breaking news
Amaravati
-
‘లక్షల కోట్లు అప్పులు చేస్తూ దివ్యాంగులకు పెన్షన్లు ఇవ్వలేరా?’
తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివ్యాంగుల పెన్షన్లను అడ్డగోలుగా తొలగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. దివ్యాంగుల పట్ల చంద్రబాబు కర్కశంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు(సోమవారం, ఆగస్టు 25వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన లేళ్ల అప్పిరెడ్డి.. చంద్రబాబు ప్రభుత్వం మానసిక వైకల్యంతో కొట్టుమిట్టాడుతోందని విమర్శించారు. ‘దివ్యాంగుల మీద చంద్రబాబు కర్కశంగా వ్యవహరిస్తున్నారు. వారికి పెన్షన్లు కట్ చేసి అన్యాయం చేశారు. చంద్రబాబు ప్రభుత్వానికి మానసిక వైకల్యం ఉంది. అందుకే అడ్డగోలుగా పెన్షన్లు తొలగించారు. దేశ చరిత్రలో ఏనాడైనా ఈ స్థాయిలో పెన్షన్ల తొలగింపు జరిగిందా?, చంద్రబాబు మాత్రమే ఏకంగా లక్షకు పైగా పెన్షన్లు తొలగించి తన కర్కశత్వాన్ని చాటుకున్నారు. పల్నాడు జిల్లాలో రామలింగారెడ్డి మరణం ప్రభుత్వ హత్యగా భావిస్తున్నాం. లక్షల కోట్ల అప్పులు చేస్తూ కనీసం దివ్యాంగులకు పెన్షన్లు కూడా ఇవ్వలేరా?, చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఒక్కరికైనా కొత్తగా పెన్షన్ ఇచ్చారా?, ఉన్నవాటిని కూడా తొలగించి వారి ఉసురు తీస్తున్నారు. దివ్యాంగుల్లో కూడా కులాలు, మతాలు, రాజకీయ పార్టీలు చూసి పెన్షన్లు ఇవ్వటం ఏంటి?, నడవలేక నేల మీద పాక్కుంటూ వచ్చేవారిని చూస్తుంటే మనసుకు బాధ కలుగుతోంది. అలాంటి వారికి కూడా ఎలా పెన్షన్లు తొలగించారు?, గతంలో ప్రభుత్వ డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికేట్లను కాదనటం ఆ డాక్టర్లను అవమానించటం కాదా?, వికలాంగులను తీసుకుని వస్తున్న మా పార్టీ నేత ఉషశ్రీ చరణ్ని పోలీసులు అడ్డుకున్నారు. మూడు హెలికాప్టర్ లలో తిరుగుతున్న ప్రభుత్వ పెద్దలకు దివ్యాంగులకు పెన్షన్లు ఇవ్వటానికి చేతులు రావటం లేదా?, తొలగించిన పెన్షన్లను వెంటనే పునరుద్దరించకపోతే ఉద్యమం చేస్తాం’ అని హెచ్చరించారు. -
బాబు ముఠా బార్ల దందా.. టీడీపీ సిండికేట్కు కట్టబెట్టేందుకు కుట్ర
సాక్షి,విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వంలో టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీలో మరో అంకానికి తెరలేచింది. ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన 840 బార్లను ఏకపక్షంగా దక్కించుకునేందుకు సిండికేట్ రంగంలోకి దిగింది. ఇతరులు ఎవరూ దరఖాస్తులు చేయకుండా అడ్డుకుంటోంది. దీంతో 840 బార్లలో 72 బార్లకే అప్లికేషన్లు వచ్చాయి. అయితే వీటిల్లో 45 బార్లకు మాత్రమే లాటరీకి అవసరమైన దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఏపీలో మద్యం బార్ల కోసం టీడీపీ సిండికేట్ స్కెచ్ వేసింది. దరఖాస్తులు వేయకుండా టీడీపీ నేతల సిండికేట్ చక్రం తిప్పింది. కమిషన్ భారీగా పెంచుకుని బార్లను దక్కించుకునేందుకు ప్లాన్ చేసింది. రేపటితో బార్ల దరఖాస్తులకు గడువు ముగుస్తుండగా.. 10 శాతం బార్లకు కూడా దరఖాస్తులు దాఖలు కాకపోవడం చర్చాంశనీయంగా మారింది. -
విజయవాడలో ఇళ్ల కూల్చివేతకు యత్నం.. బాధితులకు అండగా వైఎస్సార్సీపీ
సాక్షి, విజయవాడ: నగరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 1995లో ఒక వ్యక్తి నుంచి 42 మంది ఫ్లాట్స్ కొనుగోలు చేశారు. 2000 సంవత్సరంలో ఇళ్లు నిర్మించుకుని ఆ కుటుంబాలు అక్కడ నివాసం ఉంటున్నాయి. ఆ స్థలం తనదేనంటూ కొందరు వ్యక్తులు కోర్టుకెళ్లారు. మరోవైపు, తమ అసోసియేన్కే స్థలం చెందుతుందంటూ వాదనలు వినిపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని 42 కుటుంబాల వారు కోరుతున్నారు.ఇవాళ ఉదయం కోర్టు ఆర్డర్తో పోలీసుల సాయంతో ఇళ్లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఫ్లాట్ ఓనర్స్, రాజకీయ పార్టీల నేతలు ఇళ్ల కూల్చివేతలను అడ్డుకున్నారు. కేసు సుప్రీంకోర్టులో ఉండగా ఎలా కూల్చుతారంటూ బాధితులు అండగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ధర్నాలో పాల్గొన్నారు.పేదల ఇళ్లు కూల్చడమేనా పీ-4 అంటే..వెల్లంపల్లి మాట్లాడుతూ.. 42 మంది బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. కోర్టుని తప్పుదోవ పట్టించి స్థలాన్ని కబ్జా చేయాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. నోటీసులు ఇచ్చామని ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారు?. మునిసిపల్ ప్లాన్ ఉంది.. బ్యాంక్ లోన్ ఉంది.. అన్ని అనుమతులతో నిర్మాణం జరిగింది. పోలీసులు, ప్రభుత్వాలు పేదలను కాపాడాలి.. కానీ వారి పొట్ట కొట్టడానికి ప్రయత్నిస్తోంది. కూటమి ప్రభుత్వం.. అధికారంంలోకి వచ్చి 14 నెలలు అయినా ఒక ఇల్లు కట్టలేదు.. పేద వారి ఇల్లు కూల్చడమేనా పీ-4 అంటే.. మహిళలను జుట్టులు పట్టుకొని లాగి పడేస్తున్నారు.భూ కబ్జాలు చేసే వారి పక్షాన కూటమి సర్కార్ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అవినాష్ మాట్లాడుతూ.. పేదలను భయపెట్టి ఇళ్ల నుండి బయటకు లాగి ఇళ్లు ఖాళీ చేయిస్తున్నారు. ప్రైవేట్ భూమి విషయంలో వందలాది మంది పోలీసులు వచ్చారు. ప్రజా సమస్యలపై మాట్లాడితే పోలీసులు పట్టించుకోరు. భూ కబ్జాలు చేసే వారి పక్షాన కూటమి ప్రభుత్వం ఉంది. బాధితుల పక్షాన వైఎస్సార్సీపీ ఉంది.కోర్టుని నమ్మించి..వైఎస్సార్సీపీ గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన మహేష్ మాట్లాడుతూ.. కోర్టుని నమ్మించి తమ భూమి అంటూ ఆర్డర్స్ తెచ్చుకున్నారు. బాధితులకు వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. పేదల భూములు లాక్కుని పెద్దలకు కట్టబెట్టాలని చూస్తున్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్ ఉంది. టైం ఇవ్వాలని అడిగిన పట్టించుకోకుండా కూల్చడం ప్రజాస్వామ్య విరుద్ధం. జనవాణిలో మా భూములు కాపాడాలని అర్జీ ఇచ్చారు. ఇళ్లు కుల్చడానికి వచ్చింది జనసేన లీగల్ సెల్నే.. స్థానిక ఎమ్మెల్యే ఎందుకు స్వందించడం లేదో చెప్పాలి. -
ఎమ్మెల్యేల దందాలపై కిమ్మనరేమి బాబు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉన్న అనేకానేక పేర్లలో లీకు వీరుడన్నది ఒకటి. చేసే పనులతో సంబంధం ఉండదు. కానీ తనకు ప్రయోజనం కలిగే ప్రచారం మాత్రమే జరిగేలా జాగ్రత్త పడుతూంటారు. అయితే సోషల్ మీడియా లేని టైమ్లో ఈయన గారి చేష్టలు నడిచిపోయాయి కానీ.. ఇప్పుడు అసలు గుట్టును బయటపెట్టేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేల వల్ల చెడ్డపేరు వస్తే సహించనని ఆయన ఇటీవలి మంత్రివర్గ సమావేశంలో అన్నారట.కూటమి ప్రభుత్వ వైఫల్యాల వల్ల తమకు చెడ్డపేరు వస్తోందని ఎమ్మెల్యేలు మొత్తకుంటూంటే.. చంద్రబాబు తెలివిగా దాన్ని తిరిగి ఎమ్మెల్యేలపైనే తోసేసే ప్రయత్నమన్నమాట ఈ వ్యాఖ్య! కూటమి ఎమ్మెల్యేలు, ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు గాడి తప్పుతున్నారని అంగీకరిస్తూనే, వారేదో చిన్న తప్పులు చేస్తున్న కలరింగ్ ఇవ్వడం ఇంకోసారి అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్లు లీక్ ఇచ్చి సరిపెట్టుకున్నారు. దీనర్థం... మీరెన్ని అకృత్యాలకు పాల్పడ్డ.. పెద్దగా ఇబ్బందేమీ ఉండదన్న సందేశం పంపడమే!నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేలు ఇసుక, మద్యం తదితర దందాలు సాగిస్తున్న ఆరోపణలు ఉన్నాయి. పలువురు మంత్రులపై కూడా విమర్శలున్నాయి. ఈ విషయాలపై చంద్రబాబు ఇప్పటికే 35 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడినట్లు ఎల్లోమీడియా కథనం. అంటే ఇంకెంతమంది అక్రమ దందాల్లో మునిగి తేలుతున్నట్లు? ఈ అక్రమాలకు అడ్డుకట్ట పడేదెన్నడు? ఇటీవలి కాలంలో కొందరు ఎమ్మెల్యేలపై చాలా తీవ్రమైన ఆరోపణలే వచ్చాయి కానీ.. వాటిని కూడా చూసిచూడనట్టుగా సుతిమెత్తటి వార్నింగ్లతో సరిపుచ్చేస్తున్నారు తెలుగుదేశం అధినేత.నెల్లూరు జిల్లాకు చెందిన ఒక రౌడీషీటర్, జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్ అనే వ్యక్తికి పెరోల్ ఇచ్చిన తీరు కలకలం రేపింది. ఆ జిల్లాకు చెందిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు సిఫారసు చేయడం, ఆ మీదట హోం మంత్రి అనిత ఒత్తిడి కారణంగా హోం శాఖ అధికారులు పెరోల్ మంజూరు చేశారని నిఘా విభాగమే నివేదిక అందించిందట. అయినా బాబు ఎమ్మెల్యేలను కానీ.. మంత్రిని కానీ ఏమీ అనలేదు. మంత్రి ఏమో.... అదేదో ఒవర్లుక్ వల్ల జరిగిందని బాధ్యత నుంచి తప్పించుకోచూశారు. ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి లోకేశ్ పెరోల్ ఇచ్చేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సలహా ఇచ్చారట.ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చారా? లేదా? వీరిపై చర్య తీసుకోవడం మాని వైసీపీ వారు దుష్ప్రచారం చేస్తున్నారని, క్రిమినల్ మాఫియాగా ఉన్నారని చంద్రబాబు అనడంలో అర్థం ఏమైనా ఉందా? ప్రస్తుతం ఏపీ అంతటా టీడీపీ వర్గీయులు మాఫియాగా మారి దాడులు, దౌర్జన్యాలు, మహిళలపై వేధింపులు తదితర అకృత్యాలకు పాల్పడుతున్నట్లు నిత్యం వార్తలు వస్తుంటే, వాటి గురించి మాట్లాడకుండా వైసీపీపై విమర్శలు చేసి డైవర్ట్ చేస్తే సరిపోతుందా? టీడీసీ ఎమ్మెల్యేల గత చరిత్ర ప్రకారం ఎంతమందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయో ఆయనకు తెలియదా! ఈ పెరోల్ వ్యవహారంలో శ్రీకాంత్ ప్రియురాలు అరుణ ఎక్కడ మరిన్ని నిజాలు చెబుతుందో అని అనుమానించి ఆమెను ఏదో కేసులో అరెస్టు చేసి భయపెట్టడం మంచి పాలన అవుతుందా? అన్న చర్చ కూడా ఉంది.వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడుపై అగ్రోస్ జీఎం రాసిన లేఖ గురించి సీఎం ఏమంటారో తెలియదు. ఒక ఏపీ మంత్రి హైదరాబాద్లో కూర్చుని సెటిల్మెంట్లు చేస్తున్నారని ఎల్లో మీడియానే రాసింది. ఒక మంత్రి రాసలీలలు అంటూ టీడీపీ అధికార ప్రతినిధే వెల్లడించిన వైనం కనపడుతూనే ఉంది. అయినా చర్యలు నిల్. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి శ్రీశైలంలో అటవీశాఖ సిబ్బందిపై దౌర్జన్యానికి దిగిన తీరు పాశవికంగా ఉంది. చెక్ పోస్టు గేట్ తీయలేదని అటవీశాఖ సిబ్బందిపై తన అనుచరులతో కలిసి భౌతిక దాడికి దిగారని టీడీపీ మీడియా కూడా రాసింది. తప్పనిసరి స్థితిలో బుడ్డా రాజశేఖరరెడ్డిపై కేసు పెట్టారు కాని, బెయిలబుల్ సెక్షన్లు పెట్టి సరిపెట్టారు. అది ఎంత పెద్ద నేరం? అయినా ఇంతవరకు ఎమ్మెల్యేని అరెస్టు చేయలేదు. మొక్కుబడి తంతుగా మార్చారు.ఇక్కడ ట్విస్టు ఏమిటంటే జనసేన నేతను ఏ-1గా కేసు పెట్టారట. దాంతో టీడీపీనే కాకుండా, వారి కేసుల్నీ కూడా జనసేన మోయాలా అన్న జోకులు వస్తున్నాయి. అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కమిటీ వేశారట.అంతే తప్ప ఆ ఎమ్మెల్యేని ఒక్క మాట అన్నట్లు కనినపించలేదు అదే తమకు గిట్టని వ్యక్తులు, తమ అరాచకాలకు మద్దతు ఇవ్వని జర్నలిస్టులపై సైతం చిన్న తప్పు చేసినా, అసలు తప్పు చేయకపోయినా, ఏదో ఒక తప్పుడు కేసు పెట్టి,పదేసి సెక్షన్లు రాసి బెయిల్ రానివ్వకూడదన్న లక్ష్యంతో జైలుకు పంపిస్తుంటారు. దీనినే మంచి ప్రభుత్వం అనుకోవాలన్నమాట. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక మహిళా ఎమ్మార్వోని బెదిరించారన్న అభియోగం రాగానే పోలీసులు కేసు పెట్టి స్టేషన్కు తీసుకువెళ్లారు.ఆ రోజుల్లో శ్రీధర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన టీడీపీ నాయకత్వం, 2024 ఎన్నికలలో ఆయనను తమ పార్టీలో చేర్చుకుని టిక్కెట్ కూడా ఇచ్చింది.అలాగే మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం వైసీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేశ్లపై తీవ్రమైన ఆరోపణలు చేసేవారు. పేకాట క్లబ్ లు నడుపుతారని, అవినీతిపరుడని ప్రచారం చేశారు. సీన్ కట్ చేస్తే గత ఎన్నికలలో ఆయనకు గుంతకల్ టిక్కెట్ ఇచ్చారు.అలా ఉంటుంది. చంద్రబాబు స్టైల్. తన పార్టీలో ఉంటే ఎంత తప్పు చేసినా పునీతుడు అయిపోతాడు, అదే వేరే పార్టీవారైతే నోటికి వచ్చిన దూషణలు చేస్తుంటారు.జూనియర్ ఎన్టీఆర్ను, ఆయన తల్లిని దూషించారన్న అభియోగాలు ఎదుర్కుంటున్న అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పై ఎందుకు చర్య తీసుకోలేకపోయారో ఇప్పటివరకూ వివరణ ఇవ్వలేదు. అలాగే ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలపై వచ్చిన అభియోగాలు ఏమీ చిన్నవి కావు.అయినా వారిని ఎవరూ టచ్ చేయలేరు. అరాచకాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసే బాధ్యత ఇన్ఛార్జి మంత్రులదేనని సీఎం చెప్పారట.అసలు మంత్రుల మాట వినే ఎమ్మెల్యేలు ఎవరు అన్నది చర్చ. ఇన్ని జరుగుతున్నా చంద్రబాబు ఇచ్చిన సందేశం ఏమిటో తెలుసా..ఇలా ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్న అక్రమాలపై ప్రచారం జరగరాదట. ప్రభుత్వం చేసే మంచిపైనే చర్చ జరగాలట. నిజమే ప్రభుత్వం ఏదైనా ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే ప్రచారం ఆశించడం తప్పుకాదు.కాని మంచి జరిగినా, జరగక పోయినా, అన్నీ జరిగిపోతున్నట్లు ప్రచారం జరగాలని కోరుకోవడమే ఇక్కడ ఆసక్తికర అంశం. ఎమ్మెల్యేలను మందలించినట్లు కనిపిస్తే వారు చేసిన తప్పులన్నీ ఒప్పులయిపోతాయా?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబు ముఠా బార్ల దందా
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వంలో టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీలో మరో అంకానికి తెరలేచింది. ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన 840 బార్లను ఏకపక్షంగా దక్కించుకునేందుకు సిండికేట్ రంగంలోకి దిగింది. ఇతరులు ఎవరూ దరఖాస్తులు చేయకుండా అడ్డుకుంటోంది. టీడీపీ సిండికేట్ కూడా చివరి వరకు దరఖాస్తులు చేయకుండా పక్కా పన్నాగంతో వ్యవహరిస్తోంది. తద్వారా దరఖాస్తులు రావడం లేదనే సాకు చూపించి బార్ల విధానంలో తమకు అనుకూలంగా మరిన్ని సడలింపులు, రాయితీలు దక్కించుకోవాలని సిండికేట్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ పెద్దల పన్నాగంలో భాగంగానే ఈ తతంగం మొత్తం సాగుతుండటం గమనార్హం. రాష్ట్రంలో 840 బార్లకు లైసెన్సుల కేటాయింపు కోసం ఎక్సైజ్ శాఖ ఈ నెల 18న నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తులు దాఖలు చేసేందుకు ఈ నెల 26వ తేదీ చివరి రోజు. ఇప్పటికి వారం రోజులు అయినా సరే 840 బార్లకు కేవలం 32 దరఖాస్తులే దాఖలయ్యాయి. కనీసం నాలుగు దరఖాస్తులు దాఖలయ్యే బార్లకే లాటరీ విధానంలో లైసెన్సులు కేటాయిస్తామని ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్లో పేర్కొంది. దరఖాస్తులు దాఖలు చేసేందుకు మరో రెండు రోజులే గడువు ఉంది. అయినా సరే దరఖాస్తులు ఇంత తక్కువగా దాఖలు కావడం వెనుక గూడుపుఠాని జరుగుతోందని ఇట్టే స్పష్టమవుతోంది. ఎవరైనా దరఖాస్తు చేస్తే ఖబడ్డార్.. బార్లకు ఇంత తక్కువ సంఖ్యలో దరఖాస్తులు రావడం వెనుక టీడీపీ సిండికేట్ దందా దాగుంది. బెదిరింపులు, దౌర్జన్యాలతో హడలెత్తించి ప్రైవేటు మద్యం దుకాణాలను ఏకపక్షంగా దక్కించుకున్న కుట్రనే ఇక్కడా పునరావృతం చేస్తోంది. వాస్తవానికి బార్ల లైసెన్సుల కోసం దరఖాస్తులు చేసేందుకు ఇప్పటి వరకు దాదాపు 2 వేల మందికిపైగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. కానీ వారిలో ఏడు రోజుల్లో కేవలం 32 మంది మాత్రమే దరఖాస్తు చేయడం గమనార్హం. తమ సిండికేట్ సభ్యులు కాకుండా ఇతరులెవరైనా బార్లకు దరఖాస్తులు చేస్తే అంతు చూస్తామని కూటమి ప్రజా ప్రతినిధులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి వివరాలను టీడీపీ సిండికేట్ సేకరించి వడపోస్తోంది. వారిలో తమ సిండికేట్ సభ్యులు కాని వారిని బెదిరించి బెంబేలెత్తిస్తోంది. ఏకంగా డీఎïస్పీ, సీఐ స్థాయి అధికారులు వారిని పిలిపించి మరీ బెదిరిస్తుండటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. ‘ఎమ్మెల్యే గారు చెప్పారు. ఆయనకు ఇష్టం లేకుండా బార్ లైసెన్స్ కోసం ఎందుకు అప్లై చేయడం? లాటరీలో లైసెన్స్ వచ్చినా బార్ బిజినెస్ చేసుకోనివ్వరు. ఎందుకు అనవసర గొడవలు’ అని పోలీసు అధికారులే హెచ్చరిస్తున్నారు. ‘మీరు బార్ పెట్టుకోవడానికి ఎవరూ భవనాన్ని గానీ, ఖాళీ స్థలాన్ని గానీ లీజుకు ఇవ్వరు.. ఇవ్వాలని అనుకున్నా ఎమ్మెల్యే ఇవ్వనివ్వరు. మీ సొంత భవనంలో పెట్టుకున్నా ఎక్సైజ్, పోలీస్ ఆఫీసర్లు ఎప్పుడు పడితే అప్పుడు రైడింగ్లు చేస్తారు. బిజినెస్ జరగనివ్వరు’ అని కూడా అసలు విషయాన్ని కుండబద్దలు కొడుతున్నారు. మరో వైపు టీడీపీ గూండాలు బహిరంగంగానే బెదిరింపులకు పాల్పడుతున్నారు. దాంతో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు దరఖాస్తు చేయడానికి భయపడుతున్నారు. నేడు, రేపు సిండికేట్ సభ్యులే దాఖలు చేసే ఎత్తుగడచివరి రెండు రోజుల్లో టీడీపీ సిండికేట్ ఎంపిక చేసిన వారే దరఖాస్తులు దాఖలు చేసేలా స్కెచ్ వేశారు. కనీసం నాలుగు దరఖాస్తులు వచ్చే బార్లకే లైసెన్సుల కేటాయింపు కోసం లాటరీ నిర్వహిస్తామని ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్లో పేర్కొంది. ఆ ప్రకారం టీడీపీ సిండికేట్ సభ్యుల తరఫునే నాలుగు చొప్పున దరఖాస్తులు దాఖలు చేసేలా పన్నాగం పన్నారు. ఈ నాలుగు దరఖాస్తుల ప్రక్రియ అంతా టీడీపీ కూటమి ఎమ్మెల్యేలే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అంతా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని నమ్మించేందుకు కొన్ని ప్రధాన ప్రాంతాల్లో అదనంగా మరో ఇద్దరు ముగ్గురితో కూడా దరఖాస్తు చేయిస్తారు. వారు కూడా టీడీపీ సిండికేట్ వర్గీయులే అయ్యుండేలా గూడు పుఠాణి సాగిస్తున్నారు. ఫలితంగా లాటరీ ద్వారా సిండికేట్కే బార్ల లైసెన్సులు దక్కించుకునేలా పక్కాగా స్కెచ్ వేశారు.మరింత అడ్డగోలు దోపిడీకి స్కెచ్ బార్ల విధానంలో తమకు అనుకూలంగా మరిన్ని సడలింపులు, మరింత లాభం మార్జిన్ దక్కించుకోవాలని కూడా సిండికేట్ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే ప్రస్తుత బార్ల విధానం పట్ల వ్యాపారులు ఎవరూ ఆసక్తి కనబరచడం లేదని నమ్మించేందుకు కూడా తక్కువ దరఖాస్తులు దాఖలు అయ్యేలా కథ నడిపిస్తున్నారు. ఇప్పటికే రోజుకు ఏకంగా 14 గంటలు బార్లు తెరచి ఉంచేలా, లైసెన్స్ దక్కిన తర్వాత రెస్టారెంట్ ఏర్పాటు చేసుకునేలా, ఆరు వాయిదాల్లో లైసెన్స్ ఫీజు చెల్లించేలా, ఇతరత్రా సడలింపులు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చింది. అయినా సరే మరింత అడ్డగోలు దోపిడీపై సిండికేట్ గురి పెట్టింది. బార్ల యజమానులను ప్రోత్సహించాలనే సాకుతో లాభాల మార్జిన్ మరింత పెంచేలా, పన్నులు తగ్గించేలా ఒత్తిడి తేవాలన్నది లక్ష్యం. దరఖాస్తుదారుల నుంచి ఆ డిమాండ్ రాగానే వెంటనే ఆమోదించేందుకు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని సమాచారం. బార్ల యజమానులతో ముందుగా ఇండెంట్ పెట్టించి.. ప్రభుత్వమే తన డబ్బుతో మద్యం కొనుగోలు చేసేలా స్కెచ్ వేశారు. ఇందులోనే పెద్ద కుంభకోణం దాగి ఉంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇలా జరగలేదు.బాబు రాజ్యం.. మద్యం దోపిడీ భోజ్యం⇒ చంద్రబాబు ప్రభుత్వం అంటేనే టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీ రాజ్యం అని మరోసారి కూటమి ప్రభుత్వం రుజువు చేస్తోంది. గతంలో టీడీపీ ప్రభుత్వం సాగించిన మద్యం దోపిడీకి మించిన స్థాయిలో ఈసారి మహా దోపిడీకి బరితెగిస్తోంది. 2014–19లో అప్పటి టీడీపీ ప్రభుత్వం మద్యం విధానం ముసుగులో చంద్రబాబు యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. ⇒ 2012 నుంచి అమలులో ఉన్న ప్రివిలేజ్ ఫీజును నిబంధనలకు విరుద్ధంగా రద్దు చేశారు. ఆర్థిక శాఖ అనుమతిగానీ, కేబినెట్ ఆమోదం గానీ లేకుండానే 2015లో చంద్రబాబు ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని తెచ్చింది. మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ చీకటి జీవోలు 216, 217 జారీ చేసింది. తద్వారా 2015 నుంచి 2019 వరకు నాలుగేళ్లలో ఏడాదికి రూ.1,300 కోట్ల చొప్పున నాలుగేళ్లలో రూ.5,200 కోట్లు ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారు. ⇒ 4,840 ప్రైవేటు మద్యం దుకాణాలతోపాటు మరో 4,840 పర్మిట్ రూమ్లు ఏర్పాటు చేసింది. మద్యం దుకాణాలు, బార్లు అన్నీ టీడీపీ సిండికేట్కే కట్టబెట్టింది. 43 వేల బెల్ట్ దుకాణాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో 20 డిస్టిలరీలలో 14 డిస్టిలరీలకు టీడీపీ ప్రభుత్వమే (మిగతా ఆరింటికి అంతకు ముందు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి) అనుమతినిచ్చింది. అంతే కాకుండా బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్లకు మొత్తం 20 డిస్టిలరీలను ఎంప్యానల్ చేసింది కూడా నాటి టీడీపీ ప్రభుత్వమే. ఎంఆర్పీ కంటే 20 శాతం అధిక ధరలకు మద్యం విక్రయాలు సాగించి మరో రూ.20 వేల కోట్లు కొల్లగొట్టింది.⇒ మొత్తం మీద 2014–19లో రూ.25 వేల కోట్ల దోపిడీకి పాల్పడింది. ఈ కుంభకోణాన్ని సీఐడీ ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. ప్రధాన నిందితులుగా అప్పటి సీఎం చంద్రబాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రలతోపాటు పలువురిపై ఐపీసీ సెక్షన్లు 166, 167, 409, 120(బి) రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(1), (డి), రెడ్ విత్ 13(2) కింద సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ కేసులో చంద్రబాబు ఇప్పటికీ బెయిల్పై ఉన్నారు.⇒ ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం అంతకు మించి మద్యం దోపిడీకి బరితెగించింది. అందుకే వైఎస్సార్సీపీ ప్రభుత్వం తొలగించిన ప్రైవేటు మద్యం దుకాణాల వ్యవస్థను మళ్లీ తీసుకువచ్చింది. మొత్తం 3,736 మద్యం దుకాణాలు టీడీపీ సిండికేట్కే కట్టబెట్టింది. దాదాపు 75 వేల బెల్ట్ దుకాణాలను ఏర్పాటు చేసింది. ఇక 840 బార్లు కూడా తమ సిండికేట్కే కట్టబెట్టేందుకు సిద్ధపడుతోంది. -
డీఎస్సీ... ఇక నో ఆప్షన్!
కర్నూలు జిల్లాకు చెందిన ఎం.నాగజ్యోతికి డీఈడీ, బీఎస్సీ, బీఈడీ అర్హత ఉండడంతో డీఎస్సీలో ఎస్జీటీతోపాటు స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్), టీజీటీ (మ్యాథ్స్) పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. డీఎస్సీలో ఆమె ఎస్జీటీతోపాటు స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్) పోస్టుకు ఎంపికయ్యారు. కానీ, పరీక్షలకు ముందే తొలి ప్రాధాన్యం ఎస్జీటీకే ఇవ్వడంతో ఆమె ఉన్నతమైన స్కూల్ అసిస్టెంట్ పోస్టును కోల్పోవాల్సి వస్తోంది. కర్నూలు పట్టణానికి చెందిన కురువ నటరాజ్ డీఎడ్, బీఈడీ చేశారు. ప్రస్తుత డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ పోస్టుతోపాటు ఎస్జీటీ పోస్టుకు ఎంపికయ్యారు. ఆయన కూడా మెరిట్ లిస్టులో ఉన్నప్పటికీ పోస్టుల ప్రాధాన్యంలో మొదట ఎస్జీటీకి ఇవ్వడంతో స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు అవకాశం లేకుండాపోయింది. చిత్తూరు జిల్లాకు చెందిన పి.అనిత డీఎడ్, బీఎస్సీ, బీఈడీ పూర్తిచేశారు. ఆమె డీఎస్సీలో ఎస్జీటీ విభాగంలో జిల్లాస్థాయి 89వ ర్యాంకు, స్కూల్ అసిస్టెంట్ (బయాలజీ)లో 10వ ర్యాంకు పొందారు. కానీ, పోస్టుల ప్రయారిటీలో మొదట ఎస్జీటీకే ఆప్షన్ ఇవ్వడంతో స్కూల్ అసిస్టెంట్ పోస్టును కోల్పోనున్నారు. సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025లో అత్యుత్తమ మార్కులు సాధించినవారి ఆనందాన్ని... కూటమి సర్కారు తెచ్చిన ‘ముందస్తు ఆప్షన్ నిబంధన’ ఆవిరి చేస్తోంది. పరీక్షలకు ముందే పోస్టుల ప్రాధాన్యత ఎంపిక చేసుకోవాలని చెప్పడం... అధికారులు ఇప్పుడు అదే ‘ఫైనల్’ అని ప్రకటించడంతో మెరిట్ అభ్యర్థులకు శాపంగా మారింది. పరీక్ష పాసై మెరిట్ లిస్టులో ఉండి రెండు, మూడు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ముందుగానే ప్రాధాన్యత క్రమంలో మొదటి ఆప్షన్గా పెట్టిన సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) ఉద్యోగాన్ని మాత్రమే తీసుకోవాల్సి వస్తోంది. ఇలా రాష్ట్రంలో 10వేల మందికి పైగా రెండు నుంచి నాలుగు ఉద్యోగాలు సాధించినా... ప్రాధాన్యత క్రమంలో మొదట ఇచ్చిన ఎస్జీటీ పోస్టుకే పరిమితమయ్యే పరిస్థితి తలెత్తింది. చేజారిపోతున్న ‘ఉన్నత’ అవకాశం ఎన్నడూ లేనివిధంగా డీఎస్సీ–2025 నోటిఫికేషన్లో మాత్రమే అభ్యర్థులు దరఖాస్తు దశలోనే పోస్టుల ప్రాధాన్యత క్రమం కూడా తెలియజేయాలని నిబంధన పెట్టారు. అభ్యర్థులు ఎన్ని పోస్టులకు ఎంపికైనా, మొదటి ప్రాధాన్యతగా పేర్కొన్న ఉద్యోగాన్ని మాత్రమే తీసుకోవాల్సి వస్తుందని, మిగిలిన పోస్టులు బ్లాక్ అవుతాయని అధికారులు ప్రకటించారు. ఎడిట్కు అవకాశం ఇవ్వని విద్యాశాఖ తెలియక పోస్టుల ప్రాధాన్యత క్రమం తప్పుగా ఇచ్చామని, ఎడిట్ అవకాశం కల్పించాలని పరీక్షకు ముందే డీఎస్సీ నిర్వాహక అధికారులను కలిసి విజ్ఞప్తి చేసినా పరిగణనలోకి తీసుకోలేదని అభ్యర్థులు వాపోతున్నారు. పోస్టుల ప్రాధాన్యత ఎడిట్ అవకాశం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. అభ్యర్థులకు జీవితాంతం వేదనే...» స్కూల్ అసిస్టెంట్, టీజీటీ పోస్టులు వచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వం పెట్టిన ముందస్తు ఆప్షన్ నిబంధన వల్ల ఎస్జీటీలో చేరినవారు తీవ్రంగా నష్టపోతారు. » ఎస్జీటీ పోస్టులో చేరినవారు 10 నుంచి 15 సంవత్సరాల సర్వీసు పూర్తయినా స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి వస్తుందన్న గ్యారెంటీ లేదు. » అదే టీజీటీ పోస్టులో చేరితే ఐదేళ్లలో పీజీటీ, మరో పదేళ్లలో ప్రిన్సిపాల్ అయ్యే అవకాశం ఉంటుంది. » ప్రభుత్వం పెట్టిన ఒక్క నిబంధనతో ఇప్పుడు మెరిట్లో ముందున్న దాదాపు 10వేల మంది అభ్యర్థులు జీవితాంతం కుమిలిపోయే పరిస్థితి ఏర్పడింది. -
‘మూడ్స్’ అంటే మోజా..!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కూటమి సర్కారు అభంశుభం తెలియని చిన్నారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతోంది. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే ఎమర్జెన్సీ మెడికల్ కిట్ల పంపిణీలోనూ చేతివాటం ప్రదర్శించింది. 2025–26 సంవత్సరానికి టెండర్ పిలవకుండానే నిబంధనలకు విరుద్ధంగా రూ.7,31,54,361 విలువైన వర్క్ ఆర్డర్ను నామినేషన్ పద్ధతిపై అప్పగించేసింది. కేరళకు చెందిన మూడ్స్ కండోమ్స్ తదితర వస్తువుల తయారీ కంపెనీకి అడ్డగోలుగా నామినేషన్పై అప్పగించడంలో తెరవెనుక డీల్ కుదిరింది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని 257 ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్(ఐసీడీఎస్) ప్రాజెక్ట్ల పరిధిలో 55,746 అంగన్వాడీ సెంటర్లలో ఉండే చిన్నారుల ప్రాథమిక వైద్యం (ఫస్ట్ ఎయిడ్) కోసం అందించే మెడికల్ కిట్లలోనూ కక్కుర్తి పడటం అత్యంత దారుణమని అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. నిబంధనలకు పాతర.. వాస్తవానికి వైద్యపరంగా అత్యవసరమైతేనే నామినేషన్ పద్ధతిలో వర్క్ ఆర్డర్ ఇస్తారు. సాధారణ సందర్భాల్లో రూ.లక్ష వర్క్ ఆర్డర్ ఇవ్వాలన్నా టెండర్ పిలవాలనే నిబంధన ఉంది. అందుకు విరుద్ధంగా రూ.7.31 కోట్ల విలువైన మెడికల్ కిట్ల సరఫరాకు నామినేషన్ పద్ధతిపై ఈ నెల 5న వర్క్ ఆర్డర్ ఇవ్వడం వెనుక ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందనేది తేటతెల్లమవుతోంది. అది కూడా అందుబాటులో ఉన్న పెరెన్నికగన్న కంపెనీలను కాదని ఎక్కడో కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురానికి చెందిన హెచ్ఎల్ఎల్ లైఫ్కేర్ లిమిటెడ్ కంపెనీకి నామినేషన్ పద్ధతిపై అప్పగించడం గమనార్హం. ఆ కంపెనీ మూడ్స్ కండోమ్స్, గర్భ నిరోధక, రుతుక్రమం పరిశుభ్రత వస్తువులు, సర్జికల్ వస్తువులు వంటి వాటిని ఉత్పత్తి చేస్తోంది. పొరుగు రాష్ట్రానికి చెందిన కంపెనీకి నామినేషన్ పద్ధతిపై వర్క్ ఆర్డర్ అప్పగించడంతో 10శాతం బ్యాంక్ గ్యారంటీ చెల్లింపు, సక్రమంగా మెడికల్ కిట్ల పంపిణీలో ఎంత మేరకు బాధ్యత ఉంటుందన్నది అనుమానమే. దీనికితోడు నిజంగా కేరళ నుంచి మెడికల్ కిట్లు కొనుగోలు చేసి ఏపీకి అందిస్తే స్థానికంగా మన రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీని కూడా నష్టపోవాల్సి వస్తుంది. ఒక్కో మెడికల్ కిట్ ధర రూ.1312.25 చొప్పున నిర్ణయించగా స్థానిక మార్కెట్లో దానిలో కనీసం 30 శాతం నుంచి 40 శాతం తక్కువ ధరకు లభిస్తుందని చెబుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అంగన్వాడీ కేంద్రాలకు మెడికల్ కిట్ల పంపిణీ నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(ఏపీఎంఎస్ఐడీసీ) టెండర్ పిలిచి అపోలో, మెడ్ప్లస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ వంటి ప్రముఖ కంపెనీల ద్వారా మెడికల్ కిట్లు సరఫరా చేసేవారు. అందుకు భిన్నంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం నామినేషన్ పద్ధతిపై కేరళ కంపెనీకి కట్టబెట్టడం శోచనీయం. ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో చక్రం తిప్పిన అధికారి.. రూ.7.31 కోట్లకుపైగా వర్క్ ఆర్డర్ను నామినేషన్ పద్ధతిపై కట్టబెట్టిన తంతులో ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో కీలక అధికారి ఒకరు చక్రం తిప్పినట్టు తెల్సింది. గత టీడీపీ పాలనలో మంత్రి లోకేశ్ కోసం విజయవాడ కనకదుర్గ ఆలయంలో క్షుద్ర పూజలు జరిపించారన్న విమర్శలు ఎదుర్కొన్న అధికారి ఒకరు ఈ వ్యవహారాన్ని చక్కబెట్టినట్టు సమాచారం. వాస్తవానికి ఈ ఏడాది జూన్లోనే అంగన్వాడీ కేంద్రాలకు మెడికల్ కిట్ల పంపిణీ ప్రతిపాదన వచ్చింది. అంత పెద్ద మొత్తంలో నామినేషన్ పద్ధతిలో ఇవ్వడం సరికాదని, టెండర్ పిలవాల్సిందేనని ఐసీడీఎస్ డైరెక్టర్ తేల్చి చెప్పినట్టు తెలిసింది. కొరకరాని కొయ్యగా మారిన ఆయన ఇటీవల నెల రోజులపాటు ముస్సోరీ శిక్షణకు వెళ్లారు. అదే అదనుగా కీలక అధికారి ఒకరు ఈ డీల్ సెట్ చేసినట్టు విశ్వసనీయంగా తెల్సింది. -
చిన్న పరిశ్రమలు చితికిపోతున్నాయి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలు తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. టీడీపీ కూటమి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఇవి తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. ఫలితంగా.. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ యూనిట్లు ఇప్పుడు తెగ మూతపడుతున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖే సాక్షాత్తు పార్లమెంటులో ఇటీవలే వెల్లడించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఈ ఏడాది జూలై 28 వరకు మొత్తం 2,191 ఎంఎస్ఎంఈ యూనిట్లు మూతపడినట్లు తెలిపింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 1,401 యూనిట్లు ఈ ఆరి్థక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లోనే 790కి పైగా యూనిట్లు మూతపడ్డాయంటే రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధంచేసుకోవచ్చు. ఎంఎస్ఎంఈలు ఇలా మూతపడుతుండటంతో సుమారుగా 30,000 మంది ఉపాధి కోల్పోయినట్లు అంచనా.షాక్ కొడుతున్న విద్యుత్ బిల్లులు.. టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి రాగానే బిల్లుల రూపంలో ఎంఎస్ఎంఈలకు గట్టిగా కరెంట్ షాక్ ఇచ్చింది. ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఏపీలోని ఎంఎస్ఎంఈలపై విద్యుత్ బిల్లుల భారం విపరీతంగా పెరిగిపోయింది. అలాగే, పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వకపోవడం, మానవ వనరుల కొరత, ముడి సరుకుల ధరలు పెరుగుదల, ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వంటివి వీటిని వెంటాడుతున్నాయి. విజయవాడ కేంద్రంగా పనిచేసే ఒక ఎంఎస్ఎంఈకి సగటున యూనిట్ ఛార్జీ రూ.13.55 పడితే అదే తమిళనాడులో సగటున యూనిట్ ధర 7–8లుగా ఉంది. అంటే యూనిట్కు దాదాపు రూ.6 అదనం. ఈ స్థాయిలో విద్యుత్ బిల్లులు బాదితే ఇతర రాష్ట్రాలతో ఎలా పోటీపడాలని ఆ సంస్థ ప్రతినిధి వాపోయారు. ప్రోత్సాహకాల ఊసేలేదు..ఇక అధికారంలోకి వచ్చిన వెంటనే ఏ ఏడాది ప్రోత్సాహకాలు ఆ ఏడాదే ఇచ్చేస్తాం.. ఇందుకోసం ప్రత్యేకంగా కార్పస్ ఫండ్ పెడుతున్నామన్న చంద్రబాబు, ఇతర కూటమి నేతల మాటలు నీటిమూటలయ్యాయి. సుమారు రూ.10,000 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాల్లో కనీసం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఇవి ఇవ్వకపోగా వీటిని అడగడానికి వెళ్లిన పారిశ్రామిక ప్రతినిధులను అధికారులు పీ–4 దత్తత అంటూ వేధిస్తున్నారని వారు వాపోతున్నారు. పరిశ్రమ నడపడానికి, జీతాలివ్వడానికి మా దగ్గర డబ్బుల్లేవని చెబుతున్నా.. ఆ సంగతి తర్వాత చూద్దాంలే ముందు రెండొందల బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటన చేయమనడంతో చేసేదిలేక మొక్కుబడిగా ప్రకటన చేసి వచ్చేసినట్లు మరో పారిశ్రామిక ప్రతినిధి చెప్పారు. దీన్నిబట్టి రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్ధంచేసుకోవచ్చు. ఇంకోపక్క ఎంఎస్ఎంఈల ఉత్పత్తులను ప్రభుత్వ శాఖలు కూడా కొనుగోలు చేయకపోవడం, ప్రభుత్వ అసమర్థ విధానాలతో ప్రజల్లో కొనుగోలు శక్తిపడిపోవడంతో ఈ ప్రభావం ఎంఎస్ఎంఈ యూనిట్లపై ప్రత్యక్షంగా పడుతోంది. కోవిడ్ వంటి సంక్షోభం వచ్చినా ఏ ఒక్క పరిశ్రమ మూతపడకూడదన్న ఉద్దేశంతో గత వైఎస్ జగన్ ప్రభుత్వం రీస్టార్ట్ ప్యాకేజీతో ఆదుకుంది. కానీ, ఇప్పుడు ఈ ప్రభుత్వం మా ప్రోత్సాహకాలు మాకివ్వండని అడిగితే బ్యాంకు నుంచి రూ.5 వేల కోట్ల అప్పు తీసుకుంటున్నాం.. రాగానే ఇస్తామని చెప్పి ఆరునెలలు దాటినా చిల్లిగవ్వ ఇవ్వలేదని పారిశ్రామికవేత్తలు మండిపడుతున్నారు. సకాలంలో ప్రోత్సాహకాలు విడుదల చేయాలి.. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు అనేక గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం, అధిక విద్యుత్ ఛార్జీలు, ప్రభుత్వ శాఖల కొనుగోళ్లు లేకపోవడం, టెక్నాలజీ అప్గ్రెడేషన్ లేకపోవడం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలను ఆదుకోవడానికి తమిళనాడు తరహా విధానం అమలుచేయాలంటూ ఇప్పటికే ప్రభుత్తానికి ఒక నివేదిక ఇచ్చాం. సకాలంలో ప్రోత్సాహకాలు విడుదలచేసి మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. – వి. మురళీకృష్ణ, ప్రెసిడెంట్, ఫ్యాఫ్సియా -
దోపిడీలో స్మార్ట్ రి‘కార్డు’
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం సాంకేతికత పేరుతో నిత్యం ప్రజలను మోసం చేస్తోంది. టెక్నాలజీ సాయంతో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామంటూ కోతలు కోస్తోంది. ఇందులో భాగంగానే ప్రజా పంపిణీ వ్యవస్థలో (పీడీఎస్) ‘స్మార్ట్ కార్డుల పంపిణీ’ని ఘనకీర్తిగా ప్రచారం చేసుకుంటూ అభాసుపాలవుతోంది. వాస్తవానికి, ప్రభుత్వం కొత్తగా పంపిణీ చేసే కార్డులు పేరుకే స్మార్ట్.. అందులో ఎటువంటి సాంకేతికతను అనుసంధానించే చిప్ వ్యవస్థ లేదు. చిన్న సైజులో కార్డులను ముద్రించి దానికి సాంకేతిక పరిభాషలోని ‘స్మార్ట్’ను జోడించి లబ్ధిదారులను మభ్యపెడుతోంది. దీని కోసం ఏకంగా రూ.8 కోట్ల వరకు ఖర్చు చేయడం గమనార్హం. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 1.45 కోట్ల లబ్ధిదారులకు కొత్త కార్డుల పంపిణీ చేపట్టనుంది. అదనపు లబ్ధి శూన్యం! కేంద్ర ప్రభుత్వం పీడీఎస్ను సాంకేతిక వ్యవస్థతో అనుసంధానించింది. వన్ నేషన్.. వన్ రేషన్ నినాదాన్ని తీసుకొచి్చంది. అంటే, వేలిముద్ర వేసి దేశంలో ఎక్కడ నుంచైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించింది. ఆధార్ నంబర్ ద్వారా కూడా రేషన్ పొందొచ్చు. కేవలం ప్రభుత్వంలోని అమాత్యులు, కొందరు అధికారులు కమీషన్ల కోసం ఇలాంటి కొత్త ఆలోచనలను సృష్టించి స్మార్ట్గా వెనకేసుకుంటున్నట్టు వినికిడి. పైగా పాత కార్డులో కుటుంబ సమేతంగా రేషన్ లబ్దిదారులు ఫొటోలు ఉండేవి. స్మార్ట్ కార్డులో ఇంటి యజమానురాలి పాస్పోర్టు సైజు ఫొటో తప్ప ఇతరులు కనిపించరు. కేవలం వారి పేర్లు మాత్రమే ఉంటాయి. అది కూడా మూడు పేర్ల వరకు బాగానే కనిపిస్తాయి. అంతకు మించి ఎక్కవ మంది లబ్దిదారులు ఒకే కార్డులో ఉంటే వారి పేర్లు కుచించుకుపోవడం, లేదా లేకుండా ఉండటమే ఈ స్మార్టు కార్డు ప్రత్యేకత. దీనికి ఒక క్యూఆర్ కోడ్ను పెట్టి మిగిలిన వారి పేర్లు అందులో జోడిస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి, ఈ–పోస్ మెషిన్కు, బియ్యం తూకం వేసే ఎలక్ట్రిక్ కాటాకు అనుసంధానం ఉండాలి. లబ్ధిదారుడి వివరాల ప్రకారం ఎలక్ట్రిక్ కాటాలో సరైన తూకంలో బియ్యం వేస్తేనే ఈపోస్ మెషిన్ అంగీకరించి లావాదేవీని అనుమతిస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం నిబంధన మేరకు ప్రవేశపెట్టిన ప్రక్రియ. కానీ, కూటమి పాలనలో కొందరు డీలర్లు ఈ–పోస్ మెషిన్లను చేతుల్లో పెట్టుకుని తిరుగుతూ ఇష్టారీతిలో పీడీఎస్ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తుంటే.. ప్రభుత్వం బయట గొప్పలు చెప్పుకుంటోంది. స్మార్ట్ కోతలు.. పంపిణీలోనూ కోతలే! రేషన్ సరుకుల పంపిణీలోనూ కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. ఒక్క బియ్యం మినహా మరే సరుకులూ ఇవ్వడం లేదు. కందిపప్పు, పామాయిల్, చింతపండు, గోధుమ పిండి తదితర సరుకులన్నీ ఎక్కడా ఇవ్వడం లేదు. ఎన్నికల సమయంలో మాత్రం 18 రకాల నిత్యావసరాలు ఇస్తామని ప్రగల్భాలు పలికారు. తీరా, అధికారంలోకి వచ్చాక.. గత ప్రభుత్వం ఇస్తున్న సరుకులన్నింటినీ ఆపేశారు. రూ.220 కోట్లకుపైగా కందిపప్పు బకాయిలు పేరుకుపోవడంతో కాంట్రాక్టర్లు సరఫరాకు కూడా ముందుకు రావట్లేదు. -
ఏపీఈఆర్సీలో ఏక్ నిరంజన్!
సాక్షి, అమరావతి: స్వయం ప్రతిపత్తితో నిర్ణయాలు తీసుకుని పారదర్శకంగా ప్రజలకు మేలు చేయాల్సిన వ్యవస్థల్లో సైతం కూటమి ప్రభుత్వం రాజకీయాలను చొప్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)లో జరుగుతున్న పరిణామాలే అందుకు తాజా నిదర్శనం. రాజకీయ, సామాజిక వర్గ సమీకరణలు తేలకపోవడంతో లీగల్ మెంబర్ భర్తీ ఫైల్ సీఎం వద్ద పెండింగ్లో పడింది! ఏం జరుగుతోందంటే.. ఒక చైర్మన్, ఇద్దరు సభ్యులు ఉండే ఏపీఈఆర్సీకి 2024 అక్టోబర్ నుంచి పూర్తి స్థాయి చైర్మన్ లేరు. ఈ ఏడాది ఫిబ్రవరిలో లీగల్ సభ్యుడు పదవీ విరమణ చేయడంతో అప్పటి నుంచి ఒకే ఒక్కరు ఇన్చార్జ్ చైర్మన్గా, సభ్యుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. నెలల తరబడి సాగదీత తరువాత ప్రభుత్వం లీగల్ సభ్యుడి నియామక ప్రక్రియ చేపట్టింది. జూన్ 18న ఈ నోటిఫికేషన్ విడుదల కాగా జూలై 9వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని పేర్కొంది. తరువాత గడువు జూలై 16 వరకు పొడిగించారు. అదీ సరిపోదని జూలై 25 వరకూ మళ్లీ గడువిచ్చారు. న్యాయ వ్యవస్థలో ఉన్నవారు, ఇతర ఏ కార్యాలయాల్లోనూ ఉద్యోగి కాని వారు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. 50 ఏళ్ల లోపు వయసు ఉన్నవారు అనర్హులని, ఎంపికైన అభ్యర్థి ఐదేళ్ల పాటు ఏపీఈఆర్సీ సభ్యుడిగా కొనసాగుతారని నిబంధనల్లో పేర్కొన్నారు. వచి్చన దరఖాస్తుల్లో ఐదుగురి పేర్లను ఎంపిక చేసిన ఇంధన శాఖ ఆ ఫైలును ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించింది. అంతే.. ఆ తరువాత అక్కడి నుంచి ఫైలు కదలలేదు. స్వయంగా హైకోర్టు కలుగజేసుకోవడంతో.. రూ.వేల కోట్ల విలువైన ప్రాజెక్టులతోపాటు ప్రజల నుంచి వసూలు చేసే విద్యుత్ చార్జీలను నిర్ణయించే ప్రతిపాదనలపై విచారణ జరిపి ఆమోదించడం లేదా తిరస్కరించడం లాంటి కీలక బాధ్యతలను ఏపీఈఆర్సీ చైర్మన్ నిర్వర్తిస్తారు. అంత కీలకమైన పోస్టును కూటమి ప్రభుత్వం భర్తీ చేయకపోవడంపై ఇటీవల స్వయంగా హైకోర్టు కలుగజేసుకుంది. ఏపీఈఆర్సీ చైర్మన్ను ఎప్పటిలోగా నియమిస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే రిటైర్డ్ న్యాయమూర్తి స్థాయి వ్యక్తులు ఏపీఈఆర్సీ చైర్మన్ స్థానంలో ఉంటే తమ ఆటలు సాగవని ప్రభుత్వ పెద్దలు గ్రహించారు. దీంతో త్వరలో పదవీ విరమణ చేయనున్న సీనియర్ ఐఏఎస్ అధికారికి ఆ పదవిని కట్టబెట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. అనధికారికంగా ఇప్పటికే ఆయన పేరును ఖరారు చేశారు. ఈ క్రమంలో తొలుత లీగల్ మెంబర్ పోస్టు భర్తీ చేయాలని నిర్ణయించారు. ఓ సీనియర్ నేత జోక్యంతో... చైర్మన్ పదవికి తాము ఎంచుకున్న సీనియర్ ఐఏఎస్ అధికారి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే లీగల్ సభ్యుడి పోస్టును కూడా ఇవ్వాలని భావించారు. అయితే అదే సమయంలో కేంద్రంలో రాజ్యాంగబద్ధ పదవిని నిర్వర్తించిన ఓ సీనియర్ నేత జోక్యం చేసుకుని తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే లీగల్ సభ్యుడిగా నియమించాలని సూచించడంతో ఎటూ తేలడం లేదు. చైర్మన్, మెంబర్ పోస్టులను ఒకే సామాజిక వర్గం వారికి ఇస్తే విమర్శలు వస్తాయని ఆ సీనియర్ నేత చెబుతున్నట్లు తెలుస్తోంది. పోనీ లీగల్ మెంబర్ పోస్టును భర్తీ చేయకుండా వదిలేద్దామనుకుంటే అప్పుడు చైర్మన్ పదవిలో తప్పనిసరిగా రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించాల్సి ఉంటుంది. దీంతో ఎటూ తేల్చలేక ఏపీఈఆర్సీ సభ్యుడి భర్తీ ఫైలు రోజుల తరబడి సీఎం వద్దనుంచి కదలడం లేదు. -
సకలజన సార్వత్రిక విద్య
సాక్షి, అమరావతి: వయోలింగ భేదాల్లేకుండా దేశంలో అవసరమైనవారి విద్య, విజ్ఞానదాహం తీరుస్తోంది ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో). ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర వృత్తుల్లో ఉన్నవారు, రెగ్యులర్గా కాలేజీలకు, యూనివర్సిటీలకు వెళ్లి చదువుకోలేని లక్షలాది మందికి దూరవిద్య, ఆన్లైన్ లెర్నింగ్ ద్వారా డిగ్రీలను ప్రదానం చేస్తోంది. ఏటికేడాది ఈ విశ్వవిద్యాలయంలో చేరికలు పెరుగుతున్నాయి. 21 స్కూల్ ఆఫ్ స్టడీస్ ద్వారా 67 రీజనల్ సెంటర్లు, 2,257 లెర్నింగ్ సపోర్టు కేంద్రాల ద్వారా దేశవ్యాప్తంగా దూరవిద్య, ఆన్లైన్లో డిప్లొమా, యూజీ, పీజీ డిగ్రీలు ఇగ్నో అందిస్తోంది. 333 అకడమిక్ ప్రోగ్రామ్స్ అందిస్తున్న ఇగ్నో అనేకమంది ఉద్యోగాలు సాధించడంలోను, ఉద్యోగుల కెరీర్ వృద్ధిలోను కీలకపాత్ర పోషిస్తోంది. ప్రత్యేక కేటగిరీ కింద పరిగణించే దివ్యాంగులకు విద్యను చేరువ చేయడమే కాకుండా.. వివిధ కేసుల్లో జైలు జీవితం గడుపుతున్న ‘జైల్ ఇన్మేట్స్’ (ఖైదీలు)ను సైతం విద్యావంతులుగా తీర్చిదిద్దుతోంది. 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించి వర్సిటీ ఇటీవల విడుదల చేసిన నివేదికలో పలు ఆసక్తికర అంశాలున్నాయి. 2022–23లో 7,13,510 మంది వివిధ కోర్సులకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరితో కలిపి ఆ విద్యాసంవత్సరంలో ఇగ్నోలో 13 లక్షల మందికిపైగా విద్యార్థులున్నారు. 2022–23లో నమోదైనవారిలో పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల నుంచే ఎక్కువగా రిజి్రస్టేషన్ చేసుకున్నారు. మొత్తం చేరికల్లో దాదాపు సగం మంది మహిళలే ఉన్నారు. దివ్యాంగులు 4,227 మంది, ఖైదీలు 11,089 మంది చేరారు. కెరీర్ వృద్ధికి సోపానం ఇగ్నో సగటు విద్యార్థులకు దూరవిద్యలో బోధన అందించడమే కాకుండా ఉద్యోగాలు చేస్తూ కెరీర్లో ఎదగాలనుకునేవారికి సైతం చేయూతనిస్తోంది. కొన్నేళ్లుగా ఉద్యోగాలు చేసుకుంటూ ఇగ్నోలో ఇతర డిగ్రీలు అభ్యసిస్తున్నవారి సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. 2015–16లో 98,071 మంది ఉద్యోగులు నమోదు చేసుకుంటే.. 2019–20లో 2.28 లక్షల మంది ఉద్యోగులు నమోదు చేసుకున్నారు. తరువాత సంవత్సరం ఈ సంఖ్య 1.30 లక్షలకు తగ్గినా.. 2022–23లో 1.44 లక్షలకు పెరిగింది. సంప్రదాయ విశ్వవిద్యాలయాల మాదిరిగానే ఇగ్నో సైతం తమ సంస్థలో డిగ్రీలు పొందినవారికి ప్లేస్మెంట్స్ కల్పించడానికి చర్యలు చేపడుతోంది. 2022–23లో ఎనిమిది ప్లేస్మెంట్ డ్రైవ్స్ నిర్వహించింది. 2021–22లో 21 శాతం ఉన్న ప్లేస్మెంట్స్ రేటు 2022–23లో 30 శాతానికి పెరిగింది. అంతర్జాతీయ ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్, ఎస్బీఐ లైఫ్, గ్లోబివా, ఇన్సూరెన్స్ థేఖో డాట్కామ్ వంటి పలు సంస్థల్లో వీరు ఉద్యోగాలు పొందారు. కావాల్సినంత ప్రోత్సాహం విశ్వవిద్యాలయం కెరీర్ అవగాహన సెషన్లు నిర్వహించడం ద్వారా పరిశ్రమ నిపుణుల కెరీర్ ప్లానింగ్, నైపుణ్య అవసరాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తోంది. ఉద్యోగాన్వేషణలో ఉన్న విద్యార్థులకు చేయూత ఇస్తోంది. సీవీ తయారీ, జాబ్ పోర్టల్ వినియోగం, ఇంటర్వ్యూలకు తర్ఫీదు ఇస్తోంది. ఇగ్నో పోర్టల్లో 59 వేల కంటే ఎక్కువమంది పూర్వవిద్యార్థులు నమోదు చేసుకున్నారు. దీని ఆధారంగా పూర్వవిద్యార్థుల సమ్మేళనాలను నిర్వహించి వివిధ రంగాల్లో విజయం సాధించిన వారితో ప్రేరణ కార్యక్రమాలు అందిస్తోంది. 2022–23లో ఇటువంటి 13 సమ్మేళనాలను నిర్వహించింది. వివిధ వృత్తులు, ఉద్యోగాల్లో ఉన్నవారు ఆయా రంగాల్లో మరింత ఎదిగేందుకు కూడా ఈ విశ్వవిద్యాలయం తోడ్పాటు ఇస్తోంది. -
డేంజరస్ భిక్షువు!
సత్యాన్వేషణ స్పృహతో స్వతంత్రంగా, నిర్భీతితో, ఎరుకలో జీవించడమే మనిషి నిరంతర కర్తవ్యమని చెప్పి, అలా జీవించిన మహా మనీషి, తాత్వికుడు, విద్యా విప్లవకారుడు ఎం.శివరామ్ (85). పూర్తి పేరు మంచిరెడ్డి శివరామ్. పాతికేళ్లుగా విజయవాడ ప్రాంతంలో ‘పిల్లలు కేంద్రంగా విద్య’ అనే భావనను తల్లిదండ్రుల్లో, ఉపాధ్యాయుల్లో, పాఠశాల యాజమాన్యాల్లో పాదుకొల్పడానికి అవిశ్రాంత కృషి చేసిన శివరామ్, ఆగస్టు 20న తుదిశ్వాస విడిచారు. ఆయన అవివాహితులు.పుట్టింది అనంతపురం జిల్లాలో. 20 ఏళ్లుగా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని అరవింద స్కూల్లో మకాం. ఎటువెళ్లినా తిరిగి అక్కడికే చేరుకునేవారు. ప్రిన్సిపాల్ ఇంద్రాణి ఆత్మీయ సంరక్షణలో పిల్లల్లో ఒక పిల్లాడిలా గడిపేవారు. ‘రాజీ జీవితాన్ని’ ఏవగించుకునేవారు. శివరామ్ విఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి (జేకే) సహచరుడు. కొంతకాలం రిషి వ్యాలీ స్కూల్లో పనిచేశారు.వ్యక్తి వికాసం వెదజల్లే ప్రేమపూర్వకమైన ప్రజ్ఞ ద్వారానే మొత్తంగా సామాజిక పరివర్తన సాధ్యమనే భావన ఆయన సాన్నిహిత్యాన్నెరిగిన వారికి అనుక్షణం అర్థమవుతూ వుండేది. కమ్యూనిస్టు పంథా నుంచి ప్రేమతో జేకే చూపిన వెలుగుబాట వరకు ఎన్నెన్నో మలుపులు, మజిలీలు ఆయన జీవనయానంలో తారసపడతాయి. తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమం వేళ్లూనుకుంటున్న నాటి నుంచి ఐక్య కమ్యూనిస్టు పార్టీ కార్యక్రమాలకు ఆకర్షితుడై, పీడిత వర్గ రచయితగా, సాంస్కృతిక సేనానిగానూ ఉద్యమ ప్రగతికి కృషి చేశారు.సంపన్న కుటుంబంలో జన్మించిన శివరామ్, తాను నమ్మిన సిద్ధాంతం కోసం తుదకంటా నిలబడ్డారు. నాయకుల మాటలకు-చేతలకు, సిద్ధాంతానికి-ఆచరణకు పొంతన లేకపోవడం.. వంటి పరిస్థితులన్నీ ఆయనలో మౌలికమైన ప్రశ్నలను లేవనెత్తాయి. ఎంతకాలం ఇలా ఏ నాయకుడో చెప్పిన పంథాలో పయనించడం, వాళ్లు అది కాదంటే మనను మార్చుకోవడం? స్వతంత్రంగా సత్యాన్వేషణ చేయలేమా? సమాజాన్ని అర్థం చేసుకోడానికి, సేవ చేయడానికి మరో మార్గం లేదా?.. వంటి అనంతమైన ప్రశ్నలకు స్వయంగా సమాధానాలు అన్వేషిస్తూ దేశదిమ్మరి అయ్యారు. ఆధ్యాత్మిక గురువుల ప్రబోధాలు, ప్రవచనాలు ప్రత్యక్షంగా వింటూ, అధ్యయనం చేస్తూ, ఆ వాతావరణంలో జీవిస్తూ అన్వేషణ కొనసాగించారు.ఆ క్రమంలో జేకే పుస్తకం ఒకటి శివరామ్ కంటపడింది. వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టయింది. అది మొదలుగా జేకే దేశదేశాల్లో నిర్వహిస్తున్న చర్చాగోష్ఠుల సారాంశంతో అచ్చయ్యే తాజా పుస్తకాలను ఔపోసన పట్టడంలో నిమగ్నమయ్యారు. చెరువు గట్టున ఏకాంతంలో జేకేని చదువుతూ, తనలోకి తాను చూసుకుంటూ.. ప్రపంచాన్ని సరికొత్త దృష్టితో అధ్యయనం చేశారు. అనంతరం జేకేని స్వయంగా కలుసుకోవడంతో శివరామ్ జీవన విధానమే మారిపోయింది. ఆ సాన్నిహిత్యం ఆయనను రిషి వ్యాలీలో కట్టిపడేసింది. జేకే ఖండాంతరాల్లో నిరంతరం మాట్లాడుతున్నపుడు రికార్డు చేసిన టేపులు రిషి వ్యాలీకి చేరేవి. వాటిని రాయించి, ముద్రించడంలో కచ్చితత్వం పాటించే విషయంలో శివరామ్ జాగ్రత్త వహించేవారు. అలా జేకేని దగ్గరగా అధ్యయనం చేయడానికి, అర్థం చేసుకోడానికి ఆయనకు అవకాశం దొరికింది.రిషి వ్యాలీ మెయిన్ స్కూలు సంపన్నుల బిడ్డలకే పరిమితమవుతుండడం శివరామ్కు నచ్చలేదు. ఆ పరిసర ప్రాంతంలో గ్రామీణ పేదపిల్లలకు కూడా ‘సృజనాత్మక విద్య’ అందించాలని ప్రతిపాదించారు. ఆయన ఆధ్వర్యంలోనే రిషి వ్యాలీలో రూరల్ స్కూళ్లకు అంకురార్పణ జరిగింది. సహజంగా వికసిస్తూ, పిల్లలు సజీవంగా స్పందించడం రూరల్ స్యూళ్లలోనే సంతృప్తికరంగా సాధ్యమవుతోందని శివరామ్ అంటుండేవారు. ఎంత అద్భుతమైన వాతావరణంలో జీవిస్తున్నా ఎక్కువ కాలం ‘ఉన్నచోటనే ఉండిపోవటం’ ఆయనకు బొత్తిగా ఇష్టం లేని పని. ఐదారేళ్లకు అంతా పాతపడిపోతుందని శివరామ్ ప్రగాఢంగా భావించేవారు. రూరల్ స్కూల్స్ సక్సెస్ఫుల్గా నడుస్తున్నప్పటికీ ఉన్నట్టుండి ‘ఇక్కడింకా ఎన్నాళ్లు?’ అనిపించిందాయనకు. అంతే.. లేడికి లేచించే పరుగన్నట్టు... జేకేకి నమస్కారం పెట్టి, జోలె చంకనేసుకొని రిషి వ్యాలీ నుంచి లోక సంచారానికి బయలుదేరారు శివరామ్.బతుకు భయంతో గానుగెద్దు జీవితాలు ఈడ్చుతున్న జనాన్ని తేలికపరచాలనిపించిందో ఏమో.. అమృతభాండాగారాన్ని మనసులో నింపుకుని కాలికి బలపం కట్టారు. ఎన్నెన్ని మజిలీలో, ఎందరెందరికి పునరుజ్జీవాలో.. ఓహ్.. అదొక సజీవ జీవనగాథల అనంత సాగరం!నెల్లూరుకు దగ్గరలోని పల్లెపాడులో గాంధీ ఆశ్రమాన్ని పునరుద్ధరించి ‘సృజన స్కూల్’ను విద్యావేత్త ఎలీనా వాట్స్తో కలిసి తేదకదీక్షతో నిర్వహించారు. ఇంగ్లండ్కు చెందిన ఎలీనా, శివరామ్ సృజన పిల్లలతో గడుపుతూ పొందిన అనుభవ పాఠాలు.. తెలుగునాట విద్యారంగంలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించాయి. సృజన స్కూల్ అనుభవాలు, అనుభూతులు అనేక రూపాల్లో రికార్డయ్యాయి. అంతర్జాతీయ స్థాయిలో సృజన అనుభవాలకు గుర్తింపు లభించింది. దాదాపు ఐదారేళ్ల పాటు సృజన స్కూల్ శివరామ్, ఎలీనాల ఆధ్వర్యంలో కొనసాగింది. ఎలీనా తిరిగి ఇంగ్లండ్ వెళ్లిపోవటం, శివరామ్ హైదరాబాద్ చేరటంతో ఆ స్కూల్ ఇతరుల చేతుల్లోకి వెళ్లింది.నిశ్చలంగా ఒక స్కూలును నిరంతర పరిశీలన, పర్యవేక్షణతో నిర్వహించడం అవసరమే. కానీ, దాని పరిమితి దానికి వుంది. నాలుగ్గోడల మధ్య ‘బట్టీ చదువు’ల కింద నలిగిపోతున్న అశేష బాలలకు ఆ హింస నుంచి విముక్తి కల్పించడం కోసం శివరామ్ ఊరూరా తిరుగుతూ అంతులేని కృషి చేశారు. స్కూళ్లలో పిల్లలు నేర్చుకునే వాతావరణాన్ని నింపడానికి, పెద్దలకు తక్షణంలో జీవించడం ద్వారా జీవన మాధుర్యాన్ని ఆస్వాదించడం రుచి చూపడానికి అనంత మనోశక్తితో, నిశ్చలంగా, నిశ్శబ్దంగా కడదాకా ఉద్యమించారు. ఆ ఉద్యమపథంలో విజయవాడ మజిలీ ఒక మైలురాయి.24 ఏళ్ల క్రితం శివరామ్ గారితో ముఖాముఖి కూర్చొని, అనేక అంశాలపై గాఢంగా, లోతుగా చర్చించుకునే అవకాశం వచ్చివుండకపోతే నా జీవితం ఇప్పటికన్నా నిస్సందేహంగా వెలితిగా, అలజడిగా, అనారోగ్యంగా వుండేది. ఆయన కనిపెట్టిన ‘విద్యార్థి సృజన కుటీర్’ గనక అందుబాటులో లేకపోయుంటే మా పిల్లలు ఇప్పుడున్నంత సంతోషంగా వుండి వుండేవాళ్లు కాదు!పిల్లలు వికసించే విద్య.. తక్షణంలో జీవించడమే - జీవితం. ఈ రెంటినీ నిరంతరం ఇతరులతో పంచుకోవడమనే ధ్యానాన్ని ముగించుకొని వెళ్లిపోయారు శివరామ్. ‘డేంజరస్గా జీవించాలి’ అనేవారు తరచూ. అన్నట్టే జీవించి చూపిన అమరజీవి శివరామ్ గారికి విద్యావిప్లవ జోహార్లు!– పంతంగి రాంబాబు,సీనియర్ జర్నలిస్ట్8639738658 -
ఈ అవకాశాన్ని ఛాలెంజ్గా తీసుకోండి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ పునాదులను బలంగా నిర్మించడంలో క్రియాశీలక పాత్ర పోషించాలని.. ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులకు వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శులతో అవగాహనా సమావేశం ఆదివారం జరిగింది.ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు లేళ్ళ అప్పిరెడ్డి, పూడి శ్రీహరి, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్ రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులంటే జిల్లాలో పార్టీకి కమాండర్ లాంటి వారన్నారు. పార్టీ ఇచ్చిన అవకాశాన్ని ఛాలెంజ్గా తీసుకుని నిలబడాలి.. వైఎస్సార్సీపీది ప్రజాపక్షం అని ప్రజల్లోకి తీసుకెళ్లాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.‘‘మనమంతా బలమైన వ్యవస్ధగా రూపొందాం. మీరంతా మీ శక్తి సామర్ధ్యాలు నిరూపించుకునే అవకాశం మీకు పార్టీలో కల్పించబడింది. దానిని ఛాలెంజ్గా తీసుకుని మీరు నిలబడాలి. మండల స్ధాయి నుంచి బలమైన నాయకత్వం ఉన్నప్పుడే మనం అనుకున్న ఫలితాలు సాధించగలుగుతాం. ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజలపక్షాన నిలబడాలి. ప్రభుత్వాన్ని నిలదీయడం, ప్రజల గొంతుకగా మనం నిలబడాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం చేశారు. -
పచ్చని పంట పొలాలపై చంద్రబాబు కన్ను: రైతు నేతలు
సాక్షి, విజయవాడ: చంద్రబాబు సర్కార్పై రైతు సంఘాల సమన్వయ సమితి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. పంజాబ్లో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం 65 వేల ఎకరాలు తీసుకోవాలని చూస్తే రైతులు పోరాటం ద్వారా అడ్డుకున్నారు. కర్ణాటకలో 1750 ఎకరాలు తీసుకోవడంపై పోరాటం చేసి విజయం సాధించారు. కరేడులో మూడు పంటలు పండే భూములను ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టాలని చంద్రబాబు ప్రభుత్వం చూస్తుందంటూ ఆయన మండిపడ్డారు.‘‘ప్రభుత్వ నిర్ణయాన్ని కరేడు రైతులు వ్యతిరేకించారు. రైతుల పోరాటానికి మద్దతు తెలియజేయడానికి వెళ్లిన వాళ్లను అడ్డుకుంటున్నారు. శాంతియుతంగా ఆందోళనను కూడా ప్రభుత్వం అడ్డుకుంటుంది. న్యాయ వాదుల బృందం కరేడులో మద్దతు తెలిపింది. బీపీసీఎల్ పేరుతో రావురులో 6 వేల ఎకరాలు తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. పోర్ట్ వస్తుంది కాబట్టి.. చవకగా భూములు కొట్టేయాలని ప్రయత్నం చేస్తుంది...రైతులు పోరాటంలో భాగస్వాములు అవుతాం. నవరాత్నాల్లో ఒకటైన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు లేవు. దేశంలో సొంత గనులు లేని ఏకైక ప్లాంట్ విశాఖ స్టీల్. సొంత గనులు లేకపోవడం వల్లే స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది. ప్రజలను మభ్యపెట్టి ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు. 100 శాతం అమ్ముతామని కేంద్ర కమిటి నిర్ణయం కొనసాగుతుందని పార్లమెంట్లో చెప్పారు. అమ్మాలని కేంద్రం ప్రకటిస్తే ప్రజల చెవిలో కూటమి నేతలు ప్రజల్లో చెవిలో పువ్వులు పెడుతున్నారు...32 విభాగాలు ప్రైవేట్ పరం చేస్తే ఎందుకు ప్రశ్నించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మద్దతుపైన కేంద్రంలో ప్రభుత్వం ఉన్నా.. ఎందుకు మాట్లాడడం లేదు?. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. స్టీట్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన వారికి ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదు. దిగమతి సుంకాన్ని పూర్తిగా రద్దు చేయడం పత్తి రైతుపై దెబ్బ కొట్టింది. లక్ష 25 వేల ఆత్మహత్యలో ఎక్కువ మంది పత్తి రైతులు ఉన్నారు’’ వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు.రైతు సంఘం నేత మాట్లాడుతూ.. కేశవరావు మాట్లాడుతూ.. బహుళ పంటలు పండే భూములను కూటమి ప్రభుత్వం లాక్కోంటుంది. కరేడు రైతులు చేసే పోరాటానికి రైతు సంఘాలుగా మద్దతు ఇస్తున్నాం. రైతుల్లో, కులాల్లో, మనష్యుల మధ్య విభేదాలు పెట్టాలని ప్రభుత్వం కుట్రలు చేస్తోంది.కరేడు రైతు శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రభుత్వం చెప్పేదోకటి చేసేదోకటిగా వ్యవహరిస్తుంది. ఎండోమెంట్ భూములను కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. ఫారెస్ట్ భూములు, ఇండోమెంట్ భూములు ఇచ్చిన పరిస్ధితి ఇక్కడే ఉంది. పచ్చని పొలాలు ఉండే మా గ్రామంపై చంద్రబాబు కన్ను ఎందుకు పడింది?. మూడు పంటలు పండించుకుని జీవించే భూములను ఎందుకు ప్రైవేట్కి ఇస్తున్నారు. సస్యశామలామైన మా భూముల జోలికి ప్రభుత్వం రావొద్దు. పంటలు పండని భూముల్లో పరిశ్రమలు పెట్టుకొండి. విభజించు పాలించు అనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎక్కడ లేని చట్టాలు మా గ్రామంలో అమలు చేస్తున్నారు...సెక్షన్ 30, 144 పెట్టడంపై కోర్ట్ కి వెళ్తై అవి లేవిని కోర్టులో అబద్దాలు చెబుతారు. శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పర్మిషన్లు ఇవ్వరు. 69 వేల కోట్లతో పెట్టుబడులు పెడితే 49వేలు సబ్సిడి ఇస్తుంది ప్రభుత్వం. మా భూములు అమ్ముకోవడం మాకు వచ్చు. మా భూములు రియల్ ఎస్టేట్ చేసుకోవడం కోసం మా భూములు దోచుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి రాగానే ప్రజా సమస్యలు పవన్ మరచిపోయాడు. చంద్రబాబు చెప్పిన విధంగా చంద్రబాబు ముందుకు వెళ్తున్నాడు...చంద్రబాబు దారిలో పవన్ ప్రయాణిస్తే రాజకీయ జీవితం పవన్కి ఉండదు. రాజధాని రైతులు వాళ్ల భూముల కోసం పోరాటం చేస్తే న్యాయం.. మేమే చేస్తే అన్యాయమా?. గ్రామాల్లో ప్రతి ఇంటి ముందు నల్లాజెండాలు ఎగురవేస్తాం. తెల్లచట్టాలు, నల్లచట్టాలు, పచ్చ చట్టాలు అమలు చేస్తారా? జీవోలు వెనక్కి తీసుకోకపోతే రాజకీయ సమాధి చేస్తాం. తడా నుండి శ్రీకాకుళం నుండి భూములు కోట్టడంపై పోరాటం చేస్తాంరైతు కుమార్ మాట్లాడుతూ.. ఉలవపాడు, కరేడు ప్రాంతాల రైతుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు. కేసులతో పాటు, ఫోన్ల ట్యాపింగ్ చేస్తున్నారు. ఉద్యమ నేతలను ఫోన్స్ ట్యాప్ చేస్తాం.. కేసులు పెడతామంటూ ప్రభుత్వం బెదిరిస్తుంది. కరేడులో రైతుల సంఘాలు పర్యటిస్తాయి. నల్లజెండాలు ఎగరవేయడమే కాదు.. పోరాటం చేస్తాంఉద్యమ నేత అజయ్ కుమార్ మాట్లాడుతూ.. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కరేడు అంత పెద్ద గ్రామం లేదు. 13 వేల ఎకరాలు సారవంతమైన భూమి ఉంది. కులాలు, మతాల మద్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. 1490లో పుట్టిన ఊరుని కబలించాలని ప్రభుత్వం చూస్తుంది. 18 రకాల పంటలు పండే భూమిని కబలిస్తున్నారు. నోటిఫికేషన్ని వెనక్కి తీసుకోవాలి -
చతేశ్వర్ పుజారా రిటైర్మెంట్పై వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: క్రికెటర్ చతేశ్వర్ పుజారా రిటైర్మెంట్పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. పుజారా భవిష్యత్ బాగుండాలని.. మెరుగైన విజయాలు సాధించాలన్నారు. పుజారా క్రమశిక్షణ, ఆటతీరు దేశానికి మరింత గౌరవాన్ని పెంచాయని వైఎస్ జగన్ పేర్కొన్నారు.టీమిండియా దిగ్గజం చతేశ్వర్ పుజారా అన్ని ఫార్మాట్ల క్రికెట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆయన వెల్లడించాడు. టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ వారసుడిగా పేరొందిన ఛతేశ్వర్ పుజారా.. అక్టోబర్ 9, 2010న భారత తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు.బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాపై తన టెస్టు అరంగేట్రం చేశాడు. తన కెరీర్లో 103 టెస్టులు ఆడిన పుజరా 43.60 సగటుతో 7195 పరుగులు చేశాడు. అందులో మూడు డబుల్ సెంచరీలు, 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.As Cheteshwar Pujara announces his retirement wishing him all success in his future endeavours.His discipline, and focus brought immense pride to the nation.@cheteshwar1 pic.twitter.com/Jxe5JcaZOo— YS Jagan Mohan Reddy (@ysjagan) August 24, 2025 -
పంచాయతీ నిధుల బదిలీపై ఆలస్యం ఎందుకు?
సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడానికి కేంద్రం గత ఏడాది డిసెంబర్లో గ్రాంట్లుగా ఇచి్చన రూ. 1,121.20 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఆయా గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదల చేయకపోవడాన్ని కేంద్రం సీరియస్గా తీసుకుంది. కేంద్రం నుంచి నిధులు అందిన 10 పని దినాలలో రాష్ట్ర ప్రభుత్వం ఆయా గ్రామ పంచాయతీలు, ఇతర స్థానిక సంస్థలకు బదిలీ చేయాల్సి ఉండగా.. ఇప్పటికీ ఎందుకు జమ చేయలేదో తెలపాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించుకుంటూ వస్తోందన్న వార్తల నేపథ్యంలో ఈ తాజా పరిణామం చోటుచేసుకుంది. ఫిర్యాదుల నేపథ్యం.. ‘ఈ – గ్రామ్ స్వరాజ్ పోర్టల్’లో నిధుల బదిలీ జరిగినట్లు కనిపించకపోవడంతో పాటు పలు సర్పంచ్ సంఘాలు ఈ అంశంపై కేంద్ర పంచాయతీరాజ్ శాఖకు ఫిర్యాదు చేయడంతో కేంద్రం స్పందించింది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ రాంప్రతాప్ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తూ.. ఇక ఎలాంటి ఆలస్యం లేకుండా సంబంధిత గ్రాంట్లను వడ్డీతో సహా తక్షణమే విడుదల చేయాలని సూచించారు. ఇందుకు రుజువుగా గ్రాంట్ ట్రాన్స్ఫర్ సరి్టఫికెట్ను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని కూడా ఆ లేఖలో రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారు. కాగా, కేంద్రం లేఖ రాసి దాదాపు 20 రోజులు పూర్తవుతున్నప్పటికీ, ఈ నిధులను రాష్ట్రం ప్రభుత్వం ఇప్పటికీ విడుదల చేయకపోవడం గమనార్హం. కేంద్రం నిధుల విడుదల ఇలా.. ⇒ 15వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు కేంద్రం రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ల పేరిట కేంద్రం గత ఏడాది డిసెంబర్ 16వ తేదీన రూ. 446.48 కోట్ల బేసిక్ (అన్టైడ్) కేటగిరిలోనూ, అదే నెల మూడో వారంలో మరో రూ. 674.72 కోట్లు టైడ్ కేటగిరిలోనూ రాష్ట్ర ఆర్థిక శాఖకు విడుదల చేసింది. ⇒ ఆ నిధులను గ్రామ పంచాయతీలకు 70 శాతం, మండల పరిషత్లకు 20 శాతం, జిల్లా పరిషత్లకు 10 శాతం చొప్పున లెక్కకట్టి సంబంధిత బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయాల్సి ఉంది. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులపైనా ఆక్షేపణ రాష్ట్ర ఆర్థిక సంఘం (ఎస్ఎఫ్సీ) సిఫార్సుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి గ్రామీణ స్థానిక సంస్థలకు జరగాల్సిన చెల్లింపుల వాటాపైనా సంబంధిత లేఖలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆక్షేపించడం గమనార్హం. 4వ రాష్ట్ర ఆర్థిక సంఘం కాలపరిమితి 2024–25 ఆర్థిక సంవత్సరంతో పూర్తయినా తదుపరి ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేయకపోవడాన్ని కేంద్రం తప్పుపట్టింది. ఐదవ రాష్ట్ర ఆర్థిక సంఘం 2023 మార్చిలోనే ఏర్పాటు అయినప్పటికీ, దాని నివేదికను రాష్ట్ర శాసనసభలో సమర్పించకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశి్నంచింది. ఐదవ రాష్ట్ర ఆర్థిక సంఘం నివేదిక వివరాలను సైతం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్రం దృష్టికి తీసుకురావాలని ఆ లేఖలో ఆదేశించింది. సాక్షి ఎఫెక్ట్తో... ఏప్రిల్లో జీవోలు ఈ వ్యవహారంపై ఈ ఏడాది ఏప్రిల్ 21వ తేదీన ‘సాక్షి’ ప్రధాన సంచికలో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీంతో నిధులను విడుదల చేస్తున్నట్టు చెప్పుకోవడానికి అదే ఏప్రిల్ నెల 25వ తేదీన పంచాయతీరాజ్ శాఖ నుంచి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్స్ (బీఆర్వోలు) పేరుతో రెండు జీవోలను విడుదల చేసింది. వాటి అమలు మాత్రం లేదు. -
విద్యుత్ వ్యవస్థకు ‘సైబర్’ భద్రత
సాక్షి, అమరావతి: పవర్ గ్రిడ్లకు సైబర్ దాడుల నుంచి ముప్పు పొంచి ఉండటంతో వాటి భద్రతకు కొత్త నిబంధనలతో ప్రత్యేక చట్టాన్ని రూపొందిస్తున్నట్టు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ–సీఈఏ) ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రక్రియ ఇప్పటికే కొలిక్కి వచ్చిందని, తుది మెరుగులు దిద్ది త్వరలోనే చట్టాన్ని తీసుకువస్తామని వెల్లడించింది. కొంతకాలం క్రితం దేశ ఆరి్థక రాజధాని ముంబైలో పవర్ గ్రిడ్ పనితీరులో అంతరాలను సైబర్ నిపుణులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే విద్యుత్ వ్యవస్థను సైబర్ దాడుల నుంచి కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్రం భావించింది. సెక్యూరిటీ ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీమ్(సీఎస్ఐఆర్టీ)ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. సీఈఏ ఆధ్వర్యంలో వివిధ ప్రైవేటు సంస్ధల్లో శిక్షణ పొందిన సైబర్ (ఇంటర్నెట్) నిపుణులు ఈ బృందంలో ఉంటారు. ఇటువంటి నిర్ణయాలకు చట్టబద్ధత కల్పిస్తూ సీఈఏ తాజాగా విద్యుత్ రంగంలో సైబర్ సెక్యూరిటీపై కొత్త నిబంధనలను తీసుకువస్తోంది. ఇవీ నిబంధనలు దేశంలో నార్తరన్, వెస్ట్రన్, సదరన్, ఈస్ట్రన్, నార్త్ ఈస్ట్రన్ అనే ఐదు ప్రాంతీయ పవర్ గ్రిడ్లు ఉన్నాయి. వీటన్నిటినీ ‘ఒన్ నేషన్.. ఒన్ గ్రిడ్’ కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ గ్రిడ్కు అనుసంధానించారు. వీటి కార్యకలాపాలన్నీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిధిలో జరుగుతుంటాయి. ఇంత పెద్ద గ్రిడ్కు సంబంధించిన సమాచార వ్యవస్థను శత్రువులు చేజిక్కించుకుంటే దేశం మొత్తం చీకటైపోతుంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. ఈ నేపథ్యంలో పవర్ గ్రిడ్ వంటి మౌలిక సదుపాయాలపై సైబర్, ఉగ్ర దాడులను ఎదుర్కోవటానికి పవర్ ఐలాండ్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలని సీఈఏ ప్రతిపాదించింది. ఇది విద్యుత్ వ్యవస్థలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం. గ్రిడ్లో ఏదైనా అంతరాయం ఏర్పడితే విద్యుత్ వ్యవస్థను వెంటనే దానినుంచి వేరు చేయడాన్ని పవర్ ఐలాండింగ్ సిస్టమ్ అంటారు. దీనివల్ల పవర్ గ్రిడ్లు కుప్పకూలకుండా నియంత్రించవచ్చు. అదేవిధంగా రాష్ట్ర విద్యుత్ రంగంలో కచ్చితంగా చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్(సీఐఎస్ఓ)ను నియమించాలి. భారత పౌరసత్వం కలిగిన సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగులను సీఐఎస్ఓగా నియమించాలి. వారు సంస్థ ఉన్నతాధికారికి మాత్రమే జవాబుదారీగా ఉండాలి. అలాగే ప్రతి విద్యుత్ సంస్థ సైబర్ క్రైసిస్ మేనేజ్మెంట్ ప్లాన్(సీసీఎంపీ)ని అభివృద్ధి చేసుకోవాలి. విద్యుత్ రంగంలోని కంప్యూటర్లలో సాఫ్ట్వేర్లు హ్యాకింగ్కు గురికాకుండా అడ్వాన్స్ ఫైర్వాల్స్, డిటెక్షన్ సిస్టమ్, ప్రివెన్షన్ సిస్టమ్ను తయారు చేయాలి. ట్రస్టెడ్ వెండర్ సిస్టమ్ను కూడా కచ్చితంగా పెట్టుకోవాలి. ఇది థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ద్వారా మాల్వేర్ కంప్యూటర్లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. వీటన్నిటిపైనా ఐటీ, టెక్నాలజీ విభాగాల్లో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలి. అలాగే విద్యుత్ సంస్థల్లో ఎక్కువ మంది సిబ్బంది విద్యుత్ కార్యకలాపాలను తమ సెల్ఫోన్ల ద్వారానే నియంత్రిస్తున్నారు. వారిని మోసగించి వారి ఫోన్లలో హానికర సాఫ్ట్వేర్ పంపి విలువైన సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించింది. పునరుత్పాదక విద్యుత్కు ప్రత్యేక రక్షణ దేశ విద్యుత్ అవసరాల్లో దాదాపు 40 శాతం పునరుత్పాదక ఇంధనమైన గాలి, నీరు, సౌర విద్యుత్ నుంచే సమకూరుతోంది. ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ప్రాజెక్టులు సైబర్ దాడులకు గురవుతాయనే హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దిగుమతి చేసుకున్న విద్యుత్ సరఫరా విడి భాగాలపై సైబర్ భద్రతా చర్యలను మంత్రిత్వ శాఖ తప్పనిసరి చేసింది. మాల్వేర్, ట్రోజన్లు వంటి ఏదైనా సైబర్ బెదిరింపుల కోసం దిగుమతి చేసుకున్న అన్ని విద్యుత్ సరఫరా విడి భాగాలను నేరస్తులు వాడుకునే అవకాశం ఉండటంతో హానికరమైన ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ ఉందేమోనని తప్పనిసరిగా తనిఖీ చేయాలని స్పష్టం చేసింది. మన రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలోనే విద్యుత్ భద్రతకు సంబంధించి ప్రత్యేక పరిశోధన, చర్యలు చేపట్టారు. జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) అనేది అప్పుడే రూపొందింది. దీనివల్ల ఏపీ ట్రాన్స్కో, డిస్కంల మొత్తం ట్రాన్స్మిషన్, డి్రస్టిబ్యూషన్ నెట్వర్క్లను జియో ట్యాగింగ్ చేయడం తేలికైంది. దీంతో సదరన్ రీజినల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఆర్ఎల్డీసీ) మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో పవర్ గ్రిడ్ను పర్యవేక్షించడానికి ఏపీ ట్రాన్స్కో జీఐఎస్ మోడల్ను తీసుకుంది. -
వైద్యుల పదోన్నతుల్లోనూ అక్రమాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆరోగ్య శాఖలో వైద్యుల ప్రమోషన్లు, బదిలీ ప్రక్రియను చంద్రబాబు ప్రభుత్వం అవినీతిమయంగా మార్చేసింది. డిమాండ్ అధికంగా ఉండే ఆస్పత్రుల్లో పోస్టులను ప్రభుత్వ పెద్దలు బ్లాక్ చేసి అమ్మేస్తున్నారని వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2024–25 ప్యానల్ సంవత్సరానికి వైద్యులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్(ఏపీవీవీపీ) పరిధిలో పదోన్నతిపై సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ (సీఎస్ఎస్) పోస్టింగుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. డోన్, పుంగనూరు, గుంతకల్లు ఆసుపత్రుల్లో గైనకాలజిస్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ, కౌన్సెలింగ్లో చూపించలేదని పదోన్నతి పొందిన వైద్యులు వెల్లడించారు. ఎమ్మిగనూరులో అనస్థీíÙయా పోస్టు ఖాళీగా ఉన్నప్పటికీ ప్రదర్శించ లేదన్నారు. ఖాళీగా ఉన్న స్థానాలను ఎందుకు చూపలేదని కౌన్సెలింగ్ జరుగుతున్న సమయంలో వైద్యులు నిలదీస్తే అధికారులు పొంతన లేని సమాధానం చెప్పారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాల కేసులో ఇటీవల కొందరు కేజీహెచ్ వైద్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, పోలీసులు అరెస్ట్ చేసిన ఓ డాక్టర్ను డీఎంఈ అధికారులు కౌన్సెలింగ్కు పిలవడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సాధారణ బదిలీల్లోనూ ఇదే తంతు జూన్ నెలలో చేపట్టిన సాధారణ బదిలీల్లోనూ పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. డీఎంఈ పరిధిలో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అవసరాలను సాకుగా చూపి, పాత వైద్య కళాశాలల్లో పోస్టులను ప్రభుత్వ పెద్దలు బ్లాక్ చేశారు. బదిలీలు ముగిశాక సీఎం ప్రత్యేక అనుమతులతో బ్లాక్ చేసిన పోస్టుల్లో వారికి ఇష్టం వ చ్చిన వారిని నియమించారు. అప్పట్లో గుంటూరు, విజయవాడ, కాకినాడ, విశాఖ వంటి ప్రాంతాల్లో పోస్టింగ్స్ కోసం ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వసూళ్లుచేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. స్పౌజ్ (భార్యాభర్తలు) కేటగిరీలో ఒకరికి ఐదేళ్లలోపు సర్వీస్ ఉంటే ఇద్దరికీ బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చారు. వైద్య దంపతులతో పెద్ద ఎత్తున డబ్బు వసూళ్లు చేసి ఈ నిబంధనను ప్రవేశ పెట్టారని వైద్య వర్గాల్లో చర్చ నడుస్తోంది. బదిలీలు ముగిశాక వసూళ్ల పర్వం వెలుగులోకి వచ్చింది. -
రాసలీలల మంత్రి ఎవరు అనగా..!
