breaking news
Amaravati
-
రేపు విజయవాడకు వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని విజయవాడలో రేపు(మార్చి 18, బుధవారం) వైఎస్సార్సీపీ నిర్వహించే ఇఫ్తార్ విందు విందులో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొననున్నారు. ముస్లిం మత పెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యే ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులతో కలిసి వైఎస్ జగన్ ఉపవాస విరమణ కార్యక్రమంలో పాల్గొంటారు.రంజాన్ మాసం సోదరభావం, సామరస్యం, సేవా భావానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొంటూ ఈ ఇఫ్తార్ విందు నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ వేదికగా జరిగే ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు సాయంత్రం 6 గంటలకు వైఎస్ జగన్ విజయవాడ చేరుకుంటారు. కార్యక్రమం అనంతరం తిరిగి అక్కడి నుంచి తాడేపల్లి బయలుదేరుతారు. -
రైతు సమస్యలపై చంద్రబాబు సర్కార్ స్పందించాలి: సాకే శైలజానాథ్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో రైతులు, రైతు కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వ్యవసాయం దండగ అనే రీతిలోనే ఇప్పటికీ చంద్రబాబు ఆలోచిస్తున్నారంటూ దుయ్యబట్టారు.‘‘సగటున రోజుకు 8 మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభమే ఈ ఆత్మహత్యలకు కారణం. విపత్తులు వచ్చినా ప్రభుత్వం మాటలు తప్ప.. లబ్ధి చేకూర్చడం లేదు. ఎన్నికల ముందు రైతులకు, రైతు కూలీలకు అనేక హామీలు ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. అరకొర మినహా ఏ పంటకు గిట్టుబాటు ధరలు లేవు...మూడు లక్షల కోట్లకు పైగా అప్పులు తెచ్చినా ధరల స్థిరీకరణ నిధికి రూ.3,000 కోట్లు కూడా కేటాయించలేదు. వైఎస్సార్, జగన్ పరిపాలనలో రైతే రాజు అన్నట్లుగా పరిస్థితులు ఉండేవి. క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించక రైతులు విపత్తులతో నష్టపోయారు. అన్నంపెట్టే రైతుల సమస్యలపై చంద్రబాబు ప్రభుత్వం వెంటనే స్పందించాలి. చిన్న, సన్నకారు రైతాంగాన్ని ఆదుకోవాలి’’ అని సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. -
ఆకు రౌడీలంతా బీఆర్ నాయుడు చెంత చేరారు: భూమన
సాక్షి, తాడేపల్లి: ఆకు రౌడీలంతా బీఆర్ నాయుడు చెంత చేరారంటూ వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ నాయుడిని టీటీడీ ఛైర్మన్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ.. ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆందోళనలు చేపట్టింది. ఈ సందర్భంగా భూమన కరుణాకర్రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆకు రౌడీలను బీఆర్ నాయుడు పెంచి పోషిస్తున్నారంటూ దుయ్యబట్టారు.‘‘తిరుమల అరాచక శక్తుల, అసాంఘిక కార్యక్రమాలతో తల్లడిల్లుతోంది. బీఆర్ నాయుడు చైర్మన్ అయిన తర్వాత టీటీడీ ఔన్నత్యం, విశిష్టత దెబ్బతింది. టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు పూర్తిగా అనర్హుడు. బీఆర్ నాయుడు తీరుపై రాష్ట్ర ప్రజలు, హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా ప్రభుత్వం వెనకేసుకొస్తోంది.’’ అని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు.రూ.300 రూపాయల టికెట్లను కూడా ఆకు రౌడీలకు ఇచ్చి టీటీడీ ఛైర్మన్ వాళ్ళని పోషిస్తున్నారు. టీటీడీ చైర్మన్ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపితే ఆకు రౌడీలు మా వారిపై దాడి చేశారు. శాంతి యుతంగా నిరసన తెలిపిన మహిళలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. అనుగ్రహ భాషనలతో ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరియాల్సిన చోట ఆకు రౌడీల బూతులు వినిపిస్తున్నాయి. అసాంఘిక శక్తులపై ఉద్యమ నాయకుడిగా 50 ఏళ్ల క్రితమే పోరాటం చేశాను’’ అని భూమన కరుణాకర్రెడ్డి పేర్కొన్నారు. -
వాళ్లంతా అడ్డంగా దొరికినా.. బాబు నో యాక్షన్: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: డ్రగ్స్ తీసుకుంటూ టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ పట్టుబడ్డాడని.. పార్లమెంటు చరిత్రలో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీ ‘పుట్టా’నేనని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఒంగోలు నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు, ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘పుట్టా మహేష్తో మొదలై... పుట్టా మహేష్తో ఆగిపోలేదు.. ఇలాంటి వాటిపట్ల చంద్రబాబు వ్యవరించిన తీరు అత్యంత దారుణం’’ అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు.‘‘ఒక పాలకుడిగా ఆయన వ్యవహరించలేదు. తప్పు చేసిన వారిపట్ల తయన చర్యలు తీసుకోలేదు. అందుకనే విచ్చలవిడిగా జరుగుతున్నాయి. అత్యాచారం చేశారని, ఆపై మోసం చేశారని బాధితురాలు స్వయంగా మోసం చేశారని ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తే.. దానిపై కమిటీలు అంట.. కోనేటి ఆదిమూలం మహిళ మీద దారుణమైన లైంగిక దాడిచేస్తే పంచాయితీ చేశారు. కేజీబీవీ మహిళా ప్రిన్సిపాల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మీద నో యాక్షన్...మహిళలతో అశ్లీల వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మీద నో యాక్షన్. చివరకు మంత్రి సంధ్యారాణి పీఏ మీదా నో యాక్షన్. ప్రస్తుత టీటీడీ ఛైర్మన్ మీదా నో యాక్షన్. వీడియో, ఫొటోలతో పట్టుబడ్డా.. నో యాక్షన్. ఆదినారాయణరెడ్డి కొడుకు డ్రగ్స్ తీసుకుంటూ.. పట్టుబడితే.. నో యాక్షన్. ఇలాంటి వాటికి వత్తాసు పలికే భావన చంద్రబాబుకు ఉంది కాబట్టే.. ఇలాంటివి జరుగుతున్నాయి’’ అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు.‘‘తన కొడుకు స్విమ్మింగ్ పూల్స్ వద్ద తాగుతూ, తూలుతూ అమ్మాయిలతో డ్యాన్స్లు చూస్తే నో యాక్షన్. తన బావమరిది అమ్మాయిలకు ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలని అని బహిరంగంగా మాట్లాడితే నో యాక్షన్. చిన్నప్పుడు తాను ఇంతకంటే ఎక్కువే చేశానని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు మైండ్ సెట్ ఎలాంటిదో ఇవన్నీ సూచిస్తున్నాయి. వీళ్లకు ప్రజలకు మంచి చేయాలన్న మైండ్ సెట్ లేదు’’ అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
హెరిటేజ్కి చంద్రబాబు ప్రభుత్వం భారీ రాయితీలు
సాక్షి,అమరావతి: హెరిటేజ్కి చంద్రబాబు ప్రభుత్వం భారీ రాయితీలు కల్పించింది. టైలర్ మేడ్ రాయితీలిస్తూ జీవో 57ను ప్రభుత్వం జారీ చేసింది. హెరిటేజ్ కంపెనీకి మొత్తం రూ.59.69 కోట్లు రాయతీలిస్తున్నట్లు జీవోలో పేర్కొంది.35మందికి ఉద్యోగాలిస్తుందని రూ.59.69కోట్ల రాయితీ, టెక్నాలజీ అప్గ్రేడేషన్ సబ్సిడీ రూ.34.93కోట్లు ఇస్తుంది. ఐదేళ్ల పాటు 100శాతం జీఎస్టీ రీయింబర్స్మెంట్,జీఎస్టీ రీయింబర్స్మెంట్ కింద రూ.17.80కోట్లు లబ్ధి. ఐదేళ్ల పాటు విద్యుత్ ఛార్జీల్లో యూనిట్కి రూపాయి రాయితీ, ఐదేళ్లూ ఎలక్ట్రిసిటీ డ్యూటీ యూనిట్కి రూపాయి రాయితీ ఇచ్చింది. విద్యుత్ రాయితీల ద్వారా హెరిటేజ్కి రూ.2కోట్లు లబ్ధి చేకూరనుంది. 2శాతం వడ్డీ రాయితీ కల్పించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
'గ్యాస్' ట్రబుల్!
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా వంట గ్యాస్ సరఫరాలో చంద్రబాబు సర్కార్ ఘోరంగా విఫలమైంది. గృహ, వాణిజ్య సిలిండర్ల మధ్య తేడా లేకుండా బ్లాక్ మార్కెట్ దందా నడుస్తుంటే కళ్లప్పగించి చోద్యం చూస్తోంది. అత్యవసర వినియోగానికి ప్రభుత్వ ఆస్పత్రులు, హాస్టళ్లకు సైతం గ్యాస్ను అందించలేని దుస్థితిలో ఉంది. పైకి మాత్రం చంద్రబాబు యంత్రాంగం బూటకపు ప్రకటనలు చేస్తూ కాలం గడిపేస్తోంది. ముఖ్యంగా టీడీపీ నాయకులు, సానుభూతిపరుల చేతుల్లోని గ్యాస్ ఏజెన్సీల ద్వారా బ్లాక్ దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా నడుస్తోంది. ఫలితంగా సంక్షోభ పరిస్థితులను అనుకూలంగా మలుచుకునే చంద్రబాబు నైజం మరోసారి బట్టబయలైంది. ముఖ్యంగా హోటళ్లు, కాఫీ షాపులు, రెస్టారెంట్లకు గ్యాస్ సరఫరా చేయట్లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. బ్లాక్ మార్కెట్లో రూ.3వేల నుంచి రూ.4వేలు చెల్లిస్తే సిలిండర్లు దొరకడం అధికార పార్టీ దందాను బట్టబయలు చేస్తోంది. మరోవైపు గృహ వినియోగ గ్యాస్ పంపిణీకి ఎటువంటి అవరోధం లేకపోయినా వినియోగదారులు గ్యాస్బుక్ చేసుకుని వారం రోజులు దాటుతున్నా సరఫరా జరగట్లేదు. నిత్యం గ్యాస్ ఏజెన్సీలకు ఫోన్లు చేస్తే రేపు, ఎల్లుండి.. అంటూ సమాధానం వస్తోంది మినహా గ్యాస్ అందట్లేదు. సహజ వాయువులు, ఎల్పీజీ ఉత్పత్తులను ‘నిత్యావసర వస్తువుల చట్టం’లోకి మార్చినప్పటికీ యథేచ్ఛగా పక్కదారి పట్టిస్తుండటం గమనార్హం. నాలుగు రోజులకే నిల్వ! ఏపీలో 1.61 కోట్ల గృహ వినియోగ, 10లక్షల వరకు వాణిజ్య వినియోగ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో గృహ వినియోగానికి రోజుకు 4వేల టన్నుల గ్యాస్ అవసరం. రాష్ట్రంలో 17 వేల టన్నుల నిల్వలు ఉన్నాయి. ఇది నాలుగు రోజులకు మాత్రమే సరిపోతాయి. గడిచిన కొద్ది రోజులుగా ఇదే పరిస్థితి. గతంలో నిత్యం 2.50 లక్షలకు పైగా గ్యాస్ సిలిండర్లు సరఫరా ఉంటే తాజా ఆందోళనకర పరిస్థితుల్లో రోజువారీ బుకింగ్లు 3లక్షలకుపైగా పెరిగాయి. గ్యాస్ బుకింగ్ గడువు పట్టణాల్లో 25 రోజులు, గ్రామాల్లో 45 రోజులకు పెంచిన తర్వాత కూడా బుకింగ్లు తగ్గట్లేదు. అంటే, ఇంటిలో గ్యాస్ నిండుకుంటున్న తరుణంలో బుక్ చేసుకున్న వినియోగదారులు వారానికిపైగా సిలిండర్ కోసం ఎదురు చూడకతప్పని పరిస్థితి. మరోవైపు క్లిష్ట పరిస్థితుల్లో వెసులుబాటు ఇవ్వాల్సిన చోట ప్రభుత్వం ఈ–కేవైసీని తప్పని సరి చేయడంతో సమస్య జటిలమైంది. గ్యాస్ బుక్ అవ్వట్లేదంటూ వేలాదిమంది వినియోగదారులు ఏజెన్సీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మూసివేతకు దగ్గరగా హోటళ్లు గ్యాస్ కొరత హోటళ్లు, ఆతిథ్య రంగాన్ని తీవ్రంగా వేధిస్తోంది. రాష్ట్రంలో 2వేలకు పైగా స్టార్ హోటళ్లు, 3 వేలకుపైగా రెస్టారెంట్లతో పాటు చిరువ్యాపారులు కలుపుకొంటే 25వేలకుపై వ్యాపార సంస్థలు దినదిన గండంగా నడుస్తున్నాయి. నిత్యం హోటళ్ల రంగంలో 50 వేలకుపైగా సిలిండర్లు అవసరం. అలాంటిది ఒక్కసారిగా గ్యాస్ సరఫరా నిలిపివేడయంతో ఎప్పుడు పొయ్యి ఆరిపోతుందో తెలియని పరిస్థితుల్లో పని చేస్తున్నాయి. ప్రభుత్వం వాణిజ్య సిలిండర్లకు ఆంక్షలు పెడితే.. బ్లాక్ మార్కెట్లో రూ.3 వేలు నుంచి రూ.4వేలు వెచ్చించి కొనుగోలు చేస్తూ వ్యాపారాలు సాగిస్తున్నాయి. ఈ బ్లాక్ మార్కెట్ దందా గృహ వినియోగ సిలిండర్ల కొరతకు ఆజ్యం పోస్తోంది. ఇప్పటికే చాలా హోటళ్లు, క్యాటరింగ్ సర్వీసు వ్యాపారులు కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తున్నారు.మార్కెట్లోని పరిస్థితిలో మార్పు రాకపోతే హోటళ్ల మూసివేతకు వారం కంటే ఎక్కువ సమయం పట్టదని అసోసియేషన్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హోటళ్ల సమయాన్ని అధికారికంగా రాత్రి 10 గంటల్లోపు కుదించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా స్పందన లేకపోవడం గమనార్హం. -
జగన్ పాలనలో జోరు.. సంక్షేమం–అభివృద్ధి జోడు గుర్రాల దౌడు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలన అభివృద్ధి, సంక్షేమ రంగాలకు ప్రాధాన్యతతో కొనసాగిందని నీతి ఆయోగ్ కితాబు ఇచ్చింది. రాష్ట్ర వ్యయం నమూనా సంక్షేమ, మౌలిక సదుపాయాలపై బలమైన ప్రాధాన్యతకు నిదర్శనంగా నిలుస్తోందని పేర్కొంది. గత ప్రభుత్వ హయాంలో సొంత ఆదాయంలో ఆరోగ్యకరమైన పెరుగుదల ధోరణిని సూచించిందని నివేదిక తెలిపింది. 2023–24 రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య సూచికలపై నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలను ప్రస్తావించింది. రాష్ట్ర వ్యయం నమూనాను పరిశీలిస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చిందని.. ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణం, సాగునీరు, ఇంధన రంగాలకు పెద్దపీట వేసిందని నీతి ఆయోగ్ వెల్లడించింది. ఖర్చులలో ఎక్కువ భాగం జీతాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు లాంటి తప్పనిసరి బాధ్యతలను నిర్వర్తిస్తూనే గత ప్రభుత్వం కీలక రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆదాయాలు ఆరోగ్యకరమైన పెరుగుదలను సూచించాయని, జీఎస్టీతోపాటు వస్తువుల పన్నులు పెరిగాయని నివేదిక పేర్కొంది.» రెవెన్యూ, మూలధనం.. రెండూ కలిపి మొత్తం అభివృద్ధి వ్యయం వైఎస్ జగన్ పాలనలో గణనీయంగా పెరిగిందని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. 2019ృ20లో మొత్తం అభివృద్ధి వ్యయం రూ.1.10 లక్షల కోట్లుగా ఉండగా 2023ృ24లో రూ.1.67 లక్షల కోట్లకు గణనీయంగా పెరిగినట్లు నివేదిక ప్రస్తావించింది. గత ప్రభుత్వంలో ఐదేళ్లలో మొత్తం దాదాపు 65 శాతం పెరుగుదల నమోదైందని నివేదిక స్పష్టం చేసింది. స్థిరమైన వృద్ధి ఆధారంగా సంక్షేమ రంగాలను బలోపేతం చేయడంపై గత ప్రభుత్వ ప్రాధాన్యతకు ఇది నిదర్శనంగా నిలుస్తోందని తెలిపింది.» గత ప్రభుత్వంలో మూలధన వ్యయం జీఎస్డీపీలో 4 నుంచి 9 శాతం పరిధిలో ఉండటం ఆస్తుల సృష్టి, మౌలిక సదుపాయాల అభివృద్ధి వైపు స్థిరమైన పురోగతిని సూచిస్తోందని నివేదిక స్పష్టం చేసింది. 2023ృ24లో మొత్తం వ్యయంలో సామాజిక సేవల వ్యయం 52.4 శాతంతో అతి పెద్ద వాటాను కలిగి ఉందని పేర్కొంది. ఇది విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణ రంగాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను ప్రతిబింబిస్తోందని తెలిపింది. ఇక ఆర్థిక సేవలు 44.6 శాతం వాటాను కలిగి ఉండగా ప్రధానంగా రవాణా, నీటి పారుదల, ఇంధన రంగాలు పెట్టుబడుల ద్వారా పురోగమించాయని నివేదిక పేర్కొంది. » 2023ృ24లో మొత్తం రెవెన్యూ వ్యయంలో దాదాపు 48.59 శాతం జీతాలు, వడ్డీ చెల్లింపులు, పెన్షన్లు లాంటి తప్పనిసరి ఖర్చులకు కేటాయించినట్లు నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది. » గత ప్రభుత్వంలో రాష్ట్ర సొంత ఆదాయంలో ఆరోగ్యకరమైన పెరుగుదల నమోదైంది. 2023ృ24లో మొత్తం ఆదాయ వసూళ్లలో దాదాపు 52 శాతం సొంత పన్నుల ద్వారానే సమకూరినట్లు వెల్లడించింది. ఇందులో వస్తు సేవల పన్నులు అత్యధికంగా 35.5 శాతం వాటా కలిగి ఉండగా తరువాత జీఎస్టీ 34.1 శాతం వాటాగా నమోదైంది. » రాష్ట్ర సొంత ఆదాయం వైఎస్సార్సీపీ హయాంలో దాదాపు 48 శాతం వృద్ధిని నమోదు చేసిందని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. -
బీసీ, ఎస్సీ నేతలపైనే బాబు ప్రతాపం
సాక్షి, అమరావతి: అడ్డగోలు వ్యవహారాలు నడుపుతూ దొరికిపోయిన టీడీపీ నేతలపై చర్యల విషయంలో సీఎం చంద్రబాబు ద్వంద్వ వైఖరి పట్ల ఆపార్టీ లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎస్సీ, బీసీ నేతలైతే వెంటనే చర్యలు తీసుకోవడం.. సొంత సామాజికవర్గం నేతల విషయంలో మౌనముద్ర దాల్చడం ఏంటని మండిపడుతున్నారు. తాజాగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ హైదరాబాద్లోని ఫామ్ హౌస్లో డ్రగ్స్ కేసులో చిక్కడంతో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని షోకాజ్ నోటీసు జారీ చేశారు. అదే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాసలీలలపై ఎంత దుమారం రేగినా కిక్కురుమనకపోవడాన్ని పలువురు యాదవ సామాజిక వర్గ నేతలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు సొంత సామాజికవర్గం నేత కావడంతోనే బీఆర్ నాయుడు పవిత్రమైన టీటీడీ చైర్మన్గా ఉండి రాసలీలలు నడుపుతున్నా పట్టించుకోకుండా వదిలేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజానీకంలోనూ ఇదే చర్చ జరుగుతోంది. కనీసం టీటీడీకి ఉన్న పవిత్రతను దృష్టిలో ఉంచుకుని అయినా బీఆర్ నాయుడిపై చర్యలు తీసుకుంటే బాగుండేదని తటస్థులు సైతం పేర్కొంటున్నారు. బీఆర్ నాయుడు రాజీనామా చేయాల్సిందేనని, ఆయన ఒక్క క్షణం టీటీడీ చైర్మన్గా కొనసాగినా పదవికి కళంకమేనని సోషల్ మీడియాలో సైతం చర్చ సాగుతోంది. ఈ వ్యవహారంతో టీటీడీ ప్రతిష్టకు భంగం వాటిల్లినా చంద్రబాబు నోరు మెదపలేదు. కనీసం ఆయన్ను వివరణ కూడా అడగకుండా.. ఎవరు ఎటు పోయినా.. రాష్ట్రం ఏమైనా.. టీటీడీ భ్రష్టు పట్టిపోయినా ఫర్వాలేదనే రీతిలో బీఆర్ నాయుడిని కొనసాగిస్తున్నారు. బీఆర్ నాయుడు తీరుపై కూటమి నేతల్లోనూ తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆయన వల్ల అందరం ఇరుకునపడ్డామని, ఇంకా అందలం ఎక్కించడం ఏమిటనే అసహనం దాదాపు అందరిలోనూ కనిపించింది. అయినా సరే.. సొంత సామాజికవర్గం కావడం, అందులోనూ తనకు డప్పు కొట్టడంలో రికార్డులు బద్దలుకొట్టిన ఒక టీవీ ఛానల్కు బీఆర్ నాయుడు యజమాని కావడంతో చంద్రబాబు చేష్టలుడిగిపోయారనే విమర్శలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. పుట్టాకు షోకాజ్ డ్రామా.. డ్రగ్స్ కేసులో దొరికిపోయిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో తాను సీరియస్ అయినట్లు చంద్రబాబు లీకులు ఇచ్చారు. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, వెంటనే వివరణ ఇవ్వాలని ఆయనకు షోకాజ్ నోటీసుల డ్రామాకు తెర తీశారు. వాస్తవానికి పుట్టా మహేష్ పై వెంటనే సస్పెన్షన్ వేటు వేయాల్సి ఉన్నా సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి అల్లుడు, మరో సీనియర్ నేత సుధాకర్ యాదవ్కుమారుడు కావడంతో షోకాజ్ నోటీసు ఇచ్చి ఊరుకున్నారు. కనీసం నామమాత్రంగా తీసుకున్న ఇలాంటి చర్యలైనా బీఆర్ నాయుడి విషయంలో ఎందుకు తీసుకోలేకపోయారనే ప్రశ్నకు చంద్రబాబు వైపు నుంచి సమాధానం లేకుండా పోయింది. కోనేటి ఆదిమూలం సస్పెన్షన్ గతేడాది సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రాసలీలల వీడియో బయటకు రావడంతో ఆయనపై ఆగమేఘాల మీద సస్పెన్షన్ వేటు వేశారు. అప్పటి నుంచి ఆయన పార్టీ లోనే ఉన్నా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడంలేదు. దళిత నేత కావడంతో ఆయనపై సీరియస్ యాక్షన్ తీసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పుట్టా మహేష్ బీసీ కావడంతో షోకాజ్ నోటీసు ఇచ్చి డ్రామా నడిపారు. కానీ బీఆర్ నాయుడు తన సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో చంద్రబాబు ఆయన్ను కనీసం వివరణ కూడా అడగలేదు. ఎస్సీ నేతలపై ఒంటి కాలిపై లేస్తున్న చంద్రబాబు.. బీసీలైతే ఓ మాదిరిగా స్పందిస్తున్నట్లు టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అదే సొంత సామాజికవర్గం నేతలైతే ఎంత పెద్ద తప్పు చేసినా కనీసం పట్టించుకోనని తేల్చేసినట్లు ఈ మూడు ఉదంతాల ద్వారా తేటతెల్లమైందని పేర్కొంటున్నారు. -
కోడిని కోస్తే నాన్ బెయిలబుల్ కేసు.. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే బెయిలా?
సాక్షి, అమరావతి: ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోడిని కోస్తే నాన్ బెయిలబుల్ కేసు పెడుతున్నారు.. డ్రగ్స్ తీసుకుంటూ టీడీపీ ఎంపీ పట్టుబడితే మాత్రం స్టేషన్ బెయిల్పై విడుదల చేస్తున్నారు. చిన్న చిన్న కేసుల్లో అమాయకులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్న ప్రభుత్వం.. కూటమి నేతల డ్రగ్స్ కేసులు, మహిళలపై పాల్పడుతున్న నేరాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఏ చర్యలూ చేపట్టకుండా ద్వంద్వ వైఖరి అవలంభిస్తోంది’ అని వైఎస్సార్సీపీ ధ్వజమెత్తింది. చంద్రబాబు కూటమి ప్రభుత్వ ఈ ద్వంద్వ వైఖరిని వైఎస్సార్సీపీ ఎక్స్ వేదికగా సోమవారం ప్రశ్నించింది. ఏలూరు నియోజకవర్గ లోక్సభ సభ్యుడు పుట్టా మహేష్ కుమార్ డ్రగ్స్ తీసుకున్న కేసులో అడ్డంగా పట్టుబడ్డారని, ఇలాంటి ఘటన పార్లమెంట్ చరిత్రలో అరుదని పేర్కొన్నారు. అయినప్పటికీ రాజకీయ బలాన్ని ఉపయోగించి బెయిల్పై బయటకు తీసుకురావడం, షోకాజ్ నోటీసుల పేరుతో డ్రామాలు చేయడం సరికాదని అన్నారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, హోం మంత్రి వంగలపూడి అనిత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ స్పందించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. హైదరాబాద్లో డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నారన్న ఆరోపణలు, డ్రగ్స్ పరీక్షలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. రక్త పరీక్షల్లో కొకైన్ వాడినట్లు పాజిటివ్ వచ్చినట్లు చెబుతున్నారని, దీనిపై స్పందించాలని కోరారు. అలాగే మహిళలపై వేధింపులకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న కూటమి ప్రజాప్రతినిధులపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని వైఎస్సార్సీపీ మండిపడింది. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వచ్చిన అత్యాచార ఆరోపణలు, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక దాడి ఆరోపణలు, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్పై వేధింపుల ఆరోపణలు, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్పై అశ్లీల వీడియో కాల్స్ ఆరోపణలు వచ్చినప్పటికీ చర్యలు లేవని ధ్వజమెత్తింది. మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి పీఏపై కూడా చర్యలు తీసుకోలేదని తెలిపింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కూడా ఒక మహిళను మోసం చేశాడని ఆరోపణలు వచి్చనప్పటికీ స్పందన లేకపోవడం ఆందోళనకరమని తెలిపింది. కమిటీల విచారణలు, షోకాజ్ నోటీసుల పేరుతో డ్రామాలు ఆపి, డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఎంపీతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. లేకపోతే ప్రజలు చంద్రబాబు ప్రభుత్వాన్ని క్షమించరని ఎక్స్లో వైఎస్సార్సీపీ హెచ్చరించింది. -
మైకంలో ముంచారు..!
ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను బురిడీ కొట్టించడం తన పేటెంట్ హక్కని చంద్రబాబు మరోసారి నిరూపించారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ మాఫియాకు తలుపులు బార్లా తెరిచారు. ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన లోకేశ్ అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించారు. డ్రగ్స్ బ్యాచ్కు వత్తాసు పలుకుతూ ప్రజలను మోసగిస్తున్నారు. మాదక ద్రవ్యాల బానిసలను అరెస్టు చేయాలని ఎన్నికల ముందు వేదికల మీద వీరావేశంతో ఊగిపోయిన పవన్ కళ్యాణ్.. టీడీపీ కూటమి గంజాయి దందాపై మాత్రం ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోతున్నారు. వెరసి అధికారంలోకి రాగానే చంద్రబాబు తన నిజ స్వరూపం ప్రదర్శించారు. రాష్ట్రాన్ని టీడీపీ డ్రగ్స్ మాఫియాకు అప్పగించేసి తన మార్కు మోసాన్ని పునరావృతం చేశారు. దీంతో మాయల ఫకీరు మాయమాటలు నమ్మి మోసపోయిన బాలనాగమ్మలా తయారైంది రాష్ట్రం పరిస్థితి. టీడీపీ కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ దేశంలో డ్రగ్స్, గంజాయి రాజధానిగా ముద్ర వేసుకుని జాతీయ స్థాయిలో చెడ్డపేరు తెచ్చుకుంటోంది. -సాక్షి, అమరావతి నాడు ప్రజల్ని మభ్య పెట్టేందుకే విష ప్రచారం..చంద్రబాబు బృందం పన్నాగం తాము అధికారంలోకి వస్తే చాలు డ్రగ్స్, గంజాయిలను అరికడతామన్న చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ మాటలు ఎన్నికల ముందు కోటలు దాటాయి. నాడూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విష ప్రచారం చేసేందుకు గంజాయి, డ్రగ్స్ దందా పెరిగిపోయిందంటూ ఊరూవాడా దుష్ప్రచారానికి తెర తీశారు. అందుకు టీడీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా వత్తాసు పలికింది. కారు కూతలు, కాకి లెక్కలతో ప్రజల్ని తప్పుదారి పట్టించాయి. వాస్తవానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం గంజాయి దందాను ఉక్కుపాదంతో అణచివేసింది. అందుకోసమే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్) అనే వ్యవస్థను ప్రత్యేకంగా నెలకొల్పి విస్తృత అధికారాలు కల్పించింది. ‘సెబ్’ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లో(ఏవోబీ)లో దశాబ్దాలుగా సాగుతున్న గంజాయి సాగును కూకటి వేళ్లతో పెకిలించి వేసింది. ఆపరేషన్ పరివర్తన్ను రెండు దశల్లో విజయవంతంగా నిర్వహించి 11,500 ఎకరాల్లో గంజాయి సాగును నిర్మూలించింది. దశాబ్దాలుగా గంజాయి సాగును జీవనాధారంగా చేసుకున్న గిరిజనులను ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా ప్రోత్సహించింది. తద్వారా ఏవోబీలో గంజాయి సాగు అన్నదే లేకుండా చేసింది. అయినా సరే.. చంద్రబాబు, లోకేశ్ రాజకీయ దురుద్దేశాలతో నాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విష ప్రచారం చేశారు. తాము అధికారంలోకి వస్తే చాలు వంద రోజుల్లోనే గంజాయి, డ్రగ్స్ అనేవే లేకుండా చేస్తామని ప్రగల్భాలు పలికారు. ఈ దుష్ప్రచార కుట్రలో చంద్రబాబు పార్ట్నర్ పవన్ కళ్యాణ్ పాలు పంచుకుని మరింత దిగజారుడు ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఏకంగా 34 వేల మంది ఆడపిల్లలు కనిపించకుండా పోయారని... ఈమేరకు కేంద్ర నిఘా వర్గాలు తనకు తెలిపాయంటూ దుష్ప్రచారం చేశారు. అందుకు గంజాయి బ్యాచ్లే కారణమని ఆరోపణలు చేశారు. ఇలా చంద్రబాబు ముఠా ఎన్నికల్లో ప్రజల్ని తప్పుదారి పట్టించడమే లక్ష్యంగా పక్కా పన్నాగంతో దుష్ప్రచారానికి బరి తెగించింది. నాడు దుష్ప్రచార రాద్ధాంతం.. నేడు డ్రగ్స్ దందాపై మౌనమే సిద్ధాంతంఇదీ పవన్ కళ్యాణ్ తీరు రాష్ట్రంలో 34 వేల మంది బాలికలు కనిపించకుండా పోయారని గతంలో విష ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ తాను ఉప ముఖ్యమంత్రి కాగానే ఆ మాటే ఎత్తడం లేదు. మరి ఆ బాలికలను సురక్షితంగా వారి కుటుంబాల దగ్గరకు చేర్చేందుకు ఏ చర్యలు తీసుకున్నారంటే సమాధానమే చెప్పడం లేదు. ఎందుకంటే.. వైఎస్సార్సీపీ హయాంలో బాలికలు కనిపించకుండా పోయారని తాను చేసింది తప్పుడుప్రచారమేనన్న నిజం ఆయనకు తెలుసు కాబట్టే!నాడు చంద్రబాబు కుట్ర స్క్రిప్ట్ ప్రకారమే అవాస్తవ ఆరోపణలతో పవన్ నటించారన్నది స్పష్టమైంది. ఇక ప్రస్తుతం టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ డ్రగ్స్ తీసుకున్నారని వెల్లడైనా సరే పవన్ కళ్యాణ్ నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. కూటమి ప్రభుత్వంలో ఈ 20 నెలల్లోనే 280 మంది మహిళలపై లైంగిక దాడులు జరిగినా.. వారిలో 15 మందిపై హత్యాచార ఘటనలు వెలుగులోకి వచ్చినా పవన్ కళ్యాణ్ కనీసం స్పందించలేదు. ఎందుకంటే.. ఈసారి చంద్రబాబు ఆయనకు స్క్రిప్ట్ ఇవ్వలేదు కదా!నేడుడ్రగ్స్ దందాకు రాచబాటమత్తు మందుల రాజధానిగా ఏపీ టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే చంద్రబాబు తన నిజ స్వరూపం ప్రదర్శించారు. టీడీపీ గంజాయి, డ్రగ్స్ మాఫియాకు తలుపులు బార్లా తెరిచారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమర్థంగా అణచివేసిన గంజాయి దందాను మళ్లీ తెరపైకి తెచ్చారు. చంద్రబాబుకు వీరవిధేయులైన టీడీపీ సీనియర్ నేతల కుటుంబాలే రింగ్ మాస్టర్లుగా డ్రగ్స్ దందాకు బరి తెగించారు. ఏవోబీలో గంజాయి సాగును మళ్లీ పట్టాలు ఎక్కించడంతోపాటు.. ఒడిశా, చత్తీస్ఘడ్ నుంచి గంజాయి స్మగ్లింగ్కు ఏపీని గేట్వేగా మార్చేశారు. ఏపీతోపాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలను తమ గంజాయి దందాకు మార్కెట్గా చేసుకున్నారు. ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే చాలు డోర్ డెలివరీ... ఫామ్హౌస్లో రేవ్ పార్టీలంటే చాలు బల్్కగా సరఫరా... విద్యా సంస్థలే లక్ష్యంగా రిటైల్ అమ్మకాలు...! ఇలా వివిధ రీతుల్లో గంజాయి, డ్రగ్స్ మార్కెటింగ్ను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఇక ద్రవరూప గంజాయి (లిక్విడ్ గంజాయి) మాఫియా అయితే అడ్డూ అదుపూ లేకుండా సాగుతోంది. సాధారణ గంజాయి కిలో రూ.12 వేలు ఉంటే... లిక్విడ్ గంజాయి లీటరు రూ.లక్ష ధర పలుకుతుండటమే అందుకు కారణం. ప్రజల్ని మభ్యపెట్టేందుకే ‘గంజాయి వద్దు బ్రో..’ అనే నినాదాలతో కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ టీడీపీ గంజాయి మాఫియా దర్జాగా దందా సాగిస్తున్నా కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ఏటా రాష్ట్రం గుండా రూ.600 కోట్ల విలువైన 5 లక్షల కిలోల గంజాయి దందా సాగుతోందని పోలీసు వర్గాలే అంచనా వేస్తున్నాయి. ఇక అప్ఘనిస్తాన్, నేపాల్ నుంచి తెప్పిస్తున్న కొకైన్ లాంటి డ్రగ్స్ దందా మరో రూ.500 కోట్లు ఉంటుందని చెబుతున్నాయి. దాంతోపాటు టీడీపీ మద్యం మాఫియా ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం దందాను ఏకంగా కుటీర పరిశ్రమ తరహాలో ఊరూవాడా నెలకొల్పి దోపిడీకి పాల్పడుతోంది. ఏటా రూ.5 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.25 వేల కోట్ల దోపిడీయే లక్ష్యంగా దందా సాగిస్తోంది. ‘దమ్మారో... దమ్’ అంటున్న కూటమి నేతలు మరోవైపు టీడీపీ కూటమి నేతలు దమ్మారో దమ్..! అంటూ డ్రగ్స్, గంజాయి మత్తులో జోగుతున్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు సుదీర్రెడ్డి డ్రగ్స్ మత్తులో జోగుతూ ఇటీవల పోలీసులకు చిక్కారు. గతేడాది భీమవరం ఎమ్మెల్యే పి.రామాంజనేయులు కుమారుడు కూడా హైదరాబాద్లో డ్రగ్స్ కేసులో చిక్కారని జాతీయ మీడియాలో ప్రముఖంగా ప్రచురితం కావడం గమనార్హం. తాజాగా ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ హైదరాబాద్లో డ్రగ్స్ సేవించి అడ్డంగా దొరికారు. అయినా సరే కేవలం షోకాజ్ నోటీసుతో చంద్రబాబు సరిపుచ్చారు. తమ అధినేత అండ చూసుకునే ఎంపీ పుట్టా మహేశ్ సోమవారం లోక్సభ సమావేశాలకు దర్జాగా హాజరయ్యారని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. -
బాబు పాలన హిందుత్వానికి ప్రమాదకరం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన హిందుత్వానికి ప్రమాదకరంగా మారిందని విశ్వ హిందూ పరిషత్(వీహెచ్పీ) నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీ చైర్మన్పై ఆరోపణలొస్తే విచారణ జరిపించకుండా తాత్సారం ఏమిటని ప్రశ్నించారు. సోమవారం విజయవాడలోని వీహెచ్పీ కార్యాలయంలో పరిషత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభాగం క్షేత్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్, రాష్ట్ర విభాగం కోశాధికారి దుర్గాప్రసాదరాజు, విజయవాడ మహానగర కార్యదర్శి శ్రీహరి విలేకరులతో మాట్లాడారు. ప్రజా జీవితంలో ఉన్నవాళ్లు, ధార్మిక, ఆధ్యాత్మిక బాధ్యతల్లో ఉన్నవాళ్లపై ఆరోపణలొస్తే తక్షణమే నైతిక బాధ్యతవహించి బాధ్యతల నుంచి తప్పుకోవాలని, లేకుంటే ప్రభుత్వమే దర్యాప్తునకు ఆదేశించాలని పేర్కొన్నారు. కానీ రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిపై ఆరోపణలొస్తే మిన్నకుండడం ఏమిటని ధ్వజమెత్తారు. ఎంపీ డ్రగ్స్ తీసుకున్న ఘటనపై స్పందించిన చంద్రబాబు, టీటీడీ చైర్మన్పై చర్యలు తీసుకోకపోవడం ఏమిటని నిలదీశారు. ఇటీవల తరచూ ఎక్కువ మంది పిల్లలను కనండి అంటూ సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు అనుమానాస్పదంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. పిల్లలను కంటే రాయితీలు ఇస్తామని చేస్తున్న ప్రకటన ఏ వర్గాలకని ప్రశ్నించారు. దేవుడి భూములను కాపాడాలని సర్కారుకు లేదు దేవదాయ శాఖ భూముల విషయంలో సర్కారు తీరు హిందూ సమాజానికి చాలా ప్రమాదకరంగా ఉందని తనికెళ్ల రవికుమార్ విమర్శించారు. ప్రైవేట్ వ్యక్తుల భూములు లక్షన్నర ఎకరాలు దేవదాయ భూముల్లో కలిశాయన్న సాకుతో దేవుడి మాన్యాలను దోచుకునే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. సర్వే నంబర్లు మారాయన్న పేరుతో దేవదాయ భూములను ప్రైవేట్ వ్యక్తులకు, కార్పొరేట్లకు కట్టబెట్టాలని చూస్తే తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీర్ఘకాలిక లీజులెందుకు? పట్టణ ప్రాంతాల్లో ఉండే దేవాలయాల భూములను 33 ఏళ్ల పాటు దీర్ఘకాలికంగా ప్రైవేట్ సంస్థలకు లీజుకివ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం జీఓ 139 తేవడాన్ని సత్య రవికుమార్ తప్పుపట్టారు. దేవుడి భూములను గరిష్టంగా 11 ఏళ్లకు మాత్రమే టెండరు ద్వారా లీజుకు ఇవ్వాలని చట్టం ఉంటే 33 ఏళ్లకు ఎందుకు పెంచాల్సి వచ్చిందని బాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. వీహెచ్పీ నేతలు లేవనెత్తిన మరిన్ని అంశాలివీ.. »‘‘కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని గొడుగుపేట ఆలయ భూమి విజయవాడ సమీపాన గొల్లపూడిలో ఉంటే ఆ భూమిని ఎగ్జిబిషన్ గ్రౌండ్ కోసం, గోల్ఫ్ కోర్టుకు సర్కారు కేటాయించింది. దీనిని తప్పుబడుతూ సుప్రీంకోర్టు స్టే ఇస్తే.. 56 రోజుల్లో దానిని ఖాళీ చేసి అప్పగిస్తామని అఫిడవిట్ ఇచ్చిన సర్కారు ఇప్పటికి వంద రోజులైనా, భూమిని దేవస్థానానికి ఎందుకు అప్పగించలేదు. » కాకినాడ శ్రీభావనారాయణస్వామి ఆలయ భూములను క్రికెట్ స్టేడియం కోసం ఇచ్చారు. దీనిపై కోర్టుకెళ్లి స్టే తీసుకురావాల్సి వచ్చింది. » సింహాచలం ఆలయ భూములను పంచ గ్రామాల పరిధిలో ఆక్రమిస్తే ఆక్రమణదారులకు రెగ్యులర్ చేయడం కోసం ప్రభుత్వం కమిటీ వేయడం ఏమిటీ? ఈ భూముల్లో కొందరు చర్చిలు, మసీదులూ కట్టారు. » ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలో వందలాది ఎకరాల దేవదాయ భూమిని రాత్రికిరాత్రి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేయత్నం చంద్రబాబు సర్కారు చేసింది. తిరుపతిలో ముంతాజ్ హోటల్కు భూములివ్వాలని ప్రభుత్వం యత్నిస్తోంది. » దేవదాయ భూముల పరిరక్షణ కోసం వీహెచ్పీ దేశవ్యాప్తంగా ఉద్యమిస్తోంది. రాష్ట్రంలో ఇటీవల హైందవ శంఖారావం సభను నిర్వహించాం. దేవదాయ భూముల రక్షణకు చట్ట సవరణ నమూనా డ్రాప్ట్ తయారు చేసి ప్రభుత్వానికి, సీఎం, డిప్యూటీ సీఎం, బీజేపీ అధ్యక్షుడుకి ఇచ్చాం. అయినా ప్రభుత్వం దైవ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోంది. వీటిన్నింటిపై హిందూ సమాజాన్ని జాగృతం చేస్తాం. మరో ధారి్మక స్వతంత్ర పోరాటానికి హిందువులను సిద్ధం చేస్తాం.’’ -
10:40 దాటిన తర్వాత పంచ్ వేస్తే సెలవే..
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై చంద్రబాబు ప్రభుత్వం మరో పిడుగు వే సింది. ఇప్పటికే సర్వేల పేరిట ఉక్కిరిబిక్కిరి చేస్తూ షోకాజ్ నోటీసులతో బెంబేలెత్తిస్తున్న సర్కారు తాజాగా హాజరు నిబంధనలు మార్చింది. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఉదయం 10:40 గంటల తర్వాత పంచ్ వేస్తే సెలవుగా పరిగణిస్తామంటూ కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు సచివాలయాల ఉద్యోగుల ముఖ ఆధారిత హాజరు నమోదు యాప్లో సోమవారం ఆయా నిబంధనలు ప్రత్యక్షమయ్యాయి. నిబంధనలు ఇలా... ఆఫీసు మాన్యువల్ ప్రకారం సచివాలయాల ఉద్యో గులు ఉదయం 10:30 గంటల్లోగా హాజరు నమోదు చేయాలి. మరో పది నిమిషాలు సర్దుబాటు సమయం (గ్రేస్ టైం) కల్పించినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉదయం 10.40 గంటల తర్వాత 11.30 గంటల మధ్య నెలలో హాజరు నమోదును ఆయా సచివాల యాల డీడీవో (వేతన బిల్లులు నమోదు చేసే అధికారి) ముందస్తు అనుమతితో నెలలో మూడు సార్లు సా ధారణ హాజరుగా వీలు కల్పించనున్నట్టు పేర్కొంది. మూడు సార్లు మించి ఒక ఉద్యోగి 10.40 గంటల త ర్వాత 11.30 గంటల మధ్య హాజరు నమోదు చేసినా ప్రతిసారి అర రోజు సెలవుగా పరిగణిస్తామని ప్రభు త్వం స్పష్టం చేసింది. నెలలో ఏ రోజైనా ఒక ఉద్యోగి 11.31 నుంచి మధ్యాహ్నం రెండు గంటల మధ్య హా జరు నమోదు చేసినా అరరోజు సెలవుగా పరిగణిస్తా రు. మధ్యాహ్నం 2.01 గంటల నుంచి ఐదు గంటల మధ్య హాజరు నమోదు చేస్తే పూర్తి రోజు సెలవుగానే పరిగణించనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. నెలలో గరిష్టంగా ఏడు రోజులు మాత్రమే ఆన్డ్యూటీ హా జరుకు అవకాశం ఇవ్వనున్నట్టు పేర్కొంది. అయితే ప్రభుత్వం ప్రత్యేకించి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను టార్గెట్ చేసుకుని వివిధ నిబంధనలు అమలు చేస్తున్నట్టు ఉందని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగ సంఘ నేతలు మండిపడుతున్నారు. -
Viveka Case: ‘సునీత కీలక అంశాలను పక్కదారి పట్టించారు’
న్యూఢిల్లీ: వివేకా కేసుకు సంబంధించి ఆయన కుమార్తె సునీత అనేక కీలకాంశాలను పక్కదారి పట్టించారన్నారు కడప ఎంపీ అవినాష్రెడ్డి. తనపై తప్పుడు సాక్ష్యాలు చెప్పాలని కొందరిపై సునీత ఒత్తిడి చేశారన్నారు. ఈ కేసులో తనను అన్యాయంగా ఇరికించారని, సీబీఐ కూడా దీనికి సమాధానం చెప్పాలన్నారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని సృష్టించిందే సునీత అని అవినాష్రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు(సోమవారం, మార్చి 16వ తేదీ) న్యూఢిల్లీ నుంచి మీడియాతో మాట్లాడిన అవినాష్రెడ్డి.. వివేకాది గుండెపోటు అని సృష్టించింది సునీతతో పాటు నర్రెడ్డి, రాజశేఖర్రెడ్డి అనే వ్యక్తులు అని తెలిపారు. అసలు వివేకాది మర్డర్ ఫర్ గెయిన్ దిశగా సునీత ఎందుకు విచారణ కోరలేదని అవినాష్రెడ్డి ప్రశ్నించారు. వివేకా హత్య గురించి పోలీసులకు సమాచారం ఇచ్చింది తానేనని అవినాష్ పేర్కొన్నారు. ఇంకా ఈ కేసుకు సంబంధించి పలు విషయాలను మీడియాతో పంచుకున్నారు అవినాష్. సీబీఐ ఏకపక్షంగా దర్యాప్తు చేసింది..వివేకా హత్య కేసులో నాపై తప్పుడు సాక్ష్యాలు చెప్పాలని సునీత కొందరిపై ఒత్తిడి చేశారు. వారు చెప్పినట్లే సీబీఐకి చెప్పాలని కొందరని సునీత బెదిరించారు. రామ్సింగ్ విచారణ అధికారిగా వచ్చాక కేసు పక్కదారి పట్టింది. సీబీఐ డైరెక్టర్కు అనేక సాక్ష్యాలు సమర్పించి విచారణ చేయాలని మొరపెట్టుకున్నా. గతంలో సీబీఐకి నచ్చిన వారిని మాత్రమే పిలిచి మాట్లాడారు. సీబీఐ ఏకపక్షంగా దర్యాప్తు చేసింది’ అని స్పష్టం చేశారు.చంద్రబాబు రాజకీయంగా వాడుకుంటున్నారుఈ కేసును చంద్రబాబు రాజకీయంగా వాడుకుంటున్నారు. చంద్రబాబు హయాంలోనే వివేకా హత్య జరిగింది. వచ్చే ఎన్నికల వరకూ వివేకా కేసు సాగదీయాలనేది సునీత, చంద్రబాబు ఉద్దేశం. చంద్రబాబుకు రాజకీయంగా అవసరం ఉన్న సమయంలో సునీత బయటకొస్తారు. టాపిక్ డైవర్షన్ కోసం మీడియా ముందుకొచ్చి ఈ కేసు అంశాన్ని లేవనెత్తుతారు.వాటికి సునీత సమాధానం చెప్పలేదు..సీబీఐ స్టేట్మెంట్ తీసుకునే సమయంలో సునీతను లెటర్ గురించి అడిగారు. లెటర్ గురించి సీబీఐ అడిగిన ప్రశ్నలకు సునీత సమాధానం చెప్పలేదు.గతంలో సునీత మాటలను నేను కోర్టుకు సమర్పించాను. సునీత కీలక అంశాలను పక్కదారి పట్టించారు. చట్టం, ధర్మం, దేవుడిపై నాకు నమ్మకం ఉందిదస్తగిరి బెయిల్ రద్దు కాకుండా అడ్డుకుంటున్నారుసునీతకు దస్తగిరి అత్యంత ఆప్తుడు. దస్తగిరి బెయిల్ రద్దు కాకుండా సునీత అడ్డుకుంటున్నారు. దస్తగిరి తరఫున లూథ్రాను పెట్టి కేసు వాదనలు వినిపిస్తున్నారు. దస్తగిరి సీబీఐకి చెప్పిన స్టేట్మెంట్లో అనేక కీలక అంశాలున్నాయి. విచారణ సక్రమంగా చేయాలని సీబీఐ డైరెక్టర్కు చాలాసార్లు మొరపెట్టుకున్నా. మూడేళ్లుగా విచారణ సక్రమంగా జరగకుండా సునీత అడ్డుకుంటున్నారు. ఏదో ఒక రోజు నిజం నిగ్గు తేలుతుంది. ఈ కేసును సీబీఐ, న్యాయస్థానం త్వరగా విచారణ పూర్తి చేయాలి’ అని కోరారు.రాజకీయ లబ్ధి కోసమే సునీత ఆరాటం..ఈ కేసుకు సంబంధించి రాజకీయ లబ్ధి కోసమే సునీత ఆరాటపడుతున్నారన్నారు అవినాష్. ‘రాజకీయ లబ్ధి కోసమే సునీత ఆరాట పడుతున్నారు. దస్తగిరి, డ్రైవర్ ప్రసాద్, రాజశేఖ్ ఇచ్చిన స్టేట్మెంట్స్ను సునీత చదివారా?, హత్యకు ముందు రోజు రాజశేఖర్ను ఎందుకు శ్రీకాళహస్తికి పంపించారు. స్టేట్మెంట్లో రాజశేఖర్ అనేక విషయాలు చెప్పారు. చివరి రోజుల్లో వివేకానందరెడ్డిని మానసికంగా వేధించారు. డాక్యుమెంట్స్ కోసమే వివేకానందరెడ్డిన హత్య చేశామని దస్తగిరి చెప్పాడు. పీఏ కృష్ణారెడ్డి ఇచ్చిన లెటర్ను సునీత పోలీసులకు ఎందుకు ఇవ్వలేదు. దస్తగిరి బెయిల్ రద్దు చేయాలని మేం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాం’ అని స్సష్టం చేశారు. ఆ కోణంలో ఎందుకు విచారణ చేయలేదు..?సిబిఐ వన్ సైడ్ గా దర్యాప్తు జరిపింది. హత్య జరిగిన రోజు చంద్రబాబు అధికారంలో ఉన్నారు. సాక్షులకు శిక్షణ ఇచ్చి నాకు వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇప్పించారు. శివ ప్రకాష్ రెడ్డి తనకి ఫోన్ చేసి.. వివేకా కు గుండె పోటు అని చెప్పారు. గుండె పోటు వచ్చిందని థియరీ సృష్టించింది సునీతక్క, రాజశేఖర్ రెడ్డినే. దీనిపై ఎందుకు విచారణ అడగడం లేదు. వివేకాను ఆయన కుటుంబం వదిలేసింది. ఆయన చెక్ పవర్ తీసేశారు. షమీమ్, ఆమె కొడుకుకు ఆస్తులు పోవద్దనే వివేకాను హత్య చేసి ఉండవచ్చే కోణంలో ఎందుకు దర్యాప్తు చేయలేదు. వివేకాది మర్డర్ ఫర్ ది గెయిన్ అనే కోణంలో ఎందుకు విచారణ చేయలేదు. ఈ అంశాలపై ప్రధాన మంత్రి, హోమ్ మంత్రికి లేఖ రాశాను’ అని అవినాష్ స్పష్టం చేశారు. -
ఇటు ఎండ.. అటు వాన!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రానున్న మూడు రోజులూ ఓ వైపు ఎండలు, మరోవైపు ఆకాశం మేఘావృతమై విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ద్రోణి, నైరుతి దిశ నుంచి వీచే గాలుల ప్రభావంతో సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశి్చమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆకస్మిక వర్షాల సమయంలో పడే పిడుగుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. -
నేటి నుంచి పది పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు(ఎస్ఎస్సీ–2026) సోమవారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటలకు పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులను ఉదయం 8.30 గంటల నుంచి 10 గంటల వరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. అర్ధగంట ఆలస్యమైనా పరీక్షకు పంపిస్తారు. ఏప్రిల్ 1వ తేదీ వరకు పరీక్షలు కొనసాగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 3,415 కేంద్రాల్లో నిర్వహించనున్న ఈ పరీక్షలకు 6,40,916 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వారిలో 6,22,074 మంది రెగ్యులర్, 18,842 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారు. పరీక్షల పర్యవేక్షణ కోసం 3,415 మంది సెంటర్ సూపరింటెండెంట్లు, 3,415 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లతోపాటు 38,958 మంది ఇన్విజిలేటర్లను పాఠశాల విద్యాశాఖ నియమించింది. మాల్ప్రాక్టీస్ నియంత్రణకు 156 ఫ్లయింగ్ స్క్వాడ్స్ను నియమించింది. 210 సమస్యాత్మక పరీక్ష కేంద్రాల్లో సీసీటీవీ పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. విద్యార్థులు పరీక్షలు రాసేందుకు వీలుగా 24 పేజీల ప్రధాన ఆన్సర్ బుక్లెట్ను అందిస్తారు. అవసరమైతే మరో 12 పేజీల అదనపు బుక్లెట్ను కూడా అందుబాటులో ఉంచారు. ఒరిజినల్ హాల్టికెట్తో పరీక్షకు హాజరుకావాలని పరీక్షల విభాగం డైరెక్టరేట్ సూచించింది. ఎల్రక్టానిక్ పరికరాలు అనుమతించబోమని స్పష్టం చేసింది. పదో తరగతి పరీక్షల పర్యవేక్షణకు డీఎంసీలు పదో తరగతి పరీక్షలతో పాటు ఏప్రిల్ 4 నుంచి ప్రారంభమయ్యే మూల్యాంకన ప్రక్రియలను పర్యవేక్షించేందుకు పాఠశాల విద్యాశాఖ ‘డిస్ట్రిక్ట్ మానిటరింగ్ కో–ఆర్డినేటర్స్ (డీఎంసీ)లను నియమించింది. 11 మందికి రెండు జిల్లాల చొప్పున, నలుగురికి ఒక్కొక్క జిల్లా చొప్పున 26 జిల్లాలకు 15 మంది అధికారులను నియమించింది. ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్లో పనిచేస్తున్న 15 మంది సిబ్బందికి ఆయా జిల్లాల బాధ్యతలు అప్పగించారు. పరీక్షలు, మూల్యాంకనం సజావుగా సాగేందుకు పర్యవేక్షణ యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి, ట్యాబ్–ఆధారిత మార్కుల ఎంట్రీ, డిజిటల్ రిపోర్టింగ్ సిస్టం వంటి కొత్త విధానాలను ఈ ఏడాది అమలు చేస్తున్న నేపథ్యంలో డీఎంసీలను నియమించినట్లు రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. పర్యవేక్షణ కో–ఆర్డినేటర్లు, జిల్లా స్థాయి అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లను సమన్వయం చేస్తూ రోజువారి పర్యవేక్షణ నివేదికను డైరెక్టరేట్కు సమర్పించాలని ఆదేశించారు. ట్యాబ్–ఆధారిత మార్కుల నమోదును మూల్యాంకనం ప్రారంభమైన మొదటి రెండు రోజులు (ఏప్రిల్ 4, 5 తేదీలు) పరిశీలిస్తారు. నేటి నుంచే ఒంటిపూట బడులురాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో సోమవారం నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. ఒకటి నుంచి 9వ తరగతి వరకు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. పదో తరగతి పరీక్షలు జరిగే కేంద్రాల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 వరకు క్లాసులు ఉంటాయి. మధ్యాహ్న భోజనం కొనసాగుతుంది. -
పెట్టుబడి సాయం ఆలోచన వైఎస్ జగన్దే
సాక్షి, అమరావతి: దేశంలో రైతుకు పెట్టుబడి సాయం అందిచాలనే ఆలోచన చేయడమే కాదు... అధికారంలోకి వచ్చీరాగానే అమలు చేసింది కూడా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వరుస కరువు, కాటకాలతో అల్లాడుతున్న రైతులకు అండగా నిలవాలన్న ఆలోచనతో 2017లో జరిగిన వైఎస్సార్సీపీ ప్లీనరీలో వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని వైఎస్ జగన్ ప్రకటించారని గుర్తుచేశారు. ఆ తర్వాత 2018 డిసెంబర్లో కేంద్రం పీఎం కిసాన్ ద్వారా రైతులకు ఏటా మూడు విడతల్లో మొత్తం రూ.6 వేల ఆరి్థక సాయం ప్రకటించి, 2019 జనవరి నుంచి అమలులోకి తీసుకొచ్చిందని తెలిపారు. ఆ సమయంలో చంద్రబాబు‡ ముఖ్యమంత్రిగా ఉన్నా ఆయనకు ఈ ఆలోచన రాలేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో రైతుకు ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలు ఇస్తామని చెప్పిన వైఎస్ జగన్... అధికారంలోకి రాగానే రూ.12,500లను రూ.13,500కు పెంచి, ఐదేళ్లపాటు రూ.67,500 చొప్పున ఇచ్చారని వివరించారు. రైతులు, కౌలు రైతులతోపాటు దేవదాయ, అటవీ, ఇతర భూముల సాగుదారులు కలిపి 53.58 లక్షల మందికి రూ.34,288 కోట్ల లబ్ధి చేకూర్చారని తెలిపారు. చంద్రబాబు 2024 ఎన్నికల సమయంలో కేంద్రం ఇచ్చేది కాకుండా అదనంగా ప్రతి రైతుకు ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ, అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది ఎగ్గొట్టారన్నారు. రెండో ఏడాది 46.86 లక్షల మందికి అరకొరగా అన్నదాత సుఖీభవ కింద సాయం అందించారని పేర్కొన్నారు. లబ్ధిదారులను భారీగా తగ్గించడమే కాకుండా రెండేళ్లలో ఒక్కో రైతుకు దాదాపు రూ.30వేలు చొప్పున ఎగ్గొట్టారని విమర్శించారు. -
బావమరిది కళ్లల్లో ఆనందం కోసం..
చంద్రబాబు బంధుప్రీతి కథా‘చిత్రమిది’. సంపద సృష్టి హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ఆ హామీలిచ్చింది జనం కోసం కాదని.. తన కుటుంబ సంపద సృష్టి కోసమే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. బావమరిది బాలకృష్ణ కళ్లల్లో ఆనందం కోసం.. ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న బసవతారకం ఆస్పత్రికి ఆరోగ్యశ్రీ చెల్లింపుల్లో పెద్దపీట వేశారు. ఇందుకోసం గతేడాది చీకటి ఉత్తర్వులు సైతం జారీ చేశారు. ఆరోగ్యశ్రీ బకాయిల కోసం నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు తరచూ రోడ్లెక్కి ఆందోళనలు చేస్తున్నా.. సమ్మెబాట పడుతున్నా చంద్రబాబు సర్కారు పట్టించుకోవడం లేదు. కానీ.. బాలకృష్ణ ఆస్పత్రికి మాత్రం రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు చెల్లించడం బాబు బంధుప్రీతికి అద్దం పడుతోంది.సాక్షి, అమరావతి: అధికారాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించనని దైవసాక్షిగా ప్రమాణం చేసిన సీఎం చంద్రబాబు.. పాలనలో అడుగడుగునా పక్షపాతం, రాగద్వేషాలు కనబరుస్తున్నారు. సొంత ప్రయోజనాలు, అయినవారికి మేలు తలపెట్టడమే లక్ష్యంగా పాలనలో పారదర్శక విధానాలకు స్వస్తి పలికి అక్రమ విధానాలకు తెరలేపారు. ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.3 వేల కోట్లకు పైగా నెట్వర్క్ ఆస్పత్రులకు బకాయిలు పెట్టిన చంద్రబాబు తన బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నడిపే బసవతారకం ఆస్పత్రికి మాత్రం శరవేగంగా బిల్లులు ఇచ్చేస్తున్నారు. బిల్లు చెల్లింపుల్లో ఆలస్యం కాకుండా ఉండేందుకు పథకం ప్రారంభం నుంచి అమలవుతున్న ‘ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ (ఫిఫో)’ విధానానికి తిలోదకాలిచ్చేశారు. ఫిఫో నిబంధనలతో పని లేకుండా నిధుల విడుదలలో ప్రాధాన్యత కోసం గతేడాది వైద్య శాఖతో చీకటి ఉత్తర్వులు జారీ చేయించారు. రూ.50 కోట్ల వరకు చెల్లింపు నిబంధనల ప్రకారం ఏ ఆస్పత్రి మొదటగా బిల్లులు సమర్పిస్తుందో.. చెల్లింపుల్లో దానికే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఆరోగ్యశ్రీ పథకం వర్తించే ప్రభుత్వ, ప్రైవేట్ ఇలా ఏ ఆస్పత్రికైనా ఫిఫో షరతులు వర్తిస్తాయి. అయితే.. బసవతారకం ఆస్పత్రి విషయంలో గతేడాది మార్చిలో ఆరోగ్యశ్రీ చెల్లింపుల్లో ఫిఫో నిబంధనలను సడలిస్తూ వైద్య శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వాస్పత్రుల్లో పీపీపీ పద్ధతిలో డయాలసిస్, క్యాథ్ల్యాబ్ సేవలు అందించే సంస్థలు, టీటీడీ వైద్య సంస్థలకు మేలు చేస్తున్నట్టు సాకు చూపి బసవతారకం ఆస్పత్రికి చెల్లింపుల్లో ప్రాధాన్యత ఇస్తున్నట్టు వైద్య శాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేవలం బసవతారకం ఆస్పత్రికి మేలు చేసే లక్ష్యంతో నెట్వర్క్ ఆస్పత్రుల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండటం కోసం పీపీపీ, టీటీడీ సంస్థలను జాబితాలో చేర్చినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ ఉత్తర్వులను అడ్డుపెట్టుకుని బాబు సర్కార్ బాలకృష్ణ ఆస్పత్రికి 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు నిధుల వరద పారించినట్టు తెలుస్తోంది. బాబు గద్దెనెక్కిన నాటినుంచే బసవతారకం ఆస్పత్రికి అక్రమ విధానంలో బిల్లు చెల్లింపులు ప్రారంభించారనే ఆరోపణలున్నాయి. ఆరోగ్యశ్రీ చెల్లింపుల్లో బసవతారకం ఆస్పత్రికి ఫిఫో నిబంధనల నుంచి సడలింపు ఇస్తూ వైద్య శాఖ ఇచ్చిన ఉత్తర్వులు ముఖ్యనేత ఆదేశాలతో.. గతంలో ఆరోగ్యశ్రీ ట్రస్టుకు సీఈవోగా పనిచేసిన ఓ యువ ఐఏఎస్ అడ్డగోలు చెల్లింపులను అనుమతించబోనని చెప్పడంతో ఆ పంచాయితీ ముఖ్యనేత కార్యాలయానికి చేరింది. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలతో ఫిఫో నుంచి ప్రభుత్వం సడలింపులు ఇచ్చినట్టు వెల్లడైంది. ఈ ఉత్తర్వులను అడ్డం పెట్టుకుని క్లెయిమ్ల పరిశీలన, బిల్లులు అప్లోడ్ చేయడం, నిధులు విడుదలలో బాలకృష్ణ ఆస్పత్రికి రెడ్కార్పెట్ వేశారు. తమకు ఇవ్వకుండా బాలకృష్ణ ఆస్పతికి ఇవ్వడం ఏంటని నెట్వర్క్ ఆస్పత్రుల యజమానులు వాపోతున్నారు. అనేక ఆస్పత్రులు ఉన్నా.. వాస్తవానికి రాష్ట్రంలో బసవతారకం తరహాలోనే ట్రస్టుల ఆధ్వర్యంలో నడిచే అనేక ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ పరిధిలో ఉన్నాయి. నెల్లూరులో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ, రాజమండ్రిలో జీఎస్ఎల్ కేన్సర్ ట్రస్టు, విశాఖలో లయన్స్ కేన్సర్ హాస్పిటల్, పుట్టపర్తిలో శ్రీసత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇలా అనేక ట్రస్టు/మిషన్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ పరిధిలో సేవలు అందిస్తున్నాయి. బసవతారకం ఆస్పత్రి కూడా అలాంటిదే అయినా.. కేవలం తన బావమరిది నడిపే ఆస్పత్రి కావడంతో వల్లమాలిన బంధుప్రీతితో చంద్రబాబు నిధుల చెల్లింపుల్లో అవాంతరాలు లేకుండా చేస్తున్నారని విమర్శలున్నాయి. -
ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం.. యువకుడి బలి
గన్నవరం: ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం కారణంగా ఓ నిండు ప్రాణం బలైపోయింది. వాహన తనిఖీల పేరిట ట్రాఫిక్ పోలీసులు అడ్డుకునే ప్రయత్నంలో ప్రమాదానికి గురైన స్కూటీపై వెళ్తున్న సోదరుల్లో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడిన ఘటన వెలుగు చూసింది. వివరాలిలా.. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లికి చెందిన పలగాని శివాజీ కొడుకులు ప్రణయ్(22) కేఎల్యూలో ఇంజినీరింగ్ ఫైనలియర్, కౌషిక్ విజయవాడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నారు. కౌషిక్ను పెద్దఅవుటపల్లిలో ట్యూషన్లో వదిలేందుకు సోదరుడు ప్రణయ్ స్కూటీపై బయలుదేరారు. మార్గమధ్యలో స్థానిక శ్రీనివాస హేచరీస్ వద్ద జాతీయ రహదారిపై ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్నారు. హెల్మెట్ ధరించకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటారనే భయంతో స్కూటీని వెనక్కి తిప్పాడు. ఇది గమనించిన ఓ కానిస్టేబుల్ వారిని పట్టుకునేందుకు వెంబడించాడు. కంగారులో ప్రణయ్ రాంగ్రూట్లో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన బొలెరో వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రణయ్ ఛాతీకి, తలకు బలమైన గాయాలు కావడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కౌషిక్ కూడా గాయపడ్డాడు. ట్రాఫిక్ పోలీసులు ఆటోలో ప్రణయ్ను పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కుమారుడి మృతితో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహమే ప్రణయ్ మృతికి కారణమంటూ పలువురు ఆరోపించారు.బాధిత కుటుంబానికి వంశీ పరామర్శ..రోడ్డు ప్రమాదంలో కుమారుడిని కోల్పోయిన వైఎస్సార్సీపీ కేసరపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు పలగాని శివాజీని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఆదివారం పరామర్శించారు. తొలుత ప్రణయ్ భౌతికకాయానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రణయ్ అంతిమయాత్రలో వంశీమోహన్తో పాటు పలువురు వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. -
‘పచ్చ’ మత్తు.. జనం చిత్తు
సాక్షి, అమరావతి: ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ డ్రగ్స్ తీసుకుని దొరికి పోవడంతో ఆ పార్టీ పరువు బజారున పడింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గంజాయి, డ్రగ్స్, నకిలీ మద్యానికి రాష్ట్రం కేరాఫ్గా మారిందని ప్రజలు మండిపడుతున్నారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ రాజధానిగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డ్రగ్స్, గంజాయి మాఫియా చెలరేగిపోతోందని, పచ్చ పార్టీ నేతలు మత్తుకు బ్రాండ్ అంబాసిడర్గా మారారని నెటిజన్లు సోషల్ మీడియాలో కడిగి పారేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం డ్రగ్స్ తీసుకుని పట్టుబడిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడి బాగోతాన్ని గుర్తు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు అండ్ కో కానీ, ఎల్లో మీడియా కానీ నోరు మెదపడం లేదని ఎత్తి చూపుతున్నారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్, గంజాయి దందా బయటపడినా వాటి మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటున్నాయి. దేశంలో ఎక్కడ డ్రగ్స్ పార్టీని పోలీసులు ఛేదించినా టీడీపీ కూటమి పెద్దలే చిక్కుతున్నారు. టీడీపీ కూటమి ప్రజా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులే డ్రగ్స్ మత్తులో జోగుతూ దొరుకుతున్నారు. ఎందుకంటే డ్రగ్స్ దందా సాగిస్తున్నదే టీడీపీ పెద్దలు కావడంతో.. హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల్లో డ్రగ్స్ పార్టీల్లో వాళ్లే ప్రధాన భూమిక పోషిస్తున్నారు. టీడీపీ కూటమి ప్రజా ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు ఉంటే చాలు.. డ్రగ్స్ దర్జాగా ఫాం హౌస్లకు నడచి వస్తాయన్నది బహిరంగ రహస్యంగా మారింది. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ డ్రగ్స్ సేవిస్తూ హైదరాబాద్ పోలీసులకు చిక్కడంతో ఆ విషయం మరోసారి నిరూపితమైంది. టీడీపీ కూటమి పెద్దల కనుసన్నల్లో సాగుతున్న డ్రగ్స్, గంజాయి, కల్తీ మద్యం మాఫియా రాష్ట్రాన్ని కొల్లగొడుతోంది. ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా యావత్ దేశంలో బరితెగించి దందా సాగిస్తోంది. డ్రగ్స్కు వ్యతిరేకంగా పోరాడతామని 2024 ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబు.. అధికారంలోకి రాగానే అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ కీలక నేతల కుటుంబాలే ప్రాంతాల వారీగా డ్రగ్స్, గంజాయి, కల్తీ మద్యం దందాను పర్యవేక్షిస్తుండటంతో పోలీసు శాఖ చోద్యం చూస్తూండిపోవాల్సి వస్తోంది. చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవస్థీకృతమైన డ్రగ్స్, గంజాయి, నకిలీ మద్యం మాఫియా రాష్ట్రాన్ని అమాంతం కబళించేస్తోంది. డ్రగ్స్: డోర్ డెలివరీ ⇒ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతోంది. ఏకంగా కొరియర్ సర్వీసులతో డోర్ డెలివరీ చేసే డ్రగ్స్ దందా రాష్ట్రంలో వేళ్లూనుకుంటోంది. యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్ దందాకు రాష్ట్రం అడ్డాగా మారిపోయింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న డ్రగ్ డీలర్లు తమ దందాకు ఆంధ్రప్రదేశ్నే ప్రధాన మార్కెట్గా చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ⇒ కొన్ని నెలల క్రితం ఢిల్లీ నుంచి నూజివీడు మీదుగా విజయవాడకు తరలిస్తున్న ఎండీఎంఏ డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకోవడం రాష్ట్రంలో డ్రగ్స్ దందా తీవ్రతకు ఓ నిదర్శనం మాత్రమే. ఆ ఉదంతం రాష్ట్రంలో డ్రగ్స్ దందాలో కేవలం గొరంతేనని.. వాస్తవానికి రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న డ్రగ్స్ దందా కొండంత ఉందని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. దేశంలో ప్రధాన నగరాలే కేంద్రంగా విస్తరించిన డ్రగ్స్ మాఫియా, రాష్ట్రంలో మాత్రం ఊరూరా విస్తరిస్తోంది. ఢిల్లీ, ముంబై, అమృత్సర్ తదితర నగరాల్లోని డ్రగ్స్ మాఫియా ఆఫ్ఘనిస్తాన్ తదితర దేశాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకుంటున్న డ్రగ్స్ను మార్కెట్ చేయడానికి ఏపీనే గమ్యస్థానంగా ఎంచుకుంది. ⇒ వివిధ రూపాల్లోని ఎండీఎంఏ డ్రగ్స్ను రాష్ట్రంలోకి యథేచ్ఛగా తరలిస్తున్నారు. అందుకోసం విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, కర్నూలు, కాకినాడ వంటి ప్రధాన నగరాలతోపాటు హిందూపూర్, నంద్యాల, నూజివీడు, ఏలూరు, జగ్గయ్యపేట, భీమవరం, రాజమహేంద్రవరం, విజయనగరం వంటి దాదాపు 50 పట్టణాల్లో కూడా డ్రగ్స్ మాఫియా ఏజెంట్ల వ్యవస్థను నెలకొల్పింది. ఢిల్లీ, ముంబై తదితర నగరాల నుంచి స్థానిక ఏజెంట్లకు డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. ఇందుకోసం కొరియర్ సర్వీసులను వాడుకుంటున్నాయి. ⇒ ఏజెంట్లు అందుకున్న డ్రగ్స్ను చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి డ్రగ్స్ వెండర్స్ (విక్రేతలు)కు అందిస్తున్నారు. ఆ వెండర్స్ వాటిని గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తూ యువతను మత్తులో ముంచుతున్నారు. డ్రగ్స్ మాఫియా రాష్ట్రంలోని విద్యా సంస్థలనే తమ దందాకు కేంద్రంగా చేసుకుంది. ఏజెంట్ల ద్వారా డ్రగ్స్ పొందిన వెండర్స్ విద్యా సంస్థల ప్రాంగణాలకు సమీపంలోనే వాటిని విక్రయిస్తున్నారు. అందుకోసం ఉన్నత విద్యా సంస్థల సమీపంలోనే బడ్డీ కొట్టులు, స్ట్రీట్ వెండర్స్ రూపంలో డ్రగ్స్ విక్రయాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. సిగరెట్లు, చాక్లెట్లు, చూయింగ్ గమ్, పౌడర్ రూపంలో విక్రయిస్తున్నారు. విజయవాడలోని ఉన్నత విద్యా సంస్థల ప్రాంగణాల సమీపంలో విక్రయించేందుకే ఢిల్లీ నుంచి కొరియర్ సర్వీసు ద్వారా నూజివీడు మీదుగా డ్రగ్స్ తరలించడమే అందుకు తాజా నిదర్శనం. కేసుల నమోదు గోరంత.. స్మగ్లింగ్ కొండంత ⇒ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి దందా యథేచ్ఛగా సాగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు. నామ మాత్రంగా కేసులు నమోదు చేస్తూ కనికట్టు చేసేందుకు యత్నిస్తున్నారు. రాష్ట్రంలో సాగుతున్న డ్రగ్స్ దందాతో పోలిస్తే నమోదు చేస్తున్న కేసులు 10% మాత్రమేనని పోలీసు వర్గాలే చెబుతుండటం గమనార్హం. ⇒ 2024లో రాష్ట్రంలో 1,600 ఎన్డీపీఎస్ (నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్) కేసులు నమోదయ్యాయి. 2025లో 1,836 కేసులు నమోదు చేసి 46,011 కేజీల గంజాయిని స్వా«దీనం చేసుకున్నారు. వాస్తవానికి రాష్ట్రం మీదుగా సాగుతున్న డ్రగ్స్ దందా.. ఇందుకు పదుల రెట్లు అధికంగా ఉంటుందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మత్తుకు బ్రాండ్ అంబాసిడర్లు పచ్చ బాబులే డ్రగ్స్, గంజాయి దందా సాగించడమే కాదు.. టీడీపీ కూటమి కీలక నేతల కుటుంబ సభ్యులు డ్రగ్స్ మత్తులో మజా చేస్తూ హల్చల్ చేస్తున్నారు. తాజాగా ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ హైదరాబాద్లో డ్రగ్స్ తీసుకొని అడ్డంగా దొరికారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుదీర్ రెడ్డి డ్రగ్స్ మత్తులో జోగుతూ పోలీసులకు చిక్కారు. గత ఏడాది భీమవరం ఎమ్మెల్యే పి.రామాంజనేయులు కుమారుడు కూడా హైదరాబాద్లో డ్రగ్స్ కేసులో చిక్కారని జాతీయ మీడియాలో ప్రముఖంగా ప్రచురితం కావడం గమనార్హం.చోద్యం చూస్తున్న చంద్రబాబు ప్రభుత్వం⇒ రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా విచ్చలవిడిగా చెలరేగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదు. డ్రగ్స్ను అరికట్టేందుకు ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టమైన కార్యాచరణ చేపట్టలేదు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆపరేషన్ పరివర్తన్ను రెండు దశల్లో సమర్థవంతంగా అమలు చేసింది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్)ను ఏర్పాటు చేసి పటిష్ట కార్యాచరణ చేపట్టింది. ⇒ రాష్ట్రంలో ఆంధ్ర–ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో దశాబ్దాలుగా సాగిస్తున్న గంజాయి సాగును కూకటివేళ్లతో పెకలించింది. ఏకంగా 11,500 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేసింది. గిరిజనులను ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా ప్రోత్సహించింది. అందుకోసం రూ.500 కోట్లతో ప్రత్యేక పథకాన్ని అమలు చేసింది. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి డ్రగ్స్ అక్రమ రవాణాను సమర్థవంతంగా కట్టడి చేసింది. సెబ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి విస్లృతంగా తనిఖీలు చేసి అక్రమ రవాణాను అడ్డుకుంది. ⇒ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థ డ్రగ్స్పై పట్టు వదిలేసింది. కక్షపూరితంగా సెబ్ను రద్దు చేసింది. కొత్తగా ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేశామని చెప్పినప్పటికీ ఆ వ్యవస్థకు ఎలాంటి మౌలిక వసతులు సమకూర్చలేదు. విస్తృత అధికారాలు కల్పించలేదు. ప్రధానంగా ఉమ్మడి విశాఖ జిల్లా కేంద్రంగా డ్రగ్స్ దందాకు టీడీపీ సీనియర్ నేత కుటుంబం అండదండలు ఉండటంతో ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే ఉదాసీనంగా ఉంటోందన్న విషయం స్పష్టమైంది. ప్రభుత్వ ఉద్దేశం స్పష్టం కావడంతో పోలీసు శాఖ చోద్యం చూస్తోంది.కబళిస్తున్న నకిలీ మద్యం ⇒ ఐదేళ్లలో రూ.25 వేల కోట్ల దందానే లక్ష్యం ⇒ డ్రగ్స్ దందాతోపాటు టీడీపీ కూటమి పెద్దలు రాష్ట్రంలో నకిలీ, కల్తీ మద్యం రాకెట్ను వ్యవస్థీకృతం చేశారు. ఏకంగా కుటీర పరిశ్రమ స్థాయిలో ఊరూవాడా యూనిట్లను ఏర్పాటు చేసి నకిలీ మద్యం ఏరులై పారిస్తున్నారు. తొలి ఏడాదే రూ.5 వేల కోట్ల మేర మద్యం దందాకు పాల్పడ్డారు. ఐదేళ్లలో రూ.25 వేల కోట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా పచ్చ మాఫియా చెలరేగిపోతోంది. ⇒ అన్నమయ్య, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఎన్టీఆర్, అనకాపల్లి, తూర్పు గోదావరి జిల్లాల్లో బయటపడిన నకిలీ మద్యం తయారీ యూనిట్ల నిర్వాహకులు టీడీపీ నేతలే కావడంతో పచ్చ ముఠా బండారం బట్టబయలైంది. ఆ కేసుల్లో పాత్రధారులైన టీడీపీ చోటా నేతలను మాత్రమే ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. కానీ నకిలీ మద్యం రాకెట్ సూత్రధారులైన టీడీపీ పెద్దలపై ఈగ వాలనివ్వ లేదు. ⇒ టీడీపీ కీలక నేతలే ప్రాంతాల వారీగా నకిలీ మద్యం పంపిణీ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు కాబట్టి.. రాష్ట్రంలో నకిలీ/కల్తీ మద్యం రాకెట్ దందాను టీడీపీ మద్యం సిండికేట్ వ్యవస్థీకృతం చేసింది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల నుంచి రాష్ట్రంలోని మద్యం డిస్టిలరీల ద్వారా ‘ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (వాడుక భాషలో స్పిరిట్ అంటారు)ను అక్రమంగా కొనుగోలు చేస్తోంది. ⇒ రాష్ట్రంలో ఉన్న 20 మద్యం డిస్టిలరీలు టీడీపీ కీలక నేతల ఆ«దీనంలోనే ఉండటం సిండికేట్ దందాకు కలసివస్తోంది. అలా సేకరించిన స్పిరిట్ను అక్రమంగా కల్తీ మద్యం యూనిట్లకు తరలిస్తున్నారు. ఆ విధంగా భారీగా కొనుగోలు చేసిన స్పిరిట్తో నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. దాన్ని టీడీపీ సిండికేట్ నిర్వహిస్తున్న 4,346 మద్యం దుకాణాలు, దాదాపు 75 వేల బెల్ట్ దుకాణాలు, 540 బార్ల ద్వారా దర్జాగా విక్రయిస్తున్నారు. ఏసీ బ్లాక్, ఓల్డ్ అడ్మిరల్, ఎస్పీవై 999 తదితర బ్రాండెడ్ మద్యంగా నమ్మబలుకుతూ కల్తీ మద్యాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. -
వెలుగుల భారత్కు ‘రామన్న’ పవర్
(ఇండోర్ నుంచి సాక్షి ప్రతినిధి) సాక్షి,అమరావతి: మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో ఉన్న రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ (ఆర్ఆర్ కాట్) దేశంలోని విద్యుత్ రంగ అభివృద్ధికి అత్యంత ముఖ్యమైన పరిశోధన కేంద్రంగా నిలుస్తోంది. ఈ సంస్థ అణు విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యం పెంపు, ఆధునిక శక్తి సాంకేతికతల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. త్వరలోనే విశాఖపట్నంలోనూ కార్యకలాపాలు విస్తరిస్తోంది. సెన్సార్ల ద్వారా రైలు ప్రమాదాలను నివారించడంతోపాటు ప్రతిక్షణం పర్యవేక్షించే సాంకేతికతను తయారు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ కాట్ సాంకేతికత అభివృద్ధి, సహాయం డైరెక్టర్ డాక్టర్ జిష్ణు ద్వివేది, ఆర్ఆర్క్యాట్లో ఆవిష్కరణలు, వ్యాపార ప్రారంభాలను ప్రోత్సహించే అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ (ఏఐసీ పీఐఈ హబ్) డైరెక్టర్ డాక్టర్ క్రైస్ట్ ప్రకాష్ పాల్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్లోని ఇండోర్ వెళ్లిన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు వారి మాటల్లోనే..ఆధునిక సాంకేతికతతో అణు విద్యుత్ ఉత్పత్తి దేశంలో అణు విద్యుత్ ఉత్పత్తిని పెంచడానికి అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో ఆర్ఆర్ కాట్ ముందంజలో ఉంది. అణు విద్యుత్ కేంద్రాల్లో ఉపయోగించే అధునాతన యాక్సిలరేటర్లు, లేజర్ పరికరాలు, సూపర్ కండక్టింగ్ టెక్నాలజీలను ఈ కేంద్రం అభివృద్ధి చేసింది. ఈ సాంకేతికతలు కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, వైద్య రంగాల్లో ఉపయోగపడుతున్నాయి. అణు రియాక్టర్ల పనితీరు మరింత సమర్థవంతంగా మారి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతోంది. అలాగే రియాక్టర్ల భద్రతా ప్రమాణాలు కూడా మెరుగుపడుతున్నాయి. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఉపయోగించే పరికరాలు అధిక ఉష్ణోగ్రతలు, ఒత్తిడిని తట్టుకోవాలి. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ కాట్లో అభివృద్ధి చేసిన మెటీరియల్ సైన్స్, టెక్నాలజీ విద్యుత్ ప్లాంట్ల పరికరాల నాణ్యతను పెంచుతున్నాయి. అత్యాధునిక పదార్థాలతో తయారైన పరికరాలు ఎక్కువ కాలం పనిచేయడమే కాకుండా నిర్వహణ ఖర్చులను కూడా తగ్గిస్తున్నాయి. ముందుగానే లోపాలు గుర్తించే టెక్నాలజీ విద్యుత్ కేంద్రాల్లో పరికరాల లోపాలు ముందుగానే గుర్తించడానికి ఆర్ఆర్ కాట్ రూపొందించిన ఆధునిక లేజర్, డయాగ్నస్టిక్ టెక్నాలజీలు ఉపయోగపడుతున్నాయి. ఈ సాంకేతికతల ద్వారా విద్యుత్ ప్లాంట్లలో జరిగే లోపాలను త్వరగా గుర్తించి సరిచేయడం సాధ్యమవుతుంది. దీంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి. అణు విద్యుత్ మాత్రమే కాకుండా పునరుత్పాదక శక్తి రంగంలో కూడా ఆర్ఆర్ కాట్ పరిశోధనలు కొనసాగిస్తోంది. ముఖ్యంగా సౌర శక్తి ఉత్పత్తి కోసం ఉపయోగించే అధునాతన పరికరాల అభివృద్ధిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.ఈ టెక్నాలజీలు భవిష్యత్లో సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడతాయి. ఆర్ఆర్ కాట్లో అభివృద్ధి చేసిన పలు టెక్నాలజీలు విద్యుత్ రంగానికి సంబంధించిన పరిశ్రమలకు కూడా ఉపయోగపడుతున్నాయి. విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, పరికరాల తయారీ, నిర్వహణలో ఈ టెక్నాలజీలను ఉపయోగిస్తున్నారు. దేశంలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో శక్తి ఉత్పత్తి వ్యవస్థలను మరింత సమర్థంగా నిర్వహించడం చాలా అవసరం. ఈ దిశగా ఇక్కడి కేంద్రంలో జరుగుతున్న పరిశోధనలు దేశ విద్యుత్ భద్రతకు అండగా నిలుస్తున్నాయి. -
‘దేశం’లో కలకలం!
