breaking news
Amaravati
-
పిడుగుపాటుతో నలుగురు మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి,తాడేపల్లి: పల్నాడు జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు మృతి చెందడంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం, మోపిరివారిపాలెం, కాకాని శివారు లక్ష్మీపురం, పాలపాడు గ్రామాల్లో పిడుగుపడి నలుగురు మృతి చెందిన ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. పండుగ వేళ నాలుగు కుటుంబాల్లో విషాదం నెలకొనడం తనను కలచివేసిందని వైఎస్ జగన్ పేర్కొన్నారు.మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలని, తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. -
డీఎస్సీ అక్రమాలపై చంద్రబాబుకు వైఎస్ జగన్ ప్రశ్నలు
సాక్షి,తాడేపల్లి : డీఎస్సీ అక్రమాల అంశానికి సంబంధించి చంద్రబాబుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు ప్రశ్నలు సంధించారు. అసలు చంద్రబాబు ఇచ్చే వివరణలే మరిన్ని ప్రశ్నలకు అవకాశం కల్పిస్తోందంటూ సోషల్ మీడియా వేదికగా నిలదీశారు వైఎస్ జగన్. డీఎస్సీలో అక్రమాల ట్విస్టులను వివరిస్తూ ఆదివారం ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. ట్విస్ట్ 1: 65 మార్కులు → 7 దశల వెరిఫికేషన్..65 మార్కులు టెట్లో వచ్చినా టీచరు పోస్టు ఇచ్చారు.అంతకుముందు ఆ అభ్యర్థి 7 దశల వెరిఫికేషన్ ఎలా పూర్తి చేశాడు?ట్విస్ట్ 2: ఆ అభ్యర్థి అనర్హుడని డీఈవో తేల్చారుమరి ఆ 7 దశల్లో అసలు ఏం వెరిఫై చేసినట్టు?ట్విస్ట్ 3: ఉద్యోగం వచ్చింది... కానీ ఎలా వచ్చిందో అతనికే తెలియదు!మరి ఏడుసార్లు చేసిన వెరిఫికేషన్లో ఏం తేల్చారు?ట్విస్ట్ 4: సడన్గా తెరపైకి వచ్చిన 77 మార్కులు2018లో రాసిన టెట్లో అతనికి 77 మార్కులు వచ్చాయని అధికారులు నిర్ధారించారు.ఆ 77 మార్కులు అప్పటికే రికార్డుల్లో ఉంటే..అంతకుముందే వాటిని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు?డీఈవో అతన్ని అనర్హుడిగా ఎందుకు ప్రకటించారు?ప్రశ్నలు లేవనెత్తిన తర్వాతే ఈ వివరణ ఎందుకు బయటకు వచ్చింది?ట్విస్ట్ 5: “రాంగ్ పేపర్” ట్విస్ట్77 మార్కులు వచ్చినట్లు చెబుతున్నది పేపర్ 2లోకానీ SGT పోస్టుకు అవసరమైన టెట్ కేటగిరీ Paper-I-A.మరి అవేమీ చూడకుండానే అతను 7 దశల వెరిఫికేషన్ను ఎలా దాటాడు?ట్విస్ట్ 6: ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్లీ టెట్ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఆ అభ్యర్థి 2025లో మళ్లీ టెట్ రాశాడు.2018లో వచ్చిన 77 మార్కులతోనే అతనికి అర్హత ఉంటే..మళ్లీ టెట్ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది?ఇప్పుడు అన్నింటికంటే పెద్ద ప్రశ్నలు:ఇదేనా నిష్పక్షపాతమైన, పారదర్శకమైన నియామక ప్రక్రియ?ఇలాంటి వ్యవహారాలే డీఎస్సీ స్కామ్కు అవకాశం కల్పించలేదా?చంద్రబాబూ.. ఇప్పటికైనా ఈ స్కాంలకు మీరు నైతిక బాధ్యత వహిస్తారా? లేదా? 𝗢𝗻𝗲 𝗧𝗲𝗮𝗰𝗵𝗲𝗿 𝗣𝗼𝘀𝘁. 𝗔 𝗥𝗼𝗹𝗹𝗲𝗿𝗰𝗼𝗮𝘀𝘁𝗲𝗿 𝗼𝗳 𝗧𝘄𝗶𝘀𝘁𝘀 & 𝗧𝘂𝗿𝗻𝘀 𝗶𝗻 𝘁𝗵𝗶𝘀 𝗗𝗦𝗖 𝗦𝗰𝗮𝗺!@ncbn Garu, the explanations keep changing, and every new explanation gives rise to even more questions for teacher aspirants.𝗟𝗲𝘁’𝘀 𝗳𝗼𝗹𝗹𝗼𝘄… pic.twitter.com/MP38UWEkxD— YS Jagan Mohan Reddy (@ysjagan) September 13, 2026 -
రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ వినాయక చవితి శుభాకాంక్షలు
సాక్షి,తాడేపల్లి: రేపు(సోమవారం, సెప్టెంబర్ 14వ తేదీ) వినాయక చవితి పర్వదినం సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ గణనాథుని ఆశీస్సులు ఉండాలని, క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలని, సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. ఏ కార్యం తలపెట్టినా మహాగణనాధుడిని ముందుగా పూజిస్తామని, అలా ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోతాయని గుర్తు చేశారు. ఈ వినాయకచవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలూ కలగాలని, విజయాలు సిద్ధించాలని, ఇంకా గణనాథుని కరుణా కటాక్షాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని వైఎస్ జగన్ అభిలషించారు. -
ఏపీకి బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
సాక్షి, విజయవాడ: ఏపీలో పలు జిల్లాలకు వర్ష సూచనను వాతావరణ శాఖ జారీ చేసింది. పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని.. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలతో పాటు యానాంలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం భారీ వర్షాలు కురిశాయి. విజయవాడలో వేకువజాము నుంచి దాదాపు 3 గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపుల ధాటికి బెజవాడ వాసులు బెంబేలెత్తిపోయారు. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.ముఖ్యంగా బెంజిసర్కిల్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు భారీ స్థాయిలో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. ఏలూరు రోడ్డులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోనూ శనివారం వేకువజామున భారీ వర్షం కురిసింది. ఉ.8 గంటల వరకు జిల్లాలో సగటున 37.4 మిల్లీవీుటర్ల వర్షపాతం నమోదైంది.పి.గన్నవరంలో అత్యధికంగా 60.0 మిల్లీవీుటర్ల వర్షపాతం నమోదైంది. ఇదిలా ఉండగా, ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అల్లూరి సీతారామరాజు జిల్లా దారకొండ పంచాయతీ గంగవరం వద్ద గిరిజనులు నిర్మించుకున్న తాత్కాలిక తూరల వంతెన వరద ధాటికి కొట్టుకుపోయింది. ఒడిశా వైపు వెళ్లే మార్గంలో సుమారు 30 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.ఇదీ చదవండి: చవితి పూట.. ధరల మంట -
వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా చంద్రశేఖర్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విజయనగరం జిల్లాకు చెందిన వారిని వివిధ హోదాల్లో నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా గదల సన్యాసినాయుడు, విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బెల్లాన చంద్రశేఖర్ను నియమించినట్లు తెలిపింది. -
చెన్నై విమానం రాజమండ్రికి మళ్లింపు
గన్నవరం: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం)లో శనివారం ప్రతికూల వాతావరణ పరిస్థితులు కారణంగా చెన్నై నుంచి వచ్చిన విమానాన్ని దారి మళ్లించారు. చెన్నై నుంచి 65 మంది ప్రయాణికులతో ఇండిగో విమానం ఉదయం 8.40 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ గగనతలంలోకి చేరుకుంది. ఆ సమయంలో దట్టమైన మేఘాలు కమ్ముకుని వర్షం కురుస్తుండడంతో రన్వే విజిబులిటి లేక విమానం అరగంట పాటు గాలిలో చక్కర్లు కొట్టింది. అయినప్పటికి వాతావరణం అనుకూలించకపోవడంతో విమానంలోని ఇంధన నిల్వ దృష్ట్యా అధికారుల సూచన మేరకు రాజమండ్రి విమానాశ్రయానికి దారి మళ్లించారు. వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాత విమానం రాజమండ్రి నుంచి తిరిగి బయలుదేరి ఉదయం 11 గంటలకు గన్నవరం చేరుకుంది. -
‘బాబో’య్ ధరాఘాతం
సాక్షి, అమరావతి: ధరల మంటతో సామాన్యుడు అల్లాడుతున్నా.. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. నిత్యావసరాలు, ఆహార ధరలు రోజురోజుకూ పెరుగుతున్నా నియంత్రణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. తాజాగా అధికారికంగా విడుదలైన రాష్ట్ర ప్రణాళికా శాఖ నివేదికే కూటమి సర్కారు పాలనలో ధరల పరిస్థితికి అద్దం పట్టింది. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు రాష్ట్రంలో ద్రవ్యోల్బణం పెరుగుతోంది. 2025 జూలైతో పోల్చి 2026 జూలైలో రాష్ట్ర వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ఆహార ద్రవ్యోల్బణం ఏకంగా 9.13 శాతంగా నమోదయ్యింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆహార ద్రవ్యోల్బణం ఏకంగా 9.69 శాతానికి చేరడం.. సామాన్య కుటుంబాలపై ధరల భారానికి నిదర్శనం. జిల్లా స్థాయిలో నిత్యావసర ధరల పరిస్థితిపై కలెక్టర్లు పర్యవేక్షణ చేయాలని నివేదిక సూచించింది. రాష్ట్ర ప్రణాళికా శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం.. ⇒ వార్షిక ప్రాతిపదికన అన్ని విభాగాలను కలిపిచూస్తే రాష్ట్ర వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 5.72 శాతంగా నమోదయ్యింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలను వేర్వేరుగా చూస్తే గ్రామాల్లో సీపీఐ 6.13 శాతంగా ఉంటే, పట్టణాల్లో 5.19 శాతంగా నమోదయ్యింది. ⇒ రాష్ట్రంలో ఒక్క ఆహార ద్రవ్యోల్బణం చూస్తే 9.13 శాతంగా నమోదయ్యింది. గ్రామాల్లో ఇది మరింత ఎక్కువగా 9.69 శాతంగా నమోదుకావడం గమనార్హం. ⇒ రాష్ట్ర వ్యాప్తంగా ఆహార ద్రవ్యోల్బణం విభాగాన్ని చూస్తే వార్షికంగా ఉల్లి ధరలు ఏకంగా 153 శాతం ఎగిశాయి. అల్లం ధరలు 102.9 శాతం ఎగశాయి. చికెన్ ధరలు 37.3 శాతం ఎగశాయి. ఎండుమిర్చి ధరలు 30 శాతం పెరిగాయి. నెలవారీగా ఉల్లి, టమాటా చూసినా (2026 జూన్తో పోల్చి 2026 జూలైలో) ధరలు భారీగా 54 శాతం, 46 శాతం చొప్పున పెరగడం గమనార్హం. ⇒ సీపీఐలో భాగమైన వ్యక్తిగత సంరక్షణ, సామాజిక రక్షణ ధరలు వార్షికంగా 18.80 శాతం పెరిగాయి. ⇒ ఆహారం, పానీయాలు ధరలు 8.51 శాతం, విద్యా సేవలు ధరలు 7.62 శాతం, రెస్టారెంట్, వసతి ధరలు 5.73 శాతం, రవాణా ధరలు 3.99 శాతం పెరిగాయి. ⇒ వెండి ఆభరణాల ధరలు వార్షికంగా 108.9 శాతం పెరగ్గా, గోల్డ్, డైమండ్, ప్లాటినం ఆభరణాల ధరలు 27.72 శాతం ఎగశాయి. జాతీయ స్థాయిలో చూస్తే 1.27 శాతం అధికం కాగా, జాతీయ స్థాయిలో జూలైలో సీపీఐ వార్షిక ప్రాతిపదికన 4.45 శాతంగా నమోదవగా, రాష్ట్రంలో 5.72 శాతంగా నమోదైంది. జాతీయ స్థాయితో పోల్చితే రాష్ట్రంలో ఇది 1.27 శాతం అధికం. ఒక్క దక్షిణాది రాష్ట్లాల జాబితాలో టాప్ నుంచి (6.32 శాతంతో తెలంగాణ) రెండవ స్థానంలో రాష్ట్రం నిలిచింది. తరువాతి స్థానాల్లో తమిళనాడు (5.44 శాతం), కర్ణాటక (4.89 శాతం) కేరళ (4.85 శాతం) ఉన్నాయి. -
పోలీసు రిక్రూట్మెంట్పై.. అన్నీ అనుమానాలే!
డీఎస్సీ తరహాలోనే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో కూడా భారీగా అవకతవకలు జరిగాయా? ఈనెల 7న పీఓపీ (పాసింగ్ అవుట్ పరేడ్)కి అన్ని ఏర్పాట్లు చేసి చివరి నిమిషంలో వాయిదా వేయడంలో ఆంతర్యమేంటి? శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులు అసలు ఏ కేటగిరీలో, ఏ రిజర్వేషన్లో ఉద్యోగం పొందారో సెలక్షన్ లిస్ట్ ఇప్పటివరకూ పబ్లిక్ డొమైన్లో ఎందుకు ఉంచలేదు? బ్యాక్ లాగ్ పోస్టులను పూర్తిగా స్పోర్ట్స్ కోటాలోనే భర్తీచేస్తున్నట్లు అమెండ్మెంట్లో చేర్చిన ప్రభుత్వం ఆ వివరాలు కూడా ఎందుకు పొందుపరచలేదు? ఈ సందేహాలన్నీ చూస్తే అసలు పోలీసు రిక్రూట్మెంట్ పారదర్శకంగానే జరిగిందా? లేదా స్పోర్ట్స్ కోటా ముసుగులో ‘యువగళం’ కోటాగా కొన్ని పోస్టులు టీడీపీ నేతలకు అప్పనంగా ఇచ్చారా? అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. సాక్షి ప్రత్యేక ప్రతినిధి, అమరావతి బ్యూరో: దగా డీఎస్సీ స్కామ్ తరహాలోనే పోలీసు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లోనూ చంద్రబాబు ప్రభుత్వం అక్రమాలకు దిగజారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 6,100 పోస్టులతో మొదలైన ప్రక్రియలో 79 బ్యాక్లాగ్ పోస్టులను కొత్తగా చేర్చిన ప్రభుత్వం.. మొత్తం పోస్టుల సంఖ్యను మాత్రం 6,100గానే ఉంచడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. మరోవైపు 3 శాతం స్పోర్ట్స్ కోటా కింద 183 పోస్టులతో పాటు 79 బ్యాక్లాగ్ పోస్టులనూ అదే కోటాలో భర్తీ చేసేలా ఉత్తర్వులు జారీ చేయడంతో మొత్తం 262 పోస్టుల నియామకంపై అభ్యర్థుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రిలిమినరీ, ఫిజికల్ పరీక్షలు పూర్తయి, మెయిన్స్ అనంతరం ఎంపికైన అభ్యర్థులు తొమ్మిది నెలల శిక్షణ కూడా పూర్తి చేశారు. అయినప్పటికీ ఎవరు ఏ రిజర్వేషన్, ఏ కేటగిరీలో ఎంపికయ్యారు? స్పోర్ట్స్, బ్యాక్లాగ్ కోటాలో ఎవరికి ఉద్యోగాలు దక్కాయి? అనే వివరాలతో కూడిన తుది సెలక్షన్ జాబితాను ప్రభుత్వం బహిరంగపరచలేదు. దీనికితోడు ఈ నెల 7న జరగాల్సిన పాసింగ్ అవుట్ పరేడ్ను చివరి నిమిషంలో వాయిదా వేయడం మరిన్ని అనుమానాలకు కారణమైంది. దీంతో పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ నిజంగా పారదర్శకంగానే జరిగిందా? లేక స్పోర్ట్స్ కోటా ముసుగులో నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగాయా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2022 నవంబర్ 28న 6,100 పోస్టులకు నోటిఫికేషన్ జారీచేసింది. ప్రిలిమినరీ పరీక్షతో పాటు ఫిజికల్ టెస్ట్లు, పరుగు పందెం అప్పుడే పూర్తిచేశారు. ‘మెయిన్స్’ నిర్వహించే క్రమంలో నిరుద్యోగ జేఏసీ పేరుతో కొందరు కోర్టుకు వెళ్లడంతో రిక్రూట్మెంట్ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఆపై చంద్రబాబు ప్రభుత్వం 2025 జూన్ 1న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించింది. ఎంపికైన వారికి రాష్ట్రంలోని 21 పీటీసీ, డీటీసీ సెంటర్లలో శిక్షణ ఇచ్చారు. 79 బ్యాక్లాగ్ పోస్టులు ఎక్కడ ‘బాబూ’?.. 2022 నవంబర్ 28న జారీ అయిన నోటిఫికేషన్లో 6,100 పోస్టులున్నాయి. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం 2025 జులై 30న 2022 నోటిఫికేషన్ను రివైజ్ చేస్తూ అమెండ్మెంట్ తీసుకొచ్చింది. 6,100 పోస్టులతోనే రిక్రూట్మెంట్ ఉన్నప్పుడు కొత్తగా మళ్లీ అమెండ్మెంట్ ఎందుకు? అలాగే, 79 బ్యాక్లాగ్ పోస్టులను భర్తీచేస్తున్నట్లు అమెండ్మెంట్లో పేర్కొన్నారు. మరి 6,100 పోస్టులతో పాటు 79 బ్యాక్లాగ్ కలిపితే మొత్తం 6,179 పోస్టులు రిక్రూట్ చేయాలి కదా? ఎందుకు పోస్టుల సంఖ్య పెరగలేదు? అనేది ఇప్పుడు పోలీసు శాఖలో చర్చ జరుగుతోంది. 79 పోస్టులు స్పోర్ట్స్ కోటాలో భర్తీకి ఉత్తర్వులుమొత్తం 6,100 పోస్టుల్లో 3 శాతం స్పోర్ట్స్ కోటాలో భర్తీచేసేలా చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేకంగా జీఓలు జారీచేసింది. ఈ లెక్కన 183 పోస్టులు స్పోర్ట్స్ కోటాలో భర్తీచేయాలి. అలాగే, బ్యాక్లాగ్ పోస్టులను కూడా స్పోర్ట్స్ కోటాలోనే భర్తీచేయాలని పేర్కొన్నారు. అంటే.. 183 పోస్టులతో పాటు 79 బ్యాక్లాగ్ కలిపి మొత్తం 262 ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాలో భర్తీచేసినట్లు లెక్క. పైగా.. బ్యాక్లాగ్ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియామకాలు చేసేలా అమెండ్మెంట్ చివరి కాలమ్లో పేర్కొన్నారు. దీంతోపాటు స్పోర్ట్స్ కోటాలో గతంలో ఉన్న 20 క్రీడలను 67కు పెంచుతూ జీఓలు జారీచేశారు. కానీ, మొత్తం రిక్రూట్మెంట్ మాత్రం 6,100కే జరిగింది. మరి అలాంటప్పుడు 79 బ్యాక్లాగ్ పోస్టులు ఎలా భర్తీచేశారు? ఎవరితో భర్తీచేశారు? బ్యాక్లాగ్ పోస్టులు భర్తీచేస్తే 6,100కే రిక్రూట్మెంట్ ఎలా పరిమితం చేశారు అనేది ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. రిజర్వేషన్, కేటగిరి ప్రకారం సెలక్షన్ లిస్ట్ ఎక్కడ?.. ఇక రిక్రూట్మెంట్ చేసిన 6,100 పోస్టుల్లో కొందరికి వేరే ఉద్యోగాలు రావడం, ఇంకొందరు శిక్షణకు రాకపోవడం.. ఇతర కారణాలతో వెళ్లిపోయిన వారు కాకుండా మిగిలిన 5,757 మంది తొమ్మిది నెలలపాటు శిక్షణ పూర్తిచేసుకున్నారు. మెయిన్స్ పరీక్ష పూర్తయిన తర్వాత అభ్యర్థులు శిక్షణకు ఎంపిక కాగానే ఏ అభ్యర్థి ఏ రిజర్వేషన్, ఏ కేటగిరిలో ఎంపికయ్యారు? బ్యాక్లాగ్, స్పోర్ట్స్ కోటాలో ఎవరు ఎంపికయ్యారు అనే వివరాలతో ఎంపిక జాబితాను పబ్లిక్ డొమైన్లో ఉంచాలి. కానీ, అభ్యర్థులు తొమ్మిది నెలలు శిక్షణ పూర్తిచేసుకున్న తర్వాత, చివరకు ఈనెల 7న పీఓపీ తేదీ ప్రకటించిన తర్వాత కూడా ఇప్పటివరకూ సెలక్షన్ లిస్ట్ను రిజర్వేషన్, కేటగిరీ వారీగా ప్రకటించలేదు. దీన్నిబట్టి చూస్తే రిజర్వేషన్, కేటగిరి వివరాలు ఎందుకు ప్రభుత్వం గోప్యంగా ఉంచిందనేది అంతుపట్టడంలేదు.స్పోర్ట్స్ కోటాలోని 262 పోస్టుల భర్తీపైనే అనుమానాలు..రిజర్వేషన్ల ప్రకారం ఎస్పీలు జిల్లాల వారీగా ఎంపిక జాబితాను డీజీపీకి పంపిస్తారు. సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ ఇలా అన్ని విభాగాల్లో పోస్టుల ఖాళీలను డీజీ పరిశీలించి ఎస్ఎల్పీఆర్బీ (స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు)కు పంపిస్తారు. అప్పుడు ఎస్ఎల్పీఆర్బీ ప్రిలిమినరీ, ఫిజికల్, రన్నింగ్, మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. కానీ, ఈ ఉదంతంలో పోస్టుల జాబితాతో పాటు మెయిన్స్ మినహా మిగిలిన ప్రక్రియ మొత్తం 2022లోనే పూర్తయింది. మళ్లీ 79 బ్యాక్లాగ్ పోస్టులను భర్తీచేస్తున్నట్లు అమెండ్మెంట్లో పేర్కొనడం, వాటిని స్పోర్ట్స్ కోటాలో స్థానికులతోనే భర్తీచేసేలా చెప్పడం.. కానీ, ఈ 79 సంఖ్య మొత్తం రిక్రూట్మెంట్లో పెరగకపోవడం, శిక్షణ పూర్తిచేసుకున్నా ఇప్పటివరకూ అభ్యర్థుల సెలక్షన్ లిస్ట్ రిజర్వేషన్ వారీగా ప్రకటించకపోవడంపై 92 వేల మందికి పైగా అభ్యర్థుల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలోని 183 పోస్టులు, బ్యాక్లాగ్ 79 పోస్టులు కలిపి మొత్తం 262 పోస్టుల నియామకంపైనే తీవ్ర అనుమానాలు ఉన్నట్లు పోలీసు శాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది. 2022లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ను మార్పు చేసి 2025లో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ స్పోర్ట్స్ కోటాలోని 262 పోస్టుల భర్తీపైనే అనుమానాలు..రిజర్వేషన్ల ప్రకారం ఎస్పీలు జిల్లాల వారీగా ఎంపిక జాబితాను డీజీపీకి పంపిస్తారు. సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ ఇలా అన్ని విభాగాల్లో పోస్టుల ఖాళీలను డీజీ పరిశీలించి ఎస్ఎల్పీఆర్బీ (స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు)కు పంపిస్తారు. అప్పుడు ఎస్ఎల్పీఆర్బీ ప్రిలిమినరీ, ఫిజికల్, రన్నింగ్, మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. కానీ, ఈ ఉదంతంలో పోస్టుల జాబితాతో పాటు మెయిన్స్ మినహా మిగిలిన ప్రక్రియ మొత్తం 2022లోనే పూర్తయింది. మళ్లీ 79 బ్యాక్లాగ్ పోస్టులను భర్తీచేస్తున్నట్లు అమెండ్మెంట్లో పేర్కొనడం, వాటిని స్పోర్ట్స్ కోటాలో స్థానికులతోనే భర్తీచేసేలా చెప్పడం.. కానీ, ఈ 79 సంఖ్య మొత్తం రిక్రూట్మెంట్లో పెరగకపోవడం, శిక్షణ పూర్తిచేసుకున్నా ఇప్పటివరకూ అభ్యర్థుల సెలక్షన్ లిస్ట్ రిజర్వేషన్ వారీగా ప్రకటించకపోవడంపై 92 వేల మందికి పైగా అభ్యర్థుల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలోని 183 పోస్టులు, బ్యాక్లాగ్ 79 పోస్టులు కలిపి మొత్తం 262 పోస్టుల నియామకంపైనే తీవ్ర అనుమానాలు ఉన్నట్లు పోలీసు శాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది. -
చవితి పూట.. ధరల మంట
సాక్షి, అమరావతి: భాద్రపద మాసంలో వచ్చే వినాయక చవతి తెలుగు వారింట తొలి పండుగ. ఊరూ వాడా పందిళ్ల సందడి. ప్రతి ఇంటా కొత్త బట్టలు.. నోరూరించే పిండివంటల ఘుమఘుమలు. కానీ ఈ ఏడాది సామాన్య, మధ్య తరగతి ప్రజల లోగిళ్లలో పండుగ శోభ మచ్చుకైనా కనిపించడంలేదు. అనూహ్యంగా పెరిగిన ధరలు తొలి పండుగపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. పెరుగుతున్న ధరలను అదుపు చేయాల్సిన ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజల జేబులు గుల్లవుతున్నాయి. కానరాని ఘుమఘుమలు.. వినాయక చవితి అనగానే ప్రతి ఇంటా పులిహోర, బూరెలు, గారెలతో పాటు స్వామి వారికి నైవేద్యంగా పెట్టే కుడుములు, ఉండ్రాళ్లు, పాయసం వంటి సంప్రదాయ పిండి వంటలు తప్పనిసరి. ఇంటికొచ్చే బంధువులతో పాటు పిల్లలు, అల్లుళ్లకు కొత్తబట్టలు పెట్టడం సంప్రదాయం. అలాంటిది పెరిగిన ధరలతో ఏది వండుకోవాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని సామాన్య, మధ్య తరగతి ప్రజలు వాపోతున్నారు. బియ్యం, పప్పులు, నూనెలు, కూరగాయలు, పాలు, వాటి ఉత్పత్తుల ధరలే కాదు వినాయక వ్రతానికి ఉపయోగించే పూలు, పండ్ల, ఇతర పూజా సామాగ్రి ధరలు కూడా చుక్కలనంటుతున్నాయి.గతంతో పోలిస్తే ధరలు 30 నుంచి 75 శాతం, కొన్ని వస్తువుల ధరలైతే ఏకంగా 100–150 శాతం మేర పెరిగాయని అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. ఏ వస్తువు కొందామన్నా భయపడే పరిస్థితి. దీంతో దాదాపు 40 శాతం మంది పిండివంటలకు దూరమయ్యే దుస్థితి నెలకొందని చెబుతున్నారు. ఫలితంగా పూజా సామాగ్రి, పిండి వంటల తయారీకి ఉపయోగించే వస్తువులకు గతేడాది రూ.1000 నుంచి రూ.1500 వరకు ఖర్చు చేసిన కుటుంబాలు ఈసారి రూ.2 వేల వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇక కొత్త బట్టల ఆలోచనే చేయలేని పరిస్థితి.చవితి పందిళ్లపైనా ధరల ప్రభావం..వినాయక చవితి అంటే పల్లెలు, పట్టణాల్లో వీధి వీధినా పందిళ్లు వేసి గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసుకొని నవరాత్రులు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అలాంటిది నేడు నగరాలు, పట్టణ ప్రాంతాల్లోనే కాదు పల్లెల్లో సైతం చవితి పందిళ్ల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నాయి. ప్రభుత్వ ఆంక్షలతో పాటు బహిరంగ మార్కెట్లో పెరిగిన ధరల ప్రభావం కూడా వీటిపై కని్పస్తోంది. గతంతో పోలిస్తే ఈ ఏడాది 30–40 శాతం మేర చవితి పందిళ్ల సంఖ్య తగ్గిందని దరఖాస్తుల సంఖ్య వెల్లడిస్తోంది. పండుగ వస్తుందంటే భయంగా ఉంది.. మాది వ్యవసాయ కుటుంబం. ఓ వైపు గిట్టుబాటు ధరల్లేక తీవ్రంగా నష్టపోతున్నాం. మార్కెట్లో పెరుగుతున్న ధరలతో రోజు గడవడమే కష్టంగా మారింది. పండుగ వస్తుందంటే భయపడే పరిస్థితి. పిల్లలకు కొత్త బట్టలు కొనడం కాదు కదా.. కనీసం పండుగ పూట ఇంట్లో పిండివంటలు చేసుకునేందుకు కూడా ఆలోచించాల్సి వస్తోంది. ధరలను అదుపు చేయాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. – ఆత్మకూరి శ్రీనివాసరావు, పెరవలిపాలెం, బాపట్ల జిల్లాపిల్లలు నోరు తెరిచి అడిగినా.. పండుగ వస్తుందంటే ఇంట్లో ఎంతో సందడిగా ఉండేది. పిల్లల కోసం పోటీపడి పిండివంటలు చేసేవాళ్లం. కనీసం రెండు మూడు రకాలు వండేవాళ్లం. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. బియ్యం నుంచి బెల్లం వరకు, కూరగాయల నుంచి నూనె వరకు ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయాయి. పిల్లలు నోరు తెరిచి పండుగ పూట ఏదైనా వండమ్మా అని అడిగితే ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి. రానురాను పండుగలకు దూరమై పోతున్నాం. – వన్నెంరెడ్డి సంతోషి, శ్రీనగర్ కాలనీ, కృష్ణా జిల్లా పూజలో ఉపయోగించే ఇతర సామాగ్రి ధరలు కూడా 50–80 శాతం మేర పెరిగాయి. పాలధర ఇప్పటికే లీటర్ రూ.80కి చేరింది. వినాయక చవితికి లీటర్కు మరో రూ.2 పెంచేందుకు ప్రైవేటు, సహకార డెయిరీలు సిద్ధమయ్యాయి. -
ఏడు దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా చంద్రబాబూ?
సాక్షి, అమరావతి: డీఎస్సీ నియామక ప్రక్రియలో ఏడు దశల వెరిఫికేషన్ అంటే ఇదేనా చంద్రబాబు అంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఏపీ మెగా డీఎస్సీ స్కామ్పై ఆయన మరోసారి ‘ఎక్స్’ వేదికగా చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘వెరిఫికేషన్.. నో, నో.. ఏడు దశల వెరిఫికేషన్’ అంటూ జగన్ ఎక్స్లో పోస్టు చేశారు. ఏడు దశలు పెట్టినా.. ఒక్కో కేసులో ఒక్కో అంశం బయటపడుతోందని చెప్పారు. వెరిఫికేషన్ పేరుతో అసలేం సాధించారంటూ నిలదీశారు. ఉపాధ్యాయ అభ్యర్థుల భవిష్యత్తుతో చంద్రబాబు సర్కారు ఆటలాడుతోందని అన్నారు. ఉపాధ్యాయ అభ్యర్థుల కెరీర్లు మీకు అపహాస్యంగా మారాయా అని మండిపడ్డారు. ‘ముందుగా విజేతల జాబితాను పరిశీలిస్తే అందులో సంబంధిత అభ్యర్థుల పేర్లు కనిపించడంలేదు. ఆ తర్వాత ఖోఖో అధికారులను సంప్రదిస్తే.. సర్టిఫికెట్ నకిలీదని తేలింది. అంతేకాకుండా నాగార్జున యూనివర్సిటీని సంప్రదిస్తే.. అసలు ఆ క్రీడా కార్యక్రమమే జరగలేదని తేలింది. ఇలాంటి పరిస్థితుల్లో డీఎస్సీ ప్రక్రియను న్యాయమైన, పారదర్శకమైన నియామక ప్రక్రియగా ఎలా పిలుస్తారు? ఇది స్కామ్ కాదా? దీనికి మీరు నైతిక బాధ్యత వహించరెందుకు’ అని వైఎస్ జగన్ సీఎం చంద్రబాబుని నిలదీశారు. స్కిల్ కేసులో క్లీన్చిట్ అని చెప్పడం దౌర్భాగ్యం చంద్రబాబు చేసిన స్కామ్లో ఆయనే సొంతంగా క్లీన్ చిట్ ఇప్పించుకుని భుజాలు ఎగరేసుకుంటున్నారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఆయన శనివారం ఫేస్బుక్లో ఈమేరకు ఒక పోస్టు చేశారు. ‘అధికారులను బెదిరించి తనపై ఉన్న కేసుల పని పూర్తి చేసుకుని క్లీన్చిట్ అని చెప్పడం దౌర్భాగ్యం. తన మీద కేసులు తానే కొట్టేయించుకుంటున్నాడు. ఎందుకంటే అవన్నీ నిజం కాబట్టి. ఇప్పుడు కూడా డీఎస్సీ కేస్ని నిర్వీర్యం చేసే పని చేస్తున్నాడు. అయినా స్కిల్ కేసులో తనకు క్లీన్చిట్ వచ్చిందని చెప్పుకోవడం ఎంతటి దౌర్భాగ్యం’ అని వైఎస్ జగన్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. -
ఉద్దానంలో 24.35% మందికి కిడ్నీ వ్యాధి
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో 24.35 శాతం మంది కిడ్నీ వ్యాధితో సతమతమవుతున్నారు. వ్యాధి మూలాలపై అధ్యయనం చేస్తున్న బృందం ఇప్పటి వరకూ 3,897 మందిని పరిశీలించగా వీరిలో 949 మందికి కిడ్నీ వ్యాధి ఉన్నట్టు గుర్తించారు. బాధితుల్లో 550 మందికి క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ), 399 మందికి కారణం తెలియని క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీయూ) ఉన్నట్టు తేల్చారు. కవిటి మండలంలో అత్యధికంగా వ్యాధి బాధితులున్నట్టు వెల్లడించారు. ఉద్దానం ప్రాంతంలో 5,851 మందిని పరిశీలించి ఇప్పటి వరకూ గుర్తించిన అంశాల ఆధారంగా ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్)కు మధ్యంతర నివేదికను అధ్యయన బృందం సమర్పించిందని రాష్ట్ర వైద్య శాఖ శనివారం ప్రకటించింది. మూత్రంలో ఆల్బుమిన్ స్థాయిలపైనా విశ్లేషణ చేపట్టారు. కొందరిలో కిడ్నీ పనితీరు సాధారణ స్థాయిలో ఉన్నప్పటికీ ఆల్బుమిన్ అసాధారణంగా కనిపించినట్లు నివేదికలో స్పష్టం చేశారు. కిడ్నీ పనితీరు తగ్గడంతో పాటు ఆల్బుమిన్ పెరిగిన వారిపై ప్రత్యేకంగా దృష్టిఅవసరం ఉందని అధ్యయనం సూచిస్తోంది. కిడ్నీ వ్యాధికి దారితీసే పర్యావరణ సంబంధిత అంశాలపై విశ్లేషణలో భాగంగా నీరు, మట్టి నమూనాలతో పాటు రక్తం, మూత్ర నమూనాల్లో పురుగుమందుల అవశేషాలు, భారీ లోహాలు తదితర అంశాలను పరిశీలిస్తున్నారు. -
రెట్రోతో జాగ్రత్త
సాక్షి, అమరావతి: రెట్రో.. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ ట్రెండ్. నేటి ఫొటోలను 1980ల కాలం నాటి చిత్రాల్లా మార్చుకునేందుకు ప్రతి ఒక్కరు కృత్రిమమేధ (ఏఐ) యాప్స్ను ఆశ్రయిస్తున్నారు. అప్పటి దుస్తులు, హెయిర్స్టైల్, కెమెరా ఎఫెక్ట్, ఫొటో క్వాలిటీతో తమ చిత్రాలను మార్చుకుని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. సరదాగా కనిపిస్తున్న ఈ ట్రెండ్ వెనుక అంతే ప్రమాదం పొంచి ఉంది. ఏఐ ఫొటో ఎడిటింగ్ యాప్కు చిత్రాన్ని అప్లోడ్ చేసినప్పుడు ఆ ఫొటోలోని ముఖాన్ని సాంకేతికంగా విశ్లేషించే అవకాశం ఉంటుంది. ముఖ ఆకృతి, కళ్లు, ముక్కు, పెదవులు తదితర అవయవాల లక్షణాలను గుర్తించే ప్రక్రియలో బయోమెట్రిక్ సమాచారానికి సంబంధించిన అంశాలుంటాయి. అందుకే ముఖానికి సంబంధించిన డేటాను సాధారణ ఫొటోగా మాత్రమే చూడలేమని టెక్ నిపుణులు చెబుతున్నారు. అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ (ఎన్ఐఎస్టీ) దాదాపు 200 ముఖగుర్తింపు అల్గారిథమ్లను పరీక్షించింది. ఈ పరిశీలనలో వయసు, లింగం, జాతి, దేశ నేపథ్యం వంటి అంశాల ఆధారంగా అల్గారిథమ్ల పనితీరులో తేడాలున్నట్లు గుర్తించింది.పరీక్షల్లో 1.8 కోట్లకుపైగా చిత్రాలు, 84.9 లక్షలమందికి సంబంధించిన డేటా ఉపయోగించారు. థర్డ్పార్టీ యాప్లలో వ్యక్తిగత వివరాలు, కుటుంబ ఫొటోలు ఇవ్వడం వల్ల వాటిని మార్ఫింగ్ చేసి అసభ్యంగా చిత్రీకరించి డబ్బులివ్వాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనలు ప్రస్తుతం తమ దృష్టికి వస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలంటూ సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.బయటకు వెళితే ప్రమాదం యూరోపియన్ డేటా ప్రొటెక్షన్ బోర్డు (ఈడీపీబీ) ముఖగుర్తింపు సాంకేతికతలో ఉపయోగించే బయోమెట్రిక్ డేటా అత్యంత సున్నితమైనదని పేర్కొంది. దాని దుర్వినియోగం జరిగితే వ్యక్తిగత వివరాల దొంగతనం, వ్యక్తి పేరుతో మోసాలు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించింది. 2024లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మోడళ్లలో వ్యక్తిగత డేటా వినియోగంపై ఈడీపీబీ ప్రత్యేక అభిప్రాయాన్ని కూడా విడుదల చేసింది. ఏఐ మోడళ్ల అభివృద్ధి, వినియోగంలో వ్యక్తిగత సమాచారాన్ని ఎలా ప్రాసెస్ చేస్తున్నారనే అంశంపై స్పష్టమైన నిబంధనలు, చట్టబద్ధత అవసరమని పేర్కొంది. కొన్నిసేవల నిబంధనల్లో వినియోగదారులు అప్లోడ్ చేసే కంటెంట్ను సేవ మెరుగుదల, పరిశోధన లేదా ఏఐ మోడళ్ల అభివృద్ధి వంటి ప్రయోజనాలకు ఉపయోగించే హక్కులు సంస్థకు ఉండవచ్చు. ప్రతి యాప్ నిబంధనలు ఒకేలా ఉండవు. అందుకే ఉచితంగా ఫొటో మార్చుకోవచ్చు.. అన్న కారణంతో ఏ యాప్కైనా వ్యక్తిగత చిత్రాలను ఇవ్వడం సరికాదని నిపుణులు సూచిస్తున్నారు. డిలీట్ చేస్తే అయిపోయినట్టు కాదుఫోన్లోగానీ, యాప్లోగానీ మనం ఏదైనా ఫొటోను డిలీట్ చేస్తే అది పూర్తిగా డిలీట్ అయినట్టేనా అనేది ఇప్పుడు అందరిలోనూ ఉన్న ప్రధాన సందేహం. ఏఐ యాప్లో ఫొటో అప్లోడ్ చేసేముందు ఆ సంస్థ ఫొటోలను ఎంతకాలం నిల్వచేస్తుంది? డిలీట్ చేసిన తర్వాత బ్యాకప్ కాపీలు ఉంటాయా? ఏఐ మోడల్ శిక్షణకు ఉపయోగిస్తారా? మూడోపక్ష (థర్డ్ పార్టీ) సంస్థలతో పంచుకుంటారా? వంటి అంశాలను ప్రైవసీ పాలసీలో పరిశీలించాలి. అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్టీసీ) గతంలోనే ముఖగుర్తింపు సాంకేతికతను ఉపయోగించే సంస్థలు వినియోగదారులకు డేటా ఎలా ఉపయోగిస్తారనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలని, ఒక ప్రయోజనం కోసం సేకరించిన ముఖం లేదా బయోమెట్రిక్ డేటాను ఇతర ప్రయోజనానికి ఉపయోగించేముందు స్పష్టమైన సమ్మతి తీసుకోవాలని సూచించింది. రెట్రో ఫొటో రెండు నిమిషాల్లో తయారవుతుంది. కానీ ఒకసారి మన ముఖం, వ్యక్తిగత డేటా ఎక్కడికి వెళ్లిందో తెలుసుకోవడం అంత సులభం కాదు. ట్రెండ్కోసం ఫొటో ఇచ్చే ముందు.. ఆ యాప్ మన డేటాతో ఏం చేస్తుందో తెలుసుకోవడం తప్పనిసరి.సరదాగా రిస్క్ చేయవద్దు » తెలియని ఏఐ ఫొటో యాప్స్లో వ్యక్తిగత చిత్రాలు అప్లోడ్ చేయవద్దు. » యాప్ ప్రైవసీ పాలసీని ముందుగా చదవాలి.» ఫొటోలను ఏఐ మోడల్ శిక్షణకు ఉపయోగిస్తారా? తెలుసుకోవాలి. » మూడోపక్ష సంస్థలతో డేటా పంచుకుంటారా? పరిశీలించాలి.» డేటా తొలగింపు సదుపాయం ఉందో చూడాలి. » ఆధార్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలు కనిపించే ఫొటోలు అస్సలు అప్లోడ్ చేయవద్దు. » పిల్లలు, కుటుంబసభ్యుల ఫొటోలను కూడా అవసరం లేకుండా థర్డ్పార్టీ యాప్స్కు ఇవ్వకపోవడమే మంచిది. -
రాబడి రూ.45,169 కోట్లు.. రుణాలు రూ.55,534 కోట్లు
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు రాష్ట్ర ఆదాయానికి మించి అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించేస్తున్నారు. రాష్ట్ర సొంత పన్నుల రాబడిని మించి అప్పులు చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27)లో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఐదు నెలల కాలంలో రాష్ట్ర పన్నుల రాబడి రూ.45,169 కోట్లుగా ఉందని జిల్లా కలెక్టర్ల సదస్సులో రాష్ట్ర ఆర్థిక శాఖ పేర్కొంది. అయితే ఇదే సమయంలో రాష్ట్ర బడ్జెట్ రుణాలు రూ.55,534 కోట్లు. అంటే రాష్ట్ర సొంత పన్ను రాబడిని మించి ఏకంగా రూ.10,365 కోట్లు అప్పు చేశారు. ఐదు నెలల్లో సగటున నెలకు రూ.11 వేల కోట్లకుపైగా బడ్జెట్ అప్పు చేస్తున్నారు. అయితే రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం నెలకు సగటున దాదాపు రూ.9,000 కోట్లు మాత్రమేనని ఆర్థిక శాఖ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర సొంత ఆదాయానికి మించి అప్పులు చేయడం అంటే రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేయడమేనని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఆస్తులు, అప్పుల నిష్పత్తిపై ప్రతికూలత భారీ అప్పులు తీసుకువస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఆస్తుల కల్పనపై మాత్రం అంతంతమాత్రంగానే వ్యయాలు చేస్తోంది. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు క్యాపిటల్ వ్యయం రూ.16,001 కోట్లు మాత్రమేనని ఆర్థిక శాఖ గణాంకాలు పేర్కొన్నాయి. పైగా ఈ వ్యయాల్లో అత్యధిక భాగాన్ని ఫలితంలేని రంగాలకు బాబు ప్రభుత్వం మళ్లిస్తోంది. దీంతో అప్పులు పెరిగిపోయి, ఆస్తుల నిష్పత్తి తగ్గిపోనుంది. అప్పులు చేయకుండా సంక్షేమం, అభివృద్ధి చేస్తానంటూ ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు అందుకు పూర్తి విరుద్ధంగా అప్పులు చేయడమే లక్ష్యంగా పాలన కొనసాగిస్తున్నారు. పైగా గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలకు మంగళం పాడటమే కాకుండా తాను ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను కూడా చంద్రబాబు అమలు చేయడం లేదు. భారీగా అప్పులు చేస్తున్నా ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి తిలోదకాలు ఇచ్చేసి పబ్లిక్–ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) పేరుతో ప్రైవేట్పరం చేస్తున్నారు. -
డీఎస్సీపై నిజాయితీ నిరూపించుకోండి
సాక్షిప్రతినిధి, విజయనగరం: ‘డీఎస్సీలో అవకతవకలు జరిగాయి. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు అమ్ముకున్నారు. ఇదే విషయాన్ని మేం ధైర్యంగా చెబుతున్నాం. అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపి నిజాయితీ నిరూపించుకోండి’ అని చంద్రబాబు ప్రభుత్వాన్ని శాసనమండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. శనివారం విజయనగరంలో వైఎస్సార్సీపీ జిల్లా విస్తతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డీఎస్సీ అక్రమాలపై అసెంబ్లీలోను, బయట చాలెంజ్ చేస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శాసనమండలిలో ఎందుకు చాలెంజ్ చేయడం లేదని ప్రశ్నించారు. డీఎస్సీ నియామకాలపై తప్పుగా మాట్లాడితే కేసులు పెడతామంటూ అధికారులతో చెప్పించడం సిగ్గుచేటన్నారు. నారా లోకేశ్ నీతిమంతుడైతే తక్షణమే విచారణకు ఆదేశించాలన్నారు. 2006లో వోక్స్వ్యాగన్ అంశంలో తనపై ఆరోపణలు వచ్చాయని, తానే స్వయంగా సీబీఐ విచారణ జరిపించుకుని నిజాయితీని నిరూపించుకున్నట్టు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో పోలీస్ వ్యవస్థపై నమ్మకంపోవడం ప్రజాస్వామ్యంలో దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ప్రజా సమస్యలపై పోస్టులు పెడితే బెదిరింపులకు పాల్పడుతున్నారని, మహిళా కార్యకర్తలపై అసభ్యకర పోస్టింగ్లు పెట్టడం దారుణమన్నారు. టీడీపీ వారిపై ఎందుకు కేసులు పెట్టడం లేదని నిలదీశారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయకపోవడం దౌర్భాగ్యమన్నారు. ఈ పరిస్థితిలోనూ రైతులకు ఒక యూరియా బస్తా దొరకని పరిస్థితి ఉందన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు విడ్డూరం: కన్నబాబుపార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. రెండు రోజులపాటు నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు సమీక్షలు కాదు ఫలితాలు కావాలంటూ వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీ బాధ్యతగల ప్రతిపక్షంగా అదే చెబుతోందన్నారు. ఉదయం ఇచ్చిన పింఛన్ డబ్బులు సాయంత్రానికి మద్యం తాగేస్తున్నారని, ఎవరికి పింఛన్ ఇవ్వాలో, ఎవరికి ఇవ్వకూడదో వెరిఫై చేయాలని చెప్పడం వెనుక చంద్రబాబు ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. కొత్తగా పింఛన్లు ఇస్తామని రెండున్నరేళ్ల తరువాత ప్రకటించి, పింఛన్ల కోసం కుటుంబాలు విడిపోయాయా లేదా అని సర్వే చేయాలనడం సరికాదన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్యాన్ని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకున్నా తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఇంటింటికీ మద్యం సరఫరా చేసే పరిస్థితి తీసుకువచ్చారన్నారు. రాష్ట్రంలో విక్రయిస్తున్న ప్రతి 4 మద్యం బాటిళ్లలో ఒక నకిలీ బాటిల్ ఉంటోందన్నారు.డీఎస్సీలో పేకాట ఆడినవారికి ఉద్యోగాలిస్తామని చంద్రబాబు చెప్పడం విచారకరమన్నారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్న చందంగా టీడీపీ కూటమి ప్రజాప్రతినిధులు క్రీడా అసోసియేషన్ల ప్రతినిధులుగా సర్టిఫికెట్లు జారీచేసి ఉపాధ్యాయ ఉద్యోగాలను అమ్ముకున్నారన్నారు. సమావేశంలో మాజీ మంత్రులు గుడివాడ అమర్నా«థ్, పీడిక రాజన్నదొర, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొన్నారు. -
మందు 'బాబుకు పండగ'
ఎన్నికల హామీలకు మంగళం పాడిన నారా చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారించేందుకు కంకణం కట్టుకుంది. ఇప్పటికే ఇబ్బడి ముబ్బడిగా ఉన్న బెల్ట్ దుకాణాలు, అనధికార మద్యం విక్రయాలతో మందుబాబులు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా గుల్లవుతుంటే, ఇవి చాలవన్నట్టు మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూమ్లను తప్పనిసరి చేస్తూ ఎక్సైజ్ పాలసీని తీసుకురావడం సర్వత్రా విమర్శలను ఎదుర్కొంటోంది. దీని ద్వారా ఇకపై దుకాణాల వద్దే ‘సిట్టింగ్’ను అధికారికం చేయడమేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ కొత్త విధానం గాంధీ జయంతికి ముందు రోజు అక్టోబరు 1వ తేదీ నుంచి అమలు చేస్తుండడంపై నిప్పులు చెరుగుతున్నారు. సాక్షి, అమరావతి: తాజాగా మద్యం షాపులకు పర్మిట్ రూమ్ను తప్పనిసరి చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీని తెచ్చింది. దీంతో ఊరూరా బార్ అనే కొత్త పంథాకు ప్రభుత్వం తెరతీసినట్టయింది. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన 2026–27 ఎక్సైజ్ పాలసీ, దాని అమలుకు తెచ్చిన నిబంధనల సవరణలను పరిశీలిస్తే మద్యం విక్రయాలను భారీగా పెంచి మందుబాబుల జేబులకు మరింత చిల్లు పెట్టేలా ఉంది. మద్యం దుకాణం ఏర్పాటు చేయాలంటే పర్మిట్ రూమ్ ఉండి తీరాలని తాజాగా విడుదల చేసిన జీఓ ఎంఎస్ నెంబర్ 580లో పేర్కొన్నారు. పర్మిట్ రూమ్ లైసెన్స్ పొందకుండా ఏ షాపు ఏర్పాటు చేసేందుకు అనుమతి లేదని రూల్ 14లో స్పష్టం చేశారు. పాలసీ మార్గదర్శకాల జీవో 579లోనూ ఇదే నిబంధనను పునరుద్ఘాటించారు. దీంతో రాష్ట్రంలోని 3,736 మద్యం దుకాణాలను అక్టోబరు 1వ తేదీ నుంచి నుంచి ఊరూ–వాడా– బార్లుగా మారే అవకాశం కల్పించారు. నాడు వైఎస్ జగన్ నియంత్రిస్తే.. నేడు బాబు విస్తరిస్తున్నారు మద్యం వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కట్టుదిట్ట చర్యలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనధికార బెల్ట్ షాపులతోపాటు పర్మిట్ రూమ్లనూ పూర్తిగా ఎత్తివేశారు. మద్యం షాపుల సమీపంలో కూర్చొని తాగే ఏర్పాటునూ రద్దు చేశారు. అనంతరం చంద్రబాబు ప్రభుత్వం క్రమంగా మద్యం విక్రయాలతోపాటు వినియోగాన్ని విస్తరించేలా పాలసీలు తెస్తోంది. 2025 ఆగస్టు 12న జీవో 273 ద్వారా అవసరమైన చోట అనే పేరుతో పర్మిట్ రూమ్లను తిరిగి తెచ్చారు. అప్పుడు శాఖాపరంగా పరిశీలించి పర్మిట్ రూమ్లకు అనుమతులిస్తే.. ఇప్పుడు పర్మిట్ రూమ్ ఉంటేనే మద్యం షాపు లైసెన్స్ రెన్యువల్ అనే మెలికపెట్టడం గమనార్హం. దీని వల్ల మండల కేంద్రాలు, నగర పంచాయతీలు, పట్టణ కాలనీల్లో ఇలా మద్యం దుకాణం ఉన్న ప్రతిచోటా అక్కడే కూర్చొని మందు తాగే గది తప్పనిసరిగా ఉండనుంది. ఆదాయమే అసలు లక్ష్యం.. టీడీపీ సిండికేట్కు అక్రమ ఆదాయమే అసలు లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం మద్యం పాలసీని అమలు చేస్తోంది. మద్యం షాపులకు పర్మిట్ రూమ్ పేరుతో 50 వేల లోపు జనాభా ప్రాంతాల్లో ఏడాదికి రూ.5 లక్షలు, ఆపైన ఉన్న చోట రూ.7.5 లక్షలు చొప్పున చెల్లించాల్సి ఉంది. ఇలా రాష్ట్రంలోని 3,736 మద్యం షాపులకు పర్మిట్ రూమ్ తప్పనిసరి చేయడంతో రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ద్వారా ఏడాదికి రూ.200 కోట్లకుపైగా ఆదాయం ఆర్జించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజారోగ్యం, మహిళల భద్రత, గ్రామాల్లో శాంతిభద్రతలు గురించి ప్రభుత్వ పాలసీలో పట్టించుకోలేదు. రెన్యువల్ పేరుతో మరో రూ.వెయ్యి కోట్లు ఇప్పుడు మద్యం షాపుల లైసెన్స్ మరో ఏడాదిపాటు రెన్యువల్ చేయడం వల్ల ప్రభుత్వానికి 38 శాతం అదనంగా ‘రెన్యువల్ ఆర్ఈటీ‘ చెల్లించాలి. ఓపెన్ కేటగిరీలో జనాభాను బట్టి రూ.23 లక్షలు, రూ.27.2 లక్షలు, రూ.35.5 లక్షలు. రిజర్వ్డ్ కేటగిరీలో రూ.11.5 లక్షల నుంచి రూ.17.8 లక్షలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 3,736 ఓపెన్ షాపుల్లో 340 రిజర్వ్డ్ షాపుల లెక్క తీసేస్తే రెన్యువల్ ఆర్ఈటీ రూపంలో రూ.వెయ్యి కోట్లు వరకు ఆదాయం వస్తుందని అంచనా.మరింత పేట్రేగిపోనున్న టీడీపీ సిండికేట్.. ఇప్పటికే టీడీపీ సిండికేట్ మద్యం ధరలను ఎమ్మార్పీ కంటే రూ.5 నుంచి రూ.20లకు పెంచి విక్రయిస్తున్నారు. అదనంగా వసూలు చేస్తున్న మొత్తంలో ఎవరి వాటాలు వారికి వెళ్తున్నాయనేది బహిరంగ రహస్యం. తాజాగా రెన్యువల్ పేరుతో అదనంగా లైసెన్స్ ఫీజు, పర్మిట్ రూమ్కు ట్యాక్స్ వంటి కారణాలు చూపి మద్యం ధరలను అనధికారికంగా మరింత పెంచి విక్రయించే ప్రమాదం లేకపోలేదు. -
ఏపీలో పోలింగ్ ముగిశాక 17.25లక్షల ఓట్లు అదనంగా పోలయ్యాయి
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్) ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 13 కోట్ల మంది ఓట్లు తొలగించారని, వీరంతా వీధుల్లోకి వచ్చి తమ ఓటు హక్కు కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ అన్నారు. సీపీఎం జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి 2వ వర్ధంతిని శనివారం గుంటూరులోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సభలో ‘ప్రజాస్వామ్యంలో ఎన్నికలు, విశ్వసనీయత, పౌరసమాజం కర్తవ్యం’ అనే అంశంపై పరకాల ప్రభాకర్ స్మారకోపన్యాసం చేశారు. సర్ పేరుతో సంచార జాతులు, వలస కార్మికులు, మైనార్టీలు, దళితులు, ఆదివాసీల ఓట్లు తొలగిస్తున్నారని పరకాల ఆందోళన వ్యక్తంచేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ పూర్తయిన 10 రోజుల తర్వాత పూర్తిస్థాయి పోలింగ్ శాతాన్ని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. ఏపీలో 2024 మే నెలలో పోలింగ్ పూర్తయిన తర్వాత 3,500 పోలింగ్ బూత్లలో 17.25 లక్షల ఓట్లు అదనంగా పోలయ్యాయని, రాత్రి 11 నుంచి తెల్లవారుజూమున 2 గంటల వరకు ప్రజలు పోలింగ్ బూత్ల వద్ద నిలబడి ఓటు వేశారని ఎన్నికల కమిషన్ ప్రకటించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అలా ఓట్లు వేసినవారిని ఆధారాలతో చూపితే తాను వారికి పాదపూజ చేస్తానని పరకాల చెప్పారు. సర్ ప్రక్రియ ద్వారా అడ్డగోలుగా ఓట్లు తొలగిస్తున్న ఎన్నికల సంఘం ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోతోందని చెప్పారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో పలువురు నాయకులు పాల్గొన్నారు. -
అందుకే కలెక్టర్లను చంద్రబాబు బెదిరిస్తున్నారు: టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ఫ్రస్టేషన్ పీక్ లెవల్కు చేరిందని.. అందుకే కలెక్టర్లను కూడా బెదిరిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. ఆయన శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మహిళా ఐఏఎస్ సునీతను చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేశారని.. స్కిల్ కేసులో సునీత నిజాలు మాట్లాడారన్న కోపంతో చంద్రబాబు ఉన్నారన్నారు.‘‘చంద్రబాబు ఒత్తిడి చేయటం వలనే తాను సంతకాలు చేసినట్టు సునీత చెప్పారు. అందుకే తాను స్కిల్ కేసులో ఇరుక్కున్నానని చంద్రబాబు అనుమానిస్తున్నారు. అందుకే ప్రతిసారీ సునీతను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఒక దళిత ఐఏఎస్ అధికారిణిపై చంద్రబాబు నోరు పారేసుకోవటం సరికాదు. ఆమె తన బాధను మిగతా అధికారులతో చెప్పుకుంది. స్పోర్ట్స్ కోటాలో నారా లోకేష్ తన మనుషులకు అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చారు. ఈ ఆధారాలన్నీ బయట పడినా.. చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో ఎందుకు మాట్లాడలేదు?’’ అంటూ టీజేఆర్ నిలదీశారు.‘‘డీఎస్సీ అక్రమాలను అధికారుల మీదకు నెట్టేశారు. అందుకే చంద్రబాబు మాటలు నమ్మి సంతకాలు చేయవద్దని పదేపదే చెప్పాం. మా పార్టీ అధికారంలోకి వచ్చాక లోకేష్ జైలుకు వెళ్లటం ఖాయం. నీట్ పేపర్ లీక్తో కేంద్రమంత్రి రాజీనామా చేశారు. మరి నారా లోకేష్ ఎందుకు రాజీనామా చేయలేదు?. చంద్రబాబు, లోకేష్ అవినీతిలో అధికారులు బాధ్యులు కావద్దు. ఐఏఎస్ అధికారిని సునీత లాగా స్ట్రాంగ్గా నిలబడాలి...ఎల్నినో ఎఫెక్ట్తో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాలు పడవని ముందే ప్రపంచమంతా తెలుసు. కానీ ఇప్పటివరకు ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టలేదు. ఇప్పుడు కలెక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేయటం సబబు కాదు. చంద్రబాబు చెప్పిన పెట్టుబడులు, ఉద్యోగాల లెక్కలన్నీ పచ్చి అబద్దాలు. రాష్ట్ర ప్రజలను దగా చేశారు. పెన్షనర్లను తాగుబోతులనటం దుర్మార్గం. వృద్దులు, వికలాంగులను తాగుబోతులు అంటూ అవహేళన చేయటం తగదు. ఆ మాటలను చంద్రబాబు వెంటనే వెనక్కు తీసుకోవాలి’’ టీజేఆర్ డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: ఈ ఆటలేంటి చంద్రబాబూ?: వైఎస్ జగన్ ఫైర్ -
వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. ఇష్టానుసారం పెన్షన్లు, ఇళ్లు ఇచ్చింది
సాక్షి, అమరావతి: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హౌస్ మ్యాపింగ్ పేరుతో పేదలకు ఇష్టానుసారం పెన్షన్లు, ఇళ్లు ఇచ్చేసిందని, డబ్బులు కూడా అలాగే ఇచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్షేపించారు. నాటి సర్కారు ఇచ్చిన హౌస్ మ్యాపింగ్ ఆదేశాలను వెంటనే రద్దుచేయాలని అధికారులను ఆదేశించారు. కొత్త పెన్షన్ల జారీకి ముందే కుటుంబం యూనిట్గా మ్యాపింగ్ చేయాలన్నారు. తమ ప్రభుత్వం ఉమ్మడి, పెద్ద కుటుంబాలకే సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత ఇస్తుందని, చిన్న కుటుంబాలను వారి ఆర్థిక స్థితిని బట్టి మెరిట్ ఆధారంగా చూస్తామని ఆయన చెప్పారు. పెద్ద కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వడం, ఆ కుటుంబానికి ఎక్కువ ప్రయోజనాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇదే ప్రభుత్వ విధానమని, దీనికి అనుగుణంగానే పాలసీలు, కార్యాచరణ ఉండాలని సీఎం తేల్చిచెప్పారు. రెండో రోజు శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సునుద్దేశించి ముఖ్యమంత్రి వివిధ అంశాలపై మాట్లాడుతూ.. రేషన్, పెన్షన్లు, ఇళ్ల కోసం కుటుంబాలను చిన్న కుటుంబాలుగా విభజించడం సరికాదన్నారు. (అంటే.. పేద వర్గాలను పెద్ద, చిన్న కుటుంబాలుగా వర్గీకరిస్తూ సంక్షేమ పథకాల లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేయాలనే ఎత్తుగడ సీఎం మాటల్లో స్పష్టంగా కనిపించింది). ఈ సమయంలో ఐఏఎస్ అధికారి కె. భాస్కర్ జోక్యం చేసుకుని ఒకే వ్యక్తి ఉన్న కుటుంబాలు 30 లక్షల యూనిట్లున్నాయని, వారికి ఇచ్చే ప్రయోజనాలకు హాని కలగకుండా చూడాలన్నారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ఉన్న వారిని కొనసాగిస్తూనే కుటుంబం యూనిట్గా మ్యాపింగ్తో హేతుబద్దీకరణ చేయాలన్నారు. పెళ్లి చేసుకున్న జంటలకు రేషన్ కార్డులు ఇవ్వాలని మంత్రి నాదెండ్ల కోరారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ‘రేషన్ కార్డులివ్వండి, అంతేగానీ.. దానికోసం కుటుంబాలను విడదీయవద్దని సూచించారు. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఐదు కిలోల చొప్పున రేషన్ బియ్యం అందించేలా చూడాలన్నారు. అవసరమైతే పది మంది గల పెద్ద కుటుంబాలకు ఒక కేజీ రేషన్ ఎక్కువ ఇవ్వాలన్నారు. చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే.. లబ్దిదారులు తాగుడుకు అలవాటుపడుతున్నారేమో చూడండి.. ప్రతీనెలా 1వ తేదీన పేదల సేవలో భాగంగా అందిస్తున్న డబ్బులను లబ్ధిదారులు సది్వనియోగం చేసుకుంటున్నారా లేక తాగుడుకు అలవాటు పడుతున్నారా చూడండి. గ్రామ, వార్డు సచివాలయాలకు ఒక్కో ఈవీ సైకిల్ ఇవ్వాలి. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది విధుల స్పష్టత కోసం జాబ్ ఛార్ట్ రూపొందించాలి. పీ–4 కార్యక్రమం మొక్కుబడిగా చేస్తున్నారు. ప్రజా సమస్యలపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. సరిగ్గా పనిచేయని వారిని పక్కన పెట్టాలి. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, మండల స్థాయిలో అధికారులు నెలలో నాలుగుసార్లు గ్రామాలకు వెళ్లాలి. ఇంకా కొంతమంది కార్యదర్శులు, శాఖాధిపతులు, కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లడంలేదు. ఇందులో ఎవ్వరికీ మినహాయింపులేదు. దీనిని తేలికగా తీసుకుంటే కఠినంగా ఉంటాం. ఒక చెవితో విని మరో చెవితో వదిలేస్తున్నారు. ఫోన్ లేకుండా రాలేరా? ఏసీ రూమ్ల్లో కూర్చుని ప్రజలను, వారి సమస్యలను పట్టించుకోకపోతే జెన్జీకే కాదు అందరికీ కడుపు మండుతుంది. అప్పుడు జెన్జీ లాంటి ఉద్యమాలు వస్తాయి. సరైన న్యాయం జరగలేదనిపిస్తే ఎవరైనా ప్రశ్నిస్తారు. ఫైళ్ల పరిష్కారంలో కొంతమంది మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులు మూడ్రోజులకు పైగా సమయం తీసుకుంటున్నారు. వాట్సాప్ మెసేజ్లు చూస్తారు గానీ ఫైళ్లు చూడలేరా? ఫైళ్లన్నీ ఆన్లైన్లోనే నిర్వహించాలి. నెలరోజుల్లో భౌతిక ఫైళ్లకు ముగింపు పలకాలి. కొంతమంది శాఖాధిపతులు సమావేశానికి గైర్హాజరయ్యారు. వారికెంత ధైర్యం? ఫోన్ లేకుండా 12 గంటలు సమావేశానికి హాజరుకాలేరా? గైర్హాజరైన వారి నుంచి వివరణ తీసుకోండి. చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటా. ఇక ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలి. విద్యారంగంపై ప్రభుత్వ వ్యయం తగ్గించాలి.. నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన అంతా కాగితాలకే పరిమితమైంది. విద్యా రంగంపై ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించాలి. అలాగే, వైద్య రంగంలో సంజీవని పథకాన్ని అమలుచేయడం ద్వారా ఆ రంగం బడ్జెట్లో రూ.5,000 కోట్లు తగ్గించాలి. జిల్లా కలెక్టర్లు సోలార్రూఫ్ టాప్ పథకం ‘సూర్యఘర్’ ద్వారా ఎన్ని ఎక్కువ ఇన్స్టలేషన్లు చేయిస్తే విద్యుదుత్పత్తిపై అంత ఒత్తిడి తగ్గుతుంది. -
మళ్లీమళ్లీ అవే మాటలు..
సాక్షి, అమరావతి: గతేడాది అక్టోబర్లో కర్నూలు జిల్లా చిన్నటేకూరులో కావేరి బస్సు కాలిపోయి 19 మంది సజీవదహనమైతే.. రోడ్డు ప్రమాదాల నివారణకు కఠినచర్యలు తీసుకుంటాం అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ ఏడాది మార్చిలో మార్కాపురం జిల్లా రాయవరంలో బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 14 మంది దుర్మరణం పాలై, 28 మంది గాయపడితే.. రోడ్డు ప్రమాదాల నివారణకు కఠినచర్యలు తీసుకుంటాం అంటూ సీఎం మళ్లీ అదే ప్రకటన చేశారు. గత కలెక్టర్ల సమావేశంలోను రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలిచ్చేశారు. తాజాగా జరిగిన కలెక్టర్ల సమావేశంలోను అదే పాట పాడారు. ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు మాత్రం గడప దాటడంలేదన్నది వీటిని గమనిస్తే అర్థమవుతోంది. దేశంలోనే రోడ్డు ప్రమాదాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటిస్థానంలో ఉందని చెబుతున్న సీఎం.. ఆ ప్రమాదాల నివారణకు ఆచరణలో కనీస చర్యలు కూడా తీసుకోవడంలేదన్నది తేటతెల్లమవుతోంది. ప్రమాదాలు జరిగినప్పడు, అధికారులతో సమీక్ష నిర్వహించినప్పుడు ఊకదంపుడు మాటలు తప్ప.. ఆచరణలో అడుగు ముందుకు వేయడంలేదు. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో రోడ్డు భద్రత కమిటీలు పనిచేయడంలేదు. ఈ ఏడాది ప్రారంభంలో రోడ్డు భద్రత కమిటీలను నియమిస్తున్నట్టు రవాణాశాఖ ఉత్తర్వులు ఇచ్చినా.. అవి ఎక్కడా పనిచేస్తున్న దాఖలాలే లేవు. జిల్లాల్లో కలెక్టర్ చైర్మన్గా, ఎస్పీ వైస్ చైర్మన్గా ఉండే ఈ కమిటీలు ఎప్పటికప్పుడు సమీక్షించి ప్రమాద ప్రాంతాలు (బ్లాక్ స్పాట్స్) గుర్తించాలి. ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి. అవేవీ ఎక్కడా పనిచేస్తున్నట్లు కనిపించడంలేదు. మరోవైపు రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ఇచ్చిన రూ.40 కోట్లతో రోడ్డు భద్రత పరికరాలు కొనుగోలు చేసేందుకు చేపట్టిన టెండర్ల ప్రక్రియ నెలల తరబడి పెండింగ్లోనే ఉంది. పోలీసుశాఖకు రూ.20 కోట్లు, రవాణాశాఖకు రూ.20 కోట్లు చొప్పున కేటాయించిన ఈ నిధులతో స్పీడ్గన్స్ తదితర పరికరాలు కొనుగోలు చేయాలనే ప్రతిపాదన ఎందుకు అమలవలేదన్నది సీఎంకే తెలియాలి. ప్రతిసారి రోడ్డు ప్రమాదాల విషయంలో సీఎం చంద్రబాబు మాటలకే పరిమితమవుతున్న విషయం తాజాగా కలెక్టర్ల సమావేశంలో మరోసారి స్పష్టమైంది. సోషల్ మీడియాను కట్టడి చేయాలి రోడ్డు ప్రమాదాల్లో ఆంధ్రప్రదేశ్ జాతీయస్థాయిలో మొదటిస్థానంలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కలెక్టర్ల సదస్సు ముగింపు సందర్భంగా రాష్ట్రంలో శాంతిభద్రతలపై సీఎం చంద్రబాబు మాట్లాడారు. ప్రతి రోడ్డు ప్రమాదాన్ని ఆడిట్ చేయాలని, ప్రమాద ప్రాంతానికి అంబులెన్స్లు ఎంత సమయానికి చేరుకోగలుగుతున్నాయనేది విశ్లేషించాలని సూచించారు. డ్రగ్స్, మహిళలపై నేరాలు, రోడ్డు ప్రమాదాలను పూర్తిస్థాయిలో నివారించే లక్ష్యంగా త్రిశూల్ పేరుతో రాష్ట్ర, జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేసి కార్యాచరణను రూపొందించాలని ఆదేశించారు. సోషల్ మీడియా ఆగడాలపై మంత్రుల కమిటీ లోతుగా అధ్యయనం చేయాలని, పోలీసులు వాటిని కట్టడి చేయాలని చెప్పారు. సైబర్ టెక్నాలజీలో నిపుణుల్ని సీఐడీలో ప్రత్యేక బృందంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. గత రెండేళ్లలో 14 శాతం మేర నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నేరాలు 29.2శాతం దిగివచ్చాయన్నారు. -
కాలువలకు నిధులు కట్!
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు సర్కార్ చేసిన మరో ద్రోహం బహిర్గతమైంది.. కుడి, ఎడమ కాలువల కింద 7.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడానికి డిస్ట్రిబ్యూటరీల (ఉప కాలువలు, పిల్ల కాలువలు) పనులకు కేంద్రం నిధులు కేటాయించకపోయినా చంద్రబాబు సర్కార్ నోరుమెదపడం లేదు. ఓ వైపు 2027, మార్చి నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి, జాతికి అంకితం చేస్తామంటూ పదే పదే ప్రకటిస్తున్న చంద్రబాబు సర్కార్ ఇంతవరకు డిస్ట్రిబ్యూటరీల పనులు చేపట్టే ఆలోచన కూడా చేయకపోవడాన్ని సాగునీటిరంగ నిపుణులు ఎత్తిచూపుతున్నారు. గరిష్ఠ నీటి మట్టం 45.72 మీటర్లతో కాకుండా కనిష్ఠ నీటి మట్టం 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు.. అంచనా వ్యయాన్ని రూ.30,436.95 కోట్లకు సవరిస్తూ 2024, ఆగస్టు 28న కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మిగిలిన పనులు పూర్తికి రూ.12,157.53 కోట్లు మాత్రమే ఇస్తామని తేల్చిచెప్పింది. అందులో డిస్ట్రిబ్యూటరీల పనుల అంచనా వ్యయాన్ని మినహాయించడం గమనార్హం. డిస్ట్రిబ్యూటరీల పనులకు రూ.5,338.5 కోట్లు అవసరం. అంటే.. ఆ భారం కూడా రాష్ట్ర ఖజానాపై పడినట్లేనని సాగునీటిరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. డిస్ట్రిబ్యూటరీలకు 2023లో ప్రతిపాదనలు..పోలవరం కుడి కాలువ పొడవు 178.812 కిలో మీటర్లు ప్రవాహ సామర్థ్యం 17,560 క్యూసెక్కులు. పోలవరం ఎడమ కాలువ పొడవు 212.32 కి.మీ.లు. ప్రవాహ సామర్థ్యం 17,580 క్యూసెక్కులు. కుడి కాలువ కింద 3.2 లక్షల ఎకరాలకు నీటిని సరఫరా చేయడానికి వీలుగా డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ ఏర్పాటుకు రూ.2,248.89 కోట్లు.. ఎడమ కాలువ కింద 4 లక్షల ఎకరాలకు నీటిని సరఫరా చేసేందుకు డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ ఏర్పాటుకు రూ.3,090.01 కోట్లు వ్యయం అవుతుందని 2023లో పోలవరం ప్రాజెక్టు అధికారులు అంచనా వేశారు. ఆ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లను తయారుచేసిన పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ) ద్వారా కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ), కేంద్ర జల్ శక్తి శాఖకు అప్పట్లోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం పంపింది. వాటిపై సీడబ్ల్యూసీ అధికారులు పలుమార్లు లేవనెత్తిన సందేహాలను రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు నివృత్తి చేశారు. డిస్ట్రిబ్యూటరీల అంచనా వ్యయాన్ని ఆమోదించే ప్రక్రియ అప్పట్లోనే తుది దశకు చేరుకుంది. కానీ.. ఇప్పుడు డిస్ట్రిబ్యూటరీలకు కేంద్రం నిధులు కేటాయించకపోయినా చంద్రబాబు సర్కార్ నోరుమెదపకపోవడం గమనార్హం. జలాశయం నిర్మాణం పూర్తయ్యేలోగా కుడి, ఎడమ కాలువలతోపాటు డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేస్తేనే సత్వరమే ఆయకట్టుకు నీళ్లందించి రైతులకు పోలవరం ఫలాలను అందించే అవకాశం ఉంటుంది. అప్పుడే పోలవరం ఫలాలు రైతులకు అందుతాయి. కానీ.. చంద్రబాబు సర్కార్ ఆ దిశగా చర్యలు తీసుకోకుండా రైతులకు ద్రోహం చేస్తోందని సాగునీటిరంగ నిపుణులు మండిపడుతున్నారు. కరిగిపోతున్న స్వప్నం..గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం 2005లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దశాబ్దాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టును సాకారం చేస్తూ పనులు చేపట్టారు. ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ 194.6 టీఎంసీలు. ఈ ప్రాజెక్టు ద్వారా 322 టీఎంసీలను వినియోగించుకోవడానికి ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. కానీ.. నీరు నిల్వ చేసే ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించడం వల్ల పోలవరం రిజర్వాయర్ను చంద్రబాబు సర్కార్ బ్యారేజ్గా మార్చేసింది. ప్రాజెక్టులో 45.72 మీటర్ల ఎత్తు వరకూ నీటిని నిల్వ చేయాలంటే భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ.30 వేల కోట్లకుపైగా అవసరం. ఆ భారం రాష్ట్ర ఖజానాపై పడుతుందని సాగునీటిరంగ నిపుణులు అంటున్నారు. ఇక 2017, ఆగస్టు 17న నాటి చంద్రబాబు సర్కార్ కేంద్రానికి పంపిన డీపీఆర్–2లో చేసిన తప్పిదాల వల్ల కుడి కాలువ సామర్థ్యం 11 వేల క్యూసెక్కులు, ఎడమ కాలువ సామర్థ్యం 8 వేల క్యూసెక్కులతో చేపట్టిన పనులకే బిల్లులు ఇస్తామని కేంద్ర జల్ శక్తి శాఖ తేల్చి చెప్పింది. దీని వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.4,753.93 కోట్ల భారం పడుతుందని జల వనరుల శాఖ అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పోలవరంలో 41.15 మీటర్ల వరకే నీటి నిల్వను పరిమితం చేయడం వల్ల గోదావరికి వరద వచ్చే రోజుల్లో మాత్రమే కుడి, ఎడమ కాలువలు.. పుష్కర, తాడిపూడి ఎత్తిపోతల కింద ఉన్న 1.58 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడానికి అవకాశం ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు కింద మిగతా 5.62 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదు. కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాలు, గోదావరి డెల్టాలో 10.13 లక్షల ఎకరాల స్థిరీకరణ, ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం కింద 8 లక్షల ఎకరాలకు నీళ్లందించడం అసాధ్యమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. జల విద్యుదుత్పత్తి పూర్తి స్థాయిలో చేపట్టడమూ అసాధ్యమే. అంటే కళ్ల ముందే చిరకాల స్వప్నం కరిగి పోతుండటంతో రైతులు, సాగు నీటి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
గళమెత్తిన ‘జెన్’తరంగం
తిరుపతి సిటీ: విద్యాబుద్ధులు నేర్పిన ఎస్వీ యూనివర్సిటీకే వెన్నుపోటు పొడుస్తూ, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన మూడు విశ్వవిద్యాలయాలను తనకు జన్మనిచ్చిన తిరుపతి జిల్లా నుంచి సీఎం చంద్రబాబు అమరావతికి తరలించడంపై విద్యార్థులు, నిరుద్యోగ యువత, విద్యార్థి సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. సీఎం అసంబద్ధ విధానాలపై గళమెత్తారు. శుక్రవారం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ వద్ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎల్రక్టానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (నైలెట్) క్యాంపస్ తరలింపునకు వ్యతిరేకంగా పార్టీల కతీతంగా జెన్జెడ్ భారీ ర్యాలీ నిర్వహించారు. తిరుపతి పరిసర ప్రాంతాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు ర్యాలీలో పాల్గొని చంద్రబాబు ప్రభుత్వ వైఖరిపై ధ్వజమెత్తారు. కాక్రోచ్ ప్లకార్డులు చేతబూని ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి ఎంపీ ఎం.గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి తదితరులు ర్యాలీలో పాల్గొని సంఘీభావం తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ రాయలసీయ యువత ఉపాధి, ఉద్యోగావకాశాలను మెరుగుపరడానికి వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో పోరాడి మరీ నైలెట్ కేంద్ర ప్రభుత్వ సంస్థను తిరుపతికి తీసుకొచ్చామని వివరించారు.కానీ చంద్రబాబు ఇప్పుడు ఈ క్యాంపస్ను అమరావతికి తరలించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే తిరుపతి జిల్లా నుంచి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, నేషనల్ ఫోరెన్సిక్ వర్సిటీలనూ తరలించి తిరుపతి యువతకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నైలెట్ క్యాపంస్ను శాశ్వతంగా తిరుపతిలోనే ఉంచాలని, దీనికి 15 ఎకరాల స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. తీవ్ర ప్రతిఘటన తప్పదని, ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ర్యాలీలో మాజీ మేయర్ డాక్టర్ శిరీషా, 16 విద్యార్థి, యువజన సంఘాల నేతల పాల్గొన్నారు. -
గోశాల స్థలంలో జోక్యం చేసుకోవద్దు
సాక్షి, అమరావతి: తిరుపతి జిల్లా, తిరుచానూరులోని శ్రీరాధాగోవింద గోరక్ష సమితి 3 ఎకరాల స్థలంలోని నిర్మాణాలను రహదారి విస్తరణ పేరుతో కూల్చేందుకు అధికారులు ప్రయత్నింస్తుండటంపై హైకోర్టు స్పందించింది. తిరుచానూరు సర్వేనంబరు 575/1లోని గోరక్ష సమితికి చెందిన భూమిలో ఏ రకంగానూ జోక్యం చేసుకోవద్దని జిల్లా కలెక్టర్, తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా), ఆర్డీవో తదితరులను హైకోర్టు ఆదేశించింది. అక్కడ నిర్మాణాల జోలికి కూడా వెళ్లొద్దని, ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని వారిని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 9కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మండవ కిరణ్మయి శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. తుడా అధికారుల తీరుపై అత్యవసర పిటిషన్... తిరుచానూరు గోరక్ష సమితి స్థలంలో తుడా అధికారులు జోక్యం చేసుకుంటూ, అక్కడి నిర్మాణాలను కూల్చేసేందుకు యత్నిస్తున్నారంటూ శ్రీరాధాగోవింద గోరక్ష సమితికి చెందిన ఎ.గాయత్రి హైకోర్టులో శుక్రవారం అత్యవసరంగా పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ కిరణ్మయి విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున న్యాయవాది పీవీజీ ఉమేశ్ చంద్ర వాదనలు వినిపించారు. తిరుచానూరు సర్వే నంబరు 575/1లో గోశాల నిర్మాణం కోసం మూడు ఎకరాలను కేటాయిస్తూ జిల్లా కలెక్టర్ 2001లో ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు.అప్పటి నుంచి ఆ స్థలం గోశాల స్వాదీనంలో ఉందన్నారు. రహదారి విస్తరణ పేరుతో తుడాకు చెందిన అధికారులు, స్థానిక అధికారులతో కలిసి అక్కడి నిర్మాణాలను కూల్చివేసేందుకు యత్నిస్తున్నారని ఉమేష్ చంద్ర హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాక కూల్చివేతలకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదన్నారు. వాదనలు విన్న గోశాలకు చెందిన స్థలంలో జోక్యం చేసుకోకుండా అధికారులను నిలువరించాలని కోరారు. తుడా తరపు న్యాయవాది కేకే దుర్గాప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. అభ్యంతరాలు కోరుతూ తుడా ప్రకటించిన రహదారి అభివృద్ధి ప్రణాళికలో సర్వే నంబరు 575/1 లేదని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కిరణ్మయి, సర్వే నంబరు 575/1లోని గోశాలకు సంబంధించిన స్థలం విషయంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోవద్దని అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. -
ఇచ్చింది రెండు.. మెలికెలు మెండు..
సాక్షి, అమరావతి: ఉద్యోగుల పోరాటానికి దిగి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఎట్టకేలకు రెండు డీఏలు మంజూరు చేసినా, బకాయిల చెల్లింపును మాత్రం 2027, 2028 సంవత్సరాలకు వాయిదా వేసింది. పెరిగిన డీఏ అక్టోబర్లో చేతికి వస్తుంది కానీ ఇన్నాళ్లూ ఆపిన బకాయిల కోసం మాత్రం నెలల తరబడి ఎదురుచూడాల్సిందే. ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ శుక్రవారం నాలుగు జీవోలు జారీ చేసింది. 2024 జూలై 1 నుంచి 2.73 శాతం, 2025 జనవరి 1 నుంచి 1.82 శాతం డీఏ పెంచుతున్నట్లు తెలిపింది. దీంతో డీఏ 37.31 శాతం నుంచి 41.86 శాతానికి చేరింది. పెన్షనర్లకూ ఇవే రేట్లలో డీఆర్ పెంచుతున్నట్లు తెలిపింది. పెరిగిన డీఏ, డీఆర్ను సెప్టెంబర్ జీతం, పెన్షన్తో కలిపి ఇవ్వనున్నారు. 2025 జూలై నుంచి గడువు తీరిన డీఏల ఊసే లేదు.26 నెలల నిరీక్షణచంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గడువు తీరిన తొలి డీఏ 2024 జూలై 1 నాటిది. దాన్ని ఇవ్వడానికి సర్కారుకు 26 నెలలు పట్టింది. 2025 జనవరి డీఏకు మరో 20 నెలలు పట్టింది. ఇంతకాలం ఆపిన మొత్తాన్ని ఒకేసారి ఇవ్వకుండా ఒక్కో డీఏ బకాయిలను నాలుగు విడతలుగా, రెండు డీఏలకు కలిపి మొత్తం ఎనిమిది విడతల్లో ఇస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. తొలి విడత 2027 ఏప్రిల్లో మొదలై, చివరి విడత 2028 జూలైలో ముగుస్తుంది. మొదటి డీఏకు సంబంధించి 2024 జూలై నుంచి 2026 ఆగస్టు వరకు 26 నెలల బకాయిలు ఉన్నాయి. ఇందులో తొలి విడతగా 10 శాతం మాత్రమే 2027 ఏప్రిల్లో ఇస్తారు. మిగతా 90 శాతాన్ని 30 శాతం చొప్పున మూడు విడతల్లో 2027 జూన్, ఆగస్టు, అక్టోబర్ నెలల్లో ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రెండో డీఏ పరిస్థితి ఇంకా దారుణం. 2025 జనవరి నుంచి 2026 ఆగస్టు వరకు 20 నెలల బకాయిల్లో తొలి విడత 10 శాతం 2028 జనవరిలో ఇస్తామంది. మిగతా 90 శాతాన్ని 30 శాతం చొప్పున 2028 మార్చి, మే, జూలై నెలల్లో ఇస్తామని తెలిపింది. అంటే 2025 జనవరిలో అందాల్సిన డబ్బు పూర్తిగా చేతికి రావాలంటే 2028 జూలై దాకా ఆగాల్సిందే.ఓపీఎస్ ఉద్యోగులకు చేతికి పైసా రాదుపాత పెన్షన్ విధానం (ఓపీఎస్)లోని ఉద్యోగులకు రెండు డీఏల బకాయిలూ, ఎనిమిది విడతలూ జీపీఎఫ్ ఖాతాలోకే వెళ్తాయి. రిటైరయ్యే వారు మినహా మిగతా వారికి నగదుగా ఒక్క రూపాయి కూడా అందదు. సీపీఎస్ ఉద్యోగులకు ఒక్కో డీఏలో తొలి విడత 10 శాతం బకాయిలు ప్రభుత్వ వాటాతో కలిపి వారి సీపీఎస్ పెన్షన్ ఖాతా (ప్రాన్)లోకి వెళ్తాయి. అంటే ఆ మొత్తం వెంటనే చేతికి రాదు. మిగతా మూడు విడతల 90 శాతం మాత్రమే నగదుగా ఇస్తారు.రిటైర్ అయినవారికి, త్వరలో రిటైర్ కానున్న వారికి మాత్రం బకాయిలను జీపీఎఫ్లో వేయకుండా నగదుగా ఇస్తారు. 2024 జూలై నుంచి 2027 ఏప్రిల్ మధ్య రిటైరయ్యే వారికి మొదటి డీఏ బకాయిలు నగదుగా అందుతాయి. 2025 జనవరి నుంచి 2027 డిసెంబర్ మధ్య రిటైరయ్యేవారికి రెండో డీఏ బకాయిలు నగదుగా అందుతాయి. అయితే ఈ నగదు ఏ నెలలో ఇస్తారో జీవోలో చెప్పలేదు. ఇప్పటికే చనిపోయిన ఉద్యోగుల బకాయిలను వారి కుటుంబ సభ్యులకు ఇస్తారు.పెన్షనర్లకూ వాయిదాలేపెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లకూ ప్రభుత్వం ఇదే ఎనిమిది విడతల షెడ్యూల్ పెట్టింది. వయసు మీద పడిన పెన్షనర్లు డీఆర్ బకాయిల కోసం 2028 జూలై వరకు ఎదురుచూడాల్సిందే. అదే సమయంలో గడువు తీరిన డీఏల ప్రస్తావనే చేయలేదు. 2025 జనవరి డీఏ బకాయిల గురించే పేర్కొన్నారు. -
AP : పలుచోట్ల భారీ వర్షాలు
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. శుక్రవారం ఉ.8.30 నుంచి సా.5 గంటల వరకు శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం ఎంఎస్ పల్లిలో 3.9 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. అనకాపల్లి జిల్లా పరవాడలో 1.7, కాకినాడ జిల్లా శంఖవరంలో 1.6, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 1.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక గురువారం ఉ.8.30 నుంచి శుక్రవారం ఉ.8.30 వరకు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో 8.6 సెంటీమీటర్లు, విజయనగరం జిల్లా రేగిడి మండలం ఆమదాలవలసలో 8.2, పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో 7.3, శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో 6.8, లక్ష్మీనరసుపేట 6.7, కోవిలం 6.6, పార్వతీపురం మన్యం జిల్లా గోయిడిలో 6.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వచ్చే 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉండడంతో శనివారం పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. -
మందు బిళ్ల.. జేబు గుల్ల!