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలోని ఒక టీడీపీ మంత్రి తిరుపతిలో తరచూ రాసలీలు సాగిస్తుండటంపై రాష్ట్రంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. సదరు మంత్రి కామకలాపాలపై ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆ లీలలను బయట పెట్టింది ఆ పార్టీకి చెందిన నేత కాబట్టే. అదీ ఎల్లో చానల్ వేదికగా. టీడీపీ అధికార ప్రతినిధి ఎన్బీ సుధాకర్రెడ్డి సదరు మంత్రిపై చేసిన సంచలన ఆరోపణలు ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆ మంత్రి తరచూ తిరుపతికి వస్తూ ఫైవ్, సెవెన్ స్టార్ హోటళ్లలో దిగి రాసలీలలు సాగిస్తున్నారంటూ ఓ ఎల్లో మీడియా చానల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో కుండ బద్దలు కొట్టడంతో ‘ఇంతకూ ఆ మంత్రి ఎవరు అనగా..’ అంటూ సర్వత్రా చర్చ మొదలైంది. హైదరాబాద్లోనూ మంత్రి నీచపు పనులు ‘‘ఆ మంత్రి తరచూ తిరుపతికి వస్తారు. ఆయన వస్తే ఫైవ్, సెవెన్ స్టార్ హోటళ్లలోనే బస చేస్తారు. ఆయన పక్క గదినే ఓ మహిళకు కేటాయిస్తారు. ఆమె చెబితేనే మంత్రి అపాయింట్మెంట్ దొరుకుతుంది. నాకు కూడా ఆ మంత్రి అపాయింట్మెంట్ దొరకడం లేదు. ఆయన ఉన్నన్ని రోజులూ మహిళలతో రాసలీలలు సాగిస్తారు. ఆ మంత్రి గురించి టీడీపీలో అందరికీ తెలుసు. పేరు చెప్పను. ఆ మంత్రి తీరు చూస్తూ ఊరుకోలేక కడుపు మండి ఈ విషయాలు చెప్పాల్సి వస్తోంది’ అంటూ సుధాకర్రెడ్డి వ్యాఖ్యానించడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి కూడా స్పందించారు. టీడీపీ అధికార ప్రతినిధి చెబుతున్న ఆ మంత్రి హైదరాబాద్లోని ఖరీదైన హోటళ్లలో నికృష్టపు చేష్టలు చేస్తుంటాడని విమర్శించారు. అతనే పవిత్ర ఆధ్యాత్మిక నగరి తిరుపతిలోనూ రాసలీలలు సాగిస్తున్నాడని, పదవులు ఇప్పిస్తానని చెప్పి మహిళలను ప్రలోభ పెడుతున్నాడని ధ్వజమెత్తారు. ఈయన హైదరాబాద్లో సాగించే ఘన కార్యాలపై గతంలోనూ ఎల్లో మీడియాలోనే కథనాలు వచ్చాయని గుర్తు చేశారు. అటువంటి మంత్రిపై సీఎం చంద్రబాబు వెంటనే చర్యలు తీసుకోవాలని భూమన డిమాండ్ చేశారు. మంత్రులే ఇలా బరితెగిస్తే, ఇక ఎమ్మెల్యేలు మరీ పేట్రేగిపోరా అని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సన్నిహితులు పిలిచే పేరు డార్లింగ్ మంత్రి టీడీపీ అధికార ప్రతినిధి ఎన్బీ సుధాకర్రెడ్డి చెబుతున్న ఆ మంత్రిపై మరిన్నో ఆరోపణలు ఉన్నాయి. ఏపీ మంత్రిగా ఉంటూ.. శుక్ర, శని, ఆదివారాల్లో హైదరాబాద్లోని స్టార్ హోటళ్లలో ఆయన గడుపుతారట. సన్నిహితుల కోసం గదులు బుక్ చేస్తారట. తెలంగాణ, ఏపీకి చెందిన వారితో అక్కడే సెటిల్మెంట్లు చేస్తారట. ఫైళ్లపై సంతకాలూ అక్కడేనట. వారంలో మూడు రోజులు రాసలీలలు, గానా బజానాలతో కాలం గడుపుతారట. తెలంగాణాలో ఏపీ మంత్రి సెటిల్మెంట్ల వ్యవహారం శ్రుతిమించుతోందని అక్కడి ప్రభుత్వం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఓ లేఖ కూడా రాసినట్లు గతంలో ఓ పచ్చపత్రిక కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. ఆ మంత్రే ఇప్పుడు విజయవాడ, తిరుపతిల్లోనూ రాసలీలలు సాగిస్తున్నట్టు సమాచారం. ఆయన సొంత నియోజకవర్గానికి వారంలో ఒక రోజు మాత్రమే వెళతారట. అక్కడ మాత్రం బుద్దిమంతుడుగా వ్యవహరిస్తారని చెబుతున్నారు. బాపట్ల జిల్లాలో అనుచరుల ద్వారా మంత్రి పేకాట స్థావరాలూ నడిపిస్తున్నట్టు భారీ విమర్శలు ఉన్నాయి. ఈ మంత్రిని ఆయన అనుచరులు, సన్నిహితులు ‘డార్లింగ్ మంత్రి’ అని పిలుచుకుంటుండడం కొసమెరుపు.సీఎం గారూ మీ మంత్రిపై చర్యలు తీసుకోండి పదవులు ఇప్పిస్తానంటూ మహిళలను ప్రలోభపెట్టి, హైదరాబాద్, తిరుపతిల్లోని ఖరీదైన హోటళ్లలో వారితో రాసలీలలకు పాల్పడుతున్నమంత్రిపై చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు చర్యలు తీసుకోవాలి. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన మంత్రులే ఇలాంటి నికృష్టపు చేష్టలకు పాల్పడుతుంటే చంద్రబాబు ఎందుకు చోద్యం చూస్తున్నారు? టీడీపీ నేతే మంత్రి రాసలీలల గురించి మాట్లాడారు. ఈ మంత్రి హైదరాబాద్లో సాగించే ఘన కార్యాలపై గతంలో ఎల్లో మీడియా పత్రికలోనే కథనం ప్రచురితమైంది. – భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికారప్రతినిధి. కూటమి నేతల రాసలీలలు ఒక్కొక్కటిగా బట్టబయలు » రాష్ట్రంలో కూటమి మంత్రులు, ఎమ్మెల్యేల రాసలీలలు, అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కొన్ని నెలల క్రితం సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం తనతో సన్నిహితంగా ఉన్న వీడియోను ఓ మహిళ బయటపెట్టి సంచలనం రేపింది. » ఇటీవల గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వీడియో కాల్లో ఓ మహిళతో మాట్లాడుతూ ముద్దులు పెట్టిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. » శ్రీకాకుళం జిల్లా ఆమదాలవస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అదే జిల్లాకు చెందిన పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్ రేజేటి సౌమ్యను వేధింపులకు గురిచేయడంతో ఆమె ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే కూన రవికుమార్ మహిళా ఉద్యోగులను రాత్రి 10 గంటల తర్వాత పార్టీ కార్యాలయానికి రావాలని అనుచరుల ద్వారా ఒత్తిళ్లు చేయించడం వెలుగులోకి వచ్చింది. » పలు చోట్ల వివిధ పనుల కోసం వస్తున్న మహిళల బలహీనతలు, పేదరికాన్ని ఆసరాగా తీసుకుని టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు లోబరుచుకునే యత్నాలు పలు జిల్లాల్లో వెలుగు చూస్తున్నాయి. రాత్రిళ్లు ఫోన్ చేయడం, ఒత్తిడికి గురి చేయడం ద్వారా లొంగదీసుకునే యత్నాలు దారుణమని ప్రజల్లో చర్చ జరుగుతోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇలా చేయడం ఏమాత్రం మంచిది కాదని, సీఎం చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోలేక పోతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం వైఫల్యాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామంటూ నమ్మబలికిన టీడీపీ, జనసేన కూటమి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తంగా మార్చేసిందని తూర్పారబట్టారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గణాంకాలను ఉటంకిస్తూ చంద్రబాబు కూటమి సర్కార్ ఆర్థిక విధానాలను కడిగిపారేశారు. ఈ మేరకు వైఎస్ జగన్ శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో ఇంకా ఏమన్నారంటే.. ⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2019–24 మధ్య అప్పటి విపక్షాలు తెలుగుదేశం, జనసేన పార్టీ లు పదే పదే అసత్యాలు ప్రచారం చేస్తూ, ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా పని చేశాయి. ప్రభుత్వ విధానాల వల్ల అప్పులు విపరీతంగా పెరుగుతున్నాయని, మరోవైపు కీలక రంగాల్లో మూల ధన వ్యయం బాగా తగ్గడం వల్ల ప్రభుత్వ ఆదాయం దారుణంగా తగ్గుతోందని.. దీని వల్ల రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందడం లేదని, అది ఆర్థిక మాంద్యాన్ని సూచిస్తోందని నిందించాయి. తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టించి, రాష్ట్ర ఆదాయాన్ని చాలా వేగంగా పెంచడంతో పాటు, అప్పులు పెరగకుండా చూస్తామని గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీ లు హామీ ఇచ్చాయి.⇒ కానీ.. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వ పనితీరును ఒకసారి పరిశీలిస్తే, కఠోర వాస్తవాలు కనిపిస్తాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సొంత ఆదాయంలో (పన్నులు, పన్నేతర వసూళ్లు), అంతకు ముందు ఏడాది (2023–24)తో పోల్చి చూస్తే కేవలం 3.08 శాతం వృద్ధి మాత్రమే నమోదైంది. అదే సమయంలో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 9.8 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేస్తే, కేంద్ర ప్రభుత్వ సొంత ఆదాయంలో 12.04 శాతం పెరుగుదల నమోదైంది. మరి ఇక్కడ టీడీపీ కూటమి ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్నట్లుగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) 12.02 శాతం ఉంటే, ప్రభుత్వ సొంత ఆదాయం అత్యల్పంగా 3.08 శాతం వృద్ధికే ఎందుకు పరిమితమైంది? ⇒ గత ఏడాది రాష్ట్ర ఆదాయం దారుణంగా పడిపోయినప్పటికీ, ఈ ఆర్థిక సంవత్సరం 2025–26లో పరిస్థితి మారుతుందని అంతా భావించారు. కానీ, ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో అదే ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితి ప్రస్ఫుటమవుతోంది. గత ఏడాది ఇదే సమయంతో పోల్చి చూస్తే, వస్తు సేవల పన్ను (జీఎస్టీ), అమ్మకం పన్నుల ఆదాయంలో ఇప్పటికే తగ్గుదల కనిపిస్తోంది. ఇదే సమయంలో 2023–24లో తొలి నాలుగు నెలల్లో వచ్చిన ఆదాయంతో, ఇప్పుడు 2025–26లో మొదటి నాలుగు నెలల్లో ప్రభుత్వానికి వచి్చన ఆదాయాన్ని (సీఎజీఆర్) పరిగణనలోకి తీసుకుంటే అది కేవలం 2.39 శాతం మాత్రమే పెరిగింది. వాస్తవానికి అది కనీసం 10 శాతం ఉండాల్సి ఉంది. ⇒ మరో అత్యంత ఆందోళకర అంశం రాష్ట్ర అప్పులు విపరీతంగా పెరగడం. వైఎస్సార్సీపీ హయాంలో 2019–24 మధ్య రాష్ట్ర ప్రభుత్వ మొత్తం రుణాలు (పబ్లిక్ డెట్, పబ్లిక్ ఎక్కౌంట్, ప్రభుత్వ గ్యారెంటీతో కార్పొరేషన్ల అప్పులు, ప్రభుత్వ గ్యారెంటీ లేకుండా చేసిన కార్పొరేషన్ల అప్పులు) రూ.3,32,671 కోట్లు. కాగా, టీడీపీ కూటమి ప్రభుత్వం కేవలం ఈ 14 నెలల్లో చేసిన మొత్తం అప్పులు ఏకంగా రూ.1,86,361 కోట్లు. అంటే గత ప్రభుత్వం మొత్తం ఐదేళ్లలో చేసిన అప్పులో 56 శాతం రుణాలను కూటమి ప్రభుత్వం కేవలం 14 నెలల్లోనే చేసింది. ఒకవైపు రాష్ట్ర ఆదాయంలో వృద్ధి చాలా తక్కువగా ఉండడం, మరోవైపు అప్పులు ఆకాశాన్ని అంటే విధంగా పెరగడం అత్యంత ఆందోళనకరం. అందుకే ఇప్పటికైనా చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం, తమ విధానాలను పునరాలోచించాలి. ఎందుకంటే ఇప్పటికే మీ విధానాల వల్ల తీవ్ర అవినీతితో ప్రభుత్వ ఆదాయానికి భారీగా దగండి పడింది. -
టీడీపీ ‘ప్రేమఖైదీ’!
సాక్షి, టాస్క్ ఫోర్స్: నెల్లూరు సెంట్రల్ జైల్లో జీవిత ఖైదిగా శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్ పెరోల్ వెనుక భారీ డీల్ నడిచింది. దశాబ్దకాలం పైగా శ్రీకాంత్ సైన్యంతో నెల్లూరును నేరమయం చేసిన ఓ టీడీపీ ప్రజాప్రతినిధి పెరోల్ ద్వారా అతడిని బయటకు రప్పించేందుకు వ్యవహారం నడిపించాడని పోలీస్ నిఘా వర్గాల విచారణలో తేలినట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన శ్రీకాంత్ నాలుగు జిల్లాల్లో తన నేరసామ్రాజ్యాన్ని విస్తరించాడు. వంద మందికిపైగా సైన్యాన్ని కూడగట్టుకున్నాడు. వారి ద్వారానే సెటిల్మెంట్లు, దందాలు, బెదిరింపులు, చేయిస్తున్నాడని పోలీస్శాఖ విచారణలో తేలింది. నెల్లూరుకు చెందిన ప్రజాప్రతినిధి కనుసన్నల్లో శ్రీకాంత్ అతని సైన్యం నడుస్తున్నట్టు తేటతెల్లమైంది. నెల్లూరులో జరిగే సెటిల్మెంట్లు, సింగిల్ నంబర్ల ఆట, బెట్టింగ్, ఆర్థిక నేరాలు అన్నింటినీ అతని ద్వారానే నడిపిస్తూ నగరంలో ప్రజాప్రతినిధితో పెట్టుకుంటే నూకలు చెల్లినట్లే అనే భయాన్ని కలిగించినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఫలితంగా దశాబ్దకాలంగా నెల్లూరులో ఆ ప్రజాప్రతినిధిని చూస్తేనే నగర వాసులు వణికిపోయే పరిస్థితి నెలకొంది. ఇద్దరు ఎమ్మెల్యేల సిఫార్సు’లతోనే.. శ్రీకాంత్ పెరోల్ విషయంలో సిఫార్సు లెటర్లు ఇచ్చినా రిజక్ట్ చేశారంటూ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు బుకాయిస్తున్నప్పటికీ వారి ఒత్తిడి, హోంమంత్రి అండతో హోంశాఖ పెరోల్ ఉత్తర్వులు ఇచ్చిందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. శ్రీకాంత్ను బయటకు రప్పించి మరిన్ని సెటిల్మెంట్లతో ప్రజాధనాన్ని దోచేసేందుకు పెరోల్ అస్త్రాన్ని బయటకు తీశారు. అధికారులు అడ్డుపడడంతో కీలక మంత్రికి రూ.2 కోట్ల డీల్ కుదిర్చారన్న ప్రచారం ఉంది. ఆ డబ్బుతోనే పెరోల్తోపాటు వచ్చే ఏడాది జనవరిలో స్రత్పవర్తన కింద విడుదలయ్యే ఖైదీల జాబితాలో శ్రీకాంత్ పేరు చేర్చేలా ఒప్పందం చేసుకున్నారనే ప్రచారం సాగుతోంది.అరుణ వ్యవహారంతోనే వెలుగులోకి.. ఇటీవల పెరోల్లో బయటకు వచ్చిన శ్రీకాంత్ తన సన్నిహితురాలు అరుణనురౌడీ సామ్రాజ్యానికి రాణిని చేసేందుకు తన సైన్యంతో సమావేశం పెట్టడం వల్లే అతని పెరోల్ వ్యవహారం లీకైనట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆస్పత్రిలో శ్రీకాంత్తో అరుణ సన్నిహితంగా ఉన్న వీడియోలూ అతని సైన్యాధిపతి తీసినవేనని తెలుస్తోంది. ఎక్కడ తమ ఆధిపత్యం పోతుందోనని ఆ సైన్యాధిపతి లీకులు ఇచ్చారనే ప్రచారం ఉంది. ఈ వ్యవహారం ఎల్లో మీడియా వైఎస్సార్సీపీకి అంటగట్టేలా చేసిన యత్నాలు బూమ్రాంగ్ కావడంతో ప్రభుత్వం ఇరుకున పడింది. ఇదే అదనుగా కూటమిలోని ప్రజాప్రతినిధి వ్యతిరేక వర్గం ఎల్లో మీడియాలో ఓ వర్గాన్ని ప్రోత్సహించి వ్యవహారాన్ని బజారులో పెట్టేలా చేశారనే ప్రచారం తీవ్రంగా జరుగుతోంది.శ్రీకాంత్ పెరోల్కు సిఫార్సు లేఖ ఇచ్చిన మాట వాస్తవమే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి నెల్లూరు సిటీ: నెల్లూరు కేంద్ర కారాగారంలో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్ పెరోల్కు తాను సిఫార్సు లేఖ ఇచి్చన మాట వాస్తవమేనని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఒప్పుకున్నారు. శనివారం నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. శ్రీకాంత్ పెరోల్ కోసం తనతో పాటు గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్కుమార్ కూడా లేఖ ఇచ్చారని చెప్పారు. తమ లేఖల్ని జూన్ 16న రిజెక్ట్ చేసిన అధికారులు పెరోల్ ఇవ్వలేమని చెప్పారన్నారు. జూలై 30న హోంశాఖ మంత్రి కార్యాలయం నుంచి పెరోల్కు అనుమతి ఇచ్చిందన్నారు. పెరోల్ విషయంలో తమకేం సంబంధం లేదన్నారు. ఇకపై తాను బతికుండగా పెరోల్ కోసం సిఫార్సు లెటర్లు ఇవ్వనని చెప్పారు. ఇది తనకు గుణపాఠం లాంటిదన్నారు. గత ప్రభుత్వంలో కూడా శ్రీకాంత్ పెరోల్కు సిఫార్సు లెటర్లు ఇచ్చానని అన్నారు. లేఖలు ఇవ్వడం సాధారణమన్నారు. అధికారులు నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. -
సర్కారు డ్రామా.. ఎరువులు భ్రమ
యూరియా విషయంలో ప్రభుత్వం పైకి చెబుతున్నది ఒకటైతే, గ్రామాల్లో కళ్లకు కనిపిస్తున్నది మరొకటి. మొన్నటి దాకా తగినన్ని నిల్వలు ఉన్నాయని చెప్పిన ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు క్షేత్ర స్థాయిలో రైతుల ఆందోళనలు చూసి మాట మార్చారు. అక్రమంగా ఎలా తరలి వెళుతోందని.. అలా తరలి పోయిన యూరియా నిల్వలను తిరిగి స్వాధీనం చేసుకోండంటూ హూంకరిస్తున్నారు. దౌర్జన్యంగా, లోపాయికారిగా, అక్రమంగా యూరియా నిల్వలను తమ గోదాములకు తరలించుకు పోయింది కూటమి పార్టీల నేతలే. మరి వారి వద్ద నుంచి నిజంగా ఒక్కటంటే ఒక్క బస్తా అయినా అధికారులు స్వా«దీనం చేసుకోగలిగారా? ‘ముఖ్యమంత్రి సీరియస్..’ అని ఎల్లో మీడియాలో డ్రామా వార్తలు మినహా ప్రభుత్వం ఒరగబెట్టిందేమీ లేదు. సర్కారు నిర్వాకంతో ఊరూరా చిన్న, సన్నకారు రైతులు యూరియా దొరక్క తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: రైతులకు యూరియా, ఇతర ఎరువులను సరఫరా చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. ‘యూరియాతో సహా ఎరువులన్నీ డిమాండ్కు సరిపడా నిల్వలున్నాయి. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు’ అంటూ చేస్తున్న ప్రకటనలకు.. వాస్తల పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదు. ఇప్పటికే ఆర్బీకేలను నిర్వీర్యం చేసిన కూటమి ప్రభుత్వ.. ఇప్పుడు ఆర్బీకేలను ఇంకా పతనావస్థకు తీసుకెళ్తూ.. ఇక్కడికి రావాల్సిన యూరియా స్టాకును అటు నుంచి అటే బ్లాక్ మార్కెట్కు మళ్లించేందుకు అధికార పార్టీల నేతలకు స్వేచ్ఛ ఇచ్చింది. దీంతో వారు వ్యాపారులతో కమీషన్లు తీసుకుని అధిక ధరలతో విక్రయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇందుకోసం మార్కెట్లో యూరియాకు కృత్రిమ కొరత సృష్టించి రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారు. యూరియా దొరకడం గగనంగా మారడంతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. వచ్చిన స్టాక్ను వచ్చినట్లు టీడీపీ నేతలు దారి మళ్లించిన విషయాన్ని ఇటీవల ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో ప్రభుత్వ పెద్దలు ఉలిక్కిపడ్డారు. అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయినా.. చర్యలు తప్పవంటూ ఎల్లో మీడియా వేదికగా సీరియస్ అయినట్లు డ్రామాలతో రైతులను మభ్యపెడుతున్నారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్)తో పాటు రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్కే) ద్వారా సరఫరాను పెంచాలని రైతుల నుంచి డిమాండ్ వస్తోందని జిల్లా కలెక్టర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. మరో వైపు మార్క్ఫెడ్–ప్రైవేటు వ్యాపారులకు ఇప్పటివరకు ఉన్న 50ః50 నిష్పత్తిలో జరుపుతున్న ఎరువుల కేటాయింపులను ఇక నుంచి 70ః30 నిష్పత్తిలో కేటాయిస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటన ఇంకా ఆచరణకు నోచుకోలేదు. స్టాకు లేక మూతపడిన సొసైటీలు అధిక వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నీరు దిగిన మెట్ట పంటలతో పాటు ముంపునకు గురైన మాగాణి పొలాలకు యూరియా అత్యవసరం. వర్షాధారంతో సాగు చేసిన మెట్ట పైరులకు అదును దాటకముందే యూరియా బూస్టర్ డోస్ వెయ్యాలి. కానీ.. ఒక్క బస్తా యూరియా కూడా దొరకని పరిస్థితి నెలకొంది. మార్క్ఫెడ్ వద్ద చాలినంత స్థాయిలో యూరియా నిల్వల్లేని కారణంగా ఆర్ఎస్కేలతో పాటు మెజార్టీ సొసైటీలు శనివారం మూసివేశారు. నో స్టాక్ బోర్డులు పెట్టకపోయినప్పటికీ యూరియా నిల్వల్లేని కారణంగా రైతులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సొసైటీలను మూయాల్సి వస్తోందని సిబ్బంది చెబుతున్నారు. కొద్దిపాటి నిల్వలున్న సొసైటీల వద్ద రైతులు గంటల తరబడి పడిగాపులు పడుతున్న దృశ్యాలు అన్ని జిల్లాల్లోనూ కన్పిస్తున్నాయి. 80 శాతం ప్రైవేట్ డీలర్ల వద్దే.. రాష్ట్రంలో ఇప్పటివరకు 11.84 లక్షల టన్నుల ఎరువుల అమ్మకాలు జరగ్గా, దాంట్లో అత్యధికంగా యూరియా 4.89 లక్షల టన్నులు, కాంప్లెక్స్ 4.08 లక్షల టన్నులు, డీఏపీ 1.53 లక్షల టన్నులు, ఎస్ఎస్పీ 76 వేల టన్నులు, ఎంవోపీ 57 వేల టన్నులున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 6.23 లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉండగా, వాటిలో ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా ఉన్న యూరియా కేవలం 1.50 లక్షల టన్నులు, డీఏపీ 84 వేల టన్నులు మాత్రమే ఉంది. 17 జిల్లాల్లో యూరియా, 11 జిల్లాల్లో డీఏపీ డిమాండ్ కంటే చాలా తక్కువగా ఉన్నాయి. ఉన్న నిల్వల్లో 80 శాతానికి పైగా ప్రైవేటు డీలర్ల వద్దే ఉన్నాయి. సొసైటీలు, ఆర్ఎస్కేల్లో అరకొరగా ఉండడంతో పంపిణీలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రైవేటు డీలర్ల వద్ద బస్తా రూ.350 నుంచి రూ.400 చొప్పున, డీఏపీ రూ.1,400 నుంచి రూ.1550 వరకు బ్లాకులో విక్రయిస్తున్నారు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే ఈ సీజన్లో యూరియాతో పాటు ఎరువులు అధికంగా వాడేస్తున్నారంటూ ప్రభుత్వం తమను తప్పుపడుతుండడం ఎంత వరకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు. బస్తా కూడా పట్టుకోలేని టాస్క్ఫోర్స్ బృందాలు రైతుల ముసుగులో సొసైటీలు, రైతుసేవా కేంద్రాలకు సరఫరా అవుతున్న యూరియా నిల్వలను టీడీపీ నేతలు పక్కదారి పట్టించి, బ్లాక్లో విక్రయిస్తున్న ఘటనలు వెలుగు చూసినా ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. వ్యవసాయేతర అవసరాలతో పాటు సరిహద్దు జిల్లాలు దాటి పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్న యూరియాను అడ్డుకునేందుకు జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన టాస్్కఫోర్సు బృందాలు మొక్కుబడి తనిఖీలకే పరిమితమయ్యాయి. టీడీపీ నేతల గోదాముల జోలికి మాత్రం పోవడం లేదని స్పష్టమవుతోంది. అధికార టీడీపీ నేతల గోదాములను తనిఖీ చేసి, పెద్ద ఎత్తున నిల్వ చేసిన యూరియా నిల్వలను ఒక్క చోట అయినా వెలికి తీశారా అని ఏపీ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అన్ని ఊళ్లలో అదే దుస్థితి ⇒ నంద్యాల జిల్లా గోస్పాడు మండలం పసురపాడు గ్రామానికి వచ్చిన 266 బస్తాల యూరియాను గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలే పప్పుబెల్లాల్లా పంచుకున్నారు. మిగిలిన స్టాక్ను స్థానిక టీడీపీ నాయకుడు రూ.430 చొప్పున అమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటకు తెలియడంతో ప్రస్తుతం ఒక్కో రైతుకు కేవలం ఒక యూరియా బస్తా మాత్రమే ఇస్తున్నారు. ⇒ ఉమ్మడి కృష్ణా జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా వేధిస్తోంది. పీఏసీఎస్లు, ప్రైవేట్ ఫెర్టిలైజర్స్ దుకాణాల వద్ద రైతులు పడిగాపులు పడాల్సి వస్తోంది. పెడన మండలం నందమూరు విశాల సహకార పరపతి సంఘం వద్దకు అన్నదాతలు భారీగా తరలి రావడంతో పోలీసులను పిలిపించాల్సి వచ్చింది. గన్నవరంలో ఓ ఫెర్టిలైజర్ దుకాణం వద్ద రైతులు బారులు తీరారు. వ్యవసాయ శాఖ కొత్తగా పెట్టిన నిబంధనల మేరకు అన్నదాతలు ఆధార్కార్డు, పట్టాదారు పాస్బుక్, కౌలుకార్డు వెంట తీసుకుని వచ్చారు. ⇒ శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలో ప్రైవేటు ఎరువుల దుకాణం వద్ద శనివారం రైతులు పడిగాపులు కాశారు. ఇక్కడ కేవలం 120 బస్తాలు మాత్రమే ఉన్నాయని చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్ వైవీ పద్మావతి, వ్యవసాయ శాఖ ఏఓను నిలదీసి ఎరువుల షాప్ షట్టర్ దించేశారు. దీంతో పంపిణీ వాయిదా పడింది. ⇒ అనకాపల్లి జిల్లా మునగపాకలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కర్రి అప్పారావు ఆధ్వర్యంలో రైతులు పీఏసీఎస్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఎరువుల నిల్వలు ఏమయ్యాయో చెప్పాలని రైతులు నిలదీశారు. ⇒ శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల రైతులు ఒడిశాకు వెళ్లి యూరియా తెచ్చుకుంటున్నారు. స్థానికంగా యూరియా కొనాలంటే అదనంగా జింకు, ఇతర మందులు కొనుగోలు చేయాలంటూ డీలర్లు తమపై ఒత్తిడి చేస్తున్నారంటూ రైతులు వాపోయారు. ⇒ కాకినాడ జిల్లా సామర్లకోటలోని నీలమ్మ చెరువు వద్ద ఉన్న ప్రాథమిక సహకార సంఘం ద్వారా యూరియా పంపిణీకి టోకెన్లు పంపిణీ చేస్తుండగా తోపులాట జరిగింది. దీంతో సిబ్బంది టోకెన్లు పంపిణీ నిలిపి వేశారు. ⇒ ఏలూరు జిల్లాలో యూరియా కొరతే లేదని కలెక్టర్ ప్రకటించారు. అయితే కలెక్టరేట్కు కూతవేటు దూరంలో ఉన్న శనివారపుపేట కోఆపరేటివ్ సొసైటీకి శనివారం సిబ్బంది తాళాలు వేశారు. టీడీపీ అనుచరులకే యూరియా విజయనగరం జిల్లా సంతకవిటి మండలం మండాకురిటి గ్రామంలోని టీడీపీ నాయకులు వీఏఏ (విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్) లేకుండానే దౌర్జన్యంగా ఆర్ఎస్కే తలుపులు తీసి తమ అనుచర వర్గానికి యూరియా బస్తాలను పంపిణీ చేశారు. ఆర్ఎస్కేకు వచ్చిన 450 యూరియా బస్తాల పంపిణీని శనివారం చేపట్టారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ బత్తుల జ్యోతీశ్వరరావు ఆర్ఎస్కేకు చేరుకుని టీడీపీ నేతలను నిలదీశారు. అప్పటికే 70 శాతం మేర యూరియా టీడీపీ కార్యకర్తలకు ఇచ్చేశారు. ఎరువుల అడ్డగోలు పంపిణీపై ఏం చర్యలు తీసుకుంటారని వీఏఏ ఎం.కుసుమను సర్పంచ్ ప్రశ్నించారు.గోదాం వద్దకు వెళ్తుంటే తమ్మినేని అరెస్ట్ శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస రైల్వే గూడ్స్ గోదాం వద్ద నుంచి ఎరువులు పక్కదారి పడుతున్నాయనే సమాచారంతో శనివారం కుమారుడు చిరంజీవి నాగ్తో కలిసి అక్కడికి బయలుదేరిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను పోలీసులు అడ్డుకున్నారు. తమ్మినేని వాహనాన్ని అడ్డుకుని వెనుదిరగాలని కోరారు. తమ్మినేని వెనుదిరిగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో పోలీసులు ముందుకు కదలనీయలేదు. దీంతో ఆయన రోడ్డుపై బైఠాయించారు. అనంతరం పోలీసులు ఆయన్ను బలవంతంగా జీపు ఎక్కించి ఇంటికి తీసుకెళ్లి గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి నాగ్ వ్యవసాయ అధికారి మెట్ట మోహనరావుతో మాట్లాడుతూ జిల్లాకు ఎన్ని బస్తాల ఎరువులు వచ్చాయి, ఎన్ని ఇచ్చారని ప్రశ్నించగా ఆయన కాకి లెక్కలు చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన అనంతరం తమ్మినేని విలేకరులతో మాట్లాడారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై మూడు నెలలైనా ఎరువులు ఇవ్వలేదని తెలిపారు. రైతుల ఉసురు ప్రభుత్వానికి తప్పక తగులుతుందన్నారు. బహిరంగ మార్కెట్లోనూ ఎరువుల కొరత సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తన రాజకీయ చరిత్రలో ఇలాంటి దుస్థితి ఎప్పుడూ చూడలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే వేలాది మంది రైతులతో ప్రజా పోరాటం చేస్తామని ప్రకటించారు.వ్యవసాయం చేయలేం ప్రస్తుతం వరి పంటకు పొటాష్, యూరియా చాలా అవసరం. పొటాష్ను పెద్దాపురంలో బస్తాకు రూ.50 అదనంగా చెల్లించి కొనుగోలు చేశాను. కానీ యూరియా లభించడం లేదు. సొసైటీ వద్ద రైతుకు ఒక్కో బస్తా మాత్రమే ఇస్తున్నారు. నేను 20 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాను. ఇలాగైతే ఎలా? – గుణ్ణం వీర్రాజు, రైతు, సామర్లకోట -
ఇప్పటిదాకా ఓ లెక్క.. ఇప్పటినుంచి మరో లెక్క: ఏపీ జేఏసీ అమరావతి
సాక్షి, విజయవాడ: మూడు నెలల్లో పెండింగ్ బకాయిలు క్లీయర్ చేయకపోతే పోరుబాట పడతామని చంద్రబాబు సర్కార్ను ఏపీ జేఏసీ అమరావతి హెచ్చరించింది. ఇవాళ(శనివారం) కార్యవర్గ సమావేశంలో ప్రభుత్వంపై మా వైఖరీలో ‘‘ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క’’ అంటూ తేల్చి చెప్పింది. ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు మాట్లాడుతూ.. ఏడాది దాటినా కానీ.. సీఎం, కేబినెట్ ఉపసంఘం మాతో చర్చించలేదన్నారు. ఉద్యోగులకు సంబంధించిన అన్ని సమస్యలు తీరుస్తామని గతంలో చంద్రబాబు చెప్పారు. జూన్లో జరగాల్సిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఆగస్టులో జరిగాయి. ఏ అంశం పరిష్కారం కాలేదు’’ అని ఆయన మండిపడ్డారు.‘‘ఒక్కో ఉద్యోగికి మూడు నుండి 5లక్షలు, రిటైర్డ్ ఉద్యోగులకు 15 నుండి 20 లక్షలు బకాయిలు ఉన్నాయి. సీఎస్ఎంఎఫ్లో సంబంధం లేకుండా ప్లే స్లిప్లో మా బకాయిలు చూపించాలి. నాలుగు డీఎలు పెండింగ్లో ఉన్నాయి. డీఏ, ఐఆర్ కోల్పోవడం, బకాయిలు ఇవ్వకపోవడంతో వేల కోట్లు నష్టపోయాం. మా హక్కును మేం అడుగుతున్నాం. మూడు నెలల్లో బకాయిలు చెల్లించకపోతే పోరుబాట పడతాం’’ అని బొప్పరాజు చెప్పారు.ఏపీ జేఏసీ అమరావతి ప్రధాన కార్యదర్శి దామోదర్ మాట్లాడుతూ.. ఉద్యోగి కుటుంబం నుంచి వచ్చానని చెప్పిన పవన్ ఇప్పుడు మాట్లాడటం లేదు. 2023 నుంచి ఐఆర్ రావాలి. వేల కోట్లు బకాయిలు ఉన్నాయి. మా సమస్యలు పరిష్కరించకుంటే ఎటువంటి ఉద్యమాకైన సిద్ధం. ప్రభుత్వ స్థలాలు, ఆర్టీసీ స్థలాలు ప్రైవేట్ వ్యాపారవేత్తలకు అప్పగిస్తే సంపద సృష్టి జరగదు. -
బాబు సర్కార్ అప్పులు.. కాగ్ నివేదికపై వైఎస్ జగన్ ట్వీట్
తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళ వ్యక్తం చేశారు. ప్రధానంగా ఆదాయాలు తగ్గిపోయి, అప్పులు పెరిగిపోవడంపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కాగ్ నివేదికలను ఉటంకిస్తూ వైఎస్ జగన్ తన సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. ‘రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు భారీగా తగ్గి, అప్పులు పెరిగి పోతున్నాయి. కూటమి ప్రభుత్వ విధానాలతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై కాగ్ నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2019–24 మధ్య మా ప్రభుత్వంపై టీడీపీ, జనసేన పార్టీలు పదేపదే అబద్దాలు చెప్పాయి. రాష్ట్రంలో ఆదాయ వృద్ది తగ్గిందనీ, అభివృద్ది అనేదే లేదని తప్పుడు ప్రచారం చేశాయి. 𝙏𝙝𝙚 𝘾𝘼𝙂 𝙛𝙞𝙜𝙪𝙧𝙚𝙨 𝙧𝙚𝙫𝙚𝙖𝙡 𝙘𝙤𝙣𝙩𝙞𝙣𝙪𝙞𝙩𝙮 𝙤𝙛 𝙛𝙞𝙨𝙘𝙖𝙡 𝙨𝙩𝙧𝙚𝙨𝙨During the five year period, 2019-24, the then opposition parties TDP and JSP continuously lied that the then Government’s policies were resulting in unchecked growth in liabilities and… pic.twitter.com/X0JeWvpxVE— YS Jagan Mohan Reddy (@ysjagan) August 23, 2025 తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామంటూ కూటమి నేతలు నమ్మబలికారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆదాయాలు భారీగా తగ్గాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయాలు కేవలం 3.08% మాత్రమే పెరిగాయి. కేంద్ర ప్రభుత్వ ఆదాయాల వృద్ది 12.04% పెరగగా, ఏపీ ఆదాయం భారీగా తగ్గిపోయింది. కూటమి ప్రభుత్వం చెప్పినట్టు నిజంగానే ఏపీ ఆర్థిక వృద్ధి 12.02% ఉంటే, మరి ఆదాయం పెరుగుదల 3.08% దగ్గరే ఎందుకు ఆగిపోయింది?, గతేడాదితో పోల్చితే ఈఏడాది కొంత ఆశాజనకంగా ఉంటుందనుకుంటే మొదటి నాలుగు నెలల్లో కూడా అదే పరిస్థితి నెలకొంది. ప్రజల్లో కొనుగోలు శక్తి కూడా బాగా తగ్గిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆదాయాల వృద్ది పది శాతం ఉండాల్సి ఉండగా, కేవలం 2.39% మాత్రమే ఉంది. మా హయాంలో అన్ని రకాల అప్పులు కలిపి రూ.3,32,671 కోట్లు మాత్రమే. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ 14 నెలల్లోనే ఏకంగా రూ. 1,86,361 కోట్లు అప్పు చేసింది. అంటే మా ఐదేళ్ల హయాంలో చేసిన అప్పుల్లో ఇప్పటికే 56% చేశారు. ఆదాయాలు తగ్గి, అప్పులు పెరిగిపోతున్న ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పునరాలోచన చేయాలి. అన్ని స్థాయిల్లో పెరిగిన అవినీతిని అరికట్టాలి’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. -
‘చంద్రబాబు కుట్ర.. దివ్యాంగుల నోటి దగ్గర కూడు లాక్కుంటున్నారు’
సాక్షి, తాడేపల్లి: దివ్యాంగులను కూడా చంద్రబాబు సర్కార్ వేధిస్తోందని.. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పెన్షన్లు తొలగింపుపై బాధితులతో కలిసి కలెక్టర్ని కలుస్తామని తెలిపారు. దివ్యాంగుల నోటి దగ్గర కూడును చంద్రబాబు లాగేసుకుంటున్నారు. వైఎస్ జగన్ హయాంలో అర్హుందరికీ పెన్షన్ ఇచ్చారు. చంద్రబాబు ఐదు లక్షల పెన్షన్ల తొలగింపునకు కుట్ర పన్నారు. ఎన్నో ఏళ్లుగా పెన్షన్లు పొందుతున్న వారికి కూడా ఇప్పుడు కట్ చేశారు’’ అంటూ మేరుగ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘బాధితులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నా చంద్రబాబుకు కనపడటం లేదు. దివ్యాంగులకు వైఎస్ జగన్ హయాంలోనే న్యాయం జరిగింది. చంద్రబాబు హయాంలో 55 సదరన్ క్యాంపులు ఉంటే.. వాటిని జగన్ 171కి పెంచారు. దివ్యాంగులకు మేలు చేయాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ పని చేశారు. వాలంటీర్ల ద్వారా నేరుగా ఇంటికే పెన్షన్లు అందించారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం పెన్షన్లను తగ్గించే కుట్ర చేసింది’’ అంటూ మేరుగ నాగార్జున నిప్పులు చెరిగారు.‘‘పెన్షన్లు రాలేదన్న బాధతో చల్లా రామయ్య అనే బాపట్ల యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. అడ్డుకోబోయిన 15 మంది వైఎస్సార్సీపీ నేతలపై కేసు పెట్టారు. ఇదేనా పరిపాలన అంటే?. లంచాలు ఇస్తే వైకల్యం పెంచేలా సర్టిఫికేట్లు ఇవ్వటం అత్యంత దారుణం. సోమవారం గ్రీవెన్స్ సందర్భంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ని కలుస్తాం. మా నియోజకవర్గంలో తొలగించిన 2,500 పెన్షన్ల వ్యవహారంపై ఫిర్యాదు చేస్తాం. కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వక పోగా లక్షలాది పెన్షన్లు తొలగింపు అన్యాయం’’ అని మేరుగ నాగార్జున దుయ్యబట్టారు. -
పోలవరం నిర్వాసితులకు పునరావాసంలో అంతులేని నిర్లక్ష్యం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మండిపడింది. సకాలంలో పునరావాసం కల్పించకపోతే నిర్వాసితుల జీవితాలు ప్రమాదంలో పడతాయని ఆందోళన వ్యక్తం చేసింది. జీవనోపాధిని పెంచేలా నిర్వాసితులకు పునరావాసం కల్పించడాన్ని అత్యంత ప్రాధాన్యతగా చేపట్టాలని సిఫార్సు చేస్తూ పార్లమెంట్కు ఇటీవల స్టాండింగ్ కమిటీ నివేదిక ఇచ్చింది. జలవనరుల విభాగంపై ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ అధ్యక్షతన ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ.. ఈ ఏడాది జూన్ 8 నుంచి 11 వరకు పోలవరం ప్రాజెక్టు పనులు, పునరావాసం కల్పనను క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. దీనిపై పార్లమెంట్కు నివేదిక ఇచ్చింది. 12,797 కుటుంబాలకే పునరావాసం పోలవరం ప్రాజెక్టులో 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేస్తే 1,06,006 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. ఇందుకోసం 213 పునరావాస కాలనీల్లో ఇళ్లు నిర్మించి, మౌలిక సదుపాయాలు కల్పించాలి. కానీ, 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేసేలా.. పోలవరం ప్రాజెక్టును 2026 మార్చి నాటికి పూర్తి చేయాలని కేంద్ర కేబినెట్ నిర్దేశించింది. వరదలు, సాంకేతిక సమస్యలు వస్తే.. ప్రాజెక్టును పూర్తి చేసేందుకు మరో ఏడాది గడువు పొడిగించింది. ఆ మేరకు నిధులు ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ ప్రాజెక్టులో 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేస్తే 38,060 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. కానీ, జనవరి 8 నాటికి కేవలం 12,797 కుటుంబాలకే పునరావాసం కల్పించారని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికలో ఎత్తిచూపింది. తక్షణమే నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. పోలవరం నిర్మాణం, నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులను సమన్వయం చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. పనులను పర్యవేక్షిస్తున్న అధికారులకు వెంటనే ప్రాజెక్టు వద్ద క్వార్టర్స్ నిరి్మంచాలని సిఫార్సు చేసింది. ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేలా పనులను ఎప్పటికప్పుడు సమీక్షించడానికి కమిటీని నియమించాలని సిఫార్సు చేసింది. పోలవరం ప్రాజెక్టు వద్ద ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేస్తే స్థానికులకు ఉపాధి కల్పించవచ్చని అభిప్రాయపడింది. -
డిగ్రీ ఆప్షన్లలో గందరగోళం
సాక్షి, అమరావతి: డిగ్రీ ప్రవేశాల్లో విద్యార్థులు వెబ్ ఆప్షన్ల నమోదులో కూటమి ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తోంది. ఓఏఎండీసీ పోర్టల్లో సొంతంగా ఆప్షన్లు ఎంపిక చేసుకోవడంతోపాటుగా కళాశాలలకు నేరుగా వెళ్లి దరఖాస్తు ఇవ్వడం ద్వారా విద్యార్థులు ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చని ప్రకటించడం సీట్ల భర్తీపై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. ఈ మేరకు శుక్రవారం ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన మార్గదర్శకాలు విద్యార్థుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఆన్లైన్లో సులభంగా ఆప్షన్ల వెసులుబాటు ఉన్నప్పుడు కళాశాలలకు వెళ్లాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్న వినిపిస్తోంది. ఒక విద్యార్థి ఆన్లైన్లో తనకు నచి్చన కళాశాల కోర్సును ఎంపిక చేసుకోవచ్చు. ఇలా ఎన్ని కళాశాలల్లో ఎన్ని కోర్సులకైనా ఆప్షన్లు పెట్టుకోవచ్చు. కానీ, ఉన్నత విద్యా మండలి మాత్రం వెబ్ ఆప్షన్లకు రెండు మార్గాలుగా అవకాశం కల్పిస్తోంది. ఇక్కడ విద్యార్థి సొంతంగా ఆన్లైన్లో కాకుండా నేరుగా కళాశాలకు వెళ్లి దరఖాస్తు చేసుకుంటే.. ఆ కళాశాలలో సీటు రాకపోతే సదరు విద్యార్థి పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకం. పోనీ, ఒక కళాశాలకు వెళ్లి అక్కడి కోర్సుల్లో ఆప్షన్లతోపాటు వేరే కళాశాలలోని కోర్సుల ఆప్షన్ల ఎంపిక కుదరదు. మళ్లీ ఇక్కడ విద్యార్థి ఆన్లైన్లో ఆç³్షన్ పెట్టుకోవాలి/మరో కళాశాలలకు వెళ్లి విడిగా దరఖాస్తు చేసుకోవాలి. ఆప్షన్ల మార్పు సమయంలో ఆన్లైన్లో పెట్టిన ఆప్షన్లు ఎన్నైనా మార్చుకోవచ్చు. కానీ, కళాశాలకు వెళ్లి నమోదు చేసుకున్న ఆప్షన్ను మార్చడానికి వీలుపడదు. ఇది విద్యార్థి ప్రాథమిక హక్కును హరించడమే. -
నోటీసులు అందుకున్న వారికి వచ్చే నెలలో పింఛన్లు రావు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అనర్హత నోటీసులందుకున్న దివ్యాంగులకు వచ్చేనెలలో పింఛన్లు అందవని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. రీ అసెస్మెంట్లో వైద్య పరీక్షలు పూర్తయి మళ్లీ సర్టిఫికెట్లు వచ్చాకే వారికి తిరిగి పింఛన్లు వస్తాయని ఆయన స్పష్టంచేశారు. ప్రస్తుతం దివ్యాంగ పింఛనుదారులకు అనర్హుల పేరిట టీడీపీ కూటమి ప్రభుత్వం భారీ సంఖ్యలో నోటీసులు జారీచేస్తుండడంపై వివాదం రగులుతున్న నేపథ్యంలో.. శుక్రవారం ఆయన రాష్ట్ర సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో 2.07 లక్షల మంది దివ్యాంగులకు కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయని.. అంతకుముందు 15 ఏళ్లలో ఆరు లక్షల మంది దివ్యాంగులకు పింఛన్లు ఉన్నాయని చెప్పారు. అయితే, గత ఏడాది తమ ప్రభుత్వం వచ్చాక దీనిపై అధ్యయనం చేస్తే చాలామంది అనర్హులకు వికలాంగ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు తేలిందని.. దీంతో మొత్తం అన్ని సర్టిఫికెట్లు పరిశీలించాలని ఆదేశించామన్నారు. ఇక ప్రస్తుతమున్న మొత్తం 7.95 లక్షల మంది దివ్యాంగుల పింఛనుదారులకుగాను 5.50 లక్షల మందికి సంబంధించిన రీ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిందని, అందులో 80 వేల మంది అనర్హులుగా తేలగా, వారికి నోటీసులు జారీచేసినట్లు మంత్రి తెలిపారు. ఇదిలా ఉంటే.. అనర్హులుగా తేలిన వారిని వారి అర్హతబట్టి ఇతర పింఛన్లకు మళ్లిస్తున్నామని.. ఇలా 20 వేల మందిని వృద్ధాప్య పింఛన్ల కిందకు మార్చినట్లు మంత్రి చెప్పారు. వితంతువులు ఉంటే వాళ్లను వితంత పింఛన్లకు మారుస్తున్నామన్నారు. ఇక 2024 జులైలో 65.18 లక్షలు మందికి పింఛన్లు ఇచ్చామని.. ఇప్పుడు 63.71 లక్షల మందికి ఇస్తున్నామని.. ఈ తగ్గిన పింఛన్లు మరణించిన వారివి మాత్రమేనని మంత్రి శ్రీనివాస్ చెప్పారు. -
వరద తగ్గుముఖం.. కొనసాగుతున్న ప్రవాహం
సాక్షి, అమరావతి, పోలవరం రూరల్, ధవళేశ్వరం, విజయపురిసౌత్: వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణా, గోదావరి నదుల్లో వరద ఉధృతి క్రమేణా తగ్గుతోంది. ప్రకాశం బ్యారేజీలోకి 4,33,398 క్యూసెక్కులు చేరుతుండగా కృష్ణా డెల్టా కాలువలకు 16,776 క్యూసెక్కులు వదలుతూ మిగులుగా ఉన్న 4,16,622 క్యూసెక్కులను అధికారులు సముద్రంలోకి వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీలోకి 13,54,996 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. గోదావరి డెల్టా కాలువలకు 12,600 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 13,42,396 క్యూసెక్కుల గోదావరి జలాలను సముద్రంలోకి వదిలేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 5,26,876 క్యూసెక్కులు కృష్ణాజలాలు చేరుతుండగా.. 4,86,493 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి 4,32,217 క్యూసెక్కులు చేరుతుండగా.. 4,05,532 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 3,82,121 క్యూసెక్కులు చేరుతుండగా 3,58,902 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులోకి 11,75,859 క్యూసెక్కులు చేరుతుండగా అంతే పరిమాణంలో దిగువకు వదిలేస్తున్నారు. -
అందరి సమ్మతితోనే కావేరికి గోదావరి
సాక్షి, అమరావతి: గోదావరి ట్రిబ్యునల్ కేటాయింపులకు భంగం వాటిల్లకుండా, ఏ రాష్ట్ర హక్కులకు విఘాతం కలగకుండా, పరివాహక ప్రాంతం (బేసిన్)లోని రాష్ట్రాల సమ్మతితో గోదావరి–కావేరి అనుసంధానం చేపడతామని నదుల అనుసంధానం టాస్క్ ఫోర్స్ కమిటీ, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ అతుల్ జైన్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో శుక్రవారం ఆయన అధ్యక్షతన టాస్క్ ఫోర్స్ కమిటీ ఆరో సమావేశం జరిగింది. గోదావరి–కావేరి, బెడ్తి–వరద అనుసంధానంపై ఏకాభిప్రాయసాధనే అజెండాగా నిర్వహించిన ఈ సమావేశంలో బేసిన్లోని తొమ్మిది రాష్ట్రాలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక), కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి జలవనరులశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ అనుసంధానంపై అతుల్ జైన్ తొలుత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఇంద్రావతి సబ్ బేసిన్లో ఛత్తీస్గఢ్ కోటాలో వాడుకోని 148 టీఎంసీల గోదావరి జలాలను ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్ (కృష్ణా), సోమశిల (పెన్నా), అరణియార్ రిజర్వాయర్ మీదుగా కావేరికి తరలిస్తామని చెప్పారు. దీన్లో అంతర్భాగంగా కర్ణాటకలో బెడ్తి–వరద అనుసంధానం చేపడతామన్నారు. కావేరికి తరలించే 148 టీఎంసీల గోదావరి జలాలు, బెడ్తి–వరద అనుసంధానంలో తరలించే 18.5 టీఎంసీలు వెరసి 166.5 టీఎంసీలలో.. తెలంగాణకు 43.65, ఆంధ్రప్రదేశ్కు 43.86, తమిళనాడుకు 40.93, కర్ణాటకకు 34.40, పుదుచ్చేరికి 2.19 టీఎంసీలు కేటాయిస్తామని వివరిటంచారు. రెండోదశలో గంగా–మహానది, మహానది–గోదావరి అనుసంధానంతో కావేరికి మరిన్ని జలాలు తరలిస్తామని, అప్పుడు ఛత్తీస్గఢ్ కోటా 148 టీఎంసీలను ఆ రాష్ట్రానికే ఇస్తామని చెప్పారు. రెండోదశ అనుసంధానంలో రాష్ట్రాల అవసరాల మేరకు నీటిని కేటాయిస్తామన్నారు. తొలిదశ అనుసంధానానికి అన్ని రాష్ట్రాలు సమ్మతి వ్యక్తం చేస్తే తక్షణమే ప్రాజెక్టును చేపడతామని ఆయన చెప్పారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నదంటే.. ఆంధ్రప్రదేశ్: గోదావరిలో నీటిలభ్యతపై సీడబ్ల్యూసీ మళ్లీ అధ్యయనం చేసి నికరజలాల్లో మిగులు తేల్చాలి. ఇచ్చంపల్లి నుంచి గోదావరి జలాలను తరలిస్తే ఏపీ హక్కులకు భంగం వాటిల్లుతుంది. పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపడితే ఏ రాష్ట్ర హక్కులకు భంగం వాటిల్లదు. నికర, వరదజలాల సమస్య ఉత్పన్నం కాదు. నాగార్జునసాగర్, సోమశిల రిజర్వాయర్లను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లుగా వినియోగించుకుంటే వాటి ఆయకట్టు ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంది. వరదల్లో కృష్ణా, పెన్నా నిర్వహణ కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్, శ్రీశైలం, పులిచింతల, సోమశిల రిజర్వాయర్లపై సిమ్యులేషన్ స్టడీస్ నిర్వహించాలి. తెలంగాణ: ఇచ్చంపల్లి నుంచి గోదావరి జలాల తరలింపునకు అభ్యంతరం లేదు. కానీ ఈ అనుసంధానంలో తరలించే జలాల్లో 50 శాతం నీటిని మాకు కేటాయించాలి. నాగార్జునసాగర్ ఆయకట్టుకు విఘాతం కలగకుండా చూడాలి. ఛత్తీస్గఢ్: ఇంద్రావతి సబ్బేసిన్లో ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. మా కోటా 148 టీఎంసీలను తరలించడానికి అంగీకరించం. మహారాష్ట్ర: ఇచ్చంపల్లి బ్యారేజీలో నీటిని వాడుకోవడానికి అనుమతి ఇవ్వాలి. మధ్యప్రదేశ్: గోదావరి ట్రిబ్యునల్ అవార్డుకు విఘాతం కలగకుండా అనుసంధానించాలి. ఒడిశా: గోదావరి–కావేరి అనుసంధానం రెండోదశలో మహానది–గోదావరి అనుసంధానాన్ని అంగీకరించం. తమిళనాడు: మాకు నీటికేటాయింపు పెంచాలి. కర్ణాటక: కృష్ణాజలాల్లో మా వాటా పెంచాలి. కేరళ: కావేరి జలాల్లో మాకు అదనపు నీరు కేటాయించాలి. పుదుచ్చేరి: మాకు నీటికేటాయింపు పెంచాలి.నదుల అనుసంధానంలో ఏకాభిప్రాయమే ముఖ్యంపార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి కేంద్రం వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నదుల అనుసంధానంలో రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధనే ముఖ్యమని కేంద్ర జల శక్తి శాఖ పేర్కొంది. దీనిని విజయవంతం చేసేందుకు రాష్ట్రాలు ముందుకు రావాలని కోరింది. నదుల అనుసంధానంపై రాజీవ్ ప్రతాప్ రూఢీ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ లేవనెత్తిన పలు ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం జవాబులు ఇచి్చంది. గోదావరి–కావేరి నదుల అనుసంధానాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి.. 147.98 టీఎంసీల నీళ్ల బదిలీ కోసం ముసాయిదా డీపీఆర్ను ఇప్పటికే అన్ని పరీవాహక రాష్ట్రాలకు అందించినట్లు తెలిపింది. నదుల అనుసంధానం అమలు కోసం ముసాయిదా మెమొరాండం ఆఫ్ అసోసియేషన్(ఎంవోఏ)ను తయారు చేసి.. గతేడాది ఏప్రిల్లో రాష్ట్రాలకు పంపించినట్లు పేర్కొంది. అనుసంధాన ప్రక్రియపై ఏకాభిప్రాయం కోసం ఐదుసార్లు సమావేశాలు నిర్వహించామని తెలిపింది. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధన, ఎంవోఏపై సంతకాల కోసం కృషి చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. అలాగే దేశవ్యాప్తంగా చేపట్టనున్న నదుల అనుసంధానం ప్రతిపాదనలను కూడా కేంద్రం ప్రస్తావించింది. మొత్తంగా 30 ప్రాజెక్టులకు నివేదికలను సిద్ధం చేసినట్లు తెలిపింది. ఇందులో కెన్–బెత్వా లింక్ ప్రాజెక్ట్, గోదావరి–కావేరి లింక్ (గోదావరి–కృష్ణా, కృష్ణా–పెన్నా, పెన్నా–కావేరి), పర్బతి–కలిసిం«ద్–చంబల్ నదుల అనుసంధానాన్ని తొలి ప్రాధాన్యతగా గుర్తించినట్లు పేర్కొంది. 2030 నాటికి వీటిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది రూ.4 వేల కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు తెలిపింది. దీనిపై కమిటీ స్పందిస్తూ.. నీటి కొరత, కరువు నివారణ, వరద నియంత్రణకు ఆచరణీయమైన పరిష్కారాన్ని నదుల అనుసంధానం అందిస్తుందని అభిప్రాయపడింది. సంబంధిత రాష్ట్రాలకు దీనిపై అవగాహన పెంచి.. ఈ ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయాలని సూచించింది. -
డీఎస్సీ–2025 మెరిట్ లిస్టుల విడుదల
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ–2025 మెరిట్ జాబితాలను శుక్రవారం అర్ధరాత్రి ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర, జోన్, జిల్లా స్థాయిలో అన్ని సబ్జెక్టుల వారీగా మెరిట్ లిస్టులను ప్రకటించింది. వీటిని డీఎస్సీ అధికారిక వెబ్సైట్ (http;//apdrc.apcfrr.in/లోనూ, సంబంధిత జిల్లా విద్యాశాఖ వెబ్సైట్లలోనూ అందుబాటులో ఉంచామని డీఎస్సీ–2025 కన్వినర్ ఎంవీ కృష్ణారెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వివిధ కేటగిరీ పోస్టులకు సంబంధించి జోన్ ఆఫ్ కన్సిడరేషన్లోకి వచ్చిన అభ్యర్థులకు వారి వ్యక్తిగత డీఎస్సీ లాగిన్ ఐడీల ద్వారా కాల్ లెటర్లు అందిస్తామన్నారు. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్లను డౌన్లోడ్ చేసుకుని అందులో సూచనలను అనుసరించాలని ఆయన పేర్కొన్నారు. సదరు అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు తాజాగా తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం, గెజిటెడ్ అధికారి ధ్రువీకరించిన మూడుసెట్ల జిరాక్స్ కాపీలు, ఐదు పాస్పోర్టు సైజు ఫొటోలతో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలి. అంతకుముందే సంబంధిత సర్టిఫికెట్లను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీ, టైముకి సర్టిఫికెట్ల పరిశీలనకు వ్యక్తిగతంగా హాజరుకావాలి. హాజరుకాని అభ్యర్థుల అభ్యర్థిత్వం రద్దుచేస్తారు. మెరిట్ లిస్టులో తదుపరి ఉన్న అభ్యర్థిని సర్టిఫికెట్ల పరిశీలకులు పిలుస్తారు. ఇక సర్టిఫికెట్ల పరిశీలనకు వచ్చినంత మాత్రాన అభ్యర్థులు ఎంపిక అయినట్లు కాదని డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి స్పష్టంచేశారు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా మెరిట్, అర్హత, సంబంధిత నియమ నిబంధనలకు అనుగుణంగా జరుగుతుందని స్పష్టంచేశారు. ఇక రాష్ట్రస్థాయి పోస్టులైన ప్రిన్సిపాల్, పీజీటీ, టీజీటీ పోస్టులకు రాష్ట్రస్థాయి, జోనల్ స్థాయిలో ర్యాంకులను ప్రకటించగా.. స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీలకు ఉమ్మడి జిల్లాల వారీగా ర్యాంకులు, స్కోర్ను విడుదల చేశారు. పీజీటీ రాష్ట్ర టాపర్లు వీరే.. ఇంగ్లిష్ : వారణాశి లక్ష్మీ స్వరూప (87 స్కోరు) హిందీ : రమేష్ రామనుకొలను (93.5 స్కోరు) సంస్కృతం: తునికిపాటి భాను (94 స్కోరు) తెలుగు: పట్నాన ధర్మారావు (85.5 స్కోరు ) బయాలజీ (ఇంగ్లిష్ మీడియం): చోడవరం శివకుమార్ (81.5 స్కోరు) గణితం (ఇంగ్లిష్ మీడియం): సంకరణం విజయ్ (78.5 స్కోరు) ఫిజిక్స్ (ఇంగ్లిష్ మీడియం): బాలకిశోర్ కురాకుల (74.5 స్కోరు) సోషల్ స్టడీస్ (ఇంగ్లిష్ మీడియం): నిరోషా కురమాన (85 స్కోరు) ప్రిన్సిపాల్: చింతల గౌతమ్ (75.5 స్కోరు) పీఈటీ రాష్ట్ర ర్యాంకర్లు.. అన్నెపు జగదీశ్వరరావు: 90.5 స్కోరు టీజీటీ ఇంగ్లిష్.. వెలగల రమ్యశ్రీ : 85.43 స్కోరు టీజీటీ హిందీ.. గొల్లపల్లి పవన్ నారాయణ్ కౌశిక్ శాస్త్రి: 88.53 స్కోరు టీజీటీ సంస్కృతం.. తునికిపాటి భాను: 93.60 స్కోరు టీజీటీ తెలుగు.. కల్లె మహేశ్బాబు: 85.20 స్కోరు టీజీటీ మ్యాథ్స్.. సుంకరణం విజయ్: 87.33 స్కోరు టీజీటీ సైన్స్.. బోకం అనిత: 77.89 స్కోరు టీజీటీ సోషల్ స్టడీస్.. బొమ్మిడి డిల్లేశ్: 84.20 -
కుప్పం నుంచి కుట్రలకు క్లాప్!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైద్య రంగంలో అందుబాటులో ఉన్న వనరులను నిర్వీర్యం చేస్తున్న కూటమి సర్కారు పీపీపీ ప్రాజెక్టుల పేరిట ప్రజాధనాన్ని దారి మళ్లిస్తోంది. ఇప్పటికే ఉన్న సమర్థ వ్యవస్థలను నీరుగారుస్తూ ‘డింక్’ (డిజిటల్ నెర్వ్ సెంటర్) పేరుతో ఓ ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో పైసా ఖర్చు లేకుండా వీడియో కాల్ ద్వారా మెడికల్ కాలేజీల్లోని హబ్లతో పీహెచ్సీలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్లను అనుసంధానించి స్పెషలిస్టులతో వైద్య సేవలు అందించగా గొప్పగా నడుస్తున్న ఈ వ్యవస్థలను అటకెక్కించిన బాబు సర్కారు ముడుపుల కోసం కొత్త ప్రాజెక్టును తెచ్చింది. గతంలో అందించిన టెలీ మెడిసిన్ సేవలకే కలరింగ్ ఇస్తూ సమర్థంగా సేవలు అందించిన విలేజ్ క్లినిక్స్కు పాతరేసింది. వైద్య సేవల్లో ఇప్పుడేదో సరికొత్త వ్యవస్థను తెస్తున్నట్లు మభ్యపెడుతూ ‘డింక్’ పేరుతో రూ.350 కోట్ల ప్రజాధనానికి టెండర్ పెట్టింది! సాక్షాత్తూ సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం కేంద్ర బిందువుగా ‘పైలెట్’ ప్రాతిపదికన ఈ దోపిడీ వ్యవహారాలకు రంగం సిద్ధమైంది. కొద్ది నెలలుగా ఇక్కడ ప్రైవేట్ భాగస్వామ్యంతో ‘డింక్’ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. వచ్చే ఏడాది ఆఖరునాటికి రాష్ట్రవ్యాప్తంగా దీన్ని విస్తరిస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. ‘డింక్’ ప్రాజెక్టులో భాగంగా రేషనలైజేషన్ పేరిట ఏకంగా 2,500 నుంచి 3 వేల విలేజ్ క్లినిక్లను మూసివేసేందుకు వైద్యశాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించడం గమనార్హం. గ్రామీణ స్థాయిలో మెరుగైన వైద్యాన్ని అందించిన వ్యవస్థలను నీరుగార్చి ప్రైవేట్ సంస్థల సేవల పట్ల మొగ్గు చూపడం ఏమిటనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ రంగంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ఎన్నికైన ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. ఈ క్రమంలో ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వ వైద్యులే నేరుగా ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి వైద్యం చేసేలా విప్లవాత్మక రీతిలో ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష లాంటి వినూత్న కార్యక్రమాలను తొలిసారిగా మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టారు. ఆరోగ్య సురక్షలో భాగంగా రాష్ట్రంలో ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి మరీ ప్రజలందరికీ హెల్త్ స్క్రీనింగ్ టెస్టులు చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25 లక్షల వరకు చికిత్సను పేదలకు ఉచితంగా అందించారు. వైద్య శాఖలో ఎప్పటి ఖాళీలు అప్పుడే భర్తీ చేస్తూ జీరో వేకెన్సీ విధానాన్ని అమలు చేశారు. ఏకంగా 54 వేలకుపైగా పోస్టులను భర్తీ చేసి ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బంది పోస్టులు ఖాళీ మాటే లేకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో నాడు జాతీయ స్థాయిలో గైనిక్ వైద్యుల కొరత 50% ఉంటే రాష్ట్రంలో కేవలం 1.4% మాత్రమే ఉంది. జాతీయ స్థాయిలో స్పెషలిస్ట్ వైద్యుల కొరత 61% ఉంటే ఏపీలో 6.2 శాతం మాత్రమే ఉండేది. కేవలం వైద్య నియామకాలే కాకుండా ఆస్పత్రుల్లో మందుల కొరతకు తావు లేకుండా చేశారు. ఇలా ప్రభుత్వ వనరులను సద్వినియోగం చేసుకుంటూ.. నిధులు దుర్వినియోగం కాకుండా 2019–24 మధ్య జగన్ వైద్య ఆరోగ్య శాఖను బలోపేతం చేస్తే నేడు పీపీపీ ప్రాజెక్టుల రూపంలో చంద్రబాబు ప్రజారోగ్యానికి గండి కొడుతున్నారు. ప్రభుత్వ నూతన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేశారు. రోగులకు ఆరోగ్య ఆసరాను ఎగరగొట్టారు. ఆరోగ్యశ్రీ బిల్లులు దాదాపు రూ.నాలుగు వేల కోట్లు పెండింగ్లో పెట్టడంతో నెట్వర్క్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోతున్నాయి. ‘డింక్’ ప్రాజెక్టు ఏమిటంటే..?‘డింక్’ పేరిట కుప్పంలో ఓ సెంటర్ను ఏర్పాటు చేసి నియోజకవర్గంలోని పీహెచ్సీలు, యూపీహెచ్సీలు అనుసంధానించారు. ఇక్కడికి వచ్చే రోగులకు డిజిటల్ హెల్త్ అకౌంట్ జారీచేసి ఈ సెంటర్ ద్వారా ఫోన్లో స్పెషలిస్ట్ వైద్యసేవలను అందచేస్తారు. అవసరం మేరకు వైద్యుడు వీడియో కాల్ చేసి రోగితో మాట్లాడి సలహాలు, సూచనలు ఇస్తారు. సెంటర్లో ఉండే ఆరోగ్య సిబ్బంది గర్భిణులు, బాలింతలు, ఇతరులకు ఆరోగ్య సంరక్షణపై సలహాలు, సూచనలు ఇస్తుంటారు. స్థూలంగా చెప్పాలంటే ‘డింక్’ ప్రాజెక్టు అచ్చు టెలీ మెడిసిన్ లాంటిదే. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే కుప్పం పరిధిలో రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకూ ప్రభుత్వం ఖర్చుచేసింది. దీన్ని రాష్ట్రం మొత్తం విస్తరించడానికి రూ.350 కోట్ల మేర ఖర్చవుతుందని సంబంధిత సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. టెలీ మెడిసిన్తో అంతకంటే మెరుగ్గా..గత ప్రభుత్వం పైసా కూడా దుర్వినియోగం కాకుండా అంతకంటే మెరుగ్గా ప్రజలకు టెలీ మెడిసిన్ సేవలను అందించింది. 26 జిల్లాల్లో వైద్య కళాశాలు, జిల్లా ఆస్పత్రుల్లో 27 హబ్లను వైద్యశాఖ ఏర్పాటు చేసింది. ఈ హబ్లకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,400కిపైగా పీహెచ్సీలు, 562 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 10,032 విలేజ్ క్లినిక్లను అనుసంధానం చేసింది. ఒక్కో హబ్లో ఇద్దరు జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్ లాంటి మూడు రకాల స్పెషలిస్ట్ వైద్యులతో పాటు ఇద్దరు మెడికల్ ఆఫీసర్ల సేవలు అందుబాటులో ఉంచింది. పీహెచ్సీ, విలేజ్ క్లినిక్కు వచ్చిన రోగులకు స్పెషాలిటీ వైద్యుల సేవలు అవసరమైన సందర్భాల్లో టెలీమెడిసిన్ ద్వారా హబ్లోని వైద్యులను సంప్రదించి వారి సూచనల మేరకు చికిత్స అందించారు. హబ్లోని వైద్యులు ఆడియో, వీడియో కాల్ ద్వారా రోగులతో మాట్లాడి సలహాలు, సూచనలు తెలియజేయడంతో పాటు ప్రిస్క్రిప్షన్ సూచించేవారు. పీహెచ్సీ, విలేజ్ క్లినిక్లో ఈ మందులను రోగులకు అందజేసే యంత్రాంగం అప్పట్లో పనిచేసింది. స్మార్ట్ఫోన్ ఉన్నవారు ఈ–సంజీవని (ఓపీడీ) యాప్ ద్వారా ఇంటి నుంచే వైద్యసేవలు పొందడానికి కూడా ఆస్కారం కల్పించారు. స్మార్ట్ఫోన్ లేనివారు, వినియోగం తెలియని వారికి ఆశావర్కర్లు సహాయపడ్డారు. ఇందుకోసం రాష్ట్రంలోని 42వేల మంది ఆశావర్కర్లకు స్మార్ట్ఫోన్లు పంపిణీ చేసిన గత ప్రభుత్వం వాటన్నింటినీ హబ్లకు అనుసంధానించింది. ఇలా ప్రైవేట్ వ్యక్తులు, నిధుల దుర్వినియోగానికి ఏమాత్రం తావులేకుండా గత ప్రభుత్వంలో ప్రజలకు టెలీమెడిసిన్ సేవలు పారదర్శకంగా అందాయి.నాడు దేశానికే ఆదర్శంగా..నిధుల దుబారాకు అడ్డుకట్ట వేసి టెలీ మెడిసిన్ వైద్యసేవలు అందించడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచింది. 2019 నుంచి 2023 డిసెంబరు నాటికి దేశవ్యాప్తంగా 18.3 కోట్ల టెలి కన్సల్టేషన్లు నమోదైతే ఒక్క ఏపీ నుంచే అత్యధికంగా 25 శాతం అంటే 4,61,01,963 కన్సల్టేషన్లు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పీపీపీ ప్రాజెక్టుల రూపంలో రూ.వందల కోట్ల నిధులు దుబారా చేయకుండా గత ప్రభుత్వంలో ఏర్పాటైన హబ్లను మరింత బలోపేతం చేసి టెలీవైద్య సేవలు అందించవచ్చని వైద్య రంగ నిపుణులు సూచిస్తున్నారు.ప్రివెంటివ్ కేర్ బలోపేతం.. వైఎస్ జగన్ పాలనలో 2019–24 మధ్య ప్రజారోగ్య పరిరక్షణలో అత్యంత కీలకమైన ప్రివెంటివ్ కేర్ను బలోపేతం చేశారు. పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో పట్టణాల్లో 562 యూపీహెచ్సీలను నెలకొల్పారు. మండలానికి రెండు పీహెచ్సీలు/ఒక పీహెచ్సీ, ఒక సీహెచ్సీ ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి పీహెచ్సీకి ఇద్దరు ప్రభుత్వ వైద్యులను సమకూర్చారు. అంతేకాకుండా నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా యూపీహెచ్సీలు, పీహెచ్సీలకు అధునాతన సౌకర్యాలతో భవనాలు, ల్యాబ్లను అందుబాటులోకి తెచ్చారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా గిరిజన, మారుమూల గ్రామాలకు సైతం ప్రభుత్వ వైద్యసేవలను చేరువ చేస్తూ 2,500 జనాభాకు ఒకటి చొప్పున 10,032 విలేజ్ క్లినిక్స్ను నెలకొల్పారు.వైద్యులే ప్రజల వద్దకు..వైద్యం కోసం ప్రజలు వ్యయప్రయాసలు పడాల్సిన పనిలేకుండా నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం వైద్యులనే ప్రజల దగ్గరకు తీసుకెళ్లింది. విప్లవాత్మక రీతిలో ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో భాగంగా పీహెచ్సీ వైద్యులను గ్రామాలకు పంపి వైద్యసేవలు అందించారు. రాష్ట్రంలో ప్రతి పౌరుడి ఆరోగ్యాన్ని వాకబు చేసి వ్యాధులను ముందే గుర్తించడంతో పాటు వైద్య సేవలు అందించేందుకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అమలుచేశారు. ఇందులో భాగంగా ఊరూవాడా స్పెషలిస్ట్ వైద్యులతో క్యాంపులు నిర్వహించి అనారోగ్య బాధితులకు కొండంత భరోసా కల్పించారు. 16 రకాలు టెస్టులు ఉచితంగా చేశారు. మెరుగైన వైద్యం అవసరం ఉన్నవారిని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేసి ఉచితంగా వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చేయి పట్టుకుని ముందుకు నడిపించింది. అంతేకాకుండా గుండె, కిడ్నీ, మెదడు, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు ఇళ్ల వద్దే ఖరీదైన మందులను ఉచితంగా డోర్ డెలివరీ చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆస్పత్రుల్లో డబ్ల్యూహెచ్వో ప్రమాణాలతో మందులు అందచేశారు. అంత గొప్పగా ఉన్న ఆరోగ్య రంగాన్ని నాశనం చేసిన చంద్రబాబు సర్కారు నిధులను దోచిపెట్టే ప్రాజెక్టులకే జైకొడుతోంది. -
ఏపీ డీజీపీకి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
సాక్షి, ఢిల్లీ: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల హింసపై ఏపీ డీజీపీకి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. ఎస్వీయూ క్యాంపస్లో జరిగిన హింసపై ఆరు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల హింసపై ఎంపీ గురుమూర్తి చేసిన ఫిర్యాదుపై ఎన్హెచ్ఆర్సి ఆదేశాలు ఇచ్చింది. వైఎస్సార్సీపీ నేతలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని గతంలో నివేదిక ఇచ్చి ఏపీ డీజీపీ తప్పించుకునే ప్రయత్నం చేశారు. దాంతో మరోసారి తాజా దర్యాప్తు నివేదిక ఇవ్వాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. -
ఆకాశమే హద్దుగా.. అదే కీలకం: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ పబ్లిసిటీ వింగ్ ఆకాశమే హద్దుగా పనిచేయాలని.. ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని.. ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీది ఎప్పటికీ ప్రజల పక్షమేనన్నారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రచార విభాగం అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ సభ్యులు, అన్ని జిల్లాల ప్రచార విభాగం అధ్యక్షులతో సమావేశం ఇవాళ(శుక్రవారం) జరిగింది.ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రచార విభాగం కీలకమైన విభాగం. అన్ని అనుబంధ విభాగాలలో కూడా ఈ విభాగం సభ్యులు చురుగ్గా పాల్గొనే అవకాశం ఉంటుంది. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లడానికి మీకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పబ్లిసిటీ వింగ్లో మనకు ఉన్న అవకాశాన్ని వినియోగించుకుని ఎంత ఉత్సాహంగా పనిచేయగలిగితే అంత గుర్తింపు వస్తుంది. ఆకాశమే హద్దుగా మనం పనిచేసే అవకాశం ఈ విభాగంలో ఉంటుంది’’ అని సజ్జల పేర్కొన్నారు.‘‘ఈ వింగ్లో కష్టపడి పనిచేసి తగిన గుర్తింపు తెచ్చుకునే అవకాశాలు కూడా మీకు ఎక్కువగా ఉంటాయి. పార్టీని బలోపేతం చేయడం కోసం ఈ విభాగం ఎంతవరకు ఉపయోగపడుతుందనేది మీరు అంచనాలు వేసుకుని తగిన విధంగా పనిచేయగలిగేలా ఉండాలి. ఇందుకు తగిన విధంగా కమిటీల నియామకం జరగాలి. పార్టీ లైన్కి తగ్గట్లుగా ముందుకెళుతూ విస్తృతంగా ప్రచారం చేయాలి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుంచడంలో ముందుండి ఉత్సాహంగా పనిచేయాలి. క్రియాశీలకంగా పనిచేసే సైన్యంలో మీరు భాగస్వాములవ్వాలి...చంద్రబాబు తప్పుడు ప్రచారంతో, అబద్దాలను నిజమని నమ్మించడంలో ముందుంటారు. మన పార్టీ ప్రజల పక్షంగా ఉంటుంది కానీ ఎప్పుడూ తప్పుడు ప్రచారాలను నమ్ముకోలేదు. ప్రజల అభిప్రాయలకు అనుగుణంగా మనం ముందుకెళ్ళాలి. రాష్ట్రాన్ని దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత జగన్ది. చంద్రబాబు అబద్ధపు మాయా ప్రపంచాన్ని ప్రజల ముందు తేటతెల్లం చేయాలి. పార్టీ అనుబంధ విభాగాలన్నీ ఒక్క తాటిపైకి వచ్చి పార్టీని, అధినేతను బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకెళ్ళాలి. నిర్మాణాత్మకంగా కమిటీల నియామకం చేసుకుని ముందుకెళదాం’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్ధేశం చేశారు. -
‘ఈ అరాచకాలకు చంద్రబాబే రాజగురువు’
తాడేపల్లి : టీడీపీ ఎమ్మెల్యేలు,మంత్రులు చేస్తున్న గలీజు పనులకు చంద్రబాబు నాయుడే రాజగురువు అని వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ ధ్వజమెత్తారు. టీడీపీ అనేది డర్టీ పార్టీ అని, ఆ పార్టీ నేతలు చేసేవన్నీ డర్టీ పనులేనని మండిపడ్డారు. ఈ రోజు(శుక్రవారం, ఆగస్టు 22వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన పోతిన మహేష్.. ‘జనానికి టీడీపీ అనే డర్టీ పార్టీ మీద చిరాకు వేసింది. పబ్లిక్గా బూతు పనులు చేస్తున్న ఎమ్మెల్యేలకు చంద్రబాబు వత్తాసు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, అరాచకాలకు చంద్రబాబు రాజగురువు. ఈ 15 నెలల్లో అరాచకాలు చేసిన ఏ ఎమ్మెల్యేపైనైనా చర్యలు తీసుకున్నారా? ఏమైనా అరెస్టులు చేశారా? బోను ఎక్కించారా? చట్ట ప్రకారం ఎవరి మీదైనా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. గత వారం రోజులుగా టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతి అరాచకాలపై పుంఖాను పుంఖాలుగా వార్తలు వచ్చాయి. అటవీ శాఖ ఉద్యోగుల మీద దాడి చేసిన ఎమ్మెల్యే బుడ్డా మీద ఏం చర్యలు తీసుకున్నారు?, డీలర్లతో కమీషన్ల వ్యవహారం బయటపడితే అచ్చెనాయుడు మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు?, కనీసం విచారణకు కూడా ఎందుకు ఆదేశించలేదు?, రౌడీషీటర్ శ్రీకాంత్కు పెరోల్ ఇవ్వాలని సిఫార్సు చేసిన ఇద్దరు ఎమ్మెల్యేలు, హోంమంత్రి అనిత మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు?, ఒక్కరి మీదనైనా చర్యలు తీసుకునే దమ్ము చంద్రబాబుకు లేదు. ఎమ్మెల్యే నసీర్ వేధింపులతో ఒక మహిళ ఆత్మహత్యాయత్నం చేస్తే చర్యలు తీసుకోలేదు ఎందుకు?, మహిళా ప్రొఫెసర్ మీద వేధింపులకు దిగిన కూన రవికుమార్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు?, ఎమ్మెల్యేల మీద చంద్రబాబు సీరియస్ అని ఎల్లోమీడియాలో స్క్రోలింగ్ వేయించుకుని చేతులు దులుపుకున్నారు. జూ.ఎన్టీఆర్ని బూతులు తిట్టిన ఎమ్మెల్యే మీద ఏం చర్యలు తీసుకున్నారు?, బాధితులు పోలీసు స్టేషన్లకు వెళ్తే తిరిగి వారిమీదే కేసులు పెట్టే సంస్కృతి ఇప్పుడే చూస్తున్నాం. అటవీశాఖ అధికారుల మీద దాడి చేస్తే పవన్ కళ్యాణ్ మౌనం వహించారు. పవన్ని నమ్ముకుంటే ఎవరైనా నట్టేట మునుగుతారు. సుగాలి ప్రీతి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారాల్లో ఏం చేశారు?, చంద్రబాబు ప్రయోజనాలే తప్ప పవన్కు ప్రజలతో పనిలేదు. చంద్రబాబు పాలన రాక్షస పాలనఈ అరాచకాలకు ప్రజలే తగిన బుద్ది చెప్పే టైం దగ్గర్లోనే ఉంది’ అని హెచ్చరించారు. -
శ్రీకాంత్కు పెరోల్.. అడ్డంగా దొరికిన హోంమంత్రి అనిత
సాక్షి, అమరావతి: తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసుల్లో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న అలివేలి శ్రీకాంత్కు నిబంధనలకు విరుద్ధంగా పెరోల్ మంజూరు చేయించడం వెనుక రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రమేయం ఉందని తేటతెల్లమైంది. అంతటి తీవ్రమైన నేరాల్లో శిక్ష పడిన అతనికి పెరోల్ మంజూరు చేయడం సాధ్యం కాదని హోం శాఖ జాయింట్ సెక్రటరీ కేవీ కిషోర్ కుమార్ స్పష్టంగా తిరస్కరించినా, హోం మంత్రి అనిత ఒత్తిడితోనే పెరోల్ మంజూరైందని స్పష్టమైంది. శ్రీకాంత్ పెరోల్ ప్రతిపాదనను జూలై 16నే హోం శాఖ జాయింట్ సెక్రటరీ కేవీ కిషోర్ కుమార్ తిరస్కరించడం గమనార్హం. దీంతో మంత్రి బుకాయింపు బెడిసికొట్టింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జీవిత ఖైదీ అలివేలి శ్రీకాంత్కు పెరోల్ మంజూరు కోసం నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, పాశం సునీల్కుమార్లు హోంశాఖ జాయింట్ సెక్రటరీ కేవీ కిషోర్ కుమార్కు సిఫార్సు చేశారు. ఆ మేరకు వారిద్దరూ సిఫార్సు లేఖలు కూడా ఇచ్చారు. కానీ.. తీవ్రమైన నేరాలకు పాల్పడి జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తుండటంతోపాటు గతంలో ఒకసారి జైలు నుంచి పరారైన శ్రీకాంత్కు పెరోల్ ఇవ్వకూడదని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్రాజు నివేదిక సమరి్పంచారు. దాంతో శ్రీకాంత్కు పెరోల్ మంజూరు చేయాలన్న ప్రతిపాదనను కిషోర్ కుమార్ తిరస్కరించారు. ఈ మేరకు అధికారికంగానే జూలై 16న ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు పట్టుపట్టి మరోమారు హోం మంత్రి అనితపై ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో శ్రీకాంత్ సన్నిహితురాలు అరుణతో మంత్రికిడీల్ కుదిర్చారు. డీల్ ఓకే కావడంతో శ్రీకాంత్కు పెరోల్ మంజూరు చేయాలని ఆదేశిస్తూ హోం మంత్రి అనిత స్వయంగా నోట్ఫైల్పై సంతకం పెట్టారు. ఈ నేపథ్యంలో ఆ ఫైల్ హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ వద్దకు వెళ్లింది. హోం మంత్రి ఒత్తిడితో తప్పనిసరి పరిస్థితిలో కుమార్ విశ్వజిత్ అనివార్యంగా శ్రీకాంత్కు పెరోల్ మంజూరు చేస్తూ జూలై 30న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఇంటెలిజెన్స్ వర్గాలు ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిక సమర్పించాయి. -
దారి మళ్లిన యూరియా..