సాక్షి, అమరావతి: హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు రకరకాల గారడీలు చేస్తుంటే పలువురు టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు డ్రగ్స్ పార్టీలు, రాసలీలల్లో మునిగి తేలుతుండడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ పార్టీకి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ హైదరాబాద్లో జరిగిన ఒక డ్రగ్స్ పార్టీలో అడ్డంగా దొరికిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ ఘటనతో ఉలిక్కిపడిన టీడీపీ శిబిరం ఏం సమాధానం చెప్పాలో తెలియక సతమతమవుతోంది. మహేశ్ డ్రగ్స్ వ్యవహారంతో టీడీపీ పరువు బజారున పడిందని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. ఇలాంటి నేతలకు సీట్లు ఇచ్చి చంద్రబాబు ఇప్పుడు నాలుక కరుచుకుని ఉపయోగం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పుట్టా మహేశ్కు రాజకీయ అవగాహన లేకపోయినా, కేవలం డబ్బు ఉందనే కారణంతో కడప జిల్లా నుంచి తీసుకువచ్చి గత ఎన్నికల్లో ఏలూరు ఎంపీ సీటు ఇచ్చారు. ఎక్కడి నుంచో వలస వచ్చిన నేతకు ఇక్కడ ఎంపీగా చేయడం ఏమిటని స్థానిక టీడీపీ నేతలంతా వ్యతిరేకించినా చంద్రబాబు ఆయనకే సీటిచ్చారు.ఎంపీగా గెలిచిన తర్వాత మహేష్ నియోజకవర్గానికి చుట్టపుచూపుగా మాత్రమే వెళుతున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. పుట్టా మహేష్ టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడికి సొంత అల్లుడు. మరో సీనియర్ నేత, టీటీడీ మాజీ చైర్మన్, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కొడుకు. అందుకే ఆయనకు ఎంపీ సీటు చాలా సులభంగా దక్కిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ నాయుడు రాసలీలలు మరవక ముందే.. ఏడాదిగా కూటమి పార్టీల నేతలు ప్రజలు, పరిపాలనను గాలికి వదిలేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాసలీలల వీడియోలు బయటకు రావడంతో దానిపై రాజకీయ దుమారం రేగింది. తన చేష్టలను బీఆర్ నాయుడు నిస్సిగ్గుగా సమర్థించుకున్నా, సోషల్ మీడియా మాత్రం ఆయన నిజ స్వరూపాన్ని కడిగి పారేసింది. కలియుగ దైవం తిరుమల శ్రీవారి ఆలయానికి చైర్మన్గా ఉన్న వ్యక్తి రాసలీలలు బయటకు రావడంతో ఆయన రాజీనామా చేయాలనే డిమాండ్ బలంగా వచ్చింది. అయితే ఆయన ఒక టీవీ ఛానల్కు యజమాని కావడంతో ఆయనపై చర్య తీసుకునేందుకు, రాజీనామా చేయించేందుకు చంద్రబాబు వెనుకాడినట్లు ప్రచారం జరిగింది. కానీ నీతి నియమాలు లేని వ్యక్తిని పవిత్రమైన టీటీడీ చైర్మన్ పదవిలో కూర్చోబెట్టడం, ఆయనకు చంద్రబాబు మద్దతు పలకడంపై ఇప్పటికీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ నాయుడి వ్యవహారం సర్దుమణగక ముందే పుట్టా మహేశ్ డ్రగ్స్ వ్యవహారం గుట్టు రట్టయింది. అదే బాటలో పలువురు క్యూ కొద్దిరోజుల క్రితం జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కొడుకు సైతం హైదరాబాద్లో డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడ్డాడు. ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తనను లైంగికంగా వేధిస్తున్నట్లు ఆ నియోజకవర్గానికి చెందిన కేజీబీవీ ప్రిన్సిపాల్ మీడియా ఎదుట చెప్పి బోరున విలపించారు. ఆమెకు న్యాయం చేయకపోగా ఆమెను బెదిరించి నోరు మూయించేందుకు ఎమ్మెల్యే, అధికార పార్టీ నేతలు ప్రయత్నించారు. జనసేనకు చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను లైంగికంగా వేధించినట్లు ఒక మహిళ వీడియోలు విడుదల చేయడం కలకలం రేపింది. ఆయన్ను పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచడం తప్ప జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి ఆయనపై చర్య తీసుకోలేదు. టీడీపీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక వేధింపుల వ్యవహారం రట్టయింది. ఆయన వేధింపుల వీడియోలు బయటకు వచి్చనా బాధితుల్ని బెదిరించి రాజీ చేశారనే విమర్శలు వచ్చాయి. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహ్మద్ నజీర్ మహిళలను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. కూటమిలో ప్రధానంగా టీడీపీ, జనసేన నేతలకు సంబంధించి తరచూ రాసలీలలు, లైంగిక వేధింపులు, డ్రగ్స్ వ్యవహారాలు బయట పడుతున్నాయి. చంద్రబాబు పైకి నీతి సూత్రాలు చెబుతూ కవర్ చేస్తున్నా, ఆ పార్టీల ప్రజాప్రతినిధులు మాత్రం ఇష్టానుసారం చెలరేగిపోతున్నట్లు ఈ ఘటనల ద్వారా తేటతెల్లమవుతోంది.ఆ ఎంపీకి షోకాజ్తో సరిహైదరాబాదులో డ్రగ్స్ తీసుకుని పట్టుబడిన ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్కు కేవలం షోకాజ్ నోటీసులు ఇచ్చి సరిపెట్టాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ అయినట్లు అనుకూల మీడియాకు టీడీపీ కార్యాలయం ఆదివారం లీకులు ఇచ్చింది. ఆయనకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును చంద్రబాబు ఆదేశించినట్లు తెలిపింది. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని చెప్పినట్లు తెలిసింది. అయితే చంద్రబాబు సీరియస్ అయినట్లు, షోకాజ్ నోటీసులు ఇవ్వమన్నట్లు ఇచ్చిన లీకులన్నీ డ్రామాయేననే ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు మహేశ్కు ఎలాంటి షోకాజ్ నోటీసులు జారీ చేయలేదని సమాచారం. తీవ్ర స్థాయి ఆరోపణలు వచ్చినా సరే చంద్రబాబు ఆయన్ను వెనకేసుకుని వస్తున్నట్లు తెలుస్తోంది. లేకపోతే ఈపాటికి సస్పెన్షన్ చేసేవారని.. బాబు తీరు చూస్తుంటే అంతా ఉత్తుత్తి హడావుడేనని ఆ పార్టీలోనే చర్చ జరుగుతోంది. -
కేంద్ర నిధుల్లో కోత
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా కొనసాగుతున్నప్పటికీ నిధులను సద్వినియోగం చేసుకుని రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చడంలో సీఎం చంద్రబాబు మరోసారి విఫలమయ్యారు. ఈ ఆర్థిక ఏడాది (2025–26) కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రాష్ట్రానికి కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో రాబట్టలేక చేతులెత్తేశారు. ఆర్థిక సంవత్సరం ముగిసిపోతున్న తరుణంలో నిధులను సకాలంలో వ్యయం చేయకపోవడంతో కేంద్ర ప్రాయోజిత పథకాల కేటాయింపుల్లో భారీగా కోత పడింది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన నిధుల్లో రూ.4,042 కోట్ల మేర కోత విధించింది. దీంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మునిసిపల్, పట్టణాభివృద్ధి, సెకండరీ విద్యకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు గండి పడింది. ఆ నిధులు.. ఇతర రాష్ట్రాలకు! ఈ ఆర్థిక ఏడాది కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రాష్ట్రానికి రూ.18,662 కోట్లను కేటాయించగా చివరిలో రూ.14,620 కోట్లకు కుదించింది. అంటే రూ.4,042 కోట్ల మేర కోత పడింది. ఏ రాష్ట్రమైనా కేటాయించిన నిధులను సకాలంలో వ్యయం చేయకుంటే ఆ మేరకు కోత విధించి ఇతర రాష్ట్రాలకు అదనంగా అందజేస్తుంది. కేంద్రం కేటాయించిన నిధులను సైతం వ్యయం చేయకుండా కోత విధించే దుస్థితికి టీడీపీ కూటమి సర్కారు అసమర్థతే నిదర్శనమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా కేటాయింపులను సకాలంలో ఖర్చు చేసి అదనపు నిధుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతారు. దీనికి భిన్నంగా చంద్రబాబు సర్కారు పాలన కొనసాగుతోంది. ప్రధానంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు కేటాయింపుల్లో రూ.1,026 కోట్లు, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలకు రూ.832 కోట్లు, సెకండరీ విద్య కేటాయింపుల్లో రూ.620 కోట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖకు రూ.389 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖకు రూ.236 కోట్లు, గృహ నిర్మాణ శాఖలకు కేటాయింపుల్లో రూ.154 కోట్ల మేర కేంద్రం కోత విధించింది. -
బాబు ‘డ్రగుల్బాజీ’ పాలన
సాక్షి, అమరావతి/తిరుపతి మంగళం/నెల్లూరు రూరల్/ప్రొద్దుటూరు క్రైం/కాకినాడ రూరల్/ఏలూరు టౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో దగుల్బాజీ పాలన సాగిస్తున్నారని, మత్తు పదార్థాలు, మగువలతో అధికార కూటమి నేతలు పట్టుబడుతున్నా.. ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. ఆయన పాలనలో రాష్ట్రం మాదక ద్రవ్యాలకు అడ్డాగా మారిపోయిందని, మత్తు ముఠాలు యథేచ్ఛగా దందాలు సాగిస్తున్నాయని విమర్శించారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ డ్రగ్స్ తీసుకుని పట్టుబడిన నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతలు కురసాల కన్నబాబు, కాకాణి గోవర్ధన్రెడ్డి, రాచమల్లు శివప్రసాద్రెడ్డి, ఎస్వీ మోహన్రెడ్డి, టీజేఆర్ సుధాకర్బాబు, భూమన అభినయ్రెడ్డి, దూలం నాగేశ్వరరావు, మామిళ్లపల్లి జయప్రకాష్, కంభం విజయరాజు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ను తప్పించేందుకు తన ఆత్మీయ సన్నిహితుడైన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిని చంద్రబాబు రంగంలోకి దింపారని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే మత్తు పదార్థాలు లేకుండా చేస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ఈ రోజు ఏం సమాధానం చెబుతారని ప్రశి్నంచారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, మత్తు పదార్థాల దందా విచ్చలవిడిగా సాగుతోందని మండిపడ్డారు. గతంలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తనయుడు డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డారని గుర్తుచేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నప్పటి నుంచి మహిళలపై వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వంటి నేతలు రాసలీలలతో పట్టుబడినా వారిపై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. బాబు పాలనలో టీడీపీ నేతలే ప్రధాన సూత్రధారులుగా గంజాయి దందా నడిపిస్తున్నారని మండిపడ్డారు. మద నపల్లిలో ఒక యువకుడు గంజాయి సేవించి ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి చేశాడని, కుప్పంలోనూ గంజాయి దొరికిందని విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో రూ.47 కోట్ల విలువైన డ్రగ్స్ దొరికినా పోలీసులేం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే డ్రగ్స్ తీసుకుని పట్టుబడిన ఏలూరు ఎంపీ చేత రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం పరువు జాతీయస్థాయిలో బజారున పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ సర్కారుతో బాబు అనైతిక బంధం కొనసాగిస్తున్నారని, తన తప్పుడు పనులు, స్కాంలు కప్పిపుచ్చుకునేందుకు ఆంధ్రరాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని దుయ్యబట్టారు. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకు ఇప్పటికే రాయలసీమ ఎత్తిపోతలను బాబు తాకట్టు పెట్టారని విమర్శించారు. -
డ్రగ్స్ కేసు వివాదం: టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ బుకాయింపు
సాక్షి, విజయవాడ: ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ కేసు మరోసారి చర్చనీయాంశమైంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం రక్త పరీక్షల్లో మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయ్యింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఎంపీ మహేష్ యాదవ్ ఖండిస్తూ నేను ఎలాంటి తప్పు చేయలేదు, మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దని వీడియో విడుదల చేశారు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన తర్వాత స్టేషన్ బెయిల్ పై విడుదలైన మహేష్, వీడియోలో తన నిర్దోషిత్వాన్ని వాదించుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. తెలంగాణ పోలీసులు మాత్రం స్పష్టంగా మహేష్ డ్రగ్స్ తీసుకున్నట్టు ప్రకటించారు. దాంతో ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి. సోషల్ మీడియాలో ఆయన వీడియోపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ ఫాంహౌస్లో టీడీపీ నేత, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డ విషయం తెలిసిందే. అయినప్పటికీ, షోకాజ్ నోటీసుతో సరిపెట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పుట్టా మహేష్ను టీడీపీ ఆదేశించింది. డ్రగ్స్ ఘటనపై పుట్టా మహేష్ వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లోపు లిఖితపూర్వక వివరణ ఇవాలని కోరారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు. పుట్టా మహేష్ను టీడీపీ నుంచి సస్పెండ్ చేసి, ఎంపీ పదవికి రాజీనామా చేయించాలని సర్వత్రా డిమాండ్ వస్తోంది. అయినప్పటికీ డ్యామేజ్ కంట్రోల్ కోసం షోకాజ్ నోటీసులతో సరిపెట్టారు చంద్రబాబు. అరవ శ్రీధర్, కోనేటి ఆదిమూలం తరహాలోనే నోటీసుల డ్రామా వేస్తున్నారు. గలీజ్ కూటమి ఎమ్మెల్యేలపై ఇప్పటికీ చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోలేదు. దేశంలోనే డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డ ఏకైక ఎంపీ పుట్టా మహేష్. -
ఏపీలో పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం
విజయవాడ: ఏపీలో పదో తరగతి పరీక్షలు రేపటి(సోమవారం, మార్చి 16వ తేదీ) నుండి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ వరకూ పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం గం. 9.30 ని.లు నుండి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షా సమయం ఉంటుంది. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 3,415 పరీక్ష కేంద్రాల ఏర్పాటు చేశారు. 6,40,916 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాసేందుకు సిద్ధమయ్యారు. 6,22,074 మంది రెగ్యులర్ విధానంలో పరీక్షలు రాస్తుండగా,, 18,842 మంది ప్రైవేటు విధానంలో పరీక్షలు రాయనున్నారు. మొత్తం పరీక్షలు రాసేవారిలో 3,28,652 మంది బాలురు, 3,12,264 మంది బాలికలు ఉన్నారు.విద్యార్థులు ఉదయం 8.30 గంటల నుంచి పరీక్ష కేంద్రంలో రిపోర్టు చేయాలని, 10 గంటల తర్వాత ఎవ్వరిని లోనికి అనుమతించబోమని పరీక్షల విభాగం పేర్కొంది. పరీక్షల నిర్వహణ కి 38,958 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. మాల్ ప్రాక్టీసు అరికట్టేందుకు 156 ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా 210 సమస్యాత్మక పరీక్షా కేంద్రాలను సమస్యాత్మక పరీక్షా కేంద్రాలుగా గుర్తించారు. ఫోన్, స్మార్ట్ వాచ్, కాలిక్యులేటర్లను పరీక్షా హాల్లోకి అనుమతించబోమని విద్యాశాఖ స్పష్టం చేసింది. -
టీడీపీ.. తెలుగు డ్రగ్స్ పార్టీగా మారింది: టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: పుట్టా మహేష్ను ఎంపీ పదవి నుంచి తొలగించాలంటూ వైఎస్సార్సీపీ నేత టీజేఆర్ సుధాకర్బాబు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ.. తెలుగు డ్రగ్ పార్టీగా మారిపోయిందన్నారు. టీడీపీ ఎంపీ మద్యం తాగుతూ డ్రగ్స్ తీసుకోవడం సిగ్గుచేటు. క్యారెక్టర్ లేని వ్యక్తులను చంద్రబాబు లోక్సభకు పంపారు. పార్లమెంట్లో అడుగుపెట్టే నైతిక హక్కు మహేష్కు లేదు’’ అంటూ టీజేఆర్ మండిపడ్డారు.‘‘రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ కేసులో దొరకటం సిగ్గుచేటు. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్కు పార్లమెంటుకు వెళ్లే అర్హత లేదు. ఎంపీ మహేష్ను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. ఎంపీ పదవి నుండి తొలగించాలి. డ్రగ్స్ నెట్వర్క్తో ఎంపీ పుట్టాకు సంబంధం ఉంది. రాజస్థాన్కి చెందిన మాజీ ఎమ్మెల్యేని డ్రగ్స్ పార్టీకి పిలవడమే ఇందుకు నిదర్శనం. టీడీపీ నేతలు బరితెగించారు...తప్పులు చేసి కూడా అయితే ఏంటంటా? అంటున్నారు. ఎంపీ పుట్టా మహేష్ అనేకమంది యువత జీవితాలను పెడదోవ పట్టించేలా వ్యవహరించారు. టీటీడీకి ఛైర్మన్గా పని చేసిన సుధాకర్ యాదవ్ కొడుకే ఎంపీ మహేష్. టీటీడీ ప్రస్తుత ఛైర్మన్ బీఆర్ నాయుడు ఇటీవలే వీడియోలతో దొరికాడు. అయినాసరే చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదు...ఇప్పుడు పుట్టా మహేష్ విషయంలో ఏం చర్యలు తీసుకుంటారు. పుట్టా మహేష్ యాదవ్ కు పార్లమెంటులోకి ప్రవేశించే అర్హత లేదు. ఆయన్ను ఎంపీ పదవి నుండి వెంటనే తొలగించాలి. గుంటూరు, విజయవాడ, అమరావతిలో ఇటీవల డ్రగ్స్, గంజాయి విపరీతంగా దొరుకుతోంది. అయినాసరే చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. చంద్రబాబుకు రేవంత్, రాహుల్ గాంధీతో హాట్ లైన్ సంబంధం ఉంది. కాబట్టి రేవంత్తో మాట్కాడి పుట్టా కేసును నీరుగార్చుతారనే అనుమానం ఉంది. బీజేపీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్తో తిరుగుతున్న వ్యక్తి చంద్రబాబు. అలాంటి చంద్రబాబును ఎలా నమ్ముతున్నారో బీజేపీ, జనసేనకే తెలియాలి. రాయలసీమ లిఫ్టును కాంగ్రెస్ సీఎం అడిగాడని చంద్రబాబు ఆపేశారు. చంద్రబాబుతో సంబంధం లేకపోతే రేవంత్ రెడ్డి వెంటనే ఎంపీ మహేష్ పై చర్యలు తీసుకోవాలి. తెలంగాణ పోలీసుల నిజాయితీకి ఇది పరీక్ష. రెండు రాష్ట్రాలను డ్రగ్స్ రాష్ట్రాలుగా మార్చటం సిగ్గుచేటు’’ అంటూ టీజేఆర్ సుధాకర్బాబు మండిపడ్డారు. -
అప్పుల కుప్పలు.. దాచలేక తిప్పలు!
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం తన అప్పులపై కూడా పచ్చి అబద్ధాలు చెబుతోంది. ఒక పక్క చంద్రబాబు సర్కారు 22 నెలల పాలనలో బడ్జెట్ అప్పులు ఎంత చేశారనే విషయాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)తో పాటు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణాంకాలు వాస్తవాలను బహిరంగంగా వెల్లడించినా, బాబు సర్కారు మాత్రం బొంకడమే పనిగా పెట్టుకుంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా కాగ్ గణాంకాలను, ఆర్బీఐ లెక్కలను కాదని అవాస్తవాలు చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం రికార్డు స్థాయిలో బడ్జెట్ అప్పులు చేసినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంతే కాకుండా, బాబు తొలి ఆర్థిక ఏడాది పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దిగజారి పోయిందని, అప్పు చేయనిదే రోజు గడవడం లేదని ఇదే ఆర్థిక మంత్రికి ఇటీవల అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన కాగ్ నివేదిక మొట్టికాయలు వేసింది. ఏడాదిలో అప్పు చేయకుండా గడిచిన రోజులు కేవలం 8 మాత్రమేనని, మిగతా 357 రోజులు అప్పులు చేయనిదే గడవ లేదని ఆ నివేదిక వెల్లడించింది. బాబు సర్కారు తొలి ఏడాది చేసిన అప్పులతో భవిష్యత్ అభివృద్ధి అంధకారమేనని వ్యాఖ్యానించింది. ఇదే విషయాలను ప్రతిపక్ష నేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మీడియా సమావేశంలో వెల్లడించారు. దీన్ని జీర్ణించుకోలేని ఆర్థిక మంత్రి కేశవ్ తప్పుడు లెక్కలతో ఎదురు దాడికి దిగారు. చంద్రబాబు సర్కారు 22 నెలల్లోనే బడ్జెట్ అప్పులు రూ.1.82 లక్షల కోట్లు చేసినట్లు కాగ్ నివేదికతో పాటు ఆర్బీఐ గణాంకాలు స్పష్టం చేశాయి. ఇందుకు కాగ్ నివేదికలు, ఆర్బీఐ సెక్యూరిటీల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సమకూర్చిన అప్పుల గణాంకాలు సాక్ష్యంగా నిలిచాయి.కాగ్ కడిగి పారేసినా మారని వైఖరి⇒ 2024–25 ఆర్థిక సంవత్సరంలో చంద్రబాబు సర్కారు బడ్జెట్ అప్పు రూ.81,597 కోట్లు చేసినట్లు కాగ్ గణాంకాలు బహిరంగంగా వెల్లడించాయి. ఈ గణాంకాలు కాగ్ అధికారిక వెబ్సైట్లో అందరికీ అందుబాటులో ఉన్నాయి. అలాగే 2025–26 ఆర్థిక సంవత్సరంలో అంటే ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీ నాటికి బడ్జెట్లో రూ.1,00,667 కోట్లు అప్పు చేసినట్లు కాగ్తో పాటు ఆర్బీఐగణాంకాలు స్పష్టం చేశాయి. ⇒ ఈ అప్పులకు సంబంధించి గణాంకాలు కాగ్ వెబ్సైట్తో పాటు ఆర్బీఐ వెబ్సైట్లో బహిరంగంగానే అందుబాటులో ఉన్నాయి. చంద్రబాబు సర్కారు 22 నెలల్లో బడ్జెట్ అప్పులు రూ.1,82,264 కోట్లు చేసినట్లు కాగ్, ఆర్బీఐ గణాంకాలు స్పష్టం చేస్తున్నప్పటికీ కూడా ఆర్థిక మంత్రి కేశవ్ మాత్రం బాబు ప్రభుత్వం చేసిన మొత్తం అప్పులు కేవలం రూ.1.05 లక్షల కోట్లేనని చెప్పడం ఎవరిని మోసం చేయడానికని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల నుంచి బాబు సర్కారు గ్యారెంటీ అప్పులు అప్పులకు ఆధారమైన సర్కారు జీవోలు ⇒ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పయ్యావుల కేశవ్ రాజ్యాంగ బద్ధమైన కాగ్, ఆర్బీఐ గణాంకాలను తప్పుగా పేర్కొనడం గమనార్హం. బడ్జెట్ బయట చంద్రబాబు సర్కారు 22 నెలల్లోనే వివిధ కార్పొరేషన్లు, రాజధాని పేరుతో ప్రభుత్వ గ్యారెంటీతో ఎడాపెడా అప్పులు చేసింది. ఇందుకు చంద్రబాబు సర్కారు జారీ చేసిన జీవోలే ప్రత్యక్ష సాక్ష్యం. ఈ జీవోల గురించి మంత్రి కేశవ్కు తెలియదా? ⇒ రాజధాని పేరుతో, వివిధ కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారెంటీతో రూ.1,51,057 కోట్ల అప్పులు చేయడానికి పలు జీవోలు జారీ చేశారు. ఈ జీవోలన్నీ తప్పని ఆర్థిక మంత్రి కేశవ్ చెప్పగలరా? మరి బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట కలిపి బాబు సర్కారు చేసిన అప్పులు రూ.3,33,321 కోట్లకు చేరాయి. వాస్తవాలు ఇలా ఉంటే మంత్రి కేశవ్ అప్పులపై ఉద్దేశ పూర్వకంగా పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. బాబు మెప్పు కోసం మంత్రి కేశవ్ అబద్ధాలు⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పులపై కూడా ఆర్థిక మంత్రి కేశవ్ పచ్చి అబద్ధాలు చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి బడ్జెట్ అప్పులు, బడ్జెట్ బయట అప్పులు కలిపి రూ.6.32 లక్షల కోట్లేనని ఇటీవల ముగిసిన శాసన మండలి సమావేశాల్లో ఇదే ఆర్థిక మంత్రి కేశవ్ లిఖిత పూర్వక సమాధానంలో చెప్పారు. 2023–24 మార్చి 31 నాటికి వైఎస్ జగన్ హయాంలో బడ్జెట్ అప్పు రూ.4,91,734 కోట్లు, బడ్జెట్ బయట అప్పు రూ.1,40,470 కోట్లు అని సమాధానమిచ్చారు. ఈ రెండు కలిపితే జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి మొత్తం అప్పు రూ.6,32,204 కోట్లేనని తెలిపారు. ⇒ ఈ వాస్తవాలు ఇలా ఉండగా, ఇదే మంత్రి కేశవ్ వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.9 లక్షల కోట్ల అప్పులు చేసిందని మీడియాకు ఎలా చెబుతారు? అంటే మండలిలో చెప్పిన అంకెలు తప్పా? లేదా మీడియాతో చెప్పిన అంకెలు తప్పా? ఏది సరైందో కేశవ్ చెప్పాలి. మండలిలో తప్పుడు లెక్కలు చెప్పలేక వాస్తవాలు చెప్పి.. మీడియాలో మాత్రం తప్పుడు లెక్కలు చెప్పినట్లు స్పష్టం అవుతోంది. చట్టసభల్లో ఒకలాగ, మీడియాతో మరోలా మాట్లాడుతూ సదరు మంత్రి తన పరువు తానే తీసుకుంటూ చంద్రబాబు మెప్పు కోసం తహతహలాడుతున్నారనేది స్పష్టం అవుతోంది. -
ఉగాదిలోపు ఐఆర్ ప్రకటించకపోతే పోరాటమే
సాక్షి, అమరావతి : ఉగాది నాటికి రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ఐఆర్ ప్రకటించకపోతే ఆందోళనలకు దిగుతామని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డి చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తొలుత అన్ని జిల్లాల్లో నిరసన ప్రదర్శలు చేస్తామని, అనంతపురం జిల్లాతో నిరసనలు ప్రారంభిస్తామన్నారు. తాడేపల్లిలోని సమాఖ్య కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా స్థాయి నిరసన ప్రదర్శనల తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే విజయవాడలో మహా ధర్నా నిర్వహిస్తామని తేల్చిచెప్పారు.ఐఆర్ ప్రకటించి, పీఆర్సీ కమిషన్ను వెంటనే ఏర్పాటుచేయాలని, లేనిపక్షంలో ఏప్రిల్ ఒకటి నుంచి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఏ కేటగిరీ ఉద్యోగులకు కూడా మంచి జరగలేదని, ఇచి్చన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సినవి ఇవ్వకపోగా అణచివేస్తున్నారని, అనివార్యంగా పోరాడక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇది మంచి ప్రభుత్వం కాదని ఉద్యోగులను ముంచిన ప్రభుత్వమని ఆయన మండిపడ్డారు. \రెండేళ్లయినా ఐఆర్ ఊసేలేదు.. ఉద్యోగులను దారుణంగా వంచించారని, ఏ ఒక్కరికీ న్యాయం జరగలేదని వెంకట్రామిరెడ్డి తెలిపారు. రెండేళ్లుగా ఉద్యోగులను పట్టించుకోకపోవడంవల్లే విజయవాడ ధర్నాచౌక్ ఉద్యోగుల ధర్నాలతో దద్దరిల్లుతోందన్నారు. ఒక్క డీఏ ఇచ్చి పండుగ చేసుకోవాలని చెప్పారని.. దానితో ఎన్ని పండుగలు చేసుకోవాలని ఆయన ప్రశి్నంచారు. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఆర్నెల్లకు ఒకటి చొప్పున మొత్తం నాలుగు డీఏలు ఇవ్వాల్సి ఉండగా కేవలం ఒకటి మాత్రమే ఇచ్చారని.. అది కూడా పూర్తిగా ఇవ్వకుండా కొంత పెండింగ్ పెట్టారని తెలిపారు. అలాగే, ఐఆర్ వెంటనే ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని.. కానీ, రెండేళ్లయినా దాని గురించి మాట్లాడడంలేదన్నారు. గత ప్రభుత్వం అధికారంలోకి వచి్చన వెంటనే చెప్పిన మాట మేరకు ఐఆర్ ఇచ్చిందని వెంకట్రామిరెడ్డి గుర్తుచేశారు. గత ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషనర్ రాజీనామా చేస్తే ఇప్పటివరకూ కొత్త కమిషనర్ను నియమించలేదని, ఇక పీఆర్సీ ఎప్పుడు ఇస్తారని ఆయన ప్రశి్నంచారు. ఉద్యోగులకు రూ.40 వేల కోట్ల బకాయిలు..ఇక ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు రూ.35 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్ల వరకూ ఉన్నాయని.. వాటిని ఎప్పుడు ఇస్తారో, అసలు ఇస్తారో లేదో కూడా తెలీడంలేదని వెంకట్రామిరెడ్డి అన్నారు. చరిత్రలో ఎప్పుడూలేని విధంగా పోలీసులకు ఐదు ఎస్ఎల్లు పెండింగ్లో ఉన్నాయని.. సీపీఎస్ ఉద్యోగుల సమస్యకు పరిష్కారం చూపించకపోగా కనీసం దాని గురించి ఆలోచన కూడా చేయడంలేదని.. ఉద్యోగులకు కనీసం పదోన్నతులు కూడా ఇవ్వలేదన్నారు.అర్హతలేని వ్యక్తిని సెక్రటరీ జనరల్గా నియమించి అసెంబ్లీలో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబదీ్ధకరణను నిలిపివేయడం అన్యాయమని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బాధలు చెప్పలేని విధంగా ఉన్నాయని, రాజుల కాలంలో బానిసల కంటే దారుణంగా వారితో పనిచేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అంత పని ఒత్తిడి తట్టుకోలేక ఇప్పటికే 80 మంది ఉద్యోగులు చనిపోయారని.. అయినా వారిపై చంద్రబాబు ప్రభుత్వం కనికరం చూపడంలేదని వెంకట్రామిరెడ్డి తెలిపారు. -
ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడి
మలికిపురం: రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో రోజూ చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలంలో మూడో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలికపై మేడిద రాంబాబు(45) లైంగిక దాడికి పాల్పడినట్లు ఎస్ఐ పి.వి.వి సురేష్ శనివారం తెలిపారు.బాలిక తల్లిదండ్రులు ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. బాలిక ఇంటి వద్దకు తరచూ వచ్చే రాంబాబు శుక్రవారం కూడా ఇంటికి వచ్చాడు. రాంబాబు బాలికను ఇంటి పక్కకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడుతుండగా బాలిక నానమ్మ చూసి కేకలు వేసింది. దీంతో రాంబాబు పరారయ్యాడు. -
పోలీసు పదోన్నతులకు గ్రహణం
సాక్షి, అమరావతి: రాయలసీమలో ఇద్దరు అదనపు ఎస్పీలు నాన్ క్యాడర్ ఎస్పీలుగా పదోన్నతి జాబితాలో దీర్ఘకాలంగా ఉన్నారు. ఎస్పీ అనే హోదాతో గౌరవంగా రిటైర్ కావాలని ఆశించారు. కానీ ప్రభుత్వం పదోన్నతులను దీర్ఘకాలంగా పట్టించుకోకపోవడంతో అర్హత ఉన్నా సరే.. నాన్ క్యాడర్ ఎస్పీలుగా పదోన్నతి పొందకుండానే ఇటీవల రిటైరయ్యారు. మరో మహిళా అదనపు ఎస్పీ త్వరలో రిటైర్ కాబోతున్నారు. అర్హులైనప్పటికీ పదోన్నతులు పొందకుండానే రాష్ట్రంలో ఎంతోమంది డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు రిటైరవుతున్నారు. ఇలా చెప్పుకుంటూపోతే ఆ జాబితాకు అంతూపొంతూ లేకుండా ఉంది.ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్రంలో పోలీసు అధికారుల పదోన్నతులకు గ్రహణం పట్టింది. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో పోలీసు అధికారులు వరుసగా పదోన్నతులు పొందుతుంటే.. అదే బ్యాచ్లకు చెందిన ఏపీ అధికారులు మాత్రం పదోన్నతులు లేకుండానే రిటైరవుతున్నా అటు ప్రభుత్వం ఇటు డీజీపీ కార్యాలయం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. కానీ అర్హులను పక్కనపెట్టేసి.. అస్మదీయులకు మాత్రం కౌంటర్ ఇంటెలిజెన్స్ కోటాలో పదోన్నతులకు రంగం సిద్ధం చేస్తుండటం విస్మయపరుస్తోంది. రాష్ట్ర పోలీసు అధికారుల్లో తీవ్ర అసంతృప్తి రగిలిస్తున్న ఈ వ్యవహారం ఇలా ఉంది.. తెలంగాణలో చకచకా.. ఏపీలో కోల్డ్స్టోరేజ్.. ఉమ్మడి ఏపీలో 1995, 1996, 1998, 2002 సంవత్సరాల్లో ఎస్ఐ పోస్టులు భర్తీచేశారు. సీఐలుగా పదోన్నతులు పొందినవారిని 2014లో రాష్ట్ర విభజన తరువాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేటాయించారు. తెలంగాణకు కేటాయించిన వారిలో 1995, 1996 బ్యాచ్లకు చెందిన పోలీసు అధికారులందరికీ డీఎస్పీలుగా పదోన్నతులు ఇచ్చారు. 1998 బ్యాచ్ వారిలో 88 శాతం మంది డీఎస్పీలయ్యారు. పెండింగులో ఉన్న 1998 బ్యాచ్కు చెందిన 12 శాతం మందితోపాటు 2002 బ్యాచ్కు చెందిన అధికారులకు డీఎస్పీలుగా పదోన్నతి కల్పించే ప్రక్రియను తెలంగాణ పోలీసుశాఖ చేపట్టింది.అర్హులైన అధికారులకు డీఎస్పీలుగా పదోన్నతి కల్పించేందుకు సైబర్ క్రైం, కమాండ్ కంట్రోల్ సెంటర్, యాంటి నార్కోటిక్స్ తదితర విభాగాల్లో ప్రత్యేకంగా పోస్టులు సృష్టించింది. కానీ ఏపీలో పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. 1995లో ఉమ్మడి ఏపీలో 400 మందికి పోస్టింగులు ఇవ్వగా రాష్ట్ర విభజన తరువాత వారిలో 233 మందిని ఏపీకి కేటాయించారు. వారికే ప్రభుత్వం ఇంకా డీఎస్పీలుగా పదోన్నతులు ఇవ్వలేదు. ఇక 1996, 1998, 2002 బ్యాచ్లకు డీఎస్పీలుగా పదోన్నతి అన్నది కలగానే మిగిలిపోయేలా ఉంది. అవకాశం ఉన్న వివిధ విభాగాల్లో డీఎస్పీ పోస్టులు సృష్టించేందుకు ప్రతిపాదనలను కూడా రూపొందించనేలేదు. ఎన్నేళ్లీ నిరీక్షణ రాష్ట్రంలో అదనపు ఎస్పీ నుంచి నాన్ క్యాడర్ ఎస్పీలుగా, డీఎస్పీ నుంచి అదనపు ఎస్పీలుగా పదోన్నతుల కోసం అర్హులైన అధికారులు ఏళ్ల తరబడి నిరీక్షిస్తూనే ఉన్నారు. 30 మంది అదనపు ఎస్పీలు నాన్ క్యాడర్ ఎస్పీలుగా, 20 మంది డీఎస్పీలు అదనపు ఎస్పీలుగా పదోన్నతుల జాబితాలో ఉన్నారు. వారికి పదోన్నతులు కల్పిస్తే సీఐలకు డీఎస్పీలుగా, ఎస్ఐలకు సీఐలుగా ప్రమోషన్ ఇచ్చేందుకు మార్గం సుగమమవుతుంది. నాన్ క్యాడర్ ఎస్పీ, డీఎస్పీల పోస్టులు క్లియర్ వేకెన్సీగా ఉన్నా.. పదోన్నతులకు డీజీపీ కార్యాలయం సానుకూలంగా స్పందించడం లేదు. దీంతో ప్యానల్ జాబితాలో ఉన్న అధికారుల్లో కొందరు పదోన్నతులు పొందకుండానే రిటైరవగా, కొందరు రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నారు. కావాల్సిన వారికి మాత్రం..అర్హులైన అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐల పదోన్నతులను పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం.. అస్మదీయులైన అధికారులకు మాత్రం ఆగమేఘాల మీద పదోన్నతులు ఇచ్చేందుకు సిద్ధపడుతోంది. కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఉన్న అధికారులకు పదోన్నతులు కల్పించాలని నిర్ణయించడంపట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగంలో అధికారులకు 60 శాతం అదనపు వేతనం చెల్లిస్తారు. వివిధ పోలీసు పతకాలు ప్రదానం చేస్తారు కూడా. అర్హులైన అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐల పదోన్నతులను పక్కన పెట్టేసి మరీ... కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులకు ఆక్సిలరీ పదోన్నతులు కూడా కల్పించాలని ప్రభుత్వం ప్రతిపాదించడం విమర్శలకు దారితీస్తోంది.ఉగ్రవాద నిరోధక కార్యాకలాపాల్లో పాల్గొన్నారని వారికి పదోన్నతులు కల్పించేందుకు ప్రతిపాదించడం గమనార్హం. అందుకోసం హైదరాబాద్ పోలీసులు ఛేదించిన ఉగ్రవాద కేసును ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఖాతాలో వేసి పదోన్నతుల ఫైల్ను పరుగులెత్తిస్తున్నారు. హైదరాబాద్ పోలీసులు ఓ ఉగ్రవాద ముఠా కుట్రను ఛేదించారు. అక్కడ కొందరిని అరెస్టు చేశారు. హైదరాబాద్ పోలీసులు ఇచి్చన సమాచారంతో విజయనగరం జిల్లాలో ఒకరిని అరెస్టు చేశారు. అయితే ఈ ఉగ్రవాద కుట్రను భగ్నం చేసింది ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగమేనని చెప్పి ఆ విభాగానికి చెందిన పదిమంది అధికారులకు పదోన్నతులు కల్పించాలని నిర్ణయించారు.దీనిపై ఆ విభాగం ఉన్నతాధికారి తొలుత అభ్యంతరం తెలిపినా.. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో సమ్మతించక తప్పలేదు. ఈ పదోన్నతుల ఫైల్ ప్రస్తుతం డీజీపీ కార్యాలయం ‘ఓ’ సెక్షన్కు చేరింది. దీనిపై ప్రమోషన్లకు అర్హులైన అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీర్ఘకాలంగా తమ పదోన్నతులను పక్కన పెట్టేసీ.. కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తే తాము వారికంటే జూనియర్లం అవుతామని ఆందోళన చెందుతున్నారు. ఎన్నో ఏళ్లుగా పదోన్నతుల జాబితాలో ఉన్న తమకు పదోన్నతులు కల్పించిన తరువాత ఇతరులకు అవకాశం ఇవ్వాలని వారు కోరుతున్నారు. -
ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా..
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే మద్యం డాన్గా చెలరేగిపోతున్నారు. 2024లో టీడీపీ కూటమి అధికారంలోకి వచి్చనప్పటి నుంచి ఆయన తన దందాను టాప్ గేర్లోకి తీసుకువెళ్లారు. ఎక్సైజ్ శాఖ 125 బార్లకు జారీ చేసిన నోటిఫికేషన్ మొదలు ‘కప్పం కట్టండి...బార్ లైసెన్స్ తీసుకోండి’ అని హుకుం జారీ చేశారు. అందుకు విశాఖపట్నంలో ఎక్సైజ్ శాఖ వత్తాసు పలుకుతుండటంతో అడ్డూ అదుపు లేకుండా ఆయన దందా సాగుతోంది. ఒక్కో బార్ లైసెన్స్కు రూ.2 లక్షలు చొప్పున ఇవ్వడంతోపాటు నెలకు రూ.50 వేలు చెల్లించాలన్నది టీడీపీ ఎమ్మెల్యే మాట.తద్వారా బార్ల లైసెన్సుల వ్యవహారంలో ఏకమొత్తంగా రూ.2.50 కోట్లతోపాటు నెలకు రూ.62.50 లక్షల చొప్పున వసూళ్ల దందాకు స్కెచ్ వేశారు. ఇక విశాఖలో ప్రాంతాలవారీగా ప్రజాప్రతినిధులకు వాటాలు ఇస్తుండటంతో వారందరూ సదరు టీడీపీ ఎమ్మెల్యే చెప్పినదానికి సై అంటున్నారు. జిల్లాలో కల్లుగీత కుటుంబాలకు కేటాయించిన బార్ల లైసెన్సుల విషయంలో కూడా ఆయన మాటే చెల్లుబాటు అయ్యే వరకూ లైసెన్సులు ఇవ్వలేదు. ఎక్సైజ్ అధికారికే కప్పం వసూళ్లు, పంపిణీ బాధ్యతలు.. ఇక సదరు టీడీపీ ఎమ్మెల్యే తరఫున కప్పం వసూలు చేసి, వాటాలు పంచే బాధ్యతను ఏకంగా జిల్లాలో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి కంటే ద్వితీయ స్థానంలో ఉన్న అధికారికి అప్పగించడం మరో విశేషం. సదరు అధికారి తాను చెప్పినట్టు కప్పం వసూలు చేసే బాధ్యతను కిందిస్థాయి అధికారులకు అప్పగించారు. అందుకు సహకరించని ఇద్దరు ఎక్సైజ్ సీఐలపైనా బదిలీ వేటు వేశారు. కాగా సదరు అస్మదీయ అధికారికి తాజాగా పదోన్నతి లభించింది. పదోన్నతి తీసుకుంటే మరో జిల్లాకు బదిలీ కావాల్సి ఉన్నందున, తనకు పదోన్నతే అక్కర్లేదని ఆయన చెప్పేశారు. మరో జిల్లాలో ఉన్నతాధికారి పోస్టు కంటే విశాఖ జిల్లాలో టీడీపీ మద్యం డాన్కు కుడిభుజంగా ఉండటమే ఎక్కువ లాభసాటిగా ఉంటుందన్నది ఆయన ఉద్దేశం. పెద్దల అండదండలు ఉండడంతో ఎక్సైజ్ శాఖ కమిషనరేట్ కూడా చోద్యం చూస్తోంది.మాట వినకపోతే... విశాఖలో మొత్తం 125 బార్లకు తొలుత ఎక్సైజ్శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే కప్పం చెల్లించేందుకు సమ్మతించిన 55 బార్లకే మొదటి దశలో లైసెన్సులు ఇచ్చారు. రెండోసారి నోటిఫికేషన్ జారీ చేయడంతో మరో 13 బార్లు, మూడోసారి నోటిఫికేషన్తో 27 బార్లకు లైసెన్సులకు పచ్చ జెండా ఊపారు. ఇక మిగిలిన బార్లకు ఎక్సైజ్శాఖ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. కప్పం చెల్లించకుండా ఎవ్వరూ బార్లకు లైసెన్సులు దాఖలు చేయడానికి వీలేదంటూ టీడీపీ ఎమ్మెల్యే వర్గం అడ్డుకుంటోంది. ⇒ తనను ధిక్కరిస్తూ లైసెన్సుల కోసం అప్లికేషన్ దాఖలుకు యతి్నంచినవారిపై టీడీపీ గూండాలతో దాడులు చేయిస్తూ బెదిరిస్తున్నారు. ⇒ తమకు కాదని లైసెన్సు తెచ్చుకున్నా నగరంలో బార్ ఏర్పాటు చేసేందుకు ఎవరూ స్థలాలు, భవనాలు అద్దెకుగానీ లీజుకుగానీ ఇవ్వకుండా అడ్డుకుంటామని హెచ్చరికలూ జారీ అయ్యాయి. ⇒ సొంత స్థలాలు, భవనాల్లో బార్లను ఏర్పాటు చేయాలని భావిస్తే ఎక్సైజ్ అధికారులను పంపించి తనఖీలతో వేధిస్తామని కూడా బెదిరిస్తున్నారు. ⇒ దాంతో బార్లకు లైసెన్సులు దాఖలు చేసేందుకే ఔత్సాహికులు హడలిపోతున్నారు. -
మా సహనానికి పరీక్షా?
సాక్షి, అమరావతి: ‘అధికారంలోకి రాగానే పీఆర్సీ వేస్తామన్నారు.. అంతకు ముందే ఐఆర్ ప్రకటిస్తామని చెప్పారు. తీరా గద్దెనెక్కాక ‘మీరెవరు?’ అన్నట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? ఉద్యోగులను ఇంత దారుణంగా వంచిస్తారా?’ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాల నేతలు శనివారం చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరిగారు. రెండేళ్లవుతున్నా పీఆర్సీ లేదు.. ఐఆర్ లేదు.. బకాయిల ఊసే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఉద్యోగులకు చేసిందేమీ లేదు. ప్రభుత్వ తీరు చూస్తుంటే పీఆర్సీ దూరమవుతోందనే ఆందోళన ఉద్యోగుల్లో కనిపిస్తోంది. గతంలో ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో ఐఆర్ను ప్రకటిస్తూ వచ్చాయి. రెండేళ్లవుతున్నా ఐఆర్ ప్రకటించకపోవడం చరిత్రలో ఇదే తొలిసారి. ఉద్యోగులకు రూ.30 వేల కోట్లు, పెన్షనర్లకు రూ.10 వేల కోట్ల బకాయిల ఊసేలేదు. సరెండర్ లీవులు పెండింగ్.. డీఏలు పెండింగ్. మాకు చట్టబద్ధంగా రావాల్సినవే అడుగుతున్నాం. ఉద్యోగులందరూ ఆర్థికంగా నష్టపోతున్నారు. పెన్షనర్లు, చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల పరిస్థితి దయనీయం. రిటైర్ అయిన ఉద్యోగులు వారికి రావాల్సిన బెనిఫిట్స్ అందుకోకుండానే కన్ను మూస్తున్నారు. ఉద్యోగులు అడుగుతున్న ప్రశ్నలకు నాయకులుగా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. చేతగాకపోతే తప్పుకోండంటూ మాట్లాడుతున్నారు. ప్రభుత్వం చేస్తుందనే నమ్మకంతో ఇన్నాళ్లూ ఓపికగా ఉన్నాం. ఆ ఓపిక ఉద్యోగులు మాకు అవకాశం ఇచ్చినంత వరకే. ఆ తర్వాత చెప్పలేం’ అని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఇది మంచి ప్రభుత్వం కానేకాదని, ముంచిన ప్రభుత్వం అని ప్రభుత్వోద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను బానిసల కంటే హీనంగా చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఉగాదిలోపు ఐఆర్ ప్రకటించకపోతే పోరాటం తథ్యం అని స్పష్టం చేశారు. ఆయా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉగాదిలోపు ఐఆర్ ప్రకటించకపోతే పోరాటమేసాక్షి, అమరావతి : ఉగాది నాటికి రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ఐఆర్ ప్రకటించకపోతే ఆందోళనలకు దిగుతామని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డి చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తొలుత అన్ని జిల్లాల్లో నిరసన ప్రదర్శలు చేస్తామని, అనంతపురం జిల్లాతో నిరసనలు ప్రారంభిస్తామన్నారు. తాడేపల్లిలోని సమాఖ్య కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా స్థాయి నిరసన ప్రదర్శనల తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే విజయవాడలో మహా ధర్నా నిర్వహిస్తామని తేల్చిచెప్పారు. ఐఆర్ ప్రకటించి, పీఆర్సీ కమిషన్ను వెంటనే ఏర్పాటుచేయాలని, లేనిపక్షంలో ఏప్రిల్ ఒకటి నుంచి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఏ కేటగిరీ ఉద్యోగులకు కూడా మంచి జరగలేదని, ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సినవి ఇవ్వకపోగా అణచివేస్తున్నారని, అనివార్యంగా పోరాడక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇది మంచి ప్రభుత్వం కాదని ఉద్యోగులను ముంచిన ప్రభుత్వమని ఆయన మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కాకర్ల వెంకట్రామిరెడ్డి రెండేళ్లయినా ఐఆర్ ఊసేలేదు.. ఉద్యోగులను దారుణంగా వంచించారని, ఏ ఒక్కరికీ న్యాయం జరగలేదని వెంకట్రామిరెడ్డి తెలిపారు. రెండేళ్లుగా ఉద్యోగులను పట్టించుకోకపోవడంవల్లే విజయవాడ ధర్నాచౌక్ ఉద్యోగుల ధర్నాలతో దద్దరిల్లుతోందన్నారు. ఒక్క డీఏ ఇచ్చి పండుగ చేసుకోవాలని చెప్పారని.. దానితో ఎన్ని పండుగలు చేసుకోవాలని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఆర్నెల్లకు ఒకటి చొప్పున మొత్తం నాలుగు డీఏలు ఇవ్వాల్సి ఉండగా కేవలం ఒకటి మాత్రమే ఇచ్చారని.. అది కూడా పూర్తిగా ఇవ్వకుండా కొంత పెండింగ్ పెట్టారని తెలిపారు. అలాగే, ఐఆర్ వెంటనే ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని.. కానీ, రెండేళ్లయినా దాని గురించి మాట్లాడడంలేదన్నారు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చెప్పిన మాట మేరకు ఐఆర్ ఇచ్చిందని వెంకట్రామిరెడ్డి గుర్తుచేశారు. గత ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషనర్ రాజీనామా చేస్తే ఇప్పటివరకూ కొత్త కమిషనర్ను నియమించలేదని, ఇక పీఆర్సీ ఎప్పుడు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగులకు రూ.40 వేల కోట్ల బకాయిలు..ఇక ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు రూ.35 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్ల వరకూ ఉన్నాయని.. వాటిని ఎప్పుడు ఇస్తారో, అసలు ఇస్తారో లేదో కూడా తెలీడంలేదని వెంకట్రామిరెడ్డి అన్నారు. చరిత్రలో ఎప్పుడూలేని విధంగా పోలీసులకు ఐదు ఎస్ఎల్లు పెండింగ్లో ఉన్నాయని.. సీపీఎస్ ఉద్యోగుల సమస్యకు పరిష్కారం చూపించకపోగా కనీసం దాని గురించి ఆలోచన కూడా చేయడంలేదని.. ఉద్యోగులకు కనీసం పదోన్నతులు కూడా ఇవ్వలేదన్నారు. అర్హతలేని వ్యక్తిని సెక్రటరీ జనరల్గా నియమించి అసెంబ్లీలో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబదీ్ధకరణను నిలిపివేయడం అన్యాయమని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బాధలు చెప్పలేని విధంగా ఉన్నాయని, రాజుల కాలంలో బానిసల కంటే దారుణంగా వారితో పనిచేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అంత పని ఒత్తిడి తట్టుకోలేక ఇప్పటికే 80 మంది ఉద్యోగులు చనిపోయారని.. అయినా వారిపై చంద్రబాబు ప్రభుత్వం కనికరం చూపడంలేదని వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఈ రెండేళ్లలో ఉద్యోగులకు చేసిందేమీ లేదుఅనంతపురం అర్బన్ : ‘చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఉద్యోగులకు చేసిందేమీ లేదు. ప్రభుత్వ తీరు చూస్తుంటే పీఆర్సీ దూరమవుతోందనే ఆందోళన ఉద్యోగుల్లో కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో ఐఆర్ను ప్రభుత్వాలు ప్రకటిస్తూ వచ్చాయి. కానీ, రెండేళ్లవుతున్నా ఐఆర్ ప్రకటించకపోవడం చరిత్రలో ఇదే తొలిసారి. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల ఊసేలేదు. సరెండర్ లీవులు పెండింగ్.. డీఏలు పెండింగ్. మాకు చట్టబద్ధంగా రావాల్సినవే అడుగుతున్నాం. పెన్షనర్లు, చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రభుత్వం నుంచి అందాల్సిన బెనిఫిట్లలో ఒక్క రూపాయి కూడా వారికి అందలేదు. ఉద్యోగులు అడుగుతున్న ప్రశ్నలకు నాయకులుగా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. చేతగాకపోతే తప్పుకోండంటూ మాట్లాడుతున్నారు. ప్రభుత్వం చేస్తుందనే నమ్మకంతో ఓపికగా ఉన్నాం. ఆ ఓపిక ఉద్యోగులు మాకు అవకాశం ఇచ్చినంత వరకే. ఆ తరువాత చెప్పలేం’.. అని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. అనంతపురం విచ్చేసిన ఆయన శనివారం ఆ సంఘం కార్యాలయంలో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల అధ్యక్షులు దివాకర్రావు, మైనుద్దీన్, కార్యదర్శి సోమశేఖర్ తదితర నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు.. ప్రభుత్వ తీరుతో ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆయన చెప్పారు., ఉద్యోగులకు ఇవ్వాల్సినవన్నీ త్వరలో ఇస్తామని గత ఏడాది అక్టోబరు 18న ముఖ్యమంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారని.. అయితే, ఐదారు నెలలు అవుతున్నా ఇప్పటికీ అమలుకాలేదని బొప్పరాజు అన్నారు. దీంతో పీఆర్సీ దూరం చేస్తారనే ఆందోళనలో ఉద్యోగులు ఉన్నారన్నారు. జాప్యం చేయకుండా పీఆర్సీ కమిషనర్ను తక్షణం నియమించాలన్నారు. 60 రోజుల్లో నివేదిక ఇచ్చే వెసులుబాటు కల్పించాలన్నారు. తక్షణం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇక ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.30 వేల కోట్లకు పైగా బకాయిల ఊసేలేదని అన్నారు. సరెండర్ లీవులు ఇవ్వలేదని, డీఏలూ పెండింగ్ పెట్టారన్నారు. పోలీసులకు ఒక్క సరెండర్ లీవును రెండు విడతలుగా ఇవ్వడం ఇప్పుడే చూస్తున్నామని చెప్పారు. ఇంతటి దయనీయమైన పరిస్థితిని ఎప్పుడూ చూడలేదన్నారు. పెన్షనర్లకు రూ.10 వేల కోట్ల బకాయి.. ఇక పెన్షనర్లు, చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు చెల్లించాల్సిన బకాయిలు రూ.10 వేల కోట్లు ఉన్నాయని బొప్పరాజు చెప్పారు. బెనిఫిట్లు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా అందకపోవడంతో వారు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని.. కానీ, అవి తీసుకోకుండానే రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయిన సందర్భాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వానికి ఉద్యోగులుగా తాము సహకరిస్తున్నామని, అదే స్థాయిలో ప్రభుత్వం సహకరించడంలేదని బొప్పరాజు చెప్పారు.ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తిచంద్రబాబు ప్రభుత్వంలో ఉద్యోగులు ఏమాత్రం సంతృప్తికరంగా లేరు. గత సంక్రాంతి పండుగకు ఇచ్చామంటున్న డీఏ ఇంత వరకు చాలా మందికి అందలేదు. సంస్కరణల పేరుతో ఉపాధ్యాయులను తీవ్రంగా వేధిస్తున్నారు. పదో తరగతి పరీక్షల మూల్యాంకనం రెమ్యూనరేషన్ ఇవ్వడం లేదు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి యమలోకంలో ఉన్నట్లు ఉంది. 30 ఏళ్ల పిల్లలు కూడా గుండె నొప్పి, బ్రెయిన్ స్ట్రోక్లతో చనిపోతున్నారు. – బాజీ పఠాన్, అధ్యక్షులు, ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ఏ సమస్యా పరిష్కారం కాలేదుఉపాధ్యాయుల సమస్యలు ఏవీ పరిష్కారం కాలేదు. వాటి కోసం దశల వారీగా ఉద్యమాన్ని చేపడుతున్నాం. కూటమి మేనిఫెస్టో హామీల అమలు కోరుతూ ఆందోళనలు చేస్తాం. ఈ ప్రభుత్వం ఐఆర్ గురించి పట్టించుకోలేదు. బకాయిలు చెల్లించలేదు. పీఆర్సీ ఎప్పుడు వేస్తారో తెలియని పరిస్థితి. 11వ పీఆర్సీ బకాయిలు, డీఏ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు అలాగే ఉన్నాయి. పెన్షన్ కార్పొరేషన్ హామీ ఏమైందో తెలీదు. – రఘునాథ్రెడ్డి, అధ్యక్షుడు, రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ)త్వరలో ఆందోళన ఉధృతంఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. మా జీతం కింద దాచుకున్న పీఎఫ్, ఏపీజీఎల్ఐ వంటి వాటిని కూడా మాకు ఇవ్వడంలేదు. పీఆర్సీ, ఐఆర్ గురించి అసలు ప్రస్తావనే చేయకపోవడాన్ని బట్టి అవి ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని అర్థమవుతోంది. ఉపాధ్యాయులను ప్రతి చిన్న విషయానికి వేధింపులకు గురి చేస్తున్నారు. లోపభూయిష్టమైన అసెస్మెంట్ రిజిస్టర్లతో ఇబ్బంది పెడుతున్నారు. త్వరలో ఉధృతంగా ఆందోళన తప్పదు.– ఏఎం గిరిప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పీఆర్టీయూ -
లోకేశ్.. చిల్లర రాజకీయాలు మానుకో!
తాడేపల్లి రూరల్: ‘మిస్టర్ లోకేశ్.. చిల్లర రాజకీయాలు మానుకోండి. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి. ప్రతిపక్ష నేతలను కించపరిచేందుకు జీతాలు ఇచ్చి మరీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం తగదు’ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు కొమ్మూరి కనకారావు, వైఎస్సార్సీపీ ఫిర్యాదుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అంకిరెడ్డి నాగనారాయణమూర్తి అన్నారు. చిల్లర రాజకీయాలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని మంత్రి లోకేశ్ను హెచ్చరించారు. మాజీ సీఎం వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో వైఎస్సార్సీపీ పేరుతో సీమరాజ, జెట్టి రేణుక, కిరాక్ ఆర్పీ, కిరణ్ లాంటి వారితో దు్రష్పచారం చేయించడంపై శుక్రవారం తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వారి వెంట వైఎస్సార్సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మేక అంజిరెడ్డి, అశోక్రెడ్డి తదితరులు ఉన్నారు. -
టెన్త్ పరీక్షలకు 6.40 లక్షల విద్యార్థులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు 6,40,916 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో 6,22,074 మంది రెగ్యులర్, 18,842 మంది ప్రైవేటు విధానంలో నమోదు చేసుకున్నారు. ఈనెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు ఉదయం 9.30 గంటల నుంచి 12.45 వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు ఉదయం 8.30 గంటల నుంచి పరీక్ష కేంద్రంలో రిపోర్టు చేయాలని, 10 గంటల తర్వాత ఎవ్వరినీ లోనికి అనుమతించబోమని పరీక్షల విభాగం పేర్కొంది. మొత్తం విద్యార్థుల్లో 3,28,652 మంది బాలురు, 3,12,264 మంది బాలికలు ఉన్నారు.3,415 పరీక్ష కేంద్రాలు కేటాయించారు. ప్రతీ కేంద్రానికి సీఎస్, డీవోను నియమించారు. 38,958 మందిని ఇన్విజిలేటర్లుగా, మాల్ప్రాక్టీస్ను అరికట్టేందుకు 156 ఫ్లయింగ్స్కా్వడ్స్ను నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా 210 సమస్యాత్మక పరీక్షా కేంద్రాలను గుర్తించి సీసీటీవీ పర్యవేక్షణలో పెట్టారు. విద్యార్థులు పరీక్షలు రాసేందుకు వీలుగా 24 పేజీల ప్రధాన ఆన్సర్ బుక్లెట్ను అందిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. అవసరమైతే మరో 12 పేజీల అడిషనల్ బుక్లెట్ తీసుకోవచ్చని సూచించింది. విద్యార్థులు కచ్చితంగా ఒరిజినల్ హాల్టికెట్తో పరీక్షకు హాజరుకావాలని పేర్కొంది. ఫోన్, స్మార్ట్ వాచ్, కాలిక్యులేటర్లు అనుమతించబోమని స్పష్టం చేసింది. -
వేతన వెతలు.. పండగ వేళ పస్తులు!
సాక్షి, అమరావతి: వేతనాలు చెల్లించకుండా చంద్రబాబు సర్కారు ఉపాధిహామీ కూలీల కుటుంబాలను పస్తులుంచుతోంది. రాష్ట్రంలో ఉపాధి హామీ పనులకు హాజరైన కూలీలకు ప్రభుత్వం మూడున్నర నెలలుగా వేతనాలు చెల్లించలేదు. దాదాపు రూ.660 కోట్లు బకాయిపడింది. పూటగడవక.. వేతనాలు అందక పేదలు అవస్థలు పడుతున్నారు. ఐదారు రోజుల్లో ఉగాది పండగ వస్తుంది.. ఇంకొద్ది రోజులకు శ్రీరామనవమి.మధ్యలో రంజాన్ పండగ కూడా ఉంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని లక్షలాది పేద కుటుంబాల్లో పండగల సంతోషమే కనిపించడం లేదు. పనులు లేక... చేసిన పనులకు డబ్బులు చెల్లించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. నిబంధనల ప్రకారం ఉపాధి పనిచేసిన కూలీలకు 15 రోజుల్లోగా వేతనాలు చెల్లించాలి. ఇదే విషయం కేంద్రం చేసిన చట్టం చెబుతోంది. అయినా నెలల తరబడి ప్రభుత్వమే వేతనాలు చెల్లించకుండా పండగ రోజుల్లో సైతం పేదలను పస్తులు పెడుతోంది. పనుల కల్పనలోనూ విఫలం చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో ఉపాధి హామీ పనుల కల్పన తగ్గిపోయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి ఆర్థిక ఏడాదిలో 25 కోట్లకుపైగా పనిదినాలు కల్పించి పేద ప్రజలకు భరోసా కల్పించారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఈ ఏడాది 19 కోట్ల పనిదినాలు కూడా పూర్తయ్యే పరిస్థితి లేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి 2023–24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 46.55 లక్షల కుటుంబాలకు 25.54 కోట్ల పనిదినాలు పనులు కల్పించారు. చంద్రబాబు సీఎం అయ్యాక 2024 –25 ఆర్థిక ఏడాదిలో 24.22 కోట్ల పనిదినాలు కల్పించినా... అందులో చంద్రబాబు సీఎం కాకమునుపు 2024 ఏప్రిల్, మే నెలలోనే 11.68 కోట్ల పనిదినాల కల్పన పూర్తయింది. ఆర్థిక ఏడాదిలో మిగిలిన 10 నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం కేవలం 12.54 కోట్ల పనిదినాలే కల్పించింది. 20 రోజుల్లో ముగుస్తున్న ఆర్థిక సంవత్సరం మరో 20 రోజుల్లో 2025–26 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పోర్టల్ వెల్లడించిన గణాంకాల ప్రకారమే మార్చి 13 తేదీ వరకు 17.86 కోట్ల పనిదినాలు మాత్రమే కల్పించింది. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంతో పోల్చితే దాదాపు ఏడున్నర కోట్ల పనిదినాలు తక్కువ కావడం గమనార్హం. మరోవైపు చేసిన పనికీ నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడంతో ప్రస్తుతం రోజు వారీ 5.5లక్షల మంది కూలీలు మాత్రమే పనులకు హాజరవుతున్నారు. -
వ్యవ‘సాయానికి’ ఉరి!
రైతులకు అన్నీ కష్టాలే.. ఐదేళ్లుగా నేను ఎకరా భూమిలో కౌలు సాగు చేస్తున్నాను. రెండేళ్లుగా పెట్టుబడి సాయం అందట్లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో రైతు భరోసా సాయం అందింది. చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో రైతులకు అన్నీ కష్టాలే మిగిలాయి. చాలా సార్లు దరఖాస్తు చేసుకున్నాను. ఈ ఏడాదిలో ఈ విడతలోనైనా వస్తుందేమో అని ఆశతో ఎదురు చూశాను. కానీ నా ఆశ నిరాశగానే మారింది. నష్టాలే తప్ప లాభం లేదు. భవిష్యత్తులో కౌలుకు చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. – పినిశెట్టి అచ్చెంనాయుడు, కేజేపురం, మాడుగుల మండలం, ఉమ్మడి విశాఖ జిల్లాసాక్షి, అమరావతి: అన్నదాతా సుఖీభవ.. అంటూ చంద్రబాబు ప్రభుత్వం రైతన్నలను నిలువునా మోసగిస్తోంది. ‘అధికారంలోకి రాగానే కేంద్రం ఇచ్చే దాంతో సంబంధం లేకుండా ప్రతీ రైతుకు ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తాం’ అంటూ సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీకి తూట్లు పొడుస్తోంది. తొలి ఏడాది నిస్సిగ్గుగా రూ.20 వేలు ఎగ్గొట్టింది. రెండో ఏడాది అరకొర సాయంతో చేతులు దులుపుకుంటోంది. భూ యజమానులకు రెండు విడతల్లో రూ.5 వేల చొప్పున రూ.10 వేలు అందించిన ప్రభుత్వం.. మూడో విడతగా శుక్రవారం మరో రూ.4 వేలు జమ చేయబోతున్నట్టు ప్రకటించింది. భూ యజమానులకు రెండేళ్లలో రూ.40 వేలకు గాను రూ.26 వేలు ఎగ్గొట్టడమే కాకుండా, కౌలు రైతులకైతే పైసా సాయం చేయకుండా పూర్తిగా మొండి చేయి చూపిస్తూ ఏకంగా రూ.6,400 కోట్లు ఎగ్గొట్టింది. రాష్ట్రంలో 16 లక్షల మంది కౌలు రైతులుండగా.. 2024–25లో 9.25 లక్షల మందికి, 2025–26లో 8.24 లక్షల మందికి మాత్రమే సీసీఆర్సీలు (కౌలు రైతు గుర్తింపు కార్డులు) జారీ చేశారు. ఈ లెక్కన చూసినా తొలి ఏడాది 9.25 లక్షల మందికి రూ.20 వేల చొప్పున రూ.1,850 కోట్లు, రెండో ఏడాది 8.24 లక్షల మందికి రూ.1,648 కోట్లు జమ చేయాల్సి ఉండగా, అది కూడా చేయలేదు. మొత్తంగా అన్నదాతలకు రూ.21,273.28 కోట్లు ఎగ్గొట్టింది. మరో వైపు ఐదేళ్ల పాటు పైసా భారం లేకుండా అండగా నిలిచిన ఉచిత పంటల బీమా పథకాన్ని అటకెక్కించి.. సున్నా వడ్డీకి చాప చుట్టేసి.. ఇన్పుట్ సబ్సిడీకి ఎగనామం పెట్టింది. విత్తు నుంచి విఫణి వరకు గ్రామ స్థాయిలో రైతులను చేయి పట్టి నడిపించిన రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసింది. మరో వైపు గత రెండేళ్లలో ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కకపోయినా ఆదుకున్న పాపాన పోలేదు. అయినా సరే నిస్సిగ్గుగా తామేదో రైతులను ఉద్దరిస్తున్నట్టు అన్నదాత సుఖీభవ వారోత్సవాల పేరిట సంబరాలు నిర్వహిస్తున్నట్టు చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించడం పట్ల రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 7 లక్షల మందికి ఎగనామంసూపర్ సిక్స్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున రెండేళ్లలో రూ.40 వేల పెట్టుబడి సాయం అందించాలి. 2023–24లో అర్హత పొందిన 53,58,366 మందికి రూ.20 వేల చొప్పున ఏటా రూ.10,716.73 కోట్లు జమ చేయాలి. కానీ 2024–25 తొలి బడ్జెట్లో ఈ పథకానికి రూ.1,000 కోట్లు కేటాయించినా పైసా ఖర్చు చేయలేదు. అదిగో ఇదిగో అంటూ తొలి ఏడాది నిస్సిగ్గుగా ఎగ్గొట్టేసింది. పాత బకాయిలతో కలిపి 2025–26 బడ్జెట్లో రూ.21,433.46 కోట్లు కేటాయింపులు జరపాల్సి ఉండగా, కేవలం రూ.6,300 కోట్లతో సరిపెట్టింది. గతంలో వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందుగానే పెట్టుబడి సాయం అందించి వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా నిలిచేది. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం తొలి ఏడాది ఎగ్గొట్టి, రెండో ఏడాది తనకు నచ్చినప్పుడు రూ.5 వేల చొప్పున 2 విడతల్లో రూ.10 వేలు జమ చేసింది. వాస్తవానికి 2023–24 అర్హుల జాబితా ప్రకారం 53.58 లక్షల మందికి జమ చేయాల్సి ఉండగా, పలు సాకులతో 46.85 లక్షల మందికి కుదించింది. అంటే దాదాపు 7 లక్షల మందికి కోత పెట్టింది. మరో వైపు భూ యజమానులతో పాటు తొలి ఏడాది కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం ఎగ్గొట్టిన చంద్రబాబు ప్రభుత్వం.. రెండో ఏడాది వాస్తవ సాగుదారులకు పంగనామాలు పెట్టింది. రైతు కూలీలు, కౌలు రైతులను ఆదుకుంటామని ఎన్నికల సమయంలో కృష్ణాజిల్లా పామర్రు, ఉయ్యూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు ఇచ్చిన హామీ మూడో విడతలోనూ కోతలే⇒ నిజానికి ఏటా భూ యజమానులతో పాటు కౌలుదారుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2019–20లో 46.69 లక్షల మందికి లబ్ధి చేకూర్చగా, 2023–24కు వచ్చేసరికి లబ్ధిదారుల సంఖ్య 53.58 లక్షలకు పెరిగింది. ఇలా ఐదేళ్లలో ఈ పథకం కింద రూ.34,288.17 కోట్ల లబ్ధి చేకూరింది. ఆ లెక్కన గడిచిన రెండేళ్లలో లబ్ధిదారుల సంఖ్య పెరగాల్సింది పోయి తగ్గిపోయింది. ⇒ ఆరు దశల వడపోత అనంతరం లబ్ధిదారుల సంఖ్య 46.86 లక్షలకు కుదించారు. పైగా వీరిలో 1.16 లక్షల మంది అటవీ సాగుదారులున్నారు. ఆ లెక్కన వెబ్ల్యాండ్ డేటా ప్రకారం తొలి రెండు విడతల్లో లబ్ధి పొందిన భూ యజమానుల సంఖ్య కేవలం 45.70 లక్షల మంది మాత్రమే. ⇒ చనిపోయిన రైతుల స్థానంలో గతంలో వారి వారసులకు పెట్టుబడిసాయం అందించేవారు. కానీ, నేడు ఆ పరిస్థితి లేదు. తొలి విడతలో తామిస్తామన్న రూ.20 వేల చొప్పున రూ.10,716.73 కోట్లు ఎగ్గొట్టిన చంద్రబాబు ప్రభుత్వం.. రెండో ఏడాది 46.86 లక్షల మందికి రూ.ఐదు వేల చొప్పున రెండు విడతల్లో రూ.4,685.84 కోట్లు జమ చేసింది. కాగా పీఎం కిసాన్ కింద కేంద్రం జమ చేసే సొమ్ములను కూడా తమ ఖాతాలో వేసుకొని అసెంబ్లీ సాక్షిగా రూ.6,309.44 కోట్లు జమ చేశామని నిస్సిగ్గుగా ప్రకటించుకుంది.⇒ జగన్ హయాంలో అర్హత ఉండీ లబ్ధి పొందని వారు ఎవరైనా ఉంటే వెతికి వెతికి సాయం అందించేవారు. కానీ నేడు అన్నదాత సుఖీభవ తమకు జమ కాలేదంటూ వేలాది మంది గ్రీవెన్స్లో ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. శుక్రవారం నుంచి మూడో విడత పంపిణీ కార్యక్రమంలో రూ.4 వేల చొప్పున రూ.1,874.34 కోట్లు జమ చేయబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ సాయంతో కలిపి 2025–26 సీజన్లో రూ.6,560.18 కోట్లు జమ చేసినట్టవుతుంది. వాస్తవానికి రెండేళ్లలో ఒక్కో రైతుకు రూ.40 వేల చొప్పున రూ.21,433.46 కోట్లు జమ చేయాల్సి ఉండగా, ఏకంగా రూ.14,873.28 కోట్లు నిస్సిగ్గుగా ఎగ్గొట్టింది.సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ప్రతి రైతుకూ ఏడాదికి రూ. 20 వేల ఆర్థిక సాయం అందిస్తామంటూ తెలుగుదేశం కరపత్రిక ఈనాడులో చంద్రబాబు ఇచ్చిన ప్రకటన , తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో వ్యవసాయరంగానికి ఇచ్చిన హామీలు కౌలు రైతులకు రూ.6,400 కోట్లు ఎగనామం⇒ భూ యజమానులతో పాటు సామాజిక వర్గాలకు అతీతంగా వాస్తవ సాగుదారులైన కౌలు రైతులతో పాటు దేవదాయ, ధర్మాదాయ భూ సాగుదారులందరికీ ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామంటూ ఎన్నికల్లో చంద్రబాబు అండ్ కో ఊరూవాడ విస్తృతంగా ప్రచారం చేసింది. ఆచరణకు వచ్చేసరికి తొలి ఏడాది భూ యజమానులతో పాటు కౌలు రైతులకు ఎగ్గొట్టారు. ⇒ రెండో ఏడాది తొలివిడత సాయం పంపిణీ వేళ.. ఖరీఫ్–2025 సీజన్లో పంట నమోదు (ఈ క్రాప్) ప్రామాణికంగా కౌలు రైతుల డేటా ధ్రువీకరణ చేపట్టి, ఆ తర్వాత అర్హత పొందిన వారికి రెండు విడతలు కలిపి జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రెండో విడత సాయం పంపిణీ సమయంలో కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియ పూర్తి కావచ్చిందని, త్వరలోనే జమ చేస్తామంటూ వారిని మభ్యపెట్టారు. ⇒ కనీసం చివరి విడతలోనైనా తమకు ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇస్తుందేమోనని రాష్ట్రంలోని కౌలు రైతులందరూ ఆశగా ఎదురు చూశారు. కానీ వారి ఆశలను ఆడియాశలు చేస్తూ వారి నోట్లో మట్టికొట్టారు. దేవదాయ భూ సాగుదారులనూ మోసం చేశారు. సీసీఆర్సీలతో సంబంధం లేకుండా కౌలు సాగుదారులందరికీ పథకాన్ని వర్తింప చేయాలంటే రెండేళ్లలో రూ.6,400 కోట్లు జమ చేయాలి. కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా నిండా ముంచారు. అటకెక్కిన ఉచిత పంటల బీమా⇒ గత ప్రభుత్వ హయాంలో సాగైన ప్రతీ పంటను ఈ క్రాప్లో నమోదు చేసేవారు. ఈ క్రాప్ నమోదే ప్రామాణికంగా ఉచిత పంటల బీమా పరిహారంతో పాటు వైపరీత్యాల్లో పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించేవారు. కానీ నేడు ఈ క్రాప్ నిర్వీర్యమైపోయింది. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఉచిత పంటల బీమాను అటకెక్కించారు. స్వచ్ఛంద నమోదు బీమా అంటూ రైతుల నోట్లో మట్టికొట్టారు. ⇒ 2023–24 వ్యవసాయ సీజన్కు సంబంధించి రైతుల వాటాతో పాటు ప్రభుత్వ వాటా ప్రీమియం మొత్తం రూ.930 కోట్లు జూన్ 2024లో జమ చేయాల్సి ఉండగా, అదే సమయంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం చెల్లించకుండా ఎగ్గొట్టింది. ఫలితంగా 2023–24 సీజన్కు సంబంధించి రూ.1,324 కోట్ల బీమా పరిహారం రైతులకు అందకుండా మోకాలొడ్డింది. ⇒ ఖరీఫ్ 2024 సీజన్లో రైతుల వాటాతో పాటు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.834.44 కోట్లతో పాటు రబీ 2024–25, ఖరీఫ్–2025 సీజన్లలో ప్రభుత్వం తమ వాటా కింద చెల్లించాల్సిన రూ.260.67 కోట్లు ఎగ్గొట్టడంతో రబీ 2025–26 సీజన్లో ఏపీని కంపెనీలు బ్లాక్ లిస్ట్లో పెట్టేశాయి. ఇలా గడిచిన మూడు సీజన్లలో రూ.3,500 కోట్లకుపైగా బీమా పరిహారం రైతులకు అందకుండా దగా చేసింది.⇒ దాదాపు 12 లక్షల మంది రైతులకు రెండేళ్లలో రూ.500 కోట్ల సున్నా వడ్డీ రాయితీని ఎగ్గొట్టారు. వరుస వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న దాదాపు ఆరున్నర లక్షల మందికి రూ.1,000 కోట్లకు పైగా పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) ఇవ్వకుండా ఎగనామం పెట్టారు.రెండేళ్లలో రూ.500 కోట్ల సున్నా వడ్డీ రాయితీకి ఎగనామంఏ ఒక్క పంటకూ దక్కని మద్దతు ధర⇒ మద్దతు ధర దక్కని సమయంలో మార్కెట్లో జోక్యం చేసుకొని రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు ఉద్దేశించిన ధరల స్థిరీకరణ నిధిని చంద్రబాబు ప్రభుత్వం ఎత్తేసింది. ధాన్యం మొదలు పత్తి, మిరప, పొగాకు, టమాటా, ఉల్లి, మినుము, పెసలు, కంది, శనగ, జొన్న, మొక్కజొన్న, సజ్జ ఇలా ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కకపోయినా ఆదుకోలేదు.ధరల స్థిరీకరణ నిధికి మంగళం⇒ వైఎస్ జగన్ హయాంలో రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారు. తద్వారా ధరలు పతనమైన ప్రతిసారి మార్కెట్లో జోక్యం చేసుకుని, వ్యాపారుల మధ్య పోటీ పెంచి రైతులకు మద్దతు ధర కల్పించే వారు. ఇలా ఐదేళ్లలో 6.20 లక్షల మంది రైతుల నుంచి రూ.7,577 కోట్ల మేర పంట ఉత్పత్తులు కొనుగోలు చేశారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదు.అప్పుల ఊబిలో రైతులు⇒ చంద్రబాబు సర్కార్ నిర్వాకంతో 21 నెలల్లో రూ.35 వేల కోట్లకుపైగా రైతులు నష్టపోయారు. ఫలితంగా అప్పుల ఊబిలో కూరుకుపోయి పెద్ద సంఖ్యలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 2024–25లో దాదాపు 150 మందికి పైగా ఆత్మహత్యలకు పాల్పడగా, 2025–26లో 393 మంది రైతులు, 2,472 మంది రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారని రాష్ట్ర పోలీస్ శాఖే అధికారికంగా వెల్లడించింది. రైతులను చేయి పట్టుకుని నడిపించిన ఆర్బీకేలు నిర్వీర్యంఇది నమ్మించి మోసం చేయడమే నాలుగు ఎకరాల ఆలయ మాన్యం భూమిని కౌలుకు సాగు చేస్తున్నాను. డ్రిప్ సహాయంతో వేరుశనగ, టమాటా పంట వేశాను. పంట దిగుబడి రాక, పెట్టుబడులు తలకు మించిన భారమై రెండేళ్లుగా రూ.10 లక్షల వరకు అప్పులయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక్క పైసా కూడా సహాయం అందించలేదు. మొదటి ఏడాది ఆశలు వదులుకున్నాం.ఈ ఏడాది అయినా నగదు జమ చేస్తుందని ఆశించిన మాకు ప్రభుత్వం మొండిచేయి చూపింది. కౌలు రైతులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక పోయారు. ఇది నమ్మించి మోసం చేయడమే. – కురుబ రాము, కోనాపురం, ఉరవకొండ మండలం, అనంతపురం జిల్లా కౌలు రైతులను గుర్తించాలి కూటమి ప్రభుత్వం వచ్చాక కౌలు రైతుల ఊసే లేకుండా పోయింది. మొదటి ఏడాది అన్నదాత సుఖీభవకు ఎగనామం పెట్టారు. రెండో ఏడాది గడుస్తున్నా కౌలు రైతు గురించి పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. ప్రస్తుతం రబీ సీజన్లో సైతం 1.5 ఎకరాల్లో మినుము పంట సాగు చేశా. ఎకరాకు నాలుగు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. అధిక వర్షాలతో పంట సరిగా చేతికందక అప్పులపాలయ్యా. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కౌలు రైతులను గుర్తించి అన్నదాత సుఖీభవ మంజూరు చేయాలి. – సుబ్బరాయుడు, మీరాపురం, కమలాపురం మండలం, వైఎస్సార్ కడప జిల్లాకౌలు రైతులకు మొండిచేయి ప్రతి ఏడాది మూడెకరాల పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాను. ప్రస్తుత ప్రభుత్వంలో కౌలు రైతుల్లో కొందరికే గుర్తింపు కార్డులు ఇచ్చారు. చాలా మందికి ఇవ్వలేదు. గుర్తింపు కార్డులు ఇచ్చిన వారికి కూడా పెట్టుబడి సాయం కింద అందజేసే అన్నదాత సుఖీభవ వర్తింప చేయక పోవడం అన్యాయం. నాలాంటి కౌలు రైతులకు ఒక్క సంక్షేమ పథకం కూడా అందడం లేదు. గత ప్రభుత్వంలో కౌలు రైతులకు సైతం రైతు భరోసా ద్వారా ఆర్థిక సాయం అందజేశారు. – పట్టాభయ్య, యానాదివెట్టు, వరదయ్యపాళెం మండలం, తిరుపతి జిల్లా ధరలేక తెగనమ్ముకున్నా నాకు రెండు ఎకరాల సొంత భూమి ఉంది. ఏటా రెండు కార్లు వరి పండిస్తున్నాను. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ధాన్యానికి గిట్టుబాటు ధర లభించేది. అప్పట్లో పుట్టి (850 కేజీలు) రూ.22 వేలకు అమ్ముకున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024, 2025లో వేసిన ఎడగారుకు గిట్టుబాటు ధర లభించక పుట్టి రూ.14 వేలు చొప్పున తెగనమ్ముకున్నాను. పుట్టికి రూ.8 వేలు చొప్పున 5 పుట్లకు ఏటా రూ.40 వేలు నష్టపోయాను. రెండేళ్లల్లో నాలుగు పంటలకు రూ.1.60 లక్షలు నష్టపోయాను. రైతులకు గిట్టుబాటు ధర కలి్పంచలేని ఈ ప్రభుత్వాలు ఎందుకు? మేనిఫెస్టోలో ఏం చెప్పారు? అధికారంలోకి వచ్చాక ఏం చేస్తున్నారు?– గుడిపాటి ప్రభాకర్నాయుడు, యనమదల, చేజర్ల మండలం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మద్దతు ధర అడియాశే చంద్రబాబు కూటమి పాలనలో రైతులకు ఒరిగిందేమీ లేదు. వేలకు వేలు పెట్టుబడులు పెట్టి పంట చేతికొచ్చాక దళారులు, మిల్లర్లు దోచేశారు. గత ఖరీఫ్ సీజన్లో మూడెకరాల్లో వరి సాగు చేశాను. వరిలో తేమ శాతం సాకుగా చూపి 75 కిలోలు బస్తాకు రూ.300పైగా దోచేశారు. అండగా నిలవాల్సిన ప్రభుత్వం, అధికారుల్లో చలనం లేదు. రైతు పక్షాన నిలబడలేదు. పండించిన పంటకు మద్దతు ధర దక్కకపోగా దళారులు, మిల్లర్లు మిలాకత్ అయ్యి రైతులను అడ్డంగా దోచుకున్నారు. ఆఖరికి రవాణా వాహనాలు కూడా మేమే చూసుకోవాల్సి వచ్చింది. పేరుకేమో రైతు సంక్షేమ ప్రభుత్వం. వాస్తవంలో మాత్రం రైతు గోడు పట్టించుకోవటం లేదు. – కొండవీటి వెంకట సుబ్బారావు, మంతెన, కంకిపాడు మండలం, కృష్ణా జిల్లా చాలా అన్యాయం నేను నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని సాగుచేస్తున్నాను. కానీ నాకు అన్నదాత సుఖీభవ పథకం రాలేదు. ఇదేమని ప్రశ్నిస్తుంటే అధికారులు సమాధానం చెప్పడం లేదు. కౌలు రైతులకు సైతం అన్నదాత సుఖీభవ పథకం అందిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. కానీ ఇప్పుడు మాకు వర్తించలేదు. వైఎస్సార్సీపీ హయాంలో రైతు భరోసా వచ్చేది. ఇప్పుడు ఆగిపోయింది. అసలు కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఇస్తారా.. ఇవ్వరా తేల్చి చెప్పండి. – అమర లింగడు, కాగువాడ గ్రామం, పాతపట్నం మండలం, శ్రీకాకుళం జిల్లా వడ్డీకి అప్పుతెచ్చి పంటల సాగు నేను రెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వరి, అపరాల పంటలు సాగు చేస్తున్నాం. జగన్ ప్రభుత్వంలో వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం అందేది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి సాయం అందలేదు. అన్నదాత సుఖీభవ పథకం సాయం కోసం సచివాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. – దివిలి శ్రీను, తోడుగెడ్డ, మెంటాడ మండలం, విజయనగరం జిల్లా రెండేళ్లుగా ఇన్పుట్ సబ్సిడీ ఊసే లేదు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి దగ్గర దగ్గరగా రెండేళ్లవుతోంది. ఇప్పటి వరకు రైతులకు అందాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఊసే లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇన్పుట్ సబ్సిడీ సమయానికి అందేది. – అనుసూరి గోవిందు, ఉండూరు, రామచంద్రపురం మండలం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మొత్తంగా రూ.40 వేలు జమ చేయాలిపీఎం కిసాన్తో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ కింద ఇస్తామన్న రూ.20 వేల పెట్టుబడి సాయం కౌలు రైతులకు తొలి ఏడాది ఎలాగూ ఎగ్గొట్టారు. రెండో ఏడాది అయినా ఇస్తారనుకుంటే దగా చేశారు. కనీసం మూడో విడతతో కలిపి అయినా ఇస్తారనుకుంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనా లేదు. గతేడాది ఎగ్గొట్టిన బకాయిలతో పాటు మొత్తంగా రూ.40 వేలు జమ చేయాలి. – వై.రాధాకృష్ణ, ఎం.హరిబాబు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఏపీ కౌలు రైతుల సంఘంఇతని పేరు పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కలవకూరు గ్రామం. ఇతనికి నాలుగు ఎకరాల పొలం ఉంది. కొంత వరి పంట, మరి కొంత మొక్కజొన్న సాగు చేస్తుంటాడు. ప్రకృతి వైపరీత్యాల వల్ల వేసిన పంట నష్టపోయి దిగుబడులు పూర్తిగా తగ్గిపోయాయి. ఎకరాకు 25 బస్తాలు వరి ధాన్యం దిగుబడి వచ్చింది. కొనుగోలు చేసిన నాథుడే లేదు. కూటమి ప్రభుత్వం క్వింటా రూ.1,800కు కొనుగోలు చేస్తుందని చెప్పిందే కానీ ఆ ధరతో కొనలేదు. దీంతో చివరకు రూ.1300కే దళారులకు అమ్ముకోవాల్సి వచ్చింది. మొక్కజొన్న దిగుబడులు అంతంత మాత్రంగానే వచ్చాయి. మద్దతు ధర క్వింటా రూ.2,300తో ప్రభుత్వం కొనలేదు. దళారులకు రూ.1600కే అమ్ముకున్నాడు. దాంతో అప్పుల పాలయ్యాడు. వర్షాలకు పంట దెబ్బతిన్నా నష్ట పరిహారం ఇంత వరకు అందలేదు. ఇతని పేరు శేఖర్రెడ్డి. నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పి.లింగాపురం గ్రామం. 2025ృ26 ఖరీఫ్ సీజన్లో ఎనిమిది ఎకరాల్లో మొక్కజొన్న, నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. ప్రస్తుతం రబీ సీజన్కు ఎనిమిది ఎకరాల్లో మొక్కజొన్న, 13ఎకరాల్లో వివిధ పంటలు సాగుచేశాడు. ఖరీఫ్లో నాలుగు ఎకరాల్లో సాగుచేసిన పత్తిపంటకు రూ.6 వేల ప్రీమియం చెల్లించి పంటల బీమా చేయించాడు. 2025 ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో కురిసిన అధిక వర్షాలతో పత్తిపంట దెబ్బతిని దిగుబడి ఎకరాకు మూడు క్వింటాళ్లే వచ్చింది. పత్తిపంట దెబ్బతిన్న విషయాన్ని రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సిబ్బందికి తెలపటంతో పంట ఫొటోలు తీసుకొని వెళ్లి ప్రభుత్వానికి పంపించారు. ఇప్పటిదాకా ఒక్కరూపాయి కూడా బీమా డబ్బులు మంజూరు చేయలేదు. జగన్ పాలనలో పైసా ప్రీమియం చెల్లించకపోయినా రూ.50 వేల వరకు పంటనష్ట పరిహారం మంజూరైంది.ఇతని పేరు తామరపల్లి ముసలయ్య. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం అర్జునుడుపాలెం శివారు పెద్దిరెడ్డిపాలెం స్వగ్రామం. 4 ఎకరాలు కౌలుకు తీసుకుని పంట సాగు చేస్తున్నాడు. ఏటా పంట సాగు ఖర్చు రూ.లక్ష వరకు అవుతోంది. గత ప్రభుత్వంలో ఏటా పెట్టుబడి సాయం అందేది. ఈ ప్రభుత్వం వచ్చాక మరింతగా పెట్టుబడి సాయం అందుతుందని ఎదురు చూశాడు. తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. రెండో ఏడాది అయినా ఇస్తారనుకుంటే రూపాయి కూడా ఇవ్వలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పుడు మూడో విడతలో అయినా సాయం అందుతుందని ఎంతగానో ఆశలు పెట్టుకున్నా, నిరాశే ఎదురైందని నిట్టూరుస్తున్నాడు. ఇలాంటప్పుడు కౌలు రైతుగా గుర్తింపు కార్డు ఇచ్చినా ఏం ఉపయోగం? అని ప్రశ్నిస్తున్నాడు. -
ఏపీఐఐసీ ‘అసైన్డ్ భూములు’ 22ఏ నుంచి తొలగింపు
సాక్షి, అమరావతి: ఏపీఐఐసీ (ఆంధప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ)కి కేటాయించిన దాదాపు 75,000 ఎకరాల అసైన్డ్ భూములనురిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22 ఏ నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తక్షణమే తొలగించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇటీవల సీఆర్డీఏలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అనంతరం మంత్రి పార్ధసారధి మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. ⇒ ఏపీఐఐసీకి కేటాయించిన దాదాపు 75,000 ఎకరాల అసైన్డ్ భూములు సెక్షన్ 22 ఏ నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తక్షణమే తొలగించేందుకు ఆమోదం. నిషేధిత జాబితాలో ఉన్నందున పరిశ్రమలు స్థాపిస్తున్న వారు ఈ ఆస్తులను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు పొందలేకపోతున్నారు. అందువల్ల ఈ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి మ్యుటేషన్కు అవకాశం కలి్పంచాలని కేబినెట్ నిర్ణయం. వీటికి అదనంగా మరో 51,603 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు ఇతర భూములను నేరుగా ఏపీఐఐసీ పేరిట రెవెన్యూ రికార్డుల్లో మార్చేందుకు అనుమతి. ⇒ పోలవరం హెడ్ వర్క్స్ ప్యాకేజీ 63 ఏలో రూ.23.47 కోట్ల అదనపు ఖర్చు, మరో ప్యాకేజీలో రూ.24.51 కోట్లు అదనపు ఖర్చుకు ఆమోదం. పోలవరం ఎడమ కాలువ పనుల్లో పాత ఏజెన్సీలను రద్దు చేసి మిగిలిన పనులకు 2024–25 రేట్లతో రూ.76.87 కోట్లతో ఇచి్చన టెండర్కు ఆమోదం. ⇒ ఏపీఎస్పీ బెటాలియన్లలో 300 హెడ్ కానిస్టేబుల్ పోస్టులను అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు స్థాయికి పెంచేందుకు ఆమోదం. ⇒ ‘సఖి నివాస్ పథకం’ కింద ఒంటరి మహిళలు, వితంతువులు, వివాహమై దూరంగా ఉంటున్న వారి కోసం 30 హాస్టల్స్ ఏర్పాటుకు ఆమోదం. ఒక్కో హాస్టల్ నిర్వహణకు వార్డెన్, సెక్యూరిటీ లాంటి 8 మంది సిబ్బందిని ఔట్ సోర్సింగ్పై తీసుకునేందుకు ఆమోదం. ⇒ వాణిజ్య పన్నుల కేసుల పరిష్కారం కోసం తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలోని మూడు అప్పీలేట్ కార్యాలయాల పరిధిని నోటిఫై చేయడానికి ఆమోదం. ⇒ జల్జీవన్ మిషన్ కింద రూ.9,355 కోట్ల విలువైన ఏడు ప్రాజెక్టులకు పరిపాలన ఆమోదం. రూ.1,814.71 కోట్లతో చేపట్టనున్న 3,000 పనులకు పరిపాలన ఆమోదం. ⇒ వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం వేమగుంటపల్లి, సున్నపురాళ్లపల్లి, పెద్దదండ్లూరు, కోతకుంటపల్లి, తుగుట్లపల్లి గ్రామాల్లో 424.45 ఎకరాల ప్రభుత్వ భూమిని జేఎస్డబ్ల్యూ సంస్థ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ స్థాపన కోసం కేటాయించేందుకు ఆమోదం. ⇒ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా జక్కంపూడి కాలనీ వద్ద 400 కేవీ హైటెన్షన్ లైన్ ఎత్తు మార్పులకు సంబంధించి కరెంట్ సరఫరా ఆగిపోకుండా ల్యాంకో కంపెనీకి నోటీసులు జారీ చేసేందుకు ఆమోదం. ⇒ ఏప్రిల్ 1వతేదీ నుంచి 90 రోజుల పాటు జలధార పేరుతో కాలువల్లో అడ్డంకుల తొలగింపు. ⇒ ఈ నెల 16వ తేదీన శ్రీపొట్టి శ్రీరాములు జయంతి వేడుకల సందర్భంగా అమరావతిలో అమరజీవి 58 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరణ. -
కుటుంబానికి బాబు కానుక!
