breaking news
Mahabubnagar
-
పెళ్లి చేసుకోమని అడిగితే చంపేస్తారా?
వరంగల్ లీగల్ : ఓ మహిళ తనను వివాహం చేసుకోమని కోరగా కోపోద్రిక్తుడై ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించి చంపిన ఘటనలో నేరం రుజువుకావడంతో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం జమస్తాపురం గ్రామానికి చెందిన నేరస్తుడు చిన్నపాక అనిల్కు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ వరంగల్ రెండో అదనపు జిల్లా కోర్టు జడ్జి మనీషా శ్రావణ్ ఉన్నవ్ శుక్రవారం తీర్పు వెలువరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.సంతోషి కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఊకల్కు చెందిన పార్వతితో చెన్నారావుపేట మండలం తిమ్మరాయినిపహాడ్కు చెందిన సింగారపు బాబుకు వివాహం జరిగింది. కొన్ని సంవత్సరాల అనంతరం బాబు అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. దీంతో పార్వతి రంగశాయిపేటలో అద్దెకుంటూ కూలీ చేసుకుంటూ జీవించేది. పక్కనే అద్దెకుంటున్న చిన్నపాక అనిల్తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయమై పార్వతి సోదరులు పలుమార్లు హెచ్చరించినా ఇరువురిలో మార్పు రాలేదు. దీంతో పార్వతిని తన తండ్రి స్వగ్రామం ఊకల్కు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో పార్వతి తండ్రి మృతి చెందడంతో అనిల్ ఊకల్కు రావడం ప్రారంభించాడు. 2015, జూన్ 7న ఊకల్కు వచ్చిన అనిల్ను తనను వివాహం చేసుకోవాలని పార్వతి నిలదీసింది. దీంతో కోపోద్రిక్తుడైన అనిల్.. పార్వతిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. పార్వతి కేకలు విని చుట్టూ పక్కల వారు రాగా అనిల్ పరారయ్యాడు. పార్వతిని 108లో ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై పార్వతి సోదరుడు వెంకన్న.. రాయపర్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. విచారణలో సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు.. నేరం రుజువుకావడంతో అనిల్కు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ జడ్జి మనీషా శ్రావణ్ ఉన్నవ్ తీర్పు వెలువరించారు. కేసును పోలీస్ అధికారులు ఎస్.శ్రీనివాస్, ఆర్.సంతోష్ పరిశోధించగా లైజన్ ఆఫీసర్ హరికృష్ణ పర్యవేక్షణలో హెడ్కానిస్టేబుల్ సోమనాయక్, కానిస్టేబుల్ అనిల్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. -
చివరి ఆయకట్టుకు సాగునీరందిస్తాం
వెల్దండ: కల్వకుర్తి ఎత్తిపోథల పథకం ద్వారా చివరి ఆయకట్టు రంగారెడ్డి జిల్లా నాగిళ్ల వరకు రైతులకు సాగునీరందించడానికి కృషిచేస్తామని ఎస్ఈ సత్యనారాయణరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని ఆయా గ్రామాల్లోని కేఎల్ఐ కాల్వలను అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేఎల్ఐ కాల్వలో భాగంగా డి–82కాల్వ ద్వారా రైతులకు సాగునీరందిస్తామన్నారు. రైతులు ఇష్టానుసారంగా కాల్వపై సిమెంట్ పైపులు వేసి దారులు చేయడంతో కాల్వలకు గండిపడుతున్నట్లు తెలిపారు. వ్యవసాయ పొలాలకు వెళ్లాడానికి కాల్వకు అడ్డంగా సిమెంట్ పైపులు వేయడంతో నీటి ప్రవాహంతో పైపులకు చెత్తాచెదారం అడ్డు పడడంతో తరచుగా కాల్వలకు గండిపడి నష్టం కలుగుతుదన్నారు. చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించడానికి ప్రభుత్వం కృషిచేస్తున్నట్లు వివరించారు. డి–82 కాల్వ పనులు దాదాపుగా పూర్తి చేసినట్లు తెలిపారు. ఎక్కడైనా మరమ్మతులు ఉంటే వెంటనే పూర్తి చేసి కేఎల్ఐ కాల్వ నీరు పారించడానికి కృషిచేస్తున్నట్లు వివరించారు. వెల్దండ సమీపంలో కాల్వను పరిశీలించిన అధికారులను కాల్వపై వంతెనే నిర్మించాలని రైతులు విన్నవించారు. నిధులు మంజూరైన వెంటనే పనులు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏఈఈ శ్రీకాంత్, డీఈఈలు దేవన్న, బుచ్చిబాబు, ఏఈలు ప్రభాకర్, మాల్య తదితరులు ఉన్నారు. కేఎల్ఐ ఎస్ఈ సత్యనారాయణరెడ్డి -
గంగాభవానీ ఆలయంలో చోరీ
చిన్నచింతకుంట: మండల కేంద్రంలోని శ్రీ గంగా భవానీ మాత ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి అమ్మవారి బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. చిన్నచింతకుంట ఎస్ఐ రాంలాల్ నాయక్ తెలిపిన వివరాల మేరకు.. గురువారం సాయంత్రం ఆలయం తలుపులకు ఉన్న తాళాలను పగులగొట్టి అమ్మవారి చైను, బంగారు పుస్తెల తాడు, వెండి ముఖం, రెండు చేతులు, ముక్కెర, కిరీటం, వడ్డానాన్ని ఎత్తుకెళ్లారు. ఈ ఆభరణాల విలువ రూ. 2 లక్షలు ఉంటుంది. ఆలయాన్ని శుభ్రపరిచే నిరంటి కల్పన శుక్రవారం ఆలయానికి వెళ్లగా తాళాలు విరగొట్టి ఉండడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
డెంగీపై కేసులపై ప్రత్యేక నజర్
పాలమూరు: జిల్లాలో డెంగీ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. ఒకవైపు ఆరోగ్య శాఖ అధికారులు యాంటీ లార్వా ఆపరేషన్స్తో పాటు ఫీవర్ సర్వే చేస్తున్న పాజిటివ్ కేసులు క్రమంగా రెట్టింపు అవుతున్నాయి. ఆరోగ్య శాఖ అధికారులు జిల్లాలో అర్బన్ ఏరియాలో 41 హైరిస్క్ ప్రాంతాలు, రూరల్ ఏరియాలో 20 హైరిస్క్ ఏరియాలను గుర్తించి ఆ ఏరియాల్లో ప్రతి రోజు ఏఎల్ఓ ఆపరేషన్స్ చేయడంతో పాటు ఇంటింటి ఫీవర్ సర్వే కొనసాగిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన ఇంట్లోని ప్రతి గదిలో అన్ని మూలాలకు ఇండోర్ స్ప్రే చేయడంతో పాటు ఆ చుట్టు పక్కల సైతం 50 నుంచి 100 ఇళ్ల వరకు యాంటీ లార్వా ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఆరోగ్య శాఖ పరిధిలో మొత్తం 91 డెంగీ పాజిటివ్ కేసులు వస్తే.. అర్బన్ ఏరియాలో 60 కేసులు నమోదు అయ్యాయి. శుక్రవారం జిల్లావ్యాప్తంగా డెంగీ కేసులపై ప్రత్యేక బృందాలు తనిఖీలు చేయగా, డీఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ ఆధ్వర్యంలో నగరంలోని రామయ్యబౌళి, సద్దలగుండు, మోతీనగర్ ఏరియాలో పర్యటించారు. డెంగీ బాధితులను పరామర్శించి స్థానిక పరిస్థితులపై డీఎంహెచ్ఓ ఆరా తీశారు. జిల్లాలో 61 హైరిస్క్ ప్రాంతాలు గుర్తింపు జిల్లా ఆరోగ్య శాఖలోని మలేరియా విభాగం ఆధ్వర్యంలో జిల్లాలో మూడేళ్ల కాలంలో ఎక్కువగా డెంగీ కేసులు వస్తున్న 61 హైరిస్క్ ప్రాంతాలను గుర్తించారు. ఇందులో ప్రధానంగా సద్దలగుండు, మోతీనగర్, షాషాబ్గుట్ట, జైనల్లీపూర్, అయ్యవారిపల్లి, క్రిస్టియన్పల్లి, కోయనగర్, రామయ్యబౌళి, పాత పాలమూరు, ఎదిర, సీసీకుంట, జానంపేట, కోయనగర్, బీకే రెడ్డి కాలనీ, అయోధ్యనగర్, వీరన్నపేట, ప్రేమ్నగర్, మూసాపేట ఏరియాలున్నాయి. ఈ ప్రాంతాల్లో ఉండే ఇళ్లను ప్రత్యేకంగా బృందాలు సర్వే నిర్వహిస్తున్నాయి. ప్రతి రోజు ఇంటింటికి తిరుగుతూ ఇళ్లలో జ్వరపీడితులు ఉన్నారా? ఇతర ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అనే అంశంపై ఆరా తీస్తున్నారు. ఇంటింటి ఫీవర్ సర్వే చేస్తున్నాం.. ప్రతి ఇంట్లో తోక పురుగులు లేకుండా చూసుకోవాలి. నిత్యం క్లోరినేషన్ చేసుకోవడంతో పాటు దోమ తెరలు, నీటి విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. హైరిస్క్ ఏరియాల్లో ఏఎల్ఓ ఆపరేషన్స్లో భాగంగా ఫాగింగ్ చేయిస్తున్నాం. మరీ ముఖ్యంగా ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహించి జ్వర పీడితులను గుర్తిస్తున్నాం. ప్రస్తుతం కేసులు నమోదు అవుతున్న ఏరియాల్లో అనుమానితుల నుంచి శాంపీల్స్ సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నాం. – డాక్టర్ కృష్ణ, డీఎంహెచ్ఓ ఏఎల్ఓ ఆపరేషన్స్పై ప్రత్యేక దృష్టి పెట్టిన ఆరోగ్యశాఖ ఇప్పటి వరకు 91 కేసులు నమోదు డీఎంహెచ్ఓ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు -
మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, పీడీపై సస్పెన్షన్ వేటు
ధన్వాడ: మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఉమై ఆస్రాను సస్పెన్షన్ చేస్తూ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసాచారి ఉత్తర్వులు జారీచేశారు. అలాగే పాఠశాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న పీడీ తులసీదాస్ను విధుల నుంచి తొలగిస్తూ గురువారం రాత్రి సంబంధిత అధికారులకు ఉత్తర్వులను పంపిచారు. గతవారం సాక్షిలో ‘‘మోడల్ స్కూల్ కంపు కంపు’’ శీర్షికపై స్పందించిన అధికారులు జిల్లా విద్యాశాఖ అధికారి పర్యవేక్షించి విద్యార్థులు ఎందుకు ఆందోళన చేయాల్సి వచ్చింది.. మరుసటి రోజు పాఠశాల సమయంలో రోడ్డుపై రాస్తారోకో చేసేందుకు ఎలా అనుమతిచ్చారు అనే విషయాలపై ఉన్నతాధికారులకు వివరణ పంపిచారు. అయితే ఇక్కడ కేజీబీవీ టైపు–4 హాస్టల్లో విద్యార్థులు డ్రైనేజీ సమస్య, మరుగుదొడ్ల సమస్యపై అధికారులు స్పందించకపోవడంతో రాస్తారోకో చేశారు. కాని వీటిని పర్యవేక్షించే అధికారులు కేజీబీవీ ఎస్ఓపై మాత్రం ఎలాంటి చర్యలను తీసుకోకపోవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి
పాన్గల్: బొలెరో ఢీకొని వృద్ధురాలు మృతిచెందిన ఘటన శుక్రవారం మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాసులు కథనం ప్రకారం.. అన్నారం గ్రామానికి చెందిన గడ్డం సాయమ్మ(70) గ్రామ పంచాయతీ వద్ద ఆసరా పింఛన్ తీసుకునేందుకు వెళ్తోంది. దొండాయిపల్లి నుంచి వస్తున్న బొలేరోకు ఎదురుగా స్కూల్ బస్సు రావడంతో రివర్స్ తీసుకునేక్రమంలో వెనుక నడుచుకుంటూ వెళ్తున్న సాయమ్మను బలంగా ఢీకొనడంతో అక్కడిక్కడే మృతిచెందింది. మృతురాలి కుమారుడు గడ్డం స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మృతురాలికి కూతురు, కుమారుడు ఉన్నారు. మృతురాలి కుటుంబాన్ని మాజీ సర్పంచ్ రాములు, మాజీ ఉప సర్పంచ్ ప్రవీణ్కుమార్రెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రోడ్డు ప్రమాదంలోవ్యక్తి దుర్మరణం అమరచింత: మండలంలోని పాంరెడ్డిపల్లే గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఉంద్యాలకు చెందిన వెంకటేశ్ (52) అమరచింతలోని వైన్షాపులో పనిచేస్తున్నాడు. గురువారం అర్ధరాత్రి పనిముగించుకొని ఉంద్యాలకు బైక్పై వెళ్తుండగా పాంరెడ్డి పల్లే గ్రామం దాటిన తర్వాత కెనాల్ సమీపంలో బైక్కు ఎదురుగా పంది అడ్డురావడంతో తప్పించబోయి ప్రమాదానికి గురయ్యాడు. తలకు గాయం కావడంతో చికిత్స కోసం ఆత్మకూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర రక్తస్త్రావంతో మృతి చెందాడు. మృతుడి భార్య బండారి పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ రాములు తెలిపారు. కానిస్టేబుల్కు రిమాండ్ గట్టు : మండల పరిధిలోని చిన్నోనిపల్లె గ్రామానికి చెందిన కానిస్టేబుల్ రఘునాథ్గౌడును శుక్రవారం రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ మల్లేష్ తెలిపారు. ప్రియాంక అనే అమ్మాయిని ప్రేమించి, పెళ్లి చేసుకొకుండా నిరాకరించిన వ్యవహారంలో రఘునాథ్గౌడుతో పాటుగా కుటుంబ సభ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గద్వాల డీఎస్పీ మొగులయ్య ఆధ్వర్యంలో విచారణ చేపట్టి కానిస్టేబుల్ రఘునాథ్గౌడును అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. బాలిక అదృశ్యం: కేసు నమోదు బల్మూర్: మండల కేంద్రానికి చెందిన బాలిక అదృశ్యమైన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్ఐ రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం బహిర్భూమికి కోసం బాలిక ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఎంతకీ తిరిగి రాక పోవడంతో కుటుంబసభ్యులు ఎక్కడ వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అదనపు కట్నం కోసం వేధింపులు తిమ్మాజిపేట: మండలంలోని గొరిటకు చెందిన జక్సాన బేగంను భర్త, అత్త, మామ, ఆడపడుచులు అదనపు కట్నం తేవాలని వేధిస్తున్నారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. జక్సాన బేగంను మహబూబ్నగర్ మండలం ఎదిర గ్రామానికి చెందిన పైసల్కు ఇచ్చి వివాహం చేశారు. రెండున్నర సంవత్సరాలుగా తన భర్త అదనపు కట్నం కోసం అత్త వేధిస్తుందని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుకెస్ఐ తెలిపారు. వేర్వేరు రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు తెలకపల్లి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలైన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. శుక్రవారం మండల కేంద్రానికి చెందిన శివ, ప్రశాంత్ బైక్పై వెళ్తుండగా ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో వెనక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొన్నది. ప్రమాదంలో బైక్పై ఉన్న శివకు తీవ్రగాయాలు కాగా ప్రశాంత్కు స్వల్ప గాయాలయ్యాయి. శివను నాగర్కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించగా పరిస్థితి తీవ్రంగా ఉండడంతో యెన్నం ఆస్పత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. తిమ్మాజిపేట: మండలంలోని లక్ష్మణ్నాయక్ తండాకు చెందిన ముడావత్ లాలు బైకుపై వెళ్తుండగా వెనుక నుంచి కారు ఢీకొనడంతో లాలు తలకు, చేతికి గాయం అయినట్లు ఎస్ఐ హరిప్రసాద్రెడ్డి తెలిపారు. ఎస్ఐ వివరాల ప్రకారం లాలు వ్యవసాయ పొలంలో పనులు ముగించుకొని ఇంటికి బైక్పై వస్తుండగా వెనుక నుంచి కారు ఢీకొన్నది. ఈ ప్రమాదంలో లాలు గాయపడ్డాడు. చికిత్స కోసం జడ్చర్ల లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. లాలు భార్య ముడావత్ మన్నీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఏడాదిలో ‘రైల్వే’ ఫ్యాక్టరీ పూర్తి
విడతల వారీగా ఫ్యాక్టరీ సామర్థ్యం పెంపు శ్రీవాత్సవ మీడియాతో మాట్లాడుతూ.. అలంపూర్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో సగభాగం మరమ్మతుకు లోనైన కోచ్లను బాగు చేస్తారని, ఫ్యాక్ట రీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 50 కోచ్లను మరమ్మత్తు చేస్తారని వివరించారు. అనంతరం ఈ ఫ్యాక్టరీ సామర్థ్యం 300 కోచ్లు మరమ్మత్తులు చేసేలా పెంచుతామని చెప్పారు. డబ్లింగ్ పనులు మొదటివిడతలో మహబూబ్నగర్ నుంచి దేవరకద్ర వరకు, రెండోవిడతలో జోగుళాంబ స్టేషన్ వరకు చేపడతామన్నారు. అమృత్ భారత్ స్కీంలో అభివృద్ధి చేసేందుకు కొన్ని రైల్వే స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిందని, ఇందులో గద్వాల రైల్వే స్టేషన్ ఒకటని చెప్పారు. ఈస్కీం కింద చేపడుతున్న పనులు జూన్ 2026 నాటికి పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. హైదరాబాద్ రైల్వే డివిజన్లో గద్వాల రైల్వే స్టేషన్ ముఖ్యమైనదని, గద్వాల నుంచి రైళ్ల పొడిగింపునకు అనేక వినతులు అందాయని, దీనిపై చాలా విషయాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. జీఎం వెంట డివిజనల్ రైల్వే మేనేజర్ లోకేష్ విష్ణోయ్, చీఫ్ ఇంజినీర్ నాగభూషణం, చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ సాంబశివరావ్తో పలువురు అధికారులు ఉన్నారు. ఇదిలాఉండగా, జీఎంను సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ అసిస్టెంట్ డివిజన్ సెక్రటరీ రైల్వేశంకర్ కలిసి వినతిపత్రం అందించారు. గద్వాల రైల్వే ఉద్యోగుల కుటుంబాల కోసం వ్యాయామశాల, గ్రౌండ్ ఏర్పాటు చేయాలని, గ్యాంగ్మెన్లకు రెస్ట్, టూల్ రూంలు, ఎలక్ట్రికల్ భవనం స్థానంలో నూతన భవనాన్ని నిర్మించాలని, పెండింగ్లో ఉన్న జోనల్, డివిజన్, రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ చేపట్టాలని కోరారు. గద్వాల న్యూటౌన్/స్టేషన్ మహబూబ్నగర్/ఉండవెల్లి: అలంపూర్లో చేపడుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు జూన్ 2026 నాటికి పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మహబూబ్నగర్, గద్వాల, జోగుళాంబ రైల్వే హాల్ట్లకు చేరుకొని అక్కడ చేపట్టిన అభివృద్ధి పనుల మ్యాప్లు, నమూనాలను పరిశీలించారు. ముందుగా ప్రత్యేక రైలులో గద్వాలకు వచ్చిన జీఎం రైల్వేట్రాక్, పనితీరును అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికుల భద్రత కోసం తీసుకుంటున్న చర్యల వివరాలు తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన అధికారులతో కలిసి అమృత్ భారత్ స్కీం కింద చేపడుతున్న స్టేషన్, ప్లాట్ఫాం విస్తీర్ణం, ఆర్చి, వెహికిల్ పార్కింగ్, రోడ్ల పనులను పరిశీలించారు. వాటి పురోగతి గురించి అధికారుల ద్వారా వివరాలు ఆరా తీశారు. అలంపూర్ రైల్వే కోచ్ పనులు వేగవంతం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీవాత్సవ అమృత్ భారత్ స్కీం కింద చేపడుతున్న అభివృద్ధి పనుల పరిశీలన మహబూబ్నగర్, గద్వాల, జోగుళాంబ రైల్వే హాల్ట్ సందర్శన -
కొత్త సత్రంలో అన్నప్రసాదం కొరత
అలంపూర్: ప్రసాద్ స్కీంలో భాగంగా శ్రీ బాలబ్రహ్మేశ్వరస్వామి నిత్య అన్నదాన సత్రంలో శుక్రవారం భక్తులకు అన్నప్రసాద కొరత ఏర్పడింది. అన్నదానంపై నిర్వాహకులు ఆలయాల్లో ప్రచారం చేయడంతో దర్శనానికి వచ్చిన భక్తులు ఒక్కసారిగా సత్రం వద్దకు చేరుకోవడంతో అన్నప్రసాదం కొరత నెలకొంది. శ్రావణ మాసం రెండో శుక్రవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వచ్చారు. స్వామి వారి దర్శనం అనంతరం భక్తులు మధ్యాహ్న సమయంలో అన్నదాన సత్రానికి ఒక్కసారి వెళ్లడంతో క్యూలైన్లలో బారులు తీరారు. భోజన హాల్ నిండిపోవడంతో ఆలయ సిబ్బంది బయట ఉన్న భక్తులను లోపలికి రానివ్వలేదు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామంజనేయులు బీజేపీ స్థానిక నాయకులతో కలిసి అన్నదాన సత్రాన్ని సందర్శించారు. భక్తుల ఇబ్బందులను ఈఓ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు. రూ. 10 కోట్ల ఆదాయం ఉన్న ఆలయంలో కనీసం భక్తులకు అన్నప్రసాదం అందజేయకపోతే ఎలా అని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర్శర్మ ప్రశ్నించారు. ఈ విషయమై ఆలయ ఈఓ పురేందర్కుమార్ స్పందిస్తూ.. రోజు మాదిరిగానే అన్న ప్రసాదం తయారు చేశామని, కానీ ఒక్కసారి భక్తుల రద్దీ పెరగడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. అయినా భక్తులందరికీ అన్నప్రసాదం దశల వారిగా అందించామని తెలిపారు. మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామన్నారు. -
ఉత్సాహంగా కబడ్డీ క్రీడాకారుల ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: యువ తెలంగాణ కబడ్డీ చాంపియన్షిప్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల ఎంపికలను శుక్రవారం జిల్లాకేంద్రంలోని స్టేడియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కబడ్డీ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్ మాట్లాడుతూ.. ఈనెల 3వ తేదీన హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో యువ తెలంగాణ చాంపియన్షిప్ సెలక్షన్స్కు సంబంధించి ముందుగా జిల్లాస్థాయిలో ఎంపికలు నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లాస్థాయిలో ఎంపికై న క్రీడాకారులు 3న ఉదయం 9గంటలకు ఎల్బీ స్టేడియంలో రిపోర్టు చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు దామోదర్రెడ్డి, సంయుక్త కార్యదర్శి నర్సింహులు, కార్యనిర్వాహక కార్యదర్శి బాల్రాజయ్య, శ్రీనివాసులు, గణేశ్ పాల్గొన్నారు. ఎంపికై న క్రీడాకారులు మహేశ్, హేమంత్, మహిపాల్, అరవింద్, పాండు, కౌశిక్, శ్రీకాంత్, హున్యానాయక్, శివ, శ్రీహరి, వినయ్, చందు, సురేశ్, కె.శ్రీకాంత్, రాకేష్కుమార్. -
ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం
కల్వకుర్తి రూరల్: కమ్యూనిస్టు పార్టీలకు వందేళ్ల చరిత్ర ఉందని.. పార్టీ సూర్యోదయం ఉన్నంత వరకు ఉంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని మార్కెట్యార్డులో పార్టీ జిల్లా మూడో మహాసభలు జిల్లా కార్యదర్శి బాల్నర్సింహ అధ్యక్షతన నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కమ్యూనిస్టుల చరిత్ర త్యాగాల పునాదులపై ఏర్పాటైందని.. ఎవరికి ఏ కష్టం వచ్చినా తీర్చే వరకు పోరాడే పార్టీ అన్నారు. భూ పోరాటాలు చేసి లక్షలాదిమంది పేదలకు భూ పంపిణీ చేయించామని.. కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, అంగన్వాడీలు తదితరుల సమస్యలపై రాజీలేని పోరాటాలు చేసే ఏకై క పార్టీ తమదేనని తెలిపారు. ప్రతి మూడేళ్లకు ఓసారి మహాసభలు నిర్వహించి దేశంలో ఏ పార్టీ ఏ విధంగా ఉందో సమాలోచనలు చేసి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. దేశంలో బీజేపీ ప్రమాదకర పార్టీ కావడంతోనే కాంగ్రెస్కు అండగా ఉండి పేదల అభ్యున్నతికి ప్రయత్నిస్తున్నామన్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎర్రజెండా ఎగిరేలా అన్నిచోట్ల పోటీ చేయాలని కోరారు. ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి కమ్యూనిస్టులను అంతం చేసేందుకు గడువు విధించారని.. ఎవరితోనూ సాధ్యం కాదన్నారు. కమ్యూనిస్టు పార్టీలు ఏకమైనప్పుడు ఢిల్లీ ఎర్రకోటపై ఎర్రజెండా ఎగురుతుందని తెలిపారు. మావోయిస్ట్ అగ్రనేత కేశవరావును హత్య చేయడం దారుణమని.. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా దహనం చేయడం దుర్మార్గమన్నారు. ప్రజల పక్షాన ప్రశ్నించే వారిని అర్బన్ నక్సలైట్లుగా ముద్రవేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. డిసెంబర్లో ఖమ్మం జిల్లాలో పార్టీ వందేళ్ల వేడుకలు పెద్దఎత్తున నిర్వహిస్తున్నామని చెప్పారు. రాబోయే మూడేళ్లు ప్రజల పక్షాన పోరాటం చేయడంతో పాటు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన వివరించారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. మానవజన్మ ఉన్నంత వరకు కమ్యూనిస్టు పార్టీ ఉంటుందని.. ప్రజా సమస్యలే అజెండాగా ఉన్న కమ్యూనిస్టు పార్టీని ఎవరూ ఏం చేయలేరని చెప్పారు. ఎర్రజెండా నీడన ప్రతి ఒక్కరూ ఉంటారన్నారు. పట్టణంలోని గచ్చుబావి నుంచి బహిరంగ సభ వేధిక వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు వార్ల వెంకటయ్య, డా. శ్రీనివాస్, కేశవగౌడ్, ఫయాజ్ పరశురాములు, చంద్రమౌళి, భరత్ తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిస్టు పార్టీల చరిత్ర అజరామరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు -
ఎగువ నుంచి జూరాలకు భారీగా వరద
ధరూరు/ఆత్మకూర్: కర్ణాటక, మహరాష్ట్రలో కురిసిన భారీ వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు ప్రాజెక్టుకు 2.15 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. దీంతో ప్రాజెక్టు 19 క్రస్టు గేట్లను ఎత్తి 1.86 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 23,729 క్యూసెక్కులు, కోయిల్సాగర్కు 315 క్యూసెక్కులు, నెట్టెంపాడుకు 750 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 44 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 1,250 క్యూసెక్కులు, కుడి కాల్వకు 650 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 600 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–2కు 750 క్యూసెక్కులు కలిపి 2.13 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 7.498 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వేగవంతంగా విద్యుదుత్పత్తి ... శుక్రవారం 11 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 5 యూనిట్ల ద్వారా 180.873 ఎంయూ, దిగువలో 6 యూనిట్ల ద్వారా 215.287 మిలియన్ యూనిట్లు కలిపి మొత్తం 396.160 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు. ఎగువన ప్రాజెక్టుల స్థితి.. జూరాల ఎగువన ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 129.72 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 103.11 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 1.49 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. ప్రాజెక్టు నుంచి దిగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టుకు 1.40 లక్షల నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 34.48 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 1.41 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. 25 గేట్లను ఎత్తి జూరాలకు 1.31 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 12 గేట్ల ద్వారా నీటి విడుదల రాజోళి: సుంకేసుల డ్యాంకు ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. శుక్రవారం ఎగువ నుంచి 48వేల క్యూసెక్కు ఇన్ఫ్లో రాగా..12 గేట్లను మీటర్ మేర తెరిచి 47,448 క్యూసెక్కుల నీటిని దిగువకు, 1,847 క్యూసెక్కుల నీటిని కేసీ కెనాల్కు వదిలినట్లు జేఈ మహేంద్ర తెలిపారు. ప్రాజెక్టుకు 2.15లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో 19 క్రస్టు గేట్ల ఎత్తివేత 2.13 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు.. -
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఇందిర పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ జూనియర్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాలను సేవిస్తే అనేక అనార్థాలు ఉన్నాయని, వాటికి అలవాటు పడడంతో శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయని, ఆడుతూపాడుతూ ఎదగాల్సిన యువత మత్తుపదార్థాలకు అలవాటు పడితే జీవితం అంధకారం అవుతుందన్నారు. అలాగే ర్యాగింగ్ నిషేధచట్టం, చైల్డ్లేబర్, లీగల్సర్వీస్ యాక్ట్పై అవగాహన కల్పించారు. ప్రిన్సిపాల్ భీంరెడ్డి, రవికుమార్, యోగేశ్వర్, అశోక్గౌడ్ పాల్గొన్నారు. జీవన ప్రమాణాలు మెరుగుపడాలి: వీసీ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే ఆర్థిక క్రమశిక్షణ అవసరం అని పాలమూరుయూనివర్సిటీ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు పీయూలో ఎంబీఏ విభాగం ఆధ్వర్యంలో ఆర్థిక విద్య, జీవన నైపుణ్యాలు అనే అంశంపై ఒకరోజు జాతీయ వెబినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆన్లైన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జాతీయ విద్యా విధానం–2020 ప్రకారం నైపుణ్య ఆధారిత పరిజ్ఞానం అవసరం అన్నారు. విద్యార్థి దశలోనే ఆర్థిక అవగాన పెంచుకుని, దేశ స్థూల జాతీయోత్పత్తిలో మీ వంతు పాత్ర పోషించాలన్నారు. కీనోట్ స్పీకర్, సీనియర్ కన్సల్టెంట్ బ్రహ్మ, రిజిస్ట్రార్ రమేష్బాబు, మధుసూదన్రెడ్డి, అర్జున్కుమార్, జావిద్ఖాన్, నాగసుధ, అరుంధతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. మొక్కలను సంరక్షించాలి మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలోని బండమీదిపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రార గణంలో కొనసాగుతున్న నర్సరీని శుక్రవారం స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని ఆయా నర్సరీలలో వివిధ రకాల మొక్కలను పెంచి సంరక్షించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. వీటి నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కార్యక్రమంలో డీఈఈ నర్సింహ, ఏఈ రాగవినతి, రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ హనుమంతు పాల్గొన్నారు. -
బాలికలకు రక్షణగా షీటీంలు: ఎస్పీ
మహబూబ్నగర్ క్రైం: జిల్లాలో షీటీం బృందాల ద్వారా బాలికలకు, మహిళలకు భద్రత కల్పిస్తున్నామని, రద్దీ ప్రాంతాల్లో నిత్యం నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి.జానకి ఒక ప్రకటనలో తెలిపారు. జూలైలో మొత్తం 25 ఫిర్యాదులు రాగా... రెండు కౌన్సెలింగ్ రెండు, 15 రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాయి, ఐదు ఈ–పెట్టీ కేసులు, మూడు ఎఫ్ఐఆర్లు, 21 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రధానంగా జిల్లాలో 60 హాట్ స్పాట్ ఏరియాలు బృందాలు తనిఖీ చేసినట్లు వెల్లడించారు. షీటీం పోలీసులు పాఠశాలలు, కళాశాలల దగ్గర ప్రత్యేక దృష్టి పెడుతున్నారని, ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఈవ్టీజింగ్ లేదా రోడ్లపై వెంబడించినా, అవహేళన చేస్తూ మాట్లాడినా డయల్ 100 లేదా 87126 59365 నంబర్కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు. 31 వరకు 30 పోలీస్ యాక్ట్ అమలు జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా, ప్రశాంతమైన వాతావరణం కల్పించడంలో భాగంగా ఈ నెల 31 వరకు జిల్లావ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ 1861 అమల్లో ఉంటుందని ఎస్పీ డి.జానకి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్న క్రమంలో డీఎస్పీ లేదా ఇతర పోలీస్ ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఎలాంటి పబ్లిక్ సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు చేయరాదని సూచించారు. కత్తులు, తుపాకులు, పేలుడు పదార్థాలు, నేరానికి పాల్పడే ఎలాంటి ఆయుధాలు అయిన వాడరాదని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లౌడ్ స్పీకర్లు, డీజేలు నిషేధించడం జరిగిందని, ఈ నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే 30 పోలీస్ యాక్ట్ 1861 కింద శిక్ష అర్హులని తెలిపారు. ఆపరేషన్ ముస్కాన్తో 133 చిన్నారులను రక్షించాం జూలై నెలలో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్–11 ద్వారా జిల్లాలో 133 మంది పిల్లలను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఎస్పీ డి.జానకి తెలిపారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా బడి ఈడు పిల్లలు బడిలో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్లో పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, కార్మిక శాఖ, విద్య శాఖ, చిన్నారుల రక్షణ శాఖల సమన్వయంతో ముమ్మరంగా తనిఖీ కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. రక్షించిన వారిలో 122 మంది బాలురు, 11 మంది బాలికలు ఉన్నారని వీరిలో 38 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా బాలకార్మికులు కన్పిస్తే డయల్ 100 లేదా జిల్లా కంట్రోల్ రూం 87126 59360 సమాచారం ఇవ్వాలని సూచించారు. -
పదోన్నతుల సందడి
నిరంతర పోరాటం ప్రజా సమస్యలపై పోరాటం నిరంతరం పోరాటం చేస్తామని సీపీఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. –8లో u● నేటినుంచి ప్రక్రియ ప్రారంభం ● ఉమ్మడి జిల్లాలో 650 నుంచి 750 మంది ఉపాధ్యాయులకు మేలు ● ఎస్జీటీలకు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, ఎస్ఏలుగా అవకాశం ● స్కూల్ అసిస్టెంట్లకుగెజిటెడ్ హెచ్ఎంలుగా ప్రమోషన్ ● ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లా పరిధిలో ఇలా.. జిల్లా పాఠశాలలు విద్యార్థులు ఉపాధ్యాయులు మహబూబ్నగర్ 791 62,724 4,650 నాగర్కర్నూల్ 808 54,152 3,513 వనపర్తి 495 38,147 2,097 జోగుళాంబ గద్వాల 448 55,289 2,064 నారాయణపేట 458 52,314 1,879 ఉపాధ్యాయులకు పదోన్నతుల ప్రక్రియ శనివారం నుంచే ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఆయా జిల్లాల వారీగా డీఈఓ వెబ్సైట్లలో గ్రేడ్–2 హెడ్మాస్టర్, స్కూల్ అసిస్టెంట్ సమానమైన క్యాడర్ ఖాళీల వివరాలను ఆన్లైన్లో పొందుపర్చాల్సి ఉంది. వీటితోపాటు గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతులు పొందాల్సిన ఎస్జీటీ ఉపాధ్యాయులు సీనియార్టీ ప్రొవిజనల్ లిస్టు, స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందనున్న ఎస్జీటీల ప్రొవిజనల్ సీనియార్టీ లిస్టును ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలి. ఈ మేరకు సీనియార్టీ జాబితాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పుకొనేందుకు ఈ నెల 3న అవకాశం ఉంటుంది. అలాగే 4, 5 తేదీల్లో సీనియార్టీ జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించి తుది జాబితా విడుదల చేస్తారు. 6న పదోన్నతులకు అర్హులైన వారు వెబ్ఆప్షన్లు పెట్టుకునేందుకు అవకాశం ఉంది. 7న సంబంధిత ఆర్జేడీ, డీఈఓల నుంచి ప్రమోషన్ ఆర్డర్ వెలువడనున్నాయి. ఇలా మొదట హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల ప్రక్రియను ఈ నెల 11 వరకు పూర్తి చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 11 వరకు.. -
పరిశ్రమలకు గడువులోగా అనుమతులు
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలోని పరిశ్రమ స్థాపనకు వివిధ శాఖల నుంచి గడువులో గా అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ విజయేందిర పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక క లెక్టరేట్లోని వీసీ హాల్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ జడ్చర్ల పోలేపల్లి సెజ్, ఇండస్ట్రీయ ల్ ఎస్టేట్ ఓపెన్ డ్రైవ్స్ అత్యవసరంగా చేపట్టి పూర్తి చేయాలన్నారు. కాలుష్యకారక పరిశ్రమలపై ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ పరిశ్రమలలో గాలి, నీటి కాలుష్యం, అన్ని రకాల కాలు ష్య కారక పరిశ్రమలను సందర్శించి రిపోర్ట్ సమర్పించాలని, పరిశ్రమలలో ప్రమాదాలు జరగ కుండా నివారించేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. పరిశ్రమలకు సంబంధించిన ఇబ్బందు లు ఉంటే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, జిల్లా పరిశ్రమ జనరల్ మేనేజర్ ప్రతాప్, కాలుష్య ని యంత్రణ మండలి ఈఈ సురేష్ పాల్గొన్నారు. -
సద్వినియోగం చేసుకోవాలి..
ప్రభుత్వం నుంచి తీసుకున్న రుణాలను మహిళా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతినెలా జరిగే జెడ్ఎంఎస్ సమావేశంలో సభ్యులకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. ఈసారి అనుకున్న లక్ష్యం కన్నా అధికంగా రుణాలు ప్రభుత్వం ఇచ్చింది. సక్రమంగా చెల్లిస్తే వడ్డీ లేని రుణం వర్తిస్తుంది. – కె.స్వాతి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్యం చేరుకుంటాం.. జిల్లాకు ఈ ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన రుణ లక్ష్యాన్ని పూర్తి చేస్తాం. మహిళలు ఆర్థిక పరిపుష్టి సాధించేందుకు ప్రభుత్వం రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగా ఏటా రుణ లక్ష్యం పెంచుతోంది. రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలి. – నర్సింహులు, డీఆర్డీఓ ● -
విద్యాభివృద్ధి ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): విద్యాభివృద్ధి ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని మీటింగ్హాల్లో మహబూబ్నగర్ ఫస్ట్, వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన శత శాతం వలంటీర్ల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తొలిసారిగా శత శాతం కార్యక్రమాన్ని మహబూబ్నగర్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీఎం విద్యాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. రూ.వేల కోట్ల నిధులు విద్యపై ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. మన మహబూబ్నగర్ పిల్లల భవిష్యత్ కోసం వందేమాతం ఫౌండేషన్తో కలిసి మహబూబ్నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో ఒక మంచి ఆలోచనతో శత శాతం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు.తమ ప్రభుత్వం వచ్చాక పదో విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ ఇవ్వడం వల్ల 54 శాతం ఉన్న ఫలితాలో 85 శాతానికి పెరిగాయన్నారు. గతేడాది పయనీర్ కార్యక్రమంలో ద్వారా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వడం వల్ల 114 మంది పేద విద్యార్థులకు ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులలో ఉచితంగా ప్రవేశాలు పొందారని అన్నారు. కలెక్టర్ విజయేందిర మాట్లాడుతూ మహబూబ్నగర్ను ఎడ్యుకేషన్హబ్గా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఎమ్మెల్యే ముందుకు సాగుతున్నారని అన్నారు. ప్రతి పాఠశాలలో డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ను తన సొంత నిధులతో ఉచితంగా అందించడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహీరెడ్డి, డీఈఓ ప్రవీణ్కుమార్, వందేమాతరం ఫౌండేషన్ సభ్యులు రవిందర్, మహబూబ్నగర్ ఫస్ట్ పర్యవేక్షకుడు గుండామనోహర్, ఏఎంఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
రుణ లక్ష్యం రూ.385 కోట్లు
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): మహిళా సంఘా ల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రుణాలు ఇస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025– 26)లో జిల్లాలోని మహిళలకు రుణాలు ఇవ్వడానికి అధికారులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. మహిళలకు రుణాలు ఇచ్చి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం బ్యాంక్ లింకేజీ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఏడాదికేడాది రుణ లక్ష్యం పెంచుతోంది. దీంతో జిల్లాలో మహిళా సంఘాలు ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా రుణాలు పొందుతూ.. ఆర్థిక పరిపుష్టి సాధించే దిశగా ముందుకు సాగుతున్నారు. గతంలో ఎప్పుడూ లేనట్లుగా అధికారులు బ్యాంక్ లింకేజీ రుణాలు ఈ స్థాయిలో ఇచ్చిన దాఖలాలు లేవు. లక్ష్యం చేరడమే గగనంగా ఉండే దిశ నుంచి అంతకు మించి రుణాలు ఇస్తున్నారు. కాగా.. జిల్లాలోని 754 మహిళా సంఘాలకు ఇప్పటికే రూ.74 కోట్లు పంపిణీ చేశారు. మండలాల వారీగా.. జిల్లాలోని 8,758 మహిళా సంఘాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.385.70 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందులో అత్యధికంగా కోయిల్కొండ మండలంలోని 934 సంఘాలకు రూ.36.26 కోట్లు, అత్యల్పంగా అడ్డాకుల మండలంలోని 419 సంఘాలకు రూ.16.25 కోట్లు కేటాయించారు. అలాగే మహబూబ్నగర్లోని 794 సంఘాలకు రూ.31.26 కోట్లు, మహమ్మదాబాద్లోని 613 సంఘాలకు రూ.24.20 కోట్లు, హన్వాడలోని 872 సంఘాలకు రూ.33.64 కోట్లు, నవాబ్పేటలోని 853 సంఘాలకు రూ.32.88 కోట్లు, భూత్పూర్లోని 489 సంఘాలకు రూ.19.74 కోట్లు, జడ్చర్లలోని 730 సంఘాలకు రూ.27.80 కోట్లు, దేవరకద్రలోని 687 సంఘాలకు రూ.27.54 కోట్లు, బాలానగర్లోని 667 సంఘాలకు రూ.26 కోట్లు, చిన్నచింతకుంటలోని 800 సంఘాలకు రూ.30.74 కోట్లు, గండేడ్లోని 657 సంఘాలకు రూ.24.98 కోట్లు, రాజాపూర్లోని 482 సంఘాలకు రూ.19.62 కోట్లు, మిడ్జిల్ మండలంలోని 456 సంఘాలకు రూ.18.35 కోట్ల రుణాలు ఇవ్వనున్నారు. జిల్లాలో 8,758 మహిళా సంఘాలకు ఇవ్వాలని నిర్ణయం కోయిల్కొండకు అధికంగా రూ.36.26 కోట్లు.. అత్యల్పంగా అడ్డాకులకు రూ.16.25 కోట్లు కేటాయింపు మహిళా సంఘాల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు.. -
నిరంతర విద్యుత్ కోసం రైతుల ఆందోళన
మహబూబ్నగర్ రూరల్: విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ శుక్రవారం మనికొండ సబ్స్టేషన్ ముందు రైతులు ధర్నా చేపట్టారు. సబ్స్టేషన్లో పనిచేసే ఆపరేటర్ త్రీ ఫేస్ కరెంట్ను సక్రమంగా సరఫరా చేయకపోవడం వల్ల పంటల సాగుకు అవసరమైన విద్యుత్ సరఫరా కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నిమార్లు విన్నవించినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఆందోళన చేస్తున్న విషయం గురించి తెలుసుకున్న ఏడీ మద్దిలేటి హుటాహుటిన మనికొండ సబ్స్టేషన్ వద్దకు చేరుకుని రైతులతో మాట్లాడి సక్రమంగా విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. విద్యుత్ సరఫరా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించబోనని, అందరిని మూకుమ్మడిగా సస్పెండ్ చేస్తానని ఏడీ సిబ్బందిని హెచ్చరించారు. ఏడీ హామీతో రైతులు తమ ధర్నాను విరమించారు. ధర్నాలో బీజేపీ మండల అధ్యక్షుడు గంగన్న, మాజీ సర్పంచ్ ఆంజనేయులు, నాయకులు సుధా సాగర్, మల్లేష్, శ్రీశైలం, నర్సిములు, వీరేష్, శేఖర్తో పాటు రైతులు పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో భూత్పూర్ ఏఆర్ఐ
భూత్పూర్: మండల అసిస్టెంట్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఏఆర్ఐ) బాలసుబ్రమణ్యం రూ.4 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. మండలంలోని కప్పెట గ్రామానికి చెందిన వ్యక్తి సాకలి ఆంజనేయులు తన చెల్లికి ఇటీవల పెళ్లి చేశాడు. అయితే కల్యాణలక్ష్మి పత్రాల ఎంకై ్వరీ కోసం ఎంఆర్ఐ బాలసుబ్రమణ్యం మొదట రూ.8 వేల లంచం డిమాండ్ చేసి.. తర్వాత రూ.4 వేలకు ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు శుక్రవారం ఏఆర్ఐ బాలసుబ్రమణ్యం తహసీల్దార్ కార్యాలయానికి వస్తూ.. మార్గమధ్యంలో సాకలి ఆంజనేయులు నుంచి రూ.4 వేలు డబ్బులు తీసుకుని వెళ్తుండగా ఏసీబీ అధికారులు వెంబడించి పట్టుకున్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి ఏఆర్ఐ బాలసుబ్రమణ్యంను తీసుకొచ్చి విచారించారు. అరెస్టు చేసి న్యాయస్థానం ముందు ప్రవేశపెడతామని ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ తెలిపారు. రూ.4 వేలు లంచం తీసుకుంటూపట్టుబడిన వైనం -
గూడు.. తీరొక్క గోడు!