సొసైటీలకు సరఫరా కావాల్సిన యూరియా రాష్ట్రంలో దారి మళ్లింది. ప్రైవేటు డీలర్ల ద్వారా విక్రయిస్తూ టీడీపీ నేతలు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. మరికొంత మంది వ్యవసాయ అవసరాలకు ఉపయోగించాల్సిన యూరియాను బీర్ల తయారీతో పాటు పెయింట్, వార్నిష్, ప్లైవుడ్, యాడ్–బ్లూ ద్రావణం, పశువుల దాణా.. కోళ్లు, చేపలు, రొయ్యల మేత తయారీ, కల్తీ పాల తయారీ కోసం దర్జాగా దారిమళ్లించారు. ఇదంతా అధికార కూటమి పార్టీల ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లోనే జరుగుతోంది.ఈయనో రైతు.. పేరు సిరపురపు రామునాయుడు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం పెదవేమలి గ్రామం. ఇతనికి ఉన్న రెండు ఎకరాల పొలంలో వరి పంట సాగు చేశాడు. ఇప్పుడు యూరియా అవసరం కావడంతో ఐదు రోజులుగా తిరుగుతున్నాడు. ఇప్పటికీ ఒక్క బస్తా కూడా దొరకలేదు. గత ప్రభుత్వంలో ఇలాంటి ఇబ్బంది ఎదురు కాలేదని వాపోతున్నాడు. ప్రభుత్వం చూస్తుంటే స్టాక్ ఉందని చెబుతోందని, ఇక్కడ చూస్తే నో స్టాక్ అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లు మండలంలోని బెణికల్లులో టీడీపీ మండల నేత రమేష్కు చెందిన గోదాములో పెద్ద ఎత్తున యూరియాను అన్లోడ్ చేశారు. వాస్తవానికి ఈ నిల్వలను డీసీఎంఎస్, సొసైటీ కేంద్రాలకు సరఫరా చేయాల్సి ఉంది. ఓ పక్క సొసైటీ కేంద్రాల వద్ద యూరియా నో స్టాక్ అని బోర్డులు పెట్టి, మండలానికి కేటాయించే యూరియా నిల్వలను తన గోదాముల్లోకి తరలించుకుపోయాడు. ఇదేమిటని ప్రశ్నించిన రైతులపై సదరు టీడీపీ నేత తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: ఓ వైపు తీవ్ర వర్షాభావం.. మరో వైపు అధిక వర్షాలు.. ఇలా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఖరీఫ్ సాగు చేస్తున్న రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం ప్రత్యక్ష నరకం చూపిస్తోంది. పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో లక్షలాది ఎకరాలు ముంపు బారిన పడ్డాయి. అధికారిక లెక్కల ప్రకారమే 2.5 లక్షల ఎకరాలు ముంపునకు గురైనట్టు చెబుతుండగా, వాస్తవానికి దాదాపు 4 లక్షల ఎకరాలకు పైగా ముంపునీటిలో చిక్కుకున్నాయి. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణ, గోదావరి జిల్లాలతో పాటు దాదాపు 14 జిల్లాల్లో ఎటు చూసినా ముంపునీటిలో చిక్కుకున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ పంటలు తిరిగి నిలదొక్కుకోవాలంటే బూస్టర్ డోస్ ఇవ్వాల్సిందే. లేకుంటే పంట పెరుగుదల లేక దిగుబడులు తగ్గి పంట నాణ్యత దెబ్బ తింటుంది. ప్రస్తుతం పిలక కట్టే దశలో వరి పైరు ఉంది. ఈ దశలో ఎకరాకు కనీసం 20 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరెట్ ఆఫ్ పొటా‹Ù, పత్తికైతే 25–30 కిలోల యూరియా, 10–15 కిలోల మ్యూరెట్ ఆఫ్ పొటాష్ పైపాటుగా వేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రణాళికా బద్ధంగా ఎరువుల సరఫరాలో ప్రభుత్వం ఇప్పటికే చేతులెత్తేసింది. బఫర్ స్టాక్ నిర్వహణలో మార్క్ఫెడ్ విఫలమైంది. ఈసారి 2 లక్షల టన్నుల ఎరువులను నిల్వ చేయనున్నామని, రైతులకు కొరత లేకుండా సరఫరా చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఆచరణలో లక్ష టన్నులు కూడా సరఫరా చేయలేని దుస్థితిలో ఉన్నారు. కారణం బఫర్ స్టాక్ నిర్వహణకు అవసరమైన నిధులు విడుదలలో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేయడమే కారణం. మరో వైపు ఉన్న కొద్దిపాటి నిల్వలను టీడీపీ నేతలు దొడ్డిదారిన తమ గోదాములకు మళ్లిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఏమూలకు వెళ్లినా రైతు సేవా కేంద్రాలు కాదు కదా.. కనీసం సహకార సంఘాల్లో సైతం యూరియా కట్ట దొరకని పరిస్థితి. మిగిలిన ఎరువుల పరిస్థితి కూడా ఇంతే. అధికారులు మాత్రం రాష్ట్రంలో నిల్వలకు ఢోకా లేదని చెబుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. సర్కారు వద్ద ఉన్నది 10 శాతమే 2025– ఖరీఫ్ సీజన్ సాగు లక్ష్యం 85.26 లక్షలు కాగా ఆగస్టు 21వ తేదీ నాటికి 50.75 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. 27 లక్షల ఎకరాల్లో వరి, 9.2 లక్షల ఎకరాల్లో పత్తి, 3.2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 4.50 లక్షల ఎకరాల్లో కందులు, 4 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంటలు సాగయ్యాయి. దాదాపు రెండు నెలల పాటు తీవ్ర వర్షాభావ పరిస్థితులతో దెబ్బతిన్న రైతులు ప్రస్తుతం అధిక వర్షాలతో నష్టపోతున్నారు. ఈ పరిస్థితిలో యూరియా కట్ట దొరక్క రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఖరీఫ్ సీజన్కు 16.76 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 6.45 లక్షల టన్నుల నిల్వలున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇందులో సొసైటీలు, ఆర్ఎస్కేల వద్ద 65 వేల టన్నులు, మార్క్ఫెడ్ గోడౌన్లో 55 వేల టన్నులుండగా, మిగిలిన ఎరువులన్నీ ప్రైవేటు హోల్సేల్, రిటైల్ వ్యాపారుల వద్దే ఉన్నాయి. అంటే ఏ స్థాయిలో వీరు లాబీయింగ్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కామరాజుపేట సొసైటీ కార్యాలయం వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులు ఎమ్మార్పీకి మించి విక్రయాలు బహిరంగ మార్కెట్లో యూరియా కట్ట (ప్రభుత్వ ధర 50 కేజీల బస్తా రూ.266.50) రూ.350 నుంచి రూ.450 వరకు విక్రయిస్తున్నారు. యూరియా ఒక్కటే కాదు.. డీఏపీ పరిస్థితి కూడా అలాగే ఉంది. డీఏపీ నిల్వలు కూడా 70 వేల టన్నులకు మించి లేవు. దీంతో ఓపెన్ మార్కెట్లో డీఏపీ బస్తా (ప్రభుత్వ ధర రూ.1350) రూ.1,550 చొప్పున అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. యూరియాతో పాటు ఇతర ఎరువుల కోసం రైతుల ఆందోళనలు ప్రతి జిల్లాలో జరుగుతూనే ఉన్నాయి. చెప్పేదొకటి.. వాస్తవం మరొకటి అనంతపురం జిల్లాలో యూరియా నిల్వలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నా.. చాలా ప్రాంతాల్లో కొరత స్పష్టంగా కనిపిస్తోంది. రైతులు ఆర్ఎస్కేలు, పీఏసీఎస్లు, డీసీఎంఎస్తో పాటు ప్రైవేట్ దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. ఒకట్రెండు బస్తాల కోసం పడిగాపులు కాస్తున్నా దొరకడం లేదని రైతులు వాపోతున్నారు. చాలా చోట్ల టోకెన్లు ఇచ్చి పంపుతున్నా, మరుసటి రోజు కూడా ఇవ్వడం లేదు. ‘ఈ ఖరీఫ్కు సంబంధించి ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 26,839 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపులు ఉండగా.. ఇప్పటికే 29 వేల మెట్రిక్ టన్నులకు పైగా సరఫరా అయ్యింది. ఇందులో 28 వేల మెట్రిక్ టన్నులకు పైగా పంపిణీ జరిగింది. ఇంకా వేర్హౌస్లో బఫర్ స్టాక్ కింద 1,000 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది’ అని మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ పెన్నేశ్వరి తెలిపారు. ఈ లెక్కన రైతులెందుకు యూరియా కోసం రోడ్డెక్కుతున్నట్లు?ఎరువులను అధికార పార్టీ కార్యకర్తలు దారి మళ్లించడంతో శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం కనితూరులో రైతుల పాట్లు అన్ని జిల్లాల్లోనూ అవే కష్టాలు ⇒ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత జిల్లా శ్రీకాకుళంలో ఎరువుల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. జిల్లాలో ఎరువుల కొరతను దృష్టిలో పెట్టుకుని ప్రైవేటు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి బస్తా రూ.400తో అమ్మకాలు చేస్తున్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న అరకొర ఎరువులు రైతు భరోసా కేంద్రాలకు కాకుండా కూటమి నాయకుల ఇళ్ల వద్ద ఉంచుకుని ఆ పార్టీ వర్గీయులకే అందిస్తున్నారు. ⇒ ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, పెడన, పామర్రు, గుడివాడ, పెనమలూరు నియోజకవర్గాల్లో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. ఇదే సమయంలో ప్రైవేట్ ఎరువుల దుకాణాల్లో మాత్రం పుష్కలంగా అందుబాటులో ఉంది. అయితే యూరియాతో పాటు ఇతర మందులు కూడా కొనుగోలు చేయాలని వారు షరతు పెడుతున్నారు. సొసైటీల్లో అధికార పక్ష నేతలు సిఫారసు చేసిన వారికే యూరియా అందుతోంది. పలమనేరులో యూరియా కోసం బారులు తీరిన రైతులు ⇒ వైఎస్సార్ కడప జిల్లాలో ఓ వైపు యూరియా కొరత తీవ్రంగా ఉంది. మరో వైపు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, యూరియాకు సంబంధించిన సమస్యలుంటే 8331057300, 9491940106 నంబర్లలో సంప్రదించాలని జిల్లా అధికారులు చెబుతున్నారు. ⇒ కర్నూలు జిల్లాలో ప్రస్తుతం 2,429 టన్నుల యూరియా అందుబాటులో ఉందని అధికారులు చెబుతున్నా.. ప్రయివేటు డీలర్లు, ఆర్బీకేలు, పీఏసీఎస్లు, డీసీఎంఎస్ల్లో బస్తా కూడా యూరియా లభించడం లేదు. ఆదోని, కౌతాళం, హొళగుంద, పెద్దకడుబూరు, గోనెగండ్ల తదితర మండలాల్లో యూరియా కోసం రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. ⇒ ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతులు యూరియా కోసం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను ఆశ్రయిస్తున్నారు. అధికారులు చెబుతున్న విధంగా యూరియా క్షేత్ర స్థాయిలో ఎక్కడా దొరకడం లేదు. ప్రైవేటు షాపు నిర్వాహకులు మాత్రం యూరియాను అధిక రేట్లకు అమ్మేస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. పలమనేరులోని ఓ రైతు సమాఖ్య కేంద్రానికి గురువారం ఒక లోడు యూరియా వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న రైతులు షాపు తెరవక ముందే భారీగా క్యూ కట్టారు. గంట వ్యవధిలో ఖాళీ అయింది. వందలాది మంది రైతులకు దొరక్క పోవడంతో నిరాశతో వెనుదిరిగారు. ⇒ ఉమ్మడి గుంటూరు జిల్లాలో వ్యాపారులు కృతిమ కొరత సృష్టించి అధిక ధరకు విక్రయిస్తున్నారు. పెదకాకాని మండలంలోని గోళ్ళమూడి గ్రామంలో యూరియా ఉందని తెలియడంతో రైతులు క్యూకట్టారు. సొసైటీ వద్ద, ఆర్బీకే వద్ద కాకుండా లారీని రోడ్డుపై పెట్టి అమ్మకాలు చేపట్టారు. గురువారం ఆధార్ కార్డుకు రెండు బస్తాల చొప్పున కొంత మందికి మాత్రమే ఇచ్చారు. ఒక్క బస్తా ఇచ్చుంటే ఒట్టు మాకు ఎనిమిది ఎకరాలు సొంతభూమి ఉంది. మరో 15 ఎకరాలు కౌలుకు తీసుకున్నాం. వరి, మిర్చి, పత్తి, కంది వంటి పంటలు సాగు చేస్తున్నాం. వరి నాట్లు వేస్తున్నాం. యూరియా అత్యవసరం అయింది. అన్ని పనులు వదులు కొని ఆర్బీకేలు, ప్రయివేటు డీలర్ల చుట్టూ 25 రోజులుగా తిరుగుతున్నాం. ఒక బస్తా ఇచ్చుంటే ఒట్టు. గత ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేదు. – మర్రిస్వామి, రైతు, హొళగుంద, కర్నూలు జిల్లాఅధిక ధరకు అమ్ముతున్నారు పంటలకు అవసరమైన యూరియా దొరక్క ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నాం. 45 కేజీల బస్తా రూ.266కు అమ్మాల్సిన యూరియా దొరక్కపోవడంతో సుమారు రూ.500 కు పైగా ధర పలుకుతోంది. గతంలో ఎన్నడూ ఈ ధరలు చూడలేదు. ఈ విధంగా అధిక ధరలకు యూరియా కొనుగోలు చేసి వ్యవసాయం చేయలేం. – పీ సుధాకర్, రైతు, సోమేపల్లి, త్రిపురాంతకం మండలం, ప్రకాశం జిల్లాగత ప్రభుత్వంలో ఎన్ని బస్తాలైనా ఇచ్చేవారునేను ఐదెకరాల్లో వరి, ఐదెకరాల్లో దుంపతోట సాగు చేస్తున్నాను. నాకు 50 బస్తాల యూరియా అవసరం. గతంలో ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని బస్తాలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆధార్ కార్డుకు ఒక్క బస్తా యూరియా మాత్రమే ఇస్తున్నారు. ఇది ఎక్కడ చల్లాలో, ఏం చేయాలో తెలియడం లేదు. మాకు అవసరమైన మేరకు యూరియాను వెంటనే అందించాలి. – రాజమంద్రపు శ్రీను, రైతు, జగ్గంపేట నియోజకవర్గం, కాకినాడ జిల్లా 266 బస్తాల యూరియా లారీ పక్కదారి మంత్రి ఫరూక్ అనుచరుడి ప్రోద్బలంతో వ్యాపారికి విక్రయం సాక్షి, నంద్యాల: యూరియా దొరక్క ఓ వైపు రైతులు రోడ్డెక్కుతుంటే మరోవైపు అధికార పార్టీ నేతలు ఎక్కడికక్కడ అవి వచ్చీరాగానే వాటిని గద్దల్లా తన్నుకుపోతున్నారు. నంద్యాల జిల్లా గోస్పాడు మండలంలోని పసురపాడు గ్రామానికి మార్క్ఫెడ్ ద్వారా 266 బస్తాల యూరియాను అధికారులు గత మంగళవారం రైతు సేవా కేంద్రానికి మంజూరు చేశారు. యూరియా ఈనెల 19న రావాల్సి ఉంది. అయితే, ఆ స్టాకు మొత్తం సంబంధిత రైతుసేవా కేంద్రానికి రాకుండానే మాయమైంది. టీడీపీ నాయకులు ఈ స్టాకు మొత్తాన్ని అమ్ముకున్నట్లు తెలుస్తోంది. గ్రామానికి రావాల్సిన యూరియా రాకపోవడంతో రైతులు మార్క్ఫెడ్ కార్యాలయాన్ని సంప్రదించగా 266 బస్తాలు పంపామని తెలిపారు. దీంతో గ్రామ రైతులు విలేజ్ హార్టీకల్చరల్ అసిస్టెంట్ (వీహెచ్ఏ) శ్రీకాంత్రెడ్డిని అడగ్గా.. ఇంకా రాలేదని ఆయన నిర్లక్ష్యంగా బదులిచ్చారు. అనుమానం వచ్చిన రైతులు గోస్పాడు ఏఓకు ఫిర్యాదుచేశారు. ఇది తెలుసుకున్న శ్రీకాంత్రెడ్డి పత్తాలేకుండాపోయారు. దీంతో.. గ్రామస్తులకు యూరియా అందిందా లేదా అని ఏఓ విచారించి రైతులకు అందలేదని తెలుసుకున్నారు. అనంతరం.. వారి సంతకాలు తీసుకుని జిల్లా వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే.. టీడీపీ నాయకులే వీహెచ్ఏ శ్రీకాంత్రెడ్డితో కుమ్మక్కై 266 బస్తాల యూరియా లారీని నంద్యాలలోనే ఓ బడా వ్యాపారికి అమ్మి సొమ్ము చేసుకున్నట్లు తెలిసింది. మంత్రి ఫరూక్ ముఖ్య అనుచరుడి ప్రోద్బలంతోనే ఎరువు లారీని అమ్మే సాహసం టీడీపీ నాయకులు చేశారని తెలుస్తోంది. -
ఇప్పుడు బాల్కనీలోనే... సౌర విద్యుత్
సాక్షి, అమరావతి: కరెంటు బిల్లుల మోత నేపథ్యంలో పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించుకుని విద్యుత్ అవసరాలను తీర్చుకునే మార్గాల అన్వేషణ నిరంతరం జరుగుతోంది. ఆ క్రమంలోనే భానుడి కాంతి కిరణాలను విద్యుత్ శక్తిగా మార్చే సౌర ఫలకల వాడకం పెరుగుతోంది. అయితే విస్తరిస్తున్న పట్టణీకరణ కారణంగా వెలుస్తున్న బహుళ అంతస్తుల భవంతులపై సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్ను ఏర్పాటు చేసేందుకు పరిమితులు అడ్డంకులుగా మారుతున్నాయి. వివిధ అంతస్తుల్లో నివాసం ఉండే వారికి సౌర విద్యుత్ సరఫరా అందని ద్రాక్షగా మారుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు తాజాగా బాల్కనీలే వేదికగా ‘ప్లగ్ ఇన్’ సౌర ఫలకలు అందుబాటులోకి వస్తున్నాయి. ఖర్చు, అమర్చడం, నిర్వహణ పరంగా చూస్తే ఇవి సరికొత్త ట్రెండ్ సెట్టర్గా నిలుస్తున్నాయి. సులువైన ప్రత్యామ్నాయం విశాఖపట్నంలో ఓ హోటల్ యజమాని ఐదంతస్తుల భవనం మొత్తం గోడలను సౌర ఫలకలతో నింపేశారు. ఇది ఒక సోలార్ ప్యానల్ ఎలివేషన్తో నిర్మాణం జరిగిన ఫుల్ ఎకో గ్రీన్ హోటల్. ప్లగ్ ఇన్ ప్యానెల్స్ను అపార్ట్మెంట్లు, భవనాల బాల్కనీలో ఏర్పాటు చేసుకుని నేరుగా ఇంటిలోని ఇన్వర్టర్కి ప్లగ్ చేసుకోవచ్చు. అంటే సౌర ఫలక నుంచి నేరుగా ఒకే ఒక వైరు ద్వారా విద్యుత్ సరఫరాను పొందవచ్చు. దీనికి ఎలాంటి ప్రభుత్వ, సాంకేతిక అనుమతులు కూడా అవసరం లేదు. బాల్కనీ పొడవును బట్టి, సౌర ఫలకలు అమర్చేందుకు ఉన్న వెసులుబాటును బట్టి, ఎన్ని ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోగలిగితే అంత ఎక్కువ విద్యుత్ను ఉత్పత్తి చేసుకోవచ్చు. సూర్య కిరణాలే... భవన విద్యుత్ వెలుగులు దేశం మొత్తం మీద వాడే విద్యుత్లో భవనాల్లో వినియోగం మూడవ వంతు కంటే ఎక్కువ. దేశ వ్యాప్తంగా 2027 నాటికి రూ.75,021 కోట్లతో సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్లు కోటి ఇళ్లకు అమర్చాలనే లక్ష్యంతో కేంద్రం ప్రభుత్వం పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ పథకాన్ని 2024 ఫిబ్రవరిలో ప్రారంభించింది. 2024–25 కోసం రూ.13,175.33 కోట్లను కేటాయించింది. కానీ ఇప్పటి వరకూ కేవలం 16.15 లక్షల గృహాలపై మాత్రమే రూఫ్టాప్ పెట్టగలిగింది. అదే బాల్కనీలో ప్లగ్ ఇన్ సౌర ఫలకలు ఏర్పాటు చేయగలిగితే నగరాలు, పట్టణాల్లోని అన్ని అపార్ట్మెంట్లలో సౌర విద్యుత్ వెలుగులు విరజిమ్మే అవకాశం ఉంది. -
ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల స్థానికతపై సుప్రీంకోర్టులో నేడు విచారణ
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు అభ్యర్థుల ‘స్థానికత’ వివాదంపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరపనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ల ధర్మాసనం ఈ వ్యవహారంపై విచారణ చేపట్టనుంది. ఏపీ వెలుపల ఇంటర్ విద్యను అభ్యసించినప్పటికీ తామంతా రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటున్నామని, అందువల్ల తమను ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాల్లో ‘స్థానిక’ అభ్యర్థులుగా పరిగణించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పలువురు అభ్యర్థులు ఇటీవల హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు దర్మాసనం.. సుదీర్ఘ వాదనల అనంతరం ఈ వ్యాజ్యాలన్నింటినీ కొట్టేసింది. స్థానికత విషయంలో హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం గతంలోనే చాలా స్పష్టమైన తీర్పునిచి్చందని, ఇప్పుడు తాము అందుకు భిన్నంగా చెప్పాల్సింది ఏమీ లేదని తన తీర్పులో పేర్కొంది. ప్రవేశాలు కోరుతున్న విద్యార్థి, తాను ఏ లోకల్ ఏరియా (ఎస్వీ యూనివర్సిటీ లేదా ఆంధ్రా యూనివర్సిటీ పరిధి)లో చదివానని చెబుతున్నారో, ఆ అభ్యర్థి ఆ ప్రాంతంలో వరుసగా నాలుగేళ్లు చదివి ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ నాలుగేళ్లను క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ (+2 అంటే ఇంటర్)తో ముగించి ఉండటం తప్పనిసరి అని తేల్చి చెప్పింది. అలాగే ఆ అభ్యర్థి ఆ ప్రాంతంలో ఏ విద్యా సంస్థలోనూ చదవకపోయినప్పటికీ క్వాలిఫైయింగ్ పరీక్ష రాసే నాటికి వరుసగా నాలుగేళ్ల పాటు ఆ లోకల్ ఏరియాలో నివాసం ఉన్నా కూడా ఆ అభ్యర్థి స్థానిక అభ్యర్థే అవుతారని స్పష్టం చేసింది. రాష్ట్రం వెలుపల క్వాలిఫైయింగ్ ఎగ్జామ్కు ముందు +2 చదివిన విద్యార్థులను స్థానిక అభ్యర్థులుగా పరిగణించలేమని తేల్చి చెప్పింది. ఈ తీర్పును సవాలు చేస్తూ 53 మంది అభ్యర్థులు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై అత్యవసర విచారణ జరపాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది విపిన్ నాయర్ సుప్రీంను కోరారు. అంగీకరించిన సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. -
సాగుకు ఉరి..!
సాక్షి, అమరావతి: వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో.. వ్యవసాయ రంగాన్ని భ్రష్టు పట్టించేలా చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తుండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రైతుల వ్యవసాయ భూములను కాపాడాల్సిందిపోయి వాటిని ప్రైవేట్ వ్యక్తులు, రియల్ ఎస్టేట్ సంస్థల చేతుల్లో పెట్టేలా ఆయన కంకణం కట్టుకుని పని చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అందులో భాగంగానే ‘నాలా’ (నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ యాక్ట్) చట్టం రద్దుకు గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోద ముద్ర వేశారు. దీనిపై త్వరలో ఆర్డినెన్స్ ఇచ్చేందుకు టీడీపీ కూటమి సర్కారు సిద్ధమైంది. ఇప్పటికే యాజమాన్య హక్కులు దక్కిన 13.59 లక్షల ఎకరాల ఫ్రీ హోల్డ్ భూములను ఫ్రీజ్ చేసిన చంద్రబాబు సర్కారు ఆ రైతులను రోడ్డున పడేసింది. తాజాగా ‘నాలా’ చట్టాన్ని రద్దు చేయడం ద్వారా రాష్ట్రంలో లక్షలాది ఎకరాలను రియల్ వ్యాపారులు, తమ అనుంగు పారిశ్రామికవేత్తలకు సులభంగా దక్కేలా చేసేందుకు ప్రభుత్వ పెద్దలు సిద్ధమయ్యారు. దశాబ్దాలుగా ‘నాలా’ చట్టం రాష్ట్ర రైతాంగానికి, వ్యవసాయ రంగానికి రక్షణగా నిలిచింది. అలాంటి దాన్ని రద్దు చేయడానికి కూటమి ప్రభుత్వం ఉపక్రమించడం పట్ల తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. రియల్ ఎస్టేట్, పారిశ్రామిక వృద్ధికి ఈ చట్టం అడ్డుగా ఉందనే సాకుతో దీన్ని రద్దు చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం చెబుతుండటాన్ని వ్యవసాయ రంగ నిపుణులు తప్పుబడుతున్నారు. ఇక సాగు భూములకు రక్షణ ఏది? నాలా చట్టం మనుగడలో లేకపోతే వ్యవసాయ భూములను అత్యంత సులభంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు, వాణిజ్య అవసరాలు, పరిశ్రమలకు అప్పగించేందుకు మార్గం సుగమం అవుతుంది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర ప్రయోజనాల కోసం వినియోగించేందుకు ఉమ్మడి రాష్ట్రంలో 2006లో ‘నాలా’ చట్టాన్ని తెచ్చారు. వ్యవసాయ భూములను ఇష్టానుసారంగా ఇతర ప్రయోజనాల కోసం వినియోగించకుండా నియంత్రించేందుకే ఈ చట్టాన్ని రూపొందించారు. భూ వినియోగ మార్పిడి చేసుకుంటే ప్రస్తుతం ఆ భూమి విలువపై 5 శాతం పన్ను కట్టాలి. అలాగే కొన్ని ఇతర పన్నులు కూడా చెల్లించాల్సి ఉంటుంది. అయితే దీనివల్ల తాము సులభంగా భూములు పొందలేకపోతున్నామంటూ రియల్ ఎస్టేట్, వ్యాపార సంస్థలు, పరిశ్రమల యాజమాన్యాలు చెబుతూ వస్తున్నాయి. నాలా చట్టాన్ని రద్దు చేయాలని కోరుతున్నాయి. నిజానికి అడ్డగోలుగా జరిగే భూ వినియోగ మార్పిడిని ఈ చట్టం సమర్థంగా అడ్డుకుంది. రియల్ ఎస్టేట్ దందాలను కొంతమేరనైనా అడ్డుకోవడం వల్లే ఇప్పుడున్న సాగు భూమి మిగిలి ఉందని వ్యవసాయ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆహార భద్రతకు ముప్పు.. నాలా చట్టం అమలులో లేకుంటే వ్యవసాయ భూములు యథేచ్చగా రియల్ ఎస్టేట్, పారిశ్రామికవేత్తల చేతుల్లోకి వెళ్లిపోవడం ఖాయమని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిపోయి తిండి గింజలకు కొరత ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నాయి. భూ మార్పిడిపై నియంత్రణ కరువవడంతో అటవీ ప్రాంతాలు, నీటి వనరులు, వ్యవసాయ యోగ్యమైన భూములు దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొంటున్నాయి. దీర్ఘకాలంలో ఇది పర్యావరణ సమతుల్యతను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. నాలా చట్టం లేకుంటే భూ మార్పిడిపై ఎటువంటి నియంత్రణ లేనందున రియల్ ఎస్టేట్ సంస్థలు, బడా వ్యాపారవేత్తలు భూములను చౌకగా దక్కించుకుని రైతులను మోసం చేసే అవకాశం ఉందనే ఆందోళన నెలకొంది. అన్నదాతల గురించి ఆలోచించరా? రాష్ట్రంలో అభివృద్ధికి నాలా చట్టం అడ్డంకిగా ఉందని, దీన్ని రద్దు చేస్తేనే పెట్టుబడులు వస్తాయని చెబుతున్న చంద్రబాబు వ్యవసాయం, భూమినే నమ్ముకున్న అన్నదాతల మనోభావాలు, భావోద్వేగాల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కేవలం పెద్ద పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ లాబీలకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు స్పష్టమవుతోంది. దీనివల్ల సామాన్య రైతులకు ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు. నాలా చట్టాన్ని రద్దు చేస్తే చిన్న, సన్నకారు రైతులు తమ భూములను కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈవీఎస్ శర్మ ఆ నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరారు. వ్యవసాయ భూములు తగ్గిపోవడం, ఆహార ధాన్యాల కొరత, ధరల పెరుగుదల, గ్రామీణ ఆరి్థక వ్యవస్థ కుంటుపడటం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని లేఖలో పేర్కొన్నారు.ప్రజా ప్రయోజనాలకు విఘాతం‘నాలా’ రద్దుపై ప్రభుత్వానికి రిటైర్డ్ ఐఏఎస్ శర్మ లేఖ ‘నాలా’ చట్టాన్ని రద్దు చేయడం వల్ల చిన్న రైతుల జీవనోపాధికి తీవ్ర నష్టం కలుగుతుందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్కు లేఖ రాశారు. రాష్ట్ర ఆహార భద్రతను నిర్లక్ష్యం చేయడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని, రద్దు నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు. ‘పరిశ్రమలు, ఇతర ప్రయోజనాల కోసం భూములు తీసుకునేందుకు ఆహార భద్రత లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేయడం బాధాకరం. దీనివల్ల వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవించే లక్షలాది మంది చిన్న రైతులు, సాంప్రదాయ మత్స్యకారులు, సహకార డెయిరీ సంస్థలపై ఆధారపడ్డ చిన్న పాల ఉత్పత్తిదారులు తీవ్రంగా ప్రభావితమవుతారు. ఇప్పటికే ల్యాండ్ పూలింగ్ పేరుతో వేలాది ఎకరాలు సేకరిస్తూ ప్రభుత్వం ఆహార భద్రతను నిర్లక్ష్యం చేసింది. ప్రైవేట్ రంగ పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం విధానాలను మార్చుకోవడం వల్ల రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములైన లక్షలాది మంది నష్టపోతారు. ప్రభుత్వ విధానాలు అభివృద్ధికి దోహదం చేయాలి. అంతేగానీ ప్రైవేటు కంపెనీల లాభాలు పెంచడం కోసం కాదని గుర్తించాలి’ అని లేఖలో పేర్కొన్నారు. రిలయన్స్కు కోరుకున్న చోట 5 లక్షల ఎకరాలు.. నాలా చట్టం రద్దు నిర్ణయం రియల్ ఎస్టేట్, పారిశ్రామికవేత్తల కోసమే. ఈ చట్టం అమలులో ఉంటే భూములు అడ్డగోలుగా వారి చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉండదు. ఎలా పడితే అలా భూములు తీసుకునే వీలుండదు. వారికి దొడ్డిదారిన మేలు చేసేందుకు ఈ చట్టాన్ని రద్దు చేస్తున్నారు. రిలయన్స్ సంస్థకు 5 లక్షలు ఎకరాలు ఎక్కడ అడిగితే అక్కడ ఇవ్వాలని సీఎం ఏకంగా కలెక్టర్ల సమావేశంలోనే ఆదేశించారు. చాలా సంస్థలకు భూములివ్వడానికి రెడీ అయ్యారు. పెద్దవారికి భూములు ఇవ్వడానికి కావాల్సిన అన్ని వెసులుబాట్లు కల్పిస్తున్నారు. – వై.కేశవరావు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
ఎస్ఆర్ఎం, విట్కు చెరో 100 ఎకరాలు
సాక్షి, అమరావతి: రాజధానిలో భూములు కేటాయించినందుకు ఒకపక్క కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి ఎకరానికి రూ.నాలుగైదు కోట్ల చొప్పున ముక్కుపిండి వసూలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు అదే చోట ప్రైవేట్ సంస్థలకు వందల ఎకరాలను భారీ తగ్గింపు ధరలకు కట్టబెడుతోంది. ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించే ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ సంస్థల పట్ల ఒకలా.. ధనార్జనే ధ్యేయంగా వ్యవహరించే పైవేట్ సంస్థల పట్ల మరోలా వ్యవహరించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ల్యాండ్ పూలింగ్ పేరుతో రాజ«దాని రైతుల నుంచి తీసుకున్న భూములను గతంలో ఇచ్చిన ప్రైవేట్ సంస్థలకే మళ్లీ మళ్లీ పప్పు బెల్లాల మాదిరిగా పంచిపెట్టడం ఏమిటనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్ విద్యాసంస్థలు ఎస్ఆర్ఎం, విట్ అమరావతిలో ఎకరం రూ.2 కోట్లు చొప్పున ఒక్కో సంస్థకు వంద ఎకరాలు చొప్పున కేటాయించేందుకు తాజాగా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోద ముద్ర వేశారు. కాగా ఈ రెండు ప్రైవేట్ యూనివర్సిటీలకు గతంలోనే టీడీపీ హయాంలో ఎకరం రూ.50 లక్షలు చొప్పున ఒక్కో విద్యాసంస్థకు అమరావతిలో ఏకంగా 200 ఎకరాలు కేటాయించడం గమనార్హం. తాజాగా కేటాయిస్తున్నవి దీనికి అదనం. సమావేశం అనంతరం మంత్రివర్గ నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి పార్దసారథి మీడియాకు వెల్లడించారు. నాలా చట్టం 2006 వల్ల సాగు భూములు వ్యవసాయేతర అవసరాల మార్పిడికి అనుమతి పొందే ప్రక్రియ సంక్లిష్టతతో ఉన్నందున ఈ చట్టం రద్దు ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలపడంతో పాటు ఆర్డినెన్స్ జారీకి నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. నాలా చట్టం రద్దు నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్–అర్బన్ డెవల‹³మెంట్ అథారిటీలు చట్టం 2016, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం 2014, ఆంధ్రప్రదేశ్ టౌన్ ప్లానింగ్ చట్టం 1920, ఆంధ్రప్రదేశ్ మునిసిపాలిటీలు చట్టం 1965లకు సవరణల ప్రతిపాదనను ఆమోదించినట్లు చెప్పారు. కేబినెట్ ఇతర నిర్ణయాలు ఇవీ.. » గుంటూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి 2,954 చదరపు గజాల మునిసిపల్ భూమి గతంలో 33 సంవత్సరాలు లీజుకు కేటాయించగా ఇప్పుడు ఎకరం రూ.వెయ్యి చొప్పున 99 ఏళ్లపాటు లీజు పెంచుతూ ఆమోదం. » హోటళ్లు, పర్యాటక ప్రాజెక్టులకు భూముల కేటాయింపులో మరిన్ని రాయితీలు కల్పించేందుకు పర్యాటక విధానంలో మార్పులకు ఆమోదం. » చిత్తూరు జిల్లా కుప్పం, నెల్లూరు జిల్లా దగదర్తిలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం పీపీపీ విధానంలో అభివృద్ధి. భూసేకరణ, ఇతర అవసరాలకు హడ్కో నుంచి రుణం తీసుకునేందుకు ఆమోదం. » ఆంధ్రప్రదేశ్ సర్క్యులర్ ఎకానమీ – వ్యర్థ పదార్థాల పునరి్వనియోగ విధానం 2025–30కు ఆమోదం. » ఐఎంఎఫ్ఎల్, బీర్, వైన్, విదేశీ మద్యం బ్రాండ్లకు టెండర్ కమిటీ నిర్ణయించిన ధరలకు ఆమోదం. పొరుగు రాష్ట్రాలతో సమానంగా ధరల నిర్ణయం. » అధికార భాషా కమిషన్ పేరు ‘‘మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా కమిషన్’’గా మార్పు » అమరావతి క్యాపిటల్ సిటీలో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద ల్యాండ్ పూలింగ్ జోన్లలో మౌలిక సౌకర్యాల అభివృద్ధికి ఈపీసీ కింద టెండర్లకు అనుమతి. మౌలిక సదుపాయాల కోసం రూ.904.00 కోట్లకు పరిపాలనా ఆమోదం. » గ్రామ, వార్డు సచివాలయాల్లో వార్డు విద్య, డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ నుంచి ‘విద్య’ తొలగించి వార్డు సంక్షేమ, అభివృద్ధి సెక్రటరీకి అప్పగించేందుకు ఆమోదం. గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్తగా 993 పోస్టులు సృష్టించడంతో పాటు మొత్తం 2,778 పోస్టులు డిప్యుటేషన్, ఔట్ సోర్సింగ్లో భర్తీకి ఆమోదం. » మాన్యువల్ స్కావెంజర్స్ నియామకంపై నిషేధం. ఆ వృత్తిలో ఉన్నవారికి పునరావాస చర్యలకు ఆమోదం. ఏపీ యాచక చట్టంలో వికలాంగులు, కుష్టు వ్యాధి బాధితుల పట్ల వివక్షపూరిత పదాలను తొలిగించే ముసాయిదా బిల్లుకు ఆమోదం. » పుష్కర ఎత్తిపోతల పథకంలో ప్రెజర్ మెయిన్ పైపు మార్చేందుకు రూ.51.67 కోట్లకు పరిపాలన అనుమతి. » ఏఎస్ఆర్ జిల్లా చింతూరులో 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 100 పడకల ఏరియా ఆస్పత్రిగా మార్చేందుకు ఆమోదం. » అంతర్జాతీయ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ సాయి మైనేనికి స్పోర్ట్స్ కోటా కింద డిప్యూటీ కలెక్టర్ (గ్రూప్– ఐ సర్వీసెస్) ఉద్యోగం ఇచ్చేందుకు చట్ట సవరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం. » పల్నాడు జిల్లా గుండ్లపాడులో హత్యకు గురైన చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చేలా చట్ట సవరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం. » వైఎస్సార్ కడప జిల్లా మైలవరం మండలం వడ్డిరాల, దొడియం గ్రామాల్లో 1,200.05 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పొరేషన్ ద్వారా అదానీ సోలార్ ఎనర్జీకి 33 సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చేందుకు ఆమోదం. » ఆంధ్రప్రదేశ్ సముద్ర విధానం 2024–29 సవరణకు ఆమోదం. » నారావారిపల్లెలోని 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 50 పడకల సీహెచ్సీగా అప్గ్రెడేషన్. » చిత్తూరు జిల్లా కుప్పం మండలం బైరుగానిపల్లెలో కేంద్రీయ విద్యాలయ పాఠశాల ఏర్పాటుకు వీలుగా 7.74 ఎకరాల ప్రభుత్వ భూమి ఉచితంగా అప్పగించేందుకు ఆమోదం. » గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో కేంద్ర నిధులతో ‘సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ యోగా అండ్ నేచురోపతి’ ఏర్పాటుకు 12.96 ఎకరాల ప్రభుత్వ భూమి ఆయుష్ శాఖకు అప్పగించేందుకు ఆమోదం. » అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయ భవనంలో నిర్మాణ పనుల నిర్వహణకు రూ.160 కోట్లకు పరిపాలనా అనుమతి. » 62 ఏళ్లు నిండిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు గ్రాట్యూటీ ఇస్తూ గతంలో జారీ చేసిన జీవోకు ఆమోదం. -
రోగమొస్తే జేబు గుల్లే
గుంటూరు జిల్లాకు చెందిన రాష్ట్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగి భార్య జనవరిలో అనారోగ్యం పాలయ్యారు. చికిత్స కోసం కుటుంబసభ్యులు కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. ఎంప్లాయీ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్) కార్డు ఉందని, నగదు రహిత వైద్యం అందించాలని కుటుంబసభ్యులు కోరారు. కానీ, ‘ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదు. డబ్బు కట్టి వైద్యం చేయించుకునేట్లైతే ఉండండి. లేదంటే వెళ్లిపోండి’ అని ఆస్పత్రి యాజమాన్యం తేల్చి చెప్పింది. చేసేదేం లేక రూ.3 లక్షలకు పైగా బిల్లును సొంతంగా చెల్లించారు. రీయింబర్స్మెంట్కు దరఖాస్తు చేస్తే, ప్రభుత్వం ఇప్పటికీ మంజూరు చేయలేదు. ప్రకాశం జిల్లాకు చెందిన పశు సంవర్ధక శాఖ ఉద్యోగి కాలు నొప్పితో వైద్యులను సంప్రదించగా శస్త్రచికిత్స చేయాలన్నారు. ఈహెచ్ఎస్ కింద చికిత్స కోసం కర్నూలులోని నెట్వర్క్లోని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా... ‘‘ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు. ఉచిత చికిత్సలు అందించలేం’’ అని వైద్యులు చెప్పారు. ఫీజు కట్టి రీయింబర్స్మెంట్కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.సాక్షి, అమరావతి: ప్రస్తుతం రాష్ట్రంలో లక్షలమంది ఉద్యోగులు, పింఛనర్లు ఎదుర్కొంటున్న సమస్యలకు నిదర్శనాలు. ఈ రెండు ఘటనలు చంద్రబాబు ప్రభుత్వం వారి ఆరోగ్య భద్రతను పూర్తిగా గాలికి వదిలేసిందనేందుకు తార్కాణాలు. నెలనెల ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్)కు తమ వాటా చెల్లిస్తున్నా... ఆపద సమయంలో అక్కరకు రావడం లేదనేందుకు సాక్ష్యాలు. ఉద్యోగులు, పింఛనర్లు అనారోగ్యంతో నెట్వర్క్ ఆస్పత్రులకు వెళ్తే.. నగదు రహిత వైద్యం లభించడం లేదు. దీంతో జేబులోంచి డబ్బు పెట్టాల్సి వస్తోంది. రూ.లక్షల్లో అప్పులు చేసి వైద్యం చేయించుకుని రీయింబర్స్మెంట్కు దరఖాస్తు పెట్టుకుంటే నెలల తరబడి మంజూరు చేయడంలేదు. రాష్ట్రంలో ఈహెచ్ఎస్పై 22 లక్షల మందికి పైగా ఉద్యోగులు, పింఛనర్లు, వారి కుటుంబసభ్యులు ఆధారపడి ఉన్నారు. 50:50 నిష్పత్తిలో ఉద్యోగులు, ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తున్నారు. నిరుడు చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక నిరుపేదల ఆపద్బాంధవి ఆరోగ్యశ్రీతో పాటు, ఈహెచ్ఎస్ను అటకెక్కించారు. చికిత్సలు చేసిన ఆస్పత్రులకు సకాలంలో బిల్లులు మంజూరు చేయడం మానేశారు. ఏకంగా రూ.320 కోట్ల మేర ఈహెచ్ఎస్ బిల్లులు బకాయి పెట్టారు. అరోగ్యశ్రీ బిల్లుల బకాయిలు రూ.4 వేల కోట్లకు పైమాటే. ఇవన్నీ నెలల తరబడి పేరుకుపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పలుసార్లు నెట్వర్క్ ఆస్పత్రుల ప్రతినిధులు ప్రభుత్వానికి వివరించారు. అయినప్పటికీ స్పందన కొరవడడంతో ఆస్పత్రులు పూర్తిగా ఈహెచ్ఎస్ సేవలను నిలిపివేశాయి. కేన్సర్, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ, లివర్, ఇతర పెద్ద అనారోగ్య సమస్యలతో పాటు ప్రమాదాల్లో గాయాలపాలైనవారు ఉచిత వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ 2019కి ముందు నాటి పరిస్థితి... వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీతో పాటు, ఈహెచ్ఎస్ పథకాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం బలోపేతం చేసింది. ఆరోగ్యశ్రీ పరిధిలో ఉండే అన్ని నెట్వర్క్ ఆస్పత్రులకు ఈహెచ్ఎస్ సేవలను విస్తరించింది. అంతేకాకుండా 2019కు ముందు చంద్రబాబు ప్రభుత్వం తొలగించిన ప్రొసీజర్లను పునరుద్ధరించింది. కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారినపడితే... ఉద్యోగులు, పింఛనర్లు వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడకూడదని 46 కేన్సర్ ప్రొసీజర్లను పథకంలోకి చేర్చింది. మొత్తంమ్మీద 2014–19 మధ్య కంటే 2019–24 కాలంలో ఈహెచ్ఎస్ లబ్ధిదారులకు రెట్టించిన ఆరోగ్య భరోసా లభించింది. 2014–19 సమయంలో టీడీపీ పాలనలో రూ.976 కోట్లు ఖర్చు చేయగా, 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.1,427 కోట్లు ఖర్చు పెట్టారు. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో ఈహెచ్ఎస్కు 2019కి ముందునాటి పరిస్థితి దాపురించిందని లబ్దిదారులు వాపోతున్నారు. కార్డులు ఎక్కడా ఆమోదించడం లేదు ఈహెచ్ఎస్ కార్డులు ఎక్కడా ఆమోదించడం లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం రూ.2 లక్షల వరకే మెడికల్ రీయింబర్స్మెంట్ ఇస్తోంది. ఎక్కువ ఖర్చు పెట్టుకున్న ఉద్యోగులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. రీయింబర్స్మెంట్ పరిమితిని రూ.5 లక్షలు చేయాలి. ఉద్యోగి కాంట్రిబ్యూషన్ ప్రతి నెల నేరుగా ట్రస్ట్కు జమ చేయాలి. ఈ విధానం అమలైతేనే మేలు జరుగుతుంది. ప్రొసీజర్స్ రేట్లను సమీక్షించి పెంచాలి. ప్రస్తుతం ఉన్న ధరలతో నష్టపోతున్నామని ఆస్పత్రులు చెబుతున్నాయి. –కె.వెంకట్రామిరెడ్డి, అధ్యక్షులు, సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రభుత్వం– ఆస్పత్రుల మధ్య ఉద్యోగులు నలిగిపోతున్నారు ఉద్యోగుల నుంచి ఠంఛన్గా ఈహెచ్ఎస్ వాటా తీసుకుంటున్నా... ప్రభుత్వం ట్రస్ట్కు ఆ డబ్బు జమ చేయడం లేదు. ట్రస్ట్ ఆసుపత్రులకు బిల్లులు ఇవ్వడం లేదు. దీంతో అప్పు చేసి వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది. ఆస్పత్రులు ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. రూ.5 లక్షలు పెట్టి వైద్యం చేయించుకుంటే రీయింబర్స్మెంట్ కేవలం రూ.90 వేలు ఇస్తున్నారు. ఇదేమని అడిగితే ఆమోదించిన ప్రొసీజర్ రేట్లు ప్రకారం అంతే వస్తుందని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు చెబుతున్నారు. అటు ఆస్పత్రులు, ఇటు ప్రభుత్వం మధ్య ఉద్యోగులు నలిగిపోతున్నారు. ఓపీ, వార్షిక ఆరోగ్య చెకప్లతో పథకాన్ని బలోపేతం చేస్తామన్న హామీలు నీటి మీద రాతలే అయ్యాయి. ఐపీ సేవలు అందక ఉద్యోగులు, పింఛనర్లు నరకం చూస్తున్నారు. –బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ -
దివ్యాంగుల పెన్షన్ టెన్షన్
సాక్షి నెట్వర్క్: సదరం సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్ పేరిట కూటమి ప్రభుత్వం లక్ష మంది దివ్యాంగుల పెన్షన్లను రద్దు చేసింది. వారందరికీ సెప్టెంబర్ నుంచి పింఛన్లు నిలిపివేస్తున్నట్టు అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ చర్యతో దివ్యాంగులంతా ఆందోళన చెందుతున్నారు. ‘దివ్యాంగుల పెన్షన్లు కూడా వదలరా.. మీకు మనసెలా వచ్చింది’ అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కాలు, చేయి కూడదీసుకుని రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ఆందోళనలకు దిగుతున్నారు. వరుస ఆందోళనలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. ఆందోళనల్లో భాగంగా అనంతపురంలో గురువారం పెట్రోల్ పోసుకుని ఉద్దీప్ సింహ అనే దివ్యాంగుడు ఆత్మహత్యాయత్నం చేశారు. బాపట్లలో చల్లా రామయ్య అనే దివ్యాంగుడు సెల్ టవర్ ఎక్కిన ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేయగా.. అనంతపురంలో కలెక్టరేట్ ఎదుట దివ్యాంగులు ధర్నా, రాస్తారోకో చేపట్టారు. రోడ్డుపై అర్ధనగ్నంగా పడుకుని సర్కారు తీరును ఎండగట్టారు. తిరుపతి కలెక్టరేట్ వద్ద దివ్యాంగుల జేఏసీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ధర్నాలో నిర్వహించగా.. సుమతి అనే దివ్యాంగురాలు సొమ్మసిల్లి పడిపోయింది. ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కలెక్టరేట్లోకి అధికారుల్ని వెళ్లనివ్వకుండా అడ్డుకున్న దివ్యాంగులు ప్రభుత్వానికి తమ ఉసురు తప్పక తగులుతుందంటూ శాపనార్థాలు పెట్టారు. కాగా.. పింఛన్ తొలగించారన్న మనోవేదనతో అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన దివ్యాంగురాలు మెండు గంగాభవాని (45) గురువారం ప్రాణం విడిచిందని స్థానికులు తెలిపారు. అనంతపురంలో తీవ్ర ఉద్రిక్తతవికలాంగుల హక్కుల జాతీయ వేదిక, ఏపీ దివ్యాంగుల హక్కుల పోరాట సమితి సంయుక్తంగా గురువారం అనంతపురం కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. దివ్యాంగుల రాస్తారోకో చేపట్టడంతో కలెక్టరేట్ ఎదుట రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అక్కడే హక్కుల వేదిక కళ్యాణదుర్గం పట్టణ అధ్యక్షుడు ఉద్దీప్ సింహ ఒంటిపై పెట్రోల్ పోసుకుని లైటర్తో అంటించుకునే ప్రయత్నం చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పోలీసులు లైటర్ గుంజుకుని ఉద్దీప్ సింహపై నీళ్లు పోశారు. అనంతరం దివ్యాంగులు ఎండలో రోడ్డుపై అర్ధనగ్నంగా పడుకుని నిరసన తెలిపారు. ‘సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, మంత్రి లోకేశ్, జిల్లా మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యేల్లారా రండి.. మీ ప్రభుత్వంలో మాకు జరిగిన అన్యాయం చూడండి’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. డీఆర్ఓ మలోల, డీఆర్డీఏ పీడీ శైలజ, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ అర్చన అక్కడికి చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దివ్యాంగులు వారితో మాట్లాడేందుకు నిరాకరించడంతో కలెక్టర్ వినోద్కుమార్ అక్కడకు చేరుకుని వారితో మాట్లాడారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు వసంతకుమార్, కార్యదర్శి రాజేష్, దివ్యాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కో–ఆర్డినేటర్ హరినాథరెడ్డి దివ్యాంగులకు పింఛన్ ఎలా తొలగించారో వివరించారు. దీంతో కలెక్టర్ సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ ఆత్మారామ్ను పిలిపించారు. కళ్లెదుట వైకల్యం కనిపిస్తున్నా తక్కువగా ఉన్నట్లు వైద్యులు ఎలా సర్టిఫికెట్ ఇస్తారని ప్రశ్నించారు. వెంటనే అందరికీ మరోసారి రీవెరిఫికేషన్ చేయాలని ఆదేశించారు. దివ్యాంగుల ఆందోళనకు వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్రెడ్డి, వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం నగర అధ్యక్షుడు కాలేషా తదితరులు మద్దతు తెలిపారు. సెల్ టవర్ ఎక్కి నిరసనపెన్షన్లు తొలగించటంతో బాపట్లలో దివ్యాంగులు గురువారం కదం తొక్కారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చి నిరసన చేపట్టారు. రాష్ట్ర సంచార జాతుల సంక్షేమ సంఘం నాయకుడు చల్లా రామయ్య తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా గల సెల్ టవర్ ఎక్కి సమస్య పరిష్కరించే వరకు దిగేది లేదని భీష్మించారు. రాష్ట్రవ్యాప్తంగా తొలగించిన దివ్యాంగుల పింఛన్లను పునరుద్ధరించాలని, బాపట్ల జిల్లాలో 3,824 దివ్యాంగుల పెన్షన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రామయ్యకు మద్దతుగా సెల్ టవర్ వద్ద నినాదాలు చేస్తున్న శరత్ అనే వ్యక్తిని పోలీసులు బలవంతంగా వెదుళ్లపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ నాయకులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో సెల్ టవర్ వద్ద నుంచి వైఎస్సార్సీపీ నాయకులను పోలీసులు తరిమికొట్టారు. పోలీసులకు ఎదురు తిరిగిన నలుగురిని బలవంతంగా పోలీస్ స్టేషన్లకు లాక్కెళ్లారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మేరుగు నాగార్జున డీఎస్పీ రామాంజనేయులు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. ఎట్టకేలకు దివ్యాంగుల పెన్షన్లు తొలగింపుపై అర్జీని మేరుగు నాగార్జునతో కలిసి చల్లా రామయ్య ఆర్డీవో గ్లోరియాకు అందజేశారు. కాగా.. సెల్ టవర్ ఎక్కిన చల్లా రామయ్యపై కేసు నమోదు చేసినట్టు సీఐ రాంబాబు తెలిపారు.తిరుపతిలో దివ్యాంగుల ధూంధాంతొలగించిన పింఛన్లు వెంటనే పునరుద్ధరించాలంటూ దివ్యాంగులు తిరుపతి కలెక్టరేట్ వద్ద గురువారం ధర్నా చేపట్టారు. కలెక్టరేట్లోకి అధికారులెవరినీ వెళ్లనీయకుండా.. లోపల ఉన్న వారిని బయటకు రాకుండా గేటుకు అడ్డంగా బైఠాయించి నిర్బంధించారు. మండుటెండలో ధర్నా చేయటంతో సుమతి అనే దివ్యాంగురాలు సొమ్మసిల్లిపడిపోయింది. చికిత్స నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించారు. 75 శాతం నుంచి 90 శాతం ఉన్న వైకల్యం కూటమి ప్రభుత్వం వచ్చాక 40 శాతానికి ఎలా తగ్గిపోతుందని నిలదీశారు. వైద్యుల్ని దివ్యాంగుల వద్దకే పంపించి న్యాయం జరిగేలా చూస్తానని కలెక్టర్ వెంకటేశ్వర్ ఫోన్లో దివ్యాంగులకు హామీ ఇచ్చారు. దివ్యాంగుల ఆందోళనకు వైఎస్సార్సీపీ తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి, సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు మద్దతు తెలిపారు.దివ్యాంగుడి పింఛన్ కోత.. నిరుపేద కుటుంబం గుండెకోత» పింఛన్ రీవెరిఫికేషన్ పేరుతో వైకల్య శాతం తగ్గింపు» ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులు గాందీనగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వం వైకల్య శాతాన్ని తగ్గించడంతో పింఛన్ తగ్గిపోతుందని ఆ కుటుంబం ఆందోళన చెందుతోంది. విజయవాడ భవానీపురం 40వ డివిజన్కు చెందిన పొందుగుల చిన్నపరెడ్డి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. 2022లో చెట్టుమీద నుంచి పడటంతో వెన్నుపూస పూర్తిగా దెబ్బతింది. కాళ్లు రెండూ చచ్చుబడిపోయి పూర్తిగా మంచానికి పరిమితమయ్యాడు. వైద్యులు పరీక్షించి 90శాతం వైకల్యం ఉన్నట్లు ధ్రువీకరిస్తూ సదరం సర్టిఫికెట్ జారీ చేశారు. చిన్నపరెడ్డి బాగోగులు చూసుకోవడమే అతని భార్యకు సరిపోతోంది. కుటుంబ పోషణ, కుమార్తె చదువు భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఆ కుటుంబం 2023వ సంవత్సరంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసింది. పెద్ద మనసుతో ఆయన ఆదుకున్నారు. రూ.10 లక్షల ఆర్థిక సాయం చేశారు. అప్పటి కలెక్టర్ ఢిల్లీరావు స్వయంగా బాధితుడి ఇంటికి వెళ్లి ఈ సాయం చెక్కు అందజేశారు. సామాజిక పింఛన్ రూ.10వేలు మంజూరు చేశారు. వచ్చే పెన్షన్తో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక చిన్నపురెడ్డి పింఛన్ను రీ వెరిఫికేషన్ చేసి.. వైకల్యాన్ని 85 శాతంగా చూపుతూ సదరం సర్టిఫికెట్ జారీ చేశారు. పింఛన్ రూ.6 వేలే వస్తుందని అధికారులు నోటీసులిచ్చారు. దీంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలోకి వెళ్లింది. ఈ పరిస్థితుల్లో తాము బతికేదెలా అంటూ ఆందోళన చెందుతోంది. -
కృష్ణా, గోదావరి ఉగ్రరూపం
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/ విజయపురిసౌత్: వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో కృష్ణా, గోదావరి నదులు ఉగ్రరూపం దాల్చాయి. ప్రకాశం బ్యారేజీ, ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను దాటి నదులు ప్రవహిస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులోకి 5,40,756 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. దీంతో ప్రాజెక్టు పది గేట్ల ద్వారా 4,85,435 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. నాగార్జునసాగర్లోకి 4,32,268 క్యూసెక్కులు చేరుతుండగా, 4.28 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 4,28,513 క్యూసెక్కులు చేరుతుండగా 4,13,205 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీలోకి 5,08,849 క్యూసెక్కులు చేరుతుండగా, కృష్ణా డెల్టాకు 8 వేల క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 5 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. పోలవరం నుంచి 11,09,200 క్యూసెక్కులు..భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టులోకి 11,09,200 క్యూసెక్కులు చేరుతుండటంతో ప్రాజెక్టు 48 గేట్లు ఎత్తి అంతేమొత్తంలో దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీలోకి 11,74,573 క్యూసెక్కులు చేరుతుండగా, గోదావరి డెల్టాకు 9,100 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 11,65,473 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఉత్తరాంధ్రలోని వంశధార, నాగావళిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. వంశధార నుంచి గొట్టా బ్యారేజీలోకి 13,495 క్యూసెక్కులు చేరుతుండగా, అంతే సముద్రంలోకి వదిలేస్తున్నారు. నారాయణపురం ఆనకట్ట మీదుగా నాగావళి వరద జలాలు 9,400 క్యూసెక్కులు సముద్రంలో కలుస్తున్నాయి. -
ఖైదీ శ్రీకాంత్ పెరోల్ ఎపిసోడ్లో సంచలన ఆధారాలు
విజయవాడ: ఖైదీ శ్రీకాంత్ పెరోల్ అంశానికి సంబంధించి సంచలన ఆధారాలు ‘సాక్షి’ చేతికి చిక్కాయి. శ్రీకాంత్ పెరోల్లో హోం మంత్రి అనిత అడ్డంగా దొరికిపోయారు. టీడీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పాశం సునీల్ లేఖలపై హోంమంత్రి అనిత సంతకాలు చేశారు. హోంమంత్రి అనిత ఎండార్స్మెంట్ పైనే ఫైల్ కదిలింది. మే 16 న హోంమంత్రి అనిత ఫైల్పై సంతకం చేసి పంపగా, హోంమంత్రి ఆదేశాలతో హోంశాఖ ఫైల్ సిద్ధం చేసింది. అయితే ఖైదీ శ్రీకాంత్కి పెరోల్ ఇవ్వొద్దని రిమార్క్స్ రాసిన నెల్లూరు జైల్ సూపరింటెండెంట్. ఫలితంగా శ్రీకాంత్కి పెరోల్ ఇవ్వడం సాధ్యం కాదని హోమ్ శాఖ జాయింట్ సెక్రటరీ తిరస్కరించారు. జులై 16వ తేదీన శ్రీకాంత్ పెరోల్ ఫైల్ను హోంశాఖ జాయింట్ సెక్రటరీ తిరస్కరించారు. అయినా మళ్ళీ టీడీపీ ఎమ్మెల్యేలు చక్రం తిప్పడంతో నిబంధనలు పక్కన పెట్టి శ్రీకాంత్కి పెరోల్ ఇస్తూ జీవో జారీ చేశారు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. విద్యార్థుల ప్రాణం తీసిన ఈత సరదా
సాక్షి,అన్నమయ్య: ఈత సరదా విద్యార్థులు ప్రాణాలు తీసింది. అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ముగ్గురు ఎంబీఏ విద్యార్థులు ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. రాయచోటి రహదారి బాలరాజుపల్లి సమీపంలో ఉన్న చెయ్యేరు ఇసుక క్వారీ గుంతలో ఈతకొట్టేందుకు విద్యార్థులు వెళ్లారు. అయితే ఈత కొట్టే సమయంలో ప్రమాదవశాత్తు విద్యార్థులు క్వారీ గుంతలో పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. మృతి చెందిన వారిలో సోంబత్తిన దిలీప్(22) గాలివారిపల్లి రాజంపేట మండలం,కొత్తూరు చంద్రశేఖర్ రెడ్డి(22) మంటపంపల్లి ఒంటిమిట్ట మండలం. పెన్నరోతు కేశవ (22) పోరుమామిళ్లకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. విద్యార్థుల మరణంపై సమాచారం అందుకున్న రాజంపేట ఏ ఎస్పీ ,రెవిన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
‘ఇది చాలా తప్పు నారా లోకేష్’.. ఏబీవీపీ ఆగ్రహం
సాక్షి, విజయవాడ: ఏపీలో విద్యా రంగం నిర్జీవమైపోయిందంటూ ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యాగంటి వెంకట గోపి మండిపడ్డారు. యువగళంలో నారా లోకేష్ యువతకు చాలా హామీలిచ్చారు. మార్చిలో ఇంటర్ పరీక్షలు పూర్తైతే.. ఈరోజుకీ డిగ్రీ అడ్మిషన్ల పట్ల స్పష్టత లేదు.. ఐదు నెలలు పూర్తైంది.. విద్యార్థులకు ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితి నెలకొందంటూ మంత్రి నారా లోకేష్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘అడ్మిషన్లు ఆలస్యం కావడంతో విద్యార్థులు ప్రైవేట్ యూనివర్శిటీలకు వలస పోతున్నారు. ప్రైవేట్ యూనివర్శిటీల వద్ద తీసుకున్న లంచాల కారణంగానే అడ్మిషన్లు ఆలస్యం అవుతున్నాయని అనుమానాలొస్తున్నాయి. మెగా డీఎస్సీ మెరిట్ లిస్ట్ బహిరంగంగా విడుదల చేయలేదు. మీ పార్టీ కార్యకర్తలకు డీఎస్సీ పోస్టులు ఇవ్వాలనే ఆలోచన కనిపిస్తోంది. మెరిట్ లిస్ట్ను మెసేజ్లు పెట్టి సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసుకోవాలని చెప్పడం ముమ్మాటికీ తప్పు..రోస్టర్, మెరిట్ లిస్ట్ ప్రకారమే నియామక పత్రాలు అందించి రిక్రూట్ మెంట్ జరపాలి. ప్రైవేట్ యూనివర్శిటీల్లో చదివే పీజీ విద్యార్ధులకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని చెప్పారు. ఐసెట్, పీజీ సెట్లు అయిపోయినా ఇంతవరకూ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల ఆవరణలోకి విద్యార్ధి సంఘాలు రాకూడదని జీవో ఇవ్వడం దారుణం. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణచివేయడానికి పనిచేస్తున్నారు..యూనివర్శిటీల్లో ప్రైవేట్ కార్యక్రమాలు చేయొద్దంటారు. మీరు మాత్రం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు జరిపిస్తారు. రాజకీయాలకు అతీతంగా పాఠశాలలు ఉండాలని మీరే అంటారు. కానీ మీరే రాజకీయ కార్యకలాపాలు పాఠశాలల్లో నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా మంత్రి నారా లోకేష్ పునరాలోచన చేసి జీవోను ఉపసంహరించుకోవాలి. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలి’’ అని యాగంటి వెంకట గోపి డిమాండ్ చేశారు.స్కూళ్లు, కాలేజీల ఆవరణలో డ్రగ్స్ దందా విపరీతమైపోయింది. మెడికల్ కాలేజీల్లో పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి. ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను నిర్వహించాలి. ప్రభుత్వం తన విధానాలను మార్చుకోకపోతే అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకుని పోరాటం చేస్తాం’’ అని వెంకట గోపి హెచ్చరించారు. -
ఉద్యోగులంటే చంద్రబాబు ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యమా? వెంకట్రామిరెడ్డి
విజయవాడ: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఈరోజు(గురువారం, ఆగస్టు 21 వ తేదీ) జరిగిన ఏపీ క్యాబినెట భేటీలో ఉద్యోగుల డీఏ, ఐఆర్, పీఆర్సీలపై కనీసం చర్చించకపోవడంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిన్న(బుధవారం) జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ వినయానంద్ నిర్వహఙంచినా, నేటి చంద్రబాబు క్యాబినెట్ భేటీలో ఉద్యోగుల బెనిఫిట్స్పై చర్చిస్తారని ఉద్యోగ సంఘాలు చెప్పుకొచ్చాయి. అయితే అది జరగలేదు. కనీసం ఉద్యోగుల డీఏపై కూడా చర్చింంచకపోవడంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులంటే ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యమా? అని ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. ‘ ఈరోజు చర్చిస్తామని నిన్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో చెప్పారు. కానీ కనీసం ఒక డిఏకి కూడా ఈరోజు ఆమోదించలేదు. 15 నెలలుగా కనీసం ఒక్క డీఏ కూడా ఇవ్వలేదు. ఇక ఐఆర్ లేదు.. పీఆర్సీ కమిషన్ వేయలేదు. ఉద్యోగులు రోడ్డెక్కే పరిస్థితి ప్రభుత్వం తీసుకొస్తోంది. ఉద్యోగులపై పనిభారం పెంచి ఇబ్బంది పెడుతున్నారు. శ్రీశైలం ఎమ్మెల్యే ఉద్యోగులను కొడితే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. టీడీపీ ఎమ్మెల్యే.. కెజిబివి ప్రిన్సిపాల్ని వేధిస్తే చర్యలు లేవు. ఇక ఉద్యోగులు ఎలా పని చేయాలి’ అని మండిపడ్డారు. -
ఏపీ కేబినెట్ భేటీలో.. టీడీపీ ఎమ్మెల్యేల బూతులపై చర్చ
సాక్షి, అమరావతి: చంద్రబాబు నోట.. మళ్లీ అదే మాట. సొంత ఎమ్మెల్యేలు తప్పుడు పనులకు, అరాచకాలకు పాల్పడుతున్న విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి స్వయంగా అంగీకరించారు. ఇవాళ కేబినెట్ భేటీలో మంత్రుల అలసత్వంతో పాటు ఎమ్మెల్యేల అరాచకాలపైనా చర్చ జరిగింది. కూటమి అధికారంలోకి వచ్చాక.. కొందరు ఎమ్మెల్యేలు, మంత్రుల తీరు వివాదాస్పదంగా ఉంటూ వస్తోంది. అవినీతి, అక్రమాలు, ఆరాచకాలు, వివాదాస్పద వ్యాఖ్యలు.. చేష్టలతో ఎవరో ఒకరు నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. దీంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పదే పదే ఆయన హెచ్చరిస్తూ వస్తున్నారు. తాజాగా.. కేబినెట్ భేటీలో మునుపెన్నడూ లేని రీతిలో అరుదైన చర్చ జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేల దందాలపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించారు. టీడీపీ ఎమ్మెల్యేల అసభ్య ప్రవర్తన, బూతులతోపాటు ఉద్యోగులపై దాడులు చేసిన ఘటనలపైనా హీటెక్కింది. కొందరు ఎమ్మెల్యేల వ్యవహారం తలనొప్పిగా మారిందంటూ సీరియస్ అయ్యారు. గాడితప్పుతున్న ఎమ్మెల్యేల విషయంలో ఇన్ఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఈ మధ్యకాలంలో జరిగినవి.. శ్రీశైలం ఎమ్మెల్యే బుద్దా రాజశేఖర్.. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బందిపై దాడి చేశారు. ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్యపై వేధింపులకు దిగగా.. ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. అనంత అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ను దూషించిన ఆడియో క్లిప్ ఒకటి విపరీతంగా వైరల్ అయ్యింది. దీంతో జూనియర్ ఫ్యాన్స్ టీడీపీపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వీళ్లే కాదు.. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ వ్యవహారంలో వేధింపులు భరించలేక టీడీపీకే చెందిన ఓ మహిళా కార్యకర్త ఆత్మహత్యకు ప్రయత్నించిన విషయమూ తెలిసిందే. కొలికపూడి శ్రీనివాస్, బండారు శ్రావణి, ఇలా మరికొందరు ఫస్ట్ టైం ఎమ్మెల్యేల వ్యవహారం కూడా పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా నడుస్తోంది. ఈ క్రమంలో.. ‘‘ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదు. అధికార ఎమ్మెల్యేలే అడ్డగోలుగా వ్యవహరిస్తే.. ఎవరు బాధ్యత వహిస్తారు?. మీ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. తప్పు చేసింది ఎవరైనా ఇక మీదట చట్టపరమైన చర్యలు తప్పవు’’ అని పేర్కొన్నట్లు సమాచారం. అదే సమయంలో.. అదేసమయంలో.. మంత్రుల పెరఫార్మెన్సుపైనా అధికారుల నుంచి నివేదిక తెప్పించుకున్న సీఎం చంద్రబాబు.. వాళ్లపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు ఫైల్స్ క్లీయరెన్సులో ఘోరంగా వెనకబడ్డారని అధికారులు తేల్చారు. దీంతో ఒక్కో ఫైల్ కు సరాసరిని ఒక్కో మంత్రి ఎంత టైమ్ తీసుకుంటున్నారో వివరించిన చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇకనైనా ఈ పరిస్థితి మారాలి.. నిర్ణిత సమయంలో ఫైల్స్ క్లియర్ కావాలి అని హెచ్చరించినట్లు తెలుస్తోంది. -
శ్రీకాంత్ పెరోల్ వెనుక ఉన్నది వారే: కాకాణి
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వ మోసాలను ఎండగట్టడం వల్లే కక్షతో కేసులు పెట్టారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన సాక్షి మీడియాతో మాట్లాడుతూ.. జైలుకెళ్లొచ్చినా వెనక్కి తగ్గేది లేదని.. రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానన్నారు.‘‘దాదాపుగా రాష్ట్రంలోని అన్నీ జైళ్లు వైఎస్సార్సీపీ నేతలతో నిండిపోయాయి. టీడీపీ వాళ్లు అరాచకాలు చేసినా పోలీసులు కేసులు పెట్టే ధైర్యం చేయలేకపోతున్నారు. అక్రమ కేసుల వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులు భవిష్యత్తులో ఫేస్ చేయాల్సి వస్తుంది. గతంలో మాపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసినా మేం ఎవరి మీద కేసులు పెట్టలేదు. ఇప్పుడు ఎప్పుడో జరిగిందని ఓ టీడీపీ నాయకుడి వాంగ్మూలాన్ని తీసుకుని కేసులు పెడుతున్నారు. గతంలో ఎప్పుడూ లేని దుష్ట సంప్రదాయానికి చంద్రబాబు నాంది పలుకుతున్నారు...జగన్ పరామర్శకు వెళ్లిన సమయంలో కూడా అనేక అక్రమ కేసులు పెట్టారు. అరెస్టులు చేయటం, పీటీ వారెంట్లు వేయటం.. జైళ్ల చుట్టూ తిప్పటం.. ఇదే వాళ్ల పని.. ప్రసన్న కుమార్ ఇంటిపై దాడి కేసులో నిందితులు ఎవరూ కూడా పోలీసులు గుర్తించలేదు. మా పార్టీ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిపై అక్రమ కేసు పెట్టారు. ఎవరో డ్రోన్ ఎగరేస్తే మా పార్టీ నేతపై మర్డర్ కేసులు పెడుతున్నారు. రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ వెనుక ఉన్నది టీడీపీ ఎమ్మెల్యేలే.ఎస్పీ స్థాయి అధికారులు వద్దన్నా టీడీపీ నేతల ఒత్తిడి తోనే పెరోల్ ఇచ్చారు.. దీన్ని మళ్ళీ వైఎస్సార్సీపీకి అంటగట్టే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఇప్పటికైనా టీడీపీ చేసిన తప్పులు ఒప్పుకుని చెంపలేసుకోవాలి. అడ్రస్ లేని వ్యక్తులు, ఏ గాలికి ఆ చాప ఎత్తే వ్యక్తులు మాట్లాడిన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీని బలోపేతం చేస్తాం. వైఎస్ జగన్ను మళ్లీ సీఎం చేసేందుకు కృషి చేస్తా’’ అని కాకాణి తెలిపారు. -
సుపరిపాలన అంటే స్కామ్లు, దాడులేనా?: సాకే శైలజానాథ్
సాక్షి, తాడేపల్లి: సుపరిపాలన అంటే స్కాంలు, దళితుల మీద దాడులు చేయటమా? అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి, సాకే శైలజానాథ్ ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మద్యం, ఇసుకలో దోపిడీ చేయటమే సుపరిపాలనా? సాక్షాత్తు ఎమ్మెల్యేలే అధికారులను కిడ్నాప్ చేస్తుంటే చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. మహిళలను వేధిస్తున్న ఎమ్మెల్యేలకు చంద్రబాబు మద్దతు ఇస్తున్నారు’’ అంటూ శైలజానాథ్ దుయ్యబట్టారు.‘‘జూనియర్ ఎన్టీఆర్ తల్లిని దారుణంగా దూషించిన ఎమ్మెల్యేకి చంద్రబాబు వత్తాసు పలికారు. ఇదేనా సుపరిపాలన అంటే?. ప్రణాళికాబద్దంగా చంద్రబాబు వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. ప్రచార ఆర్భాటమే తప్ప ఆయన పాలనలో ప్రజలకు ఒరగిందేమీ లేదు. టీడీపీ ఎమ్మెల్యే అటవీశాఖ అధికారుల మీద దాడి చేస్తే ఏం చర్యలు తీసుకున్నారు? జూనియర్ ఎన్టీఆర్ తల్లిని టీడీపీ ఎమ్మెల్యే దారుణంగా దూషిస్తే కనీస చర్యల్లేవు. కూన రవికుమార్ ఒక మహిళా ప్రొఫెసర్ని వేధిస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు?’’ అంటూ శైలజానాథ్ ప్రశ్నించారు.‘‘మంత్రి అచ్చెన్నాయుడు వేధింపులకు ఆగ్రోస్ అధికారి సెలవుపై వెళ్లిపోతుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారు?. ఎమ్మెల్యేలు, మంత్రుల నీతి మాలిన చర్యల వెనుక చంద్రబాబు ఆమోదం ఉంది. భూ కుంభకోణాల గురించి జనం చర్చించుకుంటున్నారని డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. రాయలసీమకు తాగునీరు రాకపోతున్నా పట్టించుకోరా?. దెందులూరులో మా పార్టీ నేత పామాయిల్ తోటలోకి టీడీపీ గూండాలు చొరపడ్డారు. రాష్ట్రంలో రాజకీయ వికృత క్రీడలను ఇకనైనా ఆపండి’’ అంటూ శైలజానాథ్ హెచ్చరించారు.‘‘రౌడీషీటర్ శ్రీకాంత్కు పెరోల్ ఇవ్వటం వెనుక హోంశాఖ ఉండటం దుర్మార్గం. ప్రజలకు ప్రభుత్వం సంజాయిషీ ఇవ్వాలి. అరుణ సెల్ఫీ వీడియోకు ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. చంద్రబాబు పాలనలో అన్ని వ్యవస్థలు సర్వ నాశనం అవుతున్నాయి. అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చేస్తే ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు?. దౌర్జన్యాలు చేసే ఎమ్మెల్యేలకు ఎస్కార్ట్ ఇస్తారా? ఇంతకంటే దారుణం ఉంటుందా?’’ అంటూ శైలజానాథ్ మండిపడ్డారు. -
వైఎస్ జగన్ని తిట్టడం తప్ప.. రాష్ట్రానికి ఏం చేశావో చెప్పు చంద్రబాబు
సాక్షి,తూర్పుగోదావరి జిల్లా: చంద్రబాబు ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కును కాపాడేలా కలిసి వచ్చే పార్టీలతో కలిసి పోరాటం చేస్తామని పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. కూటమి నాయకుల వ్యక్తిగత స్వార్థం కనిపిస్తోంది. రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోయాయి. విశాఖ ఉక్కు కోసం ఎందుకు మాట్లాడడం లేదు. వైఎస్సార్సీపీని, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిట్టడం తప్ప ఇంకేమీ లేదు. విశాఖ ఉక్కుపై కలిసి వచ్చే పార్టీలతో పోరాటం చేస్తాం. యూరియా బస్తాలు ఇవ్వలేని స్థితలో ప్రభుత్వం ఉంది. ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తే.. కేసులు పెడుతున్నారు. కేసులు పెట్టాల్సి వస్తే ముందుకు చంద్రబాబుపైనే కేసులు పెట్టాలిరాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదు. రైతులకు కేంద్రం సాయం తప్ప.. రాష్ట్రం ఇచ్చింది లేదు. ప్రజాప్రతినిధులు, వారి తాబేదారుల కబ్జాలు పెరిగిపోయాయి.14 నెలలుగా ఢిల్లీ వెల్లి ఏం సాధించారు?. విశాఖ ఉక్కు కోసం ఎందుకు మాట్లాడారు’అని ప్రశ్నించారు.కాగా, ఈ నెల 25వ తేదీన వైఎస్ జగన్ రాజమండ్రి పర్యటన రద్దు అయ్యింది. వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డితో వైఎస్ జగన్ ములాఖత్ వినాయకచవితి తర్వాత ఉంటుందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రకటన చేశారు. -
‘ఉద్యోగుల హక్కులను చంద్రబాబు సర్కార్ కాలరాస్తోంది’
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పద్నాలుగు నెలలకు నిర్వహించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి ప్రభుత్వ వైఖరి తీవ్ర నిరాశను మిగిల్చిందని వైఎస్సార్సీపీ ఉద్యోగులు, పెన్షనర్స్ వింగ్ అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సీఎస్ నేతృత్వంలో ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులతో జరిగిన ఈ సమావేశంలో ఏ ఒక్క అంశంపైనా నిర్ణయం తీసుకోకుండా మొక్కుబడిగా ముగించడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోందన్నారు.పెండింగ్లో ఉన్న పీఆర్సీ, డీఏ చెల్లింపులు, ఐఆర్ బకాయిలపై కనీసం ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత ఇవ్వకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే.. సచివాలయంలో సీఎస్ అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏదైనా పాజిటీవ్ నిర్ణయం వస్తుందని ఉద్యోగులు, పెన్షనర్లు కొండంత ఆశ పెట్టుకున్నారు. కానీ ఏ ఒక్క దానిమీదా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు అందరూ నిరాశ చెందారు.రెండేళ్ళ నుంచి పెండింగ్లో ఉన్న పన్నెండో పీఆర్సీకి నేటికీ కమిషనర్ను నియమించలేదు. గత ప్రభుత్వం నియమించిన కమిషనర్ ఎన్నికల తరువాత కూటమి ప్రభుత్వం ఏర్పడటంతోనే రాజకీనామా చేశారు. ఆయన స్థానంలో మరో కమిషనర్ను నియమించి పీఆర్సీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అందరూ భావించారు. కానీ ఇప్పటి వరకు కనీసం పీఆర్సీ కమిషనర్నే నియమించలేదు. ఎన్నికల హామీల్లో భాగంగా ఇస్తామన్న మధ్యంతర భృతి పైన కూడా ఎక్కడా నిర్ణయం తీసుకోలేదు.ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలి. ఈ బకాయిలు ఎంత అనే దానిపైన కూడా ఒక స్పష్టత లేదు. ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన డీఏ ఎరియర్స్ ఎంత అనే దానిపైన ఈ ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. కనీసం పే స్లిప్ల్లో ఈ బకాయిలకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని అమరావతి జేఏసీ తరుఫున దీనిపై సీఎస్ను డిమాండ్ చేసినా, దానిపైనా ఎటువంటి స్పందన లేదు. పదకొండో పీఆర్స్ ఎరియర్స్తో పాటు, డీఏలకు సంబంధించిన బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని ఉద్యోగ సంఘాలు కోరాయి.ఇప్పటి వరకు నాలుగు డీఏలు పెండింగ్లో ఉంది. డీఏల గురించి ఎక్కడా ఈ సమావేశంలో మాట్లాడలేదు. అసలు జేఎస్సీ ఎందుకు పెట్టారో చెప్పాలి. కేవలం టైంపాస్ కోసం, ఉద్యోగుల కళ్ళ నీళ్ళు తుడిచేందుకే ఈ సమావేశం నిర్వహించారా..? కనీసం ముప్పై శాతంకు తగ్గకుండా మధ్యంతర భృతిని ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. దీనిపైన కూడా ఎక్కడా నిర్ణయం తీసుకోలేదు.తక్షణం పే రివిజన్ కమిషన్ను ఏర్పాటు చేయాలి:ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం తక్షణం పే రివిజన్ కమిషన్ను ఏర్పాటు చేసి, పీఆర్సీ కనీసం 30 శాతంకు తగ్గకుండా చూడాలి. డీఏ బకాయిలను విడుదల చేయాలి. మధ్యంతర భృతిని చెల్లించాలి. ఎంప్లాయిస్ హెల్త్ స్కీంలు సరిగా నిర్వహించడం లేదు, బకాయిలు పెట్టడం వల్ల ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందించడం లేదని పలువురు ఉద్యోగులు ఈ సమావేశంలో ప్రస్తావించారు. మెడికల్ రీయింబర్స్ మెంట్ ను రెండు నుంచి అయిదు లక్షల రూపాయలకు పెంచాలని, సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను తీసుకురావాలని, గత ప్రభుత్వం మూడు వేల మందిని రెగ్యులర్ చేసింది, మిగిలిన ఏడు వేల మందిని కూడా తక్షణం రెగ్యులర్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి.ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. 70 సంవత్సరాలు నిండిన పెన్షనర్లకు పదిశాతం అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్, 75 దాటిన వారికి పదిహేను శాతం ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేశాయి. అయిదు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో కనీసం ఒక్క దానిపైన కూడా నిర్ణయం తీసుకోలేదు. పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 62 ఏళ్ళ వరకు పదవీ విరమణ వయస్సును పెంచాలని కోరారు.ఈ డిమాండ్లపై సీఎస్ నుంచి ఎటువంటి హామీ రాకపోవడం, ప్రభుత్వం దృష్టికి తీసుకువెడతానంటూ చేతులు దులుపుకునే కార్యక్రమం చేయడం ఎంత వరకు సమంజసం..? కూటమి ప్రభుత్వ వైఖరిని వైయస్ఆర్సీపీ ఎంప్లాయిస్ అండ్ పెన్షనర్స్ వింగ్ తీవ్రంగా ఖండిస్తోంది. ఉద్యోగ, పెన్షనర్ల తరుఫున ప్రభుత్వం మెడలు వంచైనా సరే, వారికి రావాల్సిన అన్నింటిని సాధించుకుంటాం. -
లక్షకు పైగా వికలాంగుల పెన్షన్లు తొలగించాం
నర్సీపట్నం: ఇప్పటివరకు రాష్ట్రంలో లక్షకు పైగా వికలాంగుల పెన్షన్లు తొలగించామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. అనర్హులైన వికలాంగులకు పింఛన్ తొలగించమని సీఎం చంద్రబాబుకు తానే లేఖ రాశానని చెప్పారు. రాష్ట్రంలో 14 నెలల్లో 4.5 లక్షల పెన్షన్లు తొలగించారు. వికలాంగ పెన్షన్లు లక్ష వరకు తొలగించామని సాక్షాత్తు స్పీకరే చెబుతున్నారు. రానున్న కాలంలో మరెన్ని పెన్షన్లకు మంగళం పలుకుతారోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో స్పీకర్ మీడియాతో మాట్లాడుతూ.. అర్హత లేకుండా పెన్షన్ పొందుతున్న వికలాంగులు రాష్ట్రంలో లక్షల మంది ఉన్నారన్నారు.ఈ విషయమై రెండు నెలలు క్రితం తానే స్వయంగా సీఎం చంద్రబాబుకు లేఖ రాసినట్టు తెలిపారు. నిబంధనల ప్రకారం 40 శాతానికి పైగా వైకల్యం ఉన్న వారిని మాత్రమే అర్హులుగా గుర్తించాల్సి ఉందన్నారు. 40 శాతం కంటే తక్కువ ఉన్నవారిని అనర్హులుగా గుర్తించాలన్నారు. అనకాపల్లి జిల్లాలో 4,148 మంది వికలాంగుల్లో 40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్న వారిని గుర్తించారన్నారు. అందులో 120 మందిని ఆరోగ్య పింఛన్లకు ఎంపిక చేసినట్టు తెలిపారు. 679 మందిని వృద్ధాప్య పింఛన్లలోకి మార్చగా.. 3,349 మంది వికలాంగుల పింఛన్లు రద్దు చేసినట్టు వెల్లడించారు. -
నేడు కేబినెట్ సమావేశం
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనున్నది.ఈ సమావేశంలో ఇటీవల సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలిపి, మరిన్ని అంశాలపై చర్చించనునట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. -
వారికి నోటీసులు ఆపండి!
సాక్షి, అమరావతి: అనర్హులంటూ రాష్ట్రంలోని లక్షలాది మంది దివ్యాంగ పింఛనుదారులకు కొద్దిరోజులుగా జారీచేస్తున్న నోటీసులను కొందరికి నిలుపుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. పింఛను కార్యక్రమాలను పర్యవేక్షించే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈఓ ఈ మేరకు సూచించారంటూ సెర్ప్ అధికారులు అన్ని జిల్లాల అధికారులకు బుధవారం సమాచారం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన జాబితాలను జిల్లాల వారీగా సెర్ప్ కార్యాలయం అందజేస్తుందని వారు తెలిపారు. నిజానికి.. టీడీపీ కూటమి ప్రభుత్వం పింఛన్ల భారాన్ని తగ్గించుకునేందుకు దివ్యాంగులను ప్రధానంగా టార్గెట్ చేసింది. వీరి సంఖ్యను భారీగా కుదించేందుకు 10–15 ఏళ్లకు పైగా పింఛను పొందుతున్న లబ్ధిదారులకు కొత్తగా మళ్లీ వైద్య పరీక్షలు అంటూ హడావుడి చేస్తోంది. మీకు 40 శాతం కంటే తక్కువగా వైకల్యం ఉంది, పింఛనుకు అనర్హులంటూ ప్రతి జిల్లాలో వేలాది మంది లబ్ధిదారులకు నోటీసులు జారీచేస్తోంది. ఇప్పటికే నాలుగున్నర లక్షల పింఛన్లకు కోత..గత ప్రభుత్వ హయాంలో 66.34 లక్షల మందికి పైగా పింఛన్లు అందించగా.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఏడాదిలో దాదాపు నాలుగున్నర లక్షల పింఛన్లు తగ్గిపోయాయి. ప్రస్తుతం ఈ ఆగస్టులో పంపిణీ చేసిన మొత్తం పింఛన్లు 62.19 లక్షలే. ఇప్పుడు దీనికి అదనంగా లక్షలాది మంది దివ్యాంగ, వైద్య పింఛనుదారులకు అనర్హత పేరుతో నోటీసులు జారీచేస్తుండడంపై ‘సాక్షి’ బుధవారం ‘పింఛన్లు.. కకావికలం’ శీర్షికతో ప్రత్యేక కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. దీంతో.. మెంటల్ రిటార్డేషన్, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న 18 ఏళ్లలోపు పిల్లలకు జారీచేసే నోటీసులను నిలుపుదల చేయాలంటూ సెర్ప్ సీఈఓ ఆదేశాలు జారీచేశారు. -
అంతర్ జిల్లాల బదిలీలకు షెడ్యూల్
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు జీవిత భాగస్వామి (స్పౌజ్), పరస్పర (మ్యూచువల్) అంతర్ జిల్లా బదిలీలు చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలతో కూడిన షెడ్యూల్ను విడుదల చేసింది. ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్ స్కూళ్లల్లో పనిచేస్తూ ఈ ఏడాది జూలై 31 నాటికి రెండేళ్ల సర్వీసు ఉన్నవారికి మాత్రమే అవకాశం కల్పించారు. దరఖాస్తుదారులు ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లా, బదిలీ కోరుకుంటున్న జిల్లా వివరాలకు సంబంధించి రెండు రకాల ఫార్మాట్లలో గురువారం నుంచి ఈ నెల 24లోగా ఉపాధ్యాయులు లీప్ యాప్లో ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశించారు. దరఖాస్తుల ప్రింట్ కాపీలను స్థానిక ఎంఈవోలకు అందించాలని, వీటిపై డీఈవో పరిశీలన చేసి ఈనెల 27 నాటికి డైరెక్టరేట్కు పంపించాలన్నారు. మ్యూచువల్, స్పౌజ్ కేటగిరీ ఉపాధ్యాయులు రాష్ట్రవ్యాప్తంగా 2 వేల మంది వరకు ఉండవచ్చని అంచనా. తాజా బదిలీల్లో మెడికల్ గ్రౌండ్స్ కింద అవకాశం ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. వ్యక్తిగతం, మెడికల్ గ్రౌండ్స్ కింద కూడా అంతర్ జిల్లా బదిలీలకు అనుమతించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. అలాగే, మిగులు ఉపాధ్యాయులకు సైతం అంతర్ జిల్లా బదిలీలు చేపట్టాలని కోరుతున్నారు. -
డీఎస్సీలో డొంక తిరుగుడు!
సాక్షి, అమరావతి :మెగా డీఎస్సీ.. ‘దగా డీఎస్సీ’గా మారనుందా..? ఉపాధ్యాయ పోస్టులను అంగట్లో అమ్మకానికి పెట్టారా..? పారదర్శకంగా మెరిట్ లిస్ట్ వెల్లడించకుండా ఎంపికైన అభ్యర్థుల ఫోన్లకు మెసేజ్ పంపిస్తాం.. మీరే చూసుకోండి అని గుంభనంగా వ్యవహరించడం ఏమిటి? అనే అనుమానాలు ఉపాధ్యాయ అభ్యర్థుల్లో రేకెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం తీరు చూస్తుంటే తమకు కావాల్సిన అభ్యర్థులకు లబ్ధి చేకూర్చేందుకు అడ్డదారులు ఎంచుకుందా? అనే సందేహాలు కలుగుతున్నాయని మండిపడుతున్నారు. గతానికి భిన్నంగా డీఎస్సీ అభ్యర్థుల మెరిట్ లిస్ట్ వెల్లడించకుండా నేరుగా ఎంపికైన అభ్యర్థుల ఫోన్లకు మెస్సేజ్ పంపించేందుకు ఏర్పాట్లు చేయడం వెనుక పెద్ద కుట్రే దాగుందన్న అభిప్రాయం అభ్యర్థుల్లో కలుగుతోంది. ఏ డీఎస్సీలోనూ లేని రీతిలో..సాధారణంగా డీఎస్సీ పరీక్షలు జిల్లా స్థాయిలో నిర్వహించి మెరిట్ లిస్ట్ ప్రకటించి ర్యాంకుల ఆధారంగా పోస్టింగ్స్ ఇవ్వాలి. కానీ 2018లో నాటి టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి పరీక్షలకు శ్రీకారం చుట్టింది. దీంతో అభ్యర్థులు తమకు జరిగిన అన్యాయంపై హైకోర్టును ఆశ్రయించారు. దాంతో నియామకాలు నిలిచిపోగా తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం న్యాయ వివాదాలను పరిష్కరించి పోస్టింగ్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, 2018 డీఎస్సీ కంటే దారుణమైన తప్పులు 2025 డీఎస్సీలో చోటు చేసుకున్నట్లు అభ్యర్థులు పేర్కొంటున్నారు. లిస్ట్, సెలక్షన్ లిస్ట్ లేకుండా నేరుగా ‘సెలెక్టెడ్’ అభ్యర్థుల ఫోన్లకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం మెసేజ్లు పంపుతామని ప్రభుత్వం చెబుతుండటంతో అభ్యర్థులు నివ్వెరపోతున్నారు. తప్పులు సరిచేయకుండానే మార్కుల వెల్లడి3,36,307 మంది అభ్యర్థులు 5,77,694 దరఖాస్తులు సమర్పించగా ఈ ఏడాది జూన్ 6 నుంచి జూలై 2వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. అనంతరం విడుదలైన ఫైనల్ కీ చూసి అభ్యర్థులు కంగుతిన్నారు. అనేక తప్పులు ఉన్నట్లు గుర్తించినా, దీనిపై అభ్యంతరాలు తీసుకునేది లేదని విద్యాశాఖ ప్రకటించడంతో ఫైనల్ కీలో తప్పులపై విద్యాభవన్ హెల్ప్లైన్ నంబర్లకు ఫిర్యాదులు చేశారు. ‘సాక్షి’ ఈ విషయాన్ని డీఎస్సీ కన్వీనర్ దృష్టికి తీసుకెళ్లగా ఫైనల్ కీలో ఎలాంటి తప్పులు లేవంటూనే నిపుణులతో పరిశీలన చేయిస్తున్నట్లు చెప్పారు. తీరా ఆ తప్పులను సరిచేయకుండానే అభ్యర్థుల మార్కులు ప్రకటించారు. టెట్ మార్కుల నమోదులోనూ నిర్లక్ష్యం టెట్ మార్కులకు డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ కల్పించారు. టెట్లో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులు డీఎస్సీ పరీక్షలో సాధించిన వాటికి అదనంగా కలవడంతో మెరిట్ లిస్ట్లో ఉంటారు. ఇప్పటి వరకు జరిగిన టెట్ వివరాలు, అభ్యర్థుల డేటా, ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో సదరు అభ్యర్థి ఆధార్, ఫోన్ నంబర్లతో లింక్ అయ్యి ఉంటాయి. ఫోన్ నంబర్లు మారినా ఆధార్ మారే అవకాశం లేదు. కానీ డీఎస్సీ 2025 నిర్వహణలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఎన్నో అనుమానాలు.. !నార్మలైజేషన్ అనంతరం ఆగస్టు 11న ఫలితాలను ప్రకటించగా సవరించిన టెట్ మార్కులతో ఈనెల 13న స్కోర్ కార్డులను విడుదల చేశారు. టెట్ మార్కుల్లో తప్పులు ఉంటే అభ్యర్థులే స్వయంగా సవరించుకోవాలంటూ ఒకరోజు అవకాశం కల్పించారు. అభ్యర్థులే టెట్ మార్కులు తప్పుగా నమోదు చేశారంటూ పాఠశాల విద్యాశాఖ నెపం వారిపై నెడుతోంది. మరి విద్యాశాఖ వద్ద అభ్యర్థుల ‘టెట్’ డేటా ఉంటే అభ్యర్థులే సవరించుకోవాలని ఎందుకు చెప్పినట్లు? డీఎస్సీ దరఖాస్తును ఆన్లైన్లో సమర్పించే క్రమంలోనే అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, ఆధార్ వివరాలు నమోదు చేయగానే టెట్ మార్కులు వచ్చేలా ఎందుకు చేయలేదు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.మెరిట్ అభ్యర్థులకు అన్యాయం..!1990 నుంచి 2019 స్పెషల్ డీఎస్సీ వరకు ఫలితాలను ప్రకటించేటప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులకు వచ్చిన మార్కులతో మెరిట్ లిస్ట్ విడుదల చేశారు. డీఎస్సీ 2025లో మాత్రం అభ్యర్థుల మెరిట్ లిస్ట్ను ప్రభుత్వం ప్రకటించకపోవడం సందేహాలకు దారి తీస్తోంది. దీనివల్ల ఏ అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చాయి? మెరిట్ లిస్ట్లో ఏ స్థానంలో ఉన్నామో అంతు చిక్కని పరిస్థితి నెలకొంది. ఈ విధానం తమకు కావాల్సిన వారికి లబ్ధి చేకూర్చేందుకేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే డీఎస్సీలో చోటుచేసుకున్న తప్పులపై కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎక్స్ సర్వీస్మెన్ కోటా ఎత్తివేయడంపై ఆయా అభ్యర్థులు కూడా న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు.డీఎస్సీ ఫలితాల్లో గూడుపుఠాణీ!టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన మెగా డీఎస్సీ ఫలితాల వెల్లడిలో అభ్యర్థులను దగా చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైందని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర మండిపడ్డారు. డీఎస్సీ ఫలితాలు ప్రకటించే సమయంలో మెరిట్ లిస్ట్లను తొక్కిపెట్టడం వెనుక భారీ కుట్ర దాగి ఉందన్నారు. పారదర్శకతకు పాతర వేస్తూ మెరిట్ అభ్యర్థుల నోట్లో మట్టి కొట్టేందుకు మంత్రి నారా లోకేశ్ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వారు మీడియాతో మాట్లాడారు. ఫలితాలు వెలువడే ముందు దాదాపు 60 వేల మందికి టెట్ మార్కుల సవరణకు అవకాశం ఇవ్వడం అభ్యర్థుల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది. అభ్యర్థుల జీవితాలతో చెలగాటం ఆడే ఈ విధానాలకు తక్షణం స్వస్తి పలకాలి అని డిమాండ్ చేశారు. -
వైఎస్సార్సీపీ అభిమాని కావడం.. పిన్నెల్లి ఫొటో పెట్టుకోవడమే పాపం!