సాక్షి, అమరావతి: సంపద సృష్టించకుండా.. సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చకుండా.. సహజ వనరులను పచ్చ ముఠాలకు అప్పగించి ఇసుక, సిలికా, గ్రానైట్, క్వార్ట్జ్ దోపిడీకి తెర తీసిన చంద్రబాబు సర్కారు మరింత బరి తెగించింది! బినామీలకు 99 పైసలకే భూములను పందేరం చేస్తూ, నిర్మాణ వ్యయం కింద చదరపు అడుగుకు రూ.2,000 చొప్పున రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఖజానా నుంచి దోచిపెట్టి ఎదురు చెల్లిస్తూ, బంధు గణానికి విశాఖలో రూ.5 వేల కోట్ల విలువైన భూమిని రాసిచ్చిన ప్రభుత్వ పెద్దలు తాజాగా అన్ని విలువలకు తిలోదకాలిచ్చేశారు! దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ కనీసం ఆలోచన కూడా చేయని రీతిలో నిస్సిగ్గుగా సీఎం చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్కు ప్రయోజనాలు కలి్పస్తూ తాజాగా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తండ్రి, కుమారుడి సాక్షిగా హెరిటేజ్కు చేకూర్చిన లబ్ధి ఇలా ఉంది..! ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందంటూ.. తెలుగువారి కొత్త సంవత్సరాది ఉగాదికి ముందు తన కుటుంబానికి సీఎం చంద్రబాబు తీపి కబురు వినిపించారు! ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ వ్యాపార సంస్ధ హెరిటేజ్కు ప్రభుత్వం నుంచి భారీ రాయితీలు, సబ్సిడీలను కల్పిస్తూ శుక్రవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ విషయాన్ని కేబినెట్ నిర్ణయాలు వెల్లడించే మీడియా సమావేశంలో మంత్రి పార్ధసారధి దాటవేయగా ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో మాత్రం తెలియచేసింది.తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కాశీపెంట గ్రామంలోని హెరిటేజ్ మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ టెక్నాలజీ అప్ గ్రెడేషన్ కోసం ప్రత్యేక ప్రోత్సాహకాలు మంజూరు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 కింద మెగా ప్రాజెక్టు హోదా పొందిన ఈ హెరిటేజ్ డెయిరీ అప్ గ్రెడేషన్ వల్ల ఉత్పత్తుల తయారీ భారీగా పెరగనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఫ్లేవర్డ్ పాలు 131 శాతం, పనీర్ 400 శాతం, నెయ్యి ఉత్పత్తి ఏకంగా 566 శాతం పెరగనుంది. సభ సాక్షిగా అబద్ధాలు...!‘‘హెరిటేజ్ మా కుటుంబ సంస్థ. మా కుటుంబ సభ్యులు దాన్ని నిర్వహిస్తున్నారు. ఆ సంస్థకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి లబ్థి చేకూరలేదు. ప్రభుత్వ సహాయాన్ని కూడా కోరుకోలేదు. ఈ సంస్థ పెట్టినప్పుడే మేం ఒక నిర్ణయానికి వచ్చాం. ప్రభుత్వం నుంచి ఏదీ ఆశించకూడదన్నదే మా విధానం. దానికి కట్టుబడే ఇప్పటి వరకు నడుచుకున్నాం..!’’ తాజా బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు గంభీర ఉపన్యాసం ఇదీ! ఒకపక్క ప్రభుత్వం నుంచి ఆయాచిత ప్రయోజనాలు పొందుతూ అసెంబ్లీలో మాత్రం హెరిటేజ్కు ఎటువంటి లబ్ధి చేకూర్చడం లేదంటూ కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమంటూ రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.సుమారు రూ.100 కోట్ల రాయితీచంద్రగిరి మండలం కాశీపెంట హెరిటేజ్ ఫుడ్స్ యూనిట్ను రూ.209.68 కోట్లతో అప్గ్రెడేషన్ చేసే ప్రతిపాదనను మెగా ప్రాజెక్టుగా ఆమోదిస్తూ ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 కింద చంద్రబాబు సర్కారు భారీ రాయితీలను కల్పించింది. ప్రత్యక్షంగా 35 మందికి మాత్రమే ఉపాధి కల్పించనున్నారు. ఐదేళ్లపాటు 100 శాతం ఎస్జీఎస్టీ రీయింబర్స్మెంట్, యూనిట్కు రూపాయి చొప్పున విద్యుత్తు రాయితీ, అప్గ్రెడేషన్ టెక్నాలజీపై సబ్సిడీ పేరుతో పెట్టుబడిపై 50 శాతం వరకు అంటే సుమారు రూ.100 కోట్ల వరకు రాయితీల రూపంలో వెనక్కి ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వడ్డించేవాడు మనవాడు అయితే బంతిలో చివర కూర్చున్నా ఇబ్బంది లేదన్నట్లుగా సీఎం చంద్రబాబుతోపాటు మంత్రి నారా లోకేశ్ స్వయంగా పాల్గొన్న కేబినెట్ అజెండాలో చివరి అంశంగా హెరిటేజ్ను చేర్చి భారీ ప్రయోజనాలకు ఆమోద ముద్ర వేయించుకోవడం గమనార్హం. -
మాజీ డీజీపీ హెచ్జే దొర మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, తాడేపల్లి: మాజీ డీజీపీ హెచ్జే దొర మృతి పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగంలో విశిష్ట సేవలు అందించి ఉన్నత స్థాయికి ఎదిగిన అధికారిగా హెచ్జే దొర సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో ఆయన చక్కటి కృషి చేశారని పేర్కొన్నారు.పోలీసు వ్యవస్థకు ఆయన అందించిన సేవలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. హెచ్జే దొర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ దుఃఖాన్ని తట్టుకునే ధైర్యం, మనోబలం వారికి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. -
హెరిటేజ్కి రాయితీలు.. ఏపీ కేబినెట్ ఆమోదం
సాక్షి, విజయవాడ: హెరిటేజ్కి రాయితీలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు హెరిటేజ్ ఫుడ్స్ నిర్వహిస్తుండగా.. చంద్రగిరి మండలం కాశీపెంట హెరిటేజ్ ఫుడ్స్ యూనిట్కి కేబినెట్ రాయితీలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. హెరిటేజ్ టెక్నాలజీ అప్ గ్రేడేషన్ కోసం సబ్సిడీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.ఐదేళ్ల పాటు 100 శాతం జీఎస్టీ రియంబర్స్మెంట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కరెంట్ బిల్లులో యూనిట్ కి రూ.1 రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. హెరిటేజ్ నెయ్యి ఉత్పత్తి 566 శాతం, ఫ్లేవర్డ్ పాలు 131, పన్నీర్ 400 శాతం పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 కింద భారీ రాయితీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. హెరిటేజ్ రాయితీలను మంత్రి పార్థసారధి మీడియా సమావేశంలో వెల్లడించలేదు. అజెండాలో చివరి అంశంగా పెట్టి.. ఏపీ కేబినెట్ ఆమోదించింది. -
ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు: హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం ఏపీ హైకోర్టు ప్రాంగణంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. జస్టిస్ లీసా గిల్ చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన సమక్షంలో నూతన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ బాధ్యతలు స్వీకరించారు.ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హైకోర్టు న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ సభ్యులు, న్యాయవాదులు, హైకోర్టు సిబ్బంది హాజరయ్యారు. నూతన న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టడం పట్ల హైకోర్టు వర్గాలు, న్యాయవాదులు, సిబ్బంది జస్టిస్ లీసా గిల్కు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త బాధ్యతల్లో ఆమె విజయవంతం కావాలని ఆకాంక్షించారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు ఏపీ హైకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ప్రస్తుత సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ త్వరలోనే రిటైర్ అవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి రిటైర్ అవ్వడానికి రెండు నెలల ముందే తదుపరి సీజేను ఖరారు చేయాలని కొలీజియం నిర్ణయించింది. జస్టిస్ లీసా గిల్ 2014 నుంచి చండీగఢ్ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. -
ఊరూ వాడా ఘనంగా 16 ఏళ్ల పండుగ
సాక్షి నెట్వర్క్: ఆవిర్భావం నుంచి ప్రతి అడుగులోనూ విలువలు, విశ్వసనీయతతో రాజకీయ రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ వేడుకలు గురువారం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఘనంగా జరిగాయి. రాష్ట్రంలో గ్రామాల్లోనూ పండుగలా కార్యక్రమం కొనసాగింది. ప్రజా సంక్షేమం కోసం పురుడు పోసుకున్న పార్టీ జెండాను రాష్ట్రవ్యాప్తంగా ఊరూ వాడా పండుగ వాతావరణంలో కార్యకర్తలు, నేతలు, అభిమానుల కోలాహలం నడుమ ఎగురవేసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయాల్లో పూజలు చేశారు. రక్తదాన, వైద్య శిబిరాలు నిర్వహించి సేవా సందేశాన్ని చాటారు. ఆస్పత్రుల్లో పండ్లు పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. కేక్లు కట్ చేసి కోట్ల మంది సంబరాన్ని పంచుకున్నారు.వైఎస్సార్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ పతాకాలను ఆవిష్కరించారు. ఉరిమే ఉత్సాహంతో బైక్ ర్యాలీలు.. జై జగన్.. జై వైఎస్సార్సీపీ నినాదాలతో హోరెత్తించారు. పార్టీ జెండా రెపరెపల నడుమ తమ గుండె చప్పుడు వైఎస్సార్సీపీ అని చాటి చెప్పారు. పలుచోట్ల వైఎస్ జగన్ హయాంలో అమలైన నవరత్నాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ఫ్లెక్సీలను ప్రదర్శించారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రజా ప్రతిని«ధులు, సీనియర్ నేతలు, నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. నల్లకాలువలో వైఎస్ జగన్ ఇచ్చిన మాట కోసం 2011 మార్చి 12న పుట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనే కాదు.. దేశ రాజకీయాల్లోనే సంచలనం సృష్టించిందని గుర్తు చేసుకున్నారు.వైఎస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేశారని చెప్పారు. అబద్ధపు హామీలతో మోసగించి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి సర్కారును తరిమికొట్టేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిరంతరం పోరాటం కొనసాగిస్తామని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని స్పష్టం చేశారు. పులివెందుల బాకరాపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో నేతలు పార్టీ జెండాను ఆవిష్కరించారు. కాగా, న్యూఢిల్లీ, తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల ఈ కార్యక్రమాన్ని పార్టీ అభిమానులు ఘనంగా నిర్వహించారు.ఢిల్లీలో వైఎస్సార్సీపీ సంబరాలుసాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవాలు ఢిల్లీలో గురువారం ఘనంగా జరిగాయి. పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, అరకు ఎంపీ డాక్టర్ గుమ్మ తనూజారాణి కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. విలువలు, విశ్వసనీయతకు అర్థం చెబుతూ వైఎస్సార్సీపీ ఆవిర్భవించిందని ఎంపీలు పేర్కొన్నారు.తెలంగాణలో ఘనంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకలుకూకట్పల్లి/అల్వాల్/ఖమ్మం మయూరి సెంటర్: వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పార్టీ నాయకులు, అభిమానులు గురువారం కేక్ కట్చేసి వేడుకలు నిర్వహించారు. మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలోని రమ్యా గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అరి్పంచారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. కూకట్పల్లి, నేరేడ్మెట్ ఆర్కేపురం, ఖమ్మంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. -
వైఎస్సార్సీపీ.. 'కోట్లాది మంది అభిమానులది': వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: విలువలతో కూడిన రాజకీయాలు మర్చిపోయి ఉన్న పరిస్థితుల మధ్య.. విలువలు, విశ్వసనీయత అనే పదాలకు అర్థం చెబుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టుక, ఆ తర్వాత ఎదుగుదల కొనసాగిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తు చేశారు. ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక్క జగన్ది మాత్రమే కాదు.. కొన్ని కోట్ల మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులది.. వైఎస్సార్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న నా కుటుంబ సభ్యులది అని నేను గర్వంగా చెబుతున్నా..’’ అని స్పష్టం చేశారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారీ ఎత్తున కార్యకర్తలు, అభిమానులు, నాయకులు తరలిరావడంతో పార్టీ కేంద్ర కార్యాలయం జనసంద్రంగా మారింది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలు సమర్పించి నివాళులర్పించిన అనంతరం వైఎస్ జగన్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నేతలు, నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ద ఎత్తున పార్టీ అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున తరలి వచ్చిన పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులనుద్దేశించి వైఎస్ జగన్ ఏమన్నారంటే.. నల్లకాలువలో ఇచ్చిన మాటతో..మన పార్టీ ఆవిర్భవించి ఈరోజుకు 15 ఏళ్లు పూర్తయింది. 2011 మార్చి 12న పుట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దేశంలోనే ఒక మార్క్గా నిల్చింది. రాష్ట్రంలోనే కాదు, దేశ రాజకీయాల్లోనే ప్రబలంగా మన పార్టీ కనిపిస్తోంది. 15 సంవత్సరాల క్రితం పార్టీ ఎలాంటి పరిస్థితుల్లో పుట్టింది అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే.. ఆరోజు నల్లకాలువలో ఇచ్చిన ఒక మాట, మన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపన, ఎదుగుదలకు కారణమైంది. ఆ ఒక్క మాట నా కుటుంబ పరిస్థితుల్ని మార్చింది. రాష్ట్రం దశ, దిశ మార్చింది. ఆ ఒక్క మాట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంకురార్పణకు శ్రీకారం చుట్టింది. కాలర్ ఎగరేసుకుని గర్వంగా చెప్పుకునేలా పార్టీ అడుగులు వేస్తుంది..ఆరోజు జగన్ అనే వాడు ఒకే ఒక్కడు... కానీ జగన్ ఏనాడూ భయపడలేదు. ఆరోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ, దేశంలోనూ అధికారంలో ఉంది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసి కుట్రలు, కుతంత్రాలు పన్నిన పరిస్థితి చూశాం. కానీ, జగన్ ఏనాడూ భయపడలేదు. కారణం జగన్కు నమ్మకం ఉన్నది పైన ఉన్న దేవుడు, కింద ఉన్న మీమీద మాత్రమే అని గర్వంగా చెబుతా. నేను నమ్ముకున్న నా ప్రజలు, నేను నమ్ముకున్న నా దేవుడు.. ఇద్దరూ తోడుగా ఉండి నన్ను నడిపించారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విలువలు, విశ్వసనీయతకు ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని, నాతో పాటు నడిచే ప్రతి కుటుంబ సభ్యుడు కూడా కాలర్ ఎగరేసుకుని.. అదిగో అతడే మా నాయకుడు, అదిగో అదే మా పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని గర్వంగా చెప్పుకునేలా పార్టీ అడుగులు వేస్తుందని మరొక్కసారి మీ అందరికీ వినమ్రంగా, వినయపూర్వకంగా చెబుతున్నా. మీ అందరి ప్రేమాభిమానాలకు మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. వైఎస్సార్ను అభిమానించే ప్రతి గుండెకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడికి, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వైఎస్సార్ను ప్రేమించే ప్రతి గుండె ఏ రాష్ట్రంలో ఉన్నా, ఆ ప్రతి గుండెకు ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. -
గురువుల్లో గుబులు
సాక్షి, అమరావతి: ఈ ఏడాది పదో తరగతి పరీక్షల నిర్వహణలో ప్రవేశపెట్టిన ‘ఆటోమేషన్’ విధానం ఉపాధ్యాయుల్లో గుబులు రేపుతోంది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా జిల్లా స్థాయిలో చేపట్టే ఇన్విజిలేషన్, డిపార్ట్మెంటల్ విధులను ఈసారి పూర్తిగా కేంద్రీకృతం చేశారు. రాష్ట్ర కార్యాలయమే విధుల నిర్వహణ, పరీక్ష కేంద్రాలు, ఇన్విజిలేటర్ల ఎంపికను చేపట్టింది. ఇందుకోసం కొత్తగా ఆటోమేషన్ విధానం అమలు చేశారు. దాంతో పరీక్షల విధుల్లో సీనియర్ అధికారులు, ప్రభుత్వ ఉపాధ్యాయులను మాత్రమే నియమించాల్సిన చోట జూనియర్లు, ప్రైవేటు ఉపాధ్యాయులకు స్థానం కల్పించడంపై ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కనీసం మూడేళ్ల సర్వీసు కూడా లేని వారిని చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులుగా నియమించారు. ఇన్విజిలేటర్లుగా అత్యంత జూనియర్లు, ప్రైవేటు స్కూళ్ల టీచర్లను సైతం నియమించారు. ఉపాధ్యాయుల అనుమతి సైతం తీసుకోకుండా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కూడా విధులు కేటాయించడం గమనార్హం. 25 శాతం ప్రైవేటు ఉపాధ్యాయులే... ఈ నెల 16 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దాదాపు 6.38 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షల విధుల్లో సుమారు 54 వేల మంది సిబ్బంది పాలుపంచుకుంటారు. ఇందులో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు 7 వేల మంది, ఇన్విజిలేటర్లు 40 వేల మంది, ఓపెన్ స్కూల్ పరీక్షలకు 7 వేల మందిని నియమించారు. గతంలో ఏటా పబ్లిక్ పరీక్షల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని సీనియారిటీ ఆధారంగా జిల్లా కార్యాలయాల్లో (డీఈవో) ఎంపిక చేసేవారు. వారి వివరాలను రాష్ట్ర కార్యాలయానికి అందించేవారు. సీనియారిటీ, ఆసక్తి ఆధారంగా కేవలం ప్రభుత్వ మేనేజ్మెంట్ పాఠశాల ఉపాధ్యాయులను మాత్రమే పరిగణనలోకి తీసుకునేవారు. అనారోగ్య సమస్యలున్న వారిని మినహాయించి, మిగిలిన వారికి విధులు కేటాయించేవారు. కానీ ఈ ఏడాది పూర్తిగా ఆటోమేషన్ విధానం ద్వారా చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లను రాష్ట్ర కార్యాలయమే ఎంపిక చేసింది. ఈ ఏడాది ప్రైవేటు స్కూళ్లలోని టీచర్లను కూడా 25 శాతం మందిని విధుల్లోకి తీసుకోవడం గమనార్హం. ఆటోమేషన్పై ఆందోళన పరీక్షల నిర్వహణలో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెటల్ ఆఫీసర్లది కీలకపాత్ర. పరీక్ష కేంద్రంలో ఏర్పాట్లు చూసుకోవడం, పరీక్ష ప్రారంభ సమయానికి ముందే సంబంధిత పోలీస్ స్టేషన్కు వెళ్లి ప్రశ్నపత్రాలను భద్రంగా తేవడం, పరీక్ష నిర్వహణలో ఇన్విజిలేటర్లు, ఇతర శాఖలతో సమనన్వయం చేసుకోవడంతోపాటు పరీక్ష ముగిసిన తర్వాత జవాబు పత్రాల బండిళ్లను పార్సిల్ చేసే వరకు వీరిద్దరే అత్యంత కీలకం. కానీ ఈసారి జిల్లా విద్యాశాఖ అధికారులు ఇచ్చిన సీనియారిటీ జాబితాను పక్కనబెట్టారు. పూర్తిగా ఆటోమేషన్ చేసినట్టు చెప్పి కంప్యూటర్ ఆధారంగా విధులు అప్పగించామని రాష్ట్ర పరీక్షల విభాగం డైరెక్టరేట్ ప్రకటించింది. ఆటోమేషన్ విధానంతో అంతా తారుమారయ్యింది. సీనియర్లకు అప్పగించాల్సిన విధులను జూనియర్లకు కేటాయించారు. ఆన్లైన్లోని ఉపాధ్యాయుల డేటా ఆధారంగా ఈ విధులు వేశారేగాని, స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో పరిస్థితులకు అనుగుణంగా సిబ్బందిని జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు సర్దుబాటు చేసే అవకాశం లేకుండా చేశారు. ఇది పరీక్షల నిర్వహణపై తీవ్ర వ్యతిరేక ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. పైగా ఒక స్కూల్లో ఉన్న ఉపాధ్యాయుల్లో సగం మంది మించకుండా పరీక్షల విధులు వేయాల్సి ఉండగా.. చాలాచోట్ల 100 శాతం మందిని విధులకు కేటాయించడం గమనార్హం. ఇష్టారాజ్యంగా ఇన్విజిలేషన్ విధులుపరీక్షల ఇన్విజిలేషన్ విధుల కేటాయింపులో పాఠశాల విద్యాశాఖ ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని స్కూల్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కాడిశెట్టి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి తమ్మినాన చందనరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. కేంద్రీకృత విధానంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నిబంధనలకు విరుద్ధంగా ఇన్విజిలేషన్ విధులు కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. ఇంటర్మీడియెట్ ఓపెన్ పరీక్షలకు నియమించిన ఉపాధ్యాయులను తిరిగి పదో తరగతి పరీక్షలకు ఇన్విజిలేషన్ విధులకు ఎలా నియమిస్తారని నిలదీశారు. గతంలో జిల్లా స్థాయిలో విధులు కేటాయింపు విధానంలో అనారోగ్య సమస్యలున్న వారిని, విధులు నిర్వహించలేని వారిని మినహాయించే విధానం ఉండేదని, ప్రస్తుతం ఇవేమీ పట్టించుకోకుండా విధులు కేటాయించారని విమర్శించారు. తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారులకు బాధ్యతలు అప్పగించి ఇన్విజిలేషన్ విధులను మార్పు చేయాలని డిమాండ్ చేశారు. -
పట్టణాల్లో పౌర సేవలు అవుట్ సోర్సింగ్కు
సాక్షి, అమరావతి : పట్టణ స్థానిక సంస్థల పౌర సేవలన్నింటినీ అవుట్ సోర్సింగ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు. మున్సిపల్ బాండ్ల జారీ ద్వారా నిధులను సమీకరించడంతో పాటు ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములను సేకరించి పీపీపీ విధానంలో ప్రాజెక్టులను చేపట్టాలని సూచించారు. సచివాలయంలో గురువారం రెండోరోజు కలెక్టర్ల సదస్సులో పలు శాఖలపై సీఎం సమీక్షించారు. పట్టణ స్థానిక సంస్థలన్నింటిలోనూ విద్యుత్ వాహనాలను తీసుకురావాలని ఆదేశించారు. అభివృద్ధి చేస్తున్నా జీఎస్టీ ఆదాయం ఆ మేర ఎందుకు పెరగడంలేదనే విషయంపై అధ్యయనం చేయాలని వాణిజ్య పన్నులు, ఆర్థిక శాఖను ఆదేశించారు. అభివృద్ది జరిగితే ఆ మేర ఆదాయం పెరగాలని.. కానీ, ఎక్కడో తేడా కనిపిస్తోందన్నారు. ఆర్టిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించి పన్ను ఎగవేతకు చెక్ పెట్టాలన్నారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది సొంత ఆదాయం పన్ను వృద్ధి కేవలం నాలుగు శాతమే ఉందని.. అలాగే, ఎక్సైజ్ ఆదాయం గత ఏడాది కన్నా ఈ ఏడాది ఐదుశాతం మేర తగ్గిందని ముఖ్యమంత్రి చెప్పారు. చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే.. కొందరు అటవీ అధికారులతో ఇబ్బందులు.. అటవీ శాఖపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. కొందరు ఈ శాఖాధికారుల అసాధ్యమైన ఆలోచనలతో ఇబ్బందులు వస్తున్నాయి. ఆచరణ సాధ్యంకాని ఆలోచనలతో వ్యవహరిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పించకపోతే ఎలా? శ్రీశైలంలో అటవీ శాఖాధికారులు భక్తులను అడ్డుకున్నారు. ఆ తర్వాత రోజు తొక్కిసలాట అయ్యే పరిస్థితి వచ్చింది. బద్వేలులోనూ అటవీ శాఖ ఇదే తరహాలో వ్యవహరించింది. దీనిపై ఇప్పటికే డిప్యూటీ సీఎంతో మాట్లాడా. మరోసారి మాట్లాడతా. అటవీ శాఖాధికారులు పీపుల్స్ ఫ్రెండ్లీగా మారాలి. జిల్లాల్లో పెట్టుబడులు రాబట్టేందుకు కలెక్టర్లు చొరవ చూపుతూ పెట్టుబడుల మీటింగులు పెట్టాలి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో జిల్లాల వారీగా ర్యాంకులిస్తాం. జాతీయ రహదారులపై వే సైడ్ ఎమినిటీస్, ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, నైట్హాల్ట్ కోసం గదుల నిర్మాణం చేపడితే పెట్టుబడులు వస్తాయి. ఏపీఐఐసీ ద్వారా చేసే భూ కేటాయింపుల్లో కలెక్టర్లు ఐదెకరాల వరకూ చేసేలా వారికి ఆథరైజేషన్ ఇవ్వాలి. విజయవాడలోని డిస్నీల్యాండ్, భవానీ ఐల్యాండ్లను పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. త్వరలో సంక్షేమ క్యాలెండర్ విడుదల చేస్తాం. పవన్, లోకేశ్ డుమ్మా.. ఇక రెండ్రోజుల ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్, మంత్రి లోకేశ్ డుమ్మా కొట్టారు. కీలక మంత్రులు హాజరుకాకపోవడంపట్ల అధికార యంత్రాంగం విస్మయం వ్యక్తంచేసింది. కార్యక్రమంలో భాగంగా ‘అరకు కౌని’ పేరుతో రూపొందించిన తొలి గిరిజన ఆర్గానిక్ మిల్లెట్ ఫుడ్ మెనూను సీఎం ఆవిష్కరించి స్టాల్ను సందర్శించారు. సమావేశంలో సీఎం గొప్పలు పోవడం అధికారులకు అసహనం కలిగించింది. గతంలో సీఎంగా ఉన్నప్పుడు అది చేశా.. ఇది చేశానని చెప్పడం కేవలం కాలక్షేపానికి మాత్రమే పనికొస్తుందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. -
ఫిషింగ్ హార్బర్ పోయింది.. ‘జువ్వలదిన్నె’ ప్రైవేట్ పరం!
సాక్షి, అమరావతి: మెడికల్ కాలేజీల నుంచి ఒక్కో రంగాన్ని ప్రైవేట్పరం చేసి సంపద సృష్టించకపోగా ఆస్తులను తెగనమ్ముతూ క్రెడిట్ చోరీలకు పాల్పడుతున్న చంద్రబాబు సర్కారు తాజాగా గత ప్రభుత్వ కృషితో సాకారమైన ఫిషింగ్ హార్బర్లపై కన్నేసింది. మన రాష్ట్రానికి చెందిన మత్స్యకారులు వేట కోసం వలస వెళ్లి అవస్థలు పడకూడదని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఫిషింగ్ హార్బర్ను చంద్రబాబు సర్కారు ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతోంది. 2024 ఆగస్టులో ప్రధాని మోదీ ప్రారంభించిన నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను కూటమి సర్కారు ఇంతవరకూ అందుబాటులోకి తేకుండా మత్స్యకారుల ఆశలను నీరుగార్చింది. తాజాగా దీన్ని నౌకా నిర్మాణ కేంద్రంగా మారుస్తూ ముంబైకి చెందిన సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ లిమిటెడ్కు 29.58 ఎకరాలు కేటాయించింది. ఇందులో 7.58 ఎకరాలు వాటర్ ఫ్రంట్ ల్యాండ్, 22 ఎకరాలు హార్బర్ ల్యాండ్కు నిర్దేశించారు. మత్స్యకారుల నోట్లో మట్టి కొట్టే ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహాత్మకంగా తన తనయుడు లోకేశ్తో శంకుస్థాపన చేయించడం గమనార్హం. ముంబైకి చెందిన సాగర్ డిఫెన్స్ జువ్వలదిన్నెలో అటానమస్ మారిటైమ్ షిప్యార్డ్ యూనిట్ సిస్టమ్స్ సెంటర్ను అభివృద్ధి చేయనుంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో నడిచే మానవ రహిత ఉపరితల వాహనాలు, నీటి అడుగున తిరిగే వాహనాలను అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం తొలి దశలో కేవలం రూ.45 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. ఈ ప్రాజెక్టుకు మొదట 29.58 ఎకరాలు కేటాయించగా మొత్తం 150 ఎకరాలు అప్పగించనున్నట్లు శుక్రవారం అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో అధికారులు పేర్కొన్నారు. అంటే రానున్న కాలంలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ మొత్తం సాగర్ డిఫెన్స్కు కేటాయించనున్నట్లు స్పష్టమవుతోంది. మత్స్యకారుల నోట్లో మట్టి.. రాష్ట్రంలోని మత్స్యకారుల కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టింది. తొలి దశలో రూ.1,522.8 కోట్లతో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేసింది. జువ్వలదిన్నె హార్బర్ను ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది ఆగస్టు 30న వర్చువల్గా ప్రారంభించినా చంద్రబాబు ప్రభుత్వం మత్స్యకారులకు అందుబాటులోకి తేలేదు. రెండేళ్లలో ఏ ఒక్క ఫిషింగ్ హార్బర్నూ అందుబాటులోకి తేకపోగా గత ప్రభుత్వం చేపట్టిన వాటిని సైతం ప్రైవేట్పరం చేస్తోంది. జువ్వలదిన్నె హార్బర్ అందుబాటులోకి రాకపోవడంతో ఈ ప్రాంత మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారు. తమిళనాడుకు చెందిన మత్స్యకారులు భారీ బోట్లతో మన తీర ప్రాంతంలో వేటాడుతున్న విషయాన్ని కొద్ది రోజుల క్రితం నెల్లూరు కలెక్టర్ సీఎం చంద్రబాబు దృష్టికి తెచి్చనా తనకు పట్టనట్లే వ్యవహరించారు. ఇప్పుడు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ స్థానంలో షిప్యార్డ్కు శంకుస్థాపన ద్వారా మత్స్యకారుల ఆశలను శాశ్వతంగా నీరుగార్చారు. మత్స్యకారుల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో కేవలం చేపలు పట్టడానికి ఉపయోగపడే టెక్నాలజీని అభివృద్ధి చేస్తారంటూ నమ్మబలుకుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే పెద్ద నౌకల తయారీతోపాటు సముద్ర జలాల్లో పరీక్షలు నిర్వహించడం స్థానిక మత్స్య సంపదపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. బందరు ఫిషింగ్ హార్బరు వద్ద కూడా..ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లకుండా మన జలాల్లోనే చేపల వేట చేపట్టేలా మాజీ సీఎం వైఎస్ జగన్ జువ్వలదిన్నె హార్బర్కు శ్రీకారం చుడితే ఇప్పుడు షిప్యార్డ్ పేరుతో ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారంటూ మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుగరాజపట్నం వద్ద అభివృద్ధి చేయనున్న షిప్ బిల్డింగ్ క్లస్టర్లో కాకుండా జువ్వలదిన్నె వద్ద షిప్ యార్డు నిర్మాణం చేపట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇదే రీతిలో మచిలీపట్నం ఫిషింగ్ హార్బరు వద్ద కూడా మరో షిప్ యార్డు నిర్మాణం చేపట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుండటం మత్స్యకారులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. -
కావాల్సిన వాళ్లకు దోచిపెట్టేందుకే ఎక్స్ప్రెస్ దోపిడీ
సాక్షి, అమరావతి: కావాల్సిన వారికి ప్రజాధనాన్ని దోచిపెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు ఎక్స్ప్రెస్ వేగంతో అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. నిధులు దోపిడీ లక్ష్యంగా రెచ్చిపోతున్నారు. అమాంతం కాంట్రాక్ట్ విలువలు పెంచి, జనం సొమ్ము అస్మదీయ కాంట్రాక్టర్లకు మళ్లించి, వారి నుంచి పెద్దలు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దోపిడీకి ఇటీవల వైద్య శాఖ ఖరారు చేసిన ‘తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్’ కాంట్రాక్ట్ నిదర్శనంగా నిలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో కొత్త వాహనాలను సమకూర్చి, అతి తక్కువ ధరకే అందిన ఈ సేవలకు, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం భారీగా ధర పెంచి కాంట్రాక్ట్ కట్టబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన బాలింతలను ఇళ్లకు చేర్చడంతోపాటు, వైద్య సేవల నిమిత్తం హైరిస్క్ గర్భిణులకు హెల్త్ చెకప్స్ కోసం ఇళ్ల నుంచి ఆస్పత్రికి, తిరిగి ఇంటికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించడానికి వైద్య శాఖ టెండర్ పిలిచింది. రూ.100 కోట్లకుపైగా విలువైన ఈ ప్రాజెక్ట్ను తన అస్మదీయుడికి చెందిన విద్యా వేద ఫౌండేషన్ సంస్థకు కట్టబెట్టడంలో కీలక మంత్రి చక్రం తిప్పారు. కాంట్రాక్ట్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా 500 వాహనాలను సమకూరిస్తే, వాటిలో బాలింతలు, గర్భిణుల రవాణాకు అనుగుణంగా ప్రభుత్వం చార్జీలు చెల్లిస్తుంది.నాడు రూ.895.. నేడు రూ.1640.. 2019 వరకు మొక్కుబడిగా అరకొర వాహనాలతో అందే తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను గత వైఎస్ జగన్ ప్రభుత్వం బలోపేతం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 500 బ్రాండ్ న్యూ వాహనాలతో సేవలను విస్తరించింది. ఇందుకోసం 2021లో టెండర్లు పిలిచి, ఒక్కో ట్రిప్పునకు రూ.895 చెల్లించేలా కాంట్రాక్ట్ను ఖరారు చేసింది. 2022లో కాంట్రాక్ట్ సంస్థ సేవలను ప్రారంభించి, ప్రస్తుతం కూడా అదే రేటుతో వాహనాలను ఆపరేట్ చేస్తోంది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అదే సేవలకు ట్రిప్పునకు ఏకంగా రూ.1640 చొప్పున చెల్లించేలా రేటు ఖరారు చేసింది. ఒకే తరహా సేవలకు దాదాపు నాలుగేళ్ల వ్యవధిలో 83 శాతం రూ.745 (దాదాపు రెట్టింపు) చొప్పున ట్రిప్పునకు అదనంగా చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుతం మూడేళ్ల కాలపరిమితితో టెండర్ పిలిచి, మరో రెండేళ్లు పొడిగించుకోవడానికి వీలు కల్పించారు. అంటే ఐదేళ్ల కాంట్రాక్ట్ సంస్థకు రూ.1640 చొప్పున ప్రభుత్వం చెల్లించనుంది. వైద్య శాఖ గణాంకాల ప్రకారం ప్రస్తుతం 500 తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు నెలకు 15వేల ట్రిప్లు వేస్తున్నాయి. ఇప్పుడు ట్రిప్పునకు రూ.895 చొప్పున నెలకు రూ.1.34 కోట్ల చొప్పున ఏడాదికి రూ.16 కోట్ల పైనే ఖర్చు అవుతోంది. బాబు సర్కార్ కొత్తగా ఖరారు చేసిన రూ.1640 ధరతో నెలకు రూ.2.46 కోట్ల చొప్పున ఏడాదికి రూ.30 కోట్ల మేర వెచ్చించాల్సి ఉంటోంది. అంటే ప్రస్తుతం చేస్తున్న వ్యయంతో పోలిస్తే ఏడాదికి రూ.14 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. గతేడాది మార్చిలోనే వైద్య శాఖ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ తొలి సారి టెండర్ పిలిచింది. అప్పట్లో ఇదే సంస్థ ఏకంగా ట్రిప్పునకు రూ.2300 చొప్పున ఫైనాన్షియల్ బిడ్ దాఖలు చేసింది. భారీగా కాంట్రాక్ట్ విలువను పెంచి, నిధుల దోపిడీకి చేస్తున్న కుట్రను అప్పట్లో ‘సాక్షి’ బట్టబయలు చేసింది. దీంతో ప్రభుత్వ పెద్దల దోపిడీకి సహకరించలేమని అధికారులు చేతులెత్తేశారు. ఖర్చుల్లో భారీ వృద్ధి లేకున్నా..తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ఆపరేట్ చేసే సంస్థ సింహ భాగం ఇంధనం కోసం నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో 2022తో పోలిస్తే ప్రస్తుతం ఇంధన ధరల్లో భారీ వృద్ధి చోటు చేసుకోలేదు. మరోవైపు గతేడాది కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0 సంస్కరణలు తీసుకొచి్చంది. దీంతో కొత్త వాహనాల కొనుగోలు, వాటి స్పేర్ పార్ట్లపై పన్నుల భారం కూడా గతంతో పోలిస్తే తగ్గింది. 2022లో 500 కొత్త మారుతి ఈకో వాహనాలతో ప్రస్తుత కాంట్రాక్ట్ సంస్థ సేవలు ప్రారంభించింది. నూతన కాంట్రాక్ట్ సంస్థ ఇదే తరహా వాహనాలతోనే సేవలు అందిస్తుందని భావించినా అప్పట్లో ఈ వాహనాలపై 25 శాతం జీఎస్టీ+1 శాతం సెస్ ఉండేది. గతేడాది జీఎస్టీ సంస్కరణల్లో జీఎస్టీని 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. మరోవైపు సెస్ను పూర్తిగా రద్దు చేశారు. ఫలితంగా గతంతో పోలిస్తే ఎక్స్ – షోరూమ్ ధరల్లో సుమారు రూ.50 వేల నుంచి రూ.70 వేలు పన్నుల రూపంలోనే తగ్గుదల ఉంది. ఓ వైపు సేవల్లో పెద్దగా మార్పు లేదు. మరోవైపు నిర్వహణ ఖర్చుల్లో భారీగా వృద్ధి లేకపోయినప్పటికీ కేవలం నిధులు దోచిపెట్టడమే లక్ష్యంగా బాబు సర్కార్ కాంట్రాక్ట్ విలువను పెంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో కొందరు ఉన్నతాధికారులు కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
18న వైఎస్సార్సీపీ ఇఫ్తార్ విందు
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీన ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో జరిగే ఈ కార్యక్రమంలో మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొంటారని ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలిపారు. అవినాష్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా తదితరులు గురువారం ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లిం మైనార్టీలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఏటా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో మైనార్టీలకు అన్ని విధాలా అండగా నిలిచి మేలు చేశారని చెప్పారు. -
నా ధైర్యం మీరే .. నా బలం మీరే : వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు, నాయకులకు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు పేరునా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ‘నా ధైర్యం మీరే…నా బలం మీరే…నాన్న గారి ఆశయ సాధన కోసం స్థాపించిన మన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, నన్ను మీరు గుండెల్లో పెట్టుకున్నారు, భుజాలపై మోస్తున్నారు. కష్టకాలంలో వెనక్కి తగ్గకుండా పార్టీ కోసం నిలబడుతున్నారు. పార్టీపై నమ్మకం పెట్టుకుని, నాపై నమ్మకం ఉంచి పార్టీ కోసం నిలిచిన మీరే మన పార్టీకి అసలైన బలం.. నా బలం. మన పార్టీ ప్రస్థానం కేవలం ఒక రాజకీయ ప్రయాణం మాత్రమే కాదు…ఒక లక్ష్యంతో లక్షలాది మంది కార్యకర్తల కష్టం, నమ్మకం, త్యాగాలకు నిలువెత్తు సాక్ష్యం. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు, నాయకులకు పేరు పేరునా శుభాకాంక్షలు.’ అని పేర్కొన్నారు. నా ధైర్యం మీరే…నా బలం మీరే…నాన్న గారి ఆశయ సాధన కోసం స్థాపించినమన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, నన్ను మీరు గుండెల్లో పెట్టుకున్నారు, భుజాలపై మోస్తున్నారు.కష్టకాలంలో వెనక్కి తగ్గకుండా పార్టీ కోసం నిలబడుతున్నారు. పార్టీపై నమ్మకం పెట్టుకుని, నాపై నమ్మకం ఉంచి పార్టీ కోసం… pic.twitter.com/avdEzEGkjg— YS Jagan Mohan Reddy (@ysjagan) March 12, 2026గురువారం పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి అభిమానులు, కార్యకర్తలు, నాయకులు తరలి రావడంతో పార్టీ కార్యాలయం జనసంద్రంగా మారింది. మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలు సమర్పించి నివాళులర్పించిన వైఎస్ జగన్, ఆ తర్వాత పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం భారీగా తరలివచ్చిన పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి ప్రసంగించారు. మన పార్టీ ఆవిర్భవించి ఈరోజుకు 15 ఏళ్లు పూర్తి. 2011, మార్చి 12న పుట్టిన మన పార్టీ, ఈరోజుకి 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇంకా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేది దేశంలోనే ఒక మార్క్గా నిల్చింది. రాష్ట్రంలోనే కాదు, దేశ రాజకీయాల్లోనే ప్రబలంగా మన పార్టీ కనిపిస్తోంది. 15 సంవత్సరాల క్రితం ఈ పార్టీ ఎలాంటి పరిస్థితుల్లో పుట్టింది అనేది మనం ఒకసారి జ్ఞప్తి చేసుకుంటే.. ఆరోజు నల్లకాలువలో ఇచ్చిన ఒక మాట, మన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపన, ఎదుగుదలకు కారణమైంది. ఆ ఒక్క మాట నా కుటుంబ పరిస్థితులు మార్చింది. రాష్ట్రంలో దశ, దిశ మార్చింది. ఆ ఒక్క మాట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంకురార్పణకు శ్రీకారం చుట్టింది. విలువలతో కూడిన రాజకీయాలు మర్చిపోయి ఉన్న పరిస్థితుల మధ్య.. విలువలు, విశ్వసనీయత అన్న పదాలకు అర్ధం చెబుతూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టుక, ఆ తర్వాత ఎదుగుదల కొనసాగింది. ఈరోజు నేను ఒకటే చెబుతున్నాను. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక్క జగన్ది మాత్రమే కాదు. కొన్ని కోట్ల మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులది. వైఎస్సార్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న నా కుటుంబ సభ్యులది అని నేను గర్వంగా చెబుతున్నాను.ఆరోజు జగన్ అనే వాడు ఒకే ఒక్కడు. కానీ, జగన్ ఏనాడూ భయపడలేదు. ఆరోజు కాంగ్రెస్ పార్టీ.. ఇక్కడ, దేశంలో అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి కుట్రలు, కుతంత్రాలు పన్నిన పరిస్థితి చూశాం. కానీ, జగన్ ఏనాడూ భయపడలేదు. కారణం జగన్కు నమ్మకం ఉన్నది పైన ఉన్న దేవుడు. కింద ఉన్న మీమీద మాత్రమే అని గర్వంగా చెబుతాను. నేను నమ్ముకున్న నా ప్రజలు, నేను నమ్ముకున్న నా దేవుడు.. ఇద్దరూ తోడుగా ఉండి నన్ను నడిపించారు.ఈరోజు నేను చెబుతున్నాను. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా విలువలు, విశ్వసనీయతకు ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని, నాతో పాటు నడిచే ప్రతి కుటుంబ సభ్యుడు కూడా కాలర్ ఎగరేసుకుని.. అదిగో అతడే మా నాయకుడు, అదిగో అదే మా పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని గర్వంగా చెప్పుకునేలా ఈ పార్టీ అడుగులు వేస్తుందని చెప్పి, మరొక్కసారి మీ అందరికి కూడా వినమ్రంగా, వినయపూర్వకంగా, మీ అందరి ప్రేమాభిమానాలకు మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.ఈరోజు మరొక్కసారి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైఎస్సార్ను అభిమానించే ప్రతి గుండెకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడికి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా వైఎస్సార్ను ప్రేమించే ప్రతి గుండె, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఆ ప్రతి గుండెకు ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానంటూ వైఎస్ జగన్ ప్రసంగాన్ని ముగించారు. -
వైఎస్సార్సీపీ అభిమాని కాలర్ ఎగరేసేలా పార్టీ ఉంటుంది : వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: ‘అభిమాని కాలర్ ఎగరేసేలా పార్టీ ఉంటుందని’ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం (మార్చి 12) వైఎస్సార్సీపీ ఆవిర్భవించి 15 ఏళ్లు పూర్తి చేసుకుని 16వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా తాడేపల్లి పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ వేడుకల్లో వైఎస్ జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం ప్రసంగించిన వైఎస్ జగన్ పార్టీ భవిష్యత్తుపై తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ‘2011 మార్చి 12న పార్టీ ఆవిర్భవించింది. వైఎస్సార్సీపీ ఆవిర్భావంతో దేశ రాజకీయాల్లోనే మార్పు కనిపించింది. నల్లకాల్వలో ఇచ్చిన మాట వైఎస్సార్సీపీ ఆవిర్భావానికి కారణమైంది. ఆ ఒక్క మాట రాష్ట్ర దశ, దిశను మార్చింది. వైఎస్సార్సీపీ పార్టీ కోట్లాది మంది ప్రజలది. మొదట్నుంచీ ప్రజలు,దేవుడినే నమ్ముకున్నా. విలువలు, విశ్వసనీయతకు ఎప్పటికీ కట్టుబడి ఉంటా. వైఎస్సార్సీపీ అభిమాని కాలర్ ఎగరేసేలా పార్టీ ఉంటుంది. మీ ప్రేమాభిమానాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. వైఎస్సార్సీపీ అభిమానించే ప్రతి గుండెకు శుభాకాంక్షలు’ తెలిపారు. ఇచ్చిన మాట కోసం ఎందాకైనా... వరుస ఓటములతో జీవచ్ఛవంలా మారిన కాంగ్రెస్కు ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్రతో జీవం పోసి... టీడీపీ దుర్మార్గపు పాలనకు తెరదించుతూ 2004 ఎన్నికల్లో ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో కాంగ్రెస్ను మహానేత ఒంటిచేత్తో అధికారంలోకి తెచ్చారు. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా 2004 మే 14న ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్సార్... రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బాటలు వేశారు. జనరంజక పాలనను మెచ్చిన ప్రజలు వైఎస్ నాయకత్వానికి దన్నుగా 2009 ఎన్నికల్లోనూ మళ్లీ అధికారాన్ని కట్టబెట్టారు. 2009 మే 20న రెండోసారి ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక... అదే ఏడాది సెప్టెంబరు 2న హెలికాప్టర్ ప్రమాదంలో హఠాన్మరణం చెందారు. ఈ విషాద వార్తకు తాళలేక వందలాది మంది మరణించడం జగన్ ను కలిచి వేసింది. ప్రమాదం చోటుచేసుకున్న కర్నూలు జిల్లా నల్లకాలువ వద్ద 2009 సెప్టెంబరు 25న నిర్వహించిన సంస్మరణ సభలో మాట్లాడుతూ... మరణించిన వారి కుటుంబాలను పరామ ర్శించడానికి ఓదార్పు యాత్ర చేపడతానని ప్రకటించారు. ఆ మాటకు కట్టుబడి 2010 ఏప్రిల్ 9న పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఓదార్పు యాత్ర ప్రారంభించారు. ఈ యాత్రను ఆపేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించింది. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై కుట్రలు చేస్తుండటంతో తన తల్లి విజయమ్మతో కలిసి జగన్ కాంగ్రెస్ పార్టీకి, పులివెందుల శాసనసభ, కడప లోక్సభ స్థానాలకు రాజీనామాలు చేశారు. వైఎస్ ఆశయ సాధనే లక్ష్యంగా 2011 మార్చి 11న వైఎస్సార్సీపీ పేరును ప్రకటించారు. ఆ మరుసటి రోజే వైఎస్ సమాధి వద్ద పతాకాన్ని ఆవిష్కరించి, పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. -
అప్పులు దాచి.. ఆదాయం దోపిడీ
రాష్ట్ర అప్పులపై తప్పుడు సమాచారం ఇచ్చిన ఆర్థిక శాఖ కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర క్యాబినెట్ సెక్రటరీకి, డీవోపీటీకి లేఖ రాస్తాం. కాగ్ నివేదికలో పేర్కొన్న అప్పులు.. అసెంబ్లీలో ప్రభుత్వం చెప్పిన అప్పులను చూపించి.. చంద్రబాబు కోసం కిందామీదాపడి దగ్గరుండి సభను తప్పుదోవ పట్టించడంలో పాలుపంచుకున్నందుకు ఆ అధికారులపై లేఖ రాస్తున్నాం.ప్రభుత్వ గ్యారంటీతో ఎన్నో అప్పులు తీసుకున్నారు. వీటికి సంబంధించి అధికారికంగా ఎన్నో జీవోలు ఇచ్చారు. వీటిని బడ్జెటేతర అప్పులని కాకుండా ఏమంటారు? వీటిని మాత్రం చెప్పడం లేదు. అన్నీ దొంగచాటు వ్యవహారాలే. మొత్తం 16 రోజుల పాటు జరిగిన బడ్జెట్ సమావేశాల్లో తప్పుడు లెక్కలు, తప్పుడు ప్రచారాలు, సెల్ఫ్ డబ్బాలు.. ఇవి మినహా ఏమైనా మంచి జరిగిందా అని చూస్తే ప్రజలకు ఒరిగింది సున్నా.చంద్రబాబు అధికారంలోకి వస్తే రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు (అప్పులు) ఎందుకు పెరుగుతున్నాయంటే దానికి ప్రధాన కారణం.. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడం లేదు. చంద్రబాబు, బినామీలు, ఎమ్మెల్యేలు, ఎల్లో మీడియా యాజమాన్యాలు అందరూ కలిసి జాయింట్గా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. దోచుకో.. పంచుకో.. తినుకో..! అంటూ దోచుకుంటున్నారు కాబట్టే రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడం లేదు. ఇసుక, మట్టి, సిలికా, క్వార్ట్జ్, గ్రానైట్, లిక్కర్, పీపీఏలు.. అన్నింటా దోపిడీనే. ఇలా అయితే ప్రభుత్వానికి ఆదాయాలు ఎలా వస్తాయి? సంక్షేమం, అభివృద్ధి ఎలా నడుస్తాయి? ఎంత అప్పులు తెచ్చినా ఎలా సరిపోతాయి? సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు ఆర్థిక విధ్వంసం సృష్టిస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబు, బినామీలు, ఎమ్మెల్యేలు, ఎల్లో మీడియా యాజమాన్యాలు అంతా కలిసి దోచుకుంటుండడంతో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు పడిపోతున్నాయని, మరోవైపు రాష్ట్ర అప్పులు భారీ ఎత్తున పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో కరోనా లాంటి విపత్కర పరిస్థితులున్నప్పటికీ, ప్రజల ప్రాణాలను రక్షించుకోవడానికి అదనంగా భారీ ఎత్తున ఖర్చు చేయాల్సివ చ్చినప్పటికీ.. మేనిఫెస్టోలోని హామీలను అమలు చేస్తూనే ఆర్థిక క్రమశిక్షణ పాటించామని గుర్తు చేశారు. ఇప్పుడు అలాంటి విపత్కర పరిస్థితులేవీ లేనప్పటికీ.. కేంద్రం విధించిన పరిమితి (నెట్ బారోయింగ్ సీలింగ్)కి మించి ఎడాపెడా అప్పులతో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టిస్తూ తాను పరిపాలనా దక్షుడినంటూ చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారని దుయ్యబట్టారు. అప్పులపై అసెంబ్లీకి తప్పుడు సమాచారం ఇ చ్చిన ఆర్థిక శాఖ కార్యదర్శిపై చర్యలు కోసం కేంద్ర కేబినెట్ కార్యదర్శికి, డీవోపీటీ(డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్)కి లేఖ రాస్తామని స్పష్టం చేశారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. కాగ్ (కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదిక.. బడ్జెట్ ప్రతులు.. అసెంబ్లీకి ప్రభుత్వం రాతపూర్వకంగా ఇ చ్చిన సమాచారం ప్రతులను ఉటంకిస్తూ చంద్రబాబు సర్కార్ ఆర్థిక విధానాలను ఎండగట్టారు. 2026–27 బడ్జెట్లో లోపాలను ప్రస్తావిస్తూ.. మేనిఫెస్టోలో ఇ చ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారంటూ తాను అడిగిన ప్రశ్నలకు.. 16 రోజులపాటు నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు సర్కార్ సమాధానం చెప్పలేదని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో తండ్రీ, కుమారుడు పరస్పరం జాకీలు ఎత్తుకుంటే.. వారిద్దరి జాకీలను పవన్కళ్యాణ్ ఎత్తడమే సరిపోయిందంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మీడియా సమావేశంలో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. విధ్వంసానికి ఈ గణాంకాలే సాక్ష్యాలు.. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు సర్కారుకు ఐదు బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం ఇచ్చారు. ఇప్పటికే మూడో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఇక రెండు మాత్రమే ప్రవేశపెట్టే అవకాశముంది. గతనెల 19న జరిగిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు ఏ విధంగా మోసం చేస్తున్నాడన్న విషయాన్ని సవివరంగా చెప్పా. ఆ రోజు నేను అడిగిన ప్రశ్నలను ఇప్పుడు కాగ్ రిపోర్ట్ కూడా రూఢీ చేస్తూ చంద్రబాబు ఆర్థిక విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. మా ప్రభుత్వంలో చివరి ఆర్థిక ఏడాది (2023–24)ని.. కాగ్ ఆడిటింగ్ జరిగిన చంద్రబాబు నాయుడు తొలి ఏడాది (2024–25)తో పోలిస్తే తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 2023–24లో ప్రభుత్వ వ్యయం రూ.2,36,486 కోట్లు. ఇందులో రాష్ట్ర ఆదాయం (సొంత పన్నుల ఆదాయం, పన్నేతర ఆదాయం, కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్స్–ఇన్–ఎయిడ్) రూ.1,73,767 కోట్లు. చంద్రబాబు సర్కార్ తొలి ఏడాది 2024–25లో ప్రభుత్వ వ్యయం రూ.2,49,096 కోట్లు. ఇందులో రాష్ట్ర ఆదాయం రూ.1,68,024 కోట్లు. 2023–24లో రూ.1,73,767 కోట్లుగా ఉన్న రాష్ట్ర ఆదాయం 2024–25లో రూ.1,68,024 కోట్లకు పడిపోయింది. అంటే మా ప్రభుత్వం కంటే బాబు తొలి ఏడాదిలో రాబడులు తగ్గిపోయాయి. ఇదే సమయంలో రెవెన్యూ లోటు ఏకంగా 56 శాతం పెరిగి రూ.38,682 కోట్ల నుంచి రూ.60,285 కోట్లకు చేరింది. ద్రవ్యలోటు.. అంటే చేసిన అప్పులు 30 శాతం పెరిగి రూ.62,719 కోట్ల నుంచి రూ.81,071 కోట్లకు చేరింది. అయినా కూడా మొదటి ఏడాది సూపర్ సిక్స్లు, సూపర్ సెవెన్ హామీలు అమలు చేయకపోగా గతంలో మా ప్రభుత్వం అమలు చేసిన అన్ని పథకాలను రద్దు చేశారు. చంద్రబాబు హయాంలో ఇంతటి దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2024–25 తర్వాత కూడా రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు పెంచుకుంటూనే పోతున్నారు. 2019–20లో మా ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన తర్వాత ఐదేళ్ల కాలంతో ఇప్పటి ప్రభుత్వంలో 2024–25, 2025–26లోని పది నెలలతో పోలిస్తే ఎన్నడూ లేని విధంగా అప్పులు ఏ విధంగా పెరిగాయో తెలుస్తుంది. మా హయాంలో కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులున్నా, ప్రజలను కాపాడుకోవడానికి అదనంగా వ్యయం చేయాల్సి వ చ్చినా మేనిఫెస్టోలో చెప్పిన అన్ని పథకాలను కూడా అమలు చేస్తూ ఆర్థిక క్రమశిక్షణ పాటించాం. కానీ ఇప్పుడు ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేకున్నా, ఎలాంటి స్కీమ్లు అమలు చేయకున్నా అప్పులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 2023–24లో రాష్ట్రం మొత్తం వ్యయంలో అప్పులు 26.52 శాతంగా ఉంటే అదే చంద్రబాబు తొలి ఏడాది 2024–25లో 32.55 శాతానికి, 2025–26లో మొదటి పదినెలల్లో 39.74 శాతానికి ఎగబాకాయి. అంతేకాకుండా మా ఐదేళ్ల పరిపాలనలో జీఎసీడీపీలో అప్పులు సగటున 4.11 శాతంగా ఉంటే 2024–25లో జీఎసీడీపీలో అప్పులు 5.08 శాతానికి చేరాయి. చంద్రబాబు ఆర్థిక విధ్వంసానికి ఈ గణాంకాలే సాక్ష్యాలు.. ఆధారాలు!! దోచుకో.. పంచుకో.. తినుకో.. చంద్రబాబు అధికారంలోకి వస్తే రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు (అప్పులు) ఎందుకు పెరుగుతున్నాయంటే దానికి ప్రధాన కారణం.. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడం లేదు. చంద్రబాబు, బినామీలు, ఎమ్మెల్యేలు, ఎల్లో మీడియా యాజమాన్యాలు అందరూ కలిసి జాయింట్గా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. దోచుకో.. పంచుకో.. తినుకో..! అంటూ దోచుకుంటున్నారు కాబట్టే రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడం లేదు. ఇసుక, మట్టి, సిలికా, క్వార్ట్ ్జ, గ్రానైట్, లిక్కర్, పీపీఏలు.. అన్నింటా దోపిడీనే. ఇలా అయితే ప్రభుత్వానికి ఆదాయాలు ఎలా వస్తాయి? సంక్షేమం, అభివృద్ధి ఎలా నడుస్తాయి? ఎంత అప్పులు తె చ్చినా ఎలా సరిపోతాయి? విశాఖలో అత్యంత విలువైన 54 ఎకరాలను, రూ.5,000 కోట్ల విలువైన భూమిని బాబు దగ్గరుండి ఆయన సమీప బంధువుకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తే రాష్ట్రానికి ఆదాయాలు ఎలా వస్తాయి? రియల్ ఎస్టేట్ కంపెనీలకు శనక్కాయలు, బెల్లానికి భూములు ఇస్తున్నాడు. అంతేకాదు.. నిర్మాణ వ్యయంలో చదరపు అడుగుకు రూ.2,000 చొప్పున రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఈయన ఎదురు ఇస్తున్నాడు. ఇలాంటి స్కామ్లు జరుగుతుంటే రాష్ట్రానికి ఆదాయం ఎలా వస్తుంది? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందనడానికి ఇంకో ఉదాహరణ.. ట్రెజరీలో మినిమమ్ క్యాష్ బ్యాలెన్స్(కనీస నగదు నిల్వ) చూస్తే సరిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో కనీస నగదు లేకపోతే ముందుగా ఎస్డీఎఫ్ తీసుకుంటారు. ఇదికూడా దాటితే వేస్ అండ్ మీన్స్.. అది కూడా దాటితే ఓవర్ డ్రాఫ్ట్కు వెళుతుంది. ఇవన్నీ వడ్డీతో కూడినవి. కోవిడ్ లాంటి ఏ కష్టాలూ బాబు హయాంలో లేనప్పటికీ 2024–25లో కనీస నగదు నిల్వ ఉన్నవి కేవలం 8 రోజులు మాత్రమే. 365 రోజుల్లో 357 రోజులు కనీస నగదు నిల్వ కూడా ఉంచలేదు. చంద్రబాబు పరిపాలనకు, బిల్డప్కు తేడా స్పష్టంగా చూపించే మరో చిత్రపటం.. ట్రెజరీలోని ఈ కనీస నగదు నిల్వలు! ఒకవైపు మామీద తప్పుడు ప్రచారం చేస్తూ మరోవైపు ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తూ వాటిని బయటకు రానివ్వకుండా దాచేసే ప్రయత్నం చేస్తున్నారు. 2024–25లో ఆయన వాస్తవంగా చేసిన అప్పులు రూ.81,082 కోట్లు అని కాగ్ నివేదిక స్టేట్మెంట్ సిక్స్లో పేర్కొంది. కానీ అసెంబ్లీలో రూ.60,485 కోట్లు అప్పు చేసినట్లు చంద్రబాబు సర్కార్ తప్పుడు లెక్కలతో కూడిన సమాచారం ఇ చ్చింది. అంటే రూ 20,000 కోట్ల అప్పులు దాచిపెట్టి చూపిస్తున్నారు. ఆత్మస్తుతి.. పరనిందేరాష్ట్ర అప్పులపై తప్పుడు సమాచారం ఇ చ్చిన ఆర్థిక శాఖ కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర క్యాబినెట్ సెక్రటరీకి లేఖ రాస్తాం.. డీవోపీటీకీ లేఖ రాస్తాం. కాగ్ నివేదికలో పేర్కొన్న అప్పులు.. అసెంబ్లీలో ప్రభుత్వం చెప్పిన అప్పులను చూపించి.. చంద్రబాబు కోసం కిందామీదాపడి దగ్గరుండి సభను తప్పుదోవ పట్టించడంలో పాలుపంచుకున్నందుకు ఆ అధికారులపై డీవోపీటీకి, కేంద్ర క్యాబినెట్ సెక్రటరికీ, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి లేఖ రాస్తున్నాం.ప్రభుత్వ ప్రత్యక్ష అప్పులు కాకుండా బడ్జెటేతర అప్పుల వివరాలు ఇవ్వాలని మండలిలో రాతపూర్వకంగా కోరితే ప్రభుత్వం దాటవేసే యత్నం చేస్తూ వివరాలు ఇవ్వలేదు. ప్రభుత్వ గ్యారంటీతో ఎన్నో అప్పులు తీసుకున్నారు. వీటికి సంబంధించి అధికారికంగా ఎన్నో జీవోలు ఇచ్చారు. వీటిని బడ్జేటేతర అప్పులని కాకుండా ఏమంటారు? వీటిని మాత్రం చెప్పడం లేదు. అన్నీ దొంగచాటు వ్యవహారాలే. బడ్జెట్ సమావేశాల్లో తప్పుడు లెక్కలు, దుష్ప్రచారాలు, సెల్ఫ్ డబ్బాలు మినహా ఏమైనా మంచి జరిగిందా? అని చూస్తే ప్రజలకు ఒరిగింది సున్నా. చంద్రబాబు తన కొడుకును జాకీ పెట్టి ఎత్తుతాడు. బాబు కొడుకేమో ఆయన్ను జాకీపెట్టి ఎత్తుతాడు.. వీళ్లిద్దరిని కలిపి పవన్ కళ్యాణ్ జాకీ ఎత్తుతాడు. పరనింద.. ఆత్మస్తుతి మినహా 16 రోజుల సభలో ఏం జరిగింది? విలేకరుల సమావేశం నిర్వహించి బడ్జెట్పై గతంలో మేం అడిగిన ప్రశ్నలకు సమాధానాలేమయ్యాయి? పరిమితికి మించి అప్పులు..ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నెట్ బారోయింగ్ సీలింగ్ (ఎన్బీసీ)కి లోబడి అప్పులు తీసుకోవాలి. చంద్రబాబు అధికారంలోకి వ చ్చిన ప్రతిసారీ ఓవైపు ఎన్బీసీని ఉల్లంఘిస్తూ మరోపక్క పరిపాలనా దక్షుడిగా బిల్డప్ ఇస్తారు. 2014–19లో సీఎంగా ఉన్నప్పుడు కూడా ఎన్బీసీ పరిమితి కంటే రూ.29,099 కోట్లు అధికంగా అప్పు చేశారు. అదే మా హయాంలో రెండేళ్ల పాటు కోవిడ్ ఉన్నా, ఆదాయాలు తగ్గినా, ప్రజలను కాపాడుకోవడం కోసం భారీగా ఖర్చు చేసినా, ఇ చ్చిన హామీలు అమలు చేసినా కూడా ఎన్బీసీ పరిమితి కంటే రూ. 12,708 కోట్లు తక్కువగా అప్పులు చేశాం. ఇది మా ఐదేళ్ల ట్రాక్ రికార్డు. బాబు అధికారంలోకి రాగానే మళ్లీ సీన్ రివర్స్. తొలి ఏడాది ఎన్బీసీ కంటే రూ.17,953 కోట్లు అప్పులు ఎక్కువగా తీసుకొచ్చారు. 2025–26లో పరిస్థితి ఇంతకంటే దారుణంగా ఉంది. రెండేళ్లలో తె చ్చిన అప్పులు, కుదుర్చుకున్న అప్పులు రూ.3.20 లక్షల కోట్లు దాటాయి. మా ఐదేళ్లలో చేసిన అప్పు రూ.3.31 లక్షల కోట్లు అయితే అప్పుడే ఈ రెండేళ్లలోనే రూ.3.20 లక్షల కోట్లు దాటాయి. ఎవరు ఆర్థిక విధ్వంసం చేస్తున్నారన్నదానికి ఇదే నిదర్శనం. ఆర్థిక సంఘం ఆదేశాలూ లెక్కలేదు అయినా దుష్ప్రచారమే..! మహిళలను వేధించినా చర్యలు తీసుకోరా?చంద్రబాబును నిలదీసిన మాజీ సీఎం వైఎస్ జగన్మహిళల జోలికొస్తే ఆ రోజే ఆఖరు రోజంటూ బిల్డప్ ఇస్తారా? సామాన్య మహిళలు, ఉద్యోగులను వేధించిన టీడీపీ, జనసేన నాయకులపై చర్యలు ఏవి? బాధిత మహిళలు స్వయంగా మీకే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదేం? టీటీడీ చైర్మన్గా ఉన్న వ్యక్తి మహిళను మోసం చేసి అడ్డంగా దొరికితే ఏం చేశావు?సాక్షి, అమరావతి: ‘మహిళల జోలికి వస్తే తాట తీస్తా... మహిళలను వేధిస్తే అదే ఆఖరి రోజు అవుతుంది.. అని డైలాగులు వేసి వెళ్లిపోతున్నారు. స్వయంగా బాధిత మహిళలు మిమ్మల్ని కలిసి సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేస్తే పట్టించుకున్న దిక్కులేదు. మహిళలపై దారుణాలకు పాల్పడ్డ కూటమి పార్టీ నేతల్లో ఎంత మందిపై చర్యలు తీసుకున్నారు?’ అని సీఎం చంద్రబాబు వైఖరిని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తూర్పారబట్టారు. చంద్రబాబు ఏలుబడిలో రక్షణ కోసం ప్రాధేయపడిన బాధిత మహిళలపైనే తిరిగి పోలీసు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. మహిళల భద్రతకు సంబంధించి సీఎం చంద్రబాబుకు పలు ప్రశ్నలు సంధించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. మీ ఎమ్మెల్యేలపై చర్యలెక్కడ బాబు?» రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అత్యాచారం చేసి మోసం చేశారంటూ బాధిత మహిళ నేరుగా సీఎంకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నారు? » కేజీబీవీ మహిళా ప్రిన్సిపాల్పై ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులకు పాల్పడితే చర్యలు ఎక్కడున్నాయి? » మహిళలకు అశ్లీలంగా వీడియో కాల్స్ చేసి, అసభ్యంగా ప్రవర్తించిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్పై చర్యలు ఎక్కడ? » టీడీపీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మహిళపై దారుణమైన లైంగిక దాడికి పాల్పడితే చంద్రబాబు ఎక్కడున్నారు? » మహిళా ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ మంత్రి సంధ్యారాణి పీఏను కూడా శిక్షించలేదు. ఇక్కడ ఎమ్మెల్యేల కథ దేవుడెరుగు కనీసం రాజకీయ నాయకుల పీఏలపైనా చర్యలు తీసుకోవట్లేదు. తిరిగి బాధితురాలిపైనే కేసు పెట్టారు. బాబుకు భయం, భక్తి లేదు చంద్రబాబు పాలన అంటేనే.. మహిళలపై పాశవిక దాడులు, దారుణాలు, అఘాయిత్యాలకు కేరాఫ్గా మారిపోయింది. సాక్షాత్తూ ప్రస్తుత టీటీడీ చైర్మన్ ఒక మహిళను మోసం చేసి వీడియోలు, ఫొటోలతో అడ్డంగా దొరికిపోతే చంద్రబాబు ఏం చేశారు? టీటీడీ చైర్మన్ను ఎందుకు వదిలేశారు? ఇక్కడ విచిత్రం ఏమంటే.. తనను మోసం చేసిన వ్యక్తికి పదవులు ఇవ్వొద్దని, విచారించి చర్యలు తీసుకోవాలని బాధితురాలు గతంలోనే బాబుకు లేఖ రాశారు. అదిప్పుడు అక్నాలెడ్జ్మెంట్తో పాటు బయటకు వ చ్చింది. అయినా చంద్రబాబు టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారు. మహిళలను వంచించే వ్యక్తులకు దేవుడి పట్ల భయం, భక్తి ఉండదు.దేవాలయాల్లో భక్తుల మృత్యువాత!చంద్రబాబు అధికారంలోకి వ చ్చిన తర్వాత ఆలయాల్లో భక్తులకు కనీస రక్షణ కల్పించట్లేదు. తిరుమల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయారు. సింహాచలం చందనోత్సవంలో గోడకూలి ఏడుగురు, పలాసలో తొక్కిసలాటలో తొమ్మిది మంది చనిపోగా.. మొన్న కదిరి రథోత్సవంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వరుసగా ఇన్ని ఘటనలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? దేవుడిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం తప్ప నిజంగా వీళ్లకు శ్రద్ధ ఎక్కడ ఉంది? -
తప్పు తాను చేసి.. నిందలు , స్కామ్లు!
సాక్షి, అమరావతి: ‘ఒకవైపు చంద్రబాబే తప్పు చేసి.. వేలెత్తి ఎదుటివారిపై నింద వేసేస్తారు. రెండోవైపున ఆ దుమారంలోనే స్కామ్లు చేస్తారు. టీటీడీకి సరఫరా చేసే నెయ్యి ధరను కిలోకి రూ.351 నుంచి రూ.716కు పెంచేసి.. హెరిటేజ్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపుర్ డెయిరీ నుంచి సరఫరా చేశారు. రూ.200 కోట్ల స్కామ్కు పాల్పడ్డారు..’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘ఇలాంటి వాళ్లను ఏమనాలి? రెండున్నర గంటల సినిమాలో విలన్ కూడా ఇంత ఆలోచన చేయడేమో! ఇది లైవ్లో కనిపిస్తున్న రియాల్టీ షో. ఇక్కడ స్కీములు ఉండవు.. అన్నీ స్కాములే..!’ అంటూ చంద్రబాబును తూర్పారబట్టారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే.. ప్రపంచ చరిత్రలో కనీవినీ ఎరుగని స్కామ్తిరుమలకు సరఫరా చేసిన నెయ్యి వ్యవహారంలో మా పార్టీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం కూడా చెప్పలేదు. ఇందాపూర్ డెయిరీ, చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్కు మధ్య బంధంపై నోరు ఎత్తలేదు. సంగం డెయిరీ, వైష్ణవి డెయిరీ మధ్య సంబంధాన్ని ప్రశ్నిస్తే నోరు మెదపరు. ఇక్కడ నెయ్యిపై ఒకవైపున దుమారం రేపుతూనే మరోవైపు నెయ్యిలో స్కామ్లకు పాల్పడుతున్నారు. తిరుమలకు సరఫరా అయిన నెయ్యి టెండర్లను గమనిస్తే రూ.200 కోట్ల స్కామ్ బయటపడుతుంది. ఉద్దేశపూర్వకంగానే ఏడాదిలోనే కిలో నెయ్యి రేటును రూ.351 నుంచి రూ.716కు పెంచేశారు. 2024 ఆగస్టులో కిలో నెయ్యి రూ.351కి టీటీడీకి సరఫరా జరిగితే అక్టోబర్ 2025 నాటికి.. కేవలం ఏడాదిలోనే రూ.716కు పెంచేశారు. ఏడాదిలో కేజీ నెయ్యి ధరను రూ.365 చొప్పున పెంచేసి దోపిడీకి పథకం వేశారు. నెయ్యి స్కామ్ కోసం చంద్రబాబు అండ్ కో దోపిడీ మందలా (కాటెల్) ఏర్పడి దేవుడి సొమ్మును కొల్లగొడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 ఆగస్టు వరకు రూ.351కే కిలో నెయ్యి టీటీడీకి సరఫరా అయితే.. ఆ తర్వాత 2025 జనవరి 31 నాటికి అమాంతం రూ.513కి ఎగబాకింది. 2025 అక్టోబర్ నాటికి రూ.599 దూసుకెళ్లి.. అదే నెలలో రూ.716కి చేరుకుంది. ఇది ప్రపంచ చరిత్రలో కనీవినీ ఎరుగని స్కామ్. దేవుడంటే భయభక్తులు లేకుండా.. ఒక పక్కన నెయ్యిపై దుమారం రేపి.. అదే నెయ్యిని అడ్డుపెట్టుకుని స్కామ్లు చేస్తున్నారు. ఇదీ చంద్రబాబు కుట్ర..! తిరుమల హుండీలో డబ్బులు లెక్కించే పరకామణి నుంచి 2025 జనవరిలో రూ.కోటి విలువైన బంగారం దొంగతనంపై కేసు నమోదైంది. చంద్రబాబు హయాంలో ఇంతటి ఘోరమైన తప్పు జరిగితే ఆ దొంగకు దగ్గరుండి బెయిల్ ఇప్పించారు. పైగా మొత్తం కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. మా హయాంలో రూ.75 వేల విలువైన డాలర్ నోట్లు దొంగతనం జరిగితే.. ఏకంగా రూ.15 కోట్లు విలువైన ఆస్తులు టీటీడీ దేవాలయానికి రాయించారు. దేవుడి సొమ్ముతో ఎవరైనా చెలగాటం ఆడితే అది తప్పని, క్రమశిక్షణ ఉండాలంటూ అప్పటి టీటీడీ బోర్డు ఆ నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు హయాంలో టీటీడీ పరకామణి లెక్కింపుల సమయంలో 2025 జనవరిలో రూ.కోటి విలువైన బంగారం చోరీ జరిగింది. ఈ ఘటనను బయటకు రానివ్వకుండా దాచిపెట్టారు. మరోవైపున 2025 సెపె్టంబర్లో చంద్రబాబు కుట్ర పూరితంగా.. ఎప్పుడో 2023లో పరకామణిలో రూ.75వేలు విలువైన డాలర్లను దొంగతనం చేసి.. పశ్చాత్తాపంతో రూ.15 కోట్లు దేవుడికి రాసిచ్చిన ఘటనను తప్పుపడుతూ దు్రష్పచారం చేశారు. కానీ, చంద్రబాబు ఆరోపణ కంటే ముందు, ఆయన హయాంలో నమోదైన చోరీని మాత్రం కావాలనే బయటకు రాకుండా కప్పెట్టేశారు. నెయ్యి రేట్లు అమాంతం పెంచేసి.. చంద్రబాబు నెయ్యి వ్యవహారంలో రాజకీయ దురుద్దేశంతో, కుట్రపూరితంగా ఆరోపణలు చేశారు. వాస్తవానికి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 మే 15న నెయ్యి టెండర్లు ఖరారయ్యాయి. జూన్ 4న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా.. జూన్ 12న నెయ్యి సరఫరా ప్రారంభమైంది. వాటిల్లో జూన్–జూలైలో 4 నెయ్యి ట్యాంకులు టీటీడీ టెస్టులు పాసయ్యాయి. అదే జూలై 6, 8వ తేదీల్లో వ చ్చిన మరో 4 ట్యాంకుల టెస్టులు టీటీడీ ల్యాబ్లో నెగిటివ్ వ చ్చింది. మళ్లీ చంద్రబాబు హయాంలోనే ఆ నాలుగు తిరస్కరించిన నెయ్యి ట్యాంకులు ఆగస్టు, సెపె్టంబర్లో వేరే కంపెనీ పేరుతో మళ్లీ టీటీడీలోకి వచ్చాయి. వాటిని టీటీడీ అనుమతించింది. వాటిని లడ్డూల తయారీలో ఉపయోగించారు. ఇదంతా దాచిపెట్టిన చంద్రబాబు.. కుట్ర పూరితంగా సెపె్టంబర్ 18న తిరుమల లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని, కల్తీ జరిగిందని ఎదురు ఆరోపణలు చేశారు. చంద్రబాబు హయాంలో తప్పు జరిగితే మాపై నెట్టేశారు. అసలు తిరస్కరించిన నెయ్యి ట్యాంకులు వెనక్కి రాకూడదు. అలాంటి వాటిని వెనక్కి రప్పించి వినియోగించారు. ఇక్కడ వైష్ణవి డెయిరీ, సంగం డెయిరీ సంబంధాలు అందరికీ తెలుస్తున్నాయి. ఒకవైపు చంద్రబాబు తప్పు చేసి వేలెత్తి ఎదుటివారిపై నింద వేసేస్తారు. రెండో వైపున దుమారంలోనే స్కామ్లు చేస్తారు. హెరిటేజ్ వెబ్సైట్లో తమ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ అని రాసుకున్నారు. అదే క్రమంలో హెరిటేజ్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ను వాళ్లే ఫైర్ చేస్తారు. ఏడాదిలో నెయ్యి రేటును రూ.351 నుంచి రూ.716కి పెంచేసి స్కాములు చేసుకుంటారు. ఇలాంటి వాళ్లను ఏమనాలి? సినిమాలో రెండున్నర గంటల విలన్ కూడా ఇంత ఆలోచన చేయడేమో! ఇది లైవ్లో కనిపిస్తున్న రియాల్టీ షో. ఇక్కడ స్కీములు ఉండవు.. అన్నీ స్కాములే!శ్రీవారి సొమ్ము.. అయినవారికి దోచిపెట్టేందుకు..బాబును సీఎంగానే భరించలేకపోతున్నారుఉప ప్రధాని అయితే దేశ ప్రజలు ఎలా భరిస్తారు?.. వైఎస్ జగన్ వ్యంగ్యాస్త్రాలుసాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు రాబోయే రోజుల్లో దేశానికి ఉప ప్రధాని కాబోతున్నారని ఎల్లో మీడియా ప్రచురించిన, ప్రసారం చేస్తున్న వార్తలపై మీడియా ప్రతినిధులు బుధవారం అడిగిన ప్రశ్నలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందిస్తూ.. ‘చంద్రబాబును ముఖ్యమంత్రిగానే రాష్ట్ర ప్రజలు భరించలేకపోతున్నారు. ఉప ప్రధాని అయితే దేశ ప్రజలు ఎలా భరిస్తారు..?’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైఎస్సార్సీపీ సభ్యులు 11 మందే ఉన్నా 1,100 మందిలా మాట్లాడుతున్నారంటూ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు అడిగిన మరో ప్రశ్నకు జగన్ స్పందిస్తూ.. ‘మా పార్టీ ఎమ్మెల్యేలు అంత నిబద్ధతతో ఉన్నారు. బలంగా పని చేస్తున్నారు. అది మంచి విషయమే’ అని పేర్కొన్నారు. -
నమ్మించి నిండా ముంచి.. దగా పాలన
సాక్షి, అమరావతి: కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పే చంద్రబాబు తన పాలనలో అన్ని వర్గాల వారిని నిండా ముంచారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్కచెల్లెమ్మలు, విద్యార్థులు, ఉద్యోగులు, సామాన్యులను సైతం తన అబద్ధాలతో వంచించారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఎత్తిచూపుతూ చంద్రబాబు ప్రభుత్వ తీరును కడిగి పారేశారు. ‘పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు మా ప్రభుత్వ హయాంలో ప్రతి ఏప్రిల్లో సున్నా వడ్డీ ఇచ్చేవాళ్లం. మేం ఐదేళ్లలో రూ.4,900 కోట్లు ఈ పథకానికి ఇచ్చాం. చంద్రబాబు మేనిఫెస్టోలో వడ్డీ లేని రుణాలను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామన్నారు. పెంచడం కథ దేవుడెరుగు.. మా హయాంలో ఇచ్చేది కూడా ఎగరగొట్టేశారు. ఈయన మేనిఫెస్టోలో చెప్పిన రూ.10 లక్షల ప్రకారం చూస్తే ఈయన ఇవ్వాల్సింది ఏటా రూ.3,500 కోట్లు. ఈ మూడేళ్లలో కలిపి రూ.10 వేల కోట్లకు పైగా ఇవ్వాలి. ఇది ఎప్పుడు ఇస్తారని అక్కచెల్లెమ్మలు ఎదురుచూస్తున్నారు. మరోవైపు పొదుపు సంఘాల పరిపతి తగ్గిపోయింది. ఏకంగా రూ.10 వేల కోట్ల రుణాలు తగ్గిపోయాయి. నాబార్డు డేటా ప్రకారం రూ.40 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్లకు తగ్గిపోయాయి. మా ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నీ రద్దు చేశారు. వీళ్లు ఇస్తామన్నా సూపర్ సిక్స్, సూపర్ సెవన్ ఎగ్గొట్టేశారు’ అని నిప్పులు చెరిగారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..ఫీజులు కట్టలేక చదువులు మానేస్తున్నారు» విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు ఎప్పుడు ఇస్తారని సీఎం చంద్రబాబును గట్టిగా నిలదీస్తూ అడిగాం. కానీ ఒక్క మాట లేదు. 2024 జనవరి–మార్చి త్రైమాసికానికి సంబంధించి ఏప్రిల్లో వెరిఫై చేసి ఇచ్చే వాళ్లం. మార్చి 16న ఎన్నికల కోడ్ వచ్చింది. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది. అక్కడి నుంచి పిల్లల కష్టాలు మొదలయ్యాయి. » అసెంబ్లీ జరుగుతుండడంతో ఎక్కడ గొడవవుతుందో అని బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్వో) రూ.1,200 కోట్లు ఇచ్చారు. బీఆర్వో ఇస్తే డబ్బులు ఇచ్చినట్టు కాదని ఆరోజే చెప్పాను. కానీ ఇచ్చింది రూ.300 కోట్లే అంటున్నారు. మొత్తంగా వీళ్లు ఇచ్చింది రూ.2,071 కోట్లు మాత్రమే. అంటే రూ.6,428 కోట్లు ఈ రెండేళ్లకే బాకీ పడ్డారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో 4 క్వార్టర్స్కు రూ.700 కోట్ల చొప్పున రూ.2,800 కోట్లు, వసతి దీవెన కింద ఏప్రిల్ 2026లో ఇవ్వాల్సిన మరో రూ.1,100 కోట్లు కలిపి ఈ ఏడాది రూ.3,900 కోట్లు ఇవ్వాల్సి ఉంది. తొలి రెండేళ్లూ బాకీపడ్డ రూ.6,428 కోట్లు కలిపితే మొత్తంగా రూ.10,328 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ఈ ఏడాది బడ్జెట్లో వీళ్లు జరిపిన కేటాయింపులు రూ.2,766 కోట్లు మాత్రమే. » ఒక్కో త్రైమాసికానికి ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.700 కోట్లు ఖర్చవుతుంది. 9 క్వార్టర్స్కు రూ.6,300 కోట్లు ఇవ్వాలి. వసతి దీవెన కింద ప్రతీ ఏప్రిల్లో రూ.1,100 కోట్లు ఇచ్చే వాళ్లం. ఎన్నికల కోడ్ రాకతో ఆగిపోయింది. ఏప్రిల్ 2024, ఏప్రిల్ 2025.. అంటే రెండేళ్లలో రూ.2,200 కోట్లు ఇవ్వాలి. ఈ రెండు కలిపితే విద్యా దీవెన కింద రూ.6,300 కోట్లు, వసతి దీవెన కింద రూ.2,200 కోట్లు కలిపి మొత్తంగా రూ.8,500 కోట్లు ఇవ్వాలి. కానీ 2024–25 బడ్జెట్లో రూ.1,771 కోట్లు విడుదల చేసినట్టు చూపించారు. » ఇలా అయితే పిల్లల చదువులు ఎలా సాగుతాయి? కళాశాల యాజమాన్యాలు బలవంతంగా ఫీజులు కట్టించుకుంటున్నాయి. కట్టలేని పిల్లలు చదువులు మానేస్తున్నారు. తల్లిదండ్రులు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. చదువులు మానేస్తున్న పరిస్థితి. అయినా సరే చంద్రబాబుకు మనసు రాదు. 16 రోజుల అసెంబ్లీ సమావేశాలైన తర్వాత కూడా ఇవి ఎప్పుడు ఇస్తావని అడిగితే చంద్రబాబు నోటి నుంచి మాట రావడం లేదు. ఆరోగ్యశ్రీకి భారీ బకాయిలు» ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రుల్లో నాడు–నేడు కార్యక్రమం ఆగిపోయింది. 17 వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని ప్రజలు పెద్ద ఎత్తున సంతకాలతో నిరసన తెలిపారు. ఆ ఆధునిక దేవాలయాలైన బోధనాస్పత్రులను పూర్తి చేయాలని కోరితే చంద్రబాబు దగ్గర నుంచి స్పందన లేదు. ఆరోగ్యశ్రీ కింద రూ.3,150 కోట్ల బకాయిలు పెట్టారు» 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యశ్రీ పథకం నడవాలంటే మరో రూ.4 వేల కోట్లు కావాలి. అంటే, బకాయిలతో కలిపి చూస్తే రూ.7,150 కోట్లు రాబోయే ఆర్థిక ఏడాదిలో ఖర్చు చేయాలి. చంద్రబాబు బడ్జెట్ కేటాయింపులు మాత్రం రూ.4 వేల కోట్లు చేశారు గానీ, అంతకు ముందు సంవత్సరాలు చూస్తే ఎప్పుడూ కూడా రూ.2 వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ నడవాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నెట్వర్క్ ఆస్పత్రులు ఒకవైపు బంద్ ప్రకటిస్తున్నాయి. తాము అగ్రిమెంట్లు చేసుకోమని నోటీసులు ఇస్తున్నాయి. దీనిపై చంద్రబాబుకు చీమకుట్టినట్లు కూడా అనిపించట్లేదు.బాబు కేరాఫ్ క్రెడిట్ చోరీ!» చంద్రబాబు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా రెండే పనులు చేస్తారు. ఒకటి పింఛన్ పంపిణీలో ప్రచారం చేసుకోవడం.. రెండు ఏదో గ్రామానికి వెళ్లిన చోట రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేస్తానని బిల్డప్ ఇస్తారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, సమగ్ర సర్వే, టెక్నాలజీ వినియోగం, క్యూఆర్ కోడ్ పట్టాదారు పాస్ పుస్తకాలు, భూములను జియో కో ఆర్డినేట్స్తో హద్దులు నిర్ణయిస్తున్నానంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. వాస్తవానికి ఇవన్నీ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో.. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టినవే.» జగన్కు ఎలాంటి క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకు నచ్చదు. కనీసం క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న ఉద్యోగులకు థ్యాంక్స్ కూడా చెప్పరు. వాస్తవానికి సర్వేయర్ల వ్యవస్థ, సచివాలయాల వ్యవస్థ ఎవరి వల్ల వచ్చింది? సర్వే పరికరాలు, కోర్ స్టేషన్లు, రోవర్స్ ఎవరు తీసుకొచ్చారు? విమానాలు, హెలికాప్టర్లలో సర్వేలు ఎవరి హయాంలో జరిగాయి? ఓఆర్ఐ రికార్డులు, సర్వే అనంతరం హద్దుల్లో పాతడానికి కోట్ల హద్దు రాళ్లు ఎవరి హయాంలో సమకూర్చారు? పాస్బుక్లో క్యూఆర్ కోడ్, జీయో ట్యాగింగ్ హద్దు నిర్ణయం ఎవరి హయాంలో ప్రారంభమైంది? ఇవన్నీ చంద్రబాబు చెప్పరు. » సచివాలయ వ్యవస్థలో 15 వేల మంది సర్వేయర్లు, వారితో పాటు రెవెన్యూ, డిజిటల్ అసిస్టెంట్లు లేకుండా ఈ పనులన్నీ అయిపోయాయా? అంత కష్టపడి పని చేసిన ఉద్యోగులకు కనీసం ప్రోత్సాహకం కల్పించకుండా వేధింపులకు పాల్పడుతున్నారు. చంద్రబాబు వచ్చిన తర్వాత ఏకంగా 50–60 మంది సచివాలయ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారిపై కనీసం సానుభూతి ప్రదర్శించట్లేదు. సర్వేయర్లకు సస్పెన్షన్లు, వేధింపులు బహుమానంగా ఇస్తున్నారు. చిక్కటి చిరునవ్వులతో ప్రోత్సహించి పనులు చేయించుకోవాల్సిన చోట చావులకు పురిగొల్పుతున్నారు. ఇదీ చంద్రబాబు పాలన.సున్నా వడ్డీకిదిక్కు లేదు» ఒకవైపు సున్నా వడ్డీకి దిక్కు లేదు. మరొకవైపు ఉన్న పథకాలన్నీ రద్దయ్యాయి. ఇంకోవైపు హామీలన్నీ మోసాలుగా తేలాయి. ఇవేమీ చేయకుండా మహిళా దినోత్సవం రోజున అక్కచెల్లెమ్మలను పారిశ్రామికవేత్తలను చేస్తామంటూ చంద్రబాబు కోతలు కోస్తున్నారు. మహిళా సాధికారత కోసం మా హయాంలో అమూల్, ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్, హిందుస్థాన్ లీవర్, ఐటీసీ, రిలయన్స్ వంటి బహుళ జాతి సంస్థలను తీసుకొచ్చాం.» బ్యాంక్ లింకేజ్తో టై అప్ చేసి ప్రతి అక్కచెల్లెమ్మను లక్షాధికారి చేయడం కోసం మా ప్రభుత్వ హయాంలో ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం, కాపునేస్తం, జగనన్న తోడు, జగనన్న చేదోడు, నేతన్న నేస్తం, వాహన మిత్ర, సున్నా వడ్డీ.. ఇలా అనేక పథకాలు అమలు చేసి అక్కచెల్లెమ్మలను నిలబెట్టే కార్యక్రమం చేస్తే.. చంద్రబాబు ఇవన్నీ రద్దు చేసి వాళ్లను మోసగించారు. » మా హయాంలో అక్కచెల్లెమ్మలకు రుణాలు ఏటా పెరిగాయి. 2020–21లో రూ.20,808కోట్లు, 2021–22లో రూ.33,568 కోట్లు, 2022–23లో రూ.38,014 కోట్లు, 2023–24లో రూ.49,626 కోట్లకు పెంచుకుంటూ పోతే.. చంద్రబాబు హయాంలో రూ.41,623 కోట్లకు తగ్గింది. ఈ ఏడాది రూ.30,698 కోట్లకు దిగజారిపోయింది. మహిళా సాధికారత కాదు.. మహిళలను నాశనం చేస్తున్నారు.» త్రిబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని చంద్రబాబు ఇప్పుడు చెబుతున్నారు. కనీసం మేము మంజూరు చేసిన ఇళ్లను పూర్తి చేసేందుకు డబ్బులు ఇవ్వాలని అడిగితే మాట్లాడడు. కానీ, త్రిబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని దొంగ మాటలు మాట్లాడుతున్నాడు. ఈ రెండేళ్లలో ఒక్క అక్కచెల్లెమ్మకు ఒక్క గజం స్థలం ఇచ్చాడా? ఒక్క ఇంటి పట్టా ఇవ్వలేదు. కొత్తగా ఒక్క ఇంటిని మంజూరు చేయలేదు. » మేము 31 లక్షల పట్టాలిచ్చి, 21 లక్షల ఇళ్లు మంజూరు చేసి, 10 లక్షల ఇళ్లను పూర్తి చేశాం. మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. వాటికి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్లకు ఇవ్వకుండా ని«ధులు మళ్లించాడు. కేంద్రం ఇచ్చిన డబ్బులను చంద్రబాబు మళ్లించడంతో ఈ పథకం ఆగిపోయింది. ఉన్న ఇళ్లను పూర్తి చేయమంటే.. త్రిబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అంటాడు. మేనిఫెస్టోలో ప్రతి ఇంటి నిర్మాణానికి ఆదివాసీలకు రూ.లక్ష, కొండ ప్రాంతంలో కాకుండా కిందనున్న ఎస్టీలకు రూ.75 వేలు, ఎస్సీలు, చేనేతలకు రూ.50 వేలు చొప్పున అదనంగా ఇస్తామన్నాడు. రెండేళ్లలో ఒక్కరికైనా ఒక్క పైసా అయినా ఇచ్చాడా? ఇవ్వలేదు. దీనిపై గట్టిగా అడిగితే 16 రోజుల అసెంబ్లీ సమావేశాల తర్వాత కూడా ఆయన నోట్లో నుంచి ఒక్క మాట రాలేదు.ఐఆర్ ఏదంటే ఉలకట్లేదు అధికారంలో వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ (మధ్యంతర భృతి) ఇస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టినా ఇప్పటికీ అతీగతీ లేదు. అసలు పీఆర్సీ ప్రస్తావన తేవట్లేదు. నాలుగు పెండింగ్ డీఏలు, డీఆర్లు ఎప్పుడు ఇస్తారో స్పష్టత లేదు. జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ రీయింబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్స్ కింద ఉద్యోగులకు రూ.35 వేల కోట్లు బాకీపడ్డారు. చివరికి ఆశ వర్కర్లు, అంగన్వాడీలు మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు అమలుచేయాలంటూ విజయవాడలో ధర్నా చేస్తుంటే.. అర్ధరాత్రి పూట పోలీసులతో దాడి చేయించి అక్కడి నుంచి ఎత్తించేశారు.పాలు, నీళ్లు తాగినా చావులే!» చంద్రబాబు పాలనలో పాలు తాగినా, నీళ్లు తాగినా ప్రజలు మృత్యువాత పడుతున్నారు. స్కూళ్లు, హాస్టళ్లల్లో నాణ్యమైన భోజనం కూడా పెట్టట్లేదు. గోరుముద్ద గాలికి ఎగిరిపోయింది. నాడు–నేడు ఎత్తేయడంతో కలుషితమైన తాగు నీరు, ఆహారం తిని పిల్లలు చనిపోతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ఇదే దుస్థతి. జీరో వెకెన్సీ పాలసీ గాలికి వదిలేశారు. 17 కొత్త బోధనాస్పత్రులను స్కాముల కోసం పనులు నిలిపివేశారు. ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్, ఆస్పత్రుల్లో జీఎంపీ మందుల మాట దేవుడెరుగు సాధారణ మందుబిళ్ల కూడా దొరకట్లేదు.కళ్లార్పకుండా అబద్ధాలు » ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ఎత్తేశారు. 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఆపేశారు. గోరుముద్దకు అన్యాయం చేశారు. చదువులు ఇంత దారుణంగా ఉన్నాయి కాబట్టే ప్రభుత్వ స్కూళ్లలో జీఈఆర్ శాతం తగ్గిపోయింది. 2023–24లో దాదాపు 43 లక్షల మంది ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో విద్యను అభ్యసిస్తే.. చంద్రబాబు వచ్చిన తర్వాత ఏకంగా 33 లక్షలకు పడిపోయింది. అంటే 10 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ బడులకు దూరమయ్యారు.» సూపర్ సిక్స్, సూపర్ సెవన్ అమలు చేయరు. మా ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలను రద్దు చేశారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచకుండా, కనీసం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు. » ఇంత విధ్వంసాన్ని సృష్టించిన చంద్రబాబు ఇప్పుడు తాపీగా ప్రతి జంట ముగ్గురు, నలుగురు పిల్లల్ని కనాలంటూ ఉచిత సలహా ఇస్తున్నారు. చివరికి చంద్రన్న పెళ్లి కానుక కింద ప్రతి జంటకు రూ.లక్ష ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి, ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. కానీ, మూడో బిడ్డను కంటే డబ్బులు ఇస్తారట! చంద్రబాబు కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పి మోసాలు చేస్తారు. ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా పుడతారు.కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పి మోసాలు చేయడంలో చంద్రబాబుకు తగ్గ తనయుడు పుట్టాడు. -
హామీలపై నోరు మెదపరేమి? : వైఎస్ జగన్
మహిళలకు మళ్లీ మోసం.. సూపర్ సిక్స్, సెవెన్ అని మోసం చేశావ్.. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మళ్లను అన్ని విధాలా దగా చేశావ్.. మహిళలకు అందించిన పథకాలన్నీ రద్దు చేశావ్. ఆఖరికి సున్నా వడ్డీ కూడా ఇవ్వకుండా దారుణంగా వంచించావ్.. ఇప్పుడు మరోసారి మభ్యపెడుతున్నావ్.. మహిళలకు ఆడబిడ్డ నిధి ఎప్పుడు ఇస్తారు? ఉద్యోగులకు రూ.35 వేల కోట్ల బకాయిలుఅధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ‘ఐఆర్’ ఇస్తామన్న హామీకి అతీగతీ లేదు. పీఆర్సీ ప్రస్తావనే లేదు. నాలుగు పెండింగ్ డీఏలు ఎప్పుడిస్తారో స్పష్టత లేదు. జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ రీయింబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్స్ కింద ఉద్యోగులకు రూ.35 వేల కోట్లు బాకీపడ్డారు. చివరికి ఆశ వర్కర్లు, అంగన్వాడీలకు ఇచ్చిన హామీలనూ నెరవేర్చకుండా పోలీసులతో దాడి చేయించారు.నెయ్యిపై దుమారం రేపి.. స్కామ్లుతిరుమలకు సరఫరా అయిన నెయ్యి టెండర్లను గమనిస్తే రూ.200 కోట్ల స్కామ్ బయటపడుతుంది. ఉద్దేశపూర్వకంగానే ఏడాదిలోనే కిలో నెయ్యి రేటును రూ.351 నుంచి రూ.716కు పెంచేశారు. ఇది ప్రపంచ చరిత్రలో కనీవినీ ఎరుగని స్కామ్. దేవుడంటే భయభక్తులు లేకుండా.. ఒక పక్కన నెయ్యిపై దుమారం రేపి.. అదే నెయ్యిని అడ్డుపెట్టుకుని స్కామ్లు చేస్తున్నారు. ఇదేనా తాట తీయడం? తాట తీస్తామని డైలాగులు చెప్పడం కాదు.. మహిళలపై దారుణాలకు పాల్పడ్డ కూటమి నేతల్లో ఎంతమందిపై చర్యలు తీసుకున్నారు? రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే తనపై అత్యాచారానికి ఒడిగట్టాడని బాధితురాలు నీకే ఫిర్యాదు చేసింది బాబూ! టీటీడీ చైర్మన్ ఓ మహిళను మోసం చేసి వీడియోలు, ఫొటోలతో దొరికిపోతే ఏం చేశావ్ బాబూ? కేజీబీవీ ప్రిన్సిపాల్పై టీడీపీ ఎమ్మెల్యే కూన వేధింపుల మీద చర్యలేవి? – మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: ‘ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్.. సూపర్ సెవెన్ హామీలను ఎప్పుడు అమలు చేస్తారు? మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఉద్యోగులకు మీరు బకాయి పడిన నిధులు ఎప్పుడు ఇస్తారు? బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో నేను అడిగిన ప్రశ్నలకు.. 16 రోజులపాటు నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో నోరు మెదపలేదెందుకు?’ అంటూ సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. ‘బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత మళ్లీ అడుగుతున్నా.. ఇప్పటికే మూడు బడ్జెట్లు పెట్టారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అధికారంలోకి వచ్చీ రాగానే 2024 జూన్ నుంచే అమలులోకి వస్తాయన్నారు. హామీల పేరిట బాకీ పడ్డ సొమ్ములు ఎప్పుడిస్తావు? అని అడిగితే మాత్రం నోరు మెదపడం లేదు’ అంటూ నిలదీశారు. గిట్టుబాటు ధర లేక, అప్పుల ఊబిలో కూరుకుపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ఆదుకోవాల్సింది పోయి 16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో ఆటలు.. పాటలు.. స్కిట్లతో కాలక్షేపం చేస్తారా? అంటూ నిప్పులు చెరిగారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఎత్తిచూపుతూ.. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన హామీల వీడియోలు ప్రదర్శిస్తూ.. పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలను గుర్తు చేస్తూ.. ఆ హామీల అమలుకు బడ్జెట్లో కేటాయింపులను వివరిస్తూ.. ప్రజలకు చంద్రబాబు సర్కార్ చేస్తున్న మోసాన్ని ఆధారాలతో సహా చూపుతూ నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..అన్నదాత సుఖీభవ.. నిలుపునా మోసం⇒ పీఎం కిసాన్ కాకుండా అన్నదాత సుఖీభవ పేరిట ఏటా రూ.20 వేలు ఇస్తామన్నాడు (గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే రూ.6 వేలు కాకుండా ప్రతి ఏటా రైతుకు రూ.20 వేలు ఇస్తామంటూ ఎన్నికల్లో చంద్రబాబు మాట్లాడిన మాటలతో కూడిన వీడియోను ప్రదర్శించారు). తొలి ఏడాది ఎగ్గొట్టాడు. రెండో ఏడాది రూ.20 వేలకు గాను అప్పుడో రూ.ఐదు వేలు.. అప్పుడో రూ.ఐదు వేలు ఇచ్చాడు. అంటే రెండేళ్లలో రూ.40 వేలకు గాను రూ.10 వేలు ఇచ్చాడు. ఒక్కో రైతుకు రూ.30 వేలు బాకీ పడ్డారు. మా హయాంలో 53.58 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇస్తే చంద్రబాబు ప్రభుత్వంలో వారి సంఖ్యను 46.85 లక్షల మందికి కుదించేశారు. దాదాపు 7 లక్షల మందికి ఎగ్గొట్టారు. పైగా కౌలు రైతులకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా ఒక్క పైసా ఇచ్చింది లేదు. ఈ బాకీ సొమ్ములు ఎప్పుడిస్తావు అని అడిగితే అసెంబ్లీ సమావేశాల్లో నోరు మెదపలేదు. ⇒ 2023–24 ఖరీఫ్కు సంబంధించి 2024 జూన్లో రాష్ట్ర ప్రభుత్వం రైతుల తరఫున ఇన్సూ రెన్స్ ప్రీమియం కట్టి ఉంటే.. కేంద్రం ఇవ్వాల్సింది జత చేసేది. ఆ వెంటనే రైతులకు ఇన్సూరెన్స్ కంపెనీలు బీమా పరిహారం చెల్లించేవి. ఈ పెద్దమనిషి 2024 జూన్లో ప్రీమియం డబ్బులు కట్టక పోవడంతో రైతులు రూ.1,324 కోట్లు నష్టపోయారు. ఉచిత పంటల బీమాను రద్దు చేసి రైతులను గాలికొదిలేశారు. చంద్రబాబు నిర్వాకాల వల్ల 2023–24, 2024–25 సీజన్లలో రూ.3,500 కోట్ల మేర బీమా పరిహారం నష్టపోయారు. ఇది ఎప్పుడు ఇస్తారని అడిగితే సమాధానం లేదు. ⇒ అక్టోబర్లో మోంథా తుపాన్తో నష్టపోయిన రైతులకు ఒక్క రూపాయి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారని అడిగితే వీళ్ల నోటి నుంచి ఒక్క మాట రాదు. ⇒ మా ప్రభుత్వ హయాంలో ధరల స్థిరీకరణ నిధి రూ.3 వేల కోట్లు పెట్టి.. రూ.7,500 కోట్లు వెచ్చించి అండగా నిలిచాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి ఎకరాలో సాగైన ప్రతి పంటను ఈ–క్రాప్లో నమోదు చేసేవాళ్లం. ఏ రైతుకు అయినా తాను వేసిన ఏ పంటకైనా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉంటే సీఎం యాప్ (కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్) ద్వారా పర్యవేక్షిస్తూ ధరలు పడిపోయినా ప్రతిసారీ ఆదుకున్నాం. పైగా ప్రతీ ఆర్బీకేలో ప్రతి పంటకు నిర్దేశించిన మద్దతు ధరలతో బోర్డులు పెట్టి దళారుల వెన్నులో వణుకు పుట్టించేవాళ్లం. అంతకంటే తక్కువ రేటుకు కొనేందుకు సాహసిస్తే.. వెంటనే స్పందించేవాళ్లం. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేదు. ఇంత దారుణమా.. రైతులంటే ఇంత చులకనేంటయ్యా.. అని అడిగితే సమాధానం చెప్పకపోగా ఎదురుదాడి చేస్తున్నారు.ఏ ఒక్క పంటకు మద్దతు ధర లేదు⇒ గతేడాది వరి, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, కందులు, మినుములు, పెసలు, సజ్జలు, శనగలు, మిర్చి, టమాటా, చీనీ, పత్తి అన్ని పంటలకు ధరలు పడిపోతే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా మళ్లీ మిర్చి, శనగ, అరటి, మొక్కజొన్న పంటలకు ధరలు పడిపోయాయి. నెల క్రితం క్వింటా రూ.26 వేలున్న మిర్చి.. ఈ రోజు రూ.18 వేలకు పడిపోయింది. శనగ కనీస మద్దతు ధర రూ.5,875.. రైతులకు రూ.5 వేలకు మించి రావడం లేదు. మొక్కజొన్న మద్దతు ధర రూ.2,400 అయితే, రైతులు కేవలం రూ.1400–1500కు అమ్ముకుంటున్నారు. ఈ ఒక్క పంటపైనే రూ.3,500 కోట్లు నష్టపోతున్నారు.⇒ అరటి ఈ ఏడాది కూడా టన్ను రూ.5 వేలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. మా హయాంలో టన్ను రూ.30 వేలు పలుకగా, ఈ రోజు రూ.5 వేలకు తెగనమ్ముకుంటున్నారు. టమాటా కిలో రూ.2కు అమ్ముకోవాల్సి వస్తోంది. బత్తాయి, పుచ్చకాయ, మస్క్మెలన్, సజ్జలు ఇలా అన్ని పంటల పరిస్థితి ఇలాగే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు అండగా ఉండేందుకు ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3 వేల కోట్లు పెట్టి రైతులకు తోడుగా నిలవాల్సింది పోయి బడ్జెట్లో రూ.300 కోట్లు పెట్టారు. ఇంత తక్కువ ఎందుకు పెట్టారని అడిగితే నోరు మెదపడం లేదు.⇒ రైతులు ఇంత దారుణమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఆటలు, పాటలు, స్కిట్లతో కాలక్షేపం చేశారు. అసెంబ్లీలో వీళ్ల ప్రవర్తన చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. వ్యవసాయ రంగం ఎంత సంక్షోభంలో ఉందంటే.. వందలాది మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 2025–26లో 393 మంది రైతులు, 2,472 మంది రైతు కూలీలు ఆత్మహత్యలకు పాల్పడితే ఒక్క పైసా పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు. వీరికి పరిహారం ఎప్పుడు ఇస్తారని అడిగితే అసెంబ్లీలో ఒక్క మాట చెప్పలేదు. కనీసం వ్యవసాయ రంగంలో సంక్షోభం, రైతుల కష్టాలపై అసెంబ్లీలో చర్చించడం, వారికి భరోసా కల్పించడం మచ్చుకైనా చేయలేదు. మరో 7.46 లక్షల పింఛన్లు కోత వేయబోతున్నారు⇒ 2024 ఎన్నికల షెడ్యూల్ నాటికి మార్చిలో మేము ఇచ్చిన పింఛన్ల సంఖ్య 66,34,372. ఈ నెలలో ఇచ్చిన పింఛన్ల సంఖ్య 60,69,664. అంటే ఇప్పటికే 5,64,708 పింఛన్లు కట్ చేశారు. 2026 ఫిబ్రవరిలో 60,96,108 మందికి పింఛన్లు ఇస్తే.. మార్చిలో 60,69,664 మందికి ఇచ్చారు. అంటే ఈ ఒక్క నెలలోనే 26 వేల పింఛన్లు కట్ చేశారు. ఇలా ప్రతీ నెలా పింఛన్లు కట్ చేసూ్తనే ఉన్నారు. కొత్తగా ఒక్క పింఛన్ ఇవ్వలేదు. ఇప్పటికే ప్రభుత్వం వద్ద పింఛన్ కోసం 2.50లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి.⇒ కొత్త పింఛన్ల మంజూరు కోసం ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. మా హయాంలో ప్రతి ఆర్నెల్లకోసారి జూన్, డిసెంబర్లలో పింఛన్లు అప్డేట్ చేసే వాళ్లం. ఈరోజు ఆ పరిస్థితి కన్పించడం లేదు. కనీసం మార్చిలో ఇచ్చిన పింఛన్ల సంఖ్యను బట్టి చూసినా ఈ ఏడాది బడ్జెట్లో రూ.31,554 కోట్లు పెట్టాలి. కానీ బడ్జెట్లో పెట్టింది కేవలం రూ.27,719 కోట్లు. అంటే మరో 7,45,993 పింఛన్లు కట్ చేయబోతున్నామని చెప్పకనే చెప్పారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని, బడ్జెట్లో ఎందుకు తగ్గించి చూపిస్తున్నారో చెప్పాలని అడిగాం. 16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో కనీస ప్రస్తావన కూడా లేదు.తల్లికి వందనం పేరిట దగా⇒ తల్లికి వందనం కింద చదువుకునే ప్రతీ పిల్లాడికి రూ.15 వేలు చొప్పున ఎంత మంది పిల్లలుంటే అంత మందికి ఇస్తామన్నారు. తొలి ఏడాది ఎగ్గొట్టారు. రెండో ఏడాది ఏకంగా 20 లక్షల మంది పిల్లలకు పథకాన్ని కత్తిరించారు. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆన్ ఎడ్యుకేషన్ (యూడీఐఎస్ఈ–యూడైస్) ప్రకారం 2023–24లో బడికి వెళ్లే పిల్లలు 87,41,885 మంది ఉన్నారు. కానీ ఇచ్చింది 67 లక్షల మందికే.తల్లికీ వంచనే.. యూడైస్ ప్లస్ ప్రకారం 87,41,885 మంది పిల్లలకు తల్లికి వందనం కింద రూ.13,112 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. ఈ బడ్జెట్లో కేటాయించింది కేవలం రూ.8,456.48 కోట్లు మాత్రమే ⇒ పైగా ఏ ఒక్కరికి రూ.15 వేలు ఇవ్వలేదు. కొంత మందికి రూ.8 వేలు, మరికొంత మందికి రూ.9 వేలు, ఇంకొంత మందికి రూ.10 వేలు, అక్కడక్కడా అతి కొద్ది మందికి రూ.13 వేలు చొప్పున ఇచ్చారు. మొదటి ఏడాది ఎగ్గొట్టిన డబ్బులతో పాటు రెండో ఏడాది ఇవ్వాల్సిన మిగిలిన డబ్బులు ఎప్పుడిస్తారని అడిగితే సమాధానం లేదు. ⇒ ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. తీరా ఇప్పుడు షరతులు పెట్టారు. ఆర్టీసీలో 16 రకాల సర్వీసులుంటే కేవలం 5 రకాల సర్వీసులకే పరిమితం చేశారు. ఎందుకు ఈ మాదిరిగా షరతులు పెట్టారని అడిగితే నోరు మెదపడం లేదు. ⇒ దీపం పథకం కింద ప్రతి మహిళకు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నారు. తొలి ఏడాది ఒక సిలిండర్కే ఇచ్చి మిగిలిన రెండు సిలిండర్లు డబ్బులు ఎగ్గొట్టారు. గ్యాస్ కంపెనీల డేటా ప్రకారం రాష్ట్రంలో కోటి 59 లక్షల కనెక్షన్లున్నాయి. ఒక్కో గ్యాస్ సిలిండర్కు రూ.855 చొప్పున 3 సిలిండర్లకు ఏడాదికి రూ.4 వేల కోట్లు ఖర్చు చేయాలి. అంటే మూడేళ్లకు రూ.12 వేల కోట్లు ఖర్చు చేయాలి. కానీ తొలి ఏడాది రూ.786 కోట్లు ఖర్చు చేశారు. రెండో ఏడాది రివైజ్డ్ ఎస్టిమేట్స్లో రూ.2,199 కోట్లుగా చూపించారు. ఇచ్చారో లేదో కూడా తెలియదు. ఈ బడ్జెట్లో రూ.2,600 కోట్లు పెట్టారు. మరి రూ.12 వేల కోట్లకు గానూ ఇచ్చింది సగం కూడా లేదు. ఈ పథకం కింద మహిళలకు రూ.6,144 కోట్లు బాకీ పడ్డారు. ఈ సొమ్ములు ఎప్పుడు ఇస్తారని అడిగితే నోరు మెదపడం లేదు.నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి ఏమైంది?⇒ యువగళం పేరు పెట్టి నిరుద్యోగ భృతి కింద రాష్ట్రంలోని ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. ఏటా రూ.36 వేల చొప్పున మూడేళ్లకు ప్రతి నిరుద్యోగికి బాకీపడ్డ రూ.1.08 లక్షలు ఎప్పుడు ఇస్తారో చెప్పమంటే నోరు మెదపడం లేదు. ఆడబిడ్డలకూ తీవ్ర అన్యాయం రాష్ట్రంలో 18 నుంచి 60 ఏళ్ల వయసు గల మహిళలు 1,78,99,440 మంది ఉండగా.. ఒక్కరికి కూడా ఆడబిడ్డ నిధి కింద ఇప్పటి వరకు పైసా ఇవ్వలేదు ⇒ సూపర్ సిక్స్లో రెండో కీలకమైన హామీ..18 ఏళ్లు నుంచి 60 ఏళ్ల వయసులోపు ఉన్న మహిళలకు ఆడబిడ్డ నిధి పేరిట నెలకు రూ.1,500 ఇస్తామన్నారు. ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 2,10,58,615 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. వీరిలో 60 ఏళ్లు పైబడిన వారిని తీసేస్తే 1,78,99,440 మంది అర్హులు. వీరికి ప్రతి నెలా రూ.1,500.. ఏడాదికి రూ.18 వేలు చొప్పున మూడేళ్లకు బాకీ పడ్డ రూ.54 వేలు ఎప్పుడు ఇస్తారని అడిగితే 16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో కనీస ప్రస్తావన కూడా చేయలేదు. ⇒ మరో ముఖ్యమైన హామీ.. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్ పథకం. ఈ పథకం కింద నెలకు రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.48 వేలు..ఇలా మూడేళ్లలో రూ.1.44 లక్షలు బాకీ పడ్డారు. ఎప్పుడు ఇస్తారని అడిగితే కనీసం మాట్లాడటం లేదు.ప్రతినెలా 25 వేలకు పైగా పింఛన్ల కోత వైఎస్ జగన్ 2024 మార్చిలో 66,34,372 మందికి పింఛన్లు ఇవ్వగా.. చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో పింఛన్లు ఇచ్చినది 60,69,664 మందికి మాత్రమే ఆరోగ్యశ్రీ నిర్వీర్యం.. ఆరోగ్యశ్రీ పథకం నడవాలంటే బకాయిలతో కలిపి రూ.7,150 కోట్లు కావాలి. బడ్జెట్లో రూ.4 వేల కోట్లు మాత్రమే కేటాయించిన చంద్రబాబు గతంలో రూ.2 వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. నెట్వర్క్ ఆస్పత్రుల్లో సేవలు ఆగిపోతున్నా చంద్రబాబుకు చీమ కుట్టినట్లైనా లేదు. పిల్లల చదువులెలా సాగుతాయి? ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన కింద బకాయిలతో కలిపి మొత్తం రూ.10,328 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఈ ఏడాది బడ్జెట్లో కేటాయింపులు రూ.2,766 కోట్లు మాత్రమే. ఇలా అయితే పిల్లల చదువులు ఎలా సాగుతాయి? ఫీజులు కట్టలేక పిల్లలు చదువులు మానేస్తున్నారు. పెన్షన్లు కటింగ్...50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్ హామీని నెరవేర్చకుండా మూడేళ్లలో ఒక్కొక్కరికీ రూ.1.44 లక్షలు బాకీ పడ్డారు. మరోవైపు సామాజిక పెన్షన్లు ఇప్పటికే 5,64,708 కట్ చేశారు. ఒక్క నెలలోనే 26 వేల పింఛన్లు కట్ చేశారు. ప్రతీ నెలా పింఛన్లు కట్ చేస్తూనే ఉన్నారు. కొత్తగా ఒక్క పింఛనూ ఇవ్వలేదు. పింఛన్ కోసం 2.50లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. బడ్జెట్ కేటాయింపులను బట్టి మరో 7,45,993 పింఛన్లు కట్ చేయబోతున్నామని చెప్పకనే చెబుతున్నారు. 50 ఏళ్లకే పింఛన్ ఇంకెప్పుడు? బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని ఎన్నికల ముందు పచ్చ పత్రిక ఈనాడులో చంద్రబాబు ఇచ్చిన ప్రకటన అన్నదాతకు దగా...పీఎం కిసాన్ కాకుండా అన్నదాత సుఖీభవ పేరిట ప్రతి రైతుకూ ఏటా రూ.20 వేలు చొప్పున ఇస్తామన్నాడు. రెండేళ్లలో రూ.40 వేలకు గాను రూ.10 వేలు ఇచ్చాడు. ఒక్కో రైతుకు రూ.30 వేలు బాకీ పడ్డారు. 7 లక్షల మందికి ఎగ్గొట్టారు. కౌలు రైతులకు ఒక్క పైసా ఇవ్వలేదు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా ఒక్క పైసా ఇచ్చింది లేదు. ఉచిత పంటల బీమాను రద్దు చేసి రైతులను గాలికొదిలేశారు. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. ఏ ఒక్క పంటకూ మద్దతు ధర లేదు. ధరల స్థిరీకరణ నిధికి తూట్లు పొడిచారు. రైతులు ఇంత దారుణమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేల ఆటపాటలు, స్కిట్లతో కాలక్షేపం చేశారు. ఇళ్లపై దొంగ మాటలు..మేం 31 లక్షల పట్టాలిచ్చి 21 లక్షల ఇళ్లు శాంక్షన్ చేశాం. 10 లక్షల ఇళ్లను పూర్తి చేశాం. మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. కేంద్రం ఇచ్చిన డబ్బులను చంద్రబాబు మళ్లించడంతో ఈ పథకం ఆగిపోయింది. కనీసం మేం మంజూరు చేసిన ఇళ్లను పూర్తి చేసేందుకు డబ్బులు ఇవ్వాలని అడుగుతుంటే త్రిబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని దొంగ మాటలు చెబుతున్నారు. ఈ రెండేళ్లలో ఒక్క అక్క చెల్లెమ్మకైనా గజం స్థలం ఇచ్చారా? ఒక్క ఇంటి పట్టా ఇవ్వలేదు. కొత్తగా ఒక్క ఇంటిని కూడా మంజూరు చేయలేదు.ఇవన్నీ ఎవరి హయాంలో జరిగాయి?జగన్కు ఎలాంటి క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకు నచ్చదు. కనీసం క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న ఉద్యోగులకూ థ్యాంక్స్ చెప్పరు. సర్వేయర్ల వ్యవస్థ, సచివాలయాల వ్యవస్థ ఎవరి వల్ల వచ్చింది? సర్వే పరికరాలు, కోర్ స్టేషన్లు, రోవర్స్ ఎవరు తీసుకొచ్చారు? విమానాలు, హెలికాప్టర్లలో సర్వేలు ఎవరి హయాంలో జరిగాయి? ఓఆర్ఐ రికార్డులు, సర్వే అనంతరం హద్దుల్లో పాతడానికి కోట్ల హద్దు రాళ్లు ఎవరి హయాంలో సమకూర్చారు? పాస్బుక్లో క్యూఆర్ కోడ్, జియో ట్యాగింగ్ హద్దు నిర్ణయం ఎవరి హయాంలో ప్రారంభమైంది? -
ప్రతి సోమవారం హోటళ్లకు ‘వీక్లీ హాలిడే’
సాక్షి, అమరావతి: గ్యాస్ కొరత కారణంగా రాష్ట్రంలోని స్టార్ హోటళ్ల నుంచి జొమాటొ, స్విగ్గీ ఆన్లైన్ ఆర్డర్లను త్వరలో నిలిపివేస్తున్నట్టు హోటళ్ల అసోసియేషన్ జేఏసీ ప్రకటించింది. ముఖ్యంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరతతో వినియోగాన్ని తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకుంది. అమెరికా–ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో వాణిజ్య గ్యాస్కు తీవ్ర కొరత ఏర్పడే అవకాశం ఉండటంతో బుధవారం ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్, ఏపీ హోటల్స్ అసోసియేషన్ జేఏసీ సమావేశమైంది. అనంతరం ఏపీ స్టార్ హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్వీ స్వామి, విజయవాడ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పీవీ రమణ మీడి యాతో మాట్లాడుతూ.. గ్యాస్ కొరతతో పెరుగుతున్న నిర్వహణ ఖర్చులపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోతే హోటళ్లను మూసి వేయాల్సిందేనన్నారు. గురువారం నుంచి హోటళ్లలో గ్యాస్ వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలని నిర్ణయించామన్నారు. స్టార్ హోటళ్లలో జొమాటో, స్విగ్గీ ఆర్డర్లను త్వరలోనే నిలిపివేస్తామన్నారు. ముఖ్యంగా ప్రతి సోమవారం రెస్టారెంట్లను పూర్తిగా మూసివేసి ‘వీక్లీ హాలిడే’గా ప్రకటిస్తామన్నారు. కర్ణాటక తరహాలో ఏపీలోనూ కొన్ని హోటల్స్ కేవలం టీ, కాఫీ మాత్రమే విక్ర యించే పరిస్థితి వస్తుందన్నారు. రాత్రి 10 గంటల వర కే రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లను నడిపేలా చూడా లని ప్రభుత్వాన్ని కోరారు. గ్యాస్ ఏజెన్సీలు వాణిజ్య గ్యాస్ నిల్వలు నిండుకున్నాయని చెప్పడంతో హోటళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. మరోవైపు బ్లాక్ మార్కెట్కు తరలుతున్న గ్యాస్ను ప్రభుత్వం అరికట్టాలని కోరారు. వాణిజ్య గ్యాస్ నిలిపివేత నిర్ణయంతో లక్షలాది కుటుంబాలు రోడ్డున పడతాయని, హాస్పిటాలిటీని ప్రాధాన్యతగా గుర్తించాలని కోరారు. -
నేడు వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం గురువారం ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయాన్ని విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. పార్టీ కార్యాలయంలోకి వెళ్లే మార్గాలను పార్టీ రంగుల తోరణాలతో సుందరంగా తీర్చిదిద్దారు. వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్పీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడలా పార్టీ పతాకాలు ఎగుర వేయాలని కేంద్ర కార్యాలయం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. దీంతో అన్ని జిల్లాల్లో నేతలు, అభిమానులు, కార్యకర్తలు అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. -
సర్కారు వైద్యానికి సుస్తీ!