సాక్షి, అమరావతి: ఉచిత వైద్యం దూరం.. ఉచిత మందులూ కరువే! ప్రజారోగ్యానికి పెద్దపీట వేసి పేదలకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం కనీసం మందు బిళ్లలు కూడా ఇవ్వకుండా జనం జేబులు గుల్ల చేయిస్తోంది. ప్రభుత్వాస్పత్రులను మందులకు కూడా దిక్కులేని దౌర్భాగ్య పరిస్థితుల్లోకి నెట్టేసింది. ప్రాణాంతక జబ్బుల బారిన పడిన రోగులు ప్రతి నెలా ఖర్చులు భరించలేక అల్లాడుతున్నారు. వైద్య సేవల కోసం ప్రాణ భయంతో ప్రైవేట్ ఆస్పత్రులు, మందుల షాపుల వైపు పరుగులు తీస్తున్నారు. చంద్రబాబు సర్కార్ ఇప్పటికే ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.3 వేల కోట్లకుపైగా బిల్లులు పెండింగ్లో పెట్టడంతో పాటు కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి పేదలకు ఉచిత వైద్యాన్ని దూరం చేస్తోంది. ప్రభుత్వ వైద్య రంగాన్ని ఉద్దేశపూర్వకంగా నీరుగార్చే కుట్రలు చేస్తోంది. ఏఐ డాక్టర్.. డిజిటల్ వైద్యం.. టెలి మెడిసిన్.. ఆధునిక వైద్య సేవలంటూ సీఎం చంద్రబాబు చేసుకుంటున్న ప్రచారంలో డొల్లతనాన్ని సాక్షాత్తూ ప్రభుత్వమే నిర్వహించిన సర్వే బయటపెట్టింది. మందులు బయట కొనుక్కోవాలంటూ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రాసిచ్చిన చీటీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా ఇవ్వాల్సిన మందులకూ గతి లేదని వెల్లడైంది. రాష్ట్రవ్యాప్తంగా 50 శాతం ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు కనీసం మందులకు కూడా దిక్కులేని దుస్థితి నెలకొన్నట్లు ఈ ఏడాది జనవరి–జూలై మధ్య స్వయంగా ప్రభుత్వమే నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలో వెల్లడి కావడం ప్రభుత్వ వైద్య రంగం దయనీయ పరిస్థితికి నిదర్శనంగా నిలుస్తోంది. సాక్షాత్తూ సీఎం చంద్రబాబు, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సొంత జిల్లాల్లోనే ఇలాంటి పరిస్థితులు నెలకొనడం గమనార్హం. ప్రైవేట్ మెడికల్ షాపుల బాట.. ప్రజలకు ఉచితంగా వైద్యం, మందులు అందించాల్సిన ప్రభుత్వం.. రోగుల చేతికి చీటీలు ఇచ్చి ప్రైవేట్ మెడికల్ షాపుల బాట పట్టిస్తోంది. ఇది పేదల జేబులకు పెను భారంగా మారుతోంది. ప్రాణాంతక జబ్బుల బారిన పడి దినదిన గండంగా గడుపుతున్న వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ప్రభుత్వాస్పత్రులకు వైద్యం కోసం వెళ్లిన రోగులపై మందుల కొనుగోళ్ల రూపంలో అదనంగా రూ.వేలల్లో భారం పడుతోంది. సీఎం, వైద్యశాఖ మంత్రి సొంత జిల్లాల్లో దారుణం.. పేద రోగులకు ఉచితంగా మందుల పంపిణీ విషయంలో సీఎం, వైద్య శాఖ మంత్రి సొంత జిల్లాల్లోనే దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం చంద్రబాబు సొంత జిల్లా తిరుపతిలోని రుయా, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి అనంతపురం జిల్లా జీజీహెచ్ల్లోని సేవలపై రోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది.అనంత జీజీహెచ్లో వైద్యులు రాసిన ఉచిత మందులు అందడం లేదని రోగులు చెబుతున్నారు. ప్రివెంటివ్ కేర్లో అత్యంత కీలకమైన పీహెచ్సీల్లో తిరుపతి, అనంతపురం జిల్లాల్లో దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. తిరుపతి జిల్లాలోని ముక్కవారిపల్లి, అనంతపురం జిల్లాలోని యాడికి పీహెచ్సీల్లో సేవలు దారుణంగా ఉన్నట్లు 60 శాతం మంది రోగులు పేర్కొన్నారు. ఘోరమైన పనితీరులో సీఎం, వైద్య శాఖ మంత్రి జిల్లాల్లోని పీహెచ్సీలు టాప్ 20లో నిలిచాయి. పెద్ద జబ్బులు.. రోగుల బాధలు» ప్రభుత్వాస్పత్రుల్లో ఉచిత మందులు అందుబాటులో లేకపోవడంతో క్యాన్సర్, గుండె, కిడ్నీ, ఇతర పెద్ద జబ్బుల బారినపడ్డ రోగుల పరిస్థితి దయనీయంగా మారింది. వైఎస్సార్ జిల్లా కడపలోని వైఎస్సార్ క్యాన్సర్ సెంటర్లో రోగులకు ఉచిత మందులు అందడం లేదు. దీంతో బయటే కొనుగోలు చేస్తున్నారు. » అత్యంత వెనుకబడిన ఉత్తరాంధ్రలోని ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం ఏర్పాటు చేసిన పలాస రీసెర్చ్ సెంటర్ను బాబు సర్కార్ గాలికి వదిలేసింది. ఇక్కడ కిడ్నీ బాధితులకు ఉచిత మందులు అందుబాటులో ఉండటం లేదు. దీంతో కిడ్నీ రోగులు ప్రైవేట్లో మందుల కొనుగోళ్ల కోసం నెలకు రూ.15 వేల మేర చేతి నుంచి ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది.» కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీలో ప్రైవేట్కు కట్టబెట్టడం కోసం వైఎస్సార్సీపీ హయాంలో అభివృద్ధి చేసిన మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పులివెందుల బోధనాస్పత్రులను ప్రభుత్వం అంపశయ్య ఎక్కించింది. ఎనిమిది నెలలుగా పులివెందుల జీజీహెచ్లో రోగులకు ఉచిత మందులు అందక అల్లాడుతున్నారు. మదనపల్లెలో రోగులు మందుల చీటీలతో ప్రైవేట్ మెడికల్ స్టోర్స్ బాట పడుతున్నారు. » సీఎం చంద్రబాబు నివాసానికి కూతవేటు దూరంలో ఉండే గుంటూరు జీజీహెచ్లో వరుసగా మే, జూన్, జూలై నెలల్లో రోగులకు ఉచిత మందులు అందని దుస్థితి. గుంటూరు శ్వాసకోశ ఆస్పత్రిలో రోగులకు ప్రభుత్వం మందులు ఇవ్వకుండా బయట కొనుగోలు చేయాలని సూచించింది.» విశాఖ ఈఎన్టీ ఆసుపత్రిలో రోగులకు ఉచిత మందులు అందలేదు. ఇక్కడి ఛాతీ, అంటువ్యాధుల ఆసుపత్రిలో జనవరిలో సగం మంది రోగులు మందులు అందక బయట కొనుగోలు చేయాల్సి వచ్చింది. -
డీఎస్సీ పారదర్శకమైతే జీవోలు ఎందుకు మార్చారు?
సాక్షి, అమరావతి: ‘డీఎస్సీ సమయంలో ఒక విధానం.. నియామకాలు పూర్తయ్యాక మరో విధానమా? దీన్ని నిష్పక్షపాత, పారదర్శక నియామక ప్రక్రియ అని ఎలా అంటారు? అర్హత పరీక్ష నిబంధన తొలగించడం ద్వారా డీఎస్సీలో అక్రమాలకు ద్వారాలు తెరవలేదా..? జరిగిన పరిణామాలకు చంద్రబాబు నైతిక బాధ్యత వహించరా..?’ అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. డీఎస్సీ నియామక ప్రక్రియపై సూటి ప్రశ్నలు సంధించారు. నియామకాలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశం ఉంటే.. అర్హత పరీక్ష అవసరం లేదంటూ జీవోలు ఎందుకు జారీ చేశారని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. డీఎస్సీ ప్రక్రియ పూర్తయిన తర్వాత పాత పరీక్ష ఆధారిత నియామక విధానాన్ని తిరిగి తీసుకొచ్చేలా నిబంధనలు ఎందుకు మార్చారని నిలదీశారు. ఈ పరిణామాలను నిష్పక్షపాత, పారదర్శక నియామక ప్రక్రియగా ఎలా పరిగణిస్తారని జగన్ ప్రశ్నించారు. డీఎస్సీ కుంభకోణానికి ఈ విధానాలు అవకాశం కల్పించలేదా? అని ధ్వజమెత్తారు. ఈ మేరకు శుక్రవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. తాను మాట్లాడిన వీడియోను ట్యాగ్ చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..» క్వాలిఫైయింగ్ పరీక్ష నిబంధనను పక్కనపెట్టి నియామకాలను ఎందుకు చేపట్టారు? » డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత మళ్లీ పాత విధానాన్ని ఎందుకు అమలు చేశారు? » అర్హత పరీక్ష నిబంధన తొలగించడం ద్వారా డీఎస్సీ అక్రమాలకు ద్వారాలు తెరవలేదా? » నిబంధనలను మార్చి అక్రమాలకు అవకాశం కల్పించడంపై చంద్రబాబు సమాధానం చెప్పరా? -
మద్యం షాపులు మళ్లీ టీడీపీ సిండికేట్కే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యం షాపులను మళ్లీ టీడీపీ సిండికేట్కే చంద్రబాబు ప్రభుత్వం కట్టబెట్టింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 3,736 మద్యం దుకాణాలను మరో ఏడాదిపాటు కొనసాగించుకోవడానికి అవకాశం కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం 2026–27 సంవత్సరానికి ఎక్సైజ్ షాప్స్ పాలసీని శుక్రవారం ప్రకటించింది. అవసరమైతే ఇదే పద్ధతిని మరో ఏడాది కొనసాగించేలా వెసులుబాటు కల్పించింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులను దక్కించుకోవడంలో టీడీపీ సిండికేట్ దందా సాగించిన విషయం తెలిసిందే. మద్యం షాపులను ఎవరూరు దక్కించుకున్నా.. వాటిని టీడీపీ సిండికేట్ హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. మళ్లీ మద్యం షాపులకు వేలం నిర్వహిస్తే వేరొకరు పోటీకి వచ్చే అవకాశం ఉంటుందని భావించిన ప్రభుత్వం టీడీపీ వాళ్లకే కొనసాగించేలా పాత షాపులను మరో ఏడాదిపాటు రెన్యువల్ చేసుకునే అవకాశం ఇవ్వడం గమనార్హం. లైసెన్సుల రెన్యువల్కు 38 శాతం రిటైల్ ఎక్సైజ్ పన్ను నూతన ఎక్సైజ్ పాలసీపై రాష్ట్ర ఎక్సైజ్శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్కుమార్ మీనా శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఏడాది అక్టోబర్ 1నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఏడాది పాటు కొత్త పాలసీ అమలులో ఉంటుంది. మొత్తం 3,736 దుకాణాల్లో 3,396 ఓపెన్ కేటగిరీలో ఉండగా, 340 దుకాణాలను గీత కులాలకు కేటాయించారు. ప్రస్తుత లైసెన్సుదారులకు తమ దుకాణాల లైసెన్సులను మరో ఏడాది పాటు రెన్యువల్ చేసుకునేందుకు వార్షిక రిటైల్ ఎక్సైజ్ పన్నులో 38 శాతానికి సమానమైన రెన్యువల్ రిటైల్ ఎక్సైజ్ పన్నును చెల్లించాలి. దీంతోపాటు వార్షిక రిటైల్ ఎక్సైజ్ పన్ను, వర్తించే పర్మిట్ రూమ్ రిటైల్ ఎక్సైజ్ పన్నును కూడా చెల్లించాల్సి ఉంటుంది. రెన్యువల్ రిటైల్ ఎక్సైజ్ పన్నును మొదటి విడత వార్షిక రిటైల్ ఎక్సైజ్ పన్నుతో కలిపి ఒకేసారి చెల్లించాలి. 50 వేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో ఓపెన్ కేటగిరీ దుకాణాలకు రెన్యువల్ రిటైల్ ఎక్సైజ్ పన్ను రూ.23 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.27.2 లక్షలు, 5 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.35.5 లక్షలుగా నిర్ణయించారు. గీత కులాలకు కేటాయించిన దుకాణాలకు ఇవే కేటగిరీల్లో వరుసగా రూ.11.5 లక్షలు, రూ.13.6 లక్షలు, రూ.17.8 లక్షలుగా నిర్ణయించారు. ప్రస్తుత లైసెన్సుదారులు రెన్యువల్ కోసం రూ.35 వేల ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. ఎవరైనా లైసెన్స్ రెన్యువల్ చేసుకోకపోతే ఆ దుకాణాన్ని కొత్తగా డ్రా ఆఫ్ లాట్స్ ద్వారా కేటాయిస్తారు. కొత్తగా డ్రా ద్వారా కేటాయించిన దుకాణాలకు రెన్యువల్ రిటైల్ ఎక్సైజ్ పన్ను వర్తించదు. అమ్ముడుపోని, కేటాయించని దుకాణాలను అవసరాన్ని బట్టి తిరిగి నోటిఫై చేయడం, ప్రాంతాల వారీగా హేతుబద్దీకరించడం, మార్చడం వంటి చర్యలు చేపట్టేందుకు కూడా పాలసీలో అవకాశం కల్పించారు. మద్యం సరఫరా వ్యవస్థపై డిజిటల్ నిఘా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. తిరుపతి నగరంలో కొన్ని ప్రాంతాల్లో మద్యం దుకాణాలకు అనుమతి ఉండదు. హైవేలకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాల్సి ఉంది. -
మీ మామ బాగోతాలివిగో..
సాక్షి, అమరావతి: ‘నిజం గెలిచింది’ అంటూ సీఎం చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి పెట్టిన సోషల్ మీడియా పోస్ట్పై సీబీఐ మాజీ డైరెక్టర్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎం.నాగేశ్వరరావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మామగారిని కీర్తిస్తూ పెట్టిన ఆ పోస్ట్లో వ్యంగ్యాన్ని, హాస్యాన్ని సమపాళ్లలో బ్రహ్మాండంగా పండించారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు బాగోతాలు అంటూ మూడు అంశాలను ప్రస్తావిస్తూ ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టయి మూడేళ్లయిన సందర్భంగా బ్రాహ్మణి హైదరాబాద్లోని తన నివాసంలో 53 కొవ్వొత్తులు వెలిగించారు. ‘నిజం గెలిచింది’ నినాదంతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీనిపై నాగేశ్వరరావు ఇలా స్పందించారు. రెండెకరాల నుంచి.. సంపన్న సీఎం దాకా.. ‘రెండో, ఇరవై రెండో ఎకరాలతో 1970వ దశకంలో రాజకీయ జీవితం ప్రారంభించారు. నేడు దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా తెలుగుజాతికి అపఖ్యాతి తీసుకొచ్చారు’ అని చంద్రబాబుపై నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. ఆయన్ని నిస్వార్థ’ అవినీతిపరుడు అంటూ ఎద్దేవా చేశారు. ‘అగౌరవ శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు’ అంటూ సంబోధించారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి అహర్నిశలు కృషిచేసిన ఎన్టీఆర్కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ఎన్టీఆర్ అకాల మరణానికి కారకుడైన నయవంచకుడు, తెలుగు ద్రోహి అంటూ నిప్పులు చెరిగారు. విభజనకు లిఖితపూర్వక అంగీకారం ‘అంతే కాదు తల్లీ.. మీ మామగారి బాగోతాలు ఇంకా ఎన్నో ఉన్నాయి’ అంటూ మూడో అంశాన్ని ప్రస్తావించారు. తెలుగుజాతి ఐక్యత, ఆత్మగౌరవం కోసం ఏర్పడిన టీడీపీని ఎన్టీఆర్ నుంచి గుంజుకోవడమే కాకుండా, 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు చంద్రబాబు లిఖితపూర్వకంగా అంగీకరించారని గుర్తుచేశారు. తద్వారా తెలుగుజాతికి తీరని ద్రోహం చేసిన ఘనుడంటూ విమర్శించారు. ‘సృజనాత్మక భరితమైన మీ కాల్పనిక వ్యథ గురించి ఈ మూడు వ్యాఖ్యలు చాలా? ఇంకా కావాలా?’ అంటూ బ్రాహ్మణిని నాగేశ్వరరావు ప్రశ్నించారు. -
రైళ్లలో శుభ్రతకు పెద్ద పీట
సాక్షి, అమరావతి: ‘రైళ్లు శుభ్రంగా ఉండటం లేదు. బోగీల్లోనే చెత్తా చెదారం పేరుకుపోతోంది.’ దేశంలో రైల్వే ప్రయాణికుల ప్రధాన ఫిర్యాదు ఇదే. జనరల్ కోచ్లే కాదు స్లీపర్, ఏసీ కోచ్లలో కూడా ఇదే సమస్య వేధిస్తోంది. దీనికి చెక్ పెట్టేందుకు రైల్వే శాఖ సరికొత్త కార్యాచరణకు ఉపక్రమిస్తోంది. రైళ్లను మరింత పరిశుభ్రంగా ఉంచేందుకు ‘గార్బేజ్ డిస్పోజల్ సిస్టం’ను రూపొందించింది. ఝాన్సీలోని ‘రైల్వే వ్యాగన్ రిపేర్ వర్క్షాప్’ ఈ సరికొత్త మౌలిక వ్యవస్థను డిజైన్ చేసింది. రైళ్లలో చెత్త స్టోరేజీ సామర్థ్యాన్ని అమాంతం పెంచేందుకు ఈ సరికొత్త మౌలిక వ్యవస్థ దోహదపడనుంది. రైల్వే డిజైన్స్– స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్వో) ఈ డిజైన్ను సూత్రప్రాయంగా ఆమోదించింది. మరికొన్ని పరీక్షల అనంతరం త్వరలోనే తుది ఆమోదం అనంతరం రైళ్లలో ప్రవేశపెట్టనున్న గార్బేజ్ డిస్పోజల్ సిస్టం ఇలా ఉండనుంది.చెత్త నిర్వహణ సామర్థ్యం పెంపుప్రస్తుతం రైళ్లలో చెత్త నిర్వహణ అత్యంత పరిమితంగా ఉంది. కోచ్లలో ఉండే డస్ట్బిన్కు కేవలం 18 లీటర్ల నిర్వహణ సామర్థ్యం మాత్రమే ఉంది. దాంతో కొద్దిసేపటికే నిండిపోయి చెత్తా చెదారం అంతా రైల్ కోచ్లోనేపడి అపరిశుభ్రంగా మారుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రస్తుతం ఏకంగా 367.4 లీటర్ల నిర్వహణ సామర్థ్యంతో సరికొత్త స్టోరేజ్ వ్యవస్థను రూపొందించారు. అందుకోసం ఎల్హెచ్బీ విధానంలో రూపొందిస్తున్న కోచ్ల అడుగు భాగంలో స్టోరేజ్ కంటైనర్ను ఏర్పాటు చేస్తారు. ప్రతి కోచ్లో రెండు వైపులా టాయిలెట్ల వద్ద ఉండే డ్రాప్ బాక్స్లలో చెత్తను వేయగానే కిందనున్న స్టోరేజ్ కంటైనర్లోకి చేరుతుంది. రైలు గమ్యస్థానానికి చేరిన తరువాత కంటైనర్ నుంచి తొలగించి శుభ్ర పరుస్తారు. ఈ కంటైనర్ను 3.10 ట్యాపర్ డిజైన్తో స్టెయిన్ లెస్ స్టీల్తో రూపొందించారు. ఆర్డీఎస్వో తుది ఆమోదం లభించిన తరువాత ఎల్హెచ్బీ విధానంలో రూపొందిస్తున్న రైల్ కోచ్లలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. -
మద్యం సిండికేట్కి చంద్రబాబు సర్కార్ దాసోహం
సాక్షి, విజయవాడ: మద్యం సిండికేట్కి చంద్రబాబు ప్రభుత్వం దాసోహమైంది. వేలం లేకుండానే మద్యం షాపుల రెన్యూవల్కు నిర్ణయం తీసుకుంది. టీడీపీ లిక్కర్ సిండికేట్కి చంద్రబాబు ప్రభుత్వం ఆఫర్ ఇచ్చింది. వేలం లేకుండా టీడీపీ లిక్కర్ సిండికేట్ చక్రం తిప్పింది.స్థానిక ఎన్నికల కోసం టీడీపీ నేతలకు మద్యం షాపులు రెన్యూవల్ చేస్తూ.. ఏపీలో 3,736 మద్యం షాపులు కొనసాగించాలని నిర్ణయించింది. విచ్చల విడిగా పర్మిట్ రూమ్లు ఏర్పాటు చేసుకోవడానికి చంద్రబాబు సర్కార్ అనుమతి ఇచ్చేసింది. ప్రిన్సిపాల్ సెక్రెటరీ ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. -
ఆ విషయాన్ని ప్రశ్నిస్తే దొంగ ఏడుపులా: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫేస్బుక్లో వీడియో రిలీజ్ చేశారు. మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అంటూ వీడియో విడుదల చేశారు. డీఎస్సీ పరీక్ష లేకుండానే టీచర్ ఉద్యోగాలు ఇచ్చేసి.. ప్రశ్నిస్తే దొంగ ఏడుపులా అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.కాగా, నిన్న(గురువారం) ప్రెస్మీట్లో మెగా డీఎస్సీ కుంభకోణం ఏ విధంగా జరిగిందో సాక్ష్యాధారాలతో వైఎస్ జగన్ మరోసారి ఎండగట్టారు. డీఎస్సీ అక్రమాలపై మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని.. దొంగ సర్టిఫికెట్లు, ఫ్యామిలీ ప్యాకేజీలతో టీచర్ ఉద్యోగాలు ఇచ్చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులను, నిజాయతీపరులైన అభ్యర్థులను సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ దగా చేశారని నిప్పులు చెరిగారు.ఆ అక్రమాలను రుజువులతో సహా వెలుగులోకి తెచ్చామని.. వాటి ఆధారంగా తాను సంధించిన నాలుగు ప్రశ్నలకు ఇంతవరకూ తండ్రీ, కుమారులు ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు. డీఎస్సీలో ఒక్కొక్కటిగా అక్రమాలు బయట పడుతుంటే వాటిని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. -
అమరావతిలో వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం: వడ్డే
సాక్షి, విజయవాడ : అమరావతిలో ఎయిర్ పోర్టు కోసం 19 వేల ఎకరాలు తీసుకోబోతున్నారని.. భూ సేకరణకు అంతే లేకుండా పోతోందని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు భూ దాహానికి పుల్స్టాప్ ఎప్పుడు పడుతుందో తెలియడం లేదన్నారు.‘‘99 పైసలకే వెయ్యి కోట్ల భూములు టీసీఎస్కు కట్టబెట్టారు. కాగ్నిజెంట్కు వెయ్యి కోట్ల విలువైన 22 ఎకరాలను కట్టబెట్టారు. కాగ్నిజెంట్కు అమెరికా ప్రభుత్వం మొట్టికాయలు వేసింది. తప్పు చేస్తున్నారని కాగ్నిజెంట్పై అమెరికా కేసులు పెట్టబోతోంది. నీ ఇష్టం వచ్చినట్లు చేయడానికి చట్టం అనుమతించదు చంద్రబాబు. అమరావతిలో స్విస్ ఛాలెంజ్ పేరుతో ఉల్లంఘటనలకు ప్రయత్నించారు. 1921 ఎకరాల్లో సింగపూర్ సంస్థ స్టార్టప్ సెంటర్ పెడతామన్నారు. ఒక్క ఇటుకరాయి కూడా వేయకుండా పోయారు’’ అని శోభనాద్రీశ్వరరావు నిలదీశారు.ఎన్జీటీ తీర్పుకు వ్యతిరేకంగా నదిలోకి కరకట్ట జరపాలని చూస్తున్నారు. కరకట్టకు కొన్ని వందల కోట్లు ఖర్చు చేయబోతున్నారు. కొండవీటి వాగులో నీరు ఎత్తిపోయడానికి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టారు. ఇప్పుడు మరో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టడానికి సిద్ధమవుతున్నారు. అమరావతిలో కొన్ని వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది’’ అని శోభనాద్రీశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అబద్ధాలకు అంతే లేదా?
సాక్షి, అమరావతి: కలెక్టర్లు, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల సమక్షంలో భూములపై ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న దొంగలెక్కల చిట్టా బయటపడింది. చంద్రబాబు, ఆయన మంత్రులు నోటికి వచ్చిన అంకెలు చెబుతూ జనాన్ని నిత్యం తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఈ సదస్సులో బహిర్గతమైంది. 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూముల విషయంలో చంద్రబాబు ఒకలెక్క చెబుతుంటే రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మరోలెక్క చెప్పి అధికారులే నివ్వెరపోయేలా చేశారు. 22ఏ నుంచి 16 లక్షల ఎకరాలు తొలగించామని బుధవారం అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం పండువారికోటలో జరిగిన సభలో సీఎం ప్రకటించారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగిన కలెక్టర్ల సదస్సులో మంత్రి అనగాని 28 లక్షల ఎకరాలను 22ఏ జాబితా నుంచి తొలగించామని సెలవిచ్చారు. అంటే 24 గంటల వ్యవధిలో 12 లక్షల ఎకరాలు అదనంగా పుట్టుకొచ్చాయి. ఆ భూములు ఏ జిల్లాలో, ఏ మండలంలో, ఏ సర్వే నంబర్లలో ఉన్నాయో ఆ దేవుడికే ఎరుక. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి భూముల గణాంకాలను వాస్తవాలతో సంబంధం లేకుండా నోటికొచ్చినట్లు ప్రకటించడంపై అధికారవర్గాల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఒకవైపు 22ఏ జాబితాలో ఉన్న తమ భూములకు విముక్తి కల్పించాలని వేలాదిమంది కలెక్టరేట్లు, అధికారుల చుట్టూ తిరుగుతుంటే వారిని పట్టించుకోకుండా లక్షల ఎకరాలను తొలగించేసినట్లు చెప్పుకోవడం ఏమిటో రెవెన్యూ వర్గాలకే అంతుబట్టడంలేదు. 28 లక్షల ఎకరాలను 22ఏ జాబితా నుంచి తొలగించామని చెప్పిన మంత్రి అనగాని అసలు సత్యాన్ని ఆ ప్రసంగంలోనే బయటపెట్టారు. రెండేళ్లలో 22ఏ నుంచి తొలగించాలని 28,790 ఎకరాలకు దరఖాస్తులు వస్తే వాటిలో 1,100 ఎకరాలు తొలగించామని చెప్పారు. నిజంగా 28 లక్షల ఎకరాలను తొలగించి ఉంటే ఈ 28 వేల ఎకరాల కోసం రైతులు ఇంకా దరఖాస్తులు పెట్టుకోవాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్నకు జవాబు లేదు. ఫ్రీహోల్డ్ భూములపై పగ సాధింపు ఎందుకు? ఫ్రీహోల్డ్ భూముల విషయంలోనూ చంద్రబాబు ప్రభుత్వం తమ బండారాన్ని బయటపెట్టుకుంది. దశాబ్దాలుగా సాగుకే పరిమితమై భూమిపై ఎలాంటి హక్కులు లేని పేద అసైన్డ్ రైతులకు గత వైఎస్ జగన్ ప్రభుత్వం యాజమాన్య హక్కులు కల్పించింది. దీంతో 27.40 లక్షల ఎకరాల అసైన్డ్ రైతులకు సంపూర్ణ హక్కులు దక్కాయి. 2024 ఎన్నికల నాటికి 13.59 లక్షల ఎకరాలు ఫ్రీహోల్డ్ కాగా, సుమారు 20 లక్షలమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులు తమ భూములకు యజమానులయ్యారు. అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం వాటిలో అక్రమాలు జరిగాయంటూ 22ఏ జాబితాలో పెట్టేసింది. వాస్తవానికి 13.59 లక్షల ఎకరాల్లో క్రయవిక్రయాలు జరిగింది కేవలం 25 వేల ఎకరాలకే. దీన్ని నిర్ధారించింది టీడీపీ కూటమి ప్రభుత్వమే. కేవలం 1.8 శాతం భూములను సాకుగా చూపి మిగిలిన 98 శాతానికిపైగా భూములను 22ఏ జాబితాలో పెట్టేశారు. కొండను తవ్వి ఎలుకను పట్టారు రెండేళ్లుగా ఫ్రీహోల్డ్ భూములపై విచారణల మీద విచారణలు నిర్వహించారు. పలుమార్లు వెరిఫికేషన్ చేశారు. ప్రత్యేకంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి మరీ విచారణ జరిపించారు. ఆ సంఘం డజనుసార్లు సమావేశమైనా అక్రమాలు లేకపోవడంతో ఏ నిర్ణయం తీసుకోలేకపోయింది. నిజానికి రెవెన్యూశాఖ విచారణలోనే సుమారు 10 లక్షల ఎకరాలు సక్రమంగానే ఫ్రీహోల్డ్ అయినట్లు తేలింది. మిగిలిన 4 లక్షల ఎకరాల్లో ఉల్లంఘనలు ఉన్నాయని చెబుతున్నా, ఆ ఉల్లంఘనలు ఏమిటన్నది ఇప్పటికీ కచ్చితంగా తేల్చలేకపోయారు. ఇప్పుడు మంత్రి అనగాని మాత్రం నిబంధనల ప్రకారం ఉన్న 9 లక్షల ఎకరాలకు రిజిస్ట్రేషన్లకు అవకాశం ఇస్తామని ప్రకటించారు. సక్రమం అయితే ఇన్నాళ్లు ఎందుకు ఆపినట్లు? ఆ 9 లక్షల ఎకరాలు నిబంధనల ప్రకారమే ఉన్నాయని ఈ ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే తేలిపోయింది. అయినా వాటిపై ఇప్పటికీ ఆంక్షలు కొనసాగించారు. కేవలం వైఎస్ జగన్ హయాంలో ఆ రైతులకు భూములపై హక్కులు వచ్చాయనే కారణంతోనే వాటిని ఇంతకాలం 22ఏ జాబితాలో ఉంచారు. రైతుల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో ఇప్పుడు ఫ్రీహోల్డ్ చేస్తామని చెబుతున్నారు. ఇంతకాలం రిజి్రస్టేషన్ కాక, రుణం రాక, భూమి అమ్ముకోలేక లక్షలాది కుటుంబాలు పడిన కష్టానికి, నష్టానికి ఎవరు జవాబుదారీ అన్నదానిపై మాత్రం నోరు మెదపడంలేదు. తప్పు ఒప్పుకోవడం మానేసి.. ఇప్పుడు తామే హక్కులు కల్పిస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం క్రెడిట్ చోరీగాక మరేమిటని రైతుసంఘాలు ప్రశి్నస్తున్నాయి.మిగిలిన 4 లక్షల ఎకరాలపై అనుమానాలు మిగిలిన 4 లక్షల ఎకరాలపై పూర్తిస్థాయి విచారణ తర్వాత నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. రెండేళ్లలో అనేక వెరిఫికేషన్లు, అధికారుల కమిటీలు, మంత్రివర్గ ఉపసంఘం సమావేశాలు జరిగినా ఉల్లంఘనలు ఏమిటో తేల్చలేకపోయిన ప్రభుత్వం ఇంకెంతకాలం విచారణ పేరుతో కాలయాపన చేస్తుందన్నది ప్రశ్న. 9 లక్షల ఎకరాలపై నిర్ణయం తీసుకోగలిగినప్పుడు 4 లక్షల ఎకరాలపై ఎందుకు తీసుకోలేకపోతున్నారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ భూములను అధికారపార్టీ నేతలు చేజిక్కించుకునే ఎత్తుగడ ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
కాక్రోచ్లు ఊరికే రావు..! మెగా డీఎస్సీలో తవ్వేకొద్దీ స్కామ్లే
అక్రమాలు జరిగాయని ప్రస్ఫుటంగా కనిపిస్తున్నప్పుడు.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆయన కింద పనిచేసే అధికారులు చేసే విచారణలు నిజాయతీగా, సక్రమంగా జరుగుతాయా? అనే అనుమానం ఆ పార్టీ వాళ్లకు కూడా వస్తుంది. చంద్రబాబు కుమారుడు రాజీనామా చేయాల్సిన పరిస్థితుల్లో ఆయన కింద పని చేసే అధికారులు స్వతంత్రంగా నడుచుకోగలరా? అందుకే డీఎస్సీ పోస్టుల భర్తీపై సీబీఐ విచారణ చేయించాలని మేం మొదటి నుంచీ పట్టుబడుతున్నాం. నిజాయతీపరులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా కోర్టుల్లోనూ పోరాడుతున్నాం.– మాజీ సీఎం వైఎస్ జగన్సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ–2025లో తవ్వేకొద్దీ అక్రమాలు బయటకు వస్తున్నాయని, చంద్రబాబు స్కామ్ల చరిత్రలో అదో ఆణిముత్యం.. చిరస్థాయిగా నిలిచిపోతుందని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. డీఎస్సీ అక్రమాలపై మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని.. దొంగ సర్టిఫికెట్లు, ఫ్యామిలీ ప్యాకేజీలతో టీచర్ ఉద్యోగాలు ఇచ్చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులను, నిజాయతీపరులైన అభ్యర్థులను సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ దగా చేశారని నిప్పులు చెరిగారు. మెగా డీఎస్సీ కుంభకోణం ఏ విధంగా జరిగిందో సాక్ష్యాధారాలతో మరోసారి ఎండగట్టారు. ఆ అక్రమాలను రుజువులతో సహా వెలుగులోకి తెచ్చామని, వాటి ఆధారంగా తాను సంధించిన నాలుగు ప్రశ్నలకు ఇంతవరకూ తండ్రీ, కుమారులు ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు. డీఎస్సీలో ఒక్కొక్కటిగా అక్రమాలు బయట పడుతుంటే వాటిని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ధ్వజమెత్తారు. అభ్యర్థుల సర్టిఫికెట్లు ఏడు సార్లు వెరిఫికేషన్ చేశామని అధికారులు చెబుతున్నారని.. మరి అన్ని నకిలీ (ఫేక్) సర్టిఫికెట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. స్పోర్ట్స్ సర్టిఫికెట్లు నిఖార్సైనవని అధికారులు చెప్పలేకపోయారన్నారు. జరగని పోటీలు, టోర్నీలతో సర్టిఫికెట్లు జారీ చేశారని.. అవి బోగస్ అని స్వయంగా అసోసియేషన్లు వెల్లడించినా వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం పట్టించుకోకుండా తమవారికి అడ్డగోలుగా ఉద్యోగాలు ఇచ్చి ఆ తర్వాత గేట్లు మూసేసిందన్నారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. అసలు ఏ పరీక్షా లేకుండానే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం, అందులోనూ టీచర్ ఉద్యోగాలు ఇవ్వడం పెద్ద స్కామ్ అని స్పష్టం చేశారు. ఇదే బాటలో అటవీ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేశారని, అయితే మెగా డీఎస్సీ స్కామ్ బయటపడడంతో 40 ఉద్యోగాలకు బ్రేక్ వేయడమే కాకుండా, మిగిలిన పోస్టులకూ నియామకాలు చేపట్టలేదని వెల్లడించారు. ఇది ఉద్యోగార్థులకు తీవ్ర అన్యాయం చేయడం కాదా? అని సీఎం చంద్రబాబును నిలదీశారు. వ్యవస్థలను నాశనం చేస్తున్నారని, ఇలాంటి పరిస్థితులు కల్పిస్తేనే కాక్రోచ్లు పుట్టుకొస్తాయని, తప్పు చేసిన వారి మెడలు వంచేందుకు తానూ కాక్రోచ్గా మారతానని హెచ్చరించారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. బాబుకు బీపీ పెరిగి బెదిరిస్తున్నారుడీఎస్సీ 2025 కుంభకోణంలో తవ్వేకొద్దీ అక్రమాలు కనిపిస్తున్నాయి. గత రెండు వారాలుగా బయటకు వచ్చిన మరికొన్ని సాక్ష్యాలు, ఆధారాలు దీన్ని రుజువు చేస్తున్నాయి. ఇవి చూసిన తర్వాత కూడా ఈ స్కామ్ నుంచి తప్పించుకోగలరా? అలాంటి నివ్వెరపోయే వాస్తవాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ స్కామ్ రూపాలన్నీ అనకొండలా అనిపిస్తున్నాయి. అందుకే ఇవి బయటకు వచ్చే కొద్దీ చంద్రబాబుకి బీపీ పెరుగుతోంది. ఎవరైనా తప్పులు, ఆధారాలు బయటపెడితే వారిపై కేసులు పెడతాం, జైల్లో వేస్తామని బెదిరిస్తున్నారు. జర్నలిస్టుల మీద సైతం కేసులు పెడుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ నిలదీయకూడదంటూ అకౌంట్లు బ్లాక్ చేస్తున్నారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారు.ఈ ప్రశ్నలకు బదులేది?మెగా డీఎస్సీ స్కామ్ ఎలా జరిగిందో సాక్ష్యాలు, ఆధారాలతో చూపించా. దీనిపై నేను అడిగిన ప్రశ్నల్లో ఒక్క దానికి కూడా చంద్రబాబుగానీ ఆయన సుపుత్రుడు, విద్యాశాఖ మంత్రిగానీ సూటిగా సమాధానం చెప్పలేదు. అవన్నీ స్కామ్ పునాదులు. నేను అడిగిన ఆ నాలుగు ప్రశ్నలు చాలా సింపుల్. వాటిని మరోసారి గుర్తు చేస్తున్నా.1? రాష్ట్ర డీఎస్సీ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ప్రశ్న పత్రాల తయారీ, పరీక్ష నిర్వహణ.. ఈ రెండిటినీ ఒకే వ్యక్తి చేతిలో ఎందుకు పెట్టారు? పారదర్శకతకు ఎందుకు పాతరేశారు? ఇది స్కామ్కు ద్వారాలు తెరిచినట్లు కాదా? అని అడిగితే చంద్రబాబు నోరు విప్పలేదు.2? స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ)లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న నవీన్ అనే వ్యక్తికి మొదటి ర్యాంక్ ఎలా వచ్చింది? అతడికి మొదటి ర్యాంకు వచ్చినా ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? అతడి పేరును సెకండ్ మెరిట్ లిస్ట్లో ఎందుకు తీసేశారు? అతడి డీఎస్సీ క్యాండిడేట్ లాగిన్ ఐడీని ఎందుకు బ్లాక్ చేశారు? అతడిని సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు ఎందుకు పిలవలేదు? తనను పిలవలేదని డీఎస్సీ కన్వీనర్కు నవీన్ లేఖ కూడా రాశాడు. నవీన్ కోర్టుకు ఎందుకు వెళ్లాడు? ఇదంతా స్కామ్ను దాచిపెట్టడానికి చేసిన ప్రయత్నం కాదా? డీఎస్సీ ప్రశ్నపత్రంలో ప్రశ్నలను కూడా అమ్ముకున్నారని కొంతమంది అభ్యర్థులు చెప్పడం ఇటీవల సోషల్ మీడియాలో చూస్తున్నాం.. మెగా డీఎస్సీలో లీకేజీ జరిగిందనడానికి ఇది మరింత బలాన్ని ఇవ్వడం లేదా?3? స్పోర్ట్స్ కోటా జీవోను మార్చి గతంలో ఉన్న 2 శాతం కోటాను 3 శాతానికి పెంచడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు ఏ పరీక్షా రాయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా భర్తీ చేసుకోవడానికి జీవో నెం.4, జీవో నెం.47 ఎందుకు తీసుకువచ్చారు? ఈ జీవోలతో గేట్లు ఎత్తి 372 మందిని రిక్రూట్ చేసి, పనైపోయిన తరువాత జీవో నెం.23, జీవో నెం.25, జీవో నెం.56తో గేట్లు మూసేశారు. ఎందుకు ఇంత అడ్డగోలు జీవోలు ఇచ్చారు? అసలు పరీక్షే లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు మీ ఇష్టం వచ్చినట్లు ఇస్తారా? ఎందుకు జీవోలు ఇచ్చారు? ఎందుకు ఉపసంహరించుకున్నారు?4? టీచర్ పోస్టుల కోసం డబ్బులు తీసుకున్నారంటూ ఏకంగా ఆడియో, వీడియో కాల్స్ బయటకు వచ్చిన తరువాత కూడా కేసును ఎందుకు నిర్వీర్యం చేశారు? ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించే వరకూ కేసును నీరుగార్చారు.అంత క్లియర్గా ఆడియో కాల్లో నెంబర్ కనిపిస్తుంటే ఆ వ్యక్తిని కనిపెట్టడం కష్టమా? కానీ ఎఫ్ఐఆర్లో మాత్రం గుర్తు తెలియని (సస్పెక్ట్) వ్యక్తి అని రాశారు. కేసు నమోదుకు ఆలస్యం ఎందుకు అయ్యిందంటే..? ఉన్నతాధికారులతో సంప్రదించడం వల్ల అని రాసుకొచ్చారు. చంద్రబాబు, ఆయన తనయుడు మాత్రం.. అరెస్ట్ చేసి, రిమాండ్కు పంపించామని అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు చెప్పారు. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ (సీసీటీఎన్ఎస్)లో చూస్తే రిమాండ్కు పంపలేదని స్పష్టంగా అర్థం అవుతుంది. ఇవన్నీ సింపుల్ ప్రశ్నలు. ఆరేళ్ల పిల్లాడికైనా అర్థం అవుతాయి. ఇవే మెగా డీఎస్సీ కుంభకోణానికి పునాదులు. ఇప్పుడు బయటకు వస్తున్న ఉదాహరణలన్నీ వీటికి సంబంధించిన కోణాలే. వెన్నుపోటు పార్టీ నాయకుడికి తనను, తన తనయుడిని కాపాడుకోవడమే ప్రధానం.అయితే ఇచ్చేయ్ టీచర్ ఉద్యోగం...! ఒక అక్రమాన్ని తవ్వుతుంటే, మరొకటి బయట పడుతోంది. బాబు కుంభకోణాల చరిత్రలో డీఎస్సీ స్కామ్ ఆణిముత్యంగా నిలిచిపోతుంది. నిరుద్యోగ యువకులను నట్టేట ముంచిన స్కాం ఇది. స్పోర్ట్స్ కోటా పేరుతో చేసిన అక్రమాలు చూస్తే.. వీడు మనవాడా! డబ్బులు ముట్టాయా! అయితే ఇచ్చేయ్ టీచర్ ఉద్యోగం అన్నట్లుగా డీఎస్సీ పోస్టులు భర్తీ చేశారు. జరగని పోటీలు జరిగినట్లుగా, ఆ పోటీల్లో పాల్గొని అద్భుతంగా ఆడినట్లుగా, తప్పుడు సర్టిఫికెట్లతో పోస్టులు ఇచ్చారు.పైస్థాయి నుంచి ఆదేశాలతో కింది స్థాయి వరకూ కుమ్మకై, ఒక పద్ధతి ప్రకారం (మోడస్ ఆపరాండీ) ఈ పోస్టులన్నిటినీ భర్తీ చేశారు. దీనిపై సీబీఐ విచారణ జరగాల్సిన అవసరం ఉందని ప్రతి కేస్ స్టడీ చెబుతోంది.జూడోలో పరీక్ష లేకుండా పోస్టులు..మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అసలు పరీక్షలే లేకుండా 372 మందిని నియమిస్తే.. ఒక్క జూడో కింద 39 మందికి ఎలాంటి పరీక్ష లేకుండానే పోస్టులు ఇచ్చారు. వీరిలో కొందరు సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూడో ఛాంపియన్ షిప్ 2013 ఖమ్మంలో జరిగినట్లుగా, అందులో పాల్గొని గెలిచినట్లుగా ధ్రువీకరిస్తూ ఏపీ జూడో అసోసియేషన్ ఇచ్చిన సర్టిఫికెట్లు పెట్టారు. తీరా చూస్తే అసలు ఆ తేదీల్లో (2013 అక్టోబర్ 19–21 మధ్య) ఆ ఛాంపియన్షిప్ ఖమ్మంలో జరగలేదని, తెలంగాణ జూడో అసోసియేషన్, ఖమ్మం జిల్లా జూడో అసోసియేషన్ చాలా స్పష్టంగా రాతపూర్వకంగా చెప్పాయి. ఇంతకీ ఈ జూడో అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరని చూస్తే.. చంద్రబాబు తనయుడు, విద్యాశాఖ మంత్రి లోకేశ్కు స్వయనా తోడల్లుడు, విశాఖపట్నం ఎంపీ భరత్. దీని అర్థం.. దొంగ సర్టిఫికెట్లు పుట్టించారని, మళ్లీ ఆ దొంగ సర్టిఫికెట్లకు మన రాష్ట్రంలోని పెద్దలే ధృవీకరణ కూడా చేసి ఇచ్చారని చాలా స్పష్టంగా అర్థం అవుతోంది. సాఫ్ట్బాల్ పేరిట మరో 38 మందికి ఇలానే పరీక్ష లేకుండానే టీచర్ పోస్టులు ఇచ్చారు. ఈ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరంటే.. టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్. ఆయన సంతకం చేసిన 21 సర్టిఫికెట్లతో టీచర్ ఉద్యోగాలిచ్చేశారు.పైనుంచి ఫోన్.. అంతా సెట్బసవేశ్వరరావు అనే మరో అభ్యర్థి 49వ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఖోఖో ఛాంపియన్షిప్ గుడివాడలో జరిగిందని, అందులో పాల్గొన్నానని సర్టిఫికెట్ పెట్టాడు. కానీ అతడి సర్టిఫికెట్ ఫేక్ అని ఆంధ్రా ఖోఖో అసోసియేషన్ అధికారికంగా శాప్కు లేఖ ఇచ్చింది. అయినా సరే దానిని పక్కన పడేసి, ఫేక్ సర్టిఫికెట్ పెట్టిన వాడికి ఉద్యోగం ఇచ్చేశారు. ఎందుకంటే పైనుంచి ఫోన్.. అంతా సెట్ అయిపోయింది ఉద్యోగం ఇచ్చేయమని! ప్రగడ కళ్యాణి అనే అభ్యర్థి కబడ్డీలో ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్శిటీ టోర్నమెంట్ 2003 నాగార్జున యూనివర్శిటీలో ఆడినట్లుగా పార్టిసిపేషన్ సర్టిఫికెట్తో, పరీక్ష రాయకుండానే ఉద్యోగం ఇచ్చారు. కానీ ఆ యూనివర్శిటీలో ఆ గేమ్స్ జరగలేదని, సౌత్ వెస్ట్ జోన్ కబడ్డీ పోటీలు మాత్రమే జరిగాయని తేలింది. అయినా సరే 7 అంచెల వెరిఫికేషన్ పూర్తి చేసుకుని ఉద్యోగం చేస్తున్నారు! టెట్ క్వాలిఫై కాకున్నా ఉద్యోగాలు..మరికొన్ని కేసుల్లో అయితే టెట్ పాసవకుండానే అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చారు. ఒక కేటగిరీలో టెట్ మార్కులు చూపించి, మరో కేటగిరీ టీచర్ పోస్టులు ఇచ్చారు. ఇంకొన్ని కేసుల్లో.. అభ్యర్థికి ఒక కులానికి సంబంధించి రిజర్వేషన్ ఉంటే, మరో కులానికి సంబంధించిన రిజర్వేషన్లో ఉద్యోగం ఇచ్చారు. కర్నూలు జిల్లాలో ఈడిగ ప్రభాకర్ అనే అభ్యర్థికి ఏ పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చారు. అతడి రిజర్వేషన్ కేటగిరీ ప్రకారం ఎస్జీటీ పోస్టుకు టెట్లో 75 మార్కులు రావాలి. కానీ ఆయనకు 65 మాత్రమే వచ్చాయి. ఇదే విషయాన్ని కర్నూలు డీఈవో కూడా ఒప్పుకున్నారు. మరి ఎస్జీటీ పోస్టు ఎలా ఇచ్చారు? ఎవరు చెబితే ఇచ్చారు? దీనిని కవర్ చేసుకోవడానికి తప్పులు మీద తప్పులు చేస్తున్నారు. ప్రభాకర్కు టెట్లో 77 మార్కులు 2018లో వచ్చాయని అధికారులు దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. కానీ హాల్టికెట్ నంబర్ ఆధారంగా వెబ్సైట్లోకి వెళ్లి టెట్ డేటా చూస్తే ఆ 77 మార్కులు స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే 2 బీ కేటగిరీకి సంబంధించిన మార్కులని తేలింది. అవి చూపించి ఆయనకు టెట్ 1 ఏ కేటగిరీలో ఉన్న పోస్టు ఎలా ఇచ్చారు? సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడి హోదాలో టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ధ్రువీకరించి ఇచ్చిన సర్టిఫికెట్ల ఆధారంగా టీచర్ ఉద్యోగాలు పొందిన 21 మంది వివరాలు ‘ఈడబ్ల్యూఎస్’ మరో పెద్ద రాకెట్..ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరిట పెద్ద ఎత్తున రాకెట్ నడిచినట్లు ఒక్కొక్కటిగా కేసులు బయటకు వస్తున్నాయి. ఇతర కులాలకు చెందిన వారికి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉద్యోగాలిచ్చారు. కడప, కర్నూలు, తూర్పు గోదావరి జిల్లాల్లో ఇలాంటి కేసులు చాలా వెలుగులోకి వచ్చాయి. కడప జిల్లాలో రసూల్ 2008, 2012, 2018లో బీసీ–ఈ కేటగిరీ కింద డీఎస్సీ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకుంటే.. ఇప్పుడు మాత్రం ఓసీ–ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద ఉద్యోగం ఇచ్చారు. 1 : 1 రేషియోలో అధికారులు వెరిఫికేషన్ చేశాక కూడా పోస్టు ఎలా ఇచ్చారు? ప్రతి అభ్యర్థి సర్టిఫికెట్లను 7 సార్లు వెరిఫై చేశామని చెబుతున్నప్పుడు ఇన్ని అక్రమాలు ఎలా జరిగాయి? అర్హత లేదని తెలిసి కూడా ఎలా పోస్టులు ఇచ్చారు? ఎవరు చెబితే ఈ పని చేశారు? డీఎస్సీ స్కామ్ పునాదుల నుంచి ఈ కేస్ స్టడీస్ అన్నీ బయటకు వస్తున్నాయి. ‘ఏపీపీఎస్సీ’లోనూ ఇదే చేయాలనుకున్నారు!ఇంకా నిర్ఘాంతపోయే అంశం మరొకటి ఉంది. అదేమిటంటే.. ఏపీపీఎస్సీలోనూ పరీక్షలు రాయకుండానే ఉద్యోగాలిచ్చేయాలని చూశారు. అటవీ శాఖలో 814 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే, అందులో 40 పోస్టులు స్పోర్ట్స్ కోటా పేరిట పరీక్ష లేకుండా, కేవలం ఇలాంటి సర్టిఫికెట్లతో భర్తీ చేసేందుకు మెగా డీఎస్సీలో ఉపయోగించిన జీవో నెం.4ను వీళ్లు వాడుకున్నారు. అంటే డీఎస్సీ కుంభకోణం బయటకు రాకపోయి ఉంటే ఏపీపీఎస్సీలోనూ ఈ 40 పోస్టులు ఇచ్చేసేవారు. డీఎస్సీ అక్రమాలు బయటపడటంతో ఇవి కూడా వెలుగులోకి వస్తాయనే భయంతో మిగతా 774 పోస్టుల భర్తీ ప్రక్రియను మధ్యలోనే నిలిపివేశారు. 40 మంది జాబితా బయటపెట్టాల్సి వస్తుందని కాదా? అని నేను అడుగుతున్నా. ప్రభుత్వం, వ్యవస్థలపై నమ్మకం ఎలా ఉంటుంది?పోటీ పరీక్షల కోసం లక్షల మంది పిల్లలు సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతారు. లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. నిరుద్యోగులు ఇంత కష్టపడుతుంటే చివరికి స్కామ్లు చేసి, లంచాలు తీసుకుని నచ్చిన వాళ్లకు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు. ఇక ప్రభుత్వం మీద, వ్యవస్థల మీద ఎవరికైనా నమ్మకం ఎలా ఉంటుంది? దీన్ని మార్చాలి. వ్యవస్థలోకి మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. మార్చాలంటే ఎలా జరుగుతుంది? పారదర్శకంగా సీబీఐ విచారణ జరపాలి. విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలి. లేదంటే కాక్రోచ్లు రాక తప్పదు. వీరి మెడలు కూడా వంచక తప్పదు. కచ్చితంగా అదే జరుగుతుంది.అందుకే సీబీఐ విచారణ అవసరంఅసలు పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగాలు, అందులోనూ టీచర్ ఉద్యోగాలు ఇవ్వడమే ఓ స్కామ్. జీవోలు ఇవ్వడం.. స్పోర్ట్స్ కోటాలో 372 పోస్టులు నింపడం.. ఆ తరువాత జీవోలను రద్దు చేయడం ఇదంతా పెద్ద స్కామ్! అక్రమాలు జరిగాయని ప్రస్ఫుటంగా కనిపిస్తున్నప్పుడు, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆయన కింద పనిచేసే అధికారులు చేసే విచారణలు నిజాయతీగా, సక్రమంగా జరుగుతాయా? అనే అనుమానం ఆ పార్టీ వాళ్లకు కూడా వస్తుంది. చంద్రబాబు కుమారుడు రాజీనామా చేయాల్సిన పరిస్థితుల్లో ఆయన కింద పని చేసే అధికారులు స్వతంత్రంగా నడుచుకోగలరా? అందుకే డీఎస్సీ పోస్టుల భర్తీపై సీబీఐ విచారణ చేయించాలని మేం మొదటి నుంచీ పట్టుబడుతున్నాం. నిజాయతీపరులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా కోర్టుల్లోనూ పోరాడుతున్నాం. కాక్రోచ్లు ఊరికే రావు. వ్యవస్థలను పాలకుడు ఇలా దగ్గరుండి చెడగొట్టినప్పుడే కాక్రోచ్లు వస్తాయి. నాలాంటి వాడు కూడా కాక్రోచ్ అవుతాడు.తప్పులు ఒప్పుకోక తప్పలేదు..!తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు సీఎం చంద్రబాబు ఐఏఎస్ అధికారులతో మాట్లాడించారు. ఐఏఎస్అధికారుల ప్రెస్మీట్ తర్వాత అంతిమంగా తేలింది ఏమిటంటే...⇒ టెట్ పాస్ అర్హత లేకపోయినా, పోస్టులు ఇచ్చామని ఒప్పుకోక తప్పలేదు.⇒ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు నిఖార్సైనవి అని చెప్పలేకపోయారు.⇒ వెరిఫికేషన్ ఒక బోగస్ అని చెప్పకనే చెప్పారు.⇒ టోర్నమెంట్లు జరగకుండానే సర్టిఫికెట్లు ఇచ్చారని ఒప్పుకోక తప్పలేదు.⇒ టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ సంతకం చేసిన సర్టిఫికెట్ల ఆధారంగా పోస్టులు ఇచ్చామని కూడా ఒప్పుకున్నారు.⇒ లోకేశ్ తోడల్లుడు అధ్యక్షుడిగా ఉన్న జూడో అసోసియేషన్లో పోటీలు జరగకపోయినా దొంగ సర్టిఫికెట్లు ఇచ్చారని ఒప్పుకోక తప్పలేదు. ⇒ కులాలు మార్చి కూడా పోస్టులు ఇచ్చామని అంగీకరించక తప్పలేదు.చక్రం తిప్పిన శాప్..మరికొన్ని కేసుల్లో శాప్ స్వయంగా చక్రం తిప్పింది. విశాఖపట్నంలో ఏ పరీక్షా లేకుండా స్పోర్ట్స్ కోటాలో సీహెచ్ యోగేశ్వరరావు అనే అభ్యర్థికి సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) ఉద్యోగం ఇచ్చారు. ఆయన చెల్లికి కూడా ఇచ్చారు. కుటుంబం మొత్తం ప్యాకేజీ మాట్లాడుకున్నట్లున్నారు! నల్గొండలో జరిగిన 23వ సీనియర్ సౌత్ నేషనల్ ఖోఖో ఛాంపియన్షిప్ 2009లో యోగేశ్వరరావుకు ఫస్ట్ ప్లేస్, ఆయన చెల్లి మోహినిదేవికి సెకండ్ ప్లేస్ వచ్చినట్లు సర్టిఫికెట్లు చూపించారు. అయితే విజేతల జాబితాలో వీళ్లు లేరని తెలంగాణ ఖోఖో అసోసియేషన్ స్పష్టంగా తేల్చి చెప్పింది. ఆ రోజు పోటీలో గెలుపొందిన క్రీడాకారుల వివరాలు, పేర్లతో కూడిన రికార్డులను కూడా బయటపెట్టింది. అంటే ఈవెంట్లు ఎక్కడెక్కడ జరిగాయో తెలుసుకుని, ఆ మేరకు దొంగ సర్టిఫికెట్లు పుట్టించారని అర్థం అవుతోంది. కానీ ఇచ్చిన ఈ ఉద్యోగాలన్నీ ఏడు సార్లు వెరిఫికేషన్ అయిన తరువాత, ప్రతీ దానిని స్రూ్కటినీ చేసి, స్క్రీనింగ్ చేసి, తనిఖీ చేసి ఇచ్చామని అధికారుల చేత చంద్రబాబు చెప్పిస్తున్నారు. -
బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు, రేపు పలు జిల్లాల్లో వర్షాలు
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వచ్చే రెండు రోజులు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఉత్తరకోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా మారి అలలు ఎగసిపడే అవకాశం ఉందని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బలమైన గాలుల సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగుల వద్ద ఉండొద్దని సూచించారు. నేడు పలు జిల్లాల్లో వర్షాలు శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మిగిలిన జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది.అనకాపల్లిలో భారీ వర్షం అల్పపీడనం ప్రభావంతో అనకాపల్లి జిల్లాలో పలుచోట్ల గురువారం భారీ వర్షాలు కురిశాయి. అనకాపల్లి జిల్లా దార్లపూడిలో 3.7 సెంటీమీటర్ల వర్షం పడింది. అదే జిల్లా నంగినారపాడు, వూడేరు, పరవాడలో 3.4, గంధవరంలో 3.3 సెంటీమీటర్ల వర్షం పడింది. -
కాలుష్య నియంత్రణ ‘గాలికి’..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, గాలి నాణ్యత మెరుగుదలపై సీఎం చంద్రబాబు నిత్యం చెబుతున్న మాటలు కోటలు దాటుతున్నాయి కానీ క్షేత్రస్థాయిలో గడప దాటడంలేదు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన ‘స్వచ్ఛ వాయు సర్వేక్షణ్–2026’ ఫలితాలు రాష్ట్ర ప్రభుత్వ డొల్లతనాన్ని, వైఫల్యాలను బట్టబయలు చేశాయి. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ సర్వేలో రాష్ట్రంలోని అతిపెద్ద పారిశ్రామిక నగరమైన విశాఖపట్నం, సాంస్కృతిక రాజధాని రాజమండ్రి, రాయలసీమ ముఖద్వారం కడప బాగా వెనుకబడ్డాయి. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (ఎన్సీఏపీ) అమలుతీరు కాగితాలకే పరిమితమైందనడానికి ఈ ఫలితాలే నిదర్శనం. రాష్ట్రం మొత్తం మీద కేవలం గుంటూరు నగరానికి మాత్రమే (195 మార్కులతో జాతీయ స్థాయిలో 2వ ర్యాంక్) చెప్పుకోదగ్గ చోటుదక్కింది. మిగిలిన ప్రధాన నగరాల్లో గతేడాది కంటే దారుణమైన ర్యాంకులు వచ్చాయి. 2025తో పోలిస్తే 2026 నాటికి ర్యాంకులు, మార్కులు భారీగా పడిపోయాయి.పారిశ్రామిక సిరి ’వైజాగ్’ బేజార్.. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజన్ లాంటి విశాఖపట్నం వాయు కాలుష్య నివారణలో ఘోరంగా ఫెయిలైంది. 2025లో 177.6 మార్కులతో 17వ ర్యాంకులో ఉన్న ఈ నగరం.. ఏడాదిలో 172 మార్కులతో 21వ స్థానానికి పడిపోయింది.కడపలో 11 స్థానాల పతనం వైఎస్సార్ కడప నగర పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. ఒకే ఒక్క ఏడాదిలో ఏకంగా 11 ర్యాంకులు దిగజారి 34వ స్థానానికి పడిపోయింది. గతేడాది 168 మార్కులు సాధించిన ఈ నగరం, ఈసారి కేవలం 144 మార్కులకే పరిమితమైంది.వెనకడుగులో రాజమండ్రి, ఒంగోలు.. ఇక చారిత్రక నగరం రాజమండ్రి సైతం 12వ ర్యాంకు నుంచి 14వ స్థానానికి దిగజారింది. ఒంగోలు నాలుగు స్థానాలు నష్టపోయి 25వ ర్యాంకుకు పడిపోయింది. అనంతపురం ఒక ర్యాంకు మెరుగైనా మార్కులు (146.5 నుంచి 144కి) తగ్గడం గమనార్హం. కర్నూలు (29వ ర్యాంకు) ఎక్కడి గొంగడి అక్కడే అన్నట్లుంది. రాజధాని విజయవాడకు దక్కని ‘టాప్–3’ గౌరవం.. రాష్ట్ర రాజధాని ప్రాంతమైన విజయవాడ గతేడాది 13వ స్థానం నుంచి 8వ స్థానానికి (186 మార్కులు) కొంత మెరుగైనప్పటికీ, జాతీయ స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో మాత్రం నిలవలేకపోయింది. కాకపోతే విజయవాడలోని 60వ వార్డు జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు సాధించడం, కొన్ని నిర్దిష్ట వార్డులకు నగదు పురస్కారాలు దక్కడం ఒక్కటే ఊరట కలిగించే అంశం. 726 వార్డులకుగాను పరిశీలనకు 39 వార్డులే.. ఇక వార్డు స్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా 726 వార్డులు సర్వేక్షణ పరిధిలోకి వచ్చాయి. వీటిలో 39 వార్డులను రాష్ట్రస్థాయి సమీక్షకు ఎంపిక చేశారు. సంబంధిత ప్రాంతీయ పురపాలక అధికారులు కూడా ఈ వార్డులను తనిఖీ చేశారు. వార్డు స్థాయిలో విజయవాడ 60వ వార్డు జాతీయంగా రెండో ర్యాంకు సాధించడంతోపాటు గుంటూరు, విజయవాడ, నెల్లూరులోని కొన్ని వార్డులకు రాష్ట్రస్థాయిలోనూ నగదు పురస్కారాలు లభించాయి. ఇంత పెద్ద సంఖ్యలో నగరాలు, వార్డులు సర్వేక్షణలో పాల్గొన్నప్పటికీ.. ప్రధాన నగరాలు ఎందుకు జాతీయ స్థాయిలో అగ్రస్థానాల్లో నిలవలేకపోయాయి? అన్నదే ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్న. కాగితాల్లోనే చర్యలు.. స్వచ్ఛ వాయు సర్వేక్షణలో బయోమాస్, మున్సిపల్ వ్యర్థాల దహనం నియంత్రణ, రోడ్డుపై దుమ్ము తగ్గింపు, నిర్మాణ వ్యర్థాలు, వాహన.. పరిశ్రమల ఉద్గారాల నియంత్రణ, ప్రజల్లో అవగాహన వంటి అంశాలకు మార్కులు కేటాయిస్తారు. వీటిపై చర్యలు తీసుకుంటున్నట్లు అధికారికంగా చెబుతున్నా.. కొన్ని ప్రధాన నగరాల స్కోర్లు, ర్యాంకులు మాత్రం వెనుకబడటం గమనార్హం. ప్రత్యేకించి విశాఖపట్నం వంటి పారిశ్రామిక నగరం 21వ స్థానానికి, కడప 34వ స్థానానికి పడిపోవడం చూస్తుంటే క్షేత్రస్థాయిలో చంద్రబాబు సర్కారు లోపాన్ని, నిర్లక్ష్యాన్ని సూచిస్తోంది. ముఖ్యంగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కడప, ఒంగోలు వంటి నగరాల వైఫల్యాలు ప్రభుత్వ పనితీరుకు అద్దంపడుతున్నాయి. -
రాజకీయ పాలన కావాలి
సాక్షి, అమరావతి: తనకు రాజకీయ పాలన కావాలి తప్ప, బ్యూరోక్రటిక్ పాలన అవసరంలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లు, అధికార యంత్రాంగానికి స్పష్టంచేశారు. గత ఎన్నికల ముందు చెప్పింది చేశానని.. మళ్లీ ప్రజల దగ్గరకు వెళ్లాల్సి ఉందని, సమస్యలు నిర్మొహమాటంగా చెప్పాలన్నారు. ఏదైనా సమస్య వచ్చినా లేదా తప్పుడు ప్రచారం చేసినా సరైన సమయంలో స్పందించకపోతే ప్రభుత్వం పెనాల్టీ చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో రెండ్రోజుల పాటు జరిగే జిల్లా కలెక్టర్ల సదస్సునుద్దేశించి గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ప్రజలు గుర్తు పెట్టుకునేలాగ కలెక్టర్ల పాలన ఉండాలన్నారు. ప్రభుత్వం పాలసీ ఇస్తుందని, దాన్ని మంత్రులు, అధికారులు అమలుచేస్తారని, వాటిపై తప్పుడు ప్రచారాన్ని మంత్రులు, అధికారులు ఖండించకపోతే ప్రభుత్వం మూల్యం చెల్లించాలా అంటూ సీఎం అసహనం వ్యక్తంచేశారు. డీఎస్సీ రిక్రూట్మెంట్లో క్రీడా కోటా కింద మూడు శాతం రిజర్వేషన్ పాలసీ తీసుకొచ్చామని, దాన్ని అధికారులు అమలుచేశారని.. అయితే, దానిపై తప్పుడు ప్రచారం చేస్తే ఆ ప్రచారం తప్పు అని చెప్పకపోతే శిక్ష మనకు పడుతుందన్నారు. పాలనలో మరింత వేగం పెంచాలన్నారు. సమస్యలపై వెంటనే స్పందిస్తూ నాయకత్వాన్ని నిరూపించుకోవాల్సిందిగా కలెక్టర్లకు సూచించారు. సీఎంఓకు, సీఎస్కు సమస్యలను చెప్పి తప్పించుకోవడానికి వీల్లేదన్నారు. అన్ని జిల్లాల్లో ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి ల్యాండ్ బ్యాంక్ పోర్టల్ను తీసుకురావాలన్నారు. చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే.. గ్రోత్ ఇంజన్లను గుర్తించి సంపద పెంచాలి ప్రతి నియోజకవర్గానికి 10–15 ప్రాజెక్టులను ప్రాధాన్యతగా గుర్తించి అభివృద్ధి చేయాలి. జిల్లాల్లో గ్రోత్ ఇంజన్లను గుర్తించి దానికి అనుగుణంగా సంపద, ఆదాయాన్ని పెంచేలా చర్యలు చేపట్టాలి. 2027 నాటికి భూ వివాదాల్లేని రాష్ట్రంగా ఏపీని తయారుచేసే బాధ్యత మనందరిది. ప్రస్తుతం 13.44 శాతం వృద్ధి నమోదైంది. దీనిని 15 శాతం దిశగా తీసుకెళ్లాలి. కుటుంబ యూనిట్గా ఆధార్ అనుసంధానం చేయాలి. దీంతో అర్హులెవరో అనర్హులెవరో తేలుతుంది. పెన్షన్ కోసం, ఇంటి కోసం కుటుంబాలను విడతీస్తున్నాం. ఇక నుంచి పెద్ద కుటుంబాలకే ప్రోత్సాహం. ఏడుగురుంటే మూడు, నాలుగు బెడ్ రూమ్ల ఇళ్లు కట్టిస్తాం. ఏడాదిలోగా అర్హులకు ఇళ్ల స్థలాల ఇవ్వాలి. సెల్ టవర్లకు అవసరమైన భూములను కలెక్టర్లు సకాలంలో ఇవ్వడంలేదు. పనితీరు చూపకపోతే ఆ పదవికి పనికిరారు. జెన్జీ ఆలోచనలకు అనుగుణంగా నాయకత్వం ఉండాలి.54% లోటు వర్షపాతంఈ ఏడాది రాష్ట్రంలో 54 శాతం లోటు వర్షపాతం నమోదైంది. కరువు నేపథ్యంలో తాగునీటికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ తరువాత పశుగ్రాసం, జీవనోపాధికి పెద్దపీట వేయాలి. వర్షాభావంవల్ల మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడతారు. ఉల్లి ధరలతో ప్రభుత్వాలే కూలిపోయాయి. వర్షాల్లేవని భూములను బీడుగా వదిలేయవద్దు. ప్రకృతి వ్యవసాయం విధానంలో తక్కువ నీటితో పండే పంటలను, బహుళ పంటల విధానాన్ని అమలుచేయాలి. ఇక పంటల బీమా ఏ పంటకు చేస్తే ఆ పంటకే వర్తిస్తుందని, వేరే పంట వేస్తే వర్తించదని, అసలు పంట వేయకపోతే కూడా బీమా వర్తించదని అధికారులు సీఎంకు వివరించారు. వచ్చే వారం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఉన్నతాధికారులంతా క్షేత్రస్థాయికి వెళ్లి గ్రామాల్లో పర్యటించాలని చంద్రబాబు చెప్పారు. -
ఐక్యంగా సాగుదాం.. విజయపతాకం ఎగురవేద్దాం
చీపురుపల్లిరూరల్(గరివిడి): ఐక్యంగా ముందుకు సాగి రానున్న స్థానిక, సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయపతాకాన్ని ఎగురవేద్దామని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గరివిడిలోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘కార్యకర్తలందరూ ప్రజల సమస్యలను తమ సమస్యలుగా భావించి వాటి పరిష్కారానికి కృషి చేయాలి. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా మనం అండగా నిలబడదాం. రాజకీయాలు శాశ్వతం కాదు. మనుషుల్లో ఉండే నైతిక విలువలు, పరస్పర గౌరవం శాశ్వతంగా నిలిచిపోతాయి. నేను తప్పు చేసినా నాకు చెప్పండి.. తప్పును తప్పుగా చెప్పగలగాలి.. మనకు మనమే సరిదిద్దుకుంటూ ప్రజల కోసం పనిచేద్దాం’ అని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని పేర్కొన్న ఆయన, పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కార్యకర్తలకు, నాయకులకు సముచిత స్థానాలను కల్పిస్తూ గ్రామాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పన లక్ష్యంగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తదితర నాయకులు పాల్గొన్నారు. ప్రజల ఆదరణ అమూల్యమంటూ భావోద్వేగం తన రాజకీయ జీవితంలో కార్యకర్తలు, ప్రజలు అందించిన ఆదరణను గుర్తు చేసుకుంటూ బొత్స ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. ఈ రోజు తనకు లభిస్తున్న గౌరవం అమూల్యమైనదంటూ కంటతడి పెట్టారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తను గుర్తుంచుకుంటామని పేర్కొన్న ఆయన, అందరినీ కలుపుకుని ముందుకు సాగుదామన్నారు. వ్యక్తిగత భేదాభిప్రాయాలను పక్కనపెట్టి పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేద్దామన్నారు. -
అబద్ధాలు.. డ్రామాలు.. డైవర్షన్లు
అమ్మకానికి ప్రభుత్వ ఉద్యోగాలు అనే ధోరణి కొనసాగితే డీఎస్సీ, పోలీస్ రిక్రూట్ మెంట్, ఏపీపీఎస్సీ ఇలా ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే ఎవరైనా ఎగ్జామ్స్ రాస్తారా? ఉద్యోగాలకు ప్రిపేర్ కావడం ఎందుకనే నిర్లిప్త వైఖరి వారిలో రాదా? ఏదైనా ఫర్ సేల్ అంటే ఇక చదువులు ఎందుకు? కష్టపడడం ఎందుకు? ఏమిటీ జీవితం అనిపించదా? అని ప్రశ్నిస్తున్నా.మా హయాంలో లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. పారదర్శకతకు అత్యంత పెద్దపీట వేశాం.. ఒక్కటంటే ఒక్క రిమార్క్ కూడా రాలేదు. ఎలాంటి ఆరోపణలు రాలేదు. కావాలంటే చూసుకోండి. సచివాలయాల ఉద్యోగాల్లో ఎంతమంది టీడీపీకి చెందిన పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారో చెక్ చేసుకోండి... ఎక్కడా తేడా చూడలేదు.మేము అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పేటప్పుడు కూడా కళ్లార్పకుండా అబద్ధాలు చెబుతున్నారు. ఎఫ్ఐఆర్ లో అనుమానాస్పదం (సస్పెక్ట్) అని రాశారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు. అరెస్ట్ చేయలేదని వాళ్ల రిపోర్టులే చెబుతున్నాయి. కానీ అరెస్ట్ చేసినట్టు. జ్యుడీషియల్ రిమాండ్కు పంపినట్టు అసెంబ్లీలోనే అడ్డంగా బొంకేస్తున్నారు.సాక్షి, అమరావతి: ‘డైవర్షన్..డ్రామాలు..అబద్ధాలు.. ఇదే చంద్రబాబు బతుకు.. అధికారులను బెదిరించి.. భయపెట్టి..ప్రలోభాలకు గురిచేస్తూ తనపై నమోదైన కేసులను కొట్టేయించుకుంటున్నారు. ఇది జగమెరిగిన సత్యం. పైగా తనకు తానుగా క్లీన్ చిట్ ఇచ్చుకునే దౌర్భాగ్య స్థితికి దిగజారిపోయాడు. తమ అవినీతి, అక్రమాలు, స్కామ్లు బయటపడిన ప్రతీసారి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ పచ్చి అబద్ధాలు చెబుతూ డ్రామాలు ఆడడం చంద్రబాబుకే చెల్లింది‘ అని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. కుంభకోణాలు చేస్తూ.. పరీక్షలు రాయకుండా ఉద్యోగాలిస్తుండటంపై సాక్ష్యాధారాలతో ఇదేమిటని ప్రశ్నిస్తే ఎదురు దాడికి దిగుతారు. ఇలా అయితే వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం ఎలా ఏర్పడుతుంది. లంచాలు తీసుకుని అర్హత లేని వారికి ఉద్యోగాలిచ్చుకుంటూ పోతే వ్యవస్థ కుప్పకూలిపోతుంది. వ్యవస్థలో మార్పు రావాలి. డీఎస్సీ స్కామ్పై పారదర్శకంగా సీబీఐ విచారణ జరపాలి, ఈ స్కామ్కు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్ రాజీనామా డిమాండ్తో వైఎస్సార్సీపీ అన్ని విధాలుగా పోరాటాలు చేస్తుంది.’ అని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో పలువురు మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే..పరీక్ష రాయకుండానే ఉద్యోగాలిస్తే ప్రశ్నించకూడదా? నువ్వు పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు ఇస్తానంటున్నావు. నీకు నచ్చిన వారికి డబ్బులు తీసుకొని స్కామ్లు చేస్తూ ఉద్యోగాలు ఇస్తున్నావు. అర్హత ఉండాలి కదా? ఎలాంటి అర్హత లేకుండా నీకు నచ్చాడని, నీకు డబ్బులు ఇచ్చాడని నీ ఇష్టారాజ్యంగా ప్రభుత్వ, టీచర్ ఉద్యోగాలు ఇచ్చేస్తానంటే ఎలా? ఇదేమిటని ప్రశ్నిస్తే తప్పవుతుందా? ఉద్యోగాలు భర్తీ చేసేటప్పుడు పారదర్శకంగా ఒక పరీక్ష పెట్టాలి. ఆ పరీక్షలో ఉత్తీర్ణత పొందాలి. అలా ఉత్తీర్ణులైన వారికి ఉద్యోగాలిచ్చే సమయంలో ఒకటి రెండు తప్పిదాలు జరిగితే పొరపాటు చేశావ్ లే అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ కావాలనే పెద్ద మోసం చేసినట్టు స్పష్టంగా కన్పిస్తోంది. ఏ పరీక్ష రాయకుండానే 372 పోస్టులు ఇచ్చేందుకు స్కెచ్ వేశావు. ఉద్యోగాలకు పరీక్షలు రాయనవసరం లేదని ఏకంగా నువ్వు జీవోలు ఇచ్చావు. ఇదే రీతిలో మిగిలిన ప్రభుత్వ ఉద్యోగాలను అమ్ముకోవాలనుకున్నావ్. ఇది తప్పు కాదా? పైగా ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగుతారా? డైవర్షన్.. డ్రామాలు.. అబద్ధాలు.. ఇదే చంద్రబాబు బ్రతుకు చంద్రబాబు అనే వ్యక్తి అబద్ధాల మీద అబద్ధాలు..డైవర్షన్ మీద డైవర్షన్..ఒక డ్రామా చేస్తాడు. డీఎస్సీ స్కామ్–1 కానీ, డీఎస్సీ స్కామ్–2 కానీ ఇవన్నీ కూడా ఆధారాలతో సహా నేను చూపించాను. పక్కా ఆధారాలు, సాక్ష్యాలతో ప్రశ్నిస్తున్నా. ఈ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు చిత్తశుద్ధితో సమాధానాలు చెప్పాలి. కానీ మేము అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పేటప్పుడు కూడా కళ్లార్పకుండా అబద్ధాలు చెబుతున్నారు. ఎఫ్ఐఆర్లో అనుమానాస్పదం (సస్పెక్ట్) అని రాశారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు. అరెస్ట్ చేయలేదని వాళ్ల రిపోర్టులే చెబుతున్నాయి. కానీ అరెస్ట్ చేసినట్టు. జ్యుడీషియల్ రిమాండ్కు పంపినట్టు అసెంబ్లీలోనే అడ్డంగా బొంకేస్తున్నారు. పైగా అధికారులతో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏం చెప్పించారు.. ఏడుసార్లు వెరిఫికేషన్ తర్వాతే ఉద్యోగాలు ఇచ్చామన్నారు. మేము ఆధారాలతో బయటపెడుతున్నాం.. కాబట్టి దిక్కుతోచని, తప్పనిసరి పరిస్థితుల్లో చేసిన తప్పులను ఒప్పుకోక తప్పని పరిస్థితి వచ్చింది. నిరుద్యోగ జీవితాలతో చెలగాటాలా? డీఎస్సీ కుంభకోణంపై పోరాటం ఇంత పెద్దది కాకపోతే..జగన్ అనే వ్యక్తి ప్రశ్నించకపోతే డీఎస్సీ మాదిరిగానే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్కు వర్తింపచేసేవారు. పరీక్షలు లేకుండానే టీచర్ పోస్టులు కట్టబెట్టిన వీళ్లు ఏపీపీఎస్సీలో కూడా పరీక్షలు లేకుండానే ఉద్యోగాలు అమ్మేసుకోవాలని చూశారు. అటవీ శాఖలోని 814 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే అందులో 40 స్పోర్ట్స్ కోటా పోస్టులను పరీక్ష లేకుండా కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ ఆధారంగా భర్తీ చేసేందుకు డీఎస్సీలో ఉపయోగించిన జీవో నెం.4నే ఇక్కడ వర్తింపచేయాలని చూశారు. డీఎస్సీలో అక్రమాలు బయటపడగానే ఇవి కూడా వెలుగులోకి వస్తాయనే భయంతో రిక్రూట్మెంట్ను మధ్యలో ఆపేశారు. ఈ 40 పోస్టుల జాబితా బయటపడితే తమ బాగోతం కూడా బయటపడుతుందనే ఉద్దేశంతో మిగిలిన 774 పోస్టుల భర్తీని నిలిపివేశారు. లక్షలమంది పిల్లలు పోటీ పరీక్షల కోసం జీవితాలను ఫణంగా పెట్టి సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతారు. లక్షల రూపాయలు ఖర్చుచేస్తారు. ఇంత కష్టపడితే చివరకు స్కామ్లతో ఇష్టారాజ్యంగా నచ్చిన వాళ్లకు లంచాలు తీసుకుని నియామకాలు చేస్తూ నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఇలా అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెడుతూ సమాజానికి ఏం సందేశం పంపిస్తున్నారని సూటిగా ప్రశ్నిస్తున్నా. అమ్మకానికి ప్రభుత్వ ఉద్యోగాలు అనే ధోరణి కొనసాగితే డీఎస్సీ, పోలీస్ రిక్రూట్మెంట్, ఏపీపీఎస్సీ ఇలా ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే ఎవరైనా ఎగ్జామ్స్ రాస్తారా? ఉద్యోగాలకు ప్రిపేర్ కావడం ఎందుకనే నిర్లిప్త వైఖరి వారిలో రాదా? ఏదైనా ఫర్ సేల్ అంటే ఇక చదువులు ఎందుకు? కష్టపడడం ఎందుకు? ఏమిటీ జీవితం అనిపించదా? అని ప్రశ్నిస్తున్నా. పాలకులుగా ఉన్న మనం ఏం చేస్తా ఉన్నాం. పరిపాలన అంటే ఇదేనా?ఎలాంటి ఆరోపణ లేకుండా లక్షల ఉద్యోగాలిచ్చాం.. మా ప్రభుత్వ హయాంలో లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. పారదర్శకతకు అత్యంత పెద్ద పీట వేశాం.. ఒక్కటంటే ఒక్క రిమార్క్ కూడా రాలేదు. ఎలాంటి ఆరోపణలు రాలేదు. కావాలంటే చూసుకోండి. చెక్ చేసుకోండి..సచివాలయాల ఉద్యోగాల్లో ఎంతమంది టీడీపీకి చెందిన పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు. ఎక్కడా తేడా చూడలేదు. ప్రభుత్వం అనేది ఉద్యోగార్థుల్లో నమ్మకం కల్గించేలా ఉండాలి. అర్హత లేని వారికి ఉద్యోగాలు అమ్ముకునే విధానాన్ని ఒప్పుకుంటే వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ప్రభుత్వం మీద, వ్యవస్థల మీద వారికి నమ్మకం ఎలా ఉంటుంది? దీన్ని మార్చాలి. వ్యవస్థలోకి మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందుకే డీఎస్సీ స్కామ్పై పారదర్శకంగా సీబీఐ విచారణకు మేము డిమాండ్ చేస్తున్నాం. ఇందుకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాల్సిందే. మా డిమాండ్లో ఎలాంటి మార్పు లేదు. ఈ విషయంలో ఇప్పటికే వివిధ రూపాల్లో పోరాటాలు చేశాం. మరింత ఒత్తిడి తీసుకొచ్చేందుకు అన్ని రకాల వేదికలపైనా పోరాటాలు కొనసాగిస్తాం. నిజంగా సిగ్గుతో వాళ్లు తలదించుకోవాలి.. డీఎస్సీ స్కామ్పై మీరు లేవనెత్తిన అంశాలపై బీజేపీ, జనసేన ఎందుకు స్పందించడం లేదని మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ‘ఈ ప్రశ్నను మీరు వాళ్లను అడగాలి. డీఎస్సీ స్కామ్ విషయంలో జగన్ ఏమైనా విషయాలు తప్పుగా చెబుతున్నారా. అర్థం లేకుండా మాట్లాడుతున్నాడా ? జగన్ చెప్పే విషయాలు లాజికల్గా లేవా ? అని వాళ్లను ప్రశ్నించాలి. జగన్ చెప్పే విషయాలన్నీ కరెక్ట్ అని అనిపిస్తా ఉన్నప్పుడు నోరు మెదపాల్సిన అవసరం ప్రజాస్వామ్యంలో ఉన్న ఎవరికైనా ఖచ్చితంగా రావాలి. సాక్ష్యాలు, ఆధారాలతో పక్కాగా దొరికిపోయిన తర్వాత కూడా జనసేన, బీజేపీ నేతలు ప్రశ్నించకుండా ఇలాంటి చంద్రబాబును సపోర్టు చేస్తున్నందుకు, ఇలాంటి వ్యవస్థను బలపరుస్తున్నందుకు వాళ్లు సిగ్గుతో తలదించుకోవాలి. తనకు తాను క్లీన్ చిట్ ఇచ్చుకుంటూ.. చంద్రబాబు తనపై నమోదైన కేసులు కొట్టేయించుకుంటూ తనకు తానుగా క్లీన్ చిట్ ఇచ్చుకుంటున్నారు. అధికారులను బెదిరించి, భయపెట్టించి, ప్రలోభాలకు గురిచేస్తూ తనపై నమోదైన కేసులను మూయించుకుంటున్నారు ఇది జగమెరిగిన సత్యం. ప్రభుత్వం తన చేతుల్లో ఉంది. అధికారులందరూ ఆయన కింద పని చేస్తున్నవారే. తనపై నమోదైన కేసులను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తున్నారు. డీఎస్సీ పై నమోదైన కేసులను కూడా ఇదే రీతిలో నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ప్రభుత్వంలో రిపోర్టింగ్ అథారిటీ ఎవరు.. చంద్రబాబు నాయుడే. అందుకే తనపై నమోదైన కేసులన్నీ కొట్టేయించుకుంటూ తనకు క్లీన్ చిట్ వచ్చిందని తనకు తానుగా చెప్పుకుంటున్న దౌర్భాగ్య పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. -
సాక్షి టీవీ సోషల్ మీడియా మరో అకౌంట్ నిలిపివేత
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి సర్కార్ కుట్రలు కొనసాగుతున్నాయి. సాక్షి టీవీ సోషల్ మీడియా మరో అకౌంట్ను చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేయించింది. డీఎస్సీపై వైఎస్ జగన్ ప్రెస్మీట్ పెట్టిన వెంటనే వీడియోలను తొలగించారు. ఫేక్ అకౌంట్లతో మెటాకు టీడీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. మరో వైపు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి ప్రభుత్వం.. 20కిపైగా వైఎస్సార్సీపీ అనుకూల సోషల్ మీడియా అకౌంట్లు కూడా బ్లాక్ చేయించింది.సోషల్ మీడియా అకౌంట్ల తొలగింపు వెనుక ఏపీకి చెందిన సైబర్ అధికారులు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. డీఎస్సీ స్కామ్ వార్తలు పెట్టినందుకే సోషల్ మీడియా అకౌంట్ల బ్లాక్ చేస్తున్నట్లు సమాచారం. అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ‘సాక్షి’పై కక్ష సాధింపు చర్యలకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు ప్రభుత్వం.. పత్రికా స్వేచ్ఛను, వాక్ స్వాతంత్ర హక్కును కాల రాస్తోంది.ఇదీ చదవండి: జనసేన, బీజేపీ సిగ్గుపడాలి: వైఎస్ జగన్ -
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం
సాక్షి,చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గుడిపాల మండలం మందికృష్ణాపురంలో విషాదం చోటు చేసుకుంది నిర్మాణంలో ఉన్న చర్చి కూలి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు, అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని వైఎస్సార్సీపీ చిత్తూరు నియోజకవర్గం ఇంఛార్జి విజయానంద రెడ్డి పరిశీలించారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలను ఆయన పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. -
చంద్రబాబుది టెన్షనా.. ఫ్రస్టేషనా?