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అభిమాని కావడం, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చిత్రాన్ని వాట్సాప్ డీపీగా పెట్టుకోవడమే ఆ యువకుడు చేసిన పాపం. రెడ్బుక్ సేవలో తరిస్తున్న పల్నాడు జిల్లా పోలీసులకు అది ఆగ్రహం తెప్పించింది. అంతే.. ఆ యువకుడిని పోలీస్స్టేషన్లో అక్రమంగా నిర్బంధించారు. వెల్దుర్తి ఎస్ఐ షమందర్ వలీ, ట్రైనీ ఎస్ఐ రాంబాబు గౌడ్, కానిస్టేబుల్ వెంకటనాయక్ కలిసి విచక్షణారహితంగా చావబాదారు. కాలు విరిగేలా కొట్టారు. తీవ్ర గాయాల పాలైన బాధితుడు దీన్ని డీజీపీ, జిల్లా ఎస్పీ దృష్టికి తేవడంతో మరింత రెచ్చిపోయిన వెల్దుర్తి పోలీసులు బెదిరింపులకు దిగారు. దీన్ని భరించలేక బాధితుడు పొనుగంటి నాగిరెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. తనను కస్టడీలో తీవ్రంగా హింసించిన పోలీసులపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించడంతో పాటు బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేలా డీజీపీ, ఎస్పీలను ఆదేశించాలని అభ్యర్థిస్తూ అత్యవసరంగా లంచ్మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై స్పందించిన హైకోర్టు ఈ నెల 12వతేదీ నుంచి 14 వరకు వెల్దుర్తి పోలీస్ స్టేషన్లోని సీసీ టీవీ ఫుటేజీని భద్రపరచాలని ఎస్హెచ్వోను ఆదేశించింది. పిటిషనర్ వినతి పత్రాన్ని పరిగణనలోకి తీసుకుని చట్ట ప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. 45 నిమిషాల పాటు చిత్రహింసలు..! అంతకుముందు పిటిషనర్ తరఫు న్యాయవాది సానేపల్లి రామలక్ష్మణరెడ్డి వాదనలు వినిపించారు. ‘వెల్దుర్తి పోలీస్స్టేషన్ ట్రైనీ ఎస్ఐ రాంబాబు గౌడ్ ఈనెల 12వ తేదీ ఉదయం 9 గంటలకు పిటిషనర్ నాగిరెడ్డిని ఇంటి నుంచి పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. ఎందుకు తీసుకొచ్చారో కూడా చెప్పలేదు. సాయంత్రం 4 గంటల నుంచి దాదాపు 45 నిమిషాల పాటు నాగిరెడ్డిని ట్రైనీ ఎస్ఐ రాంబాబు, ఎస్ఐ వలీ, కానిస్టేబుల్ నాయక్ కలిసి కర్రలు, బెల్టుతో చావబాదారు. కాళ్లు, చేతులు మెలిబెట్టి అదే పనిగా కొట్టారు. రాత్రి 11 గంటల వరకు నాగిరెడ్డిని స్టేషన్లో కూర్చోబెట్టిన పోలీసులు రూ.15 వేలు డిమాండ్ చేసి తీసుకున్నారు. నాగిరెడ్డి ప్రభుత్వాసుపత్రికి వెళ్లగా కాలు విరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం మళ్లీ స్టేషన్కు రప్పించి కూర్చోబెట్టారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తరువాత పిటిషనర్ నాగిరెడ్డి తల్లిదండ్రులను కూడా పోలీసులు బెదిరించారు. ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు వెల్దుర్తి పోలీస్స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. బాధితుడి వినతి పత్రాన్ని పరిగణనలోకి తీసుకునేలా డీజీపీని ఆదేశించాలి’ అని రామలక్ష్మణరెడ్డి హైకోర్టును అభ్యర్థించారు. పోలీసుల తరఫున హోంశాఖ న్యాయవాది ఏ.జయంతి వాదనలు వినిపిస్తూ నాగిరెడ్డి బైక్పై నుంచి పడి కాలు విరగ్గొట్టుకున్నారని, ఇందులో పోలీసులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఫుటేజీ భద్రపరచడానికి ఏం ఇబ్బంది? ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, సీసీటీవీ ఫుటేజీ భద్రపరచడానికి ఇబ్బంది ఏముంటుందని ప్రశి్నంచారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతి పోలీస్స్టేషన్లో సీసీ టీవీ ఉండి తీరాలని గుర్తు చేశారు. వెల్దుర్తి పోలీస్స్టేషన్లో ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు సీసీటీవీ ఫుటేజీని తగిన అధికారికి అందించేందుకు వీలుగా భద్రపరచాలని ఎస్హెచ్వోను ఆదేశిస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు. -
ఉద్యోగుల వెతలు.. సీఎస్ కబుర్లు..!
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం నుంచి తీపికబురు వస్తుందని ఆశించిన ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి నిరాశే మిగిలింది. ప్రభుత్వం ఏర్పడిన ఏడాది తరువాత ఎన్నో ఆశలతో బుధవారం వెలగపూడి సచివాలయంలో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ (జేఎస్సీ) సమావేశంలో ఏ సమస్యపైనా ఉద్యోగులకు స్పష్టమైన హామీ లభించలేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) విజయానంద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలు పలు కీలక డిమాండ్లు ప్రస్తావించాయి. ఒక్క అంశంపైనా తక్షణ పరిష్కారం చూపకపోవడంతో ఉద్యోగ సంఘాల నేతలు అసంతృప్తిగా సమావేశం నుంచి వెనుదిరిగారు. ఉద్యోగుల డిమాండ్లలో కొన్ని... » 12వ పీఆర్సీ కమిషన్ను వెంటనే ఏర్పాటు చేయాలి » 30 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) మంజూరు చేయాలి » బకాయి నాలుగు డీఏల్లో కనీసం ఒక డీఏ వెంటనే ఇవ్వాలి » 11వ పీఆర్సీ డీఏ బకాయిలు చెల్లించాలి » సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పద్ధతి పునరుద్ధరించాలి » పెన్షనర్లకు గ్రాట్యుటీ, కమ్యూటెషన్, ఈఎల్ చెల్లింపులు ఇవ్వాలి » రెసిడెన్షియల్ సొసైటీల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలు చేయాలి ట ఈహెచ్ఎస్ కార్డుల సమస్యలు పరిష్కరించి రీయింబర్స్మెంట్ పరిమితి రూ.5 లక్షలకు పెంచాలి. వీటిపై సీఎస్ ఏమన్నారంటే‘‘ఉద్యోగులకు సంబంధించి 114 అంశాలు పెండింగులో ఉన్నాయి. ఉద్యోగుల అన్ని సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాను. కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఆర్థికేతర సమస్యలపై సానుకూలంగా స్పందిస్తాం’’ అని మాత్రమే సీఎస్ ‘హామీ’ ఇచ్చారు. నేతల అసంతృప్తి ఇలా...ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు ఉద్యోగుల బకాయిలు రూ.30 వేల కోట్లు దాటిపోయాయి. ఒక ఉద్యోగికి ఎంత బకాయి ఉందో పే స్లిప్లో చూపించాలని మే ము డిమాండ్ చేశాం. సీఎం అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ ఎప్పుడు అమలవుతుందని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. – బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీజేఎసీ అమరావతి అధ్యక్షులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉద్యోగులు పీఆర్సీ కమిషన్ చైర్మన్ నియామకం, 30 శాతం ఐఆర్, కనీసం ఒక డీఏ వెంటనే ఇవ్వాలని మేము కోరాం. ఉద్యోగుల బకాయిలు ఇవ్వకపోవడంతో 14 నెలలుగా వారు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. –విద్యాసాగర్, ఎపీఎన్జీవో అధ్యక్షులు టీచర్ల సమస్యలు పరిష్కరించాలి పాఠశాల విద్యా సమస్యలు, టీచర్ల అంశాలను ప్రస్తావించాం. అంగవైకల్యం ఉన్న ఉపాధ్యాయులకు ఫేషియల్ రికగ్నైజేషన్ నుంచి మినహాయింపు ఇవ్వాలి. మున్సిపల్ టీచర్లకు జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలి –జి. హృదయరాజు, ఎపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు -
అచ్చెన్న ‘యంత్ర’ తంత్రం!
సాక్షి, అమరావతి: ఆయన వ్యవసాయశాఖ మంత్రి. విత్తనాలతోనే కాదు.. యంత్రాలతో సిరుల పంట పండించుకోవాలని రంగం సిద్ధం చేశారు. ఈ పంట పండించాలన్న ఒత్తిడి తట్టుకోలేక ఒక అధికారి ఈ బండారాన్ని బయటపెట్టారు. దీంతో మంత్రి, ఆయన ఓఎస్డీ తేలుకుట్టిన దొంగల్లా మారారు. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేషీ కేంద్రంగా అవినీతి యథేచ్చగా సాగుతోంది. మంత్రి అచ్చెన్న అవినీతికి వత్తాసు పలకలేక, వేధింపులు తట్టుకోలేక రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆగ్రోస్) జనరల్ మేనేజర్ (జీఎం) మునెల్లి చంద్రరాజమోహన్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని కామధేనువుగా మార్చుకుని భారీ దోపిడీకి తెగబడుతున్నారని ఆయన స్వయంగా ప్రభుత్వానికి లేఖ రాశారు. యంత్ర పరికరాల తయారీ కంపెనీతో డీల్ కుదర్చమని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారని ఆయన ఓఎస్డీ తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చి వేధించారని ఆయన ఆ లేఖలో వివరించారు. అచ్చెన్నాయుడి అవినీతి బాగోతంలో తాజా వ్యవహారం ఇది. రూ.240 కోట్ల కాంట్రాక్టులో అడ్డగోలు అవినీతికి స్కెచ్ ఆగ్రోస్ ఆధ్వర్యంలో గత ఏడాది రూ.60.14 కోట్ల సబ్సిడీతో 25 వేల పరికరాలు పంపిణీ చేయగా.. 2025–26లో రూ.240 కోట్ల విలువైన కిసాన్ డ్రోన్లతోపాటు యంత్ర పరికరాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి కొనుగోలులో కమీషన్ల పేరిట సొమ్ము చేసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు స్కెచ్ వేశారు. ఆ బాధ్యతను తన ఓఎస్డీ పోలినాయుడుకు అప్పగించారు. రంగంలోకి దిగిన పోలినాయుడు ఆగ్రోస్ జీఎం రాజమోహన్ను సంప్రదించారు. యంత్రపరికరాల కంపెనీలతో మాట్లాడి భారీ కమీషన్లు వసూలు చేయాలని చెప్పారు. అందుకు సమ్మతించిన కంపెనీలకే కాంట్రాక్టు కట్టబెట్టాలని మంత్రి అచ్చెన్న ఆదేశించారని కూడా స్పష్టం చేశారు. భారీ కమీషన్ల డిమాండ్తో యంత్ర పరికరాల కంపెనీలు వెనుకంజ వేశాయి. దీంతో కమీషన్ల వ్యవహారం తేల్చకుండా కాలయాపన చేస్తున్నారంటూ ఓఎస్డీ పోలినాయుడు రెండు, మూడుసార్లు జీఎం రాజమోహన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అచ్చెన్న పేరుతో ఓఎస్డీ వేధింపుల్ని తట్టుకోలేక ఆగ్రోస్ జీఎం రాజమోహన్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. వెళ్లేముందు మంత్రి అచ్చెన్న, ఆయన ఓఎస్డీ తనను ఏవిధంగా వేధించింది, కమీషన్ల కోసం ఎంతగా ఒత్తిడి తెచ్చింది వివరిస్తూ ఆగ్రోస్ చైర్మన్ ఎం.సుబ్బనాయుడు, ఎండీ ఢిల్లీరావు, వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్లకు లేఖ రాశారు. ఆ లేఖ కాపీనీ సీఎం కార్యాలయానికి కూడా పంపారు. ఈ లేఖ మీడియాకు లీక్ కావడంతో మంత్రి అచ్చెన్నాయుడి అవినీతి బండారం బట్టబయలైంది. మీడియాలో వైరల్ అయిన ఈ లేఖ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పరికరాల ధరలు పెంచి.. గత ఏడాది రూ.60.19 కోట్ల యంత్రపరికరాల కాంట్రాక్టులోనూ చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇందుకోసం యంత్ర పరికరాల ధరలను భారీగా పెంచింది. గత ప్రభుత్వం రోటోవేటర్ను రూ.90వేల నుంచి రూ.లక్ష మధ్య కొనుగోలు చేసింది. ప్రస్తుతం అదే రోటోవేటర్కు రూ.1.45 లక్షల ధర నిర్ణయించారు. ఇదొక్కటే కాదు.. 2024–25 సీజన్లో పంపిణీచేసిన యంత్రపరికరాల ధరలన్నీ మార్కెట్ ధరల కంటే ఎక్కువ రేటు కోట్చేసి అవినీతికి పాల్పడ్డారు. తీవ్ర వివాదాల్లో చిక్కుకున్న మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన నెప్ట్యూన్ బ్యాటరీ స్ప్రేయర్ తయారీ సంస్థను సింగిల్ టెండర్ విధానంలోఎంపిక చేయడమే మంత్రి అచ్చెన్న దోపిడీకి నిదర్శనం. ట్రాక్టర్ల కొనుగోలులో ఎల్–1 టెండర్ ప్రక్రియను పాటించకుండా బాక్స్ టెండర్ పద్ధతిని అనుసరించడం, కేవలం రూ.10 లక్షల గ్యారంటీ ఉన్న కంపెనీలకు ఏకంగా రూ.23 కోట్ల వరకు అడ్వాన్సులు చెల్లించడం, డిస్క్వాలిఫై అయిన ఓ ట్రాక్టర్ల కంపెనీని ఎంప్యానెల్ జాబితాలో చేర్చడం వంటి వాటితో అవినీతికి రంగం సిద్ధం చేశారు. ఆ అవినీతికి వత్తాసు పలకలేక దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన ఆగ్రోస్ జీఎం స్థానంలో తమకు విధేయుడైన ఓ జూనియర్ అధికారిని నియమించి అవినీతి దందా సాగించేందుకు మంత్రి అచ్చెన్న సిద్ధపడుతున్నట్టు చెబుతున్నారు. -
కడలి వైపు నదుల పరుగులు
సాక్షి, అమరావతి/విజయపురి సౌత్/సత్రశాల/అచ్చంపేట/గాందీనగర్ (విజయవాడ సెంట్రల్): కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి నదుల్లో వరద ఉధృతి బుధవారం మరింత పెరిగింది. కడలి వైపు నదులు పరుగులు తీస్తున్నాయి. కృష్ణా ప్రధాన పాయతోపాటు ఉప నదులు తుంగభద్ర, భీమా వరదెత్తి ప్రవహిస్తున్నాయి. తుంగభద్ర డ్యాంలోకి 1.30 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా 1.21 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. మంత్రాలయం వద్ద తుంగభద్ర వరద నీటిమట్టం 311.32 మీటర్లకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 4,78,032 క్యూసెక్కులు చేరుతోంది. దీంతో 4,85,397 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి 4,87,037 క్యూసెక్కులు చేరుతుండగా 4,48,761 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 4,45,187 క్యూసెక్కులు చేరుతుండగా 4,81,102 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీలోకి 4,64,064 క్యూసెక్కులు చేరుతుండగా.. 4,59,786 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. కృష్ణా వరద ఉధృతి పెరగడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. గోదావరి ఉగ్రరూపం గోదావరి ఉగ్రరూపం దాల్చింది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిశాలలో కురిసిన వర్షాల ప్రభావం వల్ల గోదావరి ప్రధాన పాయతోపాటు ప్రాణహిత, ఇంద్రావతి, మానేరు, శబరి ఉప నదులు, వంకలు, వాగులు పరవళ్లు తొక్కుతుండటంతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం గంట గంటకూ పెరుగుతోంది. బుధవారం ఉదయం 9 గంటలకు వరద నీటి మట్టం 43.2 అడుగులకు చేరుకోవడంతో భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. బుధవారం అర్ధరాత్రి దాటాక భద్రాచలం వద్ద వరద మట్టం 48 అడుగులను దాటే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ధవళేశ్వరం బ్యారేజీలోకి 8,25,477 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 4,800 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 8,20,677 క్యూసెక్కులను 175 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. వంశధార, నాగావళి పోటాపోటీగా ప్రవహిస్తున్నాయి. వంశధార నుంచి గొట్టా బ్యారేజీలోకి 17 వేల క్యూసెక్కులు చేరుతుండగా.. 15,661 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
నీచ రాజకీయాలకు కేరాఫ్ టీడీపీ
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్పడిన కుంభకోణాలు వరుసగా బయట పడుతుండటంతో టీడీపీ కుప్పకూలిపోతోందని వైఎస్సార్సీపీ పేర్కొంది. ఇది ప్రభుత్వ విశ్వసనీయత, పాలన గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోందని స్పష్టం చేసింది. నీచపు రాజకీయాలకు టీడీపీ కేరాఫ్గా మారిందని నిప్పులు చెరిగింది. ప్రభుత్వ అధికారులపై నిస్సిగ్గుగా దాడులు మొదలు.. అవినీతి, పెరోల్ కుంభకోణాలు, మహిళల పట్ల అసభ్య ప్రవర్తన వరకు అనేక వివాదాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు కూరుకుపోవడంతో అధికార పార్టీ నాయకత్వాన్ని ఆత్మరక్షణలోకి నెట్టిందని ఎత్తిచూపింది. ఈ మేరకు ‘సీబీఎన్ ఫెయిల్డ్ సీఎం’ హ్యాష్ ట్యాగ్తో జాతీయ మీడియా సంస్థలను ట్యాగ్ చేస్తూ బుధవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేసింది. ఆ పోస్టులో వైఎస్సార్సీపీ ఇంకా ఏమన్నదంటే.. » శ్రీశైలంలో టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మద్యం మత్తులో విధి నిర్వహణలో ఉన్న అటవీ అధికారులపై దాడి చేశారు. పెట్రోలింగ్ కార్యకలాపాలను అడ్డుకున్నారు. గిరిజన సిబ్బందిని కూడా వేధించారు. ఈ దిగ్భ్రాంతికర సంఘటన తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇది అధికార పార్టీ శాసనసభ్యులలో చట్టవ్యతిరేక కార్యకలాపాలను ఎత్తిచూపింది.» ఈ వివాదానికి తోడు మంత్రి అచ్చెన్నాయుడు అవినీతిపై తుపానులో చిక్కుకున్నారు. డీలర్లతో అక్రమ కమిషన్ లావాదేవీలలో మధ్యవర్తిగా వ్యవహరించడానికి నిరాకరించినందుకు మాత్రమే తనను అకస్మాత్తుగా బదిలీ చేశారని ఆగ్రోస్ జనరల్ మేనేజర్ మోహన్ నేరుగా ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఈ ఆరోపణలు ఈ ప్రభుత్వ సమగ్రత, పాలనపై తీవ్రమైన సందేహాలను లేవనెత్తాయి.» వివాదాస్పద పెరోల్ సిఫార్సుల చుట్టూ ఉన్న విషయాలు కూడా అంతే ఆందోళనకరంగా ఉన్నాయి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఒక ప్రసిద్ధ రౌడీ–షీటర్కు పెరోల్ను సిఫార్సు చేశారు. ఈ చర్య ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. హోం మంత్రి అనిత ఈ ఫైల్ను ఆమోదించడం మరింత ఆందోళన కలిగించే అంశం. ఇటువంటి చట్ట వ్యతిరేక నిర్ణయాలకు చట్టబద్ధత కల్పించారు. ప్రజాభద్రత కంటే నేరస్థులకు పెరోల్ ఇచ్చేందుకు అధికంగా శ్రద్ధ చూపడం ద్వారా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. » మంత్రులు, ఎమ్మెల్యేల వేధింపులు, అసభ్య ప్రవర్తనకు సంబంధించిన వరుస కుంభకోణాలతో టీడీపీ పూర్తిగా కుప్పకూలింది. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఒక మహిళ పట్ల అసభ్యకరమైన సైగలు చేస్తూ వీడియోలో దొరికిపోయాడు. ఇది వైరల్ అయ్యింది. అసెంబ్లీని ఇబ్బంది పెట్టింది. ఈ సంఘటనను బహిర్గతం చేసినట్లు అనుమానించి, మరొక మహిళను కూడా ఆ ఎమ్మెల్యే వేధించి, ఆమెను ఇబ్బంది పెట్టాడు. దాంతో ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. » అమదాలవలస ఎమ్మెల్యే కూన రవి కుమార్ కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్యను పదే పదే వేధింపులకు గురిచేస్తున్నాడు. ఆమెను పని సాకుతో తన కార్యాలయంలో ఉండమని బలవంతం చేస్తున్నాడు. అర్ధరాత్రి అనుచిత వీడియో కాల్స్ చేస్తున్నాడు. భరించలేని విధంగా అవమానాలకు గురిచేస్తున్నాడు. ఈ ఒత్తిడిని తట్టుకోలేక సౌమ్య ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇది ఎన్నికైన ప్రజా ప్రతినిధుల అధికార దుర్వినియోగానికి ప్రతిబింబం.» మొత్తం మీద ఈ సంఘటనలు టీడీపీలోని మరో కోణాన్ని బహిర్గతం చేశాయి. కేవలం మూడు నుంచి నాలుగు రోజుల వ్యవధిలో పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు అవినీతి, అధికార దుర్వినియోగం నుంచి అధికారులపై ప్రత్యక్ష దాడులు, మహిళలపై అసభ్యకరమైన చర్యల వరకు నేరాలకు పాల్పడ్డారు. ఈ ఉదంతాలన్నీ నీచ శ్రేణి రాజకీయాలు చేసే పార్టీగా ప్రజలు టీడీపీని అభివర్ణిస్తున్నారనేందుకు అద్దం పడుతున్నాయని విమర్శకులు స్పష్టం చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు జవాబుదారీతనం లేకుండా అధికార దుర్వినియోగంతో మహిళల గౌరవం, అధికారుల హక్కులు, ప్రజా విశ్వాసానికి విఘాతం కల్పిస్తున్నారు. -
టీడీపీ నేతల ప్రవర్తన, వ్యవహార శైలిపై వైఎస్సార్సీపీ ఫైర్
సాక్షి, తాడేపల్లి: టీడీపీ నేతల ప్రవర్తన, వ్యవహార శైలిపై వైఎస్సార్సీపీ మండిపడింది. జాతీయ మీడియాను ట్యాగ్ చేస్తూ వైఎస్సార్సీపీ ట్వీట్ చేసింది. గత కొన్ని రోజుల్లోనే టీడీపీ పెద్ద ఎత్తున వివాదాలలో చిక్కుకుంది. ఆ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల ప్రవర్తన దారుణంగా తయారైంది. దీంతో ప్రభుత్వ విశ్వసనీయత, పాలన మీద తీవ్ర అనుమానాలు పెరుగుతున్నాయంటూ ఎక్స్ వేదిక వైఎస్సార్సీపీ పేర్కొంది.‘‘అధికారుల మీద దాడి చేయడం నుంచి అవినీతి, పెరోల్ స్కాం, మహిళలపై అసభ్య ప్రవర్తన వరకు అనేక దారుణాలకు ఒడిగట్టారు. శ్రీశైలంలో టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మద్యం మత్తులో అటవీ అధికారుల మీద దాడి చేశారు. వారి గస్తీ విధులను అడ్డుకున్నారు. గిరిజన సిబ్బందిని కూడా వేధించారు. ఈ ఘటనపై కనీసం అధికారులు కేసు కూడా నమోదు చేయలేదు. మంత్రి అచ్చెన్నాయుడు వైఖరితో ఆగ్రోస్ జనరల్ మేనేజర్ మోహన్ ఇబ్బందులు పడాల్సి వచ్చింది. డీలర్ల నుండి కమీషన్లు గుంజుకునే విషయంలో సహకరించలేదని ఆయన్ను వేధించి బదిలీ చేశారు...నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ఒక రౌడీషీటర్కి పెరోల్ సిఫార్సు చేశారు. దీనికి హోం మంత్రి అనిత కూడా పూర్తిగా సహకరించారు. వీరి చర్యలను చూస్తే ప్రజల భద్రత కంటే నేరస్తుల ప్రయోజనాలే ముఖ్యమన్నట్టుగా ఉంది. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వీడియో కాల్లో మహిళతో అసభ్యకరంగా వ్యవహరించారు. ఆ విషయం బయట పెట్టిందని అనుమానించి మరో మహిళను వేధించడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది.Third-Rate… Vulgar LeadersIn just the last few days, the Telugu Desam Party (TDP) has been rocked by a string of scandals involving its ministers and MLAs, raising serious questions about the government’s credibility and governance. The controversies range from brazen attacks…— YSR Congress Party (@YSRCParty) August 20, 2025..అముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్యను రాత్రిళ్లు ఆఫీస్కి పిలిపించడం, అర్థరాత్రి వీడియో కాల్స్ చేయడం వంటి వేధింపులకు పాల్పడ్డారు. దాంతో ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేశారు. మూడునాలుగు రోజుల్లోనే ఈ ఘటనలన్నీ చోటు చేసుకున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఏస్థాయిలో అవినీతి, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అధికారులపై దాడులు, మహిళలపై అసభ్య ప్రవర్తన వంటి ఆరోపణలు రావడం సిగ్గుచేటు. టీడీపి ఎమ్మెల్యేలు, మంత్రులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ మహిళల గౌరవాన్ని కాలరాస్తున్నారు. ప్రజల నమ్మకాన్ని తుంగలో తొక్కారు’’ అంటూ ఎక్స్ వేదికగా వైఎస్సార్సీపీ నిలదీసింది. -
సినీ నిర్మాత దాసరి కిరణ్ అరెస్ట్
సాక్షి, విజయవాడ: హైదరాబాద్లో సినీ నిర్మాత దాసరి కిరణ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దాసరి కిరణ్పై ఆయన సమీప బంధువు గాజుల మహేష్ ఫిర్యాదు చేశారు.గాజుల మహేష్ వద్ద దాసరి కిరణ్ నాలుగున్నర కోట్లు అప్పుతీసుకోగా.. డబ్బులు అడిగేందుకు ఆయన ఆఫీస్కు వస్తే.. 15 మంది తమపై దాడి చేశారంటూ గాజుల మహేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాజుల మహేష్ ఫిర్యాదు మేరకు దాసరి కిరణ్ను విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. -
కర్నూలు జిల్లాలో విషాదంపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
సాక్షి, తాడేపల్లి: కర్నూలు జిల్లాలో నీటికుంటలో పడి ఆరుగురు విద్యార్థులు మృతి చెందటం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్ర్భాంతి చెందారు. ఉజ్వల భవిష్యత్ను పొందాల్సిన విద్యార్థులు ఇలా ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు.‘‘మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. వారి కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
అమరావతి మునిగిపోయిందా?.. మంత్రి పర్యటనతో క్లారిటీ
సాక్షి, విజయవాడ: వరద నీళ్లలో మునిగిపోతే.. ‘అబ్బే అదేం లేదూ.. అవన్నీ ఫేక్ కథనాలే’ అంటూ కూటమి ప్రభుత్వ అనుకూల మీడియా చానెల్స్లో, సోషల్ మీడియా పేజీల ద్వారా ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పైగా కళ్లెదుట నీరు చేరిన దృశ్యాలు కనిపిస్తున్నా.. ప్రశ్నించినందుకు కేసులు పెడుతోంది కూటమి ప్రభుత్వం. అయితే రాజధాని అమరావతి ముంపునకు గురైందన్న విషయాన్ని రాష్ట్ర మంత్రి నారాయణే స్వయంగా ఒప్పుకున్న వైనం ఇప్పుడు చర్చనీయాంశమైంది!!.ఎగువ ప్రాంతాల్లో వరద పెరుగుతున్న నేపథ్యంతో చంద్రబాబు ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో అమరావతిలో పురపాలక శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. కొండవీటి వాగు ప్రవాహానికి అడ్డంగా ఉన్న మట్టి తొలగింపు పనులు పరిశీలించారు. సీఆర్డీఏ ఇంజినీర్ల ఆధ్వర్యంలో 20 ప్రొక్లయిన్లతో నిరంతరాయంగా ఈ పనులు కొనసాగుతున్నాయి. ఆ సమయంలో.. ‘‘కొండవాటి వాగు నీరు వెనక్కి తన్నింది. వెస్ట్ బైపాస్రోడ్డు నిర్మాణ పనుల వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది. ఆ నిలిచిన నీరుపోవడానికి బైపాస్కు గండ్లు పెడుతున్నాం’’ అని అన్నారాయన.అదే సమయంలో.. అమరావతికి వరద ముప్పు లేకుండా నెదర్లాండ్స్ నిపుణులతో కాలువలు, రిజర్వాయర్లు, అత్యాధునిక డిజైన్ అంటూ మళ్లీ పాత పాటే వినిపించారు. మంత్రి ప్రకటన ప్రకారం.. నీరుకొండ సమీపంలో వెస్ట్ బైపాస్ రోడ్ పై బ్రిడ్జ్ నిర్మాణంతో కొండవీటి వాగు ప్రవాహానికి ఆటంకం అని అర్థం. అంటే ఓవైపు ముంపు లేదని ఎల్లో బ్యాచ్ చెబుతుంటే.. మరోవైపు నీరు వెనక్కు తన్నిందని స్వయానా మంత్రే అంటున్నారు. ఈ లెక్కన అమరావతి ముంపునకు గురైందని ఒప్పుకున్నట్లే కదా!. -
బీటెక్ సీట్లకు పెరుగుతున్న డిమాండ్
దేశవ్యాప్తంగా బీటెక్ సీట్ల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతోంది. ఇందుకు తగ్గట్టుగానే సీట్ల భర్తీలోనూ గణనీయ వృద్ధి కనిపిస్తోంది. కంప్యూటర్ సైన్స్, అనుబంధ కోర్సుల్లో పెరుగుతున్న డిమాండ్ కారణంగా బీటెక్ సీట్లకు భారీ క్రేజ్ వస్తోంది. ఫలితంగా 2024–25 విద్యా సంవత్సరంలో ఎనిమిదేళ్ల గరిష్ఠ రికార్డులను నమోదు చేస్తూ ఏకంగా 12.53 లక్షల సీట్లు భర్తీ అవ్వడం విశేషం. – సాక్షి, అమరావతి» అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) 2024–25లో 14.90 లక్షల బీటెక్ సీట్లకు అనుమతి ఇచ్చింది. ఇందులో 12.53 లక్షల సీట్లు భర్తీ అయ్యాయి. ఇది 2017–18లో సీట్ల భర్తీతో పోలిస్తే 67 శాతం పెరుగుదల. పైగా గత ఏడాది భర్తీ కాని సీట్ల సంఖ్య కనిష్ఠంగా 16.36 శాతానికి చేరడం విశేషం. ఇక్కడ కంప్యూటర్ సైన్స్, కోర్ కోర్సుల్లో విద్యార్థుల ఆసక్తి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఏఐసీటీఈ 2025–26లో ఏకంగా 15.98 లక్షల సీట్లకు ఆమోదం ఇచ్చింది. ఇది గత ఏడాది కంటే 7 శాతం ఎక్కువ. » దేశవ్యాప్తంగా వివిధ ఇంజినీరింగ్ కళాశాలల్లో కంప్యూటర్ సైన్స్, అనుబంధ కోర్సులే అగ్రగామిగా నిలుస్తున్నాయి. కంప్యూటర్ సైన్స్లో నిరుడు 3,90,245 ప్రవేశాలు నమోదయ్యాయి. తర్వాత మెకానికల్ ఇంజినీరింగ్ (2,36,909), సివిల్ ఇంజినీరింగ్ (1,72,936), ఎల్రక్టానిక్స్–కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (1,60,450), ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ (1,25,902) కోర్సులు ఉన్నాయి. » టెక్ రంగంలో పెరిగిన అవకాశాలు కంప్యూటర్ కోర్సులపై విద్యార్థులు దృష్టిసారించేలా చేస్తున్నాయి. ఏఐసీటీఈ గతంలో సీట్లకు పరిమితంగా అనుమతులిచ్చేది. ఆ విధానాన్ని సవరిస్తూ కళాశాలల్లో మౌలిక వసతులు, నిర్దిష్ట నిబంధనలకు తగ్గట్టుగా సీట్ల సంఖ్యను పెంచుకునే వెసులుబాటు ఇచ్చింది. ఫలితంగా దేశ వ్యాప్తంగా సీట్ల సంఖ్య అమాంతం పెరిగింది. » 2017–18 నుంచి 2021–22 మధ్య సీట్ల అనుమతులు (ఇన్టేక్)కొంత తగ్గింది. ఫలితంగా 2018–19లో ప్రవేశాలు 7.22 లక్షలకు పడిపోయాయి. కానీ, 2021–22 నుంచి కంప్యూటర్ సైన్స్పై మక్కువ పెరగడంతో సీట్లకు డిమాండ్ ఏర్పడి గణనీయమైన మార్పులు వస్తున్నాయి. » ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, స్పేస్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ వంటి కోర్సులు ఇంజినీరింగ్ విద్యలో కెరీర్ అవకాశాలను పెంచడంలో కీలకంగా ఉన్నట్టు విద్యావేత్తలు భావిస్తున్నారు. » బీటెక్ అంటే కేవలం కంప్యూటర్స్ సైన్స్ కోర్సులు మాత్రమే కాదని ఇతర ఇంజినీరింగ్ కోర్సుల సమూహంతో నడవాలని కొన్ని రాష్ట్రాలు ఆలోచిస్తున్నాయి. వీటిలోని కళాశాలలు కంప్యూటర్ సైన్స్ సీట్లు పెంచుకునేందుకు దరఖాస్తు చేయగా తిరస్కరించాయి. ఇందులో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఉన్నాయి. కొన్ని కళాశాలలు సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్ సీట్లను కంప్యూటర్ సైన్స్లోకి కన్వర్షన్ చేస్తుండడంపై రాష్ట్రాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. » ఏఐసీటీఈ ఆమోదించిన ఇంజినీరింగ్ విద్యా సంస్థల సంఖ్య 2020–21 నుంచి తగ్గగా... ఈ ఏడాది తొలిసారిగా పెరిగింది. 2025–26లో 5,875 ఆమోదిత సంస్థలు ఉన్నాయి. గత ఏడాది ఇవి 5,845 మాత్రమే. 2020–21 లో నమోదైన 6,062 కంటే తక్కువే అని చెప్పాలి. -
నేడో, రేపో డీఎస్సీ మెరిట్ లిస్ట్!
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 అభ్యర్థుల మెరిట్ జాబితాను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. టెట్ మార్కుల సవరణకు ఈనెల 17వ తేదీ వరకు అభ్యర్థులకు అవకాశం ఇచ్చింది. స్పోర్ట్స్ కోటాలో ఎంపికైనవారి జాబితా సైతం సిద్ధమైంది. ఇక మిగిలింది తుది జాబితా విడుదల మాత్రమే. ఈ నేపథ్యంలో సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే అన్ని జిల్లాల్లో డీఎస్సీ విధుల్లోకి సిబ్బందిని నియమించారు. సీనియర్ హెచ్ఎంలు, ప్రిన్సిపల్స్, ఎంఈవోలకు ఈ విధులను అప్పగించారు. ఈ డీఎస్సీ ద్వారా 16,347 పోస్టులు భర్తీచేయనున్నారు. అంతేసంఖ్యలో అభ్యర్థులను సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచే అవకాశం ఉంది. డీఎస్సీ పరీక్షలకు పిలిచిన ఆన్లైన్ దరఖాస్తుల్లో దాదాపు 60 వేలమంది అభ్యర్థులు తమ టెట్ మార్కులను తప్పుగా నమోదు చేసినట్టు గుర్తించారు. దీంతో వారి మార్కులను వారే సవరించుకోవాలని రెండుసార్లు విద్యాశాఖ అవకాశం కల్పించింది. చాలామంది ఈ అవకాశాన్ని వినియోగించుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మెరిట్ లిస్ట్ విడుదల అనంతరం జిల్లాల్లో సర్టిఫికెట్ల పరిశీలనలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని సీనియర్ ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. తుది మెరిట్ లిస్ట్లో ఉన్నవారిలో అన్ని సర్టిఫికెట్లు సక్రమంగా లేకపోతే, జాబితాలో తర్వాత ఉన్న వారిని పరిగణనలోకి తీసుకుని పోస్టింగ్ ఇస్తారు. డీఎస్సీ ద్వారా కొత్త టీచర్లు వచ్చేనెల 5వ తేదీ నాటికి విధుల్లో ఉండేలా విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసినట్టు సమాచారం. -
నదుల్లో వరద పరవళ్లు
సాక్షి, అమరావతి: అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి నదుల్లో వరద ప్రవాహం ఉరకలెత్తుతోంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రకాశం బ్యారేజీ నుంచి 4.73 లక్షల క్యూసెక్కుల కృష్ణా జలాలు.. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 7.63 లక్షల క్యూసెక్కుల గోదావరి జలాలు, గొట్టా బ్యారేజీ నుంచి 20,651 క్యూసెక్కుల వంశధార జలాలు, నారాయణపురం ఆనకట్ట మీదుగా 16,300 క్యూసెక్కుల నాగావళి వరద జలాలు బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, ప్రధాన ఉప నది తుంగభద్రల్లో వరద ఉధృతి పెరిగింది. ఆల్మట్టి డ్యామ్, నారాయణ్పూర్ డ్యామ్ నుంచి వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్లోకి 1,25,164 క్యూసెక్కులు చేరుతుండగా.. స్పిల్ వే గేట్లు ఎత్తి 1,21,448 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. దాని దిగువన సుంకేశుల బ్యారేజీలోకి 1.40 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 1,27,840 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి జూరాల నుంచి 2,71,763, సుంకేశుల నుంచి 1,25,660, హంద్రీ నుంచి 2 వేలు వెరసి 3,90,135 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. దాంతో శ్రీశైలంలో 881.9 అడుగుల్లో 198.36 టీఎంసీలను నిల్వ చేస్తూ స్పిల్ వే 10 గేట్లను 14 అడుగుల మేర ఎత్తి 3,44,750, విద్యుదుత్పత్తి చేస్తూ 65,436 క్యూసెక్కులు కలిపి 4,10,186 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. నాగార్జునసాగర్లోకి 4,10,186 క్యూసెక్కులు చేరుతుండగా.. 584.6 అడుగుల్లో 296.28 టీఎంసీలను నిల్వ చేస్తూ 26 గేట్లను ఎత్తి 4.09 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 3,97,807 క్యూసెక్కులు చేరుతుండగా.. 166.47 అడుగుల్లో 33.54 టీఎంసీలను నిల్వ చేస్తూ 4,13,395 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. వాటికి మున్నేరు, వాగులు, వంకల వరద తోడవుతుండటంతో ప్రకాశం బ్యారేజీలోకి 4,73,065 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే పరిమాణంలో సముద్రంలోకి వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి పెరగడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బుధవారం ప్రకాశం బ్యారేజీలోకి వరద ప్రవాహం 5 లక్షల క్యూసెక్కులను దాటే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. గోదావరిలోనూ పెరుగుతున్న వరద ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. బుధవారం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. మంగళవారం పోలవరం ప్రాజెక్టులోకి 8,29,424 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే పరిమాణంలో 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీలోకి 7,63,310 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే పరిమాణంలో సముద్రంలోకి వదిలేస్తున్నారు. పోటెత్తిన నాగావళి, వంశధార ఒడిశా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో నాగావళి, వంశధార నదుల్లో వరద పోటెత్తుతోంది. నారాయణపురం ఆనకట్ట మీదుగా 16,300 క్యూసెక్కుల నాగావళి వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. వంశధార నుంచి గొట్టా బ్యారేజీలోకి 22 వేల క్యూసెక్కులు చేరుతుండగా.. ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తూ.. 20,651 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. వర్షాల నేపథ్యంలో సెలవులు తీసుకోవద్దు భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నందున పరిస్థితులు సాధారణ స్థితికి చేరే వరకూ లైన్మెన్ నుంచి అధికారుల వరకు ఎవరూ సెలవులు తీసుకోవద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశించారు. పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసినందున విద్యుత్సంస్థల అధికారులతో మంగళవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా సీఎస్ సమీక్ష నిర్వహించారు. అలాగే, భారీ వర్షాల నేపథ్యంలో 16 జిల్లాలకు కలిపి అత్యవసర వరద సహాయ చర్యల కోసం ప్రభుత్వం రూ.16 కోట్లు విడుదల చేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాకో రూ.కోటి చొప్పున కేటాయించింది. విలీన మండలాల్లో 80 గ్రామాలకు రెండో రోజూ నిలిచిన రాకపోకలు చింతూరు: గోదావరి, శబరి నదులకు వరద ఉధృతి మంగళవారం సాయంత్రం నుంచి క్రమేపీ పెరుగుతోంది. మరోవైపు శబరి నదిలోనూ మంగళవారం మధ్యాహ్నం నుంచి వరద పెరుగుతోంది. విలీన మండలాలైన చింతూరు, కూనవరం, వీఆర్పురం, ఎటపాక మండలాల్లో వరుసగా రెండోరోజు కూడా 80 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలో కుయిగూరు వాగు వరద తగ్గకపోవడంతో ఆంధ్రా–ఒడిశా జాతీయ రహదారి–326పై రాకపోకలు సాగక వాహనాలు చింతూరులో నిలిచిపోయాయి. చింతూరు మండలంలో సోకిలేరు, కుయిగూరు, జల్లివారిగూడెం, చంద్రవంక, చీకటివాగుల వద్ద వరద ఇంకా రహదారులపైనే నిలిచి ఉంది. కూనవరం మండలం కొండ్రాజుపేట వద్ద కాజ్వేపై వరదనీరు ఇంకా తొలగలేదు. -
దేవుడి భూములపైనా పచ్చ గద్దల కన్ను
సాక్షి ప్రతినిధి, విజయవాడ: దేవుడి భూములపైనా పచ్చ గద్దల కన్నుపడింది. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో ఉన్న మచిలీపట్నం గొడుగుపేట శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి చెందిన 39.99 ఎకరాల భూమిని తన్నుకుపోయేందుకు సిద్ధమయ్యారు. గొల్లపూడిలోని సర్వే నంబర్ 454/12బీలో 21 ఎకరాలు, 454/3బీలో 18.99 ఎకరాలు కలిపి మొత్తం 39.99 ఎకరాల భూమిని లీజు పేరిట హస్తగతం చేసుకునేందుకు పార్లమెంటరీ నియోజకవర్గ ముఖ్యనేత పావులు కదుపుతున్నారు. ఓ మూవీ మేకర్ సంస్ధ, ఓ మీడియా భాగస్వామ్యంతో ఎగ్జిబిషన్ సొసైటీ ఏర్పాటు చేసి దేవుడి భూములను లీజు పేరుతో అప్పనంగా కొట్టేసే కుట్రకు తెరలేపుతున్నారు. ఇందుకు సంబం«ధించిన ఫైలు కలెక్టరేట్కు చేరినట్టు టీడీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది. దసరా ఉత్సవాలు, వినోదం మాటున విజయవాడ నగరానికి సమీపంలో రూ.కోట్ల విలువైన భూమిని స్వా«దీనం చేసుకునేలా శరవేగంగా పావులు కదుపుతున్నారు. దీనికి ‘విజయవాడ ఉత్సవ్’ కలరింగ్ ఇస్తున్నారు. టూరిజానికి విజయవాడను చిరునామాగా మారుస్తామని ఊదరగొడుతూ కుట్రలకు పదునెక్కిస్తున్నారు. గతంలో కలెక్టరేట్ నిర్మాణానికి ప్రతిపాదన గత ప్రభుత్వం హయాంలో ఈ స్థలంలో నూతన కలెక్టరేట్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. విజయవాడకు సమీపంలో ఉండటం, జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, తిరువూరు నియోజకవర్గ ప్రజలు కలెక్టరేట్కు వచ్చేందుకు వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ స్థలం విలువకు సమానమైన భూమిని ప్రత్యామ్నాయంగా ఇచ్చేలా సీసీఎల్ఏకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం ఆ ప్రతిపాదన సీసీఎల్ఏ పరిధిలో ఉంది. అయితే కూటమి ప్రభుత్వం ఆదిశగా చర్యలు తీసుకోకపోగా.. దేవుడి భూమికి ఎసరుపెట్టి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే కోట్ల విలువైన ఆర్టీసీ స్థలం లులుకు అప్పగింత విజయవాడ నడి»ొడ్డున పాత బస్టాండుగా పిలుచుకొనే గవర్నరుపేట డిపోకు చెందిన 4.15 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లులు చేతిలో పెట్టేసింది. 99 సంవత్సరాల లీజు వి«ధానంలో ఆ భూమిని అప్పగించింది. ఇందుకు బదులుగా ఆర్టీసీకి వేరేచోట భూమిని కేటాయిస్తున్నామని ప్రకటించారు. కేవలం రూ.156 కోట్ల పెట్టుబడి కోసం రూ.600 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టడం ఏంటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ భూకేటాయింపుపై వైఎస్సార్సీపీ, వామపక్షాలు, ప్రజా సంఘాలు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశాయి. ఈ ప్రతిపాదనను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. -
డీఏ, పీఆర్సీ బకాయిలు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించండి
సాక్షి, అమరావతి: గత చంద్రబాబు ప్రభుత్వ హయాం నుంచి చెల్లించకుండా పెండింగ్లో ఉన్న కరువు భత్యం (డీఏ), వేతన సవరణ (పీఆర్సీ) బకాయిలను చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీసీపీఎస్ఈఏ) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై హైకోర్టు మంగళవారం స్పందించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ట్రెజరీస్ అకౌంట్స్ డైరెక్టర్, పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతకు ముందు పిటిషనర్ సంఘం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 2018లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కరువు భత్యం, వేతన సవరణ బకాయిలను చెల్లించలేదన్నారు. కొత్త పెన్షన్ స్కీం ప్రకారం 90 శాతం బకాయిలను నగదు రూపంలోనే చెల్లించాల్సి ఉందన్నారు. మిగిలిన 10 శాతం మొత్తాన్ని పదవీ విరమణ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించిన పలు ఉత్తర్వులు అమలు కాలేదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు. -
పింఛన్లు కకావికలం!
పింఛన్ ఆగింది.. ప్రాణం పోయింది కృష్ణా జిల్లా పెదపూడికి చెందిన మేడం లక్ష్మి(53) ఒంటరి మహిళ పింఛన్ పొందేది. కంటి చూపు మందగించడం, సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్న ఆమెకు 2024 ఏప్రిల్ నుంచి దివ్యాంగ పింఛన్ వస్తోంది. ఇటీవల కూటమి ప్రభుత్వం నిర్వహించిన రీ వెరిఫికేషన్లో ఆమెను అనర్హురాలిగా తేల్చారు. సచివాలయ సిబ్బంది సోమవారం ఆమెకు నోటీసు ఇవ్వడంతో ఆందోళనకు గురై సొమ్మసిల్లి పడిపోయింది. స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తమ ఆరోగ్యం దెబ్బతిందని.. పింఛన్ డబ్బులతోనే మందులు కొనుక్కునేవాళ్లమని లక్ష్మి తల్లి బాలమ్మ కన్నీటిపర్యంతమైంది.అన్యాయంగా తనకు వైకల్య శాతం తగ్గించారని ఓ దివ్యాంగుడు తిరుపతి జిల్లా వాకాడులో మంగళవారం కుటుంబ సభ్యులతో కలసి ధర్నాకు దిగారు. వాకాడు మండలం దుగ్గరాజపట్నం అరుందీతయ వాడలోని నిరుపేద కుటుంబానికి చెందిన పట్టపు వెంకటసుబ్బయ్య 2018లో చెట్టుపై నుంచి కిందపడిపోవడంతో రెండు కాళ్లు చచ్చుపడిపోయాయి. ఏడేళ్లుగా బాధితుడు మంచానికే పరిమితమయ్యాడు. 2019లో వైద్యులు పరీక్షలు చేసి 86 శాతం వైకల్యం ఉన్నట్లు సదరం ధృవీకరణ పత్రం ఇచ్చారు. గతేడాది సెప్టెంబర్లో తిరుపతిలో నిర్వహించిన సదరం క్యాంపులోనూ దీన్ని నిర్థారించారు. తాజాగా రీ వెరిఫికేషన్లో ఏకంగా 45 శాతానికి తగ్గించి ధ్రువీకరణ పత్రం ఇచ్చారంటూ బాధితుడు ధర్నాకు దిగాడు.సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్: అవ్వాతాతలు అందుకుంటున్న పింఛన్లను ఎడాపెడా కత్తిరిస్తున్న చంద్రబాబు సర్కారు అనైతికంగా వ్యవహరించేందుకూ వెనుకాడటం లేదు! కొత్తవి ఇవ్వకపోగా ఉన్నవాటినే ఏరిపారేస్తోంది! కనీసం దివ్యాంగుల పట్ల కూడా దయ చూపడం లేదు. గత ప్రభుత్వ హయాంలో 2024 ఎన్నికల ముందు నాటికి 66.34 లక్షల మందికిపైగా పింఛన్లు ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటివద్దే పారదర్శకంగా వలంటీర్ల ద్వారా అందించగా.. టీడీపీ కూటమి సర్కారు ఇప్పుడు వీటిని కేవలం 62.19 లక్షలకే పరిమితం చేసింది. ఏడాదిలో ఏకంగా దాదాపు నాలుగున్నర లక్షల పింఛన్లను ఎగరగొట్టింది! ఇప్పటికే పండుటాకులకు పింఛన్లు తొలగించి అవస్థలకు గురి చేస్తున్న కూటమి సర్కారు.. తాజాగా దివ్యాంగులను టార్గెట్గా చేసుకుని ఎడాపెడా కోతలు పెడుతోంది. మళ్లీ మళ్లీ సదరం సర్టిఫికెట్లు తేవాలంటూ, వైద్య పరీక్షలు, వైకల్య శాతం కుదింపుతో ముప్పు తిప్పలు పెడుతోంది. 40 శాతం కంటే తక్కువగా వైకల్యం ఉందని, పింఛనుకు అనర్హులంటూ ప్రతి జిల్లాలో వేల సంఖ్యలో లబ్ధిదారులకు నోటీసులు జారీ అవుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా నెలనెలా అందే పింఛన్నే నమ్ముకుని బతుకుతున్న దివ్యాంగులను చంద్రబాబు సర్కారు నిర్దయగా రోడ్డుకీడ్చేసింది! ఇన్నాళ్లూ నిబ్బరంగా తీసుకుంటున్న పింఛన్కు ఇకపై మీరు అనర్హులంటూ గత వారం పది రోజులుగా కూటమి ప్రభుత్వం ఇస్తున్న నోటీసులతో పింఛన్దారులు కకావికలం అవుతున్నారు! నిశ్చేషు్టలై ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళనకు దిగుతున్నారు. ఆవేదనతో తల్లడిల్లి ఆత్మహత్య యత్నాలకు పాల్పడుతున్న ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు సర్కారు మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని పెన్షన్లు కోల్పోతున్న దివ్యాంగులు గగ్గోలు పెడుతున్నారు. తమ వైకల్యాన్ని నిర్ధారిస్తూ గతంలో వైద్యులే ధ్రువీకరించి సర్టిఫికెట్లు జారీ చేస్తే ఇప్పుడీ కోతలు ఏమిటని ఆక్రోశిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్ష మందికి పైనే తాజాగా పింఛను నోటీసులు జారీ అయ్యాయని అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది.అప్పీలు చేయాలంటే అగచాట్లే.. దివ్యాంగ సర్టిఫికెట్ (సదరం) కలిగి ఉండి గత పదేళ్లకు పైగా పింఛను పొందుతున్న వారికి తాజా పరీక్షల్లో అనర్హులంటూ నోటీసులు జారీ అయ్యాయి. పూర్తి వినికిడి లోపం ఉన్న వారికి సైతం వైకల్యం లేదని అనర్హత పేరుతో నోటీసులు జారీ కావడంపై నివ్వెరపోతున్నారు. నోటీసులు అందుకున్న పింఛనుదారులు అభ్యంతరాలు తెలియజేసే ప్రక్రియను అత్యంత క్లిష్టతరంగా మార్చారు. దివ్యాంగ శాతంపై అభ్యంతరం ఉన్నవారు కొత్త సదరం సర్టిఫికెట్లను సంబంధిత ఏరియా వైద్యశాల నుంచి లేదంటే గ్రామ, వార్డు సచివాలయం నుంచి పొంది ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. ఆ తర్వాత ఎండీపీవో తిరిగి వైద్య పరీక్షలకు నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది. అనంతరం నిరీ్ణత తేదీలో మళ్లీ వైద్య పరీక్షలకు హాజరవ్వాలి. ఎంపీడీవో నిర్దేశించిన తేదీన, ఆయన సూచించిన ఆస్పత్రిలోనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. శరీర అవయవాలు అన్నీ బాగున్న వ్యక్తులకే ఇన్నిసార్లు తిరగాలంటే ఇబ్బంది. అలాంటిది దివ్యాంగులు రోజులు, నెలల తరబడి మండలాఫీసులు, ప్రభుత్వాసుపత్రుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది. సెప్టెంబరు 1వతేదీ నుంచి పింఛన్ నిలిపివేస్తున్నట్లు ఈ నెల 14వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో దివ్యాంగులకు నోటీసులు అందాయి. నోటీసు అందుకున్న వారు తమ అర్హతను నిరూపించుకొని పింఛన్ కాపాడుకునేందుకు ప్రభుత్వం కనీసం 15 రోజులు గడువు కూడా ఇవ్వకపోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు.శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయి మండలానికి చెందిన 34 ఏళ్ల మద్దులూరి నాగరాజు చిన్నతనంలో ప్రమాదవశాత్తూ పూరి గుడిసె దగ్ధమైన ఘటనలో సగానికిపైగా శరీరం, ఒక కన్ను పూర్తిగా కాలిపోయింది. తల్లిదండ్రులు లేకపోవడంతో చిన్న ఇంట్లో జీవనం సాగిస్తున్నాడు. 15 ఏళ్లుగా దివ్యాంగుల పింఛన్ పొందుతుండగా కూటమి సర్కారు నాగరాజును అనర్హుడిగా ప్రకటించి పెన్షన్ తొలగించింది. ఈ బాలుడికీ అర్హత లేదట!అనంతపురంలోని ప్రభాకర్ స్ట్రీట్లో ఉంటున్న వేలూరు ధీరజ్ వెంకట్నాథ్ పుట్టుకతోనే బుద్ధిమాంద్యంతో బాధపడుతున్నాడు. నడవలేని స్థితిలో ఉన్న ఈ బాలుడికి తల్లిదండ్రులే సపర్యలు చేయాలి. ఈ నెల 14న ధీరజ్కు పింఛన్ తొలగిస్తున్నట్లు నోటీసులు రావడంతో తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. ఇంత కన్నా దారుణం మరెక్కడా ఉండదని ఆక్రోశిస్తున్నారు.పక్షవాతమున్నా పింఛన్ తొలగింపు..నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందిన జి.గులాంబాషాకు రోడ్డు ప్రమాదంలో నడుం విరిగింది. పక్షవాతం బారిన పడటంతో 72 శాతం వైకల్యం ఉందని నిర్ధారిస్తూ 2019లో నంద్యాల ప్రభుత్వాస్పత్రి వైద్యులు శాశ్వత ధ్రువీకరణ పత్రం జారీ చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఆయనకు దివ్యాంగుల పింఛన్ మంజూరైంది. ఇటీవల రీ వెరిఫికేషన్లో గులాంబాషాకు 40 శాతంలోపే వైకల్యం ఉందంటూ పింఛన్ తొలగిస్తూ అధికారులు నోటీసు ఇచ్చారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన గులాంబాషా మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగాడు. చుట్టుపక్కలవారు గమనించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నంద్యాలకు తరలించారు. ⇒ గుంటూరు జిల్లాలో దివ్యాంగ పింఛన్లు 23,459 ఉండగా 2,489 మందిని అనర్హులుగా పేర్కొంటూ నోటీసులిచ్చారు. 472 మందికి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కింద రూ.15 వేలు చెల్లిస్తుండగా వాటిని దివ్యాంగ పెన్షన్లుగా మార్చి రూ.6 వేలకు కుదించారు. 388 మంది దివ్యాంగ పెన్షన్ కింద రూ.6 వేలు పొందుతుండగా ఓల్డ్ ఏజ్ కిందకు మార్చి రూ.4 వేలకు పరిమితం చేశారు. ⇒ పల్నాడు జిల్లాలో గత ప్రభుత్వంలో 2024 మార్చి నాటికి 2,83,119 మందికి పింఛన్లు అందజేశారు. ప్రస్తుతం జిల్లాలో దివ్యాంగులకు 35,096 పింఛన్లు అందజేస్తుండగా వారిలో 3,300 మందికి వివిధ కారణాలతో తొలగించారు. రీ అసెస్మెంట్లో 40 శాతం కంటే తక్కువ వికలాంగత్వం కలిగి ఉన్నందున తొలగించినట్లు డీఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి పేర్కొన్నారు. ⇒ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 32 వేల దివ్యాంగ పింఛన్లు ఉండగా మరోసారి ధ్రువీకరించాలంటూ రెండు నెలల క్రితం నోటీసులు జారీ చేశారు. ఆగస్టులో జిల్లావ్యాప్తంగా 4,215 దివ్యాంగ పింఛన్లను తొలగించారు. ఇవి కాకుండా 597 హెల్త్ పింఛన్లు (మంచానికే పరిమితమైనవారు), 1,611 వృద్ధాప్య పింఛన్లు నిలిపివేసినట్లు అధికారికంగా ధ్రువీకరించారు. ⇒ ప్రకాశం జిల్లావ్యాప్తంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పింఛన్ తీసుకుంటున్న వారు 33,310 మంది ఉన్నారు. రీ వెరిఫికేషన్లో ఇప్పటివరకు 30 వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా దాదాపు 9 వేల మంది దివ్యాంగులకు అనర్హులంటూ నోటీసులు అందాయి. 85 నుంచి 90 శాతం అంగవైకల్యంతో ఇప్పటి వరకు పింఛను పొందుతుంటే రీ వెరిఫికేషన్లో సాధారణ వైకల్యం మాత్రమే ఉందని, పింఛన్కు అనర్హులని నోటీసులిచ్చారు. దీంతో సోమవారం ఒంగోలులో ‘మీ కోసం’ కార్యక్రమానికి నోటీసులతో దివ్యాంగులు పోటెత్తారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 9,601 మంది దివ్యాంగులకు పింఛన్ నిలిపివేసేందుకు అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వికలాంగులు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. మంచానికే పరిమితమైన వారిని జాబితా నుంచి తొలగించారు. కలెక్టర్, ఎంపీడీవో, సర్వజనాసుపత్రి, మున్సిపల్ కార్యాలయాల వద్ద వికలాంగులు మంగళవారం రోజంతా పడిగాపులు కాశారు. శ్రీసత్యసాయి జిల్లా అగళి, బత్తలపల్లి, తాడిమర్రి, హిందూపురం, అనంతపురం జిల్లా గుత్తి, గుంతకల్లు, పామిడి తదితర ప్రాంతాల్లో బాధితులు ఆందోళన చేపట్టారు. తమకు అర్హత ఉన్నప్పటికీ ఎందుకు తొలగించారంటూ అధికారులను నిలదీశారు. ⇒ అన్నమయ్య జిల్లాలో దివ్యాంగుల పెన్షన్లు 29 వేలు ఉండగా 4 వేలకుపైగా పెన్షన్లు అనర్హుల జాబితాలో చేర్చారు. ⇒ ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం దివ్యాంగ పెన్షన్లు 27,302 ఉండగా రీవెరిఫికేషన్ పేరుతో 10,205 పెన్షన్లు నిలిచిపోయాయి. ⇒ కృష్ణా జిల్లాలో 33,173 దివ్యాంగ పింఛన్లు ఉండగా వేల సంఖ్యలో నోటీసులు జారీ అయ్యాయి. అర్హులై పించన్లు తొలగిస్తే ఉద్యమిస్తామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక కృష్ణాజిల్లా కార్యదర్శి ఎన్ఎస్ నారాయణ చెప్పారు. ⇒ తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా 3,211 మంది దివ్యాంగులకు పింఛన్లు రద్దు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ⇒ బాపట్ల జిల్లాలో 24,660 దివ్యాంగ పింఛన్లు ఉండగా రీ వెరిఫికేషన్ పేరుతో 3,829 పింఛన్లను తొలగించేందుకు అధికారులు నోటీసులు అందజేశారు. చిత్తూరు కలెక్టరేట్ వద్ద ఈ నెల 18న ధర్నా చేస్తున్న దివ్యాంగులు కూర్చోలేడు.. లేవలేడు...మాట్లాడలేడు.. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం దాదంవారిపల్లెకు చెందిన ఎన్.జయరామిరెడ్డి నాలుగేళ్లుగా పక్షవాతంతో బాధ పడుతున్నాడు. కనీసం కాలు, చేతులు కూడా కదిలించలేడు. మాట కూడా పడిపోయింది. మలమూత్రాలకు కూడా ఎత్తుకుని వెళ్లాలి. ఇంత దీనస్థితిలో ఉన్న ఆయన దివ్యాంగ పింఛన్ను రీ వెరిఫికేషన్ పేరుతో రూ.15 వేల నుంచి తొలగించి రూ.6 వేలకు మార్చారు. గతంలో 90 శాతం వైకల్యం ఉందని సదరం సర్టిఫికెట్ జారీ కాగా ఇప్పుడు 75 శాతానికే పరిమితం చేశారు. నిరక్షరాస్యుడైన ఆయన.. చదవగలడు, రాయగలడు, బరువులు ఎత్తగలడు అని వైక్యలం సర్టిఫికెట్లో నమోదు చేయడం గమనార్హం. కోతలకే రీ వెరిఫికేషన్ వైఎస్ జగన్ పాలనలో దివ్యాంగుల పట్ల మానవతా దృక్ఫథంతో వ్యవహరించారు. ఏ ఒక్కరి పెన్షన్ తొలగించలేదు. కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. 100 శాతం వైకల్యం ఉన్న వారిని సైతం రీ వెరిఫికేషన్ పేరుతో వేధిస్తోంది. ప్రభుత్వాస్పత్రులకు పిలిíపించి అమానుషంగా వ్యవహరిస్తున్నారు. పెన్షన్లలో కోత వేసేందుకే రీ వెరిఫికేషన్. నెలవారీ అవసరాలు తీర్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. – పూర్ణకంటి బాబురావు, దివ్యాంగుడు , వేమవరం జగ్గయ్యపేటఎలా బతకాలి? నాకు యాక్సిడెంట్లో కాలు విరిగింది. డాక్టర్లు పరీక్షలు చేసి సర్టిఫికెట్ ఇచ్చారు. గత ఆరేళ్లుగా పింఛను అందుకుంటున్నా. ఇప్పుడు ప్రభుత్వం నోటీసు ఇచ్చింది. మా కుటుంబం ఎలా బతకాలి? అప్పలనాయుడు, కొవ్వలి గ్రామం, ఏలూరు జిల్లా ⇒ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 32,101 దివ్యాంగ పింఛన్లున్నాయి. వీరిలో కదలలేని స్థితిలో ఉండేవారు 16,934 మంది కాగా దృష్టి లోపం ఉన్నవారు 4,036 మంది, వినికిడి లోపం ఉన్నవారు 3,992 మంది, మానసిక వైకల్యం ఉన్నవారు 3,751 మంది, మానసిక అనారోగ్యం బాధితులు 1,277 మంది, బహుళ వైకల్యం ఉన్నవారు 2,111 మంది ఉన్నారు. ఇప్పటివరకు సర్వేలో 24,213 మంది వివరాలు సేకరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కోనసీమ జిల్లాలో 2,899 పింఛన్లను రద్దు చేశారు. ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. ⇒ పశ్చిమ గోదావరి జిల్లాలో దివ్యాంగ పింఛన్ లబ్ధిదారులు 27,193 మంది ఉండగా 13,690 మందిని మాత్రమే అర్హులుగా తేల్చారు. 1,289 మందిని వృద్ధాప్య పింఛన్ల కిందకు మార్చారు. ⇒ కాకినాడ జిల్లాలో 35 వేల మంది దివ్యాంగులు ఉండగా 24,000 మందికి పరీక్షలు నిర్వహించారు. 4,300 దివ్యాంగ పింఛన్లు తొలగించారు. ⇒ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పింఛన్లు కోల్పోయిన దివ్యాంగులు పెద్ద ఎత్తున రోడ్డెక్కి ఆందోళనలు చేపడుతున్నారు. డోన్, మద్దికెర, తుగ్గలి తదితర మండలాల్లో దివ్యాంగులు మండల పరిషత్ కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేశారు. 10,050 దివ్యాంగ పింఛన్లను తొలగిస్తూ నోటీసులు ఇస్తున్నట్లు సమాచారం. ⇒ చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో దివ్యాంగ పింఛన్లు పొందుతున్న 12,523 మందికి నోటీసులు జారీచేసి తొలగించడంతో కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేస్తున్నారు. ఇటీవల బంగారుపాళ్యం మండల కేంద్రంలో ధర్నాకు దిగి రాకపోకలను నిలిపివేశారు. ఈనెల 18వ తేదీన చిత్తూరు కలెక్టరేట్లో వందలాది మంది దివ్యాంగులు బైఠాయించారు. ⇒ వైఎస్సార్ కడప జిల్లాలో 2.50 లక్షలకు పైగా పెన్షన్లు ఉండగా దివ్యాంగుల పింఛన్లు 40 వేలకు పైగా ఉన్నాయి. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 7,182 మంది దివ్యాంగులను అనర్హులుగా ప్రకటించారు. ⇒ విశాఖ జిల్లాలో మొత్తం 1,60,778 మంది పింఛన్లు పొందుతుండగా దివ్యాంగుల పింఛన్లు పొందుతున్న వారు 21,306 మంది ఉన్నారు. ప్రస్తుతం 1,178 మంది దివ్యాంగులకు పింఛన్లు నిలుపుదల చేశారు. ⇒ శ్రీకాకుళం జిల్లాలో దివ్యాంగ పింఛన్దారులు 31,502 మంది ఉండగా 29,055 మందికి నోటీసులిచ్చారు. ఆగస్టులో 1,458 దివ్యాంగ పింఛన్లు తొలగించారు. ⇒ విజయనగరం జిల్లాలో 36,412 మంది దివ్యాంగులు పింఛన్లు పొందుతుండగా ప్రస్తుతం 6,770 పెన్షన్లు రద్దయ్యే పరిస్థితి నెలకొంది. ⇒ పార్వతీపురం మన్యం జిల్లాలో దివ్యాంగ పింఛన్లు అందుకుంటున్న వారు 16,750 మంది ఉండగా పునఃపరిశీలన తర్వాత 2,781 మంది అనర్హులని తేల్చారు. దీంతో రెండు జిల్లాల్లో బాధితులు అధికారుల వద్దకు పరుగులు తీస్తున్నారు. ⇒ అనకాపల్లి జిల్లాలో 30,688 మంది దివ్యాంగుల పెన్షన్లు పొందుతుండగా 3,339 మంది పెన్షన్లను తొలగించారు. 799 మంది దివ్యాంగులకు వృద్ధాప్య పింఛన్ల కిందకు మార్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిలోనే జిల్లాలో 10,136 మంది వృద్ధాప్య పెన్షన్లను తొలగించింది. -
సచివాలయాల శాఖను రద్దు చేయండి
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను ఎక్కడ ఏపనికి అవసరమైతే అక్కడ ఉపయోగించుకుంటున్నారు తప్ప వారి సమస్యల గురించి ఎవరూ పట్టించుకోవడంలేదని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఉద్యోగులను సప్లై చేసే కంపెనీ మాదిరిగా పని చేస్తోందని దుయ్యబట్టింది. పండుగలు, సెలవులు, ఆదివారాల్లో కూడా పని ఒత్తిడితో ఉద్యోగులను వేధిస్తున్నారని పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల శాఖను రద్దుచేసి, ఉద్యోగులను మాతృశాఖలతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల్లో సర్దుబాటు చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఐక్యవేదిక చైర్మన్ ఎండీ జానీపాషా, సెక్రటరీ జనరల్ విప్పర్తి నిఖిల్కృష్ణ, కన్వినర్ షేక్ అబ్దుల్ రజాక్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.1.3 లక్షల మంది ఉద్యోగులకు ఆత్మగౌరవం లేకుండా పోయిందిప్రభుత్వ తీరు వల్ల గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న 1.3 లక్షల మంది ఉద్యోగులకు ఆత్మగౌరవం లేకుండా పోయిందని ఐక్యవేదిక నాయకులు పేర్కొన్నారు. ‘గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కేవలం ఉద్యోగులను కట్టు బానిసలుగా, రోజుకూలీల మాదిరిగా వెట్టి చాకిరీ చేయించడం కోసం సమన్వయం చేసే శాఖగా మాత్రమే పని చేస్తోంది. ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడడంలో పూర్తిగా విఫలమవుతోంది. నోషనల్ ఇంక్రిమెంట్ల మంజూరు, ప్రొబేషన్ ఆలస్యం అయిన కాలానికి అరియర్స్ చెల్లింపులు, రికార్డు అసిస్టెంట్ క్యాడర్ను జూనియర్ అసిస్టెంట్ క్యాడర్గా మార్చటం, ఆరేళ్ల స్పెషల్ ఇంక్రిమెంట్, పదోన్నతులు, మా™తృశాఖలో, ఇతర ప్రభుత్వ శాఖల్లో విలీనం, ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా చేపట్టిన బదిలీలు, సమయపాలన లేని పని ఒత్తిడి వంటి ప్రధాన అంశాలపై ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా చర్యలు తీసుకోవడం లేదు’ అని పేర్కొన్నారు. -
ఈనాడు చెప్పేవన్నీ అబద్ధాలే
సాక్షి, అమరావతి: బాబుకు బాకా ఊదడమే ఈనాడు పని. అబద్ధాలు, అసత్యాలను నేర్పుగా కథలుగా అల్లి ఏదో రకంగా చంద్రబాబుకు జాకీ వేసి ఎత్తడానికి సుదీర్ఘకాలంగా ప్రయత్నిస్తూనే ఉంది. చాలాసార్లు ప్రజలకు వాస్తవాలు తెలియకుండా దాచేసి, బాబుకు లబ్ధి చేకూర్చడంలో కొన్నిసార్లు సక్సెస్ అయింది. కానీ.. ఒక్కోసారి అడ్డంగా ప్రజలకు దొరికిపోతుంటుంది. అవాస్తవాలు, అబద్ధాల లెక్కలు వల్లె వేస్తూ చంద్రబాబు గొప్పతనమంటూ గొప్పగా చెప్పడానికి తాజాగా పడిన తాపత్రయం ప్రజలకు నవ్వు తెప్పిస్తోంది. జీఎస్టీ రాబడి అంచనాల్లో తొలి నాలుగు నెలల్లో ఏకంగా 61 శాతం వసూలైనట్టు ఆదివారం సంచికలో గొప్పగా డబ్బా కొట్టింది. వాస్తవం అందుకు భిన్నంగా ఉందని కాగ్ లెక్కలు చూస్తే తేటతెల్లమవుతోంది. వాస్తవానికి జీఎస్టీ అంచనా రాబడిలో తొలి నాలుగు నెలల వసూళ్లు 29.15 శాతమే. ఏడాదికి జీఎస్టీ రాబడి అంచనా రూ.57,477 కోట్లు అయితే.. నాలుగు నెలల్లో వసూళ్లు రూ.16,754 కోట్లు మాత్రమే. ఏరకంగా చూసినా ఇది అంచనాలో వసూలైంది 29.15 శాతమే. -
రౌడీషీటర్ పెరోల్ ఎపిసోడ్.. హోంమంత్రి అనిత తడబాటు
సాక్షి, విజయవాడ: రౌడీషీటర్ పెరోల్ వ్యవహారంలో హోంమంత్రి వంగలపూడి అనిత తడబడ్డారు. మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పని హోం మంత్రి అనిత.. విచారణ జరుగుతుందంటూ సమాచారం దాట వేశారు. సంతకాలు ఎవరెవరు చేశారో చెప్పని హోంమంత్రి.. సిఫార్సు చేసిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల పేర్లు అడిగితే నీళ్లు నమిలారు.పెరోల్ ఎలా వచ్చిందో అనవసరం అంటూ వింత వాదన వినిపించారు. రౌడీ షీటర్ శ్రీకాంత్, అరుణపై విచారణ జరుపుతామంటూ ప్రకటించిన హోంమంత్రి.. మీడియా ఆ విషయం వదిలెయ్యాలంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికే రెండు సార్లు శ్రీకాంత్కు చంద్రబాబు సర్కార్.. పెరోల్ ఇచ్చింది. టీడీపీ నేతల అండతోనే రౌడీ షీటర్ శ్రీకాంత్ బయటకొచ్చారు. పెరోల్లో మీ పాత్ర ఏంటంటూ హోంమంత్రి అనితను మీడియా ప్రశ్నించగా.. తన పాత్ర ఉందొ లేదో చెప్పకుండా.. పెరోల్ వెనుక ఉన్న వారిపై పోస్ట్మార్టం చేయండి అంటూ మాట దాటవేశారు.కాగా, హత్య కేసులో నేరం రుజువై నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్ పెరోల్ వెనుక హోంశాఖ హస్తం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. పెరోల్పై విడుదలైన శ్రీకాంత్ జల్సాలు చేస్తూ పలువురికి ఫోన్లు చేసి బెదిరింపులకు దిగిన విషయం తెలుసుకున్న కూటమి ప్రభుత్వం షాక్కు గురైంది. ఆగమేఘాలపై పెరోల్ రద్దు చేస్తూ, ఉత్తర్వులు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం, ఎమ్మెల్యేలు కలిసి చేసిందంతా చేసి ఎల్లో మీడియా ద్వారా ఈ వ్యవహారాన్ని అంతా వైఎస్సార్సీపీకి అంటగట్టే యత్నం చేస్తుండడం అందరినీ విస్మయపరుస్తోంది.ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన శ్రీకాంత్ టీడీపీలో క్రియాశీలక కార్యకర్త. శ్రీకాంత్ ఓ హత్య కేసులో 2010 నుంచి జిల్లా కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. 2014లో ఆయన సెమీ ఓపెన్ జైల్లో పని చేస్తూ తప్పించుకుని పరారయ్యాడు. నాలుగున్నరేళ్ల తర్వాత తిరిగి పోలీసులకు లొంగిపోయాడు. టీడీపీ నేతల అండదండలు ఉండడంతో శ్రీకాంత్ నాలుగున్నరేళ్లు ఎక్కడున్నాడు? ఏం చేశాడనే విషయం ఎవరికీ తెలియదు.జైలులో ఉన్నప్పుడు వివిధ నేరాల్లో పట్టుబడి జైలుకు వచ్చిన నిందితులతో మాటలు కలిపి వారికి అవసరమైన సహాయం అందించేవాడని, వారు బయటకు వెళ్లిన తర్వాత వారి ద్వారా సెటిల్మెంట్లు చేయించేవాడన్న ప్రచారం కూడా ఉంది. జైల్లో ఉన్న ఖైదీలతో కలిసి జైలు సిబ్బందిపై తిరగబడిన ఘటనలు లేకపోలేదు. కొందరు టీడీపీ ఎమ్మెల్యేల ద్వారా జైలు అధికారులను బెదిరించేవాడని తెలిసింది.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జైలు అధికారులపై తరచూ ఒత్తిడి తీసుకువచ్చి అనారోగ్యం పేరుతో ఆస్పత్రుల్లో రోజుల తరబడి గడిపేవాడు. ఆ ఆస్పత్రుల్లో తన స్నేహితురాలితో సన్నిహితంగా ఉన్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జైలు నుంచే బయట వ్యక్తులను శాసించే స్థాయికి ఎదిగాడు. అధికార పార్టీ ఎమ్మెల్యేల ముఖ్య అనుచరుడు కావడంతో అధికారులు అతన్ని నిలువరించే సాహసం చేయలేకపోయారు.ఇంత అధికార బలం ఉండడం వల్లే టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల సహకారంతో పెరోల్కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే పెరోల్ ఇవ్వొద్దని, అతను బయటకొస్తే శాంతిభద్రతలు అదుపు తప్పే అవకాశం ఉందని తిరుపతి జిల్లా ఎస్పీతోపాటు, గూడూరు డీఎస్పీ, సీఐ, జిల్లా కేంద్ర కారాగార సూపరింటెండెంట్ హోంశాఖ దృష్టికి తీసుకెళ్లినా, అనూహ్యంగా గత నెల 30న శ్రీకాంత్కు పెరోల్ మంజూరు చేస్తూ జీఓ విడుదలైంది. ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, హోంమంత్రి అనిత కనుస న్నల్లోనే 30 రోజుల పెరోల్ మంజూరైనట్లు ప్రచారం జరుగుతోంది.దీంతో శ్రీకాంత్ బయటకు వచ్చేశాడు. హోంమంత్రి అనిత సంతకం ఆధారంగానే శ్రీకాంత్ పెరోల్పై వచ్చినట్లు అతని సన్నిహితురాలు అరుణ స్పష్టం చేయడం గమనార్హం. బయటకు వచ్చిన శ్రీకాంత్ జల్సాలు చేయడం, బెదిరింపులకు దిగటం వంటి అంశాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కూటమి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. హడావుడిగా పెరోల్ని రద్దు చేసింది. -
మంత్రి అచ్చెన్న ‘రెడ్బుక్’ ప్రయోగం
సాక్షి, విజయవాడ: అధికారులపై మంత్రి అచ్చెన్నాయుడు రెడ్బుక్ ప్రయోగించారు. అచ్చెన్నాయుడు వేధింపులకు తట్టుకోలేక ఆగ్రోస్ జీఎం రాజమోహన్ సెలవుపై వెళ్లిపోయారు. సీఎస్కు లేఖ రాసి ఆయన సెలవుపై వెళ్లిపోయారు. అవినీతి వ్యవహారాల కోసం జీఎంపై మంత్రి అచ్చెన్నాయుడు ఓఎస్డి ఒత్తిడి చేశారు. వ్యవసాయ యంత్ర పరికరాల తయారీదారులతో మధ్యవర్తిత్వం చేయాలని జీఎంపై మంత్రి అచ్చెన్నాయుడు పేషీ ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.దీంతో చెప్పిన మాట విననందుకు మంత్రి అచ్చెన్నాయుడు ఆయనను నెల్లూరుకి బదిలీ చేశారు. సెలవుపై వెళ్లడం తప్ప వేరే మార్గం లేదని సీస్కు ఆగ్రోస్ జీఎం లేఖ రాశారు. జీఎం రాజమోహన్ని వేధించేందుకే బదిలీ చేశారని సమాచారం. రాజమోహన్ స్థానంలో అర్హత లేని జూనియర్కి జీఎంగా మంత్రి అచ్చెన్నాయుడు బాధ్యతలను అప్పగించారు. -
మాజీ మంత్రి కన్నబాబు తండ్రి మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కన్నబాబుకు పితృవియోగం కలిగింది. కన్నబాబు తండ్రి సత్యనారాయణ మృతి పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన వైఎస్ జగన్.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు.కాగా, కురసాల కన్నబాబు తండ్రి సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఇవాళ ఉదయం(మంగళవారం) తుదిశ్వాస విడిచారు. పలువురు పార్టీ నేతలు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. సత్యనారాయణ అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం నిర్వహించనున్నారు.కురసాల సత్యనారాయణ భౌతికకాయాన్ని సందర్శించిన ఉభయ గోదావరి జిల్లాల వైఎస్సార్సీపీ కో-ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ.. ఆయనకు నివాళులర్పించారు. దాడిశెట్టి రాజా, మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, వేణుగోపాలకృష్ణ, మాజీ ఎంపీ భరత్, వంగా గీతా, ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి, తోట నరసింహం, జక్కంపూడి రాజా, దవులూరి దొరబాబు కన్నబాబును పరామర్శించి సంతాపం తెలిపారు. -
కృష్ణమ్మ ఉగ్రరూపం.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
సాక్షి, విశాఖపట్నం/విజయవాడ: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈ ఉదయానికి తీరం దాటింది. గోపాల్పూర్ వద్ద తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో.. ఏపీలో కొన్నిచోట్ల వర్షాలు పడుతున్నాయి. అదే సమయంలో.. గడిచిన 24 గంటల్లో కురిసిన వర్షాలతో కృష్ణా నదికి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది.కృష్ణానదికి ప్రవాహం పెరగడంతో.. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుత ఇన్ ఫ్లో , అవుట్ ఫ్లో 4,01,087 క్యూసెక్కులుగా ఉంది. మొత్తం 70 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉండడంతో.. ప్రభావిత జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ‘‘కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వాగులు.. కాలువలు దాటే ప్రయత్నం చేయరాదు’’ అని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో ప్రజలను హెచ్చరించారు. వాయుగుండం ప్రభావంతో గడచిన 24 గంటల్లో.. పాడేరులో 16 సెంమీ వర్షపాతం నమోదైంది. రాష్ట్రమంతటా ఇవాళ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు, అలాగే కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి ఈదురు గాలులు కొనసాగుతాయని పేర్కొంది.చేపల వేటకు వెళ్ళి.. భారీ వర్షంలో.. చేపల వేటకు వెళ్లిన ఓ యువకుడు సముద్రంలో గల్లంతయ్యాడు. పెద్ద అల ఒక్కసారిగా రావడంతో యువకుడు తమ కళ్ల ముందే కొట్టుకుపోయాడని, రక్షించే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని కొందరు మత్స్యకారులు తెలిపారు. సదరు యువకుడిని ఎంవీపీ కాలనీకి చెందిన సతీష్గా గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే అతని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
21న అంగన్వాడీల నిరసనలు
సాక్షి, అమరావతి: అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాట్యూటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆగస్ట్ 21న రాష్ట్రంలోని ఐసీడీఎస్ ప్రాజెక్టులు, మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని మూడు యూనియన్లు పిలుపునిచ్చాయి. ఈ మేరకు ఏపీ అంగన్వాడీ వర్క్ర్స్, హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ), ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ అసోసియేషన్(ఏఐటీయూసీ), ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్(ఐఎఫ్టీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సుబ్బరావమ్మ, లలితమ్మ, వీఆర్ జ్యోతి సోమవారం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. 21న దేశ వ్యాప్తంగా బ్లాక్ డే నిర్వహించాలని అఖిల భారత అంగన్వాడీ యూనియన్ నిర్ణయించిందని పేర్కొన్నారు. దీనిలో భాగంగానే ఏపీలో చేపట్టే నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లకు పిలుపునిచ్చారు. -
విద్యార్థినులకు ‘ప్రగతి’ సాయం
సాక్షి, అమరావతి: విద్యార్థినులకు ఆర్థిక సహాయార్థం అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ‘ప్రగతి స్కాలర్ షిప్’లను అందిస్తోంది. ఈ పథకం సాంకేతిక విద్యలో డిగ్రీ, డిప్లొమా విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ మేరకు (ఆన్లైన్లో) అర్హత కలిగిన విద్యార్థినుల నుంచి దరఖాస్తులు ఆహా్వనిస్తోంది. అక్టోబర్ 31లోగా జాతీయ స్కాలర్ షిప్ పోర్టల్ https:// scholarships. gov.in/ ద్వారా దరఖాస్తులు సమర్పించాలంది. ఆధార్ బ్యాంకు లింకు చేసిన అకౌంట్ను జత చేయాలని పేర్కొంది.ఈ పథకానికి కుటుంబ వార్షిక ఆదాయం రూ.8లక్షల కంటే తక్కువ ఉన్న వారు అర్హులు. ఇలా ప్రతి కుటుంబంలో గరిష్ఠంగా ఇద్దరు బాలికల వరకు ఆర్థిక సహాయం అందించనుంది. ఏఐసీటీ ఈ ఆమోదించిన సంస్థల్లో సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న (లేటరల్ ఎంట్రీ అయినా) విద్యార్థినులకు ఏడాదికి రూ.50వేలు చొప్పున స్కాలర్షిప్ ఇవ్వనుంది. డిగ్రీ స్థాయిలో గరిçష్టంగా నాలుగేళ్లు ఇలా సహయాన్ని ఇస్తోంది. డిప్లొమాలో చేరిన విద్యార్థినులకు సైతం ఈ పథకాన్ని గరిష్టంగా మూడేళ్లు ఇవ్వనుంది. ఈ సహాయాన్ని ట్యూషన్ ఫీజులు, పుస్తకాలు, కంప్యూటర్లు, స్టేషనరీ వంటి పరికరాల ఖర్చుల నిమిత్తం ఏక మొత్తంలో అందించనుండటం విశేషం. అర్హులందరికీ... దేశంలో 23 రాష్ట్రాల్లో ఏటా 10వేల స్కాలర్షిప్లు అందిస్తోంది. వీటికి అదనంగా 13 రాష్ట్రాలు/కేంద్ర పాలిక ప్రాంతాల్లో ఎంత మంది అర్హత కలిగిన విద్యార్థినులు దరఖాస్తు చేసుకుంటే అందరికీ స్కాలర్షిప్ను మంజూరు చేయనుంది.సమర్పించాల్సిన పత్రాలు (నకలు).. ⇒ ఎస్ఎస్ఈ ధ్రువపత్రం ⇒ హెచ్ఎస్సీ/12వ తరగతి (డిగ్రీ లెవల్ విద్యార్థినులకు) ⇒ ఐటీఐ ధ్రువపత్రం (డిప్లొమా విద్యార్థినులకు) ⇒ బ్యాంకు పాస్బుక్ ⇒ కుల ధ్రువీకరణ పత్రం ⇒ ఆధార్ కార్డు ⇒ స్టడీ ధ్రువపత్రం ⇒ వార్షిక ఆదాయ ధ్రువపత్రం ⇒ తల్లిదండ్రుల డిక్లరేషన్ ⇒ బ్యాంకు మ్యాన్డేట్ ఫారమ్ -
మాతోనే బేరసారాలా?
