెట్ ఇవ్వలేకపోయినా వారికి నామినేట్ పదవులు ఇవ్వాలని సూచించారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీలో చేరాలని మా వాళ్లపై ఒత్తిడి తెస్తున్నారని, పోలీస్ శాఖకు చెడ్డపేరు తెచ్చేవిధంగా కొందరు అధికారులు పని చేస్తున్నారని ఆరోపించారు. తాము మిగిల్చిన పనులు పూర్తి చేసేందుకు, కొత్త అభివృద్ధి పనులు చేయడానికి సహకరిస్తామన్నారు. మన్యంకొండ రోప్వే, మార్కెట్లు, మినీ ట్యాంక్బండ్, గురుకుల పాఠశాలలు, సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పాలమూరు ప్రాజెక్ట్ పూర్తి చేసి రైతులకి సాగునీరు ఇవ్వాలని, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ కోసం తాము తెచ్చిన జీఓ ప్రకారం పనులు పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, కార్పొరేటర్లు నవకాంత్, శరత్రెడ్డి, ఈశ్వరయ్య, రమేష్ నాయక్, కిషోర్, మధు మోహన్, సత్యం తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్లో కోల్డ్వార్!
ముఖ్య నేత వర్సెస్ డీసీసీ వర్గాలు ● కార్పొరేషన్ ఎన్నికల తర్వాత పూర్తిస్థాయిలో చీలిక ● కాంగ్రెస్ కార్యాలయం మెట్లెక్కని పలువురు నాయకులు ● హైకమాండ్కు పోటాపోటీగా పరస్పర ఫిర్యాదులు ● నేడు టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్గౌడ్ రాక ● ఇరువురు నేతలు, వారి వర్గాల మధ్య సయోధ్య కుదిరేనా? ● ‘హస్తం’ శ్రేణుల్లో జోరుగా చర్చ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఒకరేమో జిల్లాస్థాయిలో పార్టీ పరమైన కార్యకలాపాలను పర్యవేక్షించే నేత. మరొకరేమో అదే పార్టీకి చెందిన నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు సర్కారు పథకాలను ప్రజలకు చేరవేయడం, పాలనాపరమైన వ్యవహారాలను చక్కబెట్టే హోదాలో ఉన్న ప్రజాప్రతినిధి. ఇరువురు అధికార కాంగ్రెస్కు చెందిన వారే. అటు పార్టీ, ఇటు ప్రభుత్వ పరంగా ఆ ఇద్దరు కీలకం. కానీ వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు రచ్చకెక్కగా.. నిన్నమొన్నటి వరకు ఇరువర్గాల మధ్య మాటల తూటాలు మంటలు రేపాయి. ప్రస్తుతం స్తబ్దుగా ఉన్నప్పటికీ.. ఇరు నేతల మధ్య కోల్డ్వార్ నడుస్తోంది. వర్గాల వారీగా నాయకులు చీలిపోవడంతో పార్టీ కార్యకర్తలు ఎటుపోవాలో తెలియక అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ మంగళవారం తొలిసారిగా మహబూబ్నగర్కు రానుండగా.. ఆయన పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. క్రమక్రమంగా ఆధిపత్య పోరు.. రాష్ట్రంలో 2023లో అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులను ప్రకటించిన విషయం తెలిసిందే. మహబూబ్నగర్ జిల్లా అధ్యక్ష పదవిపై పలువురు నేతలు ఆశలు పెట్టుకోగా.. అధిష్టానం సీనియర్ నేత, ముదిరాజ్ వర్గానికి చెందిన సంజీవ్ ముదిరాజ్కు అవకాశం కల్పించింది. ఈ క్రమంలో పార్టీ ముఖ్యనేతలు పలువురు భిన్నస్వరాలు విన్పించగా.. ఇవే విభేదాలకు ఆజ్యం పోసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత క్రమక్రమంగా ఇరువర్గాల నేతల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. కార్పొరేషన్ ఎన్నికల్లో బట్టబయలు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన కార్పొరేష న్ ఎన్నికల సమయంలో పార్టీ ముఖ్య నేతలు, వారి అనుచరుల మధ్య అంతర్గ త విభేదాలు రచ్చకెక్కాయి. డివిజన్లలో కా ర్పొరేటర్ అభ్యర్థుల ఎంపిక నుంచి మొదలు టికెట్ల కేటాయింపు వరకు వర్గాల వారీగా నేతలు తమతమ అ నుచరుల కోసం పోటాపో టీ రాజకీయాలకు తెరలేపారు. ప్రచారపర్వంలో సైతం ఆయా వర్గాల నేతలు వేర్వేరుగానే పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్పొరేషన్ పీఠాన్ని కై వసం చేసుకోగా.. ఆ తర్వాత చోటుచేసుకున్న నాటకీయ పరిణామాలు ఉత్కంఠ రేపాయి. తొలి నుంచి మేయర్ రేసుల్లో ఉన్న ప్రసన్న ఆనంద్ గౌడ్ను కాదని ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన గుమాల మమత శ్రీనివాస్ పేరు తెరపైకి తేవడం పార్టీలో అలజడి సృష్టించింది. చివరకు ఆమెనే మేయర్గా, డిప్యూటీ మేయర్గా మారేపల్లి సురేందర్రెడ్డి ఎన్నిక కావడంతో పార్టీలో ఇరువర్గాల నేతల మధ్యదూరం మరింత పెరిగినట్లు పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. పోటాపోటీగా ఫిర్యాదులు.. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి ఇరువర్గాల నేతలు ఒకరిపై ఒకరు పార్టీ అధిష్టానానికి పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకున్నారు. దీనిపై పలువురు నేతలు బహిరంగంగానే వెల్లడించారు. ఎన్నికల్లో కొందరు అభ్యర్థులను ఓడించేందుకు ప్రయత్నించారని.. పలువురి ఓటమికి వారే కారణమని.. వారిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యనేత వర్గీయులు పార్టీ పెద్దలను కలిసినట్లు సమాచారం. పార్టీని దెబ్బతీసేలా కొందరు యత్నించారని.. ప్రజల్లో బలం లేదని తెలిసినా వారినే నిలబెట్టి వారి ఓటమికి వారే కారకులయ్యారని...అధిష్టానం సూచించిన వారికి పదవులు ఇవ్వకుండా.. ఆధిపత్య ధోరణితో వ్యక్తిగత ఎజెండాను అమలు చేశారని ఎదుటి వర్గం నేతలు పీసీసీ పెద్దలకు నివేదిక అందజేసినట్లు తెలిసింది. -
జిల్లా కార్యవర్గంలో అన్ని వర్గాలకు అవకాశం
● డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ స్టేషన్ మహబూబ్నగర్: సామాజిక సమీకరణాల మేరకు అన్ని వర్గాలకు అవకాశం లభించేలా జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గాన్ని ఎంపిక చేసినట్లు డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో సోమవారం ఆయన 73 మందితో కూడిన డీసీసీ కమిటీ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఎమ్మెల్యేలు, నాయకులతో చర్చించి వారి అభిప్రాయాలు తీసుకొని టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్గౌడ్ ఆమోదంతో డీసీసీ కమిటీని ప్రకటించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేస్తున్న, జెండాలు మోసిన వారికి కమిటీలో చోటు కల్పించినట్లు తెలిపారు. డీసీసీ ఉపాధ్యక్షులుగా వేముల కృష్ణయ్య, బి.మధుసూదన్రెడ్డి, ఎన్.లక్ష్మినారాయణ, ఎం.వెంకట నర్సింహారెడ్డి, పోలేపల్లి యాదయ్య, సయ్యద్ మిన్హాజుద్దీన్, విష్ణువర్ధన్రెడ్డిను ఎంపిక చేసినట్లు తెలిపారు. కోశాధికారిగా జి.రాజేందర్రెడ్డి, అధికార ప్రతినిధులుగా కంచిమి లక్ష్మణ్, బాల నర్సింలు, జీడీ నిత్యానందన్లను ఎంపిక చేశామని, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శులుగా 21 మంది, జిల్లా కార్యదర్శులుగా 22 మంది, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా 19 మందిని ఎంపిక చేశారు. ఈ జంబో డీసీసీ కమిటీలో ఉపాధ్యక్షులుగా నలుగురిని బడుగు, బలహీన వర్గాలకు, ముగ్గురిని రెడ్డి వర్గానికి ఎంపిక చేయగా మిగతా జిల్లా ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లలో అధికంగా బడుగు, బలహీనవర్గాల వారిని ఎంపిక చేయడం విశేషం. నేడు టీపీసీసీ అధ్యక్షుడి రాక టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ మంగళవారం జిల్లాకు రానున్నట్లు సంజీవ్ ముదిరాజ్ వెల్లడించారు. ఆయనకు స్థానిక మెట్టుగడ్డ నుంచి ఘనంగా స్వాగతం పలుకుతామని తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ కార్యాలయంలో కార్యవర్గంతో సమావేశం, అనంతరం శాలీమార్ ఫంక్షన్హాల్లో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారని పేర్కొన్నారు. సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్రెడ్డి, అధికార ప్రతినిధి జహీర్ అఖ్తర్, మీడియాసెల్ కన్వీనర్ సీజే బెనహర్, నాయకులు కంచిమి లక్ష్మణ్, గోనెల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
వన మహోత్సవం ప్రణాళిక సిద్ధం చేయండి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): వచ్చే వర్షాకాలం ప్రారంభంలో నిర్వహించనున్న మొక్కలు నాటే వనమహోత్సవం కార్యక్రమానికి ఇప్పటి నుంచే ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ వనమహోత్సవం కార్యక్రమానికి జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, జిల్లా పంచాయతీరాజ్ శాఖ, జిల్లా అటవీ శాఖ, ఇతర అధికారులు కలిసి సమగ్ర ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది జిల్లాలో 58 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 100 శాతం లక్ష్యం పూర్తి చేసేందుకు సమగ్ర ముందస్తు ప్రణాళిక ఎంతో అవసరమన్నారు. గతంలో నాటిన మొక్కల స్థితిపై సర్వే నిర్వహించాలని, వాటిలో ఎన్ని మొక్కలు ఉన్నాయి, ఎన్ని చనిపోయాయి నివేదిక తయారు చేయాలని సూచించారు. అలాగే 2027–28 సంవత్సరానికి ముందస్తు ప్రణాళికను సిద్ధం చేయాలని తెలిపారు. తడిభూముల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ● జనగణన 2027లో భాగంగా మండలస్థాయిలో మంగళవారం, బుధవారం ఎంపీలు, ఎంపీఓ ఎంఆర్ఓ, పంచాయతీ కార్యదర్శి, మండల గణాంకా అధికారులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ప్రతి 700 నుంచి 800 జనాభా యూనిట్లుగా విభజించి, రెవెన్యూ గ్రామం, హ్యాబిటేషన్ వారీగా ఎన్యూమరేషన్ బ్లాక్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈనెల 18న శిక్షణ ఉంటుందని తెలిపారు. మే నెలలో తొలిదశ హౌస్ లిస్టింగ్, ఎన్యూమరేషన్కు సన్నాహక కార్యక్రమాలు పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మధుసూదన్ నాయక్, హరిప్రియ, డీఆర్డీఓ నర్సింహులు, సీపీఓ రవీందర్, డీఎఫ్ఓ సత్యనారాయణ పాల్గొన్నారు. -
హైడ్రాలిక్ లిఫ్ట్ ప్రారంభం
మహబూబ్నగర్ క్రైం: జిల్లా పరేడ్ మైదానంలోని మోటార్ ట్రాన్స్పోర్ట్ ఫూల్లో ఆధునిక వాహనాల మరమ్మతుల కోసం నూతనంగా ఏర్పాటు చేసి టూపోస్ట్ హైడ్రాలిక్ లిఫ్ట్ను సోమవారం డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ పోలీస్ విభాగంలో వాహనాల నిర్వహణ అత్యంత కీలకమని, అత్యవసర పరిస్థితుల్లో వాహనాలు సిద్ధంగా ఉండటం చాలా అవసరమన్నారు. ఈ టూ పోస్ట్ హైడ్రాలిక్ లిఫ్ట్ వల్ల వాహనాలను సులభంగా పైకి ఎత్తడం, తక్కువ సమయంలో మరమ్మతులు చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎస్పీ డి.జానకి, అదనపు ఎస్పీ సురేష్కుమార్, డీఎస్పీలు రమణారెడ్డి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం చూపాలి మహబూబ్నగర్ క్రైం: ప్రతి పోలీస్స్టేషన్కు వచ్చే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించి, బాధితులకు సత్వరంగా న్యాయం అందించాలని ఎస్పీ డి.జానకి సూచించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా బాధితుల నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. ఒక్కో దరఖా స్తు పరిశీలించి ఆయా సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించడం పోలీస్శాఖ ముఖ్య బాధ్యత అని తెలిపారు. ● జిల్లా పోలీస్శాఖలో పదోన్నతి పొందిన అధికారులకు సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డి.జానకి పదోన్నతి చిహ్నాలను బహుకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పదోన్నతి అనేది కేవలం గుర్తింపు మాత్రమే కాదని, బాధ్యత కూడా మరింత పెరుగుతుందన్నారు. అప్పగించిన బాధ్యతలను ప్రతి ఒక్కరూ నిబద్ధతతో ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. మార్కెట్కుభారీగా ధాన్యం దేవరకద్ర/జడ్చర్ల: దేవరకద్ర మార్కెట్ యార్డు కు యాసంగి సీజన్ ధాన్యం రాక ప్రారంభమైంది. సోమవారం మార్కెట్కు దాదాపు మూడు వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. టెండర్లలో ఆర్ఎన్ఆర్ ధాన్యం ధర క్వింటాల్కు గరిష్టంగా రూ.2,239, కనిష్టంగా రూ.2,159, హంస గరిష్టంగా రూ.1,779, ఆముదాల ధర గరిష్టంగా రూ.6,163, కనిష్టంగా రూ.6129గా ధరలు నమోదయ్యాయి. ● బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో వేరుశనగకు క్వింటా గరిష్టంగా రూ.8,032, కనిష్టంగా రూ.5,888 ధరలు లభించాయి. కందులు గరిష్టంగా రూ.7,265, కనిష్టంగా రూ.6,310, ఆముదాలు గరిష్టంగా రూ.6,365, కనిష్టంగా రూ.6,265, జొన్నలు గరిష్టంగా రూ.6,011, కనిష్టంగా రూ.2,810, మినుములు రూ.7,010, పెబ్బర్లు గరిష్టంగా రూ.4,840, కనిష్టంగా రూ.4,410, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,851, కనిష్టంగా రూ.1,601 ధరలు లభించాయి. -
మౌలిక సదుపాయాలతోనే నగర అభివృద్ధి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: మౌలిక సదుపాయాలతోనే నగర అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం వీరన్నపేట శివారులోని డబుల్బెడ్రూం ఇళ్ల కాలనీ వద్ద యూఐడీఎఫ్ నిధులు రూ.1.38 కోట్లతో, భగీరథకాలనీలో రూ.3.60 కోట్లతో, గణేష్నగర్లోని పార్కు వద్ద రూ.4.21 కోట్లతో, డంపింగ్ యార్డు సమీపంలో రూ.1.29 కోట్లతో నిర్మించే ఓవర్హెడ్ ట్యాంకులకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు బండమీదిపల్లిలో విజయ డెయిరీ ఉత్పత్తుల ఔట్లెట్ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలో పెరుగుతున్న తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని మొత్తం 14 ఓవర్హెడ్ ట్యాంకులను నిర్మించనున్నామన్నారు. అన్ని ప్రాంతాలకు సమానంగా శుద్ధి చేసిన తాగునీరు అందేలా కృషి చేస్తున్నామన్నారు. దీనివల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. విజయ డెయిరీ ద్వారా ప్రజలకు నాణ్యమైన పాలు, ఇతర ఉత్పత్తులను అందిస్తున్నామన్నారు. రైతులకు సరైన ధర లభించేలా, వినియోగదారులకు శుద్ధమైన ఉత్పత్తులు అందించే లక్ష్యంతో సంస్థ పనిచేస్తోందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఈ రంగం కీలకపాత్ర పోషిస్తోందన్నారు. అనంతరం షాషాబ్గుట్ట ప్రాంతంలో పూర్తయిన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి లబ్ధిదారురాలితో గృహ ప్రవేశం చేయించారు. ఆయా కార్యక్రమాలలో టీఎస్డీడీసీఎఫ్ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి, ముడా చైర్మన్ కె.లక్ష్మణ్యాదవ్, మేయర్ జి.మమత, డిప్యూటీ మేయర్ ఎం.సురేందర్రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.రామాంజుల రెడ్డి, నాయకులు సిరాజ్ఖాద్రీ, శ్రీనివాస్యాదవ్, సతీష్కుమార్, మైత్రి యాదయ్యతో పాటు ఆయా డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
అగ్గి.. రాజుకుంటే బుగ్గే
●మహబూబ్నగర్ క్రైం: వేసవికాలం వచ్చేసింది.. రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. పెరుగుతున్న వేసవితాపం అగ్ని ప్రమాదాలకు ఆజ్యంలా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రమాదాలు సంభవించే అవకాశాలు రెట్టింపు అవుతున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అగ్నిమాపక కేంద్రాల నుంచి ఫైర్ ఇంజిన్లు సంఘటనా స్థలాలకు చేరుకొని ఎంతో కొంత వరకు మంటలు అదుపులోకి తెస్తున్నాయి. కానీ, కొన్ని ఫైర్స్టేషన్ల దగ్గర ఫైర్ ఇంజిన్ల పరిధి 40 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. దీనికితోడు ఉమ్మడి జిల్లాలో కొన్ని రోడ్లు సైతం అస్తవ్యస్తంగా ఉండడంతో సమయానికి ఘటనా స్థలానికి చేరుకోవడానికి కష్టంగా మారింది. జనాభా ప్రాతిపదికన చూస్తే ప్రతి 50 వేల జనాభా కోసం ప్రత్యేకంగా ఒక ఫైర్ ఇంజిన్ అందుబాటులో ఉండాలి. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో 80 ఫైర్ ఇంజిన్లు ఉండాల్సి ఉండగా.. కేవలం 17 ఫైర్ ఇంజిన్లతోనే నెట్టుకొస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 13 అగ్నిమాపక కేంద్రాలు ఉండగా.. రెండు కాంట్రాక్టు పద్ధతిలో నడుస్తున్నాయి. ఇందులో మహబూబ్నగర్, జడ్చర్ల, కొత్తకోట, నారాయణపేట, మక్తల్, గద్వాల, అలంపూర్, వనపర్తి, ఆత్మకూర్, కొత్తకోట, నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట, అమ్రాబాద్లో అవుట్పోస్టు కొనసాగుతున్నాయి. ప్రతి కేంద్రానికి ఒక ఫైర్ ఇంజిన్, ఒక బుల్లెట్ ఉండగా మహబూబ్నగర్లో మాత్రం 10 వేల లీటర్లతో ఒకటి, 4,500 లీటర్లు, 2,300 లీటర్ల సామర్థ్యం కలిగిన మూడు వాహనాలు, రెండు బుల్లెట్లు ఉన్నాయి. మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాల్లో ఫైర్ ఇంజిన్లతోపాటు బుల్లెట్స్ సైతం అందుబాటులో ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లాలో ఐదు, నాగర్కర్నూల్ జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో ఐదు, గద్వాల నియోజకవర్గ వ్యాప్తంగా ఒక్క టి మాత్రమే ఉంది. అలంపూర్ నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేశారు. అయితే వేసవిలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా సంభవించే ఆస్కారం ఉన్నందున వీటి సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. అగ్ని ప్రమాదాలు 112 జిల్లా ఫైర్స్టేషన్లు వాహనాలు మహబూబ్నగర్ 2 5 నారాయణపేట 2 2 గద్వాల 2 2 నాగర్కర్నూల్ 4 5 వనపర్తి 3 3 ఉమ్మడి జిల్లాలో పొంచి ఉన్న ప్రమాదాలు 13 స్టేషన్ల పరిధిలో 17 ఫైర్ ఇంజిన్లు మాత్రమే.. పలు ప్రాంతాల్లో 40 కిలోమీటర్ల దూరంలో కేంద్రాలు ఘటనా స్థలానికి చేరుకోవడంలో ఆలస్యంతో తీవ్రనష్టం కొత్త కేంద్రాల ఏర్పాటుపై కొరవడిన చిత్తశుద్ధి వేసవిలో తరచూ ఏదో ఒకచోట అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. భానుడి భగభగకు గడ్డివాములు, అడవులు, దుకాణ సముదాయాలు, జిన్నింగ్ మిల్లులు, వాహనాలు కాలిపోతుంటాయి. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతుండటంతో ఆస్తి, ప్రాణనష్టం సంభవిస్తూనే ఉంటుంది. ప్రమాదాల కారణంగా సర్వస్వం కోల్పోయిన కుటుంబాలు వీధిన పడుతుంటాయి. ఏటా ప్రమాదాలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. అయితే మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక శాఖది కీలక పాత్ర. వీరు సకాలంలో వస్తేనే ఆస్తినష్టం జరగకుండా కాపాడుకోవచ్చు. ఉమ్మడి పాలమూరులో 64 మండలాలు ఉన్నాయి. ఇందులో కొన్ని మండలాల విస్తీర్ణం 100 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. అలాంటి చోట్ల కనీసం ఒక ఫైర్ స్టేషన్ కూడా లేదు. కొన్ని కేంద్రాలు నాలుగైదు మండలాల్లోని గ్రామాలకు సేవలందిస్తున్నాయి. ఉదాహరణకు అచ్చంపేట ఫైర్ స్టేషన్లో ఉన్న ఫైర్ ఇంజిన్ మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా మండలాల్లోని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కూడా అంతంతే. ఈ లెక్కన ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకోవడానికి కనీసం గంటన్నర సమయం పడుతుంది. ఈలోగా ప్రమాదంలో ఆస్తులన్నీ కాలి బూడిదవ్వాల్సిందే. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొత్తగా ఫైర్ స్టేషన్లకు ప్రతిపాదనలు పంపినా ఏర్పాటు చేయడంలో అటు అధికారుల్లో, ఇటు ప్రజాప్రతినిధుల్లో చిత్తశుద్ధి కొరవడింది. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
కోడేరు: మండల పరిధిలో ని గుండ్యవాల్యనాయక్ తండాలో విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కాట్రావత్ లోకారం నాయక్ (39) ఆదివారం పంటకు నీరు పెట్టేందుకు పొలానికి వెళ్లాడు. మోటారు ఆన్ చేసే క్రమంలో తెగిపడిన విద్యుత్ వైరును గమనించకుండా తగలడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య కమల, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ రాజు తెలిపారు. వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం కోస్గి రూరల్: గుర్తు తెలి యని వాహనం ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన ఘ ట న మండల పరిధిలో శనివారం రాత్రి చోటుచేసు కుంది. పోలిసుల కథనం మేరకు తోగాపూర్ గ్రామానికి చెందిన నారాయణకు (33) వికారాబాద్ జిల్లాలోని దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన తోక దస్తమ్మతో ఎనిమిదేళ్ల క్రితం వివా హం జరిగింది. వీరు హైదరాబాద్లో కూలీ ప ని చేసుకుంటూ జీవనం సాగించేవారు. గత నె ల 30 న దాల్తాబాద్ గ్రామంలోని తమ పొలంలో బోరు వేయించేందుకు వచ్చారు. ఈ క్రమంలో శనివారం రాత్రి మిత్రుడు వెంకటేష్తో కలిసి ద్విచక్రవాహనంపై తోగాపూర్ నుంచి దౌ ల్తాబాద్కు వెళ్తుండగా కొత్తపల్లి గ్రామ శివారులో మూత్రవిసర్జన నిమిత్తం వెంకటేష్ కిందకు దిగ గా బైక్పై ఉన్న నారాయణను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రగాయా లై అతను చనిపోయాడు. మృతుని భా ర్య దస్త మ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాల్రాజ్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి జడ్చర్ల: మండల పరిధిలోని పెద్ద ఆదిరాలకు చెందిన నలుగురు ఆదివారం బొలేరో వాహనంలో శ్రీశైలంలో స్వామి దర్శనానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. రెండు మూడు రోజులుగా గ్రామంలో భక్త శిరియాళ నాటక ప్రదర్శన చేసిన పాత్రదారులు ఆదివారం స్వామి వారి దర్శనానికి శ్రీశైలం బయలు దేరారు. మార్గమధ్యలో కల్వకుర్తి దాటిన తరువాత కొండారెడ్డి పల్లి గ్రామ శివారులో ఎదురుగా వచ్చిన డోజర్ వీరి వాహనా న్ని ఢీకొట్టడంతో ఇమ్మడి వెంకటయ్య (43) అక్కడికక్కడే మరణించగా కుమ్మరి యాదగిరి, కుమ్మరి సుబ్రహ్మణ్యం, కృష్ణయ్యల పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తరలించారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రమాద వార్త తెలియగానే గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఇసుక ట్రాక్టర్ల పట్టివేత మాగనూర్: అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని పోలీస్స్టేషన్కు తరలించినట్లు ఎస్ఐ అశోక్బాబు తెలిపారు. మందిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నిత్యం అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో తనిఖీలు చేపట్టామన్నారు. అయితే నిందితుడు పోలీసులను గమనించి ట్రాక్టర్ను అక్కడే వదిలేసి పారిపోవడంతో ట్రాక్టర్ను స్టేషన్కు తరలించామన్నారు. ఎవరైనా చట్టానికి వ్యతిరేకంగా అక్రమంగా ఇసుకను తరలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి నవాబుపేట: మండల పరిధిలోని కాకర్లపహడ్ గ్రామ సమీపంలోని చెరువులో చేపల వేటకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సాయిలు(41) స్నేహితులతో కలిసి చేపలు పట్టేందుకు గ్రామ సమీపంలోని చెరువు వద్దకు వెళ్లాడు. అనంతరం చెరువులోకి దిగి వలను సతీస్తున్న క్రమంలో అతని కాళ్లకు వల చుట్టుకొని చెరువులో మునిగిపోయాడు. చెరువు కట్టపై ఉన్న అతని స్నేహితులు గ్రామస్తులను తీసుకుని వచ్చే లోపు మృతి చెందాడు. మృతుడికి భార్య అంజమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ట్రాక్టర్, బైక్ ఢీ.. ఒకరు మృతి కొల్లాపూర్ రూరల్: పెద్దకొత్తపల్లి మండల పరిఽధిలోని కొత్తపేట గ్రామ సమీపంలో ప్రధాన రహదారిపై ట్రాక్టర్, బైక్ ఢీకొన్న ఘటనలో తెలుగు ఆంజనేయులు (55) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కొల్లాపూర్ మండల కుడికిల్ల గ్రామానికి చెందిన తెలుగు ఆంజనేయులు బైక్పై ఆదివారం రాత్రి కొత్తపేట దగ్గర ఉన్న మామిడి తోటకు బయలుదేరాడు. ఈ క్రమంలో ముందు వెళ్తున్న ట్రాక్టర్ను గమనించకపోవడంతో బైక్ ట్రాక్టర్ను ఢీకొట్టింది. ప్రమాదంలో ఆంజనేయులు కిందపడి మృతి చెందాడు. మృతునికి భార్య లక్ష్మమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
భక్తిశ్రద్ధలతో ఈస్టర్ వేడుకలు
స్టేషన్ మహబూబ్నగర్: జిల్లాలో క్రిస్టియన్ సోదరులు ఆదివారం ఈస్టర్ పర్వదిన వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. క్రీస్తు మహిమలను పాటల ద్వారా కొనియాడారు. జిల్లాకేంద్రంలోని కల్వరికొండపై నిర్వహించిన ఈస్టర్ వేడుకలకు శంషాబాద్ బైబిల్ కళాశాల ప్రొఫెసర్ ఆర్.ఎజ్రా ముఖ్య ప్రసంగీకుడిగా హాజరై విశ్వమానవ కల్యాణాన్ని కాంక్షిస్తూ ప్రార్థనలు చేశారు. ఈస్టర్ పండుగ ప్రాముఖ్యతను వివరించారు. కల్వరికొండపై జరిగిన ఈస్టర్ వేడుకల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఏసు పునరుత్థానం మన జీవితాలకు ఆశ, విశ్వాసం, నూతన ఆరంభాలకు మార్గదర్శకం అన్నారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, మేయర్ మమత, ఎంబీసీ చర్చి చైర్మన్, సీనియర్ పాస్టర్ రెవరెండ్ ఎస్.వరప్రసాద్, వైస్ చైర్మన్ బీఐ.జేకబ్, కార్యదర్శి జేఐ.డేవిడ్, సహాయ కార్యదర్శి ఇమ్మాన్యుయెల్ రాజ్, కోశాధికారి టీఏ.స్టీవెన్, సహ కోశాధికారి ఎ.టైటస్రాజేందర్, నాయకులు వినోద్కుమార్, సీజే బెనహర్, సిరాజ్ఖాద్రీ, కార్పొరేటర్ శ్రీపూజిత తదితరులు పాల్గొన్నారు. -
యువతకు స్ఫూర్తి బాబు జగ్జీవన్రామ్
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్)/ మహబూబ్నగర్ రూరల్: దళితులు, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం నిరంతరం పోరాటం చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్రామ్ యువతకు స్ఫూర్తి ప్రదాత అని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. ఆదివారం బాబు జగ్జీవన్రాం జయంతిని పురస్కరించుకొని తెలంగాణ చౌరస్తాలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీనివాస్రెడ్డి, ఎస్పీ జానకి, నగర మేయర్ మమతతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంబేడ్కర్, జగ్జీవన్రామ్ లాంటి ఎందరో మహనీయులు పోరాటం కృషి ఫలాలు మనం అనుభవిస్తున్నాం అన్నారు. అత్యధిక కాలం కేంద్ర మంత్రిగా పనిచేసిన గొప్ప నాయకుడు అని, కేంద్ర కార్మిక, రవాణ, ఆహార, వ్యవసాయ, రక్షణ, రైల్వే, కమ్యూనికేషన్ శాఖలతోపాటు దేశ ఉప ప్రధానిగా కీలక పదవులు నిర్వహించారని కొనియాడారు. 1974లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హరిత విప్లవాన్ని ప్రారంభించి ఆహార ధాన్యాల కొరతకు పరిష్కారం చూపారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితులు, గిరిజనులు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎన్నో చట్టాలు రూపొందించి, కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. దళితులకు భూ పంపిణీ, ఉద్యోగావకాశాల కల్పన, ఆర్థిక అభివృద్ధికి ఎన్నో పథకాలు అమలు చేశారన్నారు. ముఖ్యంగా సంక్షేమ హాస్టళ్లలో, పాఠశాలలో సౌకర్యాలు అభివృద్ధి చేసి వారికి నాణ్యమైన భోజనం అందిస్తున్నట్లు వివరించారు. సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం సాధన కోసం మనమందరం కలిసికట్టుగా పనిచేయాలని, ఆయన ఆశయాలను కొనసాగించేందుకు కృషిచేయాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హరిప్రియ, డిప్యూటీ మేయర్ సురేందర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అనిత, డీఆర్డీఓ నర్సింహులు, కార్పొరేటర్లు రమేష్బాబు, పూజిత, మున్సిపల్ కమిషనర్ రామాంజులరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ అధికారి సునీత, నాయకులు వినోద్కుమార్, సీజే బెనహర్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. -
అందుబాటులో ఉంటాం..