బహుశా దేశంలో ఎక్కడా ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితి ఉండదేమో! గొడ్డలి పార్టీ, వెన్నుపోటు పార్టీ అంటూ విమర్శలు చేసుకునే రాజకీయం ఏపీలో సాగుతోంది. దీనికి 50 ఏళ్ల రాజకీయ చరిత్రతో , సుదీర్గకాలం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రధాన కారణం కావడం అత్యంత శోచనీయం. అంతేకాదు.. తనది పొలిటికల్ గవర్నెన్స్, అంటే రాజకీయ పాలన అని బహిరంగంగా చెబుతున్న ఏకైక ముఖ్యమంత్రి కూడా ఈయనే కావచ్చు. ఆయనే చంద్రబాబు నాయుడు. వయసు రీత్యా కూడా ఆయన ఏపీలో ఉన్న రాజకీయవేత్తలలోకల్లా పెద్దవారు. పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన ఈ సమయంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, విన్యాసాలు ఏపీ సమాజానికి ఎంత ప్రయోజనం అన్న ప్రశ్న వస్తుంది. పోనీ ఆయన చెప్పే విషయాలలో నిజాలు ఉంటే అదో రకం. సత్యాసత్యాలతో నిమిత్తం లేకుండా ఆయన మాట్లాడేస్తుంటారు. దీనిని బట్టి ఆయన ఏదో టెన్షన్ లోనో, లేక ఫ్రస్టేషన్ లోనో ఉన్నారేమో అన్న భావన పలువురిలో కలుగుతుంది.పైకి అభివృద్దిలో ప్రజాప్రతినిధుల పాత్ర, విజన్ అంటూ మాటలు చెబుతూ, ఆచరణలో ప్రత్యర్ధి పార్టీల మద్దతుదారులకు వారికి అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వపరంగా ఎలాంటి సాయం చేయకపోవడం రాజకీయ పాలన అన్నమాట. అలాగే ఎమ్మెల్యేలు, ఇతర అధికార పార్టీ నేతలు వ్యవస్థలపై పెత్తనం చేస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడినా ఎవరూ నోరెత్తకపోవడం అన్నమాట. ఇది సరైన విధానమేనా అన్నది ఆయనే ఆలోచించుకోవాలి. గతంలో జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ నేతలు అరాచకాలు చేసిన సంగతి ప్రజలు మర్చిపోతారా? ఈ సారి పేరు మార్చి పొలిటికల్ గవర్నెన్స్ అని ప్రజలను పీడిస్తుంటే గమనించలేరా!వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పటికి పదిహేనేళ్లుగా రాజకీయాలలో ఉంది. ఐదేళ్లు అధికారంలో ఉంది. ఆ పార్టీ ఇప్పుడు సడన్ గా గొడ్డలి పార్టీ ఎలా అయింది.అదేమిటంటే మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఉదహరిస్తారు. దానిని జగన్కు ఆపాదించాలని విశ్వయత్నం చేస్తుంటారు. ఇందులో నిజం ఏమిటి? అసలు జగన్కు ఆ కేసుతో సంబంధం లేదని సీబీఐ విచారణలో నిర్ధారణ అయిన తర్వాత కూడా చంద్రబాబు ఆరోపణలు చేయడాన్ని ఎలా సమర్ధించుకుంటారో అర్ధం కాదు.ఈ కేసులో స్వయంగా గొడ్డలితో నరికానని చెప్పిన ఒక నిందితుడికి పరోక్షంగా టీడీపీ ఎందుకు మద్దతు ఇస్తోంది? అంటే అప్పుడు గొడ్డలి పార్టీ అని దేనిని అనాలి? అతనికి టీడీపీ తరపున వాదించే లాయర్ ఎందుకు పనిచేస్తున్నారు? అలాగే వివేకా కుమార్తె సునీత ఈ కేసు విచారణ ముందుకు సాగకుండా రకరకాల పిటిషన్లు ఎందుకు వేస్తున్నారు? ఆమెకు కూడా టీడీపీ సహకారం ఎందుకు ఇస్తోంది? పైగా వివేకా హత్య కేసు జరిగింది 2019లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే కదా! అప్పటి పోలీసు అధికారులు ఎందుకు జగన్పై అభియోగాలు మోపలేకపోయారు? అప్పటి సిట్ నివేదిక ఏమి చెబుతోంది?ఇవన్ని పట్టించుకోకుండా చంద్రబాబు ఐదేళ్ల తర్వాత గొడ్డలి పార్టీ అని మాట్లాడడం ద్వారా తన స్థాయిని తాను తగ్గించుకున్నట్లు అనిపించదా! పోనీ మరికొన్ని ఇతర హత్య కేసులు చూస్తే ఎందరు టీడీపీవారు అందులో భాగస్వాములుగా ఉన్నరన్న అభియోగాలు ఎన్ని ఉన్నాయి? ఉదాహరణకు వంగవీటి రంగా హత్య కేసులో నిందితులు టీడీపీ వారా, కారా? వారిలో కొందరు ఎమ్మెల్యేలు ఎలా అయ్యారు? స్వయంగా రంగా కుమారుడు గతంలో ఏ ఆరోపణ చేసింది గుర్తు లేదా? అంతెందుకు కూటమి అధికారంలోకి వచ్చాక జరిగిన హత్యలు ఎన్ని? ఉదాహరణకు వినుకొండలో రషీద్ హత్య, పల్నాడులో సాల్మన్ హత్య.. ఇలా పలు ఘటనలలో నిందితులు టీడీపీవారే కదా! మరి టీడీపీ గొడ్డలి పార్టీ లేక కత్తుల పార్టీ అవుతుందా?కొన్నాళ్లపాటు వైఎస్సార్సీపీ నేతలు టీడీపీ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోలేదు. కొన్నిసార్లు మాత్రం జవాబు ఇచ్చారు. మాజీ మంత్రి కొడాలి నాని టీడీపీని బూడిద పార్టీ అని అంటే, మరో మాజీ మంత్రి అంబటి రాంబాబు టీడీపీ తడిగుడ్డలతో గొంతు కోసే పార్టీ అని అన్నారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సాయికృష్ణ అనే నిందితుడిని చిత్రహింసలు పెట్టడంతో చనిపోయాడు. తదుపరి అతని బూడిద కూడా లేకుండా చేసిన ఘటనను దృష్టిలో పెట్టుకుని వారు ఈ ఆరోపణలు చేశారు. ఆ తర్వాత టిడిపికి వెన్నుపోటు పార్టీ అని నామకరణం చేసి అలాగే పిలవడం ఆరంభించారు. జగన్ కూడా మీడియా సమావేశాలలో అదే పేరుతో సంబోధిస్తున్నారు.వైఎస్సార్సీపీని గొడ్డలి పార్టీ అనడానికి ఆధారాలు లేవు కాని, టీడీపీని వెన్నుపోటు పార్టీ అనడానికి అవసరమైన అన్ని ప్రాతిపదికలు ఉన్నాయని వైఎస్సార్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. స్వయంగా చంద్రబాబును ఆయన మామగారైన ఎన్.టి.రామారావే ఏ వ్యాఖ్యలు చేసింది వారు ప్రస్తావిస్తున్నారు. వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసిన ఘట్టాన్ని ఉదహరిస్తున్నారు. ఆయా ఎన్నికలలో ఎన్నిరకాల హామీలు ఇచ్చి, వాటిని ఎగవేయడం ద్వారా ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్న విమర్శలు కూడా చేస్తున్నారు. 2014 లో ఇచ్చిన హామీలనే కాకుండా, 2024 లో ఇచ్చిన హామీలను కూడా గుర్తు చేస్తున్నారు. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు నెలకు 1500 రూపాయల ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. అలాగే నిరుద్యోగులకు మూడువేల రూపాయల భృతి ఇస్తామని తెలిపారు. బీసీలతో సహా బలహీనవర్గాలకు 50 ఏళ్లకే పెన్షన్ హామీ ఇచ్చారు.ఇలా ఎన్నో వాగ్దానాలు చేసి, వాటిని ఎగవేయడం ఆయా వర్గాలను వెన్నుపోటు పొడిచినట్లేనని వైఎస్సార్సీపీ నేతల విమర్శ. దీనికి సమాధానం చెప్పే పరిస్థితి టీడీపీలో ఉండదు. కాకపోతే తమ మీడియా బలంతో ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు భ్రమింప చేసే యత్నం జరగవచ్చు. కాని వాటిని ఎల్లవేళలా నమ్మరు కదా! ఇంతకుముందు వైఎస్సార్సీపీవారు తెలుగుదేశం పార్టీని పేరు పెట్టి ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని విమర్శలు చేసేవారేమో! కాని చంద్రబాబు వైఎస్సార్సీపీని గొడ్డలి పార్టీ అని పిలుస్తుండడంతో, జగన్ తో సహా పార్టీ నేతలంతా టీడీపీని వెన్నుపోటు పార్టీ అని పిలుస్తున్నారు. చిత్రమేమిటంటే చంద్రబాబు తాము క్రిమినల్స్తో పోరాటం చేస్తున్నామని వైఎస్సార్సీపీని ఉద్దేశించి మీడియా సమావేశాలలో అంటారు. తీరా చూస్తే ఏపీలో అత్యధికంగా 79 శాతం మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్స్ కేసులు ఉన్నాయి. కూటమి ఎమ్మెల్యేలే 164 మంది ఉన్నారు కదా! అంతేకాదు.. చంద్రబాబుపైనే 19 క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ రిపోర్టు వెల్లడించింది.జగన్ వల్ల అధికారులు, పారిశ్రామికవేత్తలు జైలుకు వెళ్లారట. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఎదిరించిన తర్వాత కేసులు వచ్చాయే తప్ప ముందు కాదు కదా! ఆ కేసులు పెట్టడానికి కాంగ్రెస్తో కలిసింది తెలుగుదేశం పార్టీనే కదా ! పారిశ్రామికవేత్త జిందాల్పై కేసు పెట్టాలని యత్నించి కూటమి సర్కార్ ఎందుకు వెనక్కి తగ్గింది. నటి జత్వాని కేసులో ఐపీఎస్లపై తప్పుడు కేసులు పెట్టినట్లు సర్కారే అంగీకరించింది కదా! మరి స్కిల్ స్కామ్లో చంద్రబాబుతో పాటు కొందరు అధికారులు అరెస్టు అయ్యారు కదా! దాని గురించి ఏమి చెబుతారు! అనవసరమైన, అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే టీడీపీ కార్యకర్తలు నమ్మినట్లు నటిస్తారేమో కాని, వారికి కూడా అసలు విషయాలు తెలియకుండా ఉంటాయా? ఏది ఏమైనా చంద్రబాబు తన హోదాకు తగిన రీతిలో హుందాగా వ్యవహరించి, సరైన పద్దతిలో ప్రసంగాలు చేయకపోతే ఆంధ్ర సమాజానికి తీరని నష్టం చేసిన వారవుతారేమో!కొమ్మినేని శ్రీనివాసరావు,సీనియర్ జర్నలిస్ట్,రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
వైఎస్ జగన్ ప్రెస్మీట్ హైలైట్స్..
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్.. మెగా డీఎస్సీ కుంభకోణం గురించి కీలక విషయాలను వెల్లడిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రెస్మీట్ హైలైట్స్2025 మెగా డీఎస్పీలో తవ్వేకొద్దీ అక్రమాలు కనిపిస్తున్నాయి.డీఎస్సీ అక్రమాలు బయటికొచ్చే కొద్దీ బాబులో బీపీ పెరుగుతోంది.నా ప్రశ్నలకు బాబు, లోకేష్ సమాధానం చెప్పలేదుప్రశ్నిస్తే తప్పుడు కేసులతో భయపెడుతున్నారు.రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రశ్నాపత్రం తయారీ2025 మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీప్రశ్నించిన జర్నలిస్టులపై కూడా అక్రమ కేసులు పెట్టారు.మా ప్రశ్నలకు సమాధానం చెప్పరు.. బుల్డోజ్ చేస్తారుఫస్ట్ ర్యాంకర్ను వెరికేషన్కు ఎందుకు పిలవలేదు?డీఎస్సీపై ప్రభుత్వానికి అనేక ప్రశ్నలు సంధించాంపర్యవేక్షణ ఒకే వ్యక్తి చేతిలో ఎందుకు పెట్టారు?ఎస్ఈఆర్టీలో వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చింది?మెరిట్ లిస్ట్లో ఫస్ట్ ర్యాంకర్ పేరును ఎందుకు మార్చారు?ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు?కోర్టుకు ఫస్ట్ ర్యాంకర్ ఎందుకు వెళ్లాడు.జీవో నంబర్ 4, 47తో గేట్లు తెరిచారు.ఆడియో, వీడియో కాల్స్ బయటకు వచ్చాయి.డిఎస్సీ స్కామ్ను దగ్గరుండి నిర్వీర్యం చేస్తున్నారు.ఇలాంటి స్కామ్ల వల్లే కాక్రోచ్లు పుట్టుకొస్తున్నాయి.బాబు స్కామ్ల హిస్టరీలో ఇదొక ఆణిముత్యంతప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగాలిచ్చేశారు.నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.పై నుంచి కింది స్థాయి వరకూ అంతా కుమ్మక్కయ్యారుకొడుకును కాపాడాలనే ఉద్దేశంలో చంద్రబాబు ఉన్నారు.వ్యవస్థలపై నమ్మకం లేకుండా చేస్తున్నారు.2013 జూడో సీనియర్ పోటీలో ఖమ్మంలో జరిగినట్లుగా ఏపీ జూడో అసోసియేషన్ సర్టిఫికెట్లు ఇచ్చింది.ఖమ్మంలో అసలు సీనియర్ పోటీలు జరగలేదని తెలంగాణ అసోసియేషన్ తేల్చి చెప్పింది.విశాఖలో అన్నాచెల్లెళ్లకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలిచ్చేశారు.దొంగ సర్టిఫికెట్లు చూపినట్లు ఆధారాలున్నాయి.ఏపీ జూడో అసోసియేషన్ అధ్యక్షుడు.. లోకేష్ తోడల్లుడు భరత్.డీఎస్సీ-2025, మెగా డీఎస్సీ కాదు, నిరుద్యోగులను, నిజాయితీపరులైన అభ్యర్థులను దగా చేసిన డీఎస్సీ అని చాలా రోజులుగా చెప్తున్నాం.గత రెండు వారాలుగా బయటకు వచ్చిన మరికొన్ని సాక్ష్యాలు, ఆధారాలు దీన్ని రుజువు చేస్తున్నారు.ఇవిచూసిన తర్వాత ఎవరైనా ఈస్కాం నుంచి తప్పించుకోగలుగుతారా? ఎందుకంటే అలాంటి నివ్వెరపోయే వాస్తవాలు మనకు కనిపిస్తున్నాయి.మెగా డీఎస్సీ కుంభకోణాన్ని తవ్వేకొద్దీ, ఈ స్కాం తాలూకు రూపాలు చాలా కనిపిస్తున్నాయి.మరోవైపు సోషల్మీడియాలో కూడా నిలదీయకూడదంటూ అక్కౌంట్లను బ్లాక్ చేస్తూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారు. ఈ డీఎస్సీ స్కాం ఎలా జరిగిందో అనేక సార్లు ఇదే వేదికపై నుంచి నేను సాక్ష్యాలు, ఆధారాలు చూపించాను.నేను అడిగే ప్రశ్నలు చాలా సింపుల్. ఇందులో అర్థంకాకపోవడానికి కూడా ఏమీ లేదు.గతంలోనైనా, ఎప్పుడైనా, రాష్ట్ర డీఎస్సీ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా, ప్రశ్న పత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ ఈ రెండింటినీ ఒకే వ్యక్తి చేతిలో ఎందుకు పెట్టారు? ఎందుకు పారదర్శకతకు పాతర వేశారు? అని అడిగా? ఇది స్కాంకు ద్వారాలు తెరిచినట్టుకాదా? అని అడిగా? కాని చంద్రబాబు నోరు విప్పలేదు.డీఎస్సీ ప్రశ్నపత్రంలో ప్రశ్నలనుకూడా అమ్ముకున్నారని ఇటీవలే కొంతమంది అభ్యర్థులు చెప్పడం, మెగా డీఎస్సీలో లీకేజీ జరిగిందనడానికి మరింత బలాన్ని ఇవ్వడంలేదా?స్పోర్ట్స్ కోటా జీవోను మార్చి, అదివరకే ఉన్న 2% స్పోర్ట్స్ కోటాను 3 శాతానికి పెంచడమే కాదు, ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షే లేకుండా, డైరెక్ట్గా జీవో 4,47లతో గేట్లు ఎత్తారు.పని అయిపోయాక, మళ్లీ జీవో నంబర్ 23, 25, జీవో నంబర్ 56 లతో, గేట్లు మూసేశారు. ఎందుకు ఈ జీవోలు ఇచ్చారు? ఎందుకు పని అయిపోయిన తర్వాత, ఆ జీవోలను ఉపసంహరించారు? కారణం ఏంటి?టీచర్ పోస్టులకోసం డబ్బులు తీసుకున్నారంటూ ఆడియో, వీడియో కాల్స్ బయటకు వచ్చినా, దీనిపై విచారణ ఎందుకు నిర్వీర్యం చేశారు? ఎఫ్ఐఆర్ నమోదయ్యింది మొదలు, స్టేషనల్ బెయిల్ ఇచ్చి పంపడం వరకూ, ఎందుకు కేసును నిర్వీర్యం చేశారు? పైగా రిమాండ్కు పంపాం అంటూ అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు చెప్పారు. ఇవే బేసిక్గా మెగా డీఎస్సీ స్కాంకు సంబంధించి పునాదులు.ఇప్పుడు బయటకు వస్తున్న కేస్స్టడీస్ అన్నీకూడా, వీటికి సంబంధించిన కోణాలే. తవ్వుతున్న కొద్దీ ఒక్కో అక్రమం, ఒక అక్రమాన్ని తవ్వుతుంటే ఇంకో అక్రమం బయటకు వస్తోంది.బాబుగారి స్కాంల హిస్టరీలో మరో ఆణిముత్యం ఇది. నిరుద్యోగ యువకులను నట్టేటా ముంచి స్కాం ఇది.స్పోర్ట్స్కోటా పేరుతో వీళ్లు చేసిన అక్రమాలు చూస్తే, వీడు మనవాడా? ఇతను దగ్గరనుంచి డబ్బులు ముట్టాయా… అయితే ఇచ్చేయ్ టీచర్ పోస్టు.. అన్న పద్ధతిలో ఈ రిక్రూట్మెంట్ చేశారు.జరగని పోటీలు జరిగినట్టుగా, ఆ పోటీల్లో వీళ్లు అద్భుతంగా ఆడినట్టుగా తప్పుడు సర్టిఫికెట్లతో సైతం పోస్టులు ఇచ్చేశారు.పై స్థాయి నుంచి ఆదేశాలతో, కింది స్థాయి వరకూ కుమ్మక్కై, ఒక మోడస్ ఆపరండీ ప్రకారం ఈ పోస్టులన్నింటినీ భర్తీచేశారు.సీబీఐ విచారణ జరగాల్సిన అవసరాన్ని ప్రతి కేస్ స్టడీకూడా చెప్తోంది.స్పోర్ట్స్లో కోటా భర్తీచేసిన వాళ్ల జాబితా చూస్తే ‘జూడో ఆట’తో మొత్తం 39 మందికి ఎలాంటి ఎగ్జామ్ లేకుండా టీచర్ పోస్టులు ఇచ్చారు.సాఫ్ట్బాల్ పేరిట, 38 మందికి ఇలానే పరీక్ష రాయకుండానే, టీచర్ పోస్టులు ఇచ్చారు. ఈ సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరంటే, టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్.మరికొన్ని కేసుల్లో అయితే, శాపే చక్రంతిప్పింది.విశాఖపట్నంలో ఏ ఎగ్జామ్ రాయకుండానే ‘యోగేశ్వర్రావు’ అనే అభ్యర్థికి స్పోర్ట్స్ కేటగిరీలో ఎస్జీటీ టీచర్ పోస్టు ఇచ్చారు.ఈయన చెల్లెలికి కూడా ఇలానే స్పోర్ట్స్ కేటగిరీలో పోస్టు ఇచ్చారు.కాని వీళ్లు విజేతల జాబితాలో లేరని తెలంగాణ ఖో – ఖో అసోసియేషన్ చాలా స్పష్టంగా చెప్తూ, ఆరోజు పోటీల్లో గెలుపొందిన వారి వివరాలను విడుదలచేశారు.అంటే, ఈవెంట్లు ఎక్కడెక్కడ జరిగాయో కనుక్కుని. ఆమేరకు దొంగ సర్టిఫికెట్లు పుట్టిస్తున్నారని అర్థం అవుతోంది.కాని ఏడుసార్లు వెరిఫికేషన్ చేయించామని చంద్రబాబు అధికారులతో చెప్పిస్తున్నారు.కొన్ని కేసుల్లో, అభ్యర్థులు టెట్ పాస్ కాకుండానే ఉద్యోగాలు ఇచ్చారు.ఒక కేటగిరీలో టెట్ అర్హత ఉంటే, మరో సబ్జెక్ట్కు సంబంధించి టీచర్ పోస్టు ఇచ్చారు.ఇంకొన్ని కేసుల్లో అభ్యర్థికి ఒక కులానికి సంబంధించి రిజర్వేషన్ ఉంటే, మరో కులానికి సంబంధించిన రిజర్వేషన్లో పోస్టు ఇచ్చారు.కర్నూలు జిల్లాలో ‘ఈడిగ ప్రభాకర్’ అనే అభ్యర్థికి, ఏ పరీక్ష రాయకుండానే, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చారు.తన రిజర్వేషన్ కేటగిరి ప్రకారం ఎస్జీటీ పోస్టుకు టెట్లోలో 75 మార్కుల రావాలి.కాని, 65 మార్కులు వచ్చినా, స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీ పోస్ట్ ఇచ్చారు.ఈ విషయాన్ని కర్నూలు డీఈఓ కూడా ఒప్పుకున్నారు. మరి ఉద్యోగం ఎలా ఇచ్చారు? ఎవరు చెప్తే ఇచ్చారు?ఈడిగ ప్రభాకర్కు టెట్లో 77 మార్కులు 2018లో వచ్చాయని ఈ కేసును ఇక్కడ కప్పిపుచ్చే ప్రయత్నంచేశారు.కాని వీరు చూపిన హాల్ టికెట్ నంబర్ ఆధారంగా వెబ్సైట్లోకి వెళ్లి, టెట్ డేటా చూస్తే,ఈ 77 మార్కులు, స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే 2B కేటగిరీకి సంబంధించిన మార్కులు.మరి ఇతనికి టెట్ 1ఏ-లో ఉన్న, ఎస్జీటీ పోస్టు ఎలా ఇచ్చారు?ఈడబ్యుఎస్ రిజర్వేషన్ పేరిట పెద్ద ఎత్తున రాకెట్ నడిచినట్టు ఒక్కొక్కటిగా కేసులు బయటకు వస్తున్నాయి.ఇతర కులాలకు చెందిన వాళ్లకు ఈడబ్యుఎస్ కింద పోస్టులు ఇచ్చారు. కడప, కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఇలాంటి కేసులన్నీ వెలుగులోకి వస్తున్నాయి.కడప జిల్లాలో రసూల్ అనే వ్యక్తి బీసీ-ఈ కేటగిరీ అయితే, 2009, 2012, 2018లో బీసీ-ఈ కిందే డీఎస్సీ పరీక్షలకోసం అప్లై చేస్తే, ఇప్పుడు మాత్రం అతనికి ఓసీ- ఈడబ్ల్యూఎస్ కింద పోస్టు ఇచ్చారు.1:1 రేష్యోలో అధికారుల వెరిఫికేషన్ ఏశాక, దాన్ని దాటి పోస్టులు ఎలా ఇవ్వగలిగారు? ప్రతి అభ్యర్థి సర్టిఫికెట్లను 7సార్లు వెరిఫైచేశామని చెప్తున్నప్పుడు ఇన్ని అక్రమాలు ఎందుకు జరిగాయి? అర్హత లేదని తెలిసి కూడా, పోస్ట్లు ఎలా ఇచ్చారు? ఎవరు చెప్తే ఈ పనిచేశారు?నిరుద్యోగ యువతకోసం న్యాయస్థానాల్లోనూ పోరాడుతున్నాం.అర్హత లేనివారికి ఎవరు చెబితే పోస్ట్ ఇచ్చారు?అసలు ఏ పరీక్షా లేకుండానే పోస్ట్లు ఇవ్వడం పెద్ద స్కాం.నాలాంటి వాడు కూడా కాక్రోచ్ అవుతాడు- వైఎస్ జనన్చంద్రబాబు దగ్గర పనిచేసే అధికారులు నిస్పక్షపాతంగా విచారణ చేయగలరా?ఏ పరీక్షా లేకుండా గర్నమెంటు ఉద్యోగాలు ఇవ్వడమే పెద్ద స్కాంమరి అక్రమాలు జరిగాయని ఒప్పుకున్న తర్వాత, చంద్రబాబుగారి ప్రభుత్వమే అధికారంలో ఉండగా, ఆయన కింద పనిచేసే అధికారులతో చేసే విచారణలు నిజాయితీగా, స్వతంత్రంగా జరుగుతాయా?చంద్రబాబు కుమారుడు రాజీనామా చేయాల్సిన పరిస్థితుల్లో, ఆయన కింద పనిచేసే అధికారులు స్వతంత్రంగా నడుచుకోగలరా?అందుకే డీఎస్సీ రిక్రూట్మెంట్పై సీబీఐ విచారణ చేయించాలని మేం మొదటి నుంచీ పట్టుబడుతున్నాం. నిజాయితీపరులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా కోర్టులోనూ పోరాడుతున్నాం.మరి కాక్రోచ్లు ఊరికే రావు. వ్యవస్థలను చెడగొట్టినప్పుడే కాక్రోచ్లు వస్తాయి. నాలాంటి వాడుకూడా కాక్రోచ్ అవుతాడు.మరో నిర్ఘాంతపరిచే విషయం ఏంటంటే, పరీక్షలు లేకుండానే, టీచర్ పోస్టులు కట్టబెట్టిన వీళ్లు, ఏపీపీఎస్సీలో కూడా పరీక్షలు లేకుండా ఉద్యోగాలు ఇవ్వాలని చూశారు.అటవీశాఖలోని 814 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే. అందులో 40 స్పోర్ట్స్ కోటా పోస్టులను పరీక్ష లేకుండా కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్ల ఆధారంగా భర్తీ చేసేందుకు డీఎస్సీలో ఉపయోగించిన జీఓ నంబర్-4నే మీరు వాడుకున్నారు.డీఎస్సీ అక్రమాలు బయటపడగానే ఇవి కూడా వెలుగులోకి వస్తాయనే భయంతో రికక్రూట్మెంట్ను మధ్యలో ఆపేశారు.ఈ 40 పోస్టుల జాబితా బయటపడితే తమ బాగోతం కూడా బయటపడుతుందనే ఉద్దేశంతో మిగిలిన 774 పోస్టుల భర్తీని నిలిపేశారు.లక్షలమంది పిల్లలు పోటీ పరీక్షలకు సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతారు. లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు.ఇంత కష్టపడితే చివరకు స్కాంలతో ఇష్టారాజ్యంగా నచ్చిన వాళ్లకు లంచాలు తీసుకుని పోస్టులు ఇస్తున్నారు.ప్రభుత్వంమీద, వ్యవస్థలమీద మరి నమ్మకం ఎవరికైనా ఎలా ఉంటుంది? -
50% పైన రిజర్వేషన్లను ఎలా సమర్థించుకుంటారు?
సాక్షి, అమరావతి: బీసీ తరగతుల సామాజిక, ఆర్థిక, విద్యా, రాజకీయ స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సమర్పించిన నివేదికను పరిశీలిస్తున్నామని ఒకవైపు చెబుతూనే.. మరోవైపు ఆ కమిషన్ నివేదిక ఆధారంగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఎలా ఉత్తర్వులు జారీ చేస్తారని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కమిషన్ నివేదికను పరిశీలనలోకి తీసుకోవాల్సి ఉందని చెబుతూనే, ఆ నివేదిక ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం ఎంత వరకు సమంజమని కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కమిషన్ నివేదికను ఎందుకు బహిర్గతం చేయడం లేదని కూడా హైకోర్టు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. అందులో అంత రహస్యం ఏముందని ప్రశ్నించింది. కమిషన్ నివేదికలోని బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన పూర్తి గణాంకాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు ఖరారు చేశారో చెప్పాలని స్పష్టంచేసింది. స్థానిక ఎన్నికలకు సంబంధించి దాఖలైన పలు వ్యాజ్యాలపై బుధవారం విచారణ జరిపిన సీజే ధర్మాసనం, అసలు రిజర్వేషన్లు 50 శాతం దాటడాన్ని ఎలా సమర్థించుకుంటారో కూడా చెప్పాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తుది ఓటర్ల జాబితానే ఎన్నికలకు ప్రాతిపదిక కావాలి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ న్యాయవాది శ్రీరాం కేంద్ర ఎన్నికల సంఘం తలపెట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పూర్తయి తుది ఓటర్ల జాబితా ప్రచురించిన తరువాత ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ పిటిషన్ దాఖలు చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ న్యాయవాది సుబ్రమణ్య శ్రీరాం వాదనలు వినిపిస్తూ, తాము స్థానిక ఎన్నికలను వాయిదా వేయాలని కోరడం లేదన్నారు. ‘ప్రస్తుతం జరుగుతున్న సర్ పూర్తయి, తుది ఓటర్ల జాబితాను ప్రచురించిన తరువాతనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాం. తద్వారా సర్లో ప్రాథమికంగా ఓటు కోల్పోయిన వారు, అప్పీల్ చేసుకుని తుది ఓటర్ల జాబితాలో స్థానం పొందే అవకాశం ఉంటుంది. తాము దాఖలు చేసిన ఈ వ్యాజ్యం పెండింగ్లో ఉండగానే, ఎన్నికల కమిషన్ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే మా వ్యాజ్యం నిరర్థకం అవుతుంది. గతంలో ఇలాగే పిటిషన్ పెండింగ్లో ఉండగానే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది’ అని శ్రీరాం విన్నవించారు. ఆయన వాదనలను ఏకీభవించిన ధర్మాసనం, ఈ లోపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తే పిటిషన్ నిరర్థకం అవుతుందని, అందులో సందేహం లేదంది. అందువల్ల ఇప్పటికిప్పుడు ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల కాదనే భావిస్తున్నామని తెలిపింది. మిషన్ నివేదిక అందకుండా వాదనలు ఎలా చేయగలం శాస్త్రీయంగా బీసీ జనగణన చేపట్టకుండా ఎన్నికలు నిర్వహించరాదని, ఆ దిశగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన శంకరరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. శంకరరావు తరఫు సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్రసాద్ వాదనలు వినిపిస్తూ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికను ప్రభుత్వం ఇప్పటి వరకు బహిర్గతం చేయలేదని, ఈ నివేదికను పరిశీలించకుండా వాదనలు వినిపించడం సాధ్యం కాదని విన్నవించారు. ప్రభుత్వ జీవోలు సరికాదు స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది తాండవ యోగేష్ పిల్ వేశారు. ఇటీవల బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ కూడా యోగేష్ మరో పిల్ వేశారు. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం దాటడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన ఈ సందర్భంగా వివరించారు. నెపాన్ని కోర్టుపై నెట్టేయాలనే దురాలోచన కృష్ణా జిల్లాకు చెందిన వెంకట నరసింహ శర్మ పిల్ దాఖలు చేసిన పిటిషన్లో ఆయన తరఫు న్యాయవాది గుండాల శివప్రసాద్రెడ్డి వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రాజీవ్ రంజన్ కమిషన్ నివేదికను తొక్కిపెడుతోందన్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రిజర్వేషన్లు 50 శాతం దాటేలా ఉత్తర్వులిచ్చిందన్నారు. రేపు కోర్టు ఈ ఉత్తర్వులను కొట్టేస్తే, ‘మేం రిజర్వేషన్లు ఇచ్చాం.. కోర్టు కొట్టేసింది.. మమ్మల్ని ఏం చేయమంటారు’ అంటూ నెపాన్ని కోర్టుపై నెట్టేయాలన్నదే ప్రభుత్వ దురాలోచన అన్నారు. -
మార్క్ఫెడ్కు మామిడి భారం ‘అంటు’గట్టిన ప్రభుత్వం
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు బడ్జెట్ బయట అప్పుల పరంపరను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీపీఎఫ్సీఎల్) హైదరాబాద్లోని అబిడ్స్లో ఉన్న పంజాబ్–సింధ్ బ్యాంక్ నుంచి రూ.500 కోట్ల అప్పు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ అప్పు మొత్తం కాలపరిమితికి గ్యారంటీ ఇస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అసలు, వడ్డీ మొత్తానికి ప్రభుత్వ గ్యారంటీ వర్తిస్తుంది. ఏపీపీఎఫ్సీఎల్ తమ సొంత వనరుల నుంచి అప్పు, వడ్డీని చెల్లించాల్సి ఉంది. వాటిని చెల్లించడంలో ఏపీపీఎఫ్సీఎల్ విఫలమైతే ప్రభుత్వ గ్యారంటీ అమల్లోకి వస్తుంది. గ్యారంటీ మొత్తానికి ఐదు శాతం కమీషన్ చెల్లించాల్సి ఉంది. తోతాపురి మామిడికి కిలోకు రూ.4 ప్రోత్సాహకం ఇస్తామంటూ గొప్పగా ప్రకటించిన చంద్రబాబు ప్రభుత్వం ఆ భారాన్ని ఏపీ మార్క్ఫెడ్పైకి నెట్టింది. ఆ మేరకు అవసరమైన రూ.281 కోట్లను వర్కింగ్ క్యాపిటల్ లేదా స్వల్పకాలిక రుణాల ద్వారా సమీకరించుకునేందుకు ప్రభుత్వం మార్క్ఫెడ్కు అనుమతినిస్తూ వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. 2026–27 మార్కెటింగ్ సీజన్లో చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, కడప జిల్లాల్లో 7.03 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడికి కిలోకు రూ.4 చొప్పున ధర లోటు పథకం కింద చెల్లించనున్నారు. మార్కెట్లో పంటల ధరలు పతనమైనప్పుడు జోక్యం చేసుకొని మద్దతు ధర కల్పించాల్సిన మార్క్ఫెడ్ను చంద్రబాబు ప్రభుత్వం ఏటీఎంగా మార్చుకుంది. ఎప్పుడుపడితే అప్పుడు ఈ సంస్థ ద్వారా రుణాలు తీసుకోవడం, వాటిని ఇతర కార్పొరేషన్లు, ఇతర కార్యకలాపాలకు మళ్లించడం పరిపాటిగా మార్చుకుంది. మార్క్ఫెడ్లో రూ.10 కోట్లుగా ఉన్న ప్రభుత్వ వాటామొత్తాన్ని రూ.30 కోట్లకు పెంచిన ప్రభుత్వం, రుణపరపతిని ఏకంగా రూ.21వేల కోట్లకు పెంచింది. ఇప్పటికే ఏపీ మార్క్ఫెడ్ ద్వారా తీసుకున్న రూ.13,853 కోట్ల రుణాన్ని పౌరసరఫరాల శాఖకు మళ్లించింది. ఇలా తీసుకున్న రుణంలో రూ.200 కోట్లను విత్తన సేకరణ కోసం మళ్లించింది. తాజాగా ఏపీ మార్క్ఫెడ్కు ఏ మాత్రం సంబంధం లేని తోతాపురి మామిడి రైతులకు ధరల లోటు పథకం కింద కిలోకు రూ.4 చొప్పున ప్రోత్సాహక రూపంలో చెల్లించేందుకు రూ.281 కోట్ల రుణ భారాన్ని అంటగట్టడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. మార్కెట్లో ధరలు పడిపోతే చేతులెత్తేస్తున్న ప్రభుత్వం అప్పుల కోసం మాత్రం మార్క్ఫెడ్పై ఆధారపడడమేమిటని ప్రశ్నిస్తున్నారు. -
చంద్రబాబు హామీలు.. మోసాలు.. ఇంటింటా ఇదే చర్చ
వచ్చే సెప్టెంబర్లో పాదయాత్ర చూస్తుండగానే కళ్లు మూసి తెరిచేసరికి దాదాపు రెండున్నర ఏళ్లు గడిచాయి. ఇప్పుడు సెప్టెంబరు నెలలో ఉన్నాం. మళ్లీ కళ్లు మూసి తెరిచేలోగా ఏడాది గడిచి మళ్లీ సెప్టెంబరు వస్తుంది. వచ్చే ఏడాది సెప్టెంబరు లేదా అక్టోబరులో నా పాదయాత్ర మొదలవుతుంది. పర్చూరు మీదుగా కూడా నా యాత్ర జరుగుతుంది. చంద్రబాబు చేసిన మోసమే ఇప్పుడు ప్రతి ఇంట్లో చర్చనీయాంశమైంది. జగన్ మోసం చేయలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మోసం చేయలేదు. వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా చేశారు. ఆ టైంలో కనీసం నాలుగువేళ్లు నోట్లోకి పోయాయి. కానీ, చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయాం. ఇవాళ నోట్లోకి ఏదీ పోవడం లేదు. చంద్రబాబు పుణ్యాన మా బతుకులు బస్టాండ్ అయిపోయాయి అన్న చర్చ ప్రతి ఇంట్లో జరుగుతోంది.‘‘జగన్ ఇస్తున్న పథకాల కంటే మూడింతలు ఎక్కువ ఇస్తాను అని చెప్పి చంద్రబాబు ప్రజలను మోసం చేశాడు. ప్రతి ఇంటికి బాండ్లు పంపాడు. ఆ బాండ్ల మీద చంద్రబాబు, పవన్కళ్యాణ్ ఫొటోలు, సంతకాలతో పాటు ప్రమాణం చేసే మాటలు. జగన్ ఇచ్చినవే కాకుండా సూపర్ సిక్స్లు, సూపర్ సెవెన్ల పేరిట ఇంకా ఎక్కువ, మూడింతలు ఇస్తామన్నారు.’’‘‘చంద్రబాబు అనే వ్యక్తి, తనను ప్రశ్నించే గొంతు వినడానికి సిద్ధంగా లేని మనిషి. ఎవరు ప్రశ్నించినా వారి మీద అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పడం, నిర్బంధించడం, ప్రలోభాలు పెట్టడం, దిగజారిన రాజకీయాలు చేయడం చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు హయాంలో మనం చూస్తోంది రోజుకో డ్రామా. రోజుకో నటన. రోజుకో డైవర్షన్.’’‘‘స్థానిక ఎన్నికలు ఎలా జరిగినా ప్రజలకు తోడుగా వైఎస్సార్సీపీ ఉంటుంది అన్న భరోసా మాత్రం కచ్చితంగా ఇవ్వాలి. ఎన్నికలు కనుక సాఫీగా జరిగితే వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎక్కడైనా సరే విజయం సాధిస్తారు. ఒకవేళ ఎన్నికలు సాఫీగా జరగకపోయినా, ప్రజలకు తోడుగా పోటీలో గట్టిగా మనం నిలబడదాం.’’‘‘ప్రజలకు మంచి చేసి.. ఫలాన మంచి నేను చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి అని అడిగే నిబద్ధత, చిత్తశుద్ధి పాలకుడికి ఉండాలి. అప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రజలు తోడుగా నిలబడతారు. కానీ చంద్రబాబు మాదిరిగా అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, దౌర్జన్యాలు చేయడం, డైవర్షన్స్ చేస్తూ ఉండడాన్ని దేవుడు కరుణించడు. ప్రజలు హర్షించరు’’ – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ పాలనకు, చంద్రబాబు పాలనకు మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోందని, ఇది ప్రతి ఇంట్లో చర్చనీయాంశంగా మారిందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు హామీలు, మోసాలపైనే ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతోందని, వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనను, చంద్రబాబు రెండున్నరేళ్ల పాలనను ప్రజలు పోల్చి చూసుకుంటున్నారని అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నేతలు, ముఖ్య కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు.. జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంగా నిలబడాలని, పోరాడాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు నిజాయితీగా జరిగితే విజయం తప్పకుండా వైఎస్సార్సీపీదే అని స్పష్టం చేశారు. పర్చూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ గాదె మధుసూదన్రెడ్డి, పలువురు నేతలు సమావేశానికి హాజరయ్యారు. వైఎస్ జగన్ ఏం మాట్లాడారంటే..కార్యకర్తలు గర్వపడేలా మన పాలనమన 5 ఏళ్ల పాలన, బాబు రెండున్నర ఏళ్ల పాలనలో ఎంతో తేడా ఉంది. దీనిపైనే ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. ఆ ఐదేళ్ల మన పరిపాలనలో ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసుకుని ఫలానావాడు మా నాయకుడు, ఫలానా పార్టీ మా పార్టీ అని గర్వంగా చెప్పుకోగలిగే పరిస్థితి. మ్యానిఫెస్టోకు అర్థం తీసుకొచ్చిన పార్టీ రాష్ట్ర చరిత్రలో కానీ, దేశ చరిత్రలో కానీ ఏదైనా ఉందంటే అది ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమే. రాజకీయ నాయకులు, పార్టీలు ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలు ఇస్తారు. చంద్రబాబు లాంటి వాళ్లు అయితే ఏకంగా ప్రతి ఇంటికి బాండ్లు కూడా పంచిపెడతారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మ్యానిఫెస్టో, అందులో ఇచ్చిన హామీలు చెత్తబుట్టలో కనిపిస్తాయి. అలాంటి పరిస్థితిని మార్చిన పాలన మనది. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్లా భావిస్తూ, అందులో చెప్పిన వాటిలో 99 శాతం అమలు చేసిన పార్టీ వైఎస్సార్సీపీ మాత్రమే అని గర్వంగా చెప్పగలుగుతాం. అంతగా మాట ఇస్తే ఆ మాటపై నిలబడాలి అని తాపత్రయపడ్డాం. బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే ఏ పథకం ఏ నెలలో ఎప్పుడు ఇస్తాము అని ముందుగానే షెడ్యూల్ ప్రకటించి, ఒక్క పథకం కూడా మిస్ కాకుండా బటన్లు నొక్కి అమలు చేసిన పార్టీ వైఎస్సార్సీపీ మాత్రమే. గతంలో ఎప్పుడూ చూడని విధంగా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చాం. ప్రభుత్వ పథకాలు లంచాలు లేకుండా ఇవ్వగలిగే పరిస్థితి ఉంటుందా? అన్న సందేహాలను పటాపంచలు చేశాం. ప్రతి గ్రామంలో ఒక సచివాలయం ఏర్పాటు చేసి, ప్రతి 50, 60 ఇళ్లకు ఒక వలంటీర్ను తీసుకొచ్చి, ప్రతి పథకాన్ని పారదర్శకంగా అమలు చేశాం. ఇది వైఎస్సార్సీపీ హయాంలోనే జరిగింది.వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులు.. మన ప్రభుత్వ హయాంలో గవర్నమెంట్ స్కూళ్లు, ప్రైవేటు స్కూళ్లకు పోటీగా మారాయి. ఇంగ్లీష్ మీడియం చదువులు, మూడో తరగతి నుంచి టోఫెల్ పీరియడ్, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్స్ అమలు చేయడం, నాడు–నేడు మనబడితో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు పూర్తిగా మార్చడం, ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ డిజిటలైజ్డ్ బోధన తీసుకొచ్చేలా డిజిటలైజ్డ్ క్లాస్ రూమ్స్ చేయడం వైఎస్సార్సీపీ హయాంలోనే జరిగాయి. గోరుముద్ద అనే పేరుతో పిల్లలు ఏం తింటున్నారో, తినే ఆ తిండి బాగుందా లేదా అని పట్టించుకునే ముఖ్యమంత్రి బహుశా దేశ చరిత్రలో ఎవరైనా ఉంటారో లేదో తెలియదు కానీ జరిగింది ఒక వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే. మొట్టమొదటిసారిగా బైలింగ్వల్ టెక్స్ట్బుక్స్.. ఒక పేజీ తెలుగు, ఒక పేజీ ఇంగ్లీషుతో బుక్స్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం మనది. ఎనిమిదో తరగతికి పిల్లాడు వచ్చేసరికి ఆ పిల్లాడి చేతుల్లో ట్యాబ్లు పెట్టింది కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. ఆరోగ్యశ్రీ పేదవాడికి ఇంకా తోడుగా ఉండేలా చాలా మార్పు చేశాం. మనం రాకముందు ఆరోగ్యశ్రీ పరిధి 1,000 ప్రొసీజర్లు. మనం వచ్చిన తర్వాత 3,300 ప్రొసీజర్లకు తీసుకెళ్లాం. ప్రతి పేదవాడికి రూ.25 లక్షల దాకా ఉచితంగా వైద్యం అందించాం. నాడు–నేడుతో హాస్పిటల్స్ రూపురేఖలు మారాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ జీఎంపీ ప్రమాణాలతో కూడిన మందులు అందుబాటులో ఉంచాం. అదీ మన చరిత్ర. ఇంకా ఆస్పత్రుల్లో జీరో వేకెన్సీ పాలసీ. ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్టుల కొరత జాతీయస్థాయిలో 61 శాతం ఉంటే మన రాష్ట్రంలో అది కేవలం 4 శాతం మాత్రమే. ఒకేసారి 17 కొత్త మెడికల్ కాలేజీలు యుద్ధ ప్రాతిపదికన మొదలు పెట్టడం అన్నది కూడా గతంలో ఎప్పుడూ చూడని విషయం. గ్రామస్థాయిలోనే విలేజ్ క్లినిక్ ఏర్పాటు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి గ్రామస్థాయిలోనే ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం. ఇంకా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్. ప్రతి మండలంలో రెండు పీహెచ్సీలు. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు. ప్రతి డాక్టర్కు నాలుగైదు ఊళ్లు కేటాయింపు. ఒక డాక్టర్ పీహెచ్సీలో ఉంటే, మరో డాక్టర్ తనకు కేటాయించిన గ్రామాలకు 104 అంబులెన్సులో పర్యటన. అలా ఆయా గ్రామాలు, అక్కడి వారితో డాక్టర్కు సాన్నిహిత్యం. అత్యుత్తమ వైద్య సేవలు. ఊరిలో పేషెంట్ను పేరు పెట్టి పిలవగలిగే పరిస్థితిలోకి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్. ఇది కూడా గతంలో ఎప్పుడూ, ఎక్కడా జరగలేదు. నష్టాల్లో ఉన్న రైతు. రైతు బ్రతుకంతా ఎప్పుడూ కష్టమే. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి నుంచి, రైతును పట్టించుకునే నాధుడు ఉండడు అన్న పరిస్థితి నుంచి, మొట్టమొదటిసారిగా రైతును చెయ్యి పట్టుకొని నడిపించాలని తపన పడింది వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే. అందుకోసం గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు. ఆ ఆర్బీకేలో అసిస్టెంట్గా అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్. ప్రతి ఎకరా ఈ–క్రాపింగ్. వాటన్నింటి ద్వారా ప్రతి అడుగులోనూ రైతును చెయ్యి పట్టుకొని నడిపించే కార్యక్రమం. ఆ ఆర్బీకేల్లో పంటల గిట్టుబాటు ధరల ప్రకటన. ఆ మేరకు పోస్టర్లు. ఏరోజైనా రైతుకు రేటు రాకపోతే వెంటనే ఆర్బీకేలోని అగ్రికల్చర్ అసిస్టెంట్ సీఎం–యాప్ (కంటిన్యూయస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్) ద్వారా యాక్టివేట్ చేస్తే, వెంటనే జాయింట్ కలెక్టర్, మార్క్ ఫెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ జోక్యం చేసుకోవడం, ఆ ఆర్బీకే పరిధిలో పంటలు కొనుగోలు చేయడం, అలా మార్కెట్లో పోటీని సృష్టించి రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చేయడం అన్నది దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. సచివాలయంలో మన కళ్ళ ముందే దాదాపు పది మంది కళకళలాడుతూ సేవలు అందించే కార్యక్రమం. ప్రతి 50,60 ఇళ్లకు ఒక వలంటీర్. ఇళ్లకే వెళ్లి సేవలు అందించే కార్యక్రమం. ఇవన్నీ ఎప్పుడూ చూడలేదు, ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తప్ప. వ్యవస్థలో కనీవిని ఎరుగని మార్పులు మన హయాంలోనే జరిగాయి.చంద్రబాబు పచ్చి దగామనం ఇస్తున్న పథకాల కంటే మూడింతలు ఎక్కువ ఇస్తాను అని చెప్పి చంద్రబాబు ప్రజలను మోసం చేశాడు. ప్రతి ఇంటికి బాండ్లు పంపాడు. ఆ బాండ్ల మీద చంద్రబాబు, పవన్కళ్యాణ్ ఫొటోలు, సంతకాలతో పాటు ప్రమాణం చేసే మాటలు. మనం ఇచ్చినవే కాకుండా సూపర్ సిక్స్లు, సూపర్ సెవెన్ల పేరిట ఇంకా ఎక్కువ, మూడింతలు ఇస్తామన్నారు. అప్పుడు చంద్రబాబునాయుడు చెప్పిన మాటలు ఏమిటి? జగనైతే అమ్మఒడి కింద ఎంత మంది పిల్లలు ఉన్నా ఒకరికే రూ.15 వేలు ఇస్తున్నాడు. మేమైతే ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే, అందరికీ రూ.15 వేల చొప్పున ఇస్తామన్నాడు. అంతటితో ఆగిపోలేదు. ఆడబిడ్డ నిధి కింద నీకు రూ.18 వేలు, నీకు రూ.18 వేలు ఇస్తామని చెప్పాడు. ఇంకా అంతటితో కూడా ఆగిపోలేదు. రైతు కనపడితే ఏమన్నాడు? జగన్ రైతు భరోసా కింద రూ.13,500 ఇస్తే, తాను రూ.26 వేలు ఇస్తానన్నాడు. అంతటితో ఆగిపోలేదు. 45 ఏళ్ళు దాటిన మహిళలకు చేయూత కింద జగన్ ఇచ్చేది కేవలం రూ.18,750 అయితే, తాము 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారు. అలా నీకు రూ.48 వేలు, నీకు రూ.48 వేలు ఇస్తామని ప్రచారం చేసుకున్నారు. ఇంకా దాంతోనూ ఆగిపోలేదు. 20 ఏళ్ల పిల్లోడు కనపడితే ఏమన్నాడు? నీకు రూ.36 వేలు, నీకు రూ.36 వేలు అని చెప్పాడు. అలా జగన్ కంటే అన్నీ ఎక్కువే ఇస్తానని నమ్మించాడు. ఆఖరికి వలంటీర్లను కూడా చంద్రబాబు మోసం చేశారు.దౌర్జన్యంతో పాలకులు రాజ్యం చేయలేరుఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే దౌర్జన్యంతో ఎప్పుడూ కూడా పాలకులు రాజ్యం చేయలేరు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు పాలనలో నా పాదయాత్రకు ముందు నంద్యాల ఉపఎన్నిక జరిగింది. ఆ ఉపఎన్నికల్లో విపరీతంగా పోలీసుల ద్వారా అధికార దుర్వినియోగం చేశారు. దాంతో నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 34 వేల ఓట్లతో ఓడిపోయింది. కానీ ఆ తర్వాత ఏమైంది? మన పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను చంద్రబాబునాయుడు తన పార్టీలో చేర్చుకున్నాడు. ఆ తర్వాత ఏమైంది? దాని తర్వాత నా పాదయాత్ర జరిగింది. ఆ తర్వాత ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఏం జరిగింది? ఒక సునామీ వచ్చింది. దేవుడు చంద్రబాబుకి ఎలా మొట్టికాయలు వేశాడో చూశాం. అదే నంద్యాలలో దాదాపు 40 వేల ఓట్లతో మనం గెలిచాము. చంద్రబాబు మన పార్టీ నుంచి చేర్చుకున్న 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు. సరిగ్గా ఆ సంఖ్యలోనే ఆ పార్టీ గెలిచింది. మన దగ్గర నుంచి వెళ్లిన వాడు ఎవడూ గెలవలేదు ఒకడు తప్ప. అందరూ ఓడిపోయినారు.’’జరగబోయేది కురుక్షేత్రంఇప్పటి ఈ ఎన్నికల కంటే కూడా రేపు పొద్దున జరగబోయే కురుక్షేత్రం ముఖ్యం. ఈ ఎన్నికల్లో చిన్న ప్రాణులను ఓడించడం కోసం చంద్రబాబు చేసిన అధికార దుర్వినియోగం, పోలీసు బలగాల ప్రయోగంపై కసి అన్నది ఆ ఎన్నికల్లో రావాలి. అలాంటి కసి కార్యకర్తలకు రావాలి. ఆ కార్యకర్తకు పార్టీ అన్ని రకాలుగా తోడుగా అండగా నిలబడుతుంది. ఇది కార్యకర్తల కోసం జరుగుతున్న ఎన్నికలు. మనం కార్యకర్తలకు తోడుగా ఉండాల్సిన ఎన్నికలు. ప్రజలకు తోడుగా కార్యకర్త నిలబడతాడు. కార్యకర్తకు తోడుగా పార్టీ నిలబడుతుంది అన్న సంకేతం ఈ ఎన్నికల ద్వారా మనం ఇవ్వాలి.స్థానిక ఎన్నికలపైనా చంద్రబాబు డ్రామా.. కుట్రఇలాంటి పరిస్థితుల మధ్య ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే చంద్రబాబు ఆ ఎన్నికలు పెడతాడో లేదో తెలియదు. కానీ మేకపోతు గాంభీర్యం మాత్రం ప్రదర్శిస్తున్నాడు. ఎందుకంటే ఆయన నిజంగా స్థానిక ఎన్నికలు పెట్టే వాడే అయితే, బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఇచ్చే వాడు కాదు. దీనికి సంబంధించి నాడు మన హయాంలో ఇచ్చిన జీఓను కోర్టు కొట్టేసింది. అయినా అంతకన్నా ఎక్కువ పదవులు మనం బీసీలకు ఇచ్చాం. ఆ జడ్జిమెంట్ ఇప్పుడు కనిపిస్తోంది. ఆ బీసీ రిజర్వేషన్లు తెలంగాణాలోనూ కొట్టేశారు. అందుకే ఇప్పుడు ఇక్కడ కూడా ఆ అవకాశం ఉందని తెలిసినా, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అంటూ చంద్రబాబు డ్రామా చేస్తున్నాడు. ఎందుకంటే ఈ ఎన్నికలు జరగకూడదు. వాయిదా పడాలన్నదే ఆయన కుట్ర. మరొకటి ‘సర్’. (ఓటర్ల జాబితాల సమగ్ర సవరణ) వీళ్ళే అంటున్నారు ఇక్కడ 44 లక్షల ఓట్లు లేవు అని. అయితే పాత జాబితాలతో ఎన్నికలు పెడతాడా? దానికి ఏ కోర్టయినా ఒప్పుకుంటుందా? మరి చంద్రబాబు ఎన్నికలు పెట్టాలని ఇవన్నీ చేస్తున్నాడా? పెట్టకూడదని చేస్తున్నాడా? ఇది మేకపోతు గాంభీర్యం కాకపోతే ఇదంతా ఏమిటి? సరే, ఏదైనా కానీ, చంద్రబాబుగారు స్థానిక ఎన్నికలు పెడతాడని అనుకుని, ముందుకు పోదాం.ఎన్నికలు సాఫీగా జరిగే వీలు లేదుచంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్నికలు సాఫీగా జరుగుతాయని నేను అనుకోవడం లేదు. చంద్రబాబు అనే వ్యక్తి, తనను ప్రశ్నించే గొంతు వినడానికి సిద్ధంగా లేని మనిషి. చంద్రబాబుని ఎవరు ప్రశ్నించినా వారి మీద అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పడం, నిర్బంధించడం, ప్రలోభాలు పెట్టడం, దిగజారిన రాజకీయాలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు హయాంలో మనం చూస్తోంది రోజుకో డ్రామా. రోజుకో నటన. రోజుకో డైవర్షన్. ఇది కాక రెడ్బుక్ రాజ్యాంగం. వీటన్నింటి నేపథ్యంలో ఎన్నికలు సాఫీగా జరుగుతాయని అనుకోవడం లేదు.సాఫీగా జరిగితే మనదే విజయంఎన్నికలు ఎలా జరిగినా ప్రజలకు తోడుగా వైఎస్సార్సీపీ ఉంటుంది అన్న భరోసా మాత్రం కచ్చితంగా ఇవ్వాలి. ఎన్నికలు కనుక సాఫీగా జరిగితే వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎక్కడైనా సరే విజయం సాధిస్తారు. ఒకవేళ ఎన్నికలు సాఫీగా జరగకపోయినా, ప్రజలకు తోడుగా పోటీలో గట్టిగా మనం నిలబడదాం. చంద్రబాబు ఒకవేళ ఓడించే కార్యక్రమం, అధికార దుర్వినియోగం చేసే కార్యక్రమం, పోలీసులు జులుంను ఉపయోగించే కార్యక్రమం చేస్తే ఎవరిని ఓడించడం కోసం? ఆ చిన్న ప్రాణాన్ని ఓడించడం కోసం. ఆ చిన్న ఎంపీటీసీ స్థానం, ఆ చిన్న సర్పంచ్ స్థానం, ఆ చిన్న వార్డ్ మెంబర్ స్థానంలో ఉన్న వ్యక్తులను ఓడించడం కోసం. అందుకే అటువంటి చిన్న ప్రాణాలకు తోడుగా ఉండాలి. -
బీసీల ఉద్ధారకుడు వైఎస్ జగనే
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ‘ఉత్తరాంధ్రలో ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల్లో 60 నుంచి 70 శాతం మంది బీసీలే. వారి సంఖ్యను కలిపేసి రాష్ట్రంలో బీసీల నిష్పత్తిని చూపిస్తున్నారు. అసలు అన్ని కులాలకు కలిపి రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని సుప్రీంకోర్టులో 9 మంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును కప్పిపుచ్చి, ఒక్క బీసీలకే 34 శాతం రిజర్వేషన్లు కల్పించకుండానే కల్పించినట్లు మసిపూసి మారేడుకాయ చేయడం ఒక్క చంద్రబాబుకే చెల్లింది. ఆయన ముఖ్యమంత్రిగా దాదాపు 20 ఏళ్ల పాలనలో బీసీలకు ఎన్నికలకు ముందు తాయిలాలు తప్ప వారి అభివృద్ధికి చేసింది శూన్యం. ఎన్నికల్లో ఎలాంటి హామీ ఇవ్వకపోయినా బీసీల సర్వతోముఖాభివృద్ధి ఎలా చేయాలో చేసి చూపించింది వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే. బీసీల ఉద్ధారకుడు ఆయన మాత్రమే. బీసీల కోసం చంద్రబాబు చేసింది శూన్యం. టీడీపీ బీసీల పార్టీ అని చెప్పుకొనే నైతికహక్కు చంద్రబాబుకు లేనేలేదు’ అని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఆయన బుధవారం న్యూఢిల్లీలో ‘సాక్షి’తో మాట్లాడారు. బీసీల కృతజ్ఞత సభ అంటూ నర్సీపట్నంలో పుష్పాభిషేకాలు, క్షీరాభిషేకాలు చేయించుకున్నంత మాత్రాన బీసీల ఉద్ధారకులు అయిపోరని చంద్రబాబును ఎద్దేవా చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో, రాజకీయ సభల్లో ఇచ్చే హామీల కన్నా, అధికారంలోకి వచ్చాక బీసీలకు ఎలాంటి ప్రయోజనాలు కల్పించారనేదే ఒక పార్టీ తమది బీసీల పార్టీ అని చెప్పుకోవడానికి ప్రామాణికం అవుతుందని చెప్పారు. అలా చెప్పుకోదగిన ప్రయోజనమేదైనా చంద్రబాబు చేశారేమో చెప్పుకోగలరా? అని ప్రశ్నించారు. కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ఐదేళ్ల పాలనలో బీసీలకు ఏయే ప్రయోజనాలు కల్పించారో చెప్పడానికి అనేక నిదర్శనాలు ఉన్నాయన్నారు.చట్టసభల్లో బీసీలకు జగన్ పెద్దపీటవిభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో బీసీలకు చట్టసభల్లో పెద్దపీట వేసిన ఘనత ఒక్క వైఎస్ జగన్మోహన్రెడ్డికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కుతుందని చెప్పారు. ఒకేదఫా నలుగురు బీసీ నాయకులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు, ఆర్.కృష్ణయ్యలను రాజ్యసభకు పంపించారని గుర్తుచేశారు. అది చాలా గొప్ప విషయమన్నారు. చంద్రబాబు ఎప్పుడైనా ఆ స్థాయిలో బీసీలను రాజ్యసభకు పంపారా? అని ప్రశ్నించారు. ‘శాసనమండలిలో 2023లో 18 స్థానాలు ఖాళీ అయితే, 11 మంది బీసీ నాయకులకు ఎమ్మెల్సీలుగా జగన్మోహన్రెడ్డి అవకాశం కల్పించారు.మొత్తం 44 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల్లో 19 మంది బీసీ నాయకులే. గతంలో ఎప్పుడూ బీసీలకు అంత పెద్దసంఖ్యలో ప్రాతినిధ్యం కల్పించిన దాఖలాలు లేవు. 2024 ఎన్నికల్లో కూడా జగన్మోహన్రెడ్డి 25 లోక్సభ స్థానాలకుగాను 11 చోట్ల బీసీలకే టికెట్ ఇచ్చారు. 175 అసెంబ్లీ స్థానాలకుగాను 48 చోట్ల బీసీ అభ్యర్థులనే నిలబెట్టారు. మొత్తం బీసీలకు 59 సీట్లు అంటే దాదాపు చట్టసభల్లో 30 శాతం రిజర్వేషన్లు ఆయన చెప్పకుండానే ఇచ్చారు’ అని వివరించారు. ఇలా బీసీలకు చట్టసభల్లో అగ్రస్థానం కల్పించి, తమ అభిప్రాయాలను, నిర్ణయాలను గళమెత్తి చెప్పడానికి అవకాశం ఇచ్చిన వ్యక్తి, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని స్పష్టం చేశారు. చంద్రబాబు కేబినెట్లో బీసీ మంత్రులెందరు? తెలుగుదేశం పార్టీ విషయానికొస్తే పూర్వం ఎన్.టి.రామారావు బీసీ పట్ల కాస్త ఉదారంగా ఉండేవారని చెప్పారు. కానీ చంద్రబాబుకు మాత్రం ఎన్నికల్లో భారీ హామీలిచ్చి, అధికారంలోకి వచ్చాక వాటిని పక్కనబెట్టేసే చరిత్ర ఉందన్నారు. ఇప్పుడు చంద్రబాబు కేబినెట్లో ఎంతమంది బీసీలకు మంత్రి పదవులిచ్చారో చూస్తే అసలు విషయం అర్థమవుతుందని పేర్కొన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో 11 మంది బీసీలకు మంత్రి పదవులిచ్చారని గుర్తుచేశారు. బీసీల పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి ఏది? రాష్ట్రంలోని బీసీలకు ఏంకావాలో చూడాలనే చిత్తశుద్ధి చంద్రబాబుకు ఏనాడూ లేదని విమర్శించారు. ఉదాహరణకు బీసీల్లో ఒకరైన లక్షలాదిమంది మత్స్యకారులు సుదీర్ఘమైన సముద్రతీరం ఉన్న ఈ రాష్ట్రాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారంటే చంద్రబాబు తన 20 ఏళ్ల పాలనలో వారి అభివృద్ధికి ఏం చేసినట్లని ప్రశ్నించారు. వారికోసం ఒక్క ఫిషింగ్ హార్బర్ను కూడా నిర్మించలేదన్నారు. జగన్మోహన్రెడ్డి తన ఐదేళ్ల పాలనలో 8 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం తలపెట్టారని గుర్తుచేశారు. వాటిలో కొన్ని నిర్మాణం పూర్తికాగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయన్నారు. కొన్నింటిని చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆపేశారని విమర్శించారు. బీసీల విద్యకు జగన్ ప్రాధాన్యం తరతరాలుగా వ్యవసాయం, చేతివృత్తుల్లోనే ఉన్న బీసీలు పారిశ్రామికీకరణ తర్వాత దేశవ్యాప్తంగా తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో వారిని సామాజికంగా, ఆర్థికంగా ముందుకు తీసుకురావడానికి ఉన్న ఏకైక మార్గం విద్య మాత్రమేనన్నారు. కానీ చంద్రబాబు మాత్రం ప్రైవేట్ విద్యాసంస్థలకు పెద్దపీట వేస్తూ, పేద కుటుంబాల్లోని పిల్లలకు విద్యను దూరం చేసే పాలసీలనే అమలుచేస్తున్నారని విమర్శించారు. అందుకు భిన్నంగా గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో మాత్రమే పేద కుటుంబాల్లోని విద్యార్థులకు విద్యను చేరువచేసే ఫీజు రీయింబర్స్మెంట్, అమ్మ ఒడి వంటి సంక్షేమ పథకాలను చేపట్టారని గుర్తుచేశారు. వారి పేదరికం ఏరోజూ వారి చదువుకు అడ్డుకాకుండా చేయగలిగిన ఘనత వైఎస్ కుటుంబానికి దక్కుతుందన్నారు. చంద్రబాబు ఆ పథకాలను నీరుగారుస్తూ తిరోగమన విధానాలను అనుసరిస్తున్నారని విమర్శించారు. బీసీల అభివృద్ధి జగన్ పాలనతోనే తెలిసిందిఅంతవరకు బీసీలకు చిన్నచిన్న తాయిలాలతోనే చంద్రబాబు పాలన సాగిందని, జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల సంక్షేమానికి ఇంత చేయవచ్చా అని తెలిసిందని చెప్పారు. రాష్ట్రంలో గూడులేని నిరుపేదల్లో ఎక్కువమంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలేనన్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి 12 వేల ఎకరాలను సేకరించి, దాదాపు 30 లక్షలమంది మహిళలకు ఇచ్చిన ఇళ్లపట్టాల్లో ఎక్కువ లబ్దిపొందింది బీసీ సామాజికవర్గాలేనని చెప్పారు. మరి చంద్రబాబు గత రెండేళ్ల పాలనలో పేదవారి కోసం ఒక్క సెంటు భూమి అయినా సేకరించారా? అని ప్రశ్నించారు. ధనవంతులైన పారిశ్రామికవేత్తలకు మాత్రం రూపాయికి, పావలాకు ప్రభుత్వ భూములను ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. తాము పారిశ్రామికీకరణకు వ్యతిరేకం కాదని, కానీ భూపంపిణీ విధానమే సరైంది కాదని చెబుతున్నామని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలను కూడా వ్యాపార, వాణిజ్య, ఐటీ, పారిశ్రామికరంగాల్లో ప్రోత్సహించే చర్యలనే ఏ ప్రభుత్వమైనా చేపట్టాలన్నారు. ఆ పనిని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో జగన్మోహన్రెడ్డి చేసి చూపించారని చెప్పారు. అందుకే ఇప్పుడు రాష్ట్రంలో బీసీలే కాదు అన్ని సామాజికవర్గాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి జగన్మోహన్రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారనే మాట వినిపిస్తోందని తెలిపారు. ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తారుమళ్లీ ఇప్పుడు స్థానికసంస్థల ఎన్నికలు వస్తున్నాయనగానే చంద్రబాబుకు బీసీలు గుర్తుకొస్తున్నారని ధర్మాన ఎద్దేవా చేశారు. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టమైన తీర్పు ఇచ్చాక కూడా ఇంకా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అంటూ చంద్రబాబు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు మాయమాటలను మళ్లీ నమ్మే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరన్నారు. చంద్రబాబు గారడీ మాటలపై బీసీలను చైతన్యం చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సభలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తొలుత ఐదు రీజియన్ల వారీగా, తర్వాత దఫాలో 25 జిల్లా కేంద్రాల్లో, 175 నియోజవర్గాల వారీగా ఈ సభలు నిర్వహిస్తామని వివరించారు. బీసీలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏం జరిగిందీ, చంద్రబాబు పాలనలో ఏం మోసం జరిగిందీ వివరిస్తామన్నారు. ఏ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలో, బీసీల నుంచి ఎలాంటి డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టాలో నిర్ణయిస్తామని ధర్మాన ప్రసాదరావు చెప్పారు. -
ఈడబ్ల్యూఎస్లో కాపులకు 5 శాతం రిజర్వేషన్లపై మీ వైఖరి ఏంటి?
సాక్షి, అమరావతి: ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు (ఈడబ్ల్యూఎస్) విద్య, ఉద్యోగ అవకాశాలలో కల్పించిన 10 శాతం రిజర్వేషన్లో కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకొచ్చిన చట్టాల అమలు విషయంలో వైఖరి ఏమిటో స్పష్టంగా తెలియజేయాలని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాపులకు సంబంధిత 5 శాతం రిజర్వేషన్ చట్టాలను అమలు చేస్తారా? లేక వాటిని పునః సమీక్షిస్తారా? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు విషయంలో గత ప్రభుత్వం జారీ చేసిన జీవోల అమలుపై ఏం నిర్ణయం తీసుకుంటారు? తదితర వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)జస్టిస్ లీసాగిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రిజర్వేషన్ల అమలుపై వ్యాజ్యాలు » కాపులకు ఈడబ్ల్యూఎస్ కోటాలో 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకొచ్చిన చట్టాలను అమలు చేయకపోవడాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ కాపు సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామ జోగయ్య గతంలో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. » విద్యా, ఉపాధి అవకాశాల్లో కాపులకు 5 శాతం రిజర్వేషన్లను అమలు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ రాజమండ్రికి చెందిన అడ్డేపల్లి శ్రీధర్ లక్ష్మణ్, విజయవాడకు చెందిన కమ్మిలి కృష్ణ, ఉత్కర్ష్ పిటిషన్లు దాఖలు చేశారు. » కాపులకు ఈడబ్ల్యూఎస్ కోటాలో 5 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన 14, 15 చట్టాలను సవాలు చేస్తూ గుంటూరు జిల్లా, కృష్ణాయపాళెంకు చెందిన పెద్ది రామకృష్ణ, కర్నూలుకు చెందిన కె.చంద్రశేఖర శర్మ, మిత్రవింద తదితరులు కూడా పిటిషన్లు వేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. అనుకూల వాదనలు పిటిషనర్లు శ్రీధర్ లక్ష్మణ్, కృష్ణ తదితరుల తరఫు సీనియర్ న్యాయవాది పి.గంగయ్యనాయుడు, జోగయ్య తరఫు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలు వినిపిస్తూ, ‘ఈడబ్ల్యూఎస్ 10 శాతం కోటాలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు చట్టాలు తీసుకొచ్చింది. అయితే ఈ చట్టాలను మాత్రం అమలు చేయడం లేదు. ఈడబ్ల్యూఎస్ కోటా 10 శాతం రిజర్వేషన్లు ఇస్తూ కేంద్రం తీసుకొచ్చిన 103వ రాజ్యాంగ సవరణను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఉన్నత వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు 10 శాతం రిజర్వేషన్లు కేటాయించడాన్ని సమర్థిస్తూ తీర్పునిచ్చింది. అదే సమయంలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇస్తూ చేసిన చట్టాలను సవాలు చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాలను కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ నేపథ్యంలో కాపులకు విద్యా, ఉపాధి అవకాశాల్లో 5 శాతం రిజర్వేషన్లను అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలి’ అని కోరారు. ప్రతికూల వాదనలు కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని సవాల్ చేసిన పెద్ది రామకృష్ణ తదితరుల తరఫు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపిస్తూ... ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చేసిన 103వ రాజ్యాంగ సవరణను సమర్థించిందన్నారు. దీనిని సవాలు చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాలను కొట్టేసిందని తెలిపారు. అయితే ఈడబ్ల్యూఎస్ 10 శాతం కోటాలో కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించడానికి సంబంధించిన వ్యాజ్యాల గురించి సుప్రీంకోర్టు ఆ తీర్పులో ప్రస్తావించలేదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ సుప్రీంకోర్టు తీర్పుపై అభ్యంతరం ఉంటే అక్కడే రివ్యూ పిటిషన్ దాఖలు చేసుకొని ఉండాల్సిందని వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు తీర్పులకు తాము భాష్యాలు చెప్పలేమంది. అలా అయితే సుప్రీంకోర్టు తీర్పును పరిశీలించి తగిన వాదనలు వినిపించేందుకు సమయం ఇవ్వాలని ఇంద్రనీల్ కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించింది. -
పండగ సీజన్లో ఉపాధి పరవళ్లు
సాక్షి, అమరావతి: వరుసగా వచ్చే పండగల సీజన్ మార్కెట్ను కొల్లగొట్టేందుకు ఈ కామర్స్, క్విక్ కామర్స్ సంస్థలు రంగం సిద్ధం చేసుకున్నాయి. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలతో మొదలైన ఈ హడావిడి వినాయక చవితి, దసరా, దీపావళి, క్రిస్మస్ వరకు కొనసాగుతుంది. కేవలం ఈ ఐదు నెలల కాలంలోనే రూ.లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఇందులో అత్యధిక శాతం కొనుగోళ్లు చేసేది జెన్జీయే. అందుకే ఈ జనరేషన్ అలవాట్లకు తగ్గట్టుగా వేగంగా డెలివరీ చేయడానికి ఈ–కామర్స్ సంస్థలు భారీ నియామకాలను చేపట్టాయి.కేవలం పండగల సీజన్ కోసం గతేడాది కంటే 15 నుంచి 20 శాతం అధికంగా నియామకాలు చేపట్టే అవకాశం ఉందని సర్వేలు అంచనా వేస్తున్నాయి. ఈ సీజన్లో సేవలందించడం కోసం తాత్కాలికంగా 2.7 లక్షల మందిని నియమించుకోవచ్చన్నది అంచనా. ఇప్పటికే ఈ–కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ 1.6 లక్షల మందిని నియమించుకున్నట్టు ప్రకటించింది. డెలివరీ బాయ్ నుంచి ఫ్రంట్లైన్ ఆఫీసర్లు, స్టోర్ కీపర్స్, వేర్హౌస్ ప్యాకర్స్, లాజిస్టిక్ ఇలా రకరకాల సేవలకు వీరిని వినియోగంచనున్నారు. మీషో అయితే కొనుగోళ్లు, అమ్మకాలు, లాజిస్టిక్స్ నిర్వహణ ద్వారా కనీసం 10 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని చెబుతోంది. రూ.1.55 లక్షల కోట్ల వ్యాపారం అంచనా ఏడాది మొత్తం మీద జరిగే ఆన్లైన్ వ్యాపారంలో 80 నుంచి 90 శాతం కేవలం పండగల సీజన్ నుంచే వస్తుంది. 2025 పండగల సీజన్లో రూ.1.2 లక్షల కోట్ల అమ్మకాలు జరగ్గా.. ఈ ఏడాది 29 శాతం వృద్ధితో రూ.1.55 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. ఈ–కామర్స్ సంస్థలు కేవలం నగరాలు, ప్రధాన పట్టణాలే కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలపై ప్రధానంగా దృష్టి సారిస్తుండటంతో ఈ ఏడాది అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. పండగల సీజన్ అమ్మకాల్లో అత్యధికంగా 60 శాతం సెల్ఫోన్లు వంటి ఎల్రక్టానిక్ వస్తువులు, వాషింగ్ మెషిన్లు, ఫ్రిడ్జ్లు వంటి హోమ్ అప్లయెన్సెస్ నుంచే ఉంటున్నాయి. ఈ–కామర్స్కు అదనంగా ఈ ఏడాది క్విక్ కామర్స్ (ఆర్డర్ పెట్టిన 10 నిమిషాల్లోనే డెలివరీ చేసే) సంస్థలు బాగా విస్తరించడంతో మార్కెట్ పరిమాణం బాగా పెరుగుతుందని అంచనా వేస్తున్నాయి. దీనికి అనుగుణంగా క్విక్ కామర్స్ సంస్థలు తమ ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్ను ద్వితీయ శ్రేణి పట్టణాలకు బాగా విస్తరించాయి. ఈ–కామర్స్ సంస్థలో పనిచేసే గిగ్ వర్కర్లు ప్రతినెలా సగటున రూ.22 వేల నుంచి రూ.32 వేల వరకు సంపాదిస్తున్నారు. ఈ ఏడాది గిగ్ వర్కర్ల వేతనాల్లో 8శాతం వృద్ధి ఉంటుందని అంచనా. -
తెలుగు రాష్ట్రాల్లో రెండు రైల్వే ప్రాజెక్టులు
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో రైల్వే కనెక్టివిటీకి ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) దేశవ్యాప్తంగా రూ.10,021 కోట్ల అంచనా వ్యయంతో ఐదు మల్టీట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ మొత్తంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 17 జిల్లాల మీదుగా ఐదు ప్రాజెక్టులు నిర్మించనున్నారు.ఇందులో భాగంగా ఏపీ పరిధిలో రేణిగుంట–అరక్కోణం మార్గంలో 77 కిలోమీటర్ల మేర మూడో, నాలుగో లైను పనులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ పనులను 2029–30 ఆర్థిక సంవత్సరం నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ ప్రాజెక్టులను పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కింద రూపొందించారు. తద్వారా ప్రజల రాకపోకలతో పాటు సరుకు రవాణా అత్యంత సులభతరం కానుంది. పనులు పూర్తయితే రైల్వే నెట్వర్క్ సామర్థ్యం పెరిగి రైళ్ల రద్దీ తగ్గుతుంది. ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలకు మహర్దశ ఈ రైల్వే లైన్ల విస్తరణ పనులతో ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలకు కనెక్టివిటీ మెరుగుపడనుంది. ఏపీలోని తిరుపతి, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయాలకు, తెలంగాణలోని యాదగిరి గుట్ట ఆలయానికి ప్రయాణికుల రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. మొత్తంగా ఐదు ప్రాజెక్టుల వల్ల సరుకు రవాణా సామర్థ్యం పెరగడంతోపాటు, ఇంధన ఆదాతో పాటు పర్యావరణానికి భారీ ప్రయోజనం కలగనుంది. వాతావరణంలోకి 42 కోట్ల కిలోల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయని, ఇది సుమారు 2 కోట్ల చెట్లను నాటడంతో సమానమని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. -
కళ్లార్పకుండా ‘కహానీలు’
సాక్షి, అమరావతి : తాను చేయని పనిని చేసినట్లు చెప్పుకోవడంలో చంద్రబాబు ఎక్కడలేని ‘తెలివితేటలు’ ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రంలో భూముల రీసర్వే, 22–ఏ భూములకు విముక్తి, పట్టాదారు పాసుపుస్తకాల ఘనత తనదేనని నోటికొచ్చినట్లు అలవోకగా అబద్ధాలు వల్లెవేస్తున్నారు. తాను వ్యతిరేకించిన కార్యక్రమాన్ని తానే ప్రారంభించినట్లు, తాను 22–ఏలో పెట్టిన భూములకు తానే విముక్తి కల్పించినట్లు నిస్సిగ్గుగా అవాస్తవాలు మాట్లాడుతూ కళ్లార్పకుండా కహానీలు చెబుతుండడంపై జనం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. క్యూఆర్ కోడ్ బాబు తెచ్చారా?.. రాష్ట్రంలో భూముల రీసర్వే మొదలైంది 2020 డిసెంబర్ 21న. అప్పటి ఉమ్మడి కృష్ణాజిల్లా తక్కెళ్లపాడులో సరిహద్దు రాయి పాతి వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష పథకానికి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఈ సర్వే కోసం దేశ చరిత్రలో తొలిసారిగా 14 వేల మంది సర్వేయర్లను ప్రత్యేకంగా నియమించారు. 3,240 జీఎన్ఎస్ఎస్ రోవర్లు, వందలాది డ్రోన్లు, నాలుగు హెలికాప్టర్లు, రెండు విమానాలు, 70 కార్స్ స్టేషన్ల నెట్వర్క్తో అనేక వ్యయ ప్రయాసలతో ఏర్పాటుచేశారు. మొత్తం 2.47 కోట్ల సర్వే నంబర్లలోని భూమిని కొలిచి కొత్తగా 86,80,246 ఎల్పీఎం (ల్యాండ్ పార్శిల్ మ్యాప్) నంబర్లు జారీ చేశారు. 13,500 గ్రామాలకు గాను 6,800 గ్రామాల్లో అన్ని దశల సర్వే పూర్తయి డిజిటల్ రికార్డులు అందుబాటులోకి వచ్చాయి. సర్వే నెంబర్ల స్థానంలో ఎల్పీఎం నెంబర్లు వచ్చింది అప్పుడే. 30 లక్షల మంది రైతులకు క్యూఆర్ కోడ్తో కూడిన భూహక్కు పత్రాలు ఇచ్చారు. పాస్ పుస్తకంపై క్యూఆర్ కోడ్, ప్రతి భూమికీ జియో హద్దులు, ప్రతి పార్సిల్కూ ఐడీ నంబరు, ల్యాండ్ పార్సిల్ మ్యాప్.. ఇలా ఇప్పుడు చంద్రబాబు చెప్పుకుంటున్న ప్రతిదీ అప్పటిదే. 2022 సెపె్టంబర్లో జారీ అయిన పాస్ పుస్తకాలపై ఆ క్యూఆర్ కోడ్ ఇప్పటికీ ఉంది. రైతుల చేతుల్లో ఆ సాక్ష్యం ఉండగా చంద్రబాబు కళ్లార్పకుండా చెబుతున్న అబద్ధాలు చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు.రీ సర్వే ఆపేస్తానని.. క్రెడిట్ దోపిడీ..రీసర్వే వల్ల రైతులకు నష్టమని, మీ భూములు ఎక్కడున్నాయో తెలుసుకుని ఆక్రమించడానికే ఈ సర్వే అని.. ఇక మీ భూములు మీవి కావని, తాము అధికారంలోకి రాగానే రీసర్వేను ఆపేస్తామని చంద్రబాబు ఎన్నికలకు ముందు ఊరూవాడా హోరెత్తించారు. అయితే, అధికారంలోకి వచ్చాక ఏడాది పాటు రీసర్వేను నిజంగానే నిలిపివేశారు. ఆ తర్వాత అదే చంద్రబాబు రాష్ట్రంలో రీసర్వే అద్భుతంగా జరిగిందని కేంద్రానికి లేఖ రాసి రూ.500 కోట్ల రాయితీని సిగ్గులేకుండా తెచ్చుకున్నారు. ఆ డబ్బు వచ్చింది వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన పనికి. ఇలా ఢిల్లీలో గొప్పలకు పోవడం.. రాష్ట్రంలో బురదజల్లడం చంద్రబాబుకే చెల్లింది. నిజానికి.. చంద్రబాబు వచ్చాక ఒక్క గ్రామంలో కూడా రీసర్వే పూర్తికాలేదు.రాజముద్ర వేసి తానే చేశానంటే సరా?.. ఇక పట్టాదారు పాస్ పుస్తకాలను రాజముద్రతో ఇచ్చానని చంద్రబాబు గొప్పగా చెప్పుకుంటున్నారు. పుస్తకంలో రైతుకు ఉపయోగపడేది బొమ్మ కాదు, క్యూఆర్ కోడ్, జియో హద్దులు, ఎల్పీఎం నంబరు. ఆ మూడూ ఎక్కడివో బాబుకు బాగా తెలుసు. లోగో మార్చడం సంస్కరణ కాదు. అలాగే, స్టిక్కర్ మార్చి చరిత్ర సృష్టించినట్లు డప్పు కొట్టుకోవడం ఆయన అవివేకం. జగన్ హయాంలో పాతిన సర్వే రాళ్లపై నవరత్నాల లోగో ఉందని, సీఎం ఫొటో ఉందని ఆయన ఇప్పటికీ విష ప్రచారం చేస్తూనే ఉన్నారు. నిజానికి అది వాటర్మార్క్ లోగో మాత్రమే. సర్వే ఎప్పుడు జరిగిందో, ఏ ప్రామాణికతతో జరిగిందో శాశ్వతంగా గుర్తుండేందుకు వేసిన ముద్ర. అది తప్పయితే ఇప్పుడు పింఛన్ల పంపిణీ పాంప్లెట్ల నుంచి ప్రతీ ప్రభుత్వ కార్యక్రమంలోనూ చంద్రబాబు ఫొటో పెట్టుకోవడం ఎంతవరకు కరెక్టు?.22–ఏ నుంచి 16 లక్షలు ఎకరాలు తీసేశారా? మరోవైపు.. 16 లక్షల ఎకరాలను 22–ఏ జాబితా నుంచి తొలగించినట్లు పచ్చి అబద్ధాలు చెబుతున్న చంద్రబాబు అసలు వాటిని అందులో పెట్టింది తానేననే విషయాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెడుతూ ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఎందుకంటే.. 2024లో అధికారంలోకి రాగానే రాజకీయ కక్షతో 20 లక్షల ఎకరాలకు పైగా భూములను నిషేధిత జాబితాలో పెట్టింది సాక్షాత్తు చంద్రబాబే. అందులో 13.59 లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్ భూములు, 2.06 లక్షల ఎకరాల చుక్కల భూములు, 1.39 లక్షల ఎకరాల సర్వీస్ ఈనాం భూములు, 40 వేల ఎకరాల షరతులు గల పట్టా భూములు, 50 వేల ఎకరాల అనాధీనం భూములు ఉన్నాయి. అనేక విచారణల తర్వాత ఆ భూములన్నీ సక్రమమేనని ప్రభుత్వం నిగ్గుతేల్చింది. ఈ నేపథ్యంలో.. తప్పు ఒప్పుకోవడం మానేసి, ఇప్పుడు వాటిని తొలగిస్తూ తానే విముక్తి కల్పించానని సిగ్గులేకుండా డబ్బా కొట్టుకుంటున్నారు. ఇక జగన్ హయాంలో ఏకకాలంలో వేల గ్రామాల్లో సర్వే బృందాలు దూసుకుపోతే, ఇప్పుడు నెలకు వంద గ్రామాల్లో కూడా జరగడం లేదు. సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసి, సర్వే బృందాలను కుదించి, రైతును మళ్లీ ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిప్పుతున్నారు. పైగా.. ఇప్పుడు ఆటో మ్యుటేషన్ తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నా అది రీ సర్వేలో భాగంగానే గతంలోనే మొదలైందన్నది చంద్రబాబుకు తెలియంది కాదు. మార్చిలోగా అన్ని భూ సమస్యలకు పరిష్కారమా? ఇదిలా ఉంటే.. మార్చిలోపు రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కరించేస్తానని చంద్రబాబు ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నారు. గడచిన రెండేళ్లలో ఒక్కటంటే ఒక్క భూ సమస్యను పరిష్కరించలేక ప్రతీ సమావేశంలోనూ అధికారులపై నిందలు వేస్తున్నారు. పీజీఆర్ఎస్లో ఏడు లక్షలకు పైగా భూ సమస్యలపై అర్జీలు వస్తే 6.20 లక్షలు పరిష్కరించేసినట్లు ప్రకటించుకున్నారు. అందులో ఒక్క శాతం సమస్యలు కూడా పరిష్కారానికి నోచుకోకపోయినా అయినట్లు మెసేజ్లు పంపారు. అయితే, మార్చికల్లా చంద్రబాబు చూపే పరిష్కారం కూడా ఇలాగే ఉంటుందని జనం ఆయన మాటలు విని నవ్వుకుంటున్నారు. ఇలా ప్రతీనెలా ‘మీ భూమి–మీ హక్కు’ పేరుతో ఓ సభ.. అదే అబద్ధాల ప్రసంగం చేయడం ఆయనకు అలవాటుగా మారింది. కానీ, ప్రతి సోమవారం కలెక్టరేట్లలో జరిగే పీజీఆర్ఎస్కు వచ్చే ఫిర్యాదులు మాత్రం ఎక్కడా తగ్గడంలేదు. పైగా.. ఒక్కటీ పరిష్కారం కావడంలేదు. అయినా చంద్రబాబు మాటలు కోటలు దాటుతూనే ఉన్నాయి. -
స్కామ్పై సర్కారు సైలెన్స్!
సాక్షి, అమరావతి: ‘‘అర్హత లేనివారికి టీచర్ పోస్టులా? అనర్హులను ఎందుకు నియమిస్తున్నారు? విద్యార్థుల భవిష్యత్తుతో ఎలా చెలగాటమాడతారు? అడ్డదారి నియామకాలతో తరతరాల భవిష్యత్తు నాశనమే. నిర్దేశిత అర్హతలు లేనివారిని నియమిస్తే.. అలాంటి వారిని సర్వీసులో కొనసాగించొద్దు..’’ ఉపాధ్యాయుల నియామకాలపై తాజాగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలివీ! » మెగా డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా ఎంపికైన ఉమ్మడి ప్రకాశం జిల్లా పుల్లల చెరువు జడ్పీ స్కూల్ టీచర్ పీవీసీహెచ్ బసవేశ్వరరావు 2015లో కృష్ణా జిల్లా గుడివాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఖోఖో చాంపియన్ షిప్లో పాల్గొన్నట్లు సర్టిఫికెట్ సమర్పించాడు. అయితే ఆయన చాంపియన్షిప్లో పాల్గొనలేదని.. తమ వద్ద అలాంటి సమాచారం ఏదీ లేదని ఏపీ ఖోఖో అసోసియేషన్ స్వయంగా శాప్కు సమాచారం ఇచ్చినా టీచర్ పోస్టు కట్టబెట్టారు. » 2013లో ఖమ్మంలో రాష్ట్రస్థాయి జూడో పోటీల్లో సీనియర్ కేటగిరీలో ద్వితీయ స్థానం సాధించినట్టు సర్టిఫికెట్ సమర్పించిన ఓ మహిళ స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీ ఉద్యోగం పొందింది. అయితే తాము అలాంటి సర్టిఫికెట్ జారీ చేయలేదని జూడో అసోసియేషన్ (తెలంగాణ) రాష్ట్ర కార్యదర్శి కైలాష్ యాదవ్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలో ‘బోగస్’ గుట్టురట్టు.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఉద్యోగాల్లో 5 శాతం స్పోర్ట్స్ కోటాను కొల్లగొట్టేందుకు పెద్దగా పరిచయం లేని మార్షల్ ఆర్ట్స్ క్రీడ ’కురాష్ ’ను తెరపైకి తెచ్చారు. 2016 నుంచి 2023 మధ్య ఏకంగా 1,500 వరకు నకిలీ సర్టిఫికెట్లతో సాగించిన భారీ కుంభకోణాన్ని ఇటీవల పుణే క్రైం బ్రాంచ్ పోలీసులు ఛేదించారు. జరగని పోటీలను జరిగినట్లుగా చూపిస్తూ, మహిళల ఈవెంట్లలో పురుషుల పేర్లు చేర్చడంతోపాటు జిల్లా పేర్లను మార్చి జారీ చేసిన ఈ బోగస్ సర్టిఫికెట్లతో ఇప్పటికే 71 మంది (పోలీస్, ఇతర విభాగాల్లో) ఉద్యోగాలు పొందగా, ఎంపీఎస్సీ గ్రూప్–1, గ్రూప్–2 పోస్టుల్లోనూ వీటితో లబ్ధి పొందారని దర్యాప్తులో తేలింది. ఈ రాకెట్కు సంబంధించి అసోసియేషన్ కార్యదర్శి, అధ్యక్షుడిని అరెస్ట్ చేశారు. భవిష్యత్లో మోసాలను అరికట్టేందుకు డిజిటల్ వెరిఫికేషన్, బ్లాక్చెయిన్ విధానాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏపీలో ఎదురు దాడి...! మెగా డీఎస్సీ 2025 అక్రమాలు కళ్లకు కట్టినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా, రాష్ట్రవ్యాప్తంగా బాధిత అభ్యర్థులు బయటకు వస్తున్నా చంద్రబాబు సర్కారు నిర్భీతిగా బుకాయిస్తూ ఎదురుదాడికి దిగడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. యువగళం దళానికి టీచర్ పోస్టులు కట్టబెట్టింది. అందుకోసం ఏకంగా కొత్త జీవోలు తెచ్చి స్పోర్ట్స్ కేటగిరీలో దొడ్డిదారిన కట్టబెట్టింది. అక్రమాలకు గేట్లు ఎత్తి ఆ తర్వాత జీవోలు మార్చేసింది. ఈ వ్యవహారం బహిర్గతం కావడంతో నిరుద్యోగులు, బాధిత అభ్యర్థులు, రోడ్డెక్కి ఆందోళనలకు దిగుతున్నారు. ఏకంగా కులం, మతం కూడా మార్చేసి ఉద్యోగాలు ఇచ్చినట్లు చీకటి కోణాలు వెలుగులోకి వచ్చాయి. జాతీయ పోటీల్లో ప్రతిభ చూపి బంగారు పతకం సాధించిన దుర్గయ్యకు పోస్టు ఇవ్వలేదు. కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు సమర్పించిన వారిని టీచర్లుగా నియమించారు. ఫస్ట్ ర్యాంకర్ నవీన్కు ఉద్యోగం ఇవ్వలేదు. ఇలాంటి అక్రమాలు వరుసగా వెలుగు చూశాయి. పలువురు అభ్యర్థులు సమర్పించిన స్పోర్ట్స్ సర్టిఫికెట్లతో తమకు సంబంధం లేదని స్వయంగా ఆయా అసోసియేషన్లే ప్రకటించాయి. ఇంత జరుగుతున్నా చంద్రబాబు సర్కారు చలించకపోవడం.. స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై తేల్చేందుకు మహారాష్ట్ర తరహాలో డిజిటల్ వెరిఫికేషన్, బ్లాక్ చెయిన్ లాంటి విధానాలను తేకపోవడం మెగా డీఎస్సీ స్కామ్కు పక్కా నిదర్శనమని విద్యావేత్తలు, రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించడంతోపాటు విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని సూచిస్తున్నారు.స్పోర్ట్స్ కోటాలో ఫేక్ సర్టిఫికెట్లు రాష్ట్ర జూడో అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఆనం రామ్కిషోర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు నెల్లూరు (టౌన్): మెగా డీఎస్సీలో ఎక్కువ మంది స్పోర్ట్స్ కోటాలో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారని రాష్ట్ర జూడో అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఆనం రామకిషోర్రెడ్డి వెల్లడించారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన వారిలో ఎక్కువ మంది అసలు క్రీడాకారులే కాదు. నిజమైన క్రీడాకారులు ఈ విషయాన్ని బయట చెప్పుకోలేరన్నారు. ట్యాంపర్ చేసి పేర్లు మార్చారు... ‘కర్నూలు జిల్లాకు చెందిన షేక్ ఇస్మాయిల్ జూడో ఫేక్ సర్టిఫికెట్లతోనే ఉద్యోగం పొందారు. 2018లో నెల్లూరులోని ఇన్ఫాంట్ జీసస్ స్కూల్లో జరిగిన రాష్ట్ర స్థాయి జూడో పోటీల్లో పాల్గొన్నట్లు ఆయన సర్టిఫికెట్ పెట్టారు. అయితే ఇస్మాయిల్ ఆ పోటీల్లో పాల్గొనలేదు. ఆ సమయంలో నేనే నెల్లూరు జిల్లా జూడో ప్రెసిడెంట్గా ఉన్నా. ఏ ఛాంపియన్షిప్ జరిగినా జిల్లా అసోసియేషన్ దగ్గర ఒక రికార్డు, జిల్లా శాప్ కార్యాలయంలో ఒక రికార్డు, రాష్ట్ర శాప్ కార్యాలయంలో ఇంకో రికార్డు కలిపి మొత్తం 3 రికార్డులు ఉంటాయి. కానీ, వీటిని ట్యాంపర్ చేసి పేర్లు మార్చారు. నా దగ్గర అన్ని ఆధారాలున్నాయి. మెగా డీఎస్సీలో ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారంపై సీఎం చంద్రబాబు, లోకేశ్, పవన్కళ్యాణ్కు కొరియర్లో లేఖలు పంపా. అక్రమాలు బయట పెట్టానన్న అక్కసుతో నన్ను అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. ఈ అక్రమాలపై కోర్టులో కూడా కేసులు వేశా. అక్కడ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా’ అని రామకిషోర్రెడ్డి పేర్కొన్నారు. -
‘కమిషన్ నివేదికలో ఏమైనా రహస్యం ఉందా?
