Amaravati
-
ఏపీలో పెట్రో కొరతపై కేంద్రానికి ఎంపీ గురుమూర్తి లేఖ
ఢిల్లీ: ఏపీలో పెట్రోల్, డీజిల్ సంక్షోభాన్ని నివారించేందుకు తక్షణమే జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి కోరారు. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి ఎంపీ గురుమూర్తి లేఖ రాశారు. ‘ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ రాష్ట్రంలో 4510 పెట్రోల్ బంకుల్లో 70 శాతం నో స్టాక్ బోర్డులు వెలిశాయి. వాహనదారులకు పెట్రోల్, డీజిల్ రేషన్ విధిస్తున్నారు. కానీ పెట్రోలియం శాఖ దేశ వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ సప్లై కి ఎలాంటి అవరోధాలు లేవని చెప్తుంది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ నుంచి ఎలాంటి డిమాండ్ లేదని ప్రభుత్వం చెప్తుంది. క్షేత్రస్థాయికి , ప్రభుత్వ లెక్కలకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. ప్రజలు ఇబ్బంది పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం చర్యలు శూన్యం. పెట్రోల్ డీజిల్ కొరత ఫలితంగా వ్యాపారులు రైతులు పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని కొరతకు గల కారణాలను దర్యాప్తు చేయాలి. బ్లాక్ మార్కెటింగ్, హోర్డింగ్ తదితర అంశాలపై దృష్టి సారించాలి. ఏపీ అవసరాలకు తగిన పెట్రోల్ డీజిల్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలి’ అని విజ్ఞప్తి చేశారు. -
లోకేశ్ ఏంటిది?.. ఆరు నెలలకు నిద్ర లేచిన మంత్రి టీమ్..
సాక్షి, అమరావతి: క్వాంటమ్ కంప్యూటింగ్... ఈ పదాన్ని చంద్రబాబు సర్కారు రాష్ట్రంలో బాగా ప్రచారం చేస్తోంది. ఎటువంటి సమస్యకైనా మిల్లీ సెకన్లలో పరిష్కారం చూపించే సత్తా ఉందంటూ ఊదరగొడుతోంది. కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ను పర్యవేక్షించే మంత్రి నారా లోకేశ్ శాఖ మాత్రం తప్పుడు జీవోలు జారీ చేసే శాఖగా మారిపోయింది. ఏకంగా జీవోల్లో కంపెనీల పేర్లనే మార్చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. తీరా దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు.. తప్పు జరిగిన ఆరు నెలల తర్వాత నిదానంగా నిద్రలేచిన లోకేశ్ టీం తప్పులను సరిదిద్దుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంతో చంద్రబాబు బడాయి మాటల బండారం ప్రపంచానికి తెలిసిపోయింది. అసలేం జరిగిందంటే... కంపెనీల పేర్లనే పూర్తిగా మార్చేసి జీవోలు.. గతేడాది నవంబర్ నెలలో ఐటీ శాఖ ఎస్సీఐసీబీ వెంచర్స్ ఎల్ఎల్పీ అనే సంస్థ రూ.550 కోట్లతో శ్రీ సిటీలో ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ జీవో ఎంఎస్ నెంబర్ 49.., క్రేయాన్ టెక్నాలజీ రూ.1,079 కోట్లతో ఐటీ ఎన్క్లౌంజర్స్, పీసీబీ బేరబోర్డు యూనిట్ ఏర్పాటును ఆమోదిస్తూ జీవో ఎంఎస్ నెంబర్ 60ను ప్రభుత్వం విడుదల చేసింది.అయితే జీవోల్లో కంపెనీల పేర్లను ఒకదానికి బదులు ఇంకో కంపెనీ పేరును పేర్కొంటూ అధికారులు కళ్లు మూసుకొని ఉత్తర్వులు జారీ చేసేశారు. ఒక జీవో జారీ చేసే ముందు సెక్షన్ ఆఫీసర్ దగ్గర నుంచి ఆ శాఖ అడిషనల్ సెక్రటరీ, సెక్రటరీ, ఫైనాన్స్, సీఎస్, సీఎంవో ఇలా అనేక మందిని దాటుకొని రావాల్సి ఉంటుంది. అలాంటిది... ఎక్కడా కూడా జరిగిన పొరపాటును గుర్తించలేదంటే ప్రభుత్వం ఏ స్థాయిలో పనిచేస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఆరు నెలల తర్వాత పేర్లు మార్చి... జీవోలు బయటకు రాగానే కంపెనీల యాజమాన్యాలు జరిగిన తప్పును వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే దాన్ని సరిదిద్దడానికి ఏకంగా ఆరు నెలల సమయం తీసుకొంది. చివరకు జనవరిలో విశాఖ కేంద్రంగా జరిగిన సీఐఐ పెట్టుబడుల సమావేశంలో ఈ రెండు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంటున్నప్పుడూ కూడా ఆ కంపెనీల ప్రతినిధులు జరిగిన తప్పిదాన్ని మరోసారి అధికారుల దృష్టికి తీసుకొచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. నవంబర్ 2025లో జారీ చేసిన తప్పుడు జీవోలను సవరిస్తూ ఏప్రిల్ 2026లో జీవోలను జారీ చేశారు.జీవో జారీ అయ్యే సమయంలో వివిధ దశల్లో ఒక గుమస్తా అనుకోకుండా చేసిన తప్పు వల్ల కంపెనీల పేర్లు మారాయంటూ చేతులు దులిపేసుకున్నారు. తప్పుడు జీవోల్లోని పేర్లు మార్చేందుకే ఆరు నెలల సమయం తీసుకున్నారని.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఇదేనా అని పలువురు పారిశ్రామికవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
కోరి తెచ్చుకుంటే.. కాలేజీని కాజేస్తోంది!
సాక్షి, అమరావతి: ఇన్నాళ్లూ ఇది తమ పార్టీ, తమ ప్రభుత్వమని భావిస్తే తమనే మింగేయాలని చూస్తోందని ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ పాత డైరెక్టర్లు లబోదిబోమంటున్నారు! కాలేజీని సొంతం చేసుకోవడానికి ‘ముఖ్య’నేత మనుషులు తెస్తున్న ఒత్తిడితో బెంబేలెత్తిపోతున్నారు. రాజధానికి చేరువలో మంగళగిరిలో రూ.2 వేల కోట్లకుపైగా విలువైన ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిని చేజిక్కించుకునేందుకు ముఖ్య నేత చేస్తున్న యత్నాలను ‘సాక్షి’ బయటపెట్టిన విషయం తెలిసిందే. డైరెక్టర్లను లొంగదీసుకునేందుకు ముఖ్యనేత సామదాన దండోపాయాలు ప్రయోగిస్తున్నట్లు తెలిసింది. రాజధాని వ్యవహారాలను పర్యవేక్షించే మంత్రి ఇదే పనిలో నిమగ్నమై డైరెక్టర్లపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ముఖ్యనేతకు బినామీగా ఉన్న పారిశ్రామికవేత్త తెరవెనుక చక్రం తిప్పుతూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. నయాన భయాన లొంగదీసుకునే యత్నాలు..ఎన్ఆర్ఐ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో అసలైన డైరెక్లర్లు ఎవరో తేల్చుకోవాలని ఆర్బిట్రేషన్ జడ్జి తీర్పు ఇవ్వడంతో ఇటీవల మేనేజ్మెంట్కి సంబంధించిన వ్యక్తులు (పాత డైరెక్టర్లు, కాలేజీ వ్యవహారాల్లో ముఖ్యులు) సమావేశమయ్యారు. కొత్త డైరెక్టర్లను ఎన్నుకునేందుకు ఆ సమావేశంలో నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. దీనిప్రకారం వారంతా తమ అభిప్రాయాలను తెలిపి తిరిగి కొత్త మేనేజింగ్ కమిటీని ఎన్నుకోవాల్సి ఉంది. ఇందుకోసం ఈ నెల 29వతేదీన మరో సమావేశం నిర్వహించనున్నారు. అందులో కొత్త డైరెక్టర్లు, కొత్త మేనేజింగ్ కమిటీ ఖరారయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ నెలాఖరులోపు కొత్త కమిటీని నియమించుకోవాలని ఆర్బిట్రేషన్ జడ్జి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో 29న జరిగే సమావేశం కీలకంగా మారింది. డైరెక్టర్లను నయాన భయాన లొంగదీసుకునేందుకు ముఖ్యనేత తరఫున ఓ మంత్రి శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. వారి వ్యాపారాలు, ఇతర వ్యవహారాల గురించి ఆరా తీస్తూ బెదిరింపులకు దిగినట్లు తెలిసింది. ముఖ్య నేత మాట కాదంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని కొందరు డైరెక్టర్ల ఇళ్లకు వెళ్లి వార్నింగ్లు ఇస్తున్నట్లు సమాచారం. మెడికల్ కాలేజీ ఏర్పాటు లక్ష్యానికి అనుగుణంగా పేద ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆశించిన డైరెక్టర్లు తాజా పరిణామాలతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీని కొన్ని దశాబ్దాలుగా పెంచి పోషించామని, గత ఎన్నికల్లో గెలిపించేందుకు శాయశక్తులా పని చేశామని, కానీ ఇప్పుడు తమపై గురి పెట్టటాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు చర్చించుకుంటున్నారు. గత ప్రభుత్వాన్ని తాము వ్యతిరేకించినా కాలేజీ విషయంలో జోక్యం చేసుకోలేదని, తమ అభీష్టానికి వ్యతిరేకంగా ఎలాంటి ఒత్తిళ్లు చేయలేదని గుర్తు చేసుకుంటున్నారు. -
ఈ పాపం సర్కారుదే!
కమర్షియల్ అంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు/కాంట్రాక్టర్లకు సంబంధించిన బంకులకు సరఫరా అయ్యే ఇంధన చార్జీలు పెరిగాయి. రిటైల్-కమర్షియల్ ఇంధనం ధరలో సగానికి సగం వ్యత్యాసం ఉంది. దీంతో పెద్ద కాంట్రాక్టర్లు కొన్ని రిటైల్ బంకుల నుంచి బ్లాక్లో కొంటున్నారని ఆయిల్ కంపెనీలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని రిటైల్ బంకులకు సరఫరా తగ్గించేశాయి. ఇక్కడ నిఘా పూర్తిగా కొరవడింది. సమన్వయం లేదు. ప్రభుత్వ పర్యవేక్షణ అసలే లేదు. ఇది చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యమే. అందుకే సమస్య తీవ్రతరమైంది. నిజంగా ప్రభుత్వం దృష్టి పెడితే 24 గంటల్లో సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ఎందుకో మరి ప్రభుత్వం ఆ పని మాత్రం చేయడం లేదు.-ఇంధన రంగానికి చెందిన ఓ నిపుణుడు సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంధన సంక్షోభం మరింత ముదిరింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క మన రాష్ట్రంలోనే డీజీల్, పెట్రోల్ దొరకని పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా ‘నో స్టాక్’ బోర్డులే దర్శనమిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉన్న 4,510 బంకుల్లో 70 శాతానికిపైగా మూతబడ్డాయి. కొన్నిచోట్ల ఉన్న కొద్ది స్టాక్ను రేషన్ లెక్కన అందిస్తున్నారు. అందుకోసం కనుచూపుమేర వాహనాలు బారులుతీరాయి. గంటల తరబడి ఎదురు చూపుల తర్వాత అరకొర ఇంధనంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. డీజిల్ కార్లకు 10–15 లీటర్లకు మించి ఇవ్వడం లేదు. బైకులకు రూ.200 పెట్రోల్ మాత్రమే పోస్తున్నారు. ఇంధనం ఉన్న బంకుల్లో గరిష్టంగా 5 గంటలు మించి అమ్మకాలు జరగలేదు. శనివారం డీజిల్కు మాత్రమే తీవ్ర కొరత ఏర్పడగా, ఆదివారం అది పెట్రోల్కు కూడా అంటుకుంది. దీంతో బంకుల వద్ద వాహనదారులు ఆందోళన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా రంగం కుదేలైంది. పెద్ద వాహనాల రవాణా నిలిచిపోయింది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకున్నారు. రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంధన సంక్షోభం కొనసాగుతుంటే ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర పోతోంది. సమస్య పట్ల పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్కు ఏమాత్రం కొరత లేదు. ఒక్క ఏపీలో మాత్రమే ఇంతగా ఇంధన సంక్షోభం నెలకొంటే ప్రభుత్వం ఏం చేస్తోందని వాహనదారులు మండిపడుతున్నారు. సమన్వయం లేదు.. నిఘా లేదు.. పరిష్కారం దిశగా చర్యలూ లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే నో స్టాక్ బోర్డు పెడితే ఊరుకోమని సీఎం హెచ్చరించడం నవ్వులపాలవుతోంది. పెట్రోల్, డీజిల్ సరఫరానే లేదని బంకుల యజమానులు వాపోతుంటే.. సరఫరా సవ్యంగా సాగేలా చర్యలు తీసుకోవాల్సింది పోయి బంకులకు వార్నింగ్ ఇవ్వడం ఏమిటని చర్చ జరుగుతోంది. గుంటూరు లాడ్జి సెంటర్లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద బారులుతీరిన వాహనాలు సీఎంది ఓ లెక్క.. సివిల్ సప్లై శాఖ మంత్రిది మరోలెక్క రాష్ట్రంలో ఇంధన కొరతతో ప్రజలు ఆందోళన చెందుతుంటే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కొరత లేదని చెబుతోంది. వినియోగంపై తప్పుడు లెక్కలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. డిమాండ్కు తగ్గ సరఫరా ఉందంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రే చెప్పడం విస్తుగొల్పుతోంది. పెట్రోలియం సంస్థలు శనివారం 10,345 కిలో మీటర్ల పెట్రోలు, 14,156 కిలో లీటర్ల డీజిల్ను డీలర్లకు సరఫరా చేసినట్టు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో రోజుకు 6,330 కిలో లీటర్ల పెట్రోల్ అమ్మకాలు ఉంటే.. శనివారం 8,489 కిలో లీటర్ల అమ్మకాలు జరిగాయని, డీజిల్ సాధారణ రోజుల్లో రోజుకు 9,048 కిలో లీటర్లు అమ్మకాలు జరిగితే శనివారం 10,556 కిలో లీటర్లకు పెరిగిందన్నారు. కర్నూలులోని నారాయణ పెట్రోల్ బంక్లో సైకిల్పై వచ్చి పెట్రోలు తీసుకెళ్తున్న యువకుడు సాధారణ స్థాయిని మించి అమ్మకాలు జరగడంతో కొన్ని బంకుల్లో నిల్వలు అయిపోతున్నాయని చెబుతున్నారు. అయితే ఇది పూర్తిగా అబద్ధం. వాస్తవానికి మార్చి 31న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో రాష్ట్రంలో ఇంధన వినియోగం వివరాలను వెల్లడించారు. రోజువారీ సగటు పెట్రోల్ వినియోగం 7,900 కిలో లీటర్లు అని, డీజిల్ 20,000 కిలో లీటర్లు ఉందన్నారు. అంతేగాక డీజిల్ సరఫరాను 8%, పెట్రోల్ను 2.4% అదనంగా పెంచినట్టు వెల్లడించారు. ఈ క్రమంలో ఆదివారం సీఎం నిర్వహించిన సమీక్ష సమావేశంలో వెల్లడించిన లెక్కలకు, సివిల్ సప్లై శాఖ మంత్రి లెక్కలకు పొంతన కుదరడం లేదు. ఈ లెక్కన ఇంధన వినియోగంపై ఇప్పటి దాకా ప్రభుత్వం వద్ద సరైన లెక్కలే లేవని తేటతెల్లమవుతోంది.అనంతపురంలోని టవర్క్లాక్ వద్ద వాహనదారులతో నిండిపోయిన ఇండియన్ పెట్రోల్ బంక్ చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం⇒ రాష్ట్రంలో ఇంధన కొరత తీవ్ర రూపం దాల్చడంతో అది రవాణా రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. రాష్ట్రం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే సరుకు రవాణా వాహనాలు దాదాపుగా నిలిచిపోయాయి. ప్రజా రవాణా వాహనాలు, ఆటోలు వంటివి సగానికి పైగా తిరగడం లేదు. ఈ నెలాఖరుకు ఇంధన ధరలు పెరుగుతాయన్న ప్రచారంతో సరఫరా ఆపేశారనే చర్చ జరుగుతోంది. అయితే ఇది కూడా వాస్తవం కాకపోవచ్చని, అలాగైతే పొరుగు రాష్ట్రాలకు ఎలా సరఫరా అవుతోందని డీలర్లు ప్రశ్నిస్తున్నారు. తిరుమలలోని హెచ్పీ బంకు వద్ద పెట్రోల్ కోసం బారులుతీరిన వాహనాలు ⇒ ఇదిలా ఉండగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రాష్ట్రంలో డీలర్లకు డిమాండ్లో 40 శాతం మాత్రమే సరఫరా చేస్తున్నాయి. ఇంధన ఉత్పత్తి పెంచామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా.. అది ఎక్కడా కనిపించడం లేదు. దీంతో సమస్య మరింత జఠిలమైంది. శనివారం మధ్యాహ్నం వరకు కొంత మేర తెరుచుకున్న బంకుల్లో పెట్రోల్ మాత్రమే అరకొరగా అమ్మకాలు సాగించారు. సాయంత్రానికి వాటిలోనూ ‘నో స్టాక్’ బోర్డులు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ద్విచక్ర వాహనాలకు రూ.200 పెట్రోల్, కార్లకు 10–15 లీటర్లు డీజిల్/పెట్రోల్ మాత్రమే అందించారు. ఫుల్ ట్యాంక్, క్యాన్లలో విక్రయాలు ఆపేశారు. -
క్రెడిట్ దోపిడీలో బాబు గిగా స్పీడ్!
సాక్షి, అమరావతి: మొన్న ఎన్టీపీసీ గ్రీన్ పవర్.. నిన్న రెన్యూ పవర్.. నేడు డేటా సెంటర్..! విశాఖ కేంద్రంగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాజెక్టులను తన ఖాతాలో వేసుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పీడ్ పెంచారు. అనకాపల్లిని మరో రంగారెడ్డి జిల్లాగా మారుస్తున్నానంటూ రెండు రోజుల క్రితం రెన్యూ పవర్ శంకుస్థాపన సభలో ప్రకటించిన సీఎం చంద్రబాబు తాజాగా తాను తెచ్చిన గూగుల్ డేటా సెంటర్తో విశాఖ విశ్వనగర మంటూ అనుకూల మీడియాలో ప్రచారానికి తెర తీశారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషితో విశాఖలో అదానీ డేటా సెంటర్ సాకారం కాగా అందుకోసం 3,900 కి.మీ. పొడవున సబ్సీ (సముద్ర గర్భం) కేబుళ్లు కోసం గత ప్రభుత్వం 2021 మార్చి 9న సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాయడం తెలిసిందే.ఇప్పుడు అదే డేటా సెంటర్ను గూగుల్ డేటా సెంటర్ అంటూ చంద్రబాబు సర్కారు క్రెడిట్ దోపిడీకి పాల్పడుతోంది. అయితే అది అదానీ డేటా సెంటరే అని సాక్ష్యాధారాలతో వైఎస్ జగన్ ఇప్పటికే బయటపెట్టడంతో చంద్రబాబు సర్కారు ఒప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. డేటా సెంటర్పై గూగుల్తో ఒప్పందం సమయంలో ఉద్దేశపూర్వకంగా అదానీ పేరును తొక్కి పెట్టి క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు చేసిన విన్యాసాలు విఫలమయ్యాయి. విశాఖలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 1,000 మెగావాట్ల సామర్థ్యంతో ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ను అదానీ, భారతీ ఎయిర్టెల్ గ్రూపుల భాగస్వామ్యంతో గూగుల్ ఏర్పాటు చేస్తోందని అంగీకరించడంతోపాటు భూములు అదానీ పేరిటే బదలాయించి ప్రోత్సాహకాలు సైతం కల్పిస్తూ సవరణ ఉత్తర్వులు జారీ చేయడమే దీనికి నిదర్శనం.బాబు సమక్షంలోనే తేల్చేసిన అదానీ.. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి గతేడాది అక్టోబర్ 14న ఢిల్లీలో ఎంవోయూ కుదుర్చుకున్న సందర్భంలో చంద్రబాబు సర్కారు ఉద్దేశపూర్వకంగానే అదానీ పేరును ప్రస్తావించలేదు.అయితే అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ స్పందిస్తూ ఈ డేటా సెంటర్లో తాము భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశారు. భారతీ ఎయిర్టెల్ గ్రూప్ కూడా ఈ డేటా సెంటర్లో తాము భాగస్వాములమంటూ ట్వీట్ చేసింది. గూగుల్తో కలిసి తాము రూ.15 బిలియన్ డాలర్లతో డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు విశాఖలో జరిగిన సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్లో అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ సీఎం చంద్రబాబు సమక్షంలోనే ప్రకటించడంతో ముఖ్యమంత్రితో పాటు వేదికపైన ఉన్న మంత్రుల మొహాలు ఒక్కసారిగా మాడిపోయిన సంగతి తెలిసిందే.జీవో సాక్షిగా బండారం బద్ధలు.. చంద్రబాబు క్రెడిట్ చోరీని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్ష్యాధారాలతో మీడియా సమక్షంలో ఎండగట్టిన విషయం తెలిసిందే. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి క్రెడిట్ దక్కుతుందనే సంకుచిత బుద్ధితోనే గూగుల్తో ఒప్పందం సమయంలో సీఎం చంద్రబాబు అదానీ పేరెత్తలేదన్న విషయాన్ని బయటపెట్టారు. వైఎస్ జగన్ చెప్పిన ప్రతీ అక్షరం సత్యమేనని చంద్రబాబు సర్కారు విడుదల చేసిన జీవో సాక్షిగా రుజువైంది.క్రెడిట్ చోరీని కప్పిపుచ్చేందుకు తొలుత గూగుల్ పేరిట జీవో విడుదల చేసి ఆ తర్వాత ఆ భూములను అదానీ ఇన్ఫ్రా పేరుమీదకు బదలాయించడమే దీనికి తార్కాణం. ఒకపక్క కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2020 నవంబర్లో విశాఖలో 300 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు అదానీతో ఒప్పందం చేసుకుంది. అంతేకాదు.. డేటా సెంటర్కు డేటా వచ్చేందుకు వీలుగా 3,900 కి.మీ. పొడవున సముద్ర గర్భంలో కేబుళ్ల ఏర్పాటుకు 2021 మార్చి 9న సింగపూర్ ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది.వైఎస్ జగన్ కృషితో సాకారం.. గూగుల్ అనుబంధ సంస్థ రైడాన్ ఇన్ఫోటెక్ దేశంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు అదానీతో జత కట్టడమే కాకుండా నోయిడాలో అదానీ నిర్మించిన డేటా సెంటర్ను 2022 అక్టోబర్ 11న లీజుకు తీసుకుంది. ఈ క్రమంలో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు 2023 మే 3న మాజీ సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. డేటా సెంటర్ కోసం గత ప్రభుత్వం 190 ఎకరాల భూమిని కూడా కేటాయించింది. చంద్రబాబు సర్కారు చెబుతున్న డేటా సెంటర్ను తాము నిర్మించడం లేదని.. దీన్ని అదానీ గ్రూపే చేపడుతోందని, అందువల్ల భూమిని కూడా అదానీ ఇన్ఫ్రాకే కేటాయించాలని కోరుతూ గూగుల్ ప్రతినిధి అలెగ్జాండర్ స్మిత్ గతేడాది అక్టోబర్లో రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్కు లేఖ రాశారు.ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. గత ప్రభుత్వ కృషితో సాకారమైన డేటా సెంటర్ను చంద్రబాబు అబద్ధాలతో తన ఖాతాలో ఎలా వేసుకున్నారో వైఎస్ జగన్ సాక్ష్యాలతో ఎండగట్టిన విషయం తెలిసిందే. డేటా సెంటర్ పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు సబ్సీ కేబుళ్లు సింగపూర్ నుంచి విశాఖకు ఏర్పాటుకు వైఎస్ జగన్ అంకురార్పణ చేశారు. ఈ డేటా సెంటర్ ద్వారా విశాఖలో ఎకో సిస్టమ్ ఏర్పడుతుందని తద్వారా గ్లోబల్ క్యాపబుల్ సెంటర్స్ వస్తాయని వైఎస్ జగన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. -
బీసీల అభ్యున్నతే వైఎస్సార్సీపీ ధ్యేయం
అనంతపురం : బీసీల అభ్యున్నతే వైఎస్సార్సీపీ ధ్యేయమని వక్తలు పునరుద్ఘాటించారు. బీసీలంటే బ్యాక్వర్డ్ కాదు.. బ్యాక్బోన్ అని దేశ చరిత్రలో తొలిసారిగా చెప్పిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని గుర్తు చేశారు. అనంతపురంలో ఆదివారం వైఎస్సార్సీపీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో రాయలసీమ జోనల్ స్థాయి ‘బీసీ గళం’సభ నిర్వహించారు.బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ, పార్టీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ తదితరులు ప్రసంగించారు. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఇచ్చిన హామీల కంటే అధికంగానే బీసీలకు తోడ్పాటునందించారని గుర్తు చేశారు. వారి అభ్యున్నతికి ఏకంగా రూ.1.75 లక్షల కోట్లు వెచి్చంచారని పేర్కొన్నారు.బడుగు, బలహీన వర్గాలకు సముచిత స్థానం కలి్పంచే శక్తి వైఎస్ జగన్కు మాత్రమే ఉందన్నారు. వైఎస్ జగన్ను మళ్లీ సీఎం చేయడానికి బీసీలందరూ ఏకతాటిపైకి వచ్చి మద్దతిస్తారని చెప్పారు. బీసీలే టీడీపీకి పట్టుకొమ్మలు అని చెప్పుకునే చంద్రబాబు ఈ రెండేళ్లలో వారి కోసం ఒక్క కార్యక్రమమైనా చేపట్టారా? అని ప్రశి్నంచారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా బీసీలకు ఇచి్చన హామీలను అమలు చేయలేదని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించేందుకు బీసీలంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ఉషశ్రీ చరణ్, శైలజానాథ్, శంకరనారాయణ, మాజీ ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, మాజీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
Andhra Pradesh: రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించినట్లు కన్వర్జెన్స్ ఎనర్జీ సర్విసెస్ లిమిటెడ్ (సీఈఎస్ఎల్) సీఈవో అఖిలేష్కుమార్ దీక్షిత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలో కాలుష్య రహిత ప్రజా రవాణా వ్యవస్థను విస్తరించేందుకు 3,604 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు కోసం సీఈఎస్ఎల్ టెండర్ పిలిచిందని పేర్కొన్నారు.దీని ద్వారా 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో విద్యుత్ ఆధారిత రవాణాను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు 750 బస్సులు కేటాయించగా, వీటిలో విశాఖపట్నానికి 150, తిరుపతికి 300 బస్సులు మంజూరు చేసినట్లు వివరించారు. -
భక్తులకు వైఎస్ జగన్ శ్రీ కన్యకాపరమేశ్వరి జయంతి శుభాకాంక్షలు
సాక్షి,తాడేపల్లి : శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా భక్తులందరికీ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా భక్తులందరికీ శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సఖ్యత, సంతోషాలు మరియు అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’అని పేర్కొన్నారు. శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా భక్తులందరికీ శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సఖ్యత, సంతోషాలు మరియు అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. pic.twitter.com/ocXww8S6f1— YS Jagan Mohan Reddy (@ysjagan) April 26, 2026 -
‘ఏపీని కూటమి ఎమ్మెల్యేలు భ్రష్టు పట్టిస్తున్నారు’
సాక్షి, తాడేపల్లి: టీడీపీ, జనసేన పార్టీల ఎమ్మెల్యేలు బరితెగించి నీచమైన పనులకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు పొడిచి తమ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు.‘‘రాచరిక వ్యవస్థను అమలు చేస్తున్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్ ఎమ్మెల్యేలను అదుపు చేయడం మానేశారు. ఈ రాష్ట్రాన్ని కూటమి ఎమ్మెల్యేలు భ్రష్టు పట్టిస్తున్నారు. గుండబోయినపల్లి టోల్ ప్లాజా వద్ద సిబ్బందిపై సురేంద్రబాబు అనుచరులు దాడి చేశారు. మహిళా సిబ్బందిపై దాడి చేసి కిడ్నాప్ చేసి.. భయబ్రాంతులకు గురిచేశారు. ఎమ్మెల్యే సురేంద్రబాబు కనీసం తన అనుచరులను వారించలేదు. నంద్యాల జిల్లా రుద్రవరం టోల్ ప్లాజా వద్ద ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనుచరులు సిబ్బందిని కిడ్నాప్ చేశారు. ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారులో ఎమ్మెల్యే లేకపోతే టోల్ కట్టమని అడుగుతారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నా కుటుంబసభ్యులు వెళ్లినపుడు టోల్ కట్టారు...టీడీపీ ఎమ్మెల్యేల రాసలీలలు ఓ స్థాయికి వెళ్లాయి. మహిళతో రాసలీలలు జరుపుతూ సత్యవేడు ఎమ్మెల్యే దొరికిపోయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ మహిళతో రాజీ చేసుకోమని స్వయంగా చంద్రబాబే చెప్పినట్లు వార్తలు చదివి ఆశ్చర్యపోయాం. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మోసం చేశాడని దళిత మహిళ వేడుకున్నా పట్టించుకోలేదు. దళిత మహిళను కాపు నేత రోడ్డుపై కొడుతుంటే పవన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మహిళలకు న్యాయం చేస్తా.. నిలబడతాననే పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు. అరవ శ్రీధర్ పై పవన్ ఎందుకు చర్యలు తీసుకోలేదు..గుంటూరు ఈస్ట్ నజీర్ అహ్మద్ మహిళతో అసభ్యంగా మాట్లాడితే కనీసం చర్యలు తీసుకోలేదు. విజయనగరం జిల్లా మంత్రి పీఏపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కూన రవికుమార్ కేజీబీవీ ప్రిన్సిపాల్ను వేధిస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు. తమను మోసం చేశారు. శారీరకంగా వాడుకున్నారని బాధిత మహిళలు చెబుతుంటే చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదు. చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలకే ముఖ్యమంత్రా....రాష్ట్రంలోని మహిళలకు ముఖ్యమంత్రి కాదా?. రాష్ట్రంలో ఏ పార్టీ బతకడానికి వీల్లేదనేదే చంద్రబాబు ఆలోచన. చంద్రబాబుది కక్షపూరిత అజెండా..స్పీకర్ హోదాలో ఉన్న అయ్యన్నపాత్రుడు డప్పు కళాకారుడి చెంప చెళ్లుమనింపించాడు. చెంపదెబ్బ కొట్టి.. మళ్లీ బాధితుడితోనే ఎలాంటి దాడి జరగలేదని వీడియో పెట్టించారు. ఎందుకు టీడీపీ పార్టీ స్పీకర్ను భరిస్తోంది. అయ్యన్నపాత్రుడు స్పీకర్ కూర్చీలో కూర్చోవడానికి అనర్హుడు. రాజమండ్రి ఎమ్మెల్యే వాసు ముఖ్య అనుచరుడు బాలికను గర్భవతి చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు?. బాలిక బిడ్డను కంటే డబ్బులిస్తాం సర్ధుకోమని చెప్పిన దుష్ట ప్రభుత్వం ఇది. ఇలా చేయడానికేనా చంద్రబాబు ఒక్క అవకాశం ఇవ్వండని అడిగింది. కంపెనీలు, ఇండస్ట్రీలు, సంస్థలపై పడుతున్నారు. పోర్టు పనులకు వెళుతున్న లారీలను కందుకూరు ఎమ్మెల్యే అడ్డుకుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదు?. కింగ్ ఫిషర్ కంపెనీ ఏడాదికి రూ.18 కోట్లు కట్టాలని మంత్రి అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. కింగ్ ఫిషర్ కంపెనీకి సమస్య సృష్టించి పరిష్కరించినట్లు డబుల్ డ్రామా ఆడారు...తన నియోజవర్గంలోంచి వెళ్లే లారీలకు కప్పం కట్టాలని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ హుకుం జారీ చేశారు. ఎందుకు కట్టాలి మీకు కప్పం ... ఈ దోపిడీని ఏమనాలి. అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి బెదిరించాడు. శ్రీశైలం ఎమ్మెల్యే అటవీ సిబ్బంది పై దాడి చేశాడు. తప్పతాగిన మైకంలో అరాచకంగా వ్యవహరిస్తున్నారు. కియా కాంట్రాక్టులన్నీ తమకే కావాలని మంత్రి సవిత అనుచరుడు దౌర్జన్యం చేస్తున్నాడు. ఎమ్మెల్యేలు , వాళ్ల అనుచరులు ఇంత అరాచకంగా వ్యవహరిస్తుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?. టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ గిరిజనుల పై నోరుపారేసుకున్నాడు. టీడీపీ నేతల ఆగడాలపై మేం ఆరోపణలు చేయడం లేదు. వాళ్ల అనుకూల పత్రికల్లోనే టీడీపీ నేతల గురించి రాస్తున్నారు. టీడీపీ, జనసేన , బీజేపీ ఎమ్మెల్యేలకు అధికారులంటే లెక్కలేదు..నర్సరావుపేట ఎమ్మెల్యే ఎస్పీ కార్యాలయంలోకి వెళ్లి బాత్ రూమ్లో కూర్చుని తాళం వేసుకున్నాడు. లీగల్ అడ్వైజర్గా సిఫార్సు చేయొచ్చు.. కానీ ఎస్పీకి హుకుం జారీ చేయడమేంటి?. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ గూండాలు, రేపిస్ట్లతో నిండిపోయి గబ్బు కొడుతోంది. చంద్రబాబు ఆయన కుమారుడికి సీఎం కుర్చీ కోసం యుద్ధం జరుగుతోంది. తమ మధ్య జరుగుతున్న యుద్ధంలో చంద్రబాబు పాలన వదిలేశారు. పవన్ కళ్యాణ్కు పది రోజులకొకసారి అనారోగ్యం కలుగుతోంది. జనసేన ఎమ్మెల్యేలు మహిళలతో అసభ్యంగా వ్యవహరించినా పవన్ మాట్లాడటం లేదు. మళ్లీ ఏపీకి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో అరాచకాలు ఆగుతాయి’’ అని సుధాకర్బాబు పేర్కొన్నారు. -
రేపు వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం నిరసనలు
సాక్షి, అమరావతి: పంచాయతీ రాజ్ శాఖలో పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని కోరుతూ ఈ నెల 27న(సోమవారం) రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద వైఎస్సార్సీపీ పంచాయతీ రాజ్ విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి.ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి తెలిపారు. నిరసన అనంతరం కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేస్తామని చెప్పారు. గతేడాది డిసెంబర్ నుంచి ఇప్పటివరకు నిర్వహించిన పనులకు సంబంధించి కూలీలకు వేతనాలు అందకపోవడం బాధాకరమన్నారు. -
నిరంతర విధి.. నిశ్శబ్ద రోదన
ఇటీవల కాకినాడలో ధనరాజ్ అనే పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పని భారం భరించలేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆయన తన సర్వీస్ రైఫిల్తో కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. సహచర కానిస్టేబుళ్లు ఆయన్ను తక్షణమే ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన పని ఒత్తిడితో కుంగిపోతున్న పోలీస్ కానిస్టేబుళ్ల దుస్థితిని మరోసారి చర్చనీయాంశం చేసింది.సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుళ్లు తీవ్రమైన పనిభారంతో కుంగిపోతున్నారు. శారీరకంగా.. మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. పోలీస్ల పని ఒత్తిడిని తగ్గించేందుకు కేంద్ర హోం శాఖ మార్గదర్శకాలు జారీ చేసినా.. చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పెద్దఎత్తున పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నా.. భర్తీ చేయడం లేదు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఏమాత్రం పట్టించుకోకుండా ఉన్నతాధికారుల వేధింపులు కానిస్టేబుళ్లను మరింతగా కుంగదీస్తున్నాయి. అటు ప్రభుత్వ నిర్లక్ష్యం.. ఉన్నతాధికారుల వేధింపులతో కానిస్టేబుళ్లు మౌనంగా రోదిస్తున్నారు. ఉండాల్సింది 80 వేలు.. ఉన్నది 48 వేల మందే పోలీస్ కానిస్టేబుళ్లకు తీవ్రమైన పని ఒత్తిడికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వమే. రాష్ట్రంలో భారీగా ఉన్న కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయడం లేదు. కేంద్ర హోం శాఖ మార్గదర్శకాల ప్రకారం.. ప్రతి లక్ష మంది జనాభాకు కనీసం 138 మంది కానిస్టేబుళ్లు ఉండాలి. ఆ ప్రకారం రాష్ట్రంలో 5.50 కోట్ల మందికి కనీసం 80 వేలమంది కానిస్టేబుళ్లు అవసరం. కానీ.. రాష్ట్రంలో అన్ని విభాగాల్లో కలిపి మొత్తం కేవలం 48 వేల మంది కానిస్టేబుళ్లు మాత్రమే ఉన్నారు. అంటే దాదాపు 45 శాతం మంది తక్కువగా ఉన్నారు.అయినా.. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదు. ఆ మేరకు కానిస్టేబుళ్లను నియమించకపోగా.. అధికారికంగా మంజూరు చేసిన కానిస్టేబుల్ పోస్టులనైనా భర్తీ చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన కానిస్టేబుల్ పోస్టుల్లో 18 వేల వరకు ఖాళీగా ఉన్నాయి. వాటిలో సివిల్ పోలీస్ విభాగంలో 5,159, ఏఆర్ విభాగంలో 4 వేలు, ఏపీఎస్పీ విభాగంలో 6,231, మినిస్టీరియల్ స్టాఫ్ విభాగంలో 3వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేసే ఉద్దేశమే లేనట్టుగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. తీవ్ర పని ఒత్తిడితో కుంగుబాటు నిబంధనల ప్రకారం కానిస్టేబుళ్లు మూడు షిప్టుల విధానంలో రోజుకు 8 గంటలపాటు విధులు నిర్వర్తించాలి. కానీ.. పోస్టులు భర్తీ చేయకపోవడంతో రెండు షిఫ్టుల విధానం అమలవుతోంది. అదికూడా వేళాపాళా లేకుండా పనిభారంతో అధికారులు వేధిస్తున్నారు. ఒక్కో కానిస్టేబుల్ రోజుకు 12 నుంచి 14 గంటలపాటు పని చేస్తున్నట్టు పోలీస్ శాఖ అంతర్గత నివేదికలు వెల్లడిస్తున్నాయి. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు వంటి నగరాల్లో కానిస్టేబుళ్లు ఏకంగా 16నుంచి 18 గంటలపాటు పని చేయాల్సి వస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.మితిమీరిన స్థాయిలో వీఐపీల బందోబస్తు విధులు, ఎన్బీడబ్ల్యూ విధులు, నైట్ పెట్రోలింగ్ విధుల ఒత్తిడితో తీవ్ర అవస్థలు పడుతున్నారు. వీక్లీ ఆఫ్ల విధానం కూడా అమలు చేయడం లేదు. అంటే వారంలో ఏడు రోజులూ పని చేయాల్సి వస్తోంది. కుటుంబానికి కనీస సమయం కేటాయించలేకపోతున్నారు. పిల్లల చదువులు, కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు వంటి విషయాలపై కూడా దృష్టి సారించలేకపోతున్నారు.పేరుకుపోయిన టీఏలు, సరెండర్ లీవులుకానిస్టేబుళ్లతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్న ప్రభుత్వం వారి సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వీఐపీ బందోబస్తు విధులు, ఎన్బీడబ్ల్యూ విధులు, కోర్టు విధులు, ఇతరత్రా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లకు ట్రావెలింగ్ అలవెన్సులు కూడా సకాలంలో చెల్లించడం లేదు. ఖర్చులు భారీగా పెరిగిపోయినా.. దీర్ఘకాలంగా చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయి. 2024 జూన్ నుంచి టీఏ బకాయిలు చెల్లించనే లేదు. మరోవైపు సరెండర్ లీవులు, అదనపు సరెండర్ లీవుల బకాయిలు సైతం పేరుకుపోయాయి. డీఏ బకాయిలు సరే సరి. రాష్ట్రంలో ఒక్కో జూనియర్ కానిస్టేబుల్కు రూ.లక్ష చొప్పున, సీనియర్ కానిస్టేబుల్కు రూ.2 లక్షల చొప్పున బకాయిలు ఉన్నాయి. అయినా సరే.. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా పనిభారం అమాంతంగా పెంచుకుంటూపోతోందని కానిస్టేబుళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గత ప్రభుత్వంలో 6,100 పోస్టుల భర్తీకి చర్యలు రాష్ట్రంలో సుదీర్ఘ కాలం తరువాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2022లో 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించింది. అయితే, టీడీపీ ఆ పోస్టుల భర్తీని సవాల్ చేస్తూ కోర్టులో ఏకంగా 28 కేసులు వేసి అడ్డుకుంది. దాంతో అప్పటి మెయిన్ పరీక్షను నిర్వహించలేకపోయింది. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ కేసులను వాపసు తీసుకోవడం గమనార్హం. అనంతరం ఆ పోస్టులను ప్రభుత్వం ఇటీవల భర్తీచేసి అది తమఘనతగా చెప్పుకుంటూ క్రెడిట్ చోరీకి పాల్పడింది. కానీ ఆ పోస్టులను వైఎస్సార్సీపీ ప్రభుత్వమే నోటిఫికేషన్ జారీ చేసి ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించిన విషయం వాస్తవమని ఎంపికైన కానిస్టేబుళ్లు స్పష్టం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
కారడవిలో అక్రమాల ‘కోడి’
సాక్షి, అమరావతి: ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనుల ఆర్థికాభివృద్ధి కోసం ఉద్దేశించిన ‘పెరటి కోళ్ల పెంపకం పథకం’లో అక్రమాలు కోడై కూస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రూ.7.96 కోట్లను మింగేసేందుకు నిబంధనల్ని ఉల్లంఘించారంటూ ఏపీ ఎస్టీ కమిషన్కు రాష్ట్ర యానాదుల సంఘం ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అక్రమాలు, అవినీతిపై ఆరోపణల నేపథ్యంలో పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్(పీఓ) నేతృత్వంలో ముగ్గురు సభ్యుల బృందంతో విచారణ కమిటీని నియమించారు.దీంతో అక్రమాల విలువతోపాటు ఈ అవినీతి వ్యవహారంలో ఎవరి వాటా ఎంత అనేది తేలుస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ పథకంలో లబ్ధిదారుల ఎంపిక నుంచి అడ్వాన్సుల చెల్లింపుల వరకు అడ్డగోలు నిర్ణయాలు అసలు లక్ష్యాన్ని దెబ్బతీస్తున్నాయనే విషయం సంఘం ఫిర్యాదుతో బట్టబయలైంది. రాష్ట్రంలోని ఆరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)ల పరిధిలో 4,593 మంది గిరిజనులకు లబ్ధి చేకూర్చి వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు దోహదపడాల్సిన ఈ పథకం పక్కదారి పట్టిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇలా కేటాయించారు⇒ ఆరు ఐటీడీఏల పరిధిలో మొత్తం రూ.7,96,25,000 కేటాయించారు.⇒ పాడేరు, రంపచోడవరం, కోట రామచంద్రాపురం, పార్వతీపురం, నెల్లూరు, శ్రీశైలం ఐటీడీఏల పరిధిలోని 25 మండలాల్లో 4,593 మంది గిరిజన లబ్ధిదారులను గుర్తించారు.⇒ ఒక్కొక్కరికీ రూ.15 వేల చొప్పున ఇప్పటికే రూ.6,88,95,000 మంజూరు చేశారు.⇒ కోళ్ల ఉత్పత్తికి బ్రీడర్ యూనిట్స్ ఒక్కొక్క దానికి రూ.1.25 లక్షల చొప్పున మొత్తం 50 యూనిట్లకు రూ.62.50 లక్షలు కేటాయించారు.⇒ కోళ్ల మేత నిమిత్తం ఒక్కో ఫీడ్ మిల్ ఏర్పాటుకు రూ.3.60 లక్షల చొప్పున మొత్తం 8 ఫీడ్ మిల్స్కు రూ.28.80 లక్షలు కేటాయించారు.⇒ కోళ్ల ఉత్పత్తి పేరిట ఒక్కో హేచరీకి రూ.2 లక్షల చొప్పున మొత్తం 8 హేచరీలకు రూ.16 లక్షలు కేటాయించారు.నోటిఫికేషన్ లేదు.. టెండర్ పిలవలేదుఏ పథకాన్ని అయినా ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలనుకుంటే నోటిఫికేషన్ జారీ చేయడం లేదా టెండర్లు ఆహ్వానించాల్సి ఉంటుంది. దీనికి విరుద్ధంగా పెరటి కోళ్ల పెంపకం పథకంలో ఎటువంటి నోటిఫికేషన్, టెండర్ పిలవకుండానే ఓ ప్రైవేట్ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకోవడం అనుమానాలకు తావిస్తోంది. కేంద్ర నిధులు నూరు శాతం లబ్ధిదారులకే కేటాయించే అవకాశం ఉన్న ఈ పథకాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన గిరిజన సంక్షేమ అధికారులతో అమలు చేయవచ్చు. అందుకు విరుద్ధంగా ప్రైౖవేట్ ఏజెన్సీకి అప్పగిస్తూ ఒప్పందం చేసుకోవడం ద్వారా నిబంధనల్ని ఉల్లంఘించారు. ఆ ఏజెన్సీని అడ్డు పెట్టుకుని నిధుల్ని బొక్కేందుకు ఆ శాఖలోని కీలక నేత చక్రం తిప్పుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.కోళ్లు కొనకుండానే అడ్వాన్సులుఏ పథకంలో అయినా లబ్ధిదారుల ఎంపిక, యూనిట్లు మంజూరు, కొనుగోళ్లు వంటి ప్రక్రియలు చేపట్టిన తర్వాతే నిబంధనల ప్రకారం ప్రభుత్వం దశలవారీగా నగదును బిల్లుల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకంలో మాత్రం ఆరు ఐటీడీఏల ప్రాజెక్ట్ ఆఫీసర్ల ఖాతాలకు ముందస్తు (అడ్వాన్స్)గా నిధులు పూర్తిగా జమ చేయడం గమనార్హం. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యిందని, కోళ్లు కొనేందుకు డబ్బులు ఇవ్వాలని పీఓలపై ఆ ఏజెన్సీ ప్రతినిధులు ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. పథకం ప్రకారమే పీఓల ఖాతాలకు నగదు జమచేసి.. ఆ తర్వాత వారిపై ఒత్తిడి తెచ్చి కోళ్ల కొనుగోలు పేరుతో అయిన వారికి వాటిని జమ చేసేలా స్కెచ్ వేశారు. అలా చేయడం ద్వారా అంతా అధికారికంగా చేసినట్టు చూపి మొత్తం వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మలచుకునేందుకు రంగం సిద్ధం చేశారు.ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశాంకేంద్ర ప్రభుత్వ నిధులతో గిరిజనులకు అందించే పెరటి కోళ్ల పెంపకం యూనిట్ల మంజూరులో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ విషయపై ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్కు ఫిర్యాదు చేశాం. ఈ నేపథ్యంలోనే పాడేరు పీఓ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యులతో కమిటీ వేసి విచారణ చేయిస్తున్నట్టు చెప్పారు. అక్రమాలను నిగ్గు తేల్చి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ పథకాన్ని నూరు శాతం సక్రమంగా అమలు చేసి గిరిజనులకు న్యాయం చేయాలి. లేదంటే ఉద్యమం చేపడతాం. – కేసీ పెంచలయ్య, అధ్యక్షుడు, ఏపీ యానాదుల సంఘం -
రైతు కథ.. కన్నీటి వ్యధ.. కర్షకుల కష్టం దళారుల పాలు
ఆరుగాలం శ్రమించి అన్నదాత చిందించిన చెమటకు ఫలితం దక్కడం లేదు. పండించిన పంటకు మద్దతు ధర లేనే లేదు. చేతికొచ్చిన పంటను అమ్ముకునే దారే కనిపించడం లేదు. తొలి పంట వైపరీత్యాలతో దెబ్బతింటే.. రెండో పంటకు మద్దతు ధర దక్కక, కొనేవారు లేక రైతులు నష్టపోతున్నారు. మద్దతు ధర కల్పించడంలో బాబు ప్రభుత్వం చేతులెత్తేయడంతో అప్పులతో సాగు చేసి పండించిన పంటను అయినకాడకి తెగనమ్ముకుంటూ ఆర్థికంగా కుదేలవుతున్నారు. ఏ పల్లెకు వెళ్లినా రాసులు పోసిన పంటలు దర్శనమిస్తున్నాయి. కొనేవారు లేక, మద్దతు ధర దక్కక, కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేక అన్నదాతలు గుండెలవిసేలా రోదిస్తున్నారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని సుమారు 30కి పైగా పల్లెల్లో ‘సాక్షి’ క్షేత్ర స్థాయి పరిశీలనలో అన్నదాతల వెతలు వర్ణనాతీతం. ఏ పల్లెకు వెళ్లినా రైతుల ఆక్రందనలే.. ఏ రైతును కదిపినా కన్నీటి గాధలే. కళ్లెదుట పంటకు మద్దతు ధర దక్కక పోవడంతో చమర్చిన కళ్లతో దుఃఖాన్ని పంటి కింద అదిమి పెట్టుకొని రైతన్నలు మౌనంగా రోదిస్తున్న తీరు గుండెలను పిండేస్తోంది. పెట్టుబడులు పెరిగిపోయాయి రెండెకరాల్లో కౌలుకు చేస్తున్నా. ఎకరాకు రూ.20 వేలు కౌలుకు చెల్లించాను. రబీలో మొక్క జొన్న సాగుకు ఎకరాకు రూ.50 వేలు పెట్టుబడి పెట్టాను. 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కోతకు రూ.4 వేలు తీసుకుంటున్నారు. పంటను తోలేందుకు ట్రాక్టర్కు రూ.1,000 డిమాండ్ చేస్తున్నారు. పెట్టుబడులు ఏటా పెరిగిపోతున్నాయి. ధర మాత్రం పెరగడం లేదు. మార్కెట్లో చూస్తే రూ.1,650కి మించి కొనడం లేదు. ఎకరాకు రూ.15 వేలకు పైగా నష్టపోతున్నా. – తాళ్లూరి ఇసాక్, గణపవరం, పల్నాడు జిల్లా ఈ రైతు పేరు లగడపాటి వీరాంజనేయులు. బాపట్ల జిల్లా పర్చూరుకు చెందిన ఈయన రబీలో కౌలుకు తీసుకున్న 30 ఎకరాల్లో శనగ, 10 ఎకరాల్లో తెల్లజొన్న వేశాడు. ఎకరాకు రూ.15 వేల చొప్పున రూ.6 లక్షలు కౌలుకే చెల్లించాడు. రెండు పంటలకు రూ.15 లక్షల వరకు రూ.2కు వడ్డీకి తెచ్చి సాగు చేశాడు. తెల్లజొన్న 25 క్వింటాళ్ల దిగుబడి వస్తే, శనగ 8 క్వింటాళ్లకు మించి రాలేదు. తెల్లజొన్న రూ.1,600కు అమ్ముకున్నాడు. శనగకు క్వింటాకు రూ.4,900కు మించి ధర లేదు. ‘అతి కష్టమ్మీద 40 క్వింటాళ్ల శనగను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో అమ్ముకున్నా రెండు నెలలైనా పైసా జమ కాలేదు. గతేడాది నల్లబర్లి పొగాకు సాగుతో రూ.10 లక్షలు నష్టపోతే ఈసారి మరో రూ.15 లక్షలకు పైగా నష్టపోతున్నా’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.ఈ రైతు పేరు శివ వెంకటరెడ్డి. గుంటూరు జిల్లా చుండూరు మండలం చిన్న పరిమి గ్రామానికి చెందిన ఈయన 10 ఎకరాలు కౌలుకు తీసుకొని మొక్కజొన్న సాగు చేశాడు. ఎకరాకు రూ.32 వేలు కౌలు చెల్లించాడు. అదునుకు యూరియా దొరకక బ్లాకులో బస్తా రూ.350–450 మధ్య కొనుగోలు చేశాడు. పంటను కాపాడుకునేందుకు మోటార్లతో ఐదుసార్లు నీళ్లు పెట్టాల్సి వచ్చింది. ఇలా ఎకరాకు రూ.50 వేల చొప్పున అప్పులు చేసి పెట్టుబడి పెట్టాడు. తీరా పంట చేతికొచ్చేసరికి క్వింటా రూ.1,600కు మించి కొనడం లేదని, ఈ ధరకు అమ్ముకుంటే కనీసం పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదని వాపోయాడు. వైఎస్ జగన్ హయాంలో ఇదే మొక్కజొన్నను రూ.2,650కు అమ్ముకున్నానని, పచ్చి వడ్లకు రూ.2,200 ధర దక్కిందని చెప్పాడు. జగన్ ప్రభుత్వంలో మంచి ధరలు లభించాయని, ఇప్పుడు రైతుల పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు.ఈ రైతు పేరు వేటు వెంకటేశ్వరరెడ్డి. బాపట్ల జిల్లా తెనాలి మండలం ఐతానగరానికి చెందిన ఈయనకు సెంటు భూమి కూడా లేదు. వ్యవసాయంపై మక్కువతో 40 ఎకరాలు కౌలుకు తీసుకొని తొలి పంట వరి వేశాడు. ఎకరాకు రూ.35 వేల వరకు పెట్టుబడి పెడితే అకాల వర్షాలకు 30 బస్తాలకు మించి దిగుబడి రాలేదు. దాంట్లో సగం కౌలుకే ఇవ్వాల్సి వచ్చింది. మిగిలిన ధాన్యం బస్తా (75 కేజీలు) రూ.1,350 చొప్పున అమ్ముకున్నాడు. రబీలో ఎకరాకు రూ.25 వేల పెట్టుబడితో జొన్న సాగు చేశాడు. మోంథా తుపానుకు మూడొంతులు పంట పోతే రెండోసారి విత్తగా ఎకరాకు 18 క్వింటాళ్ల దిగుబడులొచ్చాయి. తీరా మార్కెట్కు తెస్తే కొనేవారు లేరు. ‘రెండు పంటలకు రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. ఇప్పటి వరకు రూ.5 లక్షలే చేతికొచ్చింది. ఈ సీజన్లో రూ.7 లక్షలకు పైగా నష్టపోయాను’ అని ఈ రైతు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ రైతు పేరు నల్లమోతు సత్యనారాయణ. పల్నాడు జిల్లా నాదెళ్ల గ్రామానికి చెందిన ఈయన తనకున్న 3.5 ఎకరాల్లో మొక్కజొన్న, 1.60 ఎకరాల్లో బొప్పాయి పంటలు సాగు చేశాడు. ఎకరాకు మొక్కజొన్నకు రూ.50 వేలు, బొప్పాయికి రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టాడు. మొక్కజొన్న ఎకరాకు 20 క్వింటాళ్ల దిగుబడి రాగా, క్వింటా రూ.1,600కు అమ్ముకోగా, బొప్పాయి పంటకు నాందేడ్ తెగులు సోకడంతో నాణ్యత తగ్గింది. ‘ఎకరాకు 10 టన్నులకు మించి దిగుబడులు రావడం లేదు. మార్కెట్లో కిలో రూ.10కి మించి కొనేవారు లేరు. తెగులు సోకిందంటే కిలో రూ.5కే అడుగుతున్నారు. కనీసం కిలోకు రూ.15–16 ధర వస్తే కానీ గిట్టుబాటు కాదు. గతేడాది 10 ఎకరాల్లో వంగ తోట వేసి నష్టపోయాను. ఈసారి మొక్కజొన్న, బొప్పాయి వేసి తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాను. ఏం చేయాలో పాలుపోవడం లేద’ని కన్నీటి పర్యంతమయ్యాడు. పల్నాడు జిల్లా నాదెళ్లలో తెగుళ్ల బారిన పడిన బొప్పాయి పంట (పంపాన వర ప్రసాదరావు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల నుంచి సాక్షి ప్రతినిధి) : రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి చందాన తయారైంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో రైతులు గతేడాది సాగు చేసిన నల్ల బర్లీ పొగాకుతో తీవ్ర నష్టాలను మూట గట్టుకున్నారు. ఇప్పటికీ వందలాది మంది రైతుల ఇళ్లల్లో పొగాకు బేళ్లు బేలచూపులు చూస్తూనే ఉన్నాయి. మిర్చి, పత్తి పంటలకు గిట్టుబాటు ధర దక్కక ఒక్కో రైతు రూ.5–10 లక్షల వరకు నష్టపోయారు. నల్లబర్లి పొగాకు సాగు చేయొద్దు.. లాభసాటిగా ఉన్న మొక్కజొన్న, శనగ సాగు చేయండని ప్రభుత్వం ఊరూ వాడ ప్రచారం చేసింది. మరొక వైపు గతేడాది నష్టపోయిన మిర్చి, పత్తి రైతులు సైతం ఈసారి జొన్న, మొక్కజొన్న, శనగ, కంది సాగు వైపు మళ్లారు. బాపట్ల లంక గ్రామాలతో పాటు పల్నాడు జిల్లాలో సాగు చేసే టమాటా, ఉల్లి, బెండ, వంగ, గోరుచిక్కుడు, దోసకాయలు, బంగాళదుంప తదితర కూరగాయల పంటలకు కూడా గిట్టుబాటు ధర లేక దళారులకు అప్పనంగా ఇవ్వలేక రైతులు మౌనంగా రోదిస్తున్నారు. పల్నాడు జిల్లా అమీన్సాహెబ్ పాలెంలో మిర్చిని ఆరబోస్తున్న రైతులు తీపిని పంచాల్సిన పుచ్చకాయ, కర్బూజ తోటలు రైతులకు కన్నీటి చేదును మిగిలిస్తున్నాయి. రెండేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొందని.. ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కలేదని రైతులు బాహాటంగానే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ప్రకృతి ప్రకోపం వల్లనో, మార్కెట్ వైఫల్యం వల్లనో నష్టపోవడం లేదని.. ముమ్మాటికీ పాలకులు చేస్తున్న నమ్మక ద్రోహం వల్లే నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉల్లి, టమాటా వంటి పంటలకైతే కనీసం కోత ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేక పొలాల్లోనే వదిలేస్తున్నామని తెనాలికి చెందిన ఎం.భాస్కరరావు అనే కౌలు రైతు వాపోయారు. అరటి, బొప్పాయి పంటలు కొనే వారు లేక తోటల్లోనే పక్వానికి వచ్చి రాలిపోతున్నాయని కన్నీటి పర్యంతమవుతున్నారు. మొంథా తుపాను వల్ల నష్టపోతే పైసా పరిహారం కూడా ఇవ్వలేదని అయ్యారుపేటకు చెందిన పొపూరి బాబూరావు ఆవేదన వ్యక్తం చేశారు. పంటను అమ్మగా వచ్చిన అరకొర ఆదాయం కనీసం వడ్డీలకు కూడా సరిపోవడం లేదని మరో కౌలు రైతు కుసుమర్తి ముసలయ్య కన్నీరు పెట్టుకున్నారు. వ్యాపారులు సిండికేట్గా మారి జలగల్లా పీలుస్తుంటే ప్రభుత్వం కళ్లున్నా చూడలేని కబోదిలా తయారైందని మండిపడుతున్నారు. మార్కెట్ యార్డులు వెలవెలఎప్పుడూ కళకళలాడే మార్కెట్ యార్డులు కొనుగోళ్లు లేక నిశ్శబ్దానికి వేదికలవుతున్నాయి. జొన్న, మొక్కజొన్న సాగు చేస్తే కొనేవారు లేక చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక హమాలీలుగా పని చేయాల్సి వస్తోందని ఐతానగర్కు చెందిన శనవం గోపిరెడ్డి వాపోయారు. పేరుకు శనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా మూణ్ణాళ్ల ముచ్చటగా మూసేశారని, క్వింటాకు రూ.4,800కే దళారులకు తెగనమ్ముకుంటున్నామని రైతులు చెబుతున్నారు. కొద్ది మంది రైతులు మాత్రమే కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకుంటున్నారని చెప్పారు. మరొక వైపు మొక్కజొన్న రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. మద్దతు ధర రూ.2,400 కాగా, మార్కెట్లో రూ.1,400 నుంచి రూ.1,650 మధ్య పలుకుతోంది. అది కూడా వ్యాపారుల కాళ్లా వేళ్లా పడితే కానీ కొనడం లేదంటున్నారు. జొన్న రైతుల పరిస్థితీ అంతే.. మద్దతు ధర క్వింటా రూ.3,749 కాగా, మార్కెట్లో రూ.1,600–1,850 మధ్య దక్కుతోంది. దాచుకునేందుకు డబ్బుల్లేక సన్న, చిన్నకారు రైతులు ఈ ధరకే అమ్ముకుని నష్టపోతున్నారు. కాస్త ఆర్థిక స్థోమత ఉన్న వారైతే గోదాముల్లో నిల్వ చేసుకుంటున్నారు.ఇలాంటి ప్రభుత్వం ఉన్నా ఒకటే.. లేకున్నా ఒకటే⇒ వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఏనాడూ మద్దతు ధర కోసం ఇబ్బంది పడలేదని రైతులు ముక్త కంఠంతో చెప్పారు. ఏదైనా సందర్భంగా మార్కెట్లో కాస్త ధర తగ్గితే చాలు వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకునేదని గుర్తు చేస్తున్నారు. రెండేళ్లుగా ఆ పరిస్థితి మచ్చుకైనా కన్పించడం లేదని వాపోతున్నారు.. చంద్రబాబు ప్రభుత్వంలో ధరల స్థిరీకరణ నిధి ఉందో లేదో కూడా అర్థం కావడం లేదని వాపోయారు. ⇒ తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్లలో ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్క జొన్న కొనుగోళ్లకు శ్రీకారం చుడితే.. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కేంద్రానికి లేఖలు రాస్తూ కాలయాపన చేస్తోంది. పైగా కేంద్రం ఆర్థిక చేయూత ఇవ్వకపోతే మొక్కజొన్నే కాదు ఏ పంటనూ కొనుగోలు చేయలేమని తెగేసి చెబుతుండటాన్ని రైతులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇలాంటి ప్రభుత్వం ఉన్నా ఊడినా ఒకటేనని మండిపడుతున్నారు. ⇒ స్వామినాథన్ కమిషన్ సిఫార్సు మేరకు రైతులకు లాభసాటి ధరలు దక్కేలా చూడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. కనీసం కేంద్రం ప్రకటించిన మద్దతు ధర లభించేలా చేయడంలో విఫలమవుతోంది. ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ పథకం, పంట నష్టపరిహారం వంటి పథకాలు అందక పోవడం వంటి కారణాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం వల్ల రెండేళ్లలో రూ.25 వేల కోట్ల సంపదను రైతులు నష్టపోయారు.గతంలో బస్తా రూ.2 వేలు పలికేది ఐదెకరాల్లో గోరు చిక్కుడు సాగు చేశా. రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. 60 బస్తాలు (బస్తాకు 10 కేజీలు) దిగుబడులొచ్చాయి. మార్కెట్కు పోతే 10 కేజీల బస్తా రూ.240కు మించి కొనడం లేదు. గతంలో రూ.2 వేల వరకు ధర పలికేది. ఈసారి తీవ్రంగా నష్టపోతున్నా. – ఎరుపల్లి శ్రీనివాసరావు, విఠంరాజుపల్లె, పల్నాడు జిల్లాబాండ్ ఇచ్చినా..ఇబ్బందులే..ఐదెకరాల్లో వర్జీనియా పొగాకు సాగు చేశాను. ఐటీసీ బాండ్ కూడా ఇచ్చింది. రూ.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. తీరా పంట చేతికొచ్చేసరికి గోదాములు ఖాళీగా లేవంటూ రేపురా మాపురా అంటూ తిప్పుతున్నారు. కొనే సమయానికి నాణ్యత లేదంటున్నారు. ధర తగ్గించేస్తున్నారు. గతేడాది నల్లబర్లి సాగు చేసి నష్టపోయాం. ఈసారి వర్జీనియా సాగు చేసి ఇబ్బంది పడుతున్నాం. – మందుల నాగరాజు, విఠంరాజుపల్లె, పల్నాడు జిల్లాఅప్పులోళ్లకు జమ చేశారు ఎకరం సొంత పొలం ఉంది. మరో ఎకరన్నర కౌలుకు తీసుకుని తెల్లజొన్న పంట వేశాను. ఎకరాకు రూ.30 వేలు చొప్పున రూ.75 వేల వరకు రూ.2 వడ్డీకి అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టాను. ఎకరాకు 40 టిక్కీలు (టిక్కీ 60 కేజీలు) చొప్పున 24 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కనీస మద్దతు ధర రూ.3,749 మాట దేవుడెరుగు.. కనీసం మార్కెట్లో కొనేవారు లేరు. అప్పులోళ్లు వడ్డీల కోసం ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. చేసేది లేక క్వింటా రూ.1,850కు ఓ వ్యాపారికి తెగనమ్ముకున్నా. చేతికి రూ.44 వేలు రావడంతో దాన్ని అప్పులోళ్లకు జమ చేశాను. ఇంకా కౌలుకు చెల్లించాల్సి ఉంది. ఇంటికి పైసా కూడా తీసుకెళ్లలేదు. – పాటిపండ్ల వీరయ్య, ఐతానగరం, బాపట్ల జిల్లారెండు పంటల్లోనూ నష్టాలే..ఎనిమిది ఎకరాల్లో టమాటా వేశా. ఎకరాకు రూ.3 లక్షలు పెట్టుబడి పెట్టాను. మరో 4 ఎకరాల్లో గుమ్మడి సాగు చేశాను. రూ.60 వేల వరకు పెట్టుబడి పెట్టాను. గుమ్మడి నాలుగు టన్నులొచ్చింది. టన్ను రూ.8400 ధర పలికింది టమాటా 4 వేల బాక్సులొస్తే.. బాక్స్ (25 కేజీలు) రూ.80–110 లోపే తెగనమ్ముకోవాల్సి వచ్చింది. నా చేను సమీపంలోనే మార్కెట్లో టమాటా కిలో రూ.40 తక్కువకు అమ్మడం లేదు. నాకు మాత్రం కిలో రూ.3–4 మధ్య దక్కింది. – కళ్లం అనిల్కుమార్ రెడ్డి, సాహెబ్పాలెం, పల్నాడు జిల్లాగోరుచిక్కుడుకూ ధర లేదు..కౌలుకు తీసుకున్న 10 ఎకరాల్లో గోరుచిక్కుడు, ఐదెకరాల్లో పెసలు సాగు చేశాను. వర్షాలు ఎక్కువగా పడడంతో గోరుచిక్కుడు పంట దెబ్బతింది. ఎకరాకు రూ.30 వేల చొప్పున పెట్టుబడులు పెట్టాను. గోరుచిక్కుడు 10 కేజీల బస్తా రూ.150 పలికింది. పెసలుకు పెట్టుబడి కూడా దక్కలేదు. – భవనం కోటిరెడ్డి, విఠంరాజుపల్లె, పల్నాడు జిల్లారెండు పంటల్లోనూ నష్టాలే..ఎనిమిది ఎకరాల్లో టమాటా వేశా. ఎకరాకు రూ.3 లక్షలు పెట్టుబడి పెట్టాను. మరో 4 ఎకరాల్లో గుమ్మడి సాగు చేశాను. రూ.60 వేల వరకు పెట్టుబడి పెట్టాను. గుమ్మడి నాలుగు టన్నులొచ్చింది. టన్ను రూ.8400 ధర పలికింది టమాటా 4 వేల బాక్సులొస్తే.. బాక్స్ (25 కేజీలు) రూ.80–110 లోపే తెగనమ్ముకోవాల్సి వచ్చింది. నా చేను సమీపంలోనే మార్కెట్లో టమాటా కిలో రూ.40 తక్కువకు అమ్మడం లేదు. నాకు మాత్రం కిలో రూ.3–4 మధ్య దక్కింది. – కళ్లం అనిల్కుమార్ రెడ్డి, సాహెబ్పాలెం, పల్నాడు జిల్లాగోరుచిక్కుడుకూ ధర లేదు..కౌలుకు తీసుకున్న 10 ఎకరాల్లో గోరుచిక్కుడు, ఐదెకరాల్లో పెసలు సాగు చేశాను. వర్షాలు ఎక్కువగా పడడంతో గోరుచిక్కుడు పంట దెబ్బతింది. ఎకరాకు రూ.30 వేల చొప్పున పెట్టుబడులు పెట్టాను. గోరుచిక్కుడు 10 కేజీల బస్తా రూ.150 పలికింది. పెసలుకు పెట్టుబడి కూడా దక్కలేదు. – భవనం కోటిరెడ్డి, విఠంరాజుపల్లె, పల్నాడు జిల్లాఆ ఐదేళ్లూ... అన్నదాతకు భరోసావైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు. ధర లేని ప్రతీసారీ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ఆ పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచారు. వాటి ధరలు పెరిగేందుకు కృషి చేశారు. ఇలా ఐదేళ్లలో 6.20 లక్షల మంది రైతుల నుంచి రూ.7,796.47 కోట్ల విలువైన 21.73 లక్షల టన్నుల పంట ఉత్పత్తులు కొనుగోలు చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.139.90 కోట్ల విలువైన పొగాకుతో పాటు రూ.1,789 కోట్ల విలువైన పత్తిని కొనుగోలు చేశారు. కేంద్రం నుంచి అనుమతి ఇవ్వకపోయినా 2019–20లో 4,17,268 టన్నులు, 2020–21లో 3,06,713 టన్నులు, 2022–23లో 73,302 టన్నుల మొక్కజొన్నను మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచారు. చివరకు ఎన్నికల వేళ రబీ 2023–24 సీజన్లో ఓ దశలో జొన్న ధర పతనమవుతుందని తెలియగానే కేంద్రం నుంచి అనుమతులు రాకున్నా మార్క్ఫెడ్ ద్వారా రూ.38.60 కోట్ల విలువైన 12,136 టన్నులు కొనుగోలు చేసి తమది రైతు ప్రభుత్వమని వైఎస్ జగన్ నిరూపించారు. -
హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్ లీసా గిల్ శనివారం ప్రమాణస్వీకారం చేశారు. జస్టిస్ లీసా గిల్ చేత గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. విజయవాడలోని లోక్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు న్యాయమూర్తులు, మంత్రులు, ప్రజాప్రతినిధులతోపాటు జస్టిస్ లీసా గిల్ కుటుంబ సభ్యులు, పంజాబ్–హరియాణ హైకోర్టుకు చెందిన న్యాయమూర్తులు, విశ్రాంత న్యాయమూర్తులు సీనియర్ న్యాయవాదులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ప్రమాణస్వీకార కార్యక్రమం ప్రారంభంలో జస్టిస్ లీసా గిల్ నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పార్థసారథి చదివి వినిపించారు. ప్రమాణస్వీకారం అనంతరం జస్టిస్ లీసా గిల్కు గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు ఏజీ ఇవన సాంబశివ ప్రతాప్, రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ, ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ నల్లారి ద్వారకానాథరెడ్డి, అదనపు సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్, పలువురు న్యాయవాదులు, హైకోర్టు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం గవర్నర్ ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు.త్వరలోనే పదోన్నతిపై సుప్రీంకోర్టుకి...ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ రికార్డు సృష్టించారు. ఆమె ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు 5వ ప్రధాన న్యాయమూర్తి. పంజాబ్–హరియాణ కోటాలో జస్టిస్ లీసా గిల్ రానున్న మూడు, నాలుగు నెలల్లో పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశం ఉంది. సోమవారం నుంచి ఆమె న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యతో కలిసి కేసులను విచారిస్తారు -
విదేశీ పర్యటనకు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం అర్ధరాత్రి బెంగళూరు నుంచి కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తిగత పర్యటన నిమిత్తం యూరప్ వెళ్లారు. రెండు వారాల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. -
శ్రీరామ్ పరాశర@24 క్రాఫ్ట్స్
సాక్షి, అమరావతి: కళ్లు చెదిరే సెట్టింగ్స్..అద్భుతమనిపించే విజువల్స్.. ఇవి ఏ పాన్ ఇండియా చిత్రాల్లో కనిపించే దృశ్యాలు కాదండోయ్.!! ఓ యువ దర్శకుడు ఒక్కడే సినిమాకు అవసరమైన 24 క్రాఫ్ట్లను నిర్వర్తించి ఔరా అనిపించాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్( ఏఐ) సాయంతో ఇంతటి అద్భుతం చేశాడు యవదర్శకుడు రామ్ పరాశర. రామాయణం పేరుతో ఆయన రూపొందిస్తున్న పౌరాణిక చిత్రం టీజర్ను ఎపిక్ రామాయణ పేరుతో ఇటీవల విడుదల చేశారు. ఐదు రోజుల్లోనే లక్షల వ్యూస్ సాధించి సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచింది. అన్నీ తానై.. టీజర్లో చూపించిన విజువల్స్, గ్రాఫిక్స్, నేపథ్య సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు శ్రీరాముడి పాత్రను చూపించిన తీరు, యుద్ధ సన్నివేశాలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు రామ్. టీజర్లో రెండో వ్యక్తి అనే మాటే లేదు. డైరెక్షన్ నుంచి ఎడిటింగ్ వరకూ, సౌండ్ డిజైన్ నుంచి విజువల్ ఎఫెక్ట్స్ వరకూ 3డీ నుంచి యానిమేషన్ వరకు మొత్తం 24 విభాగాలను ఒక్కడే నిర్వహించి రికార్డు సృష్టించాడు. టీజర్ ప్రారంభంలో శివుడి ధనస్సు గురించి వినిపించే పవర్ఫుల్ వాయిస్ ఓవర్, ప్రేక్షకుడిని వెంటనే పురాణ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ప్రతి ఫ్రేమ్లో కనిపించే డీటైల్, గ్రాఫిక్స్, ఎఫెక్ట్స్ పాన్–ఇండియా సినిమా స్థాయిని తలపిస్తున్నాయి. అవకాశం సృష్టించుకున్నా.. ‘‘ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మా స్వగ్రామం. గుంటూరులో పెరిగాను. ప్రముఖ సంస్థలో ఐదేళ్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాను. సినిమా మీద ఆసక్తితో ఆరేళ్లకిందట హైదరాబాద్ వచ్చి దర్శకుడిగా మారాలని ప్రయత్నిస్తున్నాను. ఓ పెద్ద బ్యానర్లో దర్శకుడిగా అవకాశం వచ్చి కొన్ని రోజుల పాటు షూటింగ్ కూడా జరిగిన తర్వాత సినిమా ఆగిపోయింది. అప్పటి నుంచి అవకాశాల కోసం ఎక్కని ఆఫీసు మెట్టు లేదు. అయినా ఫలితం లేకపోవడంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సాయంగా తీసుకున్నాను. ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో అద్భుత రామాయణ దృశ్య కావ్యాన్ని రూపొందిస్తున్నాను. ఏఐ టూల్స్ వాడి కేవలం మూడు రోజుల్లో రూపొందించిన టీజర్కు భారీ స్పందన వస్తోంది.’’ –శ్రీ రామ్ పరాశర బొమ్మకంటి. -
బాబు సర్కారులో 'డిస్కం' లు ఢమాల్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జాతీయ స్థాయిలో ‘ఏ’ గ్రేడ్లో నిలిచేవి. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో వాటి ర్యాంకింగ్ దారుణంగా పడిపోతోంది. ఇటీవల విడుదలైన జాతీయ ర్యాంకింగ్లలోనూ వెనుకబడి ‘బీ’ గ్రేడుతో సరిపెట్టుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) శుక్రవారం విడుదల చేసిన 2024–25 డిస్కంల పనితీరు నివేదిక రాష్ట్ర విద్యుత్ రంగంలోని లోపాలను స్పష్టంగా బయటపెట్టింది. రాష్ట్ర విద్యుత్ రంగం తిరోగమనంలో ఉందనడానికి ఈ నివేదికలోని చాలా అంశాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2026–27లో చేయాల్సిన మార్పులపై ‘భవిష్యత్ వనరుల ప్రణాళిక’ ద్వారా ఏపీఈఆర్సీ సూచనలు చేసింది. ఇవీ ప్రధాన లోపాలు.. » విద్యుత్ వినియోగంలో తగ్గుదల, ప్రాజెక్టుల అమలులో ఆలస్యం, పెట్టుబడుల వినియోగంలో వైఫల్యం వంటి అంశాలు డిస్కంల వైఫల్యాలను ప్రతిబింబిస్తున్నాయి. » ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకీ) నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ను తీసుకోవడానికి చేసుకున్న ఒప్పందం ఇంకా పూర్తిస్థాయిలో అమలు కాలేదు. అలాగే, కడపలోని 750 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు ఇంత వరకూ పూర్తి కాలేదు. » రాష్ట్రంలో పరిశ్రమల విద్యుత్ వినియోగం గణనీయంగా పడిపోయింది. ముఖ్యంగా హెచ్టీ ఇండస్ట్రీ విభాగంలో ఏపీఎస్పీడీసీఎల్లో 17 శాతం, ఏపీఈపీడీసీఎల్లో 21 శాతం తగ్గుదల నమోదవ్వడం రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాల మందగమనానికి సంకేతం. పరిశ్రమలు మూతపడటమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. » డిస్కంల పరిధిలో మొత్తం విద్యుత్ అమ్మకాలు కూడా తగ్గాయి. అంటే ఆ మేరకు విద్యుత్ వినియోగం తగ్గింది. ఏపీఈపీడీసీఎల్ పరిధిలో 9.82 శాతం వరకు విద్యుత్ వినియోగం తగ్గుదల నమోదవడం గమనార్హం. విశాఖపట్నం వంటి ఆర్థిక రాజధాని ఈ డిస్కం పరిధిలోనే ఉంది. అయినప్పటికీ ఇక్కడ విద్యుత్ అమ్మకాలు పడిపోవడం రాష్ట్ర అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది. » డిస్కంలు పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు లక్ష్యాలను మించి సాధించినప్పటికీ, వినియోగ లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించలేకపోయాయి. ఆ లోటును రెన్యూవబుల్ ఎనర్జీ సర్టిఫికెట్ల (ఆర్ఈసీ) కొనుగోలుతో భర్తీ చేయడం వ్యవస్థలో లోపాలను సూచిస్తోంది. » ఆమోదించిన మూలధన వ్యయం ప్రణాళికల ప్రకారం డిస్కంలు ఖర్చు చేయడంలో విఫలమయ్యాయి. ఏపీఈపీడీసీఎల్లో రూ.3,293 కోట్లకు బదులు కేవలం రూ.1,058 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఏపీసీపీడీసీఎల్లో రూ.2813 కోట్లలో సగానికి తక్కువే వెచ్చించారు. » విద్యుత్ మిగులు, ఖర్చుల వివరాలు, ప్రాజెక్టుల పురోగతి వంటి అంశాల్లో డిస్కంలు పూర్తి పారదర్శకత పాటించడం లేదని వివిధ వర్గాల ప్రజలు ప్రజాభిప్రాయ సేకరణలో ఆరోపించారు. దీంతో భవిష్యత్లో ఖర్చుల వివరాలను మరింత స్పష్టంగా ఇవ్వాలని డిస్కంలను ఏపీఈఆర్సీ ఆదేశించింది. -
జగన్ విజన్తోనే లోకల్ క్యాడర్ వ్యవస్థ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు 95 శాతం రిజర్వేషన్ కల్పించే లోకల్ క్యాడర్ వ్యవస్థ గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే రూపుదిద్దుకుంది. తాజాగా కూటమి ప్రభుత్వం దీని అమలుకు గెజిట్ జారీ చేసినా ఆ ఆలోచన, ప్రణాళిక వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదే. 2022లో జిల్లాలను పునర్వ్యవస్థీకరించాక అందుకనుగుణంగా లోకల్ క్యాడర్ వ్యవస్థను రూపొందించి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. దానికి గతేడాది డిసెంబర్లో ఆమోదం లభించడంతో ఇప్పుడు అందుకు సంబంధించిన గెజిట్ను కూటమి ప్రభుత్వం జారీ చేసింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత కూడా 1975 నాటి పాత లోకల్ క్యాడర్ విధానమే కొనసాగింది. రాష్ట్రాన్ని జోన్లుగా విభజించి ఉద్యోగాలను భర్తీ చేసేవారు. ఒక జిల్లాకు చెందిన అభ్యర్థి తన జోన్లోని అనేక జిల్లాల అభ్యర్థులతో పోటీ పడాల్సి వచ్చేది. స్థానికత ఉన్నప్పటికీ అది విస్తృత పరిధిలో ఉండడంతో చాలామందికి అవకాశాలు తగ్గిపోయేవి. రాష్ట్రం విడిపోయాక 2014–19లో జిల్లాలను విభజించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. 2022లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ.. కొత్త లోకల్ క్యాడర్ ఏర్పాటు ఈ పరిస్థితిని మార్చడానికి 2022లో వైఎస్ జగన్ జిల్లాలను పునర్వ్యవస్థీకరించారు. రాష్ట్రాన్ని 13 నుంచి 26 జిల్లాలుగా విభజించడం ద్వారా పరిపాలనను ప్రజలకు చేరువ చేశారు. అదే సమయంలో ఉద్యోగాల విషయంలో స్థానికతను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని గుర్తించి 2023లో కొత్త లోకల్ క్యాడర్ వ్యవస్థకు రూపకల్పన చేశారు. జూనియర్ అసిస్టెంట్ స్థాయి వరకు పోస్టులను పూర్తిగా జిల్లా యూనిట్గా మార్చారు. తద్వారా ఏ జిల్లాలోని ఉద్యోగాల్లో ఆ జిల్లాకే చెందిన అభ్యర్థులకే ఎక్కువ అవకాశం లభించేలా చేశారు. ఆపై ఉన్న పోస్టులకు జోన్, మల్టీ జోన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రధానంగా 95 శాతం పోస్టులను స్థానిక అభ్యర్థులకు రిజర్వ్ చేయడం ద్వారా ఉద్యోగాలపై స్థానికులకు బలమైన హక్కు కల్పించారు. అంతకుముందు ఉన్న విధానంలో 70 నుంచి 80 శాతం వరకు మాత్రమే స్థానిక రిజర్వేషన్ ఉండేది. మిగిలిన పోస్టులకు జోనల్ పరిధిలో ఎక్కువ పోటీ ఉండేది. కొత్త విధానంలో 95 శాతం లోకల్ రిజర్వేషన్ పెట్టడం ద్వారా యువతకు మరింత భద్రత కల్పించారు. 2023లో కేంద్రానికి పంపిన జగన్ ప్రభుత్వం.. తాజాగా ఆమోదం ఈ విధానాన్ని రూపొందించినా దాన్ని అమలు చేయాలంటే రాష్ట్రపతి ఆమోదం అవసరం. స్థానికత, లోకల్ రిజర్వేషన్ అంశాలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371డి పరిధిలోకి వచ్చే అంశాలు కావడంతో కేంద్ర హోంశాఖ పరిశీలనతో పాటు రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. దీంతో వైఎస్ జగన్ ప్రభుత్వం 2023లో లోకల్ క్యాడర్ వ్యవస్థ ప్రతిపాదనలను రూపొందించి కేంద్రానికి పంపింది. ఆ ప్రతిపాదనలను గతేడాది డిసెంబర్ 15న రాష్ట్రపతి ఆమోదిస్తూ ఆర్డర్ జారీ చేశారు. దీంతో దాన్ని అమలు చేయడానికి వీలుగా ఈ నెల 20న కూటమి ప్రభుత్వం రాష్ట్రపతి ఆర్డర్ను జీవో ఎంఎస్ నంబర్ 45 ద్వారా రాష్ట్ర గెజిట్లో ప్రచురించింది. దీంతో ఈ విధానం అధికారికంగా అమల్లోకొచి్చంది. ఈ లోకల్ క్యాడర్ వ్యవస్థకు రూపకల్పన, విధానం, స్థానిక రిజర్వేషన్ జగన్ ప్రభుత్వం ఉండగా చేసిన నిర్ణయాలే. జిల్లాల పునర్వ్యవస్థీకరణ నుంచి లోకల్ క్యాడర్ డిజైన్ వరకు జరిగిన ప్రతి కీలక దశ అప్పట్లోనే పూర్తయింది. అయితే 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక కేంద్ర ఆమోదం రావడంతో ఇప్పుడు గెజిట్లో ప్రచురణ జరిగింది. నిరుద్యోగ యువతకు భరోసా రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఇది భరోసానిచ్చే విషయం. తమ జిల్లాలోనే ఉద్యోగం పొందే అవకాశాలు పెరిగాయి. స్థానిక పోటీ పరిమితమవడం వల్ల గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులకు మరింత అనుకూలంగా మారింది. మొత్తంగా చూస్తే జగన్ హయాంలోనే రూపుదిద్దుకుని ఇప్పుడు అమల్లోకి వచ్చిన లోకల్ క్యాడర్ వ్యవస్థ ఒక తరం భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్మాణాత్మక సంస్కరణ అని నిపుణులు చెబుతున్నారు. -
మద్యం అక్రమ కేసులో ఈడీ సోదాలు