వేసవికాలం పూర్తయ్యే వరకు శాఖలో పనిచేస్తున్న సిబ్బంది, ఇతర అధికారులు ఏ ఒక్కరూ అత్యవసరం అయితే తప్ప సెలవు తీసుకోకుండా 80 శాతం మంది సిబ్బందితో పనిచేస్తాం. ప్రతి కేంద్రానికి బోరు ఉంది. పాలమూరు నగరంలో మున్సిపల్ బావి సైతం అందుబాటులో ఉంది. జిల్లాలో నీటి వసతి బాగా ఉండటం వల్ల నీటికి ఇబ్బంది లేదు. జాతీయ రహదారి, పరిశ్రమలు, ఇతర ప్రమాదకరమైన వాటిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టడం జరుగుతుంది. ఎక్కడ ప్రమాదం జరిగినా వెంటనే చేరుకోవడానికి కృషిచేస్తాం. ప్రజలు ఎక్కడ అగ్నిప్రమాదం జరిగినా వెంటనే 101, 112కు సమాచారం ఇవ్వాలి. – కిషోర్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి, మహబూబ్నగర్ -
సుర్రుమంటుండు
పాలమూరుపై భానుడి ప్రతాపం ● ఉదయం 8 గంటల నుంచే అధికమవుతున్న ఎండలు ● ఉక్కపోతతో చిన్నారులు, బాలింతలు, వృద్ధుల ఇక్కట్లు పాలమూరు: ఎవరి నోటా చూసినా ఇవేం ఎండలురా బాబు.. మాడు పగిలిపోతుందనే మాటే వినిపిస్తోంది. ఉదయం 8 గంటల నుంచే మొదలై 12 గంటలు చేరుకోకముందే సూర్యుడు సుర్రుమంటున్నాడు. బయట రోడ్లమీదకు రావాలంటేనే జనాలు జంకుతున్న పరిస్థితి కనిపింస్తోంది. చిన్నారులు మధ్యాహ్నం పాఠశాలల నుంచి తిరిగి ఇళ్లకు చేరుకునేలోపు అవస్థలు పడుతున్నారు. చాలామంది వేడివల్ల వడదెబ్బకు గురవుతున్నారు. జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భూత్పూర్ మండల పరిధిలో 42 డిగ్రీల వరకు నమోదు కాగా మహబూబ్నగర్ అర్బన్, రూరల్లో 41, కోయిలకొండలో 40 డిగ్రీల వరకు నమోదు కావడం విశేషం. ఎండలు, వడగాలులు మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మన శరీర ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్ (98.6 డిగ్రీల పారన్హీట్) కలిగి ఉంటుంది. వేసవిలో మరో పది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలను తట్టుకోవడానికి అవకాశం ఉంది. ఈ క్రమంలో ఎక్కువ సమయం ఎండలో ఉంటే అనేక సమస్యలు ఎదురవుతాయి. ఎండ తీవ్రత పెరిగే కొద్ది మన శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. చెమట పట్టడంతో ఒత్తిడి, చికాకు అధికం అవుతుంది. రక్తప్రసరణ పెంచడానికి గుండె వేగం పుంజుకుంటుంది. పెద్దలు రోజుకు ఐదు లీటర్ల నీటిని తాగాలి. వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణులు ఎక్కువ సమయంలో ఎండలో ఉంటే వడదెబ్బ తగిలే ప్రమాదం అధికంగా ఉంటుంది. తాజా పండ్లు, పండ్ల రసాలు, ద్రవ పదార్థాలు తీసుకుంటే మంచిది. వేసవిలో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలకు చేరుకుంటే వైద్యపరంగా అత్యవసర పరిస్థితిగా గుర్తించాలి. నవజాత శిశువుల విషయంలో తల్లిదండ్రులు కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. నవజాత శిశువులకు తల్లిపాలు ఎక్కువసార్లు తాగించాలి. నవజాత శిశువులు ఉండే గదిలో చల్లని వాతావారణం ఉండేలా చూసుకోవాలి. చిన్నపిల్లలు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇంటి బయట ఆడకుండా జాగ్రత్త వహించాలి. ఎండలో బయటకు వెళ్లడం తప్పనిసరైతే గొడుగు తీసుకువెళ్లాలి. వడదెబ్బ తగిలితే తలనొప్పి, వాంతులు, జ్వరం వస్తాయి. వడదెబ్బ ప్రభావ ం ముందుగా మెదడు, గుండె, మూత్రపిండాలపై పడుతుంది. అపస్మారక స్థితికి వెళ్లే ప్రమాదం ఉంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలో ఉన్న వైద్యుడిని సంప్రదించాలి. జ్వరం తీవ్రత అధికంగా ఉంటే మరీ చల్లని నీటితో కాకుండా మాములు నీటితో ముంచిన గుడ్డతో శరీరాన్ని తుడవాలి. పిల్లలకు వడదెబ్బ తగలకుండా తరచూ మంచినీరు, కొబ్బరినీళ్లు వాడటం మంచిది. సులభంగా జీర్ణమమ్యే తేలికపాటి ఆహారం తీసుకోవడం చాలా ఉత్తమం. -
యుద్ధంతో మానవ మనుగడకు ముప్పు
సాగునీరు అందాలంటే కాపలా కాయాల్సిందే.. కేఎల్ఐ సాగునీరు తమ పొలాలకు అందాలంటే అన్నదాతలు కాల్వ గట్టుపై కాపలాగా పడుకోవాల్సిన దుస్థితి వస్తోంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా తిమ్మాజీపేట మండలంలోని ఆవంచ నుంచి వచ్చే డీ 82 కాల్వ కల్వకుర్తి మండలంలోని తాండ్ర మీదుగా పారుతోంది. కానీ మండలంలోని తర్నికల్ వద్ద నీరు దిగువకు వెళ్లకుండా ఎగువ ఆయకట్టు రైతులు ఇష్టానురీతిగా వ్యవహరిస్తుండడంతో పంజుగుల, సీలార్పల్లి, మొకురాల, ఎల్లికల్, తిమ్మరాసిపల్లి, జంగారెడ్డిపల్లిలోని ఆయకట్టు పొలాలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మొకురాల గ్రామానికి చెందిన యువ రైతులు రాత్రి వేళలో తర్నికల్ శివారులో కాల్వ గట్టుపై నిద్రిస్తూ సాగునీరు దిగువకు వెళ్లేలా చూసుకుంటున్నారు. అధికారులు స్పందించి తమ కష్టాలు తొలగించాలని వారు వేడుకుంటున్నారు. – కల్వకుర్తి రూరల్ మెట్టుగడ్డ: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం వలన మానవ మనుగడకు ముప్పు వాటిల్లుతుందని, మౌనం వహిస్తున్న ప్రపంచ దేశాలు యుద్ధాన్ని ఆపేందుకు చొరవ చూపాలని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఆదివారం స్థానిక పారిశ్రామిక వాడలోని సీనియర్ సిటిజన్ ఫోరం కార్యాలయంలో పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మానవ చరిత్రలో అమెరికా నిర్మాణమే ఒక దుర్మార్గమైన ఆలోచనలతో కూడుకున్నదని, ఈ యుద్ధంతో ప్రపంచ దేశాలు తామంటే భయంతో ఉండాలన్న సంకేతం ఇస్తున్నట్లుగా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఖనిజ వనరుల కోసం చేస్తున్న విధ్వంసాన్ని సృష్టించి మహిళలను, పసిపిల్లలను బలి తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇరాన్ ఉగ్రవాదాన్ని పోషిస్తుందని ఆరోపిస్తూ యుద్ధం చేయడం, అమాయకుల ప్రాణాలు తీయడం కూడా ఒక ఉగ్రవాదమే కదా అని ఆయన విమర్శించారు. నేడు దేశం ఎదుర్కొంటున్న ఇంధనం, ఆర్థిక సంక్షోభానికి అమెరికా సామ్రాజ్యావాదమే కారణమని దుయ్యబట్టారు. కార్యక్రమంలో రచయిత కల్లూరి భాస్కర్, రాఘవాచారి, సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు, తిమ్మప్ప, వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు. -
బీిసీ మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కేటాయించాలి
మెట్టుగడ్డ: మహిళా బిల్లులో బీసీ మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు పాండుయాదవ్ కోరా రు. ఆదివారం జిల్లా కేంద్రంలోని గణేషనగర్ కమ్యూనిటీ హాల్లో బీసీ కులాల ఐక్యవేదిక మహి ళా విభాగం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే బీసీలు రాజకీయంగా, విద్య, ఉద్యోగాలలో చాలా నష్టపోయారని బీసీలు రాజకీయ పార్టీలను నమ్మడం మానేసి బీసీ కులాలంతా ఏకమై ఒక రాజకీయ శక్తిగా మారి రిజర్వేషన్లు సాధించుకుందామని పిలుపునిచ్చారు. రాజ్యాధికారం ద్వారానే బీసీల ఓట్లు బీసీలు వేస్కోని అధికారం సాధిస్తేనే బీసీల జీవితాలు మారుతాయన్నారు. బీసీల పేరుతో పదవులు పొంది బీసీల సంక్షేమాన్ని మరిచి అగ్రకుల నాయకులకు సేవలు చేస్తూ వత్తాసు పలికే వారిని త్వరలోనే ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని స్పష్టం చేశారు. బీసీలు రిజర్వేషన్లు కోసం కాదు.. అధికారం కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని గ్రహించాలని, అధికారమే లక్ష్యంగా బీసీ మహిళలు యువత సిద్ధమవ్వాలని పిలుపునిచ్చా రు. కార్యక్రమంలో బీసీ మహిళలు విజయలక్ష్మి, రా ణి, రమాదేవి, అంజిలమ్మ, సత్యమ్మ, శోభారాణి, పరమేశ్వరి, మల్లేష్ యాదవ్ పాల్గొన్నారు. -
చీకట్లో బావాజీ గర్భగుడి
● సెల్ఫోన్ లైట్ల వెలుగులో స్వామివారిని దర్శించుకున్న భక్తులు ● కాంట్రాక్టర్ నిర్వాకంతో ఇబ్బందులు ● రాత్రి 7:45 గంటలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కొత్తపల్లి: మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో వెలసిన ప్రముఖ ఆలయం గురులోకా మసంద్ బావాజీ గర్భగుడిలో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఆలయానికి వచ్చిన భక్తులు సెల్ఫోన్ వెలుగుల్లో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ నెల 1 నుంచి గురులోకా మసంద్ బావాజీ ఉత్సవాలకు సంబంధించిన ఓ కాంట్రాక్టర్కు లైటింగ్ పనులు అప్పగించారు. 4 తేదీన ఉత్సవాలు ముగియడంతో ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు కాంట్రాక్టర్ తాను అమర్చిన లైట్లను తీసుకెళ్లే క్రమంలో ఆలయంలో ఉన్న విద్యుత్ వైర్లను కూడా కట్చేయడంతో గర్భగుడి చీకట్లో ఉండిపోయింది. ఉత్సవాల్లో భక్తులు వేసిన కానుకలు, నగదు, స్వామివారికి అలంకరించిన నగలు కనిపించేలా నిఘా కోసం సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డులను ఉంచారు. సాయంత్రం అయినా విద్యుత్ సరఫరా పునరుద్ధరించకపోవడంతో సెక్యూరిటీ గార్డుల్లో ఆందోళన మొదలైంది. ఈ విషయం సంబంధిత అదికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదని ఏఎస్ఐ రాములు తెలిపారు. ఈ విషయం అక్కడికి వెళ్లిన భక్తులు అధికారులకు తెలుపగా రాత్రి 7:45 గంటలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. దీంతో గర్భగుడితో పాటు సీసీ కెమెరాల నిఘా కొనసాగడంతో సెక్యూరిటీ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. -
ఆరోగ్యంపై దృష్టి సారించాలి
పాలమూరు: సుశ్రుత ప్రజావైద్యశాల ప్రారంభించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం న్యూటౌన్లో ఉన్న సుశ్రుత ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేసిన 2కే రన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, కమెడియన్ ఆటో రాంప్రసాద్ ప్రారంభించారు. 2కే రన్ న్యూటౌన్ నుంచి రాజేంద్రనగర్, పీడీ నాయుడు చౌరస్తా నుంచి స్టేడియం గ్రౌండ్ వరకు కొనసాగింది. అక్కడ ఆరోగ్యంపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జుంబా డ్యాన్స్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం ఒత్తిడి జీవనంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానంగా నిత్యం వాకింగ్, యోగా, ధ్యానం, వ్యాయమం తప్పక చేయాలని సూచించారు. కార్యక్రమంలో మేయర్ మమత, సుశ్రుత ఆస్పత్రి ఎండీ డాక్టర్ మధుసూదన్రెడ్డి, డాక్టర్ ప్రతిభ, ఐఎంఏ అధ్యక్షుడు రామ్మోహన్, వైద్యులు శ్యామూల్, విజయ్కాంత్ తదితరులు పాల్గొన్నారు. -
స్థిరంగా ఉండేవి ధర్మం, కీర్తి మాత్రమే
మక్తల్: ప్రపంచంలో స్థ్రింగా ఉండేది ధర్మం, కీర్తి మాత్రమేనని నేరడుగోమ్ పీఠాధిపతి సిద్దలింగేశ్వర స్వామి అన్నారు. ఆదివారం జక్లేర్ గ్రామంలో హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. అనంత రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలని కోరారు. విద్యార్థులు సెల్ఫోన్కు దూరంగా ఉండాలి.. పుస్తకానికి దగ్గర ఉన్నప్పుడు భవిష్యత్లో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చన్నారు. అనంతరం ఆదిత్య పరాశ్రీ స్వామి మాట్లాడుతూ మన సంస్కృతిని మనం కాపాడుకోవాలని, సమాజం మారినట్లు మనలో మార్పు రావాలని కోరారు. హిందువులందరూ ఐక్యంగా ఉన్నప్నుడే భారతదేశం అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్రెడ్డి, మాతశ్రీ, తదితరులు పాల్గొన్నారు. -
ఒకే ఇంట్లో 12 పాము పిల్లలు
మండలంలోని గుడ్లనర్వ గ్రామానికి చెందిన మేకల శివుడు అనే వ్యక్తి ఇంట్లో ఆదివారం ఒకే చోట 12 పాము పిల్లలు బయటపడ్డాయి. శివుడు ఇంట్లో ఉన్న సమయంలో పాము పిల్లలు కన్పించడంతో వాటిని బయటికి పంపే ప్రయత్నం సాధ్యం కాలేదు. దీంతో గ్రామానికి చెందిన జగన్ అనే యువకుడి సాయంతో పాము పిల్లలను పట్టుకుని పంట పొలాల్లో వదిలేశారు. జనావాసాల్లో ఎక్కడైనా పాములు కనిపిస్తే చంపకుండా తనకు సమాచారం ఇస్తే పట్టుకొని అడవుల్లో వదిలేస్తానని స్నేక్ క్యాచర్ జగన్ తెలిపాడు. బిజినేపల్లి పాము పిల్లతో స్నేక్ క్యాచర్ పట్టుకున్న పాము పిల్లలు (ఇన్సెట్లో) -
జాతీయ రహదారి పనుల అడ్డగింత
భూత్పూర్: మున్సిపాలిటీలోని అమిస్తాపూర్ వద్ద చేపడుతున్న జాతీయ రహదారి ఎన్హెచ్–167ఎన్ పనులను ఆదివారం గ్రామస్తులు అడ్డగించారు. నాలగు వరుసల రహదారి పనులు చేపడుతుండటంతో మహబూబ్నగర్ వెళ్లే దారిలో ముస్లింలకు చెందిన శ్మశానవాటిక ఉండటంతో ఆటంక పరుచకుండా బీటీరోడ్డు వేస్తున్నారు. గ్రామానికి చెందిన కొందరు పెద్దలు రెండు వైపులా సమానంగా రహ దారి పనులు చేపట్టాలని, ఒకవైపు రెండు వరుస లు, మహబూబ్నగర్ వెళ్లే దారిలో ఒక వరుస బీటీ దారి ఏంటని ప్రశ్నించారు. శ్మశానవాటికపై గ్రామ పెద్దలతో మాట్లాడి నిర్ణయం వచ్చాకనే పనులు చేపట్టాలని కాంట్రాక్టర్కు చెందిన సూపర్వైజర్కు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు రహదారి కాంట్రాక్టర్, గ్రామ పెద్దలతో మాట్లాడారు. తువ్వగుట్టలో చిరుత సంచారం మహబూబ్నగర్ రూరల్: మండలంలోని రామచంద్రాపూర్ సమీపంలోని తువ్వగుట్టలో ఆదివారం చిరుత సంచారం కలకలం రేపింది. పటేల్ చెరువు వద్ద గల గుట్టపై చిరుత కనిపించినట్లు స్థానికులు తెలిపారు. గుట్టపై చిరుత తిరుగుతుండటంతో రైతులు, గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రతిరోజూ పొలాలకు వెళ్లే రైతులు చిరుత సంచారం వల్ల భయంతో పనులకు వెళ్లడానికి సంకోచిస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా పశువులను మేపేందుకు వెళ్లే కాపరులు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుత సంచారం గురించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ, వారు వెంటనే స్పందించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పరిస్థితిని గమనించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా ఫారెస్టు అధికారులు స్పందిస్తూ చిరుత సంచరిస్తున్న ప్రదేశాన్ని పరిశీలించినట్లు తెలిపారు. అది అటవీ ప్రాంతానికి చెందిన గుట్ట అని, గ్రామ ప్రజలు అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిరుత సంచారం నేపథ్యంలో గ్రామ పరిసర ప్రాంతాల్లో అటవీ శాఖ గస్తీ పెంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
మార్కెట్లకు కాసుల పంట
జడ్చర్ల: జిల్లాలో గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వ్యవసాయ మార్కెట్ యార్డుల ఆదాయానికి పంట పండింది. వ్యవసాయ పంట దిగుబడులు ఆశాజనకంగా ఉండడంతో పాటు పంటలకు గిట్టుబాటు ధరలు లభించడంతో మార్కెట్లకు ఆదాయం కలిసి వచ్చింది. ప్రధానంగా బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఈ ఏడాది కూడా రికార్డు స్థాయిలో 2025– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.7.03 కోట్ల ఆదాయం వరుసగా కొన్నేళ్లుగా మార్కెటింగ్ శాఖ బాదేపల్లి మార్కెట్కు కేటాయించిన లక్ష్యాన్ని అధిగమించి ఆదాయం ఆర్జించడంపై మార్కెట్ అధికారులు పాలకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని మహబూబ్నగర్, దేవరకద్ర, బాలానగర్ మార్కెట్ యార్డులు కూడా నిర్దేశించిన లక్ష్మాన్ని అధిగమించాయి. నవాబ్పేట మార్కెట్ యార్డు మాత్రం నిర్దేశించిన లక్ష్యానికి కాస్త దూరంగా 70 శాతం మాత్రమే ఆదాయాన్ని సాధించింది. బాదేపల్లిలో రూ.700 కోట్ల వ్యాపారం: జిల్లాలోనే ఎక్కువగా ఈ ఏడాది బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ ఏడాది పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలకు సంబంధించి దాదాపుగా రూ. 700 కోట్ల పైచిలుకు వ్యాపారం సాగింది. ఇందుకు సంబంధించి ఒక శాతం అంటే రూ.7.03 కోట్ల ఆదాయం లభించింది. మార్కెట్ యార్డులో పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, ఆముదాలు, వరి, తదితర పంట ఉత్పత్తుల విక్రయాలు భారీగా కొనసాగడంతో యార్డుకు అధిక ఆదాయం దక్కింది. సెలక్షన్ గ్రేడ్ దక్కేనా? బాదేపల్లి యార్డుకు సంబంధించి ప్రతి సంవత్సరం మార్కెట్ ఆదాయం పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం బాదేపల్లి మార్కెట్ యార్డు స్పెషల్ గ్రేడ్ మార్కెట్గా కొనసాగుతుంది. రూ: 4 కోట్ల ఆదాయం దాటితే యార్డును సెలెక్షన్ గ్రేడ్ మార్కెట్గా గుర్తించాల్సి ఉంది. గత ఐదేళ్లుగా సెలెక్షన్ గ్రేడ్ లక్ష్మాన్ని సాధిస్తూ వస్తుంది. ఈ ఏడాది కూడా ఇందుకు అనుగుణంగా ఆదాయం లభించింది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి బాదేపల్లి మార్కెట్ యార్డును సెలెక్షన్ గ్రేడ్గా గుర్తించాలని ప్రజలు కోరుతున్నారు. వసతులు కరువు: మార్కెట్ యార్డులకు అత్యధికంగా ఆదాయం సమకూరుతున్నా.. రైతులకు మాత్రం సరిపడా సౌకర్యా లు కల్పించడంలో అటు అధికారులు ఇటు పాలకులు విఫలమవుతున్నారు. యార్డుల్లో పూర్తిస్థాయిలో సిబ్బంది లేకపోవడంతో పర్యవేక్షణ గాడి తప్పింది. సకాలంలో అటు రైతులకు ఇటు వ్యాపారులకు సేవలు అందడం లేదు. ఇప్పటికై నా మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. నవాబ్పేటలో తగ్గిన ఆదాయం: నవాబ్పేట మార్కెట్కు సంబందించి నిర్దేశించిన ల క్ష్మాన్ని సాధించలేక పోయింది.ఇక్కడ రూ.117.40 లక్షల ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించగా కేవలం రూ. 83.36 లక్షలు మాత్రమే ఆదాయం లభించింది. 2025– 26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని మార్కెట్ యార్డులకు సంబంధిత శాఖ నిర్దేశించిన లక్ష్యం.. సాధించిన ఆదాయం వివరాలు: యార్డు లక్ష్యం ఆదాయం (రూ.లక్షల్లో) (రూ.లక్షల్లో) బాదేపల్లి 684.50 702.99 మహబూబ్నగర్ 478.70 483.51 దేవరకద్ర 156.50 169.47 నవాబ్పేట 117.40 83.36 బాలానగర్ 41.60 74.79 రికార్డు స్థాయిలో ఆదాయం ముగిసిన 2025– 26 ఆర్థిక సంవత్సరం జోరుగా సాగిన క్రయవిక్రయాలు జిల్లాలోనే బాదేపల్లి యార్డుకు అధిక ఆదాయం బాదేపల్లి యార్డుకు సెలక్ష న్ గ్రేడ్ హోదా లభించే వి ధంగా కసరత్తు చేస్తున్నాం.ఇప్పటికే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఈ ఏడాది పంట దిగుబడులకు సంబంధించి మార్కెట్లో మంచి ధరలు రావడం ఆదాయానికి కలిసి వచ్చింది. మున్ముందు రైతులకు మంచి ధరలు లభించే విదంగా కృషి చేసి అ ధిక ఆదాయాన్ని ఆర్జించేందుకు కృషి చేస్తాం. – అశ్వక్ అహ్మద్,యార్డు కార్యదర్శి,బాదేపల్లి బాదేపల్లి యార్డుకు ప్రతి ఏడాది మంచి ఆదాయం లభిస్తుంది. ఈ ఏడాది రూ.7.03 కోట్ల ఆదాయం వచ్చింది. యార్డులో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం. ఆదాయానికి అనుగుణంగా మార్కెట్ స్థాయిని పెంచేందుకు కృషి చేస్తాం. – తంగెళ్ల జ్యోతి, మార్కెట్ యార్డు చైర్పర్సన్, బాదేపల్లి ఈ ఏడాది అత్యధికంగా మార్కెట్లో ధాన్యం, మొక్కజొన్న, వేరుశనగ, పత్తి క్రయ విక్రయాలు కొనసాగడం మార్కెట్ ఆదాయానికి కలిసి వచ్చింది. దాదాపు 7 లక్షల క్వింటాళ్లకు పైగా ధాన్యం క్రయవిక్రయాలు సాగాయి. అదే విధంగా 9 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్న, లక్ష క్వింటాళ్ల పత్తి, 2 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, కందులు, ఆముదాలు, జొన్నలు, పొద్దుతిరుగుడు, మినుములు, పెబ్బర్లు, రాగులు, ఉలువలు, పెసర్లు తదితర క్రయవిక్రయాలు జోరుగా సాగాయి. -
ఉమ్మడి జిల్లాలో ఇలా..
ప్రభుత్వం ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కొనసాగుతోంది. యాక్టివ్గా ఉన్న చేనేత సహకార సంఘాల్లో చనిపోయిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించమని ఆదేశాలు జారీ చేశాం. అదేవిధంగా ఓటరు జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించాం. తుది జాబితా ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ను ప్రభుత్వం ప్రకటిస్తుంది. – పద్మ, ఏడీ, చేనేత, జౌళిశాఖ అమరచింతలో చేనేత మగ్గంపై చీర నేస్తున్న కార్మికులు (ఫైల్) అమరచింత: చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మే నెల 15 వరకు ఓటరు జాబితా తయారు చేయాలని ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేయడంతో అధికార యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అయితే సంఘాల్లో అప్పులు లేని సభ్యులకే పోటీ చేసే, ఓటు వేసే హక్కు ఉంటుంది. దీంతో సహకార సంఘాల్లో ఎన్నికల సందడి మొదలైంది. 2013లో చివరిసారి.. రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాల ఎన్నికలు చివరిసారి 2013, ఫిబ్రవరిలో జరిగాయి. వీటి పదవీ కాలం 2018లో ముగిసింది. తర్వాత మళ్లీ ఎన్నికలు జరగలేదు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ఎనిమిది ఏళ్ల పాటు మొత్తం 16 పర్యాయాలు పాత పాలక వర్గాల పదవీ కాలన్ని పొడిగిస్తూ వచ్చింది. చివరిసారిగా గత నెల మార్చి 9 నుంచి మే నెల 10వ తేదీ వరకు పదవీ కాలం పొడిగించింది. జిల్లాలోని పలు సంఘాల్లో అక్రమాలు జరిగాయని నిర్ధారణ కావడంతో పీఏసీఎస్ చట్టం సెక్షన్ 51 కింద అధికారులను పర్సన్ ఇన్చార్జ్లుగా నియమించారు. మార్చి 24న ఉత్తర్వులు జారీ.. ఓటరు జాబితా తయారీకి గత నెల 24న చేనేత, జౌళిశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో తయారు చేసిన ఓటరు జాబితాలను పక్కన బెట్టారు. చనిపోయిన, డిఫాల్టర్లను ఓటరు జాబితా నుంచి తొలగిస్తారు. సంఘానికి నగదు లేక వస్తు రూపంలో 90 రోజుల కంటే ఎక్కువ బకాయి ఉంటే డిఫాల్టర్గా పరిగణిస్తారు. సభ్యులు ఓటు హక్కు కలిగి ఉండాలంటే సహకార సంఘానికి ఏమైనా బకాయిలు ఉంటే ఏప్రిల్ 13లోగా చెల్లించాలని గడువు విధించారు. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు మూడు రోజుల పాటు చేనేత జౌళిశాఖ అధికారులు సహకార సంఘాల వారీగా ఓటరు జాబితా రూపొందిస్తారు. 18వ తేదీ నుంచి 25 వరకు ఏడు రోజుల పాటు సహకార సంఘాల నోటీస్ బోర్డులపై ఓటరు జాబితా ప్రదర్శిస్తారు. 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు సభ్యుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి సవరిస్తారు. 30వ తేదీ నుంచి మే నెల 1 వరకు సంఘాల వారీగా జాబితాలను జిల్లా రిజిస్ట్రార్కు అందజేస్తారు. మే నెల 2 నుంచి 5వ తేదీ వరకు జిల్లా ఏడీ కార్యాలయంలో ఓటరు జాబితా పరిశీలిస్తారు. మే నెల 6 నుంచి 8వ తేదీ వరకు సంఘాల నోటీసు బోర్డులపై సవరించిన ఓటరు జాబితా ప్రదర్శన. జిల్లా రిజిస్ట్రార్ వద్ద అభ్యంతరాల స్వీకరణ. మే నెల 11, 12 తేదీల్లో సవరించిన సంతకం చేసిన ఓటరు జాబితా జిల్లా ఏడీ కార్యాలయంలో అందజేస్తారు. మే నెల 13 నుంచి 15వ తేదీ వరకు రాష్ట్ర కో–ఆపరేటివ్ ఎన్నికల సంఘానికి ఓటరు జాబితా అందించాల్సి ఉంటుంది. వచ్చేనెల 15 వరకు రూపకల్పన డిఫాల్టర్ల ఓటుహక్కు తొలగింపునకు అవకాశం చనిపోయిన వారి పేర్లు తొలగించాలని జౌళిశాఖకు ఆదేశం ఉమ్మడి జిల్లాలో 54 సహకార సంఘాలు ఉమ్మడి జిల్లాలోని వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, నాగర్కర్నూల్, మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం 54 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో కొన్ని పని చేస్తుండగా మరికొన్ని సంఘాలు అప్పుడప్పుడు పని చేస్తుండగా.. ఇంకొన్ని సంఘాలు మూతబడ్డాయని జౌళిశాఖ అధికారులు చెబుతున్నారు. ఉమ్మ డి జిల్లాలో సుమారు 35 వేల మంది చేనేత కార్మికులు ఉన్నారు. -
పీఎంశ్రీ స్కూళ్లకు నిధులు
● ఉమ్మడి జిల్లాలో 94 పాఠశాలలకు రూ.4.40లక్షలు విడుదల ● బ్యానర్లు, పోస్టర్లతో ప్రచారం చేయాలని సూచన మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి.. విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా విద్యార్థులను ఆకట్టుకునే విధంగా కార్యాచరణ రూపొందించింది. అందులో భాగంగా పీఎంశ్రీ (ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా) స్కీం పాఠశాలలకు కేవలం ప్రచారం కోసమే ప్రత్యేకంగా నిధులను విడుదలచేసింది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా 94 పీఎంశ్రీ పాఠశాలలు ఉండగా.. రూ.4.40లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులతో ప్రచారం నిమిత్తం కరపత్రాలు, పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. ఉపాద్యాయులు ఇంటింటి ప్రచారం కూడా నిర్వహించాల్సి ఉంటుంది. పాఠశాలలో సాధించిన విజయాలు, అందిస్తున్న వసతులు, బోధన సిబ్బంది తదితర అంశాలపై ప్రచారాన్ని నిర్వహించాలి. ఇందుకోసం ఉపాధ్యాయులు యువజన సంఘాలు, మహిళా సంఘాలు, ప్రజాప్రతినిధుల సహాయం తీసుకోవాల్సి ఉంది. కాగా, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎక్కడా కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రచారం నిర్వహించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో డీఈఓ ప్రవీణ్కుమార్ను వివరణ కోరగా.. ప్రచారం కోసం పీఎంశ్రీ పాఠశాలలకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రచారం నిర్వహిస్తామన్నారు. -
ఆరోగ్యంగా మాగిస్తే.. అమృతఫలం
గ్రేడింగ్ విధానం కాయలను గ్రేడింగ్ చేయడం ద్వారా అవసరమైన సైజు(పరిమాణం), రంగు, బరువును బట్టి చేయడం వల్ల మంచి ధర లభించే అవకాశం ఉంటుంది. ఆవిరి (వేపర్ ట్రీట్మెంట్) ద్వారా కాయలను శుభ్రం చేసుకోవచ్చు. గ్రేడింగ్ చేయడంతో రైతుకు వినియోగం కూడా లాభం చేకూరుతుంది. బరువును బట్టి గ్రేడింగ్ చేయవచ్చు. 200–250 గ్రాములు ఉన్నవాటిని మరో గ్రేడ్గా, 300 నుంచి 350 బరువు ఉన్నవాటిని ఇంకో గ్రేడ్గా తయారు చేస్తే మంచిధర లభిస్తోంది. అలంపూర్: మామిడిలో పోషకాలు అత్యంత విలువైనవి. అందుకే మాడిని పండ్లలో రాజుగా గుర్తిస్తారు. ఇందులో విటమిన్–సీ 76 శాతం, విటమిన్–ఏ 25 శాతం, విటమిన్–బీ 6నుంచి 11శాతం, ఫైబర్(పిచు) 9 శాతం, రాగి 9 శాతం పొటాషియం 7శాతం, మెగ్నీషియం 4శాతం ఉంటుంది. మామిడి ఆరోగ్యం కాబట్టి వాటిని మాగించే పద్ధతులు, కోత కోసే సమయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ ఏడీఏ సక్రియా నాయక్ రైతులకు సూచించారు. మామిడి మాగించడం: మార్కెట్లోకి పంచదార, కలప వంటి రకాలు ముందుగా వస్తాయి. పెద్దరసం, చిన్నరసం, చెరుకు రసాలు తర్వాత అందుబాటులోకి వస్తాయి. బేనిషా రకం ఆ తర్వాత నీలం, బెంగుళూరు(తోతపరి, కలెక్టర్) రకాలు అలస్యంగా మార్కెట్లోకి వస్తాయి. ముందుగా వచ్చే పండ్లకు నాణ్యత ఉండదు. కార్బెట్ను ఉపయోగించి రంగును తెప్పించి విక్రయిస్తారు. తర్వాత వచ్చే మామిడి పండ్లు రుచికరంగా ఉంటాయి. ఒకగదిలో గడ్డి లేదా వరిగడ్డి పరచి వాటిపై కాయలు పేర్చి మళ్లీ గడ్డిని కప్పాలి. రెండుమూడు రోజుల్లోనే కాయలు మాగుతాయి. పండ్లు మంచి నాణ్యత కలిగి ఉంటాయి. అవసరమైతే మామిడికి మంచి రంగును తెప్పించడానికి ఇథైల్ను ఉపయోగించవచ్చు. ఇది కెమికల్ కాదు. ఇది హార్మోన్. లీటర్ నీటికి 1ఎంఎల్ నుంచి 1.8 ఎంఎల్ను ఉపయోగించి కాయలన్నింటికీ సమానంగా రంగును తెప్పించి మాగపెట్టవచ్చు. ఇథైల్ను వేడి నీటిలో 52 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద కలిపి కాయలను 5నిమిషాలు ముంచి తీసి ఆరబెట్టాలి. మామిడి పండ్లను చెక్కపెట్టల్లో కాకుండా సీఎఫ్బీ పెట్టెల్లో ఉంచి రవాణా చేయవచ్చు. 5–10 కిలోల వరకు పెట్టేల్లో ఉంచి దూరప్రాంతాలకు రవాణా చేయడం వల్ల దెబ్బతినవు. కాల్షియం కార్బైట్ ద్వారా మాగించడంతో.. కొంతమంది రైతులు, వ్యాపారులు కాయలను మాగపెట్టడానికి ప్రమాదకరమైన పద్ధతులు పాటిస్తున్నారు. కాల్షియం కార్బైట్ను అధికంగా వినియోగించి సరిగ్గా పక్వానికి రాని కాయలను కృత్రిమంగా రంగు తెప్పించి మార్కెట్లో విక్రయిస్తున్నారు. వీటికి మంచి రంగు ఉంటుంది. కానీ రుచి ఉండదు. పుల్లగా ఉంటాయి. ఇలా మాగబెట్టినవి తినడంతో ఆరోగ్యానికి హానికి కలిస్తాయి. బాగా ముదిరిన కాయలను మాగబెట్టడానికి ఎలాంటి రసాయనాలు ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. ఇథైల్ వాడకం శ్రేయస్కరం మామిడి కాయలను మాగించడానికి ఇథైల్ వాడకం శ్రేయస్కరం. దీన్ని ఉపయోగించడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. ఇది ఆకు పచ్చని రంగును ఆకర్షణీయమైన రసం పసుపు రంగుకు మారుస్తుంది. పండ్లు తీపిదనాన్ని, మంచి సువాసనను ఇస్తోంది. ఇథైల్ వాడకంతో మామిడి కాయాల్లో ఇథిలిన్ వాయువు ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అందువల్ల రైతులు కార్బెడ్ ఉపయోగించకుండా ఈ సూచన ప్రకారం మాగపేడితే మంచి నాణ్యత వస్తోంది. రైతుకు మంచి ధర లభిస్తోంది. మామిడి కోతలో జాగ్రత్తలు తప్పనిసరి పాడి–పంట -
పాత కక్షలతో యువకుడి దారుణ హత్య
వెల్దండ: భూ వివాదం నేపథ్యంలో ఓ యువకుడిని దారుణంగా హత్యచేసి.. ఆపై రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించిన ఘటన వెల్దండలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. వెల్దండకు చెందిన రుద్రాక్షల మహేశ్ (30) శుక్రవారం రాత్రి గ్రామం నుంచి తన వ్యవసాయం పొలంలోని ఇంటికి కారులో వెళ్తుండగా.. అప్పటికే పక్కా ప్రణాళికతో దారి కాచి ఉన్న దుండగులు టిప్పర్తో కారును ఢీ కొట్టారు. అనంతరం మహేశ్పై రాళ్లతో దాడిచేసి హతమార్చారు. ఆ తర్వాత రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించారు. గ్రామస్తుల సమాచారం మేరకు శనివారం వెల్దండ సీఐ రఘువీర్రెడ్డి, ఎస్ఐ కురుమూర్తితో పాటు ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి చేసుకొని వివరాలు సేకరించారు. మహేశ్ తలపై మోదిన బండరాళ్లపై రక్తపు మరకలను గుర్తించారు. ఈ క్రమంలో మృతుడికి తన కుటుంబ సభ్యులతో భూ వివాదం ఉన్నట్లు గుర్తించారు. పథకం ప్రకారం టిప్పర్ మహేశ్ కారును ఢీకొట్టి హత్యచేశారని పోలీసులు నిర్ధారించుకున్నారు. మృతుడి భార్య మేఘన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ కురుమూర్తి తెలిపారు. కాగా, టిప్పర్ డ్రైవర్తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. ఆపై రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన వైనం -
మన్యంకొండలో వైభవంగా తిరుచ్చి సేవ
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో స్వామివారి తిరుచ్చి సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి శనివారం రాత్రి స్వామివారి తిరుచ్చిసేవ నిర్వహిస్తారు. అందులో భాగంగానే ఈ పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని గర్భగుడి నుంచి శోభయామానంగా అలంకరించిన తిరుచ్చివాహనంపై దేవస్థానం ముందున్న సభామండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. సన్నాయి వాయిద్యాలు, భక్తుల హరినామశ్చరణ మధ్య ఊరేగింపు ముందుకు కదిలింది. సభామండపం వద్ద ప్రత్యేక పూజల అనంతరం స్వామివారిని మళ్లీ గర్భగుడి వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా నలుమూలల నుంచి ఈ సేవను తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో మన్యంకొండకు తరలివచ్చారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి తదితరులు పాల్గొన్నారు. -
లింగమయ్య భక్తులపై లాఠీ చార్జీ
● ఆలస్యంగా సంఘటన వెలుగులోకి..అచ్చంపేట: సలేశ్వరం లింగమయ్య దర్శనానికి వచ్చిన భక్తులపై పోలీస్ లాఠీచార్జి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈనెల 1నుంచి 3వరకు జరిగిన సలేశ్వరం బ్రహ్మోత్సవాలకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఐదురోజుల ఉత్సవాలను అటవీశాఖ మూడు రోజులకు కుదించడంతో నల్లమల పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మొదటిరోజు నుంచే చెప్పుల కుర్వ వద్ద భక్తుల రాకపోకలను నియంత్రించినప్పుటికీ అదుపు తప్పింది. ఈ క్రమంలో భక్తుల తాకిడికి ఇనుప కంచె, బారికేడ్లు తట్టుకోలేదు. లోయ ప్రాంతంలో భక్తుల నియంత్రణంలో భాగంగా పోలీసులు, అటవీశాఖ వలంటీర్లు అదుపు చేసే సమయంలో లాఠీచార్జీ చేసిన వీడియో సోషల్ మీడియా, ఇన్స్ర్ట్రాగామ్, ఫేస్బుక్లో హల్చల్ అవుతుంది. మునుపటి మాదిరిగానే భక్తులను ఐదురోజులపాటు అనుమతిస్తే ఇంత తాకిడి ఉండదని, వచ్చే ఏడాదికై నా అటవీ, పోలీస్శాఖలు ఈ విషయంపై పునపరిశీలిస్తే బాగుటుందని అభిప్రాయపడుతున్నారు. ఏడాది పొడవునా అనుమతిస్తామని రెండేళ్లుగా ఊరిస్తున్న అటవీశాఖ ఐదురోజులకు అనుమతి ఇవ్వడంలో వారికి వచ్చే ఇబ్బంది ఏమిటనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
చెరువులో మునిగి యువకుడు మృతి
నారాయణపేట రూరల్: స్నానానికి వెళ్లిన యువకుడు ఈతరాక నీటిలో మునిగి మృతి చెందిన ఘటన మండలంలో శనివారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాలు.. మహబూబ్నగర్కు చెందిన ఖాదర్ తన మిత్రులు, సోదరులతో కలిసి మండలంలోని కోటకొండ గ్రామంలో బంధువుల ఇంట్లో వేడుకకు హాజరయ్యాడు. ఈ క్రమంలో ఉదయం గ్రామ శివారులోని చెరువుకట్ట వైపు వెళ్లిన ఖాదర్ స్నానం చేసేందుకు నీటిలోకి దిగాడు. ఈత రాకపోవడంతో నీళ్లలో మునిగిపోయాడు. మిత్రులు కాపాడే ప్రయత్నం చేసిన ఆయన ఆచూకీ దొరకలేదు. గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని బయటికి తీశారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. యువకుడు అనుమానాస్పద మృతి కొత్తకోట రూరల్: తన కుమారుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడంటూ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కొత్తకోట ఎస్ఐ ఆనంద్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్లోని శ్రీరాంనగర్ కాలనీ, కాటేదన్కు చెందిన దోమ అరుణమ్మ కుమారుడు చంద్రశేఖర్రెడ్డి (27) డీసీఎం నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈనెల 2న డీసీఎంను తీసుకుని బళ్లారికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. కొత్తకోట మండలం విలియంకొండ గ్రామ సమీపంలో ఓ దాబా దగ్గర కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఆపి అంతలోనే అస్వస్థతకు గురికావడంతో తోటి డ్రైవర్లు వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించే క్రమంలో మధ్యలోనే చంద్రశేఖర్రెడ్డి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తల్లి అరుణమ్మ తన కుమారుడి మృతిపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య రాజోళి: ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వడ్డేపల్లి మండలంలోని రామాపురంలో జరిగింది. శాంతిగనర్ ఎస్ఐ నాగశేఖర్రెడ్డి తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన రామస్వామి(40) 20 ఏళ్ల కిందట వివాహం జరిగింది. తాగుడుకు బానిస కావడంతో పదేళ్ల కిందట భార్య వదిలేసి పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో నాలుగేళ్ల క్రితం పక్షవాతం వచ్చి ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం మనస్తాపానికి గురై ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య పాల్పడినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. అడవిపంది దాడిలో గాయపడిన రైతు మృతి జడ్చర్ల: పొలంలో అడవి పంది దాడి చేసిన ఘటనలో తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతి చెందాడు. పూర్తి వివరాలు.. మండల పరిధిలోని ఉదండాపూర్ గ్రామ శివారులో శుక్రవారం వ్యవసాయ పనులు చేసుకుంటున్న గొంగండ్ల రామకృష్ణ(50)పై అడవి పంది దాడి చేసింది. దాడిలో కడుపులోని పేగులు బయటకు రాగా స్థానికులు 108 అంబులెన్స్లో చికిత్స కోసం ఏనుగొండ ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడికి భార్య సత్యమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు వెల్దండ: మండలంలోని నారాయణపూర్ బస్స్టేజీ సమీపంలో హైదరాబాదు–శ్రీశైలం జాతీయ రహదారిపై శనివారం చోటుచుసుకున్న రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. ఎస్ఐ కురుమూర్తి కథనం ప్రకారం.. హైదరాబాదు నుంచి కల్వకుర్తి వైపు వస్తున్న కారు అచ్చంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును మండలంలోని నారాయణపూర్ బస్స్టేజీ సమీపంలో ఎదురుగా ఢీకొట్టింది. ముందు వెళ్తున్న మరో వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయిన కారు బస్సును ఢీకొన్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో హైదరాబాదులోని పిసల్బండకు చెందిన డ్రైవర్ అసీఫ్అహ్మద్, అర్ఫన్, ఫరీదాబేగం, సల్మా, మహ్మద్జానీ, సఫా తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం 108అంబులెన్స్లో కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అదేవిధంగా ఆర్టీసీ బస్సులో డ్రైవర్, కండక్టర్తోపాటు మరో 33మంది ప్రయాణికులున్నారు. వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. వెల్దండ పోలీసులు పరిశీలించి వివరాలను నమోదు చేసుకున్నారు. ఆర్టీసీ డ్రైవర్ వెంకట్ ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్ అసీఫ్అహ్మద్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ప్రతి పోలీస్ కుటుంబానికి సమయం ఇవ్వాలి
● ఇకపై ఇంటివద్దే ఎఫ్ఐఆర్ నమోదు విధానం ● ఎస్పీ డి.జానకి మహబూబ్నగర్ క్రైం: పోలీస్శాఖలో పనిచేసే అధికారి నుంచి సిబ్బంది వరకు విధి నిర్వహణతో పాటు కుటుంబానికి తప్పక సమయం ఇవ్వాలని ఎస్పీ జానకి అన్నారు. జిల్లా పరేడ్ మైదానంలో శనివారం సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్, ట్రాఫిక్ పోలీసులు, మహిళా పోలీసులతో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యమాలు, ధర్నాలు, రాస్తారోకోలు వంటి పరిస్థితుల్లో పోలీసులు ఎలా స్పందించాలి, ఎలా విధులు నిర్వహించాలనే అంశంపై ప్రత్యేక మాక్ డ్రీల్ నిర్వహించారు. అత్యవససర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలను ప్రదర్శనాత్మకంగా చేసి చూపించారు. అనంతరం సిబ్బందితో ఎస్పీ సమావేశం నిర్వహించి మాట్లాడారు. విధుల కారణంగా ఒత్తిడికి గురవుతారని.. ఈ క్రమంలో ఆరోగ్యంపై కూడా దృష్టిపెట్టాలన్నారు. కుటుంబ సభ్యులతో సమయం గడపటం ద్వారా మానసిక ప్రశాంతతో పాటు ధృడంగా మారుతారని తెలిపారు. ఆరోగ్యం కోసం నిత్యం యోగా, నడక, ప్రాణయామం, ధ్యానం వంటి కార్యక్రమాలు అలవాటు చేసుకోవాలన్నారు. ఇంటి వద్దాకే ఎఫ్ఐఆర్ బాధితులు, ఫిర్యాదుదారుల సౌలభ్యం కోసం ఇకపై పోలీస్స్టేషన్కు రావాల్సిన అవసరం లేదని ఇంటి వద్ద నుంచి తెలంగాణ పోలీస్ ఎఫ్ఐఆర్ నమోదు చేసే విధానాన్ని అమలు చేస్తోందని ఎస్పీ జానకి ప్రకటనలో తెలిపారు. ప్రత్యేకంగా మహిళలు, పిల్లలు, బలహీన పరిస్థితుల్లో ఉన్న బాధితులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందన్నారు. లైంగిక నేరాలు, హత్యాయత్నం, గాయపరిచే ఘటనలు, దొంగతనం, దోపిడీ, చోరీలు వంటి ఆస్తి సంబంధిత, పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, బాల్య వివాహ నిరోధక చట్టాలు సందర్భాల్లో బాధితులు స్టేషన్కు రాలేని పరిస్థితుల్లో ఫోన్ద్వారా సమాచారం అందిస్తే వెంటనే పోలీసులు చేరుకుని ఫిర్యాదు స్వీకరిస్తారని తెలిపారు. ఫిర్యాదుదారుడు ఫిర్యాదు రాయలేని పరిస్థితుల్లో కూడా పోలీసులే బాధితుడి వాగ్మూలం వారి భాషలోనే నమోదు చేసి చదివి వినిపించి వారి సంతకం తీసుకుంటారని తెలిపారు. అక్కడినుంచే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అక్కడే బాధితుడికి ఎఫ్ఐఆర్ అందిస్తారని తెలిపారు. దీనిని బాధితులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