సాక్షి, విజయవాడ: ఏపీ హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికలపై విచారణ జరిగింది. విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక ఆధారంగా ఎలా రిజర్వేషన్లు ఇస్తారంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఒక వైపు కమిషన్ నివేదిక పరిశీలనలో ఉందని చెబుతున్నారు. నివేదిక పరిశీలనలో ఉందని ఎంతకాలం చెబుతారు.? అంటూ హైకోర్టు వ్యాఖ్యానించిందికమిషన్ నివేదిక ఎందుకు బహిర్గతం చేయటం లేదు. కమిషన్ నివేదికలో ఏమైనా రహస్యం ఉందా? అంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. బీసీ రిజర్వేషన్ల పూర్తి గణాంకాలను తమ ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. 34 శాతం రిజర్వేషన్లను ఎలా సమర్థించుకుంటారో చెప్పాలన్న కోర్టు.. తదుపరి విచారణ ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. -
నేడు వైఎస్ జగన్ ప్రెస్మీట్
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ గురువారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమకాలీన అంశాలపై ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. -
అరెస్ట్ను సెలబ్రేట్ చేసుకోవడం సిగ్గుచేటు: వీరశేఖర్ రెడ్డి
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తే పార్టీ నాయకులు చూస్తూ ఊరుకోరని, వారి భాషలోనే అంతకన్నా బలంగా సమాధానం ఇస్తామని.. తమ హుందాతనాన్ని చేతకానితనంగా భావించవద్దని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వీరశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సహనం నశించేలా తమను రెచ్చగొడితే చంద్రబాబు తనయుడు నారా లోకేష్కు సంబంధించిన అంశాలపై కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు.2014 నుంచి 2019 మధ్య కాలంలో ఫైబర్ నెట్, ఇసుక, మద్యం, అమరావతి భూములు, స్కిల్ డెవలప్మెంట్ వంటి అనేక స్కామ్లకు పాల్పడి, కోట్లు కొల్లగొట్టి, జైలుకు వెళ్లి మెడికల్ బెయిల్పై బయటికి వచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్టస్ పేరుతో ఆ కేసులను కొట్టేయించుకున్న విధానంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాంటి వ్యక్తి ఈరోజు అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. మా సహనాన్ని తక్కువ అంచనా వేయొద్దు:వైఎస్ జగన్ వ్యక్తిత్వ హననం చేస్తే చూస్తూ ఊరుకోం. మా హుందాతనం చేతకానితనం అనుకోవద్దు. మీరు రాళ్లు వేస్తే మేము బండలు వేయగలం. మీరు పూలు పెడితే మేము పుష్పగుచ్ఛాలు ఇవ్వగలం. మీరు బూతులు తిడితే మేము కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మేము హుందాగా మాట్లాడుతున్నామంటే చేతకాక కాదు. మాపై వ్యక్తిగత విమర్శలు చేయకుండా రాజకీయంగా విమర్శిస్తే రాజకీయంగానే సమాధానం ఇస్తాం. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజల సమస్యలను ఎలా పరిష్కరించాలి, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలి అనే దానిపై మాట్లాడాలి.కానీ చంద్రబాబు మాట్లాడటం మొదలుపెడితే బూతులు, అబద్ధ ప్రచారం, విషప్రచారం తప్ప మరేమీ కనిపించడం లేదు. నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఈ స్థాయికి దిగజారడం దురదృష్టకరం. మాజీ ముఖ్యమంత్రి, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిపై వ్యక్తిగతంగా, నీచంగా మాట్లాడటం సరైంది కాదు. ముఖ్యమంత్రి అనే స్థాయిని చంద్రబాబు మర్చిపోకూడదు.2014 నుంచి 2019 మధ్య ఫైబర్నెట్, ఇసుక, మద్యం, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్, అమరావతి అసైన్డ్ భూములు, స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించిన అనేక ఆరోపణలు వచ్చాయి. స్కిల్ కేసులో వందల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీల ఆరోపణలతో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి అరెస్టు చేస్తే కోర్టు జైలుకు పంపింది. అలాంటిది కేసులు, అరెస్టులు, రిమాండ్లకు సంబంధించిన విషయాలను కూడా సెలబ్రేట్ చేసుకోవడం ఏ విధమైన రాజకీయ సంస్కతి? తప్పు చేయకుండా ఒక సిద్ధాంతం కోసం పోరాడి జైలుకు వెళ్లినవాళ్లు గొప్పగా చెప్పుకుంటారు.కానీ తన అరెస్టును చంద్రబాబు సెలబ్రేట్ చేసుకోవడం సిగ్గుచేటు. స్కిల్ కేసులో అరెస్టు కాబటి జైల్లో ఉండొచ్చిన చంద్రబాబు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాడు? ఆయన మెడికల్ గ్రౌండ్స్పై బెయిల్ వచ్చాడే కానీ కేసుల్లో నిజాయితీ పరుడిగా నిర్ధారణ కాలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అధికారాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై ఉన్న కేసులను మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ పేరుతో తొలగించేసుకుంటున్నాడు.ముఖ్యమంత్రి పదవి చేపట్టింది తనపై ఉన్న కేసులను తొలగించుకోవడానికా? లేక ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికా? ఈ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. కేసుల విషయంలో కోర్టులు నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిలో ప్రభుత్వం, పోలీసులు తీసుకునే నిర్ణయాలపై కూడా ప్రజలకు వివరణ ఇవ్వాలి.లోకేశ్ బాగోతం బయట పెట్టమంటారా?వైఎస్ జగన్ చదువుల కోసం అమెరికా వెళ్లి హోమ్సిక్తో తిరిగి రావడం ఏమైనా పెద్ద తప్పా? చదువు కోసం అమెరికా వెళ్లి తల్లిదండ్రులను విడిచి ఉండలేక తిరిగి రావడాన్ని కూడా రాజకీయ విమర్శగా ఉపయోగించుకోవడం అన్యాయం. అప్పట్లో వైఎస్సార్.. చంద్రబాబు వ్యాఖ్యలకు ఇచ్చిన సమాధానం ప్రజలకు తెలుసు. వైఎస్ జగన్ వ్యక్తిగత జీవితంపై మాట్లాడుతున్న చంద్రబాబు.. ముందుగా తన కుటుంబానికి సంబంధించిన ఆరోపణలపై సమాధానం చెప్పాలి. నారా లోకేష్కు సంబంధించి గతంలో వచ్చిన ఆరోపణలపై ప్రజలకు వివరణ ఇవ్వాలి. ఇతరుల వ్యక్తిగత జీవితాలను ప్రశ్నించే ముందు తన కుటుంబంపై వచ్చిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. జనాలు అన్నీ మర్చిపోయారు, తాను ఏది చెప్పినా నమ్ముతారు అనుకోవద్దు.దస్తగిరి టీడీపీ ఆఫీస్కు ఎందుకు వెళ్లారు?వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడైన దస్తగిరికి టీడీపీ కార్యాలయంలో ఏం పని? ఆయనకు న్యాయ సహాయం ఎవరు అందించారు? ఈ అంశాలపై రాష్ట్ర ప్రజలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాలి. వీటికి సమాధానం చెప్పిన తర్వాత వైఎస్ జగన్ గురించి మాట్లాడాలి. మేము హుందాగా మాట్లాడుతున్నాం. అంతే తప్ప, అది తమ బలహీనత కాదన్న విషయం చంద్రబాబు గుర్తుంచుకోవాలని వీరశేఖర్రెడ్డి స్పష్టం చేశారు. -
ఆ లేఖను బయట పెట్టగలరా?: వంగవీటి నరేంద్ర
సాక్షి, తాడేపల్లి: స్కిల్ స్కామ్ నుంచి డీఎస్సీ వరకు అవినీతి, అక్రమాలపై ప్రజలకు సమాధానం చెప్పకుండా సంబరాలు చేసుకోవడం చంద్రబాబు, లోకేశ్కు పరిపాటిగా మారిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ధ్వజమెత్తారు. చంద్రబాబుపై స్కిల్ కేసు పెట్టింది వైఎస్ జగన్ కాదు.. ఈడీ పెట్టింది. కానీ తనపై వైఎస్ జగన్ కేసులు పెట్టించాడంటూ అన్యాయంగా మాట్లాడుతున్నారు. అనారోగ్య సమస్యలు చూపించి బెయిల్ తెచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు’’ అంటూ నరేంద్ర మండిపడ్డారు.‘‘అధికారులను భయపెట్టి తనపై ఉన్న కేసులను వెనక్కి తీసుకునేలా చేసుకుంటున్నారు. తనపై కేసులకు తానే క్లీన్ చిట్ ఇచ్చుకోవటం సిగ్గుచేటు. చంద్రబాబు నేరం చేసినట్లు ఛార్జ్ షీట్ లో స్పష్టంగా ఉంది. ప్రభుత్వం మారిన తరువాత వరుసగా కేసులు క్లోజ్ అవుతున్నాయి. స్కిల్ కేసులో నలుగురిని ఈడీ అరెస్టు చేసింది. స్కిల్ కేసులో క్లీన్ చిట్ ఇచ్చిందంటున్నారు. ఆ లెటర్ బయట పెట్టగలరా?.సిద్ధార్థ లూథ్రాకి ఏ అధికారంతో ఏపీ పోలీసు అధికారులతో సమావేశాలు పెడుతున్నారు. చంద్రబాబు అడ్డదారిలో అధికారంలోకి రాకుండా ఉంటే జీవిత కాలం జైల్లో ఉండే కేసులు ఉన్నాయి. చంద్రబాబు మళ్లీ జైలుకి వెళ్ళడం ఖాయం’’ అని వంగవీటి నరేంద్ర వ్యాఖ్యానించారు. -
ఏసీపీ దామోదర్పై సీపీకి వల్లభనేని వంశీ లాయర్ ఫిర్యాదు
సాక్షి,విజయవాడ: సెంట్రల్ ఏసీపీ దామోదర్ తీరుపై మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజులన్నీ ఒకేలా ఉండవనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన హెచ్చరించారు.బుధవారం వల్లభనేని వంశి, న్యాయవాది దేవి సత్యశ్రీలు పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబును కలిశారు. సివిల్ వివాదాలతో ఎలాంటి సంబంధం లేకపోయినా, ఏసీపీ దామోదర్ అందులో జోక్యం చేసుకుంటున్నారని సీపీకి ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా సంబంధం లేని సివిల్ వివాదాల విషయంలో తరచూ లొకేషన్కు రావాలని తమను బెదిరిస్తున్నారని న్యాయవాది దేవి సత్యశ్రీ ఆరోపించారు.ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో కలిసి పోలీస్ కమిషనర్ను కలిసిన ఆమె.. సివిల్ వివాదాల్లో అక్రమంగా జోక్యం చేసుకుంటున్న ఏసీపీ దామోదర్పై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. -
అదేగనక జరిగితే లోకేశ్ జైలుకే: వరుదు కల్యాణి
తాడేపల్లి: వైఎస్సార్సీపీని తిట్టడమే టీడీపీ నేతల పనా? అని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. తాడేపల్లిలో ఆమె బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. తప్పుడు ఆరోపణలు చేయడం, పారిపోవడం టీడీపీ నేతలకే చెల్లిందని ఆమె విమర్శించారు.టీడీపీ నేతలు ఆధారాలు చూపించరని, దూషణలు మాత్రం చేస్తారని వరుదు కల్యాణి అన్నారు. డీఎస్సీలో అక్రమాలకు సమాధానాలు చెప్పకుండా పారిపోతున్నారని చెప్పారు. మెగా డీఎస్సీని దగా డీఎస్సీ చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యేలతో ప్రెస్మీట్ పెట్టించి పచ్చి అబద్ధాలు చెప్పించారని తెలిపారు. డీఎస్సీలో అక్రమాలు చేయకపోతే సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. నారా వారి పాలన నకిలీ సర్టిఫికెట్ల పాలన అని ఆమె అన్నారు.ఆ స్థాయిలో భారీ స్కాం.. ‘‘డీఎస్సీలో విచారణ జరిగితే లోకేశ్ జైలుకే. ఆ స్థాయిలో భారీ స్కాం జరిగింది. స్కాంపై కూటమి నేతలు నోరు మెదపటం లేదు. సవాల్ చేసిన నేతలంతా ఇప్పుడెందుకు పారిపోయారు. టైం, డేట్ చెప్తే మేము చర్చకు రావటానికి సిద్ధమే. స్పోర్ట్స్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారిని కూడా చర్చకు తీసుకురావాలి.డీఎస్సీ పరీక్ష రాయకుండా ఉద్యోగాలు ఇవ్వటం స్కాం కాదా? రూ.3 లక్షలకు 120 ప్రశ్నలు అమ్ముకోవటం స్కాం కాదా? రూ.20 లక్షల చొప్పున ఉద్యోగం అమ్ముకోవడం స్కాం కాదా? టెట్ లేని ప్రభాకర్ గౌడ్ కు ఉద్యోగం ఇవ్వటం స్కాం కాదా? ఫేక్ జూడో సర్టిఫికేట్లు తెచ్చిన వారికి ఉద్యోగం ఇవ్వటం స్కాం కాదా? వీటన్నిటిపై విచారణ జరగాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా? సీబీఐ విచారణ జరిగితే లోకేశ్ జైలుకు వెళ్లక తప్పదు. ఆ భయంతోనే సీబిఐతో విచారణ జరపటం లేదన్నది వాస్తవం కాదా? లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారు. ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు తెచ్చుకున్న వారి దగ్గర టీడీపీ నేతలు తమ పిల్లలకు చదువు చెప్పిస్తారా?లోకేశ్ చేసిన తప్పులను కవర్ చేయలేక మహిళా అధికారులు ఇబ్బందులు పడ్డారు. ఫేక్ ప్రచారం చేయటం ఎలాగో చంద్రబాబు, లోకేశ్ ట్రైనింగ్ ఇచ్చారు. అందుకే పార్టీ నేతలంతా బయటకు వచ్చి డీఎస్సీలో అక్రమాలు జరగలేదంటూ కబుర్లు చెప్పారు’’ అని వరుదు కల్యాణి అన్నారు. -
కూటమి పాలనలో ‘ధరల’ పిడుగు.. ఇదేనా చంద్రబాబు, పవన్ల సంపద సృష్టి?
శాసనసభ ఎన్నికలకు ముందు నిత్యావసర సరుకుల ధరలపై కూటమి నేతలు చేసిన ప్రచారం ఏమిటి?ఇప్పుడు జరుగుతున్నదేమిటి? అసాధారణ రీతిలో ప్రస్తుతం ధరలు పెరుగుతుంటే ఏ సాకులు ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టాలా అన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. అందుకు ఎల్లో మీడియా బాండ్ బాజా వాయిస్తోంది. ధరల నియంత్రణకు ఏమి చేస్తున్నది మాత్రం తెలియడం లేదు.ధరాఘాతానికి సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు అల్లాడుతున్నారు. ఈ రెండేళ్ల కాలంలోనే ధరలు ఎలా పెరిగాయో గమనించండి. సన్నబియ్యం ధర 2024 ఏప్రిల్ లో కిలో 40 నుంచి 45 రూపాయలు ఉండగా, ఈ ఏడాది ఆగస్టులో ఇదే బియ్యం ధర 70 నుంచి 80 రూపాయలవరకు ఉన్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. వంట నూనెలు అప్పట్లో 90 నుంచి 106 రూపాయల వరకు ఉంటే, ఇప్పుడు 170 నుంచి 195 రూపాయల వరకు ఉంది. అంటే ఏకంగా అరవై నుంచి తొంభై రూపాయల వరకు పెరగడం అసాధారణమని చెప్పాలి. పంచదార ధర కిలోకి పాతిక నుంచి 30 రూపాయల వరకు పెరిగింది. ఉల్లి ధర సుమారు 40 రూపాయలు, ఎండు మిర్చి ధర సుమారు 150 నుంచి 200 రూపాయలకు పైగా పెరగడం ఆందోళన కలిగించే అంశమే. వినియోగదారులపై ఒకరకంగా ధరల పిడుగుపడిన చందమే అనిపిస్తుంది. కందిపప్పు, చింతపండు వంటి సరుకుల ధరలు కూడా బాగా పెరిగాయి.ఇక ఇసుకను ఉచితం అన్నప్పటికీ, ఇళ్ల నిర్మాణం చేసుకునేవారు లారీకి 20 వేల నుంచి 30 వేల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తోందని చెబుతున్నారు. మద్యం ధరలు పెరగనే పెరగవు అన్నట్లుగా కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్లు ప్రచారం చేశారు. ఇప్పుడేమో మద్యం ధరలు సైతం పెరుగుతున్న తీరుపై మద్యం ప్రియులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బెల్ట్ షాపుల జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. సర్దుబాటు పేరుతో విద్యుత్ చార్జీల బాదుడు కూడా గణనీయంగా ఉందన్న సంగతి తెలిసిందే. ఆర్టీసీ చార్జీలు కూడా 15 శాతం వరకు పెరిగినట్లు చెబుతున్నారు.పెట్రోల్, డీజిల్పై ఉన్న వ్యాట్ ఏ మాత్రం తగ్గలేదు. పైగా వీటి ధర పెరిగినప్పుడల్లా ప్రభుత్వానికి అదనంగా వాట్ రూపేణా ఆదాయం సమకూరుతోంది.ఆయా వస్తువుల ధరలు పెరిగినప్పుడల్లా ప్రభుత్వాలకు పన్నుల రూపంలో ఆదాయాలు కూడా అధికం అవుతాయి. అయినా ఏపీలో అప్పులు మాత్రం నానాటికి పెరుగుతున్నాయే తప్ప, అదుపులో ఉండడం లేదు. ఈ ఇరవై ఆరు నెలల్లోనే ఏపీలో అన్ని రకాల అప్పులు కలిసి 3.86 లక్షల కోట్లకు చేరాయి.ఇది చంద్రబాబు సృష్టించిన సంపద అని అంతా వ్యంగ్యంగా అనుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ అప్పులకు సంబంధించి అసలుతో పాటు వడ్డీలు చెల్లించవలసిన బాధ్యత ప్రజలపైనే ఉంటుంది. అమరావతి పేరుతో ఇప్పటికే ఏభైవేల కోట్ల అప్పు చేసిన సంగతి తెలిసిందే. అప్పులన్నిటిని ఏమి చేస్తున్నారో శ్వేతపత్రం విడుదల చేసి ఉంటే అందరికి తెలిసేది. కానీ అప్పుల వినియోగంపై ఎవరూ ప్రభుత్వ పక్షాన వివరణ ఇవ్వడం లేదు.ఇంత అప్పు చేసినా ఆయా చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు సకాలంలో చెల్లించడం లేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంటి ముందు జల జీవన్ కాంట్రాక్టర్లు ధర్నా చేసినా ఫలితం దక్కినట్లు లేదు. ఏలూరులో ఈ మధ్య ప్రభుత్వ స్కూళ్ల వాచ్మన్లు ఆందోళనకు దిగారు. ఏడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదన్నది వారి ఆవేదనగా ఉంది. జూనియర్ డాక్టర్ లు తమ స్టైపండ్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవన్ని చూస్తుంటే ఆంధ్ర సమాజం ఆర్ధిక సంక్షోభంలోకి కూరుకుపోతోందా అన్న సందేహాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అయినా ప్రభుత్వంలో అవినీతి మాత్రం దూసుకుపోతోందని సెంటర్ ఫర్ లిబర్టీ నేతలు చెబుతున్నారు. బీజేపీ అధ్యక్షుడు పీవీఎస్ మాధవ్ సైతం కొందరు ఎమ్మెల్యేలపై వస్తున్న అవినీతి ఆరోపణల వల్ల ఎన్డీఏ పనులు ప్రజలలోకి వెళ్లడం లేదని వ్యాఖ్యానించారు. ఇలాంటి అంశాల గురించి రాయాలంటే చాంతాడంత లిస్టు అవుతుంది.ఎన్నికలకు ముందు చంద్రబాబు, లోకేశ్లు ఏమని ప్రచారం చేశారో గుర్తు చేసుకోండి.పెట్రోల్,డీజిల్ పై వ్యాట్ అధికంగా ఉందని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దానిని తగ్గిస్తామని, తద్వారా నిత్యావసర సరుకుల ధరలు తగ్గిపోతాయని ప్రచారం చేశారు. కర్నాటకలోని కొన్ని బంకుల వద్దకు వెళ్లి పోటోలు దిగి, అప్పటి జగన్ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. చంద్రబాబు నాయుడు అయితే ధరల రెక్కలు విరిచివేస్తామని ఊదరగొట్టారు. ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్నాయి. సీన్ కట్ చేస్తే, కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఏ ఒక్క వస్తువు ధర తగ్గలేదు సరికదా.. పెక్కింటి ధరలు అమాంతంగా దాదాపు రెట్టింపు అయ్యాయి.ఇదే టైంలో రైతులకు న్యాయం జరిగిందా అంటే అది లేదు. పంటలు చేతికి వచ్చినప్పుడు ధరలు పడిపోయి వారంతా తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. రైతుల చేతుల నుంచి పంట వ్యాపారుల వద్దకు చేరాక మాత్రం రేట్లు పెరిగిపోతున్నాయి. బియ్యం ధరలు ఈ స్థాయిలో పెరగడానికి ప్రభుత్వ వైఫల్యం కారణమన్న భావన ఉంది. ఇలాంటి సమయాలలో విజిలెన్స్ అధికారులు తగు చర్యలు తీసుకుని ధరలను నియంత్రిస్తారు. కాని ఇప్పుడు అది ఎంతవరకు జరుగుతోంది తెలియదు. చంద్రబాబు, లోకేశ్లు తమ వాగ్దానం ప్రకారం వ్యాట్ ను తగ్గించి ఉండవచ్చు. అది వారి చేతిలో పని. ఎన్నికల హామీ కూడా ఉన్నందున వారు ఆ పని చేసి, సరుకుల ధరలు తగ్గించడానికి ప్రయత్నించి ఉంటే కాస్త పేరు వచ్చేది. కానీ వారు ఆ పని చేయడం లేదు. అంటే ఇక్కడ కూడా ప్రజలను ఢోకా చేసినట్లే కదా అన్న విమర్శను విపక్షం చేస్తోంది.అయితే ఎల్లో మీడియా ఈ ధరల సమస్యను పక్కదారి పట్టించడానికి తంటాలు పడుతోంది. ఇదంతా కరువు వల్ల, యుద్దం వల్ల అని ప్రచారం ఆరంభించాయి. లేకుంటే వ్యాపారుల తీరుతో కష్టాలు వస్తున్నాయని టిడిపి మీడియా అంటోంది. వారిని కంట్రోల్ చేయవలసిన ప్రభుత్వం వైఫల్యం చెందినట్లే కదా అని మాత్రం రాయకుండా జాగ్రత్తపడింది. పెట్రోల్, డీజిల్పై వ్యాట్ను తగ్గించాలని సలహా ఇవ్వలేకపోయింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండేళ్లపాటు కరోనా సంక్షోభం ఉన్నా, అప్పట్లోనే ఉక్రెయిన్- రష్యా యుద్దం ఆరంభమైనా, ఏ మాత్రం కనికరం లేకుండా ఎల్లో మీడియా ప్రభుత్వంపై పలు వ్యతిరేక కథనాలు రాసి ప్రజలను రెచ్చగొట్టే యత్నం చేసేవి. చంద్రబాబు, లోకేష్ తదితరులు అచ్చంగా అదే పనిలో ఉండేవారు. అప్పటికన్నా పరిస్థితి ప్రస్తుతం కొంత మెరుగ్గానే ఉన్నా ఈ ధరలు ఎందుకు పెరుగుతున్నాయన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఏవో సాకులు చెప్పి తప్పించుకోవాలని అనుకుంటే ధరల బారిన పడి ఇబ్బంది పడుతున్న సామాన్యుడికి తను పడుతున్న కష్టం తెలియదా!కొమ్మినేని శ్రీనివాసరావు,సీనియర్ జర్నలిస్ట్,రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
నిబంధనల ప్రత్తిబంధకం
సాక్షి, అమరావతి: పత్తికి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ఉందని ఊరట చెందుతున్న రైతుకు.. నిబంధనల చట్రం ప్రతిబంధకం కానుంది.. పత్తి కొనుగోళ్లను పూర్తిగా డిజిటల్ ప్రక్రియతో ముడిపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని(ఎస్వోపీ) ప్రకటించడం ఇబ్బందికరంగా మారింది. ఆధార్ ఆధారిత ఈ–పంట వివరాల్లో రైతు గుర్తింపు ఉండాలి. పత్తి కొనుగోలుకు ‘కపాస్ కిసాన్’ యాప్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. సాగు విస్తీర్ణం, మండలాల వారీ దిగుబడి, దశల వారీ ఉత్పత్తి ఆధారంగానే ఎంత పత్తి కొనుగోలు చేయాలో నిర్ణయించనున్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్ మంగళవారం జీఓఎంఎస్ నం. 46ను జారీ చేశారు. ఈ–పంట ఆధారంగానే.. రైతు సాగు చేసిన విస్తీర్ణం, వ్యవసాయ శాఖ నమోదు చేసిన మండలాల వారీ హెక్టారుకు దిగుబడి, పత్తి ఏరే దశల వారీ ఉత్పత్తి ఆధారంగా అనుమతించే పరిమాణంలోనే పంటను విక్రయించేందుకు అనుమతిస్తారు. అంటే కొనుగోలు ప్రక్రియలో ఈ–పంటలో నమోదైన సాగు విస్తీర్ణం, అధికారిక దిగుబడి లెక్కలు కీలకం కానున్నాయి. పత్తి రైతుల గుర్తింపునకు ఆధార్ ఆధారిత ఈ–పంట బుకింగ్ డేటానే ప్రాతిపదిక అవుతుంది. ఆ తర్వాత ఈ–పంట డేటా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)కి అందించి ‘కపాస్ కిసాన్’ యాప్/సీసీఐ పత్తి కొనుగోలు మాడ్యూల్తో అనుసంధానం చేస్తారు. పత్తి విక్రయానికి స్లాట్ బుకింగ్, షెడ్యూలింగ్ వ్యవస్థను అమలు చేస్తారు. గత ఏడాది స్లాట్ బుకింగ్, షెడ్యూలింగ్, స్లాట్ల పరిమితి, జిన్నింగ్ మిల్లులను ఎల్1/ఎల్2/ఎల్3 ప్రాతిపదికన తెరవడం వంటి సమస్యలు తలెత్తినట్లు ప్రభుత్వమే జీఓలో పేర్కొంది. రాష్ట్రంలో సీసీఐ గుర్తించిన మార్కెట్ యార్డులు, జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు జరుగుతాయి. జిల్లా జాయింట్ కలెక్టర్లు నోటిఫై చేసిన జిన్నింగ్ మిల్లులను కొనుగోలు కేంద్రాలుగా ఉపయోగిస్తారు. రైతులు స్లాట్ బుకింగ్ సమయంలోనూ, మార్కెట్ యార్డు/జిన్నింగ్ మిల్లులో పత్తి విక్రయించే సమయంలోనూ ఆధార్ కార్డు జిరాక్స్, పట్టాదారు పాస్బుక్ జిరాక్స్ చూపించాల్సి ఉంటుంది. పత్తి కూడా ‘లూజ్’గానే! కొనుగోలు కేంద్రాలకు పత్తిని పీపీ బ్యాగులు లేదా గోనె సంచుల్లో కాకుండా లూజుగా తీసుకురావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొన్న పత్తికి సీసీఐ ఆన్లైన్లో అదీ రైతు ఆధార్తో అనుసంధానమైన బ్యాంకు ఖాతాకే చెల్లింపులు చేస్తుంది. తగినన్ని జిన్నింగ్ మిల్లులు స్థానికంగా లేకుంటే సమీపంలోని ఇతర జిల్లాల్లో సీసీఐకి పత్తి అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. అక్కడి నుంచి సమీప జిన్నింగ్ మిల్లు కు పత్తిని తరలించేందుకు సీసీఐ ఏర్పాట్లు చేయాలి. రవాణా ఖర్చులను సీసీఐ చెల్లించే మార్కెట్ ఫీజు నుంచి భరించే విధానాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. రోజూ అన్ని కొనుగోలు కేంద్రాల్లో సాయంత్రం 5గంటల వరకే పత్తి సేకరిస్తారు. కేంద్రాల్లో తేమ మీటర్లు, టార్పాలిన్లు, ధ్రువీకరించిన ఎల్రక్టా నిక్ తూకం యంత్రాలు, నెట్ కనెక్టివిటీ, సీసీ కెమెరాలు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈసారి అసలు పరీక్ష ఇదే! కొనుగోళ్లను పర్యవేక్షించేందుకు జాయింట్ కలెక్టర్ చైర్మన్గా జిల్లాస్థాయి కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఈ–పంటలో నమోదైన వివరాలు, ఆధార్ అనుసంధానం, స్లాట్ బుకింగ్, షెడ్యూలింగ్, అనుమతించే పత్తి పరిమాణం, నాణ్యతా ప్రమాణాలు, జిన్నింగ్ మిల్లుల అందుబాటు, రోజువారీ సమయ పరిమితి ఇవన్నీ సమన్వయంతో పని చేయాల్సి ఉంటుంది. గత ఏడాది స్లాట్ బుకింగ్, షెడ్యూలింగ్, స్లాట్ల పరిమితి, జిన్నింగ్ మిల్లుల ప్రారంభంలో సమస్యలు ఎదురైనట్లు జీఓలోనే ప్రభుత్వం ప్రస్తావించిన నేపథ్యంలో.. ఈసారి వాటిని పునరావృతం కాకుండా చూసేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. -
కరువుకు కేరాఫ్.. ఈ వాటర్ ‘మ్యాన్’
సాక్షి, అమరావతి: గుక్కెడు తాగు నీటి కోసం రాష్ట్రంలో పల్లెలు అల్లాడుతున్నాయి.. పొలాలకు నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి.. నీరు, గడ్డి లేక పశువుల డొక్కలు ఎండుతున్నాయి.. అయినా పట్టించుకోని ముఖ్యమంత్రి చంద్రబాబు.. తనను తాను వాటర్మ్యాన్ అని కీర్తించుకొంటూ సొంత పార్టీ నేతలతో సన్మానాలు చేయించుకోవడం చూస్తే.. అచ్చం అలనాటి నీరో చక్రవర్తిని తలపిస్తున్నారని రాష్ట్ర ప్రజలు విమర్శిస్తున్నారు. నాడు రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు.. నేడు రాష్ట్రం కరువుతో అల్లాడుతుంటే చంద్రబాబు సత్కారాలు చేయించుకుంటున్నారని మండిపడుతున్నారు. వర్షాభావం వల్ల పంటలకు ఈ ఖరీఫ్లో నీరు ఇవ్వలేమని, రైతులు వరి పంట వేయవద్దని చెప్పిన చంద్రబాబు.. వాటర్మ్యాన్ అని తనకు తాను ప్రచారం చేసుకోవడంపై జనం విస్తుపోతున్నారు. ఒక ఆంగ్ల పత్రికలో వాటర్మ్యాన్ అని ఒక పదం రాయించుకొని, ఆ పత్రిక కీర్తించిందని ఆయన టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన నాయకత్వ సదస్సులో ఆయనే చెప్పుకోవడం.. వెనువెంటనే ఆయన కేబినెట్లోని అత్యుత్సాహపు మంత్రి ఒకరు చంద్రబాబును అభినందిస్తూ తీర్మానం ప్రవేశపెట్టడం, నాయకులంతా లేచి నిలబడి స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడం, ఎల్లో మీడియా వాటిని ఊదరగొట్టడం అంతా ఒక టీవీ స్కిట్లా నిర్వహించారు. కరువుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు చంద్రబాబు, కరువు కవల పిల్లలని ఎప్పుడూ వినిపించే మాట. 30 ఏళ్లుగా ఇది అనేకసార్లు రుజువైంది. ఆయన అధికారంలో ఉన్న ప్రతిసారీ రైతు కళ్లలో నీళ్లే తప్ప పొలంలో నీళ్లు పారవు. 1995–2004 మధ్య వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టులను అటకెక్కించారు. విద్యుత్ చార్జీలు పెంచి రైతు నడ్డి విరిచారు. అప్పుడూ కరువు వచ్చింది. 1997–98లో రైతు ఆత్మహత్యలు ఉప్పెనలా జరిగాయి. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాక రైతుల కుటుంబాలకు పరిహారం ప్రకటిస్తే ఆ ప్యాకేజీ కోసం ఆత్మహత్యలు పెరుగుతున్నాయని వ్యాఖ్యానించి అన్నదాతను అవమానించిన గొప్ప మనిషి చంద్రబాబు. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014–2019లో మళ్లీ ఆయన అధికారంలోకి రాగానే మళ్లీ కరువు వచ్చింది. 2024లో మళ్లీ చంద్రబాబు అధికారపీఠంపై కూర్చోగానే రాష్ట్రంలో కరువు ఛాయలు మొదలయ్యాయి. రెండేళ్లలో తీవ్ర కరువు వచ్చేసింది. వర్షాకాలంలో వర్షాలే లేవు. అన్ని జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు అడుగంటాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్లలో నీళ్లు లేవు కాబట్టి ఈ ఖరీఫ్కు సాగు నీరు ఇవ్వలేమని చంద్రబాబు చేతులెత్తేశారు. కృష్ణా డెల్టాలో వరి సాగుకు చుక్క నీరు వదిలే పరిస్థితి లేదని తేల్చేశారు. పంటలకు నీళ్లు ఇవ్వలేని చంద్రబాబును రైతులు తిట్టిపోస్తున్నారు. నారుమళ్లు వేసిన తాము ఏమవ్వాలని ప్రశి్నస్తున్నారు. కరువు మండలాలను ప్రకటించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జనం నీటి కోసం అల్లాడుతుంటే పట్టించుకోకుండా తనను తాను వాటర్మ్యాన్గా భజన చేయించుకోవడంపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పంటలకు నీరు ఇవ్వలేమని చెప్పిన బాబు వాటర్మ్యాన్ ఎట్లా అవుతారని ప్రశి్నస్తున్నారు. ఇది దగా కాదా? ప్రజలు ఇవి ఏమీ తెలియని పిచి్చవాళ్లని ఆయన అనుకుంటున్నారా అని మేధావులు విశ్లేషిస్తున్నారు. పబ్లిసిటీ స్టంట్.. కరువుకు పర్యాయపదంగా మారిన తనపై ఉన్న ముద్రను చెరిపేసుకోవాలనే ఆతృతలో తాను వాటర్మ్యాన్ అని రాయించుకుని, డప్పు కొట్టుకుంటున్నారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు ఇప్పుడు జలహారతి పడుతున్నారు. ప్రాజెక్టులను వదిలేసి పర్యాటకం, హైటెక్ వెంట పరుగులు తీసిన బాబు ఇప్పుడు పాయకరావుపేటలో నీటికి సాష్టాంగ నమస్కారం చేసి తన పబ్లిసిటీ గేమ్ను మరింత రక్తికట్టించారు. తాను చేయని పనులను చేసినట్టు, తాను పట్టించుకోని ప్రాజెక్టులను తానే కట్టినట్టు, తనవల్ల ఆగిన నీళ్లను తానే తెచి్చనట్టు డప్పు కొట్టుకుంటున్నారు. ఆ డప్పుకు పార్టీ నేతలు, ఎల్లో మీడియా కోరస్ పలుకుతున్నాయి. ప్రజలు పిచ్చివాళ్లు కాదు చంద్రబాబూ వాటర్మ్యాన్ బిరుదుకు గీటురాయి ఒక్కటే. కుళాయి తిప్పితే నీళ్లు రావాలి. కాలువలో నీళ్లు పారాలి. రైతు పొలంలో పంట నిలబడాలి. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ఇవేమీ ఇంతకు ముందు జరగలేదు.. ఇప్పుడూ జరగడంలేదు. అనేక గ్రామాల్లో గుక్కెడు తాగు నీరు లేక జనం విలవిల్లాడుతున్నారు. పంటలు సాగు చేయకుండా క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితులు అన్ని చోట్లా కనిపిస్తున్నాయి. కానీ చంద్రబాబు మాత్రం మంత్రివర్గం, పార్టీ సమావేశాల్లో అపర భగీరథుడిగా బిల్డప్లు ఇచ్చుకుంటూ స్టాండింగ్ ఒవేషన్లు, అభినందన తీర్మానాలు, భజనలు చేయించుకొంటున్నారు. అసలు టీడీపీ ఆఫీసులో నాయకత్వ సదస్సు దేనికి పెట్టారు? నేతల శిక్షణకా, మీకు జేజేలకా? అని జనం ప్రశి్నస్తున్నారు. ఒకవైపు వాటర్మ్యాన్గా భజన చేయించుకుని వెనువెంటనే అదే సమావేశంలో ఎల్నినోపై చర్చించడం చూస్తుంటే ఇదంతా పిచ్చివాళ్ల సదస్సులా ఉందనే సెటైర్లు పేలుతున్నాయి.ఏం చెప్పినా జనం నమ్ముతారనే భ్రమలో ఉన్నారా? తాను ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారనే భ్రమలో చంద్రబాబు వాటర్మ్యాన్ బిరుదును స్వయంగా ప్రకటించుకున్నారు. క్షేత్ర స్థాయి వాస్తవాలు, జనం పడుతున్న బాధలతో సంబంధం లేకుండా ఒక పత్రికలో ఒక పదం రాయించుకుని దాన్నే బిరుదుగా స్వీకరించి తీర్మానం, చప్పట్లు, సన్మానాల ద్వారా తనపై ఉన్న కరువు ముద్రను చెరిపేసుకునేందుకు చంద్రబాబు తాపత్రయపడుతున్నారు. కానీ నారుమడి ఎండిపోయిన రైతులు, ఖాళీ బిందెలతో కిలోమీటర్లు నడిచే మహిళలు, కరువు మండలాల ప్రకటన కోసం ఎదురుచూస్తున్న జనం మాత్రం చంద్రబాబు నాటకాలు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఆయన స్కిట్లను నమ్మడంలేదు. -
వారిద్దరిపై విచారణ జరపండి
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ–2025 నియామకాల్లో స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు పొందినట్లు చెబుతున్న ఇద్దరు అభ్యర్థుల క్రీడా ధ్రువపత్రాలపై ఆంధ్రప్రదేశ్ ఖోఖో సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్కు ఏపీ ఖోఖో అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి మేకల సీతారామిరెడ్డి మంగళవారం లేఖ రాశారు. చిల్లా మోహినీదేవి, సీహెచ్ యోగేశ్వరరావు సమర్పించినట్లు చెబుతున్న క్రీడా ధ్రువపత్రాల ప్రామాణికతను పరిశీలించాలని ఆ లేఖలో ఆయన కోరారు. వీరి సర్టిఫికెట్ల ధ్రువీకరణ కోసం శాప్ నుంచి తమ సంఘానికి ఎలాంటి సమాచారం, ఈ – మెయిల్ లేదా అభ్యర్థన రాలేదని స్పష్టం చేశారు. సంబంధిత టోర్నమెంట్కు సంబంధించి క్రీడాకారుల జాబితా, అధికారిక రికార్డుల్లో మోహినీదేవి, యోగేశ్వరరావు పేర్లు కనిపించలేదని తెలిపారు. వారి పేర్లతో తాము ఎలాంటి ప్రామాణికత, ధ్రువీకరణ పత్రాలు జారీ చేయలేదని స్పష్టం చేశారు. కాబట్టి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం పొందేందుకు సమర్పించిన ధ్రువపత్రాల చెల్లుబాటుపై సమగ్రంగా పరిశీలించాలని కోరారు. నకిలీ, ఫోర్జరీ లేదా అనధికారిక సర్టిఫికెట్లు సమర్పించినట్లు విచారణలో తేలితే నిబంధనల ప్రకారం తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. సంబంధిత క్రీడాకారుల జాబితా, రికార్డుల కాపీలను లేఖకు ఆయన జత చేశారు. అంతేకాకుండా ఖోఖో సంఘం వద్ద ఉన్న రికార్డులు, సమాచారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను స్వయంగా తానే వెళ్లి శాప్కు అందజేశానని, ఈ–మెయిల్ ద్వారా కూడా పంపించామని సీతారామిరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. -
మెగా డీఎస్సీలో అక్రమాలు ‘ఖోఖో’ల్లలు!
సాక్షి, అమరావతి: క్రీడల్లో ప్రతిభ కనబరిచి కష్టపడి ఆడిన క్రీడాకారులకు అన్యాయం చేసిన బాబు సర్కారు అసలు ఆటల్లో పాల్గొనని వారికి మెగా డీఎస్సీలో ఉద్యోగాలిచ్చేసింది! బంగారు పతకాలు సాధించిన వారిని పక్కనపెట్టి, నకిలీ పార్టీసిపేషన్ సర్టిఫికెట్లు తెచ్చిన వారికి కొలువులు కట్టబెట్టింది. మెగా డీఎస్సీ 2025 స్కామ్లో మరిన్ని అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో నకిలీ ఖోఖో సర్టీఫికెట్తో డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందిన ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. ఆట ఆడలేదు.. అయినా ఉద్యోగం.. మెగా డీఎస్సీలో ఎంపికైన పీవీసీహెచ్ బసవేశ్వరరావు మార్కాపురం (ఉమ్మడి ప్రకాశం) జిల్లా పుల్లలచెరువు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. 2015లో కృష్ణా జిల్లా గుడివాడలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన 49వ ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఇంటర్ డి్రసిక్ట్ ఖోఖో ఛాంపియన్షిప్లో పాల్గొన్నట్లు ఆయన డీఎస్సీలో సర్టీఫికెట్ సమర్పించాడు. కానీ ఆయన అసలు ఆ పోటీల్లో పాల్గొనలేదు. ఖోఖో ఆటకి, ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. ఆ టోర్నమెంట్లో ప్రకాశం జిల్లా జట్టుకి 3వ స్థానం లభించింది. మూడో స్థానం సాధించిన 12 మంది సభ్యుల జట్టు దిగిన గ్రూప్ ఫొటోలోనూ బసవేశ్వరరావు లేడు. అయినా సరే బసవేశ్వరావుకి పార్టీసిపేషన్ సర్టిఫికెట్ ఎలా వచ్చిందనేది అధికారులకే తెలియాలి. అదేవిధంగా చిల్లా మోహినీదేవి, సి.హెచ్. యోగేశ్వరరావు అనే మరో ఇద్దరు అభ్యర్ధులు సమర్పించినట్లు చెబుతున్న క్రీడా ధ్రువపత్రాల ప్రామాణికతపైనా ఖోఖో సంఘం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్ఏఏపీ) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్కు ఓ లేఖ కూడా రాసింది. స్పోర్ట్స్ కోటాలో దొడ్డిదారిలో ఉద్యోగాలిచ్చినట్లు ఇప్పటికే అనేక ఉదంతాలు బయటకు రాగా తాజాగా మరో బాగోతం బయట పడింది. మావద్ద లేవు.. బసవేశ్వరరావు గురించి అప్పటి ప్రకాశం జిల్లా ఖోఖో అసోసియేషన్ కార్యదర్శి భవనం కాశీవిశ్వనా«థరెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా తమ వద్ద అమ్మాయిల వివరాలు మాత్రమే ఉంటాయని, అబ్బాయిల వివరాలు ఫెడరేషన్లో ఉంటాయని చెప్పుకొచ్చారు. నిజానికి రాష్ట్రం తరపున ఆడిన క్రీడాకారుల వివరాలు ఫెడరేషన్ వద్ద ఉంటాయి. జిల్లా స్థాయిలో అడిన వారి వివరాలు కార్యదర్శి వద్దనే ఉంటాయి. అంటే కావాలనే విశ్వనాథరెడ్డి తప్పించుకునే యత్నం చేస్తున్నారని స్పష్టం అవుతోంది. అడగడానికి మీరెవరు..? ఈ అంశంపై వివరణ కోరేందుకు బసవేశ్వరరావును ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించింది. తాను ఖోఖో క్రీడాకారుడినేనని, గుడివాడలో జరిగిన ఛాంపియన్ షిప్లో పాల్గొన్నానని బసవేశ్వరరావు చెప్పారు. తాను సమర్పించిన సర్టీఫికెట్ నకిలీది కాదన్నారు. ఆడకుండా, ఆడానని చెప్పుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఇంతకుమించి వివరాలు వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. ‘నన్ను అడగడానికి మీరెవరు..?’ అంటూ సాక్షి ప్రతినిధిపై తీవ్ర స్వరంతో మండిపడ్డారు.అతను ఆడలేదని ముందే చెప్పాం..స్పోర్ట్స్ కోటాలో డీఎస్సీలో అర్హత సాధించిన 42 మంది అభ్యర్ధులకు సంబంధించిన పూర్తి వివరాలను ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్)కు ముందే పంపించాం. అందులో బసవేశ్వరరావుతో పాటు మరి కొందరు సమర్పించిన సర్టిఫికెట్లు నకిలీవని, వారు ఖోఖో ఆడలేదని, మావద్ద వారికి సంబంధించి ఎలాంటి వివరాలు లేదని స్పష్టంగా చెప్పాం. అయినప్పటికీ వారిలో కొందరికి ఉద్యోగాలు ఇచ్చారు. బసవేశ్వరరావు సమర్పించిన పార్టీసిపేషన్ సర్టీఫికెట్ పూర్తిగా నకిలీది. అతను గుడివాడలో జరిగిన ఖోఖో ఛాంపియన్ షిప్లో పాల్గొనలేదు. – మేకల సీతారామిరెడ్డి, 2012–25 వరకు ఆంధ్రప్రదేశ్ ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి -
బాబు ఖాతాలో మరో బలిపశువు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ పోకడలకు వెటర్నరీ విద్యార్థుల చదువులు చట్టు బండలవుతున్నాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటైన విజయనగరం జిల్లా గరివిడిలోని ప్రభుత్వ వెటర్నరీ కళాశాల మూతపడింది. 2026–27 విద్యా సంవత్సరం ప్రవేశాలకు వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(వీసీఐ) నిరాకరించింది. ఇక్కడ విద్యనభ్యసిస్తున్న సీనియర్ బ్యాచ్లకు చెందిన విద్యార్థులను ఇతర కళాశాలలకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ పనిచేస్తున్న అధ్యాపకులను డిప్యూటేషన్లపై పంపడంతో పాటు కాంట్రాక్టు పద్ధతిన బోధనా సిబ్బందితో కళాశాలను కొనసాగిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి స్థాయిలో శాంక్షన్ పోస్టులన్నీ భర్తీ చేసి, నిబంధనల మేరకు మౌలిక సదుపాయాలు కల్పించే వరకు ప్రవేశాలకు అనుమతినిచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది.వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో..గరివిడి కళాశాలకు వెటర్నరీ కౌన్సిల్ నుంచి అన్ని అనుమతులు తీసుకొన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2020–21 విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించింది. ఇక్కడ డీన్ పోస్టుతో పాటు 17 మంది ప్రొఫెసర్లు, 16 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 43 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు మంజూరు కాగా, డీన్తో పాటు 28 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 8 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 13 మంది ప్రొఫెసర్లను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేశారు. మరో 25 మందిని కాంట్రాక్టు పద్ధతిన నియమించారు.బాబు పాలనలో రాజకీయ ప్రయోజనాల కోసం..చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం ఇక్కడ పనిచేస్తున్న దాదాపు 49 మంది రెగ్యులర్ అధ్యాపకులను డిప్యూటేషన్లపై వెటర్నరీ యూనివర్సిటీతో పాటు ఇతర ప్రభుత్వ కళాశాలలకు పంపేసినట్టు వీసీఐ తనిఖీల్లో గుర్తించారు. 25 మంది కాంట్రాక్టు సిబ్బందితో ఈ కళాశాల నడుస్తోందని, కళాశాలలో విస్తరణ, ఇతర సేవా కోర్సులు నిర్వహిస్తున్నప్పటికీ అందుకు తగిన అధ్యాపకులను నియమించలేదని గుర్తించారు.పనిచేసేది ఒక చోట.. పోస్టింగ్ మరొక చోట..గరివిడి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్గా ఫుల్టైం విధులు నిర్వహిస్తున్న డాక్టర్ పి.రవికుమార్ను ఈ వెటర్నరీ కళాశాలలో వెటర్నరీ కెమికల్ కాంప్లెక్స్కు అసిస్టెంట్గా చూపించడంపై వీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. తిరుపతిలోని ఎస్వీవీలో పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఆదిలక్ష్మమ్మ గరివిడి కళాశాలలో పనిచేస్తున్నట్టుగా చూపించడమే కాక, జీతభత్యాలను కూడా ఇదే కళాశాల నుంచి ఇస్తున్నట్టు తనిఖీల్లో బయటపడింది. ఈ కళాశాలకు చెందిన రెగ్యులర్ సిబ్బందిని ఇతర కళాశాలలకు డిప్యూటేషన్పై పంపగా, వర్శిటీతో పాటు వివిధ కళాశాలల్లో పనిచేస్తున్న వారిని డిప్యూటేషన్పై ఇక్కడ పని చేస్తున్నట్టుగా చూపించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. పైగా బోధనలో ఎలాంటి అనుభవం లేని ఇద్దరు పశుసంవర్ధక శాఖాధికారులను ప్రొఫెసర్లుగా నియమించినట్టు గుర్తించారు. మరొక వైపు మౌలిక సదుపాయాల కల్పనలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నట్టు తేలింది. గత ఏడాది కూడా ఇదే రీతిలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించగా, 2025–26 విద్యాసంవత్సరంలోనే ప్రవేశాలకు వీసీఐ అనుమతి నిరాకరించింది. ఆరు నెలల్లో అంతా సరిదిద్దుతామంటూ ప్రభుత్వం లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో వీసీఐ ఆ మేరకు అనుమతినిచ్చింది. అయితే ఈ ఏడాది కూడా అదే పరిస్థితి కొనసాగడంతో 2026–27 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలను అనుమతించబోమని తేల్చి చెప్పింది. గరివిడి కళాశాలకు వీసీఐ గుర్తింపు తీసుకొస్తామంటూ సవాల్ విసిరిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.. -
నేడు పర్చూరు నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 9న (బుధవారం) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బాపట్ల జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. వారితో అక్కడ పార్టీ పరిస్థితులు, ప్రజా సమస్యలు, రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. -
సాగునీటి కోసం పోరుబాట
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీశైలం జలాలు సోమశిలకు విడుదల చేయాలనే డిమాండ్తో నెల్లూరు జిల్లా రైతులతో కలిసి వైఎస్సార్సీపీ మంగళవారం పోరుబాట పట్టింది. వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టాస్క్ ఫోర్స్ కో–ఆర్డినేటర్ సాకే శైలజానాథ్ నేతృత్వంలో మంగళవారం ‘చలో నెల్లూరు బ్యారేజీ’ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను ప్రయోగించింది. వైఎస్సార్సీపీ నేతలు, రైతులను బ్యారేజీ వద్దకు వెళ్లకుండా పోలీసులు అడుగడుగునా ఆటంకాలు కల్పిం చారు. బారికేడ్లు పెట్టి మరీ ఆంక్షలు విధించారు. రోప్ పార్టీలను రంగంలోకి దింపి రైతులు, వైఎస్సార్సీపీ నేతలపై దౌర్జన్యం చేశారు. ఎస్పీకి ముందుగానే సమాచారమిచ్చినా.. ఈ కార్యక్రమంపై ముందుగానే జిల్లా ఎస్పీకి వైఎస్సార్సీపీ నేతలు సమాచారమిచ్చినప్పటికీ అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. తొలుత మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్రెడ్డి, సాకే శైలజానాథ్, వైఎస్సార్సీపీ నెల్లూరు రూరల్ ఇన్చార్జి ఆనం విజయ్కుమార్రెడ్డి, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త బూదూరు గురవయ్య, సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకుడు వీరి చలపతి, రైతు విభాగం అధ్యక్షుడు శివుని నరసింహారెడ్డి తదితరులతో కలిసి రైతులు, పార్టీ నాయకులు వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయం నుంచి సుమారు 100 కార్లు, బైకులతో భారీ ర్యాలీగా నెల్లూరు బ్యారేజీ వైపు తరలివచ్చారు. అప్పటికే బ్యారేజీ వద్ద భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. రోప్ పార్టీలతో వైఎస్సార్సీపీ శ్రేణులను ముందుకు వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఉదయం నుంచి బ్యారేజీ రెండువైపుల బారికేడ్లు పెట్టి ప్రజలను సైతం రాకపోకలు సాగించకుండా నిలువరించారు. దీంతో దాదాపు గంటపాటు పోలీసులు, పార్టీ నేతల మధ్య తోపులాటలు జరిగాయి. అనంతరం రైతులు, నాయకులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. చివరకు పోలీసుల అడ్డంకులను లెక్కచేయకుండా బ్యారేజీ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. చంద్రబాబు నిర్లక్ష్యంతోనే శాశ్వత కరువు: కాకాణి చంద్రబాబు నిర్లక్ష్యంతోనే గ్రేటర్ రాయలసీమ శాశ్వత కరువు కోరల్లోకి వెళ్లిపోతోందని కాకాణి గోవర్ధన్రెడ్డి మండిపడ్డారు. స్వప్రయోజనాల కోసమే శ్రీశైలం జలాలను తెలంగాణకు తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. పంటలు ఎండిపోతున్నా కూటమి ప్రభుత్వం శ్రీశైలం దిగువ ప్రాజెక్ట్లకు నీటిని విడుదల చేయడంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోందని నిలదీశారు. శ్రీశైలంలో నీళ్లున్నా సోమశిలకు ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. నీటిమట్టం మరింత పడిపోతే నెల్లూరు జిల్లాకు శాశ్వత కరువు ముప్పు ఏర్పడుతుందన్నారు.సోమశిల–కండలేరు ఫ్లడ్ఫ్లో కెనాల్ ద్వారా ఒక్క రోజు నీటిని విడుదల చేసినా కలువాయి, కుల్లూరు చెరువులకు నీరు చేరుతుందన్నారు. ఇప్పటికే కలువాయి మండలం కనుపూరుపల్లి, నూకనపల్లి, యదనపర్తి, వెరు»ొట్లపల్లి, గోపవరం తదితర గ్రామాల్లో 3,600 నుంచి 4,000 ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయన్నారు. రైతులు పురుగు మందు డబ్బాలు చేతపట్టుకుని రోడ్డెక్కుతున్నా ప్రభుత్వానికి కనికరం లేదన్నారు. రైతుల పోరాటాల్ని అడ్డుకుని ప్రభుత్వ వైఫల్యాలను దాచలేరని మండిపడ్డారు. ఎల్నినో కాదు.. ఎల్లో నిల్ ఎఫెక్ట్: శైలజానాథ్ మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మాట్లాడుతూ.. ఇది ఎల్నినో ఎఫెక్ట్ కాదని.. ఎల్లో నిల్ ఎఫెక్ట్ అని ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లా రైతుల్ని కూటమి ప్రభుత్వం నట్టేట ముంచుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సోమశిల ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి తక్షణమే నీటిని తరలించి ఎండిపోతున్న పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. పది రోజులుగా శ్రీశైలం నుంచి సోమశిలకు నీటిని తరలించాలని కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. శ్రీశైలం నుంచి సోమశిలకు చుక్క నీరు కూడా ఇవ్వబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం దారుణమన్నారు. శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. -
‘బాబూ.. జాబులేవి?’ అని అడగడమే నేరమా?
సాక్షి, అమరావతి: ఇచ్చిన హామీలను నెరవేర్చా లని కాకినాడలో శాంతియుతంగా ర్యాలీ చేసిన నిరుద్యోగులపై కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా కేసులు పెట్టడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. హక్కుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నేరమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలను నెరవేర్చాలని నిరసన తెలిపిన నిరుద్యోగులపై కేసులు పెడతారా? అంటూ నిలదీశారు. ఇది కూటమి ప్రభుత్వం నిరంకుశ విధానానికి నిదర్శనమంటూ మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం సామాజిక మాధ్యమం ఎక్స్లో కూటమి ప్రభుత్వ చర్యలను ఎండగట్టారు. ఆయన ట్వీట్లో ఇంకా ఏమన్నారంటే... నిరుద్యోగ యువతపై కేసులా? మెగా పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ కాకినాడలో శాంతియుతంగా నిరసన తెలిపిన నిరుద్యోగ యువతపై చంద్రబాబు నేతృత్వంలోని వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం పోలీసు కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. శ్యామ్, టి.రాజా, ఎం. గంగ సూరిబాబు, రాజేష్తో పాటు 20 మంది పోలీసు నిరుద్యోగులు చేసిన నేరమేమిటి? ‘బాబూ.. జాబులేవి?’ అని ప్రశ్నించడమేనా నేరం? ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని అడగడం కూడా తప్పా? ప్రజలు తాము ఎన్నుకున్న ప్రభుత్వాన్ని శాంతియుతంగా ప్రశ్నించడం కూడా ఆంధ్రప్రదేశ్లో నేరంగా మారిందా?. అప్రజాస్వామిక వైఖరికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది చంద్రబాబూ?ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల భృతి ఇస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని 20 లక్షల మంది నిరుద్యోగులకు ఈ లెక్కన ఏడాదికి రూ.7,200 కోట్లు, మూడేళ్లకు రూ.21,600 కోట్లు చెల్లించాలి. కానీ ఇటు ఉద్యోగాలు ఇవ్వకుండా, అటు నిరుద్యోగ భృతి చెల్లించకుండా యువతను మోసం చేసిన ఈ వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు తమ హక్కుల కోసం ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతోంది.మెగా డీఎస్సీలో రోజుకొక మోసం బయటపడుతుంటే సమాధానం చెప్పలేక చంద్రబాబు, నారా లోకేశ్ ఇద్దరూ అణచివేత, నిర్బంధం, బెదిరింపులకు దిగుతున్నారు. అడ్డదారుల్లో ఉద్యోగాలు పొందిన వారిని కాపాడుతూ.. పారదర్శకంగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరుతున్న అర్హులైన నిరుద్యోగులను నేరస్తులుగా చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం యువత పట్ల అనుసరిస్తున్న వ్యతిరేక విధానానికి, అప్రజాస్వామిక వైఖరికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది?. యువత ఆశలు, ఆకాంక్షలను ఏనాడూ చంద్రబాబు గౌరవించలేదు వెన్నుపోటు పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ నియామకాల్లో అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిబంధనలకు విరుద్ధమైన నియామకాలు పరిపాటిగా మారాయి. అవినీతి, రాజకీయ పైరవీలతో ఉద్యోగాలను పంచుకోవడంపైనే వెన్నుపోటు పార్టీ దృష్టి తప్ప.. రాష్ట్ర యువత ఆశలు, ఆకాంక్షలను ఏనాడూ గౌరవించలేదు. ప్రతిభకు పట్టం కట్టి, అర్హులకు నిష్పక్షపాతంగా ఉద్యోగాలు కల్పిం చాలన్న చిత్తశుద్ధి ఈ వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వానికి లేదు. నిరుద్యోగ యువతపై నమోదు చేసిన కేసులన్నింటినీ తక్షణమే, బేషరతుగా ఉపసంహరించాలి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మెగా పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుంది. వారికి న్యాయం జరిగే వరకు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుంది’ అని మాజీ సీఎం వైఎస్ జగన్ హెచ్చరించారు. -
ముసుగు తీసేసిన ‘గొడ్డలి’
సాక్షి టాస్క్ఫోర్స్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు దస్తగిరి భార్యతో సహా మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలుసుకోవడానికి రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంగళగిరి టీడీపీ కార్యాలయం వద్ద దస్తగిరి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిని కలుసుకోవడానికే వచ్చానని చెప్పాడు. ఒక హంతకుడు ఇలా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చి, ముఖ్యమంత్రిని కలుసుకోబోతున్నానంటూ అక్కడ మీడియాతో మాట్లాడడం చూస్తుంటే వీళ్ల మధ్య సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమౌతోందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ‘‘గొడ్డలిని ఫలానా చోట కొన్నా.. వివేకాను నేనే నరికేశా..’ అంటూ పోలీసులకు చెప్పిన హంతకుడు దస్తగిరి ముఖ్యమంత్రిని ఎందుకు కలుస్తున్నాడు? ఇన్నాళ్లూ కొనసాగించిన ముసుగును వీళ్లు ఇక తీసేశారా..? వెన్నుపోటు పార్టీయే ఈ గొడ్డలిని స్పాన్సర్ చేసినట్లు కనిపిస్తోందన్న వ్యాఖ్యలు నిజమేనా..? ’’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.సీఎం అపాయింట్మెంట్ ఇచ్చి ఉంటారా?ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అంటే ఆషామాషీ కాదు.. ఎన్నో ప్రొటోకాల్స్ ఉంటాయి. అయినా సీఎం అనుమతి ఉంటే కానీ సాధ్యం కాదు. సాక్షాత్తూ నేనే వివేకానందరెడ్డిని హత్య చేశా అని ఒప్పుకున్న వాడిని ముఖ్యమంత్రి ఎలా కలుస్తున్నారు..? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చానని, ఏం లేదు.. ఓ వినతిపత్రం ఇవ్వడానికే.. అని దస్తగిరి మీడియాకు చెప్పాడు. ఆ తర్వాత సీఎంను రహస్యంగా కలిశాడన్న వార్తలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.దస్తగిరి వెనకున్నది వెన్నుపోటు పార్టీయే...వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి తెలుగుదేశం పార్టీపై మొదటి నుంచి అందరికీ అనుమానాలున్నాయి. హంతకుడు దస్తగిరికి కార్లు, గన్మెన్లు, పర్సనల్ సెక్యూరిటీ సిబ్బందిని తెలుగుదేశమే సమకూర్చిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. తెలుగుదేశం దన్నుతోనే దస్తగిరి బహిరంగంగా తిరుగుతున్నాడని, పంచాయితీలు చేస్తున్నాడని.. గన్మెన్లతో దౌర్జన్యానికి దిగుతున్నాడని కూడా ఆరోపణలున్నాయి. చంద్రబాబును కలిసేందుకు దస్తగిరి రావడంతో ఇప్పుడు మరింత క్లారిటీ వచ్చిందని, వివేకా హత్య వెనకున్నది ఎవరో స్పష్టమయినట్లయిందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.అందరికీ ఒకే లాయర్సిద్దార్థ లూథ్రా అంటే మాటలు కాదు.. మనదేశంలో అత్యంత ఖరీదైన లాయర్లలో ఒకరు.. నెలకు, రోజుకు, గంటకు కాదు.. ఆయన నిమిషాలలో ఛార్జ్ చేస్తారని న్యాయవర్గాలలో వినిపిస్తుంటుంది. అంత ఖరీదైన లాయర్.. చంద్రబాబు కేసులకు ఆయనే లాయర్. ఆయనంటే మాజీ ముఖ్యమంత్రి, ఇపుడు ముఖ్యమంత్రి... లూథ్రాను ఆయన భరించగలరు.. కానీ వివేకానందరెడ్డి కుమార్తె సునీతకూ లూథ్రాయే లాయర్. ఆమె వేసిన కేసులను లూథ్రాయే వాదిస్తున్నారు. నిర్ఘాంతపోయే నిజమేమిటంటే.. హంతకుడు దస్తగిరికి కూడా సిద్దార్థ లూథ్రాయే లాయర్. అదీ వెన్నుపోటు పార్టీ చేస్తున్న రాజకీయం.. తండ్రిని చంపిన హంతకుడు దస్తగిరికి, సునీతకు ఒకే లాయర్ అంటే అర్ధం కావడం లేదూ అసలు కుట్ర ఏమిటో... బెయిల్ రద్దుకు ఎందుకు ప్రయత్నించలేదు?హత్యచేసిన దస్తగిరి జైలులో ఉండాలి.. కానీ బయటకొచ్చేశాడు. దర్జాగా జనంలో తిరుగుతున్నాడు. పంచాయతీలు చేస్తున్నాడు. దందాలు సాగిస్తున్నాడు.. వసూళ్లు చేస్తున్నాడు.. ఇవన్నీ రోజూ వార్తలుగా వస్తున్నాయి. అయినా వెన్నుపోటు పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఈ నేరగాడిపై ఈగ వాలనివ్వదు. బెయిల్ రద్దు కోసం ఎలాంటి ప్రయత్నమూ చేయరు. దస్తగిరికి యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తుంటే సునీత అడ్డుకోలేదు.. హంతకుడికి శిక్ష పడాలని వీళ్లు ఏనాడూ కోరలేదు. హత్య చేశానని ఒప్పుకున్న దస్తగిరికి చంద్రబాబు, వివేకానందరెడ్డి కుమార్తె మద్దతుగా నిలబడటం వెనుక మర్మమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దస్తగిరి బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ పడితే.. వెంటనే సునీత ఇంప్లీడ్ అయ్యి.. లూధ్రా వంటి ఖరీదైన న్యాయవాదిని పెట్టి దస్తగిరికి అండగా నిలబడడం గమనార్హం. వివేకానందరెడ్డి హత్య కేసులో ఉన్నవీ లేనివి పోగేసి ఇన్నాళ్లూ అవినాష్రెడ్డిపై దుష్ప్రచారం చేయించారని దస్తగిరి, చంద్రబాబు సంబంధాలను బట్టి అర్ధమౌతోందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. -
ఏపీ డీఎస్సీ స్కామ్లో సంచలన పరిణామం
సాక్షి,విశాఖ: ఏపీ డీఎస్సీ స్కామ్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. విశాఖలో టీచర్ ఉద్యోగాలు పొందిన చిల్లా యోగేశ్వరరావు, మోహినీ దేవిలు సమర్పించిన స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఫేక్ అని తేలడంతో చర్చాంశనీయమైంది. ఈ వ్యవహారంపై ఏపీ ఖోఖో అసోసియేషన్ మాజీ సెక్రెటరీ మేకల సీతారామిరెడ్డి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(శాప్) అధికారులకు సంచలన లేఖ రాశారు.ఈ ఫేక్ సర్టిఫికేట్ల బండారాన్ని సాక్షి టీవీ తొలుత బయటపెట్టగా, తాజాగా ఖోఖో అసోసియేషన్ అధికారిక లేఖతో విషయం మరింత స్పష్టమైంది. శాప్కు రాసిన లేఖలో‘చిల్లా యోగేశ్వరరావు, మోహినీ దేవిలకు సర్టిఫికేట్లు మేం ఇవ్వలేదు.శాప్ నుండి వీళ్ల అభ్యర్థిత్వంపై ఎలాంటి సమాచారం మాకు అందలేదు. వీళ్లు ఇద్దరికి మేం ఎలాంటి మెరిట్ సర్టిఫికేట్లు ఇవ్వలేదు. మా టోర్నమెంట్ల జాబితాల్లో ఎక్కడా వీరి పేర్లు లేవు. శాప్కి మేం పూర్తి వివరాలు అందిస్తున్నాం. వీళ్లు పొందుపర్చిన సర్టిఫికేట్లు చెల్లవు.నకిలీ, ఫోర్జరీ సర్టిఫికేట్లపై విచారణ జరపాలి. ఆ సర్టిఫికేట్లపై చర్యలు తీసుకోవాలి. శాప్కి మేం పూర్తి సహకారాన్ని అందిస్తాం’అని ఏపీ ఖోఖో అసోసియేషన్ మాజీ సెక్రెటరీ మేకల సీతారామిరెడ్డి లేఖలో పేర్కొన్నారు. -
డీఎస్సీ అక్రమాలపై వరుస కథనాలు.. సాక్షి ప్రతినిధులపై అక్రమ కేసులు
సాక్షి,చిత్తూరు: కుప్పంలో డీఎస్సీ అక్రమాలపై వార్తలు ప్రసారం చేస్తున్న సాక్షి టీవీ ప్రతినిధులు కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగింది. క్షేత్రస్థాయిలో వార్తలు సేకరిస్తున్న సాక్షి టీవీ కుప్పం రిపోర్టర్ గణేష్, కెమెరామెన్ శ్రీకాంత్లపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.డీఎస్సీ అక్రమాల కథనాలపై దృష్టి మళ్లించేందుకు, విధుల్లో ఉన్న జర్నలిస్టులపై ఓ ఉపాధ్యాయుడితో తప్పుడు ఫిర్యాదు చేయించారు. జర్నలిస్ట్ తమపై దాడి చేశారని, కాలర్ పట్టుకుని బెదిరించారంటూ తప్పుడు ఆరోపణలతో ఈ కేసు బనాయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను, అక్రమాలను వెలికితీస్తున్న జర్నలిస్టులపై ఇలాంటి అక్రమ కేసులు బనాయించడం ద్వారా భావప్రకటన స్వేచ్ఛను, పత్రికా స్వాతంత్ర్యాన్ని కాలరాస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఈ క్రమంలో సాక్షి టీవీ సిబ్బందిపై బనాయించిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరుతూ చిత్తూరు ప్రెస్ క్లబ్ సభ్యులు, పలువురు మీడియా ప్రతినిధులు చిత్తూరు జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులపై అక్రమ కేసుల నమోదును ఆపాలని, లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
‘డీఎస్సీ అక్రమాల వెనుక నారా లోకేష్ హస్తం’
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ అక్రమాలు జరిగినట్టు అధికారులు అంగీకరించారు.. విజిలెన్స్ విచారణ జరుగుతోందని చెప్పారు.. అంటే అక్రమాలు జరిగినట్టు తేలిపోయింది. నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలి’’ అని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విజిలెన్స్తో కాకుండా సీబిఐతో విచారణ జరిపించాలన్నారు.‘‘ఈ అక్రమాల వెనుక నారా లోకేష్ హస్తం ఉంది. 382 స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు ఎవరికిచ్చారో పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందిన వారిపై చర్యలేవీ?. ఇప్పటికీ అక్రమాలను కప్పి పుచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు?. పచ్చి అబద్దాలతో మంత్రి లోకేష్ అసెంబ్లీని సైతం అవమాన పరిచారు. వైఎస్ జగన్కు సవాల్ చేసిన లోకేష్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?. డీఎస్సీ అక్రమాల వెనుక వ్యవస్తీకృత నేరం ఉంది. ఒక పక్కా ప్లాన్ ప్రకారమే అక్రమాలు చేశారు...జూడో అసోసియేషన్ ఛైర్మన్ భరత్ సాక్షాత్తూ నారా లోకేష్ తోడల్లుడే. ఆ అసోసియేషన్ నుండి పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. ఇవన్నీ బయట పడాలంటే సీబిఐతో విచారణ జరపాల్సిందే. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే. వైఎస్ జగన్కి సవాల్ చేసే స్థాయి లోకేష్కి లేదు. లోకేష్ ఎమ్మేల్యే కాకముందే నేను ఎంపీ అయ్యాను. లోకేష్తో చర్చకు నేను సిద్ధం. కరకట్ట ఇల్లయినా, హైదరాబాదు ఇంటికైనా చర్చకు వస్తా. డేటు, టైం లోకేష్ ప్రకటించాలి’’ అని మార్గాని భరత్ సవాల్ విసిరారు. -
మీ పోస్టులు చాలా ‘అమెచ్యూరిష్’గా ఉంటున్నాయ్!
కూటమిలోని టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య సోషల్ మీడియా వేదికగా రగులుతున్న వివాదం పోనుపోను మరింత ముదురుతోంది. ముఖ్యంగా డీఎస్సీ వ్యవహారంపై ఇరుపార్టీల కార్యకర్తలు పరస్పరం పోస్టులు.. ఒకనొక దశలో పెద్దల మీద మీమ్స్, ట్రోల్స్తో విరుచుకుపడే స్థాయికి చేరుకున్నాయి. ఈ దశలో జనసేనను ఉద్దేశిస్తూ టీడీపీ డబుల్ మేసేజ్ ఇవ్వడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో కొట్టుకుంటున్న కార్యకర్తలకు.. ఇరు పార్టీల అధిష్టానాలు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాయనేది జరుగుతున్న ప్రచారం. అయితే ఈ విషయంలో జనసేనదే మొత్తం తప్పు అనే లైన్లో టీడీపీ ఓ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. దానిని కాస్త నిశీతంగా పరిశీలిస్తే.. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వైఫల్యాల్ని.. జనసేనకు ఆపాదిస్తూ ఐటీడీపీ తన సపోర్టింగ్ పేజీలతో కొన్ని పోస్టులు చేయించింది. దీనిపై జనసేన భగ్గుమంది. ‘మీ బురదలోకి మమ్మల్నెందుకు లాగుతారు?’ అంటూ కౌంటర్ పోస్టులతో నిలదీసింది. అంతటితో ఆగకుండా.. చంద్రబాబు, నారా లోకేశ్ను టార్గెట్ చేసుకుని మీమ్స్ ప్రచారం చేసింది. అయితే అప్పటికే.. ఓ సినిమా కోసం సీనియర్ ఎన్టీఆర్ అమెచ్యూరిష్ డైలాగ్పై ఉద్దేశపూర్వక ట్రోలింగ్ నడిచిన సంగతి తెలిసిందే. ఆ పరిణామం ఆ సినీ ఫ్యామిలీపై ఎన్టీఆర్ అభిమానులు గుర్రుగా ఉన్నారు. అయితే దీనిని క్యాష్ చేసుకోవాలని భావించిన ఐటీడీపీ.. తన కౌంటర్లను మరింత పదును పెట్టింది. ఏకంగా పవన్ కల్యాణ్ సినీ, పొలిటికల్ కెరీర్ ఫెయిల్యూర్స్ను ప్రస్తావిస్తూ వరుస పోస్టులు చేసింది. అదే సమయంలో.. టీడీపీలోనే ఇంకో వర్గం నుంచి సీనియర్ నటుడు, పవన్ సోదరుడు చిరంజీవిని ఉద్దేశించి పోస్టులు వచ్చాయి. అయితే టీడీపీ నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ జనసేన కార్యకర్తలు మీమ్స్, ట్రోల్స్ చేయడం, ఇప్పుడు రాజకీయంగా ఇరకాటంలో పడేసిన డీఎస్సీ అంశంపైనా వరుసగా పోస్టులు పెట్టడంపై టీడీపీ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వరుస పరిణామాలతో కూటమి పెద్దలు రంగంలోకి దిగారు. ఇరుపార్టీల కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా పరస్పరం విమర్శలు, దూషణలకు దిగొద్దని సూచనలు ఇచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న పాలసీలు, అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనకు సంబంధించిన అంశాలపై ఒకరిపై ఒకరు కామెంట్లు చేయొద్దని.. తద్వారా ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని టీడీపీ సందేశం ఇచ్చింది. కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య విభేదాలు తలెత్తేలా సోషల్ మీడియా పోస్టులు పెట్టడం సరికాదని స్పష్టం చేసింది. ముఖ్యంగా.. జనసేన కార్యకర్తలు చేస్తున్న కొన్ని పోస్టులతో ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటోందని టీడీపీ పేర్కొంది. మరీ ముఖ్యంగా చంద్రబాబు కుటుంబంపై జనసేన కార్యకర్తలు చేసిన అవమానకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యల విషయాన్ని ఆ పార్టీతో మాట్లాడినట్లు తెలిపింది. ఇలాంటి అమెచ్యూరీష్ వ్యాఖ్యలు, పోస్టులకు దూరంగా ఉండాలని సూచించింది. ‘మన మధ్య మనమే సోషల్ మీడియాలో పోస్టులతో పోరాటం చేసుకోవడం సరికాదు’ అని టీడీపీ స్పష్టం చేసింది. టీడీపీ, జనసేన కార్యకర్తలు పరస్పరం విమర్శలు, దూషణలు చేసుకోకుండా కూటమి ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని సూచించింది.అదే సమయంలో టీడీపీ పార్టీకి, టీడీపీ కార్యకర్తల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఎటువంటి చర్యలనూ సహించబోమని పార్టీ పేర్కొనడం గమనార్హం. ఇది జనసేనకు ఇండైరెక్ట్ వార్నింగేనన్న చర్చ జోరందుకుంది. ఇప్పటికే పదవులు, ప్రాధాన్యత విషయంలో జనసేన కేడర్ క్షేత్రస్థాయిలో తీవ్ర అవమానాలు ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో.. కూటమిగా కలిసి పనిచేయాలంటూ ఒకవైపు బుజ్జగిస్తూనే.. టీడీపీ జోలికి వస్తే ఊరుకునేది లేదన్న సంకేతాన్ని మరోవైపు బహిరంగంగానే ఇవ్వడాన్ని జనసైనికులు తట్టుకోలేకపోతున్నారు.దీంతో కూటమిలో అంతర్గత విభేదాలను చక్కదిద్దేందుకు పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం టీడీపీ–జనసేన కార్యకర్తల మధ్య పోస్టుల యుద్ధం కొనసాగుతుండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.ఇదీ చదవండి: మేయర్ సీటు.. రచ్చ రాజేయడం ఖాయం! -
బాలిక ఆచూకీకి మూడునెలలు ఎందుకు పట్టింది?
సాక్షి, అమరావతి: గుంటూరుకు చెందిన పదవ తరగతి బాలికను షేక్ జాన్ సైదా అలియాస్ రబ్బానీ అనే వ్యక్తి జూన్లో అపహరించి తీసుకెళితే, ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులకు మూడు నెలల సమయం ఎందుకు పట్టిందని హైకోర్టు సోమవారం రాష్ట్ర డీజీపీని ప్రశ్నించింది. ‘మైనర్ బాలికను కిడ్నాప్ చేయడం చాలా తీవ్రమైన విషయం. బాలిక కిడ్నాప్ వెనుక షేక్ జాన్ సైదా ఒక్కరే ఉన్నారంటే నమ్మశక్యంగా లేదు. ఈ మొత్తం వ్యవహారంపై అఫిడవిట్ సమర్పించండి’ అని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరీ, జస్టిస్ ఆలపాటి గిరిధర్ ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. బాలిక కోరిక ప్రకారం తండ్రికి అప్పగించాలని ఆదేశాలు..అంతక్రితం జాన్ సైదా తీసుకెళ్లిన బాలికను గుంటూరు, పట్టాభిపురం పోలీసులు ధర్మాసనం ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఆ బాలిక తన తండ్రితో పాటు ఇంటికెళతానని ధర్మాసనానికి తెలిపింది. దీంతో ధర్మాసనం ఆ బాలికను తండ్రికి అప్పగించాలని పోలీసులను ఆదేశించింది. అంతేకాక.. ఆ బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించే విషయంలో సహకరించాలని తండ్రికి ధర్మాసనం నిర్దేశించింది. పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) తిరుమాను విష్ణుతేజ ధర్మాసనం ముందు తొలుత వాదనలు వినిపిస్తూ బాలికను జాన్ సైదా అనే వ్యక్తి తీసుకెళ్లారని తెలిపారు. వారు హరియాణాలో ఉండగా అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుడిపై పోక్సో, కిడ్నాప్ తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు పంపామని తెలిపారు. జాన్సైదాకు సహకరించిన అతని తల్లి, సోదరిని ఈ కేసులో నిందితులుగా చేర్చామని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉందన్నారు.పోలీసుల నిర్లక్ష్యంపై తండ్రి న్యాయ పోరాటం..గుంటూరులో 10వ తరగతి చదువుతున్న తన కుమార్తె ట్యూషన్కు వెళ్లి తిరిగి రాలేదంటూ గుంటూరుకు చెందిన వ్యాపారి వాసు ఈ ఏడాది జూన్ 10న పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అదే రోజున మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో పోలీసుల నిర్లక్ష్య వైఖరితో విసిగిపోయిన వాసు హైకోర్టును ఆశ్రయించారు. తన కుమార్తెను కోర్టు ముందు హాజరుపరిచి, ఆమెను తమకు అప్పగించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ ఆయన హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గతవారం విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ నేతృత్వంలోని ధర్మాసనం, పోలీసులపై ముఖ్యంగా డీజీపీపై నిప్పులు చెరిగింది. అదృశ్యమైన బాలిక ఆచూకీ తెలుసుకుని తమ ముందు హాజరుపరిచేలా చూడాలని డీజీపీని ఆదేశించింది. దీంతో డీజీపీ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.డీజీపీకి ధర్మాసనం ప్రశ్నలు..⇒ బాలికను తీసుకెళ్లే వ్యవహారంలో జాన్ సైదాకు ఎవరు సహకరించారు?⇒ గుంటూరు నుంచి వెళ్లిన తరువాత వీరికి ఎవరు ఆశ్రయం ఇచ్చారు? ⇒ బంధువులు, స్నేహితుల పాత్ర ఏమిటి?⇒ నిందితుడు సైదాకు సహకరించిన వారిపై ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారు? ⇒ ఆ బాలిక మైనర్ అని తెలిసి హోటల్ యజమానులు ఎలాంటి ధ్రువపత్రాలు పరిశీలించకుండా గదులు ఎలా వారికి అద్దెకిచ్చారు? ⇒ వారిపై ఏమి చర్యలు తీసుకున్నారు? ⇒ అదృశ్యమైన రోజు నుంచి ఈరోజు వరకు పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు? -
ఎవరెస్ట్ విలాపం
సాక్షి, అమరావతి: ‘అతి సర్వత్ర వర్జయేత్...’ అంటోంది ఎవరెస్ట్ శిఖరం. అంతటి దిగ్గజ పర్వతరాజం కూడా మితివీురినస్థాయిలో పర్వతారోహకుల తాకిడికి తల్లడిల్లుతోంది. వ్యర్థాలు, కాలుష్యంతో బెంబేలెత్తుతోంది. కనువిందు చేసే ఎవరెస్ట్ హిమగిరి సొగసులు ప్రమాదకరస్థాయిలో వేగంగా కరిగిపోతున్నాయి. పరిమితికి మించి పర్వతారోహకులు, వారి సహాయకులు ఎవరెస్ట్ బేస్ క్యాంప్నకు మౌంటెనింగ్కు వేలంవెర్రిగా వెళుతుండటం ప్రకృతికి పెనుముప్పు కలిగిస్తోందని స్ప్రింగర్ నేచర్ గ్రూప్ నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది.2023 నుంచి 2026 వరకు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్ద వాతావరణ, పర్యావరణ పరిస్థితులను అధ్యయనం చేసి ఈ నివేదిక రూపొందించింది. ఇదే పరిస్థితి కొనసాగితే 2100 నాటికి ఎవరెస్ట్ బేస్క్యాంప్ వద్ద ఉన్న హిమనీనదాల్లో 70 శాతం మంచు కరిగిపోతోందని ఆ నివేదికలో వెల్లడించింది. రీజనల్ ఎన్విరాన్మెంటల్ చేంజ్ జర్నల్ తాజాగా ప్రచురించిన ఆ నివేదిక ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆ నివేదికలోని ప్రధాన అంశాలు.. ఏటా 50 రోజులు జాతర పర్వతారోహణ సీజన్లో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను చూస్తే అది ఒక హిమనీనద ప్రాంతంగా కనిపించడం లేదు. ఆ 50 రోజులు పర్యాటకులతో కిక్కిరిసిపోయిన సాధారణ పర్యాటక విడిది కేంద్రంగా మారుతోంది. పర్వతారోహకుల కోసం బేస్క్యాంప్ వద్ద ఏకంగా 1,600 టెంట్లు వేస్తుండటం గమనార్హం. అంటే ఓ సాధారణ జాతర ప్రాంతంగా తయారవుతోంది. మంచుకొండలకు మంటేబేస్క్యాంప్ వద్ద పర్వతారోహకుల కోసం ఆహారం వండుతున్నారు. అక్కడ వంటకు, చలి నుంచి వెచ్చదనం కోసం, రాత్రివేళల్లో లైటింగ్ కోసం ఏటా సగటున 824 పోర్టబుల్ వంటగ్యాస్ సిలిండర్లు, 18,935 లీటర్ల కిరోసిన్, 5,130 లీటర్ల గ్యాసోలైన్ (పెట్రోల్ ఇంధనం) వినియోగిస్తున్నారు. దీంతో విపరీతంగా కాలుష్యం వెలువడుతోంది. తద్వారా 849.17 మెగా జౌళ్ల థర్మల్ విద్యుత్ శక్తి వెలువడుతోంది. దీంతో ఒక సీజన్లోనే 2,492 టన్నుల మంచు కరిగిపోతోంది. ముప్పు కలిగిస్తున్న మూత్రంపర్వతారోహకులు, వారి సహాయకులు రోజుకు ఆరువేల లీటర్ల మూత్రవిసర్జన చేస్తున్నారని అంచనా. ఆ మూత్రం కుంభూ హిమనీనదంలోకి చేరుతోంది. సరుకు రవాణా కోసం ఎక్కువగా ఉపయోగించే కంచర గాడిదలు, జడల బర్రె (యాక్)ల మూత్రవిసర్జన కూడా హిమనీనదాల్లోకి చేరుతోంది. అంతటి పరిమాణంలోని మూత్రంతో పుడుతున్న వేడితోనే ఒక్క సీజన్లోనే 154 టన్నుల మంచు కరిగిపోతోంది. నాలుగైదేళ్ల కిందటితో పోలిస్తే ఎవరెస్ట్ బేస్క్యాంప్ వద్దకు సరుకు రవాణా కోసం ఉపయోగిస్తున్న కంచర గాడిదలు, జడల బర్రెల సంఖ్య అయిదారు రెట్లు పెరిగింది. -
ఈ–స్టాంప్ కేసు దర్యాప్తు త్వరగా ముగించాలి
సాక్షి, అమరావతి: అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ఆయన కంపెనీ ఎస్ఆర్సీ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కనుసన్నల్లో సాగిన వేల కోట్ల రూపాయల ‘ఈ–స్టాంప్’ కుంభకోణంపై నమోదైన కేసులో వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలని హైకోర్టు సోమవారం సీఐడీని ఆదేశించింది. త్వరగా దర్యాప్తు పూర్తి చేసి సంబంధిత కోర్టులో చార్జిషిట్ దాఖలు చేయాలని తేల్చి చెప్పింది. ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పటి వరకు సాగించిన దర్యాప్తు పురోగతికి సంబంధించిన వివరాలను స్టేటస్ రిపోర్ట్ రూపంలో తమ ముందుంచాలని సీఐడీని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతక్రితం ఈ వ్యాజ్యంలో పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ, ‘ఇది రూ.2,500 కోట్ల కుంభకోణం. ఇందులో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే సురేంద్రబాబుది కీలక పాత్ర’ అని కోర్టుకు విన్నవించారు. ఈ–స్టాంపుల కుంభకోణంపై సీబీఐ, ఈడీ, ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తునకు ఆదేశించడంతో పాటు, దర్యాప్తుపై రాజకీయ ప్రభావం లేకుండా ఉండేందుకు దర్యాప్తును స్వయంగా పర్యవేక్షించాలని కోరుతూ అనంతపురం మాజీ ఎంపీ తలారి రంగయ్య గత ఏడాది హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
మీరు నిజమైన రైతులేనా!