ఈ కేసులో సిట్ ‘పిక్ అండ్ చూజ్’ (ఇష్టం వచ్చినట్లు ఎంచుకోవడం) విధానాన్ని అనుసరిస్తోంది. ప్రత్యేకించి ప్రధాన నిందితుడిని అప్రూవర్గా మార్చడానికి చూస్తోంది. ఈ చర్య మొత్తం కేసుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.282 మంది సాక్షులను విచారించడంతో పాటు ట్రంకుపెట్టెల్లో పెద్ద సంఖ్యలో డాక్యుమెంట్లను దర్యాప్తు సంస్థ సేకరించింది. అందువల్ల పిటిషనర్లను అప్రూవర్లుగా తీసుకోవాల్సిన అవసరం ఏదీ లేదు. వాస్తవానికి ఇదో నిష్ఫల యత్నం.– ఏసీబీ ప్రత్యేక కోర్టుసాక్షి, అమరావతి: మద్యం విధానంపై అక్రమ కేసు విచారణ సందర్భంగా ఏసీబీ న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో దర్యాప్తు సంస్థ (సిట్) తీరును తీవ్రంగా ఆక్షేపించింది. ప్రాసిక్యూషన్ ‘పిక్ అండ్ చూజ్’ (ఇష్టం వచ్చినట్లు ఎంచుకోవడం) విధానాన్ని అనుసరించడంపై విస్మయం వ్యక్తం చేసింది. ప్రధాన నిందితుడిని అప్రూవర్గా మార్చడానికి యత్నిస్తోందని, ఈ చర్య మొత్తం కేసుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని తప్పుబట్టింది. పిటిషనర్లకు, దర్యాప్తు సంస్థ మధ్య బేరం కుదిరిందన్న విషయాన్ని చాలా స్పష్టంగా ప్రస్ఫుటం చేస్తోందని వ్యాఖ్యానించింది. ఈమేరకు మద్యం విధానం కేసులో నిందితులుగా ఉన్న ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీబీసీఎల్) పూర్వ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, ఎక్సైజ్ శాఖ మాజీ స్పెషల్ ఆఫీసర్ దొడ్డా వెంకట సత్యప్రసాద్లకు ముందస్తు బెయిల్ను నిరాకరిస్తూ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ పిటిషన్లు పూర్తిగా తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, అరెస్ట్, అభియోగాల నుంచి తప్పించుకోవడానికే దొడ్డిదారిన దాఖలు చేశారని పేర్కొంది. అప్రూవర్కి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని, ట్రయల్ పూర్తయ్యే వరకు వారిని కస్టడీలోనే ఉంచి తీరాలని స్పష్టం చేసింది. అప్రూవర్గా మారతామన్న ప్రతిపాదనలకు చట్ట ఆమోద యోగ్యత లేదని తేల్చి చెప్పింది. ముందస్తు బెయిల్ కోసం వారిద్దరూ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తూ న్యాయాధికారి పి.భాస్కరరావు సోమవారం తీర్పు వెలువరించారు. తీర్పు సారాంశం ఇదీ... అప్రూవర్గా మారుతామన్న వాగ్దానంపై బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు... ‘చట్ట ప్రకారం అప్రూవర్కు ముందస్తు బెయిల్ మంజూరు చేయడానికి వీల్లేదు. అప్రూవర్కు క్షమాభిక్ష ప్రసాదించిన తరువాత అతన్ని బెయిల్పై విడుదల చేయడానికి వీల్లేదు. ట్రయల్ పూర్తయ్యేంత వరకు కస్టడీలోనే ఉంచి తీరాలి. సీఆర్పీసీలోని సెక్షన్ 306(4) (బీ) అప్రూవర్గా మారేందుకు సిద్ధమన్న వాగ్దానంపై బెయిల్ మంజూరు చేయడాన్ని నిషేధిస్తోంది. బెయిల్తో సంబంధం లేకుండా అప్రూవర్ సాక్ష్యం నమ్మదగినదిగా, మరకలు లేనిదిగా ఉండాలన్నదే ఈ నిషేధం వెనుక ఉన్న తర్కం. అప్రూవర్ భవిష్యత్తులో బెయిల్ పొందే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని ఇతరులను కేసులో ఇరికించవచ్చు లేదా సాక్ష్యాన్ని మార్చవచ్చు. అందువల్ల అప్రూవర్గా మారుతానన్న వాగ్దానాల లాంటి వాటిపై బెయిల్ ఇవ్వడం న్యాయవ్యవస్థ ప్రతిష్టను తక్కువ చేయడమే. బెయిల్ పిటిషన్లను ఆయా కేసుల్లోని పూర్వాపరాల ఆధారంగా తేల్చాల్సి ఉంటుందే గానీ, అప్రూవర్గా మారుతానన్న వాగ్దానాల ఆధారంగా కాదు...’ అని ప్రత్యేక కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. ప్రభుత్వం పిటిషనర్లను అప్రూవర్గా మార్చడానికి చూస్తోంది...! ‘పిటిషనర్లు దర్యాప్తునకు కొంత మేర సహకరించారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పెషల్ పీపీ చెప్పారు. అయితే ఇది ఎంతమాత్రం సరిపోదు. ఈ మొత్తం కేసులో తన పాత్ర గురించి, ఇతర నిందితుల పాత్ర గురించి పూర్తి వాస్తవాలను తెలియచేయాల్సి ఉంటుంది. పిటిషనర్లకు ముందస్తు బెయిల్ ఇస్తే పలు షరతులు విధించాలని స్పెషల్ పీపీ చెబుతున్నారు. ట్రయల్ పూర్తయ్యేంత వరకు నిందితులను కస్టడీలో ఉంచకుండా బెయిల్పై విడుదల చేస్తే వారు కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటారన్న గ్యారెంటీ ఏమీ లేదు. శక్తివంతులైన సహ నిందితులు గతంలో తమకున్న సాన్నిహిత్యంతో పిటిషనర్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం, భయపెట్టడం చేయవచ్చు. అందుకే అప్రూవర్ను ట్రయల్ పూర్తయ్యే వరకు కస్టడీలోనే ఉంచాలని చట్టం చెబుతోంది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ ‘పిక్ అండ్ చూజ్’ (ఇష్టం వచ్చినట్లు ఎంచుకోవడం) విధానాన్ని అనుసరిస్తోంది. ప్రత్యేకించి ఈ కేసులో ప్రధాన నిందితుడిని అప్రూవర్గా మార్చడానికి చూస్తోంది. ఈ చర్య మొత్తం కేసుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది..’ అని న్యాయస్థానం తన తీర్పులో ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధాన నిందితులను అప్రూవర్గా మార్చడం ఓ నిష్ఫలయత్నం... ‘శరీరానికి తల ఎంత ముఖ్యమో వీరు కూడా అంతే ముఖ్యం. తల తొలగిస్తే మొత్తం శరీరం కుప్పకూలిపోతుంది. అందువల్ల ప్రధాన నిందితులను ప్రాసిక్యూషన్ (సిట్) అప్రూవర్గా తీసుకోలేదు. ఈ కేసులో ప్రధాన నిందితులను అప్రూవర్లుగా మార్చలేరు. ప్రాసిక్యూషన్ దర్యాప్తు పూర్తి చేసింది. కెసిరెడ్డి రాజశేఖర్రెడ్డిపై చార్జిషీట్ కూడా దాఖలు చేసింది. అలాగే నిందితులుగా ఉన్న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, బాలాజీ గోవిందప్పలపై అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది. 282 మంది సాక్షులను విచారించడంతో పాటు ట్రంకుపెట్టెల్లో పెద్ద సంఖ్యలో డాక్యుమెంట్లను దర్యాప్తు సంస్థ సేకరించింది. అందువల్ల పిటిషనర్లను అప్రూవర్లుగా తీసుకోవాల్సిన అవసరం ఏదీ లేదు. వాస్తవానికి ఇదో నిష్పల యత్నం...’ అని ఏసీబీ కోర్టు తన తీర్పులో వ్యాఖ్యానించింది.ముందస్తు బెయిల్ కోసం దొడ్డిదారిన పిటిషన్లు...‘ఈ కేసులో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ నిందితులుగా ఉన్నారు. ఈ వ్యవహారంలో వారు క్రియాశీలకంగా వ్యవహరించారు. వీరిపై ఉన్న ఆరోపణలు తీవ్రమైనవి. అయితే అరెస్ట్ నుంచి తప్పించుకోవటానికి, అభియోగాల నుంచి విముక్తి పొందేందుకు దొడ్డిదారిన వీరు ఈ ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అప్రూవర్గా మారేందుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న ప్రతిపాదనతో ఈ వ్యాజ్యాలు వేశారు. అయితే ఇలాంటి పద్ధతులకు చట్ట అమోద యోగ్యత లేదు...’ అని న్యాయస్థానం తేల్చి చెప్పింది.కోర్టుతోనే బేరసారాలు.. న్యాయవ్యవస్థ ప్రతిష్టను తక్కువ చేయడమే!‘ఈ కేసులో తాము అప్రూవర్గా మారతామని, ఇందులో భాగంగా తమకు క్షమాభిక్ష ప్రసాదించాలని వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ వేర్వేరుగా సీఆర్పీసీ సెక్షన్ 306 కింద పిటిషన్లు దాఖలు చేశారు. అవి లోపభూయిష్టంగా ఉండటంతో ఈ కోర్టు కొన్ని అభ్యంతరాలు తెలిపింది. తదనుగుణంగా వాటిని రిటర్న్ చేసింది. అయితే కోర్టు వ్యక్తం చేసిన అభ్యంతరాలను పిటిషనర్లు సవరించలేదు. సవరణలతో మళ్లీ పిటిషన్లు దాఖలు చేయలేదు. అప్రూవర్లుగా మారే విషయంలో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్లకు సదుద్దేశం లేదన్న విషయాన్ని ఇది స్పష్టం చేస్తోంది. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే గానీ అప్రూవర్లుగా మారే ప్రసక్తే లేదన్నట్లుగా పిటిషనర్ల తీరు. ముందస్తు బెయిల్ ఇస్తేనే అప్రూవర్లుగా మారతామనడం కోర్టుతో బేరసారాలు చేయడమే అవుతుంది. ఇది న్యాయవ్యవస్థ ప్రతిష్టను తక్కువ చేయడమే. అంతేకాక ఇది పిటిషనర్లకు, దర్యాప్తు సంస్థ మధ్య బేరం కుదిరిందన్న విషయాన్ని చాలా స్పష్టంగా ప్రస్ఫుటం చేస్తోంది. ఈ తీరు సీఆర్పీసీ సెక్షన్ 306 (4) (బీ) కింద నిర్దేశించిన విధానానికి పూర్తి విరుద్ధం. ఈ పిటిషన్లు పూర్తిగా తప్పుదోవ పట్టించేవి. కాబట్టి పిటిషనర్లకు ముందస్తు బెయిల్ మంజూరు చేసే విషయంలో ఈ కోర్టు తనకున్న విచక్షణాధికారాన్ని ఉపయోగించడం లేదు..’ అని కోర్టు తన తీర్పులో పేర్కొంది. -
మీ మద్యం దుకాణం ఉండటానికి వీల్లేదు
సాక్షి టాస్క్ ఫోర్స్: కల్లు గీత కార్మికులకు కేటాయించిన మద్యం దుకాణంపై నగరి ఎమ్మెల్యే బంధువులు దౌర్జన్యానికి దిగారు. తమ మద్యం దుకాణానికే అడ్డు ఉండకూడదని వారికి హుకుం జారీ చేశారు. మరో చోట మద్యం దుకాణం ఏర్పాటు చేసుకుంటే.. అక్కడ మరో వైన్ షాపు యజమాని గీత కార్మికులపై దాడి చేశారు. ఆపై గౌడ మద్యం దుకాణానికి తాళం వేశారు. గత నెలలో జరిగిన ఘటన తిరుపతి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం మేరకు..ప్రభుత్వం గీత కార్మికుల కోటాలోని మద్యం దుకాణం కోసం అతిరాల నారాయణ మూడు చోట్ల దరఖాస్తు చేసుకున్నారు. నగరి నియోజకవర్గం పుత్తూరు మున్సిపాలిటీలో మద్యం దుకాణం ఏర్పాటుకు అనుమతులు పొందారు.పుత్తూరు సమీపంలో ఫిబ్రవరి 2న గౌడ మద్యం దుకాణం ఏర్పాటు చేసుకున్నారు. నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఒత్తిడి మేరకు ఎక్సైజ్ అధికారులు మద్యం దుకాణాన్ని ఖాళీ చేయాలని ఒత్తిడి చేశారు. ఆ తరువాత విష్ణుమహల్ సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. అక్కడ కూడా వీల్లేదని ఎమ్మెల్యే ఎక్సైజ్ అధికారులపై ఒత్తిడి చేశారు. ఎక్సైజ్ ఉన్నతాధికారి సలహా మేరకు పుత్తూరు–కార్వేటినగరం మార్గంలో కళ్యాణపురం వద్ద ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారు. అక్కడ వ్యాపారం చేస్తుండగా సమీపంలోని గంగా వైన్స్ యజమాని దౌర్జన్యం మొదలైంది.గౌడ వైన్స్ని తొలగించాలని ఒత్తిడి చేశారు. తొలగించకపోవటంతో దాడికి తెగబడి, దుకాణానికి తాళం వేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. 2 రోజుల తరువాత గౌడ సంఘం సహకారంతో తాళాలు పగులగొట్టి మద్యం దుకాణం నుంచి వ్యాపారం ప్రారంభించారు. 2 రోజుల తరువాత గంగా వైన్స్ యాజమాన్యం వర్గీయులు గౌడ మద్యం దుకాణం ఫ్లెక్సీలు, విద్యుత్ లైట్లను ధ్వంసం చేశారు. వ్యాపారం జరగనివ్వకుండా అరాచకం చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని నారాయణ సోమవారం ఫిర్యాదు చేశారు. -
మరో దారిలేదు.. చావే శరణ్యం
నరసరావుపేట రూరల్: ‘స్కూల్ను ఖాళీ చేసి వెళ్లిపోండి. ఆ భవనం మాకు ఇచ్చేయండి.’ అంటూ టీడీపీ నాయకులు ఓ ప్రైవేట్ పాఠశాల నిర్వాహకుడిని బెదిరించారు. ఏకంగా పాఠశాలలోకి వెళ్లేందుకు దారి లేకుండా అడ్డంగా గోడ కట్టేశారు. విజయవంతంగా నడుస్తున్న స్కూలు మూత పడుతోందని నిర్వాహకుడు తట్టుకోలేకపోయాడు. ఇక తనకు మరో దారి లేదని, చావే శరణ్యమని భావించిన ఆ ప్రైవేట్ స్కూల్ నిర్వాహకుడు షేక్ బషీర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగింది.బాధితుడి భార్య హేమలత తెలిపిన వివరాల ప్రకారం... నరసరావుపేటకు చెందిన షేక్ బషీర్ సెక్రటరీగా, మరికొందరు సభ్యులుగా పూజిత ట్రస్ట్ను ఏర్పాటు చేశారు. ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాఠశాల ఏర్పాటుకు పట్టణంలోని లింగంగుంట్ల బ్యాంక్ కాలనీలో టీడీపీ నాయకుడు శాఖమూరి రామ్మూర్తికి చెందిన స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. పది సంవత్సరాలు లీజు అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత రూ.80 లక్షలతో భవనాలు నిర్మించి 2020లో రెయిన్బో స్కూల్ను ప్రారంభించారు. బషీర్, ఆయన భార్య హేమలత ఆధ్వర్యంలో ఐదేళ్లుగా స్కూల్ను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కష్టాలు మొదలు... కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెయిన్బో స్కూల్ నిర్వాహకులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎనిమిది నెలల నుంచి పాఠశాలను ఖాళీ చేయాలని టీడీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. ‘నా భర్త బషీర్ను, నన్ను ఇటీవల టీడీపీ ఆఫీసుకు పిలిపించారు. పాఠశాలను ఖాళీ చేసి భవనాలు వారికి అప్పగించి వెళ్లిపోవాలని టీడీపీ నాయకులు వాసిరెడ్డి రవి, శాఖమూరి రామ్మూర్తితోపాటు మరికొందరు బెదిరించారు. లేకపోతే అక్రమ కేసులు పెట్టి వేధిస్తామని బెదిరించారు. మేం లీజు అగ్రిమెంట్పై న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, కోర్టు ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చింది. కోర్టు ఆదేశాలను సైతం టీడీపీ నేతలు పట్టించుకోకుండా శనివారం రాత్రి పాఠశాలలోకి వెళ్లేందుకు దారి లేకుండా అడ్డంగా గోడ కట్టేశారు. దీనిపై నరసరావుపేట రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసినా సరిగా పట్టించుకోలేదు. ఇక టీడీపీ నాయకులతో పోరాడే శక్తి లేదంటూ నా భర్త బషీర్ ఎలుకల మందు తిని ఆత్మహత్యకు ప్రయత్నించారు.’ అని హేమలత ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే బషీర్ను ఆస్పత్రిలో చేర్పించినట్లు చెప్పారు. టీడీపీ నాయకుల కుట్రల వల్ల 300మంది విద్యార్థులు, సిబ్బంది రోడ్డునపడే పరిస్థితి వచ్చిందని హేమలత కన్నీటిపర్యంతమయ్యారు. టీడీపీ నేతల వేధింపులపై ఆమె ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ కె.శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
నేడు అన్నమయ్య జిల్లాకు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11.30 గంటలకు రాజంపేట మండలం బాలిరెడ్డిగారిపల్లికి చేరుకొని.. అక్కడి నుంచి ఆకేపాడుకు వెళ్తారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి సోదరుడు అనిల్కుమార్రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్లో ఆయన పాల్గొంటారు. -
పోలీస్ ‘తిరుగుబాటు’
సాక్షి, అమరావతి: రెడ్బుక్ వేధింపులపై పోలీసు అధికారులు తిరుగుబావుటా ఎగురవేశారు. రాష్ట చరిత్రలో తొలిసారిగా... వందమందికి పైగా అధికారులు ఒకేసారి బహిరంగంగా గళం వినిపించారు. పోస్టింగులు ఇవ్వకుండా సాధిస్తుండడంపై మూకుమ్మడిగా ధ్వజమెత్తారు. ఏడాదికిపైగా జీతాలు లేవు... కుటుంబాలను ఎలా పోషించేదని నిలదీశారు. పైగా... ఇప్పుడు బయోమెట్రిక్ హాజరు అంటూ వేధింపులను మరింత తీవ్రం చేయడంపై మండిపడ్డారు.అసలు పోస్టింగులే లేవు... ఇక మా కుటుంబాలు ఎక్కడ ఉండాలి? మేం బయోమెట్రిక్ హాజరు ఎలా వేయాలి? అని ప్రశ్నించారు. ఇదంతా పోలీసు ప్రధాన కార్యాలయంలోనే జరగడం గమనార్హం. దీంతో క్రమశిక్షణకు మారుపేరైన పోలీసు అధికారులు కూడా నిరసన స్వరం వినిపించేంతగా చంద్రబాబు ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని మరోసారి స్పష్టమైంది. యావత్ పోలీస్ యంత్రాంగంతో పాటు ప్రభుత్వ వర్గాల్లోనూ తీవ్ర సంచలనంగా మారింది ఈ ఉదంతం. ఇంతకూ ఏం జరిగిందంటే...?తీరు మార్చుకోకపోగా.. మరింత దారుణంగాచంద్రబాబు ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో 24 మంది ఐపీఎస్ అధికారులతో సహా 199 మంది పోలీసు అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా వేధింపులకు తెరతీసింది. ఈ తీరుపై జాతీయస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నా ప్రభుత్వ పెద్దలు మాత్రం తీరు మార్చుకోలేదు. ఏడాదికి పైగా సమయం నుంచి పోలీసు కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ఇది చాలదన్నట్లుగా... అదనపు ఎస్పీ నుంచి సీఐ స్థాయి వరకు పోస్టింగులు లేకుండా వెయిటింగ్లో ఉన్న వందమందికి పైగా అధికారులను సోమవారం రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయానికి పిలిపించారు. పోస్టింగుల విషయం తేలుస్తారని ఆశతో వెళ్లిన అధికారులు అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు. రిసెప్షన్ వద్ద చెప్పిన ప్రకారం ఆ అధికారులు అదనపు డీజీ మధుసూదన్రెడ్డిని కలిశారు. వెయిటింగ్లో ఉన్నవారంతా రోజూ ఉదయం, సాయంత్రం డీజీపీ కార్యాలయంలో బయోమెట్రిక్ హాజరు వేయాలని మధుసూదన్రెడ్డి చెప్పారు. డీజీపీ హరీశ్కుమార్గుప్తా ఈ మేరకు ఆదేశించినట్లు తెలిపారు. ఆవేశం, ఆవేదన కలగలిపి నిరసన స్వరంఅదనపు డీజీ చెప్పిన సమాచారంతో పోలీసు అధికారులు ఒక్కసారిగా మండిపడ్డారు. శాఖలో ఎన్నడూ లేని రీతిలో... ఆవేశం, ఆవేదన కలగలిపి నిరసన స్వరం బలంగా వినిపించారు. ‘‘డీజీపీ అంటే రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి తండ్రివంటివారు. ఏడాది పైగా మాకు పోస్టింగులు లేవని, జీతాలు ఇవ్వడం లేదనే విషయం ఆయనకు తెలియదా? వందలమంది పోలీసు అధికారులు కుటుంబాలను ఎలా పోషిస్తున్నారు? పిల్లల చదువులు, ఇతర బాధ్యతలు ఎలా నిర్వరిస్తున్నారు? అని డీజీపీ ఏనాడైనా ఆలోచించారా?’’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ వేధింపులు చాలవన్నట్టు ఇప్పుడు డీజీపీ కార్యాలయంలో రోజూ ఉదయం, సాయంత్రం బయోమెట్రిక్ హాజరు వేయాలని చెప్పడం ఏమిటని ధ్వజమెత్తారు. ఎక్కడ ఉండాలి..?‘‘కుటుంబాలన్నీ మేం ఏడాది క్రితం పనిచేసిన పట్టణాలు, నగరాల్లో ఉండిపోయాయి. పోస్టింగ్ లేకుండా మేం కుటుంబాలతో సహా ఈ రాజధాని ప్రాంతంలో ఎక్కడ ఉండాలి...? డీజీపీ కార్యాలయానికి రోజూ ఉదయం, సాయంత్రం ఎలా వచ్చేది?’’ అని సూటిగా పోలీసు అధికారులు ప్రశ్నించారు. ‘‘పోస్టింగులు ఇవ్వండి. ఎక్కడ పనిచేయమంటే అక్కడ చేస్తాం. ఉదయం, సాయంత్రం ఏమిటీ...? రోజుకు పదిసార్లు బయోమెట్రిక్ వేయమన్నా వేస్తాం’’ అని స్పష్టం చేశారు. అంతేగానీ, పోస్టింగులు లేకుండా జీతాలు ఇవ్వకుండా రోజుకు రెండుసార్లు బయోమెట్రిక్ వేయమని చెప్పడం అమానవీయం అని వాపోయారు.⇒ పోలీసు అధికారుల ఆగ్రహం చూసి అదనపు డీజీ మధుసూదన్రెడ్డి అవాక్కయ్యారు. అధికారులు వ్యక్తం చేసిన అభిప్రాయాల్లో తప్పుబట్టే అంశం ఏదీ లేకపోవడంతో ఆయన వారిని ఏమీ అనలేకపోయారు. వారి ఆవేదన పట్ల తనకూ సానుభూతి ఉందని చెప్పినట్టు సమాచారం. డీజీపీ గుప్తా ఆదేశాలనే తాను చేరవేశానని అన్నారు. సమస్యను డీజీపీతోనే చర్చించాలని సూచించారు.తన మాటను నెగ్గించుకునేందుకే...‘‘వెయిటింగ్లో ఉన్నా పోస్టింగే’’ అనే తన మాటను నెగ్గించుకునేందుకే డీజీపీ హరీశ్కుమార్ గుప్తా తాజా ఎత్తుగడ వేశారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వెయిటింగ్లో ఉన్న అధికారులు రోజూ ఉదయం, సాయంత్రం వచ్చి బయోమెట్రిక్ హాజరు వేయాలని ఆదేశించినట్లు సమాచారం. కానీ, అనూహ్యంగా అధికారులు పూర్తిగా ఎదురు తిరగడంతో పోలీస్ బాస్లకు నోట మాట రాలేదు. కాగా, ఈ పరిణామం రాష్ట్ర పోలీసు యంత్రాంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ పెద్దల రెడ్బుక్ కుట్ర, అందుకు వత్తాసు పలుకుతున్న పోలీసు బాస్ల తీరుతో తమ డిపార్ట్మెంట్ ఆత్మగౌరవం దెబ్బతింటోందని పోలీసు వర్గాలే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.పోస్టింగులపై హామీ ఇవ్వని డీజీపీఅదనపు డీజీ మధుసూదన్రెడ్డిని కలిసిన అనంతరం పోలీసు అధికారులు కొందరు జట్టుగా, మరికొందరు విడివిడిగా డీజీపీ హరీశ్కుమార్గుప్తా వద్దకు వెళ్లినట్లు సమాచారం. సమస్యలను ఆయనకు కూడా వివరించినట్లు తెలిసింది. పోస్టింగులపై డీజీపీ వారికి ఎలాంటి హామీ ఇవ్వకపోవడం గమనార్హం. కాగా, అధికారులకు ఏడాదికి పైగా పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తుండడాన్ని డీజీపీ హరీశ్కుమార్ గుప్తా ఇటీవల సమర్థించుకోవడం పోలీసు శాఖలో తీవ్ర కలకలం రేపింది. ‘‘పోలీసు శాఖలో వేకెన్సీ రిజర్వ్ (వీఆర్)లో ఉండడం కూడా పోస్టింగే. వీఆర్ అన్నది శాంక్షన్డ్ పోస్టే’’ అని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. దీనిపై పోలీసు అధికారులు తీవ్రంగా స్పందించారు. ‘‘...మరి వీఆర్లో ఉన్న పోలీసు అధికారులకు నెలనెలా జీతాలు ఇస్తున్నారా? ఏడాదిగా జీతాలివ్వకుండా పోస్టింగ్లో ఉన్నట్టే అని ఎలా ప్రకటిస్తారు’’? అని ప్రశ్నించారు. -
లిక్కర్ స్కామ్ చంద్రబాబు కట్టుకథే
సాక్షి, రాజమహేంద్రవరం: సీఎం చంద్రబాబునాయుడు అల్లిన కట్టుకథే లిక్కర్ కుంభకోణమని, ఆ కథ ఆధారంగానే సిట్ అధికారులు సరైన ఆధారాలు లేకపోయినా విచారణ చేస్తూ కాలయాపన చేస్తున్నారని వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు, సీనియర్ నేత అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. లిక్కర్ అక్రమ కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్రెడ్డితో అనంత వెంకట్రామిరెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, కడప నేత సుగవాసి సుబ్రహ్మణ్యం సోమవారం ములాఖత్ అయ్యారు.అనంతరం అనంత సెంట్రల్ జైల్ వద్ద మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ శ్రేణులను అధైర్య పరచేందుకు కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తోందన్నారు. జైల్లో మిథున్రెడ్డికి అన్ని వసతులూ కల్పించాలని న్యాయస్థానం ఆదేశిస్తున్నా.. పాటించడం లేదన్నారు. బాబును ఎదుర్కొన్నందుకే: కేతిరెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కొంటున్న పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో లేని స్కామ్ను తీసుకొచ్చి నిరాధారంగా ఎంపీ మిథున్రెడ్డిని జైల్లో ఉంచారని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి విమర్శించారు. తన చిన్నాన్న పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు మూడు నెలల క్రితం కోర్టు ఆర్డర్ ఇచ్చిందని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పర్యవేక్షించాలని పోలీసులకు ఆదేశాలిచి్చనా వారు స్పందించలేదని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ కడప నేత సుగవాసి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ను నమ్మితే, పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు కాపులకు అర్థమవుతోందన్నారు. -
బార్లు.. ఇక బార్లా
సాక్షి, అమరావతి: టీడీపీ మద్యం సిండికేట్ సాగిస్తున్న అడ్డగోలు దోపిడీకి చంద్రబాబు ప్రభుత్వం బార్ల తలుపులు బార్లా తెరచింది. రాష్ట్రంలో బార్లు తెరిచి ఉంచే వేళలను మరో రెండు గంటలపాటు పెంచింది. అంటే అనధికారికంగా మరో నాలుగు గంటలు బార్లు తెరచి ఉంచినా పట్టించుకోబోమని స్పష్టమైన సంకేతం ఇచి్చంది. మరోవైపు టీడీపీ సిండికేట్కు బార్లు ఏకపక్షంగా కట్టబెట్టేందుకు రెస్టారెంట్ నిబంధనలను సడలించింది.దరఖాస్తు చేసేనాటికి రెస్టారెంట్ లేకపోయినా పర్వాలేదని నిబంధనల్లో పేర్కొంది. రాష్ట్ర మంత్రివర్గం తీర్మానాన్ని అనుసరించి సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి రానున్న కొత్త బార్ విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో 840 బార్ల లైసెన్సుల జారీకి సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిషాంత్కుమార్ మంగళగిరిలో సోమవారం మీడియా సమావేశంలో నూతన బార్ విధానాలను వెల్లడించారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ..ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. బార్లు తెరిచి ఉంచే సమయాన్ని ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ప్రభుత్వం పొడిగించింది. అంటే 24 గంటల్లో 14 గంటలపాటు బార్లు తెరచి ఉంటాయి. తద్వారా ఉదయం నుంచి అర్ధరాత్రి దాటే వరకు బార్లు బార్లా తెరిచే ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. వైఎస్సార్సీపీ హయాంలో బార్లు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పనిచేశాయి. ⇒ కల్లు గీత కుటుంబాలకు కేటాయించిన 10 శాతం బార్లకు లైసెన్సు ఫీజు 50శాతం తక్కువగా నిర్ణయించారు. ⇒ మూడేళ్లపాటు బార్ల లైసెన్సుల కోసం దరఖాస్తులు సోమవారం నుంచి ఈ నెల 26 సాయంత్రం 5గంటల వరకు స్వీకరిస్తారు. నేరుగా గానీ ఆన్లైన్ ద్వారాగానీ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.5లక్షలు. ⇒ ఇప్పటివరకు రెస్టారెంట్ ఉన్నవారే బార్ల లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన ఉంది. ఈ నిబంధనలో టీడీపీ కూటమి ప్రభుత్వం సడలింపునిచ్చింది. బార్ లైసెన్సు పొందిన తరువాత 15 రోజుల్లో రెస్టారెంట్ ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. 28న లాటరీ విధానంలో బార్ల లైసెన్సులు కేటాయిస్తారు. ⇒ పట్టణాలు, నగరాల్లో జనాభా ప్రాతిపదికన బార్ల లైసెన్సు ఫీజు నిర్ణయించారు. 50 వేల జనాభా ఉన్న పట్టణాలకు రూ.35 లక్షలు, జనాభా 50 వేలు నుంచి 5 లక్షలలోపు ఉంటే రూ.55 లక్షలు, జనాభా 55 లక్షలు పైబడి ఉంటే రూ.75 లక్షలు లైసెన్స్ ఫీజు చెల్లించాలి. ⇒ ఇప్పటివరకు లైసెన్స్ ఫీజును ఒకేసారి చెల్లించాలనే నిబంధన ఉంది. ఆ నిబంధనను సడలిస్తూ ఆరు వాయిదాల్లో లైసెన్స్ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. -
AP: వీఏఏల బదిలీ వ్యవహారంపై హైకోర్టు విస్మయం
విజయవాడ: కృష్ణా, కర్నూలు జిల్లాల గ్రామ వ్యవసాయ సహాయకులు బదిలీలు రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. వీఏఏల బదిలీ వ్యవహారంపై హైకోర్టు విస్మయం వ్యకతం చేసింది. ఆ రెండు జిల్లాల్లో తిరిగి కౌన్సిలింగ్ నిర్వహించి బదిలీలు చేపట్టాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నిబంధనలకు పాతరేసి ప్రజాప్రతినిధుల సిఫార్సులకు అధికారులు పట్టంకట్టి బదిలీలు చేయడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇవి ప్రజా ప్రతినిధుల సిఫార్సు మేరకే జరిగాయని, దీన్ని ప్రజా ప్రయోజనంగా పరిగణించలేమని హైకోర్టు పేర్కొంది. బదిలీల అమల్లో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘన జరుగుతున్నా కలెక్టర్ మౌనంగా ఉండిపోయారని, బదిలీల్లో పారదర్శకత లోపించిందని హైకోర్టు తేల్చి చెప్పింది. -
రాష్ట్రంలో భారీ భూదోపిడీ.. కర్త, కర్మ, క్రియ చంద్రబాబే
సాక్షి,తాడేపల్లి: కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో యధేచ్చగా కొనసాగుతున్న భూదోపిడీపై మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊరూపేరు లేని ఉర్సాలాంటి కంపెనీలకు విలువైన భూములు ఎందుకు ఇస్తున్నారు’ అని ప్రశ్నించారు. సోమవారం (ఆగస్టు18) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడారు.రాష్ట్రంలో యధేచ్చగా భూదోపిడీ జరుగుతోంది. అడ్డూ అదుపు లేకుండా తమకు కావాల్సిన వారికి వేల ఎకరాలను కట్టబెడుతున్నారు. ఊరూపేరు లేని ఉర్సాలాంటి కంపెనీలకు విలువైన భూములు ఎందుకు ఇస్తున్నారు?. వేల ఎకరాల భూములను ఏ ఉద్దేశంతో 99 పైసలకు విక్రయిస్తున్నారు?. అడ్రెస్ లేని కంపెనీలకు వేల ఎకరాలు ఎందుకు కట్టబెడుతున్నారు?భూములు ఇచ్చే ముందు ఆ కంపెనీల ట్రాక్ రికార్డును కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు?. ఖరీదైన భూములను కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతోంది. స్విట్జర్లాండ్ కంపెనీలకే భూములు ఇవ్వటం వెనుక దురుద్దేశం ఉంది. ఆ కంపెనీలకు ఇచ్చే భూముల వలన రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా?. అధికార పార్టీ నేతల బినామీలకే భూములను ఇస్తున్నారు.గ్లోబల్ సిస్టంలో భూములు ఇవ్వకుండా స్విట్జర్లాండ్ కంపెనీలకే భూములు ఇవ్వటం వెనుక దురుద్దేశం ఉంది. రాష్ట్రంలో విద్యుత్ కొనుగోళ్ళ వెనుక భారీ కుట్ర, అవినీతి జరుగుతోంది. మా హయాంలో రూ.2.49 పైసలకు కరెంటు కొంటే గగ్గోలు పెట్టారు. ఇప్పుడు రూ.4.59 పైసలకు ఎలా కొంటున్నారు? మహిళా ప్రొఫెసర్ని వేధించిన టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. -
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డికి బెయిల్
సాక్షి,అమరావతి: మాజీ మంత్రి గోవర్ధన్రెడ్డికి బెయిల్ మంజూరైంది. రుస్తుం మైనింగ్ కేసుల్లో కాకాణికి బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ కోర్టు సోమవారం(ఆగస్టు 18)న తీర్పును వెలవరించింది. మొత్తం ఎనిమిది కేసుల్లో బెయిల్ రావడంతో 85రోజులుగా జైల్లో ఉన్న ఆయన కాకాణి గోవర్దన్రెడ్డి మంగళవారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం.. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా సర్కారు పెద్దల బరితెగింపు హద్దులు మీరుతోంది. ప్రశ్నించే వారే ఉండకూడదని హూంకరిస్తూ నిత్యం తప్పుడు కేసులతో చెలరేగిపోతోంది. ఈ క్రమంలో ఈ ఏడాది మే నెలలో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డిని నెల్లూరు పోలీసులు కక్షపూరితంగా అరెస్ట్ చేశారు. కేరళ రాష్ట్రంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి, అక్రమాలను ఎప్పటికప్పుడు నిలదీస్తుండటం వల్లే కాకాణిపై తప్పుడు కేసు పెట్టారు. ఇందులో భాగంగా పొదలకూరు మండలం తాటిపర్తి రుస్తుం మైన్స్లో అక్రమ మైనింగ్ జరిగిందని ఈ ఏడాది ఫిబ్రవరిలో మైనింగ్ శాఖ ఇన్చార్జ్ డీడీ బాలాజీ నాయక్ పొదలకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్రమ మైనింగ్లో కాకాణి అనుచరుల ప్రమేయం ఉందని, ఆయన వారికి సహకరించారంటూ 120(బి), 447, 427, 379, 290, 506, 109 ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ, సెక్షన్ 3 పీడీపీపీఎ, సెక్షన్ 3 అండ్ 5 ఆఫ్ ఈఎస్ యాక్ట్ అండ్ సెక్షన్ 21(1), 21(4) ఆఫ్ ఎంఎండీఆర్ యాక్ట్ కింద పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.ఈ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డికి సంబంధం లేకపోయినా.. పట్టుబట్టి, టార్గెట్ చేసి ఏ4గా చేర్చారు. తొలుత ఈ కేసులో బలం లేదని ఏ1తో పాటు మరో ఇద్దరికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో కేసును మరింత పటిష్టం చేసి కాకాణిని జైలుకు పంపే కుట్రలో భాగంగా అట్రాసిటీ సెక్షన్లు జత చేశారు. ఇలా కూటమి ప్రభుత్వం కాకాణిపై అక్రమ కేసులు బనాయించడంతో వాటిపై న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ కాకాణి గోవర్దన్రెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. -
ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని ఆదివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది ప్రస్తుతం విశాఖ తీరానికి అతి సమీపంలో కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ సోమవారం వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. అనంతరం ఇది మంగళవారం మధ్యాహ్నానికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే సూచనలున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు.దీంతో విశాఖ, అనకాపల్లి, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీచేసింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. మత్స్యకారులు 20 వరకూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. కోస్తాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు..అల్పపీడన ప్రభావంతో రానున్న రెండ్రోజులు కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు.. సీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో సోమవారం భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయి.కాపులుప్పాడలో అత్యధికంగా 154మి.మీ వర్షపాతం..గడిచిన 24 గంటల్లో విశాఖ జిల్లాలోని కాపులుప్పాడలో 154 మి.మీ, పరదేశీపాలెంలో 142.25, భీమిలిలో 134, పాడేరులో 133.75, ఆనందపురంలో 131.5, మధురవాడలో 129 మి.మీ వర్షపాతం నమోదైంది.కల్లోల తీరం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తిరుపతి జిల్లా వాకాడు మండలం తూపిలిపాళెం సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. కెరటాలు ఎగసిపడుతున్నాయి. శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మత్స్యకారులు తమ వేట సామగ్రిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అల్పపీడనం ప్రభావంతో పర్యాటకుల్లేక సముద్ర తీరం బోసిపోయింది. – వాకాడు(తిరుపతి జిల్లా) -
డిస్టెన్స్, ఆన్లైన్లో హెల్త్కేర్, అనుబంధ కోర్సుల నిలిపివేత
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థల్లో హెల్త్కేర్, అనుబంధ ప్రోగ్సామ్స్ను ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెరి్నంగ్ (ఓఎల్డీ), ఆన్లైన్ మోడ్లో అందించడాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిషేధించింది. ఈ విద్యా సంవత్సరం (2025–26) నుంచే ఈ నిషేధం అమలులోకి వస్తుందని ప్రకటించింది. సైకాలజీ, మైక్రోబయాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సైన్స్, బయోటెక్నాలజీ, క్లినికల్ న్యూట్రిషన్, డైటెటిక్స్ వంటి ప్రత్యేక కోర్సులను ఇకపై ఓఎల్డీ, ఆన్లైన్లో అందించడానికి వీల్లేదని స్పష్టం చేసింది.ఈ కోర్సుల్ని ఓఎల్డీ, ఆన్లైన్లో అందించేందుకు ఆయా సంస్థలకు ఇచ్చిన గుర్తింపులను వెంటనే రద్దుచేస్తున్నట్టు ప్రకటించింది. ఇకపై విద్యార్థులకు ఈ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించవద్దని ఆదేశాలు జారీచేసింది. అనుమతులు లేని ప్రోగ్సామ్స్కు అడ్డుకట్ట యూజీసీ నిర్ణయంతో మల్టీ స్పెషలైజేషన్ డిగ్రీల్లో హెల్త్కేర్కు సంబంధించిన భాగాలు మాత్రమే ప్రభావితం కానున్నాయి. ఉదాహరణకు సైకాలజీతో సహా బహుళ మేజర్లతో కూడిన బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్లో ఓఎల్డీ, ఆన్లైన్ ప్రోగ్రామ్స్ నుంచి సైకాలజీ స్ట్రీమ్ను మాత్రమే తొలగిస్తోంది. గతంలో ప్రకటించిన ఉమ్మడి, ద్వంద్వ–డిగ్రీ ఫ్రేమ్వర్క్ల కింద యూజీసీ ఆమోదం లేకుండా దేశీయ విద్యాసంస్థల భాగస్వామ్యాల్లోకి ప్రవేశించే సంస్థలు వాటి ప్రోగ్రామ్లను గుర్తింపులేనివిగా పరిగణించాలని సూచించింది.ఈ మార్గదర్శకాలున్నప్పటికీ అనేక కళాశాలలు, ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్లు యూజీసీ గుర్తింపు లేని భాగస్వామ్యాలతో ఆన్లైన్/ఉమ్మడి కార్యక్రమాలను అందిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చినట్టు యూజీసీ తెలిపింది.వీటికి అడ్డుకట్ట వేయడంతోపాటు నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్కేర్ ప్రొఫెషన్స్ చట్టం–2021 కింద ఉన్న హెల్త్కేర్ కోర్సులపై ఈ నిషేధం విధించింది. విద్య ప్రమాణాల్లో నాణ్యత లోపం హెల్త్కేర్ కోర్సులను అందించడంలో ప్రొఫెషనల్ శిక్షణలో నాణ్యత ప్రమాణాలపై ఆందోళనలు వ్యక్తంకావడంతోనే యూజీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇటీవలి కాలంలో సైకాలజీ కోర్సులకు డిమాండ్ పెరిగింది. దీనివల్ల అనేక ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలు ఈ కోర్సును అందిస్తున్నాయి. కానీ దేశంలోని అనేక ప్రాంతాలలో విద్య నాణ్యతను కొనసాగించడంలో విఫలమైనట్టు యూజీసీ గుర్తించడంతో ఈ నిషేధం అమలు చేస్తున్నట్టు చెబుతున్నారు. వాస్తవానికి క్లినికల్ సైకాలజీకి కఠినమైన ఆచరణాత్మక శిక్షణ (ప్రాక్టికల్ ట్రైనింగ్) అవసరం.దీనికోసం 2:1 విద్యారి్థ–ఉపాధ్యాయ నిష్పత్తి అవసరం. దూరవిద్య విధానంలో ఇటువంటి శిక్షణ సాధ్యం కాదు. ఈ క్రమంలో నాణ్యత లేని డిగ్రీలు, డిప్లొమాలు జారీచేయడాన్ని కట్టడి చేసేందుకు యూజీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యావేత్తలు చెబుతున్నారు. అయితే.. ఈ కోర్సుల్లో దేశవ్యాప్తంగా పరిమిత సీట్లు అందుబాటులో ఉండటం వల్ల ఎదురయ్యే సవాళ్లను కూడా యూజీసీ పరిష్కరించాలని కోరుతున్నారు. -
మోగుతున్న అప్పుల డప్పు
సాక్షి, అమరావతి: అప్పుల్లో అగ్రపథం.. సంపద శూన్యం!! టీడీపీ కూటమి సర్కారు పాలనలో సంపద సృష్టి దేవుడెరుగు అప్పులు మాత్రం భారీ వృద్ధితో రంకెలు వేస్తున్నాయి! రాష్ట్ర సంపద పెరగకపోగా గత ప్రభుత్వ హయాంలో వచ్చింది కూడా రాకుండా పోతోంది. అమ్మకం పన్ను రాబడి అడుగంటుతోంది. అంటే ప్రజల కొనుగోలు శక్తి అంతకంతకూ క్షీణిస్తోందని స్పష్టమవుతోంది. ఈ మేరకు 2025– 26 ఆర్థిక ఏడాదికి సంబంధించి తొలి నాలుగు నెలలు (ఏప్రిల్ నుంచి జూలై వరకు) బడ్జెట్ కీలక సూచికలు, గణాంకాలను ‘కాగ్’ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) తాజాగా వెల్లడించింది. అప్పులు చేయడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా ఉందని కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. కాగ్ గణాంకాల ప్రకారం కేరళ, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాలను మించి ఆంధ్రప్రదేశ్ భారీగా అప్పులు చేసింది. ఆంధ్రప్రదేశ్ ఈ ఆర్థిక ఏడాది తొలి నాలుగు నెలల్లోనే ఏకంగా రూ.48,354.02 కోట్ల మేర అప్పులు చేసినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి.» సాధారణంగా రెవెన్యూ రాబడులు ఏటా ఎంతో కొంత పెరుగుతాయి. కానీ టీడీపీ కూటమి సర్కారు అధికారం చేపట్టిన నాటి నుంచి రెవెన్యూ రాబడులు తగ్గుతూ వస్తున్నాయి. వైఎస్సార్సీపీ హయాంలో 2023–24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు వచ్చిన రెవెన్యూ రాబడులతో పోల్చితే ఈ ఆర్థిక ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు వచ్చిన రెవెన్యూ రాబడులు 16.08 శాతం క్షీణించి రూ.9,400.99 కోట్లు తగ్గిపోయాయి.» ఇప్పుడు సంపద పెరగకపోగా గతంలో వచ్చింది కూడా ఆవిరైపోతోంది. ఇందుకు ప్రధాన కారణం సంపద సృష్టిపై దృష్టి సారించకుండా రెడ్ బుక్ అమలు లక్ష్యంగా రాజకీయ కక్షలతో పాలన సాగించడమే. 2023–24 ఆర్థిక ఏడాది తొలి నాలుగు నెలలతో పోల్చితే ఈ ఆర్థిక ఏడాది తొలి నాలుగు నెలల్లో అమ్మకం పన్ను రాబడులు 7.23 శాతం క్షీణించి రూ.457.93 కోట్లు తగ్గిపోయాయి. » టీడీపీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ కేంద్ర గ్రాంట్ల రూపంలో రావాల్సిన రాబడులు గణనీయంగా తగ్గిపోవడం గమనార్హం. 2023–24లో తొలి నాలుగు నెలల్లో వచ్చిన గ్రాంట్లతో పోలిస్తే 2025–26 తొలి నాలుగు నెలల్లో కేంద్ర గ్రాంట్లు ఏకంగా రూ.15,581.20 కోట్లు తగ్గిపోయాయి. అంటే ఏకంగా రూ.87.63 శాతం మేర కేంద్ర గ్రాంట్లు క్షీణించాయి. కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా గ్రాంట్ల రూపంలో నిధులను రాబట్టడంలో కూడా చంద్రబాబు సర్కారు వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. » వైఎస్ జగన్ ప్రభుత్వంతో పోల్చితే చంద్రబాబు పాలనలో సామాజిక రంగ వ్యయం కూడా తగ్గిపోయింది. సామాజిక రంగ వ్యయం సాధారణంగా పెరగాలి. అందుకు భిన్నంగా 2023–24 ఆర్థిక ఏడాది తొలి నాలుగు నెలలతో పోల్చితే 2025–26లో సామాజిక రంగ వ్యయం రూ.8,863.90 కోట్లు తగ్గిపోయింది. అంటే ఏకంగా 15.04 శాతం వ్యయం తగ్గింది. సామాజిక రంగంలో వ్యయం అంటే విద్య, వైద్యం, సంక్షేమ రంగాలపై చేసే వ్యయంగా పరిగణిస్తారు. » సాధారణంగా ఏటా బడ్జెట్ వ్యయం పెరుగుతుంది. అయితే అందుకు భిన్నంగా అప్పులు పెరుగుతూ రాష్ట్ర సంపద తగ్గుతూ రావడం అంటే తిరోగమనంలోకి వెళ్తున్నట్లు స్పష్టం అవుతోంది. 2023–24 ఆర్థిక ఏడాది తొలి నాలుగు నెలలతో పోల్చితే ఈ ఆర్థిక ఏడాది తొలి నాలుగు నెలల బడ్జెట్ వ్యయం రూ.9,629.89 కోట్లు తగ్గింది. అంటే ఏకంగా 9.26 శాతం మేర బడ్జెట్ వ్యయం తగ్గింది. నాలుగు నెలల్లో రూ.48,354.02 కోట్ల అప్పు ఈ ఆర్థిక ఏడాది తొలి నాలుగు నెలల్లోనే చంద్రబాబు సర్కారు బడ్జెట్ అప్పులే ఏకంగా రూ.48,354.02 కోట్లు చేసినట్లు కాగ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మూలధన వ్యయం కేవలం రూ.8,579.86 కోట్లు మాత్రమే చేసినట్లు కాగ్ పేర్కొంది. అదే వైఎస్సార్ సీపీ హయాంలో 2023–24 ఆర్థిక ఏడాది తొలి నాలుగు నెలల్లో మూల ధన వ్యయం రూ.14,844.99 కోట్లుగా ఉండటం గమనార్హం. చేసిన అప్పులను ఆస్తుల కల్పనకు వ్యయం చేయాలని ఎన్నికల ముందు గంభీరంగా చెప్పిన చంద్రబాబు ఎడాపెడా అప్పులు చేస్తూ అటు ఆస్తుల కల్పనకు వెచ్చించకపోగా ఇటు సూపర్సిక్స్ హామీలనూ నెరవేర్చడం లేదు. మరో పక్క రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు పెరగడమే కానీ తగ్గడం లేదు. రెవెన్యూ రాబడులు పెరగకపోగా అప్పులు పెరగడం ఆందోళన కలిగించే విషయమని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. 2023–24 ఆర్థిక ఏడాది తొలి నాలుగు నెలల్లో వచ్చిన రాబడులు కూడా ఇప్పుడు రాకపోగా ఇంకా తగ్గిపోవడం అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతోందని విశ్లేషిస్తున్నాయి. -
చిరుద్యోగుల పొట్టగొడుతున్న గద్దలు!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పెద్దలు, వైద్య శాఖ బాధ్యతలు చూసే కీలక ప్రజాప్రతినిధి అండదండలతో ప్రభుత్వాస్పత్రుల సెక్యూరిటీ కాంట్రాక్టర్లు చిరుద్యోగుల పొట్టగొడుతున్నారు! కాంట్రాక్టు నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన వేతనాల్లో భారీగా కోత విధిస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ఇష్టమైతే పనిచేయండి.. లేదంటే వెళ్లిపొమ్మంటున్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సెకండరీ హెల్త్, డీఎంఈ ఆస్పత్రుల్లో సెక్యూరిటీ నిర్వహణకు కూటమి సర్కారు కొత్త కాంట్రాక్టర్లను ఎంపిక చేసింది. ఈ సంస్థలు జూన్ నుంచి బాధ్యతలు చేపట్టాయి. ఈఎస్ఐ, ఈపీఎఫ్ కలిపి సెక్యూరిటీ గార్డులకు రూ.18,600, సూపర్వైజర్లకు రూ.21,506, సెక్యూరిటీ ఆఫీసర్కు రూ.40 వేలు చొప్పున వేతనాలు ఇవ్వాలని టెండర్ నిబంధనల్లో వైద్య శాఖ స్పష్టం చేసింది.కటింగ్స్ పోనూ నికర వేతనంగా సెక్యూరిటీ గార్డులకు రూ.13,960, సూపర్ వైజర్కు రూ.16,141, సెక్యూరిటీ ఆఫీసర్కు రూ.30 వేల చొప్పున జమ చేయాల్సి ఉంటుంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా గార్డులకు రూ.12,100, సూపర్వైజర్లకు రూ.13,900 మేర మాత్రమే వేతనాలు ఇస్తూ మిగిలింది ఎగ్గొడుతున్నారు.జోన్–3 కాంట్రాక్టు సంస్థ ఈగల్ ఎంటర్ప్రైజర్స్ సెక్యూరిటీ గార్డులకు రూ.12,100 మాత్రమే వేతనం జమ చేసిందని ఏఐటీయూసీ ప్రతినిధులు కర్నూలులో ఆందోళన నిర్వహించారు. జోన్–1 ఉత్తరాంధ్ర, జోన్–2 కోస్తాంధ్రలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నట్లు కారి్మకుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. జూన్లో బాధ్యతలు చేపట్టిన కాంట్రాక్టర్లు ఇప్పటి వరకూ పూర్తి స్థాయిలో వేతనాలు చెల్లించలేదని కారి్మకులు లబోదిబోమంటున్నారు. నెలకు రూ.2,400 నష్టపోతున్న గార్డులు రాష్ట్రంలోని మూడు జోన్లలో ఆస్పత్రులవారీగా ఎంత మంది సిబ్బందిని నియమించాలో టెండర్ మార్గదర్శకాల్లో స్పష్టంగా ఉంది. జోన్–1లో 2,066, జోన్–2లో 1,999, జోన్–3లో 2,107 మంది చొప్పున 6,172 మంది గార్డులు, సూపర్వైజర్లు, ఇతర సిబ్బందిని నియమించాల్సి ఉంది. సిబ్బందిలో ఎవరికీ కాంట్రాక్టర్లు నిబంధనల మేరకు వేతనాలను చెల్లించడంలేదు. సెక్యూరిటీ గార్డులకు నెలకు రూ.1,860 మేర కోత పెడుతున్నారు.దీనిమీద నాలుగు శాతం ఈఎస్ఐ రూ.74, ఈపీఎఫ్ 25 శాతం రూ.465 కలిపి నెలకు ఒక్కో గార్డు రూ.2,400 కోల్పోతున్నట్టు తెలుస్తోంది. మూడు జోన్లలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులు, సూపర్వైజర్లు, సెక్యూరిటీ ఆఫీసర్లు కలిపి మొత్తం 6,172 మంది ఉండగా సగటున రూ.2,500 చొప్పున లెక్కేసినా నెలకు రూ.1.54 కోట్ల మేర కాంట్రాక్టర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. కాంట్రాక్ట్ ముగిసే నాటికి మూడేళ్లలో రూ.55.54 కోట్లకు పైనే కారి్మకులు నష్టపోతున్నట్లు స్పష్టమవుతోంది. ఎఫ్ఆర్ఎస్ హాజరు లేకుండా.. కాంట్రాక్ట్ సంస్థలు అగ్రిమెంట్ రోజే అందరు సిబ్బంది వివరాలను అందించి ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) హాజరుకు మ్యాపింగ్ చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. సిబ్బంది హాజరు నెలలో 95 శాతం ఆపైన ఉంటేనే కాంట్రాక్టర్కు వంద శాతం బిల్లులు ఇవ్వాలి. హాజరు తగ్గితే ఆమేరకు బిల్లుల్లోనూ కోత విధించాలి. దీని ప్రకారం కాంట్రాక్టర్ పనులు ప్రారంభించిన మొదటి రోజునే ఎఫ్ఆర్ఎస్ హాజరు వేయాలి. అయితే కాంట్రాక్ట్ సంస్థలు ఇప్పటి వరకూ ఆస్పత్రుల్లో నిర్దేశించిన మేరకు సిబ్బందిని నియమించలేదు. ఉన్న కొంత మందికి ఎఫ్ఆర్ఎస్ హాజరు వేయడం లేదని తెలుస్తోంది. దీంతో పాటు వేతనాల్లోనూ భారీగా కోత పెడుతున్నారు. చక్రం తిప్పుతున్న కీలక నేత.. చిరుద్యోగుల పొట్టగొట్టడంతో పాటు నిబంధనలను అతిక్రమించిన కాంట్రాక్టర్లకు వంద శాతం బిల్లులు చెల్లించేలా వైద్య శాఖకు చెందిన కీలక నేత పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. సదరు నేత తరపున ఓ వ్యక్తి హైదరాబాద్లో తిష్ట వేసి అవినీతి కార్యకలాపాలు చక్కబెడుతున్నారు. అతడిని కలిసి బిల్లులపై ఏడు శాతం కమీషన్ ఇచ్చేలా అడ్డదారుల్లో కాంట్రాక్టులు కట్టబెట్టారు. జోన్–1 కాంట్రాక్టు సంస్థ కార్తికేయ టెండర్ మార్గదర్శకాలకు విరుద్ధంగా బిడ్ వేసినా ఆమోదించి అందలం ఎక్కించారు. ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టులో కేసులు సైతం దాఖలయ్యాయి. -
జూనియర్ ఎన్టీఆర్ బుడ్డా ఫకీర్.. వాని సినిమాలు ఆడనిస్తానా..?
సాక్షి ప్రతినిధి, అనంతపురం/అనంతపురం క్రైం: ‘జూనియర్ ఎన్టీఆర్ ఒక బుడ్డా ఫకీర్.. వాడి సినిమాలు ఇక్కడ ఎలా ఆడనిస్తానని అనుకున్నారు.. లోకేశ్ను తిట్టిన వాడి సినిమాలు ఎలా ఆడనిస్తాను.. వానెమ్మ.. లం.. కొడుకు.. వాని సినిమాలు ఆడనిస్తానా.. మీరెలా ఆడనిస్తార్రా గాడిదల్లారా.. నా పర్మిషన్ లేకుండా వేయిస్తారా.. ఈ సినిమా ఆడదు..’ అంటూ అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నోరు పారేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘వార్–2’ సినిమా విడుదల నేపథ్యంలో ఎమ్మెల్యే ఇటీవల ఎన్టీఆర్ అభిమాన సంఘం నేత ధనుంజయనాయుడుతో మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.. ఎన్టీఆర్ అభిమాన సంఘం నేతకు ఫోన్ చేసి.. ‘ఈ సినిమాకు ఎన్ని థియేటర్లు అనుమతించారు.. ఎవరు అనుమతి ఇచ్చారు.. ఎలా ఆడనిస్తారు? ఆ సినిమాను ఆడనిచ్చేదే లేదు.. వాడు బుడ్డా ఫకీర్.. లోకే‹శ్ను తిట్టిన వాడి సినిమాలు ఎలా ఆడనిస్తాను.. వానెమ్మ.. లం..కొడుకు ఈ టైమ్లో వాని సినిమాలు ఆడనిస్తానా.. మీరెలా ఆడనిస్తార్రా గాడిదల్లారా? నా పర్మిషన్ లేకుండా వేయిస్తారా? ఈ సినిమా ఆడదు.. వాడు బుడ్డా ఫకీర్ గాడు లోకేశ్ గురించి మాట్లాడతాడా? ఈ సినిమా ఆడదు.నాకు తెలియకుండా సినిమా ఎట్లా ఆడుతుంది.. నేను అనంతపురం ఎమ్మెల్యే.. బుడ్డా ఫకీర్ నా కొడుకు.. సార్ గురించి మాట్లాడతాడా? గాడ్ ప్రామిస్గా చెబుతున్నా.. ఈ సినిమా ఆడదు.. ఆపేయిస్తున్నా.. నేను ఊరుకుంటానా.. పంపించేయండి అందరినీ’ అని హుకుం జారీ చేశారు. లోకేశ్, చంద్రబాబు ప్రోద్భలంతోనే ఎన్టీఆర్ సినిమాను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఎమ్మెల్యే ప్రసాద్ వ్యాఖ్యలు అందులో భాగమేనని నందమూరి, ఎన్టీఆర్ అభిమానుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.వాయిస్ రికార్డ్ బయట పెట్టిన ధనుంజయ నాయుడుసోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో తనది కాదని ఎమ్మెల్యే ప్రసాద్ వివరణ ఇవ్వబోగా జూ.ఎన్టీఆర్ అభిమాని, టీఎన్ఎస్ఎఫ్ నేత గుత్తా ధనుంజయ నాయుడు ఆయన వాయిస్ రికార్డు బయట పెట్టారు. జూ.ఎన్టీఆర్ను తిడుతూ.. తనను ఎమ్మెల్యే ఫోన్లో బెదిరించిన అనంతరం ఆయన ఒక ఆడియోను రికార్డు చేసి ఎమ్మెల్యేకు పంపినట్లు తెలుస్తోంది. ‘అన్నా.. మీరంటే గౌరవం ఉంది. దయచేసి చెబుతున్నా.. ఎవరో చెప్పిన మాటలు విని అలా మాట్లాడవద్దు. జూ.ఎన్టీఆర్కు సినిమా పరంగా ముందు నుంచీ అభిమానిని.ఈ విషయాన్ని నారా లోకేశ్ ముందు చెప్పమన్నా చెబుతా. అంతేగానీ ఎవరి కోసమో పని చేయలేదు నేను. దయచేసి నన్ను కాంట్రవర్సీలోకి లాగొద్దు. సినిమా మీద కాంట్రవర్సీ ఎందుకు? నన్నెందుకు మీరు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు? అసభ్యంగా మాట్లాడితే నేను పడను. నాకు ఫోన్ చేసి బెదిరించడం తప్పు. ఎన్టీఆర్ గాడు.. గీడు అని మాట్లాడవద్దు. మీరు నాతో మాట్లాడిన ప్రతిదీ వాయిస్ రికార్డు చేశాను. ఈ రికార్డులన్నీ నారా రోహిత్ అన్నకు పంపినా. నాకు నీవు ఏమైనా అర్ధ రూపాయి ఇచ్చినావా? ఏడాది దాటింది.ఒక్క పని ఇచ్చావా? చిన్న సహాయం చేశావా? నా మీద నీకేం హక్కుంది మాట్లాడేందుకు? నన్ను చంపుతావా.. చంపు. నన్ను చంపావంటే మా వాళ్లు ఊరికే ఉండరు. నువ్వు నోరు జారినావంటే బాగుండదు’ అని గుత్తా ధనుంజయ నాయుడు ఎమ్మెల్యేకు పంపిన వాయిస్ రికార్డులో పేర్కొన్నారు. దీంతో జూ.ఎన్టీఆర్ అభిమానులు మరింతగా రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాదులో జూ.ఎన్టీఆర్ అభిమానుల సంఘం ఉమ్మడి రాష్ట్ర కన్వీనర్లు, ముఖ్య నేతలు సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. నీ బండారం బయట పెడతానన్న ప్రభాకర్ చౌదరిఎమ్మెల్యే ఆడియో సామాజిక మాధ్యమాల్లోకి రాకమునుపే రెండ్రోజుల ముందు టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి.. దగ్గుపాటి ప్రసాద్ను ఉద్దేశించి మాట్లాడుతూ ‘నువ్వు జూ.ఎన్టీఆర్ గురించి ఏం మాట్లాడావో నా దగ్గర రికార్డులున్నాయి. నీ బండారం బయటపెడతా’నని హెచ్చరించారు. ఆగ్రహించిన జూ.ఎన్టీఆర్ అభిమానులుఅనంత ఎమ్మెల్యే ప్రసాద్ వ్యాఖ్యలతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమ అభిమాన హీరోను నోటికొచ్చినట్లు తిట్టడాన్ని వారు జీర్ణించుకోలేక పోయారు. ఆదివారం ఉదయం అనంతపురం శ్రీనగర్ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపైకి దాడికి దిగారు. ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే భారీ ఫ్లెక్సీలను చింపేసి నిరసన తెలిపారు. ‘అవసరమైనప్పుడు పార్టీకి పని చేసిన వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. ఆ విషయం తెలియదా? మీతో ఇలా ఎవరు మాట్లాడించారో చెప్పాలి. మేము కూడా ఓట్లేస్తేనే మీరు ఎమ్మెల్యే అయ్యారు.అలాంటిది మా అభిమాన నాయకుణ్ని దూషిస్తారా? మాకు రాజకీయాలతో పని లేదు. నాలుగు గోడల మధ్య కూర్చొని క్షమాపణ చెబితే సరిపోదు. బయటకు వచ్చి.. మీరు, మీతో మాట్లాడించిన వారు బహిరంగ క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఇంట్లో ఉండీ బయటకు రావడం లేదని జూ.ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకుంది. కొందరు టీడీపీ చోటా నాయకులు కలుగజేసుకుని జూనియర్ అభిమానులకు సర్దిచెప్పారు. కాగా, శనివారం రాత్రే ఈ విషయం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లడంతో పార్టీ పెద్దల పిలుపు మేరకు ఎమ్మెల్యే దగ్గుపాటి విజయవాడకు వెళ్లినట్లు తెలిసింది.ఆ వాయిస్ ఎమ్మెల్యేదే ఆడియోలో ఉన్న వాయిస్ తనది కాదని ఎమ్మెల్యే అంటున్నారు. అది నిజం కాదు. అది ఎమ్మెల్యే వాయిస్సే. అతని వాయిస్ కాదనుకుంటే ఆడియోలో ఇంకో వైపు మాట్లాడింది ధనుంజయ నాయుడు (టీఎన్ఎస్ఎఫ్) వాయిస్ ఫేక్ కాదు కదా?! అంత పెద్ద హీరో తల్లిని అనరాని మాటలు అనడం తప్పు. ఎవరి తల్లి అయినా తల్లే కదా? ఎన్టీఆర్ అభిమాన సంఘాల నేతలు రేపు హైదరాబాద్లో సమావేశానికి పిలుపునిచ్చారు. అధికారం ఉంది కదా అని అనంతపురంలో అభిమాన సంఘం నేతలను, కార్యకర్తలను నోరు మూయించవచ్చు. ప్రభుత్వం మాది.. ఏమైనా చేస్తామంటే కుదరదు. ఇది ఇక్కడితో ఆగదు. ఎమ్మెల్యే కచ్చితంగా మీడియా వేదికగా, అభిమానుల ముందు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే. – మహేష్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానిఅనంత ఎమ్మెల్యే ప్రసాద్పై భగ్గుమన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్తిరుపతి మంగళం/నెల్లూరు (బృందావనం)/గాందీనగర్(విజయవాడసెంట్రల్) : జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా వార్–2 విడుదల సందర్భంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై అభిమానుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి.. ప్రముఖ హీరోను పట్టుకుని.. అదీ టీడీపీ అభ్యున్నతికి సహకరించిన జూనియర్ ఎన్టీఆర్ పట్ల దారుణంగా మాట్లాడటం ఏమాత్రం క్షమార్హం కాదని మండిపడుతున్నారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జూనియర్ అభిమానులు తమదైన శైలిలో నిరసన తెలిపారు.తిరుపతి పరిధిలోని తిమ్మినాయుడుపాలెం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ డౌన్ డౌన్.. అంటూ నినదిస్తూ అభిమానులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా తిరుపతి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు సోముయాదవ్, తులసీరామిరెడ్డి, తదితర అభిమానులు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఎన్టీఆర్ను హేళన చేస్తూ మాట్లాడడం దారుణం అన్నారు. అసలు ఇలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.రాజకీయం.. టీడీపీ నాయకులకు నందమూరి కుటుంబం పెట్టిన భిక్ష అని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని నెల్లూరు జిల్లా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వైఖరిని ఎండగడుతూ జూనియర్ ఎన్టీఆర్ సేవాదళ్ ఫౌండర్ గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షుడు గాలి మధుసూదన్, నగర అధ్యక్షుడు రియాజ్, రూరల్ అ«ధ్యక్షుడు అశోక్, గాలి శ్రీధర్ తదితరులు నర్తకీ సెంటర్లో ఆందోళన చేపట్టారు. ఎవరైనా జూనియర్ ఎన్టీఆర్ జోలికివస్తే సహించేది లేదంటూ బహిరంగంగా హెచ్చరించారు.జూనియర్ ఎన్టీఆర్ తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన దగ్గుపాటి ఇలా మాట్లాడడం తగదన్నారు. విజయవాడ గాం«దీనగర్లోని జయరాం థియేటర్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాష్ట్ర కనీ్వనర్ నున్న గణేష్ ఆధ్వర్యంలో అభిమానులు భారీ స్థాయిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ ఫ్లెక్సీని చెప్పులతో కొట్టారు. ఆపై ఫ్లెక్సీని దహనం చేసి, ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.జూనియర్ ఎన్టీఆర్కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూ.ఎన్టీఆర్కు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అభిమానుల సమక్షంలో బేషరతుగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో ఫ్యాన్స్ సిటీ కనీ్వనర్ కావూరి కృష్ణ, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. సాక్ష్యాధారాలతో బయట పెడతాంఅనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతకరం. నోటికి వచ్చిన పదజాలంతో జూనియర్ ఎన్టీఆర్ను తిడుతూ వార్–2 సినిమా ఆపుతానని, మీరెలా సినిమా ప్రదర్శిస్తారో చూస్తానని, రీల్స్ను తగలబెడతానని, అభిమానులు సినిమాకు వెళ్లరాదని బెదిరించడం దారుణం. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులపై గౌరవం లేని ఇలాంటి ఎమ్మెల్యేను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. పైగా ఆ వాయిస్ తనది కాదని ఎమ్మెల్యే అబద్ధాలు చెప్పడం సరికాదు. ఎమ్మెల్యే ఫోన్ నంబర్ ద్వారా వెలువడిన సంభాషణను సాక్ష్యాధారాలతో బయట పెడతాం. ఇప్పటికైనా అభిమానుల సమక్షంలో ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. – యర్రమల సుధాకర్రెడ్డి, జూనియర్ ఎన్టీఆర్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ ఎన్టీఆర్ సినిమాలు ఆపడం మీతరం కాదు మొన్నటి ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిందంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఓట్లు కూడా ఉన్నాయని ఆ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. ఎన్టీఆర్ను విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. మీరు జూ.ఎన్టీఆర్ సినిమాలను ఆపాలనుకుంటే అది మీ తరం కాదు. ఒక ప్రజా ప్రతినిధిగా అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే ప్రసాద్.. బాధ్యత గల స్థానంలో ఉండి అసభ్య పదజాలంతో మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ప్రజలకు మీరు నేర్పించేది ఇదేనా? ఎన్టీఆర్ను, ఎన్టీఆర్ అభిమానులను రెచ్చగొట్టొద్దు. – పి.పూర్ణ, ఎన్టీఆర్ అభిమానుల సంఘం నేత, ప్రకాశం జిల్లా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదుజూనియర్ ఎన్టీఆర్ను అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నోటికి ఇష్టం వచ్చినట్లుగా దూషించడం అభిమానులకు తీరని మనోవేదన కలిగిస్తోంది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు తక్షణమే స్పందించి ఆ ఎమ్మెల్యేను బర్తరఫ్ చేయాలి. లేకపోతే భవిష్యత్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. – డి.భాస్కర్, టీమ్ తారక్ ట్రస్టు, జిల్లా అధ్యక్షుడు, శ్రీకాకుళం జిల్లా -
ఐటీ ముసుగులో భూములు ‘లిఫ్ట్’!
సాక్షి, అమరావతి: ఏ ప్రభుత్వమైనా ఓ కంపెనీకి ఉదారంగా భూములివ్వాలంటే ముందుగా దాని ట్రాక్ రికార్డు చూస్తుంది! కంపెనీ శక్తి, సామర్థ్యాలు ఏమిటి? ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది? రాష్ట్రానికి పారదర్శకంగా ఎన్ని పెట్టుబడులు వస్తాయో చూస్తుంది. అంతటా నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తుంది. కానీ ఇలాంటివి ఏవీ పట్టించుకోకుండా పప్పు బెల్లాల మాదిరిగా భూముల పందేరానికి టీడీపీ కూటమి సర్కారు సిద్ధమైంది. ఐటీ కంపెనీల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర తీసింది. ఎన్ని ఎకరాల భూమి అయినా సరే కేవలం 99 పైసలకే ఇస్తాం...! ఐటీ పేరుతో వాణిజ్య సముదాయాలు ఏర్పాటు చేసుకోండి..! ఆ తరువాత మార్కెట్ ధరకు అమ్మేసుకోండి..! అంటూ ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ (లిఫ్ట్) పేరుతో విలువైన భూములను కొట్టేసేందుకు ప్రభుత్వ పెద్దలు స్కెచ్ వేశారు. ఐటీ కంపెనీలను ఆకర్షిస్తున్నామంటూ పక్కా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సన్నాహాలు చేశారు. తొలుత ఒకటి రెండు ప్రముఖ కంపెనీలను తెరపైకి తీసుకొచ్చి కనీసం పాలసీ కూడా సిద్ధం కాకముందే విశాఖలో 99 పైసలకే భూములను కట్టబెట్టారు. ఈ క్రమంలో ఊరూ పేరు లేని ఉర్సాకు కారుచౌకగా భూములను కట్టబెట్టే యత్నాలపై తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో ఉలిక్కిపడి ‘లిఫ్ట్’ పేరుతో ఓ పాలసీని తీసుకొచ్చారు. ఉర్సా లాంటి వందలాది సత్తాలేని కంపెనీలను సృష్టించి తమకు కావాల్సిన వారికి భూములు అప్పనంగా అప్పగించేందుకు సిద్ధపడ్డారు. అసలు టెక్నాలజీతో సంబంధం లేని కంపెనీలకు భూములను ధారాదత్తం చేస్తున్నారు! తొలుత విశాఖలో ఐటీ కంపెనీలను ప్రోత్సహించి ఇదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా భూములను కేటాయించనున్నట్లు ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.నామినల్ రేటు అంటే 99 పైసలు..ఐటీ కంపెనీలను ఆకర్షించేందుకు ఇప్పటికే ఏపీ ఐటీ అండ్ గ్లోబల్ కేపబులిటీ సెంటర్స్ (జీసీసీ) పాలసీ 2024–29 ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములు కేటాయించడం కోసం ప్రత్యేకంగా ‘లిఫ్ట్’ పాలసీని తెరపైకి తెచ్చింది. ముందుగా ఐటీ లేదా జీసీసీతో అభివృద్ధి చేసే వాణిజ్య సముదాయంలో 20 శాతం కొనుగోలు లేదా లీజుకు తీసుకునేలా ఒప్పందం చేసుకుంటే చాలు.. అడిగినంత భూమిని కేవలం 99 పైసలకే కట్టబెట్టనుంది. మిగిలిన 80 శాతంలో 30 శాతం ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు, జీసీసీలకు ఇస్తే చాలు 50 శాతం భూమిని వాటికి నచ్చినట్లుగా విక్రయించుకోవచ్చని ఆ జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. ‘‘నామినల్ రేటు అంటే 99 పైసలు..’’ అని అందులో పేర్కొనడం గమనార్హం.ప్రత్యేకంగా ‘ఫార్చూన్ 500 యూరప్’ ఎందుకు?ఐటీ, ఐటీఈఎస్, జీసీసీలకు 99 పైసలకే భూమి ఇస్తామంటూనే ‘‘ఫార్చూన్ 500 యూరోప్’’ను ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకోవడంపై పలు సందేహాలు తలెత్తుతున్నాయి. వీటిలో నాన్ ఐటీ కంపెనీలే ఉన్నాయి. టెక్నాలజీతో ఏమాత్రం సంబంధంలేని యూరోప్ ఫార్చూన్ 500 ఇండెక్స్ను ఎంపిక చేసుకోవడంపై సందేహాలు ముసురుకుంటున్నాయి. ఈ ఇండెక్స్లో నల్లధన రాజధాని స్విట్జర్లాండ్కు చెందిన 36కిపైగా కంపెనీలు ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఫార్చూన్ 500 యూరోప్ తేవడంపై ఉన్నతాధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.డెవలపర్స్ ముసుగులో ‘రియల్’ వ్యాపారంఐటీ పార్కు డెవలపర్స్, జీసీసీ డెవలపర్స్కు కూడా ఈ పాలసీ కింద 99 పైసలకే భూమిని కేటాయిస్తారు. జీసీసీ డెవలపర్స్ కనీసం ఒక ఎకరా భూమిలో 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే విధంగా అభివృద్ధి చేయాల్సి ఉంటుందని జీవోలో పేర్కొన్నారు. ఫార్చూన్, ఫోర్బ్స్ కంపెనీల్లో ఒక దానిని యాంకర్ కంపెనీగా ఎంపిక చేసుకొని అభివృద్ధి చేసిన భూమిలో 20 శాతం తీసుకునే విధంగా ఒప్పందం చేసుకోవాలి. ఎకరాకు కనీసం 500 మందికి ఉపాధి కల్పించాలి. ఇలా అభివృద్ధి చేసిన భూమిలో కనీసం 50 శాతం భూమిని ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలు, జీసీసీలకు ఇవ్వాల్సి ఉంటుందని ఉత్తర్వులో పేర్కొన్నారు . అదే ఐటీ పార్కు డెవలపర్స్ అయితే ఎకరాకు 1,00,000 చదరపు అడుగులు చొప్పున కనీసం 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. అంటే ఐటీ డెవలపర్స్కు కనీసం 10 ఎకరాల భూమిని కేటాయిస్తారు. -
‘ఆన్లైన్’లో గ్రామాలు గ్రేట్!
సాక్షి, అమరావతి: ఇప్పుడంతా ఆన్లైన్ ఆర్డర్ల యుగం..! దుస్తుల నుంచి సెల్ఫోన్ల వరకు.. పుస్తకాల నుంచి వంటింట్లో వస్తువుల దాక.. అన్నిటికీ ఆన్లైన్. అయితే, ఇందులో పల్లెలు, పట్టణాలకు మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోంది. అటు దేశవ్యాప్తంగానూ... ఇటు మన రాష్ట్రంలోనూ... పట్టణవాసుల కంటే గ్రామీణ ప్రజలు ఆహారేతర వస్తువులను ఆన్లైన్లో అధికంగా కొనుగోలు చేస్తున్నారు. ఇంటికి చేర్చే (హోం డెలివరీ) సేవలు అందుబాటులో ఉండడంతో పట్టణ ప్రజలు ఆహార వస్తువులను ఎక్కువగా ఆర్డర్ పెడుతున్నారు. జాతీయ స్థాయితో పాటు వివిధ రాష్ట్రాల్లో ఆన్లైన్ కొనుగోళ్లపై సమగ్ర మాడ్యులర్ సర్వే: టెలికాం–2025 ఈ వివరాలు వెల్లడించింది. దీనిప్రకారం..⇒ దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆహారేతర వస్తువులను ఆన్లైన్లో కొంటున్న కుటుంబాలు: 75.7 శాతం. ఏపీలో 75.2 శాతం. ⇒ దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఆహార వస్తువులను ఆన్లైన్లో ఆర్డర్ పెడుతున్న కుటుంబాలు 4.3 శాతం. ఏపీలో 3.2 శాతం. ⇒ దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో 20 శాతం కుటుంబాలు ఆహార, ఆహారేతర వస్తువులనూ ఆన్లైన్లో కొంటున్నాయి. ఏపీలో వీరి శాతం 21.6. ⇒ దేశంలో పట్టణాల్లో 10 శాతం కుటుంబాలు ఆహార వస్తువులను ఆన్లైన్లో ఖరీదు చేస్తుండగా.. ఏపీలో 18.7 శాతం కుటుంబాలు ఇదే పద్ధతిని ఎంచుకుంటున్నాయి. ⇒ దేశంలో పట్టణాల్లో 37.6 శాతం కుటుంబాలు ఆహారేతర వస్తువుల కోసం ఆన్లైన్ను ఆశ్రయిస్తుండగా, ఆంధ్రప్రదేశ్లో ఈ శాతం 36.1. ⇒ దేశంలో పట్టణాల్లో 52.4 శాతం కుటుంబాలు ఆహారం, ఆహారేతర వస్తువులను ఆన్లైన్లో కొంటుండగా, రాష్ట్రంలో ఈ శాతం 45.3. ⇒ దేశంలో మొత్తం గ్రామీణ, పట్టణ ప్రాంతాలు కలిపి 7.6 శాతం కుటుంబాలు ఆహార వస్తువులను ఆన్లైన్లో కొనుగోళ్లు చేస్తుండగా, 53.3 శాతం కుటుంబాలు ఆహారేతర వస్తువులను మాత్రమే ఆన్లైన్లో ఖరీదు చేస్తున్నాయి. ⇒ దేశంలో 39 శాతం కుటుంబాలు ఆహారంతో పాటు ఆహారేతర వస్తువులను ఆన్లైన్లో కొనుగోళ్లు చేస్తున్నాయి. ⇒ ఏపీలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 11.7 శాతం కుటుంబాలు ఆహార వస్తువులను ఆన్లైన్లో కొంటుండగా... 53.7 శాతం కుటుంబాలు ఆహారేతర వస్తువులను మాత్రమే ఆర్డర్ పెడుతున్నాయి. 34.6 శాతం కుటుంబాలు ఆహారంతో పాటు ఆహారేతర వస్తువులను కూడా ఆన్లైన్ ద్వారానే తీసుకుంటున్నారు. -
‘యుపిక్స్’ చీటింగ్ కేసులో నిందితుల అరెస్టు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): కష్టపడకుండా సులభంగా డబ్బులు సంపాదించాలని కొందరు వ్యక్తులు గ్రూప్గా ఏర్పడి 183 మంది నుంచి దాదాపు రూ.353 కోట్లు దండుకుని మోసగించిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్టుచేసినట్లు విజయవాడ పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు శనివారం మీడియాకు వెల్లడించారు. వీరు యుపిక్స్ క్రియేషన్ అనే యానిమేషన్ సంస్థను చూపి, హాలీవుడ్ సినిమాలకు వర్క్చేసే ఈ సంస్థలో పెట్టుబడి పెడితే ఏడాదిలోనే రెట్టింపు డబ్బులు పొందొచ్చని అమాయకులకు ఆశ చూపి క్రమేణా రూ.కోట్లలో పెట్టుబడులు రాబట్టారని ఆయన చెప్పారు. మోసం చేసిందిలా.. నిడుమోలు వెంకట సత్యలక్ష్మీకిరణ్ అనే వ్యక్తి విజయవాడ సత్యనారాయణపురం పోలీస్స్టేషన్ పరిధిలోని ఆదిశేషయ్య వీధిలో యుపిక్స్ అనే యానిమేషన్ కంపెనీని 2014లో ఏర్పాటుచేశారు. అనంతరం.. లక్ష్మీకిరణ్కు పేరం మాల్యాద్రి, అతని కొడుకు పేరం మహేశ్వరరెడ్డి, కొత్తూరి వేణుగోపాలరావు, మిట్టపల్లి రాజేంద్రబాబు అతని కొడుకు మిట్టపల్లి రాజీవ్కృష్ణ తోడయ్యారు. వీరంతా 2018లో ఒక గ్రూప్గా ఏర్పడి అమాయకులకు వల వేశారు. తొలుత లాభాలు వచ్చినట్లు చూపించి వారి బంధువులు, స్నేహితులకు సక్రమంగా కమీషన్లు చెల్లిస్తూ మరిన్ని డిపాజిట్లు చేయించేలా వారిని ప్రోత్సహించారు. అలా వచ్చిన మొత్తాలను వారి సొంత ఖాతాల్లోకి మళ్లించేవారు. ఇలా దాదాపు 183 మంది నుంచి రూ.353 కోట్లు సేకరించారు. ఇందులో రూ.194 కోట్ల వరకూ వారి సొంత ఖాతాలకు మళ్లించారు.వెలుగు చూసిందిలా.. ఈ సంస్థలో రూ.20 కోట్లు పెట్టుబడి పెడితే మోసం చేశారంటూ ఈ ఏడాది ఏప్రిల్ 14న పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన త్రిపురమల్లు శ్రీనివాసరావు, కలవకొల్లు దిలీప్కుమార్ సత్యనారాయణపురం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో.. డీసీపీ కె. తిరుమలేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో విచారణ అధికారిగా ఏసీపీ డాక్టర్ స్రవంతి రాయ్తో పాటు మరో నలుగురు ఇన్స్పెక్టర్లు, సిబ్బందితో కమిషనర్ రాజశేఖరబాబు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేశారు. దర్యాప్తులో ముఠా మోసాలు బయటపడ్డాయి. అనంతరం.. పక్కా సమాచారంతో ప్రధాన నిందితులు నిడుమోలు వెంకట సత్యలక్ష్మీకిరణ్ (33)ను విజయవాడలో, మిట్టపల్లి రాజేంద్రబాబు (63), మిట్టపల్లి రాజీవ్కృష్ణ (30)ను నరసరావుపేటలో పోలీసులు అరెస్టుచేశారు. వారి నుంచి రూ.90 లక్షల విలువైన 354 గ్రాముల బంగారు ఆభరణాలు, 21 కేజీల వెండి ఆభరణాలు, ఒక కారు, బీఎండబ్ల్యూ బైక్, కంప్యూటర్లు స్వాదీనం చేసుకున్నారు. వారి బ్యాంకు ఖాతాలనూ ఫ్రీజ్ చేశారు. నిందితులకు సంబంధించిన సుమారు రూ.23 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్మెంట్కు పెట్టినట్లు సీపీ తెలిపారు. కేసును ఛేదించిన దర్యాప్తు అధికారులు, సిబ్బందిని సీపీ రాజశేఖరబాబు నగదు రివార్డులతో సత్కరించి అభినందించారు. -
వైఎస్సార్సీపీలో పలు విభాగాలకు నియామకాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పలు విభాగాలకు నియామకాలు చేశారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం వేర్వేరు ప్రకటనలు విడుదల చేసింది.⇒ ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ను పార్టీ రాష్ట్ర శెట్టిబలిజ విభాగం అధ్యక్షుడిగా నియమించారు.⇒ శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన అంబటి శ్రీనివాసరావుకు రాష్ట్ర పోలినాటి వెలమ విభాగ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. ⇒ తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గానికి చెందిన ఎల్లా భాస్కర్రావును రాష్ట్ర అతిరస విభాగ అధ్యక్షుడిగా నియమించారు.⇒ విజయవాడ తూర్పు నియోజకవర్గానికి చెందిన పులిపాటి దుర్గారెడ్డికి పార్టీ రాష్ట్ర దివ్యాంగుల విభాగం అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు.⇒ పల్నాడు జిల్లా పెదకూరపాడు అసెంబ్లీ నియో జకవర్గానికి చెందిన షేక్ దస్తగిరిని పార్టీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. -
మద్యం బెల్టుపై పోరు‘గీత’o
సాక్షి, అమరావతి/కృష్ణలంక(విజయవాడతూర్పు): రాష్ట్రంలో 75వేల మద్యం బెల్ట్షాపులను తొలగించి, గీత కార్మికుల ఉపాధిని కాపాడే వరకు పోరాటం కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం(ఎంబీవీకే)లో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాకా రామచంద్రరావు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రజా సంఘాల రాష్ట్ర నాయకులు ఆండ్ర మాల్యాద్రి(కేవీపీఎస్), పి.బాలకృష్ణ(ఏపీ చేనేత కార్మిక సంఘం), ఎం.భాస్కరయ్య(వృత్తిదారుల సంఘం), రామన్న, అనిల్, రమాదేవి, రెడ్డయ్య వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ బతుకుదెరువు కోసం గీత కార్మికులు సాగిస్తున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతు పలికారు. రాష్ట్రంలో బెల్ట్షాపులు తొలగించి గీత కార్మికుల ఉపాధిని కాపాడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 58 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పోరాటానికి సంఘీభావం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదరర్శి జుత్తిగ నరసింహమూర్తి మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం గీత కార్మికులను ఆదుకోకపోగా ఉన్న ఉపాధిని దెబ్బతీసేలా వ్యవహరించడం దుర్మార్గమని పేర్కొన్నారు. మద్యం ఆదాయం రుచి మరిగిన ప్రభుత్వం కల్లు అమ్మకాలను దెబ్బతీసి గీత కార్మికుల పొట్ట కొట్టడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్సైజ్ శాఖ మంత్రి నియోజకవర్గంలోనే లెక్కలేనన్ని బెల్ట్ షాపులు ఉన్నాయని, అక్రమ మద్యం ఏరులై పారుతోందని, ఇక రాష్ట్రంలోని దుస్థితి చెప్పనవసరంలేదని పేర్కొన్నారు. మంచినీటికి కొరత ఉందేమోకానీ మద్యం ఎక్కడç³డితే అక్కడ దొరకడంతో రాష్ట్రంలో నిత్యం హత్యలు, లైంగికదాడులు వంటి ఘోరాలు పెచ్చుమీరాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పట్టించుకోకుంటే గీత వృత్తి రక్షణ కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జుత్తిగ నరసింహామూర్తి హెచ్చరించారు. దశలవారీ పోరాటంలో కీలక ఘట్టాలు ఇలా..గీత కార్మికుల సమస్యలపై ఉద్యమించేందుకు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 58 రోజులపాటు నిర్వహిస్తున్న దశలవారీ పోరాటంలో ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని పేర్కొన్నా రు. 30న జిల్లాల్లో ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల వద్ద నిరసనలు తెలిపి సెపె్టంబర్ 8న మంగళగిరిలో ఎక్సైజ్ కమిషనర్ను కలుద్దాం రండి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వివరించారు.సెప్టెంబర్ 10న ముఖ్యమంత్రికి సమస్యలపై వినతిపత్రం అందించి 12న బెల్ట్ షాపులు, కల్లు పాలసీ, ఉపాధిపై జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. సెపె్టంబర్ 25న జిల్లాల్లో సమీక్షలు, సభలు నిర్వహించి అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే 30 తర్వాత రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని జుత్తిగ నరసింహమూర్తి వెల్లడించారు. ఈ సమావేశంలో సిమ్మ అప్పారావు, కడలి పాండు బత్తిన నాగేశ్వరరావు, దాసరి సూరిబాబు, చెల్లుబోయిన వెంకటేశ్వరరావు, పామర్తి వెంకటేశ్వరరావు, బెజవాడ వెంకటేశ్వరరావు, నోట్ల నాగేశ్వరరావు తదితరులు మాట్లాడారు. -
ప్రమాదంలో తుంగభద్ర డ్యాం 7 గేట్లు
హొళగుంద: తుంగభద్ర డ్యాం మళ్లీ ప్రమాదం అంచున ఉంది. గతేడాది 19వ గేటు నదిలో కొట్టుకుపోగా టీబీ బోర్డు అధికారులు దాని స్థానంలో స్టాప్లాగ్ గేట్ ఏర్పాటు చేసి కాలం వెళ్లదీస్తున్నారు. అయితే మిగిలిన గేట్లకూ కాలం చెల్లిందని, మొత్తం గేట్లను మార్చాలని గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడు ఇచి్చన నివేదిక ఆధారంగా మొత్తం 33 కొత్త గేట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. సేఫ్టీ కోసం 105.788 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని 80 టీఎంసీలకు కుదించి ఖరీఫ్కు మాత్రమే నీళ్లిచ్చి రబీ సమయంలో పనులు మొదలు పెట్టెందుకు నిర్ణయం తీసుకున్నారు.అయితే ఇంకా సమయం ఉండడం, జలాశయానికి వరద పెద్ద ఎత్తున వస్తుండడంతో మళ్లీ ఎక్కడ కొత్త సమస్య వస్తుందోనని టీబీ బోర్డు అధికారులతో పాటు ఏపీ, కర్ణాటకకు చెందిన కర్నూలు, బళ్లారి, రాయచూరు, అనంతపురం జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. 19వ స్టాప్లాగ్ గేటు మినహాయించి మిగిలిన 32 గేట్ల పరిస్థితి అంతంత మాత్రంగా ఉండగా.. అందులో 4, 11, 18, 20, 24, 27, 28వ గేట్లు మరీ అధ్వాన స్థితికి చేరినట్లు తెలుస్తోంది.ఆ గేట్లు రెండు మీటర్ల ఎత్తు వరకు ఎత్తేందుకూ సమస్యగానే ఉందని అధికారులు చెబుతున్నారు. తుప్పు పట్టి ఉండటంతో ఆ గేట్లను ఎత్తితే.. దింపడం, దించితే ఎత్తడం ఇబ్బందికరమంటున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనంటూ కన్నడ టీవీ చానళ్లలో ప్రసారమైన వార్తలు శనివారం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
ఆగని ర్యాగింగ్!