సాక్షి, అమరావతి: మద్యం విధానంపై అక్రమ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి, హైదరాబాద్లోని పలువురి నివాసాల్లో శుక్రవారం సోదాలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై చంద్రబాబు ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసు ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ ఈ కేసు నమోదు చేసింది. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, హైదరాబాద్లోని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, రిటైర్డ్ అధికారి కృష్ణమోహన్రెడ్డి, మరికొందరి నివాసాల్లో సోదాలు నిర్వహించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డి, ఆయన సమీప బంధువు నివాసంలోనూ సోదాలు చేశారు. పది మంది ఇళ్లలో దాడులు జరిగాయి. అందరి ఇళ్ల వద్ద ఈడీ అధికారులకు అన్ని విధాలుగా సహకరించడంతో వారు సోదాలు పూర్తి చేసుకుని వెళ్లారు. ఈడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడంతో పాటు వారు అడిగిన డాక్యుమెంట్లు అందజేసినట్లు తెలిసింది. అడిగిందే అడుగుతూ రొటీన్ ప్రశ్నలు వేసినట్లు సమాచారం. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన సోదాల్లో పెద్దగా ఏమీ లభించలేదని తెలిసింది. ఇదిలా ఉండగా గత ప్రభుత్వ మద్యం విధానంపై ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీని ఆధారంగానే ఈడీ కూడా కేసు నమోదు చేసిన క్రమంలో శుక్రవారం సోదాలు కొనసాగించారు. -
నేడు వైఎస్సార్సీపీ రాష్ట్ర స్థాయి దళిత గళ సమ్మేళనం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ రాష్ట్ర స్థాయి దళిత గళ సమ్మేళనం శనివారం నిర్వహిస్తున్నట్లు పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావులు తెలిపారు. ఉదయం 8 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. -
సర్కారు ఆస్పత్రుల్లో సంకటం
విజయవాడ జీజీహెచ్ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి: ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి కూత వేటు దూరంలో ఉండే విజయవాడ జీజీహెచ్లో రోగులే సిరంజీలు, దూది, మందులు, సర్జికల్ పరికరాలను బయట కొనుక్కోవాల్సిన దౌర్భాగ్య స్థితి నెలకొంది. ఇక్కడే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో మందులు, సర్జికల్స్కు తీవ్ర కొరత పరిస్థితులు దాపురించాయి. ఆస్పత్రులకు ప్రభుత్వం సరిపడా మందులు, సర్జికల్స్ను సరఫరా చేయకపోవడంతో బయట కొనుక్కోవాలని సిబ్బంది చీటీలు రాసి పంపుతున్నారు. దీంతో దారి ఖర్చుల కోసం తెచ్చుకున్న పదీ పరకా ఖర్చయిపోయి పరామర్శకు వచ్చిన బంధువులు, స్నేహితులను అప్పు కోసం చేయి చాపాల్సి వస్తోందని రోగులు, కుటుంబ సభ్యులు కుమిలిపోతున్నారు. పీహెచ్సీల్లో 214, సీహెచ్సీ, ఏరియా ఆస్పత్రుల్లో 417, జిల్లా, బోధనాస్పత్రుల్లో 712 రకాల చొప్పున మందులు అందుబాటులో ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఏ ఒక్క చోటా నిర్దేశించిన మేరకు లేవు. ఇక వైద్య రంగంలో అత్యంత కీలకమైన బోధనాస్పత్రుల్లో 372 రకాల సర్జికల్స్ అందుబాటులో ఉండాలి. వీటికి కూడా తీవ్ర సంక్షోభం నెలకొంది. మందులు, సర్జికల్స్ కొరత నేపథ్యంలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ‘సాక్షి’ విజయవాడ జీజీహెచ్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రులను పరిశీలించింది. చేతిలో చీటీలతో ఆస్పత్రి ప్రాంగణంలోని ప్రైవేట్ మెడికల్ స్టోర్స్ వద్ద రోగులు, వారి సహాయకులు తండోపతండాలుగా క్యూ కట్టి కనిపించారు. బీపీ బిళ్లలు, నాజల్ డ్రాప్స్, సిరంజిలు, కాటన్, ఎగ్జామినేషన్ గ్లౌజ్లు, రక్త నమూనాలు సేకరించే ట్యూబ్లు, సర్జికల్, బ్లడ్ థిన్నర్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు సంబంధించిన వివిధ రకాల మందులు బయట కొనుక్కోవాలని చీటీలు రాయడంతో రోగులపై రూ.300 నుంచి రూ.వేలల్లో భారం పడుతున్నట్టు వెల్లడైంది. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జీజీహెచ్లలో ఇదే దుస్థితి నెలకొంది. ఈ మందులు బయట కొనుగోలు చేసుకోవాలంటూ చీటీల్లో టిక్ పెట్టిన విజయవాడ జీజీహెచ్ సిబ్బంది » గుంటూరు జీజీహెచ్లో బ్యాక్టీరియా, ఇతర ఇన్ఫెక్షన్ల చికిత్సల్లో వినియోగించే ఎస్సెన్షియల్ యాంటిబయోటిక్స్ కొరత వేధిస్తోంది. బీ–కాంప్లెక్స్, ఎకోస్ప్రిన్, మల్టీ విటమిన్ మాత్రలు సరిపడా ఉండటం లేదు. న్యూరాలజీ, కార్డియాలజీ లాంటి సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో గతంలో నెల, రెండు నెలలకు సరిపడా ఇచ్చిన మందులను తీవ్ర కొరత నేపథ్యంలో ఇప్పుడు వారం, పది రోజులకు సరిపడా మాత్రమే ఇస్తున్నారని రోగులు ఫిర్యాదు చేస్తున్నారు. గుంటూరు జిల్లావ్యాప్తంగా సెకండరీ హెల్త్ ఆస్పత్రులను మందులు, సర్జికల్స్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. » ఉత్తరాంధ్రలో ప్రభుత్వాస్పత్రులకు మందుల సరఫరా సక్రమంగా లేకపోవడం కిడ్నీ వ్యాధిగ్రస్తుల పాలిట శాపంగా మారుతోంది. డయాలసిస్ రోగులకు అవసరమైన కాల్సిట్రియోల్, ఫెబుక్సోస్టాట్, సోడియం బైకార్బొనేట్, కోర్తలిడన్, విటమిన్, టోర్సెమైడ్ లాంటి మందులను రోగులే బయట కొనుక్కోవ్సాలిన దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. విశాఖ కేజీహెచ్లో పూర్తి స్థాయిలో మందులు అందుబాటులో లేవు. సర్జికల్స్ మెటీరియల్స్కు తీవ్ర కటకట నేపథ్యంలో గాయాలతో ఆస్పత్రికి వచ్చే రోగులకు డ్రెస్సింగ్ కోసం అవసరమైన మందులు, సూదులు, కిట్స్ కూడా బయటకు రాస్తున్నారు. ఇమ్యూనోగ్లోబులిన్స్, వెంటిలేటర్ కిట్స్, ఆక్సిజన్ పైపులు, గుండె వ్యాధులకు వాడే మందులకు కొరత ఏర్పడింది. కర్నూలు, అనంతపురం, తిరుపతిల్లోని బోధనాస్పత్రుల్లోనూ మందులు, సర్జికల్స్కు తీవ్ర కొరత ఉంది. సర్జికల్స్ పరికరాలు అందుబాటులో లేకపోవడంతో ఆపరేషన్లపై తీవ్ర ప్రభావం పడుతోందని వైద్యులు చెబుతున్నారు. » సీఎం సొంత జిల్లా చిత్తూరువ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో బీపీ, విటమిన్, విరేచనాలు, జలుబు, దగ్గు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కోసం వాడే మందులకు కొరత నెలకొంది. ఎసిడిటీ, గ్యాస్ సమస్యల కోసం వాడే రాంటాక్ బిళ్లలు కూడా కొన్ని చోట్ల అందుబాటులో లేక బయట కొనుక్కోవాలని చెబుతున్నారు. » కుక్క కాటుకు పీహెచ్సీల్లో ఇచ్చే ఏఆర్వీ వ్యాక్సిన్తో పాటు క్యాల్షియం, విరోచనాలు, బీపీ, గ్యాస్ మాత్రలు, జలుబు, దగ్గు సిరప్ల నిల్వలు నామమాత్రంగా కూడా లేవు. షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇన్సులిన్ ఇంజెక్షన్లు అందుబాటులో లేకపోవడంతో బాధితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇదే పరిస్థితి గ్రామ స్థాయిలోని విలేజ్ క్లినిక్స్లోనూ నెలకొంది.సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ ఖాళీ..!చంద్రబాబు గద్దెనెక్కాక ప్రభుత్వాస్పత్రులకు మందుల సరఫరా వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. మందులు, సర్జికల్స్ కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న బడ్జెట్ ఏమాత్రం సరిపోవడం లేదని సూపరింటెండెంట్లు, వైద్య శాఖ పదే పదే మొత్తుకుంటున్నా ప్రభుత్వం అదనపు బడ్జెట్ ఇవ్వడం లేదు. 2025–26లో కేటాయించిన బడ్జెట్ మూడు క్వార్టర్లకే ఖర్చయిపోవడంతో అదనంగా రూ.100 కోట్లకుపైగా కేటాయించాలని వైద్య శాఖ అభ్యర్థించింది. ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా అదనంగా విదల్చకపోవడంతో ఇతర బడ్జెట్ను అరకొరగా సర్దుబాటు చేసి డిసెంబర్, జనవరి నెలల్లో ఇవ్వాల్సిన పర్చేజ్ ఆర్డర్లను ఏపీఎంఎస్ఐడీసీ ఫిబ్రవరి నెలాఖరులో ఇచ్చింది. 2025–26 చివరి క్వార్టర్ మందులే సెంట్రల్ డ్రగ్ స్టోర్స్(సీడీఎస్)కు పూర్తి స్థాయిలో చేరని దుస్థితి నెలకొంది. దీంతో ఆస్పత్రులకు మందులు, సర్జికల్స్ సరఫరా చేయాల్సిన సీడీఎస్లలో నిల్వలు తరిగిపోయాయి. ఏలూరు జీజీహెచ్లో మందుల కొరతపై ఇటీవల తీవ్ర వివాదం నెలకొంది. ఏప్రిల్, మే, జూన్ క్వార్టర్కు సంబంధించిన మందులు, సర్జికల్స్ సరఫరా కోసం మార్చి నెలలోనే ఇండెంట్లు తీసుకుని పీవో (పర్చేజ్ ఆర్డర్) జారీ చేయాలి. ఏప్రిల్ ముగుస్తున్నా ఇంకా ఇండెంట్లు తీసుకునే ప్రక్రియ ముగియ లేదు. రాష్ట్రంలోని అన్ని సీడీఎస్ (సెంట్రల్ డ్రగ్ స్టోర్స్)లలో శుక్రవారం నాటికి 712 రకాల మందులకు గాను 150–400 రకాలు నిల్వలు లేవు. పశ్చిమ గోదావరి సీడీఎస్లో 300 లోపు మందులే ఉన్నట్లు సమాచారం. సీఎం సొంత జిల్లాలోని చిత్తూరు, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం సీడీఎస్లలో 400 లోపు రకాల మందుల నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఈ పరిస్థితులు ఆస్పత్రులకు మందుల సరఫరాలో సర్కారు నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. కిడ్నీ బాధితులకు ఎంత కష్టం..ఉద్దానం కిడ్నీ బాధితుల ఆరోగ్య పరిరక్షణను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసి ప్రాణాలతో చెలగాటమాడుతోంది. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో బాధితుల వైద్య సేవలకు ఎంతో ప్రాధాన్యమిస్తూ క్రానిక్ కిడ్నీ డిసీజ్(సీకేడీ) కింద ప్రత్యేకంగా పీహెచ్సీలు, ఇతర ప్రభుత్వాస్పత్రులకు నాణ్యమైన, ఖరీదైన మందులను సరఫరా చేసింది. కూటమి సర్కారు వచ్చాక సీకేడీ మందుల సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఒక్కో కిడ్నీ బాధితుడిపై మందుల కొనుగోళ్ల రూపంలో నెలకు రూ.15 వేల మేరకు భారం పడుతోంది. కిడ్నీ బాధితులకు మెరుగైన వైద్య సేవల కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం నెలకొల్పిన పలాస కిడ్నీ కేర్ సెంటర్ను కూటమి సర్కారు నిర్లక్ష్యం చేస్తోంది. మందులు, సర్జికల్స్ను సక్రమంగా సరఫరా చేయడం లేదు. డయలైజర్ల కొరత నెలకొంది. డయాలసిస్ రోగులు వీటిని బయట కొనుగోలు చేసేందుకు రూ.4 వేల నుంచి రూ.5 వేల మేర ఖర్చు చేయాల్సి వస్తోంది. సప్లయ్ లేదంటున్నారు2019లో నాకు కిడ్నీ జబ్బు బయటపడింది. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నా. గత ప్రభుత్వం ఉచితంగా మందులు ఇచ్చేది. ఏడాదికిపైగా మందులు ఇవ్వడం లేదు. ఆస్పత్రుల్లో అడిగితే సప్లయ్ లేదంటున్నారు. కూలికి పోతే గానీ పూటగడవని పరిస్థితి మాది. బయట కొనేందుకు ప్రతి నెలా రూ.వేలల్లో ఖర్చు అవుతోంది. ఎంతో కష్టంగా ఉంది. – కూర్మారావు, కిడ్నీ బాధితుడు, కవిటి మండలం, శ్రీకాకుళం జిల్లాప్రతిసారి బయటే కొంటున్నాంమా మనవడికి పుట్టుకతోనే కాళ్ల వంకర సమస్య ఉంది. చికిత్స కోసం తరచూ జీజీహెచ్కు వస్తుంటాం. ప్రతిసారి బాబుకు డ్రెస్సింగ్ మెటీరియల్ బయటే కొంటున్నాం. – మేరీ, మైలవరంబీపీ బిళ్లలు బయట కొన్నామా అమ్మ నరాల సంబంధిత జబ్బుతో బాధపడుతోంది. విజయవాడ జీజీహెచ్లో అడ్మిట్ చేస్తే బీపీ బిళ్లలు బయట కొనుక్కోమని చీటీ రాసిచ్చారు. – సుబ్బారావు, మంగళగిరిపెద్దాస్పత్రిలోనూ అంతే..వారం కిందట వడదెబ్బ తగలడంతో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి వెళ్లా. వైద్యులు రాసిన మందుల చీటితో కౌంటర్కు వెళితే రెండు రకాల మందులు బయట కొనుక్కోమన్నారు. స్థానిక పీహెచ్సీలో వైద్యం సరిగా లేదని వ్యయప్రయాసలకోర్చి పెద్దాస్పత్రికి పోతే అక్కడా అదే తంతు. – మహేశ్వరి, వీరకనెల్లూరు, చిత్తూరు జిల్లావిజయవాడ వన్టౌన్ గొల్లపాలెంగట్టులో నివసించే శ్రీనివాసరావు కార్పెంటర్గా జీవనం సాగిస్తున్నాడు. అనారోగ్య సమస్యతో విజయవాడ జీజీహెచ్కు రావడంతో సీటీ స్కాన్ చేశారు. రిపోర్ట్ ఆధారంగా వైద్యులు ఆరు రకాల ఔషధాలు సూచించారు. మందుల కౌంటర్కు వెళితే మూడు రకాలు బయట కొనుక్కోవాలని చెప్పారు. దీంతో జీజీహెచ్ ప్రాంగణంలోని ప్రైవేట్ మెడికల్ షాప్లో మందులు కొన్నాడు. ‘ఉచిత వైద్యం చేస్తారని ప్రభుత్వాస్పత్రికి వస్తే మందుల కోసం రూ.300కిపైనే ఖర్చయింది. సీటీ స్కాన్ ఫిలిమ్ కోసం మరో రూ.300 తీసుకున్నారు. రిపోర్ట్ వాట్సప్లో పెట్టిస్తే చాలని డాక్టర్ చెప్పారు. అలా పెట్టం అని రూ.300 వసూలు చేశారు. నా ఒకరోజు సంపాదన మందులు, రిపోర్టులకే ఖర్చయిపోయింది’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.ఇక్కడ కనిపిస్తున్న వృద్ధురాలు లక్ష్మి స్వస్థలం కృష్ణా జిల్లా ఉయ్యూరు. వ్యవసాయ కూలీ. కొన్నేళ్లుగా గుండె సంబంధిత జబ్బుతో బాధపడుతున్న ఆమె భర్త రమణ తీవ్ర అనారోగ్యం పాలవడంతో వారం క్రితం విజయవాడ జీజీహెచ్లో అడ్మిట్ చేశారు. ‘కాళ్లావేళ్లా పడితే బుధవారం ఐసీయూకు మార్చారు. బీపీ బిళ్లలు కూడా బయటే కొన్నాం. ఇప్పుడు సిరంజీలు కూడా బయట కొనాలంటున్నారు. పొలం పనులు చేసుకుని జీవించే వాళ్లం. ఉచిత వైద్యం కోసం వస్తే మాతోనే డబ్బు ఖర్చు పెట్టిస్తున్నారు..’ అని బోరుమంది.కమీషన్ల రోగం..రోగుల ప్రాణాలతో చెలగాటం» రాష్ట్రవ్యాప్తంగా వేధిస్తున్న వెంటిలేటర్ల కొరత » విజయవాడలో 80కు గాను అందుబాటులో కేవలం 35 మాత్రమే.. తిరుపతి రుయాలో 60 వెంటిలేటర్లు మరమ్మతులకు.. » కమీషన్లు ఇచ్చే కంపెనీకే కాంట్రాక్టు ఇవ్వడానికి టెండరు ప్రక్రియ సాగదీతసాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ పెద్దల కమీషన్ల కక్కుర్తి పరాకాష్టకు చేరుతోంది. పేద రోగుల ప్రాణాల కంటే కమీషన్లకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపణలు హోరెత్తుతున్నాయి. ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో ఓ పక్క వెంటిలేటర్ల కొరత తీవ్రంగా వేధిస్తుంటే మరోపక్క కొత్తవి కొనుగోలు విషయంలో ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. కృష్ణాజిల్లా మచిలీపట్నం జీజీహెచ్లోని అనస్తీషియా విభాగంలో మూడు వెంటిలేటర్లు ఉంటే వాటిలో రెండు పనిచేయడంలేదు. దీంతో అత్యవసర కేసులను విజయవాడ జీజీహెచ్కు రిఫర్ చేస్తున్నారు.అలాగే విజయవాడ జీజీహెచ్లో 80 వెంటిలేటర్ల అవసరం ఉండగా, 35 మాత్రమే ఉన్నాయి. వీటిలో కొన్ని పనిచేయని దుస్థితి. తిరుపతి రుయాలో 120 వెంటిలేటర్లు ఉంటే 60 మరమ్మతులకు గురయ్యాయి. ఇక్కడ 100 వరకూ వెంటిలేటర్ల అవసరం ఉంది. కర్నూలు జీజీహెచ్లో 369 ఉంటే, 191 పనిచేయడంలేదు. ఇక్కడ కొన్ని నెలలుగా 70 వెంటిలేటర్లు సమకూర్చాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా పట్టించుకోవడంలేదు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా కొత్త, పాత బోధనాస్పత్రులను వెంటిలేటర్ల కొరత సమస్య తీవ్రంగా వేధిస్తుంటే అస్మదీయ సంస్థలకు కాంట్రాక్టును కట్టబెట్టేందుకు ఏడాదికి పైగా టెండరు ప్రక్రియను ప్రభుత్వ పెద్దలు సాగదీస్తున్నారు.తిరస్కరించిన కంపెనీల అర్హత కోసం..2024లో ప్రభుత్వాస్పత్రుల్లో వెంటిలేటర్ల కొనుగోలు కోసం ఏపీ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ)కి ప్రతిపాదనలు వెళ్లాయి. గతేడాది జనవరిలో టెండర్లు పిలిచారు. అయితే దానిని రద్దుచేశారు. అనంతరం.. గతేడాది డిసెంబరులో వెంటిలేటర్ల కోసం ప్రత్యేకంగా టెండరు పిలిచారు. బిడ్ల మదింపు అనంతరం అర్హత సాధించిన ఎనిమిది సంస్థల పరికరాలకు ఈనెల 7, 8 తేదీల్లో డెమో నిర్వహించారు. ఇందులో ప్రభుత్వ పెద్దల అస్మదీయ సంస్థ తెచ్చిన పరికరాలు ఘోరంగా విఫలమయ్యాయి. ఇవి ప్రమాణాల మేరకు లేవని, రోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశముందని వైద్యుల బృందం కుండబద్దలుకొట్టి తిరస్కరించినట్లు సమాచారం. అయితే, వైద్యశాఖ ఉన్నతాధికారే రీ–డెమో పెట్టి తిరస్కరించిన పరికరాలన్నింటినీ ఆమోదించాలని ఆదేశించారు. ఈనెల 28న రీ–డెమో నిర్వహణకు కార్పొరేషన్ సమాయత్తమైనట్లు సమాచారం. అవసరం లేకున్నా..కమీషన్ల కోసం గతేడాది పాయింట్ ఆఫ్ కేర్ అల్ట్రాసౌండ్ పరికరాలను అవసరం లేకపోయినా బోధనాస్పత్రులకు పెద్ద మొత్తంలో డంప్ చేశారు. రూ.9 కోట్లు విలువచేసే 80 పరికరాలను డీఎంఈ ఆస్పత్రులకు ఆర్డర్ పెట్టారు. వైద్యసేవలతో ఏమాత్రం ప్రమేయంలేని, కళాశాలల్లో కూడా డిమాండ్ లేని ఈఎన్టీ సిమ్యులేటర్ల కొనుగోలు రూపంలో మరో కుంభకోణానికి తెరలేపారు. ఏకంగా ఒకే కంపెనీ పరికరాలను సరఫరా చేసేలా దాని అనుబంధ సంస్థలు రెండు టెండర్లు వేస్తే వాటిని ఆమోదించి, కాంట్రాక్టును అవార్డు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. -
న్యాయ వ్యవస్థకు చీఫ్ జస్టిస్ ఠాకూర్ సేవలు నిరుపమానం
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా హైకోర్టు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికింది. జస్టిస్ ఠాకూర్కు వీడ్కోలు పలికేందుకు న్యాయమూర్తులందరూ మొదటి కోర్టు హాలులో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ తొలుత ప్రసంగిస్తూ, న్యాయవ్యవస్థకు జస్టిస్ ఠాకూర్ అందించిన సేవలను కొనియాడారు. ‘జస్టిస్ ఠాకూర్ ఏపీ హైకోర్టులో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారు. జ్యుడీషియల్ అకాడమీ, హైకోర్టు జడ్జిల అతిథి గృహాల ఏర్పాటుకు చొరవ తీసుకున్నారు. 38 కోర్టు భవనాలను ప్రారంభించారు. అలాగే న్యాయవ్యవస్థలో పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టారు. 3,482 పోస్టులను భర్తీ చేశారు. న్యాయాధికారుల ఖాళీలను సైతం భర్తీ చేశారు’ అని పేర్కొన్నారు. ఆయన విశ్రాంత జీవితం ప్రశాంతంగా సాగాలని ఆకాంక్షించారు. అనంతరం అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) చల్లా ధనంజయ, అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్, రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ నల్లారి ద్వారకానాథరెడ్డి ప్రసంగించారు. కార్యక్రమంలో జస్టిస్ ఠాకూర్ కుటుంబ సభ్యులు, అదనపు ఏజీ ఇవన సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, పలువురు ప్రభుత్వ న్యాయవాదులు, హైకోర్టు న్యాయవాదులు, రిజిస్ట్రార్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం జస్టిస్ ఠాకూర్ దంపతులను హైకోర్టు న్యాయవాదుల సంఘం శాలువాలతో సత్కరించి, చిత్ర పటాన్ని బహూకరించిందిస్వతంత్ర న్యాయ వ్యవస్థ పౌరుడి హక్కుచీఫ్ జస్టిస్ ఠాకూర్ భావోద్వేగ ప్రసంగంకార్యక్రమం చివరిలో జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడటానికి సిద్ధమయ్యారు. ఈ సమయంలో ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. 5 నిమిషాల పాటు ఏమీ మాట్లాడకుండా ఉండిపోయారు. అనంతరం ఆయన ప్రసంగం ఆద్యంతం భావోద్వేగంతోనే కొనసాగింది. స్వతంత్ర న్యాయవ్యవస్థ అన్నది న్యాయమూర్తి ప్రత్యేక హక్కు కాదని, అది ఈ దేశ పౌరుడి హక్కు అని చెప్పారు. న్యాయవ్యవస్థ విలువను కాపాడటానికే తాను ప్రయత్నించానని తెలిపారు. తాను న్యాయవాద వృత్తిని ఓ జీవన విధానంగా భావించిన కుటుంబంలో జన్మించినందుకు అదృష్టవంతుడినన్నారు. తన తండ్రి, సోదరుడి రుణం తీర్చుకోలేనిదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించే విషయంలో సహచర న్యాయమూర్తులు, న్యాయవాదులు, హైకోర్టు అధికారులు, ఉద్యోగులు ఎంతగానో సహకరించారన్నారు. వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. నేడు సీజేగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణంరాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్ లీసా గిల్ శనివారం ప్రమాణం చేయనున్నారు. శనివారం సాయంత్రం విజయవాడలోని లోక్భవన్లో జరిగే కార్యక్రమంలో ఆమెతో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు, పంజాబ్–హర్యానా హైకోర్టు న్యాయమూర్తులు, జస్టిస్ గిల్ కుటుంబసభ్యులు, బంధువులు, న్యాయవాదులు పాల్గొననున్నారు. న్యాయమూర్తుల గౌరవార్థం గవర్నర్ జస్టిస్ నజీర్ విందు ఏర్పాటు చేశారు. -
సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం : సజ్జల
సాక్షి,తాడేపల్లి: కూటమి పాలనలో వ్యవసాయం రంగం సంక్షోభంలో చిక్కుకుందని వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డీనేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రైతు సమస్యలపై పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. శుక్రవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రైతు విభాగం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సజ్జల మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాబు ధరలేదు. అధికార పార్టీ, దళారులు కుమ్మక్కై మోసం చేస్తున్నారు. సమస్యలు గాలికొదిలేసి మంత్రులు విదేశాల్లో తిరుగుతున్నారని’ధ్వజమెత్తారు. రైతు విభాగం సమావేశంలో వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డీనేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శులు లేళ్ళ అప్పిరెడ్డి, ఆలూరు సాంబశివారెడ్డి, రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డి రఘురామ్, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు సహా రైతు విభాగం నేతలు పాల్గొన్నారు. -
‘చంద్రబాబూ.. డైవర్షన్ రాజకీయాలు ఇంకెన్నాళ్లు?’
సాక్షి, తాడేపల్లి: ‘‘చంద్రబాబూ.. డైవర్షన్ రాజకీయాలు ఇంకెన్నాళ్లు?.. ప్రజల కష్టాలు, రైతుల కన్నీళ్లు మీకు కనపడవా?’’ అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మొక్కజొన్న, ధాన్యం, పత్తి, మిర్చి.. ఇలా ఏది చూసినా గిట్టుబాటు ధరల్లేవు. అసలు రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారా?. డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకునే నేతలు కేంద్రం నుండి ఏం సహాయం పొందారు?’’ అంటూ శైలజానాథ్ నిలదీశారు.‘‘ప్రజా సమస్యలు పక్కన పెట్టి, తిరుమల లడ్డూపై సంవత్సరన్నర పాటు అనవసర వివాదం చేశారు. పదో తరగతి పరీక్ష పేపర్ల స్పాట్ వాల్యూషన్ కూడా సరిగా చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వక విద్యాసంస్థలు పిల్లలను వేధిస్తున్నాయి. హాస్టళ్ల దుస్థితి, నిరుద్యోగుల సమస్యలు, శాంతి భద్రతలకు విఘాతం ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. మంచినీటి సమస్యతో జనం అల్లాడి పోతున్నారు. కానీ ప్రభుత్వానికి ఇవేమీ కనపడటం లేదు’’ అంటూ సాకే శైలజానాథ్ దుయ్యబట్టారు.‘‘ప్రజా సమస్యలు, దళితులపై జరుగుతున్న దాడులపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టాలి. ప్రజల ఆస్తుల్ని దోచుకోవటమే సంపద సృష్టా?. మావిగన్ ప్రతిపాదనకు సమాధానం చెప్పకుండా దూషణలు ఎందుకు?. రాయలసీమలో రైతులు నీటి కోసం కష్టాలు పడుతున్నారు. కానీ అమరావతిలో నీటిని తోడటానికే కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఆ డబ్బు రాయలసీమలో ఖర్చు పెడితే సాగునీటి ప్రాజెక్టులు పూర్తవుతాయి. కానీ చంద్రబాబు లక్షల కోట్లు అప్పులు చేసి అమరావతిలోనే పెట్టటం అన్యాయం. అమరావతి అప్పులు రాయలసీమ వాసుల మీద పడుతున్నాయి. రాష్ట్రంలో యధేచ్చగా భూదోపిడీ జరుగుతోంది. దేవాదాయ భూములను కూడా పరిశ్రమలకు ఎలా ఇస్తారు?’’ అంటూ శైలజానాథ్ ప్రశ్నించారు. -
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఐఏఎస్లు..: హైకోర్టు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం కనీస స్థాయిలో స్పందించడం లేదని హైకోర్టు మండిపడింది. ఐఏఎస్ అధికారులు వేధిస్తున్నా, ఖజానాకు నష్టం చేకూరుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆక్షేపించింది. ఐఏఎస్ అధికారులకు చట్టం అన్నా, కోర్టు ఆదేశాలన్నా కనీస స్థాయిలో కూడా గౌరవం లేదంది. రాష్ట్ర విభజన తరువాత ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కుటుంబాలు ఓ చోట, వీరు మరో చోట జీవితాన్ని వెళ్లదీస్తున్నారని తెలిపింది. అయితే ఐఏఎస్ అధికారులు మాత్రం శుక్ర, శనివారాల్లో విమానాల్లో హైదరాబాద్కు వెళ్లిపోతున్నారని వ్యాఖ్యానించింది. ఆయా అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో కోర్టు చూస్తూనే ఉందని వ్యాఖ్యానించింది. చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్సెస్ (సీసీఎస్టీ) బాబు అహ్మద్ తమను అనేక రకాలుగా వేధిస్తున్నారని, పదోన్నతులు ఇవ్వడం లేదని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ గురువారం మరోసారి విచారణ జరిపారు. ‘ఇలాంటి అధికారుల విషయంలో మెతక, ఉదాసీన వైఖరిని అవలంభించలేం. బాబు అహ్మద్ ప్రజలకు ఉచిత సేవ చేయడం లేదు. ఆయన ప్రతీ నెలా 1వ తేదీన ఠంచనుగా జీతం తీసుకుంటున్నారు. మాకే అధికారం ఉంటే తక్షణమే ఆయనను సస్పెండ్ చేసేవాళ్లం. అహ్మద్పై వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపి, ఆధారాలుంటే ఆయనను సర్వీసు నుంచి తొలగించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తాం’ అని న్యాయమూర్తి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై స్పందించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. పదోన్నతుల ఫైళ్లను తొక్కిపెట్టడం ఉద్యోగులను వేధించడం కాదా? తొలుత విచారణ పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి వాదనలు వినిపిస్తూ బాబు అహ్మద్పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వినతి పత్రాలు సమర్పించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అహ్మద్ తరఫు న్యాయవాది వీవీ సతీష్ వాదనలు వినిపిస్తూ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. పదోన్నతుల విషయంలో ప్యానల్ ఇయర్ ముగియడంతో తిరిగి డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) నిర్వహిస్తామని చెప్పారు. దీనిపై న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. ఎప్పుడో డీపీసీ పూర్తయితే ప్యానల్ ఇయర్ ముగిసేంత వరకు ఎందుకు పదోన్నతులు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇందుకుగాను అహ్మద్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)నిసూటిగా ప్రశ్నించారు. పదోన్నతులకు సంబంధించిన ఫైళ్లను ఐఏఎస్ అధికారులు తొక్కిపెట్టడం ఉద్యోగులను వేధించడం కాదా? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోర్టుకు పిలిపిస్తేనే అన్నీ సర్దుకుంటాయన్నారు. గతంలో ఓ కోర్టు ధిక్కార కేసులో హైకోర్టు ధర్మాసనం ఇదే అహ్మద్ను భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించిందని గుర్తు చేశారు. పదోన్నతుల విషయంలో గత డిసెంబర్లో ఈ కోర్టు ఆదేశాలిస్తే ఇప్పటి వరకు వాటిని పట్టించుకోలేదని పేర్కొన్నారు. -
డీఎస్సీలో ‘డీల్స్’!
డీఎస్సీలో స్థానికంగా మెరిట్ అభ్యర్థులను పక్కన పెట్టి.. నాన్–లోకల్ కోటాలో బయట జిల్లా వ్యక్తికి ఉద్యోగం ఇచ్చేశారు. నాన్ లోకల్లో పోటీపడే వారు స్థానికుల కంటే మెరిట్ జాబితాలో అగ్రస్థానంలో ఉండాలి. కానీ, సదరు ఉద్యోగి స్థానికుల కంటే రెండు స్థానాలు దిగువన ఉన్నప్పటికీ రాయలసీమ జిల్లాలో నాన్లోకల్ కోటాలో పోస్టు కట్టబెట్టేశారు. ఈ విషయం పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులకు తెలిసినా మిన్నకుండిపోయారు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డీఎస్సీ–2025 పోస్టుల భర్తీలో అవినీతి, అక్రమాల దందా రాజ్యమేలింది. అర్హులకు తీవ్ర అన్యాయం చేస్తూ... నకిలీ ధ్రువపత్రాలతో అనర్హులకు చంద్రబాబు సర్కార్ ఉద్యోగాలు కట్టబెట్టినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ‘ముఖ్య’నేతకు బంధువుగా చెప్పుకుంటూ క్రీడాశాఖలో కీలక పదవిని అనుభవిస్తున్న వ్యక్తి ఈ వసూళ్ల దందాలో మాస్టర్ మైండ్గా వ్యవహరించినట్లు చెబుతున్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం కొందరు అభ్యర్థులతో డీల్ కుదుర్చుకుని ఒక్కొక్కరి నుంచి పోస్టును బట్టి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తం రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు దండుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే జీవోలో అప్రాధాన్య నేషనల్ గేమ్స్ను చేర్చారని స్పష్టం చేస్తున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ కంటే ముందే వ్యూహాత్మకంగా క్రీడా విధానం (స్పోర్ట్స్ పాలసీ) 2024–25 ప్రకటించి ఉపాధ్యాయ పోస్టులను అంగట్లో సరుకులు మాదిరిగా విక్రయించినట్లు పేర్కొంటున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 421 డీఎస్సీ పోస్టులను క్రీడా కోటాలో పరీక్ష లేకుండా భర్తీ చేయడం ఒక ఎత్తయితే.. భారీగా ముడుపులు తీసుకుని అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టడం మరో ఎత్తు. క్రీడా విధానం రూపకల్పన సమయంలో అక్రమాలకు తెర తీస్తూ జీవో నంబర్ 4లో స్పోర్ట్స్ ప్రాధాన్యతలను ఇవ్వడం.. డీఎస్సీ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇప్పుడు ఆ ప్రాధాన్యతలను మార్పు చేస్తుండటం తీవ్ర చర్చనీయాంశమైంది. తమ జీవితాలతో చంద్రబాబు సర్కారు గేమ్స్ ఆడిందని అభ్యర్థులు వాపోతున్నారు. సీబీఐతో విచారణకు డిమాండ్..కొన్ని క్రీడా సంఘాలను భయపెట్టి క్రీడాకారుల పోస్టులకు అనుగుణంగా అవసరమైన పత్రాలు రూపొందించడంలో మాస్టర్ మైండ్ చక్రం తిప్పారు. ఈ అవినీతి బాగోతాన్ని నడిపించడంలో క్రీడా ప్రాధికార సంస్థలోని ఓ డీఎస్డీవో రేయింబవళ్లు మాస్టర్మైండ్కు సహాయ సహకారాలు అందించారు. చిన్నాచితకా సర్టిఫికెట్లు ఉన్నవారికి ఉద్యోగాలు కట్టబెట్టేశారు. అందులోనూ రెండేసి డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నా, సబ్ జూనియర్ స్థాయి నుంచి వరస క్రమంలో సర్టిఫికెట్లు లేకున్నా పోస్టులు ఇచ్చేశారు. ఐదు నుంచి పది పోస్టులు మినహా చాలావరకు క్రీడా కోటాలోనే భర్తీ చేయడం గమనార్హం. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో సమగ్ర విచారణ చేయించి అక్రమార్కులను కఠినంగా శిక్షించాలని క్రీడాకారులు డిమాండ్ చేస్తున్నారు.ప్రతిభకు ప్రాధాన్యం ఎక్కడ?క్రీడా విధానం 2024–29లో భాగంగా క్రీడా కోటా రిజర్వేషన్లు కల్పిస్తూ చంద్రబాబు సర్కార్ జీవో 4 జారీ చేసింది. ఇందులో విచిత్రంగా సీనియర్ నేషనల్ విభాగం కంటే ‘నేషనల్ గేమ్స్’కు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఇదంతా ముందస్తు పథకం ప్రకారం చేశారు. ఫెడరేషన్ల ఆధ్వర్యంలో జరిగే సీనియర్ నేషనల్స్ సర్టిఫికెట్కు అత్యధిక ప్రాధాన్యం ఉంటుంది. జాతీయ జట్టు ఎంపికలు సైతం వాటి ఆధారంగానే చేస్తారు. రెండేళ్లకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించే ‘నేషనల్ గేమ్స్’ను పెద్దగా ఎవరూ పరిగణనలోకి తీసుకోరు. జాతీయ జట్ల ఎంపికలతో వీటికి సంబంధం ఉండదు. ఇందులో చాలా రాష్ట్రాలు తమ ప్రాతినిధ్యాన్ని సైతం పెద్దగా ప్రోత్సహించవు. అలాంటి ‘నేషనల్ గేమ్స్’ను చంద్రబాబు సర్కారు జీవో 4లో ప్రాధాన్యంగా పెట్టి డీఎస్సీ క్రీడా కోటాలో అక్రమాలకు తెర తీసింది. డీఎస్సీ నోటిఫికేషన్ కంటే ముందే క్రీడా కోటాలో పోస్టులను అమ్ముకునేందుకు ముఖ్యనేతకు బంధువుగా చెప్పుకునే ‘మాస్టర్మైండ్’ పక్కా స్కెచ్ వేశారు. కేవలం పోస్టులు అమ్ముకోవడం కోసమే జీవో 4లో నేషనల్ గేమ్స్ను చేర్చి.. వసూళ్ల దందా పూర్తి కావడంతో ఆ జీవోను సవరించి చేతులు దులుపుకొనే యత్నం చేస్తున్నట్టు సమాచారం.హైకోర్టు ఆదేశాలు బేఖాతర్...⇒ చంద్రబాబు సర్కారు జారీ చేసిన డీఎస్సీ–2025 నోటిఫికేషన్కు సంబంధించి పలు న్యాయవివాదాలు రేకెత్తాయి. డీఎస్సీ ప్రక్రియలో పలు లోపాలు ఉన్నాయని, పోస్టుల భర్తీలో తప్పులు దొర్లాయని పెద్ద ఎత్తున అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో డీఎస్సీపై 104కుపైగా కేసులు దాఖలయ్యాయి. రిజర్వేషన్లు అమలు, స్పోర్ట్స్ కోటాతో పాటు దరఖాస్తు దశలోనే పోస్టుల ప్రాధాన్యం తీసుకోవడం లాంటి వాటిల్లో తమకు అన్యాయం జరిగిందని కోర్టుకు ఫిర్యాదు చేశారు. కీలకమైన పోస్టుల ప్రాధాన్యంపై అప్పట్లో హైకోర్టు స్పందిస్తూ ప్రతిభ గల అభ్యర్థులు నష్టపోకుండా ఉన్నతమైన ఉద్యోగం పొందడం వారి హక్కు అని తీర్పునిచ్చింది. అయితే, ఆ తీర్పు ఇచ్చిన రోజే.. ఆర్డర్ కాపీ రాకుండా హడావుడిగా ఫలితాలను ప్రకటించి చంద్రబాబు సర్కారు పోస్టులను భర్తీ చేసింది. కాగా ‘మాస్టర్మైండ్’కు చెందిన ఓ అసోసియేషన్ నుంచి సర్టిఫికెట్లు పొందిన వారికి తగిన అర్హతలు లేకున్నా టీచర్ పోస్టులు కట్టబెట్టేశారు. అనంతరం ఆ మాస్టర్మైండ్ సన్మానం కూడా చేయించుకున్నారు. అయితే ఆ నియామక పత్రాలు ఇచ్చేలోగా ప్రతిభ గల కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో వెనక్కి తగ్గారు.⇒ విజయనగరం జిల్లాకు చెందిన ఓ వెయిట్ లిఫ్టర్ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పోస్టల్ శాఖలో క్రీడా కోటాలో ఉద్యోగానికి అనర్హురాలిగా తేలింది. తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలతో మోసగించేందుకు యత్నించినట్లు గుర్తించడంతో విజయనగరం జిల్లాలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే అనూహ్యంగా ఆమె ఏపీ డీఎస్సీ–2025లో క్రీడా కోటాలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా ఎంపికైంది. దీనిపై సామాజిక కార్యకర్తలు ‘శాప్’కు సైతం ఫిర్యాదు చేశారు.⇒ విజయనగరానికి చెందిన మరో క్రీడాకారుడు జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలు పొందారు. ఏపీ డీఎస్సీలో క్రీడా కోటాలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటే నిర్ద్వందంగా తిరస్కరించారు. ఆ తర్వాత ఆయన పోస్టల్ శాఖలో అదే క్రీడా కోటాలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందారు. -
దక్కని ధర.. రైతుకు సెగ!
వేలం కేంద్రాల్లో పొగాకు ధరలు రైతులను కుంగదీస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ధరలు నేల చూపులు చూస్తున్నాయి. ఇది రైతుల పాలిట ఆశనిపాతంలా మారింది. వేలం కేంద్రాల్లో ప్రస్తుతమున్న పరిస్థితి కొనసాగితే ఆర్థికంగా కోలుకోలేమనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. కొనుగోలు కేంద్రాల్లో ప్రారంభ ధర రూ.250 ఉండగా నేడు రూ.232కు పడిపోయింది. బ్రైట్ రకం ధరలే ఇలా ఉంటే లోగ్రేడ్ ధరలు మరింతగా దిగజారుతాయన్న బెంగ రైతులకు పట్టుకుంది. ప్రకృతి కరుణించకపోవడం, తెగుళ్ల కారణంగా దిగుబడి భారీగా పడిపోయింది. దీనికి తోడు పశ్చిమాశియా యుద్ధం రైతుకు గోరుచుట్టపై రోకటి పోటుగా తయారైంది. ఈ ఏడాది ఎకరాకి రూ.20 వేల నుంచి రూ.50 వేలు నష్టం తప్పదని రైతులు దిగాలు చెందుతున్నారు. సింగరాయకొండ: పొగాకు రైతుకు కనకవర్షం కురవటం ఇక కలేనా అంటే అవుననే అంటున్నాయి మార్కెట్ వర్గాలు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో లాభాలు చవిచూశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రైతులకు అండగా నిలవడంతో రికార్డు స్థాయిలో ధరలు పలికాయి. ఫలితంగా రైతులకు కాసుల వర్షం కురిసింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా పరిస్థితి తలకిందులైంది. వ్యాపారులు కుమ్మక్కై రైతులను నిండా ముంచేస్తున్నా ప్రభుత్వం పట్టించున్న దాఖలాల్లేవు. ఫలితంగా వేలం కేంద్రాల్లో కనీస మద్దతు ధర లభించక ఎక్కువ మంది రైతులు పొగాకును వచ్చిన ధరకు తెగనమ్ముకున్నారు. మరికొంత మంది శీతల గోదాముల్లో దాచుకున్నారు. గత సంవత్సరం ప్రారంభ ధర కేజీ రూ.320కి పైగా పలికింది. ఈ దఫా కేజీ ప్రారంభ ధర రూ.250 ఉండగా ప్రస్తుతం కేజీ ధర రూ.232 పలకటంతో రైతులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. పొగాకు బోర్డు ఒంగోలు రీజియన్ పరిధిలో 11 వేలం కేంద్రాలున్నాయి. 2026–27 పంట సీజన్కు సంబంధించి రీజియన్ పరిధిలో 82,475 హెక్టార్లలో పొగాకు పంట సాగైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2026–27 లో పంట సీజన్కు సంబంధించి ఒంగోలు రీజియన్ పరిధిలో 90.20 మిలియన్ కేజీల పొగాకు పండించేందుకు బోర్డు అనుమతి ఉంది. కానీ ఈ ఏడాది సుమారు 130 మిలియన్ కేజీల పొగాకు పండించినట్లు బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం సాగు విస్తీర్ణం తగ్గినట్లు బోర్డు అధికారులు చెబుతున్నారు. ధరతో దిగాలు.. ప్రస్తుతం పొగాకు వేలం కేంద్రాల్లో ప్రారంభం నుంచి బ్రైట్గ్రేడ్ పొగాకు కేజీ ధర రూ.250 పలికింది. తరువాత ధరలు పెరుగుతాయని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. కర్ణాటకలో పొగాకుకు సరాసరి కేజీ ధర రూ.230 వచ్చిందని ఇక్కడ కూడా ఆ స్థాయిలో వచ్చే అవకాశం ఉందని భావించారు. కానీ వేలం ప్రారంభమైన కొద్దిరోజులకే కేజీ ధర రూ.232 లకు పడిపోవడంతో రైతులు ఆందోళనలో పడిపోయారు. గిట్టుబాటు ధర లభించేనా ప్రస్తుతం వేలం కేంద్రాల్లో లభిస్తున్న ధరలను చూస్తే రైతులకు నిద్రపట్టని పరిస్థితి నెలకొంది. కొండపి వేలం కేంద్రంలో కేజీ ధర రూ.232 ఉండగా, టంగుటూరులో కేజీ ధర రూ.235, కందుకూరులో కేజీ ధర రూ.245 ఉంది. ఈ ప్రకారం రైతుకు ఎకరాకు ఒక్కో బ్యారన్కు రూ.1.50 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు నష్టం సంభవిస్తుందని ఈ విధంగా అయితే ఎలా బట్టకట్టాలా అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆశాజనకంగా లేని దిగుబడులు: ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవకపోవటంతో పాటు మంచు కారణంగా తెగుళ్ల బెడద తీవ్రంగా ఉంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఎకరాకు 9 క్వింటాళ్ల దిగుబడి రాగా కొన్ని ప్రాంతాల్లో ఎకరాకు కేవలం 5 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చిందని రైతులు చెబుతున్నారు. జరుగుమల్లి మండలం నందనవనం తదితర ప్రాంతాల్లో అక్టోబర్లో సాగు ప్రారంభించటంతో పాటు వర్షాలు కురవటంతో ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని, అదే చాలా ప్రాంతాల్లో నవంబర్లో సాగు ప్రారంభించటంతో సకాలంలో వర్షాలు లేక దిగుబడి 5 నుంచి 9 క్వింటాళ్ల వరకు మాత్రమే వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ధరలతో ఆత్మహత్యలే శరణ్యం: ఈ ఏడాది పొగాకు ధరలు తగ్గటంతో పాటు యుద్ధం కారణంగా కొనుగోలుదారులు లేక ధరలు బాగా దిగజారే పరిస్థితి నెలకొంది. ఒకవేళ కేంద్రానికి బేళ్లు తీసుకెళ్తే వాటిని నానా పరీక్షలు చేసి కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక రైతు 45 బేళ్లు తీసుకుని వెళ్తే కేవలం 27 బేళ్లు మాత్రమే కొనుగోలు చేసి 18 బేళ్లు వెనక్కి తిప్పి పంపారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా అయితే ఆత్మహత్యలే శరణ్యమని ఇక కౌలు రైతుల పరిస్థితి చెప్పటానికి వీలు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలిగత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతుల సంక్షేమం కోసం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ఆదుకుందని రైతులు గుర్తుచేశారు. గతంలో వ్యాపారులు సిండికేట్ అయి పొగాకు ధరలు పడిపోతుంటే గత ప్రభుత్వం మార్క్ఫెడ్ను రంగంలోకి దింపి ఆదుకుంది. కానీ కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునే పరిస్థితి లేదని, వీరు ఎంతసేపటికీ దోచుకో, దాచుకో అన్న సిద్దాంతం.. లేకపోతే జగన్మోహన్రెడ్డి ని విమర్శించటానికే సమయం కేటాయిస్తున్నారే తప్ప పొగాకు రైతును ఆదుకునే ఒక్క ప్రయత్నం చేపట్టిన దాఖలాలు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొగాకు సాగు తగ్గించండి ప్రత్యామ్నాయ పంటలను పండించండని చెప్పటమే తప్ప ప్రత్యామ్నాయ పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలన్న ఆలోచన మాత్రం లేదని, ఈ ప్రభుత్వంలో కష్టాలే మిగిలాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బేళ్లు వెనక్కు పంపుతున్నారు ఈ ఏడాది పొగాకు వేలం ప్రారంభంలో కేజీ ధర రూ.250 ఉండగా, ప్రస్తుతం రూ.232 పలుకుతుంది. యుద్ధం వంక చూపి వ్యాపారులు బేళ్ల కొనుగోలు పట్ల ఆసక్తి చూపకుండా ఆంక్షలు విధిస్తూ బేళ్లు తిప్పి పంపుతున్నారు. అసలే నష్టాలు వస్తాయి ఎలా అని బాధపడుతుంటే బేళ్లు వెనక్కి పంపటం అదనపు భారంగా మారింది. – తాటికొండ రామచంద్రరావు, రైతు, పచ్చవ ఎకరాకు రూ.40 వేలు నష్టం ఈ ఏడాది 40 ఎకరాల్లో పొగాకు సాగు చేశాను. ప్రస్తుతం కేజీ ధర రూ.232 మాత్రమే ఉంది. కేజీ ధర రూ.260 పైన ఉంటేనే గిట్టుబాటవుతుంది. ప్రస్తుత ధరలతో ఎకరాకు సుమారు రూ.40 వేలు నష్టమొచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం పొగాకు రైతును ఆదుకునేందుకు కృషి చేయాలి. – నాగినేని భాస్కర్, పొగాకు రైతు, పైడిపాడుకేజీ రూ.270పైన ఉంటేనే గిట్టుబాటయ్యేది నేను 29 ఎకరాల్లో పొగాకు సాగు చేస్తున్నాను. ఈ ఏడాది కేజీ ధర రూ.270 పైన ఉంటేనే గిట్టుబాటవుతుంది. వర్షాలు సరిగా కురవకపోవటం, తెగుళ్ల కారణంగా దిగుబడి ఆశించినంతగా లేదు. మందుల ఖర్చులు బాగా పెరిగాయి. ప్రభుత్వం రైతులను ఆదుకునే చర్యలు చేపట్టి ఆదుకోవాలి. – పిన్నిక శ్రీనివాసరావు, పొగాకు రైతు, పంగులూరివారిపాలెం -
కీర్తి చోరుడు బాబు.. మరో క్రెడిట్ చోరీ
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ క్రెడిట్ చోరీకి బ్రాండ్ అంబాసిడర్లుగా మారారు. గత ప్రభుత్వంలో వచ్చిన పెట్టుబడులను తమవిగా చెప్పుకుంటూ అభాసుపాలవుతున్నా.. రోజురోజూకూ మరింత దిగజారి కీర్తి చౌర్యానికి పాకులాడుతున్నారు. తాజాగా రెన్యూ పవర్ ప్రైవేటు లిమిటెడ్ పెట్టుబడులు తామే తెచ్చామంటూ గొప్పలు పోతున్నారు. అయితే ఈ పెట్టుబడులు గత ప్రభుత్వ హయాంలోనే వచ్చాయి. రెన్యూ పవర్ సీఈఓ సుమంత్సిన్హా గత ప్రభుత్వంలో విశాఖలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ వేదికగా ఒప్పందాలు చేసుకున్నారు. అనంతరం అప్పటి సీఎం వైఎస్ జగన్ దార్శనికతను కొనియాడారు. ఇప్పుడు ఆ మాటలు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారాయి. వైఎస్ జగన్కు ధన్యవాదాలు ‘‘పెట్టుబడులను ఆకర్షించడం, వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, ఉద్యోగ అవకాశాలను సృష్టించడంపై వంటి అనుకూలమైన వ్యాపార వాతావరణంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడిదారులకు అనేక ప్రయోజనాలను అందిస్తోంది. 2050 నాటికి ఆగ్నేయాసియాలో ప్రవేశించే పెట్టుబడిదారులకి ఏపీ తొలి ప్రాధాన్యంగా మారాలని, పెట్టుబడులకు ప్రాధాన్యతనిచ్చే ప్రపంచ గమ్యస్థానంగా ఎదగాలని రాష్ట్రం ఒక దార్శనికతను కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కర్టెన్ రైజర్లో నిన్న జరిగిన చర్చకు సంబంధించి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు.’’ » ఇవి రెన్యూ పవర్ చైర్మన్, సీఈఓ సుమంత్ సిన్హా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్సెస్ట్మెంట్ సమ్మిట్లో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశం, గత ప్రభుత్వంతో ఒప్పందాల అనంతరం సామాజిక మాధ్యమం(లింక్డ్ఇన్) వేదికగా చెప్పిన మాటలు ఇవి. తండ్రీ కొడుకుల తీరు సిగ్గు..సిగ్గు వైఎస్ జగనే రెన్యూ పవర్ని తీసుకొస్తే.. గత ప్రభుత్వం రాష్ట్రం నుంచి ఆ సంస్థను గెంటేసిందని, తామే ఆ సంస్థ నుంచి పెట్టుబడులు తీసుకువస్తున్నామని చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ నిస్సిగ్గుగా పచ్చి అబద్దాలు చెబుతున్నారు. క్రెడిట్ చోరీ నాటకంలో తండ్రీకొడుకులు పోటీ పడుతున్నారు. కానీ నెటిజన్లు వాస్తవాలను బయటపెట్టి సోషల్ మీడియాలో వారిని ట్రోల్స్ చేస్తున్నారు. -
టెన్త్ ‘స్పాట్’.. తప్పులతడక
సాక్షి, అమరావతి : ఈ ఏడాది పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం విద్యార్థుల పాలిట శాపంగా మారనుంది. ఇటీవల ముగిసిన స్పాట్ వాల్యుయేషన్లో భారీగా తప్పులు జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మార్కుల నమోదు తప్పులతడకగా జరిగినట్లు తెలిసింది. పార్ట్–2లో నమోదుచేసిన మార్కులకు భిన్నంగా పార్ట్–3లో నమోదైనట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ట్యాబ్లతో మార్కులను ఆన్లైన్ చేయగా ఈ విధానం విఫలమవడంతో రాష్ట్ర పరీక్షల డైరెక్టరేట్ మళ్లీ మాన్యువల్గా స్కానింగ్ విధానం చేపట్టింది. ఈ క్రమంలో మార్కుల నమోదులో జరిగిన తప్పులు పెద్దఎత్తున బయటపడుతున్నాయని, దాంతో ఈ ప్రక్రియలో పాల్గొన్న ఉపాధ్యాయులకు నోటీసులు పంపుతున్నట్లు తెలిసింది. గతేడాది గొప్పలకు పోయి విద్యార్థుల భవిష్యత్తును చీకట్లోకి నెట్టిన పరీక్షల విభాగం.. ఈ ఏడాది అంతకంటే ఘోరమైన తప్పిదాలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో 6.20 లక్షల మంది విద్యార్థుల ఫలితాల వెల్లడి ఆలస్యమవుతుందని భావిస్తున్నారు. పార్ట్–2, 3లో భిన్నంగా మార్కులు..మూల్యాంకనంలో ఆన్సర్షీట్ పైన ఓఎంఆర్ షీట్ ఉంటుంది. ఇందులో విద్యార్థి వివరాలతో పాటు మార్కులు నమోదుచేస్తారు. అలాగే, ఓఎంఆర్ షీట్లోని పార్ట్–2లో ప్రశ్నల వారీగా మార్కులను అక్కడే గ్రాండ్ టోటల్ చేస్తారు. అనంతరం పార్ట్–3లో అవే మార్కులను నమోదుచేసి పెన్సిల్తో బబ్లింగ్ చేసి అసిస్టెంట్ ఎగ్జామినర్, స్పెషల్ అసిస్టెంట్, చీఫ్ ఎగ్జామినర్ సంతకాలు చేస్తారు. అయితే, ఇక్కడే అనేక తప్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఉదా.. ఒక సబ్జెక్టులో పార్ట్–2లో 75 మార్కులు నమోదుచేసి, పార్ట్–3లో మాత్రం 57 వచ్చినట్లు నమోదుచేశారు. అలాగే, 89 మార్కులకు 67, 90 మార్కులకు 60, 70 మార్కులకు 94, 62 మార్కులకు 88.. ఇలా నమోదైనట్లు గుర్తించారు. ఈ క్రమంలో తప్పు మార్కులు నమోదుచేసిన ఉపాధ్యాయులకు, స్పెషల్ అసిస్టెంట్లకు రాష్ట్ర పరీక్షల విభాగం తాఖీదులు పంపుతోంది. వారిచ్చే సమాధానం ఆధారంగా సవరణ చేయాల్సి ఉంటుంది. అలాగే, జిల్లాలకు భారీగా సవరణ జాబితాలు పంపుతున్నారు. సాధారణంగా ఏటా ఈ తరహా పొరపాట్లు చాలా స్వల్పంగా జరుగుతాయి. కానీ, ఈసారి భారీగా జరిగినట్లు విమర్శలు వస్తున్నాయి. టార్గెట్ పెట్టి మరీ టీచర్లపై ఒత్తిడి..ఈ ఏడాది టెన్త్ విద్యార్థుల ఉత్తీర్ణత ఆధారంగానే ఉపాధ్యాయుల పనితీరును మదింపు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అవార్డులకు కూడా దీనినే ప్రాతిపదికగా తీసుకుంటామని విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తెలిపింది. దీంతోపాటు టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించకున్నా, తక్కువ ఉత్తీర్ణత వచ్చినా ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులదే బాధ్యతని, వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది. దీంతో.. ఈసారి భారీగా కాపీయింగ్ జరిగినట్లు విమర్శలు వచ్చాయి. అలాగే, మూల్యాంకనంలో పాల్గొనాలంటే కనీసం మూడేళ్ల ‘స్పాట్’ అనుభవం ఉండాలి. కానీ, ఈసారి బోధన చేయని ఉపాధ్యాయులతోనూ మూల్యాంకనం చేయించారు. దీంతో మార్కుల నమోదులో పెద్దఎత్తున తప్పులు వెలుగుచూస్తున్నాయి. -
మీ ఇష్టానికి కొంటే కుదరదు
సాక్షి, అమరావతి: చంద్రబాబు అధికారంలోకి వచ్చాక విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి అనుమతి లేకుండా కరెంటు కొంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) గుర్తించింది. అలా కొన్న విద్యుత్కు ధరను ఖరారు చేయడానికి కమిషన్ నిరాకరించింది. అనుమతితో చేసిన కొనుగోళ్లకు సంబంధించి 2024–25 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని యూనిట్కు రూ.5.17గా ఖరారు చేసింది. ఇదే ధర 2025–26 ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తుందని గురువారం జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. ఆలస్యంగా పిటిషన్లు ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు ఏపీఈఆర్సీకి ఆరు నెలలు ఆలస్యంగా పిటిషన్లు దాఖలు చేశాయి. అలాగే డిస్కంలు యూనిట్ ధర రూ.5.22గా ప్రతిపాదించగా.. కమిషన్ రూ.5.17కు తగ్గించింది. దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోళ్ల ఆధారంగా ఈ ధరను లెక్కించింది. అనుమతి లేని కొన్ని విద్యుత్ కేంద్రాల నుంచి డిస్కంలు చేసిన కొనుగోళ్లను కమిషన్ పరిగణనలోకి తీసుకోలేదు. అలాగే పునరుత్పాదక విద్యుత్ కొనుగోళ్లను కూడా లెక్కించలేదు. ఇక తాత్కాలికంగా చెల్లించిన ధర, తుది ధర మధ్య తేడాను వచ్చే నెల నుంచి మూడు సమాన నెలవారీ వాయిదాల్లో సర్దుబాటు చేయాలని డిస్కంలను ఏపీఈఆర్సీ ఆదేశించింది. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పిటిషన్లను ఈ ఏడాది సెపె్టంబర్ 30లోపు తప్పనిసరిగా దాఖలు చేయాలని సూచించింది. ఒక్కరు కూడా అభ్యంతరం చెప్పలేదేంటో ఏపీఈఆర్సీ 2022లో ప్రవేశపెట్టిన పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు బాధ్యత నియమావళి ప్రకారం.. ఏటా డిస్కంలు విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని కమిషన్కు సమర్పించాలి. దీనిలో భాగంగా ఏపీ ఈపీడీసీఎల్ ఫిబ్రవరి 26, సీపీడీసీఎల్ మార్చి 9, ఎస్పీడీసీఎల్ మార్చి 10న పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై మార్చి 16న బహిరంగ ప్రకటన జారీ చేసిన కమిషన్ ఏప్రిల్ 6 వరకు ప్రజల నుంచి అభిప్రాయాలు కోరింది. కానీ చిత్రంగా ఒక్కరి నుంచి కూడా ఎటువంటి అభ్యంతరాలు లేదా సూచనలు రాలేదు. ఏప్రిల్ 22న కర్నూలులో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలోనూ ఎలాంటిæ అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. దీంతో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగానే కమిషన్ తుది నిర్ణయం తీసుకుంది. మూడు డిస్కంల సమాచారాన్ని కలిపి ఒకే ధరను ఖరారు చేసింది. ఇలా ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం చాలా అరుదు. కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించకపోవడమే దీనికి ప్రధాన కారణం. -
అర్చకులపై రెడ్బుక్ టెర్రర్
సాక్షి, అమరావతి : రాజకీయాలకు తావే ఉండకూడని గుళ్లను అడ్డు పెట్టుకుని చంద్రబాబు ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. వైఎస్సార్ కడప జిల్లా పర్యటనలో ఉన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రెండు రోజుల క్రితం టీటీడీ అనుబంధ ఒంటిమిట్ట ఆలయంలో పనిచేసే అర్చకులు వేద అశీర్వచనం చేయడంపై వివరణ కోరుతూ ప్రభుత్వ పెద్దలు టీటీడీ ద్వారా షోకాజ్ నోటీసులు ఇప్పించడం కలకలం రేపింది. కోట్లాది భక్తుల ఆరాధ్య దైవంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ట్రస్టు బోర్డు చైర్మన్గా వ్యవహరిస్తున్న వ్యక్తి ఓ మహిళతో అత్యంత సన్నిహితంగా ఉన్న వీడియోలు, ఫొటోలు వెలుగులోకి వచ్చినా చర్యలు చేపట్టకపోగా కనీసం వివరణ కూడా కోరలేదు. కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో పలుమార్లు శ్రీవారికి పట్టు వ్రస్తాలు సమర్పించిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి వేద ఆశీర్వచనం చేసిన అర్చకులపై చర్యలు చేపట్టడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. తిరుమల కేంద్రంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అండ్ కో ఇటీవల కాలంలో ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసుకుంటూ శ్రీ వేంకటేశ్వరస్వామి పవిత్రతను సైతం దెబ్బతీసేలా పలు సందర్భాల్లో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు కొనసాగింపుగానే అర్చకులకు నోటీసులు ఇచ్చినట్లు చర్చ సాగుతోంది. దిగజారుడు రాజకీయం ఇటీవల కాలంలో మంత్రులు, ఎమ్మెల్యేలు కొత్తగా కార్యాలయంలోకి ప్రవేశించే సమయంలో టీటీడీ సహా వివిధ ఆలయాల నుంచి వేద పండితులు వచ్చి ఆశీర్వచనం అందజేయడం పరిపాటిగా మారింది. నియోజకవర్గ, మండల స్థాయి అధికార పార్టీ నాయకులు కూడా తమ రాజకీయ, వ్యక్తిగత అవసరాల కోసం ఆలయ అర్చకులను ఉపయోగించుకుంటున్నారు. ఇటీవల రాజంపేట నియోజకవర్గంలో ఓ మండల టీడీపీ నేత అనుచరులు ఒక ఎస్సీ యువకుడిపై దాడి చేశారు. ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి తమ్ముడు, మండల టీడీపీ నేతలు ఒంటిమిట్ట ఆలయ అర్చకులను కర్నూలు జిల్లాలో పోలీసు ఉన్నతాధికారి ఆఫీసుకు తీసుకెళ్లి.. ఆ అధికారికి వేద ఆశీర్వచనం చేయించారు. ఇప్పుడు ఇదే అధికార పార్టీ నేతలు.. అర్చకులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి వేద ఆశీర్వచనం చేయడం తప్పన్నట్లు ఫిర్యాదు చేశారని తెలిసింది. దీనిపై కనీస ఆలోచన లేకుండా టీటీడీ పెద్దలు అర్చకులకు నోటీసులతో ఇబ్బంది పెట్టడాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు చేయలేదా? ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వారికి అర్చకులు వివిధ సందర్భాల్లో వేద ఆశీర్వచనం ఇవ్వడం సాధారణం అని దేవదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు తిరుమల దర్శనానికి వెళ్లినప్పుడు అప్పటి టీటీడీ అ«ధికారులు వేద పండితులతో వేద ఆశీర్వచనం అందించడంతో పాటు వస్త్రం కూడా అందజేశారని గుర్తు చేస్తున్నారు. వాస్తవానికి ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండడం వల్ల ఎవరికైనా ఎలాంటి ప్రోటోకాల్ ఉండదని, అయినా అప్పుడు చంద్రబాబుకు టీటీడీ అధికారులు ఆ గౌరవం అందించడం కేవలం ఆయన మాజీ ముఖ్యమంత్రి అన్న గుర్తింపే అని నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు. -
పెద్దసంఖ్యలో జిల్లా జడ్జిల బదిలీ
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో జిల్లా జడ్జీలు బదిలీ అయ్యారు. ఇటీవల సివిల్ జడ్జిలు (సీనియర్ డివిజన్) నుంచి అదనపు జిల్లా జడ్జిలుగా పదోన్నతులు పొందిన వారితో సహా మొత్తం 72 మందికి స్థానచలనం కల్పిస్తూ హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న నేపథ్యంలో పలువురు జిల్లా జడ్జిలు బదిలీ అయ్యారు. వీరందరికీ హైకోర్టు కొత్త పోస్టింగ్లు ఇచ్చింది. మే 7వ తేదీ లోపు కొత్త బాధ్యతలు చేపట్టాలని ఆదేశించింది. రిలీవ్ అయ్యే లోపు ఇప్పటికే రిజర్వ్ చేసుకున్న తీర్పులను వెలువరించాలని కూడా స్పష్టం చేసింది. విజయవాడ రెండో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా ఉన్న ఎ.సత్యానంద్ ప్రకాశం ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమితులయ్యారు. అత్యంత కీలకమైన విజయవాడ ఏసీబీ కోర్టు ప్రత్యేక జడ్జిగా ఎల్.తేజోవతి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె నెల్లూరు మూడో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా ఉన్నారు. విజయవాడ ఏసీబీ కోర్టు ప్రత్యేక జడ్జిగా ఉన్న పి.భాస్కరరావు తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం 12వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా బదిలీ అయ్యారు. రాష్ట్ర వక్ఫ్బోర్డ్ ట్రిబ్యునల్ చైర్మన్గా టి.రామచంద్రుడు నియమితులయ్యారు. గుంటూరు అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా ఉన్న జి.చక్రపాణి విశాఖపట్నం సీబీఐ కోర్టు ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జిగా నియమితులయ్యారు. నెల్లూరు మొదటి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా ఉన్న జి.గీత, నెల్లూరు ఏసీబీ కోర్టు ప్రత్యేక జడ్జిగా బదిలీ అయ్యారు. విజయవాడ కో–ఆపరేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్గా కె.రాధారత్నం నియమితులయ్యారు. -
నిరుద్యోగులకు వయోగండం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితి పెంపుపై చంద్రబాబు కూటమి ప్రభుత్వం మౌనం వహిస్తోంది. ఉగాదికి జాబ్ క్యాలెండర్ అంటూ నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తించిన పాలకులు, వారి వయో పరిమితి పెంపుపై మాత్రం స్పందించకపోవడంపై ఆందోళన నెలకొంది. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగాలకు 34 ఏళ్ల వయసు ఉండగా, ఈ పరిమితిని కొన్నేళ్లుగా 42 ఏళ్లకు పెంచుతున్నారు. అయితే, 2023లో సర్వీస్ కమిషన్ ద్వారా ఇచ్చిన నోటిఫికేషన్లకు 44 ఏళ్లకు పెంచాలని గత ప్రభుత్వంలో సీఎంకు నారా లోకేశ్ లేఖ రాశారు. టీడీపీ ఎమ్మెల్సీలు సైతం పరిమితిని 47 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేస్తూ సీఎంకు లేఖలు రాశారు. ఎన్నికల సమయంలో లోకేశ్ నిర్వహించిన యువగళం సభల్లోనూ నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేస్తామని ప్రకటించారు. కానీ అధికాకంలోకి వచ్చాక మాత్రం ఇచ్చిన హామీ మేరకు వయసు పెంపుపై చంద్రబాబు ప్రభుత్వం మౌనంగా ఉంది. ఈ క్రమంలో అభ్యర్థుల వయోపరిమితిపై నిర్ణయం ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) ప్రభుత్వానికి లేఖ రాసింది. అయినప్పటికీ రెండు నెలలుగా అటు నుంచి ఎలాంటి స్పందనా లేదు. మరోవైపు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితిని అక్కడి ప్రభుత్వం 46 సంవత్సరాలకు పెంచి నిరుద్యోగులకు భరోసా కల్పించింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నా ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. ప్రభుత్వం గతేడాది ఇచ్చిన డీఎస్సీ–2025లో అభ్యర్థుల వయోపరిమితిని 44 సంవత్సరాలు చేసింది. కానీ, ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల విషయంలో మాత్రం తప్పించుకుంటోంది. గతేడాది జూలైలో అటవీశాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినా వయో పరిమితి పెంచలేదు.హామీ విస్మరిస్తే ఊరుకోం వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితి పెంచాలని లోకేశ్ బహిరంగ లేఖ రాశారు. టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు 47 సంవత్సరాలకు పొడిగించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీని లోకేశ్ ఎందుకు విస్మరిస్తున్నారు? రాష్ట్రంలో యూపీఎస్సీ మాదిరిగా ఏటా నోటిఫికేషన్స్ రావడం లేదు. కొన్ని నోటిఫికేషన్లపై న్యాయ వివాదాలతో ఏళ్ల తరబడి భర్తీ పూర్తి కావడం లేదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని లోకేశ్ నిలబెట్టుకోవాలి. వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలి. లేకపోతే నిరుద్యోగుల ఆందోళన తప్పదు. – ఎంబేటి రామచంద్ర, రాష్ట్ర అధ్యక్షుడు, నిరుద్యోగ జేఏసీ ఏటా 75 వేల మందికి అన్యాయం ఏపీపీఎస్సీ ఓటీపీఆర్లో నమోదైన వివరాల ప్రకారం రాష్ట్రంలో ఏటా 75 వేల మంది గ్రాడ్యుయేట్లు వయసు దాటిపోయి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు. రెండు నెలలుగా వయో పరిమితి పెంపుపై ప్రభుత్వంగానీ, గతంలో హడావుడి చేసిన నారా లోకేశ్గానీ స్పష్టతనీయడం లేదు. దీంతో అభ్యర్థుల్లో ఆందోళన పెరుగుతోంది. ఇప్పటికే చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏపీపీఎస్సీని నీరుగార్చిందన్న అపవాదును మూటగట్టుకొంది. దాదాపు 7 నెలలుగా సర్వీస్ కమిషన్కు రెగ్యులర్ చైర్మన్ను నియమించకుండా ఇన్చార్జితోనే నెట్టుకొస్తోంది. దీంతో కమిషన్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత నెలలో జాబ్ క్యాలెండర్ ప్రకటించినా అభ్యర్థుల వయోపరిమితిపై మాత్రం స్పష్టతనివ్వకపోవడం గమనార్హం. -
హత్యా రాజకీయాలు.. దుష్ప్రచార కుట్రలు
సాక్షి, అమరావతి: చంద్రబాబు మరోసారి తన మార్కు హత్యా రాజకీయ దుష్ప్రచారానికి తెగబడుతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తిన ప్రతిసారి డైవర్షన్ కుట్రలో భాగంగా ఇటువంటి దుష్ప్రచారానికి తెర తీయడం తన నైజమని మరోసారి నిరూపిస్తున్నారు. తాజాగా వైఎస్సార్ కడప జిల్లాలో వైఎస్సార్సీపీకి చెందిన పెద్ద దస్తగిరి హత్యను వక్రీకరిస్తూ కుతంత్రానికి పాల్పడుతున్నారు. టీడీపీకి వత్తాసు పలికే ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా విభాగాల ద్వారా పక్కాగా దుష్ప్రచార పన్నాగం పన్నుతున్నారు. అసలు హతుడు దస్తగిరి భార్య రమణమ్మే ఈ హత్యతో వైఎస్సార్సీపీ నేత నిత్యానందరెడ్డికి ఎటువంటి సంబంధం లేదని ప్రకటించినా, టీడీపీ మూకలు మాత్రం విష ప్రచారం కొనసాగిస్తుండటం గమనార్హం. దస్తగిరి హత్య ఉదంతాన్ని వక్రీకరిస్తూ వైఎస్సార్సీపీతోపాటు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దుష్ప్రచారానికి దిగజారుతుండటం విభ్రాంతి కలిగిస్తోంది. అసలు రాష్ట్రంలో హత్యా రాజకీయాలకు తెరతీసిన చరిత్ర ఉన్న చంద్రబాబు.. వైఎస్సార్సీపీకి హత్యా రాజకీయాల బురద అంటించాలని యత్నిస్తుండటం విస్మయ పరుస్తోంది. దాంతో చంద్రబాబు హత్యా రాజకీయాల చరిత్ర మరోసారి ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది.చంద్రబాబు దిగజారుడు రాజకీయం వైఎస్సార్సీపీ నేత పెద్ద దస్తగిరి హత్యను వక్రీకరిస్తూ చంద్రబాబు, ఆయన ముఠా విష ప్రచారానికి పాల్పడుతూ దిగజారుడు రాజకీయాలకు తెగబడుతోంది. ఏకంగా మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, సవిత స్వయంగా ఈ దుష్ప్రచారాన్ని భుజానికెత్తుకోవడం ద్వారా ఈ పన్నాగం అంతా చంద్రబాబు డైరెక్షన్లోనే సాగుతోందన్నది స్పష్టమవుతోంది. అసలు విషయం ఏమిటంటే.. వైఎస్సార్సీపీకి చెందిన పెద్ద దస్తగిరి, నిత్యానంద రెడ్డి అత్యంత సన్నిహిత మిత్రులు. సుదీర్ఘకాలంగా వారిద్దరూ వ్యాపార భాగస్వాములు. రెండు కుటుంబాలు అత్యంత సన్నిహితంగా మెలుగుతాయన్నది వైఎస్సార్ కడప జిల్లాలో అందరికీ తెలిసిన వాస్తవం. ఈ వాస్తవాలను విస్మరిస్తూ టీడీపీ ముఠా దుష్ప్రచారానికి పాల్పడుతుండటం గమనార్హం. నిత్యానందరెడ్డికి దస్తగిరి బినామీ అనే కొత్త ప్రచారాన్ని కూడా తెరపైకి తీసుకువచ్చారు. ఆస్తుల విషయంలో గొడవతోనే ఆయన్ను హత్య చేశారని నిధారార ఆరోపణలతో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. కాగా ఆ ఆరోపణలను హతుడు దస్తగిరి భార్య రమణమ్మే స్వయంగా ఖండించడం గమనార్హం. తన భర్త పెద్ద దస్తగిరి ఎవరికీ బినామీ కాదని ఆమె తేల్చి చెప్పారు. అసలు తన భర్త పెద్ద దస్తగిరికి నిత్యానందరెడ్డితో ఎటువంటి విభేదాలు లేవని ఆమె స్పష్టం చేశారు. అయినా సరే టీడీపీ నేతలు రాజకీయ కుట్రతోనే దుష్ప్రచారం చేస్తున్నారు. దర్యాప్తు పేరిట కుతంత్రం ఈ హత్య కేసు దర్యాప్తు ముసుగులో వైఎస్సార్సీపీ నేతలను వేధించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం బరి తెగిస్తోంది. అందుకే ఈ కేసు దర్యాప్తు చేస్తున్న కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు, తాలుకా పోలీస్ స్టేషన్ సీఐ రెడ్డప్ప, చిన్న చౌకు సీఐ ఓబులేసు, ఎస్సై రాజేశ్వర రెడ్డిలను హఠాత్తుగా బదిలీ చేసింది. ఆ స్థానంలో ప్రస్తుతం ట్రాఫిక్లో ఉన్న బాలస్వామిరెడ్డిని ఏరికోరి కడప డీఎస్పీగా నియమించారు. ఆ వెంటనే డీఎస్పీ బాలస్వామి రెడ్డి నేతృత్వంలో పోలీసుల వేధింపులు మొదలయ్యాయి. బాధిత కుటుంబం అనే సానుభూతి కూడా లేకుండా హతుడు పెద్ద దస్తగిరి నివాసంలో సోదాల పేరుతో కుటుంబ సభ్యులను పోలీసులు వేధించారు. వైఎస్సార్సీపీ నేత నిత్యానందరెడ్డికి వ్యతిరేకంగా తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని వారిని వేధిస్తున్నారు. కానీ అందుకు పెద్ద దస్తగిరి కుటుంబ సభ్యులు ఏమాత్రం సమ్మతించ లేదు. హత్యా రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబేహత్యా రాజకీయాలపై చంద్రబాబు, టీడీపీ నేతలు శ్రీరంగ నీతులు చెబుతుండటం దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లోనే హత్యా రాజకీయాలకు తెరతీసింది చంద్రబాబేనన్నది చరిత్ర చెబుతున్న పచ్చి నిజం. ఆయన హత్యా రాజకీయాల చరిత్ర తిరగేస్తే చాంతాడంత ఉంటుంది. అధికారంలో ఉంటే పోలీసుల సహకారంతో హత్యలకు బరితెగించడం.. ప్రతిపక్షంలో ఉంటే అరాచక శక్తులతో హత్యలకు తెగబడటాన్ని టీడీపీ అధికారిక విధానంగా చేసింది చంద్రబాబే.టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగేతర శక్తిగా చెలరేగిన చంద్రబాబు.. తన ప్రభుత్వ హయాంలో ఇంకెంతగా బరితెగించి ఉంటారన్నది ఊహకే అందని దారుణం. విజయవాడలో మల్లెల బాబ్జీ అనుమానాస్పద మృతి నుంచి.. ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా సాగుతున్న హత్యాకాండల వరకు.. అన్ని దారుణాల్లో చూపుడు వేలు చంద్రబాబు వైపే చూపిస్తోంది. మల్లెల బాబ్జీ అనుమానాస్పద మృతి1984లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుపై మల్లెల బాబ్జీ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో హత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం సృష్టించింది. అతను ఎన్టీరామారావుపై ఎందుకు హత్యాయత్యానికి పాల్పడ్డారన్నది పోలీసుల విచారణలో వెల్లడవుతుందని అందరూ ఆశించారు. కానీ ఆ తర్వాత కొన్ని రోజులకే మల్లెల బాబ్జీ విజయవాడలోని ఓ లాడ్జిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతను ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు ప్రకటించడం గమనార్హం. కాగా అతని జేబు నుంచి పోలీసులు ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. తనకు రూ.3 లక్షలు ఇస్తానని చెప్పి కేవలం రూ.30 వేలే ఇచ్చారని ఆ లేఖలో ఉండటం గమనార్హం. కాగా ఈ వ్యవహారంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేయకుండా అప్పటి రాజ్యాంగేతర శక్తి చంద్రబాబే అడ్డుకున్నారని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పాత్రికేయుడు పింగళి దశరథరామ్ పాశవిక హత్యటీడీపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న విజయవాడకు చెందిన ప్రముఖ పాత్రికేయుడు పింగళి దశరథరామ్ పాశవిక హత్యను రాష్ట్రం ఎప్పటికీ మరచిపోలేదు. 1985 అక్టోబరు 20న రాత్రి విజయవాడలో రిక్షాలో వెళుతున్న దశరథరామ్ను దారి కాచి మరీ దారుణంగా దాడి చేశారు. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాలని కుటుంబ సభ్యులు చెప్పినా సరే పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేయడం గమనార్హం. అంటే అప్పటి ప్రభుత్వ పెద్దల దన్నుతోనే దశరథరామ్ను హత్య చేశారన్నది స్పష్టమైంది. చంద్రబాబు అండతోనే వైఎస్ రాజారెడ్డి దారుణ హత్యచంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే 1998లో వైఎస్ రాజా రెడ్డిని కడప జిల్లాలో పాశవికంగా హత్య చేశారు. టీడీపీ నేతలు పేర్ల పార్థసారథి, ఆయన వర్గీయులు చంద్రబాబు అండతోనే ఈ హత్యకు పాల్పడ్డారు. వంగవీటి రంగా దారుణ హత్యవిజయవాడలో టీడీపీ అరాచకాలకు అడ్డుగోడగా నిలిచిన అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా హత్య రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. 1988లో నిరాహార దీక్ష చేస్తున్న ఆయన్ను పాశవికంగా హత్య చేశారు. టీడీపీ ఎదుగుదలకు అడ్డంకిగా ఉన్నందునే చంద్రబాబు డైరెక్షన్లోనే ఈ హత్యకు తెగబడ్డారని పరిశీలకులు స్పష్టం చేశారు. ఆ హత్యలో స్వయంగా పాల్గొని నిందితుడిగా ఉన్న వెలగపూడి రామకృష్ణకు చంద్రబాబు 2009 ఎన్నికల నుంచి విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ టికెట్ ఇవ్వడం గమనార్హం. ప్రస్తుతం కూడా విశాఖ టీడీపీలో ఈయన కీలకమే. కాగా, టీడీపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జ్ కంగాటి నారాయణ రెడ్డితోపాటు మరొకరిని 2017లో బాంబులతో దాడి చేసి హత్య చేశారు. చంద్రబాబు అండతోనే అప్పటి ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబమే ఈ హత్యకు కుట్ర పన్నింది.ప్రతిపక్షంలో ఉంటే చంద్రబాబు అరాచక శక్తే టీడీపీ ప్రతిపక్షంలో ఉంటే చంద్రబాబు అరాచక శక్తిగా చెలరేగిపోయేవారన్నది బహిరంగ రహస్యం. 1989–94లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజాందోళన పేరిట బస్సులను దహనం చేయాలని చంద్రబాబు ఆదేశించే వారని అప్పటి టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ టీవీ చానళ్ల ఇంటర్వ్యూల్లో వెల్లడించడం గమనార్హం. కొన్ని బస్సులు తగలబడాలి.. కొందరు సామాన్యులు చనిపోవాలి.. అప్పుడే ఆందోళన విజయవంతమైనట్టని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో తాము దిగ్భ్రాంతికి గురయ్యామని ఆయన చెప్పడం గమనార్హం. మహానేత వైఎస్సార్కే నేరుగా బెదిరింపు 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి వరుసగా రెండోసారి సీఎం కావడంతో చంద్రబాబు తట్టుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే 2009లో ఆయన్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు విస్మయ పరిచాయి. ‘నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తాను’ అని చంద్రబాబు వైఎస్ రాజశేఖరరెడ్డిని బెదిరించడం గమనార్హం. అనంతరం కొద్ది రోజుల్లోనే వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో అనుమానాస్పద స్థితిలో దుర్మరణం చెందారు. దాంతో ఆయన్ను ఉద్దేశించి చంద్రబాబు చేసిన హెచ్చరికలను పరిశీలకులు ప్రధానంగా ప్రస్తావించారు కూడా. 2024 నుంచి రెడ్బుక్ అరాచకం 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో రెడ్బుక్ అరాచకం బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు రెడ్బుక్ అరాచకాన్ని ప్రోత్సహిస్తుండటం విస్మయ పరుస్తోంది. 20 నెలల్లోనే 21 రాజకీయ హత్యలకు తెగబడ్డారు. అంటే నెలకో రాజకీయ హత్యతో రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. మొత్తంగా చంద్రబాబు 22 నెలల పాలనలో రాష్ట్రంలో 710 హత్యలు జరగడం దారుణంగా దిగజారిన శాంతిభద్రతలకు నిదర్శనంగా నిలిచింది. -
జస్టిస్ లీసా గిల్కు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ లీసా గిల్కు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. లీసా గిల్ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియామకం అవ్వడం ఏపీ న్యాయవ్యవస్థకు గర్వకారణం. జస్టిస్ లీసా గిల్ తన పదవీకాలం విజయవంతంగా కొనసాగించాలని కోరుకుంటున్నానని వైఎస్ జగన్ పేర్కొన్నారు.ఇదీ జస్టిస్ లీసా గిల్ నేపథ్యం 1966 నవంబర్ 15న జన్మించారు. చండీగఢ్లోని సెక్టార్ 9లో ఉన్న కార్మెల్ కాన్వెంట్ స్కూల్లో పాఠశాల విద్య పూర్తి చేశారు. హ్యుమానిటీస్ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. 1990లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. పంజాబ్, హర్యానా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. క్రిమినల్, సివిల్, సర్వీస్, రెవెన్యూ, రాజ్యాంగ పరమైన అనేక రకాల కేసులను ఆమె వాదించారు. చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతంతో పాటు పలు బోర్డులు, కార్పొరేషన్లకు ప్రాతినిధ్యం వహించారు. 2014 మార్చి 31న పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. -
ఐఏఎస్ అహ్మద్ బాబుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
సాక్షి,అమరావతి: ఐఏఎస్ అహ్మద్ బాబుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వకపోవడంపై సీరియస్ అయ్యింది. ఉద్యోగుల జీవితాలతో ఎలా ఆడుకుంటారని మండిపడింది. ప్రభుత్వం, సీఎస్ ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. పన్ను వసూళ్లలోనూ అహ్మద్ బాబుపై ఆరోపణలున్నాయి. మాకు అధికారం ఉంటే వెంటనే సస్పెండ్ చేసే వాళ్లం’ అని వ్యాఖ్యానించింది, -
‘మీకు కార్పొరేషన్ కావాలా?’.. పవన్ ఆరోగ్యం ఎలా ఉందని అడిగారా?