ముగిసిన బావాజీ బ్రహ్మోత్సవాలు
కొత్తపల్లి: నాలగు రోజులుగా కొనసాగుతున్న లోకామసంద్ బావాజీ ఉత్సవాలు అట్టహాసంగా ముగిశాయి. శనివారం చివరి రోజు ఉదయం అమ్మవారికి పల్లకీ సేవ నిర్వహించారు. కాళికాదేవికి భక్తులు మొక్కుబడిగా మేకపోతులు, గొర్రె పోతులను బలిచ్చి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ పూజారులు చందర్నాయక్, భీమ్లాయాక్, దేవ్లానాయక్, దన్సింగ్లు కాళికామాతకు మహా హోమం జరిపంచారు. రాష్ట్రంలోనే అతి పెద్ద గిరిజన సామాజిక వర్గాల జాతర కావడంతో గిరిజనులు పెద్దఎత్తున హాజరయ్యారు. 3 నుంచి 4 లక్షల మంది భక్తులు ఉత్సవాల్లో పాల్గొనట్లు ఈఓ కోమల్ తెలిపారు. ప్రభుసేవలో కర్ణాటక మాజీ మంత్రి గురులోకా మసంద్ బావాజీ, కాళికామాతను శనివారం కర్ణాటక మాజీ మంత్రి ప్రభుచౌహాన్ దర్శించుకున్నారు. ఎమ్మెల్యేగా వరుసగా ఐదోసారి గెలుపులో లోకామసంద్ బావాజీ ఆశీస్సులతోనే ప్రజల్లో ఉంటున్నానని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆలయన అభివృద్ధిపై దృష్టి సారిస్తే గొప్ప పర్యాటక ప్రదేశంగా మారి మరింత అభివృద్ధి జరుగుతుందని ఆయన ఆకాక్షించారు. కలెక్టర్ ప్రత్యేక పూజలు బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా కలెక్టర్ ప్రతీక్జైన్ స్వామివారిని దర్శించుకొన్నారు. ఆర్డీఓ రాంచందర్నాయక్, ఆలయ కమిటీ సభ్యులు కలెక్టర్కు ఘన స్వాగతం పలికారు. జాతర ఏర్పాట్లపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మొగులప్ప, డీపీఓ సుధాకర్రెడ్డి, డీపీఆర్వో రశీద్, తహసీల్దార్ జయరాములు, కొత్తపల్లి మద్దూరు ఎంపీడీఓలు కృష్ణారావు, రామన్న, కోస్గి సీఐ సైదులు, ఎస్ఐ విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రెవెన్యూ, పోలీస్ అధికారుల తీరుపై విమర్శలు
మాగనూర్: మండల రెవెన్యూ అధికారులు అలాగే పోలీసుల తీరుపై స్థానిక ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు.. మక్తల్ నియోజకవర్గంలోని ఓ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం పేరుతో కొందరు అధికార పార్టీ నేతలు వడ్వాట్ గ్రామం నుంచి ఇసుక అక్రమంగా తరలించేందుకు చర్యలు చేపట్టారు. శుక్రవారం అర్థరాత్రి సైతం ఇదే విధంగా పదికి పైగా టిప్పర్లతో ఇసుక తరలిస్తుండగా గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే టిప్పర్ల దగ్గరకు చేరుకున్న పోలీసులు వాటిని పట్టుకోకుండా వదిలేశారు. దీంతో గ్రామస్తులు తహసీల్దార్కు సమాచారం అందించగా తహసీల్దార్ ఆదేశాలతో ఆర్ఐ శ్రీశైలం సిబ్బందితో కలిసి టిప్పర్లను అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు. అయినా పోలీసులు టిప్పర్లను పట్టుకోకుండా వదిలేశారు. దీంతో స్థానిక అధికారులు, పోలీసుల తీరుపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. సామాన్య ప్రజలు ఇంటి నిర్మాణానికి ట్రాక్టర్ ఇసుక తీసుకెళ్తే కేసులు నమోదు చేసే అధికారులకు టిప్పర్లలలో అక్రమ రవాణా కనబడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు వదిలేసిన టిప్పర్లపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
అగ్నికి ఆహుతైన పొగాకు
అలంపూర్ రూరల్: మండల పరిధిలోని లింగన్వాయి గ్రామానికి చెందిన కృష్ణకు చెందిన పొగాకు పంట ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైనట్లు ఏఓ నాగర్జున్రెడ్డి తెలిపారు. శనివారం ప్రమాదంలో దగ్ధమైన నాలుగు ఎకరాల పొగాకు పంటను పరిశీలించారు. సుమారు రూ.4 లక్షల వరకు నష్టం సంభవించిదని ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని బాధితుడు అధికారులను కోరారు. జాతీయ రహదారిపై లారీ బోల్తా భూత్పూర్: మున్సిపాలిటీలోని శేరిపల్లి(బి) వద్ద జాతీయ రహదారిపై శనివారం ముందు వెళ్తున్న కారును తప్పించబోయి లారీ బోల్తా పడింది. టైల్స్ లోడ్తో హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తుండగా ఓ మహిళ, పిల్లలతో కలిసి రోడ్డు దాటుతుంగా లారీ అకస్మాత్తుగా బ్రేకులు వేయగా, వెనకాల వస్తున్న కారు సైతం బ్రేక్ వేసింది. దీంతో కారు వెనుకాల వస్తున్న మరో లారీ రోడ్డుపై అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో లారీ డ్రైవర్, క్లీనర్కు స్వల్ప గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ చాకచక్యంతో పెను ప్రమాదం తప్పింది. శేరిపల్లి(బి) వద్ద బ్రిడ్జి నిర్మాణం పనులు నత్తనడకన సాగుతుండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల అదుపులో అనుమానితులు..? నారాయణపేట రూరల్: ఇటీవల మండలంలోని బసిరెడ్డిపల్లి గ్రామంలో ఐదేళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం పాఠకులకు విదితమే. ఈ క్రమంలో బాలికపై అత్యాచారం, హత్యా అనుమానాలు గ్రామంలో వినిపిస్తుండడంతో ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా అనుమానితులుగా గుర్తించిన నలుగురిని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. రూరల్ ఎస్ఐను వివరణ కోరగా విచారణ కొనసాగుతుందని పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. -
ఎత్తిపోతల పనులు అడ్డుకున్న రైతులు
● పరిహారం చెల్లించాకే ప్రారంభించాలని డిమాండ్ ● వెనుదిరిగిన అధికారులు దామరగిద్ద: పరిహారం చెల్లించాకే పనులు ప్రారంభించాలంటూ కాన్కుర్తి రైతులు శనివారం రిజర్వాయర్ నిర్మాణ పనులను అడ్డుకున్నారు. మక్తల్–నారాయణపేట– కొడంగల్ ఎత్తిపోతలలో భాగంగా గ్రామ సమీపంలో రిజర్వాయర్ పనులు ప్రారంభించేందుకు వచ్చిన అధికారులు, ప్రజాప్రతినిధులను రైతులు అడ్డుకున్నారు. త్వరలోనే అందరికి పరిహారం అందుతుందని అధికారులు, నాయకులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఒప్పుకోలేదు. ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లింపులో జాప్యం చేపడం సరికాదని.. ఆందోళనకు గురవుతున్నారని భూ నిర్వాసితుల సంఘం జిల్లా కార్యదర్శి వెంకట్రామిరెడ్డి, సర్పంచ్ నారాయణ అన్నారు. అధికారులు రైతులను ఒప్పించేందుకు యత్నించినా ఫలితం లేకపోవడంతో ఉన్నతాధికారులతో మాట్లాడి 15 రోజుల్లో డబ్బులు చెల్లించి పనులు ప్రారంభిస్తామంటూ అధికారులు వెనుదిరిగారు. పరిహారం చెల్లించాలంటూ రైతుల పక్షాన సర్పంచ్ నారాయణ అక్కడికి వచ్చిన చీఫ్ ఇంజినీర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సదాశివరెడ్డి, ఎమ్మెల్యే పీఏ మాధవరెడ్డి, స్థానిక నాయకులు ఈదప్ప తదితరులు ఉన్నారు. -
గ్రామీణ విద్యార్థుల్లో అపార ప్రతిభ
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో అపార ప్రతిభ ఉంటుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్లకు సంబందించి శిక్షణ తీసుకుని అర్హత సాధించిన విద్యార్థులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించేందుకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, అందులో చాలా మంది విద్యార్థులు అర్హత సాధించడం గొప్ప విషయం అన్నారు. కొంత మంది విద్యార్థులకు ప్రతిభ ఉన్నప్పటికీ అనుకున్న స్థాయిలో ప్రోత్సాహం ఉండదని, తల్లిదండ్రుల సహకారం ఉండదని తెలిపారు. ఒకవేళ తల్లిదండ్రులు పూర్తిస్థాయిలో సహకరిస్తే విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటీ, నీట్ వంటి వాటిల్లో రాణిస్తారన్నారు. భవిష్యత్లో ఈ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించేందుకు ఎన్ఆర్ఐలు కూడా సహకరిస్తున్నారని, పేద విద్యార్థులకు ఐఐటీ, నీట్ వంటి శిక్షణ కార్యక్రమాలు చేపట్టడం వల్ల వారు సీట్లు సాధించారని, గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకోవాలని అప్పుడే జీవితంలో ఉన్నతంగా ఎదుగుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, మేయర్ మమత, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సింహారెడ్డి, నాయకులు వినోద్కుమార్, సిరాజ్ఖాద్రీ, ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఓటర్ల మ్యాపింగ్ పకడ్బందీగా నిర్వహించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం దృష్ట్యా మ్యాపింగ్ ప్రక్రియ పురోగతి సాధించేలా ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో పురోగతి సాధించాలని, బూత్ స్థాయి అధికారులు మ్యాపింగ్ త్వరితగతిన చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి బూత్ స్థాయి ఏజెంట్ల నియామకం జరిగేలా కృషి చేయాలని తెలిపారు. బూత్స్థాయి అధికారులకు శిక్షణ అందించాలని, బూత్ స్థాయి ఏజెంట్లకు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు శిక్షణ సంబంధిత మెటీరియల్ అందజేయాలని సూచించారు. బూత్ స్థాయి అధికారుల పోస్టులు ఖాళీగా ఉంటే వెంటనే నియమించాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న ఫారం 6, 7, 8 దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని తెలిపారు. వీసీలో కలెక్టర్ ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్లు మధుసూదన్ నాయక్, జేఎల్బీ హరిప్రియ, ఆర్డీఓ నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
మరింత విస్తరిస్తాం..
రాష్ట్రంలోని 108 వాహనాలు ఎంతో విలువైన సేవలు అందిస్తున్నాయి. కొన్ని వాహనాల కాలం చెల్లిపోవడంతో మార్చాలని, అవసరమైన చోట సేవలు విస్తరించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కొత్త వాహనాలు కొనుగోలు చేశాం. మూడురకాల వాహనాలకు సరికొత్తగా బ్రాండింగ్ చేశారు. 108, 102 అనే హెల్ప్లైనన్ సేవల నంబర్లు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేశాం. సీఎం రేవంత్రెడ్డి ఫొటో, తెలంగాణ ప్రభుత్వం లోగో, ఉచిత సేవ అనే పదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమ్మఒడి వాహనాల వెనుక భాగంలో ‘అమ్మకు ఆత్మీయతతో.. బిడ్డకు ప్రేమతో..’ అనే ట్యాగ్లైన్న్ వాహనాల పనితీరుకు అద్దం పడుతోంది. కొత్త వాహనాల రాకతో ప్రజలకు మరింత వేగంగా, విస్తృతంగా వైద్యసేవలు అందుతాయి. – వాకిటి శ్రీహరి, రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి -
సలేశ్వరం ఉత్సవాల్లోనూ..
మన్ననూర్: తెలంగాణ అమర్నాథ్గా పేరుగాంచిన సలేశ్వరం జాతరలోనూ 108 సిబ్బంది సేవలు భేష్ అనిపించాయి. ఉత్సవాల సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లు కొంత మేరకు భక్తులకు ఇబ్బందులు కలిగినప్పటికి 108 అంబులెన్స్ సిబ్బంది అందించిన వైద్యసేవలు ఆశించినస్థాయిలో అస్వస్థతకు గురైన భక్తులకు అందుబాటులో ఉన్నట్లు పలువురు ప్రశంసించారు. మూడురోజుల పాటు 108 అంబులెన్స్, 9 మొబైల్ వాహనాలు (బైక్లు) అటవీ మార్గంలో పర్యటిస్తూ అస్వస్థతకు గురైన భక్తులకు వైద్య పరమైన సేవలు అందించారు. ఈ క్రమంలో అటవీ మార్గంలో ఇబ్బందులకు గురైన సుమారు 30 మందికి ప్రత్యక్షంగా వైద్యసేవలతోపాటు మందులు, ఓఆర్ఎస్ పాకెట్లు, తాగునీరు అందించి సఫర్యలు చేశారు. -
క్రీడా ప్రతిభను వెలికితీయడమే లక్ష్యం
● ఏప్రిల్ 9 నుంచి 24 వరకు‘ప్రధాన్మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్’ ● ఎంపీ డీకే అరుణ జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఏప్రిల్ 9 నుంచి 24 వరకు నిర్వహించనున్న ‘ప్రధాన్మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్’ ద్వారా గ్రామీణ యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, వారికి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. ఈ క్రీడా మహోత్సవానికి సంబంధించి శనివారం కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ మండల, అసెంబ్లీ స్థాయి ఇన్చార్జులు, జిల్లా విద్యాశాఖ అధికారులు, యువజన క్రీడాశాఖ అధికారులు, పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్లు తదితరులు సమన్వయంతో పనిచేసి ఈ క్రీడ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవం ఏప్రిల్ 9న నారాయణపేటలో నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామస్థాయి జట్లు ఏప్రిల్ 6లోగా ఆఫ్లైన్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 9 నుంచి 15 వరకు మండల స్థాయి పోటీలు, ఏప్రిల్ 15 నుంచి 20 వరకు అసెంబ్లీ స్థాయి పోటీలు, ఏప్రిల్ 21 మరియు 22 తేదీల్లో పార్లమెంటరీ స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 23న రన్నింగ్రేస్ నిర్వహిస్తామని, ఏప్రిల్ 24న బహుమతుల ప్రదానోత్సవం, ముగింపు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ముగింపు కార్యక్రమానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రీడా మహోత్సవంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి మండలంలో ప్రతి క్రీడకు ఒక కో–ఆర్డినేటర్ చొప్పున నలుగురిని నియమించి పోటీల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు. యువత శారీరక, మానసిక అభివద్ధికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని, డ్రగ్స్ వంటి చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ క్రీడలలో పురుషులతో పాటు సీ్త్రలు, బాలికలకు కూడా ప్రాముఖ్యత ఇచ్చి వారిని పాల్గొనే విధంగా ప్రోత్సహించాలని ఎంపీ సూచించారు. సమావేశంలో డీఈఓ ప్రవీణ్ కుమార్, డీవైఎస్ఓలు శ్రీనివాస్, వెంకటేష్, సుధీర్రెడ్డి, జిల్లా కోఆర్డినేటర్ తిరుపతిరెడ్డి, డిప్యూటీ సీఈఓ మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు. -
‘108’కు కృతజ్ఞతలు..
మా పాపకు 2025, ఆగస్టు 20న తీవ్రమైన శ్వాస సమస్యతో బాధపడుతుండటంతో నారాయణపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేయించాం. వైద్యుల సూచన మేరకు 108 వాహనంలో మహబూబ్నగర్ ఆస్పత్రికి ప్రథమ చికిత్స అందిస్తూ సకాలంలో తీసుకురావడంతో మా పాప బతికి బయటపడింది. సకాలంలో స్పందించిన 108 సిబ్బందికి, సంస్థకు కృతజ్ఞతలు. – గోవిందు, ముస్తాపేట, దామరగిద్ద 15 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నా 15 ఏళ్లుగా 108 వాహనం నడుపుతున్నా. ఈ ప్రాంతంలో రాత్రిళ్లు చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. నిరంతరం విధులు నిర్వర్తిస్తూ అత్యవసర సమయంలో ఎంతో మందికి సేవలందిస్తూ వారి విలువైన ప్రాణాలు కాపాడుతున్నాం. – సి.శ్రీనివాస్, పైలట్, నారాయణపేట ఎందరో ప్రాణాలు కాపాడా.. 108 వాహనంలో టెక్నీషియన్గా 15 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నా. రోడ్డు ప్రమాద బాధితుల్ని సకాలంలో ఆస్పత్రులకు తరలించి వారి విలువైన ప్రాణాలు కాపాడా. క్షతగాత్రులను వాహనం వరకు మోసుకొచ్చి ప్రథమ చికిత్స అందిస్తూ దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించిన ఘటనలు చాలానే ఉన్నాయి. – పి.రాజ్కుమార్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, నారాయణపేట సద్వినియోగం చేసుకోండి.. 108 నంబర్కు ఫోన్చేసిన 15 నిమిషాల్లో ఘటనా స్థలానికి వాహనం చేరుకొని బాధితులను దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నాం.అత్యవసర పరిస్థితిలో ప్రతి ఒక్కరూ 108 వాహన సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నాం. – రవి, ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ , మహబూబ్నగర్ ● -
ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం మానుకోవాలి
● ఇరిగేషన్ మంత్రిగా ఉండి డీపీఆర్సమర్పించలేదు: ఎమ్మెల్యే జీఎమ్మార్స్టేషన్ మహబూబ్నగర్: హరీశ్రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న తప్పుడు ప్రచారం మానుకోవాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి హితవు పలికారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో శనివా రం డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొడంగల్కు విహారయాత్రకు వచ్చిన హరీశ్రావు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారని ఎద్దేవా చేశా రు. ఆరు గ్యారంటీలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పదేళ్లు మీరు అధికాంలో ఉండి చేసిన మోసాలు, దోపిడీలు యావత్ రాష్ట్ర ప్రజానీకానికి తెలుసన్నారు. ప్రజలకు ఇచ్చిన మా ట ప్రకారం ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ, రూ.500కే సిలిండర్, 200యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు ఇచ్చినట్లు గుర్తు చేశారు. దేశచరిత్రలో ఎక్కడా లేని విధంగా 25 లక్షల మంది రైతులకు ఏకకాలంలో రూ.22 వేల కోట్లతో రూ.2 లక్షల రుణమాఫీ చేసినట్లు తెలిపారు. మీలా ఇంటికో ఉద్యోగం, దళిత సీఎం, కేజీ టు పీజీ ఉచిత విద్య, డబుల్ బెడ్రూం పేరిట ప్రజలను మోసం చేయలేదన్నారు. కొడంగల్ వరకు కాదు, మీరు దేవరకద్ర నియోజకవర్గానికి వస్తే రుణ మాఫీ రైతులు, గ్యారంటీలు అందుకుంటున్న లబ్ధిదారులను చూపిస్తామని సవాల్ విసిరారు. గ్రామసభల్లో ప్రజలు అడ్డుకున్నారని తప్పుడు ప్రచారం చేస్తుండడం సరికాదన్నారు. ఇరిగేషన్ మంత్రిగా ఉండి పాలమూరు ప్రాజెక్టు డీపీఆర్ ఎందుకు సమర్పించలేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో ఒక్క పాలమూరు–రంగారెడ్డినే కాదు ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ ఉనికి కోసమే హరీశ్రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఫొటోషూట్ కోసం పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించినట్లు నటించి ప్రజలను మోసం చేశా రని విమర్శించారు. త్వరలో పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసి ఆ నీళ్లతో రైతుల పాదాలు తడుపుతామని అన్నారు. ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, నాయకులు చంద్రకుమార్గౌడ్, సీజే బెనహర్, రాములుయాదవ్, అజ్మత్అలీ, అవేజ్ పాల్గొన్నారు. -
కట్టుకున్నవారే కాలయముళ్లు
అడ్డాకుల/పటాన్చెరు టౌన్: రక్షణ గా ఉండాల్సిన భర్తలే భార్యల పాలిట కాలయముళ్లు అయ్యారు. వేర్వేరు జిల్లాల్లో జరిగిన ఈ సంఘ టనలు కలకలం రేపాయి. ఒకచోట ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎనిమిది నెలలకే మనస్పర్థలతో భార్య ప్రా ణం తీస్తే.. మరోచోట అనుమానంతో పెళ్లయిన ఏళ్ల తర్వా త భార్యను కిరాతకంగా గొంతు కోసి చంపాడొక భర్త. వివరా లివి. మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం పోల్కంపల్లి గ్రామానికి చెందిన నర్సు కె.శ్రీదేవి (21).. అదే గ్రామా ని కి చెందిన చందుతో ప్రేమలో పడింది. కులాలు వేరైనా ఎని మిది నెలల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. తర్వాత పెద్దలను ఒప్పించి గ్రామంలో చందు ఇంట్లోనే ఉంటూ కాపు రం చేస్తున్నారు. ఇటీవల భార్యభర్తల మధ్య మనస్పర్థలు పెరిగాయి. చందు నిత్యం తన భార్యను హింసించేవాడు. ఈక్రమంలో శుక్రవారం రాత్రి భార్యను కొట్టి గొంతు నులిమి చంపాడు. పొలం వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసు కుందనేలా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. చివరికి గ్రామస్తు ల సమాచారంతో ఎస్ఐ ఎం.వేణు పొలం వద్దకు చేరుకుని విచారణ చేపట్టారు. మృతురాలి భర్త చందును అదుపులోకి తీసుకుని విచారించారు. యువతి మృతదేహానికి జిల్లా ఆస్ప త్రిలో శనివారం పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత సాయంత్రం గ్రామానికి తీసుకొచ్చారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది. చందు అక్కడికి వచ్చే వరకు అంత్యక్రియలు నిర్వహించేది లేదని మృతురాలి బంధువులు పట్టుబట్టారు. మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు గ్రామానికి చేరుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పారు. ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా అడ్డాకుల, దేవరకద్ర ఎస్ఐలు శ్రీనివాస్, నాగన్న బందోబస్తు చేపట్టారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు చందుపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎం.వేణు తెలిపారు. అనుమానమే పెనుభూతమై..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీ మ జిల్లా, అల్లవరం మండలం మొగలమూరుకు చెందిన పరమేశ్వరరావు, లీలా వతి (54) దంపతులు పటా న్చెరు ఏపీఆర్ కాలనీలో కుమారుడు మహావీర్ ఆరు ద్ర, కోడలు సుజాతతో కలి సి ఉంటున్నారు. కాగా కొంతకాలంగా పరమేశ్వరరావు, లీలావతి పై అనుమానం పెంచుకొని తరచూ గొడవ పడుతు న్నాడు. శనివారం ఉదయం కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. కుమారుడు, కోడలు తమ కుమారునికి వ్యాక్సిన్ వేయించేందుకు ఉదయం 10 గంటల సమయంలో బయటికి వెళ్లారు. ఈ క్రమంలో పరమేశ్వరరావు కూరగా యలు కోసే కత్తితో లీలావతి గొంతుకోసి పరారయ్యాడు. కుమారుడు, కోడలు వచ్చి చూసేసరికి లీలావతి రక్తపు మడు గులో చనిపోయి ఉండటంతో అరుస్తూ బయటికి వచ్చారు. సమాచారం అందుకున్న సీఐ రాజు సిబ్బందితో కలిసి ఘట నా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. క్లూస్ టీం బృందాన్ని రప్పించి ఆధారాలు సేకరించారు. పరారైన పరమేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కనులపండువగా రథోత్సవం
● ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు ● బావాజీ జాతరకు వేలాదిగా తరలి వచ్చిన భక్తులు ● దర్శించుకున్నమాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు కొత్తపల్లి: మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో వెలసిన గురులోకామసంద్ ప్రభు బావాజీ రథోత్సవం కనులపండుగగా సాగింది. గురువారం తెల్లవారు జామున రథోత్సవం, స్వామివారి పల్లకీ సేవా నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి గిరిజనులు నృత్యాలు, భజనలు చేస్తూ ప్రభువును ఆరాదించారు. గురువారం తెల్లవారుజామున ఆలయ పూజారులు చందర్నాయక్, భీమ్లానాయక్ ఆధ్వర్యంలో ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. రథాన్ని ఆలయ ముఖద్వారం నుంచి గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయం వరకు లాగారు. భక్తులు బావాజీకి తలనీలాలు సమర్పించి బెల్లంతో చేసిన నైవేద్యాన్ని నివేదన చేశారు. జెండాలను ధ్వజారోహణం చేసి మొక్కు లు తీర్చుకున్నారు. ఉత్సవాల సందర్భంగా 40 మంది బిల్డర్స్ పూణా గ్రూప్ అసోసియేషన్గా ఏర్పడి భక్తులకు 8 ఏళ్లుగా అన్నదానం నిర్వహిస్తున్నారు. రథోత్సవంలో భక్తుల కత్తి విన్యాసం గురువారం తెల్లవారు జామున నిర్వహించిన రథోత్సవంలో పోలీసుల గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులతో పాటు నారాయణపేట జిల్లా రెవెన్యూ డివిజనల్ అధికారి రాంచందర్, తహసీల్దార్ జయరాములు చేసిన కత్తి విన్యాసం ఆకట్టుకుంది. ప్రశాంతంగా రథోత్సవం బావాజీ జాతర రథోత్సవం పటిష్ట బందోబస్తు మధ్య తెల్లవారు జామున ప్రశాంతంగా ముగిసిందని అదనపు ఎస్పీ రియాజుల్ హక్ తెలిపారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహించారన్నారు. జాతర పూర్తిగా ముగిసే వరకు పటిష్ట బందోబస్తు కొనసాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కోస్గి సీఐ సైదులు, ఎస్ఐ విజయ్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. గురులోకామసంద్ ప్రభు రథోత్సవంలో భక్తజన సందోహం -
నల్లమల అడవిలో అగ్నికీలలు
మన్ననూర్: అమ్రాబాద్ ఫారెస్టు రేంజ్ పరిధిలోని కొల్లంబీట్ పరిధిలోని అడవిలో శుక్రవారం అగ్ని కీలలు చెలరేగాయి. వేసవి కావడంతో అటవీ ప్రాంతంలో మొత్తంగా ఎండుగడ్డి, ఎండుటాకులు విస్తరించి ఉన్నాయి. ఈక్రమంలో ఎవరైనా నిప్పు రాజేశారో కొన్ని సమయాల్లో వేడికి అగ్నికీలలు చెలరేగుతాయి. ఎలా జరిగిందో కానీ 6–7గంటల పాటు అడవిలో మంటలు చెలరేగి సుమారు 20 హెక్టార్ల విస్తీర్ణంలో అగ్నికి ఆహుతైంది. మంటలు చెలరేగుతున్న సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది ఫైర్ వాచర్లు, టైగర్ ట్రాకర్లు, ప్రొటెక్షన్ వాచర్లు సుమారు 20మంది ఘటనా స్థలానికి వెళ్లి మంటలను అదుపులోకి తీసుకొస్తున్నట్లు అటవీశాఖ అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారి లంబడోని ఉతార్ సమీప ప్రాంతంలో పొగలు విస్తరించడంతో కొంత సమయంపాటు రాకపోకలకు ఇబ్బందులు కలిగాయి. -
చిత్తుబొత్తు ఆట స్థావరంపై పోలీసుల దాడి
ఎర్రవల్లి: మండలపరిధిలో చిత్తుబొత్తు ఆట స్థావరంపై దాడి చేసి 18 మందిని అరెస్ట్ చేసినట్లు ఇటిక్యాల ఎస్ఐ రవి రాథోడ్ శుక్రవారం తెలిపారు. బీచుపల్లి గ్రామ శివారులో బొమ్మ బొరుసు ఆడుతున్నట్లు సమాచారం రావడంతో పోలీస్ సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. దాడిలో వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 18 మంది నిందితులను అదుపులోకి తీసుకొని వారి నుంచి 8బైక్లు, 20చరవాణిలు, రూ.93,200 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ సందర్భంగా సీఐ ప్రదీప్కుమార్ మాట్లాడుతూ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పేకాటరాయుళ్ల అరెస్టు వనపర్తి రూరల్: పేకాట ఆడుతున్న 8 మంది వ్యక్తులను పోలీసులు పట్టుకున్న ఘటన శుక్రవారం పెద్దగూడెం శివారులో చోటు చేసుకుంది. వనపర్తి రూరల్ ఎస్ఐ హృశికేష్ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దగూడెం శివారులోని డబుల్బెడ్రూం 202 నెం ఇంట్లో 8 మంది వ్యక్తులు సాయంత్రం అందర్బార్ పేకాట ఆడుతున్నారని పోలీసులు ఘటనా స్థలానికి 8 మంది వ్యక్తులను పట్టుకొగా వారి నుంచి రూ 36,030 నగదు, 5 బైకులు, 8స్మార్ట్ ఫోన్లను, 104 పేక ముక్కలను స్వాధీనం చేసుకుని వారిని పోలీస్స్టేషన్కు తరలించారు. 8మంది వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. 8బైక్లు, రూ.93,200 నగదు స్వాధీనం -
యాదవుల తిరుగుబాటు ప్రారంభిస్తాం
అచ్చంపేట రూరల్: సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లా, నియోజకవర్గం నుంచే యాదవుల తిరుగుబాటు యుద్ధం ప్రారంభిస్తామని యాదవ జేఏసీ చైర్మన్ డాక్టర్ దాసరి అజయ్కుమార్యాదవ్ అన్నారు. పట్టణంలోని టీఎన్జీఓ భవనంలో శుక్రవారం యాదవ జేఏసీ చైతన్య సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. నల్లమల ప్రాంతం నుంచే యాదవుల యుద్ధం ప్రారంభమైందన్నారు. నల్లమల్ల అడివిని గొర్రెల మేత కోసం గొర్రె కాపరులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో యాదవులపై దాడులు జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర మంత్రి వర్గంలో యాదవులకు చోటు కల్పించాలని డిమాండ్ చేశారు. నామినేటెడ్ పదవులల్లో యాదవులకు సముచిత స్థానం కల్పించాలన్నారు. రూ.5వేల కోట్లతో యాదవ కార్పొరేషన్ను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. కోకాపేట్లో ఏర్పాటు చేస్తున్న యాదవ భవనాన్ని వెంటనే ప్రారంభించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు శివశంకర్, కాశీం, నరేష్, యాదవ్, ప్రశాంత్, శ్రీనివాస్, కాశన్న, వెంకటేష్, సత్తయ్య, అజయ్, మహేశ్, సాయి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
తాడూరు: మండల పరిధిలోని యాదిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ చెన్నొల్ల కాలనీ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మరణించాడు. మండల కేంద్రానికి చెందిన పాలబుత్ శంకర్ (28) గురువారం రాత్రి బలాన్పల్లిలో ఓ కార్యక్రమానికి హాజరై తాడురుకు బయలుదేరాడు. చెన్నొల్ల కాలనీ వద్దకు రాగానే ద్విచక్రవాహనం అదుపుతప్పి గుంతలో పడడంతో బైకు కిక్ రాడ్ తలకు గుచ్చుకొని అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా విచారణ చేపట్టారు. యువకుడి మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. రైతుపై అడవి పంది దాడి జడ్చర్ల: వ్యవసాయ పొలంలో పనులు చేసుకుంటున్న ఓ రైతుపై అకస్మికంగా ఓ అడవి పంది దాడి చేసిన ఘటన శుక్రవారం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని ఉదండాపూర్ గ్రామ శివారులో వ్యవసాయ పనులు చేసుకుంటున్న రైతు గొంగండ్ల రామకృష్ణ(50) పై అడవి పంది దాడికి పాల్పడింది. రైతు తీవ్రంగా ప్రతిఘటించినా ఫలితం లేకపోయింది. దాడిలో రైతు శరీరం చిధ్రమైంది. కడుపులోని పేగులు పూర్తిగా బయటకు వచ్చాయి. సమీపంలోని రైతులు గమనించి 108లో వైద్య చికిత్స కోసం ఏనుగొండ ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం గ్రామస్తులు దాడికి పాల్పడిన అడవి పంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు ఉదండాపూర్ రిజర్వాయర్లో గుర్తించి మూకుమ్మడిగా దాడి చేసి చంపేశారు. వివాహిత మృతిపై కేసు నమోదు నాగర్కర్నూల్ క్రైం: ఇంట్లో ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గోవర్ధన్ శుక్రవారం తెలిపారు. పూర్తి వివరాలు.. జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన వివాహిత మహిళ లక్ష్మమ్మ(34) కూరగాయల వ్యాపారం నిర్వహిస్తుంది. ఆమె భర్త వెంకటస్వామి చేపల వ్యాపారం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై గురువారం సాయంత్రం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి చెల్లెలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ప్రముఖుల ప్రత్యేక పూజలు
గురులోకా మసంద్ బావాజీ, కాళికాదేవిని మాజీ మంత్రి హరీశ్రావు, మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు నవీన్రెడ్డితో పాటు మాజీ ఎమెల్యేలు పట్నం నరేందర్రెడ్డి, రాంమోహన్రెడ్డి, అంజయ్యయాదవ్ దర్శించుకున్నారు. అంతకు ముందు ఆలయ కమిటీ ఆద్వర్యంలో శాలువా పూలబొకేతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, గోపాల్, కౌన్సిలర్లు దినేశ్కుమార్, గోపాల్, సంగీత శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
లైఫ్ జాకెట్లు లేకుంటే విహారయాత్రకు అనుమతించొద్దు
కొల్లాపూర్ రూరల్: మండలంలోని కృష్ణా నది అందాలను వీక్షించేందుకు వచ్చే విహారయాత్రికులు బోటులో ప్రయాణించాలంటే తప్పకుండా లైఫ్ జాకెట్లు ధరించాలని లేని పక్షంలో వారిని బోటులో అనుమతించొద్దని జిల్లా పర్యాటక శాఖ అధికారి నరసింహ్మ టూరిస్టు పోలీసులను ఆదేశించారు. శుక్రవారం మండలంలోని సోమశిల నుంచి కృష్ణానదిలో బోటులో సంగమేశ్వరాలయం వెళ్లే పర్యాటకులను స్థానిక సర్పంచ్ వెంకటలక్ష్మితో కలిసి పరిశీలించారు. కొందరు లైఫ్ జాకెట్లు లేకుండా ప్రయాణించడాన్ని గమనించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యాటకులు బోటులో వెళ్లేటప్పుడు తప్పకుండా లైఫ్ జాకెట్లు ధరించాలన్నారు. మర బోట్ల యాజమానులు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సోమశిల నుంచి ఏపీలో నది అవతలివైపు ఉన్న సంగమేశ్వరాలయానికి పర్యాటకుల రద్దీ పెరుగుతుందని అందులో భాగంగా నిబంధనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకట లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గోన్నారు. -
లక్ష్మీవేంకటేశ్వరస్వామి రథోత్సవం
కృష్ణా: మండలంలోని గుడెబల్లూర్ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున శ్రీ స్వయంభు లక్ష్మీవేంకటేశ్వరస్వామి రథోత్సవాన్ని వేలాది భక్తుల సమక్షంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య, మంగళవాయిద్యాలతో కనులపండువగా చే శారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజ లు, అలంకరణ, అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 5గంటలకు పాల ఉట్టి పగులగొట్టారు. అనంతరం భజనమండలి చేత భజన గీతాలు ఆలపించారు. ఉత్సవాలకు స్థానికులే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రల నుండి వేలాది మంది భక్తులు హాజరై మొక్కులు తీర్చుకునున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండగా నిర్వాహకులు తాగునీరు, వసతి, భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. -
వెళ్లొస్తాం.. లింగమయ్య
ముగిసిన సలేశ్వరం బ్రహ్మోత్సవాలు తీవ్ర ఎండల్లో కూడా తగ్గని భక్తుల రాక భద్రతా ఏర్పాట్లు భేష్ సలేశ్వరం ఉత్సవాల ప్రశాంతంగా ముగిశాయని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ అన్నారు. శుక్రవారం ఉదయం ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్తో కలిసి సలేశ్వర క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సలేశ్వరంలో 400మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని, మూడురోజులపాటు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. సలేశ్వరం వచ్చిన భక్తులు వచ్చిన దారినే వెళ్లాలని, డీప్ ఫారెస్ట్లోకి వెళ్లకూడదని సూచించారు. సలేశ్వరంలో పోలీస్ అధికారులు ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లపై సంతప్తి వ్యక్తం చేస్తూ విధులపై సిబ్బంది చూపుతున్న అంకితభావాన్ని ప్రశంసించడంతోపాటు ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ను ప్రత్యేకంగా అభినందించారు. గురువారం రాత్రి నాగర్కర్నూల్ ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ బాబుమియా ప్రమాదవశాత్తు లోయలో పడిపోగా.. విధుల్లో ఉన్న ఎస్ఐ మురళి, కానిస్టేబుళ్లు ఊర్మిళ, మణిక్యాలు వెంటనే గమనించి అతన్ని గట్టుపైకి తీసుకొచ్చి వైద్యం అందించడంపై కానిస్టేబుళ్లను ప్రశంసించారు. ఫర్హాబాద్ వద్ద చెక్పోస్టుల మూసివేత మూడు రోజుల్లో 3లక్షల మంది దర్శనం అచ్చంపేట: తెలంగాణ అమర్నాథ్గా పేరుగాంచిన సలేశ్వర క్షేత్రం ఉత్సవాలు శుక్రవారంతో మగిశాయి. మూడురోజులపాటు నల్లమల అభయారణ్యం జనసంద్రంతో నిండుగా కనిపించింది. శివనామస్మరణంతో మారుమోగిన నల్లమల కొండలు నేటినుంచి మూగబోనున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో కొలువైన సలేశ్వరం క్షేత్రం దర్శనానికి తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు రావడంతో కిక్కిరిసింది. చివరిరోజు శుక్రవారం సాయంత్రం 5గంటల నుంచి వాహనాలు ఆడవిలోకి వెళ్లకుండా అటవీశాఖ నిలిపివేసింది. ఈసారి పోలీస్, అటవీశాఖలు సమన్వయంతో ఇచ్చిన మూడురోజుల్లో 24గంటలపాటు సలేశ్వరం దర్శనానికి అనుమతించడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. రాత్రివేళ ఎక్కువ మంది దర్శనం చేసుకోవడం అనుభూతినిచ్చింది. వన్యప్రాణుల సంరక్షణ పేరుతో అటవీశాఖ విధించిన అంక్షలతో మూడేళ్లలో భక్తుల సంఖ్య తగ్గడం, ఆలయాలపై చిన్నచూపు చూస్తున్నారనే విమర్శల కారణంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఈ ఏడాది భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగలేదు. ప్రతిఏటా చైత్రశుద్ధ పౌర్ణమి సందర్భంగా వర్షం కురిసేది. మూడేళ్లుగా అలాంటిదేదీ లేకపోవడంతో అధికార యంత్రాంగం ఊపీరిపీల్చుకున్నారు. చివరిరోజు వస్తున్నాం లింగమయ్యా.. వెళ్లొస్తాం లింగమయ్య నామం జపించారు. లోయలో భద్రత గాలికి.. సలేశ్వరం ఉత్సవాలకు వేలాదిగా తరలి వచ్చిన భక్తులకు లోయలో భద్రత కరువైంది. పోలీస్ సిబ్బంది, అటవీశాఖ వలంటీర్లను ఏర్పాటు చేసినప్పటికీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయలేపోయారు. వేలాదిమంది గుమ్మిగూడిన చోట నియంత్రణ, భద్రత చర్యలు నామమాత్రంగా కనిపించాయి. పార్కింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసినప్పటికీ వాహనాదారులు అటవీ ప్రాంతంలో ఇష్టం వచ్చినట్లు పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెరిగిన బందోబస్తు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పోలీస్, అటవీశాఖలు సమన్వయంతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. వారి అంచనాలకు మించి వాహనాలు, భక్తులు రావడంతో వారి సేవలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ముందుస్తుగా అడవిలో చెత్త నిర్వహణ, తొలగింపు, వాహనాల ట్రాఫిక్, లోయ వద్ద భక్తుల రద్దీ నియంత్రణ, బారీకేడ్లు, భద్రత నిర్వహణను పోలీస్, అటవీ శాఖ సంయుక్తంగా చేపట్టింది. భక్తుల రద్దీకి అనుగుణంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఉత్సవాలు సజావుగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపీరి పీల్చుకుంది. సలేశ్వరం లోయలో భక్తులు సలేశ్వరం కొండల్లో భక్తులు చెక్పోస్టులు మూసివేత దాతల సేవలే పరమార్థం హైదారాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిలోని ఫర్హాబాద్, లింగాల మండలం అప్పాయిపల్లి ప్రాంతంలోని చెక్పోస్టులను అటవీశాఖ అధికారులు మూసివేశారు. ఈసారి అంచనాలకు మించి వాహనాలు రావడంతో ట్రాఫిక్ నియంత్రణలో పోలీస్, అటవీశాఖలు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈనెల 1 నుంచి 3వ తేదీ వరకు మాత్రమే అనుమతించనున్నట్లు పోలీస్, అటవీశాఖ సంయుక్త ప్రకటన చేసినా.. భక్తులు మార్చి 30, 31వ తేదీల్లో కూడా తరలి రావడంతో ముందుస్తుగా అనుమంతించారు. అచ్చంపేట ఆర్టీసీ మొదటిరోజు 28, రెండోరోజు 32, మూడరోజు16 ట్రిప్పుల చొప్పున బస్సులు నడిపించారు. అటవీ ప్రాంతంలో ట్రాఫిక్ను దృష్టిలో ఉంచుకుని చివరిరోజు మధ్యాహ్నం 2గంటలకే బస్సులను నిలపివేశారు. స్వచ్ఛంద సంస్థలు, దాతలు ఏర్పాటు చేసిన అన్నదానం, అంబలి కేంద్రాలు, తాగునీటి వసతి భక్తులకు ఎండవేడి నుంచి కాపోడుకోవడానికి ఎంతగానో ఉపకరించాయి. సలేశ్వరం ఉత్సవాలతో అటవీశాఖ ముక్కిపిండి టోల్ ేరుసుము వసూలు చేసింది. సలేశ్వరం ఉత్సవాలు మాత్రం అటవీశాఖకు మంచి ఆదాయ వనరుగా నిలిచిందనే చర్చ సాగుతోంది. ఏటా రూ.లక్షలాది ఆదాయం సమకూరుతున్న అటవీశాఖ సరైన ఏర్పాట్లు చేయలేకపోయింది. -
కాలుష్యం కుమ్మరింత.. పల్లెలు కలవరింత..
..మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్లోని పరిశ్రమల నుంచి వెలువడుతున్న వాయు, జల కాలుష్యానికి ఇవి మచ్చుకు ఉదాహరణలు మాత్రమే. పలు ఫార్మా కంపెనీల నుంచి వెలువడుతున్న విష వాయులు, వ్యర్థ జలాలతో పరిసరప్రాంతాల రైతులు, ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. కలుషిత నీటిని చేలల్లోకి వదులుతుండడంతో పంటలు పండడం లేదు. చిమ్నీల నుంచి దట్టమైన పొగ ఆకాశాన్ని కప్పేస్తుండగా.. దుర్గంధంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా పాలక పక్షం, అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో బాధిత గ్రామాల దీనగాధపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ -
దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో నిలదీద్దాం
● మాజీ మంత్రి హరీశ్రావు జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిలదీద్దామని బీఆర్ఎస్ శాసనపక్ష ఉపనాయకుడు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. మహబూబ్నగర్లోని గ్రీన్బెల్ట్లోని దొడ్డి కొమురయ్య విగ్రహానికి మాజీమంత్రులు శ్రీనివాస్గౌడ్, లక్ష్మిరెడ్డి, ఎమ్మెల్సీ నవీన్రెడ్డితో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య వర్ధంతి,జయంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించాలని శ్రీనివాస్గౌడ్, శ్రీనివాస్యాదవ్లు కోరిన వెంటనే కేసీఆర్ అధికారికంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. బీసీలను, కుర్వ, గొల్ల కురుమలకు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. వేల కోట్ల బడ్జెట్ ఇస్తామని కేవలం ఏడు కోట్ల లోపు నిధులు ఖర్చు చేసినట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయని తెలిపారు. శాసనసభలో రేవంత్ ప్రభుత్వాన్ని ఈ విషయంపై నిలదీసినట్లు పేర్కొన్నారు. యాదవులకు గొర్లు ఇస్తామని నగదు బదిలీ పథకం అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ మహబూబ్నగర్ పచ్చబడాలని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు హరీశ్రావు అహర్నిశలు కృషి చేసినట్లు గుర్తు చేశారు. రోడ్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడంతో పాటు సాగు నీరు అందించేందుకు పూర్తి ప్రయత్నాలు చేసినట్లు తెలిపారు. పాలమూరు ప్రాజెక్ట్ 90శాతం పూర్తయిందని మిగిలిన పనులు వేగంగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా బీసీలకు సమాన అవకాశాలు కల్పించాలని కోరారు. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, నాయకులు వెంకన్న, శివరాజు, ఇంతియాజ్, కిషోర్, కుర్వసత్యం, నరేష్, శరత్, మున్నూర్రాజు, గాయత్రి తదితరులు పాల్గొన్నారు. దొడ్డి కొమురయ్య విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న మాజీ మంత్రులు హరీశ్రావు, శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి తదితరులు -
పెండింగ్ ప్రాజెక్టులు సత్వరమే పూర్తి చేయాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలోని పెండింగ్లో ఉన్న ప్రతి ప్రాజెక్ట్ను సత్వరమే పూర్తి చేయాలని తెలంగాణ జేఏసీ మాజీ చైర్మన్ రాజేందర్రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం తన నివాసంలో ఉమ్మడి జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సత్వర పూర్తి కోసం సమాలోచన, కార్యాచరణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తొలుత అన్ని నీటి ప్రాజెక్టులను రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ప్రజాస్వామిక వాదులతో కలిసి పర్యటన చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎక్కడికి అక్కడ ఆయా ప్రాజెక్టుల పరిస్థితిపై ప్రజలతో మాట్లాడాలని స్థానిక ప్రజా ప్రతినిధుల దృష్టికి సమస్యను తీసుకెళ్తామన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో కూడా జిల్లా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాకపోతే మహబూబ్నగర్ జిల్లా శాశ్వత వెనుకబాటు తనంలో మిగిలిపోతుంది అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం జిల్లా ప్రజలు, రైతులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు తమ సమావేశాలలో తీర్మానం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈనెలలోనే ప్రాజెక్టుల సందర్శన చేపడతామని తెలిపారు. జిల్లా ప్రయోజనం కోసం చేపట్టిన కార్యక్రమాలుగా గుర్తించి సహకారం అందించాలని కోరారు. సమావేశంలో పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ ఎం.రాఘవాచారి, న్యాయవాదులు వీరబ్రహ్మచారి, బి.జనార్దన్, పరమేశ్వర్, మధుసూదన్బాబు, రిటైర్డ్ తహసీల్దార్ చెన్నకిష్టన్న, నాయకులు టీజీ శ్రీనివాస్, వెంకట్రెడ్డి పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం జడ్చర్ల: ప్రజా సమస్యలపై నిరంతర పోరాటా లు కొనసాగిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి బాలకిషన్ పేర్కొన్నారు. శుక్రవారం జడ్చర్లలోని 8వ వార్డులో ఇంటింటికి సీపీఐ కార్యక్రమాలను తీసుకెళ్లారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా పట్టణంలో సీపీఐ కార్యక్రమాలను, భవిష్యత్ ప్రణాళికలను ప్రజలకు వివరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై అధ్యయనం చేసి పోరాటా లు కొనసాగిస్తామన్నారు. సీపీఐకి విరాళాలు అందజేసి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నాయకులు బాగి కృష్ణయ్య, ఖలీం, మహేశ్, రహమతుల్లా, తదితరులు పాల్గొన్నారు. -
పంటలు పండడం లేదు..
కంపెనీల నుంచి మా పొలాల్లోకి కాలుష్యపు నీళ్లు వదులుతున్నారు. ఉన్న రెండు కుంటలూ కలుషిత నీటితో నిండి.. ఆ నీరు పంట పొలాల్లోకి చేరుతోంది. ప్రతి ఏటా తప్పనిసరిగా మారింది. ఇప్పటికే ఉన్న బోర్లన్నీ కలుషితమయ్యాయి. ఒక్క చుక్క నీరు తాగలేకపోతున్నాం. పంటలు అసలే పండడం లేదు. నష్టపరిహారం ఇప్పించాలి. – కిష్టారం మల్లేష్ గౌడ్, రైతు, రాయపల్లి చేసేది లేక వ్యవసాయం వదులుకున్నా.. మా నాయన వాళ్ల కాలంలో మేం చిన్నగా ఉన్నప్పుడు మా బావుల నీళ్లనే తాగేటోళ్లం. ఇప్పుడు బాయికాడికి వస్తే ఇంటి నుంచి ఫిల్టర్ నీటిని తెచ్చుకుని తాగాల్సిన పరిస్థితి వచ్చింది. పరిశ్రమల నుంచి వచ్చిన కలుషిత నీటిని తాగి పశువులు సచ్చిపోతున్నాయి. మా బాధలు ఎవ్వరికీ పట్టడం లేదు. చేసేది లేక వ్యవసాయం వదులుకున్నా. – పాలెం శ్రీనివాస్, రైతు మా చెరువులోకి కాల్వ తీస్తే ఊరుకోం.. మా గ్రామ శివారులో ఉన్న పరిశ్రమల కారణంగా పల్లె చెరువు కాలుష్యమైపోయింది. చెరువులో చేపలు వదిలితే చనిపోతున్నాయి. ఉన్న కాలుష్యంతోనే ఇబ్బందులు పడుతుంటే పోలేపల్లి దిక్కు ఉన్న కంపెనీల నుంచి కాల్వ తీసి మా గ్రామ చెరువులోకి కలిపేందుకు చూస్తున్నారంట. దీన్ని ఎట్టిపరిస్థితిలోనూ అంగీకరించేది లేదు. అవసరమైతే ఊరోళ్లందరం కలిసి సెజ్ గేట్ ముందు ఆందోళన చేస్తాం. – దేవోళ్ల శేఖర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు, ముదిరెడ్డిపల్లి ● -
విజన్ 2047 లక్ష్యంగా అభివృద్ధికి ప్రణాళికలు
● మహబూబ్నగర్ను అన్ని విధాలుగా తీర్చిదిద్దుతాం ● ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి స్టేషన్ మహబూబ్నగర్: విజన్ 2047 లక్ష్యంగా మహబూబ్నగర్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండేళ్ల మూడు నెలల కాలంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం రేవంత్రెడ్డి ఆశీస్సులతో మహబూబ్నగర్ను ఎడ్యుకేషన్ హబ్గా అభివృద్ధి చేసినట్లు చెప్పారు. భవిష్యత్లో ఒక సమగ్ర ప్రణాళికబద్ధమైన నగరంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. ఇంజనీరింగ్, డిగ్రీ, జూనియర్ కళాశాలలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఏటీసీ, ట్రిపుల్ ఐటీ, ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే లక్ష్యంతో ఎన్నో విద్యాసంస్థలు పట్టణానికి తెస్తున్నామన్నారు. ప్రస్తుతం మహబూబ్నగర్ నగరంలో 3.30లక్షల జనాభా ఉందని, 2047 వరకు సుమారు 5లక్షల జనాభా పెరిగే అవకాశం ఉందని, దానిని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు శాశ్వత తాగునీటి పరిష్కారం కోసం చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం నగరానికి రోజుకు దాదాపు 40 ఎంఎల్డీ నీటి అవసరం ఉండగా, 20 నుంచి 30 ఎంఎల్డీ మాత్రమే అందుబాటులో ఉందని, లీకేజీలు, పంపింగ్ సమస్యలు కూడా నీటి సరఫరాను ప్రభావితం చేస్తున్నాయన్నారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు రూ.220 కోట్లతో వాటర్ ఆగ్మేంటేషన్ స్కీమ్ చేపట్టినట్లు వివరించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా పట్టణంలో 14 రిజర్వాయర్ల నిర్మాణం 18.6 మిలియన్ లీటర్ల అదనపు నీటి నిల్వ సామర్థ్య, 40 కిలోమీటర్ల ఫీడర్ పైప్లైన్లు, 209 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, భవిష్యత్లో 60ఎంఎల్డీ నీటి సరఫరా అందేవిధంగా ఈ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. సమావేశంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ సురేందర్రెడ్డి, నాయకులు సిరాజ్ఖాద్రీ, తదితరులు పాల్గొన్నారు. -
మత్స్యరంగం అభివృద్ధికి ప్రభుత్వ ప్రోత్సాహం
● గ్రామీణ యువతకు ఆదాయ వనరులు కల్పించడమే లక్ష్యం ● రాష్ట్ర క్రీడలు, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి రాజాపూర్: గ్రామీణ ప్రాంత యువతకు ఆదాయ వనరులు సమకూర్చి వారికి స్వయం ఉపాధి రంగాల్లో నిలదొక్కుకునేలా చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర క్రీడలు, మత్య్సశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం బాలానగర్ మండలంలోని మొదంపల్లిలోనూతనంగా ఏర్పాటు చేసిన బయో ప్లోక్ ఫిష్ ట్యాంక్స్ను జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధికి కొత్త సాంకేతికతలను తీసుకొచ్చి గ్రామీణ యువతకు ప్రాత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి మాట్లాడుతూ జడ్చర్ల నియోజకవర్గ అ భివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లుపేర్కొన్నారు. కొత్తగా మంజూరైన విద్యుత్ సబ్స్టేషన్ల పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, అవి పూర్తయితే లోఓల్టేజి సమస్య ఉండదన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్, నవోదయ పాఠశాలను బాలానగర్ మండలం పెద్దాయపల్లిలో శంకుస్థాపనలు చేసినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో విద్య, వైద్యంతో పాటు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కార్యక్రమంలో జడ్చర్ల మున్సిపల్ చైర్పర్సన్ పుష్పలత, బాలానగర్ సర్పంచ్ వెంకటేశ్వర్రెడ్డి, నాయకులు మోహన్నాయక్, బాసునాయక్, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బావాజీ ఉత్సవాలు ప్రారంభం
కొత్తపల్లి: మండల పరిధిలోని తిమ్మారెడ్డి పల్లిలో వెలసిన గిరిజనుల ఆరాధ్య దైవం గురులోకా మసంద్ ప్రభు ఉత్సవాలు బుధవారం ధ్వజారోహణంతో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం బంజాన భజనలతో స్వామి వారికి ప్రభోత్సవం నిర్వహించారు. అనంతరం వంశపార పర్య పూజారులు చందర్ నాయక్, దేవ్లానాయక్, బీంమ్లానాయక్, దన్సింగ్ ఆధ్వర్యంలో గురులోకా మసంద్ ప్రభు బావాజి, కాళికాదేవి ఆలయాల్లో ధ్వజా రోహణం నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. రాష్ట్ర పండుగ గుర్తింపుపై గిరిజనుల హర్షం గురు లోకామసంద్ ప్రభు బావాజీ జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ జీఓ విడుదల చేసింది. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద గిరిజన జాతర బావాజి జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో సీఎం రేవంత్రెడ్డి చిత్ర పటానికి ఆలయ కమిటీ సభ్యులతో పాటు జాతరకు హాజరైన భక్తులు క్షీరాభిషేకం చేశారు. ఈ గిరిజన జాతరకు కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, చత్తీస్గడ్, మధ్యప్రదేశ్ నుంచి వేలాదిగా వచ్చే గిరిజనులను గుర్తించడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతకు ముందు జాతర ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చిన కొడంగల్ నియోజకవర్గ కాడా ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, నారాయణపేట జిల్లా ఆర్డీఓ రాంచందర్, తహసీల్దార్ జయరాములు ఆలయ ప్రాంగణంలో రాష్ట్ర పండుగగా ప్రకటించిన ప్రత్యేక జీఓను కమిటీ సభ్యులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా కాడా ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. -
అపార్ట్మెంట్లో హైటెక్ దందా
● ప్లాట్లో సాగుతున్న వ్యభిచారం పోలీసుల దాడులతో వెలుగులోకి.. మహబూబ్నగర్ క్రైం: నగరంలో హైటెక్ వ్యభిచార దందా విస్తృతంగా సాగుతుంది. వాట్సాప్లో అమ్మాయిల ఫొటోలను ఎరవేసి విటులను ఆకర్షిస్తున్నారు. సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ఈ వ్యాపారం జోరుగా సాగుతుంది. నమ్మదగిన విటులకు వాట్సాప్లో అమ్మాయిలు, మహిళల ఫొటోలు పంపించి బేరం కుదుర్చుకుంటున్నారు. నగరంలో క్లాస్ ఏరియాలో సైతం ఇళ్లు, ఫ్లాట్లను అద్దెకు తీసుకొని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. బుధవారం పట్టణంలోని అశోక్ టాకీస్ ప్రాంతంలో ఉన్న శ్రీసాయి బాలాజీ టవర్స్ అపార్ట్మెంట్లోని ప్లాట్నంబర్ 309పై పోలీసులు దాడి చేయగా ఇద్దరు మహిళలు, ఐదుగురు విటులు పట్టుబడినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు రెండో పట్టణ సీఐ ఇజాజుద్దీన్ ఆధ్వర్యంలో పోలీసులు ఫ్లాట్పై దాడి చేశారు. ఈ దాడుల్లో ఇద్దరు మహిళలు, ఐదుగురు విటులతో పాటు వ్యభిచార గృహంలో ఉద్యోగిగా పనిచేసే అజయ్ని అరెస్టు చేశారు. దందా నిర్వాహకుడు సంతోష్రెడ్డి పరారీలో ఉన్నారు. దందా నడుపుతున్న వారితో పాటు విటులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. -
సలేశ్వరం.. జనసంద్రం
వైభవంగా లింగమయ్య ఉత్సవాలు ప్రారంభం ● మొదటి రోజు వేలాదిగా తరలివచ్చిన భక్తులు ● తెలంగాణ అమర్నాథ్ దర్శనానికి క్యూ కట్టిన జనం ● ఏటీఆర్ కోర్ ఏరియాలో మార్మోగిన లింగమయ్య నామస్మరణ ● దర్శనం చేసుకోకుండానే వెనుదిరిగిన పలువురు భక్తులు జాతర మొదటిరోజు బుధవారం అచ్చంపేట డిపో నుంచి 28, నాగర్కర్నూల్ నుంచి 25 ట్రిప్పులు బస్సులు నడిచాయి. పుల్లాయిపల్లి పెంట వరకు బస్సు సౌకర్యం ఉండగా.. అక్కడి నుంచి అటోల్లో మోకాళ్ల కురువ వరకు వెళ్లి కాలినడకన దర్శనం చేసుకుంటున్నారు. ఆటోలు సరిపడా లేక భక్తులు తీవ్ర ఇబ్బందు లు పడుతున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం రాత్రివేళలో కూడా బస్సులను అనుమతించడంతో నడిపించేందుకు ఆర్టీసీ అధికారులు సిద్ధంగా ఉన్నారు. గురువారం పౌర్ణమి రోజున భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉండటంతో అందుకు అనుగుణంగా బస్సులు నడుపుతామని డీఎం మురళి ప్రసాద్ తెలిపారు. అచ్చంపేట/అచ్చంపేటరూరల్: తెలంగాణ అమర్నాథ్గా ప్రసిద్ధిగాంచిన సలేశ్వరం లింగమయ్య ఉత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభయ్యాయి. పౌర్ణమి ముందురోజు వేలాది మంది భక్తులు మది నిండుగా లింగమయ్యను స్మరించుకుంటూ నల్లమల బాట పట్టారు. అటవీశాఖ బుధవారం నుంచి అనుమతిస్తామని చెప్పినప్పటికీ భక్తులు మంగళవారం సాయంత్రమే ఫర్హాబాద్ గేట్ వద్దకు చేరుకున్నారు. మండుతున్న ఎండను సైతం లెక్క చేయక పగటివేళ లింగమయ్య దర్శనానికి బారులు తీరారు. మొదటిరోజు సుమారు లక్ష మంది దర్శనం చేసుకున్నారు. మెట్లమార్గం, క్షేత్రంలో జనం కిక్కిరిసి ఉండటంతో చెప్పుల కుర్వ వద్ద పోలీసుశాఖ, వలంటీర్లు భక్తుల రాకపోకలను నియంత్రించారు. దీంతో చాలామంది పరిస్థితిని గమనించి లింగమయ్య దర్శనం చేసుకోకుండానే వెనుదిరిగారు. ‘వస్తున్నాం.. లింగమయ్యా’ అంటూ చిన్నా పెద్దా తేడాలేకుండా దట్టమైన అటవీ ప్రాంతంలో రాళ్లు రప్పలు, లోయలు, గుట్టలు, సేలయేర్లను దాటుకుంటూ ఉత్సాహంగా ముందుకు కదిలారు. ఐదురోజుల జాతరను అటవీశాఖ మూడు రోజులకు కుదించడంతో పగలు, రాత్రి తేడాలేకుండా భక్తులు భారీగా తరలివస్తున్నారు. చెంచు పూజారులు లింగమయ్యకు గిరిజన సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఇరుకుగా ఉన్న కొండ దారుల్లో నడక సాగిస్తూ సలేశ్వరం జలపాతం వద్ద పర్యాటకులు స్నానాలు ఆచరించారు. బైపాస్ రహదారులతో.. మన్ననూర్–ఫర్హాబాద్ నుంచి రాంపూర్పెంట వరకు వాహనాలు బారులు తీరాయి. ముందుస్తుగా పోలీసు, అటవీశాఖ వాహనాల రాకపోకల నియంత్రణకు వేర్వేరు దారులు ఏర్పాటు చేశాయి. వాహనాల పార్కింగ్కు మైదానం, అవసరమైన చోట చిన్న చిన్న బైపాస్ రహదారులు ఏర్పాటు చేశారు. మరో మార్గమైన అప్పాయిపల్లి–గిరిజన గుండాల కూడా భక్తజన సందోహంగా మారాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. అలసిన భక్తులు పొంచి ఉన్న ప్రమాదాలను లెక్క చేయకుండా చెట్లు, పుట్టలు, గుట్టల నడుమ సేద తీరుతున్నారు. ఆలయం, జలపాతం వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదాలు జరగకుండా వలంటీర్లు సహకరిస్తున్నారు. వైద్య, ఆరోగ్యశాఖ అప్పాయిపల్లి, రాంపూర్ పెంట, సల్వేశ్వరం లోయ, ఫర్హాబాద్ వద్ద ప్రత్యేక వైద్యకేంద్రాలు ఏర్పాటు చేశారు. అంబులెన్స్లు సైతం అందుబాటులో ఉంచారు. -
దాడులు చేస్తే తగిన బుద్ధి చెబుతాం
ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మర్రి జనార్దన్రెడ్డి హెచ్చరిక బల్మూర్: కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులు, కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని, వారికి తగిన బుద్ధి చెబుతామని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, అచ్చంపేట నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి హెచ్చరించారు. మండలంలోని జిన్కుంట సర్పంచ్ రంగినేని పుష్పలతతో పాటు ఆమె భర్త ప్రేమ్కుమార్ను బుధవారం పార్టీ నాయకులతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత నెలలో కాంగ్రెస్ వార్డు సభ్యురాలు, నాయకులు జిన్కుంటలో సర్పంచ్పై దాడి చేయడమే కాకుండా ఆమైపె అట్రాసిటీ కేసు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అరాచక పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన సర్పంచ్లను వేధిస్తున్న విషయాలను ప్రజలు గమనిస్తేనే ఉన్నారని, ఇందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ చేతకాని పాలనతో గ్రామాల అభివృద్ధిని మరిచి, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులపై దాడులకు దిగడంతో పాటు అక్రమ కేసులు పెడుతున్నారని, అధికారులు వారికే వంత పాడుతున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పోకల మనోహర్, బండపల్లి వెంకటయ్య, నర్సయ్యయాదవ్, సురేష్రావు, తులసీరాం, అంతటి శివ, రమేష్రావు, నాగయ్య, శివశంకర్, శిరీష, తిపరుపతి, సుల్తాన్, గోపాల్రావు, సుదర్శన్, మహేష్, పాల్గొన్నారు. -
మీసేవ చార్జీలు రెట్టింపు
● బుధవారం నుంచి అమల్లోకి.. ● జీఓ విడుదల చేసిన ప్రభుత్వం ● వినియోగదారులకు అదనపు భారం జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): మీ సేవ రుసుం రెట్టింపయ్యింది. ఈ మేరకు ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ఏప్రిల్ ఒకటో తేదీనుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి వచ్చాయి. మీసేవ దరఖాస్తులకు గతంలో ఉన్న చార్జీలతో పోలిస్తే దాదాపు రెట్టింపు కావడం వినియోగదారులను కలవరపెడుతుంది. మీసేవలో దరఖాస్తుల్లో ఏ, బీ కేటగిరీలు రెండురకాలు ఉండగా రెండింటిలోనూ చార్జీల పెంపు జరిగింది. ఏ, బీ కేటగిరీలుగా విభజన మీ సేవలో దరఖాస్తులను ఏ, బీ కేటగిరీలుగా విభజించారు. కేటగిరీ–ఏ కింద వచ్చే దరఖాస్తులకు ఇది వరకు రూ.35 యూజర్ చార్జీ కాగా.. పెంచిన రేటు ప్రకారం రూ.62 కానుంది. కేటగిరీ–బీ కింద వచ్చే దరఖాస్తులకు ఇప్పటివరకు రూ.45 చెల్లిస్తుండగా.. రేపటి నుంచి రూ.80 చెల్లించాల్సి ఉంటుంది. బిల్లుల చెల్లింపునకు సంబంధించిన రుసుం మూడు రకాలుగా ఉండనుంది. రూ.20గా ఉన్న చార్జీని రూ.35, రూ.25 ఉన్న చార్జీని రూ.45, రూ.30 ఉన్న చార్జీని రూ.58గా నిర్ణయించారు. విద్యుత్ బిల్లుల చెల్లింపు మొత్తానికి అనుగుణంగా మూడు రకాల యూజర్ చార్జీలు పెంచారు. గతంలో రూ.2 ఉన్న చార్జీని రూ.4, రూ.5 ఉన్న చార్జీని రూ.9, రూ.10 ఉన్న చార్జీని రూ.18. రూ.25 ఉన్న చార్జీని రూ.44కి పెంచారు. యూజర్ చార్జీల పెంపు ఒకేసారి రెట్టింపు చేయడం.. దానికి ప్రభుత్వం ఆమోదం తెలపడం భారంగా మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రోజులు అంతరాయం సర్వర్ నిర్వహణ పనుల నేపథ్యంలో మీ సేవ ఆన్లైన్ సేవలకు తాత్కాలిక అంతరాయం ఏర్పడనున్నట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. ఏప్రిల్ 3 సాయంత్రం 5గంటల నుంచి 5 ఉదయం 8 గంటల వరకు నిర్వహణ పనులు కొనసాగనున్నట్లు తెలిపారు. సర్వర్ పనితీరు మెరుగుదల, భద్రతా వ్యవస్థల అప్గ్రేడ్, సాంకేతిక సమస్యల నివారణకు ఈ పనులు చేపడుతున్నారు. ఈ సమయంలో సంబంధిత విభాగాలకు చెందిన ఆన్లైన్ సేవలు, డిజిటల్ లావాదేవీలు, వెబ్ పోర్టల్ సేవలు తాత్కాలికంగా పనిచేయవని, ప్రజలు అత్యవసర సేవలను ముందుగానే వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. నిర్వహణ పూర్తయిన అనంతరం సేవలు సాధారణ స్థితికి చేరుకుంటాయని తెలిపారు. సాంకేతిక వ్యవస్థలను ఆధునీకరించడంలో భాగంగానే ఈ చర్యలు చేపడుతున్నామని, భవిష్యత్లో వేగవంతమైన, అంతరాయంలేని సేవలను అందించేందుకు ఈ నిర్వహణ ఉపయోగపడుతుందని అధికారులు వెల్లడించారు. -
హోంగార్డు ఆత్మహత్య
అచ్చంపేట రూరల్: పురుగు మందు తాగి హోంగార్డు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధ వారం అచ్చంపేటలో చోటు చేసుకుంది. ఎస్ఐ సద్దాంహుస్సేన్ తెలిపిన వివరాల ప్రకారం... కోడేరు పోలీస్స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న బయ్యన్న (46) సలేశ్వరం జాతర డ్యూటీ కో సం బుధవారం అచ్చంపేటకు వచ్చాడు. కాగా మంగళవారం డ్యూటీలో చేరాల్సి ఉండగా బుధవారం రావడంతో అధికారులు గైర్హాజరు వేశారు. దీంతో మనస్థాపానికి గురైన బయ్యన్న అచ్చంపేట పశువుల సంత సమీపంలో క్రిమిసంహారక మందు తాగాడు. తర్వాత విషయా న్ని ఓ కానిస్టేబుల్కు ఫోన్ చేసి చెప్పగా అచ్చంపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమించడంతో నాగర్కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందా డు.మృతుడికి భార్యతో పాటు ముగ్గురు పిల్ల లు ఉన్నారు. అల్లుడు శివుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు అడ్డాకుల: మండలంలోని కందూర్ స్టేజీ వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. స్థానికు ల వివరాల ప్రకారం.. మూసాపేట మండలం నందిపేటకు చెందిన రాములు మరి కొందరితో కలిసి దుస్తుల కొనుగోలు కోసం వనపర్తి జిల్లాలోని ఖిల్లాఘనపురం వెళ్లారు. దుస్తుల కొనుగోలు తర్వాత అదే ఆటోలో ఇంటికి తిరిగి వస్తుండగా కందూర్ స్టేజీ వద్ద ఆటోను కర్నూ ల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటోలో ఉన్న రాములు, నాగన్నతో పాటు మరో ఇద్దరు మ హిళలకు గాయాలు కాగా మిగిలిన వారికి స్వ ల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఎల్అండ్ టీ అంబులెన్స్లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య ఉండవెల్లి: రైలు కిందపడి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండ లంలోని జోగుళాంబ రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం జరిగింది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ అశోక్కుమార్ తెలిపిన వివరాలు.. మానవపాడు మండలం కొర్విపాడుకు చెందిన తెలుగు యుగంధర్(22) తుంగభద్ర రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. యువకుడి మృతదేహాన్ని గద్వాల ఆస్పత్రికి తరలించగా, మృతుడి తండ్రి కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పేకాట స్థావరంపై దాడి: 10 మంది అరెస్ట్ వనపర్తి రూరల్: పట్టణంలోని సాయినగర్ కాలనీలో బుధవారం కొందరు వ్యక్తులు పేకాట ఆడుతుండగా పట్టణ పోలీసులు దాడి చేసి 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. పట్టణ ఎస్ఐ హరిప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీలోని ఓ ఇంట్లో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతుండగా పోలీసులకు అందింది. దీంతో వెంటనే అక్కడికి వెళ్లి దాడి చేసి పేకాట ఆడుతున్న 10 మంది అరెస్ట్ చేసి రూ.24వేల నగదు, 9 సెల్ఫోన్లు, 3 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఆర్టీసీ కంట్రోలర్పై దాడి ఉండవెల్లి: మండలంలోని అలంపూర్ చౌరస్తా లోని టీఎస్ ఆర్టీసీ గద్వాల జిల్లాకు చెందిన కంట్రోలర్పై నరసింహులుపై ఆంధ్ర రాష్ట్రం కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దటేకూ రు గ్రామానికి చెందిన షేక్ ఖలీల్, మంగలి పవన్కుమార్ దాడి చేశారు. బుధవారం అయి జ బస్సులో ఫుట్బోర్టుపై ప్రయాణిస్తుండగా లోపలికి వెళ్లండని కంట్రోలర్ చెప్పడంతో నువ్వెవరని దురుసుగా ప్రవర్తించి దాడి చేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు దాడి చేసిన సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శేఖర్ తెలిపారు. -
వాహనదారులకు ఇబ్బందులు రావొద్దు: ఎస్పీ
రాజాపూర్: జాతీయ రహదారిపై వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో డైవర్షన్లను ఏర్పాటు చేయాలని ఎస్పీ జానకి సూచించారు. రాజాపూర్లో జరుగుతున్న ఫ్లైఓవర్ పనులను బుధవారం ఎస్పీ పరిశీలించారు. రోడ్డు డైవర్షన్ ఏర్పాటుపై కాంట్రాక్ట్ ప్రతినిధులకు ఆమె పలు సూచనలు చేశారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యతను ఇస్తూ అవసరమైన హెచ్చరిక బోర్డులను, రిఫ్లెక్టింగ్ స్టిక్కర్లు, సిగ్నల్ లైట్లు, ఇతర సూచికలను స్పష్టంగా ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రయాణికులు, వాహనదారులు ప్రమాదాలకు గురికాకుండా, డైవర్షన్ మార్గాలను, సురక్షితంగా, సౌకర్యవంతంగా ఏర్పాటు చేయాలన్నారు. ఫ్లైఓవర్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని వారికి సూచించారు. ఎస్పీ వెంట డీఎస్పీ వెంకటేశ్వర్లు, జడ్చర్ల రూరల్ సీఐ నాగార్జునగౌడ్, ఎస్ఐ రాజాపూర్ రాజశేఖర్ ఉన్నారు. -
దేవరకద్ర మార్కెట్కు పోటెత్తిన ఉల్లి
● క్వింటా గరిష్టంగా రూ.1400.. కనిష్టంగా రూ.800 దేవరకద్ర: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డు బుధవారం ఉల్లి కుప్పలతో కళకళలాడింది. వివిధ గ్రామాల రైతులు 10 వేల బస్తాల ఉల్లిని మార్కెట్కు అమ్మకానికి తీసుకొచ్చారు. దీంతో మార్కెట్ ఆవరణ, సీసీ రహదారులపై ఎక్కడ చూసిన ఉల్లి కుప్పలే కనిపించాయి. ఉదయం పది గంటలకు ప్రారంభమైన వేలం మధ్యాహ్నం వరకు కొనసాగింది. ఇతర మార్కెట్ల నుంచి వచ్చిన వ్యాపారులు పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి తరలించారు. గత వారం ధరలే ఈసారి కొనసాగాయి. వేలంలో క్వింటా ఽఉల్లి ధర గరిష్టంగా రూ.1,400, కనిష్టంగా రూ.800 పలికింది. మార్కెట్ నిబంధనల ప్రకారం 50 కిలోలు తూకం చేసి బస్తాలుగా విక్రయించారు. బస్తా ధర గరిష్టంగా రూ.700, కనిష్టంగా రూ.400గా విక్రయించారు. ● మార్కెట్లో మధ్యాహ్నం జరిగిన టెండర్లలో ఆర్ఎన్ఆర్ ధాన్యం ధర క్వింటాల్కు గరిష్టంగా రూ.2,358, కనిష్టంగా రూ.2,202, హంస ధాన్యం రూ.1,751, ఆముదాలు గరిష్టంగా రూ.6,202, కనిష్టంగా రూ.6,189 నమోదయ్యాయి. -