‘ఇందిరమ్మ ఇళ్ల’లో కొర్రీలు ●పునాది కూల్చేస్తేనే బిల్లు ఇస్తామన్నారు.. మొదటి విడతలో నా పేరు మీద ఇందిరమ్మ ఇలు్ల్ మంజూరైంది. నాకున్న ఖాళీ స్థలంలో నింబంధనల ప్రకారం రెండు వరుసల పునాది వేశాం. అధికారులు పరిశీలనకు రాగా.. మేం ముగ్గు వేసిన తర్వాతనే పనులు ప్రారంభించాలని.. పునాది కూల్చివేయాలని చెప్పారు. ఆ తర్వాతే ముగ్గు పోస్తామని.. మళ్లీ పునాది నిర్మించిన తర్వాత బిల్లు మంజూరవుతుందన్నారు. లేదంటే ఇల్లు రద్దు చేస్తామని చెప్పారు. చేసేదేమీ లేక పక్కనే చిన్న పూరి గుడిసె వేసుకుని అప్పులు చేసి ఇంటి నిర్మాణ పనులు చేపట్టాం. – లక్ష్మమ్మ, పల్లెగడ్డ, మరికల్, నారాయణపేట బిల్లు అడిగితే స్పందించడం లేదు.. నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. నాకున్న ఖాళీ స్థలంలో అధికారులు 60 గజాలు కొలిచి ఇంటి నిర్మాణానికి ముగ్గు వేశారు. నాకు ఇద్దరు కుమారులు. దీంతో పక్కన మరింత ఖాళీ స్థలం ఉంటే ఇంటి నిర్మాణ పునాదిని విస్తరించాను. అధికారులు పరిశీలించి నిబంధనలు ఒప్పుకోవన్నారు. మేం ముగ్గు వేసిన వరకు నిర్మిస్తేనే బిల్లు మంజూరవుతుందని చెప్పారు. దీంతో వారు వేసిన ముగ్గు వరకే ఇల్లు నిర్మిస్తున్నా. గోడల పని పూర్తయింది. మొదటి బిల్లు ఇవ్వాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. స్పందించడం లేదు. – గోపాల్, పల్లెగడ్డ, మరికల్, నారాయణపేట ● అర్హుల జాబితాలో చేర్చి.. ఆపై తీసేయడంతో ఆందోళన ● అడ్డంకిగా మారిన పలు నిబంధనలు ● 600 ఎస్ఎఫ్టీలలోపే అనుమతితో పలువురు దూరం ● పక్కా ఇళ్లలో అద్దెకున్న వారికి వర్తించని పథకం సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పేద, మధ్య తరగతి కుటుంబాలకు గూడు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో నిబంధనల కొర్రీలు లబ్ధిదారుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. ప్రధానంగా 600 చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇల్లు నిర్మిస్తే ఇందిరమ్మ పథకం వర్తించదని అధికారులు తేల్చిచెబుతుండడంతో ఎటూ తేల్చుకోలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ క్రమంలో ఎక్కువ మొత్తంలో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం చేపట్టకుండా వేచి చూస్తున్నారు. మరో వైపు అర్హుల జాబితాలో చేర్చి, ఆపై తీసేయడం.. పక్కా ఇళ్లలో అద్దెకుంటున్న వారికీ మొండిచేయి చూపడంతో పలువురు ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రతిబంధకాలుగా మారిన నిబంధనలతో ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ఇబ్బందిపడుతున్న లబ్ధిదారులు, ఆశావహుల తీరొక్క గోడుపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. జిల్లాల వారీగా ఇందిరమ్మ ఇళ్ల వివరాలు.. -
రాష్ట్రానికి అన్యాయం చేస్తే ఊరుకోం
నారాయణపేట/దామరగిద్ద/అమరచింత: తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్ల కోసమని.. అలాంటి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. పేట– కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులు గురువారం దామరగిద్ద మండలం కానుకుర్తిలో ఏర్పాటు చేసిన గ్రామసభకు ఆమె హాజరై రైతులకు మద్దతు తెలిపి మాట్లాడారు. కేసీఆర్ పాలనలో ఎండాకాలంలోనూ చెరువులు నింపుకొన్నాం.. కానీ, ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమై నెలన్నర గడిచినా చెరువులు నింపుకోలేని దుస్థితి ఏర్పడిందన్నారు. ఉత్తర తెలంగాణ ప్రజలకు వరప్రధాయినిగా కాళేశ్వరం ఉన్నట్లు.. దక్షిణ తెలంగాణకు ఎంతో మేలు చేయాలనే దూరదృష్టితో కేసీఆర్ పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును చేపట్టారన్నారు. ఈ ప్రాజెక్టు పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 13 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు దోహదం చేస్తుందన్నారు. కొడంగల్, పేట నియోజకవర్గాల్లో 1.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందేలా ప్రాజెక్టు డిజైన్ చేస్తే.. సీఎం రేవంత్రెడ్డి కేవలం లక్ష ఎకరాలకే సాగునీరు అందించేలా మార్చారని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు ద్వారా కొడంగల్ నియోజకవర్గానికి సాగునీరు తీసుకుపోవడం మంచిదే.. కానీ, మధ్యలో ఉండే నారాయణపేట, దామరగిద్ద, ఊట్కూర్ ప్రాంతాల రైతులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని ప్రశ్నించారు. జూరాల నుంచి కాకుండా భూత్పూర్ రిజర్వాయర్ నీటిని పైపులైన్ ద్వారా తీసుకువస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే భీమా ప్రాజెక్టులో నీటి లభ్యత లేకుండాపోతుందని, ఫలితంగా మక్తల్ ప్రాంతానికి సాగునీరు అందే పరిస్థితి ఉండదన్నారు. తమకు సంఘీభావం ప్రకటించేందుకు వచ్చిన ఎమ్మెల్సీ కవిత ఎదుట నిర్వాసిత రైతులు కన్నీరుమున్నీరయ్యారు. ఒకే కుటుంబంలో 10–15 ఎకరాల భూమి కోల్పోతున్నామని రైతులు బోరున విలపించగా ఆమె వారిని ఓదార్చారు. రైతులు సమ్మతించే విధంగా పరిహారం అందే వరకు వెన్నంటి ఉంటానని, ఎవరూ బాధపడొద్దని పేర్కొన్నారు. అంతకు ముందు కాన్కుర్తికి వచ్చిన ఎమ్మెల్సీ కవితకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎంపీపీ వెంకట్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుభాష్, బాపన్పల్లి మాజీ సర్పంచ్ శ్రీనివాసులు, గున్ముక్ల గౌని శ్రీనివాసులు, నాయకులు జ్ఞానేశ్వర్, కృష్ణారెడ్డి, నిర్వాసిత రైతులు పాల్గొన్నారు. కాన్కుర్తిలో గ్రామ సభ ముగిసిన అనంతరం గద్వాలలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతూ ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుపై ఆగి.. నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కృష్ణానదికి కవిత పూజలు చేశారు. రైతుల కన్నీటి గోస ఊళ్లు ముంచుడు ఎందుకో.. కేసీఆర్ ప్రభుత్వంలో మల్లన్నసాగర్ నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారని, అదేవిధంగా పేట– కొడంగల్ ఎత్తిపోతల పథకంలో కూడా భూములు కోల్పోయే వారికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి.. ఎకరాకు రూ.35–40 లక్షల పరిహారం ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. అంతేకాకుండా భూములు కోల్పోయే గ్రామస్తులకు ఇళ్లు, భూములు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. రూ.20 లక్షలు పరిహారం ఇస్తానని సీఎం రేవంత్రెడ్డి చెప్పినా స్థానిక అధికారులు రూ.14 లక్షలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. నీళ్లు రాని ప్రాజెక్టు కోసం ఊళ్లు ముంచుడు ఎందుకో ఆలోచించాలన్నారు. కానుకుర్తి గ్రామ ప్రజల పక్షాన తాను నిలబడతానని పేర్కొన్నారు. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని.. మన పాలమూరు కంట కన్నీరు కారకుండా చూసుకోవాల్సిన బాధ్యత సీఎందేనన్నారు. పేట– కొడంగల్ నిర్వాసితులకు న్యాయం చేసే దాకా పోరాటం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత -
జూరాలకు భారీ వరద
ధరూరు/ రాజోళి/ ఆత్మకూర్: ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీ ఎత్తున వరద నీరు వస్తుంది. బుధవారం ప్రాజెక్టుకు 1.78 లక్షల ఇన్ఫ్లో ఉండగా.. గురువారం రాత్రి 8 గంటల వరకు 2.01 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. ప్రస్తుత సీజన్లో ఇంత పెద్దఎత్తున వరద రావడం ఇదే మొదటిసారి. దీంతో ప్రాజెక్టు వద్ద 18 క్రస్టు గేట్లను ఎత్తి గేట్లను ఎత్తి దిగువకు 1,79,316 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 25,205 క్యూసెక్కులు వదులుతున్నారు. అలాగే కోయిల్సాగర్ ఎత్తిపోతలకు 315 క్యూసెక్కులు, నెట్టెంపాడుకు 750, ఎడమ కాల్వకు 1,250, కుడి కాల్వకు 650, సమాంతర కాల్వకు 800, భీమా లిఫ్టు–2కు 750 క్యూసెక్కులు వదలగా.. 43 క్యూసెక్కులు ఆవిరైంది. మొత్తం ప్రాజెక్టు నుంచి 2.08 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.914 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇదిలా ఉండగా.. ఎగువనున్న ఆల్మట్టి ప్రాజెక్టుకు 1,57,170 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. దిగువకు 1.40 లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు. అలాగే నారాయణపూర్ ప్రాజెక్టుకు 1.35 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. ● జూరాలలోని ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో గురువారం 11 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 5 యూనిట్ల ద్వారా 195 మెగావాట్లు, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్ల విద్యుదుత్పత్తి సాధించామన్నారు. సుంకేసులకు తగ్గిన ఇన్ఫ్లో సుంకేసులకు ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టింది. రెండు రోజులుగా లక్ష క్యూసెక్కులకు పైగా కొనసాగిన ఇన్ఫ్లో గురువారం 72 వేల క్యూసెక్కులకు చేరింది. దీంతో అధికారులు 18 గేట్లను ఒక మీటరు మేర తెరిచి 69,138 క్యూసెక్కులను దిగువకు, కేసీ కెనాల్కు 1,847 క్యూసెక్కులు వదిలినట్లు జేఈ మహేంద్ర తెలిపారు. నిండుకుండలా రామన్పాడు జలాశయం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయం గురువారం పూర్తిస్థాయి నీటిమట్టంతో నిండుకుండను తలపిస్తోంది. సముద్ర మట్టానికి పైన 1,021 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జలాశయానికి జూరాల ఎడమ కాల్వ నుంచి 1,184 క్యూసెక్కులు, సమాంతర కాల్వ నుంచి 775 క్యూసెక్కుల వరద కొన సాగుతుండగా.. ఎన్టీఆర్ కాల్వకు 1,040 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 45 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 273 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రాజెక్టుకు 2 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో 18 క్రస్టు గేట్ల ఎత్తివేత.. దిగువకు 2.8 లక్షల క్యూసెక్కులు విడుదల -
తల్లిపాలే కీలకం
శిశువు ఎదుగుదలలోడబ్బా పాలతో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం మహబూబ్నగర్ రూరల్: ‘‘మాతృత స్పర్శకు ప్రతి మహిళ పరితపిస్తుంది.. పుట్టిన బిడ్డ ప్రేమను ఆస్వాదించాలని ఆరాటపడుతుంది. ఆ సమయంలో తల్లిపాలు పసికందుకు సంజీవనిలా పని చేస్తుందని అనేకసార్లు వైద్య నిపుణులు నొక్కి చెప్పారు’’.. తల్లి పాల ప్రాముఖ్యాన్ని మహిళలకు వివరించేందుకు ప్రభుత్వం ప్రతి ఏడాది ఆగస్టు మొదటి వారంలో తల్లి పాల వారోత్సవాలను నిర్వహిస్తోంది. సమగ్ర శిశు అభివృద్ధి సేవా సంస్థ (ఐసీడీఎస్) ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి గర్భిణులు, బాలింతలకు వివరిస్తారు. తల్లిపాలపై ఉన్న అపోహలను పోగొట్టి.. తల్లిపాల విశిష్టతను గర్భిణులు, బాలింతలకు వివరించేందుకు జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారులు శుక్రవారం తల్లిపాల వారోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. తల్లిపాలే బిడ్డకు అమృతం ప్రస్తుతం పుట్టిన గంటలో 41 శాతం మంది పిల్లలకు మాత్రమే తల్లిపాలు ఇస్తున్నారు. బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటానికి కావాల్సిన అన్ని రకాల పోషక విలువలు తల్లి పాలలో ఉంటాయి. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత గంటలోపే బిడ్డకు తల్లి పాలు ఇవ్వాలి. దీనివల్ల బిడ్డకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సాధారణంగా పిల్లలకు ఐదేళ్లలోపు వచ్చే డయేరియా, వైరల్ జ్వరాలు, కామెర్లు వంటి రకరకాల వ్యాధుల నుంచి తల్లిపాలు రక్షిస్తాయి. పిల్లలకు శ్వాసకోశ వ్యాధులు, అస్తమా, అలర్జీ, డయాబెటిస్ క్యాన్సర్, ఊబకాయం, చెవిలో ఇన్ఫెక్షన్లు వంటివి రాకుండా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. పిల్లల మానసిక పెరుగుదలకు తల్లి పాలు ఎంతో దోహదం చేయడమే కాకుండా బరువును అదుపులో ఉంచుతుంది. క్రమం తప్పకుండా పుట్టినప్పటి నుంచి ఆరు నెలల వరకు బిడ్డకు తల్లి పాలను తప్పక ఇవ్వాలని వైద్యులు స్పష్టం చేస్తుంటారు. ఇంటింటికీ అంగన్వాడీ పేరుతో అవగాహన నేటి నుంచి తల్లిపాల వారోత్సవాలు -
రెండు బైకులు ఢీ: వృద్ధుడి దుర్మరణం
కల్వకుర్తి రూరల్: మండలంలోని గుంటూరు గ్రామ సమీపంలో రెండు బైకులు ఢీకొన్న ఘటనలో వృద్ధుడు మృతి చెందాడు. గురువా రం గ్రామానికి చెందిన బూడిద బాలయ్య(65) బైక్పై పొలం నుంచి పాలు తీసుకొని గ్రామానికి వస్తున్న నేపథ్యంలో శంకరయ్య అనే వ్యక్తి బైక్తో ఢీకొట్టడంతో బాలయ్య కిందపడ్డాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం కల్వకుర్తి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీ సులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ హనుమంతరెడ్డి తెలిపారు. విద్యుదాఘాతంతోవ్యక్తి మృతి ధన్వాడ: విద్యుత్ ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం ధన్వా డ మండలంలోని గున్మక్ల గ్రామంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చెన్నయ్యగౌడ్(56) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బుధవారం రాత్రి ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంక్లో నీరు నింపేందుకు మోటార్ ఆన్ చేసేందుకు ప్లగ్ను స్విచ్ బోర్డులో పెడుతుండగా ప్రమాదవశాస్తు విద్యు త్ షాక్ కొట్టి పడిపోవడంతో కుటుంబ సభ్యు లు మరికల్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి భార్య సినామ్మ ఫిర్యాదు మేరకు ధన్వాడ పోలీసులు కేసు నమోదు చేశారు. చికిత్స పొందుతూవ్యక్తి మృతి మానవపాడు: ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి తీసుకెళ్లిన యువకుడి తండ్రితో ఆమె బంధువులు ఫోన్లో అన్న మాటలకు మనస్తాపం చెంది పురుగుల మందు తాగాడు. చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన గురువారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ చంద్రకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని జల్లాపురం గ్రామానికి చెందిన బతికిన హేమలమ్మ, జమ్మన్నల కుమారుడు బతికిన వీరేంద్ర రేవతిని ప్రేమించాడు. పెళ్లి చేసుకోవడానికి ఆమెను తీసుకెళ్లాడు. దీంతో అ మ్మాయి బంధువులు జల్లాపురం దావీదు, కర్నూల్కు చెందిన సుధాకర్, రాము, బీచుపల్లి, రాముడు కలిసి వీరేంద్ర తండ్రి జమ్మన్నకు ఫోన్ చేసి కొడుకు తీసుకెళ్లిన అమ్మాయిని తీసుకరావాలని హెచ్చరించారు. వాళ్ల మాటలకు జమ్మన్న(45) మనస్తాపానికి గురై మంగళవారం పురుగు మందు తాగాడు. వెంటనే చికిత్స నిమి త్తం కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన భార్య హేమలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. నీళ్లు తెచ్చేందుకు వెళ్లి శవమై తేలాడు పెద్దకొత్తపల్లి: బావిలో నీళ్లు తెచ్చేందుకు వెళ్లి యువకుడు శవమై తేలిన ఘటన మండలంలోని పెద్దకారుపాములలో జరిగింది. గ్రామానికి చెందిన ఎండీ ఆసిఫ్(22) అనే యువకుడు పొలం పనులకు వెళ్లి బావి వద్దకు నీళ్లు తెచ్చేందుకు వెళ్లి మూర్ఛ రావడంతో బావిలో పడి మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన బిక్కు, హాజీయాబేగం దంపతుల కుమారుడు ఆసీఫ్ కూలీగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన గోవింద్ అనే రైతు వ్యవసాయ పొలంలో గుంటక తోలడానికి వెళ్లాడు. మధ్యాహ్న భోజన సమయంలో నీళ్లు తెచ్చేందుకు వ్యవసాయ బావి వద్దకు వెళ్లగా మూర్ఛ రావడంతో బావిలో పడి మృతి చెందాడు. యువకుడి మృతి విషయమై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ సతీష్ తెలిపారు. కొత్త వ్యక్తులతోజాగ్రత్తగా ఉండాలి మహబూబ్నగర్ క్రైం: నగరాల్లో ఇతర ప్రాంతాల నుంచి అద్దెకు నివాసం ఉండటానికి కొత్త వారు ఎంతో మంది వస్తుంటారని, అలాంటి వాళ్లకు ఇళ్లను అద్దెకు ఇచ్చే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలని డీఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. మహబూబ్నగర్ వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బండ్లగేరి ఏరియాలో గురువారం కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు మొత్తం 210 ఇళ్లు తనిఖీ చేసి ఆయా ఇళ్లలో నివాసం ఉండే వారి ఐడెంటీ పత్రాలు పరిశీలించారు. ఈ క్రమంలో 15 ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలను ఎలాంటి పత్రాలు లేకుండా అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం పోలీస్ అన్ని రకాల చర్యలు చేపడుతుందని తెలిపారు. పోలీసులు పలు రకాల అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికి ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో వన్టౌన్ సీఐ అప్పయ్య, ఎస్ఐ శీనయ్య ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
బీసీ రిజర్వేషన్పై కేంద్ర మంత్రులు స్పందించాలి
అచ్చంపేట రూరల్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ స్పందించాలని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. గురువారం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని టీఎన్జీఓ భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజస్తాన్, గుజరాత్ రాష్ట్రాల్లో అమలవుతున్నట్టుగా తెలంగాణలోనూ ఆర్డినెన్స్ తీసుకొచ్చి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు కేంద్రం సహకరించాలన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యంతో పాకిస్తాన్, ఇండియా మధ్య యుద్ధం ఆగిందని అనేకసార్లు ప్రకటించారని, దీనిపై పార్లమెంట్లో ప్రధాని మోదీ సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఇద్దరు బీజేపీ కేంద్ర మంత్రులు ఉన్నారని, కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి బీసీ రిజర్వేషన్ అమలు చేసేందుకు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారని, ఆ హామీలను అమలు చేయాలన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తున్నా.. ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంలో నిర్లక్ష్యం చేస్తుందని, దీనిపై ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో గ్రామస్థాయిలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పర్యటించి స్థానిక సమస్యలను అధ్యయనం చేసి ఎక్కడికక్కడ ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. అప్పటికీ స్పందించకపోతే రాష్ట్రస్థాయిలో భారీ ఎత్తున ప్రజా పోరాటాలు తప్పవని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు సాగర్, వెంకట్రాములు, ధర్మానాయక్, పర్వతాలు, దేశ్యానాయక్, శంకర్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
డ్యాం గేట్ల రోప్ల పరిశీలన
రాజోళి: సుంకేసుల డ్యాం గేట్లకు ఉన్న రోప్ను పరిశీలించి ముందస్తుగా చర్యలు చేపట్టారు. వరద ఉధృతి ఎక్కువగా వస్తుండటంతో డ్యాం గేట్లను అప్పటికే పరిశీలించిన అధికారులు, అనుసంధానంగా ఉన్న రోపులను పరిశీలించారు. గత రెండు రోజులుగా లక్ష క్యూసెక్కులకు పైగా వచ్చిన వరద కారణంగా రోపులు దెబ్బతిన్నాయా అన్న కోణంలో చర్యలు చేపట్టారు. గురువారం ఎగువ నుంచి వస్తున్న వరద కొంత తగ్గుముఖం పట్టడంతో అవసరమైన చోట పనులు చేపట్టారు. నదికి వస్తున్న వరద కారణంగా రోపులను పరిశీలించి ముందస్తు మరమ్మతులు చేపడుతున్నట్లు జేఈ మహేంద్ర పేర్కొన్నారు. -
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి
జడ్చర్ల: పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే ప్రమాదముందని కలెక్టర్ విజయేందిర బోయి పేర్కొన్నారు. గురువారం మిడ్జిల్లో కలెక్టర్ రెండు గంటల పాటు పర్యటించారు. మొదటి కస్తూర్బాగాంధీ పాఠశాలలో భోజనశాల, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థుల కు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలని ఆదేశించారు. పరిసరాలు ఎప్పటికప్పడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. డ్రెయినేజీ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయం సమీపంలో చెత్త చెదారం పేరుకుపోవడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. సామూహిక మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి స్థల పరిశీలన చేశారు. మిడ్జిల్–కొత్తూరు ప్రధాన రహదారిపై చెత్త కుప్పలు కనిపించడంతో పంచాయతీ కార్యదర్శి సాయన్నపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో పారిశుద్ధ్య లోపం ఎక్కువగా ఉందని, ఇందుకు సంజాయిషీ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఇళ్ల నిర్మాణం, అందుకు అవుతున్న ఖర్చులపై ఆరా తీశారు. అక్కడి నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి తనిఖీలు చేశారు. కలెక్టర్ వెంట హౌసింగ్ పీడీ భాస్కర్, తహసీల్దార్ యూపీ రాజు, ఎంపీడీఓ గీతాంజలి, ఎంపీఓ ఆనంద్, డాక్టర్ శివకాంత్, మాజీ ఎంపీటీసీ ఎండీ గౌస్ ఉన్నారు. పారద్శకంగా విచారణ చేయాలి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): రీ సర్వే చేసిన పట్టదారుల వివరాలను పహాణిలోని వివరాలపై పారదర్శకంగా విచారణ చేయాలని సీసీఎల్ఏ రాష్ట్ర కమిషనర్ లోకేష్, సర్వే సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్ హనుమంతు ఆదేశించారు. గండేడ్ మండలం సాలార్నగర్ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ చేసిన రీసర్వేపై వీసీ నిర్వహించారు. జిల్లా రెవెన్యూ సర్వే సిబ్బంది ఫీల్డ్కి వెళ్లి రీ సర్వే చేసిన పట్టాదారుల పహాణీలోని వివరాలు విచారణ చేసి రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలన్నారు. భూ సమస్యల పరిష్కారానికి సంబంధించి అధికారులు పారదర్శంగా వ్యవహరించాలని, ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగితే ఆ బాధ్యత అధికారులదేనన్నారు. వీసీలో కలెక్టర్ విజయేందిర, అడిషనల్ కలెక్టర్ ఎనుగు నర్సింహారెడ్డి, ఆర్డీఓ నవీన్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కిషన్రావు పాల్గొన్నారు. -
అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం
అలంపూర్: అధికార, ప్రతిపక్ష పార్టీల నేత మధ్య రగడ నెలకొంది. స్థానికంగా పట్టు కోసం నువ్వా నేనా అన్నట్లుగా అధికార ప్రతిపక్ష నేతలు పోటీపడ్డారు. సజావుగా సాగాల్సిన మంత్రి పర్యటన ఉద్రిక్తతలకు దారిసింది. అలంపూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రి వాకిటి శ్రీహరి హాజరయ్యారు. మంత్రికి స్వాగతం పలికేందుకు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ అలంపూర్ చౌరస్తాకు రాగా.. అదే సమయంలో బీఆర్ఎస్కు చెందిన స్థానిక ఎమ్మెల్యే విజయుడి మంత్రికి స్వాగతం పలికేందుకు వచ్చారు. ఈ క్రమంలో ఓ పోలీస్ అధికారికి ఎమ్మెల్యేకు కొంత వాదనలు జరిగింది. మంత్రికి ఎమ్మెల్యే స్వాగతం పలికారు. ఈ క్రమంలో జరిగిన పరిణామాలతో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సభావేతాక వద్దకు వెళ్లకుండా బయటే ఉండిపోయారు. సమావేశంలో ఎమ్మెల్యే ప్రసంగిస్తూ కాంగ్రెస్లోని స్థానిక నేతలు కమీషన్ల దందా కొనసాగిస్తున్నారని ఆరోపించారు. మట్టి, ఇసుకతో పాటు ప్రతి దానికి ఒక రేట్ కట్టి వసూళ్లు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. అనంతరం మార్కెట్ చైర్మన్ దొడ్డెప్ప మాట్లాడుతూ...బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ 18 నెలల పాలనలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇచ్చిందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే తర్వాత మంత్రి మాట్లాడాల్సి ఉండగా మార్కెట్ యార్డు చైర్మన్కు ఎలా ఇస్తారని ఎమ్మెల్యే ప్రస్తావించారు. ఆరోపణలు మరోసారి ప్రస్తావించారు. దీంతో ఇటు ఎమ్మెల్యే.. అటు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రి వాకిటి శ్రీహరి, కలెక్టర్ బీఎం సంతోష్ ఇరువురిని వారించి నచ్చజెప్పారు. అనంతరం అన్నదాన సత్రం ప్రారంభోత్సవంలో ఎవరికి వారు అన్నట్లుగా వ్యవహరించారు. ముందుగా ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఆ తర్వాత ఎమ్మెల్యే, చివరగా సాయంత్రం మంత్రి అన్నదాన సత్రంలో పూజలు చేశారు. ఇలా ఉదయం నుంచి సాయంత్రం వరకు పోటాపోటీగా మాటల యుద్ధం, వాగ్వాదాలతో మంత్రి పర్యటన ముగిసింది. అలంపూర్లో మంత్రి, అధికారుల ఎదుట నేతల వాగ్వాదం ఉద్రిక్తంగా సాగిన మంత్రి వాకిటి పర్యటన -
చిరుతను పట్టుకునేందుకు చర్యలు తీసుకోవాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): టీడీ గుట్టలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో చిరుతను పట్టుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ కోరారు. గురువారం సాయంత్రం చిన్నదర్పల్లికి వెళుతున్న ఆయనకు గుట్టపై చిరుత తారసపడడంతో కారు దిగి గమనించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల రోజులవుతున్నా.. అధికారులు చిరుతను పట్టుకోవడంలో విఫలమయ్యారని అన్నారు. అటవీశాఖ అధికారులు అవసరం అయితే నిపుణుల ను పలిపించి చిరుతను బంధించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సిబ్బంది తక్కువగా ఉంటే ఇత ర ప్రాంతాల నుంచి సిబ్బందిని రప్పించాలన్నారు. -
3 పట్టణాలతో కలిపి క్లస్టర్ ఏర్పాటు
పాలమూరు/మహబూబ్నగర్ మున్సిపాలిటీ: మహబూబ్నగర్, జడ్చర్ల, భూత్పూర్ను కలిపి క్లస్టర్గా ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ క్లస్టర్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. దీనికి సంబంధించి రూ.975.48 కోట్లతో తయారుచేసిన సమగ్ర ప్రతిపాదనలను గురువారం ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ను ఎమ్మెల్యేతో పాటు ఎంపీ డీకే అరుణ కలిసి అందజేశారు. దీని ఆవశ్యకతను ఈ సందర్భంగా వారు వివరించారు. ముఖ్యంగా విద్య, వైద్యం, ఉపాధి, సాంస్కృతిక, క్రీడ లు, కమ్యూనిటీ సెంటర్లు, ఆడిటోరియాలు, ఆరోగ్య కేంద్రాలు, గ్రంథాలయాలు, పార్కుల ఏర్పాటుతో ప్రజారవాణా, ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ఈ పాటికే మహబూబ్నగర్ క్లస్టర్కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. కాగా, దీనికి అన్ని విధాలా సహకరిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారన్నారు. వారం రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తాం మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగర పరిధిలోని దివిటిపల్లిలో నెలకొన్న సమస్యలను వారం రోజులలోగా పరిష్కరిస్తామని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్కుమార్రెడ్డి అన్నారు. గురువారం దివిటిపల్లికి వెళ్లి స్థానికులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైల్వేస్టేషన్ నుంచి కాలనీ వరకు రోడ్డు సౌకర్యం, అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, వీధి దీపాలు వెలగడం, డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేదని వారు వాపోయారు. వీటన్నింటిని త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సీపీఎం నాయకులు ఎ.రాములు, నల్లవెల్లి కురుమూర్తి, కడియాల మోహన్, రాజ్కుమార్, భానుప్రసాద్, ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు శివప్రసాద్రెడ్డి, కాజల్ చంద్రశేఖర్, సురేందర్రెడ్డి, జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు. కార్మిక సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం పాలమూరు: ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమా న్ని విస్మరించి హక్కులను కాలరాస్తున్నాయని టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సి.వెంకటేష్ ఆరోపించారు. గురువారం జిల్లాకేంద్రంలో ర్యాలీ నిర్వహించి, తెలంగాణ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సాంబశివుడుతో కలిసి మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచలేదని ఆరోపించారు. కార్మిక సంఘాలతో చర్చలు జరపకుండా అప్రజాస్వామిక పాలనను కొనసాగించిందన్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, టైంస్కేల్ విధానాన్ని పట్టించుకోకుండా రెగ్యులర్ చేస్తామన్న హామీని నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి కార్మికుల సంక్షేమాన్ని విస్మరించందన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టరేట్ ఏఓ సువర్ణరాజుకు అందజేశారు. కార్యక్రమంలో బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొండన్న, గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా అధ్యక్షుడు వెంకట్రాములు, వివిధ రంగాల కార్మిక సంఘాల నాయకులు పి.దాసు, డి.అరుణ, బాలు, నర్సింహులు పాల్గొన్నారు. -
అంతా మా ఇష్టం!
రాజాపూర్: పరిశ్రమల నుంచి కాలుష్యాన్ని బయటకు వదలకూడదని ఇటు అన్ని శాఖలతో పాటు కాలుష్య నియంత్ర బోర్డు అధికారులు యా జమాన్యాలను హెచ్చరిస్తున్నా.. పోలేపల్లి సెజ్లోని పా ర్మా పరిశ్రమల తీరు మారడంలేదు. అధికారుల వచ్చి హడావుడి చేసినా యాజమాన్యాలు పరిశ్రమల నుంచి కాలుష్య జలాలను రైతుల పొలాల్లోకి యథేచ్ఛగా వదులుతున్నారు. ఇప్పటికే పోలేపల్లి సెజ్ చుట్టూ పొలాలున్న రైతులు గతకొన్ని సంవత్సరాలుగా పరిశ్రమలు వదులుతున్న జల, వాయు కాలుష్యాల మూలంగా పంటలు పండక, జన జీవరాసులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాలపై ముదిరెడ్డిపల్లి, రాయపల్లి, పోలేపల్లి రైతులు సంబంధిత అధికారులకు ఎన్నో పర్యాయయాలు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. అయితే అధికారులు వచ్చినప్పుడు పరిశ్రమల్లో నుంచి బయటికి కాలుష్యం వదలకుండా జాగ్రతలు తీసుకుంటారు. మరుసటి రోజే కాలుష్యాన్ని బయటికి వదలడం పరిపాటిగా మారింది. ఇటీవల ప్రజావాణిలో కలెక్టర్కు సమీప గ్రామాల రైతులు ఫిర్యాదు చేశాయగా.. కలెక్టర్ సంబంధిత అన్ని శాఖలను కలిపి కమిటీ వేశారు. దీంతో మంగళవారం అధికారుల బృందం సెజ్లోని పరిశ్రమలు, రైతుల పొలాలను పరిశీలించి నీటి శ్యాంపిల్లను తీసుకువెళ్లారు. అధికారులు వచ్చి 24గంటలు కాకముందే సెజ్లోని పరిశ్రమల నుంచి జల, వాయుకాలుష్యాన్ని వదులుతున్నారు. ఇటీవల పూర్తి అనుమతులు కూడా రాని ఓ ఫార్మా కంపెనీ ట్రయల్రన్ ను ంచే కాలుష్యపు నీటిని బయటికి వదులుతున్నారు. జువైనెల్ కోర్టుకు లైంగిక దాడి నిందితులు జడ్చర్ల: ఏడేళ్ల చిన్నారిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఐదుగురు మైనర్ బాలురను గురువారం అరెస్ట్ చేసి మహబూబ్నగర్ జువైనెల్ కోర్టులో హాజరు పరచినట్లు స్థానిక సీఐ కమలాకర్ తెలిపారు. లైంగిక దాడికి గురైన బాలికకు వైద్య చికిత్సల అనంతరం తల్లిదండ్రులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. తమ అమ్మానాన్నలను చూసే ఇటువంటి అఘాయిత్యానికి పాల్పడ్డామని ఓ నిందితుడు పోలీసుల విచారణలో చెప్పడం గమనార్హం. అధికారులు వచ్చినప్పుడు హడావుడి యథేచ్ఛగా రైతుల పొలాల్లోకి కాలుష్య జలాలు పోలేపల్లి సెజ్లో మారని పార్మా పరిశ్రమల తీరు -
పరీక్షల కోసం వెళ్తే ప్రాణం తీశారు..
అచ్చంపేట రూరల్: వైద్య పరీక్షల కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లిన నిండు గర్భిణికి హడావుడిగా సిజేరియన్ చేయడంతో తీవ్ర రక్తస్రావమై మృతిచెందింది. ఈ దుర్ఘటన అచ్చంపేట పట్టణంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. ఉప్పునుంతల మండలం అయ్యవారిపల్లికి చెందిన గర్భిణి శ్రావణి (22) బుధవారం వైద్య పరీక్షల నిమిత్తం అచ్చంపేటలోని ఎంఎంఆర్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి వచ్చింది. పరీక్షించిన వైద్యుడు కడుపులో బిడ్డ ఉమ్మనీరు మింగిందని.. వెంటనే ఆపరేషన్ చేయకపోతే తల్లీబిడ్డ ప్రాణాలకే ప్రమాదమని కుటుంబ సభ్యులకు చెప్పాడు. రెండు ప్రాణాలకు ఆపాయం ఉండటంతో వారు సిజేరియన్కు ఒప్పుకొన్నారు. అయితే మగబిడ్డకు జన్మనిచ్చిన శ్రావణికి కొంత సేపటికే అధిక రక్తస్రావం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. విషయం తెలుసుకున్న ఆస్పత్రి వైద్యుడు (జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త) తన స్వంత కారులో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది. బంధువుల ఆందోళన.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతురాలి బంధువులు ఎంఎంఆర్ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వారికి పలు సంఘాల నాయకులు మద్దతు పలికారు. ఆస్పత్రి గుర్తింపు రద్దు చేయాలని, బాలింత మృతికి కారకులైన వైద్యుడు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రసవానికి పది రోజుల సమయం ఉన్నా.. డబ్బుల కోసం హడావుడిగా ఆపరేషన్ చేయడంతోనే శ్రావణి మృతి చెందిందని వారు ఆరోపించారు. ఆస్పత్రి ఎదుట 6గంటల పాటు అంబులెన్స్లోనే శ్రావణి మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేశారు. ఏడాదిక్రితమే వివాహం.. శ్రావణి స్వగ్రామం అమ్రాబాద్ మండలం మన్ననూర్లోని ప్రశాంత్నగర్ కాలనీ. అయ్యవారిపల్లికి చెందిన ఎల్లస్వామితో ఏడాది క్రితమే శ్రావణికి వివాహం కాగా.. జూలై 25న పెళ్లి రోజు వేడుక జరుపుకొన్నారు. అయితే మొదటి కాన్పులో మగశిశువుకు జన్మనిచ్చిన శ్రావణి గంటల వ్యవధిలోనే మృతిచెందడం కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చింది. రూ. 9లక్షలకు ప్రాణం ఖరీదు.. మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులు పెద్దఎత్తున ప్రైవేటు ఆస్పత్రికి వస్తున్నారన్న విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులతో సెటిల్మెంట్ చేసుకోవాలని సదరు ఆస్పత్రి వైద్యుడిపై పోలీసులే ఒత్తిడి తేవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. బాలింత ప్రాణం ఖరీదు రూ. 9లక్షలకు సెటిల్ అయినట్లు తెలిసింది. ఈ విషయమై ఎస్ఐ విజయభాస్కర్ను వివరణ కోరగా.. మృతురాలి తల్లి తిరుపతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. తీవ్ర రక్తస్రావంతో బాలింత మృతి మగబిడ్డకు జన్మనిచ్చి.. తనువు చాలించిన వైనం ఆస్పత్రి ఎదుట మృతదేహంతో కుటుంబ సభ్యుల ఆందోళన -
ఏడేళ్ల చిన్నారిపై సామూహిక లైంగిక దాడి
మహబూబ్ నగర్ జిల్లా: అభం శుభం తెలియని చిన్నారిపై ఐదుగురు బాలురు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన సంఘటన జడ్చర్లలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. జడ్చర్లలోని 167 నంబర్ జాతీయ రహదారిని ఆనుకునిఉన్న ఓ కాలనీలో నివాసం ఉంటున్న ఏడేళ్ల చిన్నారిపై ఐదుగురు బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారిలో చిన్నారి సొంత అన్న కూడా ఉన్నాడు. మూడు రోజుల క్రితం (ఆదివారం) పక్కింట్లో ఆడుకోవడానికి వెళ్లిన చిన్నారిపై చుట్టుపక్కల ఇళ్లకు చెందిన ఐదుగురు బాలురు లైంగికదాడికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకరు ఇంటర్ చదువుతున్న 16 ఏళ్ల బాలుడు, మరో నలుగురు ప్రాథమిక విద్యనభ్యసిస్తున్నారు. అత్యాచారం జరిగిన తరువాత చిన్నారితో సహా అందరూ ఏమీ తెలియనట్లు ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు. ఆరోజు నుంచి బాలికకు కడుపునొప్పి రావడంతో పాటు అనారోగ్యానికి గురికావడంతో బుధవారం సాయంత్రం చిన్నారి తల్లి ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. డాక్టర్ పరిశీలించి లైంగిక దాడి జరిగినట్లు గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆస్పత్రికి చేరుకుని చిన్నారిని విచారించగా.. తాను పక్కింట్లో ఆడుకోవడానికి వెళ్లిన సమయంలో తన సొంత అన్న, స్నేహితులు కలిసి తనకు తెలియకుండానే ఏదో చేశారని చిన్నారి పోలీసుల ముందు అమాయకంగా చెప్పింది. వైద్య పరీక్షల అనంతరం చిన్నారిని జిల్లా కేంద్రంలోని సఖి కేంద్రానికి పంపారు. మైనర్ నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు తెలిసింది. ఘటనపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కేజీబీవీలో విద్యార్థినికి పాముకాటు
ఉండవెల్లి: జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలోని కలుగోట్ల కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో బుధవారం ఓ విద్యార్థిని పాముకాటుకు గురైంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని మెన్నిపాడుకు చెందిన దాక్షాయిని కేజీబీవీలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఉదయం 9:10 గంటలకు పాఠశాల ప్రాంగణంలో తోటి విద్యార్థినులతో కలిసి ప్రార్థన చేస్తుండగా.. పాముకాటుకు గురైంది. గమనించిన తోటి విద్యార్థినులు విషయాన్ని ఉపాధ్యాయులకు తెలియజేశారు. అక్కడే ఉన్న నర్సు లావణ్య విద్యార్థినికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకొని నాటువైద్యం నిమిత్తం ఇదే మండలం బొంకూరుకు తరలించి ఆకుపసరు తాగించారు. అనంతరం కేజీబీవీ సిబ్బందితో కలిసి ప్రైవేటు వాహనంలో కర్నూలు ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అక్కడి వైద్యులు చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం దాక్షాయినిని తల్లిదండ్రులు తమ స్వగ్రామానికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే విజయుడు విద్యార్థిని తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కాగా, పాముకాటుకు గురైన విద్యార్థినికి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించే వరకు కేజీబీవీ ఎస్ఓ పరిమళ అందుబాటులో లేకపోవడం గమనార్హం. కేజీబీవీ సిబ్బందే విద్యార్థిని బాగోగులు చూసుకున్నారు. అయితే మధ్యాహ్నం తర్వాత కర్నూలు ఆస్పత్రికి ఎస్ఓ వెళ్లి విద్యార్థినిని పరామర్శించినట్లు తెలిసింది. కర్నూలు ఆస్పత్రికి తరలింపు.. తప్పిన ప్రమాదం -
మహబూబ్నగర్ విజయం
మహబూబ్నగర్ క్రీడలు: హైదరాబాద్లో జరిగిన హెచ్సీఏ బి–డివిజన్ టూ డే లీగ్ చాంపియన్షిప్లో మహబూబ్నగర్ జిల్లా జట్టు విజయం సాధించింది. జిల్లా జట్టు 161 పరుగుల తేడాతో వెస్ట్మారేడ్పల్లిపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన జిల్లా జట్టు 85.1 ఓవర్లలో 300 పరుగులకు ఆలౌట్ అయింది. బుధవారం రెండో రోజు బ్యాటింగ్ చేసిన వెస్ట్మారేడుపల్లి 56.4 ఓవర్లలో 139 పరుగులకు కుప్పకూలింగింది. మహబూబ్నగర్ బౌలర్ ముఖితుద్దీన్ 17.4 ఓవర్లలో 30 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. ఇతర బౌలర్లు జస్వంత్ 3, జయసింహ 1 వికెట్ తీశారు. విజయం సాధించిన జట్టును ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ అభినందించారు. 161 పరుగుల తేడాతో వెస్ట్మారేడ్పల్లిపై గెలుపు హెచ్సీఏ బీ–డివిజన్ టూ డే లీగ్ -
జడ్చర్లకు బైపాస్ మంజూరు
●బైపాస్ సాధించుకుంటాం.. జడ్చర్ల బైపాస్ నిర్మాణానికిగాను బుధవారం ఎంపీ డీకే అరుణ, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డితో కలిసి ఢిల్లీలో కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశాం. ఇందుకు సంబంధించిన డీపీఆర్ను కూడా సమర్పించాం. పరిశీలించి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. నిరంతరం పర్యవేక్షణ చేస్తూ త్వరగా నిధులు మంజూరు చేయించేందుకు కృషిచేస్తాం. – జనంపల్లి అనిరుధ్రెడ్డి, ఎమ్మెల్యే, జడ్చర్ల జడ్చర్ల టౌన్: జడ్చర్లలో బైపాస్ నిర్మాణానికి కేంద్ర రవాణాశాఖ ఎట్టకేలకు పచ్చజెండా ఊపింది. బుధవారం ఢిల్లీలో మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, జడ్చర్ల, మహబూబ్నగర్ ఎమ్మెల్యేలు జనంపల్లి అనిరుధ్రెడ్డి, యెన్నం శ్రీనివాస్రెడ్డి కేంద్ర రవాణాశాఖమంత్రి నితిన్ గడ్కరీని కలిసి బైపాస్ ఆవశ్యకతను వివరించి ఇందుకు సంబంధించిన డీపీఆర్ను ఆయనకు అందజేశారు. డీపీఆర్ పరిశీలించి నిధులు విడుదల చేస్తామని కేంద్ర మంత్రి భరోసానిచ్చారు. ● దినదినాభివృద్ధి చెందుతున్న జడ్చర్ల మీదుగా 44, 167వ నంబరు రెండు జాతీయ రహదారులు వెళ్తున్నాయి. ముఖ్యంగా నియోజకవర్గకేంద్రం మీదుగా 167వ నంబరు జాతీయ రహదారి వెళ్తోంది. రహదారి నిర్మాణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ రోడ్డుపై పదేళ్లలో వాహనాల రాకపోకలు నాలుగు రెట్లు పెరగడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రమైంది. ఈ సమస్యను అధిగమించేందుకు బైపాస్ నిర్మాణం ఒక్కటే మార్గమని నిర్ణయించిన ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ఇదివరకే రెండు పర్యాయాలు కేంద్రమంత్రిని కలిసి సమస్యను విన్నవించారు. బుధవారం మరోమారు మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డితో కలిసి ఢిల్లీలో కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరిని కలిసి బైపాస్ ఆవశ్యకతను వివరించారు. ఎంపీ బైపాస్కు సంబంధించిన డీపీఆర్ను కేంద్ర మంత్రికి అందించారు. స్పందించిన మంత్రి బైపాస్ నిర్మాణానికి గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో పాటు డీపీఆర్ను పరిశీలించాలని జాతీయ రహదారులశాఖ అధికారులను ఆదేశించారు. డీపీఆర్ పరిశీలన అనంతరం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. పట్టణ దక్షిణభాగం నుంచి.. జడ్చర్ల–మహబూబ్నగర్ 167వ నంబరు జాతీయ రహదారిపై ఉన్న నక్కలబండ తండా నుంచి మల్లెబోయిన్పల్లి మీదుగా 44వ నంబరు జాతీయ రహదారిని కలుపుతూ తాటిపర్తి, ఆలూరు, బూర్గుపల్లి, కిష్టంపల్లి, నాగసాల, చర్లపల్లి మీదుగా గంగాపురం వద్ద తిరిగి అదే జాతీయ రహదారిని కలిపేలా ప్రతిపాదనలు రూపొందించారు. అలాగే మహబూబ్నగర్ బైపాస్ రహదారి పనుల్లో వేగం పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి కేంద్రమంత్రిని కోరారు. ఇందుకు కూడా కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. కేంద్ర రవాణాశాఖ మంత్రిని కలిసిన ఎంపీ, జడ్చర్ల, మహబూబ్నగర్ ఎమ్మెల్యేలు డీపీఆర్ అందజేత.. పరిశీలించి నిధుల కేటాయింపునకు హామీ -
రహదారులకు మహర్దశ