సాక్షి,కాకినాడ: పిఠాపురం జనసేన నేతలపై నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ ఆరోగ్యం ఎలా ఉందని ఎవరూ అడగడం లేదని అన్నారు. కాపు కార్పొరేషన్, కల్యాణ మండపం కావాలని అడుగుతారా? అని ప్రశ్నించారు. పవన్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోరా? అంటూ మండిపడ్డారు. దీంతో నాగుబాబు మాటలకు జనసేన నేతలు సారీ చెప్పారు. జనసేన క్షమాపణలు చెప్పడంతో అదే కావలని నాగబాబు వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స జరిగింది. ఈ విషయాన్ని జనసేన పార్టీ ఎక్స్ పోస్ట్లో పేర్కొంది. గత వారం సడెన్గా పవన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్ది నెలలుగా ఆరోగ్యపరంగా ఇబ్బందిపడుతున్న ఆయన తన వ్యక్తిగత వైద్యుల సలహాతో ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలతోపాటు ఎం.ఆర్.ఐ. కూడా నిర్వహించారు. వాటిని పరిశీలించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయవలసి ఉంటుందని నిర్ణయించి, శనివారం సాయింత్రం శస్త్రచికిత్స చేశారు.వారం నుంచి పది రోజులపాటు విశ్రాంతి తర్వాత ఆయన అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చని డాక్టర్లు తెలిపారు. అయితే దీర్ఘకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని, పూర్తి స్వస్థత చేకూరడానికి ఎక్కువ కాలం పడుతుందని డాక్టర్లు చెప్పారు. ఇదే విషయాన్ని పవన్ రాజకీయ కార్యదర్శి హరి ప్రసాద్ తెలిపారు. 2018లో పవన్ కల్యాణ్ కంటి సమస్యతో ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో హైదరాబాద్లోని ఎల్వీప్రసాద్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. పవన్ ఎడమ కంట్లో కురుపు ఉన్నట్లుగా గుర్తించిన వైద్యులు శస్త్రచికిత్సతో తొలగించారు. రంగస్థలం మూవీ సక్సెస్ మీట్లో ఈ విషయాన్ని పవన్ వెల్లడించారు. -
భగీరథ మహర్షి జయంతి.. వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: భగీరథుని జయంతి సందర్భంగా సగరులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దృఢ సంకల్పం, పట్టుదలతో అసాధ్యాన్ని సైతం సాధ్యంగా మార్చిన తపోధనుడు భగీరథ మహర్షి. తన కఠోర తపస్సుతో గంగను భువికి తీసుకువచ్చి, మానవళికి వరంగా ప్రసాదించిన భగీరథ మహర్షి జయంతి సందర్భంగా సగర కులస్తులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. దృఢ సంకల్పం, పట్టుదలతో అసాధ్యాన్ని సైతం సాధ్యంగా మార్చిన తపోధనుడు భగీరథ మహర్షి. తన కఠోర తపస్సుతో గంగను భువికి తీసుకువచ్చి, మానవళికి వరంగా ప్రసాదించిన భగీరథ మహర్షి జయంతి సందర్భంగా సగర కులస్తులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.#BhagirathaMaharshiJayanthi pic.twitter.com/HMuhFkZYEZ— YS Jagan Mohan Reddy (@ysjagan) April 23, 2026 -
తమిళనాడులోనూ ‘మేధావితనం’ బయటపెట్టుకున్నారా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమిళనాడు శాసనసభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఎవరికి లాభం చేకూరుస్తోంది? అన్నాడీఎంకే ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమికా? లేక అధికారంలో ఉన్న డీఎంకేకా? ద్రవిడ సెంటిమెంట్ ప్రబలంగా ఉండే తమిళనాడులో డీఎంకే పార్టీ చంద్రబాబు వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మార్చుకునేలా కనిపిస్తోంది. చంద్రబాబు తెలుగువారు అధికంగా నివసించే కోయంబత్తూరు తదితర ప్రాంతాలలో పర్యటించారు.ఈ ప్రాంతాల్లో ఒక సామాజిక వర్గానికి చెందిన తెలుగు ప్రజలే ఎక్కువ. దశాబ్దాలుగా అక్కడ జీవనం సాగిస్తున్న వారు తమిళులతో మమేకమైపోయారు. అయినాసరే... కాంగ్రెస్, డీఎంకే కూటమిపై వ్యతిరేకత పెంచే ఉద్దేశంతోనే చంద్రబాబును ఆ ప్రాంతాల్లో ప్రచారానికి వినియోగించారన్న విమర్శలు వస్తున్నాయి. అదే సందర్భంలో చంద్రబాబు ప్రసంగం కూడా వైరుధ్యాలతో కూడి ఉంది. పైగా తన బలహీన పాయింట్లను ప్రచారం చేసి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు అనిపిస్తుంది.తమిళనాడులో యాంటి హింది సెంటిమెంట్ అధికం. కానీ చంద్రబాబు అక్కడకు వెళ్లి హిందీ భాషను ప్రమోట్ చేసేలా తమిళుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడారు. ఇది సహజంగానే అక్కడి ప్రజలకు నచ్చదు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న అన్నా డీఎంకేకి కూడా ఇది రుచించదు. చిత్రమేమిటంటే తమిళనాడులో ఎన్ని భాషలు వీలైతే అన్ని నేర్చుకోవాలని చెప్పిన చంద్రబాబు ఆంధ్రలో మాత్రం ఆంగ్ల మీడియాన్ని వ్యతిరేకించారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియం ప్రవేశపెడితే దానిని తీవ్రంగా తప్పుపట్టారు.బాబు సన్నిహితులు దీనిపై హైకోర్టుకు కూడా వెళ్లిన విషయం తెలిసిందే. హిందీ నేర్చుకుంటే ఎక్కువ మేలు జరుగుతుందా?లేక ఆంగ్లం బాగా చదివితే అధికంగా ఉపయోగం ఉంటుందా అన్నది తమిళులకు తెలియదా! మీడియా సమావేశంలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా డీఎంకేకి మేలు చేసినట్లయిందని కొంతమంది విశ్లేషించారు. అలాగే కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన డీఎంకే అదే పార్టీతో కలవడం ఏమిటనే చిత్రమైన వాదన తీసుకువచ్చారు. ఇక్కడే ఆయన పరస్పర విరుద్దంగా మాట్లాడడమే కాకుండా, సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లయింది.ఎందుకంటే ఏపీలో తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్కు వ్యతిరేకంగా. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావు తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ ఢిల్లీలో తాకట్టు పెట్టిందని ప్రచారం చేసేవారు. అలాంటి కాంగ్రెస్ పార్టీలో రాజకీయం ఆరంభించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ పార్టీనే విమర్శిస్తున్నారు. ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కున్న తర్వాత ఈయన కాంగ్రెస్ తో కలవకుండా ఉన్నారా అంటే అదీ లేదు. గతంలో అంటే వేరే రాష్ట్రానికి వెళ్లి ఏమి చెప్పినా, అక్కడి జనానికి తెలియదు కనుక ఎలాగో నడిచిపోయేది. ఈ రోజుల్లో అలా కాదు. ఎవరు ఎక్కడ మాట్లాడినా, అందులో తేడా ఉంటే క్షణాలలో సోషల్ మీడియాలో వీడియోలతో సహా వచ్చేస్తోంది. చంద్రబాబు కూడా అలాగే దొరికిపోయారనుకోవాలి.1983 ఎన్నికలలో కూడా చంద్రబాబు తన మామ ఎన్.టి.ఆర్.ను కాదని కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓడిపోయారు.ఆ తర్వాత టీడీపీలోకి ప్రవేశించి, ఆధిపత్యం సాధించుకున్నారు. 2013లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోకుండా కాపాడారు. బీజేపీతో కొన్నిసార్లు, ఇతర పార్టీలతో కొన్నిసార్లు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లారు.ఆ క్రమంలో 2018లో తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్తో కలిసి పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ ను వదలి వేసినా, 2023 శాసనసభ ఎన్నికలలో పరోక్షంగా తెలంగాణలో కాంగ్రెస్కు సహకరించారన్నది బహిరంగ రహస్యమే. కాంగ్రెస్ కార్యాలయం గాంధీ భవన్ వద్ద టిడిపి జెండాలు కూడా అప్పట్లో రెపరెపలాడాయి. ఇప్పటికీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టీడీపీ నేతల అనుబంధం తెలిసిందే. కాకపోతే ఈ విషయాలేవీ తమిళులకు తెలియవన్నది ఆయన నమ్మకం కావచ్చు.ఇది ఒక కోణం అయితే కాంగ్రెస్తో స్నేహం చేస్తున్న రోజుల్లో సోనీయాగాంధీ, రాహుల్ గాంధీలతో కలిసి సభలలో పాల్గొన్నారు.బిజెపి నేతలను ముఖ్యంగా ప్రధాని మోడీని తీవ్రమైన పరుష భాషలో విమర్శించేవారు.ఆ క్రమంలో అప్పట్లో తమిళనాడు వెళ్లి ప్రస్తుత ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్ తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మోడీ కన్నా స్టాలిన్ సమర్థమైన నేత అని చంద్రబాబు ప్రశంసించారు. మామూలుగా అయితే ఈ అంశం పెద్దగా ప్రస్తావనకు వచ్చేది కాదేమో. కాని స్టాలిన్ ప్రభుత్వాన్ని విమర్శించిన నేపథ్యంలో ఈ వీడియోలన్ని బయటకు వచ్చాయి. చంద్రబాబు తన అవకాశవాద రాజకీయాలను తమిళనాడులో మరో సారి బహిర్గతం చేసుకున్నారు. ఇది డీఎంకే కే మేలు చేసే అవకాశం ఉంటుంది. అనవసర విషయాలు ప్రస్తావించి ఎన్డీయే కూటమిని డిఫెన్స్ లో పడేసినట్లు అనిపిస్తుంది.నిజానికి చంద్రబాబు ఈ టూర్లో కాంగ్రెస్పై మరీ తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు చేయలేదు. సాధారణంగా ఆయన తన ప్రత్యర్ధులపై వ్యక్తిత్వ హననానికి పాల్పతుంటారు. అందులో మంచి, చెడు కూడా చూడరు. అలాంటిది ఈ ప్రచారంలో కాంగ్రెస్ లేదా డీఎంకే ముఖ్యనేతలెవ్వరిని వ్యక్తిగతంగా విమర్శించకుండా జాగ్రత్త పడ్డారు. కాకపోతే తమిళనాడు ప్రభుత్వం వివిధ రంగాలలో వైఫల్యం చెందిందని, చెన్నై వెనుకబడిపోయిందని, అప్పులపాలైందని, మద్యం అధిక ధరలకు అమ్ముతున్నారని.. ఇలాంటి విమర్శలేవో చేశారు. అవన్ని విన్నవారు ఇదేదో ఏపీలో తన ప్రభుత్వం గురించి తానే చెప్పుకుంటున్నట్లుగా ఉందని చమత్కరిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ తమిళనాడు పారిశ్రామికంగా, ఆర్థికంగా బలమైన రాష్ట్రం. చెన్నై ఉపాధి కేంద్రంగా ఉంది.ఏపీ నుంచి అక్కడికి వెళ్లేవారి సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. అదే టైమ్ లో ఏపీ ప్రభుత్వం అప్పుల కుప్పగా మారింది. ఈ రెండేళ్లలోనే చంద్రబాబు సర్కార్ రూ.355000 కోట్లకు పైగా అప్పు చేసి దేశంలో రికార్డు సృష్టించింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలలో అనేకం అమలు కాలేదు.వి శాఖలో గూగుల్ డేటా సెంటర్ వచ్చేసినట్లు, ఇతరత్రా ఏదో అభివృద్ది జరిగిపోతున్నట్లు భ్రమ కల్పించడానికి ప్రయత్నించారు. ఈ విషయాలేవి తమిళ ప్రజలకు పెద్దగా అవసరం లేనివే. లేని గొప్పలు చెప్పుకుని ఏపీలో ఎల్లో మీడియాకు బానర్ కధనాలు ఇవ్వడమే లక్ష్యం కావచ్చు.ఏపీలో మద్యం బెల్ట్ షాపులు ప్రభుత్వం పరువు తీస్తున్నాయి. మద్యాన్ని అధిక రేట్లకు విక్రయిస్తున్నారు.నకిలీ మద్యం ప్లాంట్ కూడా నడిచిన వైనం బయటపడిన సంగతి తెలిసిందే. డబుల్ ఇంజన్ సర్కార్ తో బుల్లెట్ వేగంతో అభివృద్ది అంటూ ప్రచారం చేశారు.కాని కేంద్రం ద్వారా ఏపీకి ఈ రెండేళ్లలో కలిగిన లాభం ఏమిటో ఆయన వివరించలేకపోయారు. అమరావతిలో కొత్త ఎయిర్ పోర్టు కడుతున్నామని చెప్పుకున్నారు. దాని అవసరంపై టీడీపీ మేధావులే పెదవి విరుస్తున్నారు.అమరావతి పేరుతో వేల కోట్ల అప్పులు తెచ్చి ప్రజలను భయపెడుతున్న విషయం తమిళులకు తెలియకపోవచ్చు. తమిళనాడులో ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్నది వేరే విషయం. చివరిగా సోషల్ మీడియాలో వచ్చిన ఒక వ్యంగ్య వ్యాఖ్యను ప్రస్తావించుకోవాలి.స్టాలిన్ ఒక మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ ఈ కామెంట్ చేశారట.'చంద్రబాబు 1995లో నన్ను మంచోడు అన్నారు. 2004లో కాదన్నారు. 2009లో మంచోడు అన్నారు. 2014లో కాదు అన్నారు. 2019లో మళ్లీ నన్ను మంచోడు అని మెచ్చుకున్నారు.ఇప్పుడు 2026లో తిరిగి నేను మంచోడిని కాదు అని అంటున్నారు. ఇలాంటి వ్యక్తి మాటలు తమిళనాడు ప్రజలు పట్టించుకోరు" అని అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనికి చంద్రబాబు జవాబు ఇచ్చే పరిస్థితి ఉంటుందా?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
హైకోర్టు సీజేగా జస్టిస్ లీసా గిల్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ నియమితులయ్యారు. ఈ మేరకు భారత రాష్ట్రపతి ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జస్టిస్ గిల్ నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయ శాఖ సంయుక్త కార్యదర్శి జగన్నాథ్ శ్రీనివాసన్ బుధవారం నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నెల 25 నుంచి ఆమె నియామకం అమల్లోకి వస్తుందని ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ నియామకంతో ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ చరిత్ర సృష్టించారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఈ నెల 24న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో జస్టిస్ లీసా గిల్ సీజేగా నియమితులయ్యారు. జస్టిస్ గిల్ ప్రస్తుతం హైకోర్టులో నెంబర్ 2గా కొనసాగుతున్నారు. పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ గిల్.. గత నెల 6న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుత సీజే జస్టిస్ ఠాకూర్ పదవీ విరమణ అనంతరం జస్టిస్ గిల్ను సీజేగా ప్రతిపాదిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం గతంలోనే సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 25న సీజేగా ఆమెతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయిస్తారు.ఇదీ జస్టిస్ లీసా గిల్ నేపథ్యం 1966 నవంబర్ 15న జన్మించారు. చండీగఢ్లోని సెక్టార్ 9లో ఉన్న కార్మెల్ కాన్వెంట్ స్కూల్లో పాఠశాల విద్య పూర్తి చేశారు. హ్యుమానిటీస్ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. 1990లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. పంజాబ్, హర్యానా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. క్రిమినల్, సివిల్, సర్వీస్, రెవెన్యూ, రాజ్యాంగ పరమైన అనేక రకాల కేసులను ఆమె వాదించారు. చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతంతో పాటు పలు బోర్డులు, కార్పొరేషన్లకు ప్రాతినిధ్యం వహించారు. 2014 మార్చి 31న పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. -
అప్పుల ‘నెట్’లో ఆస్పత్రులు
సాక్షి, అమరావతి: ఇప్పటికే 23 నెలల పాలనలో రికార్డు స్థాయిలో రూ.3.56 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసిన చంద్రబాబు సర్కారు నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకుండా ‘ఆరోగ్యశ్రీ’ ఊపిరి తీస్తోంది! రూ.మూడు వేల కోట్లకుపైగా ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు వరుసగా సమ్మెలోకి వెళుతుండటంతో బకాయిలన్నింటినీ వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) చేస్తామని నమ్మబలికి మరోసారి మోసానికి సిద్ధమైంది. ఆస్పత్రుల బకాయిలు తీర్చడం కోసం అప్పులు చేస్తామంటూ ఆరోగ్యశ్రీ చరిత్రలోనే వింత సంప్రదాయానికి నాంది పలకడమే కాకుండా.. ఆ అప్పులకు నెట్వర్క్ ఆస్పత్రులు ష్యూరిటీగా ఉండాలంటూ దారుణమైన నిబంధన విధించడం.. ప్రభుత్వమే పక్కా కాబూలీ వ్యాపారుల తరహాలో వ్యవహరిస్తుండటంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం.. ఆగిన ఆసరా..అధికారం చేపట్టి రెండేళ్లు కూడా తిరక్కుండానే ప్రభుత్వ ఆరోగ్య రంగాన్ని చంద్రబాబు ఛిన్నాభిన్నం చేసేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో సూది మందు, దూదికి కూడా తీవ్ర కటకటలాడే పరిస్థితులు నెలకొన్నాయి. అనారోగ్యంతో ప్రభుత్వాస్పత్రులకు వెళ్లిన పేద రోగులను మందులు బయట కొనుక్కోవాలంటూ ప్రభుత్వమే అదనపు భారం మోపుతోంది. ఆరోగ్యశ్రీని నీరుగార్చడంతోపాటు రోగి కోలుకునే సమయంలో ఆర్థిక సాయంతో ఆదుకునే ఆసరా పధకాన్ని నిలిపివేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో శ్రీకారం చుట్టిన నాడు–నేడు కార్యక్రమాన్ని పూర్తిగా గాలికి వదిలేయడమే కాకుండా ప్రభుత్వ కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్కు కట్టబెట్టేస్తూ మన విద్యార్థుల వైద్య విద్య కల, పేదల ఉన్నత వైద్యానికి చంద్రబాబు సర్కారు గండి కొడుతోంది. 104, 108 సేవలు స్కామ్లుగా మారిపోయాయి. చివరకు వైద్య పరికరాల కొనుగోళ్లలోను భారీ అవినీతికి పాల్పడుతున్నారు. మొత్తం ఆరోగ్య వ్యవస్థనే కుప్ప కూల్చేశారు. ఏపీలో ప్రభుత్వాస్పత్రులపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లి ప్రైవేట్ ఆస్పత్రులకు క్యూ కడుతున్నారని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్వహించిన నేషనల్ శాంపిల్ సర్వేలో వెల్లడైంది.మరో మోసానికి సిద్ధం..!రూ.3 వేల కోట్లకుపైగా ఆరోగ్యశ్రీ బకాయిల సాధన కోసం నెట్వర్క్ ఆస్పత్రులు సమ్మెలోకి వెళ్లడంతో బకాయిలన్నీ ఓటీఎస్లో ఇస్తామని చంద్రబాబు ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రభుత్వం దీన్ని నిలబెట్టుకోకపోవడంతో ఇటీవల మరోమారు ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. దీంతో తొలి విడతలో రూ.వెయ్యి కోట్ల బకాయిలు విడుదల చేస్తామని నమ్మబలికి రోజుకో తిరకాసుతో చంద్రబాబు సర్కారు చుక్కలు చూపిస్తోంది. ఓటీఎస్ కోసం ప్రత్యేకంగా అప్పు చేస్తామంటూ, ఆ అప్పులకు అయ్యే వడ్డీ కోసం ఆస్పత్రులకు ఇవ్వాల్సిన మొత్తంలో 8 శాతం కోత విధించనుంది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ను ష్యూరిటీగా పెట్టి బ్యాంక్ నుంచి అప్పు చేయాలని ప్రభుత్వం ఎత్తుగడ వేసింది. అయితే ట్రస్ట్కు రుణాలు ఇవ్వబోమని బ్యాంకులు తేల్చి చెప్పడంతో ఫైనాన్స్ కార్పొరేషన్ల ద్వారా రుణాలు సమీకరించి వాటి ద్వారా ఆస్పత్రులకు నిధులు విడుదల చేస్తామని నమ్మబలికింది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆరోగ్యశ్రీ ట్రస్ట్, ఆస్పత్రి మధ్య ట్రైపార్టీ అగ్రిమెంట్ ఉంటుందని పేర్కొంది. ‘‘పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సకాలంలో రుణం తిరిగి చెల్లించకపోతే ఆస్పత్రుల నుంచి వసూలు చేస్తాం..’’ అని ఆ అగ్రిమెంట్లో నిబంధన పెట్టారు. వడ్డీ, అసలు మొత్తాన్ని ఆస్పత్రులే చెల్లించాల్సి ఉంటుందని షరతు విధించారు. ఈ నిబంధన చూసి ఆస్పత్రుల యజమానులు కంగుతిన్నారు. దీన్ని తొలగించాలని ఏపీ ప్రైవేట్ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశ) ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. సాధారణంగా ప్రభుత్వం విడుదల చేసే నిధుల్లో పది శాతం టీడీఎస్ కింద కట్ అవుతుంది. మరోవైపు అప్పులకు వడ్డీ ఆస్పత్రులే కట్టాలంటూ 8 శాతం కోత పెడుతున్నారు. ఇటు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకుండా అటు ఆస్పత్రుల ముక్కుపిండి వసూలు చేసే విధానాలపై నెట్వర్క్ ఆస్పత్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.ప్రజారోగ్యంతో చెలగాటం..ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభమైన నాటి నుంచి ప్రభుత్వం నేరుగా ఖజానా నుంచి ఆస్పత్రులకు బిల్లులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. 2024లో చంద్రబాబు గద్దెనెక్కాక ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా రూపుమాపే కుట్రలో భాగంగా బిల్లులు చెల్లించకుండా తొక్కిపెట్టారు. తన బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు చెందిన బసవతారకం ఆస్పత్రికి మాత్రం అడ్డదారుల్లో బిల్లులు ఇస్తూ, మిగిలిన ఆస్పత్రులకు రూ. 3 వేల కోట్లకుపైగా బకాయిలు పెట్టారు. ఎఫ్ఆర్బీఎం, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలన్నింటినీ ఉల్లంఘిస్తూ 23 నెలల్లో రూ.3.56 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసి ఆరోగ్యశ్రీ బిల్లులు మాత్రం చెల్లించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. -
శ్రీహరి, గిరీష్ అరెస్ట్కు పోలీసుల యత్నాలు
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి (మీడియా) పూడి శ్రీహరి, సోషల్ మీడియా యాక్టివిస్ట్ గిరీష్కుమార్రెడ్డి రిమాండ్ను తిరస్కరిస్తూ కుప్పం కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలును హైకోర్టు నిలిపివేసిన తరువాత కూడా వారి అరెస్ట్కు పోలీసులు ప్రయత్నాలు చేశారని సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి బుధవారం హైకోర్టుకు నివేదించారు. అలా అయితే ఆ వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు ఆదేశించారు. దీనిపై ఈ నెల 29వ తేదీన పూర్తి స్థాయిలో వాదనలు వింటానని తెలిపారు. అప్పటి వరకైనా కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని సుధాకర్రెడ్డి అభ్యర్థించారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ, ‘కుప్పం కోర్టు ఆదేశాల అమలును మాత్రమే నిలుపుదల చేశాం తప్ప, వాటిని రద్దు చేయలేదు. అందువల్ల శ్రీహరి, గిరీష్ లను అరెస్ట్ చేస్తారన్న ఆందోళన అవసరం లేదు’ అని పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యంలో శ్రీహరి, గిరీష్ విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ప్రత్యేకంగా ఆదేశించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కుప్పం కోర్టు ఉత్తర్వులను సవా లు చేస్తూ పోలీసులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై గత వారం విచారణ జరిపిన జస్టిస్ లక్ష్మణరావు కుప్పం కోర్టు రిమాండ్ తిరస్కరణ ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలు బుధవారం మరోసారి విచారణకు వచ్చాయి. -
నేతన్నల నిరసనాగ్రహం
మంగళగిరి టౌన్: చేనేత కార్మికులు నిరసన గళమెత్తారు. తమ సమస్యలపై చంద్రబాబు ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ పోరుబాట పట్టారు. మంగళగిరి సమీపంలోని చినకాకాని వై జంక్షన్లోని నేతన్న సర్కిల్ వేదికగా బుధవారం చేనేత సంఘాల నాయకులు 48 గంటల నిరాహార దీక్షకు దిగారు. దీక్షను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ కె. వియన్నారావు ప్రారంభించి పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా చేనేత కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కార్మికుల సామాజిక భద్రత కోసం రూ.10 లక్షల ఎక్స్గ్రేషియాతో కూడిన ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని, రాష్ట్ర బడ్జెట్లో కనీసం రూ.2 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రతి చేనేత కార్మికుడికి ఏడాదికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సహాయం తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు. సహకార సంఘాలకు రావాల్సిన రూ.203 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని, ఎనిమిది నెలలుగా పెండింగ్లో ఉన్న ‘నేతన్న నేస్తం’ నిధులు విడుదల చేయాలని కోరారు. ఇచ్చిన హామీ మేరకు మంగళగిరిలో 20 వేల ఇళ్ల స్థలాలు వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు. నెల రోజుల్లో సమస్యలు పరిష్కారం కాకపోతే ‘చలో అమరావతి’ చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ కో–కన్వినర్ పిల్లలమర్రి నాగేశ్వరరావు, నాయకులు పిల్లలమర్రి బాలకృష్ణ , బండారు ఆనంద్ ప్రసాద్, సీపీఎం నేత రమాదేవి, ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలని చంద్రబాబు ఆదేశాలు
సాక్షి,విజయవాడ : మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నా ప్రైవేట్పరం చేసేందుకే మొగ్గుచూపారు. ఈ మేరకు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.పీపీపీ పనులు నెలరోజుల్లో ప్రారంభించాలని ఆదేశించారు. మొత్తం 10 మెడికల్ కాలేజీలను పీపీపీకి ఇచ్చేయాలని సూచించారు. ఫేజ్ 1లో నాలుగు, ఫేజ్ 2లో ఆరు మెడికల్ కాలేజీలు పీపీపీకి అప్పగించనుంది. గతంలో పిలిచిన టెండర్లకు ప్రైవేట్ సంస్థలు స్పందించలేదు. ఇప్పుడు మళ్లీ ప్రైవేట్ వ్యక్తులకే అప్పగించాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
తెచ్చిన అప్పు అంతా ఏం చేస్తున్నారు?: లేళ్ల అప్పిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: రైతులు కష్టాల్లో ఉంటే మంత్రులు సింగపూర్లో షికార్లు చేస్తారా? అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతుల కోసం ఖర్చు చేయటానికి డబ్బులు లేవు గానీ.. షికార్లకు డబ్బులుంటాయా? అంటూ నిలదీశారు. చంద్రబాబు హయాంలో ఏ రైతూ బాగుపడింది లేదు. వ్యవసాయం దండగ అని తన ‘మనసులో మాట’ పుస్తకంలో రాసుకున్న వ్యక్తి చంద్రబాబు. అందుకే ఇప్పుడు మళ్లీ ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లేకపోయినా పట్టించుకోవటం లేదు’’ అంటూ అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.మామిడి, ధాన్యం, పత్తి, మిర్చి, ఉల్లి, టమోటా, మొక్కజొన్న.. ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధరల్లేదు. అయినా చంద్రబాబు అధికారులతో ఒక్ సమీక్ష సమావేశం కూడా ఎందుకు నిర్వహించలేదు?. అసలు రాష్ట్రంలో వ్యవసాయ శాఖ పని చేస్తుందా?. రైతులను ఆదుకోవడానికి డబ్బుల్లేవంటారా?. లక్షల కోట్లు అప్పులు తెచ్చి ఏం చేస్తున్నారు?. చంద్రబాబు రైతు వ్యతిరేకి. మిగతా రాష్ట్రాల్లో రైతులను అందుకునేందుకు అక్కడి ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. కానీ చంద్రబాబుకు మాత్రం ఆ స్పృహ ఎందుకు లేదు?’’ అంటూ అప్పిరెడ్డి ప్రశ్నించారు.‘‘ప్రపంచానికి పాఠాలు నేర్పానని చంద్రబాబు డబ్బా కొట్టుకుంటారు. మరి అలాంటి వ్యక్తి తన మంత్రులకు సింగపూర్లో ట్రైనింగ్ ఇస్తారట. రైతుల కోసం డబ్బుల్లేవంటూ మంత్రుల విహార యాత్రలకు మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తారా?. రైతు సమస్యల పరిష్కారానికి ఒక్క సమీక్ష సమావేశాన్నైనా చంద్రబాబు ఏర్పాటు చేశారా?. రైతులకు మేలు చేసింది వైఎస్సార్ కుటుంబమే. ఉచిత విద్యుత్ నుంచి రైతు భరోసా కేంద్రాల వరకు వైఎస్సార్, వైఎస్ జగన్ మాత్రమే చేశారు. చంద్రబాబు ఏనాడూ ఏ రైతుకూ మేలు చేయలేదు. రైతుల కన్నీళ్లలో ఈ ప్రభుత్వం కొట్టుకుపోతుంది’’ అని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. -
ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు
సాక్షి,అమరావతి: ఏపీలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. రాగల మూడు గంటల్లో అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కర్నూలు, నంద్యాల, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. 40-60కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. -
చంద్రబాబూ.. తప్పు చేస్తున్నారు
సాక్షి, అమరావతి: ‘మీరు తప్పు చేస్తున్నారు.. అందుకే ప్రజలకు, ప్రశ్నించే గొంతుకలకు భయపడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కాకర్ల వెంకట్రావిురెడ్డి చేసిన తప్పేంటి? ఉద్యోగుల సమస్యలు పరిష్కరించమని అడగడమే ఆయన చేసిన నేరమా? ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారని అడిగితే అతనిపై రెడ్బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగించి అతన్ని డిస్మిస్ చేశారంటే మీరు భయపడిపోతున్నారనే కదా..’ అంటూ సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు.సీఐ శంకరయ్య విషయంలోనూ మీరు ఇలాగే దుర్మార్గంగా వ్యవహరించారంటూ ఎత్తిచూపారు. ‘మీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షుడిగా ఉన్న అశోక్బాబు మీ తరఫున కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహించలేదా? బీజేపీని ఓడించమని పిలుపు ఇవ్వలేదా? మరి ఎందుకు అతన్ని డిస్మిస్ చేయలేదు? అంటే మీ వాళ్లకు ఒక న్యాయం, పక్క వాళ్లకు మరో న్యాయమా?’ అని నిలదీశారు. ఈ మేరకు మంగళవారం ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే..⇒ ‘‘చంద్రబాబు గారూ.. ఇటీవల మీరు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే మీరు బాగా భయపడి పోతున్నారని అర్థమవుతోంది. ఎన్నికల ముందు అధికారం కోసం నోటికి వచ్చిన వాగ్దానాలు ఇచ్చారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ ప్రతి సభలోనూ ఊదరగొట్టారు. ప్రతి ఇంటికీ వెళ్లి బాండ్లు సైతం ఇచ్చి ప్రతి కుటుంబాన్ని మోసం చేశారు. రెండేళ్లు అవుతున్నా మేనిఫెస్టోలో చెప్పినవి ఏవీ చేయకపోగా.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అమలు చేసేశామని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజల నుంచి, ఉద్యోగుల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక ప్రశ్నించే గొంతుకలపై బ్రహ్మాస్త్రాలు ప్రయోగిస్తున్నారు. అంటే మీరు భయపడుతున్నారనే కదా దీని అర్థం?⇒ ప్రజలు, ఉద్యోగుల నుంచి ప్రశ్నలు వస్తున్నాయంటేనే మీ పరిపాలన బాగా లేదనే కదా అర్థం. ఇచ్చిన హామీలు అమలు చేయలేదనే కదా దాని అర్థం. మరి అవి ఎప్పుడు నెరవేరుస్తారని అడగడం తప్పా? రెండేళ్లు అవుతున్నా, మూడో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఇంకెప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించడం నేరమా? రూ.3.50 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు. అవేమవుతున్నాయని నిలదీయడం అపరాధమా? వీటికి సమాధానం చెప్పుకోలేక మిమ్మల్ని ప్రశ్నిస్తున్న వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారంటే మీరు భయపడుతున్నారనే కదా.. మీరు తప్పు చేశారని ఒప్పుకున్నట్లే కదా..⇒ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కాకర్ల వెంకట్రావిురెడ్డి చేసిన తప్పేంటి? ఉద్యోగుల సమస్యలు పరిష్కరించమని అడగడమే ఆయన చేసిన నేరమా? ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారని అడిగితే అతనిపై రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగించి, అతన్ని డిస్మిస్ చేశారంటే మీరు భయపడిపోతున్నారనే కదా.. ఉద్యోగులకు హక్కుగా రావాల్సిన పెండింగ్ డీఏలు, పీఆర్సీ, మీరు వసూ్తనే ఇస్తామన్న ఐఆర్ ఇవ్వాలని అడగడంలో తప్పేముంది? అది మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీనే కదా.. ఉద్యోగుల విషయంలో మీరు వ్యవహరిస్తున్న తీరు, మీ మోసపూరిత వైఖరిని అందరూ గమనిస్తున్నారు.⇒ సీఐ శంకరయ్య విషయంలోనూ మీరు ఇలాగే దుర్మార్గంగా వ్యవహరించారు. మా చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో జరగని విషయాలను జరిగినట్లుగా సీఎం స్థాయిలో మీరు అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారని, అది తనను బాధించిందని శంకరయ్య అంటే అతన్ని ఏకంగా ఉద్యోగం నుంచి తొలగించడం మీ నిరంకుశ పాలనకు నిదర్శనం కాదా? మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారంటే మీరు భయపడుతున్నారనే కదా అర్థం?⇒ ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి ఇస్తామని చెప్పింది వాస్తవం కాదా? ప్రతి ఇంటికీ బాండ్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? రెండేళ్లు అవుతున్నా ఉద్యోగాలు లేవు.. నిరుద్యోగ భృతి లేదు. పైగా ఉద్యోగులపై కక్ష సాధింపులు. ఇది జంగిల్ రాజ్ కాదా? ఉగాది రోజున మీ జీతాలు డబుల్ చేస్తామని వలంటీర్లకు మాట ఇచ్చి, అధికారంలోకి వచ్చిన వెంటనే వారి కడుపుకొట్టింది నువ్వు కాదా? 2.60 లక్షల మందిని రోడ్డున పడేసి, ఆ వ్యవస్థే లేకుండా చేసిన అరాచకత్వం నీదే కదా? మీ కక్ష సాధింపులకు, మీరు ఉద్యోగులపై పెట్టే ఒత్తిళ్లకు ఒక్క సచివాలయ ఉద్యోగులే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 250 మందికి పైగా ఆకస్మిక మరణం పొందింది నిజం కాదా? ⇒ చంద్రబాబు గారూ.. సూటిగా ఒక ప్రశ్న. మీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షుడిగా ఉన్న అశోక్ బాబు మీ తరఫున కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహించలేదా? బీజేపీని ఓడించమని పిలుపు ఇవ్వలేదా? మరి ఎందుకు అతన్ని డిస్మిస్ చేయలేదు? అంటే మీ వాళ్లకు ఒక న్యాయం, పక్క వాళ్లకు మరో న్యాయమా? చంద్రబాబు గారూ.. మీరు తప్పు చేస్తున్నారు. అందుకే ప్రజలకు, ప్రశ్నించే గొంతుకలకు, భయపడుతున్నారు. -
‘ముఖ్య’నేత సూత్రధారి.. బినామీలు పాత్రధారులు 'లేపాక్షి'.. లేపేద్దాం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విలువైన భూములను సొంతం చేసుకుంటూ బంధుగణానికి, కుటుంబానికి లబ్ధి చేకూరుస్తున్న ‘ముఖ్య’నేత రూ.వేల కోట్ల విలువైన మరో భూదోపిడీకి స్కెచ్ వేశారు! బెంగళూరుకు అత్యంత సమీపంలో శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు, గోరంట్ల మండలాల్లో 44వ జాతీయ రహదారికి పక్కనే ఉన్న లేపాక్షి నాలెడ్జ్ హబ్కు చెందిన 8,844 ఎకరాల భూములను కాజేసేందుకు తన బినామీలను రంగంలోకి దించారు. రూ.పది వేల కోట్ల విలువైన ఆ భూములను సొంతం చేసుకునేందుకు ముఖ్యనేత తనకు అత్యంత సన్నిహితుడైన బీఎస్సార్ ఇన్ఫ్రా అధినేత బలుసు శ్రీనివాసరావును తెరపైకి తెచ్చి నయాన భయాన గుప్పిట పట్టే కుట్రలు వేగవంతం చేశారు. ఈడీ అటాచ్మెంట్లో ఉన్న రూ.వేల కోట్ల విలువైన ఆస్తిని బరి తెగించి స్వా«దీనం చేసుకునే కుట్ర పన్నారు. ఎన్సీఎల్టీ నుంచి వేలంలో దక్కించుకున్నవారు వాటిని బలుసుకు విక్రయించేలా ఉన్నత స్థాయిలో తీవ్ర ఒత్తిళ్లు తెచ్చారు. ఇప్పటికే మూడు నాలుగు దఫాలు సమావేశాలు జరిగాయి. ఆ భూములను బలుసుకు అప్పగించాలని ముఖ్యనేత స్వయంగా ఆదేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నేడో రేపో ఒప్పందానికి శతవిధాలా యత్నాలు జరుగుతున్నాయి. రాజధాని, సాగునీటి ప్రాజెక్టుల్లో రూ.8,300.12 కోట్ల విలువైన పనులను బీఎస్సార్ ఇన్ఫ్రాకు ఇప్పటికే అప్పగించడం గమనార్హం. దీనికి సంబంధించి మొబిలైజేషన్ అడ్వాన్సుల రూపంలో రూ.830 కోట్లు బీఎస్సార్కు చెల్లింపులు జరిగాయి. ఆ నిధులతోనే లేపాక్షి భూములను హస్తగతం చేసుకునే దిశగా ముఖ్యనేత వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ముఖ్యనేత అధికారంలోకి రాగానే తనకు సన్నిహితుడైన సెల్కాన్ అధినేత గురుస్వామినాయుడు ద్వారా తొలుత కథ నడిపించారు. ఫీల్డ్ విజిట్ పేరుతో లేపాక్షి భూముల్లో కాలుమోపిన ఆయన వాటిని ముఖ్యనేత పరం చేసేందుకు కలెక్టర్, పరిశ్రమల శాఖ కార్యదర్శితో చర్చలు జరిపారు. తమకు ఇంకా భూములు కావాలని అధికారులకు చెప్పారు. లేపాక్షి భూములకు సంబంధించి గురుస్వామినాయుడు దాదాపు రూ.150 కోట్ల మేర చెల్లింపులు జరిపి అగ్రిమెంట్ కూడా చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. వాటిని కొట్టేయటానికి 20 వేల ఎకరాల్లో మెగా ఇండ్రస్టియల్ పార్క్.. డిఫెన్స్ హబ్ ఏర్పాటు అంటూ ప్రచారానికి తెర తీశారు. గత ప్రభుత్వంలో లేపాక్షి భూములను కాజేస్తున్నారంటూ ఎల్లోమీడియాతో కలసి టీడీపీ పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసింది. ఇప్పుడు అవే భూములను అధికారంలోకి రాగానే బలుసు ద్వారా ముఖ్యనేత దక్కించుకుంటున్నారని పారిశ్రామికవర్గాలు చర్చించుకుంటున్నాయి. ముఖ్యనేత స్వయంగా బరి తెగించి సాగిస్తున్న ఈ దోపిడీ బాగోతం ఇలా ఉంది..! ఎల్లో మీడియా లెక్క ప్రకారమే రూ.10 వేల కోట్లు! బెంగళూరుకు అత్యంత సమీపంలో శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు, గోరంట్ల మండలాల్లో 44వ జాతీయ రహదారికి పక్కనే ఉన్న లేపాక్షి నాలెడ్జ్ హబ్కు చెందిన 8,844 ఎకరాల భూముల విలువ రూ.పది వేల కోట్లకు పైమాటేనని 2023లో టీడీపీ నేతలతోపాటు ఎల్లో మీడియా పేర్కొంది. ఇప్పుడు విలువైన ఆ భూములను తనకు అత్యంత సన్నిహితుడైన బలుసు శ్రీనివాసరావు పేరుతో కారుచౌకగా కొట్టేయడానికి ‘ముఖ్య’నేత స్కెచ్ వేశారు. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన 23 నెలల్లోనే రాజధానిలో రూ.7,440.08 కోట్ల విలువైన పనులతోపాటు సాగునీటి ప్రాజెక్టుల్లో (హంద్రీ–నీవా రెండో దశ కాలువ లైనింగ్లో రెండు ప్యాకేజీలు.. పోలవరం ఎడమ కాలువ ఆరు, ఎనిమిదో ప్యాకేజీలు) రూ.860.04 కోట్లు.. వెరసి రూ.8,300.12 కోట్ల విలువైన పనులను బలుసు శ్రీనివాసరావుకు చెందిన బీఎస్సార్ ఇన్ఫ్రాకు కట్టబెట్టింది. కాంట్రాక్టు పనుల అగ్రిమెంటు విలువలో పది శాతం అంటే రూ.830 కోట్లను ఇప్పటికే బలుసుకు మొబిలైజేషన్ అడ్వాన్సుల రూపంలో ఇచ్చేసింది. అవే నిధులతో ఇప్పుడు లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారని.. ఇప్పటికే డబ్బులు చేతులు మారాయని విశ్వసనీయ సమాచారం. ఆ భూముల అప్పగింత ఒప్పందంపై నేడో రేపో ఒప్పందాలు జరగనున్నట్లు పారిశ్రామికవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. రూ.పది వేల కోట్ల విలువైన లేపాక్షి నాలెడ్జ్ భూములను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్రెడ్డి రూ.500 కోట్లకే కాజేస్తున్నారంటూ ప్రస్తుత ఆరి్థక మంత్రి పయ్యావుల కేశవ్ 2023లోతీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఇదే అదునుగా ఎల్లో మీడియా వైఎస్సార్సీపీపై దుష్ప్రచారం చేసింది. కానీ.. అవన్నీ పచ్చి అబద్ధాలేన్నది తేలిపోయింది. ఇప్పుడు అవే భూములను బలుసు శ్రీనివాసరావు ద్వారా ముఖ్యనేత కాజేస్తున్నారంటూ పారిశ్రామికవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. లేపాక్షి నాలెడ్జ్ హబ్ కోసం నిర్మించిన భవనం ఎన్సీఎల్టీలో రూ.401 కోట్లకు దక్కించుకున్న సుబ్బారెడ్డి, సీవీ రెడ్డి.. ఇందూ ప్రాజెక్ట్స్, లేపాక్షి నాలెడ్జ్ హబ్ యాజమాన్యం ఒక్కరే. తీసుకున్న రుణాలను ఇందూ ప్రాజెక్ట్స్ చెల్లించలేకపోవడంతో 2018లో ఎన్సీఎల్టీ (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్)లో క్రిప్ (కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్) కింద బ్యాంకులు పిటిషన్లు దాఖలు చేశాయి. దాంతో ఈ వ్యవహారంపై ఎన్సీఎల్టీ ఒక రిజల్యూషన్ ప్రొఫెషనల్ను నియమించింది. ఇందూ ప్రాజెక్ట్స్పాటు దాని అనుబంధ సంస్థలను విక్రయించడానికి 2020లో ఎన్సీఎల్టీ బిడ్డింగ్ నిర్వహించింది. ఈ బిడ్డింగ్లో రూ.500 కోట్లకు ఎర్లిన్ ప్రాజెక్ట్స్ అనే సంస్థ ఇందూ ప్రాజెక్ట్స్, దాని అనుబంధ సంస్థలను దక్కించుకుంది. అయితే ఎన్సీఎల్టీలో సకాలంలో ఎర్లిన్ ప్రాజెక్ట్స్ డబ్బులు డిపాజిట్ చేయకపోవడంతో ఆ బిడ్డింగ్ను రిజల్యూషన్ ప్రొఫెషనల్ రద్దు చేశారు. దాంతో 2023లో మళ్లీ బిడ్డింగ్ నిర్వహించగా రూ.401 కోట్లకు ఇందూ ప్రాజెక్ట్స్తోపాటు దాని అనుబంధ సంస్థలను బి.సుబ్బారెడ్డి, సీవీ రెడ్డి దక్కించుకున్నారు. 2024 మార్చిలో ఎన్సీఎల్టీలో రూ.401 కోట్లను డిపాజిట్ చేసి ఇందూ ప్రాజెక్ట్స్, లేపాక్షి నాలెడ్జ్ హబ్తోపాటు అనుబంధ సంస్థలను వారిద్దరూ సొంతం చేసుకున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ‘లేపాక్షి’పై కన్నురాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములపై ‘ముఖ్య’నేత కన్నేశారు. సెల్ఫోన్లు, ఎల్రక్టానిక్ ఉపకరణాల తయారీ సంస్థ ‘సెల్కాన్’ అధినేత గురుస్వామినాయుడును ముందుపెట్టి కథ నడిపించారు. ఈ క్రమంలో సుబ్బారెడ్డి, సీవీ రెడ్డిలతో ఆయన ద్వారా చర్చలు సాగించారు. గురుస్వామినాయుడు లేపాక్షి భూముల వద్దకు వెళ్లి కలియతిరిగారు. అప్పటి శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్, పరిశ్రమల శాఖ కార్యదర్శితోనూ చర్చలు జరిపారు. అయితే తాజాగా తనకు అత్యంత సన్నిహితుడైన బలుసు శ్రీనివాసరావును ముందుపెట్టి ఆ భూములను సొంతం చేసుకునేలా ముఖ్యనేత మరింత పకడ్బందీగా ప్రణాళిక అమలు చేశారు. సుబ్బారెడ్డి, సీవీ రెడ్డిలతో ముఖ్యనేత నేరుగా సంప్రదించి.. కారు చౌకగా తమకు ఆ భూములు అప్పగించాలని ఒత్తిడి తెచ్చినట్లు పారిశ్రామికవర్గాలు చర్చించుకుంటున్నాయి. ఉన్నత స్థాయి నుంచి తీవ్రంగా వస్తున్న ఒత్తిళ్లకు తాళలేక లేపాక్షి భూములను బలుసు శ్రీనివాసరావుకు విక్రయించడానికి అంగీకరించినట్లు పారిశ్రామికవర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే అడ్వాన్స్గా కొంత డబ్బు కూడా చెల్లించారని.. భూముల విక్రయం ఒప్పందంపై ఏ క్షణమైనా సంతకాలు చేయటానికి రంగం సిద్ధం అయినట్లు చెబుతున్నాయి.నాడు వద్దు.. నేడు ముద్దుదేశంలో అత్యంత వెనుకబడిన ఉమ్మడి అనంతపురం జిల్లా సమగ్రాభివృద్ధే ధ్యేయంగా.. భారీ ఎత్తున ఉపాధి అవకాలు కల్పించడమే లక్ష్యంగా పారిశ్రామికాభివృద్ధికి 2006లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో బెంగళూరుకు అత్యంత సమీపంలో కర్ణాటక–ఏపీ సరిహద్దులో గోరంట్ల–చిలమత్తూరు మండలాల్లో ఎన్హెచ్–44 పక్కనే ఏపీఐఐసీ ద్వారా 8,844 ఎకరాల భూమిని సేకరించారు. ఆ భూములను తమకు కేటాయిస్తే డిఫెన్స్, ఏరోస్పేస్, ఎల్రక్టానిక్, ఐటీ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటుచేస్తామని లేపాక్షి నాలెడ్జ్ హబ్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ఆ సంస్థకు ఉన్న అర్హత ఆధారంగా 8,844 ఎకరాల భూమిని 2008లో ప్రభుత్వం కేటాయించింది. పరిశ్రమల కోసం అంత భారీ ఎత్తున భూములు కేటాయించాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు రాద్ధాంతం చేశారు. ఈ భూముల్లో పరిశ్రమల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ క్షిపణుల తయారీ పరిశ్రమ కోసం బీడీఎల్(భారత్ డైనమిక్స్ లిమిటెడ్), హెలికాఫ్టర్, విమానాల తయారీ పరిశ్రమ కోసం హెచ్ఏఎల్(హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్), ఈసీఐఎల్(ఎల్రక్టానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్), బీఈఎల్(భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్) సంస్థలు లేపాక్షి నాలెడ్జ్ హబ్తో ఒప్పందాలు చేసుకున్నాయి. దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఐఐఎస్సీ(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్) సంస్థ లేపాక్షి నాలెడ్జ్ హబ్లో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. పలు ప్రైవేటు పారిశ్రామిక దిగ్గజాలు పరిశ్రమల స్థాపన కోసం లేపాక్షి నాలెడ్జ్ హబ్తో ఒప్పందాలు చేసుకున్నాయి. 2009 సెపె్టంబరు 2న వైఎస్సార్ హఠాన్మరణం చెందారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో వైఎస్ జగన్ను రాజకీయంగా అణచివేసేందుకు సోనియాగాంధీ, చంద్రబాబు కుమ్మక్కై కుట్రలు చేస్తూ వచ్చారు. జగన్పై అక్రమ కేసులు బనాయించారు. అందులో భాగంగా ఇందూ ప్రాజెక్ట్స్, లేపాక్షి నాలెడ్జ్ హబ్లపై కూడా కేసులు పెట్టారు. 2013లో నాటి కిరణ్కుమార్రెడ్డి సర్కార్ లేపాక్షి నాలెడ్జ్ హబ్కు కేటాయించిన భూములను రద్దు చేసింది. దీనిపై లేపాక్షి నాలెడ్జ్ హబ్ హైకోర్టును ఆశ్రయించింది. కిరణ్ సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇచ్చింది. అక్రమ కేసుల విచారణలో భాగంగా లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములను ఈడీ అటాచ్ చేసింది. చంద్రబాబు, కాంగ్రెస్ అధిష్టానం సైంధవుల్లా అడ్డుపడకపోయి ఉంటే శ్రీసిటీని తలదన్నే రీతిలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ సెజ్ అభివృద్ధి చెందేదని.. వెనుకబడిన అనంతపురం జిల్లా రూపురేఖలు మారేవని.. ప్రజల జీవనప్రమాణాలు పెరిగేవని పారిశ్రామికవేత్తలు స్పష్టం చేస్తున్నారు. నాడు వద్దన్న భూములే ఇప్పుడు చంద్రబాబు సర్కార్కు ముద్దయ్యాయి. లేపాక్షి భూములతోపాటు 20 వేల ఎకరాల్లో మెగా ఇండ్రస్టియల్ పార్క్ ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తుండటం గమనార్హం. 2022–23లో పరిశ్రమల ఏర్పాటు కోసం చిలమత్తూరు మండలం టేకులోడులో ఎకరం ధర రూ.25 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయిస్తే.. ఇప్పుడు ఎకరానికి రూ.12.50 లక్షలను పరిహారంగా ముట్టజెప్పి చంద్రబాబు సర్కార్ లాక్కుంటోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
‘ఉపాధి’పై ఇంత నిర్లక్ష్యమా?
సాక్షి, అమరావతి : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) కింద పనులు చేసిన కూలీలకు నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడం వల్ల పేదల కడుపులు మాడిపోతున్నాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చంద్రబాబు కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. అంతులేని అవినీతి, అసమర్థ నిర్ణయాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అంతులేని అవినీతి చేస్తూ ప్రజా సమస్యలను పట్టించుకోవటం లేదని మంగళవారం సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. 2023–24తో పోల్చితే 2025–26లో రాష్ట్రంలో గణనీయంగా తగ్గిన ఉపాధి పనులు, వేతనాల వృద్ధి రేటు వివరాలు ‘నిజానికి ఎంజీఎన్ఆర్ఈజీఏ అనేది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెరుగుతుంది. పల్లె ప్రజలకు ఆదాయం సమకూరుతుంది. అలాంటి చరిత్రాత్మక ఎంజీఎన్ఆర్ఈజీఏను అత్యుత్తమంగా అమలు చేయటంలో మిగతా రాష్ట్రాలతో పాటు ఏపీ కూడా ఒకటిగా ఉండేది. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ రెండేళ్లలో పూర్తిగా వెనుకబడి పోయింది.ఉపాధి పొందిన కుటుంబాలు, వారి ఖర్చులు, వ్యయం వంటి వివరాలు చూస్తే ఈ విషయం అర్థం అవుతోంది. ఈ రెండేళ్లలో జీఎస్టీ, అమ్మకపు పన్ను వృద్ధి తక్కువగా ఉండటానికి కూడా ఇదొక కారణంగా ఉంది. గ్రామీణుల్లో కొనుగోలు శక్తి బాగా తగ్గింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అంతులేని ధన దాహం, అవినీతి వల్లనే ఈ పరిస్థితి తలెత్తింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించే ఓపిక కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది’ అని వైఎస్ జగన్ ఆ పోస్టులో ప్రభుత్వ తీరును కడిగి పారేశారు. -
ప్రజారోగ్యం.. ‘ప్రైవేట్’ భాగ్యం!
సాక్షి, అమరావతి: ఇటు ప్రజలు వ్యాధుల బారిన పడకుండా రోగాలను కట్టడి చేయడం.. అటు రోగులకు ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలు అందించడంలో చంద్రబాబు సర్కార్ దారుణంగా విఫలమైనట్లు స్వయంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్లో అనారోగ్య బాధితుల్లో ఏకంగా 69.9 శాతం మంది చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నట్లు ఆ సర్వే నివేదిక పేర్కొంది. గత ప్రభుత్వంలో పూర్తి భరోసా కచ్చించిన ప్రభుత్వాస్పత్రుల్లో పరిస్థితులు రెండేళ్ల వ్యవధిలోనే తారుమారు కావడంతో ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందని తేలింది. అపర సంజీవని లాంటి ఆరోగ్యశ్రీని ప్రభుత్వమే స్వయంగా నీరుగార్చడం.. ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.వేల కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్లో పెట్టడం.. ప్రభుత్వాస్పత్రుల్లో కనీసం సూది, దూది లాంటి వాటికీ దిక్కులేకపోవడం.. ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయడం లాంటివి ఈ దుస్థితికి ప్రధాన కారణం. ఏపీలో ప్రైవేట్లో వైద్యం కోసం ప్రజలు జేబు నుంచి సగటున రూ.53,303 చొప్పున ఖర్చు చేస్తున్నట్లు సర్వేలో వెలుగులోకి వచ్చింది. చంద్రబాబు గద్దెనెక్కాక ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు, సర్జికల్స్కు నిత్యం కొరత నెలకొంది. దీంతో ప్రైవేట్ ల్యాబ్స్లో పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వాస్పత్రులకు వెళ్లినా రోగులకు భారం తప్పడం లేదు. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలు నీరుగారిపోవడంతో ప్రజలు తమ సొంత జేబుల నుంచి రూ.4,972 వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని తేలింది. ఏపీలో అనారోగ్యం బారినపడిన ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నట్లు కేంద్ర గణాంకాల శాఖ ఇటీవల విడుదల చేసిన నేషనల్ శాంపిల్ సర్వే 80వ నివేదిక సాక్షిగా రుజువైంది.ఆందోళనకరంగా ఆరోగ్య సూచీలు..! చంద్రబాబు పాలనలో ప్రభుత్వ వైద్య రంగం రోజురోజుకు దయనీయంగా మారుతోంది. ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు ఉచితంగా ఇవ్వాల్సిన మందులు, సర్జికల్స్ అందుబాటులో ఉండటం లేదు. ఇతర సదుపాయాలకూ తీవ్ర కొరత నెలకొంది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లి ప్రైవేట్ ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో అనారోగ్య బాధితుల్లో 26.9 శాతం మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరుతుండగా మిగిలిన వారు ఇతర ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు సర్వే తెలిపింది. 2025 జనవరి నుంచి డిసెంబర్ మధ్య ‘గృహ సామాజిక వినియోగం : ఆరోగ్యం’ సర్వేను దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. 1,39,737 గృహాల నుంచి సేకరించిన సమాచారాన్ని అధ్యయనం చేశారు. ఆరోగ్య సూచీలకు సంబంధించి దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ పలు ప్రతికూల అంశాల్లో ముందు వరుసలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ‘అప నమ్మకం’లో ఐదో స్థానంప్రభుత్వాస్పత్రుల పట్ల ప్రజల అపనమ్మకంలో ఏపీ దేశంలో ఐదో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 69.9 శాతం మంది రోగులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించారు. అనారోగ్య బాధితుల్లోనూ ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. సర్వే నిర్వహణకు ముందు 15 రోజుల్లో అనారోగ్యానికి గురైన వారు జాతీయ స్థాయిలో 13.1 శాతంగా ఉండగా ఏపీలో 21.1 శాతం మంది వ్యాధుల బారిన పడ్డారు. అనారోగ్య బాధితుల్లో మనకంటే ముందంజలో ఉన్న పశ్చిమ బంగ, కేరళ రాష్ట్రాలు ప్రభుత్వ వైద్య సేవల్లో మాత్రం మెరుగైన స్థానాల్లో నిలవడం గమనార్హం. దేశంలో అత్యధికంగా అనారోగ్య బాధితులు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, హర్యానా, చత్తీస్గడ్, ఉత్తరప్రదేశ్ ముందు వరుసలో ఉన్నాయి. జనం జేబులు గుల్ల చికిత్సల కోసం ప్రైవేట్ ఆస్పత్రులపై ఆధారపడాల్సి రావడంతో రాష్ట్రంలో ప్రజల జేబులు గుల్ల అవుతున్నాయి. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలు నీరుగారిపోవడంతో ప్రాణాలు దక్కించుకునేందుకు అప్పుల పాలవుతున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో 3 వేలకుపైగా ప్రొసీజర్లతో ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి 2019–24 మధ్య ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిచ్చింది. 104, 108 వాహనాలను పెద్ద ఎత్తున అందుబాటులోకి తెచ్చింది. గ్రామీణ వైద్యానికి భరోసా కల్పించడంతోపాటు ఫ్యామిలీ డాక్టర్, ఇంటివద్దకే మందులు అందించడం లాంటి వినూత్న కార్యక్రమాలను చేపట్టడంతో ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన అగత్యం తప్పింది. -
సర్కారు నిర్వాకం.. జనంపై అప్పుల భారం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకపోగా తిరిగి జనంపై సీఎం చంద్రబాబు ప్రభుత్వం భారీగా అప్పుల భారం మోపుతోంది. 23 నెలల పాలనలోనే మొత్తం రూ.3,56,655 కోట్ల మేర అప్పులు చేసింది. ఈ లెక్కన చంద్రబాబు ప్రభుత్వం నెలకు సగటున రూ.15,506 కోట్లు, రోజుకు రూ.516 కోట్లు చొప్పున అప్పు చేసింది. రాష్ట్ర ప్రజల ఆదాయాన్ని పెంచడంలో, ఖజానాకు రాబడి పెంచడంలోనూ వైఫల్యం చెందిన చంద్రబాబు.. రాష్ట్రాన్ని మాత్రం అత్యంత వేగంగా అప్పుల ఊబిలో ముంచేశారు. మంగళవారం 7.81 శాతం వడ్డీతో రూ.4,600 కోట్ల బడ్జెట్ అప్పు చేశారు. దీంతో చంద్రబాబు సర్కారు 23 నెలల్లోనే రికార్డు స్థాయిలో బడ్జెట్లోనే రూ.1,98,564 కోట్ల అప్పు చేసింది. ఇప్పటి వరకు కార్పొరేషన్ల పేరుతో గ్యారెంటీ ఇచ్చి తెచ్చిన అప్పులు, రాజధాని పేరుతో చేసిన అప్పులతో కలిపి మొత్తం రాష్ట్ర అప్పులను రూ.9,88,859 కోట్లకు పెంచేసింది. బడ్జెట్ బయట, బడ్జెట్లోపల అందిన కాడికి అప్పులు చేసినా సూపర్ సిక్స్ హామీలు మాత్రం అమలు చేయలేదు. రాష్ట్రాభివృద్ధి.. కొత్త ఉద్యోగాలూ లేవు. చేసిన అప్పులన్నీ రెవెన్యూ వ్యయానికి మళ్లించేసి, రాష్ట్ర ప్రజలను దారుణమైన అప్పుల్లోకి నెట్టేసింది. మరో పక్క వివిధ కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన అప్పులు రూ.1,10,704 కోట్లకు చేరాయి. ప్రస్తుతం ఉన్న కార్పొరేషన్లే కాకుండా కొత్తగా కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేసి మరీ ప్రభుత్వం అప్పులు చేస్తోంది. ఇంకో వైపు రాజధాని పేరుతో రూ.47,387 కోట్లు చంద్రబాబు ప్రభుత్వం అప్పు చేసింది. ఇటీవల మండలిలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పిన గణాంకాల మేరకే వైఎస్ జగన్ ప్రభుత్వం దిగిపోయేనాటికి బడ్జెట్ అప్పులు, బడ్జెట్ బయట అప్పులు కలిపి మొత్తం రూ.6,32,204 కోట్లుగా పేర్కొన్నారు. ఇప్పుడు ఆ అప్పులు ఏకంగా రూ.9,88,859 కోట్లకు పెరిగాయి. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత తక్కువ వ్యవధిలో ఇంత భారీ ఎత్తున అప్పులు చేసిన దాఖలాలు లేవు. ఇంత తక్కువ వ్యవధిలో ఇంత భారీగా అప్పుల చేసిన ఘనత కేవలం చంద్రబాబు ప్రభుత్వానికే దక్కింది.ఈ మంగళవారం చేసిన అప్పు రూ.4,600 కోట్లు23 నెలల్లో చేసిన మొత్తం అప్పు రూ.3,56,655 కోట్లునెలకు సగటున చేసిన అప్పు రూ.15,506కోట్లురోజుకు సగటున చేసిన అప్పు రూ.516.8 కోట్లు -
సా‘ఫీ’గా చెల్లించకుంటే రద్దు చేయండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కొండలా పేరుకుపోవడంతో ఉన్నత విద్యా రంగం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ ఆక్షేపించింది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించలేకపోతే రద్దు చేయడమో, పునఃపరిశీలించడమో చేయాలని సూచించింది. మంగళవారం గుంటూరు జిల్లా చినకాకానిలో అసోసియేషన్ సమావేశం జరిగింది. యాజమాన్యాల ప్రతినిధులు ఫీజు రీయింబర్స్మెంట్ అమలుపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షుడు రమణాజీ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఫీజుల భారాన్ని మోయలేకుంటే వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేసుకునే వెసులుబాటు కళాశాలలకు కల్పించాలని కోరారు. బకాయిల విడుదలపై ప్రభుత్వం జీవోలు విడుదల చేస్తుంది తప్ప పైసా విదల్చడం లేదని విమర్శించారు. ఇప్పటి వరకు డిగ్రీ కళాశాలలకు దాదాపు 90శాతం ఫీజులు పెండింగ్లో ఉన్నట్టు చెప్పారు. గత రెండేళ్లుగా కళాశాలలు నిర్వహణ కుంటుపడి దివాళా తీసే పరిస్థితి వచ్చిందన్నారు. సీఎంకు, మంత్రులకు, ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పరిస్థితిలో మార్పు రావట్లేదని, ఈ ప్రభుత్వంలో ఉన్నత విద్యకు ప్రాధాన్యం లేదనే సందేహం కలుగుతోందన్నారు. సింగిల్ మేజర్ వల్ల నష్టమే 2025–26 విద్యా సంవత్సరంలో తీసుకొచ్చిన సింగిల్ మేజర్ విధానంతో నష్టం వాటిల్లుతోందని, విద్యాప్రమాణాలపై ప్రభావం పడుతోందని రమణాజీ ఆందోళన వ్యక్తం చేశారు. సంప్రదాయ డిగ్రీ కోర్సులు తగ్గిపోతుండగా వర్సిటీల్లో పీజీ కోర్సుల్లో 60–70శాతం సీట్లు ఖాళీగా ఉంటున్నాయన్నారు. రాష్ట్రంలో 1100 డిగ్రీ, 250 ఇంజనీరింగ్, 800పైగా ఇతర విద్యా సంస్థలు సేవలందిస్తున్నాయని, వీటి యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు జరిపి ఫీజు రీయింబర్స్మెంట్పై ఆమోదయోగ్య నిర్ణయానికి రావాలని హితవుపలికారు. -
‘విజయవాడకు వెస్ట్ బైపాస్ ఉండగా మళ్లీ ఇదేమిటీ?’
విజయవాడ: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పేరుతో ప్రభుత్వం నిర్బంధ భూసేకరణ చేయాలని చూస్తోందని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు ధ్వజమెత్తారు. కొంతమంది గొంతెమ్మ కోర్కెల కోసం ఇంతమంది రైతుల పొట్ట కొట్టడం అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. ఈ రోజు(మంగళవారం, ఏప్రిల్ 21వ తేదీ), అమరావతి రింగ్ రోడ్డు ప్రభావిత గ్రామాల రైతుల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఐదు జిల్లాలకు చెందిన రైతులతో పాటు వడ్డే శోభనాద్రీశ్వరరావు హాజరయ్యారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. పెద్ద పెద్ద నగరాలకు లేని ఔటర్ రింగ్ రోడ్డు అమరావతిలో అవసరమా? అని ప్రశ్నించారు. ఈ నిర్ణయాన్ని చంద్రబాబు పునః సమీక్షించుకోవాలని సూచించారు. ‘భూములు కోల్పోవాల్సి వస్తున్న రైతులను చూస్తే గుండె తరుక్కుపోతుంది. అమరావతి 29 గ్రామాల్లో జనాభా ఎంత?, ఈ 12 ఏళ్లలో ఎంత జనాభా పెరిగింది. దేశంలో పెద్ద పెద్ద నగరాల్లోనే లేని ఔటర్ రింగ్ రోడ్డు ఇక్కడ అవసరమా?, ఔటర్ రింగ్ రోడ్డు కోసం ఎవరిని సంప్రదించారు.. అసలు ఎవరికి చెప్పారు?, కనీస ఆలోచన లేకుండా రూ. 24,700 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు అవసరమా?, మొక్కజొన్న కొనమంటే మంత్రి అచ్చెన్నాయుడు డబ్బుల్లేవన్నాడు. 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు అవసరమా?, ఇదేమైనా మీ ప్రైవేట్ ప్రాపర్టీ అనుకున్నారా చంద్రబాబు. మీ హెరిటేజ్ కంపెనీ విస్తరణ అనుకున్నారా చంద్రబాబు. రైతులు... రైతుల భూములు మీకు చీమలు...దోమలు మాదిరి కనిపిస్తున్నాయా?, విజయవాడకు వెస్ట్ బైపాస్ ఉండగా కొత్తగా రింగ్ రోడ్డు అవసరమా?, జాతీయ రహదారులకు 70 మీటర్లు చాలని కేంద్రం చెబుతోంది. కానీ ప్రభుత్వం 140 నుంచి 250 మీటర్లు తీసుకోవాలని చూస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు పై పోరాటం చేయాల్సిందే’ అని పేర్కొన్నారు. -
‘చంద్రబాబూ.. ఎంజీఎన్ఆర్ఈజీఏపై ఇంత నిర్లక్ష్యమా ?’
సాక్షి, తాడేపల్లి: ఎంజీఎన్ఆర్ఈజీఏ అమలులో చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతులేని అవినీతి, అసమర్థ నిర్ణయాలతో గ్రామీణ వ్యవస్థ దెబ్బ తింటోందంటూ ఆయన ట్వీట్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అంతులేని అవినీతి చేస్తూ ప్రజా సమస్యలను పట్టించుకోవటం లేదంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు.‘‘నిజానికి ఎంజీఎన్ఆర్ఈజీఏ అనేది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెరుగుతుంది. పల్లె ప్రజలకు ఆదాయం సమకూరుతుంది. అలాంటి చారిత్రాత్మక ఎంజీఎన్ఆర్ఈజీఏని అత్యుత్తమంగా అమలు చేయటంలో మిగతా రాష్ట్రాలతోపాటు ఏపీ కూడా ఒకటిగా ఉండేది. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ రెండేళ్లలో పూర్తిగా వెనుకపడి పోయింది...ఉపాధి పొందిన కుటుంబాలు, వారి ఖర్చులు, వ్యయం వంటి వివరాలను చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. ఈ రెండేళ్లలో జీఎస్టీ, అమ్మకపు పన్ను వృద్ధి తక్కువగా ఉండటానికి కూడా ఇదొక కారణంగా ఉంది. గ్రామీణుల్లో కొనుగోలు శక్తి బాగా తగ్గింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అంతులేని ధనదాహం, అవినీతి వలనే ఈ పరిస్థితి తలెత్తింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించే ఓపిక కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది’’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు.𝗦𝘂𝗽𝗽𝗼𝗿𝘁 𝘁𝗼 𝗥𝘂𝗿𝗮𝗹 𝗘𝗰𝗼𝗻𝗼𝗺𝘆 𝗶𝘀 𝗗𝘄𝗶𝗻𝗱𝗹𝗶𝗻𝗴 From the perspective of Rural economy, effective implementation of the MGNREGA is of vital importance. This programme enhances disposable incomes in rural sections who have highest marginal propensity to… pic.twitter.com/KSvPGgVEsJ— YS Jagan Mohan Reddy (@ysjagan) April 21, 2026 -
దస్తగిరి కేసులో హైటెక్ కుట్ర..!