సాక్షి, నెట్వర్క్: సర్కారు వైద్యానికి సుస్తీ చేసింది. నయం చేయలేని రోగంతో ప్రభుత్వ ఆస్పత్రులు కునారిల్లుతున్నాయి. నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిరుపేదలు వైద్యం కోసం నానా అవస్థలు పడుతున్నారు. ఏ ఆస్పత్రిలోనూ తగినన్ని పడకలు లేవు. ఒకే పడకపై ఇద్దరు నుంచి ఏడుగురు పేషెంట్లు కనిపిస్తున్నారు. ఆస్పత్రి పరిసరాలు, బాత్రూమ్లు దుర్గంధభూయిష్టంగా ఉన్నాయి. కనీస పారిశుద్ధ్యం కనిపించలేదు. అత్యవసర చికిత్స కోసం పేషెంట్లు ఆదరాబాదరాగా వస్తే.. స్ట్రెచర్లు కాదు కదా కనీసం వీల్చైర్లో తీసుకెళ్లే దిక్కు కూడా లేదు. కొన్ని ఆస్పత్రులలో వీల్చైర్లు ఉన్నా సిబ్బంది లేరు. రోగి వెంట వచ్చే కుటుంబ సభ్యులే వారిని తీసుకెళ్లడమో మోసుకెళ్లడమో చేస్తున్నారు. వీల్చైర్లు, స్ట్రెచర్లే కాదు ముఖ్యమైన పరికరాలూ లేవు. ఉన్నా పనిచేయని స్థితిలో ఉన్నాయి. రిపేర్లు చేయించేవారు లేరు. సిబ్బంది కొరతతో పాటు వైద్యుల కొరత కూడా ఆస్పత్రులను వేధిస్తోంది. నెలల తరబడి ఈ ఖాళీలు భర్తీ కావడం లేదు. చచ్చీచెడీ వైద్యం చేయించుకున్నా మందులకు ఠికాణా ఉండడం లేదు. బయట కొనుక్కోండి అని సిబ్బంది చెబుతుంటే పేదలు బిక్కమొహం వేస్తున్నారు. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ‘సాక్షి’ పరిశీలనలో కనిపించిన విషయాలివీ.. ప్రాణాధారమైన పరికరాలెక్కడ?విజయవాడ జీజీహెచ్లో వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉంది. వెంటిలేటర్లు కొనాలని ఆరు నెలలుగా వైద్యులు కోరుతున్నా, ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. దీంతో ప్రాణాపాయంలో ఉన్న రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు జీజీహెచ్లో సిటీస్కాన్ పరికరం ఆరు నెలలకుపైగా మూలన పడింది. పట్టించుకునే నాథుడే లేడు. బాపట్ల జిల్లా కేంద్రంలోని ఏరియా వైద్యశాలలో కూడా సీటీస్కాన్ పరికరం లేదు. బయటకు పంపిస్తున్నారు. పాడేరు జిల్లా ఆస్పత్రిలో ఒకే ఒక ఎక్స్రే యూనిట్ ఉంది. వందలమంది రోగులు గంటల తరబడి అక్కడ క్యూలైన్లో వేచి ఉండాల్సి వస్తోంది.వైద్యులే కాదు సాధారణ ఉద్యోగులకూ కొరతే..విజయవాడ జీజీహెచ్లో నాల్గో తరగతి ఉద్యోగుల(ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ) కొరత తీవ్రంగా ఉంది. దీంతో రోగులను ఒకచోట నుంచి మరో చోటుకు తరలించాలన్నా, క్యాజువాలిటీ నుంచి ఐసీయూకు తరలించాలన్నా రోగుల బంధువులే తీసుకెళ్లాల్సిన దయనీయ స్థితి నెలకొంది. కనీసం 350 మంది ఉండాల్సిన ఉద్యోగులు కేవలం 96 మంది మాత్రమే ఉన్నారు. నెల్లూరు జిల్లా కేంద్రంలోని సర్వజన ఆస్పత్రిలో రోజు 1,200 నుంచి 1,300 వరకు ఓపీ ఉంటుంది. ఇన్ పేషెంట్లు సుమారు 500 మంది ఉంటారు. తగినంత మంది ఎంఎన్ఓలు, ఎఫ్ఎన్ఓలు లేరు. వీల్ చైర్లు, స్ట్రెచర్లో రోగులను తరలించడం ఇబ్బందిగా మారింది. ప్రకాశం జిల్లా ఒంగోలు సర్వజనాస్పత్రిలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న మేదరమెట్లకు చెందిన నలబోతుల కోటమ్మ అనే మహిళను 11 ఏళ్ల ఆమె కుమారుడు కోటయ్య వీల్ చైర్లో కూర్చోబెట్టుకొని తోసుకుంటూ తీసుకెళ్లడం కనిపించింది. గుంటూరు జీజీహెచ్లో మందుల కోసం క్యూ లైన్లో బారులు తీరిన రోగులు, వృద్ధులు పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని జిల్లా కేంద్ర ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది కొరత ఉంది. అత్యవసర సమయాల్లోనూ, ఆదివారాల్లోనూ మత్తు డాక్టర్ అందుబాటులో ఉండకపోవడం సమస్యగా మారిందని రోగులంటున్నారు. ఏలూరు జీజీహెచ్, మెడికల్ కళాశాలకు సంబంధించి 51కిపైగా ఖాళీలు ఉన్నాయి. ఇక గుండెపోటు వస్తే వైద్యం చేసే నాథుడే లేడు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం ఏరియా ఆస్పత్రిలో నాల్గవ తరగతి ఉద్యోగుల కొరత ఉంది. 18 మందికిగాను కేవలం నలుగురు మాత్రమే ఉన్నారు. జీడీ వర్కర్లు ఎనిమిది మందికి ముగ్గురు ఉన్నారు. పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో ముఖ్యమైన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనివల్ల విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాలకు రిఫర్ చేస్తున్నారు. ప్రధానంగా సివిల్ సర్జన్ ఆర్ఎంఓ, డిప్యూటీ సివిల్ సర్జన్ రేడియాలజీ స్పెషలిస్ట్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్, మైక్రో బయాలజీ, ఈఎన్టీ, నర్సింగ్ సూపరింటెండెంట్ వంటి కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసే వారు సైతం లేకపోవడంతో ఈ విభాగం తాళం వేసే ఉంటోంది. దీంతో ఈ సేవలకు కూడా రోగులు బయటకు వెళ్లాల్సి వస్తోంది. విజయనగరం జిల్లా సర్వజనాస్పత్రిలో సాయంత్రం నాలుగు గంటల తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్ సేవలు అందడం లేదని రోగులు చెబుతున్నారు. బంధువులే రోగులను ఎక్స్రే, స్కానింగ్, వైద్య పరీక్షల కోసం వీల్ చైర్, స్ట్రెచర్లపై తరలిస్తుండడం కనిపించింది.ఇద్దరు నుంచి ఏడుగురు రోగులకు ఒకే పడక..పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో 150 పడకలు ఉంటే.. ఇన్ పేషెంట్లు 286 మంది ఉన్నారు. దీనివల్ల ఒకే పడకపై ఇద్దరిని సర్దుబాటు చేసి, చికిత్స అందిస్తున్నారు. రోగులు, వారి బంధువులు వేచి ఉండేందుకు సరిపడా సౌకర్యాలు లేవు. కుర్చీలు కూడా లేక కిందే కూర్చోవాల్సిన పరిస్థితి. గర్భిణులకూ ఇవే ఇక్కట్లు. గుంటూరు జీజీహెచ్లో తుప్పు పట్టిన మంచాలపై, పరుపులు సైతం చిరిగిపోయిన మంచాలపై రోగులు ఉండాల్సిన దుస్థితి నెలకొంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం ఏరియా ఆస్పత్రిలో 100 పడకలుండాలి కానీ నలభై బెడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాటిలో కూడా చాలా బెడ్లను ఆస్పత్రి కారిడార్లలో ఉంచారు. విజయనగరం జిల్లా సర్వజన ఆస్పత్రిలో వార్డుల్లో పడకలు చాలక రోగులకు వరండాలోనే చికిత్స అందిస్తున్నారు. గత ఫిబ్రవరి 7న పోలవరం జిల్లా మారేడుమిల్లి మండలం దేవరపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు ఇడ్లీ, నిల్వ చట్నీ తిని అస్వస్థతకు గురికావడంతో వారిని రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ బెడ్లు చాలక ఒకే మంచంపై ఏడుగురిని కూర్చోబెట్టి చికిత్స అందించిన దుస్థితి సర్కారు నిర్లక్ష్యానికి అద్దంపట్టింది. రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో ఒకే బెడ్పై ఏడుగురు విద్యార్థులను కూర్చోబెట్టి చికిత్స చేస్తున్న దృశ్యం (ఫైల్) మందుల్లేవ్.. బయట కొనుక్కోండి..విజయవాడ జీజీహెచ్లో కార్డియాలజీ, న్యూరాలజీకి సంబంధించిన కొన్ని రకాల మందులు అందుబాటులో లేవు. దీంతో రోగులు బయట కొనుగోలు చేస్తున్నారు. బాపట్ల జిల్లా సంతమాగులూరు ఏరియా వైద్యశాలలో చాలా రకాల మందులు అందుబాటులో లేవు. బయట కొనుక్కోమని సిబ్బందే సలహా ఇస్తున్నారు. మార్కాపురం జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జనరల్ వైద్యశాలలో జలుబు, దగ్గు మందులు కూడా లేవు. కాకినాడ జీజీహెచ్లో మందుల కొరత వేధిస్తోంది. అత్యవసర కేటగిరికి చెందిన మందులు కూడా లేకపోవడం రోగులకు ప్రాణ సంకటంగా మారుతోంది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో మందులు లేవంటూ చీటి రాసి బయట తెచ్చుకోమంటున్నారని రోగులు చెబుతున్నారు.సాయం పట్టని సిబ్బందితీవ్ర అస్వస్థతతో అచేతనంగా కుటుంబ సభ్యుల సాయంతో ఆస్పత్రికి వచ్చిన ఈ వృద్ధురాలి పేరు పి.నాగమణి. శ్వాస సరిగ్గా ఆడటం లేదనీ.. మూత్ర సమస్యతో బాధపడుతోందంటూ కుటుంబ సభ్యులు విశాఖ కేజీహెచ్కు ఉదయం 10.45కి తీసుకొచ్చారు. కుమార్తె క్యాజువాలిటీలోకి వెళ్లి సిబ్బందికి సమస్య వివరించారు. చాలాసేపటి తర్వాత ఆమె చేతికి స్ట్రెచర్ ఇచ్చి పంపించారు. నాగమణి కుటుంబసభ్యులే ఆటోలోంచి వృద్ధురాలిని లేపి స్ట్రెచర్పై పడుకోబెట్టి.. క్యాజువాలిటీలోకి తీసుకెళ్లాల్సి వచ్చింది.మనవరాలిని ఎత్తుకుని తాత అవస్థలు పాడేరు మండలం కుజ్జెలి గ్రామానికి చెందిన గబ్బాడ గంగన్న గాయపడిన తన మనవరాలు శైలజను చంకన ఎత్తుకుని ఎక్స్రే గది వద్ద చాలా అవస్థ పడ్డాడు. ఎక్స్రే గది వద్ద రోగుల తాకిడి అధికంగా ఉండడంతో గంగన్న కూడా సుమారు గంటన్నర పాటు క్యూలైన్లో నిరీక్షించాల్సి వచ్చింది.ఆస్పత్రులా.. డంపింగ్ యార్డులా..పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాల పరిసరాలు దుర్గంధభూయిష్టంగా మారాయి. ఆస్పత్రిలోని డ్రైనేజీలలో నీరు ముందుకు కదలక పాచిపట్టి కనిపిస్తున్నాయి. వాడిన నీరు బయటకు వెళ్లే మార్గం లేదు. మార్కాపురం జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జనరల్ వైద్యశాలలో బ్లడ్బ్యాంకు వైపు వెళ్లే ప్రాంతాల్లో నీరు నిలిచి దుర్గంధం వెదజల్లుతోంది. మచిలీపట్నం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రోగులు, వారి సహాయకులకు అవసరమైన టాయిలెట్లు లేకపోవడం తీవ్ర సమస్యగా మారింది. ఉన్న టాయిలెట్లు రిపేర్ల పేరుతో తాళాలు వేసి ఉంచుతున్నారు. దీంతో రోగులు, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్కాపురం జీజీహెచ్ పరిసరాల్లో మురుగునీరు నిలిచిపోయి తీవ్ర దుర్గంధాన్ని వెదజల్లుతోంది. అనంతపురం సర్వజన ఆస్పత్రిలోనూ పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది.వీల్చెయిర్లు, స్ట్రెచర్లు లేవు..గుంటూరు జీజీహెచ్ ఓపీ విభాగంలో రోగులు చికిత్స పొందేందుకు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా వీల్చైర్లు, స్ట్రెచర్లు అందుబాటులో లేవు. రోగుల సహాయకులే రోగులను తరలించాల్సి వస్తోంది. కడపలోని జీజీహెచ్ (రిమ్స్) ఓపి వద్ద వీల్ చైర్, స్ట్రెచర్లు లేకపోవడంతో రోగుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.వార్డు బాయ్ కూడా లేరు..మా నాన్న సింహాచలం తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతుంటే కేజీహెచ్లో అడ్మిట్ చేశాం. టెస్టులకు, స్కానింగ్కు వెళ్లాలంటే మేమే తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ఎవరూ సాయం చెయ్యడం లేదు. వీల్ చెయిర్ ఇస్తున్నారు. అక్కడ వార్డు బాయ్ లేరని చెప్పారు.– సాయికృష్ణ, దత్తిరాజేరు, విజయనగరం జిల్లామందులకు రూ.450 ఖర్చు అయ్యిందికొంత కాలంగా విపరీతమైన దగ్గు వస్తోంది. నోటి నుంచి రక్తం సైతం పడుతోంది. ఏరియా ఆసుపత్రికి వచ్చాను. పరీక్షించిన డాక్టర్ నాలుగు రకాల మందులు రాయగా అందులో ఒకటే ఇచ్చి మూడు బయట తీసుకోమన్నారు. ప్రైవేట్ దుకాణంలో రూ.450 ఖర్చు చేసి కొన్నాను. ఈ ప్రభుత్వం వచ్చాక మందులు కొనుక్కోవలసిరావడం మా వంటి పేదలకు భారంగా మారింది. – షేక్ షఫీ, రోగి, నరసరావుపేటస్కానింగ్ బయట చేయించుకురమ్మన్నారుమాది మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలం వాకపల్లి గ్రామం. 100 కి.మీ. బస్సులో ప్రయాణించి ఎన్టీఆర్ ఆస్పత్రికి వచ్చాను. 15 రోజులుగా ఎపెండిక్స్ నొప్పితో బాధపడుతున్నా. స్కానింగ్ రాశారు. బయట చేయించుకుని నాలుగురోజుల తర్వాత రమ్మన్నారు. నొప్పి భరించలేకపోతున్నా. చనిపోవాలనిపిస్తుంది. ఏదైనా ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి చూపించుకుంటాను. – టి.చరణ్, వాకపల్లి గ్రామం, విశాఖజిల్లావైద్యం చేయలేం.. వెళ్లమన్నారు..ఇంటి దగ్గర ప్రమాదవశాత్తూ కిందపడ్డా. 55 ఏళ్ల వయసులో నడవలేని స్థితిలో హిందూపురంలోని జిల్లా ఆస్పత్రికి తెల్లవారుజామునే వచ్చాను. అత్యవసర విభాగంలోకి వెళ్తే.. స్కానింగ్ చేయించుకోవాలని చెప్పారు. ఉదయం 11 గంటలు దాటినా.. పట్టించుకునే వారే కనిపించలేదు. డ్యూటీ డాక్టర్ వచ్చే వరకు వేచి ఉండాలన్నారు. చివరకు ఇక్కడ వైద్యం చేయలేమని చెప్పి వెళ్లిపోమన్నారు. – అడవన్న, నేతులపల్లి, సత్యసాయి జిల్లాపట్టించుకునే దిక్కులేదు..నాకు నెల రోజుల కిందట మెదడుకు సంబంధించి శస్త్ర చికిత్స జరిగింది. పరీక్షలు చేయించుకునేందుకు శ్రీకాకుళం నగరంలోని రిమ్స్ ఆస్పత్రికి వచ్చాం. ఓ ప్రైవేట్ ట్యాక్సీలో వచ్చిన నన్ను దింపేందుకు ఆస్పత్రి సిబ్బంది ఎవరూ లేరు. కనీసం స్ట్రెచర్ అయినా దొరుకుతుందన్న ఆశతో మా వాళ్లు వెతుకులాడారు. ఫలితం లేదు.. సాయంత్రం నాలుగు గంటల వరకు వైద్యులెవరూ అందుబాటులో ఉండరని ఎవరో చెప్పారు. చేసేది లేక వెనక్కు వెళ్లిపోయాం. – కుమ్మరి రాజారావు, పాలవలస, శ్రీకాకుళం జిల్లా -
నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. సమకాలీన అంశాలపై ఆయన మాట్లాడనున్నారు. -
హోటల్ రంగాలపై యుద్ధ ప్రభావం
సాక్షి, అమరావతి: అంతర్జాతీయంగా పశ్చి మాసియాలో కమ్ముకున్న యుద్ధ వాతావరణం ఆతిథ్యం, హోటల్ రంగాలపై పెను ప్రభావాన్ని చూపుతోంది. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో ఆంక్షలు, తీవ్ర కొరతతో పరిస్థితి మరింత దిగజారింది. ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరులో హోటళ్ల రంగం సమ్మెబాట పట్టగా ఏపీలోనూ ఇదే పరిస్థితి ఉత్పన్నమయ్యే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో రెండు వేలకు పైగా స్టార్ హోటళ్లు, మూడు వేలకుపైగా రెస్టారెంట్లతో పాటు చిరువ్యాపారులతో కలిపి 20 – 25 వేల హోటళ్లు వినియోగదారులకు సేవలందిస్తున్నాయి. నిత్యం 50 వేల వరకు వాణిజ్య సిలిండర్లను విని యోగిస్తుండగా.. తాజా అనిశ్చితి మధ్య వాణిజ్య సిలిండర్ల సరఫరా 40 శాతానికి పడిపోయింది. ఫలితంగా ఏపీలో అత్యవసరానికి కూడా వాణిజ్య సిలిండర్లు దొరకట్లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే హోటళ్ల వ్యాపారాలు మూతపడి లక్షలాది మంది జీవనంపై ప్రభావం చూపనుంది. గ్యాస్ ఏజెన్సీలు గృహ వినియోగ సిలిండర్ల సరఫరాకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. బ్లాక్ మార్కెట్ దందాగ్యాస్ కంపెనీలు వాణిజ్య సిలిండర్ల సరఫరాపై ఆంక్షలు అమలు చేస్తున్నాయని, దీంతో ఇదే అదునుగా రాష్ట్రంలో బ్లాక్ మార్కెట్ దందాకు తెర తీశారని హోటళ్ల అసోసియేషన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల కేంద్రం ఒక్కో వాణిజ్య సిలిండర్పై రూ.115 చొప్పున పెంచింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో సిలిండర్ రూ.2500– రూ.3 వేల వరకు బ్లాక్ మార్కెట్ దందా నడుస్తోందని ఆరోపిస్తున్నాయి. దీన్ని తక్షణమే అరికట్టాలని ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్, ఏపీ హోటల్స్ అసోసియేషన్ సంయుక్తంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి.వినియోగదారులపై తీవ్ర ప్రభావంవాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత హోటళ్ల రంగంతో పాటు వినియోగదారులను కుదేలు చేసేలా కనిపిస్తోంది. గ్యాస్ను అధిక ధరకు కొనుగోలు చేస్తే తోపుడు బండ్లపై తినే ఇడ్లీ దగ్గర పెద్ద పెద్ద రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలో మెనూ రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఇది చివరకు జనంపైనే పడుతుంది. రాష్ట్రంలో నెలకు 84 లక్షలకుపైగా గృహ, వాణిజ్య వినియోగ సిలిండర్ల సరఫరా జరుగుతోంది. ఇందులో 10 శాతానికిపైగా వాణిజ్య సిలిండర్లే ఉన్నాయి. కాగా, గ్యాస్ ఏజెన్సీల లెక్కల ప్రకారం ఏపీలో గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లు మరో రెండు వారాలకు వరకు సరిపోతాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం గ్యాస్ బుకింగ్ కాల పరిమితిని 21 నుంచి 25 రోజులకు పెంచింది. కాగా, బ్లాక్ మార్కెట్లో వాణిజ్య సిలిండర్ల దందాను వెంటనే అరికట్టాలని విజయవాడ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పీవీ రమణ, స్టార్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్ వీరాస్వామి కోరారు. కొరత భయంతో బుకింగ్లు పెరగడం వల్ల సరఫరాలో స్వల్ప ఆలస్యం అవుతోందని ఏపీ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్అధ్యక్షుడు కె.శ్రీనాథ్రెడ్డి తెలిపారు. ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు : మంత్రి నాదెండ్ల రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లకు కొరత లేదని ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ అనంతరం ఆయన ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో గృహ, వాణిజ్య అవసరాలకు సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని చూసి భయపడొద్దని సూచించారు. -
ప్రత్యేకాధికారుల చేతుల్లోకి ‘పురపాలన’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విజయవాడ, విశాఖ, తిరుపతి నగరపాలక సంస్థలు సహా 11 మేయర్, 75 మున్సిపల్ చైర్పర్సన్, కార్పొరేటర్, కౌన్సిలర్ల పదవీ కాలం ఈ నెల 17తో ముగుస్తోంది. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకు రాలేదు. పదవీ కాలం ముగియడానికి ముందే ఆ నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించే విషయమై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని గత ఏడాది సెపె్టంబర్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే.. రిజర్వేషన్ల ఖరారు, ఎన్నికల ఏర్పాట్లు వంటివి ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో కొనసాగాల్సి ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రక్రియ చేపట్టలేదు. దీంతో పాలకవర్గాల పదవీ కాలం ముగియనున్న 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, పిఠాపురం, జగ్గయ్యపేట మున్సిపాలిటీల స్థాయిని పెంచింది. ప్రస్తుతం గ్రేడ్ –2 స్థాయి మున్సిపాలిటీలుగా ఉన్న వాటిని స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ చేసింది. కాకినాడ నగర కార్పొరేషన్లో ప్రత్యేకాధికారుల పాలనను ఈ నెల 16 నుంచి మరో 6 నెలల పాటు పొడిగించింది. -
అప్పు దొరికితేనే ఆరోగ్యం!
సాక్షి, అమరావతి: చంద్రబాబు ఆయన పుత్రరత్నం, ఇతర వందిమాగధులు తిరగడానికి ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల కోసం గంటకు లక్షల్లో ఖర్చు పెట్టడానికి ఖజానాలో నిధుల కొరత ఉండదు. ప్రభుత్వం తరపున వాదించేందుకు పెట్టుకొన్న ప్రత్యేక న్యాయవాదులకు కోట్లలో చెల్లించడానికి కూడా నిధుల కొరత ఉండదు. ఎమ్మెల్యేల ఆటపాటలు, విందులు, వినోదాలు, యోగా డే, విజన్ డాక్యుమెంట్ విడుదల వంటి ఈవెంట్లు.. హంగులు, ఆడంబరాలు, ఆర్భాటాలు, ప్రచారాల కోసం ప్రభుత్వం ఖజానా నుంచి నేరుగా రూ. వందల కోట్లు ప్రజాదనాన్ని ఖర్చు చేయడానికి ఏ కొరతా ఉండదు. కానీ, రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజలకు సంజీవని వంటి ఆరోగ్యశ్రీ పథకానికి నిధుల దగ్గరకొచ్చే సరికి ఖజానా ఖాళీగా కనిపిస్తుంది. వారం వారం వేల కోట్ల రూపాయలు అప్పులు తెస్తున్నా, పేదలకు నయా పైసా ఉపయోగం లేదు. రాష్ట్రంలో 1.40 కోట్లకు పైగా పేద, మధ్య తరగతి కుటుంబాలకు నాణ్యమైన, ఆధునిక వైద్యాన్ని అందించే ఆరోగ్య శ్రీ పథకానికి నిధుల్లేవని బాబు సర్కార్ చేతులెత్తేస్తోంది. ఆరోగ్య శ్రీ నెట్వెర్క్ ఆస్పత్రులకు బకాయిలు చెల్లించడానికి నిధుల్లేవని చెబుతోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ రికార్డు స్థాయిలో రూ.3.28 లక్షల కోట్లు అప్పులు తెచ్చిన బాబు సర్కార్.. ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల బకాయిలు తీర్చిన పాపాన పోలేదు. ఆ ఆస్పత్రులకు బకాయిలు చెల్లించాలంటే మరిన్ని అప్పులు చేయాలని చెబుతోంది.గద్దెనెక్కగానే ఆరోగ్యశ్రీకి గ్రహణం..2014–19 మధ్య చంద్రబాబు అధికారంలో ఉండగా ఆరోగ్య శ్రీ పథకానికి నిధులు విదల్చకుండా పేదల ఉసురు తీశారు. 2024లో మళ్లీ చంద్రబాబు గద్దెనెక్కాక ఈసారి ఏకంగా పథకానికే గ్రహణం పట్టించారు. బీమా పథకం ప్రవేశపెడతామని ప్రకటించి ఆరోగ్యశ్రీని గాలికి వదిలేశారు. ఆస్పత్రులకు బిల్లులు చెల్లించడంలేదు. దీంతో రూ.3 వేల కోట్లకు పైగా బకాయిలు పేరుకు పోయాయి. ఆస్పత్రుల యాజమాన్యాలు బిల్లుల కోసం ఎన్నిసార్లు వేడుకొన్నా స్పందించడంలేదు. చివరకు ఆస్పత్రులు పలు దఫాలు సమ్మెలోకి వెళ్లాయి. దీంతో వారితో చర్చలు జరిపి, బకాయిలను వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఓటీఎస్కు కూడా ప్రభుత్వం వద్ద నిధులు లేవని, బ్యాంకుల నుంచి అప్పు చేస్తామని చెప్పింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించిన నాటి నుంచి పేదలకు చికిత్స చేసిన ఆసుపత్రులకు నేరుగా ఖజానా నుంచి నిధులు చెల్లింపు జరుగుతోంది. చంద్రబాబు మాత్రం ఎన్నడూ లేనటు్టగా ఆస్పత్రుల బకాయిలు చెల్లింపు కోసం ఆరోగ్య శ్రీ ట్రస్టును అప్పుల్లోకి నెట్టే దుష్ట సంప్రదాయానికి తెరలేపారు. కానీ, ఆరోగ్య శ్రీ ట్రస్ట్కు రుణం ఇవ్వడానికి బ్యాంకులు అంగీకరించడంలేదు. అందుకే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసింది. ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎఫ్సీ)కి రుణాలు సమీకరించి, వాటిని ఆస్పత్రులకు మళ్లించాలని యోచిస్తున్నామని చెబుతున్నారు. ఆ రుణాన్ని ఆరోగ్య శ్రీ ట్రస్టు చెల్లిస్తామంటున్నారు. ఇందుకోసం ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఆస్పత్రులకు రుణం రూపంలో బకాయి నిధులు మంజూరు చేయడం కోసం ఓ యాప్ను రూపొందిస్తున్నారు. ఈ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకున్న ఆస్పత్రులకు మొత్తం బకాయిలో కొంత మొత్తం రద్దు చేసి, మిగిలినది మంజూరు చేయనున్నారు. పేద, మధ్య తరగతికి ఉపయోగపడే పథకం చెల్లింపుల కోసం ప్రత్యేకంగా అప్పులు చేయడం బాబు సర్కారు దివాలాకోరుతనానికి నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఉత్తుత్తి కేటాయింపులుబడ్జెట్లో ఆరోగ్యశ్రీ కోసం భారీగా నిధులు కేటాయిస్తున్నట్లు చంద్రబాబు ప్రభుత్వం కలరింగ్ ఇస్తోంది. కానీ, ఆస్పత్రులకు మాత్రం బిల్లులు ఇవ్వదు. అంటే ఈ కేటాయింపులన్నీ ఉత్తుత్తివే అని తేలిపోతోంది. దీంతో ఆస్పత్రుల నిర్వహణ ఖర్చుల కోసం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. చివరకు ఆస్పత్రుల యాజమాన్యాలు పథకం సేవలు అందించలేమంటూ బోర్డులు తిప్పేసి, పేద రోగుల నుంచి ముక్కుపిండి వసూళ్లకు పాల్పడుతున్నాయి.కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ..2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసేసింది. 2019లో వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఈ పథకాన్ని తిరిగి గాడిలో పెట్టారు. ఆరోగ్యశ్రీ కింద కవరయ్యే వ్యాధుల సంఖ్యను 1,059 నుంచి 3,257కు పెంచారు. పథకం పరిమితిని రూ.5లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచారు. చంద్రబాబు బావమరిది నడిపే బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి సహా నెట్వర్క్ ఆస్పత్రులకు చంద్రబాబు పెట్టిన వందల కోట్ల రూపాయల బకాయిలను జగన్ ప్రభుత్వమే చెల్లించింది.విప్లవాత్మక సంస్కరణలతో వైఎస్ జగన్ 2019–24 మధ్య ఆరోగ్యశ్రీని బలోపేతం చేశారు. కరోనా వ్యాప్తి, లాక్డౌన్, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన విపత్కర పరిస్థితులోనూ నెట్వర్క్ ఆస్పత్రులకు నేరుగా ఖజానా నుంచే బిల్లులు చెల్లించారు. ఇలా ఐదేళ్లలో రూ.13 వేల కోట్లకు పైగా వెచ్చించారు. అలాగే ఈ పథకం కింద చికిత్స పొందిన రోగులకు విశ్రాంత సమయానికి ఆరోగ్య ఆసరా పథకం ద్వారా నెలకు గరిష్టంగా రూ.5 వేల మేర ఆర్థిక సాయం చేశారు. ఆసరా రూపంలో పేదలకు రూ.1,465 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఇప్పుడు చంద్రబాబు ఏడాదిన్నరలోనే పథకాన్ని వెంటిలేటర్ ఎక్కించారు. బిల్లు చెల్లింపులు నిలిపేసి ఆస్పత్రులను అప్పుల ఊబిలోకి నెట్టేశారు. ఆసరా సాయాన్ని పూర్తిగా ఎత్తేశారు. -
రూ.3 వేలకోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాలి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు ఇవ్వాల్సిన రూ.3 వేలకోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశ) ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ బకాయిల విషయం తేల్చకుండానే బీమా విధానం అమలు చేయాలని ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. బకాయిల విషయం తేలిస్తేనే బీమా ఎంవోయూపై సంతకాలు చేస్తామని, లేనిపక్షంలో బీమా అమలుకు సహకరించబోమని తేల్చి చెప్పారు. విజయవాడలో మంగళవారం ఆశ ప్రతినిధులు విలేకరులతో మాట్లాడారు. ఆశ అధ్యక్షుడు డాక్టర్ విజయ్కుమార్ మాట్లాడుతూ చికిత్సల ప్యాకేజీ రేట్లను పెంచకుండా 2007 నాటి రేట్లతో ఏప్రిల్ 1 నుంచి బీమా విధానం ప్రవేశపెడతామని ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. ఈ రేట్లతో ఆస్పత్రులు ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించలేవన్నారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు అనేక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. సమస్యలకు పరిష్కారం చూపకుండా కొత్తగా బీమా విధానంలోకి ప్రభుత్వం వెళుతుండటాన్ని ఆశ పూర్తిగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. బకాయిల విషయం తేల్చకపోతే బీమా విధానానికి సహకరించబోమని స్పష్టం చేశారు. ఓటీఎస్లోను మాట మార్చిన ప్రభుత్వం గతేడాది బకాయిలు చెల్లించాలని సమ్మెచేస్తే బ్యాంకుల నుంచి అప్పుతెచ్చి వన్టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఓటీఎస్లో భాగంగా తమకు రావాల్సిన నిధుల్లోనే కోత విధిస్తామన్నా.. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అనుకుని ప్రభుత్వ షరతుకు అంగీకరించామని చెప్పారు. నాడు మొత్తం బకాయిలన్నింటినీ ఓటీఎస్ చేస్తామని ఇప్పుడు మాట మారుస్తున్నారని మండిపడ్డారు. రూ.3 వేలకోట్ల బకాయిలుంటే రూ.వెయ్యి కోట్లు ఇస్తామంటున్నారని, డబ్బు కావాల్సిన వారు దరఖాస్తు చేసుకోవాలని తమలోనే చీలిక తెస్తున్నారన్నారు. సమ్మె సమయంలో జరిపిన చర్చల్లో బీమా విధానం రూపకల్పనలో ఆస్పత్రులకు భాగస్వామ్యం కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదన్నారు. ప్యాకేజీ ధరలు రివిజన్ చేయకపోతే ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించడం సాధ్యం కాదని పదేపదే ప్రభుత్వానికి చెప్పినా పాత ప్యాకేజీలతోనే ముందుకెళుతున్నారన్నారు. 2007 నుంచి ధరల పెరుగుదల, ఇతర ఖర్చుల్లో వృద్ధి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని శాస్త్రీయ అధ్యయనం చేసి ప్యాకేజీ రేట్లు రివిజన్ చేయాలని ఆశ హైకోర్టును ఆశ్రయించిందని చెప్పారు. దీనిపై 4 వారాల్లో స్పందించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిందని, గడువు ముగిసినా సర్కారు స్పందించలేదని తెలిపారు. చికిత్సల ధరలు పెంచకుండా కొత్త విధానం తెస్తూ.. ఆస్పత్రులు నష్టాల్లోకి వెళ్లకుండా దొంగదారులు వెదుక్కునేలా చేస్తున్నారని విమర్శించారు. ఇప్పుడున్న ప్యాకేజీ ధరలతో ఆస్పత్రుల మనుగడ కూడా కష్టమని, బ్యాంకులు కూడా రుణాలు మంజూరు చేయని దుస్థితి నెలకొందని చెప్పారు. ఆశ కోశాధికారి డాక్టర్ నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించే లక్ష్యంతోనే ప్యాకేజీ రివిజన్ కోరుతున్నామన్నారు. ప్యాకేజీలతో పాటు పాత బకాయిల మీద స్పష్టత వచ్చేవరకు ఆశ పరిధిలోని ఆస్పత్రులు కొత్త విధానంలోకి వెళ్లకూడదని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆశ ఉపాధ్యక్షుడు చంద్రమౌళి, కార్యదర్శి అవినాశ్, సంయుక్త కోశాధికారి గిరిబాబు పాల్గొన్నారు. -
మళ్లీ భారీగా అప్పు తెచ్చిన చంద్రబాబు ప్రభుత్వం
చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ భారీగా అప్పు తెచ్చింది. ఆర్బీఐ సెక్యూరిటీల వేలం ద్వారా రూ.3 వేల కోట్ల అప్పు తీసుకొచ్చింది. ఇప్పటికే పరిమితికి మించి అప్పులు చేసిన బాబు ప్రభుత్వం అక్కడికీ ఆగడం లేదు. బడ్జెట్, కార్పొరేషన్ల అప్పులు రూ.3.30 లక్షల కోట్లు దాటిపోయాయి. ఈ రూ.3 వేల కోట్లతో రూ.1,82,264 కోట్లకు చేరింది బడ్జెట్ అప్పు. 21 నెలల్లో భారీగా బడ్జెటరీ అప్పులు తెచ్చింది బాబు సర్కార్. బడ్జెట్ బయట భారీగా అప్పులు తీసుకొస్తోంది. బాబు సర్కారు అప్పుల్లో దేశంలోనే నం.1 స్థానంలో నిలిచింది. మరోవైపు, ఏపీలోని రైతులు దేశంలోనే అత్యధిక అప్పుల భారాన్ని మోస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ 31 నాటికి ఏపీలో రైతన్నల నెత్తిన 3,75,254 కోట్ల రూపాయల అప్పుల భారం పడింది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయశాఖ పార్లమెంట్లో అధికారికంగా వెల్లడించింది. లోక్ సభలో లిఖిత పూర్వక ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు.రైతులపై 2,01,744 కోట్ల రూపాయల పంట రుణాల భారం ఉండగా, టర్మ్ లోన్ భారం 1,73,510 కోట్ల రూపాయలగా ఉంది. మొత్తంగా రైతులపై 3,75,254 కోట్ల రూపాయల రుణ భారంగా మారింది. దేశంలోనే రైతుల రుణభారంలో రెండో స్థానంలో ఏపీ ఉంది. -
వంట సామాన్లలో పంట పండింది!
సాక్షి, అమరావతి: బీసీ సంక్షేమ శాఖలో అడ్డగోలుగా దోపిడీ జరుగుతోంది. గురుకులాలకు సరఫరా చేసిన వంట సామగ్రిలో ఇష్టారాజ్యంగా కాసులు దండుకుంటున్నారు. రాష్ట్రంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ (ఎంజేపీఏపీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్) చెందిన 105 గురుకులాలకు ప్రభుత్వం వంట సామగ్రి అందించింది. ప్రతి గురుకులానికి స్టౌవ్తోపాటు మరో పది రకాల సామగ్రిని సరఫరా చేశారు. రాజకీయ జోక్యంతో జిల్లాల వారీగా వాటిని సరఫరా చేసే బాధ్యతను స్థానికులకు కట్టబెట్టారు. దీంతో బయట మార్కెట్లో అతి తక్కువ ధరకు దొరికే వాటికి అధిక ధర చెల్లించడంతో పెద్దఎత్తున ప్రజాధనం లూటీఅయ్యింది.ఉదా.. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండకు చెందిన ఏజెన్సీ గురుకులాలకు సరఫరా చేసిన 11 రకాల సామగ్రిని చెల్లించిన ధరలు చూస్తే విస్తుపోవాల్సిందే. గ్యాస్ స్టవ్ డబుల్ బర్నర్ కమర్షియల్ ధర రూ.26,298.38 అని నిర్ణయించి దానికి ఐదు శాతం స్టేట్ జీఎస్టీ, మరో ఐదు శాతం సెంట్రల్ జీఎస్టీ కలుపుకుని మొత్తం రూ.31,032.09 వసూలు చేశారు. నిజానికి మార్కెట్లో దీని ధర రూ.9 వేల లోపే ఉంటుందని చెబుతున్నారు.వంద కిలోల ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషిన్ ధర రూ.14,078 అని చెప్పి దానికి జీఎస్టీ కలుపుకుని రూ.16,612.49 వసూలుచేశారు. ఇలా ఇష్టానుసారం ధరలు నిర్ణయించి ఒక్కో గురుకులానికి మొత్తం రూ.86,686 చొప్పున లాగేశారు. ఇలా రాష్ట్రంలో 105 గురుకులాలకు కలిపి మొత్తంగా రూ.91,02,030 నిధులు ఖర్చుచేశారు. మార్కెట్ ధరకు మించి అయినవారికి అప్పనంగా ప్రజాధనం దోచిపెట్టడం వెనుక ఎవరి వాటా ఎంత అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.గురుకులాలకు సరఫరా చేసిన సామగ్రికి చెల్లించిన ధరలు.. (జీఎస్టీతో కలిపి)⇒ గ్యాస్ స్టవ్ డబుల్ బర్నర్ కమర్షియల్ రూ.31,032.09⇒ వంద కిలోల ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషిన్ రూ.16,612.49⇒ మిక్సర్ గ్రైండర్ (750 వాట్స్) 3 జార్లు రూ.9,313.95⇒ఐదు కిలోల వెయింగ్ మెషిన్ రూ.7,738.89⇒ హెవీ డ్యూటీ చిన్నసైజు రైస్ స్ట్రైనర్ రూ.6,096.70⇒ హెవీ డ్యూటీ ఐరెన్ కడాయి రూ.5,109.70⇒ స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ 10 లీటర్లు రూ.4,882.69⇒ అల్యూమినియం కుక్కర్ 5 లీటర్లు రూ.3,777.25⇒ 1.5 లీటర్ల జగ్ రూ.608.98⇒ ఐరన్ కురుపి 30 అంగుళాలు రూ.961.68⇒ 13 అంగుళాల ఎత్తున్న జీఐ బక్కెట్ రూ.551.27 -
ఉపాధ్యాయులకు విషమ ‘పరీక్ష’
సాక్షి, అమరావతి: విద్యాశాఖలోని పరీక్షల నిర్వహణ విభాగం తప్పులు ఉపాధ్యాయుల పాలిట శరాఘాతాలుగా మారాయి. ఆ తప్పులను సరిదిద్దాల్సిన సర్కారు అదేమని అడిగిన ఉపాధ్యాయులపైనే బెదిరింపులకు దిగడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా 24 ఏళ్ల సర్వీసు పూర్తిచేసిన ఎయిడెడ్ ఉపాధ్యాయులకు హెచ్ఎంగా ఉద్యోగోన్నతి లేదా ఆ స్థాయి ఇంక్రిమెంట్ ఇచ్చేందుకు విద్యాశాఖ ఫిబ్రవరి 14, 15 తేదీల్లో అకౌంటెంట్ టెస్ట్ నిర్వహించింది. 100 మంది దరఖాస్తు చేసుకోగా, 65 మందికి మాత్రమే హాల్టికెట్లను పంపింది.దీనిపై గతంలోనే ఉపాధ్యాయులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా సర్కారులో చలనం లేదు. 100 మార్కులకు పరీక్ష కాగా, కేవలం 90 మార్కులకు మాత్రమే పేపర్ ఇచి్చంది. రెండు పేపర్లకు హాజరైన ఉపాధ్యాయులు ఒక్క పేపర్ మాత్రమే రాశారని, మరో పేపర్కు గైర్హాజరయ్యారంటూ ఫెయిల్ చేసింది. సోమవారం రాష్ట్ర పరీక్షల విభాగం విడుదల చేసిన ఫలితాల్లో ఈ దారుణాలు వెలుగుచూశాయి. ఫలితాలు చూసి అవాక్కవడం టీచర్ల వంతైంది.పేపర్లు వ్యాల్యూయేషన్ చేయలేదు..అకౌంటెంట్ టెస్టుకు హాజరైన 65 మందిలో 23 మంది ఫెయిల్ అయినట్టు సోమవారం ఫలితాల్లో చూపారు. ఇందులో చాలామంది ఒక పేపర్కు హాజరై మరో పేపర్కు గైర్హాజరయ్యారంటూ ఆబ్సెంట్ వేశారు. అన్నమయ్య జిల్లాలో సీనియర్ ఉపాధ్యాయురాలు చింతలబోయిన స్రవంతి విజయవాడలో నిర్వహించిన పరీక్షకు హాజరయ్యారు. ఇందుకు ఆమె వేసిన ఎఫ్ఆర్ఎస్ (అటెండెన్స్) నమోదై ఉంది. కానీ ఆమె పేపర్–1 ఆబ్సెంట్ అయినట్టు ఫలితాల్లో చూపారు. అలాగే బా పట్ల జిల్లాకు చెందిన సీహెచ్ ప్రభాకర్ రెండు పేపర్లకు హాజరవగా, అటెండెన్స్ లేదని చూపారు.అంతేగాక, పేపర్–1కి 20 మార్కులు, పేపర్–2కి 21 మార్కులు వేసి ఫెయిల్ అయినట్టు చూపించారు. మిగిలిన వారికీ ఇలా జరగడంతో అసలు పేపర్ల వ్యాల్యూ యేషన్ చేయలేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. 2024 డిసెంబర్లో నిర్వహించిన పరీక్షలోనూ ఇదే దుస్థితి ఎదురైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులకు ఎంతో కీలకమైన పదోన్నతి పొందే పరీక్ష నిర్వహణలో ఇంత నిర్లక్ష్యమేంటని నిలదీశారు. తాము రాసిన పరీక్ష పేపర్ల జెరాక్సు ఇస్తే పాఠశాల విద్యాశాఖ పరీక్షల విభాగం బండారం బయటపడుతుందని డిమాండ్ చేస్తున్నారు.ఫలితాలపై విచారణ చేయాలిఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ డిమాండ్సాక్షి, అమరావతి: హెచ్ఎం అకౌంటెంట్ టెస్టు ఫలితాలపై విచారణ చేయాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.చిట్టిబాబు, ఎల్కే చిన్నప్ప డిమాండ్ చేశారు. పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసరెడ్డిని సోమవారం కలిసి పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిలో డొల్లతనాన్ని వివరించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14, 15 తేదీల్లో ఎయిడెడ్ పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులకు నిర్వహించిన పేపర్–1లో వంద మార్కులకు గానూ 90 మార్కులకు మాత్రమే ప్రశ్నలు ఇచ్చారని వివరించారు. జవాబు పత్రాలు దిద్దకుండానే ఫలితాలు ప్రకటించారని ఆరోపించారు. పరీక్ష రాసిన ఉపాధ్యాయుల జవాబు పత్రా ల జిరాక్స్ కాపీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
‘శ్రేష్ట’ విద్యార్థులకు అన్యాయం
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన విద్యా పథకంలో అద్భుతమైన ప్రతిభతో రాణించిన ఎస్సీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, నిర్ణయాలు కష్టాల పాల్జేస్తున్నాయి. నీట్, జేఈఈ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలతో పాటు ఎంసెట్ వంటి రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించినా ప్రభుత్వం మాత్రం సీట్లు ఇవ్వనంటోంది. చట్టం పేరుతో వారి భవిష్యత్ అవకాశాలను కాలరాస్తోంది. దీంతో నిరుపేద ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. పోటీ పరీక్షల్లో రాణించి ర్యాంకులు సాధించినా తమ పరిస్థితి ఇలా మారిపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.కూటమి ప్రభుత్వంలో అధికారులు, మంత్రుల చుట్టూ తిరిగినా సమస్యకు పరిష్కారం లభించ లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఎస్సీ విద్యార్థుల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం శేష్ట్ర విద్యా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ప్రతిభావంతులైన ఎస్సీ విద్యార్థులు దేశంలో ఎక్కడైనా ప్రముఖ విద్యాలయాల్లో చదువుకునే అవకాశం కల్పించింది. ఈ పథకంలో సీట్లు సాధించిన రాష్ట్ర విద్యార్థులు వివిధ రాష్ట్రాల్లోని ఉత్తమ రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుకుంటున్నారు. కానీ, వారు ఉన్నత విద్యను అభ్యసించేందుకు రాష్ట్రంతో పాటు తెలంగాణలోనూ నాన్ లోకల్గా గుర్తిస్తుండడంతో వారు ప్రభుత్వం అమలు చేస్తున్న రిజర్వేషన్లు కోల్పోతున్నారు.ఏటా దేశ వ్యాప్తంగా 3 వేల మంది ఎంపికఎస్సీ సామాజిక వర్గంలో ప్రతిభ గల విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందించేందుకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ 2022 జూన్లో ‘స్కీమ్ ఫర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హైసూ్కల్స్ ఇన్ టార్గెటెడ్ ఏరియాస్’ (శ్రేష్ట) పథకాన్ని ప్రారంభించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ద్వారా ప్రతిభా పరీక్ష నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేస్తారు. 2022 నుంచి ఏటా ఈ పథకం కింద 9, 11వ తరగతిలో ప్రవేశానికి 3 వేల మందిని ఎంపిక చేశారు. వీరికి దేశంలోని అత్యుత్తమ ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో కేంద్ర ప్రభుత్వం సీట్లు కల్పించింది. ఇలా ఏపీ నుంచి 1,015 మంది విద్యార్థులు ఒడిశా, ఢిల్లీ, ఛత్తీస్గడ్ తదితర రాష్ట్రాల్లో ప్రముఖ ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుతున్నారు. అలాగే తెలంగాణ నుంచి మరో 1,100 మంది ఎస్సీ విద్యార్థులు కూడా వివిధ రాష్ట్రాల్లో చదువుతున్నారు.శ్రేష్ట విద్యార్థులు నాన్ లోకల్ అంటూ తిరస్కరణకేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న శ్రేష్ట పథకంలో ఎంపికైన విద్యార్థులు ‘స్థానికత’ అంశంతో నష్టపోతున్నారు. ఇంటర్మిడియెట్ పూర్తయ్యాక వారు రాష్ట్రానికి తిరిగి వస్తే వారికి రాష్ట్ర కోటా పొందేందుకు అనర్హులుగా పేర్కొంటుండడంతో వాస్తవానికి ‘స్థానికత’ నిబంధనలపై అధికారులకు సరైన అవగాహన లేకపోవడమే పెద్ద సమస్యగా మారింది. చట్ట ప్రకారం విద్యార్థి నిర్దిష్ట ప్రాంతంలో కనీసం నాలుగు సంవత్సరాలు వరుసగా చదువుకున్నా లేదా వారి తల్లిదండ్రులు రాష్ట్రంలో కనీసం 10 సంవత్సరాలు నివసించినా లేదా రాష్ట్రంలో ఎక్కడైనా వరుసగా ఏడు సంవత్సరాలు చదువుకున్నా స్థానికులుగా పరిగణిస్తారు.కానీ అధికారులు మాత్రం విద్యార్థులు చదువు పూర్తి చేసిన సంవత్సరం నుంచి వెనక్కి లెక్కించడంతో కేవలం రెండేళ్లు ఇతర రాష్ట్రాల్లో చదువుకున్నవారు గతేడాది నీట్లో ఉత్తమ ర్యాంకు సాధించినా నాన్ లోకల్గా గుర్తించడంతో సీట్లు పొందలేకపోయారు. తల్లిదండ్రుల నివాస కాలాన్ని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉన్నా అధికారులు మాత్రం విద్యా సంవత్సరాలనే ప్రామాణికంగా తీసుకోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ చిత్రంలో కనిపిస్తున్న పెద్దాయన పేరు చుక్కా అప్పన్న. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఈయన శ్రీకాకుళం పట్టణంలో ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈయన ఇద్దరు కుమారులు చదువుల్లో చురుగ్గా ఉంటారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘శ్రేష్ట’ విద్యా పథకానికి ఎంపికై ఒడిశాలోని ప్రముఖ కార్పొరేట్ రెసిడెన్షియల్ స్కూల్లో సీట్లు సాధించారు. పెద్ద కొడుకు ఇంటర్ పూర్తి చేసి గతేడాది నీట్, ఎంసెట్లో ఉత్తమ ర్యాంకులు సాధించాడు. అయితే ఇంటర్మీడియెట్ వేరే రాష్ట్రంలో చదివినందున ఆంధ్రప్రదేశ్లో ‘స్థానిక’ కోటా వర్తించదని ఎంబీబీఎస్ సీటు వచ్చినా దరఖాస్తును తిరస్కరించారు. సమస్యను అధికారులు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదు. అప్పన్న చిన్న కొడుకు ప్రస్తుతం సీబీఎస్ఈ ప్లస్ టూ పరీక్షలు రాస్తున్నాడు. ఎంసెట్, జేఈఈకి రిజిస్ట్రేషన్ చేసుకుందామంటే నాన్ లోకల్ కిందే గుర్తిస్తుండడంతో ఆందోళన చెందుతున్నాడు. కళ్లముందే ప్రతిభ గల ఇద్దరు బిడ్డలకు ప్రభుత్వమే అన్యాయం చేస్తుంటే అప్పన్న కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప న్యాయం పొందలేకపోతున్నాడు. -
రైతన్నపై రుణపాశం!
సాక్షి, న్యూఢిల్లీ, సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏ ఒక్క పంటకూ మద్దతు ధర దక్కకపోవడం.. ఏ దశలోనూ చంద్రబాబు ప్రభుత్వం ఆదుకోకపోవడంతో మోసపోయిన రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ రుణ బకాయిల్లో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉండటం రాష్ట్రంలో సాగు రంగం దుస్థితి, రైతన్నల కడగండ్లకు నిదర్శనంగా నిలుస్తోంది. పెట్టుబడి సాయం అందకపోవడం.. ఎరువుల కోసం నరకయాతన.. ఉచిత పంటల బీమా అటకెక్కడం.. ఇన్పుట్ సబ్సిడీ ఎగిరిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 20 నెలలుగా పెద్ద ఎత్తున రైతుల బలవన్మరణాలు కలవరపరుస్తున్నాయి. పార్లమెంట్ సాక్షిగా ఇదే విషయం మరోసారి స్పష్టమైంది. దేశవ్యాప్తంగా రైతుల వ్యవసాయ రుణ బకాయిల్లో ఏపీ రెండో స్థానంలో ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్సభకు వెల్లడించారు. 55 శాతం రైతు కుటుంబాలకు రుణ సదుపాయంగతేడాది డిసెంబర్ నాటికి ఆంధ్రప్రదేశ్ రైతుల వ్యవసాయ రుణ బకాయిలు రూ.3,75,254.59 కోట్లు కాగా ఇందులో పంట రుణ బకాయిలు రూ.2,01,744.41 కోట్లు, వ్యవసాయ టర్మ్ రుణాలు రూ.1,73,510.18 కోట్లుగా ఉన్నాయి. గత డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా రైతుల వ్యవసాయ రుణ బకాయిలు రూ.31,34,807.42 కోట్లుగా ఉన్నట్లు వెల్లడైంది. ఇందులో పంట రుణ బకాయిలు రూ.16,34,219.07 కోట్లు, వ్యవసాయ టర్మ్ రుణాలు రూ.15,00,588.35 కోట్లు ఉన్నాయి. నేషనల్ రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సర్వే నివేదిక ప్రకారం దేశంలో 55 శాతం వ్యవసాయ కుటుంబాలు క్రెడిట్ సౌకర్యాన్ని పొందుతున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. బ్యాంకులకు ప్రాధాన్యతా రంగ రుణ లక్ష్యాలను నిర్దేశించడంతోపాటు కిసాన్ క్రెడిట్ కార్డ్, పీఎం కిసాన్, పీఎం ఫసల్ బీమా యోజన, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన లాంటి పథకాలతో రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు పంకజ్ చౌదరి చెప్పారు. ఇక తెలంగాణలో వ్యవసాయ రుణ బకాయిలు మొత్తం రూ.1,75,960.56 కోట్లుగా ఉన్నాయి. ఇందులో పంట రుణాలు రూ. 95,167.98 కోట్లు, టర్మ్ రుణాలు రూ. 80,792.58 కోట్లుగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. కాగా రూ.5,06,290.45 కోట్ల వ్యవసాయ రుణ బకాయిలతో తమిళనాడు మొదటి స్థానంలో నిలిచింది.అన్నదాతల నోట్లో మట్టి..చంద్రబాబు పాలనలో గత 20 నెలల్లో రాష్ట్రంలో రైతన్నలు అన్ని విధాలుగా మోసపోయారు. తామ అధికారంలోకి వస్తే కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్తో సంబంధం లేకుండా అన్నదాతా సుఖీభవ కింద ప్రతీ రైతుకు ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని ఇచ్చిన హామీని తొలి ఏడాది నిస్సిగ్గుగా ఎగ్గొట్టారు. ఏటా రూ.20 వేల చొప్పున రెండేళ్లలో రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా రూ.30 వేలు ఎగ్గొట్టి రూ.10 వేలతో సరిపెట్టారు. రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉండగా 6,72,428 మందికి పూర్తిగా ఎగనామం పెట్టారు. రెండేళ్లలో రూ.21,433.46 కోట్లు పెట్టుబడి సాయంగా అందించాల్సి ఉండగా కేవలం రూ.4,685.84 కోట్లు విదిల్చారు. రైతులకు మొత్తం రూ.16,748 కోట్లు సాయాన్ని ఎగ్గొట్టారు.ఉచిత పంటల బీమాను అటకెక్కించి.. ఇన్పుట్ సబ్సిడీని ఎగ్గొట్టిచంద్రబాబు అధికారంలోకి రాగానే ఉచిత పంటల బీమాను అటకెక్కించారు. స్వచ్ఛంద నమోదు బీమా అంటూ రైతుల నోట్లో మట్టికొట్టారు. 2023–24 వ్యవసాయ సీజన్కు సంబంధించి రైతుల వాటాతో పాటు ప్రభుత్వ వాటా ప్రీమియం మొత్తం రూ.930 కోట్లు 2024 జూన్లో జమ చేయాల్సి ఉండగా, అదే సమయంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం చెల్లించకుండా ఎగ్గొట్టింది. ఫలితంగా రూ.1,324 కోట్ల బీమా పరిహారం రైతులకు అందకుండా మోకాలొడ్డారు. 2024 ఖరీఫ్ సీజన్లో రైతుల వాటాతో పాటు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.834.44 కోట్లతో పాటు రబీ 2024–25, ఖరీఫ్–2025 సీజన్లలో ప్రభుత్వం తమ వాటా కింద చెల్లించాల్సిన రూ.260.67 కోట్లు ఎగ్గొట్టడంతో రబీ 2025–26 సీజన్లో ఏపీని కంపెనీలు బ్లాక్ లిస్ట్లో పెట్టేశాయి. ఇలా రూ.3,500 కోట్లకుపైగా బీమా పరిహారం రైతులకు అందకుండా చంద్రబాబు సర్కారు దగా చేసింది. మరోవైపు దాదాపు 12 లక్షల మందికి రూ.500 కోట్ల మేర సున్నా వడ్డీ రాయితీ సొమ్మును ఎగ్గొట్టారు. వరుస వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న దాదాపు ఆరున్నర లక్షల మందికి రూ.వెయ్యి కోట్లకు పైగా పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) ఇవ్వకుండా ఎగనామం పెట్టారు.దక్కని ‘మద్దతు’... ఆత్మహత్యలు..మద్దతు ధర దక్కని సమయంలో మార్కెట్లో జోక్యం చేసుకొని రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు ఉద్దేశించిన ధరల స్థిరీకరణ నిధిని చంద్రబాబు ఎత్తేశారు. ధాన్యం మొదలు పత్తి, మిరప, ఉల్లి, చీనీ, పొగాకు, టమాటా, పసుపు, పెసర, మినుము, కంది.. ఇలా ఏ ఒక్క పంటకూ మద్దతు ధర దక్కక అల్లాడుతున్నా ఆదుకున్న దాఖలాలు లేవు. రైతులకు పైసా సాయం చేసిన పాపాన పోలేదు. పెరిగిన పెట్టుబడి ఖర్చులకు తోడు వరుస వైపరీత్యాలతో సాగు, దిగుబడులు తగ్గిపోయి భారీగా నష్టం వాటిల్లింది. గత 20 నెలల్లో దిగుబడులు తగ్గిపోవడం, మద్దతు ధర కోల్పోయి దాదాపు రూ.35 వేల కోట్లకుపైగా రైతులు నష్టపోయారు. మరోవైపు రైతు ఆత్మహత్యలు కలవరపరుస్తున్నాయి. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది దాదాపు 150 మందికి పైగా చనిపోగా 2025–26లో 393 మంది రైతులు, 2,472 మంది రైతు కూలీలు ఆత్మహత్యలకు ఒడిగట్టినట్లు రాష్ట్ర పోలీస్ శాఖే అధికారికంగా వెల్లడించడం రాష్ట్రంలో రైతన్నల దయనీయ పరిస్థితులకు అద్దం పడుతోంది. -
మిర్చి రైతుకు నష్టాల ఘాటు
సాక్షి ప్రతినిధి, గుంటూరు/కొరిటెపాడు (గుంటూరువెస్ట్): తెగుళ్లతో దిగుబడులు పడిపోవడం, వ్యాపారుల కుమ్మక్కుతో మార్కెట్లో ధరలు కుప్పకూలడంతో మిర్చి రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారు. నెల కిందట గుంటూరు మిర్చి యార్డులో క్వింటాకు రూ.26 వేల వరకు పలికిన ధర ప్రస్తుతం రూ.13 వేల నుంచి రూ.18 వేలకు పడిపోయింది. అంటే కేవలం నెల వ్యవధిలో రూ.8 వేల వరకూ పతనమైంది. దీంతో ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంది. కోల్డ్ స్టోరేజ్లో ఉన్న మిర్చి అమ్మకాల సమయంలో తొలుత భారీగా పలికిన ధర, కొత్తపంట మార్కెట్కు వస్తున్న సమయంలో పడిపోవడానికి వ్యాపారుల సిండికేట్ కారణమని రైతులు చెబుతున్నారు. సిండికేట్ను నిలువరించి మంచి ధర ఇప్పించాల్సిన చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.క్షీణిస్తున్న సాగు గణాంకాలుగత మూడు ఏళ్లతో పోల్చుకుంటే ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి సాగు గణనీయంగా తగ్గిపోయింది. రాష్ట్రంలో 2022–23 సంవత్సరంలో 2,27,757 హెక్టార్లలో మిర్చి పంట సాగయ్యింది. 2023–24లో 2,46,752 హెక్టార్లకు సాగు పెరిగినా, 2024–25లో తిరిగి 1,96,153 హెక్టార్లకు తగ్గింది. ఇక 2025–26లో ఏకంగా 1,08,223 హెక్టార్లకు పడిపోయింది. గత ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా మిర్చి పంటకు ధరలు లేక పోవడం 2025–26 సీజన్పై తీవ్ర ప్రభావం చూపింది. గత మిర్చి సీజన్లో ఎన్నడూ లేని విధంగా క్వింటా ధర రూ.9 వేల నుంచి రూ.12 వేలు మాత్రమే పలికిన సంగతి తెలిసిందే. ఎకరాకు రూ.రెండు లక్షలకు పైగా ఖర్చు..ఎకరా మిర్చి సాగుకు సుమారు రూ.2 లక్షలకు పైగా ఖర్చవుతోంది. సేద్యపు ఖర్చులు, పురుగుమందులు, కోత కూలీలు, బాడుగ, కలిపి ఎకరాకు వ్యయాలు భారీగా పెరిగిపోయాయని రైతులు చెబుతున్నారు. దీనికి పొలం కౌలు అదనంగా కలుపుకోవాల్సి ఉంటుంది. కాగా నల్లతామర, కుచ్చుముడత (వైరస్) తెగుళ్ల సమస్య నెలకొంది. దీంతో పూతంతా నేలరాలిపోతుంది. ఒకవేళ అరకొర పూత మిగిలినా కాయ సైజు మజ్జుగా మారిపోతుంది. ఈ కారణంగా దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది. ఆరోగ్యకరమైన పైరు ఉంటేనే ఎకరాకు 20 నుంచి 30 క్వింటాళ్ల వరకూ దిగుబడి వస్తుంది. అయితే నల్లతామర సోకి ఎకరాకు 5 నుంచి 20 క్వింటాళ్లకు దిగుబడులు పరిమితమయ్యే పరిస్థితి నెలకొంది. ఎకరాకు రూ. లక్షకు పైగా నష్టం వచ్చింది ఈ ఏడాది 1.5 ఎకరాల్లో సూపర్–10 రకం మిర్చి వేశా. గత నెలలో ఎర్రనల్లి, ఇప్పుడు నల్లతామర సోకింది. వారానికి సుమారు రూ.10 వేలు తెగుళ్ల నివారణకు ఖర్చుపెడుతున్నా. అయినా అదుపులోకి రాలేదు. ఒక కోత వచ్చింది. ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటాకు రూ.18 వేలు ధర పడింది. ఎకరాకు రూ. లక్షకుపైగా నష్టపోవాల్సి వస్తోంది. – పి.దేవేంద్ర, కనకవీడు గ్రామం రైతు (కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు మండలం) వ్యాపారులు కుమ్మక్కవుతున్నారు నేను 341 రకం మిర్చి 2 ఎకరాల్లో సాగు చేశా. ఎకరాకు కౌలుతో కలుపుకొని రూ.2 లక్షల వరకు ఖర్చు వచ్చింది. 25 రోజుల కిందట 341 రకం మిర్చి క్వింటా రూ.25 వేలు వరకు ధర పలికింది. ప్రస్తుతం 30 బస్తాలు యార్డుకు తెచ్చాను. క్వింటా రూ.17 వేలు అడుగుతున్నారు. ఇదేమని అడుగుతుంటే ధరలు తగ్గాయని, మీకు ఇష్టం ఉన్న చోటికి తీసుకువెళ్లి అమ్ముకోవచ్చని వ్యాపారులు పేర్కొంటున్నారు. చేసేది లేక రూ.17 వేలకే అమ్ముకున్నా. – దుగ్గెంపూడి పాపిరెడ్డి, అగ్రహారం గ్రామ రైతు (మార్కాపురం జిల్లా, దోర్నాల మండలం) లాభం పరిస్థితే లేదు మూడు ఎకరాల్లో సార్క్ రకం మిర్చి పంట సాగు చేశా. ఎకరాకు రూ.2.50 లక్షల వరకూ ఖర్చు చేశా. దిగుబడి ఎకరాకు 15 క్వింటాళ్లకు మించి వచ్చే పరిస్థితి లేదు. గుంటూరు మార్కెట్ యార్డుకు ప్రస్తుతం 35 బస్తాలు తీసుకువచ్చాను. క్వింటా రూ.17,300 పడింది. క్వింటాళ్లకు రూ.20 వేలకు పైగా పలికితే గిట్టుబాటు అవుతుంది. ఈ ధరలతో మిర్చి రైతులకు అప్పులు తప్ప, లాభం మిగిలే పరిస్థితి లేదు. – పి.శ్రీనివాసరావు, ఉయ్యందన గ్రామ రైతు (పల్నాడు జిల్లా, క్రోసూరు మండలం) -
కానుకలూ గోవిందా..! పరకామణిలో దొంగలు పడ్డారు
సాక్షి, అమరావతి: నెయ్యి రేట్లు పెంచి.. అనుకూల డెయిరీలకు దోచిపెట్టి.. శ్రీవారి సొమ్మును నీకింత.. నాకింత అని పంచుకున్న తీరు గురించి జనం చర్చించుకుంటుండగానే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఏడుకొండల వాడికి జరుగుతున్న మరో అన్యాయం గురించి బట్టబయలయ్యింది. పరంధాముడి పరకామణిని దొంగలు కొల్లగొడుతున్న విషయం ఆధారాలతో సహా బయటపడింది. భక్తులు శ్రీవారికి కానుకలుగా సమర్పించే బంగారం, వెండి వస్తువులను దర్జాగా చోరీ చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం 2024 జూన్లో అధికారంలోకి రాగానే మొదలైన ఈ దొంగతనాల వ్యవహారం 2025 జనవరిలో బయటపడింది. అయినా నామమాత్రపు కేసుతో సరిపుచ్చారు. తెరవెనుక ఉన్న ముఠాపై కూపీ లాగలేదు. కోటి రూపాయల బంగారం, వెండి చోరీ జరిగినట్లు గుర్తించినా కేవలం 555 గ్రాముల బంగారం రికవరీ చేసినట్లు చూపించి పోలీసులు చేతులు దులిపేసుకున్నారు. ఈ చోరీకి పాల్పడిన పరకామణి ఉద్యోగి పెంచలయ్యకు వెంటనే బెయిల్ రావడానికి ప్రభుత్వమే పరోక్షంగా సహకరించింది. దీంతో ప్రభుత్వంలోని పెద్దలు తమ పేర్లు బయటకు రాకుండా ఉండడం కోసమే ఈ వ్యవహారాన్ని మమ అనిపించేశారన్న విమర్శలున్నాయి.. టీటీడీ, పోలీసులు ఈ వ్యవహారంలో ముందుకు వెళ్లకుండా ఆపిందెవరు? పెంచలయ్య వెనకున్న ముఠా ఎవరు? పెంచలయ్యను కాపాడుతున్న ప్రభుత్వ పెద్దలెవరు? పెంచలయ్యే కోటి రూపాయలు కొల్లగొట్టాడంటే.. పరకామణిలో ఉన్న ఇంకెంతమంది ఇంకెన్ని కోట్ల విలువైన కానుకలు కైంకర్యం చేసి ఉంటారు? వీరందరినీ నడిపించిన ఆ ‘గోల్డ్ బాబు’ ఎవరు? చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక పరకామణిలో భారీ చోరీ కథా కమామీషు ఇదీ.. నిందితుడు పెంచలయ్య చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ... టీటీడీ పరకామణిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి వి.పెంచలయ్య స్వామివారికి భక్తులు కానుకగా సమర్పించిన బంగారు బిస్కెట్ను చోరీ చేస్తుండగా విజిలెన్స్ అధికారులు 2025, జనవరి 11న రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. పరకామణిలో కానుకలను తరలించే ట్రాలీకి ఓ కన్నం చేసి అందులో 100 గ్రాముల బిస్కెట్ను జార విడిచాడు. అనంతరం ఆ బిస్కట్ను తీసుకునేందుకు యత్నిస్తుండగా విజిలెన్స్ అధికారులకు చిక్కాడు. తిరుమల పోలీసులు అతన్ని 2025, జనవరి 12న అరెస్టు చేసి న్యాయస్థానం అనుమతితో రిమాండ్కు తరలించారు. పోలీసులు పెంచలయ్య నివాసంలో సోదాలు చేయగా విస్మయకర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 2024, సెప్టెంబరు నుంచి అతను పరకామణిలో తరచూ దొంగతనాలు చేస్తున్నట్టు వెల్లడైంది. దొంగిలించిన బంగారు, వెండి ఆభరణాలను తిరుపతిలోని ప్రముఖ కార్పొరేట్ నగల దుకాణాలకు తీసుకువెళ్లి వాటిని మార్పిడి చేసేవాడు. ఆ విధంగా 2024 సెప్టెంబరు నుంచి 2025 జనవరి మధ్యలో చాలాసార్లు శ్రీవారి నగలను దొంగిలించి బంగారు దుకాణాల్లో మార్పిడి చేసి అంతే విలువైన ఇతర నగలను తీసుకున్నాడు. అంతేకాదు తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన బంగారు కానుకలను తిరుపతిలోని ఓ బ్యాంకులో తాకట్టు పెట్టి రుణాలు కూడా తీసుకున్నాడు. అందుకు సంబంధించిన వోచర్లు, ఇతర పత్రాలను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. కానీ పెంచలయ్య ఏ స్థాయిలో పరకామణిలో దొంగతనాలకు పాల్పడ్డాడు... ఎంత విలువైన బంగారు నగలను అప్పటికే దొంగిలించాడు అనేది అంతుచిక్కడం లేదు. దీనిపై పోలీసులు పూర్తి వివరాలను కూడా వెల్లడించక పోవడం గమనార్హం. పెంచలయ్య రూ.కోటి విలువైన 555 గ్రాములు బంగారం, 157 గ్రాముల వెండి కానుకలను దొంగతనం చేసినట్టు... వాటిని రికవరీ చేసినట్టు ప్రకటించి పోలీసులు చేతులు దులిపేసుకున్నారు. ఆ తర్వాత పెంచలయ్యకు కొద్ది రోజుల్లోనే బెయిల్ వచ్చింది. అతని బెయిల్ను టీటీడీ గట్టిగా వ్యతిరేకించలేదని తెలుస్తోంది. తద్వారా అతని బెయిల్కు పరోక్షంగా సహకరించారని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. నాడు రూ.76వేల దొంగతనంపై చంద్రబాబు రాద్దాంతం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రవి కుమార్ అనే పరకామణి ఉద్యోగి విదేశీ కరెన్సీని దొంగతనం చేస్తుండటంతో విజిలెన్స్ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. పరకామణిలో వ్యవహరాలను సీసీ కెమెరాల్లో పర్యవేక్షించడం ద్వారా ఈ దొంగతనాన్ని వెంటనే గుర్తించి అడ్డుకట్ట వేశారు. రవి కుమార్ భారతీయ కరెన్సీలో రూ.76వేల విలువైన అమెరికన్ డాలర్లను దొంగతనం చేసేందుకు యత్నించినట్టు గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. రిమాండ్కు పంపించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో టీటీడీ అంతటితో సరిపెట్ట లేదు. రవి కుమార్ ఆస్తులపై దర్యాప్తు చేయించింది. పరకామణిలో రూ.76వేల దొంగతనానికి ప్రాయశ్చిత్తంగా రవి కుమార్కు చెందిన రూ.15కోట్ల ఆస్తులను టీటీడీ పేరిట రాయించింది. తద్వారా ఎవరైనా శ్రీవారి పరకామణిలో చోరీకి పాల్పడితే ఎంత తీవ్రంగా స్పందిస్తామన్నది చేతల్లో చూపించింది. ఆ ప్రక్రియ అంతా లోక్ అదాలత్ ద్వారా న్యాయబద్దంగా నిర్వహించింది. అయినా సరే దీనిపై చంద్రబాబు నానా రాద్దాంతం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం, నేతలపై దు్రష్పచారం చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమ కేసు నమోదు చేసి వేధింపులకు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రూ.76వేల దొంగతనానికి రూ.15కోట్ల ఆస్తులను టీటీడీకి రాయించి ఇస్తే...మరి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అధికారికంగా పేర్కొన్న దాదాపు రూ.కోటి విలువైన బంగారం, వెండి దొంగతనానికి పరిహారంగా ఎన్ని వందల కోట్ల విలువైన ఆస్తులను టీటీడీకి రాయించి ఇవ్వాలని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలో పరకామణిలో భారీ స్థాయిలో బంగారు, వెండి ఆభరణాల దొంగతనం చేసిన బాగోతం బయటపడితే ముఖ్యమంత్రి చంద్రబాబు మౌనంగా ఉండిపోయారు. ఆ కేసును సమగ్రంగా విచారించకుండా పోలీసు శాఖను ప్రభావితం చేశారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. పెంచలయ్య అపహరించిన బంగారు బిస్కెట్ ఎందుకీ ఉదాసీనత? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హైకోర్టులో టీటీడీ ఓ అఫిడవిట్ను దాఖలు చేసింది. పరకామణిలో దొంగతనాలను నిరోధించేందుకు మరిన్ని సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు పటిష్ట వ్యవస్థను నెలకొల్పుతామని పేర్కొంది. మరి 2024 సెప్టెంబరు నుంచి 2025 జనవరి వరకు పెంచలయ్య పరకామణిలో ఎలా దొంగతనాలకు పాల్పడ్డాడు...? అంటే హైకోర్టుకు చెప్పినట్టుగా పరకామణిలో పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేయలేదన్నది స్పష్టమవుతోంది. మరి చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించిందన్నది ప్రశ్నార్థకంగా మారింది. అంటే పరకామణిలో దొంగతనాలకు పరోక్షంగా సహకరిస్తున్నారా అనే సందేహాలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పెంచలయ్య కేసులో సమగ్ర దర్యాప్తు జరపకుండా కప్పిపుచ్చేందుకు పోలీసులు పరిమితం కావడం గమనార్హం. సూత్రధారుల పాత్రను కప్పిపుచ్చేందుకేనా....!తిరుమల పరకామణిలో దొంగతనాల వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకే చంద్రబాబు ప్రభుత్వం ప్రాధాన్యమివ్వడం విస్మయపరుస్తోంది. 2024 సెపె్టంబరు నుంచి వరుసగా దొంగతనాలకు పాల్పడ్డాడని గుర్తించినా సరే సమగ్ర దర్యాప్తునకు ఆదేశించనే లేదు. పరకామణిలో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు నిర్వహిస్తున్న ఆర్గోస్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలో అతన్ని ఎవరు చేర్పించారు? శ్రీవారి హుండీ కానుకలను దొంగతనం చేసిన సొమ్ముతో అతను కొనుగోలు చేసిన ఆస్తులు ఏమిటి? ఎవరెవరి పేరున ఆ ఆస్తులు ఉన్నాయి? తదితర విషయాలపై పోలీసులు కనీసం దృష్టి సారించనే లేదు. అంతేకాదు పెంచలయ్య శ్రీవారి బంగారు కానుకలను తిరుపతిలోని కార్పొరేట్ బంగారు ఆభరణాల దుకాణాలకు తీసుకువెళ్లి ఇచ్చేవాడు. అందుకు సమాన విలువ కలిగిన నగలను ఆ దుకాణాల నుంచి తీసుకునేవాడు. ఈ మేరకు బంగారు ఆభరణాల దుకాణాల నుంచి తీసుకున్న ఇన్వాయిస్లు కూడా వెలుగులోకి వచ్చాయి. అంటే బంగారు నగలను మార్పిడి దందాకు పాల్పడ్డాడు. అయినా సరే పెంచలయ్య తీసుకువస్తున్న నగలు ఎక్కడివనే విషయాన్ని బంగారు దుకాణాల యజమానులుగానీ, ప్రతినిధులుగానీ ప్రశ్నించనే లేదు. ఒక్క పెంచలయ్యేనా... ఈ తరహా ఇంకెంతమంది శ్రీవారి బంగారు కానుకలను ఆ దుకాణాల్లో మార్పిడి చేస్తున్నారో అని సామాన్యులకు కూడా సందేహం రావడం సహజం. కానీ పోలీసులు మాత్రం ఆ దిశగా దర్యాప్తు చేయనే లేదు. అంతేకాదు చోరీ చేసిన శ్రీవారి బంగారు కానుకలను తిరుపతిలోని ఓ బ్యాంకులో తాకట్టు పెట్టాడు కూడా. మరి అందుకు సహకరించిన బ్యాంకు అధికారుల పాత్ర ఏమిటన్నది కూడా పోలీసులు సందేహించకపోవడం గమనార్హం. ఆ విషయాలపై సమగ్రంగా దర్యాప్తు చేస్తే పరకామణి దొంగతనాల వెనుక ఉన్న ముఠా బాగోతం బట్టబయలవుతుంది. ఇప్పటివరకు ఎంత భారీస్థాయిలో శ్రీవారి కానుకలను కొల్లగొట్టారన్నది కూడా బయటపడుతుంది. తిరుమల–తిరుపతిలో దోపిడీ ముఠా బాగోతం వెలుగులోకి వస్తుంది. అందుకే అంత సమగ్రంగా దర్యాప్తు చేయకుండా పోలీసులను ప్రభుత్వ పెద్దలే కట్టడి చేసినట్టు సమాచారం. దాంతో పోలీసులు కేవలం పెంచలయ్య వరకే దర్యాప్తును పరిమితం చేశారు. అది కూడా కేవలం 555 గ్రాముల బంగారం, 157 గ్రాముల వెండి ఆభరణాలకే పరిమితమై కేసును సరిపుచ్చారు. అంతకుమించి పోలీసులు దర్యాప్తు చేయకపోవడం గమనార్హం. పోలీసుల పంచనామా నివేదికలో పేర్కొన్న ప్రకారం... పరకామణి నుంచి చోరీ చేసినట్టు పెంచలయ్య అంగీకరించిన కానుకలు ఇవీ... (గ్రాముల్లో) ఈ జాబితాలో 1 నుంచి 13వరకు ఉన్నవి పెంచలయ్య పరకామణిలో నుంచి నేరుగా దొంగిలించిన బంగారు వస్తువులు. 14 నుంచి 24 వరకు ఉన్నవి పరకామణిలో దొంగిలించిన బంగారు వస్తువులను తిరుపతిలోని బంగారు దుకాణాల్లో మార్పిడి చేసి తీసుకున్న బంగారు ఆభరణాలు పరకామణి దొంగతనాల కేసును సీబీఐకి అప్పగించాలిచంద్రబాబు ముఖ్యమంత్రి, బీ ఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ అయినప్పటి నుంచీ తిరుమల పరకామణిలో బంగారం చోరీ దర్జాగా సాగుతోంది. రూ. కోటి విలువైన బంగారం, వెండి దొంగతనం చేసినట్టు ఇప్పటికి బయటపడింది. ఇంకా సమగ్రంగా దర్యాప్తు చేస్తే పరకామణిలో దొంగతనాల బండారం మొత్తం బయటపడుతుంది. ఈ దొంగతనాల వెనుక ఎవరు ఉన్నారు... ఎవరి ప్రోద్బలంతో దొంగతనాలు జరుగుతున్నాయన్నది నిగ్గు తేలుతుంది. దొంగతనం చేసిన బంగారు కానుకలను నగల దుకాణాల్లో దర్జాగా విక్రయిస్తున్నారంటే వెనుక ఎంతటి పెద్దల పాత్ర ఉందన్నది స్పష్టమవుతోంది. అందుకే ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేయకుండా కూటమి ప్రభుత్వ పెద్దలు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు. కేవలం పెంచలయ్య వరకే దర్యాప్తును పరిమితం చేసి అసలు సూత్రధారులకు వత్తాసు పలుకుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పరకామణి దొంగతనాల కేసును సీబీఐకి అప్పగించాలి. -నాగార్జున యాదవ్, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి -
‘ఇన్నర్’ను సీఐడీ నుంచి సీబీఐకి బదలాయించాలి
సాక్షి, అమరావతి: ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు , మంత్రులు లోకేశ్, పొంగూరు నారాయణ తదితరులు నిందితులుగా ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కుంభకోణం కేసును సీఐడీ నుంచి సీబీఐకి బదలాయించాలని సోమవారం హైకోర్టుకు న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ విన్నవించారు. కేసులో అప్పుడు నిందితునిగా ఉన్న చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని, ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు ముఖ్యమంత్రికి కొమ్ముకాస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కేసు మూసివేతకు ఏకంగా ఏసీబీ కోర్టులో రెఫర్డ్ చార్జిïÙట్ దాఖలు చేసిందన్నారు. అయితే ఈ వ్యాజ్యం విచారణార్హతపై సీఐడీ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ అభ్యంతరం వ్యక్తంచేసిన నేపథ్యంలో ఈ అంశంపై తదుపరి వాదనలు వింటామని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు తదుపరి విచారణను న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ఈ నెల 16వ తేదీకి వాయిదా వేశారు. అంతకు ముందు ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది శ్రవణ్ కుమార్ హైకోర్టులో చేసిన వాదనల్లో ముఖ్యాంశాలు.. n 2014–19 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా, లోకేశ్, నారాయణ మంత్రులుగా ఉన్న సమయంలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్, మాస్టర్ ప్లాన్లో అక్రమాలు జరిగాయి. n దీనిపై సీఐడీ కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసింది. ఐదు వేల పేజీలకు పైగా ఆధారాలను సేకరించింది. ఆ మేరకు ఏసీబీ కోర్టులో చార్జిïÙట్ కూడా దాఖలు చేసింది. n సాంకేతిక కారణాలతో ఈ చార్జిïÙట్ను కోర్టు వెనక్కి ఇచి్చంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మారడంతో సీఐడీ గతానికి భిన్నంగా వ్యవహరించడం మొదలుపెట్టింది. n సీఐడీ అదనపు డీజీ ముఖ్యమంత్రి కింద పనిచేస్తారు. n సీఐడీ అధికారుల పదోన్నతులు, బదిలీలు అన్నీ కూడా ముఖ్యమంత్రి పర్యవేక్షణలోనే సాగుతాయి. n అందువల్ల ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం కేసును సీబీఐకి బదలాయించాల్సిన అవసరం ఉంది. ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలి కాగా, ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం కేసును విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంలో కూడా హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
75 శాతం ఆస్తులు దానం చేసిన చరిత్ర మాది
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి రెవెన్యూ వ్యవహారాలపై అవగాహన ఇంతేనా అని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నిం చారు. సోమవారం డోన్ నియోజకవర్గంలో నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలకు బుగ్గన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సభలో ఒక అర్జీదారుడు రెండేళ్లుగా పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా తనకు న్యాయం జరగలేదని చెప్పిన విషయాన్ని సీఎం రాజకీయంగా మలచడం సరైంది కాదని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ.. అది ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉన్న వ్యక్తిగత సమస్య కావడంతో అధికారులు దానిని పరిష్కరించలేకపోయారని తెలిపారు. నిజంగా అర్జీదారుకు న్యాయం చేయాలనే ఉద్దేశం ఉంటే సంబంధిత విషయాన్ని జిల్లా కలెక్టర్కు అప్పగించి నిజ నిర్ధారణ చేయాలని సూచించాలని పేర్కొన్నారు.ప్రతి విషయాన్ని రాజకీయంగా మార్చడం ముఖ్యమంత్రి స్థాయి నాయకుడికి తగదని వ్యాఖ్యానించారు. తమ కుటుంబానికి, తమ అనుచరులకు ఇతరుల ఆస్తులపై ఎలాంటి ఆశలూ, ఆపేక్ష లేవని స్పష్టం చేశారు. వందేళ్ల క్రితం నుంచి తమ కుటుంబం ఏ ఇంట్లో నివసిస్తుందో ఈ రోజుకీ అదే ఇంట్లో ఉంటున్నామని చెప్పారు. తమ కుటుంబం వద్ద ఉన్న ఆస్తుల్లో 75 శాతం దానం చేసిన చరిత్ర ఉందని బుగ్గన పేర్కొన్నారు. తాము దానం చేసిన ఆస్తులను చూడాలంటే ఒక రోజు సమయం పడుతుందని, సమయం చూసుకుని వస్తే వ్యక్తిగతంగా చూపిస్తానని చెప్పారు.సభలో ముఖ్యమంత్రి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆర్డీవో ఆ భూమి అసైన్డ్ అని, అర్జీదారుడికి సంబంధం లేదని చెప్పినప్పటికీ ఆ విషయాన్ని బుల్డోజ్ చేసి సీఎం ఆరోపణలు గుప్పించారని విమర్శించారు. ఇది తిరుమల లడ్డూ వ్యవహారంలా ఉందని పేర్కొంటూ, అప్పట్లో ఈవో శ్యామలరావు వాస్తవాలు చెప్పినా వాటిని పట్టించుకోలేదని అన్నారు. అనంతరం సీబీఐ సిట్ కూడా శ్యామలరావు చెప్పినదే నిజమని తేలి్చందని గుర్తుచేశారు. వయస్సు, పదవికి తగిన విధంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు నాయుడికి బుగ్గన రాజేంద్రనాథ్ సూచించారు. అవాస్తవమైన, అన్యాయమైన ఆరోపణలు చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. -
ఏపీ రైతులపై అత్యధిక అప్పుల భారం..