సాక్షి, అమరావతి: రొయ్యల మేత ధరల పెంపును నిరసిస్తూ సోమవారం విజయవాడ సమీపంలోని పోరంకిలో గల మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా చేసేందుకు వచ్చిన రైతులను ఉద్దేశించి మత్స్యశాఖ కమిషనర్ రామ్శంకర్నాయక్ చేసిన అనుచిత వ్యాఖ్యలు రైతుల ఆగ్రహానికి కారణమయ్యాయి. అప్సడా చట్టానికి వ్యతిరేకంగా ఏకపక్షంగా పెంచిన రొయ్యల మేత ధరలను తక్షణమే ఉపసంహరింపజేయాలని కోరుతూ ఏపీ ఆక్వా రైతు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో రైతులు కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి, మేత కంపెనీలకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనంతరం మత్స్య శాఖ కమిషనర్ రామ్శంకర్నాయక్కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఫీడ్ తయారీలో వినియోగించే ముడి పదార్థాల ధరలు పెరిగాయని, అందువల్లే ఫీడ్ ధరలు పెంచాల్సి వస్తోందని చెప్పగా.. రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫీడ్ కంపెనీలు ముడి పదార్థాలను ప్రతినెలా కొనుగోలు చేయవని, అలాంటప్పుడు 45 రోజులకు ఒకసారి ఫీడ్ ధరలను సమీక్షిస్తూ ధరలు పెంచడంలో హేతుబద్ధత ఏమిటని ప్రశ్నించారు. ఈ సందర్భంలో రైతుల ప్రశ్నలకు బదులివ్వలేక ‘మీరు నిజమైన రైతులేనా?’ అని కమిషనర్ చేసిన వ్యాఖ్యలపై రైతులు తీవ్రంగా మండిపడ్డారు. రైతులను ఇలా అవమానపర్చడం దారుణమంటూ కమిషనర్ ఎదుటæ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఫీడ్ ధరలు తగ్గించాల్సిందే అనంతరం వారంతా మీడియాతో మాట్లాడుతూ.. ఫీడ్ ధరలు తగ్గించాల్సిందేనని కోరారు. ఫీడ్ ధరల పెంపును నియంత్రించడంతో పాటు కంపెనీల ధరల విధానాన్ని పారదర్శకంగా పర్యవేక్షించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. ఫీడ్ ధరలు, రొయ్యల ధరలను పర్యవేక్షించే కమిటీల్లో రైతుల పేరుతో ఫీడ్ కంపెనీల డీలర్లు, రొయ్యల ఎగుమతిదారుల బ్రోకర్లు ఎలా ఉంటారని రైతులు ప్రశ్నించారు. ఇలాంటి ప్రతినిధులు కమిటీల్లో ఉండటం వల్ల నిర్ణయాలు రైతుల ప్రయోజనాలకు కాకుండా ఫీడ్ కంపెనీలు, ఎగుమతిదారులకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందన్నారు. రైతులే నిర్ణయ ప్రక్రియలో భాగస్వాములు కావాలని, ఫీడ్ ధరలు–రొయ్యల ధరలపై పారదర్శకమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో సమాఖ్య కన్వీనర్ దుగ్గినేని గోపీనాథ్, వివిధ జిల్లాల సమాఖ్య ప్రతినిధులు శ్రీనాథ్రెడ్డి, మేకా వెంకటేశ్వరరావు, పి.వెంకురెడ్డి, పమిడి సుబ్బానాయుడు, బత్తుల రమేష్రెడ్డి, ఎస్.అంజిబాబు, బి.భాస్కర్రెడ్డి, సతీష్ రాజు పాల్గొన్నారు. -
తప్పు మీది.. తిప్పలు మాకా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్) ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోంది. అధికారులు చేసిన తప్పులకు తమకు శిక్ష విధిస్తున్నారని ఓటర్లు మండిపడుతున్నారు. మొక్కుబడిగా జరిగిన ఇంటింటి సర్వే తర్వాత 44.89 లక్షల మంది ఓటర్లను భారీగా తొలగించడమే కాకుండా మరో 44.21 లక్షల మంది ఓటర్లకు నోటీసులు ఇచ్చి పోలింగ్ బూత్లు, గ్రామ సచివాలయాల చుట్టూ తిప్పిస్తున్నారు. పట్టణాల్లో అద్దె ఇళ్లు మారిన వారిని పర్మినెంట్గా షిఫ్ట్ అయిపోయారంటూ ఏకంగా 22.30 లక్షల మంది ఓటర్లను తొలగించేశారు. సమీపంలోని ఇళ్లకు మారితే శాశ్వతంగా వెళ్లిపోయారంటూ ఓట్లను తొలగించేశారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ‘మీరు స్వయంగా గ్రామ సభకు హాజరై వివరణ ఇచ్చి సరైన ధృవీకరణ పత్రాలు అందచేసి ఫోటో దిగి వెళ్లాలి. లేదంటే మీ ఓటు తొలగిస్తాం..!’ అంటూ అధికారులు బెదిరించడంతో ఓటర్లు బెంబేలెత్తుతున్నారు. నోటీసులు అందుకున్న 44.21 లక్షల మందిలో అత్యధికులు ఇలాంటి సమస్యలే ఎదుర్కొంటున్నారు. ‘మేం పొట్టకూటి కోసం వేరే ఊరిలో ఉంటున్నాం.. ఇప్పటికే ఒకసారి మ్యాపింగ్ కోసం వచ్చాం.. ఇప్పుడు నోటీసులు అంటూ రెండోసారి రావాలంటే డబ్బులు ఎక్కడి నుంచి పెట్టుకోవాలి’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 25 ఏళ్ల నుంచి ఓటు వేస్తున్నాం.. 2002 ఓటర్ల లిస్టుతో మ్యాపింగ్ కూడా అయ్యింది.. కానీ ఇప్పుడు సర్ పేరిట ఈ వేధింపులు ఏమిటంటూ విజయవాడకు చెందిన వి.శ్రీనివాసరావు వాపోయాడు. అడ్డగోలుగా బూత్ల రేషనలైజేషన్.. పోలింగ్ బూత్ల రేషనలైజేషన్ పేరుతో ఓటర్లను చెల్లాచెదురు చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి 1,200 మందికి ఒక పోలింగ్ బూత్ ఉండాలనే నిబంధన పేరుతో ఎన్నికల సంఘం బూత్లను అడ్డగోలుగా రేషనలైజేషన్ చేసిందనేందుకు అరకు శాసనసభ నియోజకవర్గం మచ్చుకు నిదర్శనం. అల్లూరి జిల్లా అరకులోయ నియోజకవర్గం పెదబయలు మండలం గబుడు పుట్టు గ్రామం పీఎస్ నంబర్ 77 చీకుపనసలో ఉండాల్సింది పోయి అక్కడకు 12 కిలోమీటర్లు దూరంలో ఉన్న పీఎస్ నెంబర్ 75 ఇంజరి గ్రామంలో కలిపారు. ఇదే ఇంజరి పంచాయతీలోని సుజరి గ్రామం ఓట్లు గతంలో పీఎస్ నెంబర్ 75 ఇంజరిలో ఉండేవి. ప్రస్తుతం గిన్నెగరువులో కలపడంతో అంత దూరం వెళ్లి ఓట్లు వేయలేమని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఇదే పంచాయతీ కుమ్మరిగుంట గ్రామం పీఎస్ నెంబర్ 77 చీకుపనసలో ఉండాల్సింది పోయి అక్కడకు దూరంగా పీఎస్ నెంబర్ 76 గిన్నెగరువులో విలీనం చేశారు. తల్లభు గ్రామం పీఎస్ నెంబర్ 76 గిన్నెగరువులో ఉండాల్సింది పోయి పీఎస్ నెంబర్ 75 ఇంజరిలో కలిపారు. అధికారపార్టీ ఒత్తిళ్లతో అడ్డగోలుగా పోలింగ్ బూత్లను మార్చేసి కుటుంబ సభ్యులంతా ఒకే పోలింగ్ బూత్లో ఉండాలంటూ బలవంతంగా ఫారం 8 పెట్టించి మారుస్తున్నారు. ప్రతీ బీఎల్వోకు ఫారం 8 టార్గెట్లు విధించి అమలు చేయిస్తున్నారంటే దీని వెనక అధికారపార్టీ ఎంత ఒత్తిడి తెస్తోందో అర్థం చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికీ రెండు రాష్ట్రాల్లో ఓటు.. సర్ ఇంటింటి సర్వే తర్వాత ఒకటి కంటే ఎక్కువ ఉన్న ఓట్లు తొలగిపోతాయి.. ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల్లో రెండు చోట్ల ఉన్న ఓట్లలో ఏదో ఒకటే మిగులుతుందన్న భ్రమలు తొలగిపోతున్నాయి. 44.89 లక్షల ఓట్లు తొలగించిన తర్వాత కూడా చాలా మంది రెండు రాష్ట్రాల్లో ఓట్లు కలిగి ఉంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక్క గాజువాక నియోజకవర్గానికి చెందిన 358 మందికి అటు తెలంగాణలోను ఇటు గాజువాకలోను ఓటు ఉన్నట్లు గుర్తించి ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి ప్రయోజనం కనిపించడం లేదు. గాజువాక నియోజకవర్గం 79వ వార్డు పాత అగనంపూడి ప్రాంతానికి చెందిన కట్టా స్వాతి తెలంగాణలోని కొల్లాపూర్లో నివాసముంటున్నారు. ఆమె గాజువాక నియోజకవర్గంలోను, తెలంగాణలోని కొల్లాపూర్ నియోజకవర్గంలోను ఓటు కలిగి ఉన్నారు. సర్ ప్రకారం ఎక్కడో ఒకచోటే ఓటు హక్కు కలిగి ఉండాలి. మిగిలినచోట ఎక్కడున్నా రద్దు చేసుకోవాలి. గాజువాకలో 79వ వార్డు బూత్ నంబర్ ఒకటిలో ఓటు హక్కు కలిగి ఉన్న ఆమె తెలంగాణ కొల్లాపూర్లో బూత్ నంబర్ 82లో కూడా ఓటు కలిగి ఉన్నారు. ఈ విషయాన్ని ఏఈఆర్వో త్రినాథ్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆంధ్రప్రదేశ్లో రెండుచోట్ల ఓటు హక్కు ఉంటే తాము చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని, తెలంగాణలో రెండో ఓటు ఉండటంపై కేంద్ర ఎన్నికల సంఘం మినహా తాము చర్య తీసుకునే అవకాశం లేదన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత ముఖ గుర్తింపు, వేలి ముద్రల ద్వారా దొంగఓట్లను తొలగించే అవకాశం ఉన్నప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం ఆధార్తో లింక్ చేయకుండా సర్ పేరుతో మొక్కుబడిగా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. దశాబ్దాలుగా నివసిస్తున్నా నోటీసు.. దశాబ్దాలుగా ఓటు వేస్తున్నా. మ్యాపింగ్ పేరుతో తండ్రి ఇంటి పేరులో చిన్న పొరపాటు ఉందంటూ నాకు నోటీసు జారీ చేశారు. ఈ నెల 11న ప్రత్యేక శిబిరం వద్ద విచారణకు రావాలని నోటీసులో పొందుపరిచారు. స్థానికంగా దశాబ్దాలుగా నివాసం ఉంటున్నా. నా ఓటు తొలగిస్తే ఊరుకోను. –షేక్ అబ్దుల్ ఇస్మాయిల్, నాయుడుపేట బలవంతంగా ఫారం 8తో మార్చడం సరికాదు.. కొన్నిచోట్ల బలవంతంగా ఫారం 8 ఇచ్చి పోలింగ్ బూత్లను మార్చడం సరికాదు. ఉద్యోగం, వ్యాపారం నిమిత్తం ఒక కుటుంబంలోని వారు పలు ప్రాంతాల్లో ఉంటారు. వారంతా ఒకే పోలింగ్ బూత్లోకి రావాలనే నిబంధన కరెక్ట్ కాదు. ఆయా కుటుంబ సభ్యుల అభిప్రాయం మేరకు మాత్రమే పోలింగ్ బూత్లను మార్చాలి. – గూడూరు రఫీ, నాగూరుకాలనీ, తిరుపతి రూరల్ ఓటమి భయంతో ఓట్ల తొలగింపు.. ప్రజాదరణ లేని టీడీపీ ఓటమి భయంతోనే ఓట్ల తొలగింపునకు శ్రీకారం చుట్టింది. సర్ ప్రక్రియలో పొన్నూరు మండలం మన్నవలో టీడీపీ నాయకులు ఎన్నికల అధికారులపై ఒత్తిడి చేసి ఓట్లను తొలగించే పనిలో పడ్డారు. వైఎస్సార్ సీపీ ఓట్లే లక్ష్యంగా తొలగిస్తున్నారు. ఇప్పటికే 300కు పైగా ఓట్లు తొలగించారు. జీవనం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చే వారి ఓట్లను కూడా తీసేస్తున్నారు. – బొనిగల వేణు ప్రసాద్. మాజీ పొన్నూరు మార్కెట్ యార్డు చైర్మన్ ప్రజాదరణ కోల్పోయి అడ్డదారులు దశాబ్దాలుగా మాది రాజకీయ కుటుంబం. సర్పంచులు, ఎంపీటీసీలుగా మా కుటుంబీకులు పనిచేశారు. మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక టీడీపీ నాయకులు ఓట్లను తొలగించేందుకు కుట్రలు పన్నారు. అధికారులు వారికి సహకరిస్తున్నారు. మూడుసార్లు గ్రామ సర్పంచిగా చేసిన నా ఓటు తొలగించడం ఏమిటని ఎన్నికల అధికారులను ప్రశ్నిస్తే ఎలాంటి సమాధానం లేదు. మా తమ్ముడి భార్య ఓటు కూడా తొలగించారు. ప్రజాదరణ కోల్పోయిన టీడీపీ అడ్డదారుల్లో గెలిచేందుకు కార్యాచరణ రూపొందించింది. – బొనిగల నాగమల్లేశ్వరరావు, మాజీ సర్పంచి, మన్నవ గ్రామం, పొన్నూరు మండలం, గుంటూరు జిల్లా అరకులో అనుమానాస్పద ఓట్ల నమోదు అరకులోయ మండలం బూత్ నంబర్ 213 నుండి 271 వరకు, 107 నుంచి 163 పోలింగ్ కేంద్రాల పరిధిలో వందల సంఖ్యలో అనుమానాస్పదంగా ఓటర్ల నమోదు ప్రక్రియ జరిగినట్లు మా దృష్టికి వచ్చింది. ఒకే ఫోటోతో రెండు ఓట్లు.. చనిపోయిన వారి ఓట్లు ఇంకా జాబితాలో ఉండటం.. ఒకే వ్యక్తి పేరుతో రెండు బూత్లలో ఓట్లు ఉండటం లాంటి తప్పిదాలు జరిగాయి. దొంగ ఓట్లకు అడ్డుకట్ట వేసి వంద శాతం పారదర్శకంగా ఓటర్ల జాబితా తయారు చేయాలి. – ఆర్.మత్స్యలింగం, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే, అరకు -
కూటమిలో మేయర్ పోరు
సాక్షి, అమరావతి: ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్న రీతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవుల కోసం కూటమి పార్టీల్లో అప్పుడే కుమ్ములాటలు ముదిరిపోయాయి. ఇంకా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడలేదు, ఎప్పుడు వెలువడుతుందో కూడా తెలియదు, రిజర్వేషన్లు ఖరారు కాలేదు.. కానీ టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఆ పదవుల కోసం విపరీతంగా లాబీయింగ్లు, ఎత్తులు పైఎత్తులు, బేరసారాలు మొదలుపెట్టేశారు. బెజవాడ టీడీపీలో నువ్వా, నేనా?విజయవాడ మేయర్ పీఠం కోసం టీడీపీలోని రెండు వర్గాల మధ్య కోల్డ్వార్ నడుస్తోంది. కాపు వర్గం నుంచి సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తన కుమారుడు సిద్ధార్థను అందరి కంటే ముందు రేసులో నిలబెట్టారు. తనకు మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి తన కుమారుడికి మేయర్ సీటు ఇచ్చి కాపు వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. గతంలో మేయర్ పదవిని రెండుసార్లు కమ్మ వర్గానికి ఇచ్చారని, ఈసారి తమకు ఇవ్వాలని ఆయన పట్టుబట్టడమే కాదు చంద్రబాబు వద్దకు తన కొడుకును తీసుకెళ్లి కూడా అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. దీంతో ఉలిక్కిపడిన కమ్మ సామాజికవర్గం నేతలు విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిని రంగంలోకి దించి ఇంకా చాలామంది రేసులో ఉన్నారని చెప్పించారు. ఆయన కొమ్మారెడ్డి పట్టాభి, బొప్పన భవకుమార్ లేకపోతే తన వర్గానికి చెందిన ఎవరికైనా ఆ సీటు ఇప్పించాలని చూస్తున్నారు. కమ్మ సామాజికవర్గం నుంచి దేవినేని అపర్ణ గట్టి లాబీయింగ్ చేస్తున్నారు. లోకేశ్తో సన్నిహితంగా ఉండే ఆమె తనయుడు దేవినేని చందు.. అయితే తన తల్లికి లేకపోతే జెన్జెడ్ కోటాలో తన భార్యకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలివిగా పావులు కదుపుతూ తన వర్గం నుంచి ఒక మాజీ కార్పొరేటర్ పేరును తెరపైకి తెచ్చి చివరికి తన భార్య అనూరాధకు మేయర్ సీటు ఇప్పించుకునే యత్నాల్లో ఉన్నారు. మరికొందరూ రేసులో ఉండి చంద్రబాబు, లోకేశ్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండడంతో బెజవాడ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. విశాఖ మేయర్ సీటు కోసం ఎమ్మెల్యేల హైరానా రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యం ఉన్న విశాఖపట్నం జీవీఎంసీ మేయర్ సీటు కోసం టీడీపీ ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఈ మేయర్ సీటు ఎలాగైనా సొంతం చేసుకోవాలని ముగ్గురు ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబుతోపాటు మాజీ ఎమ్మెల్యేలు పీలా గోవింద్, గండి బాబ్జిలు తెరవెనుక ముమ్మర యత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు తమ తనయులకు ఆ సీటు ఇప్పించాలని తాపత్రయపడుతుండగా మిగిలిన వాళ్లు తామే నేరుగా సీటు కోసం యత్నిస్తున్నారు. గంటా శ్రీనివాసరావు తన తనయుడు రవితేజకి మేయర్ సీటు ఇవ్వాలని ఇప్పటికే చంద్రబాబు, లోకేశ్ను అడిగినట్లు సమాచారం. దీని గురించి ఆయనను ఇటీవల మీడియా ప్రశి్నంచగా తనకు ఆ సీటు ఇవ్వరా? అని ఎదురు ప్రశి్నంచడం విశేషం. మేయర్ రేసులో ఆయన చాలా సీరియస్ పోటీదారుగా పావులు కదుపుతున్నారు. అయితే ఎంపీగా ఉన్న లోకేశ్ తోడల్లుడు భరత్ ఇక్కడ కీలకం కావడంతో ఆయన మద్దతు కోసం చూస్తున్నట్లు తెలిసింది. టీడీపీ ఎమ్మెల్యేలు కుదిరితే తమ కుమారులు, మహిళా రిజర్వేషన్ అయితే తమ కుటుంబంలో ఒకరికి అవకాశం ఇవ్వాలని కోరుతూ ఆ దిశగా యత్నాలు చేస్తున్నారు. భరత్ మాత్రం తనకు అనుకూలంగా ఉండే వారికి మేయర్ సీటు ఇప్పించుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. నెల్లూరులో వేమిరెడ్డి చెబితేనే మేయర్ నెల్లూరు మేయర్ సీటు కోసం టీడీపీలో తెర వెనుక ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాను తమ గుప్పిట్లో పెట్టుకున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డిలు మేయర్ సీటును తమ అనుయాయుడు రూప్కుమార్ యాదవ్కి ఇప్పించాలని చూస్తుండడం మిగిలిన నేతలకు కంటగింపుగా మారింది. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి.. వేమిరెడ్డిని కాదంటే లోకేశ్తో ఇబ్బంది వస్తుందని నోరు మెదపడంలేదు. ఇదిలా ఉంటే మేయర్ ఎంపికలో తనకు ప్రాధాన్యం ఇవ్వాలని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కోరుతున్నారు. పలువురు కీలక నేతలూ వేమిరెడ్డి తీరుపై అసహనంతో రగిలిపోతున్నారు.గోదావరి జిల్లాల్లో జనసేనతో ఫైట్ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కాకినాడ, రాజమండ్రి, ఏలూరు మేయర్ సీట్లు, భీమవరం, తాడేపల్లిగూడెం తదితర మున్సిపల్ చైర్మన్ సీట్ల కోసం జనసేన, టీడీపీ నేతలు నువ్వా నేనా అనేలా పోటీ పడుతున్నారు. ఇక్కడ తమకు బలం ఎక్కువగా ఉందంటూ జనసేన నేతలు ఎక్కువ మున్సిపాలిటీలు ఇవ్వాలని అడుగుతుండగా టీడీపీ నేతలు అందుకు అంగీకరించడంలేదు. కాకినాడ మేయర్ సీటుపై జనసేన, రాజమండ్రి మేయర్ సీటుపై బీజేపీ కన్నేసి చంద్రబాబు దగ్గర మంతనాలు జరుపుతుండడంతో టీడీపీ నేతలు రగిలిపోతున్నారు. తమకు అవకాశాల్లేకుండా ఇక్కడ కూడా పొత్తు పేరుతో అన్యాయం చేస్తారా అని ముఖ్య నేతలను నిలదీస్తున్నారు. రాయలసీమలో తిరుపతి కార్పొరేషన్ తమకు ఇవ్వాలని జనసేన కోరుతుండడాన్ని టీడీపీ నేతలు జీరి్ణంచుకోలేకపోతున్నారు. గుంటూరు కార్పొరేషన్ కోసం టీడీపీ ముఖ్య నేతలు ఎత్తులకుపైఎత్తులు వేసుకుంటున్నారు. చిత్తూరు, మచిలీపట్నం, అనంతపురం కార్పొరేషన్లు తమకు ఇవ్వాలని జనసేన డిమాండ్ చేయడం అక్కడి టీడీపీ నేతలకు ఇరకాటంగా మారి బహిరంగంగానే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మేయర్, మున్సిపల్ ఛైర్మన్ పదవులు ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా ఉండడం, ఎక్కువ బడ్జెట్, అపరిమితమైన అధికారాలు ఉండడంతో వాటి కోసం నేతలు పోటీపడుతున్నారు. ఒక్కసారి పదవి దక్కితే రెండు చేతులా సంపాదించుకోవచ్చని వాటిపై కన్నేసి తమ కుటుంబంలోని ఎవరో ఒకరికి ఇప్పించుకోవడానికి ప్రయతి్నస్తున్నారు. లేనిపక్షంలో తమకు అనుకూలంగా ఉండే వారికి ఇప్పించుకోవాలని చూస్తూ రాజకీయాలు చేస్తున్నారు. -
అవసరం 1,581 ఎకరాలు.. సమీకరణ 6,212 ఎకరాలు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణం కోసం మరో 6,212.50 ఎకరాల సమీకరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భూసమీకరణ పథకం (ఎల్పీఎస్) కింద గుంటూరు జిల్లాలో కంతేరులో 974, తాడికొండలో 5,238.50 ఎకరాల సమీకరణకు సీఆర్డీఏ కమిషనర్కు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రైల్వే లైన్, ఐఆర్ఆర్, గ్రిడ్ రోడ్ విస్తరణ కోసం ఈ భూ సమీకరణ చేయనున్నారు. ఎర్రుపాలెం–నంబూరు మధ్య అమరావతి మీదుగా కొత్త బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ నిర్మాణం (ఇరు వైపులా 50 మీటర్లు బఫర్ జోన్), ఇంటర్నల్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్), గ్రిడ్ రోడ్ను ఐఆర్ఆర్ వరకూ విస్తరించే పనులకు కంతేరు, తాడికొండలో భూసమీకరణకు ఆగస్టు 28న సీఆర్డీఏ అథారిటీ సమావేశం ఆమోదించింది. అయితే ఇందుకు 1,581.34 ఎకరాలు సరిపోతుందని అంచనావేస్తుండగా, దీనికి భిన్నంగా 6,212.50 ఎకరాల సమీకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం గమనార్హం. సమీకరణల తీరిది.. ⇒ కంతేరులో పట్టా భూమి (దేవాదాయ.. వక్ఫ్ భూమితోపాటు) 3,299.66 ఎకరాలు, అటవీ–ప్రభుత్వ భూమి 304.78 ఎకరాలు, అసైన్డు భూమి 67.97 ఎకరాలు మొత్తం 3,672.41 ఎకరాలు ఉంది. అయితే రైల్వే లైన్ కోసం 148.30, ఐఆర్ఆర్ కోసం 58.03, ఐఆర్ఆర్ వరకూ గ్రిడ్ రోడ్ విస్తరణ కోసం 35.65 మొత్తం 241.98 ఎకరాలు అవసరం కాగా.. 974 ఎకరాలను సమీకరించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచి్చంది. ⇒ తాడికొండలో పట్టా భూమి(దేవాదాయ.. వక్ఫ్ భూమితోపాటు) 11,216.12 ఎకరాలు, అటవీ–ప్రభుత్వ భూమి 1,445.47 ఎకరాలు, అసైన్డు భూమి 135 ఎకరాలు మొత్తం 12,796.59 ఎకరాలు ఉంది. ఇక్కడ రైల్వే లైన్ కోసం 701.26, ఐఆర్ఆర్ కోసం 167.79, ఐఆర్ఆర్ వరకూ గ్రిడ్ రోడ్ విస్తరణ కోసం 470.31 మొత్తం 1,339.36 ఎకరాలు అవసరం కాగా.. 5,238.50 ఎకరాలను సమీకరించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచి్చంది. -
అవుకు పవర్ ప్రాజెక్టు అవుట్
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారులో ‘పవర్ సెంటర్’ దెబ్బకి రాష్ట్రం నుంచి పవర్ కంపెనీలు పారిపోతున్నాయి. ఇప్పటికే నెల్లూరు జిల్లా నుంచి టాటా పవర్ ఒడిశాకి, తిరుపతి జిల్లా నుంచి వెబ్సోల్ సంస్థ పశ్చిమబెంగాల్కు పారిపోగా.. తాజాగా నంద్యాల జిల్లా అవుకు పంప్డ్స్టోరేజ్ ప్రాజెక్టుకు ఆర్వీఆర్ ప్రాజెక్టు దణ్ణంపెట్టి మరీ తప్పుకుంది. విచిత్రం ఏమిటంటే.. ఏ తేదీన రాష్ట్రంలో ప్రాజెక్టు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందో సరిగ్గా ఏడాది తర్వాత అదే తేదీన ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నామంటూ ఆర్వీఆర్ ప్రాజెక్ట్ లేఖ రాయడం గమనార్హం. 1,200 మందికి ఉద్యోగాలంటూ.. 2025 జూలై9న రాష్ట్రంలో రూ.4,708 కోట్ల పెట్టుబడితో 1,200 మందికి ఉపాధి కల్పించే విధంగా నంద్యాల జిల్లా అవుకు వద్ద 800 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తామంటూ ఆర్వీఆర్ సంస్థ ప్రభుత్వానికి లేఖ రాసింది. అదే కంపెనీ ఈ ఏడాది జూలై 9న తమవద్ద ఈ ప్రాజెక్టు చేపట్టడానికి అవసరమైన నిధులు లేకపోవడంతో ఈ ప్రాజెక్టు ప్రతిపాదనను రద్దు చేయమంటూ లేఖ రాసింది. ఏడాది క్రితం ఈ లేఖ ఆధారంగా పెట్టుబడులకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం ఇప్పుడు ఏడాది తర్వాత కంపెనీ రాసిన లేఖ ఆధారంగానే పెట్టుబడి ప్రతిపాదనను ఉపసంహరిస్తూ రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.పవర్ నుంచి రూ.14,921 కోట్ల పెట్టుబడులు పరార్హరిత ఇంధన ప్రాజెక్టులను ప్రోత్సహించడంలో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నంద్యాల జిల్లా అవుకు వద్ద 800 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టును అరబిందో గ్రూపునకు చెందిన అరో ఇన్ఫ్రాకు అప్పగించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కారు ఈ ప్రాజెక్టును అరో ఇన్ఫ్రాకు కేటాయింపులను రద్దు చేస్తూ.. ఈనాడు రామోజీ కుటుంబానికి సమీప బంధువులకు చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్టుకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది జూలై 9న ఆర్వీఆర్ లేఖ రాయడం, అదే నెలలో డీపీఆర్ ఇవ్వడం ఎస్ఐపీసీ, ఎస్ఐపీబీ, మంత్రివర్గ ఆమోదాలు తెలుపుకుంటూ 28వ తేదీన ప్రాజెక్టును కేటాయిస్తూ ఆగమేఘాల మీద ఉత్తర్వులు ఇచ్చేశారు. ఇలా కేవలం నెల రోజుల్లోనే మూడు విద్యుత్ ప్రాజెక్టులు జీవోలు ఇచ్చాక రాష్ట్రం నుంచి వెళ్లిపోవడంతో దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. కేవలం ఈ మూడు ప్రాజెక్టులు ద్వారా రాష్ట్రం నుంచి రూ.14,921 కోట్ల పెట్టుబడులు రాష్ట్రం విడిచి వెళ్లిపోయాయి. అంతేకాదు చంద్రబాబు సర్కారు అధికారం చేపట్టిన తర్వాత నుంచి ఇప్పటివరకు జీవోలు ఇచి్చన తర్వాత రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన ప్రాజెక్టుల విలువ రూ.20,956 కోట్లకు చేరింది. -
అజెండాపై కుదరని ఏకాభిప్రాయం
కృష్ణా, గోదావరి జలాల వినియోగంలో ఏపీ, తెలంగాణల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ రెండో సమావేశంలోనూ అజెండాపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో భేటీలో చర్చించాల్సిన అంశాలపై వారంలోగా ప్రతిపాదనలు ఇవ్వాలని ఇరు రాష్ట్రాల అధికారులకు సీడబ్ల్యూసీ చైర్మన్ అనుపమ్ ప్రసాద్ సూచించారు.సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: కృష్ణా, గోదావరి జలాల వినియోగంలో ఆంధ్రపద్రేశ్, తెలంగాణల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి సూచనలు ఇచ్చేందుకు కేంద్రం ఏర్పాటుచేసిన కమిటీ రెండో సమావేశంలోనూ అజెండాపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో కమిటీ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై వారంలోగా ప్రతిపాదనలు ఇవ్వాలని రెండు రాష్ట్రాల అధికారులకు సీడబ్ల్యూసీ చైర్మన్ అనుపమ్ ప్రసాద్ సూచించారు. ఏపీ ప్రతిపాదనలను తెలంగాణకు, తెలంగాణ ప్రతిపాదనలను ఏపీకి పంపుతామని.. వాటిని పరిశీలించి ఇరు రాష్ట్రాల అధికారులు అభిప్రాయాలు చెప్పాక అజెండాను ఖరారుచేసి మరో రెండు వారాల తర్వాత సమావేశం నిర్వహిస్తామంటూ చేసిన సూచనకు ఇరు రాష్ట్రాల అధికారులు అంగీకరించారు. సీడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షతన జల వివాదాల కమిటీ రెండో సమావేశం ఢిల్లీలోని సీడబ్ల్యూసీ కార్యాలయంలో సోమవారం జరిగింది. ఏపీ తరఫున జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్కుమార్, సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు, ఈఎన్సీ కె. నరసింహమూర్తి.. తెలంగాణ తరఫున ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్, సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ తదితరులు సమావేశానికి హాజరయ్యారు. గత జనవరి 30న జరిగిన తొలి సమావేశానికి కొనసాగింపుగా ఈ భేటీ జరిగింది. ఆ సమావేశంలో అజెండా సమరి్పంచాలని ఇరు రాష్ట్రాల అధికారులను సీడబ్ల్యూసీ చైర్మన్ కోరినా ఇప్పటిదాకా అజెండాను రెండు రాష్ట్రాలు ప్రతిపాదించలేదు. దీంతో అజెండాను ఖరారు చేసేందుకు రెండో సమావేశాన్ని ఏర్పాటుచేశారు. పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతి, గోదావరిలో నీటి లభ్యతపై అధ్యయనం, గోదావరి జలాల్లో రెండు రాష్ట్రాల వాటాలు తేల్చడం, కృష్ణాపై అనుమతిలేకుండా తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులు తదితర అంశాలపై చర్చించాలని ఏపీ అధికారులు సూచించగా.. బ్రిజేష్కుఆర్ ట్రిబ్యునల్ తుది తీర్పు వచ్చేవరకు కృష్ణా జలాల్లో 50 శాతం వాటా వినియోగించుకునే అవకాశం కల్పించడం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 టీఎంసీల నీటి హక్కులను కల్పించడం, గోదావరి మిగులు జలాల వినియోగం, పోలవరం–నల్లమలసాగర్ లింక్, అంతర్రాష్ట్ర ప్రాజెక్టులకు అనుమతులు వంటి అంశాలపై చర్చించాలని తెలంగాణ అధికారులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. లభ్యత జలాల లెక్కలపై ఏపీ అభ్యంతరాలు.. గోదావరిలో ప్రవాహాలపై శాస్త్రీయంగా అధ్యయనం చేయించి నీటి లభ్యతను తేల్చాలని సీడబ్ల్యూసీ చైర్మన్ను ఏపీ అధికారులు కోరారు. నీటి లభ్యత తేల్చాక ఏపీ, తెలంగాణ వాటాలను తేల్చాలన్నారు. గోదావరి ట్రిబ్యునల్ను ఏర్పాటుచేసి రెండు రాష్ట్రాల వాటాలను తేల్చాలని తమ ప్రభుత్వం ఇప్పటికే లేఖ రాసిందని వారు గుర్తుచేశారు. నీటి వాటాలు తేలకముందే తెలంగాణ చేపట్టిన కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల వంటి ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీనిపై తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆ ప్రాజెక్టులన్నీ ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టినవేనని.. రీ–ఇంజినీరింగ్, డిజైన్ చేసి చిన్నచిన్న మార్పులు మాత్రమే చేశామని వివరించారు. ప్రస్తుత సంవత్సరం తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 65 రోజుల్లో వెయ్యి టీఎంసీలకు పైగా వరద జలాలు సముద్రంలో కలిశాయని.. అందులో 200 టీఎంసీలను వినియోగించుకోవడానికి చేపట్టిన పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతివ్వాలని ఏపీ అధికారులు కోరగా.. తెలంగాణ అధికారులు అభ్యంతరం తెలిపారు. వీటిపై సీడబ్ల్యూసీ చైర్మన్ అనుపమ్ ప్రసాద్ జోక్యం చేసుకుంటూ అజెండాలో చేర్చితే వాటిపై చర్చిద్దామని రెండు రాష్ట్రాల అధికారులకు సూచించారు. మాకు తాగునీరు, విద్యుత్ అవసరాలే ముఖ్యం : తెలంగాణ శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు విద్యుత్కేంద్రంలో తెలంగాణ సర్కార్ యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ ప్రాజెక్టును ఖాళీచేస్తోందని.. నీటి మట్టం 854 అడుగుల కంటే దిగువకు చేరితే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు నీళ్లందించలేని.. రాయలసీమ, చెన్నైకి తాగునీటిని సరఫరా చేయలేమని ఏపీ అధికారులు సీడబ్ల్యూసీ చైర్మన్కు వివరించారు. విద్యుదుత్పత్తి చేయకుండా తెలంగాణను నిలువరించాలని ఏపీ అధికారులు కోరడంపై తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తంచేశారు. అయితే, తమకు తాగునీరు, విద్యుత్ అవసరాలే అత్యంత ముఖ్యమని, ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగానే శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తిపై నిర్ణయాలు తీసుకుంటామని తెలంగాణ అధికారులు వివరించారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం దిగువన ఉన్న నాగార్జునసాగర్లో తగిన నిల్వలు అవసరమని చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఏపీ తన వాటాకు మించి నీళ్లను తరలిస్తోందన్నారు. వీటిపై సీడబ్ల్యూసీ చైర్మన్ అనుపమ్ ప్రసాద్ జోక్యం చేసుకుంటూ తాగునీటి అవసరాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని రెండు రాష్ట్రాల అధికారులకు సూచించారు.గోదావరి–కావేరి బ్లూప్రింట్ మేమే రూపొందిస్తాం : సీడబ్ల్యూసీ ఇక తెలంగాణలోని సమ్మక్క బ్యారేజ్ నుంచి గోదావరి జలాలను కావేరికి తరలించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుండగా.. పోలవరం ప్రాజెక్టు నుంచి కావేరికి గోదావరి జలాలను తరలించేలా గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. పోలవరం నుంచి గోదావరి జలాలను కావేరికి తరలిస్తే తమ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని తెలంగాణ అభ్యంతరం తెలుపుతోంది. సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. గోదావరి–కావేరి అనుసంధానం ప్రాజెక్టు బ్లూప్రింట్ తామే రూపొందిస్తామని సీడబ్ల్యూ చైర్మన్ అనుపమ్ ప్రసాద్ స్పష్టంచేశారు. -
దొరికిపోయినా దబాయింపు!
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ 2025 అక్రమాలను కప్పిపుచ్చేందుకు చంద్రబాబు సర్కారు నానా తంటాలు పడుతోంది. అక్రమాల మయంగా మారిన నియామక ప్రక్రియలో రోజుకో కొత్త కోణం వెలుగులోకి రావడం.. స్పోర్ట్స్ కోటా ముసుగులో ఇష్టారాజ్యంగా జీవోలు.. ప్రతిభ, పారదర్శకతకు పాతర.. బాధిత అభ్యర్థులు తమకు జరిగిన అన్యాయాన్ని ఒక్కొక్కరుగా బహిర్గతం చేయడం.. విద్యాశాఖ మంత్రి లోకేష్ తక్షణమే రాజీనామా చేయడంతోపాటు సీబీఐ విచారణకు ఆదేశించాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తుండటంతో బాబు సర్కారు కట్టు కథలు వినిపిస్తోంది. సర్టీఫికెట్లు చూపించాలని అడిగితే కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగింది. ఉన్నతాధికారులను రంగంలోకి దించి తప్పులను కప్పిపుచ్చే యత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) వైస్ చైర్మన్ ఎస్.భరణి సోమవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. డీఎస్సీ కుంభకోణంపై వరుసగా వస్తున్న కథనాల్లో వాస్తవం లేదంటూనే, జూడో అసోసియేషన్ ఇచ్చిన ప్రతి సర్టీఫికెట్పైనా విచారణ జరుగుతుందని చెప్పారు. తద్వారా తప్పిదాలను పరోక్షంగా అంగీకరించారు! ముఖ్యంగా కర్నూలుకు చెందిన టీచర్ ప్రభాకర్పై వచ్చిన ఆరోపణల్లో కొంత గందరగోళం ఉందని, విచారణకు త్రిసభ్య కమిటీని నియమించామని చెప్పడం గమనార్హం. మాట్లాడుతున్న భరణి, అన్సారియా అసోసియేషన్లు చెప్పిందే వేదం..! స్పోర్ట్స్ అసోసియేషన్లు జారీ చేసిన సర్టీఫికెట్ల ఆధారంగానే అభ్యర్థుల అర్హతలను పరిగణించినట్లు శాప్ వైస్ చైర్మన్ భరణి పేర్కొన్నారు. సర్టీఫికెట్లను పూర్తిస్థాయిలో పరిశీలించే అధికారం, వ్యవస్థ తమ పరిధిలో లేదని ఆమె చెప్పడం గమనార్హం. సాధారణంగా అసోసియేషన్లు జారీ చేసే ధ్రువపత్రాలను ఒరిజినల్గానే భావిస్తామని ఆమె స్పష్టం చేశారు. అంటే.. టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అధ్యక్షుడిగా ఉన్న అసోసియేషన్కు కనీసం గుర్తింపు లేకపోయినా, నిబంధనల ప్రకారం అసోసియేషన్ సెక్రటరీ మాత్రమే అభ్యర్ధుల ధృవీకరణ లేఖపై సంతకం చేయాల్సి ఉన్నా, కూన సంతకం ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చేస్తారా? అని మీడియా ప్రశ్నించగా.. కూన రవికుమార్ను తాము ఎమ్మెల్యేగా చూడటం లేదని, అసోసియేషన్ అధ్యక్షుడిగానే చూస్తున్నామని, ఆయన సంతకాన్ని ఆమోదించాలని ఫెడరేషన్ చెప్పిందని భరణి పేర్కొన్నారు. అభ్యర్థి పెద అప్పలరాజు తన సర్టిఫికెట్లను ఆన్లైన్లో తప్పుగా అప్లోడ్ చేశారని, ఆయన సర్టిఫికెట్తో పాటు సోదరుడి సర్టీఫికెట్ కూడా ఇచ్చారని, ఇది కేవలం మానవ తప్పిదమని వెనకేసుకొచ్చారు. భార్యాభర్తలకు ఉద్యోగాలు రాకూడదా? 41 ఏళ్లు ఉన్న వారికి ఉద్యోగం ఇవ్వకూడదా? అని ప్రశ్నించారు. ఎలాంటి మార్కులు రాకపోయినా, స్పోర్ట్స్ మెరిట్ ఉంటే ఉద్యోగాలిస్తామని చెప్పారు. జరగని టోర్నమెంట్పై దాటవేత.. ‘ఖమ్మంలో టోర్నమెంట్ జరిగిందంటూ జూడో సర్టీఫికెట్లతో వచ్చిన నలుగురు అభ్యర్ధులకు ఉద్యోగాలిచ్చారు. కానీ అక్కడ అసలు ఆ టోర్నమెంట్ జరగలేదు. జరగని టోర్నమెంట్లో పాల్గొని, సర్టీఫికెట్లు ఎలా తెచ్చారని విచారణ జరిపారా?’ అని ప్రశ్నించగా.. ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున తాము ఏమీ మాట్లాడలేమని భరణి సమాధానం దాటవేశారు. 372 సర్టీఫికెట్లపై విచారణ చేయడం సాధ్యం కాదన్నారు. సర్టీఫికెట్లు ఇచ్చేది మేం కాదు.. కేసులు పెడతాం! టీచర్లందరికీ టెట్ తప్పనిసరి అని అన్సారియా స్పష్టం చేశారు. వల్లూరులో టీచర్గా నియమించిన ప్రభాకర్ టెట్లో అర్హత సాధించలేదు కదా? అని ప్రశ్నించగా.. టెట్ ఎన్నిసార్లయినా రాయవచ్చని, అతడు ఒకసారి రాసినప్పుడు 77 మార్కులతో అర్హత సాధించాడని, అయినప్పటికీ కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కర్నూలులో ఉష అనే ఉపాధ్యాయురాలు టెట్లో తెలుగు సబ్జెక్ట్లో అర్హత సాధించలేదు. అలాంటప్పుడు ఆమెకు ఉద్యోగం ఎలా ఇచ్చారన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ఏ సబ్జెక్ట్ బోధించే టీచర్ ఆ సబ్జెక్టులో టెట్ అర్హత సాధించాల్సిన అవసరం లేదని అన్సారియా పేర్కొన్నారు. ‘ఈడబ్ల్యూఎస్ సర్టీఫికెట్లలో చాలా వరకూ ఫేక్ అని ఇప్పటికే రుజువైంది. ఆర్థికంగా బలంగా ఉన్నవారికి కూడా ఇచ్చి వాటి ఆధారంగా డీఎస్సీలో ఉద్యోగాలు కట్టబెట్టారు..’ అనే ప్రశ్నలపై అన్సారియా దాటవేత ధోరణి ప్రదర్శించారు. ఆ అంశం తమ పరిధిలోనిది కాదన్నారు. సర్టిఫికెట్లు ఇచ్చేది తహసీల్దార్లు కాబట్టి రెవెన్యూ విభాగానికి చెప్పి విచారణ చేయిస్తామంటూ తప్పించుకున్నారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన 372 మందికి ఫోన్లు చేసి సర్టీఫికెట్లు చూపించాలని అడుగుతున్నారని, అలా ఎవరైనా అడిగితే వారిపై చర్యలు తీసుకుంటామని అన్సారియా హెచ్చరించారు. కుప్పంలో ఇలాంటి ఘటన జరిగితే 24 గంటల్లోనే ఓ విలేకరి, కెమెరామెన్పై కేసు నమోదు చేశామన్నారు. -
బాబు సర్కార్ మరో రూ.1,950 కోట్ల అప్పు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ బయట అప్పుల పరంపరను కొనసాగిస్తోంది. తాజాగా మరో రూ.1,950 కోట్లు అప్పుకు గ్యారంటీ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. హడ్కో నుంచి ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ రూ.1,000 కోట్లు ప్రత్యేక టర్మ్ రుణంగా తీసుకునేందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. అలాగే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఏపీ ట్రాన్స్కో రూ.950 కోట్లు మీడియం టర్మ్ రుణంగా తీసుకునేందుకు గ్యారంటీ ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ హామీ.. రుణ కాల వ్యవధి మొత్తానికి చెల్లుబాటులో ఉంటుంది. అలాగే అసలు, వడ్డీకి కూడా ప్రభుత్వ హామీ వర్తిస్తుంది. రుణ సంస్థలకు చెల్లించడంలో విఫలమైన సందర్భంలో ప్రభుత్వ హామీ అమల్లోకి వస్తుంది. -
‘‘కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం అంతా లోకేశే.. రాజీనామా చేయాల్సిందే’’
సాక్షి,తాడేపల్లి: కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ను అమ్మకానికి పెట్టారని వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. డీఎస్సీ స్కామ్ బాధితులకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న డీఎస్సీ స్కామ్ అక్రమాలపై సోమవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.డీఎస్సీ అక్రమాలపై ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతోంది. అడ్డ దారిలో ఉద్యోగాలు పొందినవారి వివరాలు ప్రతిరోజూ బయటకు వస్తున్నాయి. చంద్రబాబు, లోకేష్ బయటకు వచ్చి ఎందుకు మాట్లాడటం లేదు?.ఇద్దరు మహిళా అధికారులతో మాట్లాడించారు. డీఎస్సీ అక్రమాల నేపథ్యంలో లోకేష్ రాజీనామా చేయాలి. ఏపీలో అమ్మకానికి టీచర్ పోస్టులు అన్నట్టుగా పరిస్థితి మారింది. ఆమాటకొస్తే రాష్ట్రాన్నే అమ్మకానికి పెట్టారు. టీచర్ పోస్టుల అమ్మకం వెనుక కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ నారా లోకేషే.కుంభకోణం చిన్నది కాదు, చేయించింది చిన్నవారు కాదు. మొదట డీఎస్సీలో అక్రమాలు జరగలేదన్నారు.ఇప్పుడేమో అక్కడక్కడా తప్పులు జరిగాయేమో అంటున్నారు. మా దృష్టికి వస్తే విచారణ జరుపుతామని చెప్తున్నారు.ఈ తప్పులు చేసిందీ, చేయించింది చిన్న వ్యక్తులు కాదు. దీనంతటి వెనుక ఉన్నది నారా లోకేషేనని తేలిపోయింది. డీఎస్సీ అక్రమాలు జరిగినందునే సాక్షితోపాటు మిగతా మీడియా సంస్థలు వార్తల్ని ప్రసారం చేస్తున్నాయి. అక్రమాలపై విచారణ జరపమనే మేమూ కోరుతున్నాం. అయితే లోకేష్కు వ్యతిరేకంగా విచారణ జరుగుతుందని ఎలా నమ్మాలి?.స్కాం జరిగినప్పుడు ఎవరు చేశారు? ఎలా చేశారో బయటకు తీయాలి. ఏదైనా తప్పులను చూపిస్తే దాన్ని కప్పి పుచ్చే ప్రయత్నం చేస్తున్నారు.మీడియా విచారణ చేస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. సోషల్ మీడియాను సెన్సార్ షిప్ చేయటం దుర్మార్గం. ఏపీలో అప్రకటిత ఎమర్జన్సీ అమలవుతోంది.స్పోర్ట్స్ కోటాలో అధికభాగం టీచర్ పోస్టులను అమ్మేసుకున్నారు.బంగారు పతకం సాధించిన దుర్గయ్యకు పోస్టు ఎందుకు రాలేదు?. నవీన్ అనే టాపర్ పేరు లిస్టులో పెట్టి, తర్వాత ఎందుకు తీసేశారు?. దీనిపై నవీన్ హైకోర్టుకు వెళ్లడంతో అక్రమాల డొంక కదిలింది. నవీన్ ఇష్యూపై అసెంబ్లీలో చంద్రబాబు, లోకేష్ వేర్వేరు ప్రకటనలు చేశారు.డీఎస్సీ ప్రశ్నాపత్రం తయారీలో నవీన్ పాల్గొన్నాడు.పేపర్ లీక్ అయింది. ప్రశ్నలను అమ్ముకున్నారు.120 ప్రశ్నలను రూ.3 లక్షల చొప్పున అమ్ముకున్నారు. అనేక అంశాలపై ఆధారాలు ఉన్నాయి. క్రీడా సంఘాల నుండి ఫేక్ సర్టిఫికేట్ తెచ్చి టీచర్ పోస్టులు అమ్మేసుకున్నారు. ఫేక్ టీచర్లు విద్యార్థులకు ఏం చదువులు చెప్తారు?.అర్హులకు అన్యాయం చేస్తే వారి జీవితాలు ఏం కావాలి?.డీఎస్సీలో అక్రమాలు చేసిన వారు జైల్లో ఉండాలి. బాధ్యత కలిగిన మంత్రి లోకేష్ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. వాస్తవాలు మాట్లాడకుండా నోరు పారేసుకుంటున్నారు. సవాల్ చేసే లోకేష్ శాసనమండలికి వచ్చి ఎందుకు సమాధానం చెప్పలేదు?. జూడో సర్టిఫికేట్లను ఫోర్జరీ చేసిన నలుగురికి ఉద్యోగాలు ఇచ్చారు.వారు ఇచ్చిన సర్టిఫికేట్లు ఫోర్జరీ అని తెలిసినా వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?. టెట్ క్వాలిఫై కాకపోయినా ఉద్యోగాలు ఎలా ఇచ్చారు?. దొంగల ముఠాలాగా వ్యవహరిస్తున్నారు.రేపు విచారణ జరిగితే అధికారులు కూడా తప్పించుకోలేరు. తప్పు జరిగినా బరితెగించి మాట్లాడుతున్నారు.మేము బయట పెట్టిన కేస్ స్టడీస్కు మంత్రి నారా లోకేష్ సమాధానం చెప్పాలి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఇతర రాష్ట్రాల్లో తప్పులు చేసిన వారు జైలు పాలయ్యారు. హర్యానాలో అప్పటి సీఎం, ఆయన కుమారుడు జైలు పాలయ్యారు. చంద్రబాబు, లోకేష్ డీఎస్సీ పారదర్శకంగా జరిగిందని చెప్తున్నారు.మరి తప్పులు జరిగాయని అధికారులు ఎలా చెప్పారు?. చంద్రబాబు తన కొడుకును కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. డీఎస్సీ అక్రమాలపై ఎవరి దగ్గరైనా సమాచారం ఉంటే మాకు అందించవచ్చు. లోకేష్ రాజీనామా చేయాల్సిందే సీబీఐతో విచారణ జరపాల్సిందే.కేంద్రంలో కూడా వారి ప్రభుత్వమే ఉన్నప్పుడు లోకేష్, చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు?’అని ప్రశ్నించారు.👉ఇదీ చదవండి : టోరీ జరగలేదు... సర్టిఫికెట్ వచ్చింది! -
డీఎస్సీలో అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం అంగీకారం!
సాక్షి,అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం డీఎస్సీ ద్వారా చేపట్టిన ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలకు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో బయటపడుతున్న అక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో డీఎస్సీలో అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం అంగీకరించింది జూడో సర్టిఫికెట్లపై విజిలెన్స్ విచారణ చేపడుతున్నట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్ - SAAP) ప్రకటించింది.ఈ వివాదంపై శాప్ వైస్ చైర్మన్ భరణి స్పందిస్తూ కీలక విషయాలు వెల్లడించారు. ‘స్పోర్ట్స్ సర్టిఫికెట్ల పూర్తి స్థాయి పరిశీలన మా పరిధిలో సాధ్యం కాదు. స్పోర్ట్స్ అసోసియేషన్లు జారీ చేసే సర్టిఫికెట్లను మేము ప్రాథమికంగా ఒరిజినల్గానే భావిస్తాము’ అని స్పష్టం చేశారు. అయినప్పటికీ, అక్రమాల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో చర్యలు వేగవంతం చేశామని తెలిపారు. కర్నూలుకు చెందిన ఉపాధ్యాయుడు ప్రభాకర్పై వస్తున్న ఆరోపణలపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని చెప్పారు. మరోవైపు, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ అన్సారియా ఆదేశాల మేరకు ముగ్గురు సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నామని, ఆ నివేదిక రాగానే తగిన నిర్ణయం తీసుకుంటామని శాప్ వైస్ చైర్మన్ భరణి వెల్లడించారు. -
చినుకు జాడలేదు.. కాడి కదల్లేదు అన్నదాతకు ఆపద
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చినుకు జాడలేక వ్యవసాయ క్షేత్రాల్లో కాడి కదలడం లేదు. తీవ్రమైన కరువు ప్రభావానికి చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం తోడవడంతో రైతులు ఖరీఫ్పై ఆశలు వదులుకుంటున్నారు. పనుల్లేక వ్యవసాయ కూలీలు బలైపోతున్నారు. సీజన్ చివరి దశకు చేరుకున్న తరుణంలోనూ వరుణుడు కరుణించకపోవడంతో ఖరీఫ్ ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. పచ్చని పైరుతో కళకళలాడాల్సిన పొలాలు చినుకు జాడలేక నెర్రలు తీస్తున్నాయి. సాగైన పంటలు సైతం ఆరు తడుల్లేక నిలువునా ఎండిపోతున్నాయి. అప్పులు చేసి ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు పెట్టిన పెట్టుబడులు కళ్లెదుటే ఆవిరైపోతుండటంతో రైతన్నలు గుండెలవిసేలా రోదిస్తున్నారు. పరిస్థితి ఇంత దయనీయంగా ఉన్నా ప్రభుత్వంలో చలనం లేదు. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక లేదు. కరువు మండలాల ప్రకటన లేదు. ప్రత్యేక కరువు ప్యాకేజీ ఊసు కూడా లేకపోవడంతో రైతులు, కూలీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఏపీలోనే లోటు తీవ్రం జాతీయ స్థాయిలో 14 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా.. ఏపీలో మాత్రం రికార్డు స్థాయిలో 54.73 శాతంగా నమోదైంది. దేశంలో మరే ఇతర రాష్ట్రాల్లోనూ లేనివిధంగా ఏపీలో 28 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. 11 జిల్లాల్లో 50–59 శాతం మధ్య, 10 జిల్లాల్లో 40–49 శాతం మధ్య, ఐదు జిల్లాల్లో 60 శాతం లోటు వర్షపాతం నమోదుకాగా.. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 30–39 శాతం మధ్య లోటు వర్షపాతం నమోదైంది. రిజర్వాయర్లు అడుగంటడంతో రైతులు కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయాయి. భూమిలో తేమ శాతం మచ్చుకైనా కనిపించడం లేదు. సాగు దయనీయం జాతీయ స్థాయిలో 102.38 శాతం విస్తీర్ణంలో పంటలు సాగవుతుండగా.. తెలంగాణలో 91.84 శాతం విస్తీర్ణంలో ఖరీఫ్ పంటలు వేశారు. ఏపీలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 77.10 లక్షల ఎకరాలు కాగా.. ఈ ఏడాది కనీసం 80 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. కానీ సీజన్ ప్రారంభమై దాదాపు 100 రోజులు దాటినా సాధారణ విస్తీర్ణంలో 69 శాతం విస్తీర్ణంలో కూడా వరి సాగు చేయని పరిస్థితి నెలకొంది. పప్పుధాన్యాలు 82 శాతం, పత్తి 79 శాతం, మొక్కజొన్న 65 శాతం, వేరుశనగ కనిష్టంగా 37 శాతం విస్తీర్ణంలో మాత్రమే సాగైంది. మరో 3 వారాల్లో ఖరీఫ్ సీజన్ పూర్తి కానుంది. అయినా ఈసారి 75 శాతం కూడా దాటే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాల్లో ఇదీ పరిస్థితి ఖరీఫ్లో ఇప్పటివరకు 52.84 లక్షల ఎకరాల్లో పంటలు వేయగా.. కేవలం నాలుగు జిల్లాల్లోనే 20 లక్షల ఎకరాల్లో సాగైంది. అనకాపల్లి, ప్రకాశం, అన్నమయ్య, పోలవరం, మార్కాపురం, చిత్తూరు జిల్లాల్లో సాధారణ విస్తీర్ణంలో 30 శాతానికి మించి పంటలు సాగవలేదు. ఆ తర్వాత విశాఖలో 35, వైఎస్సార్ కడపలో 38, పల్నాడులో 44, బాపట్లలో 47 శాతానికి మించి సాగవని పరిస్థితి. అత్యధికంగా కర్నూలులో 8.13 లక్షల ఎకరాలు, అనంతపురంలో 5.41 లక్షల ఎకరాలు, నంద్యాలలో 3.8 లక్షల ఎకరాలు, శ్రీసత్యసాయి జిల్లాలో 2.57 లక్షల ఎకరాల్లో సాగు జరిగింది. ఇవన్నీ వర్షాధారంగా సాగు చేసిన మెట్ట పంటలే. ఈ 4 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఇప్పటికే దాదాపు 50–60 శాతం విస్తీర్ణంలో పంటలు ఎండిపోయాయి. దాదాపు రూ.2వే ల కోట్లకు పైగా పెట్టుబడులు ఆవిరైపోయినట్టు అంచనా. మరోవైపు కృష్టా, గోదావరి డెల్టాల్లోనూ పరిస్థితి దారుణంగానే ఉంది. -
కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పరేడ్ వాయిదా
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, అమరావతి బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ పూర్తి చేసుకున్న వేల మంది కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ను చంద్రబాబు సర్కారు చివరి నిమిషంలో హఠాత్తుగా వాయిదా వేయడంపై పలు అనుమానాలు ముసురుకుంటున్నాయి. శిక్షణ ముగిసిన కానిస్టేబుళ్లకు ఈనెల 7వ తేదీన పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించనున్నట్లు తొలుత డీజీపీ మెమో కూడా జారీ చేశారు. అయితే ఆకస్మికంగా దీన్ని వాయిదా వేస్తూ తాజాగా నిర్ణయం తీసుకోవడం వెనుక మతలబు ఏమిటనే చర్చ సర్వత్రా జరుగుతోంది. దీనికోసం సన్నద్ధమైన అభ్యర్థులు, వారి తల్లితండ్రులు ప్రభుత్వం తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. గత ప్రభుత్వంలోనే నోటిఫికేషన్.. ఫిజికల్ టెస్టులురాష్ట్రవ్యాప్తంగా 6,100 కానిస్టేబుళ్ల రిక్రూట్మెంట్ కోసం 2022 నవంబర్ 28న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అప్పట్లోనే అభ్యర్థులందరికీ ఫిజికల్ టెస్టులు, పరుగు పందెం పకడ్బందీగా నిర్వహించారు. ఈ క్రమంలో నిరుద్యోగ జేఏసీ పేరుతో ఎస్.హేమంత్కుమార్ కోర్టులో కేసు వేయడంతో రాతపరీక్ష నిలిచిపోయింది. అనంతరం టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి రాగా 2025 జూన్ 1న రాత పరీక్ష నిర్వహించారు. అర్హత సాధించిన వారికి రాష్ట్రవ్యాప్తంగా పీటీసీ, డీటీసీలు ఉన్న 21 ప్రాంతాల్లో 9 నెలల పాటు శిక్షణ కూడా పూరై్తంది. 5,757 మందికి శిక్షణ పూర్తి కాగా పాసింగ్ అవుట్ పెరేడ్ నిర్వహించేందుకు డీజీపీ మెమో కూడా ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సీనియర్ ఐపీఎస్లను ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తూ మెమోలో వారి పేర్లు కూడా పేర్కొన్నారు.క్రెడిట్ చోరీ కోసం పరేడ్ రద్దు..!గత ప్రభుత్వంలోనే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వెలువడి రాత పరీక్ష మినహా కీలక దశలు పూర్తయిన కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియలోనూ క్రెడిట్ చోరీకి చంద్రబాబు సర్కారు తాపత్రయపడుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులందరినీ గతంలో మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్కు రప్పించి సీఎం చంద్రబాబు హడావుడి చేశారు. తాజాగా ఎక్కడికక్కడ పీవోపీ (పాసింగ్ అవుట్ పరేడ్) నిర్వహించేందుకు డీజీపీ ఉత్తర్వులు జారీ చేయడంతో 21 సెంటర్లలో ఏర్పాట్లు జరిగాయి. అయితే పీవోపీని వాయిదా వేస్తూ ఈ నెల 4న చంద్రబాబు సర్కారు ఆకస్మికంగా నిర్ణయం తీసుకుంది. మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారో ప్రకటించలేదు. అభ్యర్థులందరినీ మరోసారి మంగళగిరికి పిలిపించి ముఖ్యమంత్రి సమక్షంలో పాసింగ్ అవుట్ పెరేడ్ నిర్వహించాలనే యోచనతో వాయిదా వేసినట్లు పోలీసు అధికారులు చర్చించుకుంటున్నారు. ముఖ్యమంత్రి సూచనలతో హోంమంత్రి అనిత ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.మండిపడుతున్న అభ్యర్థులు, తల్లిదండ్రులు..నేడు జరగాల్సిన పరేడ్ ఆకస్మికంగా రద్దుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కానిస్టేబుళ్లుగా ఎంపికైన వారిలో ఎక్కువ మంది పేద వర్గాలకు చెందిన వారే ఉన్నారు. తమ పిల్లలు ప్రభుత్వ ఉద్యోగం సాధించడం, ఖాకీ దుస్తులు ధరించటాన్ని కళ్లారా చూడాలని ఆరాటంతో ఎంతోమంది టిక్కెట్లు బుక్ చేసుకుని హోటళ్లు రిజర్వేషన్ కూడా చేసుకున్నారు. దీనికోసం ఇతర కార్యక్రమాలన్నీ వాయిదా వేసుకున్నారు. ఈ తరుణంలో హఠాత్తుగా పీవోపీ వాయిదా వేయడంతో హతాశులయ్యారు. ‘నోటిఫికేషన్ ఇచ్చింది గత ప్రభుత్వం.. ఇప్పటికే ఒకసారి అందరం సీఎం కోసం మంగళగిరి వచ్చాం. మళ్లీ ఈ పబ్లిసిటీ పిచ్చి ఏమిటి?’ అని పోస్టులు పెడుతూ మండిపడుతున్నారు.కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో యువగళం కోటా?అకస్మాత్తుగా పాసింగ్ అవుట్ పరేడ్ వాయిదా వేయడంపై అటు పోలీసు వర్గాలతోపాటు ఇటు టీడీపీ ప్రజాప్రతినిధుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మెగా డీఎస్సీ తరహాలోనే ఇందులో కూడా అర్హత లేనివారికి యువగళం కోటా కింద అవకాశం కల్పించారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీనికి నిదర్శనంగా పలు అంశాలను ఉదహరిస్తున్నారు. మచ్చుకు అందులో కొన్ని ఇలా ఉన్నాయి..⇒ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి 2022లో జారీ అయిన నోటిఫికేషన్ను చంద్రబాబు ప్రభుత్వం రాగానే రివైజ్ చేసింది. స్పోర్ట్స్ కోటాలో 20 క్రీడలు మాత్రమే ఉంటే అదనంగా మరో 47 ఆటలను చేర్చి మొత్తం 67 గేమ్స్లో పాల్గొన్నవారికి రాతపరీక్ష లేకుండా నేరుగా రిక్రూట్ చేసేలా నిర్ణయం తీసుకుంది.⇒ స్పోర్ట్స్ కోటాలో 3 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చంద్రబాబు సర్కారు జీవో జారీ చేసింది. కేటగిరీ ఏ, బీ, సీ పేరుతో అర్హతలను మూడు విభాగాలుగా విభజించింది. కేటగిరీ – ఏలో అంతర్జాతీయ స్థాయిలో గెలిచిన లేదా పాల్గొన్నవారు, కేటగిరీలో–బీలో జాతీయస్థాయిలో ఆడిన వారు, జాతీయస్థాయిలో యూనివర్శిటీ పరిధిలో, స్కూలు గేమ్స్లో గెలుపొందిన, పాల్గొన్నవారిని చేర్చింది. కేటగిరీ– సీలో జోనల్స్థాయిలో యూనివర్శిటీ టోర్నమెంట్లో గెలుపొందిన లేదా పాల్గొన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.⇒ మొత్తం 6,100 కానిస్టేబుల్ పోస్టులకుగానూ 3 శాతం అంటే 183 ఉద్యోగాలను స్పోర్ట్స్ కోటాలో చంద్రబాబు సర్కారు భర్తీ చేసింది.⇒ గేమ్స్ కోటాను ఏకంగా 67 క్రీడలకు పెంచడం... యూనివర్శిటీ స్థాయిలో పాల్గొన్నవారు కూడా అర్హత సాధించటాన్ని చూస్తుంటే, యువగళం టీమ్ కోసం ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించారా? మెగా డీఎస్సీలో ఎలాంటి కుంభకోణం జరిగిందో అచ్చం అదే తంతు పోలీసు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లోనూ చోటు చేసుకుందా? అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. -
కొత్తవి ఇద్దామా.. వద్దా! బాబు పెన్షన్.. అర్హుల్లో టెన్షన్
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, పేదల సంక్షేమం పూర్తిగా విస్మరించిందనే విమర్శలు వెల్లువెత్తుతుండటంతో దరఖాస్తుకు అవకాశం ఇచ్చామని చెప్పుకునేందుకు సరికొత్త డ్రామాకు తెరలేపింది. దరఖాస్తులు స్వీకరిస్తున్నామంటూనే కొర్రీలు వేస్తోంది. కేవలం వారం రోజులే గడువు ఇవ్వడం ఇందుకు నిదర్శనమని అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అర్హులు కనీసం కొత్త పింఛన్ల మంజూరుకు దరఖాస్తు కూడా చేసుకునే వీలు లేకుండా ఆన్లైన్ పోర్టల్ను మూసివేసి నిర్దాక్షిణ్యంగా వ్యవహరించింది. రెండేళ్లుగా మానవత్వం అనేది మరిచిపోయి పింఛన్లను ఎడాపెడా ఏరివేసిన బాబు సర్కారుపై తీవ్ర విమర్శలు, ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతుండటంతో ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో తూతూమంత్రంగా ప్రక్రియను ముగించేందుకు సిద్ధమైంది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ నెల 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు కేవలం ఏడు పని దినాల్లో మాత్రమే కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ, ఆన్లైన్ నమోదు, ఈ కేవైసీ ప్రక్రియకు అనుమతిస్తూ ప్రభుత్వం ఆదివారం మెమో జారీ చేసింది. అయితే దరఖాస్తు చేసుకున్న వారికి పింఛన్లు మంజూరు చేస్తే.. ఎప్పటి నుంచి డబ్బులు పంపిణీ చేస్తారనే విషయాన్ని అందులో స్పష్టంగా ప్రస్తావించకపోవడం గమనార్హం. ప్రభుత్వానికి నిధుల లభ్యత, బడ్జెట్ విడుదలను బట్టి కొత్త పింఛన్ల మంజూరు, డబ్బుల విడుదల ఆధారపడి ఉంటుందని మెలిక పెట్టింది. దరఖాస్తు తేదీ నుంచి గానీ అర్హత పొందిన తేదీ నుంచి గానీ పింఛన్ డబ్బుల చెల్లింపు ఉండదని స్పష్టం చేసింది. ఇంత హడావుడిగా పింఛన్ల మంజూరు ప్రక్రియ మొదలెట్టడం చూస్తుంటే.. ఇదంతా స్థానిక ఎన్నికల స్టంట్ అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎంపీడీవోలకు అధికారం తొలగింపు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగ తదితర పింఛన్లు మంజూరు అధికారం స్థానిక ఎంపీడీవోలకే ఉండగా.. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల్లో ఎంపీడీవోలకు ఆ అధికారాన్ని తొలగిస్తున్నట్లు పేర్కొంది. ఎంపీడీవోలు కొత్తగా ఎటువంటి పింఛన్లు అయినా సరే మంజూరు చేయకూడదంటూ ప్రభుత్వం ఆ ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. ఎంపీడీవోలు గానీ మున్సిపల్ కమిషనర్లు గానీ కేవలం పింఛనుదారుడి అర్హతను పేర్కొంటూ కేవలం సిఫార్సు మాత్రమే చేయాలంటూ ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఆయా పింఛన్ దరఖాస్తులను రాష్ట్ర స్థాయిలో గ్రామ, వార్డు సచివాలయ శాఖ, ఆర్టీజీఎస్, సెర్ప్ పూర్తి స్థాయిలో పరిశీలించిన అనంతరం తుది ఆమోదం తెలపాలని పేర్కొంది. 6.42 లక్షలకుపైగా తగ్గిన పింఛన్లు... మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా అత్యధికంగా 66,34,742 మంది లబ్ధిదారులకు పింఛన్లు ఇచ్చారు. సాధారణంగా పెన్షన్ల సంఖ్య ఏటా పెరగాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక దీనికి విరుద్ధంగా పింఛన్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఈ ఏడాది సెప్టెంబరులో 1 నుంచి 3 తేదీ మధ్య రాష్ట్రంలో కేవలం 59,91,857 మందికి మాత్రమే పింఛన్ల డబ్బుల పంపిణీ జరిగింది. అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే పింఛన్ల సంఖ్య తాజాగా ఏకంగా 6.42 లక్షలకుపైగా తగ్గిపోవడం గమనార్హం. ఇక లక్ష మందికిపైగా దివ్యాంగులపై బాబు సర్కారు అనర్హత కత్తిని వేలాడదీసింది. మరోవైపు 2019–24 మధ్య వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 29.51 లక్షల కొత్త పింఛన్లు మంజూరు చేసినట్లు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. 50 ఏళ్లకే పింఛన్ల హామీ ఏమైంది? మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన నిబంధనల ప్రకారం 60 ఏళ్ల నిండిన పేదలు వృద్ధాప్య పింఛను పొందేందుకు అర్హులు. రాష్ట్రంలో రెండేళ్లుగా అన్ని అర్హతలున్న లక్షల మంది కొత్త పింఛన్ల మంజూరు కోసం పడిగాపులు కాస్తున్నా చంద్రబాబు సర్కారు మొర ఆలకించలేదు. ఇప్పటి వరకు పింఛన్లు పొందని పేద కుటుంబాల్లో వితంతువులు సైతం కొత్త పింఛన్ల కోసం ఆశగా నిరీక్షిస్తున్నారు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల భయంతో తూతూమంత్రంగా దరఖాస్తుల ప్రక్రియను ముగించేందుకు సన్నద్ధమైంది. హడావుడిగా కేవలం ఏడు పనిదినాలు మాత్రమే దరఖాస్తుల నమోదుకు అవకాశం కల్పించడంపై అధికార వర్గాలోనే చర్చ సాగుతోంది. ఇక గత ఎన్నికల సమయంలో ఎస్సీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే రూ.నాలుగు వేల చొప్పున పింఛన్ ఇస్తామన్న హామీని నెరవేర్చకుండా ఆ వర్గాలను చంద్రబాబు దారుణంగా దగా చేశారు. జగన్ హయాంలో నిరంతరం అవకాశం.. రాష్ట్రంలో అర్హులంతా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త పింఛన్ల కోసం నిరంతరం దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తూ గత ప్రభుత్వం ప్రత్యేకంగా ఆన్లైన్ పోర్టల్ అందుబాటులో తెచ్చింది. ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి తేవడంతోపాటు వలంటీర్లే అర్హుల ఇళ్లకు వెళ్లి దరఖాస్తులు తీసుకుని సచివాలయాల్లో నమోదు చేసేలా చర్యలు తీసుకుంది. చంద్రబాబు అధికారంలోకి రాగానే పింఛన్ల మంజూరుకు కనీసం దరఖాస్తు కూడా చేసుకునే వీలు లేకుండా ఆన్లైన్ పోర్టల్ను పూర్తిగా మూసి వేసింది. -
102 జీవోతో చిక్కు రిజర్వేషన్లకు ముప్పు
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్ 2026–27 విద్యా సంవత్సరం తొలి దశ ప్రభుత్వ కోటా సీట్లను ఇటీవల ఆరోగ్య విశ్వవిద్యాలయం కేటాయించింది. నీట్లో 23,550 ర్యాంక్ సాధించిన ఓ విద్యార్థికి ఆంధ్రా మెడికల్ కాలేజీలో బీసీ–ఏ రిజర్వేషన్ కింద సీటు కేటాయించారు. ఈ విద్యార్థి కంటే ఎక్కువ ర్యాంక్ అంటే 23,789 ర్యాంక్ సాధించిన బీసీ–ఏ వర్గానికి చెందిన మరో విద్యార్థికి ఓపెన్ క్యాటగిరి(ఓసీ)లో మెరిటోరియస్ రిజర్వుడు క్యాండిటేడ్ (ఎంఆర్సీ) కింద సీటు వచ్చింది. 31,325 ర్యాంక్ తెచ్చుకున్న విద్యార్థికి గుంటూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో బీసీ–బీ రిజర్వేషన్ సీటు ఇచ్చారు. అదే కాలేజీలో బీసీ–బీ వర్గానికి చెందిన విద్యార్థి 36,860 ర్యాంక్తో ఎంఆర్సీలో సీటు దక్కించుకున్నారు. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో 30,611 ర్యాంక్ సాధించిన విద్యార్థికి బీసీ–డీ కింద సీటు రాగా, అదే వర్గానికి చెందిన 30,767 ర్యాంక్ విద్యార్థికి ఎంఆర్సీలో సీటు వచ్చింది. జీవో–102తో గందరగోళంనీట్లో టాప్ ర్యాంక్ సాధించిన విద్యార్థులను వారి రిజర్వేషన్లకు పరిమితం చేసి బలహీన వర్గాలకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల వైద్యవిద్య కలను చంద్రబాబు ప్రభుత్వం తెచ్చిన 102 జీవో ఛిద్రం చేసింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీలో ప్రైవేట్పరం చేస్తూ గడిచిన రెండు విద్యా సంవత్సరాల్లో 2,450 ఎంబీబీఎస్ సీట్లను మన విద్యార్థులు కోల్పోయేలా చంద్రబాబు చేశారు. ఇది చాలదన్నట్టుగా కొన్నేళ్లుగా సజావుగా సాగుతున్న ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ ప్రక్రియను జీవో–102 ద్వారా గందరగోళంగా మార్చేశారు. ఫలితంగా మెరిట్ ఆధారంగా ఓపెన్ కేటగిరిలో సీటు దక్కించుకోవాల్సిన బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను రిజర్వేషన్ కోటాకు పరిమితం చేసి, ఆయా వర్గాల్లోని ఇతర విద్యార్థుల అవకాశాలకు ప్రభుత్వమే గండి కొట్టేసింది. హెల్త్ యూనివర్సిటీ ఇటీవల సీట్లు కేటాయించిన జాబితాలను పరిశీలిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు జరిగిన అన్యాయం స్పష్టమవుతోంది.మెరుగైన ర్యాంక్ సాధించినా..ఒకే రిజర్వేషన్లో ఒకే కాలేజీలో సీట్లు పొందిన విద్యార్థుల ర్యాంక్లను పరిశీలిస్తేనే విస్తుపోయే వాస్తవాలు వెల్లడవుతున్నాయి. ఆంధ్రా, రంగరాయ, గుంటూరు, కర్నూలు సహా చాలా వైద్య కళాశాలల్లో ఒకే రిజర్వేషన్కు చెందిన టాప్ ర్యాంకర్లు రిజర్వేషన్కు పరిమితం కాగా.. అంతకంటే ఎక్కువ ర్యాంక్ సాధించిన విద్యార్థులు ఎంఆర్సీలో సీట్లు దక్కించుకున్నారు. ఉత్తమ ర్యాంక్ సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఓపెన్లో కాకుండా వారి రిజర్వేషన్లలోనే సీట్లు కేటాయించడంతో ఆయా రిజర్వేషన్లోని ఇతర విద్యార్థులు తీవ్రంగా నష్టపోయిన దుస్థితి నెలకొంది. దీనికి చంద్రబాబు ప్రభుత్వం తెచ్చిన జీవో 102 ప్రధాన కారణంగా మారింది. గత ప్రభుత్వంలో 151 జీవో ప్రకారం 2025–26 విద్యా సంవత్సరం వరకూ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగింది. అప్పటివరకూ రాష్ట్రంలో టాప్ ర్యాంకర్లు రిజర్వేషన్కు పరిమితమై, మిగిలిన విద్యార్థులకు అన్యాయం జరిగిన ఘటనలు ఏనాడూ చోటుచేసుకోలేదు. జీవో 151 రద్దు చేసి సజావుగా సాగుతున్న కౌన్సెలింగ్ను 102 జీవో ఇవ్వడం ద్వారా బాబు సర్కారే గందరగోళం చేసేసిందని వైద్య విద్యారంగ నిపుణులు విమర్శిస్తున్నారు. రెండు జీవోల మధ్య వ్యత్యాసం ఇలావైద్య విద్యా ప్రవేశాల ప్రక్రియపై హైకోర్టు ఆదేశాల మేరకు వైఎస్ జగన్ హయాంలో నిపుణుల కమిటీ వేశారు. ఆ కమిటీ సిఫార్సుల మేరకు ప్రవేశాల ప్రక్రియలో కొన్ని సంస్కరణలు ప్రవేశపెడుతూ జీవో–151 తెచ్చారు. ఈ జీవో ప్రకారం విద్యార్థులు కౌన్సెలింగ్ ప్రారంభం కావడానికి ముందే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలను ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లుగా ఎంచుకునేవారు. ఈ ఆప్షన్ల ఆధారంగా ఆర్డర్ ఆఫ్ మెరిట్లో హెల్త్ వర్సిటీ సీట్లు కేటాయించేది. ఇదిలా ఉండగా జీవో–102 తెచ్చిన చంద్రబాబు సర్కార్ విద్యార్థులు అన్ని ఆప్షన్లు పెట్టుకోవాల్సిన పని లేకుండా చేసింది. దీంతో టాప్ స్కోర్ సాధించిన విద్యార్థులు సైతం తమ రిజర్వేషన్లలోనే సీట్లు రావడంతో ఏకంగా 70 మంది రిజర్వేషన్ విద్యార్థులు సీట్లు కోల్పోయిన దౌర్భాగ్యం నెలకొంది. ఇదిలా ఉంటే జీవో 102 ద్వారా ఎవరికి అన్యాయం జరగలేదని హెల్త్ యూనివర్సిటీ బుకాయిస్తోంది. గతేడాది ఓపెన్లో 964 మంది రిజర్వేషన్ విద్యార్థులు సీట్లు దక్కించుకోగా.. ఈ దఫా 1,172 మంది సీట్లు దక్కించుకున్నారని కాబట్టి అంతా సక్రమంగానే నడిచిందని వాదిస్తోంది. వాస్తవాలను పరిశీలిస్తే గతేడాది రాష్ట్రస్థాయిలో నీట్ ర్యాంకర్లలోని తొలి 2 వేల మందిలో 1,069 మంది రిజర్వేషన్, మిగిలిన విద్యార్థులు ఓసీలుగా ఉన్నారు. ఈ ఏడాది తొలి 2వేల మందిలో రిజర్వేషన్ విద్యార్థుల సంఖ్య 1,153కు పెరగ్గా, ఓసీ విద్యార్థుల సంఖ్య 847కు పడిపోయింది. ఈ లెక్కన గతేడాదితో ఆటోమేటిక్గా ఓపెన్ కేటగిరిలో సీట్లు పొందే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. కానీ.. 102 జీవోతో ఎవరూ నష్టపోలేదని ప్రభుత్వం వాదిస్తుండటం గమనార్హం. -
ఫీడ్ ధరల మోత.. ఆక్వా క్రాప్ హాలిడే బాట!
సాక్షి, అమరావతి: ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) చట్టానికి తూట్లు పొడుస్తూ ఫీడ్ కంపెనీలు ఇష్టానుసారంగా మేత ధరలు పెంచుతున్నా పట్టించుకోని చంద్రబాబు సర్కార్ తీరును నిరసిస్తూ ఆక్వా రైతులు మరోసారి ఆందోళనబాట పట్టారు. ధరల పెంపును వెనక్కి తీసుకునే వరకు దశల వారీగా పోరాటాలు చేయాలని ఆక్వా రైతు సంఘాలు తీర్మానించాయి. సోమవారం విజయవాడలోని మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడికి ఏపీ రొయ్య రైతు సంఘాల సమాఖ్య పిలుపునిచ్చింది. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన ఆక్వా రైతులు పెద్ద సంఖ్యలో ఈ ఆందోళనలో పాల్గొనేందుకు సమాయత్తమవుతున్నారు. డిమాండ్లు పరిష్కరించకపోతే సాగు సమ్మె (క్రాప్ హాలిడే) చేపడతామని హెచ్చరిస్తున్నారు.రొయ్యల ఫీడ్ ధర భారీగా పెంపుఫిబ్రవరిలో రొయ్యల మేత ధర టన్నుకు రూ.4 వేలు చొప్పున పెంచిన ఫీడ్ కంపెనీలు జూన్లో రూ.10 వేల నుంచి రూ.12 వేల మేర పెంచాయి. తాజాగా మరోసారి రూ.9 వేల నుంచి రూ.12 వేల వరకు ధరలు పెంచేశాయి. సగటున టన్నుకు రూ.26వేల ధర పెరిగింది. ఫలితంగా కిలో వెనామీ రొయ్యల ఉత్పత్తికి రూ.300, టైగర్ రొయ్యల ఉత్పత్తికి రూ.450 వరకు ఖర్చవుతోంది. రొయ్య ధరలు మాత్రం పెంచకపోగా కౌంట్ ధరల మధ్య వ్యత్యాసాన్ని తగ్గిస్తూ రైతులను అడ్డగోలుగా దోచుకుంటున్నారు. దీంతో ఫీడ్ ధరలను తరచూ పెంచే విధానాన్ని నిలిపివేయాలని ఏపీ రొయ్య రైతుల సమాఖ్య డిమాండ్ చేస్తోంది. కనీసం ఏడాది పాటు ఒకేధర కొనసాగేలా చూడాలని కోరుతోంది. ఏటా నవంబర్ లేదా డిసెంబర్లో ధరల సమీక్ష చేపట్టాలని, రైతుల అంగీకారం లేకుండా ధరలు పెంచకూడదని డిమాండ్ చేస్తోంది. నాణ్యమైన సీడ్ సరఫరా చేయని హేచరీలు, లైసెన్సులు లేకుండా నిర్వహిస్తున్న హేచరీలపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రాసెసింగ్ ప్లాంట్ల వద్ద రొయ్యల కొనుగోలు ధరల మార్పులు, ధరల స్థిరీకరణకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఎన్ఎఫ్డీబీ వంటి సంస్థల సహకారంతో ఆక్వా రైతులకు సబ్సిడీలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రైతుల సమస్యలపై తక్షణమే స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా 6నెలల పాటు క్రాప్ హాలిడే ప్రకటిస్తామని ఏపీ రొయ్య రైతుల సమాఖ్య కన్వీనర్ దుగ్గినేనిగోపీనాథ్ స్పష్టం చేశారు. -
‘క్లిక్’ చేస్తే.. ఖాతా ఖాళీ
సాక్షి, అమరావతి: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యూపీఐ) దేశ ఆర్థిక ముఖచిత్రాన్నే మార్చేసింది. రోడ్డు పక్కన దుకాణం నుంచి షాపింగ్ మాల్స్ వరకు చెల్లింపుల విషయంలో సామాన్యుడి జీవితాన్ని సులభతరం చేసింది. ఇది ఎంత వేగంగా విస్తరించిందో.. మోసాల తీవ్రత కూడా అంతే ప్రమాదకర స్థాయికి చేరింది. సైబర్ నేరస్తులు యూపీఐని ఉపయోగించుకొని సామాన్యుల కష్టార్జితాలను దోచేస్తున్నారు. పార్లమెంట్కు కేంద్ర ఆర్థిక శాఖ సమర్పించిన నివేదికలు, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్(ఐ4సీ) గణాంకాల ప్రకారం.. దేశంలో నమోదవుతున్న మొత్తం సైబర్ నేరాల్లో ఏకంగా 85 శాతం ఆర్థిక మోసాలే. ముఖ్యంగా దేశంలో యూపీఐ మోసాల సంఖ్య గత రెండేళ్లలో 80 శాతానికి పైగా పెరిగింది. ఆరు నెలల వ్యవధిలోనే 6.32 లక్షల యూపీఐ సంబంధిత ఫిర్యాదులు రాగా.. దాదాపు రూ.485 కోట్ల మేర ప్రజల సొమ్ము మాయమైంది. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ డేటా ప్రకారం, 2021లో కేవలం రూ.551 కోట్లుగా ఉన్న ఆన్లైన్ ఆర్థిక నష్టాలు.. ఏటా రెట్టింపవుతూ రూ.22 వేల కోట్లకు పైగా ఎగబాకింది. దేశంలో ప్రతి ఐదుగురు యూపీఐ వినియోగదారుల్లో ఒకరు సైబర్ ఉచ్చులో పడుతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.కేటుగాళ్ల సరికొత్త ఎత్తుగడలు» గతంలో మాదిరిగా కేవలం ఓటీపీ అడగడం వరకే సైబర్ నేరగాళ్లు పరిమితం కావడం లేదు. ఏఐ సాంకేతికతతో సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. డబ్బులు జమ అవుతాయని నమ్మించి ‘రిక్వెస్ట్ మనీ’ లింక్ పంపడం.. పిన్ ఎంటర్ చేయించి ఖాతా ఖాళీ చేస్తున్నారు. » గూగుల్ సెర్చ్లో బ్యాంకు, యూపీఐ యాప్ల పేర్లతో నకిలీ కస్టమర్ కేర్ నంబర్లు పెడుతున్నారు. రిమోట్ యాక్సెస్ యాప్లు ఇన్స్టాల్ చేయిస్తున్నారు. తర్వాత వినియోగదారులకు మాయమాటలు చెప్పి.. వారి సొమ్ము కాజేస్తున్నారు.» అలాగే సీబీఐ, పోలీసుల పేర్లతో భయభ్రాంతులకు గురిచేసి డిజిటల్ అరెస్ట్ లేదంటే స్టాక్ మార్కెట్లలో భారీ లాభాల పేరిట తప్పుడు ఖాతాల్లోకి నిధులు మళ్లిస్తున్నారు.బాధితులు ఏం చేయాలి» మోసానికి గురైన వెంటనే మొదటి గంట అత్యంత కీలకం. ఆ సమయంలో ఫిర్యాదు చేయగలిగితే కొంత వరకూ ప్రయోజనం ఉండవచ్చు.» మోసం జరిగిన వెంటనే జాతీయ హెల్ప్లైన్ నంబర్ 1930కి కాల్ చేయాలి లేదా సైబర్క్రైమ్.జీవోవీ.ఇన్లో ఫిర్యాదు నమోదు చేయాలి. దీనివల్ల బాధితుడి ఖాతా నుంచి వెళ్లిపోయిన సొమ్ము వేరే ఖాతాల్లోకి చేరకుండా ‘ఫ్రీజ్’ చేసే అవకాశం ఉంటుంది.» సంబంధిత బ్యాంకుకు తక్షణమే సమాచారం ఇచ్చి యూపీఐ సేవలు, ఏటీఎం కార్డులను బ్లాక్ చేయించాలి.» ఆర్బీఐ పోర్టల్ (ఛిఝట.టbజీ.ౌటజ.జీn) ద్వారా బ్యాంకింగ్ అంబుడ్స్మన్ను ఆశ్రయించవచ్చు.ఇవి అస్సలు చేయకండి» మీ ఖాతాలోకి డబ్బులు జమ కావడానికి యూపీఐ పిన్ నమోదు చేయాల్సిన అవసరం లేదు. బ్యాంకు అధికారులు, కస్టమర్ కేర్ ప్రతినిధులమని చెప్పినా యూపీఐ పిన్, ఓటీపీ, పాస్వర్డ్లను ఎవరితోనూ పంచుకోకండి.» క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు లేదా మొబైల్ నంబర్ ద్వారా పంపేటప్పుడు స్క్రీన్పై కనిపించే లబ్ధిదారుడి అసలు పేరును ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి.» స్క్రీన్ షేరింగ్ లేదా రీఫండ్ ప్రాసెస్ పేరిట గుర్తుతెలియని వ్యక్తులు చెప్పే థీమ్ వ్యూవర్, ఎనీ డెస్క్ వంటి యాప్లను ఇన్స్టాల్ చేయకండి.» లాటరీలు, క్యాష్బ్యాక్, విద్యుత్ బిల్లు బకాయిల పేరుతో వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్లలో వచ్చే లింకులను నొక్కి పేమెంట్లు చేయకండి.» కస్టమర్ కేర్ నంబర్ల కోసం సెర్చ్ ఇంజిన్లపై ఆధారపడొద్దు. అధికారిక యాప్ లేదా బ్యాంకు పాస్బుక్లోని నంబర్లనే వాడండి. -
కొలువుల పేరిట దళారుల వల
యలమంచిలి రూరల్ (అనకాపల్లి జిల్లా): ఉమ్మడి విశాఖ జిల్లాలో నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు అందినకాడికి దండుకుంటున్నారు. స్వచ్ఛంద సంస్థలు, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎస్డీసీ)పేరుతో గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, రూ.25 వేలకు పైగా వేతనం వస్తుందని నమ్మించి వారివద్ద నుంచి రూ.లక్షల్లో వసూళ్లు చేసుకుంటున్నారు. ఒక్కో పోస్టుకు రూ.3.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మోసానికి ఏకంగా పీఎంశ్రీ లోగో, ఎన్ఎస్డీసీ లెటర్ హెడ్లను ఉపయోగించడంతో పాటు ఉమ్మడి జిల్లాలో గురుకుల పాఠశాలలను ఉపయోగించుకుంటున్నారు. నకిలీ నియామక పత్రాలతో వస్తున్న నిరుద్యోగులను తమ గురుకులాల్లో పని చేసేందుకు ప్రిన్సిపాళ్లు కూడా అనుమతిస్తుండడం కేటుగాళ్లకు మరింతగా కలిసి వస్తోంది. కొక్కిరాపల్లి గురుకులంలో వెలుగులోకి.. కొక్కిరాపల్లి డాక్టర్ అంబేడ్కర్ బాలికల గురుకులంలో ఇటీవల నకిలీ నియామక పత్రంతో ఓ యువతి ఆరోగ్య సహాయకురాలిగా విధుల్లో చేరారు. ఐదు రోజులుగా ఆమె గురుకుల పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. మరో ఇద్దరు యువతులకు డిజిటల్ అసిస్టెంట్లుగా నకిలీ నియామకపత్రాలు ఇచ్చారు. వీరు తమకు గురుకులంలో విధుల్లో చేరినట్టు జాయినింగ్ రిపోర్టు ఇవ్వాలని అడగడంతో కొక్కిరాపల్లి గురుకులం ప్రిన్సిపాల్ అందుకు నో చెప్పారు. తాము ఎలాంటి ధ్రువీకరణ ఇవ్వబోమని స్పష్టం చేయడంతో నియామకాలపై అనుమానం బలపడింది. ఇదే తరహాలో తాళ్లపాలెం బాలికల గురుకుల పాఠశాలలో కూడా ఇద్దరు యువతులను విధుల్లోకి అనుమతించినట్టు సమాచారం. ఉమ్మడి జిల్లాలో మిగతా గురుకులాల్లో కూడా పోస్టులు ఉన్నాయని నకిలీ ముఠా నిరుద్యోగులకు వల వేస్తున్నట్టు తెలుస్తోంది. ఎస్ఎస్ఏ, ఎన్ఎస్డీసీ పేరుతో.. సర్వశిక్ష అభియాన్, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మీ స్కూళ్లకు ఉచితంగా సిబ్బందిని అందిస్తామని, నియమించిన వారికి తామే వేతనాలు చెల్లిస్తామని ఓ ముఠా కొద్దిరోజుల క్రితం ఉమ్మడి జిల్లాలో గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లను నమ్మించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో తమ సంస్థ ఒప్పందం కుదుర్చుకుందని ప్రిన్సిపాళ్లకు చెప్పారు. హెల్త్, డిజిటల్ అసిస్టెంట్ల పోస్టులతో పాటు మరికొన్ని పోస్టుల్లో నియామకాలు చేపడతామని చెప్పారు. ఈ పోస్టులను సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో నియమిస్తున్నట్టు నమ్మబలుకుతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈ వ్యవహారానికి కొందరు వ్యక్తులను నియమించుకున్న ముఠా అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేటు కళాశాల నిర్వాహకుడి ద్వారా పెద్దమొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. ఆ కళాశాల నిర్వాహకుడు జిల్లాలో ప్రైవేటు కళాశాలల యజమానులకు గురుకులాల్లో సర్వ శిక్ష అభియాన్ పోస్టుల భర్తీ చేస్తున్నట్టు చెబుతున్నాడు. అతని మాటలు నమ్మిన కొందరు తమకు తెలిసిన పూర్వ విద్యార్థులకు ఈ పోస్టుల విషయం చెబుతున్నారు. వెంటనే పోస్టుల కోసం బయోడేటా పంపించమంటున్న కేటుగాళ్లు.. ఆ వెంటనే ఆయా గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్ల చిరునామాతో ముద్రించిన ఆరు పేజీల నియామక పత్రాన్ని ఈ–మెయిల్, వాట్సాప్కు పంపించి సంబంధిత గురుకులానికి వెళ్లి విధుల్లో చేరాలని సూచిస్తున్నారు. నకిలీ నియామక పత్రాలతో వెళ్తున్న వారిని గురుకులాల ప్రిన్సిపాళ్లు వారిని అనుమతించడంతో.. మరికొందరు పోస్టుల కోసం ఆశపడి కేటుగాళ్లకు డబ్బు సమర్పించుకుంటున్నారు. -
టోర్నీ జరగలేదు.. సర్టిఫికెట్ వచ్చింది!