సాక్షి, అమరావతి: కడపలోని రిమ్స్ ఆవరణలో జరిగిన హత్య కేసులో హైటెక్ కుట్రలు చోటు చేసుకుంటున్నాయి. పోలీసు శాఖలోనే ఉన్నత స్థాయి అధికారుల మెప్పు కోసం కొందరు పోలీసులు వైఎస్సార్సీపీ నాయకులను టార్గెట్ చేస్తూ అడుగులు వేస్తున్నారు. వ్యక్తిగత గొడవల నేపథ్యంతో పాటు గంజాయి మత్తులో చేసిన హత్య విషయంలోనూ ఏదో ఒక రకంగా ఇరికించాలనే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి.అన్ని రకాలుగా దస్తగిరి హత్య విషయంలో హైటెక్ కుట్రను మరిపిస్తున్నారు. రిమ్స్ ఆవరణలో ఉన్న దస్తగిరిని మట్టుబెట్టిన కేసులో దర్యాప్తు పక్కదారి పడుతుందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పచ్చ పత్రికలు, మీడియాకు లీకులిస్తూ అందుకు అనుగుణంగా ఇన్వెస్టిగేషన్ను ముందుకు తీసుకెళ్తూ వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది.రిమాండ్ రిపోర్ట్లో వైఎస్సార్సీపీ నేతల ప్రస్తావనకడపలో ఈ నెల 6వ తేదీన జరిగిన దస్తగిరి హత్య కేసులో పోలీసులు పక్షపాతంగా వెళ్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఆది నుంచి కూడా ఎవరికీ తెలియకుండా నిందితుల వివరాలు బయటపడకుండా పోలీసులు అనుసరిస్తున్న వైఖరిపై చర్చ సాగుతోంది. దస్తగిరి హత్య కేసులో అన్ని విధాలుగా విచారణ చేస్తున్నామంటూనే పోలీసులు వైఎస్సార్సీపీ నేతల పేర్లు నిందితుల ద్వారా తెప్పించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా దస్తగిరితో పాటు మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, ఇతర నేతలందరూ కలిసిమెలసి ఉంటున్నారు. రిమాండ్ రిపోర్ట్లో వారు చెప్పినట్లు కాల్ రికార్డులు ఉన్నాయని కేసులో 13వ నిందితుడుగా నిత్యానందరెడ్డిని చేర్చారు. ముందుగా గంజాయి బ్యాచ్తో పాటు వ్యక్తిగత కారణాలతో హత్య జరిగిందని సోషల్ మీడియాతో పాటు ఇతర ప్రచార మాధ్యమాలు ఘోషించాయి. తరువాత క్రమంలో రాజకీయ ఒత్తిడులో లేక ఇతర కారణాలేవో తెలియదు కానీ దర్యాప్తులో పోలీసులు రూటు మార్చడంపై విమర్శలు వస్తున్నాయి.మాజీ సీఎం జగన్ వస్తారని..ఈ నెల మొదటి వారంలో హత్యకు గురైన దస్తగిరి కుటుంబాన్ని పరామర్శించడానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తారని సోషల్ మీడియాలో ప్రచా రం జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అ య్యారు. దీంతో కేసులో వేగంపెంచారు. దస్తగిరి హత్య విషయంలో ఎక్కడ ప్రభుత్వాన్ని నేతలు, పోలీసులను టార్గెట్ చేస్తారన్న ఆలోచనతో ఆగమేఘాల మీద విచారణ సాగిస్తున్నారు. అయితే ఇందులో ఫోన్ కాల్ రికార్డులు ఇతర వ్యవహారాల పరిస్థితులను చూపిస్తూ వైఎస్సార్సీపీపై నెపం నెట్టేందుకు సిద్ధమయ్యారు. డొల్లతనం బయటపడకుండా దర్యాప్తు డైవర్ట్ఈ నెల 6వ తేదీన అలంఖాన్పల్లెలో గొడవ జరిగిన తరువాత రిమ్స్ ఆవరణలో దస్తగిరిని కొంత మంది విచక్షణారహితంగా కత్తులతో పొడిచి హతమార్చిన ఘటన సంచలనం రేకెత్తించింది. అయితే అంతకు ముందు దాడులు జరిగిన నేపథ్యంలో నాకు రక్షణ కలి్పంచాలని దస్తగిరి పోలీసులకు మొరపెట్టుకున్నా ఎవరూ స్పందించలేదని సర్వత్రా చర్చ సాగుతోంది. అలంఖాన్పల్లె నుంచి రిమ్స్కు పోయేలోపే తనకు ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పుకున్నా పోలీసులు పట్టించుకోలేదు.ఈ నేపథ్యంలో రిమ్స్కు వెళ్తున్న దస్తగిరిపై దాడులు జరగడం చనిపోవడం కనిపించింది. ఈ నేపథ్యంలో దస్తగిరిని పొట్టన పెట్టుకున్న నిందితుల వివరాలు తేల్చాల్సిన పోలీసులు రాజకీయ డ్రామాలకు తెరతీయడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. అసలు ఏం జరుగుతోందో తెలియదు కానీ పోలీసులు డైవర్షన్ డ్రామాలతో హత్య కేసు దర్యాప్తులో అలా పక్కదారి వెళ్తుంది. ఏది ఏమైనా వైఎస్ఆర్సీపీ కీలక నేత, మాజీ డిప్యూటీ మేజర్ నిత్యానందరెడ్డి టార్గెట్గా కేసు విచారణ జరుగుతున్నదని జగమెరిగిన సత్యం.వైఎస్సార్ కడప జిల్లాలో జరిగిన దస్తగిరి హత్య కేసుకు సంబంధించి మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి చుట్టూ పోలీసులు వలపన్నుతున్నారు. ఆది నుంచి నిందితులతో పాటు చనిపోయిన వ్యక్తి అందరూ కలిసిమెలసి తిరుగుతున్నారు. అయితే అనేక కారణాలు వ్యక్తిగత పరిస్థితులు ఇతర కారణాలు ఏవైనా దస్తగిరి హత్య నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతలను ఇరికించే ప్రయత్నం సాగుతోందని పార్టీ నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. అయితే వ్యక్తిగత పరిచయాలు గతంలో.. దిగిన ఫొటోలు.. ఇతర కాల్ డేటా ఆధారం చేసుకుని మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డిని కేసులో ఇరికించే ప్రక్రియ షురూ అయింది. పోలీసులు అధికార పార్టీ, పోలీసు ఉన్నతాధికారుల మెప్పు కోసం మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి లక్ష్యంగా ముందుకు వెళ్లడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.నిత్యానందరెడ్డి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులుకడప: కడప నగర శివార్లలోని మాజీ డిప్యూటి మేయర్ బండి నిత్యానందరెడ్డి అక్రమ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఏడు వాహనాల్లో స్పెషల్ పోలీసులు ఇంటిపై దాడి చేసి సోదాలు చేసినట్లు తెలిసింది. వాహనాల్లో పోలీసులు ఒక్కసారిగా వచ్చి ఇంటిమీద దాడి చేయడంతో కుటుంబసభ్యులు భయాందోళనకు గురైనట్లు తెలిసింది. పోలీసులు స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్స్కోసం ఇళ్లంతా శోధించి కొన్ని పత్రాలు, ఒక ల్యాప్ట్యాప్ తీసుకెళ్లారు. ఆర్థరాత్రి వరకు పోలీసులు అక్కడే తిష్ట వేశారు. -
ఇక.. వారసత్వ సంపద వంతు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని శతాబ్దాల చరిత్ర కలిగిన వారసత్వ సంపద కేంద్రాలు, స్మారక చిహ్నాల (మాన్యుమెంట్స్) ప్రదేశాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు చంద్రబాబు సర్కార్ బరితెగించింది. అభివృద్ధి ముసుగులో రూ.కోట్ల విలువైన పర్యాటక భూములను కొల్లగొడుతున్న తరహాలోనే అత్యంత ప్రాచీన, సంస్కృతికి అద్దం పట్టే వారసత్వ సంపదను సీఎస్ఆర్ ముసుగులో కార్పొరేట్ సంస్థలు, తమ బినామీల చేతుల్లో పెడుతోంది.దేశవ్యాప్తంగా ఎక్కడా లేనివిధంగా చంద్రబాబు ప్రభుత్వం వారసత్వ కట్టడాల పరిరక్షణ బాధ్యతల నుంచి నిస్సిగ్గుగా తప్పుకోవడంతో పాటు.. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి వాటి భద్రతను ప్రశ్నార్థకం చేస్తోంది. ఇందులో భాగంగానే 2024–29 పర్యాటక విధానానికి అనుగుణంగా ‘అడాప్ట్ మాన్యుమెంట్ పాలసీ’ని సోమవారం ప్రకటించింది. ఏపీ పురావస్తుశాఖ పర్యవేక్షణలో సురక్షితంగా ఉన్న మాన్యుమెంట్స్ ఇకపై ప్రైవేటు బ్రాండింగ్లో కనుమరుగయ్యే ప్రమాదాన్ని ఎదుర్కోనున్నాయి. మరుగుదొడ్లు, చెత్తకుండీలు ఏర్పాటు చేయలేరా? వారసత్వ సంపద కేంద్రాల నిర్వహణలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కనీసం అక్కడ పర్యాటకుల సౌకర్యార్థం మరుగుదొడ్లు, చెత్తకుండీలు కూడా ఏర్పాటు చేయలేని దుస్థితిలో ఉంది. ప్రపంచ గుర్తింపు పొందిన నాగార్జునకొండ, గండికోట, లేపాక్షి, అమరావతి బౌద్ధసూ్థపం, ఉండవల్లి గుహలు, ఇతర బౌద్ధారామాలు, కొండపల్లి, చంద్రగిరి కోటలతో సహా మొత్తం వారసత్వ, స్మారక చిహ్నలను అంగట్లో సరుకు మాదిరిగా వేలం వేస్తోంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బిలిటీ (సీఎస్ఆర్) కింద వారసత్వ కట్టడాలను సంరక్షించేందుకు ముందుకు వచ్చిన సంస్థలకు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ (పీ–4)లో ఐదేళ్ల పాటు వాటి పూర్తి నిర్వహణ బాధ్యతలను అప్పగించనుంది.ఆ తర్వాత పనితీరును బట్టి కాలపరిమితి పొడిగిస్తామని పాలసీలో పేర్కొంది. ఆయా సంస్థలు, ప్రైవేటు వ్యక్తులు ముందుగా మరుగుదొడ్లు, తాగునీరు, లైటింగ్, పార్కింగ్, ల్యాండ్ స్కేపింగ్ వంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడంతో పాటు టికెట్ కౌంటర్లు, స్నాక్ సెంటర్లు, విడిది కేంద్రాలు, ఇతర సాంకేతిక వ్యవస్థలను ఏర్పాటు చేసి సెమీ వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. వారసత్వ బ్రాండింగ్ లేనట్లే.. చంద్రబాబు ప్రభుత్వం వారసత్వ కేంద్రాలను ప్రైవేటు పరం చేయడంతో వాటి సమగ్రతకు భంగం కలగడంతోపాటు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని పురాతత్వవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారసత్వ కేంద్రాలను కార్పొరేట్ ఈవెంట్ల కేంద్రంగా మార్చే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. వీటి నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆ మాన్యుమెంట్ కోసమే ఖర్చుచేయాల్సి వచ్చినప్పుడు మాన్యుమెంట్ మిత్ర తమ సొంత, అనుకూల వ్యక్తులకే పనులు కట్టబెడితే సామాన్యులు ఎలా భాగస్వాములవుతారని, స్థానికులకు ఉపాధి ఎలా లభిస్తుందని ప్రశ్నిస్తున్నారు. సీఎస్ఆర్ కింద ఖర్చుచేస్తున్న సంస్థలు తమ బ్రాండింగ్ను పెంచుకుంటే వారసత్వ కేంద్ర ప్రాధాన్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. స్మారకచిహ్నం వద్ద ఇతర వాణిజ్య సేవల కోసం లీజ్ ఒప్పందం ద్వారా మూడోవ్యక్తి చేరికతో పురాతన కట్టడాలు, చిహ్నాల భద్రత కూడా దెబ్బతినే అవకాశం లేకపోలేదు. కేవలం కార్పొరేట్, ప్రైవేటు వ్యాపారులకు పన్ను మినహాయింపులు కల్పించడానికి, పనిలోపనిగా విలువైన ప్రజల సొత్తును తమ చేతుల్లో పెట్టుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న కుట్ర అన్న ఆరోపణలు వినవస్తున్నాయి. పైగా కార్పొరేట్ల రాకతో సామాజిక–ఆరి్థక విధ్వంసం జరిగే ప్రమాదం ఉంది. అంటే స్థానిక (గైడ్లు, చిన్న వ్యాపారుల) జీవనోపాధిని దెబ్బతీసి కార్పొరేట్ వెండర్లు ప్రవేశించే అవకాశం ఉంది.సీఎస్ఆర్ అంటూనే వ్యాపారమా?వారసత్వ సంపద కేంద్రాలు, స్మారక చిహ్నలను దత్తతకు ఇచ్చిన తర్వాత అభివృద్ధి చేయడంతో పాటు అక్కడే వారికి వాణిజ్య కార్యకలపాలకు, సౌండ్ అండ్ లైటింగ్కు అవకాశం కల్పించినప్పుడు ఇక సీఎస్ఆర్కు అర్థం ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. దత్తత తీసుకునే ‘మాన్యుమెంట్ మిత్ర’కు, ప్రభుత్వానికి మధ్య అవగాహన ఒప్పందం చేసుకుని నిర్వహణ సాగించేలా ప్రత్యేకంగా పర్యాటకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చైర్మన్గా, పురావస్తుశాఖ కమిషనర్ కన్వీనర్గా, దేవదాయశాఖ కమిషనర్తో కలిపి మొత్తం ఏడుగురితో కమిటీని నియమించింది. ఈ కమిటీ దత్తత కోసం అందుబాటులోని స్మారక చిహ్నాలను ఆమోదించి వాటిని మాన్యుమెంట్ మిత్రలకు ఇచ్చేందుకు వచ్చే బిడ్ల మూల్యాంకనం చేసి కట్టబెడుతుంది. ఇక వీటి దత్తత అనంతరం పర్యవేక్షణకు పురావస్తుశాఖ కమిషనర్ చైర్మన్గా, కలెక్టర్ వైస్ చైర్మన్గా మొత్తం తొమ్మిదిమందితో కమిటీని ఏర్పాటు చేసింది. -
ఎట్టకేలకు పోలవరం ఎత్తిపోతల
సాక్షి, అమరావతి: పోలవరం ఎత్తిపోతలకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యింది. గతంలో దీన్ని తప్పుబట్టిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడు ఆ ఎత్తిపోతల అత్యంత అవసరమంటూ వాస్తవాలను అంగీకరించారు. దాంతో పోలవరం ఎత్తిపోతల పనులను రద్దు చేస్తూ గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకుని.. పనులు కొనసాగించడానికి అనుమతి ఇస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పోలవరం గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్లు కాగా.. గరిష్ట నీటి నిల్వ 194.6 టీఎంసీలు. ప్రాజెక్టు కనీస నీటి మట్టం 41.15 మీటర్లు కాగా.. కనిష్ట నీటి నిల్వ 119.4 టీఎంసీలు. పోలవరం జలాశయంలో 35.5 మీటర్ల మేర నీరు నిల్వ ఉంటేనే కుడి, ఎడమ కాలువలకు నీళ్లందుతాయి.అంతకంటే తక్కువ స్థాయిలో ఉంటే నీళ్లందవు. పోలవరంలో 35.5 మీటర్ల దిగువన ఉండే నీళ్లన్నీ డెడ్ స్టోరేజీ కింద లెక్క. ఇందులో 35.5 నుంచి 32 మీటర్ల మధ్య నిల్వ ఉండే సుమారు 30 టీఎంసీలను కుడి కాలువ ద్వారా తరలించి.. కృష్ణా డెల్టాలో ఖరీఫ్కు ముందస్తుగా సాగునీరు అందించడం, ఉమ్మడి కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల ప్రజల దాహార్తి తీర్చే లక్ష్యంతో రూ.912.84 కోట్లతో 2021 ఏప్రిల్ 19న పోలవరం ఎత్తిపోతలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 32 మీటర్ల కాంటూర్ దిగువన ఉండే నీటిని రివర్ స్లూయిజ్ల ద్వారా తరలించి గోదావరి డెల్టాలో రబీ పంటకు సమృద్ధిగా నీళ్లందించడంతోపాటు తాగునీటి అవసరాలు తీర్చాలని నిర్ణయించారు.ఆ నీటిని ఉపయోగించుకోకపోతే జూన్లో వరద ప్రవాహం ప్రారంభమవుతుంది.. పోలవరం నిండగానే ధవళేశ్వరం బ్యారేజీ మీదుగా గోదావరి వరద సముద్రం పాలవుతుంది. ఈ నేపథ్యంలో మహత్తర ఆశయంతో చేపట్టిన ఆ ఎత్తిపోతలను 2021 జూలై 24న నిర్వహించిన టెండర్లలో రూ.765.94 కోట్లకు మేఘా సంస్థ దక్కించుకుంది. 17.05 శాతం పనులను పూర్తి చేసింది. అప్పట్లో ఈ ఎత్తిపోతలను చంద్రబాబు తప్పుబట్టారు. పట్టిసీమ ఎత్తిపోతల ఉండగా పోలవరం ఎత్తిపోతల ఎందుకంటూ దబాయించారు. పోలవరం ఎత్తిపోతల వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉండవని.. రూ.912 కోట్లు వృథా అంటూ విమర్శించారు. వాస్తవానికి గోదావరిలో నీటి మట్టం 14 మీటర్లు కంటే ఎగువన ఉన్నప్పుడే పట్టిసీమ ఎత్తిపోతలకు నీళ్లందుతాయి.కానీ.. పోలవరం డెడ్ స్టోరేజీ నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తే పట్టిసీమ ఎత్తిపోతలకు నీళ్లందవు. అయితే చంద్రబాబు వాస్తవాలను వక్రీకరించి వైఎస్ జగన్ సర్కార్పై బురదచల్లారు. కృష్ణా డెల్టా, ఉమ్మడి కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల ప్రజలకు వరదాయిని లాంటి పోలవరం ఎత్తిపోతలను తప్పుబట్టిన చంద్రబాబు తీరును ఖండిస్తూ అప్పట్లో ఇంజనీరింగ్ నిపుణులు, రైతులు దుమ్మెత్తిపోశారు.ఈ క్రమంలో చంద్రబాబు అధికారంలోకి రాగానే ఆ ఎత్తిపోతల పనులను రద్దు చేశారు. కానీ.. ఇప్పుడు అదే ఎత్తిపోతల ఆవశ్యకతను గుర్తిస్తూ పనులు కొనసాగించడానికి అనుమతి ఇవ్వడం గమనార్హం. రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రజలకు వరదాయిని లాంటి రాయలసీమ ఎత్తిపోతల పూర్తయితే వైఎస్ జగన్కు మంచి పేరొస్తుందనే అక్కసుతో... తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో కుదిరిన చీకటి ఒప్పందం మేరకు ఆ ఎత్తిపోతలను చంద్రబాబు నిలిపేసి రాష్ట్ర హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టారని సాగునీటిరంగ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఉద్యోగ నియామకాలు, బదిలీలకు లోకల్ కేడర్ల గెజిట్ జారీ
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, బదిలీలకు సంబంధించి స్థానిక కేడర్ల గెజిట్ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం గత ఏడాది డిసెంబర్ 15 నుంచి ఇది అమల్లోకి వచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ సోమవారం జారీ చేసిన గెజిట్లో స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు నేరుగా భర్తీకి సంబంధించి రాష్ట్రాన్ని 26 జిల్లాలు, 6 జోన్లు, 2 మల్టీ జోన్లుగా వర్గీకరించారు. ఏ పోస్టుల భర్తీలోనైనా 95 శాతం పోస్టులను స్థానికులతోనే భర్తీ చేయనున్నారు. మిగతా పోస్టులను జనరల్ కేటగిరీలో భర్తీ చేయనున్నారు.స్థానికత విషయంలో ఏదైనా పోస్టుకు సంబంధించి విద్యార్హతలో ఏడేళ్లు ఎక్కడ చదివారో పరిశీలించి అందులో నాలుగేళ్లు చదివిన ప్రాంతాన్ని స్థానికతగా నిర్ధారిస్తారు. ఒక పోస్టుకు ఇంటర్మీడియట్ విద్యార్హతగా ఉంటే ఇంటర్కు ముందు ఏడేళ్లు ఎక్కడ చదివారో పరిశీలించి అందులో నాలుగేళ్లు చదివిన చోట స్థానికతగా పరిగణిస్తారు. విద్యార్హత లేని పోస్టులకు నివాస ప్రాంతాన్ని స్థానికంగా పరిగణిస్తారు. ఏడేళ్ల పాటు ఏ ప్రాంతంలోనూ చదవకపోతే రాష్ట్రంలోని నివాస ప్రాంతాన్ని స్థానికంగా పరిగణిస్తారు. అంధత్వం, వినికిడి లోపం ఉన్నవారి కోసం ప్రత్యేకించిన పాఠశాలల్లో చదివితే తల్లిదండ్రుల స్వస్థలాన్ని స్థానికతగా పరిగణిస్తారు. జూనియర్ అసిస్టెంట్.. అంతకంటే దిగువనున్న పోస్టులను జిల్లా స్థాయి కేడర్గా, జూనియర్ అసిస్టెంట్కు ఆపైన సూపరింటెండెంట్, మొదటి స్థాయి గెజిటెడ్ పోస్టులను జోనల్ స్థాయి కేడర్గా, మొదటి స్థాయి గెజిట్ పోస్టుల కేటగిరీపైన డిప్యూటీ కలెక్టర్, సమానమైన కేటగిరీ పోస్టులను మల్టీ జోనల్ స్థాయి కేడర్గా పరిగణిస్తారు. -
ఉద్యోగులపై ‘రెడ్బుక్’ టెర్రర్
సాక్షి, అమరావతి: రెడ్బుక్ రాజ్యాంగంతో వ్యవస్థలను గుప్పిట పట్టి రాష్ట్రంలో టెర్రర్ సృష్టిస్తున్న చంద్రబాబు సర్కారు తాజాగా ఉద్యోగులపైనా దాన్ని ప్రయోగించింది. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అడిగిన పాపానికి ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కె.వెంకట్రావిురెడ్డిని ఏకంగా ఉద్యోగం నుంచే తొలగించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పని చేస్తున్న కె.వెంకట్రావిురెడ్డిని సర్వీసు నుంచి తొలగిస్తూ చంద్రబాబు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా సమస్యలపై ప్రశ్నిస్తూ రోడ్డెక్కుతున్న ఉద్యోగులను భయపెట్టి నోరెత్తకుండా చేయాలన్నది కుతంత్రమని స్పష్టమవుతోంది. వెంకట్రావిురెడ్డిని ఉద్యోగం నుంచి తొలగించేందుకు గత ఎన్నికల్లో ఆయన వైఎస్సార్సీపీకి అనుకూలంగా ప్రచారం చేశారనే సాకు చూపారు. టీడీపీ పెద్దలకు నచ్చిన విధంగా నివేదిక ఇప్పించుకుని..తమ పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు నిస్సిగ్గుగా చట్టాన్ని సైతం మార్చాలని చూసిన చంద్రబాబు సమస్యలపై గళమెత్తిన ఉద్యోగులను మాత్రం కక్షగట్టి వేధిస్తున్నారు. ఉద్యోగుల సమస్యలపై పోరాడటంలో ముందుండే వెంకట్రావిురెడ్డిపై కక్ష గట్టి 2024 ఎన్నికల సమయంలోనే తప్పుడు ఆరోపణలతో సస్పెండ్ చేయించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సస్పెన్షన్ను కొనసాగించింది. సస్పెన్షన్లో ఉండగానే.. ఆయన వైఎస్సార్సీపీకి అనుకూలంగా పని చేస్తున్నారని తప్పుడు ఆరోపణలు మోపి విచారణ జరిపింది. గత ఎన్నికల్లో ఆయన ఆర్టీసీ డిపోల్లో ఎన్నికల ప్రచారం చేసినట్లు తప్పుడు ఆధారాలు సృష్టించింది.నిజానికి ఎన్నికల ప్రచారం జరగలేదని ఆయా డిపో మేనేజర్లు స్పష్టంగా నివేదికలు ఇచ్చినా.. అధికార యంత్రాంగం చంద్రబాబు చేతిలో ఉండడంతోనే వెంకట్రావిురెడ్డికి వ్యతిరేకంగా నివేదిక ఇప్పించుకున్నారు. దాన్ని ఆధారంగా చేసుకుని ఆయన్ను సర్వీసు నుంచి తొలగించారు. వెంకట్రావిురెడ్డి 2014–19లోనూ ఉద్యోగుల సమస్యలపై ప్రశ్నిస్తున్నారని బాబు ప్రభుత్వం ఆయనపై కక్ష సాధించింది. అప్పట్లో 15 నెలలపాటు సస్పెండ్ చేసింది. ఆయన తప్పు లేదని తేలడంతో తిరిగి విధుల్లోకి తీసుకున్నా.. ఉద్యోగుల విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న మోసపూరిత వైఖరిని తరచూ బయటపెడుతుండడం కంటగింపుగా మారింది.ఉద్యమించడంతో బెదిరింపు యత్నాలు..సమస్యలను పరిష్కరించకుంటే పోరాటం చేస్తామని, అనంతపురం జిల్లా నుంచి మొదలుపెట్టి అన్ని జిల్లాల్లో ఆందోళనలు నిర్వహిస్తామని ఇటీవలే వెంకట్రావిురెడ్డి ప్రకటించారు. ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలతోపాటు పెండింగ్ డీఏలు ఇవ్వాలని, పీఆర్సీ కమిషనర్ను వెంటనే నియమించి పీఆర్సీ ఇవ్వాలని, రూ.40 వేల కోట్ల వరకూ ఉన్న బకాయిలు చెల్లించాలని, ఉద్యోగులపై వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అవుట్సోరి్సంగ్ సిబ్బంది, అంగన్వాడీలు సహా అన్ని విభాగాల్లో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.తరచూ ఆందోళనలతో విజయవాడ ధర్నా చౌక్ మార్మోగుతోంది. తాజాగా ఈ నెలలోనే ఉపాధ్యాయ సంఘాలు భారీ ఆందోళనలకు సిద్ధమయ్యాయి. ఈ పరిస్థితుల్లో వెంకట్రావిురెడ్డిపై వేటు వేయడం ద్వారా ఉద్యోగులను భయపెట్టి నోరెత్తకుండా చేయాలని చంద్రబాబు సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తను టీడీపీ సర్కారు వేధిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఉద్యోగులపైనా దాన్ని ప్రయోగించడంతో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. -
కాగితాలపై కంపెనీలు...ఖాతాల్లోకి రూ.కోట్లు
సాక్షి,విశాఖపట్నం: నిజానికి అక్కడ ఎలాంటి వ్యాపారం జరగదు. ఏ వస్తువూ కొనుగోలు చేయరు. కానీ, కాగితాల మీద భారీ లావాదేవీలు జరిగినట్లు నకిలీ ఇన్వాయిస్లను సృష్టిస్తారు. ఈ బిల్లులను చూపిస్తూ, తాము ఇప్పటికే ప్రభుత్వానికి పన్ను చెల్లించేశామని, ఆ మొత్తాన్ని ‘ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్’ రూపంలో తిరిగి తమకు చెల్లించాలని జీఎస్టీ అధికారులకు దరఖాస్తు చేసుకుంటారు. క్షేత్రస్థాయిలో వాటిని పరిశీలించాల్సిన అధికారులు.. ఆ ఫేక్ ఇన్వాయిస్లనే ధ్రువీకరించి, కోట్లాది రూపాయల క్రెడిట్ను నేరగాళ్ల నకిలీ ఖాతాల్లోకి జమ చేసేస్తున్నారు.డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్(డీజీజీఐ) విశాఖపట్నం జోనల్ యూనిట్ పరిధిలో వరుసగా ఇలాంటి దోపిడీదారులు పట్టుబడుతున్నా.. ఈ అడ్డగోలు వ్యవహారానికి అడ్డుకట్ట పడటం లేదు. 2025–26 ఆర్థిక సంవత్సరంలోనే సుమారు రూ.352 కోట్ల మేర ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మోసాలు జరగ్గా.. ఇప్పటివరకూ పది మంది నిందితులను డీజీజీఐ అధికారులు అరెస్ట్ చేశారు. దాదాపు 380కి పైగా నకిలీ కంపెనీలు ఈ దందాలో భాగస్వాములైనట్లు దర్యాప్తులో తేలింది. వెలుగుచూసిన ఉదంతాలు ఇవే.. ⇒ శ్రీ ప్రోగ్రెసివ్ ప్రాజెక్ట్స్ పేరుతో నకిలీ సంస్థల నెట్వర్క్ ఏర్పాటు చేసి.. ఫేక్ ఇన్వాయిస్లతో రూ.9.62కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందిన ఓ ముఠాను ఈ నెల 2న డీజీజీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ⇒ తన సోదరుడి సంస్థను అడ్డం పెట్టుకొని నకిలీ రసీదులతో రూ.19.79 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కొట్టేసిన ఎలియాజ్ భాషా అనే వ్యక్తిని డీజీజీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ⇒ తమిళనాడుకు చెందిన సిద్ధిక్ సయ్యద్.. దక్షిణాది రాష్ట్రాల్లో కొందరి గుర్తింపు కార్డులను దొంగిలించి, వారి పేర్లతో 302 ఫేక్ కంపెనీలు సృష్టించాడు. ఏకంగా రూ.643 కోట్లకు ఫేక్ ఇన్వాయిస్లు తయారు చేసి, రూ.115.88 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ దోచుకున్నాడు. ఎట్టకేలకు అతన్ని గతేడాది మేలో డీజీజీఐ అధికారులు అరెస్ట్ చేశారు. నేరగాళ్ల అసలు వ్యూహాలు ఇవే! మ్యూల్ అకౌంట్స్: నేరగాళ్లు ఎన్నడూ తమ సొంత పేర్లతో కంపెనీలు పెట్టరు. నిరుపేదలు, కూలీలు లేదా అమాయకుల ఆధార్, పాన్ కార్డులను తక్కువ ధరకు సేకరించి, వారి పేర్లతో జీఎస్టీ రిజిస్ట్రేషన్లు పొందుతారు. స్కామ్ బయటపడ్డాక పోలీసులు వెళ్తే, ఆ అడ్రస్లో ఉండేది ఏమీ తెలియని సామాన్యులే. దీని వల్ల అసలు సూత్రధారులు దొరకడం కష్టమవుతోంది. సర్క్యులర్ ట్రేడింగ్: ఇదొక గొలుసుకట్టు మోసం. ఒక పేరుతో కంపెనీ పెట్టి, కాగితం మీద ఉన్న మరో కంపెనీకి వస్తువులు అమ్మినట్లు చూపిస్తారు. ఆ కంపెనీ నుంచి మరో నకిలీ కంపెనీకి బిల్లు మారుతుంది. ఎక్కడా వస్తువు కదలదు కానీ, ప్రతి దశలోనూ ‘ఇన్పుట్ టాక్స్ క్రెడిట్’ను క్లెయిమ్ చేస్తూ ప్రభుత్వ ధనాన్ని లాగేస్తుంటారు. ఐటీ రిటర్న్స్లో లొసుగులుజీఎస్టీ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు జీఎస్టీఆర్–2ఏ(కొనుగోళ్లు), జీఎస్టీఆర్–3బీ (చెల్లింపులు) మధ్య ఉండే వ్యత్యాసాలను అధికారులు ఎప్పటికప్పుడు సరిచూడాలి. అయితే, డేటా భారీ స్థాయిలో ఉండటం, చిన్న కంపెనీల విషయంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం వీరికి వరంగా మారుతోంది. ఇదే అదనుగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే సమయంలోనూ అక్రమాలకు పాల్పడుతున్నారు. షెల్ కంపెనీల మాయాజాలం: విశాఖలో పట్టుబడిన చాలా కంపెనీల చిరునామాలు.. ఒకే గదిలో పది కంపెనీలు ఉన్నట్లు లేదా అసలు ఉనికిలోనే లేని అపార్ట్మెంట్ నంబర్లతో ఉన్నట్లు గుర్తించారు. క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాల్సిన ఇన్స్పెక్టర్లు.. కార్యాలయంలోనే కూర్చుని అన్నీ సవ్యంగా ఉన్నాయి అని నివేదికలు ఇవ్వడం వల్లే ఈ రూ.352 కోట్ల స్కాం జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.డేటా అనలిటిక్స్ సాయంతోనే గుట్టు రట్టు!ఇటీవల డీజీజీఐ పట్టుకున్న కేసులన్నీ డేటా అనలిటిక్స్ సాంకేతికత ద్వారానే సాధ్యమయ్యాయని అధికారులు వెల్లడించారు. ఈ సాంకేతికత ద్వారా భారీ మొత్తంలో ఉన్న సమాచారాన్ని విశ్లేషించి, అందులోని అసాధారణ మార్పులను లేదా అనుమానాస్పద లావాదేవీలను క్షణాల్లో గుర్తిస్తారు. ముఖ్యంగా డీజీజీఐ వాడుతున్న అద్వైత్ వంటి ప్లాట్ఫామ్స్ ద్వారా.. ఒకే పాన్ కార్డుతో ఎన్ని కంపెనీలున్నాయి? ఒకే అడ్రస్తో ఎన్ని రిజి్రస్టేషన్లు అయ్యాయి? కొనుగోలు, అమ్మకాల మధ్య పొంతన ఉందా? అన్నది ఇట్టే పసిగట్టవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ సాయంతో నెట్వర్క్ డయాగ్రమ్స్ సృష్టించి.. ఒక నకిలీ కంపెనీ నుంచి మరో కంపెనీకి నిధులు ఎలా మళ్లుతున్నాయో లింక్ అనలిటిక్స్ ద్వారా గుర్తిస్తూ నేరగాళ్ల గుట్టు రట్టు చేస్తున్నారు.ముందుగా ఎందుకు గుర్తించరు? ఇంత అధునాతన సాంకేతికత అందుబాటులో ఉన్నా.. రూ.352 కోట్ల మోసాలు ఎలా జరిగాయన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. అసలు ఉనికిలో లేని దాదాపు 380కి పైగా నకిలీ కంపెనీలు కోట్లు కొల్లగొడుతున్నా.. నిబంధనల ప్రకారం జరగాల్సిన క్షేత్రస్థాయి పరిశీలన ఎందుకు అటకెక్కిందన్నదానిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.నేరగాళ్లు కోట్లాది రూపాయలు దోచుకున్న తర్వాతే అధికారులు దర్యాప్తు ప్రారంభిస్తున్నారన్నది నగ్న సత్యం. మోసం జరుగుతున్న ప్రారంభ దశలోనే ఫేక్ ఇన్వాయిస్లను పట్టుకోవడంలో జీఎస్టీ విభాగం విఫలమైందా? లేదా ఉద్దేశపూర్వకంగానే చూసీచూడనట్లు వదిలేస్తున్నారా? అన్నది తేలాల్సి ఉంది. వందల కోట్లు రికవరీ చేశామని అధికారులు చెబుతున్నా, కొత్తగా పుట్టుకొస్తున్న నకిలీ కంపెనీలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో నిఘా వ్యవస్థను కఠినతరం చేయకపోతే.. సామాన్యుడు కట్టే పన్నులన్నీ అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లడం ఖాయమనే ఆందోళన వ్యక్తమవుతోంది. -
వేడిరాత్రులు.. ప్రమాద ఘంటికలు
సాక్షి, అమరావతి: వేసవి అంటే మండిపోయే పగలు, ఉపశమనం ఇచ్చే రాత్రులు. కానీ ఇప్పుడు సూర్యుడు అస్తమించినా సెగలు తగ్గడం లేదు. రాత్రి ఏడుగంటలు దాటినా గాలిలో వేడి తగ్గకపోగా ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రాష్ట్రంలో కొన్నేళ్లుగా పగటి ఉష్ణోగ్రతల కంటే రాత్రి ఉష్ణోగ్రతలు పెరగడం వాతావరణ శాస్త్రవేత్తలను కలవరపెడుతోంది. దీన్ని వార్మ్నైట్ విపత్తుగా పిలుస్తున్నారు. సాధారణంగా భూమి పగలు సూర్యుడి నుంచి గ్రహించిన వేడిని రాత్రి సమయాల్లో తరంగాల రూపంలో అంతరిక్షంలోకి వదిలేస్తుంది.దీనివల్ల తెల్లవారుజామున వాతావరణం చల్లబడుతుంది. అయితే ప్రస్తుతం వాతావరణంలో పెరిగిన కాలుష్య పొరలు ఈ వేడిని బయటకు వెళ్లకుండా అడ్డుకుంటున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. రాత్రి 12 గంటల సమయంలో కూడా ఉష్ణోగ్రత 30 డిగ్రీల కంటే తగ్గకపోవడం గమనార్హం. ఆరోగ్యానికి పెనుముప్పు రాత్రిళ్లు వేడి తగ్గకపోవడం వల్ల మన శరీరం రీసెట్ అయ్యే అవకాశం కోల్పోతోంది. నిద్రలో గుండె వేగం తగ్గాలి. కానీ బయటి వేడి వల్ల శరీరం తనను తాను చల్లబరుచుకోవడానికి నిరంతరం శ్రమిస్తుంది. దీనివల్ల రక్తపోటు పెరిగి గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రత 25 డిగ్రీల పైన ఉంటే గాఢనిద్ర పట్టదు. ఇది మరుసటిరోజు పనితీరుపై ప్రభావం చూపడమే కాకుండా దీర్ఘకాలంలో చిరాకు, డిప్రెషన్కు దారితీస్తుంది. పంటలకూ దెబ్బ రాత్రి ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వరి వంటి పంటల దిగుబడి తగ్గిపోతుంది. మొక్కలు రాత్రివేళ ఎక్కువ శ్వాసక్రియ జరపడం వల్ల గింజ గట్టిపడక తాలుశాతం పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాతావరణ మార్పులు అంటే ఎక్కడో మంచు పర్వతాలు కరగడం మాత్రమే కాదు. మన ఇంటి పైకప్పులు నిప్పుల కుంపట్లుగా మారడం కూడా అని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. నగరాల్లో పచ్చదనాన్ని పెంచడం, భవనాలపై కూల్ రూఫ్ పెయింట్స్ వేయడం, కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా వార్మ్నైట్ ముప్పు నుంచి బయటపడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కారణాలివే ఈ వేడిరాత్రులకు ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. 1. నగరాల్లో చెట్లు తగ్గిపోయి కాంక్రీట్ భవనాలు, తారు రోడ్లు పెరిగాయి. ఇవి పగలు వేడిని పీల్చుకుని రాత్రివేళ బయటకు వదులుతాయి. పల్లెటూళ్లలో వేడి త్వరగా తగ్గుతున్నా, నగరాల్లో మాత్రం ఈ కాంక్రీట్ సెగలు రాత్రంతా కొనసాగుతున్నాయి. దీన్ని అర్బన్ హీట్ ఐలాండ్గా పేర్కొంటున్నారు. 2. మనది తీర ప్రాంత రాష్ట్రం కావడంతో గాలిలో తేమశాతం ఎక్కువ. గాలిలో తేమ పెరిగినప్పుడు అది ఒక దుప్పటిలా మారి భూమి నుంచి వెలువడే వేడిని అంతరిక్షంలోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. 3. బంగాళాఖాతంలో ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల రాత్రివేళ సముద్రం నుంచి వచ్చే గాలులు చల్లదనానికి బదులు సెగలను మోసుకొస్తున్నాయి. -
ప్రభుత్వ ఉద్యోగం నుంచి కాకర్ల వెంకట్రామిరెడ్డి తొలగింపు
సాక్షి,విజయవాడ: ఏపీ ఉద్యోగ సంఘం నాయకుడిపై కూటమి ప్రభుత్వం కుట్రకు దిగింది. కాకర్ల వెంకట్రామిరెడ్డిని ఉద్యోగం నుండి డిస్మిస్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడిగా, ప్రస్తుతం ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉన్న వెంకట్రామిరెడ్డి గత 22 నెలలుగా ఉద్యోగుల సమస్యలపై ప్రశ్నిస్తూ, చంద్రబాబు ఇచ్చిన హామీలను నిలదీస్తున్నారు. ఈ క్రమంలో ఆయనపై కక్ష సాధింపులకు దిగింది.చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు ప్రభుత్వం వెంకట్రామిరెడ్డిపై పగబట్టింది. ఈ క్రమంలో సచివాలయంలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న ఆయనపై చంద్రబాబు సీఎం అయినప్పటి నుండి సస్పెన్షన్ విధించారు. ఇప్పుడు శాశ్వతంగా సర్వీస్ నుండి డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
హంద్రీ–నీవా కాలువ పనుల్లో.. రూ.3,000 కోట్లు కొట్టుకుపోయాయ్!
సాక్షి, అమరావతి: హంద్రీ–నీవా సుజల స్రవంతి మొదటి దశ ప్రధాన కాలువ వెడల్పు.. రెండో దశ ప్రధాన కాలువ, దానిలో అంతర్భాగమైన పుంగనూరు బ్రాంచ్ కెనాల్(పీబీసీ), కుప్పం బ్రాంచ్ కెనాల్ (కేబీసీ) లైనింగ్ పనుల్లో డొల్లతనం బట్టబయలైంది. గత నెల 24న మల్యాల పంప్హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయడం ఆపేయడంతో.. కాలువలో నీటి ప్రవాహం ఆగిపోయి పనితనం తేలిపోయింది. కర్నూలు, అనంతపురం జిల్లాలలో హంద్రీ–నీవా ప్రధాన కాలువ వెడల్పు మొదటి దశ పనులను ఇష్టారాజ్యంగా చేయడంతో ప్రవాహ ఉద్ధృతికి కాలువ గట్లు కోతకు గురై బలహీనంగా మారాయి. కాంక్రీట్ నిర్మాణాలు ఉన్న చోట్ల నాసిరకంగా చేసిన లైనింగ్ కొట్టుకుపోయింది.ఇక అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో హంద్రీ–నీవా రెండో దశ, పీబీసీ, కేబీసీ కాలువ సైడ్ స్లోప్స్ (వాలు) సరిచేసి, గట్టిపరచకుండా నాసిరకంగా లైనింగ్ చేయడంతో అనేక చోట్ల జారిపోయింది. సిమెంటు కాంక్రీట్ కరిగిపోయి కొట్టుకుపోయింది. నిబంధనలు తుంగలో తొక్కి.. పని స్వభావాన్ని మార్చేసి నాసిరకంగా లైనింగ్ చేస్తుండటాన్ని గతేడాది జూలై 14న ‘ఈ లైనింగ్ దండుకునేందుకే’ శీర్షికన ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. తొలి దశ ప్రధాన కాలువ విస్తరణ పనులకు సంబంధించి గతంలో చేసినవే మళ్లీ ఇప్పుడు చేసినట్లుగా చూపడంపై ‘హంద్రీ–నీవాలో మహాపాతకం’ శీర్షికన గతేడాది జూలై 16న ప్రచురించిన కథనం ద్వారా ‘సాక్షి’ బహిర్గతం చేసింది.ఆ కథనాలు అక్షర సత్యమన్నది హంద్రీ–నీవా కాలువను పరిశీలిస్తే స్పష్టమవుతోందని ఇంజనీరింగ్ నిపుణులు, రైతులు స్పష్టం చేస్తున్నారు. రికార్డు సమయంలో పూర్తి చేశామని గొప్పలు చెప్పుకునేందుకు నాసిరకంగా పనులు చేయడం వల్ల రూ.3 వేల కోట్ల మేర ప్రజాధనం వృథా చేశారని ఆరోపిస్తున్నారు. హంద్రీ–నీవా మొదటి దశ ప్రధాన కాలువలో రోజుకు 3,850 క్యూసెక్కులు తరలించేలా వెడల్పు చేసే పనులు, రెండో దశ కాలువ, పీబీసీ, కేబీసీ లైనింగ్ పనులను రూ.3,500 కోట్లతో చేపట్టి రికార్డు సమయంలో పూర్తి చేశామని చంద్రబాబు సర్కార్ గొప్పగా ప్రకటించుకుంది.గతేడాది జూలై 17న శ్రీశైలం జలాశయం నుంచి హంద్రీ–నీవా ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోయడాన్ని అధికారులు ప్రారంభించి మార్చి 24న ఆపేశారు. మొత్తం 248 రోజుల్లో 52.023 టీఎంసీలు తరలించినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ లెక్కన రోజుకు సగటున 2,427.46 క్యూసెక్కులను మాత్రమే తరలించారన్నది స్పష్టమవుతోంది. చంద్రబాబు సర్కార్ గొప్పగా ప్రకటించినట్లుగా రోజుకు 3,850 క్యూసెక్కులను ఎత్తిపోసి ఉంటే 248 రోజుల్లో హంద్రీ–నీవా ద్వారా రాయలసీమకు 82.50 టీఎంసీలు సరఫరా అయ్యేవని ఇంజనీరింగ్ నిపుణులు, రైతులు స్పష్టం చేస్తున్నారు. 2019–24 మధ్య కాలువను వెడల్పు చేయకున్నా రోజుకు గరిష్టంగా 2,850 క్యూసెక్కులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం తరలించిందని.. దీన్ని బట్టి చూస్తే వెడల్పు, లైనింగ్ ముసుగులో చంద్రబాబు సర్కార్ భారీ ఎత్తున ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నది స్పష్టమవుతోందని పేర్కొంటున్నారు.రైతులు ముక్తకంఠంతో వ్యతిరేకించినా..హంద్రీ–నీవా రెండో దశ కాలువ, పీబీసీ, కేబీసీ కాలువకు సిమెంట్ లైనింగ్ చేస్తే భూగర్భ జలాలు అడుగంటిపోయి బోరు బావులు ఎండిపోతాయని.. పంటలు ఎండిపోయి తాము రోడ్డున పడతామని అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల రైతులు ముక్తకంఠంతో వ్యతిరేకించినా సీఎం చంద్రబాబు పట్టించుకోలేదు. హంద్రీ–నీవా రెండో దశ ప్రధాన కాలువ 216.30 కి.మీ నుంచి 400–500 కి.మీ వరకు ఐదు ప్యాకేజీలుగా విభజించి ఆర్నెల్ల్లలో పనులు పూర్తి చేయాలనే నిబంధనతో రూ.972.19 కోట్లతో (రూ.520.75 కోట్ల విలువైన మూడు ప్యాకేజీల పనులు ‘ఈనాడు’ కిరణ్ వియ్యంకుడు రాయల రఘుకి చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్కు.. రూ.451.44 కోట్ల విలువైన రెండు ప్యాకేజీల పనులు సీఎం చంద్రబాబు సన్నిహితుడు బలుసు శ్రీనివాసరావుకు చెందిన బీఎస్సార్ ఇన్ఫ్రాకు అప్పగించారు.పుంగనూరు బ్రాంచ్ కాలువలో 0 కి.మీ నుంచి 75వ కి.మీ వరకు లైనింగ్ పనులను రెండు ప్యాకేజీల కింద విభజించి కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్సార్ కన్స్ట్రక్షన్స్కు రూ.319.6 కోట్లతో అప్పగించారు. పుంగనూరు బ్రాంచ్ కాలువలో 75 కి.మీ నుంచి 207.80 కి.మీ వరకు వెడల్పు చేయడం, లైనింగ్ పనులను రూ.480.22 కోట్లతో సీఎం చంద్రబాబు సన్నిహితుడికి చెందిన ఎన్సీసీ సంస్థకు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారు. కుప్పం బ్రాంచ్ కాలువ లైనింగ్ పనులను సీఎం చంద్రబాబు తనకు అత్యంత సన్నిహితుడైన సీఎం రమేష్కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్కు రూ.196.91 కోట్లతో అప్పగించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎస్ఎఫ్ఆర్సీ లైనింగ్ టెండర్ నిబంధనల ప్రకారం రాతి పొర ఉన్న చోట్ల మాత్రమే షార్ట్ క్రీటింగ్ విధానంలో లైనింగ్ చేయాలి. నిబంధనల్లో ఎక్కడా ఎస్ఎఫ్ఆర్సీ ప్రస్తావనే లేదు. పని స్వభావం మారితే స్టేట్ లెవల్ టెక్నికల్ కమిటీ (ఎస్ఎల్టీసీ) ఆమోదంతోపాటు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. కానీ.. టెండర్లో నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలనే సాకు చూపించి ఎస్ఎఫ్ఆర్సీ విధానాన్ని కాంట్రాక్టర్లు ప్రతిపాదిస్తే ఆ పనులను పర్యవేక్షిస్తున్న ఇంజనీరింగ్ అధికారులు నోరు మెదపలేకపోయారని జల వనరుల శాఖ అధికార వర్గాలు చెబుతున్నాయి. రాతి పొర లేకున్నా.. మట్టి పొరకే.. కనీసం కాలువ సైడ్ వాలు (స్లోప్)ను క్రమానుగతంగా సరి చేయకుండానే ఇష్టారాజ్యంగా అత్తెసరు మందంతో ఎస్ఎఫ్ఆర్సీ విధానంలో కాంట్రాక్టర్లు లైనింగ్ పనులు కానిచ్చేశారు. కాలువకు నీటిని విడుదల చేయడంతో ఆ ప్రవాహ ఉద్ధృతికి ఎస్ఎఫ్ఆర్సీ విధానంలో వేసిన లైనింగ్ అనేక చోట్ల కరిగిపోయి కొట్టుకుపోయింది. వెడల్పు పేరుతో రూ.695.53 కోట్లు వృథా..:హంద్రీ–నీవా తొలి దశ ప్రధాన కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కులకు పెంచే పనులను టీడీపీ హయాంలో 2017లో చేపట్టింది. 2019 ఫిబ్రవరి 18 నాటికే 2,73,32,444 క్యూబిక్ మీటర్ల మట్టి పని పూర్తయింది. ఈ పనులకు రూ.435 కోట్ల మేర బిల్లులు చెల్లించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ.. 2025లో మళ్లీ కొత్తగా హంద్రీ–నీవా తొలి దశ ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కులకు పెంచే పనులను చంద్రబాబు సర్కారు రూ.695.53 కోట్లతో చేపట్టింది. ఈ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి.. ఒకటో ప్యాకేజీ (0 నుంచి 88 కి.మీ వరకు) కింద రూ.255.79 కోట్లకు మేఘా సంస్థకు, రెండో ప్యాకేజీ (88 కి.మీ నుంచి 216.3 కి.మీ వరకు) కింద రూ.439.74 కోట్లకు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డికి చెందిన వీపీఆర్–డీఎస్సార్(జేవీ) సంస్థకు అప్పగించింది.ప్రధాన కాలువను వెడల్పు చేయడంతోపాటు.. బ్రిడ్జిలు, అక్విడెక్టులు లాంటి కాంక్రీట్ నిర్మాణాలు ఉన్న చోట ఇరువైపులా వంద మీటర్ల పొడవున కాలువకు లైనింగ్ చేయాలని ప్రభుత్వం పేర్కొంది. ఒకటో ప్యాకేజీలో 37.79 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని, 5.61 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని.. రెండో ప్యాకేజీలో 84.97 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని, 14.13 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేయాలని లెక్క కట్టింది.కానీ.. కాలువ గట్లపై ముళ్ల పొదలు తొలగించి, ఇన్స్పెక్షన్ పాత్ (తనిఖీ మార్గం)ను సరి చేసి.. ప్రొక్లెయిన్తో అక్కడక్కడ తవ్వి.. గతంలో చేసిన పనులనే మళ్లీ కొత్తగా చేసినట్లు కాంట్రాక్టర్లు మాయాజాలం చేశారు. ఇక కాంక్రీట్ నిర్మాణాలు ఉన్న చోట్ల అత్యంత నాసిరకంగా లైనింగ్ చేశారు. మల్యాల ఎత్తిపోతల నుంచి కాలువలోకి నీటిని ఎత్తిపోయడంతో ప్రవాహ ఉధృతికి కాలువ గట్లు కోతకు గురై బలహీనంగా మారాయి. అనేక చోట్ల సిమెంటు లైనింగ్ కొట్టుకుపోయింది.⇒ హంద్రీ–నీవా సుజల స్రవంతి రెండో దశలో అంతర్భాగమైన పుంగనూరు బ్రాంచ్ కెనాల్లో 87.622 కి.మీ. నుంచి 88.925 కి.మీ. వరకు ఎక్కడికక్కడ జారిపోయిన కాంక్రీట్ లైనింగ్కు ఈ ఫొటోనే సాక్ష్యం. అన్నమయ్య జిల్లా పరిధిలో పుంగనూరు బ్రాంచ్ కెనాల్ 75 కి.మీ నుంచి 207.80 కి.మీ వరకు వెడల్పుతో లైనింగ్ పనులను రూ.480.22 కోట్లకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడి సంస్థ ఎన్సీసీకి నామినేషన్పై కట్టబెట్టారు. కాలువ సైడ్ స్లోప్స్ (ఏటవాలు ప్రాంతం) సరిచేయకుండానే.. ఇన్క్లైయిన్డ్ రోలర్తో గట్టిపరచకుండానే మట్టి పొరకు అత్యంత నాసిరకం ఎం–25, ఎం–20 రకం కాంక్రీట్ మిశ్రమంతో లైనింగ్ చేశారు. దీంతో కాలువకు నీటిని విడుదల చేయగానే లైనింగ్ ఎక్కడికక్కడ పగిలిపోయి జారిపోయింది. నీటి ప్రవాహం ఆగిపోవడంతో కాలువ లైనింగ్ డొల్లతనం తేలిపోయింది.⇒ హంద్రీ–నీవా కాలువ లైనింగ్ పనుల్లో అక్రమాలకు ఇవో మచ్చుతునక. తొలి దశ, రెండో దశ ప్రధాన కాలువ, పుంగనూరు బ్రాంచ్ కాలువ, కుప్పం బ్రాంచ్ కాలువ లైనింగ్ పనులను కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా చేసి అడ్డగోలుగా ప్రజాధనాన్ని దోచుకున్నారు. టెండర్ నిబంధనల ప్రకారం రాతి పొర, డీప్ కట్ ఉన్న ప్రాంతాల్లో మాత్రమే షార్ట్ క్రీటింగ్ విధానంలో లైనింగ్ చేయాలి. కానీ నిబంధనలను తుంగలో తొక్కి పని స్వభావం (స్కోప్ ఆఫ్ వర్క్) మార్చేసి.. వేగంగా పూర్తి చేయాలనే సాకుతో అడ్డగోలుగా ఎస్ఎఫ్ఆర్సీతో లైనింగ్ చేశారు. షార్ట్ క్రీటింగ్ పద్ధతిలో లైనింగ్ చేస్తే చదరపు మీటర్కు రూ.1,407 చొప్పున బిల్లు చెల్లిస్తారు. అదే ఎస్ఎఫ్ఆర్సీతో లైనింగ్ చేస్తే రూ.1,854 చెల్లిస్తారు. కానీ.. హంద్రీ–నీవా పనుల్లో మాత్రం రూ.2,400 చొప్పున బిల్లులు చెల్లించారంటూ ఇంజనీరింగ్ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ⇒ శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తికి సమీపంలో కమ్మవారిపల్లి వద్ద హంద్రీ–నీవా రెండో దశ ప్రధాన కాలువ 340 కి.మీ నుంచి 341 కి.మీ. మధ్య స్టీల్ ఫైబర్ రీయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ (ఎస్ఎఫ్ఆర్సీ) విధానంలో వేసిన లైనింగ్ కరిగిపోయిందనడానికి ఈ ఫొటోనే రుజువు! చిన్న చిన్న ఇనుప తీగలు, సిమెంటు, సిలికా, ఇసుక, కంకర, నీటితో కలిపి ఎస్ఎఫ్ఆర్సీని తయారు చేస్తారు. కాలువ రాతి పొర ప్రదేశంలో మాత్రమే.. సైడ్ స్లోప్స్ (ఏటవాలు ప్రాంతం) సరిచేసుకుని 38 మిల్లీమీటర్ల (ఎంఎం) మందంతో ఒకసారి, ఆ తర్వాత అదే మందంతో మరోసారి అధిక ఒత్తిడితో ఎస్ఎఫ్ఆర్సీతో లైనింగ్ చేయాలి.కానీ, మట్టి పొరకే.. అదీ కాలువ సైడ్ స్లోప్స్ క్రమానుగతంగా ఉండేలా చేయకుండానే, వాలు ఎగుడు దిగుడుగా ఉన్నప్పటికీ 10 నుంచి 20 ఎంఎం మందంతో మాత్రమే ఎస్ఎఫ్ఆర్సీతో లైనింగ్ వేశారు. ఈ దారుణాన్ని గతేడాది జూలై 14న ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఇంత అడ్డదిడ్డంగా లైనింగ్ చేసిన దాఖలాలు ఎక్కడా లేవని.. ఇదో వింత అని ఇంజనీరింగ్ నిపుణులు అప్పట్లో ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నపాటి వర్షం కురిసినా, కాలువకు కనిష్ట స్థాయిలో నీటిని విడుదల చేసినా.. ఈ లైనింగ్ ఎక్కడికక్కడ జారిపోవడం, కరిగిపోవడం ఖాయమని.. భారీ ఎత్తున ప్రజాధనం వృథా కావడం తథ్యమని స్పష్టం చేశారు. ఇప్పుడు అదే జరిగిందని ఇంజనీరింగ్ నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఆ పనులు చేసిన కాంట్రాక్టు సంస్థ బీఎస్సార్ ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ బలుసు శ్రీనివాసరావు సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం.లైనింగ్ పనులు ఎలా చేయాలంటే..⇒ తొలుత కాలువ గట్లపై ముళ్ల కంప చెట్లను తొలగించాలి. కాలువపై ఇన్స్పెక్షన్ పాత్ (దారి) వేయాలి. కాలువకు ఇరు వైపులా(సైడ్ స్లోప్స్).. అడుగు భాగంలో ఇన్క్లెయిన్డ్ రోలర్ (ప్రొక్లెయినర్కు రోలర్ను అమర్చడం) ద్వారా గట్టి పరచాలి.⇒ ఆ తర్వాత 12 ఎంఎం, 20 ఎంఎం గ్రానైట్ కంకర, నాణ్యమైన ఇసుక, సిమెంటుతో తయారు చేసిన ఎం–25 మిక్సర్, ఎం–20 మిక్సర్తో పేవర్ మిషన్ ద్వారా కాలువకు ఇరువైపులా లైనింగ్ వేయాలి. ఆ తర్వాత అడుగు భాగంలో లైనింగ్ వేయాలి. అనంతరం రెండు వారాలపాటు క్యూరింగ్ (నీటితో తడపాలి) చేయాలి.⇒ రాతి పొర ఉన్న ప్రాంతాల్లో షార్ట్ క్రీటింగ్ విధానంలో లైనింగ్ చేయాలి. రాతి పొరకు ఇనుప బోల్ట్ కొట్టి.. దానికి ఇనుప జాలరీ అమర్చి దానిపై అధిక ఒత్తిడితో ఎం–20 కాంక్రీట్ వేయాలి. ⇒ పనులను ఏఈ, డీఈ, ఈఈలు నిరంతరం పర్యవేక్షించాలి. ఎస్ఈ, సీఈలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి. నాణ్యత నియంత్రణ విభాగం(క్వాలిటీ కంట్రోల్) అధికారులు ఎప్పటికప్పుడు సిమెంటు కాంక్రీట్ లైనింగ్ శాంపుల్స్ను తీసి ల్యాబొరేటరీల్లో పరీక్షించి నాణ్యతను ధ్రువీకరించాలి. నాసిరకంగా ఉన్నట్లు తేలితే వాటిని తొలగించి మళ్లీ నాణ్యంగా పనులు చేయించాలి.⇒ పనులు దక్కించుకున్న ప్రధాన కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్టర్కు పనులు అప్పగించడానికి వీల్లేదు. ఏవైనా పనులను సబ్ కాంట్రాక్టర్కు అప్పగించాలంటే జల వనరుల శాఖ అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరి. కానీ పనుల నాణ్యతకు ప్రధాన కాంట్రాక్టరే బాధ్యత వహించాలి.లైనింగ్ పనులు ఎలా చేశారంటే..⇒ కాలువ గట్లపై ముళ్ల కంప చెట్లను తొలగించి దారి వేశారు. ఇన్క్లెయిన్డ్ రోలర్తో కాలువ ఇరు వైపులా అడుగు భాగాన్ని గట్టి పరచలేదు. కేవలం పొక్లెయిన్ బకెట్తో తూతూ మంత్రంగా గట్టి పరిచే పనులు కానిచ్చేశారు. దాంతో కాలువకు ఇరు వైపులా మట్టి ఎక్కడికక్కడ జారిపోతున్నా సరే సిమెంటు కాంక్రీట్తో లైనింగ్ వేశారు.⇒ గతంలో కాలువ తవ్వినప్పుడు వచ్చిన మట్టిని, రాళ్లను గట్టుగా పోశారు. ఆ గట్లపై ఉన్న రాళ్ల నుంచే ఇప్పుడు కంకర తయారు చేస్తున్నారు. ఆ కంకర పిండి పిండిగా నాసిరకంగా ఉంది. సమీపంలో వాగులు, వంకల్లో నుంచి ఇసుకను తెచ్చారు. నాసిరకం కంకర, ఇసుక.. తక్కువ పరిమాణంలో సిమెంటుతో ఎం–25 మిక్సర్ (ఒక పాలు సిమెంటు, ఒక పాలు ఇసుక, రెండు పాళ్లు 20 ఎంఎం కంకర కలిపి తయారు చేసే మిశ్రమం), ఎం–20 (1 పాలు సిమెంటు, 1.5 పాళ్లు ఇసుక, 3 పాళ్లు 12 ఎం ఎం కంకర కలిపి తయారు చేసే మిశ్రమం) మిక్సర్ తయారు చేశారు. ⇒ కాలువకు ఇరువైపులా ఇన్క్లెయిన్డ్ రోలర్తో గట్టిపరచక పోవడంతో ఎక్కడికక్కడ మట్టి జారిపోతున్నా పేవర్ యంత్రాన్ని వినియోగించకుండా.. కార్మికుల ద్వారా సిమెంట్ కాంక్రీట్తో లైనింగ్ వేశారు. మట్టిజారిపోతున్నా సరే అలానే లైనింగ్ వేస్తున్నారు. దీని వల్ల లైనింగ్ ఎక్కువ కాలం నిలబడదని ఇంజనీరింగ్ నిపుణులు స్పష్టం చేశారు. ఇష్టారాజ్యంగా లైనింగ్ చేయడంతో నీటి ప్రవాహ ఉద్ధృతికి లైనింగ్ ఎక్కడికక్కడ కొట్టుకుపోయింది. ఎం–25, ఎం–20 కాంక్రీట్లో సిమెంటు తక్కువగా, ఇసుక ఎక్కువగా, నాసిరకం కంకర వినియోగించడం వల్ల లైనింగ్ చేసిన ప్రాంతాల్లో ఇసుక పైకి తేలి స్పష్టంగా కనిపిస్తోంది. -
ఉద్యోగులపై అంతులేని నిర్లక్ష్యం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వోద్యోగులపై చంద్రబాబు ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని.. వారిని ఇంతలా పట్టించుకోని ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి విమర్శించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చమంటే సీఎం చంద్రబాబు తనను ఉద్యోగం నుంచి తీసేస్తామని బెదిరిస్తున్నారని.. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తేలేదని ఆయన స్పష్టంచేశారు. తాడేపల్లిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగుల మేలు కోసం తాను ఎందాకైనా వెళ్తానన్నారు. అందుకే మేలో అనంతపురం నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు ఆయన ప్రకటించారు. వెంకటరామిరెడ్డి ఇంకా ఏమన్నారంటే..రెండేళ్లయినా ఒక్క హామీ నెరవేరలేదు..వైఎస్ జగన్ పాలన ఉద్యోగులకు స్వర్ణయుగం లాంటిది. మళ్లీ జగన్ సీఎం అయితేనే ఉద్యోగుల సమస్యల పరిష్కారమవుతాయి. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ, పెండింగ్ బకాయిలు క్లియర్ వంటి చాలా హామీలిచ్చారు. ఇప్పటికే రెండేళ్లయినా ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ఐఆర్ ఊసేలేదు. పీఆర్సీ అమలుచేయాల్సిన టైం దాటిపోయి మూడేళ్లయినా ఇంతవరకు పీఆర్సీ కమీషన్ను ఏర్పాటుచేయలేదు. ఇప్పటివరకు నాలుగు డీఏలు పెండింగ్ ఉన్నాయి. బాకాయిలు రూ.40 వేల కోట్లకు చేరుకున్నాయి. పెన్షనర్ల సమస్యలు అలాగే ఉండిపోయాయి. ఇక అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు అందజేస్తాం, సీపీఎస్ ఉద్యోగులకు జీపీఎస్ కంటే మెరుగైన పింఛన్ విధానం అన్నారు.. అదీలేదు. సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు అన్నారు, అవీలేవు. ఆశ వర్కర్లకు జీతాలు పెంచి, గ్రాట్యుటీ ఇస్తామన్నారు.. అదీలేదు. ఈ ప్రభుత్వంతో పోలిస్తే గత వైఎస్ జగన్ ప్రభుత్వం వంద రేట్లు మేలు.ఉద్యోగులపై పనిభారం..ఇలాంటి ప్రభుత్వం కరోనా కాలంలో ఉండి ఉంటే రాజధాని కోసం, హూదూద్, కేరళ తుపాను బాధితుల కోసం ఉద్యోగుల నుంచి వసూలుచేసినట్లుగా కరోనా పేరుతో కూడా చంద్రబాబు డబ్బులు వసూలుచేసేవారు. ఉద్యోగుల పక్షాన గత ప్రభుత్వాన్ని విమర్శించిన చంద్రబాబు నాటి ప్రభుత్వం కంటే మెరుగ్గా ఉద్యోగులకు ఏం మేలు చేశారు? గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసింది.. వేలాది మంది టీచర్లకు ప్రమోషన్లు, మండలానికి ఒక ఎంఈఓ పోస్టు క్రియేట్ చేసి టీచర్లకు పదోన్నతులిచ్చింది.. గ్రామ, వార్డు సచివాలయాలు తీసుకొచ్చి లక్షా 30 వేల ఉద్యోగాలిచ్చింది.. ఆశ వర్కర్లకు జీతాలు పెంచింది.. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసింది.. ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు 90 శాతం నెరవేర్చింది.. అందుకే ఇప్పుడు ప్రతీ ఉద్యోగి రోడ్డుపైకొచ్చి ఆందోళన చేయటానికి సిద్ధంగా ఉన్నారు. వైఎస్సార్టీఏ కూడా ఆందోళనకు సిద్ధమైంది. ఉద్యోగులను ఇంతగా నిర్లక్ష్యం చేయటం చంద్రబాబుకు మంచిది కాదు. ఉద్యోగులకు యాప్లు తగ్గిస్తామని చెప్పి పనిభారం పెంచారు. సచివాలయ ఉద్యోగుల పరిస్థితి మరి దారుణంగా తయారైంది. పైపెచ్చు సచివాలయంలో వారు ఉండటంలేదని నిందిస్తున్నారు. ఉద్యోగులను వేధించేందుకు ఈ ప్రభుత్వం కొత్తకొత్త పద్ధతులు అవలంబిస్తోంది.ఉద్యోగులు విసిగిపోయారు..ఇక గత ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలతో మూడునెలలకు ఒక మీటింగ్ పెట్టేది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రుల కమిటీ సభ్యులు వీరికి అందుబాటులో ఉండేవారు. ఈ ప్రభుత్వంలో అలా ఎవ్వరూ లేరు. అందుకే ఉద్యోగులంతా విసిగిపోయారు. సంక్రాంతి డీఏ బకాయిలు అందరికీ పడకపోయినా ఎల్లో మీడియా ఇచ్చేసినట్లు రాసేసింది. వచ్చేనెలలో అనంతపురం నుంచి ఆందోళన కార్యక్రమాలు ప్రారంభిస్తాం. ప్రభుత్వం దిగొచ్చే వరకూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తాం. -
సుర్రుమన్న సూరీడు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండ తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. ఆదివారం కర్నూలు జిల్లా నగరడోనలో అత్యధికంగా 45.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 279 మండలాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. వైఎస్సార్ కడప జిల్లా ఖాజీపేటలో 44.5, కాకినాడ జిల్లా కరపలో 44.4, అనంతపురం జిల్లా రాయదుర్గం, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 44.3 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అదే సమయంలో ద్రోణి ప్రభావంతో కొన్నిచోట్ల వర్షం పడింది. రానున్న రెండు రోజులు కూడా తీవ్రమైన ఎండలు, అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. నేడు తీవ్ర వడగాలులు వీచే మండలాలు ఇవే.. శ్రీకాకుళం జిల్లాలో బూర్జ, హిరమండలం, పాతపట్నం, విజయనగరం జిల్లాలో బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, దత్తిరాజేరు, గజపతినగరం, మెంటాడ, మెరకముడిదాం, రాజాం, రామభద్రాపురం, సంతకవిటి, తెర్లాం, వంగర మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలో బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పాలకొండ, పార్వతీపురం, సాలూరు, సీతంపేట, సీతానగరం, వీరఘట్టం మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉంది. అలాగే, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. -
మా భూముల జోలికొస్తే పోరాటమే
తాడేపల్లి రూరల్: అమరావతి ముఖ ద్వారమైన గుంటూరు జిల్లా ఉండవల్లిలో పంట పొలాలను తీసుకునేందుకు ప్రభుత్వం ఈ నెల 16న భూ సేకరణ కింద నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ రైతులంతా ఆదివారం సమావేశమయ్యారు. ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్లాలని, వేర్వేరుగా పోరాటం చేస్తే ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందని, గతంలో భూ సమీకరణకు ఏవిధంగా పోరాడామో ఇప్పుడూ అదేవిధంగా పోరాటానికి సిద్ధం కావాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఒకవేళ ప్రభుత్వం దిగొచ్చి భూ సేకరణ నోటిఫికేషన్ వెనక్కి తీసుకుంటే... చర్చించి ఏ విధంగా అభివృద్ధి చేస్తారో, రైతులకు ఎలా న్యాయం చేస్తారో అడగడానికి సిద్ధంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఉండవల్లిలోని పంట పొలాల్లో నుంచి వచ్చే సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూమిని ప్రభుత్వానికి భూ సమీకరణకు ఇచ్చేందుకు గతంలో కొంత మంది రైతులు 9.3 పత్రాలను అందజేశారు. ప్రస్తుతం రోడ్డు నిర్మాణానికి పోను మిగిలిన భూములకు కూడా భూ సేకరణ నోటిఫికేషన్ ఇస్తారని తెలియడంతో వారు తీవ్రంగా వ్యతిరేకిస్తూ అవసరమైతే కోర్టుల ద్వారా 9.3 పత్రాలను వెనక్కి తీసుకుంటామని తెలిపారు. ఉండవల్లిలో భూ సమీకరణకు భూములు ఇచ్చిన రైతులకు ఉండవల్లి రేగడ పొలాన ప్లాట్లు కేటాయించారు. ఆ ప్లాట్లకు సీడ్ యాక్సెస్ రోడ్కి, పాత జాతీయ రహదారికి అనుసంధానం చేస్తూ రోడ్ల నిర్మాణం చేపట్టే ఆలోచనలో ప్రభుత్వం, సీఆర్డీఏ ఉందని, మొట్టమొదటగా గుంటూరు చానల్ ఒడ్డున సీడ్ యాక్సెస్ నుంచి మాతాశ్రీ ఆశ్రమం వరకు 160 మీటర్ల రోడ్డు నిర్మాణానికి 34 ఎకరాల రైతులకు భూ సేకరణ నోటిఫికేషన్ ఇచ్చారు. త్వరలోనే కొండవీటి వాగు ఎత్తిపోతల పథకానికి, కొండవీటి వాగు వెడల్పుకు, ఉండవల్లి – అమరావతి రోడ్డు నుంచి నాయుళ్ల రామమందిరం, రెడ్ల రామమందిరం మీదుగా ఉండవల్లి దళితవాడ వరకు... అక్కడి నుంచి నులకపేట ఫైరింగ్ స్టేషన్ మరోవైపు పెనుమాక నుంచి సొరంగం ఏర్పాటు చేసి ఉండవల్లి కరకట్ట వైపు కూడా రోడ్ల నిర్మాణానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. వీటన్నింటికి విడివిడిగా భూ సేకరణకు, ఇళ్లను తొలగించేందుకు నోటిఫికేషన్ త్వరలో ఇస్తారని, మనందరం ఐక్యంగా పోరాటం చేసి ప్రభుత్వం చర్చలకు వచ్చేవిధంగా నిలబడాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం నాయకులు దొంతిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రైతులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. లేని పక్షంలో కలిసొచ్చే పార్టీలతో రైతులకు మద్దతుగా నిలిచి పోరాటం చేస్తామని హెచ్చరించారు. -
కూలి ఇవ్వండయ్యా!
సాక్షి, అమరావతి: మండుటెండలో కష్టపడి పని చేసిన ఉపాధి హామీ పథకం కూలీలకు నెలల తరబడి ప్రభుత్వం కూలి డబ్బులు చెల్లించకుండా పస్తులు పెడుతోంది. గత ఏడాది డిసెంబర్ మొదటి వారం తర్వాత నుంచి పనులు చేసిన కూలీలంతా కూలి కోసం ఎదురు చూస్తున్నారు. మార్చి నెలాఖరుతో ముగిసిన 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.812 కోట్లు.. ఈ ఏప్రిల్ ఒకటి నుంచి శనివారం వరకు పనులు చేసిన కూలీలకు మరో రూ.195 కోట్లు.. మొత్తంగా రూ.1,007 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. నిబంధనల ప్రకారం గరిష్టంగా 15 రోజుల లోపు కూలీల వేతనాలు చెల్లించాలని కేంద్ర చట్టం చెబుతున్నా, ఆచరణలో అమలు కావడం లేదు. ఈ పథకానికి సంబంధించి వంద శాతం కూలి డబ్బులు కేంద్రమే చెల్లిస్తుంది. అయితే, దేశంలో మరే రాష్ట్రంలో లేనంతగా బకాయిలు కేవలం మన రాష్ట్రంలోని కూలీలకు చెల్లించాల్సి ఉందని కార్మీక సంఘాలు చెబుతున్నాయి. చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో ఈ సమస్య తీవ్రమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గత ఏడాది మే, జూన్ , జూలై నెలల్లో దాదాపు రూ.రెండు వేల కోట్లు.. 2024 డిసెంబర్– 2025 మార్చి మధ్య దాదాపు రూ.1,000 కోట్లు బకాయిలు పెట్టి.. ఆలస్యంగా చెల్లించారని కార్మీక సంఘాల నేతలు తెలిపారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమలులో అధికార పార్టీ నేతలు దొంగ మçస్తర్లతో భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులతో కేంద్రం పరిశీలన చేస్తుండడం వల్లే కూలీలకు వేతన బకాయిల చెల్లింపులో ఆలస్యమవుతోందని అధికార వర్గాల సమాచారం. సకాలంలో కూలి అందక పోవడంతో పనులకొచ్చే వారి సంఖ్య కూడా తగ్గిపోయింది. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో దాదాపు 75.43 లక్షల మంది ఏటా ఉపాధి హామీ పథకం కింద పనులు చేసి, రూ.6,500–7,000 కోట్ల మేర లబ్ధి పొందారు. అప్పట్లో కరోనా సమయంలో కూడా ఒకే రోజు 54 లక్షల మంది కూలీలు ఉపాధి పనులకు హాజరవ్వడం రికార్డుగా నిలిచింది. అప్పట్లో ఏటా ఏప్రిల్ నెలలో సగటున రోజుకు 25 లక్షల మందికి పనులు కల్పించగా, ఈ ఏడాది ప్రస్తుత ఏప్రిల్లో ఇప్పటి వరకు (20 రోజుల్లో) కేవలం 78.94 లక్షల మందికి మాత్రమే అంటే రోజుకు సగటున ఐదు లక్షల మందికి కూడా పనులు కల్పించలేక పోవడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమేనని స్పష్టమవుతోంది. ఇలాగైతే ఎలా బతకాలి? ఉపాధి హామీ పథకం పనులు చేసి నెలలు గడుస్తున్నా కూలి డబ్బులు మా బ్యాంకు ఖాతాలో జమ కాలేదు. కుటుంబాన్ని పోషించుకుందామని పనికి వెళితే కనీసం కూలి డబ్బులు కూడా ఇవ్వడం లేదు. దీంతో చాలా ఇబ్బంది పడుతున్నాం. అప్పులు చేయాల్సి వస్తోంది. ఇలాగైతే ఎలా బతకాలి? ప్రభుత్వం, అధికారులు చొరవ తీసుకుని కూలి డబ్బులు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలి. – కేజే ఫ్లోరెన్స్, కుముదువల్లి, పాలకోడేరు మండలం, పశ్చిమగోదావరి జిల్లా ఉపాధిలో కోత.. పేదలకు వాతపని దినాల కల్పనలో పదేళ్లు వెనక్కు వెళ్లిన వైనంవంద శాతం కూలీ డబ్బులు కేంద్రమే ఇస్తున్నా చంద్రబాబు సర్కారు ఘోర వైఫల్యంచేసిన పనికి వంద శాతం మేర కూలి డబ్బులు కేంద్రమే ఇచ్చే ఉపాధి హామీ పథకం అమలులో కూడా చంద్రబాబు ప్రభుత్వం అథమ స్థాయికి దిగజారి పోయింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగిన ఆఖరి ఏడాది 2023–24లో 25.55 కోట్ల పని దినాలు కల్పించగా, మార్చి 31తో ముగిసిన 2025–26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం ద్వారా పేదలు 18.59 కోట్ల పని దినాలే పొందగలిగారు. ఈ లెక్కన ఏకంగా దాదాపు 7 కోట్ల పనిదినాలు తగ్గిపోయాయి. 2023–24 ఆర్థిక సంవత్సరంలో పేదలు రూ.6,277 కోట్ల ప్రయోజనం పొందగా, 2025–26లో రూ.4,952 కోట్లు మాత్రమే లబ్ధి పొందారు. తద్వారా పేదలు రూ.1,325 కోట్ల మేర ఆర్థిక లబ్ధిని కోల్పోయారు. 2023–24లో 75.43 లక్షల మందికి పనులు దొరకగా, 2025–26లో 67.62 లక్షల మంది మాత్రమే పనులు పొందారు. ఈ లెక్కన బాబు హయాంలో దాదాపు 8 లక్షల మంది పనులు కోల్పోయారు. వంద రోజుల పని విషయానికి వస్తే 2023–24లో 6.87 లక్షల కుటుంబాలు లబ్ధి పొందగా, 2025–26లో ఆ సంఖ్య కేవలం 2.15 లక్షలే. అంటే దాదాపు మూడొంతుల కుటుంబాలు తగ్గిపోయాయి. జగన్ ప్రభుత్వంలో ఒక్కో కుటుంబం సరాసరిన ఏటా 55 పని దినాలు పొందగా, అది ప్రస్తుతం 43 రోజులకు పడిపోయింది. గత జగన్ ప్రభుత్వంలో కల్పించిన మొత్తం పనుల్లో 22–23 శాతం ఎస్సీలు లబ్ధి పొందగా, 2025–26లో అది 20.47 శాతానికి మాత్రమే పరిమితమైంది. దివ్యాంగులు సైతం జగన్ ప్రభుత్వంలో 80 వేల మందికి పైగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందగా, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో 66 వేలకు తగ్గిపోయారు. ‘ఉపాధి’లోనూ రాజకీయమే 2024 జూన్లో చంద్రబాబు సీఎం అయ్యాక తొలి రెండు నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో ఉపాధి హామీ పథకం అమలులో పనిచేసే గ్రామ స్థాయి ఫీల్డు అసిస్టెంట్లను రాజకీయ కారణాలతో పెద్ద ఎత్తున తొలగించింది. ఈ విషయమై బాధిత ఫీల్డు అసిస్టెంట్లు తాడేపల్లిలోని పంచాయతీరాజ్ గ్రామీణాభివద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. కొత్తగా నియమితులైన ఫీల్డు అసిస్టెంట్లు తమకు అనుకూలమైన వారికే పనులు కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తుండడంతో పనుల కల్పన తగ్గిపోయినట్లు స్పష్టమవుతోంది. దశాబ్ద కనిష్టానికి పనుల కల్పనరాష్ట్రంలో ఉపాధి హామీ పథకం ద్వారా పనుల కల్పన దశాబ్ద కనిష్టానికి పడిపోయింది. అంతకు ముందు విభజిత ఆంధ్రప్రదేశ్లో తొలి ఆర్థిక ఏడాది 2014–15లో అతి తక్కువ పని దినాల తర్వాత 2015–16లో 19.91 కోట్ల పనిదినాల పాటు పనులు దక్కాయి. ఆ తర్వాత గత పదేళ్లలో ఒక ఆర్థిక ఏడాదిలో ఎప్పుడూ 20 కోట్లకు తక్కువగా పని దినాలు కల్పించిన దాఖలాలు లేవు. ఉపాధి హామీ పథకం కార్యక్రమం ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో భాగం కావడం.. ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు నిత్యం గొప్పలు చెబుతున్న తరుణంలో దిగజారిన ఈ రికార్డు వారి పనితీరులోని డొల్లతనాన్ని ఎత్తిచూపుతోంది. ఇదిలా ఉండగా, 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలోనూ పేదలకు పనుల కల్పన తక్కువే. అప్పట్లో 101 కోట్ల మందికి పనులు కల్పించగా, 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఏకంగా 120 కోట్ల మందికి పనులు కల్పించారు. 23.2% తక్కువగా పనులు: లిబ్టెక్2024–25తో పోలిస్తే 2025–26లో రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం వల్ల పేదలు రూ.1,232 కోట్లు నష్టపోయారని లిబ్టెక్ స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. ఇందులో 40 శాతం అంటే దాదాపు రూ.484 కోట్ల మేర ఎస్సీ, ఎస్టీల కుటుంబాలే నష్టపోయాయని తెలిపింది. దేశ వ్యాప్తంగా రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకం తీరు తెన్నులపై ఈ సంస్థ ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ ఏటా నివేదికలు అందజేస్తుంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో ఈ పథకం అమలుపై శనివారం నివేదికను విడుదల చేసింది. గత దశాబ్ద కాలంలో అత్యంత తక్కువగా పని దినాల కల్పనలో ఇదే రికార్డు అని స్పష్టం చేసింది. 2024–25 ఆర్థిక ఏడాదితో పోల్చితే 2025–26లో పేదలకు 23.2 శాతం మేర పనుల కల్పన తగ్గిందని చెప్పింది. 2024–25లో 24.22 కోట్ల పని దినాలు లభ్యంకాగా, 2025–26లో కేవలం 18.59 కోట్ల పనిదినాలు మాత్రమే పనుల కల్పన సాగినట్టు లిబ్టెక్ పేర్కొంది. వంద రోజులు పనులు కల్పించిన కుటుంబాల సంఖ్య కూడా 5.10 లక్షల నుంచి 2.16 లక్షలకు తగ్గిపోయిందని తెలిపింది. గత ఏడాది రాష్ట్రంలో 7.20 లక్షల కుటుంబాలకు జాబ్ కార్డులను తొలగించడం, మరో వైపు జాబ్కార్డులు ఉన్న వారికి పనులు కల్పన తగ్గిపోవడం ఆందోళన కలిగించే అంశమని తన నివేదికలో స్పష్టం చేసింది. -
లోకేశ్ దిగజారుడు రాజకీయం!
సాక్షి, అమరావతి: రాజకీయాల్లో ఇంతకన్నా దిగజారరు అనుకున్న ప్రతిసారీ అంతకంటే దిగువకు దిగజారి రాజకీయ విశ్లేషకులను నివ్వెరపోయేలా చేసే సీఎం చంద్రబాబునాయుడు కంటే ఆయన తయుడు లోకేశ్ మరింత దిగజారిపోయారంటూ సామాజిక మధ్యమాల్లో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా వైఎస్ విజయ అని సంబోధిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేసిన నారా లోకేశ్ ఇప్పుడు రాజకీయంగా మరింతగా దిగజారుతూ వైఎస్ విజయమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ‘ఎక్స్’లో పోస్టు చేశారంటూ ఎత్తిచూపుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తల్లికి గతంలో ఎప్పుడైనా నారా లోకేశ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారా.. అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దిగజారుడు రాజకీయాల్లో భాగంగానే ఎన్నడూ లేని రీతిలో వైఎస్ విజయమ్మపై లేని ప్రేమను ఒలకబోస్తూ లోకేశ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం (ఏప్రిల్ 19) వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ పుట్టిన రోజు. ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మను పులువురు నేరుగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మరికొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారు. అయితే గతంలో ఎన్నడూ విజయమ్మకు శుభాకాంక్షలు తెలుపని, కనీస గౌరవం ఇవ్వని సీఎం చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేశ్.. ప్రస్తుతం దిగజారుడు రాజకీయంలో భాగంగానే ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు. -
రేపటి నుంచి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన
సాక్షి, అమరావతి/కడప ఎడ్యుకేషన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 21 నుంచి 3 రోజుల పాటు వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో పర్యటించనున్నారు. 21న సాయంత్రం పులివెందుల చేరుకుని భాకరాపురం క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. 22న ఉదయం పులివెందుల నుంచి బయలుదేరి లింగాల మండలం ఇప్పట్ల వెళతారు.ఇటీవల మృతి చెందిన స్థానిక వైఎస్సార్సీపీ నేత సుధాకర్ రెడ్డి కుటుంబీకులను పరామర్శిస్తారు. అనంతరం పులివెందుల క్యాంప్ కార్యాలయానికి వెళ్లి ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. 23న ఉదయం పులివెందుల నుంచి తిరుగు పయనమవుతారు. -
వచ్చే మంగళవారం బాబు సర్కారు మళ్లీ రూ.4,600 కోట్ల అప్పు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం మంగళవారం.. మంగళవారం అప్పుల పరంపరను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే మంగళవారం మరో రూ.4,600 కోట్ల అప్పు చేయనుంది. ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా ఈ మొత్తాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఎనిమిదేళ్ల కాల వ్యవధిలో రూ.1,800 కోట్లు, 16 ఏళ్ల కాల వ్యవధిలో రూ.1,800 కోట్లు, 30 ఏళ్ల కాల వ్యవధిలో రూ.1,000 కోట్ల అప్పును చంద్రబాబు సర్కారు చేయనుంది.ఈ మేరకు ఆర్బీఐ శనివారం నోటిఫై చేసింది. ఈ నెల 7వ తేదీనే ప్రభుత్వం రూ.4,400 కోట్లు అప్పు చేసింది. వచ్చే మంగళవారం చేసే అప్పుతో ఆ మొత్తం రూ.9,000 కోట్లకు చేరనుంది. అలాగే చంద్రబాబు ప్రభుత్వం 23 నెలల్లోనే చేసిన మొత్తం అప్పు రూ.3,56,655 కోట్లకు చేరనుంది. ఈ లెక్కన నెలకు సగటున రూ.15,506 కోట్లు, రోజుకు రూ.516 కోట్ల అప్పు చేసింది. -
మైనింగ్ మాఫియా కాటు.. నాగులకొండకు చేటు
సాక్షి, అమరావతి: కూటమి పాలనలో అడ్డూ అదుపు లేకుండా జరుగుతున్న లేటరైట్ అక్రమ తవ్వకాలతో నాగులకొండ కరిగిపోతోంది. కొండ మీద, పరిసరాల్లో విస్తరించి ఉన్న రిజర్వు ఫారెస్టు సైతం కుంచించుకుపోతోంది. అధికారమే అండగా మైనింగ్, అటవీ, పర్యావరణ నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి అక్రమార్కులు యథేచ్ఛగా లేటరైట్ను తవ్వి అమ్మేసుకుంటున్నారు. తవ్వకాలు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఈ కొండ కనుమరుగు అవుతుందని అక్కడి గిరిజనులు వాపోతున్నారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ప్రాంతం వంతాడ సమీపంలోని గిరిజనాపురంలో ఉన్న నాగుల కొండను చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇష్టానుసారం కొల్లగొడుతున్నారు. ముఖ్య నేత అండతో 2014–19 మధ్య కనీవినీ ఎరుగని స్థాయిలో లేటరైట్, బాక్సైట్ను తవ్వి రూ.వందల కోట్లు దోచుకున్నారు. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఈ అక్రమ తవ్వకాలను నిలిపివేసింది. 2024లో మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడంతో తవ్వకాలు మొదలై ఇప్పుడు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. లీజు పరిధిని మించి తవ్వకాలు ఒకే కుటుంబానికి చెందిన 8 మందికి ఉన్న ఎనిమిది లీజుల పరిధిలో 200 ఎకరాలతోపాటు పక్కనున్న కొండను కూడా ఇష్టం వచ్చినట్లు తొలచి వేస్తున్నారు. లీజు పరిధిని దాటి బయట ప్రాంతాల్లోనూ తవ్వకాలు చేస్తున్నారు. పక్కనే ఉన్న అటవీ భూములను కూడా తవ్వేసి.. ఆ గుంతల్లో మొక్కలు నాటుతున్నారు. లీజు పరిధిలో కూడా నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ లోతుకెళ్లి, పరిమాణానికి మించి మట్టి తవ్వేస్తున్నారు. వాస్తవానికి తవ్వకాలు జరుగుతున్న తీరును బట్టి నిర్దిష్ట పరిమాణానికి మించి ఎన్నో రెట్ల తవ్వకాలు జరుగుతున్నాయని గిరిజనులు వాపోతున్నారు.రోజుకు వెయ్యి ట్రిప్పులుప్రస్తుతం తవ్వకాలకు నాలుగు భారీ ఎక్సకవేటర్లు, లోడర్లను వినియోగిస్తున్నారు. అక్కడి నుంచి టిప్పర్లలో లేటరైట్ను సమీపంలోని రావికంపాడు, అరళ్ల«దార వద్ద ఏర్పాటు చేసిన యార్డులకు తరలిస్తున్నారు. ప్రతిరోజూ 50 టిప్పర్లను వినియోగిస్తూ.. ఒక్కో టిప్పర్ 20కి పైగా ట్రిప్పులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన నిత్యం వెయ్యి ట్రిప్పుల లేటరైట్ను తవ్వి తీస్తున్నారు. రావికంపాడు రైల్వే వ్యాగన్ ద్వారా లేటరైట్ను ఇతర ప్రాంతాల్లోని సిమెంటు ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారు. ఒక్కో టిప్పర్లో 30 టన్నుల లేటరైట్ మాత్రమే తీసుకెళ్లాల్సి ఉండగా, మరో 10 టన్నులు అదనంగా వేస్తున్నారు.ప్రస్తుతం మార్కెట్లో లేటరైట్ టన్ను ధర గ్రేడ్ను బట్టి రూ.800 నుంచి రూ.1,200 వరకూ ఉంది. ఈ లెక్కన ఒక్కో ట్రిప్కు రూ.35 వేల నుంచి రూ.45 వేల చొప్పున.. రోజులో మొత్తంగా రూ.3.5 కోట్ల విలువైన 35 వేల టన్నుల నుంచి 45 వేల టన్నుల లేటరైట్ను తవ్వుతున్నారు. మధ్యలో వర్షాలు, ఇతర అడ్డంకుల వల్ల తవ్వకం ఆగినా, మిగిలిన సమయాల్లో అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. తవ్వకం, రవాణా, ఇతర ఖర్చులన్నీ పోనూ 21 నెలలుగా ఇలా రూ.వెయ్యి కోట్లకుపైనే దోచేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం 4 క్రషర్లు కూడా వినియోగిస్తున్నారు.లింగంపర్తి అడవి కనుమరుగేనా!లేటరైట్ తవ్వకాలతో లింగంపర్తి రిజర్వు ఫారెస్టు రూపురేఖలే మారిపోయే పరిస్థితి ఏర్పడింది. అక్కడ పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతోంది. గతంలో పచ్చదనంతో కళకళలాడిన ఆ ప్రాంతం ఇప్పుడు ఎటు చూసినా ఎర్రమట్టి లోయగా మారిపోయింది. దుమ్ము, ధూళితో చెట్లు పెరిగే అవకాశం లేకుండా పోతోంది. తవ్వకాలతో భూగర్భ నీటిమట్టం కూడా తగ్గిపోతోందని స్థానికులు వాపోతున్నారు. మరోవైపు ఈ తవ్వకాలతో కొండపైన ఉన్న వంతాడ గిరిజన గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మైనింగ్ సమయంలో వారి రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నారు. స్థానికులకు ఉపాధి కూడా దొరకడం లేదు. తవ్వకాలతో ఈ కొండ రోజురోజుకూ తరిగిపోతున్న నేపథ్యంలో తాము ఎక్కడికెళ్లాలని కొండపై ఉంటున్న గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.ముఖ్య నేత అండదండలు ముఖ్య నేత అండదండలతోనే నాగుల కొండపై భారీ తవ్వకాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. లీజుదారుల కుటుంబంలోని కీలక వ్యక్తి చినబాబుకు అత్యంత సన్నిహితుడని సమాచారం. పైగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నేతలు లీజుదారులతో కుమ్మక్కై ఈ దోపిడీని నిరాఘాటంగా జరిపిస్తున్నారు. అందుకే అక్రమ తవ్వకాలు ఊహించని రీతిలో జరుగుతున్నా మైనింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. రిజర్వు ఫారెస్టును కొల్లగొడుతున్నా అటవీ శాఖ అక్కడ ఏమీ జరగనట్లే వ్యవహరిస్తోంది. -
అవినీతి ‘పుస్తకం’
సాక్షి, అమరావతి: రెడ్బుక్ పాలనలో విద్యార్థుల టెక్ట్స్బుక్ కాంట్రాక్టుల్లోనూ అవినీతి రాజ్యమేలుతోంది. ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం నూతన పుస్తకాలను లీక్ చేసిన ముద్రణ సంస్థకు చంద్రబాబు ప్రభుత్వం మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. రూ.70 కోట్ల విలువైన 1, 2, 7, 10 తరగతుల పుస్తకాల ముద్రణ కాంట్రాక్టును నామినేషన్పై కట్టబెట్టింది. ఆ ముద్రణ సంస్థ తప్పు చేసి అడ్డంగా దొరికిపోయినా ప్రభుత్వం మళ్లీ భారీ కాంట్రాక్టును అప్పగించడం సంచలనంగా మారింది. 2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్లో రెండో ఏడాదికి కొత్త సిలబస్ ప్రవేశపెట్టారు.నూతన సిలబస్ ఆధారంగా పాఠ్య పుస్తకాల(సేల్ బుక్స్) ముద్రణ కాంట్రాక్టును రూ.19 కోట్లకు వీజీఎస్, విక్రమ్ సంస్థలకు అప్పగించారు. ఈ సంస్థలకు కాంట్రాక్టు అప్పగించేందుకు ఏకంగా టెండర్ నిబంధనలనే మార్చేశారు. పనులు దక్కించుకున్న వీజీఎస్ కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించి పుస్తకాల పీడీఎఫ్ కాపీలను లీక్ చేసినట్లు అధికారులు గుర్తించారు.ఈ వ్యవహారంలో కార్పొరేట్ విద్యాసంస్థల నుంచి రూ.10 కోట్లు చేతులు మారినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో వీజీఎస్కు అప్పగించిన ముద్రణ కాంట్రాక్టును తెలుగు అకాడమీ రద్దు చేసింది. కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించిందని వీజీఎస్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా ఆ సంస్థపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు అదే సంస్థకు రూ.70 కోట్ల విలువైన పాఠశాల పాఠ్యపుస్తకాల ముద్రణను నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలు మార్చి... నామినేషన్పై పనులు అప్పగించిగతంలో ఎస్సీఈఆర్టీ సిలబస్ పుస్తకాల ముద్రణలోనూ వీజీఎస్ తప్పుడు మార్గాలను అనుసరించిందని బ్లాక్ లిస్టులో పెట్టారు. అటువంటి సంస్థకు ఏకంగా టెండర్ నిబంధనలనే మార్చేసి ఇంటర్మీడియెట్ పుస్తకాల ముద్రణ కాంట్రాక్టును అప్పగించారని, దీనివెనుక విద్యాశాఖ మంత్రి కార్యాలయంతోపాటు విద్యాశాఖలోని అత్యున్నతాధికారి పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయినా, వీజీఎస్ ఇంటర్ పుస్తకాల పీడీఎఫ్ను లీక్ చేసి అడ్డంగా దొరికిపోయింది. కానీ ఆ సంస్థపై ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా... రూ.70 కోట్ల విలువైన పాఠశాల పాఠ్య పుస్తకాల ముద్రణ కాంట్రాక్టును నామినేషన్పై కట్టబెట్టబెట్టడం గమనార్హం. వాస్తవానికి పాఠశాల పుస్తకాల ముద్రణ కాంట్రాక్టు కోసం గతంలో టెండర్లు పిలిచేవారు. గతేడాది నుంచి నామినేషన్ విధానంలో అప్పగిస్తున్నారు. -
మీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే దేశ ద్రోహమా?