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రైతులు దేశంలోనే అత్యధిక అప్పుల భారాన్ని మోస్తున్నారు. 2025, డిసెంబర్ 31 నాటికి ఏపీలో రైతన్నల నెత్తిన 3,75,254 కోట్ల రూపాయల అప్పుల భారం పడింది. ఈ పరిస్థితిని కేంద్ర వ్యవసాయశాఖ పార్లమెంట్లో అధికారికంగా వెల్లడించింది. లోక్ సభలో లిఖిత పూర్వక ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు. రైతుల పై 2,01,744 కోట్ల రూపాయల పంట రుణాల భారం ఉండగా, టర్మ్ లోన్ భారం 1,73,510 కోట్ల రూపాయలగా ఉంది. మొత్తం కలిపి రైతులపై 3,75,254 కోట్ల రూపాయల రుణ భారంగా మారింది. దేశంలో తమిళనాడు తర్వాత రుణభారం లో తల్లడిల్లుతున్నారు ఏపీ రైతులు.ఫలితంగా దేశంలోనే రైతుల రుణభారంలో రెండో స్థానంలో ఏపీ ఉంది. చంద్రబాబు నాయుడు పరిపాలనలో రైతులకు ఆదరణ కరువు అన్న దానికి ఇది సంకేతంగా నిలుస్తుంది. అరకొరగా రైతులకు వాగ్దానాలు అమలు చేస్తుండటంతో ఏపీ రైతులపై అప్పుల భారం తడిపి మోపడైంది. ఇక పక్క రాష్ట్రం తెలంగాణలో రైతులపై 1,75,960 కోట్ల రూపాయల అప్పుల భారం ఉంది. తెలంగాణలో రైతులపై క్రాప్ లోన్ 95,167 కోట్లు రూపాయలు, 80,792 కోట్ల రూపాయల టర్మ్ లోన్ గా ఉంది. -
నీటిగుంతలో మునిగి 10వ తరగతి విద్యార్థి మృతి
మంగళగిరి టౌన్: నీటిగుంతలో మునిగి 10వ తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో ఆదివారం చోటుచేసుకుంది. కృష్ణాయపాలేంకు చెందిన కంతేటి ప్రకాష్, విమల దంపతుల కుమారుడు ప్రజ్వల సంతోష్ (15) పదో తరగతి చదువుతున్నాడు. పరీక్షల నేపథ్యంలో పెనుమాకలోని ట్యూషన్కు ఆదివారం వెళ్లాడు. ట్యూషన్ అనంతరం ఇంటికి వచ్చే మార్గంలో నీటిగుంతలో ఈతకు దిగి మునిగిపోయాడు. స్థానికులు గమనించి ఒడ్డుకు చేర్చేలోపే సంతోష్ మృతిచెందాడు. కాగా, రాజధాని రోడ్డు నిర్మాణ పనుల కోసం తవి్వన నీటిగుంతలోనే బాలుడు మృతిచెందినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాలుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు బాలుడి మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. ప్రమాదం జరిగిన నీటిగుంత వద్ద ఎటువంటి హెచ్చరిక బోర్డులు పెట్టకపోవడం వల్లే బాలుడు మృతి చెందాడని పలువురు స్థానిక దళితనాయకులు విమర్శించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు ప్రభుత్వం, సంబంధిత కాంట్రాక్టర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బాలుడి మృతిని ప్రభుత్వ హత్యగానే పరిగణిస్తున్నట్లు ఉద్ఘాటించారు. పోలీసులు సుమోటాగా తీసుకుని దీనికి కారకులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, బాలుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
పింఛన్లు, రేషన్ కోసం.. కుటుంబాలు విడిపోతున్నాయి
సాక్షి, అమరావతి: పింఛన్లు, రేషన్ కోసం కుటుంబాలు విడిపోతున్నాయని.. దీనిని నివారించేందుకు కొత్త విధానం తీసుకొస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రభుత్వం ఇచ్చే లబ్ధి చిన్న కుటుంబాలకు కాకుండా పెద్ద కుటుంబాలకే ఇస్తానని చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజధానిలో ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. కుటుంబమే మనకు ఒక భద్రత అన్న విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు. ఇద్దరు, ముగ్గురు పిల్లలుంటే మహిళలకు మాదిరిగానే పురుషులకు కూడా రెండునెలల వరకు సెలవు ఇస్తానని తెలిపారు. ఒకప్పుడు ముగ్గురు పిల్లలను కనొద్దని చెప్పిన తానే ఇప్పుడు రాష్ట్రంలో జనాభా తగ్గుదల నేపథ్యంలో ‘ముగ్గురు పిల్లలు ముద్దు’ అంటూ ఫ్యామిలీ మ్యానేజ్మెంట్ అంటున్నానన్నారు. ‘రాబోయే పదేళ్లు నేను చెప్పింది వినండి, మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండకపోతే అప్పుడు నన్నడగండి’.. అంటూ వ్యాఖ్యానించారు. బాబు ఇంకా ఏమన్నారంటే..సెర్ప్, మెప్మాను ఒకే గొడుగు కిందకు తెస్తా..మా పార్టీ అధికారంలో లేనప్పుడు ఆయా ప్రభుత్వాలు పొదుపు సంఘాలను పట్టించుకోలేదు. బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలను 99.89 శాతం తిరిగి కట్టే వ్యవస్థ డ్వాక్రా వ్యవస్థే. రాబోయే రోజుల్లో మెప్మా, డ్వాక్రా (సెర్ప్) రెండింటిని వెలుగు అనే ఒక గొడుగు కిందకు తెస్తా. పొదుపు సంఘాల మహిళలు తయారుచేసే ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా విక్రయించేలా స్వయం పేరుతో ఒక బ్రాండ్ను ప్రారంభించా. ఈ ఏడాది మహిళల్లోనే లక్షల మంది పారిశ్రామికవేత్తలు తయారయ్యారు. మీకేదైనా అయితే నాకు ఫోను చేయండి.. ఎక్కడో యుద్ధం జరుగుతుంటే మన దగ్గర పెట్రోల్, గ్యాస్ రేట్లు పెరిగే పరిస్థితి ఉంది. ఓపెన్ మార్కెట్లో సిలిండర్ ధరలు పెరిగినా.. మా ఆడబిడ్డలకు నేను ఇచ్చే 3 సిలిండర్లు ఉచితంగానే ఇస్తా. ఐదేళ్లు గంజాయి బ్యాచ్లను తయారుచేశారు. ఆడబిడ్డలకు రక్షణలేకుండా పోయింది. మీకేదైనా జరిగితే నాకు ఫోన్ చేయండి. ఎవడైనా సరే.. తాటతీస్తా. ఇక ఈ కార్యక్రమంలో పొదుపు సంఘాలకు రూ.10,100 కోట్ల రుణాల చెక్కును సీఎం చంద్రబాబు అందజేశారు. -
రేటు పెంచి పంచుకున్నారు..
సాక్షి, అమరావతి: వడ్డించేవాడు మనవాడైతే పంక్తిలో ఏ చివర కూర్చున్నా పర్వాలేదు అన్నది సామెత... చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే చాలు ఎల్–1గా రాకపోయినా సరే హెరిటేజ్ ఫుడ్స్కు అడ్డదారిలో టెండర్లు దక్కుతుండడం ఈ సామెతకు సరిగ్గా సరిపోతుంది. నెయ్యి ధరను అమాంతంగా పెంచేసి మరీ కాంట్రాక్టులు కట్టబెట్టడం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిధులను బరితెగించి కొల్లగొడుతున్నారు. ప్రధానంగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు అండ్ కో చేసిన దుష్ప్రచార రాద్ధాంతం వెనుక ఎంతటి కుట్ర ఉందో తెలిపే వాస్తవాలు రోజుకొకటి బయటపడుతున్నాయి. ఇందాపూర్, ఇంకా హెరిటేజ్ అనుకూల డెయిరీలు మాత్రమే టీటీడీ టెండర్లలోపాల్గొనేలా.. అసలు నెయ్యి టెండర్లంటేనే ఇతర డెయిరీలు భయపడేలా చంద్రబాబు అండ్ కో కల్తీ దు్రష్పచార కుట్ర సాగించింది. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ అనుబంధ సంస్థ ఇందాపూర్ డెయిరీకి టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులు అడ్డగోలుగా కట్టబెట్టిన విషయం ఇప్పుడు ఆధారాలతో సహా బయటపడింది. టీటీడీ టెండర్లలో ఎల్–1గా వచి్చన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (నందిని డెయిరీ)ని అడ్డంపెట్టుకుని ఇందాపూర్ డెయిరీకి భారీగా నెయ్యి కాంట్రాక్టులు కట్టబెట్టిన తీరు ఇదిగో ఇలా ఉంది... కిలో నెయ్యి ధర రూ.495 నుంచి రూ.716.92కు పెంచారు.. టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టుల పేరిట దోపిడీకి చంద్రబాబు ప్రభుత్వం పక్కాగా కథ నడిపింది. అందుకే టీటీడీ నెయ్యిని ఎంత ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తే అంతగా అవినీతికి పాల్పడవచ్చని స్కెచ్ వేసింది. అందుకే 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత పక్కా పన్నాగంతో టీటీడీకి సరఫరా చేసే నెయ్యి ధరను క్రమంగా పెంచారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం... టీటీడీ పాలకమండలి ఆమోదించిన తీర్మానాల వివరాలు చూస్తే నెయ్యి ధరలను క్రమంగా ఎలా పెంచుతూ పోయారో అర్థం చేసుకోవచ్చు. » 2024 నవంబరులో కిలో నెయ్యి రూ.495 చొప్పున కొనుగోలుకు టీటీడీ పాలకమండలి ఆమోదించింది. » రెండు నెలల్లోనే... అంటే 2025 జనవరిలో కిలో నెయ్యి కొనుగోలు ధరను రూ.513కు పెంచింది. » 2025 మేలో నెయ్యి ధరను మరింత పెంచుతూ కిలో రూ.600గా ఖరారు చేసింది. » అంతటితో ఆగలేదు... 2025 అక్టోబరులో కిలో నెయ్యి ధరను రూ.716.92కు పెంచింది. » దాదాపు ఏడాదిలోనే కిలో నెయ్యి ధరను రూ.495 నుంచి రూ.716.92కు పెంచింది. అంటే నెయ్యి ధర 44.83 శాతం పెరిగిందన్నమాట. అయితే ఎందుకు ఇలా నెయ్యి ధరలను పెంచుతూ పోయారు? దీని వెనక ఉన్న మతలబేమిటి? సంప్రదింపులకు యత్నించకుండానే ఏకపక్షంగా... నందిని డెయిరీ టీటీడీ టెండర్లలో పాల్గొని భారీ ధరలకు టెండరు కోట్చేసింది. అయినా టీటీడీ ఏమాత్రం సంకోచించకుండా ఆమోదించేసింది. సాధారణంగా ధరలు అమాంతంగా పెంచుతూ సంస్థలు బిడ్లు దాఖలు చేస్తే ప్రభుత్వంగానీ, టీటీడీగానీ ఇతర డెయిరీలతో సంప్రదింపులు జరపాలి. ధరలు తగ్గించమని కోరాలి. ఎందుకంటే 2025 అక్టోబరులో ఇందాపూర్ డెయిరీ బహిరంగ మార్కెట్లో నెయ్యి కిలో రూ.529కి విక్రయిస్తోంది. ఇక ఏపీలోని సహకార రంగ విజయ డెయిరీ కిలో రూ.675కు, తెలంగాణలోని సహకార రంగంలోని టీజీ విజయ డెయిరీ కిలో రూ.637 చొప్పునే రిటైల్ మార్కెట్లో విక్రయిస్తున్నాయి. రీటైల్ మార్కెట్లో విక్రయించే నెయ్యిని ప్యాకింగ్ చేసి విక్రయిస్తారు. ప్యాకింగ్ చార్జీలతోపాటు ఏజెన్సీకి లాభం(కమీషన్) అదనంగా భరించాల్సి ఉంటుంది. అదే టీటీడీకి నెయ్యిని ట్యాంకర్లలో సరఫరా చేస్తారు కాబట్టి ప్యాకింగ్ వ్యయం ఉండదు. మధ్యలో ఏజెన్సీ ఉండదు కాబట్టి కమీషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకే టీటీడీకి సరఫరా చేసే నెయ్యి ధర తక్కువగా ఉండాలి. కానీ దానిని చంద్రబాబు ప్రభుత్వం, టీటీడీ పట్టించుకోలేదు. వివిధ డెయిరీలతో సంప్రదింపులు జరిపితే నెయ్యి ధర తగ్గుతుందనే వాస్తవాన్ని కూడా ప్రభుత్వం, టీటీడీ విస్మరించాయి. ఏకపక్షంగా కిలో రూ.716.92లు చొప్పుననెయ్యికాంట్రాక్టు ఖరారు చేసేశారు. నందిని, ఇందాపూర్ ఫిఫ్టీ ఫిఫ్టీ... నెయ్యి ధరను అమాంతంగా పెంచుతూ టెండరు ఖరారు చేసిన తర్వాత అసలు దోపిడీ కథను ఎల్లో సిండికేట్ తెరపైకి తెచి్చంది. ముందుగా 2025 అక్టోబర్లో 20 లక్షల కిలోల నెయ్యి టెండర్లలో ఎల్–1గా వచ్చిన నందిని డెయిరీకి కాంట్రాక్టు ఖరారు చేశారు. అదీ కిలో రూ.716.92లు చొప్పున. ఆ మేరకు టీటీడీ పాలకమండలి తీర్మానం ఆమోదించిన తర్వాత.. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం నందిని డెయిరీ తాము 20 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేయలేమని చెప్పింది. తాము 10 లక్షల కిలోల నెయ్యి మాత్రమే సరఫరా చేయగలమని తెలిపింది. కూటమి ప్రభుత్వ పెద్దలే ఆ విధంగా నందిని డెయిరీతో చెప్పించారన్నది బహిరంగ రహస్యం. మరి 20 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేయలేని సంస్థ అసలు టెండర్లలో ఎందుకు పాల్గొంటుంది? అంటే కూటమి ప్రభుత్వ పెద్దలతో ముందుగా కుదుర్చుకున్న డీల్ ప్రకారమే నందిని డెయిరీ ఆ ప్రకటన చేసిందన్నది స్పష్టమవుతోంది. ఆ తర్వాత నందినీ డెయిరీకి 10 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఖరారు చేశారు. మిగిలిన 10 లక్షల కిలోల నెయ్యి కాంట్రాక్టును హెరిటేజ్ ఫుడ్స్ అనుబంధ సంస్థ ఇందాపూర్ డెయిరీకి కట్టబెట్టేందుకు పావులు కదిపారు. ఆ మేరకు టీటీడీ నెయ్యి కాంట్రాక్టుల్లో సవరణలు చేసి 2025 డిసెంబర్లో పది లక్షల కిలోల నెయ్యి చొప్పున మొత్తం మీద 20 లక్షల కిలోల నెయ్యి కొనుగోలు కోసం రెండు వేర్వేరు టెండర్లు పిలిచింది. ఇందాపూర్ డెయిరీకి కాంట్రాక్టు ఖరారయ్యేలా ఇతర డెయిరీలనూ మేనేజ్ చేశారు. ఇందాపూర్ డెయిరీకి అడ్డగోలుగా నెయ్యి కాంట్రాక్టులను ఖరారు చేస్తూ టీటీడీ పాలకమండలి ప్రత్యేకంగా రెండు తీర్మానాల (590 తీర్మానం, 605 తీర్మానం) ద్వారా కథ నడిపింది. అవి ఇలా ఉన్నాయి... » టీటీడీ తీర్మానం 590 ప్రకారం 10 లక్షల కిలోల నెయ్యి కాంట్రాక్టు ఖరారు చేశారు. అందులో ఇందాపూర్ డెయిరీకి 65 శాతం వాటాతో... అంటే 6.50 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చారు. మదర్ డెయిరీకి 35 శాతం వాటా... అంటే 3.50 లక్షల కిలోల నెయ్యి కాంట్రాక్టు కేటాయించారు. » ఇక టీటీడీ తీర్మానం 605 ప్రకారం మరో 10 లక్షల కిలోల నెయ్యి కాంట్రాక్టు ఖరారు చేశారు. అందులో ఇందాపూర్కు 35 శాతం వాటా.. అంటే 3.50 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చారు. మదర్ డెయిరీకి 65 శాతం వాటా... అంటే 6.50 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు కేటాయించారు. ధర మాటున మతలబు ఇందాపూర్ డెయిరీకి అనుకున్నట్టుగానే 10 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు దక్కింది. మరీ కిలో రూ.716.92 అంటే బాగుండదు అనుకున్నారో ఏమో.. టీటీడీ తీర్మానం 590 ప్రకారం కిలో నెయ్యి రూ.658 చొప్పున ఇందాపూర్ డెయిరీకి 6.50 లక్షల కిలోల నెయ్యి టెండర్ ఖరారు చేశారు. ఇక టీటీడీ తీర్మానం 605 ప్రకారం కిలో నెయ్యి రూ.649 చొప్పున ఇందాపూర్ డెయిరీకి 3.50 లక్షల కిలోల నెయ్యి టెండరు కట్టబెట్టారు. ఇలా మొత్తంగా రూ.65.48 కోట్ల విలువైన నెయ్యి సరఫరా కాంట్రాక్టును అడ్డగోలుగా కట్టబెట్టారు. అంటే ఇందాపూర్ డెయిరీకి 10 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టును కట్టబెట్టేందుకే పక్కా పన్నాగంతోనే ఈ కథంతా నడిపారని, నందిని డెయిరీకి నష్టం లేకుండా.. కిలో నెయ్యి ధరను రూ.495 నుంచి రూ.716.92కు పెంచారన్నది బట్టబయలైంది. ఇక ఇందాపూర్ డెయిరీకి ఖరారు చేసిన ధరలను ఏడాది క్రితం టీటీడీ నెయ్యి ధరతో పోలిస్తే చంద్రబాబు ముఠా దోపిడీ పన్నాగం బయటపడుతోంది. ఏకంగా 33 శాతం అధిక ధరకు ఇందాపూర్ డెయిరీకి కాంట్రాక్టు ఖరారు చేశారన్నది తేటతెల్లమవుతోంది. అందుకు సహకరించిన నందినీ డెయిరీకి కూడా రూ.76.19 కోట్ల కాంట్రాక్టు ఖరారు చేశారు. వెరసి దొంగలు దొంగలు కలిపి ఊళ్లు పంచుకున్నట్టుగా... నందిని డెయిరీ, ఇందాపూర్ డెయిరీ కలిపి తిరుమల శ్రీవారి నిధులను కొల్లగొట్టాయన్నది స్పష్టమైంది. చేతులెత్తేసి... మళ్లీ టెండర్లలో పాల్గొన్న ‘నందిని’... ఇక తిరుమల శ్రీవారి నిధులు కొల్లగొట్టేందుకు చంద్రబాబు ముఠా పన్నిన పన్నాగం టీటీడీ సవరణ టెండర్ల వ్యవహారంలో బట్టబయలైంది. మొదట 20 లక్షల కిలోల నెయ్యి టెండర్లలో పాల్గొన్న నందిని డెయిరీ... తీరా టెండరు ఖరారు అయ్యాక (ముందుగా వేసుకున్న పథకం ప్రకారం) తాము 10 లక్షల కిలోలే సరఫరా చేయగలమని చేతులెత్తేసిన విషయం తెలిసిందే. దాంతో ఆ డెయిరీని కిలో రూ.716 చొప్పున 10 లక్షల కిలోల నెయ్యి కాంట్రాక్టుకే పరిమితం చేశారు. తద్వారా ఇందాపూర్ డెయిరీకి 10 లక్షల కిలోల నెయ్యి కాంట్రాక్టు కట్టబెట్టేందుకు మార్గం సుగమం చేశారు. అందుకోసం టీటీడీ 10 లక్షల కిలోల నెయ్యి చొప్పున రెండు వేర్వేరు అంటే 20 లక్షల కిలోల నెయ్యి కొనుగోలు కోసం సవరణ టెండర్లు పిలిచింది. వాటిలో టీటీడీ 605 తీర్మానం ద్వారా ఆమోదించిన ఒక టెండరులో నందిని డెయిరీ కూడా పాల్గొనడం గమనార్హం. అంటే 10 లక్షల కిలోల కంటే ఎక్కువ సరఫరా చేయలేమని 2025 అక్టోబరులో పక్కకు తప్పుకొన్న నందినీ డెయిరీ... ఆ వెంటనే.. అంటే 2025 నవంబరులోనే పిలిచిన టెండర్లలో మరో 10 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేయగలమని బిడ్ దాఖలు చేసి ఎల్–3గా నిలిచింది. అంటే 2025 సెప్టెంబరులో పిలిచిన టెండర్లలో కూడా 20 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేయగల సామర్థ్యం నందిని డెయిరీకి ఉందనేది స్పష్టమైంది. కేవలం ఇందాపూర్ డెయిరీ కోసమే ఆ రోజు 10 లక్షల కిలోల నెయ్యి టెండరు నుంచి నందిని పక్కకు తప్పుకొంది. మళ్లీ 2025 డిసెంబర్లో పిలిచిన సవరణ టెండర్లలో కిలో నెయ్యి రూ.716 చొప్పున బిడ్ దాఖలు చేసింది. అంటే ఇందాపూర్ డెయిరీకి కిలో రూ.658 చొప్పున కాంట్రాక్టు ఖరారు చేసేందుకే ఆ విధంగా అధిక ధరకు బిడ్ దాఖలు చేసింది. ఆ విధంగా చంద్రబాబు ముఠా ఇందాపూర్ డెయిరీకి అడ్డగోలుగా టెండరు ఖరారు చేసేందుకు పక్కాగా కథ నడపిందన్నది స్పష్టమవుతోంది. -
చీకటి కాలం.. దుశ్శాసన పర్వం
సాక్షి, అమరావతి: మహిళాభ్యుదయానికి, మహిళా సాధికారతకు చంద్రబాబు పాలన చీకటి కాలమని, ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్నదంతా దుశ్శాసన పర్వమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎంవైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీని అమలు చేయకుండా మోసం చేసిన చంద్రబాబుకు మహిళా సాధికారత అన్న పదం పలికే అర్హత కూడా లేదని నిప్పులు చెరిగారు. మూడు రోజులుగా చంద్రబాబు సర్కారు ప్రజలకు మూడు డ్రామాలు చూపించిందని, అసెంబ్లీలో ఒక డ్రామా.. పగటి వేషాలు వేసుకున్న అదే ఎమ్మెల్యేతో మరో డ్రామా.. ఈ రెండింటికీ కొనసాగింపుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున చంద్రబాబు నాయుడు ట్రూప్ ఇంకో డ్రామా ఆడిందంటూ ఎద్దేవా చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆదివారం ఆయన పోస్టు చేశారు. ‘నేను నేరుగా చంద్రబాబునాయుడిని అడుగుతున్నా.. జనాభాలో 50 శాతం ఉన్న అక్క చెల్లెమ్మలకు ఎన్నికల ముందు మీరిచ్చిన ఏ ఒక్క హామీని ఇప్పటి వరకు సక్రమంగా అమలు చేయకపోయినా, అన్నీ చేసేసినట్లు విజయవాడలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, పట్టపగలు డ్రామాలాడిన మీకు మహిళా సాధికారత అన్న పదం పలికే అర్హత ఉందా?’ అని నిలదీశారు. ఈ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..⇒ సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లో భాగంగా 19–59 మధ్య వయసున్న ప్రతి అక్కచెల్లెమ్మకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పారు. రాష్ట్రంలో 18 ఏళ్ల పైబడి, 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలు ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం కోటి 80 లక్షల మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.1,500 అంటే సంవత్సరానికి రూ.18 వేల చొప్పున ఒక్కో అక్కచెల్లెమ్మకు మూడేళ్లలో రూ.54 వేల చొప్పున బాకీ పడ్డారు. ఆ డబ్బులు ఎప్పుడిస్తారు చంద్రబాబు గారూ?⇒ 50 ఏళ్లకే పింఛన్ మరో హామీ. 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు నెలకు రూ.4 వేలు చొప్పున ఒక్కొక్కరికి ఏటా రూ.48 వేలు ఇవ్వాలి. మూడేళ్లలో రూ.1.44 లక్షలు బాకీ పడ్డారు. ఆ డబ్బులు ఎప్పుడిస్తారు? ⇒ బడికి వెళ్లే ప్రతి పిల్ల వాడికి ఏడాదికి రూ.15 వేల చొప్పున ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ తల్లికి వందనం కింద ఇస్తామన్నారు. మొదటి ఏడాది పూర్తిగా ఎగనామం పెట్టారు. రాష్ట్రంలో యూడీఐఎస్ఈ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్–యూడైస్) ప్రకారం 2023–24 నాటికి బడికి పోయే పిల్లలు 87,41,885 మంది ఉంటే రెండో ఏడాది 20 లక్షల మందికి ఎగరగొట్టారు. చివరకు 67.27 లక్షల మందికి మాత్రమే.. అది కూడా కొందరికి రూ.8 వేలు.. రూ.9 వేలు.. రూ.10 వేలు, మరి కొంత మందికి రూ.13 వేలు ఇచ్చారు. మరి వీళ్లందరికీ మిగిలిన డబ్బులు ఎప్పుడిస్తారు? ఎగ్గొట్టిన మొదటి ఏడాది డబ్బులు ఎప్పుడిస్తారు? ⇒ సూపర్ సిక్స్లో ఉచిత గ్యాస్ చిన్న హామీ. ఇక్కడ కూడా మోసాలే. రాష్ట్రంలో యాక్టివ్గా ఉన్న గ్యాస్ కనెక్షన్ల సంఖ్య దాదాపు 1.59 కోట్లు. వీరికి ఏటా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. సిలిండర్ ధర రూ.855 చొప్పున మూడు సిలిండర్లకు ఏడాదికి రూ.3,990 కోట్లు కేటాయించాలి. మొదటి ఏడాది కేవలం రూ.786 కోట్లు, రెండో ఏడాది రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం బడ్జెట్లో రూ.2,199.99 కోట్లు కేటాయించారు. 2026–27లో బడ్జెట్లో ఈ పథకానికి పెట్టింది రూ.2,601 కోట్లు. అంటే మొత్తంగా రూ.6,143 కోట్లు బాకీ పడ్డారు. ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారు చంద్రబాబు గారూ?⇒ ఉచిత బస్సులో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లవచ్చని మహిళలకు హామీ ఇచ్చారు. కడప నుంచి వైజాగ్కు పోవచ్చు.. శ్రీకాకుళం వాళ్లు తిరుపతికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు.. మధ్యలో కనకదుర్గమ్మను కూడా దర్శనం చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ఫ్రీ అన్నారు. ఏపీఎస్ ఆర్టీసీలో 16 రకాల సర్వీసులుంటే.. కేవలం ఐదు సర్వీసులకు మాత్రమే పరిమితం చేశారు. ఈ పథకం అమలు చేయాలంటే ఏడాదికి రూ.3,200 కోట్లు ఖర్చు చేయాలి. మొదటి ఏడాది ఈ స్కీమ్ ఎగరగొట్టేశారు. రెండో ఏడాది ఆర్నెల్ల తర్వాత ఆగస్టులో అరకొరగా మొదలు పెట్టారు. చేసిన ఖర్చు రూ.1,040 కోట్లు. ఈ స్కీమ్ కోసం ఈ బడ్జెట్లో కేటాయించిన మొత్తం రూ.1,420 కోట్లు. అంటే మూడేళ్లలో రూ.9,600 కోట్లకు గాను రూ.2,460 కోట్లు కేటాయించారు. అంటే రూ.7,140 కోట్లు బాకీ పడ్డారు. ఆ డబ్బులు ఎప్పుడిస్తారు చంద్రబాబు గారూ?⇒ సూపర్ సిక్స్లో అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ఇలా వంచనగా మార్చటం వల్ల ప్రతి కుటుంబాన్ని, అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారతను, మొత్తంగా మన రాష్ట్రంలో ఇంటింటి భవిష్యత్తును మీరు ఎంతగా దెబ్బతీశారో అర్థమవుతోందా?⇒ అక్కచెల్లెమ్మల పేరిట వాళ్లకు మంచి చేస్తూ ఏకంగా 31 లక్షల ఇళ్లపట్టాలిచ్చాం. అందులో 21 లక్షల ఇళ్లు మంజూరు చేయించాం. అందులో 10 లక్షల పైచిలుకు ఇళ్లు పూర్తి చేశాం. చంద్రబాబునాయుడు అక్కచెల్లెమ్మలకు ఇచ్చే ఇంటి స్థలాలకు సంబంధించి చేసిన ప్రామిస్ ఏంటి? పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. 3 బడ్జెట్లు అయిపోయాయి. ఈ రోజుకు కూడా ఒక్క కుటుంబానికి ఒక్క పట్టా ఇవ్వలేదు. దీని కోసం ఒక్క గజం కూడా స్థలం కొనలేదు. ఉన్న ఇళ్ల నిర్మాణాలను గాలికొదిలేశారు. మరి ఆ ఇళ్ల నిర్మాణాలను అక్కచెల్లెమ్మలకు ఎప్పుడు పూర్తి చేసి ఇస్తారు? ⇒ డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకానికి మూడు బడ్జెట్లలో అతీగతీ లేదు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని చెప్పారు. పెంచడం సంగతి దేవుడెరుగు.. మామూలుగా ఇంతకు ముందు ఇస్తున్నట్టు ఇచ్చేది కూడా ఆగిపోయింది. మా హయాంలో కోటి మంది మహిళలకు వడ్డీ లేని రుణాల కింద రూ.4,969 కోట్లు ఇచ్చాం. మీరు వచ్చి మూడు బడ్జెట్లు పెట్టారు. ఇప్పటికి ఒక్క పైసా కూడా సున్నా వడ్డీ కింద ఇవ్వలేదు. ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారు? ⇒ వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 26,98,931 మంది అక్కచెల్లెమ్మలకు రూ.19,189 కోట్లు.. వైఎస్సార్ ఆసరా కింద 78,94,169 మందికి రూ.25,570 కోట్లు.. వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 3,58,613 మందికి రూ.2,029 కోట్లు.. వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా 4,95,269 మంది అక్కచెల్లెమ్మలకు మరో రూ.1,876 కోట్లు ఇచ్చాం. నిజంగా స్త్రీ శక్తి ఎక్కడైనా లభించింది అంటే, వారి సాధికారత ఎక్కడైనా జరిగింది అంటే అది వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే అని గర్వంగా చెప్పగలుగుతాం. ఈ పథకాలన్నీ మీరు అధికారంలోకి వచ్చాక రద్దు చేశారు. మరి మీకు మహిళా సాధికారత గురించి మాట్లాడే అర్హత ఉందా?⇒ మీ పాలనలో ఈబీసీ అక్కచెల్లెమ్మలకు ఈబీసీ నేస్తం అనే పథకమే లేదు. మీకు కాపుల్ని మభ్య పెట్టి.. వారి ఓట్లు కొల్లగొట్టే ప్యాకేజీ పథకాలు బాగా తెలుసుగానీ, కాపు నేస్తంగా ఒక్క రూపాయి కూడా ఆ అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన చరిత్ర మీకు కానీ, మీకు మద్దతిస్తున్న వారికి కానీ లేదు.⇒ ఇలా ఇవ్వక పోవటం కూడా మీకున్న విజన్లో భాగమే అని నమ్మించగల ఎల్లో మీడియా మీ చేతిలో ఉంది కాబట్టి.. ఇదీ గొప్ప ఎంపవర్మెంట్ అని పత్రికల్లో రాయించటం, టీవీల్లో వేయించటమే ఇక మిగిలింది!⇒ అక్కచెల్లెమ్మల కాపురాల్లో చిచ్చుపెట్టేలా వీధికో బెల్టుషాపు, ఊరికో మద్యం షాపు, బారు తెరవటమే మీకు తెలిసిన మహిళా సాధికారత. అదే మీకు తెలిసిన మహిళా భద్రత.⇒ దిశ పోలీస్ స్టేషన్లను, దిశ యాప్ను కూడా నిర్వీర్యం చేశారు. చివరికి రాష్ట్రాన్ని మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ టీటీడీ చైర్మన్.. అత్యాచార ఆంధ్రప్రదేశ్ను నిర్మించారు. పసి పిల్లల్ని, ఆడపిల్లల్ని, చివరికి ఉద్యోగాలు చేసుకుంటున్న మహిళల్ని మీరు, మీకు మద్దతిస్తున్న వాళ్లు పెంచి పోషిస్తున్న కామాంధులంతా ఎలా చిదిమేస్తున్నారో చూసి కూడా మీకు సిగ్గనిపించడం లేదా?⇒ మా పాలనలో 90 శాతం అక్కచెల్లెమ్మల పేరిట డీబీటీ పథకాలే. మేం ఇచ్చిన ఇళ్ల స్థలాలన్నీ అక్కచెల్లెమ్మల పేరుమీదే. దేశ చరిత్రలో తొలిసారిగా.. మేం ఇచ్చిన వేల కొద్దీ నామినేటెడ్ పదవుల్లో 50 శాతం వాటా వారికే.⇒ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఎక్కువ మంది మహిళలకు ఎమ్మెల్సీలు, క్యాబినెట్ మంత్రులుగా అవకాశం ఇచ్చింది కూడా మా పాలనలోనే. అందుకే మా పాలన మహిళా సంక్షేమ చరిత్రలో సువర్ణ అధ్యాయం అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ⇒ ఇప్పటి పరిస్థితి ఏమిటంటే.. మహిళాభ్యుదయానికి, మహిళా సాధికారతకు చంద్రబాబు పాలన చీకటి కాలం. రాష్ట్రంలో నడుస్తున్నదంతా దుశ్శాసన పర్వం. -
నారా వారి నిర్వాకానికి 'నారీ విలాపం'!
నాడు: మహిళలకు స్వర్ణయుగం. అక్క చెల్లెమ్మలు ఆర్థికంగా నిలదొక్కుకుంటే కుటుంబంతో పాటు రాష్ట్రం ప్రగతి బాట పడుతుందని వైఎస్ జగన్ ప్రత్యేకంగా పథకాలు అందించారు. ఆర్థిక సాధికారతతోపాటు రాజకీయంగానూ ఎదిగేలా ప్రోత్సాహం అందించారు. నామినేటెడ్ పనులు, పదవుల్లో 50 శాతం మహిళలకే దక్కేలా చట్టం చేసి మరీ అమలు చేశారు. వైఎస్సార్ ఆసరా, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, సున్నా వడ్డీ పథకాలతో పాటు మహిళల పేరిటే ఇళ్ల పట్టాలు అందించి పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలను సైతం చేపట్టారు. పొదుపు మహిళలకు అండగా నిలిచారు. ‘చేయూత’ ద్వారా మహిళా సాధికారతకు వైఎస్ జగన్ ప్రభుత్వం బాటలు వేసింది. మహిళలు వివిధ వ్యాపారాల్లో రాణించి తమ కాళ్లపై తాము నిలదొక్కుకునేలా వారి ఉత్పత్తులను అమూల్, రిలయన్స్, ఐటీసీ ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, హిందుస్థాన్ లీవర్ లాంటి ప్రముఖ సంస్థలతో అనుసంధానించి, రుణాలు అందచేసి తోడ్పాటునిచ్చారు. తద్వారా మహిళలను అన్ని రంగాల్లో అగ్రపథాన నిలిపారు.నేడు: 2024 ఎన్నికల సమయంలో చంద్రబాబు వరాల వల విసిరారు. జగన్ ఇచ్చిన వాటి కంటే ఎక్కువ పథకాలు ఇస్తామని నమ్మబలికారు. మహిళల ఓట్లు కొల్లగొట్టారు. అధికారం చేపట్టాక వారిని విస్మరించారు. ఒక్కటంటే ఒక్క హామీని అమలు చేయకుండా మహిళలకు మొండి చేయిచూపారు. ఒక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎగ్గొట్టడం ద్వారానే మహిళలకు దాదాపు రూ.లక్ష కోట్ల మేర బకాయి పడ్డారు. గతంలో వైఎస్ జగన్ ఇచ్చిన పథకాలను చంద్రబాబు ఇవ్వకపోగా, తాను ఇస్తానన్న వాటిని సైతం ఎగ్గొట్టారు. దీంతో చంద్రబాబును నమ్మి మోసపోయామని, 20 నెలలుగా ప్రతి అడుగులోనూ మోసమేనని, దేశంలో ఏ రాజకీయ నాయకుడూ ఇలా మోసాలు చేసి, హామీలను నెరవేర్చానని నిస్సిగ్గుగా బుకాయించరని మహిళలు మండిపడుతున్నారు. వైఎస్ జగన్ పాలన స్వర్ణ యుగమని, మహిళలను మహరాణులుగా చేశారని గుర్తు చేసుకుంటున్నారు.సాక్షి, అమరావతి: నారా వారి నిర్వాకానికి నారీలోకం విలపిస్తోంది! చంద్రబాబు ఎన్నికల మోసాలు.. సూపర్ సిక్స్ హామీల ఎగవేత.. ఓటు బ్యాంకు రాజకీయాలు.. మహిళా దినోత్సవం సాక్షిగా మరోసారి బట్టబయలయ్యాయి. ప్రధానంగా మహిళలకు ఇచ్చిన హామీల అమలుకు మూడు బడ్జెట్లలోనూ కేటాయింపులు జరపని చంద్రబాబు అమరావతిలో ఆదివారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో సైతం ఆడబిడ్డ నిధి, డ్వాక్రా మహిళలకు సున్నావడ్డీ, 50 ఏళ్లకే పెన్షన్, పెళ్లి కానుక.. తదితర పథకాల ఊసెత్తకపోవడం గమనార్హం. 2024 ఎన్నికల ముందు మేనిఫెస్టో పేరుతో ఇంటింటికి బాండ్లు, కరపత్రాలు పంచి పెట్టిన చంద్రబాబు ఇప్పుడు మహిళలను నయవంచన చేశారని ఆక్రోశిస్తున్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను అటకెక్కించడంతోపాటు చంద్రబాబు కనీసం తానిచ్చిన హామీలను సైతం నెరవేర్చకుండా దగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆడబిడ్డ నిధి బకాయిలు రూ.97,200 కోట్లు ప్రతి అక్క చెల్లెమ్మకు మూడేళ్లలో రూ.54,000 ఎగవేత..! సూపర్ సిక్స్లో అతిముఖ్యమైన హామీ.. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున చంద్రబాబు ఏటా రూ.18 వేలు చొప్పున ఇస్తానన్నారు. ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 18 నుంచి 60 ఏళ్లలోపు వయసు మహిళలు 1.80 కోట్ల మంది ఉన్నారు. హామీ ప్రకారం ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.18 వేల చొప్పున ఏటా మొత్తం రూ.32,400 కోట్లు చెల్లించాలి. కానీ ఈ పథకానికి మూడు బడ్జెట్లలో కేటాయించింది సున్నా. మూడేళ్లకు కలిపి అక్క చెల్లెమ్మలకు చంద్రబాబు బకాయి పడ్డ సొమ్ము అక్షరాలా రూ.97,200 కోట్లు. ప్రతి అక్కచెల్లెమ్మకు ఈ స్కీమ్ కింద మూడేళ్లలో రూ.54 వేలు ఎగరగొట్టారు! సున్నా వడ్డీకి శూన్యం.. మహిళలకు రూ.15 వేల కోట్లు బాకీ పొదుపు మహిళల సున్నా వడ్డీకి మూడు బడ్జెట్లలోనూ అతీగతి లేదు. స్వయం సహాయ సంఘాలకు వడ్డీలేని రుణాలను రూ.3 లక్షల నుంచి ఏకంగా రూ.10 లక్షలకు పెంచుతామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని చంద్రబాబు నెరవేర్చకపోగా గత ప్రభుత్వంలో అమలు చేసిన దాన్ని కూడా నిలిపివేశారు. గత ప్రభుత్వంలో కోటి మందికిపైగా పొదుపు మహిళలు సున్నా వడ్డీ ద్వారా దాదాపు రూ.ఐదు వేల కోట్ల మేర లబ్ధి పొందారు. మూడు బడ్జెట్లలోనూ నిధులు కేటాయించకుండా సున్నా వడ్డీ కింద పొదుపు మహిళలకు చంద్రబాబు ఏకంగా రూ.15 వేల కోట్లు మేర ఎగ్గొట్టారు! ఇక చంద్రబాబు ప్రభుత్వంలో పొదుపు సంఘాల పరపతి గణనీయంగా క్షీణించింది. నాబార్డ్ డేటా ప్రకారం 2023–24లో మహిళల పొదుపు రుణాలు రూ.49,626 కోట్లు కాగా చంద్రబాబు హయాంలో 2025–26 (డిసెంబర్ వరకు) రూ.30,698 కోట్లకు పడిపోయింది. మహిళలకు బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో పరపతి తగ్గిపోతోంది. 50 ఏళ్లకే పింఛన్.. వంచన ఒక్కొక్కరికీ రూ.1.44 లక్షలు బకాయి సూపర్ సిక్స్లో ఇచ్చిన మరో హామీ 50 ఏళ్లకే పింఛన్. రాష్ట్రంలో 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు దాదాపు 20 లక్షల మందికి పైగానే ఉన్నారు. ఒక్కొక్కరికి నెలకు రూ.4 వేల చొప్పున సంవత్సరానికి రూ.48 వేలు ఇవ్వాలి. ఈ లెక్కన ఏడాదికి మొత్తం రూ.9,600 కోట్లు అవుతుంది. దీని ప్రకారం మూడేళ్లలో మొత్తం రూ.28,800 కోట్లు కేటాయించాల్సి ఉండగా మూడు బడ్జెట్లలో ఇచ్చింది సున్నా. ఒక్కొక్కరికీ రూ.1.44 లక్షలు మేర చంద్రబాబు బాకీ పడ్డారు. అసలు కొత్త పింఛన్లు ఇవ్వకపోగా ఉన్నవాటికే కోత పెడుతున్నారు. 2024 ఎన్నికల నాటికి రాష్ట్రంలో పింఛన్ల సంఖ్య 66,34,372 కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 60,96,108 మందికే ఫించన్లు ఇచ్చారు. అంటే ఏకంగా 5,38,264 పింఛన్లు కట్ చేశారు. మరోవైపు 2014లో టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో 39 లక్షల పింఛన్లు మాత్రమే ఉండగా వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక అర్హులందరికీ సంతృప్త స్థాయిలో అందచేస్తూ 66 లక్షలకుపైగా పింఛన్లు ఇచ్చింది. మళ్లీ చంద్రబాబు వచ్చిన రెండేళ్లకే పింఛన్లు 66 లక్షల నుంచి 60 లక్షలకు తగ్గిపోవడం గమనార్హం. తల్లులకు బాబు దగా.. మూడేళ్లలో రూ.24,504 కోట్లు ఎగవేత తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలను బడికి పంపిస్తే అంత మందికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. యూడైస్ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 87,41,885 మంది పిల్లలు బడుల్లో చదువుతున్నారు. ఈ పథకానికి ఒక్కొక్కరికీ ఏటా రూ.15 వేల వంతున ఏడాదికి మొత్తం రూ.13,112.82 కోట్లు ఇవ్వాలి. తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. 2025–26లో కేవలం 67.27 లక్షల మందికి రూ.6,377 కోట్లను మాత్రమే చెల్లించారు. రెండేళ్లలో తల్లులకు రూ.19,848.64 కోట్లకుపైగా బకాయిపడ్డారు. ఇక తాజా బడ్జెట్లో రూ.8457.07 కోట్లు మాత్రమే ప్రతిపాదించి ఏకంగా రూ.4,655.75 కోట్ల మేర కోతలు పెట్టారు. తద్వారా మూడేళ్లలో పిల్లలకు రూ.24,504 కోట్ల మేర చంద్రబాబు ఎగ్గొట్టారు! ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు చంద్రబాబు ఇచ్చిన హామీలు ఉచిత బస్సు, గ్యాస్.. తుస్సు మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీని అమలు చేయాలంటే ఏడాదికి రూ.3,200 కోట్లు ఆర్టీసీకి ఇవ్వాలి. తొలి ఏడాది హామీని పూర్తిగా ఎగ్గొట్టారు. ఇక రెండో ఏడాది ఆర్నెల్ల తరువాత ఆగస్టు నుంచి అరకొరగా మొదలుపెట్టి రూ.1,040 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. ఇక ఈ స్కీమ్ కోసం మూడో బడ్జెట్లో కేటాయించింది కేవలం రూ.1,420 కోట్లు. అంటే మూడేళ్లలో రూ.9,600 కోట్లకు గానూ రూ.2,460 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే మహిళలకు ఉచిత బస్సులో ఏకంగా రూ.7,140 కోట్లు బాకీ పడ్డారు. అంతేకాదు.. ఆర్టీసీలో 16 రకాల సర్వీసులు ఉండగా ఐదు సర్వీసుల్లో మాత్రమే ఉచిత బస్సును అమలు చేస్తున్నారు. ఇక ఉచిత గ్యాస్ కూడా మోసమే. రాష్ట్రంలో యాక్టివ్ గ్యాస్ కనెక్షన్ల సంఖ్య 1.59 కోట్లు కాగా ఏటా మూడు సిలెండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. సిలిండర్ ధర రూ.855. ఈ లెక్కన ఏడాదికి మూడు సిలిండర్లు ఇవ్వాలంటే రూ.3,990 కోట్లకుపైగా ఇవ్వాలి. ఇలా మూడేళ్లకు మొత్తం లబ్ధిదారులకు రూ.6,143 కోట్లు బాకీ పడ్డారు.అక్కచెల్లెమ్మలకు ఇళ్ల స్థలాల హామీ ఏమైంది..? చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో ఇళ్ల స్థలాల కోసం పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పి మూడు బడ్జెట్లలోనూ పైసా కేటాయించలేదు. ఒక్కరికి కూడా సెంటు భూమి పట్టా ఇవ్వలేదు. పైగా వైఎస్సార్సీపీ హయాంలో 10 లక్షల ఇళ్లు పూర్తి కాగా వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్న మిగతా వాటిని చంద్రబాబు తన ఖాతాలో వేసుకుని క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారు. 21 లక్షల ఇళ్లు మంజూరు చేయించి 10 లక్షల గృహ నిర్మాణాలను పూర్తి చేశారు. ఆడబిడ్డలకు రక్షణ కరువు.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మహిళలకు రక్షణ కరువైంది. గంజాయి, బ్లేడ్బ్యాచ్లు చెలరేగిపోవడంతో రాష్ట్రంలో రోజుకి నలుగురు, ఐదుగురు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. రోజుకు 50 నుంచి 60 మందిపై లైంగిక వేధింపుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో మహిళలపై నేరాలు 10 శాతం పెరగగా.. హోంమంత్రి అనిత ఇన్చార్జిగా ఉన్న విజయనగరం జిల్లాలోనూ నేరాలు పెరిగాయని, లోకేశ్ నియోజకవర్గంలోనూ మహిళలపై నేరాలు పెరిగాయని పోలీస్ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. మదనపల్లెలో గంజాయి మత్తులో ఓ క్రూరమృగం ఏడేళ్ల బాలికపై హత్యాచారానికి తెగబడి డ్రమ్ములో పడేయడం రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులకు అద్దం పడుతోంది. అరవ శ్రీధర్ అనే కూటమి ఎమ్మెల్యే తనను ఐదుసార్లు గర్భవతిని చేసి అబార్షన్లు చేయించినట్లు బాధితురాలు మొర పెట్టుకున్నా చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం చలనం లేకుండా వ్యవహరించింది. పలువురు టీడీపీ, జనసేన ప్రజా ప్రతినిధులు మహిళలకు లైంగిక వేధింపులకు దిగడం రాష్ట్రంలో నెలకొన్న అరాచక పరిస్థితులకు, సర్కారు వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.జగన్ పాలనలో మహిళలకు స్వర్ణయుగంవైఎస్ జగన్ నవరత్నాల పాలన మహిళలకు స్వర్ణయుగంగా సాగింది. అమ్మ కడుపులోని బిడ్డ నుంచి ఆప్యాయంగా ఆశీర్వదించే అవ్వ వరకు ప్రతి ఒక్కరి అవసరాలను గుర్తించి వైఎస్ జగన్ పథకాలను అమలు చేశారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మహిళలకు పలు పథకాల ద్వారా డీబీటీ, నాన్ డీబీటీతో ఏకంగా రూ.2,83,866.34 కోట్లు అందించారు. చట్టం చేసి మరీ 50 శాతం పదవులు.. నామినేటెడ్ పోస్టుల నుంచి కేబినెట్ వరకు మహిళలకు వైఎస్ జగన్ పెద్ద పీట వేశారు. రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్, హోం, వైద్య ఆరోగ్య, పర్యాటక శాఖల మంత్రులుగా మహిళలకు పట్టం కట్టారు. నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ పద్ధతిలో ఇచ్చే కాంట్రాక్ట్ పనుల్లో కూడా మహిళలకు 50 శాతం కేటాయిస్తూ చట్టం చేసి మరీ అమలు చేశారు. అక్క చెల్లెమ్మల పేరిటే ఇళ్లు.. స్థలాలు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ సొంతగూడు ఉండాలన్న సంకల్పంతో మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంటి స్థలాలతో పాటు ఇళ్లు మంజూరు చేశారు. అక్క చెల్లెమ్మల పేరిట స్థిరాస్తిని సమకూర్చడం దేశంలోనే సరికొత్త చరిత్ర. సొంత ఇళ్లు లేని అక్కచెల్లెమ్మలకు ఏకంగా 31 లక్షల ఇళ్ల స్థలాలు అందజేశారు. వైఎస్సార్సీపీ హయాంలో ఇళ్ల పట్టాల పంపిణీలో భాగంగా భూముల కొనుగోలు కోసం రూ.11,871 కోట్లు, ఇళ్ల నిర్మాణాలకు రూ.20,338 కోట్లు ఖర్చు చేశారు. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.3 వేల కోట్లతో కలిపి మొత్తం రూ.35,209 కోట్లు వెచ్చించి అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలిచ్చి, ఇళ్లు కట్టించి ఇచ్చి లక్షాధికారులను చేశారు. ఇదే విషయాన్ని సాక్ష్యాత్తూ కేంద్ర ప్రభుత్వం డిసెంబర్లో లోక్సభ సమావేశాల్లో లిఖిత పూర్వకంగా వెల్లడించడం గమనార్హం.మహిళా రక్షణకు పెద్దపీట.. మహిళల రక్షణ, భద్రత కోసం వైఎస్ జగన్ పలు వినూత్న చర్యలు చేపట్టారు. ప్రధానంగా దిశ బిల్లు తెచ్చి దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లతో అక్క చెల్లెమ్మలకు రక్షణ కవచంలా నిలిచారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో ఒక మహిళా పోలీస్ను నియమించారు. ఏ మహిళకు ఆపద వచ్చినా సమాచారం అందుకున్న నిమిషాల వ్యవధిలోనే పోలీసులు రంగంలోకి దిగి అండగా నిలిచేలా దిశ యాప్ ద్వారా చర్యలు చేపట్టారు. -
భారతీయులు గర్వపడే విజయమిది : వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: టి20 వరల్డ్ కప్ గెలిచిన భారత క్రికెట్ బృందానికి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. అద్భుతంగా ఆడి మళ్లీ చాంపియన్లుగా నిలిచిన కెప్టెన్ సూర్యకుమార్ నేతృత్వంలోని జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. తుదిపోరులో ప్రారంభం నుంచే భారత్ ఆధిపత్యం ప్రదర్శించిందని కొనియాడారు. అభిషేక్ శర్మ, సంజు సామ్సన్, ఇషాన్ కిషన్ బాగా ఆడారని, చివరి విజయ క్షణాలు భారతీయులందరినీ గర్వపడేలా చేశాయని అభివర్ణించారు. వరల్డ్ కప్ కిరీటం తిరిగి మన ఇంటిలోనే ఉందంటూ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కూడా భారత జట్టుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఫైనల్లో టీమిండియా ప్రదర్శించిన అద్భుత ఆటతీరు దేశ ప్రజలందరికీ గర్వకారణమని కొనియాడారు. ఈ విజయం దేశ క్రీడా రంగానికి మరింత గౌరవం తెచ్చిందని రేవంత్ అన్నారు. -
టీ20 వరల్డ్ కప్ విజేత భారత జట్టుకు వైఎస్ జగన్ ప్రశంస
సాక్షి, తాడేపల్లి: టీ20 వరల్డ్ కప్లో భారత్ విజయం సాధించిన సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో పాటు మొత్తం టీమ్ ఇండియాకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. View this post on Instagram A post shared by YS Jagan Mohan Reddy (@ysjagan)అద్భుతమైన ఆటతీరు కనబరిచిన అభి, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ లకు ప్రత్యేక అభినందనలు. దేశం అంతా గర్వపడే లాంటి విజయం సాధించారు. ఈ గెలుపు ప్రతి భారతీయుడి హృదయాన్ని ఆనందంతో నింపింది అని పేర్కొన్నారు. భారత్ జట్టు కృషి, పట్టుదల, జట్టు స్పూర్తి వల్లే ఈ విజయాన్ని సాధించగలిగిందని జగన్ అన్నారు. ఈ విజయం యువతకు ప్రేరణగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. -
ఏపీలో నారావారి నరకాసుర పాలన: ఆర్కే రోజా
సాక్షి, తాడేపల్లి: మహిళా సాధికారత కోసం కృషి చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. మహిళలు రాజకీయాల్లో ఎదగాలంటే చాలా కష్టమని.. కానీ వైఎస్ జగన్ ప్రోత్సాహంతో పార్టీలో ఎంతోమంది మహిళలు ఎదిగారని ఆమె పేర్కొన్నారు. ఆదివారం.. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవం నిర్వహించారు. మహిళా నేతలు ఆర్కే రోజాతో పాటు వరుదు కళ్యాణి, రాయన భాగ్యలక్ష్మి, పూజిత, హారిక సహా పలువురు పార్టీ నేతలు కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ.. ‘‘నన్ను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి, మంత్రి పదవి ఇచ్చి వైఎస్ జగన్ ప్రోత్సాహించారన్నారు. కష్టపడే వారికి, టాలెంట్ఉన్న వారికి వైఎస్ జగన్ ఎప్పుడూ అవకాశం కల్పిస్తారు. వరుదు కళ్యాణి తన ఎమ్మెల్సీ పదవి అలంకార ప్రాయం కాదని.. ఆయుధమని నిరూపించారు. ప్రతి మహిళ ఒక శక్తిగా ఎదగాలి. టీమ్ వర్క్గా పని చేసి మళ్లీ జగన్ను సీఎంగా చేసుకోవాలి’’ అని ఆర్కే రోజా పేర్కొన్నారు.‘‘రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన సాగుతోంది. మహిళలకు రక్షణ కల్పించలేని దిక్కమాలిన ప్రభుత్వం ఇది. హోంమంత్రి అనిత తన పదవిని పట్టించుకోకుండా ఆట, పాటలతో కాలం గడుపుతోంది. అనితతో పాటు మరో ఇద్దరు మంత్రులు మహిళలకు ఏం మేలు చేశారు?. అలాంటి మంత్రులు సబిత, అనిత, గుమ్మడి సంధ్యారాణిలకు మహిళా దినోత్సవం జరుపుకునే అర్హత లేదు. అన్యాయానికి గురైన మహిళలు ఫిర్యాదులు చేస్తే వారిమీదే కేసులు పెడుతున్న దుస్థితి నెలకొంది...కులం, మతం, పార్టీ చూడకుండా వైఎస్ జగన్ అందరికీ మేలు చేశారు. చంద్రబాబు మాత్రం కులం, మతం, పార్టీ చూసి అందరికీ వెన్నుపోటు పొడుస్తున్నారు. ఇలాంటి వ్యక్తికి మహిళా దినోత్సవం జరుపుకునే అర్హత లేదు. పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి పేరు చెప్పుకుని, ఆమె తల్లి కన్నీటిని అడ్డు పెట్టుకుని రాజకీయం చేసిన వ్యక్తి. ముప్పై వేల మంది మహిళలు కనిపించకపోయారని చెప్పిన పవన్ ఈ ఇరవై నెలల్లో ఎంతమందిని తిరిగి తీసుకు వచ్చారు?.మనం చేసిన మంచి వలనే ఇప్పటికీ జనం మనల్ని గౌరవవిస్తున్నారు. కూటమి నాయకులు గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితే లేదు. చంద్ర మండలానికి కూడా చంద్రబాబు సీఎం అవుతాడని ఎల్లో మీడియా జాకీలు ఎత్తుతోంది. బీఆర్ నాయుడు తప్పు చేస్తే అందులో తప్పేం ఉందని ఎల్లోమీడియా ప్రశ్నిస్తోంది. బీఆర్ నాయుడుకి ఒళ్లంతా అహంకారమే. లడ్డూపై విష ప్రచారం చేసిన వారందరి లెక్కలూ వెంకటేశ్వరస్వామి తేల్చుతున్నాడు’’ అని ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. -
వచ్చే మంగళవారం బాబు సర్కారు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం వచ్చే మంగళవారం మళ్లీ రూ.3,000 కోట్లు అప్పు చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా ఈ అప్పు తీసుకోనుంది. 13 సంవత్సరాల కాలవ్యవధితో రూ.1,000 కోట్లు, 15 సంవత్సరాల వ్యవధితో రూ.1,000 కోట్లు, 17 సంవత్సరాల వ్యవధితో రూ.1,000 కోట్లు చొప్పున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేయనున్నట్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నోటిఫై చేసింది.చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే బడ్జెట్ పరిధిలో రూ.1,79,264 కోట్లు అప్పు చేసింది. వచ్చే మంగళవారం చేసే రూ.3,000 కోట్ల అప్పుతో కలిపి మొత్తం బడ్జెట్ పరిధిలోనే చంద్రబాబు సర్కారు 21 నెలల్లో చేసిన అప్పు రూ.1,82,264 కోట్లకు చేరనుంది. -
మహిళల అభ్యున్నతే సమాజ ప్రగతికి కొలమానం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల మహిళలతోపాటు యావత్ మహిళలందరికీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగినప్పుడే వారు నిజమైన పురోగతి సాధించినట్లని పేర్కొన్నారు. మహిళలు సంతోషంగా ఉంటే ఆ కుటుంబం బాగుంటుందని, తద్వారా గ్రామం, రాష్ట్రం చివరకు దేశం కూడా బాగుంటాయని తెలిపారు. అందుకే మహిళల సంక్షేమం, అభివృద్ధితోపాటు మహిళా సాధికారత లక్ష్యంగా తమ ప్రభుత్వం పలు పథకాలు, కార్యక్రమాలు రూపొందించి అమలు చేసిందని గుర్తుచేశారు. అన్ని రంగాల్లోనూ మహిళలను ప్రోత్సహించి, దాదాపు 32కు పైగా పథకాల ద్వారా వారికి భరోసా కల్పించామని చెప్పారు. మానవాళిలో సగభాగం మాత్రమే కాక, అభివృద్ధిలోనూ అంతకుమించిన పాత్ర పోషిస్తున్న మహిళల అభ్యున్నతే... ఏ సమాజం ప్రగతికైనా కీలకమైన కొలమానం అని తన సందేశంలో వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
కంపెనీ పెట్టెయ్.. భూములు కొట్టెయ్!
సాక్షి, అమరావతి: ముక్కుతూ మూలుగుతూ రూ.లక్ష మూలధనంతో ఏర్పాటైన నెలలు నిండని కంపెనీలు రూ.వందల కోట్ల పెట్టుబడులు పెట్టి ఉపాధి కల్పిస్తాయట! సత్తాలేని సంస్థలకు ఆగమేఘాలపై ఖరీదైన భూముల సంతర్పణ! పెట్టుబడుల ముసుగులో చంద్రబాబు సర్కారు భూముల పందేరం ఇదీ! తాజాగా ఎన్ఏఎన్ గ్రీన్మెట్, స్కై స్టోరేజ్ సంస్థలకు కూటమి ప్రభుత్వం ఇదే విధంగా భూములను కేటాయించింది. మూడు నెలల క్రితం కేవలం రూ.లక్ష మూలధన పెట్టుబడితో ముంబై కేంద్రంగా ఏర్పాటైన ఎన్ఏఎన్ గ్రీన్మెట్ లిమిటెడ్కు నెల్లూరు జిల్లా నాయుడుపేట వద్ద 21.36 ఎకరాలను కేటాయిస్తూ పరిశ్రమలశాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. వేదాంత గ్రూపు సమీప బంధువులైన అనన్య అగర్వాల్, నైవేద్య అగర్వాల్ 2025 నవంబర్10న ఎన్ఏఎన్ గ్రీన్మెట్ ప్రైవేట్ లిమిటెడ్ను నెలకొల్పారు. కంపెనీని ఏర్పాటు చేయడం.. రాష్ట్ర ప్రభ్వుత్వంతో చర్చలు జరపడం.. ఎస్పీసీ, ఎస్పీబీ, మంత్రివర్గం ఆమోదం పొందడం.. ఆ వెంటనే ఉత్తర్వులు జారీ అయ్యే విధంగా ఫైళ్లు శరవేగంగా పరిగెత్తాయంటే దీని వెనుక ఉన్న శక్తిని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం నాయుడుపేటలో రూ.కోట్లు పలుకుతున్న భూమిని ఎకరం కేవలం రూ.30 లక్షలు చొప్పున కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కారు చౌకగా భూమితో పాటు పెట్టుబడిలో 60.38 శాతం రాయితీల రూపంలో తిరిగి ఇవ్వనున్నారు. స్కై స్టోరేజ్ సొల్యూషన్స్.. వేర్ హౌసింగ్, లాజిస్టిక్ సేవలను అందించేలా స్కై స్టోరేజ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2025 డిసెంబర్ 5న విశాఖ కేంద్రంగా ఏర్పాటైంది. కేవలం రూ.లక్ష మూలధనంతో పవన్ ప్యాలెస్, దొడపర్తి, అక్కయ్యపాలెం, విశాఖ చిరునామాతో సిదార్థ అగర్వాల్, యోగేష్ శాంతిలాల్ పటేల్లు దీన్ని నెలకొల్పారు. ఈ కంపెనీ ఏర్పాటైన రెండు నెలల్లోనే అనకాపల్లిలో 15 ఎకరాలు కేటాయిస్తూ చంద్రబాబు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఎకరం రూ.80 లక్షలు చొప్పున తక్కువ ధరకు ఏపీఐఐసీ భూమిని కేటాయించింది. నాయుడుపేటలో ఎన్ఏఎన్ గ్రీన్మెట్ లిమిటెడ్కు అత్యంత విలువైన భూమిని ఎకరం రూ.30 లక్షలకు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు ⇒ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ లిమిటెడ్కు ఎకరా రూపాయి చొప్పున విశాఖ జిల్లా తర్లువాడ వద్ద 30 ఎకరాలు కేటాయిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సెమి కండక్టర్స్ పాలసీ కింద తొలి కంపెనీగా ప్రత్యేకంగా గుర్తిస్తూ ఎకరా రూపాయికే భూమిని కేటాయించినట్లు పేర్కొన్నారు. దీంతోపాటు పెట్టుబడిలో 40 శాతం వరకు ప్రోత్సాహకాల రూపంలో తిరిగి ఇవ్వనున్నారు. సిగాచీ ఇండస్ట్రీస్కు గుట్టపాడు క్లస్టర్లో ఎకరా రూ.30 లక్షలు చొప్పున 94.70 ఎకరాలు కేటాయించారు. వీటితోపాటు 45.02 శాతం రాయితీలు ఇవ్వనున్నారు. ⇒ వారీ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్కు కూటమి సర్కారు అనకాపల్లిలో సుమారు 300 ఎకరాలు ఎకరా రూ.50 లక్షలు చొప్పున కేటాయించింది. 59.73 శాతం ఫిక్స్డ్ క్యాపిటల్ సబ్సిడీ ఇవ్వనున్నారు. ⇒ పల్నాడు జిల్లా కొండవీడు వద్ద 12.31 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు అర్షథాతు గ్రీన్ నానోటెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్కు ఎకరానికి రూ.5 లక్షల క్యాపిటల్ సబ్సిడీతోపాటు ఆ భూమిని 22 ఏ నుంచి తొలగించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ⇒ సిఫి ఇన్ఫినిటీ స్పేసెస్ ఐటీసెజ్కు కేటాయించిన భూములకు సకాలంలో నగదు చెల్లింపులో విఫలం కాగా ఎటువంటి వడ్డీ లేకుండా చెల్లించేందుకు 90 రోజుల గడువు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.⇒ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్కు నెల్లూరు జిల్లా దత్తులూరు వద్ద 400 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ⇒ రేమాండ్ అనుబంధ కంపెనీ జేకే మైనీకి కేటాయించిన భూములకు ఎటువంటి వడ్డీ లేకుండా చెల్లించడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ⇒ విరూపాక్ష ఆర్గానిక్స్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్న ఫార్మా యూనిట్కు పెట్టుబడిలో 40 శాతం రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ⇒ బయోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్కు ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరులో 28.05 ఎకరాలు, శ్రీ సత్యసాయి జిల్లాలో 14.28 ఎకరాలను కేటాయిస్తూ చంద్రబాబు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. -
‘విజయ’ పేరుతో కల్తీ నెయ్యి
లాలాపేట: సహకార స్ఫూర్తికి విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం విజయ డెయిరీ బ్రాండ్(ఏపీ)ను మేఘనా ఫుడ్స్ అనే ప్రైవేట్ సంస్థకు ఫ్రాంచైజీ అప్పజెప్పడంతో వారు వెజిటెబుల్ ఆయిల్స్తో నెయ్యి తయారు చేసి ఏపీ విజయ పేరుతో కల్తీ నెయ్యి విక్రయిస్తున్నారని తెలంగాణ పాడిపరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య (విజయ డెయిరీ) తెలంగాణ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి అన్నారు. ఒక్క హైదరాబాద్లోనే నెలకు దాదాపు 100 టన్నుల కల్తీ నెయ్యి విక్రయిస్తూ విజయ బ్రాండ్కు చెడ్డపేరు తీసుకురావడంతోపాటు తెలంగాణ పాడి రైతాంగానికి తీవ్రమైన నష్టం కల్గిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెజిటెబుల్ ఆయిల్తో తయారు చేసిన నెయ్యిలో మోతాదుకు మించి హానికరమైన రసాయనాలు ఉన్నట్లు ఎన్డీడీబీ(నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు) పరీక్షలు చేసి తేల్చిందని అమిత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం లాలాపేటలోని విజయ భవన్లో ఎండీ చంద్రశేఖర్రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాటాడారు. ఏపీ డెయిరీ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్లో రైతుల నుంచి పాల సేకరణగానీ, పాల విక్రయం కానీ చేయడంలేదన్నారు. ప్రైవేట్ వ్యక్తులు గుజరాత్లో తయారు చేసిన నెయ్యిని ఏపీ విజయ డెయిరీ పేరుతో హైదరాబాద్లో విక్రయిస్తూ ఇక్కడి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని పేర్కొన్నారు. రైతుల ద్వారా సేకరించిన పాలు, పాల పదార్థాల నాణ్యతకు మారుపేరుగా తెలంగాణ విజయ నిలుస్తోందన్నారు. ప్రభుత్వ రంగసంస్థ అయిన విజయ తెలంగాణ బ్రాండ్ విశ్వసనీయతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. విజయ పేరుతో ఎవరూ కల్తీ చేసినాఅడ్డుకుని తీరుతామన్నారు.అవసరమైతే రైతులు రోడ్డెక్కి పోరాటం చేయాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఈ విషయమై ఇప్పటికే పలుమార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పలు లేఖలు రాసామని, స్వయంగా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా స్పందనలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం స్పందించి మేఘనా ఫుడ్స్కు ఇచ్చిన విజయ ఫ్రాంచైజీని విరమించుకోవాలని, లేదంటే తెలంగాణ సహకారంతో దాన్ని తామే అడ్డుకుంటామన్నారు. పాలు, పాల పదార్థాలు కొనేటప్పుడు నాణ్యతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న తెలంగాణ విజయ లోగోను చూసి మాత్రమే పాలు, నెయ్యి ఇతర పాల ఉత్పత్తులను కొనుగోలు చేయాలని చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి వినియోగదారులకు సూచించారు. -
గ్రామ సర్వేయర్లపై చంద్రబాబు సర్కారు కక్ష
సాక్షి, అమరావతి: న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆందోళన బాట పట్టిన గ్రామ సర్వేయర్లపై చంద్రబాబు సర్కారు కక్షసాధిస్తోంది. ఇప్పటికే 40 మంది సర్వేయర్లను సస్పెండ్ చేసింది. అందులో గ్రామ సర్వేయర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, గ్రామ సచివాలయ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మధుబాబు కూడా ఉన్నారు. ఈ చర్యల ద్వారా మిగిలిన ఉద్యోగులను భయపెట్టవచ్చని సర్కారు యోచనగా కనిపిస్తోంది. అనుమతి లేకుండా యూనియన్లు పెట్టి పోరాటం చేస్తున్నారంటూ ప్రభుత్వం సస్పెన్షన్ ఆర్డర్స్లో పేర్కొంది. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈనెల 5 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సర్వేయర్లు రాష్ట్రవ్యాప్తంగా సహాయ నిరాకరణ ప్రారంభించారు. రీ సర్వే కార్యక్రమంలో పాల్గొనకుండా తమ డిమాండ్లపై చర్చించాలని కోరారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ను కలిసినా ఉపయోగం లేకపోవడంతో ఆందోళనను ఉధృతం చేశారు. దీంతో ప్రభుత్వం మూడు రోజుల నుంచి వరుసగా సస్పెన్షన్లు ప్రారంభించింది. అయినా సర్వేయర్లు వెనక్కి తగ్గకుండా సర్వే శాఖ జిల్లా కార్యాలయాల వద్ద ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. ఇవీ డిమాండ్లు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ఇతర ఉద్యోగుల మాదిరిగానే తమ పే రోల్లో మార్పు చేయాలనేది సర్వేయర్ల ప్రధాన డిమాండ్. సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ రూ.30 వేల బేసిక్ పే ఉండగా, సర్వేయర్లకు మాత్రం రూ.25,200 మాత్రమే ఉంది. దీన్ని అందరితో సమానంగా పెంచుతామని, ప్రమోషన్ ఛానల్ కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం యధావిధిగా ఆ హామీని తుంగలో తొక్కింది. కనీస వేతనం కూడా ఇవ్వకుండా ప్రస్తుతం ఉన్న జీతాన్నే కేవలం పోస్టు పేరు మార్చి ఇచ్చేందుకు ప్రభుత్వం నివేదిక తయారు చేసినట్లు చెబుతున్నారు. దీంతో సర్వేయర్లు ఆందోళన బాట పట్టారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకూ ఆందోళన విరమించేది లేదని సర్వేయర్లు స్పష్టం చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగులతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు సర్వేయర్ల సంఘం సన్నాహాలు చేస్తోంది. -
కబ్జాల గీతం.. సర్కారు తాళం!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలో సీఎం చంద్రబాబు తన బంధువులకు, బినావీులకు ప్రభుత్వ భూములను పప్పు బెల్లాలకు, 99 పైసలకు కట్టబెడుతుండటంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో ప్రభుత్వ భూములను ఆక్రమించి, వాటిని సక్రమం చేసుకునేందుకు మంత్రి లోకేశ్ తోడల్లుడు, సినీనటుడు బాలకృష్ణ అల్లుడు, విశాఖపట్నం టీడీపీ ఎంపీ భరత్కు చెందిన ‘గీతం’ సంస్థ బరితెగించి అన్ని అడ్డదారులూ తొక్కుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ అండతో జీవీఎంసీలో దౌర్జన్యం చేసి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ.. గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవిఎంసీ) సమావేశంలో ఎలాంటి చర్చ లేకుండానే తను ఆక్రమంచిన రూ.5 వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని క్రమబద్దీకరించుకుంది. ఈ బరితెగింపు, దౌర్జన్యంపై యావత్ ప్రజా సంఘాలు, రాష్ట్ర ప్రజలు ఓ వైపు మండిపడుతుండగా.. ఆ స్థలాన్ని ‘గీతం’ తన ఆధీనంలోకి తీసుకుని చదును చేసే పనులు మొదలు పెట్టడం కలకలం రేపుతోంది. తీర్మానం మేరకు ఇంకా జీవో విడుదల కాకముందే అధికారం అండ చూసుకుని గీతం యూనివర్సిటీ కబ్జా చేసిన భూములను సొంతం చేసుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తోంది. జీవీఎంసీ పాలకవర్గ సమావేశంలో అధికార బలాన్ని ప్రయోగించి, దాడులకు తెగబడి ఆ భూముల క్రమబద్ధీకరణకు తీర్మానాన్ని ఆమోదించుకున్న వైనంపై ఓ వైపు ఇంకా చర్చ జరుగుతూనే ఉండగా, ప్రభుత్వం మాత్రం వెనక్కు తగ్గడం లేదు. పైగా గతంలో ఈ భూములు ప్రభుత్వానికి చెందినవి అంటూ ప్రభుత్వం పాతిన బోర్డులను సైతం పీకేశారు. లారీల్లో ఎర్రమట్టిని తరలించి కబ్జా భూముల్లో చదును చేసే (లెవలింగ్) పనులు చురుగ్గా చేస్తున్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూముల్లో అక్రమంగా ‘గీత’ దాటి చేపడుతున్న పనుల వైపు రెవెన్యూ యంత్రాంగం కన్నెత్తి చూడటం లేదు. కొద్దిపాటి జాగాలో వ్యాపారం చేసుకుని పొట్టపోసుకునే చిరు వ్యాపారులపై ఆపరేషన్ లంగ్స్ పేరిట ప్రతాపం చూపిన ప్రభుత్వం.. రూ.5 వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిలో గీతం పనులు చేస్తున్నా, అడ్డు చెప్పడానికి సాహసించడం లేదు. ఇప్పటికి ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్న ఈ భూములు తమవే అన్నట్లు గీతం వ్యవహరిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వం కాపాడితే.. ఈ ప్రభుత్వం ధారాదత్తంఅధికారికంగా గీతం యూనివర్సిటీ కోసం కేటాయించిన భూముల్లో మాత్రమే కాకుండా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కనే ఉన్న ప్రభుత్వ భూముల్లోకి సైతం గీతం ఆక్రమణల పర్వం మొదలైంది. ఈ ఆక్రమణలన్నీ సక్రమం చేసుకునేందుకు 2014–19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు.. ‘గీతం’ పావులు కదిపింది. ఇందులో భాగంగా గీతం ఆక్రమణ చెరలో ఉన్న భూముల్ని సదరు వర్సిటీకి ఎలినేషన్ కింద బదలాయించేందుకు సన్నాహాలు చేశారు. తర్వాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశాఖ భూ కుంభకోణాలపై చర్యలకు ఉపక్రమించింది. ఇలా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏకంగా 2 వేల ఎకరాల మేర భూములను వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంరక్షించింది. వీటి విలువ రూ.6 వేల కోట్ల మేర ఉంటుందని అంచనా. ఇందులో భాగంగా గీతం భూ ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు నివేదిక సిద్ధం చేశారు. 40.51 ఎకరాలకుపైగా ఆక్రమించుకున్న స్థలాల్ని దశల వారీగా స్వాధీనం చేసుకున్నారు. భూమిని ఆక్రమించి చేపట్టిన రక్షణగోడ, గార్డెన్, గ్రావెల్ బండ్ నిర్మాణాల్ని అప్పట్లో గత ప్రభుత్వం తొలగించింది. ఇది ప్రభుత్వ స్థలం అంటూ బోర్డులను పాతింది. ఇంకా ఆక్రమిత భూములున్నాయని రెవెన్యూ అధికారులు చెప్పడంతో.. గీతం యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. దీనిపై కోర్టు స్టేటస్ కో ఇచ్చింది. మిగిలిన 14 ఎకరాలకు పైగా భూమికి సంబంధించి కోర్టులో విచారణ పెండింగ్లో ఉంది. తుది తీర్పు వచ్చే వరకు ఆ భూముల్లో ఎలాంటి కొత్త చర్యలు తీసుకోవద్దని కోర్టు స్పష్టం చేసింది. గీతం చెరలో ఉన్న భూములు ఆక్రమించినవేనని చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో వేసిన ‘సిట్’ కూడా స్పష్టం చేసింది. కబ్జా భూముల్లో లెవలింగ్ పనులు చేపట్టిన దృశ్యం బోర్డులను సైతం పీకేసి.. బలం లేకపోయినప్పటికీ వైఎస్సార్సీపీకి చెందిన మేయర్ను అధికార చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా తొలగించింది. కేవలం గీతం భూముల కోసమే మేయర్ పీఠాన్ని చంద్రబాబు ప్రభుత్వం చేజిక్కించుకుందని తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోంది. కౌన్సిల్ సమయం ముగుస్తున్న సమయంలో హడావుడిగా ఎజెండాలో చివరి అంశంగా గీతం భూముల విషయాన్ని చేర్చి, ఆమోదం పొందేలా ఒత్తిడి తెచ్చిందని స్పష్టం అవుతోంది. సీఎం, లోకేశ్ పేషీ నుంచి జీవీఎంసీపై ఒత్తిడి నేపథ్యంలో ఆ భూముల్ని గీతం వర్సిటీకి క్రమబద్ధీకరించి, బదలాయింపు ప్రక్రియ వేగవంతం చేసింది. ఇందుకోసం కౌన్సిల్ సమావేశంలో పక్కాగా రౌడీయిజానికి దిగడం.. ఎటువంటి చర్చ, ఓటింగ్ లేకుండానే అన్ని అంశాలు ఆమోదం పొందినట్లుగా ఎజెండాను మేయర్ స్వయంగా చదివి ప్రకటించడం తెలిసిందే. జీవీఎంసీ తీర్మానం తర్వాత అధికారికంగా ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో) జారీ చేయాల్సి ఉంటుంది. అయితే అప్పటి వరకు వేచి చూడలేమంటూ ‘గీతం’ ఈ భూముల్లో బరితెగించి లెవలింగ్ పనులు పెద్ద ఎత్తున చేస్తోంది. ప్రభుత్వ భూములంటూ పాతిన బోర్డులను సైతం పీకేసింది.పప్పు బెల్లాలకు భూ పందేరాలురాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ప్రభుత్వ పెద్దల బంధువులు, బినామీలకు భూ పందేరాలు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. పప్పు బెల్లాలకు, 99 పైసలకే భూములిచ్చేస్తున్నారు. పైగా ఎకరం 99 పైసలకు కాదు.. ఆయా సంస్థలకు కావాల్సిన మొత్తం భూమిని 99 పైసలకే ఇస్తామని నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నారు. రెండు మూడు నెలల క్రితం కంపెనీలు పెట్టి.. వాటి పేరుతో భూ దోపిడీ సాగిస్తున్నారు. ఎక్కడా లేని విధంగా రియల్ ఎస్టేట్ కంపెనీలకు సైతం భూములు కేటాయించిన ఘనత ఒక్క చంద్రబాబు ప్రభుత్వానికే దక్కింది. -
మహిళలందరికీ వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగినప్పుడే వారు నిజమైన పురోగతి సాధించినట్లు అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.‘‘మహిళలు సంతోషంగా ఉంటే ఆ కుటుంబం బాగుంటుంది. తద్వారా గ్రామం, రాష్ట్రం చివరకు దేశం కూడా బాగుంటుంది.. అందుకే మహిళల సంక్షేమం, అభివృద్ధితో పాటు, మహిళా సాధికారత లక్ష్యంగా మా హయాంలో పలు పథకాలు, కార్యక్రమాలు రూపొందించి అమలు చేశాం...అన్ని రంగాల్లోనూ మహిళలను ప్రోత్సహించాం. దాదాపు 32కు పైగా పథకాల ద్వారా మహిళలకు భరోసా కల్పించాం. మానవాళిలో సగభాగం మాత్రమే కాక, అభివృద్ధిలోనూ అంతకు మించిన పాత్ర పోషిస్తున్నారు. మహిళల అభ్యున్నతే.. ఏ సమాజం ప్రగతికైనా కీలకమైన కొలమానం’’ అని వైఎస్ జగన్ అన్నారు. -
వైఎస్ జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేక చంద్రబాబు కుట్రలు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపారని చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, కెమికల్ కలిపారని దుష్ప్రచారం చేశారు. వైఎస్సార్సీపీని రాజకీయంగా దెబ్బతీయాలని చంద్రబాబు ప్లాన్. వైఎస్సార్సీపీ హయాంలో క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్ను తీసుకొచ్చాం. మార్కెట్లో ఫిబ్రవరి 24న కేజీ హెరిటేజ్ నెయ్యి రూ.541 ఉంది. అదే రోజు మార్కెట్లో ఇందాపూర్ నెయ్యి రూ.578గా ఉంది. కేజీ అమూల్ నెయ్యిని రూ.525కే ఇస్తున్నారు’ అని సజ్జల తెలిపారు.అడ్డగోలుగా దోపిడీ చేయటానికే.. తిరుమల లడ్డూపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ‘నెయ్యి కాంట్రాక్టును కైవసం చేసుకోవటానికే ఇష్టానుసారం మాట్లాడారు. అధిక ధరలతో నెయ్యి కాంట్రాక్టు తీసుకుని స్వామి వారి సొమ్మును కాజేస్తున్నారు. అడ్డగోలుగా దోపిడీ చేయటానికే లడ్డూ ప్రసాదంపై విష ప్రచారం చేశారు. చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాల వెనుక పెద్ద స్కాం ఉంది.స్వామి వారి డబ్బును దోచుకోవటానికి భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బ తీశారు. లడ్డూ ఇష్యూలో ప్లాన్ ప్రకారమే మా పార్టీపై బురద చల్లారు. లడ్డూ కాంట్రాక్టు వెనుక పెద్ద ఆర్థిక కుంభకోణం ఉంది. దీనిపై సీబీఐ విచారణ జరపాలి. అప్పుడే కుంభకోణాలన్నీ బయటకు వస్తాయి. అమరావతిలో జరుగుతున్న స్కాం మదరాఫ్ ఆల్ స్కామ్స్. నెయ్యి ఇష్యూ అంతకంటే పెద్ద స్కాం. సెప్టెంబరు 18న నెయ్యి గురించి చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు.జంతువుల కొవ్వు ఉందని అనడమే దారుణం అనుకుంటే బాత్రూమ్ కెమికల్స్ కలిపారని కూడా చంద్రబాబు మళ్లీ మాట్లాడారు. సాధారణ మనుషులు ఎవరూ ఊహించని మాటలతో అందరినీ ఆందోళనకు గురి చేశారు. దీనంతటి వెనుక భారీ స్కాం చేయటానికి పన్నిన కుట్ర దాగి ఉంది. 2023లో జగన్ తిరుమలలో అత్యాధునిక ల్యాబులను ఏర్పాటు చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఇలాంటిది ఒక్కటీ చేయలేదు. బీఆర్ నాయుడి వ్యవహారం బయటపడినా ఆయనను చంద్రబాబు ఎందుకు తొలగించలేదు? మా హయాంలో పృథ్వీ విషయం తెలియగానే రాజీనామా చేయించాం. బీఆర్ నాయుడు రాజీనామా చేయాలి. భక్తుల విశ్వాసాలంటే చంద్రబాబుకు లెక్క లేదని అర్థం అయింది’ అని ధ్వజమెత్తారు. -
పోలవరంలో పెను విధ్వంసం బాబు తప్పిదమే..!