ఉమ్మడి జిల్లాలో రోడ్ల విస్తరణకు నిధులు కేటాయించిన ప్రభుత్వం సాక్షి, నాగర్కర్నూల్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కీలకమైన రహదారులకు మహర్దశ పట్టనుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వీటి విస్తరణ కోసం పెద్దఎత్తున నిధులు విడుదల చేసింది. మహబూబ్నగర్, వనపర్తి సర్కిళ్ల వారిగా ఉమ్మడి జిల్లాలోని మొత్తం 41 రోడ్ల విస్తరణ, బలోపేతం చేసేందుకు రోడ్డు, భవనాల శాఖ నిధులు కేటాయించింది. ప్రధానంగా జిల్లాలను అనుసంధానం చేస్తూ కొనసాగుతున్న రహదారులతోపాటు మండలాలు, గ్రామాలకు కనెక్టింగ్ రోడ్లను విస్తరించనున్నారు. మహబూబ్నగర్ ఆర్అండ్బీ సర్కిల్లో మహబూబ్నగర్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలు ఉండగా.. వీటి పరిధిలోని 26 రోడ్ల నిర్మాణానికి సంబంధించి మొత్తం 380.85 కి.మీ., మేర రోడ్లను విస్తరించనున్నారు. ఇందుకు గానూ ప్రభుత్వం రూ.434.19 కోట్లు కేటాయించింది. అలాగే వనపర్తి సర్కిల్లో వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాలు ఉండగా.. వీటి పరిధిలో 15 రోడ్లను ప్రభుత్వం డబుల్ రోడ్లుగా విస్తరించనుంది. మొత్తం 279.16 కి.మీ., మేర రహదారులను విస్తరించాల్సి ఉండగా ఇందుకోసం రూ.399.34 కోట్లు మంజూరు చేసింది. పెండింగ్లో ఉన్నవాటికి మోక్షం.. ఉమ్మడి జిల్లాలో గత కొన్నేళ్లుగా ప్రధాన రహదారుల విస్తరణ, మరమ్మతు పనులు దాదాపుగా నిలిచిపోయాయి. రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ చేపట్టిన జాతీయ రహదారుల నిర్మాణాలు మాత్రమే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జిల్లాలను ఒక దానితో మరొకటి అనుసంధానిస్తూ ఉన్న ఆర్అండ్బీ రోడ్లు, మండల కేంద్రాలను అనుసంధానం చేస్తూ ఉన్న రోడ్ల విస్తరణతోపాటు మరమ్మతుకు సైతం నోచుకోవడం లేదు. సుమారు ఐదేళ్లకుపైగా ఆర్అండ్బీ రోడ్లకు మరమ్మతు లేకపోవడంతో రోడ్లు పూర్తిగా దెబ్బతిని అధ్వానంగా మారాయి. మండల కేంద్రాల నుంచి గ్రామాలకు వెళ్లే కనెక్టింగ్ రోడ్లు వర్షాలకు దెబ్బతిని, కంకర తేలి దర్శనమిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వం ఆర్అండ్బీ రోడ్ల విస్తరణ, మరమ్మతుకు నిధులను మంజూరు చేయడంతో ఈ రోడ్ల రూపురేఖలు మారిపోనున్నాయి. హెచ్ఏఎం విధానంలో.. ఈసారి రహదారుల నిర్మాణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హెచ్ఏఎం) విధానంలో చేపడుతోంది. పూర్తిస్థాయిలో నిధులను ప్రభుత్వమే ఖర్చు చేయకుండా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రహదారులను నిర్మించాలని నిర్ణయించింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల నిర్మాణాలను ఈ విధానంలోనే చేపడుతుండగా.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఏఎం విధానంలో రోడ్ల విస్తరణ చేపట్టనుంది. ఈ విధానంలో రోడ్ల నిర్మాణానికి అవసరమైన నిధుల్లో 40 శాతం నిధులను ప్రభుత్వం సమకూర్చితే మిగతా 60 శాతం నిధులను ఆయా రోడ్డు నిర్మాణ కాంట్రాక్టు సంస్థలే భర్తీ చేయాల్సి ఉంటుంది. తర్వాత 15 ఏళ్లపాటు రోడ్డు నిర్వహణ బాధ్యతలతోపాటు టోల్ రుసుం సంబంధిత సంస్థలే నిర్వహిస్తాయి. రోడ్ల విస్తరణకు నిధుల కొరత లేకుండా, నిర్ణీత గడువులోగా వేగంగా పనులు పూర్తిచేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వనపర్తి సర్కిల్ పరిధిలో.. వనపర్తి– జడ్చర్ల వయా వట్టెం, తిమ్మాజిపేట రోడ్డు, బల్మూరు–నాగర్కర్నూల్ వయా గోదల్, తుమ్మన్పేట్, అచ్చంపేట–రాకొండ వయా ఉప్పునుంతల రోడ్డు, పెంట్లవెల్లి–వనపర్తి వయా శ్రీరంగాపూర్, అమ్రాబాద్– ఇప్పలపల్లి రోడ్డు, వనపర్తి–ఆత్మకూర్, ఆత్మకూర్–మరికల్ రోడ్డు, వనపర్తి–బుద్దారం రోడ్డు, చిన్నంబావి–చెల్లెపాడు రోడ్ల నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టనుంది. అలా గే బల్మూర్–నాగర్కర్నూల్ వయా గోదల్, తుమ్మ న్పేట్ రోడ్డు, అచ్చంపేట–రాకొండ, పెంట్లవెల్లి –వనపర్తి రోడ్లను డబుల్గా విస్తరించనున్నారు. మహబూబ్నగర్ సర్కిల్ పరిధిలో జోగుళాంబ గద్వాలలోని ఎర్రిగెర– అయిజ– అలంపూర్ రోడ్డు (బల్గెర, మిట్టిదొడ్డి, తుమ్మపల్లి, శాంతినగర్, కౌకుంట్ల, శ్రీనగర్, కొరివిపాడు, బొంకూర్)ను విస్తరించారు. అలాగే గద్వాల– రంగాపూర్ రోడ్డు, తుంగభద్ర బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు, గద్వాల– అయిజ రోడ్డు (బింగిదొడ్డి, అయిజ) రోడ్లను మెరుగుపరచనున్నారు. మహబూబ్నగర్ జిల్లాలోని వనపర్తి– జడ్చర్ల వయా బిజినేపల్లి రోడ్డు, మహబూబ్నగర్– మంగనూర్ రోడ్డు, మహబూబ్నగర్– నవాబుపేట రోడ్డు, వేపూర్ జెడ్పీ రోడ్డు నుంచి కొమ్మిరెడ్డిపల్లి వయా షేక్పల్లి, కురుమూర్తిరాయ టెంపుల్ రోడ్డు, గుడిబండ– తిరుమలాపూర్– అప్పంపల్లి రోడ్డు, కోడూరు– కోయిల్కొండ రోడ్డు వయా మల్కాపూర్, మణికొండ రోడ్డు, జడ్చర్ల రైల్వేస్టేషన్– కొత్తమొల్గర రోడ్డు, రాజాపూర్– తిరుమలాపూర్, మరికల్– మిన్సాపూర్ రోడ్డు, మక్తల్– నారాయణపేట వయా లింగంపల్లి రోడ్లను పునరుద్ధరించనున్నారు. మహబూబ్నగర్ సర్కిల్ పరిధిలో 380.85 కి.మీ మేర రోడ్ల నిర్మాణానికి రూ.434 కోట్లు వనపర్తి సర్కిల్లో 15 రోడ్ల నిర్మాణానికి రూ.399.34 కోట్లు మంజూరు హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో పనులు చేపట్టేందుకు చర్యలు జిల్లాలు, మండలాలు, గ్రామాల కనెక్టింగ్ రోడ్లకు ప్రాధాన్యం -
జూరాలకు భారీ వరద
ధరూరు/ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. బుధవారం సాయంత్రం 6.30 గంటల వరకు ప్రాజెక్టుకు లక్షా 78వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. 15 క్రస్టు గేట్లను ఎత్తి లక్షా 49వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జల విద్యుత్ కేంద్రంలో 11 యూనిట్లలో విద్యుదుత్పత్తిని కొనసాగిస్తున్నారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 26,345 క్యూసెక్కులు, కోయిల్సాగర్కు 315, నెట్టెపాడుకు 750, ఆవిరి రూపంలో 43, ఎడమ కాల్వకు 1,250, కుడి కాల్వకు 600, సమాంతర కాల్వకు 800.. ప్రాజెక్టు నుంచి మొత్తం లక్షా 79,413 క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.894 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పరుగులు పెడుతున్న విద్యుదుత్పత్తి ప్రాజెక్టు ఎగువలో 5 యూనిట్ల ద్వారా 175.189 ఎంయూ, దిగువలో 6 యూనిట్ల ద్వారా 208.276 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని చేపడుతున్నారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటి వరకు 383.465 మిలియన్ యూనిట్లును విజయవంతంగా విద్యుదుత్పత్తిని చేపట్టామన్నారు. 15 క్రస్టు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల -
ఉత్సాహంగా బ్యాడ్మింటన్ ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియలో బుధవారం ఉమ్మడి జిల్లాస్థాయి అండర్–11 విభాగం బాలబాలికల బ్యాడ్మింటన్ ఎంపికలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్ ఎంపికల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో మెరుగైన ప్రతిభ కనబరిచి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎల్.రవికుమార్ మాట్లాడుతూ ఎంపికై న క్రీడాకారులు రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో పాల్గొంంటారని తెలిపారు. కార్యక్రమంలో కోచ్ గోపాల్, సీనియర్ క్రీడాకారుడు సయ్యద్ పాల్గొన్నారు. కాగా..బాలుర సింగిల్స్లో అర్విన్ భాస్కర్ (ప్రథమ), విహాన్ (ద్వితీయ), బాలికల్లో డి.శ్రీహాస (ప్రథమ), లాస్యశ్రీ (ద్వితీయ), బాలుర డబుల్స్లో ఎస్.విహాన్–విశ్వతేజ, బాలికల డబుల్స్లో ఆద్య–అనుశ్రీలను ఎంపిక చేశారు. -
ఫార్మసీ, ఐసీ, బీఎడ్, ఎంఎడ్ ఫలితాలు విడుదల
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూ పరిధిలోని ఫార్మసీ, ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ, బీఎడ్, ఎంఎడ్ పరీక్ష ఫలితాలను వీసీ శ్రీనివాస్ బుధవారం విడుదల చేశారు. ఈ మేరకు ఫార్మసీలో 6వ సెమిస్టర్లో 100శాతం ఉత్తీర్ణత, ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీలో 100శాతం, బీఎడ్ సెమిస్టర్ 2లో 30.28శాతం, బీఎడ్ సెమిస్టర్ 6లో 65.91శాతం, ఏంఎడ్ సెమిస్టర్ 1లో 73.33, సెమిస్టర్లో 3లో 52.58శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను పీయూ వెబ్సైట్లో చూసుకోవాలని, అభ్యంతరాలు ఉంటే రీవాల్యువేషన్ కోసం దరఖాస్తులు చేసుకోవాలని కంట్రోలర్ ప్రవీణ ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రవికాంత్, కరుణాకర్రెడ్డి, సురేష్, ఈశ్వర్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇంజినీరింగ్ కోర్సులో అడ్మిషన్లు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూలో నూతనంగా ప్రారంభించిన ఇంజనీరింగ్ కోర్సుల్లో విద్యార్థులు అడ్మిషన్లు పొండుతున్నారు. టీఎస్ఎఫ్సెట్ ఎంట్రెన్స్ ద్వారా అడ్మిషన్లు పొందిన విద్యార్థులు ఈ నెల 28 వరకు ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాల్సి ఉండగా.. ఆగస్టు 2 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయా ల్సి ఉంది. ఈ క్రమంలో మొదటి అడ్మిషన్ను గద్వా ల్ జిల్లాకు చెందిన టీనాకుమారి తీసుకోగా.. అక్నాలెడ్జ్మెంట్ను ప్రిన్సిపాల్ చంద్రకిరణ్ అందించారు. ప్రేమ పెళ్లి వద్దన్నారని.. బాలిక ఆత్మహత్య మానవపాడు: తాను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయడం లేదని ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మానవపాడు మండలం గోకులపాడులో చోటు చేసుకుంది. ఎస్ఐ చంద్రకాంత్ వివరాల మేరకు.. ఏపీలోని కర్నూలు జిల్లా రేమట గ్రామానికి చెందిన ఎర్రల గిరిబాబు కూతురు ఏడో తరగతి వరకు మాత్రమే చదివి ఇంట్లోనే ఉండేది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మందలించారు. ఇంకా పెళ్లి వయసు రాలేదని.. ఇలాంటి వ్యవహారాలు చేయరాదని సూచించారు. అయినప్పటికీ మాట వినకపోవడంతో ఇటీవల మానవపాడు మండలం గోకులపాడు గ్రామంలో నివాసముండే బాలిక సోదరి ఇంటికి పంపించారు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక.. ఈ నెల 28న పురుగు మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు కర్నూలు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది. తండ్రి ఎర్రల గిరిబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు చారకొండ: మండలంలోని జూపల్లి సమీపాన జడ్చర్ల–కోదాడ జాతీయ రహదారిపై బుధవారం ద్విచక్రవాహనం అదుపుతప్పి ఇద్దరి యువకులకు గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కల్వకుర్తి నుంచి దేవరకొండ వైపు శంకర్, నరేష్లు ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తుండగా ప్రధాన రహదారి మూలమలుపు వద్ద వాహనం అదుపుతప్పి కింద పడింది. ప్రమాదంంలో ఇద్దరు గాయపడటంతో 108 వాహనంలో కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని చారకొండ ఎస్ఐ శంషోద్దిన్ తెలిపారు. -
అరు్హలందరికీ సంక్షేమ పథకాలు: కలెక్టర్
దేవరకద్ర రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందించేలా క్షేత్రస్థాయిలో సర్వే పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. బుధవారం పట్టణంలో దేవరకద్ర, కౌకుంట్ల మండలాలకు సంబంధించి నూతన రేషన్ కార్డులు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్తో పాటు ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి హాజరయ్యారు. అంతకుముందు పట్టణంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రేషన్కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, పేర్ల మార్పులు, చేర్పుల కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అర్హులకు కొత్త రేషన్కార్డు అందిస్తారన్నారు. జిల్లాకు 10 వేలకు పైగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా.. మొదటగా దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలోని మీనుగోనిపల్లికి చెందిన విజయమ్మ ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నారని పేర్కొన్నారు. లబ్ధిదారులు ఇంటి నిర్మాణం కోసం ఎక్కువగా ఖర్చు చేయకుండా తమ స్థాయికి తగిన విధంగా నిర్మించుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా మున్సిపాలిటీగా ఏర్పడిన దేవరకద్రను రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. అత్యవసర పనుల నిమిత్తం రూ.3 కోట్లు మంజూరుకు సంబంధించి ఉత్తర్వులు వచ్చాయని, త్వరలోనే మరో రూ.15 కోట్లు మంజూరవుతాయని తెలిపారు. 100 పడకల ఆస్పత్రికి సంబంధించిన పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని, సంవత్సరంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కొత్తగా మంజూరైన డీగ్రీ కళాశాల భవనం స్థల పరిశీలన తుది దశలో ఉందని, వెంటనే నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్, తహసీల్ధార్ కృష్ణయ్య, సుందర్రాజ్, ఎంపీడీఓ శ్రీనివాస్, అంజిల్రెడ్డి, రాఘవేందర్రెడ్డి, అరవింద్రెడ్డి, కిషన్రావు, ఫారుక్ తదితరులు పాల్గొన్నారు. -
అన్నదాన సత్రంలో ప్రత్యేక పూజలు
అలంపూర్: అలంపూర్ ఆలయాల్లోని నిత్యాన్నదాన సత్రాన్ని కొత్తగా నిర్మించిన ప్రసాద్ స్కీం భవనంలోని ఓ బ్లాక్లోకి మార్చనున్నారు. ఈ సందర్భంగా బుధవారం కొత్త భవనంలో ఆలయ ఈఓ పురేందర్కుమార్, కమిటీ చైర్మన్ నాగేశ్వర్రెడ్డి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం మహా గణపతి పూజ, పుణ్యాహవాచనం, సంప్రోక్షణ, రుత్విక్ వరుణం, మహా కలశ స్థాపన, వాస్తు మండపారాధన, గణపతి, నవగ్రహ, వాస్తు, రుద్రహోమం జరిగాయి. అనంతరం ఈఓ, చైర్మన్ అర్చకులకు దీక్షా వస్త్రాలు అందజేశారు. గురువారం తెల్లవారుజామున 4.34 గంటలకు గో సహిత గృహప్రవేశం, ఉదయం 11 గంటలకు పూర్ణాహుతి ఉంటుందని ఈఓ వివరించారు. మధ్యాహ్నం 12 గంటలకు జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి కల్యాణం, అనంతరం కొత్త అన్నదాన సత్రంలో భక్తులకు అన్న ప్రసాదం(భోజనం) ఉంటుందని తెలిపారు. ఈఓ, చైర్మన్ కొత్త అన్నదాన సత్రంలో ఏర్పాట్లను పరిశీలించారు. -
రైల్వే డబ్లింగ్ లైన్ భూ సేకరణపై ఆరా
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): మహబూబ్నగర్ నుంచి డోన్ వరకు రైల్వే డబ్లింగ్ లైన్ నిర్మాణం కోసం భూ సేకరణపై అడిషనల్ కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి అధికారులతో చర్చించారు. బుధవారం మహబూబ్నగర్ రూరల్ మండలంలోని రైల్వే లైన్ ఉన్న గ్రామాలు అల్లీపూర్, ధర్మాపూర్, రాంచంద్రాపూర్, మాచన్పల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు. రైల్వే లైన్ నిర్మాణం కోసం మండలంలో రైతుల నుంచి ఎంత భూమి పోతుందని అడగగా.. ఒక్కో రైతు పొలంలో 2 గుంటల నుంచి 9 గుంటల వరకు ఉండొచ్చని అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి భూ సేకరణ పూర్తి చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయని.. రైతులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్డీఓ నవీన్, సర్వే ల్యాండ్ ఏడీ కిషన్రావు, రూరల్ తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. రుణమాఫీ కోసం ప్రతిపాదనలు జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలోని చేనేత కార్మికులు తీసుకున్న రుణాల మాఫీ కోసం జిల్లా కమిటీ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు అడిషనల్ కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లాస్థాయి చేనేత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని చేనేత కార్మికులు 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 మధ్యలో తీసుకున్న రుణాలను మాఫీకి ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. 54 మంది చేనేత కార్మికులకు సంబంధించిన రుణాలు రూ.27,12,971లను మాఫీ చేసేందుకు కమిటీ ద్వారా ప్రభుత్వానికవ ప్రతిపాదనల పంపినట్లు తెలిపారు. సమావేశంలో చేనేత శాఖ ఆర్డీఈ పద్మ, ఏడీ బాబు, లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్, నాబార్డ్ డీడీఎం షణ్ముఖచారి, కో ఆపరేటివ్ సహకార అధికారి టైటస్పాల్ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
అర్చకుల సంక్షేమానికి నిరంతరం కృషి
స్టేషన్ మహబూబ్నగర్: దూప, దీప నైవేద్య అర్చకుల సంక్షేమం కోసం రాష్ట్ర దూప, దీప నైవేద్య అర్చక సంఘం నిరంతరం కృషి చేస్తుందని ఆ సంఘం ఉమ్మడి జిల్లా ప్రతినిధులు అన్నారు. మహబూబ్నగర్లో బుధవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలోని 6,750 మంది అర్చకుల అభ్యున్నతి కోసం పనిచేస్తున్న రాష్ట్ర దూప, దీప నైవేద్య అర్చక సంఘంపై అర్చక వెల్ఫెర్ బోర్డు సభ్యుడు జక్కాపురం నారాయణస్వామి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 14, 15, 16 తేదీల్లో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, లోకకల్యాణార్థం దూప, దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌల్తాబాద్ వాసుదేవశర్మ ఆధ్వర్యంలో చండీ కుబేర పాశుపథ యాగాన్ని ది గ్విజయంగా పూర్తి చేసినట్లు తెలిపారు. దీనిని జీర్ణించుకోలేని కొందరు అర్చక సమాఖ్య నాయకులు ఏదో విధంగా దూప, దీప నైవేద్య అర్చక సంఘంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర దూప, దీప నైవేద్య అర్చక సంఘం చేస్తున్న కార్యక్రమాలకు అడ్డుపడవద్దని కోరారు. సమావేశంలో సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి జి.రవికుమార్, మహబూబ్నగర్, వనపర్తి, నాగర్కర్నూల్, గద్వాల, పేట జిల్లాల అధ్యక్షులు జంగం మహేష్, లక్ష్మికాంతాచార్యులు, చంద్రశేఖర్, చక్రవర్తి చార్యులు, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటు పేదలకు వరం
వంగూరు: తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటు పేద విద్యార్థులకు వరమని రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మరళి అన్నారు. నూతనంగా ఏర్పాటవుతున్న వంగూరు, పోల్కంపల్లి పాఠశాలల్లో నిర్వహణకు సంబంధించి గ్రామ అభివృద్ధి కమిటీ, ఎస్ఎంసీ కమిటీలతో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయనతో పాటు కమిటీ సభ్యులు చారకొండ వెంకటేష్, విశ్వేశ్వర్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగూరు, పోల్కంపల్లి పాఠశాలల్లో తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.31 కోట్ల నిధులను మంజూరు చేసిందని తెలిపారు. పాఠశాలల నిర్వహణకు ప్రభుత్వ అధికారులతో పాటు గ్రామస్తుల సహకారం ఉండాలని కోరారు. వంగూరు పాఠశాల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని పరిశీలించారు. అంతేకాకుండా నూతనంగా రెండు బస్సులు కొనడంతో పాటు ప్రహరీ, పరిసరాలను శుభ్రం చేయడం లాంటి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిధుల వినియోగంలో ఒక్క పైసా అవినీతి జరగకుండా చూడాలని సూచించారు. చారకొండ వెంకటేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సొంత మండలమైన వంగూరులోనే రెండు పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేయడం గర్వంగా ఉందన్నారు. సమావేశంలో ఈఈ రాంచందర్, నోడల్ ఆఫీసర్ గోపాల్, ఎంఈఓ మురళీ మనోహరాచారి తదితరులు పాల్గొన్నారు. రెండు పాఠశాలలకు రూ.31 కోట్లు మంజూరు విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మరళి -
‘108’లో ఆక్సిజన్ లేక రైతు మృతి?
మహబూబ్నగర్ క్రైం: ఛాతీలో నొప్పి రావడంతో 108 అంబులెన్స్లో తరలించే క్రమంలో అందులో ఆక్సిజన్ లేకపోవడంతో రైతు మృతి చెందిన సంఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. మూసాపేట మండలం నిజాలాపూర్ గ్రామానికి చెందిన బొజ్జయ్య(65) బుధవారం తన వ్యవసాయ పొలంలో ఉండగా ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు మూసాపేటలోని ఓ ఆర్ఎంపీ దగ్గరకు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం మహబూబ్నగర్ వెళ్లడానికి ‘108శ్రీకి కాల్ చేశారు. దాదాపు 20 నిమిషాల తర్వాత అక్కడికి చేరుకున్న 108 వాహనంలో బొజ్జయ్యను తీసుకుని జిల్లాకేంద్రంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బొజ్జయ్యను పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. దీంతో మృతుడి కుటుంబసభ్యులు 108లో ఆక్సిజన్ సదుపాయం లేకపోవడం వల్లే మృతి చెందడని ఆరోపిస్తున్నారు. సిబ్బందికి ఆక్సిజన్ పెట్టాలని కోరినా పెట్టాలేదని వారు మండిపడ్డారు.ఈ ఘటనపై 108 మేనేజర్ రవిని వివరణ కోరగా.. జిల్లాలో ఉన్న ప్రతి 108లో ఆక్సిజన్ సౌకర్యం ఉంటుందని, ఈ అంబులెన్స్లో కూడా ఉందని తెలిపారు. మృతుడి కుటుంబసభ్యులే అంబులెన్స్ మహిళ టెక్నీషియన్పై దాడి చేశారని తెలిపారు. -
పింఛన్ పెంపు హామీ ఏమైంది?
గట్టు: వృద్ధులు, వికలాంగులకు ఇచ్చే పింఛన్లు పెంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏమైందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ ప్రశ్నించారు. బుధవారం గట్టు మండలం ముచ్చోనిపల్లెలో భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల కోసం రాజీ లేని పోరాటం చేసి, వారి బతుకుల్లో వెలుగులు నింపిన మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. అంబేడ్కర్ స్ఫూర్తితో యువత ముందుకుసాగాలని కోరారు. కాళ్లు, చేతులు లేనోళ్ల పింఛన్ డబ్బులు ఎగొట్టడం రేవంత్ సర్కారుకు భావ్యం కాదన్నారు. ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఉన్న పింఛన్లు పెంచకుండా, కొత్త పింఛన్లు ఇవ్వకుండా 18వేల కోట్ల బడ్జెట్ పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. నిస్సాహాయ స్థితిలో చేయూత పింఛన్పై ఆధారపడి జీవిస్తున్న వారికి అన్యాయం చేయొద్దన్నారు. పింఛన్దారుల బాధ అటు ప్రభుత్వానికి, ఇటు ప్రతిపక్షాలకు కనిపించడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం దగా చేస్తుంటే రాజకీయ పార్టీలు ఎందుకు మౌనం వహిస్తున్నాయని ప్రశ్నించారు. పింఛన్దారులకు ఇచ్చిన హామీల సాధన కోసం వచ్చే నెల 13న హైదరాబాద్లో పెద్దఎత్తున ఆందోళన చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత, బీఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి బల్గెర హనుమంతు నాయుడు, మాజీ ఎంపీపీ విజయ్కుమార్, బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు కిషోర్కుమార్, కొంకల భీమన్న, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి బుర్ర సతీశ్ మాదిగ, ఎంఎస్ఎస్పీ జిల్లా కన్వీనర్ రాజు, ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి అశోక్, మండల అధ్యక్షుడు బల్గెర ఏసన్న తదితరులు పాల్గొన్నారు. నిస్సాహాయ స్థితిలో జీవిస్తున్న వారికి అన్యాయం చేయొద్దు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ ముచ్చోనిపల్లెలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ -
బోరవెల్లిలో గుప్తనిధుల కోసం తవ్వకాలు
మానవపాడు: శతాబ్దాల చరిత్రగల బోరవెల్లి గ్రామంలోని చెన్నకేశవస్వామి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు కొన్ని రోజుల క్రితం గుప్తనిధుల తవ్వకాలు జరపగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, బుధవారం గ్రామంలో ఇరువురు అనుమానాస్పదంగా తిరుగుతుండగా గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్ఐ మురళి అక్కడికి చేరుకొని వారిని విచారించారు. పూర్తి వివరాలిలా.. చెన్నకేశవస్వామి ఆలయంలో కొందరు ఈ నెల 1 నుంచి 5వ తేదీ మధ్యలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. అనంతరం విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈక్రమంలో ఈ నెల 14న నాగర్కర్నూల్లో పనిచేసే ఓ ప్రభుత్వ ఉద్యోగి.. బోరవెల్లి చెన్నకేశవస్వామి ఆలయంలో పూజారిగా పనిచేసే రవీంద్రనాథ్కు ఫోన్ చేశాడని, మీ ఆలయంలో గుప్తనిధులు ఉన్నాయని, సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా అని ఆరా తీశాడన్నారు. నువ్వు మాకు సహకరించాలని లేదంటే నీ అంతు చూస్తానని భయభ్రాంతులకు గురిచేశాడని తెలిపారు. ఇదే విషయమై గ్రామస్తులంతా పోలీసులకు సమాచారం ఇచ్చారన్నారు. ఈక్రమంలో బుధవారం గ్రామంలో ఇద్దరు అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుకొని పోలీసులకు గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ అక్కడికి చేరుకొని ఇరువురు వ్యక్తులను స్టేషన్కు తరలించారు. ఈక్రమంలో పూజారిని బెదిరించిన వ్యక్తిని గ్రామానికి రప్పించాలని, వారికి వీరికి సంబంధం ఉందంటూ గ్రామస్తులు పోలీసుల వాహనాన్ని అడ్డుకున్నారు. అనంతరం వారిని స్టేషన్కు తరలించి విచారించారు. ఇదిలాఉండగా, పూజారి రవీంద్రచారి తనను ఫోన్లో బెదిరింపులకు పాల్పడ్డ వ్యక్తి అయిన ప్రభుత్వ ఉద్యోగిపై ఫిర్యాదు చేశాడు. అయితే, తవ్వకాల విషయమై విచారించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్ఐ తెలిపారు. -
ప్రభుత్వ జీతం.. ప్రైవేట్ సేవలు
పేరుకేమో ప్రభుత్వ వైద్యులు.. జీతం తీసుకునేది ప్రభుత్వం నుంచి.. పని చేయాల్సింది జిల్లా జనరల్ ఆస్పత్రిలో.. కానీ, నిబంధనలకు విరుద్ధంగా సొంతంగా క్లినిక్లు ఏర్పాటు చేసుకొని అక్కడే తరిస్తున్నారు. రూ.లక్షలు జీతాలు చెల్లించే జీజీహెచ్కు మాత్రం వంతుకు గంతేసినట్లు.. ఇలా వచ్చి రిజిస్టర్లో సంతకాలు పెట్టి.. గుట్టుచప్పుడు కాకుండా అలా వెళ్లిపోతున్నారు. ఫలితంగా వివిధ రోగాలతో పెద్దాస్పత్రికి వస్తున్న రోగులకు సరైన వైద్యం అందక అవస్థలు పడుతున్నారు. వీరిని పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులేమో.. అప్పుడప్పుడు వచ్చి హడావుడి చేయడం వరకే పరిమితమవుతున్నారు. – పాలమూరు అలవెన్స్ ఇవ్వడం లేదు.. ప్రభుత్వం నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్ ఇవ్వడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా అందరూ ప్రైవేట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. వీరిపై రిక్రూట్మెంట్ బోర్డు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయం సూపరింటెండెంట్ పరిధిలో ఉండదు. – మాధవి, తాత్కాలిక సూపరింటెండెంట్, జనరల్ ఆస్పత్రి మహబూబ్నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో వైద్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సమయపాలన పాటించకపోవడం మొదలు రోగులకు అందుబాటులో ఉండి వైద్యసేవలు అందించడంలోనూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ప్రధానంగా బయట సొంతంగా ప్రైవేట్ క్లినిక్లు నడుపుతున్నారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లో పనిచేసే అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ సమయంలోనే బయట ప్రైవేట్గా ప్రాక్టీస్ చేయరాదని స్పష్టంగా పేర్కొన్నారు.. వైద్యులు సైతం అలాట్మెంట్ కాపీలో ప్రైవేట్ ప్రాక్టీస్ చేయమని రాసిచ్చినా.. అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి వైద్యులు ఏ ఒక్కరూ నిబంధనలు పాటించడం లేదు. జనరల్ ఆస్పత్రిలో తూతూమంత్రంగా 3 గంటలు విధులు నిర్వహిస్తూ మిగిలిన సమయమంతా సొంత ఆస్పత్రుల్లో గడుపుతున్నారు. ఇక శనివారంతో పాటు ఆదివారాల్లో ఏ ఒక్కరూ ఇటువైపు కన్నెత్తి చూడటం లేదు. ప్రధానంగా సైకియాట్రిక్, కంటి, చర్మం, దంత తదితర విభాగాలకు చెందిన వైద్యులు రాత్రి వేళ డ్యూటీలో ఉండటం లేదు. కల్లు తాగిన రోగి ఆస్పత్రికి చికిత్స కోసం వస్తే రాత్రివేళ వైద్యం చేయడానికి సైకియాట్రిక్ విభాగం నుంచి ఎవరూ అందుబాటులో ఉండటం లేదు. ఇక రేడియాలజీ విభాగం వాళ్లు కూడా లేకపోవడంతో రాత్రివేళ అత్యవసర కేసులు వస్తే బయటకు రెఫర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రూ.30–40 వేల జీతానికి.. జిల్లా జనరల్ ఆస్పత్రిలో పనిచేస్తున్న 170 మంది హౌజ్ సర్జన్లలో దాదాపు 40 శాతం మంది నగరంలోని పలు ప్రైవేట్ క్లినిక్లలో డ్యూటీ డాక్టర్స్గా విధులు నిర్వహిస్తున్నారు. నిబంధనల ప్రకారం హౌజ్ సర్జన్ పూర్తయ్యే వరకు వారికి బయట ప్రాక్టీస్ చేయడానికి అనుమతి ఉండదు. కానీ, వాళ్లు కూడా ఇందుకు విరుద్ధంగా రూ.30–40 వేల జీతానికి ప్రైవేట్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. రాత్రివేళ అవస్థలు జిల్లా జనరల్ ఆస్పత్రిలో సాయంత్రం తర్వాత అన్ని విభాగాల వైద్యులు డ్యూటీలో అందుబాటులో లేకపోవడంతో రోగులకు అవస్థలు తప్పడం లేదు. ఆ రోజు డ్యూటీలో ఉండే వారైతే ఎక్కడో ఉంటూ ఫోన్లో జూనియర్స్కు చికిత్స విధానం చెబుతున్నారు. దీంతో రోగులకు ఆశించిన స్థాయిలో వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు. మేజర్ విభాగాల దగ్గరి నుంచి మైనర్ వరకు అన్నింటిలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దీనికి తోడు రేడియాలజీ, పెథాలజీ విభాగం సైతం రాత్రివేళ సక్రమంగా సేవలు అందడం లేదు. దీంతో అత్యవసరంగా వైద్యం కోసం వచ్చిన రోగులకు అల్ట్రాసౌండ్ పరీక్షలు, ఎంఆర్ఐ, మేజర్ ఎక్స్రే, రక్త పరీక్షలు ఇలా ఏదైనా అవసరం వస్తే బయటకు వెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ‘ప్రైవేట్’ క్లినిక్లో తలమునకలవుతున్న జనరల్ ఆస్పత్రిలోని పలువురు వైద్యులు అసిస్టెంట్ ప్రొఫెసర్లు సొంతంగా ప్రాక్టీస్ చేయొద్దని ఉత్తర్వులు ఖాళీలు భర్తీ చేసే సమయంలోనే స్పష్టంగా పేర్కొన్న ప్రభుత్వం మధ్యాహ్నం తర్వాత ఆస్పత్రిలో కనిపించని వైనం రాత్రివేళ అత్యవసర వైద్యానికి తప్పని తిప్పలు -
మహబూబ్నగర్
భక్తిశ్రద్ధలతో నాగ పంచమి బుధవారం శ్రీ 30 శ్రీ జూలై శ్రీ 2025నాగుల పంచమి వేడుకలను మంగళవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉపవాసాలు పాటించిన వారు నాగులకు నైవేద్యాలు సమర్పించి దీక్షను విరమించారు. జిల్లాకేంద్రంలోని రేణుకా ఎల్లమ్మ దేవాలయం కిటకిటలాడింది. నాగులకు పాలు, పండ్లు, నువ్వుల ఉండలు, పేలాలు నివేదించారు. వీరన్నపేట రామలింగేశ్వర స్వామి దేవాలయం(పాత శివాలయం), పిల్లలమర్రి రోడ్డులోని వేంకటేశ్వర స్వామి, టీచర్స్ కాలనీ రామాలయం, శ్రీనివాస కాలనీ పంచముఖాంజనేయ స్వామి ప్రాంగణంలోని నాగుల పుట్టల వద్ద మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. – స్టేషన్ మహబూబ్నగర్ -
వనమహోత్సవం లక్ష్యం చేరాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): వన మహోత్సవం కార్యక్రమంలో మొక్కలను నాటేందుకు నిర్దేశించిన లక్ష్యం చేరేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరం నుంచి అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్తో కలిసి ఎంపీడీఓలు, ఎంపీఓలు, డీపీఎంలు, ఏపీఎంలు తదితరులతో నిర్వహించిన వెబెక్స్ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వచ్చే వారంలోగా మొక్కలు నాటడం పూర్తి చేయాలన్నారు. ఎంపీడీఓలు మండలంలోని ఒక పాఠశాలను ఎంపిక చేసుకొని అక్కడ న్యూట్రి గార్డెన్ కోసం నిర్దేశించిన మొక్కలను నాటాలని, న్యూట్రి గార్డెన్ మోడల్ స్కూల్గా తీర్చిదిద్దాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రొసీడింగ్స్ వచ్చిన వారు మార్క్ ఔట్ చేసుకునేలా చూడాలని, ప్రొసీడింగ్స్ వచ్చి, నిర్మాణం చేపట్టని వారితో మాట్లాడి.. వేరే వారికి కేటాయించేలా చూడాలని, తద్వారా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తిచేయాలని అన్నారు. అర్హత ఉన్నా ఇల్లు కట్టేందుకు డబ్బులు లేకపోతే వారికి బ్యాంకు నుంచి లేదా లోన్లు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో చెత్త సేకరణ, డ్రెయిన్లు శుభ్రపరచడం వంటివి ఎప్పటికప్పుడు చేపట్టాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా, చెత్త, నీరు నిల్వకుండా చూడాలన్నారు. వర్షం ఎప్పుడు వస్తుందో తెలిపే ఫోర్ క్యాస్ట్ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, చెరువులో నీరు నిండి ఎలాంటి ప్రమాదాలు కానీ, ఇళ్ల లోపలికి రావడం వంటివి జరగకుండా పంచాయతీ కార్యదర్శులు పర్యవేక్షించాలన్నారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను గుర్తించి వెంటనే వేరే చోటుకి తరలించాలని చెప్పారు. ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ వైర్లు, ఒరిగి న స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను సరిచేయాలన్నారు. సమావేశంలో డీఆర్డీఓ నర్సింహులు, డీపీఓ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. భూసేకరణ వేగవంతం చేయాలి జిల్లాలో భూ సేకరణ వేగవంతం చేయాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. కోయిల్సాగర్ ప్రాజెక్ట్ కెనాల్, కేఎల్ఐ, రైల్వే డబుల్ లైన్ కోసం భూ సేకరణ పనుల్లో వేగం పెంచాలన్నారు. ఎక్కడ ఎంత భూమి సేకరించాలి.. ఇప్పటి వరకు ఎంత సేకరించారు.. ఈపాస్ అవార్డు ఎంత కంపెన్సీషన్ మంజూరయ్యాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని పనులను, సర్వేలను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, ఆర్డీఓ నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
పెండింగ్ జీతాల కోసం ‘శిక్షణ’ బహిష్కరణ
మహబూబ్నగర్ రూరల్: నాలుగు నెలలుగా రావాల్సిన వేతనాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎన్ఆర్ఈజీఎస్ ఉద్యోగులు శిక్షణ కార్యక్రమాన్ని బహిష్కరించారు. మంగళవారం మహబూబ్గర్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలోని జిల్లాలోని వివిధ మండలాల ఏపీఓలు, ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్లకు ఉపాఽధి పనులపై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఉపాధి హామీ ఉద్యోగులు ముందుగా తమకు రావాల్సిన వేతనాలు గురించి సమాధానం చెప్పాలంటూ కార్యక్రమాన్ని బహిష్కరించి.. కార్యాలయం ఎదుట రోడ్డుపై ఉద్యోగులంతా బైఠాయించి ఆందోళను దిగారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఈజీఎస్ ఉద్యోగుల జేఏసీ జిల్లా కన్వీనర్ రాజశేఖర్రెడ్డి, కో–కన్వీనర్ విజయభాస్కర్ మాట్లాడుతూ వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నామన్నారు. అసలే చాలీచాలని జీతాలు అవి కూడా సమయానికి రాకపోవడంతో కుటుంబపోషణకు అప్పులు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని అన్నారు. ప్రభుత్వం స్పందించి వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీఆర్డీఓ నర్సింహులకు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధిహామీ పథకం ఈసీల సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణ, కంప్యూటర్ ఆపరేటర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సతీష్, ఏపీఓలు, ఈసీలు, టీఏలు పాల్గొన్నారు. -
ఉద్యమం చేసేందుకుసిద్ధంగా ఉండాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): రాష్ట్ర ప్రభు త్వ ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం ఇక ఉద్యమం చేసేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం జేఏసీ చైర్మన్, టీఎన్జీఓ జిల్లా అద్యక్షుడు రాజీవ్రెడ్డి, టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి చంద్రనాయక్, జిల్లా కోశాధికారి కృష్ణమోహన్, జిలా అసోసియేట్ అధ్యక్షుడు శ్యాంసుందర్రెడ్డి ఓ ప్రకటన లో తెలిపారు. ఉద్యోగల, పెన్షనర్ల సమస్యలను పరిష్కారం కోసం గడిచిన 17 నెలలుగా ఎంతో ఎదురు చూశామని తెలిపారు. అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమస్యలను విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందని, ఉద్యోగ సంఘాలతో రాష్ట్ర ప్రభుత్వం జరిపించిన చర్చలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఆరోపించారు. 2023 జూలై 1 నుంచి అమలు చేయాల్సిన పీఆర్సీ మాట ఎత్తడం లేదని తెలిపారు. కేంద్ర సంఘం నాయకత్వం పిలుపు మేరకు ఆగస్టు 15వ తేదీ నుంచి ఉద్యమబాట పట్టాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఉద్యోగుల జేఏసీ ఇచ్చే ప్రతి పిలుపుకు టీఎన్జీఓ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. అందుకనుగుణంగా టీఎన్జీఓ సంఘం నాయకులు, ఉద్యోగులు భవిష్యత్ కార్యచరణకు సిద్ధంగా ఉండాలని కోరారు. రేపు గురుకులాల్లో స్పాట్ అడ్మిషన్లు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: మండలంలోని రాంరెడ్డిగూడెం సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ఇంటర్మీడియట్ ఎంఈసీ, సీఈసీ, ఎంపీసీ గ్రూప్లలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం గురువారం స్పాట్ అడ్మిషన్లు కల్పిస్తున్నట్లు ప్రిన్సిపల్ వాణిశ్రీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు గురువారం ఉదయం 10 గంటలకు గురకులం వద్దకు రావాలని, ఎస్సెస్సీ మార్కుల మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తామని చెప్పారు. నంచర్ల గురుకులంలో.. మహమ్మదాబాద్: నంచర్ల గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో మిగిలిన సీట్లకు గాను గురువారం స్పాట్ అడ్మిషన్లు కల్పిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ రమ తెలిపారు. విద్యార్థులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో వచ్చి స్పాట్ అడ్మిషన్లు పొందాలని సూచించారు. ప్రాక్టికల్స్కు 51మంది అభ్యర్థులు హాజరు మహబూబ్నగర్ న్యూటౌన్: ప్రభుత్వం లైసెన్స్డ్ సర్వేయర్ల ఎంపికకు రెండు నెలలుగా శిక్షణ ఇచ్చిన సర్వే ఆండ్ ల్యాండ్ రికార్డుల శాఖ రెండోరోజు మంగళవారం ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించింది. లైసెన్స్డ్ సర్వేయర్ ఎంపిక కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో మహబూబ్నగర్ జిల్లా నుంచి 230 మంది అభ్యర్థులుండగా వారిని ప్రభుత్వం జిల్లాకు కేటాయించింది. అందులో మొదటి విడతగా 132 మందికి భూసర్వే నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. రెండు నెలలుగా శిక్షణ పొందిన 98 మంది అభ్యర్థులను రెండు బ్యాచ్లుగా ఏర్పాటు చేసి సోమవారం 47 మందికి, రెండో రోజు 51 మంది ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించింది. -
సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణ
మహబూబ్నగర్ క్రైం: జిల్లాలో నేరాల నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆధునిక పద్ధతులు అమలు చేయాలని ఎస్పీ డి.జానకి పోలీస్ అధికారులను ఆదేశించారు. పోలీస్స్టేషన్ వారీగా పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి అధికారులు చొరవ చూపించాలని, ఎన్డీపీఎస్ చట్టాలపై స్పష్టమైన అవగాహనతో కేసులు దర్యాప్తు పూర్తి చేసి దో షులకు శిక్షలు పడే విధంగా చేయాలన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ, గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల్లో వేగవంతమైన విచారణ జరగాలని, సీసీటీవీలను కమ్యూనిటీ పోలీసింగ్లో మరింత విస్తరించే విధంగా చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణతో పా టు ట్రాఫిక్ నియంత్రణ కోసం శాఖ మధ్య సమన్వ యం చేసుకోవాలన్నారు. ముఖ్య పట్టణాల్లో రాత్రి వేళ పెట్రోలింగ్ విస్తృతం చేయాలన్నారు. పాత నేరస్థులు, రౌడీ షీటర్స్పై నిఘా కొనసాగించాలన్నారు. గంజాయి, ఆన్లైన్ బెట్టింగ్, లోన్ యాప్ మోసాలు, పేకాట, పీడీఎస్ రైస్ అక్రమ తరలింపు, ఇసుక మాఫియాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆమె సూచించారు. బైక్లకు సైలెన్సర్లు మార్పు చేస్తే కఠిన చర్యలు శబ్ద కాలుష్యానికి కారకులు అయిన వారితో పాటు షోరూం నుంచి వచ్చిన సైలెన్సర్లు కాకుండా మోడిఫైడ్ సైలెన్సర్లను ఏర్పాటు చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీహెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక తనిఖీల ద్వారా బైక్కు సంబంధించిన 155 మోడిఫైడ్ సైలెన్సర్లను గుర్తించి వాటిని ఎస్పీ సమక్షంలో మంగళవారం బండమీదిపల్లి సమీపంలో రోడ్ రోలర్తో ధ్వంసం చేయించారు. షోరూం నుంచి వచ్చిన సైలెన్సర్ కాకుండా మార్పులు చేసి అధిక శబ్ధాలు చేస్తూ ప్రజలను తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తున్నట్లు తెలిపారు. ఇలా చేయడం చట్ట వ్యతిరేకరమే కాకుండా ఇతర వాహనదారులకు ప్రమాదకరంగా మారుతుందన్నారు. మెకానిక్లు సైతం ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లు మార్పు చేయరాదన్నారు. ఆయా సమావేశాల్లో ఏఎస్పీ ఎన్బీ రత్నం, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, సీఐలు వెంకటేష్, అప్పయ్య, గాంధీనాయక్, కమలాకర్, నాగార్జునగౌడ్, భగవంతురెడ్డి, ఎస్ఐలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారంపై దృష్టి సారించండి : ఎస్పీ డి.జానకి -
మహబూబ్నగర్ 300 ఆలౌట్
మహబూబ్నగర్ క్రీడలు: హైదరాబాద్లో మంగళవారం జరిగిన బి–డివిజన్ టుడే లీగ్ చాంపియన్షిప్లో మహబూబ్నగర్ జిల్లా జట్టు మెరుగైన స్థితిలో ఉంది. వెస్ట్మారేడ్పల్లి జట్టుతో జరిగిన మ్యాచ్లో మహబూబ్నగర్ టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేసి 85.1 ఓవర్లలో 300 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో ఓపెనర్ అబ్దుల్ రాఫే (194 బంతుల్లో 10 ఫోర్లతో 111 పరుగులు) అద్భుతమైన సెంచరీతో రాణించాడు. జట్టులో బి.సంజయ్ (53), కేతన్కుమార్ (43), కొండ శ్రీకాంత్ (30) సత్తా చాటారు. ప్రత్యర్థి బౌలర్లలో తరుణ్చంద్ర 3, సజ్జా సాయి ప్రణవ్, సిద్దార్థ రెండేసి వికెట్లు తీసుకున్నారు. బుధవారం వెస్ట్మారేడ్పల్లి జట్టు బ్యాటింగ్ చేపట్టనుంది. సెంచరీతో రాణించిన అబ్దుల్ రాఫే -
జూరాలకు పెరుగుతున్న వరద