సాక్షి, అమరావతి: ‘మీ ఉద్దేశంలో పరిపాలన అంటే ప్రశ్నించే గొంతుకలకు సంకెళ్లు వేయడమా..? మీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే అదేమైనా దేశ ద్రోహమా..? తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జర్నలిస్టులపై మీకెందుకు అంత కక్ష?’ అని సీఎం చంద్రబాబునాయుడును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. బీసీ వర్గానికి చెందిన సీనియర్ జర్నలిస్టుగా పని చేసిన పూడి శ్రీహరి చేసిన తప్పేంటి.. అతనిపై అక్రమ కేసులు పెట్టడం ఏంటి.. మరి మీరు పెడుతున్న పోస్టులకు ఎంత మందిని అరెస్టు చేయాలి? అంటూ ప్రశ్నించారు.తెలంగాణ సీనియర్ జర్నలిస్టు కేవీఆర్పై కూడా తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేయడం జంగిల్ రాజ్ కాదా అంటూ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. గత రెండేళ్లలో బాలికలు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే నిందితులపై చర్యలు తీసుకోని మీరు.. ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం వారిపై అక్రమ కేసులు పెట్టడటం ఎంత వరకు సబబు అంటూ ప్రశ్నించారు.ఇది మీరు ముఖ్యమంత్రిగా ఉంటూ చేస్తున్న రాజ్యాంగ ఉల్లంఘన కాదా అంటూ నిలదీశారు. ఇలాంటి ఘటనలకు మీరు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. దేవుడు, ప్రజలు మీకు బుద్ధి చెప్పేరోజు దగ్గర్లోనే ఉందని స్పష్టం చేస్తూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శనివారం పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే..పొలిటికల్ గవర్నెన్స్ ముసుగులో ఇన్ని అరాచకాలా? గడిచిన రెండేళ్లలో బాలికలు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే నిందితులపై చర్యలు తీసుకోని మీరు ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం వారిపై అక్రమ కేసులు పెట్టడం ఎంత వరకు సబబు? మీ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు చేసిన ఘటనలు ఎన్నో ఉన్నా వాళ్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? వ్యవస్థలను మీ స్వార్థ రాజకీయాలకు వాడుకోవడం సుపరిపాలనా? పౌరులకు రక్షణ కల్పించడం, వారు స్వేచ్ఛగా తమ జీవితాలను గడిపేలా చూడ్డం మీ బాధ్యత కాదా? అలాంటి బాధ్యతలను నిర్వర్తించడంలో మీరు విఫలం చెందడం, పైగా మీరే మీ కక్ష సాధింపుల కోసం శాంతి భద్రతలను దెబ్బతీసి అక్రమ కేసులు, అరెస్టులకు వెన్నుదన్నుగా నిలవడం దుర్మార్గం కాదా? మీరు ముఖ్యమంత్రిగా ఉండీ చేస్తున్న రాజ్యాంగ ఉల్లంఘన కాదా? పొలిటికల్ గవర్నెన్స్ ముసుగులో ఇన్ని అరాచకాలా? ఇలాంటి ఘటనలకు మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు. దేవుడు, ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది’ అని హెచ్చరించారు. వాస్తవాలు మాట్లాడితే అంత ఉలుకెందుకు?‘చంద్రబాబు గారూ.. మీ ఉద్దేశంలో పరిపాలన అంటే ప్రశ్నించే గొంతుకలకు సంకెళ్లు వేయడమా? ఆ గొంతుకలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయించడమా? మీ ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తే అదేమైనా దేశ ద్రోహమా? తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జర్నలిస్టులపై మీకెందుకు అంత కక్ష? వాళ్లు ఏమైనా మీరు చేయనిది చెప్పారా? మీరు చెప్పనిది చూపించారా? వాస్తవాలు మాట్లాడితే అంత ఉలుకెందుకు? బీసీ వర్గానికి చెందిన సీనియర్ జర్నలిస్టుగా పని చేసిన పూడి శ్రీహరి చేసిన తప్పేంటి? అతనిపై అక్రమ కేసు పెట్టడం ఏంటి? అతని ఇంట్లో సోదాలు చేయడం ఏంటి? అతనేమైనా ఉగ్రవాదా? టెర్రరిస్టా? మరి మీరు పెడుతున్న పోస్టులకు రోజూ ఎంత మందిని అరెస్ట్ చేయాలి? తెలంగాణ సీనియర్ జర్నలిస్టు కేవీఆర్పై కూడా తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురిచేయడం జంగిల్ రాజ్ కాదా? ఆయన ఇంట్లో లేని సమయంలో ఆయన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తూ ఇంట్లో తిష్ట వేయడం ఏంటి? ఇది రెడ్బుక్ పాలనకు నిదర్శనం కాదా? -
ఎన్పీఎస్పీఎల్కు నజరానా
సాక్షి, అమరావతి: ఏడాది క్రితం కోల్కతాలో ఏర్పాటైన ఎన్పీఎస్పీఎల్ కెమికల్స్కు పెట్టుబడిలో 75 శాతం రాయితీలతో పాటు చిత్తూరు జిల్లాలో 110 ఎకరాల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్పీఎస్పీఎల్ కెమికల్స్ రూ.2,250 కోట్ల పెట్టుబడితో బ్యాటరీల్లో వినియోగించే కాథోడ్ తయారీ యూనిట్ను చిత్తూరు జిల్లా గుడుపల్లె వద్ద ఏర్పాటు చేస్తోంది. వాస్తవ ధర ప్రకారం 110 ఎకరాలు కేటాయిస్తూ ఏపీ ఎల్రక్టానిక్స్ కొంపొనెంట్స్ మాన్యుఫాక్చరింగ్ పాలసీ 2025–30 ప్రకారంభారీ ప్రోత్సాహకాలను ఇచ్చింది. పెట్టుబడిలో 60 శాతం క్యాపిటల్ ఇన్సెంటివ్తో పాటు పదేళ్ల పాటు 100 శాతం ఎలక్ట్రిసిటీ డ్యూటీ, పదేళ్లపాటు యూనిట్కు రూ.2 చొప్పున విద్యుత్ సబ్సిడీ ఇలా అన్ని సబ్సిడీలు కలిసి పెట్టుబడిలో 75 శాతం ప్రోత్సాహకాల రూపంలో తిరిగి ఇవ్వనున్నారు. అలాగే సెమీకండక్టర్స్ రంగంలోకి కొత్తగా ప్రవేశించిన ఆర్ఆర్పీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కు 75 శాతం సబ్సిడీ ధరలతో 60 ఎకరాలను కేటాయిస్తూ ఉత్తర్వులను ఇచ్చింది. శ్రీ సత్యసాయి జిల్లా టేకులోడు వద్ద లో రూ.10,239.78 కోట్లతో సెమీకండక్టర్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనుంది. తొలి దశలో 30 ఎకరాలను కేటయించి మలిదశలో మరో 30 ఎకరాలు కేటాయించడానికి భూములను రిజర్వ్ చేసిన ఉంచనున్నట్లు ఆ ఉత్తర్కులోపేర్కొన్నారు. వీటితో పాటు 30 శాతం క్యాపిటల్ సబ్సిడీ, 10 ఏళ్లపాటు 100 శాతం ఎలక్ట్రిసిటీ డ్యూటీ మినహాయింపు వంటి అనేక ప్రోత్సాహకాలను విడుదల చేసింది. విశాఖపట్నం మధురవాడలో ఎకరం రూ.1.5 కోట్లు చొప్పున 3.5 ఎకరాలు ఐస్ప్రౌంట్ డెవల్పర్స్కు కేటాయిస్తూ ఉత్తుర్వులను జారీ చేసింది. ఇందులో 50 శాతం భూమిని ఇతర వాణిజ్య అవసరాలకు వినియోగించుకోవడానికి అనుమతించింది. మరో రియల్ ఎస్టేట్ సంస్థ క్రెడెన్స్ రియాల్టీ విశాఖలో అభివృద్ధి చేయనున్న ఐటీ క్యాంపస్కు వీఎంఆర్డీఏ మౌలికవసతులు కల్పించాల్సిందిగా ఉత్తర్వులో పేర్కొన్నారు. ఫ్యూజీ సాఫ్ట్వేర్సొల్యూషన్స్ సంస్థ విశాఖ కాపులుప్పాడ ఐటీ హబ్లో ఎకరం రూ.4 కోట్లు చొప్పున రెండు ఎకరాలను కేటాయిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. శ్రీసిటీలో పీటీ టెక్నొప్లాస్ట్ ఏర్పాటు చేయనున్న వాషింగ్మెïÙన్లు, ఎయిర్ కండీషన్ల తయారీ యూనిట్కు పలురాయితీలను ప్రకటించింది. అదానీ డేటా సెంటర్, కే.రహేజా ఐటీ పార్కులతో పాటు పలు కంపెనీలకు గతంలో ఇచ్చిన ప్రోత్సాహకాలను సవరిస్తూ పలు జీవోలను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. -
యూపీఐ చెల్లింపుల్లో బురిడీ
సాక్షి, అమరావతి: టెక్నాలజీ ఎంత వృద్ధి చెందినా... కేటుగాళ్లకు మాత్రం చెక్ పడడం లేదు. వారి క్రిమినల్ మైండ్తో ప్రతిరంగంలోనూ అక్రమాలకు పాల్ప డుతూ సవాల్ విసురుతున్నారు. ఆ సెగ ఇప్పుడు యూపీఐ చెల్లింపులకు కూడా తాకింది. డిజిటల్ చెల్లింపుల్లో జెల్ల కొడుతున్నారు. ఐదేళ్లలో ఏకంగా రూ.3,889.37కోట్ల మేర మోసం జరిగినట్టు కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాలు వెల్లడించడం విస్తుగొలుపుతోంది. దేశంలోయూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ)మోసాలు పెరిగాయి. దేశంలో డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్న తరుణంలో డిజిటల్ చెల్లింపుల్లో మోసాలు కూడా పెరిగినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఐదేళ్లలో యూపీఐ చెల్లింపుల పేరిట దేశంలో 53.67 లక్షల లావాదేవీలు జరిగినట్లు వెల్లడించింది. ఈ సంఘటనల్లో రూ.3,889.37 కోట్ల మేర నగదు మోసానికి గురైనట్లు పేర్కొంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 16.29 లక్షల తప్పుడు లావాదేవీలతో రూ.1,226.37 కోట్ల నగదు మోసానికి గురైంది. మోసాల కట్టడికి చర్యలు డిజిటల్ చెల్లింపుల్లో మోసాలను కట్టడి చేయడానికి ఏఐ–ఎంఎల్ ఆధారిత నమూనాలను వినియోగించి హెచ్చరికలు జారీ చేయడంతో పాటు లావాదేవీలను తిరస్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఆరి్థక మంత్రిత్వ శాఖ తెలిపింది. మోసపూరిత ఖాతాలను ట్రాక్ చేయడానికి, బ్యాంకులు చర్యలు తీసుకోవడానికి వీలుగా అన్ని బ్యాంకులకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్రాడ్ మానిటరింగ్ సొల్యూషన్లను అందిస్తున్నట్లు తెలిపింది. ఐదేళ్లలో యూపీఐలో దేశీయంగా జరిగిన మోసాల సంఘటనలు ఇలా.. -
లేని నీళ్లతో కనికట్టు
సాక్షి, అమరావతి: కృష్ణానదీ జలాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు చేపట్టిన పలు ప్రాజెక్టులపై కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) తీవ్ర అభ్యంతరాలను లేవనెత్తింది. నికర జలాలతో పాటు మిగులు జలాల కేటాయింపుపై కృష్ణానదీ జలాల వివాదాల ట్రిబ్యునల్–2 (కేడబ్ల్యూడీటీ–2) విచారణ ఒకపక్క కొనసాగుతుంటే, మరోపక్క ‘ట్రిబ్యునల్ ఇంకా కేటాయించని జలాలను ఆధారంగా చేసుకుని’ రెండు రాష్ట్రాలు కొత్త ప్రాజెక్టులను అడ్డగోలుగా నిర్మిస్తున్నాయని, అలాగే ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతున్నాయని బోర్డ్ పేర్కొంది. ఇలాంటి ప్రాజెక్టులకు భవిష్యత్తులో అంతర్రాష్ట్ర అనుమతులు, పెట్టుబడి అనుమతులు తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. నీటి లభ్యతతో పాటు అంతర్రాష్ట్ర పర్యవసానాలపై నెలకొన్న అనిశ్చితి కారణంగా ఇలాంటి ప్రాజెక్టులకి అనుమతుల జారీ విషయాన్ని పరిశీలించడం సైతం భవిష్యత్తులో సాధ్యం కాదని తేల్చిచెప్పింది. ఇలాంటి అనుమతి లేని ప్రాజెక్టులకు అనుమతుల జారీ విషయంలో మార్గనిర్దేశం చేయాలని కేంద్ర జలసంఘాని (సీడబ్ల్యూసీ)కి విజ్ఞప్తి చేసింది. అలాగే ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులు ఏ మేరకు విస్తరించాలో నిర్థారించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇందుకు గాను ఆయా ప్రాజెక్టులకు గతంలో టీఏసీ (సాంకేతిక సలహా కమిటీ) అనుమతులను ఏ మేరకు జారీ చేశారన్న వివరాలను తమకు అందజేయాలని కోరింది. ‘కేడబ్ల్యూడీటీ–2 కేటాయింపులు జరిపే వరకు మిగులు జలాల నిర్థారణపై అనిశ్చితి కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్ కేటాయింపులు జరిపేవరకు కొత్త ప్రాజెక్టులకు ప్రణాళికల తయారీ, వాటికి అనుమతుల జారీ సరైంది కాదు’ అని స్పష్టం చేసింది. ఈ మేరకు కృష్ణాబోర్డు శుక్రవారం సీడబ్ల్యూసీలోని ప్రాజెక్టుల మధింపు విభాగం చీఫ్ ఇంజినీర్కు లేఖ రాసింది. లేఖలో ప్రధానాంశాలు... » ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 85(8)(డీ) ప్రకారం 2014, జూన్ 2కి ముందు నిర్మాణం పూర్తైన, నిర్మాణం ప్రారంభించిన ప్రాజెక్టుల నీటి లభ్యతపై కొత్త ప్రాజెక్టు ఎలాంటి దుష్ప్రభావం చూపకూడదు. » కేంద్రం 2021 జూలై 15న జారీ చేసిన గజిట్ నోటిఫికేషన్లోని పెరా 2(ఎఫ్), 2(జీ) ప్రకారం .. నిర్మాణంలోని అనుమతి లేని ప్రాజెక్టులతో పాటు విస్తరణకు లోనైన ప్రాజెక్టులకి నిర్దేశిత గడువుల్లోగా అనుమతులు తీసుకోవాల్సి ఉంది. లేనిపక్షంలో వాటి వినియోగాన్ని నిలుపుదల చేయాలి. » అయితే ఈ నోటిఫికేషన్ను సవాలు చేస్తూ వేసిన కేసు న్యాయస్థానం పరిధిలో ఉండడంతో అనుమతి లేని ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితిలో కృష్ణా బోర్డు లేదు. » కచ్చితమైన నీటి కేటాయింపులు లేని ప్రాజెక్టులను నీటి వినియోగం కోసం ఏదైనా నియంత్రణ వ్యవస్థ పరిధిలోకి తీసుకురావడం సాధ్యం కాదు. » ఇరు రాష్ట్రాల్లో ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులు విస్తరణకు లోనైనట్టు బోర్డు పరిశీలనకు వచ్చింది. ఆయా ప్రాజెక్టులకు గతంలో సీడబ్ల్యూసీలోని టీఏసీ జారీ చేసిన అనుమతులకు విరుద్ధంగా వాటిపై అదనపు ఎత్తిపోతల పథకాలను నిరి్మంచడం, కాల్వల సామర్థ్యం పెంచడం, ఆయకట్టు సామర్థ్యం పెంచడం, ఒక పరీవాహక ప్రాంతం నుంచి మరో పరీవాహక ప్రాంతానికి నీళ్ల తరలించడం వంటి చర్యలు తీసుకున్నారు. దీంతో ఈ ప్రాజెక్టులకు మళ్లీఅనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. » కొత్త ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతో పాటు టీఏసీ అనుమతులకు విరుద్ధంగా ఇలా విస్తరణకు గురైన ప్రాజెక్టులను సైతం అనుమతులు లేని ప్రాజెక్టులుగా పరిగణించాల్సి ఉంటుంది. -
‘రేవంత్తో టీడీపీ ఎంపీల భేటీ ఆంతర్యం ఏమిటి?’
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బంధాలు, అనుబంధాలు అందరికీ తెలిసినవే అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు పగలు బీజేపీతో.. సాయంత్రం కాంగ్రెస్తో దోస్తీ చేస్తూ ఉంటారని ఎద్దేవా చేశారు. ఇలాంటి ద్వంద్వ వైఖరి వలన రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. ఈ రోజు(శనివారం, ఏప్రిల్ 18వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన లేళ్ల అప్పిరెడ్డి.. చంద్రబాబు తన రాజకీయాలతో తీవ్ర అప్రతిష్టను తెచ్చారని విమర్శించారు. టీడీపీ ఎంపీలు రేవంత్రెడ్డిని కలవడానికి కారణం ఏంటని ఆయన ప్రశ్నించారు. మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్తో టీడీపీ ఎంపీలు కలవడానికి కారణం ఏంటని నిలదీశారు. చంద్రబాబుకు, రేవంత్కు ఉన్న లోపాయికారీ ఒప్పందం ఏంటో ప్రజలకు చెప్పాలన్నారు.‘టీడీపీ మహిళా నేతలు కాంగ్రెస్ నేతలను ఎందుకు కలిశారు?, రేవంత్ రెడ్డితో కలిసి టీడీపీ ఎంపీలు ఎందుకు ఫోటోలు తీసుకున్నారు. బీజేపీ ఎంపీ వర్మ రేవంత్ కి బ్రేక్ ఫాస్ట్ ఇవ్వటం ఏంటి? టీడీపీ నేతలు కూడా వెళ్లటం ఏంటి?, అసలు ఏం రాజకీయాలు చేస్తున్నారు?మీ లోపాయికారి ఒప్పందాలు ఏంటో బయట పెట్టాలి. రాష్ట్ర ప్రయోజనాలకు ఎందుకు విఘాతం కలిగిస్తున్నారు?, చంద్రబాబు బీజేపీతో పొత్తులో ఉంటూ కాంగ్రెస్తో బంధాన్ని కొనసాగిస్తున్నారు. యువత, విద్యార్థులకు ఏం మెసేజ్ ఇస్తున్నారు?, అసలు వెన్నుపోటు రాజకీయాలు చేసేదే చంద్రబాబు’ అంటూ ధ్వజమెత్తారు. పార్లమెంట్లో మహిళా బిల్లు వీగిపోవడాన్ని తమ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందని, దీనికి కారకులను మహిళా లోకం కచ్చితంగా శిక్షిస్తుందన్నారు. -
‘చంద్రబాబు టెన్షన్ అదే’
సాక్షి, తాడేపల్లి: మావిగన్ ప్రతిపాదనతో చంద్రబాబు ప్రభుత్వంలో భయం మొదలైందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు బయట పడుతున్నాయని టెన్షన్ పడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు. జర్నలిస్టులు, న్యాయవాదులపై కూడా వేధింపులు పెరిగాయి’’ అని మనోహర్రెడ్డి మండిపడ్డారు.‘‘కోర్టులు ఎన్నిసార్లు హెచ్చరించినా పోలీసుల్లో మార్పు రావటం లేదు. ఈ అరాచకాలపై జనమే తిరగపడే రోజు వస్తోంది. పూడి శ్రీహరి, తెలంగాణ జర్నలిస్టు కేవిఆర్పై వేధింపులు అన్యాయం. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై గంటల తరపడి దాడులు జరిగినప్పుడు ఈ పోలీసులు ఏం అయ్యారు?. పోలీసుల సమక్షంలోనే దాడులు జరిగినా ఎందుకు నిలువరింవలేదు. సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులను ఆపాలి. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తున్నారు’’ అంటూ మనోహర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘మహాటీవీ వంశీ వ్యాఖ్యలపై వీడియో చేశాడని తెలంగాణ జర్నలిస్టు కేవిఆర్పై అక్రమ కేసు పెట్టారు. ఏపీ పోలీసులు అతన్ని తీవ్రంగా వేధించారు. ఇప్పుడు మళ్ళీ విజయనగరంలో కేసు పెట్టించి వేధించారు. తెలంగాణ జర్నలిస్టులు నిలదీస్తే ఏపీ పోలీసులు నీళ్లు నమిలారు. నారా లోకేష్ పదేపదే రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. ఆ రెడ్ బుక్ గురించి మాట్లాడినందుకు కేవిఆర్పై కేసు పెడతారా?. సవీంద్ర కేసులో సీబీఐ రంగంలోకి దిగి విచారణ జరిపింది. ఇలా అనేక కేసుల్లో కోర్టులు తీవ్రంగా స్పందించినా పోలీసుల్లో మార్పు రాలేదు..పూడి శ్రీహరి జర్నలిస్టు జీవితంలో ఎప్పుడూ ఎక్కడా కేసుల్లేవు. కానీ మొదటిసారి చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టింది. జగన్కు సన్నిహితుడనే కారణంతోనే అరెస్టు చేశారు. టీడీపీ అధికార పేజీల్లో వైఎస్సార్ సీపీపై పెడుతున్న అడ్డగోలుగా పోస్టులపై ఎందుకు కేసులు పెట్టటం లేదు?. 2 వందలకు పైగా ఫిర్యాదులు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఏబీఎన్ రాధాకృష్ణ మీద 62 చోట్ల ఫిర్యాదులు ఇచ్చినా ఎందుకు కేసు నమోదు చేయలేదు?. పైగా నిరసన తెలిపిన మా పార్టీ నేతలపై అక్రమ కేసు పెట్టారు. వైఎస్ జగన్ తెచ్చిన మావిగన్ ప్రతిపాదన జనంలోకి బాగా వెళ్లింది. దీంతో డైవర్షన్ కోసం మంత్రులతో బూతులు తిట్టిస్తున్నారు. ప్రభుత్వం, పోలీసులు తమ వైఖరి మార్చుకోవాలి’’ అని మనోహర్రెడ్డి హెచ్చరించారు. -
విజయవాడ మీదుగా వేసవి ప్రత్యేక రైళ్లు
సాక్షి, విజయవాడ: వేసవిలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్ఓ నుస్రత్ మండ్రుప్కర్ ఒక ప్రటకలో తెలిపారు. ఎస్ఎంవీటీ బెంగళూరు–బాలుర్ఘాట్ (06551) ఈ నెల 17, 24 తేదీలలో శుక్రవారం ఉదయం 8.50 గంటలకు ఎస్ఎంటీవీ బెంగళూరులో బయలుదేరి, ఆదివారం ఉదయం 6 గంటలకు బాలుర్ఘాట్ చేరుకుంటుంది.తిరుగు ప్రయాణంలో ఈ రైలు (06552) ఈ నెల 20, 27 తేదీలలో మంగళవారం ఉదయం 5.10 గంటలకు బాలుర్ఘాట్లో బయలుదేరి, బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు ఎస్ఎంవీటీ బెంగళూరు చేరుకుంటుంది. రెండు మార్గాలలో ఈ రైళ్లు కృష్ణార్జునపురం, బంగారుపేట్, కుప్పం, జోలార్పెట్టాయ్, కాట్పాడి, రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళంరోడ్డు, పలాస, బ్రహ్మపురం తదితర స్టేషన్లలో ఆగుతుంది. చర్లపల్లి–సంత్రగచ్చి (07677) ప్రత్యేక రైలు ఈ నెల 21న మంగళవారం ఉదయం 10.30 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, మరుసటిరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు సంత్రగచ్చి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సంత్రగచ్చి–హైదరాబాద్ (07678) ప్రత్యేక రైలు ఈ నెల 22న బుధవారం సాయంత్రం 4.45 గంటలకు సంత్రగచ్చిలో బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 11 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.రెండు మార్గాలలో ఈ రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, యలమంచిలి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, బ్రహ్మపూర్, ఖుర్ధారోడ్డు, భువనేశ్వర్, కటాక్ తదితర స్టేషన్లలో ఆగుతుంది. కాకినాడ టౌన్–హిసార్ (07717) ప్రత్యేక రైలు ఈ నెల 21న మంగళవారం ఉదయం 5.40 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరి, గురువారం మధ్యాహ్నం 1.40 గంటలకు హిసార్ చేరుకుంటుంది. ఈ రైలు సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి, మెడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర్, ధర్మబాద్ తదితర స్టేషన్లలో ఆగుతుంది. -
సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ భవనాల్లో ఎంఈపీ పనులకు టెండర్లు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో నేలపాడు సమీపంలో నిర్మిస్తున్న శాశ్వత సచివాలయం టవర్లలో ఎంఈపీ(మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్) పనులకు మూడు ప్యాకేజీల కింద అమరావతి గ్రోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏజీఐసీఎల్) టెండర్లు పిలిచింది. బీ+జీ+39 అంతస్తులతో నిరి్మస్తున్న 1, 2 టవర్లలో ఎంఈపీ పనుల కాంట్రాక్టు విలువను రూ.743.02 కోట్లు.. 2, 3 టవర్లలో ఎంఈపీ పనుల కాంట్రాక్టు విలువను రూ.681.47 కోట్లు, ముఖ్యమంత్రి కార్యాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం బీ+జీ+49 అంతస్తులతో నిరి్మస్తున్న జీఏడీ టవర్లో ఎంఈపీ పనుల కాంట్రాక్టు విలువను రూ.431.59 కోట్లుగా నిర్ణయించింది. ఇక ఏడు అంతస్తుల(బీ+జీ+7)తో నిర్మిస్తున్న హైకోర్టు భవనం ఎంఈపీ పనుల కాంట్రాక్టు విలువను రూ.365.15 కోట్లు.. మూడు అంతస్తులతో(బీ+జీ+3) నిర్మిస్తున్న అసెంబ్లీ భవనం ఎంఈపీ పనుల కాంట్రాక్టు విలువను రూ.244.26 కోట్లుగా నిర్ణయించింది. విద్యుత్ సౌకర్యం, లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, శానిటరీ పనుల కోసం ఈ టెండర్లు పిలిచింది. బిడ్ల దాఖలుకు మే 5ను తుది గడువుగా నిర్ణయించింది. మే 11న ఆర్థిక బిడ్ తెరిచి.. ఎల్–1గా నిలిచిన కాంట్రాక్టర్కు మే 18న పనులు అప్పగించేలా షెడ్యూలు రూపొందించింది. జాయింట్ వెంచర్లు(ఒకరు కంటే ఎక్కువ కాంట్రాక్టు సంస్థలు సంయుక్తంగా) టెండర్లలో బిడ్ల దాఖలుకు అర్హత లేదని నిబంధన పెట్టింది. దీన్ని బట్టి చూస్తే.. ఈ పనులను ఎవరికి అప్పగించాలన్నది ఇప్పటికే ఖరారైందని.. టెండర్లు నామమాత్రమేనని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
డిగ్రీ అధ్యాపకుల బదిలీలపై కాలయాపన!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోని అధ్యాపకుల బదిలీలపై గందరగోళం నెలకొంది. న్యాయబద్ధంగా, అధ్యాపకుల హక్కుగా చేపట్టాల్సిన ఈ ప్రక్రియను ప్రభుత్వం కుట్రలతో మోకాలడ్డుతోంది. గతేడాది అన్ని ప్రభుత్వ శాఖల్లో సాధారణ బదిలీలు చేసిన ప్రభుత్వం కళాశాల విద్యాశాఖను నిర్లక్ష్యం చేసింది. దీనికి ప్రభుత్వంలో విలీనమైన ఎయిడెడ్ అధ్యాపకులకు సర్వీసు రూల్స్ లేవనే నెపంతో అప్పట్లో బదిలీలకు మంగళం పాడేసింది. ఇలా ఏడాదిపాటు కాలయాపన చేసిన చంద్రబాబు సర్కారు రూల్స్ను రూపొందించడంలో ఘోరంగా విఫలమైంది. ఫలితంగా వేలాది మంది అధ్యాపకుల బదిలీలకు బ్రేకులుపడ్డాయి. ఎయిడెడ్ అధ్యాపకులపై నిర్లక్ష్యం... రాష్ట్రంలోని 170కి పైగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నాలుగు వేలకుపైగా శాంక్షన్డ్ పోస్టులుంటే 50 శాతం పోస్టులు నాన్ రెగ్యులర్ అధ్యాపకులతోనే నడుస్తున్నాయి. మొత్తం డిగ్రీ కళాశాలల్లో 1,900 మంది వరకు రెగ్యులర్ అధ్యాపకులు పనిచేస్తున్నారు. ఇందులో ఎయిడెడ్ నుంచి ప్రభుత్వంలోకి విలీనమైన వారు 600 మందికిపైగా ఉన్నారు. వీరితో పాటు కాంట్రాక్టు పద్ధతిలో మరో 600 మంది, అతిథి అధ్యాపకులు మరో వెయ్యి మందితో బోధన సాగిస్తున్నారు. గతంలో చాలా ఎయిడెడ్ కళాశాలలు ప్రభుత్వంలో విలీనం అయ్యాయి. ఆ తర్వాత వాటికి తిరిగి వెనక్కి వెళ్లే అవకాశం కల్పించినప్పుడు కళాశాలలు మాత్రమే ఎయిడెడ్కు వెళ్లగా, వాటిల్లోని చాలామంది అధ్యాపకులు ప్రభుత్వంలోనే కొనసాగించాలని కోర్టు స్టే తెచ్చుకున్నారు. అయితే, వీరిని బదిలీల్లోకి తీసుకొస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయి. సుమారు 200 మందికి మాత్రమే పూర్తిస్థాయి కళాశాలలతో పాటు పోస్టులు విలీనమై పనిచేస్తున్నారు. ఇలా ఎయిడెడ్ నుంచి వచ్చిన అధ్యాపకులకు సర్వీసు రూల్స్ను రూపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. తొలుత ‘జీరో’ సర్వీసు ఇస్తామని ప్రకటించినా స్పష్టమైన ఉత్తర్వులు మాత్రం వెలువడలేదు. ఇప్పుడు సర్వీసు రూల్స్ దస్త్రం ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉన్నా దానిని కావాలనే చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందనే ఆరోపణలున్నాయి. మెడికల్ గ్రౌండ్ బదిలీలూ లేనట్లేనా? 2021లో రిక్రూట్ అయిన అధ్యాపకులు చాలామంది కుటుంబాలకు దూరంగా, సుదూర ప్రాంతాల్లో సేవలందిస్తున్నారు. దీనితోపాటు గత కొన్నేళ్లుగా ఒకేచోట సర్వీసులో ఉంటూ కుటుంబ అవసరాలు, పిల్లల భవిష్యత్తు దృష్ట్యా చాలామంది బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు. కానీ, కేవలం ఎయిడెడ్ నుంచి వచి్చన అధ్యాపకులకు సర్వీసు రూల్స్ లేవని, అందుకు బదిలీలు చేపట్టలేదని ప్రకటించడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని బట్టబయలు చేసింది. దీంతోపాటు ఏటా సాధారణంగా స్పౌజ్, మెడికల్ గ్రౌండ్స్లో బదిలీలకు అధ్యాపకులు దరఖాస్తు చేసుకుంటారు. వాటిని పరిశీలించి ప్రభుత్వం బదిలీలు చేస్తుంది. రెండేళ్లుగా ఈ విధానాన్ని సైతం తుంగలో తొక్కి అధ్యాపకులను తీవ్రంగా వేధిస్తోంది. గత ఏడాది ఉద్యమానికి సిద్ధమైన డిగ్రీ అధ్యాపకులకు బదిలీలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గి తీవ్రంగా మోసపోయారు. ఈ ఏడాది బదిలీలు చేయాలని ఇప్పటికే ప్రభుత్వానికి వినతిపత్రాలు అందిస్తున్నారు. -
సజ్జల భార్గవ్రెడ్డిపై ఎల్ఓసీ రద్దు చేయండి
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా పూర్వ ఇన్చార్జి సజ్జల భార్గవ్రెడ్డిపై జారీ చేసిన లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ)ను రద్దు చేయాలని హైకోర్టు శుక్రవారం ఇమ్మిగ్రేషన్ అధికారులను ఆదేశించింది. అన్నమయ్య జిల్లా ఎస్పీ నుంచి సమాచారం అందిన వెంటనే ఎల్ఓసీ రద్దు చేయాలని స్పష్టం చేసింది. విదేశాలకు ప్రయాణించే హక్కు భారత రాజ్యాంగంలోని అధికరణ 21 కింద జీవించే, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులో అంతర్భాగమని స్పష్టం చేసింది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న, అనిశ్చితంగా ఉన్న కేసుల దర్యాప్తు పేరుతో భార్గవ్రెడ్డి హక్కులను హరించడం సమంజసం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ శుక్రవారం తీర్పు వెలువరించారు. సీఐడీ అదనపు డీజీ, పలు జిల్లాల ఎస్పీల ప్రోద్బలంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు జారీ చేసిన ఎల్ఓసీని చట్ట విరుద్ధంగా ప్రకటించి రద్దు చేయాలని కోరుతూ భార్గవ్రెడ్డి గత నెలలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్పై ఇరువర్గాల వాదనల అనంతరం న్యాయమూర్తి తీర్పుఇచ్చారు. దర్యాప్తు నుంచి తప్పించుకోవడానికి భార్గవ్రెడ్డి ప్రయత్నించలేదు ‘సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ సెక్షన్ 35(3) నోటీసులిచ్చి, చట్ట ప్రకారం నడుచుకోవాలని 2025 మే 7న హైకోర్టు పోలీసులను ఆదేశించింది. అయితే పోలీసులు ఈ రోజు వరకు భార్గవ్రెడ్డికి నోటీసులు ఇవ్వలేదు. రికార్డులో ఉన్న సమాచారాన్ని పరిశీలిస్తే పిటిషనర్ భార్గవ్రెడ్డి దర్యాప్తు నుంచి తప్పించుకోవడానికి గానీ, కోర్టు పరిధి నుండి పారిపోవడానికి ప్రయత్నం చేసినట్లు కనిపించడం లేదు. అందువల్ల, భార్గవ్రెడ్డి చట్టపరమైన ప్రక్రియల్లో పాల్గొనలేదని, దర్యాప్తునకు సహకరించడం లేదని పోలీసులు వాదించడం సమంజసం కాదు. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు భార్గవ్రెడ్డికి సెక్షన్ 35 (3) కింద నోటీసులు అందచేయాలి. దర్యాప్తునకు సహకరిస్తానని, ఎప్పుడు పిలిస్తే అప్పుడు దర్యాప్తు అధికారి ముందు హాజరవుతానని పేర్కొంటూ భార్గవ్రెడ్డి డీజీపీ, అన్నమయ్య జిల్లా ఎస్పీ ముందు అఫిడవిట్లు దాఖలు చేయాలి. అనంతరం భార్గవ్రెడ్డిపై జారీ చేసిన ఎల్ఓసీ ఉపసంహరణకు జిల్లా ఎస్పీ చర్యలు తీసుకోవాలి.’ అని హైకోర్టు ఆదేశించింది. ఇతరుల ప్రతిష్టను, గౌరవాన్ని దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదుభారత రాజ్యాంగంలోని అధికరణ 19(1) కింద ఉన్న భావవ్యక్తీకరణ స్వేచ్ఛ సంపూర్ణమైనది కాదు. ఇది కొన్ని పరిమితులకు లోబడి ఉంటుంది. గౌరవం, నైతికత, పరువు నష్టం, నేర ప్రేరేపణ వంటి అంశాల ఆధారంగా పరిమితులు ఉంటాయి. సోషల్ మీడియాలో తప్పుడు, అసభ్య కంటెంట్ వ్యక్తులకు, సమాజానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఈ విధమైన కంటెంట్ ప్రముఖులు, రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులు లేదా సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకున్నప్పుడు, అది వారి ప్రతిష్టను దెబ్బతీస్తుంది, గోప్యతకు భంగం కలిగిస్తుంది. భావోద్వేగ పరమైన బాధను కలిగిస్తుంది. ఇతరుల ప్రతిష్టను, గౌరవాన్ని దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదు. ఎవరైనా వ్యక్తి ఏ విషయంపైనైనా, ప్రభుత్వ విధానాలపైనైనా తన అభిప్రాయాన్ని, అసమ్మతిని వ్యక్తం చేయవచ్చు. అయితే, ఆ అభిప్రాయం మర్యాదపూర్వకంగా వ్యక్తం చేయాలి. దర్యాప్తు సంస్థలు చట్టపరమైన విధి విధానాలను కచ్చితంగా అనుసరిస్తూ, సమగ్రంగా, వేగంగా దర్యాప్తు జరపాలి. సేకరించిన సాక్ష్యాల ఆధారంగా నేరస్థులపై అభియోగాలు నమోదు చేసి చట్టం నిర్దేశించిన గడువులోపు చార్జ్షీట్ దాఖలు చేసి వారిని కోర్టు ముందు హాజరుపరచాలి. సోషల్ మీడియాలో తప్పుడు, అసభ్య పోస్టులు పెట్టే వారు ఎవరైనా సరే లేదా ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా సరే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. చట్టం అందరికంటే గొప్పది.. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరన్న స్పష్టమైన సందేశాన్ని పంపాలి. – సోషల్ మీడియాలో పోస్ట్లపై హైకోర్టు -
డబ్బుల్లేవ్.. ఏ పంటా కొనలేం
సాక్షి, అమరావతి: మొక్కజొన్నే కాదు... ఏ పంటనూ మేము కొనలేమని, రైతులను ఏ విధంగానూ ఆదుకోలేమని, డబ్బుల్లేవని రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. కేంద్రం ఆర్థిక చేయూత ఇస్తే తప్ప మొక్కజొన్న కాదు కదా.. మరే ఇతర పంట ఉత్పత్తులను కొనుగోలు చేయలేమని తేల్చి చెప్పింది. రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కింజరాపు ఆచ్చెన్నాయుడు రైతు సంఘాల నేతల వద్ద ఈ విషయం చెప్పారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ రైతు, కౌలురైతుల సంఘాలు శుక్రవారం మంత్రి అచ్చెన్న క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. తొలుత రైతు సంఘాల కార్యాలయం నుంచి మంత్రి అచ్చెన్న క్యాంప్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. సుమారు గంటకు పైగా జరిగిన ఆందోళనలో పెద్ద ఎత్తున మొక్కజొన్న రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి అచ్చెన్నను కలిసి వినతిపత్రం ఇచ్చారు. మొక్కజొన్న కనీస మద్దతు ధర రూ.2400 కాగా, మార్కెట్లో రూ.1400–1600 మించి కొనుగోలు చేయడం లేదని, దళారుల దోపిడీ కారణంగా ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శనగ, జొన్న, కంది తదితర రైతులదీ ఇదే పరిస్థితని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. మొక్కజొన్న కొనుగోలు చేసేందుకు అవసరమైన నిధులు రాష్ట్ర ప్రభుత్వం వద్ద లేవన్నారు. కేంద్రం నుంచి నిధులొస్తే కొనుగోలు చేస్తామన్నారు. రైతు సంఘ నాయకులు జోక్యం చేసుకుని పొరుగనున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నప్పుడు కేంద్రంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయలేకపోతోందని నిలదీశారు. కేంద్రం నిధులతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి తక్షణమే కొనుగోలు చేయాలన్నారు. దీనిపై మంత్రి అచ్చెన్న బదులిస్తూ రాష్ట్రంలో ఈఏడాది మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరిగిందని, ఆమేరకు పెరిగిన దిగుబడులను కొనుగోలు చేయాలంటే కనీసం రూ.5 వేల కోట్లు కావాలని, ఆ స్థాయిలో నిధులు ప్రభుత్వం వద్ద ఎక్కడనున్నాయంటూ ఎదురు ప్రశ్న వేశారు. ధరల స్థిరీకరణ నిధి కింద బడ్జెట్లో జరిపిన కేటాయింపుల నుంచి ఖర్చు చేయాలని రైతు నాయకులు కోరగా, కుదరదని తేల్చి చెప్పారు. మొక్కజొన్న ఒక్కటే కాదు.. మరే ఇతర పంట ఉత్పత్తులను కూడా కేంద్రం ఆర్థిక చేయూత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో కొనుగోలు చేసే పరిస్థితిలో లేదని మంత్రి స్పష్టం చేశారు. అయినా సీఎంతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని ముక్తసరిగా మంత్రి చెప్పుకొచ్చారు.రైతులను ఆదుకోలేని ప్రభుత్వం ఉండీ ఉపయోగమేంటి? అనంతరం మీడియాతో రైతు సంఘ నేతలు మాట్లాడుతూ రైతులు ఓ వైపు సంక్షోభంలో కూరుకుపోతుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇలా చేతులెత్తేయడం దారుణమన్నారు. రైతులను ఆదుకోలేని ప్రభుత్వం ఉండీ ఉపయోగమేంటని ప్రశ్నించారు. ఆందోళనలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె. ప్రభాకరరెడ్డి, సీనియర్ నాయకులు వై. కేశవరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.వి. ఆంజనేయులు, ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై. రాధాకృష్ణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. హరిబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. బలరాం, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు వల్లూరు భారతి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకురాలు భీమిరెడ్డి కోటేశ్వరి, వివిధ జిల్లాల సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.హైవేపై మొక్కజొన్న రైతుల ధర్నానరసరావుపేట/రొంపిచర్ల: ప్రకటించిన మద్దతు ధరకు మొక్కజొన్న కొనుగోలు చేయాలని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలంటూ రైతులు శుక్రవారం ధర్నా చేశారు. పల్నాడు జిల్లా రొంపిచర్ల మార్కెట్ యార్డుకు ఎదురుగా ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్ప్రెస్ హైవేపై బైఠాయించి నిరసనకు దిగారు. మొక్కజొన్న రైతుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గ వైఖరిని తూర్పారబట్టారు. గిట్టుబాటు ధర కల్పించకపోతే ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ నాయకులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్రెడ్డి, గజ్జల సుధీర్ భార్గవరెడ్డి తదితరులు ధర్నా చేస్తున్న రైతులకు మద్దతు పలికారు. వందలాది మంది రైతులు రోడ్డుపై నిరసనకు దిగడంతో హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. -
బిల్లులను అడ్డుకున్న పార్టీలు ఏం సాధించాయి?
సాక్షి, అమరావతి: ‘కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన ద్వారా ప్రతిపాదించిన 50 శాతం సీట్ల పెంపుదలను ఆమోదించి ఉంటే దక్షిణాది రాష్ట్రాలకు ఎంపీ సీట్లూ పెరిగేవి... మహిళా రిజర్వేషన్ బిల్లూ ఆమోదం పొందేది..’ అని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. కానీ ఆ బిల్లులను లోక్సభలో అడ్డుకున్న పార్టీలు తాము ఏం సాధించామో నిశితంగా ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న పార్టీల చర్యతో దేశంలో మహిళలకు, దక్షిణాది రాష్ట్రాలకూ న్యాయం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గిపోయే ప్రమాదం ఏర్పడటంతోపాటు మహిళా రిజర్వేషన్ బిల్లు వాయిదా పడిందన్నారు. ఒకవేళ 2026 జనాభా లెక్కలే అమలైతే దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి మరింత దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈమేరకు మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులపై తన అభిప్రాయాన్ని వైఎస్ జగన్ శుక్రవారం తన ఎక్స్ ఖాతాలో పోస్టు ద్వారా వెల్లడించారు. అందులో ఆయన పేర్కొన్న అంశాలు ఇవీ... » కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 50 శాతం సీట్ల పెంపుదల విధానంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు పెరిగేవి. అదే 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గుతాయి. ఇక 2026 జనాభా లెక్కలు అమలులోకి వస్తే దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి మరింతగా దిగజారుతుంది. కుటుంబ నియంత్రణను సమర్థంగా అమలు చేసినందుకు జనాభా పెరుగుదల తగ్గిన దక్షిణాది రాష్ట్రాలు మరింతగా నష్టపోతాయి. » 50 శాతం సీట్ల పెంపుదల విధానాన్ని అమలు చేస్తే ప్రస్తుతం ఏపీలో ఉన్న 25 ఎంపీ సీట్లు 38 సీట్లకు పెరుగుతాయి. అదే 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే ఎంపీ సీట్లు 34 మాత్రమే అవుతాయి. అంటే ఏపీ 4 ఎంపీ సీట్లు నష్టపోతుంది. » 50 శాతం సీట్ల పెంపుదల విధానం అమలు చేస్తే ప్రస్తుతం తెలంగాణలో ఉన్న 17 ఎంపీ సీట్లు 26 సీట్లకు పెరుగుతాయి. అదే 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే ఎంపీ సీట్లు 24 మాత్రమే అవుతాయి. అంటే రెండు సీట్లు నష్టపోవాలి. » 50 శాతం సీట్ల పెంపుదల విధానం అమలు చేస్తే ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న 28 ఎంపీ సీట్లు 42 స్థానాలకు పెరుగుతాయి. అదే 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకున్నా ఆ రాష్ట్రంలో 42 ఎంపీ సీట్లే ఉంటాయి. అంటే ఆ రాష్ట్రం ఏమీ నష్టపోదు. » 50 శాతం సీట్ల పెంపుదల విధానం అమలు చేస్తే ప్రస్తుతం కేరళలో ఉన్న 20 ఎంపీ సీట్లు 30 సీట్లకు పెరుగుతాయి. అదే 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే ఎంపీ సీట్లు 23 మాత్రమే అవుతాయి. అంటే కేరళ 7 ఎంపీ సీట్లు నష్టపోతుంది. » 50 శాతం సీట్ల పెంపుదల విధానం అమలు చేస్తే ప్రస్తుతం తమిళనాడులో ఉన్న 39 ఎంపీ సీట్లు 59 సీట్లకు పెరుగుతాయి. అదే 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే ఎంపీ సీట్లు 50 మాత్రమే అవుతాయి. అంటే తమిళనాడు 9 ఎంపీ సీట్లు నష్టపోతుంది. 50 శాతం సీట్ల పెంపుదలే ఉత్తమ విధానం.. 2026 జనాభా లెక్కలు అమలైతే మరింతగా నష్టపోతాంమాజీ సీఎం వైఎస్ జగన్ తన వాదనను బలపరిచే గణాంకాలను పట్టిక రూపంలో కూడా తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పునర్విభజన బిల్లులో చెబుతున్నట్టుగా 50 శాతం సీట్లు పెరిగితే దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల పెరుగుదల ఎలా ఉంటుంది..? అదే 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు ఎంతగా తగ్గుతాయో వివరించారు. ఇక 2026 జనాభా లెక్కలు అమలులోకి వస్తే దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్ల సంఖ్య మరింతగా తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లును యథాతథంగా ఆమోదించడమే దక్షిణాది రాష్ట్రాలకు ప్రయోజనకరమన్నారు. వైఎస్ జగన్ వెల్లడించిన గణాంకాలు ఇలా ఉన్నాయి.... మొత్తంగా దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి సంక్షిప్తంగా ఇలా..» ప్రస్తుతం దేశంలో ఉన్న 534 లోక్సభ ఎంపీ సీట్లలో దక్షిణాది రాష్ట్రాల్లో 129 ఎంపీ సీట్లు ఉన్నాయి. అంటే దేశంలో ఎంపీ సీట్లలో దక్షిణాది రాష్ట్రాల వాటా 23.76 శాతంగా ఉంది. » కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పునర్విభజన బిల్లు ఆమోదం పొందితే... ప్రస్తుతం చెబుతున్న 50 శాతం పెంపు విధానం అమలైతే దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్ల సంఖ్య 195కు పెరుగుతుంది. అంటే దేశం మొత్తం మీద 815 ఎంపీ సీట్లలో దక్షిణాది రాష్ట్రాల వాటా 23.87 శాతానికి పెరుగుతుంది. » 2011 జనాభా లెక్కలనే పరిగణలోకి తీసుకుంటే దేశంలో ఏర్పాటయ్యే 850 ఎంపీ సీట్లలో దక్షిణాది రాష్ట్రాల్లో 174 ఎంపీ సీట్లే ఉంటాయి. అంటే దక్షిణాది రాష్ట్రాల వాటా 20.44 శాతమే ఉంటుంది. ఫలితంగా దక్షిణాది రాష్ట్రాలు 21 ఎంపీ సీట్లను నష్టపోతాయి. » అదే 2026 జనాభా లెక్కలు అమలులోకి వస్తే దక్షిణాది రాష్ట్రాలు అంతకంటే ఎక్కువ ఎంపీ సీట్లను నష్టపోవాల్సి వస్తుంది. ఎందుకంటే.. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను సమర్థంగా అమలు చేస్తున్నాయి. దాంతో ఆ రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల రేటు తగ్గింది. కాబట్టి 2026 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుంటే ఎంపీ సీట్లు బాగా తగ్గిపోతాయి. అందుకే జనాభా లెక్కలతో నిమిత్తం లేకుండా కేంద్ర ప్రభుత్వం చెబుతున్న 50 శాతం సీట్ల పెంపుదలను ఆమోదించడమే దక్షిణాది రాష్ట్రాలకు ప్రయోజనకరం. -
ఇదేమి చోద్యం!
మార్కాపురం: బోడి గుండుకు.. మోకాలికి...అన్నట్టు ఉంది చంద్రబాబు ప్రభుత్వంలో పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి. అమరావతి నుంచే వచ్చే ఐవీఆర్ కాల్స్ను కొన్ని గ్రామాల్లో ప్రజలు లిఫ్ట్ చేయలేదని పంచాయతీ కార్యదర్శులను ఇంటింటికీ తిప్పి చెత్తసేకరించే పని అప్పగింaచిన ఉదంతం మార్కాపురం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. సుమారు 20 గ్రామ పంచాయతీల కార్యదర్శులను శుక్రవారం మార్కాపురం మండలం రాయవరం గ్రామానికి తీసుకెళ్లి ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్త సేకరించే పనులు చేయమని చెప్పడం విమర్శలకు తావిస్తోంది. రగిలిపోతున్న పంచాయతీ కార్యదర్శులు పారిశుధ్యంపై శిక్షణపేరుతో తమ చేత ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ పనులు చేయించడంపై పంచాయతీ కార్యదర్శులు రగిలిపోతున్నారు. పంచాయతీ కార్యదర్శులను శిక్షణ పేరుతో రాయవరం గ్రామానికి రప్పించి తడిచెత్త, పొడిచెత్త సేకరించే పనులు అప్పజెప్పారు. చెత్త సేకరించాక డంపింగ్ యార్డులకు పంపాలని ఆదేశించారు. మూడురోజుల శిక్షణ పేరుతో తమకు శిక్ష విధిస్తున్నారని పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు. జిల్లాలోని మొత్తం 60 గ్రామ పంచాయతీల కార్యదర్శులకు పారిశుధ్యంపై శిక్షణ ఇవ్వనున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
తప్పుడు పోస్టులపై వైఎస్ భారతీరెడ్డి లీగల్ నోటీసులు
సాక్షి, అమరావతి: సోషల్ మీడియాలో తనను లక్ష్యంగా చేసుకుంటూ పెడుతున్న తప్పుడు, పరువు నష్టం కలిగించే పోస్టులపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతీరెడ్డి న్యాయపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. తనపై సర్క్యులేట్ అవుతున్న తప్పుడు, పరువు నష్టం కలిగించే పోస్టులను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలంటూ సోషల్ మీడియా వేదికలు మెటా ప్లాట్ఫామ్స్, ఎక్స్ కార్పొరేషన్, యూట్యూబ్, గూగుల్లకు లీగల్ నోటీసులు పంపారు. భారతీరెడ్డి తరఫున న్యాయవాది ప్రద్యుమన్ కైస్తా ఈమేరకు నోటీసులిచ్చారు. తప్పుడు కథనాలతో కూడిన పోస్టులను ప్రచారం చేస్తున్న థింక్ ఆంధ్ర, ఎం9 న్యూస్లకు సైతం నోటీసులు పంపారు.భారతీరెడ్డి, జగన్మోహన్రెడ్డి బాధితులుగా మారారు..వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు వారి రాజకీయ ప్రత్యర్థులకు చెందిన ఐటీ సెల్ ప్రారంభించిన దుష్ప్రచారానికి బాధితులుగా మారారు. ఈ దాడి.. అన్ని పరిమితులను దాటి వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని సాగుతోంది. యూట్యూబ్, ఫేస్బుక్ ఖాతాలు కలిగిన థింక్ ఆంధ్ర.. తప్పుడు, పరువు నష్టం కలిగించే పోస్టులను విస్తృతంగా ప్రచురించి ప్రసారం చేస్తోంది. మిర్చి 9 న్యూస్ కూడా ఇలాంటి కంటెంట్నే సృష్టించి విస్తృతంగా వ్యాప్తి చేస్తోంది. ఇదంతా రాజకీయ ప్రత్యర్థుల ఐటీ సెల్ పనే..ఈ కంటెంట్ను భారతీరెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ ప్రత్యర్థుల ఐటీ సెల్కు సంబంధించిన అకౌంట్లు సేకరించి వాటిని మరింత విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్లో థింక్ ఆంధ్రా ఓ తప్పుడు, ఆధారరహిత కథనాన్ని సృష్టించింది. ఫేస్బుక్, యూట్యూబ్లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ప్రణాళికబద్ధంగా సాగుతున్న దాడి...వైఎస్ జగన్ దంపతులపై దుష్ప్రచారం చేయాలనే ఉద్దేశంతోనే ఆ తప్పుడు కథనాలు, పోస్టులను వ్యాప్తి చేస్తున్నారు. ఇదంతా ప్రణాళికాబద్ధంగా సాగుతున్న దాడి. ఆ పోస్టులు నా క్లయింట్ కుటుంబ పరువుకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. అవి పరువు నష్టం కలిగించే తప్పుడు వార్తలే కాకుండా భారతీరెడ్డి వ్యకిగత గోప్యతను సైతం హరిస్తున్నాయి. ఇది చట్ట ప్రకారం నేరం. ఈ నేపథ్యంలో మీరు పోస్టు చేసిన, ప్రసారం చేసిన తప్పుడు కథనాలను తక్షణమే తొలగించాలి. అదే విషయానికి సంబంధించిన ఇతర పోస్టులను సైతం తొలగించాలి. భారతీరెడ్డి, ఆమె కుటుంబ సభ్యులపై చేస్తున్న దుష్ప్రచారం తాలూకు తప్పుడు, నిరాధార కథనాలను, పోస్టులను ప్రసారం చేస్తున్న ఆయా సామాజిక మాధ్యమాల అకౌంట్లను సైతం బ్లాక్ చేయాలి. లేని పక్షంలో భారతీరెడ్డి తీసుకునే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండండి. ప్రస్తుత లీగల్ నోటీసులో ప్రస్తావించిన అంశానికి సంబంధించిన ఏ విధమైన కంటెంట్ అయినా, అలాగే నా క్లయింట్కు అపకీర్తి కలిగించే సమాచారాన్ని ప్రచురించడం, మళ్లీ ప్రచురించడం, ప్రసారం చేయడం, అప్లోడ్ చేయడం, స్ట్రీమింగ్ చేయడం, ప్రచారం చేయడం, షేర్ చేయడం, వ్యాప్తి చేయటాన్ని తక్షణమే నిలిపివేయాలి. మీరు ప్రచురించిన, ప్రసారం చేసిన, పోస్టు చేసిన కథనాలు తప్పుడు కథనాలని అంగీకరిస్తూ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. అలాగే ఆ కంటెంట్ ఇప్పటికే తొలగించినట్లు ప్రకటించాలి..’ అని ప్రద్యుమన్ లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. -
అరెస్ట్ చేయమనండి.. చూస్తాం
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి (మీడియా) పూడి శ్రీహరి, సోషల్ మీడియా యాక్టివిస్ట్ గిరీష్ కుమార్రెడ్డికి రిమాండ్ విధించేందుకు నిరాకరిస్తూ కుప్పం కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల అమలును హైకోర్టు నిలిపేసింది. ప్రతివాదులుగా ఉన్న శ్రీహరి, గిరీష్ కుమార్రెడ్డిలకు నోటీసులు జారీ చేసింది. రిమాండ్ తిరస్కరణ ఆదేశాల అమలును మాత్రమే నిలిపివేశామని, రద్దు చేయలేదని పేర్కొన్న హైకోర్టు ఈ నేపథ్యంలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేయలేరని వివరించింది. ‘అయినా కూడా పోలీసులు అరెస్ట్ చేస్తే, అరెస్ట్ చేయమనండి.. మేమూ చూస్తాం..’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసుల లంచ్మోషన్ పిటిషన్ కుప్పం కోర్టు గురువారం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పోలీసులు హైకోర్టులో అత్యవసర లంచ్మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. శ్రీహరిని రిమాండ్కు పంపేలా ఆదేశాలు ఇవ్వాలని పోలీసుల తరఫున అడ్వకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి కుప్పం కోర్టు ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ, ప్రతివాదులు శ్రీహరి, గిరీష్ కుమార్రెడ్డిలకు నోటీసులు జారీ చేశారు. ఇంతలో ఈ విషయం తెలుసుకున్న శ్రీహరి తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి కోర్టులోకి వచ్చారు. కుప్పం కోర్టు ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. తమ వాదన వినకుండా ఎక్స్ పార్టీ ఆదేశాలు ఇవ్వడం సరికాదన్నారు. ఈ సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ, సుధాకర్రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కుప్పం కోర్టు ఇచ్చిన రిమాండ్ తిరస్కరణ ఉత్తర్వుల వల్ల శ్రీహరి, గిరీష్ లను పోలీసులు తిరిగి అరెస్ట్ చేసే అవకాశం ఉందని పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఆందోళనలో న్యాయం ఉందని ఆయన కోర్టుకు నివేదించారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ, తాము రిమాండ్ తిరస్కరణ ఉత్తర్వులను రద్దు చేయలేదని స్పష్టం చేశారు. ఒకవేళ రద్దు చేసి ఉంటే, అప్పుడు శ్రీహరి, గిరీష్ ల అరెస్ట్కు ఆస్కారం ఉండేదన్నారు. అయినా కూడా పోలీసులు అరెస్ట్ చేస్తే, అరెస్ట్ చేయమనండి.. మేమూ చూస్తాం.. అంటూ న్యాయమూర్తి ఘాటుగా వ్యాఖ్యానించారు. పోలీసులు చట్టం విధి విధానాలను పాటించడం లేదు: హైకోర్టువ్యక్తులను అదుపులోకి తీసుకునే సమయంలో పోలీసులు చట్టం నిర్దేశించిన విధి విధానాలను పాటించడం లేదని, ఇందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని హైకోర్టు పేర్కొంది. చట్ట నిబంధనలను పాటించకుండా వ్యక్తుల స్వేచ్ఛను హరించడానికి వీల్లేదంది. శ్రీహరి అక్రమ అరెస్ట్ విషయంపై దాఖలైన పిటిషన్పై న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ మెడమల్లి బాలాజీ ధర్మాసనం శుక్రవారం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. శ్రీహరి అరెస్ట్ విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఆ కౌంటర్కు పేరాల వారీగా సమాధానం ఇవ్వాలని పిటిషనర్కు సూచించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. పోలీసులమంటూ సివిల్ దుస్తుల్లో వచ్చిన కొందరు వ్యక్తులు శ్రీహరిని బలవంతంగా తమ వెంట తీసుకెళ్లారని, ఆయన్ను కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలంటూ డ్రైవర్ పోతల సింహాచలం నాయుడు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గురువారం విచారణ జరిపిన జస్టిస్ తిల్హరీ ధర్మాసనం పూర్తి వివరాలను తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే. శుక్రవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా, పిటిషనర్ తరఫు న్యాయవాది సానేపల్లి రామలక్ష్మణ్రెడ్డి వాదనలు వినిపిస్తూ శ్రీహరి అరెస్ట్ చట్ట విరుద్ధమన్నారు. ‘‘చట్టవిరుద్ధంగా వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు, ఆ అక్రమ నిర్భంధంపై హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయగానే విడుదల చేస్తున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తిని విడుదల చేశాం కాబట్టి, హెబియస్ కార్పస్ పిటిషన్ నిరర్థకమైందంటూ చెబుతున్నారు’’ అని హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. -
‘నోటి మాటగా కాదు.. చట్టంలో పెట్టాల్సిందే’
న్యూఢిల్లీ: డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులకు తాము మద్దతిస్తామని, దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్లు పెరగాలన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి. ఈరోజు(శుక్రవారం, ఏప్రిల్ 17వ తేదీ) డీలిమిటిషన్, మహిళా రిజర్వేసన్ బిల్లులపై లోక్సభలో చర్చ సందర్భంగా మిథున్రెడ్డి మాట్లాడుతూ.. ‘ డీలిమిటేషన, మహిళా రిజర్వేషన్ బిల్లులకు మేం మద్దతిస్తాం. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్లు పెరగాలి. డీలిమిటేషన్ ప్రక్రియలో అన్ని పార్టీలకు సమాన భాగస్వామ్యం ఇవ్వాలి. రాష్ట్రాల్లో ప్రాంతీయ అసమానతలు లేకుండా సీట్ల సంఖ్య పెంచాలి. ప్రతి రాష్ట్రంలో కచ్చితంగా 50 శాతం సీట్లు పెంచే విషయం చట్టంలో పెట్టాలని మేం డిమాండ్ చేస్తున్నాం. ఇది కేవలం నోటి మాటగా చెప్తే మేం అంగీకరించం. రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంట్లో చెప్పిన మాటలు అమలు కాలేదు’ అని మిథున్రెడ్డి స్పష్టం చేశారు. -
‘పారిశ్రామిక వర్గాలకు కూటమి పాలన ఒక శాపం’
తాడేపల్లి : ఏపీలో పారిశ్రామిక వేత్తలకు వేధింపులు తప్పడం లేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక వర్గాలపై రెడ్ బుక్ పాలనను అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. దాంతో ఏపీలో పారిశ్రామిక వర్గాలకు ఇదొక శాపంలా మారిందన్నారు. ‘ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి నేతలకు వాటాలను సెటిల్మెంట్ చేస్తున్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఇటీవలే సీఎంను కలిశారు. ఆ తర్వాత అల్ట్రా టెక్ సిమెంట్ ఫ్యాక్టరీ పై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఎన్ని రకాలుగా బెదిరించినా యాజమాన్యం స్పందించక పోవటంతో మరింత రెచ్చిపోతున్నారు. చంద్రబాబు పాలనను కమ్మగా ఉందంటూ విమర్శలు చేశారు. ఆ తర్వాత సీఎంతో సెటిల్మెంట్ చేసుకున్నారు. తన అనుచరులతోనే ఆల్ట్రాటెక్ పై అనేక ఫిర్యాదులు చేయించారు. తర్వాత పరిశ్రమ వాహనాలను కట్టడి చేశారు..అల్ట్రా టెక్ సిమెంట్ ఫ్యాక్టరీని అక్కడి నుంచి తరలించాలని చూస్తున్నారు.. జిందాల్ కంపెనీ వారిని కూడా ఇలాగే వేధించారు. వాళ్ళు మహారాష్ట్ర వెళ్ళిపోయారు. ఇలా కూటమి నేతలు పలు కంపెనీలపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. పారిశ్రామికవేత్తలను ఇలా బెదిరిస్తుంటే రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెడతారు?, రాష్ట్రానికి మేం ఎన్ని పరిశ్రమలు తెచ్చాం.. మీరు ఎన్ని తెచ్చారో లెక్క చెప్పాలి. పారిశ్రామిక వర్గాలపై బెదిరింపులు ఆపాలి’ అని టీజేఆర్ సుధాకర్ బాబు హెచ్చరించారు. -
ఆ ఘనత వైఎస్ జగన్దే: విడదల రజిని
సాక్షి, తాడేపల్లి: ఇవాళ దేశ చరిత్రలో గొప్పరోజుగా మిగిలిపోతుందని.. దశాబ్దాల తర్వాత మహిళా రిజర్వేషన్ కల నెరవేరబోతుందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. శుక్రవారం ఆమె తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వైఎస్సార్సీపీ ఇప్పటికే మద్దతు ప్రకటించిందన్నారు.‘‘మహిళా రిజర్వేషన్ బిల్లుతో దేశ భవిష్యత్తు మారబోతుంది. మహిళా శక్తితో మన దేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్గా చేద్దాం. మహిళల అభివృద్ధి గురించి ఆలోచించిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 90 శాతం పథకాలు మహిళల గౌరవం పెంచే పథకాలే. అమ్మ ఒడి దగ్గర నుంచి ప్రతి పథకం మహిళల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేదే...మహిళలకు వైఎస్ జగన్ ఎన్నో అవకాశాలు కల్పించారు. మహిళలను హోం మినిస్టర్లగా, డిప్యూటీ సీఎంలుగా చేసిన ఘనత జగనన్నదే. మహిళల పట్ల వైఎస్ జగన్ సామాజిక సంఘ సంస్కర్తగా ఆలోచన చేశారు. కూటమి పాలనలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరిగాయి. ఏపీలో లా అండ్ ఆర్డర్ పని చేయడం లేదు. చంద్రబాబు అజెండా రెడ్బుక్ పాలనే’’ అని విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు.మహిళా సాధికారతకు అనేక కార్యక్రమాలు చేపట్టింది వైఎస్ జగనే. రాజకీయంగా, ఆర్థికంగా ఎంతో చేయూత అందించారు. చంద్రబాబు వచ్చాక మహిళలకు రక్షణ లేదు. వేధింపులు, అఘాయిత్యాలు, ఆత్మహత్యలు పెరిగాయి. పోలీసు వ్యవస్థ రాష్ట్రంలో పూర్తిగా దిగజారిందనేదానికి నిదర్శనం. మహిళల కోసమే జగన్ దిశ యాప్, మహిళా పోలీస్ స్టేషన్లు, జీరో ఎఫ్ఐఆర్ లు తెచ్చారు. కానీ చంద్రబాబు మహిళల కోసం ఏం చేశారు?. 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని మా హయాంలో ఆరోపణలు చేశారు. మరి నిజంగానే అదృశ్యమైతే వారిని చంద్రబాబు, పవన్ వెనక్కి తెచ్చారా?. మహిళల మీద లైంగికదాడి చేసిన కూటమి ఎమ్మెల్యేలు, నేతలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?’’ అంటూ విడదల రజని నిలదీశారు. -
ఖాకీల ‘పైశాచికత్వం’
సాక్షి టాస్క్ ఫోర్స్: వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి (మీడియా విభాగం) పూడి శ్రీహరి అక్రమ అరెస్టు విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. చినబాబు కళ్లలో ఆనందం కోసం శ్రీహరిపై కక్ష సాధింపు చర్యలకు దిగిన పోలీసులు ఎట్టకేలకు ఆయనను కోర్టులో హాజరుపరిచారు. ఆయన అరెస్టుపై వైఎస్సార్సీపీ శ్రేణుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం కావడం.. ఇదే కేసులో అరెస్టయిన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా నేత గిరీష్ ను జ్యుడీషియల్ కస్టడీకి తరలించేందుకు న్యాయస్థానం అంగీకరించకపోవడంతో పోలీసులు ఒత్తిడికి గురయ్యారు. శ్రీహరిని ఎలాగైనా కస్టడీకి తరలించాలని భావించి రాత్రంతా కుప్పం పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. కోర్టులో హాజరుపరిచే విషయంలో కుంటిసాకులు చెబుతూ అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన చేశారు. చివరకు ఏం చేయాలో పాలుపోని స్థితిలో శ్రీహరిని అరెస్టు చేసిన 33 గంటల తర్వాత గురువారం సాయంత్రం కుప్పం కోర్టులో హాజరుపరచగా.. కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో శ్రీహరిని విడుదల చేయక తప్పని పరిస్థితి తలెత్తింది. పత్రిక క్లిప్పింగ్ను పార్టీ గ్రూపులో పంచుకున్నారని.. పత్రికలో ప్రచురితమైన ఓ క్లిప్పింగును తమ పార్టీ గ్రూపులో శ్రీహరి పంచుకున్నారు. దీనిపై కుప్పం ఐ.టీడీపీ నేత నుంచి 13న రాత్రి 10 గంటలకు ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆగమేఘాలపై పరుగులు తీశారు. 14వ తేదీన రాత్రి అనంతపురం జిల్లా రాప్తాడు వెళ్లి వైఎస్సార్సీపీ సోషల్ యాక్టివిస్ట్ గిరీష్ రెడ్డిని, 15న ఉదయం గుంటూరు జిల్లా తాడేపల్లిలో పూడి శ్రీహరిని అక్రమంగా నిర్బంధించి అరెస్టు చేసిన పోలీసులు హుటాహుటిన కుప్పం తీసుకొచ్చారు. కేవలం చినబాబు కళ్లల్లో ఆనందం చూడటానికి జిల్లా పోలీసు బాస్ ప్రణాళికలో స్థానిక పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేశారు. శ్రీహరిని ఓ తీవ్రవాదిని పట్టుకున్నట్టుగా వలపని అరెస్టు చేసిన పోలీసులు ఆయన వద్ద ఉన్న ఫోన్, ల్యాప్టాప్ స్వా«దీనం చేసుకున్నారు. సాయంత్రం 6 గంటల సమయంలో తాడేపల్లి నుంచి కుప్పం తీసుకొచ్చారు. ఏ–1 నిందితుడిగా గిరీష్ కుమార్రెడ్డిని, ఏ–2గా శ్రీహరిని చూపించిన పోలీసులు వేధింపులే లక్ష్యంగా ముందుకెళ్లారు. తొలుత గిరీష్ ను బుధవారం రాత్రి 7.15 గంటల సమయంలో కుప్పం కోర్టులో హాజరుపర్చారు. అయితే.. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏడేళ్లలోపు శిక్షపడే కేసుల్లో రిమాండ్ ఇవ్వడం కుదరదని గిరీష్కు జ్యుడీషియల్ కస్టడీని న్యాయమూర్తి తిరస్కరించారు. సొంత పూచీకత్తుపై గిరీష్ ను విడుదల చేశారు. ఈ ఘటనతో పోలీసుల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయ్యింది. అయితే, చినబాబు నుంచి స్పష్టమైన ఆదేశాలు అందటంతో శ్రీహరిని మానసికంగా వేధించి, స్టేషన్లో ఉంచి మరుసటి రోజు కోర్టుకు తీసుకెళ్లాలని పోలీసు బాస్ నుంచి సమాచారం అందింది. దీంతో రాత్రంతా శ్రీహరిని కుప్పం పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. ఇదిగో, అదిగో కోర్టుకు తీసుకెళుతామంటూ ఉద్దేశ్యపూరకంగా కాలయాపన చేశారు. కనీసం న్యాయవాదులను, వైఎస్సార్సీపీ నేతలను కలవడానికి కూడా ఒప్పుకోలేదు. తీరా గురువారం ఉదయం మళ్లీ కోర్టుకు తీసుకెళ్లడానికి ముందు వైద్యపరీక్షలు నిర్వహించినా.. ఆ తరువాత పోలీస్ స్టేషన్లోనే ఉంచేశారు. ఇలా గంటల కొద్దీ శ్రీహరిను స్టేషన్లో ఉంచి పైశాచిక ఆనందం పొందారు. చివరకు సాయంత్రం 4.30 గంటలకు కుప్పం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి, ఆపై సాయంత్రం 5 గంటలకు కుప్పం కోర్టులో హాజరుపరచారు. ఆ వారెంట్ల పరిస్థితి ఏమిటి?శ్రీహరి, గిరీష్లపై నమోదు చేసిన కేసుల్లో కనీసం 41ఏ నోటీసులు కూడా ఇవ్వని పోలీసులు వారిని అరెస్టు చేసి జైలుకు తరలించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. అతి సాధారణ ఫిర్యాదు ఆధారంగా వారిద్దరిపై కక్షసాధించేందుకు యత్నించారు. అయితే, జిల్లాలో హత్యలు, దోపిడీలు, అత్యాచార కేసుల్లో నిందితులుగా ఉండి.. విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న వారిపై కోర్టులు నాన్–బెయిలబుల్ వారెంట్లు (ఎన్బీడబ్ల్యూ) జారీ చేశాయి. జిల్లాలో దాదాపు 280కి పైగా నాన్–బెయిలబుల్ వారెంట్లు పెండింగ్లో ఉన్నాయి. వారెవరినీ కోర్టులో హాజరుపరిచేందుకు సమయం లేదని చెబుతున్న పోలీసులు.. ప్రతిపక్ష నేతలను మాత్రం అప్పటికప్పుడు అరెస్టు చేయడం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
మహిళలు తీసుకునే రుణాల్లో భారీ పెరుగుదల
సాక్షి, అమరావతి: దేశంలో మహిళలు తీసుకునే రుణాలు భారీగా పెరిగాయి. ఇందులో వ్యాపార రుణాల్లో అత్యధిక వృద్ది నమోదైంది. దేశంలో మహిళలు–అభివృద్ధి చెందుతున్న రుణ మార్కెట్పై నీతిఆయోగ్ విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 2017లో మహిళలు తీసుకున్న రుణాలు రూ.16 లక్షల కోట్లు ఉండగా 2025 నాటికి 4.8 రెట్లు పెరిగి రూ.76 లక్షల కోట్లకు చేరాయి. వ్యాపార రుణాల విషయంలో మహిళా పారిశ్రామికవేత్తలు బలమైన వృద్ధి సమూహంగా ఆవిర్భవించారు. 2017 నుంచి వారి పోర్ట్ఫోలియో నిల్వలు 7.5 రెట్లు పెరిగాయి. క్యాష్ క్రెడిట్, ఓవర్డ్రాఫ్ట్ వంటి రివాల్వింగ్ క్రెడిట్ ఉత్పత్తుల వైపు క్రమంగా మళ్లడం.. పెరుగుతున్న ఆర్థిక పరిజ్ఞానాన్ని, వ్యాపార పరిపక్వతను సూచిస్తోందని ఆ నివేదిక పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం.. దేశంలో మహిళలు తీసుకునే రుణ మార్కెట్ సగటు వార్షిక వృద్ధి రేటు 20 శాతంగా ఉంది. ఏటా స్థిరమైన వృద్ధిని సూచిస్తోంది. రిటైల్ రుణాల విభాగం ఇప్పటికీ ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ, వ్యాపార రుణాల్లో ఎక్కువ వృద్ధి నమోదైంది.మహిళలు తీసుకునే రుణాల్లో వ్యాపార రుణాల వాటా 2017 నుంచి 2025 మధ్య 16 శాతం నుంచి 25 శాతానికి పెరిగింది. దేశంలో మహిళలకు రుణ లభ్యత 2017లో 19 శాతం ఉండగా 2025 నాటికి 36 శాతానికి పెరిగింది. ఈ వృద్ధి మహిళల ఆర్థిక ప్రవర్తనలో వచ్చిన ఒక ముఖ్యమైన మార్పును ప్రతిబింబిస్తోంది. దీని ప్రకారం ఎక్కువమంది మహిళలు తమ వ్యక్తిగత, వృత్తిపరమైన లక్ష్యాలను చేరుకోవడానికి రుణాలను ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. -
ఇక ఉద్యమం ఉధృతం
సాక్షి ప్రతినిధి కర్నూలు: ‘తెలంగాణ సీఎం అయిన శిష్యుడు రేవంత్రెడ్డి కోసం గురువు చంద్రబాబు రాయలసీమ ప్రయోజనాలను తాకట్టుపెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపించారు. దీనికి సిగ్గుపడాలి. రాజకీయాలకు అతీతంగా పోరాడాల్సిన రాయలసీమకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు రాయలసీమ లిఫ్ట్ ఎందుకు అని ప్రశి్నస్తున్నారు. హంద్రీ–నీవా వెడల్పు చేయకుండా తగ్గించి లైనింగ్ చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఆపారు. 1995–2004 వరకు, మళ్లీ ఇప్పుడు చంద్రబాబు సీమకు తీరని ద్రోహం చేశారు. ఈ ద్రోహంపై ఉద్యమించకపోతే మన పిల్లల భవిష్యత్తును అంధకారం చేసినట్లే. గ్రామస్థాయి నుంచి ఉద్యమించి ప్రాజెక్టులు సాధించుకోవాలి!’ అని రాయలసీమ వైఎస్సార్సీపీ నేతలు ముక్తకంఠంతో నినదించారు. రాయలసీమ లిఫ్ట్ ఆపేసిన క్రమంలో ‘సీమ ప్రాజెక్టులు–సమాలోచన’ పేరుతో కర్నూలులో గురువారం వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ అనంతపురం, నంద్యాల జిల్లాల అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి, కాటసాని రాంభూపాల్రెడ్డి, మాజీమంత్రి సాకే శైలజానాథ్, కర్నూలు జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఆలూరు, మంత్రాలయం ఎమ్మెల్యేలు విరూపాక్షి, బాలనాగిరెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్రెడ్డి, ఎస్వీ మోహన్రెడ్డి మాట్లాడారు. గ్రేటర్ రాయలసీమ నీటి అవసరాలు, భవిష్యత్ కాపాడుకునేందుకు గ్రామస్థాయి నుంచి ఉద్యమించాలని చెప్పారు. ప్రాజెక్టుల సాధనకు మాజీ మంత్రి శైలజానాథ్ ఆధ్వర్యంలో రాయలసీమపై ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ సాధనకోసం అందరం సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. కాగా, గుండ్రేవుల–వేదవతి ప్రాజెక్టులు వెంటనే పూర్తిచేయాలని, గ్రామస్థాయి నుంచి ఉద్యమ కార్యక్రమాలు చేపట్టాలని, గుండ్రేవుల సాధన కోసం పాదయాత్ర చేయాలని, హంద్రీ–నీవా సామర్థ్యాన్ని పెంచాలని తీర్మానాలు చేశారు. -
ఆదాయార్జన శాఖలు లక్ష్యాలను చేరుకోవాలి
సాక్షి, అమరావతి: ఆదాయార్జన శాఖలు రెవెన్యూ లక్ష్యాలను చేరుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు వీలుగా మైక్రో, మాక్రో స్థాయిలో ప్రణాళికలు అమలుచేయాలన్నారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికల ద్వారా పూర్తిస్థాయి ఉత్పాదకతను చేరుకోవాలని ఆర్థికశాఖకు సూచించారు. 15 శాతం మేర వృద్ధి రేటు లక్ష్యాన్ని చేరుకునేలా క్షేత్రస్థాయి వరకూ ఈ ప్రణాళికల్ని అమలుచేయాలని సీఎం స్పష్టంచేశారు. సచివాలయంలో ఆర్థిక శాఖపై గురువారం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సంక్షేమ క్యాలెండర్కు అనుగుణంగానే పథకాలను అమలుచేస్తామని అన్నారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులపై దృష్టిపెట్టాలని ఆయన సూచించారు. జనగణనలో అందరూ భాగస్వాములు కావాలిరాష్ట్రంలో గురువారం ప్రారంభమైన స్వీయ జనగణనలో కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తన వివరాలను ఆన్లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకున్నారు. హౌస్ లిస్టింగ్– హౌస్ సెన్సెస్లో భాగంగా ఈ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. se.census.gov.in వెబ్సైట్ ద్వారా ముఖ్యమంత్రి వివరాలను నమోదు చేశారు. మొత్తం 33 ప్రశ్నలతో కూడిన ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియను ఏపీ జనగణన డైరెక్టర్ జె.నివాస్ ముఖ్యమంత్రికి వివరించారు. మరోవైపు.. రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని దేవదాయ శాఖపై జరిగిన సమీక్షలో చంద్రబాబు అధికారులను ఆదేశించారు. శ్రీవాణి నిధులతో రాష్ట్రవ్యాప్తంగా నిర్మించనున్న ఐదువేల దేవాలయాలను రెండేళ్లలో పూర్తిచేయాలన్నారు. తిరుమల తరహాలోనే ఇతర దేవాలయాల్లోనూ అన్నప్రసాదం అందించాలని సూచించారు. -
పరిశ్రమల భూములు అమ్ముతాం..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామిక మౌలిక వసతులు కల్పించడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించడానికి ఏర్పాటుచేసిన ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ)ని చంద్రబాబు సర్కారు పూర్తి రియల్ ఎస్టేట్ బ్రోకింగ్ సంస్థగా మార్చేశారు. ఇప్పటికే పీపీపీ విధానంలో రాష్ట్రంలోని పారిశ్రామిక పార్కులను, ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ (లిఫ్ట్) పాలసీ పేరిట విశాఖలోని రూ.వేల కోట్ల విలువైన భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు అతిచవకగా కట్టబెట్టిన ప్రభుత్వం.. తాజాగా తాను అభివృద్ధి చేసిన పార్కులు, వాణిజ్య సముదాయాల్లోని స్థలాలను రియల్ ఎస్టేట్ సంస్థలకు ఏపీఐఐసీ ద్వారా అమ్మేస్తోంది. రాష్ట్రంలోని వివిధ పారిశ్రామిక పార్కుల్లో అందుబాటు ధరల్లో గృహ సముదాయాలు నిర్మించడానికి పూర్తిస్థాయి అమ్మకపు హక్కులతో అప్పగించనుంది. కేటాయించిన స్థలంలో 60 శాతం గృహ అవసరాలకు వినియోగించి మిగిలిన 40 శాతం వాణిజ్య అవసరాలకు వినియోగంచుకోవడమే కాక, చార్జీలు వసూలు చేసుకోవడం ద్వారా ఆదాయాన్ని పొందడానికి అనుమతించింది. ఇందుకోసం ఆసక్తిగల సంస్థల నుంచి ఏపీఐఐసీ ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను ఆహ్వానించింది. బిడ్ గెలిచిన సంస్థ ఏపీఐఐసీకి భూమి ధరను చెల్లించి ఆ స్థలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చు. ఆ ప్రాజెక్టు డిజైన్, నిధుల సమీకరణ, నిర్వహణ అంతా గెలిచిన బిడ్డింగ్ సంస్థే చూసుకోవాలని, ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులను మంజూరు చేయడంలో మాత్రమే ఏపీఐఐసీ సహాయం అందిస్తుందని ఆ టెండర్ డాక్యుమెంట్స్లో పేర్కొన్నారు. జిల్లా కేంద్రాల్లో వాణిజ్య సముదాయాలుఇవేకాకుండా నగరం నడిబొడ్డున ఉన్న జోనల్ కార్యాల యాలు, లేదా పారిశ్రామిక పార్కుల్లో వాణిజ్య సముదాయాలను ఏర్పాటుచేయడానికి ప్రైవేటు సంస్థలకు ఏపీఐఐసీ భూములను కేటాయిస్తోంది. ఇందుకోసం విలువైన భూముల్లో సుమారుగా ఒక ఎకరం స్థలాన్ని కేటాయించనుంది. ఈ స్థలంలో వాణిజ్య సముదాయాలు నిర్మించి నిర్వహించుకోవడానికి 33 ఏళ్లకు లీజుకు ఇవ్వనుంది. అలాగే, అభివృద్ధి చేసిన స్థలంలో ఏపీఐఐసీకి 10,000 చదరపు అడుగులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మిగిలిన ఆదాయమంతా ఆ బిల్డరే తీసుకోవచ్చని టెండరు డాక్యుమెంట్లలో పేర్కొన్నారు. ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా 27 చోట్ల స్థలాలను కేటాయించనున్నారు. ఇందులో అత్యధికంగా జోనల్ ఆఫీసు కార్యాలయాలు ఉండగా మరికొన్ని చోట్ల ఎంఎస్ఎంఈ పార్కులు, ఇతర పారిశ్రామిక పార్కులు ఉన్నాయి. ఈ 27 చోట్ల వాణిజ్య సముదాయాలు నిర్మించి నిర్వహించుకోవడానికి ఆసక్తిగల సంస్థ నుంచి బిడ్లను ఆహ్వానించింది. -
‘ఇచ్చిన హామీలను చేతల్లో చూపిన నాయకుడు వైఎస్ జగన్’
తాడేపల్లి : ఇచ్చిన హామీలను మాటలతోనే సరిపెట్టకుండా చేతల్లో చూపిన నాయకుడు వైఎస్ జగన్ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి స్పష్టం చేశారు. అన్ని రంగాల్లోనూ బీసీలకు వైఎస్ జగన్ అండగా నిలిచారని సజ్జల తెలిపారు. ఈరోజు(గురువారం, ఏప్రిల్ 16వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో బీసీ నేతల సమావేశం జరిగింది. బీసీ సెల్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. దీనికి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మాజీ మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, బీసీ విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్లు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర బీసీ సాధికార విభాగ అధ్యక్షులు హాజరయ్యారు. ఈ మేరకు సజ్జల మాట్లాడుతూ.. ‘బీసీల సాధికారతకు జగన్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఇచ్చిన హామీలను మాటల్లో కాదు, చేతల్లో చూపిన నాయకుడు జగన్. అన్ని రంగాల్లోనూ జగన్ బీసీలకు అండగా నిలిచారు. చంద్రబాబు ప్రభుత్వంలో బీసీలు నష్టపోయారు. ఏ సంక్షేమ పథకమూ అందటం లేదు.కూటమి ప్రభుత్వంలో వ్యవస్థీకృత అవినీతి, రాజకీయ జోక్యం పెరిగింది. అమరావతి పేరుతో భారీ దోపిడీ జరుగుతోంది. ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారు. ఇష్టానుసారం అక్రమ కేసులు పెడుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుంది..’అని స్పష్టం చేశారు. ఈ నెల 26న బీసీ గళం సమావేశంఈ నెల 26న అనంతపురంలో బీసీ గళం సమావేశం నిర్వహించాలని నిర్ణయించామన్నారు సజ్జల. దీనిలో భాగంగా ఆ సమావేశం పోస్టర్ను విడుదల చేశారు. -
కుప్పం కోర్టుకు పూడి శ్రీహరి
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పూడి శ్రీహరి అరెస్టుకు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్సార్సీపీ శ్రేణుల ఒత్తిడితో పోలీసులు తలొగ్గారు. అరెస్టు చేసిన 33 గంటల తర్వాత పోలీసులు కోర్టుకు తీసుకెళ్తున్నారు. ఇవాళ ఉదయం పూడి శ్రీహరికి పోలీసులు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. ఇప్పుడు కుప్పం కోర్టుకు తరలిస్తున్నారు. కాగా,తాడేపల్లిలో నిన్న ఉదయం పూడి శ్రీహరిని పోలీసులు అరెస్టు చేశారు. -
ఏపీ విభజనపై ఎంపీ తేజస్వీ సూర్య వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి,న్యూఢిల్లీ: ఏపీ విభజనపై బెంగళూరు సౌత్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాక్ విభజనతో ఏపీ విభజనను పోల్చారు. ఏపీ విభజనను బ్రిటీష్ కంటే చెత్తగా కాంగ్రెస్ చేసింది’ అని వ్యాఖ్యానించారు. అదే సమయంలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను దక్షిణ రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇదే అంశంపై ఎంపీ తేజస్వీ సూర్య స్పందించారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల తాము సీట్లను, ప్రభావం తగ్గిపోతుందనే భావన దక్షిణాది ప్రాంతాల్లో నెలకొంది. అయితే, ప్రభుత్వం అన్ని రాష్ట్రాల వాటాను 50శాతానికి పెంచుతుంది. తద్వారా ప్రాంతానికి ప్రయోజనం చేకూరుస్తుందని స్పష్టం చేశారు. -
కందుకూరి వీరేశలింగం పంతులుకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: కందుకూరి వీరేశలింగం పంతులుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. ‘‘సాహిత్యాన్ని ఆయుధంగా చేసుకుని సమాజాన్ని మార్చిన మహోన్నతుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. సామాజిక అసమానతలపై నిర్భయంగా పోరాడుతూ, స్త్రీ విద్యకు నాంది పలికిన మహోన్నతుడు ఆయన. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.సాహిత్యాన్ని ఆయుధంగా చేసుకుని సమాజాన్ని మార్చిన మహోన్నతుడు కందుకూరి వీరేశ లింగం పంతులుగారు. సామాజిక అసమానతలపై నిర్భయంగా పోరాడుతూ, స్త్రీ విద్యకు నాంది పలికిన మహోన్నతుడు ఆయన. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను. pic.twitter.com/VYYbUHYVtN— YS Jagan Mohan Reddy (@ysjagan) April 16, 2026 -
ఆరోగ్యానికి 'సెగ'!