సాక్షి, అమరావతి: పోలవరం పనుల్లో 2017, 2018లో చంద్రబాబు సర్కార్ పాల్పడిన తప్పిదాల వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతినడంతోపాటు పెను విధ్వంసం చోటుచేసుకుందని కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తేల్చి చెప్పింది. ప్రాజెక్టు డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) నిర్మాణ షెడ్యూల్ ప్రకారం గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేశాక.. ప్రధాన డ్యాం నిర్మాణం పునాది డయాఫ్రం వాల్ను నిర్మించాలని గుర్తు చేసింది. కానీ.. దానికి విరుద్ధంగా స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేయకుండానే ప్రధాన డ్యాం పునాది డయాఫ్రం వాల్ పనులను 2017 ఫిబ్రవరిలో రూ.399.77 కోట్లతో ప్రారంభించి 2018 జూన్ నాటికి పూర్తి చేశారని పేర్కొంది. 2019 వర్షాకాలం ప్రారంభానికి ముందే ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేయాలనే లక్ష్యంతో 2018 నవంబర్లో పనులు చేపట్టారని తెలిపింది. కానీ.. నిర్వాసితులకు పునరావాసం కల్పించలేకపోవడంతో ఎగువ కాఫర్ డ్యామ్కు ఇరువైపులా 600 మీటర్ల వెడల్పుతో ఖాళీలను వదిలేశారని పేర్కొంది. దీంతో 2,400 మీటర్ల వెడల్పుతో ప్రవహించాల్సిన గోదావరి వరద.. ఎగువ కాఫర్ డ్యాంలో వదిలిన 600 మీటర్ల ఖాళీ ప్రదేశంలో కుంచించుకుపోయి ప్రవహించాల్సి వచ్చిందని.. ఫలితంగా వరద ఉద్ధృతి మరింత పెరిగి డయాఫ్రం వాల్ కోతకు గురై దెబ్బతిందని, ప్రధాన డ్యాం గ్యాప్–2లో భారీగా కోతకు గురైందని స్పష్టం చేసింది. అదే.. నిర్మాణ షెడ్యూలు ప్రకారం పనులు చేపట్టి ఉంటే ఈ విధ్వంసం చోటుచేసుకునేది కాదని.. డయాఫ్రం వాల్ కోసం చేసిన రూ.399.77 కోట్ల వ్యయం వృథా అయ్యిందని కాగ్ స్పష్టం చేసింది. ప్రాజెక్టు పనుల్లో తీవ్ర జాప్యానికి ఇదే కారణమైందని పేర్కొంది. డయాఫ్రం వాల్ దెబ్బతినడంతో దానికి సమాంతరంగా కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం, ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతాన్ని యధాస్థితికి తెచ్చే పనులకు రూ.2020.05 కోట్లతో 2023 ఏప్రిల్లో సర్కార్ పరిపాలన అనుమతి ఇచ్చిందని పేర్కొంది. పోలవరం పనులపై 2017–18 నుంచి 2023 మార్చి వరకూ అధ్యయనం జరిపి కాగ్ నివేదిక ఇచ్చింది. నిర్మాణ పనుల్లో తప్పిదాలు.. నామినేషన్ పద్ధతిలో భారీ ఎత్తున పనులు అప్పగించడం.. కాంట్రాక్టర్లకు భారీ ఎత్తున ప్రయోజనం చేకూర్చడం.. భూసేకరణలో జరిగిన లోటుపాట్లను కాగ్ తన నివేదికలో తూర్పారబడుతూ చంద్రబాబు సర్కార్ను కడిగిపారేసింది. ప్రధాన డ్యాం పనులు సజావుగా సాగేందుకు నిర్మాణ షెడ్యూలుకు కట్టుబడి ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చూడాలంటూ చంద్రబాబు సర్కార్కు అక్షింతలు వేసింది. కాగ్ నివేదికలో ప్రధానాంశాలు ఇవీ.. అడ్డగోలుగా నిబంధనల ఉల్లంఘన.. పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్(జలాశయం) పనులను రూ.4,054 కోట్లకు ట్రాన్స్ట్రాయ్ 2013 మార్చిలో ఈపీసీ(ఇంజినీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్) విధానంలో దక్కించుకుంది. 2018 మార్చి నాటికి పనులు పూర్తి చేసేలా ట్రాన్స్ట్రాయ్తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. విభజన చట్టం ప్రకారం కేంద్రమే నిరి్మంచాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను 2016 సెప్టెంబరులో రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకుంది. ట్రాన్స్ట్రాయ్తో ప్రభుత్వం 2013లో కుదుర్చుకున్న ఒప్పందం 25వ నిబంధన ప్రకారం ప్రాజెక్టు పనులకు అవసరమైన సామగ్రి, పనిముట్లను కాంట్రాక్టరే సమకూర్చుకోవాలి. కానీ.. దానికి విరుద్ధంగా సామగ్రి, ఇతర ఖర్చుల కోసం కాంట్రాక్టర్కు 2017 మే నుంచి 2018 మే వరకూ రూ.170 కోట్లను ఇంప్రెస్ట్ అమౌంట్ కింద ప్రభుత్వం ఇచ్చింది. మొబిలైజేషన్ అడ్వాన్సుతో కలిపి రూ.446.32 కోట్లు కాంట్రాక్టర్కు ఇచ్చినట్లయింది. అందులో 2018 నవంబర్ నాటికి రూ.302.10 కోట్లను కాంట్రాక్టర్ నుంచి ప్రభుత్వం వసూలు చేసింది. మిగతా రూ.144.22 కోట్లలో బ్యాంకు గ్యారంటీల రూపంలో రూ.123.07 కోట్లను 2019 మార్చిలో వసూలు చేసింది. ఇప్పటికీ ట్రాన్స్ట్రాయ్ నుంచి ఇంకా రూ.21.15 కోట్లను వసూలు చేయాల్సి ఉందని కాగ్ పేర్కొంది. » 2018, జనవరి నాటికి రూ.1,755.05 కోట్ల విలువైన పనులను మాత్రమే ట్రాన్స్ట్రాయ్ చేసింది. పనుల్లో వేగం పెంచడం పేరుతో ఏపీడీఎస్ఎస్లో 60(సీ) నిబంధన ప్రకారం రూ.2,019.67 కోట్ల విలువైన పనులను ట్రాన్స్ట్రాయ్ నుంచి తొలగించి.. ఈపీసీ పద్ధతిలో కాకుండా ఎల్ఎస్(లంప్సమ్)విధానంలో నవయుగకు నామినేషన్ పద్ధతిలో 2018 ఫిబ్రవరి 17న నామినేషన్ పద్ధతిలో చంద్రబాబు సర్కార్ అప్పగించింది. ఇది నిబంధనలకు విరుద్ధమని కాగ్ స్పష్టం చేసింది. » ఏపీడీఎస్ఎస్లో 60(సీ) నిబంధన ప్రకారం పనుల ఒప్పందం విలువలో 5 శాతం అంటే రూ.269.29 కోట్లను ట్రాన్స్ట్రాయ్కు జరిమానాగా విధించి వసూలు చేయాలి. ఈపీడీఎసీఎల్కు రూ.26.02 కోట్లను ట్రాన్స్ట్రాయ్ చెల్లించాలి. ఇంప్రెస్ట్ అమౌంట్పై వడ్డీ రూ.30.61 కోట్లను కూడా కలుపుకొంటే మొత్తం రూ.331.90 కోట్లను ట్రాన్స్ట్రాయ్ నుంచి వసూలు చేయాలి. అయితే ట్రాన్స్ట్రాయ్ దివాలా తీసింది. రూ.331.90 కోట్లను వసూలు చేయడానికి ఎన్సీఎల్టీలో ప్రభుత్వం దావా కూడా వేయకపోవడాన్ని కాగ్ ఆక్షేపించింది. » నవయుగకు నామినేషన్ పద్ధతిలో అప్పగించిన పనులను నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక రద్దు చేసింది. వాటితోపాటు జలవిద్యుత్కేంద్రం పనులకు రివర్స్ టెండరింగ్ విధానంలో టెండర్ నిర్వహించడంతో ఖజానాకు రూ.628.43 కోట్లు ఆదా అయ్యిందని కాగ్ నివేదికలో వెల్లడించింది. జలవిద్యుత్కేంద్రం పనుల్లో నవయుగకు రూ.145.47 కోట్లు అనుచిత లబ్ది.. » పోలవరం జలవిద్యుత్కేంద్రం పనులను 2017 డిసెంబర్లో రూ.3,220.28 కోట్లకు నవయుగ దక్కించుకుంది. టర్బైన్ నమూనా పరీక్ష విజయవంతంగా పూర్తయిన తర్వాత వడ్డీ లేని ముందస్తు చెల్లింపు కింద రూ.145.47 కోట్లను నవయుగకు చెల్లించింది. కానీ దీనికి జెన్కో బోర్డు ఆమోదంగానీ ప్రభుత్వం ఆమోదంగానీ లేదు. దీన్ని బట్టి చూస్తే నవయుగకు రూ.145.47 కోట్లను అనుచితంగా లబ్ధి చేర్చారని కాగ్ తప్పుబట్టింది. » కుడి, ఎడమ కాలువ తవ్వకంలో 12.02 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి కాలువ గట్లపై ఉంది. దీని విలువ రూ.1,660.15 కోట్లు. మట్టిని అమ్మితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దొంగతనం కాకుండా చూడాలని ప్రభుత్వానికి కాగ్ సూచించింది. భూసేకరణలో లోపం... పునరావాసం కల్పనలో నిర్లక్ష్యం.. » పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురయ్యే భూమితోపాటు నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి మొత్తం 1,79,770 ఎకరాల భూమిని సేకరించాలని అంచనా వేశారు. ఇందులో 1,67,765 ఎకరాల భూసేకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 2023 మార్చి నాటికి 1,13,119 ఎకరాలు సేకరించారు. మరో 54,646 ఎకరాలు సేకరించాల్సి ఉంది. » పోలవరం కోసం సేకరించాల్సిన భూమిలో 8,185.27 ఎకరాలకు డీకేటీ పట్టాలు జారీ చేశారు. 1,838.64 ఎకరాల ఆక్రమణకు గురైంది. మొత్తం ఈ 10,023.91 ఎకరాల సేకరణకు రూ.619.83 కోట్లు పరిహారం చెల్లించి సేకరించాల్సి వచ్చిందని కాగ్ పేర్కొంది. » ప్రాజెక్టుతో 373 గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఈ గ్రామాల్లోని 1,06,006 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. 2014 నాటికి 6 గ్రామాల్లోని 714 కుటుంబాలకు పునరావాసం కల్పిస్తే.. 2014–15 నుంచి 2018–19 వరకూ 11 గ్రామాల్లోని 3,066 కుటుంబాలకు.. 2019–20 నుంచి 2023, మార్చి వరకూ 21 గ్రామాల్లోని 7,897 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. ఇంకా 94,329 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. నిర్వాసితులకు పునరావాసం కల్పించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని కాగ్ ఆక్షేపించింది. -
'లెక్క'లేక చిక్కులు!
సాక్షి, అమరావతి : తన పాలనలో రాష్ట్రం వృద్ధిలో దూసుకుపోతోందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న గణాంకాలన్నీ మిథ్యేనని తేలిపోయింది. బాబు తొలి బడ్జెట్ అంకెల గారడీతో మోసం చేయడమే తప్ప కేటాయింపులకు తగినట్లు వ్యయం లేదని స్పష్టమైంది. 2024–25లో అంతకు ముందు ఆర్థిక ఏడాదితో పోల్చితే రెవెన్యూ రాబడులు ఏకంగా 3.51 శాతం తగ్గిపోయాయని తేటతెల్లమైంది. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీకి సమర్పించిన 2024–25 ఆర్థిక ఏడాది ఆర్థిక, ద్రవ్య అకౌంట్స్పై కాగ్ నివేదికలో ఈ విషయాలన్నీ పూసగుచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రం ఆర్థికంగా తిరోగమనంలో పయనిస్తున్నట్లు కాగ్ నివేదిక స్పష్టం చేసింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రెవెన్యూ రాబడులు కూడా 2024–25లో రాలేదని ఈ నివేదిక కుండబద్దలు కొట్టింది. 2023–24 ఆర్థిక ఏడాదితో పోల్చితే 2024–25 ఆర్థిక ఏడాదిలో ఆదాయ వసూళ్లలో 3.51 శాతం తగ్గుదల ఉందని వెల్లడించింది. ఇదే రీతిలో రాష్ట్ర పన్నేతర ఆదాయం 19.64 శాతం తగ్గిపోయిందని స్పష్టం చేసింది. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంతకు ముందు ఆర్థిక ఏడాదితో పోల్చితే ఏకంగా 41.82 శాతం తగ్గిపోయిందని ఎత్తి చూపింది. 2024–25 ఆర్థిక ఏడాది బడ్జెట్లో రెవెన్యూ రాబడులు రూ.2,69,928 కోట్లుగా పేర్కొనగా, వాస్తవంగా రూ.2,49,191 కోట్లే వచ్చాయని కాగ్ పేర్కొంది. అంటే రెవెన్యూ రాబడులు ఏకంగా రూ.20 వేల కోట్ల మేర తగ్గిపోయాయి. మూల ధన వ్యయం బాగా తక్కువ బడ్జెట్లో కేటాయింపుల మేరకు మూల ధన వ్యయం చేయలేదని.. ఇరిగేషన్, గృహ నిర్మాణం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి తదితర రంగాలకు వ్యయం చేయలేదని కాగ్ స్పష్టం చేసింది. 40 రంగాల్లో.. 10 రంగాలకు చేసిన గ్రాంట్లలో 50 శాతం కన్నా తక్కువ వ్యయం చేసినట్లు ఎత్తి చూపింది. మరో పక్క గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలతోపాటు ఇతర సంస్థలకు గ్రాంట్లు కూడా అంతకు ముందు ఆర్థిక ఏడాదితో పోల్చితే 2024–25లో ఏకంగా రూ.10,620 కోట్లు తగ్గిపోయినట్లు పేర్కొంది. 2024–25లో మూల ధన వ్యయం కింద రూ.45,382 కోట్ల వ్యయం చేయనున్నట్లు బడ్జెట్లో పేర్కొన్నప్పటికీ, వాస్తవంగా రూ.16,141 కోట్లే వ్యయం చేశారని తెలిపింది. ఇది జీఎస్డీపీలో కేవలం ఒక శాతం మాత్రమేనని ఎత్తి చూపింది. అదే 2023–24 ఆర్థిక ఏడాదిలో మూల ధన వ్యయం రూ.23,330 కోట్లు అని పేర్కొంది. -
వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలి
మంగళగిరి టౌన్ : గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో ఏప్రిల్ 20 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళతారని ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. మంగళగిరి ఆటోనగర్లోని సీసీఎల్ఏ కార్యాలయం వద్ద శుక్రవారం ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. తెలంగాణ తరహాలో ఏపీలో కూడా వీఆర్ఏలందరికీ పే స్కేలు అమలుచేయాలని డిమాండ్ చేశారు. కష్టపడి పనిచేస్తున్నప్పటికీ వేతనాలు సరిపడాలేవన్నారు. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు లక్షలాది రూపాయల వేతనాలు ఇస్తున్నారుగానీ వీఆర్ఏలకు మాత్రం పెంచడంలేదన్నారు. ఎన్నికల ముందు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 22 నెలలవుతున్నా నేటికీ వీఆర్ఏల సమస్యల్లో ఒక్కటీ పరిష్కారం కాలేదన్నారు. నిబంధనలకు విరుద్ధమైన డ్యూటీలు వేస్తున్నారని, రీ సర్వే పేరుతో మైళ్లకొద్దీ ఇతర ప్రాంతాలకు వెళ్లి పనిచేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్లకార్డులతో ప్రదర్శన.. ధర్నా అంతకుముందు.. ఎన్ఆర్ఐ వై–జంక్షన్ నుంచి సీసీఎల్ఏ కార్యాలయం వరకు వీఆర్ఏలు ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించి ధర్నా చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ బందగీ సాహెబ్, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు లక్ష్మణరావు, సంఘం కోశాధికారి రవికుమార్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ త్రినాథరావు, ఉపా«ధ్యక్షులు నాగేంద్ర, సుబ్బయ్య, రాష్ట్ర నాయకులు కొండబాబు, శేఖర్, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వానికి భూములు ఎందుకివ్వాలి?
సాక్షి ప్రతినిధి, గుంటూరు/గుంటూరు ఎడ్యుకేషన్ : అమరావతి రాజధాని పేరుతో సంవత్సరానికి మూడుపంటలు పండే భూములను తీసుకోవద్దన్న సూచనలు, సలహాలను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోకుండా ఆ భూములను కాంక్రీట్తో నింపేశారని రైతునేత వడ్డే శోభనాద్రీశ్వరరావు ధ్వజమెత్తారు. భూసేకరణ సమయంలో ఇచి్చన హామీలకు దిక్కు ఎవరని ప్రశ్నించారు. రాజధాని పేరుతో రైతుల నుంచి అడ్డగోలుగా భూములు లాక్కుని వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. రెండోవిడత భూసేకరణకు రైతులు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. ల్యాండ్ పూలింగ్ రెండోదశకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణ చర్చావేదిక శుక్రవారం గుంటూరులో నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్యవక్తగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నిర్మాణమే లేని రాజధానిలో ఐదువేల ఎకరాల్లో ఎయిర్పోర్టు, 1,500 ఎకరాల్లో రైల్వేస్టేషన్ అంటూ సీఎం చంద్రబాబు, మున్సిపల్శాఖ మంత్రి నారాయణ ప్రజల్లో భ్రమలు కల్పిస్తున్నారని విమర్శించారు. సీఆర్డీఏతో రైతులు చేసుకున్న ఒప్పందానికి చట్టబద్ధత లేదని, మొదటివిడతలో భూములిచ్చిన రైతులు నెత్తీనోరు బాదుకుంటున్నారని చెప్పారు. రెండోవిడత భూములు తీసుకునేముందు మొదటివిడతలో భూములిచి్చన రైతులకు ఏం న్యాయం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన మెడికల్ కళాశాలల నిర్మాణాలను పూర్తిచేసేందుకు రూ.4,400 కోట్లు లేవని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం రాజధాని అమరావతి చుట్టూ నిర్మించేందుకు ప్రతిపాదించిన ఔటర్ రింగ్రోడ్డు (ఓఆర్ఆర్)కు రూ.వేలకోట్లు ఏ విధంగా ఖర్చుచేస్తుందని ప్రశ్నించారు. మొదటివిడతలో భూములిచ్చిన రైతుల పిల్లల కోసం ఉచిత విద్య, వైద్య సదుపాయాలను కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్న చంద్రబాబు సర్కారు.. రెండోవిడతకు వచ్చేసరికి దాన్ని ఉచిత విద్య, వైద్యానికి అర్హులు అని మార్పులు చేయడంతోనే భూసేకరణ వి«ధానంలోనే లోపముందని అర్థం చేసుకోవచ్చునని చెప్పారు. రైతుల అంగీకారం లేకుండా సెంటు భూమి కూడా సైతం తీసుకోలేరని స్పష్టం చేశారు. భూముల కోసం వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు భూములిచ్చేది లేదని తెగేసి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు కుర్రా వసుంధర, మహదేవ్, విశ్రాంత ప్రొఫెసర్ సి.రామచంద్రయ్య, మెడికల్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, చార్టర్ అకౌంటెంట్ పి.మల్లికార్జునరావు, హైకోర్టు న్యాయవాది కేవీఎం రజని, ప్రొఫెసర్ ఎన్.వేణుగోపాలరావు, జనచైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయరెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నారు. -
ప్రజాప్రతినిధులకు ఒకే రూల్ ఉండాలి
తాడేపల్లి రూరల్: ప్రజా ప్రతినిధులమైన తమపట్ల చంద్రబాబు ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు ధ్వజమెత్తారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాల ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు శుక్రవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృది్ధశాఖ రాష్ట్ర కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ప్రజాప్రతినిధులందరికీ ఒకే రూలు ఉండాలని, వివక్ష సరికాదని నినదించారు. ఈ సందర్భంగా ఎంపీపీల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మేకల హనుమంతరావు, రెడ్డప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన అందరికీ ఒకే నిబంధన ఉండాలన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు మాత్రం అవసరమైన అన్నింటిని సమకూర్చుకుని ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లకు మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం మొండిచేయి చూపిస్తోందని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు రెండేళ్లవుతున్నా సీఎం అమలు చేయడంలేదన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృది్ధశాఖ మంత్రిగా పవన్కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తరువాత తమ సమస్యలపై ఒక్కసారి కూడా పెదవి విప్పలేదని విమర్శించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు నెలనెలా జీతాలు, అలవెన్సులు తీసుకుంటున్నారని, 30 నెలలుగా ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు, వార్డు సభ్యులకు ఒక్క రూపాయి వేతనం కూడా చెల్లించలేదని చెప్పారు. మండల పరిషత్ నిధులతో చేపట్టిన పనుల బిల్లులు కూడా చెల్లించలేదని తెలిపారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులను విడుదల చేయాలన్నారు. నెలకు ఎంపీపీలకు రూ.25 వేలు, ఎంపీటీసీ సభ్యులకు రూ.10 వేలు వేతనాలివ్వాలని కోరారు. 15వ ఆర్థిక సంఘం నిధులను వినియోగించుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను వెంటనే ఎత్తేయాలన్నారు.సొమ్మసిల్లిన కాకినాడ జిల్లా ఎంపీపీల సంఘం అధ్యక్షుడు పంచాయతీరాజ్, గ్రామీణాభివృది్ధశాఖ కమిషనర్ కృష్ణతేజకు వినతిపత్రం ఇచ్చేందుకు వెళుతున్న ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో తీవ్ర ఆందోళనకు గురైన కాకినాడ జిల్లా ఎంపీపీల సంఘం అధ్యక్షుడు గొల్లపల్లి నరసింహమూర్తి సొమ్మసిల్లి కిందపడిపోయారు. ఆయన్ని వెంటనే స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమపై పోలీసులు ఒత్తిడి తీసుకురావడం వల్లే నరసింహమూర్తి అస్వస్థతకు గురయ్యారని ఎంపీపీలు చెప్పారు. -
అప్పులు తప్ప దాచడానికి ఏమీ లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అప్పులు తప్ప ఏమీ దాచడానికి లేదని శాసనమండలి సాక్షిగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కుండబద్దలు కొట్టారు. బడ్జెట్ను పూర్తి పారదర్శకంగా తీసుకు వస్తున్నామని, ఇందులో ఏమీ దాచడం లేదని రాష్ట్రంలో అప్పులు తప్ప ఇక దాచడానికి ఏమీ లేవంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులను దాస్తున్న విషయాన్ని ఆర్థిక మంత్రి పరోక్షంగా అంగీకరించారు. శుక్రవారం మండలిలో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా 2026–27 బడ్జెట్ పత్రాల్లో బడ్జెట్ బయట చేసే అప్పులు (ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్) దాచిన విషయంపై ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ గట్టిగా నిలదీసింది. బడ్జెట్ ఇన్ బ్రీఫ్లో ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఎందుకు పేర్కొనలేదని, బడ్జెట్లో పేర్కొన్న రెవెన్యూ, ఆర్థిక లోటులను ఏ విధంగా పూడ్చుకుంటారన్న విషయాలు ఎక్కడున్నాయంటూ మండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ నిలదీశారు. గత ప్రభుత్వం మాకు రూ.9.74 లక్షల కోట్ల అప్పును వారసత్వంగా ఇచ్చి వెళ్లిందంటూ ఆర్థికమంత్రి కేశవ్ పేర్కొంటున్నారని, కానీ ఈ అప్పులు బడ్జెట్ పత్రాల్లో ఎక్కడ అంటూ ప్రశ్నించారు. బడ్జెట్ పత్రాల్లో చూపించకుండా అప్పులు ప్రభుత్వం విడుదల చేసిన వైట్పేపర్లో ఉన్నాయంటూ ఎలా చెపుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ కాగ్ గణాంకాల ప్రకారం రాష్ట్రం సొంత ఆదాయార్జనలో 22వ స్థానంలో ఉందని, ఆయా రాష్ట్రాల కాగ్ నివేదికలను పరిశీలిస్తే ఇది తెలుస్తుందన్నారు. వాస్తవాలు లేకుండా ఈ బడ్జెట్ను పూర్తిగా అంకెలగారడీగా మార్చేశారంటూ దుయ్యబట్టారు.సూపర్ సిక్స్లో మూడు సిక్స్లు ఔట్సూపర్ సిక్స్లో కీలకమైన నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లు దాటిన వారికి పెన్షన్ ఇస్తామన్న హామీలకు బడ్జెట్లో ఒక్క రూపాయికూడా కేటాయించలేదంటూ బొత్స ధ్వజమెత్తారు. సూపర్ సిక్స్లో మూడు సిక్స్లను ఎగరగొట్టేసి సూపర్ హిట్ అంటూ ఎలా ప్రచారం చేసుకుంటారంటూ దుయ్యబట్టారు. కనీసం ఈ పథకాలు ఎప్పటి నుంచి అమలు చేస్తారో కూడా చెప్పకుండా అమలు చేసేశామంటూ మభ్య పెడుతున్నారన్నారు. డ్వాక్రా మహిళలకు, రైతులకు సున్నా వడ్డీ రుణాలకు మంగళం పాడేసి మహిళలను లక్షాధికారులను ఎలా చేస్తారంటూ నిలదీశారు. రాష్ట్రంలో ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందిపడుతున్న మాట వాస్తవం కాదా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్ఆర్జీఎస్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వ వాటా పెట్టకుండా కేంద్రం ఇస్తున్న రూ.8,500 కోట్లను చూపిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం నడవడానికి ద్రవ్యవినిమయ బిల్లు అత్యంత ప్రాధాన్యమైనది కావడంతో బడ్జెట్లో పేర్కొన్న అంకెల గారడీని నిరసిస్తూ మౌనంగా సభలోనే ఉంటామంటూ బొత్స ప్రకటించారు. అంతకుముందు వైఎస్సార్సీపీ సభ్యుడు మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ మేనిఫెస్టోలోని పథకాలకు, కేటాయించిన నిధులకు సంబంధం లేదన్నారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లుకు మండలి ఆమోదం తెలిపింది. కాగా, వేతనాల పెంపు కోసం అంగన్వాడీలు ధర్నాలు చేస్తుంటే ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెబుతోందంటూ వైఎస్సార్సీపీ సభ్యులు మండలిలో విమర్శించారు. అంగన్వాడీల వేతనాల పెంపునకు 2024 జనవరిలోనే అప్పటి తమ ప్రభుత్వం అగ్రిమెంట్ రూపంలో హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అంగన్వాడీలకు ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ తాము సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు బొత్స ప్రకటించారు. -
వాళ్లు 11 మందే అయినా.. 1,100 మందితో సమానం
సాక్షి, అమరావతి: శాసనసభలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు 11 మందే అయినా 1,100 మందితో సమానమన్నట్లు మాట్లాడుతారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అసెంబ్లీలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ కలిసికట్టుగా ఉండకపోతే వైఎస్సార్సీపీ బలపడుతుందని స్పష్టం చేశారు. ‘వైఎస్సార్సీపీ వాళ్లు చెప్పిన దానిని చాలా బలంగా నమ్ముతారు. కానీ, మనం చేసే పనులు మనం చెప్పుకోలేం. ఎందుకు సంకోచిస్తున్నామో తెలీదు. మనలో (కూటమి) ఏకాభిప్రాయం, ఏకత్వం ఉండాలి. వైఎస్సార్సీపీ వాళ్లను ఎదుర్కోవాలంటే కూటమి సభ్యులు చాలా బలంగా ఉండాలి’ అని వ్యాఖ్యానించారు. -
అసెంబ్లీలో భజన.. కౌన్సిల్లో పలాయనం
సాక్షి, అమరావతి: చంద్రబాబు, ఆయన తనయుడు లేకపోతే ఈ రాష్ట్రమే లేదనే స్థాయిలో అసెంబ్లీలో భజన.. మరోవైపు ఇందాపూర్ డెయిరీతో హెరిటేజ్కు ఉన్న సంబంధం గురించి కనీస ప్రస్తావన కూడా రానీయకుండా కౌన్సిల్లో పలాయనం. 17 రోజులపాటు జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆసాంతం ఆత్మస్తుతి, పరనిందను తలపించాయి. అసెంబ్లీలో చంద్రబాబును కారణజన్ముడిగా, లోకేశ్ను అపర మేధావిగా, దేవాన్ష్ ను భావినేతగా కీర్తిస్తూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను కూటమి ఎమ్మెల్యేలు చంద్రబాబు కీర్తన సభలుగా మార్చివేశారు. కౌన్సిల్లో మాత్రం బయటపడిన తమ గుట్టుపై చర్చ జరక్కుండా కుతంత్రాలకు దిగజారారు. గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైన సమావేశాలను లేని గొప్పల్ని చెప్పుకోవడం, గత వైఎస్ జగన్ పాలన గురించి అబద్ధాలు చెప్పడానికే కూటమి ప్రభుత్వం పూర్తిగా ఉపయోగించుకుంది. అవాస్తవాల బడ్జెట్14వ తేదీన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా నిధులు కేటాయించకుండా వాటికి తిలోదకాలు ఇస్తున్నట్లు చెప్పకనే చెప్పింది. చేసిన అప్పుల గురించి వాస్తవాలు చెప్పకుండా, ఈ ఏడాది మాత్రం మరో రూ. లక్ష కోట్ల అప్పులు చేస్తామని నిర్భీతిగా బడ్జెట్లో పెట్టడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. బడ్జెట్ ప్రసంగంలో సైతం చంద్రబాబును పొగడ్డానికే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాధాన్యత ఇచ్చారు. 20 నెలలుగా చేసిందేమిటో చెప్పుకోలేక బడ్జెట్ ప్రసంగంలోనూ పదేపదే గత ప్రభుత్వంపై నిందలు మోపే ప్రయత్నం చేశారు. ప్రతిరోజూ జరిగిన ప్రశ్నోత్తరాలు, జీరో అవర్, బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చల్లోనూ చంద్రబాబును, లోకేశ్ను ఆకాశానికి ఎత్తేసి వారికి దగ్గరయ్యేందుకు కూటమి సభ్యులు అత్యుత్సాహం చూపారు. జనసేన ఎమ్మెల్యేలు సైతం బాబును పొగిడేందుకు పోటీపడడం గమనార్హం. జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మరో అడుగు ముందుకేసి చంద్రబాబు, లోకేశ్తోపాటు లోకేశ్ కొడుకు దేవాన్‡్షను కూడా పొగుడుతూ స్వామిభక్తిని చాటుకోవడం చర్చనీయాంశమైంది. పీఏసీ చైర్మన్గా ఉన్న మరో జనసేన ఎమ్మెల్యే రామాంజనేయులు ఏకంగా చంద్రబాబును కారణ జన్ముడిగా అభివర్ణించారు. చర్చ ఏదైనా అందులో బాబు, లోకేశ్ను ఆకాశానికి ఎత్తడం, జగన్ను తిట్టడమే పనిగా అసెంబ్లీ నడించింది.టీడీపీ నేతల్లా స్పీకర్, డిప్యూటీ స్పీకర్అదే సమయంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పీకర్ స్థానంలో కూర్చుని టీడీపీ నేతలా ప్రతిపక్షంపైనా, వైఎస్ జగన్పైనా విమర్శలు చేశారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యేలను ఏకవచనంతో సంబోధించడం, వారు మాట్లాడిన తర్వాత దానిపై జడ్జిమెంట్ ఇచ్చేయడం, అది అయ్యే పని కాదంటూ తీర్మానించి చెప్పేయడం, మాట్లాడిన సభ్యులను కామెంట్ చేసి అసెంబ్లీ స్థాయిని దిగజార్చారనే చర్చ అధికారపక్షంలోనే చోటుచేసుకుంది. చివరికి కూటమి ఎమ్మెల్యేలు తాము చేసిన భజనపై తమకే విసుగొచ్చి ప్రతిపక్షం లేకపోతే సభ బాగోలేదంటూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కౌన్సిల్ సమావేశంలో జరగనీయకుండా కుతంత్రాలు... మండలిలో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రభుత్వం అడ్డగోలు కుతంత్రాలకు తెరలేపింది. ఇందాపూర్ డెయిరీకి హెరిటేజ్ సంస్థకు ఉన్న బంధం గురించి సమాధానం చెప్పలేమనే భయంతో మొత్తం సమావేశాలు స్తంభించేలా వ్యవహరించింది. చంద్రబాబు ఆయన కుమారుడు లోకేశ్ తమ సొంత సంస్థ కోసం మంత్రులు, కూటమి ఎమ్మెల్సీలను ఉపయోగించుకుని ప్రజా సమస్యలు తమకు పట్టవని తేల్చేశారు. ఇందాపూర్ డెయిరీ–హెరిటేజ్ ప్రస్తావన రాకుండా చేసేందుకు చర్చను కూటమి ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకుంది. స్వయంగా లోకేశ్ మండలికి వచ్చి తమ సంస్థకు మద్దతుగా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్సీలను మోహరించి చర్చ జరగనీయకుండా చేయడం స్పష్టంగా కనిపించింది. చర్చకు ఒప్పుకుని చివరికి ప్లేటు ఫిరాయింపు వరుసగా నాలుగు రోజులు సభను స్తంభింపచేసి చివరికి విమర్శలు వస్తుండడంతో అధికారపక్షం బీఏసీ సమావేశం నిర్వహించి ఇతర అంశాలతోపాటు ప్రతిపక్షం కోరుతున్న అంశంపై చర్చించేందుకు అంగీకరించి ఆ తర్వాత ప్లేటు ఫిరాయించింది. ఇతర అంశాలన్నింటిపై చర్చించేందుకు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సభ్యులు సహకరించినా.. ఇందాపూర్–హెరిటేజ్ అంశంపై వచ్చేసరికి మాట మార్చి సభా సాంప్రదాయాలను తుంగలో తొక్కింది. ఈ విషయంలో మండలి చైర్మన్ మోషేన్రాజు అనుమతి లేకుండా మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటన చేయడానికి ప్రయత్నించారు. చైర్ అనుమతి లేకుండా స్టేట్మెంట్కు ప్రయత్నించి చైర్మన్ స్థానాన్ని అవమానించారని మోషేన్ రాజు విచారం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి సభను తప్పుదోవ పట్టించారని స్వయంగా చైర్మన్ సభలో ప్రకటించడాన్ని బట్టి టీడీపీ ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత కూడా అదే అంశంపై ప్రతిపక్షం చర్చకు పట్టుబట్టగా మంత్రి అచ్చెన్నాయుడు చైర్మన్కు మతం ఆపాదించి అధ్యక్ష స్థానాన్నే అవమానించి చర్చ జరక్కుండా సమస్యను పక్కదారి పట్టించారు. ఇందాపూర్–హెరిటేజ్ బంధం గురించి మండలిలో చర్చ జరక్కుండా చేసేందుకు చివరికి టీడీపీ మత రాజకీయాలకు దిగి అభాసుపాలైంది. మొత్తంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రజా సమస్యలు కంటె టీడీపీ రాజకీయాలు, చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ ప్రయోజనాల కోసమే జరిగినట్లు తేటతెల్లమైంది. -
చేబదుళ్లకూ భారీగా వడ్డీ చెల్లింపు
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు ఏడాది పాలనలోనే ఆర్థిక ఆరాచకం సృష్టించారు. ఏడాదిలో 365 రోజుల్లో 357 రోజులు చేబదుళ్లతోనే ఆర్థిక నిర్వహణను చంద్రబాబు ప్రభుత్వం కొనసాగించిందని కాగ్ నివేదిక పేర్కొంది. పైగా చేబదుళ్లకు కూడా భారీగా వడ్డీలు చెల్లించిందని వెల్లడించింది. సాధారణంగా ఎవరైనా వ్యక్తులు డబ్బులు చేబదులు తీసుకుంటే చెప్పిన సమయానికి తిరిగి చెల్లించేస్తారు. అందుకు వడ్డీ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. వ్యక్తుల తరహాలనే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆర్బీఐ చేబదుళ్లకు వెసులుబాటు కల్పిస్తుంది. ఆ వెసులుబాటు సమయం వరకు చేబదుళ్లు వాడుకుని తిరిగి చెల్లించేస్తే ఎటువంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే చంద్రబాబు సర్కారు తొలి ఏడాది పాలనలోనే సకాలంలో చేబదుళ్లు తిరిగి ఇవ్వలేక భారీగా వడ్డీలు చెల్లించిందని 2024–25 ఆర్థిక ఏడాది బడ్జెట్ అకౌంట్స్పై కాగ్ నివేదిక స్పష్టం చేసింది. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ పొందకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ వద్ద కేవలం ఎనిమిది రోజులు మాత్రమే కనీస నగదు నిల్వను నిర్వహించడం ఘోరమని కాగ్ నివేదిక వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్బీఐ స్ఫెషల్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్, ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాలను కల్పిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాల ఖాతాలో కనీస నగదు బ్యాలెన్స్ రూ.1.94 కోట్లలోపు ఉంటే ఈ సౌకర్యాలను వినియోగించుకుంటాయి. ఆర్థిక అరాచకానికి నిదర్శనం2024–25 ఆర్థిక ఏడాదిలో చంద్రబాబు సర్కారు 71 రోజులు రూ.42,004 కోట్ల మేర స్పెషల్ వేస్ అండ్ మీన్స్, 179 రోజులు రూ.73,897 కోట్ల మేర వేస్ అండ్ మీన్స్ వినియోగించుకుందని కాగ్ వెల్లడించింది. 107 రోజులు రూ.56,631 కోట్ల మేర ఓవర్ డ్రాఫ్ట్ను వినియోగించుకుందని స్పష్టం చేసింది. ఈ మొత్తాలను నిర్దేశిత సమయంలోగా తిరిగి చెల్లించక పోవడంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.303 కోట్ల మేర వడ్డీగా ఆర్బీఐకి చెల్లించినట్లు కాగ్ నివేదిక వెల్లడించింది. చేబదుళ్లకే వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితిని చంద్రబాబు ప్రభుత్వం తీసుకువచ్చిందంటే ఆర్థిక నిర్వహణ ఎంత దారుణంగా దిగజారిపోయిందో అర్థం అవుతోంది. వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్ను వినియోగించుకోవడంలో తప్పులేదు కానీ ఆ మొత్తాన్ని సకాలంలో తిరిగి చెల్లించడం ద్వారా వడ్డీ భారం పడకుండా చూడాలి. అందుకు భిన్నంగా ఏడాదిలోనే చేబదుళ్లకు ఏకంగా రూ.303 కోట్లు వడ్డీ చెల్లించడం అంటే బాబు ప్రభుత్వ ఆర్థిక అరాచకానికి నిదర్శనం.స్ఫెషల్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్42,004 (24%)189వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్73,897 (43%)82మొత్తం1,72,532303ఓవర్ డ్రాఫ్ట్56,631 (33%)32 -
అప్పులతో అభివృద్ధి శూన్యం
సాక్షి, అమరావతి : చంద్రబాబు ఏడాది పాలనలో ప్రస్తుత అభివృద్ధి దేవుడెరుగు, భవిష్యత్ అభివృద్ధిని కూడా శూన్యం చేశారని, ఆర్థిక క్రమ శిక్షణ, ఆర్థిక స్థిరత్వం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక పేర్కొంది. భవిష్యత్ అభివృద్ధికి చోటు లేకుండా ఏడాదిలోనే భారీగా అప్పులు చేశారని తూర్పారపట్టింది. 2024–25 ఆర్థిక ఏడాది ఆర్థిక, ద్రవ్య వినియోగ అకౌంట్స్పై కాగ్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీకి సమర్పించింది. అప్పులు తప్ప అభివృద్ధి లేదని, చేసిన అప్పులను ఆస్తుల కల్పనకు వినియోగించలేదని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. అప్పు చేయకుండా రోజు గడవడం లేదని, రోజువారీ ఖర్చులకు అప్పులు చేశారని, దీంతో వడ్డీ భారం గణనీయంగా పెరిగిందని ఎండగట్టింది. ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) నిబంధనలను తొలి ఏడాదిలోనే చంద్రబాబు సర్కారు తుంగలో తొక్కిందని, నిబంధనలకు మించి రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు పెరిగి పోయిందని ఎత్తి చూపింది. భారీగా అప్పు చేసినప్పటికీ మూల ధన వ్యయం తగ్గిపోయిందని, ఇది రుణ స్థిరత్వాన్ని మరింత దిగజార్చడంతో పాటు భవిష్యత్ అభివృద్ధికి ఆర్థిక అవకాశాన్ని తీవ్రంగా పరిమితం చేసిందని కాగ్ పేర్కొంది. అంతకు ముందు ఆర్థిక ఏడాదితో పోల్చితే 2024–25 ఆర్థిక ఏడాదిలో మూల ధన వ్యయం 12 శాతం తగ్గిందని, ఇది దీర్ఘకాలిక ఆస్తుల సృష్టిపై తగ్గిన ప్రాధాన్యతను సూచిస్తోందని వెల్లడించింది. రోజువారీ అవసరాలకూ అప్పులే ఆధారం» మూల ధన వ్యయం నుంచి రెవెన్యూ వ్యయం వైపు నిరంతరం మార్పు ఉందని, ఆఖరుకు రోజువారీ అవసరాలకు కూడా అప్పులపై ఆధార పడటం పెరిగిందని, ఇది ఆర్థిక క్రమ శిక్షణ, దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వంపై తీవ్రమైన ఆందోళన కలిగిస్తోందని కాగ్ వ్యాఖ్యానించింది. » 2024–25లో చేసిన అప్పులు అంతకు ముందు ఆర్థిక ఏడాదితో పోల్చితే 16.68 శాతం పెరిగినట్లు కాగ్ పేర్కొంది. ఇది అప్పులపై ఆధారపడటం పెరగడాన్ని ప్రతిబింబిస్తోందని తెలిపింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే అప్పుల శాతం పెరిగినప్పటికీ, మూల ధన వ్యయం అంతకు ముందు ఏడాదితో పోల్చితే 12 శాతం తగ్గిపోయిందని, ఇది దీర్ఘకాలిక ఆస్తుల సృష్టిపై తీవ్ర ప్రభావం చూపుతోందని చెప్పింది. » 2024–25లో ప్రభుత్వ రెవెన్యూ లోటు ఎఫ్ఆర్బీఎం నిబంధనల మేరకు జీఎస్డీపీలతో 2.7 శాతం ఉండాల్సి ఉండగా, 3.75 శాతానికి పెరిగిందని, అలాగే ప్రభుత్వ ద్రవ్య లోటు ఎఫ్ఆర్బీఎం నిబంధనల మేరకు జీఎస్డీపీలో 4 శాతం ఉండాల్సి ఉండగా.. 5.05 శాతానికి పెరిగిందని పేర్కొంది. » 2024–25లో మొత్తం అప్పు రూ.81,071 కోట్లు చేసినట్లు కాగ్ తెలిపింది. దీంతో వడ్డీ భారం గణనీయంగా పెరిగిందని స్పష్టం చేసింది. 2024–25 మార్చి నాటికి బడ్జెట్ అప్పులు రూ.5.67లక్షల కోట్లకు పెరిగాయని పేర్కొంది. » రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వడం ద్వారా మార్కెట్, ఆర్థిక సంస్థలు, వివిధ కార్పొరేషన్లు, సహకార సంఘాల ద్వారా నేరుగా అప్పులు చేస్తోందని కాగ్ పేర్కొంది. ఆ సంస్థలు రుణాలు చెల్లించడంలో విఫలమైన పక్షంలో రాష్ట్ర ప్రభుత్వమే అసలు, వడ్డీ చెల్లించాల్సి వస్తుందని చెప్పింది. ఈ అప్పులు రాష్ట్ర బడ్జెట్ వెలుపల అప్పులుగా అంచనా వేసినట్లు తెలిపింది.» ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదిత ఆఫ్–బడ్జెట్ అప్పులు మొత్తంతో పాటు వాటిని ఎక్కడి నుంచి తీసుకుంటున్నారనే విషయాన్ని వెల్లడించలేదని కాగ్ ఎత్తి చూపింది. అయితే 2024–25లో ఎటువంటి ఆఫ్–బడ్జెట్ బాధ్యతలను పొందలేదని, కేవలం 2025 మార్చి 31 నాటికి రూ.27,241 కోట్లు బకాయి ఉందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి, ఆర్థిక మంత్రిత్వ శాఖకు తెలియజేసిందని పేర్కొంది.» 2024–25లో వోచర్ల పరిశీలన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను రూపొందించి, ఆఫ్ బడ్జెట్ రుణాల కారణంగా సహాయం, గ్రాంట్ల కోసం రూ.7,240.57 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేసిందని, అయితే దీన్ని నిర్ధారించాలని తాము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు కాగ్ నివేదికలో పేర్కొంది.నిబంధనలు తప్పుగా వర్గీకరింపురాష్ట్ర ఆర్థిక అంశాలపై చట్టబద్ధమైన నిబంధనలను తప్పుగా వర్గీకరించడం, పాటించకపోవడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిందని కాగ్ పేర్కొంది. రెవెన్యూ వ్యయం రూ.3,375.60 కోట్లు తక్కువగా, మూలధన వ్యయం రూ.2,648.92 కోట్లు అధికంగా, నగదు నిల్వ రూ.95.70 కోట్లు తక్కువగా అంచనా వేసినట్లు స్పష్టం చేసింది. పారదర్శకత, జవాబుదారీతనం లేకుండా నిబంధనలను, షరతులను పాటించకుండా 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.5,005.31 కోట్ల రుణాలను హడ్కోకు, రాష్ట్ర ఆర్థిక సర్వీసు కార్పొరేషన్కు పంపిణీ చేసినట్లు కాగ్ తప్పు పట్టింది. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ నియమితులయ్యారు. ఆమె ప్రమాణ స్వీకారంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 34కి చేరుతుంది. జస్టిస్ లీసా గిల్ ప్రస్తుతం పంజాబ్, హర్యానా హైకోర్టులో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఆమెను ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలన్న సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమోద ముద్ర వేశారు. దీంతో జస్టిస్ లీసా నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆమె వచ్చే వారం న్యాయమూర్తిగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. జస్టిస్ లీసా గిల్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం ఇటీవల నిర్ణయం తీసుకుంది. మొదట జస్టిస్ లీసా గిల్ను న్యాయమూర్తిగా ఏపీ హైకోర్టుకు బదిలీ చేసి, ఆ తరువాత హైకోర్టు ప్రస్తుత సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పదవీ విరమణ చేసిన వెంటనే ఆమెను ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కూడా సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన విషయం తెలిసిందే. జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఈ ఏప్రిల్ 24న పదవీ విరమణ చేయనున్నారు.అపార అనుభవంజస్టిస్ లీసా గిల్ 1966 నవంబర్ 15న జన్మించారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. 1990లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. పంజాబ్, హర్యానా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. క్రిమినల్, సివిల్, సర్వీస్, రెవెన్యూ, రాజ్యాంగపరమైన అనేక రకాల కేసులను ఆమె వాదించారు. చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంతో పాటు పలు బోర్డులు, కార్పొరేషన్ల తరఫున వాదించారు. 2014 మార్చి 31న పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తొలుత న్యాయమూర్తిగా ఎందుకంటే..?ఒక హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని నిర్ణయించిన న్యాయమూర్తిని సదరు హైకోర్టులో సీజే పోస్టు ఖాళీ అవడానికి కనీసం రెండు నెలల ముందే న్యాయమూర్తిగా బదిలీ చేయాలని సుప్రీం కోర్టు కొత్త విధాన నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే జస్టిస్ లీసా గిల్ను ఏపీ హైకోర్టుకు బదిలీ చేసింది. జస్టిస్ లీసా గిల్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైతే ఆమె ఆం«ధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి అవుతారు. కాగా, 2028లో పదవీ విరమణ చేసే జస్టిస్ లీసా వచ్చే ఏడాది చివరి కల్లా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశం ఉంది. -
శాసనమండలిలో బొత్సకు స్వల్ప అస్వస్థత
విజయవాడ: వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ శాసన మండలిలో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దాంతో వైద్యుల్ని శాసనమండలికి పిలిపించిన అధికారులు.. పరీక్షలు చేయించారు. బీపీలో హెచ్చుతగ్గుల వల్ల బొత్స స్వల్ప అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు. బొత్స సత్యనారాయణ హైబీపీ కారణంగా ఇబ్బందిపడినట్లు వైద్యులు తెలిపారు. ఒకవేళ బీపీ కంట్రోల్లోకి రాకపోతే ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు సూచించారు. దీనిలో భాగంగా బొత్సతో సిటీన్యూరో ఆస్పత్రి వైద్యులు ఫోన్లో మాట్లాడారు. ఆరోగ్యం విషయంలో బొత్సకు డా. చంద్రశేఖర్రెడ్డి జాగ్రత్తలు చెప్పారు. అనారోగ్యం కారణంగా మండలి నుంచి ఇంటికి వెళ్లిపోయారు బొత్స. -
మంత్రి పయ్యావుల కేశవ్కు బొత్స స్ట్రాంగ్ రిప్లై
06-03-20265.25PMఏపీ శాసనమండలి నిరవధిక వాయిదా4:19 PMమంత్రి పయ్యావుల కేశవ్కు బొత్స స్ట్రాంగ్ రిప్లై ఆదాయంలో ఏపీకి 22వ స్థానం ఎలా వచ్చిందో చూపించిన బొత్సకాగ్ నివేదిక లింక్ ను పయ్యావులకు సభలో పంపిన బొత్సమీకు డౌన్ లోడ్ చేయడం చేతకాకపోతే చేసి పంపిస్తానన్న బొత్సగత ఐదేళ్లలో పంటల కొనుగోళ్ల వివరాలను ఇచ్చిన బొత్సవైఎస్ జగన్ హయాంలో రూ. 7800 కోట్లతో పంటల కొనుగోలు చేశాంపంటల వారీగా కొనుగోలు చేసిన వివరాలు ఇస్తున్నా చూస్కోండిబొత్స డాక్యుమెంట్లు ఇవ్వడంతో ఖంగుతిన్న మంత్రి పయ్యావుల కేశవ్రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు.. వారిని ఆదుకొండిప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ అంతా అంకెల గారడీ ఏపీ శాసనమండలి నుంచి వైఎస్సార్సీపీ సభ్యుల వాకౌట్👉అంగన్వాడీలపై ప్రభుత్వ తీరుకు నిరసనగా వాకౌట్👉అంగన్వాడీ కార్యకర్తల సంక్షేమంపై వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్న👉సభను తప్పుదోవ పట్టించకండి: విపక్షనేత బొత్స సత్యనారాయణఆనాటి ప్రభుత్వం చాలా హామీలు నెరవేర్చిందిచాలా హామీలకు సంబంధించి అధికారులను పిలిపించి సమాచారం తీసుకోండిలేనిపోని కల్లబొల్లి కబుర్లు చెప్పకండిసమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు చేస్తున్న వారిని అవమానించకండిమంత్రి సమస్యల పరిష్కారం కోసం ఏ అగ్రిమెంట్ ఏమీ చేసుకోలేదంటున్నారు.ముందు అంతకు ముందు ఏం జరిగిందో తెలుసుకోండి.అంగన్వాడిల పట్ల సానుభూతితో ఈ ప్రశ్నకు సభ నుంచి వాకౌట్ చేస్తున్నాం👉గీతం యూనివర్సిటీ రూ.5 వేల కోట్ల భూ దోపిడీపై సభలో చర్చించాలని కోరుతూ శాసనమండలి వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు కుంభా రవిబాబు, పండుల రవీంద్రబాబు, పాలవలస విక్రాంత్లు ప్రతిపాదించిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ మోషేన్ రాజు తిరస్కరించారు.👉దీంతో వైఎస్సార్సీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గీతం యూనివర్సిటీపై చర్చించాల్సిందేనని సభలో వైఎస్సార్సీపీ సభ్యులు నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళనకు దిగడంతో సభకు ఐదు నిమిషాల పాటు ఛైర్మన్ విరామం ప్రకటించారు. అనంతరం ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు.👉తల్లికి వందనం పథకంపై చంద్రబాబు సర్కార్ను వైఎస్సార్సీపీ సభ్యులు నిలదీశారు. తల్లికి వందనం పథకం తల్లికి వంచనగా మారిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ భరత్ మండిపడ్డారు. ఎన్నికల ముందు ప్రతీ ఇంటి వెళ్లి నీకు 15 వేలు, నీకు 15 వేలు అని ప్రచారం చేశారంటూ దుయ్యబట్టారు.ఇది పెద్ద భూ కుంభకోణం: కుంభ రవిబాబు మండలి మీడియా పాయింట్లో ఎమ్మెల్సీ కుంభ రవిబాబు మాట్లాడుతూ.. గీతంకి ప్రభుత్వ భూములు ఇవ్వడంపై వాయిదా తీర్మానం ఇచ్చామని.. ప్రభుత్వం తిరస్కరించిందన్నారు. రూ. 5 వేల కోట్ల భూములు గీతంకి ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించిందని.. ఇది పెద్ద భూ కుంభకోణమని ఆయన అన్నారు.‘‘గీతంకి భూములు ఇవ్వడంపై విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ ఇవ్వాలని తీర్మానం చేసినప్పుడు వ్యతిరేకత వచ్చింది. గీతం ఒక వ్యాపార సంస్థ. విద్యా వ్యాపారం చేస్తున్న సంస్థకి 5000 కోట్లు భూములు ఇవ్వడంపై వైఎస్సార్సీపీ అభ్యంతరం తెలిపింది. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చిన గీతంకి ఉచితంగా భూములు ఇవ్వడం పరిపాటిగా మారింది. గతంలో ఎకరం 15 లక్షలకు ఇచ్చారు...రుషికొండలో ప్రభుత్వ భవనాలను వైఎస్ జగన్ కడితే కూటమి గగ్గోలు పెట్టింది. ఎన్నికల్లో ప్రచారం చేసి లబ్ధి పొందాలని ప్రయత్నం చేశారు.51 ఎకరాల 71 సెంట్లు కట్టబట్టేందుకు ప్రయత్నం చేస్తుంది. అనేక కంపెనీలకి 99 పైసలకే భూములు ఇస్తుంది. భూములు అప్పనంగా కట్టబెట్టడాన్ని వైఎస్సార్సీపీ వ్యతిరేకిస్తుంది. విలువైన భూములను కారు చౌకగా గీతంతో పాటు ఎన్నో సంస్థలకు ఇచ్చేందుకు ప్రభుత్వం పూనుకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం’’ అని రవిబాబు తేల్చి చెప్పారు.గీతం కబ్జా చేసిన భూమిని స్వాధీనం చేసుకోవాలి: వరుదు కళ్యాణిగీతం యూనివర్సిటీ కబ్జా చేసిన భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. రెగ్యులరైజేషన్ ఆపాలి. 99 పైసలకు తన బినామీలు అనుచరులకు చంద్రబాబు భూములు కట్టబడుతున్నారు. రూ.5 వేల కోట్ల విలువైన భూములు తన కుటుంబ సభ్యులకు కట్టబడుతున్నారు. విశాఖపట్నం ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటూ దోపిడీ క్యాపిటల్లా మార్చారు. బీసీ మహిళా మేయర్ని అడ్డగోలుగా పదవి నుంచి దించారు.కబ్జా భూమిని రెగ్యులరైజ్ చేయడం కోసమే మేయర్ ని తప్పించారు. కబ్జా చేసిన భూములపై ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టాలి.. కానీ రెగ్యులరేజ్ చేస్తున్నారు. చిన్న చిన్న బడ్డీ కొట్లు పెట్టుకుంటే ప్రోక్లైన్లతో తొలగించారు. పేదలు చిన్న చిన్న గుడిసెలు వేసుకుంటే వాటిని తొలగించారు. కుటుంబ సభ్యులకు మాత్రం 5 వేల కోట్లు కట్టబెట్టారు. స్థానిక సంస్థల ఆధీనంలో ఉన్న భూములు ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకూడదంటూ కోర్టు తీర్పులు ఉన్నాయి. సుప్రీంకోర్టు అంటే కూటమి పెద్దలకు చంద్రబాబుకి భయం లేదు. గీతం కబ్జా చేసిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. అప్పటివరకు వైఎస్సార్సీపీ పోరాటం ఆగదు. -
ఔను.. రాధికకు రాయితీలిచ్చాం
సాక్షి, అమరావతి: ఔను.. రాధిక వెజిటబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్కు 44 శాతం మేర రాయితీలిచ్చిన మాట వాస్తవమేనని ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈవో డాక్టర్ గెడ్డం శేఖర్బాబు స్పష్టం చేశారు. ‘రాధికకు ఇన్ని రాయితీలా?’ అనే శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనంపై గురువారం ప్రభుత్వం తరఫున ఆయన వివరణ ఇచ్చారు. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 ప్రకారం రూ.200 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టే వాటిని మెగా పరిశ్రమలుగా పరిగణిస్తున్నామన్నారు. రూ.200 కోట్లకు పైగా ఉన్న మెగా ప్రాజెక్టులకు ఈ పాలసీ ప్రకారం ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చే వెసులుబాటు ఉందన్నారు. రాధిక వెజిటబుల్ ఆయిల్స్ లిమిటెడ్ ప్రాజెక్టు మూలధన పెట్టుబడి రూ.218 కోట్లకు పైగా ఉన్నందున పాలసీ ప్రకారం స్థిర మూలధన పెట్టుబడిలో 75 శాతం వరకు ప్రోత్సాహకాలు మంజూరు చేయవచ్చన్నారు. ఈ మేరకు రాయితీలిచ్చామని చెప్పారు. 'రాధిక'కు ఇన్ని రాయితీలా!? -
పోలవరంలో బాబు అవే తప్పులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టులో ప్రధాన(ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యాం పనులను నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నారంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ తీవ్రంగా ఆక్షేపించారు. ప్రధాన డ్యాం గ్యాప్–2లో చేస్తున్న పనుల్లో సాంకేతిక లోపాలపై సీడబ్ల్యూసీ(కేంద్ర జలసంఘం) అభ్యంతరాలు వ్యక్తం చేయడం దీనికి నిదర్శనమన్నారు. తక్షణమే సాంకేతిక లోపాలను సరిదిద్ది సీడబ్ల్యూసీ డిజైన్లు, మార్గదర్శకాల మేరకు ప్రాజెక్టు పనులు చేపట్టాలని సీఎం చంద్రబాబుకు ఉండవల్లి గురువారం లేఖ రాశారు.ఈ లేఖను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్, జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రి కందుల దుర్గేష్ లకు కూడా పంపారు. గతంలో ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేసి, గోదావరి ప్రవాహాన్ని మళ్లించాల్సి ఉండగా, ఆ పనులు చేయకుండా డయాఫ్రం వాల్ నిర్మించడంతో వరద ఉద్ధృతికి అది కోతకు గురై దెబ్బతిందని, ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతం కోతకు గుౖరె విధ్వంసం చోటుచేసుకుందని ఉండవల్లి ఆవేదన వ్యక్తం చేశారు.దానివల్లే ఇప్పుడు కొత్త డయాఫ్రం వాల్ నిర్మించడానికి, ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే పనులకు రూ.3 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఆ మేరకు ప్రజాధనం వృథా అయిందంటూ ఎత్తిచూపారు. ఆ తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సిందిపోయి చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ అవే తప్పులను చేస్తోందంటూ దుయ్యబట్టారు. సాంకేతిక లోపాలను సరిదిద్దకుండా ప్రాజెక్టును పూరి్తచేస్తే భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం వాటిల్లితే దిగువ ప్రాంతాల్లో భారీ ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతుందని సీఎం చంద్రబాబును హెచ్చరించారు. ఉండవల్లి లేఖలో ప్రధానాంశాలు ఇవీ..⇒ పోలవరం ప్రాజెక్టు పనులను జనవరి 19, 20, 21 తేదీల్లో నిపుణుల కమిటీ, పలు సాంకేతిక సంస్థలు, ఆఫ్రి వంటి అంతర్జాతీయ కన్సల్టెన్సీ ప్రతినిధులతో సీడబ్ల్యూసీ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఆ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ప్రాజెక్టు పనులపై పలు అభ్యంతరాలు లేవనెత్తారు. ఈ సమావేశం మినిట్స్ను జనవరి 30న లేఖ రూపంలో సీడబ్ల్యూసీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ⇒ ప్రధాన డ్యాం గ్యాప్–2లో గోదావరి నదీ గర్భం సముద్రమట్టానికి 8.32 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అక్కడి నుంచి ప్రధాన డ్యాం నిర్మించాలి. కానీ.. 15.50 మీటర్ల నుంచి ప్రధాన డ్యాంను నిరి్మస్తున్నారు. దీని వల్ల డ్యాం కింద ఇసుక పొరలు కోతకు గురై డ్యాం కోతకు గురై ప్రమాదం ఉంది. ⇒ టెయిల్ వాటర్ లెవల్ను ఎలాంటి బలమైన సాంకేతిక కారణం లేకుండా 25 మీటర్ల నుంచి 16 మీటర్లు, 13.5 మీటర్లకు తగ్గించడం వల్ల నీటి ప్రవాహం వెనక్కి ఎగదన్ని ప్రధాన డ్యాం దెబ్బతినే ప్రమాదం ఉందని సీడబ్ల్యూసీ ఆందోళన వ్యక్తం చేసింది. ⇒ ఫిల్టర్ డిజైన్, స్లోప్ స్టెబిలిటీ, వేవ్ రన్ అప్(అలల తాకిడి ప్రభావం) తదితర డిజైన్లు డిజైనర్ ఆఫ్రి నుంచి ఇంకా అందలేదని సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. డ్యాం భూకంపాలకు తట్టుకోగలదా అనే అంశంపై ఆఫ్రి ఇచి్చన నివేదికలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయని సీడబ్ల్యూసీ ఎత్తిచూపింది. ⇒ డిజైన్లు ఆమోదం పొందకుండా పనులు పూర్తి చేయడం.. ఆ తర్వాత వాటికి ఆమోదం పొందడం(పోస్ట్ ఫ్యాక్టో ఆప్రూవల్స్) అత్యంత ప్రమాదకరమని సీడబ్ల్యూసీ హెచ్చరించింది. ఒక సారి డ్యాం నిర్మాణం పూర్తయిన తర్వాత దానిలో లోపాలు కన్పిస్తే వాటిని మార్చడం సాంకేతికంగా అసాధ్యమని.. దీని వల్ల భారీగా నష్టం వాటిల్లుతుందని సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. -
‘స్కిల్’ కేసు క్లోజర్ కాపీ ఇప్పించండి
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి సంబంధించి సీఎం చంద్రబాబుపై గతంలో నమోదు చేసిన కేసును మూసివేసే నిమిత్తం సీఐడీ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్ను సవాల్ చేస్తూ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అప్పటి చైర్మన్ అజయ్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తాను ఫిర్యాదుదారు అయితే సీఐడీ తనకు నోటీసు ఇవ్వకుండా క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసిందని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. తనను థర్డ్పార్టీగా పేర్కొంటూ నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదన్న ఏసీబీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని హైకోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప గురువారం విచారణ జరిపారు. అజయ్రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది పాపెల్లుగారి వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో అజయ్రెడ్డి ఫిర్యాదుదారు అని తెలిపారు. సీఐడీ అధికారులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఫిర్యాదుదారు కాలమ్లో అజయ్రెడ్డి పేరే ఉందన్నారు. స్కిల్ కేసులో నిందితునిగా ఉన్న చంద్రబాబు హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో దాఖలు చేసిన పలు వ్యాజ్యాల్లోనూ అజయ్రెడ్డిని డీఫ్యాక్టో ఫిర్యాదుదారుగా పేర్కొంటూ ప్రతివాదుల జాబితాలో కూడా చేర్చారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సీఐడీ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్పై తనకు ముందస్తు నోటీసు ఇవ్వాలని, ఆ రిపోర్ట్ను వ్యతిరేకించే అవకాశం కల్పించాలని కోరుతూ ఏసీబీ కోర్టులో అజయ్రెడ్డి ఓ పిటిషన్ దాఖలు చేశారని వివరించారు. అయితే అజయ్రెడ్డికి ఈ కేసుతో సంబంధం లేదంటూ, ఈ కేసులో అతన్ని థర్డ్ పార్టీగా పరిగణిస్తూ ఆ పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టేసిందన్నారు. కేసును పూర్తిగా మూసివేస్తూ కోర్టు తుది నిర్ణయం తీసుకునేలోపు, సీఐడీ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్ను వ్యతిరేకిస్తూ ‘ప్రొటెస్ట్ పిటిషన్’ దాఖలు చేసే అవకాశం పిటిషనర్కు ఇవ్వాలని కోరారు. సీఐడీ సిట్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, మాధవ్ ఖురానా స్పందిస్తూ.. అసలు ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదన్నారు. స్కిల్ కేసులో అజయ్రెడ్డి పిటిషనరే కాదన్నారు. ఈ దశలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాల్సిన అవసరం కూడా లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 12కి వాయిదా వేశారు. ఐఆర్ఆర్ కేసును ‘ప్రత్యేక’ కోర్టుకు బదిలీ చేయండిహైకోర్టును ఆశ్రయించిన మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రాథమిక చార్జిషీట్, క్లోజర్ రిపోర్ట్ కాపీలు ఇప్పించాలంటూ మరో పిటిషన్సాక్షి, అమరావతి: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) అలైన్మెంట్, మాస్టర్ ప్లాన్ అక్రమాలకు సంబంధించి తానిచి్చన ఫిర్యాదు మేరకు సీఐడీ నమోదు చేసిన కేసును విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గురువారం హైకోర్టును ఆశ్రయించారు. ఈ కుంభకోణం కేసులో సీఐడీ 2024లోనే చార్జిషీట్ దాఖలు చేసిందని, ఈ కేసును ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయకుండా సాధారణ ఏసీబీ కోర్టులో విచారించడం చట్టవిరుద్ధమని తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం కేసులో ప్రస్తుత ముఖ్యమంత్రి, ఓ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు నిందితులుగా ఉన్నారని తెలిపారు. నిందితుల హోదాను బట్టి కేసు విచారణ కేవలం ప్రత్యేక కోర్టులోనే జరగాల్సి ఉంటుందన్నారు. అయితే, ప్రస్తుతం ఈ కేసును విజయవాడ ఏసీబీ కోర్టు విచారిస్తోందని తెలిపారు. తదుపరి చర్యలన్నీ నిలిపేయండి అశి్వనికుమార్ ఉపాధ్యాయ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచి్చన చరిత్రాత్మక తీర్పు ప్రకారం ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్ కేసులను విచారించేందుకు ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక కోర్టులున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2018లో విజయవాడలో ఎంపీ, ఎమ్మెల్యేల కేసుల విచారణ కోసం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసిందన్నారు. నిందితుల హోదాను బట్టి కేసు విచారణ కేవలం ఈ ప్రత్యేక కోర్టులోనే జరగాలని, సాధారణ ఏసీబీ కోర్టులో కాదని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణానికి సంబంధించిన కేసుపై ఏసీబీ స్పెషల్ కోర్టులో జరుగుతున్న విచారణలో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు. ‘క్లోజర్’ కాపీలు ఇప్పించండి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కుంభకోణం కేసులో 2024లో దాఖలు చేసిన ప్రాథమిక చార్జిషీట్, తాజాగా దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్ కాపీలను తనకు అందచేసేలా సీఐడీని ఆదేశించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గురువారం హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు 2014–19 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఇన్నర్ రింగ్ రోడ్డు భూ కుంభకోణంపై 2022లో తాను సీఐడీకి ఫిర్యాదు చేశానని రామకృష్ణారెడ్డి తెలిపారు. దర్యాప్తు జరిపిన సీఐడీ కుంభకోణానికి సంబంధించిన అన్ని ఆధారాలను సేకరించిందని తెలిపారు. 2024లో చార్జిషీట్ కూడా దాఖలు చేయగా.. కోర్టు దానిని సాంకేతిక కారణాలతో వెనక్కి పంపిందన్నారు. ప్రభుత్వం మారడంతో ఐఆర్ఆర్ కుంభకోణం కేసును మూసివేసేందుకు సీఐడీ సిద్ధమై విజయవాడ ఏసీబీ కోర్టులో క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసిందని చెప్పారు. ఈ నేపథ్యంలో గత నెల 18న సీఐడీ అధికారులు తనకు ఓ నోటీసు పంపి కేసును మూసివేస్తున్నట్లు తెలిపారన్నారు. 2024 నాటి తొలి చార్జిషీట్ కాపీని గానీ, ఇప్పుడు దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్ కాపీని కానీ తనకు అందించడం లేదని వివరించారు. దీంతో సీఐడీ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్ను వ్యతిరేకిస్తూ కోర్టులో ‘ప్రొటెస్ట్ పిటిషన్’ దాఖలు చేయడం సాధ్యం కావడం లేదన్నారు. చార్జిషీట్ను, క్లోజర్ రిపోర్ట్ను ఫిర్యాదుదారునికి అందించడం దర్యాప్తు అధికారి బాధ్యత అని పిటిషన్లో పేర్కొన్నారు. -
ఉద్యోగాల్లేవ్.. భృతీ లేదు
సాక్షి, అమరావతి: అధికారం కోసం కూటమి ఇచ్చిన నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన హామీలపై శాసనమండలి అట్టుడికింది. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించి, సభలో ఒకలెక్క, మండలిలో మరో లెక్క చెబుతున్నారని, అబద్ధాలు చెబుతూ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం శాసనమండలిలో ఈ అంశంపై వాడీవేడీగా చర్చ జరిగింది. వైఎస్సార్సీపీ సభ్యులు రాజగొల్ల రమేష్యాదవ్, డాక్టర్ మొండితోక అరుణ్కుమార్, డాక్టర్ పెనుమత్స వరాహ వెంకట సూర్యనారాయణరాజు నిరుద్యోగ సమస్యపై మంత్రిని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో నిరుద్యోగం ఎక్కువగా ఉందా?, ఉంటే నివారణకు తీసుకున్న చర్యలు, నిరుద్యోగ యువతకు అందిస్తున్న ఆర్థిక సాయం వివరాలు వెల్లడించాలని ప్రశ్నించారు. దీనికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ సమాధానమిస్తూ నిరుద్యోగ భృతి చెల్లించడం లేదని, దానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని సమాధానమిచ్చారు. తమ ప్రభుత్వంలో 5,72,280 ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు వాస్తవాలు చెప్పాలని నిలదీశారు. నిరుద్యోగులను నమ్మించి మోసం చేశారునిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని, ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి ఓట్లు వేయించుకుని ప్రభుత్వం వచ్చాక మోసం చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రాజగొల్ల రమేష్ యాదవ్ ప్రభుత్వాన్ని విమర్శించారు. తప్పుడు సమాచారం ఇస్తూ నిరుద్యోగులను నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత 20 నెలల కాలంలో రాష్ట్రంలో ఎంత శాతం నిరుద్యోగం ఉంది, ప్రభుత్వం ఏమైనా నివారణ చర్యలు తీసుకున్నారా? అని అడిగితే, పొంతన లేని సమాధానాలు చెబుతున్నారన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు రద్దు చేసి 15 వేల ఉద్యోగాలు డీఎస్సీ ద్వారా ఇచ్చి భారీ బహిరంగ సభలు పెట్టిన వారు 5,72,280 ఉద్యోగాలు ఇస్తే అసలు ఆగుతారా అంటూ ప్రశ్నించారు. ఇన్ని ఉద్యోగాలు ఎప్పుడిచ్చారో ప్రజలకు తెలియాలని పట్టబట్టారు. ‘‘గడిచిన 20 నెలల్లో రాష్ట్రంలో ఎంత మంది నిరుద్యోగులున్నారో లెక్క ఏమైనా ఉందా? దీనిపై ఏమెనా కమిటీ వేశారా? శాసనసభ సాక్షిగా సీఎం 6,28,320 ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్పారు, ఇప్పుడు మంత్రి 5,72,280 ఉద్యోగాలు అంటున్నారు. ఇద్దరిలో ఎవరు అబద్ధం చెబుతున్నారు? డిసెంబర్లో రాజ్యసభకు ఇచ్చిన నివేదిక ప్రకారం దేశంలో నిరుద్యోగం 5.2 శాతం ఉంటే ఆంధ్రప్రదేశ్లో 8.2 శాతం ఉంది. ఇది దేశంలోనే అత్యధికం. ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు ఏం సమాధానం చెబుతుంది? ఎన్నికల్లో మొదటి హామీగా 20 లక్షల ఉద్యోగాలు, నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ప్రకటించారు. ఇప్పటి దాకా జాబ్ కేలండర్ ఇచ్చిన పాపాన పోలేదు. దీనిపై మంత్రి సమాధానం చెప్పాలి’’ అంటూ నిలదీశారు. దేశంలో అత్యధిక నిరుద్యోగం ఏపీలోనేఎకనమిక్స్ సర్వే 2025–26 నివేదిక ప్రకారం ఏపీలో నిరుద్యోగం 8.2 శాతం ఉందని, ఇది దేశంలోనే అత్యధికమని ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా భారత ప్రభుత్వం విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్సు సర్వేలో కూడా 8.2 శాతం నిరుద్యోగంతో రాష్ట్రం రెండో స్థానంలో ఉందన్నారు. రాజ్యసభలో కేంద్ర మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం నిరుద్యోగ శాతం 8.2 శాతంతో దేశంలోనే ఏపీ టాప్లో ఉన్నట్టు ప్రకటించారని గుర్తు చేశారు. దీన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలని అడిగితే పొంతనలేని సమాధానం చెబుతున్నారన్నారు. ‘కేంద్రం చెబుతున్న గణాంకాలతో రాష్ట్ర ప్రభుత్వం ఏకీభవిస్తే నిరుద్యోగ నివారణకు తీసుకున్న చర్యలేంటి? ఉద్యోగాల కల్పనలో అసెంబ్లీలో సీఎం ఒక నంబర్, మండలిలో మంత్రి చెబుతున్న నంబర్లలో ఏది కరెక్టు? మీరు చెబుతున్న 5,72,280 ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో జిల్లాల వారీగా, వారికి చెల్లిస్తున్న వేతనాలతో సమగ్రంగా రాతపూర్వకంగా ఇవ్వాలి’ అని పట్టుబట్టారు. జగన్ 1.30 లక్షల శాశ్వత ఉద్యోగాలిచ్చారు, మీరేమిచ్చారు?నిరుద్యోగులకు ఆర్థిక సాయం అందించేందుకు ఎలాంటి పథకం అమలు చేయడం లేదని సభలో మంత్రి చెప్పడం సరికాదని ఎమ్మెల్సీ పెనుమత్స వరాహæ వెంకట సూర్యనారాయణరాజు అన్నారు. ఎన్నికలకు ముందు నిరుద్యోగ భృతి, జాబ్ కేలండర్ ఇస్తామని యువతకు హామీ ఇచ్చారని, ఇప్పుడు జాబ్లెస్ కేలండర్గా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటి దాకా జాబ్ కేలండర్నే అమలు చేయలేదు. వైఎస్ జగన్ 1.30 లక్షల శాశ్వత ఉద్యోగాలు ఇచ్చారు. మీ ప్రభుత్వం చెబుతున్నట్టుగా ఎంత మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చారు, వారిలో ఎంత మందికి ఉద్యోగాలు లభించాయో జిల్లాల వారీగా నివేదిక ఇవ్వాలి. యువతకు స్వయం ఉపాధికోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటో చెప్పాల’ని డిమాండ్ చేశారు.ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి అని చెప్పాం: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ అనంతరం మంత్రి రాంప్రసాద్ సమాధానమిస్తూ తాము ఎన్నికల్లో ఇచ్చిన సూపర్–6 హామీల్లో చెప్పింది సరిగా అర్ధం చేసుకోలేదన్నారు. తాము ‘‘20 లక్షల ఉద్యోగాలు లేదంటే నిరుద్యోగ భృతి’’ ఇస్తామన్నామన్నారు. రాష్ట్రానికి కంపెనీలు తీసుకొస్తున్నామని, అవి వస్తేనే ఉద్యోగాలు వస్తాయన్నారు.ఆ లెక్కలు అప్పటివి.. ఈ లెక్కలు ఇప్పటివి: మంత్రి అచ్చెన్న నిరుద్యోగంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని నిలదీస్తూ సభలో సీఎం, మండలిలో మంత్రి తప్పుడు లెక్కలు చెబున్నారని, వీరిద్దరిలో ఎవరు చెప్పింది నిజమో చెప్పాలని నిలదీశారు. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కల్పించుకున్నారు. ‘‘నిన్న సభలో సీఎం చెప్పిన ఫిగరు 6,28,320 ఉద్యోగాల కల్పన పాతది. మండలిలో మంత్రి చెప్పిన 5,72,280 ఉద్యోగాలు ఇప్పటివి.. ఇది తెలుసుకోవాలి’’ అనగానే వైఎస్సార్సీపీ సభ్యులతో పాటు సభలోని చాలామంది సభ్యులు నవ్వుకున్నారు. ఒక్కరోజులోనే లక్ష ఉద్యోగాలు ఎలా తగ్గిపోతాయని ప్రశ్నించారు.టీటీడీ చైర్మన్ను తొలగించాలిమండలిలో వైఎస్సార్సీపీ డిమాండ్ సాక్షి, అమరావతి: కళంకిత ఆరోపణలు ఎదుర్కొంటున్న టీటీడీ చైర్మన్ను ఆ పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్సీపీ గురువారం మండలిలో డిమాండ్ చేసింది. గురువారం ఈ అంశంపై అత్యవసర చర్చ కోరుతూ ఎమ్మెల్సీలు తూమాటి మాధవరావు, వరుదు కళ్యాణి, భరత్ మండలి చైర్మన్ మోషేన్రాజుకు వాయిదా తీర్మానం అందజేశారు. కాగా, సభ ప్రారంభం కాగానే చైర్మన్ మోషేన్రాజు వైఎస్సార్సీపీ సభ్యులు ఇచ్చిన ఆ వాయిదా తీర్మానం తిరస్కరిస్తున్నట్టు ప్రకటించి, ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ప్రకటించారు. దాంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, ‘టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలి’ అని నినాదాలు చేస్తూ పోడియం వద్ద నిలబడి ఆందోళన కొనసాగించారు. చైర్మన్ మోషేన్ రాజు వారించినప్పటికీ శాంతించని వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు కొందరు పోడియం పైకి వెళ్లి నినాదాలు కొనసాగించారు. దీంతో, సభను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ఛైర్మన్ ప్రకటించారు. వాయిదా అనంతరం దాదాపు అరగంట తర్వాత సభ ప్రారంభం కాగా, ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగింది. -
విచారణకు హాజరైన సునీల్ నాయక్
నగరంపాలెం: శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో బిహార్ ఐజీ సునీల్ నాయక్ విచారణ నిమిత్తం గురువారం గుంటూరు సీసీఎస్ పోలీస్ స్టేషన్లో హాజరయ్యారు. ఉదయం పది గంటలకు హాజరైన ఐజీ సునీల్ నాయక్ సాయంత్రం ఐదు గంటలకు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చారు. విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్ విచారణ అధికారిగా వ్యవహరించారు. మరో నాలుగు రోజులు ఆయన్ను విచారించనున్నారు. కస్టోడియల్ టార్చర్ కేసులో ఆ రోజు ఎంత మంది ఉన్నారని అడిగినట్లు తెలిసింది. -
సాక్షి కథనం సభా హక్కుల ఉల్లంఘన కిందకు రాదు
సాక్షి, అమరావతి: ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతుల పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేయడంపై ‘సాక్షి’ ప్రచురించిన వార్తాకథనం సభాహక్కుల ఉల్లంఘన కిందకు రాదని సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరాం గురువారం హైకోర్టుకు నివేదించారు. సభ లోపల జరిగిన వ్యవహారాలపై రాసిన కథనాలకే సభాహక్కుల ఉల్లంఘన వర్తిస్తుందని చెప్పారు. సభ వ్యవహారాలతో సంబంధంలేని అంశాలపై వార్తా కథనం ప్రచురించడం తప్పు కాదన్నారు. సాక్షి కథనం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందనేందుకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని చెప్పారు. ప్రాథమిక ఆధారాలు లేకుండానే సభా హక్కుల ఉల్లంఘనపై ముందే ఓ నిర్ణయానికి వచ్చి, అందుకనుగుణంగా శాసనసభ సెక్రటరీ జనరల్ నోటీసులు జారీ చేయడం చట్ట విరుద్ధమని తెలిపారు. ఆ కథనం కేవలం పరిపాలనపరమైన అంశానికి సంబంధించింది మాత్రమేనన్నారు. అసలు ఆ కథనం సభా హక్కుల పరిధిలోకి వస్తుందా.. రాదా.. అన్న విషయాన్ని ముందు తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. వాస్తవానికి ఏది సభాహక్కుల పరిధిలోకి వస్తుంది, ఏది రాదు అన్న విషయంపై ఎక్కడా నిర్దిష్టమైన నిర్వచనం లేదని తెలిపారు. తమ కథనం సభాహక్కుల పరిధిలోకి వస్తుందా.. రాదా.. అన్నదానిపై ఓ వైపు న్యాయస్థానం విచారణ జరుపుతుండగానే, ప్రచురించిన వార్తా కథనానికి సంబంధించిన ఆధారాలతో తమ ముందు హాజరుకావాలంటూ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ తాజాగా మరో నోటీసు ఇచ్చారని చెప్పారు. ఆ నోటీసుకు తాము సమాధానం కూడా ఇచ్చామని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ వ్యవహారంలో ముందుకెళ్లకుండా ప్రివిలేజ్ కమిటీని, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ను నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ సమయంలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ.. ఎలాంటి రాతపూర్వక ఉత్తర్వులు అవసరం లేదని, తదుపరి విచారణ వరకు ఎలాంటి నోటీసులు ఇవ్వబోమని చెప్పారు. ఏజీ చెప్పిన ఈ వివరాలను నమోదు చేసిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సభా హక్కుల కమిటీకి నివేదించిన స్పీకర్ సాక్షి కథనం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని, దాన్ని తాను సభలో ప్రస్తావించేందుకు అనుమతించాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్యే జయసూర్య గత ఏడాది ఫిబ్రవరి 25న అసెంబ్లీ స్పీకర్ను కోరుతూ నోటీసు ఇచ్చారు. దీంతో స్పీకర్ ఈ వ్యవహారాన్ని సభాహక్కుల కమిటీకి నివేదించారు. ఈ కమిటీ ఆదేశాల మేరకు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ‘సాక్షి’కి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఎమ్మెల్యే నోటీసుతోపాటు సెక్రటరీ జనరల్ ఇచ్చిన షోకాజ్ నోటీసును సవాలు చేస్తూ సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి, చీఫ్ రిపోర్టర్ ఫణికుమార్ గత ఏడాది జూన్లో హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. ఇచ్చింది షోకాజ్ నోటీసు మాత్రమేనని, దీని తరువాత చాలా ప్రక్రియ ఉన్న నేపథ్యంలో ఈ వ్యాజ్యాలు అపరిపక్వమైనవంటూ వాటిని కొట్టేశారు. ధర్మాసనం ముందు అప్పీళ్లు ఈ తీర్పును సవాలు చేస్తూ ధనంజయరెడ్డి, ఫణికుమార్ వేర్వేరుగా ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై గురువారం సీజే ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది శ్రీరాం, వేలూరు మహేశ్వర్రెడ్డి, అనూప్ కౌషిక్ వాదనలు వినిపించారు. శాసనసభ కార్యకలాపాల్లో జోక్యం చేసుకున్నప్పుడు, వాటిని అడ్డుకున్నప్పుడే సభాహక్కుల ఉల్లంఘన అవుతుందని శ్రీరాం వివరించారు. సాక్షి కథనం ఎక్కడా సభ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవడం లేదన్నారు. శిక్షణ తరగతులు నిర్వహించకపోవడం వల్ల ప్రజాధనం వృథా అయిందన్న విషయాన్ని మాత్రమే ఎత్తి చూపిందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను ఉదహరించారు. రూ.కోట్ల ప్రజాధనం వృథాపై సాక్షి కథనం ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతుల నిర్వహణ విషయంలో సరైన ప్రణాళిక, అవగాహన లేకపోవడంతో కోట్ల రూపాయల మేర ప్రజాధనం వృథా అయింది. ఎమ్మెల్యేలకు రెండు రోజులు శిక్షణ తరగతులు నిర్వహించాలని శాసనసభ వర్గాలు గత ఏడాది ఫిబ్రవరిలో నిర్ణయించాయి. ఎమ్మెల్యేలకు, అతిథులకు హోటళ్లు, భోజనాలు, బహుమతులు తదితరాల కోసం భారీగా ఖర్చు చేశారు. అయితే లోక్సభ స్పీకర్ ఈ కార్యక్రమానికి రాకపోవడంతో ఆ ఖర్చంతా వృథా అయింది. దీనిపై సాక్షి గత ఏడాది ఫిబ్రవరి 22న ‘కోట్లు ఖర్చు.. శిక్షణ తుస్సు’ శీర్షికన వార్తా కథనం ప్రచురించింది. ఈ వార్తా కథనంతో కంగుతిన్న అధికార పార్టీ నేతలు సాక్షిపై కక్షసాధింపు చర్యలు చేపట్టారు. -
చర్చలేకుండా డైవర్షన్
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ ప్రసాదంపై అధికారపక్షం అసలు చర్చే జరగనివ్వలేదు. శాసనమండలిలో గురువారం కూడా తెలుగుదేశం పార్టీ సభ్యులు పదేపదే అడ్డుతగులుతూ చర్చను పక్కదారి పట్టించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. తన కుటుంబ సంస్థ హెరిటేజ్ వ్యాపార ప్రయోజనాల కోసం కల్తీ నెయ్యి పేరుతో అత్యంత పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని, దానిపై చర్చిద్దామంటే సభ నుంచి ఆ పార్టీ సభ్యులు పారిపోతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆరోపించారు. అశ్లీల వీడియోల్లో ఉన్నది తానేనని బీఆర్ నాయుడు అంగీకరించిన తర్వాత కూడా ఆయన్ను టీటీడీ చైర్మన్ పదవి నుంచి తప్పించడానికి చంద్రబాబు ఎందుకు భయపడిపోతున్నారని ప్రశ్నించారు. హెరిటేజ్ అనుబంధ ఇందాపూర్ డెయిరీకి టీటీడీ నెయ్యి కాంట్రాక్టు కోసమే కల్తీ నాటకాన్ని తెరపైకి తెచ్చారని బయటపడడంతో అధికారపక్షం ఇరుకున పడిపోయింది. గురువారం తిరుమల లడ్డూపై దేవదాయ శాఖ మంత్రి ఆనం రామానారాయణ రెడ్డి స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధమవుతుండగా అడ్డుపడి అచ్చెన్నాయుడు లేచి సమస్యను పక్కదారిపట్టించేందుకు ప్రయత్నించారు. దాంతో వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ పోడియంలోకి దూసుకు వచ్చారు. ఈ నిరసన కార్యక్రమం మధ్యనే మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి స్టేట్మెంట్ను చదివేసి మమ అనిపించారు. వైఎస్సార్సీపీ సభ్యుల నిరసనతో సభను చైర్మన్ అయిదు నిమిషాలు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా అదే విధమైన పరిస్థితి కొనసాగడంతో సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు.చర్చకు దూరంగా పలాయనం..కల్తీ ఆరోపణలపై చర్చిద్దామంటే అధికారపక్షం పూర్తిగా పలాయనం చిత్తగించింది. దానిపై చర్చ జరగనీయకుండా రకరకాల వాదనలతో సమస్యను డైవర్ట్ చేయడానికి ఆపసోపాలు పడుతోంది. హెరిటేజ్ వ్యాపార ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు కల్తీ నెయ్యి ఆరోపణలు చేశారని ఆధారాలతో సహా వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు మండలిలో నిరూపించారు. ఇందాపూర్ డెయిరీ ముసుగులో హెరిటేజ్కి టీటీడీ నిధులు దోచిపెట్టడానికి చేసిన ప్రయత్నాలను వివరించారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు టీటీడీకి కిలో రూ.278కే నెయ్యి సరఫరా చేసిన ఇందాపూర్ డెయిరీ ఇప్పుడు ఏకంగా కిలో రూ.658 చొప్పున సరఫరా చేయడానికి కాంట్రాక్టు దక్కించుకుందని వారు పేర్కొన్నారు. ఇందాపూర్ డెయిరీ.. హెరిటేజ్ అనుబంధ సంస్థేనని ఒకసారి, కాదు.. అక్కడ హెరిటేజ్ ఉత్పత్తులు మాత్రమే తయారవుతాయని మరోసారి.. హెరిటేజ్ వెబ్సైట్ను మార్చడమే ఇందుకు నిదర్శనమని వైఎస్సార్సీపీ సభ్యులు వివరించారు. హెరిటేజ్ ఆధ్వర్యంలో ఏఆర్, ఇందాపూర్, సంగం, ప్రీమియర్ ఆగ్రో, భోలేబాబా డెయిరీలతో ఏర్పడిన డెయిరీ సిండికేట్ గుట్టును బయటపెట్టడంతో ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది. ప్రభుత్వం చర్చలో పాల్గొనకపోవడమంటే హెరిటేజ్ అవినీతిని అంగీకరించినట్లేనని వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు పేర్కొన్నారు. కల్తీ జరగలేదని సీబీఐ సిట్ చార్జిషీట్లో పేర్కొనడాన్ని బట్టి రాజకీయ స్వార్థం కోసమే తిరుమల శ్రీవారిని చంద్రబాబు రాజకీయాల్లోకి లాగారని ప్రజలు అర్ధంచేసుకున్నారని వారు వివరించారు. సమాధానం చెప్పలేకే డైవర్షన్..రాజకీయ లబ్ధి, హెరిటేజ్ వ్యాపార ప్రయోజనాల కోసం చంద్రబాబు ఘోరమైన కుట్రచేశారని తేలిపోయింది. దానిపై ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేకపోతోంది. ఏఆర్ డెయిరీ పేరుతో వచ్చిన నాలుగు ట్యాంకర్లను వెనక్కి పంపితే దాన్ని వైష్ణవి డెయిరీ పేరుతో తిరిగి రప్పించి లడ్డూ తయారీకి ఎలా వాడారని అడిగితే దానికి దేవదాయ శాఖ మంత్రి నుంచి సమాధానం లేదు. టీటీడీ బ్లాక్ లిస్టులో పెట్టిన ఇందాపూర్ డెయిరీపై సస్పెన్షన్ ఎత్తివేసింది కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే. భోలేబాబా డెయిరీకి టెక్నికల్ క్లియరెన్స్ ఇచ్చింది కూడా చంద్రబాబే. వీటిలో దేనికీ సమాధానం చెప్పలేక కూటమి సభ్యులు వేరే అంశాలను లేవనెత్తి సభను డైవర్ట్ చేశారు.టీటీడీ చైర్మన్ను పదవి నుంచి తొలగించాలి..టీటీడీ పవిత్రతను దెబ్బతీసిన బీఆర్ నాయుడు చైర్మన్ పదవికి అనర్హుడు. అశ్లీల వీడియోలతో అడ్డంగా దొరికిపోయిన వ్యక్తిని ఆ పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. ‘ఆ వీడియోలో తప్పేముందని.. ఆమె కుటుంబంతో 30 ఏళ్ల అనుబంధం ఉందని చెప్పారు. ఆ వీడియోలు, చంద్రబాబు, లోకేశ్, పవన్కళ్యాణ్కు బాధిత మహిళ రాసిన లేఖలపై పూర్తిస్థాయి విచారణ జరపాలి. ఈ విషయంలో చంద్రబాబు, పవన్ ఇంతవరకు స్పందించకపోవడం బాధాకరం. పవన్ నిజంగా హిందువైతే బీఆర్ నాయుడిని ఎందుకు కొనసాగిస్తున్నారో చెప్పాలి.’ అని వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. -
‘ఆశ’యమే ఆగ్రహజ్వాలై
చంద్రబాబు సర్కారు నిరంకుశత్వంపై ఆశా కార్యకర్తలు గర్జించారు. ఆశయ సాధన కోసం రణన్నినాదం మోగించారు. ప్రభుత్వ విధానాలు, వెట్టిచాకిరీ, బానిసత్వంపై నిప్పులుగక్కారు. బెజవాడలో మండుటెండనూ లెక్కచేయక నిరసన గళమెత్తారు. పది డిమాండ్లతో బాబు కూటమికి అల్టిమేటం ఇచ్చారు. సర్కారు వెన్నులో వణుకుపుట్టించారు. సాక్షి, అమరావతి: ఆశా కార్యకర్తలు విజయవాడలో గురువారం చేపట్టిన ధర్నా జయప్రదమైంది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన వర్కర్లు చంద్రబాబు సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలవులు ఇవ్వకుండా, కనీసం మానవత్వం లేకుండా రేయింబవళ్లూ సర్వేల పేరుతో వేధించడంపై నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో అలవికాని హామీలిచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత దారుణంగా మభ్యపెడుతోందని మండిపడ్డారు. ఎన్నిసార్లు వినతులు సమర్పించినా సమస్యలను పెడచెవిన పెట్టిందని ధ్వజమెత్తారు. అనేక రకాల విధులు అప్పగించి తమతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్న చంద్రబాబు సర్కారు తమను బానిసలుగా చూస్తోందని దుమ్మెత్తిపోశారు. పనిభారం తీవ్రమై, చాలీచాలని జీతంతో నరకం అనుభవిస్తుంటే, ప్రభుత్వ వైఫల్యాలను తమపై నెట్టి సర్కా రు మానసిక క్షోభకు గురిచేస్తోందని ఆవేదన వెళ్లగక్కారు. అందుకే ఉద్యమ బాట పట్టాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ఆత్మగౌరవం గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు తమ ఆత్మగౌరవాన్ని పెంచిందని ఆశా కార్యకర్తలు చెప్పారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే గౌరవ వేతనాన్ని రూ.పదివేలకు పెంచారని గుర్తుచేసుకున్నారు. కానీ, చంద్రబాబు ఎన్నికల ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి రాగానే నట్టేట ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేతనాలు పెంచాలి.. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా గౌరవ వేతనం పెంచాలని ఆశా కార్యకర్తలు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇస్తున్న రూ.10 వేలు అసలు చాలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందులో రవాణా ఖర్చులకు రూ.3 వేలు నుంచి రూ.4 వేలు ఖర్చుచేయాల్సి వస్తోందనిన్నారు. కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని, అన్ని రకాల సెలవులు మంజూరు చేయాలని, పనిభారం తగ్గించి వెట్టిచాకిరీ, బానిసత్వం నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు. కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశా కార్యకర్తలుగా మార్చాలని, ఖాళీలను భర్తీ చేయాలని, టీఏ, డీఏలు, ఏఎన్ఎం–జీఎన్ఎం శిక్షణ పొందిన వారికి పర్మినెంట్ పోస్టు, రూ.10 లక్షల బీమా, నాణ్యమైన మొబైల్స్, యూనిఫామ్ ఇవ్వడంతోపాటు విధినిర్వహణలో మృతి చెందిన వారికి దహన సంస్కార ఖర్చులుగా రూ.20వేలు ఇవ్వాలనే 10 రకాల డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. ఇదిలా ఉంటే ఆశా కార్యకర్తల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్లామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న ఆశా కార్యకర్తలు ఆశాల పోరాటం వాయిదా ఆశావర్కర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం హా మీ ఇవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన ఆందోళ న, పోరాటాలను తాత్కాలికంగా వాయిదా వేస్తూ ఆశావర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ నిర్ణయించిందని ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. చర్చల్లో రమణకుమారి, కమల, వాణిశ్రీ, సత్యవతి, పద్మ, లక్ష్మి పాల్గొన్నారు. కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలి ఆశా కార్యకర్తలకు ఇచ్చే గౌరవ వేతనం పెంచాలి. అరకొర వేతనాలతో అవస్థలు పడుతున్నాం. ధరలు పెరుగుదలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలి. కనీస వేతనం రూ.26వేలకు పెంచాలి. పనిభారం తగ్గించాలి. సెలవులు మంజూరు చేయాలి. వేధింపులు ఆపాలి. వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించాలి. – ఎ.కమల, భవానీపురం, విజయవాడఉద్యోగ భద్రతేదీ? మా బతుకులకు ఉద్యోగ భద్రత లేదు. సెలవులు ఇవ్వడం లేదు. వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. దీంతో అనారోగ్యాల బారిన పడుతున్నాం. సెలవులు, మెడికల్ లీవులు ఇవ్వాలి. పనిభారం తగ్గించాలి. ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్తల పోస్టులు భర్తీ చేయాలి. కనీస వేతనాన్ని రూ.26వేలకు పెంచాలి. ఉద్యోగ భ««ద్రత కల్పించాలి. – బి.సరళ, చింతలపూడి ఎలా బతకాలి? కనీస వేతనాలు ఇవ్వకుండా మాతో అన్ని రకాల పనులు చేయిస్తున్నారు. ముఖ్యంగా యాప్ల పేరుతో సర్వేల భారం మోపుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు పనిచేయడం లేదు. ఆ నెపాన్నీ తమపైనే మోపి వేధింపులకు పాల్పడుతున్నారు. సిమ్లు సైతం పనిచేయకపోవటంతో సొంత డబ్బుతో రీచార్జి చేయించుకుని పని చేయాల్సి వస్తోంది. ఇచ్చే రూ.పదివేలలో రవాణా, ఇతర విధుల ఖర్చులకే నలభైశాతం ఖర్చుచేయాల్సి వస్తోంది. ఇక మిగిలి వాటితో ఎలా బతకాలి? – సీహెచ్ పద్మ, కాకినాడసెలవుల్లేవు.. లాస్ ఆఫ్ పేనే ఏఎన్ఎం శిక్షణ పూర్తిచేసుకున్న ఆశా కార్యకర్తలకు ఏఎన్ఎం పోస్టుల భర్తీలో ప్రాధాన్యం ఇవ్వాలి. కనీసం సెలవు కూడా ఇవ్వకుండా అన్ని రకాలుగా చాకిరీ పనిచేయిస్తున్న పభుత్వం కనీస వేతనం ఇవ్వటం లేదు. ఆన్లైన్ సర్వేలతో పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులు వెల్నెస్ సెంటర్లోనే కూర్చోమని చెప్పటం ఇబ్బందిగా ఉంది. సెలవులు లేకపోవటం వల్ల శస్త్రచికిత్సలు చేయించుకున్నప్పుడు లాస్ ఆఫ్ పే భరించాల్సి వస్తోంది. – ఎం.రాధ ధవళేశ్వరం -
‘అచ్చెన్నాయుడిని మంత్రి పదవి నుంచి తొలగించాలి’
విజయవాడ: కులమతాలను రెచ్చగొట్టేలా సభలో మాట్లాడుతున్న అచ్చెన్నాయుడిని మంత్రి పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్పీలు డిమాండ్ చేశారు. అన్ని మతాలను గౌరవించాలని రాజ్యాంగం చెబుతుంటే, అచ్చెన్నాయుడు మాత్రం కులమతలాను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ మండిపడ్డారు. ఈరోజు(గురువారం, మార్చి 5వ తేదీ) శాసనమండలి సమావేశాల్లో భాగంగా మీడియా పాయింట్ వద్ద వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మాట్లాడారు. ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ మాట్లాడుతూ.. ‘ అచ్చెన్నాయుడితో మాట్లాడిస్తున్నది చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్. రేపు వ్యవసాయం పై జరగాల్సిన చర్చను డైవర్ట్ చేయడం కోసమే ఇలా చేస్తున్నారు. అచ్చెన్నాయుడిని మంత్రి పదవి నుంచి తొలగించాలి. బీఆర్ నాయుడిని తొలగిస్తారా లేదా?’ అని ప్రశ్నించారు.మరో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ‘ సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు. కులమత రాజకీయాలు చేయడం టీడీపీకి అలవాటు. మమ్మల్ని కాదు.. చంద్రబాబుని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించాలి. వెనక్కి పంపించిన ట్యాంకర్లు ఎందుకు వాడారో చంద్రబాబుని అడగాలి.ఇందాపూర్ కు ఎందుకు నెయ్యి టెండర్లు ఇచ్చారో చంద్రబాబుని అడగాలి. దేవుడి సొమ్మును ఎందుకు పక్కదారి పట్టించారని అడగాలి’ అని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ తిరుపతి లడ్డూ పై అపవిత్రమైన మాటలు మాట్లాడింది చంద్రబాబు. లడ్డు పై మా ప్రశ్నలకు దేవాదాయ శాఖ మంత్రి సమాధానం చెప్పలేకపోయారు. కల్తీ జరిగింది మీ హయాంలోనే. వెనక్కి పంపిన నెయ్యి ట్యాంకర్లు వాడింది మీ హయాంలోనే. ఇందాపూర్ ద్వారా హెరిటేజ్ కు దోచిపెట్టడానికే నెయ్యి ధరలు పెంచారు. దీని వెనుక పెద్ద ఆర్ధిక దోపిడీ కుట్ర ఉంది’ అని మండిపడ్డారు. ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ.. ‘ లడ్డు పై చర్చను పూర్తిగా కొనసాగనివ్వలేదు. లడ్డు పై మా ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. చంద్రబాబు సీఎంగా ఉన్న ప్రతీసారీ కల్తీ నెయ్యి తిరుమలకు వెళ్తోంది. తమ బండారం బయటపడుతుందని వాస్తవాలను రానివ్వడం లేదు. తిరుమల దర్శనం చేసిన తర్వాతే వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్ర ముగిసిన తర్వాత కూడా దేవదేవుడిని దర్శించుకున్నారు’ అని స్పష్టం చేశారు. -
‘అచ్చో’సిన మతవిద్వేషం
సాక్షి, అమరావతి: కుల మతాలకు అతీతంగా ప్రజాస్వామ్య స్ఫూర్తితో పనిచేస్తామంటూ ప్రమాణం చేసిన మంత్రులే బుధవారం శాసనమండలి సాక్షిగా వ్యక్తులకు మతాలను ఆపాదిస్తూ రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ‘‘మీరు, మీ పార్టీ నాయకుడు క్రిస్టియన్లు కాబట్టే వెంకటేశ్వరస్వామి, హిందుసమాజంపై కక్ష కట్టి వ్యవహరిస్తున్నారు’’ అంటూ మంత్రి కె.అచ్చెన్నాయుడు నేరుగా మండలి చైర్మన్ మోషేన్ రాజు, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం తిరుమల లడ్డూపై చర్చ జరుగుతున్న సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేరుగా చైర్మన్ స్థానానికే మతాలను ఆపాదించడంతో సభ ఒక్కసారిగా భగ్గుమంది. మంత్రులమనే బాధ్యత మరిచి మరీ చట్ట సభలోనే ఎస్సీ వర్గానికి చెందిన హిందువైన మోషేన్ రాజు మతాన్ని మార్చే దుస్సాహసానికి టీడీపీ ఒడికట్టింది. తిరుపతి లడ్డూపై చర్చను పక్కదోవ పట్టించే పక్కా ప్రణాళికతో టీడీపీ మంత్రులు సభలో లేని వైఎస్ జగన్మోహన్రెడ్డి మత ప్రస్తావనను పదేపదే తీసుకొచ్చారు. వైఎస్ జగన్ను మతం ఆధారంగా నిందించడం, తిరుపతి లడ్డూకు కళంకం తేవడమే లక్ష్యంగా మంత్రులు ప్రవర్తించారు. మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నిరసన తెలిపారు. తక్షణం ఆ పదాలను రికార్డుల నుంచి తొలగించడంతో పాటు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దీనిపై చైర్మన్ స్పందిస్తూ ఆ పదాలను రికార్డుల నుంచి తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి అచ్చెన్నాయుడుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నన్ను క్రిస్టియన్ అనడానికి మీరు ఎవరు? మీరు ఎలా చెప్పారం’టూ నిలదీయడంతో పాటు క్షమాపణ చెప్పాల్సిందిగా కోరారు. అయినా అచ్చెన్నాయుడు ‘ఆ మాటలకు కట్టుబడి ఉన్నా... క్షమాపణ చెప్పేది లేదం’టూ భీష్మించి కూర్చున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తాను హిందువునని, తన మతాన్ని, కులాన్ని కించపర్చడం సరికాదని గట్టిగా చెప్పారు. మంత్రి వ్యాఖ్యలతో అధికారపక్షం కూడా ఇరుకునపడటంతో పలువురు మంత్రులు అచ్చెన్నాయుడు వద్దకు వచ్చి దీన్ని నుంచి ఎలా బయటడాలన్నదానిపై తీవ్ర తర్జనభర్జనలు చేశారు. అయినా అచ్చెన్నాయుడు తన అహాన్ని వీడకుండా ‘మీరు సభ సాక్షిగా హిందువునని చెప్పినందుకు ఎటువంటి భేషజాలకు పోకుండా ఆ మాటలను వెనక్కి తీసుకుంటున్నా’ అని ప్రకటించారు. ఈ సమాధానంతో సంతృప్తి చెందానని, ఇక చర్చను కొనసాగిద్దామని చైర్మన్ చెప్పారు. అయితే వైఎస్సార్సీపీ సభ్యులు అచ్చెన్నాయుడు సభకు క్షమాపణ చెప్పాలిందేనంటూ పట్టుపట్టారు. దీంతో సభను అయిదు నిమిషాలు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు.తిరిగి అదే మత విద్వేష వ్యాఖ్యలుతిరిగి గంటన్నర తర్వాత మొదలైన తర్వాత కూడా అధికారపార్టీ సభ్యులు అదే విధంగా మత విద్వేష వ్యాఖ్యలను కొనసాగించారు. వెంకటేశ్వరస్వామి మీకు దేవుడు కాదా అంటూ మరింత విద్వేషకర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా చైర్మన్ నిజంగా హిందువైతే వైఎస్సార్సీపీ సభ్యులను కంట్రోల్ చేయాలంటూ మరోమారు చైర్మన్కు మతం రంగుపూసే ప్రయత్నం చేశారు. రూ.620లకు కేజీ నెయ్యిని కొనడాన్ని వ్యతిరేకించేవారు హిందువులు కారంటూ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. మంత్రి అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలంటూ వైఎస్సార్సీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తుండటంతో చైర్మన్ సభను గురువారానికి వాయిదా వేశారు. -
దేవుడిపై భక్తి ఉన్నవారు ఇలా చేస్తారా? బాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి, అమరావతి: కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీవారి దేవస్థానం నిర్వహణ అత్యంత పవిత్రమైన బాధ్యతని.. సీఎం చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం టీటీడీ ప్రతిష్టను దెబ్బతీశారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలిసి కూడా ఆరోపణలున్న వ్యక్తినే టీటీడీ చైర్మన్గా నియమించి ఆలయ ప్రతిష్ట, పవిత్రతను చంద్రబాబు కాలరాశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలోనే టీటీడీ ల్యాబ్ నాణ్యత లేదంటూ తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లు తిరిగి టీటీడీకి రావడం.. రిజెక్ట్ చేసిన వాటిని అంగీకరించి, అనుమతించడం.. తిరుమల లడ్డూ తయారీలో వాడడం.. ఇదే విషయాన్ని సీబీఐ సిట్ ఛార్జిషీట్లో స్పష్టం చేయడం ఆందోళనకరమన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై రాజకీయ దుమారం రేపుతూ.. నెయ్యి ధరల విషయంలో తప్పుడు ప్రచారం చేసి లాభాలు ఆర్జించడం భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందన్నారు. దేవుడిపై భక్తి ఉన్న వారు ఎవరైనా ఇలా చేస్తారా? అని సీఎం చంద్రబాబు నిలదీశారు. ఆలయాల పవిత్రత, భక్తుల విశ్వాసాన్ని కాపాడటం ప్రభుత్వాల తొలి బాధ్యత అని గుర్తు చేశారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని చంద్రబాబుకు హితవు పలికారు. టీటీడీ నిర్వహణలో చంద్రబాబు సర్కార్ తీరును సాక్ష్యాధారాలతో ఎండగడుతూ తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ బుధవారం పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..దేవుడిపై బాబుకు భక్తి, శ్రద్ధ, భయం లేదని మరోసారి రుజువైంది..దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం, శ్రీవేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల, తిరుపతి ఆలయాల నిర్వహణ, పరిపాలన అత్యంత పవిత్రమైన బాధ్యత. అది అత్యంత నిష్టతో చేయాల్సిన బాధ్యత. అలాంటి టీటీడీ చైర్మన్ పదవిలో నిష్కళంక వ్యక్తిత్వం, అచంచల భక్తి, నిబద్ధత, నిష్ట కలిగిన వారే ఉండాలి. కానీ చంద్రబాబు ఈ పవిత్రమైన స్థానాన్ని స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారు. ఆలయ ప్రతిష్టను మంటగలిపేలా వ్యవహరించారు. ఒక బాధిత మహిళ చంద్రబాబు గారికి లేఖ రాస్తూ.. ప్రస్తుత టీటీడీ చైర్మన్ తనను మోసం చేశాడని, తన జీవితంతో ఆడుకున్నాడని, ఏ చిన్న పని కోసం ఆడవారు వచ్చినా వారిని ఇబ్బంది పెడతారంటూ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. బాధ్యత ఉన్న వ్యక్తిగా చంద్రబాబు గారు ఈ ఫిర్యాదుపై విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఇన్ని రకాల ఆరోపణలు ఉన్నాయని తెలిసి కూడా, విచారణ, చర్యలన్నవి పూర్తిగా పక్కనపెట్టి, అతన్నే టీటీడీ చైర్మన్గా నియమించి, ఆలయ ప్రతిష్ట, పవిత్రతను కాలరాశారు. దేవుడి పట్ల భక్తి ఉన్నవారు ఎవరైనా ఇలా చేస్తారా? ఆలయ పవిత్రతను కాపాడాలన్న ఉద్దేశం ఉంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా? చంద్రబాబుకు భక్తీ లేదు.. శ్రద్ధ అంతకన్నా లేదు. దేవుడిపట్ల భయం కూడా లేదని మరోసారి రుజువైంది.టీటీడీకి నెయ్యి సరఫరాను సొంత ఆదాయ మార్గంగా మార్చుకున్నారు..ఈ రకంగా చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో తప్పు చేసి, దాన్ని వేరొకరిమీదకు నెట్టి, మళ్లీ దానిమీద రాజకీయ దుమారం రేపుతూ, ఆ నెయ్యితోనే స్కాంలు చేస్తున్నారు. మరోవైపు 2014–19 మధ్య టీటీడీ నెయ్యి కొనుగోలు ధర దాదాపుగా రూ.278– రూ.330 ఉంది. 2019–24 మధ్య కూడా నెయ్యి సగటు రేటు దాదాపుగా అంతే ఉంది. చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉంటూ, నెయ్యి విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తూ, దానిపై రాజకీయ దుమారం రేపుతూ.. తన హెరిటేజ్కి చెందిన మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇందాపూర్ డెయిరీకి కిలో నెయ్యి రూ.658లకు 2025లో అమ్ముకునేందుకు కట్టబెట్టి, లాభాలు ఆర్జిస్తూ, స్కాంలు చేస్తూ టీటీడీకి నెయ్యి సరఫరాను తన సొంత ఆదాయ మార్గంగా మార్చుకున్నారు. ఆలయాల నిర్వహణలో చంద్రబాబుకు భక్తి లేదు.. శ్రద్ధ లేదు.. నిష్ట లేదు.. నిజాయితీ అంతకన్నా లేదనడానికి ఇది మరొక ఉదాహరణ.నాణ్యత లేని నెయ్యిని అనుమతించింది.. లడ్డూ తయారీలో వాడింది బాబు హయాంలోనే..లడ్డూలో వాడే నెయ్యి విషయంలోనూ చంద్రబాబుది అదే నిర్లక్ష్యం. నెయ్యి క్వాలిటీ(నాణ్యత) బాగోలేదని ఈ చంద్రబాబు గారి హయాంలోనే టీటీడీ ల్యాబ్ తిప్పి పంపినా.. మళ్లీ అవే క్వాలిటీ లేని నెయ్యి ట్యాంకర్లు ఆయన హయాంలోనే వేరే వారి పేరిట తిరిగి టీటీడీకి రావడం.. ఆయన హయాంలో వచ్చిన అవే ట్యాంకర్లను టీటీడీ అంగీకరించి, అనుమతించడం.. తిరుమల లడ్డూ తయారీలో వాడడం.. ఇదే విషయాన్ని సీబీఐ–సిట్ మొదటి ఛార్జిషీటు 64, 91 పేజీల్లోనూ, ఫైనల్ ఛార్జిషీటు 44వ పేజీలోనూ చాలా స్పష్టంగా చెప్పింది. చంద్రబాబుకు దేవుడి పట్ల భక్తీ లేదు.. ఆలయాల నిర్వహణపట్ల శ్రద్ధ అంతకన్నా లేదనడానికి ఇది మరొక ఉదాహరణ. -
సమాధానం చెప్పలేక సత‘మతం’!