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు మంగళవారం ఎగువ నుంచి వస్తున్న వరద కాస్త పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. సోమవారం 1.34 లక్షల క్యూసెక్కులు ఉండగా.. మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో 1.40 లక్షల క్యూసెక్కులకు చేరిందన్నారు. దీంతో ప్రాజెక్టు 12 క్రస్ట్ గేట్లు పైకెత్తి 1,19,064 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు చెప్పారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 27,395 క్యూసెక్కులు, కోయిల్సాగర్కు 315, నెట్టెంపాడుకు 750, ఆవిరి రూపంలో 45, ఎడమ కాల్వకు 1,030, కుడి కాల్వకు 600, ఆర్డీఎస్ లింక్ కెనాల్కు 150, సమాంతర కాల్వకు 500 క్యూసెక్కులు విడుదల చేసినట్లు వివరించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 7.817 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు చెప్పారు. కొనసాగుతున్న విద్యుదుత్పత్తి.. ఆత్మకూర్: జూరాల దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిర్విరామంగా కొనసాగుతోంది. మంగళవారం 11 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువ 5 యూనిట్ల నుంచి 195 మెగావాట్లు, 172.074 మి.యూ, దిగువ 6 యూనిట్ల నుంచి 240 మెగావాట్లు, 204.431 మి.యూ. విద్యుదుత్పత్తి చేశామని.. ఇప్పటి వరకు 376.505 మి.యూ, విజయవంతంగా పూర్తి చేసినట్లు వివరించారు. సుంకేసులకు 1.25 లక్షల క్యూసెక్కులు.. రాజోళి: సుంకేసుల జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద రోజురోజుకు పెరుగుతోంది. సోమవారం 90 వేల క్యూసెక్కులు ఉండగా.. మంగళవారం లక్ష క్యూసెక్కులు దాటింది. ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి 1.25 లక్షల క్యూసెక్కుల వరద రాగా.. 10 గేట్లు ఒక మీటర్ మేర, మరో 11 గేట్లను 2 మీటర్ల మేర పైకెత్తి 1,22,326 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు జేఈ మహేంద్ర తెలిపారు. కేసీ కెనాల్కు 1,847 క్యూసెక్కుల నీటిని వదిలినట్లు ఆయన పేర్కొన్నారు. 12 క్రస్ట్గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల -
అటవీ సంపద పెంపునకు సహకరించాలి
మహబూబ్నగర్ న్యూటౌన్: అటవీ సంపద పెంపునకు సామిల్, టింబర్ డిపోల యాజమానులు సహకారం అందించాలని జిల్లా అటవీ శాఖ అధికారి సత్యనారాయణ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జోగులాంబ జోన్ సామిల్స్, టింబర్ డిపోల యాజమానుల అసోసియేషన్ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కలప అక్రమ రవాణాను ఎవరూ ప్రోత్సహించవద్దని కోరారు. ప్రభుత్వం అడవుల శాతాన్ని పెంచేందుకు అన్ని శాఖల సమన్వయంతో వనమహోత్సవం కార్యక్రమం ద్వారా విరివిగా మొక్కలు నాటనున్నట్లు పేర్కొన్నారు. అటవీ శాఖ అనుమతి లేనిది కలప రవాణా, నిల్వ చేయవద్దని సూచించారు. అనంతరం డీఎఫ్ఓ సత్యనారాయణను సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేషన్ నాయకులు రమణయ్య, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, గద్వాల్ నాయకులు నవీన్పటేల్, సిద్దిఖ్, శేషుకుమార్, ముస్తఫా, ముఖేశ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళా సంఘాలకు విరివిగా రుణాలివ్వాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): మహిళ సాఽధికారితకు స్వయం సహాయక మహిళా సంఘాలకు బ్యాంకర్ల విరివిగా రుణాలివ్వాలని సెర్ప్ బ్యాంక్ లింకేజీ డైరెక్టర్ వైఎన్ రెడ్డి బ్యాంకర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన బ్యాంకర్లు, డీపీఎం, ఏపీఎంలతో సమావేశం నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడానికి ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తోందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశానుసారం బ్యాంకర్లు రుణాలివ్వాలన్నారు. రుణాలివ్వకుంటే మహిళా సంఘాల సభ్యులు మైక్రో ఫైనాన్స్లను ఆశ్రయిస్తారని దీంతో మరో ప్రమాదం ఉందని తెలిపారు. మహిళా సంఘాలు తీసుకున్న రుణాలను కచ్చితంగా చెల్లిస్తారని.. వారి నుంచి వందశాతం రుణాలు రికవరీ అవుతాయన్నారు. మహబూబ్నగర్ జిల్లాకు 2025–26 ఆర్థిక సంవత్సరం నిర్దేశించిన బ్యాంక్ లింకేజీ రుణ లక్ష్యం రూ.385 కోట్లు పెట్టినట్లు ఈ మొత్తం 9854 మహిళ సంఘాలకు ఇవ్వాలన్నారు. ఈ మొత్తం లక్ష్యం పూర్తి అయ్యేటట్లు బ్యాంకర్లు సహకరించాలన్నారు. తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు వాటిని తిరిగి చెల్లించేలా మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, డీఆర్డీఓ నర్సిములు, డీఆర్డీఓ ఏపీడీ శారద, డీపీఎం లక్ష్మయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
కొత్త భవనంలోకి అన్నదాన సత్రం
● రేపు ప్రసాద్ స్కీం భవంతిలోకి మార్పు ● నాలుగు నెలల క్రితమే అలంపూర్ ఆలయాలకు అప్పగింత ● వర్చువల్గా భవనాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి మోదీ అలంపూర్: దక్షిణ కాశీ అలంపూర్ జోగుళాంబ, బాలబ్రహేశ్వరస్వామి క్షేత్రంలో అన్నప్రసాదానికి కొత్త భవనం అందుబాటులోకి రానుంది. ప్రసాద్ స్కీం నిధులతో నిర్మించిన భవంతిలోకి బాలబ్రహ్మేశ్వరస్వామి అన్నదాన సత్రం ఏర్పాటుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆలయ అర్చక స్వాములు ఖరారు చేసిన ముహూర్తంలో అధికారులు ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం భక్తులకు కొత్త భవనంలో అన్నప్రసాదం వసతి అందుబాటులోకి తీసుకురానున్నారు. 50 ఏళ్లుగా అన్నదాన సత్రం.. అలంపూర్ క్షేత్రంలో 50ఏళ్లుగా శ్రీగండ్రకోట కుమారశాస్త్రి బాలబ్రహ్మేశ్వరస్వామి అన్నదాన సత్రం పేరుతో అన్నప్రసాదం పంపినీ చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న అన్నదాన సత్రం పురావస్తుశాఖ అధ్వర్యంలో ఉంటుంది. ఈ క్షేత్రందినదినాభివృద్ధి చెంది భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగినప్పటికీ.. సత్రంలో 50నుంచి 100 మంది వరకు మాత్రమే భోజనం చేయడానికి అవకాశం ఉంది. దీంతో అన్నప్రసాదం పొందడానికి భక్తులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. పాత అన్నదాన సత్రంలో మార్పులు చేయడానికి పురావస్తు శాఖ నుంచి అనుమతులు వచ్చే పరిస్థితి లేకపోవడంతో అసౌకర్యాల నడుమే సత్రం కొనసాగుతోంది. రూ. 37కోట్ల వ్యయంతో కొత్త భవంతి.. కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీం ద్వారా రూ. 37కోట్లు మంజూరు చేయడంతో అన్ని హంగులతో భవనం నిర్మించారు. ఈ భవంతిలో ఒక బ్లాక్ను అన్నదాన సత్రం కోసం కేటాయించారు. ఇదివరకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ఈ భవంతిని ప్రారంభించడంతో ఆలయాలకు అప్పగించారు. ప్రస్తుతం అన్నదాన సత్రం కోసం కేటాయించిన బ్లాక్లో 1000 మంది వరకు కూర్చోని తినడానికి అవకాశం ఉంటుంది. సాధారణ రోజుల్లో ఆలయాలకు 400 మంది వరకు భక్తులు అన్నప్రసాదం కోసం వస్తారని.. సెలవు దినాల్లో 800 నుంచి 1,200 మంది వరకు అన్నప్రసాదం కోసం వస్తారు. మహాశివరాత్రి, దేవీ శరన్ననవరాత్రులు, వసంతి పంచమి వంటి ప్రత్యేక రోజుల్లో అన్నప్రసాదం కోసం వచ్చే భక్తుల సంఖ్య భారీగా ఉంటుంది. భక్తుల రద్దీకి అనుగుణంగా కొత్త భవనంలో పెద్ద హాల్తో పాటు కిచెన్, సరుకుల నిల్వకు ప్రత్యేక గదులు అందుబాటులోకి రానున్నాయి. నేడు పూజలు.. రేపు ప్రారంభం ప్రసాద్ స్కీం భవంతిలో అన్నదాన సత్రం ఏర్పాటు సందర్భంగా రెండు రోజులపాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ పురేందర్ కుమార్ తెలిపారు. బుధవారం ఉదయం 8 గంటలకు మహా గణపతి పూజ, పుణ్యహవచనం, సంప్రోక్షణ, ఋత్విక్ వరుణం, మహా కలశ స్థాపన, వాస్తు మండపారాధన, గణపతి, నవగ్రహ, వాస్తు, రుద్ర హోమాలు ప్రత్యేకంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గురువారం తెల్లవారుజామున 4:34 గంటలకు గో సహిత గృహప్రవేశం, 11 గంటలకు పూర్ణాహుతి సమర్పణ ఉంటుందని తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆదిదంపతులైన జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం మద్యాహ్నం 1గంటకు అన్నదానం ఉంటుందని ఈఓ తెలిపారు. అందుబాటులోకి సకల సౌకర్యాలు.. కొత్త భవనంలో అన్నప్రసాదం కోసం వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. భక్తులు కూర్చోని తినడానికి ఏర్పాటు ఉంటుంది. భక్తుల వాహనాల పార్కింగ్, ఇతర సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. భవిష్యత్లో ఇతర బ్లాక్లు సైతం అప్పగించే అవకాశం ఉంది. భవనం మొత్తం వినియోగంలోకి వస్తే భక్తులకు మరిన్ని సౌకర్యాలు పెరుగుతాయి. – పురేందర్ కుమార్, ఈఓ -
గుండాల కోనేటికి జలకళ
కోనేరులోకి చేరిన నీరు వెల్దండ: దక్షిణకాశీగా ప్రసిద్ధిగాంచిన మండలంలోని గుండాలలో ఉన్న అంబా రామలింగేశ్వరస్వామి ఆలయ కోనేరు జలకళను సంతరించుకుంటుండటంతో భక్తులు భారీగా తరలివచ్చి దర్శించుకుంటున్నారు. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి సందర్భంగా కల్వకుర్తి జేపీనగర్లో చదివే ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు కోనేరులో మునిగి మృతిచెందాడు. ఆ సమయంలో ఎన్డీఆర్ఎఫ్ బృందం మోటారు సాయంతో మూడు రోజుల పాటు కోనేటిలోని నీటిని బయటకు తోడి మృతదేహాన్ని బయటకు తీశారు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న కోనేరు సుమారు 160 గడుల లోతు ఉన్నట్లు వారు పేర్కొన్నారు. అప్పటి నుంచి కోనేరు ఖాళీగా ఉండటంతో ద్వారాలు మూసివేశారు. వర్షాకాలం కావడంతో నీరు కొద్దికొద్దిగా ఉబికి వస్తుండటంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రావణ మాసం కావడంతో కోనేటిలో స్నానాలకు అనుమతించాలని భక్తులు దేవాదాయశాఖ అధికారులను కోరుతున్నారు. వివాహం, సంతానం లేని వారు ఇక్కటి కోనేటిలో స్నానం చేసి శివలింగానికి అభిషేకం చేస్తే ఫలితం ఉంటుందని భక్తుల నమ్మకం. -
అదే కాలుష్యం.. అంతే నిర్లక్ష్యం
రాజాపూర్: పరిశ్రమల నుంచి వ్యర్థాలను.. కలుషిత, రసాయన నీటిని పొలాల్లోకి వదులుతున్నారని.. పంటలు వేసినా పండడం లేదని.. కంపెనీల నుంచి వచ్చే పొగతో వాయుకాలుష్యం అవుతుందని.. ఎన్నోరకాలుగా ఇబ్బందులు పడుతున్నామంటూ పోలేపల్లి సెజ్ పరిసర గ్రామాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. తాజాగా ప్రజావాణిలో పలు గ్రామాల రైతులు ఫిర్యాదు చేయడంతో అధికారులు తనిఖీలు చేయగా.. అదే కాలుష్యం.. అంతే నిర్లక్ష్యంతో సదరు కంపెనీలు, సిబ్బంది వ్యవహరించడం కనిపించింది. యథేచ్ఛగా పొలాల్లోకి కలుషిత నీటిని వదలడంతో అధికారులు హెచ్చరించారు. వివరాల్లోకి వెళ్తే.. రాజాపూర్ మండలం రాయపల్లి, ముదిరెడ్డిపల్లి గ్రామాల రైతులతో పాటు జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రామ రైతులు కాలుష్య జలాలను వదులుతున్న పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని ‘ప్రజావాణిశ్రీలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన కలెక్టర్ విజయేందిరబోయి కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, జిల్లా ఇండస్ట్రియల్, వ్యవసాయశాఖ, గ్రౌండ్వాటర్ అధికారులను కమిటీ వేసి వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. విస్తృత తనిఖీలు.. దీంతో మంగళవారం జెడ్పీ సీఈఓ వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో పీసీబీ ఈఈ సురేష్, జడ్చర్ల తహసీల్దార్ నర్సింగ్రావ్, జిల్లా ఇండస్ట్రీస్ అధికారి ప్రతాప్రెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి వెంకటేశ్వర్లు పోలేపల్లి సెజ్లోని పరిశ్రమల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. పరిశ్రమల్లో నుంచి వ్యర్థాలను రైతుల వ్యవసాయ పొలాల్లోకి వదిలే రంద్రాలను గమనించి వెంటనే వీటిని మూసివేయాలని ఆయా పరిశ్రమల ప్లాంట్ ఇంచార్జ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా సంబంధిత అధికారులకు ఎన్నో పర్యాయాలు ఫిర్యాదులు చేస్తున్నా.. వారు పరిశ్రమల నుంచి యథావిధిగా మా పొలాల్లోకి కాలుష్యపు జలాలు వదులుతున్నారని పోలేపల్లి రైతు రఘునందన్చారి అధికారులకు గోడు విన్నవించారు. ఓ పరిశ్రమలో అధికారులు తనిఖీలు చేస్తుండగా.. సమాచారం అందుకున్న మిగతా పరిశ్రమల ఇంచార్జ్లు అప్రమత్తమయ్యారు. పరిసరాలు శుభ్రంగా చేయడంతోపాటు కాలుష్యం కానరాకుండా చేశారు. ఇదిలాఉండగా, అధికారులు లోపలికి వెళ్లకుండా హెటిరో పరిశ్రమ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో వ్యవసాయశాఖ అధికారులు పరిశ్రమ గేటు బయటే ఉండిపోయారు. పోలేపల్లి సెజ్ పరిశ్రమల్లో వెలుగుచూసిన నిజాలు కలెక్టర్ ఆదేశంతో అధికారుల విస్తృత తనిఖీలు మీ తీరు మారదా.. అంటూ కంపెనీ ఇన్చార్జ్లపై ఆగ్రహం తనిఖీల సమాచారం తెలుసుకొని కంపెనీలు అప్రమత్తం కొన్ని పరిశ్రమల్లో గేట్లు వేసి అధికారులను లోపలికి రానివ్వని వైనం -
భారీ పాము పట్టివేత
కొత్తకోట రూరల్: మండలంలోని కానాయిపల్లిలో అలంపూర్ మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్రెడ్డి ఇంటి ఆవరణలో భారీ పామును స్నేక్క్యాచర్, హోంగార్డ్ కృష్ణసాగర్ పట్టుకున్నారు. కారు పార్కింగ్ స్థలంలో ఉన్న పామును ఇంట్లో పనిచేసే వారు గుర్తించి భయాందోళనకు గురై కొత్తకోటలో విధులు నిర్వర్తిస్తున్న కృష్ణసాగర్కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఆయన వెంటనే గ్రామానికి చేరుకుని పామును పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టుకున్న పాము జెర్రిపోతు అని.. ఏడు ఫీట్ల పొడవు, 12 ఏళ్ల వయస్సు, నాలుగు కిలోల బరువు ఉంటుందన్నారు. పాములు కనబడితే తనకు సమాచారం ఇస్తే పట్టుకొని అడవిలో వదిలేస్తానన్నారు. శిశుగృహలో బాలుడి అప్పగింత మహబూబ్నగర్ క్రైం: మూడేళ్ల బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లిన మంగళవారం చోటుచేసుకుంది. టూటౌన్ ఎస్ఐ విజయ్భాస్కర్ కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని సుభాష్నగర్లోని ఓ మజీద్ వద్ద గుర్తు తెలియని మూడేళ్ల బాలుడిని ఎవరో వదిలేసి వెళ్లినట్లు మంగళవారం డయల్ 100కు కాల్ వచ్చింది. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి బాలుడిని రక్షించారు. ఎవరైనా యాచకులు వదిలేసి వెళ్లారా? లేక ఇంకా ఎవరైనా వదిలేసి వెళ్లారా అనే అంశంపై విచారణ చేస్తున్నామని తెలిపారు. బాలుడి శరీరంపై గాయాలు ఉన్నాయని, శిశుగృహాలో అప్పగించినట్లు ఎస్ఐ వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి
పాలమూరు: సీజనల్ వ్యాధులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీజీఎంఎస్ఐడీసీ చైర్మన్ ఫణీంద్ర రెడ్డి సూచించారు. మహబూబ్నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రిని మంగళవారం ఆయన సందర్శించారు. మొదట జనరల్ మెడిసిన్ పురుషుల, మహిళల వార్డులను సందర్శించి రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం డైట్ విభాగాన్ని సందర్శించి ఆహార పదార్థాలను, నిల్వ ఉన్న కూరగాయాలు, ఇతర కిరాణ సామాన్ల స్టాక్ను తనిఖీ చేశారు. అదేవిధంగా ఎంసీహెచ్ బ్లాక్, సీటీ స్కాన్, పోస్ట్ ఆపరేటీవ్ వార్డు, సెంట్రల్ డ్రగ్స్టోర్, ఆస్పత్రిలోని మెయిన్ డ్రగ్ స్టోర్ను తనిఖీ చేసి వైద్యాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సీజనల్ వ్యాధలు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో కావాల్సిన మందులను, పడకలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాలు నిత్యం శానిటైజేషన్ చేపట్టి పరిసరాలను శుభ్రంగా పెట్టుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ కృష్ణ, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి, డీఐవో పద్మజా, నారాయణపేట కళాశాల ప్రిన్సిపల్ సంపత్కుమార్, డాక్టర్ సునీల్కుమార్, అమరావతి, శశికాంత్, భాస్కర్నాయక్ పాల్గొన్నారు. -
జూరాలకు పెరిగిన ఇన్ఫ్లో
ఽదరూరు/ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లో పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి 9 గంటల వరకు ప్రాజెక్టుకు 1.34లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. 12 క్రస్ట్గేట్లను ఎత్తి 1.19 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 27వేల క్యూసెక్కులు, కోయిల్సాగర్కు 315 క్యూసెక్కులు, నెట్టెంపాడుకు 750 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 48 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 1,030 క్యూసెక్కులు, కుడి కాల్వకు 500 క్యూసెక్కులు, ఆర్డీఎస్ లింక్ కెనాల్కు 150 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 200 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–2కు 750 క్యూసెక్కులు కలిపి ప్రాజెక్టు నుంచి మొత్తం 1.5 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 7.914 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కొనసాగుతున్న విద్యుదుత్పత్తి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువ, ఎగువ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో 11 యూనిట్ల ద్వారా విద్యుత్పత్తిని చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువ జూరాలలో ఐదు యూనిట్ల ద్వారా 169.364 మిలియన్ యూనిట్లు, దిగువ జూరాలలో ఆరు యూనిట్ల ద్వారా 201.175 మిలియన్ యూనిట్లు కలిపి మొత్తం 370.539 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని చేపట్టామన్నారు. సుంకేసులకు భారీగా వరద రాజోళి: సుంకేసుల డ్యాంకు వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. సోమవారం 97 వేల క్యూసెక్కులు వరద వస్తున్నట్లు దాటినట్లు అధికారులు తెలిపారు. దీంతో నదీ తీర గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజోళి మండల అధికారులు సూచించారు. 17 గేట్లను మీటర్ మేర తెరిచి 94,445 క్యూసెక్కులను దిగువకు వదిలారు. కేసీ కెనాల్కు 1,847 క్యూసెక్కులను వదిలినట్లు జేఈ మహేంద్ర పేర్కొన్నారు. 1.34లక్షల క్యూసెక్కుల వరద 12 క్రస్ట్గేట్ల ఎత్తివేత జల విద్యుత్ కేంద్రంలో 5 యూనిట్లలో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి -
హాస్టల్ విద్యార్థినికి అస్వస్థత
నవాబుపేట: మండలంలోని యన్మన్గండ్ల బాలికల హాస్టల్ విద్యార్థిని అస్వస్థతకు గురికావడంతో సిబ్బంది మండల కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. వివరాలు.. సోమవారం మధ్యాహ్నం యన్మన్గండ్ల బాలికల హాస్టల్కు చెందిన 7వ తరగతి విద్యార్థిని సాత్విక శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండడంతో ఉపాధ్యాయులు బాలికలను మండల కేంద్రంలోని పీహెచ్సీకి తరలించారు. అక్కడే బాలికకు ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా అక్కడ బాలిక కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. ఇంత జరిగినా హాస్టల్ వార్డెన్కు సహచారం లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోయిలకొండ మండలంలోని దమ్మయ్యపల్లి సాత్విక సొంత గ్రామం కాగా యన్మన్గుండ్ల హాస్టర్లో ఉంటూ చదువుతుంది. కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. ఈ విషయంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం చే యకుండా విద్యార్థుల ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
నాగర్కర్నూల్ క్రైం: విద్యుదాఘాతానికి గురై రైతుమృతిచెందిన ఘటన మండలంలోని తూడుకుర్తి పరిధి భాగ్యనగర్కాలనీలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై గోవర్ధన్ కథనం ప్రకారం.. భాగ్యనగర్కాలనీకి చెందిన గుంటిశేఖర్ (45) వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఉదయం తన పొలంలో బోరుమోటారు ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కారు, బైక్ ఢీ: ఒకరి మృతి మరికల్: కారు బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందిన ఘటన సోమవారం తీలేర్ స్టేజీ సమీ పంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకా రం.. ధన్వాడకు చెందిన కావలి భాస్కర్(37) ట్రాక్టర్కు సంబంధించిన సామగ్రిని తీసుకరావడానికి బైక్పై మహబూబ్నగర్కు వెళ్తుండగా మరికల్ మండలం తీలేర్ స్టేజీ సమీపంలోకి రాగానే షాద్నగర్ నుంచి రాయిచూర్ వెళ్తున్న కారు ఎదురెదురుగా ఢీకొనడంతో భాస్కర్ ఎగిరి ముళ్లపొదల్లో పడి అక్కడిక్కడే మృతిచెందాడు. కారు చెట్టుకు ఢీకొని పల్టీలు కొట్టి నిలిచి పోయింది. కారులో ఉన్న చిన్నారితోపాటు నలుగురు కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాము తెలిపారు. కారు, బైక్ ఢీ: యువకుడు మృతి వనపర్తి రూరల్: కారు, బైకు ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తికి గాయాలైన సంఘటన ఆదివారం అర్ధరాత్రి చిట్యాల శివారులో చోటుచేసుకుంది. వనపర్తి రూరల్ ఎస్ఐ జలంధర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి పట్టణంలోని పాతబజార్కు చెందిన శివ (35) అతని స్నేహితుడు పుట్ట కుర్మయ్య కలిసి జంగమాయిపల్లి నుంచి ఆదివారం అర్ధరాత్రి బైక్పై వనపర్తికి వస్తుండగా, మార్గమధ్యలో చిట్యాల శివారులో ఎదురుగా వస్తున్న కారు బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్పై నుంచి ఇద్దరు కింద పడ్డారు. తీవ్రగాయాలు కావడంతో వెంటనే వారిని వనపర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు శివను హైదరాబాద్కు తీసుకెళ్తుండగా కొత్తకోట శివారులో మృతిచెందాడు. పుట్ట కురుమయ్య గాయాలతో వనపర్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై సోమవారం శివ భార్య ఆవల శారద శతమానం ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం తెలకపల్లి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ నరేష్ వివరాల ప్రకారం.. వంగూరు మండలంలోని ఉల్పర గ్రామానికి చెందిన గున్నమోని శ్రీను(45) తన ద్విచక్ర వాహనంపై అదే గ్రామానికి చెందిన మల్లయ్యతో కలిసి కారువంగ గ్రామానికి చేరుకున్నారు. తిరుగు ప్రయాణంలో గున్నమోని శ్రీను ఒక్కరే తన ద్విచక్రవాహనంపై కారువంగ నుంచి ఉల్పరకు బయలుదేరాడు. కారువంగ గ్రామ సమీపంలో మాదవరెడ్డి పొలం దగ్గర ఉన్న ఎడ్లబండికి ప్రమాదవశాత్తు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్య గున్నమోని భారతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి మృతి అడ్డాకుల: రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి మృతి చెందిన ఘటన మూసాపేట మండలం జానంపేట వద్ద జాతీయ రహదారిపై సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం జానంపేట గ్రామానికి చెందిన బాల కుర్మయ్య, మద్దిగట్ల అంజమ్మ(60) దంపతులు. ఇటీవల అంజమ్మ పుట్టింటికి వెళ్లింది. భర్త అనారోగ్యానికి గురికావడంతో భార్య అంజమ్మ జానంపేటకు బయలుదేరింది. ఆదివారం రాత్రి జానంపేటలో రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు వెళ్లే కారు ఢీకొన్నది. ఈ ప్రమాదంలో అంజమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు పేర్కొన్నారు. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య జడ్చర్ల: కొల్లోనిమర్ల తండాకు చెందిన ఇంటర్ విద్యార్థిని హర్షిత(16) ఆత్మహత్య చేసుకుంది. సోమవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని తండావాసులు తెలిపారు. కాగా మృతు రాలు జిల్లాకేంద్రంలోని ఓ ప్రభుత్వ గురుకుల కళాశాలలో ఇంటర్ ప్రవేశ పరీక్ష రాసినట్లు తెలిసింది. అంతకుముందు మరో రెండు కళాశాలల్లో ప్రవేశపరీక్ష రాసిందని, చదువు ఇష్టం లేకనే ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. కూతురు ఆత్మహత్యతో తల్లిదండ్రులు ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. విద్యార్థిని ఆత్మహత్యపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
ఏడాదిలో 500 పార్లర్ల ఏర్పాటుకు కృషి
జడ్చర్ల టౌన్/ మిడ్జిల్: రాష్ట్రంలో విజయ డెయిరీ ద్వారా ఏడాదిలోపు 500 పార్లర్ల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామని రాష్ట్ర పాడిపరిశ్రమశాఖ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని విజయ డెయిరీని సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ విజయ డెయిరీ, ఫెడరేషన్ పరిరక్షణకు కఠిన నిర్ణయాలు తప్పవన్నారు. ఇప్పట్లో పాలధర పెంచే యోచన లేదని స్పష్టం చేశారు. రెండేళ్లుగా విజయ డెయిరీ ప్రతినెలా రూ.10 కోట్ల వరకు నష్టంలో ఉండేదని, తాము తీసుకున్న కఠిన నిర్ణయాలతో రెండు నెలలుగా నష్టం రూ.3 కోట్లకు తగ్గించగలిగామన్నారు. ఖర్చులు తగ్గించడంతోపాటు పాల విక్రయాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగానే రైతులకు ధరలు తగ్గించామని, సంస్థ లాభాల బాట పట్టాక బోనస్ రూపంలో రైతులకు మేలు చేసే యోచనలో ఉన్నామన్నారు. అలాగే ఆవు పాల సేకరణ తగ్గించి గేదె పాలు సేకరించడం ప్రారంభించాలన్నారు. అందుకు అవసరమైన గేదెలు కొనుగోలు చేసేందుకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తామన్నారు. జడ్చర్లలో ప్రాసెసింగ్ యూనిట్ ఇప్పట్లో వద్దని, దాని వల్ల ఖర్చులు పెరిగాయని, ముందుగా పాల విక్రయాలు పెంచాలని సూచించారు. అదేవిధంగా జాతీయ రహదారిపై, పట్టణాల్లో పార్లర్ల ఏర్పాటుకు ముందుకు వస్తే అందుకు అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. ప్రభుత్వ స్థలంలోనే ఏర్పాటు చేయాలని, తాము కలెక్టర్కు సైతం తెలియజేస్తామన్నారు. మహబూబ్నగర్ జిల్లాకు రోజు కర్ణాటక ఫెడరేషన్ నుంచి 30 వేల లీటర్ల పాలు వస్తున్నాయని, అక్కడ ధర తక్కువగా ఉండటంతో చాయ్ క్లబ్లు, టీ కేఫ్లు పెట్టేవారు అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నారన్నారు. విజయ పాలు నాణ్యతతో ఉన్నందున మహిళా సమాఖ్యలు ముందుకు వచ్చి పార్లర్లు ఏర్పాటు చేస్తే పాల ఉత్పత్తులు పంపించే బాధ్యత తాము తీసుకుంటామన్నారు. అంతకు ముందు రైతులు, మహిళా సమాఖ్య సభ్యులు పాల ధర పెంచాలని, ప్రాసెసింగ్ యూనిట్ ఇవ్వాలని కోరారు. అనంతరం మిడ్జిల్ మండలంలోని బోయిన్పల్లిలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో జీఎం మధుసూదన్, జడ్చర్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జ్యోతి, చిల్లింగ్ సెంటర్ చైర్మన్ రవీందర్రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ కవిత, డీడీ శ్రీనివాస్, సీసీ స్వర్ణ, సమాఖ్య అధ్యక్షురాలు శాంతాబాయి, కార్యదర్శి రూప, అరుణ, సత్యమ్మ, మేనేజర్ వెంకట్రెడ్డి, ఏపీఎంలు రవికుమార్, మల్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. నెలకు రూ.10 కోట్ల నష్టం నుంచి రూ.3 కోట్లకు తగ్గించాం రాష్ట్ర పాడిపరిశ్రమశాఖ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి -
స్కూల్ బస్సు కింద పడి వ్యక్తి దుర్మరణం
గట్టు: మండలంలోని బల్గెర గ్రామంలో సోమవారం ఉదయం స్కూల్ బస్సు కింద పడి బల్గెర గ్రామానికి చెందిన బజారన్న అలియస్ ముక్కెరన్న(60) మృతి చెందాడు. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు.. బల్గెర గ్రామానికి చెందిన బజారన్న అలియాస్ ముక్కెరన్న ఉదయం గ్రామంలోని శ్రీదిగంబరస్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. బస్టాప్ సమీపంలోని టీ స్టాల్ నుంచి రోడ్డు అవతల ఉన్న ఇంటికి వెళ్తున్న క్రమంలో అయిజలోని ప్రైవేటు స్కూల్ బస్సు విద్యార్థులతో ఎక్కించుకుని అయిజకు వెళ్తున్న క్రమంలో మూల మలుపు దగ్గర బజారన్న అలియాస్ ముక్కెరన్నను ఢీ కొట్టింది. దీంతో బజారన్న కాళ్లపై నుంచి ముందు టైర్ వెళ్లడంతో తీవ్రంగా గాయపడిన ఆయనను హుటాహుటిన అయిజకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం గద్వాల ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బజారన్న మృతి చెందినట్లుగా వైద్యులు నిర్దారించారు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తెలున్నారు. ఈ సంఘటనపై మృతుడి కుమారుడు పరమేష్నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్ నర్సింహులుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మల్లేష్ తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ జెడ్పీ చైర్ పర్సన్ సరిత, స్టేట్ కన్జ్యూమర్ ఫెడరేషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గట్టు తిమ్మప్ప, మాజీ ఎంపీపీ విజయ్కుమార్, మాజీ సర్పంచు బల్గెర నారాయణరెడ్డిలు గద్వాల ఆస్పత్రిలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
బాధితులకు ఎమ్మెల్యే పర్ణికారెడ్డి పరామర్శ
పాలమూరు: కోయిలకొండ మండలం కోత్లాబాద్ గ్రామ శివారులో ఈనెల 26న గొర్రెల కాపరి మైబన్న, రైతులు సత్యనారాయణరెడ్డి, చెన్నారెడ్డిపై చిరుత దాడి చేయడంతో వారికి జిల్లా జనరల్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. చిరుతదాడి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురిని సోమవారం పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాధవిని అడిగి తెలుసుకున్నారు. ముగ్గురు ఆరోగ్యంగా ఉన్నారని మంగళవారం డిశ్చార్జ్ చేస్తామని సూపరింటెండెంట్ ఎమ్మెల్యేకు వివరించారు. గాయపడిన వ్యక్తిని పరామర్శిస్తున్న ఎమ్మెల్యే పర్ణికారెడ్డి -
ప్రభుత్వ కార్యాలయంలో దొంగలు పడ్డారు
గద్వాల క్రైం: ప్రభుత్వ కార్యాలయంలో గుర్తు తెలియని దుండగులు చొరబడి రెండు కంప్యూటర్లు, రెండు ప్రింటర్లను ఎత్తుకెళ్లిన ఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు, కార్యాలయ సిబ్బంది కథనం మేరకు.. గుర్తుతెలియని దుండగులు సోమవారం తెల్లవారుజామున జిల్లా కేంద్రంలోని పంచాయతీరాజ్, క్వాలిటీ కంట్రోల్ కార్యాలయం తలుపులు ధ్వంసం చేసి రెండు కంప్యూటర్లు, రెండు ప్రింటర్లను తీసుకెళ్లారు. రోజువారి విధుల్లో భాగంగా డీఈలు కబీర్దాస్, సతీష్ కార్యాలయానికి వచ్చి చూడగా తలుపులు తెరిచి ఉండడం గమనించి చోరీ జరిగినట్లు గుర్తించారు. సిబ్బంది పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలం వద్దకు పట్టణ ఎస్ఐ కళ్యాణ్కుమార్ చేరుకుని చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. కంప్యూటర్లలో కార్యాలయానికి సంబంధించిన రికార్డులు, బిల్లులు, పలు రకాల ఫైల్స్ హార్డ్ డిస్క్ల్లో నిక్షిప్తమై ఉన్నాయని తెలిపారు. అయితే వాటి విలువ రూ.1.50లక్షలు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఘటనపై డీఈ కబీర్దాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. కంప్యూటర్లు.. ప్రింటర్లు అపహరణ -
సీడ్పత్తి రైతులకు బకాయిలు చెల్లించండి
గద్వాల: జిల్లాలో విక్రయించిన సీడ్పత్తికి సంబంధించి పెండింగ్లో ఉన్న డబ్బులను వెంటనే సంబంధిత రైతులకు చెల్లించాలని సీడ్ కంపెనీలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆదేశించారు. బాధిత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి సోమవారం మంత్రి తుమ్మల దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో సుమారు 50వేల ఎకరాల్లో సీడ్పత్తిని సాగుచేస్తున్నారని, అయితే గతేడాది ఖరీఫ్కు సంబంధించి పండించిన పంట డబ్బులను సీడ్కంపెనీలు చెల్లించకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తుమ్మలకు వివరించారు. అన్ని కంపెనీలు కలిపి సుమారు రూ.700కోట్లు రైతులకు బకాయిలు ఉన్నట్లు తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సీడ్కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి రైతులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని రైతులకు ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని హెచ్చరించారు. -
వాహనదారుడి జేబుకు చిల్లు..!
నిబంధనలు ఏం చెబుతున్నాయి.. సుప్రీంకోర్టుతో పాటు రోడ్డు రవాణా కమిషనర్ విడుదల చేసిన జీవో ప్రకారం.. ప్రతి వాహనదారుడు జాతీయ రహదారితో పాటు ఇతర రోడ్డు మార్గాలలో అతివేగంగా వాహనం నడపరాదు. ట్రాఫిక్ సిగ్నల్స్ తప్పక పాటించాలి. లారీలతో పాటు, ఇతర ప్రైవేట్ వాహనాలు అధిక లోడ్తో రాకపోకలు సాగించవద్దు. లారీ డ్రైవర్స్ ప్రయాణికులను ఎక్కించుకొని రహదారిపై ప్రయాణం చేస్తే వారిపై కఠిన చర్యలతో పాటు కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. మద్యం సేవించి వాహనం నడపరాదు. ఒకవేళ మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే కోర్టు ఎదుట హాజరుపరచడంతో పాటు వారం నుంచి 30రోజుల వరకు జైలు శిక్ష పడుతుందని నిబంధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా వాహనాలు నడుపుతూ ఫోన్ మాట్లాడినా, డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటు డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలు తీసుకొని వాహనాలు నడిపినా సదరు వ్యక్తులపై కేసులు నమోదు చేయడంతో పాటు వారి డ్రైవింగ్ లైసెన్స్ను మూడు నుంచి ఆరు నెలల పాటు రద్దు చేయడం, వారిపై కేసులతో పాటు జైలు శిక్ష పడటం జరుగుతుంది. మహబూబ్నగర్ క్రైం: ప్రభుత్వం రవాణా శాఖకు సంబంధించిన నూతన వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఫీజులు, ఫిట్నెస్ సర్టిఫికెట్స్ జారీ, పర్మిట్స్, ఇతర లావాదేవీలకు సంబంధించి సర్వీస్ ఛార్జీలు భారీగా పెంచింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని వాహనదారుల జేబులకు భారీ స్థాయిలో చిల్లు పడనుంది. గతంలో ఉన్న ఫీజులతో పొలిస్తే ప్రస్తుతం రెండు రెట్లు ఎక్కువ పెంచడం జరిగింది. పెంచిన సర్వీస్ ఛార్జీలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఉమ్మడి జిల్లాలో ఉన్న ఏడు ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రతి రోజు డ్రైవింగ్ లైసెన్స్లు 200 జారీ కాగా నూతన వాహనాల రిజిస్ట్రేషన్స్ 250వరకు అవుతున్నాయి. దీంతో పాటు ఫిట్ నెస్ సర్టిఫికెట్స్ జారీ, పరిమిట్స్, ఇతర రిజిస్ట్రేషన్స్ కలిపి 600అవుతున్నాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి లక్షల్లో ఆదాయం వస్తోంది. ప్రస్తుతం పెంచిన సర్వీస్ ఛార్జీల వల్ల ఆర్టీఏ కార్యాలయాల నుంచి ఆదాయం మరింత రెట్టింపు కానుంది. 8 ఏళ్ల తర్వాత పెంపు రాష్ట్ర రవాణా శాఖలో 2017 మే 6న సర్వీస్ ఛార్జీలు పెంచుతూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దాదాపు 8 ఏళ్ల తర్వాత మళ్లీ సర్వీస్ ఛార్జీలు పెంచడం జరిగింది. ఆన్లైన్ ద్వారా ప్రభుత్వానికి చెల్లించే సర్వీస్ ఛార్జీలు పెంచడం వల్ల ఎలాంటి రిజిస్ట్రేషన్ అయిన లైసెన్స్ పొందాలన్నా ప్రస్తుతం ఉన్న ఫీజుల కంటే అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఇక ద్విచక్ర వాహనాల్లో బైక్ మాడల్ ధర బట్టి సర్వీస్ ఛార్జీలలో మార్పులు ఉంటాయి. అదేవిధంగా కార్లలో కూడా వాటి ధరల ప్రకారం సర్వీస్ ఛార్జీలు పెరుగుతుంటాయి. ప్రస్తుతం ఉన్న ఛార్జీలతో పొలిస్తే కొత్తగా ఛార్జీలు రెట్టింపు అయ్యాయి. పెంచిన ఛార్జీలు అమల్లోకి వచ్చాయి.. పెంచిన సర్వీస్ ఛార్జీలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. 2017 తర్వాత ఇప్పుడు పెంచడం జరిగింది. అన్ని రకాల రిజిస్ట్రేషన్స్తో పాటు లైసెన్స్, పర్మిట్, ఫిట్నెస్ ఇలా అన్నింటిపై ఛార్జీలు పెరిగాయి. వాహనదారులు పెరిగిన సర్వీస్ ఛార్జీల ప్రకారం రవాణా సేవలు పొందాల్సి ఉంటుంది. – కిషన్, డీటీసీ ఉమ్మడి జిల్లా సర్వీస్ ఛార్జీల వివరాలిలా.. రవాణా శాఖలో భారీగా పెరిగిన సర్వీస్ ఛార్జీలు సోమవారం నుంచి అమల్లోకి.. ఉమ్మడి జిల్లాలో నిత్యం 250రిజిస్ట్రేషన్స్, 200 డ్రైవింగ్ లైసెన్స్లు జారీ -
ప్రశాంతంగా లైసెన్స్డ్ సర్వేయర్ ప్రాక్టికల్
మహబూబ్నగర్ న్యూటౌన్: ప్రభుత్వం లైసెన్స్డ్ సర్వేయర్ల ఎంపికకు రెండు నెలలుగా శిక్షణ ఇచ్చిన సర్వే అండ్ ల్యాండ్ రికార్డుల శాఖ సోమవారం ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించింది. మొదటి విడతగా శిక్షణ ఇచ్చిన అభ్యర్థులకు ప్రాక్టికల్ పరీక్షలను పూర్తి చేసింది. లైసెన్స్డ్ సర్వేయర్ ఎంపిక కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో మహబూబ్నగర్ జిల్లా నుంచి 230 మంది అభ్యర్థులుండగా వారిని ప్రభుత్వం జిల్లాకు కేటాయించింది. అందులో మొదటి విడతగా 132 మందికి భూసర్వే నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. రెండు నెలలుగా శిక్షణ పొందిన 98 మంది అభ్యర్థులలో సోమవారం 47 మందికి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించగా.. మిగతా 51 మంది అభ్యర్థులకు మంగళవారం నిర్వహించనున్నారు. పరీక్షల అనంతరం వారి ఫలితాలు వెల్లడించి లైసెన్స్డ్ సర్వేయర్లుగా ఎంపికై న వారికి ధ్రువపత్రాలు అందజేస్తారు. కాగా.. జిల్లాలో గత మే నెలలో స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగా అర్హులైన అభ్యర్థులకు లైసెన్స్డ్ సర్వేయర్లుగా నియమించేందుకు అవసరమైన శిక్షణను జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో శిక్షణ అందించారు. చైన్ సర్వే, టోటల్ సర్వే వంటి వాటిపై అవగాహన కల్పిస్తూ హద్దుల గుర్తింపు, సర్వే నంబర్లలోని సబ్డివిజన్ సమస్యపై చేపట్టాల్సిన సర్వే వంటి అంశాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ ఏడీ కిషన్రావు పర్యవేక్షణలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ఎండీ మూసా, రిటైర్డ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే అధికారి పర్వతాలు మొదటి బ్యాచ్కు రెండు నెలలపాటు క్షేత్రస్థాయి భూ సర్వేపై అభ్యర్థులకు శిక్షణ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి ఆర్వోఆర్–2025 చట్టం అమలులో వీరి సేవలు వినియోగించనున్నారు. -
ప్రత్యేకాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): మండలాల ప్రత్యేకాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రత్యేకాధికారులు క్షేత్రస్థాయిలో పీహెచ్సీ, హెల్త్ సబ్సెంటర్లు సందర్శించి ఏమైనా సమస్యలు, లోపాలు ఉంటే గుర్తించాలన్నారు. మహమ్మదాబాద్ పీహెచ్సీలో షార్ట్సర్క్యూట్ సమస్య పరిష్కరించాలని చెప్పారు. అన్ని పీహెచ్సీల్లో లేబర్ రూంలు వినియోగంలోకి తేవాలని ఆదేశించారు. జ్వరాలు ప్రబలిన గ్రామాలను వైద్యాధికారులు సందర్శించి.. అవసరమైన వైద్యసహాయం అందించాలని చెప్పారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధులపై అవగాహన కల్పించాలన్నారు. మండలంలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశామని, వర్షాలు, వరదలు వలన విపత్తు సంభవించకుండా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే యూరియా, ఎరువులు స్టాక్, రైతులకు సరఫరాపై నిత్యం సమీక్షించాలని సూచించారు. యూరియా పంటల సాగుకు కాకుండా ఇతర అవసరాలకు మళ్లించకుండా దృష్టిసారించాలన్నారు. నియోజకవర్గ ప్రత్యేకాధికారులు, మున్సిపల్ కమిషనర్లు, నగర పాలక సంస్థ, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం సమీపంలోని ఎస్సీ, బీసీ బాలికల వసతి గృహంలో తాగునీరు, ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ మాట్లాడుతూ జిల్లాలో వర్షాల వలన వరద నీరు పొంగి ప్రవహించే కాజ్వేలను గుర్తించి ట్రాఫిక్ మళ్లించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ఆస్పత్రులు శిథిల భవనాల్లో నిర్వహించవద్దన్నారు. డీఆర్డీఓ నర్సింహులు మాట్లాడుతూ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా ఇప్పటికే 27 లక్షల గుంతలు తీసి.. 21 లక్షల మొక్కలు నాటామని, ఆగస్టు మొదటి వారంలోగా మరో 8 లక్షల మొక్కలు నాటుతామని పేర్కొన్నారు. అలాగే 8 లక్షల మొక్కలను ఇంటింటికీ పంపిణీ చేశామన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ సిటిజన్ ఫీడ్ బ్యాక్ కింద మొబైల్ యాప్లో ఫీడ్ బ్యాక్ ఆగస్టు 31లోగా పూర్తిచేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, ఆర్డీఓ నవీన్, జెడ్పీ సీఈఓ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తులు పెండింగ్లో పెట్టొద్దు ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. సోమవారం ప్రజావాణిలో భాగంగా కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, నర్సింహారెడ్డి, ఆర్డీఓ నవీన్, జెడ్పీసీఈఓ వెంకట్రెడ్డి, డీఆర్డీఓ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీలో రగడ!
నేతల మధ్య రచ్చకెక్కినఅంతర్గత పోరు ● రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు సమక్షంలోనేబహిర్గతం ● చిచ్చురేపిన డీకే మాటలు.. మనస్తాపానికి గురైన శాంతికుమార్? ● ఎంపీ అనుచరుల గోబ్యాక్ నినాదాలపై పార్టీలో భిన్నస్వరాలు ● తెరపైకి బీసీ వాదం.. ‘కమలం’ శ్రేణుల్లో అయోమయం ● ‘స్థానిక’ఎన్నికల వేళ నష్టం వాటిల్లుతుందని ఆందోళన సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: క్రమశిక్షణకు పెద్దపీట వేసే భారతీయ జనతా పార్టీకి సంబంధించి పాలమూరులో ఇటీవల చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలు కలకలం సృష్టిస్తున్నాయి. మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, బీజేపీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతికుమార్ మధ్య ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు సమక్షంలో బహిరంగ సమావేశం వేదికగా అంతర్గత పోరు రచ్చకెక్కగా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శాంతికుమార్ గో బ్యాక్ అంటూ డీకే అనుచరుల నినాదాలు.. వేదికపై ఆయననుద్దేశించి అరుణ పరోక్షంగా మాట్లాడిన మాటలు పార్టీలో చిచ్చు రాజేశాయి. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన శాంతికుమార్ స్తబ్దుగా ఉండగా.. ఆయన అనుచరులు మాత్రం మండిపడుతున్నారు. ఈ క్రమంలో బీసీ వాదం తెరపైకి రాగా.. పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. రానున్న స్థానిక ఎన్నికల వేళ నష్టం వాటిల్లే అవకాశం ఉందని గ్రామ, మండల, పట్టణ స్థాయి నాయకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. -
సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం : వీసీ
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం అని పీయూ వీసీ శ్రీనివాస్ అన్నారు. పీయూలో సోమవారం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో గ్లోబల్ సెంటర్ ఫర్ది డెవలప్మెంట్ సహకారంతో నిర్వహించిన 7 రోజుల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయుడు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు సమాజంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని తెలుసుకునేందుకు నిత్య విద్యార్థిగా మారాల్సిన అవసరం ఉందన్నారు. పాఠశాల స్థాయిలో విద్యార్థులకు నైతిక విలువలు నేర్పించాలని, తోటి వ్యక్తులతో సమాజంలో ఎలా నడుచుకోవాలో నేర్పించాలని, భావోద్వేగాల నియంత్రణ వంటి అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. అప్పుడు ఒక విద్యార్థి సంపూర్ణంగా, సమగ్రంగా అభివృద్ధి చెందడం సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, రీసోర్సుపర్సన్ షాలిని, కన్వీనర్ కరుణాకర్రెడ్డి, కోకన్వీనర్ బషీర్ అహ్మద్, జయనాయక్, విజయలక్ష్మి, ఆంజనేయులు, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
బడుల బలోపేతం దిశగా..