పాలమూరు న్యాయవాదుల పోరాటంతోనే రక్షణ చట్టం
● సీఎం చొరవతోనే న్యాయవాద రక్షణ చట్టం బిల్లు ఆమోదం : అనంతరెడ్డి పాలమూరు: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చొరవ వల్లే న్యాయవాదుల రక్షణ చట్టం బిల్లు అమోదం పొందిందని, ఉమ్మడి జిల్లా న్యాయవాదుల పోరాటం ఫలించిందని తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి అన్నారు. జిల్లా బార్ అసోసియేషన్ భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయవాదుల రక్షణ చట్టం బిల్లును శాసనసభలో అన్ని పక్షాలు ఆమోదించేలా సీఎం చొరవ తీసుకున్నారని, ఈ సందర్భంగా సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలంపూర్ న్యాయవాదుల సంఘం సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని పాదయాత్ర చేపట్టారని, తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్, మహబూబ్నగర్ బార్ అసోసియేషన్ పూర్తి సహకారంతో ముందుకు సాగిందన్నారు. భూత్పూర్ వరకు పాదయాత్రకు చేరుకున్న సందర్భంలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్రెడ్డి, మధుసూదన్రెడ్డి, వంశీకృష్ణ అక్కడికి వచ్చి.. సీఎం దృష్టికి తీసుకువెళ్లి రక్షణచట్టం వచ్చే విధంగా చూస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆ తర్వాత స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల వల్ల సీఎంను కలవడానికి సాధ్యం కాలేదని.. రెండో విడత మహా పాదయాత్ర కొనసాగించి.. ఫిబ్రవరి 27న సచివాలయానికి చేరుకుని సీఎంను కలిసి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో న్యాయవాద రక్షణ చట్టం బిల్లు ఆమోదించినట్లు తెలిపారు. ఇకపై న్యాయవాదులపై ఎవరైనా దాడులు చేసినా, ఇబ్బందులకు గురి చేసినా.. అలాంటి వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు అవుతాయని పేర్కొన్నారు. న్యాయవాదులు ఎవరైనా రక్షణ కావాలని పోలీసులను కోరితే రక్షణ కల్పించేలా చర్యలు తీసుకునే విధంగా చట్టంలో రూపొందించినట్లు చెప్పారు. న్యాయవాదులపై దాడులు జరిగితే డీఎస్పీ స్థాయి అధికారి విచారించేలా చట్టం రూపకల్పన చేశారని గవర్నర్ ఆమోదముద్ర తర్వాత అమల్లోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు శ్రీధర్రావు, వెంకటయ్య, నాగోజీ, తగిలి కృష్ణ, రాఘవేందర్, ఉమా మహేశ్వరి పాల్గొన్నారు. -
ప్రజలకు పారదర్శక పాలన అందాలి
అడ్డాకుల: ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వారికి పారదర్శక పాలన అందేవిధంగా అధికారులు పని చేయాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా సూచించారు. బుధవారం ఆమె అదనపు కలెక్టర్ హరిప్రియ, ఆర్డీఓ నవీన్లతో కలిసి మూసాపేట మండలంలో పర్యటించారు. మండలకేంద్రంలో తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి మండల అధికారులతో సమావేశమయ్యారు. మన ఇసుక విధానం ద్వారా ఇసుక బుకింగ్పై ఆరా తీశారు. జిల్లాలో ఇసుక బుకింగ్ వందశాతం ఆన్లైన్లోనే జరగాలని అధికారులను ఆదేశించారు. ఇసుక రవాణాకు మ్యానువల్ కూపన్లు జారీ చేస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలంలో భూ భారతి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. అనంతరం మూసాపేటలో ఓ రేషన్షాపును తనిఖీ చేశారు. సన్న బియ్యం నాణ్యతను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. మూడు నెలలకు సంబంధించిన సన్న బియ్యం ఈనెల 30 వరకు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్.. లబ్ధిదారులు త్వరగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని సూచించారు. పోల్కంపల్లి ఇసుక రీచ్ పరిశీలన పోల్కంపల్లి శివారులోని పెద్దవాగులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ను కలెక్టర్ పరిశీలించారు. ఆన్లైన్ బుకింగ్ ద్వారా జరిగే ఇసుక సరఫరాను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా ఇసుక రవాణా జరిగేలా చూడాలని చెప్పారు. అనంతరం గ్రామంలో ఉన్న పీఏసీఎస్ను సందర్శించారు. అందులో కొనసాగుతున్న ఎరువుల దుకాణాన్ని పరిశీలించి ఎరువుల లభ్యత గురించి ఆరా తీశారు. స్టాక్ రిజిస్టర్ను పరిశీలించి విక్రయాలు, నిల్వలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు రిజిస్టర్లో నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లా పౌర సరఫరాల అధికారి గంప శ్రీనివాస్, డీఎం రవినాయక్, హౌసింగ్ పీడీ ఉపేందర్రెడ్డి, మైనింగ్ ఏడీ గోవిందరాజులు, తహసీల్దార్ రాజునాయక్, ఏఓ అనిల్కుమార్, తదితరులు ఉన్నారు. -
మహబూబ్నగర్
● ఎట్టకేలకు ఫైనల్లొకేషన్ సర్వే పూర్తి ● వనపర్తి, నాగర్కర్నూల్,కల్వకుర్తి, దేవరకొండ మీదుగా మార్గం ● ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.5,330 కోట్లు ● రైలు మార్గం పొడవు 296 కిలోమీటర్లు ● కీలక అభివృద్ధికి మరో ముందడుగు గురువారం శ్రీ 2 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026పదో తరగతిమూల్యాంకనం ప్రారంభం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని మహబూబ్నగర్ గ్రామర్ స్కూల్లో పదో తరగతి మూల్యాంకనం ప్రారంభమైంది. బుధవారం హిందీ జవాబు పత్రాలకు సంబంధించిన మూల్యాంకన ప్రక్రియ చేపట్టారు. మొత్తం 1,100 మంది సిబ్బంది ఇందులో పాల్గొనున్నారు. డీఈఓ ప్రవీణ్కుమార్, పరీక్షల అడిషనల్ కమిషనర్ కమలాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు సిబ్బందికి పలు సూచనలు చేశారు. మూల్యాంకన ప్రక్రియలో పాల్గొనే వారు సెల్ఫోన్లు ఉపయోగించవద్దని, వ్యాలువేషన్ కోసం డ్యూటీలు కేటాయించిన వారు తప్పకుండా విధులకు హాజరుకావాలని సూచించారు. అయితే పలు పాఠశాలలో సిబ్బందికి అనారోగ్యం, చిన్నపిల్లలు ఉన్న ఉపాధ్యాయులకు సైతం విధులు కేటాయించడంతో.. వారికి విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని పలు సంఘాల నాయకులు డీఈఓను కోరారు. అలాంటి వారికి మినహాయింపు ఇచ్చి, కొత్త వారికి విధులను కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటామని డీఈఓ తెలిపారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్రెడ్డి, టీపీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు శ్యాంబాబు, తపస్ సంఘం ప్రధాన కార్యదర్శి మోహన్, సురేందర్నాథ్, తదితరులు పాల్గొన్నారు. నిర్దేశించిన మార్గంలోనే శోభాయాత్ర సాగాలి మహబూబ్నగర్ క్రైం: నగరంలో హనుమాన్ జయంతి శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని డీఎస్పీ వెంకటేశ్వర్లు సూచించారు. వన్టౌన్ పోలీస్స్టేషన్లో బుధవారం హనుమాన్ శోభాయాత్ర నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. పోలీసులు నిర్దేశించిన మార్గంలోనే యాత్ర కొనసాగాలని, ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పూర్తి సహకారం అందించాలన్నారు. డీజే సౌండ్ సిస్టమ్ వినియోగించడానికి అనుమతి లేదన్నారు. యువత, నిర్వాహకులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ, శాంతిభద్రతలకు ఏమాత్రం విఘాతం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీఐలు ఇజాజుద్దీన్, అప్పయ్య, గాంధీనాయక్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ● హనుమాన్ జయంతిలో డీజేలు పెట్టరాదని డీజే నిర్వహకులకు వన్టౌన్ సీఐ అప్పయ్య తెలిపారు. వన్టౌన్ పరిధిలో ఉన్న డీజే సిస్టమ్ నిర్వహకులతో బుధవారం స్టేషన్లో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. డీజేలు ఏర్పాటు చేస్తే సంబంధిత వ్యక్తులపై కఠినచర్యలు ఉంటాయని తెలిపారు. అనంతరం డీజే నిర్వహకులను తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. నేడు విద్యుత్ ఆర్టిజన్లవంటావార్పు జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): విద్యుత్శాఖలో పని చేస్తున్న ఆర్టిజన్ల తమ డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న పోరాటంలో భాగంగా గురువారం విద్యుత్ భవన్ ఎదుట వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆర్టిజన్ల జేఏసీ ఉమ్మడి జిల్లా చైర్మన్ జక్కి, జడ్చర్ల డివిజన్ చైర్మన్ జహంగీర్, మహబూబ్నగర్ డివిజన్ చైర్మన్ పెంటయ్య బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పని చేస్తున్న ప్రతి విద్యుత్ కార్మికుడు హాజరై, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పీయూ ఇంజనీరింగ్ ఫలితాలు విడుదల మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూలో ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి మొదటి సెమిస్టర్ ఫలితాలను వీసీ శ్రీనివాస్ పీయూలో బుధవారం ఆవిష్కరించారు. ఈమేరకు ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్, మిషన్ లర్నింగ్లో మొత్తం 62మంది ఉండగా ఇందులో 34 మంది ఉత్తీర్ణులై, 28మంది ప్రమోట్ అయ్యారు. డేటాసైన్స్లో 32 మంది ఉత్తీర్ణులై, 29 మంది ప్రమోట్ అయ్యారు. కంప్యూటర్ సైన్స్లో 24 మంది ఉత్తీర్ణులై, 40 మంది ప్రమోట్ అయ్యారు. ఈ మేరకు కార్యక్రమంలో కంట్రోలర్ ప్రవీణ, ఆడిట్సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, అడిషనల్ కంట్రోలర్ అనురాధారెడ్డి, కోఆర్డినేటర్ రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైలు కనెక్టివిటీబలోపేతం కనెక్టివిటీల ప్రకారం అలైన్మెంట్ మార్చి కొత్త రైలు మార్గం రూపొందించారు. ఈ రైలు మార్గంలో తెలంగాణలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుంది. ఈ కొత్త రైల్వేలైన్ కూసుమంచి, పాలేరు, మోతే, సూర్యాపేట, భీమవరం, నల్లగొండ, నాంపల్లి, కల్వకుర్తి, నాగర్కర్నూల్, వనపర్తి వంటి ముఖ్యమైన పట్టణాలను అనుసంధానించే అవకాశం ఉంది. రాష్ట్రంలో రైలు కనెక్టివిటీని బలోపేతం చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ.. రైల్వే మంత్రిత్వ శాఖ 15 కొత్త రైల్వే లైన్ల కోసం ఫైనల్ లొకేషన్ సర్వేను మంజూరు చేసింది. రైల్వే మంత్రిత్వ శాఖ మంజూరు చేసిన ఈ ముఖ్యమైన ప్రాజెక్టులలో డోర్నకల్– గద్వాల కొత్త రైల్వే లైన్ ఒకటి. ఎట్టకేలకు ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేరే అవకాశం లభించింది. ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే ఉమ్మడి పాలమూరు ప్రజలకు ఎంతో మేలు జరగనుంది. నాలుగు దశాబ్దాలుగా నానుతూ వస్తున్న ఈ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. 200 కిలోమీటర్ల దూరంఇప్పటి వరకు రైల్వే లైన్ కనెక్టివిటీ లేని వనపర్తి, నాగర్కర్నూల్, సూర్యాపేట జిల్లాలకు రైల్వే సౌకర్యం కలిగి.. వెనకబడిన ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది. ఈ రైల్వేలైన్ ఏర్పాటుతో కాజీపేట– విజయవాడ, సికింద్రాబాద్– గుంటూరు, సికింద్రాబాద్– కర్నూలు వంటి మూడు ప్రధాన రైల్వేలైన్ మధ్య కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఇప్పటికే గద్వాల– రాయచూర్, డోర్నకల్– మణుగూరు (మహబూబాబాద్) మధ్య రైల్వే లైన్స్ ఉన్నాయి. కొత్త రైలు మార్గం అందుబాటులోకి వస్తే తెలంగాణలోని తూర్పు నుంచి పడమరకు ప్రయాణం చేయవచ్చు. అదేవిధంగా బెంగళూరు నుంచి విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్కతా రైలు మార్గంలో సుమారు 200 కిలోమీటర్ల దూరం తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే గద్వాల, డోర్నకల్ రైల్వేస్టేషన్లు జంక్షన్లు కాగా కొత్తగా నల్లగొండ రైల్వేస్టేషన్ జంక్షన్ ఏర్పడుతుంది. రైల్వేలైన్, మామిడి క్లస్టర్, జాతీయ రహదారులతో నాగర్కర్నూల్ జిల్లా వేగంగా అభివృద్ధి చెందనుంది. జడ్చర్ల– నంద్యాల సర్వే పూర్తి జడ్చర్ల– నంద్యాల కొత్త రైల్వేలైన్ మార్గం సర్వే కూడా పూర్తయింది. నాగర్కర్నూల్, కొల్లాపూర్, సోమశిల మీదుగా నంద్యాల వరకు 182 కి.మీ., మార్గం అత్యంత కీలకమైంది. అప్పటి నాగర్కర్నూల్ ఎంపీ మల్లు అనంతరాములు దీని కోసం పట్టుబట్టి సర్వేల వరకు తీసుకొచ్చారు. రూ.340 కోట్ల అంచనాతో 2007లో ప్రతిపాదనలు తయారు చేశారు. డోర్నకల్– గద్వాల రైల్వే మార్గంతో పాటు దీని సర్వే చేసినా.. ఈ మార్గంలో ట్రాఫిక్ అంచనాలు తక్కువగా ఉన్నాయని దక్షిణమధ్య రైల్వే శాఖ భావిస్తోంది. దీంతో ఇప్పట్లో పట్టాలెక్కడం కష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్కు రాకపోకలకు దగ్గర అవుతుంది. 1981లో బీజం.. మార్పులతో ఆమోదం గతంలో ప్రతిపాదించిన మాచర్ల– గద్వాల రైల్వేలైన్ రూట్ మ్యాప్ను మార్చారు. తాజాగా గద్వాల– డోర్నకల్ రైల్ మార్గం సర్వే పూర్తి చేసింది. ఈ రైల్వేలైన్లో 296 కిలోమీటర్లు తెలంగాణ జిల్లాలోనే ఉంది. రాయచూర్, గద్వాల– మాచర్ల (గుంటూరు జిల్లా) రైల్వే లైన్ ప్రతిపాదన నిజాం కాలం నుంచి కొనసాగుతుంది. ఇందుకోసం మూడు సార్లు సర్వే సైతం చేశారు. రాయచూరు– మాచర్ల రైలు మార్గం ఆవశ్యకతను వివరిస్తూ.. 1981లో అప్పటి ఎంపీ మల్లు అనంతరాములు కేంద్రానికి ప్రతిపాదించారు. అప్పట్లో 184.2 కి.మీ., రైల్వేలైన్ కోసం రూ.919 కోట్ల నిధులు కేటాయించారు. 2002లో రాయచూర్– గద్వాల రైలు మార్గానికి శంకుస్థాపన చేయగా చివరికి గద్వాలకే పరిమితమైంది. మరుగున పడిపోయిన రైల్వే అంశం 2007లో అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి డీపీఆర్ను మరోసారి కేంద్రానికి పంపించారు. 2015లో కేంద్రం సర్వేకు రూ.20 కోట్లు కేటాయించింది. పీపీసీ మోడ్లో (పబ్లిక్, ప్రైవేట్ పార్టిసిపేషన్) కొత్త లైన్ను చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించినా.. సగం, సగం నిధులు ఖర్చు చేసే విషయం తేలకపోవడంతో రైల్వేలైన్కు అడుగులు పడలేదు. ఇప్పుడు అలైన్మెంట్ మార్చి సర్వే పూర్తికావడంతో కొత్తలైన్ ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయి. పరిశ్రమలు, ఉపాధి మెరుగు.. దక్షిణ తెలంగాణలో ఇప్పటి వరకు రైలు సౌకర్యం లేని ప్రాంతాలకు కొత్త రైల్వేలైన్ అనుసంధానం కానుంది. ఈ కొత్త లైన్ ద్వారా రాష్ట్రంలోని ఆయా జిల్లాకేంద్రాలతోపాటు హైదరాబాద్, దేశ రాజధానికి అనుసంధానించబడుతుంది. అలాగే మొదటిసారి రైలు సౌకర్యం పొందడం వల్ల ఈ ప్రాంత సామాజిక– ఆర్థిక అభివృద్ధికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. వ్యవసాయం, వ్యాపారం, విద్య, పర్యాటకం, వైద్యం వంటి వివిధ రంగాల కోసం రాష్ట్ర రాజధానికి ప్రయాణించే ప్రజలకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది. ఈ లైన్ సిమెంట్, గ్రానైట్ పారిశ్రామిక జోన్ల గుండా వెళ్తుండటం వల్ల ఆ ఉత్పత్తులను దేశంలోని ఇతర ప్రాంతాలకు రవాణా చేయడానికి ఊతం లభిస్తుంది. అలాగే సింగరేణి కాలరీస్ నుంచి కర్ణాటక, మహారాష్ట్రలోని థర్మల్ పవర్ ప్లాంట్లకు బొగ్గు రవాణా చేయడానికి ఇది తక్కువ దూరపు మార్గంగా ఉపయోగపడుతుంది. కేంద్రం దృష్టికి తీసుకెళ్తా.. నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో రైల్వే కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు కొత్త రైల్వే లైన్ల ఆవశ్యకత ఎంతో ఉంది. పార్లమెంట్ సమావేశాల్లో రైల్వేలైన్ల గురించి అడగగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ డోర్నకల్– గద్వాల కొత్త రైల్వే లైన్ సర్వే పూర్తయినట్లు చెప్పారు. అలాగే జడ్చర్ల– నంద్యాల మార్గం సర్వే కూడా పూర్తయిందని, కానీ ఈ మార్గంలో ట్రాఫిక్ అంచనాలు తక్కువగా ఉన్నాయనే అభిప్రాయం వెల్లడించారు. ఈ రెండు లైన్ల ఏర్పాటుకు కృషి చేస్తా. అలాగే హైదరాబాద్– శ్రీశైలం రైలు మార్గం ఏర్పాటు గురించి కేంద్రం దృష్టికి తీసుకెళ్తా. – మల్లు రవి, ఎంపీ, నాగర్కర్నూల్ ●బావాజీ ఉత్సవాలు ప్రారంభం గిరిజనుల ఆరాధ్య దైవం గురు లోకమాసంద్ ప్రభు ఉత్సవాలు బుధవారం తిమ్మారెడ్డిపల్లిలో ప్రారంభమయ్యాయి. –8లో u -
రాములోరి రథోత్సవం
రమణీయం.. చారకొండ: అపర భద్రాద్రిగా విరాజిల్లుతు న్న సిర్సనగండ్ల శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహోత్సవాల్లో భాగంగా మంగళవారం పెద్ద రథోత్సవం (పెద్దతేరు) తెల్లవారుజామున అత్యంత రమణీయంగా జరిగింది. వేడుకలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. భక్తుల జయజయ ధ్వానా ల మధ్య రంగురంగుల పూలతో శోభాయమానంగా అలంకరించిన రథంపై సీతారామలక్ష్మణ ఉత్స వ విగ్రహాలను ఉంచి అర్చకులు ప్రత్యేక పూజ లు చేశారు. అనంతరం ఆలయ చైర్మన్ రామశర్మ, ఈఓ అంజనేయులు రథాన్ని లాగి, ముందుకు కదిలించారు. ప్రధాన అలయం నుంచి ముక్కిడి పొచమ్మ, దత్తాత్రేయ ఆలయం వరకు రథాన్ని తీసుకొచ్చారు. వేడుక సోమవారం అర్ధరా త్రి నుంచి తెల్లవారుజాము న 6 గంటల వరకు సాగగా.. ఆలయ ప్రాంగణం శ్రీరామనామస్మ రణతో మార్మోగింది. భక్తులు సోమవారం రాత్రి ఆలయ గుట్టపై చేరుకొని జాగరణ చేశారు. రథోత్సవంలో కళాకారులు ఆటపాటలు ఆకట్టుకున్నాయి. రాత్రికి స్వామివారికి నాగబలి, పూర్ణాహుతి, గజవాహన సేవ, దీపోత్సవం కార్యక్రమాలు నిర్వహించారు. రథోత్సవం ప్రారంభిస్తున్న ఆలయ చైర్మన్, ఈఓ తదితరులు అంగరంగ వైభవంగా పెద్ద తేరు మహోత్సవం జనసంద్రమెన సిర్సనగండ్ల -
బ్రిడ్జి కమ్ బ్యారేజ్ ఏర్పాటుకు స్థల పరిశీలన
కృష్ణా: భీమానదిౖెవ బ్రిడ్జి కమ్ బ్యారేజ్ ఏర్పాటుకు సాధ్యసాధ్యాలపై ఇరిగేషన్ అధికారులు మంగళవారం కుసుమర్తి, సూకూర్లింగంపల్లిలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. దాంతోపాటు కర్ణాటకలోని గూడూర్ బ్రిడ్జి కం బ్యారేజీని కూడా పరిశీలించారు. అనంతరం చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు భీమానదిపై బ్యారేజీ ఏర్పాటుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎంతవరకు సాధ్యమవుతుంది, ఎంత నీటి నిల్వకు అవకాశం ఉండవచ్చు, ఏ ప్రాంతంలో ఏర్పాటుకు అవకాశం ఉందనే విషయంపై పరిశీలించినట్లు తెలిపారు. అనంతరం పూర్తిస్థాయిలో నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఎస్ఈ శ్రీధర్, కేతన్కుమార్, డీఈ శేఖర్, ఏపీపీఈ ప్రదీప్, ఖాజతోపాటూ ఆయా గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. -
‘మహాలక్ష్మి’తో మహిళా సాధికారిత
స్టేషన్ మహబూబ్నగర్: మహిళల ఆర్థిక, సామాజిక భద్రతతోపాటు సాధికారితకు మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు ప్రయాణం ఎంతో దోహదపడుతోందని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 90 రోజుల కార్యక్రమంలో భాగంగా మహబూబ్నగర్ ఆర్టీసీ బస్టాండ్లో మంగళవారం నిర్వహించిన మహాలక్ష్మి సంబరాలు కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం అమలుచేస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తుందన్నారు. 2026 మార్చి 29 నాటికి సుమారు 290 కోట్ల మహిళల ప్రయాణాలు నమోదు కావడంతో రూ.10 వేల కోట్లు బస్సు చార్జీల ఆదా రూపంలో ప్రయోజనం చేకూరిందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా గ్రామీణ ప్రాంతాల మహిళలు, పట్టణాలు, నగరాలకు చేరుకొని ఉద్యోగాలు, వ్యాపారాలు, విద్యావకాశాలు పొందుతున్నారని చెప్పారు. ఈ సౌకర్యం ద్వారా వారు స్వయం ఉపాధి అవకాశాలను వినియోగించుకుంటూ ఆదాయం పెంచుకుంటున్నారని, దీని వలన ఆర్థికంగా బలపడటమే కాకుండా సామాజికంగా, విద్యాపరంగా కూడా ఎదుగుతున్నారని పేర్కొన్నారు. మేయర్ మమత మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. తాను మేయర్గా ఎన్నికవడం కూడా మహిళలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనం అన్నారు. ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో 10 డిపోల్లో 960 ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యం పొందుతున్నారన్నారు. దీని ద్వారా ఉమ్మడి జిల్లాలో సుమారు రూ.1,064 కోట్ల బస్సు చార్జీలను మహిళలు ఆదా చేసుకున్నారని చెప్పారు. ఇప్పటికే జిల్లాలో 100 కొత్త బస్సులను ప్రవేశపెట్టామని, కొత్త రూట్లలో బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకుంటున్న కొంతమంది మహిళలు తమ అనుభవాలు పంచుకున్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ నర్సింహులు, డిప్యూటీ ఆర్ఎంలు లక్ష్మీధర్మ, కవిత, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు స్వాతి, స్వయం సహాయక సంఘాల సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆరోగ్య సంజీవని.. సిరి ధాన్యాలు
● చిరు ధాన్యాలతోనే సంపూర్ణ ఆరోగ్యం ● కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా.అనిత మదనాపురం: నేటి ఆధునిక జీవనశైలిలో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా మనిషి ఆయుప్రమాణం రోజురోజుకూ తగ్గిపోతుంది. పాశ్చాత్య ఆహార సంస్కృతికి అలవాటు పడి, పాలిష్ బియ్యం, మైదాలను ఆహారంలో ఎక్కువగా చేర్చడంతో చిన్న వయసులోనే మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నామని మదనాపురం కషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా.అనిత హెచ్చరించారు. సిరిధాన్యాలు మానవాళికి ప్రకృతి ప్రసాదించిన వరమని, వాటి ప్రాముఖ్యతను తెలిపారు. చిరుధాన్యాలు షుగర్, బీపీ ఉన్నవారికి అ త్యుత్తమ ఆహారంగా నిలుస్తాయి. వాటిలో గ్లైసిమిక్ ఇండెక్ చాలా తక్కువగా ఉండడంతో ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను ఒక్కసారిగా పెంచకుండా అదుపులో ఉంచుతాయి. డయాబెటిస్ గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి అమృత ఆహారం. కణజాల రక్షణకు.. మన శరీరంలోని కణజాలం దెబ్బతినకుండా కాపాడే ఆంటీ ఆక్సిడెంట్లు చిరుధాన్యాల్లో పుష్కలంగా ఉన్నా యి. ఫలితంగా ఇవి ఒబేసిటి (అతి బరువు), గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల శరీరం చురుగ్గా, నిరంతరం శక్తివంతంగా ఉంటుంది. వీటిలోని పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరిచి, శరీరంలోని వ్యర్థ పదా ర్థాలను సులభంగా తొలగించడానికి సహాయపడుతుంది. క్యాల్షియం మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లలకు, వృద్ధులకు ఎముకల బలానికి, కీళ్ల నొప్పులను తగ్గించడానికి చిరుధాన్యాలు ఎంతగానో తోడ్పడతాయి. చిరుధాన్యాలు నాడీ వ్యవస్థను బలపర్చడం ద్వారా మేథోశక్తి మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మన దైనందిన ఆహారంలో వరి, గోధుమల స్థానంలో కొంతవరకై నా రాగులు, జొన్నలు, సజ్జలు, కొరల్రు వంటి సిరిధాన్యాలను చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని డా.అనిత సూచించారు. రాగి అంబలి రాగి ధాన్యాలతో చేసిన బిస్కెట్ వేసవి కాలంలో ముఖ్యంగా రాగులను ఆహారంలో భాగంగా చేసుకోవడం ఎంతో అవసరమని, రాగులతో చేసిన అంబలి తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్ (నీటి శాతం తగ్గిపోవడం) కాకుండా కాపాడుకోవచ్చని, ఇది చలవ చేయడమే కాకుండా శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని అందిస్తుందని డా.అనిత వివరించారు. -
చలో.. సలేశ్వరం
లింగమయ్య దర్శనానికి వేళాయె సలేశ్వరం రూట్మ్యాప్వస్తున్నాం.. వెళ్లొస్తాం ఎత్తైన కొండలు, దట్టమైన చెట్లు, రాళ్లు రప్పల మధ్య నడిచివెళ్లి.. సహజసిద్ధంగా వెలసిన జలపాతాలను దాటుకొని పున్నమి వెన్నెల్లో సలేశ్వరం లింగమయ్యను దర్శించుకోవడం ఓ మహత్తర ఘట్టం. పేద, ధనిక.. చిన్నాపెద్ద.. ముసలి ముతక.. ఇలా ఎవరైనా సరే ప్రమాదభరితమైన కొండల్లో కాలినడకన గంటల తరబడి నడిచి వెళ్లాల్సిందే. దర్శనానికి వెళ్లే ముందు ‘వస్తున్నాం.. లింగమయ్యా’ తిరిగి వచ్చేటప్పుడు ‘వెళ్తొస్తాం.. లింగమయ్యా’ అంటూ భక్తిపారవశ్యంతో కదులుతారు. సుమారు వెయ్యి అడుగుల లోయలో ప్రతిధ్వనించే లింగమయ్య నామస్మరణ.. దారి పొడవునా పడే నీటి తుంపర్లు.. వెయ్యి అడుగు లపై నుంచి జాలువారే జలపాతం.. ఇలా ఒక్కో దృశ్యం ఒక్కో అద్భతం. ఒక్కసారి ఈ యాత్ర చేస్తే జీవితాంతం గుర్తుండిపోతుంది. మహబూబ్నగర్ – అచ్చంపేట – శ్రీశైలం -
సలేశ్వర క్షేత్రం
కుంచోని మూలచివరి పాయింట్ కార్లు, బైక్ వాహనాల పార్కింగ్ ఆర్టీసీ బస్ పార్కింగ్ షికార్నగర్ ఆటో రూట్ మన్ననూర్టికెట్ కౌంటర్ మెయిన్ ఎంట్రెన్స్కాలినడక ఏరియా రాంపూర్పెంట పుల్లాయిపల్లికురియాల జంక్షన్ మోకాల కుర్వ -
కౌకుంట్ల ఎఫ్సీఐ గిడ్డంగుల తనిఖీ
దేవరకద్ర: కౌకుంట్ల రైల్వేస్టేషన్ సమీపంలోని ఎఫ్సీఐ బియ్యం గిడ్డంగులను రాష్ట్ర ఎఫ్సీఐ జనరల్ మేనేజర్ నరసింహారాజు మంగళవారం తనికీ చేశారు. గిడ్డంగిలో నిల్వ చేసిన బియ్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా బియ్యం నాణ్యత, తూకం యంత్రాల ఖచ్చితత్వాన్ని తనికీ చేశారు. అలాగే బియ్యానికి ఉపయోగించిన గోనే సంచుల బరువును క్షుణ్ణంగా పరిశీలించారు. బియ్యం సంచులను తూకం వేయడంతో వాటి ప్రమాణాలను సరిచూసుకున్నారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాపరిధిలోని కౌకుంట్లలో ఉన్న ఎఫ్సీఐ గిడ్డంగికి లక్షా11వేల టన్నుల నిల్వ సామర్థం ఉందని తెలిపారు. ఆయన వెంట ఎఫ్సీఐ రాష్ట్ర బోర్డు సభ్యులు కిరణ్సాగర్, నాణ్యత నియంత్రణ మేనేజర్ జగ్రునాయక్, సాంకేతిక సహాయకులు పాల్గొన్నారు. పెద్దపులి దాడిలో పాడిఆవు మృతి మన్ననూర్: అటవీ సరిహద్దు ప్రాంతం లింగమయ్యస్వామి ఆలయ సమీపంలో పాడి ఆవుపై పెద్దపులి దాడి చేసి చంపిన సంఘటన మంగళవారం వెలుగుచూసింది. వివరాలిలా.. మన్ననూర్ గ్రామానికి చెందిన పెర్ముల చెన్నకిష్టయ్య పాడి ఆవు మేత కోసం అటవీ పరిసర ప్రాంతానికి వెళ్లింది. ఈ క్రమంలో గ్రామానికి సమీపంలో లింగమయ్యస్వామి ఆలయం వెనుక భాగంలో పెద్దపులి ఆవుపై దాడి చేసి చంపివేసింది. బాధితులు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. పెద్దపులి సంచారం గురించి తెలుసుకోవడానికి సీసీ కెమెరాను బిగించామని వెల్లడించారు. -
నీటి కేటాయింపులో రాజీపడే ప్రసక్తే లేదు
కల్వకుర్తి టౌన్: కల్వకుర్తికి దక్కాల్సిన నీటి కేటాయింపులో రాజీ పడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీశైలం ప్రాజెక్టులో నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం విద్యుత్తు ఉత్పత్తి చేస్తుందని, శ్రీశైలం జలాశయంలో కనిష్ఠ నీటిమట్టం 20 టీఎంసీలు ఉన్నప్పుడు కూడా ఇక్కడి వారి సాగు తాగునీటి అవసరాలను పట్టించుకోకుండా ఏపీ ప్రభుత్వం అన్యాయంగా నీటిని వినియోగిస్తుందని విమర్శించారు. ఈ విషయంపై పలుమార్లు విన్నవించినప్పటికీ స్పందన లేకపోవడంతో, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రైతులు శ్రీశైలం వద్ద ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడంతో ఏపీ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసిందన్నారు. కల్వకుర్తి ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని నీటి కేటాయింపుల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. కల్వకుర్తికి నష్టం జరిగితే ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి పోరాడుతుందని భవిష్యత్లో ఇలాంటి చర్యలు పునరావృత్తమైతే కఠినంగా ఎదుర్కొంటామన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ రత్నమాల, వైస్ చైర్మన్ షాన్వాజ్ ఖాన్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మనీలా సంజీవ్ కుమార్ యాదవ్, మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్, మాజీ జెడ్పీటీసీ అశోక్ రెడ్డి, కౌన్సిలర్లు రాజేష్ కుమార్, కరుణాకర్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ రమాకాంత్ రెడ్డి పాల్గొన్నారు. -
నేటి నుంచి టోల్ప్లాజాల వద్ద ‘నో క్యాష్’..!