సాక్షి, అమరావతి: పవిత్ర తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందంటూ సీఎం చంద్రబాబు చేసిన దుష్ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని చార్జిషీట్లో సీబీఐ తేల్చేసినా, కేంద్ర ప్రభుత్వ ల్యాబ్లు నిర్ధారించినా పశ్చాత్తాపం లేదు..! కనీసం చట్టసభలోనూ కూటమి సర్కారు స్పందించలేదు! 2014–19 మధ్య టీటీడీకి కిలో రూ.278కే నెయ్యి సరఫరా చేసిన ఇందాపూర్ డెయిరీకి ఇప్పుడు ఏకంగా కిలో రూ.658 చొప్పున సరఫరా కాంట్రాక్టు అప్పగించడంపైనా జవాబు లేదు! ఇటీవల వరకు హెరిటేజ్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్గా చూపించిన ఇందాపూర్ డెయిరీని గుట్టు చప్పుడు కాకుండా కో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్గా మార్చేయడంపైనా నోరు విప్పలేదు! చంద్రబాబు అధికారంలోకి వచ్చాక టీటీడీ రిజెక్ట్ చేసిన నెయ్యి ట్యాంకర్లను దొడ్డి దారిన రప్పించి తిరిగి అవే ట్యాంకర్ల నెయ్యిని లడ్డూల తయారీకి వాడినట్లు సాక్షాత్తూ సీబీఐ తేల్చేసినా సమాధానం లేదు! ప్రభుత్వ టెండర్లలో హెరిటేజ్ ఎప్పుడూ పాల్గొనలేదంటూ చంద్రబాబు చెబుతున్న మాటల్లో నిజం లేదని.. మండలి సాక్షిగా విపక్షం ఆధారాలను బహిర్గతం చేస్తే సమాధానం అంతకంటే లేదు!!చర్చకు భయపడి పక్కదారి పట్టించేందుకేతిరుమల లడ్డూపై చంద్రబాబు దుష్ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని కేంద్ర ప్రభుత్వ ల్యాబ్లు, సీబీఐ చార్జిషీట్లో తేల్చేయడం.. ఇందాపూర్ డెయిరీతో హెరిటేజ్ వ్యాపార అనుబంధం.. నెయ్యిపై రాజకీయ, ఆర్థిక కుట్రలు బహిర్గతం కావడం.. ఇదంతా చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్కు లబ్ధి చేకూర్చేందుకేనని తేటతెల్లం కావడం.. టీడీపీ కూటమి సర్కారుకు దుర్బుద్ధి లేకుంటే దీనిపై చట్టసభలో చర్చకు ఎందుకు జంకుతోందని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా చర్చించుకోవడం.. శాసన మండలి చైర్మన్ న్యాయం వైపు గట్టిగా నిలబడంతో తప్పనిసరి పరిస్థితుల్లో చర్చకు ఒప్పుకున్నట్లు నటిస్తూనే చంద్రబాబు సర్కారు డ్రామాలాడటం పట్ల హైందవ ధార్మిక సంస్థలు, హిందూ సమాజం తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇన్ని రోజులూ మొహం చాటేసిన చంద్రబాబు సర్కారు కుట్ర బుద్ధితో టాపిక్ డైవర్షన్ రాజకీయాలకు తెర తీసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్వయంగా అధికార పక్షమే ఇన్ని రోజులు సభను అడ్డుకున్న దాఖలాలు దేశ చరిత్రలో లేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. లడ్డూపై శాసన మండలిలో బుధవారం చర్చ మొదలు కాగానే మంత్రులు అడ్డుపడటం.. మతం ప్రస్తావన తేవడం.. ఎస్సీ వర్గానికి చెందిన మండలి చైర్మన్పై వ్యక్తిగత విమర్శలు చేయడం అంతా వ్యూహం ప్రకారం లడ్డూపై చర్చకు భయపడి పక్కదారి పట్టించేందుకేనని మండలి సాక్షిగా బహిర్గతమైందని పేర్కొంటున్నారు. లడ్డూపై సభలో చర్చ జరిగితే చంద్రబాబు రాజకీయ, ఆర్థిక కుంభకోణం కుట్రలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతో టీడీపీ తనకు అలవాటైన రీతిలో డైవర్షన్ పాలిటిక్స్ను ఎంచుకుందని స్పష్టం చేస్తున్నారు. వెబ్సైట్లో తీసేస్తే హెరిటేజ్కు, ఇందాపూర్కు ఉన్న సంబంధాలు తెగిపోతాయా? ఒక పరిశ్రమ మరో పరిశ్రమతో కలసి వ్యాపారం చేస్తోందంటే వెబ్సైట్లో తీసేస్తే అయిపోతుందా? అంటూ వ్యాఖ్యానించిన మంత్రి అచ్చెన్న దీన్ని కవర్ చేసుకునేందుకే ‘మతం’ ప్రస్తావన తెచ్చారని విశ్లేషిస్తున్నారు. వైఎస్సార్ సీపీ సభ్యుడు చంద్రశేఖర్రెడ్డి మొత్తం 19 నిమిషాలు మాట్లాడితే అందులో 12 సార్లు అడ్డుపడ్డారంటే అధికారపార్టీ ఏ స్థాయిలో భయపడిందో చెప్పేందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు.బాబూ.. హిందూ సమాజం నిన్ను క్షమించదు..!రాజకీయ కుట్రతో ప్రారంభమైన నెయ్యి వ్యవహారం ఆర్థిక కుట్రగా ఎలా మారిందో విపక్ష సభ్యులు చంద్రశేఖర్రెడ్డి, తూమాటి మాధవరావు సాక్ష్యాధారాలతో శాసన మండలిలో ఎండగట్టారు. పరమ పవిత్రమైన తిరుమల లడ్డూలో పంది కొవ్వు, చేప కొవ్వు కలిసిందంటూ దుష్ప్రచారం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబును హిందూ సమాజం క్షమించబోదని చంద్రశేఖర్రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు నియమించిన సిట్పై నమ్మకం లేకనే వైవీ సుబ్బారెడ్డి సీబీఐ దర్యాప్తు కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారని, ఇది తమ చిత్తశుద్ధికి నిదర్శనమని గుర్తు చేశారు. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్కు ఇందాపూర్ డెయిరీతో ఉన్న సంబంధాలను సాక్ష్యాధారాలతో వివరించారు. హెరిటేజ్ వెబ్సైట్లో ఇన్నాళ్లూ తమ తయారీ సంస్థగా చూపించిన ఇందాపూర్ డెయిరీని ఆరోపణలు రాగానే హఠాత్తుగా కో–మాన్యుఫాక్చర్గా మార్చడంతో పాటు మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్తో రాజీనామా చేయించిన వైనాన్ని వివరించారు. 2016లో టీటీడీ నాణ్యత పరీక్షల్లో ఇందాపూర్ డెయిరీ ఫెయిల్ అయ్యిందని, ఇప్పుడు అదే ఇందాపూర్కి రూ.680కి నెయ్యి సరఫరా అప్పగించడం వెనుక పెద్ద ఆర్థిక కుంభకోణం దాగి ఉందన్నారు. ఏఆర్ డెయిరీ, బోలేబాబా డెయిరీలను టీడీపీ ప్రభుత్వమే అనుమతించిందని, వారి హయాంలోనే ఏఆర్ డెయిరీ నెయ్యి సరఫరా చేసిందన్నారు. నాణ్యతా ప్రమాణాలు లేనందున నాలుగు నెయ్యి ట్యాంకర్లను తిరస్కరిస్తే వాటిని ఎవరి ఒత్తిడి మేరకు సంగం డెయిరీతో సంబంధం ఉన్న వైష్ణవీ డెయిరీ ద్వారా అనుమతించారో చెప్పాలంటూ నిలదీశారు. కల్తీ నెయ్యి సరఫరా టీడీపీ హయాంలో జరిగితే వైఎస్సార్ సీపీకి ఏం సంబంధమంటూ ప్రశ్నించారు. ఎన్డీడీబీ రిపోర్టు, సీబీఐ చార్జిషీటులో ఎక్కడా కూడా జంతుకొవ్వు కలిసిందని లేకపోయినా 120 కోట్ల మంది హిందువుల విశ్వాసాన్ని హేళన చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడటం దారుణమన్నారు. సీబీఐ చార్జిషీటులో టీటీడీ జీఎం ఫిర్యాదును ప్రస్తావిస్తే, అదే నివేదిక అంటూ సభను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ విమర్శించారు. హెరిటేజ్ ప్రభుత్వ టెండర్లలో ఎప్పుడూ పాల్గొనలేదంటూ శాసన సభను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. టీటీడీకి పాలపొడి సరఫరా టెండర్లలో పాల్గొందని పేర్కొన్నారు. ఒకసారి టీటీడీకి హెరిటేజ్ పాలపొడి సరఫరా చేయగా బిల్లులు ఆగిపోతే ఒత్తిడి తెచ్చి ప్రత్యేకంగా రిజల్యూషన్తో డబ్బులు తీసుకున్న వైనాన్ని ఆధారాలతో వివరించారు. హెరిటేజ్ మజ్జిగ సరఫరాకు సంబంధించి కలెక్టర్లకు ఇచ్చిన ఆదేశాలను కూడా సభ ముందుంచారు. చంద్రబాబు కుటుంబంతో కలసి గత ఐదేళ్లలో పలుదఫాలు తిరుమల వెళ్లి ప్రసాదం తిన్నారని మరి ఎప్పుడైనా లడ్డూ కల్తీ జరిగిందని ఫిర్యాదు చేశారా? అని ప్రశ్నించారు. అయోధ్యకు వెళ్లి బాగుందంటూ తిరుమల లడ్డూలు తిన్న కూటమి నేతలు ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారంటూ నిలదీశారు. ఇందాపూర్ కోసం నిబంధనలు మార్చామని స్వయంగా మీ పార్టీ ఎమ్మెల్యే, టీటీడీ ప్రొక్యూర్మెంట్ కమిటీ సభ్యుడే స్వయంగా శాసనసభలో వెల్లడించారని గుర్తు చేశారు. కేవలం గేదె పాలను మాత్రమే సేకరిస్తున్న సంగం డెయిరీ ఆవు నెయ్యి ఎలా సరఫరా చేస్తుందని ప్రభుత్వాన్ని నిలదీశారు. ⇒ ఒకానొక దశలో తమ సభ్యుడు చంద్రశేఖర్రెడ్డి మాట్లాడేందుకు మైక్ ఇవ్వాలని కోరిన తూమాటి మాధవరావుపై మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి దాడి చేసే యత్నం చేశారు. ఇంత గందరగోళ పరిస్థితుల మధ్యలో కూడా విపక్ష వైఎస్సార్ సీపీ సభ్యులు పూర్తి ఆధారాలతో చంద్రబాబు కుట్రను మండలి సాక్షిగా బయటపెట్టారు.⇒ అంతకుముందు స్వల్పకాలిక చర్చ కంటే ముందు మంత్రి స్టేట్మెంట్ ఇస్తారంటూ అధికారపార్టీ సభ్యులు చర్చ జరగకుండా అడ్డుకున్నారు. అయితే సభలో కొత్త సంప్రదాయాలకు అవకాశం లేదని, నిబంధనల ప్రకారమే చర్చ తర్వాత ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుందంటూ చైర్మన్ చర్చను ప్రారంభించారు. టీడీపీ తరపున అనురాధ మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డితో పాటు వైఎస్ జగన్పై వ్యక్తిగత ఆరోపణలు చేశారు. -
‘రాధిక’కు ఇన్ని రాయితీలా!?
సాక్షి, అమరావతి: దొడ్డిదారిన ప్రజాధనం లూటీ చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కొత్త ఎత్తుగడలు వేస్తోంది. ప్రభుత్వ రంగంలో ఉన్న పరిశ్రమకు ఆర్థిక చేయూతనివ్వకుండా ప్రైవేటు రంగంలో ఏర్పాటయ్యే పరిశ్రమలకు రాయితీల రూపంలో అడ్డగోలుగా లబ్ది చేకూరుస్తోంది. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం కొత్తకి గ్రామం వద్ద రూ.240 కోట్లతో ప్రైవేటు రంగంలో ఆయిల్పామ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు‘రాధిక వెజిటబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థకు ప్రభుత్వం ఇస్తోన్న రాయితీలే ఇందుకు నిదర్శనం. ఎన్నడూ లేనివిధంగా ప్రాజెక్టు వ్యయంలో 44 శాతానికి పైగా రాయితీలు కల్పిస్తూ పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జీవో ప్రకారం చూస్తే ఏ స్థాయిలో దోపిడీకి స్కెచ్ వేశారో ఇట్టే అర్థమవుతుంది.ఆయిల్ ఫెడ్ యూనిట్ను నిర్వీర్యం చేస్తూ..ఆయిల్ పామ్ రైతులకు ఓఈఆర్ (నూనె వెలికితీత నిష్పత్తి) నిర్ధారణలో కీలక పాత్ర పోషిస్తున్న పశ్చిమగోదావరి జిల్లా పెదవేగిలో ప్రభుత్వ రంగంలో నడుస్తున్న ఏపీ ఆయిల్ ఫెడ్ ప్లాంట్ను చంద్రబాబు ప్రభుత్వం పగ్గాలు చేపట్టింది మొదలు ఏదో విధంగా మూసివేసి తమ అనుయాయులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తూనే ఉంది. వైఎస్ జగన్ హయాంలో రూ.10 కోట్లతో ఆధునికీకరణ పనులు పూర్తిచేసుకుని గంటకు టన్ను సామర్థ్యం కల్గిన ఈ ప్లాంట్ నేడు 24 టన్నుల క్రషింగ్ చేస్తోంది. 2018–19లో 90 వేల టన్నులు ప్రాసెస్ చేయగా, ప్రస్తుతం 1.20 లక్షల టన్నులు ప్రాసెస్ చేసే స్థాయికి చేరింది. దాదాపు రూ.200 కోట్లకు పైగా లాభాల్లో నడుస్తున్న ఈ యూనిట్ను ఆధునికీకరణతో పాటు కాకినాడ, ఏలూరుల్లో కొత్త యూనిట్ల ఏర్పాటుకు చేయూతనివ్వాలని ఏపీ ఆయిల్ ఫెడ్ ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. కొత్త యూనిట్ల ఏర్పాటుకు రూ.250 కోట్ల రుణం ఇచ్చేందుకు ఎన్సీడీసీ, ఎన్డీడీబీ ముందుకొచ్చినా, ప్రభుత్వం మాత్రం గ్రీన్సిగ్నల్ ఇవ్వలేదు. పైగా గతంలో టీడీపీ హయాంలో ఎగ్గొట్టిన రూ.156 కోట్ల బకాయిలను చెల్లిస్తే, పెదవేగి యూనిట్ను ఆధునికీకరించుకుంటామని చెప్పినా స్వలాభం కోసం ఆ ప్రతిపాదనను గాలికొదిలేసింది. పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఉన్న యూనిట్లను మూడుకు విస్తరించగా ఏపీలో మాత్రం ఉన్న ఏకైక యూనిట్ను మూసివేయాలని కుట్రలు చేయటం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ప్రైవేటు రంగంలో 14 ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో నడుస్తున్న ఏకైక యూనిట్ను నిర్వీర్యం చేసి ఆయిల్ పామ్ రంగంలో గుత్తాధిపత్యాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడమే లక్ష్యంగా ప్రైవేటురంగంలో ఈ యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రూ.240 కోట్ల ప్రాజెక్టుకు.. రూ.95.98 కోట్ల రాయితీలా?సాధారణంగా ఏ ప్రభుత్వమైనా పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు 10–15 శాతానికి మించవు. క్యాపిటల్ సబ్సిడీ రూపంలో నేరుగా రూ.42.50 కోట్లు ఉచిత గ్రాంట్ రూపంలో ఇచ్చేస్తున్నారు. రాష్ట్ర జీఎస్టీ రీయింబర్సుమెంట్ రూపంలో ఐదేళ్ల పాటు 100 శాతం అంటే రూ.31.50 కోట్లు తిరిగి ఇచ్చేయనున్నారు. 304 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నందున ఉపాధి సబ్సిడీ రూపంలో రూ.13.64 కోట్ల రాయితీ ఇస్తున్నారు. అంటే ఒక్కో ఉద్యోగికి ప్రభుత్వం రూ.4.5 లక్షల చొప్పున సబ్సిడీ ఇస్తోంది. డీకార్బోనైజేషన్ సబ్సిడీ కింద రూ.3 కోట్లు, విద్యుత్ రాయితీల రూపంలో రూ.3.74 కోట్లు, స్టాంప్ డ్యూటీ మినహాయింపు రూపంలో రూ.60లక్షల మేర రాయితీలు ఇస్తోంది. ఇలా రాయితీల రూపంలో ప్రాజెక్టు వ్యయంలో 44.02శాతం (రూ.95.98 కోట్లు)మేర లబ్ధి చేకూర్చడం పలు అనుమానాలకు తావిస్తోంది.అడ్డగోలు దోపిడీ కోసమే ఈ రాయితీలు..ఇంత పెద్దఎత్తున రాయితీ కల్పిస్తున్న ప్రభుత్వానికి ఈ కంపెనీలో వాటా కానీ, లాభాల్లో వాటా కానీ ఏమైనా ఇస్తున్నారా అంటే అదీ లేదు. తెరవెనుక పెద్దలకు ఈ కంపెనీలో వాటాలుండడం వలనే ఈ స్థాయిలో రాయితీలు ఇస్తున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. రాబడి లేని రాయితీలు ఇవ్వడం ఎంత వరకు సమంజసమని ఆయిల్పామ్ రైతులు నిలదీస్తున్నారు.. ఇంత పెద్దఎత్తున రాయితీలివ్వడానికి బదులుæ ప్రభుత్వ యూనిట్ను ఆధునికీకరించడం లేదా ప్రభుత్వ రంగంలోనే కొత్త యూనిట్లు ఏర్పాటు చేస్తే రైతులకు మేలు జరుగుతుందంటున్నారు. పారిశ్రామికవేత్తలను ఆకర్షించడానికి కాకుండా.. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో నడిచే, ఎంపిక చేసిన వ్యక్తులు, సంస్థలకు లబ్ధి చేకూర్చడం ద్వారా తమ జేబులు నింపు కోవడమే లక్ష్యంగా ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0ని రూపొందించినట్టు కన్పిస్తోందంటున్నారు. ఇది ముమ్మాటికి నీకింత..నాకింత తరహా దోపిడీకి తెరతీయడమేనని ఆరోపిస్తున్నారు. తక్షణమే ఈ జీవోను ఉపసంహరించుకోవాలని ఆయిల్ పామ్ రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
నేలవాలిన అరటి ధర
కర్నూలు (అగ్రికల్చర్): రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఏ పంటకూ కనీస గిట్టుబాటు ధర కూడా రాకపోగా, అన్నదాతలు నష్టాలపాలయ్యారు. ఆ జాబితాలో ఇప్పుడు అరటి రైతులు కూడా చేరారు. సాగు కలిసిరాక.. పంటకు ధరలేక దిక్కుతోచని రైతులు తోటలను ట్రాక్టర్లతో దున్నేస్తున్నారు. ఒకప్పుడు రూ. 30 వేలు పలికిన టన్ను అరటి ధర ఇప్పుడు రూ. 5 వేలకు పడిపోయింది. అయినా చంద్రబాబు ప్రభుత్వం కనీసం స్పందించడంలేదు. దీంతో దిక్కుతోచని రైతులు తోటలను దున్నేస్తున్నారు. కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలంలోని కర్లకుంట, బాపనదొడ్డి, కోయిలకొండ గ్రామాల్లో దాదాపు 50 ఎకరాల్లో అరటిని తొలగించేశారు. అరటిరైతులను ఆదుకునేదిశగా చంద్రబాబు ప్రభుత్వం కనీసం స్పందించడంలేదు. రాయలసీమ జిల్లాల్లో మామిడి తర్వాత అరటి ప్రధాన పంట. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 13,500, అనంతపురం జిల్లాలో 40 వేలు, వైఎస్సార్ కడప జిల్లాలో 36 వేలు, చిత్తూరు జిల్లాలో 6,500 ఎకరాల్లో.. మొత్తం 96 వేల ఎకరాల్లో అరటి సాగవుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మహానంది, ఓర్వకల్లు మండలాల్లో సుగంధాలు, చిన్న పచ్చ అరటి సాగుచేస్తారు. మిగిలిన అన్ని ప్రాంతాల్లో టిష్యూకల్చర్ (గ్రాండ్ నైన్) అరటి మాత్రమే సాగుచేస్తారు. అనేకమంది రైతులు ల్యాబ్ల్లో వృద్ధిచేసిన పిలకలు తెచ్చి నాటుతున్నారు. అరటిసాగు కలిసి వస్తుండటం, గిట్టుబాటు ధరలు లభిస్తుండటంతో 2024–25, 2025–26 సంవత్సరాల్లో కూడా దీని సాగుపై ప్రత్యేకదృష్టి కేంద్రీకరించారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ధరలు తారుమారవడంతో నష్టాలు తప్పని పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో ధరలు పడిపోయినపుడు చంద్రబాబు ప్రభుత్వం హడావుడి చేసింది. అరటి రైతులకు ఆర్థికంగా భరోసా కల్పించకుండా ఫ్రూట్కేర్ యాక్టివిటీస్ చేపట్టాలని సూచించింది.ధరాఘాతం: గత ఏడాది నుంచి ఒక్కసారిగా ధరలు నేలను తాకడంతో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. టిష్యూకల్చర్ అరటిలో ఎకరాకు 25 టన్నుల దిగుబడి వస్తుంది. టన్నుకు కనీసం రూ.25 వేల ధర ఉంటే రైతుకు మేలు కలుగుతుంది. విదేశాలకు ఎగుమతి చేసే రకాలకే ధరలు పడిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. గత అక్టోబర్, నవంబర్ నెలల్లో జి–9 అరటి టన్నుకు సగటున రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు మాత్రమే ధర లభించిందంటే రైతులు ఏ స్థాయిలో నష్టపోయారో తెలుస్తుంది. తర్వాత ధరలు పెరిగినప్పటికీ అరటి కోతలు చురుగ్గా జరుగుతున్న వేళ ఇప్పుడు మళ్లీ ధరలు పడిపోయాయి. ఇటీవల టన్ను ధర రూ.20 వేల వరకు వెళ్లినా.. సరుకు మార్కెట్కు వచ్చే సమయానికి ఉన్నట్టుండి టన్ను ధర రూ.5 వేలకు పడిపోయింది.వక్రభాష్యం: అరటి ఒకసారి నాటుకుంటే మూడేళ్ల పాటు గెలలు వస్తాయి. ఏటా పిలకలు అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది. మెయిన్టెనెన్స్పై ప్రత్యేకదృష్టి పెడతారు. ఇప్పుడు ధరలు పడిపోవడానికి చెబుతున్న కారణాలు వింతగా ఉంటున్నాయి. అనేకమంది రైతులు తక్కువ పెట్టుబడితో మూడోపంట తీస్తారు. రైతులను ఆదుకోవడానికి ముందుకురాని చంద్రబాబు ప్రభుత్వం.. ధరలు పడిపోవడానికి మూడోపంటే కారణమని ఉద్యాన అధికారులతో చెప్పిస్తోంది. మూడోపంటలో నాణ్యత ఉండదని, అందువల్ల గిట్టుబాటు ధరలు లభించవని చెబుతున్నారు. కొన్నేళ్లుగా అరటిలో రైతులు మూడోపంట తీస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి మాత్రమే ధరలు పడిపోయాయి. ఇప్పటికైనా ప్రభుత్వం నష్టపోతున్న రైతులను ఆదుకునేదిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వైఎస్సార్సీపీ హయాంలో విదేశాలకు ఎగుమతి రాయలసీమ జిల్లాల్లో 2019–20 నుంచి 2023–24 వరకు రైతులకు అరటిసాగు కలిసి వచి్చంది. అప్పట్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎగుమతులను ప్రోత్సహించే విధంగా టిష్యూకల్చర్ అరటిసాగుకు ప్రత్యేక సదుపాయాలు కల్పించింది. అప్పట్లో టన్ను ధర రూ.28 వేల నుంచి రూ.30 వేల వరకు లభించింది. నంద్యాల, అనంతపురం, తిరుపతి జిల్లాల నుంచి విదేశాలకు అరటి ఎగుమతి అయింది. వైఎస్సార్సీపీ హయాంలో రాయలసీమ జిల్లాల నుంచి రైతులు విదేశాలకు 1.25 లక్షల టన్నుల టిష్యూకల్చర్ అరటిని ఎగుమతి చేశారు. ఏ పంట సాగుచేసినా.. ఆదుకోని చంద్రబాబు ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం ఏం పంట సాగుచేసినా రైతులను ఆదుకున్న దాఖలాల్లేవు. 2024లో మిర్చి రైతులకు చేయూత ఇవ్వలేదు. మామిడి రైతులకు ఎలాంటి భరోసా దక్కలేదు. పొగాకు రైతు నష్టపోకుండా మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయిస్తామని ప్రకటించి తర్వాత చేత్తులెత్తేశారు. ఉల్లి ధరలు పడిపోవడంతో క్వింటా రూ.1,200 మద్దతు ధరతో కొంటామని హడావుడి చేసి మూన్నాళ్ల ముచ్చటగా ముగించారు. తర్వాత ఎకరాకు రూ.20 వేల ప్రకారం పరిహారం చెల్లిస్తామని అరకొరగానే ఇచ్చారు. మొక్కజొన్న ధరలు పడిపోయి రైతులు గగ్గోలు పెట్టినా మద్దతు ధరతో కిలో కూడా కొనలేదు. ధరలు పడిపోయి టమాట రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయినప్పటికి చంద్రబాబు ప్రభుత్వం చెవికెక్కించుకోలేదు.20 ఎకరాల్లో అరటిని ట్రాక్టరుతో దున్నేశాం మాకు అరటి ప్రధానపంట. కొన్నేళ్లుగా సాగుచేస్తున్నాం. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి అరటిసాగులో నష్టాలు మూటగట్టుకున్నాం. మేం నాలుగెకరాల్లో 2024లో అరటి సాగుచేశాం. రెండేళ్లు పంట తీసుకున్నాం. నాలుగెకరాల్లో ఆరువేల మొక్కలున్నాయి. మొదటి ఏడాది మూడువేల గెలలే అమ్ముడుపోయాయి. మరో మూడువేల గెలల్లో నాణ్యత లేదని వ్యాపారులు కొనలేదు. రూ.ఆరులక్షల పెట్టుబడి పెడితే మొదటి ఏడాది పంట పెట్టుబడి వరకే వచ్చింది. రెండో ఏడాది నష్టాలు మూటగట్టుకున్నాం. మామూలుగా మూడోపంట కూడా సాగుచేస్తాం. అయితే మార్కెట్లో ధరలు పడిపోవడం, మార్కెటింగ్ సదుపాయం లేకపోవడంతో మా కుటుంబానికి చెందిన 20 ఎకరాల్లో అరటి తోటలను ఫిబ్రవరి మొదటి వారంలో ట్రాక్టరుతో దున్నేశాం. అరటిలో మొదటిసారిగా నష్టాలొచ్చాయి. – కృష్ణ, బాపనదొడ్డి, క్రిష్ణగిరి మండలం, కర్నూలు జిల్లా -
ప్రమాద ఘంటిక.. మాయిస్ట్ హీట్
సాక్షి, అమరావతి: వేసవి అంటే మనకు గుర్తుకు వచ్చేది సెగలు గక్కే ఎండలు, వడగాడ్పులు. కానీ ఈ వేసవి సీజన్లో వాతావరణం ఒక కొత్త రూపం దాల్చబోతోందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఎండలు సాధారణంగానే ఉన్నట్లు అనిపించినా రానున్న రోజుల్లో ‘మాయిస్ట్ హీట్’ (తేమతో కూడిన వేడి) ప్రభావం ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ, అంతర్జాతీయ పరిశోధన సంస్థలు హెచ్చరిస్తున్నాయి. గాలిలో ఉష్ణోగ్రతతో పాటు తేమ కూడా అధికంగా ఉండటాన్ని ‘మాయిస్ట్ హీట్’ అంటారు. సాధారణ పరిభాషలో దీన్ని ఉక్కపోతగా పేర్కొంటారు. సాధారణ ఎండల కంటే ఇది భిన్నమైంది. పొడి ఎండల్లో చెమట పడితే గాలికి ఆవిరై శరీరం చల్లబడుతుంది. కానీ గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు చెమట ఆవిరి కాదు. దీనివల్ల శరీరం తనను తాను చల్లబరుచుకునే సహజ ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. ప్రస్తుతం వాతావరణ పరిశోధనల్లో ‘వెట్–బల్బ్ టెంపరేచర్’ అనే పదం ప్రముఖంగా వినిపిస్తోంది. గాలిలోని వేడి, తేమను కలిపి కొలిచే కొలమానాన్నే ఇలా పిలుస్తున్నారు. సాధారణంగా వెట్–బల్బ్ ఉష్ణోగ్రత 31 డిగ్రీలు దాటితే అది మానవ శరీరానికి ఇబ్బందికరంగా మారుతుంది. ఒకవేళ ఇది 35 డిగ్రీలకు చేరితే అత్యంత ఆరోగ్యవంతులు కూడా నీడలో ఉన్నా తట్టుకోవడం కష్టమవుతుందని నేచర్ క్లైమేట్ చేంజ్ వంటి అంతర్జాతీయ జర్నల్స్ పేర్కొన్నాయి. తీర ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. మార్చి రెండో వారం నుంచి ఏప్రిల్ వరకు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని చెబుతున్నారు. ఎల్నినో ప్రభావంతో గాలి మందగించడం వల్ల తేమ ఒకే చోట పేరుకుపోయి మాయిస్ట్ హీట్ పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాతావరణ నిపుణులు తెలిపారు. వాతావరణ వ్యవస్థలు అస్థిరంగా ఉండడం వల్ల సముద్రపు గాలులు భూభాగంపైకి ఎక్కువ తేమను మోసుకొస్తున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. రెండు మూడేళ్లుగా ఇదే ధోరణి.. వాస్తవానికి ఈ మార్పు ఇప్పుడు హఠాత్తుగా వచ్చిందేమీ కాదు. గత రెండు, మూడేళ్లుగా ఈ ధోరణి కనిపిస్తోంది. 2024, 2025 వేసవి కాలాల్లో ఉక్కపోత తీవ్రంగానే ఉంది. కానీ ఈ ఏడాది ఎల్నినో పరిస్థితులు, అస్థిరమైన సముద్రపు గాలుల కలయిక వల్ల తీవ్రత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పట్టణాల్లో పెరుగుతున్న కాంక్రీట్ కట్టడాల ప్రభావం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చివేసింది.ముప్పు ఏమిటి? గాలిలో తేమ 70 శాతం ఉండి, ఉష్ణోగ్రత 35 డిగ్రీలు ఉన్నా అది మన శరీరానికి 48 డిగ్రీల ఎండలో ఉన్నంత ప్రభావం చూపుతుంది. ఈ వేసవిలో ఇలాంటి అసౌకర్య రోజులు గతం కంటే 15 – 20 రోజులు అదనంగా ఉంటాయని అంచనా. జాగ్రత్తలు ముఖ్యం.. హీట్ ఇండెక్స్ గమనించండి: కేవలం డిగ్రీలను మాత్రమే కాకుండా ‘హీట్ ఇండెక్స్’ (గాలిలోని తేమను కలిపి చూపే ఉష్ణోగ్రత)ను గమనించాలి. ఫోన్లలోని వాతావరణ యాప్స్లో ఫీల్స్ లైక్ అని ఉండే ఉష్ణోగ్రతే దీనికి సంకేతం. నీటి వినియోగం: దాహం వేయకపోయినా నీరు తాగుతూ ఉండాలి. మాయిస్ట్ హీట్లో చెమట ఆవిరి కాకపోయినా శరీరం లోపల నీటి శాతం తగ్గుతుంది. గాలి సరఫరా: గదుల్లో గాలి ధారాళంగా ఆడేలా చూసుకోవాలి. తేమ ఎక్కువగా ఉన్నప్పుడు కేవలం ఫ్యాన్ వేసుకున్నా వేడి గాలి మాత్రమే వస్తుంది. కాబట్టి కిటికీలు తెరిచి ఉంచడం లేదా ఎగ్జాస్ట్ ఫ్యాన్లు వాడడం మంచిది. -
13న కేబినెట్ సమావేశం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 13వ తేదీ ఉదయం 10.30 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సమావేశానికి తీసుకువెళ్లాల్సిన ప్రతిపాదనలను ఈ నెల 11వ తేదీ సాయంత్రం 4 గంటలకల్లా సాధారణ పరిపాలన శాఖ (కేబినెట్ విభాగం)కు పంపాల్సిందిగా అన్ని శాఖలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. -
ఆ ప్రజాప్రయోజన ప్రాజెక్టు ఆగిపోకూడదు
సాక్షి, అమరావతి: బెంగళూరు–మైదుకూరు–అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే భూ సేకరణకు జాతీయ రహదారుల చట్టం కింద వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 2022–23లో జారీ అయిన నోటిఫికేషన్లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. 124 కిలోమీటర్లు, 12 మండలాలు, 49 గ్రామాలకు సంబంధించిన పెద్ద ప్రజా ప్రయోజన ప్రాజెక్ట్ అని, కొద్దిమంది అభ్యంతరాలతో మొత్తం ప్రాజెక్ట్ ఆగిపోకూడదని న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి ఇటీవల తీర్పు వెలువరించారు.అంతా సక్రమమే: హైకోర్టుబెంగళూరు–మైదుకూరు–అమరావతి గ్రీన్ ఫీల్డ్ కారిడార్ నిర్మాణం కోసం వైఎస్సార్ కడప జిల్లాలో భూములను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ రహదారుల చట్టం కింద 2022–23లో భూ సేకరణ నోటిఫికేషన్లు జారీ చేసింది. తరువాత గెజిట్ నోటిఫికేషన్లు కూడా జారీ అయ్యాయి. వీటిని సవాలు చేస్తూ పలువురు భూ యజమానులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఓబిరెడ్డి మనోహర్రెడ్డి వాదనలు వినిపించారు. నోటిఫికేషన్లపై పిటిషనర్ల అభ్యంతరాలను హైకోర్టు తిరస్కరించిన తీరిది.. » జాతీయ రహదారుల చట్టం కింద భూములు సేకరిస్తుంటే, భూ సేకరణ నోటిఫికేషన్లో ఆ భూముల వివరాలను సంక్షిప్తంగా పేర్కొంటే సరిపోతుంది. » భూముల యజమానుల పేర్లను భూ సేకరణ నోటిఫికేషన్లో పేర్కొనాల్సిన అవసరం లేదు. » జాతీయ రహదారుల చట్టంలోని సెక్షన్ 3ఏ (1) ప్రకారం భూ సేకరణ నోటిఫికేషన్ను ఏవైనా రెండు స్థానిక పత్రికల్లో ప్రచురిస్తే సరిపోతుంది. ఆ పత్రికల సర్క్యులేషన్ ఎంత అన్నది అవసరం లేదు. » సాంకేతిక నిపుణుల ద్వారా రూపొందించిన జాతీయ ప్రాజెక్టుల విషయంలో న్యాయ సమీక్షా పరిధి చాలా పరిమితంగా ఉంటుంది. » పెద్ద ప్రాజెక్టులకు భూములిచ్చేందుకు మెజారిటీ యజమానులు అంగీకరించినప్పుడు, కొద్ది మంది అభ్యంతరాల ఆధారంగా ఆ ప్రాజెక్టును నిలిపివేయడం సాధ్యం కాదు. » పైగా చట్ట ప్రకారం పిటిషనర్లు 21 రోజుల్లో అభ్యంతరాలు తెలపాల్సి ఉండగా, ఆ గడువులో అభ్యంతరాలు చెప్పలేదు. » డబుల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ మధ్యలో ఉన్న భూములు కూడా హైవేలో భాగమే. » సేకరించిన భూములను వాణిజ్య కార్యకలాపాల కోసం వాడతారనే అనుమానం ఆధారరహితం. -
అడ్డదారుల్లో మరింత పతనం
సాక్షి, అమరావతి: రాజకీయ లబ్ధి కోసం కలియుగదైవమైన వెంకటేశ్వరస్వామినే వివాదంలోకి లాగి కల్తీ డ్రామా ఆడి అభాసుపాలుకావడంతో అధికార టీడీపీ దాన్నుంచి బయటపడడానికి రకరకాల అడ్డదారులు వెతుకుతూ మరింత పతనావస్థకు చేరుతోంది. తాజాగా బుధవారం శాసన మండలి సాక్షిగా రాజ్యాంగబద్ధమైన శాసన మండలి చైర్మన్కు సైతం మతం రంగు పులిమారు. దళిత వర్గానికి చెందిన కొయ్యే మోషేన్రాజు క్రిస్టియన్ అంటూ మంత్రి అచ్చెన్నాయుడు పదే పదే ప్రస్తావించి ప్రజల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేశారు. ఇది ముమ్మాటికీ అధికార టీడీపీ ఆగడాలకు పరాకాష్ట అని రాష్ట్ర ప్రజలు తప్పుబడుతున్నారు. శాసన మండలి చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఒక దళితవర్గానికి చెందిన నాయకుడిని వైఎస్ జగన్మోహన్రెడ్డి చైర్మన్ పదవి ఇచ్చి గౌరవించారు. అటువంటి గొప్ప సామాజిక సంస్కరణను స్వాగతించాల్సింది పోయి టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనేక సందర్భాల్లో ఉద్దేశపూర్వకంగానే దళిత వర్గానికి చెందిన మండలి చైర్మన్ను అవమానిస్తోంది. తిరుపతిలో మహిళా పార్లమెంట్ నిర్వహించిన సందర్భంలో మోషేన్రాజును ఆహ్వానించకుండా కించపరిచారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద నిర్మించిన కొత్త భవనం ప్రారంభోత్సవంలో శిలాఫలకంపై మోషేన్రాజు పేరు లేకుండా చేశారు. అధికార టీడీపీ తీరుపై అప్పట్లో విమర్శలు రావడంతో ప్రారంభోత్సవం అయ్యాక శిలాఫలకంపై పేరు పెట్టారు. ఇటీవల ఏలూరు జిల్లా పెదవేగి మండలం లక్ష్మీపురంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవానికి శాసనమండలి చైర్మన్ను ఆహ్వానించ లేదు. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అనేక సందర్బాల్లో ఆయనకు ఇవ్వాల్సిన ఫ్రొటోకాల్ను విస్మరించడం, శిలాఫలకాలపై పేరు లేకుండా చేయడం, అధికారిక కార్యక్రమాలకు పిలవకపోవడం వంటి చర్యలతో తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆయన చైర్మన్ అయ్యారనో? దళిత వర్గానికి చెందిన వ్యక్తి అనో? ఉద్దేశపూర్వకంగానే ప్రోటోకాల్ విస్మరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తాజాగా ఆయనకు మతాన్ని కూడా ఆపాదించడం మరింత దుర్మార్గం. హిందువునని చెప్పుకోవాల్సిరావడం బాధాకరం..శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ తీరుపై మండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజును బుధవారం రాత్రి సాక్షి సంప్రదించింది. సభలో మంత్రుల తీరుపై విచారం వ్యక్తం చేస్తూ తాను హిందువుగానే పుట్టానని, హిందువుగానే జీవిస్తున్నానని మోషేన్రాజు బదులిచ్చారు. తన సొంత గడ్డ అయిన భీమవరంలో వినాయక చవితి పందిళ్లు వేసి ఉత్సవాల్లో పాలుపంచుకుంటానని, మావూళ్లమ్మ ఉత్సవాల్లోనూ భాగస్వామిని అవుతానని, తిరుమల శ్రీవారిని దర్శించుకుంటానని వాటికి సంబంధించిన ఫొటోలను సైతం విడుదల చేశారు. తాను హిందువునే అని చెప్పుకోవాలి్సన పరిస్థితి రావడం బాధాకరమన్నారు. -
మండలి చైర్మన్పై మంత్రులు, టీడీపీ ఎమ్మెల్సీల ప్రవర్తన అవమానకరం
సాక్షి, అమరావతి: శాసనమండలిలో బుధవారం చోటుచేసుకున్న ఘటనల కారణంగా ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజుగా నిలిచిపోతుందని వైఎస్సార్సీపీ నేతలు మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు ఆవేదన వ్యక్తం చేశారు. శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు పట్ల మంత్రులు, టీడీపీ సభ్యులు అమానవీయంగా, అవమానకరంగా ప్రవర్తించారని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో మండిపడ్డారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిని గౌరవించాల్సింది పోయి కులం, మతం పేరుతో లక్ష్యంగా చేసుకోవడం చట్టసభల సంస్కృతికి విరుద్ధమన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకే ఈ దాడులు జరిగాయని స్పష్టమైందని ఆరోపించారు. మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు యాదృచ్ఛికం కాదని, దీనివెనుక స్పష్టమైన దురుద్దేశం ఉందన్నారు. మంత్రి లోకేశ్ సభలో ఉండగానే ఈ ఘటన జరగిందన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న దళిత వ్యక్తిని మతం, కులం పేరుతో అవమానించడం కేవలం వ్యక్తిగత దాడి మాత్రమే కాకుండా సామాజిక న్యాయం, సమానత్వంపై దాడి అని స్పష్టం చేశారు. చైర్మన్ను ఏ మతానికి చెందినవారు అని ప్రశ్నించడం చట్టసభల గౌరవాన్ని మంటగలిపిందని పేర్కొన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారాన్ని రాజకీయ దుమారంగా మార్చి.. ఆ నీడలో హెరిటేజ్ ఫుడ్స్ అనుమానాస్పద లావాదేవీలపై వస్తున్న ఆరోపణలను దారి మళ్లించేందుకు అధికార పక్షం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తిరుమల నెయ్యి కొనుగోళ్లలో అవకతవకలపై ఆధారాలతో ప్రశ్నలు లేవనెత్తగానే అధికార పక్షం అసహనానికి లోనైందన్నారు. మార్కెట్ ధరకంటే అధిక ధరలకు నెయ్యిని సరఫరా చేస్తూ హెరిటేజ్ యూనిట్ ద్వారా లాభాలు పొందుతున్నారనే అంశాలపై సమాధానం చెప్పలేకపోయినందుకే సభను గందరగోళానికి గురిచేసే ప్రయత్నం జరిగిందని విమర్శించారు. మండలిని వారి చేతుల్లోకి తీసుకోవాలన్న దురుద్దేశంతోనే చైర్మన్పై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు హానికరంగా వ్యవహరించిన మంత్రి అచ్చెన్నాయుడిపై తక్షణ చర్యలు తీసుకుని, ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. -
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పార్టీ సీఈసీ సభ్యునిగా పామిరెడ్డిగారి పెద్ద నాగిరెడ్డి(నంద్యాల), ఎస్ఈసీ సభ్యునిగా వైసి గోవర్ధనరెడ్డి(మడకశిర), పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కంగాటి ప్రదీప్ రెడ్డి (పత్తికొండ), పార్టీ రాష్ట్ర సెక్రటరీ (పార్లమెంటు) పోరెడ్డి నరసింహారెడ్డి (ప్రొద్దుటూరు) నియమితులయ్యారు.కాగా, వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ల నియామకం జరిగిన సంగతి తెలిసిందే. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు బొత్స సత్యనారాయణ, ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు కురసాల కన్నబాబు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలకు బూడి ముత్యాలనాయుడు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు గుడివాడ అమర్నాథ్ నియమితులయ్యారు. -
‘అంగన్వాడీ వర్కర్లపై పోలీసుల దాడి అమానుషం’
సాక్షి, తాడేపల్లి: అంగన్వాడీ వర్కర్లపై పోలీసుల దాడి అమానుషమని, ఎన్నికల హామీలు అమలు చేయాలని కోరుతూ శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న అక్కచెల్లెమ్మలను దారుణంగా వేధించిందని వైఎస్సార్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ అక్కచెల్లెమ్మలకు వేతనాలు పెంచుతానని, సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన చంద్రబాబు, రెండేళ్లుగా మభ్యపెడుతూ వచ్చారని వివరించారు.టెంట్లో ఉండి నిరసన వ్యక్తం చేస్తున్న ఉన్న మహిళలను వేకువ జామున ఒక్కసారిగా ఈడ్చి వ్యాన్లలోకి తరలించడం హేయమని చర్యగా పేర్కొన్నారు. అంగన్వాడీ వర్కర్లకు వైయస్సార్సీపీ అండగా ఉంటుందని, ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ తరఫున పోరాడుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదని నలమారు చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..రెండేళ్లుగా మభ్యపెడుతున్నారుఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న అంగన్వాడీల పట్ల ప్రభుత్వం అత్యంత అమానుషంగా వ్యవహరించింది. ప్రభుత్వంతో చర్చలకు పిలుస్తామని ముందురోజు రాత్రి నమ్మబలికి వేకువజామున టెంట్లు కూల్చేసి అక్రమంగా అరెస్టు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ అక్కచెల్లెమ్మలకు వేతనాలు పెంచుతానని, సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతోంది.. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అనేక దఫాలు శాంతియుతంగా నిరసనలు తెలిపిన అంగన్వాడీలను చంద్రబాబు ప్రతిసారీ మభ్యపెడుతూ వచ్చారు.ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టక పోవడంతో సోమవారం నిర్వహించిన ‘ఛలో విజయవాడ’ కార్యక్రమానికి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు భారీగా పోటెత్తారు. మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకు అందరూ నిద్రిస్తుండగా వందలాది మంది మగ పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడి అంగన్వాడీ మహిళలను ఈడ్చి పారేశారు. వారు తేరుకునేలోగా టెంట్లు పడేసి, ప్లెక్సీలు చించేసి, ప్లకార్డులు విసిరేసి, అంతా చిందరవందర చేసేశారు. అంగన్వాడీల పట్ల ప్రభుత్వం పోలీసులు వ్యవహరించిన తీరును వైయస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. వారికి పార్టీ అండగా ఉండి వారి తరఫున ఉద్యమిస్తుంది.హామీ అమలు చేయాలని కోరడం తప్పా?శాంతియుతంగా ఉద్యమించిన మహిళలపై కర్కశంగా వ్యవహరించింది. రోడ్డు పైనే సొమ్మసిల్లిన అంగన్వాడీలపై చంద్రబాబు సర్కారు పోలీసులను ప్రయోగించి విరుచుకుపడింది. అంగన్వాడీలు తేరుకుని ఏం జరుగుతోందో గ్రహించేలోపే మహిళలని కూడా చూడకుండా ఈడ్చి పారేసి పోలీసు వ్యాన్లలోకి ఎక్కించేశారు. గతంలోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ధర్నా నిర్వహిస్తున్న అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించిన నీచ చరిత్ర చంద్రబాబుది. అంగన్వాడీలు బయటకు వెళ్లే అవకాశం లేకుండా చుట్టూ రోప్ పార్టీతో పోలీసులు దిగ్బంధించారు.రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన వారిని కనీసం బ్యాగులు, సెల్ఫోన్లు కూడా తీసుకోనివ్వకుండా నిర్బంధించారు. చేతికి దొరికిన వారిని దొరికినట్లు అరెస్టు చేసి వ్యాన్లలోకి తోసేశారు. తమను ఎందుకు అరెస్టు చేస్తున్నారు..? ఎక్కడికి తీసుకెళ్తున్నారు..? అని ప్రశ్నించిన వారికి సమాధానం చెప్పకుండా గెంటేశారు. ఈ సందర్భంగా జరిగిన పెనుగులాటలో పలువురు అంగన్వాడీ వర్కర్లు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. తమను అక్రమంగా అరెస్ట్ చేసి కనీసం టాయిలెట్స్కు వెళ్లడానికి కూడా అనుమతించలేదని అంగన్వాడీ వర్కర్స్ వాపోతున్నారు. అంగన్వాడీ వర్కర్ల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు చూసి దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతోంది.మూల్యం చెల్లించుకోక తప్పదుఅంగన్వాడీలు మాత్రమే కాదు.. టీచర్లు, ఇతర ఉద్యోగ సంఘాల నాయకులు, పెన్షనర్లు ప్రభుత్వ తీరు పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ ఇప్పటికే అనేకసార్లు వినతులు, నిరసనలు తెలియజేశారు. అయినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన ఉండటం లేదు. వైయస్సార్సీపీ హయాంలో ఉన్న పీఆర్సీ చైర్మన్ తో రాజీనామా చేయించిన చంద్రబాబు.. రెండేళ్లుగా కొత్త పీఆర్సీ కమిషన్ వేయకుండానే కాలయాపన చేస్తున్నారు.కనీసం ఒకటో తేదీన జీతాలు ఇస్తామన్న హామీని కూడా నిలబెట్టుకోలేదు. ఉద్యోగులకు రావాల్సిన దాదాపు రూ. 35 వేల కోట్ల బకాయిలు ఇవ్వకుండా వేధిస్తున్నారు. బినామీ కంపెనీలకు 99పైసలకు వేల కోట్ల విలువైన భూములు కట్టబెట్టడానికి ఉత్సాహం చూపిస్తున్న ప్రభుత్వం... ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం లేదు. ప్రభుత్వం తక్షణం స్పందించి ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయకపోతే దానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోకతప్పదని నలమారు చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. -
మండలి ఛైర్మన్ను అవమానించడం దారుణం: శ్రీకాంత్రెడ్డి
సాక్షి, తాడేపల్లి: రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న మండలి చైర్మన్కి మతం, పార్టీ ఆపాదిస్తూ మాట్లాడిన సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని, సభలో అడుగుపెట్టకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.రాజకీయ లబ్ధి కోసం ఇన్నాళ్లు దేవుడిని రాజకీయాల్లోకి లాగి ఆలయ ప్రతిష్టను మసకబార్చిన కూటమి నాయకులు.. మాట్లాడాల్సిన సబ్జెక్టుని పక్కన బెట్టి శాసనమండలి చైర్మన్ని చర్చలోకి లాక్కురావడమే కాకుండా ఆయన్ను కులమతాల పేరుతో కించపరచడం దారుణమని ఆయన ఆక్షేపించారు. రాజ్యాంగ వ్యవస్థలో ఈరోజును చీకటిరోజుగా చూడాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శ్రీకాంత్రెడ్డి స్పష్టం చేశారు. ప్రెస్మీట్లో ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:కల్తీ నెయ్యి పేరుతో టీటీడీ నిధుల దోపిడీకి పాల్పడిన హెరిటేజ్ అంశం మండలిలో చర్చకు రావడంతో దానికి సమాధానం చెప్పలేక సభలో లేని వైఎస్ జగన్, మండలి చైర్మన్లు క్రిస్టియన్లు అని మాట్లాడుతూ సభను పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడం అత్యంత హేయమైన చర్య. పైగా మీ నాయకుడు జగన్ అంటూ మండలి చైర్మన్కు పార్టీని ఆపాదించి అవమానించారు. ఇది దారుణం. ఇందాపూర్ డెయిరీ ముసుగులో హెరిటేజ్ చేసిన టీటీడీ నిధుల దోపిడీపై వైఎస్సార్సీపీ సభ్యులు ప్రశ్నిస్తుంటే వాటికి సమాధానం చెప్పుకోలేని ప్రభుత్వం సభను పక్కదోవ పట్టించడానికి చైర్మన్ని రాజకీయాల్లోకి లాగి మతాన్ని, పార్టీని ఆపాదించింది.అధికార పక్ష సభ్యుల అనైతిక ప్రవర్తన:అధికార పార్టీ సభ్యులం అన్న విషయమే మరిచిపోయి వైఎస్సార్సీపీ సభ్యులు మాట్లాడుతుండగా ప్రసంగానికి పదులసార్లు అడ్డుతగలడమే కాకుండా మంత్రులంతా పోడియం చుట్టుముట్టి సభలో ఆందోళన చేయడం సిగ్గుచేటు. నేను ఫలానా మతం అని మండలి చైర్మన్ చెప్పుకునే దుస్థితి కల్పించినందుకు ప్రభుత్వం సిగ్గుపడాలి. పరిస్థితులు తమకు అనుకూలంగా లేకపోతే ఎవరికైనా కులమతాలు అంటగట్టి దిగజారుడు రాజకీయాలు చేస్తామని కూటమి నాయకులు చెప్పకనే చెబుతున్నారు.అచ్చెన్నాయుడిపై చర్య తీసుకోవాలి:ఇప్పటికైనా సీఎం చంద్రబాబు కలగజేసుకుని మంత్రి కె.అచ్చెన్నాయుడిని రాబోయే మూడేళ్లపాటు సభలో అడుగుపెట్టకుండా శాశ్వతంగా సభ నుంచి సస్పెండ్ చేయాలి. మంత్రి అచ్చెన్నాయుడు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటిస్తే సరిపోదు. ఆయన తన పదవికి రాజీనామా చేయాలి. తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన్ను సస్పెండ్ చేయాలి. శ్రీవారిని రాజకీయాల్లోకి లాగినందుకు కూటమిని ప్రజలు అసహ్యించుకుంటుంటే దాన్నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కులమతాలతో రాజకీయాలు చేయడం అత్యంత హేయమైన చర్య అని శ్రీకాంత్రెడ్డి అభివర్ణించారు. -
మండలి చరిత్రలోనే ఇది చీకటి రోజు: వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: తిరుపతి లడ్డూ, కల్తీ నెయ్యి, హెరిటేజ్ ఇందాపూర్ డెయిరీ మధ్య సంబంధాలపై శాసనమండలిలో లఘు చర్చ సందర్బంగా సభలో రగడ చోటుచేసుకుంది. అధికార పక్షం అడుగడుగునా అడ్డుకోవడంతో చివరకు సభ వాయిదా పడింది. అనంతరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు.. మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.విలువలు మంటగలిపేలా అచ్చెన్న వ్యాఖ్యలు: లేళ్ల అప్పిరెడ్డిశాసనమండలి చరిత్రలో ఇవాళ జరిగిన ఘటనలు చీకటి రోజుగా నిలిచిపోతాయి. తిరుమల లడ్డూ ప్రసాదంపై చర్చ జరపాలని వైఎస్సార్సీపీ.. సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచీ నాలుగుసార్లు వాయిదా తీర్మానాలు ఇచ్చింది. మండలిని కూడా స్తంభింపజేశాం. ఎట్టకేలకు బీఏసీలో 23వ తేదీన మండలిలో చర్చకు అంగీకరించిన తర్వాత కూడా మంత్రులు చర్చ రాకుండా అడ్డుకున్నారు.తిరిగి వైఎస్సార్సీపీ సభ్యుల ఒత్తిడి మేరకు చర్చ ప్రారంభించినా.. మంత్రులు అడుగడుగునా మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రజాస్వామ్య చరిత్రలోనే మండలికి ఉన్న గౌరవాన్ని మంటగలిపేలా సాక్ష్యాత్తు ఛైర్మన్పైనే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన అధికారాన్ని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఛైర్మన్ మతాన్ని ఉద్దేశించి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువల్ని మంటగలిపేలా ఉన్నాయి.మంత్రులు ఆరోపణలు చేస్తున్నా ఆధారాలు ఉండట్లేదు. దీంతో వారు కంగుతిన్నారు. అందుకే ఏదో విధంగా సభను డైవర్ట్ చేసి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగానే సభలో లేని జగన్మోహన్ రెడ్డిగారితో పాటు ఛైర్మన్ మతాల ప్రస్తావన తెచ్చారు. లడ్డూ కల్తీ ఆరోపణలు చేసిన ప్రభుత్వం.. ఇందాపూర్ లింకులు బయటపడే సరికి ఆత్మరక్షణలో పడిపోయింది. చివరికి హెరిటేజ్ కోసమే లడ్డూ కల్తీ వ్యవహారం తెరపైకి తెచ్చారని తేలిపోయింది. మా సభ్యులు చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు ఛైర్మన్ కు ఇచ్చాం. దీనికి సమాధానాలు చెప్పలేక ఛైర్మన్ మత ప్రస్తావన తీసుకురావడం దారుణం. మోషేను రాజు ఛైర్మన్ గా ఉండటం మీకు ఇష్టం లేదా, ఎందుకు ఆయనపై అడుగడుగునా వివక్ష చూపుతూ అవమానిస్తున్నారు?.చంద్రబాబు తీరును ఆధారాలతో ఎండగట్టాం: పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితిరుమల లడ్డూ నెయ్యిపై వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలనే 14 రోజులుగా ప్రయత్నిస్తున్నాం. ఇవాళ మండలిలో చర్చ ప్రారంభమయ్యాక ప్రతీ అంశంపై ఆధారాలు సమర్పించి మాట్లాడాం. ఇన్ని ఆధారాలతో రాజకీయ కుట్రను బయటపెట్టేందుకు ప్రయత్నిస్తే.. అధికార పక్షం వ్యవహరించిన తీరు దుర్మార్గంగా ఉంది. సభలో లేని వైఎస్ జగన్ ప్రస్తావన తెచ్చి ఆయనపై విమర్శలు చేశారు. తన కుమారుడి పట్టాభిషేకం కోసం వైఎస్ జగన్ను అడ్డు తొలగించుకోవాలన్న రాజకీయ కుట్రే ఇందులో ఉంది.మీ హయాంలో టీటీడీలో నాలుగు నెయ్యి ట్యాంకర్ల నెయ్యిని కల్తీ పేరుతో వెనక్కి పంపి, తిరిగి వైష్ణవీ డెయిరీ ద్వారా లోపలికి పంపుకున్నారు. కల్తీ జరిగితే అది జరిగింది మీ ప్రభుత్వంలోనే, దాన్ని మాకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో దాదాపు కిలో నెయ్యి రూ.300కు తీసుకుంటే, మీ హెరిటేజ్ అనుబంధ సంస్థ ఇందాపూర్ డెయిరీకి కిలో రూ.600 కు ఇచ్చేలా టెండర్ కట్టబెట్టారు. భోలేబాబా, ప్రీమియర్ డెయిరీ కూడా మీ హయాంలోనే 95 శాతం నెయ్యి సరఫరా చేసింది, ఇప్పుడు అదే ప్రీమియర్ డెయిరీ సరఫరా చేసిన నెయ్యి నాణ్యత లేకపోతే వైఎస్సార్సీపీకి అంటగట్టి ఆరోపణలు చేస్తున్నారు. భోలేబాబాకు అనుమతులు ఇచ్చింది మీ హయాంలోనే. ప్రజలకు మేం చెప్పాలనుకున్నది సభలో చెప్పాం. ప్రజలే దీనిపై నిర్ణయిస్తారు.హెరిటేజ్పై దొరికిపోయిన ప్రభుత్వం: తూమాటి మాధవరావుగత వారం అసెంబ్లీలో జరిగిన తిరుమల లడ్డూ చర్చలో హెరిటేజ్కు టీటీడీతో సంబంధాలు లేవని, కేజీ నెయ్యి కూడా సరఫరా చేయలేదని, టెండర్లలో పాల్గొనలేదని చంద్రబాబు ప్రకటించారు. కానీ 1998లో టీటీడీకి కేజీ రూ.70 చొప్పున టెండర్ లేకుండానే హెరిటేజ్ పాల పౌడర్ సరఫరా చేసిందని మేం ఆధారాలు బయటపెట్టాం. నిబంధనలకు విరుద్దంగా టెండర్ లేకుండా ఎలా డబ్బులు చెల్లిస్తారని టీటీడీ ఆపేస్తే.. తిరిగి బోర్డుకు పంపి ఆమోదం తీసుకుని చెల్లింపులు చేసారు. అదే విషయం ఇవాళ ప్రశ్నిస్తే 1998 విషయం ఎందుకు మాట్లాడుతున్నారని ఎదురు దాడి చేశారు. పాల పౌడర్ తిరుమలలో దేనికి వాడారో చంద్రబాబు సమాధానం చెప్పాలి.2008లో కాంగ్రెస్ ప్రభుత్వంలో టీటీడీ టెండర్లలో పాల్గొని ఎల్–3గా వచ్చారని కూడా ఆధారాలు చూపించాం. కేజీ రూ.117.75 చొప్పున టిన్నుల్లో సరఫరా చేస్తామని టెండర్ వేశారు కదా అని అడిగితే మేం ఎల్–1కాదని బుకాయించారు. దీనిపై నిలదీస్తే మాపై దాడికి ప్రయత్నించారు. మా సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతుంటే ఆర్ధికమంత్రి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అనుమతించాలని మండలి ఛైర్మన్ ను అడుగుతుంటే నన్ను అడ్డుకున్నారు. మా గొంతు నొక్కేందుకు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను వెనక్కి తగ్గేది లేదు.అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలి: తోట త్రిమూర్తులులడ్డూపై చర్చించాలని పది రోజులుగా కోరుతున్నా వెనక్కి పారిపోయిన ప్రభుత్వం.. ఎట్టకేలకు ఒప్పుకున్నట్లు చూపించి డైవర్ట్ చేసే ప్రయత్నం చేసింది. ఇందాపూర్ డెయిరీకి, హెరిటేజ్ కూ ఉన్న సంబంధం, వీళ్ల అవినీతి బయటపెట్టే సరికి జీర్ణించుకోలేకపోయారు. అందుకే సభను పక్కదారి పట్టించేలా సభలో లేని జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన తెచ్చి ఆయనపై ఓ ముద్ర వేసేందుకు ప్రయత్నించారు. వైఎస్ జగన్ పలుమార్లు తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న సందర్భాలు ఉన్నాయి.కడప జిల్లాలో తాజాగా నందేశ్వర ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. అయినా ఆయన హిందూ మతానికి వ్యతిరేకం అని ముద్ర వేసేందుకు కుట్ర చేస్తున్నారు. వైఎస్సార్ హయాంలో రెండు కొండలుగా ఉన్న తిరుమలను ఏడు కొండలంటూ జీవోలు ఇచ్చిన చరిత్ర ఉంది. వైఎస్సార్ ఇచ్చిన జీవోల్ని రద్దు చేస్తామని చెప్పిన వ్యక్తి చంద్రబాబా కాదా అనేది ప్రజలు గమనించాలి. ఎప్పుడూ తిరుమల వేంకటేశ్వరస్వామి అంటే భక్తి ఉందని చెప్పుకునే చంద్రబాబు ఎప్పుడైనా ఆయనకు తలనీలాలు సమర్పించారా చెప్పాలి. లడ్డూ నెయ్యిపై చర్చ పెట్టి తిరుమల ప్రతిష్టను దెబ్బతీసిన వ్యక్తి చంద్రబాబు. సభలో లేని వైఎస్ జగన్ ప్రస్తావన తెచ్చినందుకు మంత్రి అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలి.లడ్డూ నెయ్యిపై వాస్తవాలు చెప్పేశాం: వంకా రవీంద్రనాథ్ఇవాళ మంత్రులు తొలిసారి మండలిలో సభ్యులపై అనుక్షణం దాడికి ప్రయత్నించారు. మా వాదన వినిపించకుండా అడ్డుకున్నారు. ఈ సభ ద్వారా ప్రజలకు వాస్తవాలు చేరడం వారికి ఇష్టం లేదు. అయినా మా సభ్యులు లడ్డూ నెయ్యి మీద ప్రజలకు ఆధారాలతో వాస్తవాలు చెప్పారు. ఇది మంచి పరిణామంగా భావిస్తున్నాం. ఇప్పుడు రాష్ట్రంలో పాలు, ఇతర కల్తీల మీద ప్రభుత్వాన్ని నిలదీస్తాం. వచ్చే మూడు రోజుల్లో ప్రజా సమస్యలపై చర్చించాలని కోరుకుంటున్నాం.ఛైర్మన్ను మతం పేరుతో అవమానిస్తారా?: వరుదు కల్యాణిపది రోజులుగా లడ్డూ నెయ్యి మీద చర్చ అడుగుతుంటే ఇవాళ్టికి ఒప్పుకున్నారు. కానీ మా సభ్యులు మాట్లాడుతుంటే అధికార పక్షం దిగజారిపోయి ఛైర్మన్ ను కూడా మతం పేరుతో టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది. మనం ప్రజాస్వామ్యదేశంలో ఉన్నామా లేమా అనే పరిస్ధితిని కూటమి మంత్రులు కల్పించారు. లౌకిక దేశంలో ఇలాంటి ఘటనలు దురదష్టకరం. దీన్ని బట్టి ఈ చర్చకు మీరు ఎంత భయపడుతున్నారో అర్థమవుతోంది.లడ్డూ నెయ్యి మీద అనవసర ఆరోపణలు చేసి చంద్రబాబు భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. దీనిపై సమాధానం అడిగితే చెప్పరు. తిప్పిపంపిన నెయ్యి ట్యాంకర్లు మళ్లీ ఎందుకు వాడారని అడిగితే సమాధానం లేదు. పాల ధర 2 రూపాయలు పెరిగితే నెయ్యి ధర 250 రూపాయలు ఎక్కడైనా పెరుగుతుందా చెప్పాలి. హెరిటేజ్, ఇందాపూర్ బంధాన్ని మా సభ్యులు బయటపెడితే సమాధానం చెప్పలేకపోయారు. ఈవోను ఎందుకు మార్చారంటే చెప్పరు. చర్చ జరగడం ఇష్టం లేదు కాబట్టే మిమ్మల్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీన్ని ప్రజలు అర్థం చేసుకున్నారుఆధారాలు బయటపడే సరికి అడ్డుకునే యత్నం: ఎంవీ రామచంద్రారెడ్డిబడ్జెట్ సమావేశాలు పెట్టినప్పటి నుంచీ చంద్రబాబు లడ్డూపైన చేసిన వ్యాఖ్యలపై చర్చ అడుగుతుంటే ఇవాళ స్వల్ప చర్చకు అనుమతించారు. ఇవాళ హెరిటేజ్, ఇందాపూర్ బంధంపై మా సభ్యులు ఆధారాలు బయటపెడుతుంటే మంత్రులు అడుగడుగునా అడ్డుకున్నారు. రాష్ట్రంలో పాలతో పాటు అన్నీ కల్తీ అవుతున్నాయి. వీటిపై ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. వీటిని అడ్డుకోవాల్సిన అధికారులు ఎక్కడున్నారు. సభలో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. కులమతాలకు అతీతంగా పూజించే శ్రీవారి జోలికి రావొద్దని, మీ తప్పులకు పశ్చాత్తాపం చెందాలని అధికారపక్షాన్ని కోరాం.ప్రజలకు వాస్తవాలు అర్థమయ్యాయి: కల్పలతారెడ్డిలడ్డూ నెయ్యిపై చంద్రబాబు చేసిన ఆరోపణలపై ప్రజలకు వాస్తవాలు తెలియాలనే వాయిదా తీర్మానాలు ఇచ్చాం. ఎట్టకేలకు చర్చకు ఒప్పుకున్నా వైఎస్సార్సీపీ సభ్యులు మాట్లాడకుండా అడ్డుపడ్డారు. తిరుమల లడ్డూ కల్తీపై వాళ్లు చేసిన తప్పుడు ఆరోపణలకు ఎక్కడ కౌంటర్ ఇస్తామో అని భయపడి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా మా సభ్యులు మాత్రం ఆధారాలతో అన్ని విషయాలు బయటపెట్టారు. ప్రజలకు ఈ విషయాలు తెలిసేలా చేశారు. మంత్రుల తీరునూ ప్రజలు గమనించారు.ఈ ప్రభుత్వానికి చేతులు రావడం లేదు: మొండితోక అరుణ్కుమార్ఎస్సీ,ఎస్టీ పారిశ్రామిక వేత్తలను ఈ ప్రభుత్వం బిచ్చగాళ్లుగా మార్చింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఈ ప్రభుత్వం మోసం చేసింది. టీడీపీ కండువా కప్పుకున్న వారికి 40%, సానుభూతి పరులకు 20% మాత్రమే ప్రోత్సాహకాలు ఇచ్చారు. ఇన్సెంటివ్లు ఇవ్వాలంటే టీడీపీ ఎమ్మెల్యేల సంతకాలు కావాలని వేధించిన ప్రభుత్వం ఇది. తమకు న్యాయం చేయండని ధర్నా చేసినందుకు లాఠీఛార్జి చేశారు. టీడీపీ బడా నేతల కంపెనీలకు ఇన్సెంటివ్లు ఇస్తారు. కానీ ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వడానికి మాత్రం ఈ ప్రభుత్వానికి చేతులు రావడం లేదు.సుమారు 500 మంది నారా లోకేష్ను కలవడానికి వస్తే కుదరదన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ను కలిసేందుకు కేవలం ఐదుగురికే అనుమతిచ్చారు. ఎంఎస్ఎంఈలపై మండలిలో మా ప్రశ్నకు మంత్రి తప్పుడు సమాచారం ఇచ్చారు. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు మంత్రిపై ప్రివిలేజ్ మోషన్ ఇస్తాం. కోర్టుకు వెళతాం. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు మేం అండగా ఉంటాం. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఇన్సెంటివ్లు విడుదల చేయాలి. -
అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై మండలి ఛైర్మన్ ఆగ్రహం
సాక్షి, అమరావతి: మండలి ఛైర్మన్పై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మండలి ఛైర్మన్ను క్రిస్టియన్ అంటూ అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. మంత్రి వ్యాఖ్యలపై మండలి ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నన్ను క్రిస్టియన్ అనడానికి నువ్వు ఎవరు?’’ అంటూ మండిపడ్డ మండలి ఛైర్మన్.. తాను క్రిస్టియన్ కాదని స్పష్టం చేశారు. తాను హిందువునని.. క్రిస్టియన్ కాదని మండలి ఛైర్మన్ తెలిపారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్సీపీ సభ్యులు డిమాండ్ చేశారు. బాబూ.. మీ మంత్రులకు ఇదేనా నేర్పింది?: బొమ్మి ఇజ్రాయెల్శాసనమండలి మీడియా పాయింట్లో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ మాట్లాడుతూ.. కులాల మధ్య కుంపటి పెట్టిన వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. చంద్రబాబు బాటలోనే మంత్రులు నడుస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘సభ సాక్షిగా మంత్రి అచ్చెన్నాయుడు.. ఛైర్మన్ను అవమానించారు. ఛైర్మన్ దళితుడనే కారణంతో ఆయన్ని అవమానించారు. మీ నాయకుడు, మీ ఛైర్మన్ క్రిస్టియన్ అంటూ మంత్రి అవమానించారు. అయ్యా చంద్రబాబు.. మీ మంత్రులకు ఇదేనా మీరు నేర్పింది?..దళితులు, క్రిస్టియన్ల పట్ల మీకెందుకు అంత వివక్ష. లోకేష్ సమక్షంలోనే అచ్చెన్నాయుడు మాట్లాడారు. మంత్రి అచ్చెన్నాయుడితో లోకేష్ ఇలా మాట్లాడించారా?. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టడం సరికాదు. చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు క్రిస్టియన్లకు క్షమాపణ చెప్పాలి. హెరిటేజ్, ఇందాపూర్, సంఘం డెయిరీలు, వైష్ణవి కంపెనీలను కాపాడుకోవడానికే మీ ప్రయత్నం. కచ్చితంగా దేవుడే మీకు బుద్ధి చెబుతాడు. తిరుమల లడ్డూపై చర్చకు రావాలని మేం వారం రోజుల నుంచి కోరుతున్నాం. చర్చకు రాకుండా పారిపోతున్నారు. ఈరోజుకి ఎట్టకేలకు చర్చకు అంగీకరించారు. చర్చకు పదే పదే మంత్రులు అడ్డుపడ్డారు’’ అంటూ బొమ్మి ఇజ్రాయెల్ మండిపడ్డారు. -
చిన్నారులకు వైఎస్ జగన్ అన్నప్రాసన
సాక్షి, అమరావతి: తల్లిదండ్రుల కోరిక మేరకు ఇద్దరు చిన్నారులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నప్రాసన చేశారు. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట 18వ వార్డు మెంబర్ చిట్లూరి వెంకటేష్, లక్ష్మీ చంద్రిక దంపతులు మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిశారు.వారి విజ్ఞప్తి మేరకు వారి కుమారుడు ఆర్యన్కు వైఎస్ జగన్ అన్నప్రాసన చేసి, ఆశీస్సులు అందజేశారు. అలాగే నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ మహిళా విభాగం కార్యదర్శి శ్రావ్య రెడ్డి, జీవన్ రెడ్డి దంపతుల కోరిక మేరకు వారి కుమారుడు శ్రియాన్ రెడ్డికి వైఎస్ జగన్ అన్నప్రాసన చేసి, ఆశీస్సులు అందజేశారు. దీంతో ఇద్దరు చిన్నారుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. -
హామీలు అమలు చేయమంటే అంగన్వాడీలపై దౌర్జన్యమా!
సాక్షి, అమరావతి: చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయాలని శాంతియుత నిరసన తెలిపిన అంగన్వాడీలను ప్రభుత్వం దౌర్జన్యంగా పోలీసులతో అరెస్టులు చేయించడాన్ని వైఎస్సార్టీయూసీ అనుబంధ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ తీవ్రంగా ఖండించింది. విజయవాడలో అంగన్వాడీలను పాశవికంగా అరెస్టు చేయడాన్ని యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కాల్వపల్లి చిన్నమ్మ, ఉపాధ్యక్షురాలు మద్దా చంద్రకళ తప్పుబట్టారు.ఈ మేరకు మంగళవారం ప్రకటన చేస్తూ.. అంగన్వాడీ మహిళల పట్ల మగ పోలీసులు అమానవీయంగా వ్యవహరించిన తీరుపై హోంమంత్రిగా ఉన్న మహిళ సమాధానం చెప్పాలన్నారు. గతంలో అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించిన చంద్రబాబు మహిళల ఆగ్రహానికి గురయ్యారన్నారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు చేపట్టిన ఆందోళనను అణచివేసేందుకు ప్రయత్నించి చంద్రబాబు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరుఅంగన్వాడీ మహిళల అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని చంద్రబాబు ప్రభుత్వాన్ని అంగన్వాడీ యూనియన్ నేతలు హెచ్చరించారు. శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ కె.ధనలక్ష్మి, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ అనుబంధ యూనియన్ల నాయకులు లక్ష్మీదేవి. జైని, రత్నకుమారి, లలితమ్మ, సుజాత తదితరులు విజయవాడలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. అంగన్వాడీలు నిద్రమత్తులో ఉండగా ప్రభుత్వం దుర్మార్గంగా అక్రమ అరెస్టులకు పాల్పడిందన్నారు.అరెస్టు చేసిన వారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని, ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి అంగన్వాడీలకు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుంటే భవిష్యత్లో పోరాటాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అలాగే, శాంతియుతంగా ధర్నా చేసిన అంగన్వాడీలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని వామపక్ష పార్టీలు మంగళవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించాయి. అంగన్వాడీలు నిద్రిస్తుండగా తెల్లవారుజామున అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని మండిపడ్డాయి. -
వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డీనేటర్స్ నియామకం
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పలువురిని ఆ పార్టీ రీజినల్ కో–ఆర్డీనేటర్స్గా నియమించారు.ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు బొత్స సత్యనారాయణ, ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు కురసాల కన్నబాబు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలకు బూడి ముత్యాలనాయుడు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు గుడివాడ అమర్నాథ్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయం జాబితా విడుదల చేసింది. -
భూ దాహం తీరనిది!