ఎండ ఎరుపు రంగు పూసుకుంది.. ఉదయం ఏడింటికే సుర్రుమంటోంది.. సాయంత్రం చీకటిపడేదాకా తాపం తగ్గేది లేదంటోంది.. ఇంకేముంది భానుడి సెగ ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తోంది. మండుటెండల కారణంగా వడ‘దెబ్బ’ పొంచి ఉంది. ఇప్పటికే వడదెబ్బలు నమోదవుతున్నాయి.. ఎండల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కడప రూరల్: సూర్యుడు ‘చుర్రు’మంటున్నాడు.. మాడు పగిలేలా భగభగమంటున్నాడు. ఇటీవల కాలంలో వాతావ‘రణం’ రణరంగంగా మారింది. దీంతో ప్రజల ఆరోగ్య వ్యవస్థ దెబ్బతింటోంది. ఇప్పటికే 42–43 డిగ్రీల గరిష్ణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్నరోజుల్లో 48 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావర ణ శాఖ అంచనా. ఈ నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా..ఆరోగ్య జాగ్రత్తలు పాటించడం శ్రేయస్కరం. జాగ్రత్తలతోనే అడ్డుకట్ట... ఎండ తీవ్రత వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీంతో మెదడు మీద తీవ్ర ప్రభావం పడుతుంది. దీనివల్ల మెదడులో ఉష్ణోగ్రతను నియంత్రించే కేంద్రం (హైపో «థలామన్) దెబ్బతింటుంది. ఫలితంగా సదరు వ్యక్తి వడదెబ్బకు గురవుతాడు. దీనినే ‘హీట్ స్ట్రోక్’ లేదా ‘సన్ స్ట్రోక్’ అంటారు. ఈ దశ ప్రమాదకరం, ప్రాణాంతకం. లక్షణాలు..కారణాలు.. » చెమట పట్టకపోవడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం » వణుకు పుట్టడం. మగత నిద్ర లేదా కలవరింత. »ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మారక స్థితి కలగడం. » శరీరంలో ఎక్కువ వేడి ఉత్పత్తి కావడం. శరీరం ఉష్ణాన్ని కోల్పోవడం జరుగుతుంది. శరీరంలో కలిగే మార్పులు... » వేడి వల్ల చెమట పట్టి శరీరంలోని లవణాలు (సోడియం క్లోరైడ్) తగ్గిపోతుంది. లేదా శరీరంలోని నీటి నిష్పత్తి తగ్గుతుంది. » ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశాల్లో శ్రమతో కూడిన పని చేస్తున్నప్పుడు ప్రతి గంటకు 3–4 లీటర్ల నీటిని చెమట రూపంలో శరీరం కోల్పోతుంది. అధికంగా అనారోగ్యానికి గురయ్యేవారు ఎవరంటే.... 65 ఏళ్ల వయస్సు పైబడిన వారు. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, పసిపిల్లలు » అనారోగ్యంతో బాధపడుతున్న వారు. ఉదాహరణకు అధిక రక్తపోటు, గుండె జబ్బులు కలిగిన తదితరులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది.ప్రథమ చికిత్స ఇలా... » వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ గల ప్రదేశానికి చేర్చాలి. » చల్లని నీటితో ముంచిన తడి గుడ్డతో ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చే వరకు తడి గుడ్డతో తుడవాలి. ఫ్యాను గాలి, చల్లని గాలి తగిలేలా ఉంచాలి. » ఉప్పు కలిపిన మజ్జిగ లేదా చిటికెడు ఉప్పు కలిపిన గ్లూకోజు ద్రావణం లేదా ఓఆర్ఎస్ (ఓరల్ రీ హై డ్రేషన్) ద్రావణాన్ని తాగించాలి. » వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలో ఉన్న రోగికి నీరు తాగించకూడదు. వీలైనంత త్వరగా వైద్యుడి వద్దకు తీసుకుపోవాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు» తలకు టోపీ, రుమాలు వాడాలి. వేడిగాలి తగలకుండా చూసుకోవాలి. » గొడుగు వాడాలి. తెలుపు రంగు, పలచటి చేనేత వస్త్రాలను ధరించాలి. » ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య కాలంలో ఆరు బయట అధిక శారీరక శ్రమతో కూడిన పని చేయకుండా ఉండాలి. » శీతల పానీయాలు, మంచు ముక్కలు తీసుకుంటే గొంతుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. » ఇంటి నుంచి బైటకు వెళ్లే ముందు ఒక గ్లాసు మంచి నీరుతాగాలి. వీలైనన్ని సార్లు మంచి నీటిని తాగడం మంచిది. » ఎండలో తిరిగే సమయంలో చల్లని నిమ్మరసం, కొబ్బరి నీరు, చల్లని మంచి నీరు తాగాలి » తీవ్రమైన ఎండలో బయటికి వెళ్లినప్పుడు తల తిరగిడం తదితర అనారోగ్య సమస్యలు తలెత్తితే తక్షణం వైద్యులను సంప్రదించాలి. కిడ్నీలపై డీహైడ్రేషన్ ప్రభావం వేసవి కాలంలో డీహైడ్రేషన్ కారణంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడుతా యి. ఇన్ఫెక్షన్లు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సీజన్లో కిడ్నీలను కాపాడుకోవాలంటే ఒక రోజుకు 3 లీటర్ల నీరు తాగాలి. ఆహారంలో ఉప్పు ను తగ్గించాలి. –డాక్టర్ దినేష్కుమార్రెడ్డి, మూత్రపిండాల వైద్య నిపుణులు, కడప. -
ఇంటర్ ఫలితాల్లో మెరిసిన బాలికలు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్ పరీక్షల్లో బాలికలే పైచేయి సాధించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23 నుంచి మార్చి 25 వరకు జరిగిన పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా జనరల్, ఒకేషనల్ కలిపి 10,57,312 మందికి గాను 10,15,916 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో 7,21,342 మంది జనరల్, 48,720 మంది ఒకేషనల్ కలిపి మొత్తం 7,70,062 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో రెండో ఏడాది విద్యార్థులు 3,84,967 మంది(81 శాతం).. మొదటి ఏడాదిలో 3,85,095 మంది(77 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలితాలను విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం ‘ఎక్స్’లో విడుదల చేశారు. ఉత్తీర్ణత శాతం మొదటి ఏడాదిలో పెరగ్గా.. రెండో ఏడాదిలో తగ్గింది. 2025 మార్చిలో జరిగిన పరీక్షల్లో మొదటి ఏడాది 70 శాతం, రెండో ఏడాది 83 శాతం మంది పాసయ్యారు. ఈసారి ఉత్తీర్ణత మొదటి ఏడాది 7 శాతం పెరిగితే, రెండో ఏడాది 2 శాతం తగ్గింది. బాలికలదే హవా.. ఫలితాల్లో బాలికలే అత్యధిక ప్రతిభ కనబరిచారు. రెండో ఏడాదిలో 85 శాతం, మొదటి ఏడాదిలో 81 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. బాలురు రెండో ఏడాది 76 శాతం, మొదటి ఏడాదిలో 72 శాతం మంది పాస్ అయ్యారు. ఒకేషనల్ విభాగంలోనూ బాలికలు మొదటి ఏడాది 71 శాతం, రెండో ఏడాది 83 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. బాలురు మొదటి ఏడాది 49 శాతం, రెండో ఏడాది 62 శాతం మందే పాస్ అయ్యారు. ఒకేషనల్ పరీక్షలకు మొదటి ఏడాది 38,443 మంది హాజరవ్వగా.. 23,569 మంది ఉత్తీర్ణులయ్యారు. రెండో ఏడాదిలో 33,852 మందికి గాను 25,151 మంది విజయం సాధించారు. టాప్లో కృష్ణా, గుంటూరు ఇంటర్ ఫలితాల్లో కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం జిల్లాలు టాప్లో నిలిచాయి. మొదటి ఏడాది ఫలితాల్లో కృష్ణా 90 శాతం, గుంటూరు 88 శాతం, విశాఖపట్నం 85 శాతంతో మొదటి మూడుస్థానాల్లో ఉన్నాయి. రెండో ఏడాదికి సంబంధించి కృష్ణా 92 శాతం, గుంటూరు 88 శాతం, ఎన్టీఆర్ జిల్లా 87 శాతంతో తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. ఇంటర్ మొదటి, రెండో ఏడాదికి సంబంధించి చివరి స్థానంలో అన్నమయ్య జిల్లా ఉంది. 27 వరకు రీకౌంటింగ్కు అవకాశం ఇంటర్ ఫలితాల్లో అభ్యంతరాలు ఉంటే ఈనెల 20 నుంచి 27 వరకు రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్కు దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు కార్యదర్శి రంజిత్ బాషా తెలిపారు. రీ వెరిఫికేషన్ జవాబు పత్రానికి రూ.1,300, రీ కౌంటింగ్ కోసం జవాబు పత్రానికి రూ.260 చొప్పున చెల్లించాలని సూచించారు. ఇంటర్లో కేజీబీవీల ఉత్తమ ఫలితాలుసాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల (ఐపీఈ–2026) ఫలితాల్లో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు(కేజీబీవీ) గణనీయమైన ప్రగతి సాధించాయి. రాష్ట్రంలోని 352 కేజీబీవీల నుంచి మొదటి సంవత్సరంలో 9,367 మంది విద్యార్థినులు పరీక్షలు రాయగా.. 7,904 మంది (84 శాతం) ఉత్తీర్ణత సాధించారు. గతేడాది కంటే 15 శాతం పెరిగింది. ఈ ఉత్తీర్ణత రాష్ట్ర బాలికల సగటు 77%తో పోలిస్తే 7 అధికం. ద్వితీయ సంవత్సరంలో 8,073 మంది బాలికలు పరీక్షలు రాయగా.. 7,022 మంది (87 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాలు రాష్ట్ర సగటు ఉత్తీర్ణత (81%) కంటే మెరుగ్గా నమోదైంది. యాజమాన్యాల వారీగా చూస్తే కేజీబీవీలు గతేడాది 6వ స్థానం ఉండగా, ఈసారి 5వ స్థానానికి పెరిగింది. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రాష్ట్ర సగటుతో పోలిస్తే కేజీబీవీ విద్యార్థినులు అత్యుత్తమ ఉత్తీర్ణత శాతాన్ని సాధించారని ప్రశంసించారు. విద్యార్థినులు, కేజీబీవీ కార్యదర్శి డి.దేవానందరెడ్డి, ఇతర సిబ్బందిని అభినందించారు. విద్యార్థినుల ఉత్తీర్ణత శాతం పెంచడానికి రూపొందించిన ‘విజయపథం’ శిక్షణ ఫలితాలు సాధనకు ఉపకరించిందని దేవానందరెడ్డి పేర్కొన్నారు. మే 21 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలుఈనెల 20 నుంచి 27 వరకు ఫీజుల చెల్లింపునకు అవకాశంసాక్షి, అమరావతి: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ బుధవారం విడుదలైంది. మే 21 నుంచి జూన్ 4 వరకు మొదటి ఏడాది ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, రెండో ఏడాదికి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు రంజిత్ బాషా తెలిపారు. ఈనెల 20 నుంచి 27 వరకు ఫీజు చెల్లించవచ్చని సూచించారు. మొదటి ఏడాది అన్ని పేపర్లకు రూ.600, ప్రాక్టికల్స్కు రూ.275, బ్రిడ్జి కోర్సులకు రూ.165, ఒకేషనల్ బ్రిడ్జి కోర్సుకు రూ.275 చెల్లించాలన్నారు. మొదటి, రెండో ఏడాదికి కలిపి అన్ని పేపర్ల కోసం రూ.1,200, ఒకేషనల్ ప్రాక్టికల్స్కు రూ.550, బ్రిడ్జి కోర్సులకు రూ.330 చెల్లించాలని సూచించారు. ఇంటర్ రెండేళ్లు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు బెటర్మెంట్ రాయాలనుకుంటే ఆర్ట్స్ సబ్జెక్టులకు రూ.1,350, సైన్స్ సబ్జెక్టులకు రూ.1,600 చెల్లించాలని స్పష్టం చేశారు. జూన్ 7 నుంచి ప్రాక్టికల్స్.. ఎథిక్స్, మానవ విలువల పరీక్ష జూన్ 5న, పర్యావరణ విద్య పరీక్ష జూన్ 6న ఉదయం 10 నుంచి మధ్యాహ్న ఒంటి గంట వరకు జరుగుతాయి. ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 7 నుంచి 11 వరకు నిర్వహిస్తారు. జనరల్, ఒకేషనల్ కోర్సులకు రెండు సెషన్లలో అంటే ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరుగుతాయి. -
రెడ్ బుక్ అరాచకం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ రెడ్బుక్ అరాచకం వెర్రితలలు వేస్తోంది. రాజ్యాంగ హక్కుల హననం యథేచ్ఛగా కొనసాగుతోంది. ఏకంగా సుప్రీంకోర్టు తీర్పు, మార్గదర్శకాలనే కాలరాస్తూ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులతో విరుచుకుపడుతోంది. ఈ 20 నెలల్లో ఇప్పటికే 270కుపైగా సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసుల్లో దాదాపు 100మందిని అక్రమంగా అరెస్టులకు తెగబడింది. ఆ క్రమంలోనే ఈసారి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి(మీడియా) పూడి శ్రీహరిని పోలీసులు లక్ష్యంగా చేసుకున్నారు. చిత్తూరుజిల్లా కుప్పం పోలీసులు మఫ్టీలో వచ్చి గుంటూరు జిల్లా తాడేపల్లిలో బుధవారం ఉదయాన్నే శ్రీహరిని అపహరించుకుపోయారు. తక్షణం స్పందించిన వైఎస్సార్సీపీ న్యాయపోరాటానికి ఉపక్రమించి పోలీసుల కుట్రకు సమర్థంగా అడ్డుకట్ట వేసింది. అయినా సరే పోలీసులు శ్రీహరిని బుధవారం అర్ధరాత్రి దాటినా న్యాయమూర్తి ఎదుట హాజరుపరచకుండా అక్రమంగా నిర్బంధించి వేధిస్తుండటం చంద్రబాబు ప్రభుత్వ మార్కు బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తోంది. సీఎంవో, డీజీపీ కార్యాలయం కనుసన్నల్లోనే... ముఖ్యమంత్రి కార్యాలయం, డీజీపీ కార్యాలయం స్థాయిలోనే పక్కాగా పన్నాగం పన్నారు. అందులో భాగంగానే ఓ సోషల్ మీడియా పోస్టుపై కుప్పం టీడీపీ నేత వినోద్ కుమార్ మూర్తితో ఫిర్యాదు ఇప్పించారు. ఆ వెంటనే అనంతపురం జిల్లా రాప్తాడులోని సోషల్ మీడియా కార్యకర్త గిరీష్ కుమార్ రెడ్డిని మంగళవారం అక్రమంగా అరెస్టు చేశారు. ఆ వెంటనే వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి( మీడియా) పూడి శ్రీహరిని పోలీసులు లక్ష్యంగా చేసుకున్నారు. అందుకోసం కుప్పం పోలీసులు మఫ్టీలో మంగళవారం రాత్రే తాడేపల్లి చేరుకున్నారు. శ్రీహరి నివాసం వద్ద రెక్కీ నిర్వహించారు. బుధవారం ఉదయం 8గంటల ప్రాంతంలో శ్రీహరిని అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. మఫ్టీలో ఉన్నవారు పోలీసులో.. ఎవరైనా అసాంఘిక శక్తులో కూడా అంతుబట్ట లేదు. ‘అసలు ఏ కేసులో అదుపులోకి తీసుకుంటున్నారు... సోషల్ మీడియా పోస్టుతో నాకేం సంబంధం... నా సోషల్ మీడియా ఖాతా నుంచి ఎటువంటి పోస్టు పెట్ట లేదు కదా.. అసలు బీఎన్ఎస్ 35(3) కింద నోటీసులు ఇవ్వాలి కదా’అని శ్రీహరి పోలీసులను అడిగినా సరే పోలీసులు బలవంతంగా వారి వాహనంలోకి ఎక్కించి తీసుకుపోయారు. ఆయన ఫోన్, ల్యాప్టాప్ను స్వాదీనం చేసుకున్నారు. శ్రీహరిని అక్రమంగా నిర్బంధించి తరలిస్తున్న పోలీసు వాహనాన్ని ఆయన వ్యక్తిగత సహాయకుడు సింహాచలం నాయుడు కొద్ది దూరం అనుసరించారు. కానీ పోలీసులు ఆయన్ని బలవంతంగా వెనక్కి పంపించి వేశారు. అనంతరం మరో బృందం పోలీసులు శ్రీహరి నివాసంలో దాదాపు 3గంటల పాటు సోదాలు చేసింది. ఆయన నివాసంలో పలు రికార్డులు, ఇతర వస్తువులను స్వా«దీనం చేసుకున్నారు. బెడిసికొట్టిన కుట్ర... గిరీశ్కు బెయిల్ మంజూరు సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా పోలీసులు తెగబడ్డ అక్రమ అరెస్టును న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసిన గిరీశ్ కుమార్ రెడ్డిని పోలీసులు బుధవారం సాయంత్రం కుప్పం న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఆయనకు రిమాండ్ విధించాలని పోలీసుల తరపు న్యాయవాదులు కోరారు. కాగా సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా పోలీసులు అక్రమ అరెస్టు చేశారని నిందితుల తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి న్యాయస్థానానికి నివేదించారు. బీఎన్ఎస్ 111 సెక్షన్ కింద కేసు నమోదు చేయడం అక్రమమని వాదనలు వినిపించారు. సోషల్ మీడియా పోస్టులపై నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. గిరీశ్కు వ్యక్తిగత పూచీకత్తు మీద బెయిల్ మంజూరు చేసింది. సోషల్ మీడియా పోస్టులపై బీఎన్ఎస్ 111 సెక్షన్ కింద కేసు నమోదు చేయడం ఏమిటని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యవస్థీకృత నేరాలకు సంబంధించిన కేసుల్లో నమోదు చేయాల్సిన బీఎన్ఎస్ 111 సెక్షన్ సోషల్ మీడియా కేసులకు వర్తించదని తేల్చి చెప్పింది. ఈ కేసులో ఏ1 గా పేర్కొన్న గిరీశ్ కుమార్ రెడ్డికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో పోలీసుల కుట్ర బెడిసికొట్టింది. శ్రీహరిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిస్తే బెయిల్ మంజూరు అవుతుందని పోలీసులకు స్పష్టమైంది. అందుకే కుప్పం పోలీస్ స్టేషన్లోనే విచారణ పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారు. సాయంత్రం 6గంటలకు పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చిన శ్రీహరిని అర్ధరాత్రి వరకు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచలేదు. శ్రీహరితో మాట్లాడేందుకు ఆయన తరపు న్యాయవాదులను కూడా పోలీసులు అనుమతించలేదు.హెబియస్ కార్పస్ పిటిషన్తో... కిడ్నాప్ పన్నాగానికి తెర...శ్రీహరి అరెస్టుతో అప్రమత్తమైన వైఎస్సార్సీపీ న్యాయ విభాగం వెంటనే హైకోర్టును ఆశ్రయించింది. శ్రీహరి ఆచూకీ తెలియజేయాలని పోలీసులను ఆదేశించాలని కోరుతూ బుధవారం హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసును గురువారం విచారిస్తామని హైకోర్టు తెలిపింది. దాంతో పోలీసులు విధి లేని పరిస్థితుల్లో పూడి శ్రీహరిని సాయంత్రం 6 గంటలకు కుప్పం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కేసులో గిరీశ్ కుమార్ రెడ్డిని అరెస్టు చేసినట్టు ప్రకటించి కుప్పం న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఎఫ్ఐఆర్ నమోదులోనూ పోలీసులు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించారు. సోషల్ మీడియా పోస్టులపై బీఎన్ఎస్ 111 కింద కేసులు నమోదు చేయవద్దని హైకోర్టు, సుప్రీంకోర్టు ఇప్పటికే పలు సార్లు స్పష్టం చేశాయి. వ్యవస్థీకృత నేరాల కేసుల్లో నమోదు చేయాల్సిన బీఎన్ఎస్ 111 సెక్షన్ను సోషల్ మీడియా పోస్టులకు వర్తింపజేయడం చెల్లదని తేల్చి చెప్పాయి. అయినా సరే కుప్పం పోలీసులు బీఎన్ఎస్ 111 తోపాటు 196(1)ఎ, 352(2), 336(1), 340(2), 61(2) సెక్షన్లు, ఐటీ చట్టం 67 కింద కేసు నమోదు చేయడం విస్మయపరుస్తోంది. ఈ కేసులో గిరీశ్ కుమార్ రెడ్డిని ఏ1గా, పూడి శ్రీహరిని ఏ2గా పేర్కొన్నారు. -
వెర్రితలలు వేస్తున్న టీడీపీ సోషల్ మీడియా
సాక్షి, అమరావతి : వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగంపై అక్రమ కేసులతో రెడ్బుక్ వేధింపులకు పాల్పడుతున్న పోలీసులు ... టీడీపీ సోషల్ మీడియా విభాగం బరితెగించి సాగిస్తున్న దుష్ప్రచారం, వ్యక్తిత్వ హనన పోస్టులపై మాత్రం చోద్యం చూస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా పోస్టులతో వ్యక్తిత్వ హననానికి పాల్పడే దు్రష్పచారానికి టీడీపీ సోషల్ మీడియా 2014లోనే తెరతీసింది. అప్పటి నుంచి అసభ్యకర, జుగుప్సాకర పోస్టులతో బరితెగించడమే పనిగా పెట్టుకుంది. ఇక 2014లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ సోషల్ మీడియా విభాగం విశ్వంఖలత్వం వెర్రితలలు వేస్తోంది. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు, టీడీపీ నేతల జుగుప్సాకర వ్యాఖ్యలతో పోస్టులను సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ చేస్తోంది. అది కూడా టీడీపీ అధికారిక వెబ్ సైట్ ద్వారానే ఈ విష ప్రచారం సాగిస్తుండటం గమనార్హం. వైఎస్ జగన్ చేతిలో గొడ్డలి, ఇతర ఆయుధాలు పెట్టినట్టుగా మార్ఫింగ్ ఫొటోలతో టీడీపీ అధికారిక వెబ్సైట్లో పుంఖానుపుంఖాలుగా పోస్టులు పెడుతున్నారు. మహిళలు, చిన్నారులను కూడా కించపరుస్తూ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ పోస్టులు పెడుతుండటం టీడీపీ బరితెగింపునకు నిదర్శనం. వాటిని టీడీపీ సోషల్ మీడియా విభాగాలు, ఆ పార్టీ కార్యకర్తలు పక్కా పన్నాగంతో వివిధ సోషల్ మీడియా వేదికల ద్వారా వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులను కట్డడి చేయాలన్న హైకోర్టు ఆదేశాలు టీడీపీ నేతలకు వర్తించవన్నట్టుగా పోలీసు శాఖ వ్యవహరిస్తోంది. అందుకే టీడీపీ సోషల్ మీడియా విభాగం విష ప్రచారాన్ని కట్టడి చేసేందుకు ఏమాత్రం యత్నించడమే లేదు. టీడీపీ సోషల్ మీడియా విభాగం చేస్తున్న అసభ్యకర, అభ్యంతరకర పోస్టులను ప్రశ్నిస్తూ...నిలదీస్తూ వైఎస్సార్సీపీ పోస్టులు పెడితే మాత్రం పోలీసులు అక్రమ కేసులతో వేధిస్తుండటం గమనార్హం. పోలీసులు టీడీపీ సోషల్ మీడియా సైకో కార్యకర్తలుగా వ్యవహరిస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది. ఇక డీజీపీ కార్యాలయం టీడీపీ కార్యాలయంగా రూపాంతరం చెందిందా అన్న రీతిలో వ్యవహరిస్తోంది. -
నేటి నుంచి జనగణన
సాక్షి, అమరావతి: జనాభా గణన–2027 ప్రక్రియ రాష్ట్రంలో గురువారం నుంచి ప్రారంభమవుతుందని రాష్ట్ర జనాభా గణన డైరెక్టర్ జె.నివాస్ తెలిపారు. తొలి దశగా ఇళ్ల జాబితా, ఇళ్ల గణనతోపాటు స్వీయ గణన మొదలవుతుందని చెప్పారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జనాభా గణన–2027 ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ప్రజలు తమ వివరాలను స్వయంగా గణన యాప్లో నమోదు చేసేందుకు గురువారం నుంచి ఈ నెలాఖరు వరకు అవకాశం కల్పించినట్లు ఆయన చెప్పారు. ఇళ్ల జాబితా, ఇళ్ల గణన మే 1 నుంచి 30వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. స్వీయ గణన అనేది మంచి విధానమని, ప్రజలు తమ వివరాలను సరిగా నమోదు చేశామనే విశ్వాసం పొందుతారన్నారు. స్వీయ గణన అనంతరం జనాభా గణన సిబ్బంది కూడా ప్రజలు సరిగా నమోదు చేశారా? లేదా ? అని పరిశీలన చేస్తారన్నారు. దీనివల్ల జనాభా గణన సిబ్బంది పని సులభమవుతుందన్నారు.జనాభా గణనకు 1.10 లక్షల మంది ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లు జనాభా గణనకు 1.10 లక్షల మంది ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లను వినియోగిస్తామని నివాస్ చెప్పారు. జనాభా గణన సిబ్బంది 80 శాతం మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులే ఉంటారని తెలిపారు. జనాభా గణనకు వచ్చే సిబ్బందికి ప్రజలు సహకరించాలని, వాస్తవ సమాచారం ఇవ్వాలని కోరారు. జనాభా గణన సిబ్బందికి ఆటంకాలు కల్పిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. 2027 ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు ఉన్న జనాభా ఆధారంగా జనగణన జరుగుతుందన్నారు. 2011లో చివరి జనగణన నిర్వహించగా, 2027లో జరగబోయేది 16వదని, స్వాతంత్య్రం వచ్చాక ఎనిమిదో విడత అని వివరించారు.స్వీయ గణన ఇలా...» ప్రజలు https://se.census.gov.in పోర్టల్లో తమ మొబైల్ నంబర్తో లాగిన్ అయ్యి, ఇంటిని జియో–ట్యాగ్ చేసి వివరాలు నమోదు చేయాలి. అది పూర్తయిన తర్వాత ఒక ప్రత్యేకమైన స్వీయ గణన ఐడీ జనరేట్ అవుతుంది. ఈ ఐడీని ఎన్యూమరేటర్కు అందజేసి క్షేత్రస్థాయి తనిఖీ సమయంలో ధ్రువీకరించాల్సి ఉంటుంది.» వాటికి అదనంగా తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, వంట ఇంధనం, స్నాన సౌకర్యం, వంటగది వంటి సౌకర్యాలు నమోదు చేయాల్సి ఉంటుంది. కుటుంబ ఆస్తులు (టీవీ, ఇంటర్నెట్, మొబైల్, వాహనాలు), ప్రధాన ఆహారం, మొబైల్ నంబర్ వంటి వివరాలు కూడా నమోదు చేయాలి. » జనాభా గణన సందర్భంగా విద్య, కులం వంటివాటి ధ్రువీకరణకు ఎటువంటి రుజువులు, పత్రాలు అడగరు. » జనాభా గణనకు ఆధార్ నంబర్తో సంబంధం లేదు. » జనాభా గణన వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహిస్తారు. ఆ సమయంలో కుల గణనకు కూడా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేస్తుంది.» ఇళ్ల జాబితా, ఇళ్ల గణన మే 1 నుంచి 30 వరకు కొనసాగుతుంది. ఇళ్ల జాబితా సేకరణలో భవనాలు, ఇళ్లకు నంబర్లు ఇస్తారు. గృహ జాబితా దశలో మొత్తం 33 ప్రశ్నలకు వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది. ఇందులో గృహ నిర్మాణ అంశాలు (ఫ్లోర్, గోడ, పైకప్పు), గృహ వినియోగం, గృహ స్థితి, కుటుంబ సభ్యుల సంఖ్య, కుటుంబ యజమాని వివరాలు, ఎస్సీ, ఎస్టీ సామాజిక స్థితి, గదుల సంఖ్య, నివాసం ఉంటున్న వివాహిత జంటలు వంటి అంశాలు ఉంటాయి. -
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఏకకాలంలో విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 77 శాతం ఉత్తీర్ణత, సెకండ్ ఇయర్లో 81 శాతం ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు తమ ఫలితాలను వేగంగా, సులభంగా చూసుకోవడానికి కింద లింక్ను ఉపయోగించగలరు. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10.50 లక్షల మంది విద్యార్థులు రాశారు.కాగా, మే 21 నుంచి జూన్ 4 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహణ జరగనుంది. జూన్ 7 నుంచి 11 వరకు ప్రాక్టికల్స్ జరుగుతాయి. ఈ నెల 20 నుంచి 27 వరకు రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
రాజకీయ రాబందు.. అవినీతి చంద్రిక
సాక్షి, అమరావతి: రావణుడి గుట్టు విభీషణుడికి తెలుసు అన్నట్టు.. తెలుగు రాజకీయ రావణుడు చంద్రబాబు గుట్టు, గూడుపుఠాణి అంతా ఆయన సొంత కుటుంబ సభ్యుల కంటే ఇంకెవరికి బాగా తెలుస్తుంది...! అందుకే చంద్రబాబు అవినీతి చరిత్ర, రాజకీయ కుట్రల గురించి ఆయనకు సొంత మామ ఎన్టీ రామారావు, తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎనాడో సవివరంగా వెల్లడించారు. 1995లో వైస్రాయ్ హోటల్ కుట్ర అనంతరం ఎన్టీ రామారావు ఆనాడు ఓ టీవీ చానల్ నిర్వహించిన చర్చా గోష్టిలో మాట్లాడుతూ చంద్రబాబు రాజకీయ నైచ్యాన్ని ఎండగట్టారు. చంద్రబాబును ఏకంగా ‘గొడ్డు కన్నా హీనం.. గాడ్సే కన్నా ఘోరం’అని దుయ్యబట్టారు. తెలుగు చరిత్రలో అభినవ ఔరంగజేబ్ అని తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇక చంద్రబాబు కుతంత్రాల చరిత్ర మాటలతో చెప్పడం సాధ్యం కాదని చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు భావించారు. అందుకే ‘ఒక చరిత్ర.. కొన్ని నిజాలు’ శీర్షికతో ఓ పుస్తకమే రాశారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు, అవినీతి గురించి సోదాహరణంగా ఎండగట్టారు. ఎన్టీ రామారావు ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో చంద్రబాబు గురించి చేసిన విమర్శలనూ ఆ పుస్తకంలోనే ప్రస్తావించారు. చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ఒక చరిత్ర – కొన్ని నిజాలు పుస్తకంలోని కొన్ని భాగాలు ఇవీ... ఒక చరిత్ర.. కొన్ని నిజాలు పుస్తకంలోని అంశాలు సంక్షిప్తంగా.. కాంగ్రెస్లో ఉండగానే అవినీతికి శ్రీకారంచంద్రబాబు కాంగ్రెస్ పారీ్టలో ఉండగానే అవినీతికి పాల్పడ్డారు. అసలు మంత్రి పదవి కోసమే చేయరాని పనులు చేశారు. మద్రాసులోని సవేరా హోటల్లో ఎన్నో చెప్పలేని, చేయరాని పనులు చేశారు. ఇక మంత్రి అయిన తరువాత అవినీతికి బరితెగించారు. ఆయనకు టార్చ్లైట్ మినిస్టర్ అని ఆనాడే ముద్ర వేశారు. అంటే రాత్రి వేళల్లో టార్చ్లైట్లతో పనులను తనిఖీ చేస్తున్నట్టు హడావుడి చేసి కాంట్రాక్టర్లను బెదిరించేవారు. అనంతరం వారి నుంచి భారీగా కమీషన్లు వసూలు చేసేవారు. ఎన్టీఆర్ గ్లామర్కు ఐదు శాతం ఓట్లు కూడా రావని ఎద్దేవా సీనీ రంగంలో ఉన్న ఎనీ్టరామారావు 1982లో టీడీపీని ఏర్పాటు చేసినప్పుడు చంద్రబాబు ఆయన్ని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఆయన తాను టీడీపీలో చేరనని ప్రకటించారు. అంతేకాదు ఎన్టీ రామారావు తిరుపతి నుంచి పోటీ చేస్తానని ప్రకటించగానే చంద్రబాబు ఆయన్ని ఎగతాళి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే సొంత మామ అయినా ఎన్టీ రామారావుపై పోటీ చేస్తానన్నారు. చంద్రబాబును టీడీపీలో చేరాలని కోరినప్పుడు ఎద్దేవా చేశారు. కాగితాలపై ఏవేవో లెక్కలు వేసి ఎన్టీ రామారావు సినీ గ్లామర్కు ఐదు శాతం ఓట్లు రాలవని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఎన్టీ రామారావు చేతి నుంచి పైసా కూడా తీయరని కూడా హేళన చేశారు. అటువంటి ఎన్టీ రామారావు పార్టీని నడపలేరని వ్యాఖ్యానించారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఆ పార్టీలో చేరిన చంద్రబాబు 1983 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచి్చంది. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యారు. సిట్టింగ్ మంత్రిగా ఉంటూ చంద్రగిరిలో పోటీ చేసిన చంద్రబాబూ ఓడిపోయారు. దాంతో ఆయన వెంటనే ప్లేటు ఫిరాయించారు. కాంగ్రెస్ పారీ్టకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతానన్నారు. చంద్రబాబును పారీ్టలో చేర్చుకోవడాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయినా సరే ఎన్టీ రామారావు పార్టీ నేతలను ఒప్పించి చంద్రబాబు టీడీపీలో చేరికకు సమ్మతించారు. టీడీపీలో చేరగానే వసూళ్ల పర్వం చంద్రబాబు టీడీపీలో చేరగానే తన నైజాన్ని చూపించారు. మహానాడు, ఇతర పార్టీ కార్యక్రమాల పేరిట రాష్ట్రంలో భారీగా వసూళ్లు మొదలుపెట్టారు. ఇవన్నీ ఎన్టీ రామారావుకు తెలియకుండానే చేసేవారు. వసూలు చేసిన నిధులను పార్టీ ఖాతాలో జమ చేసేవారు కూడా కాదు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ సందర్భంగా కొనుగోలు చేసే సామగ్రిలో కూడా చంద్రబాబు కమీషన్లు తీసుకునేవారు. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు వసూలు చేస్తూ టీడీపీలో అవినీతిని వ్యవస్థీకృతం చేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పనుల్లో చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారు. ఎనీ్టఆర్ కుటుంబ సభ్యులను అణచివేసిన చంద్రబాబు ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు టీడీపీలో రాజకీయంగా ఎదగకుండా చంద్రబాబు అణచివేశారు. హరికృష్ణను తన వారసుడిగా చేయాలని ఎన్టీ రామారావు భావించారు. దాంతో హరికృష్ణను పార్టీ కార్యక్రమాలకు చాకచక్యంగా దూరం చేశారు. ఇక టీడీపీ ఆవిర్భావం నుంచి పారీ్టలో ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయ ఎదుగదలను అడ్డుకునేందుకు కుట్రలకు పాల్పడ్డారు. 1986లో మదనపల్లి సభలో ఎన్టీ రామారావు బాలకృష్ణను తన వారసుడిగా ప్రకటించారు. దాంతో చంద్రబాబు ఎన్టీ రామారావుపై ఒత్తిడి తెచ్చి ఆ ప్రకటనకు ఆయనతోనే ఖండన ఇప్పించారు. బరితెగించి దోపిడీఎన్టీ రామారావు ప్రభుత్వ హయాంలో చంద్రబాబు యథేచ్చగా అవినీతికి పాల్పడ్డారు. మద్యం బాట్లింగ్ ప్లాంట్ల లైసెన్సుల వ్యవహారంలో చంద్రబాబు అవినీతి విస్మయపరిచింది. తమిళనాడుకు చెందిన పురుషోత్తం అనే కాంట్రాక్టరు ఉన్న తాజ్ బంజారా హోటల్కు తానే స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్లారు. ఆయన నుంచి రూ.3కోట్లను గోతం సంచులలో వేసుకుని తెచ్చుకున్నారు. ఆ విధంగా కాంట్రాక్టులు ఇప్పిస్తామని భారీగా కమీషన్లు తీసుకునే సంస్కృతి టీడీపీలోకి తెచి్చంది చంద్రబాబే. ఇక 1989 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ నేతలతో కుమ్మక్కయ్యారు. కమీషన్లు తీసుకుని కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతికి కొమ్ముకాశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు టెండర్లలో భారీ అవినీతి జరిగిందని ప్రతిపక్ష టీడీపీ శాసనసభలో నిలదీసింది. దాంతో ఆ ప్రాజెక్టు ఫైళ్లను ప్రతిపక్ష నేతలు స్పీకర్ కార్యాలయంలో పరిశీలించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ప్రతిపక్ష టీడీపీ తరపున చంద్రబాబు స్పీకర్ కార్యాలయంలో ఆ ఫైళ్లను పరిశీలించి అన్నీ సవ్యంగా ఉన్నాయని పత్రికలకు తెలిపారు. విషయం ఏమిటంటే... శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాంట్రాక్టర్లు పెద్ద మొత్తం చంద్రబాబుకు కమీషన్గా సమర్పించారు. ఆ విషయం తెలిసీ ఎన్టీ రామారావు చంద్రబాబుకు చెప్పరాని విధంగా చివాట్లు పెట్టారు. పార్టీని తాకట్టు పెడుతున్నారని ... అమ్మేస్తున్నారని కడిగిపారేశారు. వైస్రాయ్ కుట్ర.. ఎన్టీ రామారావుకు వెన్నుపోటు ఎన్టీఆర్ పై చెప్పులు వేసిన చంద్రబాబు మనుషులు1994లో టీడీపీ అఖండ మెజారీ్టతో అధికారంలోకి వచి్చనప్పటి నుంచి చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠంపై కన్నేశారు. 1995 ఆగస్టులో వైస్రాయ్ హోటల్ కుట్రకు తెరతీశారు. ఆ రోజు వైస్రాయ్ హోటల్కు వచ్చిన ఎన్టీ రామారావుపై చంద్రబాబు మనుషులు చెప్పులు విసిరారు. చంద్రబాబు చేసిన ద్రోహాన్ని తలచుకుంటూ మనోవేదనతో ఎన్టీ రామారావు మరణించారు. అనంతరం టీడీపీ సభ్యత్వ పుస్తకాలపై ఎన్టీ రామారావు బొమ్మలు తీయించి వేశారు. ‘ఇంకా ఎన్నాళ్లు ఎన్టీఆర్ బొమ్మ పట్టుకుని పాకులాడతాం... ఎనీ్టఆర్ బొమ్మ పోవాలి.. మన బొమ్మ రావాలి’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లూ పార్లమెంటులో ఎన్టీ రామారావు విగ్రహం పెట్టకుండా అడ్డుకున్నారు. అవినీతి చక్రవర్తి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు అవినీతి మరింత పెచ్చుమీరింది. ఏలేరు భూముల నష్టపరిహారం కుంభకోణం, లిక్కర్ అమ్మకాల్లో ముడుపులు, బిల్లీరావు ప్రమేయం ఐఎంజీ అనే బోగస్ సంస్థకు హైదరాబాద్లో వందల కోట్ల రూపాయలు విలువ చేసే వేయిఎకరాలను ఎకరా రూ.25 వేల చొప్పున కట్టబెట్టడం, ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తిదారుల నుంచి అధిక మొత్తంలో వసూళ్లు ఇలా బరితెగించి అవినీతికి పాల్పడ్డారు. ఎన్టీ రామారావు‘రాజ్యాధికారం కోసం తండ్రిని జైల్లో పెట్టిన, సోదరుడిని హత్య చేసిన ఔరంగజేబ్ వంటి వాడు చంద్రబాబు. తెలుగు జాతి చరిత్రలో అభినవ ఔరంగజేబ్ చంద్రబాబు. నాతోనే ఉంటూ పథకం ప్రకారం వెన్నుపోటు పొడిచాడు. గుండెల మీద తన్నాడు. చంద్రబాబు గొడ్డు కన్నా హీనం... గాడ్సే కన్నా ఘోరం. చంద్రబాబు దశమ గ్రహం. ఎమ్మెల్యేలు అందరికీ డబ్బులు ఇచ్చారు. ఆయన పేరు చెప్పడం లేదు. పేరు చెప్పడానికి కూడా అర్హుడు కాదు. దేవుడు కూడా క్షమించనంత ఘాతుకం చేశాడు చంద్రబాబు నాయుడు. ఇది జాతి, చరిత్ర ఎప్పటికీ విస్మరించదు. మీరే న్యాయ నిర్ణేతలు. -
‘ఉపాధి’ పనుల నిలిపివేత
సాక్షి టాస్క్ ఫోర్స్: వైఎస్సార్ జిల్లా చక్రాయపేట మండలం శివారు ప్రాంతమైన కల్లూరుపల్లె గ్రామం దిద్దుకుంట వాండ్లపల్లెలో టీడీపీ నేత ఆదేశాలతో ఉపాధి హామీ పనులు నిలిపివేయడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిద్దుకుంట వాండ్లపల్లెలో సుమారు 50 కుటుంబాల వారు ఎప్పటిలాగే మంగళవారం ఉదయం ఉపాధి పనులకు వెళ్లారు. ఆ సమయానికి అక్కడికి చేరుకున్న టెక్నికల్ అసిస్టెంట్ ‘మీకు పనులు లేవు... ఇళ్లకు వెళ్లిపోండని’ ఆదేశించారు.ఇదేమని అడిగితే ‘పనులు పెట్టొద్దన్నారు... అందుకే మీకు పనులు పెట్టేది లేదు’ అని తేల్చి చెప్పాడు. దీంతో గ్రామస్తులంతా ఏకమై వాదనకు దిగి... నిన్న పనులు ప్రారంభించి ఈ రోజు లేవంటే ఎలా అని నిలదీయడంతో... టీడీపీ నేత ఆదేశాలతోనే పనులు నిలిపేశామని టెక్నికల్ అసిస్టెంట్ బదులిచ్చాడు. దీంతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు తమకు పనులు కల్పించకపోతే ఎంత దూరమైనా వెళ్తామని... ఎవ్వరినీ వదలమని తేల్చిచెప్పారు. అధికారులు స్పందించి వెంటనే ఉపాధి పనులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ అభిమానులు కావడంతో... దిద్దుకుంట వాండ్లపల్లెలో నాలుగైదు ఇళ్లు మినహా మిగిలిన వారంతా వైఎస్సార్సీపీ అభిమానులు కావడంతో పచ్చ నేతకు కంటగింపుగా మారింది. ఎలాగైనా అక్కసు తీర్చుకోవాలని అనుకున్నదే తడవుగా అధికార బలాన్ని ప్రదర్శించి... ఆ ఊర్లో ఉపాధి పనులు నిలిపేయాలని అధికారులకు హుకుం జారీ చేశాడు. పచ్చ చొక్కాలు తొడుక్కున్న అధికారులు వెంటనే సదరు టీడీపీ నేత ఆదేశాలను అమలు చేశారు. అయితే ఊరి జనమంతా ఏకమై ఉపాధి సిబ్బందిపై ఎదురుతిరగడంతోపాటు... ‘ఈ ఊర్లోనే ఉపాధి పనులు ఎందుకు పెట్టరు’ అని నిలదీయడంతో సిబ్బంది కంగుతిన్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి. -
బీద వెన్నుబోట్లకు సాక్ష్యం ఇదిగో
సాక్షి, అమరావతి: నిబంధనలకు విరుద్ధంగా మన రాష్ట్ర సరిహద్దు సముద్ర జలాలను దాటి వచ్చిన తమిళనాడు బోట్లను నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వద్ద మత్స్యకారులు ప్రాణాలకు తెగించి పట్టుకుంటే... స్వార్థం కోసం వాటిని రాత్రికి రాత్రే మాయం చేసిన ఘనులు కూటమి నేతలేనని తేలిపోయింది. ముఖ్యంగా ఈ వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఇన్నాళ్లూ బుకాయించిన టీడీపీ ఎంపీ బీద మస్తాన్ రావు అసలు సూత్రధారి అని స్పష్టమైంది. బోట్ల మాయం వ్యవహారంలో నిందితులుగా ఉన్న వారితో ఎంపీ స్వయంగా మాట్లాడారు.ఇతర రాష్ట్రానికి చెందిన నిందితులతో బీద అనుచరులు ఫోన్లో సంప్రదింపులు జరిపారు. వీరే బోట్లు వదిలేశారనే విషయం ఫోన్ ‘కాల్ రికార్డ్స్ డేటా’ ఆధారంగా బయటపడింది. ఇతర రాష్ట్రాల వారు ఏపీ పరిధిలోకి వచ్చి తమ పొట్టగొడుతున్నారని, న్యాయం చేయాలని స్థానిక మత్స్యకారులు వేడుకుంటే, వారిని ఏమార్చి, వారి నాయకులను కొనేసి, ఎంపీ తన అనుచరుల సాయంతో తమిళనాడుకు చెందిన నాలుగు బోట్లను దొంగచాటుగా విడిపించి పంపించేసిన బాగోతానికి తిరుగులేని సాక్ష్యంగా కాల్ డేటా వెలుగులోకి వచ్చింది. బీదా... ఇప్పుడేమంటారు? బోట్ల వివాదంలో మత్స్యకారులు తమకు న్యాయం చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వదిలేసిన బోట్లను వెనక్కు రప్పించాలని అడుగుతున్నారు. అలాగే వాటిని వదిలేసిన వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఫోన్ కాల్ డేటా సంచలన విషయాలను వెల్లడించింది. బీద మస్తాన్రావుతోపాటు ఆయన అనుచరులు సైతం బోట్ల మాయం వ్యవహారంలో నిందితులతోనూ, బోట్ల యజమానులతోనూ మాట్లాడినట్లు కాల్ డేటా బయటపెట్టింది. ⇒ ఎంపీ బీద మస్తాన్ అనుచరుడు, బోట్ల వ్యవహారంలో నిందితుడైన కొండూరు పోలిశెట్టి అనే పాతపాళెంకు చెందిన వ్యక్తి తమిళనాడు మత్స్యకారులు తీసుకువెళ్లిన బోట్ల యజమాని అశోక్తో ఫోన్లో గతేడాది డిసెంబర్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 16 వరకూ దాదాపు 77 సార్లు మాట్లాడారు. ఇందులో ఒకసారి పోలిశెట్టి ఫోన్ చేస్తే మరోసారి అశోక్ చేశారు. ఇలా ఇద్దరూ మూడు నెలల పాటు మాట్లాడుకున్నారు. ⇒ అదే విధంగా బోట్ల మాయం వ్యవహారంలో నిందితుడిగా ఉన్న అల్లూరు మండలం ఇసుకపల్లిపాలెం గ్రామానికి తోటయ్య అనే వ్యక్తితో బీద మస్తాన్ అనుచరుడైన పోలిశెట్టి అదే డిసెంబర్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 9 వరకూ 19 సార్లు ఫోన్ చేసి సంప్రదింపులు జరిపినట్లు ఫోన్ కాల్ డేటాలో స్పష్టంగా కనిపిస్తోంది. ⇒ ఇక తోటయ్య సైతం బోట్ల యజమాని అశోక్తో మాట్లాడారు. అది కూడా గతేడాది డిసెంబర్ 1 నుంచే మొదలైంది. దాదాపు 46 సార్లు వీరిద్దరూ ఫోన్లో సంప్రదింపులు జరుపుకున్నారు. ⇒ అన్నిటికంటే ముఖ్యంగా తోటయ్య ఎంపీ బీద మస్తాన్రావుతోనూ ఫోన్లో మాట్లాడినట్లు బయటపడింది. గతేడాది అక్టోబర్ 30, నవంబర్ 8, డిసెంబర్ 31, ఈ ఏడాది జనవరి 15, ఫిబ్రవరి 28 తేదీల్లో ఎంపీకి ఫోన్ చేసి తోటయ్య అన్ని విషయాలనూ అప్ డేట్ చేస్తూ వచ్చారు. -
నేడు ఇంటర్ ఫలితాలు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్ మొదటి, రెండో ఏడాది ఫలితాలను బుధవారం విడుదల చేయనున్నట్టు బోర్డు మంగళవారం తెలిపింది. ఉదయం 10.31 గంటలకు https://resultsbie.ap.gov.in/ లేదా మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా ఫలితాలు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. విద్యార్థులు sakshieducation.comలో కూడా ఫలితాలు చూసుకోవచ్చు. -
టీడీఆర్ బాండ్లే తీసుకోవాలని బలవంతం చేయొద్దు
సాక్షి, అమరావతి: భూ సేకరణ చట్టం కింద భూమి తీసుకున్నప్పుడు చట్ట ప్రకారం చెల్లించాల్సిన పరిహారాన్ని ఇవ్వకుండా టీడీఆర్ బాండ్లు తీసుకోవాలని బలవంతం చేయడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చి చెప్పింది. టీడీఆర్ బాండ్లు తీసుకోవడానికి భూ యజమానులు నిరాకరిస్తే చట్టం నిర్దేశించిన మేరకు పరిహారం చెల్లించడం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేసింది. పరిహారానికి బదులు టీడీఆర్ బాండ్లు తీసుకోవడం తప్పనిసరి కాదంది. టీడీఆర్ బాండ్లు తీసుకోవడమన్నది కేవలం ఐచ్ఛికం మాత్రమేనని పేర్కొంది. తీసుకున్న భూమికి చట్ట ప్రకారం పరిహారం చెల్లించకుండా టీడీఆర్ బాండ్లు తీసుకోవాలని భూ యజమానులను ఒంగోలు మున్సిపల్ అధికారులు బలవంతం చేయడాన్ని తప్పుపట్టింది. బాండ్లు తీసుకునేందుకు భూ యజమానులు నిరాకరించారని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో వారికి చట్ట ప్రకారం పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఇటీవల తీర్పు వెలువరించారు.బెదిరింపులకు దిగటంతో హైకోర్టును ఆశ్రయించిన బాధితులుఒంగోలు మున్సిపల్ అధికారులు జేఎంబీ చర్చి సెంటర్ నుంచి ఓల్డ్ మార్కెట్ వరకు రోడ్డు విస్తరణ చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం కొన్ని ఆస్తులను సేకరించాలని నిర్ణయించారు. అందులో భాగంగా పలువురికి నోటీసులు జారీ చేశారు. టీడీఆర్ బాండ్లు లేదా పరిహారానికి ఆమోదం తెలిపాలని సదరు భూ యజమానులను కోరారు. అయితే, భూ యజమానులు టీడీఆర్ బాండ్లు తీసుకునేందుకు నిరాకరించారు. తమకు చట్ట ప్రకారం పరిహారం చెల్లించాలని కోరారు. దీంతో ఒంగోలు పురపాలక శాఖ అధికారులు టీడీఆర్ బాండ్లు తీసుకోవాల్సిందేనని, లేనిపక్షంలో ఇల్లు కూల్చేస్తామంటూ మౌఖికంగా బెదిరింపులకు దిగారు. దీంతో భూ యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. టీడీఆర్ బాండ్లు కాకుండా తమకు చట్ట ప్రకారం పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది షేక్ ఆసిఫ్ వాదనలు వినిపిస్తూ.. టీడీఆర్ బాండ్లు తీసుకోవాల్సిందేనని పిటిషనర్లను అధికారులు బలవంతం చేస్తున్నారని తెలిపారు. చట్ట ప్రకారం పరిహారం చెల్లించకుండా ఎగవేసేందుకే అధికారులు టీడీఆర్ బాండ్లను తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని వివరించారు.బలవంతంగా రుద్దడానికి వీల్లేదువాదనలు విన్న న్యాయమూర్తి అధికారుల తీరును తప్పుపట్టారు. బాధితులపై టీడీఆర్ బాండ్లను బలవంతంగా రుద్దడానికి వీల్లేదని స్పష్టం చేశారు. బాధితులైన భూ యజమానులు టీడీఆర్ బాండ్లను తిరస్కరిస్తే 2013 భూ సేకరణ చట్టం కింద పరిహారం చెల్లించడం మినహా ప్రభుత్వానికి మరో ప్రత్యామ్నాయం లేదని తేల్చి చెప్పారు. పిటిషనర్కు 2013 చట్ట ప్రకారం మార్కెట్ ధరను ఖరారు చేసి అందుకు అనుగుణంగా పరిహారాన్ని చెల్లించాలని ఒంగోలు మున్సిపల్ అధికారులను ఆదేశించారు. -
గంగపుత్రులకు వెన్నుదన్నుగా
సాక్షి, అమరావతి: వేటకు వెళ్తేగానీ పూట గడవని గంగపుత్రులకు వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలిచిందని మత్స్యకారులు గుర్తు చేసుకుంటున్నారు. వైఎస్సార్ చేయూత, ఆసరా, జగనన్న ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణం.. ఇలా ప్రతి సంక్షేమ పథకం ద్వారా గత ప్రభుత్వంలో తాము లబ్ధి పొందామని పేర్కొంటున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఏటా క్రమం తప్పకుండా అందించిన వేట నిషేధ భృతి (మత్స్యకార భరోసా), ఆయిల్ సబ్సిడీ పెంపుతో వేటకు వెళ్లే బోట్ల సంఖ్య, వేటపై ఆధారపడి జీవనోపాధి పొందిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఐదేళ్లు క్రమం తప్పకుండా.. ఎన్నికల హామీ మేరకు 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చీ రాగానే మత్స్యకారులకు వేట నిషేధ భృతిని రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంచడమే కాదు.. ఆరంభంలోనే నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. కరోనా లాంటి విపత్కర సమయంలో కూడా నిషేధ భృతిని అందించి వారికి అండగా నిలిచారు. మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లకే కాదు.. తెప్పలు, ఇతర సంప్రదాయ పడవలపై వేట సాగించే వారికి సైతం సాయాన్ని అందజేసిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానికే దక్కింది.2014–19 మధ్య చంద్రబాబు హయాంలో ఏటా సగటున 60 వేల మంది మాత్రమే లబ్ధి పొందితే 2019–24 మధ్య వైఎస్ జగన్ హయాంలో 5.38 లక్షల మందికి రూ.538 కోట్లకుపైగా భృతిని అందజేశారు. గతంలో డీజిల్పై లీటర్కు రూ.6.03 చొప్పున సబ్సిడీ ఇవ్వగా వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.9కు పెంచింది. వేటకు వెళ్లే్టప్పుడు సబ్సిడీని మినహాయించుకుని ఆయిల్ నింపుకొనే వెసులుబాటు కల్పించారు.2014–19 మధ్య 1,100 బోట్లకు మాత్రమే ఆయిల్ సబ్సిడీని వర్తింప చేస్తే.. 2019–24 మధ్య ఈ సంఖ్య ఏకంగా 23,209కి పెరిగింది. ఆయిల్ సబ్సిడీ ద్వారా రూ.148 కోట్ల మేర లబ్ధి చేకూర్చారు. ఇక 50 ఏళ్ల పైబడిన మత్స్యకారులకు ఇస్తున్న పింఛన్ 2018–19 నాటికి 42,729 మందికి వర్తింప చేయగా 2019–24 మధ్య ఏకంగా 69,741 మందికి అందచేశారు. టీడీపీ హయాంలో పింఛన్ కోసం రూ.51.57 కోట్లు ఖర్చు చేయగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.759.47 కోట్లు వెచ్చించింది. పరిహారం రెట్టింపు.. చేపల వేట సమయంలో ప్రమాదవశాత్తూ మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలకు చెల్లించే పరిహారాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచి ఆదుకుంది. 2019–24 మధ్య 175 మందికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.16.87 కోట్ల పరిహారాన్ని అందజేసింది. మరోవైపు డాక్టర్ కోనసీమ అంబేడ్కర్ జిల్లాలో జీఎస్పీసీ తవ్వకాల వల్ల జీవనోపాధి కోల్పోయిన 16,554 మంది మత్స్యకార కుటుంబాలకు రూ.78.22 కోట్లు, ఓఎన్జీసీ పైపులైన్ తవ్వకాల వల్ల జీవనోపాధి కోల్పోయిన 23,458 మంది కుటుంబాలకు రూ.647.44 కోట్లు సాయాన్ని అందించారు. వివిధ పథకాల ద్వారా ఐదేళ్లలో గత ప్రభుత్వం రూ.4,913 కోట్ల మేర మత్స్యకారులకు లబ్ధి చేకూర్చింది.గత ప్రభుత్వంలో ఏపీకి అవార్డులు..వైఎస్ జగన్ ప్రభుత్వ తోడ్పాటుతో మత్స్య ఉత్పత్తుల దిగుబడులు 39.92 లక్షల టన్నుల (2018–19లో) నుంచి 51.58 లక్షల టన్నులకు (2023–24లో) చేరాయి. 2019–24 మధ్య జాతీయ స్థాయిలో 19.37 శాతం వృద్ధి రేటు నమోదైతే.. ఏపీలో 23.28 శాతంగా నమోదైంది. డొమెస్టిక్ ఫిష్ మార్కెటింగ్కు స్కోచ్ అవార్డుతో పాటు 2021–22, 2023–24లలో రాష్ట్రానికి బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డులు దక్కడం గమనార్హం.చంద్రబాబు, కూటమి వచ్చాక ఆ భరోసా మచ్చుకైనా కానరావడం లేదని మత్స్య కారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటా రూ.20 వేల చొప్పున మత్స్యకార భరోసా ఇస్తామని హామీ ఇచి్చన చంద్రబాబు ప్రభుత్వం తొలి ఏడాది నిస్సిగ్గుగా ఎగ్గొట్టిందని, రెండో ఏడాది అరకొరగా విదిలించి చేతులు దులుపుకొందని మండిపడుతున్నారు. ఇక డీజిల్ సబ్సిడీ ఎప్పుడిస్తున్నారో తెలియని దుస్థితి నెలకొంది. ఆయిల్ కంపెనీలు డీజిల్పై లీటర్కు రూ.24 మేర పెంచిన భారాన్ని తగ్గించాలని మొర పెట్టుకున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తోందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వెన్నుదన్నుగా నిలిచారు.. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో మత్స్యకారులకు జరిగినంత మేలు గతంలో ఎప్పుడూ జరగలేదు. ఫిషింగ్ హార్బర్లు, పోర్టులు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల ఏర్పాటుతో మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగు పర్చేందుకు బాటలు వేశారు. ఏటా క్రమం తప్పకుండా ఐదేళ్ల పాటు మత్స్యకార భరోసా అందించి వెన్నుదన్నుగా నిలిచారు. చేయూత, ఆసరా, ఫీజు రీయింబర్సుమెంట్, ఆరోగ్యశ్రీ, ఇళ్లపట్టాలు, ఇళ్లు.. ఇలా ప్రతీ పథకం ద్వారా లబ్ధి చేకూర్చారు. –వాసుపల్లి జానకీరామ్, ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ఏ ఒక్క పథకం లేదు.. గత ప్రభుత్వంలో మత్స్యకారులకు మహర్దశ. నేడు మమ్మల్ని పట్టించుకునేవారు కరువయ్యారు. తొలి ఏడాది వేట నిషేధ భృతి ఎగ్గొట్టారు. మత్స్యకారులకు ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు కావడం లేదు. కొత్తగా మత్స్యకార పింఛన్లు మంజూరు చేయడం లేదు. బతుకు భారంగా తయారైంది. –చోడిపల్లి శ్రీను, మత్స్యకారుడు, పాయకరావుపేట -
పోర్టులు, హార్బర్లపై 'బాబు' వల!
సాక్షి, అమరావతి: కొత్తగా సంపద సృష్టిస్తానని నమ్మబలికి ఉన్న సంపదనే బినామీల చేతుల్లో పెట్టేస్తున్నారు..!అభివృద్ధికి తానే కేరాఫ్ అంటూ జబ్బలు చరుచుకుంటూ.. జరిగిన అభివృద్ధిని నాశనం చేసేస్తారు! ప్రజోపయోగ కార్యక్రమాలన్నింటినీ నిలిపివేసి ప్రజాధనాన్ని వాటాలతో పంపకాలు చేస్తుంటారు!వారం వారం రూ.వేల కోట్ల అప్పులు చేస్తూ.. పైసాకి కూడా లెక్కలు చెప్పరు..! టోటల్గా చంద్రబాబు పాలన అంటే రాష్ట్ర సంపదను కరగబెట్టి తన బినావీులకు ధారపోయడం! వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాటి సీఎం వైఎస్ జగన్ ముందుచూపు, విజన్తో శ్రీకారం చుట్టిన 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను తన సన్నిహితులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు అధికారంలోకి రాగానే పనులను కుట్రపూరితంగా నిలిపివేయడమే దీనికి నిదర్శనం. రాష్ట్రంలో 1,053 కి.మీ. సుదీర్ఘ తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో వైఎస్సార్ సీపీ హయాంలో రూ.26,501 కోట్లతో చేపట్టిన పోర్టులు, షిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులను చంద్రబాబు అధికారంలోకి రాగానే తొక్కిపెట్టారు. గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయిన వాటిని కూడా అందుబాటులోకి తేకుండా మోకాలడ్డారు. ప్రధాని ప్రారంభించిన జువ్వలదిన్నెను అందుబాటులోకి తేకుండా...రాష్ట్రంలో పోర్టు ఆధారిత పారిశ్రామికాభివృద్ధి కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ సెజ్, మూలపేట వద్ద 4 కొత్త పోర్టులతో పాటు 10 ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ల్యాండ్ సెంటర్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టులకు అన్ని రకాల అనుమతులు సాధించి ఎక్కడా మధ్యలో పనులు ఆగకుండా పూర్తిస్థాయిలో నిధులు సమకూర్చి ప్రారంభించింది. 2024 ఎన్నికల నాటికే రామాయపట్నం పోర్టు 90 శాతానికిపైగా పూర్తయింది. బల్క్ కార్గో బెర్త్ పూర్తి స్థాయిలో సిద్ధమైంది. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పూర్తయింది. దీనిని 2024 ఆగస్టు 30న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అయినాసరే.. దాదాపుగా పూర్తయిన రామాయపట్నం పోర్టుతోపాటు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైన జువ్వలదిన్నె హార్బర్ను అందుబాటులోకి తేకుండా చంద్రబాబు నిలిపివేశారు. రామాయపట్నం పోర్టు కార్యకలాపాలు ప్రారంభం కాకపోవడంతో ఆ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడింది. కూటమి సర్కారుపై మత్స్యకారుల్లో ఆగ్రహావేశాలు..తమిళనాడుకు చెందిన మత్స్యకారులు భారీ బోట్లతో రాష్ట్ర తీరంలోకి అక్రమంగా చొరబడి మత్స్య సంపదను అపహరిస్తున్నట్లు స్వయంగా నెల్లూరు కలెక్టర్ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తెచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. నెల్లూరు జిల్లా మత్స్యకారులు ప్రాణాలకు ఎదురొడ్డి తమిళనాడు బోట్లను పట్టుకొని బంధిస్తే కూటమి సర్కారు దొడ్డిదారిన వదిలేయడంపై మత్స్యకారులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. డబ్బులు తీసుకుని బోట్లను వదిలేసిన గ్రామాలను గుర్తించి జరిమానా విధించడమే కాకుండా అధికార పార్టీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావుతో మత్స్యకారులు ఎవరూ మాట్లాడకూడదంటూ మత్స్యకార సంఘాలు అంతర్గతంగా ఆదేశించడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. దీంతో ముఖ్యమంత్రి హడావుడిగా సమీక్ష నిర్వహించి రెండో విడత హార్బర్ల నిర్మాణం చేపట్టాలంటూ బుజ్జగించే యత్నాలు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభించిన 10 ఫిషింగ్ హార్బర్లను అందుబాటులోకి తెచ్చి ఉంటే 555 మత్స్యకార గ్రామాల్లో 6.3 లక్షల మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరేది. ఈ హార్బర్లు అందుబాటులోకి వస్తే అదనంగా 4.5 లక్షల టన్నుల మత్స్య సంపద ద్వారా రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.9,000 కోట్లు పెరిగి ఉండేదని నిపుణులు పేర్కొంటున్నారు.ప్రైవేటీకరణ దిశగా బాబు అడుగులుపీపీపీ విధానంలోకి పోర్టులు, ఫిషింగ్ హార్బర్లుతూర్పు తీర ప్రాంతానికి ముఖద్వారంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దోచుకో.. పంచుకో.. తినుకో.. విధానంలో టీడీపీ పెద్దలకు కావాల్సిన వారికి కట్టబెట్టడానికి రంగం సిద్ధమైంది. సంపద సృష్టిలో భాగంగా వైఎస్ జగన్ ప్రభుత్వం పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తే.. చంద్రబాబు వాటిని ప్రైవేటుపరం చేస్తున్నారు. ఇప్పటికే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను ప్రైవేటుపరం చేస్తున్న చంద్రబాబు సర్కారు.. మిగిలిన పోర్టులు, హార్బర్లను కూడా ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టనుంది. ఈ కుట్రలో భాగంగానే తీరప్రాంతం అభివృద్ధి ముసుగులో ఏపీ మారిటైమ్ బోర్డు ల్యాండ్ అలాట్మెంట్ గైడ్లైన్స్ 2026 తాజాగా విడుదల చేసింది. దీనిద్వారా తీర ప్రాంతంలోని వాటర్ ఫ్రంట్ ఏరియా, తీరం, ఉప్పు సాగు భూములను టీడీపీ పెద్దలు తమకు నచ్చినవారికి కేటాయించనున్నారు. తీర ప్రాంతంలో ‘ఏ’ కేటగిరీ భూములను ఏపీ మారిటైమ్ బోర్డు ద్వారా, బీ కేటగిరీ కింద భారీ స్థాయిలో భూ కేటాయింపులను ప్రభుత్వ ఆమోదంతో చేపట్టనున్నారు. కనిష్టంగా ఆరు నెలల నుంచి 30 సంవత్సరాల వరకు లీజు విధానంలో ఈ భూములను కట్టబెట్టనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. గత ప్రభుత్వం ల్యాండ్ లార్డ్ మోడల్లో అభివృద్ధి చేసిన పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను పీపీపీ విధానంలోకి మార్చి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించనున్నారు. ఇందులో భాగంగానే నిర్మాణ పనులను ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తూ రాష్ట్ర ప్రగతికి విఘాతం కలిగిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలో బందరు పోర్టు నిర్మాణ కాంట్రాక్టుల విలువ భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. గతేడాది మార్చిలో రూ.402.62 కోట్ల పనులను కేటాయించగా తాజాగా మరో రూ.395.38 కోట్ల విలువైన పనులను అప్పగిస్తూ బందరుపోర్టు కాంట్రాక్టు సంస్థకు ప్రభుత్వం నజరానా అందించింది. వాస్తవానికి గతేడాది డిసెంబర్ నాటికి అందుబాటులోకి రావాల్సిన పోర్టు పనులను నిలిపివేసి చంద్రబాబు సర్కారు గాలికి వదిలేసింది.మత్స్యకారులకు దగా..ఫిషింగ్ హార్బర్ల వద్ద నౌకా తయారీ కేంద్రాలుచేపల వేట కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొంటున్న మత్స్యకారుల కష్టాలను తన సుదీర్ఘ పాదయాత్రలో చూసిన వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.3,520.64 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తొలిదశలో సుమారు రూ.2,113.06 కోట్లతో ఐదు హార్బర్లు నిర్మించాలని ప్రతిపాదించగా కూటమి సర్కారు వాటిని నాలుగుకు కుదించడమే కాకుండా ప్రాజెక్టు వ్యయాన్ని రూ.632 కోట్లకు తగ్గించేసింది. బుడగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం, ఓడరేవుల్లో మాత్రమే హార్బర్లు నిర్మిస్తోంది. బియ్యపుతిప్పను ఫిషింగ్ హార్బరు నుంచి ఫిష్ల్యాండ్ సెంటర్గా మార్చేసింది. మత్స్యకారుల ఆర్థిక స్థితిగతులను మార్చేసే ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ వ్యయంలో కోత పెట్టడంపై మత్స్యకార సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిర్మాణ పనుల నుంచి ప్రభుత్వం తప్పుకోవడమే కాకుండా ప్రాజెక్టు వ్యయాన్ని తగ్గించడంపై మండిపడుతున్నారు. అంతేకాదు.. ఫిషింగ్ హార్బర్ల వద్ద నౌకా తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా చంద్రబాబు సర్కారు మత్స్యకారుల పొట్ట కొడుతోంది. ఇప్పటికే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బరులో 29.58 ఎకరాలను పుణెకు చెందిన సాగర్ డిఫెన్స్కు అప్పగించగా.. మచిలీపట్నం హార్బర్ వద్ద కూడా నౌకా తయారీ కేంద్ర నిర్మాణం దిశగా సర్కారు అడుగులు వేస్తోంది.జగన్పై నమ్మకంతోనే భూములిచ్చాం.. వైఎస్ జగన్పై ఉన్న నమ్మకంతోనే మా భూములను, గ్రామాన్ని మూలపేట పోర్టుకు త్యాగం చేశాం. పోర్టు పనులు కూడా వేగంగా జరిగాయి. ఈ ప్రాంత అభివృద్ధికి జగన్ చేసిన కృషిని భావితరాలు కూడా గుర్తుంచుకుంటాయి. – జీరు శివ, నిర్వాసితుడు, మూలపేట, సంతబొమ్మాళి మండలంప్రాణాలైనా అర్పిస్తాం.. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ మా మత్స్యకారుల భవిష్యత్తు. వైఎస్ జగన్ మా బతుకులు మార్చాలని గట్టి సంకల్పంతో నిర్మించారు. చంద్రబాబు ప్రభుత్వం ఏనాడూ మా అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. వైఎస్ జగన్ కట్టించిన ఫిషింగ్ హార్బర్ భూముల్లో కొంత భాగం ప్రైవేట్కు అప్పగించారంటే.. మిగతాది కూడా వారికి కట్టబెట్టే ఉద్దేశం ఉన్నట్లే. ప్రాణాలైనా అర్పించి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను కాపాడుకుంటాం. – మామిడి గోవిందస్వామి, మాజీ సర్పంచ్, జువ్వలదిన్నె, బోగోలు మండలం జగన్ వరమిస్తే.. చంద్రబాబు ద్రోహం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను నిర్మించి వైఎస్ జగన్ వరమిస్తే.. చంద్రబాబు వచ్చి ద్రోహం తలపెట్టారు. మా ప్రాంతాన్ని ప్రైవేట్కు అప్పగించే హక్కు ఈ ప్రభుత్వానికి ఎక్కడుంది? మాజీ సీఎం వైఎస్ జగన్, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డికి పేరొస్తోందనే దుగ్ధతోనే మా బతుకులు, భవిష్యత్ను అంధకారం చేయడానికి చంద్రబాబు సిద్ధపడుతున్నారు. మత్స్యకారులంతా ఏకమై మా అభిప్రాయాలను వైఎస్ జగన్కు తెలియజేయాలని తీర్మానించుకున్నాం. – ప్రళయ కావేరి రాంబాబు, తుమ్మలపెంట, కావలి మండలంఎన్నో ఏళ్లుగా ఎదురుచూపులు..బందరు పోర్టుతో ఈ ప్రాంతవాసుల కల సాకారమైంది. ఎన్నో సంవత్సరాలుగా పోర్టు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వంలో పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీని నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలి. పోర్టు ఆధారిత పరిశ్రమల స్థాపనకు కృషి చేయాలి. – మద్దుల గిరీష్, కృష్ణాజిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, మచిలీపట్నం, కృష్ణాజిల్లాగత ప్రభుత్వం సఫలీకృతం.. పోర్టు నిర్మాణంతో బందరుకు మహర్దశ రానుంది. 20 సంవత్సరాలుగా పోర్టు నిర్మాణం కోసం పోరాటం చేశాం. పోర్టు తీసుకురావటంలో గత ప్రభుత్వం సఫలీకృతమైంది. శరవేగంగా అభివృద్ధి చేసి ఈ ప్రాంత వాసులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి.– డాక్టర్ బి.శ్రీనివాసాచార్యులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్, ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడుహార్బర్తో మత్స్యకారులకు మేలుమచిలీపట్నం హార్బర్ నిర్మాణంతో ఈ ప్రాంత మత్స్యకారులకు ఎంతో మేలు జరుగుతుంది. మత్స్యసంపదకు మంచి ధర లభించేలా ఎగుమతిదారులను ప్రోత్సహించాలి. సముద్ర ముఖ ద్వారాన్ని మెరుగుపరచాలి. – సైకం ఆంజనేయులు, డీప్ సీ ఫైబర్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
నేడు వైఎస్ జగన్ జువ్వలదిన్నె పర్యటన
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం జువ్వలదిన్నెలో పర్యటించనున్నారు. ఉదయం 9.00 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బోగోలు మండలంలోని జువ్వలదిన్నె చేరుకుంటారు.10.30 గంటలకు ఫిషింగ్ హార్బర్ను పరిశీలించిన అనంతరం 11 గంటలకు మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. మధ్యాహ్నం తిరుగు పయనమవుతారు. -
కాలేయం కొవ్వెక్కుతోంది
సాక్షి, అమరావతి: మారుతున్న వాతావరణం పరిస్థితులు, ఆహార అలవాట్లు, జీవనశైలి వంటి కారణాలతో కాలేయ సంబంధిత వ్యాధుల వ్యాప్తి పెరుగుతోంది. మద్యపానం చేసే వారితోపాటు ఆ అలవాటు లేని వారిలోనూ ఫ్యాటీ లివర్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మూడు దశాబ్దాల్లో ఫ్యాటీ లివర్/మెటబాలిక్ డిస్ఫంక్షన్–అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్ (ఎంఏఎస్ఎల్డీ) బాధితుల సంఖ్య 143 శాతం పెరగడమే దీనికి నిదర్శనం. గ్యాస్ట్రో ఎంటరాలజీ, హెపటాలజీపై ఇటీవల ‘ది లాన్సెట్’ ప్రచురించిన అధ్యయనం మద్యపానం అలవాటు లేని వారిలో బీపీ, షుగర్, ఊబకాయం వంటి సమస్యలతో ఫ్యాటీ లివర్ సమస్యలు పెరుగుతున్నట్టు వెల్లడైంది. ఈ అధ్యయనం ప్రకారం భారత్లో 1990లో సగటున లక్ష మందిలో ఫ్యాటీ లివర్ కేసులు 10,191 ఉండగా.. 2023 నాటికి ఆ సంఖ్య 12,555కు పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 1990 నుంచి 2023 మధ్య ఫ్యాటీ లివర్ బాధితుల సంఖ్య 143 శాతం పెరిగినట్టు స్పష్టమైంది. దాదాపు ప్రతి ఆరుగురిలో ఒకరు ఫ్యాటీ లివర్ సమస్యతో సతమతమవుతున్నట్టు తేల్చారు.జీవనశైలి జబ్బులే ప్రధాన కారణంభారత్లో ఫ్యాటీ లివర్ సమస్య వేగంగా పెరుగుతుండటానికి బీపీ, షుగర్, ఊబకాయం వంటి జీవనశైలి జబ్బులే ప్రధాన కారణమని అధ్యయనం వెల్లడించింది. రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉండటం కాలేయంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పట్టణీకరణ పెరిగి, శారీరక శ్రమలేని జీవనశైలి, జంక్, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వినియోగం అదికమవడంతో పట్టణాల్లో 32 శాతానికిపైగా ఈ వ్యాధితో బాధపడుతున్నట్టు నిపుణులు అభిప్రాయడ్డారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాధి అత్యంత వేగంగా పెరుగుతుండటంతో 2050 నాటికి దాదాపు 200 కోట్ల మంది బాధితులు ఉంటారని అంచనా వేశారు. 1990–2023 మధ్య 30 ఏళ్లలో చోటుచేసుకున్న వృద్ధి కంటే రెట్టింపు ఉండవచ్చని తెలుస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ అంచనాల ప్రకారం దేశంలో 11 శాతానికిపైగా జనాభా షుగర్, 35 శాతం బీపీ సమస్యతో బాధపడుతున్నారు. రాష్ట్ర వైద్య శాఖ ఎన్సీడీ సర్వేలో గుర్తించిన బీపీ, షుగర్ బాధితులు 60 లక్షల మందికి పైగానే ఉంటున్నారు. ఫ్యాటీ లివర్ సమస్య ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలను చూపదని.. ఈ దృష్ట్యా బీపీ, షుగర్, ఊబకాయ బాధితులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.ఆహారమే ఔషధందేశంలోని పెద్దల్లో 40 శాతం మంది, ఊబకాయం గల పిల్లల్లో 60 శాతం మందికి ఫ్యాటీ లివర్ ఉందని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. క్రమరహిత ఆహార అలవాట్లు, నిద్ర, శారీరక శ్రమ లేమి వంటి కారణాలు మద్యపానం అలవాటు లేని వారిలోనూ ఫ్యాటీ లివర్కు దారితీస్తోంది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరు జీవనశైలి, ఆహార అలవాట్ల మీద శ్రద్ధ పెట్టాలి. ఆహారాన్ని ఔషధంగా చూడాలి. తినే ఆహారంపై నియంత్రణ ఉంటే జబ్బుల బారినపడే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ప్రాసెస్డ్, జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ను పూర్తిగా విడనాడాలి. మనిషికి రోజుకు 1,600–1,800 క్యాలరీలు అవసరం. అంతకంటే ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారాన్ని తీసుకోకూడదు. వారానికి 150–180 నిమిషాలు శారీరక శ్రమ చేయాలి. రన్నింగ్, వాకింగ్, యోగా, జిమ్లో వ్యాయామం ఇలా ఏదో ఒక శారీరక శ్రమను జీవనశైలిలో భాగం చేసుకోవాలి.– డాక్టర్ కె.జగదీశ్వర్రెడ్డి, గ్యాస్ట్రో ఎంటిరాలజిస్ట్, ఒంగోలు -
శ్రీమన్నారాయణ మహాయజ్ఞానికి వైఎస్ జగన్కు ఆహ్వానం
సాక్షి, తాడేపల్లి: ఆధ్యాత్మికత,ధార్మిక కార్యక్రమాలు సమాజానికి ఐక్యతను, సానుకూలతను తెస్తాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కృష్ణా జిల్లా కోడూరు మండలం ఉల్లిపాలెంలో ఈ నెల 19 నుంచి 29 వరకు శ్రీమన్నారాయణ మహాయజ్ఞం జరగనుంది.శ్రీమన్నారాయణ మహాయజ్ఞంలో పాల్గొనాలని కోరుతూ శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామి వైఎస్ జగన్ను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా ‘అభినవ మేల్కోట భక్తి గీతమాలిక’ సీడీని జగన్ ఆవిష్కరించారు. అనంతరం సంపత్కుమార రామానుజ జీయర్ స్వామిని సత్కరించారు. తరువాత వైఎస్ జగన్ మాట్లాడుతూ..‘ఆధ్యాత్మికత, ధార్మిక కార్యక్రమాలు సమాజానికి ఐక్యతను, సానుకూలతను తెస్తాయి. ఇలాంటి మహాయజ్ఞాలు ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయి’ అని అన్నారు.కార్యక్రమంలో మాజీ మంత్రులు పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సింహాద్రి రమేష్బాబు తదితరులు పాల్గొన్నారు. -
పోలీసుల వ్యవహార శైలిపై మండిపడ్డ వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ బాణాల తనీష్ బాబు కలిశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను వేమూరు టీడీపీ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సమర్ధించడం ఎంతవరకు సమంజసం అంటూ తనీష్ బాబు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.దీనిపై ఎమ్మెల్యే కార్యాలయానికి చెందిన వ్యక్తి ఫిర్యాదుతో చినపులివర్రులో కొల్లూరు ఎస్ఐ ఏడుకొండలు, మరికొందరు పోలీసులు తెల్లవారుజామున మఫ్టీలో గోడదూకి తన ఇంట్లోకి చొరబడి తనను వెంట తీసుకెళ్ళేందుకు ప్రయత్నించారని వైఎస్ జగన్కు తనీష్ బాబు వివరించారు. ఎవరు మీరు, నా భర్తను ఎందుకు తీసుకెళుతున్నారని ప్రశ్నించిన తన భార్య అనూషపై, అడ్డుకున్న స్ధానికులపై దౌర్జన్యం చేసిన తీరును వైఎస్ జగన్కు ఆయన వివరించారు.తనీష్బాబును అక్రమంగా తీసుకెళుతున్న సమాచారం తెలుసుకుని అప్పటికప్పుడు తాను చినపులివర్రు వెళ్ళి పోలీసుల దౌర్జన్యాన్ని నిలదీసినట్లు వేమూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ వరికూటి అశోక్ బాబు తెలిపారు. సోషల్ మీడియా కేసులలో నోటీసులు ఇవ్వకుండా వీధిరౌడీల్లా అర్ధరాత్రి ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించడమేంటని ప్రశ్నించిన వైఎస్ జగన్.. పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణమని మండిపడ్డారు.తనీష్బాబుకు అవసరమైన న్యాయ సహాయం వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అందిస్తుందని.. తనీష్ కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ను కలిసిన వారిలో తనీష్ బాబు భార్య అనూష, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి, మాజీ ఎంపీపీ పెరికల పద్మారావు, చిలుమూరు రామ్మోహన్ రావు, సొంటి కామేశ్వరరావు, వసుమల్ల రోహిత్, అంబటి రామ్మోహన్ రావు ఉన్నారు. -
ప్రైవేట్ కేసు వేద్దాం.. న్యాయ సాయం చేస్తాం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాంబొట్లవారి పాలెంకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త కృష్ణార్జునరెడ్డి మంగళవారం కలిశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాననే నెపంతో తనను చెరుకుపల్లి ఎస్ఐ అనిల్కుమార్ అక్రమంగా స్టేషన్లో నిర్భందించి, విచక్షణారహితంగా లాఠీలతో కొట్టాడని.. తన శరీరంపై గాయాలను వైఎస్ జగన్కు కృష్ణార్జునరెడ్డి చూపారు.టీడీపీ నాయకుల మెప్పు పొందడానికి కొంతమంది పోలీసు అధికారులు రెచ్చిపోతున్నారని, చట్టాన్ని అతిక్రమించి వ్యవహరిస్తున్న పోలీసు అధికారులపై హైకోర్టులో ప్రైవేట్ కేసు వేసి బాధితులకు న్యాయం జరిగేలా చూద్దామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. కృష్ణార్జునరెడ్డిని అక్రమంగా నిర్భందించి దాడిచేసిన ఎస్ఐ అనిల్పై చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా ఎస్పీ, డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు వైఎస్ జగన్కు వైఎస్సార్సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పీటా నాగమోహన్ కృష్ణ వివరించారు. కృష్ణార్జున రెడ్డికి అవసరమైన న్యాయసహాయం వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అందిస్తుందని, అతని కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. -
రెండు లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు?: మార్గాని భరత్
సాక్షి, తాడేపల్లి: జయంతికి, వర్ధంతికి తేడా తెలియని వ్యక్తి నారా లోకేష్.. అలాంటి వ్యక్తి రెడ్బుక్ పేరుతో ఏపీలో అల్లకల్లోలం సృష్టిస్తున్నారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ దుయ్యబట్టారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నోటికొచ్చినట్టు మాట్లాడవద్దంటూ మంత్రి పార్థసారథిని హెచ్చరించారు. అమరావతి కోసం వేలకోట్లు అప్పులు చేస్తారా?. నీళ్లు ఎత్తిపోసే రాజధాని ప్రపంచంలో అమరావతి మాత్రమే. రెండు లక్షల కోట్లు ఎక్కడ్నుంచి తెస్తారు?’’ అంటూ మార్గాని భరత్ ప్రశ్నించారు.‘‘అది అసాధ్యం కాబట్టే వైఎస్ జగన్ మావిగన్ ప్రతిపాదన తెచ్చారు. మంత్రులకు సింగపూర్లో శిక్షణా తరగతులు అంట. అవినీతి చేసి జైలు పాలయిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్తో శిక్షణ ఇప్పిస్తారా?. గతంలో అమరావతి రైతులను కూడా ఇలాగే సింగపూర్ తీసుకెళ్లారు. ఆ తర్వాత అమరావతిలో గ్రాఫిక్స్ చూపించి నట్టేట ముంచారు. రాధాకృష్ణ ఉన్మాదాన్ని సమర్థించిన వ్యక్తులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్. వీళ్లు మరింత ఉన్మాదంతో వ్యవహరిస్తూ వైఎస్ జగన్ కుటుంబ సభ్యుల మీద ట్రోల్స్ చేస్తున్నారు’’ అంటూ మార్గాని భరత్ దుయ్యబట్టారు.‘‘కొన్ని ఫేక్ ఛానల్స్తో ఉన్మాదపు ట్రోల్స్ చేస్తున్నారు. నారా లోకేష్.. అధికారం శాశ్వతం కాదు. మీరు చేసే ఆర్గనైజ్డ్ క్రైం మీకే ఇబ్బంది పెడుతుందని గుర్తించాలి. డైవర్షన్ రాజకీయాల కోసం ఏం చేసినా సహిస్తామనుకోవద్దు. మావిగన్ ప్రతిపాదనపై అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభిస్తోంది. రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేసేకంటే మావిగన్ బెటర్ అన్న చర్చ జరుగుతోంది...అమరావతిలో రాజధాని కడితే నయా రాయపూర్, గాంధీనగర్ లాగ అవుతుంది. సాయంత్రం అయితే అధికారులు విజయవాడ, గుంటూరు వెళ్తారేగానీ అమరావతిలో ఎవరూ ఉండరు. జనంలేని అమరావతిలో రాజధాని కడతారా?. జనం ఉన్న మావిగన్లో రాజధాని నిర్మిస్తారా?. అమరావతి ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ తెలియదు. అసలు ఇప్పటితరం అమరావతిని చూడలేదు’’ అంటూ మార్గాని భరత్ వ్యాఖ్యానించారు. -
‘మా బాబును రాష్ట్రపతి తెగ పొగిడేశారు తెలుసా!’