అడ్డాకుల: జాతీయ రహదారిపై ఉన్న టోల్ప్లాజాల వద్ద బుధవారం నుంచి నగదు చెల్లింపులకు జాతీయ రహదారుల సంస్థ స్వస్తి పలికింది. టోల్ప్లాజాల వద్ద వాహనదారులు ఎక్కువ సేపు వేచి ఉండే సమయాన్ని తగ్గించి సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించడానికి ఎన్హెచ్ఏఐ ఫాస్టాగ్ విధానాన్ని అమలు చేస్తోంది. ఇప్పటి వరకు ఫాస్టాగ్ లేని వాహనదారుడి నుంచి రెండింతల నగదును వసూలు చేసేవారు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి నగదు చెల్లింపులను పూర్తిగా నిలిపివేస్తున్నారు. ఫాస్టాగ్ లేని వాహనదారుల నుంచి డిజిటల్, యూపీఐ చెల్లింపులకు మాత్రమే అనుమతించనున్నారు. ఇందుకోసం 25 శాతం ఫీజును అధికంగా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రాయికల్, శాఖాపూర్, అలంపూర్ టోల్ప్లాజాల వద్ద నగదు చెల్లింపులకు ఎన్హెచ్ఏఐ స్వస్తి పలికింది. ఇక నుంచి టోల్ప్లాజాల వద్ద నగదు చెల్లించి వెళ్లాలనుకుంటే కుదరదని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య హన్వాడ: భార్య మానసిక పరిస్థితి, తనపై కేసుల కా రణంగా జీవితం విరక్తి చెంది ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని నాగినోనిపల్లికి చెందిన బొమ్మరాసి నర్సిములు(51) భార్య లక్ష్మమ్మ మానసిక పరిస్థితి సరిగా ఉండేది కాదు. అలాగే తనపై కేసులు ఉండడంతో ఈనెల 29న ఇంట్లో చీరతో ఫ్యాన్కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ మేరకు మృతుడి తల్లి రాములమ్మ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటేష్ తెలిపారు. -
భారీ బందోబస్తు ఏర్పాటు
రథోత్సవ వేడుకలో వేలాది మంది భక్తులు పాల్గొనడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఐ రఘువీర్రెడ్డి, ఎస్ఐ వీరబాబు అధ్వర్యంలో దాదాపుగా 3 వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గుట్టపైకి వాహనాలు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. రథోత్సవ వేడుక అనంతరం భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లో బారులుతీరారు. స్వామివారి దర్శనం అనంతరం అమ్మవారు, శివదత్తాత్రేయ ఆలయాలను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ నిరంజన్, అర్చకులు లక్ష్మణ్శర్మ, అనంత శర్మ, కోదండ రామశర్మ, ప్రవీణ్శర్మ, మురళీధర్ శర్మ, సర్పంచ్లు, నాయకులు ఉన్నారు. -
నిందితుడికి రెండేళ్ల జైలుశిక్ష, జరిమానా
గట్టు: నిర్లక్ష్యంగా వాహనం నడిపి వ్యక్తి మృతికి కారణమైన చెనుగోనిపల్లెకు చెందిన డ్రైవర్ సాయికుమార్కు మంగళవారం గద్వాల 1వ అదనపు జ్యూడిషయల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ ఉదయ్నాయక్ నిందితునికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.2వేల జరిమాన విధించినట్లు గట్టు ఎస్ఐ శేఖర్గౌడ్ తెలిపారు. ఎస్ఐ వివరాల ప్రకారం.. 2018లో గట్టు పోలీస్స్టేషన్ పరిధిలోని బల్గెర సమీపంలో నిర్లక్ష్యంగా వాహనం నడుపగా చెనుగోనిపల్లెకు చెందిన పెద్ద బుచ్చన్న (70) గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. అప్పటి ఎస్ఐ విజయ్కుమార్ కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ తరఫున సాక్ష్యాలను కోర్టులో ప్రవేశ పెట్టి, నేరం రుజువయ్యేలా పబ్లిక్ ప్రాసిక్యూటర్ రేచల్ సంజన జాషువ, కోర్టు కానిస్టేబుల్ రాందాస్ కృషి చేసినట్లు ఎస్ఐ తెలిపారు. నేరం రుజువు కావడంతో నిందితుడు చెనుగోనిపల్లెకు చెందిన డ్రైవర్ సాయికుమార్కు రెండేళ్ల జైలుశిక్ష, రూ.2వేల జరిమాన విధించినట్లు ఎస్ఐ తెలిపారు. కారు బోల్తా.. ముగ్గురికి గాయాలు ఉండవెల్లి: మండలంలోని ఉండవెల్లి శివారులో వరసిద్ది వినాయక పత్తి మిల్లు సమీపంలో మంగళవారం ఓ కారు బోల్తా పడిన ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి నంద్యాలకు వెళ్తున్న కారు బోల్తా అదుపుతప్పి బోల్తా పడగా కారులో ప్రయాణిస్తున్న ఇమ్రాన్, భాను, మహమ్మద్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు గమనించి అంబులెన్స్కు ఫోన్ చేయగా సిబ్బంది వచ్చి 108లోనే చికిత్స అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి వనపర్తి రూరల్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. పెబ్బేరు పట్టణ కేంద్రానికి చెందిన బత్తుల కృష్ణయ్య, భార్య వరలక్ష్మితో కలసి ఈ నెల 29న వీపన్గండ్ల మండలం ,కల్వరాల గ్రామంలో శుభకార్యం ఉండడంతో బైక్పై బయలుదేరారు. చెలిమిల్లకు రాగానే వెనుక నుంచి వస్తున్న కారు అతివేగంగా వచ్చి బైక్ను ఢీకొట్టింది. ప్రమాదంలో కృష్ణయ్య తలకు తీవ్రగాయమై కోమాలోకి వెళ్లగా కర్నూల్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో సోమవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతునికి ఇద్దరు కుమారులు ఉన్నారు. యువకులపై కేసు నమోదు మహబూబ్నగర్ క్రైం: గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై అభ్యంతకరంగా ఇన్స్ట్రాగామ్లో పోస్టు షేర్ చేసిన ఒక యువకుడిపై కేసు నమోదు చేయడంతోపాటు టూటౌన్ పోలీసులు బైండోవర్ చేశారు. టూటౌన్ సీఐ ఇజాజుద్దీన్ కథనం ప్రకారం.. టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ఇటీవల గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫొటోపై ఇన్స్ట్రాగామ్లో అభ్యంతకరంగా ఒక పోస్టు ఏర్పాటు చేసి షేర్ చేశారు. దీంతో కొంతమంది యువకులు సదరు యువకుడి ఇంటికి వెళ్లి అతనితో ఆ పోస్టు తొలగించే విధంగా చేశారు. ఆ తర్వాత అతనితోనే రాజాసింగ్ చిత్రపటానికి పాలాభిషేకం చేయించి దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఘటనపై ఆరుగురు యువకులకు నోటీసులు జారీ చేయడంతోపాటు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. అదేవిధంగా రాజాసింగ్పై అభ్యంతకరంగా పోస్టుపెట్టిన యువకుడిపై కేసు నమోదు చేసి బైండోవర్ చేసినట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో ఇతరులను కించపరిచే విధంగా పోస్టులు పెట్టడం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఏదైనా సమస్య ఉంటే నేరుగా పోలీసుల దృష్టికి తీసుకురావాలి తప్పా సొంతంగా చేయరాదని సూచించారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి జడ్చర్ల: ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ మల్లేశ్ తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు.. ఏపీలోని అనంతపూర్ జిల్లా యాడికి మండలం రాయంచెరువు గ్రామానికి చెందిన తుమ్మల రమేశ్(54) ఉదండాపూర్ శివారులోని ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం సమీప దేవుడిగుట్టతండా సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న రోడ్డు కల్వర్టు మీద పడుకున్నాడు. నిద్ర మత్తులో ఉన్న సమయంలో ప్రమావశాత్తు కల్వర్టు మీద నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతు సోమవారం రాత్రి మృతి చెందాడు. మృతుడి సోదరుడు రాధాకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
వేడిమి.. ఉక్కపోత
● జిల్లాలో తీవ్రమైన ఎండలు ● 11 గంటలకే నిర్మానుష్యంగా మారుతున్న రోడ్లు ● మధ్యాహ్నం వేళలో తల్లడిల్లుతున్న ప్రజలు ● పండ్ల రసాలు, శీతలపానియాలతో ఉపశమనం పాలమూరు: భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. మండు వేసవికి ముందే తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఎండల తీవ్రత రోజురోజుకూ అధికం అవుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం తల్లడిల్లుతున్నారు. వేడిమి నుంచి ఉపశమనం కోసం మజ్జిగ, కొబ్బరినీళ్లు, చెరకు, పండ్ల రసాలను తాగుతున్నారు. నానాటికీ పెరుగుతున్న ఎండలతో జిల్లా ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఉదయం 9 గంటలకే భానుడి భగభగలు మొదలై సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగుతున్నాయి. పనులమీద బయటకు వస్తున్న ప్రజలు.. మధ్యాహ్నం వరకే పనులు ముగించుకొని ఇళ్లకు చేరేలా ప్రయత్నిస్తున్నారు. ఆరు బయటకు వచ్చిన జనాలు ఉపశమనం పొందేందుకు నానా ఇక్కట్లు పడ్డారు. మహబూబ్నగర్ టు రాయచూర్, హైదరాబాద్ టు మహబూబ్నగర్, భూత్పూర్ ప్రధాన రహదారులతోపాటు పట్టణాలు, గ్రామాల్లోని రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ద్విచక్రవాహనదారులు తలకు టోపీలు ధరిస్తూ, ముఖాలకు గుడ్డలు కట్టుకుని జాగ్రత్త పడుతున్నారు. పాదచారులు గొడుగు నీడన అడుగులు వేస్తూ భానుడి ప్రతాపం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. -
బావాజీ ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
● రేపటి నుంచి గురులోక మాసంద్ జాతర ప్రారంభం ● డీఎస్సీతో పాటు 10 మంది సీఐలు,15 మంది ఎస్ఐలతో బందోబస్తు కొత్తపల్లి: గిరిజనుల జీవన విధానంలో తన బోధనల ద్వారా మార్పు తీసుకొచ్చి, ఆపద సమయంలో వారిని ఆదుకున్న గురులోకామాసంద్ ప్రభు (బావాజీ)ని గిరుజనులు ఆరాధ్య దైవంగా భావిస్తారు. ఈ క్రమంలోనే అయన పుట్టిన రోజు (చైత్ర శుద్ధ పౌర్ణమి)ను పురస్కరించుకొని గిరిజనులు ప్రతి ఏటా కనులపండువగా ఉత్సవాలు నిర్వహిస్తారు. నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో గురులోకామాసంద్ ప్రభు ఆలయంలో మార్చి 1 నుంచి 4 వరకు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. చైత్ర శుద్ధ చతుర్ధశి బుధవారం నుంచి చైత్ర బహుళ విదియ మొదటి రోజు 1న ధ్వజారోహణం (అర్థాస్) రాత్రి ప్రభోత్సవం, బంజారాల సంస్కృతి కార్యక్రమాలు, 2న గురులోకామాసంద్ ప్రభుకు, ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు, రాత్రి 2గంటలకు రఽథోత్సవం (తేరు), 3న మహాభోగ్, ప్రభువారి పల్లకీసేవ, కాళికాదేవి వద్ద భక్తుల మొక్కుల చెల్లింపులు, 4న కాళికాదేవి పల్లకీ సేవ, హోమం, పూర్ణాహుతి, మంగళ హారతి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆలయ పూజారులు తెలిపారు. ఉత్సవాలకు తెలంగాణతో పాటు కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచి గిరిజన భక్తులు హాజరై ప్రభును ఆరాధిస్తారు. ఏర్పాట్లు పూర్తి ఉత్సవాల ఏర్పాటు కోసం గత నెల 17న కలెక్టర్ సిక్తా పట్నాయక్, కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి వివిధ శాఖల అధికారులతో ఆలయం ఆవరణలో సమావేశం నిర్వహించారు. అలాగే ఈ నెల 28న కలెక్టర్ ప్రతీక్ జైన్ మరోసారి అధికారులతో సమీక్షతో పాటు, ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలు చేశారు. జాతర జరిగే నాలుగు రోజులు జిల్లా అధికారులు పర్యవేక్షించనున్నారు. ఉత్సవాల్లో పారిశుద్ధ్య పనులు, తాగునీటి సరఫరా తదితర ఏర్పాట్ల కోసం 500 మంది సిబ్బంది ఉపయోగిస్తున్నట్లు డీపీఓ సుధాకర్రెడ్డి తెలిపారు. జాతరను 12 సెక్టార్లుగా విభజించి ఒక్కో సెక్టార్ ఇన్చార్జ్గా ఎంపీఓ వ్యవహరిస్తారన్నారు.ఉత్సవాల్లో సమస్యలపై ఫి ర్యాదుల చేయడానికి 2 కంట్రోల్ రూంలను ప్రారంభించామని కోస్గి సీఐ సైదులు తెలిపారు. అలాగే షీటీంలు, మఫ్టీలో పోలీసులు, పోలీస్ పెట్రోలింగ్, ట్రాఫిక్, ఇతర బందోబస్తుకు పోలీసులను నియమిస్తున్నట్లు ఆయన తెలిపారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా నారాయణపేట డీఎస్సీ లింగయ్య పర్యవేక్షణలో 10 మంది సీఐలు, 15 మంది ఎస్ఐలు, 36 మంది హెడ్కానిస్టేబుళ్లు, 200 మంది పోలీసులు, 53 మంది హోంగార్డులు విధులు నిర్వహించనున్నారు. గ్రామంలోని ఇళ్లలో ఎవరైనా మద్యం అమ్మకాలు సాగిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. -
మంచి స్నేహితులతో ఆరోగ్యకర జీవనశైలి
మహబూబ్నగర్ క్రైం: మాదకద్రవ్యాలు యువత భవిష్యత్ను అంధకారంలోకి నెట్టే ప్రమాదకర వ్యసనమని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. జిల్లా పోలీస్శాఖ ఆధ్వర్యంలో నగరంలోని బృందావన్ గార్డెన్లో 2వేల మంది విద్యార్థులతో పాటు జేపీఎన్సీఈ ఇంజినీరింగ్ కళాశాలలో మాదకద్రవ్యాల నిర్మూలనపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆమె హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలనకు పెద్దఎత్తున చర్యలు తీసుకుంటూ.. ప్రత్యేకంగా ఈగల్ ఫోర్స్ బృందాన్ని బలోపేతం చేసినట్లు తెలిపారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి, కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం పెంచుకోవడం.. మంచి స్నేహితులతో కలిసి క్రీడల్లో పాల్గొంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. ఎస్పీ డి.జానకి మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగంతో శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ఈ వ్యసనానికి లోనైతే వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం రెండూ దెబ్బతింటాయన్నారు. ఒకవేళ ఎవరైనా ఈ అలవాటుకు గురైతే భయపడకుండా పోలీసులను సంప్రదించి బయటపడాలన్నారు. యువత తమ లక్ష్యాలపై దృష్టిపెట్టి మంచి భవిష్యత్ నిర్మించుకోవాలని సూచించారు. అనంతరం ఈగల్ ఫోర్స్ అదనపు ఎస్పీ పి.కృష్ణమూర్తి మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయ విధానాలు, వాటి వెనుక ఉండే నెట్వర్క్పై పవర్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు వివరించారు. అందుకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించి.. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ ఈఎస్ సుధాకర్, అదనపు ఎస్పీ ఎన్బీ రత్నం, డీఎంహెచ్ఓ డా.కృష్ణ, డీఈఓ ప్రవీణ్, డీఎస్పీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ప్రత్యేక నంబర్లు ఏర్పాటు.. జిల్లాలో డ్రగ్స్ కట్టడి కోసం పోలీస్ శాఖ ప్రత్యేక నెంబర్లు ఏర్పాటు చేసింది. టోల్ఫ్రీ నంబర్ 1908, వాట్సప్ నంబర్ 8712671111, కంట్రోల్ రూం నంబర్ 8712659360తో పాటు tsnabho-hyd@tspoice.gov.in ఏర్పాటు చేయడం జరిగింది. -
పంటలకు నీరందించాలని రైతుల ఆందోళన
చిన్నచింతకుంట: మండలంలోని పర్దీపూర్ జలాశయం అడుగంటిపోవడంతో పంటలకు నీరులేక ఎండుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. జూరాల బ్యాక్ వాటర్ను విడుదలచేసి, పంటలను కాపాడాలని కోరుతున్నారు. ఈ మేరకు సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎండిన పంట పొలాల్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షుడు కోట రాము మాట్లాడుతూ.. పర్దీపూర్ రిజర్వాయర్ ద్వారా ఆయకట్టుకు సాగునీరు అందకపోవడంతో రైతులు కష్టించి సాగుచేసిన వరిపైరు ఎండిపోతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారన్నారు. పంట చేతికొచ్చే సమయంలో సాగునీరు లేకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి.. జూరాల నుంచి రిజర్వాయర్కు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బసిరెడ్డి సంతోష్రెడ్డి, స్వామి, నర్సింహ, రఘు, బైని బాలరాజు, బరనప్ప, మల్లేష్, గోవిందు, వెంకటేశ్, ఆంజనేయులు, బుచ్చప్ప పాల్గొన్నారు. -
స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలు షురూ
మహబూబ్నగర్ క్రీడలు: రాష్ట్రంలోని నాలుగు ప్రాంతీయ క్రీడా పాఠశాలల్లో 4వ తరగతిలో ప్రవేశాలకు జిల్లా స్థాయిలో సెలక్షన్స్ మొదలయ్యాయి. మేడ్చల్ జిల్లాలోని టీజీజీఎస్ఎస్ హకీంపేటతో పాటు కరీంనగర్, ఆదిలాబాద్, హన్మకొండ ప్రాంతీయ క్రీడా పాఠశాలల్లో 2026–27 సంవత్సరానికి 4వ తరగ తిలో ప్రవేశాలు జరగనున్నాయి. ప్రతి స్కూల్లో 4వ తరగతిలో 20 మంది బాలురు, 20 మంది బాలికలను, హన్మకొండ స్కూల్లో 40మంది బా లురు, 40మంది బాలికలకు ప్రవేశాలు కల్పిస్తారు. ఉమ్మడి జిల్లాలో సందడి.. ఉమ్మడి జిల్లాలో జిల్లాస్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్ సందడి నెలకొంది. సోమవారం నాగర్కర్నూల్, జోగులాంబ గద్వాల జిలాల్లో జిల్లాస్థాయి సెలక్షన్స్ జరగగా నేడు (మంగళవారం) మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా వనపర్తి జిల్లాలో నేడు బాలుర, బుధవారం బాలికల జిల్లాస్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్ నిర్వహించనున్నారు. జిల్లాస్థాయిలో ఎంపికై న వారు రాష్ట్రస్థాయి సెలక్షన్స్కు వెళ్తారు. ఏఫ్రిల్ 27వ తేదీ నుంచి మే 1 వరకు రాష్ట్రస్థాయి సెలక్షన్స్ జరగనున్నాయి. మే 13, 14 తేదీల్లో కౌన్సెలింగ్, జూన్ 12న ఎంపికై న విద్యార్థులు ఆయా స్పోర్ట్స్ పాఠశాలల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. కావాల్సిన ధ్రువపత్రాలు స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాల ఎంపికలకు విద్యార్థులు ధ్రువ పత్రాలతో రావాలి. ఒరిజినల్ ఆధార్కార్డు, 4వ తరగతి సర్టిఫికెట్, వయస్సు ధృవీకరణ పత్రం, 3వ తరగతి ప్రోగ్రెస్ రిపోర్ట్, కమ్యూనిటీ సర్టిఫికెట్, ఐదు పాస్పోర్టు సైజ్ ఫోటోలు, విద్యార్థులు 8 నుంచి 9 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి, 01–09–2017 నుంచి 31–08–2018 మధ్య పుట్టిన వారు అర్హులు. నేడు మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి జిల్లా కేంద్రాల్లో సెలక్షన్స్ ఇప్పటికే నాగర్కర్నూల్, గద్వాల జిల్లాల్లో పూర్తి ఏప్రిల్లో రాష్ట్రస్థాయి సెలక్షన్స్ -
శ్రీశైలంలో తగ్గుతున్న నీటిమట్టం
అచ్చంపేట: శ్రీశైలం జలాశయంలో క్రమంగా నీటిమట్టం తగ్గుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885.0 అడుగుల వద్ద 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం జలాశయంలో 824.1 అడుగుల వద్ద 44.0874 టీఎంసీల నీటి నిల్వ ఉంది. టీజీ జెన్కో పరిధిలోని భూగర్భ కేంద్రంలో శ్రీశైలంలో నీటిమట్టం 800.0 తగ్గకుండా ఉన్నంత వరకు విద్యుదుత్పత్తి చేసుకోవచ్చు. అలాగే ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో శ్రీశైలంలో నీటిమట్టం 798.0 అడుగుల వరకు విద్యుదుత్పత్తి చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా.. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం తగ్గుముఖం పట్టడంతో వేసవిలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సాగు, తాగునీటి ఎద్దడి ఏర్పడే అవకాశాలు ఉండటంతో మంగళవారం రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలతో కలిసి శ్రీశైలం డ్యాం వద్ద ధర్నా చేయనున్నట్లు దోమలపెంటకు చెందిన కాంగ్రెస్ నాయకులు మోయిజ్, మల్లిఖార్జున, గురువయ్య, సిరాజ్ సోమవా రం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానంగా ఏపీ పరిధిలోని శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తుండటం వల్ల శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం రోజురోజుకూ తగ్గిపోతుందని, దీంతో ఎంజీకేఎల్ఐపై ప్రభావం చూపి ఉమ్మడి జిల్లాకు తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడుతుందని చెప్పారు. ఇసుక డంప్ సీజ్ అయిజ: అనుమతులు లేకుండా నిల్వ చేసిన ఇసుక డంపులను అధికారులు సోమవారం సీజ్ చేశారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ రజనీకాంత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని తుంగభద్రానది ఒడ్డున పులికల్ గ్రామ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు 40 ట్రాక్టర్ల ఇసుకను డంప్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇసుక డంప్ను పరిశీలించి పంచనామా చేశారు. అదేవిధంగా ఇసుక డంప్ను సీజ్ చేశారు. కార్యక్రమంలో ఏఎస్ఐ శ్రీనివాస్, కానిస్టేబుల్ రవినాయక్, జీపీఓ రవి పాల్గొన్నారు. -
విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి
మహబూబ్నగర్ మెయిన్ స్టేడియంలో మంగళవారం జిల్లా స్థాయి స్పోర్ట్స్ స్కూల్స్ ఎంపికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేశాం. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారే ఎంపికల్లో పాల్గొనాలి. సంబంధిత ధృవపత్రాలతో ఉదయం 8 గంటలకు మెయిన్ స్టేడియంలో రిపోర్టు చేయాలి. మిగతా వివరాల కోసం 94406 56162 నంబర్ను సంప్రదించాలి. –ఎస్.శ్రీనివాస్, జిల్లా యువజన క్రీడల అధికారి, మహబూబ్నగర్ క్రీడా పాఠశాలతో ఉజ్వల భవిష్యత్ స్పోర్ట్స్ స్కూళ్లకు ఎంపికై న వారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుంది. విద్యార్థులను ఇటు చదువుతోపాటు అటు క్రీడాంశాల్లో ప్రత్యేక శిక్షణ అందజేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాపోటీల్లో పాల్గొనేలా తీర్చిదిద్దుతారు. ఈ అవకాశాన్ని క్రీడలపై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఉపయోగించి భవిష్యత్కు బాటలు వేసుకోవాలి. –వేణుగోపాల్, సీనియర్ పీడీ, జెడ్పీహెచ్ఎస్ చిన్నదర్పల్లి, మహబూబ్నగర్ ● -
పెయింట్ దుకాణంలో షార్ట్ సర్క్యూట్
గద్వాల క్రైం: పట్టణంలోని ఓ పెయింట్ దుకాణంలో సోమవారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకుంది. ఫైర్ సిబ్బంది, బాధితుడు రఘురాం కథనం మేరకు.. తుల్జారాం దేవాలయం సమీపంలో ఓ వ్యక్తి పెయింట్ దుకాణం నిర్వహిస్తున్నాడు. అయితే తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ సంభవించి దుకాణంలోని రూ.30 లక్షల విలువగల పెయింట్ డబ్బాలు మంటల్లో కాలిపోయాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది అశోక్, రాకేష్, గౌస్, రాజశేఖర్లు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే మంటలు పెద్దఎత్తున వ్యాపించడంతో సాధ్యం కాలేదు. మరో ఫైర్ ఇంజిన్ సాయంతో సుమారు రెండు గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. -
భక్తిశ్రద్ధలతో గరుడవాహన సేవ
సిర్సనగండ్లలో స్వామివారికి గరుడ వాహన సేవ నిర్వహిస్తున్న భక్తులు చారకొండ: సిర్సరనగండ్ల సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారికి గరుడ వాహన సేవను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా జై శ్రీరామ్ నినాదాలు మార్మోగాయి. అంతకుముందు ఆలయంలో సీతారామచంద్రస్వామికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అదేవిధంగా శివదత్తాత్రేయ, పరశరామాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రామశర్మ, ఈఓ ఆంజనేయు లు, మేనేజర్ నిరంజన్, అర్చకులు లక్ష్మణ్ శర్మ, మురళీధర్ శర్మ, సీతారామశర్మ, కోదండ రామ శర్మ, ప్రవీణ్ శర్మ, అనంత శర్మ, భాస్కర్ శర్మ పాల్గొన్నారు. -
పిడుగుపాటుతో మహిళా రైతు మృతి
వంగూరు: మండలంలోని నిజాంబాద గ్రామానికి చెందిన మహిళా రైతు ఇడమోని లక్ష్మమ్మ (34) సోమవారం సాయంత్రం పిడుగుపాటుకు గురై మృతి చెందింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు.. లక్ష్మమ్మ తన వ్యవసాయ పొలంలో వేరుశనగ పంటను తూర్పార పడుతుండగా వర్షం రావడంతో ఆమె కూలీలతో పాటు కొంతదూరం వెళ్లి నిలబడ్డారు. కొద్దిసేపటి తర్వాత వేరుశనగ కుప్పపై కప్పిన కవర్ గాలికి లేచిపోవడంతో దానిని సరిచేసేందుకు వెళ్తుండగా లక్ష్మమ్మ పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందింది. భర్త వెంకటయ్యకు కళ్లు కనబడకపోవడంతో ఆమెనే వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుందని గ్రామస్తులు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమె మరణంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణ ం రాజాపూర్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం రాజాపూర్ మండల పరిధిలోని ముదిరెడ్డిపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే బీహార్ రాష్ట్రం బుక్సర్ జిల్లా నవాన్నగర్కు చెందిన మంజి పాశ్వన్ (31) పోలేపల్లిసెజ్లో గల ధర్మోకేబుల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. సోమవారం రోజు మాదిరిగా పనికి వెళ్తూ జాతీయ రహదారి పక్క నుంచి వెళ్తుండగా జడ్చర్ల నుంచి హైదరాబాద్ వెళ్తున్న గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య చంపకుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. చికిత్స పొందుతూ వృద్ధురాలి మృతి వనపర్తి రూరల్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధురాలు మహబూబ్నగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పట్టణ ఎస్ఐ 2 శశిధర్ తెలిపిన వివరాల ప్రకారం.. వీపనగండ్ల మండలంలోని బొల్లారం గ్రామానికి చెందిన గోపిరెడ్డి శాంతమ్మ (70) జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న తన కుమార్తె మల్రెడ్డి సుమలత ఇంటి వచ్చింది. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం గ్రామానికి వెళ్లడానికి రామాలయం బస్స్టాప్ వద్ద రోడ్డు దాటుతుండగా బస్టాండ్ వైపు నుంచి అతివేగంగా వచ్చిన బైక్ ఆమెను ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శాంతమ్మను కుమార్తె వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మహబూబ్నగర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో మృతి చెందింది. ఘటనపై మృతురాలి కుమార్తె మల్రెడ్డి సుమలత ఫిర్యాదు మేరకు సోమవారం పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. అప్పులబాధతో వ్యక్తి ఆత్మహత్య కృష్ణా: అప్పులబాధ తాళలేక ఓ వ్యక్తి కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కృష్ణాలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. మండలంలోని చెక్పోస్టు ప్రాంతంలో నివసిస్తున్న నాగరాజు (50) వ్యవసాయ పొలాలను లీజ్కు తీసుకొని పంటలు సాగుచేసేవాడు. కొంతకాలంగా వ్యసాయంలో నష్టం రావడంతో అప్పులు పెరిగిపోయాయి. దీంతో అప్పులబాధ భరించలేక సమీపంలోని బ్రిడ్జిపై నుంచి కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి పాన్గల్: మండలంలోని తెల్లరాళ్లపల్లి తండాకు చెందిన ముడావత్ లక్ష్మణ్ (57) చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. ఎస్ఐ కురుమయ్య వివరాల మేరకు.. వ్యవసాయ కూలీ పనులు చేసుకొని జీవించే ముడావత్ లక్ష్మణ్ కుమారుడు ఏడేళ్ల క్రితం మృతిచెందాడు. నాటి నుంచి తీవ్ర మనస్తాపానికి గురవుతున్నాడు. ఈ క్రమంలో శనివారం తన ఇంట్లోనే పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పాన్గల్ ఆస్పత్రికి, అక్కడి నుంచి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మహబూబ్నగర్ ఆస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య మంగమ్మ, నలుగురు కూతుళ్లు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. కాగా, మృతుడి కుటుంబాన్ని స్థానిక సర్పంచ్ ఉషా లింగానాయక్, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి బాల్యానాయక్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
కాంగ్రెస్ పాలనలో విద్యార్థులకు కష్టాలు
గద్వాల: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు రూ.9వేల కోట్ల ఫీజు రియింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో కష్టాలు పడుతున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని పాతబస్టాండులో పోరుదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ఇంజినీరింగ్, వైద్య, ఇతర కాలేజీలు మూసివేయడానికి సిద్ధమవుతున్నారన్నారు. దీనిపై కాలేజీల యాజమాన్యాలు పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టింపు లేకుండా పోయిందన్నారు. ఫలితంగా విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొందన్నారు. బకాయిలను వెంటనే చెల్లించాలని.. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పోరుబాట చేపడతామని హెచ్చరించారు. అదేవిధంగా నిరుద్యోగ యువత, విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీలకు నిరుద్యోగులు మేలుకొని పోరుబాట పట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్, నాయకులు బాసు హనుమంతునాయుడు, నాగర్దొడ్డి వెంకట్రాములు, పద్మ, చక్రధర్రావు, రాఘవేంద్రరెడ్డి, ప్రేమలత, పల్లయ్య, సూర్యగౌడ్, కోటేశ్, మోనేష్, పులిపాటి వెంకటేశ్, చిత్తారి కిరణ్, కమ్మరి రాము, నర్సింహులు, గంజిపేట రాజు తదితరులు పాల్గొన్నారు. -
మానసిక వేదనతో.. ప్రభుత్వ ఉద్యోగి బలవన్మరణం
గోపాల్పేట: మానసిక వేదనతో ప్రభుత్వ ఉద్యోగి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గోపాల్పేట మండలం బుద్ధారంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ జగన్మోహన్ వివరాల మేరకు.. బుద్ధారం గ్రామానికి చెందిన ఆవుల రామస్వామి (52) కొంతకాలంగా జిల్లా నీటిపారుదలశాఖలో పనిచేస్తున్నారు. గతంలో గ్రామ వీఆర్ఏగా పనిచేశారు. అయితే తనకు కంటిచూపు సమస్య ఉండటంతో పాటు ఇటీవల తన ఇంటి పక్కనున్న స్థలంపై వివాదం నెలకొనడంతో మానసిక వేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన అతడు.. ఆదివారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రించిన తర్వాత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ఇద్దకు కుమారులు ఉన్నారు. అతడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆశాల రాస్తారోకో ఉద్రిక్తం
ఎస్సీలకు స్వయం ఉపాధి రుణాలు జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంస్థ ద్వారా సబ్సిడీపై ఎలక్ట్రికల్ వాహనాలు (బైక్, ఆటో), పాడి పశువులు, సోలార్ యూనిట్ అందించేందుకు ఏప్రిల్ 8 లోగా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని సోమవారం కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025–26 క్రింద రూ. లక్ష వరకు ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాలు (90% సబ్సిడీ)తో, రూ.3లక్షల విలువ గల మూడు చక్రాల ఎలక్ట్రికల్ ఆటో (ప్యాసింజర్/ గూడ్స్) వాహనాలు (70% సబ్సిడీ)తో రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల ( 60% సబ్సిడీ)తో విలువ గల సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్, వ్యవసాయ అనుబంధ, పశు సంవర్ధక యూనిట్ల కోసం ఆన్లైన్ పోర్టల్ https://tgobmms.cgg.gov.inలో దరఖాస్తులు నమోదు చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 9849905996 నంబర్ను సంప్రదించాల్సిందిగా సూచించారు. జడ్చర్ల టౌన్: సమస్యల పరిష్కారం కోసం జడ్చర్లలో సోమవారం 44వ నంబర్ జాతీయరహదారిపై ఆశ కార్యకర్తలు నిర్వహించిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. కనీస వేతనం రూ.19 వేలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్ వేతనాలు చెల్లించాలనే పలు డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్త జాతీయ రహదారుల ధర్నాలో భాగంగా మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాలకు చెందిన పలువురు ఆశా కార్యకర్తలు జడ్చర్ల ఎంబీ మెడికల్ సెంటర్ వద్దకు తరలివచ్చారు. జడ్చర్ల యంబీ మెడికల్ సెంటర్ వద్ద మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాలకు చెందిన పలువురు ఆశ కార్యకర్తలు తరలివచ్చారు. జాతీయ రహదారిపై ధర్నాలకు అనుమతి లేదని, ఒకవేళ రోడ్డెక్కితే కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ గిరిజాబు, సీఐ నాగరాజుగౌడ్ ఆశావర్కర్స్ యూనియన్, సీఐటీయూ నాయకులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆశావర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి విజయలక్ష్మి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దీప్లానాయక్ జాతీయరహదారిపైకి వెళ్లి.. రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఒక్కసారిగా వందలాది మంది ఆశా కార్యకర్తలు ఒక్కసారిగా పరుగులు తీసి రోడ్డుపైకి వచ్చి.. రాస్తారోకోకు దిగారు. జాతీయరహదారిపై రాస్తారోకో ధర్నాలకు అనుమతి లేదని వారికి నచ్చచెప్పేందుకు ప్రయత్నం చేసిన పోలీసులకు వారికి తీవ్ర వాగ్వాదం చెలరేగింది. పోలీసులు ఎంతగా నచ్చచెప్పినా వినలేదు. దాదాపు గంటసేపు రాస్తారోకో చేయడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు సీఐటీయూ నాయకులు తెలుగు సత్తయ్య, దీప్లానాయక్లను అరెస్టు చేసేందుకు యత్నించారు. ఈక్రమంలోనే తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులకు, ఆశా కార్యకర్తలకు తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. దీంతో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఆశావర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి విజయలక్ష్మిని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో వందలాది మంది ఆశాలు వారిని అడ్డుకున్నారు. మహిళా పోలీసులు రాకుండా సీఐటీయూ నాయకులు అడ్డుగా ఉండడంతో పాటు తోపులాటలు, అరుపులు, కేకలతో ఆ ప్రాంతం మార్మోగింది. ఈ క్రమంలో విజయలక్ష్మి సొమ్మసిల్లిపడిపోయారు. కాసేపటికి తేరుకున్న తర్వాత ఆమెను అక్కడి నుంచి తరలించారు. ఎట్టకేలకు పోలీసులు ముఖ్యనాయకులను అరెస్టు చేయడంతో.. ఆశా కార్యకర్తలు రాస్తారోకో విరమించారు. ● సమస్యల పరిష్కారం కోసం ఇందిరాపార్కు వద్ద ధర్నా చేసుకుంటామని విన్నవించినా నిరాకరించటం వల్లే హైవే ఎక్కాలి వచ్చిందని విజయలక్ష్మి పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే వచ్చే వర్షాకాలం సీజనల్ వ్యాధుల సమయంలో నిరంతరంగా సేవలు నిలిపివేస్తామని హెచ్చరించారు. యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సాధన, సావిత్రి మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం చేయకుండా తాత్సారం చేస్తే తగిన గుణపాఠం తప్పదన్నారు. రాస్తారోకోలో అమృత, సరోజ, శివలీల, జయలక్ష్మి, పలువురు సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు. 44వ నంబర్ జాతీయరహదారిపైఆశా కార్యకర్తల రాస్తారోకో గంటకు పైగా కొనసాగిన నిరసన పోలీసులతో తీవ్ర వాగ్వాదం, పలువురు నాయకుల అరెస్టు కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు -
ప్రజావాణికి 167 ఫిర్యాదులు