ఖమ్మం స్పోర్ట్స్: ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం డీఎస్సీ ద్వారా చేపట్టిన ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలకు సంబంధించి రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో బయటపడుతున్న అక్రమాలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. ఈక్రమంలోనే తెలంగాణలోని ఖమ్మం జిల్లా కేంద్రంలో జరగని టోర్నీకి సర్టిఫికెట్ సృష్టించి.. దాని ఆధారంగా ప్రకాశం జిల్లాలో ఓ మహిళ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. 2013లో రాష్ట్ర స్థాయి జూడో పోటీలు ఖమ్మం జిల్లా కేంద్రంలో 2013 అక్టోబర్ 19నుంచి 21వరకు జూనియర్ కేటగిరీలో బాలబాలికల రాష్ట్రస్థాయి జూడో పోటీలు జరిగాయి. కానీ ఇక్కడ సీనియర్ కేటగిరీలో పోటీలు జరిగినట్లు.. అందులో పాల్గొన్న మహిళ ద్వితీయస్థానం దక్కించుకున్నట్లు సర్టిఫికెట్ పుట్టుకొచ్చింది. ఈ సర్టిఫికెట్ ఆధారంగా సదరు మహిళ ఏపీ డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా ద్వారా ఎస్జీటీ ఉద్యోగం సాధించినట్లు తెలిసింది. పోటీలు నిర్వహించిన అసోసియేషన్ బాధ్యుల సంతకాలతో కూడిన సర్టిఫికెట్ సృష్టించినట్లు తెలియడంతో... ఆమెపై చర్యలు తీసుకునేందుకు జిల్లా జూడో అసోసియేషన్ సిద్ధమవుతోంది. అసలు జరగని టోర్నీకి సర్టిఫికెట్ ఎవరు ఇచ్చారనే అంశంపై అసోసియేషన్ పరంగా విచారణ చేపట్టనున్నట్లు అసోసియేషన్ బాధ్యులు తెలిపారు. సదరు మహిళ సంబం«దీకులే ప్రెస్లో సర్టిఫికెట్ ముద్రించారా.. లేక అసోసియేషన్కు చెందిన ఎవరైనా ఇచ్చారా అన్నది తేలాల్సి ఉంది. పరిశీలన ఏదీ? స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాలు పొందాలంటే క్రీడాకారులు రాణించిన స్థాయిని పరిగణనలోకి తీసుకుంటారు. అయితే, ఉద్యోగాలు ఇచ్చే సమయంలో అసోసియేషన్ బాధ్యులు, అధికారుల సంతకాలు సరిగ్గా ఉన్నాయా లేదా అని పరిశీలించాలి. ఇందుకోసం నియామక బాధ్యులు.. సదరు సర్టిఫికెట్లను క్రీడా సంఘం, జిల్లా స్పోర్ట్స్ అథారిటీలకు పంపించాలి. ఆతర్వాత వారు సర్టిఫికెట్ను పరిశీలించి పోటీల నిర్వహణ తేదీ, ఇతర అంశాలన్నీ సరిపోల్చుకున్నాక నిర్ధారిస్తారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో సర్టిఫికెట్ల పరిశీలన నిబంధనలు అమల్లో ఉన్నా ఏపీలో అలా జరగకపోవడం గమనార్హం. ఆ సర్టిఫికెట్తో సంబంధం లేదు ఆంధ్రప్రదేశ్ డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగం సాధించిన మహిళకు మా అసోసియేషన్ నుంచి సర్టిఫికెట్ జారీ చేయలేదు. 2013లో ఖమ్మంలో కేవలం జూనియర్ కేటగిరీలోనే పోటీలు జరిగాయి. అలాంటప్పుడు సీనియర్ కేటగిరీలో పోటీలు జరిగినట్లు సర్టిఫికెట్ ఎలా వచ్చిందో తేల్చాలి. సర్టిఫికెట్ల అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరైన నిబంధనలు పాటించకపోవడం వల్లే ఇలా జరిగి ఉంటుంది. అక్కడి అధికారులు సదరు క్రీడా సంఘానికి లేదా జిల్లా స్పోర్ట్స్ అథారిటీకి సర్టిఫికెట్లు పంపిస్తే అసలువా, నకిలీవా తేల్చేవాళ్లం. అలాంటివేవీ చేయకుండా నేరం మాపై మోపడం సరికాదు. ఆంధ్రప్రదేశ్లో చాలామంది నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సాధించినట్లు తెలుస్తోంది. – కైలాష్ యాదవ్, జూడో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి -
59 యూఎల్బీల్లో 8 నుంచి రిజర్వేషన్ల ప్రక్రియ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల (యూఎల్బీ) సాధారణ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియ ఈనెల 8 నుంచి చేపట్టనున్నట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేశ్కుమార్ తెలిపారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పక్కాగా చేస్తున్నామని ఆయనన్నారు. నూతన నిబంధనల ప్రకారం కార్పొరేషన్లలో మేయర్ను.. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో చైర్పర్సన్లను ప్రజలే నేరుగా ఎన్నుకుంటారని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లలో ఒక డిప్యూటీ మేయర్, నగర పంచాయతీల్లో ఒక వైస్ చైర్పర్సన్ మాత్రమే ఉంటారన్నారు. డిప్యూటీ మేయర్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు పరోక్ష పద్ధతిలోనే జరుగుతాయని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్ల కోసం ఓటర్ల గుర్తింపు ప్రక్రియను 59 పట్టణ స్థానిక సంస్థల్లో చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్తోపాటు 58 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఇందులో ఉన్నాయి. వారం రోజుల్లో ఓటరు జాబితాలు.. ఇక 41 పట్టణ స్థానిక సంస్థల్లో ఓటర్ల జాబితాలను వారం రోజుల్లో ప్రచురించనున్నట్లు సురేశ్కుమార్ తెలిపారు. అనంతరం రిజర్వేషన్లు, ఇతర ఎన్నికల ప్రక్రియను చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. యాక్ట్–5కు సంబంధించి హైకోర్టులో పెండింగ్లో ఉన్న 23 యూఎల్బీల్లో మాత్రం కోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత డీలిమిటేషన్, ఓటర్ల జాబితాలు, తదుపరి ఎన్నికల ప్రక్రియ చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్ల ప్రక్రియ, ఇతర చట్టబద్ధమైన కార్యక్రమాలను రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ పూర్తిచేస్తున్నామన్నారు. -
ఉద్యమం తాత్కాలికంగా వాయిదా
సాక్షి, అమరావతి : ఎటువంటి ఒత్తిళ్లకు, ప్రలోభాలకు తలొగ్గకుండా చిత్తశుద్ధితో ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగుల పోరాట ఫలితంగా ప్రభుత్వం నుంచి కొన్ని సానుకూల నిర్ణయాలు వెలువడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీపై గౌరవంతో ఉద్యమ కార్యాచరణను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. విజయవాడ రెవెన్యూ భవన్లో బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఆదివారం ఏపీ జేఏసీ అమరావతి, రాష్ట్ర మహిళా విభాగం ఉమ్మడి రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఉద్యోగ సంఘాలతో సెపె్టంబర్ 5న ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశంలో ప్రకటించిన నిర్ణయాలు, తదుపరి ఉద్యమ కార్యాచరణపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఉద్యోగులు అత్యంతగా ఎదురు చూస్తున్న మధ్యంతర భృతి (ఐఆర్), రూ.వేల కోట్ల బకాయిల చెల్లింపుపై స్పష్టత లేకపోవడంపై ఏపీ జేఏసీ అమరావతికి చెందిన కొన్ని జిల్లాల నాయకత్వాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఐఆర్ విషయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నేపథ్యంలో నిర్దిష్ట సమయం వేచి చూడాలని నిర్ణయించారు. ఐఆర్ సాధ్యమైనంత త్వరగా ప్రకటించి అమలు చేయాలని, బకాయిల చెల్లింపునకు రోడ్ మ్యాప్ ప్రకటించి పే స్లిప్లో చూపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఇంక్రిమెంట్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై కూడా త్వరితగతిన ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని ఈ సమావేశంలో తీర్మానించారు. ఇప్పటికే ఆలస్యమైన పీఆర్సీ ప్రక్రియను వేగవంతం చేసి, ఆరు నెలల్లో నివేదిక సమర్పించేలా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మిగిలిన 30 ప్రధాన డిమాండ్లను గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ త్వరితగతిన చర్చించి, ఒక్కో అంశానికి స్పష్టమైన పరిష్కారం చూపాలని ఏపీ జేఏసీ నేతలు కోరారు. ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయాలు పూర్తిగా అమలయ్యే వరకు, మిగిలిన డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు ఎప్పటికప్పుడు సమీక్షించాలని నిర్ణయించారు. భవిష్యత్లో ఉద్యోగుల హక్కులు, ప్రయోజనాలకు భంగం కలిగితే ఉద్యమ కార్యాచరణను కొనసాగించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. సెపె్టంబర్ 8న అన్ని జిల్లాల్లో విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో పలిశెట్టి దామోదరరావు, టీవీ ఫణి పేర్రాజు, తిమ్మసర్తి నాగేశ్వరరావు, పి.లక్ష్మీ, పొన్నూరు విజయలక్ష్మి తదితరులతో పాటు అన్ని జిల్లాల జేఏసీ నాయకులు పాల్గొన్నారు. హామీలు అమలు కాకపోతే ఉద్యమమే..ఏపీ జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ స్పష్టీకరణ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించినప్పటికీ, ప్రధాన డిమాండ్లపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదని ఏపీ జేఏసీ చైర్మన్ ఎ.విద్యాసాగర్ అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాకపోయినా, డిమాండ్ల పరిష్కారంలో జాప్యం జరిగినా.. మళ్లీ ఉద్యమాలకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. విజయవాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పీఆర్సీ కమిషన్ నియామకంతోపాటు ఐఆర్ ప్రకటించాలని కోరామని, తగిన సమయంలో పరిశీలిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు. ఐఆర్తోపాటు ఇతర పెండింగ్ డిమాండ్లు ఎప్పుడు పరిష్కారమవుతాయనే దానిపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. హెల్త్ కార్డుల సమస్యల పరిష్కారం, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం, పదవీ విరమణ వయస్సు పెంపు వంటి అంశాలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలకు సంబంధించి ఉత్తర్వులు వెలువడటం, డిమాండ్లు అమలు కావడమే తమ తదుపరి లక్ష్యమని స్పష్టం చేశారు. హామీలు అమలు కాకపోతే ఉద్యమ కార్యాచరణ చేపట్టడంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకునేందుకు సెపె్టంబర్ మూడో వారంలో ఏపీ జేఏసీ రాష్ట్ర సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఏపీ జేఏసీ సెక్రటరీ జనరల్ కెఎస్ఎస్ ప్రసాద్, పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
‘అక్రమాలపై ప్రశ్నిస్తే చంద్రబాబుకు ఎందుకంత భయం?’
సాక్షి, తాడేపల్లి: అక్రమాలను ప్రశ్నిస్తుంటే చంద్రబాబు సర్కార్కు భయం పట్టుకుందని.. అందుకే ప్రశ్నించే గొంతులను నులుముతున్నారంటూ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో అనధికార సెన్సార్ షిప్ దుర్మార్గం అన్నారు. సోషల్ మీడియా ఖాతాలను లేపేస్తున్నారు. గతంలో వైఎస్సార్సీపీ ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్లను తొలగించారు. సాక్షి టీవీ, బిగ్ టీవీ ఖాతాలను కూడా లేపేశారు. ప్రశ్నించే గొంతులను చూసి చంద్రబాబుకు ఎందుకంత భయం?’’ అంటూ శివశంకర్ ప్రశ్నించారు.డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తే నేరమా?. అందులో అబద్దాలు ఉంటే ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కానీ సోషల్ మీడియా, టీవీ ఛానళ్ల ఎక్కౌంట్లపై దాడి ఎందుకు?. తప్పులను కప్పి పుచ్చుకోవటానికే సోషల్ మీడియా ఖాతాలపై దాడి చేస్తున్నారు. ఇదే కొనసాగితే సోషల్ మీడియా వార్ తప్పదు. డీఎస్సీలో అక్రమాలకు మంత్రి లోకేష్ బాధ్యత వహించాలి. పదవికి రాజీనామా చేసి సీబీఐతో విచారణ జరపాలి. సోషల్ మీడియా అకౌంట్లపై దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నాం. న్యాయ పోరాటం చేసి మళ్ళీ ఆ అక్కౌంట్లను సాధిస్తాం’’ అని శివశంకర్ అన్నారు. -
ఏపీలో కదులుతున్న డీఎస్సీ అక్రమాల డొంక
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో డీఎస్సీ అక్రమాల డొంక కదులుతోంది. టెట్ అర్హత లేకుండా టీచర్ ఉద్యోగాలు.. డీఎస్సీ కుంభకోణం బద్దలవుతోంది. వరుస అవకతవకలు వెలుగులోకి వస్తున్నాయి. విశాఖలో ఒకే కుటుంబంలో ఇద్దరికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టెట్ అర్హత లేకుండానే ఉద్యోగాలు ఇచ్చినట్టు తేలింది.టెట్ పాస్ కాకుండానే టీచర్ ఉద్యోగం పొందిన చిల్లా యోగీశ్వరరావు.. అతని చెల్లి మోహిని దేవికి కూడా స్పోర్ట్స్ కోటాలో టీచర్ పోస్ట్ వచ్చింది. టెట్ సెర్టిఫికెట్ పెట్టకపోయినా యోగీశ్వరరావుకి ఎస్జీటీ ఉద్యోగం ఇచ్చేశారు. టెట్ అర్హత రావాలంటే 75 మార్కులు రావాలి.. మూడుసార్లు టెట్ రాసినా 75 మార్కులు రాలేదు. అయినా చంద్రబాబు సర్కార్ ఉద్యోగం ఇచ్చేసింది.వెలుగులోకి మరో టీచర్ వ్యవహారం..స్పోర్ట్స్ కోటాలో మరో టీచర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. టెట్ అర్హత లేకుండానే ఓ మహిళకు స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉద్యోగం కట్టబెట్టారనే ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. జంపాల ఉషా అనే మహిళకు ఎస్ఏ తెలుగు ఉద్యోగం ఇచ్చినట్లు తేలింది. స్పోర్ట్స్ కోటాలోనే జాబ్ దక్కించుకున్న ఉషా.. తెలుగు టెట్ పాస్ కాలేదు. దరఖాస్తులో ఎస్ ఏ బయాలజీగా ఉషా పేర్కొంది. సెలక్షన్ లిస్ట్లో ఎస్ఏ తెలుగు ఉద్యోగం ప్రభుత్వం ఇచ్చేసింది. సర్టిఫికేట్లలో మ్యాథ్స్, సైన్స్ మాత్రమే టెట్ రాసినట్టు వెల్లడించగా.. ప్రభుత్వ అప్లోడ్ చేసిన సర్టిఫికేట్లలో తెలుగు టెట్ అర్హత కానరాలేదు. ఆమె రాసిన హాల్ టిక్కెట్ నెంబర్తో తెలుగు టెట్ కానరాలేదు.హోళగుంద మండలంలో తెలుగులో అసలు టెట్ రాసినట్టుగా రికార్డ్ అందుబాటులో లేదు. టెట్ రికార్డుల్లో ఎక్కడా ఆమె తెలుగు రాసినట్టు ఆనవాళ్లు దొరకలేదు. ఆమె సర్టిఫికేట్లలో కూడా ఎక్కడా లేని తెలుగు టెట్ అర్హత సర్టిఫికేట్. ఎస్కేయూ యూనివర్సిటీ స్పోర్ట్స్ సర్టిఫికేట్లతో టీచర్ పోస్ట్ ఇచ్చేశారు. హోళగుంద మండలం వందవాగిలి స్కూల్లో తెలుగు టీచర్గా ఉద్యోగం పొందారు. ఈమె టెట్ అర్హతపై విచారణ జరపాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.కాగా, స్పోర్ట్స్ కోటా పేరుతో నచ్చినోళ్లకు నకిలీ సర్టిఫికేట్లు ఇచ్చేసి ఆ సర్టిఫికెట్లతో ఉద్యోగాలిచ్చేసిన కుంభకోణం ఇప్పుడు రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఎక్కడో ఒకచోట నకిలీ సర్టిఫికెట్ బయటపడుతోంది.. మరోచోట వేరొకరి ధ్రువపత్రంతో ఉద్యోగం కొట్టేశారన్న ఫిర్యాదు వస్తోంది.. ఇంకొకచోట గడువు ముగిసిన తర్వాత సర్టిఫికెట్ మార్చుకునే అవకాశం ఎలా వచ్చిందన్న ప్రశ్న తలెత్తుతోంది.మరొక వ్యవహారంలో గుర్తింపు లేని క్రీడా సంఘం ధ్రువపత్రాలతోనే కొలువులు దక్కాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకే నియామక ప్రక్రియలో ఒక్కొక్కరికి ఒక్కో నిబంధన వర్తించినట్లుగా కనిపిస్తుండటమే ఇప్పుడు అసలు అనుమానాలకు తావిస్తోంది. మెరిట్లో ముందున్నవారికి అన్యాయం జరిగిందన్న ఆరోపణల నుంచి.. అనుమానాస్పద సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వ్యవహారాల వరకు.. ఒక్కొక్కటిగా బయటకొస్తున్న ఉదంతాలు మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఎంపిక ప్రక్రియలో జరిగిన అక్రమాలను బయటపెడుతున్నాయి. ఇదీ చదవండి: ఆట దగా.. ‘కోటా’ దగా! -
ధరల మోత.. నేరాల వాత
సాక్షి, అమరావతి: బంగారం ధర గుండె దడ పుట్టిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో తులం బంగారం(10 గ్రాములు) ధర రూ.లక్షన్నర పైమాటే. ఈ క్రమంలో చైన్ స్నాచింగ్స్, దొంగతనాలూ అంతకంతకూ పెరుగుతున్నాయి. తులం బంగారం చోరీ చేస్తే చాలు.. క్షణాల్లో రూ.లక్షన్నరకు పైగా సొమ్ము చేతికి వస్తుందనే దురాశతో దుండగులు రెచ్చిపోతున్నారు. గతేడాది ఏపీలో 13,176 చోరీలు జరగ్గా.. ఈ ఏడాది వాటి సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా. ఒంటరిగా వెళ్లే మహిళలపై ద్విచక్ర వాహనాలపై వచ్చి దాడిచేసి చైన్ స్నాచింగ్లకు పాల్పడటం, షాపుల్లో కస్టమర్లా చొరబడి మంగళసూత్రం లాక్కొని పారిపోవడం, బస్సు, రైలు ప్రయాణాల్లో బ్యాగుల నుంచి ఆభరణాలు కొట్టేయడం, బురఖా ధరించి జ్యువెలరీ షాపుల్లో దృష్టి మరల్చి బంగారు వస్తువులు అపహరించడం, పూజ, మంత్రాల పేరిట ఇంట్లోకి చొరబడి నిజమైన నగల స్థానంలో నకిలీవి పెట్టడం, బ్యాంకు గోల్డ్ లోన్ ఖాతాల్లో అంతర్గత మోసాలకు పాల్పడుతున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాలతోపాటు చిన్నస్థాయి పట్టణాలు, గ్రామాల్లోనూ చైన్ స్నాచింగ్స్, ఇళ్లలో దొంగతనాలు విజృంభిస్తున్నాయి. దీంతో ‘బంగారం’ విషయంలో బీకేర్ఫుల్గా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. మహిళలే టార్గెట్.. బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరడంతో కేటుగాళ్ల దృష్టి నేరుగా మహిళల ఆభరణాలపై పడింది. ఉదయం వాకింగ్కు వెళ్లే మహిళలు, కాలనీల్లో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లేవారు, ఇంటి ముందు ముగ్గులు వేస్తున్నవారు, కిరాణా షాపులకు వెళ్లేవారే టార్గెట్గా చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. నంబర్ ప్లేట్లు లేకుండా దోచుకున్న బైక్లపై వచ్చి చోరీలకు పాల్పడుతున్నారు. ఇటీవల రైళ్లలో రిజర్వేషన్ బోగీల్లోనూ రెక్కీ నిర్వహిస్తున్న దొంగలు.. అప్పటి వరకు వేచి చూసి కదులుతున్న రైలు కిటికీలు, డోర్ దగ్గర నుంచి మహిళల మెడలో ఆభరణాలు తెంచుకుపోతున్నారు. రైళ్లలో ఈ తరహా చోరీలు ఇటీవల విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి ప్రధాన స్టేషన్లలో పెరిగాయి. బంగారం చోరీల్లో అంతర్రాష్ట్ర ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఇటీవల ప్రకాశం జిల్లాలో పట్టుబడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా నుంచి రూ.1.70కోట్ల విలువైన బంగారాన్ని పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ఆ ముఠా 13 చోరీలకు పాల్పడినట్టు లెక్కతేలింది. బిహార్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి వచ్చి తెలుగు రాష్ట్రాల్లో చోరీలకు తెగబడుతున్నారు. ప్రాణాలు తీసేస్తున్నారు.. ఇటీవల హైదరాబాద్లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ(62)ను హత్య చేసిన నేపాల్ ముఠా 225 గ్రాముల బంగారం, నగదు దోచుకుపోయిన ఘటన సంచలనం రేపింది. శ్రీకాకుళం జిల్లాలో 70 ఏళ్ల వృద్ధురాలు ఒక వేడుకకు బంగారం ధరించి వెళ్లి తర్వాత శవమై దొరికింది. బంగారం ధర పెరిగిన కొద్దీ, చోరీలకు పాల్పడుతున్న ముఠాల ఆగడాలు ప్రాణాలు తీసేవరకు వెళ్తున్నాయి. అప్రమత్తత అతి ముఖ్యం.. » బస్సులు, రైళ్లలో ప్రయాణిస్తున్న మహిళలు మెడలో బంగారు ఆభరణాలతోపాటు హ్యాండ్బ్యాగ్, ట్రాలీ బ్యాగ్లను తెరిచేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణంలో నిద్రపోయినా, బ్యాగ్ వదిలేసినా, అదే దొంగలకు అవకాశం. మన బ్యాగ్ కళ్లెదుటే ఉండేలా చూసుకోవాలి. » ఉదయం నడక, వివాహాలు, ఆలయాలకు నగలు ధరించి వెళ్లేటప్పుడు కేటుగాళ్లపై ఓ కన్నేసి ఉంచాల్సిందే. » ఇంట్లో నగలు ఉంచుకోకుండా లాకర్లో భద్రపరుచుకోవడం మేలు. పూజ, పేరంటం, శుభకార్యం పేరుతో ఎవరికీ బంగారం ఇవ్వకపోవడం మంచిది. -
ఇంగ్గిష్ వస్తే.. డబుల్ ఓకే.!
సాక్షి, అమరావతి: ఇంగ్లిష్.. కేవలం ఒక భాష కాదు. ఉన్నత విద్య, ఉద్యోగం, సాంకేతిక పరిజ్ఞానం, వ్యాపారం, ప్రపంచ మార్కెట్తో అనుసంధానానికి అదొక కీలక నైపుణ్యంగా మారింది. ముఖ్యంగా ఐటీ, ఐటీఈఎస్, హెల్త్కేర్, ఫైనాన్స్, హాస్పిటాలిటీ, రిటైల్, మీడియా వంటి రంగాల్లో ఇంగ్లిష్ లో మాట్లాడటం, రాయటం, చదవటం, అర్థం చేసుకోవటం తెలిసిన వారికి అవకాశాలు పెరుగుతున్నాయని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఇంగ్లిష్ నేర్చుకోవడం అంటే మాతృభాషను వదిలేయడం కాదు. అయితే భవిష్యత్తు ఉద్యోగ ప్రపంచంలో డొమైన్ నాలెడ్జ్, డిజిటల్ స్కిల్స్, సమస్య పరిష్కార సామర్థ్యంతోపాటు ఇంగ్లిష్ కమ్యూనికేషన్ ఉంటే అవకాశాల పరిధి మరింత విస్తరిస్తుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అధ్యయనాలు ఏమి చెబుతున్నాయంటే.. » ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్(ఈటీఎస్) 2026 గ్లోబల్ ఇంగ్లీష్ స్కిల్స్ రిపోర్ట్ ప్రకారం, ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ కారణంగా కార్యాలయాల్లో ఆంగ్ల ప్రావీణ్యం అవసరం పెరుగుతోందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న 81 శాతం మంది హెచ్ఆర్ అధికారులు చెబుతున్నారు. » ఈటీఎస్ విడుదల చేసిన భారత ఉద్యోగ మార్కెట్ విశ్లేషణ ప్రకారం 91 శాతం మంది భారతీయ యజమానులు ఉద్యోగ మార్కెట్లో పోటీ పెరగడంతో ఇంగ్లిష్ ప్రావీణ్యానికి డిమాండ్ పెరుగుతోందని తెలిపారు. అంతర్జాతీయ సహకారం కోసం ఇంగ్లీషు అవసరం పెరుగుతోందని 94 శాతం మంది భారతీయ హెచ్ఆర్లు పేర్కొన్నారు. » బ్రిటీష్ కౌన్సిల్, నేషనల్ స్కిల్స్ డెవలప్మెంట్ ఏజెన్సీకి సంబంధించిన పరిశోధనలో 21 ప్రధాన రంగాలను పరిశీలించగా.. సగానికిపైగా రంగాల్లో ఇంగ్లిష్ ను ముఖ్యమైన అదనపు నైపుణ్యంగా గుర్తించారు. ఐటీ, ఐటీఈఎస్, మీడియా, హాస్పిటాలిటీ, బ్యూటీ అండ్ వెల్నెస్, రిటైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్కేర్ వంటి రంగాల్లో ఇంగ్లిష్ ప్రాధాన్యం ప్రత్యేకంగా కనిపించింది. దాదాపు 47 శాతం భారతీయ గ్రాడ్యుయేట్లు ఇంగ్లిష్ భాష సరిగ్గా మాట్లాడలేకపోవడం కారణంగా పలు రంగాల్లో ఉద్యోగాలకు పూర్తిగా సిద్ధంగా లేరని అధ్యయనం అంచనా వేసింది. -
ఇక ‘కేర్’ కూడా కెరీరే
సాక్షి, అమరావతి: దేశంలో వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని నీతి ఆయోగ్ తన తాజా నివేదికలో పేర్కొంది. 2022లో 14.9 కోట్లు ఉన్న వృద్ధుల సంఖ్య 2031లో 19.4 కోట్లకు చేరుతుందని, 2050 నాటికి ఈ సంఖ్య ఏకంగా 34.7 కోట్లకు పెరుగుతుందని వివరించింది. మొత్తం జనాభాలో 2022లో 10.5 శాతంగా ఉన్న వృద్ధుల సంఖ్య 2050 నాటికి 20.8 శాతానికి చేరుతుందని విశ్లేషించింది. ఈ నేపథ్యంలో కేర్ గివింగ్ (సంరక్షణ) రంగానికి మంచి డిమాండ్ ఉంటుందని అంచనా వేసిన నీతి ఆయోగ్, ఇందుకు సంబంధించి జాతీయ ‘సంరక్షణ’ విధానాన్ని రూపొందించాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించింది. దేశంలో కేర్ ఎకానమీ అభివృద్ధికి నియంత్రణ సంస్థ (నేషనల్ కేర్ గివింగ్ కౌన్సిల్) ఏర్పాటును ప్రతిపాదించింది. 2023లో 2,962 కోట్ల డాలర్లుగా (సుమారు రూ.2.78 లక్షల కోట్లు) ఉన్న భారత సంరక్షణ సేవల మార్కెట్ 2030 నాటికి 7,231 కోట్ల డాలర్లకు (సుమారు రూ.6.80 లక్షల కోట్లు) చేరుకుంటుందని నివేదిక అంచనా వేసింది. వ్యవస్థీకృత సంరక్షణ సేవలకు పెరుగుతున్న డిమాండ్కు ఇది నిదర్శనమని నివేదిక పేర్కొంది. ‘వికసిత్ భారత్ : 2047లో సంరక్షకులకు సాధికారత.. సంరక్షణ రంగానికి కొత్త వ్యూహాలు’ పేరుతో రూపొందించిన నివేదికలో ఈ అంశాలను స్పష్టంచేసింది. నివేదికలోని మరికొన్ని అంశాలు..» వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక సంరక్షణ అవసరమయ్యే ఇతరులకు అందించే సేవల నాణ్యతను మెరుగుపరచడంతో పాటు, సంరక్షణ సేవలను వృత్తిపరంగా తీర్చిదిద్దడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మహిళల కార్మిక భాగస్వామ్యం మెరుగుపడుతుంది. » శిక్షణ పొందిన సంరక్షణ సిబ్బందిని అందించే విశ్వసనీయమైన గ్లోబల్ హబ్గా భారత్ను నిలబెట్టేందుకు ఇది దోహదపడుతుంది. » సంరక్షకులను, సంరక్షణ అవసరమైన వారిని అనుసంధానించడంతో పాటు సేవలకు సులభంగా చేరుకునేలా జాతీయ డిజిటల్ కేర్ గివింగ్ పోర్టల్ను ఏర్పాటు చేయాలి.» సంరక్షకుల పని పరిస్థితులను మెరుగుపరచడంతోపాటు మరింత వ్యవస్థీకృతమైన, నైపుణ్యవంతమైన, సుస్థిరమైన సంరక్షణ ఆర్థిక వ్యవస్థను నిర్మించాలి. ఇందులో భాగంగా సంరక్షకులకు సామాజిక భద్రత, సంక్షేమ ప్రయోజనాలు కల్పించాలి. » దేశంలో 2.68 కోట్ల మంది దివ్యాంగులు ఉన్న నేపథ్యంలో వ్యవస్థీకృత సంరక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.ప్రపంచవ్యాప్తంగానూ డిమాండ్ప్రపంచవ్యాప్తంగా సంరక్షకుల కొరత కారణంగా ఏర్పడుతున్న ఆర్థిక అవకాశాన్ని నీతి ఆయోగ్ నివేదిక ప్రముఖంగా ప్రస్తావించింది. 38 సభ్య దేశాలతో కూడిన ఆర్గనైజేషన్ ఫర్ ఎకనావిుక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ)లో ప్రస్తుత సంరక్షకులు–వృద్ధుల నిష్పత్తిని కొనసాగించాలంటే 2040 నాటికి మరో 60 శాతం మంది కేర్ వర్కర్లు అవసరమవుతారని అంచనా వేసింది. అంటే అదనంగా 1.35 కోట్ల మంది సంరక్షకుల అవసరం ఏర్పడనుందని పేర్కొంది. అలాగే, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అంచనా ప్రకారం 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 1.1 కోట్ల మంది ఆరోగ్య, సంరక్షణ సిబ్బంది కొరత ఏర్పడనుందని, దీంతో శిక్షణ పొందిన కేర్ గివింగ్ నిపుణులను అందించే దేశంగా భారత్ ఎదిగేందుకు అవకాశాలు ఉన్నాయని నివేదిక పేర్కొంది. ప్రపంచ జనాభా వృద్ధి నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 65 సంవత్సరాలపైన వయస్సు గల జనాభా 70.3 కోట్లు ఉండగా, ఈ సంఖ్య 2050 నాటికి 1.5 బిలియన్లకు చేరుకుంటుంది. ఒక్క అమెరికాలో 2030 నాటికి 1,51,000 మంది సంరక్షణ కార్యకర్తల కొరత ఉంటుందని అంచనా. ఇది 2040 నాటికి 355,000కి పెరుగుతుందని భావిస్తున్నారు. కోర్సులు సిద్ధం» నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ మూడు నుంచి నాలుగు నెలలపాటు వృద్ధుల సంరక్షణ ప్రదాతల కోర్సులో శిక్షణ ఇస్తోంది. వృద్ధులకు అవసరమైన పడక వద్ద సంరక్షణ, సహాయం అందించడం వంటి ప్రధాన అంశాలతో ఈ కోర్సును రూపొందించింది. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి, శిక్షణ పొందిన వారిని ఆసుపత్రులు, వృద్ధుల సంరక్షణ యూనిట్లు, వృద్ధాశ్రమాలలో పూర్తికాల ప్రాతిపదికన నియమిస్తారు. ప్రారంభంలో నెలకు సగటున రూ.16,000 నుంచి రూ. 30,000 వరకు జీతం ఉంటుంది. తరువాత రూ.40,000 నుండి రూ.50,000 వరకు పెరుగుతుంది. పార్ట్ టైమ్ ప్రాతిపదికన సంరక్షణ సేవలు అందించేవారు రోజుకు సుమారు రూ.1,200 నుంచి 1,500 వరకు సంపాదిస్తారు.» నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్.. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ సహకారంతో 21–45 సంవత్సరాల వయస్సు గల, బ్యాచిలర్ డిగ్రీ ఉన్న అభ్యర్థులకు ఇంటిగ్రేటెడ్ జెరియాట్రిక్ కేర్లో పీజీ డిప్లొమా కోర్సును అందుబాటులోకి తెచ్చింది. సోషల్ వర్క్, నర్సింగ్ వంటి సంబంధిత రంగాలలో ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి సైద్ధాంతిక జ్ఞానాన్ని, ఆచరణాత్మక నైపుణ్యాలను అందించి, వారిని ఒక మేనేజర్ పాత్రలో వివిధ సంరక్షణ కేంద్రాలలో వృద్ధుల సంక్లిష్ట అవసరాలను తీర్చడానికి సిద్ధం చేస్తుంది. ప్రాథమిక కోర్సు పూర్తి చేసిన తర్వాత శిక్షణార్థులు నెలకు సగటున రూ. 40,000 నుండి రూ. 80,000 వరకు జీతం పొందుతారు. -
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు కొత్త నిబంధనలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు ప్రభుత్వం కొత్త నిబంధనలు జారీచేసింది. మేయర్ ఎన్నికను ప్రత్యక్ష విధానంలో నిర్వహిస్తుండడంతో అందుకు నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. మేయర్, కార్పొరేటర్ల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ‘ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్స్ (కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ మేయర్ అండ్ వార్డు మెంబర్స్) రూల్స్–2026’ను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ శనివారం జీఓఎంఎస్ నంబర్ 211 జారీచేసింది. ఈ కొత్త నిబంధనలు మున్సిపల్ కార్పొరేషన్లకు మాత్రమే వర్తిస్తాయి. ఒక ఓటరు.. రెండు ఓట్లు..» ఒక ఓటరు ఈ ఎన్నికల్లో కార్పొరేటర్ అభ్యర్థికి ఒక ఓటు, మేయర్కు ఒక ఓటు వేయాల్సి ఉంటుంది. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరికీ ఓటు వేయకూడదనుకునే వారికి నోటా అవకాశం కల్పించారు. ూ మేయర్ లేదా కార్పొరేటర్గా పోటీచేసే సాధారణ అభ్యర్థి రూ.5,000 డిపాజిట్ చెల్లించాలి. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రూ.2,500గా నిర్ణయించారు. ఒకే వార్డుకు ఒక అభ్యర్థి నాలుగు నామినేషన్లు దాఖలు చేసినా ఒక డిపాజిట్ సరిపోతుంది. ఒక్కో అభ్యర్థి గరిష్టంగా నాలుగు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. నామినేషన్తో పాటు క్రిమినల్ కేసులు, ఆస్తులు, అప్పులు, విద్యార్హతల వివరాలతో అఫిడవిట్ సమర్పించాలి.» అంధులు, శారీరక వైకల్యం కారణంగా స్వయంగా ఓటు వేయలేని వారికి 18 ఏళ్లు నిండిన సహాయకుడి ద్వారా ఓటువేసే అవకాశం ఉంటుంది. అయితే, ఒకే సహాయకుడు ఒకరి కంటే ఎక్కువమందికి సాయం చేయకూడదు.» పోలింగ్ ఏజెంట్ ఓటరు గుర్తింపును సవాలు చేయవచ్చు. ఇందుకు రూ.10 డిపాజిట్ చేయాలి. ప్రిసైడింగ్ అధికారి విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటారు.» ఎన్నికల విధుల్లో ఉన్న అర్హులైన సిబ్బంది, రాష్ట్రం వెలుపల విధుల్లో ఉన్న సాయుధ దళాల సిబ్బంది, చట్టపరమైన నిర్బంధంలో ఉన్న అర్హులైన ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటువేసే అవకాశం ఉంటుంది.» ఫలితాలు ప్రకటించిన తర్వాత అభ్యర్థి లేదా అతని ఎన్నికల ఏజెంట్ రాతపూర్వకంగా రీకౌంటింగ్ కోరవచ్చు. దానిపై నిర్ణయం తీసుకునే అధికారం రిటర్నింగ్ అధికారికి ఉంటుంది.» ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థికి వచ్చిన చెల్లుబాటు అయ్యే ఓట్లు మొత్తం చెల్లిన ఓట్లలో 1/6 కంటే ఎక్కువ లేకపోతే డిపాజిట్ జప్తు అవుతుంది.» పోలింగ్ పూర్తయిన తర్వాత బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల పత్రాలు, ఓటర్ల జాబితాలను సీలు చేసి సురక్షితంగా భద్రపరుస్తారు. ఎన్నికల పత్రాలను నిర్ణయించిన కాలపరిమితి వరకు భద్రపరిచే విధానాన్ని కూడా ప్రభుత్వం నిర్దేశించింది. -
ఇకపై 28 జిల్లా పరిషత్లు
సాక్షి, అమరావతి: ప్రస్తుతం ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన కొనసాగుతున్న 13 జిల్లా పరిషత్ (జెడ్పీ) లను కొత్త జిల్లాల ప్రాతిపదికన 28 జెడ్పీలుగా పునర్విభజిస్తూ ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. జిల్లా పరిషత్ల ప్రస్తుత పాలక మండళ్ల పదవీకాలం ఈ నెల 24తో ముగుస్తుంది. మరుసటి రోజు 25వ తేదీ నుంచే కొత్త జెడ్పీలు ఏర్పాటవుతాయి. 2022లో రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన మొదలయింది. అప్పటికి జిల్లా పరిషత్ల ఎన్నికలు జరిగి ఏడాది కాలమే కావడంతో సాంకేతిక కారణాలతో అప్పటి ఎన్నికల్లో గెలిచిన పాలకమండళ్ల పదవీ కాలం ముగిసే వరకు ఉమ్మడి జిల్లా పరిషత్లు కొనసాగాయి.నాలుగు మండలాలతోనే విశాఖ జిల్లా పరిషత్రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 660 మండలాలను కొత్త జిల్లాల ప్రాతిపదికన 28 జిల్లా పరిషత్లుగా వర్గీకరించారు. విశాఖపట్నం జిల్లా పరిషత్ మాత్రం కేవలం నాలుగు మండలాలకే పరిమితమైంది. విశాఖ జిల్లాలో నగర ప్రాంతం కాకుండా గ్రామీణ ప్రాంతాలు భీమునిపట్నం, పెందుర్తి, పద్మనాభం, ఆనందపురం మండలాలే ఉంటాయి. ప్రతి జిల్లా ఒక జిల్లా పరిషత్గా ఏర్పాటు చేయాలన్న పంచాయతీరాజ్ శాఖ చట్టం నిబంధనల మేరకు ఆ నాలుగు మండలాలతోనే ప్రత్యేక జిల్లా పరిషత్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కేవలం నాలుగు మండలాల ప్రజలు ఎన్నుకొనే నలుగురు జెడ్పీటీసీ సభ్యులతోనే ఆ జిల్లా పరిషత్ ఉంటుంది. అందులో ఒకరిని జెడ్పీ చైర్మన్గా ఎన్నుకొంటారు. అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లా పరిషత్లలో 11 మండలాలు చొప్పున ఉన్నాయి. అత్యధికంగా వైఎస్సార్ కడప జిల్లా పరిషత్లో 39 మండలాలు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. » ప్రతి జిల్లాలోని మండల ప్రజా పరిషత్లు జిల్లా ప్రజా పరిషత్లో భాగస్వామ్యమై ఉంటాయని ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది. భవిష్యత్తులో ఏదైనా మండల ప్రజా పరిషత్ను పునర్వ్యవస్థీకరించినా, విలీనమైనా లేదా మారినా, దానికి అనుగుణంగా జెడ్పీలో చట్టబద్ధమైన మార్పులు చేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. » కొత్తగా ఏర్పాటయ్యే జెడ్పీలలో కార్యకలాపాల నిర్వహణకు జిల్లాకొకరు చొప్పున మొత్తం 15 జెడ్పీ సీఈవో, 15 డిప్యూటీ సీఈవో అదనపు పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. » జెడ్పీలో ప్రస్తుతం ఉన్న సిబ్బందిని మండల ప్రజా పరిషత్తుల సంఖ్య, ప్రాంతీయ పరిధి, పనిభారం, అవసరాలకు అనుగుణంగా 28 జెడ్పీలకు వర్గీకరించనున్నట్టు ప్రభుత్వం ఆ ఆదేశాల్లో తెలిపింది. -
బాలలే దేశానికి గొప్ప ఆస్తి
సాక్షి, అమరావతి: పేదరికం, సామాజిక నిర్లక్ష్యం, ప్రతికూల పరిస్థితుల కారణంగానే ఎక్కువ మంది చిన్నారులు జువెనైల్ జస్టిస్ వ్యవస్థ పరిధిలోకి వస్తున్నారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ పేర్కొన్నారు. బాలలు దేశానికి అత్యంత విలువైన మానవ వనరు, గొప్ప ఆస్తి అని ఆమె కొనియాడారు. జువెనైల్ జస్టిస్ (బాలల న్యాయ సంరక్షణ, భద్రత) చట్టం–2015 అమల్లోకివచ్చి పదేళ్లయిన సందర్భంగా విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో శనివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి సంప్రదింపుల సమావేశం–2026లో ఆమె ప్రసంగిస్తూ, ‘జువెనైల్ జస్టిస్ బోర్డులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, బాలల సంరక్షణ సొసైటీలు, జిల్లా బాలల సంరక్షణ విభాగాలు, ప్రత్యేక జువెనైల్ పోలీసు యూనిట్లు, బాలల సంరక్షణ సంస్థలను ఏర్పాటు చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు వస్తున్నాయా? అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి. సైబర్ వేధింపులు, నియంత్రణలేని డిజిటల్ కంటెంట్ చిన్నారుల భద్రతకు ముప్పుగా మారుతున్నాయి. ఈ సమస్యలను అధిగవిుంచడానికి తగిన ప్రయత్నం జరగాలి. బాలల సంరక్షణలో పోలీసు, మహిళా–శిశు సంక్షేమ, సాంఘిక సంక్షేమ, విద్యాశాఖలతోపాటు న్యాయవ్యవస్థ, రాష్ట్ర–జిల్లా న్యాయసేవాధికార సంస్థలు, పౌర సమాజ సంస్థలు సమన్వయంతో పనిచేయాలి. స్వల్ప నేరాలకు సంబంధించిన కేసుల్లో బాలలను సాధ్యమైనంత వరకు అధికారిక న్యాయస్థాన ప్రక్రియకు దూరంగా ఉంచాలి’ అని పేర్కొన్నారు. సమావేశంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.సురేష్రెడ్డి, జస్టిస్ బీఎస్ భానుమతి, జస్టిస్ వి.సుజాత, జస్టిస్ డాక్టర్ వెంకటజ్యోతిర్మయి ప్రతాప, జస్టిస్ కిరణ్మయి మండవ, జస్టిస్ రవినాథ్ తిల్హరి, రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి ఎ.సూర్యకుమారి, డైరెక్టర్ ఎం. వేణుగోపాలరెడ్డి, సమగ్రశిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. పోలీస్, మహిళా, శిశు సంక్షేమ, పంచాయతీరాజ్ అధికారులతో పాటు బాలల కోసం పని చేస్తున్న వివిధ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.ఎవరెస్ట్ అధిరోహకులకు సత్కారంఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన 21 మంది విద్యార్థులను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ఈ సందర్భంగా సత్కరించారు. దేశంలోని ఇతర పిల్లలకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. బాలల సంరక్షణ కోసం చేసే ప్రతి ప్రయత్నం దేశ భవిష్యత్పై పెట్టే అత్యంత కీలకమైన పెట్టుబడి అని జస్టిస్ లీసా గిల్ స్పష్టం చేశారు. -
ఉద్యోగులు, పెన్షనర్లకు మరోసారి నిరాశే
సాక్షి, అమరావతి: ఉద్యోగులు, పెన్షనర్లను చంద్రబాబు కూటమి ప్రభుత్వం మరోసారి తీవ్ర నిరాశకు గురిచేసిందని వైఎస్సార్సీపీ ఉద్యోగులు, పెన్షనర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఉద్యోగులు, పెన్షనర్లకు మంచి పీఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. అప్పటికే నియమించిన పీఆర్సీ కమిషనర్ను పంపించేసి, 27 నెలల తర్వాత కొత్త కమిషనర్ను నియమించడం వల్ల ఉద్యోగులకు ఒరిగేదేమిటని ప్రశ్నించారు.మంచి ఫిట్మెంట్తో పీఆర్సీ ఇవ్వాల్సిన ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆక్షేపించారు. పీఆర్సీ అమలుకు ఇంకా సమయం పడుతుందని, ఈలోగా ఉద్యోగులు, పెన్షనర్లు కోరుతున్న 30 శాతం మధ్యంతర భృతి (ఐఆర్)ని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి ఇచ్చిందని గుర్తుచేశారు. అలాగే ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీ మేరకు కనీసం 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.40 వేల కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉందని, వాటిని ఎప్పుడు చెల్లిస్తారో ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాల్సిందేనని అన్నారు. ఒక్క సరెండర్ లీవ్ను.. అదీ సంక్రాంతి సమయంలో ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని, మిగతా సరెండర్ లీవ్ బకాయిలపై ఎందుకు మాట్లాడటంలేదని నిలదీశారు. 70 ఏళ్లు దాటిన పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ పెన్షన్ను 7 శాతం నుంచి 10 శాతానికి, 75 ఏళ్లు దాటిన వారికి 12 శాతం నుంచి 15 శాతానికి పెంచుతామని ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు, పెన్షన్ల నుంచి ప్రతి నెలా వారి వాటాను ప్రభుత్వం మినహాయించుకుంటోందని, దానికి ప్రభుత్వం తన వాటాను కలిపి ఎప్పటికప్పుడు సంబంధిత ఆస్పత్రులకు చెల్లించాల్సి ఉందన్నారు.ప్రభుత్వం ఈ బకాయిలు చెల్లించకపోవడంతో కొన్ని ఆస్పత్రుల్లో ఉద్యోగులు, పెన్షనర్లకు వైద్య సేవలను నిరాకరిస్తున్నారని తెలిపారు. ఈహెచ్ఎస్ను సక్రమంగా అమలు చేసి, ఆస్పత్రుల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యోగులు, పెన్షనర్ల సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. ప్రభుత్వం ఉద్యోగులతో పెట్టుకుంటే ఎన్నికల సమయంలో ఏం జరగుతుందో ఆలోచించుకోవాలని చంద్రశేఖర్రెడ్డి హెచ్చరించారు. -
ఇవేం చర్చలు.. అవేం హామీలు? ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి
సాక్షి, అమరావతి/మంగళగిరి టౌన్: ‘ఇవేం చర్చలు.. అసలు ఐఆర్ చాలా ముఖ్యమైన విషయం కదా.. దాని ప్రస్తావనే లేకుండా చర్చలు ఎలా ఫలప్రదమైనట్లు.. ఇలాగైతే ఎలా? బకాయిల గురించి కూడా స్పష్టమైన హామీ లేదు. ఇప్పుడు ప్రజలకు మనం ఏం చెప్పాలి?’ అని ఉద్యోగులకు చంద్రబాబు తాజాగా ఇచ్చిన హామీలపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఐఆర్ ఇవ్వకపోయినా చర్చలు ఫలప్రదమైనట్లు చెప్పుకోవడాన్ని కొన్ని సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ క్రమంలో చర్చలు ముగిసిన తర్వాత ఉద్యోగ సంఘాల నాయకులు బయటకు వచ్చి మాట్లాడే సమయంలో తోపులాట చోటుచేసుకుంది. ఉద్యోగ సంఘ నాయకుడు సూర్యనారాయణ మైకును వదలకుండా అదే పనిగా మాట్లాడుతుండడంపై ఏపీ జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎంతో మాట్లాడి ప్రకటన చేయించింది తామైతే నీ హడావుడి ఏమిటంటూ పలువురు సూర్యనారాయణను నిలదీశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇరువర్గాల నేతలు పరస్పరం కాలర్లు పట్టుకుని తోసుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.సమావేశంలో చర్చించిన అంశాలు, ప్రభుత్వం ఇచ్చిన హామీలపై వివిధ సంఘాల నేతలు తమ అభిప్రాయాలను మీడియాకు వెల్లడించే క్రమంలో పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలకు వ్యతిరేకంగా ఏపీ ఎన్జీవో సంఘం నేతలు, ఇతర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాల మధ్య మాటా మాటా పెరగడంతో తోపులాట జరిగింది. ప్రభుత్వానికి తలొగ్గారంటూ ఆరోపణలుఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమయ్యారని, వారు ప్రభుత్వానికి తలొగ్గారని కొన్ని ఉద్యోగ సంఘాల నాయకులు ఆరోపించారు. సీఎం చర్చలకు పిలవడం.. చాలా సమస్యలున్నప్పటికీ ఒకటి రెండు సమస్యలనే అరకొరగా పరిష్కరిస్తామని సీఎం హామీ ఇవ్వడం.. ఇందుకు అన్ని సంఘాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం తాజా వివాదానికి కారణమైంది. తమ డిమాండ్ల సాధన విషయంలో ఉద్యోగ సంఘాలన్నీ ఐక్యంగా పోరాడాల్సిన సమయంలో ఒకటి రెండు అరకొర హామీలకే ఒప్పుకోవడంపై ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రధానంగా పెండింగ్ బకాయిలు ఎప్పుడు, ఎలా ఇస్తారన్న దానిపై స్పష్టత రాకపోవడాన్ని ఉద్యోగులు ఎత్తి చూపుతున్నారు.జిల్లా నేతలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఐఆర్పై సీఎం ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పటికే ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్న ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించి ఉంటే బావుండేది. సీఎంతో జరిగిన చర్చలకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఉన్న 21 సంఘాలను ఆహ్వానించాల్సి ఉన్నా, కేవలం 11 సంఘాలను మాత్రమే పిలవడం బాధాకరం. సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే వరకు ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తాం. ఆదివారం మా జేఏసీలోని 28 జిల్లాల నాయకులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చిన హామీలు కూడా మేము చేపట్టిన ఉద్యమం ఫలితంగానే సాధ్యమయ్యాయి. బకాయిలపై స్పష్టత ఇవ్వకపోవడంపైనా అసంతృప్తి ఉంది. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 62 ఏళ్లకు రిటైర్మెంట్ వయస్సు పెంచాలని కోరాం. ఈ విషయాన్ని కూడా పరిశీలించి నివేదిక ఇవ్వాలని సీఎం ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. – బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడుతర్వాత దశలో ఐఆర్ చూస్తామన్నారురెండు డీఏలను అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఇస్తామని సీఎం చెప్పారు. అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నందున ఉద్యోగులు సంయమనం పాటించాలని సీఎం సూచించారు. సీఎం ఉద్యోగులకు ప్రకటించిన అంశాలకు సంబంధించి ఏటా రూ.2,880 కోట్ల అదనపు వ్యయం అవుతుందని చెప్పారు. ఈ రెండేళ్లలో కామన్ ఎంప్లాయీస్కు ఎటువంటి లబ్ధి కలగలేదని చెప్పాం. ప్రకటించిన నిర్ణయాలను సత్వరమే అమలు చేయాలని, మిగిలిన సమస్యలను కూడా దశల వారీగా పరిష్కరించాలని కోరాం. – విద్యాసాగర్, ఏపీ జేఏసీ, ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడుఈ చర్చలు ఎలా సఫలమైనట్లు?ఉద్యోగులకు ఐఆర్ ఇవ్వకపోవడం అన్యాయం. దీని గురించి ప్రకటన చేయకుండా చర్చలు సఫలమైనట్లు చెప్పుకోవడం సరికాదు. అధికారంలోకి రాగానే మంచి పీఆర్సీ ఇస్తామని, ఐఆర్ ప్రకటిస్తామని చెప్పారు. 30 నెలలు గడిచింది. ఏమీ లేదు. గత ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషన్ చైర్మన్ను తొలగించి కాలయాపన చేశారు. సీఎంతో జరిగిన చర్చల్లో ఐఆర్ ప్రకటిస్తారని ఉద్యోగులంతా ఎదురు చూశారు. కేవలం పీఆర్సీ కమిషన్ నియామకం, రెండు డీఎలతో చర్చలు ముగించడం సరికాదు. 30% ఐఆర్ వెంటనే ప్రకటించాలి., నిర్దిష్ట కాలపరిమితితో పీఆర్సీ కమిషన్ ఛైర్మన్ను నియమించాలి. ప్రకటించిన డీఏలకు అరియర్స్పై ప్రకటన చేయాలి. మిగిలిన 3 డీఏలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలి. – జాలిరెడ్డి, షేక్ జంషీద్, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ -
మళ్లీ మోసాల గార'డీయే'
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులను చంద్రబాబు మళ్లీ మోసం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రెండేళ్లు కాలయాపన చేసి వారు ఉవ్వెత్తున ఉద్యమించడంతో ఊరడించేందుకు శనివారం కంటితుడుపుగా చర్చలు జరిపారు. ఆ చర్చల్లో రెండు డీఏలు ఇస్తామని, పీఆర్సీ కమిషన్ను నియమిస్తామని చెప్పి మిగిలిన హామీలు ఇవ్వలేమని చేతులేత్తేశారు. గత ఏడాదీ ఇలాగే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి ఒక డీఏ ఇస్తామని, బకాయిలు విడుదల చేస్తామని ప్రకటించినా వాస్తవంలో దానికి కోతలు పెట్టారు. ఇప్పుడూ కంటితుడుపుగా రెండు డీఏలు ప్రకటించినా అవి విడుదల చేసే వరకూ గ్యారంటీ లేదని ఉద్యోగులు భావిస్తున్నారు. మిగిలిన మూడు డీఏల పరిస్థితి ఏమిటో అంతుబట్టడంలేదు. వైఎస్ జగన్ హయాంలోనే 12వ పీఆర్సీ కమిషన్ నియమించగా చంద్రబాబు అధికారంలోకి రాగానే కమిషనర్ మన్మోహన్సింగ్ను బెదిరించి రాజీనామా చేయించారు. ఆ తర్వాత కొత్త కమిషనర్ను నియమించకుండా రెండేళ్లు పీఆర్సీ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లకుండా ఆపివేశారు. ఇప్పుడు ఉద్యోగులు ఉద్యమించడంతో కమిషనర్ను నియమించడానికి అంగీకరించినా అది ఎప్పటిలోగా నియమిస్తారు? నివేదిక ఇవ్వడానికి ఎంత గడువు ఇస్తారు? 12వ పీఆర్సీ ఎప్పుడు ఇస్తారనే అంశాలపై నోరు మెదపలేదు. ఐఆర్కు ఎగనామం పీఆర్సీ ఆలస్యమైంది కాబట్టి అది వచ్చేలోపు ఉద్యోగులకు ఆర్థికంగా ఊరట కల్పించేందుకు ఇచ్చే మధ్యంతర భృతి (ఐఆర్)ని ఇవ్వలేమని చంద్రబాబు ఈ సమావేశంలో తేల్చేశారు. ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఉద్యోగులు అర్థం చేసుకోవాలని చెప్పి దాన్ని ఇచ్చేది లేదని తేల్చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 27 శాతం ఐఆర్ ఇచ్చి ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. 2024లో చంద్రబాబు రాగానే ఐఆర్ ఇవ్వకపోగా పీఆర్సీ కమిషనర్ను వెళ్లగొట్టి ఇప్పుడు దాన్ని ఇవ్వకుండా తమకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగులకు రావాల్సిన రూ.40 వేల కోట్ల బకాయిలపైనా చంద్రబాబు స్పష్టత ఇవ్వలేదు. కానీ రెండేళ్లలో రూ.30 వేల కోట్ల బకాయిలు ఇచ్చామని చెప్పడంతో ఉద్యోగులు ఆశ్చర్యపోతున్నారు. అంత డబ్బు ఎవరికి ఇచ్చారో తెలియడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఉద్యోగ సంఘాలు ఏ ఉద్యోగికి ఎంత బకాయి ఉంది, ఎంత బకాయి చెల్లించారు? ఇంకా ఎంత బకాయి ఉందో పే స్లిప్లో చూపాలని కోరుతున్నా దాని గురించి పట్టించుకోవడంలేదు. ఆ పని చేయకుండా రూ.30 వేల కోట్ల బకాయిలు ఇచ్చేశామని చెబుతుండడంతో చంద్రబాబు చెప్పేవి అబద్ధాలని ఉద్యోగులు మండిపడుతున్నారు. పోలీసు సరెండర్ లీవ్ బకాయిలపైనా అనుమానమే పోలీసు సిబ్బందికి సంబంధించిన సరెండర్ లీవుల బకాయిలు ఇస్తామని చెప్పినా ఇస్తారో లేదోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాదీ సీఎంతో చర్చలు జరిగినప్పుడూ వాటిని ఇస్తామని చెప్పినా ఇవ్వలేదని ఉద్యోగులు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడూ ఇస్తామంటున్నా ఇచ్చే వరకూ గ్యారంటీ లేదని చెబుతున్నారు. పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్పైనా వారిలో నమ్మకం కలగడంలేదు. ఆర్థిక భారం లేని పెన్షన్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి ముందుకు రాకుండా అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇస్తారంటే ఎలా నమ్ముతామని వారు ప్రశ్నిస్తున్నారు.సీపీఎస్ ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరమే ఇక సీపీఎస్ ఉద్యోగులకు ఇచ్చిన హామీ గురించి ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల్లో స్పష్టత ఇవ్వలేదు. సీపీఎస్పై ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ సీఎంతో చర్చల తర్వాత కూడా హామీగానే మిగిలింది. అత్యవసర అవసరాల కోసం జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) నుంచి నగదు ఉపసంహరణకు వెంటనే అనుమతివ్వాలని కోరగా చంద్రబాబు అంగీకరించారు. కానీ అది అమలయ్యే అవకాశం ఎంతవరకూ ఉందో అర్థం కావడంలేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఆ హమీని కూడా అమలు చేస్తామని గతంలో చెప్పిన బాబు తుంగలో తొక్కారు. ఇప్పుడు మళ్లీ అమలు చేస్తామంటుండడంతో దాన్ని ఉద్యోగులు నమ్మలేకపోతున్నారు. రిటైర్ అయ్యే ఉద్యోగులకు జీపీఎఫ్, జీఎల్ఐ, గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యాష్మెంట్ వంటి ప్రయోజనాలను సకాలంలో చెల్లించాలనే దానిపైనా సీఎం సరైన సమాధానం చెప్పలేదు. ఇక కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలను వర్తింపజేయాలనే అంశం అసలు ప్రస్తావనకే రాలేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు పెట్టిన 30కిపైగా డిమాండ్లలో తూతూమంత్రంగా నాలుగైదు డిమాండ్లకు ఒప్పుకున్నట్లు చెప్పిన చంద్రబాబు మిగిలిన వాటికి ఎగనామం పెట్టారని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అంగీకరించిన వాటినీ ఎంతవరకూ ఇస్తారో, ఎప్పుడు ఇస్తారో కూడా తెలియడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఆట దగా.. ‘కోటా’ దగా!
సాక్షి నెట్వర్క్: మైదానంలో గెలవాలంటే ప్రతిభ ఉండాలి.. డీఎస్సీలో ఉద్యోగం రావాలంటే మెరిట్ ఉండాలి. కానీ చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ నడిపిన మెగా డీఎస్సీ దగా నాటకంలో ఉద్యోగం రావాలంటే నకిలీ సర్టిఫికెట్లు ఉండాలి. స్పోర్ట్స్ కోటా పేరుతో నచ్చినోళ్లకు నకిలీ సర్టిఫికేట్లు ఇచ్చేసి ఆ సర్టిఫికెట్లతో ఉద్యోగాలిచ్చేసిన కుంభకోణం ఇçప్పుడు రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఎక్కడో ఒకచోట నకిలీ సర్టిఫికెట్ బయటపడుతోంది.. మరోచోట వేరొకరి ధ్రువపత్రంతో ఉద్యోగం కొట్టేశారన్న ఫిర్యాదు వస్తోంది.. ఇంకొకచోట గడువు ముగిసిన తర్వాత సర్టిఫికెట్ మార్చుకునే అవకాశం ఎలా వచ్చిందన్న ప్రశ్న తలెత్తుతోంది. మరొక వ్యవహారంలో గుర్తింపు లేని క్రీడా సంఘం ధ్రువపత్రాలతోనే కొలువులు దక్కాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకే నియామక ప్రక్రియలో ఒక్కొక్కరికి ఒక్కో నిబంధన వర్తించినట్లుగా కనిపిస్తుండటమే ఇప్పుడు అసలు అనుమానాలకు తావిస్తోంది. మెరిట్లో ముందున్నవారికి అన్యాయం జరిగిందన్న ఆరోపణల నుంచి.. అనుమానాస్పద సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వ్యవహారాల వరకు.. ఒక్కొక్కటిగా బయటకొస్తున్న ఉదంతాలు మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఎంపిక ప్రక్రియలో జరిగిన అక్రమాలను బైటపెడుతున్నాయి. కేసులు వేరు.. వ్యక్తులు వేరు.. క్రీడలు వేరు. కానీ జరిగింది ఒక్కటే...ఇదో పెద్ద స్కామ్.. స్పోర్ట్స్ కోటా ఎంపిక మొత్తం ఓ పెద్ద కుంభకోణం.. దానిని నిరూపించే కొన్ని ఉదంతాలను చూద్దాం...టాపర్ను బలిచేసి అనర్హురాలికి పోస్టుకోటిపల్లి అనిల్కుమార్ది శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట గ్రామం. మెగా డీఎస్సీలో 2025లో ఎస్సీ గ్రూప్–1 కేటగిరీ కింద స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టుకు ఎగ్జామ్ రాశారు. ఎస్సీ గ్రూప్–1 మెరిట్ లిస్టులో మూడో వ్యక్తి. అనిల్ కంటే ముందు ఉన్న ఇద్దరికీ ఓపెన్లో 13, 14వ ర్యాంకులు రావడంతో ఓపెన్ కేటగిరీలో పోస్టులు సాధించారు. వారి తర్వాత 73 మార్కులతో అనిల్ (168ఓపెన్ ర్యాంకు) ఉన్నారు. అంటే ఎస్సీ గ్రూప్–1 కేటగిరీ కింద అనిల్ టాప్లో ఉన్నారు. ఆ కేటగిరీ పోస్టు ఆయనకే దక్కాలి. కానీ ఎలాంటి మెరిట్ లిస్టు ప్రకటించకుండా విడుదల చేసిన స్పోర్ట్స్ కోటా కింద ఎస్సీ కేటగిరీకి చెందిన నాగరత్నం అనే మహిళను ఎస్సీ గ్రూప్ 1 సోషల్ రిజర్వేషన్ పోస్టులో భర్తీ చేశారు. దానిపై అభ్యంతరాలు స్వీకరించకుండా ఏకపక్షంగా నియమించేశారు. తీరా చూస్తే ఆ మహిళా అభ్యర్థి అనర్హురాలు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో రెగ్యులర్గా పనిచేస్తున్న ఆమె బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సు పూర్తి చేసినట్టు సర్టిఫికెట్ పెట్టారు. బీపీఈడీ అనేది డిస్టెన్స్ మోడ్లో పూర్తి చేయాల్సిన కోర్సు కాదు. రెగ్యులర్గా కాలేజికి వెళ్లి చేయాల్సిన కోర్సు అది. కానీ ఇక్కడ నాగరత్నం సెలవు పెట్టకుండా కోర్సు పూర్తి చేసినట్టు తేలింది. అంటే, అది ఫేక్ సర్టిఫికెట్. అలాగే, డిగ్రీ కూడా ఫేక్ సర్టిఫికెట్ అని గుర్తించారు. దీనిపై అనిల్తో పాటు స్పోర్ట్స్ కోటాలో నాగరత్నం కంటే ముందు ఉన్న బి.ఎర్రయ్య అనే వ్యక్తి కూడా అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు కూడా ఆ సర్టిఫికెట్లు ఫేక్ అని గుర్తించారు. దీంతో ఆమెకు పోస్టు ఇవ్వకుండా హోల్డ్లో పెట్టారు. సమాధానం లేని ప్రశ్నలు డీఎస్సీ అభ్యర్థులు, ప్రతిపక్షాలు అడుగుతున్న ఈ ప్రశ్నలకు జవాబుందా? ⇒ స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన అభ్యర్థుల పూర్తి మెరిట్ జాబితాను ప్రభుత్వం ఎందుకు బహిరంగపరచలేదు? ⇒ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్లో ఎవరు తుది నిర్ణయం తీసుకున్నారు? వారి బాధ్యతను ప్రభుత్వం వెల్లడిస్తుందా? ⇒ ఫేక్/అనుమానాస్పద సర్టిఫికెట్లపై వచ్చిన ఫిర్యాదులన్నింటిపై ఒకే స్థాయి విచారణ జరిగిందా? లేక కేసు కేసుకు వేర్వేరు ప్రమాణాలు పాటించారా? ⇒ అనర్హత నిర్ధారణ అయిన అభ్యర్థులకు ఇప్పటికే ఉద్యోగాలు ఇచ్చి ఉంటే, ఆ నియామకాలను రద్దు చేస్తారా? వారికి చెల్లించిన వేతనాల పరిస్థితి ఏమిటి? ⇒ అక్రమంగా పోస్టు కోల్పోయినట్లు చెబుతున్న మెరిట్ అభ్యర్థులకు న్యాయం చేయడానికి తీసుకుంటున్న చర్యలేమిటి? ⇒ మొత్తం స్పోర్ట్స్ కోటా నియామకాల్లో ఎన్ని సర్టిఫికెట్లను, ఎంతమంది అభ్యర్థులను ప్రత్యేకంగా ఆడిట్ చేశారు? ⇒ గుర్తింపు రద్దయిన లేదా గుర్తింపు లేని స్పోర్ట్స్ సంఘాల సర్టిఫికెట్లను డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ఏ నిబంధన ప్రకారం అంగీకరించారు? ⇒ సాఫ్ట్బాల్ అసోసియేషన్కు గుర్తింపు లేకపోయినా ఆ సంఘం జారీ చేసిన సర్టిఫికెట్ల ఉద్యోగాలు ఎందుకు ఇచ్చారు?సర్టిఫికెట్లు ఎప్పుడైనా మార్చవచ్చా? శ్రీకాకుళం జిల్లాలోనే ఇది మరో వ్యవహారం. స్పోర్ట్స్ కోటాలో పెద్ద అప్పలరాజుకు పీఈటీ ఉద్యోగం వచ్చింది. పోస్టు కోసం దరఖాస్తు చేసిన సమయంలో హయ్యెస్ట్ స్పోర్ట్స్ సర్టిఫికెట్ కింద 37వ నేషనల్ గేమ్స్ 2023 పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయగా, బ్యాకప్ సర్టిఫికెట్గా 4వ యూత్ మెన్ అండ్ ఉమెన్ నేషనల్ బాక్సింగ్ చాంపియన్షిప్ పార్టిసిపేషన్ను అప్లోడ్ చేశారు. ఇక్కడే తేడా జరిగింది. బ్యాకప్ సర్టిఫికెట్గా అప్లోడ్ చేసిన 4వ యూత్ మెన్ అండ్ ఉమెన్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ సర్టిఫికెట్ ఆయనది కాదు. ఆయన సోదరుడు విశ్వేశ్వరరావుది. అంతేకాదు అప్పలరాజు పుట్టిన తేదీ 1998 జూలై 29 కాగా, బ్యాకప్ సర్టిఫికెట్లో విశ్వేశ్వరరావు పుట్టిన తేదీ 2003 జూన్ 12గా ఉంది. అటు సర్టిఫికెట్లు చూసినా, ఇటు పుట్టిన తేదీ చూసినా తేడా ఉందని అధికారులు గుర్తించాలి. అభ్యంతరం పెట్టాలి. ఇదేమీ పరిశీలించకుండా పెద్ద అప్పలరాజుకు ఉద్యోగం ఇచ్చేశారు. వీటిపై ఆరోపణలు వచ్చే సరికి శాప్లో తన సోదరుడు విశ్వేశ్వరరావు సర్టిఫికెట్ తీసేసి బ్యాకప్ సర్టిఫికెట్గా అప్పలరాజుకు చెందిన 6వ ఎలైట్ మెన్స్ నేషనల్ బాక్సింగ్ చాంపియన్షిప్ 2022 పార్టిసిపేషన్ సర్టిఫికెట్ పెట్టారు. అభ్యంతరాలు వచ్చిన కొద్ది రోజుల వ్యవధిలోనే మార్పులు, చేర్పులు జరిగిపోయాయి.మరి గిరిజనుడైన దుర్గయ్యకు ఆ రూల్ వర్తించదా? పెద్ద అప్పలరాజు అర్హుడైనప్పుడు గిరిజనుడైన దుర్గయ్య కూడా అర్హుడే అని చెప్పాలి. ఆర్చరీలో గోల్డ్ మెడలిస్టు అయిన దుర్గయ్యకు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వలేదు. గోల్డ్ మెడల్ సర్టిఫికెట్ పెట్టానని దుర్గయ్య అంటుంటే సిల్వర్ మెడల్ పెట్టారని ప్రభుత్వం చెబుతోంది. ఒక వేళ మిస్సయిందనుకుంటే గోల్డ్ మెడల్ సర్టిఫికెట్ జత పరుస్తానని దుర్గయ్య చెబుతూ వచ్చారు. కానీ పరిగణనలోకి తీసుకోలేదు. దరఖాస్తు గడువు ముగిశాక వెనక్కి వెళ్లి పాత తేదీలతో ధ్రువీకరణ పత్రాలను స్వీకరించడం చట్టబద్ధంగా నిబంధనలకు విరుద్ధమని, సాంకేతికంగా ఆయన దరఖాస్తును పరిశీలించలేమని చెప్పేసింది. ఆన్లైన్లో గోల్డ్ మెడల్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయలేదని దుర్గయ్య దరఖాస్తును పరిశీలించినప్పుడు పెద్ద అప్పలరాజు ఆన్లైన్లో తన తమ్ముడు విశ్వేశ్వరరావు నేషనల్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయడమే కాకుండా, పుట్టిన తేదీల్లో కూడా తేడాలున్నాయి. దానిపై కూడా అభ్యంతరం వ్యక్తం చేయాలి. కానీ అలా చేయలేదు. అప్పలరాజుకు తన తమ్ముడు సర్టిఫికెట్ తీసి, తన సర్టిఫికెట్ పెట్టుకునేందుకు అవకాశం కల్పించారు. అది కూడా జాబ్ వచ్చాక, అభ్యంతరాలు వచ్చిన తర్వాత. దీనివెనకున్న మర్మమేంటో ప్రభుత్వమే చెప్పాలి. సర్టిఫికెట్ అప్లోడ్ విషయంలో పొరపాటు జరిగిందని, వెరిఫికేషన్ సమయంలో ఆ సర్టిఫికెట్ మార్చడం జరిగిందని పెద్ద అప్పలరాజు మీడియా ముందు కూడా అంగీకరించారు. అర్హత లేకపోయినా కూన రవికుమార్ సంతకంతో ఉద్యోగాలు అర్హత లేని సంఘాల ద్వారా కూడా స్పోర్ట్స్ కోటాలో డీఎస్సీ ఉద్యోగాలు ఇచ్చేశారు. ఇందులో నిబంధనలు కూడా పాటించలేదు. దీనికి సాఫ్ట్బాల్ అసోసియేషనే ఉదాహరణ. సాఫ్ట్బాల్ అసోసియేషన్కు ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ గానీ మినిస్ట్రీ ఆఫ్ యూత్ సర్వీసెస్ గుర్తింపుగానీ లేదు. ఇది లేకుండా ఏ సంఘం పనిచేసే అవకాశం లేదు. 2021లో ఇచ్చిన ఫేక్ సర్టిఫికెట్ల కారణంగా సంఘం గుర్తింపు రద్దు అయ్యింది. గతంలో ఒక వ్యక్తి సాఫ్ట్బాల్ నేషనల్స్ అడకుండానే హైకోర్టు ఉద్యోగానికి స్పోర్ట్స్ కోటాలో సెలక్టయ్యాడు. అతడి సర్టిఫికెట్పై అనుమానం వచ్చి విచారణ చేయగా అతను నేషనల్స్ అడినట్లు చెబుతున్న తేదీల్లో ఒక కాలేజీలో పరీక్షలు రాస్తున్నట్లు తేలింది. దీంతో 2025 డిసెంబర్ 15న అసోసియేషన్ గుర్తింపును రద్దు చేస్తున్నట్లు ఒలింపిక్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో సాఫ్ట్బాల్ అసోసియేషన్కు అసలు గుర్తింపే లేకుండా డీఎస్సీ స్పోర్ట్ కోటాలో ఉద్యోగాలు ఎలా ఇచ్చారన్నది ప్రశ్న. జీవో–4 ప్రకారం నోట్ అని ఒక కాలమ్ ఇచ్చారు. అందులో రాష్ట్ర అసోసియేషన్ కార్యదర్శి లేదా ఫెడరేషన్ కార్యదర్శి సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ దీనికి భిన్నంగా ఫెడరేషన్ కార్యదర్శి, అసోసియేషన్ కార్యదర్శితోపాటు అసోసియేషన్ అధ్యక్షుని హోదాలో ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కూడా విచ్చలవిడిగా సర్టిఫికెట్లు ఇచ్చేశారు. అతని సర్టిఫికెట్లను కూడా పరిగణనలోకి తీసుకుని ఉద్యోగాలు ఇచ్చేశారు. ఆఖరికి శ్రీకాకుళం సాఫ్ట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి రమణ భార్య లక్ష్మీదేవికి కూడా ఇదే కోటాలో ఉద్యోగం దక్కింది. శాప్ గుర్తింపు లేదంటూ రెజ్లింగ్ వంటి సంఘాలకు ఉద్యోగాలు నిరాకరించారు. అటువంటిది ఒలింపిక్ అసోసియేషన్ గాని కేంద్రం గుర్తింపు లేని సంఘం నుంచి ఉద్యోగాలివ్వడం వెనుక శాప్ చైర్మన్ రవినాయుడు ఉన్నట్లు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో సంబంధిత అసోసియేషన్ కార్యదర్శి సమక్షంలో ఈ ప్రక్రియ చేయాల్సి ఉండగా దీనికి భిన్నంగా శాప్ ఎండీకి కూడా సంబంధం లేకుండా శాప్ పరిపాలనా అధికారితో దీన్ని పూర్తి చేశారు. వాలీబాల్ అసోసియేషన్కు కూడా గుర్తింపు లేదని సమాచారం. ముఖ్యనేత అండ, భరోసా లేకుండా ఇలా చేయడం సాధ్యం కాదని డీఎస్సీ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.పోస్టల్ డిపార్ట్మెంట్ నిరాకరించినా.. దగా డీఎస్సీలో ఉద్యోగం.. వెయిట్ లిఫ్టింగ్లో కతిల వెంకటలక్ష్మి తప్పుడు జనన ధ్రువీకరణ ఇచ్చారని రుజువు కావడంతో పోస్టల్ డిపార్టుమెంట్లో ఉద్యోగం నిరాకరించారు. ఆమె 1992 మే 20న పుట్టినట్లు స్కూల్ సర్టిఫికెట్లలో ఉంటే 1993 మే 10 పుట్టినట్లుగా బోగస్ జనన ధ్రువీకరణ పత్రం సృష్టించి వెయిట్ లిఫ్టింగ్లో పాల్గొనట్లు గుర్తించారు. తాజాగా డీఎస్సీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్లో మాత్రం ఉద్యోగం ఇచ్చేశారు. నాట్ క్వాలిఫైడ్.. కానీ ఉద్యోగం.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కాట్రేనికోన మండలం గచ్చకాయలపోర జెడ్పీ హైస్కూల్లో తెలుగు పండిట్గా విధులు నిర్వహిస్తున్న మిరియాల గాయత్రి సాయిశ్రీ ఇటీవల సోషల్ (బ్యాక్లాగ్) కేటగిరీలో టీచర్ పోస్టు సాధించారు. అయితే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ రిమార్క్లో నాట్ క్వాలిఫైడ్ అని ఉన్నా, బీఈడీకి సంబంధించి ఆమె సరైన ఆధారాలు సమర్పించకపోయినా ఫైనల్ లిస్టులో ఉద్యోగం ఎలా వచ్చిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమలాపురం డివైఈఓ కిషోర్ గాయత్రిని తన కార్యాలయానికి పిలిచి విచారణ చేపట్టారు. ఆమె విద్యార్హత పత్రాలు, కుల ధృవీకరణ, బీఈడీ సర్టిఫికెట్లు, స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన ధ్రువపత్రాలను పరిశీలించారు. అనంతరం విచారణ నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు పంపినట్టు ఆయన తెలిపారు. సాఫ్ట్బాల్ సర్టిఫికెట్లపై అధ్యక్షుడి హోదాలో సంతకం చేసిన కూన రవికుమార్ నకిలీ పత్రాలతో అడ్డంగా దొరికిపోయారు.. దగా డీఎస్సీ నకిలీ సర్టిఫికెట్ల బాగోతంలో ఇదో కొత్త అంకం.. భార్యాభర్తలు ఒకే గేమ్ సర్టిఫికెట్లతో స్పోర్ట్స్ కోటా కింద రెండు ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందారు. నంద్యాల జిల్లా దొర్నిపాడుకు చెందిన షేక్ ఇమాంహుసేన్, అతని భార్య కరిష్మా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో జూడో ఛాంపియన్స్ అంటూ ధ్రువపత్రాలు సమర్పించి ఉద్యోగాలు పొందారు. ప్రస్తుతం వీరు కౌతాళం మండలంలో ఉర్దూ ఎస్జీటీగా ఇమామ్ హుసేన్, తెలుగు ఎస్జీటీగా కరిష్మా విధులు నిర్వహిస్తున్నారు. కానీ వీరు సమర్పించిన ధ్రువపత్రాల్లో స్థానికత వేరువేరుగా ఉన్నాయి. 73కిలోల విభాగంలో జూడో హరిక్రిష్ణ అనే వ్యక్తి స్పోర్ట్స్ సర్టిఫికెట్ను సవరించి అందులో పేరు మాత్రం మార్చి వీరి పేరుతో సర్టిఫికెట్లు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి తోడు ఇమామ్ హుసేన్ స్వస్థలం ఒకచోట విశాఖ, మరో చోట దొర్నిపాడు అని, భార్య కరిష్మాది ఒక చోట దొర్నిపాడు అని మరోచోట విజయనగరం స్వస్థలాలుగా ఉన్నట్లు గుర్తించారు. ఒకే వ్యక్తికి రెండు స్వస్థలాలు ఎలా ఉంటాయనేది ఇక్కడ అనుమానం. దీనిని బట్టి ఇవీ తప్పుడు స్పోర్ట్స్ ధ్రువీకరణ పత్రాలే అని తెలిసిపోయింది. ఎక్కడైతే చదువుతున్నామో అక్కడి నుంచే స్పోర్ట్స్ ఆడాల్సి ఉంటుంది. కానీ 2014లో కర్ణాటకలో డీఈడీ చదువుతూ అదే ఏడాది 2014లో ఏపీలో జూడో పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచి సర్టిఫికెట్ ఎలా పొందారన్నదే ఇక్కడ పెద్ద ప్రశ్న. నొస్సం కరిష్మా ఇంటర్ 2011–2013లో చదివారు. 2014లో ఏదో ఒక కోర్సు చేస్తూ ఉండాలి. జూడో స్పోర్ట్స్ సర్టిఫికెట్లో మాత్రం 2014లో ఆడినట్లు ఉంది. కానీ ఆ సమయంలో ఆమె ఖాళీగా ఉంది. ఎందుకంటే డీఈడీ మాత్రం 2015–2017లో చేసినట్లు సర్టిఫికెట్ ఉంది. అంటే 2017లో డీఈడీ పూర్తి చేసి ఎలాంటి విద్యాభ్యాసం చేయకుండా ఉన్న 2014 సర్టిఫికెట్ ఎలా చెల్లుతుందనేది అనుమానం. -
బాబూ.. దేనికి భయం?