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని గాలికొదిలేసి.. ప్రచార ఆర్భాటాల కోసం టీడీపీ బృందం హస్తిన బాట పట్టింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సోమవారం విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, టీడీపీ కూటమి ఎంపీల బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ బిల్లుకు ఆమోదం తెలిపినందుకు వారంతా రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు. బాబును పొగిడారంటూ ప్రచారం భేటీ అనంతరం టీడీపీ వర్గాలు తమదైన శైలిలో ప్రచారాన్ని మొదలుపెట్టాయి. సీఎం చంద్రబాబును రాష్ట్రపతి ‘ఇంటెలిజెంట్, విజనరీ’ అని ప్రశంసించారని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. రాజధాని కోసం అమరావతి రైతులు 33 వేల ఎకరాలు ఇవ్వడం గొప్ప విషయమని రాష్ట్రపతి అన్నట్టుగా లోకేశ్ బృందం ప్రచారం చేస్తోంది. రాష్ట్రపతితో భేటీ అనంతరం టీడీపీ ఎంపీ అప్పలనాయుడు మీడియాతో మాట్లాడారు. ఎప్పటి మాదిరిగానే వైఎస్సార్సీపీపైన, మాజీ సీఎం వైఎస్ జగన్ పైన విమర్శలు గుప్పించారు. అమరావతిలో అవినీతి జరుగుతోందని వైఎస్సార్సీపీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాజధాని బిల్లు ఆమోదాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఐదు కోట్ల ఆంధ్రులను అవమానిస్తోందంటూ అక్కసు వెళ్లబోశారు. -
కోర్టుకు ఇచ్చిన హామీ ఉల్లంఘన శిక్షార్హమే..!
సాక్షి, అమరావతి: కోర్టుకిచ్చిన హామీ ఉల్లంఘన ఎంతమాత్రం క్షమార్హం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి ఉల్లంఘనకు పాల్పడిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి నెల రోజుల సాధారణ జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధించింది. దీంతోపాటు రూ.10వేలు ఖర్చులు విధించింది. ఈ మొత్తాన్ని ఏపీ హైకోర్టు న్యాయసేవల కమిటీకి జమ చేయాలని ఆదేశించింది. న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరీ, జస్టిస్ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం ఈ మేరకు ఇటీవల తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళితే ఆస్తి వివాదానికి సంబంధించి సాఫ్ట్వేర్ ఉద్యోగి నగతం ముకుందరెడ్డి, మరికొందరిపై నగతం సునీత, మరో ముగ్గురు 2009లో తిరుపతి ఐదో అదనపు జిల్లా కోర్టులో దావా వేశారు.విచారణ జరిపిన తిరుపతి కోర్టు, ఆస్తిలో 1/4 వాటా సునీత తదితరులకు చెందుతుందని 2017లో డిక్రీ జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ ముకుందరెడ్డి తదితరులు హైకోర్టులో అప్పీల్ చేయడంతో తీర్పు అమలు ఆగిపోయింది. కాగా తిరుపతి కోర్టులో తాము దాఖలు చేసిన తమ ఆస్తి ఒరిజినల్ డాక్యుమెంట్లను వెనక్కి ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ముకుందరెడ్డి హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ డాక్యుమెంట్లను బ్యాంకు తాకట్టు పెట్టడం గానీ, ఆస్తిపై మూడో పక్షానికి హక్కులు సృష్టించడం గానీ చేయబోమని హైకోర్టుకు హామీ ఇచ్చారు.దీంతో ఈ మేరకు 2021లో హైకోర్టు సానుకూల ఆదేశాలు ఇచ్చింది. అయితే ముకుందరెడ్డి కోర్టు నుంచి తీసుకున్న ఆస్తి ఒరిజినల్ డాక్యుమెంట్లను తాకట్టు పెట్టారని, ఆ ఆస్తిని థర్డ్ పార్టీకి విక్రయించి రిజిస్ట్రేషన్ చేశారని, ఇది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేంటూ సునీత మరికొందరు 2025లో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ తిల్హరీ ధర్మాసనం ఇటీవల తుది విచారణ జరిపింది. ముకుందరెడ్డి ఉద్దేశపూర్వకంగా తమ ఆదేశాలను ఉల్లంఘించారని, ఇది కోర్టు ధిక్కారమేనని తేల్చింది. -
తెలుగుదేశం గ్రాఫ్ పడిపోయింది.. ‘రాయచోటి’లో అభ్యర్థుల్లేరు
సాక్షి అమరావతి: ‘టీడీపీ గ్రాఫ్ పడిపోయింది. రాయచోటి మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీచేసేందుకు పదుల వార్డుల్లో మనకు అభ్యర్థులే లేరు. కూటమికి సానుకూల వాతావరణం ఉన్న గత సార్వత్రిక ఎన్నికల్లోనే 89 పోలింగ్ బూత్లలో మైనస్ కనిపించింది. ఇతర పార్టీలతో పొత్తు టీడీపీని దెబ్బతీస్తోంది..’ అంటూ మంత్రి రాంప్రసాద్రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేకెత్తించాయి. రాయచోటిలో ఆదివారం జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమలు చేయలేని హామీలతో అధికారంలోకి రావడంతోపాటు పాలనలో అన్ని విధాలుగా విఫలమయ్యారంటూ ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి. మహిళలకు రక్షణ కరువైంది. ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. అమరావతి పేరుతో లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ప్రచారం క్షేత్రస్థాయికి చేరడంతో ఆ పార్టీ నాయకులకే భయం పట్టుకుంది. ఇదే సమయంలో స్థానిక సంస్థలకు సిద్ధంగా ఉండాలన్న అధినేతల సూచనలు మంత్రులు, ఎమ్మెల్యేల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న వ్యతిరేకత స్థానిక సంస్థల ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపనుందని గ్రహించిన మంత్రులు, ఎమ్మెల్యేలు ముందుగానే చేతులెత్తేసే దశకు చేరుకుంటున్నారు. రాష్ట్ర రవాణా, క్రీడా, యువజనశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి పార్టీ కార్యకర్తల సమావేశంలోనే రాయచోటి మున్సిపాలిటీలో పదుల సంఖ్యలో వార్డుల్లో పోటీచేయడానికి పార్టీకి అభ్యర్థులే లేరంటూ వ్యాఖ్యానించడమే దీనికి ఉదాహరణ. 2024లో జరిగిన సాధారణ ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో పొత్తువల్లే భారీ మెజారిటీతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిందని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఇంతకంటే మెజార్టీ ఎప్పుడూ రాలేదని, ఇకపై రాదని కూడా పేర్కొన్నారు. అలా గెలిచిన నియోజకవర్గాల్లో రాయచోటి కూడా ఉందన్నారు. అదే సమయంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కొన్ని బూత్లలో చెత్తగా ఫలితాలు వచ్చాయని నిషూ్టరంగా మాట్లాడుతూనే ఇక్కడ (ముస్లింలు, దళితులు, క్రిస్టియన్) కులాలు, మతాలకు ఇంకా ఓ పార్టీ (వైఎస్సార్సీపీ)తో ప్రేమలు చావలేదంటూ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. కొన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్ల చాలా పోలింగ్ కేంద్రాల్లో దెబ్బతిన్నామంటూ పరోక్షంగా బీజేపీని విమర్శించారు. ఆ పార్టీ కారణంగానే 89 బూత్లలో టీడీపీకి తక్కువ ఓట్లు పడ్డాయని చెప్పారు. మన పార్టీ వారే శత్రువులుగా తయారయ్యారు అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చడంతో రాయచోటిలో టీడీపీ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని చెప్పారు. సొంత పార్టీ వారే శత్రువులుగా తయారయ్యారంటూ పరోక్షంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్బాబుపై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. రాయచోటి మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి అన్ని వార్డులకు అభ్యర్థులు ముందుకొచ్చేలా సిద్ధం చేయాలని పార్టీ నాయకులకు సూచించారు. పార్టీ ఓడిపోతే వచ్చే కష్టాలను ఊహించుకుని కార్యకర్తల్లో చిత్తశుద్ధిని పెంచాలని కోరారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తనకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ అభ్యర్థిని గెలిపించాలన్నారు. టీడీపీ నేతల్ని కలవరపరుస్తున్న ప్రజావ్యతిరేకత రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ప్రజల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకత టీడీపీ నేతల్లో కలవరం కలిగిస్తోంది. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలన్న నేతల పిలుపుతో మరింత ఆందోళన చెందుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు తమకు అనుకూలంగా ఉండవనే స్పష్టమైన అంచనాకు వచ్చిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా స్థానిక ఎన్నికల బాధ్యత నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. -
నేటి అర్ధరాత్రి నుంచి వేటకు విరామం
సాక్షి, అమరావతి: చేపల పునరుత్పత్తి కోసం 61 రోజులపాటు అమలు చేయనున్న వేట నిషేధం మంగళవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తుంది. తూర్పు తీర భారత ప్రాదేశిక జలాల్లో జూన్ 15 వరకు ఈ నిషేధం అమలులో ఉంటుంది. సముద్రంలో మత్స్య సంపద వృద్ధి, పరిరక్షణ, నిర్వహణకైఏటా క్రమం తప్పకుండా ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నారు. ఈ సమయంలో మోటారు వినియోగించని సాంప్రదాయ బోట్లకు వేట నిషేధం నుంచి మినహాయింపు ఉంది.కాగా మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లపై మాత్రం లోతు జలాల్లో వేట నిషేధం. నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే బోట్లతో సహా అందులో ఉండే మత్స్య సంపదను స్వాదీనం చేసుకోవడంతోపాటు ఆయా బోట్ల యజమానులు ఏపీ సముద్ర మత్స్య క్రమబద్దికరణ చట్టం 1994 సెక్షన్ (4)కింద శిక్షార్హులు. నిషేధం పక్కాగా అమలు చేసేందుకు మత్స్యశాఖ, కోస్ట్గార్డు, కోస్టల్ సెక్యురిటీ, నేవీ, రెవెన్యూ అధికారులతో బృందాలను ఏర్పాటు చేశారు. -
టీడీపీలో ‘రాజ్య’కాంక్ష
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి చెందిన నాలుగు రాజ్యసభ ఎంపీ స్థానాలు త్వరలో ఖాళీ అవుతుండడంతో వాటిలో తమకు వచ్చే స్థానాల కోసం టీడీపీ నేతలు పోటీ పడుతున్నారు. ఒక స్థానం ఏడాది క్రితమే ఆ పదవి దక్కించుకున్న సానా సతీష్బాబు (కాల పరిమితి ముగియనుంది)కు రెన్యువల్ చేయడం ఖాయమనే ప్రచారం ఆ పార్టీ నేతల్లో జోరుగా జరుగుతోంది. చినబాబుకు అత్యంత సన్నిహితమైన వ్యక్తి కావడంతోపాటు ఆయన వ్యవహారాలన్నీ చక్కబెడుతుండడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. గతంలోనే పార్టీలోని సూపర్ సీనియర్లను కాదని ఆ పదవిని సానాకి కట్టబెట్టిన ముఖ్య నేత ఇప్పుడు ఆయన్ను పక్కనపెట్టే అవకాశం లేశ మాత్రం కూడా లేదనే అభిప్రాయాలు పార్టీలోనే వ్యక్తమవుతోంది. మరో స్థానంపై మాత్రం విస్తృతంగా చర్చ నడుస్తోంది. ఈ స్థానాన్ని ఎలాగైనా సరే తన అనుయాయుడికే ఇస్తానని చినబాబు స్పష్టం చేస్తున్నారు. ఆ అనుయాయుడు ఇప్పటికే ప్రభుత్వంలో చినబాబు తరఫున అన్ని విషయాలు చూసుకుంటూ సూపర్ బాస్గా మారిపోయారు. ఆయనకు మరింత ‘రాజసం’ కల్పించేందుకు రాజ్యసభ ఎంపీ పదవి కావాల్సిందేనని తద్వారా తన మనిషిగా ఎటువంటి ఆటంకాలు లేకుండా అటు ఢిల్లీలోనూ, ఇటు రాష్ట్రంలోనూ అన్ని వ్యవహారాలు చూసుకుంటాడని చినబాబు భావిస్తున్నట్లు తెలిసింది. దీనిపై సీనియర్ నేతలు మండిపడుతూ అనుచరుడిగా ఉన్న వ్యక్తికి అంత పెద్ద పదవి కట్టబెడితే ఇక తాము ఎందుకని ప్రశ్నిస్తున్నారు. పార్టీ కోసం అనేక సంవత్సరాలుగా పని చేస్తున్న తమను కాదని ఎన్నికల్లో డబ్బు సమకూర్చిన వారికి, తమ పనులు చేసే వారికి పదవులు ఇవ్వడం ఎంతమాత్రం సమంజసం కాదని వాపోతున్నారు. ఈ విషయాన్ని పలువురు చంద్రబాబుకే చెప్పినా ఆయన కూడా ఆర్థికంగా అండదండలు అందించిన వారిని కాదనలేమని అంటున్నట్లు తెలిసింది. దీంతో సీనియర్ నాయకులు రగిలిపోతున్నారు.జయదేవ్ లాబీయింగ్మరోవైపు రాజ్యసభ స్థానం కోసం మాజీ ఎంపీ గల్లా జయదేవ్ తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో గుంటూరు ఎంపీ సీటును వదులుకుని తప్పు చేశానని మదనపడుతున్న ఆయన ఎలాగైనా సరే మళ్లీ పార్లమెంటులో అడుగుపెట్టాలనే పట్టుదలతో చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. గత ఎన్నికల్లో గుంటూరు ఎంపీ సీటు ఆశించి భంగపడిన భాష్యం రామకృష్ణ కూడా ఎన్నికల్లో అండగా నిలిచాను కాబట్టి రాజ్యసభకు పంపాలని కోరుతూ ఆ దిశగా యత్నాలు చేస్తున్నారు. చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే సీనియర్ నేత కంభంపాటి రామ్మోహనరావు, మరో సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ తదితరులు రాజ్యసభ స్థానంపై కన్నేసి చంద్రబాబుపై పలు రకాలుగా ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఆయన మాత్రం ఎవరికీ మాట ఇవ్వకుండా చూద్దాం అని చెబుతుండడంతో వారు రగిలిపోతున్నారు. తమను అన్ని రకాలుగా పార్టీ కోసం ఉపయోగించుకుని ఇప్పుడు తమను పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.జనసేన తరఫున లింగమనేని పేరు జనసేనకు ఈసారి ఒక స్థానం దక్కుతుందని అది లింగమనేని రమేష్కి ఇస్తారనే ప్రచారం చాలారోజులుగా జరుగుతోంది. ఆయన అటు చంద్రబాబుకు ఇటు పవన్ కళ్యాణ్కి సన్నిహితమైన వ్యక్తి కావడంతో ఆయన పేరు ఖరారైనట్లేనని చెబుతున్నారు. ఒకవేళ చివరి నిమిషంలో ఏదైనా మారితే తప్ప జనసేనకు ఒక స్థానం కేటాయిస్తే అది రమేష్కి ఖరారవుతుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలాఉండగా ఖాళీ అయ్యే నాలుగు ఎంపీ స్థానాల్లో కూటమిలో ఏ పార్టీ ఎన్ని సీట్లు తీసుకోవాలనే దానిపైనా మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. చంద్రబాబు, లోకేష్ తరచూ చేసే ఢిల్లీ పర్యటనలు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీల్లో దీనిపై మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. నాలుగింటిలో ఒక్కోటి బీజేపీ, జనసేనకు వదిలినా రెండు కచ్చితంగా టీడీపీకి దక్కుతాయనే ప్రచారం జరుగుతోంది. అయితే తమకు మూడు స్థానాలు ఇస్తే బాగుంటుందని ముఖ్య నేత అడుగుతున్నా అందుకు బీజేపీ సుముఖంగా లేదనే వాదన వినిపిస్తోంది. -
‘మావిగన్’తో కలవరం
సాక్షి, అమరావతి: మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు కారిడార్గా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం మావిగన్ ప్రకటనతో టీడీపీ, చంద్రబాబు బెంబేలెత్తిపోతున్నారని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. ఈ అంశంపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుండటం వల్లే తనకెప్పుడూ అలవాటైన రీతిలో చంద్రబాబు తన మంత్రుల ద్వారా తిట్ల దండకం చదివిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అనాలోచిత నిర్ణయాలు, అంతులేని అవినీతి, అత్యాశల కారణంగా అమరావతి అనేది రాష్ట్రానికి మోయలేని గుదిబండగా మారిందన్నారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసి భవిష్యత్ తరాలను అంధకారంలోకి నెట్టేస్తున్నారని వైఎస్ జగన్ అద్భుతంగా వివరించారని చెప్పారు. జగన్ ప్రతిపాదనను ఎందుకు అంగీకరించడం లేదో చెప్పకుండా, లెక్కలతో వివరించకుండా చంద్రబాబు తన మంత్రులు, ఎమ్మెల్యేలకు బూతు పాఠాలు రాసిచ్చి వారితో మాట్లాడిస్తున్నాడని నిప్పులు చెరిగారు.మంత్రులుగా ఉండి బాధ్యతగా వ్యవహరించాల్సిన అచ్చెన్నాయుడు, అనిత, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, సత్యకుమార్, సవితలతోపాటు ఎమ్మెల్యే ధూళిపాళ్ల, ఎంపీ కలిశెట్టి, టీడీపీ నాయకుడు పట్టాభి వంటి వారిని వైఎస్ జగన్ మీదకు ఉసిగొల్పి బూతులు, అసత్యాలతో వ్యక్తిత్వ హననం చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లంతా మావిగన్పై చర్చ జరగకుండా జగన్ను ట్రోల్ చేశామని సంబరపడిన 48 గంటల్లోనే వారి ఆశలు ఆవిరైపోయాయన్నారు. ఈ అంశం ప్రజల్లోకి శరవేగంగా దూసుకెళ్లిందని చెప్పారు. ఈ సందర్భంగా పేర్ని నాని ఇంకా ఏమన్నారంటే..వీళ్లంతా చంద్రబాబును ఎంత ఘోరంగా తిట్టారో..కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా ఉన్నప్పుడు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటలు తీసుకొచ్చి వైఎస్ జగన్ వ్యక్తిత్వం గురించి చంద్రబాబు తప్పుడు ప్రచారం మొదలు పెట్టాడు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ అప్పట్లో చంద్రబాబును ఘోరాతి ఘోరంగా తిట్టాడు. గొడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరం, అభినవ ఔరంగజేబు చంద్రబాబు, పశువుకున్న విశ్వాసం కూడా చంద్రబాబుకి లేదు.. అని దుమ్మెత్తిపోశారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తన వైపు లాక్కున్నాడని చెప్పాడు. నా మీద పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికి నా ప్రభంజనంలో కొట్టుకుపోయిన చిన్న మిడత చంద్రబాబు.. నమ్మించి ముంచిన నంగనాచి, బాబు నా కన్నా పెద్ద నటుడు. ఇలా 73 ఏళ్ల వయసులో చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు.ఆయన తిట్టిన తిట్లకు ఇంకెవరన్నా అయితే ఏదైనా అఘాయిత్యం చేసుకునేవాళ్లు. ఇవన్నీ ఎంపీ కలిశెట్టి మీడియాకు చూపించాలి. చంద్రబాబు ఊసరవెల్లి. వాడుకుని వదిలేయడం చంద్రబాబు నైజం. మళ్లీ అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తాడని ఆయన వద్ద ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న వాళ్లే అన్నారు. ఇప్పుడు చంద్రబాబుకు పార్టనర్గా ఉన్న పవన్ కళ్యాణ్ సైతం నాడు చంద్రబాబు, లోకేశ్ల అవినీతిని తీవ్రంగా విమర్శించారు. బాబు మళ్లీ సీఎం అయితే అవినీతిని ప్రోత్సహించినట్టే అన్నాడు. చంద్రబాబు కేబినెట్లో ఉన్న సగం మంది మంత్రులు ఒకప్పుడు ఆయన్ను తిట్టిన వీడియోలు చాలా ఉన్నాయి.164 మంది ఎమ్మెల్యేల్లో చంద్రబాబుని తిట్టిన వారి లెక్క వందకు పైనే. చంద్రబాబుని మోడీ, మోడీని చంద్రబాబు దూషించుకున్నారు. చంద్రబాబును దగ్గుబాటి పురందేశ్వరి ఎన్నిసార్లు తిట్టిందో లెక్కే లేదు. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏకంగా చంద్రబాబు గురించి పుస్తకాలే రాశాడు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకాలను టీడీపీ శిక్షణ తరగతుల్లో పంచి పెట్టగలరా? ఈ ప్రాంతాల్లో రూపాయి ఖర్చు చేశారా? చంద్రబాబు చెప్పే అమరావతి కాన్సెప్టులో బలముంటే మావిగన్ పేరెత్తితే ఎందుకంత భయం? మావిగన్ అనేది సీఆర్డీఏ పరిధిలో ఎప్పుడో ఉందని 2014 డిసెంబర్ 30 నాటి జీవో చూపిస్తున్నారు. మరి ఎనిమిదేళ్లలో ఈ ప్రాంతాలకు మాస్టర్ ప్లాన్ ఎందుకు సిద్ధం చేయలేదు? వైఎస్ జగన్ మావిగన్ పేరెత్తే వరకు అమరావతి అంటే 29 ఊర్లే. ఆయన ఎప్పుడైతే మావిగన్ కాన్సెప్టు తీసుకొచ్చారో అప్పుడు హడావుడిగా విజయవాడ రూరల్, పెనమలూరు, ఇబ్రహీంపట్నం, పమిడిముక్కల, నూజివీడు, గుడివాడ, గన్నవరం, ఉంగుటూరు, పామర్రు, ఘంటసాల, పెదపారుపూడి మండలాలకు కన్సల్టెంట్లను పంపించాడు.రూ.51 వేల కోట్లకు టెండర్లు పిలిచామని చెప్పే మంత్రి నారాయణ అందులో ఒక్క కోటి రూపాయలైనా ఈ ఊర్లలో ఎందుకు వెచ్చించలేదు? మాస్టర్ ప్లాన్ ఇంత వరకు ఎందుకు రూపొందించలేదు? మా ప్రాంతాల్లో ఒక్క ఆఫీసు ఉందా? ఐదు టవర్లలో ఒక్కటైనా ఉందా? జడ్జి బంగ్లాలు, ఎమ్మెల్యే క్వార్టర్లు లేకుండా మేం రాజధాని పరిధిలో ఉన్నామని ఎలా ఫీలవ్వాలో చెప్పాలి. 8 ఏళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేశామని మంత్రి నారాయణ చెబుతున్నాడు. కానీ అందులో రూ.5 వేల కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సులే ఉన్నాయి. ఏ లెక్కన ఎకరం రూ.10 కోట్లు అంటున్నారు?జమ్మూ కశ్మీర్లో కాలేజీ పెట్టిన నారాయణ నష్టమొచ్చిందని ఎలా మూసేస్తున్నాడో, రాష్ట్రానికి అమరావతి గుదిబండగా మారిందని తెలిశాక ఆపేస్తేనే భవిష్యత్తు తరాలకు మంచిది. రాజధాని మీద ఇంత అప్పు చేస్తున్నప్పుడు ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదా? ఈ అప్పులు ఎక్కడికి చేరుకుంటాయో కనీస అంచనా కూడా ప్రభుత్వం వద్ద లేదు. 2029 నాటికి బేసిక్ కేపిటల్ (సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు) పూర్తి చేస్తామని చెబుతున్నారు. బేసిక్ కేపిటల్కే రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తే, ల్యాండ్ పూలింగ్లో రైతుల నుంచి తీసుకున్న ప్లాట్లు డెవలప్మెంట్కు ఇంకెంత ఖర్చు చేయాలి? అమరావతిలో ఎకరం విలువ రూ.10 కోట్లు ఉందని, భవిష్యత్తులో రూ.20 కోట్లకు చేరుతుందని బోగస్ ప్రచారం మొదలుపెట్టారు.వాస్తవం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. చంద్రబాబు తన ఇంటి నిర్మాణం కోసం వెలగపూడి ప్రాంతంలో 25 వేల చదరపు గజాలు (5 ఎకరాలు) గజం రూ.7,500 చొప్పున కొనుగోలు చేశాడు. ఆ మొత్తం 5 ఎకరాల స్థలాన్ని ఏడాది క్రితం రూ.18.75 కోట్లకు కొనుగోలు చేసినట్టు సేల్ డీడ్లో స్పష్టంగా పేర్కొన్నారు. దీని ప్రకారం చంద్రబాబు ఎకరం రూ.3.63 కోట్లకు కొన్నాడు. అది కూడా కొత్తగా నిర్మించబోతున్న సచివాలయానికి ఎదురుగా ఉండే ప్రైమ్ ల్యాండ్లో. ఇంటి వెనుక హైకోర్టు వస్తుంది.అలాంటిది ఎకరం రూ.10 కోట్లు పలుకుతుందని మంత్రి నారాయణ చెప్పేవన్నీ అబద్ధాలే కదా? ఈ లెక్కన ప్రభుత్వం వద్ద ఉన్న 5 వేల ఎకరాలు అమ్మినా వచ్చే ఆదాయం రూ.18,150 కోట్లు అవుతుంది. ఈ లెక్కలన్నీ వివరిస్తే వైఎస్ జగన్ను తూలనాడుతున్నారు. 4,800 గజాల్లో వైఎస్ జగన్ తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటేనే ప్యాలెస్ అంటే, చంద్రబాబు ఐదెకరాల్లో కడుతున్న ఇంటిని ఏమనాలి? బాబు చెబుతున్న లెక్కల ప్రకారం అసలు, వడ్డీ కలిపి ఏడాదికి రూ.19,500 కోట్ల నుంచి రూ.22 వేల కోట్ల చొప్పున 20 ఏళ్లపాటు కట్టాలి.రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు?ప్రజల ఆకాంక్ష మేరకు ఇప్పుడైనా మావిగన్ గురించి ఆలోచించండి. రూ.10 వేల కోట్లతో అద్భుతమైన రాజధాని అవుతుంది. మీరు చెప్పినట్లే విశాలంగా 10 లక్షల చదరపు అడుగుల చొప్పున హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ కూడా కట్టొచ్చు. కోకాపేటలో ఎకరా రూ.100 కోట్లకు వేలంలో పాడి అద్భుతమైన సదుపాయాలతో ఇళ్లు పూర్తి చేసి, చదరపు అడుగు రూ.10 వేలకు అమ్ముతున్నారు. ఇదే విషయం మిమ్మల్ని ప్రశ్నిస్తే వైఎస్ జగన్ను నోటికొచ్చినట్లు దూషిస్తున్నారు. హైదరాబాద్ శంకరపల్లి, కోకాపేట, నియోపోలీస్ ఏరియాలో కూడా చదరపు అడుగు ఎంతో తెలుసుకోండి. మంత్రి నారాయణ ఇళ్లు, కార్యాలయం చదరపు అడుగు రూ.16 వేలతో కట్టారా? చంద్రబాబు ఇంటికి ఇంతే పెడుతున్నారా? ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? నేను అగ్రిమెంట్ రాస్తాను.మీరు చెబుతున్నట్టు 10 లక్షల చదరపు అడుగుల చొప్పున సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ కేవలం రూ.10 వేల కోట్లలో కట్టి చూపిస్తాం. కేంద్రమంత్రి పెమ్మసాని అమరావతిలో లక్ష జనాభా లేరని, హోటల్ కట్టినా ఎవరూ రారని చెబుతున్నారు. మరోవైపు చంద్రబాబు మాత్రం 2035 నాటికి 50 లక్షల జనాభా అవుతుందని చెబుతున్నారు. ఎంత మోసం? అమరావతి బిల్లు పెట్టినప్పుడు చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా మిగిలిన ప్రాంతాల ప్రజలను మభ్యపెట్టడానికి ఏయే జిల్లాలకు ఏం చేయబోతున్నాడన్నది హామీ ఇచ్చాడు.అనంతపురం కరువు నివారణకు 100 శాతం డ్రిప్, ఉద్యాన యూనివర్సిటీ, ఎయిమ్స్కు అనుబంధంగా ఆసుపత్రి, నూతన పారిశ్రామిక నగరం, హిందూపూర్లో స్మార్ట్ సిటీ, ఎలక్ట్రానిక్ పార్కు, పుడ్ పార్కు, ఎలక్ట్రానిక్ హార్డ్ వేర్ క్లస్టర్, సోలార్–విండ్ పవర్ ప్లాంట్, పెనుగొండలో ఇస్కాన్ ప్రాజెక్టు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఆధ్యాత్మిక నగరంగా పుట్టపర్తి, ఎయిర్ పోర్ట్, అనంతపురంలో విమాన మరమ్మత్తుల కేంద్రం, హంద్రీ–నీవా ప్రాజెక్టు, స్టీల్ ప్లాంటు ఇవన్నీ అనంతపురం జిల్లాకే చేస్తామన్నాడు. ఇందులో ఒక్కటైనా చేశారా చంద్రబాబూ?ఏ సమస్య వచ్చినా చంద్రబాబు చేసేది డైవర్షనే⇒ ఏ సమస్య వచ్చినా దానికి చంద్రబాబు దగ్గర ఉన్న పరిష్కారం డైవర్షన్ రాజకీయం. జగన్ను వ్యక్తిత్వ హననం చేస్తూ తిట్టించడం. చంద్రబాబు దోపిడీ, విలాసాలకు ఒక హద్దుపద్దు లేకుండా పోయింది. రాష్ట్రాని సర్వనాశనం చేస్తున్నారు. రెండేళ్లు తిరక్కుండానే చంద్రబాబు రూ.3.57 లక్షల కోట్లు అప్పులు చేశాడు. ఇంత డబ్బు తెచ్చికూడా సంక్షేమం కరువైంది. అభివృద్ధి అటకెక్కింది. ఇలాంటి పరిస్థితుల్లో అమరావతిలో రోడ్లు, కరెంటు, నీళ్లు, డ్రైనేజీ లాంటి సదుపాయాలకే రూ.2 లక్షల కోట్లు పెట్టే స్తోమత రాష్ట్రానికి ఉందా? ⇒ ప్రాక్టికల్ కాని అమరావతి మీద లక్షల కోట్లు పెడితే, ప్రజల పట్ల, రాష్ట్రం నిర్వర్తించాల్సిన బాధ్యతల సంగతి ఏమిటి? ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థులు చదువులు మానేస్తున్న పరిస్థితి. 2026–27 ఆర్థిక సంవత్సరంతో కలుపుకొని రూ.10 వేల కోట్లు ఇవ్వాలి. అసెంబ్లీ సమావేశాలకు ముందు లోకేశ్ బీఆర్ కాపీలు చూపుతూ రూ.1,200 కోట్లు ఇస్తున్నామని చెప్పాడు. ఇప్పటికీ పూర్తిగా ఇవ్వలేదు. ⇒ ఆరోగ్య శ్రీ పూర్తిగా పడకేసింది. దాదాపు రూ.3,200 కోట్లు నెట్వర్క్ ఆస్పత్రులకు ఇవ్వాలి. చివరకు పేద రోగుల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆరోగ్యశ్రీ డబ్బులు కూడా దోచుకుంటున్నారు. మా పథకాలన్నీ రద్దయ్యాయి. మీరిస్తామన్న సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ లేదు. ఆడ బిడ్డ నిధి కింద నెలకు రూ.1500 ఇస్తానన్న దానికీ అతీగతీ లేదు. 40 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నెలకు రూ.4 వేల పెన్షన్కు దిక్కులేదు. నిరుద్యోగ భృతి కింద ఒక్క రూపాయి లేదు. ⇒ స్కూళ్లలో, ఆస్పత్రుల్లో నాడు–నేడు ఆపేశారు. ఆస్పత్రుల్లో మందులకు, దూదికీ దిక్కులేదు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించేస్తున్నారు. మత్స్యకారుల కోసం మేం కట్టిన ఫిషింగ్ హార్బర్లు వారికి అప్పగించకుండా, ప్రైవేటు వారికి అమ్మేస్తున్నారు. మేం ప్రారంభించిన మూడు ప్రభుత్వ పోర్టుల్లో పనులన్నీ ఆపేశారు. వీటన్నింటినీ పట్టించుకోకుండా నిత్యం అమరావతి పాట పాడుతున్నారు. ఎందుకంటే ఆ పేరిట స్కామ్లు, వాటి ద్వారా చంద్రబాబుకు వస్తున్న ఆదాయాలే కారణం. ఆయన స్కాముల కోసం ప్రజల్లో భ్రమలు కల్పిస్తున్నారు. రాష్ట్రానికి కేపిటల్ అనేది లేకుండా చేస్తున్నారు.ఇప్పటికైనా ఆలోచించండి⇒ ఏ రోజైనా విజయవాడ వెస్ట్ బైపాస్ ఆలోచన చేశారా? జగన్ ఈస్ట్ బైపాస్ అనుమతులు తీసుకొస్తే.. అవుటర్ రింగ్ రోడ్డు పేరుతో దాన్ని కూడా రద్దు చేశారు. ఈ అవుటర్ రింగ్ రోడ్డు ఎప్పటికి పూర్తి అవుతుంది? రాజధాని లోపలకి వెళ్లడానికి రోడ్డే ఇంతవరకు పూర్తి కాలేదు. చంద్రబాబు ఇంటి వద్దే ఎకరం రూ.3.63 కోట్లు ఉంటే అమరావతి మారుమూల ప్రాంతాల్లో ఎంత రేటు ఉంటుంది? అలాంటప్పుడు వైఎస్ జగన్ చెప్పిన మావిగన్ ప్రతిపాదన తప్పేంటి? ⇒ ఇండియా–పాకిస్తాన్ మ్యాచ్కు ఎవరు డబ్బులు కట్టారో చెప్పకుండా విమానంలో వెళ్లి మ్యాచ్ చూసి రావడం గొప్పకాదు లోకేశ్.. ఫీజు రీయింబర్స్మెంట్ నయా పైసలతో కట్టి మాట్లాడండి. ఆరోగ్యశ్రీ లేక ప్రజలు అల్లాడుతుంటే మీరు మాత్రం విలాసాల్లో మునిగారు. భార్య చనిపోతే భర్తకు, భర్త చనిపోతే భార్యకు పెన్షన్ ఇవ్వడం లేదు. కొత్త పెన్షన్ లేవీ లేవని మీ స్పీకరే చెబుతున్నాడు. పంట నష్ట పరిహారం ఇస్తున్నారా అని అసెంబ్లీలో అడిగితే స్పష్టమైన సమాధానం లేదు. ⇒ అమరావతి పేరుతో చేస్తున్న అప్పుల కారణంగా అన్ని పనులను నిలిపివేశారు. అమరావతిలో బ్లాక్–1 తప్ప ఎక్కడ లిఫ్ట్లు కూడా పనిచేయవు. ఉన్న అసెంబ్లీని బాగు చేయవచ్చు. అందరినీ తాకట్టు పెట్టి లక్షల కోట్లు అప్పు చేస్తే అది ఎప్పటికీ తీరేది కాదు. మీ తప్పడు ఆలోచనలు మానండి. బూతులు తిట్టడం ఆపండి. మీకు దమ్ముంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుతో అమరావతిని పోల్చండి. ⇒ ఎప్పటికి అమరావతిని పూర్తి చేస్తారు? రైతులకు ప్లాట్లు ఎప్పుడిస్తారు? రోడ్లు ఎప్పుడు వేస్తారు? అప్పు ఎంత చేస్తారు? ఎలా అప్పు తీరుస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతే మావిగన్ గురించి ఆలోచించండి. ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని లోకేశ్ పిలుపు ఇస్తే 29 గ్రామాల్లో ఎక్కడా ప్రజలు దీపాలు పెట్టలేదు. దీన్ని బట్టే ప్రజల మనోగతం అర్థమవుతోంది. -
మావిగన్ వారియర్స్.. అమరావతి గ్రాఫిక్స్!
సాక్షి, అమరావతి: మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదించిన ఆచరణ సాధ్యమైన రాజధాని ‘మావిగన్’ ఓవైపు... ముఖ్యమంత్రి చంద్రబాబు అరచేతిలో వైకుంఠంగా చూపిస్తున్న రాజధాని అమరావతి మరోవైపు..! రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి గ్రోత్ ఇంజన్గా మావిగన్... రాజధాని ముసుగులో చంద్రబాబు ముఠా అవినీతికి వేదికగా అమరావతి...! రాష్ట్ర రాజధాని అంశం రాష్ట్రంలో రాజకీయ వేడి పుట్టిస్తోంది. ఆకాశంలో మబ్బులు చూసి ముంతలో నీళ్లు పారబోసుకోవడం అవివేకమని ప్రజలు గుర్తిస్తుండటం తాజా పరిణామం. ఆచరణ సాధ్యం కాని అమరావతి కంటే అతివేగంగా సాకారమయ్యే మావిగన్ వైపు ప్రజాభిప్రాయం మొగ్గుతోందన్నది స్పష్టమవుతుండటం ఆసక్తికరంగా మారింది. దాంతో బెంబేలెత్తుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి తన శకుని మార్కు కుతంత్రాలకు బరి తెగించారు. రాజధాని అంశంలో టీడీపీ కుట్రలు బెడిసికొట్టడంతో తనదైన డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు చెబుతున్న అమరావతి ఆచరణ సాధ్యం కాదని... మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపాదించిన రాజధానిగా ‘మావిగన్’ అందుబాటులో ఉన్న ఏకైక పరిష్కారమనే నిశ్చితాభిప్రాయం రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తమవుతోంది. ప్రజల మనోగతం వెల్లడి కావడంతో బెంబేలెత్తుతున్న టీడీపీ కూటమి పెద్దలు దీని నుంచి దృష్టి మళ్లించేందుకు దిగజారుడు రాజకీయాలకు తెర తీశారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు. వాస్తవాలను వక్రీకరిస్తూ... అభూత కల్పనలను జోడిస్తూ పచ్చ మీడియా ప్రాపగాండాతో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు పన్నాగం పన్నుతున్నారు. చంద్రబాబు కుట్రలను వైఎస్సార్సీపీ సమర్థంగా తిప్పికొడుతోంది. రాజధానిగా ‘మావిగన్’ ఏ విధంగా మెరుగైనదో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు దుర్బుద్ధి, కుట్రలను ఎండగడుతూ ఆయన మామ ఎన్టీ రామారావుతోపాటు ఆయన తోడల్లుడు దగ్గుబాటి, బావమరిది నందమూరి హరికృష్ణతోపాటు పలువురు నేతలు స్వయంగా చెప్పిన మాటలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న పవన్ కళ్యాణ్, ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్థసారథి తదితరులు గతంలో చంద్రబాబునుద్దేశించి చేసిన విమర్శలను ప్రస్తావిస్తున్నారు. ‘అమరావతి’ అవినీతిపై సమాధానం చెప్పలేకే... టీడీపీ కూటమి సర్కారు రెండేళ్ల పాలనపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతుండడంతో చంద్రబాబు బెంబేలెత్తుతున్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను అమలు చేయలేక చంద్రబాబు చేతులెత్తేశారు. సున్నా వడ్డీ పథకానికి అతీ గతీ లేదు.. నాడు – నేడు పథకం అటకెక్కింది. ఆరోగ్యశ్రీ ఆగిపోయింది. పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎగ్గొట్టారు. తల్లికి వందనం పథకం పచ్చి మోసంగా మారింది. అటు సంక్షేమ పథకాలు నిలిచిపోవడం, ఇటు అభివృద్ధి కార్యక్రమాలే లేకపోవడంతో ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. దాంతో ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు హఠాత్తుగా రాజధానిగా అమరావతి తీర్మానాన్ని తెరపైకి తెచ్చారు. తద్వారా తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చాలన్నది ఆయన ఎత్తుగడ. అయితే రాజధానిగా అమరావతి ఏ విధంగా ఆచరణ సాధ్యమో చెప్పాలంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. కేవలం రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికే రూ.2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని నిలదీశారు. ఇక మాస్టర్ ప్లాన్ ప్రకారం రాజధాని నిర్మాణానికి ఏ రూ.10 లక్షల కోట్లు అవుతుందో అంతే చిక్కడం లేదన్నారు. చంద్రబాబు 2014–19లో, 2024 నుంచి ఇప్పటివరకు రాజధాని కోసం ఖర్చు చేసింది కేవలం రూ.8 వేల కోట్లేనని గుర్తు చేశారు. దీన్నిబట్టి ఆయన చెబుతున్న అమరావతి రానున్న 30 ఏళ్లలో కూడా సాధ్యం కాదన్నారు. ఇక అమరావతి నిర్మాణం పేరిట యథేచ్ఛగా పాల్పడుతున్న అవినీతిని వైఎస్ జగన్ సాక్ష్యాధారాలు, గణాంకాలతో సహా ఎండగట్టారు. బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ఇటాలియన్ మార్బుల్స్తో అధునాతనంగా నిర్మించే భవనాలకే చ.అడుగుకు రూ.4,500 ఖర్చు అవుతోంది. కానీ అమరావతిలో మాత్రం చ.అడుగుకు ఏకంగా రూ.14 వేలు దాకా చెల్లిస్తూ పనులు ఎందుకు కట్టబెడుతున్నారని ప్రశ్నించారు. కేంద్ర జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్హెచ్ఏఐ) దేశంలో కి.మీ.కు రూ.20 కోట్ల చొప్పున ఆరు లేన్ల రహదారులు నిర్మిస్తుంటే... అమరావతిలో మాత్రం కి.మీ.కు రూ.53 కోట్ల చొప్పున టెండర్లు ఖరారు చేయడం ఏమిటని నిలదీశారు. అమరావతి దోపిడీ కుట్రలో భాగస్వాములైన ఈనాడు కిరణ్ వియ్యంకుడు, చంద్రబాబు బినామీ బలుసు శ్రీనివాసరావు తదితరులకు మొబిలైజేషన్ అడ్వాన్స్ల రూపంలో భారీగా ప్రజాధనాన్ని దోచిపెడుతున్న తీరును ఎండగట్టారు. ఈ నేపథ్యంలో అమరావతి నిర్మాణం ఏ విధంగా ఆచరణ సాధ్యమో తెలపాలని.. రాజధాని పేరుతో సాగుతున్న అవినీతిపై వైఎస్ జగన్ సంధించిన ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానమే లేకుండా పోయింది. దాంతో రాజధాని అమరావతి నిర్మాణం పేరిట చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని ప్రజలకు స్పష్టమైంది. అమరావతి పేరిట భారీగా అవినీతికి పాల్పడుతున్నారన్నది బహిర్గతమైంది. ‘మావిగన్’కు ప్రజామోదం.. రాష్ట్ర రాజధానిగా వైఎస్ జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’ పట్ల రాష్ట్రవ్యాప్తంగా సానుకూల అభిప్రాయం బలపడుతోంది. పారిశ్రామిక, వ్యవసాయ, సేవా రంగాల పరంగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ‘మావిగన్’ గ్రోత్ ఇంజన్గా నిలుస్తుందని స్పష్టం చేస్తున్నారు. అభివృద్ధి చెందిన 110 కి.మీ. అర్బన్ ప్రాంతం, అంతర్జాతీయ విమానాశ్రయం, బందరు పోర్టు, పూర్తి కనెక్టివిటీ ఉన్న జాతీయ రహదారులు, ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉన్నత విద్యా సంస్థలతో మావిగన్ రాజధానిగా అత్యంత అనుకూలమనే ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. అమరావతిలో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికే రూ.2 లక్షల కోట్లు కావాల్సి ఉండగా... కేవలం రూ.20వేల కోట్లతో మావిగన్ను పూర్తిస్థాయి రాజధానిగా తీర్చిదిద్దవచ్చన్నది స్పష్టమవుతోంది. ‘మావిగన్’కు వ్యతిరేకంగా టీడీపీ తమ సోషల్ మీడియా విభాగం ద్వారా చేసిన అవహేళన, దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టింది. దాంతో ఉలిక్కిపడ్డ చంద్రబాబు తనదైన శైలిలో మరోసారి క్రెడిట్ చోరీకి యత్నించి భంగపడ్డారు. తాము ప్రతిపాదించిన అమరావతిలో మావిగన్ ఒక భాగమని నమ్మించేందుకు యత్నించారు. కానీ కూటమి ప్రభుత్వం గాలిలో మేడలు కడుతున్న అమరావతి వేరు... వైఎస్ జగన్ ప్రతిపాదించిన ఆచరణ సాధ్యమైన మావిగన్ వేరని ప్రజలు గుర్తించారు. చంద్రబాబు మాటలను ఏమాత్రం విశ్వసించడం లేదని నిఘావర్గాలు కూడా ప్రభుత్వానికి నివేదికలు సమర్పించినట్లు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. అందుకే చంద్రబాబు ‘దుష్ప్రచార’ కుతంత్రం... అమరావతిపై తన కట్టుకథలు బెడిసికొడుతుండటం... మావిగన్కు అనుకూలంగా ప్రజాభిప్రాయం బలపడుతుండటంతో చంద్రబాబు తన మార్కు కుతంత్రాలకు పదును పెట్టారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన కపట నైజాన్ని గుర్తు చేస్తున్నాయి. ‘2009 ఎన్నికల అనంతరం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ.. ‘నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తాను..!’ అని హెచ్చరించడం గమనార్హం. అనంతరం అనుమానాస్పద రీతిలో హెలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖరరెడ్డి దుర్మరణం చెందడం సందేహాలను బలపరుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు మరోసారి తన మార్కు దుర్బుద్ధిని ప్రదర్శించారు. అమరావతి పేరిట తాము సాగిస్తున్న అవినీతి బట్టబయలు కావడంతో మరోసారి తన పన్నాగానికి పదును పెట్టారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని కించపరుస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడేందుకు దుష్ప్రచారానికి తెగబడ్డారు. వాస్తవాలను వక్రీకరిస్తూ... అభూత కల్పనలను జోడిస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు టీడీపీ దుష్ప్రచారానికి తెరతీసింది. మంత్రి అచ్చెన్నాయుడు మొదటగా ఈ కుట్రను లేవనెత్తగా... మంత్రులు నిమ్మల రామానాయుడు, అనిత, టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు ఆ కుట్రలో పాత్రధారులుగా మారారు. చంద్రబాబు రాజకీయ స్వార్థం, కుట్రలు, కుతంత్రాలు, దిగజారుడు రాజకీయాలు, బరితెగించి సాగించిన అవినీతి గురించి గతంలో పలువురు చేసిన విమర్శలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. సొంత మామ ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వైస్రాయ్ కుట్ర ఉదంతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబు గురించి ఎన్టీ రామారావు, తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బావమరిది నందమూరి హరికృష్ణ, సొంత తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడులతోపాటు పలువురు సీనియర్ నేతలు గతంలో చేసిన విమర్శలను సామాన్యులు సైతం చర్చించుకుంటున్నారు. బాబు నైచ్యానికిదే నిదర్శనం! 2009 ఆగస్టులో వైఎస్ను ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన నైచ్యానికి అద్దంపడుతున్నాయని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ‘‘నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తాను’’ అని చంద్రబాబు హెచ్చరించడం, ఆ తర్వాత రోజే అనుమానాస్పద రీతిలో వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందడాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు డర్టీయెస్ట్ పొలిటీషియన్తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ దేశంలోనే డర్టీయెస్ట్ రాజకీయ నాయకుడు.. ఆయన నాయకుడు కాదు.. మేనేజర్ మాత్రమే.. కాపీ క్యాట్..! ఆయనకు ఆదర్శాలు లేవు.. స్వార్థం మాత్రమే ⇒ డిసెంబర్ 30, 2018 ప్రెస్ మీట్లో ‘హైదరాబాద్ను ప్రపంచ మ్యాప్పై పెట్టానని చంద్రబాబు అంటాడు.. మెంటల్..! అంత సమర్థుడైతే అమరావతి ఎందుకు కట్టలేదు? గ్రాఫిక్స్ తప్ప నిజమైన భవనాలు ఏవీ రాలేదు. ⇒ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో నవంబర్ 25, 2018 పరిగి (వికారాబాద్) బహిరంగ సభ, ప్రెస్మీట్లో.. హత్యా రాజకీయాలే బాబు బ్రాండ్!ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హత్యా రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబే అన్నది నిర్వివాదాంశమని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. టీడీపీ అక్రమాలకు అడ్డుగోడగా ఉన్నారనే 1988లో అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగాను హత్య చేయించారని, ఇందుకు నాటి హోంమంత్రి కోడెల శివ ప్రసాద్ ద్వారా కుట్ర పన్నారని చెబుతున్నారు. రంగా హత్యలో స్వయంగా పాల్గొన్న వెలగపూడి రామకృష్ణకు 2009లో, 2024లో చంద్రబాబు విశాఖ తూర్పు నియోజకవర్గ టికెట్ ఇవ్వడాన్ని గుర్తు చేస్తున్నారు. 1985లో ఎన్టీఆర్పై హత్యాయత్నం చేసిన మల్లెల బాబ్జీ.. విజయవాడలో అనుమానాస్పద స్థితిలో చనిపోవడం వెనుక వేళ్లన్నీ చంద్రబాబు వైపే చూపుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ కుట్రలో సూత్రధారులు పేర్లు బయట పడకూడదనే మల్లెల బాబ్జీని అంతం చేశారని స్పష్టం చేస్తున్నారు. టీడీపీ అక్రమాలను ప్రశ్నిస్తున్న ప్రముఖ పాత్రికేయుడు పింగళి దశరథ రామ్ను విజయవాడలో నడిరోడ్డుపై హత్య చేయడం వెనుక కుట్రదారు చంద్రబాబేనని సోషల్ మీడియాలో ఇప్పటికీ తిరుగుతూనే ఉంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే వైఎస్ రాజారెడ్డిని 1998లో టీడీపీ వర్గీయులు హత్య చేశారు. ఆ కేసులో నిందితులు ఇప్పటికీ టీడీపీలోనే ఉన్నారు. వైఎస్ రాజారెడ్డి హత్య అనంతరం నిందితులకు చంద్రబాబు ప్రభుత్వమే హైదరాబాద్లో నెల రోజులపాటు ఆశ్రయం ఇవ్వడం గమనార్హం. 2024లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో రెడ్బుక్ అరాచకం బీభత్సం సృష్టిస్తోంది. 21 నెలల్లోనే 21 రాజకీయ హత్యలకు తెగబడ్డారని, చంద్రబాబు అధికారం చేపట్టాక రాష్ట్రంలో 710 హత్యలు జరగడం దారుణంగా దిగజారిన శాంతిభద్రతల దుస్థితికి నిదర్శనమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు తిరుపతి రైల్వే స్టేషన్లో జేబులు కొట్టేవాడు..!-నాదెండ్ల భాస్కర్రావు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చి అవినీతిపరుడు. దిగజారుడు వ్యక్తి. రాజకీయాల్లోకి రాకముందు తిరుపతి రైల్వే స్టేషన్లో జేబులు కొట్టేవాడని మాకు రిపోర్ట్ వచ్చింది. అటువంటి వ్యక్తి ఇక రాజకీయాల్లోకి వస్తే ఎంతగా దిగజారి ప్రవర్తిస్తాడో ఊహించుకోండి. చంద్రబాబు అలానే దిగజారుడు, అవినీతి రాజకీయాలే లక్ష్యంగా పని చేస్తున్నాడు.చంద్రబాబు ప్రభుత్వం అవినీతిమయం...-పవన్ కళ్యాణ్, టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి(గతంలో చంద్రబాబుపై చేసిన విమర్శలు) చంద్రబాబు ప్రభుత్వం అవినీతిమయంగా మారింది. రాజధాని అమరావతి, కోస్టల్ కారిడార్ పేరుతో అవినీతికి పాల్పడుతోంది. రాష్ట్రంలో భూములు, గనులు, ఇసుక కుంభకోణాలు పెచ్చుమీరుతున్నాయి. లోకేశ్ నా తల్లిని దూషించారు. ఖబడ్దార్...! చంద్రబాబు ఔరంగజేబ్... గొడ్డుకన్నా హీనం... గాడ్సే కన్నా ఘోరం: ఎన్టీరామారావు‘రాజ్యాధికారం కోసం తండ్రిని జైల్లో పెట్టిన, సోదరుడిని హత్య చేసిన ఔరంగజేబ్ వంటి వాడు చంద్రబాబు. తెలుగు జాతి చరిత్రలో అభినవ ఔరంగజేబ్ చంద్రబాబు. నాతోనే ఉంటూ పథకం ప్రకారం వెన్నుపోటు పొడిచాడు. గుండెల మీద తన్నాడు. చంద్రబాబు గొడ్డుకన్నా హీనం... గాడ్సే కన్నా ఘోరం. చంద్రబాబు దశమ గ్రహం. కుటుంబాన్నీ, ప్రజలను మోసం చేసిన కుట్రదారు చంద్రబాబు -దగ్గుబాటి వెంకటేశ్వర రావు‘అడ్డదారిలో అధికారాన్ని దక్కించుకునేందుకు చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారు. అందుకోసం 1995లో వైస్రాయ్ హోటల్ కుట్ర ద్వారా ఇటు కుటుంబాన్ని, అటు రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. అధికారం, అవినీతే చంద్రబాబు లక్ష్యాలు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కాంట్రాక్టర్లు, బడా పారిశ్రామికవేత్తలకు నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులు ఇప్పించి యథేచ్చగా అవినీతికి పాల్పడేవారు. 1985ృ89 ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో మద్యం డిస్టిలరీల లైసెన్సు ఇప్పిస్తానని తమిళనాడుకు చెందిన ఓ వ్యాపారి గోనె సంచిలో కోట్ల రూపాయలు తీసుకువచ్చి ఇచ్చారు. విద్యుత్ ప్లాంట్ల లైసెన్సుల మంజూరులో అవినీతికి పాల్పడితే ఎన్టీ రామారావు తీవ్రంగా మందలించారు. అయినా సరే గోతికాడ నక్కలా కాచుకుని వెన్నుపోటు పొడిచారు. రంగా హత్య వెనుక చంద్రబాబు-మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య(‘అరవై వసంతాల నా రాజకీయ ప్రస్థానం’ పుస్తకంలో పేర్కొన్నారు) ప్రజా నాయకుడు, విజయవాడ ఎమ్మెల్యేగా ఉన్న వంగవీటి మోహన రంగా హత్య వెనుక ప్రధాన కుట్రదారు చంద్రబాబే. ఆయన ప్రోద్బలంతోనే రంగాను హత్య చేశారు. రంగా జీవించి ఉంటే టీడీపీకి మనుగడ ఉండదని భావించారు. అందుకే రంగా హత్యకు పచ్చ జెండా ఊపారు.’ చంద్రబాబు అరాచక శక్తి-దేవినేని నెహ్రూ, మాజీ మంత్రి‘అధికారం కోసం చంద్రబాబు ఎంతటి అరాచకానికైనా పాల్పడతారు. 1994లో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావును, ఆయన కుమారుడు హరికృష్ణను మా ముందే పచ్చి బూతులు తిట్టారు. ఇక వైస్రాయ్ హోటల్ కుట్రతో ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారు. గతంలో ప్రతిపక్షంలో ఉండగా పార్టీ నిర్వహించే ధర్నాల సందర్భంగా బస్సులను దహనం చేయాలని కార్యకర్తలను ఆదేశించారు. సామాన్య ప్రయాణికులు చనిపోతారని కార్యకర్తలు చెప్పినా సరే ఆయన వినిపించుకునేవారు కాదు. సామాన్యులు చనిపోతే మనకేం... బస్సులు తగలబెట్టకపోతే పార్టీ కార్యక్రమాలు విజయవంతం అయినట్టు కాదు అని చంద్రబాబు చెప్పేవారు. అంతటి అరాచక శక్తి చంద్రబాబు. అవినీతి, అక్రమాల్లోనే చంద్రబాబు సీనియర్-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి(2019 ఎన్నికల సందర్భంగా గుంటూరు, రాజమహేంద్రవరం, విశాఖపట్నం ఎన్నికల సభల్లో ప్రసంగిస్తూ) ‘అద్భుతమైన రాజధాని అంటూ చంద్రబాబు అక్రమ సంపాదన ఆర్జనలో బిజీ అయిపోయారు. ఆయన చేస్తోంది రాజధాని నిర్మాణం కాదు.. కూలి పోతున్న టీడీపీ నిర్మాణం. అమరావతి, పోలవరం ప్రాజెక్టు సహా అన్నింటిలోనూ చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ దోపిడీకి పాల్పడుతున్నారు. సొంత హెరిటేజ్ కంపెనీ కోసమే ఆయన తపన అంతా. పోలవరం ప్రాజెక్టును తన అవినీతికి ఏటీఎంగా చేసుకున్నారు. ప్రజల్ని మోసగించేందుకు డేటా చోరీకి పాల్పడ్డారు. చంద్రబాబు తాను సీనియర్నని చెప్పుకుంటారు. కానీ సొంత మామకే వెన్నుపోటు పొడవటంలో ఆయన సీనియర్. తెలుగు ప్రజలను మోసం చేయడంలో సీనియర్. నేడు తిట్టిన పార్టీ ఓళ్లోనే రేపు కూర్చోవడంలో సీనియర్. కేంద్ర పథకాలను తనవిగా స్టిక్కర్ వేసుకోవడంలోనే సీనియర్.’ -
అధికారులపై వృద్ధురాలి ప్రతీ‘కారం’!
గాందీనగర్(విజయవాడసెంట్రల్): విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సోమవారం పీజీఆర్ఎస్ జరుగుతున్న సమయంలో ఓ వృద్ధురాలు కలకలం సృష్టించింది. కలెక్టరేట్ భూసేకరణ విభాగం కార్యాలయంలోకి ప్రవేశించి అక్కడి అధికారులపై కారం చల్లేందుకు యత్నించింది. ఈ ఘటనతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నందిగామ మండలం అనాసాగరం గ్రామంలో జాతీయ రహదారి విస్తరణలో భాగంగా 65 ఏళ్ల మల్లెంపూడి లక్ష్మీతులసి భూమిని 2003లో అప్పటి ప్రభుత్వం సేకరించింది. ఇందుకు సంబంధించి ఆమెకు 2022వ సంవత్సరంలో రూ.6,51,821 నష్టపరిహారం చెల్లించారు.అయితే తన నుంచి సేకరించిన భూమి మొత్తానికి సంబంధించి పరిహారం ఇవ్వలేదని, కొంత భాగానికి మాత్రమే ఇచ్చారని లక్ష్మీతులసి కలెక్టరేట్ అధికారుల చుట్టూ తిరుగుతోంది. ఇతరులకు ఎక్కువ విస్తీర్ణానికి పరిహారం చెల్లించారని ఆరోపించింది. పరిహారం కోసం తాను కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో తన చేయి విరిగిందని కన్నీరు పెట్టుకుంది. భూ సేకరణ విభాగంలో పనిచేస్తున్న అధికారి తనను ఇబ్బంది పెట్టాడని వాపోయింది. ఈ క్రమంలో సోమవారం పీజీఆర్ఎస్ జరగుతున్న సమయంలో కలెక్టరేట్కు చేరుకుంది.అక్కడ భూ సేకరణ విభాగంలోకి వెళ్లి తన వెంట తెచ్చుకున్న కారం ప్యాకెట్ విసిరింది. కారం అంతా బల్లలపై, కుర్చిలపై పడింది. అక్కడ నుంచి బయటకు వచ్చి ఆవరణలో బైఠాయించింది. తనకు న్యాయం చేయాలని కన్నీటి పర్యంతమైంది. దీనిపై అధికారులు వివరణ ఇస్తూ.. లక్ష్మీతులసికి చెందిన 28 చదరపు మీటర్లు మాత్రమే భూమి సేకరించామని, అందుకు ఆమెకు రూ.6,51,821 పరిహారం కూడా చెల్లించామని కలెక్టర్ జి.లక్ష్మీశకు డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం నివేదించారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా ఈ విషయాన్ని పునః పరిశీలించాలని నందిగామ తహసీల్దార్ను ఆదేశించారు. ఈ మేరకు డీఆర్వో ప్రకటన విడుదల చేశారు. -
ఫీజుల వసూళ్ల పేరుతో వడ్డీ వ్యాపారమా!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కార్పొరేట్ విద్యాసంస్థలు ఫైనాన్స్ కంపెనీలతో కుమ్మక్కై విద్యార్థుల తల్లిదండ్రులతో వడ్డీ వ్యాపారం చేస్తున్నాయని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర మండిపడ్డారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది చదువులు పూర్తి కాకుండానే నిబంధనలకు విరుద్ధంగా వచ్చే విద్యా సంవత్సరానికి మొదటి టర్మ్ ఫీజులు వసూలు చేస్తున్నా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు.నిర్ణీత సమయంలో ఫీజులు చెల్లించకపోతే వడ్డీ చెల్లించాల్సి వస్తుందని మెసేజ్లు పంపి మరీ విద్యార్థుల తల్లిదండ్రులను బెదిరిస్తున్నా ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. చైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ విద్యాసంస్థలు 6, 9 నెలల కాలపరిమితితో విద్యార్థులకు రుణాలు ఇప్పిస్తూ ఈఎంఐల రూపంలో అసలుతోపాటు వడ్డీ కూడా వసూలు చేస్తున్నాయన్నారు. విద్యా సంస్థల ముసుగులో ఫైనాన్స్ వ్యాపారం మొదలుపెడితే ప్రభుత్వానికి పట్టదా? అని నిలదీశారు.వైఎస్సార్సీపీ హయాంలో ఫీజుల నియంత్రణకు పర్యవేక్షణ కమిటీ వేసి ఇలాంటివి జరగకుండా అడ్డుపడిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ.. టీడీపీ కూటమి ప్రభుత్వంలో విద్యను వ్యాపారం చేసి ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న లోకేశ్కి విద్యాశాఖపై ఏమాత్రం నియంత్రణ, అవగాహన లేదని.. ఆయన తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
కూరగాయాలు..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూరగాయ రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. ఆరుగాలం శ్రమించి అప్పులతో సాగుచేసి పండించిన పంటను మార్కెట్కు తీసుకెళ్తే కన్నీళ్లే మిగులుతున్నాయి. మార్కెట్లో ఏ కూరగాయ ధర చూసినా కిలో రూ.40 తక్కువ లేదు. కానీ, అందులో పదో వంతు కూడా రైతుకు దక్కడంలేదు. ఎంతో కష్టపడి సాగుచేసిన పంటలు చేతికొచ్చే సమయానికి వాటి ధరలు తగ్గిపోవడం, రెక్కలు ముక్కలు చేసుకుని చేసిన కష్టం దళారీల పాలవుతుండడంతో చివరకు పెట్టుబడి కూడా చేతికి అందక రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. రైతు కష్టం దళారీల పాలు.. రాష్ట్రంలో ప్రధానంగా కృష్ణా, గోదావరి లంక గ్రామాలతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో బోర్ల కింద అధిక సంఖ్యలో రైతులు కూరగాయ పంటలను సాగుచేస్తున్నారు. రాయలసీమ (కర్నూలు, నంద్యాల, అనంతపురం) ఉల్లి సాగుకు పెట్టింది పేరు. కర్నూలు జిల్లా అయితే ఇక్కడ నిల్వ సౌకర్యాలు లేకపోవడంతో పంట కోసిన వెంటనే అయిన కాడికి తెగనమ్ముకోవాల్సిన దుస్థితి. ఇక చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో టమాటా రైతులు పండించిన పంటను రోడ్లపై పారబోస్తున్నారు. కోస్తాంధ్ర (ప్రకాశం, పల్నాడు, గుంటూరు)లో దోస, వంకాయ, బెండ సాగుతో రైతులు కుదేలవుతున్నారు. ప్రకాశం జిల్లాలో నీటి ఎద్దడిని తట్టుకుని, ట్యాంకర్లతో నీరుపోసి పండించిన దోసకాయను కిలో రూపాయికి కూడా కొనేవారు కనిపించడంలేదు. కోస్తా – ఉత్తరాంధ్రలో కాకర, బీర వంటి తీగజాతి పంటలకు పందిరి పెట్టుబడి ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఉల్లి, టమాటా రైతుల పరిస్థితి దారుణం.. ముఖ్యంగా.. ఉల్లి రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. పొరుగు రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున పంట మార్కెట్లోకి రావడంతో ఎగుమతుల్లేక ఉల్లి పంటను కొనేవారు కరువయ్యారు. నాణ్యమైన ఉల్లికి సైతం క్వింటా రూ.300–రూ.400కు మించి ధర దక్కడంలేదు. కూరగాయల రైతుల పరిస్థితి కూడా ఇంతే. రెండునెలల కిందట కిలో టమాట రూ.50 వరకు పలకగా.. నేడు రూ.3–4 కు దిగజారింది. వాటిని కోయడానికి కూలీ ఖర్చులు కూడా రాకపోవడంతో వందలాది మంది రైతులు టమాటా పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు ఏటా 30 శాతం చొప్పున పెరుగుతున్నా, ప్రభుత్వం మాత్రం సబ్సిడీలు ఏమాత్రం పెంచలేదు. పైగా.. రెండేళ్లుగా రైతులకు సబ్సిడీ విడుదల చేస్తున్న దాఖలాల్లేవు. మరోవైపు కూలీల రేట్లు (మగ కూలీ రూ.600, ఆడ కూలీ రూ.400), డీజిల్ ధరలు, విత్తన ధరలు తడిసిమోపడవుతున్నాయి. ఏ కూరగాయ ధర చూసినా గుండె గుబులే.. ఏ కూరగాయ ధర చూసినా రైతు గుండెలు బాదుకుంటున్నాడు. దోసకాయల బస్తా ధర మూడు నెలల కిందట రూ.రెండున్నర వేలు ఉండగా, ప్రస్తుతం రూ.రెండు వందలకు కూడా కొనేవారు లేరు. క్యాబేజీ నెల క్రితం కిలో రూ.40లకు పైగా ఉండగా నేడు కిలో రూ.4–6కు పడిపోయింది. బెండ, వంకాయలు కిలో రూ.8–10.. కాకర, పెద్ద చిక్కుళ్లు కిలో రూ.15–20లు మాత్రమే పలుకుతున్నాయి. తక్కువ వ్యవధిలో పంట చేతికొస్తోందని, సాగుకు నీరులేకపోయినా రూ.లక్షలు వెచి్చంచి బోర్లు వేసి కూరగాయల పంటలు సాగుచేస్తే చివరికి పెట్టుబడి కూడా రాక నష్టాలపాలై అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. పత్తా లేని ప్రభుత్వం.. ఇక ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే ‘ధర స్థిరీకరణ నిధి’ ఎక్కడా అమలుకాకపోవడంతో దళారుల చేతిలో రైతులు నిలువు దోపిడీకి గురవు తున్నారు. ధరలు పతనమైనప్పుడు ప్రభుత్వం మార్కెట్లోకి వచ్చి కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. టమాటా, ఉల్లి వంటి పంటలను కొనేవారులేక చేలల్లో, రోడ్లపక్క పంటను పారబోస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. దళారీలు, వ్యాపారులు సిండికేట్గా మారి రైతును దోచుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఉల్లి, టమాటా వంటి పంటలకు గిట్టుబాటు ధర కలి్పంచకపోతే, వచ్చే ఏడాది సాగుచేసే వారు కరువయ్యే ప్రమాదం ఉంది.కూరగాయల సాగుతో తీవ్ర నష్టాలు మూడెకరాల్లో టమోటా సాగుచేశా. ధర లేకపోవడంతో తీసేశా. ప్రస్తుతం నాలుగెకరాల్లో ఉల్లి పంట, ఎకరాలో వంకాయ, రెండెకరాల్లో బెండ సాగుచేశా. ఉల్లి కొనేవారు లేరు. కూరగాయలకు మార్కెట్లో కనీస ధరలేక ఆర్థికంగా నష్టపోతున్నా. టమోటా ఎకరాకు రూ.60 వేల చొప్పున రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టి నష్టపోయా. ఎకరాకు రూ.లక్ష చొప్పున నాలుగెకరాల్లో ఉల్లి పెట్టుబడి నష్టపోయా. బెండ ఎకరాలో రూ.40వేలు.. వంకాయ ఎకరాకు రూ.60 వేల వరకు పెట్టుబడి పెట్టా. కానీ, ఏ ఒక్క పంటకూ పెట్టుబడి దక్కలేదు. – ఆంజనేయులు, ప్యాలకుర్తి గ్రామం, కోడుమూరు మండలం, కర్నూలు జిల్లా -
హజ్ కమిటీలో బాబు అపవిత్ర రాజకీయం
సాక్షి, అమరావతి: పవిత్ర హజ్ కమిటీ నియామకంలో చంద్రబాబు ప్రభుత్వం అపవిత్ర రాజకీయం చేస్తోంది. హజ్ కమిటీ చట్టం–2002 నియమ నిబంధనలను గతేడాది యథేచ్ఛగా ఉల్లంఘించింది. కమిటీలో ధార్మిక ప్రతినిధులుగా పేర్కొంటూ ఇద్దరు టీడీపీ నేతలను నియమించింది. దీనిపై ముస్లిం సంఘాలు అప్పట్లోనే హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో ఏడాది అనంతరం పాత జీవో స్థానంలో మరో జీవోను బాబు ప్రభుత్వం జారీ చేసింది. అయితే ఈ నియామకంలోని కూడా ప్రభుత్వం అదే తప్పు చేసింది. ఈసారి స్థానిక సంస్థల ప్రతినిధుల పేరుతో పదవీకాలం ముగిసిన ముగ్గురు టీడీపీ నేతలను నియమించింది. దీనిపై ముస్లిం సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. దీనిపై మళ్లీ న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నాయి.టీడీపీ నేతలే ధార్మిక ప్రతినిధులా?ఏపీ హజ్ కమిటీనీ నియమిస్తూ ప్రభుత్వం గతేడాది ఏప్రిల్ 16న జీవో 38 జారీ చేసింది. ఏపీ హజ్ కమిటీ చట్టం–2002 సెక్షన్ 18(1), (2) ప్రకారం చేపట్టిన ఈ నియామకంలో సబ్ క్లాజ్–3 ప్రకారం ముగ్గురు ధార్మిక పండితులను నియమించాల్సి ఉంది. అయితే ధార్మిక పండితులను నియమించకుండా వారి పేరుతో టీడీపీ ప్రతినిధులైన పఠాన్ ఖాదర్ ఖాన్, షేక్ హసన్ బాషాలను నియమించడం వివాదాస్పదమైంది. దీంతో బాబు ప్రభుత్వం చట్టాన్ని ఉల్లంఘించిందని రాజమహేంద్రవరానికి చెందిన షేక్ నిజాముద్దీన్ హైకోర్టును ఆశ్రయించారు.దీనిపై విచారణ చేసిన హైకోర్టు 4 వారాల్లో దీనిపై నిర్ణయం తీసుకోవాలని గతేడాది జూన్ 21న ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ ఆదేశం అమలును ప్రభుత్వం జాప్యం చేసి ఈ ఏడాది మార్చి 29న జీవో 34ను జారీ చేసింది. అయితే కొత్తగా నియమించిన హజ్ కమిటీలోనూ చంద్రబాబు ప్రభుత్వం అదే తప్పు పునరావృతం చేసింది. ఈ ఏడాది మార్చి 29న ఇచ్చిన జీవో 34లో స్థానిక సంస్థల ప్రతినిధులుగా ఉన్న షేక్ అబ్దుల్ హుస్సేన్, రమేష్ పర్వీన్, షేక్ జబీన్లను కమిటీలో నియమించింది. రాష్ట్రంలో మునిసిపాలిటీలకు, పంచాయతీలకు పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జీవో ఇచ్చే నాటికి వారు పదవిలో ఉన్నప్పటికీ.. పదవీకాలం అయిపోయిన తర్వాత కూడా కొత్త కమిటీలో ఎలా కొనసాగిస్తారని ముస్లిం సంఘాలు కొత్త జీవోను తప్పుపడుతున్నాయి. దీనిపై న్యాయపోరాటానికి మళ్లీ సిద్ధపడుతున్నాయి.నిబంధనలను ఉల్లంఘిస్తారా?పవిత్రమైన హజ్ కమిటీ నియామకంలో టీడీపీ ప్రతినిధులను నియమించుకోవడం కోసం చట్టంలోని నియమ నిబంధనలను ఉల్లంఘిస్తారా? గత జీవోలో ధార్మిక పండితుల పేరుతో ఇస్లామిక్ ధర్మశాస్త్రంపై ఎటువంటి అవగాహన లేని టీడీపీ నేతలను నియమించారు. ఇప్పుడు జీవోలో పదవీకాలం ముగిసిపోయిన వారిని కమిటీలో ఎలా కొనసాగిస్తారు? –షేక్ గౌస్ లాజమ్, ఏపీ హజ్ కమిటీ మాజీ చైర్మన్హజ్ కమిటీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన జగన్వైఎస్సార్సీపీ హయాంలో ఏపీ హజ్ కమిటీ నియామకం పారదర్శకంగా చేపట్టారు. హజ్ కమిటీ పనితీరులోను వైఎస్ జగన్ పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఏపీ హజ్ కమిటీ చట్టం–2002లోని సెక్షన్లకు లోబడి నియామకం చేపట్టడంలో నిబంధనలు పాటిస్తూ ఏ ఒక్క విమర్శకు కూడా తావులేకుండా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం హజ్ కమిటీ నియామకంలో తప్పు మీద తప్పు చేస్తోంది. చివరకు కోర్టు ధిక్కారం కేసు నుంచి బయటపడేందుకు ఇచ్చిన కొత్త జీవోలోనూ నిబంధనలు ఉల్లంఘించింది. – ఇస్సాక్ బాషా, ఎమ్మెల్సీ, హజ్ కమిటీ మాజీ సభ్యుడుకూటమిలో ముస్లిం ప్రతినిధులు మూగబోయారా?హజ్ కమిటీ నియామకంలో చంద్రబాబు ప్రభుత్వం ఇష్టానుసారం వ్యవహరిస్తుంటే..కూటమిలోని ముస్లిం ప్రతినిధులు మూగబోయారా? నిబంధనలను అతిక్రమిస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న వరుస నిర్ణయాలపై మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్, మైనారిటీ సలహాదారు ఎంఏ షరీఫ్, ముస్లిం నేతలు ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? వెంటనే జీవో 34ను రద్దు చేసి నిబంధనల మేరకు నియామకాలు చేపట్టకపోతే న్యాయ పోరాటం చేస్తాం. –షేక్ నాగుల్ మీరా, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు -
ఫీజు కట్టండి.. లేదంటే వడ్డీ విధిస్తాం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): నిర్దేశిత సమయంలోగా ఫీజు చెల్లించకపోతే వడ్డీతో కలిపి దాన్ని చెల్లించాలనే కొత్త విధానానికి కార్పొరేట్ స్కూళ్లు తెరలేపాయి. విద్యార్థుల తల్లిదండ్రులు తమ ఆర్థికస్థితిని బట్టి విద్యా సంవత్సరం ప్రారంభంలోనో, మధ్యలోనో, చివరిలోనో ఫీజులు చెల్లిస్తుంటారు. ఆర్థిక భారంతో సతమతమవుతున్న వీరికి గుండెల్లో గునపాలు గుచ్చేవిధంగా విద్యాసంవత్సరం ప్రారంభం కాకుండానే ఫీజు చెల్లించాలని గడువు విధించడం, నిర్దేశిత సమయంలోపు చెల్లించకపోతే వడ్డీ విధిస్తామని చెబుతుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అకడమిక్ ఇయర్ ప్రారంభం కాకముందే... సాధారణంగా విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాతే స్కూళ్లు ఫీజులు వసూలు చేస్తుంటాయి. విద్యా సంవత్సరంలో టర్మ్ ఫీజులను తల్లిదండ్రులు తమ ఆర్థిక వెసులుబాటును బట్టి చెల్లిస్తుంటారు. పాఠశాలల్లో ఇప్పటివరకు సంవత్సరాంతపు పరీక్షలు కూడా జరగలేదు. వేసవి సెలవులూ ఇవ్వలేదు. అప్పుడే వచ్చే విద్యా సంవత్సరానికి ఫీజులు కట్టడమేమిటని, లేకపోతే వడ్డీ పడుతుందని చెప్పడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. చట్టపరంగా ఎదుర్కొంటాం ఫీజు చెల్లింపు ఆలస్యమైతే బ్యాంకు వడ్డీ విధిస్తామనడం తాము ఎన్నడూ చూడలేదని, దీన్ని చట్టపరంగా ఎదుర్కొంటామని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. కాగా, ఫీజు కట్టకుంటే వడ్డీ అనే విధానం పూర్తిగా చట్ట విరుద్ధమని తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు చెప్పారు. ఇటువంటి వి«ధానం అవలంబిస్తున్న విద్యాసంస్థలపై చర్యలు చేపడతామని తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాకుండానే ఫీజులు కట్టించుకోవడం నేరమన్నారు. అంతేగాక గడువు విధించి ఆ సమయానికి ఫీజు చెల్లించకపోతే వడ్డీ సహా చెల్లించాలని చెప్పడం కూడా తప్పేనని స్పష్టం చేశారు. ఇలా మెసేజ్లు పంపే స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బ్యాంక్ వడ్డీ రేట్ల ప్రకారం చార్జీలు విధిస్తాం రాజమహేంద్రవరంలోని పిడింగొయ్యి ప్రాంతంలోని ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్ సమీపంలోని ఓ కార్పొరేట్ పాఠశాలలో తమ పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులకు ఈ వింత పరిస్థితి ఎదురైంది. ఇంకా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ఫస్ట్ టర్మ్ ఫీజులు చెల్లించాలని ఒత్తిడి తీసుకురావడం వివాదాస్పదంగా మారింది. ఇటీవల తల్లిదండ్రులకు పంపిన వాట్సాప్ మెసేజ్లో ‘2026 ఏప్రిల్ 10 లోపు ఫీజులు చెల్లించాలి. ఆలస్యమైతే బ్యాంకు వడ్డీ రేట్ల ప్రకారం అదనపు చార్జీలు విధిస్తాం’ అని స్పష్టంగా పేర్కొంది. ఈ స్కూల్ విధించిన కొత్త నిబంధనేదో బాగుందని భావించిన మిగిలిన కొన్ని పాఠశాలల యాజమాన్యాలు కూడా ‘వడ్డీ’ విధానాన్ని అవలంబించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. -
సెగలు కక్కుతున్న భానుడు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భానుడు సెగలు కక్కుతున్నాడు. రోజురోజుకీ ఎండ తీవ్రత, వడగాలుల తీవ్రత అధికం అవుతోంది. దీనికితోడు గాలిలో తేమ తక్కువగా ఉండడంతో ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఎండ తీవ్రత ఎక్కువగా కనిపించింది. వైఎస్సార్ కడప జిల్లా పొట్టిపాడులో 43.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 43.1 డిగ్రీలు, అనంతపురం జిల్లా తేరన్నపల్లెలో 42.3, కర్నూలు జిల్లా గూడూరులో 42.1, పల్నాడు జిల్లా దుర్గిలో 41.8, శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నంలో 41.6, మార్కాపురం జిల్లా అనుమలపల్లి, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 41.2, పశ్చిమగోదావరి జిల్లా పోడూరులో 41.1 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం 51 మండలాల్లో తీవ్ర వడగాలులు, 49 మండలాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాలుల తీవ్రత ఉంటుందని, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. మున్ముందు మరింత తీవ్రం వచ్చే వారం రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 3 నుంచి 5 డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. రాయలసీమలోని కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ కడప, దక్షిణ కోస్తాలోని శ్రీపొట్టిశ్రీరాములు, ప్రకాశం జిల్లాల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది. -
ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో వసూల్రాజాలు
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్రస్ట్ అక్రమాలకు అడ్డాగా మారిపోయింది. ఓ వైపు ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ (ఫిఫో) విధానాన్ని తుంగలో తొక్కి చంద్రబాబు బావమరిది, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు చెందిన బసవతారకం ఆస్పత్రికి అడ్డదారుల్లో బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లిస్తుండగా.. మరోవైపు బిల్లులు తొందరగా ఇప్పిస్తామంటూ ఆ ట్రస్ట్లోని ఫైనాన్స్ విభాగంలో కొందరు వివిధ ఆస్పత్రుల యజమానుల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ బాగోతంపై ఇటీవల ట్రస్ట్కు ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. బిల్లింగ్ మీద ఒక శాతం నుంచి ఐదు శాతం వరకూ కమీషన్ను వారు ఆస్పత్రులకు ఫోన్చేసి డిమాండ్ చేస్తున్నారు. పైగా.. వెనకున్న బిల్లులను ఆన్లైన్లో ముందుగా అప్లోడ్ చేయడం, ప్రభుత్వం నుంచి బిల్లులు జమ కావడానికి ముందే మీ ఆస్పత్రికి ఇంత మొత్తంలో నిధులు వస్తాయని ఉప్పందించడం ద్వారా కమీషన్లు దండుకుంటున్నట్లు తెలుస్తోంది. వాటాల్లో తేడా రావడంతో..ఈ బాగోతంలో ఇద్దరి మధ్య వాటాల్లో తేడా రావడంతో మొత్తం వ్యవహారం బెడిసికొట్టినట్లు తెలుస్తోంది. ఓ కార్పొరేట్ సంస్థ తెలంగాణాతో పాటు, ఏపీ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఆస్పత్రులను నడుపుతోంది. ఈ సంస్థ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు ఇప్పిస్తామంటూ ఫైనాన్స్ విభాగంలోని వారు కొందరు పెద్దఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ వ్యవహారంలో సదరు కార్పొరేట్ సంస్థ ఉద్యోగి ఒకరు ట్రస్ట్ ఫైనాన్స్ విభాగంతో నిత్యం టచ్లో ఉంటూ బిల్లులను అప్లోడ్ చేయించడం, నిధులు జమ అయ్యాక కమీషన్లు ముట్టజెపుతున్నట్లు తెలుస్తోంది. బిల్లులు జమయ్యాక ట్రస్ట్కు ఇచ్చే కమీషన్లో కొంత మొత్తాన్ని కార్పొరేట్ సంస్థ ఉద్యోగి కూడా నొక్కేస్తున్నట్లు వెల్లడైంది. దీంతో.. ఈ ఉద్యోగిని సైడ్చేసి ట్రస్ట్ ఫైనాన్స్ ఉద్యోగి ఒకరు ఆస్పత్రి యాజమాన్యంతో నేరుగా టచ్లోకి వెళ్లి, బిల్లులు జమ అయిన వెంటనే హైదరాబాద్కు వెళ్లి ముడుపులు తెచ్చుకుంటున్నాడు. ఇది పసిగట్టిన సదరు ఉద్యోగి మొత్తం బండారాన్ని బట్టబయలు చేసినట్లు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ కార్పొరేట్ ఆస్పత్రి నుంచి గతేడాది రూ. లక్షల్లో ఫైనాన్స్ విభాగానికి కమీషన్లు ముట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాణిజ్య పన్నుల విభాగం నుంచి డిప్యూటేషన్పై ట్రస్ట్లో పనిచేస్తున్న ఓ అధికారిపైనా ఆరోపణలు వస్తున్నాయి. ఆయన డిప్యూటేషన్ ముగిసినా, సదరు అధికారిపై ట్రస్ట్ ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు అందినా ప్రభుత్వం కొనసాగిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.రగిలిపోతున్న నెట్వర్క్ ఆస్పత్రులు..నిజానికి.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఫిఫో విధానాన్ని తుంగలో తొక్కింది. ప్రాధాన్యతా క్రమంలో చెల్లింపుల పేరిట ప్రత్యేక ఉత్తర్వులిచ్చి నందమూరి బాలకృష్ణకు చెందిన బసవతారకం ఆస్పత్రికి వేగంగా బిల్లులు చెల్లిస్తోంది. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం అరకొరగా చేపడుతున్న మిగిలిన చెల్లింపుల్లోనూ అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు అనుమానిస్తున్నాయి. ఈ విషయాన్ని పలుమార్లు ఉన్నతాధికారులతో జరిగిన సమావేశాల్లోను ప్రస్తావించాయి. ఇప్పుడు తాజాగా వసూళ్ల పర్వం వెలుగుచూడటంతో ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలు రగిలిపోతున్నాయి. -
విజిలెన్స్లో అచ్చోసిన అన్నదే ఇష్టారాజ్యం
సాక్షి, అమరావతి: అవినీతికి అడ్డుకట్ట వేయాల్సిన విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో అవినీతి కట్టలు తెంచుకుంటోంది. ఉత్తరాంధ్రకు చెందిన రిటైర్డ్ అధికారి ఇష్ట ప్రకారమే అంతా సాగుతోంది. ప్రభుత్వంలో కీలక నేతలుగా ఉన్న బాబాయ్, అబ్బాయ్ కుటుంబ సభ్యుడు కావడంతో విజిలెన్స్ – ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో ఏకంగా సొంత సిండికేట్ను ఏర్పాటు చేశారు. ఆయన వర్గంలోని అధికారులకే కీలక జిల్లా పోస్టింగులు ఇస్తున్నారు. గ్రానైట్, ఇసుక, ఇతర వ్యాపారుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతూ ఈ సిండికేట్ బరితెగించి అవినీతికి పాల్పడుతుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఓఎస్డీగా నియమించి.. వైజాగ్లో పోస్టింగ్ ప్రభుత్వంలో అచ్చోసిన వ్యాఖ్యలు చేసే కీలక నేత సోదరుడి ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అందలం ఎక్కించింది. ఆయన రిటైర్మెంట్కు ఒక రోజు ముందు అద నపు ఎస్పీగా పదోన్నతి కల్పించింది. అంతేకాదు ఆయన రిటైరైన తరువాత విజిలెన్స్– ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో ఓఎస్డీగా నియమించింది. సాధారణంగా ఓఎస్డీ అంటే రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో పోస్టింగు ఇస్తారు. కానీ అందుకు విరుద్ధంగా ఆ అధికారి కోరుకున్న ట్టుగా విశాఖపట్నంలో పో స్టింగ్ ఇస్తూ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జిగా బాధ్యతలు కట్టబెట్టారు. ఓఎస్డీగా ఆయన పదవీ కాలాన్ని ఇటీవల మరోసారి పొడిగించారు కూడా. కాగా తాజాగా గోదావరి జిల్లాల బాధ్యతలను కూడా ఆ అధికారికే కట్టబెట్టడం గమనార్హం. సిండికేట్లోని సొంత వర్గీయులకే కీలక పోస్టింగ్లు ఇక ఆ అధికారి రాష్ట్రవ్యాప్తంగా తన వర్గీయులైన అధికారులతో ఓ సిండికేట్ను ఏర్పాటు చేశారు. ఆ సిండికేట్లోని అధికారులకే మైనింగ్, గ్రానైట్, ఇతర కీలక వ్యాపారాలకు కేంద్ర స్థానాలుగా ఉన్న జిల్లా అధికారులుగా పోస్టింగ్లు ఇస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి జిల్లాలతోపాటు గుంటూరు, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల విజిలెన్స్ అధికారులుగా ఆయన వర్గీయులకే పోస్టింగులు దక్కడం గమనార్హం. ఆ జిల్లాల్లోనే భారీగా ఇసుక, గ్రానైట్, ఇతర మైనింగ్ కార్యకలాపాలు సాగుతున్నాయి.అవే ప్రాంతాలు రియల్ ఎస్టేట్, బంగారం, వస్త్ర వ్యాపారాలకు కేంద్ర స్థానాలుగా ఉన్నాయి. ఇసుక, గ్రానైట్, మైనింగ్ వ్యాపారుల నుంచి ఈ సిండికేట్ భారీగా వసూళ్లకు పాల్పడుతోంది. తమ అధికార పరిధిని అతిక్రమించి మరీ రియల్ ఎస్టేట్, బంగారం, వస్త్ర, ఇతర వ్యాపారులను తనిఖీల పేరుతో వేధిస్తున్నారు. ఆ ముసుగులో వారి నుంచి యథేచ్ఛగా వసూళ్లకు పాల్పడుతున్నారు.ఉన్నతాధికారి అండతోనే వసూళ్ల దందా ఈ సిండికేట్కు విజిలెన్స్– ఎన్ఫోర్స్మెంట్ విభాగం కీలక ఉన్నతాధికారి పూర్తి దన్నుగా నిలుస్తున్నారు. తన చేతికి మట్టి అంటకుండా సిండికేట్ మొత్తం వసూళ్ల దందా సాగిస్తుండటమే అందుకు కారణం. ఆ ఉన్నతాధికారిని తగిన రీతిలో సంతృప్తిపరుస్తూ ఈ విజిలెన్స్– సిండికేట్ ఇష్టారాజ్యంగా దందాకు పాల్పడుతోంది. అందుకే ఆ కీలక ఉన్నతాధికారి విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి రెగ్యులర్ అధికారిని నియమించకుండా తన గుప్పిట్లోనే ఉంచుకున్నారని కూడా అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. -
ఇప్పుడిక పశుసంవర్ధక సహాయకుల వంతు
సాక్షి, అమరావతి: రైతు సేవా కేంద్రాల (పూర్వపు ఆర్బీకే) ద్వారా పాడి రైతులకు గ్రామ స్థాయిలో వెన్నుదన్నుగా నిలుస్తున్న గ్రామ పశుసంవర్ధక సహాయకుల (వీఏహెచ్ఏ)పై చంద్రబాబు ప్రభుత్వం కక్ష కట్టింది. వైఎస్ జగన్ హయాంలో నియమితులైన 6,105 మందిలో దాదాపు 1,200 మంది నకిలీ సర్టీఫికెట్లతో చేరారని ఒక్క ఫిర్యాదు అందడంతో ఇదే అదునుగా ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసి, వారిని తొలగించడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ (ఐవీఆర్ఎస్ సర్వే) పేరిట గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిపై సస్పెన్షన్ల వేటు వేస్తూ వేధింపులకు గురి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వీఏహెచ్ఏలను సాగనంపేందుకు గురిపెట్టింది. రాతపరీక్షలు, సర్టీఫికెట్ల పరిశీలనల తర్వాతే తమను నియమించారని, ఇప్పుడిలా వేధింపులకు గురిచేయడం ముమ్మాటికి తమ మనోభావాలను దెబ్బతీయడమేనని వీఏహెచ్ఏ సంఘం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్యలపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేస్తున్నారు. సహాయకులకు సర్కార్ సహాయ నిరాకరణ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు గ్రామ పశుసంవర్ధక సహాయకుల (వీఏహెచ్ఏ) పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. ఒక్కో సహాయకునికి 3–4 గ్రామాలు మ్యాపింగ్ చేశారు. సర్వేల పేరిట వీరిని అడ్డమైన పనులకు వినియోగించుకుంటూ వేధిస్తున్నారు. 2023లో మూడో విడతలో పోస్టింగ్లు పొందిన 1,896 మందికి ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీతో ప్రొబేషన్ పిరియడ్ పూర్తయ్యింది. మార్చి నుంచి వారికి పే స్కేల్ వర్తింపచేయాల్సి ఉంది. ఈ విషయమై ఎన్నిసార్లు మొత్తుకున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. దాదాపు రెండేళ్లుగా సకాలంలో జీతాలు ఇచ్చిన దాఖలాలు లేవు. రేపో మాపో ప్రొబేషన్ కన్ఫర్మ్ చేస్తారని, పే స్కేల్ వర్తింప చేస్తారన్న ఆశతో పనిచేస్తున్న దశలో ‘నకిలీ’ అభాండం వారిని కుంగదీస్తోంది. పటిష్ట ప్రక్రియతో నియామకం ఏ ప్రభుత్వ ఉద్యోగయినా నోటిఫికేషన్ నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్ వరకు ఎన్నో అగ్ని పరీక్షలు ఎదుర్కొంటారు. రాత పరీక్షల్లో మెరిట్.. ఇంటర్వ్యూలలో అర్హత.. సర్టిఫికెట్ పరిశీలన.. తర్వాతే అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందుకుంటారు. పశుసంవర్ధక సహాయకుల నియామకాలు కూడా ఇలా జరిగినవే. జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ), పశుసంవర్ధక శాఖ సంయుక్తంగా నిర్వహించిన రాత పరీక్షలో ఉత్తీర్ణత పొందడమే కాదు, నిర్దేశిత జీవో ఆధారంగా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పూర్తి పారదర్శకంగా జరిగిన సర్టీఫికెట్ వెరిఫికేషన్ వంటి ప్రక్రియల ద్వారా అర్హుల ఎంపిక జరిగింది. పైగా ప్రతీ ఉద్యోగికి నాలుగు నెలల శిక్షణ అనంతరం శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో అర్హత పరీక్ష నిర్వహించారు. తరువాత వారు ఆర్ఎహెచ్ఎసీ (రీజనల్ యానిమల్ హజ్బెండరీ ట్రైనింగ్ సెంటర్) లో పశువులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ప్రత్యేక శిక్షణ కూడా పొందారు. నాడు ఓకే అన్న అధికారులే నేడు ‘నకిలీ’ అంటున్నారు ఉద్యోగుల్లో దాదాపు 1,200 మంది నకిలీ సర్టీఫికెట్లతో చేరారంటూ ఏపీ వెటర్నరీ కౌన్సిల్ చైర్మన్ పీవీ లక్ష్మయ్య చేసిన ఆరోపణలతో తాజా కుట్ర ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అప్పట్లో ప్రతి సర్టిఫికెట్ను క్షుణ్ణంగా పరిశీలించి, నియామకాలకు ఓకే చెప్పిన అధికారులే ఇప్పుడు దాదాపు మూడేళ్ల తర్వాత ఉద్యోగులపై ‘నకిలీ’ ముద్ర వేస్తున్నారు. లోకాయుక్త పేరిట భయ భ్రాంతులకు గురిచేస్తున్నారు.పైగా ఏప్రిల్ 25వ తేదీలోగా ఈ నకిలీల నిగ్గు తేల్చాలంటూ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ టి.దామోదరనాయుడు పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారులకు ఈ నెల 6వ తేదీన సర్క్యులర్ జారీచేయడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ డైరెక్టర్గా కొనసాగుతున్న వ్యక్తి ఈ తరహా వేధింపులకు పాల్పడడం పట్ల ఉద్యోగ సంఘాలు సైతం మండిపడుతున్నాయి. ఆర్బీకేలను నిరీ్వర్యం చేయడం, టీడీపీ కార్యకర్తలను సాధ్యమైనంతమేర నింపుకోవడం ఈ వేధింపుల వెనుక కుట్రగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.పాడి రైతులకు జగన్ సర్కార్ వెన్నుదన్నుసచివాలయాలకు అనుబంధంగా గ్రామ స్థాయిలో 10,778 రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే)లను ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం పాడి రైతులకు అండగా నిలిచేందుకు గ్రామానికి ఒక గ్రామ పశుసంవర్ధక సహాయకుని (వీఏహెచ్ఏ)నియామకానికి శ్రీకారం చుట్టింది. 7,272 ఆర్బీకేల్లో పాడి సంపద అధికంగా ఉన్నట్టుగా గుర్తించగా, మూడు విడతల్లో 6,105 మంది వీఏహెచ్ఏలను నియమించింది. మిగిలిన చోట్ల గోపాలమిత్రలు, ఆర్ఎల్యూ సిబ్బంది సేవలను అనుసంధానం చేశారు. పశువైద్యసేవల కోసం ప్రతీ ఆర్బీకేలో ప్రత్యేకంగా రూ.10 వేల విలువైన ట్రెవీస్ (ఇనుప చట్రాలు)ను ఏర్పాటు చేశారు.పశువీర్యాన్ని నిల్వ చేసేందుకు రూ.16.90 కోట్ల ఖర్చుతో లిక్విడ్ నైట్రోజన్ కంటైనర్లను సమకూర్చారు. ప్రతీ నెలా రూ.2,700 చొప్పున ఏడాదికి రూ.32,400 విలువైన 105 రకాల మందులను అందుబాటులో ఉంచేవారు. ఇలా 4 ఏళ్లలో రూ.50 కోట్ల విలువైన మందులను సరఫరా చేశారు. పాడి రైతులు ఫోన్ చేయగానే క్షణాల్లో వారి గడపవద్దకు వెళ్లి ప్రాథమిక వైద్యసేవలందించేవారు. ఇప్పుడు ఆ స్వర్ణయుగాన్ని గుర్తుతెచ్చుకుంటూ రైతులు మళ్లీ జగన్ పాలన రావాలని కోరుకుంటున్నారు. -
‘పచ్చ’ నేతలకు జీ హుజూర్!