సాక్షి, అమరావతి: దేశంలోని మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ నిరోధానికి కఠిన చట్టం అమల్లో ఉన్నప్పటికీ... ర్యాగింగ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని వైద్యకళాశాలల్లో గత ఏడాది (2024)లో 165 ర్యాగింగ్ కేసులు నమోదైనట్లు తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 33 కేసులు నమోదైనట్లు తెలిపింది. ఆ తర్వాత బిహార్లో 17, అత్యల్పంగా కేరళలో ఒక కేసు నమోదైనట్లు వివరించింది. ఆంధ్రప్రదేశ్లో ఆరు కేసులు నమోదయ్యాయి. ర్యాగింగ్ నిరోధంపై వైద్య విద్యాసంస్థల డీన్లు, ప్రిన్సిపాల్స్తో వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా క్రమం తప్పకుండా మాట్లాడుతూ పర్యవేక్షిస్తున్నామని, అవసరమైన తదుపరి చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ర్యాగింగ్ నిరోధక చర్యలు పాటించకపోతే గుర్తింపు రద్దు వైద్య విద్యాసంస్థలు ర్యాగింగ్ నిరోధక ప్రొటోకాల్ను పాటిస్తున్నాయా.. లేదా.. అని నిర్ధారించేందుకు వార్షిక ర్యాగింగ్ నిరోధక నివేదికను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ప్రొటోకాల్ పాటించకపోతే జరిమానాలు విధించడంతోపాటు విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. విద్యార్థులకు సురక్షిత వాతావరణం ఉండేలా ర్యాగింగ్ నివారణ, నిషేధం నిబంధనలు–2021ను అమలు చేస్తున్నట్లు వివరించింది. అడ్మిషన్ బ్రోచర్లు, బుక్లెట్లలో ర్యాగింగ్ నిరోధక చర్యల గురించి నిర్దిష్ట సమాచారం అందిస్తున్నట్లు తెలిపింది. కళాశాలలు, ఆస్పత్రులు, హాస్టళ్లతోసహా క్యాంపస్లోని వివిధ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతోపాటు ర్యాగింగ్ నిరోధక పోస్టర్లు, హోర్డింగ్లను ప్రదర్శిస్తున్నట్లు పేర్కొంది. విద్యార్థులు ర్యాగింగ్కు సంబంధించిన ఫిర్యాదులను దాఖలు చేసేందుకు జాతీయ వైద్య కమిషన్ ప్రత్యేక పోర్టల్ను ఏర్పాటు చేసిందని, ఫిర్యాదులను యాంటీ ర్యాగింగ్ సెల్ పర్యవేక్షిస్తుందని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలియజేసింది. -
ఇంటర్నేషనల్ చదువుకు కొత్త అడ్రస్.. న్యూజిలాండ్
సాక్షి, అమరావతి: భారతీయ విద్యార్థుల విదేశీ విద్య గమ్యస్థానాల్లో న్యూజిలాండ్ సరికొత్త ఆశాకిరణంగా మారుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కఠినంగా మారుతున్న వీసా నిబంధనలు, విధాన అనిశ్చితుల నేపథ్యంలో విద్యకు న్యూజిలాండ్ కీలకమైన కేంద్రంగా అవతరిస్తోంది. ఇంగ్లిష్ మాట్లాడే వాతావరణం, పారదర్శక విధానాలతో పాటు ముఖ్యంగా భారత సంస్థలతో పెరుగుతున్న సంబంధాలతో న్యూజిలాండ్ ఆశాజనకంగా కనిపిస్తోంది.34% వృద్ధి నమోదుఎడ్యుకేషన్ న్యూజిలాండ్ డేటా ప్రకారం 2023లో న్యూజిలాండ్ విద్యాలయాల్లో భారతీయ విద్యార్థుల సంఖ్య 7,930 కాగా, 2024లో కేవలం జనవరి–ఆగస్టు మధ్యే 34 శాతానికి పైగా వృద్ధితో 10,640కి పెరిగింది. వాస్తవానికి న్యూజిలాండ్ విశ్వవిద్యాలయాల్లోని మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయుల వాటా 11 శాతం. చైనా తర్వాత అతిపెద్ద విదేశీ విద్యా వనరుగా భారత్ నిలుస్తోంది. ఒక్క మహిళా విద్యార్థుల్లోనే 2023 నుంచి 2024కు 100 శాతం పెరుగుదల నమోదయ్యింది. 2030 నాటికి 40 వేల వరకూ భారతీయ విద్యార్థులను ఆకర్షించడమే లక్ష్యంగా న్యూజిలాండ్ అడుగులు వేస్తోంది. న్యూజిలాండ్లో వార్షిక ట్యూషన్ ఫీజులు భారతీయ కరెన్సీలో రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల లోపే ఉంటున్నాయి.ఈ నేపథ్యంలో ‘బిగ్ ఫోర్’ దేశాలైన యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియాలకు ప్రత్యామ్నాయంగా భారతీయ విద్యార్థుల దృష్టి న్యూజిలాండ్కు మారింది. న్యూజిలాండ్ ఇటీవల తమ దేశానికి విద్య, ఉద్యోగాల కోసం వచ్చే విదేశీ విద్యార్థులు, అభ్యర్థులకు విధించే నిబంధనల నుంచి భారత్కు మినహాయింపులు ఇచ్చింది. దీంతో వలస ప్రక్రియలో మినహాయింపులు పొందుతున్న ఎనిమిది దేశాల సరసన (ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, సింగపూర్, దక్షిణ కొరియా, శ్రీలంక, స్వీడన్, స్విట్జర్లాండ్) భారత్ చేరింది. తద్వారా భారత విద్యార్థులకు అంతర్జాతీయ అర్హత అంచనా (ఐక్యూఏ) మినహాయింపులు లభించాయి.ఐక్యూఏ అనేది న్యూజిలాండ్ క్వాలిఫికేషన్స్ అథారిటీ (ఎన్జెడ్క్యూఏ) నిర్వహించే ఒక అధికారిక బెంచ్ మార్కింగ్ ప్రక్రియ. ఒక విదేశీ విద్యార్హత.. ఆ దేశ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదో ఈ ప్రక్రియ నిర్ధారిస్తుంది. దీనికి తోడు ప్రత్యేక స్కాలర్ షిప్ పథకం ద్వారా విద్యార్థికి గరిష్టంగా రూ.10 లక్షల వరకు ఆర్థిక సహాయం లభిస్తోంది.పని గంటల పెంపుపోస్టు స్టడీ వర్క్ (పీఎస్డబ్ల్యూ) పాలసీ కూడా న్యూజిలాండ్లో చదువుకునే విదేశీ విద్యార్థులకు ఎంతో మేలు చేస్తోంది. కనీసం 30 వారాల మాస్టర్ లేదా డాక్టోరల్ లెవల్ స్టడీని పూర్తి చేసిన విద్యార్థులు ఆ దేశంలోనే ఉండి మూడేళ్ల వరకు పని చేసుకునే వెసులుబాటు ఉండటం విద్యార్థులకు కలిసివస్తోంది. ఇటీవల వారానికి పని గంటలను 20 నుంచి 25కు పెంచింది. నవంబర్ నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. చదువుకుంటూ పని చేసుకుని, ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడాలనే విద్యార్థులకు ఎంతగానో ఉపకరించే అంశం ఇది. క్యూఎస్ ర్యాంకుల్లోనూ..న్యూజిలాండ్కు చెందిన ఎనిమిది విశ్వవిద్యాలయాలు క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ 2026లో ఉత్తమ ర్యాంకులు పొందాయి. ఇవి ఇంజనీరింగ్, డేటా సైన్స్, బిజినెస్ అనలిటిక్స్, హాస్పిటాలిటీ, నర్సింగ్ వంటి విద్య రంగాల్లో విస్తృత శ్రేణిలో ప్రోగ్రామ్స్ అందిస్తున్నాయి.భాగస్వామ్య ఒప్పందాలుఇటీవల భారత్–న్యూజిలాండ్ విద్యా సంస్థల మధ్య భాగస్వామ్య ఒప్పందాలు పెరుగుతున్నాయి. గతేడాది న్యూజిలాండ్ ప్రభుత్వం ఐఐఎం–అహ్మదాబాద్, గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ (జీఐఎఫ్టీ సిటీ), కర్ణాటక ఉన్నత విద్యా మండలిలో విద్యా సహకార ఒప్పందాలు చేసుకుంది. దేశంలో అభివృద్ధి చెందుతున్న విద్యా రంగానికి అనుగుణంగా విధాన మార్పిడి నిర్ణయాలను వేగంగా తీసుకుంటోంది. -
బాబు మార్కు కనికట్టు!
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకీ) నుంచి యూనిట్ విద్యుత్ కేవలం రూ.2.49కే కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంటే ఆ ధర ఎక్కువన్నారు.. పాతికేళ్ల పాటు వ్యవసాయ అవసరాలకు 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ను తెస్తుంటే వద్దన్నారు.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంత తక్కువ ధరకు అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీల మినహాయింపుతో విద్యుత్ తీసుకుంటా మంటే అవినీతి జరిగిందంటూ దుష్ప్రచారం చేశారు.. కానీ, అదే కూటమి నేతలు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక యూనిట్ విద్యుత్కు రూ.3.20 చొప్పున చెల్లించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించి ఈ ఏడాది మార్చిలో పిలిచిన టెండర్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. త్వరలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆమోదం కోసం పంపేందుకు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు సన్నాహాలు చేస్తున్నాయి. మరి ఈ పాలకులను ఏమనాలి? రెండు నాల్కల ధోరణి అనాలా? అవకాశవాదం అనాలా? ప్రజలను తప్పుదారి పట్టించే మోసగాళ్లు అనాలా? అధిక ధర ముసుగులో కమీషన్లు కొట్టేసే కేటుగాళ్లు అనాలా?సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యూనిట్ సోలార్ విద్యుత్ రూ.2.49కే వస్తోందంటే నానా యాగీ చేసిన ఇదే కూటమి.. అధికారంలోకి రాగానే యూనిట్ విద్యుత్ను రూ.3.20 చొప్పున ప్రైవేటు సంస్థల నుంచి కొనేందుకు సిద్ధమైపోయింది. తమకొక న్యాయం.. ఎదుటి వాళ్లకు మరో న్యాయం అని నిస్సిగ్గుగా చెబుతూ బరితెగించింది. రాష్ట్రంలో దాదాపు 19 లక్షల వ్యవసాయ విద్యుత్ సర్వీసులు ఉంటే, వీటిలో 3 లక్షల సర్వీసులకు సరిపోయేలా కుసుమ్ పథకం కింద 3,325 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం గల మినీ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో 1,185.80 మెగావాట్ల ప్రాజెక్టుల ఏర్పాటుకు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఈ ఏడాది మార్చిలో సర్కిళ్ల వారీగా టెండర్లు పిలిచాయి. యూనిట్కు కనిష్ఠంగా రూ.3.19 గరిష్ఠంగా రూ.3.60 ధరను గుత్తేదారులు కోట్ చేశారు. తాజాగా ఈ టెండర్ల ధరలను కూడా ఖరారు చేశారు. దాని ప్రకారం.. యూనిట్కు రూ.3.19 నుంచి రూ.3.20 మధ్య ఇవ్వనున్నారు. ఎకోరాన్ కంపెనీకి యూనిట్కు రూ.3.18, వృద్ధిమాన్ సంస్థకు యూనిట్కు రూ.3.19, భవ్య కంపెనీకి రూ.3.20 చొప్పున టెండర్లను ఖరారు చేసేందుకు రంగం సిద్ధమైంది. నిజానికి వ్యవసాయానికి 30 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్కు ఢోకా లేకుండా అందించేందుకు గత ప్రభుత్వం సెకీతో కుదుర్చుకున్న ఒప్పందం ఇంకా అమలులోనే ఉంది. దాని ప్రకారం ఇంతకంటే తక్కువ ధరకు సెకీ నుంచి విద్యుత్ను తీసుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ దానిని కాదని, పొలాల వద్ద మినీ సోలార్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. నిజానికి సౌర విద్యుత్ బహిరంగ మార్కెట్లో ఇంత కన్నా తక్కువ ధరకే వస్తోంది. అప్పనంగా 5,983.5 ఎకరాలు ధారాదత్తంమినీ సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం మూడు ప్రైవేటు సంస్థలకు టెండర్లు అప్పగించనుంది. ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ (ఏపీఎస్పీడీసీఎల్) పరిధిలోని 9 సర్కిళ్లలో 610 మెగావాట్ల ప్రాజెక్టుల ఏర్పాటుకు డిస్కం టెండర్లు పిలిచింది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప, శ్రీసత్యసాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలు సర్కిళ్ల పరిధిలో ప్రాజెక్టుల ఏర్పాటుకు 3,055 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ఈ డిస్కం గుర్తించింది. ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ (ఏపీసీపీడీసీఎల్) పరిధిలోని 4 సర్కిళ్లలో 355.50 మెగావాట్ల ఉత్పత్తి ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వ, ప్రైవేట్ భూములు 1,842 ఎకరాలను గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ (ఏపీఈపీడీసీఎల్) పరిధిలో 220.30 మెగావాట్ల ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రతిపాదించగా, దీని కోసం 1,086.5 ఎకరాలు గుర్తించారు. మొత్తంగా 5,983.5 ఎకరాలను సిద్ధం చేశారు. మిగులు ఉండగా కొత్తవి ఎందుకు?రాష్ట్రంలో ఇప్పటి వరకు గ్రిడ్ గరిష్ట డిమాండ్ 13 వేల మెగావాట్లు మించి లేదు. అది కూడా వేసవి వంటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న రోజుల్లో మాత్రమే. మిగతా ఏడాదంతా 10 వేల మెగావాట్లలోపే విద్యుత్ డిమాండ్ నమోదవుతోంది. భవిష్యత్ అవసరాల కోసం, డిమాండ్ భారీగా పెరిగినా ఇబ్బంది లేకుండా ఉండేందుకంటూ ఇప్పటికే డిస్కంలు 23 వేల మెగావాట్లకు పీపీఏలు చేసుకున్నాయి. ఈ ఒప్పందాల నుంచి ప్రస్తుతం సుమారు 14 వేల మెగావాట్ల విద్యుత్ సమకూరుతోంది. అంటే డిమాండ్కు అవసరమైన విద్యుత్ కంటే ఎక్కువగానే విద్యుత్ అందుబాటులో ఉంది. దీంతో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఉత్పత్తిని అనేకసార్లు నిలిపివేయాల్సి వస్తోంది. ఇలాంటి మిగులు విద్యుత్ పరిస్థితులు రాష్ట్రంలో ఉండగా, ఇంకా అధిక ధరకు విద్యుత్ను కొనుగోలు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందనేది కూటమి ప్రభుత్వ పెద్దలకే తెలియాలి. మిగులు విద్యుత్ ఉన్నప్పటికీ కొత్త ప్రాజెక్టులతో ఒప్పందాలు చేసుకోవడం వల్ల డిస్కంలపై ఆర్థికంగా చాలా భారం పడే అవకాశం ఉందని ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు.అధికారం చేతికి రాగానే దోపిడీ⇒ చంద్రబాబు అధికారంలోకి రాగానే గతంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పట్టాలెక్కించడానికి ఉపక్రమించారు. యాక్సిస్ రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన యూనిట్ రూ.4.60 చెల్లించి విద్యుత్ కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకున్నారు. ఈ సంస్థ 400 మెగావాట్ల పునరుత్పాదక (పవన–సౌర హైబ్రీడ్) విద్యుత్ ప్రాజెక్టులను స్థాపించి, వాటి నుంచి పాతికేళ్ల పాటు రాష్ట్ర విద్యుత్ సంస్థలకు విద్యుత్ను విక్రయించేలా ఏర్పాటు చేశారు.⇒ వాస్తవానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, గతంలో చంద్రబాబు అధిక ధరలకు కుదుర్చుకున్న పీపీఏల వల్ల విద్యుత్ సంస్థలు ఆర్థికంగా కుదేలవుతున్నాయని గుర్తించి, వాటిని పునఃపరిశీలించాలని భావించింది. ఆ క్రమంలోనే యాక్సిస్ పీపీఏలను పక్కన పెట్టింది. కానీ మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని పట్టాలెక్కించారు చంద్రబాబు. తాను సగంలో ఆపేసిన దానిని ఎలాగైనా పూర్తి చేయాలనే లక్ష్యంతో మార్కెట్లో సగానికిపైగా తక్కువ ధరకు దొరుకున్నప్పటికీ, రెట్టింపు ధర ఇచ్చి విద్యుత్ను కొనుగోలు చేస్తున్నారు. ⇒ భవిష్యత్తులో పునరుత్పాదక విద్యుత్ ధరలు తగ్గుతాయని, కావున సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) నుంచి యూనిట్ రూ.2.49తో సౌర విద్యుత్ను కొనుగోలు చేయడం భారమని వాదించిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు మినీ సోలార్ ప్రాజెక్టుల పేరుతో రూ.3.20తో యూనిట్ కొనుగోలుకు సిద్ధమైపోయింది.సబ్సిడీ ఎగ్గొట్టే కుట్రమినీ సోలార్ ప్లాంట్ల ఏర్పాటు వెనుక ప్రస్తుతం రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్ను ఎత్తేయాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ఏదైనా సమస్య వచ్చి, ఆ సంస్థలు ఎదురు తిరిగితే రైతులకు ఈ కేంద్రాల నుంచి విద్యుత్ లభించకపోవచ్చు. అప్పుడు వారికి విద్యుత్ ఎలా అందిస్తారనే ప్రశ్నకు సమాధానం లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీల కోసం డిస్కంలకు 2019–24 మధ్య రూ.47,800.92 కోట్లు అందించింది. అదే టీడీపీ గత హయాంలో 2014–19 మధ్య ఐదేళ్లకు రూ.13,255.76 కోట్లు మాత్రమే సబ్సిడీ చెల్లించింది. పైగా రైతులకు ఉచిత విద్యుత్ బకాయిలు రూ.8,845 కోట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టింది. దానిని కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చెల్లించింది. చంద్రబాబు గత అయిదేళ్ల పాలనలో 3.5 లక్షల వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయగా, జగన్ ప్రభుత్వం సుమారు 5 లక్షల వ్యవసాయ పంపుసెట్లు మంజూరు చేసింది. రాష్ట్రంలో 6,663 వ్యవసాయ ఫీడర్ల ద్వారా 9 గంటలు పగటి పూట విద్యుత్ సరఫరా చేసేలా రూ.1,700 కోట్లతో వాటి సామర్థ్యాన్ని గత ప్రభుత్వం పెంచింది. ఇప్పుడు వాటి వద్దనే టీడీపీ ప్రభుత్వం సోలార్ ప్లాంట్లు పెట్టిస్తామంటోంది. ఇదంతా వ్యవసాయానికి ఇప్పుడు ఇస్తున్న దాదాపు రూ.12 వేల కోట్ల సబ్సిడీని ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.‘సెకీ’ ఒప్పందంపై ఎన్నో కుట్రలు ⇒ రైతులకు పగటి పూట 9 గంటలపాటు ఇచ్చే ఉచిత విద్యుత్ పథకాన్ని దీర్ఘకాలికంగా అమలు చేయడానికి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ) నుంచి 17 వేల మిలియన్ యూనిట్ల (7 వేల మెగావాట్లు) సౌర విద్యుత్ను కొనుగోలు చేయడానికి గత ప్రభుత్వంలో ఒప్పందం జరిగింది. అది కూడా అత్యంత చవకగా.. యూనిట్ రూ.2.49కే ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుంది. ⇒ 2022–23లో యూనిట్ రూ.5.13గా ఉన్న సగటు విద్యుత్ సేకరణ ఖర్చుతో పోల్చితే ఇది రూ.2.64 తక్కువ. అదీగాక ఏపీకి సౌర విద్యుత్ను తక్కువ ధరకే సరఫరా చేస్తామన్న ప్రతిపాదన సెకీ నుంచే వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా యూనిట్ ధర రూ.2.80కి పెరిగినప్పటికీ మనకు మాత్రం ఒప్పందం మేరకు యూనిట్ రూ.2.49కే ఇచ్చేందుకు సెకీ అంగీకరించింది. ⇒ సౌర విద్యుత్ కొనుగోలుకు తమతో ఒప్పందం చేసుకుంటే ప్రత్యేక ప్రోత్సాహకంగా అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీ (ఐఎస్టీఎస్)ల నుంచి మినహాయింపు వస్తుందని చెప్పింది. సెకీతో కుదుర్చుకునే పునరుత్పాదక విద్యుత్ ఒప్పందాలకు అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీలు ఉండవని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ సైతం ఆదేశాలిచ్చింది. సెకీ ఒప్పందాలకు పాతికేళ్ల పాటు విద్యుత్ ప్రసార చార్జీలు ఉండవని కేంద్రం విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్సీ) కూడా స్పష్టం చేసింది.⇒ చివరికి ‘సెకీ’, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంల మధ్య జరిగిన విద్యుత్ సరఫరా ఒప్పందంలోనూ ఐఎస్టీఎస్ చార్జీలు వంద శాతం మాఫీ అని స్పష్టంగా ఉంది. అయినప్పటికీ గత ప్రభుత్వంపై బుదరజల్లి, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నిందలు వేశారు. చంద్రబాబు అండ్ గ్యాంగ్, ఎల్లో మీడియా సెకీ ఒప్పందంపై విషం గక్కాయి. సెకీ ఒప్పందాన్ని ఓ అవినీతి భూతంగా చూపించాలని విశ్వ ప్రయత్నాలు చేశాయి. అసత్య కథనాలు, అబద్ధ ప్రచారాలతో రైతులకు సైతం ఉచిత విద్యుత్ను దూరం చేయాలని ప్రయత్నించాయి. ⇒ ఈ కుట్రలన్నిటినీ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) పటాపంచలు చేసింది. సెకీ ఒప్పందం సక్రమమేనని తేల్చి చెప్పింది. ఇప్పుడు ఇదే బాబు ప్రభుత్వం అదే సౌర విద్యుత్ను యూనిట్కు రూ.3.20 చొప్పున చెల్లించి కొంటున్నారంటే దాని వెనుక ఎంతటి అవినీతి దాగుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. -
‘అమరావతిని లేపడానికి పొన్నూరును ముంచేశారు’
సాక్షి, తాడేపల్లి: రియల్ ఎస్టేట్ మాయలో పడి కళ్లు మూసుకుపోయిన ప్రభుత్వం అమరావతిని బతికించుకోవడం కోసం కొండవీటి వాగు వరద నీటిని కృష్ణా, గుంటూరు, అప్పాపురం ఛానళ్లకు మళ్లించి పొన్నూరులో పొలాల ముంపునకు కారణమైందని వైఎస్సార్సీపీ పొన్నూరు నియోజకవర్గం సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆక్షేపించారు. దీని వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, అందుకు వారు ప్రభుత్వాన్ని ఎప్పటికీ క్షమించరని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అంబటి మురళీకృష్ణ చెప్పారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:చోద్యం చూస్తున్నారు:ప్రభుత్వ కుట్ర వల్ల పొన్నూరు నియోజకవర్గంలో రైతులు తీవ్రంగా నష్టపోయినా మంత్రులు, ఎమ్మెల్యేలు కనీసం రివ్యూ చేసి ఎన్యుమరేషన్ చేయించకుండా చోద్యం చూడటం బాధాకరం. పంటలు మునిగి రైతులు నష్టపోయి వ్యవసాయానికి దూరమైతే పొలాలను రియల్ వెంచర్లుగా మార్చి రూ.3 వేల కోట్లు దోచుకోవాలని ఎమ్మెల్యే ధూళిపాల్ల నరేంద్ర కుట్ర చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఎలాగూ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రాదని భావిస్తున్న నరేంద్ర, నియోజకవర్గ రైతాంగాన్ని పూర్తిగా గాలికొదిలేశారు.ఈ ఏడాది వర్షపాతం ఎక్కువగా నమోదవుతుందని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. అయినా ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. మరో వైపు రాజధాని అమరావతి కోసం పొన్నూరు రైతులను కొండవీటి వరదనీటితో ముంచారు. పంటలు నీటమునిగి రైతులు దుర్భర పరిస్థితుల్లో ఉన్నా మంత్రులు కానీ, కూటమి ఎమ్మెల్యేలు కానీ పొలాల వైపు కన్నెత్తి కూడా చూసిన పాపానపోవడం లేదు. పంట నష్టంపై అధికారులను నివేదిక కోరినట్టు కూడా ఎక్కడా వార్తలు కూడా లేవు. రైతుల సమస్యలతో ప్రభుత్వానికి సంబంధమే లేదన్నట్టు వారి సమస్యలు అసలు సమస్యలే కావన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోంది.పొన్నూరులో 72 వేల ఎకరాల్లో పంట నష్టం:పొన్నూరు నియోజకవర్గంలో గుంటూరు ఛానల్ 17 కి.మీ మేర ప్రవహిస్తుంది. గుంటూరు ఛానల్కు గత ఏడాది గండ్లు పడ్డాయి. దాంతో ఇప్పుడు వరదనీటికి గండ్లు తెగి వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రని రైతులు కోరినప్పుడు నల్లపాడు నుంచి గ్రావెల్ తెచ్చి వేస్తున్నామని చెప్పాడు. కానీ పంట కాలువల్లోని నల్ల మట్టిని తెచ్చి ఆ గండ్లు పూడ్చేయించాడు. తూటికాడు తీయమంటే గడ్డి మందు స్ప్రే చేసి వదిలేశారు. దీనికి సాగునీటి సంఘాలు రూ.24 లక్షల బిల్లులు పెట్టుకున్నాయి. ఎండినట్టే ఎండి మళ్లీ వర్షాలతో గడ్డి పెరిగిపోయిండి. వర్షాలకు ఈ తూటికాడు తూములకు అడ్డం పడి నంబూరు దగ్గర కాలువలకు మూడు గండ్లు పడ్డాయి.ఒక్క కాకాణి వద్దనే 11 వేల ఎకరాల్లో పంటలు నీట మునిగినట్టు అధికారులే చెబుతున్నారు. చేబ్రోలు మండలంలో 15 వేల ఎకరాలు సాగు విస్తీర్ణం ఉంటే అందులో 5 వేల ఎకరాలు నీట మునిగాయి. పొన్నూరు మండలంలో 28 వేల ఎకరాల్లో 15 వేల ఎకరాలు మునిగిపొయాయి. నియోజకవర్గ వ్యాప్తంగా పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. (అంటూ ప్రెస్మీట్లో ఆ ఫోటోలు చూపారు)సమస్యపై తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడానికి వెళితే చోద్యం చూస్తున్నారే తప్ప చర్యలు తీసుకునే ఆలోచన వారిలో కనిపించలేదు. గత ఏడాది గుంటూరు ఛానల్, కృష్ణా వెస్ట్ ఛానల్, హైలెవల్ ఛానల్, అప్పాపురం ఛానల్ పరిధిలో మొత్తం 237 గండ్లు పడి 74వేల ఎకరాల మాగాణి, 30 వేల ఎకరాల ఉద్యానవన పంటలు కొట్టుకుపోయాయి. ఈ ఏడాది ఇప్పటికే 72వేల ఎకరాల్లో పంట వరద ముంపునకు గురైనట్టు ప్రాథమిక అంచనాలను బట్టి తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో రైతులకు భరోసా కల్పించేలా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. వరద ముంపు ప్రాంతాల్లో ఎక్కడా ఎన్యుమరేషన్ కి ఆదేశించలేదు.పొన్నూరును ముంచెత్తిన అమరావతి వరద:నంబూరు గ్రామంలో గతంలో ఉత్సవాల కోసం వచ్చిన డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, 18 వేల ఎకరాల్లో పంట నీట మునిగి రైతులు అల్లాడిపోతుంటే కనీసం పరామర్శించలేదు. నిజానికి ఈ పరిస్థితులు రావడానికి ప్రధాన కారణం అమరావతి ముంపును తగ్గించడం కోసం ప్రభుత్వం కొండవీటి వాగుకు పంపులు పెట్టి గుంటూరు ఛానల్, కృష్ణా ఛానల్, అప్పాపురం ఛానల్లోకి మళ్లిస్తోందని రైతులు చెబుతున్నారు.ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ చూపి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.రూ.3 వేల కోట్ల దోపిడీకి ధూళిపాళ్ల స్కెచ్:గుంటూరు – బాపట్ల ప్రధాన రహదారిని నేషనల్ హైవేగా మార్చి ఫోర్ వేగా అభివృద్ధి మార్చాలని చూస్తున్నారు. ఎప్పుడో బ్రిటీష్ కాలంలో కట్టిన చేబ్రోలు–కొమ్మమూరు బ్రిడ్జిని ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ధూళిపాళ్ల నరేంద్ర పునర్నిర్మాణం చేయాలని అనుకోలేదు. నాడు జగన్ సీఎం అయ్యాక రూ.45 కోట్లకు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ను నియమించి బ్రిడ్జి పనులు మొదలుపెడితే కూటమి ప్రభుత్వం వచ్చాక 14 నెలలుగా ఈ పనులు పక్కన పడేశారు.కాంట్రాక్టర్ను రూ.5కోట్లు కమీషన్లు కట్టాలని డిమాండ్ చేయడంతో పనులు వదిలేసి వెళ్లిపోయాడు. ఇటీవల కురుస్తున్న వర్షాలు, వరదలతో రోడ్డు సగం కొట్టుకుపోయింది. ఈ బ్రిడ్జి కనుక కూలిపోతే రెండు జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. గత నెలన్నర కాలంగా ఎమ్మెల్యే నియోజకవర్గంలో జాడ లేకుండా పోయాడు.నంబూరు రైతులు తమ గోస వినిపించాలని ఎమ్మెల్యేకు ఫోన్ చేస్తే అవి పంటలు పండే పొలాలు కాదని, లేఅవుట్లుగా మార్చుకోవాలని ఉచిత సలహాలిస్తున్నాడని వారు వాపోతున్నారు. రాజధానికి దగ్గరగా ఉన్న 30 వేల ఎకరాలను లేఅవుట్లుగా మార్చితే ఎకరాకు రూ.10 లక్షల వంతున వసూలు చేసి రూ.3 వేల కోట్లు సొమ్ము చేసుకోవచ్చనేది ఎమ్మెల్యే కుట్ర చేస్తున్నారని అంబటి మురళీకృష్ణ ఆరోపించారు. -
పులివెందుల, ఒంటిమిట్ట పోలింగ్ సమాచారం ఇవ్వండి: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ఖూనీ చేస్తూ, అత్యంత దారుణంగా, ఏకపక్షంగా నిర్వహించిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలపై వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తోంది. ఆ దిశలోనే ఆ రెండు ఎన్నికల పోలింగ్కు సంబంధించి.. ‘‘పోలింగ్ స్టేషన్లు, ఆయా ప్రాంగణాల సీసీ కెమెరా ఫుటేజ్, పలు ఘటనలకు సంబంధించిన వీడియో కవరేజ్, పోలింగ్కు సంబంధించిన వెబ్కాస్టింగ్, ఆ రోజు పోలింగ్ బూత్ల్లో కూర్చున్న ఏజెంట్ల పేర్లు జాబితా....పోలింగ్ ఆఫీసర్ (పీఓ) డైరీ, ఫామ్–12. ఫామ్–32 ఈ ఏడు అంశాల పూర్తి వివరాలు, సమాచారం ఇవ్వాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘాని(ఎస్ఈసీ)కి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వేర్వేరుగా రెండు (పులివెందుల, ఒంటిమిట్ట) వినతిపత్రాలు పంపించారు. వీలైనంత త్వరగా ఆ వివరాలు, పూర్తి సమాచారం ఇవ్వాలి’’ అని లేఖల్లో లేళ్ల అప్పిరెడ్డి విజ్ఞప్తి చేశారు.పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రకటించిన నాటి నుంచి అధికార పక్షం చేసిన అరాచకాలు, వారికి వత్తాసు పలుకుతూ పోలీసులు వ్యవహరించిన తీరుపై వైఎస్సార్సీపీ ప్రత్యక్షంగానూ, లేఖల ద్వారానూ మొత్తం 35 పర్యాయాలు ఎస్ఈసీకి వినతిపత్రాలు అందజేసింది. ఫిర్యాదు చేసింది. ఎన్నికలకు వారం రోజుల ముందు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్యాదవ్, పార్టీ నాయకుడు వేల్పుల రామలింగారెడ్డిపై హత్యాయత్నం జరిగింది. దానిపై ఆధారాలతో సహా ఎస్ఈసీకి వైయస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. అయినా ఎస్ఈసీ పట్టించుకోలేదు.ఇక ఎన్నికల రోజున ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, తెల్లవారుజాము నుంచే అన్ని పోలింగ్ బూత్లు స్వాధీనం చేసుకున్న అధికార పక్షం నాయకులు, కార్యకర్తలు.. చివరకు ఏ పోలింగ్ బూత్లోకి వైఎస్సార్పీపీ ఏజెంట్లను అడుగు కూడా పెట్టనీయలేదు. వారి నుంచి ఏజెంట్ అధీకృత ఫామ్స్ లాగేసుకున్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులెవ్వరూ ఓటు వేయకుండా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. చివరకు పులివెందులలో వైఎస్సార్సీపీ అభ్యర్థి తుమ్మల హేమంతరెడ్డిని కూడా ఓటు వేయనీయలేదు.ఆయన్ను ఇంట్లో నుంచి బయటకు కదలనీయలేదు. ప్రతిచోటా పోలీసు బలగాలను ఉపయోగించారు. యథేచ్ఛగా రిగ్గింగ్ చేసుకున్నారు. దీనిపై అప్పటికప్పుడు ఆధారాలతో సహా, ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసినా, ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఈ నేపథ్యంలో ఆ రెండు ఉప ఎన్నికల పూర్తి వివరాలు, సమాచారం, వీడియోలు ఇవ్వాలంటూ వైఎస్సార్సీపీ రెండు లేఖల ద్వారా ఎస్ఈసీకి విజ్ఞప్తి చేసింది. -
మూడు రోజుల పాటు భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీనికి అనుబంధంగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల మీదుగా రుతుపవన ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు గరిష్టంగా 60 కి.మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ఈ నెల 18 వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. కళింగపట్నం, భీమిలి, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గడిచిన 24 గంటల్లో పెందుర్తిలో 87.5 మి.మీ, వేపగుంటలో 74 మి.మీ, జియ్యమ్మవలసలో 67మి.మీ, కురుపాంలో 60మి.మీ వర్షపాతం నమోదైంది. -
ప్రీమియం పెను భారం..
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తేయడం వల్ల ఈ ఖరీఫ్లో 86లక్షల ఎకరాలకు గానూ, కేవలం 14.15 లక్షల ఎకరాలకు మాత్రమే రైతులు సొంత ఖర్చుతో బీమా చేయించుకోగలిగారు. ఐదేళ్ల పాటు పైసా భారం లేకుండా అండగా నిలిచిన ఉచిత పంటల బీమా పథకాన్ని అధికారంలోకి వచ్చీ రాగానే చంద్రబాబు కూటమి ప్రభుత్వం అటకెక్కించింది. ప్రీమియం భారాన్ని రైతుల నెత్తిన మోపుతూ స్వచ్ఛంద నమోదు పద్ధతిన పంటల బీమా అమలుకు శ్రీకారం చుట్టింది.ప్రీమియం భారం భరించలేని స్థితిలో ఉండడంతో ఈ పథకంలో చేరలేక అన్నదాతలు బీమాకు దూరమైపోతున్నారు. ఈ నేపథ్యంలో 2025 ఖరీఫ్ సీజన్కు వాతావరణ ఆధారిత పంటలతో పాటు దిగుబడి ఆధారిత పంటలకు ప్రీమియం చెల్లించేందుకు గడువు ముగిసింది. ఉచిత పంటల బీమా పుణ్యమా అని 2024 ఖరీఫ్లో 85.83 లక్షల మంది రైతులకు బీమా రక్షణ లభించింది. దాదాపు 71.17 లక్షల ఎకరాల్లో పంటలకు బీమా కవరేజ్ లభించింది. కానీ ఈ ఏడాది అంటే 2025 ఖరీఫ్లో బాబు ప్రభుత్వ నిర్వాకం వల్ల కేవలం 10.97 లక్షల మంది రైతులు తమ సొంత డబ్బులు చెల్లించి 14.15 లక్షల ఎకరాలకు బీమా ప్రీమియం చెల్లించారు. దీంతో 71.85 లక్షల ఎకరాలకు బీమా దక్కలేదు. నోటిఫై చేసిన పంటల సాగు విస్తీర్ణంలో కూడా 12 శాతం పంటలకు మించి బీమా కవరేజ్ లభించలేదు. దాదాపు 90 శాతం మంది రైతులు బీమా రక్షణకు దూరమైపోయారు. దీంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.జిల్లాకో రీతిలో.. పంటకో రీతిలో అమలు» ఖరీఫ్ 2025–26 సీజన్లో స్వచ్ఛంద పంటల బీమా పథకం కింద దిగుబడి ఆధారంగా 15, వాతావరణం ఆధారంగా 7 చొప్పున 22 పంటలను రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. వరికి మాత్రమే 26 జిల్లాల్లో నోటిఫై చేయగా, మిగిలిన పంటలకు జిల్లా పరిధిలో సాగు విస్తీర్ణాన్ని బట్టి నోటిఫై చేశారు. నోటిఫై చేసిన పంటల వాస్తవ సాగు విస్తీర్ణం 86 లక్షల ఎకరాలు కాగా, రాష్ట్ర ప్రభుత్వం 70.36 లక్షల ఎకరాలకే నోటిఫై చేసింది. వీటిలో దిగుబడి ఆధారిత పంటల సాగు విస్తీర్ణం 50.76 లక్షల ఎకరాలు కాగా, వాతావరణ ఆధారిత పంటల సాగు విస్తీర్ణం 19.60 లక్షల ఎకరాలుగా పేర్కొంది.» దిగుబడి ఆధారిత పంటలను ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై)తో, వాతావరణం ఆధారిత పంటలను పరిమిత వాతావరణం ఆధారిత పంటల బీమా పథకం (ఆర్డబ్ల్యూబీసీఐఎస్) కింద స్వచ్ఛంద నమోదు పద్ధతిన అమలు చేస్తున్నారు. రైతులు ముందుగా జిల్లాల వారీగా కంపెనీలు నిర్దేశించిన ప్రీమియం సొమ్ము జమ చేసి, నిర్దేశిత గడువులోగా ఈ పథకంలో చేరాలి. బ్యాంకుల్లో పంట రుణాలు పొందే రైతులు ఐచ్ఛిక పద్ధతిలో ఈ పథకంలో చేరేందుకు ముందుకొస్తే, ప్రీమియం మొత్తాన్ని మినహాయించుకుని ఆ మేరకు రైతుల తరఫున బ్యాంకులు కంపెనీలకు డబ్బు చెల్లిస్తాయి. » రుణాలు పొందని రైతులైతే స్వచ్ఛందంగా సమీప సచివాలయాలు, రైతు సేవా కేంద్రాలు, కామన్ సర్వీస్ సెంటర్లలో నిర్దేశిత ఫారాలు నింపి, సాగు వివరాలు నమోదు చేసి.. ప్రీమియం చెల్లించాలి. అయితే జిల్లాకో రీతిలో, పంటకో రీతిలో కంపెనీలు నిర్దేశించిన ప్రీమియం మొత్తం రైతులకు పెనుభారంగా మారింది. » గడిచిన 2024 ఖరీఫ్ సీజన్లో ఉచిత పంటల బీమాను కొనసాగించడంతో వాతావరణ ఆధారిత పంటలకు సంబంధించి నూరు శాతం అంటే 19.60 లక్షల ఎకరాలకు గాను 13.86 లక్షల మంది రైతులు బీమా కవరేజీ లబ్ధి పొందారు. ఈ ఏడాది జూలై 15వ తేదీతో ఈ పంటలకు ప్రీమియం చెల్లింపు గడువు ముగియగా, కేవలం 10.23 లక్షల ఎకరాల్లో సాగైన పంటలకు సంబంధించి 6.80 లక్షల మంది రైతులు బీమా కవరేజ్ పొందగలిగారు. అంటే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 9.37 లక్షల ఎకరాల్లో సాగైన పంటలకు సంబంధించి 7.06 లక్షల మంది రైతులు బీమా రక్షణ పొందలేక పోయారు.వరి సహా ఇతర పంటల పరిస్థితి దారుణం » వాస్తవానికి వరి సాధారణ విస్తీర్ణం 37.17 లక్షల ఎకరాలు కాగా, ప్రభుత్వం 32.66 లక్షల ఎకరాల్లో సాగయ్యే పంటనే నోటిఫై చేసింది. వరియేతర పంటల సాధారణ విస్తీర్ణం 29.23 లక్షల ఎకరాలుండగా, ప్రభుత్వం 18.09 లక్షల ఎకరాలకే పరిమితం చేసింది. కనీసం ఆ మేరకైనా బీమా కవరేజ్ కల్పించిందా అంటే అదీ లేదు.» గతేడాది ఉచిత పంటల బీమా పుణ్యమా అని దిగుబడి ఆధారిత పంటలకు సంబంధించి 71.57 లక్షల మంది రైతులు 50.77 లక్షల ఎకరాల్లో పంటలకు బీమా రక్షణ పొందగలిగారు. వరియేతర పంటలకు ప్రీమియం చెల్లింపు గడువు జూలై 31వ తేదీతో ముగియగా, వరి పంటకు శుక్రవారం (ఆగష్టు 15వ తేదీ)తో ముగిసింది. » వరి సహా దిగుబడి ఆధారిత పంటలన్నీ కలిపి ఈ సీజన్లో కేవలం 3.92 లక్షల ఎకరాలకు 4.17 లక్షల మంది రైతులు మాత్రమే ప్రీమియం చెల్లించి బీమా కవరేజ్ పొందగలిగారు. ఇందులో ఒక్క వరి పంటే దాదాపు 3 లక్షల ఎకరాలుండటం గమనార్హం. ఇతర పంటలన్నీ కలిపి 92 వేల ఎకరాలకు మించలేదు. ఈ లెక్కన గతేడాదితో పోలిస్తే 46.84 లక్షల ఎకరాల్లో నోటిఫై చేసిన పంటలకు 67.40 లక్షల మంది రైతులు బీమా చేయించుకోలేకపోయారు. మొత్తంగా నోటిఫై చేసిన పంటల వరకు చూసినా సరే 57 లక్షల ఎకరాల్లో సాగైన పంటలకు బీమా కవరేజ్ లభించ లేదు. 74.86 లక్షల మంది రైతులు బీమా రక్షణ పొందలేకపోయారు. 2024– 25 రబీ సీజన్లో 9.90 లక్షల ఎకరాలకే బీమాచంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం వల్ల 2024– 25 రబీ సీజన్లో కేవలం 6.75 లక్షల మంది రైతులకు సంబంధించి 9.90 లక్షల ఎకరాల్లో సాగు చేసిన పంటలకు మాత్రమే బీమా కవరేజ్ లభించింది. రబీ–2023 సీజన్తో పోల్చుకుంటే 24.35 లక్షల ఎకరాలకు బీమా కవరేజ్ దూరం కాగా, 36.63 లక్షల మంది రైతులు బీమా రక్షణ పొందలేకపోయారు. మరో వైపు రైతులు తమ వాటాగా ప్రీమియం రూపంలో రూ.37.77 కోట్లు చెల్లించగా, రాష్ట్ర ప్రభుత్వం తమ వాటాగా రూ.88.12 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం కూడా ఇప్పటి వరకు చెల్లించిన పాపాన పోలేదు.ఐదేళ్లూ పైసా భారం లేకుండా భరోసా» వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2019–24 మధ్య ఐదేళ్లూ పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేసి రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచింది. ఈ క్రాప్లో నమోదే ప్రామాణికంగా నోటిఫై చేసిన పంటలకు యూనివర్సల్ కవరేజ్ కల్పించింది. పైగా ఏ సీజన్కు చెందిన బీమా పరిహారాన్ని మరుసటి ఏడాది అదే సీజన్ ముగిసేలోగా జమ చేసి అండగా నిలిచింది. » ఏటా సగటున 1.08 కోట్ల ఎకరాల చొప్పున ఐదేళ్లలో 5.42 కోట్ల ఎకరాలకు, ఏటా సగటున 40.50 లక్షల మంది చొప్పున ఐదేళ్లలో 2.10 కోట్ల మంది రైతులకు బీమా రక్షణ కల్పించింది. ప్రభుత్వ వాటాతో పాటు రైతుల తరఫున రూ.3,022.26 కోట్లు ప్రీమియం కూడా వైఎస్ జగన్ ప్రభుత్వమే కంపెనీలకు చెల్లించింది. » ఐదేళ్లలో 54.55 లక్షల మంది రైతులకు 7,802.08 కోట్ల మేర పరిహారాన్ని రైతుల ఖాతాలకు జమ చేసింది. అంతేకాకుండా 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం 6.20 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టిన రూ.715.84 కోట్ల బకాయిలను సైతం చెల్లించి రైతులకు అండగా నిలిచింది. 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంతో పోల్చుకుంటే అదనంగా 23.70 లక్షల మంది రైతులకు రూ.43.90 కోట్ల మేర పరిహారం అందించింది.2024 ఖరీఫ్ పంటల బీమా పరిహారం ఎగనామం2024 ఖరీఫ్ సీజన్ వరకు ఉచిత పంటల బీమా పథకాన్నే కొనసాగించిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. 2024–25 రబీ సీజన్ నుంచి ఈ పథకాన్ని పూర్తిగా ఎత్తివేసింది. అయితే 2024 ఖరీఫ్ సీజన్లో 71.17 లక్షల ఎకరాలకు సంబంధించి 85.83 లక్షల మంది రైతులకు అందాల్సిన పరిహారం మాత్రం ఇప్పటికీ అందలేదు. దిగుబడి ఆధారిత పంటలకు రూ.303.88 కోట్లు, వాతావరణ ఆధారిత పంటలకు రూ.530.04 కోట్లు.. మొత్తంగా రైతుల వాటాతో కలిపి రూ.833.92 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం బీమా కంపెనీలకు చెల్లించలేదు. ఏప్రిల్, మేలో ఈ ప్రీమియం చెల్లించి ఉంటే జూలై –ఆగస్టుల్లో రైతులకు బీమా పరిహారం అందేది. ఇప్పటి వరకు దిగుబడులు, వాతావరణం ఆధారిత పంట నష్టం వివరాలు కూడా కొలిక్కి రాని పరిస్థితి నెలకొంది. దీంతో 2024 ఖరీఫ్ సీజన్లో నష్టపోయిన రైతులకు ఎంత పరిహారం వస్తుందో.. ఎప్పుడు వస్తుందో తెలియని దుస్థితి నెలకొంది. మరో వైపు 2023–24 సీజన్కు సంబంధించిన ప్రీమియం రూ.930 కోట్లు (2024 ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికల కోడ్ కారణంగా చెల్లించలేదు) చంద్రబాబు ప్రభుత్వం చెల్లించి ఉండాలి. ఆ మొత్తాన్ని ఇప్పటికీ చెల్లించక పోవడంతో రూ.1,385 కోట్ల పరిహారం నేటికీ రైతులకు అందలేదు.అందని పంట నష్ట పరిహారంపంటల బీమా పరిహారానికి తోడు పంట నష్టపరిహారం, కరువు సాయం కూడా నేటికీ జమ కాలేదు. గత ఖరీఫ్లో అధికారికంగా దాదాపు 6.96 లక్షల మంది రైతులకు చెందిన 10.78 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నాయి. కరువు బకాయిలతో సహా రూ.838.57 కోట్ల పంట నష్ట పరిహారం చెల్లించాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 1.84 లక్షల మంది రైతులకు రూ.285 కోట్లు జమ చేసి చేతులు దలుపుకుంది. రాయలసీమ జిల్లాల్లో ఖరీఫ్లో దాదాపు 100 మండలాలు, రబీలో 80కి పైగా మండలాలు కరువు కోరల్లో చిక్కుకోగా, కంటి తుడుపు చర్యగా ఖరీఫ్లో 54, రబీలో 51 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించినా, పైసా సాయం చేయలేదు. ఖరీఫ్ సీజన్లో ప్రక టించిన కరువు మండలాల్లో 2.36 లక్షల ఎకరాలు బీడు వారగా, పంటలు కోల్పోయిన దాదాపు 1.41 లక్షల మంది రైతులకు చెల్లించాల్సిన రూ.143.10 కోట్ల కరువు సాయం నేటికీ జమ చేయలేదు.ప్రీమియం భారం భరించలేకున్నాంవైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్ల పాటు ఉచిత పంటల బీమా అమలు చేశారు. మా దగ్గర నుంచి పైసా కూడా కట్టించుకోలేదు. ఏ సీజన్లో జరిగిన నష్టానికి సంబంధించిన పరిహారం ఆ మరుసటి ఏడాది అదే సీజన్ ముగిసే నాటికి ఇచ్చేవారు. అయితే ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వరికి ప్రీమియం మొత్తం ఎక్కువగా ఉండడంతో పంటల బీమా చేయించుకోలేక పోయాం. సాంకేతిక కారణాలతో అన్నదాత సుఖీభవ సాయం కూడా నాకు జమ చేయలేదు. ఈ ప్రభుత్వంలో రైతులను పట్టించుకునే పరిస్థితి కన్పించడం లేదు. – వేముల సీతారామయ్య, పైడూరు పాడు, విజయవాడ రూరల్ -
కాదేదీ... కల్తీకి అనర్హం..!
సాక్షి, అమరావతి: ‘ప్రజలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారం ఔషధం వంటిది. తీసుకునే ఆహారంపైనే ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.’ అంటూ ప్రజలకు సూచనలు ఇచ్చిన సీఎం చంద్రబాబు.. చేతల్లో మాత్రం ఆహార భద్రతా విభాగాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు. రాష్ట్రంలో హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార తయారీ సంస్థల్లో ఆహార భద్రతా ప్రమాణాలపై పర్యవేక్షణ కొరవడింది. ఉప్పు, కారం, పసుపు, పాలు.. ఇలా అన్ని రకాల ఆహార పదార్థాల కల్తీ రోజు రోజుకు పెచ్చుమీరుతుంటే నియంత్రణ చర్యలు మాత్రం తిరోగమనంలో ఉంటున్నాయి. సురక్షిత, పరిశుభ్రమైన ఆహారాన్ని ప్రోత్సహించడానికి దేశంలోని రాష్ట్రాలు తీసుకున్న చర్యలపై ఇటీవల ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఒక నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం 2022–23, 2023–24తో పోలిస్తే బాబు ఏలుబడిలో 2024–25లో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ విభాగం నిర్వహించిన తనిఖీలు తగ్గినట్టు వెల్లడైంది. నివేదికలోని మరికొన్ని అంశాలు.. » రాష్ట్రంలో ఆహార భద్రతా చట్టాన్ని అమలు చేయాల్సిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం).. అధికారులు, సిబ్బంది లేక కనుమరుగు అయ్యే దుస్థితిలో ఉంది. ఈ విభాగానికి 723 శాంక్షన్ పోస్టులు ఉండగా, ఏకంగా 80 శాతం (580 పోస్టులు) ఖాళీగా ఉన్నాయి. కేవలం 143 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. »ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ ఐపీఎం ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. ఆయన తర్వాత రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ అధికారి ఒక్కరూ లేని దయనీయ పరిస్థితి నెలకొంది. » గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైజాగ్, గుంటూరు, తిరుపతిల్లో ఫుడ్ సేఫ్టీ ల్యాబ్లను కేంద్రం మంజూరు చేసింది. అదే విధంగా తిరుమల, కర్నూలు ల్యాబ్లకు అప్పట్లోనే ప్రతిపాదనలు పంపారు. వీటిని రూ.100 కోట్లతో పూర్తిగా కేంద్రమే ఏర్పాటు చేస్తోంది. పరికరాల కొనుగోలుకు టెండర్లు పిలిచి, వర్క్ ఆర్డర్లు కూడా ఇచ్చారు. వీటిల్లో పనిచేయడానికి ఒక్కో ల్యాబ్లో సగటున 50 మంది సిబ్బందిని నియమించాల్సి ఉంది. నెల రోజుల్లో తిరుమల, వైజాగ్ ల్యాబ్లు అందుబాటులోకి రానున్నాయి. మరో ఆరు నెలల్లో మిగిలిన ల్యాబ్లు అందుబాటులోకి రావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకూ ప్రభుత్వం సిబ్బంది నియామక ప్రక్రియను ప్రారంభించనే లేదు. » రాష్ట్ర కార్యాలయంలో జాయింట్ ఫుడ్ కంట్రోలర్, డిప్యూటీ ఫుడ్ కంట్రోలర్ పోస్టులు ఖాళీగా>నే ఉన్నాయి. పదోన్నతి ద్వారా ఈ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. పదోన్నతికి అర్హులైన అధికారులున్నప్పటికీ జిల్లాలు వదిలేసి రావాల్సి వస్తుందని వారు పదోన్నతులు చేపట్టకుండా అడ్డుపడుతున్నారనే విమర్శలున్నాయి. » అరకొర తనిఖీల్లో సేకరించిన శాంపిల్స్ను పరీక్షించడానికి ల్యాబ్లలో కనీస వసతులు కూడా లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి.» గత ప్రభుత్వంలో ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా నాలుగు మొబైల్ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ వాహనాలు కొన్నారు. వీటిని ప్రభుత్వం మూలనపడేసింది. -
‘ముద్దు’ల ముచ్చట.. ‘కూన’ నైట్ కాలింగ్..!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం పట్నం బజారు (గుంటూరు), కళ్యాణదుర్గం: దేశమంతా ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరుపుకొంటున్న వేళ.. రాష్ట్రంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు బరితెగించి ప్రవర్తిస్తుండటంతో మహిళలు రక్షణ కరువై అల్లాడుతున్నారు. పైశాచిక వేధింపులతో గుండె బరువై రాలిపోతున్నారు. బాధ్యత మరిచిన టీడీపీ ప్రజాప్రతినిధుల విశృంఖల వైఖరితో మహిళలు బెంబేలెత్తుతున్నారు. కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం టీడీపీ నేతల అడుగులకు మడుగులొత్తుతోంది. విద్యాధికులైన మహిళలను సైతం కామ పిశాచాలు వేధిస్తుంటే కట్టడి చేయాల్సిన ప్రభుత్వ పెద్దలు కళ్లు మూసుకుని కూర్చున్నారు! కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ నాయకులు, ఆ పార్టీ ప్రజా ప్రతినిధుల ఆగడాలు మితిమీరిపోవడంతో మహిళా ఉద్యోగులు కార్యాలయాలకు రావాలంటే వణికిపోతున్నారు. రాత్రిపూట పార్టీ కార్యాలయాలకు పిలుస్తూ.. వీడియో కాల్స్ చేసి వేధింపులకు దిగుతున్నారు. అనంతపురం, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో వెలుగులోకి వచ్చిన అఘాయిత్యాలు.. గుంటూరు ఎమ్మెల్యే ‘ముద్దు’ వీడియోలు మహిళల పట్ల ఏడాది పాలనలో జరుగుతున్న దుశ్చర్యలకు మచ్చు తునకగా నిలుస్తున్నాయి. ‘కూన’ వీడియో కాల్స్...!‘ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమా ర్ రాత్రి 10 గంటల తర్వాత పార్టీ కార్యాలయాలకు రావాలని తన అనుచరులతో పిలిపిస్తారు. చాలాసేపు అక్కడే ఉంచుతారు. రాత్రి 10.30 దాటిన తర్వాత వీడియో కాల్ చేసి వేధిస్తుంటాడు. శారీరకంగా, మానసికంగా వేధించాడు. సాధారణ కాల్స్ చేయరు. వీడియో కాల్ అయితేనే మాట్లాడతారని అనుచరులతో చెప్పిస్తారు. దుర్బుద్ధితోనే ఇదంతా... దారికి రాలేదని వేధింపులకు గురి చేస్తున్నారు. నాలా నియోజకవర్గంలో అనేక మంది మహిళా ఉద్యోగులను ఇబ్బంది పెట్టారు. ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నేతల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలను కున్నా...!’టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులు ఎదుర్కొన్న పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్య ఆవేదన ఇదీ! దళితురాలిని తీవ్రంగా వేధించారంటూ బాధితురాలు కన్నీరు మున్నీరవుతున్నారు. కూన రవికుమార్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు చెబుతున్నారు. ఇటీవల ఎమ్మెల్యే ఇద్దరు మనుషులను పంపించి కేజీబీవీలోని టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందితో తనకు వ్యతిరేకంగా బలవంతంగా సంతకాలు చేయించినట్లు తెలిపారు. అధికారులు తనకు అండగా ఉండకపోగా ఎమ్మెల్యేకు కొమ్ము కాస్తున్నారని వాపోయారు. కాగా గార, కంచిలి కేజీబీవీల ప్రిన్సిపాళ్లపై కూడా వ్యూహాత్మకంగా ఫిర్యాదులు చేయించి బదిలీలు చేయించారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.బలిపశువుని చేస్తున్నారు..!గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే ఎండీ నసీర్ అహ్మద్ ‘ముద్దు’ దృశ్యాల వీడియో వైరల్ అయిన ఘటనలో తనని బలిపశువుని చేస్తున్నారంటూ పార్టీ మహిళా నేత షేక్ సూఫియా పురుగుల మందు తాగడం కలకలం రేపింది. ఎమ్మెల్యే, పోలీసుల వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ శుక్రవారం ఆమె గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియం వద్ద ఆత్మహత్యాయత్నం చేయడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పార్టీ నాయకురాలు గుడిపల్లి వాణితో ఎమ్మెల్యే వివాహేతర సంబంధం గురించి ప్రతి ఒక్కరికీ తెలుసని సూఫియా మీడియాతో పేర్కొన్నారు. ఎమ్మెల్యేతో సన్నిహితంగా ఉన్న వీడియోలను ఆమె భర్త నవీన్కృష్ణ స్వయంగా రికార్డ్ చేసి వైరల్ చేశారని ఆరోపించారు. తాను ఈ విషయాన్ని ఎమ్మెల్యే నసీర్కు చెప్పడంతో రెండు రోజులు మాట్లాడకుండా ఉండమన్నారని చెప్పారు. గుడిపల్లి వాణి కుటుంబంతో ఎమ్మెల్యే సెటిల్మెంట్ చేసుకుని తనని ఇరికించే యత్నం చేస్తున్నారని చెప్పారు. నవీన్కృష్ణ ఫోన్లో ఉన్న వీడియోలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పోలీసుల వేధింపులు తట్టుకోలేకపోతున్నానని, తనకు ఆత్మహత్యే శరణ్యమని వాపోయారు. కళ్యాణదుర్గంలో గర్భిణి బలవన్మరణం..‘భర్త, అత్త మామల వేధింపులు తాళలేక పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసినా నాకు న్యాయం జరగలేదు. నా ఫిర్యాదును పోలీసోళ్లు మార్చేశారు. టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి నాకు అన్యాయం చేశారు..’ అని విలపిస్తూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన నిండు గర్భిణి శ్రావణి (22) ఉరి పోసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తన దయనీయ పరిస్థితిని ఫోన్లో ఆడియో రికార్డ్ చేసి తనువు చాలించింది. ఈ ఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకోగా... శుక్రవారం ఉదయం మృతురాలి ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ ప్రభుత్వంలో న్యాయం జరగదా..?కళ్యాణదుర్గానికే చెందిన శ్రీనివాసులుతో మూడేళ్ల క్రితం శ్రావణికి వివాహమైంది. అదనపు కట్నం కోసం భర్త,అత్త మామలు తరచూ వేధించడంతో కళ్యాణదుర్గం పోలీస్లకు ఫిర్యాదు చేసినట్లు శ్రావణి పేర్కొంది. స్థానిక టీడీపీ నేత, మున్సిపల్ మాజీ చైర్మన్ వైపీ రమేష్, మాజీ వైస్ చైర్మన్ శర్మస్ వలి ఒత్తిళ్లతో సీఐ దీన్ని మరో రకంగా మార్చేసి భర్త, అత్తమా మలకు అనుకూలంగా వ్యవహరించారని ఆడియోలో మృతురాలు కన్నీరు మున్నీరైంది. కడుపులో పెరుగుతున్న బిడ్డతో పాటు తాను ఈ లోకం నుంచి వెళ్లిపోతున్నామని, కనీసం తన మొదటి బిడ్డకైనా (రెండేళ్ల చిన్నారి) న్యాయం చేయాలని వేడుకుంది. ఈ ప్రభుత్వంలో ఇక న్యాయం జరగదా? అని ఆక్రోశించింది. ఈమేరకు ఫోన్లో వాయిస్ రికార్డ్ చేసి పుట్టింట్లో ఉరేసుకుని తనువు చాలించింది. దీనిపై పట్టణ సీఐ యువరాజును వివరణ కోరగా.. మృతురాలు ఆరోపించినట్లుగా తాము నిర్లక్ష్యం చేయలేదని చెప్పారు. -
కుట్టేస్తారు.. మిషన్లు ఇవ్వండి!
సాక్షి, అమరావతి: కుట్టుశిక్షణ ఇచ్చేశాం.. ముందు మిషన్లు ఇవ్వండి.. వివరాలు తరువాత.. అంటూ ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతో రూ.కోట్లు కొట్టేసేందుకు కొందరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఏదోరకంగా నిధులు విడుదల చేయించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇంతకుముందు ఒకటి, రెండు రకాలుగా ప్రయత్నించినా పనికాకపోవడంతో తాజాగా ఎమ్మెల్యేల లేఖలతో రంగంలోకి దిగారు. బీసీ సంక్షేమశాఖలో రూ.257 కోట్ల తో 1,02,832 మందికిపైగా మహిళలకు ఉచితంగా కుట్టుశిక్షణ ఇచ్చి మిషన్లు ఇచ్చేందుకు ఉద్దేశించిన స్కీమ్లో రోజుకో వింతపోకడ వెలుగులోకి వస్తోంది. బీసీ, ఈడబ్ల్యూఎస్ మహిళలకోసం అంటూ చేపట్టిన ఈ పథకానికి ఆదిలోనే అక్రమాల చెదలు పట్టిన సంగతి తెలిసిందే. కీలకనేతల అండదండలతో టెండర్ నుంచి శిక్షణ వరకు అనేక నిబంధనలకు పాతరేయడంతో ఈ స్కీమ్లో వేలు పెడితే భవిష్యత్లో చట్టపరంగా ఇబ్బందులు తప్పవని అధికారులు హడలిపోతున్నారు. దీనికితోడు జాతీయస్థాయిలో అమలు చేస్తున్న ప్రధానమంత్రి విశ్వకర్మ (పీఎం విశ్వకర్మ) స్వయం ఉపాధి శిక్షణ కార్య్రకమాల్లో కుట్టుశిక్షణను పరిగణనలోకి తీసుకోకపోయినా.. రాష్ట్రంలో ఈ తరహా శిక్షణ చేపట్టడాన్ని అధికారులు తప్పుబడుతున్నారు. ఈ పథకానికి బిల్లులు మంజూరు చేసి తాము దోషులుగా నిలబడలేమంటూ ఫైనాన్స్ అధికారులు కొర్రీవేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో ఈ పథకంపై వస్తున్న విమర్శలను రాజకీయాలకు ముడిపెట్టి ప్రభుత్వ పెద్దలను తమకు అనుకూలంగా మలుచుకుని స్కీమ్కు సంబంధించిన బిల్లులు రాబట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎంతమందికి, ఎక్కడ శిక్షణ ఇచ్చారో తెలియదు.. కొందరు కీలక బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారుల (ఈడీల)తో సమావేశం నిర్వహించి ఉచిత శిక్షణ మొదటిదశ పూర్తయినట్టు ఆమోదం తెలపాలని ఒత్తిడి చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో దరఖాస్తులు తీసుకుని, నియోజకవర్గాల వారీగా శిక్షణ ఇచ్చినట్టు ప్రకటించి ఇప్పుడు తమను బాధ్యుల్ని చేస్తున్నారంటూ ఈడీలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రతి నియోజకవర్గంలో మొదటిదశ శిక్షణ పూర్తిచేసినట్టు కాంట్రాక్టర్ మనుషులు, ప్రభుత్వంలోని కొందరు ఎమ్మెల్యేల లేఖలు తీసుకుంటున్నారు. శిక్షణ ఎక్కడ ఎంతమందికి ఇచ్చారో.. ఎవరికీ తెలియని పరిస్థితిలో మొదటిదశ పూర్తయిందంటూ ఎమ్మెల్యేల లేఖ తీసుకుని, దాన్ని సిఫారసు లేఖగా ప్రయోగించి ఫైనాన్స్ అధికారులపై బిల్లుల కోసం ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా సబ్ కాంట్రాక్టులు ఇచి్చనా, శిక్షణ ఇచ్చేవారికి నైపుణ్య అర్హతలు లేకపోయినా, అరకొరగానే శిక్షణ అయిందనిపించినా, కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల నిఘాలో ఉన్న వారికి టెండరు ఖరారు చేసినా.. పట్టించుకోని కీలకనేతలు తాము అనుకున్నదే జరగాలనే పట్టుదలతో ఎమ్మెల్యేలను రంగంలోకి దించుతుండటం విమర్శనీయంగా మారింది. -
కొరకరాని కొయ్య ఎఫ్ఎంజీఈ!
సాక్షి, అమరావతి : దేశంలో అవకాశం లభించక విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన విద్యార్థులు.. అనంతరం మన దేశంలో పీజీ లేదా ప్రాక్టీస్ కోసం అవసరమయ్యే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ) గట్టెక్కలేక చతికిల బడుతున్నారు. విదేశాల్లో ఎంబీబీఎస్ అభ్యసించిన వారికి ఈ పరీక్ష ఉత్తీర్ణత తప్పనిసరి. ఈ పరీక్షను ఏటా జూన్, డిసెంబర్ నెలల్లో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్బీఈ) నిర్వహిస్తోంది. ఈ ఏడాది జూన్లో నిర్వహించిన ఎఫ్ఎంజీఈ పరీక్ష ఫలితాలను బుధవారం ప్రకటించారు. 36,034 మంది పరీక్ష రాయగా, కేవలం 18.61 శాతం అంటే 6,707 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఏకంగా 81.39 శాతం మంది మెడికోలు పరీక్ష తప్పారు. కొన్నేళ్లుగా ఎఫ్ఎంజీఈ పాస్ పర్సంటేజీ చాలా తక్కువగా ఉంటోంది. దీంతో విదేశాల్లో వైద్య విద్య నాణ్యతపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఏటా ఎఫ్ఎంజీఈ పరీక్షల్లో 70 నుంచి 80 శాతం మందికిపైగా ఫెయిల్ అవుతున్నారు. గతేడాది డిసెంబర్లో 45,552 మంది పరీక్ష రాయగా 13,149 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. గత పదేళ్లలో ఇదే అత్యధిక పాస్ పర్సంటేజీ అని తెలుస్తోంది. 2015–18 మధ్య నాలుగేళ్లలో 61 వేల మందికిపైగా పరీక్ష రాయగా 14 శాతం మేర మాత్రమే ఉత్తీర్ణత సా«ధించారు. భారత పాఠ్యాంశాలతో పోలిస్తే విదేశాల్లో పాఠ్యాంశాల్లో వ్యత్యాసం ఉండటం, తక్కువ క్లినికల్ ఎక్స్పోజర్, కొన్ని దేశాల్లో ఇంగ్లిష్ లో కాకుండా అక్కడి భాషల్లో బోధన వంటివి తక్కువ ఉత్తీర్ణతకు కారణమని వైద్య రంగ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. లక్ష్యం నెరవేరక దిగాలు దేశంలో 20 లక్షల మందికిపైగా విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్ దక్కించుకోవడం కోసం నీట్ యూజీ రాస్తున్నారు. ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలల్లో 1.20 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. డిమాండ్కు సరిపడా సీట్లు లేకపోవడంతో కష్టపడి చదివిన పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు కన్వినర్ కోటా సీట్లు దక్కడం లేదు. మన దగ్గర ఉన్న ఫీజులతో యాజమాన్య కోటా కింద చదవడం మధ్యతరగతి వారికి తలకు మించిన భారం. ఈ క్రమంలో ఎలాగైనా పిల్లల వైద్య విద్య కలను సాకారం చేయాలనే లక్ష్యంతో అప్పులు చేసి మరీ విదేశాలకు పంపుతున్నారు. రష్యా, చైనా, ఉక్రెయిన్, నేపాల్, బంగ్లాదేశ్, కజకిస్తాన్, అర్మేనియా, జార్జియా వంటి దేశాలను ఆశ్రయిస్తున్నారు. ఏపీ నుంచి ఏటా వేల సంఖ్యలో విద్యార్థులు విదేశాలకు ఎంబీబీఎస్ చదవడానికి వెళుతున్నారు. కాగా, కొన్ని దేశాల్లో మన ప్రమాణాలకు అనుగుణంగా వైద్య విద్య లేకపోవడంతో కోర్సు పూర్తయ్యాక ఎఫ్ఎంజీఈ గట్టెక్కడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో బయట చదివి వచ్చినా, స్థానికంగా ప్రాక్టీస్ పెట్టుకోలేని పరిస్థితి. ఏపీ విద్యార్థులు ఈ తరహా కష్టాలు పడకుండా నివారించే లక్ష్యంతో రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం వైద్య విద్య అవకాశాలను విస్తరించేలా అడుగులు వేసింది. 17 కొత్త వైద్య కళాశాలలు నెలకొల్పడం ద్వారా 2,550 ఎంబీబీఎస్ సీట్లను మన విద్యార్థులకు సమకూర్చడం కోసం కృషి చేసింది. 2023–24లో విజయవంతంగా 750 సీట్లను సమకూర్చింది. అనంతరం వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కళాశాలలను పీపీపీలో ప్రైవేట్కు కట్టబెట్టడం కోసం మన విద్యార్థులకు తీరని ద్రోహం తల పెట్టింది. ఈ క్రమంలో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. -
సూపర్ సిక్స్.. సూపర్ ఫ్లాప్.. చంద్రబాబు మోసాలు ఇవిగో..
సాక్షి, తాడేపల్లి: స్వాతంత్ర్య దినోత్సవం నాడు కూడా చంద్రబాబు తనకు అలవాటైనా అబద్ధాలనే ప్రజల ముందు మాట్లాడారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సూపర్ సిక్స్.. సూపర్ హిట్ అంటూ ఆయన మాట్లాడింది చూస్తే... చంద్రబాబుది సూపర్ చీటింగ్ అంటూ ప్రజలు ఈసడించుకుంటున్నారన్నారు. చివరికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీం ప్రారంభంలోనూ ఆంక్షలు పెట్టి, నిస్సిగ్గుగా మహిళలను మోసం చేసిన ఘనుడు చంద్రబాబేనని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..సీఎం చంద్రబాబు విజయవాడలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా చేసిన ప్రసంగంలోనూ తనను గురించి తాను గొప్పగా చెప్పుకోవడం, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై అసత్యపు విమర్శలు చేశారు. కనీసం స్వాతంత్ర్య దినోత్సం నాడు అయినా కొన్ని నిజాలు మాట్లాడతారుని అనుకుంటే, తన సహజ నైజంను మళ్లీ బయటపెట్టుకున్నాడు. సూపర్సిక్స్ సూపర్ హిట్ అంటూ పత్రికల్లో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చుకున్నారు. అసలు సూపర్ సిక్స్... హిట్ ఎలా అయ్యిందో చెప్పాలి.తల్లికి వందనం గత ఏడాది ఎగ్గొట్టారు. 9.7.2024న జారీ చేసిన జీఓలో విద్యార్థుల తల్లులకు రూ.15 వేలు చొప్పున తల్లికి వందనం కింద ఇస్తామని చాలా స్పష్టంగా రాశారు. ఈ జీఓను ఏడాది తరువాత అమలు చేస్తారా? ఇది మోసం కాదా చంద్రబాబూ? దీనిపై వైఎస్సార్సీపీ వెంటపడటం వల్ల ఈ ఏడాది ఇచ్చే ప్రయత్నం మొదలు పెట్టారు. కొందరికి రూ.8 వేలు, మరికొందరికి రూ.6 వేలు ఇలా అరకొరగానే తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఏడాదికి మూడు గ్యాస్ సిలెండర్లు ఉచితం అన్నారు. దీపం పథకం కింద రాష్ట్రంలో 1.59 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి.వారికి ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలెండర్లు ఇవ్వాలంటే రూ.4 వేల కోట్లు కావాలి. కానీ తొలివిడతలో రూ.895 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇక రెండో ఏడాది రూ.2600 కోట్లు కేటాయించారు. అంటే దీనిని ఏమంటారో చంద్రబాబే చెప్పాలి. అన్నదాత సుఖీభవ పథకంను గత ఏడాది ఎగ్గొట్టారు. కేంద్రం ఇచ్చే దానితో కలిసి రూ.26వేలు ఏడాదికి ఇస్తానని చెప్పి, రెండే ఏడాది రూ.7 వేలతో సరిపెట్టారు. నిరుద్యోగభృతి కింద నెలకు రూ.3 వేలు అన్నారు. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఒక్క పైసా ఇవ్వలేదు. స్త్రీశక్తి, ఉచిత బస్సు ప్రయాణం అంటూ ఈ రోజు ప్రారంభించారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడూ అంటూ వైఎస్సార్సీపీ వెంటపడితే తప్ప ఈ పథకాన్ని అమలు చేయడానికి ముందుకు రాలేదు. ఉచిత బస్సు పథకంలోనూ మహిళలను మోసం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు పద్నాలుగు నెలల తరువాత పల్లెవెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ మెట్రో, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ కేటగిరిలకు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం అంటూ అవకాశం ఇచ్చారు. పదహారు కేటగిరిల్లో కేవలం ఈ పరిమిత కేటగిరిల్లోనే ప్రయాణించాలని ఆంక్షలు పెట్టడం దారుణం కాదా?పోలవరాన్ని సర్వ నాశనం చేశారువైఎస్సార్సీపీ ప్రభుత్వం వల్లే పోలవరం, అమరావతి ఆగిపోయింది అంటూ సిగ్గూ, ఎగ్గూ లేకుండా చంద్రబాబు అబద్ధాలు అడుతున్నారు. పోలవరాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు. టీడీపీ ప్రభుత్వ అయిదేళ్ల పాలనలో సోమవారాన్ని పోలవరం అనేవాడు. ఇప్పుడు కనీసం అటు వైపు వెళ్ళే ధైర్యం చేయడం లేదు. డయాఫ్రంవాల్ మేం చెడగొట్టామని అబద్దాలు చెబుతున్నాడు. కాఫర్ డ్యాంలను నిర్మించకుండా డయాఫ్రం వాల్ నిర్మించి, దానిని నిర్వీర్యం చేశారని నిపుణుల కమిటీనే చంద్రబాబు నిర్వాకాన్ని ఎత్తి చూపింది.2027 నాటికి పోలవరం పూర్తి చేస్తానంటూ అబద్దాలు చెబుతున్నాడు. పోలవరం కాంట్రాక్ట్ల్లో కమీషన్ల కోసమే చంద్రబాబు దృష్టి పెట్టాడు. రూ.10 లక్షల కోట్లు అప్పులు చేశామంటూ మా ప్రభుత్వంపై మాట్లాడారు. ఇదే చంద్రబాబు సీఎంగా అసెంబ్లీలో రూ.6 లక్షల కోట్లు అంటూ మాట్లాడిన మాటలు మరిచిపోయారా? ఈ పద్నాలుగు నెలల్లోనే దాదాపు రూ.2 లక్షల కోట్లు అప్పులు చేశాడు. దేని కోసం ఈ అప్పులు చేస్తున్నారు. వైయస్ జగన్ పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం.అవినీతి సొమ్ము కోసమే సింగపూర్ జపంటీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు సీఎంగా సింగపూర్ ప్రభుత్వం అమరావతిలో పెట్టుబడి పెడుతుందని అబద్ధం చెప్పాడు. సింగపూర్లోని కొన్ని ప్రైవేటు కంపెనీలతో అవినీతి ఒప్పందాలు చేసుకుని, జేబులు నింపుకున్నాడు. ఈ వ్యవహారంలో సహకరించిన ఆనాటి సింగపూర్ ప్రభుత్వంలోని మంత్రి ఈశ్వరన్ అవినీతి కేసుల్లో అరెస్ట్ అయి, జైలుకు వెళ్ళాడు. దీనితో చంద్రబాబు వేసుకున్న ప్లాన్లు అన్ని రివర్స్ అయ్యాయి. ఇప్పుడు సీఎంగా మళ్ళీ సింగపూర్ వెళ్ళి, తిరిగి తన దందాను కొనసాగించాలని చూస్తే, వారు తిరస్కరించారు. దీనికి వైఎస్సార్సీపీ కారణమంటూ మాపైన ఏడుస్తున్నాడు.రాజధానిని కూడా సర్వనాశనం చేసే పరిస్థితికి తీసుకువచ్చారు. 52 వేల ఎకరాలను పూర్తి చేయడంకుండా మరో 43 వేల ఎకరాలను సేకరించాలని చూస్తున్నాడు. ఇప్పటికే రాజధాని పనుల్లో కాంట్రాక్ట్లు ఇవ్వడం, దానికి గానూ ముందుగానే మెబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చి, అందులోంచి ఎనిమిది శాతం కమిషన్గా తీసుకోవడం చేస్తున్నాడు. వీటన్నింటినీ నారా లోకేష్ పర్యవేక్షిస్తున్నాడు. సూట్ కేసులు సర్దడమే లోకేష్ పని.ఇంత దుర్మార్గమైన ఎన్నికను ఎప్పుడూ చూడలేదుపులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక అద్భుతంగా జరిగిందని, ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిందని పవన్ కళ్యాణ్, లోకేష్లు మాట్లాడుతున్నారు. దేశ చరిత్రలోనే ఇంత దుర్మార్గమైన ఎన్నిక మరెక్కడా జరిగి వుండదు. అక్కడి ఓటర్లను ఇళ్ళ నుంచి బయటకు రానివ్వకుండా, పక్క గ్రామాల నుంచి టీడీపీ కార్యకర్తలను తీసుకువచ్చి, పబ్లిక్గా పోలీసుల రక్షణలో రిగ్గింగ్ చేయించారు. ఆధారాలతో సహా బయటపెట్టాం. పదివేల మంది ఓటర్లు ఉన్న ఈ సెగ్మెంట్లోని గ్రామాల్లో తిరిగి చూస్తే, ఏ ఇంటిలోని ఓటరు వేలిమీద మీకు సిరా మార్క్ కనిపించదు.కారణమేంటంటే, వారి ఓటును కూడా టీడీపీ వారే వేసుకున్నారు. దానిలో స్లిప్లు దొరికాయని, ముప్పై ఏళ్లుగా ఓటు హక్కు వినియోగించుకోలేదని దానిలో రాసినట్లు ప్రచారం చేస్తున్నారు. ఈ స్లిప్ వేసింది జిల్లా కలెక్టరా లేక డీఐజీ కోయ ప్రవీణా తేలాలి. మంత్రి నారా లోకేష్ తన ట్వీట్లో పెట్టిన ఫోటోలో ఓటు వేస్తున్న క్యూలైన్లో ఉన్న వ్యక్తి జమ్మలమడుగు లోని మార్కెట్ యార్డ్ చైర్మన్. ఆయన వేశాడేమో ఈ స్లిప్. ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం తమను తాము గొప్పగా చెప్పుకోవడం సిగ్గు చేటు.మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు స్పందిస్తూ..చంద్రబాబుకు కూడా సోదరీమణులు ఉన్నారు. వారెప్పుడైనా ఆయనకు రాఖీలు కట్టిన సందర్భం ఉందా? కనీసం అమరావతిలో కొత్త ఇంటి శంకుస్థాపనకు అయినా వారిని పిలిచి ఒక్క చీరె అయినా పెట్టారా? తన మేనత్తల గురించి కనీసం మాట్లాడలేని లోకేష్ దానిని మరిచిపోయి వైఎస్ జగన్ సోదరిమణుల గురించి మాట్లాడుతున్నారు. అసలు చంద్రబాబు తన సోదరుడిని ఎంత బాగా చూశాడో ప్రజలందరికీ తెలుసు. ముందు వాటి గురించి తెలుసుకుని లోకేష్ మాట్లాడితే బాగుంటుంది.ఎన్నికలు అయిపోయిన తరువాత కౌంటింగ్కు మధ్యలో 12.5 శాతం ఓట్లు ఎలా పెరిగాయో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పాలి. చంద్రబాబు, రేవంత్ రెడ్డి, రాహూల్ గాంధీ హాట్లైన్లో ఉన్నారన్న వైయస్ జగన్ మాటల్లో తప్పేముందీ? చంద్రబాబు గతంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్ళలేదా? రేవంత్ రెడ్డి.. చంద్రబాబు శిష్యుడు కాదా? ఓటుకు కోట్లు కేసులో రేవంత్రెడ్డితో అవినీతి సొమ్ము పంపించలేదా? తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్తో, రాహూల్గాంధీతో కలిసి చంద్రబాబు పనిచేయలేదా? ఎవరినైనా సరే మోసం చేయగల వ్యక్తి చంద్రబాబు. బీజేపీని మోసం చేసి కాంగ్రెస్తోనూ, కాంగ్రెస్ను మోసం చేసి బీజేపీతోనూ కలిశాడు. ఆయనకు ఒక సిద్దాంతం అంటూ లేదు. -
నామినేషన్ నుంచి పోలింగ్ దాక ప్రజాస్వామ్యం ఖూనీ
సాక్షి, అమరావతి: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అపహాస్యం చేశారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. ‘‘14 నెలల పాలనలో అన్నివిధాలా వంచించిన కూటమి ప్రభుత్వానికి పులివెందుల ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారన్న భయం పట్టింది. అందుకే పోలీసుల అండతో దౌర్జన్యానికి దిగారు. చంద్రబాబు ఎన్ని అక్రమాలు చేసినా ప్రజలకు వాస్తవాలు తెలిశాయి. వారిని తరిమికొట్టడం ఖాయం’’ అని తేల్చిచెప్పారు.గురువారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పులివెందుల, రాజంపేట నియోజకవర్గాల్లో ఒక్కో జెడ్పీటీసీ, కుప్పంలో ఎంపీటీసీ, ప్రకాశం జిల్లాలో సర్పంచ్ స్థానాన్ని ఎంచుకుని మరీ ఉప ఎన్నికకు సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు ప్రభుత్వం మహాగొప్పగా ప్రకటించిందని పేర్ని నాని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్తో కుమ్మక్కై.. 13 నెలల టర్మ్ మాత్రమే ఉన్న జెడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహిస్తూ, నామినేషన్ల నుంచే ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసేలా రకరకాల తంతులు నిర్వహించారని మండిపడ్డారు. ఖాకీ చొక్కాలు, అధికారులు తొత్తులుగా మారారని,, ఐఏఎస్లుగా రాష్ట్రంలో అత్యున్నత పదవులు వెలగబెట్టి, ఎన్నికల విధుల్లో ఉన్న కొందరు అధికారులు సైతం తమ బాధ్యతలను విస్మరించారని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో దొంగలు పడ్డారంటే ఇదేనేమో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుపుతున్నామని చెప్పడానికి, మీడియాకు పోలింగ్ కేంద్రాల వద్దకు అనుమతిస్తారని, కానీ పులివెందుల, ఒంటిమిట్టలో ఎవరినీ వెళ్లనివ్వకుండా, వాళ్లే ప్రయివేటు కెమెరాతో చిత్రీకరించారని పేర్ని అన్నారు. ‘‘ఈ వీడియోల్లో ఎక్కడా మహిళలు ఓటు వేసినట్లు కనిపించలేదు. అందరూ పురుషులే. అది కూడా జమ్మలమడుగు లేదా కమలాపురం, ప్రొద్దుటూరు నియోజకవర్గాలకు చెందినవారు.ఈ మూడు నియోజకవర్గాల కూటమి ఎమ్మెల్యేలకు ఓట్లు గుద్దుకోవడానికి కాంట్రాక్ట్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. పులివెందులలో విచిత్రం ఏమంటే సాయంత్రం 5–6 గంటల మధ్య ఓటు వేసిన మహిళలంతా వి.కొత్తపల్లెలో పోలింగ్ స్టేషన్ నం.13లో ఓటు హక్కు వినియోగించుకున్నవారే. అక్కడ ఒక పురుష ఓటరు కూడా లేడు. అధికార పార్టీ బరితెగింపునకు ఇదో నిదర్శనం. క్యూ లైన్లో లేకుండానే 3,684 మంది మహిళలు ఓటు వేశారు. బహుశా దేశంలో దొంగలు పడ్డారంటే ఇదేనేమో! తండ్రికొడుకు ఇద్దరు దొంగలు పడ్డారని, ఇంత తంతు చేసి, మీరిచ్చిన లెక్కలతోనే దొరికిపోయారు’ అని అన్నారు. డ్రామా రక్తి కట్టేలా పోస్టులు.. డ్రామాను మరింత రక్తి కట్టించడానికి 30 ఏళ్ల తర్వాత ఓటు వేస్తున్నాం థ్యాంక్స్ అంటూ టీడీపీ ఎక్స్ ఖాతాలో కొన్ని స్లిప్పుల పోస్టులు పెట్టారని, అంటే.. 30 ఏళ్ల తర్వాత పులివెందులలో దొంగ ఓట్లు వేస్తున్నామని థ్యాంక్స్ చెబుతున్నారా? క్యూలైన్లో పురుషులు అదీ బయటివాళ్లు ఉంటే.. వారితో సమానంగా మహిళల ఓట్లు ఎలా వచ్చాయని పేర్ని నాని ప్రశి్నంచాచు. అంటే, జమ్మలమడుగు నుంచి వచ్చి దొంగఓట్లు వేసినవారు.. 30 ఏళ్ల తర్వాత ఓటు వేశామని చెబుతూ పోస్టులు పెట్టారని ఎద్దేవా చేశారు. లోకేశ్... మీ పోస్ట్లోనే తెలుస్తోంది పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచిందంటూ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ ఖాతాలో వీడియో పోస్ట్ చేశారని... అందులో ఉన్నది జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన జిల్లా రైతు ప్రధాన కార్యదర్శి, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ పొన్నతోట మల్లికార్జున్ అని పేర్ని నాని పేర్కొన్నారు. ‘‘ఇదీ వీళ్ల బండారం..! కలెక్టర్ పోస్ట్ పెట్టి తీసేస్తారు. మంత్రి దౌర్జన్యాల మీద, దొంగ ఓటర్ల మీద కేసులుండవు. ఓ సోదరి కుప్పంలో మీరు ఇలాగే చేశారని అంటోంది. కానీ, అక్కడ టీడీపీకి ఎంత ఖర్మ పట్టిందీ అంటే వాళ్ల చేతులతో వారే 680 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేశారు’’ అని తెలిపారు.వైఎస్ జగన్ ప్రశ్నలకు సమాధానమేది బాబూ...? ఉప ఎన్నికల పోలింగ్లో ఏ జరిగిందో ఆధారాలతో సహా కళ్లకు కట్టినట్టు చూపిస్తూ సమాధానం ఇవ్వాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ చాలెంజ్ చేశారని, కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారని పేర్ని నాని గుర్తుచేశారు. ‘‘పోలింగ్ సరళి సీసీ టీవీ ఫుటేజీని, వెబ్ కాస్టింగ్ ను ప్రజల్లో పెట్టాలని వైఎస్ జగన్ అడిగితే, ఎందుకు భయం? వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ చేసిన ట్వీట్లో ఆయన ముందున్నవారు దొంగ ఓటర్లు.అంటే, కలెక్టర్ దగ్గరుండి దొంగ ఓటింగ్ చేయించారా? క్యూలైన్లలోని దాదాపు 90 శాతం దొంగ ఓటర్లే. వీటిపైనే వైఎస్ జగన్ ప్రశ్నించారు’’ అని తెలిపారు. దీంతో చంద్రబాబు స్క్రీన్ ప్లే మార్చారని, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక కౌంటింగ్ ఒకే రౌండ్ లో పూర్తి చేయాలని నిర్ణయించారని పేర్కొన్నారు. ‘‘ఎక్కడ తప్పు పడతారోననే భయంతో, కోర్టులు ప్రారంభమయ్యేలోగా ఉప ఎన్నిక ఫలితాలు తేల్చాలని ఆదరాబాదరాగా ఆదేశాలిచ్చారు.ప్రజాస్వామ్యయుతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉప ఎన్నికలు జరుపుతున్నామని డ్రామా మాటలు చెప్పిన వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్.. ఒక్క మీడియాను కూడా ఓటింగ్ ను చూపించేందుకు బూత్లలోకి అనుమతించలేదు. కిరాయికి మాట్లాడుకున్న ప్రైవేటు ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్తో ఫొటోలు, వీడియోలు తీయించి విడుదల చేశారు’ అని చెప్పారు.డీఐజీ.. ఎవరి ఆనందం కోసం ఈ నిర్వాకం రాయచోటి ఎమ్మెల్యేనో, ఎన్నికలున్న ఒంటిమిట్టలో ఓటరు కాకపోయినా రాష్ట్ర మంత్రి ఎలా పోలింగ్ స్టేషన్ కు వెళ్తారని పేర్ని నాని నిలదీశారు. చిన్నకొత్తపల్లె గ్రామంలో మంత్రి సమక్షంలోనే వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్ను కొట్టారని, మంత్రి మీద కేసు ఫైల్ చేశారో లేదో డీఐజీ కోయ ప్రవీణ్ సమాధానం చెప్పాలని పేర్ని నిలదీశారు. ‘ఇదంతా ఎన్నికల కమిషన్ కు కనబడ్డం లేదా? కేసు కట్టని అధికారులను సస్పెండ్ చేయరా? షోకాజ్ ఇవ్వరా? మీకు సిగ్గూ, శరం ఉందా ? పోలీస్ ఉన్నతాధికారులు చేస్తున్న పనికి డీజీపీ సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. పోలింగ్ బాగా నిర్వహిస్తున్నామని జబ్బలు చరుచుకున్న జిల్లా కలెక్టర్.. వెంటనే ఎక్స్ఖాతాలోని పోస్టును ఎందుకు డిలీట్ చేశారని నిలదీశారు.సునీతమ్మా.. మీ తండ్రే పులివెందులలో ప్రజాస్వామ్యాన్ని చంపేశారా?‘‘అసెంబ్లీఎన్నికల్లో అక్రమాలు జరిగాయి. ఎక్కడాలేని విధంగా పోలైన ఓట్ల కంటే ఏపీలో 12 శాతం ఓట్లు అదనంగా లెక్కించారు. మొదటినుంచి మేం ఇది చెబుతూనే ఉన్నాం. ఇప్పుడు మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇదే చెబుతున్నారు. టీడీపీ కూటమికి 164 సీట్లు రావడం మీద దేశమంతా అనుమానంతో ఉంది. అది కూడా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక లాంటిదే అని ప్రజలు అనుకుంటున్నారు’’ అని పేర్ని నాని అన్నారు. 30 ఏళ్ల తర్వాత పులివెందులలో చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని బతికించారంటున్న నర్రెడ్డి సునీతారెడ్డి.. ఈ నియోజకవర్గంలో ఆమె తండ్రి వైఎస్ వివేకానే చాన్నాళ్లు రాజకీయం చేశారని, అంటే ఆయనే ప్రజాస్వామ్యాన్ని చంపేశారని చెబుతున్నారా?’’ అని ప్రశి్నంచారు. -
పునర్నియామకం కావాలి... మంత్రికి రూ.10 కోట్లు ఇవ్వాలి
సాక్షి, అమరావతి: ‘రిటైర్మెంట్ తరువాత పునరి్నయామకం కావాలి.. అందుకు మంత్రిగారికి రూ.10 కోట్లు ఇవ్వాలి... అందుకే ఈ బలవంతపు వసూళ్లు..!’ గిరిజన సంక్షేమ శాఖలో అవినీతి తిమింగలంగా ముద్రపడిన ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) సబ్బవరం శ్రీనివాస్ అవినీతి వ్యవహారాలివీ! కీలక మంత్రి అండతో యథేచ్ఛగా అవినీతికి పాల్పడే ఈ ఉన్నతాధికారి ఈ నెలాఖరులో రిటైర్ కానున్నారు. అనంతరం సర్విసు పొడిగించేందుకు కీలక మంత్రితో రూ.10 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో ఆయనపై గతంలో నమోదైన అవినీతి కేసులను ఆ మంత్రి సిఫార్సుతో ఇటీవల ఉపసంహరించారు.ఇక మిగిలింది సర్విసు పొడిగింపు ఉత్తర్వులే. అందుకోసం మంత్రికి ముడుపులు చెల్లించేందుకు గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు రూ.5 కోట్లు టార్గెట్ విధించగా కాంట్రాక్టు సంస్థ నుంచి రూ.5 కోట్లు లంచం డిమాండ్ చేశారు. అయితే బాధితులు ఏసీబీని ఆశ్రయించడంతో కథ అడ్డం తిరిగింది. మొదటి విడతగా రూ.25 లక్షలు లంచం తీసుకుంటూ ఉండగా ఈఎన్సీ శ్రీనివాస్ను ఏసీబీ అధికారులు ఇటీవల రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. గిరిజన సంక్షేమ శాఖవర్గాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ అవినీతి బాగోతం ఇలా ఉంది... రూ.5 కోట్లు లంచం డిమాండ్... రెడ్హ్యాండెడ్గా చిక్కిన ఈఎన్సీ రాష్ట్ర చరిత్రలో తొలిసారి రూ.5 కోట్ల భారీ లంచం డిమాండ్ చేయడం ద్వారా గిరిజన సంక్షేమ శాఖ ఈఎన్సీ సబ్బవరపు శ్రీనివాస్ అక్రమాల్లో కొత్త రికార్డు సృష్టించారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో నిర్మాణ పనులు చేసిన శ్రీసత్యసాయి కన్స్ట్రక్షన్స్ నుంచి ఆయన రూ.5 కోట్లు భారీ లంచం డిమాండ్ చేశారు. ఆ సంస్థకు పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలంటే డబ్బు ఇవ్వాల్సిందేనన్నారు. అంత భారీ మొత్తం ఇచ్చుకోలేనని సంస్థ మేనేజింగ్ పార్టనర్ చెరుకూరి కృష్ణంరాజు పేర్కొనగా డబ్బులిస్తేనే ఫైల్ ముందుకు కదులుతుందని తేల్చి చెప్పారు.దాంతో ఈఎన్సీ శ్రీనివాస్ తీరుపై ఆయన విజయవాడ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఏసీబీ అధికారులు సూచించిన ప్రకారం ఈఎన్సీ శ్రీనివాస్కు ఆయన కార్యాలయంలో చెరుకూరి కృష్ణంరాజు ఇటీవల రూ.25 లక్షలు ముట్టజెప్పారు. లంచం డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ వల పన్ని ఈఎన్సీ శ్రీనివాస్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకుంది. అనంతరం అరెస్టు చేసి విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో హాజరు పరిచింది. కీలక మంత్రి అండతో చెలరేగి.. ఈఎన్సీ శ్రీనివాస్ గిరిజన సంక్షేమ శాఖలో అవినీతి తిమింగలంగా గుర్తింపు పొందారు. ‘అచ్చ’ంగా ఉత్తరాంధ్రకు చెందిన ఓ సీనియర్ మంత్రి సామాజిక వర్గానికి చెందిన ఆయన అడ్డూ అదుపు లేకుండా అక్రమాలు సాగించారు. మంత్రి అండతో ఏఈగా, ఎస్ఈగా, ఈఎన్సీగా యథేచ్ఛగా అవినీతికి పాల్పడి భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టారు. గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలలు, వసతి గృహాలు, ఇతర భవన నిర్మాణ కాంట్రాక్టుల కేటాయింపులో అవినీతికి పాల్పడ్డారు. ఉత్తరాంధ్రలో వందల ఎకరాల భూములు, రెండు విద్యా సంస్థలు, లెక్కకుమించి స్థలాలు, ఫ్లాట్లు, బంగారం.. ఇలా ఈఎన్సీ శ్రీనివాస్ అక్రమార్జన చిట్టాకు అంతే లేదు. ఆయనపై గతంలోనే ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నమోదు చేసినా, వెనక్కి తగ్గలేదు. ‘అచ్చంగా’ రూ.10కోట్ల డీల్... అవినీతి కేసులు ఉపసంహరణ ఈఎన్సీ సబ్బవరపు శ్రీనివాస్ ఈ నెలాఖరులో రిటైర్ కానున్నారు. ఆ తరువాత కూ డా తనను ఈఎన్సీగా పునరి్నయమించాలంటూ ఆయన కీలక మంత్రిని సంప్రదించారు. ఇందుకు రూ.10 కోట్లు డీల్ కుదిరింది. అయితే రిటైరైన తరువాత పునర్నియమించాలంటే సంబంధిత అధికారిపై అవినీతి కేసులు పెండింగులో ఉండకూడదు. దీంతో కీలక మంత్రి సిఫార్సుతో ఈఎన్సీ శ్రీనివాస్పై గతంలో నమోదైన ఏసీబీ కేసులను ప్రభుత్వం ఉపసంహరించింది.ఈమేరకు జూలై 31న జీవో జారీ కావడం గమనార్హం. ఇక మిగిలింది ఈఎన్సీ శ్రీనివాస్ను పునరి్నయమిస్తూ సెపె్టంబర్ మొదటి వారంలో జీవో జారీ చేయడమే. ఇందుకోసం కీలక మంత్రికి రూ.పది కోట్లు ముట్టచెప్పేందుకు సిద్ధమైన శ్రీనివాస్ అన్ని జిల్లాల గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు టార్గెట్లు నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే ఏసీబీ రంగంలోకి దిగడంతో అడ్డంగా దొరికిపోయారు. -
పొగాకు రైతుపై సర్కారు పగ!