జెడ్పీసెంటర్(మహబూబ్ నగర్): ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 167 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ దరఖాస్తుదారులతో మాట్లాడుతూ వారి సమస్యలను విని సంబంధిత అధికారులతో చర్చించి అర్జీలను పరిశీలించి సమస్యను పరిష్కారం చేయాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న అర్జీలను ఆయా శాఖల అధికారులు వెంటనే పరిష్కారం చేయాలని ఆదేశించారు. కలెక్టరేట్లో ప్రత్యేక వైద్య శిబిరం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్లో ఒక రోజు ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహించారు. కలెక్టర్ ఖుష్బూగుప్తా శిబిరాన్ని ప్రారంభించారు. పిల్లలు, ఎముకల వైద్య నిపుణులు, జనరల్ మెడిసిన్, ప్రసూతి–గైనకాలజీ, కంటి వైద్యం, మహిళల ఆరోగ్య నిపుణులు కలెక్టరేట్ సిబ్బంది, సాధారణ ప్రజలకు ప్రాథమిక ఆరోగ్యసేవలు అందించారు. శిబిరంలో భాగంగా కలెక్టరేట్ ఉద్యోగులకు, కలెక్టర్ కార్యాలయం ప్రజావాణి కార్యక్రమంకు వచ్చిన అర్జీ దారులు, ప్రజలకు రక్తపోటు, షుగర్ పరీక్షలు, కంటి పరీక్షలు నిర్వహించారు. అధికారులు, ఉద్యోగులు ప్రత్యేక వైద్య క్యాంపును సద్వినియోగం చేసుకుని ఆరోగ్య వైద్య పరీక్షలు నిర్వహించుకుని డాక్టర్ల సలహాలు, మందులు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జేఎల్బీ హరిప్రియ, మధుసూదన్ నాయక్, కలెక్టరేట్ ఏఓ సువర్ణరాజ్ పాల్గొన్నారు. -
మహిళా హక్కుల సాధనకు కృషి
అలంపూర్: సమాజంలో మహిళల హక్కుల సాధనకు అఖిల భారత ప్రజాతంత్ర మహిళ సంఘం(ఐద్వా) కృషి చేస్తుందని ఐద్వా మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అరుణజ్యోతి అన్నారు. పట్టణంలో ఆదివారం ఐద్వా జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు మాట్లడుతూ.. సమాజంలో మహిళలపై దాడులు, వివక్ష కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మనువాద రాజకీయాన్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లు కావస్తున్నా సమాజంలో మహిళను రెండో పోరురాలిగానే చూస్తున్నారన్నారు. సమాజంలో మహిళాకు సమానహక్కులు లేవన్నారు. ప్రేమ, కులం పేరుతో మహిళలపై దాడులు, హత్యలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం డ్రగ్స్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. పోర్న్ సైట్లని నిషేధించడంలో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. జిల్లా అధ్యక్షరాలు ఏమేలమ్మ, కార్యదర్శి నర్మద మాట్లాడుతూ.. జిల్లాలో మహిళల సమస్యలపై నిరంతరం పోరాడేది అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంమన్నారు. ఐద్వాకు పెద్ద సంఖ్యలో సభ్యులుగా చేరాలన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో విసృతంగా సభ్యత్వ నమోదు కొనసాగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి మహిళకు రూ.2500, నిరుద్యోగ భృతి, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక సమస్యలపై సర్వేలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు రాధమ్మ, సమీరా, సుజాత, మాధవి పాల్గొన్నారు. -
ప్రేమ పేరుతో మోసం.. యువకుడికి రిమాండ్
పాన్గల్: ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన యువకుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ కుర్మయ్య ఆదివారం తెలిపారు. మండలంలో ఓ గ్రామానికి చెందిన యువతిని రేమద్దుల గ్రామానికి చెందిన మీదిండ్ల నవీన్ అనే యువకుడు పెళ్లి చేసుకుంటానని లోబర్చుకున్నాడు. తర్వాత పెళ్లి చేసుకోవాలని యువతి కోరగా ముఖం చాటేశాడు. దీంతో సదరు యువకుడిపై యువతి ఈనెల 24న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అనంతరం శనివారం రాత్రి యువకుడిని అరెస్టు చేసి జిల్లా కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి ఆదేశానుసారం యువకుడిని మహబూబ్నగర్ జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు. కారు ఢీ.. వ్యక్తి దుర్మరణం మిడ్జిల్: రోడ్డు దాటుతున్న వ్యక్తిని కారు ఢీకొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండల పరిధిలొని బోయిన్పల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, ఎస్ఐ శివనాగేశ్వర్నాయుడు కథనం మేరకు.. నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం బాల్యలోక్య తండాకు చెందిన దేవ్యా (40) పనిమీద బోయిన్పల్లి గ్రామానికి వచ్చారు. పని ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా కల్వకుర్తి నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. ప్రమాదంలో దేవ్యా తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మరణించాడు. మృతుడి భార్య సిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు గ్రామస్థులు తెలిపారు. నీటి బకెట్లో పడి చిన్నారి మృతి ఽభూత్పూర్: రెండేళ్ల చిన్నా రి నీటి బకెట్లో పడి మర ణించిన ఘటన పట్టణంలో ఆదివారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణానికి చెందిన మహమూద్, అస్మల కుమార్తె జూవేరియా ఆడుకుంటూ ఇంటి ముందు ఉన్న నీటి సంపులో పడిపోయింది. తల్లిదండ్రులు గమనించి వెంటనే బయటికి తీసి ద్విచక్రవాహనంపై జిల్లా ఆస్పతికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఈ విషయమై ఎస్ఐ చంద్రశేఖర్ను సంప్రదించగా చిన్నారి మృతిపై తమకు ఏలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. దైవక్షేత్రంలో వరుసగా కోడెదూడల మృతి దేవరకద్ర రూరల్: ఉమ్మడి జిల్లాలోనే ప్రసిద్ధి గాంచిన చిన్నరాజమూర్ గ్రామంలోని చిన్నరాజమూర్ ఆంజనేయస్వామి దేవాలయంలో వరుసగా కోడెదూడలు మృతి చెందడం కలకలం రేపుతుంది. భక్తులు మొక్కులు తీర్చుకునే క్రమంలో ఆలయానికి సమర్పించిన ఆవులు, కోడెదూడల బాగోగులు పట్టించకోకపోవడంతో ఇప్పటి వరకు పదికి పైగా కోడెదూడలు మరణించాయి. ఆదివారం కూడా ఓ కోడెదూడ మరణించగా అధికారులు కళేబరాన్ని బయటికి పొక్కకుండా తరలించారు. రూ.లక్షల్లో ఆదాయం వచ్చే ఆలయంలో పశువులకు కనీసం పశుగ్రాసం, తాగునీరు కూడ అందకపోవడంతోనే మరణించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. -
హిందుత్వంపై అందరూ ఏకం కావాలి
ఉండవెల్లి: దేశంలో హిందూ సమాజం అంతరించకుండా అదుపు చేయాలంటే చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు హిందుత్వంపై పట్టు, ఐక్యత ఉండాలని పురాణపీఠం, అనంత సాహితి ఆశ్రమానికి చెందిన అనంతానంద భారతి స్వామిజీ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని మణికంఠ అయ్యప్ప స్వామి ఆలయంలో హిందూ సమ్మేళనం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అనంతానంద భారతి స్వామిజీ మాట్లాడుతూ.. ప్రజల్లో హిందు సంస్కృతి, సమాజం అంతంకాకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే చిన్నారులకు హిందుత్వంపై అవగాహన కల్పించాలని, రాష్ట్రంలో హిందూ సమాజంపై పట్టు సాధించేందుకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు. నుదుటిన బొట్టు, సాంప్రదాయ దుస్తులను ధరించి కులమతాలకు అతీతంగా హిందూమతంపై ప్రచారం కొనసాగించాలి. దేశంలో హిందుత్వంపై ఐక్యత రావాలంటే మొదట పల్లె నుంచే ప్రారంభించాలని ప్రజలకు ఉపసందేశం అందించారు. ఆర్ఎస్ఎస్ ప్రచారక్ ప్రధాన వక్త మాట్లాడుతూ ప్రతి గ్రామంలో హిందువులందరూ ఒక్క మాటపై ఉంటే ఎవరొచ్చినా ఏమి చేయలేరన్నారు. దేశంపై గౌరవం ఉన్న వాడికి హిందుత్వంపై మక్కువ ఉంటుంది. రాష్ట్రీయ స్వంయం సేవక్ సంఘ్ 1952లో ప్రారంభిచి వందేళ్ల ప్రయాణంలో అనేక ఎత్తుపల్లాలను చూసిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో హిందు సమ్మేళనం కమిటీ అధ్యక్షుడు చల్లా దామోదర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుధాకర్రెడ్డి, మండల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
అట్టహాసంగా బండలాగుడు పోటీలు
● ముగిసిన శ్రీరామ నవమి ఉత్సవాలు ఉప్పునుంతల: మండల కేంద్రమైన ఉప్పునుంతలలో స్థానిక కేదారేశ్వర చెన్నకేశవ స్వామి ఆలయంలో శ్రీరామ నవమిని పురస్కరించుకొని నాలుగు రోజులపాటు నిర్వహించిన బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం అంతరాష్ట్ర ఎద్దుల బండలాగుడు పోటీలు అట్టహాసంగా కొనసాగాయి. సీనియర్ విభాగంలో ఆయా ప్రాంతాల నుంచి ఏడు జతల ఎద్దులు పాల్గొన్నాయి. వాటిలో ప్రాధాన్యత క్రమంలో ఐదు జతలను విజేతలుగా ఎంపికచేసి నగదు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి రూ. 80 వేలు నగదు (దాత కట్టా సరిత అనంతరెడ్డి)ను నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం కోప్పోల్కు చెందిన హనుమాన్ ఎద్దులు గెలుచుకున్నాయి. రెండో బహుమతి రూ.60 వేలు (దాత మదనాగుల మహేందర్), మూడో బహుమతి రూ.40 వేలు (దాత బొల్లె బాలయ్య), నాలుగో బహుమతి రూ.30వేలు ( కట్టా జనార్ధన్రెడ్డి), ఐదో బహుమతి రూ.20 వేలు (తాండ్ర మల్లేష్) అందజేశారు. అదేవిధంగా ఉత్సవాల సందర్భంగా నిర్వ హించిన కోలాటాం, ట్రాక్టర్ రివర్స్, భజన, చిరుతల భజన పోటీల్లో గెలుపొందిన విజేతలకు దాత ల సహకారంతో బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచు చింతగాళ్ల శ్రీనివాసులు, ఎస్ఐ వెంకట్రెడ్డి, నిర్వాహకులు కట్టా అనంతరెడ్డి, తిప్పర్తి నర్సింహ్మారెడ్డి, కొత్త పెద్ద జంగిరెడ్డి, ప్రశాంత్రెడ్డి, నారాయణ్రెడ్డి, వెంకట్రెడ్డి, జగన్మోహన్రెడ్డి, బాలయ్య, రామచంద్రయ్య, లక్ష్మ య్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
కనులపండువగా పూల రథోత్సవం
సిర్సనగండ్లలో మార్మోగిన శ్రీరామ నామస్మరణ చారకొండ: సీర్సనగండ్ల సీతారామచంద్రస్వామి బ్రహోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం తెల్లవారు జామున పూల రథోత్సవం (చిన్నతేరు) కనులపండువగా సాగింది .ఆలయ చైర్మన్ ఢేరం రామశర్మ, ఈఓ అంజనేయులు మేనేజర్ నిరంజన్ అర్చకులు, ప్రజా ప్రతినిథులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలోని గుట్టపై దత్తాత్రేయగుడి, ముక్కిడి పోచమ్మ, మైసమ్మ దేవాలయాలను దర్శించుకొని నైవేద్యం సమర్పించారు. మేళతాళాలు, భజనలు, భక్తుల శ్రీరామనామ స్మరణతో రథం ముందుగు సాగింది. రఽథోత్సవానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం ఆలయంలో స్వామివారిని దర్శనం అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు లక్ష్మణ్శర్మ, మురళీధర్శర్మ, వేణుశర్మ, ఆనంద్శర్మ, అనంతశర్మ, గోపీశర్మ, భాస్కర్శర్మ పాల్గొన్నారు. సోమవారం అర్ధరాత్రి తర్వత పెద్ద రథోత్సవం ప్రారంభమవుతుంది భక్తులు అధిక సంఖ్యలో హజరై స్వామివారిని దర్శించుకొని, ఉత్సవాన్ని విజయవంతం చేయాలని ఆలయ చైర్మన్, ఈఓ కోరారు. -
డ్రగ్స్ మహమ్మారి నుంచి యువతను రక్షించాలి
స్టేషన్ మహబూబ్నగర్: శ్రీకరి ఫౌండేషన్ పాలమూరు ఆధ్వర్యంలో ఆదివారం మర్లులోని శ్రీశాంతినగర్ కాలనీలో ఉగాది పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హిందూ ధర్మ రక్ష ఫౌండర్ చికోటి ప్రవీణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సమాజాన్ని వేధిస్తున్న డ్రగ్స్, మత్తు పదార్థాల నుంచి యువతను రక్షించాలని వాటికి బానిసలు కాకుండా చూడాలని పిలుపునిచ్చారు. మత్తు వల్ల కలిగే అనర్థాలు వారికి వివరించాలని స్కూల్ దశ నుంచే వాటిపై అవగాహన కల్పించాలన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడుకునేందుకు యువత నడుం బిగించాలన్నారు. శ్రీకరి ఫౌండేషన్ సేవలను ఆయన కొనియాడారు. అనంతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, కవులు, కళాకారులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, కాటికాపరులు, మున్సిపల్ సిబ్బంది, రంగస్థల నటులకు, ప్రవచనకర్తలకు, పోలీస్ ఉద్యోగులకు ఇలా వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న దాదాపు 70 మందికి ఉగాది పురస్కారాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మెట్టుకాని శ్రీనివాస్, ఫౌండేషన్ ప్రతినిధి మెట్టుకాడి శ్యాంసుందర్, కృష్ణవర్మ, భానుప్రకాశ్, మెట్టుకాడి ప్రణీత, సిద్దిరామప్ప, మెట్టుకాడి ప్రభాకర్, లక్ష్మణ్సింగ్, కార్పొరేటర్ లక్ష్మినరేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగం పేరుతో మోసం
గద్వాల క్రైం: ఉద్యోగం పేరుతో యువకులను మోసం చేసిన ఘటనపై ఆదివారం పట్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదైనట్లు పట్టణ రెండో ఎస్ఐ సతీష్కుమార్రెడ్డి తెలిపారు. పట్టణంలోని ఐడీఎస్ఎంటీ కాలనీకి చెందిన గుణవర్ధన్రెడ్డి ఇటీవల ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో తెలిసిన వ్యక్తులు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ. 2 లక్షలు వసూలు చేశారు. తెలిసిన వ్యక్తులే కదా అని నమ్మి తనతో పాటు మరి కొంత మంది యువతకు ఉద్యోగాలు ఇప్పించాలని డబ్బులు అందజేసినట్లు బాధితులు తెలిపారు. అయితే సదరు వ్యక్తులు కంపెనీలో ఉద్యోగం వచ్చినట్లు నకిలీ ప్రవేశపత్రం అందజేశారు. వాటిని తీసుకుని కంపెనీకి వెళ్లాగా అక్కడి సిబ్బంది నకిలీ ఉద్యోగ నియామక పత్రాలుగా నిర్వహకులు చెప్పడంతో మోసపోయినట్లు గుర్తించి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ‘పల్లెనిద్ర’లో ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ధరూరు: భీం దీక్షలో భాగంగా స్వేరోస్ ఫౌండర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మండల పరిధిలోని మార్లబీడు గ్రామం చేరుకున్నారు. గ్రామంలోని సమస్యలను తెలుసుకోవడంతో పాటు ప్రజలతో మమేకమయ్యేందుకు చేపట్టిన పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు చదువకోవాలని, జ్ఞానంతోనే అన్నింటిని జయించవచ్చన్నారు. మహనీయుల చరిత్రను వివరించారు. స్వేరోతో ఎంతో మంది చిన్నారుల జీవితాలను మార్చాలన్నదే తమ లక్ష్యమన్నారు. అంతకు ముందు ధరూరులోని స్వేరో నాయకులు శ్రీనివాస్ మహరాజ్ ఇంటికి చేరుకుని తేనీటి విందులో పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కర్రెన్న, జర్నలిస్టు ఫోరం జిల్లా అధ్యక్షులు వెంకటన్న, దేవన్న, గోవిందు, లాజర్, సత్యం, శ్రీనివాసులు, అశోక్, స్వేరో జిల్లా ఉపాధ్యక్షులు రమణయ్య తదితరులు పాల్గొన్నారు. దేశభక్తికి మారు పేరు శివాజీ జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ‘ఛత్రపతి శివాజీ మహారాజ్ ధైర్యం, దేశభక్తికి మారుపేరని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం స్థానిక బోయపల్లిలో వాయుపుత్ర యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివాజీ స్వాభిమానానికి ఆరాధ్యుడన్నారు. యువత మత్తు పదార్థాలు, గంజాయి, డ్రగ్స్ వంటి వాటికి బానిస కాకుండా, శారీరకంగా దృఢంగా, మానసికంగా ఆరోగ్యవంతంగా ఉండాలని ఆకాంక్షించారు. -
కమిషన్ పేరుతో ప్రభుత్వం కుట్ర
అలంపూర్: కమిషన్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని అమలు చేయడానికి కుట్ర చేస్తోందని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, స్కూల్ ఫెడరేషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి చావా రవి ఆరోపించారు. అలంపూర్ పట్టణంలో రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి విద్యా సదస్సు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా సదస్సుకు హాజరైన ముఖ్య నాయకులు, ఉపాధ్యాయులు అలంపూర్ పురవీధుల్లో ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ ర్యాలీ చేపట్టారు. యుద్ధం నివారించి మానవ హక్కులను కాపాడాలని నినదించారు. ఈ సందర్భంగా చావా రవి మాట్లాడుతూ.. దశాబ్ద కాలంగా రాష్ట్రంలో విద్యా రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతుందన్నారు. ఆహ్లాదకర వాతావరణం కోసం మౌలిక వసతులు కల్పించాల్సిన ప్రభుత్వం విద్యకు సరైన బడ్జెట్ కేటాయించడం లేదన్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా విద్యా కమిషన్ పేరుతో కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. పరోక్షంగా ప్రైవేటు విద్యను బలోపేతం చేస్తోందని ఆరోపించారు. పెండింగ్లో ఉన్న బిల్లులు, డీఏలు ఇవ్వకుండా పీఆర్సీ కమిషన్ రిపోర్ట్ను కావాలని తొక్కిపెట్టడం తగదన్నారు. నూతన సంస్కరణల్లో భాగంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పాఠశాలల ప్రభుత్వ నిర్ణయం ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, కేజీవీబీ వంటి పాఠశాలల మూతపడే అవకాశం ఉంటుందన్నారు. మండలాన్ని రెండు లేదా మూడు క్లస్టర్గా విభజిస్తూ పబ్లిక్ పాఠశాలల ఏర్పాటుతో గ్రామాల నుంచి విద్యార్థులను తరలించడానికి రవాణ ఇబ్బందులు తలెత్తె అవకాశం ఉంటుందన్నారు. పూర్వ ప్రాథమిక తరగతుల నిర్ణయాన్ని స్వాగతిస్తూనే పూర్వ ప్రాథమిక విద్య కోసం నూతన ఉపాధ్యాయుల నియామకాలను చేపట్టాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ విధానాన్ని తొలగించి రెగ్యులరైజేషన్ చేస్తామంటూనే ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆక్షేపనీయమన్నారు. సర్వశిక్ష అభియాన్లో భాగంగా పనిచేస్తున్న సీఆర్పీలను, ఎంఐఎస్ కోఆర్డినేట్లకు రెగ్యులర్ వేతనాన్ని ఇవ్వాలన్నారు. కేజీబీవీలలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందిని రెగ్యులర్ చేయాలని వారికి 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సు ప్రస్తుత యుద్ధ వాతవరణ పరిస్థితుల్లో భారత్ ప్రపంచ శాంతి కోసం కృషి చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకట్ అన్నారు. విద్యా సదస్సులో ఆయన మాట్లాడుతూ.. అమెరికా, ఇజ్రాయిల్ సామ్రాజ్యవాద ధోరణితో ప్రపంచ దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయన్నారు. అమెరికా ఆధిపత్య ధోరణి ఇరాన్ దేశంలో తీవ్రంగా మానవ హక్కులు హరించబడినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రమేష్, ఫ్యామిటీ వెల్ఫేర్ ఫండ్ జిల్లా కన్వీనర్ బీసన్న, యూటీఎఫ్ జిల్లా నాయకులు గోపాల్, రవిప్రకాష్గౌడ్, కుమార్నాయుడు, వెంకటరమణ, రాజశేఖర్, తిమ్మప్ప, తిలక్, చంద్రకాంత్, లక్ష్మన్న, రాముడు, చిరంజీవినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
నగర రోడ్ల దుస్థితి చూడతరమా!
అధ్వాన స్థితిలో ప్రధాన, అంతర్గత రహదారులు ● ఎక్కడబడితే అక్కడ అడుగు లోతు గుంతలు పడిన వైనం ● పట్టించుకోని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ● వాహనదారులు, పాదచారులకు తప్పని ఇబ్బందులు –8లో uఎక్కడెక్కడ అంటే..? మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగరంలో ప్రధాన, అంతర్గత రోడ్లు చాలా చోట్ల అధ్వాన స్థితికి చేరుకున్నాయి. ఎక్కడబడితే అక్కడ అడుగు లోతు గుంతలు పడినా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు సుమారు ఎనిమిదేళ్ల క్రితం ఆయా గల్లీలలో మిషన్ భగీరథ పథకం పైపులైన్ల కోసం రోడ్లను అడ్డంగా తవ్వి సరిగా పూడ్చకుండా అలాగే వదిలేశారు. ఇన్నేళ్లయినా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గాని ఇంటింటికీ నల్లా కనెక్షన్ తీసుకున్న యజమానులు గాని మరమ్మతు చేసిన దాఖలాలు లేవు. మనకెందుకులే అని ఎవరికి వారు వదిలేయడంతో పాదచారులు నడవడానికి, అలాగే వాహనదారుల రాకపోకలకు తరచూ అంతరాయం కలుగుతోంది. బైక్లు మొదలుకుని భారీ వాహనాలు ఆయా గుంతల వద్దకు చేరుకోగానే ఆగి నెమ్మదిగా వెళ్లాల్సి వస్తోంది. క్లాక్టవర్ చుట్టూ నలుదిక్కులా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి కొన్ని నెలలు గడుస్తున్నాయి. క్లాక్ టవర్ నుంచి అశోక్ టాకీస్ చౌరస్తా వరకు పలుచోట్ల బీటీ, సీసీ పగిలిపోయింది. ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట, సమీపంలోని పెద్ద బ్రిడ్జి వద్ద కంకర లేచిపోయింది. ఎన్హెచ్–167పై షాషాబ్గుట్టకు వెళ్లే మలుపు వద్ద, అశోక్ టాకీస్ చౌరస్తాలోని బాలగంగాధర్ తిలక్ విగ్రహం ఎదుట, మోడ్రన్ రైతుబజార్కు ఎదురుగా సుమారు ఏడాది క్రితం మిషన్ భగీరథ పథకం మెయిన్ పైపులైన్కు భారీ లీకేజీలు ఏర్పడటంతో మున్సిపల్ కార్పొరేషన్ ఇంజినీరింగ్ అధికారులు బాగు చేశారు. అయితే ఈ మూడు చోట్ల బీటీ రోడ్డు లెవలింగ్నుమరిచిపోయారు. ఎక్కడికక్కడ కంకర తేలి నడవడానికి సైతం వీలు లేని పరిస్థితి నెలకొంది. క్లాక్టవర్ నుంచి రాంమందిర్చౌరస్తా వరకు పదుల సంఖ్యలో బీటీ దెబ్బతింది. ఈ మార్గంలో ఇరువైపులా వివిధ వ్యాపార దుకాణాలు ఎప్పుడూ జనంతో కిక్కిరిసి ఉంటాయి. గతుకుల రోడ్డు కారణంగా వాహనాలు వెళ్లడానికి, పాదచారులు నడవడానికి నరకయాతన పడుతున్నారు. క్లాక్టవర్ నుంచి మార్కెట్ రోడ్డు, పాత బస్టాండు మొదలుకుని కోయిల్కొండ ఎక్స్రోడ్డు వరకు చాలా చోట్ల గుంతలు పడ్డాయి. పాత బస్టాండు నుంచి తెలంగాణచౌరస్తా వరకు మూడు చోట్ల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. తెలంగాణ చౌరస్తా నుంచి బోయపల్లిగేట్ వరకు, సుభాష్నగర్ నుంచి ఎర్రసత్యం చౌరస్తా వరకు, రెడ్క్రాస్ బిల్డింగ్కు ఎదురుగా, న్యూటౌన్ చౌరస్తా నుంచి స్టేషన్ రోడ్డు వరకు, జీజీహెచ్కు ఎదురుగా ఉన్న రెండు గల్లీలలో పలుచోట్ల సీసీ, బీటీ దెబ్బతిని గుంతలు పడ్డాయి. మెట్టుగడ్డ నుంచి టీచర్స్కాలనీ, మర్లు మీదుగా ఎస్ఆర్నగర్ వరకు అడుగడుగునా గుంతలు పడ్డాయి. ఇక 60 డివిజన్ల పరిధిలోని వీధి రోడ్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తప్పక బాగు చేయిస్తాం నగరంలోని ప్రధాన, అంతర్గత రహదారులపై వివిధ చోట్ల బీటీ, సీసీ దెబ్బతిని గుంతలు ఏర్పడిన విషయం వాస్తవమే. త్వరలోనే వీటన్నింటిని ఒకసారి పరిశీలించి ఎక్కడ అవసరమైతే అక్కడ తప్పక బాగు చేయిస్తాం. – పి.రామాంజులరెడ్డి, కమిషనర్, మహబూబ్నగర్ కార్పొరేషన్ -
ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
స్టేషన్ మహబూబ్నగర్: ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు థామస్రెడ్డి, ఈదురు వెంకన్న కోరారు. మహబూబ్నగర్ ఆర్టీసీ డిపో ఎదుట ఆదివారం నిర్వహించిన గేట్మీటింగ్లో వారు పాల్గొని మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సమ్మె అనివార్యమన్నారు. ఎన్నికలకు ముందు కార్మికుల జీతభత్యాలు సవరిస్తామని, ఆర్టీసీలో యూనియన్లను పునరుద్ధరిస్తామని, ఖాళీలు భర్తీ చేస్తామని అనేక హామీలు ఇచ్చి.. తీరా అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే కార్మికులకు రావాల్సిన రెండు పీఆర్సీలు, ట్రేడ్ యూనియన్లపై ఉన్న ఆంక్షలు ఎత్తివేసి, యూనియన్లను పునరుద్ధరించాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి అపాయింటెడ్డే ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జి.లక్ష్మణ్గౌడ్, విజయబాబు, యాదయ్య, యాదగిరి, బసప్ప, అరవింద్, నర్సింలు, సత్యశీలారెడ్డి, డి.శ్రీనివాసులు, నారాయణ, చంద్రమోహన్, జీకేరావు, వెంకటయ్య పాల్గొన్నారు. -
3,416 పోలీసు కేసులు పరిష్కారం
మహబూబ్నగర్ క్రైం: జిల్లా కోర్టులలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో పోలీస్ శాఖ నుంచి మొత్తం 3,416 కేసులు పరిష్కారం అయినట్లు ఎస్పీ డి.జానకి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్ బాధితులకు రూ.42,97,445 నగదు తిరిగి అందజేసినట్లు పేర్కొన్నారు. ఐపీసీ కేసులు 524, డ్రంకన్డ్రైవ్ 794, ఈ–పెట్టీ కేసులు 1,979, సైబర్ క్రైం కేసులు 119 పరిష్కరించినట్లు వివరించారు. ఈ కేసుల రాజీతో బాధితులకు తక్షణ న్యాయం అందించడంతో పాటు కోర్టులపై ఉన్న భారం కూడా తగ్గినట్లు తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా వివాదాలను వేగవంతంగా పరిష్కరించుకోవడం వల్ల ఆర్థికంగా ఆదా కావడంతో పాటు సమయం ఆదా అవుతుందని పేర్కొన్నారు. ఉత్సాహంగా ‘హ్యాపీ డే’ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ‘ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఎన్హెచ్–167పై జిల్లా స్టేడియం కమాన్ వద్ద మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి మూడు గంటల పాటు ‘హ్యాపీ డే’ నిర్వహించారు. చిన్నారుల నృత్య, కరాటే ప్రదర్శనలు, మ్యాజిక్షో, యోగాసనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే ఎస్హెచ్జీలు ఏర్పాటు చేసిన స్టాళ్లలో వారు తయారుచేసిన పౌష్టికాహార పదార్థాలు, ఇతర ఉత్పత్తులను ప్రదర్శించగా ప్రజలు ఆసక్తిగా వీక్షించి కొనుగోలు చేశారు. -
బీసీలకు పెద్దపీట వేసింది కాంగ్రెస్
● మాజీ మంత్రి రాజకీయ డ్రామాలు ఆపాలి ● మేయర్ మమత మెట్టుగడ్డ: కాంగ్రెస్ పార్టీయే బీసీలకు పెద్దపీట వేసిందన్న విషయాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ గుర్తించాలని మేయర్ మమత శ్రీనివాస్ అన్నారు. మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ తొలి బడ్జెట్ సమావేశంలో చోటు చేసుకున్న ప్రొటోకాల్ వివాదంపై ఆదివారం ప్రెస్క్లబ్లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్లో తన భర్తను నమ్మించి నడిరోడ్డుపై వదిలేసిన ఘనత మాజీ మంత్రిదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బీసీ మహిళను మేయర్గా ఉన్నత స్థానంలో కూర్చొబెట్టిందన్నారు. బీసీ మహిళకు దక్కిన పదవిని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ కార్పొరేటర్లను బయటకు రమ్మని.. కౌన్సిల్ను బహిష్కరించాలని చెప్పింది మీరు కాదా అని మాజీ మంత్రిని ఆమె ప్రశ్నించారు. బీసీ మహిళ మేయర్ అయితే సంతోషి ంచాల్సింది పోయి అవమానించేలా వ్యవహరించడం బాధాకరమన్నారు. కౌన్సిల్ సమావేశంలో ప్రొటోకాల్ ధిక్కరణ అనే అంశమే లేదని.. ఇది కేవల ం రాజకీయంగా సృష్టించిన వివాదం మాత్రమేనని అన్నారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సమయంలో రాజకీయ డ్రామాలు చేయడం సరికాదన్నారు. రాజకీయాలకు అతీతంగా మహబూబ్నగర్ కార్పొరేషన్ను అభివృద్ధి చేస్తామన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు రమేశ్గౌడ్, నర్సింహులు యాదవ్, రామస్వామి, పార్టీ నాయకుడు శ్రీనివాస్ ఉన్నారు. -
సంక్షేమ పథకాల పనుల్లో వేగం పెంచాలి
మహమ్మదాబాద్: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పనుల్లో వేగం పెంచేలా చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ మధుసూదన్నాయక్ అధికారులకు సూచించారు. ఆదివారం మహమ్మదాబాద్, చిన్నాయపల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు. గ్రామ పంచాయతీల్లోని నర్సరీలు, సెగ్రిగేషన్ షెడ్లు, లబ్ధిదారులు నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఇంకా ప్రారంభంకాని ఇళ్ల పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సంక్షేమ పథకాల అమలులో అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. ప్రతి ఒక్క లబ్ధిదారుడికి సంక్షేమ ఫలాలు అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నరేందర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
అనుమానాస్పద మృతి.. పోలీసులకు ఫిర్యాదు
భూత్పూర్: మండలంలోని కొత్తూర్ గ్రామానికి చెందిన ఆంజనేయులు (57) అనుమానాస్పద మృతి చెందాడని మృతుడి సోదరుడు లక్ష్మయ్య శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మండలంలోని ఎల్కిచర్లకు చెందిన అరుణ అలియాస్ మొగులమ్మతో ఆంజనేయులుకు 30 ఏళ్ల క్రింద వివాహం జరిగింది. అయితే ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో పెళ్లి అయిన ఐదేళ్ల నుంచే ఆంజనేయులు భార్యతో కలిసి అత్తగారింట్లోనే ఉండేవారు. ఈ క్రమంలో ఈ నెల 23న సాయంత్రం ఆంజనేయులు పాము కాటు వేయడంతో చనిపోయాడని అతడి సోదరుడైన లక్ష్మయ్యకు అరుణ ఫోన్లో సమాచారం ఇచ్చా రు. మరుసటి రోజే అంత్యక్రియలు నిర్వహించగా ఆంజనేయులు శరీరంపై గాయాలు ఉన్న ట్లు గమనించారు. దీంతో మృతుడి తమ్ముడు తన అన్నను చిత్రహింసలు చేసి చంపారని అనుమానం వ్యక్తం చేసి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోస్టుమార్టం నిర్వహించి కారకులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో తెలిపాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. చికిత్స పొందుతూ వృద్ధురాలి మృతి ఖిల్లాఘనపురుం: మిద్దె పైకి ఎక్కుతూ ప్రమావశాత్తు జారిపడిన ఓ వృద్ధురాలు చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం ఖిల్లాఘనపురానికి చెందిన గంగారపు వెంకటమ్మ (63) శనివారం తెల్లవారు జామున వర్షం పడుతుండగా మిద్దైపెన ఆరబోసిన ఉల్లి విత్తనాలు నానిపోతాయని తీసేందుకు మిద్దె పైకి వెళ్లే క్రమంలో జారి కింద పడిపోయింది. కుటుంబసభ్యులు గమనించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలు కావడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. ఈ విషయమై మృతురాలి భర్త రాంరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేష్ తెలిపారు. -
జడ్చర్ల ‘పుర’ బడ్జెట్ రూ.65.82కోట్లు
● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.49కోట్లు ● పన్నుల ద్వారా పురపాలిక ఆదాయం రూ.16.82కోట్లు ● వివరాలు వెల్లడించిన కమిషనర్ లక్ష్మారెడ్డి జడ్చర్ల టౌన్: 2026–27 ఆర్థిక సంవత్సరానికిగానూ జడ్చర్ల మున్సిపాలిటీకి సంబంధించి రూ.65కోట్ల82లక్షల వార్షిక బడ్జెట్ను పాలకవర్గం ఆమోదించింది. ఇందులో రూ.49కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే గ్రాంట్లు కాగా.. మున్సిపాలిటీ పరిధిలో వివిధ పన్నుల ద్వారా రూ.16కోట్ల82లక్షలుగా లెక్కించారు. శనివారం జడ్చర్ల మున్సిపాలిటీ సమావేశ మందిరంలో చైర్పర్సన్ కోనేటి పుష్పలత అధ్యక్షతన నిర్వహించిన బడ్జెట్ సమావేశం వివరాలు, 2025–26 ఏడాదికి సంబంధించిన సవరించిన బడ్జెట్ వివరాలను కమిషనర్ లక్ష్మారెడ్డి తెలియజేశారు. ● పన్ను రాబడిగా రూ.7కోట్ల64లక్షలుగా అంచనా వేసినట్లు తెలిపారు. స్టాంప్ డ్యూటీగా రూ.కోటి90లక్షలు, భవన నిర్మాణ అనుమతులతో రూ.5కోట్లు, పారిశుద్ధ్యం రూ.కోటి25లక్షలు, అద్దె ఆదాయం రూ.22లక్షలు, ఇంజనీరింగ్ విభాగం ద్వారా రూ.23లక్షలు, వివిధ డిపాజిట్ల ద్వారా రూ.50లక్షలుగా అంచనాలకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఇక వ్యయాల అంచనాకు వస్తే వేతనాలు, జీనతాలు రూ.5కోట్లు, పారిశుద్ధ్య ఖర్చులు రూ.కోటి70లక్షలు, విద్యుత్ చార్జీలు రూ.కోటి22లక్షలు, హరితబడ్జెట్ రూ.2కోట్ల2.40లక్షలు, ఇతర నిర్వహణ ఖర్చులు రూ.31కోట్ల7లక్షలు, అభివృద్ధి చెందని ప్రాంతాలకు వన్థర్డ్ బడ్జెట్ కేటాయింపులు రూ.63లక్షలు, ప్రజాసౌకర్యార్థం రూ.32లక్షలు, వార్డుల వారీగా వ్యయం రూ.1.76.40కోట్లుగా ఆమోదం తెలిపినట్లు స్పష్టం చేశారు. పై మొత్తాలు మున్సిపల్ గ్రాంట్ ద్వారా రాబడుట రూ.16కోట్ల24లక్షలు, మూలధనగ్రాంటు రూ.49కోట్లు, మూలధన గ్రాంట్ వ్యయం రూ.49కోట్లుగా తెలిపారు. బడ్జెట్కు కౌన్సిల్ ఆమోదం తెలియజేసిందని వివరించారు. బడ్జెట్ సమావేశంలో వైస్చైర్పర్సన్ పాలాది సారిక, వార్డు కౌన్సిలర్లు ఉమాశంకర్గౌడ్, చైతన్యహరికృష్ణగౌడ్, లత, జ్యోతికృష్ణారెడ్డి, నందకిశోర్గౌడ్, ప్రశాంత్రెడ్డి, బుక్క మహేష్, కుమ్మరిరాజు, శశికిరణ్, శ్రావణి, నవనీత, విజయ్, చైతన్యచౌహాన్, హరిత పాల్గొన్నారు. ఎలక్ట్రీషియన్ తొలగింపుపై అభ్యంతరం మున్సిపాలిటీ పరిధిలో సీనియర్ ఎలక్ట్రీషియన్ వెంకటేశ్ను విధుల నుంచి తొలగించేందుకు కౌన్సిల్ ఆమోదం కోసం సమావేశంలో కౌన్సిలర్ కుమ్మరిరాజు ప్రతిపాదించగా.. తోటి కౌన్సిలర్లు ప్రశాాంత్రెడ్డి, నందకిశోర్ బలపర్చారు. అయితే కౌన్సిలర్లు ఉమాశంకర్గౌడ్, చైతన్యగౌడ్, అలూరి శశికిరణ్, శ్రావణి వ్యతిరేకించారు. సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగిని తొలగించటం సబబుకాదని, తప్పుచేసి ఉంటే మాట్లాడి ఒప్పిద్దామని సూచించారు. ఏదైనా వివాదం ఉంటే సద్దుమణిగేలా ప్రయత్నించాలని చైర్పర్సన్, కమిషనర్కు సూచించారు. దీంతో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కౌన్సిల్ సమావేశం ముగించారు. -
అట్టహాసంగా ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ
ధన్వాడ: మండల కేంద్రంలో శనివారం ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహావిష్కరణ శనివారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, బీజ్వార్ పీఠాధిపతి ఆదిత్య పరాశ్రీ స్వామిజీ ముఖ్య అతిథులుగా హాజరై ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఎంపీ మాట్లాడుతూ.. ధన్వాడలో శివాజీ విగ్రహ ఏర్పాటు చేయకుండా కొందరు 15 ఏళ్లుగా అడ్డుకుంటున్నారన్నారు. తనతో పాటు స్థానిక ఎమ్మెల్యే పర్ణికారెడ్డి సంపూర్ణ సహకారం అందించడంతోనే విగ్రహ ఏర్పాటు పూర్తయిందన్నారు. తన స్వగ్రామంలో శివాజీ మహరాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఆయన ధర్మస్థాపన కోసం ఎంతో కృషి చేశారని.. ప్రజలను పీడిస్తున్న వారిని వేటాడి వెంటాడి మట్టుపెట్టారని కొనియాడారు. నేటితరం పిల్లలకు సనాతన ధర్మాన్ని వివరించాలని సూచించారు. 2047లోగా దేశాన్ని వికసిత్ భరత్గా మార్చేందుకు ప్రధాని నరేంద్రమోదీ కృషి చేస్తున్నారన్నారు. కామారెడ్డిలో మాజీ సీఎం, ప్రస్తుత సీఎంను ఓడించిన ఘనత ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికే దక్కిందని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఆదిత్య పరాశ్రీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ శివాజీ మహరాజ్ అడుగుజాడలో నడిచి ధర్మాన్ని పాటించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ జ్యోతి రాంచంద్రయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, మాజీ అధ్యక్షుడు శ్రీనివాసులు, హిందూవాహిని జిల్లా అధ్యక్షుడు సుదర్శన్గౌడ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఉమేష్, మాజీ ఉపాధ్యక్షుడు మల్లయ్య, నాయకులు ఉదయభాను, మల్లయ్య, గోవర్ధన్గౌడ్, మండల అధ్యక్షుడు శివరాజ్, మాజీ అధ్యక్షుడు మాకం సురేందర్, సర్పంచులు కొండయ్య, రవికుమార్, బీజేవైఎం నాయకుడు ప్రవీణ్కుమార్, ఉపసర్పంచ్ నర్సింహులు పాల్గొన్నారు. -
గంజాయి విక్రేత అరెస్ట్.. కేసు నమోదు