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రుల ఆలోచనల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో సైతం ప్రీప్రైమరీ (పూర్వపు ప్రాథమిక విద్య)ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతోంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రైవేటు స్కూళ్లలో ప్రీ ప్రైమరీ విద్య అందిస్తున్నారు. ప్రభుత్వ ప్రీ ప్రైమరీ స్కూళ్లు అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటులో చేర్పిస్తున్నారు. తద్వారా అన్ని స్థాయిల్లో ప్రైవేటు స్కూళ్లకు విద్యార్థులు అలవాటు పడుతున్నారు. ఈ లోపాన్ని సరిదిద్ది సర్కారు బడుల్లో అడ్మిషన్లు పెంచేందుకు ప్రభుత్వం పూర్వపు ప్రాథమిక విద్య అందించేందుకు చర్యలు చేపట్టింది. అందుకోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 90 ప్రీ ప్రైమరీ స్కూళ్లను నెలకొల్పాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి నూతనంగా ప్రారంభించిన పాఠశాలల్లో 4–5 ఏళ్ల పిల్లలను చేర్చుకోవాలని సూచించింది. ఇద్దరు చొప్పున నియామకం.. ప్రతి ప్రీ ప్రైమరీ పాఠశాలకు ఇద్దరు సిబ్బందిని నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో ఒక టీచర్ ఇంటర్మీడియట్తోపాటు ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్, ప్రైమరీ టీచింగ్లో అర్హులై ఉండాలి. విద్యార్థుల బాగోగులు చూసుకునేందుకు ఒక ఆయాను కూడా నియమించాల్సి ఉంది. ఆమెకు కనీసం 7వ తరగతి అర్హత ఉండి స్థానికులై ఉండాలి. వీరిని జిల్లాస్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ ఎంపిక చేస్తుంది. ప్రీ ప్రైమరీ విద్యార్థులకు ఎస్సీఆర్టీ జాతీయ స్థాయిలో అమలుపరుస్తున్న సిలబస్ను బోధించాల్సి ఉంటుంది. ప్రైమరీ పాఠశాలల్లో.. నూతనంగా ప్రారంభించే ప్రీ ప్రైమరీ స్కూళ్లకు ప్రస్తుతం కొనసాగుతున్న ప్రైమరీ పాఠశాలల్లో ఒక తరగతి గదిని కేటాయించనున్నారు. అనంతరం అందుబాటులో ఉండే నిధుల ఆధారంగా కొత్త గదులను నిర్మించనున్నారు. వీటిలో వసతుల కల్పన కోసం ఒక్కో బడికి రూ.1.50 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో విద్యార్థులు ఇండోర్, అవుట్ డోర్ గేమ్స్ ఆడేందుకు బొమ్మలు, గోడలపై ఆకర్షణీయమైన చిత్రాలు వేయడం, బేంచీలు, బోర్డులు, కుర్చీల వంటివి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వీటి కొనుగోలు పూర్తిగా కలెక్టర్ ఆదేశాల మేరకు అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టాలి. వీటితోపాటు అన్ని పాఠశాలల మాదిరిగానే మధ్యాహ్న భోజనం, స్నాక్స్ వంటివి విద్యార్థులకు అందిస్తారు. ఏయే పాఠశాలల్లో అంటే.. ఎంపీపీఎస్ బాదేపల్లి తెలుగువాడ, బోడజానంపేట, బాదేపల్లి (బీఓ), కన్మనూర్, కొత్తూర్, ఎల్లంబాయితండా, గురుకుంట, వెంకట్రెడ్డిపల్లి, కాటవరం, జంగమయ్యపల్లి, రావులపల్లి, బాదేపల్లి (కొత్తబజార్), రెడ్డిపల్లి, వాడ్యాల్, పెద్దతండా, కొల్లంపల్లి, ధర్మాపూర్, సింగనోనిపల్లి, గొల్లబండతండా, చౌదర్పల్లితండా, సింగాయపల్లి, చౌదర్పల్లి, బల్సుర్గొండ, మున్ననూర్, చెడుగుట్ట, మణికొండలో ప్రీ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ ప్రీ ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటు ఉమ్మడి జిల్లాలో కొత్తగా ప్రారంభం కానున్న 90 పాఠశాలలు వసతుల కల్పనకు రూ.1.50 లక్షల చొప్పున మంజూరు ఈసారి నుంచే ఎల్కేజీ, యూకేజీ అడ్మిషన్లకు అనుమతి జాతీయ స్థాయి సిలబస్ బోధనకు చర్యలు -
బాధితులకు సత్వర న్యాయం అందాలి
మహబూబ్నగర్ క్రైం: ప్రతి పోలీస్స్టేషన్కు వచ్చే ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టిపెట్టడంతోపాటు వారికి సత్వర న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఎస్పీ డి.జానకి అన్నారు. ఎస్పీ కార్యాలయంలో సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 13 మంది బాధితులతో ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ సదరు పోలీస్ స్టేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదులు వేగవంతంగా పరిష్కరించాలన్నారు. ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేసి నిత్యం వాటిపై పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఈ క్రమంలో ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఓ వృద్ధురాలు మెట్ల మార్గంలో మొదటి అంతస్తులోకి వెళ్లడానికి ఇబ్బంది పడటంతో ఎస్పీనే కిందకు వచ్చి మహిళతో మాట్లాడి ఫిర్యాదు స్వీకరించారు. 1 నుంచి కార్మికులకు కొత్త పథకం మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ)లో కొత్తగా నమోదయ్యే కార్మిక ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ‘ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకం’ ప్రవేశపెట్టిందని పీఎఫ్ నోడల్ ఆఫీసర్ శ్రీలతారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక చైతన్య సెంట్రల్ స్కూల్లో పీఎఫ్ ఖాతాదారుల సమస్యలపై ‘నిధి ఆప్కే నిక్కత్–2’ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చే నెల 1 నుంచి కొత్తగా ఉద్యోగాల్లోకి చేరి తొలిసారి ఈపీఎఫ్ఓలో పేరు నమోదైన వారికి రూ.15 వేల ప్రోత్సాహకం లభిస్తుందన్నారు. ఇది ఏడాదిలో రెండుసార్లు (ఆరు నెలలకోసారి) నేరుగా ఉద్యోగుల ఖాతాలో డీబీటీ విధానంలో జమ అవుతుందన్నారు. ఈ ప్రయోజనం రూ.లక్ష వరకు వేతనం వచ్చే కొత్త ఉద్యోగులందరికీ వర్తిస్తుందన్నారు. కార్మికులు, ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో పీఎఫ్ సెక్షన్ సూపర్వైజర్ శరత్, వివిధ కంపెనీల ఉద్యోగులు పాల్గొన్నారు. కోయిల్సాగర్లో 26 అడుగుల నీటిమట్టం దేవరకద్ర: కోయిల్సాగర్లో నీటిమట్టం సోమవారం సాయంత్రం వరకు 26 అడుగులకు చేరింది. ఈ నెల 1న ప్రాజెక్టులో కేవలం 11 అడుగుల కనిష్ట స్థాయిలో ఉండగా అదేరోజు జూరాల నుంచి కోయిల్సాగర్ లిఫ్ట్ ఫేస్–1లో ఒక పంపును రన్ చేసి నీటిని విడుదల చేశారు. 6న తీలేరు వద్ద ఉన్న ఫేస్–2 పంపుహౌస్కు చేరిన నీటిని ఒక పంపును రన్ చేసి కోయిల్సాగర్కు విడుదల చేశారు. గత 22 రోజుల నుంచి ఎత్తిపోతల ద్వారా వస్తున్న నీటితోనే ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. దీనికితోడు ఇటీవల వర్షాలు కురుస్తుండడంతో పెద్ద వాగు ద్వారా కొంత నీరు కూడా ప్రాజెక్టులోకి చేరుతోంది. కాగా.. ప్రాజెక్టు పాత అలుగు స్థాయి 26.6 అడుగులు కాగా మరో 0.6 అడుగుల నీరు రావాల్సి ఉంది. అలాగే ప్రాజెక్టు గేట్ల స్థాయి 32.6 అడుగులు కాగా మరో 6.6 అడుగుల నీరు వస్తే పూర్తిస్థాయికి చేరుకుంటుంది. ఇదిలా ఉండగా.. ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటి విడుదల కొనసాగుతుంది. దరఖాస్తుల ఆహ్వానం బిజినేపల్లి: మండలంలోని వట్టెం జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11 తరగతుల్లో ప్రవేశానికి గాను విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పి.భాస్కర్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం 8, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు నవోదయ వెబ్సైట్ ద్వారా సెప్టెంబర్ 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం నవోదయ విద్యాలయం లేదా ఉమ్మడి జిల్లాలోని మండల విద్యాధికారుల కార్యాలయాల్లో సంప్రదించాలని తెలిపారు. -
నాన్నా.. నీ కాళ్లు మొక్కుతా.. నన్ను ఏమీ చేయకు
మహబూబ్ నగర్ జిల్లా: ‘నాన్న.. నీ కాళ్లు మొక్కుతా.. నన్ను ఏమీ చెయ్యొద్దంటూ ప్రాథేయపడినా ఆ తండ్రి కనికరించలేదు. సభ్యసమాజం తల దించుకునేలా మృగంలా మారి కన్న కూతురిపైనే దారుణ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని ఓ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ రాము కథనం ప్రకారం.. కుర్వ కుర్మయ్యకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరు మక్తల్లోని ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. అయితే చిన్న కూతురు (10)కు రెండు నెలల క్రితం కుక్క కరవటంతో చికిత్స చేయించి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే 5వ తరగతి చదివిస్తున్నారు. ఈ నెల 25న తల్లి కూలీ పనులకు, తండ్రి మేకల దగ్గరకు వెళ్లాడు. చిన్న కూతురు పాఠశాల నుంచి వచ్చి సాయంత్రం ఇంట్లో చదువుకుంటుండగా ఇంటికి వచ్చిన తండ్రి కుర్మయ్య.. ఒంటరిగా ఉన్న కూతురిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. నాన్న.. నీ కాళ్లు మొక్కుతా.. నన్ను ఏమీ చేయొద్దని ప్రాథేయపడినా కనికరించలేదు. ఇంట్లో నుంచి బాలిక అరుపులు విన్న చుట్టుపక్కల వారు వచ్చి బాలికను కాపాడారు. అప్పటికే బాలికకు తీవ్ర రక్తస్రావమైంది. కూలీ పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన తల్లికి జరిగిన విషయాన్ని చెప్పగా.. గ్రామంలోని ఆర్ఎంపీకి చూపించారు. పరిస్థితి విషమంగా ఉందని ఆర్ఎంపీ చెప్పగా.. భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కుర్మయ్య భార్యను కొట్టి గ్రామం నుంచి పరారయ్యాడు. బాలిక పరిస్థితి మరింత విషమంగా మారడంతో అదే రోజు రాత్రి మరికల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మహబూబ్నగర్కు తీసుకెళ్లాలని చెప్పగా.. కుటుంబ సభ్యులు మరుసటి రోజు శనివారం మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి బాలికను తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు పోలీసు కేసు అయితేనే చికిత్స చేస్తామని చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆదివారం తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
రద్దీ ఏరియాల్లో నిఘా పెంచుతాం
మహబూబ్నగర్ క్రైం: జిల్లా కేంద్రంలోని రద్దీ ఏరియాల్లో నిఘా పెంచుతామని ఎస్పీ జానకి పేర్కొన్నారు. శనివారం అర్ధరాత్రి ఆర్టీసీ బస్టాండ్, రైల్వేస్టేషన్ వద్ద ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. మొదట ఆర్టీసీ బస్టాండ్కు వెళ్లిన ఎస్పీ అక్కడ వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు నిద్రిస్తున్నండగా.. వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొంతమంది అనుమానితులు కన్పిస్తే వారిని అదుపులోకి తీసుకుని ఫింగర్ ప్రింట్ డివైస్ సహాయంతో వారి వివరాలు పరిశీలించారు. అనంతరం రైల్వేస్టేషన్లో కూడా పలు రైళ్లకోసం ఎదురుచూస్తున్న ప్రయాణికుల లగేజ్తోపాటు వారి వివరాలను ఆరా తీశారు. అదేవిధంగా అనుమానితుల ఫింగర్ ప్రింట్లు సేకరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. బస్టాండ్, రైల్వేస్టేషన్లో అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులపై నిత్యం నిఘా పెట్టడంతో నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఫింగర్ డివైస్ సహాయంతో వ్యక్తుల వేలిముద్రలు క్షుణ్ణంగా పరిశీలించి నేర చరిత్ర ఉంటే అదుపులోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ తనిఖీలు భవిష్యత్లో మరింత విస్తృతం చేస్తామని, పోలీసుల నిఘా చర్యలతో నేరాల తగ్గుముఖం పట్టాయని తెలిపారు. తనిఖీలో డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి, ఇతర పోలీసులు పాల్గొన్నారు. పాలమూరు ఎస్పీ జానకి పట్టణంలో అర్ధరాత్రి విస్తృత తనిఖీలు -
జూరాలకు మళ్లీ పెరిగిన వరద
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద ఆదివారం మళ్లీ పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. శనివారం 75 వేల క్యూసెక్కులు ఉండగా.. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో 1.08 లక్షలకు చేరిందన్నారు. దీంతో 12 క్రస్ట్గేట్లు ఎత్తి 58,884 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని చెప్పారు. అలాగే విద్యుదుత్పత్తి నిమిత్తం 32,719 క్యూసెక్కులు, కోయిల్సాగర్కు 315, నెట్టెంపాడుకు 750, ఆవిరి రూపంలో 44, ఎడమ కాల్వకు 550, కుడి కాల్వకు 500, ఆర్డీఎస్ లింక్ కెనాల్కు 150, సమాంతర కాల్వకు 200, భీమా లిఫ్ట్–2కు 750 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు చెప్పారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 7.933 టీఎంసీల నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొనసాగుతున్న విద్యుదుత్పత్తి.. ఆత్మకూర్: జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద భారీగా వస్తుండటంతో దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిర్విరామంగా కొనసాగుతుందని ఎస్ శ్రీధర్ తెలిపారు. ఆదివారం ఎగువన 5 యూనిట్ల నుంచి 195 మెగావాట్లు, 165.284 మి.యూ., దిగువ 6 యూనిట్ల నుంచి 240 మెగావాట్లు, 196.082 మి.యూ. విద్యుదుత్పత్తి చేపట్టామన్నారు. ఎగువ, దిగువ కేంద్రాల్లో ఇప్పటి వరకు 361.366 మి.యూ. ఉత్పత్తి విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. సుంకేసులకు 50 వేల క్యూసెక్కులు.. రాజోళి: సుంకేసుల జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద ఆదివారం పెరిగింది. 50 వేల క్యూసెక్కుల వరద జలాశయానికి చేరుతుండగా.. 14 గేట్లను తెరిచి 52,682 క్యూసెక్కుల నీటిని దిగువకు, కేసీ కెనాల్కు 1,847 క్యూసెక్కులు మొత్తం 54,529 క్యూసెక్కులు వినియోగించినట్లు జేఈ మహేంద్ర వివరించారు. 1.08 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో 12 క్రస్ట్గేట్లు ఎత్తి దిగువకు విడుదల -
పాన్గల్ కోటలో పులివేట వీరగల్లు ప్రతిమ
పాన్గల్: వనపర్తి జిల్లా పాన్గల్ మండల కేంద్రంలోని ఖిల్లా కోటకు చాలా ప్రాచీన చరిత్ర ఉంది. కోటలో అనేక కట్టడాలు, ఫిరంగులతో పాటు ఎన్నో శిల్పాలు, వీరగల్లు విగ్రహాలున్నాయి. కోటలోకి వెళ్తుంటే ముళ్ల గవినిగా పిలవబడే ప్రదేశం వద్ద దాదాపు నాలుగు అడుగులున్న పులివేట వీరగల్లు ప్రతిమను కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధన సభ్యులు బైరోజపు చంద్రశేఖర్, బైరోజు శ్యాంసుందర్ ఆదివారం గుర్తించారు. ఈ దుర్గం వద్ద కనిపించే పులి, పందివేట వీరగల్లులు ప్రత్యేక ఆకర్షణ. పులులు, అడవి పందుల నుంచి ప్రజలను కాపాడిన వీరుల సాహసాన్ని గుర్తుచేసే వీరగల్లులు, ఊరి పొలిమేరల్లో ప్రజల అభిమానానికి నిదర్శనంగా నిలిచాయి. రాతిపై వీరగల్లు ప్రతిమలో కుడివైపు సిగ, తలపై పాగా, మెడలో కంటె, వీరకాసెతో కనిపిస్తున్న వీరుడు రెండు చేతుల బల్లెంతో పులిని చంపుతున్న దృశ్యం ఒక రాతిపలక మీద ఉపశిల్పంగా చెక్కబడింది. ఈ వీరగల్లు ప్రతిమ క్రీ.శ.13, 14వ శతాబ్దాల నాటి శైలిలో చెక్కబడి ఉంది. అరుదుగా కనిపించే, ప్రతిష్ఠించే ఈ పులివేట వీరగల్లు ప్రతిమ మరొకటి ఇదే మండలంలోని బుసిరెడ్డిపల్లి కూడా ఉందన్నారు. ఇవి అరుదైన వీరగల్లులు అని ఇలాంటివి తెలంగాణలో నిజామాబాద్, భువనగిరి, ఖమ్మం, వరంగల్, నిర్మల్ జిల్లాలో కూడా ఉన్నాయని వారు తెలిపారు. ఇప్పుడు వనపర్తి జిల్లాలో ఈ పులివేట వీరగల్లు ఉండడం ఇక్కడి వీరుల పరాక్రమాన్ని తెలియజేస్తున్నాయని వివరించారు. వీటిని భద్రపరచడమో లేదా ఏదేని మ్యూజియానికి చేర్చాలని స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని కోరారు. అలాగే పాన్గల్ ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే ప్రాంతీయ ప్రగతికి దోహదం చేస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
ఉత్సాహంగా ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: వరంగల్లో వచ్చేనెల 3, 4 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి అంతర్జిల్లా అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల ఎంపికలను ఆదివారం జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహించారు. అండర్–14, అండర్–16, అండర్–18, అండర్–20 విభాగాల బాలబాలికలు, పురుషుల, మహిళా విభాగాల ఎంపికలు నిర్వహిచారు. ఈ సందర్భంగా జిల్లా అథ్లెటిక్స్ సంఘం ఉపాధ్యక్షులు పుట్టి సురేష్చందర్, ప్రధాన కార్యదర్శి జి.శరత్చంద్ర క్రీడాకారులను పరిచయం చేసుకొని మాట్లాడుతూ జిల్లా అథ్లెట్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పీడీలు రమేష్బాబు, సి.శ్రీనివాసులు, ఽపి.శ్రీనివాసులు, కోచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. షార్ట్సర్క్యూట్తో కిరాణ షాపు దగ్ధం పాన్గల్: మండలంలోని మాందాపూర్లో షార్ట్సర్య్కూట్తో కిరాణం షాపు దగ్ధమైన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాసులుకు చెందిన కిరా ణం దుకాణంలో విద్యుత్ షార్ట్సర్క్యూట్తో కిరా ణం సామగ్రి, ఫ్రిజ్, టీవీ, ఇతర వస్తువులు దగ్ధమై న బాధితుడు పేర్కొన్నారు. ఘటనలో దాదాపుగా రూ.60 వేల వరకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. గతంలో కూడా గ్రామంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. విద్యుత్ అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
‘బీసీలను అవమానిస్తే మూల్యం తప్పదు’
మెట్టుగడ్డ: మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో బీసీ నాయకుడిని అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోనెల శ్రీనివాసులు మండిపడ్డారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బీసీ సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. బీసీ నాయకుడికి జరిగిన అవమానాన్ని యావత్ బీసీ సమాజానికి జరిగిన అవమానంగా భావిస్తున్నామని, తక్షణమే ఎంపీ డీకే అరుణ బీసీ నాయకుడికి, బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీసీ ఓట్లతో గెలిచి, నేడు అదే సమాజానికి చెందిన వారిని అవమానిస్తూ చిన్నచూపు చూడటం తగదన్నారు. బీసీలకు క్షమాపన చెప్పకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి సరైన పద్ధతిలో బుద్ధి చెప్తామన్నారు. -
ప్రశాంతంగా జీపీఓ, సర్వేయర్ల పరీక్ష
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): గ్రామ పాలన అధికారులు (జీపీఓ), లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకం కోసం జిల్లాకేంద్రంలో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఆదివారం జరిగిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. కలెక్టర్ విజయేందిర పరీక్షకేంద్రాన్ని తనిఖీ చేసి.. నిర్వహణ తీరును పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా, పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఉదయం జరిగిన గ్రామ పాలన అధికారి పరీక్షకు 100 మంది అభ్యర్థులకు 88 మంది హాజరైనట్లు కలెక్టర్ తెలిపారు. లైసెన్స్డ్ సర్వేయర్ల పరీక్షకు సంబంధించి 111 మంది అభ్యర్థులకు 97 మంది హాజరయ్యారని వెల్లడించారు. జెడ్పీ సీఈఓ వెంకట్రెడ్డి, డిపార్ట్మెంటల్ అధికారి, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కిషన్ రావు, ఆర్డీఓ నవీన్, అర్బన్ తహసీల్దార్ ఘన్షిరాం, తదితరులు పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. ఎడ్యుకేషన్ హబ్గా మార్చేందుకు కృషి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాలో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా విద్యాసంస్థలు పనిచేయాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. ధర్మాపూర్ వద్ద జీకే ఇంజనీరింగ్ కళాశాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో కళాశాలలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వలసల జిల్లా అని పేరు బడిన పాలమూరు ఎడ్యుకేషన్ హబ్గా మార్చేందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా పీయూ అభివృద్ధికి ఒక్క సంవత్సరంలోనే రూ.100 కోట్లు యూజీసీ నిధులు తీసుకొచ్చామని, ఇంజనీరింగ్, లా కళాశాలలను కూడా అనుమతి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. వీటితో పాటు జిల్లా కేంద్రంలో ట్రిపుటీ కళాశాలను కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పాలమూరు బిడ్డ రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కావడం వల్లే అనేక అభివృద్ధి పనులు చేసేందుకు సాధ్యపడుతుందన్నారు. పేద విద్యార్థులకు ఉపయోగపడే విధంగా, జిల్లాలో వలసలను నివారించాలనే ఉద్దేశంతో ప్రైవేటు కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ఆల్ మదీనా విద్యాసంస్థలు కూడా పేద విద్యార్థుల అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, వినోద్కుమార్, సిరాజ్ఖాద్రీ, బెన్హర్, షబ్బీర్, ఇంతియాజ్ ఇసాక్ పాల్గొన్నారు. -
ఎరువుల కోసం వెతలు
పెరిగిన ధరలు.. వేధిస్తున్న కొరత ●కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు ఫర్టిలైజర్ దుకాణాల్లో డీలర్లు డీఏపీని కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువగా అమ్ముతున్నారు. యూరియా రూ.265, డీఏపీ రూ.1,350 ఉంటే అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. సొసైటీల్లో ఇచ్చే యూరియా బస్తాలు సరిపోవడం లేదు. బయట కొందామంటే ఇష్టం వచ్చినట్లు ధరకు అమ్ముతున్నారు. అధికారులు రావడం.. పోవడం తప్ప చర్యలు తీసుకోవడం లేదు. – చంద్రయ్య, రైతు, ఫర్దీపూర్ గ్రామం, చిన్నచింతకుంట మండలం యూరియా దొరక్కట్లేదు మా గ్రామంలో సొంతంగా ఎకరం పొలం ఉండగా, మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకున్నా. అందులో మూడెకరాల్లో వరి, మరో మూడెకరాల్లో పత్తి వేశా. యూరియా కోసం బిజినేపల్లికి వెళ్లి ప్రైవేటు డీలర్లను అడిగితే స్టాక్ లేదన్నారు. నాటేసినంక 15 రోజులలోపే పొలానికి యూరియా వేస్తేనే పంట దిగుబడి మంచిగా వస్తుంది. వేసిన పంటలకు అధికారులు సరిపడా ఎరువులు ఎందుకు ఇవ్వడం లేదు. – వెంకటయ్య, రైతు, ఎల్కిచర్ల, భూత్పూర్ మండలం కొరత లేదు యూరియా దొరకదని తప్పుడు సమాచారం రావడంతో రైతులు భయపడి ఎక్కువగా కొనుక్కుంటున్నారు. ఎక్కడా కొరత లేదు. ప్రతిరోజు ఏదో ఓ మండలానికి వెళ్లి తనిఖీలు చేస్తున్నాం. సొసైటీల్లో స్టాకు ఉంది. ఇంకా రావాల్సి ఉంది. మనకు అవసరాన్ని బట్టి ఇండెంట్ ఇచ్చాం. వ్యాపారులు ఎరువుల కొరత సృష్టించి.. బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. యూరియా ఇప్పటి వరకు రైతులకు 15,419 మెట్రిక్ టన్నులు పంపిణీ చేశాం. మరో 3,751 మెట్రిక్ టన్నుల అందుబాటులో ఉంది. డీలర్లు అధిక ధరలకు యూరియా, ఇతర ఎరువులు అమ్మినా, లింక్ ద్వారా ఇతర ఎరువులు ఇచ్చినా.. కృత్రిమ కొరత సృష్టించినట్లు ఫిర్యాదు చేస్తే విక్రయదారులపై చర్యలు తీసుకుంటాం. – బి.వెంకటేష్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి● ఇప్పటి వరకు 27,977 టన్నులు సరఫరా ● పీఏసీఎస్ల వద్ద బారులు తీరుతున్న వైనం ● అడిగినంత ఇవ్వడం లేదని రైతుల అసంతృప్తి ● ధరలు పెంచి అమ్ముతున్న ప్రైవేట్ వ్యాపారులు మహబూబ్నగర్ (వ్యవసాయం): వానాకాలం సీజన్ ఆరంభమైంది. వర్షాలు అడపాదడపా పడుతున్నా.. సాగు పనులు ఊపందుకున్నాయి. అన్నదాతకు సాగు మొదలు నుంచి పంట అమ్మకం వరకు అన్నీ కష్టాలే. వ్యయ ప్రయాసలతో ఈ ఏడాది వానాకాలం సాగు పనులు మొదలుపెడితే ఎరువు బరువుగా మారింది. ఒకవైపు ధర పెరిగి భారంగా మారితే.. మరోవైపు ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తున్నా రు. ప్రభుత్వం సరఫరా చేసిన డీఏపీని బ్లాక్ మార్కెట్కు తరలించి స్టాక్ లేదంటున్నా రు. ధరలు పెంచి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ప్రొడక్ట్ మార్క్ఫెడ్ సొసైటీల్లో ప్రస్తుతం జిల్లా డీలర్స్ మొత్తం యూరియా 1,136 366 709 2,605 డీఏపీ 2,000 60 268 447 ఎంవోపీ – 32 110 355 ఎస్ఎస్పీ – 44 205 394 కాంప్లెక్స్ 1,181 824 3,422 4,838 మొత్తం 4,317 1,326 4,714 8,639 కావాల్సిన ఎరువుల అంచనా (మెట్రిక్ టన్నుల్లో) నెల యూరియా డీఏపీ ఎండోపీ కాంప్లెక్స్లు ఆగస్టు 8,400 1243 103 7,500 సెప్టెంబర్ 5,920 356 228 5,600 అక్టోబర్ 1,557 217 185 1,700 -
నిత్యం.. కలకలం
మహబూబ్నగర్ జనావాసాల్లోకి చిరుతలు సోమవారం శ్రీ 28 శ్రీ జూలై శ్రీ 2025వివరాలు 8లో u●అన్ని చోట్ల కెమెరాలతోపాటు బోన్లు ఏర్పాటు చేశాం.. జూన్ నుంచి ఆగస్టు వరకు చిరుతల సంపర్కానికి అనుకూల సమయం. ప్రస్తుతం అవి జనావాసాల్లోకి రావడానికి కారణాలు అంతుచిక్కడం లేదు. ఆహారం, నీరు సమృద్ధిగా దొరకనప్పుడే అవి నివాసిత ప్రాంతాలకు వస్తాయి. చిరుతలు అనుకోని సందర్భాల్లో తప్ప మనుషులపై దాడి చేసిన ఘటనలు చాలా తక్కువ. గుట్టల సమీప ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పిల్లలను ఒంటరిగా వదిలేయొద్దు. ఎక్కడికి వెళ్లినా గుంపులుగానే పోవాలి. వాటిని బంధించేందుకు అన్ని చోట్ల బోన్లు ఏర్పాటు చేశాం. కెమెరాలతో నిత్యం పర్యవేక్షిస్తున్నాం. టీడీగుట్ట వద్ద ఇటీవల వరకు కనిపించిన చిరుత నాలుగైదు రోజులుగా కనిపించడం లేదు. – సత్యనారాయణ, డీఎఫ్ఓ, మహబూబ్నగర్ చిరుత జాడ లేకుండా ఏ ఒక్క నెల లేదు.. చిరుతల సంచారంతో వణికిపోతున్నాం. వ్యవసాయ పనులకు వెళ్లాలంటే భయమైతాంది. సాయంత్రం అయ్యిందంటే చాలు.. ఊరంతా తలుపులేసుకుని ఇంట్లోనే ఉంటున్నారు. చిరుత జాడ లేకుండా కనీసం ఏ ఒక్క నెల లేదు. గత నెలలో మా గ్రామంలోని ఓ రైతుకు చెందిన పశువుల పాకలో కట్టేసిన లేగదూడను చిరుత ఎత్తుకుని వెళ్లి అడవికి సమీపంలో రక్తం తాగి పడేసింది. దీంతో కంటి మీద కునుకు లేకుండా పోయింది. – రవి, మొగుళ్లపల్లి, నవాబుపేట ఇటీవల వీరన్నపేట, మొన్న టీడీగుట్ట, చౌదర్పల్లి, నిన్న మొగుళ్లపల్లి.. ఇలా జిల్లాలో నిత్యం ఏదో ఒక్క చోట చిరుతలు దర్శనమిస్తూనే ఉన్నాయి. ఎక్కడో అటవీ ప్రాంతంలో అవి కనపడుతున్నాయని అనుకుంటే పరవాలేదు. కానీ జనావాసాల పరిధిలోనే దర్శనమిస్తుండడంతో ప్రజలు హడలెత్తుతున్నారు. సుమారు నెల రోజులుగా ఆయా ప్రాంతాల వారికి కంటి మీద కునుకు లేకుండా పోయింది. అయితే చిరుత పులులు కనపడడం.. తదితర చోట్ల గొర్లు, మేకలు, పశువులపై దాడి చేసిన ఘటనలే ఇప్పటివరకు ఉన్నాయి. తాజాగా కోయిల్కొండ మండలం కొత్లాబాద్, హన్వాడ మండలం రామన్నపల్లి శివారులో ముగ్గురిపై చిరుత దాడి చేసిన నేపథ్యంలో ప్రజల్లో మరింతగా భయాందోళనలు నెలకొన్నాయి. ● పట్టణ, మండల శివార్లలోని గుట్టల్లో ఆవాసం ● రోజుకో చోట దర్శనం.. గొర్రెలు, మేకలు, పశువులపై దాడి ● ఒక్క మహబూబ్నగర్ జిల్లాలో 15 నుంచి 18 వరకు చిరుతలు ● ఫలితం లేని అధికారుల ఆపరేషన్.. భయంభయంగా ప్రజల జీవనం ● కొత్లాబాద్లో ముగ్గురిపై దాడితో స్థానికుల్లో ఆందోళన – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ -
ఉమ్మడి జిల్లా హ్యాండ్బాల్ కమిటీ ఎన్నిక
జడ్చర్ల: ఉమ్మడి పాలమూరు జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం పోలేపల్లి సెజ్లోని ఎస్వీకేఎం స్కూల్లో ఎన్నుకున్నారు. చైర్మన్గా గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డి, జిల్లా అధ్యక్షుడిగా సయ్యద్ తకీయుద్దీన్, ప్రధాన కార్యదర్శిగా శంకర్నాయక్, కోశాధికారిగా కాల్వ రాంరెడ్డి, ఉపాధ్యక్షుడిగా వెంకటేశ్, మన్యం, సోయబ్ అలీ, రమణ, సంయుక్త కార్యదర్శులుగా అశోక్, ఉమాశంకర్, యాదయ్య, మొగులాల్, ఇంతియాజ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా అభిలాశ్, కార్యవర్గ సభ్యులుగా రవి, నర్సింహా, సతీశ్, అశోక్, శివకుమార్, రాఘవేందర్రెడ్డి, రవి, అనిల్, ప్రశాంత్, మహేశ్ను ఎన్నకున్నారు. రాష్ట్ర నాయకులు పుల్లయ్య, శరత్చంద్ర ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించారు. -
వరదొస్తే.. రాకపోకలు బంద్
దుందుభీ పరివాహక ప్రాంతాల ప్రజల అగచాట్లు ●రాకపోకలు నిలిచిపోతాయి.. దుందుభీ వాగు ఉధృతి పెరిగిన ప్రతి సారి రాకపోకలు నిలిచి ఇబ్బందులు పడుతున్నాం. దుందుబీ వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని గత కొన్ని సంవత్సరా లుగా కోరుతున్నా ఇప్పటి వరకు పట్టించుకో లేదు. గత ప్రభుత్వ హయాంలోను బ్రిడ్జి నిర్మి స్తామంటూ ప్రకటించారు. కానీ కా ర్యరూపం దాల్చలేదు. ఇప్పటికై నా బ్రిడ్జి నిర్మించేందుకు పాలకులు చర్యలు తీసుకోవాలి. – జర్పుల ఈరన్న, తుపుడగడ్డ తండా అలుగు పారితే అంతే.. పోలేపల్లి–కిష్టారం మధ్య చెరువు అలుగు పారినప్పుడల్లా రాకపోకలు బంద్ అవుతాయి. ఉదండాపూర్, వల్లూరు మీదుగా జడ్చర్లకు వెళ్లాల్సి వస్తుంది. కిష్టారం–అంబటాపూర్ మధ్య కూడా వరద ప్రవాహం పెరిగినప్పుడు రాకపోకలు నిలిచిపోతాయి. బ్రిడ్జిల నిర్మాణం చేపడితే ఇబ్బందులు తప్పుతాయి. – గోపాల్రెడ్డి, కిష్టారం ప్రతిపాదనలు పంపించాం.. నియోజకవర్గంలోని దుందుభీ వాగు, తదితర ప్రాంతాలలో రాకపోకలకు ఇబ్బందిగా మారే దగ్గర బ్రిడ్జిల నిర్మాణం చేపడతాం. ఇప్పటికే 9 బ్రిడ్జిలకు రూ.44.10 కోట్లతో ప్రతిపాదనలు నివేదించాం. నిధులు మంజూరు కాగానే పనులు చేపడతాం. మిగతా చోట్ల కూడా బ్రిడ్జిల నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటాం. – అనిరుధ్రెడ్డి, ఎమ్మెల్యే, జడ్చర్ల జడ్చర్ల: వానాకాలం వచ్చిందంటే చాలు దుందుభీ పరివాహక ప్రాంతాల ప్రజల్లో ఆందోళన నెలకొంటుంది. వర్షాలు కురిసాయంటే చాలు వాగులు, వంకలు పారడం.. ఆయా ప్రాంతాల ప్రజలకు రాకపోకలు బంద్ కావడం ఏటా నిత్యకృత్యంగా మారింది. విధిలేని పరిస్థితుల్లో చుట్టూ కి.మీ.ల మేర తిరిగి వెళితే తప్ప ఇతర ప్రాంతాలకు వెళ్లలేని పరిస్థితి నియోజకవర్గంలోని పలు గ్రామాలు, తండాల ప్రజలు ఎదుర్కొంటున్నారు. జడ్చర్ల మండలంలోని కొండేడు–తుపుడగడ్డ తండాల మధ్య దుందుభీ వాగు ప్రవాహం ఉధృతమైన సమయంలో అటు ఇటుగా రాకపోకలు నిలిచిపోతాయి. రాకపోకలు సజావుగా సాగితే ఈ ప్రాంతాల మధ్య 2 కి.మీ.లు మాత్రమే ఉండగా వరద ముంచెత్తిన సమయంలో తుపుడగడ్డతండా నుంచి చిన్న ఆదిరాల, పెద్ద ఆదిరాల గ్రామాల మీదుగా దాదాపు 6 కి.మీ.ల మేర చుట్టూ తిరిగి రాకపోకలు సాగించాల్సి వస్తుందని తండా వాసులు తెలిపారు. నల్లకుంట తండా ప్రజల దుస్థితీ ఇదే. లింగంపేట–నల్లకుంటతండాల మధ్య దుందుభీ వాగు పొంగిపొర్లిన సమయంలో రాకపోకలు స్తంభిస్తాయి. దీంతో దాదాపు 6 కి.మీ.లకు పైగా చుట్టూ తిరిగి కోడ్గల్ నుంచి రావాల్సి ఉంటుంది. అదేవిధంగా కిష్టారం–అంబటాపూర్ మధ్య కూడా బ్రిడ్జి లేకపోవడంతో రాకపోకలు ఇబ్బందిగా మారాయి. పోలేపల్లి–కిష్ట్టారం మధ్య చెరువు అలుగు పారిన సమయంలో రాకపోకలు నిలిచి ఉదండాపూర్, వల్లూరు మీదుగా జడ్చర్లకు చేరుకోవాల్సి ఉంటుంది. నసరుల్లాబాద్ చెరువు అలుగు పారితే లోతట్టు ప్రాంతంలోని అల్వాన్పల్లి–తంగెళ్లపల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచి ఇబ్బందులు తలెత్తుతాయి. ఎక్వాయపల్లి–లింగందన గ్రామాల మధ్య దుందుభీ వాగు ప్రవహిస్తే రాకపోకలు స్తంభించి పోతాయి. వంతెనలు లేక ఇబ్బందులు నెక్కొండ–బైరంపల్లి గ్రామాల మధ్య కూడా బ్రిడ్జి నిర్మించాలన్న డిమాండ్ ఉంది. అదేవిధంగా రాజాపూర్ మండలంలోని దోండ్లపల్లి–ఇప్పటూరు గ్రామాల మధ్య దుందుభీ వాగు పారిన సందర్భంగా రాకపోకలు స్తంభించి చుట్టు దాదాపు 10 కి.మీ.ల మేర తిరిగి వెళ్లాల్సి వస్తుంది. రాపల్లె–కుచ్చర్కల్ మధ్య ఇదే పరిస్థితి నెలకొంది. ఇక బాలానగర్ మండలంలో 44వ నంబర్ జాతీయ రహదారి నుంచి ఉడిత్యాల, మోతి ఘన్పూర్,సూరారం మార్గంలో, శేరిగూడ–బోడ జానంపేట మధ్య కూడా బ్రిడ్జి నిర్మాణం చేయాల్సి ఉంది. నవాబ్పేట మండలంలోని వీరశట్పల్లి నుండి దయాపంతులపల్లి మీదుగా హాజీపూర్ వెళ్లే మార్గంలో బ్రిడ్జి ఏర్పాటు చేయాల్సి ఉంది. నవాబ్పేట–దయాపంతుల పల్లి,మల్లారెడ్డిపల్లి–కారూర్ మధ్య బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. మిడ్జిల్ మండలంలో వల్లబురావుపల్లి నుంచి చౌటకుంటతండా మీదుగా వేముల మార్గంలో బ్రిడ్జి నిర్మాణం చేపడితే రాకపోకలకు సౌకర్యంగా ఉంటుంది. కొత్తూరు–వెలుగొమ్ముల మద్య దుందుభీ వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాల్సి ఉంది. వంతెనలు నిర్మిస్తేనే ప్రయోజనం దశాబ్దాలుగా ప్రజల ఎదురుచూపులు తాజాగా నిధుల మంజూరుకుప్రతిపాదనలు -
గురుకులంలో ఫుడ్ పాయిజన్
సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాకేంద్రం సమీపంలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో ఆస్పత్రిలో చేరిన ఘటన కలకలం సృష్టించింది. శనివారం రాత్రి భోజనం చేసిన తర్వాత అస్వస్థతకు గురైన విద్యార్థినులు 64 మందిని జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడుతున్న విద్యార్థినులకు ఆస్పత్రిలో చికిత్స అందించిన వైద్యులు ఆదివారం సాయంత్రానికి డిశ్చార్జి చేశారు. అయితే పాఠశాలలో వంట కోసం వినియోగించిన సరుకులు నాసిరకంగా ఉండటం, గడువు తీరిన పాలు, పెరుగు పదార్థాలను వినియోగించడం వల్లనే ఫుడ్ పాయిజన్ చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. పాఠశాలకు సంబంధించిన క్యాటరింగ్ కాంట్రాక్టర్ బయట నుంచి పాలు, పెరుగు డబ్బాలను కొనుగోలు చేసి విద్యార్థినులకు వడ్డిస్తున్నారు. ఈ క్రమంలో నిర్ణీత కాలం పాటు, రెండు, మూడు రోజుల్లోపే వినియోగించాల్సిన పాలు, పెరుగు డబ్బాలను ఎక్స్పైరీ తేదీ దాటినా వినియోగించడంతోపాటు ప్రధానంగా పెరుగన్నం తిన్న విద్యార్థినులు అస్వస్థతతకు గురైనట్లు తెలిసింది. భయంతో ఇంటిదారి.. ఫుడ్ పాయిజన్తో విద్యార్థినులు కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరడంతో పాఠశాలలోని మిగతా విద్యార్థులు సైతం భయాందోళనకు గురయ్యారు. ఉయ్యాలవాడ బీసీ గురుకుల పాఠశాలలో 480 మంది విద్యార్థులతోపాటు మరో 360 మంది ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థులు చదువుతున్నారు. ఫుడ్ పాయిజన్తో 64 మంది ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకోగా, మరో 30 మంది వరకు భయాందోళనకు గురై జనరల్ ఆస్పత్రిలోని ఔట్ పేషెంట్ విభాగంలో చూయించుకున్నారు. విద్యార్థినులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన త ర్వాత కొంతమంది తమ తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్లిపోయారు. చాలామంది విద్యార్థులు భయా ందోళనలో ఉన్న కారణంగా వారి తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లడం కనిపించింది. అమలుకాని మెనూ.. జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ గురుకుల హాస్టళ్లలో ఎక్కడా డైట్ మెనూ సరిగా అమలుకావడం లేదు. ఉదయం పూట టిఫిన్ కింద పూరి, ఇడ్లి, చపాతి, దోశ ఇవ్వాల్సి ఉండగా.. చాలాసార్లు లెమన్ రైస్, కిచిడీ, పులిహోరతో సరిపెడుతున్నారు. మధ్యాహ్నం భోజన సమయంలో మిక్స్డ్ వెజ్ బిర్యానీ, రెండేసి కూరలతో వడ్డించాల్సి ఉండగా.. పప్పులు, సాంబారుతో నెట్టుకొస్తున్నారు. వారంలో చికెన్, గుడ్డు, స్నాక్స్ విషయంలో కోత విధిస్తున్నారు. వంట గదుల్లో శుచి, శుభ్రత పాటించకపోవడం, శుభ్రమైన నీటిని వినియోగించకపోవడంతో తరుచుగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గురుకుల హాస్టళ్ల నిర్వహణపై క్షేత్రస్థాయిలో సరైన పర్యవేక్షణ కొరవడటంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉయ్యాలవాడలోని బీసీ గురుకుల పాఠశాలలో 64 మంది విద్యార్థినులకు అస్వస్థత కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరిక గడువుతీరిన పాలు, పెరుగు వల్లే ఘటన ఉడకని భోజనం, నాసిరకం సరుకుల వినియోగం విద్యార్థులను పరామర్శించిన మంత్రి జూపల్లి, మాజీ మంత్రి హరీశ్రావు, పలువురు నాయకులు విద్యార్థులను పరామర్శించిన నాయకులు ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు గురైన జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను వివిధ పార్టీల నాయకులు పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే రాజేష్రెడ్డితో కలిసి గురుకుల పాఠశాలను పరిశీలించారు. హాస్టల్లోని వంటగది, కూరగాయల గది, పరిసరాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. ఫుడ్ పాయిజన్ ఘటన బాధ్యులైన వారిపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. మాజీ మంత్రి హరీశ్రావు విద్యార్థులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. విద్యార్థులను పరామర్శించిన వారిలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు, మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్రెడ్డి, తదితరులు ఉన్నారు. -
చిరు ధాన్యాల సాగు.. బహుళ లాభాలు
అలంపూర్: చిరు ధాన్యాల సాగుతో అధిక లాభాలు గడించే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు సూచించారు. వాటిలో కొర్ర ముఖ్యమైంది. కొర్రలలో పోషకాలతో పాటుగా ఔషద గుణాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో పిండి పరార్థాలు తక్కవ, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా ఊబకాయంతో బాధపడే వారికి మంచి ఆహారంగా గుర్తించారు. వీటిని అన్నానికి బదులుగా తీసుకోవడం ద్వారా చక్కెర వ్యాధి, గుండె జబ్బులు, ఇతర రోగాలను అదుపులో ఉంచుకోవచ్చు. దీంతో కొర్రకు మంచి డిమాండ్ వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో కొర్ర పంట సాగు చేసుకోవడం రైతులకు లాభదాయకమని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియానాయక్ రైతులకు సూచించారు. కొర్ర సాగు, యాజమాన్య పద్ధతులు గురించి తెలుసుకుందాం. సాగు: కొర్ర పంటను వానాకాలంలో జూన్, జులై నెలల్లో, వేసవి పంటగా జనవరిలోనూ విత్తుకోవచ్చు. రకాలు: కృష్ణదేవరాయ, నరసింహారాయ, శ్రీలక్ష్మి, ఎస్ఐఏ 3085 రకాలు సాగు చేస్తే 80 నుంచి 85 రోజుల్లో కోతకు వస్తాయి. అలాగే ప్రసాద్, సూర్యనంది (ఎస్ఐఏ3088) రకాలు 70 నుంచి 75 రోజుల్లో కోతకు రావడంతో పాటు అధిక దిగుబడి ఇస్తాయి. విత్తన మోతాదు: సాళ్లలో విత్తితే ఎకరాకు రెండు కిలోలు, వెదజల్లే పద్ధతిలో అయితే నాలుగు కిలోల విత్తనం సరిపోతుంది. ● కిలో విత్తనానికి రెండు గ్రాముల కార్బండిజమ్తో విత్తన శుద్ధి చేయాలి. ● 25 సెం.మీ ఎడం ఉన్న సాళ్లలో మొక్కల మధ్య 10 సెం.మీ దూరం ఉండేలా విత్తుకోవాలి. ● అంతర్ పంటగా ప్రతి ఐదు సాళ్లకు ఒక సాలు కంది వేయాలి. లేదా 2ః1 నిష్పత్తిలో కొర్ర, వేరుశనగ వేసుకోవచ్చు. ● విత్తిన రెండు వారాల్లోపు ఒత్తు మొలకలు తీసివేయాలి. ● 30 రోజుల వరకు పంట పొలంలో కలుపు మొక్కలు లేకుండా చూడాలి. ● విత్తిన 20 నుంచి 25 రోజుల తర్వాత సాళ్లల్లో అంతర్ కృషి చేసి కలుపు నివారించాలి. ఎరువులు: ఆఖరి దుక్కిలో నాలుగు టన్నుల పశువుల ఎరువులను పొలంలో వేసి బాగా కలియదున్నాలి. విత్తేటప్పుడు 20 కేజీల యూరియా, ఒక బస్తా (50 కేజీల) సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేయాలి. విత్తిన నెల రోజులకు మరో 20 కేజీల యూరియాను పైపాటుగావేయాలి. సస్యరక్షణ: కొర్ర పంటను ఆశించే వాటిలో గులాబీ రంగు పురుగు, కాండం తొలిచే పురుగు, చెదలు, మిడతలు, లద్దె పురుగు ముఖ్యమైనవి. ● చెదల నివారణకు చివరి దుక్కిలో ఫాలిడాల్ రెండు శాతం పొడి మందును ఎకరాకు 10 నుంచి 12 కిలోల వంతున మట్టిలో బాగా కలిసేటట్లు వేయాలి. ● మిడతల నివారణకు కార్బరిల్ 5 శాతం పాడి మందును ఎకరాకు 10 నుంచి 12 కిలోల చొప్పున చల్లాలి. ● కిలో విత్తనానికి 3 గ్రాముల కాప్టాన్/థైరామ్, మందుతో విత్తన శుద్ధి చేయడం ద్వారా తుప్పు, అగ్గి, వెర్రికంకి తెగుళ్లను కొంత వరకు ఆరికట్టవచ్చు. పాడి–పంట -
రైతు బలవన్మరణం
మాగనూర్: సాగునీటి పంచాయితీలో ఓ రైతు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని మందిపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ అశోక్బాబు కథనం మేరకు.. గ్రామానికి చెందిన కుర్వ సాయిబన్న (48)కు గ్రామ సమీపంలో వ్యవసాయ పొలం ఉంది. సమీప బంధువుల పొలం కింద ఇతడి భూమి ఉండటంతో సాగు నీరు వదలాలని కోరారు. అందుకు వారు నిరాకరించడంతో ఆదివారం గ్రామపెద్దల వద్ద పంచాయితీ పెట్టారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో మనస్తాపానికి గురై పొలం వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య మల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ వివరించారు. వ్యక్తి ఆత్మహత్యాయత్నం గండేడ్: గడ్డిమందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మండలంలోని చెల్లిల్లలో ఆదివారం చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన మోహన్ హైదరాబాద్ నుంచి ఆదివారం మధ్యాహ్నం ఇంటికి వచీరాగానే గడ్డిమందు తాగాడు. విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు, స్థానికులు 108లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని బంధువులు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియరాలేదు. క్షణికావేశంలో గొంతు కోసుకున్న వ్యక్తి తిమ్మాజిపేట: కుటుంబంలో చిన్నపాటి గొడవ కావడంతో క్షణికావేశంలో గోనెల శేఖర్ గొంతు కోసుకున్న ఘటన ఆదివారం తిమ్మాజిపేట పోలీస్స్టేషన్ ఎదుట చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. మండలంలోని ఆవంచ గ్రామానికి చెందిన గోనెల శేఖర్ గతంలో జడ్చర్ల సమీపంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. కానీ కొన్నిరోజులు ఏం పని చేయకుండా ఊరికే తిరుగుతుండడంతో పాటు తాగుడుకు బానిసయ్యాడు. ఈ విషయమై కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరగడంతో పోలీస్స్టేషన్కు వచ్చాడు. ఈ క్రమంలో క్షణికావేశానికి లోనై తన వెంట తెచ్చుకున్న బ్లేడ్తో గొంతు కోసుకున్నాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన బాధితుడిని జడ్చర్ల ఆస్పత్రికి తరలించి చికిత్స అనంతరం ఇంటికి పంపించారు. ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్.. వ్యక్తి మృతి మిడ్జిల్: ఆగి ఉన్న లారీని ప్రమాదవశాత్తు బైక్ ఢీకొట్టిన ఘటనలో బైక్ మీద ఉన్న వ్యక్తి మృతిచెందాడు. ఈఘటన జడ్చర్ల –కల్వకుర్తి ప్రధాన రహదారిపై మిడ్జిల్ మండలంలోని వాడ్యాల్ గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా.. మిడ్జిల్ మండలంలోని బోయిన్పల్లి గ్రామానికి చెందిన గోవిందాచారి (55) ఆదివారం మధ్యాహ్నం పనిమీద జడ్చర్ల బైక్పై వెళ్లి.. తిరిగి రాత్రి 8 గంటలకు జడ్చర్ల నుంచి ఇంటికి బయల్దేరాడు. వాడ్యాల్ సమీపంలో జడ్చర్ల కల్వకుర్తి 167 జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని మోటార్ సైకిల్పై వస్తున్న గోవిందాచారి ఎదురుగా వస్తున్న వాహనాల వెలుతురుకు ముందు ఉన్న వాహనం కన్పించకపోవడంతో లారీ వెనుకవైపు ఢీకొట్టాడు. దీంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతుడి కుటుంబసభ్యులకు విషయం తెలిపి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య మంగమ్మతో పాటుగా ఇద్దరు పిల్లలు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. -
శ్రీశైలంలో ఒక గేట్ పైకెత్తి..