సాక్షి, అమరావతి: నల్లబర్లీ పొగాకు రైతుల జీవితాలతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోంది. పూర్తిగా ఆరబెట్టిన తర్వాత నాణ్యమైన పొగాకును ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తున్నా... ప్రైవేటు కంపెనీల మాదిరిగా ‘క్వాలిటీ లేదు’ అనే సాకుతో కొర్రీలు వేస్తూ రైతులకు చుక్కలు చూపిస్తోంది. రైతులు తీసుకొచి్చన పొగాకులో 90శాతానికి పైగా లో, మీడియం క్వాలిటీగానే కొనుగోలు కేంద్రాల సిబ్బంది పరిగణిస్తున్నారు. కేవలం 5 నుంచి 10శాతం పొగాకును మాత్రమే కాస్త క్వాలిటీగా ఉందని కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు పొగాకు కొనుగోళ్లు ప్రారంభించి రెండు నెలలు కావొస్తున్నా రైతులకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. 30 క్వింటాళ్లు కొంటామని మెసేజ్లు... యార్డుకు వెళితే 20 క్వింటాళ్లే అట! పొగాకు రైతులకు బాసటగా నిలిచేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకాశం జిల్లా పొదిలి మార్కెట్ యార్డుకు వెళ్లిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం దిగొచ్చింది. ఆఘమేఘాల మీద గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో 24 కేంద్రాలు ఏర్పాటుచేసి పొగాకు కొనుగోళ్లకు శ్రీకారం చుట్టింది. రైతుల వద్ద పేరుకుపోయిన నిల్వల్లో 33వేల టన్నులు కంపెనీల ద్వారా కొనుగోలు చేయిస్తామని, మిగిలిన 20వేల టన్నులను మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆర్భాటంగా చెప్పింది. నాణ్యతతో సంబంధం లేకుండా చివరి ఆకు వరకు క్వింటా రూ.12వేలు చొప్పున కొంటామని ప్రకటించింది. ఆచరణలోకి వచ్చేసరికి యార్డుల్లో నమోదు చేసుకున్న రైతుల నుంచి 30 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేస్తామని మెసేజ్లు పంపిస్తున్నారు. ఆ మేరకు లోడింగ్, అన్లోడింగ్, రవాణా ఖర్చులన్నీ భరిస్తూ తీసుకువెళితే 20 క్వింటాళ్లకు మించి కొనడం లేదు. దీంతో తెచ్చిన పొగాకును ఏం చేయాలో తెలియక రైతులు తలలు పట్టుకుంటున్నారు. క్వాలిటీ పేరిట రైతుకు శఠగోపం » పొగాకు కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో హై క్వాలిటీ(హెచ్డీఆర్)కి క్వింటా రూ.10వేల నుంచి రూ.12వేలు, మీడియం క్వాలిటీ (హెడ్డీఎం)కి రూ.7వేల నుంచి రూ.9వేలకు, లో క్వాలిటీ (హెచ్డీఎక్స్)కి రూ.4వేల నుంచి రూ.6వేలు చొప్పున ధరలు నిర్ణయించారు. » జూన్ 8వ తేదీన కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా, ఆగస్టు 9వ తేదీ(శనివారం) నాటికి అతికష్టమ్మీద 5,682 మంది రైతుల నుంచి 10,197 టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. నాణ్యత పేరిట అడ్డగోలుగా ధరలో కోత విధిస్తున్నారు. » హైక్వాలిటీ పొగాకు 912 టన్నులు(8.9శాతం) సేకరించారు. హై క్వాలిటీకి రూ.12 వేల వరకు చెల్లించాల్సి ఉన్నప్పటికీ అత్యధిక మంది రైతులకు గరిష్టంగా రూ.10వేలకు మించి ధర నిర్ణయించడం లేదు. » మీడియం క్వాలిటీ పేరిట 4,323 టన్నులు(42.4శాతం), లో క్వాలిటీ పేరిట 4,962 టన్నులు(48.7శాతం) సేకరించారు. » మీడియం క్వాలిటీ పొగాకుకు క్వింటా రూ.7వేలు, లో కేటగిరీ పొగాకు రూ.4వేలకు మించి ధర దక్కడం లేదు. » వాస్తవానికి 20వేల టన్నులకు క్వింటా రూ.12వేలు చొప్పున రూ.260 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే, ఇప్పటి వరకు సేకరించిన పొగాకు విలువ రూ.80 కోట్లు మాత్రమే. » ఇప్పటికీ రైతుల వద్ద మరో 30వేల టన్నుల వరకు పొగాకు నిల్వలు ఉన్నాయి. కంపెనీలు ముఖం చాటేయడంతో ఏం చేయాలో తెలియక రైతులు మల్లగుల్లాలు పడుతున్నారు. పైసా విడుదల చేయని ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.80 కోట్ల విలువైన పొగాకు సేకరించగా, తొలి విడత చెల్లింపుల కోసం రూ.55 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు పంపారు. కానీ ఆరి్థక శాఖ నుంచి గ్రీన్సిగ్నల్ రాలేదు. దీంతో రెండు నెలలుగా పొగాకు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన రైతులకు డబ్బులు అందక నానా అవస్థలు పడుతున్నారు. అప్పులు చేసి ఎకరాకు రూ.లక్షన్నర వరకు పెట్టుబడులు పెట్టామని, వడ్డీలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉన్నామని రైతులు వాపోతున్నారు. మరోవైపు ఈ నెలాఖరులోపు కొనుగోలు కేంద్రాలకు పుల్స్టాప్ పెట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. పొగాకు కొనుగోలుకు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) నుంచి రూ.209 కోట్లు, ధరల స్థిరీకరణ నిధి (పీఎస్ఎఫ్) నుంచి రూ.100 కోట్లు కేటాయించాలని మార్క్ఫెడ్ అభ్యర్థనను సైతం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. -
జల విపత్తు మృతుల్లో రాష్ట్రమే టాప్!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా జల వాతావరణ విపత్తుల్లో అత్యధిక మృతులు నమోదైన రాష్ట్రంగా మారింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకూ కేవలం నాలుగు నెలల్లో రాష్ట్రంలో 343 మంది జల విపత్తుల్లో ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు తేల్చిన ఈ నిజం– రాష్ట్ర విపత్తు నిర్వహణలో కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని బట్టబయలు చేస్తున్నాయి. కొన్ని ముఖ్యాంశాలు..⇒ ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి అందిన సమాచారం ప్రకారం జల వాతావరణ విపత్తుల కారణంగా 1,626 మంది మృతి చెందారు. ⇒ జలాశయాల దగ్గర ఎటువంటి ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయకపోవడంతో చాలా మంది జలాశయాల్లో దిగి మృతి చెందుతున్నారు. ⇒ భారీ వర్షాలకు లోతట్టు ప్రాంత ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయకపోవడంతో చాలా మంది ప్రాణాలను కోల్పోవాల్సిన పరిస్థితులు నెలకుంటున్నాయి.⇒ మృతుల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్ (243), హిమాచల్ ప్రదేశ్ (195) నిలిచాయి. ⇒ జల విపత్తులు సంభవించిన రాష్ట్రాల్లో నష్టాలను అంచనా వేసిన తరువాత జాతీయ విపత్తుల నిధి నుంచి కేంద్రం ఆర్థిక సాయం అందిస్తుందని గణాంకాల నివేదిక పేర్కొంది. ⇒ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూలై 15వ తేదీ నాటికి జాతీయ విపత్తుల నిధి నుంచి కేంద్ర వాటాగా 22 రాష్ట్రాలకు రూ.9,578.40 కోట్లను విడుదల చేసినట్లు కేంద్ర హోమంత్రిత్వ శాఖ వెల్లడించింది. -
డీఎస్సీ అభ్యంతరాల స్వీకరణ గడువు ఒక రోజు పెంపు
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025పై అభ్యంతరాల స్వీకరణ అనంతరం సవరించిన టెట్ మార్కులతో స్కోర్ కార్డులను https://apdsc.apcfss.in/ వెబ్సైట్లో ఉంచినట్టు డీఎస్సీ కన్వినర్ ఎంవీ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు టెట్ మార్కులను తప్పుగా నమోదు చేసిన నేపథ్యంలో అభ్యంతరాలు వచ్చాయన్నారు. ఈ క్రమంలోనే అభ్యర్థి ఐడీ నంబర్తో వెబ్సైట్లో వివరాలను స్వయంగా సరిచేసుకునేందుకు శుక్రవారం వరకు అవకాశం పొడిగించామన్నారు. -
‘పరీక్ష’ తప్పింది!
‘ఏ మేధావులు తయారుచేశారో ఈ ఒకటో తరగతి పరీక్ష పేపర్లు! పేరాగ్రాఫ్ విని ఇంగ్లిష్ లో ఆన్సర్ చేయాలంట. వర్డ్స్ రాయాలంట. పదాలు తయారు చేయాలంట. ఉపాధ్యాయులను, విద్యార్థులను ఇబ్బంది పెట్టడానికి తప్ప ఈ పరీక్షలతో ఏం ఉపయోగం? పాఠశాలలో ప్రయోగశాల ఉండాలి తప్ప, పాఠశాలనే ప్రయోగశాలగా మార్చడం పద్ధతి కాదు..’ ఎఫ్ఏ–1 ఒకటో తరగతి ఇంగ్లిష్ పేపర్ తీరుపై ఉపాధ్యాయుల అభిప్రాయం ఇది. నాలుగు, ఐదో తరగతి పరిసరాల విజ్ఞానం 8 పేజీల ప్రశ్నపత్రంలో ప్రశ్నలను ‘నాట్ కండిషన్’తో అడిగారు. డీఎస్సీ పరీక్షకి తయారుచేసిన ప్రశ్నల్లో మిగిలిన వాటిని ఏమైనా ఈ పేపర్లో ఇచ్చారా అన్నట్టుగా ఉన్నాయి ప్రశ్నలు? ఇవి విద్యార్థి సామర్థ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోను సరిగ్గా అంచనా వేయలేవు..’ మంగళవారం జరిగిన ఈ పరీక్షపై కొందరు సీనియర్ ఉపాధ్యాయుల అభిప్రాయం. సాక్షి, అమరావతి: పాఠశాల విద్యాశాఖ ఈ విద్యాసంవత్సరం అమల్లోకి తెచ్చిన పరీక్ష విధానం ఫెయిలైంది. విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు పెట్టిన మొదటి పరీక్ష ఫార్మెటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ)–1 ఉపాధ్యాయులకే అర్థంగానిరీతిలో ఉందని తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యార్థులకు అసెస్మెంట్ పుస్తకాలిచ్చి, అన్ని పరీక్షలను వాటిలోనే రాయాలన్న నిబంధన పెట్టారు. పరీక్ష విధానంలో పలు మార్పులు తీసుకొచి్చన రాష్ట్ర విద్య, పరిశోధన, శిక్షణమండలి (ఎస్సీఈఆర్టీ) ఈ పరీక్షలపై అటు విద్యార్థులకు ఇటు ఉపాధ్యాయులకు అవగాహన కల్పించలేదని చెబుతున్నారు. విద్యార్థులు ఒకమార్కు ప్రశ్నలకు ఓఎంఆర్ షీట్లపై జవాబులు బబ్లింగ్ చేయడం, మరోపక్క వ్యాసరూప ప్రశ్నలకు పుస్తకంలో జవాబులు రాయడం ఒక ఎత్తయితే, పేపర్ల వాల్యూయేషన్ ఉపాధ్యాయులకు కొత్త పరీక్ష పెట్టింది. మొత్తం వాల్యూయేషన్ ప్రక్రియను రెండు, మూడురోజుల్లో పూర్తిచేసి ఓఎంఆర్ షీట్లను లీప్ యాప్లో స్కాన్చేసి అప్లోడ్ చేయాల్సి రావడం ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రాథమిక స్థాయిలోనే కఠిన పరీక్ష సాధారణంగా ఒకటో తరగతిలోనే అత్యధికమంది విద్యార్థులు అక్షరాలు నేర్చుకుంటారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు కూడా ఈ స్థాయిలోనే ఉంటాయి. అంగన్వాడీ కేంద్రాల్లో నేర్చుకునేది చాలా స్వల్పం. కానీ ఒకటో తరతి ఎఫ్ఏ–1 ఇంగ్లిష్ పరీక్షలో అడిగిన ప్రశ్నలు చూసి ఉపాధ్యాయులే విస్తుపోయారు. ఇందులో 8, 9, 10 ప్రశ్నలకు ఇంగ్లిష్ పేరాగ్రాఫ్ విని జవాబులు రాయాలన్నారు. అలాగే ఇంగ్లిష్ పదం ఇచ్చి దానికి సరిపోయే బొమ్మను కనుక్కునేలా ప్రశ్నలు అడిగారు. రెండో తరగతి ఇంగ్లిష్ మొదటిప్రశ్న ఆంగ్లంలోని అచ్చులకు వ్యాకరణం పరీక్షిస్తూ అడిగారు. పాఠశాలలు ప్రారంభమై రెండునెలలు కాకముందే అత్యంత లోతైన సామర్థ్యాలను పరీక్షించేలా ఎస్సీఈఆర్టీ నిపుణులు ప్రశ్నపత్రాలు తయారు చేయడం ఏంటని పలువురు ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. 35 మార్కులకు నిర్వహించిన ఈ పరీక్షలో సగం ప్రశ్నలు విషయపరిజ్ఞాన (అనలైటికల్) ప్రశ్నలే కావడంతో ఎలా రాయాలో తెలియక విద్యార్థులు తికమకపడినట్టు తెలిసింది. మరోపక్క ఒకమార్కు జవాబులను ఓఆర్ఎం షీట్లపై బబ్లింగ్ చేయడం చేతగాక ప్రాథమికస్థాయి విద్యార్థులు పరీక్ష రాయలేకపోయినట్టు సమాచారం. చాలా ప్రశ్నలు సిలబస్ నుంచిగాక పూర్తిగాని పాఠ్యాంశాల నుంచి ఇచ్చారని తెలిసింది. ఉపాధ్యాయులకూ కఠిన పరీక్షే.. విద్యార్థులు మొత్తం ఆరు పరీక్షలను అసెస్మెంట్ పుస్తకంలో రాయాలి. మార్కులను ఉపాధ్యాయులు బబ్లింగ్ చేయాలి. అసెస్మెంట్ బుక్లో ప్రతి విద్యార్థికి ఉపాధ్యాయుడు నివేదిక రాయాలి. విద్యార్థుల జవాబుపత్రాల ఓఎంఆర్ షీట్లను స్కాన్చేసి లీప్యాప్లో అప్లోడ్ చేయాలి. ప్రాథమిక తరగతుల్లో ప్రతి విద్యార్థికి నాలుగు చొప్పున, ఉన్నత తరగతుల్లో ఆరు చొప్పున స్కాన్ చేయాలి. ఇప్పటికే రోజూ యాప్లు, ఆన్లైన్ వర్క్, అర్జెంట్ ఫైళ్లతో బోధనకు దూరమైన తమకు ఇది మరో భారమైందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ప్రైవేటులో సొంతంగా పేపర్లు! ఎఫ్ఏ–1 పరీక్షలు ఈనెల 11 నుంచి 14 వరకు జరుగుతాయని షెడ్యూల్ విడుదల చేశారు. ఫార్మెటివ్ పరీక్షలను ఎవరికివారు నిర్వహించుకునే వెసులుబాటు కల్పించడంతో ప్రైవేటు యాజమాన్య స్కూళ్లు ఈనెల 11వ తేదీకి ముందే నిర్వహించాయి. ఇప్పటికే తలాతోకా లేని విధానాలకు సంస్కరణల పేరు పెట్టిన కూటమి ప్రభుత్వం సర్కారు బడులను, ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసింది. ఇప్పుడు ఈ తరహా పరీక్షల్లోను విద్యార్థులు ఫెయిలైతే.. ప్రభుత్వ స్కూళ్లకంటే ప్రైవేటు స్కూళ్లే మేలు అని తల్లిదండ్రులు భావించి పిల్లల్ని మార్చే అవకాశాలున్నాయి. కేవలం కార్పొరేట్ విద్యాసంస్థలకు మేలుచేసేందుకే ప్రభుత్వం ఇలాంటి విధానాలు అనుసరిస్తోందని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
ఏపీ వెలుపల ఇంటర్ చదివితే స్థానిక హోదా ఉండదు
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి అభ్యర్థుల ‘స్థానికత’ విషయంలో ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావులతో కూడిన ధర్మాసనం బుధవారం స్పష్టత నిచ్చింది. ఈ తీర్పు ప్రతి గురువారం అందుబాటులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ వెలుపల విద్యను అభ్యసించినప్పటికీ, తాము రాష్ట్రంలో నివాసం ఉంటున్నామని, అందువల్ల తమను ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాల్లో స్థానిక అభ్యర్థులుగా పరిగణించాలంటూ పలువురు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం కొట్టేసింది.రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెలుపల క్వాలిఫయింగ్ ఎగ్జామ్ (ఇంటర్) చదివిన విద్యార్థులను స్థానిక అభ్యర్థులుగా పరిగణించలేమని ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది. స్థానికత విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులు చాలా స్పష్టంగా ఉన్నాయని తెలిపింది. అలాగే గతంలోనే హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం దీనిపై చాలా స్పష్టమైన తీర్పునిచ్చిందని గుర్తు చేసింది. ఇందులో తాము కొత్తగా చెప్పేందుకు ఏమీ లేదంది. తాము కూడా రాష్ట్రపతి ఉత్తర్వులకు, హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పునకు లోబడి ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. ధర్మాసనం తాజా తీర్పు ప్రకారం ఎవరు స్థానిక అభ్యర్థులు అవుతారంటే.. ⇒ ప్రవేశం కోరుతున్న విద్యారి్థ, తాను ఏ లోకల్ ఏరియా (ఎస్వీ యూనివర్సిటీ లేదా ఏయూ పరిధి)లో చదివానని చెబుతున్నాడో, ఆ ప్రాంతంలో ఆ అభ్యర్థి వరుసగా నాలుగేళ్చ్లు చదివి ఉండాలి. ఆ నాలుగేళ్లను క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్(+2)తో ముగించి ఉండాలి. అప్పుడే ఆ అభ్యర్థి ఆ ప్రాంతానికి స్థానిక అభ్యర్థి అవుతాడు.⇒ ఆ అభ్యర్థి ఆ ప్రాంతంలో (లోకల్) ఏ విద్యా సంస్థలోనూ చదవకపోయినప్పటికీ, క్వాలిఫైయింగ్ పరీక్ష రాసే నాటికి వరుసగా నాలుగేళ్ల పాటు ఆ లోకల్ ఏరియాలో నివాసం ఉన్నా కూడా ఆ అభ్యర్థి స్థానిక అభ్యర్థే అవుతాడు.⇒ అలాగే క్వాలిఫయింగ్ పరీక్ష రాసే నాటికి ఆ అభ్యర్థి లోకల్ ఏరియాలో నాలుగేళ్ల పాటు ఎక్కడా కూడా విద్యాభ్యాసం చేయనప్పటికీ, రాష్ట్రంలో ఏడేళ్ల పాటు నివాసం ఉంటే సైతం ఆ అభ్యర్థిని స్థానిక అభ్యర్థిగానే పరిగణించాల్సి ఉంటుంది. -
బుడమేరులో బోగస్ ఆపరేషన్!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: వర్షం కురిసిందంటే చాలు బెజవాడ వాసులు బెంబేలెత్తుతున్నారు. ప్రధానంగా బుడమేరు ప్రాంత నివాసులు గతేడాది విలయం తలుచుకుని గజగజ వణికిపోతున్నారు. బుడమేరును ప్రక్షాళన చేస్తామన్న ప్రభుత్వ పెద్దల మాటలు ఏడాదిగా ఉత్త మాటలుగానే మిగిలిపోయాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు స్థానికంగా కురిసిన వర్షాలకే బుడమేరుకు 5,000 క్యూసెక్కులపైగా వరద వచ్చింది. ఏలూరు కాలువకు వెయ్యి క్యూసెక్కులు, మిగిలిన నీటిని బుడమేరు కాలువ ద్వారా బయటికి పంపే యత్నం చేస్తున్నారు. బుడమేరు పరిధిలో ఆక్రమణల మాట దేవుడెరుగు కనీసం పూడికతీత కూడా సక్రమంగా చేయలేదు. గుణదల, నిడమానూరు, రామవరప్పాడు, గూడవల్లి ప్రాంతాల్లో బుడమేరు వంతెనలను వెడల్పు చేయకపోవడంతో పైనుంచి నీరు ప్రవహిస్తోంది. నీళ్లు నిలువ ఉండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయి ఇళ్లలోకి ప్రవహిస్తోంది. రోడ్లు కోతకు గురి అవుతున్నాయి. బుడమేరు కాలువ సామర్థ్యం ఐదు వేల క్యూసెక్కులని చెబుతున్నా ఆక్రమణలు, పూడికతో కాలువ కుంచించుకుపోయింది. మూడు వేల క్యూసెక్కులకే కాలువ పొంగి లోతట్టు ప్రాంతాల్లోకి ప్రవేశించే పరిస్థితి నెలకొంది. ఎగువ ప్రాంతాల్లో పెద్దగా వర్షాలు కురవకపోవటం, బుధవారం వరకు వెలగలేరు వద్ద వరద లేకపోవడంతో బెజవాడ ఊపిరి పీల్చుకుంది. గురువారం ఉదయం వెలగలేరు వద్దకు 3 వేల క్యూసెక్కుల వరద రాగా డైవర్షన్ కెనాల్ ద్వారా కృష్ణా నదిలోకి పంపారు. 10,500 క్యూసెక్కుల వరకు డైవర్షన్ కెనాల్ ద్వారా కృష్ణాలోకి పంపే అవకాశం ఉంది. అయితే ఇదే వర్షం కొనసాగి ఉంటే బుడమేరు వరదతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యేవి. మాయ మాటలతో సరి..! బెజవాడ దుఃఖదాయినిగా మారిన బుడమేరు ఆధునికీకరణపై కూటమి సర్కారు మాయ మాటలతో మభ్యపెట్టింది. గతేడాది విరుచుకుపడ్డ వరదకు 32 డివిజన్ల పరిధిలో అధికారిక లెక్కల ప్రకారమే 2.62 లక్షల కుటుంబాలు సర్వం కోల్పోయాయి. తాగేందుకు గుక్కెడు నీరు కూడా దొరకక వారం రోజులపాటు వరద నీటిలోనే విలవిల్లాడాయి. పెద్దఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి, నష్టం జరిగింది. ముంపు నివారణకు రూ.500 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశామని ప్రకటించిన సీఎం చంద్రబాబు చివరకు రూ.39.47 కోట్లతో సరిపెట్టారు. ఆ పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదు. విజయవాడను ముంపు రహిత నగరంగా మార్చేలా ఆపరేషన్ బుడమేరు యాక్షన్ ప్లాన్ అంటూ మంత్రులు కొద్ది రోజులు హడావుడి చేశారు. తొలిదశలో బుడమేరు సామర్థ్యం 10 వేల క్యూసెక్కులకు పెంచాలని ప్రతిపాదించారు. 13.25 కిలోమీటర్లు మేర బుడమేరు ఆక్రమణలకు గురైంది. విద్యాధరపురం నుంచి గుణదల వరకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 70 ఎకరాలు ఆక్రమణకు గురికాగా వీటిలో 3,051 ఇళ్ల నిర్మాణాలు జరిగినట్లు గుర్తించారు. బుడమేరుకు వచ్చే వరద నీటికి సమాంతరంగా కాలువ తవ్వి మళ్లించే ప్రణాళికలు కాగితాలకే పరిమితమయ్యాయి. చీమలవాగు, కేసరపల్లి, ఎనికేపాడు, యూటీల సామర్థ్యం పెంపు ప్రతిపాదన బుట్టదాఖలైంది. ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు 50.6 కిలో మీటర్ల మేర కాలువ గట్ల పటిష్టానికి చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రస్తుతం కొద్దిపాటి వర్షాలకే బుడమేరు ముంపు ప్రాంతాల్లో 45 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన స్థితి ఉంది. 660 మందిని ఆ కేంద్రాలకు తరలించారు. గతంలో కృష్ణలంకలో నెలకొన్న పరిస్థితులు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయని నగర వాసులు వాపోతున్నారు.పుట్టగుంట వంతెన వద్ద ఉధృతి.. పుట్టగుంట వంతెన వద్ద బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి ఐదు వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా వంతెన వద్ద 17.5 అడుగుల మేర వరద ఉంది. 20.5 అడుగులకు చేరితే మచిలీపట్నం–నూజివీడు–కల్లూరు జాతీయ రహదారిపై రాకపోకలను నిలిపివేసే అవకాశం ఉంది. నందివాడ మండలంలో ఇప్పటికే 6 వేల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. బుడమేరు ప్రవాహం మరింత పెరిగితే పరీవాహక గ్రామాలు గతేడాది మాదిరిగా ముంపు బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. వంతెన వద్ద ఎంఎన్కె రహదారి కోతకు గురవడంతో సగం మేర ధ్వంసమైంది. దీనివల్ల ప్రమాదాలు చోటు చేసుకునే ఆస్కారం ఉన్నా పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు.వర్షం పడితే వణుకే.. బుడమేరు వరద విలయానికి ఏడాది అవుతున్నా ఆ బీభత్సం ఇంకా కళ్లెదుట మెదులుతూనే ఉంది. సర్వం కోల్పోయి రోడ్డున పడ్డాం. వర్షం పడుతుంటే మా కాలనీ వాసులకు వణుకొస్తోంది. సంవత్సరం గడిచినా వరద నీరు మళ్లీ మా ఇళ్లల్లోకి రాదనే భరోసాను ప్రభుత్వం కల్పించలేకపోయింది. బుడమేరులో ఆక్రమణలు, పూడికలు తొలగించాలి. ప్రజలను అప్రమత్తం చేయడం, పునరావాస కేంద్రాలు ఏర్పాటుపై సమాచారం సరిగా లేదు. – టి.బాల, అరుణోదయనగర్, 57వ డివిజన్, విజయవాడ కొద్దిపాటి వానకే ఇళ్లల్లోకి నీళ్లు.. సింగ్నగర్, నందమూరినగర్లో డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేదు. దీంతో కొద్దిపాటి వర్షానికే డ్రెయినేజీ నీళ్లు.. వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరుతోంది. గతేడాది వచ్చిన వరదలను మా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇల్లు మునిగిపోయి సర్వస్వం కోల్పోయాం. ఇప్పుడు రెండు రోజుల వర్షానికే 68 ఇళ్లకుగానూ 30 ఇళ్లల్లోకి నీళ్లు వచ్చేశాయి. రోడ్లన్నీ మునిగిపోవడంతో మోటార్లు పెట్టి తోడుతున్నారు. తాత్కాలిక చర్యలు కాకుండా డ్రెయినేజీ నీరు సక్రమంగా పారేలా, వర్షపునీరు నిలవకుండా శాశ్వత చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ పెద్దలు నందమూరినగర్పై దృష్టిపెట్టి ముంపు ముప్పును తొలగించాలి. – వై.ప్రసాదరావు, నందమూరినగర్, 58వ డివిజన్, విజయవాడ -
వైఎస్సార్సీపీకి 683 ఓట్లే వచ్చాయంటే టీడీపీ వాళ్లే నమ్మడం లేదు: ప్రొ. నాగేశ్వర్
సాక్షి అమరావతి: పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 683 ఓట్లు మాత్రమే వచ్చాయంటే టీడీపీ వాళ్లే నమ్మడం లేదని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. అలాంటిది ఇక రాష్ట్ర ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. టీడీపీ గెలుపుపై సోషల్ మీడియాలో నెటిజన్ల సెటైర్లు ఒక టీవీ చానెల్తో మాట్లాడుతూ గురువారం నాగేశ్వర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇదే విషయంపైన సోషల్ మీడియాలోనూ సెటైర్లు పేలుతున్నాయి. భారీ ఎత్తున దొంగ ఓట్లు, రిగ్గింగ్, పోలీసుల అండతోనే టీడీపీ గెలిచిందని నెటిజన్లు మండిపడుతున్నారు. పులివెందులలో వైఎస్సార్సీపీకి 683 ఓట్లు రావడమే ఇందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు. -
ఇద్దరు ఏపీ పోలీసు అధికారులకు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి/కర్నూలు/లక్ష్మీపురం(గుంటూరు ఈస్ట్) : ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు పోలీసు అధికారులు చెన్నుపాటి భద్రయ్య (ఎస్పీ), గోపు రాజీవ్కుమార్ (డీఎస్పీ) రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీసు పతకానికి ఎంపికయ్యారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పోలీసు, అగి్నమాపక, హోంగార్డు, సివిల్ డిఫెన్స్, కరెక్షనల్ సర్విసెస్కు చెందిన మొత్తం 1,090 మంది అధికారులకు శౌర్య/సేవా పోలీస్ పతకాలను ప్రకటించింది. ఇందులో మొత్తం 25 మంది ఏపీ అధికారులు ఈ పతకాలకు ఎంపికయ్యారు.కేంద్ర హోంశాఖ గురువారం ఈ జాబితా విడుదల చేసింది. ఇందులో భాగంగా.. దేశవ్యాప్తంగా 233 మందికి శౌర్య పతకాలు (జీఎం), 99 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు (పీఎస్ఎం), 758 మందికి ప్రతిభాపూర్వక సేవా పతకాలు (ఎంఎస్ఎం) ప్రకటించింది. వీరిలో ఏపీకి చెందిన ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం, 20 మంది పోలీసులకు కరెక్షనల్ సర్విసెస్ కింద, ముగ్గురు అధికారులకు ప్రతిభాపూర్వక సేవా పతకాలు లభించాయి.ప్రాణాలు, ఆస్తులను కాపాడటంలో, నేరాలను నిరోధించడంలో లేదా నేరస్తులను అరెస్టుచేయడానికి విధి నిర్వహణలో ప్రదర్శించిన శౌర్యం, తెగువ ఆధారంగా రాష్ట్రపతి శౌర్య పతకం (పీఎంజీ), శౌర్య పతకం (జీఎం) కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. అలాగే, విధి నిర్వహణలో అందించిన విశిష్ట సేవకు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం (పీఎస్ఎం), విలువైన సేవకు ప్రతిభాపూర్వక సేవా పతకం (ఎంఎస్ఎం) ఇస్తున్నారు. ప్రతిభాపూర్వక సేవా పతకాలు రవికృష్ణ ఆకే (ఐజీ), శ్రీనివాసరావు వల్లూరి (డీఎస్పీ), వీరవెంకట ప్రతాప్కుమార్ తోట (డీఎస్పీ), కోదండ శ్రీరామచంద్రరాజు దెందుకూరి (అసిస్టెంట్ కమాండెంట్), గోవిందరావు మామిడి (ఇన్స్పెక్టర్), రామకృష్ణ గండెం (ఇన్స్పెక్టర్), శ్రీనివాసరావు బొడ్డు (హెడ్ కానిస్టేబుల్), సీతారాము కరిమకొండ (ఎస్ఐ), చంద్రశేఖర్ పెదిరెడ్డి (ఏఎస్ఐ), నాగమల్లేశ్వరరావు విశ్సరాపు (ఏఎస్ఐ), వెంకటరామశర్మ బుర్రా (ఏఎస్ఐ), ఉస్మాన్ గనిఖాన్ నయేబ్ (ఏఎస్ఐ), గోపాల్ కరువా (ఎస్ఐ), కోటేష్ కోట్టకోట (ఎస్ఐ), నాగేశ్వరరావు దొమ్మేటి (ఏఎస్ఐ), సీతారామాంజనేయులు పామర్తి (ఏఎస్ఐ), నాగబాబు కొప్పిశెట్టి (ఏఎస్ఐ), గోపాలకృష్ణ గుబ్బల (హెడ్ కానిస్టేబుల్), సురేష్ కుమార్ మురుగేశన్ (హెడ్ కానిస్టేబుల్), దానం గడ్డ (హెడ్ కానిస్టేబుల్), డా. వరప్రసాద్ మామిళ్లపల్లి (డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్), రవికుమార్ కరణం (చీఫ్ హెడ్వార్డర్), వీరవెంకట సత్యనారాయణరావు తలపర్తి (హెడ్ వార్డర్)జమ్మూకశ్మీర్లో ఏపీ ఐపీఎస్కు కూడా.. ఇక జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్ ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న కర్నూలుకు చెందిన ఐపీఎస్ అధికారి జీవీ సందీప్ చక్రవర్తి కూడా రాష్ట్రపతి పోలీస్ మెడల్కు ఎంపికయ్యారు. చక్రవర్తి అక్కడ అనేక ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో చురుకైన పాత్ర పోషించారు. ఆయన ధైర్యసాహసాలకు గుర్తింపుగా ఈ అవార్డుకు ఎంపికయ్యారు. అలాగే, గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని ఆరీ్పఎఫ్ డీఎస్పీ గొల్లమూడి మధుసూదనరావు, రేణిగుంట అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ కుక్కల రాజగోపాల్రెడ్డి కూడా రాష్ట్రపతి పోలీసు మెడల్స్కు ఎంపికయ్యారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీవాస్తవ, డీఆర్ఎం సుధేష్ట సేన్ వీరికి అభినందనలు తెలిపారు. -
కృష్ణమ్మ దూకుడు
సాక్షి, అమరావతి/విజయపురిసౌత్/సత్రశాల(రెంటచింతల)/తాడేపల్లిరూరల్/శ్రీశైలం ప్రాజెక్ట్ : ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి వస్తున్న వరదకు మూసీ, మున్నేరు, కట్టలేరు, బుడమేరు, కొండవీటివాగు ప్రవాహం తోడవడంతో కృష్ణా నదిలో వరద ఉధృతి మరింత పెరిగింది. గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 5,59,185 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీ 70 గేట్లు ఎత్తి 5,59,185 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో ఎగువన వర్షాలు కురస్తుండటంతో ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్లలోకి వరద కొనసాగుతోంది. ఆ రెండు జలాశయాలు నిండుకుండల్లా మారడంతో వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. ఉప నది భీమాపై మహారాష్ట్రలోని ఉజ్జయిని డ్యామ్ కూడా నిండింది. దాంతో కృష్ణా, భీమా వరద జూరాల మీదుగా శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతోంది. ప్రధాన ఉప నది తుంగభద్ర డ్యాం కూడా నిండిపోయి సుంకేశుల బ్యారేజీ మీదుగా శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద చేరుతోంది. దీంతో గురువారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,72,234 క్యూసెక్కులు చేరుతుండగా.. నాలుగు గేట్లను పది అడుగుల మేర ఎత్తి 1,06,608 క్యూసెక్కులు, కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 65,982 క్యూసెక్కులు.. వెరసి 1,72,590 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్లోకి 1,72,774 క్యూసెక్కులు చేరుతుండగా.. స్పిలే వే గేట్లు ఎత్తి, విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 2,36,958 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. దీనికి మూసీ వరద తోడవుతుండటంతో పులిచింతల ప్రాజెక్టులోకి 2,73,900 క్యూసెక్కుల వరద చేరుతోంది. స్పిల్ వే గేట్ల ద్వారా 1,84,692 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ కృష్ణాలో వర్షాలు తగ్గిన నేపథ్యంలో శుక్రవారం ప్రకాశం బ్యారేజీ వద్ద వరద తగ్గుముఖం పడుతుందని అధికార వర్గాలు తెలిపాయి. -
నేడు 9 జిల్లాల్లో ‘ఫ్లాష్ ఫ్లడ్’!
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: అల్పపీడనం, రుతుపవన ద్రోణి ప్రభావం రాష్ట్రంపై భారీగానే ఉంటుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) వెల్లడించింది. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలకు ఆకస్మిక వరదలు(ఫ్లాష్ ఫ్లడ్స్) వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. శుక్రవారం మధ్యాహ్నంలోపు కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. దీనికనుగుణంగా ఆయా ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఒక్కసారిగా వరద నీరు ఉప్పొంగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కొనసాగుతున్న అల్పపీడనం మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలకు సమీపంలో అల్పపీడనం కొనసాగుతోందని, శుక్రవారం ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా బలపడుతుందని, అనంతరం పశి్చమ వాయవ్య దిశగా కదులుతుందని ఐఎండీ తెలిపింది. బిలాస్పూర్, కళింగపట్నం మీదుగా రుతుపవన ద్రోణి కొనసాగుతోందని వెల్లడించింది. అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. శుక్రవారం, శనివారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల విస్తారంగా వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వివరించింది. కాగా, 16 నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు పెరుగుతాయని తెలిపింది. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయగా, కళింగపట్నం, భీమునిపట్నం, నిజాంపట్నం, వాడరేవు పోర్టులకు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. వేటకు వెళ్లొద్దు రానున్న మూడు రోజులు తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. వరద పూర్తి స్థాయిలో తగ్గేవరకు కృష్ణానది పరీవాహక లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని కోరారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, ప్రజలను అప్రమత్తం చేస్తూ విపత్తు నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు మెసేజ్లు పంపిస్తుందని ఆయన స్పస్టంచేశారు. తణుకులో 240 మి.మీ. వర్షపాతం గడిచిన 24గంటల్లో తణుకులో 240 మిల్లీ మీటర్ల భారీ వర్షపాతం నమోదుకాగా, నందిగామలో 190, తాడేపల్లిగూడెంలో 160, విజయవాడ, అమలాపురం, డెంకాడలో 130, పాలేరులో 120, భీమడోలులో 100, పూసపాటిరేగ, ఏలూరులో 90, తుని, విజయనగరం, పాలకోడూరులో 80 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
రిగ్గింగ్ ఎన్నికల్లో.. సిగ్గుపడే గెలుపు
సాక్షి ప్రతినిధి, కడప, సాక్షి రాయచోటి: ‘‘అసలు ప్రతిపక్షానికి చెందిన ఏజెంట్లే లేకుండా జరిగిన ఈ ఎన్నికలు ఒక ఎన్నికలా..? ఏ ఒక్క బూత్లోనూ విపక్ష ఏజెంట్లను రానివ్వకుండా రిగ్గింగ్ చేసి, అనైతికంగా పోలీసుల సాయంతో గెలిచి సంబరాలు చేసుకోవడం ఏమిటి? ప్రపంచ చరిత్రలో ఏ ఎన్నికా ఇలా జరిగి ఉండదు...!’’ అని ప్రజాస్వామికవాదులు, రాజకీయ విశ్లేషకులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ‘దేశంలో ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా పారదర్శకంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు పోలీసు వ్యవస్థను వినియోగిస్తారు. కానీ మొట్టమొదటిసారి ప్రజలు ఓట్లు వేయకుండా ఉండేందుకు పోలీసులను వాడిన దుర్మార్గమైన చరిత్ర చంద్రబాబు సర్కారుది..’ అని వ్యాఖ్యానిస్తున్నారు. కళ్లు మూసుకున్న ఎన్నికల కమిషన్!పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అడ్డదారిలో టీడీపీ గట్టెక్కింది! ఎన్నికల ముందు తాలిబన్లు, బందిపోటు ముఠాల మాదిరిగా అటకాయించి వైఎస్సార్ సీపీ నేతలపై హత్యాయత్నాలు, దాడులకు తెగబడటంతో మొదలైన పచ్చముఠాల అకృత్యాలు ఎన్నికల రోజు మరింత యథేచ్ఛగా సాగాయి. అధికార యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకుని కొమ్ము కాసే పోలీసుల సహకారంతో ప్రభుత్వ పెద్దలు ఎన్నికల అరాచకాలకు బరి తెగించారు. టీడీపీ నేతలు ఎన్నికల ముందు రోజు రాత్రే వైఎస్సార్ సీపీ పోలింగ్ ఏజెంట్ల ఇళ్ల వద్దకు చేరుకుని వారు బయటకు రాకుండా మోహరించారు. ఓటర్ల నుంచి స్లిప్పులు లాక్కుని బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారితో దొంగ ఓట్లు వేయించారు. దేశ చరిత్రలో తొలిసారిగా అసలు విపక్ష పోలింగ్ ఏజెంట్లే లేకుండా చేసి అధికార పార్టీ అడ్డగోలుగా అరాచకాలకు పాల్పడినా ఎన్నికల కమిషన్ కళ్లు మూసుకుని కూర్చుంది. ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచి పోలీసు అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారు. వైఎస్సార్ సీపీ నేతలపై బైండోవర్ కేసులు మొదలు హత్యాయత్నం, కౌంటర్ కేసులు బనాయించి అరెస్టులు చేసుకుంటూ వెళ్లారు. పట్టపగలు నల్లగొండువారిపల్లె గ్రామం మధ్యలో ప్రజలంతా చూస్తుండగా ఎమ్మెల్సీ రమేష్యాదవ్, వేల్పుల రామలింగారెడ్డిపై హత్యాయత్నం జరిగితే నిందితులను ఇప్పటికీ అదుపులోకి తీసుకోలేదు. పైగా కౌంటర్ కేసులో అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. పోలింగ్ రోజు వైఎస్సార్సీపీ ఏజెంట్లు బూత్ల వద్దకు రాకుండా దగ్గరుండి మరీ అడ్డుకుని టీడీపీ గూండాలకు సహకారం అందించారు. ఏకంగా డీఐజీ కోయ ప్రవీణ్ పులివెందులలోనే తిష్ట వేసి ఈ అరాచకాలను పర్యవేక్షించడం విస్మయం కలిగిస్తోంది. ఒంటిమిట్టలో మంత్రి సమక్షంలోనే దాడులు..ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలింగ్ ఉదయం 10.30 వరకు సాఫీగా సాగినా ఓటర్లు వైఎస్సార్ సీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు పసిగట్టిన పచ్చముఠాలు బూత్లను ఆక్రమించుకుని దౌర్జన్యాలకు తెగబడ్డాయి. ఏకంగా మంత్రి రాంప్రసాద్రెడ్డి సమక్షంలోనే వైఎస్సార్ సీపీ ఏజెంట్లపై దాడులకు దిగినా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. టీడీపీ గూండాలను వారించకపోగా.. వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలను రాకుండా కట్టడి చేయడంతో అధికార పార్టీ బూత్లలో యథేచ్ఛగా రిగ్గింగ్ చేసుకుంది. పోలింగ్ రోజంతా విచ్చలవిడిగా సాగిన టీడీపీ మూకల రిగ్గింగ్, బయటి ప్రాంతాల నుంచి వచ్చిన దొంగ ఓటర్లతో జాతరను తలపించింది. ఉదయం పోలైన ఓట్లలో ఎక్కువ శాతం వైఎస్సార్సీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి వచ్చినట్లు తెలుస్తోంది. తర్వాత పచ్చ ముఠాలు అక్రమాలకు బరి తెగించాయి. ఓటర్ల నుంచి స్లిప్పులు లాక్కుని దొంగ ఓట్లు వేశాయి. సాయంత్రం వరకు విపక్ష ఏజెంట్లు లేకుండా ఈ డ్రామా సాగింది. ఈ అరాచకాలు, అక్రమాలు, ఏకపక్ష ఎన్నికలను నిరసిస్తూ కడపలో జరిగిన కౌంటింగ్ను వైఎస్సార్ సీపీ అభ్యర్థితోపాటు ఏజెంట్లు బహిష్కరించారు.అభాసుపాలైన ఎస్ఈసీ..జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా వ్యవహరించిన తీరుతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అభాసుపాలైంది. ఓటర్లు నాలుగైదు కిలోమీటర్లు దూరం ప్రయాణించి ఓట్లు వేయాల్సి వచ్చేలా పోలింగ్ కేంద్రాలను ఇష్టానుసారంగా మార్చేసినా ఏమీ పట్టనట్లు కళ్లు మూసుకుంది. టీడీపీ నాయకులు దొంగ ఓటర్ల అవతారం ఎత్తిన వైనం మీడియా, సామాజిక మాధ్యమాల్లో రోజంతా వైరల్ అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చివరకు మహిళలవి కూడా దొంగ ఓట్లు పోలయ్యాయి. పులివెందులలో 3,684 మంది మహిళలు ఓట్లు వేసినట్లు నమోదైంది. వెబ్ కాస్టింగ్ పరిశీలిస్తే బోగస్ బాగోతం వెల్లడవుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. వ్యవస్థలన్నీ కుమ్మక్కై రౌడీ రాజ్యానికి పట్టం కట్టారని పులివెందుల ప్రజలు పేర్కొంటున్నారు.ఓటర్లతో మాట్లాడే ధైర్యం ఉందా? సాక్షి, అమరావతి: ఒంటిమిట్ట, పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని, అందుకే కౌంటింగ్ ప్రక్రియను బాయ్కాట్ చేస్తున్నట్లు ప్రకటించామని ఒంటిమిట్ట వైఎస్సార్ సీపీ అభ్యర్థి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఒంటిమిట్టలో ఉదయం 11 గంటల వరకు మాత్రమే ఎన్నికలు సజావుగా జరిగాయని, ఆ తరువాత టీడీపీ నేతలు పోలీస్ ప్రొటెక్షన్తో రిగ్గింగ్ చేసుకుని దొంగ ఓట్లు వేసుకున్నారని వెల్లడించారు. ఈ రెండు ఉప ఎన్నికలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఒంటిమిట్ట, పులివెందులలో ఏ గ్రామానికి వెళ్లినా వేలికి సిరా గుర్తు లేని వారే కనిపిస్తారని చెప్పారు. ప్రతి గ్రామానికి వెళ్లి ఓటర్లకు సిరా గుర్తు ఉందో లేదో విచారణ చేయాలని కోరారు. గ్రామాలకు వచ్చి నిజమైన ఓటర్లతో మాట్లాడే ధైర్యం ఉందా? అని టీడీపీ నేతలకు సవాల్ చేశారు.పులివెందుల, ఒంటిమిట్ట స్థానాలు టీడీపీకే కడప సెవెన్రోడ్స్: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం కడప శివార్లలోని మను పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తుమ్మల హేమంత్రెడ్డికి 683 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డికి 6,716 ఓట్లు వచ్చాయి. దీంతో ఆమె 6,033 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి 6,513 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డికి 12,780 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి 6,267 ఓట్ల మెజారీ్టతో గెలుపొందారు. -
తాడిపత్రికి కేతిరెడ్డి.. అనంతపురం పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఏపీలో హైకోర్టులో ఊరట దక్కింది. తాడిపత్రి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. పెద్దారెడ్డి దాఖలు చేసిన కోర్టు ధిక్కారణ కేసును హైకోర్టు విచారించింది. తాడిపత్రి వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ సందర్భంగా అనంతపురం పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈనెల 18వ తేదీన కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు అనుమతిచ్చిన కోర్టు .. ఆయనకు పోలీసులే భద్రత కల్పించాలని సూచించింది. -
ఉచిత బస్సు పథకం.. అసలు రంగు ఇదే!
2024 ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం, జనసేన పార్టీలు సంయుక్తంగా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి. అధికారంలోకి రావడమే తరువాయి.. ‘‘మీ ఇష్టం ...మీరు ఎక్కడకు కావాలంటే అక్కడికి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు’’ అని ఇద్దరూ తెగ ఊరించారు. ఇంకో అడుగు ముందుకేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ‘‘ఎవరైనా టిక్కెట్ అడిగితే చంద్రన్న చెప్పాడని బస్ కండక్టర్కు తెలపండి.. నేను సేఫ్ డ్రైవర్ని’’ పదే పదే చెప్పారు కూడా. ఈ హామీకి సంబంధించిన ప్రచారం కోసం తయారు చేసిన ప్రకటనల్లో ‘‘మహిళలు ఏపీలోని ఏ పుణ్యక్షేత్రానైన్నా ఉచితంగా దర్శించి రావచ్చు’’ అని ఉండేది. ఒక యాడ్ ఎలా ఉందంటే... ‘‘టీ కూడా పెట్టకుండా బిజీగా రాసుకుంటున్నావు..’’ అని భర్త తన భార్యను ప్రశ్నిస్తాడు..‘‘మొక్కులు తీర్చుకోవడానికి యాత్రలకు గాను పుణ్యక్షేత్రాల జాబితా తయారు చేస్తున్నా’’.. అని భార్య జవాబు.. ‘‘అసలే ఖర్చులు ఎక్కువగా ఉంటే ఇప్పుడు ఎలా’’ అని భర్త ప్రశ్న.. ‘‘మనం ఒక పనిచేస్తే సగం ఖర్చు తగ్గించుకోవచ్చు’’ అని భార్య సమాధానం..‘‘జనసేనకు ఓటు వేస్తే ఉచిత బస్ ప్రయాణం చేయవచ్చు. దాంతో సగం ఖర్చు తగ్గిపోతుంది’’ అని భార్య వివరణరిప్లై.. ఇక అంతే కూటమికి ఓటు వేస్తే ఫ్రీబస్ అంటూ ఊదరగొట్టేశారు..అధికారం అయితే వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. కాని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 14 నెలల వరకు అందుబాటులోకి రాలేదు. ఆడబిడ్డ నిధితోసహా పలు స్కీములు అమలు చేయకుండా కాలం గడుపుతున్న కూటమి ప్రభుత్వంపై ప్రజలలో ముఖ్యంగా మహిళలలో తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో, దాన్ని ఎంతో కొంత తగ్గించాలన్న ఉద్దేశంతో ఇచ్చిన హామీలలో కొన్ని అయినా, కొంత మేర అయినా అమలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. కాని వీటిని అరకొరగా చేస్తుండడంతో ప్రజలలో వ్యతిరేకత పెద్దగా తగ్గుతున్నట్లు కనిపించడం లేదు. టీడీపీ జనసేనలు తమను మోసం చేశాయని మహిళలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం ఉచిత బస్సు ప్రయాణాన్ని పేరుకే తప్ప పెద్దగా ప్రయోజనం లేకుండా అమలు చేయ సంకల్పించారని విమర్శిస్తున్నారు. దానికి కారణం ఆడవారు ఏపీలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లే అవకాశం కల్పిస్తామని చెప్పి, ఇప్పుడు రకరకాల షరతులు పెట్టడమే. ఉచిత బస్ స్కీమ్పై కూటమి మంత్రులు ఇంతకాలం పలురకాల పిల్లి మొగ్గలు వేశారు. జిల్లాల వరకే ఉచితం అని ఒకసారి, ఉమ్మడి జిల్లాలలో ప్రయాణాలకు అనుమతిస్తామని మరోసారి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా జిల్లా స్థాయిలో ఉచిత ప్రయాణాలు ఉంటాయని అన్నప్పుడు అంతా నవ్వుకున్నారు. యథా ప్రకారం మరో మోసం చేశారని విమర్శించారు. దీనికి తోడు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత జగన్ చేస్తున్న విమర్శల ఒత్తిడి ఉండనే ఉంది. కడప నుంచి అమరావతి ఎప్పుడు ఉచిత బస్లలో వెళదామని స్త్రీలు ఎదురు చూస్తున్నారని ఒక సందర్భంలో ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కొత్త ఆలోచన చేసి రాష్ట్రమంతా పర్యటించవచ్చంటూ చెబుతూనే లిటిగేషన్ పెట్టారు. ఎన్నికల ప్రచారంలో అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం అనుకునేలానే చెప్పేవారు. తిరుమల, శ్రీశైలం, సింహాచలం, అన్నవరం.. ఏ గుడికి అయినా, ఎంత దూరం అయినా హాపీగా వెళ్లి రావచ్చనుకున్న ఆడవాళ్ల ఆశలపై నీళ్లు చల్లే పరిస్థితి ఏర్పడింది. మొత్తం పదహారు రకాల బస్ సర్వీసులు ఉంటే ఐదింటిలో మాత్రమే ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారట. దాని ప్రకారం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లు, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్ప్రెస్లలోనే ఫ్రీ. ఇవేవి దూర ప్రాంతాలకు వెళ్లేవి కావు. ఎక్స్ప్రెస్ బస్సులను అనుమతించినా, అవి సరిపడా ఉండవు. పైగా వీటిలో చాలా బస్సులు నాన్స్టాప్లుగా మార్చారు. అన్ని కలిపి 8458 బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుందని టీడీపీ మీడియా మహిళలను మభ్య పెట్టాలని యత్నించింది. ఈ లెక్కలు కూడా కావాలని పెంచి చెప్పినవే. ఏ మహిళైనా విశాఖ నుంచి తిరుపతికి వెళ్లాలంటే పది బస్సులు మారి వెళ్లాల్సి వస్తుందని, మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. అల్ట్రా డీలక్స్, సూపర్ లక్జరీ, నాన్ ఏసీ స్లీపర్ స్టార్ లైన్, ఏసీ బస్సులు, తిరుమల ఘాట్ బస్సుల్లో ఉచిత ప్రయాణం వీల్లేదు. నాన్స్టాప్ ఎక్స్ప్రెస్ బస్సుల్లోకాని, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులకు వెళ్లే ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో కాని టిక్కెట్ తీసుకోవల్సిందే. అంటే సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే స్త్రీలు టిక్కెట్లు తీసుకోవల్సిందే అన్నమాట. మహిళలు హైదరాబాద్ వెళ్లాలన్నా బస్సులు మారుతూ గంటల తరబడి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఏపీ సరిహద్దు వరకే ఉచితం కనుక, ఆ తర్వాత టిక్కెట్ తీసుకుని మరో బస్సు ఎక్కాలన్నమాట. అమరావతి బస్సుల్లో కాని, ఆర్టీసీ అద్దెకు తీసుకుని నడిపేవాటిల్లోనూ ఉచిత ప్రయాణం అవకాశం లేదు. నాన్స్టాప్ బస్సులు ఒక పట్టణం నుంచి మరో పట్టణానికి ఉంటాయి. వాటిలో ఎక్కడానికి వీలు లేదు. ఉదాహరణకు విజయవాడ-గుంటూరు మధ్య ప్రతి పావుగంటకు నాన్స్టాప్ బస్సులు ఉంటాయి. అలాగే విశాఖ- శ్రీకాకుళం, తిరుపతి-కడప, నెల్లూరు-ఒంగోలు ,విజయవాడ-ఏలూరు, కాకినాడ- రాజమండ్రి, అనంతపురం-కర్నూలు, నంద్యాల-కర్నూలు ఇలా వివిధ పట్టణాల మధ్య పెద్ద సంఖ్యలో నాన్స్టాప్ బస్సులు ఉంటాయి. ఇవి ఉచిత పథకంలో భాగం కాదు. తిరుమల, పాడేరు, శ్రీశైలం ఘాట్ రోడ్డులలో కూడా టిక్కెట్ కొనాల్సిందేనట. అలాంటప్పుడు పుణ్య క్షేత్రాలకు ఉచితంగా వెళ్లడం ఎలా సాధ్యం. చివరికి గిరిజనులు అధికంగా ప్రయాణించే పాడేరు ఘాట్ రోడ్డులో కూడా ఈ స్కీమ్ ఉండదట. అంటే ప్రజలను మభ్య పెట్టడానికే ఎన్నికల సమయంలో అన్నీ ఫ్రీ అని అబద్దపు ప్రచారం చేశారన్నమాట. అప్పుడేమో ఎలాంటి షరతులు పెట్టకుండా నమ్మబలికి , ఇప్పుడేమో అన్నీ కండిషన్స్ పెడతారా అని మహిళలను మండిపడుతున్నారు. ఇంకో విషయం చెప్పాలి. ఎల్లో మీడియాలో మే నెల18 న రాసిన ఒక స్టోరీలో ఉచిత స్కీమ్ అమలుకు ఏపీ ప్రభుత్వంపై రూ.3182 కోట్ల భారం పడుతుందని లెక్కవేశారు. అదే మీడియా ఆగస్టు 10న రాసిన ఒక కథనంలో ఏడాదికి ఈ స్కీమ్ కింద భారం రూ.1942 కోట్లు అవుతుందని అంచనా వేశారని తెలిపారు. అంటే దాదాపు 1200 కోట్ల మేర భారం తగ్గించారంటే ఆ మేరకు ఉచిత బస్ ప్రయాణ సర్వీసులలో కోత పెట్టినట్లే. నిజానికి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ స్కీమును అమలు చేశారు. ఆ పథకం అమలులో ఆ రాష్ట్రాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. తెలంగాణలో నెలకు సుమారు రూ.300 కోట్లు ఖర్చు అవుతున్నదని అంచనా. ఏపీలో కూడా తొలుత సుమారు రూ.250 కోట్ల వ్యయం అంచనా వేసినా, ఆ తర్వాత దానికి కోత పెట్టుకుంటూ స్కీమ్ను నామమాత్రం చేశారా అన్న సంశయం కలుగుతుంది. తెలంగాణలో ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులను రీయింబర్స్ చేయడం లేదు. దాంతో పలు సమస్యలు ఎదురవుతున్నట్లు చెబుతున్నారు. నిధుల కొరత కారణంగా తెలంగాణలో గౌలిగూడ ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని తాకట్టు పెట్టి రూ.400 కోట్ల రుణం తీసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోందని ఒక వార్త వచ్చింది. ఏపీలో గత జగన్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ సిబ్బందిగా మార్చినందున కొంత భారం తగ్గుతుంది. అయినా స్కీమ్ అమలులో తీవ్ర జాప్యం చేశారు. ఇది ఇలా ఉండగా, ఉచిత బస్ స్కీమ్ వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని ఆటోలు, టాక్సీల వారు వాపోతున్నారు.స్వయంఉపాధి కింద వేలాది మంది బతుకుతున్న వారికి ఇది ఒక గండంగా మారుతుంది. ఫ్రీ బస్ స్కీమ్ హామీ వల్ల ఆటోలవారు నష్టపోకుండా వారికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని, రుణ సదుపాయం, రాయితీల కల్పన వంటివి చేస్తామని హామీ ఇచ్చినా, ఇంతవరకు అవి అమలు కావడం లేదు. దాంతో ఆటో యజమానులు, డ్రైవర్లు ఆందోళనకు గురి అవుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకం మొత్తమ్మీద చూస్తే విజయవాడ, విశాఖ వంటి పెద్ద నగరాలలో సిటీ బస్సుల్లో తిరిగే మహిళలకే కాస్త ఉపయోగం.అదేమీ పెద్ద ఖర్చు కాదన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానానికి, ఆచరణలో అమలు చేస్తున్నదానికి చాలా తేడా ఉందన్నమాట.ఉచిత బస్ స్కీమ్ వల్ల వేల రూపాయలు ఆదా అవుతాయని చేసిన ప్రచారం అంతా ఉత్తదే అన్నమాట. పుణ్య క్షేత్రాలన్నీ తిరిగేసి మొక్కులు తీర్చుకోవాలనుకున్న ఏపీ మహిళలు, కనీసం టీడీపీ, జనసేనలకు మద్దతు ఇచ్చిన వనితలకు ఇది పెద్ద నిరాశ మిగుల్చుతుందని భావించవచ్చు. ఇదన్నమాట! స్త్రీ శక్తి పేరుతో అమలు చేయతలపెట్టిన ఉచిత బస్ ప్రయాణం పథకం అసలు రంగు.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఎస్ఈసీ కల్పించుకుని రిగ్గింగ్ను అడ్డుకోవాల్సింది: హైకోర్టు
సాక్షి, అమరావతి: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ అక్రమాలపై వైఎస్సార్సీపీ వేసిన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ మధ్యాహ్నానికి వాయిదా పడింది. వైఎస్సార్సీపీ ఏజెంట్లను పోలింగ్బూత్ల్లోకి అనుమతించకుండా అడ్డుకున్నారని.. పక్క నియోజకవర్గాల నుంచి మనుషులను రప్పించి రిగ్గింగ్ చేయించారని వైఎస్సార్సీపీ తరఫు లాయర్ వాదనలు వినిపించారు. అయితే విజేతను ప్రకటించాక కోర్టుల జోక్యం అనవసరమంటూ టీడీపీ తరఫు లాయర్ వాదించారు. ఈ క్రమంలో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు మరికాసేపట్లో ఆదేశాలు జారీ చేయనుంది.వైఎస్సార్సీపీ అభ్యర్థుల తరఫున లాయర్ వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ ఉప ఎన్నికల్లో పక్క నియోజకవర్గాల టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు. మొత్తం 15 పోలింగ్బూత్ల్లోకి వైఎస్సార్సీపీ ఏజెంట్లను అనుమతించలేదు. జమ్మలమడుగు నుంచి వాహనాల్లో వచ్చారు. ఆ వాహనాలపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఫొటోలు ఉన్నాయి. పక్క నియోజకవర్గాల నుంచి వచ్చిన టీడీపీ నేతలు క్యూ లైన్లో నిల్చిన ఓటేసిన ఫొటోలు ఉన్నాయి. ఓటర్లను భయభ్రంతాలకు గురి చేసి ఓట్లేశారు. కలెక్టర్ సమక్షంలో దొంగ ఓటు వేస్తున్న ఫొటోలు బయటకు వచ్చాయి. ఎన్నికలో జరుగుతున్న దౌర్జన్యాలను అదే రోజు ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లాం. ఎన్నిలక సంఘం ఎలాంటి జోక్యం చేసుకోలేదు. రిగ్గింగ్ జరుగుతున్నా పట్టించుకోలేదు. తమను అనుమతించలేదని వైఎస్సార్సీపీ ఏజెంట్లు ఫిర్యాదు చేశారు అని వాదించారు. అయితే.. టీడీపీ తరఫు లాయర్ వాదిస్తూ.. ఎన్నిక సంబంధమైన వివాదాల్లో జోక్యం చేసుకునే హైహక్కు కోర్టుకు లేదు. ఇప్పటికే విజేతను ప్రకటించారు. కాబట్టి కోర్టుల జోక్యం అనవసరం అన్నారు. ఈ క్రమంలో.. పిటిషనర్ల తరఫున మాజీ ఏజీ శ్రీరామ్ వాదిస్తూ.. ఎన్నికల సంఘం పరిధిలోకి కోర్టులు జోక్యం చేసుకోవద్దనే నియమం ఈ కేసుకు వర్తించదని స్పష్టం చేశారు. మోహిందర్ సింగ్ కేసులో కోర్టు రీపోలింగ్కు ఆదేశించింది. సహజన్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఏదైనా జరిగినప్పుడు.. జోక్యం చసుకునే హక్కు హైకోర్టుకు ఉంది అని తెలిపారు. ఈ క్రమంలో జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ స్పందిస్తూ.. ఎస్ఈసీ కల్పించుకుని రిగ్గింగ్ను అడ్డుకోవాల్సిందని అన్నారు. అంతేకాదు.. ఇతర ప్రాంతాల వారు ఓట్లు వేస్తున్నట్లు ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికల అవకతవకల పిటిషన్ వాదనలు పూర్తి కావడంతో ఆదేశాలు మధ్యాహ్నాం తర్వాత జారీ చేస్తామని తెలిపారాయన. ‘‘పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార టీడీపీ నాయకులు బెదిరింపులు, దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడ్డారని, పోలింగ్ కేంద్రాలను ఆక్రమించి దొంగ ఓట్లు వేసుకున్నారని, ఈ నేపథ్యంలో రీ పోలింగ్కు చర్యలు చేపట్టేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని వైఎస్సార్సీపీ అభ్యర్థులు తుమ్మల హేమంత్రెడ్డి, ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. -
‘కన్ఫర్డ్ ఐపీఎస్’లకు రెడ్బుక్ కుట్ర బాధ్యతలు!