రాజాపూర్: బీహార్ నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్న వ్యక్తిని శనివారం ఎకై ్సజ్ అధికారులు పట్టుకుని కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే బాలానగర్ మండలంలోని మోతిఘనాపూర్ శివారులో నవదుర్గ స్టీల్ కంపెనీ పరిసర ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో ఏఈఎస్ నర్సింహ్మరెడ్డి ఆధ్వర్యంలో శనివారం చర్యలు చేపట్టారు. బాలానగర్ ఎకై ్సజ్ ఎస్ఐ నాగరాజు తనిఖీలు చేపట్టి బీహార్కు చెందిన రాజేంద్ర అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 424 గ్రాముల ఎండు గంజాయి 10 గ్రాముల గంజాయి చాక్లెట్స్ను స్వాధీనం చేసుకున్నారు. బీహార్ నుంచి కిలో రూ.5వేల చొప్పున తీసుకొచ్చి 5 గ్రాములకు రూ.400 చొప్పున ఎండు గంజాయి, రూ.50 ఒక గంజాయి చాక్లెట్ విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఎక్కడైన మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే 90300 19943 నంబర్కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. ఎకై ్సజ్ ఎస్ఐ మురళీమోహన్, హెడ్ కానిస్టేబుల్ సిద్దార్థ తదితరులు పాల్గొన్నారు. -
పెట్రోల్బంక్ బ్యారల్స్లో డీజిల్ నిల్వ
జడ్చర్ల: పెట్రోల్, డీజిల్ కొరత నెలకొన్న నేపథ్యంలో ఓ పెట్రోల్బంక్ వద్ద బ్యారల్స్, ట్యాంక్ల్లో డీజిల్ నిల్వ ఉండటంతో స్థానికులు జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన జడ్చర్ల మున్సిపాలిటీలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణ శివారులోని కిష్టంపల్లి సమీపంలో ఉన్న ప్రకాశ్ ఫిల్లింగ్ స్టేషన్ ఆవరణలో ఒక సింటెక్స్ ట్యాంకులో 2వేల లీటర్ల డీజిల్, మరో ఐదు బ్యారల్స్లో మరో వెయ్యి లీటర్ల డీజిల్ నిల్వ ఉంచి.. పైన కవర్లు కప్పి ఉంచారు. అటుగా వెళుతున్న వినియోగదారులు ఆరుబయట డీజిల్ నిల్వ ఉంచడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. బ్లాక్ మార్కెట్కు తరలించాలనే ఉద్దేశంతోనే ఇలా నిల్వ చేశారన్న అనుమానంతో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో డీజీఎస్ఓ శ్రీనివాసులు, ఎన్ఫోర్స్మెంట్ డీటీ వెంకటేశ్వర్రెడ్డి, ఏఎస్ఓ అశ్వక్, సేల్స్ ఆఫీసర్ హృదయ్, స్థానిక ఎస్ఐలు జయప్రసాద్, మల్లేశ్ తదితరులు పెట్రోల్ బంక్ వద్దకు చేరుకొని విచారించారు. నిబంధనలకు విరుద్దంగా ఆరుబయట బ్యారల్స్లో డీజిల్ నిల్వ ఉంచడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే శనివారం ఉదయం డీజిల్ ట్యాంకర్ వచ్చిందని.. బంక్ ట్యాంకుల్లో డీజిల్ పూర్తిస్థాయిలో నింపిన తర్వాత మిగిలి ఉన్న డీజిల్ను వెనక్కి పంపలేక ఇలా ట్యాంకు, బ్యారల్స్లో నిల్వ ఉంచాల్సి వచ్చిందని బంక్ నిర్వాహకులు అధికారులకు వివరించారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారించి నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని డీసీఎస్ఓ తెలిపారు. డీసీఎస్ఓ విచారణ -
ప్రోటోకాల్పై రగడ
వాడీవేడిగా నగర పాలక తొలి సమావేశం మహబూబ్నగర్ మున్సిపాలిటీ: మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ తొలి బడ్జెట్, సాధారణ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా కొనసాగింది. వేదికపై మేయర్ మాత్రమే కూర్చోవాలని.. ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్ సైతం పక్కనే ఉండటంపై బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలుపుతూ సభ నుంచి వాకౌట్ చేశారు. శనివారం మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశ మందిరంలో నగర మేయర్ జి.మమత అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది. ఆ వెంటనే బీఆర్ఎస్ సభ్యులు ఒక్కొక్కరు లేచి వేదికపై మేయర్ మాత్రమే ఉండాలని వాదించారు. ఆ పక్కనే ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్ తదితరులు కూర్చోవడం వల్ల మేయర్ పదవిని తక్కువ చేసినట్లేనని పేర్కొన్నారు. అయితే మేయర్ అనుమతితో మిగతా వారు వేదికపై ఉండవచ్చని కమిషనర్ పి.రామాంజులరెడ్డి బదులిచ్చినా వారు ఏ మాత్రం పట్టించుకోకుండా సభ నుంచి వాకౌట్ చేసి బయటకు వెళ్లిపోయారు. అనంతరం సమావేశపు అజెండా ప్రతులను ఉర్దూలోనూ ప్రచురించాలని ఎంఐఎం సభ్యులు అడిగారు. దీనికి ప్రతిగా బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు లేచి ఇతర మాతృభాష (హిందీ, ఇంగ్లిష్, సంస్కృతం)లోనూ ఉంటే బాగుంటుందని గట్టిగా వాదించారు. దీంతో సభ కొద్దిసేపు గందరగోళంగా మారగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి జోక్యం చేసుకుని 60 మంది కార్పొరేటర్లలో ఎవరు ఏ భాషలో కావాలన్నది ముందుగా కమిషనర్కు తెలియజేస్తే ఆ మేరకు అవసరమైనన్ని కాపీలు తర్జుమా చేయిస్తారని సూచించడంతో పరిస్థితి సద్దుమణిగింది. కాగా, ఆయా డివిజన్లలో నెలకొన్న సమస్యలను కార్పొరేటర్లు సమావేశం దృష్టికి తెచ్చారు. చాలా చోట్ల వీధి దీపాలు వెలగడం లేదని, పారిశుద్ధ్యం మెరుగుదలకు సిబ్బందిని పెంచాలని, మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు సరఫరా అవుతున్న సమయంలో పలుచోట్ల వృథా అవుతోందని, దీనిని అరికట్టాలన్నారు. అలాగే సీసీరోడ్లు, డ్రెయినేజీలు దెబ్బతిన్నాయని, కుక్కల బెడద తీవ్రంగా ఉందన్నారు. ముఖ్యంగా ఆదాయ వనరులు పెరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజు, మున్సిపల్ షాపుల అద్దె బకాయిలను ఎప్పటికప్పుడు వసూలు చేయించాలన్నారు. ఈ సమస్యలను సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తామని, సభ్యులందరి సహకారంతో ఆదాయ వనరుల పెంపునకు అన్ని చర్యలు చేపడతామని కమిషనర్ బదులిచ్చారు. సమావేశంలో ఇన్చార్జి స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ మధుసూదన్నాయక్, డిప్యూటీ మేయర్ ఎం.సురేందర్రెడ్డి, మేనేజర్ వెంకటేశ్వరరావు, ఎంఈ మురళీమోహన్రెడ్డి, డీఈఈలు నర్సింహ, విజయ్కుమార్, ఏసీపీలు కరుణాకర్గౌడ్, జ్యోత్స్నాదేవి తదితరులు పాల్గొన్నారు. వేదికపై మేయర్తో పాటు ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్ ఉండటంపై బీఆర్ఎస్ సభ్యుల నిరసన వార్షిక బడ్జెట్ ప్రారంభం కాగానే వాకౌట్ చేసిన వైనం సమావేశపు అజెండాను ఇతర భాషల్లోనూ ముద్రించాలని పట్టుబట్టిన కార్పొరేటర్లు ఎమ్మెల్యే యెన్నం జోక్యంతో సద్దుమణిగిన పరిస్థితి అనంతరం సజావుగా సాగిన కౌన్సిల్ సమావేశం -
వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం శ్రీరామ పట్టాభిషేకం మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శోభాయమానంగా అలంకరించిన పల్లకీలో స్వామి దంపతులను గర్భగుడి నుంచి సన్నాయి వాయిద్యాలు, వేదమంత్రాలు, భక్తుల హరినామశ్చరణ మధ్య లక్ష్మీవిలాసం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చి.. పట్టాభిషేకం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా స్వామి దంపతులను నూతన వస్త్రాలు, వివిధ రకాల పూలతో అలంకరించి.. స్వామివారికి స్వర్ణకిరీట ధారణ నిర్వహించారు. పురోహితుల వేదమంత్రాల మధ్య జరిగిన ఈ మహోత్సవాన్ని భక్తులు కనులారా తిలకించి తన్మయం చెందారు. పట్టాభిషేకం అనంతరం స్వామి దంపతులను పల్లకీలో గర్భగుడి వద్దకు తీసుకొచ్చి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందాచారి, అళహరి రామకృష్ణ, రాయల్ కుమార్తో పాటు పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి షూటింగ్ క్రీడలకు ఎంపిక
మక్తల్: మండలకేంద్రంలోని గురుకులంతో పాటు వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు జాతీయస్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికై నట్లు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోపాలం తెలిపారు. ఈ మేరకు సదరు విద్యార్థులను స్థానిక ఎంజేసీ పాఠశాలలో ఎస్ఐ–2 ఆచారి అభినందించి సర్టిఫికెట్లను అందజేశారు. ఈనెల 1 నుంచి 3 వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో జిల్లాకు చెందిన 24 మంది విద్యార్థులు ప్రతిభ చాటి జాతీయ స్థాయికి ఎంపికై నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ సల్లారెడ్డి, పీఈటీ స్వప్న, వార్టెన్ రాఘవచారి, శివకుమార్, తదితరులు పాల్గొన్నారు. -
ధరల భారం ప్రజలపై మోపలేదు
● తెలంగాణలో బీజేపీకి ఒక్క అవకాశం ఇచ్చిచూడండి ● పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు పాలమూరు: ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు 7 నుంచి 18 శాతం పెరిగినా.. దేశంలో ధరలు పెరగాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు తగ్గించే చర్యలు తీసుకుంటుందని, ఇది ప్రజలపై భారం తగ్గించాలనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అన్నారు. నగరంలోని శిశుమందిర్ పాఠశాలలో శనివారం మహబూబ్నగర్ రూరల్, హన్వాడ మండలాల బీజేపీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు హాజరై మాట్లాడారు. గతంలో ప్రధాని మన్మోహన్సింగ్ ప్రభుత్వం పెట్రోల్ ధరలు ప్రపంచ మార్కెట్లో తగ్గినప్పటికీ దేశంలో తగ్గించని పరిస్థితి ఉండేదని, ఆ సమయంలో ఆయిల్ బాండ్స్ అనే విధానాన్ని ఉపయోగించారని విమర్శించారు. పెట్రోల్ ధరలను కృత్రిమంగా తగ్గించి, మిగిలిన భారం భవిష్యత్లో చెల్లించడానికి బాండ్ల రూపంలో భారం మోపారని, ఆ బాండ్ల విలువ రూ.లక్షల కోట్లకు చేరిందన్నారు. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకొని అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నా సామాన్యులపై ఆ భారం పడకూడదనే గొప్ప సంకల్పంతో పెట్రోల్, డీజిల్ ఎకై ్సజ్ సుంకాన్ని ఏకంగా రూ.10 చొప్పున తగ్గిస్తూ కేంద్రం సాహసోపేత నిర్ణయం తీసుకుందన్నారు. సోషల్ మీడియాలో పెట్రోల్ కొరత, గ్యాస్ అందుబాటులో లేదనే తప్పుడు ప్రచారాలు ప్రజల్లో అనవసర భయాన్ని సృష్టిస్తున్నాయన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే ఎజెండాగా కార్యకర్తలు పనిచేయాలన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారని, ఆశించిన ఫలితాలు రాలేదని ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇస్తే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ద్వారా అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందన్నారు. బీజేపీ కోట్లాది సభ్యులతో మందుకు సాగుతుందని తెలంగాణలో కూడా పార్టీ బలంగా పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, నాయకులు పద్మజారెడ్డి, ఎగ్గని నర్సింహులు, బాలరాజు, వీరబ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు. -
పాలమూరు లోక్ అదాలత్లో 17,737 కేసుల పరిష్కారం
పాలమూరు: మహబూబ్నగర్ జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 17,737 కేసులు పరిష్కరించారు. జిల్లా ప్రధాన కోర్టులలో ఐదు బెంచీలు, జడ్చర్లలో రెండు బెంచీల ద్వారా లోక్ అదాలత్లో మొత్తం ఈ మేరకు కేసులను పరిష్కరించి.. ఓ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రూ.26 లక్షలకు రాజీ కుదరడంతో సదరు చెక్కును బాధితులకు అందించారు. మరో కేసులో రూ.3 లక్షల చెక్కును అందించారు. ఈ సందర్భంగా జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత మాట్లాడుతూ లోక్ అదాలత్ కోసం జిల్లాలో 2,033 కేసులు గుర్తించి సదరు కక్షిదారులకు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. అంతకు ముందు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు పి.శ్యాంకోశీ, ఎన్వీ శ్రావణ్కుమార్లకు ఆర్అండ్బీ అతిథి గృహంలో కలెక్టర్ ఖుష్బూ గుప్తా పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీసులు గౌరవం వందనం సమర్పించారు. జాతీయ లోక్ అదాలత్లో భాగంగా ఓ కేసులో నష్టపరిహారం చెక్కును హైకోర్టు న్యాయమూర్తులు అందజేశారు. అదేవిధంగా విడాకులు తీసుకోవడానికి కోర్టుకు వచ్చిన జంటకు ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి కౌన్సెలింగ్ ఇచ్చి కలిసి ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. ఆ జంట లోక్ అదాలత్లో భాగంగా హైకోర్టు న్యాయమూర్తుల ఎదుట పూలదండలు మార్చుకొని మళ్లీ ఒక్కటయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీహెచ్ పంచాక్షరి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఇందిర, ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనందరావు, జిల్లా న్యాయమూర్తులు తదితరులు పాల్గొన్నారు. -
యూరియా అక్రమ తరలింపుపై విచారణ
లింగాల: మండలంలోని అప్పాయపల్లి నుంచి గురువారం రాత్రి యూరియా అక్రమ తరలింపుపై వచ్చిన ఆరోపణలపై శనివారం ఏఓ అనిల్ క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించారు. గ్రామం నుంచి యూరియాను ఎందుకు తరలించారు, ఎన్ని బస్తాలు తదితర అంశాలను సర్పంచ్ విజయకృష్ణ, రైతుల సమక్షంలో విచారించారు. గ్రామానికి చెందిన రైతు వేముల రాంచందర్ ఇతర ప్రాంతాలకు యూరియాను తరలించడంలో ఆంతర్యం ఏమిటనేది విచారించినట్లు ఏఓ తెలిపారు. రైతు తన సొంత భూమితోపాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తుండగా.. యూరియా అవసరం ఎక్కువైనట్లు విచారణలో తెలిసిందని, సకాలంలో యూరియా లభ్యం కాకపోవడంతో వేరే గ్రామం రైతు నుంచి 20బస్తాల యూరియా బదులుగా తెచ్చుకున్నట్లు, దానిని తిరిగి రైతుకు పంపుతుండగా తెలియనివారు పట్టుకొని సమస్య సృష్టించినట్లు ఏఓ తెలిపారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు ఏఓ తెలిపారు. యూరియా తరలింపు అవాస్తవం అప్పాయపల్లిలో యూరియాను అక్రమంగా తరలించినట్లు వచ్చిన అరోపణలు అవాస్తవమని కాంగ్రెస్స్ పార్టీ నాయకులు నాగేశ్వర్రావు, మల్లయ్య ఖండించారు. రాజకీయ దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీని అబాసుపాలు చేయాలనే ఆలోచనతో ఆరోపణలు చేశారని వారన్నారు. అధికారులు విచారణలో నిజాలు వెల్లడైనట్లు వారు తెలిపారు. యువకుడిపై పోక్సో కేసు నమోదు అడ్డాకుల: మండల కేంద్రానికి చెందిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. యువకుడు అదే గ్రామంలో నివాసముంటున్న బాలికపై కొంత కాలంగా అత్యాచారానికి పాల్పడేవాడు. ఇటీవల బాలిక శరీరంలో వస్తున్న మార్పులను గమనించిన తల్లి ఆమెను నిలదీయగా జరిగిన విషయం తెలిపింది. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా శనివారం నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. బాలికను సఖీ కేంద్రానికి పంపంచినట్లు చెప్పారు. -
రూ.326 కోట్లతో వార్షిక బడ్జెట్
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మొదటి వార్షిక (2026–27) బడ్జెట్ మొత్తం రూ.326,60,78,000గా అంచనా వేశారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రాంట్ల కింద రూ.229.80 కోట్లు రావచ్చని, నికరంగా వివిధ పద్దుల కింద రూ.91,80,78,000 ఆదాయం వస్తుందని లెక్కలుగట్టారు. ఇందులో పన్నుల రాబడి నుంచి రూ.40.85 కోట్లు పన్నేతర రాబడిగా రూ.44.9578 కోట్లు, అసైన్డ్ ఆదాయం నుంచి రూ.6 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. అలాగే 2025–26 సంవత్సరానికి మిగులు రూ.3,58,13,000 గా చూపించారు. ఇక వ్యయాలకు సంబంధించి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీత భత్యాలకు రూ.15 కోట్లు, పారిశుద్ధ్య నిర్వహణ ఖర్చులకు రూ.7.85 కోట్లు విద్యుత్ బిల్లులకు రూ.6,45,70,000, రుణ వాయిదాల చెల్లింపులకు రూ.1 కోటి, హరితహారం పనులకు రూ.9,18,08,000 వెచ్చించనున్నారు. అలాగే చార్జ్డ్ వ్యయాలకు రూ.39,48,78,000, ఇతర నిర్వహణ ఖర్చులకు రూ.25.22 కోట్లు కేటాయించారు. మురికివాడలలో మౌలిక వసతులకు రూ.9,03,33,000, పార్కులు, జిమ్లకు, వైకుంఠధామాల అభివృద్ధికి రూ. 1,50,00,000, వివిధ డివిజన్లలో అభివృద్ధి పనులకు, ఇతర మూలధన వ్యయాలకు రూ.16,56,67,000 కేటాయించనున్నారు. ఇదిలా ఉండగా 2025–26 సంవత్సరాంతానికి మిగులు రూ.3,58,13,000గా చూపించారు. ఈ పద్దులను మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.రామాంజులరెడ్డి శనివారం నిర్వహించిన బడ్జెట్ సమావేశంలో వివరించారు. అనంతరం వీటికి పాలకవర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే గ్రాంట్స్ రూ.229.80 కోట్లు 2026–27కు నికరంగా రూ.91.80 కోట్లతో అంచనా ఆమోదించిన మహబూబ్నగర్ కార్పొరేషన్ పాలకవర్గం 2025–26 నాటికి మిగులు రూ.3.58 కోట్లు -
ఉపాధి పనులు పూర్తి చేయాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఈ ఆర్థిక సంవ్సరం పూర్తి కావస్తోందని, ఉపాధి హామీ పనులను వెంటనే పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. తన చాంబర్ నుంచి శనివారం అధికారులతో వెబెక్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు గ్రామాలు పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సూచించారు. మంజురైన ఇందిరమ్మ ఇళ్లను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఎంపీడీఓలు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. 7 లోగా దరఖాస్తు చేసుకోవాలి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: తెలంగాణ ఎస్టీ సంక్షేమ గురుకులాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 14 ప్రతిభా కళాశాలల్లో ఇంటర్మీడియట్లో చేరేందుకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆర్సీఓ కల్యాణి ఒక ప్రకటనలో తెలిపారు. అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు జేఈఈ, ఎంసెట్, ఐఐటీ, నీట్, ఏఐఐఎంఎస్ వంటి వాటికి శిక్షణ ఇస్తారని, వచ్చేనెల 7వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. వాడీవేడిగా నగర పాలక తొలి సమావేశం ప్రోటోకాల్పై రగడ వేదికపై మేయర్తో పాటు ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్ఉండటంపై బీఆర్ఎస్ సభ్యుల నిరసన వార్షిక బడ్జెట్ ప్రారంభం కాగానే వాకౌట్ చేసిన వైనం సమావేశపు అజెండాను ఇతర భాషల్లోనూ ముద్రించాలని పట్టుబట్టిన కార్పొరేటర్లు – వివరాలు IIలో.. -
విద్యుదాఘాతంతో యువకుడు మృతి
కోస్గి రూరల్: ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని చంద్రవంచలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం మేరకు చంద్రవంచ గ్రామానికి చెందిన పటేల్ కృష్ణయ్య ఇంటి నిర్మాణం ప్రారంభించాడు. ఈ క్రమంలో కృష్ణయ్య మొదటి కుమారుడు పటేల్ రమేష్ (16) ఇంటి ముందు ఉన్న కొబ్బరి చెట్టు దగ్గర కాలుజారి పక్కనే ఉన్న కరెంట్ బుడ్డి ఎర్తింగ్ వైర్పై పడిపోయాడు. దీంతో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేశారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బాల్రాజ్ తెలిపారు. మనస్తాపంతోయువకుడి ఆత్మహత్య వనపర్తి రూరల్: మండలంలోని రాజనగరం చెందిన యువకుడు ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. రూరల్ ఎస్ఐ హృశికేష్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన నక్క రాకేష్(20) మూడు రోజుల క్రితం పాన్గల్ గ్రామంలో అతని తాత మృతి చెందాడు. అప్పటి నుంచి మనస్తాపంతో అన్నం తినకుండా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో చీరతో ఉరేసుకొని మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఉరేసుకొని వ్యక్తి బలవన్మరణం చారకొండ: మండల కేంద్రానికి చెందిన మునగాల లోకేశ్(45) శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం గ్రామానికి లోకేశ్ నూనె తయారీ చేసే దుకాణంలో పనిచేస్తున్నాడు. శుక్రవారం దుకాణంలో ఎవరు లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేఎల్ఐ కాల్వలోపడి వ్యక్తి మృతి తిమ్మాజిపేట: మండల పరిధిలోని ఆవంచ గ్రామ సమీపంలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కాలువలో పడి గొల్కోండ వసంత్ (50) అనే వ్యక్తి మృతి చెందినట్లు గ్రామ స్తులు తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు కేఎల్ఐ కాలువ నుంచి పంటలకు నీరు పారించేందుకు కొందరు రైతులు కాలువలో మోటార్లు ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో కాలువలో ఎక్కువగా నాచు ఉండడంతో బోరు మోటార్లు పనిచేయక పోవడంతో వసంత్తో మరమ్మతు చేయించేవారు. ఈక్రమంలో శుక్రవారం ఓ రైతుకు చెందిన మోటార్ పనిచేయకపోవడంతో మరమ్మతు చేసేందుకు వెళ్లి నీటిలో మునిగి గల్లంతయ్యాడు. రైతులందరూ కలిసి గాలించి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. -
వీరుల ప్రాణత్యాగాలు వెలకట్టలేనివి
మక్తల్: జాతీయోద్యమ వీరుల ప్రాణ త్యాగాలు వెలకట్టలేనివని పీపవైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అన్నారు. భగత్సింగ్, రాజ్గురు, సుఖదేవ్ 95వ వర్ధంతి సందర్భంగా నారాయణపేట క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనలో భగత్సింగ్, రాజ్గురు, సుఖదేవ్, ఉద్దమ్ సింగ్, భట్ కేశ్వర్, ఆస్సదుల్లకాన్, అజాద్, చంద్రశేకర్ తదితరులు చిత్రపటాలను పీవైఎల్, పీడీఎస్యూ ఆధ్వర్యంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ప్రభుత్వం జాతీయ ఉద్యమ వీరుల ఆకాంక్షలను పూర్తిగా విస్మరిస్తూ దేశ సార్వభౌమత్వాన్ని అమెరికా అగ్రరాజ్యానికి తాకట్టు పెడుతూ దేశ సంపదను స్వదేశ విదేశి కార్పొరేట్ పెట్టుబడి దారులకు కట్టబెడుతున్నాదని ఆగ్రహించారు. దేశంలో పేదలకు ఉచిత విద్యను అందించడంతో పూర్తిగా విఫలమైందన్నారు. రేవంత్రెడ్డి ప్రభుత్వంలో విద్యా రంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి నేటి వరకు అమలు చేయడం లేదని పేర్కొన్నారు. అంతకు ముందు రాష్ట్ర నాయకులు రామృకష్ణ, చంద్రశేఖర్, ఎం, కృష్ణ, బి.రాము, కాళేశ్వర్, ఎండీ భగత్సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సిద్ధూ, కాళేశ్శర్, భాస్కర్, భుట్టో, సాయి తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా వేంకటేశ్వరుడి కల్యాణం
● పవిత్ర ఘట్టాన్ని తిలకించి తరించిన భక్తులు ● ఘనంగా శ్రీరామనవమి వేడుకలు మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శుక్రవారం స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతిఏడాది శ్రీరామనవమికి వేంకటేశ్వరస్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగానే ఈ పవిత్ర ఘట్టాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శోభాయమానంగా అలంకరించిన పల్లకీలో స్వామి దంపతులను గర్భగుడి నుంచి దేవస్థానం సమీపంలోని రామసదనం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. మహిళల మంగళహారతులు, సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాల మధ్య ఊరేగింపు ముందుకు కదిలింది. అనంతరం స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని ప్రారంభించారు. ప్రత్యేక పూజల అనంతరం జీలకర్ర, బెల్లం కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ఆశేష భక్తజనావళి తిలకిస్తుండగా.. పురోహితుల మంత్రోచ్ఛారణలు, సన్నాయి వాయిద్యాల మధ్య అమ్మవారి మంగళసూత్రధారణ కార్యక్రమం కనులపండువగా నిర్వహించారు. అనంతరం తలంబ్రాల కార్యక్రమం గావించారు. కల్యాణం అనంతరం స్వామి దంపతులను మళ్లీ పల్లకీలో గర్భగుడి వద్దకు తీసుకెళ్లి పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు మన్యంకొండకు తరలివచ్చారు. దీంతో మన్యంకొండ భక్తులతో కిటకిటలాడింది. రకరకాల పూలు, వివిధ ఆభరణాల అలంకరణలో స్వామిదంపతులు ధగధగ మెరిసిపోతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. ఈ దృశ్యాన్ని చూసి భక్తులు భక్తిపారవశ్యంతో పులకించిపోయారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఆళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. -
నకిలీ డ్రగ్స్ కట్టడికి బల్క్ ఎస్ఎంఎస్ విధానం
పాలమూరు: మెడికల్ దుకాణాల్లో నకిలీ డ్రగ్స్ కట్టడి కోసం బల్క్ ఎస్ఎంఎస్ విధానం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు జిల్లా ఔషధ నియంత్రణ శాఖ ఏడీ దినేష్కుమార్ వెల్లడించారు. మార్కెట్లో డ్రగ్స్ శాంపిళ్లను సేకరించిన తర్వాత వాటిలో నకిలీలు, ప్రమాణాలు పాటించని మందులు ఉంటే దీనితో గుర్తించవచ్చునని తెలిపారు. డ్రగ్ డీలర్లు, హోల్సేల్, రిటైల్ వ్యాపారుల సెల్ఫోన్లకు ఈ సమాచారం బల్క్ ఎస్ఎంఎస్ల్లో పంపిస్తుందని తెలిపారు. అప్పటికే డీలర్ నుంచి హోల్సెల్, రిటైల్కు చేరి ఉంటూ వెంటనే ఆ బ్యాచ్ మందులను వెనక్కి తీసుకోవడానికి అవకాశం ఉంటుందని, దీంతో నకిలీ డ్రగ్స్ రోగులకు చేరకముందే అడ్డుకట్ట పడుతుందని తెలిపారు. నకిలీ మందుల పట్ల రోగులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని సందేహం వస్తే, మందుల పాకెట్లపై క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే మందుల తయారీ ప్రాంతం, తేదీ, ఇతర వివరాలు కన్పిస్తాయని తెలిపారు. -
ఉత్సాహంగా ఎడ్లబండ్ల గిరక పోటీలు
ఆత్మకూర్: మండలంలోని మూలమల్ల గ్రామంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని శుక్రవారం నిర్వహించిన ఎడ్లబండ్ల గిరక పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. ఉమ్మడి మహాబూబ్నగర్లోని 18 జతల ఎద్దులు పోటీల్లో పాల్గొన్నాయి. నారాయణపేట జిల్లాకు చెందిన రంగన్న ఎద్దులు మొదటి బహుమతి సాధించగా దేశాయిపద్మాజారెడ్డి రూ.20 వేలు నగదు అందజేశారు. గద్వాల జిల్లాకు చెందిన ధర్మరెడ్డి ఎద్దులు ద్వితీయ స్థానంలో నిలువగా సర్పంచ్ రంగారెడ్డి రూ.15 వేలు బహుమతి అందజేశారు. మూడో విజేత గంగన్నపల్లికి చెందిన ధరెప్పకు ఉపసర్పంచ్ అశోక్ రూ.10 వేలు నాలుగో విజేత వనపర్తి రైతు లోకపతిరాజుకు మునిస్వామి రూ.5 వేలు అందజేశారు. కార్యక్రమంలో నిర్వహకులు ఆనంద్గౌడ్, ఆనంద్రెడ్డి, మల్లికార్జున్, రవికుమార్, రాజు, గ్రామస్తులు, రైతులు పాల్గోన్నారు. -
మన్సూర్పల్లిలో మళ్లీ కనిపించిన చిరుతలు
● అడవి పందిని తింటూ ఒకటి.. మరొకటి గుండుపై పడుకొని ● భయాందోళనకు గురవుతున్న పరిసర ప్రాంతాల రైతులు గండేడ్: మండలంలోని మన్సూర్పల్లి బొందగట్టు ప్రాంతంలో శుక్రవారం చిరుతలు మళ్లీ రైతులకు కనిపించాయి. అందులో ఒకటి అడవి పందిని చంపుకొని తింటూ కనిపిస్తే మరొకటి గుండుపై పడుకుని కనిపించినట్టు స్థానికులు బాలయ్య, సాయికుమార్ తెలిపారు. మొన్న కొండాపూర్కు చెందిన మల్లయ్య మేకలపై దాడిచేసి ఒకదాన్ని చంపి మరోదాన్ని గాయాలపాలు చేసిన ఘటనను రైతులు చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం కూడా ఇదే ప్రాంతంలో కనిపించడం రైతులను మరింత భయభ్రాంతులకు గురి చేస్తుంది. చిరుతల సంచారంతో రైతులు పొలాలకే వెళ్లడంలేదు. పశువులను పొలాల దగ్గరి నుంచి ఇళ్లకు తీసుకొస్తున్నారు. దీంతో పొలానికి వెళ్లి పశువులకు మేత తీసుకురావాలన్నా.. వాటిని మేపాలన్నా చాలా ఇబ్బందికరంగా మారిందని ఆయా గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు చిరుతలకు బోనులు ఏర్పాటు చేసి పట్టుకోవాలని కోరుతున్నారు. పశు ప్రాణనష్టం జరుగుతున్నా అటవీశాఖ అధికారులు ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నిస్తున్నారు. -
గొర్రెల పెంపకంలో జాగ్రత్తలు అవసరం
అలంపూర్: గొర్రెల పెంపకంలో జాగ్రత్తలు పాటిస్తేనే అధిక లాభాలు పొందవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. పలు సూచనలు, సలహాలు అందిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. గొర్రెలలో వచ్చే రోగాల నివారణకు గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని పశుసంవర్థక శాఖ అధికారి శంకరయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను వివరించారు. ● అనేక మంది సన్నకారు చిన్నకారు, రైతులు, వ్యవసాయ కూలీలు గొర్రెలను అధిక సంఖ్యలో పెంచడం జరుగుతుంది. అయితే వీటి పోషణలో తగు జాగ్రత్తలు పాటించకపోవడంతో ప్రతి ఏడాది 20 శాతం వరకు గొర్రెలను కోల్పోతున్నారు. దీంతో అనేక మంది గొర్రెల పెంపకందార్లు లాభాలకు బదులుగా నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. ●గొర్రెల పోషణలో ఆధునిక యాజమాన పద్ధతులు, ఆరోగ్య రక్షణ మీద సరైన అవగాహన పెంచుకుంటే లాభాలు ఆర్జించవచ్చని ఆయన పేర్కొంటున్నారు. పెంపకంలో సలహాలు ప్రధానంగా గొర్రెల పాకలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పాకలను గాలి, వెలుతురు వచ్చే విధంగా ఎత్తైన ప్రదేశాల్లో నిర్మించుకోవాలి. పాకలో తడి లేకుండా చూసుకోవాలి. ● గొర్రెలకు సరైన కాలంలో టీకాలు ఇప్పించాలి. అమ్మతల్లి, పీపీఆర్ వంటి రోగాల నివారణకు టీకాలు చేయించాలి. ● గొర్రెలకు క్రమం తప్పకుండా 60 నుంచి 90 రోజులకు ఒక సారి నట్టల నివారణ మందులు త్రాగించాలి. ఈ మందులను పశు వైద్యుల సలహా మేరకు అందించాల్సి ఉంటుంది. ● గొర్రెల పోషణలో సరైన జాగ్రత్తలు పాటించకపోవడంతో గొర్రెల పిల్లలు నూటికి 20 వరకు మృతి చెందడం జరుగుతుంది. గొర్రె పిల్లల మరణాలు అరికట్టాలి. గొర్రె పిల్లలకు పుట్టిన మూడోరోజు జున్నపాలు తాపాలి. పశు వైద్యుల సలహా మేరకు రోగ నిరోధక మందులను నోటి ద్వార అందించాలి. పాడి–పంట నీటి ప్రవాహాల వద్దనే నీటిని తాపాలి గొర్రెల మందలో విత్తనపు పొటెళ్లను ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మార్చుకోవాలి. మందలో వచ్చే వ్యాధులను అప్రమత్తంగా ఉంటు గమనించుకోవాలి. అలాంటి వ్యాధి లక్షణాలు ఉన్న గొర్రెలను మంద నుంచి వేరు చేసి సరైన చికిత్స అందించాలి. దోమలు, ఈగల వలన కొన్ని వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. వీటి నివారణకు వర్షాకాలం, శీతాకాలల్లో గొర్రెల మందలో వేపాకు పొగను ఏర్పాటు చేసుకోవాలి. ఇలా గొర్రెల పెంపకంలో సరైన జాగ్రత్తలు పాటిస్తే గొర్రెల మరణాలు తగ్గించి అధిక లాభాలు పొంద వచ్చని సూచించారు. -
హత్య కేసు ఛేదన
● వివాహేతర సంబంధమే కారణంగా గుర్తించిన పోలీసులు ● ఇద్దరు నిందితులకు రిమాండ్ ఖిల్లాఘనపురం: మండలంలోని రోడ్డుమీదితండా సమీపంలో మొల్గర శేషమ్మను హత్యచేసి కాల్వలో వేసిన కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను శుక్రవారం రిమాండ్కు తరలించిన కొత్తకోట ఇన్చార్జి సీఐ రత్నం, ఖిల్లాఘనపురం ఎస్ఐ వెంకటేష్ విలేకర్ల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. మండలంలోని తిర్మలాయపల్లి గ్రామానికి చెందిన మొల్గర నిరంజన్ భార్య మొల్గర శేషమ్మ(55)కు అదే గ్రామానికి చెందిన మొల్గర కృష్ణయ్య వివాహేతర సంబంధం ఉంది. వీరిద్దరు గ్రామం నుంచి వెళ్లిపోయి మహబూబ్నగర్లోని కుమ్మరివాడలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. ఇదిలా ఉండగా మొల్గర శేషమ్మ అక్కడ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు కృష్ణయ్యకు అనుమానం వచ్చింది. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే కృష్ణయ్య ఈ నెల 22న అర్ధరాత్రి సమయంలో మద్యం తాగి ఇంటికి వచ్చి ఆమెతో గొడవ పెట్టుకుని చేతులతో గొంతునులిమి చీరలతో గొంతుకు బిగించి చంపాడు. అనంతరం మరుసటి రోజు ఉదయం తనకు తెలిసిన మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని టీడీగుట్టలో ఉంటున్న ముచ్చింతల కురుమూర్తిని ఆటో తీసుకుని రావాలని పిలిచాడు. ఇద్దరూ కలిసి మృతదేహాన్ని ఆటోలో వేసుకుని మహబూబ్నగర్ నుంచి భూత్పూర్, వెల్కిచెర్ల, మామిడిమాడ, పర్వతాపురం మీదుగా ఖిల్లాఘనపురం చేరుకున్నారు. అక్కడి నుంచి తిర్మలాయపల్లి రెవెన్యూ శివారులో రోడ్డుమీదితండా సమీపంలో హనుమాన్కత్వ కుంట దగ్గర నీళ్లు లేని కాల్వలో మృతదేహాన్ని పడేసి వెళ్లారు. అటుగా వెళ్తున్న గ్రామస్తులు మృతదేహాన్ని చూసి పోలీసులకు చెప్పారు. తిర్మలాయపల్లి గ్రామానికి చెందిన మొల్గర శేషమ్మగా గుర్తించగా.. ఆమె కుమారుడు మొల్గర కుర్మయ్య అనమానాస్పద మృతిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు హత్య చేసి చంపిన మొల్గర కృష్ణయ్య, సహకరించిన ముచ్చింతల కురుమూర్తిలను అదుపులోకి తీసుకుని విచారించారు. నేరాన్ని ఒప్పుకోవడంతో వారిని వనపర్తి కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా వారికి న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఈ కేసులో నిందితులను గుర్తించి పట్టుకోవడంలో కృషిచేసిన ఎస్ఐ వెంకటేష్, కానిస్టేబుళ్లు లింగం, రాజు, చైతన్యకుమార్, మునావర్లను సీఐ అభినందించారు. -
ప్రియుడి ఇంటి ఎదుట యువతి ధర్నా
మిడ్జిల్: ప్రేమించి గర్భవతిని చేసి పెళ్లికి నిరాకరించిన ప్రియుడి ఇంటి ఎదుట యువతి ధర్నా చేసిన ఘటన మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. మండల కేంద్రానికి చెందిన యువకుడు అమ్మాయిని పదేళ్ల నుంచి ప్రేమించాడు, చివరకు మాయమాటలు చేసి గర్భవతిని కూడా చేశాడు. ఆ విషయం అమ్మాయి ఇంట్లో తెలువడంతో పెండ్లి చేసుకోవాలని కోరగా, నిరాకరించడంతో శుక్రవారం అమ్మాయి సదరు యువకుడి ఇంటి ఎదుట ధర్నాకు కూర్చుంది. అనంతరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివనాగేశ్వర్నాయుడు తెలిపారు. కాగా ప్రేమించిన యు వకుడికి గతంలో పెళ్లి అయి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని, అయినా అమ్మాయిని నమ్మించి, పెళ్లి చేసుకుంటానని మోసం చేసినట్లు యువతి ఫిర్యాదులో పేర్కొంది. కేఎల్ఐ కాల్వకు గండి తిమ్మాజిపేట: మండలంలోని ఆవంచ సమీపంలో ఉన్న కేఎల్ఐ కాల్వకు గండి పడడంతో అప్రమత్తమైన రైతులు శుక్రవారం గండి పూడ్చి వేశారు. రైతు గడ్డమోని కృష్ణయ్య పొలం వద్ద కేఎల్ఐ కాల్వకు గండి పడి నీరు వృథాగా పోతున్న విషయం గుర్తించిన చుట్టు పక్కల రైతులు జేసీబీ, ట్రాక్టర్లతో కాల్వకు మరమ్మతు చేశారు. కాల్వకు గండి పడితే తక్షణమే స్పందించాల్సి ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నా.. రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సొంత ఖర్చులతో సాగునీరు వృథా కాకుండా కృషి చేశారని వారిని అభినందించారు. ● గర్భవతిని చేసిన యువకుడు ● పెళ్లికి నిరాకరించిన వైనం