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాల వ్యవహారానికి సంబంధించి రోజురోజుకూ మరిన్ని ఆధారాలు బయట పడుతున్నాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. వాటన్నింటిపై వెల్లువలా తలెత్తే అన్ని ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని నిలదీశారు. అంతా పారదర్శకంగా జరిగిందన్నప్పుడు, దాచుకోవడానికి ఏమీ లేనప్పుడు మీ కెందుకింక భయం? అని ప్రశ్నించారు. డీఎస్సీ స్కామ్పై ప్రతిపక్షంతో పాటు గళం విప్పిన కొన్ని మీడియా సంస్థలు, సామాజిక కార్యకర్తలకు చెందిన సోషల్ మీడియా ఖాతాలను మెటా ద్వారా ఎందుకు బ్లాక్ చేయిస్తున్నారని, వాటిని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ–2025 నియామకాలు నిజాయితీగా, పారదర్శకంగా జరిగాయని అనుకుంటే వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలని సీఎం చంద్రబాబుకు సవాల్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఆ పోస్టులో ఇంకా ఏమన్నారంటే..వెలుగులోకి కొత్త ఆధారాలు, వాస్తవాలు ‘రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మరిన్ని కొత్త ఆధారాలు, వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. అవన్నీ డీఎస్సీలో తీవ్ర అక్రమాలను బయట పెడుతూ, సీఎం చంద్రబాబు వెన్నుపోటు పార్టీ సమాధానం చెప్పాల్సిన అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పి, నిజాలను నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణకు అంగీకరించాల్సిన ప్రభుత్వం.. స్వతంత్ర దర్యాప్తును తిరస్కరిస్తోంది. మరో వైపు ప్రశ్నిస్తున్న గొంతులను అణచివేసే మార్గాన్ని వెన్నుపోటు పార్టీ ఎంచుకుంది. డీఎస్సీ నియామకాల అక్రమాలపై గొంతెత్తుతున్న ప్రతిపక్షంతో పాటు, కొన్ని మీడియా సంస్థలు, సామాజిక కార్యకర్తలు, వ్యక్తులకు సంబంధించిన సామాజిక పోస్టులు, ఖాతాలను మెటా సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో నియంత్రిస్తున్నారు. ‘చట్టపరమైన ఆదేశాలు’ అంటూ వాటిని తొలగించడం లేదా జియో బ్లాక్ చేయడం జరుగుతోంది. ఆ ఆంక్షల బారిన పడిన ఖాతాలు, పేజీలు, ఫేస్బుక్లో సాక్షి టీవీ, ఇన్స్టాగ్రామ్లో సాక్షి డిజిటల్, బిగ్ టీవీ, జగనన్న కనెక్ట్స్తో పాటు డీఎస్సీ స్కామ్పై ప్రశ్నిస్తున్న ఇతర వ్యక్తిగత హ్యాండిల్స్ కూడా ఉన్నాయి.ఇది పరిపాలన కాదు. నియంతృత్వ సెన్సార్షిప్వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ వ్యవహారం కేవలం డీఎస్సీ స్కామ్తోనే ఆగిపోవడం లేదు. వెన్నుపోటు పార్టీ ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలు, అమలు కాని సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఎన్నికల హామీలు, నిరంకుశత్వం, అధికార దుర్వినియోగంపై ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరినీ లక్ష్యంగా చేసుకుంటున్నారు. ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, ప్రశ్నించిన వారి గొంతు నొక్కేస్తున్నారు. ఇది పరిపాలన కాదు. నియంతృత్వ సెన్సార్షిప్! వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటన స్వేచ్ఛ భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు. ప్రశ్నలు రాజకీయంగా ఇబ్బందికరంగా ఉన్నాయనే కారణంతో ప్రతిపక్షం, మీడియా, సామాజిక కార్యకర్తలు, పౌరుల గొంతు నొక్కే అధికారం ఏ ప్రభుత్వానికీ లేదు.ప్రజలకు సమాధానం చెప్పండిచంద్రబాబు గారూ.. మీరు భయపడుతున్నది ప్రశ్నలకా? లేక వాటి సమాధానాలకా? డీఎస్సీ నియామకాల్లో ప్రతిరోజూ కొత్తగా వెలుగు చూస్తున్న ఆధారాలు ఒకవేళ అవాస్తవమైతే.. ప్రజల ముందుకు వచ్చి వాస్తవాలతో వాటిని ఖండించండి. ఆ పని చేయడం లేదు. ఇంకా సీబీఐ విచారణను కూడా ఎందుకు తిరస్కరిస్తున్నారు? అక్రమాలను బయట పెడుతున్న వారి గొంతు ఎందుకు అణచి వేస్తున్నారు? వారి పోస్టులు, ఖాతాలను ఎందుకు నియంత్రిస్తున్నారు? ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఒక పోస్టును తొలగించినంత మాత్రాన ఆధారాలు చెరిగిపోవు. ఒక ఖాతాను బ్లాక్ చేసినంత మాత్రాన నిజాన్ని పాతిపెట్టలేరు. ప్రతిపక్షాన్ని రాజకీయంగా ఎదుర్కోండి. ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా సమాధానం చెప్పండి. రాజ్యాంగబద్ధంగా పాలించండి.ఉత్తీర్ణులు కాకుండానే ఉపాధ్యాయ ఉద్యోగాలా?డీఎస్సీ పరీక్ష రాయకుండానే, ఉపాధ్యాయ అర్హత పరీక్ష ‘టెట్’లో ఉత్తీర్ణులు కాకుండానే కొందరికి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చి.. మిమ్మల్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా భర్తీ కోసం కొత్తగా జీవోలు జారీ చేశారు. ఆ నియామకాలు పూర్తి చేయగానే, ఆ జీవోలు రద్దు చేశారు. అయినప్పటికీ ఆ జీవోల ద్వారా నియమితులైన అభ్యర్థులు ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. అంటే అక్రమ నియామకాలకు ముందు గేట్లు తెరిచి.. ఆ నియామకాలు పూర్తయ్యాక వాటిని మూసివేశారు. ఇదంతా అవినీతిని సూచించడం లేదా? అందుకే నియంతృత్వ సెన్సార్షిప్లో భాగంగా నియంత్రించిన ప్రతి సామాజిక మాధ్యమ ఖాతాను, పోస్టును, కంటెంట్ను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నా. అలాగే అందరూ లేవనెత్తుతున్న ప్రశ్నలన్నింటికీ స్పష్టమైన సమాధానాలు చెప్పాలి.స్వతంత్ర దర్యాప్తు ద్వారా నిజానిజాలు తేల్చండిచంద్రబాబుకు.. ఆయన ప్రభుత్వానికి నేను ఒక సవాల్ చేస్తున్నా. డీఎస్సీ–2025 నియామకాలు నిజాయతీగా, పారదర్శకంగా జరిగాయని మీరు అనుకుంటే వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించండి. స్వతంత్ర దర్యాప్తు ద్వారా నిజానిజాలు తేల్చండి. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు ఆధారాలతో సహా బయట పడుతున్నందున, వాటికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తన పదవికి రాజీనామా చేయాలి. అంతే కాకుండా వెంటనే సామాజిక మాధ్యమాల ఖాతాలు పునరుద్ధరించండి. వాటి సెన్సార్షిప్ను ఆపండి. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పండి. సీబీఐ విచారణకు ఆదేశించండి. అంతా పారదర్శకంగా జరిగినప్పుడు, దాచుకోవడానికి ఏమీ లేనప్పుడు మీకెందుకింకా భయం?’ అని వైఎస్ జగన్ నిలదీశారు. -
ఏపీ డీఎస్సీ అక్రమాలపై నోరు విప్పని ఐఏఎస్లు
సాక్షి, విజయవాడ: ఏపీ డీఎస్సీ అక్రమాలపై ఐఏఎస్లు నోరు విప్పడం లేదు. కర్నూలు అనర్హత టీచర్ ప్రభాకర్పై సమాధానం చెప్పని ఐఏఎస్లు.. నకిలీ క్రీడా సర్టిఫికెట్ల టీచర్లపై కూడా సమాధానం చెప్పకుండా మౌనంగా వహిస్తున్నారు. అధికారుల తీరుపై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి విద్యాశాఖ మాజీ కార్యదర్శి కోన శశిధర్ నోరు విప్పడం లేదు. విద్యాశాఖ కమిషనర్ అన్సారియా ఎందుకు మాట్లాడటం లేదన్న సందేహాలు వ్యక్తమవుతుండగా.. కార్యదర్శి శ్యామలరావు కూడా ఇంతవరకు సమాధానం చెప్పలేదు.స్పోర్ట్స్ కోటా నకిలీ సర్టిఫికెట్లపై ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్జైన్ ఎందుకు నోరు విప్పడం లేదు? గతంలో అంతా సక్రమమన్న అజయ్ జైన్ ఇప్పుడెక్కడ?. శాప్ ఎండీ భరణికి ఇప్పుడు బాధ్యత లేదా?. అర్హతలేని స్పోర్ట్ కోటా టీచర్లపై ఎండీ భరణి ఎందుకు నోరు విప్పడం లేదు?. లోకేష్ను కాపాడటం కోసం నోరు విప్పడం లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీఎస్సీ అక్రమాలపై పోస్ట్ చేస్తే చర్యలంటూ చంద్రబాబు సర్కార్ వార్నింగ్లు ఇస్తోంది. అడ్డంగా దొరికిపోవడంతో ప్రభుత్వం, అధికారులు సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. -
డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్సీపీ నిరసన దీక్ష
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్సీపీ నిరసన దీక్ష చేపట్టింది. గురు పూజోత్సవం సందర్భంగా 'గురు పరిరక్షణ దీక్ష' పేరుతో ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. డీఎస్సీలో అక్రమాలపై సీబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ.. ఎమ్మెల్సీలు కౌరు శ్రీనివాస్, పెన్మెత్స సురేష్ బాబు, ఇసాక్, కల్పలతారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, కుంభా రవిబాబు, మొండితోక అరుణ్కుమార్, రామచంద్రారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, పాలవలస విక్రాంత్, సిపాయి సుబ్రహ్మణ్యం నిరసన చేపట్టారు. డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు.అనర్హులు పాఠాలు చెప్తే పిల్లల భవిష్యత్తు ఏంటి..?: వైవీవైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘‘డీఎస్సీలో భారీగా అక్రమాలు వెలుగు చూశాయి. అనర్హులు కూడా టీచర్లు అయ్యారు.. అనర్హులు పాఠాలు చెప్తే పిల్లల భవిష్యత్తు ఏంటి..?. అనర్హులను ఉద్యోగాల నుండి తప్పించాలి. సీబీఐ విచారణ జరిపితేనే నిజాలు బయటికి వస్తాయి. మంత్రి లోకేష్ బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలి. లోకేష్ రాజీనామా చేస్తేనే అన్యాయమైన వారికి న్యాయం జరుగుతుంది. అర్హులుగా ఉద్యోగాలు పొందిన వారిని తొలగించమని మేము అడగడం లేదు. అనర్హులను మాత్రమే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. పూర్తిస్థాయిలో వెరిఫికేషన్ చేస్తే అనర్హులు బయటపడతారు’’ అని ఆయన పేర్కొన్నారు.విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు?: కురసాలమాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. అనర్హులు గురువులు అయితే విద్యార్థుల నష్టపోతారు. విద్యావ్యవస్థలో నకిలీ గురువులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. నకిలీ గురువులతో భావితరాలు నష్టపోతాయి.. ఈ డీఎస్సీ ప్రక్రియ దుర్మార్గమైన స్కామ్. స్కామ్ బయటపడినా విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు?. కూటమి సర్కార్కి కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. అన్ని వర్గాలకు ప్రభుత్వం నష్టం చేసింది’’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: సాక్షి సోషల్ మీడియాపై చంద్రబాబు సర్కార్ అక్కసు -
ఏపీ వ్యాప్తంగా బట్టబయలవుతున్న డీఎస్సీ అక్రమాలు
సాక్షి, విజయవాడ: ఏపీ వ్యాప్తంగా డీఎస్సీ అక్రమాలు బయటపడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోనూ డీఎస్సీ స్పోర్ట్స్ కోటా బండారం బయటపడింది. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందిన పెద్ద అప్పలరాజుపై ఫిర్యాదులు వచ్చాయి. ఉద్యోగం పొందిన వ్యక్తి పేరు “పెద్ద అప్పలరాజు” కాగా, “పాండ అప్పలరాజు” పేరుతో ఉన్న సర్టిఫికెట్ను అప్లోడ్ చేశారు. శాప్ పోర్టల్లో అభ్యర్థి తమ్ముడి పేరుతో ఉన్న సర్టిఫికెట్ను ఎందుకు అప్లోడ్ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే విధంగా, సర్టిఫికెట్ను మూడు సార్లు ఎందుకు మార్చారు? అనే సందేహాలు కలుగుతున్నాయి.ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ..ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ డీఎస్సీ నూయామకాల్లో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. నకిలీ బ్లైండ్ సెర్టిఫికెట్తో ఒక వ్యక్తి ఉద్యోగం పొందాడని మరో మహిళా అభ్యర్థి ఆరోపిస్తున్నారు. స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల జాబితా ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. విశాఖ డీఈవో ప్రేమ్ కుమార్ని స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల జాబితా ఇవ్వాలని సాక్షి మీడియా కోరగా.. జాబితా ఇవ్వకూడదని.. ఉన్నతాదికారుల ఆదేశాలు పాటిస్తున్నామని డీఈవో తెలిపారు. ఏ సమాచారం కావాలన్నా లిఖిత పూర్వకంగా కోరితే ఆర్జేడీకి పంపుతామంటూ వెల్లడించారు.కోనసీమ జిల్లాలో అడ్డగోలుగా పోస్టింగులు..కోనసీమ జిల్లాలో అడ్డగోలుగా డీఎస్సీ అభ్యర్థుల పోస్టింగులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. సఖినేటిపల్లి మండలం అప్పన రాముని లంకకు చెందిన గాయత్రి సాయిశ్రీకి కాట్రేనికోన మండలం బ్రహ్మసమేద్యం పోస్టింగ్ ఇచ్చారు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ రిమార్క్స్లో నాట్ క్వాలిఫైడ్ అని అధికారులు రాశారు. ఆమె బీఈడీ సర్టిఫికెట్లు సబ్మిట్ చేయలేదని అధికారులు స్పష్టం చేశారు. ఫైనల్ లిస్ట్లో మాత్రం బాక్సింగ్ స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వం.. ఉద్యోగం ఇచ్చేసింది. బీఈడీ సర్టిఫికెట్లు లేకపోయినా అధికారులు ఎలా ఉద్యోగం ఇచ్చారో స్పష్టం కాలేదు. 11 సార్లు తెలుగు టెట్ రాసిన ఆమెకు సోషల్ స్కూల్ అసిస్టెంట్గా పోస్టింగ్ ఇచ్చారు. ఈ పోస్టింగ్పై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు పండిట్కు సోషల్ పోస్టింగ్ ఎలా ఇచ్చారో అధికారులు స్పష్టం చేయలేదు.రిజర్వేషన్లలోనూ గోల్మాల్వైఎస్సార్ జిల్లాలోనూ డీఎస్సీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. రిజర్వేషన్లలోనూ గోల్మాల్ చేసి అభ్యర్థులు ఉద్యోగం పొందినట్లు తేలింది. వైఎస్సార్ జిల్లాలో బీసీ–ఈ అభ్యర్థి మనూర్ రసూల్ ఓసీ కింద ఉద్యోగం పొందారు. 2008, 2012, 2018 డిఎస్సీల్లో తాను బీసీ–ఈ కేటగిరీగా నమోదు చేసుకున్న రసూల్.. 2025 డిఎస్సీలో మాత్రం తాను ఓసీ (ఈడబ్ల్యూఎస్) కింద దరఖాస్తు చేసుకుని ఉద్యోగం పొందారు.రసూల్ చేసిన అవకతవకల వల్ల తనకు ఉద్యోగం రాలేదని రాయచోటికి చెందిన జమీల్ ఆరోపిస్తున్నారు. ఈ అక్రమాలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని జమీల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా రిజర్వేషన్లనే మార్చేసి అక్రమంగా ఉద్యోగం పొందడంపై చంద్రబాబు సర్కార్ నోరు విప్పడం లేదు. ఏడాదిగా ఈ అంశంపై జిల్లా యంత్రాంగం విచారణ చేస్తూనే ఉన్నారు. రసూల్ చేసిన అక్రమాలపై చర్యలు తీసుకుని తనకు రావాల్సిన ఉద్యోగం ఇప్పించాలని జమీల్ కోరుతున్నారు.విద్యా శాఖ ప్రకటనతో అనుమానాలుకర్నూలు డీఎస్సీ అక్రమాలు కప్పి పుచ్చేందుకు విద్యాశాఖ ప్రయత్నం చేస్తోంది. విద్యాశాఖ ప్రకటనతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీఎస్సీ అంతా పారదర్శకం అంటూ విద్యాశాఖ మీడియా ప్రకటన చేసింది. కర్నూలు జిల్లా కౌతాళం మండలం, వల్లూరు ఎంపీపీఎస్ (న్యూ) పాఠశాలలో క్రీడా కోటా కింద ఈడిగ ప్రభాకర్, SGT(తెలుగు)గా ఎంపిక, పోస్టింగ్ ప్రక్రియలో అక్రమాలపై పాఠశాల విద్యా శాఖ వివరణ ఇచ్చింది. పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ పేరుతో ప్రకటన విడుదల చేసింది. ఘటన గురించి తెలిసిన వెంటనే శాఖాపరమైన దర్యాప్తును విద్యా శాఖ ప్రారంభించింది.ఉన్నతాధికారులు విచారణ ప్రక్రియను పరిశీలిస్తున్నారు. కర్నూలు డీఈవో విచారణను ప్రారంభించి, సమగ్ర పరిశీలన కోసం సంబంధిత రికార్డులను, వెరిఫికేషన్ ఫైళ్లను తెప్పించారు. విచారణ నివేదిక అందగానే, రిక్రూట్మెంట్, సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని.. డీఎస్సీ-2025 నియామక ప్రక్రియలో సంపూర్ణ పారదర్శకత, ప్రతిభ ఆధారిత ఎంపిక, విధానాన్ని అవలంభించామని పాఠశాల విద్యాశాఖ పునరుద్ఘాటిస్తోంది. -
ఉపాధ్యాయులందరికీ వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: టీచర్స్ డే సందర్భంగా గురువులకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మన భవిష్యత్తుకు నిజమైన శిల్పులు ఉపాధ్యాయులే. విద్యాబోధనతో పాటు విద్యార్థుల్లో కలలను రేకెత్తించి.. విలువలను పెంపొందిస్తూ మంచి భవిష్యత్తును నిర్మించుకునే.. ఆత్మవిశ్వాసాన్ని కల్పించేది గురువులే’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు. చిన్నారులను జ్ఞానవంతులుగా, సాధికారులుగా తీర్చిదిద్దేందుకు అంకితభావంతో కృషి చేస్తున్న ప్రతి గురువుకీ హృదయపూర్వక అభినందనలు. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.On the occasion of #TeachersDay, I extend my heartfelt greetings and gratitude to all our teachers.Teachers are the architects of our future. Beyond imparting knowledge, they inspire dreams, instil values and give our children the confidence to shape a better tomorrow.My…— YS Jagan Mohan Reddy (@ysjagan) September 5, 2026 -
సాక్షి సోషల్ మీడియాపై చంద్రబాబు సర్కార్ అక్కసు
సాక్షి, విజయవాడ: ఏపీలో రెడ్బుక్ అరాచకాలు కొనసాగుతున్నాయి. సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను కూటమి సర్కార్ బ్లాక్ చేయించింది. వాస్తవాలు ప్రసారం చేసిన సాక్షి సోషల్ మీడియాపై అక్కసు వెళ్లగక్కుతోంది. సాక్షి ఫేస్బుక్, ఇన్స్టా అకౌంట్లను బ్లాక్ చేయించిన చంద్రబాబు సర్కార్.. డీఎస్సీ అక్రమాలపై వరుస కథనాలు ప్రసారం చేయడంతో వణుకు పోతోంది.సాక్షి సోషల్ మీడియా అకౌంట్లతో పాటు మరికొన్ని సోషల్ మీడియా అకౌంట్లపై కూటమి సర్కార్ కుట్రలకు తెరలేపింది. టీడీపీ ఫేక్ అకౌంట్లు, ఏపీ సైబర్ క్రైమ్తో కలిసి కుట్రలు చేస్తోంది. ఇప్పటికే సాక్షి సోషల్ మీడియాపై కూటమి సర్కార్ పదుల సంఖ్యలో కేసులు పెట్టింది. పత్రికా స్వేచ్ఛను, వాక్ స్వాతంత్ర హక్కును చంద్రబాబు సర్కార్ కాల రాస్తోంది. ఏపీ సర్కార్ కుట్రలపై సాక్షి మీడియా న్యాయ పోరాటం చేస్తోంది.అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ‘సాక్షి’పై కక్ష సాధింపు చర్యలకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు ప్రభుత్వం.. సాక్షి ఎడిటర్, జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని అడుగడుగునా అక్రమ కేసులు పెట్టించిన సంగతి తెలిసిందే. అవసరం లేకపోయినా విచారణలు, తనిఖీల పేరుతో వేధింపులకు గురిచేస్తోంది. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా హరించేస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, అక్రమాలను వెలుగులోకి తెస్తున్న మీడియా సంస్థల గొంతు నొక్కేందుకు అధికారాన్ని దుర్వినియోగం చేస్తోంది. ఇదీ చదవండి: మెగా డీఎస్సీ కాదది.. నిరుద్యోగుల గొంతు కోసిన ‘దగా డీఎస్సీ’ -
బాబు సర్కార్ మరో రూ.3,800 కోట్ల అప్పు
సాక్షి, అమరావతి: మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. వచ్చే మంగళవారం మరో రూ.3,800 కోట్ల బడ్జెట్ అప్పు చేయనుంది. ప్రభుత్వ సెక్యూరిటీలను వేలంలో విక్రయించడం ద్వారా ఈ మొత్తం అప్పును ఆర్బీఐ సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఈ మేరకు ఆర్బీఐ శుక్రవారం నోటిఫై చేసింది. -
చర్చలు ఫలించే వరకూ పోరాటం ఆగదు
సాక్షి, అమరావతి: ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించడం తమ ఉద్యమానికి తొలి విజయమని, చర్చలు ఫలించే వరకు తమ పోరాటం ఆగదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు స్పష్టం చేశారు. ఉద్యోగులు సంఘాలకు అతీతంగా తమకు మద్దతు ఇవ్వడంతో ప్రభుత్వం స్పందించిందని చెప్పారు. తక్కువ కాల పరిమితితో పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని, జాప్యం జరిగినందున వెంటనే ఐఆర్ మంజూరు చేయాలని కోరారు. పెండింగ్లో ఉన్న డీఏలను విడుదల చేయడంతో పాటు రిటైర్డ్ ఉద్యోగులకు అదనపు పింఛను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు వర్తింపజేయడం, గ్రామ–వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం, మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులకు ప్రత్యేక సర్వీస్ రూల్స్ రూపొందించడం వంటి డిమాండ్లను కూడా పరిష్కరించాలని కోరారు. ఆర్టీసీలో ప్రవేశపెట్టనున్న విద్యుత్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించకుండా ఆర్టీసీ ద్వారానే నిర్వహించాలన్నారు. జూలై 22న జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి తరఫున ప్రస్తావించిన ఇతర 30 డిమాండ్లను కూడా పరిష్కరించాలని కోరారు. మొత్తంగా రూ.40 వేల కోట్ల బకాయిలు చెల్లించాలన్నారు. శనివారం జరిగే చర్చల్లో ఉద్యోగుల న్యాయమైన ఆర్థిక డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించినా, ఇప్పటికే ప్రకటించిన ఉద్యమ కార్యాచరణలో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. శనివారం భోజన విరామ సమయంలో ‘డిమాండ్స్ డే’ నిరసనలు యథాతథంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాలు, ఆర్డీవో కార్యాలయాల వద్ద భోజన విరామ సమయంలో నిరసనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు వారు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
గుంటూరు బాలిక ఆచూకీ కనిపెట్టిన పోలీసులు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: దాదాపు మూడు నెలల కిందట మాయమైన బాలిక ఆచూకీ ఇప్పటివరకు దొరకలేదని చెబుతున్న పోలీసులు.. హైకోర్టు తీవ్ర ఆగ్రహం, హెచ్చరికల నేపథ్యంలో బాలికను, ఆమెను కిడ్నాప్ చేసిన వ్యక్తిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరూ హరియాణా రాష్ట్రం కర్నాల్ నగరంలోని ఓ లాడ్జిలో ఉండగా సిట్ బృందం అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. వారిద్దరినీ గుంటూరు తీసుకువస్తున్నారు. మూడు నెలలుగా ఆచూకీ కనిపెట్టలేకపోయిన పోలీసులు.. సోమవారానికల్లా బాలిక ఆచూకీ కనిపెట్టి కోర్టులో హాజరు పరచాలని ఆదేశించిన 24 గంటల్లోనే అంత దూరంలో ఉన్న వారిని ఎలా పట్టుకోగలిగారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటి వరకు వదిలేయడం వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా, దీని వెనుక ఉన్న పెద్దలు ఎవరు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బాలికకు ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన నిందితుడు షేక్ జాన్ సైదా అలియాస్ రబ్బాని అలియాస్ పండు ఆమెను జూన్ 9న తీసుకెళ్లిపోయాడు. ఆ సమయంలో బాలిక ఇంటి నుంచి 200 గ్రాముల బంగారం తీసుకెళ్లింది. ఆ బంగారంలో సగం వరకు అమ్మేసిన కిడ్నాపర్ సైదా మూడు నెలలపాటు విచ్చలవిడిగా ఖర్చు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. బాలిక అశ్లీల వీడియోలు, ఫొటోలు తన వద్ద ఉన్నాయని, తన వెంట రాకపోతే గ్రూపుల్లో షేర్ చేస్తానంటూ బెదిరించి బాలికను తీసుకెళ్లినట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు చెబుతున్నారు. షేక్ జాన్ సైదా సెల్ఫోన్ను స్వాదీనం చేసుకుని, అందులో బాలిక వీడియోలు, ఫొటోలు ఉన్నాయా అని పరిశీలిస్తున్నట్లు సమాచారం. నిందితుడిపై కిడ్నాప్, అత్యాచారం, పోక్సో సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, పూర్తి విచారణ అనంతరం కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు చెబుతున్నారు. కిడ్నాపర్కు ఎవరెవరు సహకరించారనేది విచారణలో తేలుతుందని, దాన్ని బట్టి వారిపైనా కేసు నమోదు చేస్తామంటూ పోలీసులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఎందుకు పట్టుకోలేదు? బాలిక కనిపించడం లేదంటూ ఆమె తండ్రి జూన్ 10న ఫిర్యాదు చేసినా గుంటూరు పట్టాభిపురం పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. అన్ని ఆధారాలు ఇచ్చినా, వారి ఖర్చులు భరించినా కాలం వెళ్లదీశారు. పైగా షేక్ సైదా చేతనైతే పట్టుకోవాలని పోలీసులకు సవాలు కూడా విసిరాడు. అతడి గురించి సమాచారం ఉన్నా పట్టుకొని తీసుకురావడంలో పోలీసులు ఘోరంగా విఫలమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. చివరకు బాలిక తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు గురువారం పోలీసులపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారానికల్లా బాలిక ఆచూకీ కనిపెట్టి, హాజరుపరచాలని గట్టిగా హెచ్చరించడంతో దిగివచ్చిన పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. పోలీసులకు అధికారపార్టీ నేతలు, ఉన్నతాధికారుల అండ? బాలిక కిడ్నాప్ కేసును ఛేదించడంలో మూడు నెలలుగా నిర్లక్ష్యం వహించిన పట్టాభిపురం పోలీసులపై చర్యలు తీసుకుంటారా లేక వదిలేస్తారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బాలిక కిడ్నాప్పై స్పందించకపోవడం వెనుక పెద్ద తలకాయలే ఉంటాయన్న అనుమానాలున్నాయి. బాలిక తండ్రి పోలీసుల చుట్టూ తిరుగుతూ.. వారికి స్వయంగా కార్లు, ఫ్లైట్ టికెట్లు పెట్టి సహకరిస్తున్నా నిందితుడిని పట్టుకోకపోవడం వెనుక పెద్ద వ్యక్తులు ఉంటారని తేటతెల్లమవుతోంది. పట్టాభిపురం పోలీసులపై చర్యలు తీసుకోకుండా అధికార పార్టీ నేతలు, కొందరు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. -
అక్షరాస్యతపైనా అబద్ధాలా?
సాక్షి, అమరావతి : అక్షరాస్యతపై చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు గణాంకాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ‘వాస్తవ పరిస్థితులను, గణాంకాలను వక్రీకరిస్తున్నారు. అధికారిక గణాంకాలు ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత రేటు 71.4 శాతంగా స్పష్టం చేస్తుంటే.. విద్యా శాఖ మంత్రి మాత్రం 82.1 శాతం అంటూ ప్రచారం చేయడం వెనుక ఉన్న లెక్కల మతలబు ఏమిటి?’ అని ప్రశ్నించారు. ఇంకా పూర్తికాని 2026 సంవత్సరానికి అక్షరాస్యత గణాంకాలు ఎలా వచ్చాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వ తీరును ఎండగడుతూ పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను ట్యాగ్ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఆ పోస్టులో ఇంకా ఏమన్నారంటే..2026 ఏడాది అక్షరాస్యత గణాంకాలు ఏ సంస్థా విడుదల చేయలేదు ‘సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఏ స్థాయిలో తప్పుడు సమాచారంతో ప్రచారం చేసుకుంటోందో చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతోంది. 2024లో 72.6 శాతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత రేటు 2026లో 82.1 శాతానికి పెరిగిందని విద్యా శాఖ మంత్రి ప్రకటించారు. కానీ 2026 కేలండర్ సంవత్సరానికి సంబంధించిన అక్షరాస్యత గణాంకాలను ఇప్పటి వరకు ఏ అధికారిక సంస్థా విడుదల చేయలేదు. అసలు 2026 సంవత్సరమే ఇంకా పూర్తి కాలేదు. మరి 82.1 శాతం అనే లెక్క ఎక్కడి నుంచి వచ్చింది? కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎన్ఎస్ఎస్వో నిర్వహించిన సర్వే ఆధారంగా పీఎల్ఎఫ్ఎస్ (పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే) 2023–24 వార్షిక నివేదికను రూపొందించారు. జూన్ 2023 నుంచి జూన్ 2024 మధ్య కాలానికి సంబంధించిన ఈ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఏడు సంవత్సరాలు పైబడిన వారి అక్షరాస్యత రేటు 72.6 శాతం. 2018–19లో 69.1 శాతంగా ఉన్న ఈ రేటు 2023 – 24 నాటికి 72.6 శాతానికి చేరింది. అలాగే, జనవరి 2025 నుంచి డిసెంబర్ 2025 మధ్య ఎన్ఎస్ఎస్వో నిర్వహించిన సర్వే ఆధారంగా రూపొందించిన పీఎల్ఎఫ్ఎస్ కేలండర్ ఇయర్ 2025 వార్షిక నివేదికను 2026 జూలై 2న విడుదల చేశారు. ఈ అధికారిక నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఏడు సంవత్సరాలు పైబడిన వారి అక్షరాస్యత రేటు 71.4 శాతం మాత్రమే.యూడైస్ గణాంకాల ప్రకారం వైఎస్ జగన్ హయాం(2023–24)లో, చంద్రబాబు హయాం (2025–26)లో రాష్ట్రంలో విద్యార్థుల వివరాలు టీడీపీ ప్రభుత్వం మోసపూరిత ప్రచారాలతో లేనిపోని గొప్పలు అధికారిక గణాంకాలు ఇంత స్పష్టంగా అందుబాటులో ఉన్నప్పటికీ, 82.1 శాతం అంటూ తప్పుడు లెక్కలతో రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం అత్యంత దురదృష్టకరం. మరో ఆందోళనకరమైన అంశం ఏమిటంటే.. ప్రస్తుత కూటమి ప్రభుత్వ తీరువల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు తగ్గుతుండగా, ప్రైవేట్ పాఠశాలల్లో నమోదు పెరుగుతోందని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన యూడైస్ (యూడీఐఎస్ఈ) గణాంకాలే వెల్లడిస్తున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు విద్యను మరింత అందుబాటులోకి ఎలా తీసుకురావాలి? ప్రభుత్వ పాఠశాలలను ఎలా బలోపేతం చేయాలి? అనే అంశాలపై దృష్టి పెట్టాల్సిన టీడీపీ కూటమి ప్రభుత్వం మోసపూరిత ప్రచారాలతో లేనిపోని గొప్పలు చెప్పుకోవడంలోనే నిమగ్నమైంది. విద్యాశాఖ మంత్రి ‘రెడ్బుక్ పాలన’పై సమయం వెచ్చించడం మానుకుని, తన శాఖపై ఎక్కువ సమయం, శ్రద్ధ పెట్టడం మంచిది’ అని వైఎస్ జగన్ హితవు పలికారు. -
మెగా డీఎస్సీ కాదది.. నిరుద్యోగుల గొంతు కోసిన ‘దగా డీఎస్సీ’
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. డీఎస్సీ–2025 కుంభకోణం తీగ లాగితే అక్రమాల డొంకలు కదులుతున్నాయని వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీలో జరిగింది మెగా డీఎస్సీ కాదు, యువగళం డీఎస్సీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేశ్ పాదయాత్రలో పాల్గొన్న వారికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారని.. కర్మ ఎవరినీ వదిలిపెట్టదని.. చంద్రబాబు, లోకేశ్ల పాపాలు ఒక్కటొక్కటిగా బట్టబయలవుతున్నాయని చెప్పారు. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం నిర్వహించింది మెగా డీఎస్సీ కాదని, అది నిరుద్యోగుల గొంతు కోసిన ‘దగా డీఎస్సీ’ అని మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘అధికార బలం, అనుకూల మీడియా సాయంతో చేసిన పాపాలను ఎంతకాలం కప్పిపుచ్చగలరు? టెట్ పరీక్షలో పాస్ అవ్వని వాళ్లకు కూడా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత నారా లోకేశ్కే దక్కుతుంది. రాజకీయ పార్టీలు కాదు.. స్వయంగా ప్రజలే శోధించి డీఎస్సీ అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడుతున్నారు. డీఎస్సీ అంటే తెలుగుదేశం అని ప్రగల్భాలు పలికిన వాళ్లకు ప్రజలు చెంపపెట్టు లాంటి నిజాలు చూపిస్తున్నారు. కర్నూలు జిల్లాలో మొదలైన డీఎస్సీ అక్రమాల డొంక చిత్తూరు, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాలకూ పాకింది’ అని నిప్పులు చెరిగారు. నారా లోకేశ్ తన ‘యువగళం’ కోటా కింద, నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి అర్హత లేని తమ వారికి స్పోర్ట్స్ కోటా పేరుతో లక్షల రూపాయలకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ–2025లో ఎంపికైన అభ్యర్థుల టెట్ స్కోర్, కేటగిరీ, సబ్జెక్ట్ అర్హత, కేటాయించిన పోస్టును కంప్యూటర్ ఆధారంగా క్రాస్ వెరిఫికేషన్ చేయడానికి ప్రభుత్వం సిద్ధమా? అని నాని సూటిగా ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు నాయుడు, లోకేశ్ నాయుడులకు నిజాలు బయటపెట్టే దమ్ముందా? అని నిలదీశారు. స్పోర్ట్స్ కోటాలో సమర్పించిన సర్టిఫికెట్లను, ముఖ్యంగా జరగని ఈవెంట్లకు సంబంధించినవిగా ఆరోపణలు వస్తున్న సర్టిఫికెట్లను పూర్తి స్థాయిలో వెరిఫై చేయించే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై స్వతంత్ర థర్డ్ పార్టీ ఏజెన్సీ అయిన సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాని ఇంకా ఏమన్నారంటే..టెట్ పాస్ కానివాడికి టీచర్ ఉద్యోగమా?» కర్మ అనేది ఎవరినీ వదిలిపెట్టదు. నిన్నటిదాకా అసలు తప్పే జరగలేదన్న ఈ పాలకులు, ఇవాళ 16 వేల మందిలో ఒక్క తప్పు జరిగిందని తప్పించుకోవాలని చూస్తున్నారు. ప్రజలే శోధించి ఆధారాలతో సహా లోకేశ్ బండారాన్ని బద్దలు కొడుతున్నారు. ప్రభుత్వ జీవో ప్రకారం టీచర్ ఉద్యోగం రావాలంటే టెట్ అర్హత తప్పనిసరి. ఏ కోటాలో వచ్చినా ఈ నిబంధన వర్తిస్తుంది. » బీసీలకు 75 మార్కులు రావాల్సి ఉండగా, కర్నూలు జిల్లా కౌతాలం మండలం ఒల్లూరు ప్రాథమిక పాఠశాలలో కేవలం 65 మార్కులు వచ్చిన ప్రభాకర్ అనే వ్యక్తికి ఎస్జీటీ ఉద్యోగం ఎలా ఇచ్చారు? 150 మార్కులకు కనీస అర్హత సాధించని అభ్యర్థి ఆన్లైన్ దరఖాస్తును కంప్యూటర్ ఎలా స్వీకరించింది? డీఈవోలు, ఐఏఎస్ అధికారులు ఎదురెదురుగా కూర్చుని స్క్రూటినీ చేశామని చెప్పారు కదా.. మరి ఈ అనర్హుడిని ఎలా ఎంపిక చేశారు? పైనుంచి వచ్చిన బలమైన ఒత్తిళ్లు కాక దీనికి కారణమేంటి?బోర్డర్ మండలాల్లో స్పోర్ట్స్ కోటా దందా » ఎవరూ రారు, చూడరు అనే ధీమాతో కర్ణాటక సరిహద్దున ఉన్న కర్నూలు జిల్లా కౌతాలం మండలంలో ఏకంగా 24 మంది స్పోర్ట్స్ కోటా టీచర్లను నియమించారు. ఒక్క ఒల్లూరు స్కూల్లోనే ఐదుగురు స్పోర్ట్స్ కోటా వాళ్లే పాఠాలు చెబుతున్నారు. 41 ఏళ్ల వయసులో 2009–10 నాటి జూడో పార్టిసిపేషన్ సర్టిఫికెట్ తెచ్చుకుంటే, 42 ఏళ్లకు టీచర్ కొలువు ఇచ్చేశారు. జూడో ఆడేవాళ్లే లేని రాష్ట్రంలో 30–40 మందికి ఎలా ఉద్యోగాలు ఇచ్చారు?» ఇంత జరుగుతుంటే ఎంఈవో, డీఈవో ఆఫీసుల్లో కాకుండా ‘గోతులదొడ్డి’ స్కూల్లో చీకట్లో రహస్య విచారణలు ఎందుకు జరుపుతున్నారు? ఇవాళ శాప్ ఒక దొంగల బండిలా మారింది. శ్రీకాళహస్తిలోని ఒక ప్రైవేట్ బీఈడీ కళాశాల కేంద్రంగా ఈ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల దందా నడిచింది. నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు రాత పరీక్ష నిబంధనను ఎత్తేస్తూ జీవో 4, జీవో 47 తెచ్చారు. మేము నిలదీశాక మళ్లీ జీవోలు మార్చారు. గుర్రపు స్వారీ (ఈక్వెస్ట్రియన్), ఫెన్సింగ్, రైఫిల్ షూటింగ్ వంటి సంపన్నుల ఆటలను ఏకేటగిరీలో పెట్టి.. సామాన్యులు ఆడే కబడ్డీ, బాడీబిల్డింగ్, చెస్, క్యారమ్స్లను బికేటగిరీకి నెట్టేశారు. అసలు జరగని టోర్నమెంట్లకు ఫేక్ సర్టిఫికెట్లు తెచ్చిన వారికి కొలువులు కట్టబెట్టారు.సీబీఐ లేదా థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలి » సంబంధిత శాఖ మంత్రిగా లోకేశ్ ఈ విషయంపై ఎందుకు మాట్లాడటం లేదు? హోం మంత్రితో ఎందుకు మాట్లాడిస్తున్నారు? ఈ ప్రభుత్వం ఐఏఎస్ అధికారులతోనూ అబద్ధాలు చెప్పించి.. వారిని అక్కడి నుంచి పంపించేసింది. ఒక్క తప్పిదం లేకుండా డీఎస్సీ పూర్తి చేశామన్న వారు ఇప్పుడేమంటారు? టెట్ పాస్ కాని అభ్యర్థి అప్లికేషన్ను ఎందుకు రిజెక్ట్ చేయలేదు?» ‘16 వేల మందిలో ఒక్క తప్పు మాత్రమే జరిగిందని చేతులు దులుపుకోవాలనుకుంటే చూస్తూ ఊరుకోం. జీవో–15 ప్రకారం టెట్ క్వాలిఫై కాకుండా టీచర్ ఉద్యోగం ఇవ్వడం ఉల్లంఘనే. చిత్తూరు జిల్లాలో ఓసీ అభ్యర్థికి టెట్లో 90 మార్కులు రావాల్సి ఉండగా, 79 మార్కులొచ్చినా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం కట్టబెట్టారు. » తూర్పుగోదావరి జిల్లాలో తెలుగులో టెట్ రాస్తే, సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ పోస్టింగ్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన అభ్యర్థుల టెట్ స్కోర్లు, కేటగిరీలను కంప్యూటర్ క్రాస్ వెరిఫికేషన్ చేసే దమ్ము ప్రభుత్వానికి ఉందా? తక్షణమే ఈ ‘దగా డీఎస్సీ’పై సీబీఐ లేదా థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలి. నారా లోకేష్ వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలి. » శాప్ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) ఒక పెద్ద దొంగల బండి లా మారింది. అక్కడ ముద్ర పడితే చాలు అర్హత లేకున్నా కొలువులు ఇచ్చేస్తున్నారు. శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేట్ బీఈడీ కాలేజీ కేంద్రంగా సాగిన ఈ స్పోర్ట్స్ కోటా దందాను పూర్తిగా నిగ్గు తేల్చాల్సిందే.యువగళం కోటా వాళ్లకు రూల్స్ మినహాయింపుపాతికేళ్లు, ముప్పై ఏళ్లుగా నిబద్ధతతో పాఠాలు చెబుతూ సమాజానికి ఎంతో మంది ప్రయోజకులను అందించిన సీనియర్ టీచర్లనేమో టెట్ పాస్ కావాలని వేధిస్తారు. కానీ మీ యువగళం కోటాలో అర్హత లేకపోయినా, టెట్ తప్పినా అడ్డగోలుగా ఉద్యోగాలు కట్టబెడతారా? లోకేశ్ రాజకీయాల్లో ఒక కామెడీ పీస్గా మారిపోతున్నారు. డబ్బులిచ్చి సర్వేలు రాయించుకుంటూ 82 శాతం అక్షరాస్యత వచ్చిందని పోస్టులు పెట్టుకోవడం హాస్యాస్పదం.రెండేళ్లలో ఫీజు రీయింబర్స్మెంట్ అందక, చదువు భారమై సుమారు నాలుగైదు లక్షల మంది పేద విద్యార్థులు చదువులు మానేశారు. వీళ్లకు ఇవ్వడానికి నిధులు ఉండవు గానీ, యోగా మ్యాట్లకు, ప్రతినెలా సీఎం పెన్షన్ ఇచ్చేందుకు తిరిగే ఆర్భాటాలకి రూ.కోట్ల ప్రజాధనాన్ని తగలేస్తున్నారు. ఎన్నికలప్పుడు ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ ఇస్తామని ఊదరగొట్టిన వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం.. తీరా అధికారంలోకి వచ్చాక స్పందించడమే లేదు. రూ.40 వేల కోట్ల బకాయిలు ఎప్పుడిస్తారని ఉద్యోగులు అడుగుతుంటే ఉలకడం లేదు. ఒకపక్క ఉద్యోగుల జీతాల భారం అంటూనే, పాత డీఎస్సీ పాపాలను కప్పిపుచ్చుకోవడానికి రెండో డీఎస్సీ అంటూ డ్రామాలు ఆడుతున్నారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు ఆపి, ఉద్యోగుల బకాయిలు చెల్లించి, డీఎస్సీ అక్రమాలపై పూర్తిస్థాయి నిష్పక్షపాత విచారణ జరిపించాలి. -
నెర్రెలిచ్చిన ఆశలు.. బీడువారిన బతుకులు
(గవరవరం నుంచి సాక్షి ప్రతినిధి) : ఈ చిత్రంలోని రైతు పేరు పలివెల వరదయ్య. సొంత పొలం ఎకరంతో పాటు మరి కొంత కౌలుకు తీసుకుని గవరవరంలో వ్యవసాయం చేస్తున్నారు. ‘ఓ వైపు వర్షాలు తగ్గిపోయాయి. మరోవైపు కరెంటు లేదు. వారం రోజులకు ఒకసారి మాత్రమే చేనుకు నీరు అరకొరగా పెట్టుకోగలుగుతున్నాం. ఈ పంటకు వారం అయినా నీరు లేకపోవడంతో నెర్రె కొట్టేసింది. ఇక పంట పోయినట్టే. కౌలు కింద రూ.40 వేలు ముందే చెల్లించేశాం. పెట్టుబడులకు ఎకరాకు ఇంకో రూ.30 వేలు ఖర్చుచేశాం. ఇప్పుడు అదంతా పోయినట్టే. ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే దారి లేదు.’ అంటూ కంట తడిపెట్టారు..ఇది కేవలం వరదయ్యకు వచ్చిన కష్టం మాత్రమే కాదు. రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల కన్నీటి వ్యధకు ప్రత్యక్ష సాక్ష్యం. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. ఉచిత విద్యుత్ అందక రైతులు పడుతున్న అగచాట్లపై ఏలూరు జిల్లా గవరవరం గ్రామం నుంచి ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్..తీగలపై బట్టలారేసుకోవడమే..వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తామంటే ‘ఉచిత విద్యుత్ ఇస్తామనేది పచ్చి అబద్ధం..తీగలపై బట్టలు ఆరేసుకోవడమే’ అంటూ ఎద్దేవా చేశారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఆయన అధికారంలో నిజంగా అదే పరిస్థితి వచ్చిందంటున్నారు అన్నదాతలు. రాష్ట్రంలో దాదాపు 22 లక్షల వ్యవసాయ విద్యుత్ సర్వీసులున్నాయి. వాటి ఆధారంగా లక్షలాది ఎకరాలకు సాగు నీరును బోర్ల ద్వారా వినియోగించుకుంటున్నారు రైతులు. అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయానికి కష్టకాలం మొదలైంది. ముఖ్యంగా విద్యుత్ సరఫరాలో నాణ్యత కరువైంది. రెండు, మూడు గంటలు కోతతో రోజులో కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. దానివల్ల తడిచిన చేనే మళ్లీ తడపాల్సి వస్తోంది. మరమ్మతులు, నిర్వహణ పేరుతో వారంలో ఒకటి, రెండు రోజులు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేస్తున్నారు. ఫలితంగా నేల ఎండిపోయి, పంటలు దెబ్బతింటున్నాయి. 9 గంటలు విద్యుత్ సరఫరా అబద్ధంవ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని విద్యుత్ పంపిణీ సంస్థలు చెబుతున్నాయి. రాష్ట్రంలో వ్యవసాయానికి 10,948.65 మిలియన్ యూనిట్లు (1,094.87 కోట్ల యూనిట్లు) విద్యుత్ సరఫరా చేస్తున్నామని అంటున్నాయి. ఇందులో ఏపీ ఎస్పీడీసీఎల్ 6,352.86 మిలియన్ యూనిట్లు, ఏపీ సీపీడీసీఎల్ 2,149.24 మిలియన్ యూనిట్లు, ఏపీ ఈపీడీసీఎల్ 2,446.55 మిలియన్ యూనిట్లు ఇస్తున్నట్లు లెక్కల్లో చూపిస్తున్నారు.రాష్ట్రంలో ప్రస్తుతం పగటి పూట 9 గంటలు విద్యుత్ సరఫరా అనేది లేనే లేదు. కేవలం 6 నుంచి 7 గంటలే వస్తోందని రైతులు స్పష్టం చేస్తున్నారు. అదైనా నిరంతరాయంగా ఇస్తున్నారా అంటే అదీ లేదు. విడతల వారీగా పగలు, రాత్రీ అనే తేడా లేకుండా ఇవ్వడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళ పొలాల్లో భయంతోనే గడుపుతున్నారు. మరోవైపు కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం ఎదురుచూసూ్తనే ఉన్నారు. దాదాపు 45 వేల కనెక్షన్లు పెండింగ్లో ఉన్నట్లు ఓ అంచనా.ఒక్క ఎకరాకూ నీరు అందడం లేదు.. పదెకరాల్లో వరి సాగు చేశాను. ఒక్క ఎకరానికి కూడా నీరు అందడం లేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు 7–8 గంటలే వస్తోంది. అది కూడా విడతల వారీగా ఇస్తున్నారు. దాని వల్ల శివారు భూములకు నీరు అందడం లేదు. రాత్రి పూట రెండు గంటలు ఇస్తుంటే రైతు ఆసమయంలో పొలంలోకి వచ్చి ఎలా చేలకు నీరు పెట్టుకోగలడు. – గంటా రమేష్, రైతు, గవరవరం పెట్టుబడి కూడా రాదు..ఎకరా కౌలు రూ.40 వేలు, దుక్కులకు రూ.3 వేలు, ఊడ్పులకు రూ.5 వేలు, నారుమడికి రూ.2 వేలు, ఇవి కాకుండా మూడుసార్లు ఎరువులు వేయాలి. అంతా కలిపి ఎకరాకు రూ.70 వేల వరకు పెట్టుబడి ఖర్చులు అవుతున్నాయి. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ రావడం లేదు. గతంలో రైతు భరోసా కేంద్రం ద్వారా ప్రభుత్వమే బీమా డబ్బులు చెల్లించేది. ఇప్పుడు అదీ లేదు. – బిరుదుగడ్ల ప్రేమ్కుమార్, రైతు, గవరవరం పంట మొత్తం ఎండిపోతోందికరెంటు సరిగ్గా ఇవ్వడం లేదు. ఫ్యూజు పోతే రేపొస్తాం అంటున్నారేగాని విద్యుత్ సిబ్బంది వెంటనే వచ్చి బాగు చేయడం లేదు. 15 ఎకరాల్లో వరి, 7 ఎకరాల్లో మినుము సాగు చేశాను. నీరు అందక మొత్తం పంట ఎండిపోతోంది. – నల్లూరు రాజు, రైతు, చొప్పరామన్నగూడెం ‘ఓటీపీ’ నిర్ణయిస్తోంది..ఈ ఏడాది వ్యవసాయంలో మొత్తం నష్టపోవాల్సిందే. ఒక్క రూపాయి కూడా ఇంటికి తీసుకువెళ్లే పరిస్థితి లేదు. విద్యుత్ సరఫరా విడతల వారీగా ఇస్తున్నారు. విద్యుత్ ఉన్నప్పుడు చేనుకు నీరు పెట్టి ఎరువుల కోసం వెళితే అక్కడ ఓటీపీలు రావడం లేదు. ఇక్కడ నీరు ఉండటం లేదు. నిరంతరం ఇదే పరిస్థితి. రైతు బతుకును ఓటీపీలు నిర్ణయిస్తున్నాయి. – యన్నంశెట్టి మంగరాజు, కౌలు రైతు, గవరవరంఎలా బతకాలి?నేను కూరగాయలు సాగు చేస్తున్నాను. యూరియా లేకపోతే పంట లేదు. ఇరవై రోజులకు గానీ ఇవ్వడం లేదు. వేరే రకం ఎరువు వేయాలంటే బస్తా రూ.1500 పైనే ఉంది. మార్కెట్లో కూరగాయలు కొనాలంటే ధరలు ఎక్కువగా ఉన్నాయి. మా వద్ద కిలో బెండకాయ రూ.1.50 ధరకు కొంటున్నారు. ఇలా అయితే మేం ఎలా బతకాలి. – వేముల సత్యనారాయణ, కూరగాయల రైతు, గవరవరంవైఎస్సార్సీపీ హయాంలో పెద్దపీటగత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి, వ్యవసాయ రంగ అభివృద్ధికి పెద్దపీట వేసింది. 2019 తర్వాత అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం పగటిపూట విద్యుత్ సరఫరా అందించింది. ఇందు కోసం వ్యవసాయానికి ప్రత్యేక ఫీడర్లను కూడా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.1700 కోట్లతో ఏర్పాటు చేయించారు. దీంతో రాష్ట్రంలో వ్యవసాయ పంపుసెట్లకు పగటిపూట 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయగలిగారు. ఇక ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో విద్యుత్ సరఫరాకు సంబంధించి ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే గంటల తరబడి సరఫరా నిలిచిపోతోంది. ఒక సారి ట్రాన్స్ఫార్మర్ దెబ్బతింటే నెలల తరబడి అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
త్వరలో విజయవాడ–తిరుపతి విమాన సర్వీసు
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వీలుగా ఉదయం వేళల్లో విజయవాడ – తిరుపతి మధ్య విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు విజయవాడ ఎయిర్పోర్టు డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. శుక్రవారం ఏపీ చాంబర్స్ ఏర్పాటు చేసిన ఇంటరాక్టివ్ సెషన్లో ఆయన మాట్లాడుతూ ఫ్లై–91 అనే సంస్థ ఉదయం వేళల్లో విజయవాడ–తిరుపతి మధ్య సర్వీసును ప్రారంభించనుందన్నారు. కొత్త ఎయిర్పోర్టు టెర్మినల్ పనులు అక్టోబర్ నాటికి పూర్తి చేసి త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ టెర్మినల్లో ఆరు ఎయిరోబ్రిడ్జిలు, ఎస్కలేటర్లు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం విజయవాడ నుంచి రోజూ 22 విమాన సర్వీసుల ద్వారా 2,000 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. కొత్త టెర్మినల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత యూరప్, అమెరికా, దుబాయ్కు ప్రత్యక్షంగా కనెక్టివిటీ వచ్చే అవకాశం ఉందన్నారు. -
సర్కారు తీరుతో రిజర్వేషన్ విద్యార్థులకు అన్యాయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎంబీబీఎస్ ప్రవేశాల కౌన్సెలింగ్లో రిజర్వేషన్ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. మెరిట్ ఆధారంగా ఓపెన్ కేటగిరీ (ఓసీ)లో సీటు దక్కించుకోవాల్సిన బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను రిజర్వేషన్ కోటాకు కుదించి, సాధారణ మెరిట్ కలిగిన పేద వర్గాల విద్యార్థులు ప్రభుత్వ కోటా సీటు కోల్పోయే దుస్థితిని చంద్రబాబు ప్రభుత్వం సృష్టించింది. 2026–27 విద్యా సంవత్సరానికి కన్వీనర్ కోటా మొదటి విడత సీట్లను గురువారం ఆరోగ్య విశ్వవిద్యాలయం కేటాయించింది. ఈ క్రమంలో ఆంధ్ర యూనివర్సిటీ (ఏయూ) రీజియన్లో ఓపెన్ కేటగిరీలో కటాఫ్ ర్యాంక్ 71,547.. ఎస్వీయూ రీజియన్లో 94,966 ర్యాంక్కు చివరి సీటు దక్కింది. ఈ రెండు రీజియన్లలో ఓసీ కటాఫ్ కంటే ఎంతో మెరుగైన విద్యార్థులకు హెల్త్ యూనివర్సిటీ రిజర్వేషన్ కోటాలో సీట్లు కేటాయించింది. ఇలా ఏయూలో 43, ఎస్వీయూలో 27 మంది చొప్పున 70 మంది మెరిటోరియస్ విద్యార్థులకు ఓసీ విభాగంలో కాకుండా రిజర్వేషన్ కోటాలో ఎంబీబీఎస్ సీటు ఇచ్చారు. రెండు రీజియన్లలో సీట్ల కేటాయింపును పరిశీలిస్తే ఓసీ కటాఫ్ ర్యాంక్ల కంటే మెరుగ్గా 23,550, 30,307, 30,611, 31,325, 37,039 వంటి ర్యాంక్లు సాధించిన విద్యార్థులను సైతం రిజర్వేషన్ విభాగాల్లో సర్దుబాటు చేశారు. ఈ నేపథ్యంలో సాధారణ మెరిట్లోని రిజర్వేషన్ విద్యార్థుల్లో 70 మందికి నష్టం వాటిల్లిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సీట్ల కేటాయింపు హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాబు తెచ్చిన జీవో 102 ఫలితమే ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులో ప్రస్తుతం రిజర్వేషన్ విద్యార్థులకు జరిగిన అన్యాయానికి చంద్రబాబు సర్కారు తెచ్చిన జీవో 102 కారణమని ఆరోపణలు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో హైకోర్టు ఆదేశాలు, నిపుణుల కమిటీ సూచనలతో ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ కోసం జీవో 151 రూపొందించారు. గత విద్యా సంవత్సరం వరకు అదే జీవో ప్రకారం కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతూ వచ్చింది. ఇదిలా ఉండగా ఉన్నఫళంగా జీవో 151 రద్దు చేసి, జీవో 102ను బాబు సర్కారు ప్రవేశపెట్టింది. జీవో 151 ప్రకారం అన్ని రౌండ్ల కౌన్సెలింగ్కు విద్యార్థులు ఆప్షన్లు లాక్ చేసేవారు. అన్ని ప్రైవేటు, ప్రభుత్వ కళాశాలలను ప్రాధాన్యత క్రమంలో విద్యార్థులు ఎంచుకునేవారు. వీటి ఆధారంగా అన్ని రౌండ్లలో సీట్ల కేటాయింపు జరిగేది. ఈ నేపథ్యంలో ఓసీ కటాఫ్ కంటే ఉత్తమ ర్యాంక్ వచ్చిన బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఓపెన్లోనే సీట్లు ఇచ్చేవారు. ఫలితంగా రిజర్వేషన్ సీట్లు కింది ర్యాంకర్లకు దక్కేవి. పారదర్శకమైన ఈ విధానానికి పాతరేస్తూ చంద్రబాబు ప్రభుత్వం జీవో 102ను తీసుకొచ్చింది. తద్వారా విద్యార్థులు ప్రతి రౌండ్ కౌన్సెలింగ్కు ఆప్షన్లు నమోదు చేయాలని సూచించింది. అదే విధంగా అన్ని కాలేజీలు ఆప్షన్ల కింద ఎంపిక చేసుకోవాల్సిన పని లేదని తేల్చేసింది. ఇలా బాబు సర్కార్ తెచ్చిన మార్పులతో రిజర్వేషన్ విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. జీవో 102 రద్దు చేయాలి రిజర్వేషన్ విద్యార్థులు ఉత్తమ మెరిట్ సాధిస్తే వారికి ఓపెన్ కేటగిరీలో సీట్లు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయి. అయినప్పటికీ రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులో అన్యాయం చేశారు. ఇప్పటి వరకు సజావుగా, పారదర్శకంగా సాగిన సీట్ల కేటాయింపును జీవో 102తో గందరగోళం చేశారు. అసలు జీవో 151తో ఎవరికీ నష్టం లేదు. అయినా ప్రభుత్వం ఎందుకు రద్దు చేసిందో తెలియడం లేదు. ప్రభుత్వం వెంటనే రిజర్వేషన్ విద్యార్థులకు నష్టం చేస్తున్న జీవో 102 రద్దు చేసి, 151ని పునరుద్ధరించాలి. – డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ మెడికో పేరెంట్స్ అసోసియేషన్ జరిగిన తప్పును సరిదిద్దాలి సీట్ల కేటాయింపులో జరిగిన తప్పును ప్రభుత్వం వెంటనే సరిదిద్దాలి. నిబంధల ప్రకారం మెరిట్ విద్యార్థులకు ఓపెన్ కేటగిరీలో సీట్లు కేటాయించాలి. రిజర్వేషన్ విద్యార్థులకు నష్టం వాటిల్లకుండా చూడాలి. ఈ ప్రభుత్వ గందరగోళ నిర్ణయాలతో ఇప్పటికే 70 మంది రిజర్వేషన్ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. – డాక్టర్ అంబటి రాధాకృష్ణ, విజయవాడ -
విసిగి'వీసా'రి!
విదేశాల్లో చదువు.. మంచి యూనివర్సిటీ.. ఆ తర్వాత మంచి ఉద్యోగం. ఒకప్పుడు భారతీయ మధ్యతరగతి కుటుంబాల కలగా ఉన్న ఈ ఫార్ములాకు ఇప్పుడు జెన్ జెడ్ దూరం జరుగుతోంది. విదేశీ డిగ్రీలపై యువత ఆలోచన నెమ్మదిగా మారుతోంది.సాక్షి, అమరావతి: విదేశాల్లో చదువు.. మంచి యూనివర్సిటీ.. ఆ తర్వాత మంచి ఉద్యోగం. ఒకప్పుడు భారతీయ మధ్యతరగతి కుటుంబాల కలగా ఉన్న ఈ ఫార్ములాకు ఇప్పుడు జెన్ జెడ్ దూరం జరుగుతోంది. విదేశీ డిగ్రీలపై యువత ఆలోచన నెమ్మదిగా మారుతోంది. విదేశాలకు వెళ్లి చదవాలా? లేక అంతర్జాతీయ స్థాయి విద్యను భారత్లోనే పొందగలమా? అన్న అంశాన్ని కొత్త జెన్ జెడ్ బేరీజు వేస్తోంది. ఎడ్యుకేషన్ టెక్నాలజీ సంస్థ ఎమిరిటస్ విడుదల చేసిన ‘ఇండియా జెన్ జెడ్ ఔట్లుక్–2026: ది నో క్యాప్ జనరేషన్’ నివేదికలో ఈ మార్పు స్పష్టంగా కనిపించింది. 15 నుంచి 28 ఏళ్ల వయసున్న 1,010 మంది అభిప్రాయాలను విశ్లేషించి ఈ నివేదిక రూపొందించారు. వారిలో 48 శాతం మంది గత ఏడాదితో పోలిస్తే విదేశీ విద్యపై తమకు అంత ఆసక్తి లేదని తెలిపారు.ఖర్చే తొలి అడ్డంకివిదేశీ చదువు అంటే ట్యూషన్ ఫీజు మాత్రమే కాదు. వసతి, ఆహారం, ప్రయాణం, బీమా, రోజువారీ జీవన వ్యయం కూడా కలుస్తాయి. కుటుంబాలు విద్యా రుణాలపై ఆధారపడితే.. చదువు పూర్తయ్యాక వచ్చే ఆదాయంతో ఆ రుణాన్ని ఎంతకాలంలో తీర్చగలమన్నది కీలకంగా మారుతుంది. అందుకే జెన్ జెడ్ ఇప్పుడు యూనివర్సిటీ బ్రాండ్ కంటే పెట్టుబడి–ప్రతిఫలంపై ఎక్కువ దృష్టి పెడుతోంది. విదేశీ చదువుపై ఆసక్తి తగ్గడానికి 37 నుంచి 41 శాతం మంది ఖర్చులను కారణంగా పేర్కొన్నారు.వీసా, ఇమ్మిగ్రేషన్ నిబంధనల్లో అనిశ్చితే ఆటంకమని 26 నుంచి 34 శాతం మంది చెప్పారు. కుటుంబానికి దూరంగా ఉండటంపై 31 శాతం మంది, విదేశాల్లో భద్రత, రాజకీయ అనిశ్చితిపై 24 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కేవలం అభిప్రాయాల్లోనే కాకుండా వాస్తవంలోనూ ఆ మార్పు కనిపిస్తోంది. 2023లో సుమారు 8.95 లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాలకు వెళ్లగా, 2025లో ఈ సంఖ్య 6.19 లక్షలకు తగ్గిందనే గణాంకాలు వెలువడ్డాయి.విదేశీ విద్య కావాలి.. కానీ దేశం దాటకుండానేవిదేశాలకు వెళ్లే ఆసక్తి తగ్గుతున్నా అంతర్జాతీయ విద్యపై ఆసక్తి మాత్రం తగ్గడం లేదని ఈ నివేదికలో తేలింది. ప్రీ–కాలేజ్ విద్యార్థుల్లో 87 శాతం, ఉన్నత విద్యలోకి మారుతున్న విద్యార్థుల్లో 92 శాతం మంది భారత్లోనే అంతర్జాతీయ ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీ ప్రోగ్రామ్లను చదవడానికి సిద్ధంగా ఉన్నారు. వీసా సమస్యలు లేకుండా భారత్లోనే అంతర్జాతీయ ప్రోగ్రామ్ ఎంచుకోవడానికి విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. పీజీ విద్యను అభ్యసించాలనుకుంటున్న వారిలో 50 శాతం మంది మన దేశంలో పూర్తిగా క్యాంపస్ ఆధారిత అంతర్జాతీయ ప్రోగ్రామ్లపై మొగ్గు చూస్తున్నారు. హైబ్రిడ్ లేదా పాత్వే మోడల్పైనా ఆసక్తి పెరిగింది. అంటే మన దేశంలోనే చదువుతూ కొంతకాలం విదేశీ క్యాంపస్లో చదవడం లేదా అంతర్జాతీయ విద్యా అనుభవం పొందడం వంటి మార్గాలకు ఆదరణ పెరుగుతోంది.మన దేశానికి అవకాశం.. పరీక్ష కూడాఇది భారత ఉన్నత విద్యకు అవకాశమని విద్యా రంగ నిపుణులు చెబుతున్నారు. విదేశీ యూనివర్సిటీ క్యాంపస్లు, డ్యూయల్ డిగ్రీలు, ట్విన్నింగ్ ప్రోగ్రామ్లు, అంతర్జాతీయ భాగస్వామ్యాలు, హైబ్రిడ్ కోర్సులు పెరగడానికి ఇది అనుకూల వాతావరణాన్ని కల్పించవచ్చు. అయితే విదేశీ యూనివర్సిటీ పేరు భారత్లో ఉండటం ఒక్కటే సరిపోదని విశ్లేష్తున్నారు. నాణ్యమైన ఫ్యాకల్టీ, పరిశోధన, అంతర్జాతీయ గుర్తింపు, పరిశ్రమతో అనుసంధానం, ఇంటర్న్షిప్లు, ఉద్యోగ అవకాశాలు అందించగలిగితేనే ఈ మోడల్ నిజమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని స్పష్టం చేస్తున్నారు. జెన్ జెడ్ విదేశీ విద్యను తిరస్కరించడం లేదు. విదేశీ విద్య కోసం తప్పనిసరిగా విదేశాలకు వెళ్లాలనే భావనను మాత్రం ప్రశ్నిస్తోంది. నిన్నటి వరకు ఏ దేశానికి వెళ్లాలి? అన్నది ప్రశ్న అయితే.. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి విద్యను తక్కువ ఖర్చు, తక్కువ రిస్క్తో ఎక్కడ పొందగలం? అన్నదే అసలు లెక్కగా మారుతోంది. అమెరికాపైనా మారుతున్న లెక్కలుఅమెరికాను చదువుల గమ్యస్థానంగా భావించిన వారూ అక్కడికి వెళ్లడానికి ఇప్పుడు పెద్దగా ఇష్టపడడంలేదు. అమెరికా విద్యకు సంబంధించిన అధిక ఖర్చులు, వీసా ప్రక్రియ, చదువు తర్వాత పని చేసే అవకాశాలపై అనిశ్చితి వంటి అంశాలు కీలకంగా మారుతున్నాయి. విదేశీ విద్య నిర్ణయం ఇప్పుడు కేవలం ప్రతిష్టకు సంబంధించినది కాదనే విషయం కనిపిస్తోంది. ఎక్కడ చదివావు? అనే అంశం కంటే ఎంత ఖర్చు పెట్టి ఏం సాధించావు? అన్నదే ముఖ్యమవుతోందని ఎమిరిటస్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అశ్విన్ డామెరా తెలిపారు. -
రాజధాని రైతుల్లో పూలింగ్ గుబులు
తాడికొండ: రాజధాని రైతుల్లో పూలింగ్ గుబులు మొదలైంది. రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణాలతోపాటు రాజధాని వైపు ఉన్న భూముల అదనపు సేకరణకుగాను మంత్రివర్గ సమావేశం అనంతరం గురువారం రాత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. రైల్వేలైన్, ఇన్నర్ రింగ్రోడ్డు పేరుతో తాడికొండ, కంతేరు, కొప్పురావూరు గ్రామాల్లో అధికారులు ఇప్పటికే సాధారణ గ్రామసభ సమావేశాలు నిర్వహించి రైతుల అభిప్రాయాలు సేకరించారు. తాడికొండతోపాటు కంతేరు గ్రామ ప్రజలు కూడా మూకుమ్మడిగా తాము రైల్వేలైన్ ఇన్నర్ రింగ్ రోడ్డుకు భూములు ఇస్తామని, అదనంగా భూమి సమీకరణకు తాము వ్యతిరేకమని తేల్చిచెప్పారు. ఇవేమీ పరిగణనలోకి తీసుకోని ప్రభుత్వం, అధికారులు అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులతో చర్చించి రైతుల ప్రయోజనాలను పక్కనబెట్టి ప్రత్యేకాధికారులతో అనుకూలంగా తీర్మానం చేయించుకుని నోటిఫికేషన్ ఇచ్చిన వైనంపై రైతులు రగిలిపోతున్నారు. గ్రామసభ సమావేశాల్లో సైతం అదనపు సమీకరణను వ్యతిరేకిస్తున్నట్లు తాము ఎమ్మెల్యే, మంత్రి నారాయణ సాక్షిగా చెప్పామని.. అయినా, నోటిఫికేషన్ ఎలా ఇస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు.గతంలో భూములిచ్చిన రైతులకే ఇంతవరకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేక ప్రభుత్వం చేతులెత్తేసిందని.. కనీసం డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్, తాగునీరు సౌకర్యాలు సైతం కల్పించకపోవడంతో ఆ రైతులు ఇప్పటివరకు తమ ప్లాట్లు ఎక్కడున్నాయో అర్ధంకాక ఆందోళన చెందుతుంటే మళ్లీ తమ భూములకు ఎసరు పెట్టడం ఎంతవరకు సమంజసమని వారు ఆందోళన చెందుతున్నారు. పేదల నోట్లో మట్టికొట్టేందుకే.. ఇదిలా ఉంటే.. రైల్వేలైన్, ఇన్నర్ రింగ్ రోడ్డు పేరుతో వేల ఎకరాల భూ సమీకరణకు ప్రభుత్వం ఎత్తుగడ వేసిందని, లింగమనేని, హెరిటేజ్ భూములు సమీకరణకు మినహాయించి పేదల భూములకే బౌండరీ వేసి మరీ సమీకరణ చేయడం పేదల నోట్లో మట్టికొట్టేందుకేనని రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం వైఖరి చూస్తుంటే ఓ విధానం అంటూ లేకుండా ఉందని.. రైల్వేలైన్, ఇన్నర్ రింగ్ రోడ్డుకు లోపల ఉన్న కంతేరు, తాడికొండ రైతుల భూములకు ఎసరు పెట్టి కొప్పురావూరు గ్రామ భూములను మినహాయించడం వెనుక ఉన్న మతలబు ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ అదనపు భూ సమీకరణకు వ్యతిరేకంగా జిల్లా కలెక్టర్, సీఆర్డీయే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే దిశగా రైతులు సమాయత్తం అవుతున్నారు. దీనిపై వచ్చే సోమవారం గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. -
డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా?
విజయవాడ: డీఎస్సీ నియామకాల్లో, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా కింద జరిగిన నియామకాలపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పకుండా వార్తా ఛానళ్లు, ప్రతిపక్ష స్వరాలు, డిజిటల్ మీడియా ఖాతాలను లక్ష్యంగా చేసుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వైఎస్సార్సీపీ ఆరోపించింది.ప్రభుత్వంపై విమర్శలు చేసే మీడియా సంస్థల ఖాతాలను పరిమితం చేయడం పత్రికా స్వేచ్ఛపై దాడి అని పేర్కొంది. ఆరోపణల్లో నిజం లేదంటే వాస్తవాలతో సమాధానం చెప్పాలని, అవసరమైతే నిష్పక్షపాత విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేసింది. ఖాతాలను బ్లాక్ చేయడం ద్వారా ప్రశ్నలను, అసమ్మతిని అణచివేయలేరని.. డీఎస్సీ నియామకాలపై ఉన్న అనుమానాలకు సమాధానం చెప్పాల్సిందేనని వైఎస్సార్సీపీ స్పష్టం చేసింది. -
ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారు?
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ 2025 స్కామ్లో అర్హత లేనివారికి ఉద్యోగాలు కట్టబెట్టారంటూ వరుసగా ఎన్నో సాక్ష్యాలు బయటకు వస్తున్నా ఈ వ్యవహారాన్ని సీబీఐ విచారణకు ఇవ్వకుండా ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారని సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ‘కర్నూలు జిల్లాలో ఒక అభ్యర్థి టెట్లో క్వాలిఫై కాకపోయినా స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీ పోస్టు ఎలా ఇచ్చారు?వన్ టు వన్ ప్రకారం సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి మరీ, అర్హత లేదని తెలిసి కూడా పోస్టు ఎలా ఇచ్చారు? దరఖాస్తు దశలోనే రిజెక్ట్ కావాల్సిన వ్యక్తి ఆ తర్వాత దశలు కూడా దాటి ఉద్యోగం ఎలా పొందగలిగాడు? అధికారుల చేత ఈ పని చేయించిన ఆ అదృశ్య శక్తి ఎవరు? లోకేశ్ కాదంటారా? డీఎస్సీ 2025లో ఇలాంటి అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు ఎన్నో ఉన్నాయి..’ అని స్పష్టం చేశారు. ఈమేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆధారాలను ట్యాగ్ చేస్తూ శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. అందులో ఏమన్నారంటే... ఇంకా దాక్కుంటారా..? ఇంకెన్నాళ్లు యువకులను మోసం చేస్తారు? మీరు నిర్వహించిన డీఎస్సీ.. మోసాల్లో మెగా, నిజాయితీపరులైన అభ్యర్థుల పాలిట దగా అని తేలిపోతుంటే మీరు, మీ సుపుత్రుడు దాక్కోవడం ఎందుకు? ఈ స్కామ్కు బాధ్యత వహిస్తూ, విద్యాశాఖ మంత్రి లోకేశ్తో రాజీనామా చేయించకుండా.. అధికార బలంతో అబద్ధాలు చెబుతూ, పబ్లిసిటీ గిమ్మిక్కులు చేస్తూ కుమారుడిని కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఆ అదృశ్య శక్తి లోకేశ్ కాదంటారా? కర్నూలు జిల్లాలో ఒక అభ్యర్థికి తన కేటగిరీ ప్రకారం టెట్లో 75 మార్కులు రావాల్సి ఉండగా 65 మార్కులే వచ్చినా స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీ పోస్టు ఎలా ఇచ్చారు? వన్ టు వన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి మరీ అర్హత లేదని తెలిసి కూడా పోస్టు ఎలా ఇచ్చారు? దరఖాస్తు దశలోనే రిజెక్ట్ కావాల్సిన వ్యక్తి ఆ తర్వాత దశలు కూడా దాటి ఉద్యోగం ఎలా పొందగలిగాడు? అధికారుల చేత ఈ పని చేయించిన ఆ అదృశ్య శక్తి ఎవరు? లోకేశ్ కాదంటారా? రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో డీఎస్సీ 2025లో ఇలాంటి అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు ఎన్నో ఉన్నాయి.చంద్రబాబూ..! ఇలాంటి పరిస్థితుల్లో మీ ప్రభుత్వమే అధికారంలో ఉండగా, మీ అధికారులతో చేసే విచారణలు నిజాయితీగా, స్వతంత్రంగా జరుగుతాయా? మీ కుమారుడు రాజీనామా చేయాల్సిన పరిస్థితుల్లో, మీ కింద పనిచేసే అధికారులు స్వతంత్రంగా నడుచుకోగలరా? అందుకే డీఎస్సీ రిక్రూట్మెంట్పై సీబీఐ విచారణ చేయించాలని మేం మొదటి నుంచీ పట్టుబడుతున్నాం. నిజాయితీపరులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా కోర్టులోనూ పోరాడుతున్నాం. ఈ దారుణమైన స్కామ్ను కప్పిపుచ్చలేరు ఇన్ని అక్రమాలు జరిగాయి కాబట్టే.. వీటి వెనుక మీరు, మీ సుపుత్రుడు ఉన్నారు కాబట్టే మీరు సీబీఐ విచారణకు అంగీకరించడం లేదు. ఉద్యోగాలు పొందిన వారితో ర్యాలీలు చేయించి మీకు డబ్బా కొట్టించుకోవడం ద్వారా నిజాయితీపరులైన ఉద్యోగార్థులను దెబ్బ తీసిన ఈ దారుణమైన స్కామ్ను కప్పిపుచ్చలేరు. పారదర్శకంగా పరీక్షలు, నిష్పక్షపాతంగా ఉద్యోగ నియామకాల కోసం పోరాడుతున్న ఉద్యోగార్థులు, యువకులకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ అండగా నిలుస్తుందని మరోమారు భరోసా ఇస్తున్నాం. లీకేజీ వ్యవహారం నుంచి స్పోర్ట్స్ కోటా వరకు.. టెట్ అర్హతల నుంచి పోస్టింగ్ ఆర్డర్ల వరకు.. మొత్తంగా మెగా డీఎస్సీ వ్యవహారాన్ని, జీవో నంబర్ 4 ఆధారంగా నడిచిన నియామకాలన్నింటినీ సీబీఐకి అప్పగించాలని మరోమారు డిమాండ్ చేస్తున్నా.మీ అక్రమాలను ఏపీపీఎస్సీకి పాకించారు..మరో నిర్ఘాంతపరిచే విషయం ఏమిటంటే.. పరీక్షలు లేకుండానే టీచర్ పోస్టులు కట్టబెట్టిన మీరు, మీ అక్రమాల విధానాన్ని డీఎస్సీ నుంచి ఏపీపీఎస్సీకి కూడా పాకించడం. మా హయాంలో ఫైనాన్స్ క్లియరెన్స్ పొందిన అటవీ శాఖలోని 814 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసి మెయిన్స్ పరీక్షలు పూర్తి చేసిన తర్వాత, అందులో 40 స్పోర్ట్స్ కోటా పోస్టులను పరీక్ష లేకుండా కేవలం సర్టిఫికెట్ల ఆధారంగా భర్తీ చేసేందుకు డీఎస్సీలో ఉపయోగించిన జీవో నంబర్ 4నే మీరు వాడుకున్న మాట వాస్తవం కాదా? డీఎస్సీ అక్రమాలు బయటపడగానే ఇవి కూడా వెలుగులోకి వస్తాయనే భయంతో రిక్రూట్మెంట్ను మధ్యలో ఆపేయడంతోపాటు ఈ 40 పోస్టుల జాబితా బయటపడితే బాగోతం బయటపడుతుందనే ఉద్దేశంతో మిగిలిన 774 పోస్టుల భర్తీని కూడా నిలిపివేయడం వాస్తవం కాదంటారా? .@ncbn గారూ… మెగా డీఎస్సీ స్కాంలో అర్హత లేనివారికి ఉద్యోగాలు కట్టబెట్టారంటూ సాక్ష్యాలు బయటకు వస్తున్నా, ఈ వ్యవహారాన్ని సీబీఐ విచారణకు ఇవ్వకుండా ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారు? ఇంకెన్నాళ్లు యువకులను మోసం చేస్తారు? మీరు నిర్వహించిన డీఎస్సీ మోసాల్లో “మెగా”, నిజాయితీపరులైన అభ్యర్థుల… pic.twitter.com/8dkiPMnKjk— YS Jagan Mohan Reddy (@ysjagan) September 4, 2026 -
‘ఒక్కొక్కటిగా బయటపడుతున్న లోకేష్ బండారం’
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వ హయాంలో చేపట్టింది మెగా డీఎస్సీ కాదని, యువగళం డీఎస్సీ అంటూ మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం చేసిన పాపాలను ఎల్లకాలం దాచిపెట్టలేరని, రోజుకో నిజం బయటపడుతోందని విమర్శించారు. రాష్ట్రంలో వెలుగులోకి వస్తున్న డీఎస్సీ అక్రమాలపై శుక్రవారం తాడేపల్లి వైఎస్సార్సీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్న తమ అనుచరులకు, కార్యకర్తలకే స్పోర్ట్స్ కోటా పేరిట అక్రమంగా ఉపాధ్యాయ ఉద్యోగాలు కట్టబెట్టారు. కనీసం టెట్ అర్హత సాధించని వారికి, తక్కువ మార్కులు వచ్చిన వారికి కూడా ఉద్యోగాలు ఎలా కట్టబెట్టారో మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలి. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నిబంధనను కఠినంగా వర్తింపజేస్తూ, తమ యువగళం టీచర్లకు మాత్రం ఎలాంటి అర్హతలూ లేకపోయినా మినహాయింపు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు.కర్నూలు జిల్లాలో ప్రారంభమైన ఈ అక్రమాల డొంక ఇప్పుడు రాష్ట్రంలోని మిగతా జిల్లాలకూ విస్తరిస్తోంది. కౌతాళం మండలంలోనే ఏకంగా 24 మంది, ఒకే చోట ఐదుగురు స్పోర్ట్స్ కోటా టీచర్లు పనిచేస్తున్నారు. రాష్ట్రంలో ఆదరణ లేని జూడో ఆట పేరుతో నకిలీ సర్టిఫికేట్లు సృష్టించి దాదాపు 30 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అలాగే చిత్తూరు జిల్లాలో కేవలం 79 మార్కులు వచ్చిన వారికి, తూర్పు గోదావరి జిల్లాలో అసలు అర్హతే లేని వారికి నియామకాలు చేపట్టారు. ఇటువంటి ఉపాధ్యాయులు రేపటి తరం పిల్లలకు ఏం పాఠాలు చెబుతారని ఆవేదన వ్యక్తం చేశారు.స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) పూర్తిగా అవినీతి అడ్డాగా మారింది. క్రీడా సర్టిఫికేట్లను కనీసం వెరిఫికేషన్ చేయకుండా నియామకాలు ఎలా పూర్తి చేస్తారని పేర్ని నాని మండిపడ్డారు.చంద్రబాబు, లోకేష్లకు ధైర్యముంటే స్పోర్ట్స్ కోటా కింద ఎంపికైన టీచర్ల జాబితాను, వారి సర్టిఫికేట్లను వెంటనే బహిర్గతం చేయాలని సవాల్ విసిరారు. మెగా డీఎస్సీలో జరిగిన ఈ భారీ కుంభకోణంపై ప్రభుత్వం తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని, ఈ అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే ప్రభుత్వం మరో డీఎస్సీ అంటూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పెదకాకానిలో టెన్షన్.. టెన్షన్
సాక్షి, గుంటూరు: పెదకాకానిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అమ్మవారి మంగళసూత్రం మాయంపై వైఎస్సార్సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. పెదకాకాని శ్రీభ్రమరాంబ అమ్మవారికి నాంతాడు కానుకగా సమర్పించేందుకు పొన్నూరు వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణ సిద్ధమయ్యారు. అంబటి మురళీకృష్ణను అడ్డుకోవాలని టీడీపీ నాయకులు ప్లాన్ చేశారు. పెదకాకాని ఆలయానికి టీడీపీ నాయకులు భారీగా చేరుకున్నారు. అంబటి మురళి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కోన రఘుపతిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారుమల్లాది విష్ణు కారుపై దాడికి చేసేందుకు టీడీపీ కార్యకర్తలు యత్నించారు. పోలీసులు భారీగా మోహరించారు. అమ్మవారి మంగళసూత్రం మాయం నేపథ్యంలో శ్రీభ్రమరాంబ అమ్మవారికి ఇవాళ నాంతాడు సమర్పిస్తానని వారం రోజులు క్రితమే అంబటి మురళి ప్రకటించారు. అంబటి మురళితో పాటు కొంతమంది భక్తులు కొత్త నాంతాడు తయారు చేయించారు. అయితే, వైఎస్సార్సీపీ నేతలను ఆలయం వైపు వెళ్లకుండా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. -
గర్జించిన ఉపాధ్యాయులు
సాక్షి, అమరావతి/మంగళగిరి రూరల్: చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ఉపాధ్యాయులు ఆగ్రహోదగ్రులయ్యారు. ‘లోకేశ్ రాజీనామా చేస్తావా.. లేక టెట్ రద్దు చేస్తావా’ అంటూ గర్జించారు. ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్నుంచి మినహాయింపు ఇవ్వాలన్న డిమాండ్తో గురువారం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులోని స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ కార్యాలయాన్ని (విద్యాభవన్)ముట్టడించేందుకు వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన ఉపాధ్యాయులపై చంద్రబాబు సర్కారు ఉక్కుపాదం మోపింది. పోలీసులను ప్రయోగించి వారి గొంతునొక్కే ప్రయత్నం చేసింది. విద్యాభవన్కు టీచర్లు చేరుకోకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టించింది. సర్వీసు రోడ్లను సైతం మూసివేయించింది. పోలీసులు అడుగడుగునా తనిఖీలు చేస్తూ విద్యాభవన్ వైపు ఉపాధ్యాయులు వెళ్లకుండా అడ్డుకుని అరెస్ట్లు చేశారు. 150 మందికి పైగా ఉపాధ్యాయులను అరెస్ట్ చేసి వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. టీచర్లంటే అంత నిర్లక్ష్యమా! కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు తమ ఆవేదనను ఎందుకు పట్టించుకోవడం లేదని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘టీచర్లంటే అంత నిర్లక్ష్యమా బాబూ’ అంటూ మండిపడ్డారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు ఉపాధ్యాయులను ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో వారంతా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దాదాపు 30 ఏళ్లు సర్వీసు పూర్తిచేసిన తాము టెట్ పూర్తి చేయకపోతే ఉద్యోగం వదులు కోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో నిరసనలు చేపట్టామని.. బైక్ ర్యాలీలు నిర్వహించినా ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో చలో విద్యాభవన్కు సిద్ధమయ్యామని తెలిపారు. పీఆర్సీ వేయకపోయినా, ఐఆర్, డీఏలు ఇవ్వకపోయినా ప్రశ్నించని తాము ఉద్యోగ భద్రత కోసం విధిలేని పరిస్థితుల్లో రోడ్డెక్కాల్సి వచ్చిందని వాపోయారు. ఉపాధ్యాయుల పట్ల ఇంత నిర్లక్ష్యం ఎందుకని ప్రశి్నంచారు. తమిళనాడు ప్రభుత్వం ఇన్ సర్వీసు టీచర్లకు టెట్ మినహాయించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిందని, ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ప్రభుత్వం స్పందించి రాతపూర్వకంగా హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. పోలీసులను ప్రయోగించి నిర్భందించడం తమ గొంతు నొక్కడమేనని వాపోయారు. అవసరమైతే నిరవధిక దీక్షలు చేపడతామని హెచ్చరించారు. టీచర్ల ఆందోళనకు పీడీఎఫ్ ఎమ్మెల్సీ గోపిమూర్తి, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో యూటీఎఫ్ అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్, గౌరవాధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, సహాధ్యక్షురాలు కుసుమకుమారి, కార్యదర్శి మనోహర్కుమార్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.ప్రధాన డిమాండ్లు ఇవీ⇒ ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయించాలి ⇒ విద్యాహక్కు చట్టంలోని 23(1) సవరించాలి⇒ టెట్ ఆఫ్లైన్ విధానంలో నిర్వహించాలి ⇒ బోధిస్తున్న సబ్జెక్టుపైనే టెట్ నిర్వహించాలి⇒ టెట్ మినహాయించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి -
స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా, ఎదుర్కొనేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు ఇప్పటినుంచే పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని ఆ పార్టీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీ, పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్లమెంటరీ పరిశీలకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులతో గురువారం ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ (సర్) ప్రక్రియ, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత, పార్టీ ఐడీ కార్డుల పంపిణీ, ‘వెన్నుపోటు పార్టీ–వెన్నుపోటు పాలన’పై ప్రచారం తదితర అంశాలపై నేతలకు ఆయన దిశా నిర్దేశం చేశారు. సర్ ప్రక్రియకు లభించిన అదనపు పది రోజుల గడువును పూర్తిగా సద్వినియోగం చేసుకుని, ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, పెండింగ్ అంశాలను పరిష్కరించుకోవాలని సూచించారు. డూప్లికేట్ ఓటర్ల జాబితాలను బూత్ స్థాయి ఏజెంట్లతో మరోసారి పరిశీలించాలని, మన ఓటర్లు పొరపాటున తొలగించబడి ఉంటే ఫారమ్–6 ద్వారా తిరిగి చేర్పించే ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పారు. ‘వివిధ సామాజిక వర్గాల నుంచి వచ్చే సూచనలను పరిశీలించి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించాలి. జిల్లా స్థాయి నుంచి అసెంబ్లీ నియోజకవర్గం, మండలం, గ్రామ స్థాయి వరకు సమావేశాలు నిర్వహించాలి. ప్రతి యూనిట్లో పార్టీ పరిస్థితి, స్థానిక సమస్యలు, ఎన్నికల సన్నద్ధతపై చర్చ జరగాలి. ప్రతి కార్యక్రమానికి పక్కా క్యాలెండర్ ఉండాలి. సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలి. మనం సిద్ధంగా ఉన్నామనే స్పష్టమైన సందేశం ప్రజల్లోకి వెళ్లాలి. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులంతా సమన్వయంతో ముందుకు సాగాలి’ అని సజ్జల పిలుపునిచ్చారు. -
పోలవరానికి మరో ద్రోహం కుడి ఎడమల దగా!