సాక్షి, అమరావతి: ప్రాణాలకు రక్షణ కల్పించండి అని పోలీసు స్టేషన్లో బాధితుడు గగ్గోలు పెట్టినా దిక్కులేదు.. కుటుంబ సభ్యుల నుంచే ప్రాణహాని ఉందని ఓ యువతి కన్నీరు పెట్టుకున్నా పట్టించుకోనే పరిస్థితి లేదు.. ఫలితంగా ఆ ఇద్దరూ దారుణ హత్యకు గురయ్యారు. రాష్ట్రంలో పోలీసుల తీరు ఇది. అసలు ప్రజల భద్రత తమ బాధ్యతే కాదన్నట్టుగా పోలీసు శాఖ వ్యవహరిస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది. అధికార టీడీపీ కూటమి రెడ్బుక్ రాజ్యాంగ అరాచకాలకు వత్తాసు పలకడానికి అలవాటుపడ్డ పోలీసు శాఖ.. అసలు వృత్తి ధర్మాన్ని విస్మరిస్తోంది. ఫలితంగా రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా దిగజారుతున్నాయి. సామాన్యుల ప్రాణాలు గాల్లో దీపంలా మారుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఘటనలు ఇలా ఉన్నాయి.రక్షణ కల్పించమంటే ముఖం చాటేసిన పోలీసులుతన ప్రాణాలకు రక్షణ కల్పించాలని పోలీసు స్టేషన్లోనే బాధితుడు వేడుకున్నా కడప పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. గంజాయి బ్యాచ్ పట్ల కఠినంగా వ్యవహరించలేని పోలీసుల నిర్లక్ష్య వైఖరి ఆ యువకుడి ప్రాణాలు తీసింది. గంజాయి బ్యాచ్ ఏకంగా కడపలోని రిమ్స్ ఆసుపత్రిలోకి ప్రవేశించి మరీ ఆ యువకుడిని హత్య చేసింది. కడపలోని అలంకాపల్లిలో 4వ తేదీన జరిగిన మారెమ్మ జాతర సందర్భంగా భద్రతా ఏర్పాట్లలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారు. జాతర సందర్భంగా ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందని తెలిసినా, ఏమాత్రం పట్టించుకోలేదు. దాంతో జాతరలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తి, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినా సరే పోలీసులు ఆ విషయాన్ని తీవ్రంగా పరిగణించలేదు.మరోసారి ఆ వర్గాలు ఘర్షణ పడకుండా ముందస్తు చర్యలు తీసుకోలేదు. ఇరువర్గాల మధ్య గత ఆదివారం రాత్రి ఘర్షణ తలెత్తింది. ఏకంగా గంజాయి బ్యాచ్లు రంగంలోకి దిగి కత్తులు పట్టుకుని మరీ వీరంగం సృష్టించాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. అంతా అయిపోయిన తర్వాత వచ్చిన పోలీసులు.. ఇరు వర్గాలకు చెందిన కొందరిని పోలీసు స్టేషన్కు తీసుకువెళ్లారు. గంజాయి బ్యాచ్ చేతిలో తీవ్రంగా గాయపడిన పెద్ద దస్తగిరిని కూడా పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లడం గమనార్హం. ఆయన్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించాలనే విషయాన్ని పోలీసులు పట్టించుకోనేలేదు. కాసేపటి తర్వాత వారిని ఇళ్లకు వెళ్లిపోవాలని పోలీసులు చెప్పారు. తాను బయటకు వెళితే గంజాయి బ్యాచ్ చంపేస్తుందని ఆయన వాపోయారు.అయినా పోలీసులు వినిపించుకోలేదు. ‘పోలీస్ స్టేషన్లో ఉండొద్దు.. వెళ్లిపోండి.. రిమ్స్ ఆసుపత్రికి వెళ్లి మీరే చికిత్స చేయించుకోండి’ అని ఆదేశించారు. కనీసం రిమ్స్ ఆస్పత్రి వరకు తోడు రావాలని ప్రాధేయపడినా పోలీసులు వినిపించుకోలేదు. దాంతో పెద్ద దస్తగిరి ఒక్కరే రిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. ఆయన్ను ఆసుపత్రి సిబ్బంది వార్డులో చేర్చుకుని చికిత్స చేశారు. కాగా అదే రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత గంజాయి బ్యాచ్ ఏకంగా రిమ్స్ ఆసుపత్రిలోకి ప్రవేశించి మరీ దస్తగిరిపై కత్తులతో దాడి చేసి హత్య చేసింది. అందరూ చూస్తుండగానే కత్తులతో స్వైర విహారం చేసి పాశవికంగా హత్య చేయడం దిగ్భ్రాంతికి గురి చేసింది.తన ప్రాణాలకు హాని ఉందని పెద్ద దస్తగిరి ఎంతగా చెప్పినా పోలీసులు పట్టించుకోకపోవడంతోనే ఇంతటి దారుణం చోటుచేసుకుంది. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే.. పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చిన ఇరువర్గాలను వెంటనే పంపించి వేయాలని జిల్లా పోలీసు ఉన్నతాధికారి ఆదేశించారు. దాంతోనే బాధితులు తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఎంతగా వాపోయినా సరే పోలీసులు పట్టించుకోకుండా బయటకు వెళ్లగొట్టారు. ఫలితంగా గంజాయి బ్యాచ్ బరితెగించి హత్యకు పాల్పడింది. టీడీపీ నేతల అండదండలు ఉన్న గంజాయి బ్యాచ్ పట్ల కఠినంగా వ్యవహరించడంలో జిల్లా పోలీసు ఉన్నతాధికారి తటపటాయించారని తెలుస్తోంది. టీడీపీ నేతల ఒత్తిడితోనే బాధితులను పోలీస్ స్టేషన్ నుంచి బయటకు పంపించి వేశారని సమాచారం.ప్రాణహాని ఉందన్నా పోలీసులు బేఖాతరుకుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని ఓ కొత్త పెళ్లి కూతురు ఎంతగా వేడుకున్నా పల్నాడు పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. ఏకంగా ఓ పరువు హత్యకు సహకరించడంతో యావత్ రాష్ట్రం విభ్రాంతికి గురైంది. ఈ ఉదంతం బయట పడటంతో సీఐని సస్పెండ్ చేసి పోలీసు శాఖ కనికట్టు చేస్తోంది. జిల్లా పోలీసు ఉన్నతాధికారి ఆదేశాలతోనే ఆ సీఐ అలా వ్యవహరించారని సమాచారం. పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన కామనబోయిన చౌడేశ్వరి, జమ్మలమడకకు చెందిన నాగరాజు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చౌడేశ్వరి కనిపించడం లేదని ఆమె తండ్రి చంద్ర శ్రీను పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేజర్లు అయిన చౌడేశ్వరి, నాగరాజు వివాహం చేసుకున్నారని పోలీసులు గుర్తించారు. వారిని పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు.ఆ విషయం తెలిసిన ఆమె కుటుంబ సభ్యులు జిల్లా పోలీసు ఉన్నతాధికారి ద్వారా కథ నడిపించారు. ఆమెను తమకు అప్పగించేలా మాచర్ల పోలీసులను ఆదేశించాలన్నారు. టీడీపీ నేతల ద్వారా ఒత్తిడి తీసుకువచ్చారు. అందుకు జిల్లా పోలీసు ఉన్నతాధికారి సమ్మతించారు. మాచర్ల సీఐ వెంకటరమణతో కూడా చంద్ర శ్రీను డీల్ కుదుర్చుకున్నారు. ఆయనకు రూ.6.50 లక్షలు లంచం ఇచ్చారు. ఓ వైపు పోలీసు ఉన్నతాధికారి ఆదేశించగా, మరోవైపు భారీగా లంచం కూడా ముట్టడంతో సీఐ వెంకటరమణ చెలరేగిపోయారు. ఈ క్రమంలో చౌడేశ్వరిని ఆమె తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలని పోలీసులు చెప్పారు. కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, చంపేస్తారని తాను వెళ్లనని ఆమె కన్నీరు పెట్టుకుంది. అయినా సీఐ తురకా వెంకట రమణ వినిపించుకోలేదు. మేజర్ అయిన తాను ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకున్నానని చెప్పినా వినకుండా చౌడేశ్వరిని తీవ్రంగా బెదిరించారు.ఆమెను బలవంతంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఫలితంగా తన ఇష్టానికి విరుద్ధంగా వివాహం చేసుకున్న కుమార్తె చౌడేశ్వరిని చంద్ర శ్రీను గత నెల 18న హత్యచేశారు. దానిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో పరువు హత్య వ్యవహారం, అందుకు సహకరించిన సీఐ వెంకటరమణ బాగోతం బయట పడింది. తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసు శాఖ సీఐ వెంకటరమణను సస్పెండ్ చేసింది. కానీ చౌడేశ్వరిని ఆమె తల్లిదండ్రులకు అప్పగించాలని ఆదేశించిన జిల్లా పోలీసు ఉన్నతాధికారిపై మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఈ వ్యవహారంలో ఆయన పాత్రను పోలీసు శాఖ కప్పిపుచ్చింది. ప్రజల ప్రాణాలు కాపాడటం తమ బాధ్యత కాదన్నట్టుగా పోలీసు శాఖ వ్యవహరిస్తుండటం విస్మయ పరుస్తోంది. -
అమరావతి భూములపై బాబు కాకి లెక్కలు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని, ప్రభుత్వం చేతిలో ఉన్న ఐదు వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ విలువ ప్రస్తుత రేట్ల ప్రకారం రూ.50 వేల కోట్లు పైమాటేనంటూ కాకి లెక్కలతో నమ్మించటానికి యత్నించి సీఎం చంద్రబాబు మరోసారి అడ్డంగా దొరికిపోయారని వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డీనేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. అమరావతిపై ద్వేషంతోనే వైఎస్సార్సీపీ విమర్శలు చేస్తోందంటూ చంద్రబాబు మరోసారి పచ్చి అబద్ధాలాడుతున్నారని ధ్వజమెత్తారు.అమరావతి పేరుతో రాష్ట్రాన్ని శాశ్వతంగా అప్పుల ఊబిలో ముంచే చంద్రబాబు మార్క్ ‘ఎండమావి’ కావాలా? లేక అందులో పదో వంతు ఖర్చుతో (అది కూడా దశలవారీగా) రాష్ట్ర రాజధానిని అతి స్వల్ప కాలంలోనే అగ్రశ్రేణి నగరాల సరసన నిలిపే జగన్ మార్క్ గ్రోత్ ఇంజన్ ‘మావిగన్’ కావాలో ప్రజలు ఆలోచించాలని ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు.అమరావతిలో చంద్రబాబు ఇంటి కోసం కొనుగోలు చేసిన 25 వేల గజాల (5 ఎకరాలు) స్థలం ధర గజం రూ.7,500 మాత్రమే. దస్తావేజుల ప్రకారం ఎకరం భూమి విలువ రూ.3.63 కోట్లు. నిజానికి ఆ ప్రాంతంలో ప్రభుత్వ రికార్డుల (ఎస్ఆర్ఓ) ప్రకారం గజం ధర రూ.6 వేలు మాత్రమే. ఆ ప్రకారం అక్కడ ఎకరం భూమి విలువ రూ.2.91 కోట్లు. చంద్రబాబు కొనుగోలు చేసిన ధర ప్రకారం ఐదు వేల ఎకరాలు అమ్మితే వచ్చేది దాదాపు రూ.18 వేల కోట్లు మాత్రమే. అంతకు మించి పైసా రాదు. రాష్ట్రం మీద పడే భారం మాటేమిటి? అమరావతిలో చంద్రబాబు సర్కారు ఇప్పటికే ఇచ్చిన కాంట్రాక్ట్ల విలువ రూ.50 వేల కోట్లకు పైనే. అక్కడ రోడ్లు లాంటి మౌలిక సదుపాయాల కోసం ఆయన చెబుతున్న ప్రకారమే రూ.2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి. ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది అంతా అప్పులు చేసే. ఇంకా తెచ్చేది కూడా అప్పే. దానికి వడ్డీ లెక్క వేస్తే రూ.2 లక్షల కోట్లకు ఏటా రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్లు అవుతుంది. ఎకరం రూ.20 కోట్లు పలికేలా అభివృద్ధి చెందడానికి 20 ఏళ్లు పడుతుందని చంద్రబాబు చెబుతుండగా 15 ఏళ్లు పడుతుందని ఆయన కుమారుడు అంటున్నారు. అప్పటికి వడ్డీ రూ.3 లక్షల కోట్లో రూ.4 లక్షల కోట్లో అవుతుంది. ఆ వడ్డీ కట్టడానికి కూడా మళ్లీ అప్పు చేయాల్సిందే కదా? చంద్రబాబు ఆయన కోసం సంపద సృష్టించుకుంటే, రాష్ట్రం మీద పడే భారం మాటేమిటి? దీనిపై రాష్ట్ర ప్రజలంతా ఆలోచించాలి. -
విద్యాశాఖ అస్తవ్యస్తం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యాశాఖలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. బోధన నుంచి పరీక్షల నిర్వహణ వరకు పద్ధతి లేకుండా అస్తవ్యస్తం చేశారు. ఇష్టారీతిన చేస్తున్న ప్రయోగాలతో అటు విద్యార్థులకు ఇటు ఉపాధ్యాయులకు ప్రయోజనం లేకపోగా.. అదనపు భారంతో అవస్థలు పడుతున్నారు. పాఠశాల విద్యలోనూ, ఇంటర్మీడియెట్ విద్యాశాఖలో ఇవే విధానాలు కొనసాగుతున్నాయి. ఎక్కడైనా శాఖలో వ్యతిరేక ఫలితాలు వస్తే దానిపై సంబంధితశాఖ మంత్రి ఉన్నతాధికారులతో సమీక్షించి తప్పులను సరిచేస్తారు. కానీ విద్యాశాఖలో మాత్రం అన్నీ అధికారులకు అప్పగించి మంత్రి చోద్యం చూస్తున్నారు. 2025–26 విద్యాసంవత్సరంలో మోడల్ ప్రైమరీ స్కూళ్లలో మొదలైన ప్రయోగాలు వికటించి ఆయా స్కూళ్లు మూతబడే స్థితికి చేరుకున్నాయి.జూన్లో ప్రారంభించాల్సిన విద్యాసంవత్సరాన్ని ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ఏప్రిల్ ఒకటినే ప్రారంభించారు. పాఠ్యపుస్తకాలు ఇవ్వకుండా, లెక్చరర్లు లేకుండా బోధన మాత్రం జరిగిపోతున్నట్టు కలరింగ్ ఇస్తున్నారు. ఒక విద్యాసంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలు ఒకసారి, 1–9 తరగతుల వార్షిక పరీక్షలు ఒకేసారి జరుగుతాయి. అలాగే విద్యాసంవత్సరం జూన్ రెండోవారంలో ప్రారంభమవుతుంది. కానీ గత విద్యాసంవత్సరం నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు ముగిసిన వెంటనే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రెండో ఏడాది విద్యార్థులకు విద్యాసంవత్సరం ప్రారంభిస్తున్నారు.అన్ని కాలేజీల్లోనూ ఏప్రిల్ 23 వరకు తరగతులు నిర్వహించాలని సిలబస్ సైతం ఇచ్చారు. ఈ సమయంలో జూనియర్ లెక్చరర్లు వార్షిక పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం విధుల్లో ఉన్నారు. మూల్యాంకనం జూనియర్ కాలేజీల్లోనే జరుగుతుండడంతో విద్యార్థులను అనుమతించే పరిస్థితి కూడా లేదు. మరోపక్క అవసరమైన పాఠ్యపుస్తకాలు సైతం ప్రభుత్వం ఇవ్వకుండా తరగతులు ఎలా నిర్వహిస్తుందనే విషయం ఎవరికీ అంతుబట్టని అంశంగానే మిగిలిపోయింది. వేసవి ఎండల్లో కాలేజీలకు విద్యార్థులు వచ్చే పరిస్థితి లేదు. ఈ క్రమంలో తరగతులను ఎవరికి కోసం.. ఎందుకోసం తలపెట్టారో ఎవరికీ అర్థం కావడం లేదు. పరీక్షలతోనూ ప్రయోగాలు.. ఆరు నుంచి తొమ్మిదో తరగతి పరీక్షలు జరిపే విధానం కూడా ఈ ఏడాది అస్తవ్యస్తంగా తయారైంది. విద్యాశాఖ చరిత్రలోనే తొలిసారి 9వ తరగతికి ఒకసారి, 6, 7, 8 తరగతులకు మరోసారి పరీక్షలు నిర్వహించారు. దీంతో ఉపాధ్యాయుల కొరతతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరీక్షల నిర్వహణ, పర్యవేక్షణ స్కూల్ అసిస్టెంట్లే చూడాలి. కానీ ఈ ఏడాది ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా మారింది. తొమ్మిదో తరగతికి మార్చి 2 నుంచి 12వ తేదీ వరకు ఎస్ఏ–2 పరీక్షలు నిర్వహించారు.అనంతరం ఆ విద్యార్థులకు పదో తరగతి సిలబస్ ఏప్రిల్ 23 వరకు బోధించాలని ప్రత్యేకంగా బ్రిడ్జి కోర్సు రూపొందించారు. ఈ బోధన ప్రారంభం కాకుండానే పదోతరగతి వార్షిక పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభించడంతో స్కూల్ అసిస్టెంట్లు, ప్రధాన ఉపాధ్యాయులు పబ్లిక్ పరీక్షల విధుల్లో నిమగ్నమయ్యారు. దీంతో 9వ తరగతి విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు బోధనను గాలికి వదిలేశారు. పదోతరగతి పరీక్షలు ఏప్రిల్ 2వ తేదీతో ముగిశాయి. అనంతరం బ్రిడ్జి కోర్సు బోధన చేపట్టాలని భావించినా ఏప్రిల్ 6 నుంచి పదోతరగతి మూల్యాంకనం ప్రారంభమైంది.స్కూల్ అసిస్టెంట్లు అందరికీ ఆ విధులు అప్పగించారు. ఇదిలా ఉంటే ఏప్రిల్ 6వ తేదీ నుంచి 6, 7, 8 తరగతులకు వార్షిక పరీక్షలు మొదలయ్యాయి. ఉపాధ్యాయుల కొరతతో ఒకే గదిలో మూడు తరగతులకు పరీక్షలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకపక్క మూల్యాంకనం, ఇంకోపక్క ఉన్నత తరగతులకు పరీక్షలు, మరోపక్క తొమ్మిదో తరగతికి బ్రిడ్జికోర్సు బోధన ఎలా సాధ్యమవుతుందన్న కనీస ఆలోచన కూడా లేకుండా విధానాలు అమలు చేయడంపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. -
చంద్రబాబు సర్కారుకు అమరావతి రైతుల అల్టిమేటం
సాక్షి,అమరావతి: చంద్రబాబు సర్కారుకు అమరావతి రైతులు అల్టిమేటం జారీ చేశారు. తమ భూములకు సరైన పరిహారం చెల్లించకపోతే ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని తెలిపారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంపై రైతులు ఆందోళన బాట పట్టారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండల రైతులు పుల్లడిగుంట హైవే వద్ద భూములు కోల్పోతున్నామని ఆందోళన చేపట్టారు. సజావుగా ఉన్న ఔటర్ రింగ్ రోడ్ 2017లో సరిగా ఉండగా.. 2025-26 మ్యాప్ అలైన్మెంట్లో మార్పులు జరిగాయని రైతులు ఆరోపిస్తున్నారు. రోడ్డుకు మలుపు తిప్పడం వల్ల తమ భూములు ప్రభావితమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చెన్నై, బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాల్లో కూడా 140 మీటర్ల వెడల్పు రోడ్లు లేవని రైతులు వాదిస్తున్నారు. తమ భూములకు సరైన పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నారు. -
‘ఉపాధి’కి పచ్చ చెదలు!
అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో 2017–19 మధ్య వందకు పైగా పండ్ల తోటల పెంపకం పనుల పేరిట 2025 ఆగస్టులో ఆ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత తమ్ముడు ధర్మవరపు మురళి ఒక్కరే లక్షల రూపాయలకు బిల్లులు పెట్టుకొని ఉపాధి హామీ పథకం నుంచి నిధులు దండుకు న్నారు. బండమీదపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో 60 పనులకు రూ.7,28,276, చెర్లోపల్లెలో 18 పనులకు రూ.2,64,909, మండల కేంద్రమైన రాప్తాడులో 17 పనులకు రూ.1,20,807, హంసాపురంలో 21 పనులకు రూ.83,847.. ఇలా పలు గ్రామాల్లో పనులకు ఆయన పేరిట బిల్లుల చెల్లింపు కూడా పూర్తయింది. ఇలాంటి ఉదాహరణలు రాష్ట్ర వ్యాప్తంగా కోకొల్లలు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీడీపీ నేతలు ‘ఉపాధి’ని అడ్డుపెట్టుకుని రూ.వందల కోట్లలో దోపిడీ పర్వాన్ని యథేచ్ఛగా కొనసాగించారు. కూలీలతో చేయించే పనులే కాకుండా, రోడ్ల నిర్మాణం తదితర మెటీరియల్ కేటగిరీ పనుల్లో సైతం కాంట్రాక్టర్ల వ్యవస్థకు ఈ పథకంలో తావుండదు. గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో లేదా వివిధ ప్రభుత్వ విభాగాల ప్రత్యేక పర్యవేక్షణలో ఆ పనులు చేపట్టాల్సి ఉంటుంది. అయితే 2014–19 మధ్య జరిగిన మొత్తం 4,47,344 పనులకు సంబంధించి రూ.331.66 కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించాలని చంద్రబాబు కూటమి ప్రభుత్వం 2024 నవంబర్ 6న మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు అదే నెల 15న ఆదేశాలు జారీ చేసింది. వాటికి సంబంధించి 2025 ఆగస్టులో దాదాపు రూ.300 కోట్ల దాకా చెల్లింపులు పూర్తయ్యాయి. అప్పట్లో వివిధ గ్రామ పంచాయతీల పేరుతో జరిగిన పనులకు సంబంధించి నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి టీడీపీ నాయకులు పలువురు పెద్ద సంఖ్యలో నేరుగా ‘వెండార్’ పేరిట బిల్లులు పెట్టుకొని డబ్బులు దండుకున్నారు. కొన్ని చోట్ల ఎంపీడీవోలు లేదా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారుల పేరిట ఆన్లైన్లో నమోదు చేసి టీడీపీ నేతలు సొమ్ము చేసుకున్నారు. ఇలా వందల కోట్ల రూపాయలు డ్రా చేసుకున్నారు. 90 శాతం వెండార్లకు జీఎస్టీనే లేదు2014–19 మధ్య కాలానికి ఉపాధి హామీ పథకం నిధుల చెల్లింపులకు ఉన్న నిబంధనల్లో 2021 తర్వాత మార్పులు చోటు చేసుకున్నాయి. మారిన నిబంధనల ప్రకారం ఈ పథకంలో ఏ పనికి సంబంధించిన బిల్లులైనా నేరుగా ఆ పనికి అవసరమైన వస్తువులు సరఫరా చేసే వెండార్ (సరఫరాదారుడు లేదా వ్యాపారి)కు లేదంటే పని చేసే కూలీలకు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఆ పనుల బిల్లుల చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేవలం వెండార్ల పేర్లు, బ్యాంకు అకౌంట్ల వివరాలను మాత్రమే నమోదు చేయాల్సి ఉంది.ఈ నేపథ్యంలో పాత బకాయిల పేరిట వందల కోట్ల రూపాయలు టీడీపీ నేతలకు దోచిపెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం గ్రామాల్లో టీడీపీ నేతలకు వెండార్ల ముసుగు వేసింది. ఆయా టీడీపీ నేతల పేర్లనే సిమెంట్ తదితర వస్తువులు సరఫరా చేసే, సేవలు అందించే వ్యాపారవేత్తలంటూ నమోదు చేయించింది. ఈ పథకం కింద వెండర్ల పేర్లను నమోదు చేసే అధికారం మండలాల్లో ఎంపీడీవోలకే ఉండటంతో అధికార పార్టీ పెద్దలు ఇష్టమొచ్చినట్టు వ్యవహరించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం పనులకు వివిధ రకాల వస్తువులు, సామగ్రి తదితర వస్తువులు సరఫరా చేసే వెండార్లుగా దాదాపు 14 లక్షల మంది పేర్లు నమోదయ్యాయి. ఇందులో ఏకంగా 13.94 లక్షల మంది వెండార్లకు కనీసం జీఎస్టీ నంబరు కూడా లేదని అధికార గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ లెక్కన దోపిడీ ఎలా సాగిందో ఇట్టే స్పష్టమవుతోంది. మూసిన రికార్డులు తెరిపించి మరీ బిల్లులు ఉపాధి పనుల మంజూరు, పురోగతి, బిల్లుల నమోదు, చెల్లింపుల ప్రక్రియ అంతా ఆన్లైన్ విధానంలో కొనసాగుతుంది. 2014–19 మధ్య జరిగిన పనులకు బిల్లుల చెల్లింపులు జరిగి ఆ పనుల నిర్వహణ అన్ని దశల్లో పూర్తయినట్టు కేంద్రం వెబ్సైట్లో సైతం నమోదు చేసింది. అయినప్పటికీ బకాయిల పేరిట టీడీపీ నేతలకు నిధులను దోచి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు లేఖ రాసి పనుల రికార్డులను తిరిగి ఓపెన్ చేయించింది. -
ఖాకీ ముసుగేసుకున్న కీచకుడు
సాక్షి, నరసరావుపేట: మహిళలకు అండగా నిలవాల్సిన రక్షకభటులే వారి పాలిట కీచకులుగా మారిన ఉదంతం రాష్ట్ర ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. ఏకాంతంగా ఉండే జంటల వీడియోలు తీసి.. వారిని బెదిరించి నగదు గుంజుకోవడంతోపాటు లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డబ్బులు తీసుకుని పరువు హత్యకు కారణమైన సీఐ వెంకటరమణ వ్యవహారం మరువక ముందే మాచర్లలో మరో ప్రబుద్ధుడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. టౌన్ పోలీసుస్టేషన్ ఏఎస్ఐగా పనిచేస్తున్న శ్రీనివాసరావు సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు గస్తీ పేరుతో పర్యాటక, నిర్మానుష్య ప్రాంతాల్లో తిరుగుతుంటారు. ఏకాంతంగా గడపటానికి వచ్చిన ప్రేమజంటలతోపాటు భార్యాభర్తల వీడియోలు తీసి వారిని బెదిరిస్తుంటాడు.‘స్టేషన్కు పదండి’ అని గద్దిస్తూ బాధితులను భయపెట్టి నగదు గుంజుకునే ప్రయత్నం చేస్తాడు. అతడి మాటల్ని ఖాతరు చేయని వారి వీడియోలు వైరల్ చేస్తానని బెదిరించి వారినుంచి పెద్ద మొత్తంలో నగదు వసూలు చేసి జేబులు నింపుకుంటున్నాడు. కొందరు మహిళలను లైంగికంగా కూడా వేధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాగిన మత్తులో ఏఎస్ఐ శ్రీనివాసరావు అత్యంత జుగుప్సాకరంగా వ్యవహరించిన వీడియోలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఓ నవజంట సరదాగా రోడ్డు పక్కన బండిమీద కూర్చుని మాట్లాడుతుండగా ఏఎస్ఐ వారిని బెదిరించిన తీరును చూస్తుంటే అతడు ఎంతటి దుర్మార్గుడో అర్థమవుతోంది. ఆటోడ్రైవర్ సాయంతో.. ఏఎస్ఐ శ్రీనివాసరావు ప్రేమ జంటల వీడియోలు తీసి, ఆ తరువాత విచారణ పేరుతో వారి నుంచి డబ్బు గుంజేవాడు. యువతులకు ఫోన్చేసి తన కోరిక తీర్చకపోతే వీడియోలు బయటపెడతానని బెదిరించి పలువురి మహిళలను ఇబ్బందులకు గురిచేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారాల్లో వీడియోలు తీయడానికి, డబ్బులు వసూలు చేయడానికి మాచర్ల మండలం జమ్మలమడకకు చెందిన ఆటో డ్రైవర్ సైదులును సహాయకుడిగా నియమించుకున్నాడు. ఏఎస్ఐ చేసిన దుర్మార్గాలను సైతం ఆటో డ్రైవర్ వీడియోలు తీయడంతో ఈ వ్యవహారం బయటపడింది.నిత్యం రాత్రివేళ ఆటోలో కానిస్టేబుళ్లు, హోంగార్డులతో ఏఎస్ఐ హైవేలపై సంచరించేవాడు. ఎవరు కనిపించినా బెదిరించి దౌర్జన్యం చేసేవాడు. అతిగా మద్యం సేవించడమే కాకుండా వాహనాలు ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు రాస్తానని డబ్బులు గుంజేవాడు. వ్యభిచార గృహాలపై దాడులు చేసి వారినుంచి డబ్బులు వసూలు చేయడంతోపాటు అక్కడి మహిళలపైనా లైంగికంగా వేధింపులకు దిగాడు. పోక్సో కేసు ఉన్నా పోస్టింగ్లోనే.. గతంలోనూ ఏఎస్ఐ శ్రీనివాసరావుపై లైంగిక ఆరోపణలున్నాయి. ఇప్పటికే అతనిపై మేడికొండూరు పోలీసుస్టేషన్లో పోక్సో కేసు నమోదు కాగా.. వాయిదాల నిమిత్తం కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. అయిఆ అధికారులు అతనికి పోస్టింగ్ ఇచ్చారు. అయినప్పటికీ ప్రవర్తన మార్చుకోకుండా స్టేషన్కు వచ్చే బా«ధిత మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తాడని తోటి ఉద్యోగులు చెబుతున్నారు.ఫిర్యాదుదారులకు ఫోన్లుచేసి సమస్య పరిష్కరిస్తానని.. తన కోరిక తీర్చాలని వేధింపులకు గురిచేసేవాడని బా«ధిత మహిళల నుంచి ఇప్పటికే ఫిర్యాదులు అందినట్టు తెలుస్తోంది. అయితే, చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఏఎస్ఐ ఆగడాలు పెచ్చుమీరాయి. ఎక్కడ పనిచేస్తే అక్కడ మహిళలతో వివాహేతర సంబంధాలు నెరపడం ఏఎస్ఐ అలవాటుగా మార్చుకున్నాడు. ఇతనిపై గతంలో భార్య సైతం ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. సస్పెన్షన్ వేటు కాగా.. మాచర్ల టౌన్ ఏఎస్ఐ శ్రీనివాసరావు వీడియోలు శనివారం సోషల్ మీడియాలో వైరలై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో పోలీసుశాఖ స్పందించింది. ఏఎస్ఐ శ్రీనివాసరావుపై గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సస్పెన్షన్ వేటు వేశారు. అతనిపై పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించారు. మరోవైపు ఏఎస్ఐతో పాటు ఇదే స్టేషన్లో పనిచేసే మరో అధికారి, మరికొందరు సిబ్బంది సైతం ఇదే తరహా వ్యవహారాలు చేస్తున్నారని, వారిపైనా విచారణ జరపాలని మాచర్ల వాసులు డిమాండ్ చేస్తున్నారు. -
ఇది పుచ్చుకో.. అది ఇచ్చుకో!.. రాజధాని పనుల్లో క్విడ్ ప్రో కో
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి కాంట్రాక్టు పనుల్లో మరో కోణం వెలుగుచూసింది. శాశ్వత సచివాలయంలో భాగంగా నిర్మిస్తున్న జీఏడీ టవర్ పనులను టెండర్లలో ఎన్సీసీ సంస్థ దక్కించుకుంది. కానీ.. ఆ టవర్ను డయాగ్రిడ్ స్ట్రక్చరల్ స్టీల్ విధానంలో తామే నిర్మిస్తున్నట్టు భీమా ఇన్ఫ్రా సొల్యూషన్స్ సంస్థ వెల్లడించింది. టెండర్ నిబంధనల ప్రకారం 50 శాతం పనులను సీఆర్డీఏ అనుమతి తీసుకుని అధికారికంగా సబ్ కాంట్రాక్టర్కు అప్పగించవచ్చు. జీఏడీ టవర్ నిర్మాణంలో డిజైన్, స్ట్రక్చరల్ కనెక్షన్ ఇంజినీరింగ్, ప్రిసిసిన్ స్టీల్ ఫ్యాబ్రికేషన్, డయాగ్రిడ్ స్ట్రక్చరల్ పద్ధతిలో నిర్మించే పనులను తాము చేస్తున్నట్లు భీమా సంస్థ పేర్కొంది.అయితే.. ఇదే సంస్థ హైదరాబాద్కు సమీపంలో శామీర్పేట వద్ద సీఎం చంద్రబాబు కుటుంబ వ్యాపార సంస్థ హెరిటేజ్ ఫుడ్స్కు 6,205 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రీ–ఇంజినీర్డ్ బిల్డింగ్(పీఈబీ) విధానంలో ఐస్క్రీమ్ ప్లాంట్ కోసం భవనాన్ని నిర్మించినట్టు తన వెబ్సైట్లో పేర్కొంది. ‘నీకిది.. నాకిది’లో భాగంగానే హెరిటేజ్ పుడ్స్కు ఐస్క్రీమ్ ఫ్యాక్టరీ ప్లాంట్ను సీహెచ్ సీతారాం మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న భీమా సంస్థ నిర్మించిందనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.హెరిటేజ్కు ఐస్క్రీమ్ ప్లాంట్ను నిర్మించిన భీమాటెండర్లలో అధికారికంగా పనులు దక్కించుకున్న ఎన్సీసీ సంస్థకు వాటిని అప్పగించడానికి గతేడాది జూన్ 26న ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టెండర్ నిబంధనల ప్రకారం సీఆర్డీఏ ఈఎన్సీ, సీఈలకు సమాచారం ఇచ్చి.. వారినుంచి అధికారిక అనుమతి తీసుకున్నాక 50 శాతం పనులను సబ్ కాంట్రాక్టర్కు అప్పగించవచ్చు. జీఏడీ టవర్ నిర్మాణ పనుల్లో భీమా సంస్థకు ఎంత పరిమాణంలో సబ్ కాంట్రాక్టు కింద అప్పగించామన్నది ఎన్సీసీ సంస్థ అధికారికంగా ప్రకటించలేదు. సీఆర్డీఏ ఈఎన్సీ, సీఈలు కూడా వెల్లడించలేదు.కానీ.. భీమా ఇన్ఫ్రా సొల్యూషన్స్ సంస్థ మాత్రం తన అధికారిక వెబ్సైట్లో ఆ పనులు చేస్తున్నట్టు పేర్కొనడం గమనార్హం. ఇదే సంస్థ సీఎం చంద్రబాబు కుటుంబ వ్యాపార సంస్థ అయిన హెరిటేజ్ ఫుడ్స్కు హైదరాబాద్కు సమీపంలోని శామీర్పేట్ వద్ద 98.5 మీటర్ల పొడవు, 63 మీటర్ల వెడల్పు, 18.2 మీటర్ల ఎత్తుతో పీఈబీ విధానంలో ఐస్క్రీమ్ ప్లాంట్ కోసం భవనాన్ని నిర్మించినట్టు భీమా ఇన్ఫ్రా సొల్యూషన్స్ తన అధికారిక వెబ్సైట్లో ప్రకటించింది. ఆ ప్లాంట్ను ఇటీవల సీఎం చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి ప్రారంభించారు.నాడూ నేడూ ఒకే సంస్థ.. అంచనా వ్యయం భారీగా పెంపుముఖ్యమంత్రి, విభాగాధిపతుల కార్యాలయాల కోసం సచివాలయంలో జీఏడీ టవర్ను బీ+జీ+49 అంతస్తులతో 1,04,815 చదరపు మీటర్ల నిర్మిత ప్రాంతంతో చేపట్టే పనులకు 2018లో నిర్వహించిన టెండర్లలో రూ.554.06 కోట్లకు ఎన్సీసీ సంస్థ దక్కించుకుంది. 2019 నాటికే రూ.32.90 కోట్ల విలువైన పనిని ఆ సంస్థ పూర్తి చేసిందని కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) 2023లో ఇచ్చిన నివేదికలో పేర్కొంది. అంటే.. జీఏడీ టవర్లో మిగిలిన పనుల విలువ రూ.521.16 కోట్లు. 2024లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ కాంట్రాక్టును రద్దు చేసింది. ఆ పనుల కాంట్రాక్ట్ విలువ రూ.884.22 కోట్లుగా నిర్ణయించి.. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ వంటి పన్నుల రూపంలో 163.60 కోట్లను రీయింబర్స్ చేస్తామని పేర్కొంటూ గతేడాది టెండర్లు పిలిచింది.ఈ పనులను 4.53 శాతం అధిక ధర అంటే రూ.882.47 కోట్లకు కోట్ చేసి ఎల్–1గా నిలిచి ఎన్సీసీ సంస్థే తిరిగి దక్కించుకుంది. దానికి పన్నులు కలిపితే.. జీఏడీ టవర్ కాంట్రాక్టు విలువ రూ.1,046.07 కోట్లకు చేరుతుంది. అంటే.. నాటికీ నేటీకీ అంచనా వ్యయం రూ.524.91 కోట్లు పెంచేసినట్టు స్పష్టమవుతోంది. అప్పుడూ ఇప్పుడూ ఒకే సంస్థ టెండర్లో పనులు దక్కించుకోవడాన్ని బట్టి చూస్తే గూడుపుఠాణీ కాకపోతే మరేమిటని ఇంజినీరింగ్ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. దీనిద్వారా కాంట్రాక్టర్కు భారీఎత్తున ప్రయోజనం చేకూర్చారని ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. కాగా, ఇవే అంశాలను వైఎస్సార్సీపీ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. -
అమరావతి x మావిగన్
సాక్షి, అమరావతి: మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ ఆలోచననుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం చంద్రబాబు అండ్ కో ఎన్ని డైవర్షన్ కుట్రలు చేసినా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు అదే చర్చ నడుస్తోంది. ఆచరణ సాధ్యం కాని అమరావతి గురించి, మావిగన్ ప్రయోజనాల గురించి జనం బేరీజు వేసుకుంటున్నారు. ప్రజా రాజధానిగా అభివృద్ధి చేసుకునేందుకు మావిగన్ అన్ని విధాలా అనుకూలమైన ప్రాంతమని వ్యాఖ్యానిస్తున్నారు. మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు పట్టణాలను కలిపి మహానగరంలా మార్చుకునేందుకు, మంచి రాజధానిగా అభివృద్ధి చేసుకునేందుకు అవకాశముందని అంటున్నారు.. తక్కువ సమయంలోనే తక్కువ ఖర్చుతోనే ఇది సాధ్యమవుతుందని అందరూ అంగీకరిస్తున్నారు. మావిగన్తో వచ్చే అవకాశాలు, ఉద్యోగాల గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. 10 రోజులుగా రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్గా మారింది. మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ దీనిపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. మావిగన్తో వచ్చే ప్రయోజనాల గురించి స్పష్టంగా వివరించిన వైఎస్ జగన్ అమరావతిపై అనేక ప్రశ్నలనూ సంధించారు. జగన్ అత్యంత ఆచరణాత్మక ప్రతిపాదన చేశారని జనం అంటున్నారు. మావిగన్కు ప్రజల నుంచి రోజురోజుకూ మద్దతు పెరుగుతుండడంతో సీఎం చంద్రబాబు కంటికి కునుకు కరువయ్యింది. ఎల్లో మీడియా సహకారంతో, మందీ మార్బలం ప్రోద్బలంతో మావిగన్ నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఎల్లో మీడియాలో మరణ మృదంగం కథనాలు వస్తున్నాయి. వైఎస్ మరణానికి జగనే కారణమనే దిగజారుడు రాతలకు ఎల్లో పత్రికలు దిగజారాయి. చంద్రబాబు ఉసిగొల్పడంతోనే ఆయన మెప్పుకోసం చుట్టూ ఉన్న వందిమాగధ బృందాలు గార్దభాల్లా గొంతు విప్పుకుని ఓండ్రపెడుతున్నాయి. అసలు నరహంతక చరిత్ర చంద్రబాబుదే కదా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. మల్లెల బాబ్జీ, పింగళి దశరథరామ్, వంగవీటి రంగా, చివరకు పిల్లనిచ్చిన సొంత మామ ఎన్టీఆర్, తమ్ముడు రామ్మూర్తినాయుడి వరకు ఏ మరణాన్ని చూసినా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చంద్రబాబువైపే వేళ్లన్నీ చూపిస్తాయన్న సంగతి తెల్సిందే.. అవేవీ ప్రజలకు తెలియవన్నట్లుగా ఉంది ఈ ఎల్లో సిండికేట్ వీరంగం చూస్తుంటే.. మావిగన్ అంటే వీళ్లెంత భయపడుతున్నారో ఈ డైవర్షన్ రాజకీయాలను చూస్తుంటేనే అర్థం చేసుకోవచ్చు. మొదట మావిగన్ అంటే జోక్ అన్నారు.. ప్రజల్లో మద్దతు పెరుగుతుండడంతో ఆ తర్వాత అది సీఆర్డీఏ పరిధిలోనే ఉంది అంటున్నారు.. ఎవరేమన్నా ప్రజలు మాత్రం మావిగన్ ప్రజా రాజధాని అవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. అమరావతి ప్రచారం వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు లేవన్న విషయం అందరికీ అర్థమవుతోంది.. ఇప్పుడు వైఎస్ జగన్ ప్రతిపాదించిన ఆచరణాత్మకమైన మావిగన్.. చంద్రబాబు ఆచరణసాధ్యం కాని ఊహాజనితమైన అమరావతిని పోల్చుకుంటూ రాష్ట్రంలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తొలి రోజు నుంచే పరుగులుఇప్పటికే అన్ని మౌలికవసతులు ఉండి 110 కి.మీ జాతీయ రహదారులు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మంగళగిరి–తాడేపల్లి వంటి నాలుగు కార్పొరేషన్లతో పాటు ఉయ్యూరు, తాడిగడప వంటి మరో రెండు మున్సిపాల్టీలు కలిగి ఉన్న మావిగన్ ప్రాంతానికి రాజధానిగా తొలి రోజునుంచే పరుగులు పెట్టే శక్తి ఉందని మేధావులు స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో 60 లక్షలకుపైగా జనాభా ఉండటం, వాణిజ్య వ్యాపార కార్యకలాపాలు పెద్ద ఎత్తున జరుగుతుండడం వల్ల ఈ ప్రాంతం వేగవంతమైన గ్రోత్ ఇంజన్గా పనిచేస్తుందని మేధావులు విశ్లేషిస్తున్నారు. అదే అమరావతి రాజధాని అయితే జనాభా లేని ఈ ప్రాంతంలో విద్యుత్ లైన్లు, రహదారులు, మురికి కాలవలు దగ్గర నుంచి కొత్తగా నిర్మించుకోవాల్సి వస్తుందని, లక్ష ఎకరాల్లో వీటి నిర్మాణం పూర్తి చేయడానికి చాలా సుదీర్ఘ సమయం పడుతుందంటున్నారు. మావిగన్లో అన్ని మౌలికవసతులు ఉండటంలో తొలిరోజు నుంచే రాజధాని శరవేగంగా అభివృద్ధి చెందుతుందని అదే అమరావతి విషయానికి వస్తే ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలియదంటున్నారు. ఆచరణసాధ్యం కాని అమరావతి పేరుతో చంద్రబాబు రాష్ట్రానికి అసలు రాజధానే లేకుండా చేస్తున్నాడని విమర్శకులంటున్నారు.అమరావతికి ఎన్ని లక్షల కోట్లు అవసరమవుతాయో?అమరావతిలో రోడ్లు వేయడానికి, కరెంట్ ఇవ్వడానికి, డ్రైనేజీ వ్యవస్థ, నీళ్లు వంటి బేసిక్ వసతులు కల్పించడానికి ఎకరాకు రూ.2 కోట్లు ఖర్చు అవుతుందని చంద్రబాబు ప్రభుత్వమే సెంట్రల్ గవర్నమెంట్కు, బ్యాంకులకు ఇచ్చిన డీపీఆర్లలో స్పష్టంగా పేర్కొంది. ఈ లెక్కన చూసుకుంటే తొలి దశలో 50 వేల ఎకరాలకే లక్ష కోట్లు, ఇప్పుడు రెండో దశ కింద సేకరిస్తున్న మరో 50 వేల ఎకరాలు కలుపుకుంటే మొత్తం లక్ష ఎకరాలకు రూ.2 లక్షల కోట్లు కేవలం రోడ్లు వేయడం, కరెంట్, డ్రైనేజీ పనులకే అవసరం అవుతాయి. వీటన్నింటినీ పూర్తి చేయడానికి చాలా దశాబ్దాలు పట్టే అవకాశం కనిపిస్తోంది. అంటే ఇప్పుడు ఉన్న రూ. 2లక్షల కోట్ల అంచనా వ్యయం విలువ ఏళ్లు గడిచేకొద్దీ రూ.4 లక్షల కోట్లు అవుతుందో, రూ. 10 లక్షల కోట్లు అవుతుందో తెలియదు. అదే మావిగన్లో అయితే ఇందులో కేవలం పదోవంతు అంటే సుమారు రూ.20,000 కోట్లు ఖర్చు చేస్తే చాలు ప్రభుత్వ భవనాలు, ఇతర నిర్మాణాలు పూర్తి చేసుకుని బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలతో పోటీ పడగలమని నిపుణులంటున్నారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ కాదని, రానున్న కాలంలో రాష్ట్రానికి ఆర్థిక గుదిబండగా తయారయ్యే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.అందుబాటులో అన్ని మౌలిక వసతులుమావిగన్ పూర్తిగా జాతీయ రహదారులు, రైల్వేలైన్లతో అనుసంధానించి ఉండటం వేగంగా వృద్ధి చెందడానికి ప్రధానంగా కలిసివచ్చే అంశం. 110 కి.మీ పైగా ఆరులైన్ల జాతీయ రహదారులు ఉండటమే కాకుండా, దేశంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానించే విజయవాడలోని అతిపెద్ద రైల్వే జంక్షన్తో పాటు గుంటూరు రైల్వే జంక్షన్ ఉన్నాయి. అదే అమరావతి పూర్తిగా ఒక మారుమూల ప్రాంతంగా ఉండటంతో ఈ ప్రాంతాన్ని ప్రధాన రహదారులకు అనుసంధానించడానికి ప్రత్యేకంగా రహదారులు, రైల్వే లైన్లు నిర్మించాలి. ఇందుకోసం వేల కోట్లు వ్యయం చేయాల్సి రావడం లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రానికి పెద్ద గుదిబండగా మారుతుందని ఆర్థిక వేత్తలు స్పష్టం చేస్తున్నారు. పోర్టు, ఎయిర్పోర్టు, జాతీయ రహదారులు, రైల్వే లైన్లు వంటి అన్ని కీలక మౌలికవసతులు మావిగన్లో ఉండటంతో ఎటువంటి అదనపు వ్యయాలు లేకుండా తొలి రోజు నుంచే పెద్ద నగరాలతో పోటీపడ వచ్చంటున్నారు.పోర్టు నగరాల్లో శరవేగంగా అభివృద్ధిచెన్నై సమీపంలో పోర్టు, విమానాశ్రయం ఉండటం.. ముంబైకి సమీపంలో పోర్టు, విమానాశ్రయం ఉండటం వల్లే భారీ ఎత్తున పెట్టుబడులు తరలిరావడంతో ఆ నగరాలు స్వల్ప కాలంలోనే మహానగరాలుగా రూపాంతరం చెందాయని.. వాటితరహాలోనే మావిగన్ కూడా మహానగరంగా అభివృద్ధి చెందుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు రాజధాని ప్రాంతానికి మచిలీపట్నం పోర్టును అనుసంధానిస్తే లాజిస్టిక్స్ వ్యయం తగ్గడమే కాకుండా ఇది ఎగుమతులు దిగుమతులతో ప్రధాన ఆర్థిక వాణిజ్య కేంద్రంగా వేగంగా ఎదుగుతుందంటున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సాగరమాల పథకం కింద మచిలీపట్నం పోర్టును జాతీయ రహదారులు, రైల్వేలైన్లతో అనుసంధానించే విధంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టింది.. నౌకాశ్రయం, విమానాశ్రయం సమీపంలోనే ఉండటం వల్ల ఎగుమతులు, దిగుమతులకు అత్యంత అనువైన ప్రాంతం ఇది. ఐటీ వంటి స్మార్ట్ ఇండస్ట్రీస్తోపాటు భారీ ఎత్తున పరిశ్రమలు పెట్టడానికి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు పట్టణాలు అత్యంత అనుకూలమైనవని పారిశ్రామికవేత్తలు స్పష్టం చేస్తున్నారు. మావిగన్ కారిడార్ను రాజధానిగా ప్రకటించి.. అభివృద్ధి చేస్తే అంతర్జాతీయ, జాతీయ బహుళజాతి సంస్థలు భారీ ఎత్తున పెట్టుబడి పెట్టి పరిశ్రమలు స్థాపించడానికి పోటీలుపడటం ఖాయమంటున్నారు. అదే అమరావతి విషయానికి వస్తే మరో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి 5,000 ఎకరాలు కేటాయించడంతోపాటు వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుందంటున్నారు. -
మొక్కల పేరుతోనూ మంత్రి నారాయణ మేత
నెల్లూరు రూరల్: నెల్లూరు నగరపాలక సంస్థలో భారీ ఎత్తున అవినీతి జరుగుతోందని.. మొక్కుబడిగా మొక్కలు నాటి ఏకంగా రూ.60 కోట్ల ప్రజాధనం కొల్లగొడుతున్నారని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ఆరోపించారు. 48 వేల మొక్కలు నాటి వాటికి ట్రీ గార్డులు, నీరుపోసే పేరుతో మంత్రి నారాయణ ఒక్కో మొక్కకు ఏకంగా రూ.12,500 ఖర్చు చేస్తూ.. రూ.60 కోట్ల నిధులు మేసేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ హయాంలో ఒక్కో మొక్కకు చేసిన ఖర్చు కేవలం రూ.750 మాత్రమేన్నారు. శనివారం వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. నెల్లూరులో మొక్కల నాటే కార్యక్రమం పేరుతో భారీ దోపిడీకి మంత్రి నారాయణ వ్యూహరచన చేశారని ధ్వజమెత్తారు. ప్రజలకు ఉపయోగపడని పనులతో యథేచ్ఛగా ప్రజాధనాన్ని దోచేస్తున్నారని మండిపడ్డారు.టీడీపీ నేతలకే కాంట్రాక్టులిచ్చి .. నగరంలో తొలి విడతలో 14,741 మొక్కలకు సంబంధించి టీడీపీకి చెందిన 25 మంది కాంట్రాక్టర్లకు అనుమతులిచ్చారని, మొదటి విడతలో నాటిన చెట్లకు రూ.8.03 కోట్లు చెల్లించారని చంద్రశేఖర్రెడ్డి చెప్పారు. ఒక్కో మొక్క నాటి దానికి ట్రీగార్డు ఏర్పాటు చేసేందుకు రూ.5,500 ఖర్చుచేస్తే.. ఒక డివిజన్లో 1,800 మొక్కలకు నీళ్లు పోయడానికి రూ.1.24 కోట్ల కేటాయించారన్నారు. ఈ లెక్కన ఒక్కో మొక్కకు నీరు పోసేందుకే రూ.6,888 ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ విధంగా ఒక్కొక్క మొక్కకు దాదాపు రూ.12,500 పైగా ఖర్చు చేస్తున్నట్టు అర్థమవుతోందన్నారు.మంత్రి నారాయణ కేవలం 12 అడుగుల రోడ్డులో ఇరువైపులా మొక్కలు నాటిస్తున్నారని, ఈ మొక్కలకు రెండు నెలలే ఆకులు, పూలు ఉంటాయని, ఆక్సిజన్, నీడను ఇవ్వని ఇలాంటి చెట్ల వల్ల ఏం ప్రయోజనం అని ప్రశ్నించారు. సిమెంట్ రోడ్డును కట్చేసి మొక్కలు నాటుతున్నట్టు టెండర్లలో పేర్కొంటూ గ్రావెల్ రోడ్డులో నాటుతున్నారన్నారు. బహిరంగ ప్రదేశాల్లోనే కాకుండా ప్రైవేట్ స్థలాల్లో నాటిన మొక్కలకు మెష్ ఏర్పాటు చేసి బిల్లులు పెట్టుకున్నారని చెప్పారు. ఎవరైనా వర్షాకాలం సమీపిస్తున్నప్పుడు మొక్కలు నాటుతారని.. నారాయణ మాత్రం బిల్లులు వస్తే చాలన్నట్టు మండే ఎండల్లో నాటిస్తున్నారని ధ్వజమెత్తారు.మరో వైపు పన్నుల పేరుతో నగర వాసులను వేధిస్తున్నారని, టేబుల్పై కోడి గుడ్లు అమ్మకుంటున్న చిరు వ్యాపారిని ఆక్రమణ పేరుతో పెనాల్టీ వేశారని, ఒక దగ్గర నేమ్ బోర్డు ఒక అడుగు ముందుకొస్తే పెనాల్టీ వేశారని, ఇంకా పేదలు నివసించే ఏరియాలో నీటిబిల్లు రూ.350 కట్టలేదని పైప్లైన్ కట్ చేసి డమ్మీలు పెట్టారని వివరించారు. ‘ఎన్’ టీమ్తో దోపిడీకి మాస్టర్ ప్లాన్ అవినీతి, దోపిడీ విషయాల్లో నారాయణ ‘మాస్టార్’ ప్లాన్ సక్సెస్గా కొనసాగుతోందని చంద్రశేఖరరెడ్డి విమర్శించారు. నియోజకవర్గంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో మంత్రి నారాయణ ఏర్పాటు చేసుకున్న ‘ఎన్’ టీమ్ దోచుకుతింటోందన్నారు. స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్ నుంచి మొదలు పెడితే.. పెయింటింగ్స్, ట్రాఫిక్ సిగ్నల్స్, బయోటాయ్లెట్, చెత్తను తరలించే ట్రాక్టర్లు, సిల్ట్ క్లీనింగ్, దోమల నివారణ, ఎండ్ టు ఎండ్ రోడ్, ప్యాచ్వర్కులు ఇలా అన్నింట్లోనూ రూ.వందల కోట్ల పనులు నామినేటెడ్ కింద తన వారికి ఇప్పించి దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికే జాఫర్ సాహెబ్ కెనాల్, వీఆర్ కాలేజీ అక్రమాలను ప్రజల దృష్టికి తీసుకుకొచ్చామని చెప్పారు. -
చేయించేది.. నిందలు వేసేది నారా బాబే!
సాక్షి, అమరావతి: హత్యా రాజకీయాలపై చంద్రబాబు, టీడీపీ నేతలు శ్రీరంగ నీతులు చెబుతుండటం దయ్యాలు వేదాలు వల్లించినట్టుందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హత్యా రాజకీయాలకు తెరతీసిందే చంద్రబాబు అని, ఇది చరిత్ర చెబుతున్న పచ్చి నిజం అని వక్కాణిస్తున్నారు. గతంలో రౌడీలు, అసాంఘిక శక్తుల పరస్పర ఘర్షణల్లో అప్పుడప్పుడు హత్యలు జరుగుతుండేవి. కానీ రాజకీయ ఆధిపత్యం కోసం, ప్రత్యర్థులను అడ్డు తొలగించుకోవడం కోసం హత్యలకు తెగబడే ఒరవడిని తీసుకువచ్చింది మాత్రం కచ్చితంగా చంద్రబాబేనని రాజకీయ విశ్లేషకులు గతంలోనే కుండబద్దలు కొట్టారు.అధికారంలో ఉంటే పోలీసుల సహకారంతో హత్యలకు బరితెగించడం.. ప్రతిపక్షంలో ఉంటే అరాచక శక్తులతో హత్యలకు తెగబడే విధానాన్ని టీడీపీ అధికారిక విధానంగా చేసిందీ చంద్రబాబే అంటున్నారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగేతర శక్తిగా చెలరేగిన చంద్రబాబు.. ఇక తన ప్రభుత్వ హయాంలో ఇంకెతంగా బరితెగించి ఉంటారన్నది ఊహకే అందని దారుణం అని పలు ఘటనలను ప్రస్తావిస్తున్నారు. నాడు విజయవాడలో మల్లెల బాబ్జీ అనుమానాస్పద మృతి నుంచి.. ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా సాగుతున్న హత్యాకాండ వరకు అన్ని దారుణాల్లో అన్ని వేళ్లూ చంద్రబాబు వైపే చూపిస్తాయని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో చర్చకొచ్చిన కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. ఎన్టీఆర్పై హత్యాయత్నం కుట్ర కప్పిపుచ్చి.. 1982లో ఎన్టీ రామారావు టీడీపీ స్థాపించినప్పుడు ఆ పార్టీలో చేరని చంద్రబాబు.. కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే మామగారిపైనే పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికిన విషయం తెలిసిందే. అలాంటి చంద్రబాబు 1983లో టీడీపీ అధికారంలోకి రాగానే నిస్సిగ్గుగా ప్లేటు ఫిరాయించి ఆ పార్టీలో చేరారు. అప్పటి నుంచే ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసి.. టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగేతర శక్తిగా చెలరేగిపోయారు. ఈ నేపథ్యంలో 1984లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుపై మల్లెల బాబ్జీ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో హత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం సృష్టించింది. అతను ఎన్టీరామారావుపై ఎందుకు హత్యాయత్యానికి పాల్పడ్డారన్నది పోలీసుల విచారణలో వెల్లడవుతుందని అందరూ ఆశించారు.కానీ ఆ తర్వాత కొన్ని రోజులకే మల్లెల బాబ్జీ విజయవాడలోని ఓ లాడ్జిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతను ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు ప్రకటించడం గమనార్హం. కాగా అతని జేబు నుంచి పోలీసులు ఓ లేఖను స్వా«దీనం చేసుకున్నారు. తనకు రూ.3 లక్షలు ఇస్తానని చెప్పి కేవలం రూ.30 వేలే ఇచ్చారని ఆ లేఖలో ఉండటం గమనార్హం. కాగా, ఈ వ్యవహారంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేయకుండా అప్పటి రాజ్యాంగేతర శక్తి చంద్రబాబే అడ్డుకున్నారని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది.ఏకంగా ముఖ్యమంత్రిపైనే హత్యాయత్నం చేసిన నిందితుడు అనుమానాస్పద మృతి.. అతను రాసిన లేఖపై పోలీసుల మౌనం.. అంతా పక్కా పన్నాగంతోనే సాగాయన్నది స్పష్టమైంది. ఎన్టీ రామారావు హత్యకు గురైతే రాజకీయ అధికారం ఎవరికి దక్కుతుందన్నది కీలకంగా మారింది. దాంతో సహజంగానే చంద్రబాబుపైనే అందరికీ సందేహం కలిగింది. ఆ వాస్తవాన్ని శాశ్వతంగా కప్పిపుచ్చే కుట్ర నేపథ్యంలోనే మల్లెల బాబ్జీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ అంశంపై చంద్రబాబే సమాధానం చెప్పాలని ప్రతిపక్ష పార్టీలు, పరిశీలకులు ఎన్నోసార్లు డిమాండ్ చేసినా ఆయన మౌనంగా ఉండిపోవడం సందేహాలను మరింత బలపరుస్తోంది. పాత్రికేయుడు పింగళి దశరథ రామ్ పాశవిక హత్య టీడీపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న విజయవాడకు చెందిన ప్రముఖ పాత్రికేయుడు పింగళి దశరథ రామ్ పాశవిక హత్యను రాష్ట్రం ఎప్పటికీ మరచిపోదు. ఎన్టీ రామారావు ప్రభుత్వంలో చంద్రబాబు రాజ్యాంగేతర శక్తిగా చెలరేగిపోతున్న సమయంలోనే దశరథ రామ్పై ఎన్నోసార్లు హత్యాయత్నాలు జరగడం గమనార్హం. విజయవాడలో జరిగిన టీడీపీ మహానాడులోనే హత్య చేసేందుకు యత్నించారు. ఆయన హైదరాబాద్ నుంచి వస్తుంటే మారణాయుధాలతో వెంటబడ్డారు. 1985 అక్టోబర్ 20న రాత్రి విజయవాడలో రిక్షాలో వెళుతున్న దశరథ రామ్ను దారి కాచి మరీ దారుణంగా హత్య చేశారు.కొన ప్రాణాలతో ఉన్న ఆయన్ను కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాలని చెప్పినా సరే పోలీసులు ఉద్దేశ పూర్వకంగా కాలయాపన చేశారు. అంటే అప్పటి ప్రభుత్వ పెద్దల దన్నుతోనే దశరథ రామ్ను హత్య చేశారన్నది స్పష్టమైంది. దశరథ రామ్ హత్య ఉదంతంలో చంద్రబాబు పాత్ర ఉందని ఆరోపణలున్నాయి. ఆ హత్య వెనుక సూత్రధారులు ఎవరన్నది బయటకు రాకుండా ప్రభుత్వం మేనేజ్ చేసింది. రంగా హత్య కుట్రదారు చంద్రబాబే చంద్రబాబు హత్యా రాజకీయాలకు పరాకాష్ట వంగవీటి మోహన రంగా దారుణ హత్యే అని పలువురు నేతలు నొక్కి చెప్పారు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో చెలరేగిపోయిన చంద్రబాబుకు విజయవాడలో ప్రజా నాయకుడు, అప్పటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వంగవీటి రంగా అడ్డుగా నిలిచారు. దాంతో రంగా హత్యకు టీడీపీ కుట్ర పన్నింది. చంద్రబాబు ఆదేశాలతోనే ఆయనకు అత్యంత సన్నిహితుడు అయిన అప్పటి హామ్ మంత్రి కోడెల శివప్రసాదరావు ఈ కుతంత్రానికి తెర తీశారు. పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలనే డిమాండ్తో నిరాహార దీక్ష చేస్తున్న వంగవీటి రంగాను 1988 డిసెంబర్ 25 అర్ధరాత్రి తర్వాత టీడీపీ రౌడీ మూకలు నరికి చంపాయి.ఆ రోజు రంగా హత్యలో స్వయంగా పాల్గొన్నారని నిందితుల జాబితాలో ఉన్న వెలగపూడి రామకృష్ణకు చంద్రబాబు 2009లో విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం గమనార్హం. తద్వారా వంగవీటి రంగా హంతకులకు చంద్రబాబు అండదండలు ఉన్నాయనే విషయం మరోసారి నిరూపితమైంది. వెలగపూడి రామకృష్ణ ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా విశాఖపట్నంలో కీలక నేతగా ఉన్నారు. చంద్రబాబు అండతో టీడీపీ మద్యం సిండికేట్కు రింగ్ మాస్టర్గా దందా కొనసాగిస్తున్నారు. చంద్రబాబు అండతోనే వైఎస్ రాజారెడ్డి దారుణ హత్య రాజకీయ ప్రత్యర్థులను అడ్డం తొలగించుకునేందుకు చంద్రబాబు ఎంతకైనా తెగబడతారనడానికి వైఎస్ రాజారెడ్డి దారుణ హత్యే నిదర్శనం. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే 1998లో వైఎస్ రాజారెడ్డిని కడప జిల్లాలో పాశవికంగా హత్య చేశారు. టీడీపీ నేతలు చంద్రబాబు అండతోనే ఈ హత్యకు పాల్పడ్డారన్నది బహిరంగ రహస్యం. అందువల్లే హంతకులకు 30 రోజులపాటు చంద్రబాబే హైదరాబాద్లో ఆశ్రయం ఇప్పించారని అప్పట్లోనే వెల్లడైంది.ఈ హత్యపై పోలీసులు నమోదు చేసిన కేసులో ఆధారాలు లేవని మొదటి అదనపు సెషన్స్ న్యాయస్థానం నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. కానీ అప్పటి టీడీపీ ప్రభుత్వం దీనిపై కోర్టులో కౌంటర్ కూడా వేయలేదు. అనంతరం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఆ తీర్పును హైకోర్టులో సవాల్ చేసింది. ఈ కేసులో 11 మంది నిందితులకు న్యాయస్థానం 2006లో యావజ్జీవ ఖైదు విధించింది. 2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసులో దోషిగా జైలు శిక్ష అనుభవిస్తున్న రాగిపిండి సుధాకర్ రెడ్డికి క్షమాభిక్ష ప్రసాదించడం గమనార్హం. ప్రతిపక్షంలో ఉంటే బాబు అరాచక శక్తే టీడీపీ ప్రతిపక్షంలో ఉంటే చంద్రబాబు అరాచక శక్తిగా చెలరేగిపోయేవారన్నది బహిరంగ రహస్యం. 1989–94లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజా ఆందోళన పేరిట బస్సులను దహనం చేయాలని చంద్రబాబు ఆదేశించేవారని అప్పటి టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ టీవీ చానళ్ల ఇంటర్వ్యూల్లో వెల్లడించడం గమనార్హం. కొన్ని బస్సులు తగలబడాలి.. కొందరు సామాన్యులు చనిపోవాలి.. అప్పుడే ఆందోళన విజయవంతమైనట్టని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో తాము దిగ్భ్రాంతికి గురయ్యామని ఆయన చెప్పడం గమనార్హం.బాబు ఘాతుకాలకు ఆయన తోడల్లుడే సాక్షిపిల్లనిచ్చిన సొంత మామ అయిన ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని లాక్కోవడంతో పాటు చంద్రబాబు సీఎం కావడం వెనుక సత్యాలను ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావే స్వయంగా చెప్పారు. ఒక చరిత్ర కొన్ని నిజాలు – సత్యానికి మరో కోణం పుస్తకాల్లో బాబు ఘాతుకాలను సవివరంగా పేర్కొన్నారు. ఆగస్టు తిరుగుబాటులో చంద్రబాబు పోషించిన పాత్రను దగ్గుబాటి బట్టబయలు చేశారు. మాజీ మంత్రి, మాజీ ఎంపీ హరిరామ జోగయ్య సైతం చంద్రబాబు దారుణాలను తాను రాసిన ‘60 వసంతాల నా రాజకీయ ప్రస్థానం’ పుస్తకంలో వివరించారు. -
అమరావతి నిర్మాణాల అక్రమాల్లో మరో కోణం
అమరావతి: ఏపీలోని అమరావతి నిర్మాణాల అక్రమాల్లో మరో కోణం బయడపడింది. హైదరాబాద్లో హెరిటేజ్ కొత్త యూనిట్ను నిర్మించిన భీమా ఇన్ఫ్రాకే అమరావతి నిర్మాణాలు అప్పచెప్పారు. జీఏడీ టవర్ల పనుల్లో భీమా ఇన్ఫ్రాకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది ప్రభుత్వం. హైదరాబాద్లో కొత్త హెరిటేజ్ యూనిట్ను భువనేశ్వరి, బ్రాహ్మిణి ఇటీవలే ప్రారంభించారు. రామ్ హెరిటేజ్, జీఏడీ టవర్లు చేశామన్న భీమా ఇన్ఫ్రా ప్రకటించింది. హెరిటేజ్ యూనిట్ పూర్తి చేసినట్లు భీమా ఇన్ఫ్రా వెల్లడించింది., అదే భీమా సంస్థకు అమరావతి జీఏడీ టవర్ల పనులు దక్కడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భీమా ఇన్ఫ్రాకి అమరావతి పనులు ఇవ్వడాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా తప్పుబట్టింది. -
ఏపీపై బట్టబయలైన చంద్రబాబు కపట ప్రేమ
సాక్షి,అమరావతి: ఏపీపై సీఎం చంద్రబాబు కపట ప్రేమ బట్టబయలైంది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేస్తూనే, పెట్టుబడులను మాత్రం తెలంగాణలో పెడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.తెలంగాణలో హెరిటేజ్ సంస్థ కొత్త ప్లాంట్ను ఏర్పాటు చేసింది. శామీర్పేటలో 6,205 చదరపు మీటర్ల విస్తీర్ణంలో, 98.5 మీటర్ల పొడవు, 63 మీటర్ల వెడల్పుతో హెరిటేజ్ ఐస్క్రీమ్ ప్లాంట్ను ప్రారంభించింది. ఈ ప్లాంట్లో చంద్రబాబు కుటుంబం రూ.204 కోట్ల పెట్టుబడి పెట్టింది. వచ్చే ఐదేళ్లలో ఈ పెట్టుబడులను రూ.500 నుంచి రూ.700 కోట్ల వరకు పెంచాలని నిర్ణయించింది.అయితే, కొత్త ప్లాంట్ను ఏపీలో ఏర్పాటు చేయడానికి చంద్రబాబు కుటుంబం ఆసక్తి చూపలేదని విమర్శలు వస్తున్నాయి. సొంత రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోయినా, తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. తనని చూసే ఏపీకి పెట్టుబడులు వస్తాయంటూ ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు.. తన కుటుంబ వ్యాపారాన్ని మాత్రం తెలంగాణలో విస్తరించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. -
కీసర టోల్ ప్లాజా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం
ఎన్టీఆర్ జిల్లా: కీసర టోల్గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టోల్గేటు దాటే సమయంలో బీఎండబ్ల్యూ కారు (టీఎస్09ఎఫ్టీ662)పై ట్యాంకర్ పడింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలు అయ్యాయి, వారి పరిస్థితి విషమంగా మారింది.కారుపై పడిన ట్యాంకర్ను తొలగించేందుకు రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భారీ క్రెయిన్ సహాయంతో కారుపై పడిన ట్యాంకర్ను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో ప్రమాదానికి గురైన కారు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిసింది. కారు హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడాకు చెందిన శ్రీనివాసరావుదిగా పోలీసులు గుర్తించారు. ట్యాంకర్ ఏపీ రిజిస్ట్రేషన్ పేరుతో తమిళనాడులో ఎక్కువగా తిరుగుతున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం తరువాత పరారీలో ఉన్న ట్యాంకర్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
వైఎస్ జగన్ పాలనలోనే బీసీలకు న్యాయం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జ్యోతీరావ్ పూలే జయంతి కార్యక్రమం నిర్వహించారు. పూలే విగ్రహానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రులు జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, బీవై రామయ్య, నారాయణమూర్తి, ఎమ్మెల్సీలు కల్పలతారెడ్డి, రమేష్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. 2019 నుంచి 24 వరకు పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి జగన్. ఐదేళ్ల పరిపాలన కాలంలో చదువుకు పెద్దపీట వేశారన్నారు.మాజీ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. వైస్సార్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళి అర్పించాం. సంఘ సంస్కర్త, సామాజికవేత్త జ్యోతి రావు పూలే.. సమాజం కోసం అహర్నిశలు పాటు పడిన వ్యక్తి పూలే అయితే, ఆయన ఆశయాలని అమలు చేసిన మహనీయుడు వైఎస్సార్. సామాజిక న్యాయం ఉంటే చంద్రబాబు చెప్పాలి. సవాల్ స్వీకరించాలి. నలుగురు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు వైఎస్ జగన్.. డిప్యూటీ సీఎం ఇచ్చారు. సామాజిక న్యాయానికి పెద్ద పీట వేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు డిప్యూటీ సీఎం పదవి ఎందుకు ఇవ్వలేకపోయాడు. సామాజిక న్యాయం చేస్తా బీసీలే నా వెన్నుముకని చెప్పిన చంద్రబాబు దీనికి సమాధానం చెప్పాలి.మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. యావద్దేశం జ్యోతిబాపూలేకి ఘనమైన నివాళులర్పిస్తుంది. అనేక సంస్కరణలకు మూలపురుషుడు జ్యోతిరావు పూలే. చంద్రబాబు క్యాబినెట్లో 8 మంది బీసీలు ఉంటే జగన్ క్యాబినెట్లో 11 మంది బీసీలు ఉన్నారు. రాజ్యసభ సీట్ల కేటాయింపులో కూడా బీసీలకు పెద్ద పేట వేశారు. డీబీటీ ద్వారా లక్షలా కోట్ల రూపాయలు నేరుగా బ్యాంక్ అకౌంట్ వేశారు. అన్ని పదవుల్లో పారదర్శకంగా వ్యవహరిస్తూ 50 శాతం సీట్లు బీసీలకు ఇచ్చారు. చంద్రబాబు బీసీలకు వ్యతిరేకి.. సీనియర్ ఎందుకు పక్కన పెట్టాడో చంద్రబాబు సమాధానం చెప్పాలి. బీసీలు స్థితిగతులు మెరుగుపడాలంటే.. బీసీలకు రాజ్యాధికారం రావాలంటే అది వైఎస్సార్సీపీలోనే సాధ్యం. -
మండిన ఎండ.. అక్కడక్కడ వాన
రాష్ట్రంలో ఒకవైపు తీవ్రమైన ఎండలు కాస్తుండగా.. మరోవైపు కొన్నిచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఈ సీజన్లోనే గరిష్టంగా కాకినాడ జిల్లా కరపలో 44.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదవ్వగా.. అన్నమయ్య జిల్లా పుంగనూరు, అనకాపల్లి జిల్లా రావికమతం, విశాఖ జిల్లా ఆనందపురం తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. -
అస్మదీయ ఆస్పత్రులకే నిధులు!
సాక్షి, అమరావతి: ఒకవైపు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకుండా తొక్కిపెడుతున్న చంద్రబాబు సర్కారు.. కూటమి పార్టీల ప్రజా ప్రతినిధులకు చెందిన ఆస్పత్రులకు మాత్రం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కింద లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసీ) రూపంలో నిధుల వరద పారిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వంలో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలతో పాటు రెండు చెవులకు కాక్లియర్ ఇంప్లాంటేషన్ లాంటి ఖరీదైన చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారు. అయితే వీటికి ఇప్పుడు ఆరోగ్యశ్రీలో కాకుండా ఎల్ఓసీల రూపంలో రెండు మూడు రెట్లు అధికంగా ఖజానా నుంచి చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది.ఆరోగ్యశ్రీలో నిరాకరణక్యాన్సర్ రోగులకు జబ్బు తీవ్రతను బట్టి రేడియేషన్ థెరపీకి ఆరోగ్యశ్రీలో రూ.లక్ష నుంచి రూ.2.5 లక్షల మేరకు ప్రభుత్వం చెల్లిస్తుంది. బోన్మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కు రూ.7 లక్షల నుంచి రూ.11 లక్షల దాకా ఇస్తుంది. అయితే కూటమి నేతలకు చెందిన ఆస్పత్రులు మాత్రం ఆరోగ్యశ్రీ సేవలను నిరాకరిస్తూ ఎల్ఓసీలకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి. ఎన్నికల అనంతరం పక్క రాష్ట్రంలో ‘ముఖ్య’నేత బంధువుకు చెందిన క్యాన్సర్ ఆస్పత్రిలో బోన్మ్యారో సహా ఇతర ఖరీదైన చికిత్సలను ఆరోగ్యశ్రీ కింద నిరాకరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, వారి సన్నిహితులకు చెందిన ఆస్పత్రులు ఎల్ఓసీలను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నట్లు వైద్య వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.‘స్వాహా’పై దాటవేత..!‘సాక్షి’ గురువారం సంచికలో ప్రచురించిన ‘సీఎంఆర్ఎఫ్ స్వాహా!’ కథనంపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. నిబంధనల ప్రకారమే సీఎంఆర్ఎఫ్ సాయం మంజూరు, ఎల్ఓసీ జారీ చేస్తున్నామని పేర్కొంది. ఈ ప్రక్రియ అంతా ఎంతో పారదర్శకంగా చేపడుతున్నామని తెలిపింది. అయితే వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన తుంటి ఎల్లయ్యకు సీఎంఆర్ఎఫ్ సాయం ముసుగులో టీడీపీ నాయకుడు వేణుగోపాల్ రూ.8 లక్షలు కాజేసిన వ్యవహారంపై ప్రభుత్వం స్పందించకుండా దాటవేయడం గమనార్హం.