సాక్షి, అమరావతి: ఇప్పటికే 53,748 ఎకరాల్లో (217.23 చదరపు కిలోమీటర్లు) రాజధాని నిర్మాణ పనులను చేపట్టిన ప్రభుత్వం.. రెండో దశలో 50 గ్రామాల పరిధిలో 1,75,347.43 ఎకరాల్లో (709.57 చదరపు కిలోమీటర్లు) రాజధానిని విస్తరించడానికి ‘మాస్టర్ ప్లాన్’ రూపకల్పనకు ఫిబ్రవరి 16న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్లో బిడ్ల దాఖలు గడువు బుధవారంతో ముగియనుంది. అదే రోజున సాంకేతిక, గురువారం ఆర్థిక బిడ్ను తెరిచి అర్హత సాధించే కన్సల్టెన్సీకి మాస్టర్ ప్లాన్ తయారీ బాధ్యతలు అప్పగించనుంది. తొలి దశ, రెండో దశ కలుపుకుంటే మొత్తం 926.8 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నిర్మించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించినట్లు స్పష్టమవుతోంది. ఇటీవల బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట 53 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణానికి వందేళ్ల సమయం పట్టొచ్చునని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఈ లెక్కన 1.75 లక్షల ఎకరాల్లో రాజధాని విస్తరణకు ఇంకెన్ని వందల ఏళ్లు పడుతుందని సామాజిక, ఆర్థిక వేత్తలు, సిటీ ప్లానర్లు నిలదీస్తున్నారు. దేశంలో మహా నగరాలైన గ్రేటర్ హైదరాబాద్ 650 కి.మీ, గ్రేటర్ చెన్నై 438, బృహత్ బెంగళూరు 741, గ్రేటర్ ముంబై విస్తరించింది 603.4 చదరపు కిలోమీటర్లలోనే ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఆ మహా నగరాలను ఎవరూ నిర్మించలేదని, వాటంతట అవే మహా నగరాలుగా అభివృద్ధి చెందాయని స్పష్టం చేస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే అంతర్జాతీయ, జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అధిక వడ్డీలకు రూ.47,438 కోట్లు అప్పు తెచ్చారని.. నగర నిర్మాణం పూర్తయ్యే సరికి రూ.లక్షల కోట్ల అప్పు తేవాల్సి ఉంటుందని.. ఇది రాష్ట్రాన్ని పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలోకి నెడుతుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా అమరావతి రాజధాని 2,29,095.43 ఎకరాల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. 11 ఏళ్లుగా ప్రాథమిక దశను దాటని రాజధాని ⇒ రాజధానిపై ముందే వందిమాగధులు, బినామీలకు లీకులు ఇచ్చి, ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడి రైతుల నుంచి కారుచౌకగా భూములు కాజేసిన తర్వాత 2015లో గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో 29 గ్రామాల పరిధిలో రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అప్పట్లో 53,748 ఎకరాల్లో (217.23 చదరపు కిలోమీటర్లు) రాజధాని నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. ⇒ ఇందులో ప్రభుత్వ, అటవీ భూమి పోనూ 34,390 ఎకరాలను రైతుల నుంచి భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) ద్వారా సమీకరించింది. పల్లపు ప్రాంతం.. కొండవీటి వాగు, పాలవాగు వరద ప్రభావిత ప్రాంతమైన ఆ భూమిలో రాజధాని నిర్మించడానికి కనీస మౌలిక సదుపాయాల కల్పనకే ఎకరానికి రూ.2 కోట్లు చొప్పున రూ.లక్ష కోట్లు అవసరం అవుతుందంటూ అప్పట్లో కేంద్రానికి సీఎం చంద్రబాబు డీపీఆర్ సమర్పించారు. ⇒ కానీ.. 11 ఏళ్లవుతున్నా ఇప్పటికీ రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వలేదు. 2014–19 మధ్య రాజధాని నిర్మాణానికి రూ.5,500 కోట్లు వ్యయం చేసినా, శాశ్వత నిర్మాణం ఒక్కటంటే ఒక్కటీ కట్టలేదు. తాత్కాలిక నిర్మాణాల ముసుగులో కాంట్రాక్టర్లతో కలిసి భారీ ఎత్తున దోచుకున్నారని.. షాపూర్జీ పల్లోంజీ నుంచి సీఎం వ్యక్తిగత కార్యదర్శి కమీషన్లు తీసుకుని, ఐటీ శాఖకు పట్టుబడటాన్ని బట్టి చూస్తే రాజధాని నిర్మాణంపై చంద్రబాబు సర్కార్కు అప్పట్లో ఎంత చిత్తశుద్ధి ఉందన్నది స్పష్టమవుతోందని ఆర్థిక నిపుణులు ఎత్తిచూపుతున్నారు. ⇒ 2024 జూన్ 12న మళ్లీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. అధికారంలోకి వచ్చి ఇప్పటికే 21 నెలలు పూర్తయింది. రాజధాని నిర్మాణ పనుల కోసం రూ.47,387 కోట్లు అప్పు తెచ్చి.. సుమారు రూ.60 వేల కోట్ల అంచనాతో పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారు. కానీ.. పనుల పురోగతిని పరిశీలిస్తే నిర్దేశించిన లక్ష్యం మేరకు పనులు సాగడం లేదని అధికార వర్గాలే చెబుతున్నాయి. తొలి విడత సమీకరణ కింద భూములు ఇచ్చిన రైతులకు పదేళ్లలో అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని, ఆ పదేళ్లు కౌలు చెల్లిస్తామని సీఆర్డీఏ చట్టం ద్వారా హామీ ఇచ్చారు. కానీ.. ఆ మేరకు హామీ అమలు చేయలేదు. దాంతో రైతులకు కౌలు చెల్లింపును మరో ఐదేళ్లు పొడిగించారు.పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలోకి రాష్ట్రం ⇒ రాజధానికి ఇప్పటికే సమీకరించిన 53,748 ఎకరాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికే ఎకరానికి సగటున రూ.2 కోట్ల చొప్పున రూ.లక్ష కోట్లు అవసరమని 2016–18 మధ్య కేంద్రానికి ప్రభుత్వం డీపీఆర్లు పంపింది. గతేడాది ఏప్రిల్ 16న రాజధాని తొలి దశ నిర్మాణానికే రూ.77,249 కోట్లు అవసరమని 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు.⇒ ప్రస్తుత ధరల ప్రకారం 1.75 లక్షల ఎకరాల్లో రాజధానిని విస్తరించాలంటే మౌలిక సదుపాయాల కల్పనకే రూ.3.50 లక్షల కోట్లు అవసరం. ఇటీవల బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట 53 వేల ఎకరాల్లో రాజధాని అభివృద్ధికి వందేళ్ల సమయం పడుతుందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో తొలి దశ రాజధాని నిర్మాణం పూర్తయ్యే సరికి వ్యయం రూ.లక్షల కోట్లకు చేరుతుందని అధికార వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ⇒ ఈ లెక్కన రాజధానిని 1.75 లక్షల ఎకరాలకు విస్తరించే పనులు పూర్తి కావాలంటే ఇంకెన్ని వందల ఏళ్లు పడతాయి? ఇంకెన్ని రూ.లక్షల కోట్లు వ్యయం అవుతుంది? ఇంకెన్ని రూ.లక్షల కోట్ల అప్పు తేవాలని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని రాజధాని నిర్మాణం పేరుతో తెచ్చే అప్పులతో పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.తొలి విడతకు మూడింతలు.. ⇒ రాజధాని 29 గ్రామాలకే పరిమితమైతే చిన్న మున్సిపాలిటీగా మిగిలి పోతుందని, భూముల ధరలు పెరగాలంటే ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని.. అందుకోసం రెండో విడత భూ సమీకరణ తప్పదని సీఎం చంద్రబాబు తెగేసి చెప్పారు. అందులో భాగంగా పల్నాడు జిల్లా అమరావతి మండలంలో నాలుగు గ్రామాలు, గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో మూడు గ్రామాలు.. వెరసి ఏడు గ్రామాల్లో 20,494 ఎకరాల్లో (82.9 చదరపు కిలోమీటర్లు) భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ⇒ వాటితోపాటు గుంటూరు జిల్లాలో గుంటూరు, మంగళగిరి, మేడికొండూరు, పెదకాకాని, తాడికొండ మండలాలు, పల్నాడు జిల్లాలో అమరావతి, యడ్లపాడు, పెదకూరపాడు మండలాల్లోని 43 గ్రామాల్లో 1,54,853.43 ఎకరాలకు (626.67 చదరపు కిలోమీటర్లు) రాజధాని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 50 గ్రామాల్లో 709.57 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ⇒ ఇందులో ఏడు గ్రామాల్లోని 20,494 ఎకరాలను తొలుత భూ సమీకరణ చేసి.. ఆ తర్వాత అవసరమైనప్పుడు మిగతా భూమిని విడతల వారీగా సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగా రాజధానిని ఆనుకుని ఉత్తరాన కృష్ణా నది నుంచి దక్షిణాన అవుటర్ రింగ్ రోడ్డు వరకు.. తూర్పున చెన్నై–కోల్కతా జాతీయ రహదారి వరకు ఉన్న ప్రాంతంలో రాజధాని విస్తరణకు మాస్టర్ ప్లాన్ తయారీకి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ⇒ మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు 6 నెలలు గడువుగా నిర్దేశించింది. తొలుత భూ సమీకరణ చేస్తున్న ఏడు గ్రామాల్లో వివరణాత్మక ప్రణాళిక.. ఆ తర్వాత మిగిలిన 43 గ్రామాల్లో రాజధాని విస్తరణకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని నిర్దేశించింది. రహదారులు, వరద నీటి నియంత్రణ, మురుగు నీటి వ్యవస్థ, విద్యుత్ సౌకర్యం వంటి మౌలిక సదుపాయాల కల్పన.. ఆ పనులకు జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తీసుకోవడం.. భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు కేటాయించగా సీఆర్డీఏకు మిగిలే భూమిని విక్రయించడం, దీర్ఘకాలిక లీజు, జాయింట్ డెవలప్మెంట్ వంటి నమునాల ద్వారా ఆర్థిక వనరుల సమీకరణ వంటి మార్గాలను అన్వేషిస్తూ మాస్టర్ ప్లాన్ రూపొందించాలని నిర్దేశించింది. -
ఏప్రిల్ 25న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష
సాక్షి, అమరావతి: పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇంజినీరింగ్, నాన్– ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్–2026ను వచ్చేనెల 25న నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్షకు ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.400, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.100 చెల్లించి ఏప్రిల్ 4 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులను https://polycetap.ap.gov. in లో సమర్పించవచ్చు. -
స్వదేశంలోనే విదేశీ విద్య
సాక్షి, అమరావతి: భారతీయ విద్యార్థులకు స్వదేశంలోనే విదేశీ విద్య అందుబాటులోకి వస్తోంది. ప్రపంచ యూనివర్సిటీలు భారత్ బాట పడుతున్నాయి. విదేశీ యూనివర్సిటీల క్యాంపస్లకు అనువైన ఎంపికగా భారత్ మారుతోంది. 2040 నాటికి 5.60 లక్షల మందికి పైగా విద్యార్థులకు మన దేశంలో ఏర్పాటయ్యే విదేశీ యూనివర్సిటీల క్యాంపస్లు సేవలందిస్తాయని డెలాయిట్ ఇండియా, నైట్ఫ్రాంక్సంస్థల సంయుక్త అధ్యయనం వెల్లడించింది. అలాగే ఏకంగా 113 బిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుందని తెలిపింది. 40 భారతీయ నగరాలకు సామర్థ్యం.. విదేశీ వర్సిటీలకు ఆతిథ్యం ఇవ్వగల సామర్థ్యం 40 భారతీయ నగరాలకు ఉందని నివేదిక స్పష్టం చేసింది. వీటిలో ఢిల్లీ, బెంగళూరు, ముంబై టాప్లో ఉన్నాయి. ఇక్కడ పరిశోధనకు అనువైన వాతావరణం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతుల రాకకు అనుకూలంగా ఉండటం, మౌలికవసతులు, పరిశ్రమ–విద్య అనుసంధానం వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అడ్డంకులను అధిగమిస్తూ.. అధ్యయనం ప్రకారం.. ఉన్నత విద్య చదివే వయసున్న యువత కలిగిన దేశంగా భారత్ టాప్లో ఉంది. ప్రస్తుతం దేశంలో 15.50 కోట్ల మంది ఉన్నత కళాశాలల స్థాయి యువత ఉండగా.. 2030 నాటికి వారి సంఖ్య 16.50 కోట్లకు పెరుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో 2035 నాటికి విద్యార్థుల స్థూల నమోదును ప్రస్తుత స్థాయి నుంచి 50 శాతానికిపెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు దేశీయ ఉన్నత విద్య సామర్థ్యం సరిపోవట్లేదని భావించిన విద్యార్థులు అమెరికా, యూకే, కెనడా, ఆ్రస్టేలియా తదితర దేశాలు వెళ్తుండేవారు. మారిన పరిస్థితుల్లో ఆయా దేశాలు వీసా నియమాలను కఠినతరం చేస్తుండడంతో భారత విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పైగా పెరుగుతున్న ఖర్చులు కూడా వారికి అడ్డంకిగా మారాయి. ఈ నేపథ్యంలో భారత్లోనే తమ క్యాంపస్ల ఏర్పాటుకు ప్రపంచ వర్సిటీలు ముందుకొస్తున్నాయి. విదేశీ వర్సిటీల ఏర్పాటుకు వెసులుబాటు..నూతన విద్యా విధానం తర్వాత దేశంలో ఉన్నత విద్యాసంస్థలను స్థాపించాలనుకునే విదేశీ వర్సిటీలకు వెసులుబాటు లభించింది. విదేశీ వర్సిటీల ఆఫ్షోర్ క్యాంపస్లు, జాయింట్ వెంచర్లు, ట్రాన్స్నేషనల్ ఎడ్యుకేషన్ మోడల్స్ ద్వారా భారత్లో స్వతంత్రంగా పని చేయడానికి కేంద్ర ప్రభుత్వం బహుళ మార్గాలను కల్పించింది. వీటిలో పన్ను ప్రోత్సాహకాలు, సింగిల్ విండో క్లియరెన్స్ తదితరాలున్నాయి.ఫలితంగా 18 విదేశీ యూనివర్సిటీలు భారత్లో తమ క్యాంపస్ల ఏర్పాటుకు సూత్రప్రాయ ఆమోదం పొందాయి. ఇందులో ఆ్రస్టేలియాకు చెందిన డీకిన్, వోలోన్గాంగ్ వర్సిటీలు గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ(గిఫ్ట్సిటీ)లో, యూకేకు చెందిన సౌతాంప్టన్ వర్సిటీ గురుగ్రామ్లో తమ క్యాంపస్లు ప్రారంభించాయి. -
రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల మూత
కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం కారణంగా రాష్ట్రంలోని పలు ఆలయాలు మూతపడ్డాయి. తిరుమల శ్రీవారి ఆలయం, విజయవాడ కనకదుర్గ ఆలయం, శ్రీశైలం ముక్కంటి ఆలయం, సింహాచలం అప్పన్న ఆలయాలు పూజల అనంతరం మూసివేశారు. గ్రహణానంతర శుద్ధి కార్యక్రమాల తరువాత తిరుమల శ్రీవారి ఆలయాన్ని రాత్రి 8.30 గంటలకు తెరిచారు. మరికొన్ని ఆలయాలు బుధవారం ఉదయం తెరిచి శుద్ధి, సంప్రోక్షణ, పూజాధికాల అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. – తిరుమల/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ)/సింహాచలం/శ్రీశైలం టెంపుల్తిరుమల శ్రీవారి ఆలయం చంద్రగ్రహణం కారణంగా మంగళవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకూ మూసివేశారు. గ్రహణానంతర శుద్ధి కార్యక్రమాల అనంతరం రాత్రి 8 గంటలకు ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. అన్నప్రసాద సముదాయం, లడ్డూ కౌంటర్లు కూడా రాత్రి 8.30 గంటల నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి.కుమారధార తీర్థ ముక్కోటి నిర్వహణ ఇదిలా ఉండగా, మంగళవారం సాయంత్రం కొంతమంది భక్తులు కుమారధార తీర్థం ముక్కోటిని ఆచరించారు. అయితే చంద్రగ్రహణం కారణంగా పరిమిత సంఖ్యలోనే భక్తులు తీర్థంలో పవిత్రస్నానం చేసి మధ్యాహ్వానికే తిరిగి వెళ్లిపోయారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆలయంతో పాటు ఇతర ఉపాలయాలను మూసివేశారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ఆలయ అర్చకులు అమ్మవారి ప్రధాన ఆలయ ద్వారాలను కవాట బంధనం చేశారు. బుధవారం తెల్లవారుజామున సంప్రోక్షణ, అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం ఉదయం 8 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. విశాఖ జిల్లాలోని సింహాచలంలో ఉన్న శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని గ్రహణం కారణంగా మూసిశారు. రాత్రి 7గంటల సమయంలో ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ పూజలు చేశారు. బుధవారం ఉదయం 6.30గంటల నుంచి భక్తులకు దర్శనాలు కల్పించనున్నారు. శ్రీశైలం ఆలయ ద్వారాలు చంద్రగ్రహణం కారణంగా మంగళవారం మూసివేశారు. తిరిగి రాత్రి 7.30గంటలకు ఆలయ ద్వారాలు తెరచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, తదితర పూజాదికాల తరువాత రాత్రి 9గంటలకు స్వామిఅమ్మవార్ల దర్శనాలను పునఃప్రారంభించారు. గ్రహణ కాలానికి అతీతం.. శ్రీకాళహస్తీశ్వరాలయంశ్రీకాళహస్తి: దేశంలో ఉన్న ఆలయాలు గ్రహణ కాలంలో మూసివేయడం ఆనవాయితీ. అయితే శ్రీకాళహస్తీశ్వరాలయం గ్రహణాలకు అతీతంగా ఉంటుంది. గ్రహణ కాలంలో కూడా ఈ ఆలయం తెరచి ఉంచుతారు. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. మంగళవారం శ్రీకాళహస్తీశ్వరాలయానికి భక్తులు పోటెత్తారు. గ్రహణ కాలంలో రాహు–కేతు పూజలు అధిక సంఖ్యలో జరిగాయి. 35వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శివయ్య సేవలో నెలరేడు గ్రహణానంతరం పౌర్ణమి చంద్రుడు శివయ్యను సేవిస్తున్నాడా..? అన్నట్టుగా శ్రీకాళహస్తీశ్వరాలయం వద్ద ఉన్న భక్త కన్నప్పకొండపై గల శివపార్వతుల ముందు దర్శనమిచ్చారు. భక్తులు పున్నమి చంద్రుడ్ని ఫొటోలు తీస్తూ మురిసిపోయారు. -
అంగన్వాడీలపై ఆటవిక దాడి!
2000 జూలై 26..సమైక్యాంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్లో వేతనాలు పెంచాలని శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న అంగన్వాడీలను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అమానవీయంగా గుర్రాలతో తొక్కించి, బాష్ప వాయువు ప్రయోగించి, అక్రమ అరెస్టులకు దిగింది.2026 మార్చి 3..విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సమీపంలోని విజయవాడలో.. హామీలు నెరవేర్చాలని, వేతనాలు పెంచాలని శాంతియుతంగా నిరసన తెలిపి టెంటులో రోడ్డుపై నిద్రిస్తున్న అంగన్వాడీలపై చంద్రబాబు సర్కారు తెల్లవారుజామున విరుచుకుపడింది. పోలీసులతో ఈడ్చేసి అక్రమంగా అరెస్టులు చేసింది. మహిళల పట్ల చంద్రబాబు మార్కు దౌర్జన్యం, పాతికేళ్లుగా మారని బాబు తీరుకు ఈ రెండు ఘటనలు నిదర్శనం!సాక్షి, అమరావతి, నెట్వర్క్: నమ్మించి నయవంచన చేయడంలో తాను ఏమాత్రం మారలేదని సీఎం చంద్రబాబు అంగన్వాడీల విషయంలో రుజువు చేసుకున్నారు! 2024 ఎన్నికల ముందు వేతనాల పెంపు కోసం ఉద్యమించిన అంగన్వాడీలను కలిసిన చంద్రబాబు తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ అక్కచెల్లెమ్మలకు వేతనాలు పెంచుతానని, సమస్యలన్నీ పరిష్కరిస్తానని నమ్మబలికారు. అంగన్వాడీ కార్యకర్తలకు సుప్రీం కోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లిస్తానని టీడీపీ, జనసేన ఎన్నికల మేనిఫెస్టోలో సైతం పెట్టారు. దీంతో చంద్రబాబు అధికారంలోకి వస్తే తమకు వేతనాలు పెంచుతారని, డిమాండ్లు పరిష్కరిస్తారని అంగన్వాడీలు ఆశ పడ్డారు. కానీ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా అంగన్వాడీల వేతనాల పెంపు, గ్రాట్యుటీ చెల్లింపు లాంటి హామీలకు అతీగతీ లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అనేక దఫాలు శాంతియుతంగా నిరసనలు తెలిపిన అంగన్వాడీలను చంద్రబాబు ప్రతిసారీ మభ్యపెడుతూ వచ్చారు. తాజాగా అంగన్వాడీలు ‘ఛలో విజయవాడ’కు పిలుపునివ్వడంతో వారిని మరోసారి మోసగించేందుకు.. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందంటూ రెండు రోజుల ముందు మంత్రులు వంగలపూడి అనిత, ఫరూక్, బాలవీరాంజనేయులు తదితరులతో ప్రకటనలు గుప్పించారు. అయితే ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో సోమవారం నిర్వహించిన ‘ఛలో విజయవాడ’ కార్యక్రమానికి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు భారీగా పోటెత్తారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు చొరవ చూపని చంద్రబాబు మంత్రి అచ్చెన్నను రంగంలోకి దించి చర్చల పేరుతో మభ్య పెట్టారు. ఈ క్రమంలో అంగన్వాడీ నాయకులకు మంత్రి అచ్చెన్నాయుడు ఫోన్ చేసి ప్రభుత్వం మంగళవారం రోజు చర్చలకు పిలుస్తుందని సమాచారం ఇచ్చినట్లు యూనియన్ నేతలు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం చర్చలకు పిలుస్తుందని భావించిన అంగన్వాడీలు రాత్రి ధర్నా టెంట్లోనే రోడ్డుపై నిద్రకు ఉపక్రమించారు. అయితే నమ్మించి దగా చేయడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు తెల్లవారుజామున పోలీసులను ప్రయోగించి అంగన్వాడీలను దౌర్జన్యంగా ఈడ్చేశారు! మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకు అందరూ నిద్రిస్తుండగా వందలాది మంది మగ పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడి అంగన్వాడీ మహిళలను ఈడ్చి పారేసిన తీరు దుశ్శాసన పర్వాన్ని తలపించింది. వారు తేరుకునేలోగా టెంట్లు పడేసి, ప్లెక్సీలు చించేసి, ప్లకార్డులు విసిరేసి, అంతా చిందరవందర చేసిన పోలీసులు కిష్కింధకాండను తలపించారు!!విజయవాడలో తెల్లవారుజామున అంగన్వాడీలను ఈడ్చుకెళ్తున్న పోలీసులు ఉద్యమంపై ఉక్కుపాదం..దుర్వాసన వెదజల్లే డ్రైయిన్.. ముసురుకున్న దోమల నడుమ పట్టు వదలకుండా, నిరసన చేపట్టిన టెంట్లోనే.. రోడ్డుపైనే సొమ్మసిల్లిన అంగన్వాడీలపై చంద్రబాబు సర్కారు పోలీసులను ప్రయోగించి విరుచుకుపడింది. చంద్రబాబు తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ శాంతియుతంగా ఉద్యమించిన మహిళలపై కర్కశంగా వ్యవహరించింది. విజయవాడలో తెల్లవారుజామున అంగన్వాడీలు నిద్రిస్తున్న టెంట్లలోకి చొరబడిన వందలాది మంది పోలీసులు భీతావహ వాతావరణాన్ని సృష్టించారు. అంగన్వాడీలు తేరుకుని ఏం జరుగుతోందో గ్రహించే లోపే మహిళలని కూడా చూడకుండా ఈడ్చి పారేసి పోలీసు వ్యాన్లలోకి ఎక్కించేశారు. చుట్టూ రోప్ పార్టీ (తాడుతో వలయం) ఏర్పాటు చేసుకున్న పోలీసులు.. అంగన్వాడీలు బయటకు వెళ్లే అవకాశం లేకుండా దిగ్బంధించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చిన వారిని కనీసం బ్యాగులు, సెల్ఫోన్లు కూడా తీసుకోనివ్వకుండా నిర్బంధించారు. చేతికి దొరికిన వారిని దొరికినట్లు అరెస్టు చేసి వ్యాన్లలోకి తోసేశారు. తమను ఎందుకు అరెస్టు చేస్తున్నారు..? ఎక్కడికి తీసుకెళ్తున్నారు..? అని ప్రశ్నించిన వారికి సమాధానం చెప్పకుండా గెంటేశారు. ఈ సందర్భంగా జరిగిన పెనుగులాటలో పలువురు అంగన్వాడీ వర్కర్లు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. తమను అక్రమంగా అరెస్ట్ చేసి కనీసం టాయిలెట్స్కు వెళ్లడానికి కూడా అనుమతించలేదని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బేబీ రాణి, సుబ్బరావమ్మ వాపోయారు. అంగన్వాడీల అక్రమ అరెస్టులకు నిరసనగా ఏలూరులో భారీ ర్యాలీ చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు తాము చేసిన తప్పేమిటని సత్తెనపల్లి టౌన్ పోలీసుస్టేషన్ ఎదుట ఆక్రోశించారు. అరకొర వేతనాలు, అదనపు బాధ్యతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న తమకు వేతనాలు పెంచాలని కోరడం మినహా ఏం నేరం చేశామని నిలదీశారు. పోలీసుల దాడిలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు బేబీ రాణి ఎడమ చేయి విరిగిందని పేర్కొన్నారు. ఈ దుర్మార్గమైన చర్యలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అంగన్వాడీ మహిళలకు ఇచ్చిన గిఫ్ట్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. వేతనాలు పెంచి న్యాయమైన సమస్యలు పరిష్కరించకుంటే కూటమి ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని హెచ్చరించారు. ఈడ్చేసిన మగ పోలీసులు..టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో యాక్షన్లోకి దిగిన పోలీసులు కేవలం 30 నిమిషాల్లో నిరసన దీక్ష టెంట్ను కకావికలం చేసి అంగన్వాడీలను ఇతర ప్రాంతాలకు తరలించారు. మగ పోలీసులు అంగన్వాడీ మహిళలను ఇష్టానుసారంగా పట్టుకుని ఈడ్చేసి వ్యాన్ల్లోకి ఎక్కించారు. కనీసం మహిళల వ్యక్తిగత ఇబ్బందులను కూడా పట్టించుకోకుండా గంటల తరబడి వ్యానుల్లోనే మగ్గిపోవడంతో నరక యాతన ఎదుర్కొన్నారు. విజయవాడ నుంచి పోలీస్ వ్యాన్ల్లో సుమారు 60 నుంచి వంద కిలోమీటర్ల దూరంలోని గుంటూరు, పల్నాడు, ఏలూరు జిల్లాల్లోని మారుమూల చోట్లకు తరలించి అక్కడ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించి చంద్రబాబు మార్కు దౌర్జన్యాన్ని ప్రత్యక్షంగా చూపించారు.నెల్లూరులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు భగ్గుమన్న మహిళలు..చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొని సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు శాంతియుతంగా నిరసన తెలిపిన అంగన్వాడీలు నిద్రిస్తున్న సమయంలో తెల్లవారుజామున చంద్రబాబు సర్కారు అక్రమ అరెస్టులకు దిగడంపై రాష్ట్రవ్యాప్తంగా మహిళలు భగ్గుమన్నారు. అన్ని జిల్లాల్లో రోడ్లపైకి చేరుకుని నిరసన తెలిపారు. అరెస్టు చేసిన అంగన్వాడీలను తరలించిన సత్తెనపల్లి, నరసరావుపేట పోలీస్ స్టేషన్ల వద్ద పెద్ద ఎత్తున బైఠాయించారు. తమ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడలో అరెస్టు చేసిన కార్యకర్తలను ఏలూరు జిల్లా బుట్టాయగూడెం, చాట్రాయి లాంటి మారుమూల ప్రాంతాలకు తరలించగా స్థానిక అంగన్వాడీలు పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అణచివేత విధానాలను అనుసరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారు తీరుకు నిరసనగా విశాఖ కలెక్టరేట్ వద్ద భారీ ప్రదర్శన నిర్వహించారు. నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోని ప్రధాన కేంద్రాల్లో అంగన్వాడీలు నల్ల బ్యాడీ్జలతో నిరసన తెలిపారు.కర్నూలులో కలెక్టరేట్కు ర్యాలీగా వెళ్తున్న అంగన్వాడీలు బాబు మారలేదు.. అంగన్వాడీలతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రులతో కబురు పంపించిన చంద్రబాబు మరోవైపు పోలీసులను ప్రయోగించి అక్రమ అరెస్టులు చేయడం పట్ల సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ అనుబంధ యూనియన్ల రాష్ట్ర కీలక నేతలు కె.సుబ్బరావమ్మ, జె.లలిత, వీఆర్ జ్యోతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించిన చంద్రబాబు మారాడనుకున్నామని, అయితే ఆయన ఏమాత్రం మారలేదని రుజువైందన్నారు. దీనికి పర్యవసానం అనుభవించక తప్పదని హెచ్చరించారు. అరెస్టులకు భయపడేది లేదని, జిల్లాల్లో నిరసన ఉద్యమాన్ని కొనసాగించాలని అంగన్వాడీలకు పిలుపునిచ్చారు. పోలీసుల లాఠీలు, అరెస్టులతో ఉద్యమాన్ని అణచివేయలేరని, తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. ఈమేరకు మూడు యూనియన్ల నేతలు సెల్ఫీ వీడియోలు విడుదల చేశారు.‘సాక్షి’ కెమెరా లాక్కున్న పోలీసులుచంద్రబాబు సర్కారు ఆదేశాలతో స్వామి భక్తి ప్రదర్శించిన పోలీసులు రెచ్చిపోయి అంగన్వాడీ మహిళలను అరెస్టు చేస్తున్న దృశ్యాలను ఎవరూ చిత్రీకరించకుండా జాగ్రత్త పడ్డారు. అంగన్వాడీల వద్ద సెల్ఫోన్లు లాక్కున్నారు. పోలీసుల దమనకాండను చిత్రీకరిస్తున్న ‘సాక్షి’ కెమెరామెన్ను దూరంగా వెళ్లిపోవాలని హెచ్చరించి కెమెరా గుంజుకున్నారు. -
హామీలు అమలు చేయాలని అడిగితే తప్పా..?
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లపై చంద్రబాబు సర్కారు ప్రదర్శించిన దమనకాండ అత్యంత హేయమని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ‘ఛలో విజయవాడ’కు తరలివచ్చిన అంగన్వాడీ మహిళలను నిద్రిస్తున్న సమయంలో అత్యంత దారుణంగా అక్రమంగా అరెస్టులు చేయడాన్ని వైఎస్ జగన్ తప్పుబట్టారు. ఈ మేరకు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘ఎక్స్’లో వైఎస్ జగన్ మంగళవారం పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే.. చంద్రబాబు ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు గట్టిగా అడగడం తప్పు అవుతుందా? రెండేళ్లు అవుతున్నా.. ఆ హామీలకు దిక్కూ మొక్కూ లేదని నిలదీయడం, ప్రశ్నించడం నేరం అవుతుందా? అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లపై మీ దమనకాండ అత్యంత హేయం. మహిళలని కూడా చూడకుండా వారిపై లాఠీఛార్జీ.. పోలీసుల చేత బలప్రయోగం.. ఎక్కడికక్కడ నిర్బంధం.. వారికి కనీస సౌకర్యాలు కూడా లేకుండా చేసి అత్యంత అమానవీయంగా వ్యవహరించారు. ఇలా చేయడానికి మీకు సిగ్గనిపించడం లేదా? వాళ్లు ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే... ఈరోజు ఉదయం చర్చలకు పిలుస్తామని చెప్పి, ముందు రోజు రాత్రే నిరసన శిబిరాలకు కరెంటు తీసివేసి, కంచెలు వేసి, కనీసం ఆహారం, తాగునీళ్లు అందకుండా చేయడం దారుణం కాదా? ఏరుదాటాక తెప్పతగలేసే మీ ధోరణి, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లు ఎగరగొట్టి పచ్చి మోసాలు ఎలా చేస్తున్నారో ప్రజలంతా గమనిస్తున్నారు. ఒక్క అంగన్వాడీలకే కాదు.. రైతులకు, విద్యార్థులకు, మహిళలకు, ఉద్యోగులు సహా వివిధ వర్గాల వారికి మీరు చేస్తున్న అన్యాయాలు, వెన్నుపోట్లు శిశుపాలుడి పాపాల్లా పెరుగుతూనే ఉన్నాయి. దీనికి తప్పకుండా మీరు మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. చంద్రబాబుగారూ.. మీరు తక్షణం అంగన్వాడీలు, వర్కర్లకు క్షమాపణలు చెప్పాలని, వారికిచి్చన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నా!! -
రాయితీలు ఇవ్వకుంటే ఏపీఐఐసీ స్థలాలకు నగదు చెల్లించలేం
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సిన రాయితీలు ఇస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) స్థలాలకు నగదు చెల్లించలేమని ఏపీ ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు అనార్ బాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం 1,600 మంది ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు జీవో 7 ద్వారా ప్లాట్లు కేటాయించిందని ఆయన గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఏపీఐఐసీకి నగదు చెల్లించేందుకు మరో మూడు నెలలు మాత్రమే గడువు పొడిగించిందని ఆయన పేర్కొన్నారు. మూడు నెలల గడువు ఈ నెల 8తో ముగుస్తున్నందున మరో నాలుగు నెలలపాటు గడువు పెంచాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి యువరాజ్కు అనార్ బాబు సోమవారం లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఆ లేఖను ముఖ్యమంత్రి, పరిశ్రమలశాఖ మంత్రికి కూడా పంపారు. నిర్దిష్టమైన కారణాల వల్ల జీవో 7 ద్వారా ప్లాట్లు పొందిన ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు నగదు చెల్లించలేకపోతున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వం నుంచి సబ్సిడీలు రావడం లేదని, సబ్సిడీ నగదు ప్రభుత్వం వద్దనే ఆగిపోవడంతో బ్యాంకులు అదనపు రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. జీవో 7 పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా 1600 మంది ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులన్నారని, ఇందులో సగం మందికి నూరు శాతం సబ్సిడీలు రాలేదన్నారు. వారిలోనే ఎక్కువ మంది ఏపీఐఐసీకి నగదు చెల్లించాల్సిన వారు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. రావాల్సిన సబ్సిడీ నగదు పరిశ్రమల శాఖ వద్దే ఉన్నందున ఆ నగదును ఏపీఐఐసీకి బదిలీ చేసి సర్దుబాబు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. సబ్సిడీలు వచ్చేంత వరకు మరో నాలుగు నెలలపాటు గడువు పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వర్గాలకు జీవో నెంబర్ 7 కింద ఇచి్చన ప్లాట్లను రద్దు చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. -
ఎస్సీల నుంచి రుణాలను ముక్కుపిండి రికవరీ చేయండి
సాక్షి, అమరావతి: జాతీయ దళిత ఆర్థిక సంస్థ(ఎన్ఎస్ఎఫ్డీసీ), జాతీయ సఫాయి కర్మచారీస్ ఆర్థిక అభివృద్ధి సంస్థ (ఎన్ఎస్కెఎఫ్డీసీ) పథకాల కింద ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీల స్వయం ఉపాధి కోసం మంజూరు చేసిన రుణాలను వారి నుంచి ముక్కుపిండి వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మండల స్థాయిలో ప్రత్యేకంగా రికవరీ బృందాలను ఏర్పాటు చేసింది. మండల స్థాయిలో రికవరీ బృందాలను ఏర్పాటు చేసి ఆ రుణాలను వసూలు చేయాలని జిల్లా యంత్రాంగాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రికవరీ బృందాల పనితీరుపై దృష్టి సారించాలని కలెక్టర్లను ఆదేశించింది. కొన్ని సంవత్సరాలుగా ఎస్సీల స్వయం ఉపాధి కోసం రూ.396.96 కోట్లను రుణాలుగా మంజూరు చేశారు. ఇందులో ఇప్పటికే రూ.100.68 కోట్లను రికవరీ చేశారు. మిగతా 296.28 కోట్లను వసూలు చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా రూ.30.69 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.25.10 కోట్లు, అనంతపురం జిల్లాలో రూ.7.68 కోట్లు ఎక్కువ బకాయిలున్నాయని, వాటిని రాబట్టాలని సూచించింది. ఎస్సీ కార్పొరేషన్ అధికారులు, సిబ్బందితో మండలాల వారీగా రికవరీ బృందాలను ఏర్పా టు చేసి ప్రత్యేక చర్యలను తీసుకుంటున్నారు. -
విశాఖ తీర రక్షణకు తూట్లు!
సాక్షి, విశాఖపట్నం: సుదీర్ఘమైన తీరప్రాంతంపై చంద్రబాబు ప్రభుత్వం పగబట్టింది. అనుయాయులకు లబ్ధి చేకూర్చేందుకు అభివృద్ధి పేరుతో తీరాన్ని విచ్చిన్నం చేసేందుకు కుట్ర పన్నుతోంది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్జెడ్) నిబంధనలను సడలించడం, జోన్లు మార్చడం వంటి చర్యలతో తీరప్రాంత సమతుల్యతను దెబ్బతీస్తోంది. పర్యాటక ముసుగులో న్యాయస్థానాల హెచ్చరికల్ని కూడా బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. కావాల్సిన వారికి ప్రాజెక్టులను కట్టబెట్టేందుకు అడ్డదారులు తొక్కుతోంది. గతంలో పర్యావరణవేత్తలు, ప్రజలు పోరాడి కాపాడుకున్న తీరప్రాంతాలను ఇప్పుడు కమర్షియల్ హబ్లుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. నగరంలోని సాగరతీర ప్రాంతాల్లో ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తే ప్రభుత్వం ఎంతటి మొండివైఖరితో ఉందో అర్థమవుతోంది. తన వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, బడా కాంట్రాక్టర్ల కోసం పర్యావరణ అనుమతులను సైతం వేగవంతం చేయాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. అభ్యంతరాలను పక్కనపెట్టి అడ్జస్ట్మెంట్లతో ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. భీమిలి తీరంలో సీఆర్జెడ్ మాయాజాలం విశాఖ–భీమిలి తీరప్రాంతంలో సీఆర్జెడ్ జోన్ల మారి్పడి (రీక్లాసిఫికేషన్)పై చంద్రబాబు ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. సీఆర్జెడ్ నిబంధనల ప్రకారం.. సీఆర్జెడ్–3 కేటగిరీలో ఉన్న ప్రాంతాలు తక్కువ నిర్మాణాలు కలిగి, ప్రకృతి సిద్ధంగా ఉంటాయి. సముద్రమట్టం నుంచి 200 మీటర్ల వరకు ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు. ఇక్కడి ఇసుకదిబ్బలు, చిత్తడినేలలు వంటివి అలల తాకిడిని, తుపాన్లను అడ్డుకునే సహజ రక్షణ కవచాలుగా పనిచేస్తాయి. సీఆర్జెడ్–2 కేటగిరీలో సముద్రతీరానికి అత్యంత సమీపంలో భారీ కాంక్రీట్ కట్టడాలు, వాణిజ్య సముదాయాలు నిర్మించుకోవచ్చు.విశాఖ–భీమిలి బీచ్ వెంబడి సీఆర్జెడ్–3 పరిధిలో 500 ఎకరాలకుపైగా భూములున్నాయి. వీటిలో భారీ కాంక్రీట్ నిర్మాణాలకు వీలులేదు. ఇప్పుడు ఈ భూముల్ని సీఆర్జెడ్–2 పరిధిలోకి తీసుకొచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయతి్నస్తోంది. ఈ భూముల్లో మెజారిటీ వాటా ప్రభుత్వ నేతలదే కావడంతో.. మార్పిడి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. విశాఖని గ్లోబల్ సిటీగా మారుస్తామనే సాకుతో తీరప్రాంత మాస్టర్ప్లాన్పై సమీక్షలు మొదలుపెట్టారు. 2024 అక్టోబర్–డిసెంబర్ మధ్య మాస్టర్ప్లాన్ సవరణల పేరుతో అంతర్గత కసరత్తు జరిగింది. ఆ సమయంలోనే సీఆర్జెడ్–3లోని భూముల్ని సీఆర్జెడ్–2 కిందకు చేర్చి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలుగా మార్చాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనలను కేంద్రానికి పంపించి మార్పులు చేసెయ్యాలని ప్రభుత్వం ఆరాటపడిపోతోంది. పర్యావరణ నిబంధనలు అభివృద్ధికి అడ్డంకి అన్న మంత్రి దుర్గేష్ నిబంధనల్ని పాటిస్తూ పర్యావరణాన్ని కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు.. ఇప్పుడు అభివృద్ధికి అవే అడ్డంకి అనటం ఆందోళన కలిగిస్తోంది. పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ శాసనసభలో మాట్లాడుతూ పర్యావరణ నిబంధనలు అభివృద్ధికి అడ్డంకి అంటూ వ్యాఖ్యానించారు. ఇక విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి కూడా అసెంబ్లీలో నియోజకవర్గంలోని సమస్యలు, అభివృద్ధి కోసం కాకుండా.. బీచ్రోడ్డుని సీఆర్జెడ్–2లోకి తీసుకురావాలని కోరారు. పర్యావరణ కంటే.. ప్రాఫిట్ ముఖ్యంవీటిని పరిశీలిస్తే ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కంటే ప్రాఫిట్కే పెద్దపీట వేస్తోందని స్పష్టమవుతోంది. ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటే.. నగరంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. తీరంలో ఇసుక దిబ్బలు, ఖాళీ ప్రదేశాలు సహజ సిద్ధమైన బఫర్ జోన్లుగా పనిచేసి ఉప్పెనలు, తుపాన్ల తీవ్రతను తగ్గిస్తాయి. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో వాణిజ్య విస్తరణకు తెరతీస్తే.. భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాలకు విశాఖను బలి చేయడమేనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వం విశాఖ విధ్వంసాన్ని మాత్రమే కోరుకుంటోంది తప్ప.. అభివృద్ధిని కాదంటూ పర్యావరణవేత్తలు, కూటమి పారీ్టల ప్రతినిధులే సామాజిక మాధ్యమాల్లో దుమ్మెత్తిపోస్తున్నారు. ఆత్మహత్యా సదృశ్యమే.. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల ముప్పు పొంచి ఉన్న తరుణంలో ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఓవైపు గ్రేట్ గ్రీన్వాల్ వంటి కార్యక్రమాలు చేస్తూనే.. మరోవైపు పర్యాటకశాఖ దానికి విరుద్ధంగా వ్యవహరించడం శోచనీయం. కేవలం రూ.4,098 కోట్ల పెట్టుబడులు, 2,800 హోటల్ గదులు వంటి తాత్కాలిక ఆరి్థక ప్రయోజనాల కోసం, శాశ్వత పర్యావరణ రక్షణ కవచాలైన సీఆర్జెడ్–3 నిబంధనలను సడలించి తీరాన్ని కాంక్రీట్ జంగిల్గా మార్చాలని చూడటం ఆత్మహత్యా సదృశ్యమే. ఇప్పటికే జీవీఎంసీ, ఏపీపీసీబీ పర్యవేక్షణ లోపంతో సముద్రజలాలు కలుషితమవుతున్నాయి. ఇప్పుడు అదనపు కట్టడాలకు అనుమతినిస్తే విశాఖ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. అభివృద్ధి అంటే ప్రకృతిని ధ్వంసం చేయడంకాదు, భావితరాలకు సురక్షితమైన తీరాన్ని అందించడమే. ప్రభుత్వం సీఆర్జెడ్ పునర్వర్గీకరణ ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలి. – బొలిశెట్టి సత్యనారాయణ, జనసేన ప్రతినిధి, పర్యావరణవేత్త తుపాన్లు, ఉప్పెన్ల ముప్పు పెరుగుతుంది విశాఖపట్నం తీరప్రాంతంలో సీఆర్జెడ్–3 నిబంధనలను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుండటం గర్హనీయం. కేవలం పర్యాటక అభివృద్ధి, వాణిజ్య విస్తరణ పేరుతో చేస్తున్న ఈ మార్పువల్ల సాగరతీరంలోని ఇసుక దిబ్బలు, చిత్తడి నేలలు వంటి సహజ రక్షణ కవచాలు ధ్వంసమైపోతాయి. భవిష్యత్తులో తుపాన్లు, ఉప్పెన్ల ముప్పు పెరుగుతుంది. ప్రభుత్వం తాత్కాలిక లాభాల కోసం మత్స్యకారుల జీవనోపాధిని పణంగా పెడుతోంది. ఇప్పటికే కాలుష్యంతో అల్లాడుతున్న విశాఖకు ఇది మరో పెద్దదెబ్బ. చట్టబద్ధమైన పర్యావరణ రక్షణలను అడ్డంకులుగా చూడటం బాధ్యతారాహిత్యం. చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాల్సిందే. – వై.రాజే‹Ù, వీఎస్ కృష్ణ, మానవహక్కుల ఫోరం ప్రతినిధులు -
2, 3 రోజుల్లో ‘పది’ హాల్టికెట్ల విడుదల
సాక్షి, అమరావతి : పదో తరగతి పబ్లిక్ పరీక్షల(ఎస్ఎస్సీ–2026) హాల్టికెట్లను రెండు, మూడు రోజుల్లో విడుదల చేయనున్నారు. ఈ నెల 16 నుంచి పరీక్షల నిర్వహణకు ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో గురు, లేదా శుక్రవారం హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్లో విడుదల చేయనున్నట్టు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. -
ఈ నెలంతా సెలవుల్లేవు!
సాక్షి, అమరావతి: ఇంటి పన్ను, ఆస్తి పన్ను వసూళ్ల నిమిత్తం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఈనెలలో సెలవులు రద్దుచేస్తూ రాష్ట్రంలో పలుచోట్ల అధికారులు ఆదేశాలు జారీచేశారు. సర్వేలు, పన్నుల వసూళ్ల టార్గెట్ కారణంగా పని ఒత్తిడి పెరిగి ఇప్పటికే పెద్ద సంఖ్యలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు చనిపోతున్నారని ఉద్యోగ సంఘం నేతలు ఆందోళన చెందుతుండగా.. తాజాగా ఈ నెలంతా సెలవుల రద్దు ఆదేశాల జారీపై వారు మండిపడుతున్నారు.విజయవాడ కార్పొరేషన్ అధికారులు సోమవారం ‘ప్రస్తుత ఆరి్థక సంవత్సరం ఈనెల 31తో ముగుస్తున్నందున వార్డు ఆడ్మిన్ సెక్రటరీలు, నగర కార్పొరేషన్ రెవెన్యూ విభాగంలో పనిచేసే ఔట్ డోర్, ఇన్డోర్ సిబ్బంది, క్యాష్ కౌంటర్ల వద్ద పనిచేసే సిబ్బంది అందరూ 3వ తేదీ (మంగళవారం–హోలీ సెలవు) నుంచి ఈ నెలాఖరు వరకు సెలవు రోజులతో సహా అన్ని రోజులు పనిచేయాలి’.. అంటూ ఆదేశాలు జారీచేశారు.రాష్ట్రంలో ఇంకా చాలాచోట్ల కార్యదర్శులకు ఇలాంటి ఆదేశాలు మౌఖికంగా జారీ అయినట్లు ఉద్యోగ సంఘ నేతలు చెబుతున్నారు. మార్చిలోనే హోలీ, ఉగాది, శ్రీరామ నవమి, రంజాన్ వంటి పండుగలతో పాటు ఆది, శనివారాలు కలిపి దాదాపు 10 రోజులు అధికారిక సెలవులు ఉండగా.. పండుగ రోజుల్లో సైతం సెలవులు రద్దుచేయడాన్ని ఉద్యోగ సంఘ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. -
రూ.6,000 కోట్లు ఔట్.. ‘పారి’.. శ్రమ!
సాక్షి, అమరావతి: ‘‘మీ కప్పాలు కట్టలేం.. మీ బెదిరింపులు భరించలేం.. మీ భూములు వద్దు.. మీకో దండం..!’’ అంటూ పరిశ్రమలు రాష్ట్రాన్ని వదిలేసి పారిపోతున్నాయి! రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా భూములు కేటాయించిన తర్వాత కూడా వాటిని తీసుకోకుండా తిరిగి రాష్ట్ర ప్రభుత్వం ముఖంమీదే విసిరి కొట్టి పారిశ్రామికవేత్తలు పరుగులు తీస్తున్నారు! చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గం ఆమోదం మేరకు కేటాయించిన భూములను సైతం వెనక్కి ఇచ్చేసి వెళ్లిపోతున్నారంటే రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం ఏ స్థాయిలో నడుస్తోందో ఊహించవచ్చని పారిశ్రామిక వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. తాజాగా పలు కంపెనీలకు కేటాయించిన భూములను రద్దు చేస్తూ చంద్రబాబు సర్కారు ఇచ్చిన జీవోలే దీనికి నిదర్శనమని పేర్కొంటున్నారు. గత ప్రభుత్వంలో ఒప్పందం కుదిరిన హిందుస్థాన్ కోకోకోలా బెవరేజెస్ దగ్గర నుంచి టీడీపీ కూటమి సర్కారు వచ్చాక ఎస్ఐపీబీలో ఆమోదం పొందిన అజాద్ ఇండియా మొబిలిటీ, జ్యూపిటర్ రెన్యువబుల్ ప్రైవేట్ లిమిటెడ్, జిన్ఫ్రా ప్రెసిషన్స్ వరకు ఒకేసారి నాలుగు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడుల ఆలోచనను విరమించుకుంటున్నట్లు ప్రకటించడం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో మన రాష్ట్రం ఏకంగా రూ.6,096 కోట్ల విలువైన పెట్టుబడులను కోల్పోయిందని స్పష్టం చేస్తున్నారు. రెడ్బుక్ రాజ్యాంగం పేరిట పారిశ్రామికవేత్తలను బెదిరించడం.. తాము చెప్పినంత కప్పం కట్టకుంటే యూనిట్లను పనిచేయనివ్వకుండా అడ్డుకుంటూ ఏపీ అంటేనే భయపడే పరిస్థితిని కల్పించారని పేర్కొంటున్నారు. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వస్తూనే రెడ్బుక్ రాజ్యాంగానికి పని కల్పిస్తూ పారిశ్రామికవేత్తలపై తప్పుడు కేసులు, కథనాలు ప్రచురిస్తూ జిందాల్, అదానీలపై తమ అనుకూల పత్రికలు, ఎల్లో మీడియా ద్వారా వ్యక్తిత్వ హననం కథనాలను ప్రచారం చేసిందని గుర్తు చేస్తున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు వద్ద అదానీ గ్రూపు నిర్మిస్తున్న పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ నిర్మాణ పనులను తమకు కమీషన్లు ఇవ్వకుండా ఎలా మొదలు పెడతారంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరులు సంస్థ కార్యాలయంపై రాళ్ల దాడి చేసి యంత్ర సామాగ్రిని ధ్వంసం చేయడంతోపాటు సిబ్బందిని గాయపర్చారు. ఇక అదానీ నిర్వహిస్తున్న కృష్ణపట్నం పోర్టు సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి నేరుగా వెళ్లి దాడి చేశారంటే కూటమి నేతలు ఎంతగా బరితెగించారో వేరే చెప్పాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. యునైటెడ్ బ్రూవరీస్, కోకోకోలా లాంటి కంపెనీలైతే కూటమి నేతల వసూళ్లపై నేరుగా కేంద్రానికే ఫిర్యాదు చేశాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో స్పష్టమవుతోందని పారిశ్రామిక వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి ‘సీమ’ దాకా సేమ్ సీన్..శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు బృందం యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ యాజమాన్యాన్ని ఒక్కో లారీకి రూ.వెయ్యి చొప్పున నెలకు సుమారు రూ.1.50 కోట్లు కప్పం కట్టాలని డిమాండ్ చేసింది. అనకాపల్లి జిల్లాలో యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్ మామూళ్లు ఇవ్వాలని బెదిరింపులకు దిగడంతో కోకోకోలా ఫ్యాక్టరీ ప్రతినిధులు నేరుగా కేంద్రానికి, సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. పల్నాడు జిల్లాలో సిమెంట్ కంపెనీలు మామూళ్లు, వాటాలు ఇవ్వాలంటూ స్థానిక ఎమ్మెల్యేలు ముడిసరుకు రవాణా, సిమెంట్ సరఫరాను అడ్డుకోవడంతో చెట్టినాడ్ సిమెంట్, భవ్య సిమెంట్ ఉత్పత్తిని నిలిపివేసి యూనిట్లకు తాళాలు వేసి వెళ్లిపోయాయి. దీంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చే బూడిదను తరలించే విషయంలో టీడీపీకి చెందిన జేసీ ప్రభాకరరెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి బహిరంగా బాహాబాహీకి దిగిన సంగతి తెలిసిందే. ఆరీ్టపీఎస్ బూడిద తరలింపు కాంట్రాక్టు తమకు కావాలంటే తమకు కావాలంటూ కొట్టుకోవడంతో ఈ పంచాయితీ చివరకు సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. నంద్యాల జిల్లాకు చెందిన ఒక మంత్రి సిమెంట్ కంపెనీలకు ఎర్రమట్టి సరఫరాపై అదేపార్టీకి చెందిన నాయకుడితో గొడవకు దిగారు. దీంతో ఇండియా సిమెంట్స్ బూడిద, మట్టి సరఫరా కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. చివరకు బీజేపీకి చెందిన ఎంపీ అదే పారీ్టకి చెందిన ఎమ్మెల్యేపై ఎస్పీకి ఫిర్యాదు చేశారంటే పరిస్థితులు ఎంత దిగజారాయో అర్థం చేసుకోవచ్చు. బైబై చెప్పేసిన కోకోకోలా.. అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద రూ.1,200 కోట్లతో శీతల పానీయాల తయారీ యూనిట్ ఏర్పాటుకు హిందుస్థాన్ కోకోకోలా కంపెనీ 2023 మే 4న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. గత ప్రభుత్వం దీన్ని పరిశీలించి 50.04 ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు పలు రాయితీలను ప్రకటిస్తూ 2024 ఫిబ్రవరి 7న ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన అనంతరం కూటమి నేతల కప్పాల వసూళ్లతో జంకిన కోకోకోలా పెట్టుబడుల ప్రతిపాదనను ఉపసంహరించుకొని తెలంగాణకు తరలిపోయింది. తమకు కేటాయించిన భూములను వెనక్కి ఇచ్చేస్తామని, తమ కంపెనీ పేరిట భూ సమీకరణ చేయవద్దని మొర పెట్టుకుంటూ కోకోకోలా కంపెనీ లేఖ రాసింది. 2026 ఫిబ్రవరి 27న కోకోకోలాకు భూ కేటాయింపులను రద్దు చేస్తూ పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. తొలి ఒప్పందానికే దిక్కులేదు.. బాబు సర్కారు అధికారం చేపట్టిన తరువాత 2024 నవంబర్ 19న పెట్టుబడుల ప్రోత్సాహక మండలి తొలి సమావేశం జరిగింది. రూ.85,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. వీటిలో ఒక్క ఎలీజీ ఎల్రక్టానిక్స్ మినహా మరే ప్రాజెక్టు ఇంతవరకు పట్టాలు ఎక్కకపోగా ఆమోదం పొందిన ప్రతిపాదనలు సైతం వెనక్కి వెళ్లిపోయాయి. వడ్డీతో సహా ‘ఆజాద్’ వసూలు..! శ్రీసత్యసాయి జిల్లా గుడిపల్లి వద్ద ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ 70.71 ఎకరాల్లో మూడు దశల్లో ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాక్ల గ్రీన్ ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకొచ్చింది. రూ.1,046 కోట్ల పెట్టుబడితో 2,381 మందికి ఉపాధి కల్పిస్తామని పేర్కొంది. కానీ ఇప్పుడు ఆజాద్ మొబిలిటీ పెట్టుబడుల ప్రతిపాదన నుంచి వెనక్కి వెళ్లిపోవడమే కాకుండా ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ) వడ్డీతో సహా వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో 2026 ఫిబ్రవరి 18న ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఎస్ఐపీబీ సమావేశంలో వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. ఆజాద్ మొబిలిటీకి కేటాయించిన భూములను రద్దు చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. ఈఎండీ కింద అజాద్ మొబిలిటీ చెల్లించిన రూ.2.51 కోట్లు 2024 ఆగస్టు 30 నుంచి వడ్డీతో సహా చెల్లించడానికి ప్రభుత్వం అంగీకరించింది.జిన్ఫ్రా.. పరుగో పరుగు! రాష్ట్రంలో రూ.1,150 కోట్లతో 155 ఎంఎం ఆర్టిలరీ గన్స్లో ఉపయోగించే బైమాడ్యులర్ చార్జ్ సిస్టమ్స్తో పాటు ట్రిపుల్ బేస్ ప్రొపెలెంట్, సింగిల్ బేస్ ప్రొపెల్లెంట్ తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తామంటూ జిన్ఫ్రా ప్రెసిషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిపాదన సమర్పించింది. ఎస్ఐపీబీ 7వ సమావేశంలో కూటమి సర్కారు దీన్ని ఆమోదించింది. అనంతపురం జిల్లా తమ్మి సముద్రంలో ఎకరా రూ.8.3 లక్షలు చొప్పున 121.53 ఎకరాలు కేటాయిస్తూ 2025 జూన్ 27న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పుడు ఈ కంపెనీ రాష్ట్రంలో అమలవుతున్న రెడ్బుక్ రాజ్యాంగంతో బెంబేలెత్తి వెనక్కి వెళ్లిపోయింది. తమకు కేటాయించిన భూములను రద్దు చేయాలంటూ లేఖ రాసింది. దీంతో జిన్ఫ్రాకు భూ కేటాయింపులను రద్దు చేస్తూ 2026 ఫిబ్రవరి 27న పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ ఉత్తర్వులు ఇచ్చారు. కంపెనీ విజ్ఞప్తి మేరకు భూ కేటాయింపులు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నాల్కో మిథాని యూనిట్ ప్యాకప్...!కేంద్రంలో అధికారాన్ని పంచుకుంటూ రాష్ట్రానికి కొత్త పీఎస్యూ ప్రాజెక్టులను తేకపోగా గతంలో ఏపీకి వచ్చిన వాటిని కూడా చంద్రబాబు సర్కారు వెళ్లగొడుతోంది. రెండు కేంద్ర ప్రభుత్వ రంగ కీలక సంస్థలు నాల్కో, మిథాని కలిసి నెల్లూరు జిల్లాలో రూ.5,500 కోట్ల పెట్టుబడి అంచనాతో ఏడాదికి 60,000 టన్నుల అల్యూమినియం ఉత్పత్తి సామర్థ్యంతో యూనిట్ నెలకొల్పేలా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో గత ప్రభుత్వంలో ఒప్పందం కుదిరింది. ఇప్పుడు ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవడంపై త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు నాల్కో ప్రకటించింది. 2024–25 వార్షిక నివేదికలో ఈ ప్రాజెక్టు గురించి నాల్కో స్పష్టంగా పేర్కొంది. కేంద్ర ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న టీడీపీ కూటమి పెద్దలు దీనిపై కనీసం స్పందించకపోవడం పట్ల అధికారులు విస్తుపోతున్నారు. ప్రైవేటు కంపెనీలకు సొంత ఇనుప గనులను కేటాయించేందుకు ఢిల్లీకి పరుగులు తీస్తున్న రాష్ట్ర మంతులు కీలకమైన కేంద్ర ప్రాజెక్టు ఏపీ నుంచి వెనక్కు వెళ్లిపోతున్నా పట్టించుకోకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.జారుకున్న ‘జూపిటర్..’ అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద జూపిటర్ రెన్యువబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.2,700 కోట్ల పెట్టుబడితో 2,216 మందికి ఉపాధి కల్పించే ప్రతిపాదనకు ఎస్ఐపీబీ 6వ సమావేశంలో ఆమోదం లభించింది. 4.8 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ పీవీ సెల్, 1.5 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ మాడ్యూల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు 142 ఎకరాలను కేటాయిస్తూ 2025 మే 23న జీవో ఎంఎస్ నెంబర్ 85 జారీ అయింది. ఎకరం కేవలం రూ.50 లక్షల చొప్పున రాయితీ ధరకు భూమిని కేటాయించారు. కానీ ఏడాది తిరగకుండా ఆ భూములు తమకొద్దని.. రూపాయి కూడా చెల్లించేది లేదని జూపిటర్ కుండబద్ధలు కొట్టింది. తమ పేరు మీద భూ కేటాయింపులను రద్దు చేయాలని కోరింది. దీంతో జూపిటర్కు కేటాయించిన 142 ఎకరాలను రద్దు చేస్తూ ఫిబ్రవరి 27న రాష్ట్ర ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. -
నిర్బంధాల కంచె దాటి.. అంగన్వాడీ ఉద్యమవేడి
పోలీసులను ప్రయోగించి అంగన్వాడీ యూనియన్ నేతలను చంద్రబాబు ప్రభుత్వం గృహాల్లోనే నిర్బంధించింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లను పిలిచి మరీ విజయవాడ వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ‘ఎక్కువ మంది వెళ్తే ఊరుకునేది లేదు.. తప్పదనుకుంటే నలుగురైదుగురు వెళ్లండి’ అంటూ ఐసీడీఎస్ అధికారులు ఆంక్షలు పెట్టారు. అయినా నిర్బంధాల కంచెను పెకలించుకుని అంగన్వాడీలు పోరుబాట పట్టి.. న్యాయం కోసం నినాదాల పొలికేక పెట్టారు. మండే ఎండను సైతం లెక్కచేయకుండా చంటి బిడ్డలను చంకనెత్తుకుని కొందరు.. చేతి సంచిలో అన్నం క్యారేజీలు పెట్టుకుని మరికొందరు విజయవాడ తరలివచ్చి నిరసన గళమెత్తారు. సాక్షి, అమరావతి: అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల ఉద్యమంతో బెజవాడ మరోసారి ఎరుపెక్కింది. ఆంక్షల కంచెను పెకలించుకుని.. మండేఎండను సైతం లెక్కచేయక కదం తొక్కి మరీ ఉద్యమ వేడిని రగిలించారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ సంఘాల చలో విజయవాడ పిలుపునందుకుని సోమవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు నగరానికి ఉవ్వెత్తున తరలివచ్చారు. అంతా విజయవాడ ధర్నా చౌక్కు చేరుకుని ‘ధర్నా’గ్రహానికి దిగారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో తరలివచ్చిన అంగన్వాడీలతో ఐలాపురం జంక్షన్, రైల్వేస్టేషన్, బస్టాండ్, బందర్ రోడ్, ఏలూరు రోడ్ వంటి ప్రధాన రహదారులు కిక్కిరిసిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. డిమాండ్లు నెరవేర్చే వరకూ వెనక్కి తగ్గం ధర్నా చౌక్లో ఆందోళన సందర్భంగా జరిగిన సభలో మూడు యూనియన్ల ముఖ్య నాయకులు కె.సుబ్బరావమ్మ, బేబీరాణి, ఎన్సీహెచ్ సుప్రజ, జె.లలిత, వీఆర్ జ్యోతి తదితరులు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు, ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చేవరకు ఆందోళన విరమించేది లేదని అల్టీమేటం ఇచ్చారు. వివిధ రాజకీయ పార్టీలు, కార్మీక సంఘాలు అంగన్వాడీల పోరాటానికి సంఘీభావం ప్రకటించాయి. కల్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లను తాత్కాలిక జైళ్లుగా మార్చేసి.. ఒకవైపు అంగన్వాడీల డిమాండ్ల పరిష్కారానికి సానుకూలంగా ఉన్నామని మంత్రులతో ప్రకటనలు చేయించిన చంద్రబాబు ప్రభుత్వం.. మరోవైపు అంగన్వాడీల ఆందోళనను విఫలం చేసేందుకు సర్వశక్తులు ఒడ్డింది. పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు(హౌస్ అరెస్టుల)తో తీవ్రమైన ఆంక్షలు పెట్టింది.విజయవాడలో అంగన్వాడీలు అడుగుపెట్టకుండా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ప్రధాన కూడళ్ల వద్ద, ఏలూరు రోడ్డు, బీఆర్టీఎస్ రోడ్డులో వేలాది మందిని అదుపులోకి తీసుకుని కల్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లలో నిర్బంధించి వాటిని తాత్కాలిక జైళ్లుగా మార్చేశారు. ఇబ్రహీంపట్నం, గన్నవరం, పెనమలూరు పరిసరాల్లో చెక్ పోస్ట్లు ఏర్పాటు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ తదితర ప్రాంతాల్లో యూనియన్ నేతలను గృహ నిర్బంధం చేశారు. ఛలో విజయవాడకు బయలుదేరుతున్న వారిని రైల్వే స్టేషన్లలోనే నిలిపివేశారు.విశాఖలోని పలు ప్రాంతాల నుండి బయలుదేరుతున్న కార్యకర్తలను, సీఐటీయూ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశి్చమ గోదావరి జిల్లా నరసాపురం, పాలకొల్లు వంటి ప్రాంతాల్లో రైళ్లలో విజయవాడకు వస్తున్న వారిని రైల్వే స్టేషన్లలోనే అడ్డుకుని స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లోనూ పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు. విజయవాడకు వచ్చే వారిపై ఎక్కడికక్కడ పోలీస్ నిఘా పెట్టారు. శ్రీకాకుళంలో అంగన్వాడీలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల నుంచి విజయవాడ వచ్చే ప్రధాన రహదారులపై పోలీసులు తనిఖీలు చేపట్టి పలువురు నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేశారు. చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని నోటీసులు సైతం ఇచ్చారు. అనేక జిల్లాల్లో చెక్పోస్టులు పెట్టి తనిఖీలు చేసి అడ్డుకోవడం గమనార్హం. ఎలాంటి ఆంక్షలు విధించినా.. భారీ సంఖ్యలో అంగన్వాడీలు చేరుకోవడంతో చలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైంది. ధర్నా చౌక్లోనే వంటా వార్పు.. రోడ్డుపైనే నిద్ర చంద్రబాబు ప్రభుత్వం స్పందించకపోడంతో సోమవారం రాత్రి కూడా అంగన్వాడీలు నిరసన కొనసాగించారు. ధర్నా చౌక్లోనే వంటా వార్పు చేపట్టి రోడ్లపైనే భోజనాలు చేశారు. అక్కడే నిద్రించి నిరసన తీవ్రతను చూపించారు. చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు కోసం దాదాపు 20 నెలలపాటు ఎదురు చూశామని, ఇకపై ఓర్పు వహించేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. మంగళవారం నాటికి ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని, అసెంబ్లీ సమావేశాలు ముగిసే నాటికి తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. చట్ట ప్రకారం నెలకు రూ.32 వేలు ఇవ్వాల్సి ఉన్నా.. కనీసం రూ.26 వేలు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. వేతనం పెంపుతోపాటు మిగిలిన డిమాండ్స్ కూడా అమలు చేయకపోతే ఐసీడీఎస్ కార్యాలయాల వద్ద ఉద్యమాన్ని చేపడతామని, రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు వెళ్తామని మూడు యూనియన్ల నేతలు హెచ్చరించారు.కీలక డిమాండ్లు ఇవీ..అంగన్వాడీలు ప్రభుత్వం ముందు కీలక డిమాండ్లు ఉంచారు. వేతనాల పెంపుపై ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా గౌరవ వేతనాన్ని పెంచాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాట్యుటీ సౌకర్యం కలి్పంచాలి. యాప్ల ద్వారా ఆన్లైన్ పని భారాన్ని తగ్గించి, రిజిస్టర్ల నిర్వహణను సరళతరం చేయాలి. పదవీ విరమణ సందర్భంగా ఇచ్చే ప్రయోజనాలను పెంచాలి. చాలీచాలని వేతనాలతో నెట్టుకొస్తున్నందున అంగన్వాడీలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి. -
‘బాబూ.. అగ్రి గోల్డ్ బాధితుల ఆర్తనాదాలు వినండి’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అగ్రి గోల్డ్ బాధితుల ఆర్తనాదాలను సీఎం చంద్రబాబు పట్టించుకోవాలని, బాధితులకు చంద్రబాబు ఇచ్చిన హామీల అమలుకు అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు స్పష్టమైన చర్యలు చేపట్టాలని వక్తలు కోరారు. విజయవాడ ధర్నాచౌక్లో అగ్రి గోల్డ్ బాధితుల రిలే దీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. అగ్రి గోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన ధర్నాలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య, ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడారు.కంపెనీ చైర్మన్ అవ్వా సీతారామారావు, వారి సోదరుల కుటుంబ సభ్యుల పేరిట గల ఆస్తులను కూడా తక్షణమే జప్తు చేయాలని కోరారు. అగ్రి గోల్డ్ ఆస్తులను వేలం వేసి నిలువునా మోసపోయిన బాధితులకు న్యాయం చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. గత ఎన్నికల్లో ఓట్లను అభ్యర్ధించే సమయంలో ఇంటింటా ప్రచారం చేసిన కూటమి నేతలు అగ్రి గోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు.ఆ హామీలను అమలు చేయకుండా 20 నెలలుగా సీఎం చంద్రబాబు మౌనం వహించడం బాధ్యతారాహిత్యమేనన్నారు. అగ్రి గోల్డ్ బాధితుల నిరవధిక దీక్షలకు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. కార్యక్రమంలో అసోసియేషన్ ఉప ప్రధాన కార్యదర్శి బి.చంద్రశేఖర్, అసోసియేషన్ నాయకులు రామదాసు, సుబ్రహ్మణ్యం, శంకరయ్య, వెంకటేశ్వర్లు మాట్లాడారు. తొలి రోజు రిలే దీక్షలో ప్రకాశం, నెల్లూరు జిల్లాల బాధితులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 4న బుధవారం విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం అరకు చేరుకుని తంగుల్గూడాలో ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్నారు.అనంతరం విశాఖ చేరుకుని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నివాసానికి వెళ్తారు. ఇటీవల వివాహం చేసుకున్న నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. ఈ నెల 5న గురువారం వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు చేరుకుని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్కు హాజరవుతారు. -
ప్రవాసాంధ్రులను తక్షణం సురక్షితంగా తీసుకురావాలి: వైఎస్ జగన్
తాడేపల్లి: అమెరికా-ఇజ్రాయిల్, ఇరాన్ల యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులను తక్షణమే సురక్షితంగా తీసుకురావాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. యుద్ధం నేపథ్యంలో ప్రవాసాంధ్రుల రక్షణ అంశానికి సంబంధించి వైఎస్ జగన్ ప్రకటన చేశారు.‘ఏపీకి చెందిన వేలాదిమంది గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులను తక్షణం సురక్షితంగా తీసుకురావాలి. యుద్ధం వల్ల అనిశ్చితి నెలకొనడంతో పాటు భద్రత కొరవడింది. పలు విమానాశ్రయాల్లో ఆంక్షలు, విమాన సర్వీసుల రద్దు వల్ల చాలామంది ఎక్కడికక్కడి చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్నారు. వారందరినీ ఇక్కడకి తీసుకురావడంలో ప్రభుత్వం చొరవ చూపాలి. కేంద్రంతో ఏపీ ప్రభుత్వం సమన్వయం చేసుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేయండి. ఆంధ్రుల భద్రత, సురక్షిత ప్రయాణం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. సంక్షోభ సమయం రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి. అక్కడి వారి పరిస్థితిని ఎప్పడికప్పుడు, వారి కుటుంబాలకు తెలియజేసే విధంగా ఇక్కడ ప్రత్యేక కంట్రోల్రూమ్ ఏర్పాటు చేసి, హెల్ప్లైన్ నెంబర్లు కూడా అందుబాటులోకి తేవాలి’ అని వైఎస్ జగన్ సూచించారు. -
నిర్బంధంతో ఉద్యమాన్ని అడ్డుకోలేరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం నిర్బంధంతో అంగన్వాడీల ఉద్యమాన్ని అడ్డుకోలేరని సీఐటీయూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ హెచ్చరించింది. ఈ మేరకు సీఐటీయూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఏవీ నాగేశ్వరరావు, సిహెచ్.నరసింగరావు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం విజయవాడలో మహాధర్నా చేపట్టనున్నారని పేర్కొన్నారు.విజయవాడకు వస్తున్న అంగన్వాడీలను కర్నూలు, నంద్యాల రైల్వేస్టేషన్లో నిర్బంధించడాన్ని ఖండించారు. ఎమ్మెల్యేలు అంగన్వాడీలను తమ ఆఫీసులకు పిలిచి మరీ బెదిరించడం సరికాదన్నారు. రెండేళ్ల నుంచి వేతనాల పెంపు ప్రకటన రాకపోవడంతో ఆందోళన బాట పట్టారని స్పష్టం చేశారు. -
ముంచుకొస్తున్న భారీ భయం!
సాక్షి, అమరావతి: దేశంలో ఊబకాయం సమస్య చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రస్తుతం దేశంలోని 9.8 శాతం మంది మహిళలు, 5.4 శాతం మంది పురుషులు ఊబకాయ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య 2050 నాటికి మహిళల్లో 17.4 శాతం, పురుషుల్లో 12.1 శాతానికి పెరుగుతుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ అంశాన్ని ఢిల్లీ ఎయిమ్స్, వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ, గురుగ్రామ్లోని ఫోరి్టస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, త్రివేండ్రంలోని జ్యోతిదేవ్ డయాబెటిస్ రీసెర్చ్ సెంటర్ వంటి ప్రముఖ సంస్థలకు చెందిన 12 మంది నిపుణులు రూపొందించిన నివేదికలో వెల్లడించారు. అంతర్జాతీయంగా ఊబకాయాన్ని దీర్ఘకాలిక వ్యాధిగా గుర్తించినప్పటికీ.. భారత్లో మాత్రం జీవన శైలి సమస్యగా మాత్రమే చూస్తున్నారని పేర్కొన్నారు. వేగంగా విస్తరిస్తున్న ఈ సమస్యను అరికట్టడానికి విధానపరమైన మార్పులు అవసరమని సిఫార్సు చేశారు. కొంప ముంచుతున్న హెడోనిక్ హంగర్ 5 నుంచి 19 ఏళ్ల వయసు పిల్లలు, యువతలో ఊబకాయం సమస్య అత్యధికంగా ఉంటోంది. 1990–2022 మధ్య బాలికల్లో 0.1 శాతం నుంచి 3.1 శాతానికి, బాలురలో 0.2 శాతం నుంచి 3.7 శాతానికి సమస్య పెరిగింది. ఇది కేవలం జన్యులోపంతో వచ్చే సమస్య మాత్రమే కాదని.. జీవక్రియ, నరాల సంబంధిత, పర్యావరణ కారకాల కలయికతో వస్తుందని నిపుణులు స్పష్టం చేశారు. శరీరంలో కొవ్వు కణాలు పెరగడంతో వచ్చే వాపు ఇన్సులిన్ నిరోధకతకు, గుండె జబ్బులు, కాలేయ వ్యాధులకు దారితీస్తోందని.. క్లోమ, మూత్రాశయ, రొమ్ము, గర్భాశయ కేన్సర్ల ముప్పు పెంచుతోందని హెచ్చరించారు.శరీరానికి శక్తి అవసరం లేకపోయినా.. కేవలం నోటికి రుచి కోసం తీసుకునే హెడోనిక్ హంగర్ కొంప ముంచుతున్నట్టు స్పష్టం చేశారు. ఆకలి లేకపోయినా ఆనందం, ఆహ్లాదం, నోటికి రుచి కోసం తీసుకునే స్వీట్లు, బిర్యానీ, పిజ్జా, ఇతర జంక్ ఫుడ్స్ ప్రమాదకరమని స్పష్టం చేశారు. ఆన్లైన్ యాప్ల ద్వారా ఫుడ్ డెలివరీ సౌకర్యం అందుబాటులోకి వచ్చాక హెడోనిక్ హంగర్ ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. ఇలా హెడోనిక్ హంగర్ అలవాటు ఉన్న వాళ్లు పదేళ్లలో ఊబకాయం బారినపడతారని వైద్య నిపుణులు హెచ్చరించారు. కార్యాచరణ అత్యవసరం ఊబకాయాన్ని నిరోధించేందుకు అత్యవసర కార్యాచరణ చేపట్టాలని శ్వేతపత్రంలో నిపుణులు స్పష్టం చేశారు. ఊబకాయం నిర్వహణకు దేశవ్యాప్తంగా ఒకే రకమైన చికిత్స, పర్యవేక్షణకు మార్గదర్శకాలు అవసరమని నొక్కిచెప్పారు. ప్రభుత్వాస్పత్రుల్లో క్లినిక్ల ఏర్పాటు, పాఠశాల దశలోనే పిల్లల ఆహార అలవాట్లలో మార్పు తెచ్చే కార్యక్రమాలు సహా ఈ చికిత్సలకు బీమా సౌకర్యం వంటివి కూడా తీసుకురావాలని శ్వేతపత్రంలో సూచించారు. -
బాబు బోర్డు తిప్పేశారు
సాక్షి, అమరావతి: హామీలతో నమ్మించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా, తమను ఆదుకునే చర్యలు చేపట్టకపోవడంతో అగ్రిగోల్డ్ బాధితులు మరోసారి ఆందోళన బాట పట్టారు. కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో బాధితులకు అగ్రిగోల్డ్ కంపెనీ ఆస్తులు అమ్మి సొమ్ము చెల్లిస్తామనే హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోకపోవడంతో బాధితులు మహా విజ్ఞాపన దినం, కన్నీటి పాదయాత్ర, అగ్రిగోల్డ్ ఆవేదన దీక్ష వంటి ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మరోసారి ఉద్యమ కార్యాచరణ చేపట్టారు. తొమ్మిది ప్రధాన డిమాండ్లపై ఇప్పటికే రాష్ట్ర హోంమంత్రి అనితతో చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఈ నెల 2వ తేదీ నుంచి మరోసారి విజయవాడ ధర్నా చౌక్లో నిరాహార దీక్షలు చేపట్టి తాజా ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు అగ్రిగోల్డ్ బాధిత సంఘం ప్రకటించింది. 4వ తేదీ వరకూ రిలే నిరాహార దీక్షాలు చేపట్టి, అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే 5వ తేదీ నుంచి నిరవధిక నిరాహార దీక్షలు చేపడతామని ఆదివారం విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఏపీ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం, దానికి తోడు ప్రభుత్వం అలసత్వం, మోసపూరిత విధానాలను ఈ సందర్భంగా నిరసించారు.హామీ ఇచ్చి ఆదుకున్న జగన్ 2019 ముందు అధికారంలో ఉన్న చంద్రబాబు అగ్రిగోల్డ్ బాధితుల వేదనను పట్టించుకోకపోవడంతో పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగాయి. అప్పట్లో వారిని కలిసి సంఘీభావం తెలిపిన వైఎస్ జగన్, బాధితుల పక్షాన పోరాడేందుకు ప్రస్తుత ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి నేతృత్వంలో వైఎస్సార్సీపీ అగ్రిగోల్డ్ బాధితుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. బాధితులకు అండగా అనేక ఆందోళనల్లో వైఎస్సార్సీపీ నేతలు పాల్గొని మద్దతు పలికారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారానికి చంద్రబాబుకు మనస్సు రాకపోతే తాను అధికారంలోకి వచ్చాక రూ.20వేల లోపు డిపాజిట్లు చెల్లించి ఆదుకుంటామని అప్పట్లో జగన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.10వేలు, రూ.20వేలు చొప్పున డిపాజిట్లు ఉన్న 10.40లక్షల మందికి రెండు విడతల్లో మొత్తం రూ.905.57 కోట్లు చెల్లించి జగన్ ప్రభుత్వం ఆదుకుంది. వైఎస్ జగన్ తరహాలో మిగిలిన బాధితులను ఆదుకుని ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని చంద్రబాబుకు అగ్రిగోల్డ్ బాధితులు అల్టిమేటం ఇచ్చారు. -
మధ్యవర్తిత్వంతో మేలైన న్యాయం
సాక్షి, అమరావతి: కోర్టుల్లో కేసులు పేరుకుపోకుండా మధ్యవర్తిత్వం ఎంతో ఉపయోగపడుతుందని, కక్షిదారులకు తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో మేలైన న్యాయం అందుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నేతృత్వంలో మధ్యవర్తిత్వంపై రాష్ట్ర స్థాయి సదస్సును ఆదివారం విజయవాడలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీజేఐ మాట్లాడుతూ మధ్యవర్తిత్వాన్ని కేవలం ప్రత్యామ్నాయంగా కాకుండా ప్రాధాన్యం గల పద్ధతిగా చూడాలన్నారు. ఇదో అద్భుతమైన మార్గమని, మొదటి అంతర్జాతీయ మధ్యవర్తిత్వ సదస్సు ఢిల్లీలో జరిగిందని చెప్పారు. వాస్తవానికి భారతదేశ డీఎన్ఏలోనే మధ్యవర్తిత్వం ఉందని, పురాణ కాలం నుంచే ఇది అమలులో ఉందన్నారు. కురుక్షేత్రం జరగకుండా పాండవులకు, కౌరవులకు మధ్య శాంతి కోసం శ్రీకృష్ణుడు చేసిన రాయబారాన్ని తొలి అధికారిక మధ్యవర్తిత్వంగా ఉదహరించారు. ఆర్బిట్రేషన్పై విశ్వాసం పెంచుకోవాలి మధ్యవర్తిత్వం(ఆర్బిట్రేషన్)తో పరిష్కారమయ్యే కేసులూ కోర్టుల్లో పెండింగ్లో ఉండిపోతున్నాయని, ఆర్బిట్రేషన్ ప్రక్రియపై కక్షిదారులు నమ్మకం పొందడం చాలా ముఖ్యమని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. 2023లో వచ్చిన మధ్యవర్తిత్వ చట్టంతో దీనికి ఒక చట్టబద్ధత లభించిందని, దీని ద్వారా జరిగే పరిష్కారాలు కోర్టు డిక్రీతో సమానంగా అమలు చేస్తారని స్పష్టం చేశారు. మధ్యవర్తులుగా వ్యవహరించే వారికి సరైన శిక్షణ చాలా అవసరమని పేర్కొన్నారు. మధ్యవర్తిత్వం అంతర్జాతీయంగానూ ఇప్పుడు ప్రముఖ పాత్ర పోషిస్తోందని, మలేషియాలో మధ్యవర్తిత్వానికి దొరుకుతున్న ప్రోత్సాహాన్ని తాను స్వయంగా చూసినట్టు జస్టిస్ సూర్యకాంత్ ఉదహరించారు. ఆంధ్రప్రదేశ్లో మీడియేషన్ విషయంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ముఖ్యమంత్రితో చేసిన మీడియేషన్ విజయవంతం అయిందన్నారు. ప్రజలు రాజీ మార్గాలను ఎంచుకునేలా ప్రోత్సహించాలి : హైకోర్టు సీజే ధీరజ్ సింగ్ ఠాకూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ప్రజలు న్యాయ పోరాటాల కంటే రాజీ మార్గాలను ఎంచుకునేలా ప్రోత్సాహించాలని సూచించారు. జమ్మూ కశ్మీర్లో జడ్జిగా ఉన్న సమయంలో అమెరికాలో సెటిల్ అయిన ఒక వ్యక్తి వారసత్వ ఆస్తి గురించి తనను ఓ న్యాయవాదిగా సంప్రదించారని, అప్పుడు తాను ‘‘ఎందుకు మీరు మీ సోదరునితో మాట్లాడకూడదు’’ అని ఆయనకు చెప్పినట్టు గుర్తు చేశారు. ఆరు నెలల తర్వాత ఆయన కనిపించి తన ఫ్యామిలినీ, తన సోదరుడిని దూరం చేసుకోలేదని తనకు చెప్పారని వివరించారు. రాజీకి ఉన్న శక్తి అలాంటిదని వివరించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జితేంద్రకుమార్ మహేశ్వరి మాట్లాడుతూ.. చర్చల ద్వారా పరస్పర అంగీకారంతో చాలా సమస్యలు పరిష్కారమవుతాయని వివరించారు. దీనివల్ల సంబంధాలు దెబ్బతినకుండా ఉంటాయన్నారు. ఏపీ లీగల్ సెల్ అథారిటీ చైర్మన్ జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించడానికి మధ్యవర్తిత్వం గొప్ప మార్గమని అభిప్రాయపడ్డారు. గతంలో మధ్యవర్తిత్వ చట్టం ద్వారా దాదాపు 2 లక్షల కేసులు పరిష్కరించినట్టు గుర్తు చేశారు. కేసులను మరింత సమర్థవంతంగా పరిష్కరించడానికి, ఇటీవలే దాదాపు 400 మంది న్యాయవాదులకు మధ్యవర్తుల అంశాలకు సంబంధించి శిక్షణ ఇచ్చామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్, ఎనీ్టఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, జిల్లా జడ్జిలు, జుడీషియల్ అధికారులు, న్యాయవాదులు, బెజవాడ బార్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. సత్వర న్యాయంతో త్వరితగతిన అభివృద్ధి: సీఎం చంద్రబాబు సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణంలో భాగంగా జస్టిస్ సిటీలో న్యాయ వ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, జుడిషియల్ అకాడమీ, లీగల్ సర్వీసెస్ అథారిటీ, మీడియేషన్ సెంటర్, ఇంటర్నేషనల్ లా యూనివర్శిటీ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వంటి కేంద్రాలను సమీకృతం చేస్తూ బెస్ట్ జుడీషియల్ సిటీని నిరి్మస్తామని పేర్కొన్నారు. గ్రామాల్లో మధ్యవర్తిత్వం ద్వారా చాలా సమస్యలను పరిష్కరించేవారని, తన తండ్రి కూడా పెద్దరికం వహించి గ్రామంలోని సమస్యలను పరిష్కరించినట్టు చెప్పారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసులను పరిష్కరిస్తే రూ.10 వేలు ఇస్తామని, కేసులు పరిష్కారం కాకున్నా రూ.3 వేలు ఇస్తామని సీఎం ప్రకటించారు. భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్లూ–గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా అమరావతి ఉంటుందని తెలిపారు. న్యాయమూర్తుల గృహ సముదాయం ప్రారంభం అమరావతిలో సీఆర్డీఏ ఆధ్వర్యంలో రూ.210 కోట్లతో చేపట్టిన 36 మంది జడ్జిల బంగాళాల సముదాయాన్ని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ప్రారంభించారు. ఇక్కడ ప్రతి నివాస గృహాన్ని 7,841 చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ ప్లస్ 1 నమూనాలో నిర్మించారు. నివాస సముదాయ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని సీజేఐ ఆవిష్కరించారు. అనంతరం సముదాయ ఆవరణలో మొక్కలు నాటారు. మధ్యాహ్నం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ విజయవాడలోని లోక్ భవన్లో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్కు మర్యాదపూర్వకంగా తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. జుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన తాడికొండ: అమరావతి సమీపంలోని పిచ్చుకలపాలెం వద్ద జుడీషియల్ అకాడమీ నిర్మాణానికి ఆదివారం భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. తొలుత జుడీషియల్ అకాడమీ రూపొందించిన ఆడియో, వీడియోను తిలకించిన అనంతరం ఆయన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ జుడీషియల్ అకాడమీని రూ.165 కోట్లతో నిర్మిస్తుండగా దీనిలో బ్లాక్ బీలో జీ ప్లస్–3 అంతస్తులతో అకడమిక్ బ్లాక్ నిరి్మస్తున్నారు. జీ ప్లస్–8 అంతస్తులతో హాస్టల్ బ్లాక్, జీ ప్లస్–3 అంతస్తుల్లో ఇండోర్ స్పోర్ట్స్, గెస్ట్ ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు. మొత్తం భవన విస్తీర్ణం 2.05 లక్షల చదరపు అడుగులు. ఏపీ హైకోర్టు నుంచి ఈ అకాడమీ 5.7 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి 50 మీటర్ల వెడల్పు కలిగిన రహదారి సౌకర్యం ఉంది. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు.ఎయిర్పోర్ట్లో సీజేఐకి ఘనస్వాగతం విమానాశ్రయం(గన్నవరం): భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్కు ఆదివారం గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. విజయవాడ, అమరావతిలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన తిరుపతి నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 1.35 గంటలకు గన్నవరం చేరుకున్నారు. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్తోపాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ దొనడి రమేష్, జస్టిస్ జయసూర్య, జస్టిస్ మహేశ్వరరావు, జస్టిస్ టీసీడీ శేఖర్ కూడా వచ్చారు. విమానాశ్రయంలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్కు డీజీపీ హరీష్ కుమార్గుప్తా, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు స్వాగతం పలికారు. అదేవిధంగా సాయంత్రం ప్రత్యేక విమానంలో సీజేఐ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయనకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, సీఎం చంద్రబాబు తదితరులు వీడ్కోలు పలికారు.న్యాయ వ్యవస్థపై విశ్వసనీయత పెరగాలిసుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్తిరుపతి లీగల్: ప్రజల్లో న్యాయవ్యవస్థపై విశ్వసనీయత పెరిగేలా న్యాయమూర్తులు, న్యాయవాదులు విధులు నిర్వహించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. ఆదివారం తిరుపతి మండలం దామినేడు వద్ద కోర్టు భవనాల సముదాయానికి భూమి పూజ, శిలాఫలకం ఆవిష్కరణలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశాన్ని సీజేఐ, ఇతర న్యాయమూర్తులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తికీ సత్వర న్యాయం పొందే హక్కు ఉందని చెప్పారు. న్యాయవాదులు న్యాయవ్యవస్థలో భాగమని, వారు ప్రత్యేకం కాదన్నారు. నూతన కోర్టు భవన సముదాయంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సీజేఐ సూచించారు. న్యాయం ఎప్పటికీ ఆగదుఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గతంలో కోర్టులలో సరైన వసతులు ఉండేవి కావని, మహిళా న్యాయవాదులు ఇబ్బందులు పడేవారని, ఇప్పుడు పరిస్థితులు క్రమేణా మెరుగు పడుతున్నాయని, కోర్టులలో మౌలిక సదుపాయాల కల్పనపై శ్రద్ధ కనిపిస్తోందని వెల్లడించారు. న్యాయం ఎప్పటికీ ఆగదు.. అదే న్యాయమూర్తుల ఆత్మస్ఫూర్తి అని కొనియాడారు. 2023లో రాష్ట్రంలోని అన్ని కోర్టుల్లో ఏసీలను ఏర్పాటు చేసినట్టు గుర్తుచేశారు. సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ జేకే మహేశ్వరి మాట్లాడుతూ న్యాయవ్యవస్థ గొప్పదనం భవనాల్లో కాదని, వాటి లోపల జరిగే న్యాయప్రక్రియ, నిష్పాక్షిక తీర్పుల్లో ఉంటుందని పేర్కొన్నారు. తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రమే కాదని, ధర్మానికి ప్రతీకని అభివర్ణించారు. అనంతరం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిపాలన జడ్జి జస్టిస్ జయసూర్య, తిరుపతి న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు గొట్టి గజేంద్ర ప్రసంగించారు. భవన నిర్మాణాలకు సహకరించిన న్యాయమూర్తులకు ధన్యవాదాలు తెలిపారు. న్యాయవాదుల అసోసియేషన్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను సన్మానించారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నరసింహ, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డి.రమేష్, జస్టిస్ మహేశ్వరరావు, జస్టిస్ శేఖర్, ఉమ్మడి చిత్తూరు జిల్లా జడ్జి అరుణ సారిక, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శేషాద్రి నాయుడు, న్యాయవాదులు పాల్గొన్నారు.భూమి పూజకు అటెండర్ను ఆహ్వానించిన సీజేఐ నూతన కోర్టు భవనాల భూమి పూజ చేస్తున్నప్పుడు న్యాయమూర్తులు, ఇతర అధికారులందరూ ఇటుకలు పేర్చి పూజలు చేశారు. ఈ సమయంలో సీజేఐ సూర్యకాంత్ జిల్లా కోర్టు అటెండర్ను ఆత్మీయంగా ఆహ్వానించారు. ఆయన చేత ఇటుక పెట్టించి పూజ చేయించారు. ఈ ఘటన అందరినీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. -
ఎంకే స్టాలిన్కు వైఎస్ జగన్ బర్త్ డే విషెస్
సాక్షి, తాడేపల్లి: తమిళనాడు సీఎం స్టాలిన్కి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.Warm birthday greetings to Thiru @mkstalin Avargal. Wishing you good health and continued happiness.— YS Jagan Mohan Reddy (@ysjagan) March 1, 2026 -
ఇరాన్, ఇజ్రాయిల్లో జాగ్రత్తగా ఉండండి
సాక్షి, అమరావతి: ఇరాన్పై అమెరికా యుద్ధం ప్రారంభించిన నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయిల్తోపాటు, సౌదీ అరేబియాల్లో ఉన్న ప్రవాసాంధ్రులు జాగ్రత్తగా ఉండాలని ఏపీ ఎన్ఆర్టీఎస్ సూచించింది. ఇజ్రాయిల్, ఇరాన్లో ఉన్న భారతీయులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లడంతో పాటు ఆయా దేశాలు జారీచేసిన సూచనలను తప్పకుండా పాటించాల్సిందిగా భారత విదేశాంగ శాఖ సూచించింది. తదుపరి నోటీసు వచ్చేవరకు అనవసర ప్రయాణాలను రద్దుచేసుకోవాలని కోరింది. ఇజ్రాయెల్లోని భారత రాయబార కార్యాలయం, టెల్ అవీవ్–24్ఠ7 హెల్ప్లైన్: +972–54–7520711.. ఇరాన్లోని +989128109 115, +989128109109, +989128109102, +9899321793 59 నంబర్లలో సంప్రదించాలని కోరింది. యుద్ధం విస్తరిస్తున్నందున పశ్చిమాసియాలోని ప్రవాసాంధ్రులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పింది. భారత ఎంబసీతో ఏపీ ఎన్ఆర్టీఎస్ సంప్రదింపులు జరుపుతుందని, అత్యవసరమైతే హెల్ప్లైన్ నంబర్ +91 8500 027678ను సంప్రదించాలని ఎన్ఆర్ఐ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు.