దోమలపెంట: శ్రీశైలం ఆనకట్ట వద్ద ఆదివారం ఒక గేట్ను పది అడుగుల మేర పైకెత్తి 26,698 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎగువన జూరాల ఆనకట్ట గేట్లు పైకెత్తి స్పిల్వే ద్వారా 31,504 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ 34,088, సుంకేసుల నుంచి 52,682 క్యూసెక్కులు శ్రీశైలం జలాశయానికి చేరుతుందని వివరించారు. భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులు, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 31,102 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న నాగార్జునసాగర్కు విడుదల చేశారు. 24 గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 30 వేల క్యూసెక్కులు, హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2,401, ఎంజీకేఎల్ఐకు 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ కేంద్రంలో 17.335 మి.యూ., కుడిగట్టు కేంద్రంలో 15.917 మి.యూ. విద్యుదుత్పత్తి చేశారు. -
‘కాంగ్రెస్ కులగణన బూటకం’
మహబూబ్ నగర్: కాంగ్రెస్ చేపట్టిన కులగణన బూటకమని విమర్శించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అనేది బీసీలను మోసం చేయటమేనన్నారు. మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమన్నారాయన. ఈ రోజు(శనివారం, జూలై 26) మహబూబ్నగర్లో పర్యటించిన రాంచందర్రావు.. గతంలో ఎమ్మెల్సీగా గెలిపించిన పాలమూరు ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. పాలమూరు నుంచి ఇంకా వలసలు తగ్గడం లేదని, సీఎం రేవంత్రెడ్డి దీనిపై దృష్టి సారించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న చిత్తశుద్ది లేదని మండిపడ్డారు,. రేవంత్రెడ్డికి ఢిల్లీ తిరగటమే సరిపోయిందంటూ ఎద్దేవా చేశారు. భవిష్యతఖ్లో పాలమూరు బీజేపీకి అడ్డాగా మారబోతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంత పెద్ద నాయకుడైనా పార్టీనే సుప్రీం అని ఆయన స్పష్టం చేశారు. -
ఎస్ఎల్బీసీ దుర్ఘటనకు ఐదునెలలు
అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వకం పనులు పునరుద్ధరణకు చ ర్యలు చేపడతామని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఇప్పటికే వెల్లడించా రు. జాతీయ భౌగోళిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ)సహకారంతో మిగిలిన 9.559 కిలోమీటర్ల సొరంగ మార్గం పనులు సత్వరమే పూర్తి చేసేదిశగా అడుగులు వేస్తున్నారు. సొరంగం ప్రాంతంలోని నేల స్వభావాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేక హెలికాప్టర్లతో ఎలక్ట్రోమ్యాగ్నటిక్ సర్వే చేయించాలని ప్రభు త్వం నిర్ణయించింది. అందుకు తక్కువ ఎత్తు లో ఎగిరే సామర్థ్యం గల రక్షణ శాఖకు చెంది న రెండు హెలికాప్టర్లు వినియోగించునున్నా రు. సర్వే పరికరాలను డెన్మార్స్ నుంచి ప్రత్యేకంగా తెప్పించనున్నారు. ఎలక్ట్రోమ్యాగ్నటిక్ పరికరాలతో జరిపే సర్వే భూ ఉపరితలం నుంచి కిలోమీటర్ లోతు వరకు నేల స్వభావంతోపాటు ఇతర సమాచారాన్ని అందిస్తోంది. పనుల్లో ఎలాంటి అవాంతరాలు రాకుండా ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తల సహకారంతో ఏరియల్ లైడార్ సర్వేను చేయించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇందుకు సొరంగం నిర్మాణంలో అనుభవం కలిగిన ఆర్మీ మాజీ ఈఎన్సీ హర్పాల్ సింగ్ను సలహాదారుడిగా, కల్నల్ పరీక్షిత్ మెహ్రాను స్పెషల్ సెక్రటరీ హోదాలో రెండేళ్లపాటు నియమించారు.● గల్లంతైన 8మందిలో నేటికీ లభించని ఆరుగురి ఆచూకి ● సొరంగం తవ్వకానికి ప్రభుత్వం సన్నద్ధం ● మిగిలిన 9.559 కి.మీ. పనుల పూర్తికి అడుగులు ● నేల స్వభావం అంచనాకు ఎలక్ట్రోమ్యాగ్నటిక్ సర్వే! అచ్చంపేట: దోమలపెంట శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ)ఇన్లెట్ సొరంగం పైకప్పు కూలిన ఘటనకు నేటితో ఐదునెలలు పూర్తవుతుంది. ఫ్రిబవరి 22న సొరంగం పైకప్పు కూలిన ఘటనలో అక్కడ పనిచేస్తున్న 8మంది కార్మికులు చిక్కుకోగా ఇద్దరి మృతదేహాలను మాత్రమే వెలకితీశారు. 66రోజులపాటు కొనసాగిన అన్వేషణలో సొరంగంలో ఇరుక్కుపోయిన టన్నెల్ బోరింగ్ మిషన్ విడిభాగాలు కత్తిరించి, మట్టి, బండరాళ్లును బయటకు తరలించారు. మిగిలిన ఆరుగురి కోసం విస్తృతంగా గాలించిన వారి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. గల్లంతైన కార్మికుల జాడ కోసం చేపట్టిన విస్తృత గాలింపు చర్యల తర్వాత ప్రభుత్వం సహాయక చర్యలను నిలిపివేశారు. నల్గొండ జిల్లాకు 3.50లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చేపట్టిన ఎస్ఎల్బీసీ సొరంగం ఇన్లెట్ (దోమలపెంట) శ్రీశైలం జలాశయం నుంచి ఆరంభం అవుతుంది. అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి ఔట్లెట్ వరకు మొత్తం 43.930 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇన్లెట్ సొరంగం వైపునుంచి 13.930 కిలోమీటరు వద్ద టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం) సొరంగం తవ్వుతుండగా పైనుంచి ఉబికి వచ్చిన నీటి ఉధృతికి పైకప్పు కూలడంతో చివరి వరకు వెళ్లిన కార్మికులు అందులో చిక్కుకున్నారు. నీటి ప్రవాహంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడడంతో డీ–1 నిషేఽధిత ప్రాంతం మినహా కాంక్రీట్ సెగ్మెంట్లు, బండరాళ్లు, బురద మట్టిని తొలగించినా గల్లంతైన కార్మికుల అచూకీ లభించలేదు. 12సంస్థల సహకారంతో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన రెస్క్యూ బృందాలు సొరంగం కుప్పకూలిన నాటి నుంచి శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులను బయటకు తెచ్చేందుకు ఎంతో శ్రమించి రెస్క్యూ ఆఫరేషన్ చేశాయి. ఇందులో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ, ఆర్మీ, దక్షణ మధ్య రైల్వే, నేవీ, ర్యాట్హోల్ మైనర్స్, హైడ్రా, ఎస్ఆర్ఎస్, జీఎస్ఐ, ఎన్జీఆర్ఐ, రోబోటిక్ కంపెనీ వంటి 12సంస్థలకు చెందిన 800మంది కార్మికులు మూడు షిఫ్ట్ల్లో 24గంటలు పనిచేశాయి. అత్యాధునిక యంత్రాలు, పరికరాలను ఉపయోగించారు. మానవ శేషాలను గుర్తించేందుకు స్వీపర్ డాగ్స్, క్యాడవర్ డాగ్స్ను కేరళ నుంచి రప్పించారు. జేపీ కంపెనీ, రెవెన్యూ, పంచాయతీరాజ్, ట్రాన్స్కో, గిరిజన సంక్షేమశాఖలు వివిధ సేవలు అందించాయి. సీఎం రేవంత్రెడ్డి, మత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సొరంగం సందర్శించి పర్యవేక్షించారు. 43మీటర్ల వద్ద నిలిచిన సహాయక చర్యలు ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి సొరంగం తవ్వకాలను ముందుకు కొనసాగించడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) హెచ్చరించిన నేపథ్యంలో 13.930కిలోమీటర్ల వెనక్కి 43మీటర్ల శిథిలాలను తొలగించలేదు. ప్రమాద స్థలంలో శిథిలాలను తొలగించేందుకు సహాయక బృందాలు డీ–1, డీ–2 ప్రదేశాలుగా గుర్తించి శిథిలాలు తొలగించారు. డీ–2, డీ–1 ప్రదేశం వరకు 281 మీటర్ల తవ్వకాలు పూర్తికాగా అత్యంత ప్రమాదకరమైన నిషేధిత ప్రాంతంలో తొలగింపు పనులు నిలిపివేశారు. నిషేధిత ప్రదేశంలో పేరుకుపోయిన మట్టి, బురద, బండరాళ్లు కదిలిస్తే మరింత ప్రమాదం జరిగే అవ కాశం ఉందని అధ్యయన కమిటీ తేల్చింది. 9.55 కిలోమీటర్ల సొరంగం కోసం.. ఎస్ఎల్బీసీ సొరంగం పనులు పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. 43.930 కిలోమీటర్ల సొరంగానికి..ఇన్లెట్ వైపు నుంచి 13.930 కిలోమీటర్లు, ఔట్లెట్ మన్నెవారిపల్లి వైపు నుంచి మరో 20.430 కిలోమీటర్ల చొప్పున ఇప్పటివరకు 34.710 కిలోమీటర్ల మేర పనులు పూర్తికాగా.. ఇంకా 9.559 కిలోమీటర్ల మేర సొరంగం తవ్వకాలు చేపట్టాల్సి ఉంది. ఈ సొరంగాన్ని ఇప్పటి వరకు రెండు టీబీఎంల సహాయంతో రెండువైపులా(ఇన్లెట్, ఔట్లెట్) నుంచి తవ్వుకుంటూ వచ్చారు. ఇన్లెట్ వైపు సొరంగం ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఐదునెలలుగా పనులు నిలిచిపోయాయి. -
అటవీ ప్రాంతంలో వ్యక్తి అదృశ్యం
మన్ననూర్: శ్రీశైలం – హైదరాబాద్ ప్రధాన రహదారి నల్లమల అటవీ ప్రాంతం సరిహద్దులో వ్యక్తి అదృశ్యమైన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాలిలా.. గురువారం రాత్రి రహదారి గుండా పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో లంబడోని ఉతార్ అనే అటవీ సరిహద్దు ప్రాంతంలో ఒక ఆటో నిలిచి ఉండటాన్ని అటవీ శాఖ అధికారులు గమనించారు. కొంత సమయం వరకు అక్కడే ఉండి పరిశీలించగా ఎంతకు సంబంధిత వ్యక్తులు ఎవరు కూడా రాకపోవడంతో ఆటోను మన్ననూర్ దుర్వాసుల చెరువు వద్ద ఉన్న అటవీశాఖ చెక్పోస్టు ప్రాంగణానికి తరలించారు. అయితే, ఆటోలో లభించిన ఆధారాలను బట్టి అదృశ్యమైన వ్యక్తి శ్రీశైలం గ్రామానికి చెందిన ఎం.లక్ష్మణ్గా భావించారు. అయితే, శుక్రవారం ఉదయం సదరు వ్యక్తి బంధువులు చెక్పోస్టు వద్దకు చేరుకున్నారు. గత కొంత కాలంగా లక్ష్మణ్ తరచూ ఆందోళన చెందుతూ.. మతిస్థిమితం కోల్పోయినట్లుగా ప్రవర్తించేవాడని, ఈ క్రమంలోనే ఇక్కడికి వచ్చి ఉండవచ్చునని అమ్రాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఐ గిరి మనోహర్రెడ్డి నేతృత్వంలో పోలీసులు, అటవీశాఖ సిబ్బంది అటవీ పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అదృశ్యమైన వ్యక్తి ఎవరికై నా కనిపిస్తే సెల్ నం.8985778286కు లేదా అమ్రాబాద్ పోలీస్ స్టేషన్లో తెలియజేయాలని కోరారు. అచ్చంపేటలో బిహార్ పోలీసులు అచ్చంపేట రూరల్: సైబర్క్రైం నేరారోపణల నేపథ్యంలో శుక్రవారం అచ్చంపేటలో బిహార్ పోలీసులు విచారణ చేపట్టారు. ఎస్ఐ విజయభాస్కర్ కథనం మేరకు.. పట్టణానికి చెందిన వెంకటరమణ ప్రధాన రహదారికి ఎదుట బాలాజీ మెడికల్ దుకాణం నిర్వహిస్తున్నారు. అతడి కుమారుడు డొంగరి అనిరుధ్ ఉన్నత విద్యనభ్యసించి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. బిహార్లో రూ.2 కోట్ల వరకు పలువురి అకౌంట్ల నుంచి తండ్రి వెంకటరమణ, నల్గొండ జిల్లా కోదాడకు చెందిన భార్య అకౌంట్లకు మళ్లించడంతో కేసు నమోదైంది. నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి, బంధువుల ఇళ్లలో సోదాలు జరిపినట్లు ఎస్ఐ వివరించారు. గతంలో చైన్నె, బెంగుళూరు పోలీసులు కూడా వచ్చి విచారణ చేపట్టారని తెలిపారు. సుమారు రూ.9 కోట్ల వరకు పలువురు అకౌంట్ల నుంచి డబ్బులు దారి మళ్లినట్లు వివరించారు. బిహార్ డీఎస్పీతో పాటు సీఐ, ఎస్ఐ స్థాయి అధికారుల బృందం గాలించినప్పటికీ అనిరుధ్ ఆచూకీ లభించలేదని ఎస్ఐ తెలిపారు. మరోసారి సోదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. మద్యం దుకాణంలో చోరీ వనపర్తి రూరల్: జిల్లా కేంద్రంలోని యుఆర్ లిక్కర్మార్ట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పట్టణ ఎస్ఐ హరిప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి జిల్లా కేంద్రంలోని పెబ్బేరు రోడ్డులోని యుఆర్ లిక్కర్ మార్ట్ను మూసి సిబ్బంది ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు లిక్కర్ మార్ట్ పైకప్పు కట్ చేసి లోపలికి దిగి రూ.2.08 లక్షల నగదు చోరీ చేశారు. ఘటనపై మార్ట్ క్యాషియర్ జయబ్రహ్మం శుక్రవారం పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
జూరాలకు పెరిగిన వరద
ధరూరు/ రాజోళి/ దోమలపెంట: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద స్వల్పంగా పెరిగింది. గురువారం ప్రాజెక్టుకు 60 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. శుక్రవారం రాత్రి 7 గంటల వరకు 80 వేల క్యూసెక్కులకు పెరిగిందని పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 12 క్రస్టు గేట్లను ఎత్తి 48,504 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే విద్యుదుత్పత్తి నిమిత్తం 34,227 క్యూసెక్కులు, కోయిల్సాగర్కు 315, నెట్టెంపాడుకు 750, ఎడమ కాల్వకు 820, కుడి కాల్వకు 530, ఆర్డీఎస్ లింక్ కెనాల్కు 150, సమాంతర కాల్వకు 200, భీమా లిఫ్టు–2కు 750 క్యూసెక్కులు వదలగా.. మరో 45 క్యూసెక్కులు ఆవిరైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.415 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ● ఇదిలా ఉండగా.. ఎగువనున్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు ఇన్ఫ్లో తగ్గింది. ఆల్మట్టి ప్రాజెక్టుకు 32,932 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. దిగువకు 42,500 క్యూసెక్కులు వదులుతున్నారు. దీంతో దిగువనున్న నారాయణపూర్ ప్రాజెక్టుకు 45 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. దిగువకు 43,488 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సుంకేసులకు ఇన్ఫ్లో.. సుంకేసుల డ్యాంకు శుక్రవారం ఎగువ నుంచి 37 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. దీంతో 7 గేట్లను తెరిచి 34,488 క్యూసెక్కుల నీటిని దిగువకు, కేసీ కెనాల్ 1,847 క్యూసెక్కులను వదిలినట్లు జేఈ మహేంద్ర తెలిపారు. వేగవంతంగా విద్యుదుత్పత్తి ఆత్మకూర్: జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి వేగవంతంగా కొనసాగుతుంది. ఈ మేరకు శుక్రవారం 11 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 5 యూనిట్ల ద్వారా 195 మెగావాట్లు, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు విద్యుదుత్పత్తి చేపడుతున్నారు. ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రాల్లో ఇప్పటి వరకు 345.156 మిలియన్ యూనిట్లు సాధించారు. ఎగువ నుంచి 80 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో రాక 12 క్రస్టు గేట్ల ఎత్తి.. దిగువకు 85,391 క్యూసెక్కుల విడుదల -
కొల్లాపూర్ రేంజ్లో 5 పెద్దపులులు
కొల్లాపూర్: కొల్లాపూర్ అటవీ రేంజ్ పరిధిలో 5 పెద్దపులులతోపాటు 2 చిన్నపిల్లలు ఉన్నట్లు రేంజర్ ఈశ్వర్ తెలిపారు. శుక్రవారం అంకిల్పెంట ఏరియాలో నాలుగు పెద్దపులుల జాడలు గుర్తించామని వెల్లడించారు. వాటి జాడలు గుర్తించిన సిబ్బందిని డీఎఫ్ఓ రోహిత్ గోపిడి, ఎఫ్డీఓ చంద్రశేఖర్ అభినందించారని తెలిపారు. సీసీ కెమెరాల్లో కూడా వాటి కదలికలు నమోదయ్యాయని వివరించారు. జూలై నుంచి సెప్టెంబర్ వరకు పులుల సంతానోత్పత్తి సమయమన్నారు. ఈ సమయంలో అడవిలోకి మనుషులు వెళ్లడం ప్రమాదకరమన్నారు. మనుషుల అలికిడి గమనిస్తే పులులు వారిపై దాడులు చేసే ఆస్కారం ఉంటుందన్నారు. వన్యప్రాణుల రక్షణకు అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వివరించారు. పులుల జాడలు గుర్తించే కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్లు ముజీబ్ఘోరీ, శివ, నీలేశ్, కిరణ్, నాగార్జునగౌడ్, శ్యామ్, నవీన్, లిఖిత తదితరులున్నారు. పులుల జాడలు గుర్తించిన అటవీ అధికారులు -
‘పంటలకు గిట్టుబాటు ధర చెల్లించాలి’
నారాయణపేట: రైతులు సంక్షోభం నుంచి బయటపడాలంటే పంటలకు గిట్టుబాటు ధర చెల్లించాలని ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని భగత్సింగ్ భవన్లో నిర్వహించిన అఖిలభారత ఐక్య రైతు సంఘం (ఏఐయూకేఎస్) నారాయణపేట జిల్లా ప్రథమ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేసి, పంట పెట్టుబడిపై 50 శాతం అదనంగా మద్దతు ధర చెల్లించాలన్నారు. ఏఐయూకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాము మాట్లాడుతూ.. తమ పంటలకు గిట్టుబాటు ధర రాకపోతే దాన్ని నిల్వ చేసుకొనేలా రైతులకు అసరమైన ఏర్పాట్లు చేయాలని కోరారు. దేశంలో దాదాపు 54 శాతం మందికి ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ రంగాన్ని మరింత సంక్షోభంలో నట్టే విధంగా ప్రధాని నరేంద్రమోదీ విధానాలు ఉన్నాయని మండిపడ్డారు. కార్యక్రమంలో ఏఐయూకేఎస్ జిల్లా అధ్యక్షుడు భగవంతు, కార్యదర్శి యాదగిరి, ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి, చెన్నారెడ్డి, కృష్ణయ్య, సహాయ కార్యదర్శులు కొండ నర్సిములు, నారాయణ, బాలకృష్ణ, వ్యవసాయ సంఘం జిల్లా అధ్యక్షుడు సలీం, సీపీఐఎంఎల్ మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి కాశీనాథ్, టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు నర్సింహ, అరుణోదయ జిల్లా అధ్యక్షుడు రాములు, పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి సౌజన్య, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అనుమతి లేని కల్లు డిపోపై దాడి
గద్వాల క్రైం: ఎలాంటి అనుమతులు లేకుండా.. గుట్టుగా కొనసాగుతున్న కల్లు డిపోపై ఎన్ఫోర్స్మెంట్ అధికారుల బృందం మెరుపుదాడి చేసింది. దాదాపు 468 లీటర్ల కల్లు, 100 కేజీల చక్కెర, 10 కేజీల ఈస్ట్ (కల్లు తెలుపు రంగు కోసం వాడే పదార్ధం) రెండు బైక్లు స్వాధీనం చేసుకోవడంతోపాటు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎకై ్సజ్ అధికారి విజయభాస్కర్రెడ్డి తెలిపిన వివరాలిలా.. జోగుళాంబ గద్వాల జిల్లాలోని గోనుపాడు గ్రామ శివారులోని శెట్టి ఆత్మకూర్ రోడ్డు మార్గంలో ఎకై ్సజ్ శాఖ అనుమతి లేకుండా కల్లు డిపోను కొనసాగిస్తున్నారు. ఈ డిపోను గుండ్రాతి సాంబశివగౌడ్, లక్నిసాని కిషోర్, ఈడిగ శ్రీనివాస్గౌడ్ నడుపుతూ.. తయారు చేసిన కల్లును మోటార్ సైకిళ్లపై చుట్టుపక్కల గ్రామాల్లో విక్రయాలు చేస్తున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు గురువారం రాత్రి ఎన్ఫోర్స్మెంట్ అధికారుల బృందం కల్లుడిపోపై దాడి చేశారు. అయితే దాడులు చేపట్టిన క్రమంలో కల్లు తయారీకి వినియోగించిన చక్కెర, ఈస్ట్ పదార్థం, కల్లు, బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా తయారు చేసిన కల్లును సేకరించి ల్యాబ్ పరీక్షలకు పంపించారు. క్లోరో హైడ్రేడ్ (సీహెచ్), డైజోఫాం, ఆల్ఫోజోలం వంటి మత్తు పదార్థాలతో కల్లును తయారీ చేశారా లేదా అనే విషయాలను ల్యాబ్కు పంపించిన శాంపిల్స్ ఫలితాల ఆధారంగా గుర్తించనున్నారు. పట్టుబడిన ముగ్గురు నిందితులపై ఎకై ్సజ్ యాక్టు ప్రకారం కేసు నమోదు చేశామని అధికారి తెలిపారు. గోప్యంగా.. ఎలాంటి అనుమతి లేకుండా గోనుపాడు శివారులో కల్లు డిపోను కొన్ని నెలలుగా నిర్వహిండగా ఎన్ఫోర్స్మెంట్ అధికారుల బృందం గురువారం రాత్రి దాడి చేసింది. అయితే దాడి చేపట్టిన విషయాన్ని జిల్లా ఎకై ్సజ్ అధికారులు ధ్రువీకరించలేదు. అనంతరం మీడియా వాకబు చేయగా సీఐ గణపతిరెడ్డి అధికారికంగా దాడుల సమాచారంపై ప్రకటన విడుదల చేశారు. ఇదిలాఉండగా, జిల్లా పరిధిలో ఎకై ్సజ్, డీటీఎఫ్ సిబ్బంది నిత్యం తనిఖీలు చేపడుతుండగా వారికి ఈ డిపో విషయం తెలియదా.. లేక రాజకీయ ఒత్తిళ్లు, ఇతరాత్ర నజరానాలు అందడంతో చూసీచూడనట్లు వదిలేశారా అన్న అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రసాయన పదార్థాలతో తయారుచేసే కల్లుతో ప్రజల ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా కూడా ఉక్కుపాదం మోపడంలో జిల్లా ఎకై ్సజ్ అధికారులు విఫలమయ్యారని.. దాడి విషయాన్ని గోప్యంగా ఉంచడం ఏమిటని పలువురు గీత కార్మికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 468 లీటర్ల కల్లు స్వాధీనం ముగ్గురి అరెస్టు.. ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడితో జిల్లాలో అలజడి -
హిందువుల ఐక్యతే లక్ష్యం
వనపర్తిటౌన్: హిందువులందరినీ ఒకే నినాదం, ఒకే విధానంలోకి తీసుకురావాలని, అందుకోసం హిందూవాహిని పని చేస్తుందని హిందూవాహిని ద్విరాష్ట్ర అధ్యక్షుడు రాజవర్ధన్రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో హిందూ ప్రముఖులతో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలోని ప్రతి ఒక్కరు కులాలను పక్కనబెట్టి మనమంతా ఒక్కటే అనే భావనను చాటిచెప్పే సమయం ఆసన్నమైందని.. వంశపారంపర్యంగా వస్తున్న కులవృత్తిని గౌరవిస్తూ పర మతాలకు అవకాశం ఇవ్వకుండా మనకంటూ స్థ్ధానాన్ని సంపాదించుకోవాలని సూచించారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బ తీయడానికే కొన్ని శత్రు దేశాలు పన్నిన కుట్రలో భాగంగా హిందూ అమ్మాయిలను టార్గెట్ చేస్తూ ప్రేమ, బెస్టీ అనే కొత్త కొత్త సంబంధాలతో ట్రాప్ చేస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలన్నారు. రాబోయే రోజుల్లో ఎలాంటి యుద్ధాలు, ఆటంకాలు వచ్చినా ఏకమై ఎదుర్కొనేలా ఎదగాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో హిందూవాహిని రాష్ట్ర ఆర్గనైజర్ ముడుపు యాదిరెడ్డి, రాష్ట్ర సహ సంయోజక్ హరిచంద్రారెడ్డి, విభాగ్ కన్వీనర్ అభిలాష్, జిల్లా కన్వీనర్ అరుణ్గౌడ్, కో–కన్వీనర్లు శ్రీకాంత్, నవీన్, పట్టణ కన్వీనర్ నంద, నాయకులు మూర్తి, సంతోష్, నీలేష్, కార్తీక్, భరత్, సంతోష్, నిఖిల్సాయి, హిందూవాహిని కార్యకర్తలు, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ట్రాఫిక్ సమస్య రాకుండా చూడాలి: ఎస్పీ
మహబూబ్నగర్ క్రైం: జిల్లాకేంద్రంలోని ప్రధాన చౌరస్తాల్లో ట్రాఫిక్ సమస్యలు రాకుండా, ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఎస్పీ డి.జానకి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ చౌరస్తా, న్యూటౌన్, షాషాబ్గుట్ట చౌరస్తాలో శుక్రవారం ఎస్పీ ట్రాఫిక్ పరిస్థితులను పరిశీలించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా సౌకర్యవంతమైన రవాణా కల్పించడానికి కార్యాచరణ రూపొందించాలన్నారు. ప్రధానంగా రద్దీ ఉండే సమయాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టాలన్నారు. వాహనదారులు తప్పకుండా నిబంధనలు పాటించే విధంగా చర్యలు చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినచర్యలు తీసుకోవాలన్నారు. ఈ తనిఖీల్లో ట్రాఫిక్ సీఐ భగవంతురెడ్డి పాల్గొన్నారు. పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్కు దరఖాస్తుల ఆహ్వానం స్టేషన్ మహబూబ్నగర్: 2025–26 విద్యా సంవత్సరానికి మైనార్టీ విద్యార్థులు పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి శంకరాచారి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో చదివే మైనార్టీ విద్యార్థులు సెప్టంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈపాస్ వెబ్సైట్ ద్వారా http://telanganaepass.cgg. gov.inలో ఆన్లైన్లో స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 2023–24, 2024–25కి సంబంధించి పెండింగ్ దరఖా స్తులు కళాశాల యాజమాన్యాలు ఈ నెల 31లోగా కార్యాలయంలో అందజేయాలని సూచించారు. రెండోరోజు మరో 37 దుకాణాల సీజ్ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: స్థానిక మార్కెట్ లైన్లోని మున్సిపల్ దుకాణాల నుంచి అద్దెలు సుమారు రూ.2.50 కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. దీంతో శుక్రవారం ఈ ప్రాంతంలోని 37 షాపులను మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. మొదటి రోజు గురువారం క్లాక్టవర్ సమీపంలోని 35 దుకాణాలపై దాడులు నిర్వహించి తాళాలు వేసిన విషయం విదితమే. ఇప్పటివరకు మొత్తం 72 దుకాణాలను సీజ్ చేశారు. ఈ దాడుల్లో ఆర్ఓ మహమ్మద్ ఖాజా, ఆర్ఐలు అహ్మద్ షరీఫ్, రమేష్, ముజీబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాకేంద్రంలో మోస్తరు వర్షం మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలో శుక్రవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు మధ్యలో ఓ మోస్తరు వర్షం కురిసింది. వరుసగా నాలుగు రోజుల పాటు పడుతున్న ఈ వర్షాలతో రోడ్లన్నీ చిత్తడి చిత్తడిగా మారాయి. వివిధ చోట్ల ఇసుక మేటలు ఏర్పడి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఆయా వీధులలో డ్రెయినేజీలు నిండి పొంగి పొర్లాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇక పది విలీన గ్రామాల్లోని మట్టి రోడ్లు బురదమయంగా మారాయి. నడవడానికి పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రేపు గ్రామ పాలన అధికారుల పరీక్ష జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): గ్రామ పాలన అధికారుల రెండవ దఫా పరీక్ష ఈ నెల 27న (ఆదివారం) నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయేందిర శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కాలేజీలో నిర్వహించే పరీక్షకు 99 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. పరిక్షకు హాజరయ్యే అభ్యర్థులు పాస్పోర్టు ఫొటోను నిర్ణీత స్థలంలో అతికించాలని, లేకుంటే పరీక్ష రాయడానికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. అభ్యర్థులు నామినల్ రోల్స్లో అతికించడానికి పరీక్ష హాల్లో ఒక పాస్పోర్ట సైజు ఫొటోను సమర్పించాలని సూచించారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, పేపర్లు, రికార్డింగ్ పరికరాలు పరీక్షకేంద్రం లోపలికి తీసుకొచ్చేందుకు అనుమతి లేదని తెలిపారు. -
సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగరంలో ఎక్కడా సీజనల్ వ్యాధులు సోకకుండా తగు చర్యలు చేపట్టాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.శశికాంత్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.ప్రవీణ్కుమార్రెడ్డి సూచించారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో ఆశా కార్యకర్తలు, మున్సిపల్ జవాన్లు, మెప్మా ఆర్పీలకు ఒకరోజు శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దోమల నివారణకు ప్రతినిత్యం ఇంటింటికీ వెళ్లి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో డెంగీ, మలేరియా, జ్వరాలు తదితర వ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇంటి ఆవరణలోని నీటి డ్రమ్ములు, పాత టైర్లు, సంప్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలన్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లోని ఓపెన్ ప్లాట్లలో నిలిచే నీటిలో, మురుగు కుంటలలో లార్వా ఏర్పడకుండా ఆయిల్ బాల్స్ వేయాలన్నారు. -
వక్ఫ్ భూముల్లో రియల్ దందా!
వక్ఫ్ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ప్రొహిబిటెడ్ జాబితాలో ఉన్న ఇనాం భూముల్లో ‘రియల్’ గద్దలు వాలాయి. అనుభవదారుల వారసులు తెగబడగా.. సుమారు రూ.7 కోట్ల భూమికి ఎసరుపెట్టారు. ఓ పంచాయతీ స్థాయి అధికారి వారితో కుమ్మకై ్క అందినకాడికి దండుకుంటున్నట్లు సమాచారం. హన్వాడ మండలం గుడిమల్కాపూర్లో చోటుచేసుకున్న దందాపై ‘సాక్షి’ కథనం.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ పల్లె ప్రకృతి వనంలోని నరికివేసిన చెట్లు హన్వాడ మండలం గుడిమల్కాపూర్లో వెలుగులోకి.. ● సుమారు రూ.7 కోట్ల భూమికి ఎసరు ● 7.07 ఎకరాల్లో ఇనాం భూములు ● తెగబడిన అనుభవదారుల వారసులు ● ఓ పంచాయతీ సెక్రటరీతో కుమ్మక్కు ● బినామీ పేరుతో 300 గజాల స్థలం కొన్న సదరు అధికారి ● అందినకాడికి దండుకుని గృహనిర్మాణాలకు అనుమతులు ● పల్లె ప్రకృతి వనంలో చెట్లను నరికేసిన ఘనులు -
కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం
స్టేషన్ మహబూబ్నగర్: కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా రైతుబంధు మాజీ అధ్యక్షుడు గోపాల్యాదవ్, మాజీ కౌన్సిలర్లు పద్మజ, రామకృష్ణతో పాటు కుర్వ సత్యం, బీజేపీ, బీఆర్ఎస్లకు చెందిన భారీగా కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలో జరుగుతున్న అభివృద్ధి గత 75 ఏళ్ల కాలంలో ఎన్నుడూ జరగలేదన్నారు. 16 నెలల కాలంలో సుమారు రూ.260 కోట్లతో మహబూబ్నగర్లో సమాంతరంగా అభివృద్ధి చేశామని, ప్రతి కాలనీలో రోడ్లు, డ్రెయినేజీలు, ఇతర అభివృద్ధి పనులు పూర్తిచేసినట్లు తెలిపారు. బీసీ రిజర్వేషన్ కోసం సీఎం చేస్తున్న కృషిని రాహుల్గాంధీ కొనియాడారన్నారు. కేంద్ర ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి సహకారంతో తెలంగాణలోనే అత్యధికంగా నిధులు తెచ్చి మహబూబ్నగర్ను బ్రహ్మంగా అభివృద్ధి చేసుకునే సువర్ణ అవకాశం మనకు వచ్చిందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మహబూబ్నగర్ కార్పొరేషన్లోని 60 స్థానాల్లో గెలుపొంది సీఎంకు బహుమతిగా ఇద్దామని పిలుపునిచ్చారు. టీజీఎంఎఫ్సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఘనమైన చరిత్ర ఉందని, అధికారమే పరమవాదిగా పనిచేసే పార్టీ కాదన్నారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేద్దామని కోరారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, గ్రంథాలయ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, వైస్ చైర్మన్ విజయ్కుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్గౌడ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వసంత, నాయకులు ఎన్పీ వెంకటేశ్, చంద్రకుమార్గౌడ్, ఎం.సురేందర్రెడ్డి, అమరేందర్రాజు, సిరాజ్ఖాద్రీ, రాఘవేందర్రాజు, సీజే బెనహర్, సాయిబాబా, రాములుయాదవ్, అజ్మత్అలీ, అవేజ్, ఫయాజ్, నాగరాజు, బండి మల్లేష్ పాల్గొన్నారు. -
రూ.2 కోట్ల విలువైన 2 ఎకరాలు మాయం..
గుడిమల్కాపూర్ సెంటర్లో వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూముల్లో ఎకరా వరకు దర్గా నిర్మించారు. గత ప్రభుత్వ హయాంలో ఎకరా వరకు పల్లె ప్రకృతి వనానికి కేటాయించగా.. చెట్లు ఏపుగా పెరిగాయి. మరోవైపు గ్రామానికి ఆనుకుని ఉన్న ఈ భూముల్లో సుమారు 3 ఎకరాలను పలువురు వ్యవసాయానికి అనుకూలంగా మార్చుకుని కొన్నేళ్లుగా సాగు చేస్తున్నారు. రియల్ఎస్టేట్ దందాతో మిగతా రెండెకరాలకు పైగా అన్యాక్రాంతం కాగా.. దీని విలువ రూ.2 కోట్లకు పైగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. మలక్బాద్షా, ములుక్ బాద్షాల దర్గా -
నేటినుంచి బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడి పర్యటన
పాలమూరు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్.రామచందర్రావు నియామకం అయిన తర్వాత తొలిసారిగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. శని, ఆదివారాల్లో నియోజకవర్గాల్లో పర్యటించి జిల్లాస్థాయి నేతలతో పాటు కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించనున్నారు. తొలిసారిగా ఉమ్మడి జిల్లాకు వస్తున్న క్రమంలో ఆయా జిల్లాలో పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట రామచందర్రావు శనివారం మధ్యాహ్నం 12 గంటలకు జడ్చర్లకు చేరుకుంటారు. అక్కడ పాలమూరు బీజేపీ శాఖ, బీజేపీ శ్రేణులు స్వాగతం పలుకుతారు. తర్వాత మహబూబ్నగర్లోని అప్పన్నపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి.. అక్కడి నుంచి భారీ బైక్ ర్యాలీతో అన్నపూర్ణ గార్డెన్కు చేరుకుంటారు. అక్కడ జిల్లా, నియోజకవర్గ, మండల, బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం మధ్యా హ్నం 3 గంటలకు నారాయణపేట జిల్లా మరికల్, నారాయణపేటకు వెళ్లి.. వివిధ వర్గాల నాయకులతో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. రాత్రికి గద్వాల జిల్లాకేంద్రానికి చేరుకుని అక్కడే బస చేస్తారు. ఆదివారం ఉదయం 8గంటలకు ప్రెస్ మీట్, ఆ తర్వాత మేధావులు, వివిధ వర్గాల నేతలతో సమావేశం నిర్వహించి.. 10 గంటలకు పెబ్బే రు, ఆ తర్వాత వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాకేంద్రాల్లో కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొంటారు. ఉమ్మడి జిల్లాలో 2 రోజుల పాటుకార్యక్రమాలు భారీ ఏర్పాట్లు చేస్తున్న పార్టీ శ్రేణులు -
వక్ఫ్ భూముల్లో వెలసిన ఇళ్లు, వాటర్ ప్లాంట్..