సాక్షి, అమరావతి : రాష్ట్రానికి జీవనాడిగా అభివర్ణిస్తున్న పోలవరం జాతీయ ప్రాజెక్టుకు చంద్రబాబు సర్కార్ మరో ద్రోహం చేసింది. ఇప్పటికే నీటి నిల్వ మట్టాన్ని 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గిస్తూ 2024 ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరించడం ద్వారా పోలవరం రిజర్వాయర్ను బ్యారేజ్గా మార్చేసింది. తాజాగా కుడి కాలువ సామర్థ్యం 11 వేల క్యూసెక్కులు, ఎడమ కాలువ సామర్థ్యం 8 వేల క్యూసెక్కులతో చేపట్టిన పనులకే బిల్లులు ఇస్తామని కేంద్ర జల్ శక్తి శాఖ తేల్చి చెప్పినప్పటికీ నోరు మెదపక పోవడం విస్తుగొలుపుతోంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు 8 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా 17,580 క్యూసెక్కుల సామర్థ్యంతో పోలవరం ఎడమ కాలువను, కృష్ణా డెల్టాకు నీటి కరువన్నదే లేకుండా చేసేందుకు 17,560 క్యూసెక్కుల సామర్థ్యంతో కుడి కాలువను 2004లో చేపట్టారు. విభజన నేపథ్యంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం.. తాజా ధరల మేరకు సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు 2017 ఆగస్టు 17న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిన రెండో సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదన (డీపీఆర్–2)లో కుడి కాలువ సామర్థ్యాన్ని 11 వేలు, ఎడమ కాలువ సామర్థ్యాన్ని 8 వేల క్యూసెక్కులుగా తప్పుగా పేర్కొంది. దాని ఫలితంగానే కేంద్ర జల్ శక్తి శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.4,753.93 కోట్ల భారం పడుతుందని జల వనరుల శాఖ అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చిరకాల స్వప్నం సాకారమైన వేళ.. గోదావరిపై పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రతిపాదన 1941లో వచి్చనా, 2004 వరకు ఆ ప్రాజెక్టు పనులు చేపట్టే సాహసం ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టును సాకారం చేస్తూ నిర్మాణ పనులు చేపట్టారు. కొత్తగా 3.2 లక్షల ఎకరాలకు నీళ్లందించడంతోపాటు 80 టీఎంసీలను మళ్లించి కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేలా 17,560 క్యూసెక్కుల సామర్థ్యంతో కుడి కాలువను చేపట్టారు. కొత్తగా 4 లక్షల ఎకరాలకు నీళ్లందించడం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 63.2 టీఎంసీను మళ్లించి 8 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా 17,580 క్యూసెక్కుల సామర్థ్యంతో ఎడమ కాలువను చేపట్టారు. గోదావరి ట్రిబ్యునల్ అనుమతి మేరకు 45.72 మీటర్లు (150 అడుగులు) గరిష్ట నీటి మట్టంతో 194.6 టీఎంసీల నీటి నిల్వ.. 960 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్కేంద్రం.. 449.78 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి డెల్టాలో 10.13 లక్షల ఎకరాలను స్థిరీకరించడంతోపాటు విశాఖపట్నం పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు 23.44 టీఎంసీలు.. కుడి, ఎడమ కాలువల సమీపంలోని 540 గ్రామాల్లోని 28.50 లక్షల మంది దాహార్తి తీర్చేలా ఈ ప్రాజెక్టును చేపట్టారు. డీపీఆర్–2లో తప్పుల పర్యవసానమే.. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం.. అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించడంతోపాటు అన్ని రకాల అనుమతులు తీసుకుని, వంద శాతం వ్యయంతో తామే నిర్మించి ఇస్తామని రాష్ట్రానికి హామీ ఇచ్చింది. ఆ మేరకు విభజన చట్టంలో సెక్షన్–90లో స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టడం కోసం పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ)ను 2014 మే 28న ఏర్పాటు చేసింది. 2015 మార్చి 12న నిర్వహించిన తొలి సర్వసభ్య సమావేశంలోనే.. తాజా ధరల మేరకు పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలు ఇవ్వాలని అప్పటి పీపీఏ సీఈవో దినేష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కానీ.. సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనను సమర్పించడంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసింది. ఎట్టకేలకు 2017 ఆగస్టు 17న రెండో సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను పీపీఏకు సమర్పించింది. ఆ ప్రతిపాదనల్లో కుడి, ఎడమ కాలువ సామర్థ్యాన్ని తప్పుగా పేర్కొంది. ఇదే అంశాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎత్తిచూపింది. విభాగాల వారీగా విధించిన పరిమితులను ఎత్తేసి.. తాజా ధరలు, పనుల పరిమాణాల ఆధారంగా ప్రాజెక్టు పనులకు అయ్యే వ్యయాన్ని రీయింబర్స్ చేయాలన్న విజ్ఞప్తికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అంగీకరించారు. ఆ మేరకు నిధులు ఇస్తామని స్పష్టం చేస్తూ 2023 జూన్ 5న నోట్ జారీ చేశారు. కానీ.. ఇప్పుడు కుడి కాలువ సామర్థ్యం 11 వేలు, ఎడమ కాలువ సామర్థ్యం 8 వేల క్యూసెక్కులతో చేపట్టిన పనులకే బిల్లులు ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది.కళ్లముందు కరిగిపోతున్న స్వప్నం నీరు నిల్వ చేసే ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించడం వల్ల పోలవరం రిజర్వాయర్ బ్యారేజ్గా మారిపోయింది. గోదావరికి వరద వచ్చే రోజుల్లో మాత్రమే కుడి, ఎడమ కాలువలు.. పుష్కర, తాడిపూడి ఎత్తిపోతల కింద ఉన్న 1.58 లక్షల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే నీళ్లందించడానికి అవకాశం ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు కింద మిగతా 5.62 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదు. కృష్ణా డెల్టాలో 13.06 లక్షల ఎకరాలు, గోదావరి డెల్టాలో 10.50 లక్షల ఎకరాల స్థిరీకరణ అసాధ్యమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం, విశాఖ పారిశ్రామిక, తాగు నీటి అవసరాలకు నీళ్లందించడం వీలు కాదని స్పష్టం చేస్తున్నారు. జల విద్యుదుత్పత్తి పూర్తి స్థాయిలో చేపట్టడమూ అసాధ్యమే. అంటే కళ్ల ముందే చిరకాల స్వప్నం కరిగిపోతుండటంతో రైతులు, సాగు నీటిరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించడం ద్వారా భూసేకరణ, పునరావాస వ్యయం రూపంలో ఇప్పటికే రూ.23,622 కోట్లను కేంద్రం మిగుల్చుకుంది. తాజాగా కుడి, ఎడమ కాలువ పనుల పరిమాణాన్ని తగ్గించడం ద్వారా మరో రూ.4,753.98 కోట్లనూ మిగుల్చుకుందని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. -
టెట్ ఫెయిలైనా టీచరే..!
కర్నూలు సిటీ: మెగా డీఎస్సీ 2025లో అక్రమాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేసిన పోస్టుల్లో పలువురు అర్హతలు లేకపోయినా తప్పుడు మార్గాల్లో ఉద్యోగాలు పొందినట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలం వల్లూరు ఎంపీపీఎస్ స్కూల్లో మెగా డీఎస్సీ ద్వారా సెకండ్ గ్రేడ్ టీచర్గా ఎంపికై విధులు నిర్వహిస్తున్న ఈ.ప్రభాకర్ విద్యార్హతలపై మీడియా, సోషల్ మీడియాలో వి్రస్తృతంగా ప్రచారం జరగడంతో నాలుగైదు రోజులుగా ఆయన సెలవులో ఉన్నారు. కౌతాళం ఎంఈవో, కర్నూలు డీఈవో ఆఫీస్లో నిర్వహించిన విచారణలో టెట్ పరీక్షలో అర్హత మార్కులు సాధించకుండానే ఆయన టీచర్గా ఎంపికైనట్లు నిర్ధారణ అయ్యింది. జిల్లాలో 21 మంది స్పోర్ట్స్ జూడో కోటాలో టీచర్ పోస్టులు పొందారు. వీరిలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఏడుగురు ఉన్నారు. వీరంతా బంధువులు కావడం గమనార్హం. ఇక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు సమర్పించిన వారిలో అనర్హులు ఉన్నట్లు కొందరు అభ్యర్థులు కోర్టును సైతం ఆశ్రయించారు. టెట్ క్వాలిఫై కాకున్నా టీచర్గా ఎంపిక చేసిన శాప్.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మెగా డీఎస్సీ ద్వారా 1,697 ఎస్జీటీ, 786 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 79 మున్సిపల్ టీచర్ పోస్టులు, 28 ట్రైబల్ వెల్ఫేర్ టీచర్ పోస్టులు భర్తీ చేశారు. స్పోర్ట్స్ కోటా కింద ఎస్జీటీ 48 (తెలుగు మీడియం), 3 పోస్టులు (ఉర్దూ మీడియం), లాంగ్వేజెస్ పోస్టులు 6, స్కూల్ అసిస్టెంట్ టీచర్లు గణితం 2, ఫిజికల్ సైన్స్ ఒక పోస్టు, బయోలాజికల్ సైన్స్ 2, సోషల్ స్టడీస్ 3, ఫిజికల్ ఎడ్యుకేషన్ 5 పోస్టులకు శాప్ అభ్యర్థులను ఎంపిక చేసి జిల్లా విద్యాశాఖకు పంపింది. ఆ జాబితాలో ఉన్న వారందరికీ పోస్టింగ్స్ ఇచ్చారు. వెల్దుర్తి మండలం రత్నపల్లికి చెందిన ఈ.ప్రభాకర్ వల్లూరు ఎంపీపీఎస్లో ఎస్జీటీ టీచర్గా పోస్టింగ్ పొందారు. ఆయన హాకీ క్రీడాకారుడుగా సర్టిఫికెట్ సమర్పించారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీ పోస్టు పొందాలంటే టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. ప్రభాకర్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో టెట్లో తప్పనిసరిగా 60 శాతం మార్కులు అంటే 75 మార్కులు సాధించాలి. కానీ డీఎడ్ తరువాత 2022లో రాసిన టెట్లో (హాల్టికెట్ నెంబరు: టీఈటీ 22265677) పేపర్–1 ఏలో ఆయనకు 65.4281 మార్కులు మాత్రమే వచ్చాయి. 2024లో (హాల్ టికెట్ నెంబరు: టీఈటీ 7240454497) 66.83274 మార్కులు సాధించారు. అదే ఏడాది మరోసారి నిర్వహించిన టెట్లో (హాల్ టికెట్ నెంబరు: టీఈటీ 241187876) ఆయన 61.81213 మార్కులు పొందారు. 2025లో నిర్వహించిన టెట్లో 51.7424 మార్కులు మాత్రమే వచ్చాయి. కానీ స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేసిన శాప్.. టెట్ 2022లో ఆయనకు వచ్చిన 65.4281 మార్కులకు అర్హుడిగా నిర్ధారిస్తూ ఎస్జీటీ పోస్టుకు ఎంపిక చేయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బీసీలు టెట్లో 75 మార్కులు వస్తేనే అర్హులు. కానీ ప్రభాకర్కు కనీస అర్హత మార్కులు లేకున్నా టీచర్ పోస్టుకు శాప్ ఎంపిక చేయడం గమనార్హం. చర్యలకు డీఈవో సిఫారసు..! మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీ పోస్టుకు ఎంపికైన ఈ.ప్రభాకర్ విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను కర్నూలు డీఈఓ ఆఫీసులో డిప్యూటీ డీఈఓ శ్రీధర్బాబు, కల్లూరు ఎంఈఓ–2 వనజాకుమారి బుధవారం పరిశీలించారు. ప్రభాకర్ టెట్ పేపర్–1ఏలో అర్హత మార్కులు పొందలేదని, ఈ విషయాన్ని ఆయనే అంగీకరించారని, తదుపరి చర్యల నిమిత్తం సీసీఏ నిబంధనలను అనుసరించి పాఠశాల విద్య డైరెక్టర్కు నివేదిక ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు. అనర్హులను తొలగించాలి.. టెట్లో క్వాలిఫై కాని వ్యక్తిని మెగా డీఎస్సీలో టీచర్ ఉద్యోగానికి ఎంపిక చేసి అర్హులకు అన్యాయం చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన వారితో పాటు మెగా డీఎస్సీలో ఎంపికైన వారందరి సర్టిఫికెట్లను క్షుణ్ణంగా పరిశీలించాలి. అర్హత లేని వారిని తొలగించి, అర్హులకు ఉద్యోగ అవకాశం కల్పించాలి. – కె.సతీష్, బహుజన టీచర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.. స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీపై ఎన్ని ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? మెగా డీఎస్సీపై సిట్టింగ్ జడ్జితో విచారించాలి. ఇన్ సర్వీస్ టీచర్లు తప్పనిసరిగా టెట్లో అర్హత పొందాల్సిందేనని చెబుతున్న ప్రభుత్వం మెగా డీఎస్సీలో అనర్హులను ఎలా ఎంపిక చేస్తుంది? స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లన్నీ మరోసారి వెరిఫై చేయాలి. స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీలో అక్రమాలకు వల్లూరు స్కూల్ టీచర్ ఉదంతమే ఉదాహరణ. – కె.భాస్కర్, పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు -
బాగా చూసుకున్నందుకు బాబు బొనాంజా!
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కు పాల్పడి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉండగా చంద్రబాబును బాగా చూసుకున్నందుకు జైలర్ కోవెల దుర్గా రమేష్కు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఏపీ ఎక్సైజ్ సర్వీస్ రూల్స్ సడలించి మరీ ఆయన్ను అసిస్టెంట్ ప్రొహిబిషన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ఏపీఈఎస్)గా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముఖేష్కుమార్ మీనా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.బాబు ఉన్న బ్లాక్కు ఇన్చార్జిగా..స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసులో అరెస్టు అయిన చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉండటం తెలిసిందే. 2023 సెప్టెంబర్ 9న సీఐడీ చంద్రబాబును అరెస్ట్ చేసింది. విజయవాడ ఏసీబీ కోర్టు ఆయనకు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 2023 అక్టోబర్ 31న విడుదలయ్యే వరకు 52 రోజులపాటు సెంట్రల్ జైలులో చంద్రబాబును ఉంచిన జైలు బ్లాక్కు దుర్గా రమేష్ ఇన్చార్జిగా వ్యవహరించారు. రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు చంద్రబాబును చక్కగా చూసుకున్నందుకే నిబంధనలు సడలించి మరీ దుర్గా రమేష్ను నియమించినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.స్పెషల్ కేస్ పేరుతో నిబంధనలు సడలించి..దుర్గా రమేష్ 2010లో డిప్యూటీ జైలర్గా నియమితులు కాగా 2017లో జైలర్గా పదోన్నతి పొంది ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కోసం చంద్రబాబు సర్కారు ఏకంగా నిబంధనలు సడలించడం చర్చనీయాంశంగా మారింది. సమాజానికి ప్రత్యక్షంగా సేవ చేసేందుకు తన సేవలను ఎక్సైజ్ శాఖకు శాశ్వత ప్రాతిపదికన మార్చాల్సిందిగా కోరుతూ ఆయన చేసిన అభ్యర్థనను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఎక్సైజ్ సర్వీస్ నిబంధనలు సాధారణంగా ఇతర శాఖల వారిని నేరుగా ఈ పోస్టుల్లోకి తీసుకోవడానికి అనుమతించవు. దీంతో ఏపీ ఎక్సైజ్ సర్వీస్ రూల్స్ కేటగిరీ–4 కింద రూల్ 2 సడలిస్తూ ‘స్పెషల్ కేస్‘ కింద ప్రభుత్వం ఈ నియామకం చేపట్టడం గమనార్హం. -
వరికి బదులు ఆరుతడి పంటలు వేసుకోండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే రెండు నెలలు కరువు మరింత తీవ్రతరమవుతుందని, ఈ నేపథ్యంలో వరి పంటకు బదులు ఆరుతడి పంటలు వేసుకోవాలని రైతులకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సూచించింది. దేశంలోనే కరువు తీవ్రతలో ఆంధ్రప్రదేశ్ మొదటి లేదా రెండో స్థానంలో ఉందని, ఇప్పటికే 52 శాతం లోటు వర్షపాతం నమోదైందని సమాచార శాఖ మంత్రి కె.పార్థసారథి తెలిపారు. గురువారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కరువు పరిస్థితులపై చర్చించినట్లు మంత్రి పార్థసార«థి మీడియా సమావేశంలో చెప్పారు. కరువు తీవ్రత నేపథ్యంలో పంటలు ఎండిపోకుండా, నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ ఆరుతడి పంటలు వేసేలాగ రైతులకు అవగాహన కల్పించాలని సీఎం సూచించినట్లు మంత్రి చెప్పారు. సాధారణంగా ఖరీఫ్లో ఇప్పటికే 90 శాతం నాట్లు పడాల్సి ఉండగా కేవలం 60 శాతమే నాట్లుపడ్డాయని మంత్రి చెప్పారు. ఆరుతడి పంటలకు 90వేల కిలోల విత్తనాలు సబ్సిడీపై సరఫరా చేయడానికి గాను రూ.90 కోట్ల మంజూరు చేయాల్సిందిగా సీఎం అధికారులను ఆదేశించారని మంత్రి పేర్కొన్నారు. పంటలను కాపాడేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో సమగ్ర ప్రతిపాదనలు సమర్పించాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. పశుగ్రాసం, తాగునీటికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. 14,829 నివాస ప్రాంతాల్లోని 3.93 కోట్ల ప్రజలకు తాగునీటికి ఇబ్బంది లేకుండా ఏదో ఒక రూపంలో చర్యలు తీసుకోనున్నట్లు ఆయన చెప్పారు. అవసరమైతే కొత్త బోర్లు వేయడం లేదా ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయడం, అవసరమైతే ట్యాంకర్లను పొరుగు రాష్ట్రాల నుంచి అద్దెకు తీసుకోవడం వంటి చర్యలను తీసుకోనున్నట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను వివరిస్తూ కేంద్రానికి సీఎం లేఖ రాయనున్నట్లు మంత్రి చెప్పారు. కేబినెట్ తీసుకున్న మరిన్ని నిర్ణయాలు» పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులోని పనులకు సంబంధించి మేఘా సంస్ధ అభ్యర్ధన మేరకు ధరల వ్యత్యాసం కింద జీఎస్టీతో కలిపి రూ.557.97 కోట్లకు అనుమతి మంజూరు. » ఆంధ్రప్రదేశ్ ‘‘పౌల్ట్రీ అభివృద్ధి విధానం 2025–29’’ ముసాయిదాకు ఆమోదం. ఈ విధానం కింద ఇక పౌల్ట్రీ ఫారాలు తప్పనిసరిగా రిజి్రస్టేషన్ చేసుకోవాలి. బయోసెక్యూరిటీని మెరుగుపరుస్తారు. పాలసీలో వివిధ అంశాల కింద మొత్తం రూ.657.18 కోట్ల మేర ఆర్థిక ప్రోత్సాహకాలను సూచించారు. ఇందులో వడ్డీ రాయితీ ఉంది. అయితే ప్రోత్సాహకాలు పౌల్ట్రీ రైతులందరికీ వర్తించవు. రిజి్రస్టేషన్, అర్హత, ధ్రువీకరణ, ఆర్థిక పరిమితులు, బడ్జెట్ లభ్యత ఆధారంగానే ప్రోత్సాహకాలు మంజూరు చేస్తారు. » ఏపీ ట్రాన్స్కో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి తీసుకున్న మధ్యకాలిక రుణం తిరిగి చెల్లింపునకు పూచీకత్తుగా రూ.950 కోట్లకు ప్రభుత్వ హామీ. » ఏపీపీడీసీఎల్ పీఎఫ్సీ ఆర్ఈసీ నుంచి పొందిన రూ.1,050 కోట్లు అప్పునకు సంబంధించి ఏపీజెన్కో హామీకి ప్రభుత్వం ఆమోదం. -
మరో 6,212 ఎకరాల సమీకరణ
సాక్షి, అమరావతి : రాజధాని నిర్మాణంలో భాగంగా ఎర్రుపాలెం–నంబూరు బ్రాడ్గేజ్ రైల్వే లైన్ నిర్మాణానికి వంద మీటర్ల బఫర్ జోన్తోపాటు.. రాజధాని సరిహద్దు నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు వరకు గ్రిడ్ రోడ్ల విస్తరణకు 6,212.50 ఎకరాల సమీకరణకు రాష్ట్ర మంత్రివర్గం గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గుంటూరు జిల్లా కంతేరులో 974 ఎకరాలు, తాడికొండ మండలంలో 5,238.50 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ స్కీం (ఎల్పిఎస్) కింద సమీకరించేందుకు సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ)కు అనుమతి ఇచ్చింది. దీంతో రాజధాని నిర్మాణం పేరుతో మలి విడత భూ సమీకరణ 29,050.62 ఎకరాలకు చేరుకోవడం గమనార్హం. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు, స్మార్ట్ ఇండస్ట్రీస్, భవిష్యత్ అవసరాలకు మరో 1.48 లక్షల ఎకరాల సమీకరణ కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించే బాధ్యతను ఇప్పటికే సింగపూర్ సంస్థకు సర్కార్ కట్టబెట్టింది. రాజధాని నిర్మాణం కోసం 2015లో 53,748 ఎకరాలు (217.23 చదరపు కిలోమీటర్లు) సమీకరించిన సర్కార్.. స్పోర్ట్స్ సిటీ నిర్మాణం పేరుతో 20,494 ఎకరాల (82.9 చదరపు కిలోమీటర్లు) సమీకరణకు నోటిఫికేషన్ జారీ చేసి, ఆ ప్రక్రియను ప్రారంభించింది. గత నెల 6న రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్డు పేరుతో మోతడక గ్రామంలో 2,344.12 ఎకరాల సమీకరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.తాజాగా మరో 6,212.50 ఎకరాల సమీకరణకు పచ్చ జెండా ఊపింది. మోతడకతోపాటు.. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు, స్మార్ట్ ఇండస్ట్రీస్, భవిష్యత్ అవసరాల కోసం గుంటూరు జిల్లాలో గుంటూరు, మంగళగిరి, మేడికొండూరు, పెదకాకాని మండలాలు, తాడికొండ, పల్నాడు జిల్లాలో అమరావతి, ఎడ్లపాడు, పెదకూరపాడు మండలాల్లోని 43 గ్రామాల్లో 1,54,853.43 ఎకరాల్లో (626.67 చదరపు కిలోమీటర్లు) రాజధాని విస్తరణకు అవసరమైన మాస్టర్ ప్లాన్ను రూపొందించే బాధ్యతను సింగపూర్కు చెందిన సుర్బానా–జురాంగ్ సంస్థకు రూ.45.14 కోట్లకు అప్పగించింది. అంటే.. మొత్తం 2,29,095 ఎకరాల్లో (926.8 చదరపు కిలోమీటర్లు) రాజధాని నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. 2.29 లక్షల ఎకరాల్లో రాజధాని నిర్మాణానికి రూ.4.58 లక్షల కోట్లు వాస్తవానికి 29 గ్రామాల్లో 53,748 ఎకరాల్లో రాజధాని నిర్మాణం పూర్తవడానికే వందేళ్ల సమయం పడుతుందని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట ఇటీవల ప్రభుత్వం చెప్పింది. ఈ లెక్కన 2.29 లక్షల ఎకరాల్లో రాజధాని నిర్మాణం పూర్తికి ఇంకెన్ని శతాబ్దాలు పడుతుందన్నది అంచనా వేయలేని స్థితి. మరోవైపు చంద్రబాబు సర్కార్ కేంద్రానికి సమర్పించిన డీపీఆర్ల ప్రకారమే రాజధాని నిర్మాణంలో రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యం వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పనకు ఎకరానికి సగటున రూ.2 కోట్లు వ్యయం అవుతుందని పేర్కొంది.ఈ లెక్కన 2.29 లక్షల ఎకరాల్లో రాజధాని నిర్మాణానికి రూ.4.58 లక్షల కోట్లు అవసరం. ఆ అప్పు, వడ్డీతో కలిసి ఇంకెన్ని లక్షల కోట్లు అవుతుందోనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని బట్టి స్కాముల కోసం రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడమే కాదు.. రాష్ట్రాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి చంద్రబాబు నెట్టేస్తున్నారంటూ విద్యార్థులు, ఆర్థికవేత్తలు, మేధావులు స్పష్టం చేస్తున్నారు. -
డీజీపీ బుర్ర ఉపయోగించరా?
సాక్షి, అమరావతి: గుంటూరుకు చెందిన పదిహేనేళ్ల బాలిక అదృశ్యం కేసులో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వ్యవహారశైలిని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ గేదెల తుహిన్ కుమార్ ధర్మాసనం తీవ్రస్థాయిలో ఆక్షేపించింది. బాలిక ఆచూకీ తెలుసుకునేందుకు అంటూ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయడాన్ని కూడా తప్పుపట్టింది. సిట్ ఏర్పాటు కేవలం కంటితుడుపు చర్య మాత్రమేనంది. రాష్ట్రంలో ఏదైనా కేసులో సిట్ ఏర్పాటు చేశారంటే, దాని అర్థం ఆ కేసు ‘కోల్డ్ స్టోరేజ్’లోకి వెళ్లినట్లేనని ఘాటుగా వ్యాఖ్యానించింది. అదృశ్యమైన బాలిక ఆచూకీ తెలుసుకుని, తమ ముందు హాజరుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని డీజీపీని తాము ఆదేశిస్తే, ఆ పని చేయకుండా సిట్ను ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించింది. దీనిని బట్టి డీజీపీ బుర్ర ఉపయోగించడం లేదని అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. పైపెచ్చు ఈ సిట్లో గుంటూరు, పట్టాభిపురం పోలీసులకు స్థానం కల్పించడాన్ని తప్పుపట్టింది. ‘బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పట్టాభిపురం పోలీసులు ఏమీ చేయలేకపోయారు. మూడు నెలల క్రితం బాలిక తండ్రి ఫిర్యాదు ఇస్తే ఇప్పటి వరకు బాలిక ఆచూకీ తెలుసుకోలేకపోయారు. ఓ బాలిక ఆచూకీ తెలుసుకోవడంలో దారుణంగా విఫలమైన వారికి సిట్లో స్థానం కల్పిస్తారా? సిట్ను ఏర్పాటు చేశారంటేనే ఈ కేసు దర్యాప్తులో గుంటూరు పోలీసులు విఫలమైనట్లు డీజీపీ ఒప్పుకున్నట్లే. గుంటూరు పోలీసుల వల్ల ఏమీ కాదన్న నిర్ణయానికి వచ్చిన తరువాతనే డీజీపీ సిట్ను ఏర్పాటు చేశారు. అలాంటప్పుడు గుంటూరు పోలీసులకు సిట్లో స్థానం కల్పించడంలో అర్థమేముంది?’ అని డీజీపీని నిలదీసింది. ఈ కేసులో దర్యాప్తు ఎలా చేయాలో మేం చెప్పే పరిస్థితిని తెచ్చుకోవద్దని డీజీపీకి తేల్చి చెప్పింది. పోలీసులు ఉన్నది ప్రజల ప్రాణాలను రక్షించడానికేనని స్పష్టం చేసింది. మాకు కథలు చెబుతున్నారు‘బాలికను తమ ముందు హాజరుపరచాలని ఆదేశించిన తరువాత తీసుకున్న చర్యలు, సీఐడీ అదనపు డీజీ సమీక్ష, సిట్ ఏర్పాటు, సిట్ చేయాల్సిన పనులు వంటి వాటిపై దాఖలు చేసిన మెమో విషయంలోనూ హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ మెమోలో వ్యాసం రాశారు. సీరియల్ కథలు రాశారు. వాటి ఆధారంగా మాకు కథలు చెబుతున్నారు. ఓ బాలిక అదృశ్యం కేసును రొటీన్ వ్యవహారంలా చూస్తున్నారు. మీరు ఆ మెమోలో రాసిన రాతల తీరు చూస్తుంటే, కోర్టుకే మీరు సూచనలు చేస్తున్నట్లుంది. కోర్టు ఎలా వ్యవహరించాలో మార్గదర్శకత్వం చేస్తున్నట్లు ఉంది. పోలీసులు రాసిచ్చింది మాకు ఇవ్వడం కాదు. ప్రభుత్వ న్యాయవాదులూ వాటిని చదివి రావాలి. హెబియస్ కార్పస్ పిటిషన్లో పోలీసులు వ్యవహరించాల్సిన తీరు ఇదేనా?’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మాకు కావాల్సింది బాలిక ఆచూకీ.. ఇలాంటి స్పందనను మేం డీజీపీ నుంచి ఏ మాత్రం ఆశించలేదు. ఈ కేసు దర్యాప్తులో పట్టాభిపురం పోలీసుల నుంచి సహకారం తీసుకుంటే సరిపోతుంది. అంతే తప్ప ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లకు సిట్లో స్థానం కల్పించడం ఏంటి? డీజీపీ ఈ కేసును చాలా కాజువల్గా తీసుకుంటున్నారు. డీజీపీ తీరుపై మేం బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాం. బాలికను ట్రాప్ చేసి తీసుకెళ్లిన వ్యక్తి ఎక్కడున్నారో పోలీసులకు బాగా తెలుసు. డీజీపీ ఆ పోలీసులను ఓ గదిలో కూర్చోబెట్టి అడిగితే ఉదయం కల్లా వారిని రప్పించొచ్చు. బాలికను కోర్టు ముందు హాజరుపరచమంటే, కాలానుగుణ నివేదికలు ఇస్తామంటారా? నివేదికలు ఇస్తే ఏమవుతుంది? మాకు కావాల్సింది బాలిక ఆచూకీ. అది తప్ప మీరు అన్నీ చేస్తామంటున్నారు. డీజీపీతో పాటు సంబంధిత పోలీసు అధికారుల వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిస్తాం. అప్పుడు గాని పరిస్థితుల్లో మార్పు రాదు.’ అని ధర్మాసనం తేల్చి చెప్పింది. కోర్టు ప్రొసీడింగ్స్ను డీజీపీ చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు... ‘డీజీపీ కోర్టు ప్రొసీడింగ్స్ను చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. సిట్ ఏర్పాటు చేయడానికి ముందు గుంటూరు జిల్లా ఎస్పీ నుంచి డీజీపీ నివేదిక తెప్పించుకున్నారా? ఎస్పీ నుంచి కాకుండా సీఐడీ నుంచి నివేదిక తెప్పించుకోవడం ఏంటి? అసలు ఈ కేసుతో సీఐడీకి ఏం సంబంధం? ఎస్పీ నుంచి కాకుండా సీఐడీ నుంచి నివేదిక తెప్పించుకున్నారంటేనే, డీజీపీ బుర్ర ఉపయోగించలేదని అర్థమవుతోంది. అసలు సిట్ ఏంటి? డీజీపీనే రంగంలోకి దిగి పోలీసులను ఉరుకులు, పరుగులు పెట్టిస్తే, ఆ బాలిక ఆచూకీ ఇట్టే తెలుస్తుంది. అయితే గుంటూరు పోలీసులను డీజీపీ అసమర్థులుగా భావించారు కాబట్టే సిట్ను ఏర్పాటు చేశారు. ఓ బాలిక ఆచూకీ తెలుసుకోలేకపోయినందుకు గుంటూరు పోలీసులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి వారికి సిట్లో స్థానం కల్పిస్తారా? డీజీపీ ఇలాగేనా పని చేసేది? సిట్ ఏర్పాటు కేవలం కంటితుడుపు చర్య మాత్రమే. డీజీపీనే కోర్టుకు పిలిపించి వివరణ అడుగుతాం.’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. సోమవారం వరకు గడువునివ్వండి... ఈ సమయంలో పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) తిరుమాను విష్ణు తేజ వాదనలు వినిపిస్తూ, సోమవారం వరకు గడువునివ్వాలని అభ్యర్థించారు. ఆ లోపు బాలిక ఆచూకీ తెలుసుకుని కోర్టు ముందు హాజరుపరుస్తామని చెప్పారు. సోమవారం లోపు బాలిక ఆచూకీ తెలిసినా వెంటనే హాజరుపరుస్తామని తెలిపారు. బాలిక అదృశ్యం కేసును కిడ్నాప్ కేసుగా మార్చామన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 7కి వాయిదా వేసింది. దళిత మహిళ గంగమ్మ లాకప్డెత్ బాధ్యురాలికే సిట్ బాధ్యతలు... బాలిక అదృశ్యం వ్యవహారంలో సిట్ను ఏర్పాటు చేసిన డీజీపీ, దాని బాధ్యతలను గుంటూరు ఎస్పీ (క్రైమ్స్) కె.సుప్రజకు అప్పగించారు. సుప్రజతో పాటు గుంటూరు వెస్ట్ డీఎస్పీ బి.శ్రీనివాసరావు, పట్టాభిపురం ఇన్స్పెక్టర్ గంగా వెంకటేశ్వర్లు, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ నిసార్ బాషా, మహిళా ఎస్ఐ తరంగిణి, ఎస్ఐ రాజ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ నరసింహారావు, కానిస్టేబుళ్లు తనీష్ కుమార్, మాణిక్యరావు సిట్లో ఉన్నారు. వాస్తవానికి సుప్రజ లాకప్డెత్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గతంలో ఓ కేసులో సుప్రజ నేతృత్వంలోని సిట్ చేతిలో కర్నూలుకు చెందిన మాల గంగమ్మ అనే దళిత మహిళ లాకప్డెత్కు గురయ్యారన్న ఆరోపణలున్నాయి. గంగమ్మ మృతిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతూ వస్తోంది. ఇలాంటి సుప్రజకు మళ్లీ సిట్ బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. కుమార్తె ఆచూకీ కోసం తండ్రి న్యాయ పోరాటం... గుంటూరులో 10వ తరగతి చదువుతున్న తన కుమార్తె ట్యూషన్కి వెళ్లి తిరిగి రాలేదంటూ గుంటూరుకు చెందిన వ్యాపారి వాసు ఈ ఏడాది జూన్ 10న పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అదే రోజున మిస్సింగ్ కేసు నమోదు చేశారు. వాసు ఒత్తిడితో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొన్ని క్లూస్ సంపాదించారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ బాలిక ఆచూకీని మాత్రం తెలుసుకోలేకపోయారు.పోలీసుల నిర్లక్ష్య వైఖరితో విసిగిపోయిన వాసు హైకోర్టును ఆశ్రయించారు. తన కుమార్తెను కోర్టు ముందు హాజరుపరిచి, ఆమెను తమకు అప్పగించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ ఆయన హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం విచారణ జరిపిన జస్టిస్ దేవానంద్ నేతృత్వంలోని ధర్మాసనం, అదృశ్యమైన బాలిక ఆచూకీ తెలుసుకుని తమ ముందు హాజరుపరిచేలా చూడాలని డీజీపీని ఆదేశించిన విషయం తెలిసిందే. -
హోరెత్తిన ఉద్యోగుల నిరసనలు
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గురువారం ఉద్యోగులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఏపీ జేఏసీ అమరావతి పిలుపు మేరకు డిమాండ్స్ డే పేరుతో మధ్యాహ్నం భోజన విరామ సమయంలో అన్ని జిల్లాలు, డివిజన్ కేంద్రాలు, హెచ్ఓడీ కార్యాలయాల వద్ద నిరసనలతో హోరెత్తించారు. ‘మా బకాయిలు మాకు చెల్లించాలి.. మా హక్కులు మాకు కల్పించాలి‘అంటూ నినాదాలు చేశారు. డిమాండ్స్ డే విజయవంతమైనట్లు ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగులు కొత్తగా ఏమీ కోరడంలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీల అమలునే కోరుతున్నారని తెలిపారు.ఉద్యోగుల సహనాన్ని పరీక్షించవద్దుకష్టార్జిత హక్కులు, న్యాయమైన ఆర్థిక ప్రయోజనాలనే కోరుతున్నారన్నారు. డీఏ బకాయిలు, పీఆర్సీ ఆర్థిక ప్రయోజనాలు, వేల కోట్ల పెండింగ్ బిల్లులు, సరండర్ లీవులు, రిటైర్డ్, మృతి చెందిన ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యాష్మెంట్ తదితర ఆర్థిక ప్రయోజనాలను ఇకపై వాయిదా వేయడం సరికాదని చెప్పారు. జీతభత్యాల బకాయిలు తీసుకోకుండానే అనేకమంది పెన్షనర్లు చనిపోయారని, వారికి ప్రభుత్వం చెల్లించాల్సిన మట్టి ఖర్చులను కూడా తోటి అధికారులు సొంత డబ్బు నుంచి చెల్లించే పరిస్థితి రావడం దురదృష్టకరమని అన్నారు. చట్టబద్ధంగా రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు ఇవ్వకపోయినా రెండేళ్లకుపైగా ప్రభుత్వానికి సహకరిస్తూనే ఉన్నామని, ఉద్యోగుల సహనాన్ని పరీక్షించవద్దని చెప్పారు. ప్రభుత్వం తక్షణమే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి, సమస్యల పరిష్కారానికి స్పష్టమైన నిర్ణయం, కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. జాప్యం కొనసాగిస్తే ఐక్య ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రకాశం జిల్లాలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
లోకాయుక్త చట్ట సవరణ సంగతి ఏమిటి?
సాక్షి, అమరావతి: లోకాయుక్త నియామకానికి సంబంధించిన దాఖలైన రెండు వ్యాజ్యాలపై గురువారం హైకోర్టు స్పందించింది. వేర్వేరుగా దాఖలైన ఈ రెండు వ్యాజ్యాలను జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అలాగే, చట్ట సవరణను సవాలు చేస్తూ ఇప్పటికే దాఖలైన పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన అనంతరం లోకాయుక్త నియామకానికి సంబంధించి దాఖలైన మరో పిల్లో జస్టిస్ మల్లికార్జునరావుకు, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్తో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు వ్యాజ్యాలు ఇవీ.. » లోకాయుక్త నియామక ప్రక్రియ నుంచి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పిస్తూ చంద్రబాబు ప్రభుత్వం 2024లో చేసిన చట్ట సవరణ చేసింది. దీనిని సవాలు చేస్తూ గతంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. » రాష్ట్ర లోకాయుక్తగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు నాయుడుకి పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేసిన జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావును నియమించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో తాజాగా మరో పిల్ దాఖలైంది. లోకాయుక్తగా ఆయన నియామకాన్ని రద్దు చేయాలని కోరుతూ రైల్వేశాఖ విశ్రాంత ఉద్యోగి ఏము కొండలరావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. » పిటిషనర్ తరఫు న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ, ‘లోకాయుక్తగా జస్టిస్ మల్లికార్జునరావు నియామకం విషయంలో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వానికి, లోకాయుక్త మల్లికార్జునరావుకు నోటీసులు జారీ చేయాలి’ అని కోరారు. అయితే ఈ దశలో నోటీసులు ఇవ్వలేమని, చట్ట సవరణపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తరువాత నోటీసుల అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టంచేసిన ధర్మాసనం, రెండు వ్యాజ్యాలను జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. -
‘యువగళం పోస్టింగ్స్’.. లోకేశ్ టీమ్కు టీచర్ ఉద్యోగాలు!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: సీఎం చంద్రబాబు మొదటి సంతకం పెట్టిన మెగా డీఎస్సీ–2025 నియామక ప్రక్రియ అక్రమాలమయంగా మారిందనేందుకు మరిన్ని బలమైన ఆధారాలు, కొత్త కోణాలు, సంచలన వాస్తవాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రతిభావంతులను దగా చేస్తూ, అర్హులకు ద్రోహం తలపెట్టి మెగా డీఎస్సీ పరీక్షల నిర్వహణలో గోప్యతకు, పారదర్శకతకు చంద్రబాబు సర్కారు తూట్లు పొడిచింది. అసలు పరీక్షే లేకుండా స్పోర్ట్స్ కోటా పేరుతో ఇష్టారాజ్యంగా టీచర్ ఉద్యోగాలను ఇవ్వడం.. జాతీయ స్థాయిలో పతకాలు పొందినవారిని పక్కనపెట్టి కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఉన్న వారికి ఉద్యోగాలు ఇచ్చేయడం.. ఆ పోస్టులకు బేరం పెట్టిన వాట్సాప్ కాల్ రికార్డింగ్స్ వైరల్ కావడం తెలిసిందే. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయడంతోపాటు మొత్తం ప్రక్రియపై సీబీఐతో విచారించాలని ఇప్పటికే నిరుద్యోగులు, బాధిత అభ్యర్థులు, జెన్జీ డిమాండ్ చేస్తుండగా తాజాగా కర్నూలులో మరో చీకటి కోణం వెలుగులోకి వచ్చింది. డీఎస్సీ ఎంపిక ప్రక్రియలో అత్యంత కీలకమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో కనీస అర్హత మార్కులు సాధించడంలో విఫలమైన వారిని సైతం మెగా డీఎస్సీ ద్వారా టీచర్లుగా పోస్టింగ్లు ఇవ్వడం చంద్రబాబు సర్కారు బరి తెగింపు చర్యలకు పరాకాష్టగా విద్యావేత్తలు, పరిశీలకులు పేర్కొంటున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకానికి టెట్లో ఉత్తీర్ణత తప్పనిసరి. టెట్లో సాధించిన మార్కులకు డీఎస్సీలో వెయిటేజీ ఉన్నందున ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఎంతో కీలకం. టెట్ మార్కులను బట్టి తలరాతలు మారిపోతుంటాయి. ఇక ఇప్పటికే దశాబ్దాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఇన్ సర్వీస్ టీచర్లకు సైతం టెట్ను తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు. అలాంటిది కొత్తగా చేపట్టిన మెగా డీఎస్సీ నియామకాల్లో టెట్ క్వాలిఫై కాకున్నా టీచర్ పోస్టు కేటాయించటాన్ని బట్టి ఈ ప్రక్రియ ఎంత దారుణంగా జరిగిందో ఊహించవచ్చని స్పష్టం చేస్తున్నారు. ‘అసలు పరీక్షే లేకుండా టీచర్ ఉద్యోగాలు ఇవ్వడం ఏమిటి? స్పోర్ట్స్ కోటా జీవోలు ఎందుకు మార్చారు? స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఇచ్చేదీ మీరే.. ధృవీకరించేది కూడా మీరేనా..? పతకాలు లేకపోయినా ఉద్యోగాలిస్తారా? కేవలం పార్టిసిపేట్ చేస్తే చాలా? జాతీయ పతక విజేతకు ఉద్యోగం ఎందుకు రాలేదు? ప్రశ్నాపత్రం తయారీ.. పరీక్ష నిర్వహణ బాధ్యత.. రెండూ ఒకరి చేతికేనా? ఇది స్కామ్కు నాంది కాదా? అత్యంత కీలకమైన ప్రశ్నాపత్రం తయారీ, అప్లోడ్ ప్రక్రియలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొనడం.. ఈ ప్రక్రియలో పాల్గొన్న ఉద్యోగే డీఎస్సీలో టాప్ ర్యాంకర్గా నిలవడం నిజం కాదా? మరి టాప్ ర్యాంకర్కు పోస్టు ఎందుకు ఇవ్వలేదు? సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరు కాలేదని కాకమ్మ కబుర్లు చెబుతారా? సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరవ్వని వ్యక్తి కోర్టుకు ఎందుకు వెళ్లాడు? కలెక్టర్ల నేతృత్వంలో సాగాల్సిన ప్రక్రియను ఎందుకు కేంద్రీకృతం చేశారు? 1 : 1లో వెరిఫికేషన్కు పిలిచి.. అన్నీ సక్రమంగా ఉన్నా ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు?.. ఎవరికోసం ‘సర్దుబాటు?’ 336 కేసులు వేశారంటూనే.. ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని బుకాయిస్తారా? టీచర్ పోస్టులకు బేరసారాల ఆడియోపై కేసు నమోదైనా సూత్రధారులెవరో బయట పెట్టరా? స్కామ్కు ఇవన్నీ సాక్ష్యాలు కాదా? న్యాయం జరగాలంటే సీబీఐతో విచారించాల్సిందే. నైతిక బాధ్యతగా విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాల్సిందే..’ అని స్పష్టం చేస్తున్నారు. టెట్ క్వాలిఫై కాకున్నా ఎస్జీటీ పోస్టింగ్.. మెగా డీఎస్సీలో కనీసం టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) క్వాలిఫై కాకుండానే చంద్రబాబు సర్కారు ఉపాధ్యాయ ఉద్యోగాలు కట్టబెట్టినట్లు బహిర్గతమైంది. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలం వల్లూరు ఎంపీపీ స్కూల్లో టెట్ క్వాలిఫై కాకుండానే స్పోర్ట్స్ కోటాలో ప్రభాకర్ను ఎస్జీటీ టీచర్గా నియమించినట్లు తాజాగా తేలింది. ఈ విషయం ఇటీవల వెలుగులోకి రావడంతో బుధవారం విచారించిన జిల్లా విద్యాధికారి వాస్తవమేనని నిర్ధారించడం సంచలనం రేపుతోంది. ఒక్క ప్రభాకరే కాకుండా జిల్లావ్యాప్తంగా స్పోర్ట్స్ కోటాలో సుమారు 25 మంది ఇలా టీచర్ ఉద్యోగాలు పొందినట్లు సమాచారం. వీరిలో చాలామంది టెట్ క్వాలిఫై కాలేదని తెలుస్తోంది. దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి రావడం ఖాయం. మరోవైపు స్పోర్ట్స్లో ఎలాంటి నైపుణ్యం లేకున్నా చాలామంది నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాలు పొందినట్లు తెలుస్తోంది. ప్రభాకర్ వ్యవహారం బయటకు పొక్కడంతో వారంతా బెంబేలెత్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కొందరు టీచర్లు సెలవులో వెళ్లిపోయినట్లు చర్చ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా నకిలీల కలకలం.. కర్నూలుకు చెందిన ఓ ప్రైవేట్ బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్, దూరవిద్యా కేంద్రంలో పని చేస్తున్న మరోవ్యక్తి, నెల్లూరుకు చెందిన క్రీడా అసోసియేషన్ నాయకుడితో కలసి మెగా డీఎస్సీలో నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయించినట్లు సమాచారం. వీరితోపాటు ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ ఇదే తరహాలో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి అక్రమంగా ఉద్యోగాలు పొందినట్లు తెలుస్తోంది. కర్నూలు, చిత్తూరు, తిరుపతి, కడప అనంతపురం జిల్లాల్లోనూ నకిలీ స్టోర్ట్స్ సర్టిఫికెట్లతో చాలామంది మెగా డీఎస్సీలో ఉద్యోగాలు పొందినట్లు ప్రచారం జరుగుతోంది. లోకేశ్ యువగళం టీమ్కు టీచర్ జాబ్స్..! నారా లోకేశ్ యువగళం పాదయాత్ర సమయంలో చురుగ్గా పనిచేసిన వారిలో చాలామందికి మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా కింద దొడ్డిదారిన ఉద్యోగాలు ఇచ్చినట్లు సమాచారం. యువగళంలో ఎక్కువగా అనంతపురం, చిత్తూరు, తిరుపతి, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన టీమ్ సభ్యులకు ఈ తరహాలో ఉద్యోగాలు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. లోకేశ్ టీమ్లో కీలకంగా ఉన్న కొందరు వ్యక్తులు ఈ మొత్తం వ్యవహారం నడిపించినట్లు టీడీపీలోని ఓ వర్గం చర్చించుకుంటోంది. సవాల్ స్వీకరించకుండా చినబాబు దబాయింపు..!ఇప్పటికే మెగా డీఎస్సీలో అక్రమాలను మీడియా సాక్షిగా ఎండగట్టిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని సవాల్ విసిరితే మంత్రి లోకేశ్ తోక ముడిచారు. దీన్ని కప్పిపుచ్చేందుకు గత ప్రభుత్వంలో పూర్తి పారదర్శకంగా పూర్తయిన గ్రూప్ 1 నియామకాలపై దు్రష్పచారానికి తెర తీశారు. నిజంగానే మెగా డీఎస్సీని పారదర్శకంగా నిర్వహిస్తే చంద్రబాబు ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు అంగీకరించాలని బాధిత అభ్యర్థులు, నిరుద్యోగులు, విద్యావేత్తలు స్పష్టం చేస్తున్నారు. స్పోర్ట్స్ కోటా పేరు చెప్పి అసలు పరీక్షే లేకుండా టీచర్ ఉద్యోగాలు కట్టబెట్టడం ఏమిటని సూటిగా ప్రశ్నిస్తున్నారు. అవన్నీ అమ్మకానికి పెట్టిన ఉద్యోగాలేనని, ఈ వ్యవహారం విద్యాశాఖా మంత్రి కనుసన్నల్లోనే జరిగినట్లు కర్నూలు డీఈవో కార్యాలయంలోని ఒక అధికారి వ్యాఖ్యానించారు. ఇక స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలివ్వడానికి టెట్ అక్కర లేదని చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. ఇన్ సర్వీసు టీచర్లకు మాత్రం టెట్ తప్పనిసరి చేయడం ఎంతవరకు సమంజసమని ఉపాధ్యాయ వర్గాలు ప్రశ్నిస్తుండటం కొసమెరుపు. -
కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి,కాకినాడ: తాళ్ళరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మట్లపాలెం గ్రామం వద్ద వేగంగా వస్తున్న ఆటో, బైక్ను బలంగా ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు సమాచారం మేరకు.. కృష్ణ, మణికంఠ, తమ్మి అనే ముగ్గురు యువకులు ఒకే బైక్పై కాకినాడ నుండి యానం వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో తాళ్ళరేవు మండలం మట్లపాలెం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ఆటో వీరి బైక్ను బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాద తీవ్రతకు తీవ్ర గాయాలపాలైన కృష్ణ, మణికంఠ ఇద్దరూ ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. తీవ్ర గాయాలతో ఉన్న మరో యువకుడు తంబిని స్థానికులు తక్షణమే కాకినాడ జిజిహెచ్ జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో అతను కన్నుమూశాడు. ఒకే ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
ఏపీ కేబినెట్లో ప్రోటోకాల్పై హైడ్రామా
సాక్షి,అమరావతి: ఏపీ మంత్రివర్గ సమావేశంలో తీవ్ర ప్రోటోకాల్ రగడ కలకలం రేపింది. వెలిగొండ, పోలవరం ప్రాజెక్టులకు సంబంధించిన అధికారిక ప్రకటనలు, పోస్టర్లలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఫొటోను పక్కనబెట్టడం తీవ్ర వివాదానికి దారితీసింది. మంత్రి ఫొటో స్థానంలో లోకేష్ ఫొటోను ముద్రించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.నిమ్మల రామానాయుడు ఫొటో లేకుండా, లోకేష్ను ప్రమోట్ చేసే వ్యూహంలో భాగంగానే ఈ మార్పులు చేశారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వ్యవహారం రచ్చకెక్కడంతో, నష్టనివారణ చర్యల్లో భాగంగా చంద్రబాబు అధికారులపై మందలింపుల డ్రామా మొదలుపెట్టారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందంటూ అనుకూల మీడియా ద్వారా లీకులు ఇప్పిస్తూ, తప్పును అధికారులపైకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. -
వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన చంద్రబాబు
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దెబ్బకు సీఎం చంద్రబాబు దిగొచ్చారు. ఎట్టకేలకు కరువుపై కేబినెట్లో చర్చ జరిపారు. ఇటీవలే ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ నిలదీసిన సంగతి తెలిసిందే. దీంతో కరువుపై కేంద్రానికి లేఖ రాస్తానంటూ చంద్రబాబు ప్రకటించారు. ఏపీలో దుర్భర పరిస్థితులు ఉన్నాయని చంద్రబాబు అంగీకరించారు.దేశమంతా 14 శాతం లోటు వర్షపాతం ఉండగా.. ఏపీలో మాత్రం 52 శాతం లోటు వర్షపాతం ఉన్నట్టు వెల్లడించారు. జలాశయాల్లో నీళ్లున్నా.. రైతులకు ప్రభుత్వం విడుదల చేయలేదు. నీళ్లివ్వలేమంటూ కేబినెట్లో చంద్రబాబు వ్యాఖ్యానించారు. విమర్శలు చేస్తున్నవారిపై ఎదురుదాడి చేయాలంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు.ఏపీ కేబినెట్లో ప్రోటోకాల్పై హైడ్రామాఏపీ కేబినెట్లో ప్రోటోకాల్పై హైడ్రామాకు తెరతీశారు. అధికారులను సీఎం మందలించినట్టు లీకులు ఇచ్చారు. వెలిగొండ, పోలవరం ప్రకటనల్లో రామానాయుడు ఫొటో కానరాలేదు. రామానాయుడు ఫొటో తీసేసి నారా లోకేష్ ఫొటో ముద్రించారు. లోకేష్ని ప్రమోట్ చేయడానికి టీడీపీ ప్లాన్ చేసింది. విషయం బట్టబయలు కావడంతో సీఎం చంద్రబాబు డ్రామా మొదలుపెట్టారు. తప్పంతా అధికారులపై నెట్టేసి తిట్టినట్టు లీకులు ఇచ్చారు. -
ఊరూవాడా వైఎస్సార్కు ఘన నివాళులు
సాక్షి, అమరావతి/మలికిపురం/లబ్బీపేట (విజయవాడ తూర్పు) : కోట్లాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని రాష్ట్ర ప్రజలు బుధవారం కన్నీటి నివాళులతో స్మరించుకున్నారు. మహానేత ఆశయాలను గుర్తుచేసుకుంటూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆయన 17వ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నుంచి తీసుకొచ్చిన జలాలతో జలాభిషేకాలు, ధాన్యాభిషేకం, అన్నదానాలు, పాలాభిషేకాలు, పేదలకు పండ్ల పంపిణీ, రక్తదానం వంటి సేవా కార్యక్రమాలతో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. పలుచోట్ల దుస్తులు పంపిణీ చేశారు. ప్రతి ఊరిలో ఆయన విగ్రహాల వద్ద మార్మోగిన ‘వైఎస్సార్ అమర్ రహే’ నినాదాలు.. మహానేతకు ప్రజల గుండెల్లో ఉన్న అభిమానానికి, ఆయన పాలనపై ఉన్న చెరగని జ్ఞాపకాలకు ప్రతీకగా నిలిచాయి. ఆయన పాలనలో పేదలకు అందించిన సంక్షేమ పథకాలను గుర్తుచేసుకున్నారు. విజయవాడలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. వందమందికి పైగా కార్యకర్తలు రక్తదానం చేశారు. కర్నూలు జిల్లా నల్లకాల్వ గ్రామంలోని వైఎస్సార్ స్మృతి వనంలో కూడా ఘనంగా నిర్వహించారు. చెన్నైలోనూ పలుచోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించి వైఎస్సార్కు నివాళులర్పించారు. పెరంబూరులోని పార్టీ కార్యాలయం ఆవరణలో వైఎస్సార్సీపీ తమిళనాడు విభాగం అధ్యక్షుడు ఏకే జకీర్ హుస్సేన్ నేతృత్వంలో పారిశుధ్య కార్మికులకు ఆహార ప్యాకెట్లను అందజేశారు. విదేశాల్లో.. గల్ఫ్ దేశం ఖతార్ రాజధాని దోహాలోని న్యూసలాటాలో ఆ దేశ వైఎస్సార్సీపీ కన్వీనర్ జాఫర్ హుస్సేన్ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదానం చేశారు. పార్టీ నేతలు దొండపాటి శశికిరణ్, పార్టీ గల్ఫ్ ప్రతినిధులు, ఖతార్ కమిటీ సభ్యులు, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అలాగే, అమెరికాలోని న్యూజెర్సీలో శివారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి నిర్వహించారు. వైఎస్సార్ చిత్రపటానికి ఆ పార్టీ రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి చల్లా మధుసూదన్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ నేతలు డాక్టర్ రాఘవరెడ్డి, అల్లా రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో...సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్ అభిమానులు వేర్వేరుగా నివాళులు అర్పించారు. పార్లమెంట్లో వైఎస్సార్ చిత్రపటానికి వైవీ సుబ్బారెడ్డి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించగా.. ఏపీ భవన్లో అఖిల భారత్ సంఘాల సమైక్య సెక్రటరీ బండ్లపల్లి మదన్మోహన్రెడ్డి, అడ్వైజర్ బొమ్మారెడ్డి కోటిరెడ్డి, ఇంద్రప్రస్థ తెలుగు అసోసియేషన్ తరఫున రవీందర్రెడ్డి, డాక్టర్ కిరణ్ ఉదయ్, వైఎస్సార్ అభిమానులు షేక్ శివనాగురు (రాహుల్), డాక్టర్ హరిరెడ్డి, అన్వేష్, రవీంద్రరెడ్డి, రాజశేఖర్, హేమంత్, శివ, విజయ్, ఉదయ్రెడ్డి, ప్రసాద్రెడ్డి, క్రాంతికిరణ్, అపూర్వ, సురేష్, రామచంద్ర, రాజు తదితరులు కొవ్వొత్తులు వెలగించి వైఎస్సార్కు నివాళులు అర్పించారు. -
నిద్రను మింగేస్తున్న ‘హెల్’ ఫోన్
సాక్షి, అమరావతి: రాత్రి భోజనం అయిన వెంటనే మంచంపైకి వెళ్లి ఫోన్ చేతిలోకి తీసుకోవడం.. రీల్స్, షార్ట్స్, సోషల్ మీడియా పోస్టులు చూడటం.. మధ్యలో ఓ వెబ్సిరీస్ ఎపిసోడ్.. ‘ఐదే నిమిషాలు’ అంటూ మొదలయ్యే ఈ అలవాటు గంటల తరబడి సాగిపోతుంది. ఫలితంగా నిద్ర సమయం తగ్గిపోయి, నిద్ర నాణ్యత దెబ్బతిని.. చివరకు ఆరోగ్యం దెబ్బతింటోందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా పడుకునే ముందు సోషల్ మీడియా, స్ట్రీమింగ్ వంటి డిజిటల్ మీడియా వినియోగం ఎక్కువగా ఉన్నవారిలో నిద్ర సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సమస్య కేవలం స్క్రీన్ వెలుతురుతోనే కాదు. ఆసక్తికరమైన కంటెంట్ మెదడును చురుగ్గా ఉంచుతుంది. దాని వల్ల నిద్ర రాదు. అందుకే పడుకునే ముందు సెల్ ఫోన్, సోషల్ మీడియాను దూరంగా ఉంచటం, మంచంపై ఫోన్ వాడకపోవడం, అవసరం లేని నోటిఫికేషన్లు ఆపేయడం వంటి అలవాట్లు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది కేవలం ఒకటి రెండు అధ్యయనాలు చెప్పిన విషయం కాదు. 55 అధ్యయనాల పేపర్లు, 41,716 మంది పాల్గొన్న డేటాను విశ్లేíÙంచిన ‘మెటా’ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. రోజూ 5 నుంచి 8 గంటలు సెల్ఫోన్తో గడుపుతున్న వారు 29.6 శాతం ఉన్నట్లు వెల్లడించింది. 2 నుంచి 4 గంటలు ఫోన్ చూస్తున్న వారు 44.9 శాతం ఉన్నట్లు గుర్తించింది. నిద్రకు ముందు గంటలో స్క్రీన్ ఉపయోగిస్తున్నామని 46.7 శాతం మంది తెలిపారు. 18.3 శాతం మందిలో సోషల్ మీడియా వ్యసనంఈ ఏడాది ప్రచురితమైన ‘బియాండ్ స్క్రీన్ టైమ్’ అధ్యయనంలో 722 మంది పెద్దలను పరిశీలించారు. నిద్రకు ముందు డిజిటల్ మీడియా వినియోగం, నిద్ర నాణ్యత, నిద్ర వ్యవధి, నిద్ర పట్టేందుకు పట్టే సమయాన్ని విశ్లేషించారు. సోషల్ మీడియా, స్ట్రీమింగ్ వినియోగం ఎక్కువగా ఉన్న వర్గాల్లో సుమారు 8 శాతం వరకు నిద్ర తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. నిద్ర పట్టే సమయంలోనూ సుమారు 15 శాతం వ్యత్యాసం ఉన్నట్లు తెలుసుకున్నారు. » మధ్యప్రదేశ్లోని ఛింద్వారా ప్రాంతంలో 18 నుంచి 25 ఏళ్ల వయసున్న 750 మంది కాలేజీ విద్యార్థులపై ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన అధ్యయనంలో 18.3 శాతం మందిలో సోషల్ మీడియా వ్యసనం ఉన్నట్లు తేలింది. ఈ వ్యసనం పెరిగేకొద్దీ నిద్ర నాణ్యత తగ్గుతున్నట్లు గుర్తించారు. రోజుకు 3 గంటలకు మించి సోషల్ మీడియా వినియోగం కూడా వ్యసనంగా భావించాలని అధ్యయనం తెలిపింది. » 2024లో తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో జరిగిన అధ్యయనంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీకి చెందిన 792 మంది విద్యార్థులను పరిశీలించగా.. 17.7 శాతం మందికి సోషల్ మీడియా వ్యసనం ఉన్నట్లు తేలింది. » పట్నాలోని ఏడు మెడికల్ కాలేజీలకు చెందిన 510 మంది అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థులపై 2025 జూన్లో నిర్వహించిన మరో అధ్యయనంలో 68.2 శాతం మందికి నిద్ర నాణ్యత సరిగా లేదని తేలింది. -
నిషేధాన్ని తుంచి... విషాదాన్ని పంచి
సాక్షి, అమరావతి: గిరిజన బిడ్డల ప్రాణాలతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోంది. పోతే పోయేది ప్రాణాలే కదా అనే నిర్లక్ష్య ధోరణితో వ్యవహారిస్తోంది. గిరి‘జనం’లో వ్యాధుల వ్యాప్తిని అరికట్టడంలోనూ విఫలమవుతోంది. కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలను సైతం తుంగలో తొక్కుతోంది. వ్యాధి నిర్ధారణ కాకుండా క్లోరోక్విన్ మాత్రలు వాడవద్దన్న నిబంధనలను సైతం కాలరాసి వారి ఉసురు తీస్తోంది. తాజాగా, పోలవరం జిల్లా గుల్లగుప్పలో మలేరియా నివారణ చర్యల్లో భాగంగా క్లోరోక్విన్ మాత్రలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పంపిణీ చేసింది. మాత్రలు వికటించి ఏడేళ్ల గిరిజన బాలిక మృతి చెందింది. మరో బాలిక పరిస్థితి విషమంగా ఉంది. సుమారు 52 మంది వరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.13 ఏళ్ల కిందటే స్పష్టమైన మార్గదర్శకాలుదేశంలో 2013లోనే మలేరియా ముందస్తు నివారణ చికిత్సలో క్లోరోక్విన్ మాత్రల వినియోగాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ నిషేధించింది. మలేరియా చికిత్సపై స్పష్టమైన మార్గదర్శకాలనూ ఇచ్చింది. జ్వరం ఇతర మలేరియా అనుమానిత లక్షణాలు ఉన్న వారికి ర్యాపిడ్ డయాగ్నస్టిక్ కిట్ (ఆర్డీటీ)/ మైక్రోస్కోపీ రక్త పరీక్ష చేసి వ్యాధి నిర్ధారణ చేయకుండా మాత్రల పంపిణీ చేయడాన్ని నిషేధిం చింది. ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో ఈ మార్గదర్శకాలు ఉల్లంఘించకూడదని స్పష్టం చేసింది. మలేరియాకు సంబంధించి టెస్ట్, ట్రీట్, ట్రాక్ (టీ3) విధానం అమలు చేయాలని తేల్చి చెప్పింది. అయినా గుల్లగుప్ప గ్రామంలో వ్యాధి నిర్ధారణ చేయకుండా రాష్ట్ర వైద్య శాఖ క్లోరోక్విన్ మాత్రలు పంపిణీ చేయడం ప్రాణాల మీదకు తెచ్చింది.నిర్ధారణ చేయకుండా ఎందుకు వాడకూడదు? పిల్లల్లో క్లోరోక్విన్ సురక్షిత పరిమితి చాలా తక్కువ. మోతాదు ఏమాత్రం ఎక్కువైనా అది తీవ్ర గుండె సమస్యలు, రక్తపోటు, ఫిట్స్/ప్రాణాంతక విషప్రభావం వంటి అంశాలకు దారి తీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. డెంగీ, టైఫాయిడ్ జ్వరాలు, ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లతో వచ్చి ఉంటే, ఊహాజనితంగా క్లోరోక్విన్ వాడితే అసలైన వ్యాధికి చికిత్స అందక ఆరోగ్యం విషమించే ప్రమాదం ఉంది. ఆరోగ్య శాఖ గుల్లగుప్పలో ఇవేమీ పట్టించుకోకుండా పాఠశాల విద్యార్థులు సహా 71 మందికి క్లోరోక్విన్ మాత్రలు వేసింది.ఆసుపత్రి పాలయ్యాకఇక చికిత్స నియమావళి ప్రకారం వైవాక్స్ మలేరియా నిర్ధారణ అయిన రోగులకు క్లోరోక్విన్ను మూడు రోజుల పాటు శరీర బరువు ఆధారంగా ఇస్తారు. వ్యాధి నిర్ధారణ కాకుండా, విద్యార్థుల బరువు పట్టించుకోకుండా గుల్లగుప్పలో మందుల పంపిణీ చేశారు. బాలిక మృతి చెంది, పదుల సంఖ్యలో బాధితులు ఆస్పత్రి పాలయ్యాక ప్రభుత్వం మేలుకొంది. దీని ఫలితమే బుధవారం జాతీయ మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఆదేశాలు జారీ చేశారు. -
ఆభరణాల మాయం కేసులో కొత్త ట్విస్ట్
పెదకాకాని: గుంటూరు జిల్లా పెదకాకానిలోని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి ఆలయంలో మాయమైన అమ్మవారి ఆభరణాల కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. పోలీసులే పరుపుకింద ccపెట్టి తన భర్తను ఇరికించారని అర్చకుడు రణదీర్ భార్య మాధురి ఆరోపిస్తుండగా.. తన కుమారుడిని పోలీసులు 13 రోజులుగా చిత్రహింసలకు గురిచేస్తూ చోరీ కేసును అక్రమంగా అంటగట్టారని అర్చకుడి తల్లి కొండవీటి మల్లేశ్వరి ఆవేదన వ్యక్తం చేసింది. బుధవారం వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. ‘ఒక్కసారిగా పది మంది పోలీసులు మా ఇంట్లోకి ప్రవేశించి బీరువా తలుపులు తెరిపించారు. వారిలో కొంతమంది బెడ్రూంలోకి వెళ్లి పరుపు పైకెత్తి బంగారు నానుతాడు, మంగళసూత్రాలు కనిపించాయని తీసుకొచ్చారు. పోలీసులే పరుపు కింద వాటిని పెట్టి దొంగతనంలో నా భర్తను ఇరికించారు’ అని గర్భిణి అయిన అర్చకుడి భార్య మాధురి విలపించారు. రణదీర్ తల్లి మల్లేశ్వరి మాట్లాడుతూ.. ‘నా కొడుకుని 13 రోజులపాటు చిత్రహింసలకు గురి చేశారు. దొంగతనం చేసింది తానేనని అంటూ ఒప్పుకోవాలని వేధించారు. శివాలయంలో అందరూ పర్మినెంట్ అర్చకులు. నా కొడుకు ఒక్కడే అదనపు అర్చకుడిగా పనిచేస్తున్నాడు. తమ వాళ్లను కాపాడుకునేందుకు వారంతా కావాలనే నా కుమారుడిని దొంగతనం కేసులో ఇరికించారు. మా బాబును పోలీసులు వేధిస్తున్నారని లాయర్ సహాయంతో హైకోర్టును ఆశ్రయించాం. అప్పటినుంచి మాపై కక్ష పెంచుకున్నారు. రెండు రోజుల క్రితం మా కోడలు ఆస్పత్రికి సంబంధించిన రిపోర్టుల కోసం మంచంపై ఉన్న పరుపు తీసి వెతికాం. అప్పుడు కనిపించని బంగారు నానుతాడు, మంగళసూత్రాలు ఇప్పుడు పరుపు కిందకు ఎక్కడి నుంచి వచ్చాయో అర్థం కావడం లేదు. మా లాయర్ను కనుక్కుని సంతకం చేస్తానని చెప్పినా వినకుండా నా చేత బలవంతంగా సంతకం చేయించారు. పోలీసులే పరుపు కింద నగలు పెట్టి బయటకు తీశారు. రణదీర్ను చిత్రహింసలకు గురి చేశారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.నిందితుడు అరెస్టు శివాలయంలో అమ్మవారి ఆభరణాలు మాయం చేసిన నిందితుడు కొండవీటి రణదీర్ను అరెస్టు చేసినట్లు మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. పెదకాకాని పోలీసుస్టేషన్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నిందితుడు రణదీర్ను న్యాయస్థానంలో హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు తెలిపారు. ఇదీ వివాదం.. ఆగస్టు 14న ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూలతోపాటు బంగారు ఆభరణాలు అలంకరించారు. ఆ తరువాత 18న అమ్మవారికి అలంకరించిన మంగళసూత్రాలు, నానుతాడు కనిపించడం లేదని ఆలయ అర్చకులు అధికారుల దృష్టికి తెచ్చారు. దీంతో ఆ వారం రోజులు విధులు (వంతు) నిర్వహిస్తున్న అర్చకులకు 19న షోకాజ్ నోటీసులు ఇచ్చిన అధికారులు 26న ఐదుగురిని సస్పెండ్ చేశారు. ఆలయ ఆభరణాల మాయంపై 21న కేసు నమోదు చేసిన పోలీసులు ఆ రోజు విధుల్లో ఉన్న అర్చకులను స్టేషన్కు పిలిపించి విచారణ చేపట్టారు. విచారణ పేరుతో పదేపదే పోలీసుస్టేషన్కు తిప్పుతూనే ఉన్నారు. ఆలయానికి సంబంధించిన చెత్త పడేస్తున్న ప్రదేశంలో పారిశుద్ధ్య కార్మికులతో వెతికించారు. ఈ క్రమంలో అర్చకులంతా చందాలు వేసుకుని ఆభరణాలు తయారు చేయిస్తున్నారని, చెత్తలో దొరికిందని చూపించేందుకు పథక రచన చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. బంగారు ఆభరణాలు మాయమైనప్పటి నుంచి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పోలీసులకు, ఆలయ అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఆగస్టు 27న నగర సంకీర్తన పేరుతో పెదకాకాని వైజంక్షన్ నుంచి శివాలయం వరకూ పాదయాత్ర చేపట్టారు. అనంతరం వైఎస్సార్సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ అమ్మవారికి మంగళసూత్రాలు సమర్పించారు. సెపె్టంబరు 4న నానుతాడు కూడా అమ్మవారికి సమర్పిస్తున్నట్టు ప్రకటించారు. కాగా.. ఆభరణాల మాయం వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ చివరకు అర్చకుడు రణదీర్ ఇంట్లో దొరికినట్లు పోలీసులు ప్రకటించగా.. పోలీసుల తీరుపై హైకోర్టును ఆశ్రయించిన రణ«దీర్ భార్య, తల్లి తాజాగా ఈ ఆరోపణలు చేయడం గమనార్హం. -
బాలికపై లైంగిక దాడి కేసులో 20 ఏళ్ల జైలు
విజయవాడ లీగల్: బాలికపై మాయమాటలతో పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితునికి 20 ఏళ్లు కఠిన కారాగార శిక్ష, రూ.20వేలు జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి కె.జయలక్ష్మి తీర్పునిచ్చారు. విజయవాడ సూర్యారావుపేట పోలీసుస్టేషన్ పరిధిలోని 17 ఏళ్ల బాలికకు తన అన్నయ్య స్నేహితుడు పరిచయమై ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పి పలుమార్లు శారీరకంగా కలిశాడు. కొద్దిరోజుల తరువాత నిన్ను ప్రేమించడం లేదని, ఈ విషయం ఎవరికైనా చెబితే ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నట్లు బాధితురాలు పోలీసుస్టేషన్లో ఫిర్యాదుచేసింది. కేసు నమోదు చేసిన అప్పటి సూర్యారావుపేట మహిళా ఎస్సై జి.అనూష అనంతరం అప్పటి సౌత్ ఏసీపీ డి.పావన్ కుమార్ దర్యాప్తు చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ గ్రామానికి చెందిన కోరేపల్లి ప్రవీణ్ కుమార్ (37)ను అదుపులో తీసుకొని, అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో నిందితునిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పునిచ్చారు. అలాగే బాధిత బాలికకు రూ.లక్ష నష్ట పరిహారం అందించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థను న్యాయమూర్తి ఆదేశించారు. -
ట్రక్కు చార్జింగ్ స్టేషన్ల సమాచారం ఇక ఈజీ
సాక్షి, అమరావతి: దేశ రహదారులపై 100 శాతం ఎలక్రిక్ ట్రక్కుల (ఈ–ట్రక్కుల) లక్ష్యసాధన దిశగా కేంద్రప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేసింది. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించడమేగాక సమాచార వ్యవస్థను కూడా పటిష్టపరుస్తోంది. సమీపంలో చార్జింగ్ స్టేషన్లు ఎక్కడున్నాయో ట్రక్కు డ్రైవర్లు తెలుసుకునేందుకు ఒక డిజిటల్ పరికరాన్ని రూపొందించింది. స్కౌట్ చార్ట్–పార్క్ అని పేరు పెట్టిన ఈ డిజిటల్ పరికరాన్ని ఐఐటీ–మద్రాస్తో కలసి ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ క్లీన్ ట్రాన్స్పోర్టేషన్ (ఐసీసీటీ) ఆవిష్కరించింది. ట్రక్కు డ్రైవర్లు, యజమానులు, గ్రిడ్ నిర్వాహకులతోపాటు ప్రభుత్వసంస్థలకు కూడా ఉపయుక్తంగా ఏఐఎస్–140 ట్రాకింగ్ ప్రమాణాలకు అనుగుణంగా దీన్ని రూపొందించారు. మొత్తం 14 బిలియన్ల జీపీఎస్ పింగ్లు, 1.57 కోట్ల రికార్డెడ్ స్టాప్ ఈవెంట్లతోసహా ట్రాకింగ్ చేసే సామర్థ్యం ఈ పరికరానికి ఉంది. 2050 నాటికి వందశాతం ఈ–ట్రక్కులే లక్ష్యంప్రస్తుతం దేశంలో 30 లక్షల వరకు సరుకు రవాణా ట్రక్కులు ఉన్నాయి. అవి ఏటా 10 వేలకోట్ల కిలోమీటర్ల మేర ప్రయాణిస్తున్నాయి. ఆ డీజిల్ వాహనాలే 25 శాతం కర్బన ఉద్గారాలు వెదజల్లుతున్నాయని అంచనా. అందుకే దేశంలో రోడ్లపై వందశాతం ఈ–ట్రక్కులను ప్రవేశపెడితే కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు సూచించారు. దీంతో పదేళ్ల కాలపరిమితి దాటిన డీజిల్ ట్రక్కులను నిషేధించాలని కేంద్రప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. వాటిస్థానంలో ఈ–ట్రక్కులు కొనుగోలు చేసేందుకు పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది. మరోవైపు ఈ–ట్రక్కుల కోసం చార్జింగ్ స్టేషన్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. 2030 నాటికి 50 వేల ట్రక్కు చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. 2050 నాటికి దేశంలో 1.50 లక్షల ట్రక్కు చార్జింగ్ స్టేషన్లు అవసరమవుతాయని అంచనా వేశారు. ఈ చార్జింగ్ స్టేషన్లు ఎక్కడున్నాయన్నది ట్రక్కు డ్రైవర్లు ఎప్పటికప్పుడు రియల్ టైమ్ విధానంలో తెలుసుకునేందుకు వీలుగా స్కౌట్ చార్్జ–పార్క్ డిజిటల్ పరికరాన్ని రూపొందించారు. తమకు సమీపంలో ఉన్న చార్జింగ్ స్టేషన్లు, పార్కింగ్ జోన్లు, దాబాలు, పోలీస్స్టేషన్లు, ఆస్పత్రులు, ఇతర సమాచారం కూడా ఈ పరికరం ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇక ట్రక్ యజమానులు కూడా తమ ట్రక్కు ఎక్కడ ఉంది, సరైన మార్గంలోనే గమ్యస్థానానికి చేరుతోందా లేదా అన్నది కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. రహదారి భద్రత, నేరాల నియంత్రణ కోసం పోలీసు, ఇతర శాఖలకు కూడా ఈ పరికరం ఉపయోగపడుతుంది. స్కౌట్ చార్ట్–పార్క్ పరికరంపై విస్తృత అవగాహన కల్పించాలని ఐసీసీటీ నిర్ణయించింది. -
సాయికృష్ణ లాకప్డెత్పై స్పందించిన హైకోర్టు
సాక్షి, అమరావతి: కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్డెత్పై సీబీఐ దర్యాప్తు కోరుతూ అతడి తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై హైకోర్టు స్పందించింది. సీబీఐ దర్యాప్తు విషయంలో పూర్తి కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ గేదెల తుహిన్కుమార్ ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. తన కుమారుడు సాయికృష్ణ ఆచూకీ తెలియడం లేదని, అతడిని కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ విజయలక్ష్మి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ దాఖలు చేసిన తరువాత సాయికృష్ణ పోలీసుల లాకప్డెత్లో మృతిచెందినట్లు రూఢీ అయింది. దీంతో విజయలక్ష్మి తన కుమారుడి లాకప్డెత్ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. తరువాత ఈ వ్యాజ్యంలో పలు పరిణామాలు చోటుచేసుకున్నాయి. సీబీఐ దర్యాప్తు కోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను ఉపసంహరించుకుంటున్నట్లు ఓసారి, ఉపసంహరించుకోవడంలేదని మరోసారి విజయలక్ష్మి చెబుతూ వచ్చారు. ఆమె తరఫున హాజరవుతున్న న్యాయవాదుల విషయంలో కూడా వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. విజయలక్ష్మి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ బుధవారం మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా విజయలక్ష్మి న్యాయవాది కోగంటి రిత్విక స్పందిస్తూ.. తమ పిటిషన్పై ప్రభుత్వ కౌంటర్కు తిరుగు సమాధానం (రిప్లై) దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని కోరారు. అలాగే సాయికృష్ణ లాకప్డెత్పై సీబీఐ దర్యాప్తు కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. దాన్ని పరిశీలించిన ధర్మాసనం.. సీబీఐ దర్యాప్తు విషయంలో కౌంటర్ దాఖలు చేశారా? అని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) సింగమనేని ప్రణతిని ప్రశ్నించింది. దాఖలు చేయలేదని ఆమె చెప్పడంతో.. సీబీఐ దర్యాప్తు విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ధర్మాసనం విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. -
వీళ్లేం పోలీసులు?
సాక్షి, అమరావతి: పదవ తరగతి చదివే తన కుమార్తె కనిపించడం లేదంటూ దాదాపు మూడు నెలల క్రితం గుంటూరుకు చెందిన ఓ వ్యాపారి ఫిర్యాదు చేస్తే, పోలీసులు ఇప్పటి వరకు ఆ బాలిక ఆచూకీ తెలుసుకోలేకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు నెలల క్రితం కనిపించకుండా పోయిన బాలిక ఆచూకీని ఇప్పటివరకు కనిపెట్టలేకపోవడం సిగ్గుచేటని పోలీసులను ఉద్దేశించి హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇలాంటి పోలీసులు ఉన్నందుకు రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలంది. ఆ బాలికను కిడ్నాప్ చేశారా? ఆ బాలికను ఎవరికైనా అమ్మేశారా? అసలు ఏం జరిగిందో తేల్చారా.. అని ప్రశ్నించింది. ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఈ రోజుల్లో ఓ పదవ తరగతి అమ్మాయి ఆచూకీ తెలుసుకోలేకపోయారంటే అంతకన్నా సిగ్గుపడాల్సిన విషయం ఏమీ ఉండదంది. ఇన్ని రోజులైనా ఆ బాలిక ఆచూకీ కనిపెట్టలేకపోయారంటే.. ఇది ముమ్మాటికీ పోలీసుల వైఫల్యమేనని తేల్చి చెప్పింది. ‘కుమార్తె కనిపించడం లేదంటూ తండ్రి ఫిర్యాదు ఇచ్చి దాదాపు మూడు నెలలు అవుతోంది. ఇప్పటి వరకు ఏం చేశారు? మీరు దర్యాప్తు చేస్తున్నారంటే మేం నమ్మాలా? ఓ బాలిక మిస్సింగ్ కేసును తేలిగ్గా తీసుకుంటారా? రాష్ట్ర పోలీసులందరిలో కల్లా గుంటూరు పోలీసులు చాలా గ్రేట్ (వ్యంగ్యంగా). పోలీస్స్టేషన్లోకి రాకుండా సమాచార ప్రధాన కమిషనర్నే అడ్డుకున్న ఘనత వీరిది. ప్రధాన కమిషనర్కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదా ఉంటుంది. చట్ట ప్రకారం ప్రధాన కమిషనర్కు తగిన ప్రోటోకాల్ ఉంది. ఆయన్నే అడ్డుకున్నారంటే, గుంటూరు పోలీసులు ఎంత గొప్పోళ్లో అర్థమవుతోంది. ఇలాంటి పోలీసులు ఉండటం ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటు.’ అని హైకోర్టు నిప్పులు చెరిగింది. సదరు బాలికను షేక్ జాన్ సైదా అలియాస్ రబ్బానీ అనే వ్యక్తి తీసుకెళ్లారని తెలిసినా కూడా పోలీసులు పట్టించుకోకపోవడంపై మండిపడింది. ఆ బాలికను గురువారం తమ ముందు హాజరుపరిచి తీరాలని ఏకంగా డీజీపీనే హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ గేదెల తుహిన్ కుమార్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కుమార్తె ఆచూకీ కోసం హైకోర్టు తలుపుతట్టిన తండ్రి... గుంటూరు భాష్యం పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న తన కుమార్తె ట్యూషన్కి వెళ్లి తిరిగి రాలేదంటూ గుంటూరుకు చెందిన వ్యాపారి వాసు ఈ ఏడాది జూన్ 10న పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అదే రోజున మిస్సింగ్ కేసు నమోదు చేశారు. వాసు ఒత్తిడితో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొన్ని క్లూస్ సంపాదించారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ బాలిక ఆచూకీని మాత్రం తెలుసుకోలేకపోయారు. పోలీసుల నిర్లక్ష్య వైఖరితో విసిగిపోయిన వాసు హైకోర్టును ఆశ్రయించారు. తన కుమార్తెను కోర్టు ముందు హాజరుపరిచి, ఆమెను తమకు అప్పగించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ ఆయన హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. చేతనైతే పట్టుకోవాలని సవాలు విసిరినా పోలీసులు స్పందించడం లేదు... ఈ వ్యాజ్యంపై బుధవారం జస్టిస్ బట్టు దేవానంద్ ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది డీవీ శశిధర్ వాదనలు వినిపించారు. ట్యూషన్కు వెళ్లిన పిటిషనర్ కుమార్తె గత 80 రోజులుగా కనిపించడం లేదన్నారు. ఇన్స్ట్రాగామ్లో పరిచయమైన షేక్ జాన్ సైదా అలియాస్ రబ్బానీ అనే వ్యక్తి ఆ బాలికను ట్రాప్ చేసి తీసుకెళ్లారన్న విషయం దర్యాప్తులో రూఢీ అయినట్లు పోలీసులు చెబుతున్నారని, అయితే తదుపరి ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు. రబ్బానీ ఉపయోగించిన బైక్ మొదలు, సదరు బాలికను తీసుకెళ్లడం, నెల్లూరులో ఫోన్ కొనడం, కోయంబత్తూర్లో లాడ్జీల్లో దిగడం, అక్కడి నుంచి కేరళ వెళ్లడం, మళ్లీ అక్కడి నుంచి హైదరబాద్ రావడం వంటి వాటికి ఆధారాలు సేకరించినట్లు పోలీసులు చెబుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. చేతనైతే తనను పట్టుకోవాలని సైదా ఇన్స్టాలో సవాలు విసిరాడని, అయినప్పటికీ పోలీసులు ఆ బాలిక ఆచూకీని మాత్రం తెలుసుకోవడం లేదన్నారు. సైదా మొబైల్ నెంబర్, ఇన్స్ట్రా ఐడీ, చిరునామా కూడా పోలీసులు తెలుసుకున్నారని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, గుంటూరు పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్హెచ్ఓ.. ఎస్పీలతో ప్రయోజనం లేదు.. డీజీపీనే కరెక్ట్... అనంతరం పోలీసుల తరఫున ప్రభుత్వ సహాయ న్యాయవాది (ఏజీపీ) కృష్ణ ప్రణీత్ స్పందిస్తూ, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. తల్లిదండ్రులతో కలిసి మూడు రాష్ట్రాలకు వెళ్లారన్నారు. ఫిర్యాదు రాగానే కేసు నమోదు చేసి, ఆ బాలిక, రబ్బాని ఎక్కడున్నారో తెలుసుకున్నామని, తీరా అక్కడి వెళ్లాక వారు అక్కడ లేరని తెలిపారు. బాలిక ఆచూకీ తెలుసుకునేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, పోలీసులు సక్రమంగా దర్యాప్తు చేస్తున్నారంటే తామెలా నమ్మగలమంటూ వ్యాఖ్యానించింది. ఆ బాలికను గురువారం తమ ముందు హాజరుపరిచి తీరాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. డీజీపీకి కాకుండా జిల్లా ఎస్పీకి ఆదేశాలు ఇవ్వాలని ప్రణీత్ కోరగా, ధర్మాసనం అందుకు నిరాకరిస్తూ, ఎస్హెచ్ఓ, ఎస్పీలకు ఆదేశాలిస్తే ప్రయోజనం ఉండదని, డీజీపీకే ఆదేశాలు ఇవ్వడం సబబని తేల్చి చెప్పింది. -
తీవ్ర వర్షాభావం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 67 సంవత్సరాల తర్వాత అంతటి తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అమరావతి కేంద్రం డైరెక్టర్ కె.నాగరత్న తెలిపారు. పసిఫిక్ మహాసముద్రం వేడెక్కడం వల్ల ఏర్పడే వాతావరణ వ్యవస్థ ఎల్నినో 1959లో ఉన్నంత తీవ్రంగా ఇప్పుడు ఉందని అన్నారు. వచ్చే ఏడాది వరకూ దీని ప్రభావం ఉంటుందని, ఫలితంగా తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉంటాయని పేర్కొన్నారు. సాక్షి ప్రతినిధికి బుధవారం ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె పలు అంశాలు వెల్లడించారు. ‘ఎల్నినో’ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? మన రాష్ట్రంపై దాని ప్రభావం ఏ స్థాయిలో కనిపిస్తోంది? ప్రస్తుతం ఎల్నినో దేశవ్యాప్తంగా వాతావరణ వ్యవస్థలను ప్రభావితం చేస్తోంది. పసిఫిక్ మహా సముద్రంలోని ‘నినో 3.4’ రీజియన్లో పరిస్థితులు సాధారణ స్థాయిలోనే ఉన్నాయి. అయితే యునైటెడ్ స్టేట్స్కి చెందిన నోవా (నేషనల్ ఓషియానక్ అండ్ అటా్మస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్) సంస్థ అంచనాల ప్రకారం అక్టోబర్, నవంబర్ నాటికి దీని తీవ్రత మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో వర్షపాతం ఏ రకంగా ప్రభావితమైంది? జూన్ నెల నుంచే రాష్ట్రంలో వర్షపాతం సాధారణం కంటే చాలా తక్కువగా నమోదవుతోంది. ముఖ్యంగా భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు పడే రోజుల సంఖ్య దాదాపు 80 శాతం వరకు తగ్గిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు దక్షిణ కోస్తా వైపు రాకుండా ఉత్తర దిశగా పయనించడం వల్ల ఏపీ వ్యాప్తంగా కేవలం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలే కురిశాయి. ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, కాకినాడలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కొన్నిచోట్ల సాధారణ వర్షపాతం నమోదైనప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా చూస్తే తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. సాధారణ సీజన్తో పోలిస్తే వర్షపాత రోజుల్లో వచ్చిన వ్యత్యాసం ఏంటి? వర్షపాత రోజులు సాధారణంగా నమోదవుతున్నప్పటికీ, భారీ వర్షాలు కురిసే రోజులు 80 శాతం తగ్గిపోయాయి. ఇదే ప్రధాన సమస్యగా మారింది. రాష్ట్రంలో ఏయే జిల్లాలు అత్యంత తీవ్రంగా ప్రభావితమయ్యాయి? ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జిల్లాలూ లోటు వర్షపాతం పరిధిలోనే ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే 50 శాతం లోటు వర్షపాతం నమోదైంది. నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో గరిష్టంగా 69 శాతం వరకు వర్షపాత లోటు నమోదైంది. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ రంగానికి ఉపయోగపడేలా ఐఎండీ చేపడుతున్న చర్యలేంటి? ఎల్నినో వల్ల సంభవించే పరిస్థితుల గురించి ముందే హెచ్చరికలు జారీ చేశాం. ఐఎండీ, రాష్ట్ర వ్యవసాయ శాఖ సమన్వయంతో వ్యవహరిస్తున్నాయి. వర్షాభావం దృష్ట్యా ఎక్కువ నీరు అవసరమయ్యే వరి పంట స్థానంలో తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించేందుకు కంటింజెన్సీ ప్లాన్స్ అమలు చేస్తున్నాం. రైతులకు నిరంతరం సమాచారం అందించడానికి రోజువారీగా మండల స్థాయిలో, వారానికి రెండుసార్లు జిల్లా స్థాయిలో ఆగ్రో బులెటిన్లు, ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్కాస్ట్లు విడుదల చేస్తున్నాం. రాబోయే సీజన్లలో వాతావరణం ఎలా ఉండబోతోంది? అంతర్జాతీయ వాతావరణ నమూనాల ప్రకారం వచ్చే ఏడాది మార్చి వరకు ‘ఎల్నినో’ ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. అప్పటివరకు సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదు కావచ్చు. ఏప్రిల్ తర్వాత మార్పులు సంభవించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలానికి తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఈ స్థాయి ఎల్నినో తీవ్రత గతంలో ఎప్పుడైనా ఉందా? సాధారణంగా ఎల్నినో ఉన్నప్పుడు వర్షపాతం తగ్గుతుంది. కానీ ఈసారి పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. అసలు వర్షపాతమే లేని పరిస్థితి ఏర్పడింది. 1959లో సరిగ్గా ఇటువంటి తీవ్రమైన పరిస్థితులు నమోదయ్యాయి. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ అదే తరహా ప్రతికూల వాతావరణాన్ని చూస్తున్నాం. సెప్టెంబర్ చివరి వరకు రాష్ట్రంలో వర్షపాతం అత్యంత తక్కువగా నమోదయ్యే సూచనలున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులకు మీరు ఇచ్చే ప్రధాన సూచన ఏంటి? అన్ని ప్రభుత్వ శాఖలూ వాతావరణ శాఖతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి. ఐఎండీ జారీ చేసే ఆగ్రో బులెటిన్లు, అర్బన్, రూరల్, సాధారణ వాతావరణ నివేదికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ఆ హెచ్చరికల ప్రాతిపదికన కార్యాచరణ రూపొందించుకోవాలి.