సాక్షి, అమరావతి: రెడ్బుక్ కుట్రలకు అడ్డగోలుగా వత్తాసు పలికే పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీలుగా అవకాశం ఇచ్చేందుకు చంద్రబాబు సర్కారు సన్నద్దమవుతోంది. అందుకోసం క్యాడర్ ఐపీఎస్ అధికారులు కాకుండా తమకు కొమ్ము కాసే ‘కన్ఫర్డ్ ఐపీఎస్’ అధికారులను నియమించాలని భావిస్తోంది. ఇది పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. రెడ్బుక్ కుట్ర కేసులతో ఐపీఎస్లు బెంబేలు.. టీడీపీ కూటమి సర్కారు ఏడాదికిపైగా సాగిస్తున్న రెడ్బుక్ కక్ష సాధింపు చర్యలతో పలువురు ఐపీఎస్ అధికారులు బెంబేలెత్తుతున్నారు. అధికార పార్టీకి అడ్డగోలుగా కొమ్ముకాస్తూ అక్రమ కేసులతో వేధింపులకు పాల్పడితే భవిష్యత్లో న్యాయపరంగా, ఇతరత్రా ఇబ్బందులు తప్పవన్నది వారి ఆందోళన. ప్రధానంగా ఇంకా చాలా సర్వీసు ఉన్న ఐపీఎస్ అధికారులు మరింత ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ కుట్రల్లో భాగస్వాములు కాలేమని డీజీ, అదనపు స్థాయి సీనియర్ ఐపీఎస్లే సహాయ నిరాకరణ చేస్తుండటాన్ని ప్రస్తావిస్తున్నారు.సీఐడీ ఐజీగా ఉన్న వినీత్ బ్రిజ్లాల్ రెడ్బుక్ కుట్రలకు సహకరించలేనని కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. మరో యువ ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్ స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేశారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్ తీవ్ర ఒత్తిడితో ఇప్పటికే రెండుసార్లు కుప్పకూలి అనారోగ్యం బారిన పడ్డారు. ఈ పరిణామాలన్నీ క్యాడర్ ఐపీఎస్ అధికారులను పునరాలోచనలో పడేశాయి. రెడ్బుక్ కుట్ర కేసులకు దూరంగా జరుగుతున్నారు. కొందరు నేరుగా చెప్పలేక సహాయ నిరాకరణ చేస్తున్నారు. ప్రభుత్వం తమను అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేసినా పర్వాలేదు కానీ అక్రమ కేసులకు వత్తాసు పలకలేమని తేల్చి చెబుతున్నారు. అస్మదీయ కన్ఫర్డ్ ఐపీఎస్లతో రెడ్బుక్ కుట్ర.. చంద్రబాబు ప్రభుత్వం మరో ఎత్తుగడకు తెరతీసింది. తమకు అస్మదీయులైన కన్ఫర్డ్ ఐపీఎస్ల ద్వారా రెడ్బుక్ కుట్రను తీవ్రతరం చేయాలని భావిస్తోంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం 14 మందిని కన్ఫర్డ్ ఐపీఎస్లుగా గుర్తించింది. దాంతో జిల్లా ఎస్పీల బదిలీల ప్రక్రియపై ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. తిరుపతి విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ విభాగం తిరుపతి ఆర్ఈవీవోగా ఉన్న కరీముల్లా షరీఫ్, కర్నూలు ఆర్ఈవీవోగా ఉన్న చౌడేశ్వరి, ఇంటెలిజెన్స్ విభాగంలో ఉన్న రామ్మోహన్రావులను ఇప్పటికే సూత్రప్రాయంగా ఎంపిక చేసినట్లు సమాచారం.కరీముల్లా షరీఫ్ను పుట్టపర్తి జిల్లాకు, చౌడేశ్వరిని ఉభయ గోదావరిలో ఒక జిల్లా, రామ్మోహన్రావును నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఒక జిల్లాకు ఎస్పీగా నియమించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. మరో కన్ఫర్డ్ ఐపీఎస్ అధికారి చక్రవర్తిని పల్నాడు జిల్లా ఎస్పీగా నియమించాలని భావిస్తున్నారు. సీఐడీ విభాగంలో ఉన్న కన్ఫర్డ్ ఐపీఎస్ అ«దికారి ఈశ్వరరావు, శ్రీనివాసరావులకు కీలక జిల్లాల ఎస్పీలుగా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ప్రకాశం ఎస్పీ దామోదర్ను మరో కీలక జిల్లాకు ఎస్పీగా బదిలీ చేసే అవకాశం ఉంది. కన్ఫర్డ్ ఐపీఎస్ అధికారులను కీలక జిల్లాల ఎస్పీలుగా నియమించేందుకు వీలుగా క్యాడర్ ఐపీఎస్ అధికారులను అప్రాధాన్య పోస్టుటులకు బదిలీ చేయాలనే ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. -
99 పైసలకే 22 ఎకరాలు.. బాబు ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం
సాక్షి, అమరావతి: విశాఖపట్నం, మధురవాడలో ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్కు 22 ఎకరాల భూమిని ఎకరా 99 పైసలకే కేటాయించడంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 24వ తేదీకి వాయిదా వేసింది.ఇదే సమయంలో టీసీఎస్, లులు కంపెనీలకు భూ కేటాయింపులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను కూడా కాగ్నిజెంట్కు సంబంధించిన పిటిషన్తో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అన్నింటినీ కలిపి విచారిస్తామని పేర్కొంటూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావులతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.99 పైసలకే 22 ఎకరాల భూ కేటాయింపులపై పిల్...కాగ్నిజెంట్ కంపెనీకి భూ కేటాయింపులను సవాలు చేస్తూ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ అండ్ ఎన్విరాన్మెంట్ రైట్స్ విశాఖ జిల్లా అధ్యక్షురాలు నక్కా నమ్మిగ్రేస్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ, విశాఖ నడిబొడ్డున రూ.1,109 కోట్ల విలువ చేసే 22 ఎకరాల భూమిని ప్రభుత్వం కేవలం 99 పైసలకే కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చిందన్నారు. సేల్డీడ్ ద్వారా కాగ్నిజెంట్కు విక్రయించేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. లీజు విధానంలో మాత్రమే భూ కేటాయింపులు జరపాల్సి ఉంటుందని తెలిపారు. -
నేడు వైఎస్ జగన్ అనంతపురం పర్యటన
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం అనంతపురంజిల్లా ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించనున్నారు. వైఎస్ జగన్ ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి అనంతపురం చేరుకుంటారు.నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశీస్సులుసాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు జిల్లా ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహ కార్యక్రమం బుధవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని వీఎస్ఎస్ గార్డెన్స్లో జరిగింది. ఈ వేడుకకు మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరై నూతన వధూవరులు ప్రజ్ఞ, నాగ సత్తిరాజుకు వివాహ శుభాకాంక్షలు తెలియజేసి.. ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు, మాజీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పినిపే విశ్వరూప్, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, వైఎస్సార్సీపీ నాయకులు ముదునూరి ప్రసాదరాజు, దూలం నాగేశ్వరరావు, కారుమూరి సునీల్కుమార్, గూడూరి ఉమాబాల, పాతపాటి మురళీకృష్ణంరాజు, మేకా ప్రతాప్ అప్పారావు, తెల్లం బాలరాజు, కొఠారు అబ్బయ్యచౌదరి, తలారి వెంకట్రావు, కంభం విజయరాజు, మామిళ్లపల్లి జయప్రకాష్, చినమిల్లి చినవెంకట్రాయుడు, పీవీఎల్ నర్సింహరాజు తదితరులు పాల్గొన్నారు. కాగా, వైఎస్ జగన్ వస్తున్నారని తెలుసుకున్న ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు జోరు వానను సైతం లెక్కచేయకుండా పెద్ద ఎత్తున తరలివచ్చి వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలికారు. ఆయనను కలిసేందుకు పోటీపడ్డారు. వారందరికీ వైఎస్ జగన్ అభివాదం చేస్తూ.. ఆప్యాయంగా పలకరించారు. -
వరద ముంపులో అమరావతి
సాక్షి ప్రతినిధి, గుంటూరు/తాడికొండ : రాజధాని అమరావతి మళ్లీ వరద ముంపులో చిక్కుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లడంతో గుంటూరు వైపు నుంచి రాజధాని అమరావతికి రాకపోకలు నిలిచిపోయాయి. మంగళవారం రాత్రి పది గంటల నుంచి బుధవారం ఉదయంలోపు జిల్లాలో సగటున 145 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో తాడికొండ మండలం లాం వద్ద కొండవీటి వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దాదాపు ఆరు గంటల పాటు వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. పెదపరిమి వద్ద కోటేళ్లవాగు, కంతేరు వద్ద ఎర్రవాగు, అయ్యన్నవాగు, పాలవాగులు పొంగడంతో రహదారులపైకి నీరు చేరింది.రాజధాని నిర్మాణాలతో స్వరూపం కోల్పోయిన వాగులు..రాజధాని ప్రాంతంలో వివిధ నిర్మాణాల కారణంగా పాలవాగు, అయ్యన్నవాగులు వాటి స్వరూపాన్ని కోల్పోయాయి. కొండవీటి వాగు నీరు దిగువకు వెళ్లే పరిస్థితి లేకుండాపోయింది. నిర్మాణాలతో వాగులు మూసుకుపోవడంతో పాటు రోడ్ల ఎత్తును పెంచడంతో వాగు నుంచి వచ్చే వేల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్లే పరిస్థితి లేక వేలాది ఎకరాల్లో పంటలు పూర్తిగా నీటమునిగాయి. ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టిసారించకుండా కొండవీటి వాగు వరదను గాలికొదిలేయడంతో పరిస్థితి అధ్వానంగా తయారైంది. మరోవైపు.. తాడికొండ, తుళ్ళూరు, మేడికొండూరు, మంగళగిరి రూరల్ మండలాల్లోని సుమారు 40 వేల ఎకరాల్లో పంటలు కొండవీటి వాగు వరద ఉధృతికి ముంపుబారిన పడి సముద్రాన్ని తలపిస్తున్నాయి. ఎక్కడ చూసినా వరద నీరే ఉండటంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ప్రత్యామ్నాయ చర్యలు నిల్..ఇక మంగళవారం రాత్రి తాడికొండ మండలంలో 225 మిల్లీమీటర్లు, తుళ్ళూరు మండలంలో 180.2 మి.మీ., మేడికొండూరు 140.2, ఫిరంగిపురం 111.2, మంగళగిరి 194.8 మి.మీ., వర్షం కురిసింది. ఈ వర్షం నీరు అంతా కొండవీడు కొండల మీదుగా మేడికొండూరు, తాడికొండ, తుళ్ళూరు, తాడేపల్లి మండలాల మీదుగా ప్రకాశం బ్యారేజ్కు చేరాల్సి ఉంది. కానీ, కొండవీటి వాగు ప్రక్షాళనకు రూ.234 కోట్లతో టీడీపీ కూటమి ప్రభుత్వం తలపెట్టిన ఎత్తిపోతల పథకంలో ఎక్కడా ఎగువ నుంచి దిగువకు వరద నీరు పూర్తిగా వచ్చేలా ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదు. నిజానికి.. వందల ఏళ్లుగా కొండవీటి వాగు పల్లపు ప్రాంతమైన రాజధాని ప్రాంతం నుంచే ప్రవహించేది. అయితే, ప్రస్తుతం దానిని మూసేసి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లుచేయకపోవడంవల్లే రాజధాని ప్రాంతం ముంపునకు గురైందని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. మరోవైపు.. కాసుల కక్కుర్తి కోసం రాజధానిలో రిజర్వాయర్ల పేరుతో ఇతర నిర్మాణాలను చేపట్టడం కూడా వరద ముంపునకు కారణమైంది. దీంతో.. గత 25 ఏళ్లలో ఎప్పుడూ జరగని నష్టం ఇప్పుడీ ప్రాంతానికి వచ్చింది. ఇటు పంటలు మునగడంతో పాటు గ్రామాల్లో కూడా నీరు కదిలే పరిస్థితి లేక రాజధానితో పాటు పరిసర ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం..ఇదిలా ఉంటే.. గుంటూరు నుంచి రాజధానికి వెళ్లేందుకు ప్రధాన రహదారి అమరావతి–గుంటూరు రోడ్డే. అయితే, ఈ మార్గంలో లాం వద్ద కొండవీటి వాగు ఏటా ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఇక్కడ వంతెన నిర్మాణం హామీ ఇప్పటివరకు ఆచరణకు నోచుకోలేదు. » మరో మార్గం.. జాతీయ రహదారి మీదుగా కంతేరు–తాడికొండ మధ్యలో ఎర్రవాగు వద్ద కూడా వరద పొంగి ప్రవహిస్తుంది. ఇక్కడ కూడా వంతెన నిర్మాణం చేయాల్సి ఉంది. ఆ దిశగా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. » మంగళగిరి మీదుగా రాజధానికి ప్రవేశించాలన్నా నీరుకొండ–పెదపరిమి రహదారి వద్ద భారీ వర్షం కురిస్తే వారం పాటు రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఐనవోలు మీదుగా కూడా రహదారి పూర్తిగా దిగ్బంధం అవుతుంది. » ఒక్క చంద్రబాబు నివాసం మీదుగా వచ్చే కరకట్ట రహదారి మినహా రాజధానికి రావాలంటే ఏ ఒక్క రోడ్డు అందుబాటులో లేకపోవడంతో రాష్ట్ర సచివాలయానికి ఉద్యోగులు వెళ్లలేక నానా ఇబ్బందులు పడ్డారు. -
నేడు అక్కడక్కడా అతిభారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో బుధవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది మరింత బలపడి గురువారం మధ్యాహ్నానికి వాయుగుండంగా మారే అవకాశాలున్నాయి. ఆదివారానికి దక్షిణ ఒడిశా మీదుగా కదులుతూ తీరం దాటనుంది. మరోవైపు వాయవ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా, తెలంగాణ వరకూ తూర్పు పశ్చిమ ద్రోణి విస్తరించి ఉంది. అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. రాయలసీమలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం కూడా రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. వర్షాల ప్రభావం ఈనెల 17 వరకు ఉంటుందని.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో 18న కూడా కొనసాగే సూచనలున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు.. ఈనెల మూడో వారంలో కోస్తాంధ్ర తీరాల్లో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని.. ఆ తర్వాత మళ్లీ వర్షాలు పుంజుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. -
కృష్ణవేణి.. ఉగ్రరూపిణి
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు తోడు ఉప నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ప్రకాశం బ్యారేజీలోకి బుధవారం రాత్రి 9 గంటలకు వరద 3,97,250 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. అంతే పరిమాణంలో 70 గేట్ల ద్వారా అధికారులు సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ నుంచి గురువారం ఉదయానికి ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే వరద ప్రవాహం 4 నుంచి 4.50 లక్షల క్యూసెక్కులకు చేరుతుందని అంచనా. ఈ నేపథ్యంలో.. కృష్ణా నదీ తీర ప్రాంతంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మూడ్రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, ప్రధాన ఉప నది తుంగభద్ర పరవళ్లు తొక్కుతున్నాయి. బుడమేరు పరీవాహక ప్రాంతంలో కూడా విస్తారంగా వర్షాలు కురవడంతో బుధవారం రాత్రికి 10–15 వేల క్యూసెక్కుల వరద వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మున్నేరు, కొండవీటి వాగు తదితర వాగుల ద్వారా ప్రకాశం బ్యారేజీలోకి భారీగా వరద వస్తోంది. విజయవాడలో పలు ప్రాంతాలు జలమయం భారీ వర్షాలకు విజయవాడతోపాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో డ్రెయిన్లు పొంగడంతో రోడ్ల మీద 4 అడుగుల మేర నీరు నిలిచింది. వందల సంఖ్యలో ఇళ్లలోకి నీరుచేరింది. బుడమేరు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హంసలదీవి వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. పమిడిముక్కల మండలం ఐనంపూడిలో పిడుగుపడి పశువులపాక దగ్ధం కావటంతో రెండు గేదెలు, ఒక ఎద్దు మృతిచెందాయి. కాజ టోల్గేటు వద్ద నిలిచిన ట్రాఫిక్ మంగళగిరి నగర పరిధిలోని కాజ టోల్గేటు వద్ద జాతీయ రహదారిపై భారీగా నీరు నిలిచిపోవడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. టోల్ప్లాజా వద్ద మూడడుగుల నీరు ఉండడంతో గుంటూరు నుంచి విజయవాడ వైపు పలు లైన్లలో రాకపోకలు నిలిపివేశారు. మంగళగిరి టిడ్కో గృహ సముదాయంలో నీరు నిలిచిపోయింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వివిధ గ్రామాల్లో ప్రధాన రహదారులపై వాగులు పొంగి పొర్లడంతో రాకపోకలు నిలిపోయాయి. గుంటూరు రోడ్లు, డ్రెయిన్లు, మార్కెట్లు, జలమయమయ్యాయి. పిడుగురాళ్ల మండలం జూలకల్లు, గుత్తికొండ, దాచేపల్లి, కారంపూడి మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. అక్కడక్కడ బ్రిడ్జిలు, చప్టాలు కూలిపోయాయి. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని దొంగలవాగు ఉధృతంగా ప్రవహించటంతో కర్నూలు రహదారిలో కొత్తూరు వద్ద ఉన్న వెలుగొండ ప్రాజెక్టు సొరంగ నిర్మాణ ప్రాంతం వద్ద బుధవారం ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ‘పశ్చిమ’లోనూ భారీ వర్షం పశి్చమ గోదావరి జిల్లా భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పెనుగొండ, ఉండి నియోజకవర్గాల్లో కుండపోత వర్షంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్ర«దాన రహదారులపై సైతం వర్షం నీరు నిలిచిపోవడంతో వాహన చోదకులు ఇక్కట్లకు గురయ్యారు. ఏలూరు జిల్లాలోనూ కుండపోత వర్షం కురిసింది. కాకినాడ, జిల్లాలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రహదారులు కనిపించని విధంగా జలమయమయ్యాయి. మూడు జిల్లాల్లో పంటలకు నష్టం వర్షాల వల్ల ఖరీఫ్ పంటలు నీటమునుగుతున్నాయి. గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల జిల్లాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. ప్రాథమిక అంచనా ప్రకారం.. ఈ మూడు జిల్లాల పరిధిలో 161 గ్రామాల్లో 1.12 లక్షల ఎకరాల్లోని పంటలు ముంపుబారిన పడ్డాయి. 52,924 మంది రైతులకు చెందిన పంటలు దెబ్బతిన్నాయి. అత్యధికంగా 1.02 లక్షల ఎకరాల్లో వరి, 8,550 ఎకరాల్లో పత్తి, వెయ్యి ఎకరాల్లో మినుము, 300 ఎకరాల్లో వేరుశనగ పంటలు ముంపునకు గురయ్యాయి. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ వందల ఎకరాల్లో వరి పైర్లు నేలకొరిగాయి. ఉమ్మడి గోదావరి జిల్లాల్లోనూ అక్కడక్కడ వరి పంటలు నీట మునిగాయి. కర్నూలు జిల్లాలో పత్తి, ఉల్లి, మొక్కజొన్న, కంది, టమాట పంటలు నీటమునిగి కుళ్లిపోతుండడంతో రైతులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నంద్యాల జిల్లాలోనూ వరి పైరు నీట మునిగింది. మినుము, మొక్కజొన్న పంటలకు తీవ్రనష్టం వాటిల్లుతోంది. అప్రమత్తంగా ఉండండి: సీఎంరాష్ట్రంలో వచ్చే రెండు, మూడ్రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో వాగులు, వంకల నుంచి వచ్చే ఆకస్మిక వరద ప్రవాహాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దిగువ ప్రాంతాలకు సమాచారం ఇవ్వాలని సూచించారు.సీఎం చంద్రబాబు బుధవారం తన క్యాంపు కార్యాలయంలో మంత్రులు, అధికారులతో రాష్ట్రంలో వర్షాల పరిస్థితిపై సమీక్షించారు. ప్రకాశం బ్యారేజీకి దిగువ ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లాల్లో వర్షాల పరిస్థితిపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు రైతులకు సమాచారం ఇవ్వాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని తొలగించాలని చెప్పారు. బెజవాడలో ముగ్గురు దుర్మరణం భారీ వర్షాలకు విజయవాడలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. పాతబస్తీ గులాం మొహిద్దీన్ వీధిలో భూగర్భ డ్రైనేజీ మరమ్మతుల నిమిత్తం నగరపాలక సంస్థ సిబ్బంది తీసిన గోతిలోపడి కృష్ణా జిల్లా హోల్సేల్ డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు టీవీ మధుసూదనరావు మరణించాడు. మరో ఘటనలో.. పాతబస్తీ సుబ్బరామయ్య వీధిలోని జెండా చెట్టు వద్ద ప్రధాన అవుట్ఫాల్ డ్రెయిన్ సమీపంలో ముర్తుజా అనే వ్యక్తి వర్షపు నీటిలో పడి కొట్టుకుపోయాడు. లయోలా కాలేజీ సమీపంలో చెట్టు పడటంతో ఓ వ్యక్తిపై ప్రాణాలు విడిచాడు. కాగా.. కృష్ణా నదిలో తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం వద్ద ఇసుకను తోడే బుల్డోజర్ స్థానం మార్చేందుకు దిగిన కామేశ్వరరావు (19), వీర ఉపేంద్ర (22) గల్లంతు కాగా.. మరో యువకుడు సురక్షితంగా బయటపడ్డాడు. -
ఏజెంట్లే లేకుండా ఎన్నికలా?: వైఎస్ జగన్
మీరు ప్రజలను మోసం చేశారు కాబట్టే, ప్రజలు మీకు ఓటు వేయరు కాబట్టే, విచ్చల విడిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ప్రతి బూత్కు సంబంధించిన వెబ్ కాస్టింగ్ వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ఇచ్చే ధైర్యం మీకుందా? పోలింగ్ బూత్ ఆవరణల్లో సీసీ ఫుటేజ్ బయట పెడతారా? ఆ ధైర్యం ఉందా చంద్రబాబూ? – వైఎస్ జగన్ అసలు ఏజెంట్లే లేకుండా పోలింగ్ నిర్వహిస్తే.. వాటిని ఎన్నికలు అని ఎలా అంటారు? ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని ప్రశ్నించకపోతే, గొంతు విప్పకపోతే అసలు ప్రజాస్వామ్యం అనేది ఉండదు. ఎన్నికలు హాస్యాస్పదమే అవుతాయి. అప్పుడు ఎన్నికల అవసరం కూడా ఉండదు. ఇష్టం వచ్చినట్లు అంతా ఓట్లు వేసుకోవడమే. సీఎం చంద్రబాబు, ఆయనతో చేతులు కలిపి అంట కాగుతున్న ఎల్లో మీడియా లక్ష్యం ఇదే. వారి లక్ష్యం ప్రజలకు మంచి చేయడం, పాలకుల మోసాన్ని ప్రశ్నించడం కానే కాదు. కేవలం దోచుకో.. పంచుకో.. తినుకో.. అదే వారి ఎజెండా. దీనికి ప్రజాస్వామ్యం సిగ్గుపడాలి.చంద్రబాబుకు మా డిమాండ్.. అలాగే ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వారికి మా విన్నపం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోకపోతే, అది చేజారిపోతే.. నక్సలిజం అక్కడే పుడుతుంది. చంద్రబాబు ఈ రోజు ఒక ప్రమాదకర పరిస్థితికి పునాది వేస్తున్నారు. ఇప్పటికైనా కళ్లు తెరవండి. నిన్న జరిగిన రెండు ఎన్నికలు రద్దు చేయండి. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఎన్నికలు జరపండి. ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో ఒక ఛాలెంజ్గా తీసుకోండి.పులివెందుల జెడ్పీటీసీ కింద ఆరు పంచాయతీలకు సంబంధించి 15 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో ఏకంగా 700 మంది పోలీసులను పెట్టారు. కేవలం ఓటర్లను భయపెట్టడం కోసమే అంత మందిని మోహరించారు. ఉదయం 4 గంటలకల్లా జమ్మలమడుగు, కమలాపురం నియోజకవర్గాలు, అనంతపురం జిల్లా నుంచి వచ్చిన వారు ఆయా గ్రామాల్లో మకాం వేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కో బూత్ వద్ద దాదాపు 400 మంది పాగా వేశారు. పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరిగింది. వారే ప్రోత్సహించారు. పచ్చ చొక్కాలు వేసుకున్న పోలీసులు, బయట నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలు, ఆ పార్టీ నాయకులు.. అంతా కలిపి మొత్తం 7 వేల మంది ఉంటారు. అంటే ఒక్కో ఓటరుకు బయట నుంచి దాదాపు ఒక్కో రౌడీని ఏర్పాటు చేశారు. సాక్షి, అమరావతి: ‘సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మీరు ప్రజలను మోసం చేశారు. మీ పాలన మొత్తం రాక్షస పాలన అని ప్రజలకు అర్థమైంది. కాబట్టి మీకు ఓట్లు వేసే పరిస్థితి లేదు. అందుకే పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో ఇదివరకు చంబల్ లోయ బందిపోటు దొంగలను మరిపించేలా.. పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, అడ్డగోలుగా దొంగ ఓట్లు వేసుకున్నార’ని సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఇలా అడ్డగోలుగా రాజకీయాలు చేసే వారిని నాయకుడనరని.. చంద్రబాబు ఒక మాబ్స్టర్.. ఫ్రాడ్స్టర్ అని తేల్చి చెప్పారు. ‘మీ పరిపాలన మీద మీకు విశ్వాసం ఉంటే.. మీరు ప్రజలకు మంచి చేశారని నమ్మితే, వారు మీకు ఓటు వేస్తారనుకుంటే.. వెంటనే మంగళవారం జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికలు రద్దు చేయండి. కేంద్ర బలగాల పర్యవేక్షణలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించండి’ అని సవాల్ విసిరారు. మీకు ఆ నమ్మకం లేదు కాబట్టే.. మీరు ప్రజలను మోసం చేశారు కాబట్టే.. ప్రజలు మీకు ఓటు వేయరు కాబట్టే, విచ్చలవిడిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని దెప్పిపొడిచారు. ‘ప్రతి బూత్కు సంబంధించిన వెబ్ కాస్టింగ్ వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ఇచ్చే ధైర్యం ఉందా? పోలింగ్ బూత్ ఆవరణల్లో సీసీ ఫుటేజ్ బయట పెడతారా? ఆ ధైర్యం ఉందా?’ అని సీఎం చంద్రబాబుకు మరో సవాల్ విసిరారు. వెబ్ కాస్టింగ్, సీపీ ఫుటేజీ ఇస్తే ఎవరెవరు బయటి నుంచి వచ్చి, పోలింగ్ బూత్లు ఆక్రమించి దొంగ ఓట్లు వేశారనేది మరింతగా బట్టబయలవుతుందన్నారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల వైఎస్సార్సీపీ అభ్యర్థులు తుమ్మల హేమంత్రెడ్డి, ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్లను తనతో కూర్చోబెట్టుకుని వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నిక పోలింగ్లో పోలీసులు, టీడీపీ నాయకులు జట్టుగా ఏర్పడి వైఎస్సార్సీపీ ఏజెంట్లను పోలింగ్ బూత్లలోకి వెళ్లకుండా అడ్డుకోవడం, ఏజెంట్లపై దౌర్జన్యం చేయడం.. ఓటు వేయడానికి వెళ్తున్న ఓటర్లను అడ్డుకోవడం.. ఇతర ప్రాంతాల నుంచి రప్పించిన టీడీపీ నాయకులతో దొంగ ఓట్లు వేయించుకోవడం, కలెక్టర్ సమక్షంలోనే దొంగ ఓట్లు వేయడం నుంచి వైఎస్సార్సీపీ నాయకులపై పోలీసుల ఏకపక్ష దాడులు.. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకుల దౌర్జన్యాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను చూపుతూ సాక్ష్యాధారాలతో ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన తీరును తూర్పారబట్టారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక నిర్వహించడంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైన తీరును సాక్ష్యాధారాలతో ఎండగట్టారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనిపించడం లేదు. అందుకు నిన్న (మంగళవారం) జరిగిన ఎన్నికలు (పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు) ప్రత్యక్ష ఉదాహరణ. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పోలింగ్ బూత్లలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఏజెంట్లు లేకుండా ఎన్నికలు నిర్వహించారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో 15 పోలింగ్ బూత్లు ఉండగా, వాటిలో వైఎస్సార్సీపీ ఏజెంట్లను అస్సలు ఉండనివ్వలేదు. ఏ ఒక్క ఏజెంట్ను బూత్ దగ్గరకు పోనివ్వకుండా ఆపేసి రిగ్గింగ్ చేశారు. పోలీసుల ప్రోద్బలంతో బూత్లలోకి ఏజెంట్లను పోనివ్వలేదు. ఇంత దారుణం ఏ ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడా ఉండదేమో.. ఒక్క మన రాష్ట్రంలో తప్ప!.పోలింగ్ ఏజెంట్ల కీలక బాధ్యతలు ⇒ అసలు ఎన్నికల్లో బూత్ ఏజెంట్ హక్కులు, బాధ్యతలు ఏమిటంటే.. దొంగ ఓటర్లను గుర్తించడం. ఓటర్ల జాబితాను తనిఖీ చేయడం. ఎక్కడైనా అక్రమాలు గుర్తిస్తే, వెంటనే పోలింగ్ అధికారికి చెప్పడం. అలాగే అవే వివరాలు పార్టీకీ తెలియజేయడం. ఈ బాధ్యతలన్నీ ఏజెంట్లకు ఉంటాయి కాబట్టే.. వారికీ హక్కులు కల్పించబడ్డాయి. ⇒ ఒక పోలింగ్ ఏజెంట్ బూత్లోకి వెళ్లగానే పోలింగ్ మొదలవడానికి ముందే ఫామ్–12 (వారి అపాయింట్మెంట్ కోసం పార్టీ ఇచ్చేది)ను అక్కడి ప్రిసైడింగ్ ఆఫీసర్కు ఇస్తారు. ఆ తర్వాత బూత్లో కూర్చుంటాడు. కానీ నిన్న (మంగళవారం) మా పార్టీ ఏజెంట్ల నుంచి ఆ ఫామ్లను టీడీపీ వారు, పోలీసులు లాక్కుని చింపేశారు. ఆ స్థాయిలో ప్రజాస్వామ్యం దిగజారి పోవడం చరిత్రలో చూసి ఉండం.⇒ ఓటరు బూత్లోకి రాగానే తన పేరు చెబుతాడు. అక్కడ పోలింగ్ ఆఫీసర్ సంతకం తీసుకుని బ్యాలెట్ ఇస్తాడు. రిజిస్టర్ నింపేది పోలింగ్ ఆఫీసర్ అయితే, దాన్ని నిర్ధారించేది పోలింగ్ ఏజెంట్. పోలింగ్ ముగిసిన తర్వాత ఫాం–32ను నింపి ఆ బూత్లో ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయనేది రికార్డు చేస్తారు. బూత్లో ఉండే అధికారి ఆ రికార్డును ఏజెంట్కు ఇవ్వాల్సి ఉంటుంది. అంతే కాకుండా ప్రిసైడింగ్ ఆఫీసరు.. ఏజెంట్ నుంచి ఒక రిసీట్ కూడా తీసుకుంటాడు. ఆ రికార్డుతో ఈ రిసీట్ను కూడా జత చేయాలి. మరోవైపు ఆ రికార్డును ధృవీకరించడమే కాకుండా, బ్యాలెట్ బాక్స్కు సీల్ వేసే వరకు ఏజెంట్ అక్కడే ఉంటాడు. చివరకు ఆ సీల్పై కూడా పోలింగ్ ఏజెంట్ సంతకం చేస్తాడు. ఈ ఉప ఎన్నికల్లో ఇవన్నీ జరిగాయా? ఈ రోజు ఎంత దారుణంగా వారు ఎన్నికలు నిర్వహించారంటే, ప్రజాస్వామ్యాన్ని ఎంతగా ఖూనీ చేశారంటే.. ఒక్కమాటలో చెప్పాలంటే అచ్చం చంబల్లోయ బందిపోట్ల మాదిరిగా వ్యవహరించారు. పోలీసులే దగ్గరుండి అన్నింటినీ ప్రోత్సహించారు. చంద్రబాబుకు ఇదే నా సవాల్ ⇒ మీ పరిపాలన మీద మీకు విశ్వాసం ఉంటే, మీరు ప్రజలకు మంచి చేశారని నమ్మితే, వారు మీకు ఓటు వేస్తారనుకుంటే, వెంటనే నిన్నటి ఎన్నికలు రద్దు చేయండి. కేంద్ర బలగాలు దింపి, వారి ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించండి. మీకు ఆ నమ్మకం లేదు కాబట్టే, మీరు ప్రజలను మోసం చేశారు కాబట్టే, ప్రజలు మీకు ఓటు వేయరు కాబట్టే, విచ్చలవిడిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ప్రతి బూత్కు సంబంధించిన వెబ్కాస్టింగ్ వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ఇచ్చే ధైర్యం ఉందా? పోలింగ్ బూత్ ఆవరణల్లో సీసీ ఫుటేజ్ బయట పెడతారా? ఆ ధైర్యం ఉందా? మీకు ఆ ధైర్యం లేదు. అయినా ఎవరెవరు బయటి నుంచి వచ్చి, పోలింగ్ బూత్లు ఆక్రమించి దొంగ ఓట్లు వేశారనేది చూపుతాం. ఇలా అడ్డగోలు రాజకీయాలు చేసే నాయకుణ్ని లీడర్ అనరు. మాబ్స్టర్ లేదా ఫ్రాడ్స్టర్ అంటారు. ⇒ ఎంత దారుణంగా నిన్నటి ఎన్నికలు జరిగాయంటే.. ఎక్కడైనా ఏ ఊరి ఓటర్లు ఆ ఊరిలోనే ఓట్లు వేస్తారు. ఎప్పుడైనా, ఎక్కడైనా అదే జరుగుతుంది. ఓటర్లు వారి సొంత ఊళ్లలోనే ఓటేయడం సహజం. కానీ, ఇక్కడ చంద్రబాబు ఏకంగా ఒక ఊరి నుంచి మరో ఊరికి పోలింగ్ బూత్లు మార్చేశారు.⇒ ఎర్రబల్లి నుంచి నల్లపురెడ్డిపల్లికి, నల్లగొండవారిపల్లి నుంచి నల్లపురెడ్డిపల్లికి, మళ్లీ నల్లపురెడ్డిపల్లి వారు ఎర్రబల్లికి.. నల్లపురెడ్డిపల్లి నుంచి నల్లగొండవారిపల్లికి వెళ్లి ఓటు వేయాలంట. 4 కిలోమీటర్లు నడిచి వెళ్లేలా పోలింగ్ సెంటర్లు మార్చారు.⇒ దాదాపు 10,600 ఓట్లకు గాను, 4 వేల ఓట్లకు సంబంధించిన పరిస్థితి ఇది. స్కెచ్ అక్కడే మొదలైంది. ఇంకా వారి ఆలోచన ఏమిటంటే, ఓటర్లు 4 కిలోమీటర్లు నడిచి పోతుంటే బెదిరించాలి. దాడి చేసి అడ్డగించాలి. ఓటేయకుండా చూడాలి. నిన్న అదే జరిగింది.ఏకంగా గ్రామాలే పంచుకున్నారుఈ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగాయని ఎవరైనా అంటారా? టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో అరాచకం సృష్టించేందుకు ఈ గ్రామాలను పంచుకున్నారు. మంత్రి సవిత ఎర్రబల్లెలో తిష్ట వేస్తే.. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి జమ్మలమడుగు నుంచి భారీగా తన అనుచరులతో నల్లపురెడ్డిపల్లెలో మకాం వేశాడు. మరో టీడీపీ ఎమ్మెల్యే పుత్తా చైతన్య ఇ.కొత్తపల్లిలో వందల మంది కార్యకర్తలతో మకాం వేస్తే.. బీటెక్ రవి అనే టీడీపీ నాయకుడు పులివెందుల రూరల్ ఓటరు కాకపోయినా కనంపల్లిలో తిష్ట వేసి దౌర్జన్యం చేశాడు. పోలింగ్ బూత్లకు వైఎస్సార్సీపీ ఏజెంట్లు వెళితే, వారిపై దాడి చేసి, ఫామ్లు లాక్కుని చింపేశారు. ఓటర్ల స్లిప్లు కూడా లాక్కుని వారిని వెనక్కి పంపి, వారే ఓటు వేసుకున్నారు. ఎవరైనా వైఎస్సార్సీపీ సానుభూతిపరుడైనా, లేక తటస్థుడైనా బూత్ వైపు వస్తే టీడీపీ వారు బెదిరించి ఓటరు స్లిప్ లాక్కుని దౌర్జన్యంగా బయటకు పంపించారు.పులివెందుల మండలంలో టీడీపీ నేతల ఆగడాలను విలేకరుల సమావేశంలో వివరిస్తున్న వైఎస్ జగన్ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి⇒ డీఐజీ కోయ ప్రవీణ్ పర్యవేక్షణలో ఇన్ని అక్రమాలతో జరిగింది ఎన్నికలేనా? అసలు ఎందుకు ఈ ఎన్నికలు జరపడం?⇒ ఉదయం 4 గంటల నుంచే పోలింగ్ బూత్ల ఆక్రమణ నిజం కాదా?⇒ పులివెందుల టౌన్లో ఉన్న ఎంపీ అవినాష్రెడ్డి అక్రమ అరెస్ట్ నిజం కాదా? నిజానికి అక్కడ ఎన్నిక లేదు. అయినా తెల్లవారుజామున అరెస్టు చేశారు.⇒ మొట్నూతలపల్లెకు 2 కిలోమీటర్ల దూరంలోనే వాహనాలు ఆపి, ఓటర్లను అడ్డగించడం నిజం కాదా?⇒ ఎర్రపల్లెలో మహిళలను ఓటు వేయనివ్వక పోవడం నిజం కాదా? ⇒ కనంపల్లి సర్పంచ్ రామాంజనేయులు ఇంటికి వెళ్లి, మంచంపై రైఫిల్ పెట్టి బెదిరించడం వాస్తవం కాదా?⇒ ఎర్రపల్లెలో రిగ్గింగ్కు వెళ్తున్న టీడీపీ కార్యకర్తలకు పోలీసులు స్వాగతం పలకలేదా?⇒ కనంపల్లెలో రిగ్గింగ్ జరిగిందని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేయడం, బిటెక్ రవి తమ్ముడు భరత్ బెదిరింపులు నిజం కాదా?⇒ తమను ఓటు వేయనీయాలంటూ ఓటర్లు కనంపల్లెలో పోలీసుల కాళ్లు పట్టుకుని వేడుకోలేదా?⇒ పులివెందులలో వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్రెడ్డిని బయటకు రానివ్వకపోవడం నిజం కాదా?⇒ ఒంటిమిట్టలోనూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఓటర్లు వాపోలేదా?⇒ ఆర్.తుమ్మలపల్లిలో టీడీపీ వాళ్లు స్లిప్లు ఇస్తూ, దొంగ ఓట్లు వేయించలేదా?⇒ ఎన్నిక పులివెందుల రూరల్లో జరుగుతుంటే, పులివెందులలో ఉన్న ఎమ్మెల్యే ఆఫీస్కు డీఐజీ కోయ ప్రవీణ్ వెళ్లి ఎందుకు హడావుడి చేశారు? ⇒ ‘కాల్చి పారేస్తా నా కొడకా’ అంటూ డీఎస్పీ మురళి బెదిరించడం వాస్తవం కాదా?⇒ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి ఒంటిమిట్ట మండలం చిన్న కొత్తపల్లి పోలింగ్ సెంటర్లో దౌర్జన్యం చేయలేదా? మా పార్టీ ఏజెంట్పై దారుణంగా దాడి జరగలేదా?⇒ చంద్రబాబూ.. నీవు నిజంగా మంచి చేశావనుకుంటే ఎందుకీ అక్రమాలు?భవిష్యత్తులో అవి మీకే చుట్టుకుంటాయి మీరు దౌర్భాగ్య పని చేస్తున్నారు. తప్పుడు వి«ధానానికి బీజాలు వేస్తున్నారు. అవే రేపు వృక్షాలు అవుతాయి. గ్రామాల్లో ఇప్పుడు మీరు తీసుకొచ్చే కక్షలు, దాడులు రాబోయే రోజుల్లో మీకే చుట్టుకుంటాయి. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇవే మీకు ఆఖరి ఎన్నికలు కావొచ్చు. ఈ వయసులో ఈ పనులేంటి? కనీసం రామ, కృష్ణ అనుకుంటే పుణ్యం వస్తుంది. ఈ విధంగా చేస్తే నరకానికి పోతావు. ఇప్పటికన్నా రవ్వంత మార్పు తెచ్చుకోమని చంద్రబాబుకు గట్టిగా హితవు పలుకుతున్నా.డమ్మీ కన్నా దారుణంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇన్ని దారుణాలు జరుగుతున్నా, దురదృష్టవశాత్తు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) డమ్మీ కన్నా దారుణమైన పాత్ర పోషిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత గల స్థానంలో ఉన్న వ్యక్తులు, నిజంగా ఇంత దిగజారిపోయిన పరిస్థితుల మధ్య ఈ వ్యవస్థ నడుస్తోంది. ఇది చాలా దురదృష్టకరం. అందుకే కచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. కోర్టులో కేసులు వేస్తాం. ఈ ఆధారాలన్నీ చూపుతాం. నిన్న పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు కూడా అందుకే ఇక్కడికి వచ్చారు. పోలీసులు పూర్తి వివక్ష⇒ ఇది అన్యాయం అని ప్రశ్నించడానికి వైఎస్సార్సీపీకి సంబంధించిన వ్యక్తులు ఐదు మంది కలిసి వెళ్లినా కూడా పోలీసులు తరిమి తరిమి కొట్టారు. మహిళా ఏజెంట్లపైనా దాడులు చేశారు. ఇతర నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ వాళ్లు వందల మంది ఒకే చోట ఉన్నా కూడా షామియానాలు వేసుకుని, భోజనాలు చేస్తున్నా పోలీసులు వేడుక చూశారు. ⇒ ఈ ఎన్నికల కోసం పోలీసులను ఏరికోరి నియమించుకున్నారు. డీఐజీ కోయ ప్రవీణ్ టీడీపీ మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహన్రావు సమీప బంధువు. వరసకు అల్లుడు అవుతాడు. ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలు జరిపారు. ఆయన అచ్చంగా పచ్చ చొక్కా వేసుకుని సోమవారం రాత్రి నుంచే తనకు కావాల్సిన వారిని విధుల్లోకి తీసుకుని పులివెందులలో మకాం వేసి, ఎన్నికలు జరిపారు. యథేచ్ఛగా దోపిడీ, వాటాలు చంద్రబాబునాయుడు చేస్తున్న అవినీతిలో వీళ్లందరూ భాగస్వాములు. డీఐజీ ఆధ్వర్యంలో కలెక్షన్లు.. మాఫియా రింగ్ లీడర్ ఎవరంటే డీఐజీ. బెల్ట్ షాపుల ఆక్షన్ దగ్గర నుంచి.. ఇసుక, మట్టి, ల్యాటరేట్, క్వార్ట్›జ్, సిలికా.. పేకాట క్లబ్బులు.. ఇంకా ఏ మైన్ ఉన్నా కలెక్షన్ అంతా వీరి ఆధ్వర్యంలోనే జరుగుతోంది. వచ్చిన దాంట్లో ఎమ్మెల్యేలకు ఇంత.. చినబాబుకు ఇంత.. పెదబాబుకు ఇంత అని ఈ డీఐజీలు, డీఎస్పీలు, సీఐలు నడిపిస్తున్నారు. ఇదీ ముఠా నాయకత్వం.చంద్రబాబు మాట వినకపోతే.. ఒకవేళ పోలీసు అధికారులు ఎవరైనా చంద్రబాబు మాట వినకపోతే.. డీజీ స్థాయిలో ఉన్న అధికారులు సైతం జైళ్ల పాలు కావాల్సిందే. పీఎస్ఆర్ ఆంజనేయులు జైలుకెళ్లారు. దళిత వర్గానికి చెందిన డీజీ స్థాయి అధికారి సునీల్కుమార్, అడిషనల్ డీజీ సంజయ్, విశాల్ గున్నీలపై అక్రమ కేసులు పెట్టారు. బీసీ వర్గానికి చెందిన ఐజీ కాంతిరాణా టాటాపై కూడా అక్రమ కేసు. ఇంకా ఎంతో మందిని సస్పెండ్ చేశారు. మరెందరో ఎస్పీల మీద తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తున్నారు. వీరు కాక నలుగురు నాన్క్యాడర్ ఎస్పీలు, ఒక కమాండెంట్ స్థాయి అధికారి, 22 మంది అడిషనల్ ఎస్పీలు, 55 మంది డీఎస్పీలకు పోస్టింగులు లేవు. మరో ఆరుగురు డీఎస్పీలు, ముగ్గురు అడిషనల్ కమాండెంట్లు, ఇద్దరు అసిస్టెంట్ కమాండెంట్లను హెడ్ క్వార్టర్స్లో రిపోర్టింగ్ చేయిస్తున్నారు. 8 మంది డీఎస్పీలను సస్పెండ్ చేశారు. మరో 80 నుంచి 100 మంది ఇన్స్పెక్టర్లు, వందలాది మంది కానిస్టేబుళ్లు వీఆర్లో ఉన్నారు.ఆనాడు ఏం జరిగిందో గుర్తుందా?2017లో నా ప్రజా సంకల్పం పాదయాత్ర మొదలు కావడానికి ముందు నంద్యాల ఉప ఎన్నికలోనూ ఇలాగే చేశారు. 27 వేలతో గెల్చి ఇక మా పార్టీ పనైపోయిందని అదేపనిగా చెప్పారు. కానీ ఏం జరిగింది? సరిగ్గా ఏడాదిన్నర తర్వాత అదే నంద్యాలలో 35 వేలతో గెల్చాం. ఆ తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో రాష్ట్రమంతా చంద్రబాబును భూస్థాపితం చేశాం. ఇంకో మూడున్నర ఏళ్ల తర్వాత ప్రజలు చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతారు. మీకు కనీసం డిపాజిట్లు కూడా రావు.ఇవిగో ఆధారాలు..⇒ ఇతర నియోజకవర్గాలు, మండలాల నుంచి వచ్చిన వారు ఎలా దొంగ ఓట్లు వేసింది.. వారు ఎవరనే పూర్తి వివరాలతో ఈ ఫొటోల్లో (ఫొటోలు చూపుతూ) చూడండి. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సమక్షంలోనే వారు దొంగ ఓట్లు వేశారు. ఆ వేసింది జమ్మలమడుగుకు చెందిన (ఫొటో చూపుతూ) టీడీపీ కార్యకర్తలు దస్తగిరి, సందీప్కుమార్. నల్లపురెడ్డిపల్లె పోలింగ్బూత్లో వారు దొంగ ఓట్లు వేశారు. మరో ఆశ్చర్యం ఏమిటంటే, ఈ రోజు (బుధవారం) రీ పోలింగ్లో కూడా దొంగ ఓట్లు వేస్తున్నారు (ఆ ఫోటోలు కూడా ప్రెస్మీట్లో చూపారు). పోలింగ్ బూత్లలో వైఎస్సార్సీపీ ఏజెంట్లు లేరు కాబట్టి, యథేచ్ఛగా దొంగ ఓట్లు వేస్తున్నారు.⇒ జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన ప్రకాశం, మైలవరానికి చెందిన ద్వారచర్ల జనార్ధనరెడ్డి నల్లపురెడ్డిపల్లెలో ఓటు వేశారు.⇒ పొన్నతోట మల్లికార్జున టీడీపీ జిల్లా రైతు ప్రధాన కార్యదర్శి (చంద్రబాబుతో దిగిన ఫొటో ప్రదర్శించారు). జమ్మలమడుగు మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ కూడా. వీళ్లందరూ వచ్చి పులివెందులలో ఓట్లు వేశారు. పోలింగ్ కేంద్రంలో ఏజెంట్ అనే వాడిని ఉండనివ్వలేదు. ఇక అడిగేవాడు లేడని దొంగ ఓట్లు వేసుకున్నారు. కలెక్టర్ రెండు చేతులు జేబులో పెట్టుకుని దొంగ ఓట్లు వేయిస్తున్నాడు.⇒ కర్మలవారిపల్లె గ్రామం టీడీపీ సర్పంచ్ మారెడ్డి చిన్నపుల్లా రెడ్డి పులివెందులలో ఓటు వేశారు. జమ్మలమడుగు మండలానికి చెందిన నాగేశ్వరరెడ్డి, అదే మండలంలోని గూడెం చెరువు గ్రామానికి చెందిన పాతకోట శివారెడ్డిలు నల్లపురెడ్డిపల్లెలో దొంగ ఓటు వేశారు.⇒ నవాబుపేట గ్రామానికి చెందిన రామస్వామిరెడ్డి, భీమగుండం గ్రామానికి చెందిన కొత్తపల్లి రాజగోపాల్, హనుమంతగిరి గ్రామానికి చెందిన బోయిన బాలుగ్రామ్, కమలదిన్నె గ్రామానికి చెందిన మంత్రి కుళ్లాయప్ప ఇలా అందరూ దొంగ ఓటర్లే. ⇒ విచిత్రంగా బుధవారం రీ పోలింగ్ జరుగుతుంటే కూడా.. కమలాపురం నియోజకవర్గానికి చెందిన నసంతపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గుజ్జల నారాయణ యాదవ్ పులివెందులలోని ఈ కొత్తపల్లిలో ఓటు వేసేందుకు క్యూలో నిలబడ్డాడు. ఇలా రిపిటేషన్ పద్ధతిలో దొంగ ఓటర్లను తిప్పుకున్నారు. -
బ్యాలెట్ బాక్సులనే మాయం చేశారు: ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి
సాక్షి, తాడేపల్లి: ఎన్నికల ప్రక్రియను అపహాస్యంపాలు చేసేలా నిర్వహించిన ఒంటిమిట్ట, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కనీవినీ ఎరగని అరాచకాన్ని చూశామని వైఎస్సార్సీపీ ఒంటిమిట్ట జడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక చిన్న జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకోవడం కోసం చంద్రబాబు ఏకంగా ఏడుగురు మంత్రులను మండలంలో మోహరించినప్పుడే మా సత్తా అర్థమైందని అన్నారు.మంత్రి రాంప్రసాద్రెడ్డి 300 మంది రౌడీలను వెంటేసుకుని ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు 17 పోలింగ్ బూత్లలో తిరుగుతూ మా ఏజెంట్లపై దాడులు చేసి బయటకు పంపించారని, ఏకంగా బ్యాలెట్ బాక్సులనే మాయం చేసి రిగ్గింగ్కి పాల్పడ్డారని సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే..మంత్రి రాంప్రసాద్రెడ్డి అరాచకాలను కళ్లారా చూసిన జాయింట్ కలెక్టర్ కానీ, ఫోన్లో ఫిర్యాదు చేస్తే జిల్లా ఎస్పీ కానీ స్పందించకపోవడం చూస్తుంటే ఎన్నికలు ఎంత లోపభూయిష్టంగా జరిగాయో అర్థంఅవుతోంది. అందుకే రీపోలింగ్ ని బహిష్కరించామని, కౌంటింగ్కి కూడా వైయస్సార్సీపీ హాజరుకాబోవడం లేదు. కానీ ప్రశాంతంగా ఉంటే ఒంటిమిట్టలో కోదండరాముడి సాక్షిగా మంత్రి చేసిన అరాచకాలకు తప్పకుండా గుణపాఠం నేర్పుతాం. ఒంటిమిట్ట నుంచే మంత్రి రాంప్రసాదరెడ్డి పతనం ప్రారంభమైంది.ముగ్గురు మంత్రులు మండలంలో తిష్ట వేశారుఒంటిమిట్టలో నామినేషన్ వేసింది మొదలు ముగ్గురు మంత్రులు బీసీ జనార్దన్రెడ్డి, సవిత, రాంప్రసాద్రెడ్డి నేతృత్వంలో ప్రలోభాలు, బెదిరింపుల పర్వం నడిచింది. మరో నలుగురు మంత్రులు ప్రచారం పేరుతో మండలంలో విపరీతమైన హడావుడి చేశారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు నుంచి ఒంటిమిట్ట మండలంలో పార్టీకి గట్టిగా అండగా నిలబడిన దాదాపు 50 మంది వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్ల మీద దాడులు చేశారు. అన్నీ ఎదుర్కొని ఎన్నికల రోజున ఉదయం 5 గంటలకే ఏజెంట్లను నిలబెట్టగలిగాం. కానీ కీలకమైన పార్టీ ఏజెంట్లను గుర్తించి పోలీసులే బయటకు బూత్ల నుంచి బయటకు గెంటేశారు.దీనిపై జిల్లా ఎస్పీకి ఉదయం 9 గంటలకు ఒకసారి, 11 గంటలకు మరోసారి ఫిర్యాదు చేయడం జరిగింది. మండలంలో ఎన్నికలు జరుగుతుంటే రాజంపేట, రాయచోటితో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు పోలింగ్ బూత్ల వద్ద యాక్టివ్గా తిరుగుతూ కనిపిస్తున్నారని, గొడవలు జరిగే ప్రమాదం ఉంటుందనే ఉద్దేశంతో చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశాను. కొంతమంది వ్యక్తులను గుర్తించి అక్కడే ఉన్న పోలీసులకు చెప్పడం కూడా జరిగింది. అయినా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడమే కాకుండా ఫిర్యాదు చేసిన మమ్మల్నే అక్కడ్నుంచి బలవంతంగా పంపించి వేశారు. పోలీసులు వ్యవహరించిన తీరు చూస్తే యూనిఫాంకే చెడ్డపేరు తెచ్చారు.17 బూత్లలో మంత్రి రిగ్గింగ్ చేయించాడుఉదయం 11 గంటల ప్రాంతంలో మంత్రి రాంప్రసాద్రెడ్డి 300 మంది రౌడీలతో చిన్నకొత్తపల్లికి వచ్చి హల్ చల్ చేశాడు. 700 మంది ఓటర్లున్న చాలా చిన్న బూత్ అది. మా వారు 5 గురు ఏజెంట్లుగా ఉన్నారు. పోవడం పోవడం మా పార్టీ ఏజెంట్లను బయటకు ఈడ్చి దారుణంగా కొట్టారు. ఆ విషయం తెలిసి నేను ఈ బూత్ వద్దకు వెళితే నన్ను కూడా బెదిరించాడు. ఇదేం పద్దతని నేను ఆయన్ను నిలదీస్తే పోలీసులు నన్ను అక్కడ్నుంచి పంపించేశారు. ఆ తర్వాత మంత్రి రాంప్రసాద్రెడ్డి మంటపంపల్లి అనే మరో ప్రాంతానికి వెళ్లి అక్కడా అంతే.వందల మంది రౌడీలతో వెళ్లి మా ఏజెంట్లను బూత్ల నుంచి బయటకు లాక్కొచ్చి కొట్టిపడేశారు. మంత్రి రాంప్రసాద్రెడ్డి తనకు సంబంధం లేని ప్రాంతానికి వచ్చి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని, ఆయనకు చిన్నకొత్తపల్లిలో ఓటు కూడా లేదని జాయింట్ కలెక్టర్కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదే విషయాన్ని నేను మా ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డికి చెప్పడం జరిగింది. ఆయనతో కలిసి నేను మంటపంపల్లెకి వెళ్లేసరికి అక్కడ బాక్సుల్నే మాయం చేశారు.పోలింగ్ బూత్ ఖాళీగా ఉంది. మాతోపాటే వచ్చిన జాయింట్ కలెక్టర్కి కూడా జరిగిన విషయాన్ని చెబితే ఆమె కూడా కళ్లారా చూశారు. ఆ తర్వాత ఆమె కూడా అక్కడ్నుంచి మెల్లిగా జారుకున్నారు. మంత్రిని అడ్డుకోవడానికి మేం ప్రయత్నిస్తుంటే పోలీసులు వెళ్లనీయకుండా మా కార్లను అడ్డుకుంటున్నారు. మంత్రి రాంప్రసాద్రెడ్డి ఉదయం నుంచి సాయంత్రం వరకు మొత్తం 17 పోలింగ్ బూత్లల్లో పోలీసుల అండతో యథేచ్ఛగా రిగ్గింగ్ చేసుకున్నాడు.కౌంటింగ్ను కూడా బహిష్కరిస్తున్నాంప్రజాస్వామ్యంలో నిన్నటి రోజు ఒక చీకటి దినం. ప్రశాంతంగా ఉన్న మండలంలో మంత్రి అరాచకం సృష్టించాడు. ఏడాది తర్వాత అన్ని ప్రాంతాల్లో ఎన్నికలు జరిగితే ఆయన ఇదే విధంగా చేయగలడా? భవిష్యత్తులో టీడీపీకి ఏజెంట్లు కూడా ఉండరు. మంత్రి బెదిరింపులకు నేను వెనక్కి తగ్గేదే లేదు. చిన్న మండలంలో సొంతంగా గెలవలేక 780 మంది పోలీసులను తెచ్చుకున్నారు. మంత్రి అండ చూసుకుని నన్ను భూస్థాపితం చేస్తానని అన్నోళ్లు భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు సిద్ధంగా ఉండాలి.పులివెందుల, ఒంటిమిట్టలో జరిగింది ఎన్నికే కాదు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరగలేదు. రీపోలింగ్ను బహిష్కరించాం. కౌంటింగ్ను కూడా బహిష్కరిస్తున్నాం. మీ ఇష్టమైన మెజారిటీ రాసుకోండి. రాబోయే ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తాం. మంత్రి రాంప్రసాద్రెడ్డి అనుసరించిన తీరుని రాష్ట్ర ప్రజలంతా చూశారు. భవిష్యత్తులో మంచి గుణపాఠం చెబుతారు. కోదండరాముని సాక్షిగా చెబుతున్నా ఈ జడ్పీటీసీ ఎన్నిక మంత్రి పతనానికి ఆరంభం. -
నీట మునిగిన ‘ఏపీ రాజధాని’
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అమరావతి నీట మునిగింది. అమరావతి కోర్ క్యాపిటల్ వరద ముంపులో చిక్కుకుంది. అమరావతి రాజధాని గ్రామాలు వర్షానికి మునిగాయి. ఏపీ రాజధాని అమరావతి.. కృష్ణా నదిని తలపిస్తోంది. రాత్రి కురిసిన వర్షానికి రాజధానిలోకి భారీ స్థాయిలో వరద నీరు చేరుకుంది. కొండవీటి వాగు, పాలవాగు పొంగిపొర్లుతుంది. నీరుకొండ వద్ద కొండవీటి వాగు పొంగి పొర్లుతోంది. దీంతో కనుచూపుమేరలో రాజధానిలో భూమి కనిపించడం లేదు.వేల ఎకరాలు భూములు నీటమునిగాయి. నీరుకొండ వద్ద వర్షపు నీరు గంట గంటకు పెరుగుతోంది. శాఖమూరు, ఐనవోలు, కృష్ణాయ పాలెం, నీరుకొండ, కురగల్లు, ఎర్రబాలెం, పెనుమాక, బేతపూడి పొలాల్లోకి వరద నీరు చేరింది. ఎస్ఆర్ఏం యూనివర్సిటీ చుట్టూ భారీగా వరద నీరు చేరుతోంది. హైకోర్టుకు వెళ్లే రోడ్డు మార్గం జలమయంగా మారింది. రాజధాని నిర్మాణాల చుట్టూ వరద నీరు పెరుగుతోంది. పొంగి ప్రవహిస్తున్న కొండవీటి వాగు, పాలవాగుతో వేలాది ఎకరాల నీటమునిగాయి.ప్రకాశం బ్యారేజీకి వరద నీరు భారీగా పోటెత్తుతోంది. దీంతో అధికారులు.. మొత్తం 70 గేట్లను పూర్తిగా ఎత్తివేశారు. విజయవాడకు మరోసారి వరద ముప్పు పొంచి ఉంది. భారీ వర్షాలతో డ్రైనేజీలు, మ్యాన్ హోల్స్ పొంగిపొర్లుతున్నాయి. కృష్ణా నది ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. గుంటూరు, తాడికొండ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. మంగళగిరిలో ఇళ్లలోకి వరద నీరు చేరింది.నీట మునిగిన అమరావతి ఐకానిక్ టవర్ నిర్మాణంఅమరావతి ఐకానిక్ టవర్ నిర్మాణం కూడా నీట మునిగిపోయింది. ఐకానిక్ టవర్ నిర్మాణం చుట్టూ వరద నీరు చేరింది. రాయపూడిలో ఐకానిక్ టవర్ నిర్మాణం అవుతోంది. అమరావతి ఐకానిక్ టవర్ ప్రాంతం చెరువులా మారిపోయింది. -
పైన దేవుడు చూస్తున్నాడు.. అనుభవిస్తారు: చెవిరెడ్డి
సాక్షి, విజయవాడ: అక్రమ మద్యం కేసులో సిట్ అధికారులు తనను అక్రమంగా ఇరికించారని చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు. ‘‘మా కుటుంబం మద్యం జోలికి పోలేదు. వేద పాఠశాల నడుపుతున్నా.. నేనెప్పుడూ అబద్ధం చెప్పను.. పైన దేవుడు చూస్తున్నాడు.. అనుభవిస్తారు’’ అంటూ కోర్టు నుంచి జైలుకి తరలించే సమయంలో ఆయన కన్నీరు పెట్టుకున్నారు.గాడ్ ఈజ్ సుప్రీం.. నేచర్ ఈజ్ సుప్రీం. అక్రమంగా కేసులు పెట్టిన అధికారులు తప్పకుండా శిక్ష అనుభవిస్తారు. మద్యం ముట్టలేదు.. అమ్మలేదు. అమ్మనురాజకీయంగా కక్ష ఉంటే మరో కేసు మోపండి. చిన్నప్పటి నుంచి దూరం పెట్టిన మద్యాన్ని రుద్దడం భావ్యం కాదు. ప్రభుత్వ పెద్దలు తప్పు చేస్తున్నారు. దానిని కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేస్తున్నారు’’ అంటూ చెవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, లిక్కర్ అక్రమ కేసులో అరెస్టైన వారికి ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మిగిలిన వారికి ఆగస్ట్ 26 వరకూ రిమాండ్ను పొడిగించింది. -
జగన్ ప్రెస్మీట్.. ఆ ఫొటోలు డిలీట్ చేసిన కలెక్టర్
సాక్షి,వైఎస్సార్: పులివెందుల,ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల పోలింగ్లో రిగ్గింగ్ రాజ్యమేలింది. నల్లపురెడ్డిపల్లెలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ గూండాలు యథేచ్చగా దొంగ ఓట్లు గుద్దుకున్నారు. క్యూలో దర్జాగా రకరకాల ఫోజులతో నిలబడి మరీ ఓట్లు వేశారంటూ ఇవాళ మీడియా సమావేశంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధారాలతో సహా ఆ విషయాన్ని బయటపెట్టారు. ఈ క్రమంలో.. కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఎదురుగానే దొంగ ఓట్లుపడ్డ సంగతిని వైఎస్ జగన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. అందుకు సంబంధిత దృశ్యాలు సైతం సోషల్ మీడియాలో సైతం వైరల్గా మారాయి. అయితే ఫోటోలో ఉన్నది దొంగ ఓటర్లని బహిర్గతం కావడంతో కలెక్టర్ కంగుతిన్నారేమో..! దీంతో అప్పటికే ఆ ఫోటోలను తన ఎక్స్లో పోస్ట్ చేసిన జిల్లా కలెక్టర్ వెంటనే వాటిని డిలీట్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. -
జెడ్పీటీసీ అభ్యర్థి ఇంటిని చుట్టుముట్టిన టీడీపీ మూకలు
సాక్షి టాస్్కఫోర్స్: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్రెడ్డిని బయటకు రాకుండా అడ్డుకునేందుకు టీడీపీ మూకలు ఆయన ఇంటిని చుట్టుముట్టాయి. ఆయన ఇంటిపక్కనే షామియానాలు ఏర్పాటు చేసి టీడీపీ, బయటి ప్రాంతాల నుంచి వచ్చిన రౌడీలు కర్రలు చేతబూని ఓటర్లను యథేచ్ఛగా భయబ్రాంతులకు గురి చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడలేదు. ఒకవేళ అటువైపు పోలీసులు వెళ్లినా టీడీపీ కార్యకర్తలు వారిని లెక్క చేయలేదు. కాగా.. తుమ్మలపల్లె పోలింగ్ బూత్ సమీపంలోనే టీడీపీ నేతలు షామియానాలు వేసి వందలాది మందికి టిఫిన్, భోజనాలు పెట్టారు. -
ఆయుష్షు పోస్తున్న అవయవ దానం
ఆరిలోవ: అవయవ దానంలో రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉంది. జీవన్ దాన్ పేరిట 2015లో అవయవ దాన కార్యక్రమం ప్రారంభమైంది. రోడ్డు, ఇతర ప్రమాదాలకు గురైన వారిలో బ్రెయిన్ డెడ్ అవుతున్న వ్యక్తుల అవయవాలను ఇతరులకు అమర్చి జీవం పోస్తున్నారు. గుండె, కాలేయం, మూత్ర పిండాలు, కార్నియా తదితర అవయవాలను అవసరమైన వారికి అమర్చి కొత్త జీవితం అందిస్తున్నారు. ఇలా సేకరించిన వివిధ అవయవాలను గడచిన పదేళ్లలో 1,148 మందికి అమర్చి వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు.రాష్ట్రంలో ఇప్పటివరకు 358 మంది బ్రెయిన్ డెడ్ అయిన వారినుంచి అవయవాలు తొలగించారు. వాటిలో 634 మందికి కిడ్నీలు, 271 మందికి లివర్, 88 మందికి గుండె, 151 మందికి ఊపిరితిత్తులు, ముగ్గురికి పాంక్రియాస్, ఒకరికి స్మాల్ బౌల్ అవయవాలను అమర్చారు. అవయవాల కోసం 5 వేలమంది ఎదురుచూపు రాష్ట్రంలో జీవన్దాన్ కింద 5 వేల మంది అవయవాలు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అత్యధికులు కిడ్నీ కోసమే దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అవయవాలు స్వీకరించటం కోసం 81 ఆస్పత్రులు మాత్రమే పేర్లను నమోదు చేసుకున్నాయి. వాటిలో సగం ఆస్పత్రులు ఇంతవరకు ఒక్క బ్రెయిన్ డెడ్ కేసునూ ప్రకటించలేదని జీవన్దాన్ ప్రతినిధులు చెప్తున్నారు. విమ్స్లో ప్రత్యేక సర్జరీలు విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్)లో అవయవ దానంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఇటీవల మొదటిసారిగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి ప్రభుత్వ ఆస్పత్రులకు ఆదర్శంగా నిలిచింది. ఇంతవరకు విమ్స్లో నాలుగు బ్రెయిన్ డెడ్ కేసులకు సర్జరీలు నిర్వహించి అవయవాలను స్వీకరించారు. విమ్స్ ఆస్పత్రిని ఆదర్శంగా తీసుకొని కేజీహెచ్ తదితర ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా బ్రెయిన్ డెడ్ కేసులను గుర్తించి అవయవాలను స్వీకరించగలిగితే మరింత మందికి ప్రాణాలు కాపాడవచ్చని జీవన్దాన్ ప్రతినిధులు చెబుతున్నారు.మరింతమంది ముందుకు రావాలి అవయవ దానం చేయడానికి మరింతమంది ముందుకు రావాలి. రాష్ట్రంలో 358 మంది నుంచి 1,148 అవయవాలు స్వీకరించాం. వాటిని అవసరమైన వారికి అమర్చాం. ప్రస్తుతం సమారు 5 వేల మంది అవయవాలు అవసరమైన వారు ఉన్నారు. అవయదానంపై ప్రజల్లో మరింతగా అవగాహన కలిగించాల్సి ఉంది. అవయదానం చేసిన వారి మృతదేహానికి అంత్యక్రియలు జరుపుకోవడం కోసం రూ.10 వేల అందించి ప్రభుత్వ అధికారుల చేత ఘన నివాళులు అర్పిస్తున్నాం. విమ్స్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశాం. త్వరలోనే అన్ని ప్రభుత్వ ఆసుపత్రులో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి అవయవాలు స్వీకరించే కార్యక్రమం చేపట్టనున్నాం. – డాక్టర్ కె.రాంబాబు, కో–ఆర్డినేటర్, జీవన్దాన్, విమ్స్ డైరెక్టర్ -
మీ కాళ్లు పట్టుకుంటాం..మా ఓట్లు ఏమయ్యాయ్?
సాక్షి, అమరావతి/పులివెందుల : ‘మమ్మల్ని ఆపకండయ్యా.. మా ఓటు మమ్మల్ని వేయనివ్వండి.. మీ కాళ్లు పట్టుకుంటాం..’ అంటూ పులివెందుల మండల ఓటర్లు వేడుకున్నప్పటికీ పోలీసులు కనికరించలేదు. వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో అధికార టీడీపీ నేతల అడ్డగోలు వ్యవహారాలు, దౌర్జన్యాలు, ఓట్లు కొల్లగొట్టడాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను విస్తుగొలుపుతున్నాయి. ప్రజలు ఓట్లు వేయకుండా గ్రామాలకు గ్రామాలనే నిలువరించడం ఇప్పుడే చూస్తున్నామని పులివెందుల మండల ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలంటే ఓటర్లందరూ వంద శాతం ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తుంది. పోలింగ్ రోజున వృద్ధులు, నడవలేని వారిని పోలీసులు, ప్రభుత్వ సిబ్బంది భుజాలపై మోసుకుని వెళ్లి ఓటు వేయించడం గతంలో అందరూ చూశారు. మంగళవారం పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్లో ఇలాంటి ఘటన మచ్చుకు ఒక్కటి కూడా కనిపించలేదు. చంద్రబాబు కనుసన్నల్లో టీడీపీ పచ్చ తాలిబన్ల అరాచకం రాజ్యం ఏలింది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు స్వేచ్ఛగా పోలింగ్ బూత్ల వరకూ వెళ్లనివ్వకుండా పోలీసులే చెక్పోస్టులు పెట్టి అడ్డుకున్నారు. దీంతో మేం ఓటు హక్కు వినియోగించుకోలేకపోయాం.. మా ఓట్లన్నీ ఏమయ్యాయ్? అని పులివెందుల జెడ్పీటీసీ పరిధిలోని ఓటర్లు ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ అడ్డగింత ప్రజాస్వామ్యబద్ధంగా ఉప ఎన్నిక జరిగితే ఘోర పరాజయం తప్పదని ముందే పసిగట్టిన చంద్రబాబు.. కుట్రలు, కుతంత్రాలు పన్నిన విషయం తెలిసిందే. ఒక గ్రామం పోలింగ్ బూత్ను మరో గ్రామానికి మార్చేసి, ఓటర్లు ఓటు వేయడానికి రెండు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. ముందస్తు పన్నాగంలో భాగంగా ఓటర్లు పక్క ఊరికి వెళ్లి ఓటు వేయకుండా పోలీసుల ద్వారా ఎక్కడికక్కడ చెక్పోస్టులు పెట్టి నిలువరించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు ధర్నాలు, ఆందోళనలు చేయాల్సిన దుస్థితిని చంద్రబాబు తీసుకొచ్చారు. ఓటర్లందరినీ పోలీసులతో నిలువరించి, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, ఇతర బయటి ప్రాంతాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలను రప్పించి, వారితో ఇష్టారాజ్యంగా రిగ్గింగ్కు పాల్పడ్డారు. కాళ్లు పట్టుకుని ప్రాధేయపడినా.. » పులివెందుల మండలంలోని కనంపల్లి ఓటర్లు పోలింగ్ బూత్ దగ్గరకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోకుండా పోలీసులు గ్రామాన్ని నిర్బంధించారు. దీంతో గ్రామస్తులు ఓటు వేయడం కోసం పోలీసుల కాళ్లు పట్టుకుని ప్రాధేయపడ్డారు. అయినప్పటికీ వారు ఏ మాత్రం కనికరించ లేదు. ‘మమ్మల్ని ఆపకండయ్యా.. మా ఓటు మమ్మల్ని వేయనివ్వండి..’ అంటూ గ్రామస్తులు పోలీసుల కాళ్లు పట్టుకున్నారు. ఇంతలోనే తమ ఓట్లను వేరే వారు వేశారని తెలుసుకున్న కనంపల్లె మహిళలు ఆందోళనకు దిగారు. మా ఓట్లు ఏమయ్యాయంటూ నిరసన తెలిపారు. వేముల, దుగ్గన్నగారిపల్లి గ్రామాలకు చెందిన టీడీపీ వాళ్లు రిగ్గింగ్ చేశారని మండిపడ్డారు. మోట్నూతనపల్లి గ్రామస్తులకు కూడా ఓటు వేసే పరిస్థితి లేకుండా చేశారు. » తుదకు పులివెందుల జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి సైతం తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. మంగళవారం తెల్లవారుజామున హేమంత్ రెడ్డి నిద్ర లేచాక ఇంటి బయటికి వచ్చి చూస్తే వందలాది మంది టీడీపీ మూకలు చుట్టుముట్టాయి. బయటకు వస్తే మీ మీద దాడులు జరిగే అవకాశం ఉందని పోలీసులే హేమంత్రెడ్డిని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చి ఓటు వేయలేకపోయారు. ఓ దశలో బయటకు రావడానికి ప్రయత్నించినా, బయట ఉన్న టీడీపీ మూక అరుపులు, కేకలతో భయపెట్టారు. » ఓటు హక్కు వినియోగించుకోలేకపోయామని, రీపోలింగ్ నిర్వహించాలంటూ అచి్చవెళ్లి గ్రామస్తులు ఎన్నికల అధికారికి వినతి పత్రం సమరి్పంచారు. బయట ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో టీడీపీ గూండాలు గ్రామాల్లో కర్రలతో, రాడ్లతో కలియ తిరుగుతూ భయభ్రాంతులకు గురి చేశారని చెప్పారు. వైఎస్సార్సీపీ ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు. మహిళలపైనా దౌర్జన్యకాండే » ఎక్కడికక్కడ పురుషులను పోలీసులు నిర్బంధించగా.. ఏజెంట్లుగా కూర్చోడానికి మహిళలు ముందుకొచ్చారు. ఇందుకు అభినందించాల్సిన ఖాకీలు.. అధికార ఒత్తిళ్లకు తలొగ్గారు. ‘మగాళ్లతోనే కాలేదు.. మీరెందుకొచ్చారు.. గొడవలవుతాయి.. త్వరగా ఇంటికి వెళ్లిపోండి’ అంటూ వెనక్కు పంపడం విస్తుగొలుపుతోంది. » పోలింగ్ బూత్లలోకి రాకుండా మహిళా ఏజెంట్లను అడ్డుకున్నారు. టీడీపీ రౌడీలు దూషణల పర్వం కొనసాగించినా చూస్తుండిపోయారు. అవసరమున్నప్పుడు బందోబస్తు ఇవ్వకుండా.. రిగ్గింగ్ అయిపోయాక వస్తారా.. అంటూ మరోచోట మహిళలు పోలీసులను నిలదీశారు. ఎర్రిపల్లెకు చెందిన అన్నారెడ్డి మమత, మునేశ్వరీ, గంగా భవానీలు ఏజెంట్లుగా కూర్చోడానికి టీడీపీ నేతలను తప్పించుకుని వెళ్లగలిగారు. అయితే వారిని పోలీసులే అడ్డుకున్నారు.» నల్లగొండువారిపల్లెకు చెందిన సంధ్య.. నల్లపురెడ్డిపల్లెలో ఏజెంటుగా కూర్చునేందుకు వచి్చనా అనుమతించలేదు. నోరు మూసుకొని పోండి’ అంటూ రౌడీ మూక గదమాయించింది. ఈ పోలింగ్ కేంద్రం వద్దకు వస్తున్న వారిపై సుమారు 350 మంది రౌడీలు దౌర్జన్యానికి దిగి వెనక్కు పంపారు. » తమను టీడీపీ గూండాలు అడ్డుకున్నారని, ఏజెంట్లుగా కూర్చొన్న మహిళలను బెదిరించారని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఎదుట అచ్చివెళ్లి గ్రామస్తులు మొరపెట్టుకున్నారు. స్థానిక భాకరాపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో వారు ఎంపీని కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలింగ్ బూత్ల వద్దకు వెళితే మహిళలని కూడా చూడకుండా చంపుతామని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. రిగ్గింగ్ చేసుకున్నారు ఎర్రిపల్లె గ్రామంలో 600 ఓట్లు ఉన్నాయి. 350 మందికి పైగా టీడీపీ గూండాలు వచ్చి అరాచకం సృష్టించి, ఓట్లు వేయకుండా మమ్మల్ని అడ్డుకున్నారు. పోలీసులు కూడా వారికే మద్దతుగా నిలిచారు. పోలీస్ పహారా మధ్య టీడీపీ మూకలే మా ఓట్లన్నీ వేసేసుకున్నాయి. – అన్నారెడ్డి మమత, ఎర్రిపల్లె, పులివెందుల మండలం ఏజెంట్లనూ వెళ్లనివ్వలేదు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అల్లరి మూకలు రిగ్గింగ్కు పాల్పడ్డాయి. కనీసం ఏజెంట్లను కూడా పోలింగ్ బూ త్ల వద్దకు రానివ్వలేదు. బయటి వ్యక్తులు వచ్చి గ్రామంలో తిష్ట వేశారు. మా గ్రామంలో ఒక్కరు కూడా ఓటు వేయలేదు. అసలు ఇంత మంది పోలీసులను ఎందుకు దింపినట్లు? – రమాదేవి, కనంపల్లె, పులివెందుల మండలం చంపేస్తామని బెదిరించారు సోమవారం రాత్రి నుంచే టీడీపీ రౌడీలు గ్రామాన్ని చుట్టుముట్టారు. ఓటు వేయడం కోసం వస్తే చంపుతామని బెదిరించారు. మీరు స్లిప్పులు ఇచ్చి వెళ్లిపోండన్నారు. టీడీపీకి చెందిన బీటెక్ రవి, శ్రీనాథ్లతోపాటు 400 మంది బయట వ్యక్తులు వచ్చారు. పోలీసులు కూడా వారికి సహకరించారు. ఓటు..గీటు అంటే దెబ్బలు తింటారని పోలీసులే చెప్పడం దారుణం. – కుమారి, కనంపల్లె, పులివెందుల మండలం స్లిప్పులు లాక్కుని చించేశారు నా అనుభవంలో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ జరగలేదు. టీడీపీ గూండాలు సోమవారం రాత్రి నుంచే వైఎస్సార్సీపీ ఏజెంట్ల ఇంటి ముందు రాడ్లు, కత్తులు పట్టుకొని తిష్ట వేశారు. ఏజెంట్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లడానికి బయటకు వస్తే చంపేస్తామని బెదిరించారు. జమ్మలమడుగు, కమలాపురం, వేంపల్లె ప్రాంతాల నుంచి టీడీపీ రౌడీలు గ్రామాన్ని చుట్టి ముట్టారు. ఓటు వేయకుండా అడ్డుకున్నారు. ఓటు వేయడం కోసం ఎలాగో ఒకలా వచ్చిన వారి వద్ద నుంచి స్లిప్పులు లాక్కొని చింపేశారు. పోలీసుల కళ్లెదుటే ఇదంతా జరిగింది. – బాంధవి, ఎంపీటీసీ సభ్యురాలు, అచ్చవెళ్లి, పులివెందుల మండలం ఏజెంట్ ఫారాన్ని చింపేశారు గ్రామస్తులు ఎవరూ ఓటు వేయనందున రీ పోలింగ్ జరిపించాలి. నేను ఏజెంటుగా పోలింగ్ బూత్ వద్దకు ఆరు గంటల్లోపు వెళ్లాను. అప్పటికే టీడీపీ గూండాలు బూత్ల వద్దకు చేరుకొని నా దగ్గర ఉన్న ఏజెంట్ ఫారాన్ని చించేశారు. ఇంటికి వెళ్లకపోతే చంపుతాం అని బెదిరించారు. ‘మీరు ఇక్కడ ఉండాల్సిన పనిలేదు.. ఓట్లు మేమే వేసుకుంటాం.. వెళ్లిపోండి’ అని బెదిరించారు. అయినా పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా ఇక్కడి నుంచి త్వరగా వెళ్లిపోవాలని.. లేదంటే దెబ్బలు తింటారని పోలీసులే చెప్పడం దారుణం. – అనురాధ, అచ్చివెళ్లి, పులివెందుల మండలం -
పులివెందుల జెడ్పీటీసీకి రీ–పోలింగ్ నిర్వహించండి
సాక్షి, అమరావతి: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్లో టీడీపీ అరాచకాల కారణంగా వాస్తవ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారని, అందువల్ల రీ–పోలింగ్ నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ కడప వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు మంగళవారం లేఖ రాశారు. పోలింగ్ సందర్భంగా టీడీపీ చేసిన అరాచకాలను ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుని వెళ్లారు. 14వ తేదీన ఎన్నికల కౌంటింగ్ నిలిపివేయాలని కోరారు. టీడీపీ గూండాల అరాచకంతో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారని వివరించారు. అధికార పార్టీ ఇష్టారాజ్యంగా రిగ్గింగ్కు పాల్పడిందన్నారు. పోలింగ్కు ముందే టీడీపీ బయటి ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో గూండాలను పోలింగ్ కేంద్రాలు ఉన్న గ్రామాల్లో మోహరించిందని వివరించారు. దీని మీద పదే పదే ఫిర్యాదు చేసినప్పటికీ, ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్లు ఫారాలను సమర్పించడానికి పోలింగ్ కేంద్రాలకు రాకుండా టీడీపీ గూండాలు అడ్డుకున్నారని వెల్లడించారు. ఓటర్లను సైతం ఓటు హక్కు వినియోగించుకోకుండా నిరోధించారన్నారు. పోలీసు యంత్రాంగం పోలింగ్ ఏజెంట్లు, ఓటర్లకు రక్షణ కల్పించడానికి బదులుగా, అధికార పార్టీ నాయకుల అరాచకాలకు అండగా నిలిచిందని చెప్పారు. పులివెందుల జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డి బయటకు రాకుండా టీడీపీ గూండాలు ఇంటిని చుట్టుముట్టారని తెలిపారు. పులివెందుల జెడ్పీటీసీ పరిధిలోని 15 పోలింగ్ కేంద్రాల్లో అధికార పార్టీ రిగ్గింగ్కు పాల్పడిందని తెలిపారు. -
ఓట్ల దొంగలు!
పేరు: మల్లిఖార్జున్హోదా: టీడీపీ రైతు రాష్ట్ర కార్యదర్శి, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ (జమ్మలమడుగు)నివాసం: పొన్నతోట గ్రామం, జమ్మలమడుగు నియోజకవర్గంఓటు వేసింది: పులివెందుల మండలం ‘నల్లపురెడ్డిపల్లి’ పోలింగ్ కేంద్రంలో..పేరు: పుల్లారెడ్డిహోదా: టీడీపీ సర్పంచ్నివాసం: కర్మలవారిపల్లె, జమ్మలమడుగు నియోజకవర్గంఓటు వేసింది: పులివెందుల మండలం ‘నల్లపురెడ్డిపల్లి’ పోలింగ్ కేంద్రంలో..పేరు: వీరభద్రహోదా: టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ప్రధాన అనుచరుడునివాసం: వేంపల్లి గ్రామం/మండలంఓటు వేసింది: పులివెందుల మండలంలోని ‘నల్లపురెడ్డిపల్లి’ పోలింగ్ కేంద్రంలో..పేరు: సుధాకర్ (మాజీ సర్పంచ్), మహమ్మద్ రఫీ, అనకాల రమేష్నివాసం: పెద్ద చెప్పలి గ్రామం, కమలాపురం నియోజకవర్గంఓటు వేసింది: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో..సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: స్వతంత్ర భారత దేశ చరిత్ర నిర్ఘాంతపోయేలా టీడీపీ కూటమి సర్కారు ప్రజాస్వామ్యాన్ని అత్యంత కిరాతకంగా ఖూనీ చేసింది. పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను, ప్రజాస్వామిక విలువలను మంటగలిపింది. ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా జరగాల్సిన ఎన్నికలను దౌర్జన్యాలు, దుర్మార్గాలు, అధికార దుర్వినియోగానికి అడ్డాగా మార్చేసింది. పోలీసు బలగాలు, పచ్చమూకలను అడ్డుపెట్టుకుని భీతావహ వాతావరణాన్ని సృష్టించింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలన్న దుర్భుద్ధితో అధికార పార్టీ బరితెగించింది. ఆటవిక రాజ్యాన్ని, తాలిబన్లను మరిపిస్తూ దొంగ ఓట్లు, బూత్ క్యాప్చరింగ్లు, రిగ్గింగ్లతో విశృంఖలంగా వ్యవహరించింది. పులివెందుల ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రానివ్వకుండా పోలీసు బలగాలు, టీడీపీ రౌడీలతో అడ్డుకుంది. పొరుగు నియోజకవర్గాలైన జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరుతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వేలాదిగా టీడీపీ గూండాలను తరలించి పోలింగ్ కేంద్రాల్లో యథేచ్ఛగా దొంగ ఓట్లు వేసుకుని అరాచకం సృష్టించింది.యథేచ్ఛగా దొంగ ఓటర్లను తరలించి..పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు నిర్వహిస్తున్న 15 పోలింగ్ కేంద్రాల్లోనూ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రోద్బలంతో వేలాది మంది టీడీపీ రౌడీలు, అనుచరులు దొంగ ఓటర్లుగా ప్రత్యక్షమయ్యారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని నవాబుపేట, భీమగుండం, కంబళదిన్నె, కలవటల, చిన్న దండ్లూరు, గూడెం చెరువు, కర్మలవారిపల్లె, పొన్నతోట తదితర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి దొంగ ఓట్లు వేశారు. టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి, ఆదినారాయణరెడ్డి సోదరుడి కుమారుడు భూపేష్రెడ్డి కనుసన్నల్లో దొంగ ఓటర్లను తరలించారు. పులివెందులకు పొరుగు ప్రాంతాలైన.. అసలు పులివెందుల మండలంలో ఓటర్లు కాదు కదా.. కనీసం స్థానికులతో సంబంధం లేని వ్యక్తులు వచ్చి దర్జాగా దొంగ ఓట్లు వేసి వెళ్లిపోయారంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏ స్థాయికి దిగజారిపోయిందో చెప్పేందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఒక్క నల్లపురెడ్డిపల్లి పోలింగ్ కేంద్రంలోనే టీడీపీ నుంచి పదవులు అనుభవిస్తున్న వందలాది మంది వ్యక్తులు.. సర్పంచ్లు, మార్కెట్ యార్డు సభ్యులు, ఆ పార్టీ నాయకుల ప్రధాన అనుచరులు నిస్సిగ్గుగా దొంగ ఓట్లు వేస్తుంటే ఎన్నికల కమిషన్ కళ్లు మూసుకుని కూర్చుంది. ముఠా పనులకు కూలీలను తీసుకెళ్లినట్లుగా.. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం చంద్రబాబు సర్కారు దొంగ ఓటర్లను దిగుమతి చేసి ప్రజాస్వామ్య విలువలను కాలరాసింది.స్లిప్పులు లాక్కుని.. దొంగ ఓటర్లకు పంచి..పులివెందుల మండలంలోని గ్రామాల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రాల ఛాయలకు కూడా రాకుండా చంద్రబాబు సర్కారు పోలీసు బలగాలతో బెదిరింపులకు దిగింది. ఎన్నికల వేళ ఓటర్లకు రక్షణగా నిలిచి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా అండగా నిలవాల్సిన పోలీసులే అధికార పార్టీ అరాచకాలకు కొమ్ము కాశారు. గ్రామాల్లో పికెటింగ్ పెట్టి బ్యారికేడ్లతో పోలింగ్ కేంద్రానికి కిలోమీటరు దూరంలోనే ఓటర్లను అడ్డుకున్న దౌర్భాగ్య పరిస్థితి కనిపించింది. వైఎస్సార్సీపీకి చెందిన ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల నుంచి దౌర్జన్యంగా బయటకు గెంటేయడం ద్వారా టీడీపీ పథకం ప్రకారం యథేచ్ఛగా దొంగ ఓట్లు వేసుకోవడంతో పాటు కనీవినీ ఎరుగని రీతిలో రిగ్గింగ్కు పాల్పడింది. పోలింగ్ కేంద్రాల దగ్గరే తిష్టవేసిన టీడీపీ మూకలు ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్ల నుంచి బలవంతంగా స్లిప్పులను లాక్కుని.. వాటిని దొంగ ఓటర్లకు పంచుతూ అక్రమాలకు పాల్పడ్డాయి.‘హెల్ప్’లెస్ డెస్క్లు..!పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సహాయార్థం ఏర్పాటు చేసే ‘హెల్ప్డెస్క్’లను సైతం ఎన్నికల కమిషన్ నిర్వహించలేని నిస్సహాయ పరిస్థితుల నడుమ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ముగిసింది. టీడీపీ గూండాలతో పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాలు నిండిపోయాయి. పోలీసులే ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రానివ్వకుండా అడ్డుకుని అరాచక శక్తులకు దండుగా నిలిచారు. ఫలితంగా హెల్ప్డెస్క్లో ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తులను కూర్చోనివ్వకుండా తరిమేశారు. చివరికి పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బంది ఉత్సవ విగ్రహాలు మాదిరిగా మిగిలిపోయారు. కణంపల్లెలో వేముల, దుగ్గన్నగారిపల్లి గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు ఓట్లు రిగ్గింగ్ చేస్తున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత అప్రజాస్వామికంగా ఎన్నికలు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ నిలదీశారు. ఓట్లు వేయకుండా తమను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులతో అక్కడ ఓటర్లు వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుకు నిరసనగా ధర్నా చేశారు.పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నిక సందర్భంగా నల్లపురెడ్డిపల్లిలో యథేచ్ఛగా ఓట్లు వేసిన జమ్మలమడుగుకు చెందిన కొందరు వ్యక్తుల వివరాలు..» పాతకుంట శివారెడ్డి, గూడెంచెరువు» రామచంద్రయ్య, చిన్న దండ్లూరు » రాజన్న, కలవటల, n కుళాయి, కంబళదిన్నె » రాజగోపాల్, భీమగుండం » మర్రి ప్రకాశం, నవాబుపేట » ద్వారకచర్ల జనార్దన్ రెడ్డి, నవాబుపేటపచ్చ గూండాల చేతుల్లో పోలింగ్ కేంద్రాలు..!పులివెందుల మండలం ఎర్రిపల్లి గ్రామంలో టీడీపీ మూకలు పోలింగ్ కేంద్రాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ గూండాలు యథేచ్ఛగా దొంగ ఓట్లు వేస్తూ వికృత చేష్టలతో మహిళలపై దౌర్జన్యానికి దిగి భయబ్రాంతులకు గురి చేశారు. గ్రామంలో ఎవరినీ ఓటు వేయనివ్వకుండా భీతావహ వాతావరణాన్ని సృష్టించారు. -
నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 13న (బుధవారం) ఉదయం 11 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడతారు. -
ఏజెంట్లు లేకుండానే ఎన్నికలు
సాక్షి, అమరావతి: అధికార పార్టీ ఆగడాలు.. స్వయంగా మంత్రి, ఎమ్మెల్యే అరాచకాలు.. అధికార దుర్వినియోగం.. పోలీస్ యంత్రాంగం స్వామి భక్తి సాక్షిగా ప్రజాస్వామ్యం నడివీధుల్లో అపహాస్యం పాలైంది! రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ.. ప్రజాస్వామ్య విలువలు, మౌలిక సూత్రాలను కాలరాస్తూ టీడీపీ కూటమి సర్కారు అక్రమాలకు పాల్పడింది. ప్రత్యర్థి పార్టీ ఏజెంట్లే లేకుండా ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించుకోవాలన్న తలంపుతో బరి తెగించింది. ఎక్కడికక్కడ ఏజెంట్లను అడ్డుకుని పోలింగ్ బూత్ల దరిదాపుల్లోకి కూడా రానివ్వకుండా కట్టడి చేసి పోలీసుల సహకారంతో దాడులకు తెగబడింది. చివరకు నిస్సిగ్గుగా మహిళా ఏజెంట్లపై కూడా దౌర్జన్యాలకు ఒడిగట్టింది. ఏజెంట్ల ఇళ్ల వద్ద మోహరించి..పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో మునుపెన్నడూ చూడని విష సంస్కృతికి అధికార టీడీపీ తెర తీసింది. దేశ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో అసలు ఏజెంట్లే లేని ఎన్నికలు నిర్వహించి టీడీపీ పెద్దలు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు. ఎన్నికల సంఘంతో పాటు పోలీసులు కూడా కళ్లుమూసుకోవడంతో ఎన్నికల నిర్వహణ పూర్తిగా తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం బరిలో నిలిచిన అభ్యర్థులు తమ తరపున పర్యవేక్షించేందుకు జనరల్ ఏజెంట్లతో పాటు బూత్కొకరు చొప్పున పోలింగ్ ఏజెంట్లను నియమించుకుంటారు. వీరు తమకు కేటాయించిన పోలింగ్ బూత్లలో ఎన్నికల నిర్వహణను పర్యవేక్షిస్తుంటారు. రిగ్గింగ్ జరగకుండా అడ్డుకోవడం, బోగస్ ఓట్లు పడకుండా నివారించడం వీరి ప్రధాన విధి. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటమి భయంతో వణికిపోయిన టీడీపీ పెద్దలు ఓ పథకం ప్రకారం వైఎస్సార్సీపీ ఏజెంట్లను పోలింగ్ బూత్లలోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. అడుగడుగునా పోలీస్ యంత్రాంగాన్ని మోహరించి తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఏజెంట్ల ఇళ్లకు వెళ్లి వారి వద్ద ఉన్న ఫారాలను చించివేసి గృహ నిర్భందాలకు పాల్పడ్డారు.కొన్ని చోట్ల సోమవారం రాత్రి నుంచే ఏజెంట్ల ఇళ్ల వద్ద కర్రలతో పహారా కాస్తూ బయటకు రాకుండా తిష్ట వేశారు. ఎలాగోలా బూత్లకు చేరుకున్న ఏజెంట్లపై దాడులకు తెగబడ్డారు. బూత్లలో ఉన్న ఏజెంట్లను బయటకు ఈడ్చుకొచ్చి దౌర్జన్యాలకు పాల్పడ్డారు. పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో 15 పోలింగ్ బూత్లుండగా ఏ ఒక్క చోట కూడా ఏజెంట్ను లోపలకు వెళ్లనివ్వలేదు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ ముష్కరులు దాడులకు తెగబడుతున్నా అడ్డుకునే యత్నం చేయలేదు. కొన్ని చోట్ల అయితే పోలీసులే దగ్గరుండి వైఎస్సార్సీపీ ఏజెంట్లను బయటకు పంపించేశారు.ఏకంగా అభ్యర్థినే ఇంట్లో బంధించి..పులివెందుల వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్రెడ్డి స్వగ్రామమైన తుమ్మలపల్లెలో ఆయన ఇంటి చుట్టూ 150 మందికిపైగా టీడీపీ మూకలు పోగై కర్రలతో బెదిరిస్తూ బయటకు రాకుండా అడ్డగించారు. పోలీసులు వారికి కొమ్ము కాస్తూ.. హేమంత్రెడ్డి బయటకు రావొద్దని, వస్తే గొడవలు అవుతాయంటూ హెచ్చరించడం విస్మయం కలిగిస్తోంది. పోలింగ్ బూత్ వద్దకు వెళ్లేందుకు సైతం అనుమతించలేదు. పోలింగ్ జనరల్ ఏజెంట్ బలరామిరెడ్డిది కూడా అదే పరిస్థితి. ఆయన్ను కూడా బయటకు రానివ్వలేదు. పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకోవాలంటే దాదాపు 300 మందిని దాటుకొని వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. పోలీసులు పూర్తిగా టీడీపీ నేతలకు సరెండర్ అయ్యారు.బూత్ను ఆక్రమించి ‘ఆది’ అరాచకం..» నల్లపురెడ్డిపల్లెలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నేతలు బూత్లను ఆక్రమించారు. వైఎస్సార్సీపీకి చెందిన ఏజెంట్లను కూర్చోనివ్వకుండా పోలీసులు బలవంతంగా బయటకు పంపేశారు. ఏజెంట్ల ఫారాలను లాక్కుని చించేశారు. » కనంపల్లెలో బూత్లలోకి ఏజెంట్లు వెళ్లకుండా వారి ఇళ్ల వద్ద టీడీపీ గూండాలు కర్రలు, రాడ్లతో మోహరించారు. ఇ.కొత్తపల్లిలో రెండు బూత్లను ఆక్రమించి ఏజెంట్లను అడ్డుకున్నారు.» మోట్నూతలపల్లిలో టీడీపీ మూకలు పోలింగ్ బూత్కి 2 కి.మీ ముందే వాహనాలను వెనక్కి పంపేశాయి. పోలింగ్ బూత్లను ఆక్రమించి గ్రామంలోకి ఎవరినీ రానివ్వలేదు. వైఎస్సార్సీపీ ఏజెంట్లను బూత్ లోపలికి వెళ్లనివ్వలేదు. ఈ అక్రమాలను అడ్డుకున్న గ్రామస్తులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు.మంత్రి రాంప్రసాద్రెడ్డి సమక్షంలో ఏజెంట్పై దాడి» ఒంటిమిట్ట మండలం చినకొత్తపల్లిలో మంత్రి రాంప్రసాద్రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా బూత్లోకి చొరబడ్డారు. మంత్రి హోదాలో ఉంటూ ఓ గూండా మాదిరిగా పార్టీ కార్యకర్తలతో కలిసి వైఎస్సార్సీపీ ఏజెంట్ను బయటకు లాక్కొచ్చి బట్టలూడదీసి చావబాదారు. పక్కనే ఉన్న పోలీసులు అడ్డుకోకుండా ప్రేక్షక పాత్ర వహించారు. ఇదే మండలం గాండ్లపల్లి బూత్లో పోలింగ్ మొదలు కాకముందే వైఎస్సార్ సీపీ ఏజెంట్లను పోలీసుల సమక్షంలోనే బయటకు గెంటేశారు.» పులివెందుల మండలం చింతరాజుపల్లెలో ఎన్నికల బూత్లో వైఎస్సార్సీపీ ఏజెంట్పై దాడి చేసిన టీడీపీ నాయకులు చితకబాది బయటకు గెంటేశారు.» నల్లగొండువారిపల్లెలోని బూత్లోకి వైఎస్సార్సీపీ ఏజెంట్లు వెళ్లకుండా టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ బూత్ బయట కర్రలతో స్వైర విహారం చేశారు.» బీటెక్ రవి తమ్ముడు భరత్ ఎర్రిపల్లె పోలింగ్ బూత్లోకి ఏజెంట్లను రానివ్వకుండా అడ్డుకుంటున్నా పోలీసులు చోద్యం చూశారని మహిళా ఏజెంట్ వాపోయారు. » అచ్చివెళ్లిలో వైఎస్సార్సీపీ ఏజెంట్లను అడ్డుకున్న టీడీపీ నాయకులు బూత్ల నుంచి బలవంతంగా పంపేశారు. కొత్తపల్లె పోలింగ్ బూత్లలోకి వైఎస్సార్సీపీ ఏజెంట్లను అనుమతించలేదు. తుమ్మలపల్లెలో పోలింగ్ బూత్లను టీడీపీ నాయకులు ఆక్రమించుకొని ఏజెంట్లను బయటకు పంపేశారు. -
టీడీపీ గూండాగిరీకి పోలీసుల గులాంగిరీ
జెడ్పీటీసీ ఉప ఎన్నిక సాక్షిగా పులివెందులలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. ఖాకీలే పచ్చరౌడీల్లా తెగబడ్డారు. పోలీసు పహారాలోనే అధికారిక రిగ్గింగ్ యథేచ్ఛగా సాగిపోయింది. టీడీపీ కూటమి కుతంత్రాన్ని పచ్చ ఖాకీలు అంతా తామై అమలు చేశారు. రాజ్యాంగాన్ని నిర్భీతిగా కాలరాశారు. స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఎన్నడూలేని రీతిలో పోలీసులు సర్వం తామై ఎన్నికల అక్రమాలకు బరితెగించారు. ఓటు వేసే ప్రజల రాజ్యాంగ హక్కును అడ్డుకున్నారు. దాడులతో తెగబడి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారు. సామాన్యులు కనీసం పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. టీడీపీ గూండాలు దాడులకు తెగిస్తూ బీభత్సం సృష్టిస్తున్నా చోద్యం చూశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ రౌడీలు దొంగ ఓట్లు వేసేందుకు రాచబాట పరిచారు. సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కడప: జెడ్పీటీసీ ఉప ఎన్నికలో చంద్రబాబు ప్రభుత్వ అరాచకానికి వత్తాసు పలకడమే విద్యుక్త ధర్మం అంటూ పోలీసులు కొత్త మాన్యువల్ను అమల్లోకి తెచ్చారు. పత్తేపారం చేస్తున్నారా అనే దిగజారుడు భాషతో పచ్చ ఖాకీల అధికారిక రౌడీయిజానికి డీఐజీ కోయ ప్రవీణ్ రింగ్ మాస్టర్గా వ్యవహరించారు. ఈయన ఓ టీడీపీ మాజీ ఎంపీ అల్లుడే కావడం గమనార్హం. లాఠీచార్జితో వైఎస్సార్సీపీ కార్యకర్తలను చెల్లాచెదురు చేయమని పచ్చ పైత్యం ప్రదర్శించారు. ఇక, కాల్చిపారేస్తా.. నా కొడకా అంటూ డీఎస్పీ మురళీనాయక్ పచ్చిరౌడీలా చెలరేగిపోయారు. ఎస్పీ అశోక్కుమార్ నుంచి డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు మొత్తం పోలీసు వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కుట్రలో భాగస్వామిగా మారింది. ఓటర్లను అడ్డుకునేందుకు పక్కా స్కెచ్ జెడ్పీటీసీ ఉప ఎన్నికలో అక్రమాలు, టీడీపీ రిగ్గింగ్కు అడ్డుఅదుపు లేకుండా చేసేందుకు పోలీసులు పక్కా స్కెచ్ వేశారు. రెక్కీ నిర్వహించి హత్యలు చేసే కిరాయి మూకల్లా ఖాకీలు పులివెందులపై పడ్డారు. వెయ్యిమందికిపైగా పోలీసులు మండలాన్ని అష్ట దిగ్బంధం చేశారు. వారం రోజులుగా పులివెందులలో పోలీసు మార్క్ రౌడీయిజంతో అందరినీ భయభ్రాంతులకు గురిచేశారు. టీడీపీ ప్రభుత్వ కుతంత్రంతో ఓ గ్రామంలోని ఓటర్లకు వేరే గ్రామంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటి వద్దకు వైఎస్సార్సీపీ సానుభూతిపరులు వెళ్లకుండా పోలీసులు రంగంలోకి దిగారు. ఎక్కడపడితే అక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఇక మంగళవారం పోలింగ్ సందర్భంగా పోలీసులు పూర్తిగా బరితెగించేశారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చిన ఓటర్లను లాఠీలు ఝళిపిస్తూ బూతులు తిడుతూ వెనక్కి పంపించేశారు. అయినా సరే తాము ఓట్లు వేస్తామని పట్టుబట్టినవారిపై విరుచుకుపడ్డారు. అనుమతించాలని కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు. ఓటర్ల చేతుల్లోని స్లిప్లను గుంజుకున్నారు. ‘‘మీ దగ్గర ఓటరు స్లిప్పులు లేవు కాబట్టి అనుమతించం’’ అని తర్వాత చెప్పడం గమనార్హం. ఓ విధంగా చెప్పాలంటే ఖాకీ గూండాగిరీ రాజ్యమేలింది. పోలీసు పహారాలోనే టీడీపీ రిగ్గింగ్ టీడీపీ రిగ్గింగ్కు పోలీసులు రక్షాకవచంగా నిలిచారు. పులివెందులలోని అన్ని పోలింగ్ బూత్లలోని వైఎస్సార్సీపీ ఏజెంట్లపై టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారు. పోలీసుల సమక్షంలోనే వారిని బలవంతంగా బయటకు గెంటేశారు. అనంతరం ఏకపక్షంగా రిగ్గింగ్ చేసుకున్నారు. కాగా, జమ్మలమడుగు, కమలాపురం నుంచి టీడీపీ కూటమి గూండాలను కూడా రప్పించారు. వాస్తవానికి ఇతర ప్రాంతాల వారిని పోలింగ్ రోజున అనుమతించకూడదు. పోలీసులు అవేమీ పట్టించుకోకుండా కూటమి గూండాలకు రాచబాట పరిచారు. దీంతో పచ్చ గూండాలు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు. భారీగా ఓటర్లు ఉన్న గ్రామాలను లక్ష్యంగా చేసుకుని మరీ విధ్వంసానికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులు, సామాన్యులు ఓటు వేసేందుకు వెళ్లకుండా నిరోధించారు. స్లిప్పులను తీసుకుని చింపివేశారు. ఇక ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ వర్గీయులు, గూండాలు పోలింగ్ కేంద్రాల్లోకి దూసుకెళ్లి యథేచ్ఛగా దొంగ ఓట్లు వేశారు. పోలీసులే వారిని దగ్గరుండి తీసుకువెళ్లి మరీ దొంగ ఓట్లు వేయించడం గమనార్హం. సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ ముగిసేవరకు పోలీసుల పహారాలోనే టీడీపీ రిగ్గింగ్ యథేచ్ఛగా కొనసాగింది. వైఎస్సార్సీపీ కార్యాలయంపై ఖాకీల దండయాత్ర డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ ఆశోక్కుమార్, ఏఎస్పీ ప్రకాష్ బాబు, డీఎస్పీ మురళీనాయక్, మరో ఆరుగురు సీఐలు, 10 మంది ఎస్ఐలు, వందలమంది పోలీసులతో వైఎస్సార్సీపీ కార్యాలయంలోకి చొచ్చుకువచ్చారు. వారికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు నినాదాలు చేయగా లాఠీచార్జితో చెదరగొట్టాలని డీఐజీ ఆదేశించారు. దాంతో ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడింది. తమను ఓట్లు వే సేందుకు అనుమతించాలని ఓటర్లు కాళ్లా వేళ్లా పడినా పోలీసులు ఏమాత్రం కనికరించలేదు. ఇదే అదనుగా వైఎస్సార్సీపీ కార్యాలయం గేటుకు తాళం వేసి సాయంత్రం 5 గంటల వరకు ఎంపీ అవినాశ్రెడ్డిని నిర్బంధంలోనే ఉంచారు. డీఐజీ కోయ ప్రవీణ్ ఆయన పక్కనే కూర్చుని మరీ ఈ కుతంత్రాన్ని పకడ్బందీగా పర్యవేక్షించారు. రిగ్గింగ్ ఆధారాలు ఉంటే ఇవ్వండి: డీఐజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ముందస్తు అరెస్టు చేసి సాయంత్రం వరకు గృహ నిర్బంధంలో ఉంచామని డీఐజీ కోయ ప్రవీణ్ మీడియాకు తెలిపారు. తాము బందోబస్తు కోసమే వచ్చామని చెప్పుకొచ్చారు. రిగ్గింగ్ జరిగినట్లు ఆధారాలుంటే ఇవ్వాలని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. రిగ్గింగ్కు సంబంధించిన ఆధారాలు ఉంటే ఎన్నికల సంఘం, కోర్టుకు ఇస్తారు కానీ డీఐజీకి ఎందుకు ఇస్తారని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.కాల్చిపడేస్తా నా కొడకా.. అంటూ డీఎస్పీ రౌడీయిజంపులివెందుల డీఎస్పీ మురళీనాయక్ అయితే వైఎస్సార్సీపీ కార్యాలయంలో వీరంగం సృష్టించారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికలో తమను ఓటు వేయనీయడం లేదని, రిగ్గింగ్ను ఆపాలంటూ ఓటర్లు పోలీసులకు విజ్ఞప్తి చేసే యత్నం చేశారు. అక్కడే ఉన్న డీఎస్పీ ఓటర్లపై చిందులు తొక్కారు. ‘కాల్చిపడేస్తా నా కొడకా.. ఏమనుకుంటున్నావ్, యూనిఫాం ఇక్కడ..’ అంటూ రౌడీ తరహాలో చెలరేగిపోయారు. పోలీసులు కుట్రపూర్వకంగానే వైఎస్సార్సీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేందుకు యత్నించారు. లాఠీచార్జి చేసి చెదరగొట్టాలని డీఐజీ ఆదేశించడం.. పరుష వ్యాఖ్యలతో డీఎస్పీ మురళీనాయక్ చెలరేగిపోవడం.. ఇద్దరు, ముగ్గురు సీఐలు విరుచుకుపడడం అంతా పక్కా పన్నాగంతోనే సాగింది. కార్యకర్తలు ప్రతిఘటించి పరిస్థితి అదుపుతప్పితే.. అదే సాకుగా ‘తీవ్రమైన చర్యల’కు తెగించాలన్నది పోలీసుల కుతంత్రం. కాల్పులకూ తెగించేందుకు వారు సంసిద్ధంగా ఉన్నారని స్పష్టమైంది. పోలీసులు ఉద్దేశం గుర్తించిన ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి కార్యకర్తలను వారించారు. ‘ఎలాంటి ఉద్రిక్తతలు వద్దు. కార్యకర్తలు సంయమనం పాటించాలి’ అని హితవు పలికారు. రిగ్గింగ్ రింగ్ మాస్టర్ డీఐజీ కోయ ప్రవీణ్ మొన్న విపరీత వ్యాఖ్యలు.. నేడు అధికార దుర్వినియోగం పులివెందుల మండలంలో టీడీపీ అధికారిక రిగ్గింగ్కు రింగ్ మాస్టర్గా డీఐజీ కోయ ప్రవీణ్ వ్యవహరించారు. ఐపీఎస్ అధికారిగా తన చట్టబద్ధమైన అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ దిగజారుడుతనం ప్రదర్శించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు సృష్టించి కుతంత్రానికి బరితెగించారు. ఎస్పీ అశోక్ కుమార్తో పాటు యావత్ పోలీసు యంత్రాంగాన్ని తన కుట్రలో భాగస్వామిగా చేసుకుని చెలరేగిపోయారు. పోలింగ్కు నాలుగు రోజుల ముందు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేశ్యాదవ్, పార్టీ కీలక నేత వేల్పుల రాములపై హత్యాయత్నాన్ని డీఐజీ ప్రవీణ్ తక్కువ చేసి చూపించేందుకు యత్నించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నేతలను ఉద్దేశించి ‘ఒక ఊరివారు మరో ఊరికి ఎందుకు వెళ్లారు? పత్తేపారం చేయడానికా’ అంటూ వెటకారం ఆడారు. తద్వారా ఎన్నికల్లో టీడీపీ అక్రమాలకు వత్తాసు పలకడమే తన ఉద్దేశం అని చాటారు. పోలింగ్ సందర్భంగా ప్రవీణ్ అధికార దుర్వినియోగం పతాక స్థాయికి చేరింది. ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి అక్రమ గృహ నిర్బంధం, వైఎస్సార్సీపీ కార్యాలయంపై దాడి తరహాలో పోలీసులు చొచ్చుకుపోవడాన్ని ప్రవీణ్ స్వయంగా పర్యవేక్షించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై లాఠీచార్జికి స్వయంగా ఆదేశించడం గమనార్హం. ప్రవీణ్ ఆదేశాలతోనే ఎస్పీ అశోక్కుమార్, డీఎస్పీ మురళీనాయక్తో పాటు పోలీసులు అక్రమాలకు తెగబడ్డారు. తెల్లవారుజామునే పోలీసుమార్కు గూండాయిజం ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి అక్రమ నిర్బంధం పులివెందులలో మంగళవారం సూర్యోదయానికి ముందే పచ్చ ఖాకీలు గూండాగిరీకి తెరతీశారు. భారీగా పోలీసు అధికారులు, సిబ్బంది వేకువజామునే ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి నివాసంపై దండెత్తారు. దురాక్రమణదారుల మాదిరిగా ఇంట్లోకి దూసుకెళ్లారు. ఎంపీని అక్రమంగా అరెస్టు చేశారు. ఎంపీగా తన నియోజకవర్గ పరిధిలోని జెడ్పీటీసీ ఉప ఎన్నికలను పర్యవేక్షించడం ఆయన హక్కు, బాధ్యత. కానీ, దీన్ని పోలీసులు కాలరాశారు. ఆయనను అక్రమంగా అరెస్టు చేస్తున్నట్టు తెలిపారు. పోలీసుల దౌర్జన్యంపై వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర నిరసన తెలపగా వారిని ఈడ్చి పడేశారు. ఎంపీని తమ వాహనంలో బలవంతంగా ఎక్కించుకుని ముద్దనూరు వైపు తీసుకువెళ్లారు. నిడిజివ్వి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే సు«దీర్రెడ్డి ఇంటి వద్ద దింపి ఇక్కడే ఉండాలని ఆదేశించారు. అక్కడికి వైఎస్సార్సీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పోలీసుల అరాచకాలకు వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు యర్రగుంట్ల వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. నాలుగు రోడ్ల కూడలిలో బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం ఎంపీ పులివెందులలోని వైఎస్సార్సీపీ కార్యాలయానికి చేరుకున్నారు. -
ఆక్వా రైతు పోరుబాట
సాక్షి, అమరావతి: ట్రంప్ టారీఫ్ల నేపథ్యంలో సంక్షోభంలో కూరుకుపోతున్న ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఇందుకోసం దశల వారీగా ఆందోళనలు చేపట్టడం ద్వారా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పన్నులు–ఆక్వా రంగం ప్రభావంపై విజయవాడ బాలోత్సవ భవన్లో ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య అధ్యక్షతన మంగళవారం రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సంక్షోభం నుంచి ఆక్వా రైతులను ఆదుకోవాలని వక్తలు డిమాండ్ చేశారు. దీనిపై మత్స్య శాఖ మంత్రి, ముఖ్యమంత్రిలకు వినతిపత్రాలు ఇవ్వాలని, ఆక్వా సాగు ఉన్న అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సులు, బహిరంగ నిరసనలు తెలియజేయాలని నిర్ణయించారు. సమావేశంలో తొలుత ఏపీ రైతుసంఘం పూర్వ రాష్ట్ర అధ్యక్షులు బి.బలరాం మాట్లాడుతూ రాష్ట్రంలో 8 తీరప్రాంత జిల్లాల్లో 4 లక్షల ఎకరాలకు పైగా సాగవుతున్న ఆక్వా రంగంపై లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారని చెప్పారు.ఏటా రాష్ట్రం నుంచి 7.16 లక్షల టన్నులు ఆక్వా ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయని పేర్కొన్నారు. ఆక్వా ఎగుమతులపై అమెరికా సుంకాలను 50 శాతానికి పెంచడంతో టన్నుకు రూ.లక్ష నుంచి రూ.50 వేలు అదనంగా చెల్లించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రొయ్యల ధరలు పతనం ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య మాట్లాడుతూ ట్రంప్ సుంకాల ప్రభావంతో ఇప్పటికే రొయ్యల ధరలు పతనమయ్యాయని, ఇతర దేశాలకు ఎగుమతి చేసే రొయ్యలు, కౌంట్ ధరలను కూడా తగ్గించేశారని విమర్శించారు. రైతులు సుమారు టన్నుకు రూ.40వేల వరకు నష్టపోతున్నారని వివరించారు. రైతు సంఘం నేత వై. కేశవరావు మాట్లాడుతూ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఎంపెడా ద్వారా ధరలు తగ్గకుండా చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై ఏపీ కౌలురైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు ప్రవేశపెట్టిన తీర్మానాలను రౌండ్ టేబుల్సమావేశం ఆమోదించింది. రౌండ్ టేబుల్ సమావేశంలో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి. రమాదేవి, ఆక్వా టెక్ ఎడిటర్ కోనా జోసెఫ్, ఆక్వా రంగం నిపుణులు షేక్ అలీ హుస్సేన్, ఆక్వా రైతుల సంఘం పశి్చమగోదావరి జిల్లా కనీ్వనర్ ఆర్.సూర్యనారాయణ రాజు (యువరాజు), సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు ఎ.వి.నాగేశ్వరరావు, వ్యవసాయ కారి్మక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు, కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి అండ్ర మాల్యాద్రి పాల్గొన్నారు. తీర్మానాలివీ.. » కేంద్ర ప్రభుత్వం ఎంపెడా కౌంటర్ గ్యారెంటీ ఇచ్చి ఆక్వా ఉత్పత్తుల ధరలకు భరోసా ఇవ్వాలి. » కేంద్ర ఎక్స్పోర్టర్స్ ధర తగ్గించి కొనుగోలు చేయకుండా తగు చర్యలు తీసుకోవాలి. » అమెరికా సుంకాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. » ఆక్వా రంగాన్ని వ్యవసాయంగా గుర్తించాలి. దేశంలో అంతర్గత (డొమెస్టిక్) వినియోగానికి చర్యలు తీసుకోవాలి. » నాణ్యమైన సీడ్, ఫీడ్ అందేలా చూడాలి. ధరలు నియంత్రించాలి. విద్యుత్ రాయితీ అమలు చేయాలి.