గుడిమల్కాపూర్లోని సర్వేనంబర్ 49లో 7.07 ఎకరాల్లో వక్ఫ్ భూములు ఉన్నాయి. ప్రధాన సెంటర్లో దర్గా స్థలాలు ఉండడంతో కమర్షియల్గా డిమాండ్ ఎక్కువగా ఉంది. వక్ఫ్ భూమికి ముగ్గురు అన్నదమ్ములు అనుభవదారులుగా ఉన్నారు. అయితే ఈ భూములను వారివారి వారసులకు గతంలోనే పంపకాలు చేశారు. నిబంధనల ప్రకారం ఇనాం భూములను అనుభవించాల్సిందే తప్ప.. ఎలాంటి అమ్మకాలు, కొనుగోలు చేయరాదు. కానీ వారి వారసులు ఇటీవల లోపాయికారీగా ఈ భూములను గజాల చొప్పున అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ భూముల్లో వాటర్ప్లాంట్లు, ఇళ్లు వెలియడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. -
పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పెండింగ్లో ఉన్న పెన్షన్, జీపీఎఫ్ ఫైనల్ విత్ డ్రాయల్ కేసుల సత్వర పరిష్కారానికి పెన్షన్ అదాలత్ నిర్వహించి పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చందా పండిత్ అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో అకౌంటెంట్ జనరల్ (ఏఅండ్ఈ), కలెక్టరేట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెన్షన్, జీపీఎఫ్ అదాలత్లో కలెక్టర్ విజయేందిరతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్లు, జీపీఎఫ్ అందజేతలో ఏమైనా సందేశాలు ఉంటే అదాలత్లో నివృత్తి చేసుకోవాలని సూచించారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పెన్షన్ పత్రాలు, సాధారణ భవిష్య నిధి పత్రాలు అందిన వెంటనే వాటిని పరిశీలించి మంజూరు ఉత్తర్వులు అందిస్తామన్నారు. ప్రభుత్వ శాఖలలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్, జీపీఎఫ్ ఫైనల్ విత్ డ్రాయల్ ఉత్తర్వులు అందేలా ప్రత్యేక దృష్టిపెట్టామన్నారు. కలెక్టర్ విజయేందిర మాట్లాడుతూ పింఛన్ ప్రభుత్వ ఉద్యోగుల హక్కు, పదవీ విరమణ చేసిన రోజున ఉద్యోగులకు పెన్షన్ ఉత్తర్వులు అందేలా చూడాలన్నారు. ఉద్యోగ బాధ్యతలతోపాటు ఆర్థిక నిర్వహణ కూడా ఇది ముఖ్యమన్నారు. అలాగే పెన్షన్ అదాలత్ ఏర్పాటు చేసి పెన్షన్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కోరారు. జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన వారి పెన్షన్ పత్రాలు, జీపీఎఫ్ ఫైనల్ పత్రాలు సత్వరమే ఏజీకి పంపించాలని చెప్పారు. పెండింగ్లో ఉన్న పెన్షన్ సమస్యలను అదాలత్లో పరిష్కరించుకోవాలని సూచించారు. కాగా.. పెన్షన్ అదాలత్లో 116 ప్రభుత్వ శాఖల అధికారులు, 50 మంది పెన్షనర్లు, 28 మంది చందాదారులు, పెన్షనర్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. మంజూరు పత్రాలు, ప్రొసీడింగ్స్ అందజేత.. ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్తో కలిసి కలెక్టర్ 20 మందికి పెన్షన్ మంజూరు పత్రాలు, 16 జీపీఎఫ్ ఆథరైజేషన్ ప్రొసీడింగ్స్లను రిటైర్డ్ ఉద్యోగులకు అందజేశారు. 10 పెండింగ్ పెన్షన్ కేసులను పరిష్కరించారు. ఉదయం పెన్షన్ అదాలత్ తర్వాత మధ్యాహ్నం పెన్షన్, జీపీఎఫ్, అకౌంట్ సంబంధిత సమస్యలపై నిర్వహించిన వర్క్షాప్ విజయవంతమైంది. ఈ సందర్భంగా పెన్షన్ మంజూరు అధికారులు, పెన్షన్ జారీ, పంపిణీ అధికారులకు మార్గదర్శకాలు వివరించి అవగాహన కల్పించారు. అకౌంట్ సంబంధిత సమస్యలు చేసే తప్పుల గురించి వివరించారు. సమావేశంలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ (అకౌంట్స్– వీఎల్సీ) నరేష్కుమార్, డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ (ఎన్ టైటిల్మెంట్స్) అభయ్ అనిల్ సోనార్కర్, వనపర్తి, గద్వాల అదనపు కలెక్టర్లు యాదయ్య, నర్సింగ్రావు, ఉమ్మడి జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. పదవీ విరమణ పొందనున్న ఉద్యోగులకు త్వరగా పేమెంట్ ఆర్డర్ అందజేతకు చర్యలు రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చందా పండిత్ ప్రిన్సిపల్, అకౌంటెంట్ జనరల్, కలెక్టరేట్ సంయుక్త ఆధ్వర్యంలో పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ పెన్షన్, జీపీఎఫ్, అకౌంట్ సమస్యలపై వర్క్షాప్ విజయవంతం -
నాగర్కర్నూల్ కలెక్టర్కు మాతృవియోగం
నాగర్కర్నూల్: జనగామ జిల్లా జఫర్గడ్ మండలం సూరారం గ్రామానికి చెందిన నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మాతృమూర్తి బదావత్ శాంతమ్మ(51) గుండెపోటుతో మృతిచెందారు. బుధవారం మధ్యాహ్నం ఆమెకు గుండెపోటు రాగా హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి తర్వాత తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూరారం గ్రామానికి చేరుకుని శాంతమ్మ మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నాగర్కర్నూల్ కలెక్టర్ సంతోశ్కుమార్ను పరామర్శించారు. కలెక్టర్ సంతోశ్కుమార్ను పరామర్శించిన వారిలో స్టేషన్ఘన్పూర్, కొల్లాపూర్ ఆ ర్డీఓ వెంకన్న, బన్సీలాల్ తదితరులు ఉన్నారు. కలెక్టర్ మాతృమూర్తి బదావత్ శాంతమ్మ అకాల మర ణంపై జిల్లా అధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
శ్రావణం.. శుభకరం
అచ్చంపేట/స్టేషన్ మహబూబ్నగర్/కృష్ణా: శ్రావణమాసం.. మహిళలకు ప్రత్యేక మాసంగా చెప్పవచ్చు. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ఈ మాసంలో మహిళలు మంగళగౌరి, శ్రావణలక్ష్మి (వరలక్ష్మి) పూజలు, పేరంటాలు, వ్రతాలతో ఎంతో సందడిగా గడుపుతారు. అమ్మవారి ఆరాధన, నోములు, వ్రతాలు సీ్త్రలకు సకల సౌభాగ్యాలు కలిగిస్తాయని వారి నమ్మకం. లక్ష్మీదేవి జన్మించింది కూడా శ్రావణ మాసంలోనే అని పురాణాలు చెబుతున్నాయి. అలాగే శ్రీమహావిష్ణువు శ్రవణ నక్షత్రంలోనే జన్మించడంతో ఈ మాసం ఆమెకు ప్రీతికరమైందని చెబుతున్నారు. ఈ మాసంలో చేసే అన్ని పూజల్లోకెల్లా వరలక్ష్మి వ్రతం ఉత్తమమైందని.. మొదట ఈ వ్రతాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడని ప్రతీతి. ఈ వ్రతం చేసిన మహిళలకు సంతానం, ధనధానాలు, సంపూర్ణ ముత్తైదువుతనం, సంతానం, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని పురాణంలో పేర్కొన్నారు. వరలక్ష్మి వ్రతం.. వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి సకల ఉపచారాలతో ఈ వ్రతం నిర్వహిస్తారు. ఈ వ్రతంలో తొమ్మిది సంఖ్యకు ప్రాధన్యం. అందుకే తొమ్మిది పోగులతో కూడిన తోరణం ధరించి, తొమ్మిది రకాల పిండివంటలు నివేదన చేసి ముత్తైదువులకు వాయిణమిస్తారు. బూరెలు, బొబ్బట్లు, పులగం, గారెలు, పూర్ణాలు, పరమాన్నం, పులిహోర, రవ్వ కేసరి తదితర పిండివంటల్లో భాగంగా ఉంటాయి. తిరు నక్షత్ర మహోత్సవాలు.. ఆలయాల్లో అండాళ్ తిరునక్షత్ర మహోత్సవాలు నిర్వహిస్తారు. తొలి శ్రావణ శనివారం సందర్భంగా తులసి అర్చన చేస్తారు. వివాహాలు, శుభకార్యాలు.. శ్రావణ మాసంలో పెళ్లిళ్లు, గృహాప్రవేశాలు, ఇతర శుభకార్యాలు చేసేందుకు ఇప్పటికే ముహూర్తాలు నిర్ణయించుకున్నారు. ఈ నెల 26, 30, 31, ఆగస్టులో 1, 3, 5, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 17లో వివాహ ముహూర్తాలున్నాయి. పండుగలకు ప్రత్యేకం.. శ్రావణమాసం పండుగలకు ప్రత్యేకమైందిగా చెప్పవచ్చు. ఈ మాసానికి నభోమాసమని మరో పేరుంది. ప్రతి హైందవుడి ఇంట్లో ఈ నెలంతా పూజలు, వ్రతాలు నిర్వహిస్తుంటారు. ఆలయాల్లో సామూహిక కుంకుమార్చనలు, తులసి అర్చనలు, పుష్పార్చనలు, రుద్రాభిషేకాలు తదితర పూజలు చేస్తారు. వర్షాలు కురవాలని శివుడికి ఘఠాభిషేకం చేయడం ఆచారంగా ఉంది. – తోటపల్లి శ్రీకాంత్శర్మ, అర్చకుడు, మహబూబ్నగర్ హిందువులకుపవిత్ర మాసం.. హిందువులకు శ్రావణమాసం అతి పవిత్రమైంది. ఈ మాసంలో శుభకార్యాలు నిర్వహించుకుంటారు. ప్రతి హిందువు నెలరోజుల పాటు ఇంట్లో పూజలు నిర్వహించడంతో పాటు శుచి, శుభ్రత, పవిత్రత, మడి, ఆచారం, సాంప్రదాయాలకు అనుగుణంగా నడుచుకోవడం, మద్యం, మాంసం ఆరగించకుండా భక్తితో ఉంటారు. – రాజశేఖర్స్వామి, ప్రధాన అర్చకుడు, పార్వతీ పరమేశ్వర దేవస్థానం, చేగుంట (కృష్ణా) నేటి నుంచి శ్రావణమాసం ప్రారంభం పండుగలకు నెలవైన మాసం శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరం శుభ్రత, సాత్వికత, ప్రేమలో... శుచి, శుభ్రతతో ఉండే ఇళ్లు, తోటి వారితో కలిసిమెలిసి ఉండే వారి ఇళ్లు, పాపపు ఆలోచనలు చేయని, తప్పులు చేయని వారిలో, ప్రేమ, సేవాభావం కలిగిన వారిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవి కేవలం ధనంగానే కాకుండా ఆరోగ్యం, ఐశ్యర్యం, ఆయుష్షు, అందం, బంధుగణం, సంపద, సౌకర్యాలు, సీ్త్రలు, ఆచారాలు, ఆలయాలు, వస్త్రాలు, విద్య, కళలు, పరికరాలు, పుష్పాలు తదితర అన్ని అంశాల్లోనూ నెలవై ఉంటుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. -
కోర్టుకు హాజరైన తేజేశ్వర్ హత్య కేసు నిందితులు
బెయిల్పై న్యాయవాదిని వాకాబు చేసిన ఏ–7 గద్వాల క్రైం: జూన్17వ తేదీన గద్వాల పట్టణంలోని గంటవీధికి చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ సుపారీ గ్యాంగ్చేతిలో దారుణహత్యకు గురైన ఘటన రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం విధితమే. అయితే గురువారం జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న నిందితులు ఏ– 1 తిరుమలరావు, ఏ– 2 ఐశ్వర్య అలియాస్ సహస్ర, ఏ –3 కుమ్మరి నగేశ్, ఏ–4 చాకలి పరశురాముడు, ఏ–5 చాకలి రాజు, ఏ–6 ఏ మోహన్, ఏ–7 తిరుపతయ్య(తిరుమల రావు తండ్రి), ఏ–8 సుజాతను గద్వాల జూనియర్ సివిల్ కోర్టు నాయ్యమూర్తి ఉదయ్నాయక్ ఎదుట పోలీసులు ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో కేసుకు సంబంధించిన అంశాలపై మరోసారి న్యాయమూర్తి నిందితులతో మాట్లాడారు. జైలు అధికారులు ఏమైనా ఇబ్బందులు, ఆహార పానీయాలు అందించే విషయంలో నిర్లక్ష్యం వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. కేసుకు సంబంధించిన వాదనలకు న్యాయవాదులను ఏర్పాటు చేసుకున్నారా అని ప్రశ్నించారు. అనంతరం నిందితులకు మరో 14రోజుల పాటు రిమాండ్కు ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు నిందితులను జైలుకు తరలించారు. రిమాండ్కు తరలించే క్రమంలో ఏ–7 తిరుపతయ్య తన తరఫున ఏర్పాటు చేసుకున్న న్యాయవాదితో బెయిల్ విషయంపై వాకబు చేశారు. నేడో రేపో బెయిల్ బెంచ్ మీదకు వస్తుందని త్వరలోనే బెయిల్ వస్తుందని న్యాయవాది తెలిపారు. నిందితులంతా కోర్టులో హాజరవుతున్నారని తెలుసుకున్న బంధువులు కోర్టు వద్దకు చేరుకుని వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని కన్నీంటిపర్యమయ్యారు. ఇద్దరు నిందితులను కస్టడీకి కోరిన పోలీసులు హత్య కేసు ఘటనలో ఇద్దరు నిందితులైన ఏ–1 తిరుమలరావు, ఏ– 2 ఐశ్వర్య అలియాస్ సహస్రను పోలీసులు కస్టడీకి కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ విషయంపై త్వరలో న్యాయమూర్తి అనుమతి ఇవ్వనున్నట్లు తెలిసింది. ఈ కేసు వ్యవహారంలో ఈనెల 10న ఏ –1, 3, 4, 5ను మూడు రోజులపాటు వివిధ అంశాలపై విచారణ అధికారి సీఐ శ్రీను విచారించి రిమాండ్కు తరలించారు. -
మన్యంకొండకు ‘శ్రావణ శోభ’
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానానికి శ్రావణశోభ రాబోతుంది. ఈనెల 25వ తేదీ నుంచి దేవస్థానంలో శ్రావణమాసపు ప్రత్యేక విశేషోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 28వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. ఇందుకుగాను దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో నెలరోజులపాటు దేవస్థానంలో పలు పూజా కార్యక్రమాలతోపాటు ప్రతిరోజు శాంతిహోమాన్ని నిర్వహిస్తారు. నెలలో ప్రత్యేక దినోత్సవాల రోజుల్లో పలు పూజలు నిర్వహిస్తారు. విశేషోత్సవాల సందర్భంగా స్వామివారిని బంగారు అభరణాలతో అలంకరణ చేసి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తారు. ప్రతి శనివారం రాత్రి స్వామివారి శేషవాహనసేవా నిర్వహిస్తారు. ప్రతి బుధ, గురు, శుక్రవారాల్లో ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. అలాగే ప్రతిరోజు వేయి తులసీదళాలతో ప్రత్యేక అర్చన పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. విశేషోత్సవాలు... దేవస్థానంలో ఈనెల 25వ తేదీన ప్రత్యేక పూజా కార్యక్రమాలతో శ్రావణమాస విశేషోత్సవాలను ప్రారంభిస్తారు. ఈనెల 29న నాగుల (గరుడ పంచమి), ఆగస్టు 5న ఏకాదశి, శ్రీవిష్ణుసహస్రనామ అఖండ పారాయణం నిర్వహిస్తారు. 9న ఉదయం 11 గంటలకు స్వామివారి కల్యాణం (రాఖీ పౌర్ణమి), హయగ్రీవ జయంతి (రాత్రికి శేష వాహన సేవ), 16న శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉట్ల కార్యక్రమం, శ్రీ హనుమద్దాసుల కీర్తనలతో అఖండ భజన 24 గంటల పాటు జరుగుతుంది. అలాగే 28న గురుపంచమి బ్రుషిపంచమి సమారాధన, శ్రావణమాస హోమ పూర్ణాహుతి, సమారాధన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు తెలిపారు. శ్రావణమాస విశేషోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాతృలు కావాలని కోరారు. నేటినుంచి విశేషోత్సవాలు ప్రారంభం ప్రతిరోజూ శాంతిహోమం, తులసీనామార్చన స్వర్ణాభరణ అలంకరణలో దర్శనమివ్వనున్న స్వామివారు -
రైతులకు ఇబ్బందులు రాకుండా చూడండి
జడ్చర్ల/బిజినేపల్లి/భూత్పూర్: రైతులకు యూరియా ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్లు పద్మహర్ష, హర్ష ప్రభ అధికారులను ఆదేశించారు. గురువారం సాక్షి దినపత్రిలో యూరియా కోసం పడిగాపులు శీర్షికన వచ్చిన కథనంపై వీరు స్పందించారు. ఈ నేపథ్యంలో జడ్చర్లతో పాటు భూత్పూర్ తదితర చోట్ల వేర్వేరుగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జేడీ పద్మహర్ష డీఏఓ వెంకటేశ్, మార్కెటింగ్ ఏడీ బాలమణి, తదితర అధికారులతో కలిసి స్థానిక గంజ్లోని హాకా ఫార్మర్ సర్వీస్ సెంటర్తో పాటు ఇతర ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. అనంతరం రైతులతో మాట్లాడి యూరియా, తదితర ఎరువుల లభ్యతపై విచారించారు. బస్తా ధర రూ.267 ఉండగా డీలర్లు రూ.275కు విక్రయించడంపై విచారించారు. హమాలీ చార్జీలతో కలుపుకుని విక్రయిస్తున్నట్లు డీలర్లు వివరణ ఇచ్చారు. అలాగే జేడీ హర్షప్రభ సైతం జిల్లా వ్యవసాయశాఖ అధికారి వెంకటేశ్తో కలిసి భూత్పూర్ పట్టణంలోని సింగిల్ విండోతో పాటు ఫెస్టిసైడ్ దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. మండలానికి ఎరువుల ఎంత మేరకు అలాట్మెంట్ చేశారు, ఇప్పటి వరకు ఎంత సరఫరా చేశారు అని జేడీఏ వెంకటేశ్ను అడిగి తెలుసుకున్నారు. భూత్పూర్ మండలానికి 294 టన్నుల యూరి యా అలాట్మెంట్ చేసి, 249 మెట్రిక్ టన్నుల యూరియాను వివిధ ఎరువుల దుకాణాలకు సరఫరా చేసినట్లు వివరించారు. అలాగే 45 టన్ను ల యూరియా రైతులకు అందుబాటులో ఉంచినట్లు జేడీఏ వెంకటేష్ వివరణ ఇచ్చారు. ఉదయం 8 గంటల నుంచి పీఏసీఏస్ కేంద్రాల ద్వారా ఏరువులు సరఫరా చేయాలని సీఈవో రవికి సూచించారు. కొన్ని దుకాణాల్లో ఇతర ఎరువులు, మందులు కొంటేనే ఎరువులను విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఏడీ పూర్ణచంద్రారెడ్డికి సూచించారు. -
మార్మోగిన గోవింద నామస్మరణ
చిన్నచింతకుంట: ఆషాడ మాసం అమావాస్య పురస్కరించుకొని గురువారం పేదల తిరుపతిగా పేరుగాంచిన కుర్తిమూర్తి కొండలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచి భక్తులు స్వామి వారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి పునీతులయ్యారు. కొందరు క్యూలైన్లో నిల్చొని స్వామి వారి దర్శనానికి వెళ్లగా మరికొందరు మెట్టు మెట్టుకు కుంకుమ పెడుతూ, దీపాలు వెలింగి ముందుకు సాగారు. స్వామివారి దర్శించుకొని పరవశించిపోయారు. కొండపైన అలివేలు మంగమ్మ, చెన్నకేశవస్వామి, ఆంజనేయ స్వామి, ఉద్దాల మండపం వద్ద భక్తులు దర్శించుకున్నారు. కొండ దిగువన మట్టికుండలో పచ్చిపులుసు అన్నం నైవేద్యంగా తయారు చేసి స్వామికి సమర్పించారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఆలయాన్ని శుద్ధి చేసి సుప్రభాత సేవ నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ ప్రాంగణమంతా భక్తుల రద్దీగా కనిపించింది. జాతరమైదానంలో ఏర్పాటు చేసిన దుకాణాలల్లో స్వీట్లు, తదితర వస్తువులను కొనుగోలు చేశారు. వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు. ఇబ్బందులు లేకుండా ఆలయ చైర్మన్ గోవర్ధన్రెడ్డి, ఈఓ మధనేశ్వర్రెడ్డి, కమిటీ సభ్యులు బాదం వెంకటేశ్వర్లు ఏర్పాట్లను పరిశీలించారు. అన్నదాతలు పేర్లు నమోదు చేసుకోవాలి అన్నదాతలు దేవస్థానం కార్యాలయంలో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని ఆలయ చైర్మన్ గోవర్ధన్రెడ్డి ఈఓ మధనేశ్వర్రెడ్డిలు కోరారు. ప్రతి నెల అమావాస్య, పౌర్ణమి, ప్రతి శనివారంను ఆలయం ప్రాగణంలో భక్తులకు అన్నదానం చేస్తునట్లు తెలిపారు. అమావస్యం రోజు అన్నదానం కోసం రూ.25 వేలు, పౌర్ణమి రోజు రూ. 6వేలు,, శనివారం రూ.6వేలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కురుమూర్తి గిరులు భక్తులతో కిటకిట నేటి నుంచి శ్రావణ మాసోత్సవాలు కురుమూర్తి స్వామి ఆలయంలో నెల రోజుల పాటు శ్రావణ మాసోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 23 వరకు ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టనున్నారు. వచ్చేనెల 6న లక్ష్మీదేవి అమ్మవారికి కుంకుమార్చన, 7న స్వామి వారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు, 8న స్వామివారికి అభిషేకం, పవిత్రారోహణం తదితర కై ంకర్యాలు నిర్వహించనున్నారు. -
పాలమూరులో పోకిరీలు
‘మహబూబ్నగర్ రూరల్ మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు కొన్నిరోజుల నుంచి పదో తరగతి విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో ఈ నెల 4న విద్యార్థులు షీటీం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో పాఠశాలను పరిశీలించి జరిగిన ఘటనపై విచారణ చేయగా ఉపాధ్యాయుడు తప్పుగా ప్రవర్తించినట్లు తేలింది. దీంతో సదరు ఉపాధ్యాయుడిపై రూరల్ పోలీస్స్టేషన్లో పోక్సో కేసు నమోదు చేశారు.’ మహమ్మదాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికపై జీలకరపురం కృష్ణయ్య లైంగిక దాడి చేయడంతో 376(2) ఐపీసీతో పాటు పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. దీనిపై చార్జీషీట్ దాఖలు చేసి కోర్టులో హాజరుపరచగా ఈ నెల 17న ప్రత్యేక సెషన్స్ కోర్టు న్యాయమూర్తి నిందితుడు కృష్ణయ్యకు జీవితఖైదుతోపాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో ఏటా పెరుగుతున్న పోక్సో కేసులు ● ఆందోళన కలిగిస్తున్న అఘాయిత్యాలు ● కీచకులుగా మారుతున్న పలువురు ఉపాధ్యాయులు ● పాఠశాలల్లోనూ విద్యార్థినులౖపైలెంగిక దాడులు ● నాలుగేళ్లలో 1,412 కేసులు నమోదు మహబూబ్నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో రోజురోజు కూ పాఠశాలలు, కళాశాలలకు వెళ్తున్న బాలికలు, అమ్మాయిలపై వేధింపులు పెరుగుతున్నాయి. దీనికి కారకులపై కూడా పోక్సో కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. అమ్మాయిలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిలో బాలురు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఇంట్లో తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకుండా జులాయిగా తిరిగే కొందరు యువకులే ఎక్కువగా ఇలాంటి చేష్టలకు పాల్పడుతున్నారు. కొందరైతే పనిగట్టుకొని పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం, వదిలే సమయానికి బైక్లపై ఉంటూ వచ్చిపోయే వారిని టీజ్ చేయడం సర్వసాధారణంగా మారింది. అయితే కొందరు బాధితులు ధైర్యంగా పోలీసులకు ఫిర్యా దులు చేస్తుంటే.. మరికొందరు సర్దుకుపోతున్నారు. ఇలాంటి వారిని అలుసుగా తీసుకొని కొందరు యు వకులు మరింత రెచ్చిపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో 2022 నుంచి 1,412 పోక్సో కేసులు నమో దయ్యాయి. అందులో అత్యధికంగా మహబూబ్నగర్లో 451, నాగర్కర్నూల్లో 327, గద్వాలలో 234, నారాయణపేటలో 211, వనపర్తిలో 189 కేసులున్నాయి. నిత్యం తనిఖీలు చేస్తే.. మహిళా, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని బాలల పరిరక్షణ, పోలీస్శాఖ ఆధ్వర్యంలోని షీటీం బృందాలు తనిఖీలు చేపడుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో ఈ తనిఖీలు మరింతగా పెరగాలి. ముఖ్యంగా బాలికల హక్కుల పరిరక్షణతో పాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలపై నిత్యం తనిఖీలు చేయడం చాలా అవసరం. వసతి గృహాలు, పాఠశాలలు, గురుకులాలకు వెళ్లి చిన్నారులు తమ బాధలు చెప్పుకొనే అవకాశం ఇవ్వాలి. ఎక్కడైనా అనుమానంగా అనిపించినా.. బాలికలకు సరైన రక్షణ అందని పరిస్థితులను గుర్తించినా తగు చర్యలు తీసుకోవాలి. అవగాహన కల్పిస్తున్నాం.. జిల్లాలో షీటీం బృందాలు విద్యార్థినులు, అమ్మాయిలను వేధిస్తున్న ఆకతాయిలను అదుపులోకి తీసుకుని వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ఘటనలు తీవ్రంగా ఉంటే కేసులు నమోదు చేస్తున్నాం. అన్ని రకాల పాఠశాలల్లో పోక్సో, అమ్మాయిల రక్షణ, గుడ్ టచ్– బ్యాడ్ టచ్, ఈవ్ టీజింగ్ వంటి వాటిపై అవగాహన కల్పిస్తున్నాం. అమ్మాయిలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిఫెన్స్ వంటివి మెరుగుపరుచుకోవాలి. సోషల్ మీడియా వల్ల జరుగుతున్న నష్టాలపై చైతన్యం చేస్తున్నాం. – జానకి, ఎస్పీ, మహబూబ్నగర్ అండగా సఖి కేంద్రం.. వివిధ రూపాల్లో దాడులకు గురైన మహిళలకు సఖి కేంద్రం అండగా ఉంటుంది. మైనర్లపై అత్యాచారాలు, లైంగిక దాడులు, పరువు హత్యలు, యాసిడ్ దాడులు, వరకట్నం వంటి అన్ని రకాల వేధింపుల నుంచి రక్షించడానికి కృషి చేస్తోంది. 18 ఏళ్ల లోపు బాలికలతో పాటు మహిళలకు ఏదైనా సమస్య వస్తే సఖి కేంద్రాన్ని ఆశ్రయిస్తారు. అలాగే టోల్ఫ్రీ నం.181కు ఫోన్ చేసి సమస్యను చెప్పవచ్చు. – సౌజన్య, సఖి కేంద్రం కో–ఆర్డినేటర్, మహబూబ్నగర్ చిన్నప్పటి నుంచే.. లైంగిక వేధింపుల గురించి పిల్లలకు చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాలి. వేధింపులకు గురైతే ఎవరి సహాయం కోరాలి.. ఎలా స్పందించాలో వివరంగా చెప్పాలి. ఒంటరిగా ఎక్కడికీ వెళ్దొదని, వెళ్లినప్పుడు ఎలా జాగ్రత్తగా ఉండాలో వివరించాలి. శరీరంలోని ఏ భాగాలను ఇతరులు తాకకూడదనే విషయాన్ని వారికిఅర్థమయ్యేలా చెప్పాలి. ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే ముట్టొద్దు అని గట్టిగా అరవడం, అక్కడి నుంచి పారిపోవడం, ఎదురించడం వంటివి తెలియజెప్పాలి. -
పాత నేరస్తులపై నిరంతరం నిఘా
మహబూబ్నగర్ క్రైం: పాత నేరస్తులు గతంలో చేసిన తప్పులు భవిష్యత్లో చేయకుండా మంచి సత్ప్రవర్తనతో ఉండాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి గొడవలు, అలర్లకు పాల్పడకూడదని ఎస్పీ జానకి అన్నారు. వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న పాత నేరస్తులకు గురువారం వన్టౌన్ పోలీస్ స్టేషన్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చట్టాలను గౌరవిస్తూ ప్రశాంత వాతావరణాన్ని కల్పించడంలో భాగస్వామ్యం కావాలన్నారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలు పదిలంగా ఉండేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. పాత నేరస్తులపై నిరంతరం నిఘా కొనసాగుతుందని, ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో వన్టౌన్ సీఐ అప్ప య్య, ఎస్ఐ శీనయ్య తదితరులు పాల్గొన్నారు. శిథిల ఇళ్లలో ఉండరాదు మహబూబ్నగర్ క్రైం: జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ జానకి అన్నారు. ఎస్పీ కార్యాలయం నుంచి ఆమె పోలీస్ అధికారులతో వీసీ ద్వారా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఎవరూ ఉండరాదని, వాగులు, చెరువులు, నదుల దగ్గరకు వెళ్లరాదన్నారు. ప్రధానంగా విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. దుందుభీ, కోయిల్సాగర్, జిన్నారం, గొండ్యాల, రంగారెడ్డిపల్లి, దాదాపూర్, ఎర్రకుంట, కొత్త చెరువు, ట్యాంక్బండ్, రైల్వే అండ్ బ్రిడ్జిల దగ్గరకు వెళ్లరాదన్నారు. సెల్ఫీలు తీసుకోవడానికి, వీడియోలు తీయడానికి ప్రయత్నించవద్దన్నారు. వాహనదారులు వర్షం పడుతున్న సమయంలో జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని, రోడ్లపై నెమ్మదిగా వాహనాలు నడపాలని, రోడ్లపై గుంతలను జాగ్రత్తగా గమనించాలని చెప్పారు. -
ఇంజినీరింగ్ కళాశాలలో అడ్మిషన్లు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో నూతనంగా ప్రారంభించనున్న ఇంజినీరింగ్ కళాశాలలో ఎఫ్సెట్–2025 ద్వారా సీట్ల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఇందు లో ర్యాంకుల వారిగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్ల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేశారు. ఈ మేరకు గత వారం పీయూలో సీట్లు పొందిన విద్యార్థుల జాబితాను విడుదల చేసింది. అందులో కోర్సుల వారిగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్లో 66 మందితో జాబితా విడుదల చేయగా 42 మంది ఆన్లైన్లో రిపోర్టు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లర్నింగ్లో 64 మంది జాబితాలో ఉండగా 48 మంది, డాటా సైన్స్ విభాగంలో 63 మంది విద్యార్థులు జాబితాలో ఉండగా.. 46 మంది ఇప్పటి వరకు ఆన్లైన్లో సెల్ప్ రిపోర్టింగ్ చేశారు. మొత్తం 193 మంది విద్యార్థులను ప్రభుత్వం అలాట్ చేయగా ఇప్పటి వరకు 136 మంది విద్యార్థులు ఆన్లైన్లో సెల్ప్ రిపోర్టింగ్ చేశారు. కాగా రిపోర్టింగ్ చేసిన విద్యార్థులు ఈ నెల 31 నుంచి వచ్చే నెల 1, 2వ తేదీల్లో నేరుగా పీయూలో రిపోర్టింగ్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకోవాలని ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రకిరణ్ పేర్కొన్నారు. అంతేకాకుండా ఇంజినీరింగ్ కళాశాలలో చేరిన బాల, బాలికలకు వేర్వేరుగా హాస్టల్ సదుపాయం కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో సందేహాలు, సూచనల కోసం పీయూ ఇంజినీరింగ్ కళాశాల వద్ద హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఆన్లైన్లో సెల్ప్ రిపోర్టు చేసిన 136 మంది విద్యార్థులు -
సిబ్బంది సమయపాలన పాటించాలి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూలో పనిచేస్తున్న టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బంది అందరినీ సమానంగా చూస్తామని.. ఏ ఒక్కరి మీద ఎలాంటి చర్యలు తీసుకోమని వీసీ శ్రీనివాస్ అన్నారు. ‘సాక్షి’లో బుధవారం ‘పీయూలో ఏం జరుగుతోంది’ శీర్షికన ప్రచురితమైన కథనానికి వీసీ స్పందించారు. ఈ మేరకు గురువారం ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ సమయాల్లో తప్పకుండా విధుల్లో ఉండాలని సిబ్బందికి ఇప్పటికే సూచించామని, ఆ ఆదేశాలకు అనుగుణంగా అంరూ పనిచేసి, అభివృద్ధి చెందుతున్న యూనివర్సిటీకి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అంతేకాకుండా సిబ్బంది వేతనాలు పెంచేందుకు పూర్తిస్థాయిలో కృషిచేస్తున్నామని, తప్పకుండా నాన్టీచింగ్ సిబ్బందికి వేతనాలు పెంచుతామని పేర్కొన్నారు. ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం -
రైతుల్లో చిగురించిన ఆశలు
మహబూబ్నగర్ (వ్యవసాయం): జిల్లాలో గురువారం మోస్తరు వర్షం కురిసింది. వర్షాలు ఆలస్యం కావడంతో ఆందోళనలో ఉన్న రైతులకు తాజాగా కురుస్తున్న వర్షాలు ఊరట కలిగించాయి. మరో రెండురోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతుండటంతో వానాకాలం సాగుపై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పత్తి, జొన్న, మొక్కజొన్న తదితర పంటలు, పండ్లు, కూరగాయల తోటలకు ఈ వర్షాలు జీవం పోస్తున్నాయి. ఉదయం నుంచి ముసురు వాన కురిసింది. జిల్లాలో సగటు వర్షపాతం 14.4 మి.మీ., నమోదైంది. వరినాట్లు షురూ జిల్లాలో వానాకాలం వరి నాట్లు వేయడం ప్రారంభమైంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో బోరు, బావులు, చెరువుల కింద నార్లు పోసిన రైతులు కూలీలతో వరి నాట్లు వేయిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో సరైన కొంతమంది రైతులు నార్లు పోయకుండా కొద్దిగా మొలకెత్తిన వడ్లను వెదజల్లే పద్ధతిలో సాగు చేస్తున్నారు. జిల్లాలో వానాకాలం సీజన్లో సుమారు 2 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు కానుంది. స్వల్పకాలిక, దీర్ఘకాలిక రకాల వరి వంగడాలను నార్లుగా పోసుకున్న రైతులు నాట్లను మొదలుపెట్టారు. వరి సాగు చేసుకునే రైతులు డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులను ఆఖరి దుక్కిలోనే మొత్తం వేసుకొని కలియదున్ని నాట్లు వేసుకోవాలని, 48 గంటల ముందే జింక్ సల్ఫేట్ వేసుకుని ఇతర జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి 13,125 ఎకరాల్లో వరి నాట్లు పడగా.. మరో 85,400 ఎకరాల విస్తీర్ణం నర్సరీ దశలో ఉంది. నెల రోజులుగా వర్షాల కోసం ఎదురుచూసిన రైతులకు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఊపిరి పీల్చుకున్నారు. మళ్లీ సాగు పనులు ఊపందుకునేందుకు అవకాశాలు ఏర్పడ్డాయి. జిల్లాలో రోజంతా కురిసిన ముసురు వాన పత్తి, మొక్కజొన్న, జొన్న పంటలకు జీవం -
నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
గండేడ్: జిల్లాలో ఇందిరమ్మ లబ్ధిదారులు ఇళ్లను ప్రభుత్వ నిబంధనల ప్రకారమే కట్టుకోవాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. గురువారం ఆమె మండలంలోని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న జానంపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్లు ఎలా నిర్మించుకుంటున్నారు.. బిల్లులు ఎలా వస్తున్నాయి అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఇంటి నిర్మాణం పూర్తి కావడానికి ఇంకా ఎంత ఖర్చు అవుతుందని ఆరాతీశారు. అలాగే పూర్తయిన ఇంటి నిర్మాణానికి ఎంత ఖర్చు అయిందని ఓ లబ్ధిదారుడిని అడగగా ఇప్పటికే రూ.7 లక్షలు అయ్యాయని చెప్పారు. దీంతో కలెక్టర్ ఎక్కడ తెచ్చారు.. అప్పు చేశారా అని ప్రశ్నించారు. తల్లిదండ్రులు, తెలిసిన వారి వద్ద తీసుకున్నామని వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇళ్లు లేని వారికి గూడు కల్పించాలన్న ఉద్దేశంతో ఓ నమూనా ప్రకారం రూ.5 లక్షలతో పూర్తయ్యే విధంగా రూపొందించిందని, దాని ప్రకారమే ఇల్లు కట్టుకోవాలని సూచించారు. అలా కాకుండా నిర్మాణాలు చేసుకొని అప్పుల పాలు కావొద్దని హితవు పలికారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి.. పిల్లలు ఎంతమంది ఉన్నారు.. ఎలాంటి భోజనం పెడుతున్నారని ప్రశ్నిచారు. గ్రామంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. మండల కేంద్రంలోని పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసి.. వైద్యం కోసం వచ్చిన రోగులతో మాట్లాడారు. మెడికల్ ఆఫీసర్ చంద్రశేఖర్తో మాట్లాడి పలు సూచనలు చేశారు. కేజీబీవీకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాల ఆవరణలో ఓ మూలన ఉన్న రాళ్లు తొలగించాలని ఎంపీడీఓ హరిశ్చంద్రారెడ్డికి సూచించారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ భాస్కర్, తహసీల్దార్ మల్లికార్జున్రావు, ఎంఈఓ జనార్దన్, ఆర్ఐ యాసిన్, ఏపీఓ హరిశ్చంద్ర, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు జితేందర్రెడ్డి, మాజీ సర్పంచ్ పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాల్యవివాహాలు చేయొద్దు
పాలమూరు: చిన్న వయస్సులో బాల్య వివాహం చేసుకోవడం వల్ల అమ్మాయిలకు అనారోగ్య సమస్యలతోపాటు చట్టపరమైన సమస్యలు ఎదువుతాయనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అన్నారు. జిల్లాకేంద్రంలోని జలజం జూనియర్ కళాశాలలో గురువారం చట్టాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి న్యాయమూర్తి హాజరై డ్రగ్స్, ఇల్లిసిట్ ట్రాఫికింగ్, బాలల హక్కులు, విద్యాహక్కు, పోక్సో యాక్ట్, ర్యాగింగ్ నిషేధ చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థి దశలో నుంచే చట్టాలపై అవగాహన పెంచుకోవడం వల్ల భవిష్యత్లో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మనకు కావాల్సిన న్యాయంపై ఎవరికి వారు పొందడానికి అవకాశం ఉంటుందన్నారు. నేడు పెన్షన్ అదాలత్ జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): పెన్షనర్లు, జీపీఎఫ్, అకౌంట్ సంబంధిత పెండింగ్ సమస్యలపై శుక్రవారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పెన్షన్ అదాలత్, వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ విజయేందిర గురువారం ఒక ప్రకనటలో తెలిపారు. రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ జిల్లా స్థాయిలో పెన్షన్ కమిటీల ద్వారా పెండింగ్ పెన్షన్ కేసులు త్వరితగతిన పరిష్కరించడానికి వీలుగా కలెక్టర్ల సమన్వయంతో పెన్షన్ అదాలత్, వర్కర్షాప్ నిర్వహించాలని ఆదేశించారన్నారు. మహబూబ్నగర్, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాలకు సంబంధించి దీర్ఘకాలిక పెన్షన్ కేసుల పరిష్కారంపై ఈ వర్క్షాప్ కొనసాగుతుందన్నారు. అలాగే పెన్షన్ చెల్లింపు ఆర్డర్లు, పీపీఓ, పీజీఎఫ్ అధికారాలు కూడా పంపిణీ చేస్తారన్నారు. ఓపెన్ ఇంటర్, ఎస్సెస్సీ పరీక్ష ఫీజు చెల్లించండి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఓపెన్ ఇంటర్, ఎస్సెస్సీ ఫెయిలైన విద్యార్థులు సప్లిమెంటరీ ఫీజులు చెల్లించాలని డీఈఓ ప్రవీణ్కుమార్, టాస్క్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ శివయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో పరీక్ష రాసి ఫెయిలైన వారు, అడ్మిషన్ పొంది పరీక్ష రాయలేని వారు ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 28 నుంచి వచ్చే నెల 5 వరకు చెల్లించాలని, అపరాధ రుసుంతో వచ్చే నెల 6 నుంచి 10 వరకు ఆన్లైన్లో చెల్లించాలన్నారు. పరీక్ష సెప్టెంబర్ 22 నుంచి 29 వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు. 35 అద్దె దుకాణాల సీజ్ ● రూ.కోట్లల్లో పేరుకుపోయిన బకాయిలు ● కొరడా ఝుళిపించిన మున్సిపల్ అధికారులు మహబూబ్నగర్ మున్సిపాలిటీ: స్థానిక క్లాక్టవర్ సమీపంలోని సుమారు 35 మున్సిపల్ అద్దె దుకాణాలను గురువారం ఆర్ఓ మహమ్మద్ ఖాజా ఆధ్వర్యంలో సీజ్ చేశారు. ఈ షాపుల నుంచి రూ.ఐదు కోట్లకు పైబడి బకాయిలు పేరుకుపోయాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాజాగా మున్సిపల్ రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్లి అద్దె చెల్లించాలని దుకాణదారులకు హెచ్చరించినా స్పందించకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నారు. కాగా రెండు, మూడు నెలల క్రితమే ఇదే విషయమై ఈ షాపులను సీజ్ చేసినా దుకాణదారులు కొంత గడువు కోరడంతో సరేనన్నారు. అయినప్పటికీ వారు అద్దె చెల్లించకపోవడం గమనార్హం. ఈ దాడుల్లో ఆర్ఐలు ముజీబుద్దీన్, రమేష్, అహ్మద్షరీఫ్, టి.నర్సింహ తదితరులు పాల్గొన్నారు. -
ప్రేమించిన మరదలితో వివాహం చేయడం లేదని..
కృష్ణా: ప్రేమించిన మరదలితో కుటుంబ సభ్యులు వివాహం చేయడం లేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఇక సెలవు (మిస్యూ మా, మిస్యూ ఆల్ మై ఫ్రెండ్స్, ఫ్యామిలీ) అంటూ తన ఫొన్లో స్టేటస్ పెట్టి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలోని చేగుంటలో మంగళవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికుల వివరాల మేరకు.. చేగుంటకు చెందిన సంగెంబండ బస్సప్ప – తిమ్మవ్వ దంపతులకు మల్లప్ప, భీమ్రాయ, పరశివ సంతానం. వీరి తల్లి తిమ్మవ్వ కొన్నేళ్ల క్రితం మృతిచెందగా.. మొదటి కొడుకు మల్లప్ప తన భార్యతో కలిసి జీవనోపాధి నిమిత్తం బెంగళూరుకు వలస వెళ్లారు. ఆరేళ్ల క్రితం పదో తరగతి పూర్తిచేసుకున్న చిన్నకొడుకు పరశివ (22) కూడా ఉపాధి నిమిత్తం బెంగళూరులోని తన అన్న మల్లప్ప వద్దకు వెళ్లాడు. బెంగళూరులో పరశివ పనిచేసుకుంటూ.. తన రెండో అన్న భీమ్రాయ భార్య సునీత చెల్లెలు నిఖితతో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరు వరుసకు బావమరదలు కావడంతో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని స్వగ్రామంలో ఉన్న తన సోదరుడు భీమ్రాయ, వదిన సునీతకు చెప్పేందుకు గాను వారం రోజుల క్రితం పరశివ బెంగళూరు నుంచి చేగుంటకు వచ్చాడు. ఈ క్రమంలో పరశివ, నిఖిత వివాహానికి అన్న, వదినలు అడ్డు చెప్పారు. ప్రేమించిన యువతి ఆరోగ్యం బాగా లేదని, నీకు మరో అమ్మాయితో వివాహం చేస్తామని పరశివకు సర్దిచెప్పారు. ఇక వీరి మాటకు ఎదురు చెప్పలేక తిరిగి బెంగళూరుకు బయలుదేరాడు. ఆదివారం బెంగళూరు నుంచి మళ్లీ బయలుదేరిన పరశివ.. రాష్ట్ర సరిహద్దులోని దేవసూగూర్లో గల కృష్ణానది తీరానికి చేరుకున్నట్లు తెలిసింది. అక్కడ తన ఫోన్లో ‘మీస్యూ ఆల్ మై ఫ్రెండ్స్, అండ్ ఫ్యామిలీ’ అంటూ స్టేటస్ పెట్టాడు. అలాగే తాను ప్రేమించిన నిఖితతో దిగిన ఫొటోలు, వీడియోలు స్టేటస్లో పెట్టుకొని ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మొదట కృష్ణా, ఆ తర్వాత శక్తినగర్ పోలీసులకు సమాచారం అందించారు. అయితే కృష్ణానదిలో పడి ఆత్మహత్య చేసుకున్నాడేమో అని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో స్థానికుల సహాయంతో కృష్ణానదిలో గాలింపు చర్యలు చేపట్టగా.. ఆచూకీ లభించలేదు. యువకుడి అదృశ్యం ఘటనకు సంబంధించి శక్తినగర్ ఎస్ఐ తిమ్మణ్ణను వివరణ కోరగా.. ఈ విషయంపై బెంగళూరులో కేసు నమోదైందని త తెలిపారు. తాము స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదన్నారు. ఇప్పటికే బెంగళూరులో కేసు నమోదైనందున తాము కేసు చేయలేదని తెలిపారు. -
జోగుళాంబ హుండీ ఆదాయం రూ.72 లక్షలు
అలంపూర్: అలంపూర్ ఆలయాల్లో హుండీల లెక్కింపు ద్వారా రూ.72 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి పురేందర్కుమార్ తెలిపారు. బుధవారం దేవాదాయ, ధర్మాదాయశాఖ సహాయ కమిషనర్ మదనేశ్వర్రెడ్డి, కార్యనిర్వాహక అధికారి పురేందర్ కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కొనసాగింది. 120 రోజుల హుండీని లెక్కించగా.. జోగుళాంబ అమ్మవారి ఆలయాల హుండీలో రూ.6,23,265, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయ హుండీలో రూ.9,76,819 వచ్చినట్లు పేర్కొన్నారు. అన్నదాన సత్రం హుండీ ద్వారా రూ.41,142.. క్షేత్ర ఆలయాల హుండీల ద్వారా మొత్తంగా రూ.72,50,619 ఆదాయం సమకూరినట్లు కార్యనిర్వాహక అధికారి వివరించారు. వీటితోపాటు విదేశీ కరెన్సీ, 20 గ్రాముల మిశ్రమ బంగారం, 380 గ్రాముల మిశ్రమ వెండి వచ్చినట్లు చెప్పారు. లెక్కింపులో ఆలయ ధర్మకర్తలు నాగ శిరోమణి, గోపాల్, జగన్మోహన్ నాయుడు, చంద్రశేఖర్రెడ్డి, జయరాముడు, ఆలయ ఉప ప్రధాన అర్చకుడు, ఎక్స్ అఫీషియో సభ్యుడు ఆనంద్శర్మ, ఆలయ అర్చకులు, సిబ్బంది, సేవా సంస్థలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. -
మహేష్ మృతదేహం మూలమళ్ల వద్ద లభ్యం
అమరచింత: జూరాల ప్రాజెక్టు రహదారిపై ఆదివారం జరిగిన కారు, బైక్ ప్రమాదంలో నదిలో పడి గల్లంతయిన మహేష్ (23) మృతదేహం ఆత్మకూర్ మండలంలోని మూలమళ్ల శివారులోని కృష్ణానది ఒడ్డున బుధవారం లభ్యమైంది. మహేష్ మృతికి కారణమైన వారిని చట్టపరంగా శిక్షించాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలంటూ మృతుడి బంధువులు ప్రాజెక్టు రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న ధరూర్ ఎస్ఐ శ్రీహరి ఘటనా స్థలానికి చేరుకొని వారితో మాట్లాడారు. తమకు తక్షణమే న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు పట్టుబట్టడంతో ఎస్ఐ జోక్యం చేసుకుని అనుమతి లేకుండా రాస్తారోకో చేస్తే కేసులు నమోదవుతాయన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని మృతుడి కుటుంబ సభ్యులకు వివరించారు. పరిహారం గురించి కోర్టులో మాట్లాడుకోవాలని, ఇలా రోడ్డుపై రాస్తారోకో చేయడం సరికాదన్నారు. దీంతో వారు ఆందోళన విరమించారు. న్యాయం చేయాలని ప్రాజెక్టుపై బంధువుల ఆందోళన -
భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య
బిజినేపల్లి: భార్య కాపురానికి రాలేదని మనస్థాపం చెందని భర్త చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని మమ్మాయిపల్లిలో చోటు చేసుకుంది. స్థానికు లు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన నక్క మైబూస్(32) భార్య అరుణకు మధ్య మనస్పర్థల కారణంగా అరుణ 15 రోజులుగా శాకాపూర్లోని తల్లి గారింట్లో ఉంటుంది. ఈ క్రమంలో భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపం చెందిన మైబూస్ గ్రామ శివారు లోని పొలాల వద్ద మంగళవారం రాత్రి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవా రం ఉదయం అటుగా వెళ్లిన రైతులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగర్కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మోతిఘన్పూర్లో గంజాయి పట్టివేత జడ్చర్ల: బాలానగర్ మండలంలోని మోతిఘన్పూర్లో గంజాయి విక్రయిస్తుండగా నిందితుడి ని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు ఎకై ్సజ్ సీఐ విప్తవరెడ్డి తెలిపారు. సీఐ కథనం మేరకు.. బీహార్కు చెందిన దినేష్సింగ్ మోతిఘన్పూర్లో అద్దె ఇంటిలో నివా సం ఉంటూ ఓ ప్రైవేట్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఇ టీవల బీహార్ వెళ్లిన సమయంలో అక్కడి నుంచి కిలో గంజాయిని తీసుకువచ్చి 5 గ్రాముల చొప్పున పాకెట్లను తయారు చేసి ఒక్కో ప్యాకె ట్ను రూ.300కు తోటి కార్మికులకు విక్రయిస్తున్నాడు. ఈక్రమంలో తమకు వచ్చిన సమాచారం మేరకు బుధవారం అతని ఇంటిలో తనిఖీలు నిర్వహించి అతని వద్ద నుంచి 250 గ్రా ముల గంజాయిని, సెల్ఫోన్ను స్వాధీన పర్చుకున్నారు. ఈమేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. దాడులలో ఎస్ఐ నాగరాజు, తదితర సిబ్బంది పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి జడ్చర్ల: కొత్తగా నిర్మించుకుంటున్న ఇంటికి క్యూ రింగ్ చేసేందుకు నీరు పడుతుండగా ప్ర మాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన మండలంలోని పోలేపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలిలా.. పోలేపల్లిలోని బీసీ కాలనీలో గురుకుంట రాములు(28)కు ఇటీవల ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఇంటి నిర్మాణ పనులు చేపట్టారు. ఇంటికి చేసిన సిమెంట్ నిర్మాణ పనులకు మోటార్ ఆన్ చేసి క్యూరింగ్ చేస్తుండగా విద్యుదాఘాతం సంభవించి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. మృతుడికి భార్య స్వాతి, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. కుటుంబ పెద్ద మరణించడంతో మృతుడి కుటుంబం ఒక్కసారిగా దుఖఃసాగరంలో మునిగింది. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యుదాఘాతంతో లారీ డ్రైవర్ మృతి కల్వకుర్తి రూరల్: పట్టణంలోని మంగళవారం రాత్రి విద్యుత్ షాక్ తో లారీ డ్రైవర్ మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ మాధవరెడ్డి తెలిపిన కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన నరసింహారావు (50) లారీ యజమాని అయినప్పటికీ డ్రైవింగ్ చేస్తారు. కొవ్వూరు నుంచి గోవా రాష్ట్రానికి లారీలో వెళుతూ.. కల్వకుర్తి పట్టణంలోని మహబూబ్నగర్ చౌర స్తాలో లారీని ఆపి రోడ్డు అవతల ఉన్న పాన్షాప్కు వెళుతూ.. డివైడర్పై ఉన్న కరెంట్ స్తంభానికి ఉన్న వైరు పట్టుకున్నాడు. దీంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. మృతుడి కు మారుడు సుబ్బారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పెళ్లి కావడం లేదని యువకుడి బలవన్మరణం నాగర్కర్నూల్ క్రైం: పెళ్లి కావడం లేదని మనస్తాపంతో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లా కేంద్రంలోని హౌజింగ్బోర్డు కాలనీలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ గోవర్ధన్ వివరాల మేరకు.. జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిడి జిల్లా శిబువాడీ గ్రామానికి చెందిన మెహతాబ్ అన్సారీ (20) నాలుగేళ్లుగా జిల్లా కేంద్రంలోని హౌజింగ్బోర్డు కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని టైల్స్ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కళ్లు సరిగా కనపడకుండా పోయాయి. కుటుంబ సభ్యులు మెహతాబ్ అన్సారీకి ఇటీవల పెళ్లి చేసేందుకు ప్రయత్నాలు చేస్తుండడంతో కళ్లు కనబడటం లేదనే కారణంతో పెళ్లి సంబంధా లు కుదురకపోవడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి అన్న అఫ్తాబ్ అన్సారీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
ట్రాప్ సీసీ కెమెరాకు చిక్కిన చిరుత జాడ
మహబూబ్నగర్ న్యూటౌన్: మూడు వారాలుగా మహబూబ్నగర్ పట్టణ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న చిరుత ట్రాప్ సీసీ కెమెరాకు చిక్కింది. ఈనెల 22న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఫైర్ స్టేషన్ ఎదురుగా ఉన్న టీడీ గుట్ట గుండుపై కనిపించడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది చిరుత కనిపించిన చోటుకు చేరుకొని సెర్చ్ ఆపరేషన్ కొనసాగించారు. అటవీశాఖ సీఎఫ్ఓ రాములు, డీఎఫ్ఓ సత్యనారాయణలు పరిస్థితిని సమీక్షించి సెర్చ్ బృందాలను అప్రమత్తం చేశారు. ముందుగానే గుట్టపై అమర్చిన ట్రాప్ కెమెరాలకు అదే రోజు సాయంత్రం 6.50 గంటలకు గుట్టపై నుంచి డంపింగ్ యార్డు వైపు వెళుతూ కనిపించింది. దీంతో అటవీశాఖ అధికారులు సెర్చ్ బృందాలను అలర్ట్ చేసి బుధవారం ఉదయం జేసీబీల సాయంతో బోన్లను గుట్టపైకి మార్చి.. మరిన్ని ట్రాప్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. డంపింగ్ యార్డ్ వైపు వెళ్లిన చిరుత నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి దాటే అవకాశం లేనందున తిరిగి గుట్టపైనే సంచరిస్తున్నట్లు అటవీశాఖ బృందాలు అంచనా వేస్తున్నాయి. త్వరలో చిరుతను పట్టుకొని తీరుతామని పేర్కొంటున్నారు. తిరుమలదేవుని గుట్ట, గుర్రం గట్టులపై చిరుత సంచరిస్తుండడంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పటికప్పుడు పోలీసు, అటవీ శాఖ బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తిరుమల దేవునిగుట్ట, గుర్రంగట్టు, వీరన్నపేట, కోయిలకొండ క్రాస్రోడ్డు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ భయానికి గురికాకుండా సూచనలు చేస్తూనే ఉన్నారు. సెర్చ్ బృందాలకు సవాల్ విసురుతూ బోన్లో చిక్కకుండా చిరుత తప్పించుకొని తిరుగుతుంది. -
మోడల్ స్కూల్కు కదిలిన యంత్రాంగం
ధన్వాడ: మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో హాస్టల్ విద్యార్థినులు పడుతున్న అవస్థలపై బుధవారం ‘సాక్షిశ్రీలో ప్రచురితమైన ‘మోడల్ స్కూల్.. కంపు కంపు’ కథనానికి స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణి కారెడ్డితో పాటు జిల్లా యంత్రాంగం స్పందించింది. ఎమ్మెల్యే పీఏ మాధవరెడ్డితో పాటు విద్యాశాఖ అధికారులు ఆగమేఘాలపై మోడల్ స్కూల్కు చేరుకున్నారు. హాస్టల్ గదులతో పాటు మరుగుదొడ్లు, మూత్రశాలలను పరిశిలించారు. కలెక్టర్ ఫండ్ రూ. 2.5లక్షలతో హాస్టల్ భవనానికి మరమ్మతు చేయించనున్నట్లు డీఈఓ గోవిందరాజులు, ఏఎంఓ శ్రీనివాసులు తెలిపారు. ప్రస్తుతానికి నీటి లీకేజీలకు మరమ్మతు చేయి స్తున్నట్లు వివరించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వారం రోజుల్లో విద్యార్థినుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. కాగా, హాస్టల్లో మరుగుదొడ్లు, మూ త్రశాలలను బాగు చేయడంతో పాటు నీటి లీకేజీలకు మరమ్మతు చేయించే వరకు తాము హాస్టల్లోకి వెళ్లమని విద్యార్థినులు భీష్మించారు. అయితే మరమ్మతు పనులు త్వరగా పూర్తిచేస్తామని డీఈఓ నచ్చజెప్పడంతో విద్యార్థినులు శాంతించారు. అధికారుల వెంట ఎంపీడీఓ వెంకటేశ్వర్రెడ్డి, జీసీడీఓ నర్మద, ప్రిన్సిపాల్ గంగమ్మ, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రహిమన్ఖాన్, రఘవేందర్రెడ్డి, నరేందర్ ఉన్నారు. మూత్రశాలలు, మరుగుదొడ్లకు మరమ్మతు వారం రోజుల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ -
జడ్చర్లలో మూడు డెంగీ కేసులు నమోదు
జడ్చర్ల టౌన్: పుర పరిధిలోని సంజీవయ్య కాలని, కృష్ణారెడ్డినగర్, జవహర్నగర్కాలనీలో ముగ్గురికి డెంగీ పాజిటివ్ నిర్ధారణ అయిందని అర్బన్హెల్త్ సెంటర్ వైద్యాధికారి డా. మనుప్రియ తెలిపారు. బాధితుల్లో ఇద్దరు స్థానిక ఏరియా ఆస్పత్రిలో, మరొకరు ఇంటివద్దే చికి త్స పొందుతున్నారని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో బుధవారం ఫీవర్ సర్వే, యాంటీ లార్వా ఆపరేషన్స్ నిర్వహించారు. రసాయనాలను పిచికారీ చేయగా జిల్లా ప్రోగ్రాం అధికారి డా. భాస్కర్నాయక్ పరిశీలించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు దోమ లు వ్యాప్తి చెందకుండా చూసుకోవాలని ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ సలోమి, శానిటరీ ఇన్స్పెక్టర్ నరేష్, వైద్య, ఆరోగ్యశాఖ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఉధృతంగా దుందుభీ.. అదుపుతప్పిన ట్రాక్టర్ తాడూరు: ఇటీవల కురిసిన భారీ వర్షానికి మండలంలోని సిర్సవాడ వద్ద దుందుభీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో సిర్సవాడ నుంచి మాదారానికి వెళ్లే రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఆయా గ్రా మాల రైతులు ట్రాక్టర్లో నదిదాటుతుండగా ట్రాక్టర్ అదుపుతప్పి నదిలో పడింది. గమనించిన స్థానికులు జేసీబీ వాహనం ద్వారా ట్రాక్టర్ ను బయటకు తీశారు. స్థానికులు మాట్లాడుతూ.. ప్రతిఏటా పరిస్థితి ప్రమాదకరంగా ఉంటుందని, స్థానిక ఎమ్మెల్యే బ్రిడ్జి నిర్మాణానికి రూ.20 కోట్లు మంజూరైనట్లు తెలపడం ప్రకటనలకే పరిమితమైందని వాపోయారు. అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టా లని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు. -
కూలిన పాఠశాల పాత భవనం
నవాబుపేట: మండల పరిధిలోని కేశరావుపల్లి ప్రాథమిక పాఠశాల పాత భవనం ఇటీవల కురుస్తున్న వర్షాలకు కుప్పకూలింది. పాఠశాలలో కొత్త భవనంలోనే విద్యా బోధన కొనసాగు తుండటంతో పెను ప్రమాదం తప్పిందని వి ద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు. పాఠశాల భవనానికి ఆనుకుని ఉన్న పాత భవనం మంగళవారం రాత్రి కూలింది. దీంతో గ్రామస్తులు బుధవారం పరిస్థితిని విద్యాశాఖ అధికారులకు వివరించారు. కాగా కూలిన భవనాన్ని వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులకు గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఉన్నతాధికారుల అనుమతులు తీసుకుని శిథిలాలు వెంటనే తొలగిస్తామని ఎంఈఓ నాగ్యానాయక్ పేర్కొన్నారు. -
జూరాలను సందర్శించిన డీఐజీ చౌహాన్
ధరూరు: ప్రియదర్శిని జూరాల ఆనకట్టను బుధవా రం జోగులాంబ గద్వాల జిల్లా జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ సందర్శించారు. గద్వాల, వనపర్తి ఎస్పీలు శ్రీనివాసరావు, రావుల గిరిధర్తో కలిసి జూరాల వద్దకు చేసుకుని వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వర్షాల దృష్ట్యా ఎలాంటి విపత్తులు ఎవరైనా పోలీస్ శాఖ తగు చర్యలు తీసుకుంటుందన్నారు. కర్ణాటక రాష్ట్రం నుంచి వస్తున్న వరద ప్రవాహంతో గద్వాల జిల్లా పరిధిలో 6 గ్రామాలకు, వనపర్తి జిల్లాలో 6 గ్రామాలకు ప్రమాదం పొంచి ఉందన్నారు. చేపట్టాల్సిన చర్యలపై తగు సూచనలు చేసినట్లు తెలిపారు. ప్రాజెక్టు వద్ద ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం రేవులపల్లి పోలీసుస్టేషన్ను సందర్శించారు. కార్యక్రమంలో గద్వాల, వనపర్తి డీఎస్పీలు మొగులయ్య, వెంకటేశ్వర్లు, సీఐలు టంగుటూరు శ్రీను, రవిబాబు, రాంబాబు, ధరూరు, ఆత్మకూరు ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆర్టీసీలో గ్రాడ్యుయేట్లకు శిక్షణ
నారాయణపేట రూరల్: ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీ సరికొత్త నిర్ణయాలతో ప్రజల మనస్సు చూరగొంటుంది. ఇందులో భాగంగా ఇంజినీరింగ్ అభ్యర్థులకు జాతీయ అప్రెంటిస్ పథకం ద్వారా శిక్షణ ఇవ్వాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దరఖాస్తుల స్వీకరణ సైతం మంగళవారం నుంచి ప్రారంభించింది. మూడేళ్ల కోర్సు ఇంజినీరింగ్ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి అప్రెంటిస్ షిప్ విధానం వరం లాంటిది. ఎంపికై న వారికి పని అనుభవంతో పాటు ఆర్థిక తోడ్పాటును అందించేందుకు మూడేళ్ల కోర్సుగా దీన్ని ప్రవేశపెట్టారు. ముఖ్యంగా రెండు విభాగాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. సాధారణ డిగ్రీ పూర్తి చేసిన వారికి ట్రాఫిక్ సెక్షన్లో చేర్చుకుంటారు. మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన వారికి గ్యారేజీ విభాగంలో తీసుకుంటారు. ఎంపికై న అభ్యర్థులకు ట్రాఫిక్ సెక్షన్లో మొదటి సంవత్సరం నెలకు రూ.15 వేలు, గ్యారేజీ విభాగంలో రూ.17 వేలు అందిస్తారు. మూడేళ్ల పాటు సంవత్సరానికి రూ.వెయ్యి చొప్పున అదనంగా గౌరవ వేతనం ఇవ్వనున్నారు. సేవల మెరుగునకు అవకాశం.. ప్రస్తుతం ఒక్కో డిపోలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల్లో ఇద్దరు చొప్పున ఉన్నారు. వారిలో ఒకరు మెకానికల్ విభాగం పర్యవేక్షిస్తుండగా.. మరొకరు ట్రాఫిక్ సెక్షన్ చూస్తుంటారు. పని భారం కారణంగా నిర్వహణ గాడి తప్పకుండా చూసుకోవాలని ఆర్టీసీ భావిస్తోంది. అప్రెంటిస్ విధానం అమలుతో ఆ సమస్య కొంతమేర తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు. అసిస్టెంట్ మేనేజర్లకు అప్రెంటిస్ అభ్యర్థులు తోడైతే మెకానికల్, ట్రాఫిక్ విభాగాల నిర్వహణ సులభతరం కానుంది. తద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించొచ్చు. దరఖాస్తు ఇలా.. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 27 లోగా ఆన్లైన్లో సంబంధిత వెబ్సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకొని మహబూబ్నగర్ రీజియన్ను ఎంపిక చేసుకోవాలి. అభ్యర్థులు 2021 విద్యా సంవత్సరం నాటికి ఇంజినీరింగ్, ఇతర డిగ్రీ కోర్సుల్లో ఉత్తీర్ణత పొంది సర్టిఫికెట్ ఉండాలి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న పత్రాలను మహబూబ్నగర్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కార్యాలయంలో అందజేయాలి. ఉమ్మడి జిల్లాలో మొత్తం పది డిపోల పరిధిలో ట్రాఫిక్ సెక్షన్లో పది, మెకానికల్ సెక్షన్లో ఎనిమిది పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తంగా ఉమ్మడి మహబూబ్నగర్ రీజియన్ లో 18మందికి అవకాశం లభిస్తుంది. అప్రెంటిస్ విధానానికి ఆన్లైన్లో దరఖాస్తులు ట్రాఫిక్ సెక్షన్లో 10, మెకానిక్ విభాగంలో 8 పోస్టులు ఈ నెల 27వరకు గడువు సద్వినియోగం చేసుకోవాలి ఇంజినీరింగ్ అభ్యర్థులు ఆర్టీసీ కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రీజియన్ పరిధిలో అన్ని డిపోల్లో అప్రెంటిస్ అవకాశం ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల నుంచి అర్హులను ఎంపిక చేసి డిపోలకు కేటాయిస్తారు. అన్ని అంశాల్లో నైపుణ్యం సాధించేలా శిక్షణకు ప్రణాళిక సిద్ధం చేశాం. – సంతోష్కుమార్, ఆర్టీసీ ఆర్ఎం, మహబూబ్నగర్ -
లూడో గేమ్కు యువకుడి బలి.. మనోవేదనతో తాత మృతి
నర్వ: ఆన్లైన్ బెట్టింగ్ ఓ యువకుడి ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అతడి మరణంతో తీవ్ర మనోవేదనకు గురైన తాత తనువు చాలించాడు. ఈ విషాదకర ఘటన నారాయణపేట జిల్లా నర్వ మండలం రాయికోడ్లో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. రాయికోడ్కు చెందిన తెలుగు పోతుల వెంకటేశ్ (18) బతుకుదెరువు నిమిత్తం నాలుగేళ్ల క్రితం హైదరాబాద్కు వలస వెళ్లాడు. అక్కడ ఓ హోటల్లో గార్డెనింగ్ పనిచేసే వాడు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటుపడిన ఆతడు.. చేసిన కష్టంతో పాటు అప్పులు చేసి దాదాపు రూ.5 లక్షల వరకు ఆన్లైన్ బెట్టింగ్లో పోగొట్టుకున్నాడు. చేసిన అప్పులు తీర్చే దారిలేక.. ఇంట్లో చెబుకోలేక ఐదు రోజుల క్రితం హైదరాబాద్లోనే క్రిమిసింహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై అక్కడే కేసు నమోదైంది. నాలుగు రోజుల క్రితం మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి ఖననం చేశారు. ఇదిలా ఉంటే, బుధవారం కుటుంబసభ్యులు తమ కులాచారం ప్రకారం మక్తల్లో సంత చేసేందుకు వెళ్లారు. ఈ సమయంలో మృతుడి తాత పోతుల బాలప్ప (80) సైతం వెళ్లి ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో మనువడి మృతిపై తీవ్ర మనోవేదనకు గురైన అతడు.. ఏడుచుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయి మృతి చెందాడు. ఐదు రోజుల వ్యవధిలోనే తాత, మనువడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
జూరాలకు నిలకడగా వరద
ధరూరు/ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద కాస్త తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. మంగళవారం 1.02 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. బుధవారం రాత్రి 8 గంటల వరకు ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ఫ్లో 67వేల క్యూసెక్కులకు తగ్గినట్లు వివరించారు. ప్రాజెక్టు 4 క్రస్టు గేట్లను ఎత్తి గేట్ల ద్వారా 28,792 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 36,706 క్యూసెక్కులు, కోయిల్ సాగర్కు 315, భీమా లిఫ్టు–1కు 650, నెట్టెపాడుకు 750, ఆవిరి రూపంలో 69, ఎడమ కాల్వకు 820, కుడి కాలువకు 720, ఆర్డీఎస్ లింక్ కెనాల్కు 150, భీమా లిఫ్టు–2కు 750, సమాంతర కాల్వకు 200.. ప్రాజెక్టు నుంచి మొత్తం 69,122 క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 9.398 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. కొనసాగుతున్న విద్యుదుత్పత్తి జెన్కో దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతుంది. బుధవారం 11 యూనిట్ల ద్వారా 435 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేపట్టినట్టు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 149.609 ఎంయు, దిగువలో 178.134 మొత్తం 327.743 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేపట్టినట్టు తెలిపారు. కోయిల్సాగర్లో 24.6 అడుగులు దేవరకద్ర: కోయిల్సాగర్ ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటి విడుదల కొనసాగుతుంది. జూరాల నుంచి వస్తున్న నీటితో సమానంగా నీటి విడుదల కొనసాగడం వల్ల ప్రాజెక్టులో 24.6 అడుగుల మేర నీటిమట్టం వారం రోజులుగా కొనసాగుతుంది. ఎగువన చెరువులు నిండినా, పెద్ద వాగు నుంచి ప్రవాహం వచ్చినా ప్రాజెక్టు త్వరగా నిండే అవకాశం ఉంది. ప్రాజెక్టు అలుగు స్థాయి నీటి మట్టం 26.6 అడుగులు కాగా మరో 2 అడుగుల నీరు వస్తే అలుగు స్థాయికి చేరుతుంది. సుంకేసుల వద్ద 8 గేట్ల ద్వారా నీటి విడుదల రాజోళి: సుంకేసుల డ్యాంకు వరద క్రమంగా వస్తుండడంతో బుధవారం ఎనిమిది గేట్లను తెరిచి దిగువ కు విడుదల చేస్తున్నట్లు జేఈ మహేంద్ర తెలిపారు. ఎగువ నుంచి 43వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా.. 36,975 క్యూసెక్కులు దిగువకు 1,540 క్యూసెక్కులు కేసీ కెనాల్కు వదులుతునట్లు పేర్కొన్నారు. కొనసాగుతున్న విద్యుదుత్పత్తి -
అదుపుతప్పిన బైక్.. వ్యక్తి మృతి
బల్మూర్: ౖబెక్ అదుపుతప్పిన ఘటనలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని మైలారం– అంబగిరి రహదారిపై మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ రాజేందర్ తెలిపిన వివరాలు.. లింగాల మండలం ఎంసీ తండాకు చెందిన కాట్రావత్ కిషన్నాయక్(35) మంగళవారం అచ్చంపేటకు వెళ్లి రాత్రి 11: గంటల సమయంలో స్వగ్రామానికి తిరిగి వస్తుండగా మార్గమధ్యలోని మైలా రం సమీపంలో మలుపు వద్ద అదుపు తప్పి బైక్ బోల్తా పడింది. ప్రమాదంలో తలకు తీవ్ర గాయా లు కావడంతో కిషన్నాయక్ అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుని భార్య పద్మ ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసి మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. మృతుడికి భార్య, కూమార్తె, కుమారుడు ఉన్నారు. ప్రమా దం జరిగిన ప్రదేశంలో అడవిపందులు గుంపు సంచరించినట్లు గుర్తులు ఉన్నాయని వాటి కారణంగానే బైక్ అదుపుతప్పి కిందపడినట్లు స్థానికులు, కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
రేషన్కార్డు.. పేదవాడి ఆత్మగౌరవం
దేవరకద్ర రూరల్/చిన్నచింతకుంట: ప్రతి పేద కుటుంబం గుర్తింపు, ఆకలి తీర్చే ఆయుధం రేషన్కార్డు అని మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. కౌకుంట్లలో పేదలకు మంజూరైన నూతన రేషన్కార్డులను బుధవారం ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డితో కలిసి మంత్రి పంపిణీ చేశారు. అంతకు ముందు రూ.1.30కోట్లతో 30 పడకల ఆస్పత్రి, రూ. 21లక్షలతో గ్రామపంచాయతీ భవనం, ఇస్రంపల్లిలో రూ. 32లక్షలతో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ షేడ్ నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం కౌకుంట్ల పాఠశాలలో నిర్మించిన తరగతి గదులను ప్రారంభించారు. చిన్నచింతకుంట మండలంలో రూ. 2.70కోట్లతో ఉంద్యాల తండాకు బీటీరోడ్డు, కురుమూర్తి స్వామి దేవస్థానంలో రూ. 74లక్షలతో చేపట్టనున్న రేకులషెడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలకు మంత్రి వాకిటి శ్రీహరి భూమిపూజ చేశారు. భక్తులకు తాగునీటి సౌకర్యార్థం రూ. 34లక్షలతో నిర్మించిన మంచినీటి సంపును ప్రారంభించారు. చిన్నచింతకుంట ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహాన్ని మంత్రి, ఎమ్మెల్యే ఆవిష్కరించి.. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో మంత్రి వాకిటి మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధే ద్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కరికి కూడా రేషన్కార్డు ఇవ్వలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్కార్డు మంజూరు చేయడంతో పాటు ఉచితంగా సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు వంటి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి నిత్యం మంత్రివర్గంతో సమీక్షించి.. విద్య, వైద్యం, తాగు, సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించడంతో పాటు వసతిగృహాల విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలు పెంచామన్నారు. ఉపాధ్యాయులు బాధ్యతగా పనిచేసి ప్రతి విద్యార్థి బంగారు భవిష్యత్కు బాటలు వేయాలన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో రూ. 100 కోట్లతో కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ వద్ద మత్స్య పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. అనంతరం చిన్నచింతకుంట గంగాభవాని ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ● ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ.. పదేళ్ల కాలంలో తెలంగాణను బీఆర్ఎస్ నాయకులు అన్నిరకాలుగా ధ్వంసం చేశారన్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలో వస్తుందని.. మరోసారి మంత్రిగా శ్రీహరి, ఎమ్మెల్యేగా తాను ప్రజలకు సేవ చేస్తామని అన్నారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, నర్సింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నరేందర్రెడ్డి, రాఘవేందర్రెడ్డి, కురుమూర్తిస్వామి ఆలయ చైర్మన్ గోవర్ధన్రెడ్డి, మార్కెట్ కమిటీల చైర్మన్లు ప్రశాంత్కుమార్, కథలప్ప, రహిమత్తుల్ల, తహసీల్దార్ సుందర్రాజ్, ఎంపీడీఓ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి అహర్నిశలు కృషి మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి -
నీటి ప్రవాహాల వద్ద అప్రమత్తంగా ఉండాలి
జడ్చర్ల: వర్షాలు కురుస్తున్న సందర్భంగా చెరువులు, కుంటలు, వాగుల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ జానకి పేర్కొన్నారు. బుధవారం ఆమె లింగంపేట వద్ద దుందుభీ వాగును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయని, పొలాలకు వెళ్లే వారు, ఇతర అవసరాల కోసం వాగులు దాటే వారు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. పిల్లలు, వృద్ధులు, మహిళలు, ఈత రాని వారు ఇలాంటి ప్రవాహాల వద్దకు వెళ్లడం మంచిది కాదన్నారు. చేపలు పట్టేందుకు కూడా వెళ్లవద్దన్నారు. ప్రజలు సురక్షితంగా ఉండాలన్నదే తమ భావన అని పేర్కొన్నారు. అనంతరం జడ్చర్ల సిగ్నల్గడ్డ వద్ద రోడ్డు విస్తరణ పనులను ఆమె పర్యవేక్షించారు. ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి స్థానిక పోలీసులకు తగు సూచనలు జారీ చేశారు. ట్రాఫిక్ జామ్ కాకుండా ఎప్పటికప్పడు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఎస్పీ వెంట సీఐ కమలాకర్, తదితర సిబ్బంది ఉన్నారు. 27న పుస్తక ఆవిష్కరణ సభ పాలమూరు: పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్ హరగోపాల్ రచించిన శాంతి చర్చలు–ప్రజాస్వామిక అన్వేషణ పుస్తక ఆవిష్కరణ సభ ఈనెల 27న హైదరాబాద్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహిస్తున్నట్లు పాలమూ రు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ రాఘవాచారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జస్టిస్ బి.సుదర్శన్రెడ్డి, జస్టిస్ కె.చంద్రకుమార్ హాజరవుతారని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి మేధావులు, వక్తలు అధికంగా హాజరుకావాలని కోరారు. స్థానిక ఎన్నికలకు సంసిద్ధం కావాలి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): స్థానిక సంస్థ ల ఎన్నికల నిర్వహణకు సంబంధిత అధికారు లు సంసిద్ధం కావాలని పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీజ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి జిల్లా అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు ఇచ్చినా సిద్ధంగా ఉండాలన్నారు. వనమహోత్సవం లక్ష్యం మేరకు మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వించాలని సూచించారు. నిర్మాణంలో ఉన్న గ్రామపంచాయతీ, అంగన్వాడీ భవనాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. వీసీలో జెడ్పీ సీఈఓ వెంకట్రెడ్డి, డీపీఓ పార్థసారధి, అడిషనల్ పీడీ సాయిదాబేగం పాల్గొన్నారు. విద్యాసంస్థల బంద్ విజయవంతం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్తో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేప ట్టిన విద్యాసంస్థల బంద్ బుధవారం విజయవంతంగా ముగిసింది. ఈ మేరకు విద్యార్థి సంఘాల నాయకులు పలు పాఠశాలలు, కళాశాలలను మూసివేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తున్నప్పటికీ విద్యాశాఖ మంత్రిని నియమించలేదని, విద్యారంగ సమస్యలను పరిష్కరించే వారు లేకుండాపోయారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు అనేక సమస్యలు ఉన్నా పట్టించుకోవడం లేదని, మూత్రశాలలు, తరగతి గదులు, తాగునీటి సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయని తెలిపా రు. స్కాలర్షిప్లు రూ.8 వేల కోట్ల వరకు పెండింగ్లో ఉన్నాయని, వాటిని విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతు న్నారన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, నూతన విద్యావిధానాన్ని రాష్ట్రంలో అమలు చేయకుండా అసెంబ్లీ తీర్మానం చేయాలన్నారు. పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి సీతారాం, భాస్కర్, రాజు, భరత్, లక్ష్మణ్, వెంకటేష్, నాగేష్, సంజీవ్, నర్సింహులు, ప్రవీణ్కుమార్, వెంకటేష్, శ్రీనివాసులు, మల్లేష్, రాజు, రమేష్, నందు పాల్గొన్నారు. -
అప్పుడే.. లోకల్ ఫైట్!
జడ్చర్లలో 100 పడకల ఆస్పత్రి వద్ద మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కుటుంబసభ్యులు అక్రమంగా తీసుకున్న అసైన్డ్ ల్యాండ్ను ప్రభుత్వానికి అప్పగించాలి. సిగ్నల్గడ్డ రోడ్డు విస్తరణకు సంబంధించి పాత బస్టాండ్ వైపు నేరుగా వాహనాలు వెళ్లేందుకు మార్గం లేదు. డిజైన్ లోపంతో ఇబ్బందులు వస్తాయి. – జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి సొంత ఊరు రంగారెడ్డిగూడ దేవాలయం భూములపై శ్వేతపత్రంవిడుదల చేయాలి. సిగ్నల్గడ్డ రోడ్డు విస్తరణ పనుల డిజైన్లో ఎలాంటి లోపాలు లేవు. పోలేపల్లి సెజ్ నుంచి నా ఖాతాకు డబ్బులు వచ్చాయని ఆరోపణలను రుజువు చేయాలి. లేకపోతే క్షమాపణలు చెప్పాలి. – లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనడం కన్నా.. 1300 ఓట్లతో గెలిచిన గఫ్లత్ ఎమ్మెల్యే అంటే బాగుంటుంది. అటువంటి ఎమ్మెల్యే కల్లు తాగిన కోతి లాగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన హరీశ్రావును విమర్శిస్తున్నాడు. సీఎం రేవంత్రెడ్డితో మెప్పు పొందాలనే ఈ విమర్శలు చేస్తున్నాడు. – దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అవినీతి చిట్టనా దగ్గర ఉంది. భారీగా ఆస్తులు సంపాదించాడు. పదేళ్లుగా నియోజకవర్గ కేంద్రాన్ని గాలి కొదిలేశాడు. – దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి ● షెడ్యూల్ విడుదలకు ముందుగానే చేరికలకు తెరలేపిన పార్టీలు ● ముఖ్య నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలు ● గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పక్షాల కసరత్తు ● సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో ‘హస్తం’ ముందడుగు ● ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా ‘కారు’ కార్యాచరణ ● పట్టు సాధించాలనే తపనతో ‘కమలం’ స్థానిక ఎన్నికల వేళ వేడెక్కినరాజకీయం -
స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్దే విజయం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): వచ్చే స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ పార్టీదే విజయమని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే సంతోషమే కానీ జిల్లాకు ఆయన చేసిందేమి లేదని మండిపడ్డారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ 90 శాతం పూర్తయిందని, మరో పదిశాతం పనులు పూర్తి చేస్తే జిల్లాకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ‘తెలంగాణ కోసం పోరాటం చేసినం. జైళ్లకు పోయినం. పదేండ్లు తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేసినం. కానీ ముఖ్యమంత్రి ఏం అభివృద్ధి చేయకుండా మాట్లాడితే ఎవరు పడరు.’ అని తెలిపారు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలందరూ ఐక్యంగా పని చేసి జిల్లా అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. బీసీ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పొంతన లేని సమాధానం చెబుతోందని విమర్శించారు. పార్లమెంట్లో బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతున్నారని.. మరికొందరు ఆర్డినెన్సు ద్వారా రిజర్వేషన్ అమలు చేస్తామని అంటూ గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. విద్య, ఉపాధి రంగాల్లో కూడా రిజర్వేషన్ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్తో ఎన్నికలు నిర్వహించాలన్నారు. కేసీఆర్ను తిడితే ప్రజలు మెచ్చుకుంటారని అనుకోవద్దని, ముందు సీఎం అభివృద్ధిపైన దృష్టి పెట్టాలన్నారు. ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన ప్రభుత్వంలో కనిపించడం లేదన్నారు. డబ్బులు తీసుకొని ఇందిరమ్మ ఇళ్లను ఇస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు మల్లు దేవేందర్రెడ్డి నాయకులు రాజేశ్వర్ గౌడ్, గంజి వెంకన్న, శివరాజ్, సుధాశ్రీ, శ్రీకాంత్గౌడ్ పాల్గొన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ -
ఎస్సీ, ఎస్టీల సమస్యలు పరిష్కరించాలి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఎస్సీ, ఎస్టీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా ఎస్సీ, ఎస్లీ విజిలెన్స్–మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సభ్యుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. భూమి హక్కులకు సంబంధించిన సమస్యల పరిష్కారం, విద్యార్థులకు స్కాలర్షిప్ మంజూరు, కార్పొరేట్ పథకాల్లో పరిమిత సీట్లు కేటాయించాల్సిందేనన్నారు. వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో విద్యార్థులకు పౌష్టికాహారం, పరిశుభ్రత, తాగునీటి, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తామన్నారు. అనంతరం ఎస్పీ డి.జానకి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. అంతకుముందు అంబేడ్కర్, సంత్ సేవాలాల్ మహరాజ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమావేశంలో రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ ఎ.నరసింహారెడ్డి, జెడ్పీ సీఈఓ వెంకట్రెడ్డి, ఎస్సీ అభివృద్ధి శాఖ డీడీ సునీత, మహిళా–శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారిణి జరీనాబేగం, ఏఎస్డబ్ల్యూఓలు సుదర్శన్, కన్యాకుమారి తదితరులు పాల్గొన్నారు. యూరియా పంపిణీలో అక్రమాలను సహించం హన్వాడ: రైతులకు యూరియా పంపిణీలో అక్రమాలకు పాల్పడితే సహించేదిలేదని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. హన్వాడలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనసాగతున్న యూరియా విక్రయ కేంద్రాన్ని బుధవారం జిల్లా ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా కోసం వచ్చే రైతులకు ఆధార్కార్డు ప్రకారం రెండు బస్తాలకు మించి అదనంగా ఇవ్వరాదని సూచించారు. అయితే పలువురు రైతులు ఇష్టారీతిగా యూరియాను తీసుకెళ్లడాన్ని గమనించిన కలెక్టర్.. పీఏసీఎస్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూరియా కోసం వచ్చిన రైతుల బయోమెట్రిక్ విధానాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఆమె వెంట ఏడీఏ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశం జిల్లా విజిలెన్స్–మానిటరింగ్ కమిటీ సమావేశం -
దేశంలోనే మహాలక్ష్మి పథకం గొప్ప విప్లవం
స్టేషన్ మహబూబ్నగర్: రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన మహలక్ష్మి పథకం దేశంలోనే ఒక గొప్ప విప్లవం అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో 200 కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో బుధవారం ఏర్పాటు చేసిన సంబరాల కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి ఆలోచన చేసి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించినట్లు తెలిపారు. ఒక్క ఏడాదిలోనే మహబూబ్నగర్కు 48 కొత్త బస్సులు కేటాయించారని, వచ్చే ఏడాది మరో 48 బస్సులు అందుబాటులోకి వస్తాయని అన్నారు. ఈ పథకం ప్రారంభమైన వెంటనే బీఆర్ఎస్ నాయకులు కడుపుమంటతో ఇష్టానుసారంగా మాట్లాడినట్లు తెలిపారు. మహిళల అభ్యున్నతి కోసం ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్నట్లు తెలిపారు. మహిళలే మాకు శక్తి, ధైర్యం అని, మీ ఆశీర్వాదం మాకు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులు రాఘవి, భాగ్యలక్ష్మి, శిరీష, అయేషాబేగం, ప్రవళికలకు బహుమతులు అందజేశారు. అనంతరం బస్టాండ్ ఆవరణలో ఉన్న గ్రంథాలయాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, వైస్ చైర్మన్ విజయ్కుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్గౌడ్, ఇన్చార్జి ఆర్ఎం కవిత, డిపో మేనేజర్ సుజాత, నాయకులు సిరాజ్ఖాద్రీ, సీజే బెనహర్, అజ్మత్అలీ, ఖాజా పాష, అంజద్, రాషెద్ఖాన్, సంజీవరెడ్డి పాల్గొన్నారు. -
‘కోచింగ్ సెంటర్’ లవ్ స్టోరీ.. చివరికి బిగ్ ట్విస్ట్
గద్వాల: ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటూ ఓ కానిస్టేబుల్ తనను మోసం చేశాడని.. చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ ఓ యువతి మంగళవారం గద్వాల డీఎస్పీ మొగిలయ్యను ఆశ్రయించింది. బాధితురాలి కథనం మేరకు.. భద్రాది కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం బోరంతపల్లెకు చెందిన ప్రియాంక 2023లో ఉద్యోగ పోటీ పరీక్షల శిక్షణకు హైదరాబాద్కు రాగా.. గట్టు మండలం చిన్నోనిపల్లికి చెందిన రఘునాథ్గౌడ్ సైతం శిక్షణ కోసం హైదరాబాద్కు చేరుకున్నారు.ఈ క్రమంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వివాహం చేసుకుందామంటూ రఘునాథ్గౌడ్ యువతి తల్లిదండ్రులను ఒప్పించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత తమ తల్లిదండ్రులతో మాట్లాడి వివాహం చేసుకుందామని నమ్మించారు. ఇటీవల కానిస్టేబుల్ ఉద్యోగం రాగా వివాహం చేసుకుందామని ఫోన్లో సంప్రదించగా దాటవేస్తూ వచ్చారని బాధితురాలు చెప్పారు. ఈ నెల 17న రఘునాథ్గౌడ్ ఇంటికి వెళ్లి వివాహ విషయం మాట్లాడగా కుటుంబ సభ్యులు నిరాకరించడంతో పాటు తనపై చేయి చేసుకున్నట్లు డీఎస్పీకి వివరించింది.తీవ్ర మనస్తాపానికి గురై వారి ఇంటి ముందే నిద్రమాత్రలు మింగగా స్థానికులు గుర్తించి 108 వాహనంలో జిల్లా ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాప్రాయం తప్పిందని తెలిపింది. మంగళవారం ఉదయం కూడా మరోమారు వారి తల్లిదండ్రులతో మాట్లాడేందుకు కుటుంబంతో కలిసి వెళ్లగా నిరాకరించారన్నారు. ప్రస్తుతం శాంతినగర్ పోలీస్స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న రఘునాథ్గౌడ్, దాడి చేసిన కుటుంబ సభ్యులౖపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ బాధిత యువతి, తల్లిదండ్రులు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేశాం.. బాధితురాలి ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్ రఘునాథ్గౌడ్పై గట్టు పోలీస్స్టేషన్లో ఇప్పటికే కేసు నమోదైందని డీఎస్పీ మొగిలయ్య తెలిపారు. కానిస్టేబుల్ను విచారించి తగిన చర్యలు తీసుకుంటామని.. మోసం చేసిన వ్యక్తి ఎవరైనా సరే చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. బాధితురాలికి అన్నివిధాలా న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. -
దొంగల స్వైర విహారం
కల్వకుర్తి రూరల్: పట్టణంలో దొంగలు స్వైర విహారం చేస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి పట్టణంలోని గాంధీనగర్ కాలనీలో ఐదు ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డారు. చోరీలో దాదాపు 5 తులాల బంగారం, 50 వేల వరకు నగదు అపహరించినట్లు బాధితులు వాపోయారు. తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు బాధితులు తెలిపారు. గాంధీనగర్కు చెందిన అనిల్ ఇంట్లో రెండున్నర తులాల బంగారం, రూ.15 వేల నగదు, చంద్రయ్య ఇంట్లో రూ.20 వేల నగదు, బంగారు ఆభరణాలు, కృష్ణయ్య ఇంట్లో రూ.10,000 నగదు, నరసింహారెడ్డి, మైనుద్దీన్ ఇళ్లలో చోరీకి పాల్పడినట్లు తెలిపారు. మంగళవారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉండడాన్ని గమనించిన బాధితులు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. చోరీ జరిగిన ఇళ్లను సీఐ నాగార్జున, ఎస్ఐ మాధవరెడ్డి క్లూస్టీంతో కలిసి పరిశీలించారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
గద్వాల క్రైం: గోదాంలో నిల్వ చేసిన రూ.18 లక్షల విలువైన సిగరెట్లను అపహరించిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్చేసి రిమాండ్కు తరలించినట్లు జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. మంగళవారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆయన వివరించారు. అయిజ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన వినయ్కుమార్ రెండేళ్లుగా అయిజలో విజయలక్ష్మి ఏజెన్సీ ఏర్పాటుచేసి సిగరెట్ల వ్యాపారం చేస్తున్నారు. అయితే ఈ నెల 11న అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఏజెన్సీ సముదాయంలో నిల్వ చేసిన సిగరెట్ డబ్బాలను అపహరించారు. ఈ ఘటనపై బాధితుడు 12వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని పలు బృందాలతో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ● రాజస్థాన్లోని పైలా జిల్లా బితులాకు చెందిన రతన్లాల్, జలోర్ జిల్లాకు చెందిన బీర్బల్ బిష్ణయ్, గుణదేవ్ గ్రామానికి చెందిన జగదీష్లు ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నారు. ఈ నెల 11న కారులో కర్ణాటకలోని బెల్గాం నుంచి అయిజకు కారులో వచ్చారు. పట్టణంలోని విజయలక్ష్మి ఏజెన్సీ ద్వారా భారీ మొత్తంలో సిగరెట్ల వ్యాపారం కొనసాగుతుందని గుర్తించి అదేరోజు అర్ధరాత్రి దుకాణ సముదాయం నుంచి రూ.18 లక్షల విలువైన సిగరెట్ కాటన్ డబ్బాలను కారులో వేసుకొని ఎరిగెర మీదుగా రాయచూర్కు చేరుకున్నారు. దొంగిలించిన సిగరెట్ బాక్స్లను తక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు 21వ తేదీన శాంతినగర్ సీఐ టాటాబాబు ప్రత్యేక బృందంతో రాయచూర్కు వెళ్లగా పట్టణ శివారులో సిగరెట్ బాక్సులతో ఉన్న కారు, రతన్లాల్, జగదీష్ కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించారన్నారు. బీర్బల్ విష్ణయ్ పరారీలో ఉన్నారని ఇద్దరు నిందితులతో పాటు రూ.15 లక్షల విలువైన సిగరెట్ బాక్సులు, రెండు సెల్ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు. నిందితులను మంగళవారం గద్వాల కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఎస్పీ మొగిలయ్య, సీఐ టాటాబాబు, ఎస్ఐలు శ్రీనివాసరావు, నాగశేఖర్రెడ్డి, అబ్దుల్ షుకూర్, సిబ్బంది రంజిత్, ప్రసాద్, గోవింద్, రవికుమార్, శ్రీను ఉన్నారు. కేసును చేధించిన సిబ్బందికి ఎస్పీ ప్రత్యేక క్యాష్ రివార్డులను అందజేశారు. రూ.15 లక్షల విలువైనసిగరెట్లు, కారు, సెల్ఫోన్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన జోగుళాంబ గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు -
బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాల్సిందే: యెన్నం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడి అన్నారు. మంగళవారం వివిధ డివిజన్ల పరిధిలో రూ.1.21 కోట్ల ముడా నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలైనప్పుడే అన్ని విధాలా న్యాయం జరుగుతుందన్నారు. దీనికోసం పార్టీ లకతీతంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు.మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.ప్రవీణ్కుమార్రెడ్డి, ముడా చైర్మన్ కె.లక్ష్మణ్యాదవ్, నాయకులు ఎస్.వినోద్కుమార్, సిరాజ్ఖాద్రీ, రాజేందర్రెడ్డి, మనోహర్ , సీజే బెన్హర్, వెంకటేశ్గౌడ్, దేవేందర్రెడ్డి, రామస్వామి, కిరణ్కుమార్, ఇమ్మడి పురుషోత్తం, మంజుల, జ్యోతి, శాంతన్నయాదవ్, యాదన్న, రాములు యాదవ్ పాల్గొన్నారు. -
భూనిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసిత కుటుంబాలకు ఆర్అండ్ఆర్ కింద కేటాయించే స్థలాన్ని అన్ని వసతులలో వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీహాల్లో ఆయా శాఖ అధికారులతో సమీక్షించారు. ఉదండాపూర్ తుమ్మలకుంట తండా, రేగడిపట్టి తండా, చిన్నగుట తండా, ఒంటిగుడిసె తండా, పోలేపల్లి వ్యవసాయక్షేత్రంలో ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు పునరావాసం కింద 300 గజాల స్థలం త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. సీజనల్ వ్యాధులను అరికట్టాలి వర్షాల కాలంలో వచ్చే సీజనల్ వ్యాధులను అరికట్టడంతో పాటు దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. డెంగీ, మలేరియా, చికెన్గున్యా.. తదితర వ్యాధులను అరికట్టేందుకు వైద్య, ఆరోగ్యశాఖ సంసిద్ధంగా ఉండాలని సూచించారు. దోమల రాకుండా ఫాగింగ్చేయాలని, పీహెచ్సీల నుంచి ప్రతిరోజూ జ్వరాల నివేదిక సమర్పించాలన్నారు. తాగునీరు పరిశుభ్రంగా ఉండేలా మిషన్ భగీరథ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. సంక్షేమ పథకాల అమలులో కలెక్టర్లు కీలకం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో కలెక్టర్లు కీలకంగా వ్యవహరించాలని, ఆయా సంక్షేమ ఫలాలు పేదలకు చేరే విధంగా తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. మంగళవారం సచివాలయం నుంచి మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, లక్ష్మణ్కుమార్లతో కలిసి ఆయన కలెక్టర్తో వీసీ నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, భూభారతి, వన మహోత్సవం, మహాలక్షి పథకం తదితర అంశాలపై సమీక్షించారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, నర్సింహారెడ్డి, జెడ్పీ సీఈఓ వెంకట్రెడ్డి, ఆర్డీఓ నవీన్, డీఎంహెచ్ఓ కృష్ణ, డీపీఓ పార్థసాఽరథి, హౌజింగ్ పీడీ వైద్యం భాస్కర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్కుమార్రెడ్డి, పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్, సివిల్ సప్లయ్ డీఎం రవినాయక్, తదితరులు పాల్గొన్నారు. అప్రమత్తంగా ఉండాలి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయేందిర కోరారు. ఉరుములు, మెరుపులు, వచ్చిన సమయంలో ట్రాన్స్ఫార్మర్లు, సెల్టవర్ల వద్ద కు వెళ్లరాదని సూచించారు. చెట్ల కొమ్మలు, తెగినపడిన విద్యుత్ తీగల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. వాగులు, వంకలు, నీటి ప్రవాహాలు, చెరువుల వద్దకు వెళ్లవద్దని సూచించారు. కలెక్టరేట్లో కంట్రోల్రూంను ఏర్పాటు చేశామని, ఎవరికైనా సమస్యలు వస్తే 08542–241165 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. -
విద్యుదుత్పత్తి కేంద్రాన్ని సందర్శించిన శ్రీశైలం ఈఓ
దోమలపెంట: భూగర్భ జల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని మంగళవారం శ్రీశైలం దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు సందర్శించారు. ఆయనకు కేంద్రం చీఫ్ ఇంజినీర్ కేవీవీ సత్యనారాయణ, ఎస్ఈ (సివిల్) రవీంద్రకుమార్, ఎస్ఈ (ఓఅండ్ఎం) ఆదినారాయణ, డీఈ (కేంద్రం సేఫ్టీ) శ్రీకుమార్గౌడ్ స్వాగతం పలికి సత్కరించారు. కేంద్రంలో విద్యుదుత్పత్తి, విద్యుత్ను టీజీ లోడ్ డిస్పాచ్కు సరఫరా చేస్తున్న విధానాన్ని సీఈ ఆలయ ఈఓకు వివరించారు. అనంతరం సమావేశ మందిరంలో ఈఓ కేంద్రం సీఈ, ఎస్ఈలు, డీఈ, ఎస్పీఎఫ్ ఆర్ఐ రవి, ఎస్పీఎఫ్ ఎస్ఐ అనూప్ను దేవస్థానం కండువాలతో సత్కరించి ప్రసాదాన్ని అందజేశారు. భూగర్భ కేంద్రానికి అవసరమైతే ఆలయ వేద పండితుల సహకారం అందిస్తామన్నారు. -
వివాహేతర బంధమే ప్రాణం తీసింది
కొల్లాపూర్: పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు దామోదర్గౌడ్(48) హత్యకు వివాహేతర బంధమే కారణమని నాగర్కర్నూల్ డీఎస్పీ శ్రీనివాస్యాదవ్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి వివరాలను మంగళవారం కొల్లాపూర్ సీఐ కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. ఈ నెల 11న రాత్రి దామోదర్గౌడ్ ఇంటిపై పడుకుంటానని భార్య నిర్మలకు చెప్పి బయటకు వెళ్లాడు. మరుసటి రోజు దామోదర్గౌడ్ కనిపించకపోవడం, ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో తెలిసిన వారికి భార్య నిర్మల ఫోన్ చేసింది. ఎంతకూ ఆచూకీ తెలియకపోవడంతో 13న పెద్దకొత్తపల్లి పోలీసుస్టేషన్లో నిర్మల ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయితే దామోదర్గౌడ్కు అదే గ్రామానికి చెందిన బుసిగారి వెంకటమ్మ అనే మహిళతో వివాహేతర సంబంధం ఉందని, దీనిపై గతంలో వారి కుటుంబీకులతో గొడవలు జరిగాయని, వారిపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు సింగోటం చెరువులో ఓ వ్యక్తి మృతదేహం నీటిలో తేలుతుందని మత్స్యకారులు చెప్పడంతో దాన్ని వెలికితీశారు. దామోదర్గౌడ్గా నిర్ధారించి తలకు గాయాలైనట్లు గుర్తించి పోస్టుమార్టానికి తరలించినట్లు తెలిపారు. బంధువుల ఇంట్లో తలదాచుకొన్నారు ఈ క్రమంలో మంగళవారం వెంకటమ్మ, కుటుంబీకులు పెద్దకొత్తపల్లిలో బంధువుల ఇంట్లో ఉన్నారన్నా సమాచారంతో వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. విచారణలో 11వ తేదీ రాత్రి వెంకటమ్మ ఇంటికి దామోదర్గౌడ్ రాగా ఆమె భర్త బిచ్చయ్య, కుమారుడు కుర్మయ్యకు మధ్య వాగ్వాదం జరగడంతో కర్రలతో దాడిచేసి కొట్టి చంపినట్లు తెలిపారని పేర్కొన్నారు. అదేరోజు అర్ధరాత్రి ట్రాక్టర్ డ్రమ్ము స్టాండ్పై దామోదర్గౌడ్ మృతదేహం, అతని బైక్ను కుడికిళ్ల సమీపంలోని కేఎల్ఐ కాల్వలో పడేయగా మృతదేహం కాల్వగుండా కొట్టుకొచ్చి సింగోటం చెరువులో తేలినట్లు తెలిపారు. హత్యకు వెంకటమ్మ బంధువు పెబ్బేటి వెంకటస్వామి కూడా సహకరించినట్లు విచారణలో తేలిందన్నారు. ఈ మేరకు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు డీఎస్పీ వెల్లడించారు. మృతదేహం తరలించిన ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. సమావేశంలో కొల్లాపూర్ సీఐ మహేష్, పెద్దకొత్తపల్లి ఎస్ఐ సతీష్ ఉన్నారు. హత్య చేసింది ప్రియురాలి కుటుంబీకులే.. నిందితులను అరెస్టు.. రిమాండ్కు తరలింపు వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాస్యాదవ్ -
పీయూలో ఏం జరుగుతోంది?
ఈసారి జెడ్పీపీఠం కై వసం చేసుకోవాలి ● స్థానిక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలి ● బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి పాలమూరు: ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేక 42 శాతం బీసీ రిజర్వేషన్ అంశం ఎత్తుకుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి విమర్శించారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో మంగళవారం స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ నాయకులతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అప్పుడు ఎందుకు 42 శాతం కల్పించలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొత్తగా ఈ డ్రామాకు తెరలేపారని ఆరోపించారు. బూత్ స్థాయిలో విజయం సాధిస్తే రాబోయో ఎన్నికల్లో గెలుపు ఖాయమన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల్లో అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారని, 18 నెలలు గడిచినా ఇప్పటికీ వాటిని అమలుచేయలేదన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో లేకపోయినా కేంద్రం రూ.12 లక్షల కోట్ల నిధులను తెలంగాణకు ఇచ్చిందన్నారు. జిల్లాలో 16 మండలాల్లో 8 మహిళలకు రిజర్వ్ అవుతాయని, 16 జెడ్పీటీసీ స్థానాలు గెలుపొంది జెడ్పీ పీఠం దక్కించుకోవాలన్నారు. జిల్లాలో 423 గ్రామ పంచాయతీలు, 3,367 వార్డుల్లో పార్టీ అభ్యర్థులను బరిలో దింపాలన్నారు. ఈ నెల 26న జిల్లాలో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు హాజరవుతారని, ఈ కార్యక్రమానికి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, నాయకులు పవన్కుమార్రెడ్డి, పద్మజారెడ్డి, వీర బ్రహ్మచారి, సుదర్శన్రెడ్డి, ఎగ్గని నర్సింహులు, ప్రశాంత్రెడ్డి, అంజయ్య, సాహితీరెడ్డి పాల్గొన్నారు. నాన్ టీచింగ్ సిబ్బందిపై వేధింపుల పర్వం ● ఇటీవల పలువురిపై సస్పెన్షన్ వేటు ● చిన్నపాటి తప్పిదాలకే విచారణ కమిటీల ఏర్పాటు ● వేతనాలపై ప్రశ్నిస్తున్నందుకే ఇదంతా చేస్తున్నారని ఆరోపణలు ● టీచింగ్ సిబ్బందిలో సైతం అధికారుల తీరుపై తీవ్ర అసహనం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో ఉన్నతస్థాయి అధికారులు కిందిస్థాయి సిబ్బందిపై వేధింపుల పర్వానికి తెరలేపారు. గత కొన్నిరోజుల వ్యవధిలోనే ముగ్గురు సిబ్బందిపై సస్పెషన్ వేటు వేసి తమలోని అక్కసును బయటపెట్టుకున్నారు. దీంతో పాటు నాన్టీచింగ్ సిబ్బంది చేసే చిన్నపాటి తప్పిదాలకే విచారణ కమిటీలు వేసి భయాందోళనకు గురిస్తున్నారు. వేసవిలో యూనివర్సిటీకి సెలవులు ప్రకటించిన అధికారులు.. నాన్టీచింగ్ సిబ్బందికి మాత్రం ఒక్క సెలవు ఇవ్వలేదు. సమస్యలు చెప్పుకోవడానికి వెళ్లిన సిబ్బందిని కనీసం అధికారులు వారి చాంబర్లోకి కూడా రానివ్వలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే కేవలం తమకు వేతనాలు పెంచమని కోరినందుకే అణచివేత ధోరణికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పీయూలో తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న నాన్టీచింగ్ సిబ్బందిలో కిందిస్థాయి వారికి రూ.6 వేల నుంచి మధ్యస్థాయి వరకు రూ.15 వేల వరకు వేతనాలు ఇస్తున్నారు. ఏం మాట్లాడితే ఏం చేస్తారో.. మూడు రోజుల క్రితం విధుల్లో ఉన్న పీయూ పీజీ కళాశాల ఓ మహిళా నాన్టీచింగ్ సిబ్బంది తన కొడుకుకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆస్పత్రికి వెళ్తుండగా.. రిజిస్ట్రార్ అడ్డుకుని సదరు మహిళను సస్పెండ్ చేస్తున్నట్లు చెప్పారు. రిజిస్ట్రార్ తీరుతో నాన్టీచింగ్ సిబ్బందిలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఎలాంటి విచారణ, హెచ్చరిక, నోటీస్ లేకుండా సస్పెన్షన్ వేటు వేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. దీంతోపాటు గతంలో ఓ టీచింగ్, ఓ నాన్టీచింగ్ గొడవపడిన వ్యవహారంపై ముగ్గురు సభ్యులతో కమిటీ వేసిన అధికారులు నేరుగా నెల రోజుల పాటు సస్పెండ్ చేసినట్లు సమాచారం. మరో ఇద్దరు సిబ్బంది చిన్నచిన్న తప్పిదాలు చేశారన్న ఆరోపణలతో వారిపై ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీలు వేశారు. దీంతో ఏం మాట్లాడితే.. ఏం చేస్తారోనన్న భయాందోళన నాన్ టీచింగ్ సిబ్బందిలో నెలకొంది. టీచింగ్ సిబ్బందిలోనూ అసంతృప్తి.. పీయూలో ప్రొఫెసర్ స్థాయి లెక్చరర్లు ఉన్నప్పటికీ రిజిస్ట్రార్ను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తీసుకోవడంపై రెగ్యులర్ టీచింగ్ సిబ్బంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతేకాకుండా గతంలో అడ్మినిస్ట్రేషన్లో పనిచేసిన వారికి ఎలాంటి పదవులు ఇవ్వకుండా వారిని దూరంగా పెట్టడం, సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ● ఇటీవల అన్ని హాస్టళ్లకు కలిపి ఒక రెగ్యులర్ అధ్యాపకుడిని చీఫ్ వార్డెన్గా నియమించారు. ఇందులో రెండు బాలికల హాస్టళ్లు సైతం ఉన్నాయి. ఈ క్రమంలో బాలికల హాస్టల్కు గతంలో ఉన్న చీఫ్ వార్డెన్ (మహిళ)ను తప్పించి పురుష అధికారిని నియమించారు. బాలికల హాస్టల్లో సమస్యలు, ఇబ్బందులు వస్తే వారు ఆయనకు ఎలా చెప్పుకుంటారనే ప్రశ్న తలెత్తుతోంది. బదిలీల పరంపర..నాన్టీచింగ్లో రెగ్యులర్ ప్రతిపాదిక పనిచేస్తున్న అసిస్టెంట్ రిజిస్ట్రార్కు సైతం వేధింపులు తప్పలేదు. తమకు అనుకూలంగా వ్యవహరించడం లేదని అడ్మినిస్ట్రేషన్ విభాగంలో కొన్నేళ్లుగా పనిచేస్తున్న ఆయనను ఎలాంటి కారణం చెప్పకుండా నేరుగా ఎగ్జామినేషన్ విభాగానికి బదిలీ చేశారు. అంతేకాకుండా మరో నాన్టీచింగ్ సిబ్బందిని సరిగా విధులకు రావడం లేదన్న కారణంతో ఫార్మసీ కళాశాలకు బదిలీ చేసి.. అక్కడి నుంచి గద్వాల పీజీ కళాశాలకు బదిలీ చేసి అక్కడి వెళ్లాలని సూచించారు. చాలా రోజులుగా వైస్ చాన్స్లర్ను కలిసి సమస్యను చెప్పుకోవడానికి ప్రయత్నిస్తే కనీసం చాంబర్లోకి సైతం రానివ్వలేదని తెలిసింది. అంతేకాకుండా మరో మహిళా సిబ్బందిని ఎలాంటి కారణం లేకుండా నేరుగా ఎగ్జామినేషన్ బ్రాంచ్కు బదిలీ చేశారు. గతంలో తప్పిదాలు చేసి బదిలీపై వెళ్లిన వారిని ప్రస్తుత అధికారులు పైరవీలు చేసి తిరిగి అడ్మినిస్ట్రేషన్ బ్రాంచ్కు రప్పించుకుంటున్నట్లు సమాచారం. మరో ఇద్దరిపై విచారణ కోసం కమిటీలు వేసి, వారి వివరణ సైతం తీసుకుంటున్నారు. ఇలాంటి ధోరణితో సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు.