Amaravati
-
చెవిరెడ్డి పేరు చెప్పాలని ‘సిట్’ చిత్ర హింసలు
సాక్షి అమరావతి: మద్యం అక్రమ కేసులో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పేరు చెప్పాలని ఆయనతో పాటు తిరిగిన వారిని, సన్నిహితంగా మెలిగిన వారిని సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం–ఎస్ఐటి) అధికారులు టార్గెట్ చేసి చిత్ర హింసలు పెడుతున్నారు. పోలీసులని కూడా చూడకుండా గతంలో గన్మెన్లుగా పని చేసిన వారిపై కూడా చేయి చేసుకుంటున్నారు.జరగని లిక్కర్ స్కామ్లో చెవిరెడ్డికి భాగమున్నట్లు తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని తనకు నరకం చూపారని గతంలో చెవిరెడ్డికి గన్మెన్గా పనిచేసిన మదన్రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన ఒంటిపై ఖాకీ యూనిఫాం ఉన్నప్పటికీ తనను కొట్టారని, అనరాని మాటలతో మానసిక వేదనకు గురిచేశారని వివరిస్తూ డీజీపీకి లేఖ రాశారు. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. చెప్పినట్లు చేయడానికి నీకేంటి రోగం?⇒ ‘నన్ను విజయవాడ సిట్ సార్ వాళ్లు రమ్మంటే వెళ్లాను. మొదటి రోజు వారు చెప్పినట్టు రాసి సంతకాలు చేయమన్నారు. నేను సాక్షిగా వచ్చాను.. వాస్తవాలు చెబుతాను, వాస్తవాలు రాస్తానని చెప్పాను. అందుకు వాళ్లు నన్ను అసభ్యంగా తిట్టారు. నీ కన్నా ముందు విచారణకు వచ్చిన గిరి అనే కానిస్టేబుల్ మేము చెప్పినట్టు రాసి సంతకాలు పెట్టాడని చెప్పారు. వీడియో రికార్డింగ్లోనూ అదే చెప్పాడు. మరి నీకేంటి రోగం.. అంటూ తిట్టారు.⇒ మొదటి రోజు పది గంటల పాటు ఒకరు మారిస్తే ఒకరు నన్ను మానసికంగా, శారీరకంగా హింసించారు. అనరాని మాటలు అంటుంటే, నన్ను ఇలాగే వేధిస్తే తట్టుకునే శక్తి నాకు లేదన్నాను. ఇక్కడ నాకు ఏదైనా జరిగితే మీదే బాధ్యత అని చెప్పడంతో ఆ రోజుకు పంపించేశారు. రేపు రా.. అది కూడా యూనిఫాం తీసేసి రా అని చెప్పారు. నా కన్నా ముందు సిట్ విచారణకు యూనిఫాం తీసేసి వచ్చిన కానిస్టేబుల్ గిరిని కొట్టారని తెలిసి రెండో రోజు కూడా యూనిఫాం వేసుకుని విచారణకు వెళ్లాను. అలా వచ్చినందుకు నన్ను బూతులు తిట్టారు. ⇒ నువ్వు కూడా రాసిచ్చి మీ ఊరికి వెళ్లిపో అని చెప్పారు. నేను చెవిరెడ్డి దగ్గర పదేళ్లు గన్మెన్గా పనిచేశాను. లిక్కర్ వల్ల ఆయన కుటుంబంలో ఇద్దరిని కోల్పోయాడు. అతను ఎన్నికల్లో కూడా మద్యం పంపిణీ చేయలేదు. అతనికి సెంటిమెంట్ కూడా. అలాంటిది ఒక చిన్న కానిస్టేబుల్ అయిన నా చేత అంత పెద్ద మాటలు చెప్పించడం, రాయించడం ఏంటి సార్.. నేను అలా అబద్ధాలు చెప్పలేను అని చెప్పాను. దీంతో సిట్ వాళ్లు చాలా కోపంతో నీ ఉద్యోగం ఊడబెరికి జైలుకు పంపుతామని బెదిరించారు. ఏమైనా సరే అంతగా అబద్ధాలు చెప్పలేనన్నాను. దీంతో అక్కడున్న పది మంది సిబ్బంది యూనిఫాంలో ఉన్న నాపై విరుచుకుపడ్డారు.⇒ తల, ముఖం, వీపుపై పిడిగుద్దులు గుద్దారు. నా చేతి వేళ్లు పట్టుకుని వెనక్కు విరిచారు. ఆ నొప్పి భరించలేక నేను గట్టిగా అరిచాను. నీళ్లు తాగించి మళ్లీ అలాగే చేశారు. కొంత సేపటి తర్వాత.. యూనిఫాం తీసేసి రావాలంటూ పంపించారు. నేను రూముకు వచ్చాక కళ్లు తిరిగి కిందపడ్డాను. తర్వాత మణిపాల్ ఆసుపత్రికి వెళ్లాను. తీవ్ర ఆందోళనలో ఉన్న నాకు కార్డియాలజీ, న్యూరాలజీ పరీక్షలు చేయాలని అడ్మిట్ చేసుకున్నారు. ⇒ సార్.. ఈ పరిస్థితిలో నేను సిట్ దగ్గరకు ఒంటరిగా వెళ్లలేను. ఆ దెబ్బలు తట్టుకొనే శక్తి, ఆరోగ్యం నాకు లేవు. నాకు ఉద్యోగం లేకపోయినా కూలి పనులు చేసుకుని, పశువులు మేపుకుని బతుకుతాను. అక్కడ నాకు ఏమైనా జరిగితే నా కుటుంబం అన్యాయమైపోతుంది.. దయచేసి పెద్ద మనస్సుతో నా విన్నపాన్ని మన్నించి, నన్ను కొట్టకుండా విచారించేలా సిట్ వాళ్లకు ఆదేశాలివ్వండి’ అని విన్నవించారు. గిరి.. మదన్.. వెంకటేష్.. బాలాజీ..చెవిరెడ్డికి అంగరక్షకులుగా.. అత్యంత సన్నిహితులుగా మెలిగిన వారిని బలవంతంగా అరెస్టు చేసిన సిట్ అధికారులు రోజుల తరబడి వారి అదుపులో పెట్టుకుని చిత్రవధ చేశారని ఇప్పటికే చెవిరెడ్డి పలుమార్లు మీడియా ద్వారా వెల్లడించారు. మొదటగా గన్మెన్ గిరిని పట్టుకుని తీవ్రంగా కొట్టి, భయపెట్టి స్టేట్మెంట్ తీసుకున్నారని, ఆ తర్వాత మరో గన్మెన్ మదన్ను విచారణకు పిలిపించి విచక్షణా రహితంగా కొట్టి శారీరకంగా, మానసికంగా చిత్రవధకు గురిచేశారని చెవిరెడ్డి తెలిపారు.తన సన్నిహితుడైన వెంకటేష్నాయుడు, అతని కుటుంబీకులను వేధింపులకు గురి చేసి టార్చర్ పెట్టారన్నారు. బాలాజీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఐదు రోజుల పాటు నరకం చూపారన్నారు. చెవిరెడ్డికి ఏపీ లిక్కర్ స్కాంతో సంబంధం ఉందని చెప్పాలని వీరందరిపై ఒత్తిడి చేశారని చెప్పారు. సిట్ అధికారుల దెబ్బలకు తీవ్రంగా గాయపడిన మదన్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడమే సిట్ బరితెగింపుకు నిలువెత్తు సాక్ష్యమన్నారు.సిట్ వేధిస్తోంది..జోక్యం చేసుకోండిమద్యం విధానానికి సంబంధించిన కేసులో సాక్షిగా విచారణకు హాజరైన తనను సిట్ అధికారులు చిత్రహింసలకు గురి చేశారంటూ వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్రెడ్డి వద్ద గన్మెన్గా విధులు నిర్వర్తించిన హెడ్ కానిస్టేబుల్ ఎన్.మదన్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ విచారణ జరిపారు. మదన్రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, మద్యం విధానం కేసులో సాక్షిగా తమ ముందు హాజరు కావాలంటూ పిటిషనర్కు సిట్ అధికారులు నోటీసులిచ్చారన్నారు. ఈ నోటీసులను గౌరవిస్తూ పిటిషనర్ ఈ నెల 10న విచారణకు హాజరయ్యారని తెలిపారు.విచారణ పేరుతో సిట్ అధికారులు మదన్రెడ్డిని తీవ్రంగా బెదిరించారన్నారు. చెవిరెడ్డికి గత పదేళ్లలో రూ.200 కోట్లు అందినట్లు చెప్పాలని, తాము చెప్పినట్లు చేయకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారని వివరించారు. సిట్ అధికారుల తీరు వల్ల పిటిషనర్ తీవ్రంగా ఒత్తిడికి గురై ఆసుపత్రిలో చేరారని, వైద్యులు 15 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చారన్నారు.మదన్రెడ్డిని న్యాయవాది సమక్షంలో విచారించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. సిట్ అధికారుల తరఫున వాదనలు వినిపించేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) అందుబాటులో లేకపోవడంతో న్యాయమూర్తి తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు. ఇదిలా ఉండగా, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ చేసిన ఆరోపణలను సిట్ అధికారులు ఖండిస్తూ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విచారించామే తప్ప తామెవరినీ కొట్టలేదన్నారు. బెదిరింపులు.. వేధింపులు.. చిత్రహింసలువైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు ముసుగులో సిట్ ఆరచకాలకు మొదటి నుంచీ అడ్డూ అదుపూ లేకుండాపోతోంది. లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించాలన్న ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో సిట్ రాజ్యాంగేతర శక్తిగా బరితెగిస్తోంది. అందుకోసం ఈ కేసు దర్యాప్తు పేరిట వేధింపులు, దాడులకు తెగబడుతోంది. ఇప్పటికే పలువురు డిస్టిలరీల ప్రతినిధులను సిట్ అధికారులు హైదరాబాద్ నుంచి బలవంతంగా విజయవాడ తీసుకువచ్చి వేధించారు.60 ఏళ్లు పైబడిన వారిని కూడా భౌతికంగా హింసించడం సిట్ అరాచకానికి తార్కాణం. ఆ డిస్టిలరీల ప్రతినిధులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సిట్ వేధింపులకు అడ్డుకట్ట పడింది. వారిని హైదరాబాద్లోని వారి నివాసంలోనే అదీ సాయంత్రంలోపే విచారించాలని న్యాయస్థానం ఆదేశించింది. అంతకు ముందు ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ పూర్వపు ఎండీ వాసుదేవరెడ్డిని దర్యాప్తు పేరుతో వేధించింది. సిట్ వేధింపులకు వ్యతిరేకంగా ఆయన మూడుసార్లు హైకోర్టును ఆశ్రయించారు కూడా. కానీ సిట్ పట్టు వీడకుండా ఆయన్ను వెంటాడి వెంటాడి వేధించింది.సిట్ వేధింపులతో బెంబేలెత్తిన వాసుదేవరెడ్డి కూటమి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. దాంతోనే ఆయన్ను రాష్ట్ర సర్విసు నుంచి రిలీవ్ చేసి కేంద్ర సర్విసులకు వెళ్లేందుకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అదే రీతిలో బేవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగులు సత్య ప్రసాద్, అనూషలను కూడా సిట్ అధికారులు వేధించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించారు. ఇక ఈ కేసులో అరెస్టు చేసిన పలువురు ప్రైవేటు వ్యక్తులను బెదిరించి లోబరచుకుని వారితో అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించింది. -
బాబు అరాచకం.. సిట్ గూండాయిజం
సాక్షి, అమరావతి: అచ్చోసిన ఆంబోతు ఊరి మీద పడి బీభత్సం సృష్టించిన తీరును తలపిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పనితీరు. దర్యాప్తు ముసుగులో గూండాగిరీకి బరితెగించమని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ముద్ర వేసి రాష్ట్రం మీదకు వదలినట్టుంది సిట్ అరాచకం. అందుకే బెదిరింపులు, వేధింపులు, కిడ్నాపులు, చిత్రహింసలతో చెలరేగిపోతోంది. చివరకు పోలీసు శాఖలో కింది స్థాయి ఉద్యోగి కానిస్టేబుల్ను కూడా విచారణ పేరుతో చిత్రహింసలకు గురి చేయడం సిట్ దాష్టీకానికి పరాకాష్టగా నిలుస్తోంది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేస్తూ సిట్ చీఫ్ ఎస్వీ రాజశేఖర్బాబు, ఆయన బృందం అధికారిక రౌడీయిజం చలాయిస్తోంది. మరోవైపు గతంలో ఎన్నికల కమిషన్ నమోదు చేసిన కేసును వక్రీకరిస్తూ వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసి అక్రమ అరెస్టుకు తెగబడింది. లుక్ అవుట్ నోటీసులు ఇచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన స్నేహితుడు వెంకటేశ్ నాయుడులను మంగళవారం బెంగళూరు విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. బెంగళూరులోని న్యాయస్థానంలో హాజరు పరచి, ట్రాన్సిట్ వారెంట్పై బుధవారం విజయవాడకు తీసుకురానున్నారు. అనంతరం వారిద్దరినీ విజయవాడ న్యాయస్థానంలో హాజరు పరిచే అవకాశం ఉంది. తద్వారా చెవిరెడ్డి భాస్కర్రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసేందుకు కొన్ని రోజులుగా చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న కుతంత్రం బట్టబయలైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై రెడ్బుక్ కుట్రతో నమోదు చేసిన అక్రమ కేసును వేధింపులకు పాల్పడటమే లక్ష్యంగా అరాచకానికి తెగబడుతోంది. అందుకోసం అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో భేతాళ కుట్రకు తెరతీసింది. ఆ కుట్రలో తాజా అంకమే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్టు.. ఆయన కుమారుడు మోహిత్రెడ్డి, మరో నలుగురిపై కేసు నమోదు. ఈ అక్రమ కేసులో తాజాగా వెంకటేశ్ నాయుడు(ఏ34), బాలాజీ కుమార్ యాదవ్ (ఏ35), యద్దాల నవీన్ (ఏ36), హరీశ్ (ఏ37), చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (ఏ38), చెవిరెడ్డి మోహిత్ రెడ్డి (ఏ39)లను నిందితులుగా చేరుస్తూ సిట్ విజయవాడ న్యాయస్థానంలో మెమో దాఖలు చేసింది. ఏకంగా సుప్రీం ఆదేశాలు, హెచ్చరికలు బేఖాతరు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వ బేతాళ కుట్ర ఇలా సాగుతోంది.పోలీసు శాఖలో చిరుద్యోగులపై కూడా థర్డ్ డిగ్రీ!చివరకు పోలీసు శాఖలోని కింది స్థాయి ఉద్యోగులను కూడా దర్యాప్తు పేరుతో వేధించి భౌతికంగా హింసించడం సిట్ దాష్టీకానికి నిదర్శనం. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఈ అక్రమ కేసులో ఇరికించాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశించారు. అందుకోసం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్ద గతంలో గన్మెన్గా పని చేసిన గిరి అనే ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) కానిస్టేబుల్ను కొన్ని రోజులపాటు సిట్ ఆఫీసులో నిర్బంధించారు. చెవిరెడ్డి భాస్కర్రెడ్డి చెబితే తాను నగదు తరలించే వాహనానికి భద్రత కోసం వెళ్లానని చెప్పాలని వేధించారు. ఆయన్ను కొట్టి మరీ ఒప్పించినట్టు తెలుస్తోంది. సిట్ అధికారులు చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించారని సమాచారం. అనంతరం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్ద గతంలో గన్మెన్గా చేసిన ఏఆర్ విభాగానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డిని సిట్ అధికారులు తిరుపతి నుంచి విజయవాడ తీసుకువచ్చారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని ఆయన్నూ వేధించారు. దాదాపు రూ.250 కోట్ల నగదును అక్రమంగా తరలించేందుకు తాను ఎస్కార్టుగా వెళ్లినట్టు వాంగ్మూలం ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి చేశారు. అబద్ధపు వాంగ్మూలం ఇచ్చేందుకు మదన్ రెడ్డి సమ్మతించకపోవడంతో సిట్ అధికారులు ఆయనపై పోలీసు మార్కు ప్రతాపం చూపించారు. ఆయన ముఖం, వీపుపై తీవ్రంగా కొట్టారు. అంటే పోలీసుకే పోలీసు మార్కు ట్రీట్మెంట్ రుచి చూపించారు. సిట్ అధికారులు కొట్టిన దెబ్బలకు తీవ్రంగా గాయపడిన మదన్రెడ్డి ఆసుపత్రిలో చేరారు. సిట్ అధికారులు కొట్టడంతో తనకు తగిలిన గాయాల ఫొటోలతో సహా ఆయన డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి, గవర్నర్లకు ఫిర్యాదు చేయడంతోపాటు పూర్తి ఆధారాలతోసహా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దాన్ని కోర్టు విచారణకు స్వీకరించి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.కోర్టును తప్పుదారి పట్టించే ఎత్తుగడఈ కేసులో మంగళవారం సాయంత్రం వరకు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఆయన స్నేహితుడు వెంకటేశ్ నాయుడులను సిట్ నిందితులుగా చేర్చనేలేదు. కానీ వారిపై గుట్టుచప్పుడు కాకుండా లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. నిందితులుగా చేర్చక పోయినా లుక్ అవుట్ నోటీసు జారీ చేయడం సిట్ బరితెగింపే. సొంత కంపెనీ పనిపై చెవిరెడ్డి మంగళవారం ఉదయం కొలంబో వెళ్లి.. తిరిగి బుధవారం సాయంత్రం వచ్చేలా ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ క్రమంలో తన స్నేహితుడితో కలిసి వెళ్లేందుకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, వెంకటేశ్ నాయుడులను అక్కడ అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాతే ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి (ఏ38), వెంకటేశ్ నాయుడు (ఏ34)తోపాటు మరో నలుగురిని నిందితులుగా చేరుస్తూ సిట్ అధికారులు న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు. అంటే బెంగళూరు విమానాశ్రయంలో వారిని అదుపులోకి తీసుకునే వరకు వారు ఈ కేసులో నిందితులే కారు. అయినా సరే వారిపై లుక్ అవుట్నోటీసు జారీ చేసి వారిని అడ్డుకోవడం కచ్చితంగా నిబంధనలకు విరుద్ధమే. ఇదిలా ఉండగా, తాను ఎప్పుడు పిలిచినా సిట్ విచారణకు రావడానికి సిద్ధమని ఇప్పటికే చెవిరెడ్డి పలుమార్లు ప్రకటించారు. తన కోసం చిన్న చిన్న ఉద్యోగులను ఇబ్బంది పెట్టొద్దని, వేధించొద్దని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. అయినా ఆయన ఎక్కడికో పారిపోతున్నట్లు సిట్ రహస్యంగా లుక్ అవుట్ నోటీసులిచ్చి అరెస్ట్ చేయడం చంద్రబాబు ప్రభుత్వ బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తోంది. బుధవారం వారిని బెంగళూరులోని న్యాయస్థానంలో హాజరుపరచి ట్రాన్సిట్ వారెంట్పై ఆంధ్రప్రదేశ్కు తరలించాలి. ఆ సమయంలో ఏ కేసులో వారు నిందితులుగా ఉన్నారని అక్కడి న్యాయస్థానం ప్రశ్నిస్తుంది. అందుకే సిట్ అధికారులు మంగళవారం మధ్యాహ్నం తర్వాత హడావుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడు పేర్లను నిందితులుగా చేరుస్తూ విజయవాడ కోర్టులో మెమో దాఖలు చేయడం గమనార్హం.బండారం బయట పడుతుందనే..రెడ్బుక్ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చెవిరెడ్డిని చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. ఎందుకంటే చంద్రగిరిలో ఆయన బలమైన రాజకీయ నేతగా ఉన్నారు. ఆ నియోజకవర్గం నుంచి 2014, 2019లో వరుసగా వైఎస్సార్సీపీ అభ్యర్థిగా 2సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం కూడా చంద్రగిరితోపాటు ఒంగోలు లోక్సభ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్గా ఉన్నారు. దాంతో చెవిరెడ్డిపై కూటమి ప్రభుత్వం రెడ్బుక్ కుట్రకు తెగబడింది. అందుకోసం తిరుపతి, చంద్రగిరిలో ఆయనపై అక్రమ కేసులు నమోదు చేయించేందుకు యత్నించారు. అక్రమంగా పోక్సో కేసు పెట్టారు. అందుకోసం నిరక్షరాస్యుడైన ఓ వ్యక్తితో ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించుకుని ఆయన ఫిర్యాదు చేసినట్టుగా అక్రమ కేసు నమోదు చేశారు. కానీ పోలీసుల కుట్ర తెలుసుకున్న ఆ వ్యక్తి కోర్టులో అసలు విషయం వెల్లడించారు. తాను చెవిరెడ్డి్డపై ఫిర్యాదు చేయలేదని, పోలీసులే తనతో ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించుకుని వారికి నచ్చినట్టుగా అబద్ధపు ఫిర్యాదు రాసుకున్నారని చెప్పడంతో పోలీసుల కుట్ర బెడిసి కొట్టింది. దీంతో ఆయనపై మద్యం అక్రమ కేసు నమోదు చేయాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశించారు. అందుకోసం ఆయన వద్ద గతంలో గన్మెన్గా పనిచేసిన గిరి, మదన్ రెడ్డి అనే ఏఆర్ కానిస్టేబుళ్లను వేధించి,హింసించి అబద్ధపు వాంగ్మూలం కోసం బలవంతం చేశారు. చెవిరెడ్డి స్నేహితుడు వెంకటేశ్ నాయుడు, ఆయన సతీమణిని సిట్ అధికారులు విచారణ పేరిట హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకువచ్చి అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని వేధించారు. తిరుపతికి చెందిన బాలాజీని వేధించి లొంగదీసుకునేందుకు యత్నించారు. తనను చిత్రహింసలకు గురి చేశారని ఏఆర్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో తమ కుట్ర పూర్తిగా బట్టబయలవుతుందని భావించిన సిట్ అధికారులు వెంటనే చెవిరెడ్డి అక్రమ అరెస్టుకు పావులు కదిపారు.మద్యం అక్రమ కేసులో చెవిరెడ్డిని ఇరికించేందుకే..గన్మెన్లను పిలిచి అబద్ధపు స్టేట్మెంట్ల కోసం చిత్రహింసలురాజకీయ కక్షసాధింపులకు పోలీసులను వాడుకుంటున్నారుతప్పుడు కేసులతో భయపెట్టాలనుకోవడం ప్రభుత్వ అవివేకంవైఎస్సార్సీపీ నాయకుడు చెవిరెడ్డి మోహిత్రెడ్డి ఆగ్రహంసాక్షి,అమరావతి/సాక్షి, టాస్క్ఫోర్స్: లిక్కర్ అక్రమ కేసులో కుట్రపూరితంగా చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని ఇరికించాలని కూటమి ప్రభుత్వం యత్నిస్తోందని వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి మోహిత్రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భాస్కర్రెడ్డి వద్ద గతంలో గన్మెన్లుగా పనిచేసిన గిరి, మదన్రెడ్డిలను సిట్ పోలీసులు విచారణ పేరుతో పిలిచి వ్యతిరేక స్టేట్మెంట్లు ఇవ్వాలని చిత్రహింసలకు గురి చేశారని విమర్శించారు. మదన్రెడ్డి ఆస్పత్రిపాలై చికిత్స పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను మోహిత్రెడ్డి ప్రదర్శించారు. మద్యం అక్రమ కేసులో చెవిరెడ్డికి సంబంధం ఉన్నట్టు అబద్ధపు స్టేట్మెంట్ ఇవ్వనందుకు మదన్రెడ్డిని దారుణంగా హింసించారని ధ్వజమెత్తారు. దీనిపై ఇప్పటికే ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని వెల్లడించారు. తనకు రక్షణ కల్పించాలంటూ ఓ హెడ్ కానిస్టేబుల్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారంటేనే సిట్ ఎంత దారుణంగా వ్యవహరిస్తుందో అర్థమవుతోందన్నారు. పోలీసులు చట్టపరిధిలో పనిచేయాలని, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడతారని హెచ్చరించారు.ఈ ప్రశ్నలకు బదులేదీ?మద్యం అక్రమ కేసులో ప్రతిపక్ష నేతలందరినీ ఇరికించడానికి సిట్ అనుసరిస్తున్న విధానం, అరెస్టు చేసిన వారిపై తెస్తున్న ఒత్తిడి, తప్పుడు స్టేట్మెంట్లకు వారు ఎంచుకున్న మార్గాన్ని నిలదీస్తూ మోహిత్రెడ్డి సోషల్ మీడియా వేదికగా ప్రశ్నావళిని సంధించారు. వీటికి నిజాయతీగా సమాధానం చెప్పగలరా? అని ప్రశ్నించారు.⇒ ఏడాదిగా విచారణ చేస్తున్న సిట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి రాజ్ కేసిరెడ్డి నుంచి డబ్బులు అందాయని గానీ, దానిని ప్రజలకు పంచారనిగానీ ఏనాడు ప్రస్తావించకుండా ఈ రోజే చెప్పడంలో అర్థం ఏమిటీ..? అది నిజం కాదు కనుకే కదా..? ⇒ 20 ఏళ్ల సర్వీసున్న హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని పణంగాబెట్టి పోలీసు అధికారులపై అబద్ధాలు చెప్పగలరా..? ఒక్క క్షణం అందరూ ఆలోచించండి.. అలాంటిది ఒక హెడ్ కానిస్టేబుల్ విచారణ సమయంలో తనకు జరిగిన అన్యాయం, తనపై జరిగిన దాడిని తన లేఖ ద్వారా డీజీపీకి విన్నవించుకోవడంపై అతను అబద్ధాలు చెబుతున్నారని అనడం సిట్ దిగజారుడుతనానికి నిదర్శనం కాదా?⇒ మదన్రెడ్డిని సిట్ కార్యాలయానికి పిలిపించి అతను చెప్పినట్టు స్టేట్మెంట్ రాయకుండా, సిట్ చెప్పినట్టు రాయాలని, చెప్పమన్నట్టు చెప్పాలని ఒత్తిడి చేయడం, తప్పుడు స్టేట్మెంట్పై సంతకం పెట్టాలని బలవంతం చేయడం వల్లే కదా అతడు చనిపోతానన్నది. కాదని చెప్పగలరా?⇒ ఒక హెడ్కానిస్టేబుల్ తనకంటే పైస్థాయి అధికారులు (సిట్ అధికారుల) ముందే విచారణ సమయంలో మీ అందరి పేర్లూ రాసి తాను చనిపోతాను అన్నాడంటే.. ఆ హెడ్ కానిస్టేబుల్ను సిట్ అధికారులు శారీరకంగా, మానసికంగా ఎంత చిత్రవధ చేసి ఉంటే అంత మాట అనగలడు. ఎవరైనా కాదని చెప్పగలరా?⇒ సిట్ విచారణకు వచ్చే వరు ఎంత నిజాయతీగా చెబుతున్నా.. ఎవరినో మెప్పించడానికి, తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించడానికి ప్రతిరోజు కుట్రలు, కుతంత్రాలు పన్నుతోంది సిట్ కాదా..?⇒ ‘‘సిట్ కార్యాలయంలో ఎంతో పారదర్శకంగా విచారణ జరుగుతోంది, ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరగలేదు. ఎవరినీ టార్చర్ చేయడం లేదు’’ అని సిట్లో పనిచేసే ఏ ఒక్క అధికారి అయినా భగవంతుని ముందు ప్రమాణం చేయగలరా? ⇒ సిట్ రాయమన్నట్టు రాసి, చెప్పమన్నట్టు కోర్టులో మెజిస్ట్రేట్కు చెప్పిన గిరి అనే కానిస్టేబుల్కు ఆగమేఘాలపై రాత్రికి రాత్రి ఇప్పుడు అతనికి వస్తున్న జీతానికి అదనంగా 60 శాతం పెంచి ఆక్టోపస్లో ఉద్యోగం ఇచ్చారంటేనే సిట్ అధికారుల నిజాయతీ, నిబద్ధత, పారదర్శకత ఏపాటిదో స్పష్టంగా అందరికీ తెలుస్తోంది కదా.. అది వాస్తవం కాదా?⇒ సిట్ తన పారదర్శకత, నిబద్ధతను నిరూపించుకోవడానికి మీలోనే ఒక పోలీసు అధికారితో విచారణ చేయిస్తే నిజాలు ఎలా బయటకు వస్తాయి? నిజాయతీ, నిబద్ధతలను నిరూపించుకోవాలంటే సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరపాలి. అలా చేయాలని సిట్ అధికారులు కోరగలరా..?⇒ సత్యమేవ జయతే.. అంటున్నారు.. నిజమే ఏదో ఒకరోజు తప్పకుండా సత్యమే జయిస్తుంది. ఆ రోజు తప్పు చేసిన సిట్ అధికారులందరికీ న్యాయస్థానం శిక్ష విధించి సత్యాన్ని, ధర్మాన్ని కాపాడుతుంది.. రాసి పెట్టుకోండి.. అంటూ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. -
ప్రత్యేక రైళ్లు పొడిగింపు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల డిమాండ్ మేరకు చర్లపల్లి–నర్సాపూర్, జాల్నా–తిరుపతి మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ పీఆర్వో నుస్రత్ మండ్రూప్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి–నర్సాపూర్ (07233) ప్రత్యేక రైలు జూలై 5 నుంచి వచ్చే ఏడాది మార్చి 28 వరకు ప్రతి శనివారం రాత్రి 7.50 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7 గం.లకు నర్సాపూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (07234) జూలై 6 నుంచి వచ్చే ఏడాది మార్చి 29 వరకు ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు నర్సాపూర్లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. రెండు మార్గాల్లో ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, వీరవాసరం, పాలకొల్లు స్టేషన్లలో ఆగుతుంది. ఇక జాల్నా–తిరుపతి (07609) రైలు జూలై 7 నుంచి వచ్చే ఏడాది మార్చి 30 వరకు ప్రతి సోమవారం ఉదయం 7 గంటలకు జాల్నాలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 10.45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (07610) జూలై 8 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3.15 గంటలకు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 3.50 గంటలకు జాల్నా చేరుకుంటుంది. ఈ రైలు బీదర్, మారపల్లి, వికారాబాద్, లింగంపల్లి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. -
మీ పాలనలో మహిళలకు లభిస్తున్న ఆత్మగౌరవం ఇదేనా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నారాయణపురం గ్రామంలో భర్త అప్పు చెల్లించలేదనే కారణంతో ఒక మహిళను టీడీపీ కార్యకర్త చెట్టుకు కట్టేసి హింసించిన ఘటనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో మహిళలకు లభిస్తున్న ఆత్మగౌరవం ఇదేనా.. అని ప్రశ్నించారు. చంద్రబాబు, ఆయన పార్టీ నాయకుల దుర్మార్గాలకు మహిళలు, యువతులు, బాలికలు బలైపోతున్నారని మండిపడ్డారు. మహిళను టీడీపీ కార్యకర్త చెట్టుకు కట్టేసి, హింసించిన ఫొటోను ట్యాగ్ చేస్తూ మంగళారం ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ‘చంద్రబాబూ.. రాష్ట్రంలో మహిళలకు మీరు కల్పిస్తున్న రక్షణ ఇదేనా? మీ పాలనలో మహిళలకు లభిస్తున్న ఆత్మ గౌరవం ఇదేనా? సాక్షాత్తు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని నారాయణపురం గ్రామంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి, హింసించిన ఘటన.. మీ దుర్మార్గపు పరిపాలన ఫలితమే. తిమ్మరాయప్ప అనే కూలీ అప్పు చెల్లించలేదనే కారణంతో అతని భార్య శిరీషను మీ పార్టీ కార్యకర్త చెట్టుకు కట్టేసి, హింసించాడు. ఆమె బిడ్డలు రోదిస్తున్నా సరే కనికరం చూపి విడిచి పెట్టలేదు. మీ హయాంలో జరిగిన అనేక క్రూరమైన ఘటనల్లో ఇదొకటి. పొలిటికల్ గవర్నెన్స్, రెడ్బుక్ పేరిట మీరు నెలకొల్పిన దుష్ట సంప్రదాయంలో భాగంగా మీరు, మీ పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగిపోయి చేస్తున్న దుర్మార్గాలకు మహిళలు, యువతులు, బాలికలు ఇలా ఎందరో బలైపోతున్నారు. ఈ ఘటనతోపాటు, ఏడాది కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరిగిన అన్యాయాలు, అఘాయిత్యాలను సీరియస్గా తీసుకోవాలని, చట్ట ప్రకారం కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాను’ అని ఆ పోస్ట్లో పేర్కొన్నారు. -
సుప్రీంకోర్టు చెప్పినా సిట్కు లెక్కే లేదా?
సాక్షి, అమరావతి: చంద్రబాబు కుట్రలో భాగంగా ఏర్పడిన సిట్ రాజ్యాంగేతర శక్తిగా చెలరేగిపోతోంది. రెడ్బుక్ కుట్రలో భాగంగా అక్రమ అరెస్ట్లు, దర్యాప్తు ముసుగులో వేధింపులు, చిత్రహింసలకు బరితెగిస్తోంది. సిట్ అరాచకం ఎంతగా సాగుతోందంటే సాక్షాత్తు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలు, హెచ్చరికలను నిర్భీతిగా ఉల్లంఘిస్తూ దాష్టీకానికి పాల్పడుతోంది. ఇదే అక్రమ కేసులో నిందితులుగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎ.ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ గోవిందప్ప దాఖలు చేసిన పిటిషన్ను విచారిస్తూ సుప్రీంకోర్టు విస్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు, విచారణ పేరిట ఈ కేసులో సాక్షులు, నిందితులను ఏ విధంగానూ వేధించకూడదని.. వారిని శారీరకంగా హింసించ కూడదని స్పష్టం చేసింది. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని కూడా హెచ్చరించింది. అంతేకాదు ఆధారాలు లేకుండా అరెస్టు చేయకూడదని పేర్కొంది. కేసు పెట్టాం కాబట్టి అరెస్టు చేసి తీరాలన్న ఆలోచన ఏమాత్రం సరైంది కాదని కూడా విస్పష్టంగా తేల్చి చెప్పింది. అది పౌరుడి గౌరవ ప్రతిష్టలకు సంబంధించిన వ్యవహారమని కూడా వ్యాఖ్యానించింది. అందుకు విరుద్ధంగా రాజకీయ దురుద్దేశాలతో వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని సిట్ అధికారులను సుప్రీంకోర్టు హెచ్చరించింది.మా పని మాది..సుప్రీంకోర్టు ఆదేశాలను తామేమాత్రం పట్టించుకోబోమని సిట్ చీఫ్ ఎస్వీ రాజశేఖర్బాబు, ఆయన బృందం తమ చేతల ద్వారా తేల్చి చెప్పారు. ఇప్పటికే ఎంతో మంది సాక్షులను వేధించి, హింసించిన సిట్ అధికారులు తాజాగా తమ పోలీసు శాఖకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లపై ఏకంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించి మరీ చిత్రహింసలకు గురి చేయడం విభ్రాంతి కలిగిస్తోంది. అంతే కాకుండా చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అక్రమ అరెస్ట్ వ్యవహారంలో కూడా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించింది. ఆయనకు వ్యతిరేకంగా సిట్ ఎలాంటి ఆధారాలు ఇప్పటి వరకు చూపించనే లేదు. ఆయనకు నోటీసు ఇచ్చి విచారణకు పిలవనే లేదు. మంగవారం మధ్యాహ్నం వరకు ఆయన పేరును ఎఫ్ఐఆర్లో కూడా చేర్చనే లేదు. అయినా సరే మంగళవారం ఉదయం ఆయన్ను అక్రమంగా అరెస్ట్ చేసి.. సీఎం చంద్రబాబు కుట్రలకు సిట్ వత్తాసు పలికింది. కేవలం రాజకీయ దురుద్దేశాలతోనే చెవిరెడ్డిని అరెస్ట్ చేసినట్లుగా స్పష్టమవుతోంది. అంటే సుప్రీంకోర్టు ఆదేశాలంటే తమకు ఏమాత్రం లెక్కలేదని, ప్రభుత్వ పెద్దల రాజకీయ కుట్రలకు వత్తాసు పలికి.. వేధింపులు, కక్ష సాధింపులకు పాల్పడటమే తమ ఏకైక లక్ష్యమని సీనియర్ ఐపీఎస్ అధికారి ఎస్వీ రాజశేఖర్బాబు, ఆయన బృందం స్పష్టం చేస్తోంది. -
డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలకు మంగళం?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్య గందరగోళంలో పడింది. ప్రభుత్వ నిర్లక్ష్య విధానం విద్యార్థులను మానసికంగా కుంగదీస్తోంది. తాజాగా సంప్రదాయ డిగ్రీ విద్యలో ఆన్లైన్లో ప్రవేశాలకు మంగళం పలికేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది. దీనికోసమే... 2 వారాల కిందట ఉన్నత విద్యా మండలి ఆన్లైన్ ప్రవేశాల్లో సాంకేతిక తోడ్పాటు కోసం వివిధ సంస్థల నుంచి ఫైనల్ బిడ్లను ఓపెన్ చేస్తే వాటిని నిలిపేసింది. ఏ నిర్ణయాన్ని ప్రకటించకుండా ప్రవేశాలను గాల్లో పెట్టింది. ఇదంతా పారదర్శక ఆన్లైన్ విధానాన్ని ఎత్తేసి మాన్యువల్గా ప్రవేశాలు చేపట్టే ఉద్దేశంగా కనిపిస్తోంది. అదే జరిగితే డిగ్రీ ప్రవేశాల్లో భారీ అవకతవకలు చోటుచేసుకునే ప్రమాదం ఉంది. కళాశాలలు అక్రమ మార్గాల్లో ప్రవేశాలు చేపట్టే అవకాశం ఉంది. గత ప్రభుత్వం ఇలాంటి అక్రమ మార్గాలకు అడ్డుకట్ట వేసేందుకే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని తీసుకొచ్చింది. కూటమి సర్కారు కమీషన్ల కక్కుర్తి, ప్రజాధనాన్ని కాజేసే ఉద్దేశంతో దానికి మంగళం పాడుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిగ్రీపై తలో మాట.. కూటమి ప్రభుత్వంలో డిగ్రీ విద్యలో తలో మాట వినిపిస్తోంది. ఎన్నికల సమయంలో, అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులను ఒక నిర్దిష్ట సబ్జెక్టులో నిపుణుడిగా తీర్చిదిద్దే సింగిల్ మేజర్ను కాదని డ్యుయల్ మేజర్ పద్ధతిని తీసుకొస్తామని ప్రకటించింది. దీన్ని విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఉభయ సభల్లో పదేపదే ప్రస్తావించారు. ఈ తరుణంలో ఉన్నత విద్యా మండలి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి సింగిల్ మేజర్లో స్వల్ప మార్పులు చేస్తూ డ్యుయల్ మేజర్లోని క్రెడిట్లు, కోర్సులు, సబ్జెక్టుల వారీగా వివరాలను వెల్లడించింది. నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీనికి 1,500కు పైగా కళాశాలలు అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకున్నాయి. డ్యుయల్ మేజర్పై ప్రభుత్వం సందేహాలు వ్యక్తం చేస్తూ నోట్ అడగడంతో ఉన్నత విద్యా మండలి సమాచారం అందించింది. కానీ, ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తోంది. ఫలితంగా విద్యా సంవత్సరం ప్రారంభమైనా కళాశాలలకు అనుమతుల మంజూరు నిలిచిపోయింది. ఉత్సవ విగ్రహంలా ఉన్నత విద్యా మండలి విద్యా సంబంధ విషయాల్లో ఉన్నత విద్యా మండలి, వర్సిటీలదే కీలక పాత్ర. గతంలో ఎన్నడూ ప్రభుత్వాలు జోక్యం చేసుకున్న దాఖలాలు లేవు. కూటమి సర్కారు పాలనలో వ్యవస్థల్లో మితిమీరిన రాజకీయ, అధికార జోక్యం కారణంగా విద్యా రంగం కుంటుపడుతోంది. ప్రస్తుతం విద్యా సంవత్సరం ప్రారంభమైంది. డిగ్రీ తొలి ఏడాది ప్రవేశాలు ముగిశాక జూలై చివరి, ఆగస్టు తొలి వారంలో తరగతుల నిర్వహణకు తేదీలు ఖరారు చేస్తారు. కానీ, ప్రవేశాల విధానంపై ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడం, డిగ్రీలో ఏ విధానాన్ని కొనసాగిస్తారో స్పష్టం చేయకపోవడంతో మొత్తం గందరగోళంగా తయారైంది. » నెల రోజుల వ్యవధిలో 1,500కుపైగా కళాశాలల వివరాలను పరిశీలించి అనుమతులు ఇవ్వడం, కొత్త కోర్సుల కరిక్యులమ్ సిద్ధం చేయడం వంటి ప్రక్రియలు ఎలా సాధ్యమని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.ఓఎస్డీనే... షాడో మంత్రి!విద్యాశాఖ వ్యవహారాలు మంత్రి లోకేశ్ కంటే ఆయనకు షాడోగా వ్యవహరిస్తున్న ఓఎస్డీ ఆకుల వెంకటరమణకే బాగా తెలుసని బహిరంగంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి లోకేశ్ అవగాహన రాహిత్యం అనేక సార్లు బయటపడింది. మరోవైపు ఎవరైనా విద్యా వ్యవస్థలో తమ సమస్యలు చెప్పుకునేందుకు మంత్రి అపాయింట్మెంట్ కూడా దొరకని పరిస్థితి. ఎంతటి వారైనా ఓఎస్డీని కలవాల్సిందే.. వినతి పత్రాలు ఆయనకే ఇవ్వాల్సిందే. కాలేజీల అసోసియేషన్లు సైతం మంత్రి దర్శనం లేక ఎన్నో సార్లు సచివాలయం చూట్టూ ప్రదక్షిణలు చేసి వెళ్లిపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఓఎస్డీ ఉన్నత విద్యలో నిర్ణయాల అమలును శాసించే స్థాయికి వచ్చేశారు. గతంలో రాష్ట్ర నిఘా విభాగం (ఇంటెలిజెన్స్) సైతం సదరు ఓఎస్డీ పని చేసిన ప్రదేశాల్లో అవినీతిలో మునిగితేలారని, డబ్బుల వసూళ్లలో తలపండిపోయినట్టు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అయినప్పటికీ మంత్రి సదరు ఓఎస్డీని కొనసాగిస్తుండటం వెనుక పెద్ద మర్మమే ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల విద్యాశాఖలో అత్యంత పాదర్శకంగా జరిగాయని చెప్పుకుంటున్న బదిలీల్లోనూ చక్రం తిప్పినట్టు వినికిడి. » ఓఎస్డీ కొందరు అధికారులతో కలిసి ఉన్నత విద్యామండలి అధికారాలకు కత్తెర వేసేందుకు ప్లాన్ వేసినట్టు సమాచారం. ఉన్నత విద్యా మండలిని అకడమిక్ వ్యవహారాలకే పరిమితం చేసి, ప్రవేశాల నిర్వహణ, కళాశాలలకు అనుమతుల జారీ అంశాలను తమ చేతుల్లో పెట్టుకుని భారీగా దండుకునేందుకు ఎత్తుగడ వేశారు. అందుకే విద్యా సంబంధ విషయాల్లో మండలి భాగస్వామ్యాన్ని తగ్గిస్తూ.. దాని ప్రతిపాదనలకు పదేపదే మోకాలొడ్డుతూ వచ్చారు. కీలక విద్యా సంబంధ కార్యక్రమాలకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ను ఆహ్వానించడమే మానేశారు. గతంలో ఇదే ప్రభుత్వం ఎన్ఐటీకి చెందిన విద్యావేత్తను ఉన్నత విద్యా మండలికి చైర్మన్గా నియమించామని గొప్పలు చెప్పుకొంది. తీరాచూస్తే మండలి, ప్రభుత్వానికి సమన్వయం లోపించింది. దీంతో విద్యా వ్యవస్థ దిగజారుతోంది. తన శాఖలో ఇంత జరుగుతుంటే మంత్రికి కనీసం చీమకుట్టినట్టు కూడా లేకపోవడం గమనార్హం! -
సిట్ అధికారులకు మోహిత్ రెడ్డి బహిరంగ లేఖ
తాడేపల్లి : నిబద్ధత, నిజాయితీ, పారదర్వకత అంటూ లేఖ రాసిన సిట్ అధికారులు తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? అంటూ ప్రశ్నించారు చెవిరెడ్డి మోహిత్రెడ్డి. ఈ మేరకు సిట్ అధికారులు బహిరంగ లేఖ రాశారు. ఒక్క ఏడాది కాలంగా విచారణ చేస్తున్న సిట్ అధికారులు.. ఈ 365 రోజుల్లో ఏ రోజు కూడా చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి రాజ్ కసిరెడ్డి నుంచి డబ్బులు అందాయని కానీ ప్రజలకు పంచారని కానీ ఏనాడు ప్రస్తావించకుండా ఈ రోజు చెప్పడంలో అర్థమేంటి?, అది నిజం కాదు కనకే కదా? అని లేఖ ద్వారా ప్రశ్నించారు. ఇంకో 20 సంవత్సరాలు సర్వీసున్న హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని పణంగా పెట్టి.. పోలీస్ అధికారులపై అబద్ధాలు చెప్పగలరా?, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పదేళ్లు గన్మెన్గా పనిచేసిన మదన్రెడ్డిని సిట్ కార్యాలయంకు పిలిపించి విచారణ సమయంలో అతను చెప్పినట్టు స్టేట్మెంట్ రాయకుండా, సిట్ అధికారులు చెప్పినట్టు చెప్పాలని ఒత్తిడి చేయడం, తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని హింసించడం వల్లనే కదా.. అతను చనిపోతాను అన్నది’ అని మోహిత్ రెడ్డి నిలదీశారు.ఒక హెడ్కానిస్టేబుల్ తనకంటే పై స్థాయి అధికారులు (సిట్ అధికారుల) ముందే విచారణ సమయంలో మీ అందరి పేర్లు రాసి తాను చనిపోతాను అన్నాడంటే.. ఆ హెడ్ కానిస్టేబుల్ను సిట్ అధికారులు శారీరకంగా, మానసికంగా ఎంత చిత్రవధ చేసి వుంటే అంత మాట అనగలడు. అందరూ ఆలోచించాలి’ అని అన్నారు.తప్పుడు స్టేట్మెంట్లు కోసం కుట్రలు పన్నుతుంది మీరే కదా?, అంతా పారదర్శకంగానే జరుగుతుందని దేవుడు ముందు ప్రమాణం చేయగలరా?,నిజంగానే సిట్ అధికారులకు నిబద్ధత ఉంటే సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయించాలని కోరే దమ్ముందా?, తప్పకుండా ఏదో ఒక రోజు సత్యమేవ జయతే అవుతుంది. ఆ రోజు తప్పు చేసిన సిట్ అధికారులందరికీ దేవుడు, న్యాయస్థానాలు శిక్ష విధిస్తాయి’ అని మోహిత్రెడ్డి లేఖ ద్వారా స్పష్టం చేశారు. -
అటు సుందర ‘కొల్లేరు’.. ఇటు కాలుష్యంతో కన్నీరు
సాక్షి, అమరావతి: దేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు సమస్యను లోతుగా అధ్యయనం చేస్తే ఓ వైపు సుందర కొల్లేరు.. మరోవైపు కలుషిత కన్నీరు సాక్షాత్కరిస్తాయి. పర్యావరణపరంగా చిత్తడి నేల వ్యవస్థగా, వలస పక్షుల కేంద్రంగా, జీవ వైవిధ్యానికి నిలయంగా అంతర్జాతీయ గుర్తింపు కలిగిన కొల్లేరు పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల నడుమ విస్తరించింది. ఒకనాడు కొల్లేరు ప్రజల బతుకుదెరువు కోసమే ప్రభుత్వం బలవంతంగా చెరువులు తవ్వించి చేపలు సాగుచేయిస్తే.. అవే ఇప్పుడు కొల్లేరుకు ముప్పుగా పరిణమించాయి. నేడు చేపల చెరువులను నిర్మూలించే స్థాయికి పరిస్థితి వచ్చింది.ఎందుకంటే.. కొల్లేరులో దాదాపు 60 శాతం చేపల చెరువులే ఉండడంతో పర్యావరణ సమస్య తలెత్తిందని నిపుణులు చెబుతున్నారు. ఇదే విషయమై అనేకమార్లు పర్యావరణవేత్తలు కోర్టు తలుపులు తట్టడంతో కొల్లేరు పరిరక్షణ అనేది ప్రధాన అజెండాగా తెరమీదకు వస్తోంది. దీంతో అక్కడి ప్రజల మనుగడ కోసం మళ్లీ రోడ్డెక్కి పోరాటాలకు సిద్ధమయ్యే పరిస్థితికి దారితీస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు దాదాçపు ఏడు కమిటీలు కొల్లేరు సమస్యపై అధ్యయనం చేసి నివేదికలు ఇచ్చినా పరిస్థితి ఏమాత్రం మారలేదు.కొల్లేరు అభయారణ్యంపై సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారంటూ కాకినాడకు చెందిన పర్యావరణవేత్త మృత్యుంజయరావు తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఆక్రమణలు తొలగించి మూడునెలల్లో హద్దులు నిర్ణయించాలని న్యాయస్థానం ఆదేశించింది. ‘సుప్రీం’ ఆదేశాలతో ఐదుగురు సభ్యులతో కూడిన కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ) మంగళ, బుధ వారాల్లో రెండ్రోజులపాటు కొల్లేరులో పర్యటించి అక్కడి స్థితిగతులను అధ్యయనం చేయనుంది.ఇప్పటివరకు కమిటీలు ఏం చెప్పాయంటే.. కొల్లేరు సరస్సు సంరక్షణ, పర్యావరణం, జీవవైవిధ్యం, స్థానిక సమాజాల జీవనోపాధులకు సంబంధించిన అనేక సమస్యలను పరిష్కరించడానికి సుప్రీంకోర్టు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో అనేక కమిటీలను ఏర్పాటుచేశాయి. ఈ కమిటీలు పలు సిఫార్సులు చేశాయి. బొంబాయి నేచురల్ హిస్టరీ సొసైటీ (బీఎన్హెచ్ఎస్) కమిటీ, సుప్రీంకోర్టు నియమించిన సాధికార కమిటీ, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీలు కీలక అంశాలపైనివేదికలు ఇచ్చాయి. అవేమిటంటే..⇒ కొల్లేరు సరస్సులో చుట్టూ అక్రమ చెరువులను (ఆక్వాకల్చర్) నియంత్రించాలి.. ⇒ సరస్సు సహజ నీటి ప్రవాహాన్ని పునరుద్ధరించాలి..⇒ పక్షుల సంరక్షణకు కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం సామర్థ్యాన్ని పెంచాలి..⇒ స్థానిక మత్స్యకారులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలను అందించాలి.ఇక రాష్ట్ర ప్రభుత్వం 1982లో కొల్లేరు సరస్సు అభివృద్ధి కమిటీ ఏర్పాటుచేసినప్పటికీ కాలుష్య నియంత్రణలో ఇప్పటికీ ఫలితాలు రాబట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో.. తాజాగా మంగళ, బుధవారాల్లో కేంద్ర సాధికార కమిటీ పర్యటనపై స్థానికంగా ఆసక్తి నెలకొంది. -
ఎంబీబీఎస్ కటాఫ్పై ఉత్కంఠ
సాక్షి, అమరావతి: జాతీయ స్థాయిలో 2025–26 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ–2025 ఫలితాలు చర్చోపచర్చలకు దారితీశాయి. జాతీయ స్థాయి ర్యాంక్ల ఆధారంగా ఎంబీబీఎస్ సీట్లు ఏ మేరకు వస్తాయన్న అంచనాలు వేసుకోవడంలో విద్యార్థులు, తల్లిదండ్రులు తలమునకలయ్యారు. ఈసారి రాష్ట్రం నుంచి 57,934 మంది పరీక్ష రాయగా 36,776 మంది అర్హత సాధించారు. గతేడాదితో పోలిస్తే ఈ దఫా జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో నీట్ రాసిన, అర్హత సాధించిన విద్యార్థుల సంఖ్య తగ్గింది. అదే విధంగా పేపర్ ఎంతో కఠినంగా ఉండటంతో గతేడాదికి పూర్తి భిన్నమైన ఫలితాలు వెలువడ్డాయి. తక్కువ మార్కులు వచ్చినప్పటికీ మంచి ర్యాంక్లు దక్కాయి. దీంతో ఎంబీబీఎస్ అడ్మిషన్లలో కటాఫ్ మార్కులు బాగా తగ్గుతాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. గతేడాది ఏయూ రీజియన్లో ఓపెన్ కేటగిరిలో 601 మార్కులతో 75,427 ర్యాంక్ (నేషనల్) సాధించిన విద్యార్థికి ప్రభుత్వ (కన్వీనర్) కోటా చివరి సీటు దక్కింది. బీసీ, మైనార్టీల్లో 482 స్కోర్ వచ్చిన విద్యార్థుల వరకు సీట్లు వచ్చాయి. ఎస్వీయూ రీజియన్లో జనరల్ కేటగిరిలో 583 స్కోర్తో 93,186 ర్యాంకర్కు, బీసీల్లో 502 స్కోర్తో 2,01,883 ర్యాంకర్కు, ఎస్సీల్లో 500 స్కోర్తో 2,05,164, ఎస్టీల్లో 458 స్కోర్తో 2,69,020 ర్యాంక్ సాధించిన విద్యార్థులకు మెడిసిన్ సీటు వచ్చింది. గత ఏడాది ఉన్న సీట్లలోనే.. రాష్ట్రంలో 2025–26 విద్యా సంవత్సరంలో కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించడం లేదని కూటమి ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వ పరిధిలో ఒక్క సీటు పెరిగే అవకాశం లేదు. ఇక ప్రైవేట్లో కొత్త కళాశాలలు, సీట్ల పెరుగుదల లేదని తెలుస్తోంది. దీంతో 2024–25 విద్యా సంవత్సరంలో అందుబాటులో ఉన్న 6,510 సీట్లలోనే 2025–26 విద్యా సంవత్సరంలోనూ అడ్మిషన్లు చేపట్టనున్నారు. ప్రస్తుత నీట్ ఫలితాల సరళి, ఆల్ ఇండియా ర్యాంక్ల సరళిని ఓసారి గమనిస్తే.. నీట్ 2024లో టాప్ 100లోపు విద్యార్థులు 715–720 మధ్య స్కోర్ చేశారు. ఏకంగా 80,117 మంది విద్యార్థులు దేశ వ్యాప్తంగా 600పైబడి స్కోర్ చేశారు. ఈసారి జాతీయ స్థాయిలో టాప్ స్కోర్ 686 దగ్గరే ఆగిపోయింది. 651 నుంచి 686 మధ్య 73 మంది, 601–650 మధ్య 1259 మంది, 551–600 మధ్య 10,658 మంది చొప్పున విద్యార్థులు నిలిచారు. ఈసారి టాప్ స్కోరర్ల సంఖ్య గణనీయంగా పడిపోయింది. 400 నుంచి 500 మధ్య ఎక్కువ మంది స్కోర్ చేశారు. దీంతో 2025–26 ఎంబీబీఎస్ అడ్మిషన్లలో కటాఫ్లు 100 మార్కులకు పైబడి దిగిరానున్నాయి. ఇదిలా ఉండగా నీట్ అర్హత సాధించిన రాష్ట్ర విద్యార్థుల సమాచారం ఎన్టీఏ నుంచి ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఇంకా అందాల్సి ఉంది. ఎన్టీఏ నుంచి పిలుపు వస్తే విశ్వవిద్యాలయం ప్రతినిధి ఢిల్లీకి వెళ్లి నీట్ అర్హుల సమాచారాన్ని తీసుకురానున్నారు. ఇందుకు వారం రోజులు సమయం పట్టనుంది. కన్వీనర్ కోటాలో 4,046 సీట్లు ప్రస్తుతం రాష్ట్రంలో 18 ప్రభుత్వ, 18 ప్రైవేట్ వైద్య కళాశాలలు ఉన్నాయి. 2024–25 సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం ఈ కళాశాలల్లో 6,510 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 475 సీట్లు ఆల్ ఇండియా కోటా కింద భర్తీ అవుతాయి. మిగిలిన సీట్లలో 4046 రాష్ట్ర స్థాయిలో కన్వీనర్ కోటాలోకి, 1,989 సీట్లు యాజమాన్య (బీ, సీ) కోటాలోకి వస్తాయి. ఇక బీడీఎస్లో ప్రభుత్వ, ప్రైవేట్లో కలిపి 1,540 సీట్లుండగా, ఆల్ ఇండియా కోటాలో 21, రాష్ట్ర కన్వీనర్ కోటాలో 818, యాజమాన్య కోటాలో 700 సీట్లు భర్తీ చేస్తారు. -
పేరుకు వందనం.. భారీ కోతలతో బంధనం
ఏ నెలా 100 యూనిట్లు దాటలేదు నేను, నా భర్త కూలి పనులు చేసుకుంటూ చిన్న ఇంట్లో జీవిస్తున్నాం. మాకు ఇద్దరు పిల్లలు. ఒకరు ఎనిమిది, మరొకరు ఇంటర్ చదువుతున్నారు. తల్లికి వందనం డబ్బులొస్తే ఫీజుల అవసరం తీరుతుందనుకున్నా. నాకు డబ్బులు పడలేదు. సచివాలయానికి వెళ్తే 300 యూనిట్లు దాటి కరెంటు వాడటం వల్ల డబ్బులు రాలేదని చెప్పారు. మాకు ఎప్పుడూ కనీసం 100 యూనిట్లు కూడా రాలేదు. అలాంటిది 300 యూనిట్లని ఎలా చెప్పారంటూ సచివాలయ సిబ్బందిని అడిగాం. తామేమీ చేయలేమంటున్నారు. గత ప్రభుత్వంలో క్రమం తప్పకుండా అమ్మ ఒడి తీసుకున్నాను. – ఆరుగుల అరుణ, భీమవరపుకోట, కాకినాడ జిల్లా‘తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు చొప్పున ఇస్తాం. మీ ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ ఇస్తాం. ఒకరుంటే రూ.15 వేలు.. ఇద్దరుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు, నలుగురుంటే రూ.60 వేలు ఇస్తాం. ఇప్పుడున్న సంక్షేమ పథకాలు ఏ ఒక్కటీ ఆపేది లేదు.. అన్నీ కొనసాగిస్తాం.. జగన్ ప్రభుత్వం అమ్మ ఒడి పథకాన్ని సక్రమంగా అమలు చేయలేదు.. మేము అలా కాదు.. అందరికీ రూ.15 వేల చొప్పున ఇస్తాం.. నిబంధనలను సాకుగా చూపి ఎవరికీ ఎగ్గొట్టం’ అని ఎన్నికల ముందు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్ అండ్ కో ఊరూరా ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక ఆ మేరకు అమలు చేయలేక అంకెల గారడీ చేస్తున్నారు. కొంత మందికి మాత్రమే ఇచ్చి.. అందరికీ ఇచ్చినట్లు కనికట్టు చేస్తున్నారు. నిజంగా అందరికీ ఇచ్చి ఉంటే ఊరూరా మహిళలు ఎందుకు ఆందోళనలు చేస్తున్నట్లు? స్కూళ్ల చుట్టూ, సచివాలయాల చుట్టూ, విద్యుత్ ఆఫీసుల చుట్టూ ఎందుకు ప్రదక్షిణలు చేస్తున్నట్లు? సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పేరుతో కనికట్టు చేస్తోంది. కొంత మందిని మాత్రమే అర్హుల జాబితాలో ప్రకటించి.. మిగతా తల్లులందరికీ పంగనామాలు పెట్టింది. అర్హుల జాబితాతోనే 30 లక్షల మందికి పైగా ఎగ్టొట్టిన సర్కారు.. తను చెప్పుకుంటున్నట్లు 54 లక్షల మందిలో సగానికి సగం తెగ్గోయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు కరెంట్ బిల్లును, ఇతర నిబంధనలను ఆయుధంగా ఎంచుకుంది. నెలలో 300 యూనిట్లకు మించి వాడారంటూ ఏకపక్షంగా నిర్ణయించి అనర్హత వేటు వేసింది. ప్రతి నెలా సగటున 300 యూనిట్లకు మించి వినియోగించక పోయినా, వినియోగించినట్లు నెపం మోపి పథకాన్ని కట్ చేసింది. పలు జిల్లాల్లో ఏకంగా స్కూళ్లకు స్కూళ్లనే జాబితా నుంచి ఎత్తేసింది. రోజుకు రూ.233 వేతనంతో పని చేసే అంగన్వాడీ ఆయాల పట్ల కూడా ప్రభుత్వ ఉద్యోగులంటూ కనికరం లేకుండా వ్యవహరించింది. చంద్రబాబు కూటమి ప్రభుత్వ మోసంపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు భగ్గుమంటున్నారు. ఏడాది విద్యుత్ బిల్లులను నెలవారీగా లెక్క తీసినా 300 యూనిట్లలోపు వచ్చిన వారిని కూడా అనర్హుల జాబితాలో చేర్చడంపై తల్లులు మండిపడుతున్నారు. ఇదేం అన్యాయమంటూ సోమవారం విద్యుత్ కార్యాలయాలకు పోటెత్తారు. కాకినాడ జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంతో పాటు పెద్దాపురం నియోజకవర్గంలో సైతం తల్లులు ఆగ్రహంతో విద్యుత్ కార్యాలయాల వద్ద పెద్ద సంఖ్యలో బారులు తీరారు. అవాస్తవ కారణాలతో అనర్హులుగా తేల్చి, పలువురిని తల్లికి వందనానికి దూరం చేశారు. ప్రభుత్వ పథకాలు అమలు చేయాలంటూ అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల నిరసన సంఖ్యను కుదించేందుకే ఇలా.. కొందరి పేరున అసలు విద్యుత్ మీటర్లే లేవు. మరికొందరి పేరున 4 నుంచి 10, 15 విద్యుత్ మీటర్లు ఉన్నట్లు రికార్డయ్యాయి. వాటిని చూపి తల్లికి వందనం లేకుండా చేశారని పలువురు తల్లులు విద్యుత్ అధికారుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఒకే మీటర్ ఉన్నప్పటికీ, తమ పేరిట ఇన్ని మీటర్లు ఎలా ఉంటాయని నిలదీశారు. తల్లికి వందనం లబ్ధిదారుల సంఖ్యను కుదించేందుకే ప్రభుత్వం ఇలా చేసి ఉంటుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం, సామర్లకోట, తుని, కాకినాడ, తిరుపతి, కడప, కర్నూలు, నంద్యాల, అనంతరం, నెల్లూరు, ఒంగోలు తదితర ప్రాంతాల్లోని సబ్ స్టేషన్ల వద్ద తల్లులు స్టేట్మెంట్ల కోసం బారులు తీరి కనిపించారు. అయితే ఏడాది స్టేట్మెంట్ కావాలని అధికారులు కోరుతుండగా, విద్యుత్ అధికారులు మాత్రం ఆరు నెలల స్టేట్మెంట్ మాత్రమే ఇస్తామని చెబుతున్నారు. కేంద్ర స్కూళ్లపై కోపమా?తిరుపతి జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం పరిధిలో పీఎం శ్రీ పాఠశాలలు 2, రేణిగుంటలో 1, ఏర్పేడు ఐఐటీలో 1, వెంకటగిరిలో 1 మొత్తం 5 పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో 30 వేలకు పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇదే విధంగా రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో సైతం సెంట్రల్ స్కూల్స్ నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలల్లో ఒక్క విద్యారికీ తల్లికి వందనం ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఎన్నికల సమయంలో కూటమి మేనిఫెస్టోను బీజేపీ నేతలు పట్టుకోలేదని ఇలా కక్ష సాధిస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తిరుపతి జిల్లా తిక్కవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 310 మంది విద్యార్థులు ఉండగా, వారిలో ఒక్కరికి కూడా తల్లికి వందనం నగదు బదిలీ కాలేదు. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పిటికాయగుళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 134 మంది విద్యార్థులు ఉన్నారు. అర్హుల జాబితాలో ఒక్కరి పేరు కూడా లేదు. పిఠాపురం సబ్ స్టేషన్ వద్ద స్టేట్మెంట్ల కోసం గుమిగూడిన ప్రజలు అన్ని జిల్లాల్లోనూ ఇదే తీరు⇒ తమకు తల్లికి వందనం వర్తింపజేయాలని కోరుతూ సోమవారం వైఎస్సార్ కడప జిల్లాలో కేంద్రీయ విద్యాలయ విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టరేట్ గ్రీవెన్స్సెల్కు పెద్ద ఎత్తున తరలివచ్చారు. విద్యార్థులందరూ స్థానికులేనని, ఒక్కరికీ కూడా పథకం వర్తింప చేయలేదని కలెక్టర్ కి విన్నవించారు. ⇒ నంద్యాల జిల్లా గడివేముల మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 355 మందిలో ఏ ఒక్క విద్యార్థికి తల్లికి వందనం వర్తించకపోవడం చర్చనీయాంశంగా మారింది. విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్ఎం విక్టర్ ఇమ్మానియల్ను నిలదీశారు. తమకు తెయదని, పైనుండి జాబితాలు వచ్చాయన్నారు. ⇒ చిత్తూరు జిల్లాలోని అంగన్వాడీ ఆయమ్మకు రూ.7 వేలు, కార్యకర్తకు రూ.11,500 జీతం చెల్లిస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా చెప్పడానికి టీడీపీ కూటమికి సిగ్గులేదా అని అంగన్వాడీ సంఘం జిల్లా నేతలు లలిత, షకీలా ప్రశ్నించారు. ఈ మేరకు ఆ సంఘ నాయకులు చిత్తూరు కలెక్టరేట్ వద్ద సోమవారం పెద్ద ఎత్తున ధర్నా చేపట్టి ఇన్చార్జి కలెక్టర్ విద్యాధరికి వినతిపత్రం అందజేశారు. ⇒ అంగన్వాడీ కేంద్రాల్లో పని చేసే ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ వర్తింపేయాలని ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ) నగర కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఐఎఫ్టీయూ నగర కమిటీ ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉద్యోగులు తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి ఆర్డీఓకు అందజేశారు. ⇒ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, అప్కాస్ ఉద్యోగులందరికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని అప్కాస్ రాష్ట్ర అధ్యక్షుడు జి.చిన్నబాబు తెలిపారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎస్.జయచంద్ర, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కె.సుమన్లతో కలిసి సోమవారం తిరుపతి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.25 వేలు కంటే తక్కువ జీతం పొందే ఉద్యోగులందరికీ అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం నాయకులు ప్రకటించారని, అయితే నేడు చిరుద్యోగులకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయకపోవడంపై తీవ్ర నిరాశకు లోనవుతున్నారని తెలిపారు. ⇒ ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న స్వచ్ఛ భారత్ మండల కో–ఆర్డినేటర్ల పిల్లలకు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం వర్తింపజేయక పోవడం తగదని యూనియన్ నాయకుడు చల్లా కామేశ్వరరావు అన్నారు. పథకం వర్తింపజేయాలని కోరుతూ సోమవారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్కు వినతిపత్రం అందజేశారు. తమకు కటింగ్స్ పోను రూ.11,342 మాత్రమే వేతనం ఇస్తున్నారని, అది కూడా ఆరేడు నెలలకు చెల్లిస్తున్నారని చెప్పారు. ⇒ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు చిరుద్యోగులమైన తమకు కూడా అమలుచేయాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు సోమవారం అనకాపల్లి కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు.ఇద్దరు పిల్లలైతే.. 66 మందిగా నమోదు.. ప్యాపిలి: నంద్యాల జిల్లా ప్యాపిలి పట్టణానికి చెందిన దాసరి శోభకు ఇద్దరు పిల్లలు. వీరికి తల్లికి వందనం కింద రూ.26 వేలు జమ కావాల్సి ఉంది. అయితే ఆమెకు 66 మంది పిల్లలు ఉన్నట్లు జాబితాలో నమోదు చేశారు. ఈ నిర్లక్ష్యంతో శోభకు తల్లికి వందనం వర్తించలేదు. దీంతో కంగుతిన్న ఆమె గత రెండు రోజులుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. శోభ తన ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ పుస్తకం తీసుకుని సోమవారం ఎంఈఓ కార్యాలయం, స్టేట్ బ్యాంకు అధికారులను సంప్రదించింది. వివరాలను పరిశీలించిన ఎంఈవో వెంకటేశ్ నాయక్.. జరిగిన పొరపాటును సరిదిద్దుతామన్నారు. కూటమి ప్రభుత్వం మోసం చేసింది మా పిల్లలు ముగ్గురు స్థానిక జెడ్పీ పాఠశాలలో చదువుతున్నారు. మాకు ఎలాంటి పొలాలు లేవు. కరెంటు బిల్లు చాలా తక్కువ. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. జాబితాలో మా పిల్లల పేర్లు చూపడం లేదు. సిబ్బందిని అడిగితే ఏమీ తెలియదంటున్నారు. కూటమి ప్రభుత్వం తల్లితండ్రులను మోసం చేస్తోంది. ఎన్నికలప్పుడు చెప్పిందొకటి, ఇప్పుడు చేస్తున్నది మరొకటి. – సాల్మన్, గడివేముల, నంద్యాల జిల్లాఒక్క నెలలో 300 యూనిట్లొస్తే ఆపేస్తారా? తాపీ మే్రస్తిగా పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. మాకు ఇల్లు తప్ప వేరే ఆస్తులేవీ లేవు. మా కుమార్తె మాధవి అనంత భార్గవి 7, కుమారుడు జశ్వీర్ 5 తరగతులు చదువుతున్నారు. గత ప్రభుత్వంలో అమ్మ ఒడితో ఏటా రూ.15 వేలు బ్యాంక్ అకౌంట్లో జమ చేసేవారు. తల్లికి వందనం పేరిట ఒక్కొక్కరికి రూ.15 వేలు వేస్తామని చంద్రబాబు చెబితే సంతోషించాం. మే నెల కరెంట్ బిల్లు 300 యూనిట్లు దాటిందని తల్లికి వందనం తీసేశారు. ఇలా ఒక్క నెలనే పరిగణనలోకి తీసుకుంటే ఎలా? – నున్న ఉమావాణి శ్రీదేవి, భీమశంకరం, కరప, కాకినాడ జిల్లాకావాలనే ఇలా చేశారు మా పెద్దమ్మాయి లక్ష్మి పదో తరగతి పూర్తి అయ్యింది. రెండో కుమార్తె వసంత 8వ తరగతిలోకి వెళ్తోంది. మూడో కుమార్తె గంగోత్రి ఆరో తరగతిలోకి వెళ్తోంది. కుమారుడు విజయ్కుమార్ నాలుగో తరగతిలోకి ప్రవేశిస్తున్నాడు. నలుగురు పిల్లల్లో ఒక్కరికి కూడా తల్లికి వందనం పథకం డబ్బులు రాలేదు. గత ప్రభుత్వంలో డబ్బులు పొందాను. సచివాలయం అధికారులను అడిగితే మీరు ఇన్ ఎలిజిబుల్ లిస్టులో ఉన్నారని చెబుతున్నారు. మాకు మెట్ట భూమి పది ఎకరాల్లోపే ఉన్నప్పటికీ అదే సాకుతో పథకం ఆపేశారు. ఎందుకిలా కావాలనే చేశారో అర్థం కావడం లేదు. – ఉలిగమ్మ, బిలేహాల్ గ్రామం, హాలహర్వి మండలం, కర్నూలు జిల్లా ఈ నెల బిల్లు 68 యూనిట్లు వచ్చింది మే నెలకు సంబంధించి మాకు కరెంట్ బిల్లు 68 యూనిట్లు వచ్చింది. వేడి మండిపోయే మే నెలలోనే 68 యూనిట్లు వస్తే తక్కిన సమయంలో ఎన్ని యూనిట్లు వస్తాయి? అటువంటిది 300 యూనిట్లు దాటిందని తల్లికి వందనం పథకంలో అనర్హులుగా పేర్కొనడం అన్యాయం కాదా? మాలాంటి వారికి కూడా పథకాన్ని సక్రమంగా అమలు చేయకపోతే ఎలా? – వేల్పుల మరియమ్మ, సీఎం కాలనీ, కుక్కునూరు, ఏలూరు జిల్లాఇల్లే లేదు.. ఏడు కనెక్షన్లట మాకు 10, 8 తరగతులు చదివే ఇద్దరు కొడుకులు ఉన్నారు. గత ప్రభుత్వంలో అమ్మ ఒడి పథకం ద్వారా నగదు అందింది. ఇప్పుడు తల్లికి వందనం పథకం కింద అర్హులం కాదని చెప్పారు. ఎందుకో తెలుసుకోవడానికి సచివాలయంలో వెళ్లి అడిగాము. నా పేరుతో ఏడు విద్యుత్ కనెక్షన్లు నమోదై ఉన్నాయని సిబ్బంది తెలిపారు. సొంత ఇల్లే లేని నాకు ఏడు విద్యుత్ కనెక్షన్లు ఎక్కడివని ప్రశ్నించగా విద్యుత్ కార్యాలయంలో సంప్రదించాలని సిబ్బంది చెప్పారు. – బైసాని సత్యనారాయణ, ఆత్మకూరు, నెల్లూరు జిల్లా ఇడ్లీ పిండి అమ్ముకునే మాకూ ఎగ్గొట్టారు..మా అమ్మాయి లేఖన ప్రస్తుతం 6వ తరగతి చదువుతోంది. గతంలో అమ్మ ఒడి డబ్బులు సక్రమంగా పడ్డాయి. ఇప్పుడు తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు అందుతాయని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మాకు ఆ డబ్బులు జమ కాలేదు. విషయం ఏమిటా అని ఆరా తీస్తే అద్దె ఇంటిలో ఉంటూ ఇడ్లీ పిండి అమ్ముకుంటూ జీవనం సాగించే మాకు ఏడు కరెంటు మీటర్లు ఉన్నాయని చెప్పారు. ఇలా అసంబద్ధమైన కారణాలు చూపి అనర్హులమనడం సరికాదు. – దాసిరెడ్డి నాగజ్యోతి, నరసాపురం, పశ్చిమగోదావరి జిల్లా -
రేపు రెంటపాళ్లకి వైఎస్ జగన్
సాక్షి,అమరావతి: కూటమి ప్రభుత్వం వేధింపులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడిన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల ఉపసర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని ఈనెల 18న మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించనున్నట్లు మాజీ మంత్రి, ఆ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు వెల్లడించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెంటపాళ్లలో ఏర్పాటు చేసిన నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని కూడా వైఎస్ జగన్ ఆవిష్కరిస్తారని తెలిపారు.వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. శాంతిభద్రతల పేరుతో పోలీసుల ద్వారా వైఎస్ జగన్ పర్యటనపై ఆంక్షలు విధించేందుకు సిద్ధమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘వైఎస్ జగన్ చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నా కూడా ఈ ప్రభుత్వం జీరి్ణంచుకోలేకపోతోంది.అసలు వైఎస్ జగన్ ఇంటి గడప దాటి బయట కాలు పెడితేనే చంద్రబాబు, లోకేశ్కి వణుకు పుడుతోంది. నిద్ర పట్టడం లేదు. పొగాకు రైతులను పరామర్శించడానికి పొదిలి వెళితే అలజడి సృష్టించడానికి కొంతమంది మహిళలను అడ్డుపెట్టుకుని రాళ్ల దాడికి దిగారు. మా కార్యకర్తలు, అమాయక రైతుల మీద టీడీపీ గూండాలతో దాడులు చేయించారు. తిరిగి మా నాయకులపైనే అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేశారు’ అని చెప్పారు. పర్యటనను అడ్డుకోవాలని చూస్తే ఊరుకోం ‘ఇటీవలే వ్యాపారి గుత్తా లక్ష్మీనారాయణ పోలీసుల వేధింపులు భరించలేక విషం తాగి ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్నారు. పోలీసుల వేధింపులు తట్టుకోలేక మా నాయకులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతుంటే వారికి భరోసా ఇచ్చేందుకు వైఎస్ జగన్ వెళ్తున్నారు. ఆయన వెళ్లి పరామర్శిస్తే కూటమి దుశ్చర్యలు ప్రపంచానికి తెలిసిపోతాయనే భయంతో వైఎస్ జగన్ పర్యటనలపై ఆంక్షలు విధించి అడ్డుకోవాలని చూస్తున్నారు.ఇది అప్రజాస్వామికం. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు చంద్రబాబు, లోకేశ్ కుట్రలు పన్నుతున్నారు. పర్యటనలను అడ్డుకోవాలని చూస్తే సహించబోం. ప్రతిపక్ష నేత పర్యటనలను అడ్డుకోవడం, అలజడి సృష్టించేందుకు యతి్నంచడం కూటమి ప్రభుత్వానికే మంచిది కాదు.’’ అని అంబటి హితవు పలికారు. -
నియోజకవర్గాల పునర్విభజనకు లైన్క్లియర్!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్థానాలు 175 నుంచి 225కు.. తెలంగాణ శాసనసభ స్థానాలు 119 నుంచి 134కు పెంపునకు మార్గం సుగమమైంది. దేశంలో జన గణన చేపట్టడానికి అనుమతిస్తూ సోమవారం కేంద్రం గెజిట్ నోటీఫికేషన్ జారీ చేసింది. జన గణన వచ్చే ఏడాది పూర్తి కానుంది. కొత్త జనాభా లెక్కల ఆధారంగా దేశ వ్యాప్తంగా లోక్సభ స్థానాలు.. శాసనసభ స్థానాల పునర్విభజన ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టనుంది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో శాసనసభ స్థానాలను పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టనుంది.రాష్ట్ర విభజన జరిగిన 11 ఏళ్ల తర్వాత రెండు రాష్ట్రాల శాసన సభల్లో స్థానాల పెంపునకు లైన్ క్లియర్ కావడం గమనార్హం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తూ 2014, మార్చి 1న ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014ను కేంద్రం జారీ చేసింది. దీంతో 2014, జూన్ 2న తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించింది. రాజ్యాంగంలోని 170వ అధికరణలోని సెక్షన్–15 ప్రకారం శాసనసభ స్థానాలను ఆంధ్రప్రదేశ్లో 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 134కు పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని విభజన చట్టం–2014లో సెక్షన్–26(1) ద్వారా ఎన్నికల సంఘానికి కేంద్రం నిర్దేశించింది. విభజన చట్టం ప్రకారం 2019 నాటికే రెండు రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలను పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ఎన్నికల సంఘం, కేంద్రం పూర్తి చేస్తాయని రాజకీయపార్టీలు ఆశిస్తూ వచ్చాయి. కానీ.. ఆ ఆశలు అడియాసలయ్యాయి. జన గణనతో ముడిపెట్టిన కేంద్రం జమ్మూ కశ్మిర్లో శాసనసభ స్థానాల పునర్విభజనకు 2022, మే 5న కమిషన్ను ఏర్పాటుచేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనూ శాసనసభ స్థానాలను పెంచేలా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీం కోర్టులో కె.పురుషోత్తం రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు.జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో శాసనసభ స్థానాలను పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడంపై కేంద్రం అభిప్రాయాన్ని సుప్రీం కోర్టు కోరింది. దేశంలో జన గణన ప్రక్రియ 2026లో పూర్తవుతుందని.. ఆ తర్వాతే విభజన చట్టంలో సెక్షన్–26(1) ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో శాసనసభ స్థానాల పెంపునకు నియోజకవర్గాల పునర్విభజన చేపడతామని స్పష్టం చేస్తూ అడిషనల్ సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు. ఈ పిటిషన్పై తీర్పును ఏప్రిల్ 30న సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం రిజర్వు చేసింది.ప్రజల సౌకర్యం.. పాలన సౌలభ్యమే ప్రాతిపదికగా:జన గణన ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్న అంశం ఏపీ విభజన చట్టంలో ఎక్కడా లేదు. ప్రజల సౌకర్యం, పాలన సౌలభ్యం, భౌగోళికంగా సమస్యలు తలెత్తకుండా శాసనసభ స్థానాలను పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని మాత్రమే ఎన్నికల సంఘానికి విభజన చట్టం నిర్దేశించింది. కానీ.. కేంద్రం జన గణనతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో శాసనసభ స్థానాల పునర్విభజనను ముడిపెట్టడం గమనార్హం.వాస్తవానికి జన గణన 2020లో ప్రారంభమై 2021 నాటికి పూర్తి కావాలి. కానీ.. 2020 ఫిబ్రవరి నుంచి 2022 వరకూ కరోనా మహమ్మారి మూడు విడతలుగా దేశ వ్యాప్తంగా ప్రబలింది. దీంతో జన గణనను అప్పట్లో కేంద్రం వాయిదా వేసింది. అంతలోనే 2024 సార్వత్రిక ఎన్నికలు ముంచుకు రావడంతో ఆ అంశం మరుగున పడింది. -
జననేత పర్యటనకు ఆంక్షల అడ్డంకులు
సాక్షి, నరసరావుపేట: గతంలో ఏ ప్రతిపక్ష నేతకూ లేని నిబంధనలు తెరపైకి.. ఏదో ఒకవిధంగా పర్యటనను అడ్డుకునే ప్రయత్నాలు.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి పర్యటనను అడ్డుకునే కుట్రతో కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోంది. ఈ నెల 18న సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. నిరుడు సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డ వైఎస్సార్సీపీ నేత, రెంటపాళ్ల గ్రామ ఉప సర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. పోలీసులు, కూటమి నేతల వేధింపులు తాళలేక నాగమల్లేశ్వరరావు పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు.ఫలితాలు వెలువడిన జూన్ 4, మరుసటి రోజు పోలీసులు ఆయనను స్టేషన్లో కూర్చోబెట్టారు. ఫలితాలు వచ్చిన రోజు సాయంత్రం కూటమి పార్టీల కార్యకర్తలు.. నాగమల్లేశ్వరరావు ఇంటిపై రాళ్లు రువ్వారు. ఆ విషయం చెప్పడానికి కూతురుతో మాట్లాడుతుండగా సెల్ఫోన్ లాక్కున్నారు. రెంటపాళ్లలో అడుగుపెడితే కేసులు నమోదు చేస్తామని బెదిరించారు. ఓవైపు పోలీసులు, మరోవైపు కూటమి నేతల తీరుతో మనస్తాపం చెందిన నాగమల్లేశ్వరరావు జూన్ 6న ఆత్మహత్య చేసుకున్నారు.ఆ కుటుంబాన్ని పరామర్శించి, వారు ఏర్పాటు చేసుకున్న విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఈ నెల 18న మాజీ సీఎం వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన ఖరారైంది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా దీనికి అనుమతివ్వలేమని, తాము చెప్పిన ఆంక్షల మేరకైతేనే అనుమతిస్తామని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. భద్రతా కారణాలు చూపుతూ గతంలో ఏ ప్రతిపక్ష నేత పర్యటనకు లేని ఆంక్షలను పోలీసులు ప్రస్తుతం విధిస్తున్నారు. ప్రజాభిమానాన్ని కొలిచేది ఎలా..? ఈ నెల 18న రెంటపాళ్లలో వైఎస్ జగన్ పర్యటనకు అనుమతివ్వాలంటూ సత్తెనపల్లి వైఎస్సార్సీపీ ఇన్చార్జి డాక్టర్ గజ్జెల సు«దీర్ భార్గవ్రెడ్డి సత్తెనపల్లి డీఎస్పీకి దరఖాస్తు చేశారు. దీనిపై పోలీసులు ముప్పుతిప్పలు పెడుతున్నారు. భారీగా జనం తరలివస్తారని నివేదికలు ఉన్నాయని.. కార్యక్రమానికి ఎంతమంది హాజరవుతారు? పాల్గొనే వాహనాల సంఖ్య ఎంత? స్పష్టం చేయాలని అడుగుతున్నారు. వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికి తప్ప.. ఈ కార్యక్రమానికి పార్టీ తరఫున జన సమీకరణ లేదు. అయితే, వైఎస్ జగన్ వస్తున్నారంటే అభిమానులు భారీగా తరలివస్తారు. ఆ అభిమానాన్ని నిర్వాహకులు ఎలా లెక్కకట్టి చెప్పగలరు. కానీ, ఎన్నడూ లేని విధంగా పోలీసులు ఈ కారణాలతో వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల తెనాలి, రాప్తాడు, పొదిలిలో వైఎస్ జగన్ పర్యటనకు ప్రజల నుంచి విశేషణ స్పందన వచి్చంది. ఏడాదిలోనే ప్రభుత్వ వ్యతిరేకత తారస్థాయికి చేరిందని వీటి ద్వారా తేలింది. అందుకనే కూటమి నేతలు కుట్రలకు తెరతీస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.పోలీసులు చెబుతున్నట్లుగా మూడు కార్లు, వందమందితో పర్యటన ఎలాగని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రాజధానిపై టీవీలో ప్రసారమైన వ్యతిరేక వ్యాఖ్యల నేపథ్యంలో పెద్దఎత్తున మహిళలు రోడ్ షోను అడ్డుకునే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. వారిని సాకుగా చూపుతూ పర్యటన అనుమతికి ముడిపెట్టారు. అనుమతుల విషయంలో గందరగోళం సృష్టించడం, పాల్గొంటే కేసులు పెడతారన్న భయం కలిగించి.. వచ్చే అభిమానుల సంఖ్యను తగ్గించే కుట్రలకు తెరలేపిందని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.18న వైఎస్ జగన్ పర్యటనకు అనుమతి లేదు పల్నాడు జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు వెల్లడి నరసరావుపేట రూరల్: మాజీ సీఎం వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటనకు అనుమతి నిరాకరించినట్టు పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. తన కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 18న వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన అనుమతి కోసం సత్తెనపల్లి వైఎస్సార్సీపీ ఇన్చార్జి డాక్టర్ గజ్జల సు«దీర్భార్గవ్రెడ్డి దరఖాస్తు చేశారని, అందులో పూర్తి వివరాలు లేకపోవడంతో అదనపు సమాచారం ఇవ్వాలని కోరినట్లు పేర్కొన్నారు. నిబంధనల వలన దరఖాస్తును తిరస్కరిస్తున్నట్లు తెలిపారు.సుదీర్భార్గవ్రెడ్డి కోరిన విధంగా కార్యక్రమ నిర్వహణకు అనుమతివ్వడం లేదని తెలిపారు. కాగా, ఇటీవల వైఎస్ జగన్ పర్యటనలకు భారీ ఎత్తున ప్రజలు హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా పర్యటనకు కూడా వేలాది మంది తరలివస్తారని ఇంటెలిజెన్స్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఎలాగైన జగన్ పర్యటనను అడ్డుకోవాలనే కుట్రతోనే రకరకాల నిబంధనల పేరుతో ప్రభుత్వం అనుమతిని నిరాకరించిందని జనంలో చర్చ జరుగుతోంది. -
చెల్లని చెక్కులు పంచిన మంత్రి లోకేష్!
సాక్షి, పార్వతీపురం మన్యం జిల్లా: షైనింగ్ స్టార్స్ పేరిట కూటమి ప్రభుత్వం పంచుతున్న చెక్ల విషయంలో దారుణం జరిగింది. స్వయంగా విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) పంచిన చెక్కులు చెల్లకుండా పోయాయి. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురై అధికారులను ఆరాలు తీశారు. వివరాల్లోకి వెళ్తే.. పదవ తరగతి, ఇంటర్మీడియట్లో అత్యుత్తమ మార్కులు సాధించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం షైనింగ్ స్టార్స్(Shinig Stars Cheques) పేరుతో అవార్డులను ప్రదానం చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే.. వారం కిందట పార్వతీపురంలో 90 మంది ప్రతిభా వంతులైన విద్యార్థులకు స్వయంగా మంత్రి లోకేష్ రూ.20 వేల విలువైన చెక్లు అందించారు. అయితే ఆ చెక్లను బ్యాంక్లు వెనక్కి తిప్పి పంపించాయి. దీంతో ఆందోళన చెందిన విద్యార్థులు విద్యా శాఖ కార్యాయాల వద్దకు చేరి ఆరాలు తీశారు. అయితే ఆ చెక్లపై ఉన్న డీఈవో, ఎంఈవోల సంతకాలు సరిపోలేదని చెబుతూ బ్యాంకులు తిప్పి పంపినట్లు తేలింది. దీంతో మంత్రి లోకేష్ చేతుల మీదుగా జరిగిన వ్యవహారం కావడంతో అధికారులు గుట్టుచప్పుడు కాకుండా ఆ చెల్లని చెక్లు తీసుకుని విద్యార్థులను వెనక్కి పంపించేశారు. త్వరలోనే చెల్లే చెక్కులు పంపిణీ చేస్తామని వాళ్లకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఎక్కడి వారు అక్కడే గప్చుప్! -
ఎక్కడి వారు అక్కడే గప్చుప్!
సాక్షి, అమరావతి: పదో తరగతి పరీక్షల నిర్వహణలో ఘోరంగా విఫలమైన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు ఉపాధ్యాయుల బదిలీల్లోనూ దారుణంగా ఫెయిలైంది. వేల మంది స్కూల్ అసిస్టెంట్లను సర్ప్లస్గా చూపి సీనియర్లను కూడా మోడల్ స్కూల్ ప్రైమరీ హెచ్ఎంలుగా పంపింది. అయితే, వారు ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలల్లో రిలీవర్లు లేక ఎక్కడ పనిచేస్తున్న వారు అక్కడే ఉండాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో 9,600 మంది పీఎస్ హెచ్ఎంల్లో దాదాపు 90 శాతం మంది తిరిగి బదిలీ అయిన స్థానంలో రిపోర్టు చేసి, పాత స్కూళ్లల్లోనే స్కూల్ అసిస్టెంట్లుగా విధులు నిర్వర్తించే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం పాఠశాలల్లో ప్రవేశాలు జరుగుతున్నాయి. మరోపక్క ఆయా స్కూళ్లలో పలు అంశాలపై విద్యాశాఖ అడిగే సమాచారాన్ని అందించాలి. వాటి పర్యవేక్షణ పూర్తిగా ప్రాధానోపాధ్యాయులు మాత్రమే చూడాలి. కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారో తెలియని పరిస్థితి నెలకొంది. కేటగిరీ–3, 4 పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మెరుగైన స్టేషన్ పాయింట్లతో ప్రస్తుత బదిలీల్లో కేటగిరీ 1, 2 స్కూళ్లకు (పట్టణ, మండల కేంద్రాలు) బదిలీ అయ్యారు. అయితే, వారు పనిచేస్తున్న పోస్టుల్లో కొత్తవారు లేకపోవడంతో పాత పోస్టుల్లోనే కొనసాగాల్సి వస్తోందని వాపోతున్నారు.ఎంపీఎస్లపై దృష్టి పెట్టి హైస్కూళ్లు నిర్లక్ష్యంఈ ఏడాది రాష్ట్రంలో కొత్తగా మోడల్ స్కూళ్లను ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. వీటిలో పీఎస్ హెచ్ఎంతో పాటు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను నియమిస్తున్నట్టు చెప్పారు. అందుకు తగ్గట్టుగా 9,600 ప్రాథమిక పాఠశాలలను మోడల్ ప్రైమరీ స్కూళ్లుగా ప్రకటించారు. పాఠశాల విద్యాశాఖ వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి, వీటిలో తప్పనిసరిగా హెచ్ఎం పోస్టు ఉండాలని ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లుగా ఉన్న స్కూల్ అసిస్టెంట్లను మిగులు (సర్ప్లస్) చూపించి వారినే నియమించింది. అలాగే, ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో ఎస్జీటీలకు పదోన్నతులిచ్చి భర్తీ చేస్తామని ప్రకటించింది. కానీ, ఎస్ఏ ఖాళీలు భారీగా ఉంటే అరకొరగా ఎస్జీటీలకు పదోన్నతులిచ్చింది. దాంతో ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లు కరవయ్యారు. ఇప్పుడు చేసేది లేక పీఎస్ హెచ్ఎంలుగా వెళ్లిన స్కూల్ అసిస్టెంట్లను కొత్త పోస్టులో చేరాక.. తిరిగి పాత పోస్టుల్లోనే కొనసాగాలని ఆదేశించింది. ఇలా ఎంత కాలం పనిచేయాల్సి వస్తుందో తెలియదని, హెచ్ఎంగా వెళ్లామన్న సంతృప్తి లేకుండా పోయిందని బదిలీ అయిన ఉపాధ్యాయులు అంటున్నారు. ఇక కేటగిరీ–3, 4 పాఠశాలల్లో పనిచేస్తూ బదిలీపై కేటగిరీ 1, 2 స్కూళ్లకు వచ్చినా తిరిగి మారుమూల పాత స్కూళ్లలోనే ఉండిపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 90 శాతం మంది పాత పోస్టుల్లోనే..పాఠశాల విద్యాశాఖ ప్రస్తుత బదిలీల్లో దాదాపు 40 వేల మంది టీచర్లను బదిలీ చేసింది. వీరిలో హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు, భాషా పండితులు ఉన్నారు. 9,600 మోడల్ ప్రైమరీ స్కూళ్లలో 4,706 పీఎస్ హెచ్ఎం పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్లను నియమించారు. మిగిలిన చోట గతంలో పదోన్నతిపై వచ్చిన ఎస్జీటీలను హెచ్ఎంలుగా నియమించారు. అయితే, ప్రస్తుతం ఎస్ఏల పోస్టుల్లో ఎస్జీటీలకు పదోన్నతులిచ్చి నియమించాల్సి ఉన్నా.. చాలా తక్కువ మందికే అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో ఉన్నత పాఠశాలలను నిర్లక్ష్యం చేయడంతో లెక్కతప్పి హైస్కూళ్లల్లో సిబ్బంది తగ్గిపోయారు. దీంతో పీఎస్ హెచ్ఎంలుగా వెళ్లిన వారు జిల్లాను బట్టి 70 నుంచి దాదాపు 90 శాతం మంది పాత పోస్టులోనే కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాకినాడ జిల్లాలో మిగులుగా గుర్తించిన స్కూల్ అసిస్టెంట్లను పీఎస్ హెచ్ఎంలుగా పంపించారు. వందల్లో ఖాళీ అయిన పోస్టుల్లో పదుల సంఖ్యలో ఎస్జీటీలకు పదోన్నతులిచ్చి భర్తీ చేశారు. సోషల్ సబ్జెక్టులో 135 పోస్టుల్లో కేవలం 15 పోస్టులనే ఎస్జీటీలకు ప్రమోషన్లు ఇచ్చారు. మిగిలిన 120 పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. అలాగే, ఫిజికల్ సైన్స్లో 89 ఖాళీల్లో 9 మాత్రమే భర్తీ చేశారు, మ్యాథ్స్లో 126 ఖాళీలకు గాను 12, బయాలజీలో 136 పోస్టులు చూపి 16 పోస్టులను మాత్రమే ఎస్జీటీలను పదోన్నతిపై భర్తీ చేశారు. మిగిలిన పోస్టుల్లోని ఎస్ఏలు బదిలీ అయినా రిలీవర్లు లేక ఆయా పోస్టుల్లో కొనసాగుతున్నారు. అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. వీరు ఇలా ఎంత కాలం అదే పోస్టులో కొనసాగాల్సి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. -
బకాయిల మోత.. విద్యార్థులకు వాత
ఉన్నత చదువుల కోసం, ఆరోగ్యం కోసం పేదలు అప్పులపాలు కాకూడదనే గత ప్రభుత్వ స్ఫూర్తికి కూటమి సర్కారు గండికొట్టింది. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకంతో ఇటు విద్యార్థులు–తల్లిదండ్రులతో పాటు అటు కళాశాలల యాజమాన్యాలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. నాణ్యమైన విద్య మిథ్యగా మారిపోయింది. ఈ పరిణామాలన్నీ రాష్ట్రంలో పూర్తిగా దిగజారిన విద్యా రంగ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్య పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. విద్యార్థులతో పాటు కళాశాలల యాజమాన్యాల దుస్థితి దినదిన గండంగా తయారైంది. ‘ఫీజు రీయింబర్స్మెంట్’ బకాయిలు కొండలా పేరుకు పోవడంతో కళాశాలల మనుగడ, విద్యార్థుల భవిష్యత్తు పెను ప్రమాదంలో పడింది. ప్రభుత్వం సకాలంలో ‘ఫీజు’ చెల్లింపులు చేయక పోవడం యావత్ కళాశాలల ఉనికికే ప్రశ్నార్థకమైంది. రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలల్లో దాదాపు రూ.4,200 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్, రూ.2,200 కోట్లు హాస్టల్ మెయింటెనెన్స్ చార్జీలు (వసతి దీవెన).. మొత్తంగా రూ.6,400 కోట్లు పెండింగ్ పెట్టింది. వాస్తవానికి అధిక శాతం కళాశాలలు విద్యార్థుల ఫీజులపైనే ఆధారపడి నిర్వహణను చేపట్టడంతో తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయాయి. అధ్యాపకులకు, బోధనేతర సిబ్బందికి జీతాలు చెల్లించలేక కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ పరిణామాల ఫలితంగా విద్యార్థులకు నాణ్యమైన బోధన లభించడం లేదు. అధునాతన సాంకేతిక మార్పులకు అనుగుణంగా కళాశాలలు అప్గ్రేడ్ అవలేక మూస పద్ధతిలోనే కొనసాగడంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కళాశాల యాజమాన్యాలు ఉన్నప్పుడు నైపుణ్యం కలిగిన సిబ్బంది ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారిస్తున్నారు. అరకొర సిబ్బందితో బోధనను సాగించాల్సిన దయనీయ పరిస్థితి నెలకొనడంతో విద్యార్థులకు కోలుకోలేని నష్టం కలుగుతోంది. విద్యార్థులకు హాస్టల్ మెయింటెనెన్స్ కింద అందించే మొత్తాన్ని కూడా నిలిపి వేయడంతో పేదింటి బిడ్డలకు ఉన్నత విద్య భారంగా మారింది. గతంలో వసతి దీవెన కింద ఈ మొత్తాన్ని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వేసినప్పుడు కళాశాలల హాస్టల్లో విద్యార్థులు సకాలంలో చెల్లింపులు చేసేవారు. ఆ విధంగానూ కళాశాలలు ఆర్థికంగా బలంగా ఉండేవి. ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ఉన్నత విద్యను భ్రష్టు పట్టించింది. ఫీజు రీయింబర్స్మెంట్ వ్యవస్థను తీవ్రంగా నాశనం చేసింది. విద్యార్థులు హాయిగా కళాశాలలకు వెళ్లి చదువుకునే వాతావరణాన్ని దెబ్బ తీసింది. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలకు సైతం కంటిమీద కునుకు లేకుండా ఆర్థిక కష్టాల్లోకి నెట్టేసింది. విద్యా సంవత్సరం ముగిసినా ఇప్పటికీ ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులు చేయక పోవడంతో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నిసార్లు ప్రభుత్వానికి, అధికారులకు విజ్ఞప్తులు చేసినా ఫలితం శూన్యమేనని మండి పడుతున్నాయి. ప్రభుత్వం స్పందించి వెంటనే ఫీజు బకాయిలు విడుదల చేయని పక్షంలో ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతున్నాయి. త్వరలో కోర్టులోనే తేల్చుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ పూర్తిగా దిగజారిన విద్యా రంగ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. వాస్తవానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రైవేటు కళాశాలల మనుగడను దృష్టిలో పెట్టుకుని ‘క్వార్టర్’ (మూడు నెలలు) ప్రాతిపదికన ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలయ్యేలా షెడ్యూల్ను అమలు చేసింది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా చెల్లింపులు చేయడంతో పారదర్శకతతో పాటు యాజమాన్యాల నుంచి జవాబుదారీ తనాన్ని ప్రోత్సహించింది. కానీ, కూటమి ప్రభుత్వం క్వార్టర్ను కాస్తా.. ఆరు నెలలకు ఒకసారికి మార్చింది. తల్లుల ఖాతాల్లోకి బదులు కళాశాలలకు నేరుగా ఫీజులు చెల్లిస్తామని చెప్పింది. కానీ, విద్యా సంవత్సరం ముగిసినప్పటికీ ఫీజులు చెల్లించక పోవడంతో ప్రైవేటు కళాశాలల నిర్వహణ దెబ్బతిని ఉన్నత విద్య ప్రమాదంలో పడుతోంది.గాడి తప్పిన షెడ్యూల్ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను అమలు చేసిన చరిత్ర దేశంలో వైఎస్ జగన్కే దక్కుతుంది. అంతకు ముందు వరకు ప్రభుత్వం నుంచి అరకొర చెల్లింపులు ఉండటంతో పేదింటి బిడ్డలు ఉన్నత చదువుల కోసం తీవ్ర అవస్థలు పడ్డారు. కానీ, 2019 తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఐదేళ్లు ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగిన చదువులు ఏడాదిగా కుదుపులకు గురవుతున్నాయి. విద్యార్థుల చదువులను బాధ్యతగా తీసుకోవాల్సిన కూటమి ప్రభుత్వం రాజకీయ ధోరణితో అంధకారంలోకి నెడుతోంది. 2024 మార్చి వరకు షెడ్యూల్ ప్రకారం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నిధులు విడుదలయ్యాయి. ఆ వెంటనే ఎన్నికల నియమావళి అమలులోకి రావడంతో విద్యార్థులకు క్రమం తప్పకుండా చెల్లించే ఫీజులను కూటమి నాయకులు కుట్రలతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా ఫీజుల చెల్లింపుల షెడ్యూల్ విధానాన్ని నాశనం చేసింది. ఈ క్రమంలో 2024 ఏప్రిల్ నుంచి ఇప్పటిదాక మొత్తంగా ఆరు త్రైమాసికాల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు, ఏప్రిల్–మేలో ఇవ్వాల్సిన వసతి దీవెన (హాస్టల్ మెయింటెనెన్స్ చార్జీలు) నిధులను విస్మరించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడింది. ఈ ఏడాదీ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఫలితంగా లక్షలాది మంది పేదింటి విద్యార్థుల కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. అప్పులు చేసి సర్టిఫికెట్లు, పరీక్షలకు హాల్ టికెట్లు తీసుకుంటున్న దుస్థితి కనిపిస్తోంది.రూ.6,400 కోట్ల బకాయిలు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, హాస్టల్ మెయింటెనెన్స్ చార్జీల చెల్లింపుల కింద కూటమి ప్రభుత్వం సుమారు రూ.6,400 కోట్లు బకాయిలు పెట్టింది. ఇందులో విద్యార్థుల హాస్టల్ ఖర్చుల కింద రూ.2,200 కోట్ల చెల్లింపులకు మంగళం పాడేసింది. అసలు ఎక్కడా ఆ ఊసే ఎత్తడం లేదు. కేవలం ఫీజు రీయింబర్స్మెంట్పై అడపాదడపా మాట్లాడుతూ.. సకాలంలో చెల్లింపులు చేసేస్తున్నట్టు ప్రచారం చేసుకుంటోంది. కానీ, ఇప్పటికీ రూ.4,200 కోట్ల వరకు బకాయిలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాలనను మొదటి నుంచి ప్రారంభిస్తామంటే చట్టాలు, రాజ్యాంగం అంగీకరించవు. అందుకే ఏ ప్రభుత్వమైనా తప్పనిసరిగా కొనసాగించాల్సిన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే 2014–19లో టీడీపీ హయాంలో16.73 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాల్సిన రూ.1,778 కోట్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం తక్షణ బాధ్యతగా భావించి చెల్లింపులు చేసింది. బడ్జెట్లోనూ విద్యకు లోటే ఒక విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్కు రూ.2,800 కోట్లు, హాస్టల్ మెయింటెనెన్స్ ఖర్చుల కింద రూ.1,100 కోట్లు కలిపి రూ.3,900 కోట్లు వెచ్చించాలి. కానీ, 2024–25కు నిధులు ఏమీ విదల్చక పోగా, 2025–26 విద్యా సంవత్సరానికి బడ్జెట్లో రూ.3,900 కోట్లు కేటాయించాల్సి ఉంటే కేవలం రూ.2,600 కోట్లు మాత్రమే కేటాయింపులు చేసింది. విద్యార్థుల భవిష్యత్తుకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన కింద రూ.12,609.68 కోట్లు, వసతి దీవెన కింద రూ.4275.76 కోట్లు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసింది. టీడీపీ ప్రభుత్వ బకాయిలతో కలిపితే మొత్తం రూ.18,663.44 కోట్లు ఉన్నత విద్య కింద ఉచిత చదువులకు ఖర్చు పెట్టింది. -
ర్యాగింగ్ నంబరు 165 @ 2024
సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా వైద్యకళాశాలల్లో గతేడాది నమోదైన ర్యాగింగ్ ఫిర్యాదుల గణాంకాలను కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నివేదించింది. దేశ వ్యాప్తంగా 2024లో మొత్తం 165 కేసులు నమోదైనట్లు వెల్లడించింది, ఈ నివేదిక ప్రకారం అత్యధిక ఫిర్యాదులు నమోదైన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ మొదటిస్థానంలో నిలవగా, రెండోస్థానంలో బిహార్ ఉంది. ఉత్తర ప్రదేశ్లో 33, బిహార్లో 17 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉంది. ఏపీతో పాటు హరియాణా, ఉత్తరాఖండ్లో గతేడాదిలో చెరో ఆరు ర్యాగింగ్ ఘటనలు చోటు చేసుకున్నాయని నివేదిక వెల్లడించింది. తెలంగాణ, గుజరాత్, ఢిల్లీ, జమ్మూ కశ్మీర్లో చెరో మూడు కేసులు నమోదై 12వ స్థానంలో నిలిచాయి. ర్యాగింగ్ నివారణలో కేరళ ఆదర్శనీయంగా నిలిచింది. కేవలం ఒకే ఒక్క ఫిర్యాదుకు మాత్రమే పరిమితమైందని కేంద్రం తెలిపింది. కళాశాలలు, ఆసుపత్రులు, హాస్టళ్లు సహా క్యాంపస్లోని పలు ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుతో పాటు సంస్థలలోని వివిధ ప్రదేశాల్లో ర్యాగింగ్ నిరోధక పోస్టర్లు హోర్డింగ్లను ప్రదర్శిస్తున్నట్లు పేర్కొంది. ర్యాగింగ్పై విద్యార్థులు ఫిర్యాదు చేసేందుకు జాతీయ వైద్య కమిషన్ ప్రత్యేక పోర్టల్ని ఏర్పాటు చేసిందని స్పష్టం చేసింది. -
పరిమితికి మించి పొగాకు సాగు వద్దు
కొరిటెపాడు (గుంటూరు) : పొగాకు రైతులు అధిక ఉత్పత్తి చేయడంవల్లే అంతర్జాతీయ మార్కెట్లో దానికి డిమాండ్ తగ్గిందని.. అందుకే వారు సమస్యలు ఎదుర్కొంటున్నారని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ చెప్పారు. పరిమితికి మించి పొగాకు సాగు చెయ్యొద్దని, ఉత్పత్తి లక్ష్యం తగ్గించేలా రైతుల్లో చైతన్యం కలిగించాలని బోర్డు అధికారులు, సిబ్బందికి సూచించినట్లు ఆయన తెలిపారు. నిజానికి.. గత నాలుగేళ్లలో పొగాకు రైతుల ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు. గుంటూరులోని పొగాకు బోర్డు కార్యాలయంలో పొగాకు కొనుగోళ్లు, రైతులు పడుతున్న ఇబ్బందులు, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టామన్నారు. వారి పిల్లలకు విద్యా రుణాలను రూ.5 లక్షలకు పెంచామని.. తీసుకున్న విద్యా రుణాల చెల్లింపుల్లో కూడా సడలింపులు ఇస్తున్నామని చెప్పారు. అలాగే, స్కిల్ డెవలప్మెంట్, విదేశీ భాషల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మూడు ఇండస్ట్రియల్ పార్కులు..ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఏపీలో మూడు ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటుచేయనున్నట్లు పీయూష్ గోయెల్ వెల్లడించారు. పోర్టులు, పారిశ్రామికాభివృద్ధి ద్వారా రాష్ట్రంలో 1.60 కోట్ల కుటుంబాలు లబ్ధిపొందుతాయని తెలిపారు. కృష్ణపట్నం పోర్టు అభివృద్ధికి టెండర్లు పిలిచామన్నారు. సమావేశంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్, పొగాకు బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్కుమార్, గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, పొగాకు బోర్డు ఈడీ బి. విశ్వశ్రీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.పొగాకు కొనుగోళ్లకు రూ.150 కోట్లు కేటాయించాలికేంద్రమంత్రి పీయూష్ గోయెల్కు సీఎం చంద్రబాబు వినతిసాక్షి, అమరావతి : ఏపీలో పొగాకు కొనుగోళ్ల నిమిత్తం టొబాకో బోర్డు ద్వారా రూ.150 కోట్లు కేటాయించాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్కు ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ఆదివారం కేంద్రమంత్రి సీఎంతో సమావేశమయ్యారు.హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లు, పామాయిల్పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు తదితర అంశాలపై కేంద్రమంత్రికి చంద్రబాబు వినతిపత్రం అందించారు. పొగాకు ధరలు తగ్గిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే రూ.300 కోట్లతో 20 మిలియన్ కేజీల కొనుగోళ్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసే రూ.300 కోట్లలో టొబాకో బోర్డు రూ.150 కోట్లు భరించేలా చూడాలని ముఖ్యమంత్రి కోరారు. -
మసీదు భూముల వ్యవహారం.. పచ్చనేతలకు ఫలహారం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వక్ఫ్ భూములపై కన్నేసింది. ఎప్పుడో 17వ శతాబ్దంలో ఓ మొఘల్ చక్రవర్తి వక్ఫ్ చేసిన వందలాది ఎకరాల భూములను ఇప్పుడు తమ అనుయాయులకు పప్పుబెల్లాల్లా కట్టబెట్టేందుకు చకచకా పావులు కదుపుతోంది. ముందుగా ఆ భూములను పారిశ్రామికాభివృద్ధి కోసమంటూ ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ)కి బదలాయించి ఆ తర్వాత అస్మదీయులకు పంచిపెట్టనుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈనెల 17న ఇందుకు ఆమోదముద్ర పడిపోవడం ఖాయం. గుంటూరు లాలాపేట ప్రాంతంలో ప్రసిద్ధ షాహీ జామియా మసీదును మొఘల్ చక్రవర్తి షా ఆలం బాద్షా ఘాజీ 17వ శతాబ్దం (ముస్లిం క్యాలెండర్ 1189 హిజరీ)లో నిర్మించారు. దీని నిర్వహణ కోసం ఆయన గుంటూరు జిల్లా రెడ్డిపాలెంలో 244.34 ఎకరాలు, ప్రతిపాడు మండలం మల్లాయపాలెంలోని సర్వే నెంబర్ 232/1–ఎలో 144.79 ఎకరాలు, 232/1/సి లోని 80.25 ఎకరాలు, 232/2లో 7 ఎకరాలు, 232/8లో 1.14 ఎకరాల భూమిని వక్ఫ్ చేశారు. వీటిని 1962లో భారత ప్రభుత్వం వక్ఫ్ నోటిఫికేషన్ ద్వారా అధికారికంగా గుర్తించింది. ఎంతో ఉదారంగా వక్ఫ్ చేసిన ఆ భూముల విలువ ఇప్పుడు రూ.వందల కోట్లకు పైగా పెరగడంతో వాటిని కాజేసే కుట్రలు ఊపందుకున్నాయి. టీడీపీకి చెందిన బడా బాబులు మల్లాయపాలెంలోని 233.18 ఎకరాల భూములపై కన్నేసి అధికారికంగా వాటిని చేజిక్కించుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వ పెద్దలు సైతం రంగంలోకి దిగి అందుకు అవసరమైన వ్యూహాన్ని రచించారు. ఇందులో భాగంగా.. రెవెన్యూ అధికారులు ఈ ఏడాది ఏప్రిల్ 22న వక్ఫ్బోర్డుకు లేఖ రాశారు. ఏపీఐఐసీకి ల్యాండ్ ఎక్విజేషన్ ద్వారా సదరు వక్ఫ్ భూమిని ఇవ్వాలని అందులో కోరారు. వక్ఫ్ అధికారులు సైతం ఆఘమేఘాలపై స్పందించి ఆ భూములను ఏపీఐఐసీకి అప్పగించేలా రంగం సిద్ధంచేశారు. ఈ మేరకు ప్రతిపాదనలు సైతం సిద్ధంచేసి ఈనెల 17న నిర్వహించే వక్ఫ్బోర్డు సమావేశానికి 42 అంశాలతో రూపొందించిన అజెండాలో 4వ అంశంగా దీనిని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం నేరుగా పర్యవేక్షిస్తుండడంతో దీని ఆమోదముద్రకు వక్ఫ్ బోర్డుపై తీవ్ర ఒత్తిడి కూడా పెరిగింది. నిజానికి.. వక్ఫ్ చట్టం–1995 ప్రకారం ఈ భూములను భూసేకరణ ద్వారా ఇతరులకు కేటాయించడం చట్ట విరుద్ధం. అయినా, వాటిని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఐఐసీ)కు అప్పగించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం బరితెగించింది. ఆ తర్వాత వాటిని ఏపీఐఐసీకి బదలాయించి తద్వారా ఇండ్రస్టియల్ పార్కు పేరుతో పచ్చనేతలకు లీజు పేరుతో సమరి్పంచాలన్నది అసలు వ్యూహం. సర్కారు తీరుపై ముస్లిం సమాజం భగ్గుఇక వక్ఫ్ సవరణ చట్టానికి ఓ పక్క మద్దతు పలికిన చంద్రబాబు.. మరోపక్క ఇలా రాష్ట్రంలో వక్ఫ్ భూముల అన్యాక్రాంతానికి ఊతమివ్వడంపట్ల ముస్లిం సమాజం మండిపడుతోంది. ముఖ్యమంత్రి అవలంబిస్తున్న రెండు నాల్కల ధోరణిపట్ల రగిలిపోతోంది. దీంతో.. ముస్లింల సంక్షేమానికి ఉపయోగించాల్సిన వక్ఫ్ భూములను ఇతరులకు అప్పగించే ప్రయత్నాలను అడ్డుకుంటామని, వక్ఫ్ చట్టాన్ని తుంగలో తొక్కే కూటమి ప్రభుత్వ తీరుపై న్యాయపోరాటం చేస్తామని ఏపీ ముస్లిం హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా హెచ్చరించారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు వెయ్యి ఎకరాల వక్ఫ్ ఆస్తులను ఆక్రమణల చెర నుంచి విడిపించి ఆదర్శంగా నిలిస్తే.. టీడీపీ కూటమి ప్రభుత్వం మాత్రం వాటిని అన్యాక్రాంతం చేస్తోందని ఆరోపించారు. ఇదే తీరు కొనసాగితే శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వక్ఫ్ భూములు మిగలవని.. దీన్ని అడ్డుకునేలా ముస్లిం సమాజం, ముస్లిం మేథావులు, న్యాయవాదులు పోరాటానికి సిద్ధంకావాలని నాగుల్ మీరా పిలుపునిచ్చారు. -
ప్రచారం ఘనం.. చిత్తశుద్ధి శూన్యం
సాక్షి, అమరావతి: గోరంత చేసి కొండంత ప్రచారం చేసుకోవడంలో చంద్రబాబును మించిన వారుండరు. ఏ ప్రభుత్వ కార్యక్రమం, పథకమైనా సరే ఆయన చేసే ప్రచారానికి, అమలుకు ఏమాత్రం పొంతన ఉండదు. విజయవాడ వరదల సమయంలో డ్రోన్లతో బాధితులకు ఆహారం అందించినట్టు ఏఐ ఫొటోలు సృష్టించి ప్రజలను బురిడీ కొట్టించిన ఘటనే ఇందుకు నిదర్శనం. అదే తరహాలో రూ.కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేసి యోగాంధ్ర పేరిట ప్రజలను మభ్య పెట్టే మరో కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.ఈ నెల 21న ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకుని నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలకు బాబు పిలుపునిచ్చారు. ప్రతి గడపకు సిబ్బంది వెళ్లి యోగాపై అవగాహన కల్పిస్తున్నారని, ఆసక్తి కలిగిన వారు రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారని వెల్లడించారు. 2 కోట్ల రిజిస్ట్రేషన్లు లక్ష్యం కాగా, ఇప్పటికే లక్ష్యాన్ని దాటి 3 కోట్ల దిశగా కొనసాగుతున్నట్టు ఇటీవలే వైద్య శాఖ ప్రకటించింది. కానీ వాస్తవాలను పరిశీలిస్తే.. రికార్డుల కోసం అడ్డదారులు.. రెండు కోట్ల రిజిస్ట్రేషన్లు పూర్తి చేసి, 21వ తేదీన వారందరితో యోగా చేయించినట్టు రికార్డు సృష్టించడం కోసం ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతోంది. కార్యాలయాల్లో కూర్చొని ప్రజలకు సమాచారం ఇవ్వకుండా, ఆమోదం తీసుకోకుండానే యోగాంధ్రలో ఎడాపెడా రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. యోగా అంటే ఏంటో కూడా తెలియని రెండు, మూడేళ్ల చిన్నారులు, కదల్లేని స్థితిలో ఉండే వృద్ధుల పేరిట రిజిస్ట్రేషన్లను ప్రభుత్వ యంత్రాంగం చేపడుతోంది. దీంతో ఆ వ్యక్తుల పేరిట ఐడీ, క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతున్నాయి. ‘యోగాంధ్ర–2025లో పాల్గొనాలన్న ఆసక్తికి హృదయపూర్వక అభినందనలు’ అంటూ ప్రజలకు వాట్సప్లో సందేశాలొస్తున్నాయి. దీంతో మేమెప్పుడు నమో దు చేసుకున్నామని జనం ఆశ్చర్యపోతున్నారు. కాకి లెక్కలతో ‘అవినీతి’ ఆసనాలు రిజిస్ట్రేషన్లు చేసుకున్నవారందరూ యోగా కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా పాల్గొంటారని, వారికి టీ షర్ట్స్, మ్యాట్స్, వసతుల కల్పన పేరిట రూ.కోట్లలో ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నారు. ఇప్పటికే జిల్లాకు రూ.కోటి చొప్పున కేటాయించారు. రాష్ట్రస్థాయి బడ్జెట్తో కలుపుకుని రూ.30 కోట్లపైనే ఖర్చు చేస్తున్నారు. కాకిలెక్కల రిజిస్ట్రేషన్లను చూపి, అందరూ యోగాకు హాజరైనట్టు చిత్రీకరించాలని ప్రణాళిక రచించారు. ఈ క్రమంలో సౌకర్యాల కల్పన పేరిట ప్రభుత్వ పెద్దలు అవినీతి ఆసనాలు వేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
నాన్నా.. నా ప్రతి అడుగులోనూ మీరే స్ఫూర్తి.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: ఫాదర్స్ డే సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయన తండ్రి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.‘‘మీరు ఎప్పుడూ నాకు స్ఫూర్తి, మీరే నాకు రోల్ మోడల్, నా ప్రతి అడుగులోనూ మీరే నా స్ఫూర్తి. హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా’’ అంటూ వైఎస్సార్ ఫోటోను జతచేశారు. చారిత్రాత్మకమైన మీ పాదయాత్ర ముగింపు రోజును కూడా గుర్తు చేసుకుంటున్నా.. అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. You have always been my inspiration, aspiration and role model. నాకు నా ప్రతి అడుగులో నువ్వే నా స్ఫూర్తి.Happy Father’s Day! Remembering the closing Day of your historic Padayatra! pic.twitter.com/Xn8qqadyKm— YS Jagan Mohan Reddy (@ysjagan) June 15, 2025 -
తక్కువ మార్కులకే మంచి ర్యాంకులు
సాక్షి, అమరావతి: నీట్ యూజీ–2025లో రాష్ట్రం నుంచి 36,776 మంది అర్హత సాధించారు. టాప్–100 మందిలో ఆరు ర్యాంకులు ఏపీ విద్యార్థులు సొంతం చేసుకున్నారు. జాతీయ స్థాయిలో వైద్య విద్య ప్రవేశాల కోసం గత నెల 4వ తేదీన నిర్వహించిన నీట్ యూజీ ప్రవేశ పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శనివారం విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా 22,09,318 మంది హాజరైన ఈ పరీక్షలో 12,36,531 మంది అర్హత సాధించినట్టు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈసారి 59,219 మంది దరఖాస్తు చేసుకోగా, 57,934 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 36,776 మంది అర్హత సాధించారు. జాతీయ స్థాయిలో టాప్–100లో ఆరుగురు విద్యార్థులు ర్యాంకులు సాధించారు. వీరిలో 19వ ర్యాంకుతో దర్భా కార్తీక్ రామ్ కిరీటి రాష్ట్ర టాపర్గా నిలిచాడు. అలాగే, కొడవాటి మోహిత్ శ్రీరామ్ 56వ ర్యాంకు.. దేశిన సూర్యచరణ్ 59, పొదిలపు అవినాష్ 64 (ఓబీసీ), యర్రా సమీర్ కుమార్ 70 (ఓబీసీ), తుమ్మూరి శివ మణిదీప్ 92వ (ఓబీసీ) ర్యాంకులు సాధించారు. వీరుగాక కారు మంచి విక్రాంత్ జాతీయ స్థాయిలో 262 ర్యాంకుతో పాటు ఎస్సీ కేటగిరీలో 9వ స్థానంలో నిలిచాడు.టాపర్గా రాజస్థాన్ విద్యార్థి ఈసారి నీట్ యూజీ పరీక్షలో టాప్–10 ర్యాంకులు ఉత్తరాది విద్యార్థులు సొంతం చేసుకున్నారు. వీరిలో 9 మంది బాలురు, ఒక బాలిక ఉన్నారు. రాజస్థాన్కు చెందిన మహేష్ కుమార్ టాపర్గా నిలవగా, మధ్యప్రదేశ్కు చెందిన ఉత్కర్‡్ష అవాధియా రెండో ర్యాంకు, మహరాష్ట్ర విద్యార్థి క్రిషంగ్ జోషి మూడో ర్యాంకు, ఢిల్లీకి చెందిన మృణాల్ కిషోర్ ఝా నాలుగో ర్యాంకు, అవికా అగర్వాల్ (ఢిల్లీ) ఐదో ర్యాంకు సొంతం చేసుకున్నారు. 73 మందికి అత్యుత్తమ మార్కులుఈ ఏడాది నీట్ మార్కుల సాధనలో విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చినట్టు ఎన్టీఏ వెల్లడించింది. 144 నుంచి 686 మార్కుల వరకు సాధించిన విద్యార్థులను ప్రకటించింది. ఇందులో 73 మంది 651 నుంచి 686 మధ్య మార్కులు సాధించారు. -
మరో దోపిడీకి తెరలేపిన విద్యుత్ శాఖ
విజయవాడ నగరంలో స్క్యూ బ్రిడ్జి సమీపంలో నివసించే లక్ష్మికి ఏపీ సీపీడీసీఎల్ నుంచి ఈ నెల విద్యుత్ బిల్లుతో పాటు అదనపు వినియోగానికి సెక్యూరిటీ డిపాజిట్ (అడిషనల్ కన్జంప్షన్) చెల్లించాలంటూ ఓ నోటీసు వచ్చింది. అది చూసిన లక్ష్మికి గుండె ఆగినంత పనైంది. ఆమె విద్యుత్ సర్వీసు తీసుకున్నప్పుడు రెండు నెలలకు అడ్వాన్స్గా రూ.1,600 చెల్లించారు.కానీ.. 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకూ వినియోగించిన విద్యుత్ ఆధారంగా రూ.15,132 సెక్యూరిటీ డిపాజిట్ కట్టాల్సి ఉందని, అందులో రూ.1,600 పోనూ మిగిలిన రూ.13,532ను 30 రోజుల్లోగా చెల్లించాలని ఆ నోటీసులో ఉంది. ఇప్పటికిప్పుడు అంత సొమ్ము ఎక్కడి నుంచి తేవాలో తెలియక, ఇదెక్కడి అన్యాయం బాబూ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది.‘విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి. మీ విద్యుత్ సర్వీసు లోడ్ క్రమబద్ధీకరణకు చక్కటి అవకాశం వచ్చింది. చెల్లించాల్సిన డిపాజిట్లో 50 శాతం రాయితీ లభిస్తుంది. త్వరపడండి. ఈ అవకాశం కొంతకాలం మాత్రమే’ అంటూ ఇటీవల డిస్కంలు అరకొర ప్రకటనలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాయి. అసలు విషయంలోకి వెళితే.. క్రమబద్ధికరణ పేరుతో రాష్ట్ర ప్రజల నుంచి డిస్కంలు అడ్డదారిలో మరో దోపిడీకి పాల్పడుతున్నాయి.ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ)ని ఏమార్చి, విద్యుత్ వినియోగదారులను మోసం చేసి, రాయితీ పేరుతో అదనపు భారాన్ని మోపుతున్నాయి. ఇప్పటికే రూ.15,485 కోట్ల అదనపు చార్జీల భారంతో విద్యుత్ బిల్లులు రెట్టింపయ్యాయి. వాడిన దానికి మించి వాడని విద్యుత్కు కూడా అకారణంగా బిల్లులు చెల్లించాల్సి వస్తోందని జనం గగ్గోలు పెడుతున్నారు.అది చాలదన్నట్టు ఇప్పుడు లోడ్ క్రమబద్ధికరణ, అదనపు వినియోగ సెక్యూరిటీ డిపాజిట్ వంటి పేర్లతో నోటీసులు జారీ చేస్తూ ప్రజలను మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారు. విద్యుత్ బిల్లుతో పాటు వస్తున్న ఈ నోటీసులను వినియోగదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. – సాక్షి, అమరావతిఇప్పుడెందుకు గుర్తొచ్చింది?విద్యుత్ సర్వీసు తీసుకునే సమయంలో అధికారులు గతంలో గృహంలో ఉన్న పరికరాల ఆధారంగా కనెక్టెడ్ లోడ్ను అంచనా వేసి కాంట్రాక్టెడ్ లోడ్ను నిర్ణయించేవారు. ప్రస్తుతం విద్యుత్ బిల్లులో కనెక్టెడ్ లోడ్, కాంట్రాక్టెడ్ లోడ్ వివరాలను చేర్చి, వినియోగదారులు తమ లోడ్ను క్రమబద్ధికరించుకోవాలని సూచిస్తున్నారు. కాంట్రాక్టెడ్ లోడ్ కంటే ఎక్కువ వినియోగం ఉంటే.. అదనపు లోడ్ ఆధారంగా చార్జీలు విధిస్తున్నారు. అందులో భాగంగా కాంట్రాక్టెడ్ లోడ్ కంటే ఎక్కువగా వినియోగం ఉన్న వినియోగదారులకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ నోటీసుల్లో అదనపు లోడ్ చార్జీలను చెల్లించాలని లేదా లోడ్ను క్రమబద్ధికరించాలని చెబుతున్నారు.జూన్ 30లోగా క్రమబద్ధీకరించుకునే వారికి 50 శాతం రాయితీ ఇస్తామని ఏపీఈఆర్సీ ద్వారా ఓ ఆఫర్ను కూడా తీసుకొచ్చారు. దానిని ముందు పెట్టి అవసరమైన వాళ్లకు, అవసరం లేని వాళ్లకు కూడా నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పుడు కట్టకపోతే పూర్తి మొత్తం చెల్లించాలని చెబుతున్నారు. ఈ కొత్త చార్జీలు వినియోగదారులకు, ముఖ్యంగా సామాన్యులకు భారంగా మారుతున్నాయి. ఇన్నాళ్లూ లేని చార్జీలు ఇప్పుడు ఆకస్మికంగా విధించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.అసలేమిటీ లోడ్విద్యుత్ లోడ్ భారం అనేది ఒక గృహం, సంస్థలో విద్యుత్ వినియోగానికి అవసరమైన మొత్తం విద్యుత్ అవసరాన్ని సూచిస్తుంది. దీనిని సాధారణంగా కిలోవాట్లలో కొలుస్తారు. ఈ లోడ్ రెండు రకాలుగా విభజిస్తారు. ఒకటి కనెక్టెడ్ లోడ్. అంటే.. ఒక విద్యుత్ సర్విసుకు అనుసంధానంగా ఉన్న ఫ్యాన్లు, లైట్లు, ఏసీలు, టీవీలు వంటి అన్ని పరికరాల మొత్తం విద్యుత్ సామర్థ్యం. రెండవది కాంట్రాక్టెడ్ లోడ్.. అంటే విద్యుత్ సరఫరా సంస్థతో వినియోగదారుడు చేసుకున్న ఒప్పందం ప్రకారం అనుమతించిన గరిష్ట లోడ్. ఉదాహరణకు 2 కిలోవాట్ల కాంట్రాక్టెడ్ లోడ్ను ఎంచుకుని అంతకు మించి వినియోగం ఉంటే అదనపు చార్జీలుగానీ, జరిమానా గానీ చెల్లించాల్సి ఉంటుంది.అయితే గృహ విద్యుత్ వినియోగంలో చాలామంది సామాన్య, పేద కుటుంబాలు కేవలం ఫ్యాన్లు, లైట్లు, టీవీ వంటి సాధారణ విద్యుత్ పరికరాలను మాత్రమే ఉపయోగిస్తాయి. వాటి లోడ్ అధికంగా ఉండకపోయినా అదనంగా కట్టాలనడం వల్ల వారిపై ఆరి్థక భారం పడుతుంది. గృహ వినియోగదారులు కిలోవాట్కు రూ.2,000 అదనపు లోడ్ చార్జీ, రూ.200 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. ఈ లెక్కన 5 కిలోవాట్లకు నోటీసు ఇస్తే రూ.11 వేలు చెల్లించాలి. ఇందులో లోడ్ చార్జీలపై సగం రాయితీ ఇస్తే రూ.5 వేలు తగ్గుతుంది. మిగతా రూ.6 వేలు నెల రోజుల్లోపు చెల్లించకపోతే సర్వీసు తొలగించి సరఫరా నిలిపివేస్తామని విద్యుత్ శాఖ హెచ్చరిస్తోంది. -
20, 21 తేదీల్లో డీఎస్సీ పరీక్షలు వాయిదా
సాక్షి, అమరావతి: ప్రభుత్వం ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో 20, 21 తేదీల్లో జరిగే డీఎస్సీ పరీక్షలను వాయిదా వేసినట్టు డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.యోగా డే సందర్భంగా పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల రాకపోకలకు అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో ఆ రెండు రోజుల్లో జరగాల్సిన పరీక్షలను వచ్చేనెల 1, 2 తేదీల్లో నిర్వహిస్తామన్నారు. మారిన పరీక్షా కేంద్రాలు, తేదీలతో హాల్ టికెట్లు ఈనెల 25 నుంచి https://apdsc.apcfss.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయన్నారు. -
ఎటెళ్లిపోయాయో.. ఆ 900 బస్తాలు
సాక్షి టాస్క్ఫోర్స్: పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని టీడీపీ కూటమి నేతలు బుక్కేస్తున్నారు. రూ.కోట్ల విలువైన బియ్యాన్ని పక్కదారి పట్టించేస్తున్నారు. వెయ్యి బస్తాలకు పైగా రేషన్ బియ్యం ఉన్న ఓ గోదామును అధికారులు శుక్రవారం తనిఖీచేసి తాళం వేయగా తెల్లారేసరికి 109 బస్తాలను ఉంచి మిగిలిన వాటిని రాత్రికి రాత్రే తరలించేశారంటే పచ్చమూకలు ఎంతటి బందిపోట్లో తెలుస్తోంది. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో వెలుగుచూసిన ఈ బాగోతం వెనుక టీడీపీ ముఖ్యనేత కుమారుడున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.వివరాలివీ.. ఓ గుర్తుతెలియని వ్యక్తి శుక్రవారం అక్రమ బియ్యం దందాపై ఇచ్చిన సమాచారంతో పట్టణంలోని శిరుగుప్ప రోడ్డులో ఉన్న ఓ గోదామును సివిల్ సప్లయ్స్ రాష్ట్ర డైరెక్టర్ మహేష్నాయుడు తనిఖీ చేశారు. అందులో వెయ్యిబస్తాలకు పైగా రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. అప్పటికే ఆలస్యం కావడంతో ఆయన గోడౌన్కు తాళం వేయించారు. దానిని సీజ్ చేసేందుకు శనివారం ఉదయం ఆయన గోదాముకు వచ్చారు. గోదాములో కేవలం 109 బస్తాలు మాత్రమే ఉండడాన్ని చూసి మహేష్నాయుడు, సివిల్ సప్లయ్స్, డిప్యూటీ తహసీల్దార్ బాబు, పోలీసు అధికారులు అవాక్కయ్యారు. మిగతా బియ్యం బస్తాలన్నీ రాత్రికి రాత్రే తరలిపోయాయి. రంగంలోకి టీడీపీ ముఖ్యనేత కుమారుడు!..మహేష్నాయుడు గోడౌన్ తనిఖీకి వెళ్లగానే ఆదోనికి చెందిన టీడీపీ ముఖ్యనేత ఒకరు ఫోన్ చేసినట్లు తెలిసింది. వెయ్యికి పైగా బియ్యం బస్తాలు పట్టుబడినట్లు తెలుసుకుని ఆయన తనకేమీ సంబంధంలేదని తప్పుకున్నట్లు సమాచారం. అయితే, ఆ వెంటనే సదరు ముఖ్యనేత కుమారుడు అక్కడికి చేరుకోవడం, తన తండ్రికి తెలీదని.. చూసీచూడనట్లుగా వదిలేయాలని డైరెక్టర్ను కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు కూడా సంపాదించుకునేందుకు అడ్డుతగిలితే ఎలాగని డైరెక్టర్తో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ముఖ్యనేతల కుమారుల బియ్యం దందా..వాస్తవానికి.. ఆదోని టీడీపీలో రెండు వర్గాలున్నాయి. అందులో ఒక వర్గం నేత కుమారుడు ఆదోని పట్టణం, మరో వర్గం నేత కుమారుడు ఆదోని రూరల్ ఏరియాలో బియ్యం దందా చేస్తున్నారు. వీరిని నిలువరించే వాళ్లు లేకపోవడంతో వారిద్దరూ పోటీపడి మరీ బియ్యం దందాను సాగిస్తున్నారు. సమీపంలోని కర్ణాటక సరిహద్దులు దాటించి రూ.కోట్లు దండుకుంటున్నారని ఆరోపణలున్నాయి.దోషులపై పీడీ యాక్ట్..రేషన్బియ్యం దందాలో ఎవరెవరి హస్తం ఉందో సోమవారం తేలుస్తాం. రాత్రి వెయ్యికి పైగా బియ్యం బస్తాలున్నట్లు గుర్తించాం. తెల్లారేసరికి అవన్నీ నిపించకుండాపోవడం చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది. విషయాన్ని పైకి తీసుకెళ్తా. పూర్తిస్థాయి విచారణ చేయించి దోషులపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయిస్తాం.– మహేష్నాయుడు, సివిల్ సప్లయ్స్ డైరెక్టర్కచ్చితంగా టీడీపీ నేతల ప్రమేయం..పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ దందాలో కచ్చితంగా టీడీపీ నేతల ప్రమేయం ఉంది. పూర్తిస్థాయి విచారణ చేయకుండా అసలైన దోషులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. – వై. సాయిప్రసాద్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ఆదోని -
ప్రసారం ఓ ప్రహసనం..మనుగడ ప్రశ్నార్థకం
సాక్షి, అమరావతి, బీచ్రోడ్డు(విశాఖ): ఏపీ ఫైబర్ నెట్ వ్యవస్థ చుట్టూ నిర్లక్ష్య మేఘాలు కమ్మేస్తున్నాయి. ప్రతిరోజూ ప్రసారాలను సమీక్షిస్తూ వ్యవస్థను చక్కదిద్దాల్సిన సంస్థలోని పెద్దల నిర్వాకం ఫైబర్ నెట్ మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులుగా ఏపీ ఫైబర్ నెట్ ప్రసారాలు నిలిచిపోయాయి. సిబ్బందికి వేతనాలు ఇవ్వకపోవడం, పాడైన బాక్సుల స్థానంలో కొత్త బాక్సులు అమర్చకపోవడంతో ఫైబర్నెట్ ప్రసారాలు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. దీంతో వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో వారి నుంచి నిత్యం తిట్లు, శాపనార్థాలు వినలేకపోతున్నామని కేబుల్ ఆపరేటర్లు వాపోతున్నారు. ఉమ్మడి రాయలసీమ జిల్లాల్లో పరిస్థితి మరింత దారుణం. కనీసం ఓ గంటపాటైనా ప్రసారాలు ఇవ్వలేకపోతున్నామని ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఏపీ ఫైబర్ నెట్ను గాలికి వదిలి నరకం చూపిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్స్ జేఏసీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో శనివారం విశాఖలోని ఏయూ దూర విద్య కేంద్రంలోని ఏపీ ఫైబర్ నెట్ కార్యాలయాన్ని జేఏసీ నాయకులు ముట్టడించారు. ఏడాదిలో ఒక్క సమీక్షైనా? ఫైబర్నెట్ దుస్థితిపై సీఎం చంద్రబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఏపీ స్టేట్ ఫైబర్నెట్ లిమిటెడ్ (ఏపీ ఎస్ఎఫ్ఎల్) ఉన్నతాధికారులకు ఎన్నో లేఖలు రాసినా సరైన పరిష్కారం లభించలేదని కేబుల్ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక ఒక్కసారైనా సమీక్ష నిర్వహించలేదు. కూటమిసర్కారు అస్తవ్యస్త నిర్వహణతో ఏపీ ఫైబర్నెట్ సేవలకు తీవ్ర విఘాతం ఏర్పడుతోందని, ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అయినా పరిస్థితిలో మార్పురాలేదు. దీంతో కేబుల్ ఆపరేటర్ల ఐక్య కార్యాచరణ కమిటీ విశాఖలో ఏపీ ఎస్ఎఫ్ఎల్ కార్యాలయానికి తాళాలు వేసి నిరసనకు దిగింది. అవాంతరాలతో లక్షల మంది దూరం నిరంతర అంతరాయాలతో నాలుగు లక్షల మందికి పైగా వినియోగదారులు కనెక్షన్లను రెన్యువల్ చేయించుకోవడం మానేశారు. ఇలా కనెక్షన్లు సస్పెండ్ అవుతున్నాయి. దీంతో సస్పెండ్ అయిన ఒక్కో బాక్సు నుంచి ప్రతి నెలా రూ.59ను కేబుల్ ఆపరేటర్ల నుంచి ప్రభుత్వం వసూలు చేస్తోంది. ఈ పరిణామం తమను మరింత కుంగదీస్తోందని కేబుల్ ఆపరేటర్లు కలత చెందుతున్నారు. ఎండీ ప్రవర్తనపై పెదవివిరుపు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత ఏపీ ఫైబర్ నెట్ ఎండీ ప్రవర్తన ఉందని ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులుగా తమ సమస్యలను చెప్పుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఎండీ దగ్గర నుంచి స్పందన లేదని, తమ కష్టాలను గాలికి వదిలేసి విలాసాల కోసం విదేశాలకు వెళ్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. తక్షణమే ఎండీ తన పదవికి రాజీనామా చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.అధికారులకు ఫోన్ చేస్తే స్పందన లేదు సమస్యలను చెబుతామని అధికారులకు ఫోన్ చేస్తే స్పందించటం లేదు. నాలుగు లక్షల మంది వినియోగదారులను కాపాడుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాలి. ప్రధాన డిమాండ్లు నెరవేర్చాలి. అలా జరిగేంతవరకు మా నిరసన కొనసాగుతుంది. – నారాయణరావు, జేఏసీ అధ్యక్షుడు డిమాండ్లు ఇవీ..» సాంకేతిక సిబ్బందికి జీతాలు తక్షణమే చెల్లించాలి » ఒక్కో బాక్స్పై రూ. 59 సస్పెండ్ చార్జీలను రద్దు చేయాలి » తొలగించిన 850 మందిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలి » సిగ్నలింగ్ వ్యవస్థను సరిచేయాలి నిరంతర ప్రసారాలు జరిగేలా చూడాలి » ఏపీ ఫైబర్ నెట్లో మీడియా, దిగువ స్థాయి ఉద్యోగులపై కక్షసాధింఫులు మానుకోవాలి » అవినీతికి పాల్పడిన వారినే శిక్షించాలి.. అంతే తప్ప వ్యవస్థను నిర్వీర్యం చేయొద్దు -
ఏడాది పాలన.. మహిళలకు వంచన
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం సాగించిన ఏడాది పాలనలో అన్ని రంగాల్లో మహిళలు వంచనకు గురయ్యారని వివిధ రంగాలకు చెందిన మహిళా నేతలు నిప్పులు చెరిగారు. కూటమి ఏడాది పాలనంతా ఆరాచక.. విధ్వంసక.. వినాశక పాలనగా సాగిందని మండిపడ్డారు. మహిళల భద్రతకు ఏవిధంగానూ భరోసా లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ‘ఏడాది కూటమి పాలన.. మహిళలకు వంచన’ అనే అంశంపై విజయవాడ రామవరప్పాడులోని ఎం.కన్వెన్షన్ సెంటర్లో శనివారం చర్చావేదిక నిర్వహించారు. మహిళా న్యాయవాదులు, వైద్యులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, వలంటీర్లు, డ్వాక్రా సంఘాల నేతలు, వివిధ రంగాలకు చెందిన మహిళా ప్రముఖులు, మహిళా నేతలు పెద్దఎత్తున హాజరై తమ గళం వినిపించారు. మహిళల జీవితాలు తల్లకిందులయ్యాయివైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ‘రాష్ట్రం అవినీతి పాలన అప్పుల ఆంధ్రాగా మారింది. ఏడాదిలోనే మహిళల జీవితాలు తలకిందులైపోయాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా సాధికారతకు పెద్దపీట వేశారు. కానీ.. ఈ ప్రభుత్వంలో మహిళా భక్షక పాలన సాగుతోంది. తొలి ఏడాదిలో తొమ్మిది శాతం కూడా మహిళలకు ప్రయోజనం చేకూర్చలేదు. రోజుకు 70 మంది మహిళలపై దాడులు జరగడం స్వర్ణాంధ్ర అంటారా? సందుసందుకి మద్యం షాపులు ఉండటాన్ని స్వర్ణాంధ్ర అంటారా? 17 ఏళ్లలో చేయనంత అప్పు చేయడాన్ని స్వర్ణాంధ్ర అంటారా?, సూపర్ సిక్స్ అమలు చేసేశాను.. ఎవరైనా అడిగితే వారి నాలుక మందం ఎక్కినట్టే అని సీఎం చెబుతున్నారు. సూపర్ సిక్స్ అడిగిన వారి నాలుక మందం అయితే.. ఎగ్గొట్టిన వారిని ఏమనాలి? ఇంటింటికీ బాండ్లు పంచిన వారిని ఏమనాలి? గతంలో అమ్మఒడిపై విమర్శలు చేశారు. వైఎస్ జగన్ అమలు చేసిన పథకాలను ఈ ప్రభుత్వం కాపీకొట్టగలదు.. కానీ జగన్ చిత్తశుద్ధిని కాపీ కొట్టలేరు. ఏడాది కాలంలో మద్యం, గంజాయి, డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయాయి. రాష్ట్రంలో అఘాయిత్యాలకు ఇవే ప్రధాన కారణం. అనంతపురంలో బాలిక అదృశ్యమైందని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా వారం రోజులు పట్టించుకోలేదు. పోలీసుల నిర్లక్ష్యంతో బాలిక శవమై తేలింది. సత్యసాయి జిల్లాలో 14 ఏళ్ల బాలికపై టీడీపీ కార్యకర్తలు నెలల తరబడి అత్యాచారానికి పాల్పడ్డారు’ అని మండిపడ్డారు..మహిళలకు భద్రత కల్పించాలనే ఆలోచనే లేదు మాజీ హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. ‘రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలా అనే ఆలోచన తప్ప మహిళలకు భద్రత కల్పించాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. వైఎస్ జగన్ దిశ యాప్ తెస్తే దానిపై ప్రస్తుత హోంమంత్రి హేళనగా మాట్లాడారు. అదే దిశ యాప్ పేరు మార్చి శక్తి యాప్ అని పెట్టారు. అమ్మఒడి పథకంలో పాఠశాలల నిర్వహణకు కొంత తీసుకుంటే లోకేశ్ అనరాని మాటలు అన్నారు. ఇప్పుడు తల్లికి వందనం పథకంలో లోకేశ్ రూ.2 వేలు కోత పెట్టారు. ఎవరైనా ప్రశ్నిస్తే కేసులుపెట్టి నానా రకాలుగా వేధిస్తున్నారు. ఏడాది కాలంగా ఎంతోమంది చిన్నారులపై అఘాయిత్యాలు జరిగాయి. హోంమంత్రి అనిత కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పింది లేదు. హోంమంత్రి అనిత ఓ రబ్బర్ స్టాంప్ మాదిరి మారారు. రాష్ట్రం రావణకాష్టంలా మారింది. క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. ఇవన్నీ డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్కు కనిపించడం లేదా. పవన్ ఎందుకు మౌనవ్రతం దాల్చారో చెప్పాలి’ అని నిలదీశారు. బడులకు దగ్గరే మద్యం షాపులు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ.. ‘ఈ ప్రభుత్వంలో విద్యకు ఒక విధానమంటూ లేకుండాపోయింది. ఏడాది కాలంలోనే టీచర్లను రోడ్డు మీదకు లాగేశారు. బడులకు దగ్గర్లోనే మద్యం షాపులు పెట్టారు’ అని ధ్వజమెత్తారు. తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ.. ఆరోగ్యానికి వైఎస్ జగన్ పెద్దపీట వేశారని గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. అమలుకాని హామీలతో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర, మాజీ మేయర్ గొలగాని హరివెంకటకుమారి, మాజీ ఎమ్మెల్సీ శివకుమారి, న్యాయవాదులు లలిత, సౌమ్య, విశ్రాంత ఉపాధ్యాయిని రజనీ, కార్పొరేటర్ శశికళ, సోషల్ మీడియా యాక్టివిస్టులు పెద్దిరెడ్డి సుధారాణి, ఇంటూరి సృజన తదితరులు మాట్లాడారు. -
పొగాకు రైతుల సమస్య డైవర్ట్ చేయడానికి ఇంత దుర్మార్గమా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనలో నిరసనల పేరుతో ఉద్రిక్తతలకు కారణమైన వారిని వదిలేసి.. అమాయక రైతులు, ప్రజలపై కేసులు పెట్టడాన్ని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇది రైతుల సమస్యను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు సర్కార్ చేయిస్తున్న మరో దుర్మార్గమని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్’లో ఆయన పోస్టు చేశారు. వైఎస్ జగన్ ఏమన్నారంటే..‘‘చంద్రబాబూ... పొగాకు పంటకు కనీస మద్దతు ధరలు లభించక రైతులు అన్యాయానికి గురవుతుంటే, వారిని పరామర్శించి భరోసా ఇవ్వడానికి నేను ప్రకాశం జిల్లా పొదిలి వెళ్తే, ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి మీరు కుట్ర చేయడం భావ్యమా? రైతులను పరామర్శించే ఈ కార్యక్రమానికి సంఘీభావంగా దాదాపు 40 వేలమంది రైతులు, ప్రజలు తరలివస్తే, మేం వెళ్తున్న మార్గంలో మీరు 40 మంది టీడీపీ కార్యకర్తలను పెట్టి, వారిని ఉసిగొల్పి, రాళ్లు విసిరి గలాటా చేయించారు. కానీ... ప్రజలు, రైతులు ఆ పన్నాగాన్ని అర్థం చేసుకుని అత్యంత సంయమనంతో వ్యవహరించారు. హింసను సృష్టించడానికి మీరు పంపిన ఆ 40 మంది చేసిన దుశ్చర్యలపై, అక్కడున్న 40 వేల మంది ప్రజలు, రైతులు ప్రతిస్పందించి ఉంటే ఏం జరిగి ఉండేది చంద్రబాబూ? రైతుల సమస్యలపై గొంతెతి్తతే దాన్ని డైవర్ట్ చేయడానికి మీరు ఇలా చేయించడం దుర్మార్గం కాదా..? ఉల్టాగా... రాళ్లు మీ వాళ్లు విసిరితే, మీరు ఉసిగొల్పిన కార్యకర్తలు గొడవలు చేసే ప్రయత్నం చేస్తే, అన్యాయంగా రైతులపై, ప్రజలపై కేసులు పెడతారా? ఆ కార్యక్రమానికి వచ్చిన రైతులను, ప్రజలను రౌడీలుగా అభివర్ణించడం మీ దిగజారుడుతనం కాదా చంద్రబాబూ? రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయిస్తూ కూర్చున్న చక్రవర్తి నీరో తరహాలో... ఆ రైతుల సమస్యలను పట్టించుకోకుండా, తిరిగి వారిపైనే ఎదురు కేసులు పెట్టడం మీకు మాత్రమే చెల్లుతుంది’’ అని మండిపడ్డారు. -
పూర్తిస్థాయిలో విత్తనాలు, ఎరువుల్లేవు
సాక్షి, అమరావతి: రైతులకు ఎరువుల లభ్యత, విత్తనాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవని.. సరఫరా కూడా కావడంలేదని టీడీపీ కూటమి ప్రభుత్వం సేకరించిన ఐవీఆర్ఎస్ ప్రజాభిప్రాయంలో తేలింది. మహిళలపై హింస, బహిరంగ ప్రదేశాల్లో వేధింపులున్నాయని కూడా అందులో స్పష్టమైంది. వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల మీద వ్యక్తమైన అభిప్రాయాలపై శనివారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఎరువుల లభ్యతలేదని 39.1 శాతం మంది రైతులు.. విత్తనాలు సమయానికి సరఫరా జరగలేదని 37 శాతం మంది రైతులు కుండబద్దలు కొట్టారు. మహిళలపై హింస, బహిరంగ ప్రదేశాల్లో వేధింపులు జరుగుతున్నాయని 27.8 శాతం మంది చెప్పారు. తమ ప్రాంతంలో డ్రగ్స్ సంబంధిత సమస్య ఉందని 27.4 శాతం మంది.. విద్యుత్ సరఫరా నిరంతరాయంగా జరగడంలేదని 38.4 శాతం మంది అభిప్రాయపడ్డారు. అలాగే, ఆర్టీసీలో శుభ్రత, సీటింగ్ విషయంలో 46.6 శాతం మంది అసంతృప్తి వ్యక్తంచేశారు. జీరో కరప్షన్ దిశగా పాలన..ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఏ శాఖలో ఎక్కడ, ఎవరు అవినీతికి పాల్పడినా సహించేదిలేదని.. జీరో కరప్షన్ దిశగా రాష్ట్రంలో పాలనా వ్యవస్థను నిర్మించాలన్నారు. అవినీతి రుజువైతే తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రజాభిప్రాయ సేకరణపై టెక్నికల్ ఆడిటింగ్ జరపాలని.. సమస్యలున్న చోట సంతృప్తిస్థాయి పెంచేలా చూడాలని చంద్రబాబు అన్నారు. సంక్షేమం, ఉద్యోగాల కల్పన, రహదారులు వంటి 10 ముఖ్యమైన ప్రజా సమస్యలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి.. వాటి పరిష్కారానికి కృషిచేయాలని చెప్పారు. 175 నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు నిర్వహించడంతో పాటు, ఆగస్టు 15 కల్లా అన్ని సేవలను వాట్సప్ గవర్నెన్స్ ‘మన మిత్ర’ ద్వారా అందించాలన్నారు. మరోవైపు.. వికలాంగులు, వృద్ధులకు రేషన్ సరుకుల పంపిణీ మరింత మెరుగ్గా జరిగేలా ఆలోచించాలన్నారు. చౌకధరల దుకాణాలను పెంచడం.. నగదు లేదంటే కూపన్లు ఇవ్వడం వంటి ప్రత్యామ్నాయాలపై లబ్ధిదారుల అభిప్రాయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. అలాగే, ఇసుకపై ప్రాంతాల వారీగా అధ్యయనం చేయాలన్నారు. -
ఏపీ డీఎస్సీ పరీక్ష తేదీల్లో మార్పు
సాక్షి, అమరావతి: ఏపీలో డీఎస్సీ పరీక్షల తేదీల్లో మార్పులు జరిగాయి. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా డీఎస్సీ పరీక్షల తేదీల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఈ నెల 20, 21 తేదీల్లో జరగాల్సిన పరీక్షలను జులై 1, 2 తేదీల్లో నిర్వహించనున్నట్లు డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి శనివారం ప్రకటన విడుదల చేశారు.కాగా, ఈ నెల 25 నుంచి మార్పు చేసిన హాల్ టికెట్లను https://apdsc.apcfss.inలో అందుబాటులో ఉంచనున్నట్లు కృష్ణారెడ్డి వెల్లడించారు. అభ్యర్థులు ఈ మార్పును గమనించి మార్చిన హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకుని కొత్త తేదీల ప్రకారం పరీక్షలకు హాజరు కావాలని ఆయన తెలిపారు. -
కొమ్మినేనిపై హోంమంత్రి అనిత వ్యాఖ్యలు హేయం: పొన్నవోలు
సాక్షి, తాడేపల్లి: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావునుద్దేశించి హోంమంత్రి అనిత వ్యాఖ్యలు హేయం అని వైస్సార్సీపీ జనరల్ సెక్రటరీ, సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి మండిపడ్డారు. కొమ్మినేనిపై హోంమంత్రి వ్యాఖ్యలను సుప్రీంకోర్టుకు నివేదిస్తామని సుధాకర్రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. డిబేట్లో పార్టిసిపెంట్ మాటలను కొమ్మినేనికి ఎలా ఆపాదిస్తారని సుప్రీంకోర్టు ఈ ప్రభుత్వాన్ని కడిగేసింది. కొమ్మినేని విషయంలో రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగింది కాబట్టే సుప్రీంకోర్టు గట్టి ఆదేశాలు ఇచ్చింది’’ అని పొన్నవోలు పేర్కొన్నారు.తన విచక్షణాధికారాన్ని వినియోగించి ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టు కొమ్మినేని విడుదలకు ఆదేశాలు ఇచ్చింది. అయినా సరే కొమ్మినేనిపై ఉద్దేశ పూర్వకంగా విషం కక్కుతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఈ ప్రభుత్వం కుట్రను బద్దలు చేశాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను తట్టుకోలేక ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. తాము చేసిన ఆరోపణలనే ఈ రాష్ట్రం, దేశమే కాదు, కోర్టులు కూడా నమ్మాలన్న భావనలో ఉన్నారు. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను శిరసావహించాలన్న విజ్ఞత హోంమంత్రి చూపడంలేదు. ఒక హోంమంత్రికి సుప్రీంకోర్టు ఆదేశాల విలువ తెలియకపోవడం దురదృష్టకరం. హోంమంత్రి అనిత మాటలు సుప్రీంకోర్టును తప్పుబట్టేలా ఉన్నాయి’’ అని పొన్నవోలు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ఈ కేసు ఇంకా ముగిసిపోలేదు, విచారణలో ఉందనే విషయం ఆమెకు తెలియదా?. సుప్రీంకోర్టు విచారణలో ఉన్న అంశంపై ఒక హోంమంత్రి ఇష్టానుసారంగా మాట్లాడటం చట్ట విరుద్ధం. కొమ్మినేని అరెస్టు వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని ఆమె మాటల్లోనే వ్యక్తం అవుతోంది. డిబేట్లు చేయొద్దని సుప్రీంకోర్టు ఎలాంటి దేశాలు ఇవ్వలేదు. జర్నలిస్టుగా ఆయన వాక్ స్వాతంత్రాన్ని కాపాడాల్సిన బాధ్యతనూ సుప్రీంకోర్టు గుర్తుచేసింది...కావాలంటే ఆ తీర్పు కాపీని మంత్రికి పంపిస్తాను. తాను అనని మాటలను కొమ్మినేనికి ఆపాదించి, ఆ ముసుగులో సాక్షి కార్యాలయాలపై దాడులు చేశారు. ఈ దాడులకు పోలీసులు పహరా కాశారు. దాడుల్లో పాల్గొన్న వారంతా టీడీపీ నాయకులు, కార్యకర్తలే. వీడియో, ఫొటోల రూపంలో అన్ని ఆధారాలున్నాయి. తుదపరి విచారణలో మొత్తం ఈ వ్యవహారాన్ని కోర్టు ముందుపెడతాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. లేకుంటే అరాచకం ప్రబలుతుంది’’ అని పొన్నవోలు సుధాకర్రెడ్డి పేర్కొన్నారు. -
తల్లులను మోసగించిన మిమ్మల్ని ఏమనాలి బాబూ?: ఆర్కే రోజా
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కార్ మోసాలను ఎక్స్ వేదికగా మాజీ మంత్రి ఆర్కే రోజా నిలదీశారు. ‘‘సూపర్ సిక్స్ పథకాల్ని అమలు చేశామని, ఇకపై వాటి గురించి ప్రశ్నిస్తే, నాలుక మందమని అనుకోవాల్సి వస్తుందని సీఎం చంద్రబాబు ఇటీవల అన్నారు. ప్రతి విద్యార్థికీ తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చి, అడ్డగోలు షరతులతో కొందరికే పథకాన్ని పరిమితం చేశారు. తల్లులను మోసం చేసిన మిమ్మల్ని ఏమనాలి చంద్రబాబూ’’ అంటూ ఆర్కే రోజా దుయ్యబట్టారు.‘‘ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసం ఆచరణ సాధ్యం కాని హామీల్ని ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో పథకాన్ని నీరుగార్చుతున్నారు. సూపర్ సిక్స్ పథకాల్ని అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ, మరోవైపు షరతులతో వాటికి కోత విధిస్తుండడం నిజం కాదా?. తాజాగా తల్లికి వందనం పథకాన్ని ఏకంగా ఆంధ్రప్రదేశ్లోని కేంద్రీయ విద్యాలయం (KV) విద్యార్థుల్ని మొత్తానికి మొత్తం అనర్హులుగా చేయడం నిజం కాదా?’’ అంటూ చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు.‘‘గతంలో జగనన్న హయాంలో కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్న విద్యార్థుల ప్రతి తల్లీకి అమ్మ ఒడి లబ్ధి చేకూర్చాం. ఆ వివరాలు ప్రభుత్వం దగ్గర అధికారికంగా ఉన్నాయి. కానీ ఎగ్గొట్టే కుట్రతో యూడైస్ ప్లస్ నుంచి కేవీ సంస్థలను కట్ చేసినట్టు, దాంతో తాము తల్లికి వందనం పథకానికి దూరమవుతున్నామని తల్లులు వాపోతున్నారు...పేరుకు అందరికీ పథకాన్ని అమలు చేస్తున్నామంటూ, మరోవైపు ఎగ్గొట్టారనేందుకు మచ్చుకు ఇదో ఉదాహరణ మాత్రమే. ఇలాంటి విన్యాసాలు మున్ముందు కూటమి ప్రభుత్వం ఇంకెన్ని చేస్తుందో అనే ఆందోళన ప్రజల్లో వుంది. అందుకే జగన్ అంటే నమ్మకం, బాబు అంటే మోసం అని ప్రజలు అనుకుంటున్నారు.’’ అని ఆర్కే రోజా ట్వీట్ చేశారు. -
తల్లికి వందనం పేరుతో తల్లులకు వంచన: మేరుగ నాగార్జున
సాక్షి, తాడేపల్లి: తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టి, రెండో ఏడాది అమలు చేసినా తల్లికి వందనం పథకంలో టీడీపీ కూటమి ప్రభుత్వం, ఆ తల్లులను మోసం చేసిందని, అడ్డగోలు నిబంధనలతో లబ్ధిదారులను గణనీయంగా తగ్గించారని వైఎస్సార్సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. శనివారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలోమాట్లాడారు.యూడైస్ రిపోర్టు మీద అబద్ధాలు:తల్లికి వందనం పేరుతో తల్లికి వంచన చేశాడు సీఎం చంద్రబాబు. జిల్లాల వారీగా దేశంలో విద్యార్థుల వివరాలు సేకరించడానికి యూడీఐఎస్ఈ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్)ను ప్రామాణికంగా తీసుకుంటారు. కలెక్టర్ల ద్వారా జిల్లాల వారీగా విద్యార్థుల వివరాలను తీసుకుని యుడైస్ ద్వారా కేంద్రానికి నివేదిక ఇస్తుంటారు. దీని ప్రకారం రాష్ట్రంలో 87,41,855 మొత్తం మంది విద్యార్థులు ఉంటే దాదాపు రూ.13,110 కోట్లు చెల్లించాలి.కానీ ప్రభుత్వం కేవలం రూ.8,745 కోట్లు మాత్రమే చెల్లించి మూడో వంతు విద్యార్థులకు చెల్లించకుండా మోసగించింది. ఇంటర్ వరకు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చి నిబంధనల పేరుతో పథకానికి అర్హులు కాకుండా ప్రభుత్వమే మోసగించింది. దీనినై వైఎస్సార్సీపీ తరఫున ప్రశ్నిస్తుంటే, టీడీపీ నాయకులు యూడైస్ రిపోర్టు మీద కూడా అబద్ధాలు చెబుతున్నారు. ఎల్కేజీ, యూకేజీ, అంగన్వాడీ పిల్లలను మినహాయించి ఈ యూడైస్ రిపోర్టును తయారు చేసినట్టు స్పష్టంగా ఉన్నా, బయట రాష్ట్రాల విద్యార్థులు ఉన్నారంటూ వక్రభాష్యాలు చెబుతున్నారు. ప్రతిపక్షం ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక, మంత్రి నారా లోకేష్ ఎదురుదాడి చేస్తూ, కేసులు పెడతామని బెదిరిస్తున్నారు.నాడు జే ట్యాక్స్ అన్నారు. ఇప్పుడేమంటారు?:ఎప్పుడిస్తారో తెలియని ఫీజు రీయింబర్స్మెంట్ను అడ్డం పెట్టుకుని ఇంట్లో ఎవరైనా ఫీజు రీయింబర్స్మెంట్ అందుకున్నా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఉపకార వేతనాలు పొందుతున్నా తల్లికి వందనం పథకం అమలు చేయలేదు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల పిల్లలకూ పథకాన్ని వర్తింప చేయలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు అందే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ డబ్బులు మినహాయించి లబ్ధిదారుల ఖాతాల్లో తల్లికి వందనం డబ్బు జమ చేశారు.కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన పాపాన పోలేదు. కానీ రేషన్ కార్డు లేదనే కారణంతో పథకం ఎగ్గొట్టారు. మా హయాంలో స్కూల్ నిర్వహణ కోసం అమ్మ ఒడిలో వెయ్యి రూపాయలు మినహాయిస్తే జే ట్యాక్స్ అంటూ నారా లోకేష్ విషప్రచారం చేశాడు. కానీ తల్లికి వందనంలో చెప్పాపెట్టకుండా ఒక్కో విద్యార్థి నుంచి ఏకంగా రూ.2 వేలు లాగేసుకున్నారు. దీనికి మంత్రి నారా లోకేష్ ఏం సమాధానం చెబుతాడు?.విద్యావ్యవస్థ సర్వనాశనమైంది:నారా లోకేష్ నేతృత్వంలో విద్యావ్యవస్థ సర్వనాశనం అయ్యింది. నారా లోకేష్ నిర్వహించే ఈ శాఖలో నిర్వహణ, సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. బడులు ప్రారంభించే నాటికి బదిలీలు పూర్తి చేయలేదు, పైగా బడులు ప్రారంభమైన నాలుగైదు రోజులకు టీచర్ల ట్రైనింగ్ క్లాసులు మొదలుపెట్టారు. జీవో నెంబర్ 117 రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఏడాది కాలంగా రద్దు చేయకపోగా దానికి ప్రత్యామ్నాయంగా మరో మూడు జీవోలు తీసుకొచ్చారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరంచెల విద్యావిధానాన్ని తీసేసి 9 అంచెల విధానాన్ని తీసుకొచ్చారు. బడులు ప్రారంభం అయ్యే నాటికి ఇవ్వాల్సిన విద్యాకానుక కిట్లు ఇప్పటికీ చాలా స్కూళ్లకు చేరలేదు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన బదిలీ విధానంలో పలుకుబడి ఉన్నారికి, డబ్బులిచ్చినవారికే ప్రాధాన్యత లభించిందే కానీ ఎక్కడా నిబంధనలు అమలు జరగలేదు. గతంలో 3,158 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉంటే, వాటిని పూర్తిగా రద్దు చేయాలని చంద్రబాబు నిర్ణయించాడు. దీన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సుమారుగా 1303 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కొనసాగిస్తామని, 1076 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ బేసిక్ ప్రైమరీ స్కూల్స్గా మార్చేస్తామని మరో అడ్డగోలు నిర్ణయం తీసుకుంది.నాటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ నాడు–నేడు ద్వారా రెండు విడతల్లో దాదాపు రూ. 12 వేల కోట్లు వెచ్చించి 38 వేల ప్రభుత్వ బడులను కార్పొరేట్కి దీటుగా తీర్చిదిద్దితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ పనులను అటకెక్కించారు. సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్టు, టోఫెల్ శిక్షణ, సీబీఎస్ఈ సిలబస్, 8 తరగతి నుంచి పిల్లలకు ట్యాబ్లు, డిజిటల్ క్లాస్ రూమ్లు వంటి వినూత్న ఆలోచనతో దేశంలో ఏపీ విద్యావ్యవస్థను ఉన్నత స్థానంలో నిలబెడితే ఏడాది పాలనతోనే వాటికి ఆనవాళ్లు లేకుండా చేసేశారు. ప్రభుత్వ బడుల్లో పిల్లలను చదివించాలంటే తల్లిదండ్రులు భయపడిపోయే దుస్థితి కల్పించారు.రూ.1306 కోట్లు వెచ్చించి 9,52,925 ఉచిత బైజూస్ కంటెంట్ ట్యాబులు పంపిణీ చేయడం జరిగింది. ఆరోతరగతి నుంచి ఆ పైన తరగతులకు రూ.838 కోట్లతో 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్పీ), 45 వేల స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేశాం. వీటన్నింటినీ కూటమి సర్కారు రద్దు చేసింది. గోరుముద్ద పథకం కోసం ఐదేళ్లలో మా వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.7,244.60 కోట్లు వ్యయం చేసింది. రోజుకో మెనూతో పిల్లలకు మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం పెట్టాం. కానీ కూటమి పాలనలో గోరుముద్ద కాస్త ‘ఘోర ముద్ద’గా మారిపోయింది. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో నాణ్యత కొరవడి విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు అతిసారం బారిన పడిన ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. వైఎస్సార్సీపీ హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను సంక్షేమ క్యాలెండర్ ప్రకారం ఎప్పటికప్పుడు విడుదల చేసేవాళ్లం. కానీ కూటమి సర్కారు విద్యాదీవెన, వసతి దీవెన కింద రూ.7,800 కోట్లు పెండింగ్ పెట్టింది. 2024–25లో కేవలం రూ.700 కోట్లు విడుదల చేసి, రూ.7,100 కోట్లు బకాయిలు పెట్టింది. 2025–26 బడ్జెట్ లో కేవలం రూ.2,600 కోట్లు కేటాయించినట్లు చూపారు. వీటన్నింటి ద్వారా పిల్లల చదువులపై ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదన్నది స్పష్టమవుతోంది.వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులువిద్య, వైద్యం, వ్యవసాయం.. ఇలా అన్ని రంగాలను నాశనం చేసిన కూటమి ప్రభుత్వం, మరోవైపు శాంతి భద్రతలు కాపాడడంలోనూ దారుణంగా విఫలమైంది. పొగాకు రైతుల పరామర్శ కోసం పోలీసుల అనుమతితో మా నాయకుడు వైఎస్ జగన్ ప్రకాశం జిల్లా పొదిలి వెళ్లారు. అక్కడికి వేలల్లో వచ్చిన ప్రజాభిమానాన్ని చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు మాపై రాళ్ల దాడికి దిగితే రక్షణ కల్పించాల్సిన పోలీసులు చోద్యం చూస్తుండిపోయారు. నిరసన పేరుతో అడ్డుకోవాలని చూసిన వారికి రక్షణ కల్పించడమే కాకుండా, మా నాయకుల మీద అక్రమ కేసులు పెట్టారు. చివరకు పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అయిన బూచేపల్లి శివప్రసాదరెడ్డికి కూడా నోటీసులిచ్చారు.దళితులపై దమనకాండ:రాష్ట్రంలో దళితుల కుటుంబాల మీద వరుసగా దాడులు జరుగుతున్నాయి. యథేచ్ఛగా చట్టాలను అపహాస్యం చేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇటీవల దళిత విద్యార్థిని మీద 18 మంది టీడీపీ యువకులు ఆరు నెలలుగా అత్యాచారం చేసిన విషయం సాక్షి వెలుగులోకి తేవడంతో ఆ కుటుంబాన్ని ఊరి నుంచి పంపించివేశారు. ఆ బాలిక కుటుంబం టీడీపీ సానుభూతిపరులే అయినా ఆ పార్టీ నాయకులే అన్యాయం చేశారు. ఇంటర్ చదువుతున్న మరో గిరిజన విద్యార్థినిని ప్రేమ పేరుతో వేధించి దారుణంగా చంపేసినా పోలీసులు పట్టించుకోలేదు. వారి కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తున్న మా నాయకులు తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మీద అక్రమ కేసు నమోదు చేశారని మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆక్షేపించారు. -
బ్యాంకింగ్ మోసాలు @ రూ.36,014 కోట్లు
సాక్షి, అమరావతి: రుణ ఖాతాలు, డిజిటల్ పేమెంట్లకు సంబంధించి 2024–25 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ నేరాల విలువ 2023–24తో పోల్చిచూస్తే మూడు రెట్లు పెరిగింది. ఈ మోసాల విలువ రూ.12,230 కోట్ల నుంచి రూ.36,014 కోట్లకు ఎగసింది. భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గురువారం విడుదల చేసిన వార్షిక నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. ఇదే కాలంలో నేరాల సంఖ్య మాత్రం 36,060 నుంచి 23,953కు తగ్గింది. ఫ్రాడ్ క్లాసిఫికేషన్కు సంబంధించి 2023 మార్చి 27న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి, గత సంవత్సరాల్లో నివేదించిన రూ.18,674 కోట్ల విలువైన 122 కేసులను తిరిగి తాజా నేరాలుగా నమోదు చేయడం వల్ల మొత్తం నేరాల విలువ పెరిగిందని ఆర్బీఐ నివేదిక వివరించడం గమనార్హం. మొత్తం నేరాల సంఖ్యలో ప్రైవేటు బ్యాంకులకు సంబంధించినవి 60 శాతం ఉన్నాయి. కానీ విలువ పరంగా ప్రభుత్వ రంగ బ్యాంకులవి 71 శాతం కంటే ఎక్కువగా ఉందని నివేదిక తెలిపింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే..» నేరాల సంఖ్యలో ఎక్కువగా డిజిటల్ చెల్లింపుల (కార్డ్, ఇంటర్నెట్) కేటగిరీలో చోటుచేసుకున్నాయి. అయితే విలువ పరంగా చూస్తే లోన్ లేదా అడ్వాన్స్ ఖాతాల్లోనే ఎక్కువ నేరాలు జరిగాయి. » ప్రైవేట్ బ్యాంకుల్లో ఎక్కువగా కార్డ్, ఇంటర్నెట్ నేరాలు జరగ్గా, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లోన్ పోర్టుఫోలియోకి సంబంధించిన నేరాలు ఎక్కువ ఉన్నాయి. » మొత్తం కేసుల్లో లోన్ సంబంధిత నేరాలు 33 శాతానికి పైగా ఉండగా, మొత్తం నేరాల విలువలో 92 శాతం వాటాను కలిగి ఉన్నాయి.» 2024–25 చివరిలో కార్డ్, ఇంటర్నెట్ నేరాల కేటగిరీలో 13,516 కేసులు నమోదయ్యాయి. ఇవి మొత్తం 23,953 నేరాల్లో 56.5 శాతం.» రూ.లక్ష, అంతకంటే ఎక్కువ ఉన్న కేసుల వివరాలనే నివేదికలో పొందుపరచడం జరిగింది. » సంస్థలు తమ నివేదికలను సవరిస్తే ఈ డేటా మారే అవకాశం కూడా ఉంది. » నివేదికలో పేర్కొన్న మొత్తాన్ని ‘కోల్పోయిన నష్టం’గా పరిగణించడం సరికాదు. రికవరీల ఆధారంగా నష్టం తగ్గవచ్చు.భద్రత కోసం కొత్త డొమెయిన్లు..డిజిటల్ చెల్లింపుల్లో పెరుగుతున్న నేరాలపై పోరాటానికి ఒక వినూత్న ప్రయత్నంగా భారతీయ బ్యాంకుల కోసం ప్రత్యేకంగా ‘..bank.in’, నాన్–బ్యాంకుల కోసం ‘fin.in’ అనే ఇంటర్నెట్ డొమెయిన్లను ప్రవేశపెట్టే ప్రతిపాదనను రిజర్వ్ బ్యాంక్ చేసింది. ఈ ప్రయత్నం డిజిటల్ బ్యాంకింగ్పై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతుంది, సైబర్ మోసాలను గుర్తించడంలో అలాగే ఫిషింగ్ వంటి ప్రమాదకరమైన కార్యకలాపాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ (ఐడీఆర్బీటీ) ఈ డొమెయిన్లకు ప్రత్యేక రిజిస్ట్రార్గా వ్యవహరిస్తుందని, బ్యాంకుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2025–26 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమవుతుందని నివేదిక తెలిపింది. -
బాబు తొలి ఏడాది మోసాల ఖరీదు రూ.81,398 కోట్లు
చెరువు గట్టున మర్రి చెట్టు కింద వేటాడే సత్తువ లేని ఓ ముసలి పులి కూర్చొని ఉండేది. చేతితో బంగారు కడియం పట్టుకుని.. అటుగా వెళ్తున్న బాటసారులను బంగారు కడియం ఇస్తా నా వద్దకు రా అంటూ పిలుస్తూ ఉండేది. ఒక రోజున చెరువు గట్టుపై నుంచి వెళ్తున్న బాటసారిని ముసలి పులి నా వద్దకు రా అంటూ పిలిచింది. బాటసారి భయపడి పారిపోతుంటే.. ‘భయపడకు.. నా చేతిలో బంగారు కడియం చూశావా.. నీలాంటి పుణ్యాత్మునికి ఈ బంగారు కడియం ఇస్తే నాకు స్వర్గ లోక ప్రాప్తి కలుగుతుంది’ అంటూ ఆశ పెట్టింది. ‘నువ్వేమో క్రూర జంతువు.. నిన్నెలా నమ్మేది?’ అంటూ ఆ బాటసారి అనుమానం వ్యక్తం చేస్తే.. ఆ ముసలి పులి పక్కనే ఉన్న నక్క జోక్యం చేసుకుంటూ ‘పండు ముసలి పులి పరుగెత్తలేదు.. పళ్లూడిపోయాయి.. మాంసం తినడం ఎప్పుడో మానేసింది.. చెరువులో శుభ్రంగా స్నానం చేసి రా.. బంగారు కడియం తీసుకో’ అంటూ ఊరించింది.బంగారు కడియంపై ఆశపడ్డ బాటసారి.. నక్క చెప్పినట్టే చెరువులో స్నానం చేసి, మర్రి చెట్టు కింద కూర్చున్న ముసలి పులి వద్దకు వెళ్లాడు.. ముసలి పులి ఒక్కసారిగా బాటసారిపై పడి చంపేసి కడుపు నిండా తినేసింది.. మిగిలిపోయిన బాటసారి మాంసాన్ని నక్క తినేసింది. ఇదీ పంచతంత్రం నీతి కథ. ఈ కథ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితికి అద్దం పడుతోంది.ఎన్నికల్లో సూపర్ సిక్స్ సహా 143 హామీలను టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చారు. ఆ హామీల అమలు పూచీపత్రం ఇదిగో అంటూ ‘బాబు ష్యూరిటీృభవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో ఏటా పథకాల ద్వారా ఆ కుటుంబానికి ఒనగూరే లబ్ధిని వివరిస్తూ ఇంటింటా బాండ్లను పంపిణీ చేశారు. గత చరిత్రను చూసి చంద్రబాబును ప్రజలు నమ్మరేమో అనే భయంతో.. ఆ హామీల అమలు పూచీ నాదీ అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు.వైఎస్ జగన్ పథకాలను కొనసాగించడంతోపాటు రెండింతలు సంక్షేమం అధికంగా ఇస్తామంటూ చంద్రబాబు, పవన్ నమ్మబలికారు. ఆ మేరకు ఎల్లో మీడియా కూడా ఊదరగొట్టింది. ఆ హామీలతో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. అయితే తొలి ఏడాది సూపర్ సిక్స్లో ఒక్కటంటే ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు. మిగతా హామీలకు దిక్కే లేదు. ఆ హామీలన్నీ మోసాలుగా మిగిలాయి. సూపర్ సిక్స్, ఇతర పథకాల ద్వారా తొలి ఏడాది లబ్ధిని ప్రజలకు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఈ లెక్కన చంద్రబాబు మొదటి ఏడాది మోసాల ఖరీదు రూ.81,397.83 కోట్లు.సాక్షి, అమరావతి : సార్వత్రిక ఎన్నికల్లో సూపర్ సిక్స్ సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి.. ఓట్లేయించుకుని విజయం సాధించిన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. అయితే ఏరు దాటే వరకు ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న.. అనే సామెతను అవపోసన పట్టిన సీఎం చంద్రబాబు, అధికారం చేపట్టిన వెంటనే తన నైజాన్ని చాటిచెప్పారు. సూపర్ సిక్స్ సహా సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఎవరైనా ప్రశ్నిస్తే.. సంపద సృష్టించే రహస్యం చెవిలో చెప్పండి.. సంపద సృష్టించాక సంక్షేమం ఇస్తా.. అంటూ ఎదురు దాడికి దిగుతూ వచ్చారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఏడాదిలోనే రూ.1,58,604 కోట్లు అప్పు చేసి రికార్డు సృష్టించారు. అయినా సరే ఒక్కటంటే ఒక్క పథకాన్ని అమలు చేయకపోవడం గమనార్హం. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆడబిడ్డ నిధి, దీపం, ఉచిత బస్సు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్, నిరుద్యోగ భృతి, మత్స్యకార భరోసా, ఉచిత పంటల బీమా పథకాల కిందే రూ.81,397.83 కోట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. తద్వారా చంద్రబాబును నమ్మి ఓటేయడమంటే చంద్రముఖిని మళ్లీ నిద్రలేపడమేనని ఎన్నికల ప్రచారంలో ఓటర్లను అప్రమత్తం చేస్తూ నాటి సీఎం వైఎస్ జగన్ చెప్పిన మాటలు అక్షర సత్యమని నిరూపితమైందని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.అది మేనిఫెస్టో.. ఇది మాయఫెస్టో రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో నాలుగే నాలుగు పేజీలతో కూడిన మేనిఫెస్టోను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విడుదల చేశారు. అధికారంలోకి వచ్చాక ఆ మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించారు. తొలి ఏడాదే 95 శాతం హామీలు అమలు చేశారు. సంక్షేమ పథకాల ద్వారా తొలి ఏడాదే 3.58 కోట్ల మంది లబ్ధిదారులకు రూ.40,627 కోట్లను నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. ఐదేళ్ల పాలనలో రూ.2,73,756.17 కోట్లను డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో పేదల ఖాతాల్లో జమ చేశారు. నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1,84,604.32 కోట్ల ప్రయోజనాన్ని చేకూర్చారు. డీబీటీ, నాన్ డీబీటీ పథకాలు కలిపితే ఐదేళ్లలో పేదలకు మొత్తం రూ.4,58,360.49 కోట్ల ప్రయోజనం కలిగించారు. మేనిఫెస్టో అమలు అంటే ఇదీ అని నిరూపించారు. కానీ.. సూపర్ సిక్స్ సహా 143 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తొలి ఏడాది సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా మేనిఫెస్టోను మాయఫెస్టోగా మార్చారు. వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తామంటూ నమ్మబలికి, అంతకంటే రెండింతలు సంక్షేమం ఇస్తామని నమ్మించి ప్రజలను నట్టేట ముంచారు.మోసాలుగా మిగిలిన హామీలు » సూపర్ సిక్స్ పథకాల్లో ఆడబిడ్డ నిధి పథకం ఒకటి. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలు 2.07 కోట్ల మంది ఉన్నారు. ఇందులో 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు 1.80 కోట్ల మంది. వీరికి నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలను ఆడబిడ్డ నిధి కింద ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. మొదటి ఏడాది ఒక్క పైసా ఇవ్వలేదు. అంటే.. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు రూ.32,400 కోట్లు ఎగ్గొట్టారు. » దీపం పథకం కింద రాష్ట్రంలో 1,59,20,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సిలిండర్ ధర రూ.855. ఈ లెక్కన ఏడాదికి మూడు సిలిండర్లు ఇవ్వాలంటే.. రూ.4,083.48 కోట్లు అవసరం. కానీ.. తొలి ఏడాది ఒక సిలిండర్కు మాత్రమే రూ.865 కోట్లు మాత్రమే ఇచ్చారు. అంటే.. రూ.3,218.48 కోట్లు ఎగ్గొట్టారు.» మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీని అమలు చేయాలంటే నెలకు రూ.275 కోట్ల చొప్పున ఆర్టీసీకి ఇవ్వాలి. కానీ.. తొలి ఏడాది ఈ హామీని అమలు చేయలేదు. అంటే.. ఉచిత బస్సు రూపంలో మహిళలకు రూ.3,500 కోట్లు ఎగ్గొట్టారు. ఉచిత బస్సు సౌకర్యం అమలై ఉండింటే అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు మహిళలంతా అమరావతికి వెళ్లి చూసొచ్చే వారు. కడప, తిరుపతి, కర్నూలు తదితర ప్రాంతాల వాళ్లంతా విశాఖ నగరానికి వెళ్లొచ్చేవారు. వారి ఆశలు ఇప్పటి దాకా నెరవేర లేదు. » 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు పెన్షన్ ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు 20 లక్షల మంది ఉన్నారు. వారికి నెలకు రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.9,600 కోట్లు పెన్షన్ రూపంలో ఇవ్వాలి. కానీ.. తొలి ఏడాది పెన్షన్ ఇవ్వకుండా రూ.9,600 కోట్లు ఎగ్గొట్టారు.» తల్లికి వందనం పథకం కింద ఎంత మంది పిల్లలను బడికి పంపిస్తే అంత మంది పిల్లలకు రూ.15 వేల వంతున తల్లి ఖాతాలో జమ చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. యూడీఐఎస్ఈ (యునిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్–యూడైస్) గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 87,41,885 మంది పిల్లలు బడుల్లో చదువుతున్నారు. రూ.15 వేల వంతున వారికి ఏడాదికి రూ.13,112.82 కోట్లు ఇవ్వాలి. కానీ.. తొలి ఏడాది ఆ మేరకు ఇవ్వకుండా ఎగ్గొట్టారు.» 20 లక్షల మందికి ఉద్యోగాలు.. లేదా ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. తొలి ఏడాది నిరుద్యోగ భృతి జాడే లేదు. రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వారికి నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.7,200 కోట్లు ఎగ్గొట్టారు.» ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ పథకంతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక్కో రైతుకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయంగా అందిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉన్నారు. వారికి రూ.20 వేల చొప్పున ఇవ్వాలంటే ఏటా రూ.10,716.53 కోట్లు అవసరం. కానీ.. తొలి ఏడాది వాటిని ఇవ్వకుండా ఎగ్గొట్టారు.» వైఎస్ జగన్ అమలు చేస్తున్న ఉచిత పంటల బీమా పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. 2023–24లో పంటలు సాగు చేసిన రైతులకు బీమా ప్రీమియం చెల్లించకుండా ఎగ్గొట్టారు. దాంతో రైతులకు బీమా పరిహారం రూ.1,385 కోట్లు రాలేదు.» మత్స్యకారులకు వేట నిషేధ భృతి కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ.. మొదటి ఏడాది మత్స్యకారులకు వేట నిషేధ భృతి ఇవ్వకుండా రూ.265 కోట్లు ఎగ్గొట్టారు.సూపర్ సిక్స్ ఇచ్చేశా అంటూ హూంకరింపు కూటమి సర్కార్ రెండో ఏడాదిలోకి అడుగు పెట్టాక తల్లికి వందనం పథకం కింద 87,41,885 మందికి రూ.15 వేల వంతున ఇవ్వాల్సి ఉండగా 54,94,703 మందికి మాత్రమే రూ.13 వేల చొప్పున జమ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అంటే 32,47,182 మందికి ఎగనామం పెట్టి తల్లికి వందనం పథకాన్ని మహా మోసంగా మార్చారు. ఈ పథకంపై మీడియాతో మాట్లాడుతూ పీృ4కు ఆడబిడ్డ నిధి, స్కిల్ డెవలప్మెంట్కు నిరుద్యోగ భృతి అనుసంధానం చేశానని.. 20న అన్నదాత సుఖీభవ, ఆగస్టు 15న ఉచిత బస్సు పథకాలను అమలు చేస్తానని చెప్పుకొచ్చారు. మొత్తంగా సూపర్ సిక్స్ అమలు చేసేశానని, ఇంకెవరైనా దీని గురించి మాట్లాడితే నాలుక మందం తప్ప మరోటి కాదంటూ హూంకరించారు. 32,400 కోట్లు18 నుంచి 59 ఏళ్లలోపు మహిళలకు ఏటా రూ. 18 వేల చొప్పున ఎగ్గొట్టిన ఆడబిడ్డ నిధి లబ్ధిదారులు 1.80కోట్లు3,218.48 కోట్లుదీపం2 పథకం కింద మహిళలకు టోకరాలబ్ధిదారులు 1.59 కోట్లు13,112.82 కోట్లుతల్లికి వందనం పథకం కింద మహిళలకు రూ. 15 వేల చొప్పున టోపీలబ్ధిదారులు 87,41,8851,385 కోట్లుపంటల బీమా పరిహారం చెల్లించకుండా రైతులకు కలిగించిన నష్టం లబ్ధిదారులు53 లక్షలు9,600 కోట్లు50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు నెలకు రూ. 4 వేలు చొప్పున ఇవ్వని పింఛన్ సొమ్ము లబ్ధిదారులు 20 లక్షలు10,716.53 కోట్లుఅన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు రూ. 20 వేల చొప్పున అన్యాయం లబ్ధిదారులు 53,58,266265 కోట్లుమత్స్యకారులకు వేట నిషేధ భృతి కింద రూ. 24 వేల చొప్పున తొలి ఏడాది ఎగవేసిన మొత్తం 7,200 కోట్లునిరుద్యోగ భృతి కింద యువతకు రూ. 36 వేల చొప్పున దగాలబ్ధిదారులు 20 లక్షలు3,500 కోట్లుఉచిత బస్సు కింద మహిళలకు మోసం లబ్ధిదారులు 2.7 కోట్లు -
మిడిమిడి జ్ఞానమా.. అతి తెలివా!?
సాక్షి, అమరావతి : ‘ప్రజా జీవితంలో ఉండేవారు ఏదైనా మాట్లాడేటప్పుడు కొంతైనా తెలుసుకోవాలి, లేదా అన్నీ తెలిసిన వారిని పక్కన పెట్టుకోవాలి. అదీ సాధ్యం కానప్పుడు తెలిసిన వారు చెప్పింది విని అర్థం చేసుకుని మాట్లాడాలి. వీటిలో ఏ ఒక్కటీ చేయని వ్యక్తి కీలక విద్యా శాఖ మంత్రిగా ఉండడం రాష్ట్ర ప్రజల దురదృష్టం’ అని విద్యా రంగ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్ని పాఠశాలలు ఉన్నాయో.. వాటిలో ఎంత మంది విద్యార్థులున్నారో తెలియకుండా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడి నవ్వుల పాలవడం లోకేశ్కు కొత్తేం కాదని ప్రజలు అంటున్నారు. శుక్రవారం పాత్రికేయుల సమావేశంలో విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్.. యూడైస్పై మాట్లాడిన తీరు చూస్తుంటే విద్యా రంగంపై ఆయనకు కనీస అవగాహన లేదని స్పష్టమైందని సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అయ్యాయి. ‘యూడైస్ ప్లస్’లో అంగన్వాడీ పిల్లలను కూడా లెక్కిస్తారని చెప్పి తన అజ్ఞానాన్ని ప్రదర్శించారంటున్నారు. ‘యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్’.. సంక్షిప్తంగా యూడైస్ ప్లస్గా పేర్కొనే వెబ్సైట్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది.యూడైస్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులతో పాటు, ఉపాధ్యాయుల డేటాను ఏటా అప్లోడ్ చేస్తారని విద్యా రంగ నిపుణులు చెబుతున్నారు. పైగా ఇందులో నమోదు చేసే వివరాలన్నీ ఆయా జిల్లా కలెక్టర్లు స్వయంగా పరిశీలించిన తర్వాతే అప్లోడ్ చేస్తారు. చిల్లరమల్లర వివరాలను ఇందులో నమోదు చేయరు. పైగా అన్ని వివరాలను ఒకటికి పదిసార్లు పరిశీలించిన తర్వాతే డేటాను నమోదు చేస్తారు. ప్రతి విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ (1–12) వరకు చదివే విద్యార్థుల వివరాలు మాత్రమే ఇందులో ఉంటాయని, అంగన్వాడీ పిల్లల వివరాలు నమోదు చేయలేదని యూడైస్ ప్లస్ నివేదికలోనే పేర్కొన్నారు. కావాలంటే రిపోర్టులోని పేజీ నంబర్ 10లో చూస్తే అవగాహన వస్తుందంటున్నారు. యూడైస్ ప్లస్ డేటా ప్రకారం 2023–24 విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో వివిధ మేనేజ్మెంట్ పాఠశాలలు 61,373 ఉన్నాయి. వీటిలో 87,41,885 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ వివరాలు ఇదే రిపోర్టులోని 30వ పేజీలో ఉంది. ఈ కనీస వివరాలు కనుక్కోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడటం మంత్రిగా తగదని, అయినా లోకేశ్ సంగతి తెలిసిందే కదా అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. లోకేశ్ సెల్ఫ్ గోల్ విద్యాశాఖ మంత్రి లోకేశ్కు పరిపక్వత లేదు. నన్ను విమర్శించే స్థాయి అంతకంటే లేదు. యూడైస్ డేటాను తెలుసుకోవడానికి వంద రోజుల సమయం పట్టిందంటే ఆయనకు ఏ మాత్రం జ్ఞానం ఉందో అర్థమవుతోంది. పదో తరగతి పేపర్ల మూల్యాంకనం తప్పుల తడకగా నిర్వహించినప్పుడే విద్య శాఖ మంత్రిగా లోకేశ్ ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు యూడైస్ డేటా పేరుతో ప్రతిపక్షంపై బురద చల్లాలని సెల్ఫ్గోల్ వేసుకున్నారు. యూడైస్ డేటాను కలెక్టర్లు స్వయంగా ఆమోదిస్తారు. ఏ లెక్కలు పడితే.. అవి ఇందులో చేర్చడానికి కుదరదు. ఇంగిత జ్ఞానం లేని లోకేశ్కు ఈ విషయాలు ఏమీ తెలియవు. అసలు లోకేశ్ను కాదు.. ఆయన్ను విద్య శాఖ మంత్రిని చేసిన చంద్రబాబును అనాలి. కొడుకుపై ప్రేమ ఉంటే ఇంకేమైనా చేసుకోవాలి గానీ విద్యార్థులపై బలవంతంగా రుద్దడం దురదృష్టకరం. – బొత్స సత్యనారాయణ, రాష్ట్ర విద్యా శాఖ మాజీ మంత్రినీ బుద్ధి గడ్డి తినిందా లోకేశ్?లోకేశ్కు ఏపాటి అక్షర జ్ఞానం ఉందో దేశం మొత్తానికి తెలుసు. ఏడాది కాలంలో విద్యా శాఖను భ్రష్టు పట్టించారు. ఎక్కడైనా అంగన్వాడీ పిల్లలను యూడైస్లో నమోదు చేస్తారా? నువ్వు మంత్రివా? చదువు సంధ్యలు సరిగా అబ్బలేదు. కనీసం ప్రెస్మీట్కు వచ్చే ముందైనా నీ అధికారులను అడిగితే చెబుతారు కదా! తల్లికి వందనం కింద రూ.15 వేలు ఇస్తామని చెప్పి రూ.2 వేలు కోత పెడుతున్నావు? దీనిపై గతంలో నువ్వు విమర్శలు చేయలేదా? ఇప్పుడు నీ బుద్ధి గడ్డి తింటోందా? కలెక్టర్ స్వయంగా ఆమోదించిన డేటాలో తప్పులు ఉన్నాయని ఎలా అంటావు? సరే.. ఒక్కటైనా నిరూపించావా? – ఆదిమూలపు సురేశ్,రాష్ట్ర విద్యా శాఖ మాజీ మంత్రి -
అంత ఉలుకెందుకు లోకేశ్!?
సాక్షి, అమరావతి :తల్లికి వందనం పథకం అమలుతీరుపై వెల్లువెత్తుతున్న విమర్శల నేపథ్యంలో వైఎస్సార్సీపీని ఉద్దేశించి మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ ఘాటుగా బదులిచ్చింది. మంత్రి సవాల్కు ప్రతి సవాల్ కూడా చేస్తూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కౌంటర్ ఇచ్చింది. వైఎస్సార్సీపీ స్పందన ఏమిటంటే..‘‘నారా లోకేశ్.. యూడైస్ నివేదిక 2023–24 ప్రకారం రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకూ చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్య మొత్తం 87,41,885 మంది. ఆ రిపోర్టును జతచేస్తున్నాం. కానీ మీరు అంగన్వాడీ పిల్లలను కలిపారని అంటున్నారు. మీ వ్యాఖ్యలను ఈ నివేదిక సమర్థించడంలేదు. దీనికి సమాధానం ఏంటి? పైగా ఆనాటి విద్యాశాఖ మంత్రికి బేసిక్స్ కూడా తెలియవంటూ అవమానకరంగా, హేళనచేస్తూ మాట్లాడ్డం సంస్కార హీనం’’.. అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ సమాచారానికి సంబంధించిన పేపర్లు, వీడియో క్లిప్పింగ్స్లు జతచేసింది. నువ్వు చేసిన ప్రచారానికి మేం ఎన్ని కేసులు పెట్టాలి?‘‘మీ తప్పుల్ని ఎత్తిచూపినా, నీ అబద్ధాలను ఎండగడుతున్నా తట్టుకోలేక అధికార అహంకారంతో బెదిరించడం మీకు అలవాటైంది. అమ్మఒడి నుంచి టాయిలెట్ మెయింటెనెన్స్, ఇతర మెయింటెనెన్స్ పేరు చెప్పి వైఎస్ జగన్మోహన్రెడ్డి డబ్బులు లాగేస్తున్నారని గతంలో మీరు చెప్పిన సిద్ధాంతమే లోకేశ్. అప్పుడు ఎన్నికల్లో నువ్వు చేసిన ప్రచారాన్ని ఇప్పుడు మేం చెప్తుంటే అంత ఉలుకెందుకు? అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ని అనకూడని మాటలు కూడా అన్నావు. నువ్వు చేసిన ప్రచారానికి మేం ఎన్ని కేసులు పెట్టాలి? అప్పట్లో స్వయంగా నువ్వు ఏమన్నావో ఒక్కసారి విను’’.ఆ రోజుల్లో మీ వేదన అంతా ఇంతా కాదు..‘‘వైఎస్సార్సీపీ హయాంలో టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ గురించి మీరు, మీకు వత్తాసు పలుకుతూ నిరంతరం అబద్ధాలు వండివార్చే మీ పార్టీ కరపత్రం ఈనాడు రాసిన ఒక కథనాన్ని ప్రస్తావిస్తూ మీరు చేసిన పోస్టు ఇది. వెయ్యి రూపాయలు ఏమయ్యాయో తెలియదంటూ పాపం ఆ రోజుల్లో మీరు పడ్డ ఆవేదన అంతా ఇంతా కాదు. మరి దీనికి ఎవరిపై కేసులు పెట్టాలి? మీ పార్టీ సోషల్ మీడియాను నడిపిన మీపైనా? ఏనాడూ నిజం చెప్పని ఈనాడుపైనా? లేక ఇద్దరిపైనా? లేకపోతే ఆ పోస్టు చేసింది మా పార్టీ కాదని మళ్లీ అదే ఎల్లో మీడియాతో రాయిస్తావా? అంతటి ఘనుడివే నువ్వు’’.. అంటూ శుక్రవారం వైఎస్సార్సీపీ ట్వీట్ చేసింది. -
ఒకేసారి 72 వేల మంది బదిలీ
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒకేచోట ఐదేళ్లుగా పనిచేస్తున్న 72 వేల మందికి పైగా ఉద్యోగులకు స్థానచలనం తప్పదు. దాదాపు 80 వేల మంది సచివాలయాల ఉద్యోగులకు ఈ విడతలో బదిలీలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఒకేచోట ఐదేళ్లు పూర్తిచేసుకున్న ఉద్యోగులు బదిలీకి దరఖాస్తు చేసుకోకపోయినా వారు బదిలీకాక తప్పదు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఈ బదిలీల ప్రక్రియ జరగనున్నట్లు అధికారులు చెప్పారు. మరోవైపు.. రిక్వెస్టు బదిలీలకు దరఖాస్తు చేసుకోవడానికి శనివారం ఉదయం నుంచి ప్రత్యేక వెబ్పోర్టల్ అందుబాటులోకి రానున్నట్లు అధికారులు చెప్పారు. 70 శాతానికి పైగా బదిలీ.. ప్రస్తుతం 1.09 లక్షల మంది ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నారు. వీరిలో ఈ ఏడాది 70 శాతం మందికి పైగా స్థానచలనం ఉంటుందని అధికారులు స్పష్టంచేస్తున్నారు. ఈనెల 30లోగా ఈ బదిలీల ప్రక్రియను పూర్తిచేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు స్పష్టంచేస్తూ బదిలీ మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కార్యదర్శి కె. భాస్కర్ గురువారం ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ఆఫ్లైన్ విధానంలోనే బదిలీల ప్రక్రియ.. ఈసారి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీల ప్రక్రియను ఆన్లైన్ విధానంలో కాకుండా ఆఫ్లైన్లో చేపట్టాలని టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. గతంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలను నాటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా ఆన్లైన్ విధానంలో చేపట్టింది. అయితే, ఇప్పుడు ఒకే విడతన దాదాపు 80 వేల మందిని ఆఫ్లైన్లో చేపట్టాలని నిర్ణయించడమంటే, భారీగా పైరవీలకు తెరలేపినట్లేనని సచివాలయాల ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫార్సులకే పెద్దపీట వేసే అవకాశముందని.. దీనివల్ల ఉద్యోగులు రాజకీయ ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. -
పీహెచ్సీల్లో ఉచిత మందులు కరవు
చంద్రబాబు ఏడాది పాలనలో రాష్ట్రంలో ప్రజారోగ్య పరిరక్షణ వ్యవస్థ కుప్పకూలింది. వ్యాధుల వ్యాప్తిని నియంత్రించడంతో పాటు, ప్రజారోగ్య పరిరక్షణలో అత్యంత కీలకమైన పీహెచ్సీల్లో (ప్రైమరీ హెల్త్ సెంటర్) మందులకు తీవ్ర కొరత నెలకొంది. వైద్యం కోసం పీహెచ్సీలకు వెళ్లిన వారిలో సగం మందికి పైగా రోగులకు ఉచిత మందులను ప్రభుత్వం అందించలేకపోతోంది. ఈ విషయం ప్రభుత్వం నిర్వహించిన తాజా ఐవీఆర్ఎస్ సర్వేలోనే వెల్లడైంది. ఉమ్మడి 13 జిల్లాల వారీగా చేపట్టిన సర్వేలో ఏకంగా 43 నుంచి 55 శాతం మంది రోగులు ఉచిత మందులు అందలేదని స్పష్టం చేశారు. అదే విధంగా పీహెచ్సీల్లో అందుతున్న వైద్య సేవలపైనా 40 శాతం వరకూ రోగులు అసంతృప్తిగా ఉన్నారు. –సాక్షి, అమరావతిసీఎం సొంత జిల్లాలో అధ్వాన్నంఏడాది పాలనలో ఆరోగ్య శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకుని వచ్చినట్టు కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. అయితే క్షేత్ర స్థాయిలో ఈ పరిస్థితి కనిపించడం లేదు. నిబంధనల ప్రకారం పీహెచ్సీల్లో 200 రకాలకు పైగా ఉచిత మందులు అందుబాటులో ఉండాల్సి ఉండగా, సగానికిపైగా మందులను ప్రభుత్వం సరఫరా చేయడం లేదు. ఫలితంగా ఎక్కువ సంఖ్యలో రోగులు మందులను బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది.స్వయంగా సీఎం చంద్రబాబు సొంత ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 48 శాతం మంది రోగులకు ఉచిత మందులు అందలేదని వెల్లడైంది. ఇక వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి అనంత జిల్లాలో ఏకంగా 55 శాతం మంది రోగులు తమకు ఉచిత మందులు అందలేదని ఆవేదన వ్యక్తం చేసినట్టు తేలింది. ఇక పీహెచ్సీల్లో అందుతున్న వైద్య సేవల విషయంలో చిత్తూరు జిల్లాలో 36 శాతం, అనంతపురం జిల్లాలో 40 శాతం మంది రోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. -
వారాహి ఆలయ ధ్వంసంపై కేసు నమోదు
సాక్షి, టాస్క్ఫోర్స్: తిరుపతి జిల్లా తిరుచానూరు సమీపంలోని శ్రీ ఆది వారాహి అమ్మవారి ఆలయం ధ్వంసంపై హిందూ సంఘాలు, రాజకీయ పార్టీల నిరసనలతో ఎట్టకేలకు పోలీసులు స్పందించారు. ఈ ఘటనపై ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితం కావడంతో బాధితుల ఫిర్యాదు మేరకు రామిరెడ్డి, మణిరెడ్డి, హేమాద్రితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. అనంతరం ఆ ముగ్గురినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా, న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. అయితే ప్రధాన నిందితుడైన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరుడు కిషోర్ రెడ్డిపై కేసు నమోదు చేయక పోవడం పట్ల స్థానికుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పెద్దలు పోలీసులపై ఒత్తిడి తెచ్చి, నామమాత్రపు సెక్షన్లతో కేసు పెట్టడం వల్లే ముగ్గురి ఇలా అరెస్ట్ చేయడం.. అలా బెయిల్ మంజూరు చేసి పంపడం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో ఎవరిపై చర్యలు తీసుకోకపోయినా.. తీసుకున్నట్లు కనిపించాలని పై స్థాయి నుంచి ఆదేశాలు వచి్చనట్లు సమాచారం. అందువల్లే తూతూ మంత్రపు చర్యలతో పోలీసులు ప్రజలను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ‘నన్నెవరూ ఏమీ చేయలేరు. నాని అన్న మంత్రి లోకేశ్తో మాట్లాడాడు. వాళ్లేం చేస్తారో చేసుకోని.. మనం చేసేది చేద్దాం’ అని ఆలయం కూల్చివేతలో కీలక నిందితుడు తన సన్నిహితులతో చెప్పినట్లు తెలిసింది. కాగా, ఈ ఘటనపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుండటంతో ఆలయాన్ని నేలమట్టం చేసిన ప్రాంతాన్ని శుక్రవారం ఉదయం ఎస్ఐ జగన్నాథరెడ్డి పరిశీలించారు. కూటమి నాయకుల దాడిలో శిథిలమైన విగ్రహాలు, ఉత్సవమూర్తులను పోలీసు స్టేషన్కు తరలించారు. దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఫణిరాజశయన ఆలయ ధ్వంసం ప్రాంతాన్ని సందర్శించి, ఆలయ ఉపచారకులు శ్రీమహారుద్ర వారాహి స్వామిని అడిగి వివరాలను నమోదు చేసుకున్నారు. ప్రభుత్వం తరఫున ఆలయ నిర్మాణానికి సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.కాగా, విజయవాడకు చెందిన జై భారత్ హిందూ సంఘానికి చెందిన సభ్యులు ఘటనా స్థలి వద్దకు వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నప్పటికీ కూటమి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత పెద్ద ఘటనలో నిందితులకు వెంటనే బెయిల్ మంజూరు కావడంపై హిందూ సంఘాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. పాకిస్తాన్లో ఉన్నామా? చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి హిందువులపై ఎందుకు ఇంత విద్వేషమని హిందూ సంఘ ప్రతినిధి చీనేపల్లి కిరణ్ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత్లోనే ఉన్నామా.. లేక పాకిస్తాన్లో ఉన్నామా అని అనుమానం కలుగుతోందన్నారు. ఎమ్మెల్యే నాని అనుచరుడు కిషోర్ రెడ్డి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని చెబుతున్నా ప్రభుత్వం స్పందించక పోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యే నాని ధ్వంసమైన ఆలయాన్ని పరిశీలించక పోవడం శోచనీయమన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఈ ఘటనపై స్పందించక పోవడం పట్ల హిందువులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం తూతూ మంత్రపు చర్యలతో సరిపెడితే హిందూ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం తప్పదని స్పష్టం చేశారు. -
విద్యుత్ కొనుగోలు ధరలు ఖరారు!
సాక్షి, అమరావతి: విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి డిస్కంలు కొనుగోలు చేసే విద్యుత్కు చెల్లించాల్సిన ధరలను డిస్కంలు ఖరారు చేశాయి. యూనిట్ సగటు ధర రూ.4.99గా ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు నిర్ణయించాయి. ఈ మేరకు 2023–24లో కొన్న ధరనే 2024–25కు వర్తింపజేయాలంటూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)ని కోరుతూ పిటిషన్లు దాఖలు చేశాయి. ఆ వివరాలను కమిషన్ తన వెబ్సైట్ ద్వారా శుక్రవారం అధికారికంగా వెల్లడించింది. డిస్కంల ప్రతిపాదన ప్రకారం.. ఇళ్లపైన సోలార్ రూఫ్టాప్ ఏర్పాటుచేసుకుని నెట్ మీటరింగ్ ద్వారా మిగులు విద్యుత్ను డిస్కంలకు అందిస్తున్న వారికి పూల్డ్కాస్ట్ ధర యూనిట్కు రూ.4.60 లభిస్తుంది. అదే విధంగా.. సెంట్రల్ గ్యాస్ స్టేషన్లు, ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్లు, ఏపీ జెన్కో థర్మల్, హైడల్ వంటి ఉత్పత్తి కేంద్రాలకు చెల్లించాల్సిన పూల్డ్కాస్ట్ ధరను కూడా డిస్కంలు ఖరారుచేసి ఏపీఈఆర్సీకి సమరి్పంచాయి. -
హంద్రీనీవా విస్తరణ పనుల్లో నాణ్యత డొల్ల
కర్నూలు సిటీ/పత్తికొండ రూరల్ : హంద్రీనీవా కాలువ విస్తరణ పనుల్లో డొల్లతనం బట్టబయలైంది. పనుల్లో నాణ్యతతో ఇటీవల కురిసిన వర్షాలకు ప్రధాన కాలువ లైనింగ్ దెబ్బతిని గండి పడడంతో కర్నూలు, అనంతపురం కడప, చిత్తూరు జిల్లాలోŠల్ 6.05 లక్షల ఎకరాలకు సాగు, 33 లక్షల మందికి తాగునీటిని అందించేందుకు హంద్రీనీవాను చేపట్టారు. ఈ కాలువ సర్కిల్–1 పరిధిలో 216 కి.మీ వరకు ఉంది. ఇందులో కర్నూలు జిల్లాలో 0 కి.మీ నుంచి 134 కి.మీ వరకు ప్రవహిస్తుంది.ఏటా 40 టీఎంసీల నీటిని శ్రీశైలం వెనుక జలాల నుంచి (బ్యాక్వాటర్) ఈ కాలువ ద్వారా తరలించాలనేది లక్ష్యం. అందుకు కాలువను 3,850 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించారు. అయితే, ఏటా నీటి ప్రవాహంతో కాలువలో పూడిక పేరుకుపోతుండటంతో ప్రవాహ సామర్థ్యం తగ్గిపోతోంది. ఈ కారణంగా 40 టీఎంసీలలో 60 శాతం నీటిని కూడా తరలించలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రధాన కాలువను విస్తరించాలని జల వనరుల శాఖ నిర్ణయించింది. రెండు ప్యాకేజీలుగా సుమారు రూ.601 కోట్లతో అంచనాలు వేశారు. ప్యాకేజీ–1 కింద రూ.171 కోట్లు, ప్యాకేజీ–2లో రూ.430 కోట్లతో టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టారు. 60 శాతం పనులు పూర్తయ్యాయి. ఇంతలో పత్తికొండ సమీపంలోని పందికొన గ్రామం 108 కి.మీ దగ్గర ప్రధాన కాలువకు గండిపడి లైనింగ్ దెబ్బతింది. దీనికి కారణం కాల్వ పక్కన ఉండే వాగులో నుంచి నీరు రావడమేనని ఇంజనీర్లు చెబుతున్నారు. కానీ, కాల్వ విస్తరణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంవల్లే లైనింగ్ దెబ్బతిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.విస్తరణ పనుల్లో నాణ్యతపై అనుమానాలు..హంద్రీనీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని పెంచే పనులు ఈనెల 10లోపు పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో కాంట్రాక్టర్లు హడావుడిగా పనులుచేస్తూ నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే కాలువకు గండిపడి లైనింగ్ దెబ్బతినింది. నిజానికి.. అక్కడ నాణ్యమైన బంక మట్టివేసి రోలింగ్ చేశాకే లైనింగ్ చేయాలి. కానీ, నాణ్యతలేని నల్లమట్టి వాడడంవల్లే ఇటీవలి వర్షాలకు సిమెంట్ లైనింగ్ దెబ్బతినిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయంపై హంద్రీనీవా ఎస్ఈ పాండురంగయ్యను వివరణ కోరగా.. కాలువకు ఎలాంటి ప్రమాదంలేదని, కాల్వ పక్కనున్న వంక నీరు కాల్వగట్టుపై నుంచి రావడంతోనే సిమెంట్ కాంక్రీట్ ఊడిపోయిందన్నారు. -
ఉపరితల ఆవర్తనంతో భారీ వర్షాలు
సాక్షి, అమరావతి/మహారాణిపేట(విశాఖ): ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగలలో 4.8, అన్నమయ్య జిల్లా గుండ్లపల్లిలో 4.4, విజయనగరం జిల్లా గుల్లసీతారామపురంలో 4.0, నంద్యాల జిల్లా చౌతకూరులో 3.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకూ 24 గంటల వ్యవధిలో తిరుపతి జిల్లా తడలో అత్యధికంగా 8.3 సెంటీమీటర్ల వర్షం పడింది. నాగలాపురంలో 7.9 సెంటీమీటర్లు, పల్నాడు జిల్లా మాచర్లలో 7.1, తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మలకచర్లలో 6.7, చిత్తూరు జిల్లా యాదమర్రిలో 6.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉపరితల ఆవర్తనం శుక్రవారానికి ఉత్తర కర్ణాటక దానికి ఆనుకుని ఉన్న తెలంగాణ, రాయలసీమ మీదుగా సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. మరో ద్రోణి పశ్చిమ–మధ్య అరేబియా సముద్రం నుంచి దక్షిణ ఒడిశా తీరం వరకు కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో శనివారం రాష్ట్రవ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణంతో పాటు కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. -
ఎడాపెడా అక్రమ అరెస్టులపై చెంపదెబ్బ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పౌరులు, మేధావులు, పాత్రికేయుల వాక్ స్వాతంత్య్ర హక్కును హరిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. వాక్ స్వాతంత్య్ర హక్కును కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని తేల్చిచెప్పింది. సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ను తప్పుపట్టింది. లైవ్ షోలో ఓ ప్యానలిస్ట్ చేసిన వ్యాఖ్యలపై నవ్వినందుకు కొమ్మినేనిని అరెస్ట్ చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. ‘‘నవ్వడం నేరమా? దానికే అరెస్ట్ చేసేస్తారా?’’ అంటూ మండిపడింది. నవ్వడమే తప్పయితే, తాము కూడా ప్రతి రోజూ నవ్వుతూనే కేసులను విచారణ చేస్తుంటామంటూ గుర్తు చేసింది. లైవ్ షోలో ప్యానలిస్ట్ వ్యాఖ్యలకు కొమ్మినేని శ్రీనివాసరావు నవ్వారే తప్ప, ఆయన ఎలాంటి అనుచిత, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేసింది. ఓ జర్నలిస్టుగా లైవ్ న్యూస్ షోలో పాల్గొనే కొమ్మినేని హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని, తద్వారా ఆయన వాక్ స్వాతంత్య్ర హక్కును కూడా పరిరక్షించినట్లవుతుందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు ఈ నెల 8న నమోదు చేసిన కేసులో కొమ్మినేని శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. బెయిల్ మంజూరు సందర్భంగా షరతులు విధించాలని కింది కోర్టుకు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.అరెస్ట్... రిమాండ్ను సవాల్ చేసిన కొమ్మినేనికొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించే కేఎస్సార్ లైవ్ షోలో పాల్గొన్న మరో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు అమరావతి రాజధాని గురించి పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో కృష్ణంరాజు, కొమ్మినేనిపై టీడీపీకి చెందిన కంభంపాటి శిరీష ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కొమ్మినేని, కృష్ణంరాజుపై ఐటీ చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. తర్వాత పోలీసులు కొమ్మినేని శ్రీనివాసరావును హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ఆయనను మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో కొమ్మినేని తన అరెస్ట్, రిమాండ్ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. కొమ్మినేని తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ దవే, పొన్నవోలు సుధాకర్రెడ్డి, అల్లంకి రమేశ్ వాదనలు వినిపించారు. » ఈ నెల 6న కొమ్మినేని లైవ్ షో నిర్వహించారని, అందులో ప్యానలిస్ట్గా పాల్గొన్న మరో సీనియర్ జర్నలిస్ట్ అమరావతి గురించి వ్యాఖ్యలు చేశారని సిద్ధార్థ దవే ధర్మాసనానికి వివరించారు. ఈ వ్యాఖ్యలతో కొమ్మినేనికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆయన ఎవరి మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయలేదని నివేదించారు. ప్యానలిస్ట్ వ్యాఖ్యలకు.. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వ్యక్తిని బాధ్యుడిగా చేయడానికి వీల్లేదని పేర్కొన్నారు.మరొకరు చేసిన వ్యాఖ్యలకు యాంకర్ను ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించిన జస్టిస్ మన్మోహన్... అలా అదుపులోకి తీసుకునేందుకు చట్టం అనుమతిస్తుందా? అని ప్రశ్నించారు. ఏ నిబంధన మేరకు అరెస్టు చేశారో చెప్పాలని ఏపీ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ్ లూథ్రాలను ప్రశ్నించారు. చర్చలో ఆ వ్యక్తి చేసిన వ్యాఖ్యలకు కొమ్మినేని నవ్వారని, ఈ విషయంలో ప్రేక్షక పాత్ర పోషించారని వివరించారు. ఆయన మాట్లాడేటప్పుడు అడ్డుకోకుండా నవ్వారని రోహత్గీ బదులిచ్చారు. ఈ వాదనపై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. నవ్వడం నేరమా? నవ్వితే అరెస్ట్ చేస్తారా? అంటూ నిలదీసింది. ఎవరైనా నవ్వొచ్చేలా మాట్లాడితే ధర్మాసనంపై ఉన్న తాము కూడా నవ్వుతామన్న జస్టిస్ మన్మోహన్.. అంతమాత్రాన తప్పుడు కేసులు అంటగట్టేస్తారా? అని ప్రశ్నించారు. జస్టిస్ మిశ్రా ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తూ... ప్రతి రోజూ ఇలా జరుగుతూనే ఉంటుందని అన్నారు. కొమ్మినేని చర్చలో ప్రేక్షకుడు కాదని రోహత్గీ చెప్పగా... ఆయన ఆ వ్యాఖ్యలు చేయలేదు కదా? అని జస్టిస్ మిశ్రా అసహనం వ్యక్తం చేశారు. పిటిషనర్ స్వయంగా ఎటువంటి పరువు నష్టం కలిగించే, అవమానకర వ్యాఖ్యలు చేయలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. లైవ్ షోలో ఆయన పాత్రికేయ భాగస్వామ్యం రక్షణకు అర్హమైనదని, ఇది వాక్ స్వాతంత్య్ర హక్కును కాపాడుతుందని తెలిపింది. కొమ్మినేని అరెస్ట్ ఎంతమాత్రం సహేతుకం కాదంటూ ఆయనను బెయిల్పై విడుదల చేయాలని ఆదేశించింది. ట్రయల్ కోర్టు విధించే నిబంధనలు, షరతులకు లోబడి ఈ నెల 8న నమోదు చేసిన ఎఫ్ఐఆర్ నంబర్ 108లో కొమ్మినేనిని బెయిల్పై విడుదల చేయాలని నిర్దేశించింది. తాను నిర్వహించే షోలో కొమ్మినేని ఎలాంటి పరువు నష్టం వ్యాఖ్యలు చేయడానికి వీల్లేదని, ఇతరులను అలాంటి ప్రకటనలు చేయడానికి అనుమతించడం గానీ చేయొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
సుప్రీంకోర్టు ఆదేశాలు చంద్రబాబుకు పెద్ద చెంపపెట్టు
సాక్షి, అమరావతి: ‘సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు పెద్ద చెంపపెట్టు’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ అభివర్ణించారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ ‘ఎక్స్’ వేదికగా శుక్రవారం ఆయన పోస్టు చేశారు. ‘నిరంకుశంగా, అప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు సుప్రీంకోర్టు గట్టిగా బుద్ధిచెప్పింది.కొమ్మినేని అరెస్టు ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛకు తీవ్ర భంగకరమని సుప్రీంకోర్టు చెప్పడం ముదావహం’ అని పేర్కొన్నారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ‘అమరావతి నిర్మాణం పేరిట రూ.వేల కోట్ల అవినీతి నుంచి, తన పాలనా వైఫల్యాల నుంచి, క్షీణించిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులపై తీవ్రంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించడానికి తన ఎల్లో ముఠాతో కలిసి చంద్రబాబు కృత్రిమ వివాదాన్ని సృష్టించారు.అబద్ధాలు, మోసాలతో కూడిన పాలన నుంచి మళ్లించడానికి, చేయని వ్యాఖ్యలను కొమ్మినేనికి ఆపాదించి, దానిచుట్టూ తన ఎల్లో గ్యాంగ్ ద్వారా పథకం ప్రకారం విష ప్రచారం చేయించారు. వాటిని పట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా రౌడీయిజం చేశారు. ఆస్తులను ధ్వంసం చేశారు. మహిళల నిరసన పేరుతో ఒక ముసుగు వేసుకుని ‘సాక్షి’ మీడియా యూనిట్ ఆఫీసుల మీద, కార్యాలయాల మీద అరాచకంగా దాడులు చేయించారు. మీడియా స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని కాలరాశారు. చంద్రబాబు తన తప్పు తెలుసుకోకుండా ఇంకా ఆ వ్యాఖ్యలను వైఎస్సార్సీపీకి, ‘సాక్షి’ మీడియాకు ఆపాదిస్తూ జుగుప్సాకరంగా మాట్లాడడంతోనే ఆయన రాజకీయ లబ్ధి కోసం ఈ కుట్ర పన్నారని అర్థం అవుతోంది. విశ్లేషకుడి వ్యాఖ్యలతో యాంకర్గా వ్యవహరించిన కొమ్మినేనికి ఏం సంబంధం అంటూ ఇవాళ సుప్రీంకోర్టు ఇచి్చన ఆర్డర్ చంద్రబాబు కుట్రను బద్దలు చేసింది, ఎండగట్టింది. తద్వారా ఆంధ్రప్రదేశ్లో అక్రమ అరెస్టుల అంశం మరోసారి దేశం దృష్టికి వెళ్లింది. వక్రీకరణలు, అబద్ధాలు ఎల్లకాలం చెల్లుబాటుకావు. సత్యమేవ జయతే’ అని పేర్కొన్నారు. చంద్రబాబుకు ఇదొక హెచ్చరికకొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అక్రమం అంటూ సుప్రీంకోర్ట్ ఇచ్చిన ఉత్తర్వులు ప్రభుత్వానికి చెంపపెట్టు. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛకు చంద్రబాబు ప్రభుత్వం వేసిన సంకెళ్లను న్యాయ వ్యవస్థ బద్దలు కొట్టింది. కొమ్మినేని అరెస్ట్ అక్రమం అని దేశం మొత్తం తెలిసింది. సాక్షి కార్యాలయాలపై తన కార్యకర్తలను, నాయకులను ఉసిగొల్పి దాడులు చేయించిన చంద్రబాబు అరాచకానికి తాజా తీర్పు ఒక హెచ్చరిక. చంద్రబాబు కుట్రపూరిత విధానాలను న్యాయస్థానం ఉత్తర్వులు ఎత్తిచూపాయి.– పూనూరు గౌతంరెడ్డి, వైఎస్సార్టీయూసీ అధ్యక్షుడుబాబు సిగ్గుతో తలదించుకోవాలికొమ్మినేని అరెస్ట్ అక్రమమని తన తీర్పుతో కూటమి ప్రభుత్వానికి సుప్రీం కోర్టు బుద్ధి చెప్పింది. చంద్రబాబు సర్కార్ పత్రికా స్వేచ్ఛను హరించే ప్రయత్నాలకు ఈ తీర్పు గట్టి హెచ్చరిక. ఇకనైనా చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి. అక్రమ అరెస్టులను ఆపాలి. –పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, ఎమ్మెల్సీతల ఎక్కడ పెట్టుకుంటారు..కొమ్మినేని అరెస్ట్ అక్రమం అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చంద్రబాబుకు చెంపపెట్టు. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛకు చంద్రబాబు ప్రభుత్వం వేసిన సంకెళ్లను న్యాయ వ్యవస్థ బద్దలు కొట్టింది. ఇప్పుడు చంద్రబాబు తల ఎక్కడ పెట్టుకుంటారు. – కల్పలత, ఎమ్మెల్సీసుప్రీం తీర్పుతోనైనా బాబు కళ్లు తెరవాలికొమ్మినేనిది అక్రమ అరెస్ట్ అంటూ సుప్రీం ఇచ్చిన తీర్పుతో అయినా చంద్రబాబు కళ్లు తెరవాలి. చంద్రబాబు మెప్పు కోసం రెడ్బుక్ రాజ్యాంగం ప్రకారం పనిచేస్తున్న పోలీసులు పునరాలోచన చేయాలి. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించే వారిని కోర్టుల్లో నిలబెడతాం. – తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్యేరాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బకొమ్మినేని అక్రమ అరెస్టుపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎదురురెబ్బ. కనీస నిబంధనలు పాటించకుండా అరెస్ట్ చేయడంపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. ఆయనను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం హర్షణీయం. – బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేక్షమాపణ చెప్పాలి సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన అంశంలో మంగళగిరి కోర్టు న్యాయమూర్తి, డీజీపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, తాజాగా సుప్రీంకోర్టు జర్నలిస్టుల భావప్రకటన స్వేచ్ఛను కాపాడుతూ వెంటనే విడుదల చేయాలని ఇచ్చిన తీర్పు కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు. తెనాలిలో దళిత, ముస్లిం యువకులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడాన్ని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ తప్పు పట్టడం కూడా ప్రభుత్వ నేతలను తలదించుకునేలా చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ అందరూ కొమ్మినేని అరెస్టుతో ఆగకుండా సాక్షి కార్యాలయాలపై దాడులకు ప్రేరేపించినందుకు తక్షణం ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అలాగే కొమ్మినేని, కృష్ణంరాజులపై కేసులను ఉపసంహరించుకోవాలి. – ఈదర గోపీచంద్, సామాజిక విశ్లేషకులు -
‘తప్పుడు వివాదాన్ని సృష్టించిన వారంతా క్షమాపణలు చెప్పాలి’
తాడేపల్లి: సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్ట్పై సుప్రీంకోర్ట్ ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మహిళలను కించపరిచారంటూ లేని దానిని ఆపాదిస్తూ కూటమి పార్టీల నేతలు తాము చేసిన బురద రాజకీయంకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగంతో అరాచకం సృష్టించాలనుకుంటే కుదరదనే విధంగా సుప్రీంకోర్ట్ తీర్పు ప్రజాస్వామిక స్పూర్తిని నిలబెట్టిందని అన్నారు. ఇంకా ఆమె ఎమన్నారంటే...‘ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ, పత్రికాస్వేచ్ఛను పరిరక్షిస్తూ సుప్రీంకోర్ట్ కొమ్మినేని అరెస్ట్పై ఇచ్చిన ఉత్తర్వులను ప్రజలు స్వాగతిస్తున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నిరంకుశంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు. వారి సొంత రెడ్బుక్ రాజ్యాంగాలు చెల్లవు, భారత రాజ్యాంగం ప్రకారమే ఎవరైనా పాలన చేయాలని మరోసారి సుప్రీంకోర్ట్ తన తాజా ఉత్తర్వులతో చెప్పినట్లయ్యింది. ఏపీలో ఏడాది పాలనలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు. మహిళలకు రాష్ట్రంలో రక్షణ లేదు. అమరావతి పేరుతో పెద్ద ఎత్తున దోపిడీకి తెగబడ్డారు. తన అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టిని మళ్ళించేందుకు సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్, సాక్షి మీడియా కార్యాలయాలపై దాడులతో ఒక అరాచకాన్ని సృష్టించారు. అటువంటి భయానక పరిస్థితుల్లో ప్రజాస్వామిక స్పూర్తిని పరిరక్షిస్తూ సుప్రీంకోర్ట్ ఈ రోజు వెలువరించిన తీర్పు చంద్రబాబు అరాచకాలకు గొడ్డలిపెట్టు. గడిచిన మూడు రోజులుగా మహిళలను అవమానించారనే వక్రీకరణలను ఆపాదిస్తూ వైఎస్సార్సీపీ, వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతమ్మ, సాక్షి మీడియా పైనా, సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావుపైనా చేసిన దుష్ప్రచారం, కూటమి ప్రభుత్వ కుట్రలు సుప్రీంకోర్ట్ ఉత్తర్వులతో మొత్తం దేశమంతా తెలిసింది. ఇటువంటి దుర్మార్గానికి పాల్పడిన వారంతా వైఎస్ జగన్, వైఎస్ భారతమ్మకు క్షమాపణలు చెప్పాలి. ఈ వివాదాన్ని రెచ్చగొట్టేలా చేసిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ ఇప్పటికైనా సుప్రీంకోర్ట్ ఉత్తర్వులతో తన బుద్ది మార్చుకోవాలి. బాధ్యతాయుతమైన మహిళా మంత్రులు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఫిర్యాదులు ఇచ్చి, తప్పుడు కేసులు బనాయించేందుకు కుట్రపూరితంగా వ్యవహరించారు. ఇటువంటి తప్పుడు విధానాలకు పాల్పడినందుకు వారు తమ పదవులకు రాజీనామా చేయాలి’ అని ఆమె డిమాండ్ చేశారు. -
కొమ్మినేని అరెస్ట్ టు బెయిల్! ఎప్పుడేం జరిగిందంటే..
సాక్షి, అమరావతి: సుప్రీం కోర్టు తీర్పుతో విశ్లేషకుడు కృష్ణంరాజు వ్యాఖ్యలకు, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైంది. కొమ్మినేనిని తక్షణమే రిలీజ్ చేయాలంటూ.. ఆయన అరెస్ట్ అక్రమమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చేసింది. సాక్షి, కొమ్మినేనికి కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలకు ఏ సంబంధం లేకపోయినా.. వాటిని ఆపాదిస్తూ ఎల్లో బ్యాచ్ ఎంతగా రెచ్చిపోయిందో తెలిసిందే. ఈ క్రమంలో ఎప్పుడు, ఏం జరిగిందో పరిశీలిస్తే..9వ తేదీ సోమవారం..గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు కొమ్మినేనిని ఈ నెల 9వ తేదీన(సోమవారం) అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని ఆయన నివాసానికి ఆ రోజు ఉదయమే చేరుకుని ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఏ అభియోగాలపై తనను అదుపులోకి తీసుకున్నారని ప్రశ్నించిన కొమ్మినేనికి సరైన సమాధానం ఇవ్వలేదు. 👉70 ఏళ్ల వయసులో.. సీనియర్ సిటిజన్, పైగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన్ను.. ఇంటి లోపల గదిలోకి వెళ్లి మందులను తెచ్చుకునేందుకు కూడా అనుమతించలేదు. బలవంతంగా వాహనం ఎక్కించి గుంటూరుకు తరలించారు. కొమ్మినేనిని సోమవారం ఉదయం 11 గంటలకు అరెస్టు చేసినట్టు ప్రకటించారు.కొమ్మినేనిపై బీఎన్ఎస్ 79, 196(1), 353(2), 299, 356(2), 61(1), 67 ఐటీ యాక్ట్, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సాక్షి మీడియాపై కుట్రతోనే చంద్రబాబు ప్రభుత్వం పక్కాగా అక్రమ కేసు నమోదు చేసిందని వైఎస్సార్సీపీ మండిపడింది. అదే సమయంలో సాక్షి మీడియా సంస్థలపై టీడీపీ శ్రేణులు దాడులకు దిగాయి.పోలీసులపై మంగళగిరి కోర్టు ఆగ్రహంఈ నెల 10న (మంగళవారం) కొమ్మినేనిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. కొమ్మినేనిపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద ఏ విధంగా కేసు నమోదు చేస్తారు? అంటూ గుంటూరు జిల్లా మంగళగిరి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు ఆ సెక్షన్ను ఎందుకు పెట్టారని తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ డిబేట్లో అసలు ఎస్సీ, ఎస్టీల గురించి చర్చే జరగనప్పుడు ఆ చట్టం కింద కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఆ సెక్షన్లు కొట్టి వేస్తున్నట్లు చెబుతూ.. మెమోలు జారీ చేస్తామని పోలీసులను హెచ్చరించారు. ఆపై కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ని గుంటూరు జైలుకు తరలించారు.ఇవాళ.. పోలీసులకు సుప్రీం కోర్టు మందలింపు కొమ్మినేని అరెస్టు అక్రమమని దాఖలైన పిటిషన్పై శుక్రవారం(13 జూన్) సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ‘‘గెస్ట్ చేసిన వ్యాఖ్యలకు టీవీ యాంకర్ కొమ్మినేని ఎలా బాధ్యులవుతారు?. నవ్వినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా?.. అలాగైతే కేసు విచారణ సమయంలో చాలాసార్లు మేమూ నవ్వుతాం అని వ్యాఖ్యానించింది . వాక్ స్వాతంత్రాన్ని రక్షించాలని.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, కొమ్మినేని శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం. -
రామ్మోహనా.. రీల్స్ చేయడానికి వెళ్లావా..?
సాక్షి, తాడేపల్లి: నిన్న(గురువారం) భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన జరిగిన సంగతి తెలిసిందే. గుజరాత్లో ఘోర విమాన ప్రమాదంలో 241 మంది మరణించారు. అయితే, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సోషల్ మీడియా పోస్టుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.నిన్న ఫ్లైట్ క్రాష్ ఘటనా స్థలాన్ని పరిశీలించిన వీడియోను రామ్మోహన్ నాయుడు ఎక్స్లో పోస్ట్ చేశారు. వీడియోకు బ్యాక్ గ్రౌండ్ ఆడియో కలిపి పోస్టు చేయడంపై ట్రోల్ అవుతోంది. ఘటన స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లారా? రీల్స్ చేయడానికా అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.This is Aviation minister RamMohan Naidu.Instead of taking the responsibility for #planecrash he's literally uploading reels.There is music in the video, there are multiple cuts & video effects.This reel-fever of Modi cabinet is disgusting.pic.twitter.com/vUDcYfBhps— Tarun Gautam (@TARUNspeakss) June 12, 2025 -
దంపతులపై బరితెగించిన బాస్
సాక్షి, అమరావతి : టీడీపీ కూటమి పాలనలో నాయకులు, పోలీసులే కాదు.. పాలకపక్ష నేతల అడుగులకు మడుగులొత్తే కొందరు అధికారులు సైతం పేట్రేగిపోతున్నారు. చేతిలో అధికారం, పెద్దల ఆశీర్వాదం ఉందన్న ధీమాతో కిందిస్థాయి వారిని ఇష్టారాజ్యంగా వేధిస్తున్నారు. పశుసంవర్థక శాఖలో ఓ ఉన్నతాధికారి ఓ అడుగు ముందుకేసి దంపతులపై చెయ్యెత్తి కొట్టేందుకు బరితెగించారు. బదిలీల్లో తాము దరఖాస్తు చేసుకోకపోయినా బదిలీ అయిందని.. పైగా పోస్టింగ్ ఇవ్వలేదని అడగడమే వారు చేసిన నేరం. ఆ వివరాలు..స్పౌజ్ గ్రౌండ్లో పశు వైద్యులు డాక్టర్ సురేష్ విశాఖ జిల్లా పరవాడ మండలం వాడచీపురపల్లిలోనూ, డాక్టర్ పద్మలీల గాజువాక డిస్పెన్సరీల్లో మూడేళ్లుగా పనిచేస్తున్నారు. తాజా బదిలీల్లో వారు దరఖాస్తు చేసుకోకపోయినప్పటికీ పద్మలీలను బదిలీచేశారు. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. తమ గోడు చెప్పుకునేందుకు విజయవాడ వచ్చిన ఈ దంపతులపై పశుసంవర్థక శాఖ డైరెక్టర్ డాక్టర్ టి. దామోదరనాయుడు చేయిచేసుకున్నంత పనిచేశారు. ‘నిబంధనల మేరకే బదిలీలు చేశాం.. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే వెళ్లి ప్రభుత్వానికి చెప్పుకోండి.. మీరు కోరుకున్న చోట పోస్టింగ్లు ఇవ్వడం కుదరదు’.. అంటూ గుడ్లురుముతూ ఆగ్రహంతో ఊగిపోయారు. చెయ్యెత్తి కొట్టేందుకు వారి మీదకు దూసుకెళ్లారు.‘కొట్టాలనుకుంటే కొట్టండి.. మీకు దండం పెట్టి అడుగుతున్నా.. అప్లై చేయకుండా ఎలా బదిలీ చేస్తారు? కనీసం ఎక్కడ పోస్టింగ్ ఇచ్చారో కూడా చెప్పకపోతే ఎలా?’.. అంటూ డాక్టర్ సురేష్ దంపతులు వాపోయారు. ‘ముందు మీరిక్కడ నుంచి వెళ్లిపోండి. పోస్టింగ్ ఆర్డర్స్ పంపిస్తాం’.. అంటూ బలవంతంగా వారిని అక్కడ నుంచి పంపించేసిన కొద్దిసేపటికే వారిద్దరికీ పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. వాడచీపురపల్లి నుంచి ఏజెన్సీ ప్రాంతమైన అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడకు సురేష్ను.. ఆయన ఖాళీచేసిన వాడచీపురపల్లికి ఆయన భార్య పద్మలీలను పంపించారు. ఈ ఘటన ఒక్కటే కాదు.. పశుసంవర్థక శాఖలో జరిగిన తాజా బదిలీల్లో ఉన్నతాధికారుల లీలలు కోకొల్లలు. జీఓ–23 ప్రకారం.. ఐదేళ్లు నిండిన వారిని విధిగా బదిలీ చేయాలి.దరఖాస్తు చేస్తేనే రెండేళ్లు దాటిన వారిని బదిలీ చేయాలి. కానీ, ఆచరణకు వచ్చేసరికి ఈ నిబంధనలకు తిలోదకాలిచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి పార్టీ నేతల సిపార్సు లేఖలు ఉంటే చాలు అడ్డగోలుగా బదిలీలు చేసేశారు. ముడుపులు ముట్టజెప్పిన వారికైతే కోరుకున్న చోట పోస్టింగ్లు ఇచ్చారు. సిఫార్సులున్నాయనే సాకుతో 5–7 ఏళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న వారి జోలికిపోని ఉన్నతాధికారులు, పనిచేసేచోట ఆరునెలల సర్వీస్ కూడా పూర్తికాని వారిని పైరవీలతో బదిలీలు చేశారు. ఓ సామాజికవర్గానికి చెందిన వారికైతే కోరుకున్న చోట కోరుకున్న పోస్టింగ్లు ఇచ్చారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాధాన్యత గల కీలక విభాగాల్లో తమకు అనుకూలంగా ఉన్న వారికి పోస్టింగ్లు ఇచ్చుకున్నారని డైరెక్టర్పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ప్రశ్నిస్తే దాడికి యత్నిస్తారా?బదిలీల్లో నిబంధనలు పాటించలేదు. దరఖాస్తు చేయకపోయినా, ఐదేళ్లు నిండకపోయినా అడ్డగోలుగా బదిలీలు చేశారు. ఇదేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే నానా దుర్భాషలాడుతూ దురుసుగా ప్రవర్తించడం, బెదిరించడం, దాడికి సైతం యత్నించడం చేస్తున్నారు. డాక్టర్ సురేష్ దంపతులపట్ల పశుసంవర్థక శాఖ డైరెక్టర్ దామోదరనాయుడు ప్రవర్తించిన తీరే ఇందుకు నిదర్శనం. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. – డాక్టర్ సీహెచ్ కృష్ణారావు, చైర్మన్, ఏపీ పశుసంవర్థక శాఖ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ -
రాజస్థాన్ ప్రథమం..సిక్కిం అథమం
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా చెట్ల సంఖ్య పెరుగుదలలో రాజస్థాన్ అగ్రస్థానంలో నిలిచింది. 2019–20లో చదరపు కిలోమీటరుకు 10363 చెట్లుండగా, 2021–22 నాటికి ఆ సంఖ్య 10841కు చేరింది. ఆ తర్వాత స్థానాల్లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ నిలిచాయని జాతీయ పర్యావరణం–2025 తెలిపింది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఈ నివేదికను వెల్లడించింది.దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. 2019–20తో పోల్చితే 2021–22 నాటికి 93 చెట్లు పెరిగినట్లు వివరించింది. అసోం, బీహార్, గోవా, గుజరాత్, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్, మణిపూర్, మిజోరం, మేఘాలయ, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 2019–20తో పోల్చితే 2021–22లో చెట్ల సంఖ్య తగ్గిపోయినట్లు గణాంకాలు వెల్లడించాయి. తెలంగాణ 11వస్థానం సాధించింది. కాగా చెట్ల సంఖ్య పెరుగుదలలో సిక్కిం చివరిస్థానంలో నిలిచింది. 2019–20లో చదరపు కిలోమీటరుకు 51 చెట్లుండగా , 2021–22 నాటికి వాటి సంఖ్య 48కు తగ్గిందని నివేదిక వెల్లడించింది. -
విమానంలో విద్యుత్
నడవడమే రాని మానవుడు నేడు పక్షిలా గాలిలో ఎగిరిపోయే సాధనాలను కనుగొని ఎక్కడికి అంటే అక్కడికి నిమిషాలు, గంటల్లోనే ప్రయాణిస్తున్నాడు. దేశ విదేశాల్లో విమానంలో చక్కర్లు కొడుతున్నాడు. ఆ విమానం నడవాలంటే మాత్రం ఇంధనంతో పాటు విద్యుత్ కూడా చాలా అవసరం. కానీ, అవే ఒక్కోసారి వందల ప్రాణాలు పోవడానికి కారణం అవుతున్నాయి. అహ్మదాబాద్లో గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదం కూడా అలాంటిదే.ఈ దుర్ఘటనకు విమానంలో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా విఫలమవడం కారణం కావొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు విమానంలో విద్యుత్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది..? ఎందుకు విఫలం అవుతుంది..? దానివల్ల జరిగిన ప్రమాదాలేంటి? అనే అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.సాక్షి, అమరావతి: విమానంలో ప్రధానంగా నాలుగు రకాల విద్యుత్ వ్యవస్థలు పనిచేస్తుంటాయి. వాటినే ప్రధాన, అత్యవసర, ద్వితీయ, సహాయక విద్యుత్ వ్యవస్థలుగా పిలుస్తుంటారు. వీటితో పాటు ఓవర్లోడ్, షార్ట్ సర్క్యూట్ వంటి ఆకస్మిక ప్రమాదాల నుంచి రక్షించేందుకు సర్క్యూట్ బ్రేకర్లను అమర్చుతారు. అత్యవసర సమయంలో వాడుకునేందుకు వీలుగా విద్యుత్ను బ్యాటరీల్లో నిల్వ చేస్తారు. నావిగేషన్, కమ్యూనికేషన్, నియంత్రణ, క్యాబిన్, కాక్పిట్ లైటింగ్, ఎయిర్ కండిషనింగ్, టీవీ, ఫ్యాన్లు వంటి కీలక పనులకు ఈ విద్యుత్ వ్యవస్థ ఉపయోగపడుతుంది.ఇది ఏమాత్రం విఫలమైనా విమానం కుప్పకూలే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. విమానంలో జనరేటర్లు లేదా ఆల్టర్నేటర్లు అనేవి ఉంటాయి. ఇవి ఇంజిన్తో నడుస్తూ విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి. ప్రధాన ఇంజన్లు పని చేయనప్పుడు సహాయక విద్యుత్ యూనిట్ ఆదుకుంటుంది. రామ్ ఎయిర్ టర్బైన్ అనేది కొన్ని సందర్భాల్లో విద్యుత్ వనరుగా పనికొస్తుంది. ట్రాన్స్ఫార్మర్ రెక్టిఫయర్ యూనిట్లు కొన్ని వ్యవస్థల కోసం విద్యుత్ను అందిస్తుంటాయి. బ్యాటరీలు బ్యాకప్ పవర్ సోర్స్లుగా పనిచేస్తాయి. కాకపోతే ఈ వ్యవస్థ అన్ని విమానాల్లోనూ ఒకేలా ఉండదు. సింగిల్ ఇంజిన్ జనరల్ ఏవియేషన్ ఎయిర్క్రాఫ్ట్, ఆధునిక, బహుళ ఇంజిన్ కమర్షియల్ జెట్ ఎయిర్క్రాఫ్ట్ మధ్య విద్యుత్ వ్యవస్థ సామర్థ్యం, నిర్మాణంలో చాలా తేడా ఉంటుంది. ముందే శిక్షణ ఇస్తారు.. విద్యుత్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా తగిన సూచనలను, శిక్షణను ముందే పైలట్లకు తెలియజేస్తారు. విద్యుత్ వ్యవస్థ వైఫల్యాన్ని సూచించడానికి ఒక అమ్మీటర్, లోడ్ మీటర్ లేదా హెచ్చరిక లైట్ ఉంటాయి. బలమైన రక్షణ వ్యవస్థ, పర్యవేక్షణ, వైఫల్య హెచ్చరిక నిబంధనలు విద్యుత్ వ్యవస్థలో ఉంటాయి. ఇవి ఎప్పటికప్పుడు తగిన సూచనలను పైలట్లకు అందజేస్తుంటాయి. స్టాండ్బై ఫ్లైట్ ఇన్స్ట్రుమెంట్స్, ఎయిర్క్రాఫ్ట్ ఎమర్జెన్సీ ఫ్లోర్ పాత్ ఇల్యూమినేషన్ వంటి భాగాలు వాటికి సొంత బ్యాకప్ విద్యుత్ ఉంటుంది. విద్యుత్ వ్యవస్థ పూర్తిగా విఫలమైనా కూడా ఇవి పనిచేస్తాయి. విమానంలో సర్క్యూట్ బ్రేకర్ విఫలమైనప్పుడు ఒకసారి మాత్రమే రీసెట్ చేయాలి. రెండోసారి చేయకూడదు. విద్యుత్ జనరేటర్లు, వైర్ల నుంచి పొగలు, మంటలు వస్తే విద్యుత్ ఐసోలేషన్ విధానాన్ని అనుసరించాలి. విమానాన్ని త్వరగా ల్యాండ్ చేయాలి. ఏమాత్రం ఆలస్యమైనా భారీ నష్టం సంభవిస్తుంది.విద్యుత్ వ్యవస్థ విఫలంతో విమాన ప్రమాదాలు, దుర్ఘటనల్లో కొన్ని⇒ ఎండీ11 అనే స్విస్ ఎయిర్ విమానంలో విద్యుత్ అగ్నిప్రమాదం వల్ల కెనడా సమీపంలో 1998 సెపె్టంబర్ 2న అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయింది. ⇒ 2010 ఆగస్టు 24న ఉత్తర సూడాన్లో ఖార్టూమ్ నుంచి బీరుట్ బయల్దేరిన ఏ321 ఎయిర్బస్లో జనరేటర్లు దెబ్బతిని విద్యుత్ వ్యవస్థ పనిచేయడం మానేసింది. 49 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ⇒ 2009 మార్చి 15న లండన్ హీత్రూ నుంచి ఎడిన్బర్గ్కు బయల్దేరిన బ్రిటిష్ ఎయిర్వేస్కు చెందిన ఏ319 విమానంలో విద్యుత్ వైఫల్యం ఏర్పడి పైలట్లకు డిస్ప్లే కనిపించలేదు. పొగలు కూడా వచ్చాయి. దీంతో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ⇒ 2008 సెపె్టంబరు 22న అమెరికన్ ఎయిర్లైన్స్కు చెందిన బి752 సియాటిల్ నుంచి న్యూయార్క్ వెళ్తుండగా విద్యుత్ సమస్య ఎదుర్కొంది. చికాగోలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ల్యాండింగ్ గేర్ దెబ్బతిన్నది. 192 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. -
డీజీపీ బాధితుల పక్షమా?.. దాడి చేసినవారి పక్షమా?
సాక్షి, అమరావతి: రాష్ట్ర డీజీపీ బాధితుల పక్షాన ఉంటారో, దాడులు చేసిన చేసిన వారి పక్షాన ఉంటారో తేల్చుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్సీలు అరుణ్కుమార్, వరుదు కళ్యాణి, ఇతర నేతలు స్పష్టంచేశారు. ఏపీలో అరాచక పరిస్థితులపై డీజీపీకి ఫిర్యాదు చేయటానికి వస్తే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. సాక్షి కార్యాలయాలపై దాడులు, పొదిలిలో రైతులపై అక్రమ కేసులు, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వ వైఫల్యం, మాజీ సీఎం వైఎస్ జగన్ కార్యక్రమాలకు భద్రత కల్పించకపోవడం, మహిళలపై అఘాయిత్యాలు తదితర అంశాలపై వారు గురువారం అదనపు డీజీ మధుసూదనరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు.అనంతరం ఎమ్మెల్యే చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది కాలంలో ఒక్కసారి కూడా డీజీపీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అదనపు డీజీకి చాలా అంశాలపై ఫిర్యాదు చేశాం. దర్శిలో మా వారిపై టీడీపీ గూండాలు దాడి చేస్తే, మా వారిపైనే 15 అక్రమ కేసులు పెట్టారు. బాధితులకు కాకుండా టీడీపీ గూండాలకే పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడైన వైఎస్ జగన్ పర్యటనలకి ఉద్దేశపూర్వకంగానే భద్రత కల్పించడంలేదు. జగన్ కాన్వాయ్పై రాళ్ల దాడి చేసిన వారికి పోలీసులు అండగా నిలబడ్డారు.పొదిలి, గుంటూరు, రామగిరి, తెనాలి ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటనలో ప్రజలు భారీగా వచ్చినా, తగిన భద్రత కల్పించలేదు. ఇందులో లోకేశ్, టీడీపీ పాత్రపై విచారణ చేయాలి. జగన్ పర్యటనను అడ్డుకొనేందుకు వచ్చిన 40 మంది టీడీపీ మహిళా కార్యకర్తలకు మాత్రం 200 మంది పోలీసులను రక్షణగా పెట్టారు. మహిళలను ముందర పెట్టి విధ్వంసాలు సృష్టించి, జగన్ ప్రజల్లోకి వెళ్లకుండా చేయాలని టీడీపీ కుట్ర చేస్తోంది.ఇవే విషయాలను అడిషనల్ డీజీకి వివరించాం. వైఎస్సార్సీపీ వారిపై కొందరు పోలీసులు చేస్తున్న దాడులపైనా చర్యలు తీసుకోవాలని కోరాం’ అని చెప్పారు. వైఎస్ జగన్ పర్యటనలకు భద్రత విషయంలో ఎవరు ఆదేశిస్తే ఇంత ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారో పోలీసు అధికారులే చెప్పాలని అరుణ్ కుమార్ అన్నారు. అడిషనల్ డీజీని కలిసిన వారిలో ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, నాయకులు మలసాని మనోహర్ రెడ్డి, ఏఎన్ఎన్ మూర్తి తదితరులు ఉన్నారు. -
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీలు
సాక్షి, అమరావతి : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 30లోగా వీరి విధుల హేతుబద్ధీకరణ, బదిలీల ప్రక్రియను పూర్తిచేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు స్పష్టంచేస్తూ బదిలీ మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను గ్రామ, వార్డు సచివాలయ శాఖ కార్యదర్శి కె. భాస్కర్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ మార్గదర్శకాల ప్రకారం మే 31 నాటికి ఒకే గ్రామ, వార్డు సచివాలయంలో ఐదేళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీచేయాలి. ఐదేళ్లు పూర్తికాని ఉద్యోగులను కూడా వారి అభ్యర్థన మేరకు బదిలీ చెయ్యొచ్చు. అలాగే..⇒ ఉద్యోగులను వారి సొంత మండలానికి బదిలీ చేయకూడదు. n దృష్టిలోపం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. మానసిక వికలాంగ పిల్లలు ఉన్న ఉద్యోగులను సంబంధిత వైద్య సౌకర్యాలు అందుబాటులో చోటుకు లేదా వారు కోరుకునే ప్రాంతానికి బదిలీచేయాలి. ⇒ గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు పైగా పనిచేసిన ఉద్యోగులకు, 40 శాతం వైకల్యంగల ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యత ఇవ్వాలి. ⇒ క్యాన్సర్, ఓపెన్హార్ట్ ఆపరేషన్, న్యూరో సర్జరీ, కిడ్ని ట్రాన్స్ప్లాంటేషన్ వంటి వ్యాధులతో బాధపడే ఉద్యోగులను లేదా ఆ ఉద్యోగులపై ఆధారపడిన భార్య లేదా పిల్లలుంటే అటువంటి వారిని ఆయా వైద్య సౌకర్యాలున్న ప్రాంతాలకు బదిలీచేయాలి. ⇒ కారుణ్య ప్రాతిపదికన నియమించిన వితంతు ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యత ఇవ్వాలి. ⇒ దృష్టిలోపం ఉన్న ఉద్యోగులు బదిలీ నుంచి మినహాయింపు పొందవచ్చు. ఒకవేళ బదిలీ కోసం అభ్యర్థిస్తే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆ కేటగిరిలో స్పష్టమైన ఖాళీ లభ్యత ఆధారంగా కోరుకున్న చోటుకు బదిలీచేయాలి. ⇒ భార్యాభర్తలు ఉద్యోగులైతే ఇద్దరినీ ఒకే స్టేషన్కు లేదా దగ్గరగా ఉన్న స్టేషన్లకు బదిలీచేయాలి. ⇒ గిరిజన, మారుమూల, వెనుకబడిన ప్రాంతాల్లో ఖాళీల భర్తీకి కలెక్టర్లు ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఐటీడీఏ ప్రాంతాలకు బదిలీ అయిన ఉద్యోగులు నిర్ధేశిత గడువులోగా విధుల్లో చేరాలి. లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ⇒ ఇక నిధులు చెల్లింపు పెండింగ్ ఉన్న ఉద్యోగులను రిలీవ్ చేయకూడదు. ⇒ ఉద్యోగుల బదిలీలను ఈ మార్గదర్శకాల మేరకు అత్యంత పారదర్శకంగా ఎటువంటి ఫిర్యాదులు, ఆరోపణలకు అవకాశంలేకుండా గడువులోగా పూర్తిచేయాలి.సొంత మండల పరిధిలోనే బదిలీలు చేయాలి..గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో కోరుకున్న వారిని మినహాయించి మిగిలిన వారినందరినీ సొంత మండలాల పరిధిలోనే బదిలీలు కల్పించాలని గ్రామ, వార్డు సచివాలయాల ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎం.డి. జానీపాషా, ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు ప్రభుత్వాన్ని కోరారు.ఇతర మండలాలకు వారిని బదిలీ చేయాలనే నిబంధనతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారన్నారు. -
ఏడాది పాలన అంతా అరాచకమే
సాక్షి, అమరావతి: ఏడాది పాలనలో తాను ప్రజలకు ఏం చేశానో చెప్పుకోవడానికి ఏమీ లేక ఇవాళ్టికీ చంద్రబాబు నిత్యం బురద చల్లుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, ఏడాది పాలన అంతా అరాచకమే అని వైఎస్సార్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, కారుమూరి నాగేశ్వరరావు, పి.అనిల్కుమార్ యాదవ్, మేరుగు నాగార్జున, పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు. ‘క్రిమినౖలెజేషన్ ఆఫ్ పాలిటిక్స్’కు ఆద్యుడు చంద్రబాబే అనే సంగతి అందరికీ తెలిసిందేనన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్రమంతా వేడుకలు నిర్వహించాలని ఆదేశించడమే కాకుండా, చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ యథావిథిగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై, మాజీ సీఎం వైఎస్ జగన్పై నిందలు మోపుతూ.. నిస్సిగ్గుగా గొప్పలు చెప్పుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రసంగమంతా ఆత్మస్తుతి.. పరనిందగా సాగిందని, డైవర్షన్ పాలిటిక్స్ను నమ్ముకుని ముందుకెళుతున్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు గురువారం వారు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ‘వంగవీటి మోహన రంగా హత్య వెనుక ఎవరున్నారో నాడు రాష్ట్ర హోం మంత్రిగా పని చేసిన చేగొండి హరిరామజోగయ్య స్వయంగా చెప్పారు. వైఎస్సార్ తండ్రి రాజారెడ్డి హత్య కేసులో నిందితులకు ఆశ్రయం ఇచ్చి, వారిని దాచి పెట్టిన వ్యక్తి చంద్రబాబు కాదా? వైఎస్ వివేకానందరెడ్డి హత్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగింది. ఆ కేసును ఉద్దేశ పూర్వకంగా రాజకీయంగా వాడుకుని, తామే హత్య చేశామని టీవీ ప్రత్యక్ష ప్రసారాల్లో చెప్పిన వారిని కూడా అప్రూవర్గా మార్చి, ఆ నెపాన్ని నిర్దోషుల మీద మోపి రాజకీయ విష క్రీడ ఆడుతున్నది ఎవరో ప్రజలకు తెలిసిందే. తెల్గీ స్టాంప్ పేపర్ల స్కామ్ మొదలు.. స్కిల్ స్కామ్, మద్యం స్కామ్ వరకు ఏ నేరం చూసినా సరే చంద్రబాబు పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది’ అని తెలిపారు. వారు ఇంకా ఏం చెప్పారంటే.. కూటమి ప్రభుత్వంలో 390 హత్యలు » ఏడాదిగా చంద్రబాబు అత్యంత హేయమైన పాలన సాగించారు. విపక్ష నేతలు, కార్యకర్తలు లక్ష్యంగా హత్యలు, హత్యా యత్నాలు, ఆస్తుల విధ్వంసంతోపాటు టార్గెట్ చేసుకున్న వారిపై అక్రమ కేసుల బనాయింపునకు బరితెగించారు. » ఏడాదిలో 390 హత్యలు. హత్యాయత్నాలు, దాడులకు గురైన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు 766 మంది. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు 2,466. జైలుకు వెళ్లిన నాయకులు, కార్యకర్తలు 500 మంది. అక్రమ కేసులు నమోదైన సోషల్ మీడియా యాక్టివిస్టులు 440 మంది. కేసులు నమోదై జైలుకు వెళ్లిన సోషల్ మీడియా యాక్టివిస్టులు 79 మంది. దాడులకు గురైన జర్నలిస్టులు 11 మంది. జర్నలిస్టులపై అక్రమ కేసులు 63. మహిళలపై లైంగిక దాడులు 198. ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు 73. ఇద్దరు ప్రజా సంఘాల నాయకులు, ఎనిమిది మంది జర్నలిస్టులు జైలుకు వెళ్లారు. » విద్యార్థి దశలో ఉన్నప్పుడే తన సహచరులకు మద్యం పట్టించి ప్రత్యర్థులపైకి దండయాత్రకు పంపానని చంద్రబాబు స్వయంగా తన ఎల్లో మీడియా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మామ కాళ్లు పట్టుకుని టీడీపీలోకి వచ్చాక.. ఆయన చేసిన నిర్వాకాలన్నింటినీ ఆయన తోడల్లుడు చెప్పారు. జర్నలిస్ట్ పింగళి దశరథరాం హత్య వెనుక ఎవరున్నారో కూడా అందరికీ తెలిసిందే.» వైఎస్ జగన్ పొగాకు రైతుల పరామర్శ కోసం పొదిలి వెళితే టీడీపీ కార్యకర్తలతో దాడులు చేయించి, రాజకీయ హింసను రాజేసి ఆ మంటల్లో చలి కాచుకుందామని కుట్ర పన్నారు. అది ఫలించకపోవడంతో రైతులపై రౌడీలుగా ముద్ర వేసి, వారిపై కేసులు పెట్టి కక్ష సాధిస్తున్న చంద్రబాబువి నేరమయ రాజకీయాలు కావా?. -
బాధ్యత మరచి.. బాధితురాలి పేరు చెప్పి
అనంతపురం టవర్క్లాక్: బాధ్యత గల పదవిలో ఉన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ కనీస అవగాహన లేకుండా అత్యాచార బాధితురాలి పేరు చెప్పడంపై ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. శ్రీసత్యసాయి జిల్లాలో 14 మంది టీడీపీ కీచకులు దళిత బాలికపై అత్యాచారం చేయగా.. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దళిత బాలికను పరామర్శించేందుకు గురువారం అనంతపురం వచ్చిన రాయపాటి శైలజ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో అత్యాచారానికి గురైన బాధితురాలి పేరును శైలజ పదేపదే ప్రస్తావించారు. దీంతో ఆమె తీరును జర్నలిస్టులు తప్పుపట్టారు. అత్యాచారానికి గురైన బాలిక పేరు చెప్పకూడదంటూ నిబంధన ఉందని ఆమెకు గుర్తు చేశారు. గతంలో అత్యాచారానికి గురైన బాలిక పేరు చెప్పారంటూ మాజీ ఎంపీ మాధవ్పై కేసు నమోదు చేసిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు మహిళా కమిషన్ చైర్పర్సన్పైన కూడా కేసు నమోదు చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. అలాగే ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు ఆమెను అడ్డుకొని బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో గిరిజన విద్యార్థిని తన్మయి హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని వారు మండిపడ్డారు. దళిత బాలికపై సామూహిక అత్యాచారం విషయంలోనూ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చర్యలు తీసుకోకపోతే.. ఉద్యమిస్తామని హెచ్చరించారు.భయపడడం వల్లే హత్యలు, అత్యాచారాలు..మహిళలు, బాలికలు భయపడటం వల్లే హత్యలు, అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ చెప్పారు. అందరూ ధైర్యంగా ఉండాలనిని సూచించారు. ఏ కష్టం వచ్చినా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. గిరిజన విద్యార్థిని తన్మయి హత్య కేసులో పోలీసుల నిర్లక్ష్యం లేదన్నారు. అయినా పోలీసులపై ఆరోపణలు రావడంతో సీఐను సస్పెండ్ చేశామన్నారు. బాధిత కుటుంబాలకు తగిన సాయం చేస్తామన్నారు. -
సూపర్ సిక్స్ అమలు చేసేశాను: చంద్రబాబు
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేసేశానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఇంకా ఎవరైనా సూపర్ సిక్స్ గురించి మాట్లాడితే నాలుక మందం తప్ప ఇంకొకటి కాదని అన్నారు. తల్లికి వందనం పథకం అమలుపై గురువారం ఆయన ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ తల్లికి వందనం ఇస్తామని చెప్పిన మాట మేరకు.. నలుగురు పిల్లలున్న వారికి కూడా ఇస్తున్నామని తెలిపారు. 67 లక్షల మంది పిల్లలకు రూ.13 వేలు చొప్పున వారి తల్లులు, సంరక్షకుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామన్నారు. మిగతా రెండు వేల రూపాయలు స్కూళ్ల నిర్వహణకు వినియోగిస్తామని తెలిపారు. తల్లికి వందనం పథకానికి అమ్మ ఒడి మార్గదర్శకాలనే అమలు చేస్తున్నామని చెప్పారు. పీ–4కు ఆడబిడ్డ నిధి, స్కిల్ డెవలప్మెంట్కు నిరుద్యోగ భృతి అనుసంధానం చేశామన్నారు. ఈ నెల 20న కేంద్రం రైతులకు డబ్బులు వేస్తుందని, అదే రోజు అన్నదాత సుఖీభవ కింద రాష్ట్రం తొలి వాయిదా ఇస్తుందన్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమలు చేస్తామని, దీంతో సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేసినట్లేనని తేల్చి చెప్పారు. తెనాలిలో పోలీసులు నడిరోడ్డుపై దళితులను బహిరంగంగా లాఠీలతో కొట్టిన వారి కుటుంబాలను పరామర్శించడానికి వైఎస్ జగన్ ఎలా వెళ్తారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘దేవతల రాజధాని అమరావతిని వేశ్యల నగరం అంటారా... ఎంత కొవ్వు ఎక్కింది.. మీడియా ఏం చేస్తోంది.. ఆ అంశాన్ని డైవర్ట్ చేయడానికే జగన్ 15 వేల మందితో పొగాకు రైతుల దగ్గరకు వెళ్లి రౌడీయిజం చేశారు. పొగాకు క్వింటా రూ.12 వేల చొప్పున కొనుగోలు చేస్తున్నాం. రాజకీయ ముసుగులో శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తే ఉపేక్షించేది లేదు. తీవ్రవాదులపైనే పోరాటం చేసిన వాడిని. ప్రజల భద్రత విషయంలో రాజీపడను. ఏం చేయాలో చేసి చూపిస్తా’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు నడుస్తోందని మంత్రి లోకేశ్ అన్నారు. 60 శాతం కుటుంబాలకు ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ తల్లికి వందనం కింద రూ.13 వేలు చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. -
తల్లికి వందనం మహా మోసం!
తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు చొప్పున ఇస్తాం. మీ ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ ఇస్తాం. ఒకరుంటే రూ.15 వేలు.. ఇద్దరుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు, నలుగురుంటే రూ.60 వేలు ఇస్తాం. – ఎన్నికలప్పుడు నారా చంద్రబాబు నాయుడుఇప్పుడున్న సంక్షేమ పథకాలు ఏ ఒక్కటీ ఆపేది లేదు.. అన్నీ కొనసాగిస్తాం.. జగన్ ప్రభుత్వం అమ్మ ఒడి పథకం సక్రమంగా అమలు చేయడం లేదు.. రేపు కూటమి ప్రభుత్వం రాగానే మీ ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ తల్లికి వందనం కింద రూ.15 వేల చొప్పున ఇస్తాం. నిబంధనలను సాకుగా చూపి ఎవరికీ ఎగ్గొట్టం. – ఎన్నికలప్పుడు నారా లోకేశ్విద్యార్థుల లెక్కలు చెప్పేందుకు దేశంలో యూడైస్ డేటానే ప్రామాణికం. అన్ని జిల్లాల్లోని స్కూళ్లలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారన్న సమగ్ర సమాచారం కేంద్ర ప్రభుత్వానికి అందించే నివేదిక ఇది. ఈ వివరాలను స్వయంగా ఆయా జిల్లాల కలెక్టర్ల ద్వారానే అప్లోడ్ చేస్తారు. ఈ లెక్కన రాష్ట్రంలో 87,41,885 మంది విద్యార్థులున్నట్టు యూడైస్ గణాంకాలు చెబుతున్నాయి. వీరందరికీ తల్లికి వందనం కింద రూ.15 వేల చొప్పున ఇవ్వాలంటే రూ.13,112 కోట్లు అవసరం. కానీ చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది రూ.8,745 కోట్లే. అంటే 1/3 విద్యార్థులకు పంగనామాలు పెడుతున్నామని జీవో సాక్షిగా చెప్పారు.ఒక ఇంట్లో ఒక విద్యార్థి ఫీజు రీయింబర్స్మెంట్ పొందుతుంటే ఆ ఇంట్లో మరెవ్వరికీ తల్లికి వందనం ఇవ్వం అని తేల్చి చెప్పింది. అసలు కూటమి ప్రభుత్వ పాలనలో వసతి దీవెన, విద్యా దీవెన పథకాలు అమలవుతున్నాయా! ఎప్పుడొస్తుందో తెలియని.. అసలు వస్తుందో రాదో తెలియని ఫీజు రీయింబర్స్మెంట్పై నెపం మోపి తల్లికి వందనం పథకాన్ని వారికి రద్దు చేయడం దుర్మార్గం కాదా?ఒకటి నుంచి ఇంటర్ వరకు చదివే ప్రతి విద్యార్థికీ ఏటా రూ.15 వేలు ఇస్తామని గురువారం అన్ని దినపత్రికల్లో (సాక్షి మినహా) ఫుల్ పేజీ ప్రకటన ఇచ్చారు. నేడే తల్లుల ఖాతాల్లో రూ.8,745 కోట్లు జమ చేస్తామని కూడా ఘనంగా చాటుకున్నారు. మీ మాటలు నమ్మి డబ్బులు పడతాయని లక్షలాది మంది తల్లులు రాత్రి పొద్దుపోయే వరకు ఎదురు చూశారు. తీరా సవాలక్ష నిబంధనలు పెట్టి, నగదు జమ చేయడానికి ఇంకో నెల గడువు తీసుకున్నారు. మీరు చెప్పిన పిల్లల సంఖ్యలో ఇంకా కోత వేయడానికే కదా ఈ గిమ్మిక్కులు! దీన్ని ఏమనాలి? మోసం అనాలా.. లేక దగా అనాలా? వీరందరూ అనర్హులు⇒ ఒక ఇంట్లో ఒకరు ఫీజు రీయింబర్స్మెంట్ పొందుతున్నట్లయితే, అదే ఇంట్లో ఇతరులకు తల్లికి వందనం వర్తించదు.⇒ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉపకార వేతనాలు పొందే వారికీ పథకం రద్దు. ⇒ కుటుంబానికి బియ్యం కార్డు లేకుంటే పథకం రాదు.⇒ కుటుంబ నెలవారీ ఆదాయం గ్రామీణులకు రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలు మించితే పథకం ఇవ్వరు.⇒ మాగాణి 3 ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాలు మించి ఉండరాదు. పట్టణాలల్లో 1000 చ.అడుగుల స్థలం ఉన్నా, నాలుగు చక్రాల సొంత వాహనం ఉన్నా పథకం వర్తించదు. ⇒ ప్రతి కుటుంబానికి ఏడాది విద్యుత్ వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని నెలకు 300 యూనిట్లు మించి విద్యుత్ వినియోగించి ఉంటే పథకం రాదు.⇒ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ పొందుతున్న వారు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలు వేతనం పొందుతున్న వారికి పథకం రాదు. ⇒ కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ప్రీృమెట్రిక్, పోస్ట్ృమెట్రిక్ స్కాలర్షిప్ల పరిధిలోకి వచ్చే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఆ పథకాల కింద ఆయా శాఖలు అందిస్తున్న మొత్తం మినహాయించి, మిగిలిన నగదును మాత్రమే ‘తల్లికి వందనం’ పథకం కింద చెల్లిస్తారు. ⇒ సచివాలయాల్లో ప్రదర్శించిన లబ్ధిదారుల జాబితాలో ఎవరిపై అయినా ఫిర్యాదులొస్తే పథకాన్ని ఆపేస్తారు.సాక్షి, అమరావతి: తల్లికి వందనం పేరుతో కూటమి సర్కారు షాకిచ్చింది. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అందరికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామని చెప్పి అనేక కొర్రీలు పెట్టి లబ్ధిదారులను తగ్గించేసింది. సవాలక్ష నిబంధనలు విధించి.. ఇంకా కోత కోయనుంది. మిగిలిన వారికి కూడా కేవలం రూ.13 వేలు మాత్రమే ఇస్తామని ప్రకటించింది. గురువారమే నిధులు ఖాతాల్లో జమ చేస్తామని హడావుడి చేసిన ప్రభుత్వం.. వచ్చే నెలకు వాయిదా వేసింది. కేవలం విధివిధానాలు మాత్రమే విడుదల చేసి అనేక కఠిన నిబంధనలతో లబ్ధిదారులకు కోత పెట్టే ప్రక్రియకు పూనుకుంది. ఇందులో భాగంగా లబ్ధిదారుల వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించి.. అభ్యంతరాలు ఉన్న వారిని తొలగించనున్నారు. అర్హులుగా తేలిన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వచ్చే నెలలో రూ.13 వేలు మాత్రమే జమ చేస్తారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు (26, 27 జీవోలు) విడుదల చేసింది. ప్రభుత్వం తల్లికి వందనం కింద ఇచ్చే రూ.13 వేలకు అనేక నిబంధనల ఆంక్షలు పెట్టింది. ప్రస్తుత విద్యా సంవత్సరం (2025–26) నుంచే ఈ పథకం వర్తిస్తుందని, ఈ ఏడాది హాజరుతో సంబంధం లేకుండా అన్ని మేనేజ్మెంట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీ విద్యార్థులకు పథకం అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు. అయితే ఇంట్లో ఎంత మంది విద్యార్థులుంటే అంత మందికీ పథకం ఇస్తామన్న కూటమి ప్రభుత్వం.. తీరా తల్లులపై ఫీజుల భారం మోపింది. ఇచ్చేది 54,94,703 మందికే.. ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన సూపర్–6 హామీల్లో ఒకటైన తల్లికి వందనంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం 67,27,164 మందికి ఈ పథకాన్ని ఇస్తున్నట్టు ప్రకటించినా, ప్రస్తుతం ఇచ్చేది 54,94,703 మందికేనని తేల్చింది. ఒకటో తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరికల అనంతరం లబ్ధిదారులను పరిశీలించనున్నట్టు పేర్కొంది. ఒకటో తరగతిలో 5,87,265 మంది, జూనియర్ ఇంటర్లో 5,32,485 మంది చేరుతారని అంచనా వేశారు. రికార్డుల్లో తప్పులున్నవారు 21,860 మంది, కుటుంబ వివరాలు లేని వారు 90,851 మంది ఉన్నట్లు అంచనా. వీరి వివరాలు తీసుకుని తర్వాత లెక్క సరిచేయనున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలోని వివిధ కులాలకు చెందిన 15 కార్పొరేషన్ల ద్వారా గుర్తించిన 54,94,703 మంది విద్యార్థుల వివరాలను స్థానిక గ్రామ/వార్డు సచివాలయాల్లో ప్రదర్శించి అభ్యంతరాలు స్వీకరిస్తారు. నిబంధనలు అన్నీ సరిపోతే.. ఇతరులెవరైనా ఫిర్యాదు చేయకపోతే వచ్చే నెల 5న ఆయా విద్యార్థులకు సంబంధించి 42,69,459 మంది తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు చొప్పున జమ చేస్తారు. ఈ విద్యా సంవత్సరం 75 శాతం హాజరు ఉన్న వారికే 2027లో పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. నాలుక మడతేసిన లోకేశ్!వైఎస్ జగన్ ప్రభుత్వం అమ్మఒడి అమలులో కఠిన నిబంధనలు పెట్టిందని ఎన్నికలప్పుడు ప్రస్తుత విద్యా శాఖ మంత్రి లోకేశ్ నీతులు వల్లించారు. కానీ ప్రస్తుతం తల్లికి వందనం అమలు నిబంధనలు చూసి ప్రజలు విస్తుపోతున్నారు. వారు చెప్పిన ప్రకారం ఇప్పటికే రెండేళ్ల కాలానికి విద్యార్థులకు తల్లికి వందనం వేయాలి. కానీ తేదీల మతలబుతో మాయ చేసి 2026కు ఇప్పుడు ప్రకటించారు. అదీ 67,27,164 మంది లబ్ధిదారులని చెప్పి, ఇచ్చేది మాత్రం 54,94,703 మందికేనని.. కండిషన్స్ అప్లై అన్నారు. గత ప్రభుత్వంలో 75 శాతం హాజరు నిబంధన పెట్టినా పేదల పక్షపాతి అయిన నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరుతో సంబంధం లేకుండా పిల్లలను బడికి పంపించే తల్లుల ఖాతాల్లో అమ్మఒడి నిధులు జమ చేశారు. అయితే నాటి నిబంధనలను తప్పుబట్టిన లోకేశ్.. ఇప్పుడు తప్పుడు లెక్కలతో లబ్ధిదారులకు కోత పెట్టారు. ఇప్పుడు అర్హులైన వారికి రూ.13 వేలు మాత్రమే ఇస్తామని, మరో రూ.2 వేలు పాఠశాల నిర్వహణ నిధికి జమ చేస్తామంటున్నారు. ఎన్నికల ముందు చెప్పిందేమిటి.. చేసిందేమిటని ప్రజలు సోషల్ మీడియా వేదికగా లోకేశ్ను నిలదీస్తున్నారు. పైగా ఈ పథకాన్ని 2024 జూన్/జూలైలో విద్యార్థులకు ఇవ్వాల్సింది ఎగవేశారు. 2025 జూన్లో ఇవ్వాల్సిన పథకాన్ని ఇప్పుడు ప్రకటించి 2026కు కూడా ఇదే అని చెబుతున్నారు. పైగా ఒక ఇంట్లో ఫీజు రీయింబర్స్మెంట్ పొందే విద్యార్థులుంటే తల్లికి వందనం వర్తించదని ప్రకటించారు. గత ప్రభుత్వంలో ఒక ఇంట్లో గ్రాడ్యుయేషన్ చదువుకునే వారు ఎందరుంటే అందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారు. అమ్మ ఒడి కూడా ఇచ్చారు. ఇంత పక్కాగా అమలు చేసిన అమ్మ ఒడిపై తీవ్ర విమర్శలు చేసిన లోకేశ్.. ఇప్పుడు ఇన్ని కండిషన్లతో తల్లికి ఎగనామం పెట్టినట్టు కాదా.. అని ప్రజలు నిలదీస్తున్నారు. -
రేపటి వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమం వాయిదా
సాక్షి, అమరావతి: అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదంలో దాదాపు 241 మంది మరణించిన నేపథ్యంలో.. ఆ ఘటనకు, మృతులకు సంతాప సూచకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో శుక్రవారం (జూన్ 13వ తేదీ) తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేశారు.టీడీపీ కూటమి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు.. ఉద్యోగాల కల్పన లేదా నిరుద్యోగ భృతి చెల్లింపు వెంటనే అమలు చేయాలని, అలాగే విద్యార్థుల సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, యువజన విభాగాలు సంయుక్తంగా నిరసన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించాయి.కాగా, అహ్మదాబాద్లో దారుణ విమాన ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నామని, తిరిగి ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఒక ప్రకటనలో తెలియజేశారు. -
గవర్నర్ని కలిసిన వైఎస్సార్సీపీ నేతలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ను వైఎస్సార్సీపీకి చెందిన పలువురు నేతలు కలిశారు. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పలువురు వైఎస్సార్సీపీ నేతలు.. గవర్నర్ నజీర్ను కలిసి పలు అంశాలపై వినతిపత్రం అందించారు. గవర్నర్ను కలిసిన వారిలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జగ్గయ్యపేట వైఎస్సార్సీపీ ఇంచార్స్ తన్నేరు నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు అరుణ్, రాహుల్, మేయర్ భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు శైలజా రెడ్డి, బెల్లం దుర్గలు ఉన్నారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ. . ‘గవర్నర్ని కలిసి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు వివరించాము. స్థానిక ప్రజాప్రతినిధుల చేస్తున్న ఇసుక అక్రమ రవాణా పై వివరించాము. మహిళలపై జరుగుతున్న హత్యాచారాలు, అక్రమ కేసులు, సూపర్ సిక్స్ అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం, శాతవాహన కాలేజ్ అంశం, సాక్షి కార్యాలయంపై దాడి , జగన్ పోన్నూరు టూర్ లో రాళ్ళ దాడిపై వినతిపత్రం అందించాం’ అని అన్నారు.మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ‘10 అంశాలతో కూడిన వినతి గవర్నర్ కి ఇచ్చాం.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం , అక్రమ అరెస్టులు అన్ని వివరించాము. గవర్నర్తగు చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారు. గత హయాంలో జరిగిన మంచి కార్యక్రమాలు తుడిచిపెట్టే పని మొదలు పెట్టారు..కూటమి నేతలు తల్లికి వెన్నుపోటు పొడిచారు.. 30లక్షల మంది పిల్లలకు అన్యాయం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని సహజ సంపదని తెలంగాణకి అమ్మేసుకొంటున్నారు’ అని మండిపడ్డారు. -
ఏపీ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మే 19 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను అధికారులు ఇవాళ (గురువారం) సాయంత్రం విడుదల చేశారు. మొత్తంగా 1,23,477మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 76.14శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు విద్యాశాఖ ప్రకటించింది.బాలురలో 73.55 శాతం, బాలికల్లో 80.10 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థులు ఒకే ఒక్క క్లిక్తో www.sakshieducation.comలో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. 👉ఏపీ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు 2025 కోసం క్లిక్ చేయండి -
వారాహి ఆలయాన్నీ వదలని టీడీపీ నేతలు
సాక్షి టాస్క్ఫోర్స్: తిరుచానూరులో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. శ్రీఆదివారాహి ఆలయాన్ని నేలమట్టం చేశారు. అమ్మవారి విగ్రహం, శివలింగం, ఇతర మూర్తుల విగ్రహాలను ధ్వంసం చేసి స్వర్ణముఖిలో పడేశారు. ఇన్నాళ్లూ కబ్జాలు, ఆక్రమణలకు పాల్పడిన టీడీపీ నేతలు ఇప్పుడు వారాహి మాత ఆలయ స్థలంపై కన్నేశారు. అడ్డొచ్చిన వారిపై దాడులకు తెగబడి మంగళవారం అర్ధరాత్రి ఆలయాన్ని కూల్చేశారు. డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ దీక్ష చేసిన వారాహి అమ్మవారి విగ్రహం చేతులు విరిచి మరీ నదిలో పడేయడం కలకలం రేపింది. మారణాయుధాలతో దాడిచేసి.. ఆలయ నిర్వాహకులు, హిందూ సంఘాలు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుచానూరులో స్వర్ణముఖి నది ఒడ్డున శ్రీవారాహి అమ్మవారి ఆలయం ఉంది. ఇక్కడ కొన్నేళ్లుగా మహారుద్ర వారాహి స్వామి ఆధ్వర్యంలో అమ్మవారికి నిత్యకైంకర్యాలు నిర్వహిస్తున్నారు. కాగా.. ఆలయం ఉన్న భూమి తమదేనంటూ తిరుచానూరుకు చెందిన మణిరెడ్డి, రామిరెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఆలయ నిర్వాహకులు సైతం కోర్టును ఆశ్రయించడంతో కేసు నడుస్తోంది. ఈ నెల 9వ తేదీన రామిరెడ్డి, మణిరెడ్డితో పాటు సుమారు 30 మంది గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలతో ఆలయ నిర్వాహకులపై దాడికి తెగబడ్డారు. అడ్డొచి్చన మహిళలపై దౌర్జన్యం చేసి ఆలయాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. దీంతో బాధితులు తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నామమాత్రపు కేసులు కట్టి చేతులు దులుపుకున్నారు. దాడికి పాల్పడిన వారు టీడీపీకి అనుకూలం కావడంతో వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు వెనుకాడారని బాధితులు ఆరోపించారు.అర్ధరాత్రి ఆలయం నేలమట్టం పోలీసుల వైఫల్యంతో మరోసారి కబ్జాదారులు ఆలయంపై విరుచుకుపడ్డారు. మంగళవారం అర్ధరాత్రి జేసీబీలతో వచ్చి ఆలయాన్ని కూల్చేశారు. ఆపై ఆలయంలోని మూలవిరాట్ శ్రీవారాహి అమ్మవారి విగ్రహంతో పాటు శివలింగం, ఇతర దేవతామూర్తుల విగ్రహాల చేతులు, తలలు నరికేశారు. ఆపై విగ్రహాలను తీసుకెళ్లి స్వర్ణముఖి నదిలో పడేశారు. అక్కడ ఆలయ ఆనవాళ్లు పూర్తిగా తుడిచిపెట్టేశారు. సమాచారం అందుకున్న హిందూ సంఘాలు, జై భజరంగ్దళ్ కార్యకర్తలు బుధవారం ఘటన స్థలానికి చేరుకుని స్వర్ణముఖి నదిలో పడేసిన విగ్రహాలను జేసీబీ సాయంతో వెలికితీశారు, అప్పటికే విగ్రహాలు పగిలిపోవడంతో హిందూ సంఘాలు మండిపడ్డాయి.హిందూ సంఘాలు, ఆలయ నిర్వాహకులు తిరుచానూరు పోలీసు స్టేషన్ సమీపంలో విరిగిన విగ్రహాలతో నిరసనకు దిగారు. పోలీసులు వారిని బలవంతంగా ఈడ్చుకుంటూ పోలీసు స్టేషన్కు తరలించారు. ఆలయాన్ని కూలి్చవేసి.. ఆ భూమిని అప్పగించేందుకు టీడీపీ నేతలు రూ.10 లక్షలకు ఒప్పందం కుదిర్చుకున్నట్టు సమాచారం. ఈ దురాగతం టీడీపీ నేత కిశోర్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిందని ఆలయ నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. కిశోర్రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరుడు కావడం గమనార్హం.టీడీపీ నేత అండతోనే కూల్చివేతశ్రీవారాహి అమ్మవారి ఆలయం కూల్చివేత, విగ్రహాల ధ్వంసం ఘటనలు తిరుచానూరుకు చెందిన టీడీపీ నాయకుడు కిషోర్రెడ్డి అండతోనే జరిగిందని జై భజరంగదళ్ జిల్లా అధ్యక్షుడు కిరీఠి ఆరోపించారు. టీడీపీ నేతలు ఆలయాలపై దాడికి పాల్పడడం సహించబోమని, జిల్లావ్యాప్తంగా నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పోలీసు వ్యవస్థ మొత్తం కూటమి కనుసన్నల్లోకి వెళ్లిపోయిందని, సీఐ సునీల్కుమార్ కూటమి నేతల దౌర్జన్యాలకు సహకరిస్తున్నారని మండిపడ్డారు. -
పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులకు అంతర్రాష్ట్ర చార్జీలు మినహాయింపు
సాక్షి, అమరావతి: పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులకు అంతర్రాష్ట్ర ప్రసార వ్యవస్థ (ఐఎస్టీఎస్) ఛార్జీల మినహాయింపును కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ మరో మూడేళ్లు పొడిగించింది. 2028 జూన్ 30 లోపు ప్రారంభించే హైడ్రో పంప్డ్ స్టోరేజ్ (పీఎస్పీ), బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (బీఈఎస్ఎస్) తదితర ప్రాజెక్టులకు ఈ ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించింది. ఈ వెసులుబాటు వల్ల ప్రాజెక్టు ఖర్చు తగ్గుతుందని వెల్లడించింది. పవర్ గ్రిడ్ స్థిరత్వం, సమర్థవంత నిర్వహణకు ఆర్ఈ ప్రాజెక్టులు ఉపయోగపడతాయని తెలిపింది. తమ ఆదేశాలకు అనుగుణంగా లీగల్ టీమ్లు విద్యుత్ కొనుగోలు ఒప్పందా (పీపీఏ)లను రూపొందించుకోవాలని కేంద్రం సూచించింది.‘ఐఎస్టీఎస్’ వెలుసుబాటుతో గతంలోనే ఒప్పందాలువ్యవసాయానికి పగటి పూట 9 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు సామాన్య ప్రజలు, పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ను అందించే లక్ష్యంతో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల స్థాపనకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అదే సమయంలో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను ప్రోత్సహించడం కోసం 2021 జనవరిలో కేంద్రం ఐఎస్టీఎస్ చార్జీలను పూర్తిగా మాఫీ చేసింది. అనంతరం ఐఎస్టీఎస్ చార్జీల మినహాయింపుతో యూనిట్ కేవలం రూ.2.49కే 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ను అందిస్తామంటూ 2021 సెప్టెంబర్ 15న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) రాష్ట్రానికి లేఖ రాసింది. దీనిపై లోతుగా అధ్యయనం చేసిన తరువాత 2021 డిసెంబర్ 1న సెకీతో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సరఫరా ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఇప్పటి వరకూ కూటమి ప్రభుత్వం సెకీ విద్యుత్ను తీసుకోలేదు. పైగా ఐఎస్టీఎస్ చార్జీలు వర్తిస్తాయంటూ టీడీపీ, దాని అనుబంధ ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయి. దేశంలోనే అత్యధికంగా 44.79 గిగావాట్ల పునరుత్పాదక సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ (పీఎస్పీ) ప్రాజెక్టుల ఏర్పాటుకు కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముందడుగు వేసింది. వివిధ జిల్లాల్లో ఉండే నీటి వనరులను ఉపయోగించుకొని పంప్డ్ హైడ్రో స్టోరేజీ, సౌర, పవన విద్యుత్ల కలయికగా ఈ అధునాతన ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. ఇందులో 33,240 మెగావాట్లకు సంబంధించి 29 ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులకు ఫీజిబులిటీ అధ్యయనం చేసి, 20,900 మెగావాట్ల సామర్ధ్యంతో కూడిన ప్రాజెక్టులకు డీపీఆర్లు కూడా పూర్తి చేసింది. ఇందులో 16,180 మెగావాట్ల ఉత్పత్తికి వివిధ కంపెనీలకు అనుమతులు కూడా ఇచ్చింది. వీటిని కూడా కూటమి ప్రభుత్వం అటకెక్కించింది. ఈ మూడేళ్లలోనైనా ఈ ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం పట్టాలెక్కిస్తే అంతర్రాష్ట్ర ప్రసార చార్జీల నుంచి మినహాయింపు పొంది, రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుంది. -
ఆకలి తీర్చే అక్షయపాత్ర
భక్తుల కోరిక తీర్చడమే కాదు.. తన దర్శనానికి వచ్చినప్పుడు ఆకలి కూడా తీరుస్తున్నాడు జగత్కల్యాణ చక్రవర్తి..తిరుమల వేంకటేశ్వరుడు.. ఆ దేవదేవుడే ఆదేశించినట్లుగా ప్రతిరోజు తిరుమలలో అన్నప్రసాదవితరణ మహాయజ్ఞంలా సాగుతోంది....తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు టీటీడీ నిరంతర యజ్ఞంగా అన్నప్రసాద వితరణ ఉచితంగా చేస్తోంది. 1985, ఏప్రిల్ 6న శ్రీవేంకటేశ్వర నిత్యాన్నదానం పథకాన్ని అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారకరామారావు చేతులమీదుగా టీటీడీ ప్రారంభించింది. తదుపరి 1994, ఏప్రిల్ 1న శ్రీవేంకటేశ్వర నిత్యాన్నదానం ట్రస్టుగా, తర్వాత దీనిని శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుగా నామకరణం చేశారు. మొదటగా తిరుమలలో కల్యాణకట్ట ఎదురుగా గల పాత అన్నదానం కాంప్లెక్స్లో అన్నదానం జరిగేది. ఇప్పటి వరకు శ్రీ వైంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ కు దాతలు దాదాపు రూ. 2,190 కోట్ల విరాళాలను అందించారు. ఎందరో దాతలు ఇచ్చిన నిధులతో నిర్విరామంగా అన్నప్రసాద వితరణ సాగుతోంది. వ్యక్తిగతంగా దాతల పుట్టిన రోజు, దాతల కుటుంబ సభ్యుల పేర్లతో, దాతల ట్రస్ట్ లు, కంపెనీల పేరుతో రూ.44 లక్షలు అందించవచ్చు. శ్రీవారి పుట్టిన రోజు అయిన శ్రవణా నక్షత్రం, శ్రీ పద్మావతీ అమ్మవారి పుట్టిన రోజు అయిన ఉత్తరషాడ నక్షత్రం, పంచమితీర్థం, వైకుంఠ ఏకాదశి, శ్రీవారి, శ్రీపద్మావతీ అమ్మవారి ప్రత్యేక రోజుల్లో కూడా దాతలు విరాళంగా అందించవచ్చు.భక్తుల నుంచి విశేష ఆదరణదాతలు రూ.44 లక్షలు అన్నప్రసాద వితరణకు విరాళం అందిస్తే, ఆ రోజంతా తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్–1లోని 20, వైకుంఠం క్యూ కాంప్లెక్స్– 2లోని 31 కంపార్ట్మెంట్లు, నారాయణగిరిలోని 9 కంపార్ట్ మెంట్లు, ఏటీసీ, ఎంబీసీ, టిబీసీ, పీఏసీ– 2, పీఏసీ – 4 కేంద్రాలు, శిలాతోరణం, కృష్ణతేజ వరకు బయటి క్యూలైన్లు, తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం కాంప్లెక్సులు, శ్రీగోవిందరాజ స్వామి ఆలయ అన్నప్రసాదరణ వితరణ కేంద్రం, రుయా ఆస్పత్రి, స్విమ్స్, మెటర్నిటి ఆస్పత్రి, బర్డ్, ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రి, తిరుచానూరులోని అన్నప్రసాద భవనం, ఒంటిమిట్టలో భక్తులకు ఉచితంగా అన్నప్రసాద వితరణ చేస్తారు. ప్రతి రోజూ టీటీడీలో అన్నప్రసాదాల తయారీ, పంపిణీకి సుమారు పలువురు ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్నారు. అన్నప్రసాదాలు విభాగంలో పలువురు శ్రీవారి సేవకులు సేవలు అందిస్తున్నారు. తద్వారా భక్తులు నుంచి టీటీడీ అన్నప్రసాదం విభాగం విశేష ఆదరణ పొందుతోంది.దాతలు స్వయంగా అన్న ప్రసాదం వడ్డించే అవకాశంరూ. 44 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులు ప్రత్యేకంగా అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. విరాళం అందించే దాతల పేరును తిరుమల వెంగమాంబ అన్నప్రసాద భవనంలోని డిస్ ప్లే బోర్డులో ప్రదర్శిస్తారు. అదేవిధంగా ఒకరోజు అన్నప్రసాదాలను వడ్డిస్తారు. ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణ రూ.44 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఉదయం అల్పాహారం కోసం రూ.10 లక్షలు, మధ్యాహ్నం భోజనం కోసం రూ.17 లక్షలు, రాత్రి భోజనం కోసం రూ.17 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తారు. తిరుమల, తిరుపతి, ఒంటిమిట్టలోని టీటీడీ అన్నప్రసాదాలు వితరణ కేంద్రాల నుండి రోజుకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రికి సుమారు 2.5 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరిస్తున్నారు. -
దంచికొట్టిన వర్షాలు
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ): ఈశాన్య రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం నుంచి బుధవారం వరకూ 24 గంటల వ్యవధిలో ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపర్రులో 15.5 సెం.మీ. వర్షం కురిసింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 10, గుడివాడలో 9.4, చల్లపల్లి మండలం పురిటిగడ్డలో 9.3, బాపట్ల జిల్లా కూచినపూడిలో 7.9 సెం.మీ. వర్షం కురిసింది. బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా రస్తాకుంటు బాయిలో 7.2 సెం.మీ. వర్షం పడింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 6.5, అంబేడ్కర్ కోనసీమ జిల్లా తాతపూడిలో 4.7, ప్రకాశం జిల్లా కొలుకులలో 4.4, ఆత్రేయపురంలో 4.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ద్రోణి ప్రభావంతో మరో రెండు, మూడు రోజులపాటు రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరుగా, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. శుక్రవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. -
‘సాక్షి’ కార్యాలయాలకు భద్రత కల్పించండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘సాక్షి’ పత్రిక, టీవీ కార్యాలయాలు, ఆ సంస్థ పాత్రికేయులపై టీడీపీ నేతలు, కార్యకర్తలు, గూండాల దాడులను వెంటనే అరికట్టాలని ‘సాక్షి’ మీడియా గ్రూప్ ప్రతినిధుల బృందం డీజీపీ హరీశ్ కుమార్గుప్తాను కోరింది. పన్నాగం ప్రకారం దాడులకు దిగుతూ రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు డీజీపీని ఉద్దేశించిన వినతిపత్రాన్ని అదనపు డీజీ (శాంతిభద్రతలు) మధుసూదన్రెడ్డికి సమర్పించింది. ‘సాక్షి’ మీడియా గ్రూప్ ప్రతినిధులు బుధవారం మధుసూదన్రెడ్డిని మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో కలిశారు. రాష్ట్రంలో తమ సంస్థ కార్యాలయాలపై కొన్ని రోజులుగా జరుగుతున్న దాడులు, ఆస్తుల విధ్వంసాన్ని వివరించారు. విజయవాడలోని ప్రధాన కార్యాలయంతో పాటు శ్రీకాకుళం, రాజానగరం, మంగళగిరి, తిరుపతి, అనంతపురం, చిత్తూరు, ఏలూరు తదితర నగరాల్లో ‘సాక్షి’ పత్రిక యూనిట్, ప్రాంతీయ కార్యాలయాలపై జరిగిన దాడుల తీవ్రతను తెలియజేశారు. బాధ్యతాయుతమైన మీడియా సంస్థగా... మహిళలు, పిల్లలు, ఇతర వర్గాల గౌరవానికి ఏమాత్రం భంగం కలిగించలేదని, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించిందని ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రతినిధులు స్పష్టం చేశారు. కుట్రపూరితంగా కొందరు పత్రిక కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు, విధ్వంసానికి పాల్పడుతున్నారని అదనపు డీజీ దృష్టికి తీసుకెళ్లారు. డీజీపీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు తక్షణం జోక్యం చేసుకుని దాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దాడులకు పాల్పడినవారిపై ఇప్పటికే ఆధారాలతో సహా సమర్పించిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కులను పరిరక్షించాలని కోరారు. ‘సాక్షి’ ప్రతినిధులు సమర్పించిన వినతిపత్రంపై అదనపు డీజీ మధుసూదన్రెడ్డి సానుకూలంగా స్పందించారు. దాడులకు పాల్పడినవారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, ‘సాక్షి’ కార్యాలయాలకు పూర్తి భద్రత కల్పిస్తామని చెప్పారు. -
మద్యం విధానంతో నాకు సంబంధం లేదు
సాక్షి, అమరావతి: మద్యం విధానం పూర్తిగా రాష్ట్ర మంత్రి మండలి పరిధిలోని వ్యవహారమని, అందులో పార్లమెంటు సభ్యుడికి ఎలాంటి పాత్ర ఉండదని రాజంపేట ఎంపీ పీవీ మిథున్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని బెవరేజెస్ కార్పొరేషన్ అమలు చేస్తుందన్నారు. ఈ విషయం దర్యాప్తు సంస్థ సీఐడీకి బాగా తెలిసినా ఉద్దేశపూర్వకంగా మాస్టర్ మైండ్ అంటూ తనపై పదేపదే ఆరోపణలు చేస్తోందని, తన పాత్ర ఉందని నిరూపించే ఒక్క ఆధారాన్ని కూడా చూపడం లేదని తెలిపారు. కోర్టు ముందు కూడా ప్రాథమిక ఆధారాలను ఉంచలేదని వివరించారు. మద్యం విధానానికి సంబంధించి లావాదేవీలతో ఎలాంటి సంబంధం లేదని.. విధానం మార్పునకు తనను బాధ్యుడిగా చేయడం తగదని తెలిపారు. తనను అరెస్ట్ చేసి తీరాలన్న వ్యూహంలో భాగంగా కోర్టును రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని మిథున్రెడ్డి నివేదించారు. మద్యం విధానంపై సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ మిథున్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, ఆ కౌంటర్కు సమాధానం ఇవ్వాలని మిథున్రెడ్డిని ఆదేశించింది. ఈ మేరకు ఆయన సమాధానం ఇచ్చారు. ముందస్తు బెయిల్పై హైకోర్టు గురువారం విచారణ జరపనుంది. మిథున్రెడ్డి దాఖలు చేసిన కౌంటర్లోని ముఖ్యాంశాలు... ‘‘2014–19 మధ్య ప్రభుత్వ పెద్దలు లిక్కర్ మాఫియాను సృష్టించారు. వారికి దగ్గరగా ఉన్న సిండికేట్లో భాగమైన నాలుగైదు కంపెనీలకే 68 శాతం మద్యం తయారీ బాధ్యతలు అప్పగించి లబ్ధి పొందారు. రాయితీలు, పన్ను మినహాయింపులు, ఆయాచిత లబ్ధి, లైసెన్స్ల జారీలో అనుచిత ప్రయోజనాలు కల్పించారు. దీంతో రాష్ట్ర ఖజానాకు రూ.వేల కోట్ల నష్టం వాటిల్లింది. లిక్కర్ షాప్ల లైసెన్సుల జారీ లాటరీలో రిగ్గింగ్కు పాల్పడి కావాల్సిన వారికే దుకాణాలు దక్కేలా చూశారు. మొత్తం 4,380 షాప్లలో 80 శాతం షాప్లపై గుత్తాధిపత్యం సాధించారు. ప్రైవేటు షాప్లు, ప్రివిలేజ్ ఫీజు తొలగింపుతో వేలాది బెల్టు దుకాణాలు పుట్టుకొచ్చాయి. మద్యాన్ని ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్మేందుకు 4,380 పర్మిట్ రూమ్లకు అనుమతులిచ్చారు. ఇలా వచ్చిన డబ్బును దారిమళ్లించారు. అమ్మకాలు గణనీయంగా పెరిగినా, ప్రభుత్వ ఆదాయం పెరగలేదు’’ అని వివరించారు.గత ప్రభుత్వంలో పారదర్శక విధానం..గత ప్రభుత్వం (2019–24)లో మద్యం విధానం పూర్తి పారదర్శకంగా ఉందని మిథున్రెడ్డి తెలిపారు. సంస్కరణలతో మద్యం వినియోగం తగ్గించాలన్న లక్ష్యాన్ని సాధించిందన్నారు. ‘‘లిక్కర్ మాఫియాను రూపుమాపడంతో పాటు బెల్ట్ షాప్లు, పర్మిట్ రూమ్లను రద్దు చేసి మద్యం వినియోగం తగ్గించే చర్యలు చేపట్టింది. మద్యం షాపులను 4,380 నుంచి 2934కి కుదించింది. 2014–19 మధ్య రూ.16,091 కోట్లుగా ఉన్న మద్యం ఆదాయం 2023–24 నాటికి రూ.24,760 కోట్లకు చేరింది. దీన్ని కాగ్ నివేదికల్లో స్పష్టం చేసింది. ఖజానాకు నష్టం జరగలేదు. కాబట్టి గత ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాలతో నష్టం వాటిల్లిందన్న దర్యాప్తు సంస్థ వాదన పూర్తి నిరాధారం’’ అని స్పష్టం చేశారు. భయపెట్టి, బెదిరించి వాంగ్మూలాల నమోదుమద్యం విధానం కేసులో కొందరు సాక్షులు తనకు వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇచ్చారని దర్యాప్తు సంస్థ చెబుతోందని, నిజానికి అవి బెదిరించి, భయపెట్టి తీసుకున్నవని మిథున్రెడ్డి పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థ తీరుపై కొందరు సాక్షులు, ఇతర నిందితుల కుటుంబసభ్యులూ హైకోర్టును ఆశ్రయించారని గుర్తు చేశారు.అయినా కూడా దర్యాప్తు సంస్థ బలవంతంగా వాంగ్మూలాలు తీసుకుంటోందని, ఇలాంటివాటికి విలువ లేదని పేర్కొన్నారు. తనను ఈ కేసులో ఇరికించాలన్నదే సీఐడీ లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతో తనతోపాటు పలువురిని లక్ష్యంగా చేసుకుని విచారణ మొదలుపెట్టారన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రిపై గతంలో నమోదు చేసిన కేసుకు కౌంటర్గా తమపై తప్పుడు కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. ‘‘ఈ కేసులో దర్యాప్తు నిష్పాక్షికంగా జరగడం లేదు. సీఐడీ నమోదు చేస్తున్న వాంగ్మూలాలే దీనికి నిదర్శనం. పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్తో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే హైకోర్టుకు నివేదించింది. అయినా పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ లావాదేవీలను నాకు ముడిపెడుతూ కోర్టులను తప్పుదోవ పట్టిస్తోంది. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నానని, వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. -
పాత్రికేయుడు కృష్ణంరాజు అరెస్టు
సాక్షి, అమరావతి: సీనియర్ పాత్రికేయుడు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజును గుంటూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం రాత్రే అదుపులోకి తీసుకున్న అయనను ఓ రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్టు సమాచారం. అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే అభియోగాలతో పాటు సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు, ‘సాక్షి’ టీవీ యాజమాన్యంపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పటికే కొమ్మినేనిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. కృష్ణంరాజు అరెస్టును గురువారం అధికారికంగా వెల్లడించి అనంతరం న్యాయస్థానంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనిపై పోలీసు వర్గాలు అధికారికంగా స్పందించేందుకు నిరాకరించాయి. -
ఏరువాక సందడి ఏది?
సాక్షి, అమరావతి: ఏరువాక పౌర్ణమి.. మరోపేరు జ్యేష్ట పౌర్ణమి.. ఇది తెలుగు రైతుల పండుగ. తొలకరి పంట సాగుకు సన్నద్ధమయ్యే సందర్భంగా రైతులు సంప్రదాయబద్ధంగా ఉత్సాహంగా జరుపుకునే వేడుక.. కాడెద్దులను సిద్ధంచేసి వ్యవసాయ పరికరాలను అలంకరించుకుని పూజలుచేసి సాగును ఆరంభిస్తారు. అలాంటి సంప్రదాయ పండుగ వాతావరణం ఈ ఏడాది రైతుల లోగిళ్లలో ఎక్కడా కన్పించడంలేదు. గడిచిన ఏడాదిగా టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య ధోరణి రాష్ట్రంలోని రైతులందరి పాలిట శాపంగా మారింది. ప్రభుత్వ నిర్వాకంవల్ల సాగుభారంగా మారడంతో రైతులు తొలకరి సాగుకు ఉసూరుమంటూ బుధవారం ఏరువాకకు శ్రీకారం చుట్టారు.పెట్టుబడి సాయం లేకుండా ఏరువాక ఎలా?తాము అధికారంలోకి వస్తే ఏటా ప్రతీ రైతు కుటుంబానికి రూ.20వేల చొప్పున అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి సాయం అందిస్తామని టీడీపీ కూటమి ఎన్నికల్లో ఊదరగొట్టింది. ఎన్నికల్లో గెలిచాక 2024–25 సీజన్కు ఇవ్వాల్సిన రూ.10,717 కోట్ల పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టింది. కనీసం ఈ ఏడాదైనా సీజన్కు ముందు ఇస్తుందేమోనని రైతులంతా ఆశగా ఎదురుచూసారు. కానీ, ఇప్పటివరకు ఆ ఊసేలేదు. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా ఇప్పటివరకూ జారీచేయలేదు. మరోపక్క.. గడిచిన ఖరీఫ్, రబీ సీజన్లలో వరదలు, అకాల వర్షాలు, కరువు ప్రభావంతో పంటలు నష్టపోయిన దాదాపు ఏడు లక్షల మంది రైతులకు రూ.850 కోట్లకు పైగా పంట నష్టపరిహారం సీజన్ ముగిసినా చెల్లించలేదు. రూ.వెయ్యి కోట్లకు పైగా ధాన్యం బకాయిలుఇక 48 గంటల్లోనే.. కాదు కాదు 24 గంటల్లోనే ధాన్యం సొమ్ములు జమచేస్తున్నామంటూ గొప్పలు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. గడిచిన రబీ సీజన్కు సంబం«ధించి పేరుకుపోయిన రూ.1,000 కోట్ల బకాయిల చెల్లింపు ఊసెత్తడం లేదు. అలాగే, 2023–24 సీజన్కు సంబంధించి ప్రీమియం బకాయిలు రూ.930 కోట్లు చెల్లించకుండా ఎగ్గొట్టడం వల్ల రైతులకు రూ.1,385 కోట్ల పంటల బీమా పరిహారం అందకుండాపోయింది. కనీసం ఖరీఫ్–2024 సీజన్కు సంబంధించిన పంటల బీమా ప్రీమియం మొత్తం రూ.838 కోట్లు చెల్లించి ఉంటే బీమా పరిహారమైనా ఈపాటికి చేతికొచ్చేది. ఇలా దాదాపు రూ.25 వేల కోట్లకు పైగా రైతులకు అందాల్సిన సాయం జమకాకుండా టీడీపీ కూటమి ప్రభుత్వం మోకాలడ్డింది. పైగా.. రబీ సీజన్ నుంచి ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దుచేసింది. స్వచ్ఛంద బీమా నమోదు చేయాలని చెప్పడంతో ఆ భారం భరించలేక రైతులెవరూ రబీలో నమోదు చేసుకోలేదు. మరోపక్క.. ధాన్యం, పత్తి, మిరప, పొగాకు, టమాటా ఇలా ఏ ఒక్క పంటకూ మద్దతు ధర దక్కక రైతన్నలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ప్రభుత్వ నిర్వాకంవల్ల రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కనీసం అదునుకైనా విత్తనం అందించారా అంటే అదీ లేదు.విత్తనం అందక అగచాట్లుఇదిలా ఉంటే.. గత సీజన్ నుంచే నాన్ సబ్సిడీ విత్తన సరఫరాకు మంగళం పాడేశారు. 6.32 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనం అవసరం కాగా.. నిధులలేమి సాకుతో 5.38 లక్షల క్వింటాళ్లకు పరిమితం చేశారు. వేరుశనగ విత్తనం 30 శాతానికి కుదించారు. కనీసం ఆ విత్తనమైనా సీజన్కు ముందు అందుబాటులో ఉంచారా అంటే అదీలేదు. ఇప్పటివరకు కనీసం 30 శాతం విత్తనాన్ని కూడా పొజిషన్ చేసిన పాపాన పోలేదు. రైతు సేవా కేంద్రాల్లో సబ్సిడీ విత్తనమే కాదు.. ఎరువులూ కానరావడంలేదు. అయినాసరే, ఏరువాక పౌర్ణమిని పండుగ వాతావరణంలో చేసుకోవాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడం విస్మయానికి గురిచేస్తోంది. రైతులు చేసుకోవాల్సిన ఈ పండుగను అంతా బాగుందంటూ వారిని ఏమార్చి మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో కూటమి కార్యకర్తలు హంగామా చేశారు. -
నేటి నుంచి బడిగంటలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఉ.9 గంటలకు బడిగంటలు మోగనున్నాయి. ప్రాథమిక పాఠశాలలు మ.3.20 గంటల వరకు, ఉన్నత పాఠశాలలు సా.5 గంటల వరకు కొనసాగుతాయి. హైసూ్కళ్లలో సా.4 గంటల వరకు తరగతులు కొనసాగుతాయి. అనంతరం గంట సమయం (ఐచ్ఛికం) ఆటలు లేదా స్టడీ అవర్కు కేటాయిస్తారు. 2025–26 విద్యా సంవత్సరానికి గాను గతనెలలో ప్రాథమిక స్కూళ్ల విద్యా కేలండర్ను విడుదల చేసిన విద్యాశాఖ.. బుధవారం హైస్కూల్ అకడమిక్ కేలండర్ను కూడా విడుదల చేసింది. ఈ ఏడాది విద్యా సంవత్సరంలో మొత్తం 316 రోజులకు గాను 83 రోజులను వివిధ సెలవులుగా ప్రకటించింది. మిగిలిన 233 రోజులు పాఠశాలలు పనిచేస్తాయి. ఇక సాధారణ బడులకు సెపె్టంబరు 24 నుంచి అక్టోబరు 2 వరకు దసరా సెలవులు.. వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. అలాగే, క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లకు సెపె్టంబరు 27 నుంచి అక్టోబరు 2 వరకు దసరా సెలవులు.. డిసెంబరు 21 నుంచి 28 వరకు క్రిస్మస్ సెలవులు, జనవరి 10 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. ప్రతి శనివారం అన్ని పాఠశాలల్లోను ‘నో బ్యాగ్ డే’ కొనసాగుతుంది. ఆ రోజు విద్యేతర కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఏడాదికి ఏడు పేరెంట్స్–టీచర్స్ సమావేశాలుఇక విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే (ఫార్మేటివ్, సమ్మేటివ్ అసెస్మెంట్) ముందు పేరెంట్స్–టీచర్స్ సమావేశం (పీటీఎం) నిర్వహిస్తారు. ఏడాదిలో మొత్తం ఏడు పీటీఎంలు ఉంటాయి. వీటిలో జూన్ 25న, నవంబరు 25న మెగా పీటీఎంలు ఉంటాయి. ఆగస్టులో తెలుగు భాషోత్సవాలు నిర్వహిస్తారు. అలాగే, పదో తరగతి విద్యార్థులకు 2026 మార్చి 16 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు పబ్లిక్ పరీక్షలు ఉంటాయి. విద్యార్థుల్లో రాజకీయ విజ్ఞానం పెంచేందుకు కొత్తగా అసెంబ్లీ పర్యటనను చేర్చారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలల్లో 8–10 తరగతుల విద్యార్థులకు పోటీలు నిర్వహించి ఎంపికైన వారికి అమరావతిలోని శాసనసభ సందర్శించే అవకాశం కల్పిస్తారు. 9వ తరగతి విద్యార్థులకు కొత్తగా బ్రిడ్జి కోర్సును ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా టెన్త్ విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించే మార్చిలో తొమ్మిదో తరగతి విద్యార్థులకు కూడా పరీక్షలు నిర్వహించి పబ్లిక్ పరీక్షలపై అవగాహన కల్పిస్తారు. -
తల్లికి వందనం 30 లక్షల మందికి ఎగనామం
సాక్షి, అమరావతి: ‘నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు.. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ ఇస్తాం. ఒకరుంటే రూ.15 వేలు.. ఇద్దరుంటే రూ.30 వేలు.. ముగ్గురుంటే రూ.45 వేలు.. నలుగురుంటే రూ.60 వేలు ఇస్తాం.. అధికారంలోకి రాగానే తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పథకం కింద ఈ మొత్తాన్ని జమ చేస్తాం’ అని ఊరూరా.. ఇంటింటా ఎన్నికల ముందు ప్రచారం చేసిన చంద్రబాబు అండ్ గ్యాంగ్.. ఇప్పుడు మాట తప్పింది. ఏకంగా దాదాపు 30 లక్షల మందికి ఈ పథకాన్ని ఎగ్గొట్టనుంది. అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టడమే కాకుండా.. రెండో ఏడాది తూతూ మంత్రంగా అమలు చేసేందుకు సిద్ధమైంది. రూ.15 వేల స్థానంలో రూ.13 వేలు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించిందని తెలిసింది. రాష్ట్రంలో 87,41,885 మంది విద్యార్థులున్నట్టు యూడైస్ లెక్కలు చెబుతున్నాయి. వీరందరికీ తల్లికి వందనం కింద రూ.15 వేల చొప్పున ఇవ్వాలంటే రూ.13,112 కోట్లు అవసరం. అయితే ఈ పథకం అమలు కోసం రూ.8,745 కోట్లు మాత్రమే కేటాయించినట్లు సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఈ లెక్కన ఈ మొత్తం 58 లక్షల మంది విద్యార్థులకే సరిపోతుంది. అంటే దాదాపు 30 లక్షల మందికి ఈ పథకాన్ని ఎగ్గొట్టడానికి రంగం సిద్ధం చేశారని తెలుస్తోంది. ఈ రూ.13 వేలను ఒకేసారి ఇస్తారా.. లేక వాయిదాల పద్దతిలో ఇస్తారా.. అన్నది ఇంకా స్పష్టం చేయలేదు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా సూపర్ సిక్స్ అమలు చేయక పోవడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా.. ప్రజలు ఈ పథకం గురించి ఎక్కడికక్కడ ప్రశ్నిస్తుండటంతో అరకొరగా అమలు చేయనుందని తెలుస్తోంది. అయితే అంతుబట్టని అంకెల గారడీతో తల్లుల కళ్లకు ప్రభుత్వం గంతలు కట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో 67,27,164 మంది విద్యార్థులున్నట్టు చెబుతోంది. ఈ లెక్కన తీసుకున్నా, తలో రూ.15 వేల చొప్పున రూ.10,090.74 కోట్లకు పైగా అవసరం. కానీ కేటాయింపులు మాత్రం ఆ మేరకు కూడా లేక పోవడం పలు సందేహాలకు తావిస్తోంది. తీరా నగదు జమ చేసే సమయానికి ఇంకెంత మందికి ఎగ్గొడతారోననే అనుమానం వ్యక్తమవుతోంది.గత ఏడాది ఎగ్గొట్టి.. ఈ ఏడాది కోతలు పెట్టి.. ‘‘ఇప్పుడున్న సంక్షేమ పథకాలు ఏ ఒక్కటీ ఆపేది లేదు.. అన్నీ కొనసాగిస్తాం.. ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ ‘తల్లికి వందనం’ అమలు చేస్తాం. ఒక్కరుంటే రూ.15 వేలు ఇస్తాం. ఇద్దరుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తాం. ఇంకా పిల్లలను కనండి పథకాలు అందుకోండి’’ అంటూ ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇదే హామీని ‘సూపర్–6’లోనూ పేర్కొన్నారు. అందరికీ తల్లికి వందనం ఇస్తామన్న హామీ ప్రకారం.. ఇప్పుడు చెప్పిన విద్యార్థుల సంఖ్య, నిధుల లెక్క సరిపోవడం లేదు. విద్యార్థుల లెక్కలు చెప్పేందుకు దేశంలో యూడైస్ డేటానే ప్రామాణికం. అన్ని జిల్లాల్లోని స్కూళ్లలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారన్న సమగ్ర సమాచారం కేంద్ర ప్రభుత్వానికి అందించే నివేదిక ఇది. ఈ లెక్కలను స్వయంగా ఆయా జిల్లాల కలెక్టర్ల ద్వారానే అప్లోడ్ చేస్తారు. రాష్ట్రంలో 87,41,885 మంది విద్యార్థులున్నట్టు యూడైస్ లెక్కలు చెబుతున్నాయి. వీరందరికీ తల్లికి వందనం కింద రూ.15 వేల చొప్పున ఇవ్వాలంటే రూ.13,112 కోట్లు అవసరం.గతేడాది ఒక్క విద్యార్థికీ ఈ పథకం ఇవ్వకుండా ఎగ్గొట్టింది. ఈసారి విద్యార్థుల సంఖ్యలో కోత పెట్టి గొప్పలు చెబుతోంది. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభమైన జూన్ నెలలో అమ్మఒడి జమయ్యేది. గతేడాది ఎన్నికలు జరిగి కూటమి ప్రభుత్వం రావడంతో పథకం ఆగిపోయింది. కానీ సీఎం చంద్రబాబు గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు కొనసాగిస్తామన్నారు. అలాగే, ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఇస్తామన్నారు. హామీ ప్రకారం రెండేళ్లకు ఒక్కో విద్యార్థికి రూ.30 వేల చొప్పున ఇవ్వాలని తల్లులు డిమాండ్ చేస్తున్నారు.నేడు ‘తల్లికి వందనం’ నిధులు జమసమీక్షలో సీఎం చంద్రబాబు నిర్ణయంసాక్షి, అమరావతి: తల్లికి వందనం పథకాన్ని గురువారం నుంచి అమలుచేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. సచివాలయంలో బుధవారం ఈ పథకం అమలు, విధివిధానాలపై మంత్రులు లోకేశ్, పయ్యావుల కేశవ్, అధికారులతో సీఎం సమీక్షించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా గురువారమే తల్లులకు కానుకగా ఈ పథకాన్ని అమలుచేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అర్హులైన విద్యార్థుల ప్రతి తల్లి ఖాతాలో తల్లికి వందనం నిధులను జమచేయాలని ఆయన ఆదేశించారు. సమీక్షలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. అర్హులైన విద్యార్థులను ఇప్పటికే గుర్తించామన్నారు. పథకాన్ని ఎలా అమలుచేయబోతున్నామనే విషయాన్ని వివరించారు. పథకం అమలుకు అవసరమైన నిధుల లభ్యత విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కు సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో 67,27,164 మంది విద్యార్థులకు తల్లికి వందనం కింద గురువారం నగదును తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. -
‘డైవర్షన్ పాలిటిక్స్కి మహిళలను పావులుగా వాడుకోవడం సిగ్గుచేటు’
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం తన డైవర్షన్ పాలిటిక్స్ కోసం మహిళలను పావులుగా వాడుకోవడం అత్యంత దారుణమని వైఎస్సార్సీపీ మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న సాక్షి మీడియాపై మహిళలను ఉసికొల్పి దాడులు చేయించే దిగజారుడు రాజకీయాలకు సీఎం చంద్రబాబే పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రశ్నించే ప్రతి గొంతును నొక్కేయాలనే దుర్మార్గమైన పాలనలో భాగంగానే మహిళలను ముందు పెట్టి కుటిల రాజకీయానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆమె ఎమన్నారంటే..ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఎక్కడికెళ్లినా ప్రజలు వేలాదిగా తరలివచ్చి ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇది చూసి చంద్రబాబు, లోకేష్ ఓర్వలేక మహిళలను అడ్డం పెట్టుకుని డైవర్షన్ పాలిటిక్స్కి తెగబడ్డారు. వారి దిగజారుడు రాజకీయాలకు మహిళలను పావులుగా వాడుకుంటున్నారు. మహిళల నిరసన పేరిట సాక్షి కార్యాలయాలను టార్గెట్ చేసుకుని గడిచిన మూడు నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అరాచకాలకు టీడీపీ కుట్ర చేసింది.మహిళలను ఆర్థికంగా ఆదుకోవడం, రక్షణ కల్పించడం వంటివి చేయకపోగా వారిని అడ్డం పెట్టుకుని కుట్ర రాజకీయాలు చేయడం దారుణం. ఏలూరులో సాక్షి కార్యాలయం మీద దాడికి టీడీపీ కుట్ర చేసింది. ముందుగా మహిళా కార్యకర్తలను పంపించి, వారి వెనుక టీడీపీ కార్యకర్తలను పంపించి దాడులు చేయించింది. తిరిగి ఆ నెపం వైయస్సార్సీపీ మీదకు నెట్టాలని చూస్తున్నారు.రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదుసాక్షి టీవీ డిబేట్లో జర్నలిస్ట్ కృష్ణంరాజు మాట్లాడిన మాటలకు వైఎస్ జగన్ క్షమాపణలు చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేయడం సిగ్గుచేటు. చంద్రబాబులా మహిళల గురించి ఏనాడైనా వైఎస్ జగన్ చులకనగా మాట్లాడటం జరిగిందా? కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అని మహిళల పుట్టుకనే అవమానించేలా మాట్లాడిందే చంద్రబాబు. దానికి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్లూ మహిళలకు అమ్మ ఒడి, చేయూత, ఆసరా వంటి పథకాలతో అండగా నిలిస్తే, చంద్రబాబు తన కుట్ర రాజకీయాలకు మహిళలను వాడుకుంటున్నాడు.ఈ ప్రభుత్వంలో మహిళలకు కనీస రక్షణ కూడా లేదు. డైవర్షన్ పాలిటిక్స్తో ఎంతోకాలం ప్రభుత్వాన్ని నడపలేరు. ఇలాంటి కుట్రలు, వక్రీకరణలు ఎంతోకాలం సాగవని గుర్తుంచుకోవాలి. కూటమి మోసపు హామీలు నమ్మి మోసపోయామని ఇప్పటికే మహిళలు ఆందోళనగా ఉన్నారు. పాలనా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఏడాది కాలంలోనే రూ.1.58 లక్షల కోట్లు అప్పులు చేసిన కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్లో ఒక్క పథకాన్ని కూడా పూర్తిగా అమలు చేయలేకపోయింది. మా ఐదేళ్ల పాలనలో చేసిన అప్పుల్లో 44 శాతం అప్పులు ఏడాదిలోనే చంద్రబాబు చేసేశాడు. మహిళలకు రక్షణ కల్పించలేని దుస్థితిలోకి కూటమి ప్రభుత్వం దిగజారిపోయింది. ఇప్పటికైనా చంద్రబాబు తన కుట్ర రాజకీయాలకు ఫుల్స్టాప్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. -
నిరుద్యోగులకు బాబు వెన్నుపోటు.. ఎల్లుండి వైఎస్సార్సీపీ నిరసనలు
సాక్షి, తాడేపల్లి: ఎల్లుండి(జూన్ 13) వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో నిరసనలు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిరసనలు తెలపాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. ఏడాదిగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు చెల్లించకపోవటం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండా నిరుద్యోగులను మోసం చేసినందుకు వైఎస్సార్సీపీ నిరసన చేపట్టనుంది. అనంతరం కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించాలని వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాలు నిర్ణయించాయి.ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్.. అంటూ ఊదర గొట్టి తీరా అధికారంలోకి వచ్చాక కూటమి నేతలు చేతులెత్తేయడంపై నిరుద్యోగ యువత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు కల్పించని పక్షంలో ప్రతినెలా రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీపై పాలకులు మాట్లాడకపోవడంపై నిలదీస్తున్నారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందంటూ మండిపడుతున్నారు.మరో వైపు, చంద్రబాబు ప్రభుత్వం పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. వాళ్లకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తోంది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. -
వారం వ్యవధిలోనే రూ.14 వేల కోట్ల అప్పు
సాక్షి, అమరావతి: కేవలం వారం వ్యవధిలోనే చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రూ.14 వేల కోట్లు అప్పు చేసింది. గత మంగళవారం (3వ తేదీన) రూ.7,000 కోట్లు అప్పు చేసిన చంద్రబాబు సర్కారు.. తాజాగా ఈ మంగళవారం మరో రూ.7,000 కోట్లు అప్పు చేసింది. 6.65 శాతం నుంచి 7.8 శాతం వడ్డీకి ప్రభుత్వ సెక్యూరిటీలను విక్రయించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మొత్తం అప్పును ఆర్బీఐ సమీకరించింది. మంగళవారం చేసిన అప్పుతో ఏడాది పాలనలోనే చంద్రబాబు సర్కారు రాష్ట్ర ప్రజలపై రూ. 1,58,604 కోట్ల అప్పుల భారం మోపింది.ఇందులో బడ్జెట్ అప్పులే ఏకంగా రూ.1,08,194 కోట్లకు చేరగా.. బడ్జెట్ బయట అప్పులు మరో రూ.50,410 కోట్లకు చేరాయి. బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో రూ.19,410 కోట్లు అప్పు చేశారు. ఇదికాకుండా రాజధాని అమరావతి పేరుతో ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు, జర్మనీ సంస్థ, హడ్కో నుంచి రూ.31 వేల కోట్లు అప్పు చేస్తోంది. రాజధాని అప్పులకు చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. గనులపైనా అప్పులు గనుల శాఖ (ఏపీఎండీ)కు చెందిన 436 మైనర్ లీజుల విలువ రూ.1,91,000 కోట్లుగా చూపించి తద్వారా ప్రైవేట్ బాండ్లు జారీ ద్వారా రూ.9,000 కోట్లు అప్పు చేయడానికి చంద్రబాబు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఇప్పటికే రూ.3,489 కోట్ల విలువైన బాండ్ల జారీ ద్వారా అప్పు చేసింది. మిగతా మొత్తాన్ని కూడా బాండ్ల జారీ ద్వారా సేకరించనుంది. ఏడాదిలోనే ఇంత పెద్దఎత్తున అప్పులు చేసిన ప్రభుత్వాలు గతంలో లేవు. చంద్రబాబు ప్రభుత్వానికే ఆ ఘనత దక్కింది. అయినా.. సూపర్ సిక్స్ పథకాలకు డబ్బుల్లేవట అప్పులు చేయడం ద్వారా చంద్రబాబు సర్కారు రాష్ట్ర ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టేస్తోంది. అయినప్పటికీ సూపర్ సిక్స్తో పాటు ఇతర హామీలను అమలు చేయడం లేదు. ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే అప్పులు చేయకుండానే సంపద సృష్టించి సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు అందుకు విరుద్ధంగా మంగళవారం, మంగళవారం అప్పులు చేస్తూ రాష్ట్ర ప్రజలపై మోయలేని భారం మోపుతున్నారు. మొత్తంగా ఏడాది పాలనలో చంద్రబాబు ప్రభుత్వం ఏమైనా చేసిందంటే.. భారీగా అప్పులు చేయడం తప్ప ఏమీ లేదని స్పష్టమవుతోంది. -
వీళ్లా మహిళల గౌరవాన్ని కాపాడేది?
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలను ఎత్తిచూపుతూ.. మహిళలపై గతంలో చంద్రబాబు, బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు, లోకేశ్ వ్యవహరించిన తీరుకు సంబంధించిన వీడియోలను జత చేస్తూ.. వీళ్లా మహిళల గౌరవాన్ని కాపాడేదంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. సీఎం చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మహిళల గౌరవం కాపాడటం’ అనే ముసుగులో కూటమి నేతలు రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి మీడియా కార్యాలయాలపై చేస్తున్న దాడులను, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని అరెస్టును ఖండిస్తూ ‘ఎక్స్’లో మంగళవారం ఆయన పోస్టు చేశారు. అందులో ఏం చెప్పారంటే.. అది రాజకీయ దురుద్దేశంతో జరిగిన అరెస్టు‘పారదర్శకత, అవినీతి రహిత, న్యాయబద్ధమైన, విప్లవాత్మక సంక్షేమ పథకాలతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమర్థవంతంగా పాలన చేసింది. కానీ.. చంద్రబాబు ప్రభుత్వ ఏడాది పాలన మోసాలతోనే కొనసాగింది. రెడ్ బుక్తో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ నిరంకుశ పాలన సాగుతోంది. తన గొప్ప వాగ్దానాలను అమలు చేయలేని అసమర్థతతో ప్రజలను మోసగించిన చంద్రబాబు.. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు.. ప్రజల దృష్టి మళ్లించేందుకు అలజడి సృష్టిస్తున్నారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఎప్పుడూ చేయని వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించి తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేయించారు. ఇది చట్టబద్ధంగా జరిగిన అరెస్టు కాదు. రాజకీయ దురుద్దేశంతో జరిగిన అరెస్టు. ఆయన చర్చను నిష్పక్షపాతంగా నిర్వహిస్తారు.ఆయన చేయని వ్యాఖ్యలను చంద్రబాబు ప్రభుత్వం వక్రీకరించి కొమ్మినేనిని బాధ్యులుగా చేయడం ఎంత అన్యాయం? వాస్తవాలను వక్రీకరించి ఒక పథకం ప్రకారం మహిళల గౌరవాన్ని కాపాడటం అనే ముసుగులో సాక్షి మీడియా కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు. కోడలు మగ బిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా? అంటూ చంద్రబాబు, అమ్మాయి కన్పిస్తే వెళ్లి ముద్దయినా పెట్టాలి.. కడుపైనా చేయాలి.. అంటూ బాలకృష్ణ అన్న మాటలు.. అమ్మాయిలతో లోకేశ్ నృత్యం చేస్తున్న వీడియోలు.. వీళ్లా మహిళల గౌరవాన్ని కాపాడతామని చెప్పేది? ఈ వీడియోలు వారి నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నాయి. మహిళల పట్ల వారికి ఉన్న గౌరవాన్ని, విలువను చాటిచెబుతున్నాయి. హామీ ఇచ్చిన భద్రత ఇదేనా? రాష్ట్రంలో ఏడాదిలోనే 188 అత్యాచారాలు, 15 అత్యాచార హత్యలు జరగడం కూటమి ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం. ఇటీవలే అనంతపురం జిల్లాకు చెందిన ఇంటర్మీడియట్ గిరిజన విద్యార్థినిని హత్య చేసి, ఆమె మృతదేహాన్ని అడవిలో పడేశారు. ఏడుగుర్రాలపల్లిలో 9వ తరగతి చదువుతున్న దళిత బాలికను టీడీపీకి చెందిన 14 మంది ఆరు నెలల పాటు సామూహిక అత్యాచారం చేశారు. ఆమె గర్భవతి అయింది. తీవ్రమైన రాజకీయ ఒత్తిడి, పోలీసుల నిష్క్రియాపరత్వాల మధ్య ఆ బాధితురాలి కుటుంబం అదృశ్యమైంది. మహిళలకు వారు హామీ ఇచ్చిన భద్రత ఇదేనా? వారు కాపాడిన గౌరవం ఇదేనా? మహిళల పట్ల వారి చర్యలు, వైఖరి రెండూ అవమానకరంగా ఉన్నాయి. మహిళల గౌరవం కాపాడటం ముసుగులో కూటమి నేతలు పగ పెంచుకున్న వారిపై కేసులు నమోదు చేయడం అసహ్యకరం. -
నేడు ప్రకాశం జిల్లా పొదిలికి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం ప్రకాశం జిల్లా పొదిలిలో పర్యటించనున్నారు. పొగాకు రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకోనున్నారు.పొదిలి పొగాకు బోర్డును సందర్శించి.. రైతులతో ముఖాముఖి చర్చించనున్నారు. వైఎస్ జగన్ బుధవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి పొదిలికి బయల్దేరుతారు. పొగాకు బోర్డును సందర్శించి పొగాకు రైతులతో ముఖాముఖి అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘మీరు ఎవరూ అధైర్యపడొద్దు... వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది’ అని రైతులు, ఇంటింటికీ రేషన్ వాహనాల(ఎండీయూ) డ్రైవర్లకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయనను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కోకో, అయిల్పామ్, పొగాకు రైతులు, రేషన్ వాహనాల(ఏపీ ఎండీయూ–మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్) డ్రైవర్ల యూనియన్ కృష్ణా జిల్లా ప్రతినిధులు కలిశారు. ‘మేం పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మా పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది’ అని రైతులు వాపోయారు. దీంతో అన్నదాతలకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ భరోసాగా ఉంటుందని, వారి పక్షాన పోరాడుతుందని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ⇒ ఇంటింటికీ నిత్యావసర సరుకులు అందించాలన్న గొప్ప ఉద్దేశంతో రేషన్ వాహనాల వ్యవస్థను ఏర్పాటు చేసి... 9,260 మంది కుటుంబాలకు ఉపాధి కల్పించి, తమను ఆదుకున్నది మీరేనంటూ వైఎస్ జగన్కు రేషన్ వాహనాల డ్రైవర్లు ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని, రేషన్ వాహనాల డ్రైవర్లను తొలగించి జీవనోపాధి లేకుండా చేసిందని వాపోయారు. తమతోపాటు దాదాపు 10 వేలమంది హెల్పర్ల కుటుంబాలు కూడా కూటమి ప్రభుత్వ నిర్వాకంతో రోడ్డున పడ్డాయని గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో వారికి అండగా ఉంటామని వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. ఆయిల్పామ్ రైతులకు ఏమీ మిగలడం లేదు నాకు నాలుగెకరాల ఆయిల్పామ్ తోట ఉంది. గతంలో సీజన్ లేనప్పుడు పామాయిల్ టన్ను రూ.21,400 ఉండేది. ఇప్పుడు రూ.18,600కు పడిపోయింది. పెట్టుబడి ఖర్చులు పెరిగాయి. గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులకు ఏం మిగలడం లేదు. ఇంకా ధర తగ్గితే మేం పూర్తిగా నష్టపోతాం. దయచేసి టన్నుకు కనీసం రూ.20 వేల మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మా సమస్యలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లాం. అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. – అన్నవరపు గణేష్, రైతు, రావికంపాడు, చింతలపూడి నియోజకవర్గం, ఏలూరు జిల్లాధర్నాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు మేం కోకో రైతులం. వైఎస్ జగన్కు మా సమస్యను వివరించాం. కోకోను ప్రైవేట్ కంపెనీలు గతంలో కేజీ రూ.వెయ్యికి కొనుగోలు చేశాయి. ఈసారి సీజన్ ప్రారంభంలో కేజీకి రూ.750 ఇచ్చి.. ఇప్పుడు రూ.400కి తగ్గించేశారు. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం కేజీ రూ.850కి అమ్ముతుంటే ఇక్కడ మాత్రం సిండికేట్ అయి రూ.300–400 మధ్య కొంటున్నారు. అదికూడా టీడీపీకి చెందిన రైతుల దగ్గరే కొంటున్నారు. పైగా నిరుడు ధర పలికిందని ఈ ఏడు కౌలు రేట్లు కూడా పెంచడంతో తీవ్రంగా నష్టపోతున్నాం. రైతులంతా ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇలాగైతే ఏం కావాలి? వైఎస్సార్సీపీ సానుభూతిపరులం అని మా దగ్గర కొనడం లేదు. ఇవన్నీ వైఎస్ జగన్కు వివరించాం. మా సమస్యలు విన్న ఆయన తప్పనిసరిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. – తాతా రవి, రైతు, బాదరాల గ్రామం, ఏలూరు జిల్లాకూటమి ప్రభుత్వం నిలువునా ముంచేసింది కూటమి ప్రభుత్వం రేషన్ వాహనాల డ్రైవర్లను నిలువునా ముంచింది. వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రేషన్ వాహనాలు ఉన్న సమయంలో బియ్యం పక్కదోవ పట్టాయన్నారు. కానీ.. ఈ నెలలో రేషన్ షాప్ల ద్వారా పంపిణీ చేస్తున్నా రాష్ట్రంలో అనేకచోట్ల బ్లాక్ మార్కెట్కు తరలుతూ పట్టుబడ్డాయి. ప్రభుత్వ పెద్దలు ఇప్పుడేం సమాధానం చెబుతారు? మాకు వాహన రుణాలు క్లియర్ చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టింది. ప్రజా పంపిణీ వ్యవస్థను నిరీ్వర్యం చేశారు. ప్రజలు రేషన్ షాప్ల వద్ద క్యూలైన్లలో నిల్చోలేకపోతున్నామని వాపోతున్నారు. పైగా సర్వర్లు పనిచేయడం లేదని డీలర్లు మళ్లీమళ్లీ తిప్పించుకుంటున్నారు. మేం వైఎస్ జగన్ను కలిసి సమస్యలు వివరించాం. తప్పకుండా మిమ్మల్ని ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. – పి.శ్యాంబాబు, రేషన్ వాహనాల డ్రైవర్ల యూనియన్ కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ -
చదువు చతికిల బడింది
విజయనగరంలోని నారాయణ స్కూల్లో గత ఏడాది 3వ తరగతికి స్కూల్ ఫీజు రూ.48 వేలు, పుస్తకాలకు రూ.7,500, రిజర్వ్ నగదు రూ.1,000 (మొత్తం రూ.56,500) వసూలు చేశారు. ఈ ఏడాది స్కూల్ ఫీజును రూ.55 వేలు చేశారు. పుస్తకాలకు రూ.8,500 కట్టించుకున్నారు. రిజర్వ్ నగదు రూ.వెయ్యితో కలిపి రూ.64,500 వసూలు చేస్తున్నారు. ఇదే స్కూల్లో నిరుడు 4వ తరగతికి స్కూల్ ఫీజు రూ.50 వేలు, పుస్తకాలకు రూ.8,500,(రిజర్వ్ నగదు రూ.1,500) మొత్తం రూ.60 వేలు తీసుకున్నారు. నేడు స్కూల్ ఫీజును రూ.60 వేలకు పెంచారు. పుస్తకాలకు రూ.9,500 తీసుకున్నారు.ఏడాదిలోనే ఎంత తేడా...? అప్పుడు అంతా ప్రగతి బాట.. ఇప్పుడు మొత్తం అస్తవ్యస్తం..! నాడు సంస్కరణల పథం.. నేడు నిర్వీర్యం..! వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక విప్లవంలా విద్యారంగాన్ని ముందుకుతీసుకెళ్లగా... టీడీపీ కూటమి సర్కారు అంతా కుప్పకూల్చింది..! పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలని గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తపించగా.. ప్రైవేటుమయం చేయాలని ప్రస్తుత సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. దీంతో నాడు–నేడు అభివృద్ధి పనులు అటకెక్కాయి.. సర్కారీ చదువులు చట్టుబండలవుతున్నాయి..! అమ్మ ఒడికి వీడ్కోలు పలికారు...ఇంగ్లిష్ మీడియంకు మంగళం పాడారు... డిజిటల్ క్లాస్రూమ్కు బైబై అన్నారు... టోఫెల్ క్లాసులకు టాటా చెప్పారు...సబ్జెక్ట్ టీచర్లపై వేటు వేశారు... గోరుముద్దను ఘోరంగా మార్చారు... ఆసాంతం విద్యా వ్యవస్థను నీరుగార్చారు... ఫలితం... ఫలితాలు దారుణంగా పడిపోయాయి. దీంతో ప్రభుత్వ బడులను వీడి విద్యార్థులు ప్రైవేటు బాట పడుతున్నారు. ⇒ ప్రభుత్వ విద్యా వ్యవస్థలో స్వాతంత్య్రం అనంతరం ఎవరూ చేయని స్థాయిలో... వైఎస్ జగన్ పాలనలో సమూల విద్యా సంస్కరణలు ఉద్యమంలా సాగాయి. నాణ్యమైన విద్యను పేద పిల్లల ముంగిటకు తెచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పోటాపోటీ చేరికలతో ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు విలసిల్లాయి. సర్కారీ బడుల్లో ఖాళీలు లేక.. ‘నో వేకెన్సీ’ బోర్డులు పెట్టేంత వరకు వెళ్లాయి. కానీ, కూటమి పాలనలో సంస్కరణలు నిలిచిపోయి.. సంక్షేమ పథకాలు అమలు కాక.. పరిస్థితులు తలకిందులయ్యాయి. రాష్ట్రంలో గురువారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం..సాక్షి, అమరావతి : సంవత్సరం క్రితం వరకు ఎంతో గొప్ప ఫలితాలతో దేశంలోనే ఆదర్శంగా నిలిచిన ఏపీ ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి నేడు దిగజారిపోయింది. వైఎస్సార్సీపీ పాలనలో మనబడి నాడు–నేడు పనులతో సకల సదుపాయాలతో వెలుగొందిన బడులు ఇప్పుడు జీవం కోల్పోయాయి. రికార్డు వ్యవధిలో ఫలితాలు అంటూ.. ఘనంగా చెప్పుకొన్న పదో తరగతి ఫలితాల్లోనే కూటమి సర్కారు డొల్లతనం బయటపడింది. మోడల్ స్కూళ్ల పేరుతో వందల ప్రాథమిక పాఠశాలలను దూరంగా ఉన్న మరో పాఠశాలలో విలీనం చేయడంతోనే పనితీరు తేటతెల్లమైంది. సర్కారీ బడుల్లో ప్రమాణాలు పెంచే పనులను పక్కనపెట్టడంతోనే.. చంద్రబాబు ప్రభుత్వానిది ప్రైవేటు మోజు అని స్పష్టమైంది. ఇదే అదనుగా ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు చెలరేగుతున్నాయి. ఈ ఏడాది ఫీజులను భారీగా పెంచేశాయి. ఇక కార్పొరేట్ స్కూళ్లలో చదివించాలంటే ఆస్తులు అమ్ముకునే పరిస్థితి. సగటున ఒక్కో స్కూల్లో 10 నుంచి 30 శాతంపైగా ఫీజులు పెంచేశాయి. వీటికి పుస్తకాలు, యూనిపారం ఖర్చులు అదనం. ప్రైవేటులో ఫీజులను నియంత్రించాల్సిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకున్నది లేదు. పిల్లల చదువులు భారంగా మారడంతో గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అంటేనే తల్లిదండ్రులు దిగాలు చెందుతున్నారు. –2024 వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులే అత్యధిక మార్కులతో టాపర్లుగా నిలిచారు. ఈ ఏడాది అధిక శాతం ప్రైవేటు విద్యార్థులే ఆ స్థానాన్ని దక్కించుకున్నారు. దీంతో ‘షైనింగ్ స్టార్’ అవార్డులు వారికే దక్కాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సమూల విద్యా సంస్కరణలు స్వాతంత్య్రం అనంతరం ఎవరూ చేయని స్థాయిలో అమలు నాణ్యమైన విద్యను పేద పిల్లల ముంగిటకు తెచ్చిన వైఎస్ జగన్ పోటాపోటీ చేరికలతో ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నాడు సర్కారీ బడుల్లో ఖాళీలు లేక.. ‘నో వేకెన్సీ’ బోర్డులు విద్యార్థుల యూనిఫాం సైతం వైఎస్ జగన్ స్వయంగా పరిశీలించి ఎంపిక నేడు నిలిచిపోయిన సంస్కరణలు.. అమలు కాని పథకాలు వైఎస్సార్సీపీ పాలనకు, ఇప్పటికీ పూర్తి భిన్నంగా పరిస్థితులు ప్రజా వ్యతిరేక విధానాలే మేలంటూ.. 2024 జూన్ 12న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మరుసటి రోజు నుంచి 2024–25 విద్యా సంవత్సరం ప్రారంభమైంది. కూటమి వచ్చిందే తడవుగా.. అప్పటిదాకా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంస్కరణలు, విద్యా సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను నిలిపివేసింది. పథకాలకు పేర్లు మార్చింది. విద్యా కానుక తప్ప ఇతర అన్నింటినీ రద్దు చేసింది. 16 రకాల పదార్థాలతో విద్యార్థులకు అందజేసిన ‘జగనన్న గోరుముద్ద’ను డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకంగా పేరు మార్చిందేగాని నాణ్యతను గాలికి వదిలేసింది. దీంతో 50 శాతం మంది కూడా విద్యార్థులు తినలేని పరిస్థితి. ⇒ రాష్ట్రంలో మూడు ప్రాంతాలకు మూడు రకాల మెనూ అందిస్తామని రూ.కోట్ల ఖర్చుతో ప్రయోగాలు చేసిన ప్రభుత్వం చివరకు చేతులెత్తేసింది. ⇒ ఇంట్లో విద్యార్థులు ఎంతమంది ఉంటే అందరికీ రూ.15వేలు తల్లికి వందనం ఇస్తామని చెప్పి ఏడాదిగా ఎగ్గొట్టింది. ⇒ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.8 వేల కోట్లతో మనబడి నాడు–నేడు రెండో దశ పనులు ప్రారంభించింది. 20 వేల పాఠశాలల అభివృద్ధి పనులను చేపట్టి, 4 వేల స్కూళ్లలో పూర్తిచేసింది. మిగిలిన పాఠశాలల్లో పనులను కూటమి ప్రభుత్వం అర్థంతరంగా నిలిపివేసింది. ⇒ గత ఏడాది జూలైలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను ప్రారంభించి ప్రాథమికోన్నత స్కూళ్లలో స్కూల్ అసిస్టెంట్ బోధనను తొలగించింది. విద్యా సంవత్సరంలో దాదాపు 9 నెలలపాటు ఉపాధ్యాయుల సర్దు బాటు తోనే కాలంవెళ్లదీసి బోధనను బలహీనం చేసింది. ⇒ ప్రమాణాల మెరుగు కోసం 3–5 తరగతుల విద్యార్థులకు వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన సబ్జెక్టు టీచర్ చదువులను సైతం కూటమి సర్కారు రద్దు చేసింది. ⇒ వైఎస్సార్సీపీ వెయ్యి స్కూళ్లలో ప్రారంభించిన సీబీఎస్ఈ బోధనను కూటమి వచ్చాక ఎత్తివేశారు. ⇒ పేద విద్యార్థుల కోసం తెచ్చిన టోఫెల్, అంతర్జాతీయ ఐబీ విద్యను చంద్రబాబు ప్రభుత్వం దూరం చేసింది. డిజిటల్ క్లాస్రూమ్ కాన్సెప్్టను పక్కనపెట్టింది.టెన్త్ పరీక్షల్లో ఘోరంగా ‘ఫెయిల్’పరీక్షలు జరుగుతుండగానే ప్రశ్నపత్రాలు వాట్సాప్లో ప్రత్యక్షం... ఆపై ఫలితాల వెల్లడిలో చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఘోర వైఫల్యం..! ఇదీ 2024–25 విద్యా సంవత్సరం పదో తరగతి పరీక్షలను కూటమి ప్రభుత్వం నిర్వహించిన తీరు. ఈ ఒక్క ఉదాహరణ చాలు... ప్రభుత్వం ఎంత ఘోరంగా ఫెయిలైందో చెప్పేందుకు. గత ఐదేళ్లలో ఎన్నడూ లేనిది... కూటమి ప్రభుత్వంలో ప్రశ్నపత్రం లీక్ కావడం ఒకప్పటి టీడీపీ పాలనను గుర్తు చేసింది. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి, రికార్డు కక్కుర్తిలో తక్కువ రోజుల్లోనే ఫలితాల ప్రకటనతో తప్పిదాలు జరిగాయి. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం ఏకంగా 66 వేల దరఖాస్తులు అందాయి. పునః పరిశీలనలోనూ మళ్లీ తప్పులు జరిగాయి.నాడు నో వేకెన్సీ బోర్డులు.. నేడు సర్కారు బడికి రాంరాంచక్కగా సాగుతున్న సంస్కరణలను పక్కకుపెట్టి... సంక్షేమ పథకాలను ఎత్తివేసిన కూటమి.. ప్రభుత్వ విద్యలో ప్రయోగాలు చేస్తూ 2025–26 విద్యా సంవత్సరం నుంచి 9 రకాల పాఠశాలలను ప్రవేశపెట్టింది. ప్రజలు, ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నా ఇదే మేలంటూ పాఠశాల విద్యను అంధకారంలోకి నెట్టేసింది. గత ఏడాది ప్రభుత్వ చర్యలతో ఏకంగా 4 లక్షల మందిపైగా విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ల నుంచి వెళ్లిపోయారని ముఖ్యమంత్రికే జిల్లాల కలెక్టర్లు నివేదిక ఇవ్వడం గమనార్హం. ప్రస్తుతం ప్రభుత్వ విద్యపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందని.. ఇదే విధానాలు కొనసాగితే ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య మరింత తగ్గిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి భిన్నంగా వైఎస్సార్సీపీ పాలనలోని పరిస్థితులను ప్రస్తావిస్తున్నారు. నాడు చేపట్టిన విద్యా సంస్కరణలు అద్భుత ఫలితాలు ఇచ్చాయని, ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటుకు దీటుగా నిలిచాయని గుర్తుచేస్తున్నారు. విద్యార్థులతో కిటకిటలాడాయని పేర్కొంటున్నారు. ‘‘మా పాఠశాలలో సీట్లు లేవు’’ అంటూ గేట్లకు నో వేకెన్సీ బోర్డులు కూడా పెట్టిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అప్పటి సీఎం వైఎస్ జగన్ విద్యార్థుల యూనిఫాంను స్వయంగా పరిశీలించి ఎంపిక చేసిన అంశాన్ని ఉదహరిస్తున్నారు.విద్యార్థుల ప్రైవేటు బాట... ఫీజుల బాదుడు బాధకూటమి ప్రభుత్వ విద్యా విధానాల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు దిగజారడంతో తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రైవేటు స్కూళ్లల్లో ప్రవేశాలు తీసుకుంటున్నారు. దొరికిందే చాన్సుగా ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాలు ఫీజులు భారీగా పెంచేశాయి. ఏడాది కాలంలో సగటున 10 నుంచి 30 శాతం పైగా స్కూల్ ఫీజులు పెంచేయడంతో మధ్య తరగతి వర్గం తీవ్ర ఆందోళన చెందుతోంది. గత ఏడాది ఓ కార్పొరేట్ స్కూల్లో 3వ తరగతి ఫీజు రూ.45 వేలు ఉంటే, ఇప్పుడు రూ.55 వేలకు పెరిగింది. పుస్తకాల ధర రూ.7 వేల నుంచి రూ.8,500కి చేరింది. ఏడాది కాలంలో వందపైగా కొత్త ప్రైవేట్ స్కూళ్లకు విద్యాశాఖ అనుమతినిచ్చినట్టు అంచనా. సాధారణ బడ్జెట్ పాఠశాలల్లో ఒకటో తరగతికి రూ.12 వేలు ఫీజు, పుస్తకాలకు మరో రూ.3 వేలు వసూలు చేస్తుండగా, ఆరో తరగతికి రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు తీసుకుంటున్నారు. పుస్తకాలకు మరో రూ.5 వేలు వెరసి రూ.30 వేలు అవుతోంది. వ్యవసాయ కుటుంబాలు, మధ్య తరగతి వర్గాల పిల్లలను చదివించే సెమీ కార్పొరేట్ పాఠశాలలు ఒకటో తరగతికి రూ.25 వేల నుంచి రూ.38 వేలు వసూలు చేస్తున్నాయి. కార్పొరేట్ పాఠశాలలు నాన్ ఏసీ, ఏసీ తరగతులు అంటూ ఫీజులు బాదుతున్నాయి. పిల్లల చదువులతో ఆర్థిక కష్టాలు ఎలక్ట్రీషియన్గా కుటుంబాన్ని పోషిస్తున్న నాకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి 6వ తరగతి, అబ్బాయి 5వ తరగతికి వచ్చారు. ఇద్దరినీ స్థానికంగా ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్నా. ఏడాదికి రూ.50 వేలు ఖర్చవుతున్నాయి. పిల్లలను చదివించేందుకు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫీజులతో పాటు బుక్స్, యూనిఫాం, బ్యాగ్లు, బూట్లు, సాక్సులు వంటి సామగ్రి కొనుగోలు భారంగా మారింది. ఫీజులను ఇష్టారాజ్యం పెంచుకుంటూ పోతున్నారు. –షేక్ బాజీ, గుంటూరుచదువు భారంగా మారుతోంది నాకు ముగ్గురు పిల్లలు. మా పెద్దబ్బాయి హాలహర్విలోని ఓ ప్రైవేట్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్నాడు. ఏడాదికి రూ.20 వేలు ఫీజు చెల్లించాలి. ఫీజుతోపాటు బుక్స్, యూనిఫాం, షూకు రూ.4 వేలు ఖర్చు అవుతోంది. మాకున్న రెండు ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ.. కూలి పనులు చేసుకుని బతుకుతున్నాం. పిల్లల చదువుకు, వ్యవసాయానికి ఏటా రూ.50వేలు అప్పు చేయాల్సిన దుస్థితి. – గాదిలింగప్ప, నిట్రవట్టి గ్రామం, హాలహర్వి మండలం, కర్నూలు జిల్లా -
ఎఫ్డీఐల ఆకర్షణలో 14వ స్థానంలో ఏపీ
సాక్షి, అమరావతి: విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ 14వ స్థానంలో నిలిచింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,957.04 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించింది. ఇందులో శ్రీసిటీలో ఏర్పాటు చేసిన డైకిన్, పానాసోనిక్ ,ఏటీసీ టైర్స్ వంటి సంస్థల నుంచి ఈపెట్టుబడులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2024–25 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా రూ.4,21,929 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి.అందుకు ముందు ఏడాదితో పోలిస్తే 15 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం విదేశీట్ట్టుబడుల్లో 50 శాతానికి పైగా పెట్టుబడులు మహారాష్ట్ర, కర్ణాటకకే రావడం గమనార్హం. మొత్తం పెట్టుబడుల్లో 39.07 శాతం వాటా రూ.1,64,875 కోట్లతో మహారాష్ట్ర మొదటిస్థానంలో నిలిచింది. 13.27 శాతం వాటా రూ.56,030 కోట్లతో కర్నాటక రెండవస్థానం సాధించింది. అత్యధికంగా మారిషస్, సింగపూర్ నుంచే.. మన దేశంలోకి వస్తున్న విదేశీ పెట్టుబడుల్లో అత్యధికంగా 49 శాతం మారిషస్, సింగపూర్ దేశాల నుంచే వస్తున్నాయి. డాలర్ల పరంగా చూస్తే మారిషస్ మొదటిస్థానంలో ఉంటే అదే రూపాయల పరంగా చూస్తే సింగపూర్ మొదటిస్థానంలో ఉంది.ఏప్రిల్–2000 నుంచి ఇప్పటివరకు మారిషస్ నుంచి రూ.10,92,900 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మొత్తం వచ్చిన పెట్టుబడుల విలువలో ఇది 25 శాతం. ఇదే సమయంలో 24 శాతం వాటాతో సింగపూర్ నుంచి రూ.12,18,108 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఆ తర్వాత అమెరికా, నెదర్లాండ్స్, జపాన్, బ్రిటన్ నుంచి అత్యధికంగా పెట్టుబడులు వచ్చాయి. సర్వీసు, కంప్యూటర్స్, ట్రేడింగ్, టెలికమ్యూనికేషన్స్, ఆటోమొబైల్ రంగాల్లోకి అత్యధికంగా పెట్టుబడులు వస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. 2024–25లో ఎఫ్డీఐ ఆకర్షించిన టాప్–5 రాష్ట్రాలు ఇవే.. మహారాష్ట్ర 1,64,875కర్నాటక 56,030 గుజరాత్ 51,540 ఢిల్లీ 47,947 తమిళనాడు 31,103 -
సేవ్ ఉమెన్.. సేవ్ ఆంధ్రా
సాక్షి, అమరావతి/నెట్వర్క్: రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా వైఎస్సార్సీపీ చేపట్టిన ఆందోళనల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. మంగళవారం ‘సేవ్ ఉమెన్.. సేవ్ ఆంధ్రా’ నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ మహిళా విభాగం నిరసన కార్యక్రమాలు చేపట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న నాటినుంచి మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్న నేపథ్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో అంబేడ్కర్ విగ్రహాలకు వైఎస్సార్సీపీ మహిళా విభాగం నేతలు వినతిపత్రాలు సమర్పించారు. కూటమి పాలనలో రాష్ట్రంలో స్త్రీలు, బాలికల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండాపోయిందని మహిళలంతా నినదించారు. హోం మంత్రి అనిత మహిళ అయి ఉండి కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఆమె వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ ఆంక్షల నడుమ పోటెత్తిన ర్యాలీలు గుంటూరులో నిరసన తెలిపేందుకు వెళుతున్న మహిళలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు, నిరసనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మహిళలు బారికేడ్లను నెట్టుకుని వెళ్లి నిరసన తెలియజేశారు. లాడ్జి సెంటర్లో అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, మహిళా విభాగం అధికార ప్రతినిధి శ్రీదేవిరెడ్డి పాల్గొన్నారు. విజయవాడలో పోలీసులు అడుగడుగునా అడ్డుపడినా ‘సేవ్ ఉమెన్.. సేవ్ ఆంధ్రా’ నినాదాలు చేస్తూ మహిళలు అంబేడ్కర్ స్మృతి వనానికి తరలివెళ్లారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి మహిళలపై అఘాయిత్యాలు, హత్యలను నిరసిస్తూ వినతిపత్రం సమర్పించారు. బాపట్లలో అంబేడ్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి వినతిపత్రం సమర్పించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ‘సేవ్ ఉమెన్.. సేవ్ ఆంధ్రా’ నినాదాలతో కూడిన ప్లకార్డులు, బ్యానర్లు చేతబట్టి మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరులోని వీఆర్సీ సెంటర్లో భారీ ర్యాలీ జరిగింది. ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లో అంబేడ్కర్ విగ్రహం వద్ద మహిళలు భారీఎత్తున నిరసన తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిõÙకం చేసి వినతిపత్రం సమర్పించారు. భీమవరంలోనూ పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. కాకినాడ ఇంద్రపాలెం బ్రిడ్జి వద్ద అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మహిళలు భారీ నిరసన చేపట్టి గోకవరం బస్టాండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జిల్లా నలుమూలల నుంచి మహిళలు తరలివచ్చి ‘సేవ్ ఉమెన్.. సేవ్ ఆంధ్రా’ కార్యక్రమం చేపట్టారు. ఒంగోలులో అంబేడ్కర్ భవన్ నుంచి ప్లకార్డులు పట్టుకుని మహిళలు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ కలెక్టరేట్కు చేరుకుని నిరసన తెలిపారు. ఉత్తరాంధ్రలో నిరసనల వెల్లువ విశాఖపట్నంలో మహిళలు, వైఎస్సార్సీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించి అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అనకాపల్లిలో మహిళలు రింగ్ రోడ్ నుంచి ర్యాలీగా రైల్వే జంక్షన్కు వెళ్లి అంబేడ్కర్ విగ్రహం వద్ద ‘రెడ్బుక్ పాలన పోవాలి.. మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు అరికట్టాలంటూ వినతిపత్రం అందజేశారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. శ్రీకాకుళంలోని అంబేడ్కర్ కూడలి వద్ద మహిళలు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శన చేశారు.రాయలసీమ జిల్లాల్లో నిరసన గళం మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై అనంతపురం అంబేడ్కర్ విగ్రహం ఎదుట రోడ్లపై బైఠాయించారు. రాప్తాడు, హిందూపురంలో మహిళలు నిరసన తెలిపారు. కడప కోటిరెడ్డి సర్కిల్లో మహిళలకు రక్షణ కల్పించాలని మహిళలు నినదించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ర్యాలీ జరిపారు. కర్నూలులో నల్లబ్యాడ్జీలు ధరించి కొండారెడ్డి బురుజు నుంచి పాతబస్టాండ్ సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేశారు. మహిళలపై అఘాయిత్యాల విషయం కూటమి ప్రభుత్వ తీరును ఎండగడుతూ తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. చిత్తూరు జిల్లాలోనూ నిరసన కార్యక్రమాలు జరిగాయి. -
డయాఫ్రం వాల్పై ‘డ్రామా’నాయుడు
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం గ్యాప్–2 పునాది డయాఫ్రం వాల్ పనుల్లో అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఆక్షేపించిన, ‘సాక్షి’ ఎత్తిచూపిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మంగళవారం గోదావరి వేదికగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు డ్రామా చేశారు. డయాఫ్రం వాల్ను భూగర్భంలో నిర్మిస్తారు. దాని మందం, లోతు, నాణ్యత కొలతకు ప్రత్యేక సాంకేతికతను ఉపయోగిస్తారు.భూమిని తవ్వే ట్రెంచ్ కట్టర్/గ్రాబర్ను బేయర్ సంస్థ కార్మికులతో టేపుతో కొలిపించి.. 1.5 మీటర్ల మందంతో డయాఫ్రం వాల్ను నిర్మిస్తున్నట్లుగా ప్రకటించి మంత్రి నిమ్మల మాయ చేశారు. దీనిపై ఇంజినీరింగ్ నిపుణులు విస్తుపోయారు. కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) ఆమోదించిన డిజైన్, డ్రాయింగ్ ప్రకారం డయాఫ్రం వాల్ను గరిష్ట లోతు వంద మీటర్లతో 3 శాతం టోలరెన్స్(విచలనం, భ్రమణం) డీవియేషన్తో 1.5 మీటర్లు(1500 మిల్లీమీటర్లు) మందంతో నిర్మించాల్సి ఉండగా.. కనిష్ట మందం 0.9 మీటర్లు(900 మిల్లీమీటర్లే) ఉందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ తేల్చిచెబుతూ ఈనెల 4న పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ)కి నివేదిక ఇచ్చింది. ఈ అంశంపై సమీక్షించి.. సముచిత నిర్ణయం తీసుకోవాలని సిఫార్సు చేసింది. ఇదే అంశాన్ని ‘డయాఫ్రం వాల్ పనులు డిజైన్కు విరుద్ధం’ శీర్షికన ఆదివారం ప్రచురించిన కథనం ద్వారా ‘సాక్షి’ బహిర్గతం చేసింది. అంతర్జాతీయ నిపుణుల కమిటీ సిఫార్సులను పాటిస్తూ డయాఫ్రం వాల్ను నాణ్యతతో నిర్మించాల్సిందిపోయి.. చేస్తున్న తప్పులను కప్పిపుచ్చేందుకు మంత్రి యత్నించడంపై ఇంజినీరింVŠ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్కు విరుద్ధంగా..!ప్రధాన డ్యాం గ్యాప్–2లో 1396.6 మీటర్ల పొడవు.. 1.5 మీటర్ల మందం, 93.5 మీటర్ల లోతు.. 0.3 శాతం టోలరెన్స్(విచలనం, భ్రమణం) డీవియేషన్తో డయాఫ్రం వాల్ను నిర్మించేలా ఈ ఏడాది జనవరి 16న సీడబ్ల్యూసీ, డిజైన్, డ్రాయింగ్, లేఅవుట్ ప్లాన్ను ఆమోదించింది. డయాఫ్రం వాల్ నిర్మాణానికి వర్కింగ్ ప్లాట్ఫాంను ఏర్పాటుచేసి దానిపై ట్రెంచ్ కట్టర్/గ్రాబర్తో భూమి లోపల రాతి పొర తగిలే వరకూ తవ్వుతూపోతారు. ప్యానళ్లను అత్యంత కఠిన శిల(సౌండ్ హార్డ్ రాక్)లోకి రెండు మీటర్లు దించాలి. ఖాళీ ప్రదేశంలోకి బెంటనైట్ మిశ్రమంతో నింపుతూపోవాలి. ఆ తర్వాత 32 డిగ్రీల వద్ద టీ–16 ప్లాస్టిక్ కాంక్రీట్ సమ్మేళనాన్ని అధిక ఒత్తిడితో పంపాలి. అప్పుడు బెంటనైట్ మిశ్రమం బయటకు వస్తుంది. కొంత బెంటనైట్ మిశ్రమం ప్లాస్టిక్ కాంక్రీట్ సమ్మేళనంతో కలిసి పటిష్ట గోడగా మారుతంది. అదే డయాఫ్రం వాల్.. అధిక ఒత్తిడితో ప్లాస్టిక్ కాంక్రీట్ సమ్మేళనాన్ని పంపినప్పుడు అది విచలనం, భ్రమణాని(టోలరెన్స్)కి గురవడం వల్ల మందం కాస్త తగ్గుతుంది. 0.3 శాతం విచలనం, భ్రమణాన్ని పరిగణలోకి తీసుకుంటే.. సీడబ్ల్యూసీ ఆమోదించిన ప్రకారం గరిష్ట లోతు 100 మీటర్ల వద్ద అంటే అట్టడుగు భాగంలో డయాఫ్రం వాల్ మందం కనిష్టంగా 1.2 మీటర్లు.. గరిష్టంగా 1.455 మీటర్లు ఉండాలి. అట్టడుగు భాగంలో అంతకంటే మందం తగ్గితే డయాఫ్రం వాల్ సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్కు విరుద్ధంగా ఉన్నట్లు లెక్క. డయాఫ్రం వాల్ నాణ్యతను నిర్ణయించడానికి నిర్వహించిన పరీక్షల్లో దాని మందం కనిష్టంగా 0.9 మీటర్లే ఉన్నట్లు అంతర్జాతీయ నిపుణుల కమిటీ గుర్తించి.. అదే అంశాన్ని నివేదికలో తెలిపింది.నిన్న ఒకలా.. నేడు మరోలా..: జలవనరుల శాఖ మంత్రి నిమ్మల సోమవారం రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ లోతుకు వెళ్లే క్రమంలో కొన్ని ప్రాంతాల్లో 0.3 మీటర్లు, ఒక ప్యానల్ పక్కన మరో ప్యానల్ దించేటప్పుడు 0.3 మీటర్లు మందం మొత్తం 0.6 మీటర్లు తగ్గే అవకాశం ఉంటుందని సీడబ్ల్యూసీ ఆమోదించిన డయాఫ్రం వాల్ డిజైన్లో ఉందని పేర్కొన్నారు. నిర్దిష్టంగా 0.9 మీటర్ల మందంతో డయాఫ్రం వాల్ ఉండాలనే లక్ష్యంతోనే డయాఫ్రం వాల్ మందాన్ని 1.5 మీటర్లుగా నిర్ణయించారన్న విషయాన్ని గ్రహించాలని, పోలవరం పనులు పరుగులు పెడుతుండటాన్ని జీర్ణించుకోలేక ‘సాక్షి’ అబద్ధాపు కథనాలను ప్రచురిస్తోందని విమర్శించారు. కానీ.. పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయి పరిశీలన పేరుతో మంగళవారం అక్కడికి వెళ్లిన నిమ్మల ట్రెంచ్ కట్టర్/గ్రాబర్ను కార్మికులతో కొలిపించి.. డయాఫ్రం వాల్ను 1.5 మీటర్ల మందంతో నిర్మిస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే.. డయాఫ్రం వాల్ నిర్మాణంలో తప్పులను కప్పిపుచ్చేందుకు మంత్రి నిమ్మల డ్రామాలాడినట్లు స్పష్టమవుతోంది. పనుల నాణ్యతపై నోరుమెదపరేం?:డయాఫ్రం వాల్ నిర్మాణంలో వినియోగించిన ప్లాస్టిక్ కాంక్రీట్ సమ్మేళనం నాణ్యత లోపం వల్ల ఏప్రిల్ నాటికి 52 ప్యానళ్లలో 9 ప్యానళ్ల పరిధిలో డయాఫ్రం వాల్లో పైభాగం 1 నుంచి 2 మీటర్ల లోతు వరకూ నీటి బుడగలు కన్పిస్తున్నాయని, సీపేజీ తీవ్రతను తేల్చడానికి 2 నుంచి 3 మీటర్ల లోతు వరకూ వరుసగా రంద్రాలు చేసి అధ్యయనం చేయాలని అంతర్జాతీయ నిపుణుల కమిటీ సూచించిన అంశాన్ని ‘సాక్షి’ ఎత్తిచూపింది. సీపేజీ అధికంగా ఉన్న ప్రాంతాల్లో డయాఫ్రం వాల్ పైభాగంలో 1 నుంచి 2 మీటర్ల లోతు వరకూ తొలగించాలని అంతర్జాతీయ నిపుణుల కమిటీ స్పష్టం చేయడాన్ని.. ప్లాస్టిక్ కాంక్రీట్ సమ్మేళనం నాణ్యతను సమీక్షించి.. డయాఫ్రం వాల్ను నిర్మించాలని సూచించడాన్ని ‘సాక్షి’ చాటిచెప్పింది. టీ–16 ప్లాస్టిక్ కాంక్రీట్ సమ్మేళనం 32 డిగ్రీల వద్ద నాణ్యంగా ఉంటుందని.. కానీ 35 డిగ్రీలతో ఉన్న ప్లాస్టిక్ కాంక్రీట్ను వినియోగించడం, నీటి శాతం ఎక్కువగా ఉండటంతో ఆ ఉష్ణోగ్రతకు సిమెంటు, బెంటనైట్, కంకర వంటివి విడిపోయాయని(సెగ్రిగేట్).. ఇదే సీపేజీకి దారితీస్తోందని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ఆ ప్లాస్టిక్ కాంక్రీట్ను సమీక్షించి.. 32 డిగ్రీల వద్ద ఉండేలా చూడాలని సూచించింది. వాటిపై మంత్రి నిమ్మల నోరుమెదపకపోవడం గమనార్హం.2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి పోలవరం రూరల్: పోవలరం ప్రాజెక్టు పనులు 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను మంగళవారం ఆయన అధికారులు, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో కలిసి పరిశీలించారు. డయాఫ్రమ్ వాల్ పనులు జరుగుతున్న తీరును ప్రాజెక్టు సీఈ నరసింహమూర్తి ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూఇప్పటికే డయాఫ్రమ్వాల్ నిర్మాణం 360 మీటర్లకు చేరుకుందన్నారు. గ్యాప్–1కు సంబంధించి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ 2026కు పూర్తి చేసేలా లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. అనంతరం ప్రాజెక్టు క్యాంపు కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో పనుల పురోగతిపై సమీక్షించారు. -
కార్మికులపై సవరణ కత్తి
సాక్షి, అమరావతి: శ్రమ దోపిడీకి ఆస్కారం ఇస్తూ కార్మికుల హక్కులను కాలరాసేందుకు కూటమి సర్కారు కుట్రపన్నుతోంది. ఇప్పటికే పని వేళలను పది గంటలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న కర్కశ ప్రభుత్వం ఇప్పుడు చిన్న సంస్థల్లో పనిచేసే చిరుజీవుల నోట్లో మట్టి కొట్టేందుకు రంగం సిద్ధం చేసింది. చిన్న వాణిజ్య సంస్థల్లో పనిచేసే గుమాస్తాలు, వాచ్మెన్లు, ఇతర చిరుద్యోగుల హక్కులు కాపాడే ఏపీ షాప్స్ ఎస్టాబ్లిష్ మెంట్ చట్టాన్ని సవరించేందుకు సిద్ధమైంది. 20 మందిలోపు సిబ్బంది ఉండే సంస్థలపై కార్మిక శాఖ జోక్యం లేకుండా చట్ట సవరణకు ప్రతిపాదనలు చేసింది. ఇవి వచ్చే కేబినెట్ భేటీలో మంత్రివర్గం ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. యజమానే డిక్లరేషన్ ఇస్తే చాలటరాష్ట్రంలో ఒకటి నుంచి 20 మంది సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు 3.50 లక్షలకుపైగా ఉన్నాయి. వీటిల్లో 30 లక్షల మంది కార్మికులు, చిరుద్యోగులు పనిచేస్తుంటారు. ఈ సంస్థలు ఏపీ షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం–1988 మార్గదర్శకాలు పాటించాలి. ఈ చట్టం ప్రకారం.. ఎప్పటికప్పుడు కార్మిక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టి నిబంధనలు ఉల్లంఘించిన యజమానులపై కేసుల నమోదుకు అవకాశం ఉంటుంది. అయితే 20 మంది లోపు సిబ్బందితో నడిచే సంస్థలను కార్మిక శాఖ పరిధి నుంచి తప్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. దీనిప్రకారం.. అన్ని నిబంధనలూ సక్రమంగా పాటిస్తున్నామని యజమాని సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే చాలు.. ఆ సంస్థలలో కార్మిక శాఖ అధికారులు తనిఖీలు చేయడానికి అవకాశం ఉండదు. దాదాపు 12 గంటలు పనిచేయిస్తున్న సంస్థలు ఇప్పటికే చిన్న సంస్థల యజమానులు శ్రామికుల చేత 12 గంటలకుపైగా పనిచేయిస్తున్నారు. ఉదయం పది గంటలకు దుకాణానికి వెళితే రాత్రి పదిగంటల తర్వాత కూడా వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. కార్మిక శాఖ ఏడాది పొడవునా ఈ దుకాణాలను తనిఖీ చేసి నియంత్రిస్తున్నా.. యజమానులు లెక్కచేయని దుస్థితి. ఇప్పుడు ప్రభుత్వమే కార్మిక శాఖ పరిధి నుంచి వాటిని మినహాయిస్తే ఇప్పుడు పరిస్థితి ఇంకా ఎంత భయానకంగా ఉంటుందోనని శ్రామికులు, కార్మిక సంఘాల నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పని గంటలు పెంపుఓ వైపు పని వేళలు తగ్గించాలని కార్మిక వర్గాల నుంచి డిమాండ్ వ్యక్తమవుతుంటే దీనికి భిన్నంగా పెట్టుబడుల ఆకర్షణను సాకుగా చూపి పని వేళలను గరిష్టంగా 9 నుంచి 10 గంటలకు పెంచుతూ చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇప్పటికే కార్మికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో త్రైమాసిక కాలానికి ఓవర్ టైమ్ 75 గంటల నుంచి 144 గంటలకు పెరిగాయి. ఈ పెంపు వల్ల ఎక్కువ సంపాదించవచ్చని సర్కారు వక్రభాష్యం చెబుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం కనీస వేతనాలే అమలు కావడం లేదన్న సత్యాన్ని ఉద్దేశపూర్వంగా విస్మరిస్తోంది. ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ యాక్ట్– 1988 చట్టం ఏం చెబుతోందంటే..» ఒక వర్కర్ను సంస్థలో చేర్చుకునేప్పుడు నియామక పత్రం ఇవ్వాలి.» ఉద్యోగి అటెండెన్స్ రిజిçష్ట్టర్ను నిర్వహించాలి. ప్రతినెలా ఐదో తేదీలోపు వేతనం చెల్లించాలి.» ఏటా 12 రోజులు క్యాజువల్ లీవ్స్, 9 పండుగ సెలవులు ఇవ్వాలి. వీక్లీ ఆఫ్ అమలు చేయాలి. » వర్కర్కు మధ్యలో డబ్బు అవసరం అయితే ఇవ్వడానికి వీలుగా అడ్వాన్స్ రిజిస్టర్ పెట్టాలి.» ఉద్యోగంలో నుంచి తీసి వేయడానికి నెల ముందు నోటీస్ ఇవ్వాలి.» 10 మంది కంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్నట్టయితే నెల వేతనం ఏటా బోనస్ కింద ఇవ్వాలి. కనీస వేతనాల చట్టం అమలు, స్త్రీ, పురుషులకు సమాన వేతనం పాటించాలి. » కార్మిక శాఖ సాధారణ తనిఖీల్లో నిబంధనలు అతిక్రమించినట్లు గుర్తిస్తే కేసు నమోదు చేసి, కోర్టులో చార్జి షీట్ దాఖలు చేయడానికి వీలుంటుంది. కనీస వేతనాలు ఇవ్వలేదని తేలితే యజమాని నుంచి రికవరీ చేయచ్చు.చట్ట సవరణ చేస్తే.. » చట్ట సవరణ అయితే ఎవరైనా శ్రామికుడు ఫిర్యాదు చేస్తే తప్ప కార్మిక శాఖ చిన్న సంస్థలపై జోక్యం చేసుకోరాదు. దీనివల్ల ఇప్పుడు ఉన్న హక్కులన్నింటినీ కార్మికుడు కోల్పోయే ప్రమాదం ఉంది. యజమాని సెల్ఫ్ డిక్లరేషన్లో అసత్యాలు పేర్కొనే ఆస్కారమూ ఉంది. -
రాష్ట్రంలో నాలుగైదు రోజులు భారీ వర్షాలు
సాక్షి, అమరావతి: వచ్చే నాలుగైదు రోజులు రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్ నుంచి పశి్చమ మధ్య బంగాళాఖాతం వరకు, ఉత్తర మధ్యప్రదేశ్, దక్షిణ ఛత్తీస్గఢ్, మధ్య ఒడిశా మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాయలసీమపై దీని ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపింది. అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కోస్తా జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రధానంగా 11, 12 తేదీల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తాయని, గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వివరించింది. మరోవైపు కొన్నిచోట్ల ఉక్కపోతతోపాటు ఎండ ప్రభావం ఉంటుందని తెలిపింది. మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 4.3 సెంటీమీటర్లు, శ్రీకాకుళంలో 4.2, విశాఖ జిల్లా ఆనందపురంలో 3.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే ప్రకాశం జిల్లా వేమవరంలో 40 డిగ్రీలు, కొనకనమిట్లలో 39.9, తిరుపతి జిల్లా మంగ నెల్లూరు 39.9, వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్లలో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. -
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను విడుదల చేసింది. మంగళవారం సాయంత్రం అధికారిక వెబ్సైట్లో ఫలితాలను ఉంచినట్లు పేర్కొంది. ఈనెల 23 నుంచి 30వ తేదీ వరకు గ్రూప్-1 ఇంటర్వ్యూలు జరగనున్నాయని తెలిపింది.ఏపీలో మొత్తం 81 గ్రూప్ -1 పోస్టుల భర్తీకి 2024 మార్చి 17న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 1,48,881మంది ప్రిలిమ్స్కు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 4,496మంది మెయిన్స్కు అర్హత సాధించారు. ఈ ఏడాది మే3 నుంచి 9వరకు ఏపీపీఎస్సీ నిర్వహించిన మెయిన్స్ పరీక్షలకు 4వేల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. నెల రోజుల్లోనే మూల్యాంకనం పూర్తి చేసి ఇప్పుడు ఫలితాలు విడుదల చేశారు. 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను మౌఖిక పరీక్షలకు ఎంపిక చేశారు. -
‘ప్రశ్నించే గొంతులను రాష్ట్రంలో లేకుండా చేసే కుట్ర’
తాడేపల్లి : సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు అక్రమని, ఎలాంటి అరెస్టు లేకుండా ఎలా అరెస్టు చేస్తారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కోరుముట్ల శ్రీనివాసులు ప్రశ్నించారు. ఈరోజు(మంగళవారం, జూన్ 10) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన కోరుముట్ల.. కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘చర్చా వేదికలో జరిగిన విషయాలను సాక్షి టీవీకి, వైఎస్ఆర్ సీపీకి రుద్దే ప్రయత్నం చేసారు. సాక్షి కార్యాలయాలపై టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగారు. ప్రీప్లాన్డుగానే ఈ మొత్తం వ్యవహారం జరిగింది. ఒక జర్నలిస్టు మాట్లాడిన మాటలను కొమ్మినేని అదే వేదిక మీద ఖండించారు. అయినప్పటికీ అక్రమంగా కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను డైవర్టు చేసేందుకే ఈ దాడులు, అక్రమ .మహిళలు, చిన్నారులకు రాష్ట్రంలో రక్షణ లేదు. దీనిపై చంద్రబాబు కనీసం సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించలేదు. ప్రత్యర్థి పార్టీలు, ప్రశ్నించే గొంతులను రాష్ట్రంలో లేకుండా చేసే కుట్రలు జరుగుతున్నాయి. కొమ్మినేనికి ముందస్తు నోటీసు కూడా ఇవ్వకుండా అరెస్టు చేశారు. చట్టం, రాజ్యాంగాలతో పని లేదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కొమ్మినేని తన న్యాయవాదులతో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు.అసలు కొమ్మినేని మీద ఎట్రాసిటీ కేసు ఎలా పెడతారు?, అంటే కొమ్మినేని మీద ప్రభుత్వం ఎంత కక్ష సాధింపునకు దిగిందో అర్థం చేసుకోవచ్చు’ అని కోరుముట్ల ధ్వజమెత్తారు.. -
ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్సీపీ మహిళా విభాగం నిరసనలు
విజయవాడ : ఏపీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా నేడు (మంగళవారం, జూన్ 10వ తేదీ)) రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ మహిళా విభాగం నిరసన కార్యక్రమాలు చేపట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంతో జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇచ్చి నిరసన తెలియజేస్తున్నార వైఎస్సార్సీపీ మహిళా విభాగం నేతలు. చిత్తూరు జిల్లా: కూటమి ప్రభుత్వంలో ఆడబిడ్డలకు రక్షణలేకుండా పోయింది: ఆర్కే రోజాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందిహోం మంత్రికి చీమ కుట్టినట్లు కూడా లేదుఅధికారంలో ఉన్నవాళ్లు లా అండ్ ఆర్డర్ కాపాడాలిఅధికారంలో ఉన్నవాళ్లు వారే రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నారుమహిళ హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలు పై దారుణాలు జరగడం సిగ్గుచేటునగరి నియోజకవర్గం లో మైనర్ బాలికపై అత్యాచారం చేశారుఅనంతపురం జిల్లా ఇంటర్ విద్యార్ధి కనిపించకపోతే పట్టించుకోలేదుపరిటాల సునీత నియోజకవర్గంలో 14 మంది టీడీపీ వాళ్లు మైనర్ బాలికపై అత్యాచారం చేస్తే సాక్షి మీడియా బయటకు తీసుకు వచ్చిందిడిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ మహిళలు పై దాడులు జరుగుతుంటే పట్టించుకోవడం లేదుహోం మంత్రి అనిత నా చేతిలో గన్ ఉందా, నాకు పవర్ ఉందా.. అంటూ చేతకాని మాటలు మాట్లాడుతూ ఉంటే రాజీనామా. చేయాలి విజయవాడలో..రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలకు నిరసనగా వైస్సార్సీపీ మహిళ విభాగం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసనలో వైఎస్ఆర్సిపి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు వరుదు కళ్యాణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు కార్యకర్తలు సైతం పాల్గొన్నారు. కృష్ణాజిల్లా:లో.. సేవ్ ఉమెన్-సేవ్ ఆంధ్రా నినాదాలతో వైఎస్సార్సీపీ మహిళా నేతల తమ నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఖండిస్తూ మచిలీపట్నం లోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు వైఎస్ఆర్సీపీ మహిళలు. దీనిలో భాగంగా మాజీ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ.. ‘కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుండి ఈ రాష్ట్రం లో మహిళలపై, వృద్ధులపై, బాలికపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ఎవ్వరూ మమల్ని ప్రశ్నించకూడదు అని దాడులకు తెగబడుతున్నారు, పిల్లిని గదిలో పెట్టి దాడి చేస్తే ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో టీడీపీకి అదే గతి పడుతుంది. రాష్ట్రంలో మహిళా హోమ్ మినిస్టర్ గా ఉన్నా ఆమె పసుపు పార్టీకి కార్యకర్తగానే వ్యవహరిస్తుంది తప్పా అధికారాన్ని ఎక్కడా మహిళ ల పక్షాన్న చూపించడం లేదు’ అని మండిపడ్డారు.విశాఖలో..మహిళలపై జరుగుతున్న హత్యలు హత్యాచారాలను నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సిపి మహిళా నేతలు నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు మహిళ నేతలు. ‘రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి.రాష్ట్రంలో మహిళలకు చిన్న పిల్లలకు రక్షణ కరువైంది.కూటమి పాలనలో మహిళల భద్రతను గాలికి వదిలేసారు. హోం మంత్రి అనిత మహిళ అయి ఉండి కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలి. గత ముఖ్యమంత్రి జగన్ మహిళల రక్షణకు పెద్దపీట వేశారు.దిశ చట్టాన్ని అమలు చేసి మహిళలకు భద్రత కల్పించారు’ అని వైఎస్సార్సీపీ మహిళా నేతలు స్సష్టం చేశారు. అనంతపురంలో.. అనంతపురంలో చంద్రబాబు సర్కార్ పై మహిళల ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలక భద్రత కల్పించాలంటూ ఆందోళన చేపట్టారు. దీనిలో భాగంగా అనంతపురం అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ మేరకు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వ అరాచకాలు నశించాలంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు మహిళల ద్రోహి అంటూ నిరసన చేపట్టారు.వైఎస్ఆర్ జిల్లా:కడప అంబేద్కర్ సర్కిల్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళల ఆందోళనరాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు, దారుణాలపై నిరసనరాష్ట్ర ప్రభుత్వానికి, హోంమంత్రి అనితకి వ్యతిరేకంగా నినాదాలుహోం మంత్రి మహిళ అయ్యి ఉండి కూడా న్యాయం చేయలేకపోతున్నారని మండిపాటుఆమెకు నిత్యం జగన్ను తిట్టి చంద్రబాబు వద్ద మార్కులు కొట్టేసే పనిలో ఉన్నారని విమర్శ32వేల మహిళలు ఇప్పుడు ఎక్కడున్నారని పవన్ కళ్యాణ్ కి ప్రశ్నమహిళల మన, ప్రాణాలను కాపాడలేని హోం మంత్రి అనిత రాజీనామా చేయాలని డిమాండ్32వేల మంది మహిళలను డిప్యూటీ సీఎం అయ్యాక కూడా తీసుకురాలేని పవన్ కళ్యాణ్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్కాకినాడ జిల్లా:మహిళలపై జరుగుతున్న దాడులు,అఘాయిత్యాలను అరికట్టాలని కోరుతూ వైఎస్ఆర్ సిపి మహిళ విభాగం నిరసనడా.బి.అంబేద్కర్ విగ్రహనికి వినతి పత్రం అందజేతపాల్గొన్న వంగా గీతా, జిల్లా అధ్యక్షురాలు సుజాతఏలూరు జిల్లా:సేవ్ ఉమెన్ సేవ్ ఆంధ్ర... నినాదంతో ఏలూరులో వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం నేతల నిరసనపాల్గొన్న ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ మహిళా అధ్యక్షురాలు సరిత రెడ్డి, నగర అధ్యక్షురాలు విజయనిర్మల, పార్టీ మహిళా విభాగం నాయకులుఏలూరు పాత బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన మహిళ నాయకులుమహిళలు బాలికలకు బాబు పాలనలో భద్రత కరువైంది: సరిత రెడ్డికూటమి ప్రభుత్వ పాలనలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయికూటమి పాలనలో మహిళలు,చిన్నారులకు రక్షణ లేదుజగనన్న పాలనలో మహిళకు పెద్దపీట వేశారుచంద్రబాబు ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం ఒక్క పథకం కూడా అమలు చేయలేదుఅంబేద్కర్ రాజ్యాంగం పక్కన పెట్టీ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారూజగనన్నదిశ యాప్ ద్వారా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసే మహిళలకు అండగా నిలిచారుగత వారం రోజుల వ్యవధిలోని మహిళలు చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోయాయిహోం మంత్రి మహిళ అయినా మహిళల పట్ల బాధ్యత లేదు కర్నూలు:కర్నూలు పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలు ఆందోళనమహిళలు, బాలికల పై జరుగుతున్న అఘయిత్యాలను నిరసిస్తూ వైఎస్సార్ సిపి మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసనరాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన నిరసన వ్యక్తం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల విభాగం నేతలు చిత్తూరు జిల్లా: దర్గా సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమంఅంబేద్కర్కు వినతి పత్రం అందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు, నాయకులురాష్ట్రంలో శాంతి భద్రతలు గాలికి వదిలేశారు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు..అంజలి రెడ్డికూటమి ప్రభుత్వం పాలనలో మహిళలు పై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు.మహిళలు పై ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే హోం మంత్రి మహిళగా ఉండి ఏం చేస్తున్నట్లు.. కార్పో రేటర్ హరిణి రెడ్డివైఎస్ జగన్ పాలనలో మహిళలకు ఎంతో రక్షణ ఉండేది.సంక్షేమ పాలన అందించారు..హరిణి రెడ్డిమహిళల రక్షణ కోసం దిశ చట్టాన్ని తీసుకువచ్చారు,మహిళలకు గౌరవం,సంక్షేమాన్ని ఇచ్చారు జగనన్న.. మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి , -
AP: ‘సాక్షి’పై దాడులు.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన
ఏపీలో కూటమి ప్రభుత్వం అరాచకాలు పతాకస్థాయికి చేరాయి. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా భావించే పత్రికా స్వేచ్ఛకూ సంకెళ్లు వేస్తున్నారు. నిజాలు రాసే కలాలను, వాస్తవాలు చెప్పే గళాలను నిరంకుశంగా అణగదొక్కుతున్నారు.ఈ క్రమంలోనే.. ఎవరో చేసిన వ్యాఖ్యలను సాకుగా చూపించి ‘సాక్షి’పై దాడులకు ఉసిగొలిపింది.తెలుగువారి మనస్సాక్షిగా.. పేదవాడి గొంతుకై.. నాణేనికి రెండోవైపు ప్రజల పక్షాన నిలబడుతూ, వాస్తవాలను ప్రచురిస్తూ.. ప్రసారం చేస్తున్న ‘సాక్షి’పై రాజకీయ కుట్రలకు బరితెగిస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ ప్రోద్బలంతో కూటమి నేతలు, అల్లరిమూకలు కలిసి సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ‘సాక్షి’ కార్యాలయాలపై మూకుమ్మడి దాడులకు తెగబడ్డారు. ఈ దాడులపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.మీడియాపై అధికార పార్టీ దౌర్జన్యం తగదు శ్రీకాకుళం: అమరావతిపై ఇటీవల సాక్షి టీవీ చానల్లో జరిగిన చర్చలో దొర్లిన కొన్ని వ్యాఖ్యలపై నిరసనల పేరుతో అధికారపార్టీ దౌర్జన్యాలకు దిగడం దారుణమని, మీడియా కార్యాలయాలను ధ్వంసం చేయడం సరైన విధానం కాదని సామ్నా రాష్ట్ర అధ్యక్షుడు నల్లి ధర్మారావు ఖండించారు. మీడియాపై దాడి అప్రజాస్వామికమని పేర్కొన్నారు. దాడి ఘటనలను ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎన్.ఈశ్వరరావు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సీహెచ్ జగదీ‹Ù, సనపల రమేష్ ఖండించారు.ప్రభుత్వ తప్పిదాలను ‘సాక్షి’ ప్రశ్నిస్తుందనే అక్కసుతోనే..ఏపీలో సాక్షి’ కార్యాలయాలపై అకారణంగా టీడీపీ గూండాలు దాడులపై రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి సిబ్బంది నిరసనసోమవారం కొవ్వొత్తుల ప్రదర్శనతో టీడీపీ దాడులపై మండిపాటుప్రభుత్వ తప్పిదాలను ‘సాక్షి’ ప్రశ్నిస్తుందనే అక్కసుతోనే దాడులుఇవి కుట్రపూరిత, కక్ష పూరిత దాడులంటూ ధ్వజంపత్రికా స్వేచ్ఛపై దాడి: డీజేయూ'సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని అరెస్టు, సాక్షిపై దాడులను ఖండించిన డీజేయూ ఏపీ రాష్ట్ర కమిటీవిశ్లేషకుడు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు దుర్మార్గమైన చర్య,ఇది పత్రికా స్వేచ్ఛపై దాడిసాక్షి కార్యాలయాలపై దాడుల సరికాదుసాక్షి కార్యాలయాలపై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ ‘సాక్షి’ కార్యాలయాలపై దాడులు తగవు: ఏపీయూడబ్ల్యూజేసాక్షి పత్రిక కార్యాలయాలపై టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడులు చేయడాన్ని ఖండించిన ఏపీయూడబ్ల్యూజేదాడులతో పాటు పత్రిక ప్రతులను దహనం చేయడం వంటి చర్యలు దిగ్భ్రాంతి కలిగించాయిసాక్షి కార్యాలయా లపై దాడులకు పూనుకోవడం గర్హనీయంపత్రికా కార్యాలయాలపై దాడులు చేసే సంస్కృతి ప్రమాదకరం ‘సాక్షి’పై దాడుల్ని ఖండించిన ఐజేయూసాక్షి టీవీ నిర్వహించిన ఒక చర్చ కార్యక్రమంపై నిరసన పేరుతో ఏపీలోని సాక్షి మీడియా కార్యాలయాలపై దాడులు జరిపి, ధ్వంసం చేయడాన్ని ఖండిస్తున్నట్టు ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) అధ్యక్షుడు కె.శ్రీనివాస్రెడ్డి, కార్యదర్శి వై.నరేందర్రెడ్డి, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు కె.విరాహత్ అలీ, కె.రాంనారాయణ, సీనియర్ సంపాదకుడు డాక్టర్ కె.రామచంద్రమూర్తి సోమవారం ఓ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విధ్వంస సంస్కృతి ఏ రకంగానూ సమర్థనీయం కాదన్నారు. కొమ్మినేనిపై కేసు నమోదు చేయడం సరైంది కాదని, క్షమాపణ చెప్పిన జర్నలిస్టును విడుదల చేయాలని కోరారు. సాక్షి పత్రిక, చానల్ కార్యాలయాల ధ్వంసానికి పాల్పడ్డ వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు. ‘సాక్షి’కార్యాలయాలపై దాడులను ఖండిస్తున్నాం సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును ఐజేయూ మాజీ అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ తీవ్రంగా ఖండించారు. విశ్లేషకుడి మాటలను సాక్షి మీడియా ఖండించినప్పటికీ అరెస్ట్ చేశారన్నారు. 70 ఏళ్ల కొమ్మినేనిపై అక్రమ కేసులు పెట్టి వేధించడం సరికాదన్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి టాక్ షోలు చేసే వారు అనేక అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని.. కొమ్మినేనిపై పెట్టినట్టు వారందరిపైనా అక్రమ కేసులు పెడతారా అని ఆయన ప్రశ్నించారు. మహిళలను కించపరిచేవిధంగా, వారి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఎవరూ మాట్లాడకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. -
కొమ్మినేనిపై కేసు.. పోలీసులపై న్యాయమూర్తి ఆగ్రహం
సాక్షి, గుంటూరు: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ విషయంలో పోలీసుల తీరుపై మంగళగిరి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ఈ కేసుకు ఎలా వర్తిస్తుంది? అని ప్రశ్నించింది. గతంలో ఓసారి చెప్పినా మళ్లీ ఇవే సెక్షన్లు ఎలా పెడతారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ డీఎస్పీ, ఎస్పీకి మెమో జారీ చేస్తామని హెచ్చరించింది. అదే సమయంలో.. కొమ్మినేనిపై నమోదు అయిన ఎస్సీ, ఎస్టీ యాక్ట్, 356(2) సెక్షన్స్ను జడ్జి తొలగించారు. ఆపై కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ని గుంటూరు జైలుకు తరలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు మఫ్టీలో హైదరాబాద్కు వచ్చి మరీ సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును సోమవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 70 ఏళ్ల వయస్సున్న కొమ్మినేనిపై అక్రమ కేసులు బనాయించి మరీ చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యకు దిగిందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్, ఆ పార్టీకి చెందిన ఇతర నేతలు మండిపడుతున్నారు. పలువురు జర్నలిస్టులు, మేధావులు సైతం కొమ్మినేని అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నారు.మరోవైపు.. కొమ్మినేనిని రాత్రంతా నల్లపాడు పీఎస్లోనే ఉంచారు పోలీసులు. కొమ్మినేనిని అడ్వకేట్లు కలవకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై న్యాయవాదుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉదయం జీజీహెచ్లో వైద్యపరీక్షలు అన్నీ పూర్తయ్యాక మంగళగిరి కోర్టులో హాజరు పరిచారు.కొమ్మినేని అరెస్టుపై జర్నలిస్టుల నిరసనలుసీనియర్ జర్నలిస్టు కొమ్మినేని అరెస్ట్ను నిరసిస్తూ ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టులు నిరసనలకు దిగారు. నల్ల జెండాలతో ర్యాలీలతో పాటు నినాదాలు చేశారు. బేషరతుగా కొమ్మినేనిని విడుదల చేయాలని, ఏపీ ప్రభుత్వం మీడియా స్వేచ్ఛను హరిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందిఅల్లూరి సీతారామరాజు జిల్లా: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని అరెస్టును ఎమ్మెల్సీ అనంత బాబు ,మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మిలు ఖండించారు. కక్షపూరితంగా కొమ్మినేని అరెస్ట్ చేశారన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని విమర్శించారు.కొమ్మినేని అరెస్టు దుర్మార్గం సాక్షి, అమరావతి: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు దుర్మార్గం, కక్షపూరితమని, సాక్షి మీడియాను టార్గెట్ చేసిన సీఎం చంద్రబాబు, నిజాయితీగా పని చేసే జర్నలిస్టును వేధించడం దారుణమని వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జర్నలిస్ట్ కృష్ణంరాజు వ్యాఖ్యలతో ‘సాక్షి’కి సంబంధం లేకపోయినా వైఎస్ జగన్ను, ఆయన సతీమణి భారతిని తిట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. కూటమి పాలన వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే కొమ్మినేనిని అరెస్టు చేశారని విమర్శించారు.కొమ్మినేని అరెస్టు అక్రమం అనంతపురం కార్పొరేషన్: సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్ అరెస్టు అక్రమమని వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు.ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ..రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కొమ్మినేనిని అరెస్టు చేయించారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం ఈ అంశాన్ని వాడుకుంటున్నారని మండిపడ్డారు. సాక్షి మీడియాపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టించుకోని పోలీసులు, కొమ్మినేని విషయంలో మాత్రం ఆగమేఘాలపై స్పందించడం రాజకీయ కుట్రలో భాగమేనని ఆరోపించారు.విశ్లేషకుల వ్యాఖ్యలను ‘సాక్షి’కి ఆపాదించకూడదు సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిఫై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విశ్లేషకుల అభిప్రాయాలను సాక్షి మీడియాకు ఆపాదించడం సరైనది కాదని సెంటర్ ఫర్ పొలిటికల్ స్ట్రాటజీ అండ్ రీసెర్చ్ (సీపీఆర్ఎస్) చీఫ్ స్ట్రాటజిస్ట్ డాక్టర్ మామిడి సుదర్శన్ అన్నారు. గతంలో ఈనాడులో వచి్చన పలు వ్యాసాలపై ఆ పత్రిక అధినేత రామోజీరావు మీద కోర్టులో పరువు నష్టం దావా వేసినప్పుడు రామోజీరావు ఇదే విషయాన్ని కోర్టుకు నివేదించారని తెలిపారు. పేపర్లో రాసే వ్యాసాలు, విశ్లేషణలు రాసిన వారి వ్యక్తిగత అభిప్రాయాలే తప్ప, ఈనాడుకు ఏ సంబంధంలేదని హైకోర్టుకు రామోజీరావు నివేదించారని సోమవారం ఒక ప్రకటనలో ఆయన గుర్తుచేశారు. సాక్షి టీవీ చర్చలో అమరావతిపై విశ్లేషకుడి అభిప్రాయం ఆయన వ్యక్తిగతమని, దీనితో సాక్షికి సంబంధంలేదని స్పష్టం చేశారు.జర్నలిస్టులను అణిచివేతకే అక్రమ అరెస్ట్లు తిరుపతి మంగళం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కక్ష సాధింపులు, రెడ్బుక్ పాలన, అక్రమ కేసులు బనాయించి గిట్టనివాళ్లను జైళ్లకు పంపడమే పనిగా పెట్టుకుందని వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తున్న సాక్షి మీడియాపై కూటమి ప్రభుత్వం దాడులకు తెగబడుతూ అక్రమ అరెస్ట్లు చేయడం బాధాకరమన్నారు. జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేయడం, పత్రికా కార్యాలయాలపై దాడులు చేయడం చరిత్రలో ఎన్నడూ లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘కొమ్మినేని’ అరెస్టు కక్ష సాధింపే.. హైదరాబాద్: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేయడాన్ని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్డబ్ల్యూజే), తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) తీవ్రంగా ఖండించాయి. ఇది పోలీసుల కక్ష సాధింపు చర్యలో భాగమని ఐఎఫ్డబ్ల్యూజే కార్యదర్శి పులిపలుపుల ఆనందం, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షుడు పిల్లి రాంచందర్ తదితరులు సోమవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్లో కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు సందర్భంగా వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా ఉందని తెలిపారు. -
ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణీకులకు ‘బస్సు’ తిప్పలు
విజయవాడ: ఏపీలోని పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. వేసవి సెలవులు మగిసిన తర్వాత హైదారాబాద్ బయల్దేరారు ఏపీలోని ప్రజలు. అయితే ప్రయాణీకుల రద్దీకి తగినంతగా బస్సుల ఏర్పాటు చేయడంలో ఏపీఎస్ ఆర్టీసీ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దాంతో ప్రయాణికలు తీవ్ర ఇబ్బందుల పడ్డారు. ప్రత్యేక బస్సులు నడపడంలో ప్రభుత్వ వైఫల్యం పూర్తిగా కనబడింది. వేసవి సెలవులు ముగిశాయని తెలిసినా ప్రభుత్వం మాత్రం సాధారణ బస్సు సర్వీసులకే పరిమితమైంది. ఎటువంటి ప్రత్యేక బస్సు సర్వీసుల ఏర్పాట చేయకపోవడంతో విజయవాడ నుంచి హైదరాబాద్కు వచ్చే వారు తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. గతరాత్రి విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ లో బస్సులు లేక జనం అవస్థలు పడ్డారు. గతంలో ఎప్పుడూ ఇలా చూడలేదని, ప్రత్యేకంగా గత ఏడాది కూడా ఇలానే వచ్చినా ఈ తరహాలో బస్సులు లేకుండా ఇబ్బందులు పడలేదని ప్రయాణీకులు అంటున్నారు. -
ఏపీలో ఘోరం: కడుపులో బిడ్డ ఉంది.. కొట్టొద్దన్నా..!
తాడేపల్లి రూరల్ : అసలే అర్ధరాత్రి.. ఆపై మద్యం మత్తు.. దీనికితోడు నేర చరిత్ర ఉన్న యువకులు.. మహిళ కనిపించగానే ఉన్మాదులుగా మారారు.. ఆమెపై దాడికి దిగారు.. గర్భంతో ఉన్నానని చెప్పినా వినకుండా పైశాచికంగా ప్రవర్తించారు..! తాడేపల్లి పోలీస్స్టేషన్ పరిధి పాత జాతీయ రహదారి వెంట పోలకంపాడు వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగిందీ ఘటన. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం భార్యాభర్తలైన రైల్వే ఉద్యోగి ఆనందరావు, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సునీత ఉండవల్లిలో ఉంటూ విజయవాడలో విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం విధులు ముగిశాక ద్విచక్ర వాహనంపై వస్తుండగా పోలకంపాడు మూడు బొమ్మల సెంటర్ దాటిన తర్వాత వెనుక నుంచి మద్యం మత్తులో ఉన్న గుర్తుతెలియని వ్యక్తి ఢీకొట్టాడు. ఐదు నెలల గర్భిణి అయిన సునీతను ఆనందరావు పైకి లేపుతుండగా, మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు వచ్చి దాడి చేశారు. ప్రతిఘటించే క్రమంలో సునీత చెప్పు తీసుకుని కొట్టింది. రెచ్చిపోయిన యువకులు ఫోన్ చేసి మరికొందరిని పిలిపించారు. ఆనందరావు, సునీతలను రోడ్డుపై విచక్షణారహితంగా కొట్టారు. భార్యాభర్తలు రక్షించండి అని కేకలు వేయడంతో తాడేపల్లి పోలీసులు వస్తున్న సంగతి తెలిసి యువకులు పరారయ్యారు. వీరిపై రౌడీషీట్ ఉన్నట్లు తెలుస్తోంది. తాడేపల్లి పోలీస్స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. -
‘కొమ్మినేని’ అరెస్ట్.. అరాచకాలకు పరాకాష్ట
సాక్షి, అమరావతి: సాక్షిటీవీ డిబేట్లో జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై ఒక పథకం ప్రకారం మూడు రోజులుగా చేస్తున్న కృత్రిమ ఆందోళనలకు పరాకాష్ట సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయనేమన్నారంటే.. వ్యాఖ్యలపై దుష్ప్రచారం సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు సాక్షి టీవీలో నిర్వహించిన డిబేట్లో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని ఉటంకిస్తూ అన్న మాటలను ప్రణాళిక ప్రకారం వివాదం చేయాలనుకున్న టీడీపీ, కృష్ణంరాజు అమరావతి గురించి తప్పుగా వ్యాఖ్యలు చేశారనే దు్రష్పచారాన్ని చేపట్టింది. సీఎం చంద్రబాబు తన ట్వీట్లో కృష్ణంరాజు వీడియోను పోస్ట్ చేసి తన పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగానే టీడీపీ, ఎల్లో మీడియా అదేపనిగా రాద్ధాంతం చేశాయి.కృష్ణంరాజు క్షమాపణ చెప్పినా.. తన వ్యాఖ్యలపై కృష్ణంరాజు క్షమాపణలు చెప్పారు. టీవీ డిబేట్లలో ఎవరు ఏ అభిప్రాయం చెప్పినా అది వారి వ్యక్తిగతమే. వాటిని టీవీ చానల్కుగానీ, ఆ కార్యక్రమ ప్రజెంటర్కుగానీ ఆపాదించడం తగదు. టీడీపీ అనుకూల చానల్స్లో వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ నేతల వ్యక్తిత్వాలను హననం చేస్తూ వందలకొద్ది డిబేట్లు జరిగాయి. అధికారంలో ఉన్నప్పుడూ వైఎస్సార్సీపీ ఇలాంటి డిబేట్లను పట్టించుకోలేదు. ఏ టీవీపైనా, పేపర్పైనా కక్షపూరితంగా వ్యవహరించలేదు. అసమర్థ పాలకులే ఇలాంటి అంశాలతో డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడతారు. ప్రణాళిక ప్రకారం వ్యక్తిగత దాడిసాక్షి టీవీ డిబేట్ను ప్రణాళిక ప్రకారం వివాదం చేసిన టీడీపీ.. వైఎస్ జగన్, వైఎస్ భారతిపై వ్యక్తిగత దాడి ప్రారంభించింది. జర్నలిస్టు వ్యాఖ్యలను సమర్థించలేదని, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని సాక్షి టీవీ చాలా స్పష్టంగా ఒక ప్రకటన విడుదల చేసింది. వైఎస్సార్సీపీ కూడా జర్నలిస్టు వ్యాఖ్యలను ఖండించింది. కొమ్మినేనీ క్షమాపణలు చెప్పారు. అయినా చంద్రబాబు కనుసన్నల్లోనే టీడీపీ సాక్షిటీవీ కార్యాలయాలపై దాడులకు తెగబడుతోంది. పరోక్షంగా అమరావతి పరువును టీడీపీనే బజారుకీడ్చింది. కొమ్మినేనిని గతంలోనూ ఎన్టీవీ ఉద్యోగం నుంచి చంద్రబాబు తొలగింపజేశారు. చంద్రబాబును పొగిడితేనే జర్నలిస్టులకు మనుగడ ఉంటుందనే సందేశం ఇస్తున్నారు. దీనిపై ప్రజలు, జర్నలిస్టులు, మేధావులు, ప్రజాసంఘాలు గళమెత్తాలి. హామీలు నెరవేర్చే వరకూ నిరసన గళంఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకూ కూటమి ప్రభుత్వంపై నిరసన గళమెత్తుతూనే ఉంటామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం యువజన విభాగం రాష్ట్ర కమిటీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు.క్రియాశీల పోరాటాలకు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్దామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, యూత్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్దార్ధ్ రెడ్డి పాల్గొన్నారు. -
విచ్చలవిడిగా యాంటిబయోటిక్స్ విక్రయాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మెడికల్ స్టోర్స్ యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. లాభాపేక్షతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండానే విచ్చలవిడిగా యాంటిబయోటిక్స్ విక్రయాలు చేపడుతున్నారు. అవగాహన లేమితో దగ్గు, జలుబు, జ్వరం, నొప్పుల వంటి చిన్న అనారోగ్య సమస్యలతో మెడికల్ స్టోర్స్ను సంప్రదిస్తున్న వారికి అవసరం లేకున్నా యాంటిబయోటిక్స్ని కట్టబెడుతున్నారు.వీటి అతి వినియోగం ప్రజారోగ్యానికి పెను విపత్తుగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. వీటిని అతిగా వినియోగించడంతో యాంటి మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) సంభవించి, ప్రాణాంతక వ్యాధుల బారినపడిన సమయంలో మందులు పనిచేయని దుస్థితి నెలకొంటోంది. నిబంధనలు బేఖాతర్ రాష్ట్రంలో 42 వేల హోల్సేల్, రిటైల్ మందుల దుకాణాలు ఉన్నాయి. డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ చట్టం 1945లోని షెడ్యూల్ హెచ్, హెచ్ 1లో ఉండే మందులను మెడికల్ స్టోర్స్లో వైద్యుడి ప్రిస్కిప్షన్ లేకుండా విక్రయించకూడదు. ఈ మందుల్లో యాంటిబయోటిక్ మందులు కూడా ఉంటాయి. అయితే నిబంధనలను చాలా వరకూ స్టోర్స్ యజమానులు బేఖాతరు చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అవగాహనా కార్యక్రమాలేవి? వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి విపత్తుగా మారిన ఏఎంఆర్ నియంత్రణ దిశగా అడుగులు వేశారు. ప్రత్యేక కార్యాచరణను ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. వైద్య, పశుసంవర్ధక, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, ఇతర శాఖలను సమన్వయ పరుచుకుంటూ ఏఎంఆర్ నియంత్రణకు ప్రణాళిక రచించారు. పలు సంస్థలతో వైద్య శాఖ ఎంవోయూలు చేసుకుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయా చర్యలు నీరుగారిపోయాయి. ఏటా ప్రపంచ వ్యాప్తంగా ఏఎంఆర్ కారణంగా దాదాపు యాభై లక్షల మంది మరణిస్తున్నారని పలు అధ్యయనాలు వెల్లడించాయి. 2050 నాటికి ఏఎంఆర్ కారణంగా మృత్యువాత పడేవారి సంఖ్య కోటికి చేరే అవకాశం ఉందని అంచనా. ప్రపంచం ఎదుర్కొంటున్న తొలి పది ఆరోగ్య సంక్షోభాల్లో ఏఎంఆర్ ఒకటని డబ్ల్యూహెచ్వో సైతం స్పష్టం చేస్తోంది. -
డ్యూయల్ మేజర్లతోనే పీజీ!
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం డిగ్రీ విద్యలో గందరగోళం సృష్టిస్తోంది. గతంలో సింగిల్ మేజర్, మైనర్ విధానంపై బురదజల్లడమే కాకుండా తాము అధికారంలోకి వస్తే పాత పద్ధతి(మూడు కోర్ సబ్జెక్టులు)ని ప్రవేశపెడతామని చెప్పి.. ఇప్పుడు డ్యూయల్ మేజర్లతో విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తోంది. తొలి సెమిస్టర్ నుంచే రెండు మేజర్ సబ్జెక్టులను అమలు చేయడమే కాకుండా రెండో ఏడాది నుంచి మైనర్ సబ్జెక్టును తప్పనిసరి చేసింది. కానీ మైనర్ సబ్జెక్టుకు క్రెడిట్లు తక్కువ కేటాయించడం ద్వారా అందులో పీజీకి అవకాశం లేకుండా చేసింది. అలాగే ఎలాంటి బోధన వనరులు లేకపోయినా.. క్వాంటం కంప్యూటింగ్ సబ్జెక్టును తప్పనిసరి చేసి విద్యార్థులను హడలెత్తిస్తోంది. ఇంటర్న్షిప్ సమయంలో కోత విధించి.. పుస్తకాల బట్టీకి ప్రాధాన్యమిచ్చింది.బోధన సాధ్యమేనా?బీకాం కోర్సులకు సంబంధించి కొత్త విధానంలో సబ్జెక్టుల కాంబినేషన్పై గందరగోళం నెలకొంది. బీకాంలో కంప్యూటర్ సైన్స్/అప్లికేషన్ల అనుబంధ మేజర్ సబ్జెక్టులుగా చదివే వారు తప్పనిసరిగా క్వాంటం టెక్నాలజీని మైనర్ సబ్జెక్టుగా అభ్యసించాలని నిబంధన పెట్టడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. క్వాంటం టెక్నాలజీ సబ్జెక్టును బోధించే వనరులు రాష్ట్రంలో జల్లెడ పెట్టి వెతికినా దొరకని పరిస్థితి ఉందని.. ప్రభుత్వం సొంత ప్రచారం కోసం విద్యార్థులను బలి చేస్తోందని విద్యావేత్తలు మండిపడుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యార్థులకు అత్యాధునిక విద్యను అందించేందుకు ఎడెక్స్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థల ద్వారా ఆన్లైన్ వర్టికల్స్ చదువుకునే అవకాశం కల్పించిందని వారు గుర్తు చేస్తున్నారు. కానీ, కూటమి ప్రభుత్వంలో కాలేజీలో పాఠాలు చెప్పడానికే వనరుల కొరత ఉన్నప్పుడు ఈ టెక్నాలజీ కోర్సులను ఎలా బోధిస్తారని ప్రశ్నిస్తున్నారు. కాగా, మేజర్ 1, మేజర్ 2, మైనర్ సబ్జెక్టులకు కాంబినేషన్ సబ్జెక్టుల జాబితాను ప్రభుత్వం ఇంకా విడుదల చేయకపోవడంపై డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. గతంలో విద్యార్థులకు అనుకూలంగా..ఒక సబ్జెక్టులో విద్యార్థి సంపూర్ణ నైపుణ్యాలు సాధించాలనే లక్ష్యంతో యూజీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా గత ప్రభుత్వం సింగిల్ మేజర్ విధానాన్ని తీసుకువచ్చింది. రెండో సెమిస్టర్ నుంచి 100కి పైగా సబ్జెక్టుల్లో నచ్చిన సబ్జెక్టును మైనర్ కింద చదువుకునేలా క్రెడిట్లు రూపొందించింది. అంటే మేజర్, మైనర్లో ఏదో ఒక సబ్జెక్టుతో పీజీలో ప్రవేశాలకు అర్హత పొందొచ్చు. దీంతో పాటు ఐచ్ఛికంగా మరో మైనర్ సబ్జెక్టును విద్యార్థి చదివితే దానికి కూడా క్రెడిట్లు ఇచ్చి అందులో సైతం పీజీ చేసేందుకు వీలు కల్పించింది. ఇక్కడ మేజర్కు 60, మైనర్కు 24 క్రెడిట్లు కేటాయించింది. నాలుగేళ్ల డిగ్రీ విధానంలో ఏడు సబ్జెక్టులు మాత్రమే ఉండేవి. అందులో ఒక సబ్జెక్టును కేవలం చివరి సంవత్సరంలో మాత్రమే చదవాల్సి ఉండేది.మైనర్ సబ్జెక్టులో పీజీకి అవకాశం లేదు..కూటమి ప్రభుత్వం సింగిల్ మేజర్ విధానం స్థానంలో డ్యూయల్ మేజర్ ప్రకటించింది. ఇందులో తొలి సెమిస్టర్ నుంచే విద్యార్థి ప్రధానంగా రెండు సబ్జెక్టులు(మేజర్1, 2) తీసుకోవాలి. మూడో సెమిస్టర్ నుంచి మైనర్ సబ్జెక్టును తప్పనిసరిగా చదవాలి. ఇక్కడ మేజర్ 1కు 48, మేజర్ 2కు 32, మైనర్కు 16 క్రెడిట్లు కేటాయించింది. యూజీసీ నిబంధనల ప్రకారం ఒక సబ్జెక్టులో కనీసం 24 క్రెడిట్లు ఉంటేనే.. అందులో పీజీ చేయొచ్చు. ఈ లెక్కన కేవలం 2 మేజర్లలో ఏదో ఒక దానిలో మాత్రమే పీజీ చదివేందుకు అర్హత ఉంటుంది. పైగా డ్యూయల్ మేజర్ నాలుగేళ్ల డిగ్రీలో 8 సబ్జెక్టులను చదవాల్సి ఉంటుంది.ఇంటర్న్షిప్, క్రెడిట్లలో కోత..వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యార్థులకు తరగతి బోధనతో పాటు ఉద్యోగ నైపుణ్యాలు పెంపొందించేందుకు 10 నెలల ఇంటర్న్షిప్ను ప్రవేశపెట్టింది. తొలి ఏడాది అనంతరం 180 గంటల కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టు, రెండో ఏడాది తర్వాత 180 గంటల ఇంటర్న్షిప్, చివరి ఏడాది(విద్యార్థి వీలును బట్టి) ఏదో ఒక సెమిస్టర్లో పూర్తిగా లాంగ్టర్మ్ ఇంటర్న్షిప్ అవకాశం కల్పించింది. కానీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం విద్యార్థులను పూర్తిగా బట్టీ చదువులకే పరిమితం చేస్తోంది. కమ్యూనిటీ సర్వీసు ప్రాజెక్టును 120 గంటలకు, స్వల్పకాలిక ఇంటర్న్షిప్ను 120 గంటలకు, లాంగ్టర్మ్ ఇంటర్న్షిప్ను 10 వారాలకు(240 గంటలకు) కుదించింది. పైగా క్రెడిట్లను 20 నుంచి 16కు తగ్గించింది. -
పశుసంవర్ధక శాఖలో చిరుద్యోగులపై వేటు?
సాక్షి, అమరావతి: పశుసంవర్ధక శాఖలో చిరుద్యోగులపై వేటు పడబోతోంది. కేవలం జీతాలకు నిధుల్లేవనే సాకుతో వీళ్లని బయటికి పంపించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమయింది. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తోన్న 28 బిజినెస్ ప్రాసెసింగ్ ఆపరేటర్(బీపీవో) / టెలిఫోన్ ఆపరేటర్లతో పాటు ముగ్గురు ఐటీ ప్రోగ్రామర్లు ఇందులో ఉన్నారు. జూలై 7వ తేదీలోగా స్వచ్ఛందంగా తప్పుకోవాలంటూ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ టీ.దామోదరనాయుడు టెర్మినేషన్ ఆర్డర్ ఇచ్చారు. జీతాలిచ్చేందుకు తగినంత నిధులు లేని కారణంగా తొలగించాల్సి వస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వమే కావాలని..కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పశు బీమా పథకం అమలు కోసం 2023లో పత్రికా నోటిఫికేషన్ ద్వారా ఈ 31 మందిని నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఆప్కాస్ ద్వారా నియామక పత్రాలు జారీ చేశారు. ఐటీ ప్రోగ్రామర్లకు రూ.27వేలు, బీపీవోలకు రూ.18వేలు చొప్పున జీతభత్యాలు నిర్ణయించారు. పేరుకు బీపీవోలుగా పోస్టింగ్లు పొందినప్పటికీ వీరు డైరెక్టరేట్తో పాటు జిల్లా కేంద్రాల్లో జూనియర్ అసిస్టెంట్ల సేవలన్నీ నిర్వహిస్తున్నారు. అయితే రెండు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. అయినా వీరంతా నిబద్ధతతో పని చేస్తున్నారు. ఇంతలో జూలై 7వతేదీ నుంచి వీరిని తొలగిస్తున్నట్టు ఆదేశాలు జారీ కావడంతో వీరు ఆందోళనకు లోనవుతున్నారు. ఉన్న ఫళాన తొలగిస్తే తమ కుటుంబాల పరిస్థితి ఏమిటని వారు కలత చెందుతున్నారు. కాగా ప్రభుత్వాదేశాల మేరకే ఈ 31మందిని తొలగించారనే ప్రచారం జరుగుతోంది. ఉద్వాసన పలికిన అనంతరం వీరి స్థానంలో కూటమి పార్టీల కార్యకర్తలు, సానుభూతిపరులను నియమించుకునే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
అద్దె భారం సాకు.. మెడికల్ అకాడమీ రద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోనే ఏకైక బాలికల ఐఐటీ, ఎన్ఐటీ, మెడికల్ అకాడమీని కూటమి ప్రభుత్వం అర్థంతరంగా మూసేసింది. దళిత, గిరిజన, బీసీ, మైనార్టీల బిడ్డలు చదివే గురుకులానికి అద్దె భారమైందని సాకులు చెబుతోంది. ఈడుపుగల్లు అకాడమీ బంద్తో 280 మంది భవితవ్యం రోడ్డున పడింది. ఇంటర్ మొదటి సంవత్సరం ఇక్కడ చదివిన తాము.. రెండో ఏడాది ఎక్కడకు వెళ్లాలంటూ విద్యార్థినులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఐఐటీ, ఎన్ఐటీ, మెడికల్ సీట్లు సాధించాలనే లక్ష్యంతో తామంతా చేరితే కేవలం అద్దె చెల్లించలేమంటూ.. ప్రభుత్వం మాట మాత్రమైనా చెప్పకుండా కృష్ణా జిల్లా ఈడుపుగల్లు అకాడమీని మూసేసిందని కన్నీటి పర్యంతమయ్యారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తాడేపల్లిలోని ఏపీ సాంఘిక సంక్షేమ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యాలయం వద్ద సోమవారం ఆందోళనకు దిగారు. బాలికలకు ఉన్న ఏకైక అకాడమీని మూసేసి వేరే గురుకులంలో చేరాలని అధికారులు ఒత్తిడి చేయడం అన్యాయమని తల్లిదండ్రులు, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పలు శాఖల ప్రధాన కార్యాలయాల నుంచి క్షేత్రస్థాయిలో అనేక కార్యాలయాలను అద్దె భవనాల్లోనే నిర్వహిస్తున్న కూటమి ప్రభుత్వం ఏకైక మెడికల్ అకాడవీుకి అద్దె చెల్లించలేమని చేతులెత్తయడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమేనని మండిపడ్డారు.రాష్ట్రంలో ఏకైక బాలికల అకాడమీ..కర్నూలు జిల్లా చిన్నటేకూరు, గుంటూరు జిల్లా అడవి తక్కెళ్లపాడులో బాలుర కోసం అకాడమీలు నిర్వహిస్తున్నారు. ఈడుపుగల్లులోని అకాడమీ బాలికల కోసం ప్రత్యేకించినది. ప్రవేశపరీక్ష నిర్వహించి మెరిట్ ప్రాతిపదికన సీట్లు ఇస్తున్నారు. 26 జిల్లాల దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన బాలికలు ఇక్కడ చేరి చదువుకుంటున్నారు. అయితే, దీన్ని మూసివేయాలనే ముందస్తు ప్రణాళికతో ఉన్న ప్రభుత్వం ఈ ఏడాది ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్లుసైతం నిలిపివేసింది.శభాష్ అన్పించుకుంటున్న విద్యార్థినులుఈడుపుగల్లు అకాడమీ విద్యార్థినులు కొన్నేళ్లుగా ఐఐటీ, ఎన్ఐటీ, ఎంబీబీఎస్, వెటర్నరీ, అగ్రి, ఈఏపీసెట్, జేఎన్టీయూల్లో సీట్లు సాధించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అద్భుతంగా రాణించారు. 2021 నుంచి ఏటా రాష్ట్ర స్థాయిలో పలు విభాగాల్లో ఎన్నికవుతూ వస్తున్నారు.కేఎల్వైఈఎస్–యూఎస్ ప్రోగ్రాంలో ఏడాది పాటు అమెరికాలో ఉండి విద్యను అభ్యసించే అవకాశాన్ని అందుకున్నారు. 2022–23 విద్యా సంవత్సరంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్వహించిన జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో మొదటి స్థానంలో నిలిచిన ఈడుపుగల్లు విద్యార్థులు ఏకంగా రూ.3.50 లక్షల నగదు బహుమతులు పొందడం విశేషం.అకాడమీని తీసేస్తే పిల్లల భవిష్యత్ ఏంటి?మా అమ్మాయి ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తయింది. రెండో సంవత్సరానికి వచ్చేసరికి అకాడమీ తీసేస్తే ఆమె భవిష్యత్ ఏమిటి? పిల్లలను కృష్ణా జిల్లా కుంటముక్కల గురుకులానికి తరలిస్తామని చెబుతున్నారు. విజయవాడకు 50 కిలోమీటర్లకు పైగా దూరం ఉండే అకాడవిుకీ వెళ్లాలంటే రెండు గంటలు పడుతుంది. అక్కడ పెచ్చులూడిపోయిన భవనంలో కనీస సౌకర్యాలు లేవు. అన్నీ వదిలేసి అంత దూరం నుంచి తీసుకొచ్చి మా పిల్లల్ని ఈడుపుగల్లు అకాడమీలో చేర్పిస్తే ఇంత దుర్మార్గంగా చేస్తే ఎలా? –ఇందిర, విద్యార్థిని తల్లి, నల్లజర్ల, తూర్పుగోదావరి జిల్లావైఎస్ జగన్ కొనసాగించినా.. లోకేశ్ తీసేస్తున్నారుమా పాప శ్రీవల్లిని ఎంతో ఆశతో ఈడుపుగల్లు అకాడమీలో చేర్పించాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 470 మార్కులకు 426 సాధించింది. మరింత ఉన్నత చదువులకు వెళ్తుందనుకుంటే ఇంతలోనే అకాడమీని మూసేసి అన్యాయం చేశారు. 2017లో చంద్రబాబు స్థాపించిన ఈ అకాడమీని మాజీ సీఎం వైఎస్ జగన్ ఎంతో శ్రద్ధతో కొనసాగించారు. ఇప్పుడు చంద్రబాబు కుమారుడు, విద్యా శాఖ మంత్రిగా ఉన్న లోకేశ్ తీసేయాలని చూడడం దుర్మార్గం. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు రూ.20 వేల కోట్లకు పైగా కేంద్ర నిధులు వస్తున్నాయి. కనీసం అద్దె కట్టి ఒక అకాడమీని ఎస్సీ, ఎస్టీ బాలికల కోసం కొనసాగించలేరా? –జెల్లా శ్రీనివాసులు, బేతంచర్ల, నంద్యాల జిల్లాప్రభుత్వానికి అద్దె భారమవుతోందని..అకాడమీ భవనానికి అద్దె భారంగా మారిందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దాన్ని మూసివేస్తే అద్దె భారం తగ్గుతుంది. అందుకే విద్యార్థులను వేరొక గురుకులానికి తరలించేలా ఒప్పిస్తున్నాం. ఉన్నవారిని విభజించి గురుకులాల్లో సర్దుబాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నాం –ప్రసన్న వెంకటేశ్, కార్యదర్శి, ఏపీ ఎస్సీ అంబేడ్కర్ గురుకుల విద్యాలయ సంస్థ -
'ప్రైవేటే షైనింగ్' స్టార్
విజయనగరం జిల్లా నుంచి షైనింగ్ స్టార్ అవార్డులకు 40 మంది జూనియర్ కాలేజీ విద్యార్థులను ఎంపిక చేయగా, వీరిలో 29 మంది ప్రైవేటు కాలేజీవారు. 11 మంది మాత్రమే ప్రభుత్వ జూనియర్ కళాశాలల వారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ ఇదే విధంగా అవార్డులకు ఎంపిక జరిగింది. కూటమి ప్రభుత్వ పాలనలో ఏడాదికాలంలో ప్రభుత్వ విద్యను ఎంతగా దిగజార్చారో ఇదిఉదాహరణ మాత్రమే. సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ విద్య అభాసుపాలవుతోంది. ప్రతిభావంతులైన ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులకు దక్కాల్సిన గుర్తింపు ప్రైవేటు సంస్థలకు చెందుతోంది. తాజాగా ఇచ్చిన ‘షైనింగ్ స్టార్’ పురస్కారాలు దీనినే స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన 4,168 పురస్కారాల్లో 3 వేలకు పైగా ఆ సంస్థల విద్యార్థులకే కట్టబెట్టారు. ప్రతి మండలంలో పదో తరగతిలో ఆరుగురు, ఇంటర్మీడియట్లో జిల్లాకు 36 మంది చొప్పున అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఈ అవార్డులకు ఎంపిక చేశారు.అయితే, గత విద్యా సంవత్సరంలో అత్యధిక మార్కులు ప్రైవేటు స్కూళ్లు, ప్రైవేటు జూనియర్ కాలేజీ విద్యార్థులకే దక్కడంతో షైనింగ్ స్టార్లుగానూ వారే అధికంగా ఎంపికయ్యారు. అత్యంత గందరగోళంగా జరిగిన స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియతో ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీ విద్యార్థులకు అన్యాయం జరిగిందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ప్రైవేటుకు మేలు జరిగేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందనే విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ ఈ అంశాన్ని సీరియస్గా పరిగణించలేదు. పైగా, ఇప్పుడు ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల విద్యార్థులకే షైనింగ్ స్టార్ అవార్డులు ఇచ్చింది. రూ.20 వేల నగదు, మెడల్తో పాటు అభినందన పత్రం బహూకరించారు. సోమవారం 26 జిల్లా కేంద్రాల్లో పురస్కారాలను ప్రదానం చేశారు. పదో తరగతిలో 600కి 500 పైన (సగటున 83.33 శాతం) మార్కులు సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ విద్యార్థులను మండలానికి ఆరుగురు చొప్పున, 70 శాతం మార్కులు సాధించిన ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను జిల్లాకు ముగ్గురు చొప్పున ఎంపికచేసి అవార్డులను ఇచ్చారు. ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సీఈసీ/ఎంఈసీ, ఒకేషనల్ గ్రూపుల్లో 830పైగా మార్కులు పొందిన 36 మందిని, 700 మార్కులు పొందిన ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను సత్కరించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ విద్యకే గుర్తింపు నాడు జగనన్న ఆణిముత్యాలు అధికం ప్రభుత్వ విద్యార్థులకే రాష్ట్రంలో ప్రతి పేదింటి బిడ్డ చదువులో రాణిస్తే పేదరికం పోగొట్టవచ్చని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాంక్షించారు. ఇంగ్లిష్ మీడియంలో చదివితే అద్భుతంగా రాణిస్తారని బలంగా నమ్మారు. దీనికోసం వైఎస్ జగన్ హయాంలో మనబడి నాడు–నేడు పథకంతో పాటు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి అంతర్జాతీయ స్థాయి బోధనను అందించారు. వైఎస్ జగన్ తెచ్చిన సంస్కరణలతో ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల విద్యార్థులు కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల వారిని తలదన్నేలా అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. ‘జగనన్న ఆణిముత్యాలు’ కింద ఎంపికయ్యారు. కానీ, కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ, వైఎస్ జగన్పై కక్ష సాధించేందుకు ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసింది. ‘పేదలకు ఉచితంగా చదువు చెప్పడం ప్రభుత్వ బాధ్యత కాదు, ప్రభుత్వ బడుల్లో సదుపాయాలు ఉండవు, ప్రైవేటు బడులు బాగుంటాయి. డబ్బున్నవారు అక్కడ చదువుకుంటారు, మేధావులుగా తయారవుతారు. మీరూ ఫీజులు కట్టి ప్రైవేటు స్కూళ్లకు వెళ్లండి’ అని గతంలో సీఎం హోదాలో చంద్రబాబు బహిరంగంగా ప్రకటించారు. దీనికితగ్గట్లే 2024–25 విద్యా సంవత్సరంలో పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ప్రహసనంగా మార్చేశారు. వేలాదిమంది ప్రభుత్వం పాఠశాలల విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టారు. -
పాలనలో ఫెయిల్.. అందుకే ఈ డైవర్షన్
సాక్షి, అమరావతి: మహిళలు అంటే ఏమాత్రం గౌరవంలేని చంద్రబాబు, టీడీపీ నేతలు ఒక్కసారిగా నక్కజిత్తులతో సూక్తి ముక్తావళి వల్లిస్తుండటం తాజా రాజకీయ వైచిత్రి. తమ ప్రభుత్వ పరిపాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించే కుయుక్తిలో భాగంగానే ఈ పన్నాగానికి తెరతీశారు. అసలు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, బావమరిది బాలకృష్ణతో సహా ఆ పార్టీ నేతలు ఏనాడూ మహిళలకు తగిన గౌరవం ఇవ్వలేదనన్నది బహిరంగ రహస్యం. 2014–2019 మధ్య చంద్రబాబు సాక్షాత్తు ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ స్వయంగా వివక్షాపూరిత వ్యాఖ్యలు చేయడం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైన తీరు అందరికీ గుర్తింది. ‘కోడలు కొడుకును కంటాను అంటే అత్త వద్దంటుందా’ అని ఆయన బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. తద్వారా కుమార్తెలను తక్కువ చేసి అవమానించారు. స్త్రీ పురుష సమానత్వం కోసం అందరికీ ఆదర్శవంతంగా ఉండాల్సిన ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు మహిళల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరించారు. ఇక చంద్రబాబు బావమరిది, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. తాను తన బావకంటే నాలుగాకులు ఎక్కువే చదివానన్నట్టుగా వ్యవహరించారు. ‘ఆడది కనిపిస్తే ముద్దయినా పెట్టాలి.. కడుపైనా చేయాలి’ అని ఓ సినిమా వేడుకలో వేదిక ఎక్కి మరీ అత్యంత జుగుప్సాకరంగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు కుమారుడు, బాలకృష్ణ అల్లుడు నారా లోకేశ్ అటు తండ్రినీ ఇటు మామనూ మించిపోయారు. విదేశాల్లో ఆయన పలువురు యువతులతో స్విమ్మింగ్ పూల్లో సాగించిన వ్యవహారాలు ఫొటోలు, వీడియోలతో సహా వెలుగులోకి రావడంతో అంతా అవాక్కయ్యారు. పైగా బాలకృష్ణ ఓ చానల్ కోసం నిర్వహించే రియాల్టీ షోలో పాల్గొన్న చంద్రబాబు తన కుమారుడి బాగోతాన్ని వెనకేసుకువచ్చారు. బాలకృష్ణ కూడా లోకేశ్కే వంతపాడారు. ప్రస్తుతం హోమ్ మంత్రిగా ఉన్న వంగలపూడి అనిత గతంలో టీడీపీ సభల్లో ప్రసంగిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతి గురించి అసభ్యకరంగా వ్యాఖ్యానించారు. ఓ మహిళ, అందులోనూ ప్రజాప్రతినిధిగా చేసిన ఆమె సాటి మహిళలను పత్రికల్లో రాయలేని భాషతో అసభ్యకరంగా మాట్లాడటం విభ్రాంతి కలిగించింది. అదే టీడీపీ సంస్కృతి అని ఆ పార్టీ వర్గాలు ఘనంగా చెప్పుకోవడం మరింత విస్మయానికి గురి చేసింది. అటువంటి చంద్రబాబు, బాలకృష్ణ, లోకేశ్, అనిత ప్రస్తుతం ఒక్కసారిగా మహిళలపై లేని ఆపేక్షను చూపిస్తూ కొంగజపం చేస్తుండటం టీడీపీ కుట్రపూరిత రాజకీయాలకు నిదర్శనం.» టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఓ మహిళా తహశీల్దార్ జట్టు పట్టుకుని మరీ ఈడ్చుకొచ్చి దాడి చేశారు. అయినా సరే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఎమ్మెల్యే చింతమనేని అరచకానికి అండగా నిలిచారు. తహశీల్దార్ వనజాక్షిని బెదిరించి మరీ పంచాయతీ చేశారు.» 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బాలికలు, మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యలు రాష్ట్రాన్ని తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. అయినా సరే ఏమాత్రం పట్టించుకోని చంద్రబాబు.. వైఎస్సార్సీపీపై దుష్ప్రచారం కోసం మాత్రం రోజుకో డ్రామాకు తెరతీస్తున్నారు.నివేదికలను ప్రస్తావించి.. మహిళలను కించపరిచిన ఈటీవీ..సాక్షి టీవీ చానల్ చర్చా గోష్టిలో ఆ టీవీ ప్రతినిధులు ఎవరూ మహిళలను కించపరిచేలా మాట్లాడనే లేదు. ఓ స్వతంత్ర విశ్లేషకుడు టైమ్స్ ఆఫ్ ఇండియా అనే ఆంగ్ల పత్రిక ప్రచురించిన నివేదికను ప్రస్తావిస్తూ మాట్లాడారు. ఆ సందర్భంగా ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు అప్పుడే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన్ను వారించారు. సాక్షి టీవీ యాజమాన్యం వెంటనే స్పందించి ఆ స్వతంత్ర విశ్లేషకుడి వ్యాఖ్యలతో తమకే మాత్రం సంబంధం లేదని స్పష్టం చేసింది. వైఎస్సార్సీపీ కూడా ఆయన వ్యాఖ్యలతో తమ పార్టీకి ఏమాత్రం సంబంధం లేదని తేల్చి చెప్పింది. అయినా సరే వక్రీకరిస్తూ సాక్షి టీవీ యాజమాన్యం, కొమ్మినేని శ్రీనివాసరావుపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా పలువురు పరిశీలకులు గతంలో ఈటీవీ ప్రసారం చేసిన ఓ వార్తా కథనాన్ని గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో వ్యభిచారం, ఎయిడ్స్ వ్యాప్తిపై ఓ నివేదిక వెల్లడించిందంటూ ఈటీవీ ప్రత్యేక వార్తా కథనాన్ని ప్రసారం చేసింది. యావత్ రాష్ట్రంలో మహిళల ఆత్మగౌరవం దెబ్బతీసేలా కథనాన్ని ప్రసారం చేయడం గమనార్హం. ఎవరో స్వతంత్ర విశ్లేషకుడు చెప్పింది కాదు.. ఈటీవీ స్వయంగా రూపొందించిన వార్తా కథనంగా ప్రసారం చేసింది. అసలు రాష్ట్రంలో మహిళలను కించపరిచేలా ఏదైనా చానల్ వార్త కథనాన్ని ప్రసారం చేసిందంటే అది ఈటీవీ మాత్రమేనని పరిశీకులు స్పష్టం చేస్తున్నారు. ఈటీవీ ప్రసారం చేసిన ఆ వార్తా కథనం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అటువంటి దిగజారుడు పాత్రికేయం చంద్రబాబుకు ఇంపుగా కనిపిస్తుంది. ఎందుకంటే అది తన రాజగురువు రామోజీ కుటుంబం నిర్వహిస్తున్న చానల్. కానీ ఎవర్నీ కించపరచకుండా, గౌరవమైన రీతిలో చార్చా గోష్టి నిర్వహించే సాక్షి టీవీపై మాత్రం అక్రమ కేసు నమోదు చేయడం టీడీపీ మార్కు కుతంత్రం.బాబు గుండెల్లో రైళ్లు» పతిపక్ష వైఎస్సార్సీపీ ఈ నెల 4న నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ నిరసన కార్యక్రమాలు విజయవంతం కావడంతో ప్రభుత్వ పెద్దల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే టీడీపీ కూటమి ప్రభుత్వ పుట్టి మునగడం ఖాయమని చంద్రబాబు గుర్తించారు. » డైవర్షన్ రాజకీయాల కోసం కాచుకుని ఉన్న చంద్రబాబు ఈ నెల 6న సాక్షి టీవీ నిర్వహించిన చర్చా గోష్టిని వక్రీకరిస్తూ కుట్రకు తెరతీశారు. సాక్షి టీవీలో చర్చా గోష్టి ముగిసిన 24 గంటల తర్వాత ఆ ఉదంతాన్ని వక్రీకరిస్తూ కుతంత్రానికి తెరతీశారు. బాబు ఆదేశాలతో టీడీపీ సోషల్ మీడియా కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను సాక్షి టీవీకి, వైఎస్సార్సీపీకి ఆపాదిస్తూ టీడీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని వైరల్ చేసింది. టీడీపీ అనుకూల టీవీ చానళ్లు ఈటీవీ, ఏబీఎన్ ఆంధ్ర జ్యోతి, టీవీ 5 తదితర చానళ్ల ద్వారా వైఎస్సార్సీపీపై విష ప్రచారానికి పాల్పడ్డారు. » చంద్రబాబు కుట్రలో భాగంగా మంత్రి లోకేశ్ తెరపైకి వచ్చారు. సాక్షి టీవీ, వైఎస్సార్సీపీపై నిరాధార ఆరోపణలు చేశారు. ఆ వెంటనే టీడీపీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనల పేరుతో గూండాగిరీకి పాల్పడ్డాయి. చర్చా గోష్టిలో విశ్లేషకుడు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలతో తమకే మాత్రం సంబంధం లేదని సాక్షి టీవీ యాజమాన్యం ఖండించింది. వాస్తవానికి అంతటితో ఆ అంశం ముగిసిపోయినట్టే. కానీ చంద్రబాబు కుట్ర మరోలా ఉంది.» జూన్ 8 (ఆదివారం) కూడా ఈ అంశంపై రాద్ధాంతం కొనసాగేలా కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు స్వయంగా ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో కామెంట్ పోస్టు చేశారు. ఫలితంగా అక్రమ కేసులు, సాక్షిపై దాడులు కొనసాగాయి. -
రాష్ట్ర వ్యాప్తంగా ‘సాక్షి’ సిబ్బంది నిరసన
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: ‘సాక్షి’ కార్యాలయాలపై అకారణంగా టీడీపీ గూండాలు దాడులకు పాల్పడటాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ‘సాక్షి’ సిబ్బంది సోమవారం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు జరుగుతోందని, ప్రభుత్వ తప్పిదాలను సాక్షి ప్రశ్నిస్తోందన్న అక్కసుతో చంద్రబాబు కూటమి ప్రభుత్వం కక్ష కట్టిందని ఈ సందర్భంగా వారు మండిపడ్డారు. సంబంధం లేని విషయాన్ని సాకుగా చూపి ‘సాక్షి’పై దాడులకు టీడీపీ గూండాలను పురమాయించడం దుర్మార్గమన్నారు.విజయవాడ ఆటోనగర్లోని సాక్షి రాష్ట్ర ప్రధాన కార్యాలయం వద్ద సోమవారం రాత్రి సిబ్బంది కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కూటమి గూండాలు ఉదయం సాక్షి కార్యాలయంపై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేసి, నేమ్ బోర్డ్ను ధ్వంసం చేయడం పత్రికా స్వేచ్ఛపై దాడే అని నినదించారు. కర్నూలు, కడప, అనంతపురం, తిరుపతి (రేణిగుంట), ఒంగోలు, మంగళగిరి, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, విశాఖ, శ్రీకాకుళంలో సాక్షి కార్యాలయాల సిబ్బంది కొవ్వొత్తుల ప్రదర్శన జరిపారు. ప్రజాస్వామ్యంలో మీడియాపై దాడులు మంచిది కాదని, దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని వివిధ జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. పార్టీల ముసుగులో పత్రికా కార్యాలయాలపైకి గూండాలను పంపడం రాష్ట్రంలో శాంతిభద్రతల దుస్థితికి అద్దం పడుతోందన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు పత్రికలపై ఏమాత్రం గౌరవం ఉన్నా, వెంటనే ‘సాక్షి’ కార్యాలయంపై దాడికి దిగిన వారిని అరెస్టు చేయించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
టీడీపీ రౌడీ మూకలపై చర్యలు తీసుకోండి
సాక్షి నెట్వర్క్: రాష్ట్ర వ్యాప్తంగా ‘సాక్షి’ కార్యాలయాలపై అధికార టీడీపీ నేతలు, కార్యకర్తలు సోమవారం కుట్ర పూరితంగా దాడులు చేయడాన్ని ఖండిస్తూ.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ అన్ని జిల్లాల్లో సాక్షి జర్నలిస్టులు, సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పలు చోట్ల ‘సాక్షి’ కార్యాలయాల గేట్లు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడంతో పాటు రాళ్లు, కోడిగుడ్లతో దాడికి పాల్పడటం దుర్మార్గం అని చెప్పారు.‘సాక్షి’ నేమ్ బోర్డులను ధ్వంసం చేసి తగులబెట్టడం, కార్యాలయ గేట్లు, ప్రహరీ పైకి ఎక్కి సిబ్బందిపై దాడికి ప్రయత్నించడం సరైన చర్యలు కాదన్నారు. వారి చర్యల వల్ల కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది భయోత్పాతానికి గురయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. దాడులు చేసిన వారిపై తక్షణ విచారణ చేపట్టి, దోషులను కఠినంగా శిక్షించాలని, సాక్షి కార్యాలయ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని, ‘సాక్షి’ కార్యాలయాల వద్ద పోలీస్ భద్రత ఏర్పాటు చేయాలని కోరారు. ఇది పూర్తిగా ఆర్గనైజ్డ్ క్రైం అని, టీడీపీ నేతల దాడులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పోలీసులకు అందజేశారు. తమ కార్యాలయం ఎదుట అనుమతి లేకుండా గుంపులుగా చేరి దాడులకు పాల్పడ్డారని, వారిపై సెక్షన్ 143, 147, 427, 341, 506, 352 కింద కేసులు నమోదు చేయాలని కోరారు. -
AP: పత్రికా స్వేచ్ఛపై పాశవిక దాడి
నాణేనికి మరోవైపు కోణాన్ని నిర్భయంగా చూపుతున్న తెలుగు ప్రజల మనస్సాక్షి.. ‘సాక్షి’పై ముష్కర మూకలు దాడులకు తెగబడ్డాయి.. అదును కోసం నక్కిన గుంటనక్కలు లేగదూడపై ఆవురావురుమంటూ విరుచుకుపడిన చందంగా ఒక్కసారిగా సాక్షి కార్యాలయాలపై ఈ పచ్చమూకలు విరుచుకుపడ్డాయి.. గేట్లపై రాళ్లు, కోడిగుడ్లు విసిరి, బోర్డులను విరగ్గొట్టి, పేపర్లను తగులబెట్టి వికృతానాందాన్ని ఆస్వాదించాయి. ప్రజల వాణిగా.. వాస్తవాల వారధిగా సాక్షి నిలవడం నచ్చని ఉన్మాదులు ఈ దాడిలో అత్యుత్సాహం చూపడం ఆశ్చర్యపరచకపోయినా.. నచ్చని మాట అన్నారంటూ ఆగ్రహించిన అతివలు అత్యంత లాఘవంగా గేట్ల పైకెక్కడం చూసి జనం ముక్కున వేలేసుకున్నారు.. మహిళలను గౌరవించడంలో ముందుండే సాక్షి మీడియా వివాదానికి కారణమైన విశ్లేషకుడి మాటలను తీవ్రంగా ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది.. వాటిని సాక్షికి ఆపాదించవద్దని కోరింది. అయినా దీనిని ఓ అవకాశంగా మార్చుకోవాలన్న దుగ్ధతో, రాజకీయ కుట్రతో శ్రేణులను ఎగదోస్తూ దాడులకు ప్రేరేపించారు. సాక్షి కార్యాలయాలపై విధ్వంసానికి పురికొల్పారు. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిస్తూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు సాగించిన ఈ దుర్మార్గాన్ని ప్రజాస్వామికవాదులు, పత్రికా స్వేచ్ఛను కాంక్షించే ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండిస్తున్నారు.సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్ : రాష్ట్రంలో రెడ్బుక్ అరాచకాలు పతాకస్థాయికి చేరాయి. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా భావించే పత్రికా స్వేచ్ఛకూ సంకెళ్లు వేస్తున్నారు. నిజాలు రాసే కలాలను, వాస్తవాలు చెప్పే గళాలను నిరంకుశంగా అణగదొక్కుతున్నారు. గత ఎన్నికల్లో గుప్పించిన సూపర్ సిక్స్ హామీలను ఏడాదైనా ఒక్కటీ నెరవేర్చలేకపోతున్న చంద్రబాబు ప్రభుత్వం దాన్ని కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలి‘ట్రిక్స్’ చేస్తోంది. అందులో భాగంగానే అడ్డగోలుగా అక్రమ అరెస్టులు, అనవసర రాద్ధాంతాలు చేస్తోంది. ఈ క్రమంలోనే.. ఎవరో చేసిన వ్యాఖ్యలను సాకుగా చూపించి ‘సాక్షి’పై దాడులకు ఉసిగొలిపింది. తెలుగువారి మనస్సాక్షిగా.. పేదవాడి గొంతుకై.. నాణేనికి రెండోవైపు ప్రజల పక్షాన నిలబడుతూ, వాస్తవాలను ప్రచురిస్తూ.. ప్రసారం చేస్తున్న ‘సాక్షి’పై రాజకీయ కుట్రలకు బరితెగిస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ ప్రోద్బలంతో కూటమి నేతలు, అల్లరిమూకలు కలిసి సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ‘సాక్షి’ కార్యాలయాలపై మూకుమ్మడి దాడులకు తెగబడ్డారు. విచక్షణారహితంగా రాళ్లు రువ్వుతూ, కోడిగుడ్లు విసురుతూ రెచ్చిపోయారు. ‘సాక్షి’ యూనిట్ కార్యాలయాల వద్ద నేమ్ బోర్డులను పెకిలించేశారు. ‘సాక్షి’ పత్రిక ప్రతులతో పాటు, ‘సాక్షి’ నేమ్ బోర్డులను తగులబెట్టారు. బయటి వ్యక్తి వ్యాఖ్యలతో సంబంధంలేదని ‘సాక్షి’ చెప్పినప్పటికీ రెచ్చిపోయిన టీడీపీ మూకలు నానా బీభత్సం సృష్టిస్తూ, ‘సాక్షి’ సిబ్బందిని భయాందోళనలకు గురిచేశారు. విజయవాడలో ‘సాక్షి’ ఏపీ ప్రధాన కార్యాలయంపై దాడిఈ దాడుల్లో భాగంగా.. విజయవాడ ఆటోనగర్లో ఉన్న ‘సాక్షి’ రాష్ట్ర ప్రధాన కార్యాలయంపైనా పచ్చమూకలు విరుచుకుపడ్డాయి. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు భార్య అనురాధ, ఆయన కొడుకు గద్దె క్రాంతికుమార్, కార్పొరేటర్లు చెన్నుపాటి ఉషారాణి, ముమ్మనేని ప్రసాద్, పొట్లూరి సాయిబాబు, మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీతో పాటు టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు, అల్లరిమూకలు ఉ.11 గంటలకు ‘సాక్షి’ కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుని గేటు ముందు బైఠాయించారు. ‘సాక్షి’ పత్రికకు, యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యాజమాన్యం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అక్కడితో సరిపెట్టకుండా, కొందరు అత్యుత్సాహంతో కార్యాలయం గేటుపైకెక్కి లోపలికి ప్రవేశించేందుకు యత్నించారు. కార్యాలయంలోకి వెళ్లి విధ్వంసం చేయాలని శతధా ప్రయత్నించారు. అది సాధ్యంకాక గుడ్లు, రాళ్లు తెచ్చి కార్యాలయంపైకి విసిరారు. దీంతో అక్కడ రక్షణ కల్పిస్తున్న పోలీసులకు అవి తగిలాయి. మహిళా పోలీసులపై కోడిగుడ్లు పడ్డాయి. అప్పటికీ శాంతించని కూటమి నేతలు ‘సాక్షి’ నేమ్ బోర్డును తొలగించి, కొంత భాగాన్ని మురుగుకాలువలో పడేశారు. మిగతా భాగాన్ని గేటు ముందుకు తెచ్చి కాళ్లతో తొక్కారు. పత్రిక ప్రతులతో పాటు నేమ్ బోర్డుకు నిప్పుపెట్టారు. దాదాపు మూడు గంటల పాటు ఈ విధ్వంసకాండ కొనసాగింది. ఆ సమయంలో విధుల్లోకి వెళ్లాల్సిన ‘సాక్షి’ సిబ్బంది రోడ్డుపైనే మండుటెండలో ఉండిపోవాల్సి వచ్చింది. మరోవైపు.. కూటమి నేతల దుశ్చర్యలకు ఆటోనగర్లో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనచోదకులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తిరుపతిలో టీడీపీ నాయకులు సోమవారం పోలీస్ చట్టం సెక్షన్–30ని ఉల్లంఘించి నిరసన ప్రదర్శన నిర్వహించారు.ఎల్లోగ్యాంగ్ అరాచకం ఇలా..» శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని ‘సాక్షి’ కార్యాలయం ఆస్తులను టీడీపీ మూకలు నిరసనకారుల ముసుగులో ధ్వంసం చేశాయి. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు బావ, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మెండ దాసునాయుడు తదితరులు సుమారు మూడు గంటలపాటు విధ్వంసకాండకు పాల్పడ్డారు. కార్యాలయం నేమ్ బోర్డును పీకేసి తగలబెట్టారు. కార్యాలయంలోకి, ప్రహరీపై పేడ విసిరారు. ప్రహరీపై నుంచి లోపలికి దూకి కార్యాలయం లోపల గలాటా సృష్టించారు. గేటుకున్న తాళాన్ని సైతం పీకేశారు. కార్యాలయం ఎదుట రెండు టెంట్లు వేసి ధర్నా చేశారు. » విశాఖ, అనకాపల్లి, తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలోని ‘సాక్షి’ యూనిట్ కార్యాలయాల వద్ద టీడీపీ, జనసేన శ్రేణులు ఆందోళన నిర్వహించారు. » ఏలూరులోని ‘సాక్షి’ జిల్లా కార్యాలయంపైనా టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడులకు యత్నించారు. టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో రభస సృష్టించారు. » గుంటూరు జిల్లా ఆత్మకూరులోని సాక్షి కార్యాలయం వద్ద అమరావతి జేఏసీ పేరుతో అమరావతి రైతులు, మహిళలు ధర్నా చేశారు. పలుమార్లు సాక్షి కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. గేట్లు ఎక్కి రాళ్లు రువ్వారు. రాజధాని జేఏసీ కన్వీనర్ పువ్వాడ సుధాకర్, మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష, మాజీ జెడ్పీటీసీ ఆకుల జయసత్య, మంగళగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్, తాడికొండ మార్కెట్ యార్డ్ మాజీచైర్మన్, టీడీపీ నాయకులు బెల్లంకొండ నరసింహారావు, తాడేపల్లి టీడీపీ మహిళా పట్టణ అధ్యక్షురాలు అన్నె కుసుమ, గోవాడ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు.. గుంటూరు, పల్నాడు జిల్లా నరసరావుపేట సాక్షి కార్యాలయాల ముందు కూడా ఆందోళన చేశారు. » నెల్లూరు, కర్నూలు, కడప, రేణిగుంటలోని సాక్షి యూనిట్ కార్యాలయాలపైనా టీడీపీ మూకలు కొందరు రౌడీలతో కలిసి దాడికి తెగబడ్డాయి. -
నేనంటే చంద్రబాబుకు పగ.. అందుకే కక్ష సాధింపు
సాక్షి, హైదరాబాద్: తన అరెస్టుపై సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు మండిపడ్డారు. ‘నేను సీనియర్ సిటిజన్ని ఎలా అరెస్టు చేస్తారు? సెర్చ్ వారెంట్ కూడా ఇవ్వలేదు. 70 ఏళ్ల వయసులో నాపైన ప్రభుత్వానికి ఇంత కక్ష దేనికి? కక్ష గట్టి చేస్తున్నారు. నా వల్ల ఎవరికి నష్టం కలిగిందో, ఇబ్బంది కలిగిందో చెప్పడం లేదు. పోలీసులు రూల్స్ పాటించకుండా ఐడీ కార్డులు చూపి తుళ్లూరు తీసుకువెళ్తామని చెప్పారు. ఇంటిలో పైకి వెళ్లి మందులు తెచ్చుకోవడానికి కూడా పోలీసులు ఒప్పులేదు. ఫిర్యాదు ఎవరు ఇచ్చారో చెప్పకుండా కావాలనే నాపై కక్ష గట్టి చేస్తున్నారు. సీనియర్ జర్నలిస్ట్ పరిస్థితే ఇలా ఉంటే సామాన్య ప్రజల పరిస్థితేంటి? కేసు ఎవరు పెట్టారో చెప్పడం లేదు. సాక్షిలో నా డిబేట్లు రాకుండా చేయాలని చూస్తున్నారేమో. ప్రభుత్వ వ్యతిరేక వాయిస్ వినిపించకుండా చేసే ప్రయత్నం జరుగుతోంది. జర్నలిస్టులను కూడా వదిలిపెట్టడం లేదు. రెడ్ బుక్లో ఇది కూడా భాగమేమో. గతంలో ఒక టీవీ చానెల్లో నేను పనిచేస్తున్నప్పుడు అమరావతి భూములపై నేను డిబేట్ చేస్తే యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి నన్ను తొలగించేలా చేశారు. అప్పటి నుంచి నాపై చంద్రబాబుకు కోపం ఉంది. ఆ తర్వాత నాకు వైఎస్ జగన్ సాక్షిలో అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఏ అవకాశం లేకపోయినా కావాలని నాపై పోలీసులు దొంగ కేసు పెట్టారు. నేను అనని విషయంపైన కేసు పెట్టడం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. అమరావతి మహిళలను ఎవరూ ఏమీ అనలేదు. కావాలని రెచ్చగొట్టి చేస్తున్నారు. చంద్రబాబు, లోకేశ్కు కోపం వస్తే ఎవరైనా జైలుపాలు కావాల్సిందే’ అని ఆవేదన వ్యక్తం చేశారు. -
అరాచకానికి కేరాఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేరాఫ్ అడ్రస్గా మారిపోయిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లో సోమవారం ఉదయం సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును ఆయన నివాసంలో ఏపీ పోలీసులు అరెస్టు చేయడంపై వైఎస్ జగన్ స్పందించారు. ‘ఎక్స్’ వేదికగా కొమ్మినేని అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ పోస్టు చేశారు. అనని మాటలను సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు ఆపాదిస్తూ, వాటిని వక్రీకరించి విషప్రచారం చేసి, ఆయనను అరెస్టు చేశారని మండిపడ్డారు. అంతేకాకుండా ఒక పథకం ప్రకారం సాక్షి యూనిట్ కార్యాలయాలపైన దాడులు చేయించారని ధ్వజమెత్తారు. ఈ అరాచకానికి మహిళల గౌరవం అనే ముసుగు తొడిగి ఎక్కడికక్కడ విధ్వంసం చేస్తూ ఆటవికంగా వ్యవహరిస్తున్నారని సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. కోడలు మగపిల్లాడిని కంటే అత్త వద్దంటుందా? అని మీరు, ఆడపిల్ల కనిపిస్తే ముద్దైనా పెట్టాలి లేదా కడుపైనా చేయాలి అని మీ బావమరిది గతంలో అన్న మాటలు చూస్తే.. మీకు మహిళల మీద ఎంతటి గౌరవం ఉందో తెలుస్తోందని వైఎస్ జగన్ దునుమాడారు. ఇంకా ఈ పోస్టులో ఆయన ఏం తెలిపారంటే..» ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ అయిపోతున్నాయి. ప్రజలు, ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నారు. ఏడాది కాలంగా చంద్రబాబు చేస్తున్న అరాచకపు, అన్యాయ పాలనపై ప్రజల తరఫున వీరెవ్వరూ గొంతెత్తకుండా, ఏడాదిగా తన దుర్మార్గపు పాలన, తన మోసాలు, తన అవినీతి, తన వైఫల్యాలపై స్వరం వినిపించకుండా చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అణచివేయడానికి యత్నిస్తున్నారు. తాను చేయని వ్యాఖ్యలకు 70 ఏళ్ల వృద్ధుడైన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టుచేసి కక్షసాధింపుల విష సంస్కృతిని పతాక స్థాయికి తీసుకెళ్లారు.» సహజంగా ఒక డిబేట్ జరిగేటప్పుడు, వక్తలు మాట్లాడే మాటలకు, యాంకర్కు ఏం సంబంధం? కొందరు అనుకూలంగానూ, మరికొందరు వ్యతిరేకంగానూ మాట్లాడుతూ ఉంటారు. కొన్ని టీవీ ఛానళ్లలో వ్యక్తిత్వాలను హననం చేస్తూ చాలామంది గెస్ట్లు మాట్లాడిన సందర్భాలు గతంలో మనం చూడలేదా? ఇప్పటికీ కొనసాగడంలేదా?» ప్రజల తరఫున మీడియా నిలవకూడదని, చంద్రబాబు చేసిన తప్పులను ప్రశ్నించకూడదని ఒక పథకం ప్రకారం లేనివాటిని ఆపాదిస్తూ, టాపిక్లను డైవర్ట్ చేస్తూ, వక్రీకరిస్తూ, సాక్షి మీడియాపైనా దాడులు చేయిస్తున్నారు. కొమ్మినేనిపై చంద్రబాబు కక్ష కట్టడం ఇది తొలిసారి కాదు. గతంలోనే ఆయన ఉద్యోగాన్ని ఊడగొట్టాడు. ఆయన నిష్పక్షపాతంగా డిబేట్లు చేయడం తట్టుకోలేక 2014–19 మధ్య ఆ ఛానల్పై (గతంలో, సాక్షి కాదు) ఆంక్షలు విధించారు. ఇప్పుడు కూడా తనకు మద్దతుగా లేవన్న కారణంతో ఆయా ఛానళ్లను నియంత్రిస్తూ కక్ష సాధిస్తున్నారు. కొమ్మినేని అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను.» చంద్రబాబూ.. ప్రజలు మీకు ఇచ్చిన అధికారం ఐదేళ్లే. అందులో ఏడాది గడిచిపోయింది. నాలుగేళ్ల తర్వాత మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, అధికార దుర్వినియోగాలపై ప్రజలకు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుందని, చేసిన తప్పులకు బాధ్యత వహించాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. చెడు సంప్రదాయాలకు నాంది పలుకుతూ ఇవాళ ఏది విత్తుతారో, రేపు అదే పండుతుంది, అది రెండింతలవుతుందని మర్చిపోకండి.» చంద్రబాబూ.. రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోయింది. ఈ ఏడాది పాలనలో మహిళలు, బాలికల పట్ల మీకు ఎలాంటి చిత్తశుద్ధి లేదని తేలిపోయింది. అనంతపురంలో ఇంటర్మీడియట్ చదువుకునే తమ కూతురు తన్మయి కనిపించకుండా పోయిందని తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే, 6 రోజుల తర్వాత ఆ అమ్మాయి దారుణంగా హత్యకు గురై శవమై కనిపించింది. కనిపెట్టడానికి మీకు, మీ యంత్రాంగానికి చేతకాలేదు. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లెలో 9వ తరగతి విద్యార్థినిపై 6 నెలలుగా బ్లాక్మెయిల్ చేసి 14 మంది అత్యాచారం చేస్తే, బాధితురాలు ఫిర్యాదు చేయనీయకుండా భయపెట్టారు. నేరం చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం మీకు చేతకాలేదు. కొందరు చేస్తున్న అఘాయిత్యాలకు స్కూలుకు వెళ్తున్న బాలికలు గర్భం దాలుస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. మీ పాలన మొదటి ఏడాదిలోనే 188 మంది మహిళలు, బాలికలు అత్యాచారాలకు గురైతే, 15 మందిని రేప్ చేసి చంపేశారు. వందలకొద్దీ మహిళలపై దాడులు, దౌర్జన్యాలు, వేదింపులకు పాల్పడ్డారు. మీ ట్రాక్ రికార్డు ఇంత ఘోరంగా ఉంది.» చంద్రబాబూ.. మీరు వచ్చాక విద్య, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్ పూర్తిగా నాశనం అయిపోయాయి, నిర్వీర్యం అయిపోయాయి. విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. అధికారంకోసం సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరుతో ప్రజలకు హామీలు ఇచ్చి, తీరా సీట్లోకి వచ్చాక వారికి నిలువెల్లా వెన్నుపోటు పొడిచి, ఏడాది పాలన తర్వాత ప్రజలముందు దోషిగా నిలబడ్డారు. పాలనలో చతికిలపడ్డ, అసమర్థ, అవినీతి, అరాచక ముఖ్యమంత్రిగా ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు. వీటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి మీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలతో తప్పుడు ప్రచారం చేయించి, కిరాతకంగా వ్యవహరిస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ ఎంతోకాలం చెల్లవు చంద్రబాబూ అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అమానుషం.. ఏపీలో సాక్షి కార్యాలయాలపై టీడీపీ దౌర్జన్యం
రాష్ట్రంలో టీడీపీ గూండాలు రెచ్చిపోతున్నారు. నిరసనకారుల ముసుగులో సాక్షి కార్యాలయాలపై దాడులకు దిగుతున్నారు. విశ్లేషకుడు కృష్ణంరాజు వ్యాఖ్యలను సాక్షికి ఆపాదిస్తూ సాక్షి కార్యాలయాలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు. ముందుగా ప్లాన్ చేసి ‘సాక్షి’పై దాడులకు దిగుతుంది పచ్చపార్టీ. ఆ వ్యాఖ్యలతో సాక్షి మీడియాకు సంబంధం లేకపోయినా అసత్య ఆరోపణలతో దాడులకు పాల్పడుతుంది పచ్చదండు. సాక్షిపై అసత్య ఆరోఫణలు అనేవి కేవలం దాడులు చేసేందుకే అనే విషయం తేటతెల్లమైంది. టీడీపీ గూండాల దాడితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్ర బట్టబయలైంది. విజయవాడ సాక్షి మీడియా కార్యాలయం పై టిడిపి పార్టీ రౌడీల దాడుల పై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదుసాక్షి మీడియా కార్యాలయం పై దాడులకు పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేయాలని డిమాండ్డీసీపీ సరితకు వినతిపత్రం అందించిన విజయవాడ బ్రాంచి మేనేజర్ యశోధరాజు, సాక్షి పేపర్, టీవీ ప్రతినిధులుకర్నూలు:సాక్షి పత్రిక మీడియా కార్యాలయంపై టీడీపీ రౌడీల దాడులపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన పాత్రికేయులురాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాక్షి మీడియా పై దాడులకు పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేయాలని కోరిన జర్నలిస్టుల సంఘాల నేతలుకర్నూలు ఇన్చార్జ్ డిఎస్పీ శ్రీనివాస్ ఆచారికి వినతి పత్రాన్ని అందించిన సాక్షి మీడియా పాత్రికేయులు సాక్షి కార్యాలయాలపై టీడీపీ కుట్రపూరిత దాడులు👉 ఏపీలో అన్ని జిల్లాల్లో సాక్షి కార్యాలయాలపై టీడీపీ కార్యకర్తల భౌతిక దాడులు 👉టీడీపీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో దాడులకు కుట్ర👉రాళ్లు, కర్రలతో దాడులు చేస్తన్న టీడీపీ గూండాలు👉దాడులకోసం ఉదయం నుంచి టీడీపీ మూకల మోహరింపు👉పథకం ప్రకారం ఆర్గనైజ్డ్గా సాక్షి కార్యాలయాలపై దాడులు👉విజయవాడ, మంగళగిరి, వైఎస్సార్ కడప, తిరుపతి, అనంతపురం, శ్రీకాకుళంలో దాడులు👉సాక్షి బోర్డులు ధ్వంసం చేసి, ఆఫీసుల్లోకి వెళ్లేందుకు యత్నం👉అన్ని జిల్లాల్లో సాక్షి ఆఫీసులపై దాడులు చేయాలని టీడీపీ కేంద్ర కార్యాలయం ఆదేశాలు👉రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్న అధికార పార్టీ👉రాష్ట్ర చరిత్రలో ఏ మీడియాపైనా జరగని రీతిలో టీడీపీ నేతల దాడులు మంగళగిరి సాక్షి కార్యాలయం వద్ద టీడీపీ దౌర్జన్యం👉సాక్షి కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నం👉మంగళగిరి సాక్షి కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణులు దౌర్జన్యం👉. టీడీపీ నేతలు, మహిళా కార్యకర్తలు కలిసి సాక్షి కార్యాలయం బోర్డు ధ్వంసం👉బోర్డున ధ్వంసం చేసిన మాదిగ కార్పోరేషన్ చైర్మన్ శిరీష్👉అడ్డుకునేందుకు పోలీసులు యత్నం, వాగ్వాదంఆందోళన పేరుతో విజయవాడ, మంగళగిరి, తిరుపతి, కడప, శ్రీకాకుళం, అనంతపురంలోని సాక్షి కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారు. రేణిగుంట సాక్షి ఆఫీస్ వద్ద టీడీపీ గూండాల బీభత్సం సృష్టించారు. రేణిగుంటలోని సాక్షి కార్యాలయంపై టీడీపీ గూండాలు రాళ్ల దాడికి దిగారు. అదే సమయంలో సాక్షి కార్యాలయంలోకి చొచ్చుకువెళ్లేందుకు యత్నించారు.అనంతపురంలోని సాక్షి కార్యాలయంపై సైతం టీడీపీ గూండాలు దాడికి యత్నించారు. నిరసనకారల ముసుగులో సాక్షి కార్యాలయం వద్ద ధర్నాకు దిగిన టీడీపీ నేతలు.. సాక్షి బోర్డు తొలగించేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే వారిని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. శ్రీకాకుళం, కడప సాక్షి కార్యాలయాల వద్ద కూడా పచ్చమూకలు రెచ్చిపోయాయి. ఆందోళన పేరుతో సాక్షి కార్యాలయాలపై దాడులకు దిగారు. -
కొమ్మినేని పారిపోయే రకం కాదు: దేవులపల్లి అమర్
సాక్షి, హైదరాబాద్: కొమ్మినేని శ్రీనివాస్ను ఏపీ అరెస్ట్ చేయడం దురదృష్టకరమని, వేధించడం పద్ధతి కాదని మరో సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ అన్నారు.. మీడియాను కూటమి నేతలు రాజకీయమయం చేసేశారు. విశ్లేషకుడి మాటలను సాక్షి మీడియా ఖండించింది. అయినా కూడా 70 ఏళ్ల వయసులోనూ కొమ్మినేనిపై అక్రమ కేసు పెట్టి వేధించడం సరికాదు.మీడియాను కూటమి ప్రభుత్వం శత్రువుగా చూస్తోంది. కొమ్మినేని టెరరిస్ట్ కాదు. పారిపోయే వ్యక్తి అంతకన్నా కాదు. విశ్లేషకుల అందరిపైనా కొమ్మినేనిపై పెట్టినట్లే అక్రమ కేసులు పెడతారా?. ఒకరికి ఒక న్యాయం.. మరొకరికి మరో న్యాయం అంటే ఎలా? అని అమర్ ప్రశ్నించారు. -
ఈఏపీ సెట్లో బాలురు భళా
బాలాజీ చెరువు (కాకినాడ సిటీ)/కందుకూరు రూరల్/ శ్రీకాళహస్తి/పెనమలూరు/ఆలమూరు/పాలకొల్లు సెంట్ర ల్/తాడేపలిలగూడెం : బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, ఫార్మాడీ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఇంజినీరింగ్, అగ్రిక ల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రెస్ట్ టెస్ట్ (ఏపీ ఈఏపీ సెట్) ఫలితాల్లో అబ్బాయిలు పూర్తి ఆధిపత్యం కనబరిచారు. ఇంజినీరింగ్తో పాటు అగ్రికల్చర్ విభాగంలో టాప్–10 ర్యాంకులను వారే కైవసం చేసుకున్నారు.గత ఏడాది ఇంజినీరింగ్లో టాప్–10 ర్యాంకులు అబ్బాయిలు దక్కించుకోగా, అగ్రికల్చర్ విభాగంలో ఆరుగురు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు ర్యాంకులు సాధించారు. కానీ, ఈ ఏడాది మాత్రం రెండు విభాగాల్లోనూ బాలురే టాప్–10 ర్యాంకులన్నింటినీ కొల్లగొట్టారు. ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలను జేఎన్టీయూ–కాకినాడలో సెట్ చైర్మన్, వర్సిటీ వైస్ చాన్సలర్ సీఎస్ఆర్కే ప్రసాద్, సెట్ కన్వీనర్ వీవీ సుబ్బారావు ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. ఇంజినీరింగ్ విభాగానికి 2,80,611 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,64,840 మంది హాజరయ్యారు. 1,89,748 మంది (71.65 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 1,05,436 (70.33 శాతం) మంది, బాలికలు 84,313 (73.37 శాతం) మంది ఉన్నారు. అలాగే, అగ్రికల్చర్ విభాగంలో 81,837 మంది దరఖాస్తు చేసుకోగా 75,460 మంది పరీక్ష రాశారు. వీరిలో 67,761 మంది (89.8 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 16,097 (89.92 శాతం) మంది, బాలికలు 51,664 (89.76 శాతం) మంది ఉన్నారు. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఇంజినీరింగ్ వైపు అత్యధికంగా బాలురు, అగ్రి కల్చర్ వైపు బాలికలు మొగ్గు చూపారు. మొత్తం మీద 75.67 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.25 శాతం వెయిటేజీతో ర్యాంకులు..మే 19 నుంచి 27 వరకు కంప్యూటర్ బేస్డ్ (సీబీటీ) విధానంలో పరీక్ష నిర్వహించినట్లు సెట్ చైర్మన్, జేఎన్టీయూకే వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్ చెప్పారు. పరీక్షలు పూర్తయిన 12 రోజుల్లో ఫలితాలు విడుదల చేశామన్నారు. ఈఏపీ సెట్ పూర్తయిన తరువాత ప్రాథమిక కీ విడుదల చేశామని, అభ్యంతరాలు స్వీకరించేందుకు కీ అబ్జర్వేషన్స్ వెరిఫికేషన్ కమిటీ నియమించామని చెప్పారు. జువాలజీ, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో టైపోగ్రాఫికల్ లోపం వలన రెండు ప్రశ్నలకు సంబంధించి ఆప్షన్లు మార్చామని, అలాగే.. మాల్ ప్రాక్టీస్కు సంబంధించి ఫలితాలు విడుదల చేయలేదన్నారు.రాష్ట్రంలో రెగ్యులర్ ఇంటర్మిడియెట్లో ఉత్తీర్ణులై ఈఏపీ సెట్లో అర్హత సాధించిన వారందరికీ ఇంటర్ మార్కుల ఆధారంగా 25 శాతం వెయిటేజీ ఇచ్చి, ర్యాంకులు ప్రకటించామని వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూకే ఇన్చార్జి రిజిస్ట్రార్ రవీంద్ర, కో కన్వీనర్ రాము, సుమతి, కో ఆరి్డనేటర్ సానబోయిన చంద్రశేఖర్, జయప్రసాద్, ఉషాదేవి, దిలీప్కుమార్ పాల్గొన్నారు.ఇంజినీరింగ్లో రెండో ర్యాంకర్ భానుచరణ్రెడ్డి..ఇంజినీరింగ్ విభాగంలో రెండో ర్యాంకు సాధించిన భానుచరణ్రెడ్డిది తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి. జేఈఈ అడ్వాన్స్డ్ ఓపెన్ కేటగిరీలో 51వ ర్యాంకు, జేఈఈ మెయిన్స్ ఓపెన్ కేటగిరిలో 158, జేఈఈ బీఆర్క్ ఓపెన్ కేటగిరిలో 54వ ర్యాంకు సాధించాడు. ఈయన తండ్రి రాయలసీమ జూనియర్ కాలేజి ప్రిన్సిపాల్ మాండవ్యపురం జయభారత్. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ తీసుకుని క్వాంటం కంప్యూటర్స్ను డెవలప్ చేయడమే తన లక్ష్యమని భానుచరణ్రెడ్డి చెప్పాడు.ఇంజినీరింగ్లో పాలకొల్లు విద్యార్థికి మూడో ర్యాంకుపశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన కోటివల్లి యశ్వంత్ సాత్విక్ ఇంజినీరింగ్ విభాగంలో 3వ ర్యాంకు సాధించాడు. యశ్వంత్ సాత్విక్ గతంలో పాలిసెట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు, జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మొదటి స్థానం, జేఈఈ మెయిన్స్ రెండో సెషన్లో ఓపెన్ కేటగిరీలో 53వ ర్యాంకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 3వ ర్యాంకు సాధించాడు. జేఈఈ అడ్వాన్స్డ్లో ఓపెన్ కేటగిరీలో 113వ ర్యాంకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 8వ ర్యాంకు సాధించాడు. యశ్వంత్ తండ్రి వెంకట సత్యనారాయణ పండ్ల వ్యాపారి. ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్ చదవాలనేది తన కోరికని యశ్వంత్ చెప్పాడు.ఇంజినీరింగ్లో కందుకూరు విద్యార్థికి 10వ ర్యాంకు..శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన బద్రిరాజు వెంకట మణి ప్రీతమ్ ఏపీ ఈఏపీసెట్ (ఎంసెట్) ఫలితాలు ఇంజినీరింగ్ విభాగంలో 10వ ర్యాంకు సాధించాడు. జేఈఈ అడ్వాన్స్డ్లో 234వ ర్యాంకు, మెయిన్స్లో 129వ ర్యాంకు, తెలంగాణ ఎంసెట్లో 39వ ర్యాంకు సాధించిన ప్రీతమ్.. ఈఏపీసెట్లోనూ హవా కొనసాగించాడు. ప్రీతమ్ తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే.అగ్రిఫార్మాలో హర్షవర్థన్కు ఫస్ట్ ర్యాంకు..అగ్రి, ఫార్మా ఫలితాల్లో కృష్ణాజిల్లా పెనమలూరు మండలం కానూరుకు చెందిన రామాయణం వెంకట నాగసాయి హర్షవర్థన్కు రాష్ట్రస్థాయిలో ఫస్ట్ ర్యాంకు వచ్చింది. నంద్యాలకు చెందిన తండ్రి నాగసత్యనారాయణ, తల్లి హేమలలిత కొన్నేళ్లుగా కానూరులో నివసిస్తున్నారు. నాగసత్యనారాయణ హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ట్రాన్స్పోర్టేషన్ గ్రూప్ స్టేట్ హెడ్గా పనిచేస్తున్నారు. నాగసాయి హర్షవర్థన్కు 149.5 మార్కులతో స్టేట్ ఫస్ట్ వచ్చాడు. తనకు మెడిసిన్ చదవాలని ఉందని వెంకట నాగసాయి హర్షవర్థన్ తెలిపారు. మెడిసిన్ చదవాలనే లక్ష్యంతో నిరంతరం శ్రమించానన్నారు.అగ్రిఫార్మాలో మల్లేశ్కుమార్కు మూడో ర్యాంకు..అగ్రి, ఫార్మా విభాగంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చొప్పెల్ల గ్రామానికి చెందిన డేగల అకీరానంద వినయ్ మల్లేష్కుమార్ మూడో ర్యాంకు సాధించాడు. మల్లేష్ తండ్రి శివప్రసాద్ రైస్మిల్లు యజమాని కాగా తల్లి వెంకటలక్ష్మి గృహిణి. నీట్లో మంచి ర్యాంకు సాధించి కార్డియాలజిస్ట్గా సేవలు అందించడమే తన లక్ష్యమని మల్లేశ్ కుమార్ తెలిపాడు.అగ్రి, ఫార్మా విభాగంలో ‘గూడెం’ విద్యార్థికి ఐదో ర్యాంకు..ఆగ్రి, ఫార్మా విభాగంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన యలమోలు సత్య వెంకట్ ఐదో ర్యాంకు సాధించాడు. సత్యవెంకట్ తల్లిదండ్రులు డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ సుచరిత ఇద్దరూ డాక్టర్లే. తల్లి, తండ్రి, సోదరి బాటలోనే వైద్యుడిగా చేయాలనేది తన సంకల్పమని సత్య వెంకట్ చెప్పాడు. మంచి వైద్యుడిగా సమాజంలో విశేష సేవలందించాలనేది తన లక్ష్యమని సత్య వెంకట్ చెప్పారు -
ఏపీ ఎన్నికల్లోనూ ఈవీఎంల మాయాజాలం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల మాయాజాలం చోటుచేసుకుందనే చర్చ మరోసారి ఊపందుకుంది. మహారాష్ట్రలో ఈవీఎంల మాయాజాలంవల్లే బీజేపీ గెలిచిందని.. వచ్చే ఎన్నికల్లో బిహార్లోనూ అదే రీతిలో గెలిచేందుకు బీజేపీ ఎత్తులు వేస్తోందని కాంగ్రెస్ నేత, లోక్సభలో ప్రతిపక్ష నేత, రాహుల్గాంధీ ఓ ఆంగ్ల పత్రికలో రాసిన వ్యాసంలో ఆరోపించారు. ఈ వ్యాసాన్ని ఉటంకిస్తూ మహారాష్ట్ర తరహాలోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లోనూ ఈవీఎంల మాయాజాలంతో కూటమి గెలిచిందంటూ ‘ఎక్స్’ వేదికగా రిటైర్డు ఐఏఎస్ పీవీఎస్ శర్మ ఉద్ఘాటించారు. ‘ఆంధ్రప్రదేశ్లో 2024, మేలో జరిగిన ఎన్నికల్లో సాయంత్రం 6 గంటలకు 68.12 శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ తర్వాత 81.86 శాతం ఓట్లు పోలైనట్లు తుది పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. అంటే.. తొలుత ప్రకటించిన దానికి.. చివరిసారిగా ప్రకటించిన శాతానికి, పోలింగ్ 13.74 శాతం ఎక్కువగా ఉంది. దీనివల్ల 46 లక్షల ఓట్లు అధికంగా పోలయ్యాయి. అంటే.. సగటున ఒక్కో నియోజకవర్గానికి 26 వేల ఓట్లు అధికంగా పోలయ్యాయి. చివర్లో పెరిగిన పోలింగ్ శాతమే అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసింది’ అంటూ తన ‘ఎక్స్’ ఖాతాలో పీవీఎస్ శర్మ ఆదివారం కుండబద్దలు కొట్టారు.రాయచోటిలో అధికంగా పోలైన ఓట్లన్నీ ఒకే పార్టికా!? : గడికోటవైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తూ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ‘నేను ప్రాతినిధ్యం వహించి పోటీచేసిన రాయచోటి నియోజకవర్గంలో ఎన్నికలు జరిగిన తీరు, పోలింగ్ సరళి తదితర అంశాలను, గణాంకాలను పరిశీలిస్తే.. కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. 2012 ఉప ఎన్నిక, 2014, 2019, 2024లో జరిగిన రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలను పరిశీలిస్తే.. 2012, 2014, 2019 ఎన్నికల్లో 62 వేల నుంచి 66 వేల ఓట్లు టీడీపీకి వచ్చాయి. వైఎస్సార్సీపీకి 92 వేల నుంచి 98 వేల మధ్య ఓట్లు వచ్చాయి.2014తో పోలిస్తే 2019లో పోలైన ఓట్ల పెరుగుదల కేవలం 200 మాత్రమే. 2019తో పోల్చితే 2024లో 30 వేల ఓట్లు అధికంగా పోలయ్యాయి. గతంలో ఇంత పెరుగుదల ఎప్పుడూలేదు. కానీ, 2024లో వైఎస్సార్సీపీకి 95 వేల ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల ఫలితాలతో చూస్తే.. వైఎస్సార్సీపీ ఓట్లు అలానే ఉన్నాయి. కానీ, టీడీపీకి మాత్రం 96 వేల ఓట్లు వచ్చాయి. అంటే.. 2019తో పోలిస్తే 2024లో అధికంగా పోలైన 30 వేల ఓట్లు కూడా టీడీపీకే పడ్డాయని అర్థమవుతోంది. అధికంగా పోలైన ఈ 30 వేల ఓట్లు ఒకే పార్టికి ఎలా పడతాయి? ఇది సాధ్యమేనా? ఇది నమ్మశక్యమేనా?’ అంటూ గడికోట శ్రీకాంత్రెడ్డి ‘ఎక్స్’లో ప్రశ్నించారు. -
కీచక రాజ్యం.. ఆగని అఘాయిత్యాల పర్వం
సగటున రెండు రోజులకొక అత్యాచారం.. చంబల్ లోయ దురాగతాలను తలపిస్తున్న రాష్ట్రం చోద్యం చూస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. రెడ్బుక్ సేవలో తరిస్తున్న పోలీసు యంత్రాంగం రామగిరి మండలంలో 9వ తరగతి బాలికపై 14 మంది ఆరు నెలలపాటు అత్యాచారం.. బాధిత బాలికను స్వయంగా విచారించిన ఎస్పీ.. అయినా ఇప్పటిదాకా కేసే లేదు! మహిళలంటే టీడీపీ నేతలకు చిన్నచూపు.. అందుకే బాలికలు, మహిళల భద్రతకు కూటమి సర్కారు తిలోదకాలుసాక్షి, అమరావతి: కీచక చంద్రబాబు ప్రభుత్వం గురివింద నీతిని వల్లె వేస్తోంది. మహిళల పట్ల ఒక్కసారిగా మొసలి కన్నీరు కారుస్తోంది. ఓ వైపు రాష్ట్రంలో అసాంఘిక శక్తులు.. మహిళలు, బాలికలపై విచ్చలవిడిగా అత్యాచారాలకు పాల్పడుతున్నా, నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం.. మరోవైపు మహిళల భద్రత, గౌరవం, ఆత్మాభిమానం అంటూ వైఫల్యాన్ని కప్పిపుచ్చేకునేందుకు యత్నిస్తోంది.ఒకప్పటి చంబల్ లోయను తలపిస్తూ రాష్ట్రంలో మహిళలు, బాలికలపై యథేచ్ఛగా అఘాయిత్యాలతో ఆంధ్రప్రదేశ్ అంతటా భీతావహ పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. వాటిని కట్టడి చేయడం చేతగాని చంద్రబాబు ప్రభుత్వం.. ఎవరో ఓ ప్రైవేటు వ్యక్తి చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రతిపక్ష పార్టీకి ఆపాదిస్తూ దుష్ప్రచారానికి తెగబడుతోంది. తమ ఏడాది పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ రాజకీయాల కుట్రకు తెగిస్తోంది. కానీ, రాష్ట్రంలో రోజు రోజుకూ దిగజారుతున్న మహిళల భద్రత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అత్యాచారాలతో అట్టుడుకుతున్న రాష్ట్రంబాలికలు, మహిళలపై అత్యాచారాలతో రాష్ట్రం హడలిపోతోంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో ఆంధ్రప్రదేశ్లో సాగుతున్న అత్యాచార పర్వం యావత్ దేశాన్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఎంతగా అంటే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో ఇప్పటి వరకు ఏకంగా 188 మంది బాలికలు, మహిళలపై అత్యాచారాలు జరగడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఇందులో అత్యాచారం ఆపై హత్యకు గురైన వారు 15 మంది ఉన్నారు. మరో తొమ్మిది మంది బాలికలు, మహిళలు అనుమానాస్పదంగా మృతిచెందారు. ఈ లెక్కన దాదాపు ప్రతి రెండు రోజులకు ఓ అత్యాచారం జరుగుతోందని పోలీసు రికార్డులే వెల్లడిస్తున్నాయి. ఒకప్పుడు చంబల్ లోయలో మహిళలపై ఈ తరహాలో అఘాయిత్యాలకు పాల్పడేవారని పత్రికలు ప్రచురించేవి. ఆనాటి చంబల్ లోయలోని దారుణ పరిస్థితులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నెలకొనడం తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. మహిళల ఆక్రందనలు పట్టని చంద్రబాబు ప్రభుత్వంరాష్ట్రంలో బాలికలు, మహిళల భద్రత రోజు రోజుకూ దిగజారుతున్నా చంద్రబాబు ప్రభుత్వం చోద్యం చూస్తోంది. బాలికలు, మహిళల భద్రత గురించి నామమాత్రంగా కూడా చర్యలు తీసుకోవడం లేదు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో దిశ వ్యవస్థ ద్వారా మహిళల భద్రత కోసం పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఆపదలో ఉన్నామని బాలికలు, మహిళలు ఆ యాప్ ద్వారా సమాచారం ఇస్తే చాలు కేవలం 5–10 నిమిషాల్లోనే పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని భద్రత కల్పించేవారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసింది.రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేయడం.. అక్రమ కేసులు నమోదు చేసి వేధించడమే పోలీసుల ఏకైక విధి అని స్పష్టం చేసింది. దాంతో రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. పోలీసులు శాంత్రి–భద్రతల పరిరక్షణ, మహిళా భద్రత వంటి కీలకమైన తమ విధులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. టీడీపీ నేతలకు ఏకపక్షంగా మద్యం దుకాణాల లైసెన్సులు దక్కేలా, ఇతర కాంట్రాక్టులు లభించేలా ప్రత్యర్థులు, పోటీదారులను బెదిరించడమే తమ విధి అని భావిస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధులు చెప్పిన వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తూ వేధించడమే ఏకైక పనిగా పెట్టుకున్నారు.దాంతో రాష్ట్రంలో బాలికలు, మహిళా భద్రత గాలిలో దీపంలా కొట్టుమిట్టాడుతోంది. శ్రీవారి దివ్యక్షేత్రం తిరుపతి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురం, మంత్రి లోకేశ్ నియోజకవర్గం మంగళగిరి, హోమ్ మంత్రి అనిత నియోజకవర్గం పాయకారావుపేట.. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా మహిళలు, బాలికలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యమైపోయాయి. విద్యార్థినులు బడికి వెళ్లి ఇళ్లకు తిరిగి వచ్చే వరకు తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. టీడీపీ పెద్దల తీరే అంత.. అందుకే ఈ దుస్థితిటీడీపీ కూటమి పెద్దలు, కీలక నేతలే మహిళల గౌరవానికి భంగం కలిగిస్తూ బహిరంగంగా వ్యాఖ్యానిస్తుండటం ప్రభుత్వ మైండ్ సెట్కు నిదర్శనం. ‘ఆడది కనిపిస్తే ముద్దయినా పెట్టాలి.. కడుపైనా చేయాలి’ అని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. ‘కారు షెడ్డులో ఉండాలి.. ఆడవాళ్లు ఇంట్లో ఉండాలి’ అని దివంగత కోడెల శివ ప్రసాదరావు తదితరుల వ్యాఖ్యలే రాష్ట్రంలో బాలికలు, మహిళల భద్రత పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనడానికి తార్కాణం. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఒక మహిళా ఎమ్మార్వోను జుట్టు పట్టుకొని ఈడ్చి.. దాడి చేసినా చంద్రబాబు పట్టించుకోక పోగా, సదరు బాధితురాలినే తప్పు పట్టడం తెలిసిందే. ఇక నారా లోకేశ్ విదేశాల్లో మహిళలతో అసభ్యకరంగా వ్యవహరించిన వీడియోలు, ఫొటోలు గతంలోనే వెలుగులోకి వచ్చాయి. అప్పట్లోనే సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే.14 మంది రేప్ చేస్తే కేసు కట్టరా?చీమ కుట్టినట్టుగా కూడా లేదా?హోం మంత్రి ఎక్కడ?ఉమ్మడి అనంతపురం జిల్లాలో మాజీ మంత్రి పరిటాల సునీత సొంత ప్రాంతం రామగిరి మండలం పేరూరు పంచాయతి పరిధిలోని ఏడుగుర్రాలపల్లిలో తొమ్మిదో తరగతి చదువుతున్న దళిత బాలికపై 14 మంది యువకులు కొన్ని నెలలపాటు సామూహిక అత్యాచారం చేసిన ఘటన యావత్ రాష్ట్రాన్ని తీవ్రంగా కలచి వేస్తోంది. ఆ బాలిక గర్భం దాల్చడంతో ఆ దారుణం బయటకు పొక్కింది. అదే గ్రామానికి చెందిన బడగొర్ల అభిషేక్, బూడిద రాజేష్, బాసి గిరి, బాసి కార్తీక్, బాసి రాజేంద్ర, బాసి సోనప్ప, బాసి అంజి, తలారి మురళి, రొద్దకంపల్లి మహేశ్, హెచ్.సురేశ్, హెచ్.హేమంత్ పేర్లు బయటపడ్డాయి. మరో ముగ్గురి పేర్లు తెలియరాలేదు. అందరూ టీడీపీ కార్యకర్తలే కావడంతో నిందితులకు అధికార పార్టీ నేతలు అండగా నిలుస్తుండటం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.బాధిత బాలిక తండ్రి గతేడాది టీడీపీ గెలిచిన సంబరాల్లో తప్పెట వాయించుకుంటూ బొలెరో నుంచి జారి కింద పడి చనిపోయారు. బాలిక తల్లికి మతి స్థిమితం లేదు. అలాంటి ఆ బాలికపై వీడియోలు చూపి బ్లాక్ మెయిల్ చేస్తూ 14 మంది అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బెదిరించడంతో బాలిక ఎవరికీ చెప్పుకోలేని దుస్థితి. అనారోగ్యం కారణంగా ఆస్పత్రికి వెళ్లగా.. ఆరు నెలల గర్భంతో ఉన్నట్లు నిర్ధారించారు.దీంతో బాలికను బంధువులు నిలదీయగా.. అసలు విషయం వెలుగు చూసింది. బాధిత బాలికను స్వయంగా ఎస్పీనే విచారించారు. అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స, పరీక్షలు చేయిస్తున్నారు. ఇంత దారుణమైన ఘటనపై ఇప్పటి వరకు ఎందుకు కేసు నమోదు చేయలేదు? ఎవరు అడ్డు పడుతున్నారు? ఎంకా ఎన్నాళ్లు నాన్చుతారు? వింటుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తున్న ఈ ఘటనలో ఇటు పోలీసులు, అటు పాలకులకు చీమ కుట్టినట్లుగా కూడా లేకపోవడం దుర్మార్గం. స్థానిక మహిళా శాసన సభ్యురాలు సునీత, మహిళా హోం మంత్రి అనిత ఇప్పటి దాకా ఎందుకు నోరు విప్ప లేదు? కళ్లెదుటే ఎన్నో ఘటనలు..⇒ అనంతపురానికి చెందిన ఓ యువతిని కొందరు యువకులు కిడ్నాప్ చేశారు. మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరుకు తీసుకువెళ్లి హత్య చేయడం రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు తాజా ఉదాహరణ. ⇒ 2024 జూలై 7వ తేదీన నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో ఓ బాలికను అత్యాచారం చేసి హత్య చేశారు. 11 నెలలు గడిచినప్పటికీ ఇప్పటికీ బాలిక మృతదేహాన్ని కూడా గుర్తించలేకపోయారు. నిందితులను శిక్షించనే లేదు. ⇒ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోనే మహిళలకు భద్రత లేకుండాపోయింది. పిఠాపురం టీడీపీ పట్టణ అధ్యక్షురాలు, మాజీ కౌన్సిలర్ దుర్గాడ విజయలక్ష్మి భర్త, దుర్గాడ జాన్ ఓ బాలికకు మాయమాటలు చెప్పి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ⇒ బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం హిందూపురం మండలం తూమకుంట పరిధిలో 2024 ఆగస్టు 2వ తేదీన ఎనిమిదేళ్ల చిన్నారిని గంగాధర్ (45) అనే వ్యక్తి దారుణంగా చంపి ఇసుకలో పాతిపెట్టాడు. అంతకు ముందు అత్యాచారం చేసి, ఆ తర్వాత హత్య చేసినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు.⇒ వైఎస్సార్ జిల్లా గోపవరం మండలంలో ఇంటర్ విద్యార్థినిపై ప్రేమోన్మాది పెట్రోలు పోసి నిప్పంటించి హత్య చేశాడు. బద్వేలు పట్టణంలోని రామాంజనేయనగర్కు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థినిని విఘ్నేష్ అనే వివాహితుడు ప్రేమ పేరుతో వేధించాడు. బాలికను గోపవరం మండలంలోని సెంచురీ పానెల్స్ పరిశ్రమ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం చేసి.. అనంతరం వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఆమెపై పోసి నిప్పు అంటించాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు, మేకల కాపరులు గమనించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలిక మృతిచెందింది.⇒ తిరుపతి జిల్లా కేవీబీ పురం ఓళ్లూరు గిరిజన కాలనీకి చెందిన భార్య, భర్త, తన ఇద్దరు పిల్లలతో కలిసి పది రోజుల క్రితం వడమాలపేట మండలం ఏఎం పురం ఎస్టీ కాలనీకి చేరుకున్నారు. చిన్నారి మేనమామకు ప్రమాదవశాత్తు కాలు విరిగింది. చిన్నారి తండ్రి, కుటుంబీకులు కలిసి సమీపంలోని పుత్తూరు రాచపాలెంలో శల్య వైద్యశాలకు తీసుకెళ్లారు. ఆ సమయంలో చిన్నారి తల్లితో ఉంది. ఏఎం పురానికి చెందిన సుశాంత్ చిన్నారికి చాక్లెట్ తీసిస్తానని అంగడికి తీసుకెళ్లాడు. చిన్నారిని తిరిగి నివాసానికి తీసుకెళ్లకుండా.. పక్కనే ఉన్న సచివాలయం, పాఠశాల మధ్యలోకి తీసుకెళ్లి కిరాతకంగా లైంగిక దాడి చేశాడు. విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు కిరాతకుడైన సుశాంత్.. చిన్నారిని పక్కనే ఉన్న మురికి కాలువలో తొక్కి చంపేశాడు.⇒ దర్శి సమీపంలోని గ్రామంలోని ఓ బాలికను టీడీపీ నేత కుమారుడు ఏనుగంటి చరణ్ సాయి తన స్నేహితుల రూమ్కు తీసుకుని వెళ్లి కూల్ డ్రింక్లో మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడు. ⇒ అభంశుభం తెలియని చిన్నారులకు తెలుగుదేశం పార్టీకి చెందిన యువకులు మద్యం తాగించి, వారిని లైంగికంగా వేధించిన అమానవీయ ఉదంతం నంద్యాల జిల్లా డోన్ మండలం మల్యాల గ్రామంలో చోటుచేసుకుంది. టీడీపీ కార్యకర్తలైన యువకులు బాలికలపై అత్యాచారానికి పాల్పడి వీడియోలు కూడా చిత్రీకరించారు. టీడీపీ నేత ఈడిగె వీరాంజనేయులు గౌడ్ కుమారుడు ఈడిగె రాంబాబుగౌడ్ తన ఇద్దరు స్నేహితులతో కలసి బాలికలను బెదిరించి మద్యం తాగించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. -
కాలుష్య బడ‘బాన’లం
సాక్షి, అమరావతి: నగరాలు, పట్టణాలు కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాయని పర్యావరణం దెబ్బతింటుందని ప్రపంచ దేశాలు గగ్గోలు పెడుతున్నాయి. 2030 నాటికి కర్బన ఉద్గారాలను 45 శాతం తగ్గించాలని, 2070 నాటికి సున్నా స్థాయికి తీసుకురావాలని ప్రణాళికలు రచిస్తున్నాయి. ప్యారిస్లో అన్ని దేశాలూ కలిసి సమావేశమై ఈ విషయంపై తీవ్రంగా చర్చించి ఒప్పందం కూడా చేసుకున్నాయి. అయినా మార్పు సాధించింది మాత్రం నామ మాత్రమే. ప్రధానంగా పరిశ్రమలు, వాటిలోని బాయిలర్లు (కాగు బాన) విపరీతంగా కాలుష్యాన్ని విడుదల చేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడింగ్(డీపీఐటీ) తాజా అధ్యయనం తేల్చింది. రసాయనాలు, దుస్తులు తయారీ, ఆహార పదార్థాల ప్రాసెసింగ్ వంటి పరిశ్రమల్లోని బాయిలర్లు మరింత ఎక్కువగా కాలుష్యం ఉత్పత్తి చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. పాతికేళ్ల నాటి బాయిలర్లే అధికం దేశ వ్యాప్తంగా 42,500 బాయిలర్లు ఉన్నట్లు ఓ అంచనా. ఇవన్నీ కలిసి 1.26 బిలియన్ టన్నుల ఆవిరిని విడుదల చేస్తున్నాయి. పైగా ఇప్పుడున్నవన్నీ 20 ఏళ్ల నుంచి 25 ఏళ్ల పాత బాయిలర్లు కావడంతో సల్ఫర్ డయాక్సైడ్ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా విడుదలయ్యే గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల్లో 7 శాతం బాయిలర్ల నుంచే వస్తుందని అంచనా. అంటే ఏటా 182 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ను బాయిలర్లు విడుదల చేస్తున్నాయన్నమాట. ఇది రవాణా రంగంలోని అన్ని వాహనాల నుంచి వచ్చే కాలుష్యం కంటే ఎక్కువ. ఇతర పరిశ్రమల నుంచి విడుదలయ్యే కాలుష్యంలో నాలుగో వంతు కంటే అధికం. 40 శాతం బాయిలర్లు బొగ్గు, గ్యాస్, ఆయిల్ వంటి శిలాజ ఇంధనాలపై ఆధారపడి నడుస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. ఏపీలో నియంత్రణ చర్యలు శూన్యంప్రమాదకర బాయిలర్లను వాడుతున్న మొదటి ఐదు రాష్ట్రాల్లో గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్తోపాటు ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. బాయిలర్లు అధిక స్థాయిలో కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లను ఉత్పత్తి చేయకుండా అడ్డుకోవడానికి ఆధునిక సాంకేతికత పరిజ్ఞానం ఉపయోగపడుతుంది. కానీ అది ఖర్చుతో కూడుకున్న పని కావడంతో దాని గురించి ఎవరూ పెద్దగా ఆలోచించడం లేదని అధ్యయనం తెలిపింది. ఈ పరిశ్రమల్లో ‘గ్రీన్ బాయిలర్ మిషన్’ను అమలు చేయాలని సూచించింది. ఆ దిశగా ఉత్తరప్రదేశ్ ముందడుగు వేసింది. తాజాగా బాయిలర్స్ యాక్ట్ 2025ను ఆ రాష్ట్రం అమలులోకి తీసుకువచ్చింది. అలాగే శిలాజ ఇంధనాలకు బదులు వరి గడ్డిని బాయిలర్లు మండించడానికి వాడే పరిశ్రమలకు మూలధన రాయితీలను పంజాబ్ రాష్ట్రం ప్రకటించింది. టాప్ 5లో ఉన్న మన రాష్ట్రం మాత్రం ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. -
యాంత్రీకరణ విఫలం
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం గొప్పగా ప్రారంభించిన వ్యవసాయ యాంత్రీకరణ పథకం ఘోరంగా విఫలమైంది. అవసరం లేని పరికరాలను బలవంతంగా అంటగట్టాలని చూడటంతో ఈ పథకం కింద పరికరాలు తీసుకునేందుకు రైతులు ఏమాత్రం ఆసక్తి చూపలేదు. పైగా ఆ పరికరాలకు ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే బహిరంగ మార్కెట్లో ధరలు తక్కువగా ఉండడం, జీఎస్టీతో పాటు రవాణా భారంగా మారడం, రాయితీ తక్కువగా ఉండటం వంటి కారణాలతో రైతులు ముందుకు రాలేదు. దీంతో అర్ధాంతరంగా వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని నిలిపి వేయాల్సిన దుస్థితి ఏర్పడింది.అంతన్నారు.. ఇంతన్నారుకూటమి అధికారంలోకి రాగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా ఏర్పాటైన యంత్ర సేవా కేంద్రాలను నిర్వీర్యం చేశారు. వ్యక్తిగత యాంత్రీకరణ పథకం అమలు చేయబోతున్నామని గొప్పగా ప్రకటించారు. కేంద్ర పథకమైన స్మామ్ (సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్) ద్వారా 2024–25 ఆర్థిక సంవత్సరానికి 50 శాతం సబ్సిడీపై 42,864 పరికరాలు ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం రూ.75.80 కోట్లు కేటాయించింది.మార్కెట్ ధరలకు మించి ఉండటంతో..వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతు కమిటీలు తాము కోరుకున్న పరికరాన్ని కోరుకున్న కంపెనీ వద్ద కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉండేది. పైగా బేరమాడుకుని తక్కువ ధరకు కొనుగోలు చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేకుండా ప్రభుత్వమే ధరలు నిర్దేశించింది. ఈ ధరలకు అదనంగా ప్రతి పరికరంపై 12% నుంచి 18% జీఎస్టీతో పాటు.. 2% ఆగ్రోస్ సేవా చార్జీలు చెల్లించాలని నిర్దేశించారు. అంటే దాదాపు పరికరంపై ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే 14% నుంచి 20% వరకు అదనపు భారం పడుతోంది. అంటే ఓ పరికరం ధర రూ.25 వేలు అయితే.. కనీస జీఎస్టీ, ఆగ్రోస్ రుసుం కలిపి 14% చొప్పున లెక్కేసినా రూ.3,500, అదే రూ.లక్ష విలువైన పరికరమైతే రూ.1.14 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అదే రైతు నేరుగా కొనుక్కుంటే డీలర్ల వద్ద బేరమాడుకుంటే తక్కువ ధరకే లభిస్తుంది. తైవాన్ స్ప్రేయర్ బహిరంగ మార్కెట్లో రూ.18 వేల నుంచి రూ.20 వేలకు లభిస్తుండగా, యాంత్రీకరణ పథకంలో రూ.26 వేలుగా నిర్ణయించి, అందులో రూ.10 వేల రాయితీ ప్రకటించారు. దీనిపై జీఎస్టీ, వ్యవసాయ ఆగ్రోస్ సేవా చార్జీలు అదనం. ట్రాక్టర్ ఆధారిత యంత్ర పరికరాలు కూడా రైతులు సొంతంగా కొనుక్కుంటేనే తక్కువకు వస్తున్నాయి. పైగా ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు కూడా రైతులకు ప్రతిబంధకంగా మారాయి.కవీుషన్లకు కక్కుర్తిపడి రైతులకు అవసరం లేని, డిమాండ్ లేని, పనికి రాని పరికరాలను అంటగట్టాలని చూడటంతో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సాధారణంగా వ్యక్తిగత పరికరాలు సబ్సిడీపై ఇస్తామంటే రైతులెవరైనా ఎగబడతారు. అలాంటిది రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రభుత్వం అమలు చేసిన ఈ యాంత్రీకరణ పథకం ఏడాదిలోనే అట్టర్ఫ్లాప్ అయ్యింది. ఇందుకోసం కేటాయించిన మొత్తంలో చాలావరకు కమీషన్ల రూపంలో పక్కదారి పట్టినట్టు విమర్శలు వచ్చాయి. దీంతో పథకాన్ని 2024–25 ఏడాదికి అర్థంతరంగా నిలిపివేశారు. -
నీటిలో మునిగి ఆరుగురి మృతి
డుంబ్రిగుడ/అమరావతి/ఏయూ క్యాంపస్(విశాఖ జిల్లా): అల్లూరి సీతారామరాజు, పల్నాడు, విశాఖ జిల్లాల్లో ఆదివారం జరిగిన వేర్వేరు ఘటనల్లో నీటిలో మునిగి ఆరుగురు మృతి చెందారు. అల్లూరి జిల్లా పోతంగి పంచాయతీ బిల్లాపుట్టు గ్రామానికి చెందిన అన్నదమ్ములు గుంట కమందన్, గుంట రామదాస్ కుమారులు గుంట సాయికిరణ్ (14), గుంట భానుతేజ్ (14)లు 9వ తరగతి చదువుతున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో వీరు డుంబ్రిగుడ మండలం గంగవలస గ్రామంలో ఉన్న తమ మేనత్త ఇంటికి వెళ్లారు. ఆదివారం మామిడి పండ్లు సేకరించేందుకు కొండ వద్దకు వెళ్లి వస్తున్న తరుణంలో..అదే గ్రామానికి చెందిన వీరి స్నేహితుడు కొర్ర సుశాంత్(14)తో కలిసి చెరువులో స్నానాలకు దిగారు. ఇటీవల మన్యంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో చెరువులో 12 అడుగుల మేరకు నీరు చేరింది. ఇది గమనించని విద్యార్థులు ఈతకు దిగి..మునిగిపోయారు. వారిని రక్షించేందుకు సమీపంలోని పొలాల వద్ద ఉన్న వారు వచి్చనా ఫలితం లేకపోయింది. దీంతో ముగ్గురూ మృతి చెందారు. అలాగే, గుంటూరు జిల్లా పెదకాకాని మండలం అగతవరప్పాడు ఏవీఎస్ కాలనీ నుంచి రెండు కుటుంబాలకు చెందిన 10 మంది బక్రీద్ అనంతరం నదిలో స్నానాలు చేసేందుకు ఆదివారం పల్నాడు జిల్లాలోని అమరావతికి వచ్చారు. అమరేశ్వరఘాట్ సమీపంలో కృష్ణానదిలోని ఇసుకలో బాల్తో ఆడుకుంటుండగా.. బాల్ పక్కనే ఉన్న నదిలో పడింది. బాల్ కోసం సయ్యద్ ఖాదర్ వలి (13), సయ్యద్ కాజా(21)లు నీటిలో దిగి...మునిగిపోయారు. స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పగా..సీఐ అచ్చియ్య ఘటనా స్థలాన్ని సందర్శించి గజ ఈతగాళ్లను రప్పించారు. వారు గాలింపు చర్యలు చేపట్టి ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. బాలుడిని బలిగొన్న అలలు విశాఖ సాగర తీరంలో విక్టరీ ఎట్ సీ ఎదురుగా బీచ్లో స్నానానికి దిగి ఎం.శ్రీపాద సూర్య(7) కెరటాలకు బలయ్యాడు. ఆదివారం ఉదయం అగనంపూడికి చెందిన ఓ కుటుంబం బీచ్కు వచ్చింది. వీరిలో స్టీల్ప్లాంట్లో పనిచేస్తున్న సతీష్ది శనివారం పెళ్లి రోజు. వేడుకల అనంతరం ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి బీచ్కు వచ్చారు. సముద్రంలో స్నానం చేస్తుండగా బలమైన కెరటాలు బాలుడిని లోపలికి లాక్కెళ్లాయి. సమీపంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు పరదేశి వెంటనే ఘటనాస్థలికి చేరుకుని బాలుడిని రక్షించే ప్రయత్నం చేశారు. బాలుడిని వెంటనే ఒడ్డుకు తీసుకువచ్చి 108 వాహనంలో కేజీహెచ్కు తరలించారు. బాలుడు నీరు ఎక్కువగా తాగడంతో మరణించినట్లు కేజీహెచ్ వైద్యులు వెల్లడించారు. బాలుడి తల్లిదండ్రులను వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు గొల్లబాబురావు పరామర్శించారు. -
కర్షకుల ‘సేవకు’ కత్తెర
సాక్షి, అమరావతి: కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది మొదలు, వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రజారంజక విధానాలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రజారంజక పాలనపై ఆయన ముద్రను చెరిపేయడమే ఈ నిర్ణయాల వెనుక ఉన్న ఉద్దేశంగా కనిపిస్తోంది. ఈ జాబితాలో ఇప్పటికే సచివాలయాలు చేరగా, తాజాగా రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్కే) వంతయ్యింది. క్రమబద్దీకరణ పేరిట కూటమి ప్రభుత్వం వీటిని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. హేతుబద్దీకరణ పేరుతో రెండు లేదా మూడు సచివాలయాలను కలిపి ఒక క్లస్టర్గా విలీనం చేశారు. తాజాగా వ్యవసాయ, సంబంధిత శాఖల హేతుబద్ధీకరణ సాకుతో రైతు సేవా కేంద్రాలను (ఆర్ఎస్కే), వీటిలో పనిచేస్తున్న సిబ్బందిని సగానికి పైగా కుదించేస్తున్నారు. దీంతో ఆర్ఎస్కేలు రైతు సేవలకు దూరం అయ్యే పరిస్థితి నెలకొంది. ‘ప్రజల ఇంటికే పాలనను తీసుకొస్తాం’ అని ఒక వైపు చెబుతున్న ప్రభుత్వం మరో వైపు ‘హేతుబద్దీకరణ’ పేరుతో ప్రజలకు, రైతులకు పలు సేవలను దూరం చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పేరు మార్పు నుంచి నిర్వీర్యం వరకూ.. ప్రజల ముంగిట పౌరసేవలు అందించాలన్న సంకల్పంతో జగన్ హయాంలోని ప్రభుత్వం ప్రతి రెండు వేల జనాభాకు ఒక సచివాలయం చొప్పున 10,965 సచివాలయాలను ఏర్పాటు చేసింది. వీటికి అనుబంధంగా రైతు సేవలకు 10,778 రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు– ఇప్పటి ఆర్ఎస్కేలు) ఏర్పాటయ్యాయి. గ్రామ స్థాయిలో రైతులకు సేవలు, సంక్షేమ ఫలాలు అందించాలన్నది దీని ప్రధాన లక్ష్యం. ఆర్బీకేల సేవల విషయంలో ఉద్యోగ నియామకాల ప్రతిపాదన సంఖ్య 21,796కాగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం దశలవారీగా పట్టభద్రులైన 15,667 వ్యవసాయ (6,162), ఉద్యాన (2,303), పట్టు (377), మత్స్య (720), వెటర్నరీ (6,105) సహాయకులను నియమించింది. మిగిలిన వారిని నియమించేందుకూ అప్పట్లో కసరత్తు ప్రారంభించింది. సచివాలయాల పరిధిలోనే వీరి నియామకాలు జరిగినప్పటికీ, ఆర్బీకేలు కేంద్రంగా సేవలందించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు పేరు మార్పుసహా రైతు సేవా కేంద్రాల నిర్వీర్యమే లక్ష్యంగా పని చేస్తోంది. సచివాలయాల తరహాలోనే ఆర్ఎస్కే క్లస్టర్స్ కూటమి ప్రభుత్వ నిర్ణయంతో 10,965 సచివాలయాలు 5,678 క్లస్టర్స్గా (విలీనం) మారాయి. ఇదే తరహాలోనే 10,778 ఆర్ఎస్కేలను సగానికి సగం కుదించి క్లస్టర్స్గా మార్చడానికి కూటమి ప్రభుత్వం తాజాగా సన్నాహాలు చేస్తోంది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన చేపడుతున్న ఈ ప్రక్రియలో సిబ్బందిని కూడా అదే పరిధిలో సర్దుబాటు చేస్తున్నారు. గతంలో స్థానికంగా సాగు విస్తీర్ణాన్ని బట్టి వీఏఏ (గ్రామ వ్యవసాయ సహాయకులు), వీహెచ్ఏ (గ్రామ ఉద్యాన సహాయకులు) వీఎస్ఏలు (గ్రామ పట్టు సహాయకులు) ఉండేవారు. కొన్ని చోట్ల వ్యవసాయ, ఉద్యాన సహాయకులు, మరికొన్ని చోట్ల గ్రామ పట్టు సçహాయకులు ఉండేవారు. తీర మండలాల్లోని ఆర్బీకేల్లో మత్స్య సహాయకులే ఇన్చార్జిలుగా ఉండేవారు. స్థానికంగా ఉండే పాడి సంపద ఆధారంగా దాదాపు మెజార్టీ ఆర్బీకేల్లో గ్రామ పశుసంవర్ధక సహాయకులు ఉండేవారు. ప్రభుత్వ తాజా ప్రతిపాదనల ప్రకారం, ఇక నుంచి సచివాలయ క్లస్టర్ ప్రాతిపదికన ఆర్ఎస్కే క్లస్టర్లో ఒకరు మాత్రమే ఉంటారు. వీఏఏ, వీహెచ్ఏ, వీఎస్ఏలలో ఎవరో ఒకరిని మాత్రమే ఉంచేలా సర్దుబాటు చేస్తున్నారు. మిగిలిన వారిని సచివాలయాల్లో ఇతర సేవలకు సర్దుబాటు చేస్తారు. రెండు వేల ఎకరాలకు ఒకరు.. కాగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రతి 2 వేల ఎకరాల విస్తీర్ణం ప్రాతిపదికన ఆర్ఎస్కేలను క్లస్టర్స్ పరిధిలోకి తీసుకొస్తోంది. స్థానికంగా వ్యవసాయ/ ఉద్యాన/పట్టు పంటల సాగు విస్తీర్ణం ఏవి ఎక్కువగా ఉంటే వాటి ఆధారంగా సహాయకులను నియమిస్తారు. అంటే ప్రతీ 2 వేల ఎకరాలకు ఒక ఆర్ఎస్కే ప్రతినిధి మాత్రమే ఉంటారన్నమాట. తక్కువ విస్తీర్ణం ఉన్న ఆర్ఎస్కేలను విలీనం చేస్తారు. విలీనం అనంతరం క్లస్టర్ కేంద్రంగానే కార్యకలాపాలు కొనసాగించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. మిగిలినవి ‘పేరుకు మాత్రం కేంద్రాలు’గా మిగలనున్నాయి. విస్తీర్ణం ఎక్కువగా ఉన్న క్లస్టర్స్కు అవసరం మేరకు ఏఈవో, ఎంపీఈవోలను అదనంగా కేటాయిస్తారు. వ్యవసాయ, ఉద్యాన, పట్టు విస్తరణ అధికారులుగా పదోన్నతులు కల్పించిన ఆర్ఎస్కే అసిస్టెంట్స్ను కూడా ఈ సర్దుబాటు పరిధిలోకి తీసుకురావడం గమనార్హం. రేషనలైజేషన్ ప్రక్రియ ఓ కొలిక్కి తీసుకువచ్చి ఆ మేరకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. దీనికి సంబం«ధించి త్వరలో ఉత్తర్వులు రానున్నాయి. -
తిరగబడ్డ టీచర్లు
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ అభాసుపాలైన చంద్రబాబు కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు తమ బదిలీలను సైతం ప్రహసనంగా మార్చేసిందని ఉపాధ్యాయులు నిప్పులు చెరుగుతున్నారు. సంఖ్యాపరంగా అధికంగా ఉన్న ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపడతామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఆన్లైన్లోనే ఈ ప్రక్రియ కొనసాగుతుందని ప్రకటించడంపై వారు తిరుగుబాటు ప్రకటించారు. ఒక్కో ఎస్జీటీ 2,500కు పైగా ఆన్లైన్ ఆప్షన్లు ఇవ్వడం అసాధ్యమని, అదీ కేవలం 48 గంటల్లో పూర్తి చేయాలనడంపై మండిపడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మాన్యువల్ కౌన్సెలింగ్ ఉంటుందని భావించిన వారికి శనివారం ఆన్లైన్ విధానం మాత్రమే ఉంటుందని ప్రకటించడంతో కంగుతిన్నారు. దీంతో శనివారం బదిలీ కౌన్సెలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో నిరసన తెలిపిన ఎస్జీటీలు.. ఆదివారం బదిలీ కౌన్సెలింగ్ను బహిష్కరించి పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లాల్లోని కలెక్టరేట్లు, డీఈవో కార్యాలయాలను ముట్టడించారు. ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖలో 1.79 లక్షల మంది ఉపాధ్యాయులు పని చేస్తుండగా, ఎస్జీటీలు 1.20 లక్షల వరకు ఉన్నారు. ప్రస్తుత బదిలీల్లో సుమారు 65 వేల మందికి స్థాన చలనం కల్పించాలి. వీరిలో 35 వేల మంది వరకు ఎనిమిదేళ్లు పూర్తయ్యి, తప్పనిసరి బదిలీల్లో ఉన్నారు. విద్యా శాఖ గత నెలలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10వ తేదీతో ఎస్జీటీల కౌన్సెలింగ్ ప్రక్రియ ముగియాలి. కానీ ఆందోళన నేపథ్యంలో ఆ ప్రక్రియకు బ్రేక్ పడినట్టయింది. మాన్యువల్కు హామీ.. ఆన్లైన్కు ఉత్తర్వులు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గతేడాది సెప్టెంబర్ నుంచి ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో విద్యా రంగంలో చేయాల్సిన మార్పులపై సమావేశాలు నిర్వహిస్తోంది. ప్రతి శుక్రవారం విద్యాభవన్లో జరిగే ఈ సమావేశాల్లో ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్, 3–5 తరగతులు తిరిగి ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. గత 9 నెలల్లో 40కి పైగా సమావేశాలు నిర్వహించి, ప్రతి సమావేశంలోనూ సంఘాల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. అయితే, ప్రభుత్వం మార్చి నెలలో ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ ముసాయిదా చట్టం–2025’ తీసుకొచ్చింది. ఇందులో పలు అంశాలపై అభ్యంతరాలను లేవనెత్తి ఆందోళన వ్యక్తం చేయడంతో తుది చట్టంలో మార్పులు చేస్తామని నాడు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే, ఏప్రిల్లో చేసిన ‘ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ చట్టం–2025’లో ఆన్లైన్ కౌన్సెలింగ్ అని పేర్కొన్నారు. గత నెలలో జరిగిన సమావేశంలో మాన్యువల్ కౌన్సెలింగ్పై పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు చర్చలను బహిష్కరించి నిరసన తెలిపారు. అయితే, మరుసటి రోజే విద్యా శాఖ కార్యదర్శి నేతృత్వంలో సమావేశం ఏర్పాటు చేసి, ఎస్జీటీల డిమాండ్ మేరకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఉపాధ్యాయుల బదిలీ ఉత్తర్వు (జీవో నం.22)లో మళ్లీ ఆన్లైన్ విధానమే ఉంటుందని పేర్కొన్నారు. ఇలా ఉపాధ్యాయులను మభ్యపెడుతూ వచ్చిన ప్రభుత్వం, కౌన్సెలింగ్ ప్రక్రియ దగ్గర పడేసరికి ఉపాధ్యాయులు ఆన్లైన్లోనే ఆప్షన్లు పెట్టాలని, 48 గంటల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాలని ఒత్తిడి చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిలువునా మోసం చేశారు» సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ) బదిలీలను మాన్యువల్ కౌన్సెలింగ్ విధానంలోనే చేపడతామని ఉపాధ్యాయ సంఘాల సమక్షంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేసింది. నమ్మించి మోసం చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని ఆదివారం ఉపాధ్యాయులు ముట్టడించారు. వెబ్ కౌన్సెలింగ్ వద్దు, మాన్యువల్ కౌన్సెలింగ్ ముద్దు.. అంటూ ఉపాధ్యాయులు చేసిన నినాదాలతో డీఈఓ కార్యాలయాల ప్రాంగణాలు మార్మోగాయి. ఈ సందర్భంగా డీఈవోలను ఘెరావ్ చేశారు. » ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లకు వెబ్ కౌన్సెలింగ్ను తప్పుల తడకగా నిర్వహించారని, ఎక్కువ పాయింట్లు వచ్చిన వారికి కాకుండా తక్కువ పాయింట్లు వచ్చిన వారికి క్లస్టర్ వేకెన్సీల్లో అవకాశం ఇచ్చారని ఈ సందర్భంగా పలువురు ఆరోపించారు. ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఉపాధ్యాయులు జనరల్ ఆప్షన్లు పెట్టినా ప్లేసులు కేటాయించక పోవడం అన్యాయమన్నారు. » రాష్ట్ర ప్రభుత్వ తీరు చెప్పేదొకటి.. చేసేది మరొకటి అన్నట్లుగా ఉందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు మండిపడ్డారు. ఉపాధ్యాయుల హక్కులు, ఆత్మ గౌరవంతో ఆటలాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్కు ఈ–మెయిల్, వాట్సాప్ ద్వారా మెసేజ్లు పంపాలన్నారు. విద్యా శాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని, ప్రభుత్వ వైఖరి నశించాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. మాన్యువల్గా కౌన్సిలింగ్ నిర్వహించకపోతే ఎంత దూరమైనా పోవడానికి సిద్ధమని స్పష్టం చేశారు. చిత్తూరులో మండుటెండలో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. » నిరసన కార్యక్రమంలో ఎస్టీయూ, పీఆర్టీయూ, యూటీఎఫ్, ఏపీటీఎఫ్, ఏపీయూఎస్, వైఎస్సార్ టీఏ, ఎస్టీఎఫ్, పీఈటీ అసోసియేషన్, ఎస్ఆర్టీఎఫ్, ఎన్టీఏ, ఎస్సీ, ఎస్టీ యూనియన్ తదితర సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఉపాధ్యాయుల కడుపు కొడుతున్న చంద్రబాబుఎన్నికల సమయంలో ఉపాధ్యాయులు తనకు మద్దతుగా నిలవడంతో తన కడుపు నిండిపోయిందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఇప్పుడు ఉపాధ్యాయుల కడుపుకొడుతున్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా, ఉపాధ్యాయులు, ఉద్యోగుల గురించి ఆలోచించిన పాపాన పోలేదు. వరల్డ్ బ్యాంక్ నిబంధనలకు అనుగుణంగానే సాల్ట్ ఒప్పందంలో భాగంగా ప్రభుత్వ విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రభుత్వం తన తీరు మార్చుకోకపోతే ఉపాధ్యాయుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. – బొర్రా గోపిమూర్తి, ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీఉద్యమం మరింత ఉధృతంఉపాధ్యాయుల బదిలీల్లో ఎస్జీటీలు, సమాన కేడర్ టీచర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మాన్యువల్ కౌన్సెలింగ్ చేపట్టాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఉద్యామాన్ని మరింత ఉధృతం చేయనున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఉమ్మడి జిల్లాల్లోని డీఈవో కార్యాలయాలను ముట్టడించారు. సోమవారం ఆయా డీఈవో కార్యాలయాల వద్ద నిరహార దీక్ష చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. ప్రభుత్వం అప్పటికీ దిగిరాకపోతే మంగళవారం విద్యా భవన్ (డైరెక్టరేట్)ను ముట్టడికి తరలి రావాలంది. -
‘పోలవరం’లో కమీషన్ల కథ
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టు. కమీషన్ల కక్కుర్తితో జీవనాడి జీవం తీసేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తుండటంపై ఇంజినీరింగ్ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదించిన డిజైన్ను తుంగలో తొక్కి.. 1.5 మీటర్ల మందంతో కాకుండా 0.9 మీటర్ల మందంతో ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో పునాది డయాఫ్రం వాల్ నిర్మిస్తుండటంపై ఇంజినీరింగ్ నిపుణులు మండిపడుతున్నారు. గతంలో 2016–18 మధ్య ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో డయాఫ్రం వాల్ నిర్మాణంలో అవకతవకలకు పాల్పడటం వల్లే అది కోతకు గురై దెబ్బతిన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కమీషన్ల కోసం పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని 2019లో ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని ఇంజినీరింగ్ నిపుణులు గుర్తు చేస్తున్నారు. గతంలో డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని కట్టబెట్టిన కాంట్రాక్టు సంస్థ బావర్కే కొత్త డయాఫ్రం వాల్ పనులను అప్పగించడాన్ని తప్పు పడుతున్నారు. టెండర్లు పిలవకుండా కట్టబెట్టేశారురూ.990 కోట్ల వ్యయంతో చేపట్టిన కొత్త డయాఫ్రం వాల్ పనులకు టెండర్లు పిలవాలి. కానీ.. ఆ పనులను ప్రధాన కాంట్రాక్టు సంస్థ మేఘాకు అప్పగించి.. ఆ తరువాత ఆ సంస్థపై ముఖ్యనేత ఒత్తిడి తెచ్చి అనధికారికంగా బావర్ సంస్థకు కట్టబెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డయాఫ్రం వాల్ మందం తగ్గించడం వల్ల పనుల పరిమాణం తగ్గుతుందని.. ఆ మేరకు కాంట్రాక్టు సంస్థకు భారీ ఎత్తున లబ్ధి చేకూర్చి కమీషన్లు దండుకునేందుకు పథకం రచించారని స్పష్టం చేస్తున్నారు. సీపేజీ(ఊటనీరు)ని సమర్థవంతంగా అడ్డుకట్ట వేయడానికే డయాఫ్రం వాల్ నిర్మిస్తున్నారు. డయాఫ్రం వాల్ ఎంత నాణ్యంగా, పటిష్టంగా ఉంటే ప్రధాన డ్యామ్ అంత పటిష్టంగా ఉంటుంది. డయాఫ్రం వాల్ మందం తగ్గడం వల్ల పటిష్టత తగ్గుతుందని.. ప్రధాన డ్యామ్ బరువు ప్రభావం వల్ల డయాఫ్రం వాల్లో చీలికలు ఏర్పడి ఊటనీటి ఉధృతి పెరగడానికి దారి తీస్తుందని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల ప్రధాన డ్యామ్కు గండ్లుపడి ప్రాజెక్టు భద్రతను ప్రశ్నార్థకం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కమీషన్ల కక్కుర్తితో జీవనాడి భద్రతను ప్రశ్నార్థకంగా మార్చారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రూ.వందల కోట్లు కాజేసేందుకే..పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ గ్యాప్–1లో 393 మీటర్ల పొడవున డయాఫ్రం వాల్ పనులను 2022లో మేఘా సంస్థ పూర్తి చేసింది. ఆ డయాఫ్రం వాల్ సమర్థవంతంగా పనిచేస్తోందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ తేల్చింది. ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో దెబ్బతిన్న డయాఫ్రం వాల్కు 6 మీటర్ల ఎగువన కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను రూ.990 కోట్లతో ప్రభుత్వం చేపట్టింది. ఈ పనులను ప్రధాన కాంట్రాక్టు సంస్థ మేఘాకు కాగితంపై ప్రభుత్వం అప్పగించింది. కానీ.. మేఘాపై ఒత్తిడి తెచ్చి బావర్ సంస్థకు ఆ పనులను అనధికారికంగా సబ్ కాంట్రాక్టు కింద ఇచ్చేసింది. పనులను సబ్ కాంట్రాక్ట్ కింద అధికారికంగా ఇస్తే మేఘా, బావర్, ప్రభుత్వం మధ్య త్రైపాక్షిక ఒప్పందం చేసుకోవాలి. కానీ.. మేఘా, బావర్ మధ్య అంతర్గత ఒప్పందం చేసుకోవడాన్ని బట్టిచూస్తే ముఖ్యనేత కమీషన్ల కక్కుర్తి బయటపడిందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గతంలో అంటే 2016–18లో డయాఫ్రం వాల్ పనులను బావర్ సంస్థకే అప్పగించగా.. కొత్త డయాఫ్రం వాల్ పనులను తిరిగి ఆ సంస్థకే కట్టబెట్టడం గమనార్హం. కొత్త డయాఫ్రం వాల్ను 1.5 మీటర్ల మందం.. గరిష్టంగా 93.5 మీటర్ల లోతు.. 1,396.6 మీటర్ల పొడవుతో టీ–16 ప్లాస్టిక్ కాంక్రీట్ సమ్మేళనంతో నిర్మించేలా జనవరి 16న సీడబ్ల్యూసీ డిజైన్ను ఆమోదించింది. ఆ డిజైన్ ప్రకారం 66,002 వేల చదరపు మీటర్ల పరిధిలో పనులు చేయాల్సి ఉంటుంది. కానీ.. డయాఫ్రం వాల్ మందం తగ్గించడం వల్ల చేయాల్సిన పనుల పరిమాణం సగానికి తగ్గే అవకాశం ఉందని ఇంజినీరింగ్ నిపుణులు లెక్కలు వేస్తున్నారు. పనుల పరిమాణం తగ్గినా.. అత్యంత కఠిన శిల (సౌండ్ హార్డ్ రాక్)లోకి రెండు మీటర్ల లోతు వరకూ ప్యానళ్లను దించి డయాఫ్రం వాల్ వేయడం వల్ల అదనపు పనులు చేశామని చూపి రూ.వందల కోట్లు కాంట్రాక్టు సంస్థకు దోచిపెట్టి కమీషన్లు రాబట్టుకునేందుకు ముఖ్యనేత పథకం వేశారని చెబుతున్నారు.కమీషన్ల కోసం చారిత్రక తప్పిదం» సీడబ్ల్యూసీ ఆమోదించిన పోలవరం ప్రాజెక్టు డిజైన్ ప్రకారం.. తొలుత నదీ ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ చానల్ను పూర్తి చేయాలి. ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను పూర్తిచేసి.. వాటి మధ్యన ప్రధాన డ్యామ్ పునాది డయాఫ్రం వాల్ నిర్మించి దానిపై ప్రధాన డ్యామ్ను పూర్తి చేయాలి. » కానీ.. 2016, డిసెంబర్లో ఒకేసారి స్పిల్ వే, స్పిల్ చానల్, ప్రధాన డ్యామ్ డయాఫ్రం వాల్ పనులను నాటి చంద్రబాబు సర్కారు ప్రారంభించి చారిత్రక తప్పిదం చేసింది. కమీషన్ల కక్కుర్తితో ఆ పనులను బావర్ సంస్థకు సబ్ కాంట్రాక్టు కింద కట్టబెట్టేసింది. గోదావరికి అడ్డంగా 2016 డిసెంబర్ నుంచి 2017 జూలై వరకు చెయినేజ్ 1,485.7 నుంచి 480 మీటర్ల వరకూ 1,006 మీటర్లు.. 2017 డిసెంబర్ నుంచి 2018 జూన్ వరకూ చెయినేజ్ 480 నుంచి 89 మీటర్ల వరకూ 390.6 మీటర్ల పొడవున మొత్తం 1,396.6 మీటర్ల మేర ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో డయాఫ్రమ్ వాల్ను నిర్మించింది. » డయాఫ్రం వాల్ను అప్పట్లో బావర్ సంస్థ ఇష్టారాజ్యంగా చేసిందని.. ప్యానళ్లను సౌండ్ హార్డ్ రాక్లోకి రెండు మీటర్ల లోతు వరకూ దించలేదని, కేవలం సాధారణ రాతి నేల వరకూ మాత్రమే పనులు చేసిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. » కానీ.. అవేమీ పట్టించుకోకుండా డయాఫ్రం వాల్ పనులకు 2018 జూన్ నాటికే రూ.393.32 కోట్ల మేర బిల్లులు చెల్లించింది. మరో రూ.94 కోట్ల మేర బిల్లులు చెల్లించాలని బావర్ సంస్థ ప్రతిపాదనలు పంపింది. ఈ వ్యవహారంలో భారీఎత్తున ముడపులు చేతులు మారాయి. అప్పటి ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ట్రాయ్ అధినేత రాయపాటి రంగారావు మీడియా సాక్షిగా వెల్లడించిన అంశాలే దీనికి నిదర్శనం. ఇప్పుడు కొత్త డయాఫ్రం వాల్ను అదే సంస్థకు కట్టబెట్టడం.. లోపభూయిష్టంగా పనులు చేస్తుండటంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన డ్యామ్ భద్రతకే ప్రమాదంపోలవరం ఎగువ కాపర్ డ్యామ్ వద్ద ఇసుక నేలలో ఊటనీటి (సీపేజీ) ఫర్మియబులిటీని 2016–17లో తప్పుగా లెక్కించారు. దీనివల్ల ఎగువ కాఫర్ డ్యామ్ పునాది జెట్ గ్రౌటింగ్ వాల్ను 20 మీటర్ల లోతు నుంచే నిర్మించారు. వాస్తవంగా ఆ వాల్ను 40 మీటర్ల లోతు నుంచి నిర్మించాలి. దీన్ని బట్టి చూస్తే కమీషన్ల కక్కుర్తితో జెట్ గ్రౌటింగ్ వాల్ను తక్కువ లోతుతో నిర్మించారనే విషయం స్పష్టమవుతోంది. 2018లో గోదావరి ప్రవాహం జెట్ గ్రౌటింగ్ వాల్ మీదుగానే ప్రవహించింది. ఆ వరద ఉధృతికి జెట్ గ్రౌటింగ్ వాల్లో చెయినేజ్ 1,040 మీటర్ల నుంచి 1,330 మీటర్ల మధ్య 27 చోట్ల భారీగా చీలికలు ఏర్పడ్డాయని.. దానివల్లే ఎగువ కాఫర్ డ్యామ్లో సీపేజీ అధికంగా ఉందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ తేల్చింది. వరద ఉధృతి పెరిగినప్పుడు సీపేజీ తీవ్రత పెరిగి ఎగువ కాఫర్ డ్యామ్కు గండ్లు పడకుండా ఉండేందుకు అంతర్జాతీయ నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు ఎగువ కాఫర్ డ్యామ్ దిగువన దానికి పొడవునా సమాంతరగా బట్రెస్ బర్మ్ను ప్రభుత్వం నిర్మిస్తోంది. గతంలో చేసిన తప్పునకు పరిహారం రూ.200 కోట్లకుపైగా వ్యయం చేస్తోంది. డయాఫ్రం వాల్ మందం 1.5 మీటర్ల నుంచి 0.9 మీటర్లకు తగ్గించడం వల్ల.. ఎగువ కాఫర్ డ్యామ్ జెట్ గ్రౌటింగ్ వాల్ దెబ్బతిన్న తరహాలోనే ప్రధాన డ్యామ్ బరువు ప్రభావం వల్ల డయాఫ్రం వాల్లో చీలికలు ఏర్పడి, సీపేజీ పెరగడానికి.. ప్రధాన డ్యామ్లో గండ్లు పడటానికి దారి తీస్తుందని.. ప్రాజెక్టు భద్రతను ప్రశ్నార్థకంగా మారుస్తుందని ఇంజినీరింగ్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రాష్ట్రంలో మహిళలు, బాలికలకు భద్రత కరువు: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. అనంతపురంలో ఇంటర్మీడియెట్ చదువుతున్న గిరిజన బాలిక సాకె తన్మయి కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా, రక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హత్యా ఘటనకు ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ, భద్రత లేకుండాపోయింది. శాంతిభద్రతల నిర్వహణలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఫల్యం ఇలాంటి దారుణాల రూపంలో ప్రతిరోజూ కనిపిస్తూనే ఉంది. అనంతపురంలో ఇంటర్మీడియెట్ చదువుతున్న గిరిజన బాలిక సాకె తన్మయిని అత్యంత దారుణంగా హత్య చేశారు. తమ కుమార్తె కనిపించడం లేదని ఈ నెల 3న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఆ అమ్మాయిని రక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఆరు రోజుల తర్వాత కూడేరు మండలం బ్రాహ్మణపల్లె సమీపంలో తన్మయి మృతదేహాన్ని గుర్తించారు. తన్మయి హత్య పూర్తిగా యంత్రాంగ వైఫల్యమే. ఒక అమ్మాయి కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పుడు అక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తోంది? ఆరు రోజుల క్రితం ఫిర్యాదు వచ్చినా సరే ఎందుకు పట్టించుకోలేదు? అసలు రాష్ట్రంలో కేసుల దర్యాప్తు మీద, నేరాల అదుపు మీద దృష్టి ఉందా? కేవలం రెడ్బుక్ రాజ్యాంగం అమలు, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప.. ఈ ప్రభుత్వానికి ప్రజల రక్షణ పట్ల బాధ్యత అనేది ఉందా? తన్మయి హత్యా ఘటనకు ముఖ్యమంత్రి, ప్రభుత్వం బాధ్యత వహించాలి’ అని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ, భద్రత లేకుండా పోయింది. శాంతి భద్రతల నిర్వహణలో @ncbn గారి వైఫల్యం ఇలాంటి దారుణాల రూపంలో ప్రతిరోజూ కనిపిస్తూనే ఉంది. అనంతపురంలో ఇంటర్మీడియట్ చదువుతున్న గిరిజన బాలిక సాకె తన్మయిని అత్యంత దారుణంగా హత్యచేశారు. ఈనెల జూన్ 3న తమ కుమార్తె… pic.twitter.com/WSSOoiAIwL— YS Jagan Mohan Reddy (@ysjagan) June 8, 2025 -
AP EAPCET: ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల
విజయవాడ: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో ప్రవేశాలకు గాను గత నెలలో జరిగిన ఏపీ-ఈఏపీ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంజనీరింగ్ విభాగంలో 1.89 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. హైదరాబాద్ విద్యార్థి అనిరుద్రెడ్డికి తొలి ర్యాంక్ రాగా, శ్రీకాళహస్తి విద్యార్థి భాను చరణ్రెడ్డి రెండో ర్యాంక్ వచ్చిఇంది. ఇక పాలకొల్లు విద్యార్థి యశ్వంత్ మూడో ర్యాంకు కైవసం చేసుకున్నాడు. ఇక అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో 89.9 శాతం ఉత్తీర్ణత సాధించారు విద్యార్థులు. అగ్రి, ఫార్మాసీలో సాయి హర్షవర్థన్కు తొలి ర్యాంకు రాగా, రంగారెడ్డి జిల్లాకు చెందిన నిశాంత్కు రెండో ర్యాంక్, కోనసీమ జిల్లా విద్యార్థి వినయ్ మల్లేశ్కు మూడో ర్యాంకు వచ్చింది. కాగా, గత నెల 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకూ ఏపీ ఈఏపీ సెట్ నిర్వహించారు. ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు మొత్తం 3,62, 392 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 145 పరీక్షా కేంద్రాలతో పాటు హైదరాబాద్ లో రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
‘అది డైవర్ట్ చేయడానికే టీడీపీ బురద చల్లుడు రాజకీయాలు’
సాక్షి, తాడేపల్లి: జర్నలిస్ట్ కృష్ణంరాజు సాక్షి టీవీ డిబేట్లో పాల్గొన్న సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవే, వాటిని వైఎస్సార్సీపీకి, సాక్షి టీవీ యాజమాన్యానికి ఎలా ఆపాదిస్తారని వైఎస్సార్సీపీ నేత పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కృష్ణంరాజు తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన తరువాత కూడా కూటమి సర్కార్ ఒక పథకం ప్రకారం వాటిని రాజకీయం చేసేందుకు, వైఎస్ కుటుంబం మీద వ్యక్తిత్వ హననానికి వాడుకుంటోందని మండిపడ్డారు.మహిళలను కించపరిచే ఎటువంటి వ్యాఖ్యలనైనా సరే సాక్షి టీవీ, వైఎస్సార్సీపీ సమర్థించే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు. కూటమి ఏడాది పాలనపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం వెన్నుపోటు దినం విజయవంతం ద్వారా బహిర్గతం అవ్వడంతో, దానిని నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు కుట్రపూరితంగా టీడీపీ దానికి వంతపాడే ఎల్లోమీడియా, సోషల్ మీడియా ద్వారా పనిగట్టుకుని దుష్ప్రచారంకు దిగారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..గతంలో అనేక సందర్భాల్లో టీవీ డిబేట్లలో, పబ్లిక్ మీటింగ్ల్లో కూర్చుని టీడీపీ సీనియర్ నాయకులే ఇష్టారాజ్యంగా మాట్లాడినప్పుడు ఇప్పుడు ప్రశ్నిస్తున్న వారంతా ఏమైపోయారు. ఈటీవీ, టీవీ 5, ఏబీఎన్ ఛానెళ్ల ముందు ఎందుకు ధర్నాలు నిర్వహించలేదు? ఆ పత్రికల ప్రతులను ఎందుకు తగలబెట్టలేదు? టీడీపీ నాయకులు మాట్లాడిన సందర్భాల్లో వారి మనోభావాలు దెబ్బతినలేదా?టీడీపీ నాయకులు, కిర్రాక్ ఆర్పీ, సీమ రాజా, చేబ్రోలు కిరణ్ మాట్లాడిన వీడియోలను కూడా ఈ సందర్భంగా పత్రికా సమావేశంలో ప్రజలు చూసేందుకు గానూ ప్రదర్శిస్తున్నాము. సాక్షాత్తు స్పీకర్ అయ్యన్నపాత్రుడు, హోంమంత్రి అనిత వైయస్ కుటుంబం గురించి, వారి ఇంటి మహిళల గురించి అసభ్యంగా మాట్లాడినా వారి మీద ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. నాడు సీఎం వైయస్ జగన్ ను ఉద్దేశించి పదే పదే సైకో అని మాట్లాడిందే చంద్రబాబు. వైయస్సార్సీపీ నాయకులను ఉద్దేశించి పవన్ కళ్యాన్ నా కొడకల్లారా అని రెచ్చిపోయాడు. వారిద్దరి మీద కూడా ఎందుకు కేసులు పెట్టలేదు?ఐటీడీపీ పేరుతో రెచ్చిపోతున్న సైకోలువ్యక్తిత్వ హననం అనేది టీడీపీ జీన్స్ లోనే ఉంది. ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్ నుంచి నేటి వైయస్ జగన్ వరకు వ్యక్తిత్వ హననం చేయడమే ఎజెండాగా సైకోలను ప్రోత్సహించడమే టీడీపీ పనిగా పెట్టుకుంది. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తోడేళ్లు వైయస్ కుటుంబంపై దారుణంగా విమర్శలు చేస్తున్నారు. ఐ-టీడీపీ పేరుతో నారా లోకేష్ ఒక సైకో వ్యవస్థను సృష్టించి డబ్బులిచ్చి పోషిస్తున్నాడు. చంద్రబాబు ఇచ్చిన ప్రోత్సాహంతోనే వీడియోలు చేస్తున్నానని టీడీపీ సైకో చేబ్రోలు కిరణ్ స్పష్టంగా చెప్పాడు. అధికారం అండ చూసుకుని, రెడ్ బుక్ రాజ్యాంగం పొగరుతో ఏం చేసినా పోలీసులు మనల్ని ఏం చేయరులే అని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సైకోలు దారుణాలకు తెగబడుతున్నారు. ఇలాంటి చర్యలను వైయస్సార్సీపీ చూస్తూ ఊరుకోదు. వైయస్ కుటుంబాన్ని కించపరిచేలా మాట్లాడే వారిని ఉపేక్షించే ప్రసక్తేలేదు.మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే ప్రభుత్వానికి పట్టదుమహిళల మీద అత్యాచారాలు, దాడులు జరుగుతుంటే ఈ ప్రభుత్వం చూసీ చూడనట్టు వ్యవహరిస్తోంది. దళిత బాలికపై సామూహిక అత్యాచారం చేస్తే ఇంతవరకు కేసు నమోదు చేసి నిందితులను శిక్షించలేదు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత, మంత్రి నారా లోకేష్ నియోజకవర్గాల్లో మహిళల మీద దాడులు జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు. ముచ్చుమర్రిలో చిన్నారిని అత్యాచారం చేసి చంపేశారు. ఈ ఘటన జరిగి 9 నెలలు దాటినా ఇంతవరకు బాలిక మృతదేహాన్ని వెతికి తీయడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా ఫెయిలైంది.రాష్ట్ర వ్యాప్తంగా దళిత మీద దాడులు నిత్యకృత్యమైపోయాయి. పిఠాపురంలో ఏకంగా దళితులను సాంఘిక బహిష్కరణ చేసినా పవన్ కళ్యాణ్ దానిపై ఇంతవరకు నోరుమెదపలేదు. ఈ ఘోరాలపై నోరెత్తి మాట్లాడే తీరిక ప్రభుత్వ పెద్దలకు లేదు. శాంతి భద్రతలను కాపాడాల్సిన డీజీపీ ఎక్కడున్నారో తెలియదు. రాజధాని పేరుతో అమరావతి భూములను దోచుకోవడమే అజెండాగా చంద్రబాబు పనిచేస్తున్నాడని రాజధాని రైతులు, మహిళలు గుర్తించాలి. అమరావతిలోని వందల ఎకరాల భూములను తన బినామీల కంపెనీలకు చంద్రబాబు దోచిపెట్టడమే పనిగా పెట్టుకున్నాడు. గతంలో సేకరించిన భూములనే అభివృద్ధి చేయలేక చేతులెత్తేసిన సీఎం చంద్రబాబు, మళ్లీ 44 వేల ఎకరాలు సేకరిస్తానని చెప్పడం భూములు దోచుకునే కుట్రలో భాగమే. -
కొత్త కనెక్షన్లకూ ఛార్జీల బాదుడు
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ వినియోగదారులపై రూ.15,485 కోట్ల ఛార్జీల భారాన్ని మోపింది. ఇప్పుడు దీనికి అదనగా కొత్త కనెక్షన్ల ఛార్జీలను పెంచుతూ మరో షాక్ ఇస్తోంది. కొత్త విద్యుత్ కనెక్షన్ కావాలంటే కొత్త ఛార్జీలు చెల్లించాలి్సందేనంటూ ప్రతిపాదన రూపొందించారు. వీటిని నిర్ణయించేందుకు, విద్యుత్ రెగ్యులేటరీ చట్టంలోని నిబంధనలకు నాలుగో సవరణను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ప్రకటించింది. ఆ చట్టంలో మార్పులు చేస్తూ ముసాయిదాను రూపొందించింది. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలుంటే ఈనెల 23లోగా మండలికి ఈ–మెయిల్ ద్వారా పంపాలని కోరింది. అనంతరం.. ముసాయిదాను ప్రకటిస్తామని, ఇది ప్రకటించాక 21 రోజుల్లో కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని ఏపీఈఆర్సీ వెల్లడించింది.ప్రస్తుత విధానం ఇదీ..విద్యుత్ సర్వీసు అవసరమైనప్పుడు వినియోగదారులు సంబంధిత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)కు దరఖాస్తు చేసుకుంటారు. డిస్కం నుంచి అధికారులు క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలిస్తారు. అప్పటికే ఉన్న విద్యుత్ లైన్ల నుంచి కొత్త సర్వీసు ఇచ్చే ప్రాంతానికి ఎంతదూరం ఉంది?.. దానికెంత విద్యుత్ తీగలు, విద్యుత్ స్తంభాలు అవసరమవుతాయని ఒక అంచనా రూపొందిస్తారు. దాని ప్రకారం ఆ ఖర్చులో కొంత మొత్తాన్ని లేదా పూర్తిగానూ చార్జీల రూపంలో చెల్లించాలంటూ వినియోగదారునికి నోటీసు జారీచేస్తారు. దాని ప్రకారం చెల్లించిన తరువాత సర్వీసును మంజూరుచేస్తారు. కానీ, ఇకపై అలా కుదరదు. దరఖాస్తు చేస్తున్నప్పుడే ముందే నిర్ణయించిన ఛార్జీలు కూడా చెల్లించాల్సి ఉంటుంది.కమిషన్కు ఛార్జీలు నిర్దేశించే అధికారంవిద్యుత్ లైన్ ఏర్పాటుకు అయిన ఖర్చుల రికవరీకి సంబంధించి 150 కిలోవాట్లు, అంతకుమించిన లోడ్కు కొత్త కనెక్షన్లు ఇచ్చేందుకు డిస్కంలు వసూలుచేయాల్సిన ఛార్జీలను నిర్దేశించే అధికారాన్ని కమిషన్కు కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ కట్టబెట్టింది. ఇందుకు అనుగుణంగా 150 కిలోవాట్ల వరకు కొత్త కనెక్షన్ ఇచ్చేందుకు డిస్కంలు వసూలుచేస్తున్న ఛార్జీలను పరిగణనలోకి తీసుకుని ముసాయిదా మార్గదర్శకాలను కమిషన్ ప్రతిపాదించింది. డిస్కంల నెట్వర్క్ నుంచి కిలోమీటర్ పరిధి.. 150 కిలోవాట్ల లోడ్ వరకు (కొత్త కనెక్షన్/ప్రస్తుతమున్న సర్వీస్కు అదనపు లోడ్ కింద) 2025–2026 ఆర్థిక ఏడాదిలో డెవలప్మెంట్ ఛార్జీలను కమిషన్ నిర్దేశించింది.లోడు 75 కిలోవాట్లకు మించితే అంతే..ఇక వినియోగదారుడు తన లోడ్ 75 కిలోవాట్లకు మించితే వారంతట వారే 150 కిలోవాట్ల వరకు ఎల్టీగానీ హెచ్టీగానీ ఎంచుకుని డెవలప్మెంట్ ఛార్జీలను చెల్లించాలి. ఈ ఛార్జీలతో పాటు అప్లికేషన్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్ను రెగ్యులేటరీ నిబంధనల మేరకు చెల్లించాలి. 2026–2027 ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త, అదనపు లోడ్కు సంబంధించిన సర్వీస్లైన్ ఛార్జీల షెడ్యూల్ను డిస్కంలు కమిషన్కు సమర్పించవచ్చు. డిస్కంల నుంచి ఎలాంటి ప్రతిపాదనలూ రాకపోతే కొత్త ఛార్జీలను ఖరారు చేసేంత వరకూ 2025–2026 చార్జీలనే కమిషన్ పరిగణలోకి తీసుకుంటుంది. -
‘సాక్షి’కి ఆపాదించడం సరికాదు
సాక్షి, అమరావతి: సాక్షి టీవీలో శుక్రవారం కేఎస్ఆర్ లైవ్ షోలో విశ్లేషకుడు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని ‘సాక్షి’ టీవీ స్పష్టం చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలను తనకు ఆపాదిస్తూ కూటమి నేతలు చేస్తున్న ప్రకటనలను సాక్షి టీవీ తీవ్రంగా ఖండించింది. తాము ఎల్లప్పుడూ మహిళల పట్ల అత్యంత గౌరవాభిమానాలను చూపుతామని తెలిపింది. సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను సాక్షి టీవీ ఎంత మాత్రం సమర్థించలేదని, సమర్థించబోమని వెల్లడించింది.‘సాక్షి’ మొదటి నుంచీ కూడా మహిళల పట్ల అత్యంత గౌరవంగా వ్యవహరిస్తోంది. మహిళల వికాసానికి, వారి అభ్యున్నతికి సంబంధించి అనేక ప్రత్యేక కథనాలను ప్రచురిస్తూ.. ప్రసారం చేస్తోంది. పాత్రికేయ విలువలకు కట్టుబడి పని చేస్తున్న ‘సాక్షి’ ఏనాడు గీత దాటలేదు. పాత్రికేయ చట్టాలు, నిబంధనల పరిధిలో ప్రజలకు వాస్తవాలను వెల్లడిస్తోంది. దీంతో.. ‘సాక్షి’ని నేరుగా ఏమీచేయలేకపోతున్నామనే బాధలో ఉన్న టీడీపీ, దాని అనుబంధ ఎల్లో మీడియా, ‘సాక్షి’కి ఏమాత్రం సంబంధంలేని వ్యాఖ్యలను చూపించి కుట్రలకు తెర తీస్తుండటం దారుణం అని పలువురు సీనియర్ జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు.సాక్షి టీవీలో శుక్రవారం కేఎస్ఆర్ లైవ్ షోలో విశ్లేషకుడు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమని, ఆ వ్యాఖ్యలను ఏమాత్రం సమర్థించలేదని, సమర్థించబోమని ‘సాక్షి’ టీవీ స్పష్టం చేసినప్పటికీ ఇంకా ఏదో రాద్ధాంతం చేయాలని టీడీపీ ప్రయత్నిస్తుండటమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. అయినప్పటికీ ఆ వ్యాఖ్యలను ‘సాక్షి’కి ఆపాదిస్తూ, సంస్థ ప్రతిష్టను దిగజార్చే పన్నాగంతో టీడీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తుండటం సరికాదంటున్నారు. దురుద్దేశంతో ‘సాక్షి’పై టీడీపీ కుట్రలు ‘సాక్షి’ కార్యాలయాలపైకి తన మూకలను ఉసిగొల్పి సంస్థను ఇబ్బంది పెట్టాలని టీడీపీ వ్యూహ రచన చేస్తుండటం సరికాదని, ఇది కొత్త విష సంస్కృతికి దారి తీస్తుందని సీనియర్ జర్నలిస్టులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాదైనా, ఫలానా మంచి పనులు చేశామని చెప్పుకునేందుకు ఏమీ లేక సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతుండటంతో ఎలాగైనా దాన్ని డైవర్ట్ చేసేందుకు ఎప్పటి లాగే డైవర్షన్ పాలిటిక్స్కు తెర లేపింది.ఇందులో భాగంగానే శనివారం సాయంత్రం విజయవాడ ‘సాక్షి’ కార్యాలయం వద్దకు కొంత మందిని పంపించి గొడవ చేయించింది. ‘సాక్షి’కి మహిళలంటే గౌరవమని, కృష్ణంరాజు వ్యాఖ్యలను ఎంత మాత్రం సమర్థించలేదని, సమర్థించబోమని పోలీసుల సమక్షంలో వారికి స్పష్టం చేయడంతో ఆందోళన విరమించి వెళ్లిపోయారు. అయినా కూడా శనివారం రాత్రి పొద్దుపోయాక కూడా టీడీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం కొనసాగింది. పైగా ఆదివారం రాష్ట్రంలోని అన్ని ‘సాక్షి’ కార్యాలయాల వద్ద ఆందోళనలకు సన్నాహాలకు పిలుపునిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఎంత మాత్రం సరికాదని సీనియర్ జర్నలిస్టులు తప్పుపడుతున్నారు. -
11న పొదిలికి వైఎస్ జగన్
పొదిలి రూరల్: పొగాకు రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 11న ప్రకాశం జిల్లా పొదిలికి రానున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి తెలిపారు. శనివారం పొదిలి–దర్శి రోడ్డులోని ఎస్ఆర్ పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్న హెలిప్యాడ్ స్థలాన్ని వైఎస్సార్సీపీ ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, అన్నా కృష్ణచైతన్యతో కలిసి పరిశీలించారు.అనంతరం శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ గత నెల 28న పొదిలి పొగాకు బోర్డును వైఎస్ జగన్ సందర్శించాల్సి ఉండగా, వాతావరణ పరిస్థితుల వల్ల వాయిదా పడిందని పేర్కొన్నారు. ఈ నెల 11న కార్యక్రమం ఖరారైనట్లు చెప్పారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు పొదిలి పొగాకు బోర్డుకు వైఎస్ జగన్ చేరుకుంటారన్నారు. వైఎస్ జగన్ రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి కష్టాలు తెలుసుకుని భరోసా కల్పిస్తారని వివరించారు.అనంతరం మీడియా సమావేశం నిర్వహిస్తారని వెల్లడించారు. హెలిప్యాడ్ ప్రాంతంలో చేపట్టాల్సిన పనులు వేగవంతం చేయాలని బూచేపల్లి సిబ్బందికి సూచించారు. వారి వెంట వైఎస్సార్సీపీ నాయకులు సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, కేవీ రమణారెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, వైఎం ప్రసాద్రెడ్డి, వై.వెంకటేశ్వరరావు, కె.నరసింహారావు తదితరులు ఉన్నారు. -
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారిందని.. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలే అందుకు నిదర్శనమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూటమి ప్రభుత్వం చెప్పేదానికి పూర్తి విరుద్ధంగా కాగ్ నివేదికలు వాస్తవాలను వెల్లడిస్తున్నాయని చెప్పారు. ఆర్థిక పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనలు, కాగ్ నివేదికల్లో వాస్తవాలను ఉటంకిస్తూ శనివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. కూటమి సర్కార్ చెబుతున్న అబద్ధాలను కడిగి పారేశారు. ఇంకా ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే..⇒కాగ్ 2025 ఏప్రిల్కు సంబంధించి కీలక సూచికలను వెల్లడించింది. ఈ గణాంకాలను పరిశీలిస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందన్నది స్పష్టమవుతోంది. జీఎస్టీ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 2025 ఏప్రిల్లో నికర జీఎస్టీ వసూళ్లు అత్యధికంగా రూ.3,354 కోట్లు ఉన్నట్లుగా మే 1న ప్రభుత్వం పత్రిక ప్రకటన విడుదల చేసింది. ⇒ కానీ.. కాగ్ నివేదికలో వాస్తవ లెక్కలను పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన లెక్క అబద్ధమని తేల్చింది. 2024 ఏప్రిల్తో పోల్చితే, 2025 ఏప్రిల్లో రాష్ట్ర ప్రభుత్వ జీఎస్టీ ఆదాయం ఏకంగా 24.20 శాతం తగ్గింది. కాగ్ వాస్తవాలను బట్టబయలు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరించింది. ఏప్రిల్కు సంబంధించిన జీఎస్టీ ఆదాయాలు చెప్పకుండా, మేలో జీఎస్టీ ఆదాయాలు రికార్డు స్థాయిలో పెరుగుతాయంటూ రాష్ట్ర ప్రభుత్వం మరో పత్రికా ప్రకటనను విడుదల చేసింది.⇒ కేంద్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్కు సంబంధించి ఐజీఎస్టీ ముందస్తు సర్దుబాట్ల కారణంగా రాష్ట్ర జీఎస్టీ ఆదాయాలు రూ.796 కోట్లు తగ్గాయని ఆ పత్రికా ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది. ఐజీఎస్టీ ముందస్తు సర్దుబాట్లను మైనర్ హెడ్ 110 కింద లెక్కిస్తారు. ప్రభుత్వ ఖాతాల మేజర్ హెడ్ 0006 కింద ఎస్జీఎస్టీని లెక్కిస్తారు. ఇది ఒక సాధారణ ప్రక్రియ. ఈ సర్దుబాట్లన్నింటినీ లెక్కించిన తర్వాతే నికర జీఎస్టీ ఆదాయాలను లెక్కకడతారు.⇒ 2025 ఏప్రిల్కు సంబంధించి నికర జీఎస్టీ ఆదాయం రూ.3,354 కోట్లుగా ఉన్నట్లు మే 1న పత్రికా ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం.. ఇపుడు సర్దుబాట్లు కారణంగా రూ.796 కోట్ల ఆదాయం తగ్గిందని చెబుతోంది. కానీ, జీఎస్టీ ఆదాయాల గురించి కాగ్ నిజాలను వెలుగులోకి తేగానే.. దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం ఇలాంటి ప్రకటనలు చేస్తోంది. టీడీపీ ప్రభుత్వం చెప్పేదానికి పూర్తి విరుద్ధంగా కాగ్ నివేదికలు వాస్తవాలను వెల్లడిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దగమనంలో ఉంది. గతేడాది ఏప్రిల్తో పోల్చితే ఈ ఏడాది ఏప్రిల్లో పన్ను ఆదాయాలు 12.21 శాతం తగ్గాయి. పన్నేతర ఆదాయాలు 22.01 శాతం తగ్గాయి. రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం 12.76 శాతం తగ్గింది. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మరింత ఆందోళన కలిగించే అంశం. -
బీసీ సంక్షేమ శాఖలో బదిలీ ‘బేరం’
సాక్షి, అమరావతి: సాధారణ బదిలీలకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపడంతో దాదాపు అన్ని శాఖల్లో పైరవీలు ఊపందుకున్నాయి. పైరవీలలో బీసీ సంక్షేమ శాఖ ఓ అడుగు ముందుకేసి తన రూటే సెప‘రేటు’ అని అంటోంది. ఉద్యోగుల బదిలీల గడువు ఈ నెల 9తో ముగియనుండటంతో నిబంధనలు బేఖాతరు చేస్తూ గురువారం జారీ చేసిన సర్క్యులర్ వివాదాస్పదంగా మారింది. తిరుపతి కేంద్రంగా రెండు రోజుల క్రితం జరిగిన బేరసారాల ‘డీల్’ నేపథ్యంలోనే ఆ సర్క్యులర్ జారీ చేశారని, ఇది ముమ్మాటికీ బదిలీ నిబంధనలకు విరుద్ధమని ఉద్యోగులు చెబుతున్నారు. ఇటీవల డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా జిల్లా బీసీ సంక్షేమ అధికారులు/సాధికారత అధికారులకు అడ్డగోలుగా అడ్హాక్ పదోన్నతులు కల్పించిన బీసీ సంక్షేమ శాఖ ఇప్పుడు సాధారణ బదిలీల్లోనూ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం విమర్శల పాలవుతోంది. మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయంటే.. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సాధారణ బదిలీలకు 2022 ఏప్రిల్ 8న మార్గదర్శకాలతో కూడిన జీవో 23ను రాష్ట్ర ఆరి్థక శాఖ జారీ చేసింది. ఆ మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి/ఉపాధ్యాయుడు ఒకేచోట (నగరం, పట్టణం, గ్రామం) పనిచేసిన కాలాన్ని పరిగణనలోకి తీసుకుని బదిలీలు చేపట్టాలి. అదే ప్రాంతంలో స్థానిక బదిలీలు చేస్తే సంబంధిత కార్యాలయం లేదా సంస్థలో పనిచేసిన కాలాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఈ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుని ఐదేళ్లు ఒకేచోట పనిచేసిన వారి బదిలీకి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర్వులు రాష్ట్రంలో ఏ శాఖలోనూ లేనివిధంగా ఒక్క బీసీ సంక్షేమ శాఖలో తాజాగా జారీ చేసిన సర్క్యులర్ (మెమో నంబర్ ఎ/1210/2025) ఆరి్థక శాఖ జారీ చేసిన నిబంధనలకు విరుద్ధమని ఉద్యోగులు చెబుతున్నారు. జిల్లాల పునర్ర్విభజనతో 2022 ఏప్రిల్ 4న కొత్త జిల్లాలకు పాత జిల్లాల నుంచి కేటాయించిన ఉద్యోగులు ఉమ్మడి జిల్లా (పాత జిల్లా) సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకుని బదిలీల్లో అవకాశం ఇవ్వాలన్నది ఆ ఉత్తర్వుల సారాంశం. 2022 ఏప్రిల్ 3వ తేదీ వరకు అక్కడే కొనసాగిన వారి సర్వీసును కూడా లెక్కగట్టి బదిలీకి వెసులుబాటు ఇవ్వడం తొందరపాటు చర్య అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐదేళ్ల నిబంధన.. మూడేళ్లకే బదిలీ రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్ వ్యవస్థీకరించిన నేపథ్యంలో ఆర్డర్ టు సర్వ్పై కొత్త జిల్లాలకు 2022 ఏప్రిల్లో ఉద్యోగులను కేటాయించారు. ఆ లెక్కన ఏదైనా ప్రాంతంలో ఆప్పటినుంచి పనిచేస్తున్న వారి సర్వీసు మూడేళ్లు మాత్రమే అవుతుంది. ఉదాహరణకు కొత్తగా ఏర్పడిన ఎనీ్టఆర్ జిల్లాకు ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఓ ఉద్యోగిని కేటాయిస్తే.. ఆ ఉద్యోగి సర్వీసు ప్రస్తుతం మూడేళ్లు మాత్రమే ఉంటుంది. వారికి బదిలీల్లో అవకాశం ఉండదు. పునర్ వ్యవస్థీకరణకు ముందు పాత కృష్ణా జిల్లాలో పనిచేసి, పునర్ వ్యవస్థీకరణ తరువాత కూడా పనిచేస్తున్న ఉద్యోగికి మాత్రం ఐదేళ్ల సర్వీసు పూర్తవుతుంది. ఒకేచోట ఐదేళ్లు సర్వీసు ఉన్న వారిని బదిలీ చేయాలనే నిబంధనను బేఖాతరు చేస్తూ.. కొత్తగా ఏర్పడిన జిల్లాలో పనిచేసిన ఉద్యోగుల పాత సర్వీసును కూడా కలిపి బదిలీ అవకాశం ఇవ్వడానికి పెద్దఎత్తున పైరవీలు సాగినట్టు విశ్వసనీయ సమాచారం. ఒకవేళ ప్రత్యేక పరిస్థితుల్లో బదిలీ చేయాల్సి వచి్చనా.. వారికి ప్రత్యామ్నాయం (మ్యూచువల్)గా వేరొక ఉద్యోగి ఇష్టపడితేనే బదిలీ చేయాలి. అవేమీ పట్టించుకోకుండా పాత జిల్లా సర్వీసును కొత్త జిల్లా సర్వీసుకు కలిపి ఐదేళ్లు ఉంటే బదిలీ చేయాలని సర్క్యులర్ ఇవ్వడం ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ (రాష్ట్రపతి ఉత్తర్వుల)కు వ్యతిరేకమని ఉద్యోగులు చెబుతున్నారు. ఉమ్మడి (పాత) జిల్లాలతో సంబంధం లేకుండా కొత్త జిల్లాలను కూడా జిల్లాలుగానే పరిగణించి స్టేషన్ సీనియారిటీని విడివిడిగా లెక్కించాలనే నిబంధనను కాదని, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా బీసీ సంక్షేమ శాఖ మెమో జారీ చేయడం వెనుక తిరుపతి జిల్లాకు చెందిన ఒక అధికారి కీలకపాత్ర పోషించినట్టు సమాచారం. ముందుగానే బేరసారాలు కొనసాగించి.. ఒప్పందాలు కుదుర్చుకున్న తరువాతే మెమో జారీ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
శ్రుతి తప్పిన రుతురాగం
రాష్ట్రంలో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. వాతావరణ సీజన్లు పూర్తిగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. మండు వేసవిలో భారీ వర్షాలు కురిసి వాతావరణం చల్లబడగా.. వర్షాల సీజన్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. గత నెలాఖరుకే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించి అన్నిచోట్లకు విస్తరించినా.. ఆ తర్వాత పూర్తిస్థాయిలో మందగించాయి. దీంతో వారం రోజులుగా రాష్ట్రమంతటా ఎండలు మండిపోతున్నాయి.విజయవాడ, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, ఏలూరు, విజయనగరం, పార్వతీపురం మన్యం వంటి కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీలు నమోదవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులు వాస్తవ ఉష్ణోగ్రత కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తోంది. విజయవాడలో శనివారం 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా.. 44 డిగ్రీల ఉష్ణోగ్రత ప్రభావం కనిపించింది. ఉదయం నుంచి రాత్రి వరకూ వేడి వాతావరణం ఉండటంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం రోహిణీ కార్తె కావడంతో ఎండల తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటోంది. 15 రోజుల క్రితం వేసవిలో ఎండలు తీవ్రంగా ఉండాల్సిన సమయంలో భారీ వర్షాలు కురిశాయి. –సాక్షి, అమరావతిసీజన్లు ఇలా మారాయిసాధారణంగా మార్చి నుంచి మే నెలాఖరు వరకూ వేసవి సీజన్. జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ వర్షాకాలం ఉంటుంది. కానీ.. ఈ ఏడాది సీజన్లు తారుమారయ్యాయి. మే నెలలో రాయలసీమ, కోస్తా జిల్లాల్లో అకాల వర్షాలు కురిశాయి. కర్నూలు, కడప, అనంతపురం, విజయవాడ, గుంటూరు, అనకాపల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి వేసవి అంతా వర్షాకాలంలా మారిపోయింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా తొలకరి వర్షాలు కురవడం లేదు. ఎండలు తగ్గాల్సిన జూన్లో మండిపోతోంది. కోస్తా ప్రాంతాల్లో వీచే గాలుల్లో తేమ శాతం తక్కువగా ఉండటంతో నమోదైన ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. వాతావరణ మార్పులతో అస్థిరంగా రుతుపవనాలుగ్లోబల్ వారి్మంగ్ వల్ల వాతావరణంలో ఏర్పడుతున్న మార్పులు రుతుపవనాల సమయాన్ని, తీవ్రతను అస్థిరపరచడమే దీనికి కారణంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఒకటి, రెండు డిగ్రీలు పెరగడంతో తేమ స్థాయిలు పెరుగుతూ వర్షాలను అస్థిరపరుస్తున్నట్టు అంచనా వేస్తున్నారు. సముద్ర ఉష్ణోగ్రతల పెరుగుదల అకాల వర్షాలకు కారణమవుతుండగా.. వేడి గాలులు, తక్కువ వాయు ప్రవాహం ఎండల తీవ్రతను పెంచుతున్నట్టు చెబుతున్నారు.జూన్ నెలాఖరు వరకు ఎండలుముందుగానే వచ్చిన రుతు పవనాలు ప్రస్తుతం మందగించాయి. నాలుగు రోజులుగా వాటిలో ఎలాంటి కదలిక లేదని వాతావరణ శాఖ తెలిపింది. వాటిని బలపరిచే ఉపరితల ఆవర్తనాలు లేకపోవడంతో స్థిరంగా ఉన్నచోటే ఉండిపోయాయి. జూన్ 15 తర్వాత కొద్దిగా మార్పు వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. ఏదైనా జూన్ మధ్య నుంచి జూన్ చివరి వారం వరకు ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు. జూలై మొదటి వారం నుంచి వర్షాలు స్థిరంగా కురిసే అవకాశం ఉందని.. అప్పటివరకూ ఎండల తీవ్రత ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
ఈఫిల్ కన్నా ఎత్తైన వంతెనపై.. తెలుగుతేజం
తెనాలి: దేశానికి గర్వ కారణంగా నిలిచిన చినాబ్ రైల్వే వంతెన నిర్మాణంలో రాష్ట్రానికి చెందిన మహిళా ఇంజనీర్, ప్రొఫెసర్ మాధవీలత కీలక పాత్ర పోషించారు. ఈఫిల్ టవర్కన్నా 35 మీటర్ల ఎత్తైన ఈ ఇంజనీరింగ్ అద్భుత ‘వంతెన’ను ప్రధాని మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆర్చి బ్రిడ్జిగా చరిత్రకెక్కిన ఈ అద్భుత నిర్మాణంలో తన పాత్ర ఉండడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని ప్రొఫెసర్ మాధవీలత పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు ఉపకరించే ప్రాజెక్టులో 17 ఏళ్లపాటు తన భాగస్వామ్యం ఉండటం సంతృప్తికరంగా ఉందని అన్నారు. ఆమె శనివారం ఫోన్లో తన సంతోషాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. వివరాలు ఆమె మాటల్లోనే.. అవకాశం ఇలా వచ్చింది... రీసీ జిల్లా బాక్కల్ దగ్గర చినాబ్ నదిపై నిర్మించిన ఆర్చి బ్రిడ్జి నిర్మాణ పనులను కొంకణ్ రైల్వేస్ ‘ఆఫ్కాన్స్’ సంస్థకు అప్పగించింది. ఆ సంస్థ జియో టెక్నికల్ కన్సల్టెంటుగా నాకు, ఈ వంతెన నిర్మాణంలో భాగం పంచుకునే అవకాశం లభించింది. 2004లో ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ చేసినప్పటి నుంచి ఇదే ప్రాజెక్టులో ఉన్నా. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ప్రొఫెసర్గా పనిచేశాను. అక్కడే సెంటర్ ఫర్ సస్టెయినబుల్ టెక్నాలజీస్ విభాగానికి చైర్పర్సన్గా సైన్స్ను, టెక్నాలజీని గ్రామీణాభివృద్ధికి చేరువ చేసే ప్రాజెక్టులకు నాయకత్వం వహించాను. ఐఐటీ మద్రాస్లో పీహెచ్డీ చేశాక, బెంగళూరులోని ఐఐఎస్సీలో ప్రొఫెసర్ సీతారాం ఆధ్వర్యంలో రాక్ మెకానిక్స్లో పోస్ట్ డాక్టోరల్ కొనసాగించాను. రాక్ మెకానిక్స్లో ఉన్న అనుభవమే నన్ను ఈ ప్రాజెక్టులో భాగస్వామిని చేసింది. కష్టాన్ని సవాలుగా తీసుకుని... నిజానికి చినాబ్ నదిపై బ్రిడ్జిని రెండు కొండల మధ్య నిర్మించటానికి ఇంజినీరింగ్ డిజైన్ పెద్ద సవాలుగా మారింది. అక్కడి రాళ్లను పరిశోధించి, అధ్యయనం చేశాం. పటిష్టమైన వాలు స్థిరీకరణ ప్రణాళికను రూపొందించి, అమలును నిరంతరం పర్యవేక్షిస్తూ వచ్చాను. నేను చేసిన విశ్లేషణ, సంకేతాలను విదేశీ నిపుణులు తనిఖీలు చేసి ఆమోదించటంతో బ్రిడ్జి నిర్మాణం కొనసాగింది. ఈ రైలు మార్గంలో నిర్మించిన కొన్ని సొరంగాల పనుల్లోనూ పాల్గొన్నాను. మొదట్లో ఒక కొండ నుంచి మరో కొండకు వెళ్లటానికి మార్గం కూడా లేదు. పడవలో ప్రయాణించాల్సి వచ్చింది. 17 ఏళ్లు నిరంతర శ్రమ, పట్టుదలతో ప్రపంచ అద్భుతం ఆవిష్కృతమైంది. సాధారణ రైతు కుటుంబం నేపథ్యం ప్రకాశం జిల్లా ఏడుగుండ్లపాడు నా సొంతూరు. సాధారణ రైతు కుటుంబం. తల్లిదండ్రులు అన్నపూర్ణమ్మ, వెంకారెడ్డి. కాకినాడలో ఇంజినీరింగ్ చేశాను. మా ఊరు నుంచి ‘తొలి ఇంజినీరు’ అని అనిపించుకున్నాను. బాపట్ల జిల్లా మోదుకూరు గ్రామానికి చెందిన హరిప్రసాద్రెడ్డితో వివాహమైంది. స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా భారత ప్రభుత్వం సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, ఆర్ట్, మేనేజ్మెంట్ విభాగాల్లో జాతీయస్థాయిలో అత్యుత్తమ సేవలందించిన 75 మంది మహిళల వివరాలతో తీసుకొచి్చన ‘షి ఈజ్ 75’ పుస్తకంలో నాకు కూడా స్థానం కల్పించారు. ఈ ప్రాజెక్టుతో అందిన ప్రతిష్టాత్మక గౌరవం ఇది. -
డయాఫ్రం వాల్ పనులు 'డిజైన్కు విరుద్ధం'
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) గ్యాప్–2లో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదించిన డిజైన్కు విరుద్ధంగా డయా ఫ్రం వాల్ (పునాది) పనులు చేస్తుండటాన్ని అంతర్జాతీయ నిపుణుల కమిటీ తీవ్రంగా ఆక్షేపించింది. డయా ఫ్రం వాల్ను 1.5 మీటర్ల మందంతో నిర్మించేలా డిజైన్ను ఆమోదిస్తే.. క్షేత్ర స్థాయిలో 0.9 మీటర్ల మందంతో బావర్ సంస్థ నిర్మిస్తోందని ఎత్తి చూపింది. మందం తగ్గించటంపై తక్షణమే సమీక్షించి.. తగిన నిర్ణయం తీసుకోవాలని పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ)కి సూచించింది. డయాఫ్రం వాల్ నిర్మాణంలో వినియోగిస్తున్న టీ–16 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంలో నీటి శాతం అధికంగా ఉన్నట్లు అంతర్జాతీయ నిపుణుల బృందం గుర్తించింది. ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమం 32 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నాణ్యంగా ఉంటుందని.. కానీ డయాఫ్రం వాల్లో వినియోగిస్తున్న కాంక్రీట్ మిశ్రమం ఉష్ణోగ్రత 35 డిగ్రీలు ఉందని ఎత్తి చూపింది. డిజైన్ ప్రకారం 1.5 మీటర్ల మందంతో డయాఫ్రం వాల్ నిర్మించాల్సి ఉండగా 0.9 మీటర్ల మందంతో నిర్మిస్తున్నారని.. మందం తగ్గించడంపై సమీక్షించాలని నివేదికలో పేర్కొన్న అంతర్జాతీయ నిపుణుల కమిటీ గత మూడు నెలల్లో 52 ప్యానళ్లతో డయాఫ్రం వాల్ పనులు చేశారని, అందులో 9 ప్యానళ్ల పరిధిలో డయా ఫ్రం వాల్ ఉపరితలంపై నీటి బుడగలు (సీపేజీ) ఉన్నట్లుగా చెప్పింది. సీపేజీ తీవ్రతను తేల్చడానికి ఇప్పటి దాకా వేసిన డయాఫ్రం వాల్పై రెండు నుంచి 3 మీటర్ల లోతు వరకు రంధ్రాలు చేసి, పరీక్షలు చేయాలని ప్రతిపాదించింది. ప్రాజెక్టు భద్రత దృష్ట్యా, సీపేజీ ఉన్న ప్యానళ్ల పరిధిలో డయా ఫ్రం వాల్ పైభాగంలో 1 నుంచి 2 మీటర్ల లోతు వరకు తొలగించి.. మళ్లీ కొత్తగా వేయాలని పీపీఏకు సూచించింది. గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు పూర్తి చేయకుండానే 2016 డిసెంబర్లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ప్రధాన డ్యాం గ్యాప్–2లో డయాఫ్రం వాల్ పనులు ప్రారంభించి.. 2018 జూన్ నాటికి పూర్తి చేసింది. దీంతో 2018 జూన్ తర్వాత వచ్చిన వరదలకు కోతకు గురై దెబ్బతింది. దాంతో దెబ్బతిన్న దాని స్థానంలో కొత్త డయాఫ్రం వాల్ వేయాలని సీడబ్ల్యూసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా కొత్తగా చేపట్టిన డయాఫ్రం వాల్ పనులను సైతం లోపభూయిష్టంగా ఇప్పటి చంద్రబాబు ప్రభుత్వం చేస్తుండటంపై ఇంజినీరింగ్ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు పాపాలు వెంటాడుతున్నాయనడానికి అంతర్జాతీయ నిపుణుల కమిటీ తాజాగా పీపీఏ, సీడబ్ల్యూసీలకు ఇచ్చిన నివేదిక తార్కాణమని రిటైర్డు చీఫ్ ఇంజినీర్ ఒకరు చెప్పారు. ఈ నెల 4న సీడబ్ల్యూసీకి నివేదికపోలవరం ప్రాజెక్టు పనుల్లో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి ఏడాది క్రితం సియాన్ హించ్బెర్గర్, మెస్సర్స్ సీ రిచర్డ్ డొన్నెళ్లి, గియానో ఫ్రాంకో డీ క్యాప్పో, డేవిడ్ పాల్ సభ్యులతో కూడిన అంతర్జాతీయ నిపుణుల కమిటీని సీడబ్ల్యూసీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నాలుగోసారి గత నెల 5 నుంచి 9వ తేదీ వరకు పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి.. అధికారులు, కాంట్రాక్టు సంస్థలతో సమీక్షించింది. క్షేత్ర స్థాయి పర్యటనలో గుర్తించిన అంశాలు, అధికారుల సమీక్షలో వెల్లడైన విషయాలు ఆధారంగా ఈ నెల 4న పీపీఏ, సీడబ్ల్యూసీలకు అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. ప్రాజెక్టు పనుల్లో లోపాలను ఎత్తిచూపుతూ.. వాటిని సరిదిద్దుకోవడానికి చేపట్టాల్సిన చర్యలను ఆ నివేదికలో సిఫార్సు చేసింది. ఆ నివేదికలో ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి. పనుల్లో తీవ్ర జాప్యం ⇒ ప్రధాన డ్యాం గ్యాప్–2లో డయా ఫ్రం వాల్ పనులను 66 వేల చదరపు మీటర్ల పరిధిలో చేయాలి. నిర్దేశించుకున్న షెడ్యూలు ప్రకారం వర్షాలు ప్రారంభం కావడానికి ముందే అంటే 2025 జూన్ నాటికి 28 వేల చదరపు మీటర్ల పరిధిలో డయాఫ్రం వాల్ పనులు పూర్తి చేయాలి. 2025 ఏప్రిల్ నాటికి 15 వేల చదరపు మీటర్ల పరిధిలో పనులు పూర్తి చేయాల్సి ఉండగా.. 12 వేల చదరపు మీటర్ల పరిధిలో మాత్రమే పూర్తయ్యాయి. అంటే.. మూడు వేల చదరపు మీటర్ల పరిధిలో పనులు వెనుకబడినట్లు స్పష్టమవుతోందని నిపుణుల కమిటీ తేల్చింది. ⇒ పనుల్లో జాప్యానికి కాంట్రాక్టు సంస్థ బావర్ చెబుతున్న కారణాలు సహేతుకంగా లేవని నిపుణుల కమిటీ కుండబద్దలు కొట్టింది. డయాఫ్రం వాల్ ప్యానళ్లను అత్యంత కఠిన శిల (సౌండ్ హార్డ్ రాక్) లోపలికి రెండు మీటర్ల లోతు వరకు దించితేనే.. సీపేజీని సమర్థవంతంగా నియంత్రించవచ్చని పేర్కొంది. అలా చేయడం వల్లే పనులు ఆలస్యమవుతున్నాయని చెప్పడం విడ్డూరమని పేర్కొంది. డయాఫ్రం వాల్లో సీపేజీ⇒ ప్రధాన డ్యాం గ్యాప్–2లో డయాఫ్రం వాల్ పనుల్లో ఏప్రిల్ వరకు 373 ప్యానళ్లు వేయాల్సి ఉండగా, 52 ప్యానళ్ల పరిధిలో మాత్రమే పనులు పూర్తయ్యాయి. ఇందులో 9 ప్యానళ్ల పరిధిలో డయాఫ్రం వాల్ పైభాగంలో 1 నుంచి 2 మీటర్ల లోతు వరకూ నీటి బుడగలు బయటకు వస్తున్నట్లు(సీపేజీ) అంతర్జాతీయ నిపుణుల కమిటీ గుర్తించింది. ⇒ డయాఫ్రం వాల్లో వినియోగించే ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమం 32 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నాణ్యంగా ఉంటుందని గతంలో నిర్వహించిన సమావేశాల్లో తాము అధికారులకు చెప్పామని స్పష్టం చేసింది. కానీ.. పోలవరం డయాఫ్రం వాల్ నిర్మాణంలో వినియోగిస్తున్న ప్లాస్టిక్ కాంక్రీట్ ఉష్ణోగ్రత 35 డిగ్రీలు ఉన్నట్లుగా గుర్తించింది. ప్లాస్టిక్ కాంక్రీట్లో నీటి శాతం అధికంగా ఉన్నట్లుగా పసిగట్టింది. ⇒ కాంక్రీట్ మిశ్రమంలో ఉష్ణోగ్రత, నీటి శాతం ఎక్కువగా ఉండటం, ముడి పదార్థాల మోతాదు నిర్దేశించిన ప్రమాణాల మేరకు లేక పోవడం వల్లే సిమెంట్, బెంటనైట్, కంకర, ఇసుక, నీరు విడిపోతోందని (సెగ్రిగేట్), దానివల్ల అది పటిష్టంగా, నాణ్యంగా ఉండదని స్పష్టం చేసింది. అందువల్లే డయాఫ్రం వాల్లో సీపేజీ వస్తోందని అభిప్రాయపడింది.⇒ సీపేజీ తీవ్రతను తేల్చడానికి తక్షణమే డయాఫ్రం వాల్పై రెండు మీటర్ల లోతు వరకు వరుసగా రంధ్రాలు వేసి.. పరీక్షలు చేయాలని పీపీఏకు సూచించింది. ప్రాజెక్టు భద్రత దృష్ట్యా సీపేజీ ఉన్న చోట్ల డయాఫ్రం వాల్ పైభాగం 1 నుంచి 2 మీటర్ల లోతు వరకూ తొలగించి.. దానిపై కొత్తగా డయాఫ్రం వాల్ వేయాలని సిఫార్సు చేసింది.నాడూ నేడూ అవే తప్పులు⇒ సీడబ్ల్యూసీ ఆమోదించిన ప్రాజెక్టు నిర్మాణ ప్రణాళిక ప్రకారం.. గోదావరి వరదను మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను తొలుత పూర్తి చేయాలి. గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించాక.. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల మధ్య ప్రధాన డ్యాం గ్యాప్–2లో 1,396.6 మీటర్లు్ల, గ్యాప్–1లో 393 మీటర్ల పొడవున డయాఫ్రం వాల్లను నిర్మించాలి.⇒ కానీ.. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం వరదను మళ్లించే పనులను పూర్తి చేయకుండానే 2016 డిసెంబర్లో ప్రధాన డ్యాం గ్యాప్–2లో డయాఫ్రం వాల్ పనులను ప్రారంభించి, చారిత్రక తప్పిదం చేసింది. 2017 జూన్ వరకూ డయాఫ్రం వాల్ పనులు చేసింది. ఆ తర్వాత గోదావరి వరద ఆ డయాఫ్రం వాల్ మీదుగా ప్రవహించడంతో కోతకు గురైంది. అయినా సరే.. 2017 నవంబర్లో మళ్లీ పనులు ప్రారంభించి, 2018 జూన్ నాటికి గ్యాప్–2లో 1.396.6 మీటర్ల పొడవున డయాఫ్రం వాల్ను పూర్తి చేసింది.⇒ ఆ డయాఫ్రం వాల్పై 2018 జూన్ తర్వాత వచ్చిన గోదావరి వరద ప్రవహించింది. దీంతో వరద ఉద్ధృతికి డయాఫ్రం వాల్ కోతకు గురై దెబ్బతిందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఆదిలోనే తేల్చింది. 2019 మే 30న వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేసి.. 2021 జూన్ 11న గోదావరి వరదను మళ్లించింది.⇒ ఆ తర్వాత గ్యాప్–1లో డయాఫ్రం వాల్ను పూర్తి చేసింది. గ్యాప్–2లో దెబ్బతిన్న డయాఫ్రం వాల్ భవితవ్యాన్ని తేల్చడంలో సీడబ్ల్యూసీ తీవ్ర జాప్యం చేసింది. లేదంటే అప్పట్లోనే డయాఫ్రం వాల్ను పూర్తి చేసే వారని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంతర్జాతీయ నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు.. గ్యాప్–2లో దెబ్బతిన్న డయాఫ్రం వాల్కు ఎగువన కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి గతేడాది సెప్టెంబర్లో సీడబ్ల్యూసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణంలోనూ చంద్రబాబు సర్కార్ అవే తప్పులు చేస్తుండటంపై ఇంజినీరింగ్ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ తుంగలోకి⇒ పోలవరం ప్రాజెక్టు భద్రత దృష్ట్యా ప్రధాన డ్యాం గ్యాప్–2లో దెబ్బ తిన్న డయాఫ్రం వాల్ స్థానంలో కొత్త డయా ఫ్రం వాల్ నిర్మించడం శ్రేయస్కరమని అంతర్జాతీయ నిపుణుల కమిటీ చేసిన సూచనను సీడబ్ల్యూసీ ఆమోదించింది. దెబ్బతిన్న డయాఫ్రం వాల్కు 6 మీటర్ల ఎగువన కొత్త డయా ఫ్రం వాల్ నిర్మించాలని ప్రతిపాదించింది. ⇒ కొత్త డయా ఫ్రం వాల్ను 1.5 మీటర్ల మందంతో 1,396.6 మీటర్ల పొడవున 100 మీటర్ల లోతుతో (పునాది) నిర్మించేలా ప్రధాన కాంట్రాక్టు సంస్థ మేఘా డిజైనర్ ఆఫ్రి డిజైన్ (ఆకృతి)ను రూపొందించింది. దాన్ని అంతర్జాతీయ నిపుణుల కమిటీ సమీక్షించి, అనుమతి ఇచ్చింది. దాంతో ఆ డిజైన్ను సీడబ్ల్యూసీ ఆమోదించింది. టీ–16 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంతో డయా ఫ్రం వాల్ను నిర్మించాలని పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ), రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులను నిర్దేశించింది. ⇒ డయాఫ్రం వాల్ నిర్మించే సమయంలో అధిక ఒత్తిడితో ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమాన్ని పంపినప్పుడు విచలనం, భ్రమణానికి గురవడం వల్ల డయా ఫ్రం వాల్ మందం గరిష్టంగా 0.3 శాతం అంటే 4.5 సెంటీమీటర్ల వరకు తగ్గొచ్చని సీడబ్ల్యూసీ పేర్కొంది. ⇒ రూ.990 కోట్ల వ్యయంతో చేపట్టిన కొత్త డయాఫ్రం వాల్ పనులను 2016–18 మధ్య ఆ పనులు చేసిన బావర్ సంస్థకు మేఘా సబ్ కాంట్రాక్టుకు ఇచ్చింది. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ను తుంగలో తొక్కి.. 1.5 మీటర్ల (1500 మిల్లీ మీటర్లు) మందంతో కాకుండా 0.9 మీటర్ల (900 మిల్లీమీటర్లు) మందంతో బావర్ సంస్థ డయా ఫ్రం వాల్ పనులు చేస్తోందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఎత్తిచూపింది. అంటే.. సీడబ్ల్యూసీ ఆమోదించిన మందం కంటే 0.6 మీటర్లు మందం తగ్గించి పనులు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ⇒ మందం తగ్గించడంపై తక్షణమే సమీక్షించి.. దీనివల్ల ఎలాంటి పరిణామాలు జరుగుతాయన్నది విశ్లేషించి.. దీనిపై సముచితమైన నిర్ణయం తీసుకోవాలని పీపీఏకు అంతర్జాతీయ నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది.⇒ డయాఫ్రం వాల్ నిర్మాణంలో ఒక ప్యానల్ను మరో ప్యానల్తో నిలువునా జత చేసేటప్పుడు (ఓవర్ల్యాప్).. 7.5 సెంటీమీటర్ల పొడవున ఒకదానితో మరొకటి జత చేస్తున్నారని.. కనీసం పది సెంటీ మీటర్ల పొడవున ఓవర్ ల్యాప్ చేయాలని సూచించింది. అప్పుడే సీపేజీకి సమర్థవంతంగా అడ్డుకట్ట వేయొచ్చని పేర్కొంది. -
కృష్ణంరాజు వ్యాఖ్యలను తమకు ఆపాదించడంపై వైఎస్సార్సీపీ ఖండన
సాక్షి, తాడేపల్లి: జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను తమకు ఆపాదించటంపై వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండించింది. పార్టీకి, నాయకులకు ఆపాదిస్తూ టీడీపీ, దానికి కొమ్ము కాస్తున్న మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. ఈ వ్యవహారానికి రాజకీయాన్ని జోడించి బురదజల్లే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వైఎస్సార్సీపీ పేర్కొంది. ‘‘జర్నలిస్టు కృష్ణంరాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కాదు. పాత్రికేయుడిగా ఆయన సాక్షి టీవీ చర్చలో పాల్గొన్నారు. ఆ వ్యాఖ్యలు ఆయనకు సంబంధించినవి. మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు’’అని వైఎస్సార్సీపీ స్పష్టం చేసింది.‘‘తన వ్యాఖ్యలపై జర్నలిస్ట్ కృష్ణంరాజు ఇచ్చిన వివరణను కూడా అనేక మాధ్యమాల్లో చూశాం. ఏ వేదికమీద అయినా మహిళల గౌరవమర్యాదలకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తే అవి తప్పకుండా ఖండిచదగ్గవి. మా పార్టీ అభిప్రాయంకూడా ఇదే. కానీ, మా పార్టీకి సంబంధంలేని వ్యక్తి, టీవీలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తే, అవి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీవే అన్నట్టుగా, అవి మా పార్టీకి చెందిన నాయకులవే అన్నట్టుగా తెలుగుదేశంపార్టీ, దాని అనుబంధ మీడియా ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం...దీన్ని అడ్డం పెట్టుకుని మా పార్టీ అధ్యక్షులు, ఆయన కుటుంబ సభ్యుల మీద టీడీపీ సోషల్ మీడియా, వారి నాయకులు ఇష్టానుసారంగా, అనైతికంగా పోస్టులు పెడుతూ, తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. జర్నలిస్టు కృష్ణం రాజు వ్యాఖ్యలు వ్యక్తిగతమని, వాటిని సమర్థించడంలేదని సాక్షిటీవీ ప్రజలకు ప్రకటనచేసిన విషయాన్ని ఈ సందర్భంగా మరోసారి గుర్తుచేస్తున్నాం. అదే సమయంలో ప్రత్యక్షంగానైనా, పరోక్షంగానైనా, అప్రయత్నంగానైనా మహిళల గౌరవ మర్యాదలకు భంగం కలిగించే వ్యాఖ్యలను, ప్రకటనలను ఖండిస్తున్నామని, ఇలాంటి వాటిని సమర్థించబోమని మరోసారి స్పష్టం చేస్తున్నాం’’ అని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. -
కేఎస్ఆర్ లైవ్ షోలో కృష్ణంరాజు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం: సాక్షి టీవీ
హైదరాబాద్: శుక్రవారం నాటి కేఎస్ఆర్ లైవ్ షోలో విశ్లేషకుడు కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని సాక్షి టీవీ పేర్కొంది. కృష్ణంరాజు వ్యాఖ్యలను కూటమి నేతలు సాక్షి టీవీకి ఆపాందించడం సరికాదని తీవ్రంగా ఖండించింది. సాక్షి మీడియా ఎల్లప్పుడూ మహిళల పట్ల అత్యంత గౌరవాభిమానాలు చూపుతుందని.. సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు వ్యాఖ్యలను.. సాక్షి మీడియా ఎంత మాత్రం సమర్ధించదని సాక్షి టీవీ స్పష్టం చేసింది.ఎవరినీ కించపరిచే ఉద్దేశం నాకు లేదు: కృష్ణంరాజుఇదిలా ఉండగా, కృష్ణంరాజు కూడా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. మహిళల మనోభావాలను కించపరిచే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదన్నారు. ఒకవేళ ఎవరి మనోభావాలైన కించపరిచి ఉంటే క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నానని కృష్ణంరాజు అన్నారు. -
రైతుల గోడు పట్టదా?: కూటమి సర్కార్పై కారుమూరి ఫైర్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో పొగాకు పండించిన రైతుల గోడు వర్ణనాతీతంగా ఉందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కొనుగోలు చేసే వారు లేక పొగాకు రైతులు అల్లాడుతుంటే కూటమి ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు ఈనెల 11న ప్రకాశం జిల్లా పొదిలికి మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వెడుతున్నారని వెల్లడించారు. ఒక్క పొగాకే కాకుండా రాష్ట్రంలో కోకో, మామిడి, మిర్చి ఇలా ఏ పంట చూసినా రైతుల కష్టాలను ఆదుకునే వారే కనిపించడం లేదని ధ్వజమెత్తారు. వ్యవసాయం దండుగ అనే రీతిలోనే సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..పొగాకు రైతుల కష్టాల గురించి తెలుసుకుని, వారికి అండగా ఉండేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ పొదిలి వెడుతున్నారని ప్రకటించగానే, కూటమి ప్రభుత్వం స్పందించి హడావుడిగా పొగాకు కొనుగోళ్ళ విషయంలో చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించి, చేతులు దులుపుకుంది. వర్షాల వల్ల వైఎస్ జగన్ ముందుగా ప్రకటించిన తేదీకి బదులుగా ఈ నెల 11వ తేదీన వెళ్ళేందుకు సిద్ధపడ్డారు.ఈ విషయం తెలియగానే మళ్లీ మంత్రులు ప్రెస్మీట్ పెట్టి రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామంటూ హామీలు గుప్పిస్తున్నారు. కేవలం మాటలకే తప్ప చేతల పరంగా ఎటువంటి చర్యలు కనిపించడం లేదని రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కూటమి ప్రభుత్వం వందల కోట్ల రూపాయలతో కొత్త హెలికాఫ్టర్లను కొనుగోలు చేసేందుకు చూపే శ్రద్ధలో కనీసం రైతులను ఆదుకునేందుకు రూ.1000 కోట్లతో అయినా స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయలేరా అని రైతులే ప్రశ్నిస్తున్నారుసిండికేట్గా మారిన పొగాకు కంపెనీలురాష్ట్రంలో పొగాకు సాగు చేసిన రైతులు కొనుగోలు చేసేవారు లేక అల్లాడిపోతున్నారు. బర్లీ పొగాకును ప్రోత్సహించిన పలు కంపెనీలు తరువాత ఆ పొగాకును కొనుగోలు చేయకుండా మోసం చేస్తున్నా ప్రభుత్వం తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. రెండుమూడు బేళ్ళు కొనుగోలు చేసి, మిగిలిన దానిని వదిలిస్తుండటంతో రైతులు అన్యాయమైపోతున్నారు. మొత్తం ఏడు కంపెనీలు సిండికేట్గా మారి రేటు పెరగకుండా రైతులను దగా చేస్తున్నాయి. ఈ రోజు రైతుల వద్ద మొత్తం 55 మెట్రిక్ టన్నుల పొగాకు నిల్వలు ఉంటే, ఇప్పటి వరకు కేవలం 25 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోళ్ళు చేశారు.మిగిలిన పొగాకును దాచుకునేందుకు కూడా అవకాశం లేకపోవడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరానికి రూ.1.50 లక్షలు పెట్టుబడులు పెట్టిన వారికి కనీసం పెట్టిన వ్యయం కూడా గిట్టుబాటు కావడం లేదు. తక్షణం మార్క్ఫెడ్ను రంగంలోకి దింపి పొగాకు కొనుగోళ్ళు జరిపించాలి. గతంలో వైఎస్ జగన్ పాలనలో పొగాకు రైతులు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటే ఏకంగా రూ.100 కోట్లు కేటాయించి కొనుగోళ్ళు చేయించేందుకు చర్యలు తీసుకున్నారు. గతంలో ఈక్రాప్, ఇన్సూరెన్స్ కట్టించి, రైతులకు అండగా నిలిచారు. గతంలో ఒంగోలులో కందులు పండకపోతే ఈ-క్రాప్, ఇన్సూరెన్స్ వల్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.12000 పరిహారం అందింది.రైతుల వేదన అరణ్య రోదనరాష్ట్రంలో రైతుల వేదన అరణ్య రోదనగా మిగిలిపోతోంది. రాష్ట్రంలో కోకో రైతులు రూ.900 రేటు కావాలంటే రూ.450 కొంటున్నారు. అదనగా రూ.50 కల్పిస్తామని చెప్పారే తప్ప అది కూడా కల్పించడం లేదు. గత ప్రభుత్వంలో రేటు పడిపోయిన సందర్భంలో రూ.3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి, అవసరమైతే మార్క్ఫెడ్తో కూడా కొనుగోళ్ళు చేయించి రైతులను ఆదుకున్నాం. మిర్చి రైతులను ఆదుకున్న పరిస్థితి కనిపించడం లేదు. అమ్మబోతో అడవి, ప్రజలు కొనబోతే కొరివిలా తయారైంది.రాష్ట్రంలో దళారీ వ్యవస్థను పెంచిపోషిస్తున్నారు. మామిడి, కోకో, పొగాకు పంటలకు గిట్టుబాటు రేటు కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ధాన్యానికి మద్దతు ధర ఇస్తామని, 24 గంటల్లో సొమ్ము రైతుకు చెల్లిస్తామని చెప్పారు. ఏప్రిల్ 6న ధాన్యం కొనుగోలు చేసి, నేటికీ చెల్లింపులు చేయలేదు. మంత్రి దుర్గేష్ను రైతులు నిలదీసిన విషయం వాస్తవం కాదా? సివిల్ సప్లయిస్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఏం చేస్తున్నారు? పదిలక్షల మెట్రిక్ టన్నులకు కానూ, 7 లక్షల మెట్రిక్ టన్నులకే పశ్చిమ గోదావరిజిల్లాలో కొనుగోలుకు అనుమతి ఇచ్చారు. మిగలిన ధాన్యంను ఎవరికి అమ్ముకోవాలి? తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలోనూ ధాన్యం రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. పట్టుబడిన బియ్యం వివరాలు బయటపెట్టండివైఎస్ జగన్ హయాంలో ఇంటింటికీ రేషన్ను వాహనాల ద్వారా ఇస్తే పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్కు తరలిపోతోందని కూటమి ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేసింది. అందుకోసం ఆ వ్యవస్థను రద్దు చేసి, రేషన్ షాప్ల వద్దకే వెళ్ళాలని ప్రజలకు సూచించింది. నేడు ఎండలకు రేషన్ కోసం వెళ్ళి క్యూలైన్లలో నిలబడి పేదలు వడదెబ్బ బారిన పడుతున్నారు. తాజాగా విశాఖలో అక్రమంగా తరలిస్తున్న రైస్ను పట్టుకున్నారు.ఎండీయు వాహనాల వల్లే రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని ఆరోపించిన ప్రభుత్వం, ఇప్పుడు ఆ వాహనాలను రద్దు చేసిన తరువాత కూడా అక్రమంగా బియ్యం రవాణా ఎలా జరుగుతోందో చెప్పాలి. అలాగే పట్టుబడిన బియ్యంను మా ప్రభుత్వంలో వేలం వేసే విధానం ఉండేది. కానీ కూటమి ప్రభుత్వంలో ఇలా పట్టుకున్న బియ్యం ఎక్కడికి వెడుతుందో తెలియడం లేదు. ఏడాది కాలంగా ఎంత బియ్యాన్ని పట్టుకున్నారు, ఆ బియ్యాన్ని ఎలా వేలం వేశారో వెల్లడించాలి. -
ఏపీ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఏపీలోకి ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరాల అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు కాసేపట్లో విడుదలయ్యాయి. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో 1,35,826 మంది, రెండో ఏడాదిలో 97,963 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఒక్క క్లిక్తో ఫలితాలను ఇక్కడ చూడండి..ఫలితాల కోసం ఈ కింది లింక్లను క్లిక్ చేయండి.. AP Intermediate 1st Year Adv. Supplementary Results 2025 (General)https://results.sakshieducation.com/Results2025/Andhra-Pradesh/Inter/Jr-Inter/Supply/ap-intermediate-1st-year-results-2025.htmlAP Intermediate 2nd Year Adv. Supplementary Results 2025 (General)https://results.sakshieducation.com/Results2025/Andhra-Pradesh/Inter/Sr-Inter/Supply/ap-intermediate-2nd-year-results-2025.htmlAP Intermediate 1st Year Adv. Supplementary Results 2025 (Vocational)https://results.sakshieducation.com/Results2025/Andhra-Pradesh/Inter/Jr-Inter/Supply/VOC/ap-intermediate-1st-year-vocational-results-2025.htmlAndhra Pradesh Intermediate Second Year Supply Results 2025 (General)https://results.sakshieducation.com/Results2025/Andhra-Pradesh/Inter/Sr-Inter/Supply/Voc/ap-intermediate-2nd-year-vocational-results-2025.html -
జోసాలో సీట్ల జోష్
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక సాంకేతిక విద్యాసంస్థలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) సంస్థల్లో సీట్ల సంఖ్య భారీగా పెరిగింది. వీటితోపాటు 2025–26 విద్యా సంవత్సరానికి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సహకారంతో నడిచే గ్రాడ్యుయేట్ ఫీల్డ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (జీఎఫ్టీఐ)లలో 62,853 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం సాంకేతిక మార్పులకు అనుగుణంగా విద్యార్థులకు కొత్త కోర్సులను పరిచయం చేస్తూ అవకాశాలను మరింత మెరుగుపరుస్తోంది. దీంతో గత ఏడాదితో పోలిస్తే 2916 సీట్లు పెరిగాయి.జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ఐఐటీ, ఎన్ఐటీలు ట్రిపుల్ఐటీలు, జీఎఫ్టీఐ లకు సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ను విడుదల చేసింది. అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య గత సంవత్సరం కంటే 4.86 శాతం పెరుగుదలను ప్రతిబింబించింది. ఐఐటీల్లో నిరుడు 17,760 సీట్లు ఉండగా తాజాగా 400 పెరిగాయి. ఎన్ఐటీల్లో 296 కొత్త సీట్లను చేర్చారు. ఈ ఏడాది ట్రిపుల్ ఐటీల్లో అత్యధికంగా 1,394 సీట్లు అందుబాటులోకి రావడం విశేషం.జీఎఫ్టీఐలలో 826 సీట్లు పెరిగాయి. ఈ నెల 3 నుంచి జోసా రిజిస్ట్రేషన్లు చేపట్టింది. 11 వరకు ఆప్షన్లను ఎంపిక చేసుకోవచ్చు. అనంతరం రెండుసార్లు మాక్ సీట్ ప్రక్రియ నిర్వహిస్తారు. మాక్ సీట్ అలాట్మెంట్ ఆధారంగా ర్యాంకు ప్రకారం ఎక్కడ సీటు వస్తుందో విద్యార్థులకు అవగాహన ఏర్పడుతుంది. మాక్ సీట్–1 కేటాయింపు జాబితాను జూన్ 9న, మాక్ సీట్–2 కేటాయింపు జాబితాను జూన్ 11న ప్రకటిస్తారు. జోసా–2025లో భాగంగా అకడమిక్ ప్రోగ్రామ్స్ కోసం అభ్యర్థుల నమోదు, ఆప్షన్ల ప్రక్రియ జూన్ 12తో ముగుస్తుంది. ఈ ఏడాది కౌన్సెలింగ్లో 127 విద్యా సంస్థలు పాల్గొంటున్నాయి. జూన్ 14 నుంచి జూలై 16 వరకు ఆరు విడతల్లో సీట్లు కేటాయింపు జరుగనుంది.62 శాతం సీట్లు పెరుగుదలదేశంలో 23 ఐఐటీలు, 31 ఎన్ఐటీలు, 26 ట్రిపుల్ ఐటీలతో పాటు 47 జీఎఫ్టీఐలు, ఇతర సంస్థలు జోసా కౌన్సెలింగ్లో పాల్గొంటున్నాయి. కొన్నేళ్లుగా ఐఐ టీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీ, జీఎఫ్టీఐల్లో సీట్లు గణనీయంగా పెరుగుతున్నాయి. 2019కి ముందువరకు ఈ సంస్థల్లో సీట్ల సంఖ్య నామమాత్రంగానే ఉండేది. ఉన్నత ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్య కోసం విద్యార్థులు ఏటా విదేశాలకు వెళ్లి రూ.లక్షలు ఖర్చుచేసి చదువుకోవాల్సి వచ్చేది. ఈ క్రమంలో ప్రతిష్ఠాత్మక సంస్థల్లో సాంకేతిక విద్యను మెరుగుపరిచి విద్యార్థులకు అందుబాటులోకి వచ్చేలా ఏటా సీట్ల సంఖ్యను పెంచుతున్నారు. దీంతో 2019లో 38,704 సీట్లు ఉండగా.. ఇప్పుడు 62,853కు చేరాయి. అంటే ఆరేళ్లలో 24,149 సీట్లు (62 శాతం) పెరిగాయి. గతంలో డీపీ సింగ్ నివేదిక మేరకు 2024 నాటికి 50 శాతం సీట్ల పెంపు లక్ష్యాన్ని నెరవేర్చింది.ఐఐటీల్లో మరింత..ఐఐటీల్లో దశలవారీగా వచ్చే ఐదేళ్లలో మరో 6,500 సీట్లను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ప్రస్తుతం 18,160 సీట్లు ఉండగా.. అవి 24 వేలు కానున్నాయి. కొత్త తరం ఐఐటీలైన తిరుపతి, ధార్వాడ్, పాలక్కాడ్, జమ్ము, భిలాయ్లో ఏటా 200కు పైగా కొత్త యూజీ సీట్లను పెంచుకునేలా చర్యలు చేపట్టింది. ఇలా ఏడాదికి దాదాపు 1,500 సీట్లు పెరగనున్నాయి. ఏపీ, తెలంగాణాల్లో 3,424ఏపీ, తెలంగాణలో జోసా ద్వారా 3,424 సీట్లను భర్తీ చేయనుంది. నిరుడు 3,384 ఉండగా 40 సీట్లు పెరిగాయి. హైదరాబాద్ ఐఐటీలో 630, తిరుపతి ఐఐటీలో 254, వరంగల్ నిట్లో 1049, తాడేపల్లిగూడెం నిట్లో480, స్పా విజయవాడలో 132, హైద్రాబాద్ సెంట్రల్ వర్సిటీలో 110, శ్రీ సిటీ ట్రిపుల్ ఐటీలో 438, కర్నూలు ట్రిపుల్ ఐటీలో 331 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఐఐటీ హైదరాబాద్లో 35 సీట్లు పెరిగాయి. నిరుడు నాలుగేళ్ల ఇంజినీరింగ్ ఫిజిక్స్ కోర్సును 10 సీట్లతో అందుబాటులోకి తేగా ఇప్పుడు 35కి పెంచారు. -
రైతుపై సర్కారు పగాకు
నాలుగేళ్లుగా నల్లబర్లీ సాగు చేస్తున్నా. కిందటి సంవత్సరం వరకు మంచి ధర లభించింది. కంపెనీలు ఇచ్చిన భరోసాతో 12 ఎకరాలు కౌలుకు తీసుకొని నల్లబర్లీ వేశా. కౌలుకే ఎకరాకు రూ.30 వేల వరకు చెల్లించా. సాగుకు ఎకరాకు రూ.1.30 లక్షలైంది. బంగారం కుదవపెట్టి రూ.4 లక్షలు, ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.3 వడ్డీకి మిగిలిన మొత్తం తెచ్చా. నిరుడు ఎకరాకు 15–18 క్వింటాళ్ల దిగుబడి రాగా, క్వాలిటీతో సంబంధం లేకుండా క్వింటా రూ.15వేలు–18 వేల మధ్య కొన్నారు. ఈ ఏడాది కంపెనీల చుట్టూ తిరిగినా కొనేవారు లేరు. కంపెనీల మాయమాటలు నమ్మి మోసపోయాం. పూర్తిస్థాయిలో ప్రభుత్వం కొంటే కనీసం కొంత గట్టెక్కుతాం. లేదంటే ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదు. – గెద్దల నాగబాబు, బాపట్ల జిల్లా వంకాయలపాడు (బాపట్ల జిల్లా పర్చూరు, చీరాల ప్రాంతాల నుంచి సాక్షి ప్రతినిధి) : నాలుగు జిల్లాలు.. దాదాపు లక్ష ఎకరాల్లో పంట.. వేలమంది రైతులు.. ఇప్పుడు లబోదిబోమంటున్నారు. పొగాకు కంపెనీల మాటలు నమ్మి నిండా మునిగామని గుండెలు బాదుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం చేతులెత్తేస్తుండడంతో ఏంచేయాలో తెలియక తీవ్ర ఆందోళనలో ఉన్నారు..! బాపట్ల, గుంటూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో ఏ పల్లెకు వెళ్లినా రైతుల్లో ఒకటే వ్యథ. ‘‘గతేడాది వరకు మంచి ధరలు లభించడంతో పాటు కంపెనీలు ఇచ్చిన భరోసాతో ఈసారి పెద్దఎత్తున నల్లబర్లీ పొగాకు (హెచ్డీ బర్లీ) సాగు చేశాం. పంట పండాక ప్రభుత్వం, కంపెనీలు మొహం చాటేస్తున్నాయి. ఎవరికి చెప్పుకోవాలి’’ అనే ప్రశ్నలు వస్తున్నాయి. కౌలు, కూలీల ధరలు, ఇతర ఖర్చులు పెరగడంతో ఎకరా సాగుకు రూ.లక్షన్నర అయిందని.. నిరుడు ఎకరాకు 15–18 క్వింటాళ్ల దిగుబడి రాగా, ఈసారి సగటున 10–12 క్వింటాళ్లకు పడిపోయిందని వారు వాపోతున్నారు. ఐడీ నంబర్లు ఇచ్చి మరీ సాగుచేయించిన పొగాకు కంపెనీలు.. డిమాండ్ లేదనే సాకుతో పంట కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కళ్లుమూసుకున్న కూటమి ప్రభుత్వంసీఎం యాప్ ద్వారా ప్రతి పంటకు కోతకొచ్చే సమయంలోనే మార్కెట్ ధరలను అంచనా వేసి ఏ ఒక్క రైతు నష్టపోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని గొప్పలు చెబుతున్న కూటమి ప్రభుత్వం నల్లబర్లీ రైతులను గాలికొదిలేసింది. మిర్చి రైతుల మాదిరిగానే పొగాకు రైతులను ఏమార్చేందుకు యత్నిస్తోంది. నల్లబర్లీకి సాధారణంగా డిసెంబరు నుంచి ఆకు కొట్టడం మొదలుపెట్టి మార్చి ఆఖరుకు పూర్తిచేస్తారు. ఫిబ్రవరిలో కొనుగోళ్లు మొదలై ఏప్రిల్కు దాదాపు పూర్తవుతాయి. అరకొరగా ఆఖరులో వచ్చే పొగాకును మాత్రమే మే నెలలో మార్కెట్కు తెస్తుంటారు. ఈసారి జూన్ తొలివారంలోనూ కనీసం మూడో వంతు పొగాకు కూడా కొనని పరిస్థితి నెలకొంది.పంట అమ్మితేనే కూలీ డబ్బులిచ్చే దుస్థితిపంట కొనేవారు లేకపోవడంతో రైతులు పొలాల్లో కట్టెలు పెట్టి వాటిపై బేళ్లు నిల్వ చేశారు. పైన పట్టాలు కప్పి కాపలా కాస్తున్నారు. ఆకు కొట్టడం నుంచి తాళ్లకు గుచ్చడం వరకు కూలీలకు ఒప్పందాలు ఇచ్చి పనులు చేయించారు. పంట అమ్మితే కానీ వీరికి సొమ్ములివ్వలేని పరిస్థితి. ఇటుచూస్తే క్వింటా రూ.7 వేలకు కూడా కొనేవారు లేరు. దాదాపు ప్రతి రైతు ఎకరాకు రూ.80 వేల నుంచి రూ.లక్ష నష్టపోతున్నారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య యత్నాలు చేస్తున్నారు. పొగాకు రైతులకు అండగా వైఎస్సార్సీపీతో పాటు రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే కానీ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. కాగా, చివరి కేజీ వరకు పొగాకును కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఖరీఫ్ సాగుకు దూరంగా ఉండాలని (క్రాప్ హాలిడే) భావిస్తున్నారు.కూటమి కార్యకర్తలకు మేలు చేసేందుకేకంపెనీల భరోసాతోనే రైతులు ఈసారి నల్లబర్లీ సాగు చేశారని, చాలా కంపెనీలు రైతులకు బాండ్లు ఇచ్చాయని ప్రభుత్వానికి తెలిసినా... వాటిపై ప్రభుత్వానికి కనీస నియంత్రణ కొరవడింది. పంట మార్కెట్కు వచ్చే సమయంలోనే ప్రభుత్వం జోక్యం చేసుకుని కంపెనీలపై ఒత్తిడి తెచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. పొగాకు కోతలు పూర్తయి రెండు నెలలు గడుస్తోంది. ఖరీఫ్ సీజన్ కూడా మొదలైంది. అయినా సరే నల్లబర్లీ పంట చేలల్లోనే ఉండిపోయింది. ఈ ఏడాది లక్ష టన్నుల దిగుబడి అంచనా వేయగా, గ్రేడ్లను బట్టి 85 వేల టన్నులు మార్కెట్కు వస్తుందని లెక్క. కానీ, ఇప్పటివరకు అదీ అతికష్టమ్మీద 24.58 వేల టన్నులు మాత్రమే కంపెనీలు, ట్రేడర్లు కొనుగోలు చేశారు. రైతు ఎవరైనా 10 చెక్కులు (క్వింటాళ్లు) తీసుకెళ్తే 3–4 చెక్కులు కొని మిగిలింది నాణ్యత లేదనే సాకుతో వెనక్కి పంపేస్తున్నారు. రైతుల వద్ద మరో 55 వేల టన్నుల పంట ఉంది. గత నెలలో వర్షాలకు పొగాకు దెబ్బతిన్నది. పంట నాణ్యతరోజురోజుకు తగ్గుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అండగా నిలవాల్సిన ప్రభుత్వం వ్యాపారులకు వత్తాసు పలికేలా వ్యవహరించింది. మిర్చి మాదిరిగానే కాలయాపన చేస్తూ పొగాకు రైతులను కంపెనీలకు వదిలేసింది. ఓవైపు ధర లేక రైతులు ఆత్మహత్య యత్నాలు చేస్తుండగా, మరోపక్క పొగాకు బేళ్లను తగలబెడుతున్నారు. కానీ, కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదు. నెల రోజుల క్రితం కంపెనీలకు లక్ష్యాలను నిర్దేశించినా ఏ ఒక్కటీ కొనుగోలు చేసిన పాపాన పోలేదు. కాగా, ఏ గ్రామంలో ఎంత మంది రైతులు ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు..? ఎంత దిగుబడి వచ్చింది..? ఎంత అమ్ముకున్నారు..? రైతుల వద్ద ఇంకా ఎంత ఉంది? అని ప్రభుత్వం తెలుసుకుంటోంది. ఇదంతా కూటమి పార్టీల కార్యకర్తలకు మేలు చేసేందుకే అన్న ఆరోపణలు వస్తున్నాయి.నాడు అండగా నిలిచిన వైఎస్ జగన్ ప్రభుత్వం» నేరుగా మార్క్ఫెడ్ను రంగంలోకి దింపి చర్యలు» తేమ శాతంతో సంబంధం లేకుండా కొనుగోళ్లు» 30 వేల మంది నుంచి రూ.139 కోట్ల పంట కొనుగోలునల్లబర్లీ పంట విషయంలో ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా నిలిచింది. 2019–20 సీజన్లో మార్కెట్లో ధర లేని సమయంలో ఏపీ మార్క్ఫెడ్ను రంగంలోకి దింపింది. తేమ శాతంతో సంబంధం లేకుండా 30 వేల మంది రైతుల నుంచి రూ.139.19 కోట్ల విలువైన 12,933 టన్నుల పొగాకు సేకరించింది. 2022–23లో 1.42 లక్షల టన్నుల పొగాకు కొనుగోలుకు బోర్డు అనుమతివ్వగా, మాండూస్ తుపాన్తో సగానికి పైగా పొగాకుతో పాటు ఇతర పంటలు దెబ్బతిన్నాయి. అదే సమయంలో పొగాకు రేటు బాగుండడంతో రైతులంతా ఇదే పంట వేశారు. ఫలితంగా 1.72 లక్షల టన్నుల పొగాకు ఉత్పత్తయింది. సాధారణంగా అనుమతికి మించి ఉత్పత్తయిన సందర్భాల్లో ప్రత్యేక పరిస్థితులుంటే 5 శాతం పెనాల్టీతో కొనుగోలుకు కేంద్రం అనుమతి ఇస్తుంది. అలాంటిది నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చొరవ కారణంగా పైసా పెనాల్టీ లేకుండా కొనుగోలుకు కేంద్రం ఒప్పుకొంది. నేడు ఈ చొరవ కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వ నిర్వాకంతో రైతులు కంపెనీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తోంది.ధరల నేలచూపు.. రైతుల వద్ద పేరుకున్న నిల్వలునల్లబర్లీ లక్ష టన్నుల దిగుబడి వచ్చింది. పొగాకు బోర్డుతో సంబంధం లేకుండా ట్రేడర్స్, కంపెనీలు కొనుగోలు చేసే ఈ పొగాకును బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో 20 వేల మంది సాగు చేశారు. నిరుడు హై గ్రేడ్కు కిలో రూ.155–180 చొప్పున ధర లభించగా, ఈ ఏడాది రూ.70–80 మించడం లేదు. లో గ్రేడ్ గత ఏడాది కిలో రూ.80–100 ధర పలకగా, ఇప్పుడు రూ.30–45కు మించి కొనేవారు లేరు. రాష్ట్రంలో 21 పొగాకు కంపెనీలు ఉన్నాయి. జీపీఐ, ఐటీసీతో సహా ఏడు కంపెనీలు రైతుల నుంచి నేరుగా, మరో 12 ట్రేడర్స్ ద్వారా పరోక్షంగా కొనుగోలు చేస్తాయి. కానీ, ఈ ఏడాది కంపెనీలన్నీ సిండికేట్గా మారి రైతులను నిలువునా ముంచేశాయి.ఎకరాకు రూ.60 వేలు నష్టం తప్పేలా లేదుబాపట్ల జిల్లా ఇంకొల్లు మండలానికి చెందిన వంకాయలపాటి లోతుబాబు ఈ ఏడాది 3.5 ఎకరాల్లో నల్లబర్లీ వేశారు. గత ఏడాది ఎకరంలో పొగాకు పండించి రెండెకరాల్లో మిరప వేశారు. పంట దెబ్బతినడంతో తీసేసి మొక్కజొన్న పండించారు. ఈ ఏడాది నల్లబర్లీ ఎకరాకు రూ.1.50 లక్షలు పెట్టుబడి కాగా 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పొగాకు పండించమంటూ కంపెనీల వాళ్లు వచ్చి ప్రతి గ్రామంలో మీటింగ్ పెట్టారు. కానీ, ఒక్కరూ కొనడం లేదు. లోతుబాబు ఒక్క కేజీ కూడా అమ్మలేదు. ‘‘శనగ వేసుకున్నా మా డబ్బులు మాకు వచ్చేవి. ఎకరాకు రూ.60 వేలకు పైగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది’’ అని ఆయన ఇప్పుడు వాపోతున్నారు.నాలుగు చెక్కులు వేస్తే.. నాలుగూ వెనక్కినేను 10 ఎకరాల్లో నల్లబర్లి పొగాకు సాగు చేశా. ఎకరాకు రూ.1.50 లక్షల పెట్టుబడి పెట్టా.10 క్వింటాళ్లు వచ్చింది. కంపెనీ వాళ్లు కొంటామని చెప్పారు. నాలుగు చెక్కులు వేస్తే.. నాలుగూ వెనక్కి ఇచ్చేశారు. ఒక్క చెక్ కూడా ఇప్పటి వరకు కొనలేదు. నా దగ్గర దాదాపు 100 క్వింటాళ్ల పంట ఉంది. ఏం చేయాలో అర్ధం కావడం లేదు. – భవనం వెంకటరెడ్డి, వంకాయలపాడు, ఇంకొల్లు మండలం, బాపట్ల జిల్లాగ్రేడింగ్ రావడం లేదని..3 ఎకరాల్లో కౌలుకు తీసుకొని నల్లబర్లీ పొగాకు సాగు చేశా. 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కౌలుకే రూ.27 వేలు అప్పులు చేసి ఇచ్చాను. బంగారం తాకట్టు పెట్టి అప్పులు చేశాను. 30 క్వింటాళ్ల పంట ఉంది. ఐదు చెక్లు తీసుకెళ్తే రెండు వెనక్కి ఇచ్చేశారు. చెక్కు చేరా రూ.1000 ఖర్చవుతోంది. క్వింటాకు గ్రేడ్ చేసి తొక్కాలంటే రూ.500. ఇక 10 క్వింటాళ్లు గ్రేడింగ్ చేస్తే 3 క్వింటాళ్లు బాగుంది. మిగిలింది గ్రేడింగ్ రావడం లేదు. కొనేవారు లేక ఇంటి వద్దే ఉంచా. – కాసు కోటిరెడ్డి, వంకాయలపాడు, ఇంకొల్లు మండలం, బాపట్ల జిల్లాపురుగుమందుల షాపులకే రూ.7లక్షలు కట్టాలి..11 ఎకరాల్లో నల్ల బర్లీ సాగు చేశా. ఎకరాకు రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టా. నిరుడు క్వింటా రూ.15,500కు కొన్నారు. ఈ సారి రూ.6–8 వేలకు కూడా తీసుకోవడం లేదు. పురుగుమందుల దుకాణం వాళ్లకే రూ.7 లక్షలు ఇవ్వాలి. బంగారం పూర్తిగా బ్యాంక్లోనే ఉంది. నిరుడు ఎకరాకు రూ.50వేలు మిగిలింది. ఈసారి ఎకరాకు రూ.50–70 వేలు నష్టపోతున్నాం. – ఎర్రం సుబ్బారెడ్డి, ఇంకొల్లు, బాపట్ల జిల్లాపొగాకు రైతు ఆత్మహత్య» ప్రకాశం జిల్లా కొండపిలో విషాదం» పంట సాగులో నష్టాలతో మనస్తాపంకొండపి: పొగాకు పంట సాగు చేసి నష్టాలు రావడంతో పొగాకు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రకాశం జిల్లా కొండపిలో శుక్రవారం జరిగింది. బాధిత రైతు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన చల్లా మధుసూదన్రెడ్డి (43) పొగాకుతో పాటు కొన్ని వాణిజ్య పంటలు పండిస్తున్నాడు. గత సంవత్సరం లాభాలు వచ్చాయన్న ఆశతో ఈ ఏడాది 15 ఎకరాల్లో పొగాకు సాగు చేశాడు. అయితే వేలం ప్రారంభం నుంచి పొగాకుకు గిట్టుబాటు ధర లేదని కుటుంబ సభ్యులకు చెప్పుకుని ఆవేదన చెందాడు. ఇలాగైతే పంటసాగుకు చేసిన ఖర్చు కూడా తిరిగొచ్చే అవకాశం లేదని వాపోయాడు. ఈ క్రమంలో నాలుగో తేదీన కొండపికి వెళ్తున్నానని, సాయంత్రానికి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. అయితే మధుసూదన్రెడ్డి ఇంటికి తిరిగి రాలేదు. శుక్రవారం స్థానిక పొగాకు బోర్డు వెనుక గుర్తుతెలియని మృతదేహం ఉందని పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. మృతుడి కుటుంబ సభ్యులు వచ్చి చూడగా అది మధుసూదన్రెడ్డిదిగా గుర్తించారు. మృతుడి కుమారుడు మాట్లాడుతూ పొగాకు సాగు కోసం తన తండ్రి భారీగా అప్పులు చేశారని, అయితే గిట్టుబాటు ధర రాకపోవడంతో తీవ్రంగా కలత చెందారని కన్నీంటిపర్యంతమయ్యాడు.ఈ ఘటనపై చల్లా మధుసూదన్ రెడ్డి తండ్రి బ్రహ్మారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఒంగోలు రిమ్స్కు తరలించారు. అయితే పోలీసులు మాత్రం రైతు ఆత్మ హత్యగా కాకుండా, రూ.200 కోసం తల్లిదండ్రులతో గొడవపడి నెన్నూరు పాడు నుంచి వచ్చి కొండపిలోని పొగాకు బోర్డు సమీపం ఒక పాకలో అనుమానాస్పదంగా మృతి చెందాడని కేసు నమోదు చేసినట్టు సమాచారం.పొగాకు నిల్వలను పూర్తిగా ప్రభుత్వమే కొనాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ సాక్షి, అమరావతి: రైతుల వద్ద పేరుకుపోయిన పొగాకు నిల్వలను పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి.కృష్ణయ్య, కె.ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. మిర్చి రైతులకు ఇచి్చన హామీ లాగా బుట్టదాఖలు చేయకుండా రైతుల వద్ద ఉన్న చివరి కిలో పొగాకు వరకు ప్రభుత్వమే కొనుగోలు చేసి కంపెనీల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని కోరారు. పొగాకుతో పాటు మామిడి, కోకో రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా ప్రైవేటు కంపెనీలు దగా చేస్తున్నాయని ఆరోపించారు. -
8 జిల్లాలతో ‘విశాఖ ఎకనమిక్ రీజియన్’
సాక్షి, అమరావతి: ‘విశాఖ ఎకనమిక్ రీజియన్’ను ఆంధ్రప్రదేశ్కు గ్రోత్ ఇంజిన్గా తీర్చిదిద్దాలని, 2032 నాటికి 120 బిలియన్ డాలర్ల సంపద సృష్టి జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. వచ్చే ఏడేళ్లలో విశాఖను మరో ముంబైలా తీర్చిదిద్దాలని నిర్దేశించారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, పార్వతిపురం మన్యం మొత్తం 8 జిల్లాల పరిధిలో ఎకనమిక్ యాక్టివిటీ పెరిగేలా ప్రాజెక్టులు నెలకొల్పాలని పేర్కొన్నారు. వీటి కోసం లక్ష ఎకరాలు గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ‘మూలపేట–విశాఖపట్నం, విశాఖపట్నం–కాకినాడ మధ్య బీచ్ రహదారులు నిర్మిస్తామని, వీటిని జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తామని సీఎం చెప్పారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా 20 లక్షల మందికి అవకాశం కల్పించాలని యత్నిస్తున్నామని సీఎం చెప్పారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంపై సమీక్షలో ‘విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్’గా అభివృద్ధి చేసే అంశంపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆరు పోర్టులు, ఏడు మాన్యుఫాక్చరింగ్ నోడ్లు, 17 మేజర్ వ్యవసాయ క్షేత్రాలు, 6 సర్వీస్ హబ్స్, 12 పర్యాటక హబ్స్తో విశాఖ ఎకనమిక్ రీజియన్ను అభివృద్ధి చేయాలని యోచిస్తున్నట్టు సీఎం చెప్పారు. దీనిపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ ట్రాన్సిషన్ రోడ్ మ్యాప్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీతి ఆయోగ్, ఐఎస్ఈజీ ఫౌండేషన్ మధ్య అవగాహనా ఒప్పందం జరిగింది. సమావేశంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, నీతి ఆయోగ్ సీఈవో సుబ్రమణ్యం, సీఎస్ విజయానంద్ పాల్గొన్నారు. హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో పోలవరం–బనకచర్ల హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో పోలవరం–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు చేపట్టాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో శుక్రవారం నీటిపారుదల ప్రాజెక్టులపై ఆయన సమీక్ష నిర్వహించారు. పోలవరం–బనకచర్ల ప్రాజెక్టును చేపట్టడానికి జలహారతి కార్పొరేషన్ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)ని ఏర్పాటుచేశామని చెప్పారు. రూ.81,900 కోట్ల వ్యయంతో 50 శాతం రూ.40,950 కోట్లు ఈఏపీ(విదేశీ) రుణం, కేంద్ర ప్రభుత్వ గ్రాంట్గా 20 శాతం రూ.16,380 కోట్లు సమకూర్చుకోవాలని.. రాష్ట్ర ప్రభుత్వ ఈక్విటీగా 10 శాతం రూ.8,190 కోట్లు, హ్యామ్(హైబ్రిడ్ యాన్యుటీ) విధానంలో మరో 20 శాతం రూ.16,380 కోట్లు ఖర్చు చేసేలా అధికారులు చేసిన ప్రతిపాదనను సీఎం చంద్రబాబు ఆమోదించారు. -
ధోకా బాబూ..!
రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వం వివక్ష కొనసాగిస్తోంది. ఒకవైపు వక్ఫ్ బోర్డు సవరణకు వత్తాసు పలికిన సర్కారు... మరోవైపు రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తులను అన్యాక్రాంతం చేయడానికి వేగంగా అడుగులు వేస్తోంది. ఇదే సమయంలో ముస్లిం మైనార్టీలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటైనా అమలు చేయకుండా సాచివేత ధోరణి అవలంబిస్తోంది. ఏడాదిగా హామీల అమలు కోసం నిరీక్షించిన ముస్లింలు ఇప్పుడు హామీల అమలెప్పుడు బాబూ అంటూ గళమెత్తుతున్నారు. ఈ ఏడాది రంజాన్ సందర్భంగా తోఫా కూడా అందించని కూటమి సర్కారు తాజాగా బక్రీద్(శనివారం) నాటికి కూడా హామీల అమలుకు కార్యాచరణ చేపట్టకపోవడంపై ఆగ్రహం పెల్లుబుకుతోంది.టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ముస్లిం మైనార్టీల కోసం ఇచ్చిన తొమ్మిది ప్రధాన హామీల్లో ఇప్పటివరకు ఏ ఒక్కటీ అమలు చేయలేదు. గతంలోను ఇదే మాదిరిగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు దగా చేసిన విషయాన్ని ముస్లింలు గుర్తు చేసుకుంటున్నారు. ఈసారి కూడా మేనిఫెస్టోలో పేర్కొన్నవి, సభల్లో ప్రకటించిన హామీల అమలుకు కూటమి ప్రభుత్వం కనీసం శ్రద్ధ చూపకపోవడాన్ని వారు తప్పుబడుతున్నారు. –సాక్షి, అమరావతిఏడాదైనా అమలు కాని ముస్లింలకు ఇచ్చిన హామీలివే..» ముస్లిం మైనార్టీలకు 50ఏళ్లకే పెన్షన్» ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకు, ఖబరస్తాన్లకు స్థలాలు కేటాయింపు » విజయవాడ సమీపంలో హజ్హౌస్ నిర్మాణం » నూర్బాషా కార్పొరేషన్ ఏర్పాటు, ఏటా రూ.వంద కోట్ల కేటాయింపు » మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.5లక్షల వరకు వడ్డీలేని రుణాలు » ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనం బకాయిలతోసహా పూర్తిగా అందించే చర్యలు (వీటిని ఏడాదికి చెల్లిస్తున్నట్టు జీఓ ఇచ్చి 9నెలలకు సర్కారు సరిపెట్టింది. ఇంకా ఆరునెలలకు చెల్లించాల్సి ఉంది.)» అర్హత ఉన్న ఇమామ్లు ప్రభుత్వ ఖాజీలుగా నియామకం » మసీదుల నిర్వహణకు ప్రతినెలా రూ.5వేలు ఆర్థిక సాయం » హజ్ యాత్రకు వెళ్లే ప్రతి ముస్లింకు రూ.లక్ష (గత ప్రభుత్వం విడుదల చేసిన డబ్బులూ 2024 హజ్ యాత్రకు వెళ్లిన వారికి చెల్లించకపోగా ఈ ఏడాది వెళ్లిన కూడా ఒక్క పైసా విదల్చలేదు.)జగన్ హయాంలో రూ.20,863కోట్ల లబ్ధి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదర్శంగా నిలిచారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీ వర్గాలకు చెందిన 51,00,771 మందికి రూ.20,863.40కోట్ల లబ్ధి చేకూర్చారు. ఇమామ్లకు నెలకు రూ.5 వేల నుంచి రూ.10వేలకు, మౌజన్లకు రూ.3 వేల నుంచి రూ.5వేలకు గౌరవ వేతనం పెంచి ఆదుకున్నారు. ఆదాయంలేని మసీదుకు రూ.5వేలు చొప్పున అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు ఏడాదైనా దాని ఊసే ఎత్తడం లేదు. వడ్డీలేని రుణాల విషయంలోనూ కూటమి ప్రభుత్వం దగా చేసింది. ఎన్డీఏ కూటమికి ఓట్లేసిన ముస్లింలు మరోసారి మోసపోయామని ఇప్పుడు బాధపడుతున్నారు. –షేక్ నాగుల్ మీరా, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడుమైనారిటీలపై కూటమి ప్రభుత్వం వివక్ష రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంతో ఆదరిస్తే.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతోంది. నామినేటెడ్ పోస్టుల్లోనూ ప్రభుత్వం ముస్లింలకు తీరని అన్యాయం చేసింది. రాష్ట్రంలో నూర్ బాషా, దూదేకుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, రూ.వంద కోట్లు కేటాయిస్తానని 2014, 2024 ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు దగా చేశారు. –షేక్ దస్తగిరి, ముస్లిం దూదేకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మైనార్టీ విద్యార్థుల విదేశీ విద్యపై కూటమి సర్కారు నిర్లక్ష్యంఆంధ్రప్రదేశ్లో ఏపీజే అబ్దుల్ కలాం ఓవర్సీస్ విద్యా పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన కూటమి ప్రభుత్వం మైనారిటీ విద్యార్థుల కలల్ని చిదిమేసింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకానికి కేవలం రూ.20 కోట్లు కేటాయించినా దానిలో ఇప్పటివరకు ఒక రూపాయి కూడా ఖర్చు చేయలేదు. జూన్, జూలై, ఆగస్టు నెల నుంచి విదేశీ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు ప్రారంభమవుతున్నా విదేశీ విద్యా పథకానికి నోటిఫికేషన్ వెలువడకపోవడం వల్ల విద్యార్థులు అడ్మిషన్, వీసా ప్రక్రియల్ని కొనసాగించలేని దుస్థితిలో ఉన్నారు. –షేక్ మునీర్ అహ్మద్, ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వీనర్ -
కుప్పకూలిన శాంతిభద్రతలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. రాజకీయ కక్షలతో చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు చేస్తున్న నేరపూరిత చర్యలు, ఆలోచనల కారణంగా లా అండ్ ఆర్డర్ (శాంతిభద్రతలు) కుప్పకూలిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎవరికీ రక్షణ, భద్రత లేకుండా పోయిందని, అత్యంత భయానక పరిస్థితులు నెలకొన్నాయంటూ ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలను గుర్తు చేశారు. అధికారంలో ఉన్న వారు అహంకారం, రౌడీయిజంతో చెలరేగిపోయి.. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు యంత్రాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న ఫలితంగా జరుగుతున్న ఘటనలు అత్యంత దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు శ్రీకాళహస్తిలో జరిగిన ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ అంటూ ఎత్తిచూపారు. మీ పద్ధతి మార్చుకోకపోతే.. ప్రజలు ఎల్లకాలం చూస్తూ ఊరుకోరని సీఎం చంద్రబాబును హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగేలా వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందని భరోసా ఇస్తూ ఈ మేరకు శుక్రవారం ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..1 అధికార పార్టీ.. పోలీసు యంత్రాంగాన్ని ఏ రకంగా అదుపాజ్ఞల్లోకి తీసుకుందో చెప్పడానికి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జరిగిన ఘటన ప్రత్యక్ష ఉదాహరణ. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే భార్య వాహనం డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. దీంతో ఓ పోలీసు చలానా రాశాడు. దీంతో ఆ ఎమ్మెల్యే.. ఆ కానిస్టేబుల్ను రప్పించుకుని, సీఐ సమక్షంలో నిందితుడైన అదే డ్రైవర్తో దాడి చేయిస్తారా? చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఆ ఘటనను మూసివేసేలా ప్రయత్నించి వ్యవస్థలకే తలవంపులు తెస్తున్నారు. ఒక పోలీసుకు లేని రక్షణ ఇక సామాన్యులకు ఎక్కడిది?2 రాజకీయ కక్షలతో నిర్దోషులపై తప్పుడు కేసులు పెట్టి, వారిని జైళ్లకు పంపడం పరిపాటిగా మారింది. వైఎస్సార్ జిల్లా ఖాజీపేట మండలం దుంపలగట్టుకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త రెడ్యం శివలక్ష్మీనారాయణపై అక్రమంగా కేసుపెట్టి, తీవ్రంగా కొట్టారు. లంచం ఇవ్వలేదని.. లేని గంజాయి కేసుపెట్టి 2 నెలలపాటు జైలుకు పంపడంతో అవమానాలు భరించలేక ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పదేళ్ల కొడుకు, ఎనిమిదేళ్ల కూతురు ఉన్న లక్ష్మీనారాయణ కుటుంబం ఇప్పుడు రోడ్డున పడింది. చంద్రబాబు ఏడాది పాలనలో రెడ్బుక్ రాజ్యాంగానికి గురైన ఇలాంటి కుటుంబాలెన్నో ఉన్నాయి. లక్ష్మీనారాయణకు జరిగిన అన్యాయానికి బాధ్యత ఎవరిది? అక్రమ కేసులు పెట్టి ఆత్మహత్య చేసుకునేలా చేసిన వారిపై ఏం చర్యలు తీసుకుంటున్నారు? వ్యవస్థలు సక్రమంగా పని చేసి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేదా? 3 ప్రజా సమస్యల పరిష్కారంపై గళమెత్తుతూ వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నందుకు టీడీపీ వాళ్లు కక్షగట్టి కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ మాజీ ఎంపీటీసీ సభ్యుడు రమేష్ నాయుడును కత్తులతో పొడిచి, బండరాయితో మోది చంపేశారు. ఇక రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా, ప్రజల తరఫున ఎవ్వరూ కార్యక్రమాలు నిర్వహించకూడదా? అలా చేస్తే చంపేస్తారా? పోలీసుల పర్యవేక్షణ, ఇంటెలిజెన్స్ సరిగ్గా ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదు కదా? 4 శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లి గ్రామంలో 9వ తరగతి చదువుతున్న దళిత బాలికపై సామూహిక అత్యాచారం అత్యంత అమానవీయం. ఈ ఘటనపై కనీసం ఫిర్యాదు కూడా ఇవ్వనీయకుండా టీడీపీ వాళ్లు భయపెట్టారు. నిందితులకు అధికార పార్టీ అండదండలు ఉండడంతో వారిని ఎదిరించే ధైర్యం లేక, తండ్రి లేని ఆ బాలిక కుటుంబం ఏకంగా ఊరు విడిచి వెళ్లిపోయింది. పోలీసులది ప్రేక్షక పాత్రే అయ్యింది.5 ఈ ఘటనలన్నింటినీ వేర్వేరుగా చూడకూడదు. చట్టాన్ని అపహాస్యం చేసి, బాధితులకు న్యాయాన్ని నిరాకరించి, అధికార పార్టీకి చెందిన వారు అని, ఆ నిందితులను స్వేచ్ఛగా వదిలేసినప్పుడు, ఈ పరిణామాలన్నింటినీ మౌనంగా చూస్తున్నప్పుడు.. కేవలం పాలన మాత్రమే కాకుండా, ప్రజాస్వామ్యాన్ని నడిపించే వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోతాయి. చంద్రబాబూ.. మీరు మీ పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు ఇక ఎల్లకాలం చూస్తూ ఊరుకోరు. బాధితులకు న్యాయం జరిగేలా వారి తరఫున వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది. -
పత్రికా స్వేచ్ఛపై సర్కారు మరోదాడి
సాక్షి, అమరావతి : రెడ్బుక్ రాజ్యాంగం ప్రకారం రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం తాజాగా సాక్షి దినపత్రికను మరోసారి లక్ష్యంగా చేసుకుంది. ఏపీ శాసనసభ ద్వారా వేధింపులకు దిగింది. అసెంబ్లీ సెక్రటరీ జనరల్ శుక్రవారం ‘సాక్షి’ దినపత్రికకు ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. బడ్జెట్ సమావేశాలకు ముందు ఫిబ్రవరి 25న సాక్షిలో ప్రచురితమైన ఒక వార్త అసెంబ్లీకి, అసెంబ్లీ సభ్యుల హక్కులకు భంగం కలిగించిందని అందులో పేర్కొన్నారు. నందికొట్కూరు ఎమ్మెల్యే జి. జయసూర్య ఇచ్చిన ఫిర్యాదును స్పీకర్ ప్రివిలేజ్ కమిటీకి పంపారని, ఈనెల 2న సమావేశమైన కమిటీ పత్రిక ఎడిటర్, సంబంధిత రిపోర్టర్, ప్రింటర్ అండ్ పబ్లిషర్ స్పందన తెలుసుకోవాలని సూచించిందని పేర్కొన్నారు. వారం రోజుల్లో ఈ నోటీసుపై స్పందించాలని కోరారు. ఎవరి హక్కుల ఉల్లంఘనా జరగలేదు.. వాస్తవానికి.. ‘సాక్షి’ ప్రచురించిన కథనంలో ఎక్కడా సభా హక్కుల ఉల్లంఘన జరగలేదు. అసెంబ్లీ, అసెంబ్లీ సభ్యులు, అధికారుల ప్రస్తావన అందులో లేదు. వారి హక్కులకుగానీ, వారి హుందాతనానికి గానీ అగౌరవం కలిగే వ్యాఖ్యలు అసలేలేవు. కేవలం పరిపాలనాపరమైన లోపాలను మాత్రమే అందులో ప్రస్తావించారు. శిక్షణా తరగతుల పేరుతో అన్ని ఏర్పాట్లు చేశాక రద్దుచేయడం ద్వారా ప్రజాధనం వృధా అయిందని, ప్రణాళికా లోపంవల్లే ఇది జరిగిందని వ్యవస్థాపరమైన లోపాలను గుర్తుచేస్తూ ఈ కథనంలో రాశారు. కానీ, సాక్షి మీడియాపై కక్షగట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. బడ్జెట్ సమావేశాల్లో ఒక సభ్యుడితో దీనిపై ఫిర్యాదు చేయించి సభా హక్కుల ఉల్లంఘనగా ఆరోపించింది. ఆ సభ్యుడి ఫిర్యాదు మేరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు దాన్ని ప్రివిలేజ్ కమిటీకి పంపగా కమిటీ నోటీసులిచ్చింది. ఇలా కూటమి ప్రభుత్వం సాక్షి మీడియాపై వరుస దాడులు చేయిస్తోంది. జర్నలిస్టులను భయపెట్టాలని, పత్రికా స్వేచ్ఛకు పరిమితులు విధించాలనే కుతంత్రంతో ఇలా చేయిస్తున్నట్లు ప్రజాస్వామ్యవాదులు చెబుతున్నారు. సాక్షి, సాక్షి సిబ్బందిపై వరుస దాడులు.. ఇక ఇటీవలే సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్. ధనంజయరెడ్డి నివాసంలో ‘సిట్’ పోలీసులు అకారణంగా సోదాలు జరిపారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా.. మద్యం కేసు నిందితుల కోసం అన్వేషించే పేరుతో ఒక పత్రిక ఎడిటర్ నివాసంలో సోదాలు జరిపి పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించారు. అలాగే, సమాజంలో జరిగే పలు అంశాలను ప్రతిబింబించే క్రమంలో రాసిన వివిధ కథనాలపై పరువు నష్టం కేసులు వేసింది. మరోవైపు.. సాక్షి విలేకరులపై రాష్ట్ర వ్యాప్తంగా అక్రమార్కులు దాడులకు తెగబడుతున్నారు. వారి తప్పులను ఎత్తిచూపడమే నేరమన్నట్లు భౌతిక దాడులకు దిగుతున్నారు. ఏలూరు సాక్షి కార్యాలయంపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడిచేసి కంప్యూటర్లు, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. అలాగే, గుంటూరు జిల్లా సాక్షి ఛానల్ ప్రతినిధిపై కూటమి నేతలు దాడికి పాల్పడ్డారు. శ్రీకాళహస్తిలోనూ సాక్షి విలేకరిపై దాడి చేశారు. ఇంకా అనేక చోట్ల సాక్షి మీడియాపై దాడులు, దౌర్జన్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా.. ఇప్పుడు అసెంబ్లీ ద్వారా ప్రివిలేజ్ నోటీసు ఇచ్చి పత్రికా స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేస్తున్నారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నంపై వైఎస్ జగన్ ఆవేదన
తాడేపల్లి: సత్తెనపల్లి నియోజకవర్గం, రాజుపాలెం మండలం, పెదనెమలిపురి గ్రామానికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణను పోలీసులు వేధించి, హింసించిన ఘటనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగంతో వైఎస్సార్సీపీ కార్యకర్త చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడన్నారు. ఈ మేరకు వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ‘ఆ కార్యకర్త గతంలో తన వ్యాపార భాగస్వాములు చేసిన ఆరోపణలకు సంబంధించి సత్తెనపల్లి సీఐ, ఎస్సై విచారించినప్పటికీ, లక్ష్మీనారాయణకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో పోలీసులు ఆ విషయాన్ని విడిచిపెట్టారు. కాని, అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇదే విషయంపై 2 నెలల తర్వాత సత్తెనపల్లి డీఎస్పీ పిలిపించుకుని తీవ్ర వేధింపులకు దిగారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాడివైనా నువ్వు వైఎస్సార్సీపీలో ఎందుకున్నావు అని డీఎస్పీ తీవ్రంగా అవమానపరిచి, తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తామని, డబ్బులు ఇవ్వాల్సిందేనని బెదిరించారు. దీంతో లక్ష్మీనారాయణ ఈ తెల్లవారు జామున పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతూ డీఎస్పీ దుర్మార్గంపై వీడియో వాంగ్మూలం ఇచ్చాడు. బాధ్యులైన వ్యక్తుల పేర్లతో లేఖ కూడా రాశాడు. ఇప్పుడు చావుబతుకుల మధ్య గుంటూరు ఆస్పత్రిలో ఉన్నాడు. లక్ష్మీనారాయణ కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. లక్ష్మీనారాయణకు, ఆయన కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.రెడ్బుక్ రాజ్యాంగానికి వైయస్సార్సీపీ కార్యకర్త చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. సత్తెనపల్లి నియోజకవర్గం, రాజుపాలెం మండలం, పెదనెమలిపురి గ్రామానికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణను పోలీసులు వేధించి, హింసించారు. తనపై గతంలో తన వ్యాపార భాగస్వాములు చేసిన ఆరోపణలకు సంబంధించి… pic.twitter.com/DQYqumM3Hz— YS Jagan Mohan Reddy (@ysjagan) June 6, 2025 -
మీరు మీ పద్ధతిని మార్చుకోకపోతే ప్రజలు చూస్తూ ఊరుకోరు: వైఎస్ జగన్
తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్లో క్షీణించిన శాంతిభద్రతపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయని ధ్వజమెత్తారు. ఈ మేరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ‘రాజకీయ కక్షలతో చంద్రబాబుగారు, ఆయన పార్టీనాయకులు చేస్తున్న నేరపూరిత చర్యలు, ఆలోచనల కారణంగా లా అండ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణ, భద్రత లేకుండా పోయింది.అత్యంత భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అధికారంలో ఉన్నవారు అహంకారం, రౌడీయిజంతో చెలరేగిపోయి, చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు యంత్రాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న ఫలితంగా జరుగుతున్న ఘటనలు అత్యంత దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. అధికార పార్టీ పోలీసు యంత్రాంగాన్ని ఏ రకంగా అదుపాజ్ఞల్లోకి తీసుకుందో చెప్పడానికి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జరిగిన ఘటన ప్రత్యక్ష ఉదాహరణ. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే భార్య డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే, చలానా రాసినందుకు ఆ ఎమ్మెల్యే ఆ కానిస్టేబుల్ను రప్పించుకుని, సీఐ సమక్షంలో నిందితుడైన అదే డ్రైవర్తో దాడిచేయిస్తారా? , చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఆ ఘటనను మూసివేసేలా ప్రయత్నించి వ్యవస్థలకే తలవంపులు తెస్తున్నారు. ఒక పోలీసుకు లేని రక్షణ ఇక సామాన్యులకు ఎక్కడిది?’ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. తప్పుడు కేసులు పెట్టడం పరిపాటిగా మారిపోయింది‘రాజకీయ కక్షలతో నిర్దోషులపై తప్పుడు కేసులు పెట్టి, వారిని జైళ్లకు పంపడం కూటమి ప్రభుత్వానికి పరిపాటిగా మారిపోయిందని వైఎస్ జగన్ మండిపడ్డారు. వైఎస్ఆర్ జిల్లా ఖాజీపేట మండలం దుంపలగట్టుకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త రెడ్యం శివలక్ష్మీనారాయణపై అక్రమంగా కేసుపెట్టి, తీవ్రంగా కొట్టారు.. లంచం ఇవ్వలేదని లేని గంజాయి కేసుపెట్టి 2 నెలలపాటు జైలుకు పంపడంతో అవమానాలు భరించలేక లక్ష్మీనారాయణ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.10 ఏళ్ల కొడుకు, 8 ఏళ్ల కూతురు ఉన్న లక్ష్మీనారాయణ కుటుంబం ఇప్పుడు రోడ్డున పడింది. .@ncbn గారి పాలనలో వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. రాజకీయ కక్షలతో చంద్రబాబుగారు, ఆయన పార్టీనాయకులు చేస్తున్న నేరపూరిత చర్యలు, ఆలోచనల కారణంగా లా అండ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణ, భద్రత లేకుండా పోయింది. అత్యంత భయానక పరిస్థితులు నెలకొన్నాయి.… pic.twitter.com/9w3zBRhTub— YS Jagan Mohan Reddy (@ysjagan) June 6, 2025చంద్రబాబుగారి ఏడాదిపాలనలో రెడ్బుక్ రాజ్యాంగానికి గురైన ఇలాంటి కుటుంబాలెన్నో ఉన్నాయి. లక్ష్మీనారాయణకు జరిగిన అన్యాయానికి బాధ్యత ఎవరిది?, అక్రమకేసులు పెట్టి ఆత్మహత్య చేసుకునేలా చేసిన వారిపై ఏం చర్యలు తీసుకుంటున్నారు?, వ్యవస్థలు సక్రమంగా పనిచేసి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేదా?, ప్రజాసమస్యల పరిష్కారంపై గళమెత్తుతూ వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నందుకు టీడీపీ వాళ్లు కక్షగట్టి కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ మాజీ ఎంపీటీసీ సభ్యుడు రమేష్నాయుడును కత్తులతో పొడిచి, బండరాయితో కొట్టి చంపేశారు.ఇక రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా, ప్రజల తరఫున ఎవ్వరూ కార్యక్రమాలు నిర్వహించకూడదా?’ అని నిలదీశారు వైఎస్ జగన్. మీ పద్ధతిని మార్చుకోకపోతే ప్రజలు చూస్తూ ఊరుకోరుఅలా చేస్తే చంపేస్తారా? పోలీసుల పర్యవేక్షణ, ఇంటెలిజెన్స్ సరిగ్గా ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదు కదా? , శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం ఏడు గుర్రాకులపల్లి గ్రామంలో 9వ తరగతి చదువుతున్న దళిత బాలికపై సామూహిక అత్యాచారం అత్యంత అమానవీయం. ఈ ఘటనపై కనీసం ఫిర్యాదుకూడా ఇవ్వనీయకుండా టీడీపీ వాళ్లు భయపెట్టారు. నిందితులకు అధికారపార్టీ అండదండలు ఉండడంతో వారిని ఎదిరించే ధైర్యం లేక తండ్రిలేని ఆ బాలిక కుటుంబం ఏకంగా ఊరు విడిచి వెళ్లిపోయింది. పోలీసులది ప్రేక్షక పాత్రే అయ్యింది. ఈ ఘటనలన్నింటినీ వేర్వేరుగా చూడకూడదు.చట్టాన్ని అపహాస్యం చేసి, బాధితులకు న్యాయాన్ని నిరాకరించి, అధికార పార్టీకి చెందినవారని ఆ నిందితులను స్వేచ్ఛగా వదిలేసినప్పుడు, ఈ పరిణామాలన్నింటినీ మౌనంగా చూస్తున్నప్పుడు కేవలం పాలనమాత్రమే కాకుండా, ప్రజాస్వామ్యాన్ని నడిపించే వ్యవస్థలన్నీకూడా కుప్పకూలిపోతాయి. చంద్రబాబుగారూ మీరు మీ పద్ధతిని మార్చుకోకపోతే ప్రజలు ఇక ఎల్లకాలం చూస్తూ ఊరుకోరు. బాధితులకు న్యాయం జరిగేలా వారి తరఫున వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది.’ అని వైఎస్ జగన్ హెచ్చరించారు. -
ముస్లింలకు వైఎస్ జగన్ బక్రీద్ శుభాకాంక్షలు
తాడేపల్లి : ముస్లిం సోదర, సోదరీమణులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాల పండగ బక్రిద్ కాగా, త్యాగం, సహనం.. ఈ రెండూ బక్రీద్ పండగ ఇచ్చే సందేశాలన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్ పండుగ జరుపుకుంటారని, త్యాగనిరతికి ఈ పండుగ నిదర్శమన్నారు. ధనిక, పేద అనే తారతమ్యం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా ముస్లింలందరూ ఈ పండుగను భక్తిశ్రద్ధలతో చేసుకుంటారని, అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ముస్లిం సోదర, సోదరీమణులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ, త్యాగానికి, విశ్వాసానికి, కరుణ, ఐక్యతకు ప్రతీకగా నిలిచే బ్రకీద్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.#EidUlAdha— YS Jagan Mohan Reddy (@ysjagan) June 7, 2025 -
‘పవన్.,. మీ శాఖలో ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా?’
తాడేపల్లి : ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు 143 వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మాయ చేసి గెలిచారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. ఈరోజు(శుక్రవారం) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడిన తాటిపర్తి చంద్రశేఖర్.. చంద్రబాబు ప్రజలకు నిలువునా వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. ‘ వైఎస్సార్సీపీ చేపట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. కడప మహానాడుకి జనం నామమాత్రంగా కూడా రాలేదు. వైఎస్సార్సీపీ ఒక్క వెన్నుపోటు దినం అని పిలుపునిస్తే లక్షలమంది ప్రజలు వచ్చారు. మీరు ఏ అభివృద్ధి చేయలేక జగన్ని దూషించటమే పనిగా పెట్టుకున్నారు. మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి మరింత దిగజారి మాట్లాడుతున్నారు. అలా మాట్లాడటానికి మంత్రికి సిగ్గులేదా?. దళితులకు ఈ రాష్ట్రంలో అవమానం జరుగుతోంది. రాష్ట్రంలో గంజాయి వ్యాపారం చేస్తుంది టీడీపీ వాళ్లే అని గంటా శ్రీనివాసరావు చెప్పారు. టీడీపీ వలనే గంజాయి బజారులో కూడా దొరుకుతోంది. హోంమంత్రి అనితకు కులం కోటాలనే హోంమంత్రి పదవి వచ్చింది. దళితులను కొడితే హోంమంత్రి కేర్లేస్గా మాట్లాడుతున్నారు. టీడీపీలో చాలామందిపై కేసులు ఉన్నాయి. వారిని ఇలానే బజారులో కొడతారా?. పరిటాల సునీత ఇలాకాలో దళిత బాలికపై నెలల తడబడి అత్యాచారం చేశారు. ఈ ఘటన మీకు కనబడుటం లేదా, అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా?, ఇచ్చిన హామీలను అమలు చేయని చంద్రబాబు వెన్నుపోటు దారుడు కాదా?, విద్యార్థులు, మహిళలు, తల్లులను మోసం చేసింది టీడీపీ కాదా?, రైతులను మోసం చేసింది నిజం కాదా?, చివరకు రాష్ట్రంలో సినిమా హాళ్లను కూడా మూసివేసే పరిస్థితికి తెచ్చారు. మీ నాయకుడు పవన్ కళ్యానే సినిమా వాయిదా వేసుకునే పరిస్థితి వచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శాఖలో ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా?, పవన్ కళ్యాణ్ అన్న నాగబాబుకి మాత్రమే రాజకీయ ఉద్యోగం ఇప్పించారు. పంచాయతీ రాజ్ శాఖని నిర్వీర్యం చేశారు. గ్రామ పంచాయతీ వ్యవస్థని నాశనం చేశారు’ అని మండిపడ్డారు. -
వెన్నుపోటు వీరుడా.. చంద్రబాబు మీద సాంగ్ వైరల్
సాక్షి, అమరావతి: చంద్రబాబు మోసాలు, ప్రజలకు వెన్నుపోటు పొడిచిన తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక పాటను రిలీజ్ చేసింది. వెన్నుపోటు వీరుడా.. అబద్ధాల శూరుడా.. నీకు నీవే సాటి రా.. అంటూ సాగే ఆ వీడియో సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది.సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్లో రిలీజ్ చేయగానే అత్యధికులు దాన్ని డౌన్ లోడ్ చేసుకున్నారు. తల్లికి వందనం, మెగా డీఎస్సీ, నిరుద్యోగ భృతి, ధరల పెరుగుదల.. ఇలా అనేక అంశాలను ప్రస్తావిస్తూ, ప్రజలను చంద్రబాబు ఎలా మోసం చేశారో ఆ సాంగ్ స్పష్టంగా తెలియజేస్తోంది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.Here is the teaser of "వెన్నుపోటు వీరుడా.. అబద్దాల శూరుడా!" song!Vennupotu Veerudaa.. Abaddhaala Shurudaa!🎧 Stay tuned for the full song, releasing today at 8 PM — launching on the @we_ysrcp YouTube channel!📲 👇🏻https://t.co/VOuzq3sSkA#VennupotuVeerudaa… pic.twitter.com/PFu655VgvZ— YSR Congress Party (@YSRCParty) June 4, 2025 -
కోర్టు కేసులా.. అయితే నాకేంటి?
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో రెండు గ్రూపుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. కూటమి ప్రభుత్వం అండదండలతో సూర్యనారాయణ ఇష్టానుసారం చెలరేగిపోతుండగా, అసలు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తమదేనని ఆస్కార్రావు వర్గం కోర్టును ఆశ్రయించింది. కోర్టులో మూడు కేసులున్నా లెక్క చేయకుండా సూర్యనారాయణ ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో నిబంధనలు పక్కనపెట్టి ఎన్నికలు నిర్వహించేసుకోవడం గమనార్హం.ఏడాది నుంచి రగడప్రభుత్వ ఉద్యోగుల సంఘం తమదంటే తమదని ఏడాది నుంచి సూర్యనారాయణ, ఆస్కార్రావు వర్గాలు కొట్లాడుకుంటున్నాయి. సూర్యనారాయణ గత ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తను మరిపించేలా కూటమి గెలుపు కోసం పని చేశారు. ఏడాది కిందట ప్రభుత్వ ఉద్యోగుల సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఉన్న సూర్యనారాయణ, ఆస్కార్రావు మధ్య విభేదాలు వచ్చాయి. ఆస్కార్రావును సంఘం నుంచి తొలగిస్తున్నట్లు కొద్ది నెలల కిందట సూర్యనారాయణ ప్రకటించారు. తనను తొలగించే అధికారం సూర్యనారాయణకు లేదని, అసలు ఆ సంఘం తమదేనని ఆస్కార్రావు న్యాయ పోరాటానికి దిగారు. ఈ నెల 3వ తేదీతో సంఘం రాష్ట్ర కార్యవర్గం గడువు ముగిసింది. కోర్టులో విచారణ జరుగుతుండగానే కొత్తగా ఎన్నికలు పెట్టడానికి సూర్యనారాయణ సన్నాహాలు మొదలుపెట్టారు.సమావేశం ముసుగులో ఎన్నికలు సూర్యనారాయణ వర్గానికి మండల స్థాయిలో కమిటీల నిర్మాణం లేదు. అందువల్ల ఆయన ప్రభుత్వ మద్దతుతో ఉద్యోగులను సమీకరించి ఎన్నికలకు సిద్ధమయ్యారు. గురువారం విజయవాడలో సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నామని, దానికి సీఎం చంద్రబాబు వస్తున్నారని ప్రచారం చేశారు. తన పలుకుబడి ఉపయోగించి ఈ సమావేశానికి హాజరయ్యేందుకు వీలుగా గురువారం ఉద్యోగులకు ప్రత్యేక సెలవు ఇస్తూ ప్రభుత్వంతో ఉత్త్వులు జారీ చేయించారు. తద్వారా ఉద్యోగులను రప్పించి ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.దీనిపై ఆస్కార్రావు వర్గం కోర్టును ఆశ్రయించింది. స్టేట్ కౌన్సిల్ మీటింగ్ ముసుగులో సూర్యనారాయణ ఎన్నికలు నిర్వహిస్తున్నారని, నోటిఫికేషన్ లేకుండా, కింది స్థాయిలో ఎన్నికలు నిర్వహించకుండా రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు జరుపుతున్నారని, దాన్ని ఆపాలని హైకోర్టులో ఒకటి, మచిలీపట్నం కోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. మచిలీపట్నం కోర్టులో దీనిపై బుధవారం విచారణ జరిగి, గురువారానికి వాయిదా పడింది. గురువారం సాయంత్రం కోర్టులో విచారణ జరగాల్సి ఉండగా, ఉదయమే సూర్యనారాయణ కోర్టులను కూడా లెక్క చేయకుండా విజయవాడలోని ఒక కన్వెన్షన్ సెంటర్లో ఎన్నికలు నిర్వహించి తాను అధ్యక్షుడినని ప్రకటించుకున్నారు. ఉద్యోగుల పేరుతో టీడీపీ కార్యకర్తల హాజరు?ఈ సమావేశం కోసం ప్రతి జిల్లాకు ఐదు బస్సులు పెట్టి ఉద్యోగులను రప్పించారు. కొన్ని జిల్లాల నుంచి ఉద్యోగుల పేరుతో టీడీపీ కార్యకర్తలను బస్సులు ఎక్కించినట్లు తెలుస్తోంది. సూర్యనారాయణపై అనేక అవినీతి ఆరోపణలున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న బదిలీల్లోనూ ఆయన అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆఫీస్ బేరర్స్ సర్టిఫికెట్లను బదిలీలకు అనుమతించవద్దని వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ ఉత్తర్వులివ్వడం విశేషం. ఇన్ని ఆరోపణలున్నా, అక్రమాలకు పాల్పడుతున్నా కూటమి ప్రభుత్వం సూర్యనారాయణకు మద్దతిచ్చి ఆయన అక్రమంగా నిర్వహించిన ఎన్నికలకు సహకరించడంపై ఉద్యోగవర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. -
అక్రమ కేసు పెట్టి..
ఖాజీపేట: పోలీసుల వేధింపులు.. తప్పుడు కేసుకు ఒక నిండు ప్రాణం బలైపోయింది. వైఎస్సార్ సీపీ కార్యకర్త ఆత్మహత్యకు కారణమైంది. తీవ్ర మానసిక వేదనకు గురైన అతను ఏకంగా విద్యుత్ సబ్స్టేషన్లో కరెంటు తీగలు పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుని బంధువుల, స్థానికుల కథనం ప్రకారం.. వైఎస్సార్ జిల్లా ఖాజీపేట మండలం దుంపలగట్టు గ్రామానికి చెందిన రెడ్యం శివలక్ష్మీనారాయణరెడ్డి పేకాట ఆడుతున్నట్లు అనుమానించి మే 6న ఖాజీపేట పోలీసులు స్టేషన్కు పిలిపించారు. అతనితోపాటు మరో 9 మందిని పిలిపించి విచారణ చేపట్టారు.తాము పేకాట ఆడలేదని వారు చెప్పినా.. పోలీసులు వినిపించుకోలేదు. రెడ్యం శివలక్ష్మీనారాయణరెడ్డిని పోలీసులు తీవ్రంగా వేధించారు. అనంతరం అతనితోపాటు విచారణకు వచ్చిన అందరినీ ఇంటికి పంపించారు. 7,8 తేదీల్లో స్టేషన్కు మళ్లీ విచారణ పేరుతో పిలిపించారు. 9న వారి పై పేకాట కేసుతోపాటు గంజాయి కూడా అమ్ముతున్నట్లు తప్పుడు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో రెడ్యం శివలక్ష్మీనారాయణరెడ్డి తోపాటు మరో 8 మందిని నిందితులుగా చూపుతూ, వారి వద్ద నుంచి 2.570 కిలోల గంజాయితోపాటు రూ 20,500 నగదు 52 పేకముక్కలు దొరికినట్లు చూపించారు. తనకు సంబంధంలేని గంజాయి కేసులో అరెస్టయిన శివలక్ష్మినారాయణరెడ్డి మే 29న బెయిల్పై బయటకు వచ్చారు.తన భార్య సుభాషిణికి జరిగిన విషయం వివరించారు. ఖాజీపేట సీఐ మోహన్ తనను అక్రమంగా పేకాట, గంజాయి కేసులో ఇరికించారని ఆవేదన చెందారు. తనను చిత్ర హింసలకు గురిచేసినట్లు చెప్పారు. తగిలిన దెబ్బలను భార్యకు చూపించి తీవ్ర మనోవేదన చెందారు. సీఐ మోహన్పై ప్రైవేటు కంప్లయింట్ వేసి కోర్డులోనే న్యాయం కోరదామని ఆమె నారాయణరెడ్డికి సర్ది చెప్పే యత్నం చేశారు. ఆయన బుధవారం మైదుకూరులో జరిగిన వైఎస్సార్సీపీ వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.జరిగిన అన్యాయాన్ని అక్కడ వైఎస్సార్సీపీ నాయకులకు చెప్పి బాధపడ్డాడు. తీవ్ర మనోవేదనతో రాత్రి 10 గంటలకు ఇంటి నుంచి బయటకు పోయి పుప్పగిరి వెళ్లే దారిలో ఉన్న సబ్స్టేషన్ మెయిన్ తీగలను పట్టుకుని విద్యుదాఘాతానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఎంతకూ ఇంటికి రాక పోవడంతో భార్యతోపాటు బంధువులు వెతికారు. చివరకు సబ్స్టేషన్లో విద్యుత్ తీగ పట్టుకుని చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. సీఐ మోహన్పై మృతుడి భార్య ఫిర్యాదుఖాజీపేట సీఐ మోహన్ తన భర్త నారాయణరెడ్డిని డబ్బుల కోసం, వేధించారని, డబ్బులు ఇవ్వక పోవడంతో అక్రమంగా కేసు నమోదు చేసి జైలుకు పంపి తన భర్త మృతికి కారణమయ్యాడని సుభాషిణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్త ఆత్మహత్యకు కారణమైన సీఐ మోహన్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విషయం తెలుసుకున్న మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి కడప మేయర్ సురేష్ బాబు ఎస్పీ అశోక్ కుమార్ను కలిశారు. సీఐది తప్పని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని నాయకులకు ఎస్పీ భరోసా ఇచ్చారు. అనంతరం దుంపలగట్టు గ్రామంలో జరిగిన లక్ష్మీనారాయణరెడ్డి అంత్యక్రియల్లో నాయకులు పాల్గొన్నారు. -
నేటి నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగా ల భర్తీకి నిర్వహించే డీఎస్సీ–2025 పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తం 44 దశల్లో ఈనెల 30వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9, మధ్యాహ్నం 2 గంటల నుంచి పరీక్షలు రెండు విడతల్లో జరుగుతాయి. పరీక్ష ప్రారంభానికి గంటన్నర ముందు నుంచే కేంద్రాల్లోకి ప్రవేశం ఉంటుంది. మొత్తం 16,437 పోస్టులకు 3,36,305 మంది 5,77,675 దరఖాస్తులు చేసుకున్నారని కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు.సీబీటీ విధానంలో జరిగే పరీక్షల కోసం రాష్ట్రంలో 137 పరీక్ష కేంద్రాలు, రాష్ట్రం వెలుపల హైదరాబాద్, కోదాడ, చెన్నై, బెంగళూరు, బెర్హంపూర్లో మరో 17 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మొదటి ప్రాధాన్యత క్రమంలో 87.8 శాతం మందికి వారి జిల్లాల్లోనే కేంద్రాలు కేటాయించారు. అన్ని కేంద్రాల్లోనూ సీసీటీవీలు ఏర్పాటు చేశారు. సందేహాల నివృత్తి కోసం రాష్ట్ర, జిల్లా స్థాయిలో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశామని, ఏమైనా ఫిర్యాదులుంటే 6281704160, 8121947387, 8125046997, 9398810958, 7995649286, 7995789286 9963069286, 7013837359 నంబర్లలో సంప్రదించాలని కన్వీనర్ కృష్ణారెడ్డి సూచించారు. -
లోకేశ్ ఒత్తిడితోనే మూల్యాంకనంలో తప్పులు
సాక్షి, అమరావతి, మంగళగిరి: కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మండిపడ్డారు. పదో తరగతి ప్రశ్నాపత్రాల మూల్యాంకనంలో జరిగిన తప్పులతో నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గురువారం మంగళగిరిలోని పాఠశాల విద్యా భవన్ ఎదుట ధర్నా నిర్వహించారు.లోకేశ్ అసమర్థత వల్లే పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రహసనంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన హడావుడికి విద్యార్థులు బలయ్యారని, లోకేశ్కు పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. వారం రోజుల్లో మూల్యాంకనం పూర్తి చేయాలంటూ ఒత్తిడి తెచ్చిన విద్యా శాఖ, అందులో జరిగిన తప్పులకు టీచర్లను బాధ్యులను చేసి చేతులు దులుపుకొనేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ధర్నాలో వారు ఏమన్నారంటే..విద్యా శాఖను భ్రష్టు పట్టించారు..‘‘పదో తరగతి పరీక్షలను సరిగా నిర్వహించలేక చేతులెత్తేసిన ప్రభుత్వం, జవాబు పత్రాల మూల్యాంకనంలోనూ ఘోరంగా ఫెయిలైంది. సాక్షాత్తు సీఎం చంద్రబాబు కుమారుడు నిర్వహించే శాఖలోనే పనితీరు ఇంత ఘోరంగా ఉందంటే.. మిగతా వ్యవస్థలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అన్ని సబ్జెక్టుల్లో 90 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు ఒక్కదాంట్లో కేవలం 5, 10, 20 మార్కులతో ఫెయిలవడం, రీకౌంటింగ్ లో 90 మార్కులు రావడం చూస్తే విద్యాశాఖ ఎంత భ్రష్టుపట్టిందో అర్థమవుతోంది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా 66,363 మంది రీవ్యాల్యూయేషన్, రీ వెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకుంటే 11 వేల మందికిపైగా ఉత్తీర్ణులయ్యారు. రికార్డుల కోసం విద్యార్ధుల జీవితాలతో ఆటలు వారం రోజుల్లో మూల్యాంకనం పూర్తి చేసి ఘనతగా చెప్పుకోవాలని భావించిన ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంది. సంఖ్యను పెంచకుండా ఉన్నవారితోనే మూల్యాంకనం చేయించడంతో టీచర్లు ఒత్తిడికి లోనయ్యారు. వైఎస్సార్ కడప జిల్లాలో గంగిరెడ్డి మోక్షితకు సాంఘిక శాస్త్రంలో 21 మార్కులు వేశారు. రీకౌంటింగ్ లో 84 మార్కులొచ్చాయి. బాపట్లలో తేజశ్వినికి అన్ని సబ్జెక్టుల్లో 90 శాతంకి పైగా మార్కులు వస్తే సాంఘిక శాస్త్రంలో 26 మార్కులతో ఫెయిలైంది. రీవెరిఫికేషన్ తర్వాత 96 మార్కులొచ్చాయి. రాష్ట్ర చరిత్రలో రీవెరిఫికేషన్ తర్వాత కేవలం 5, 10 మార్కులు పెరిగేవి. కానీ, ఇంత దారుణంగా 70 పైగా మార్కులు పెరిగిన సందర్భాలు లేవు. ఇదంతా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అసమర్థతను తెలియజేస్తుంది.విద్యార్థుల డబ్బులు తిరిగి చెల్లించాలిచాలామంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన లేక, రుసుములు భరించలేక రీవెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోలేదని తెలుస్తోంది. లేదంటే ఫలితాలు ఇంకా దారుణంగా ఉండేవేమో? రాజమహేంద్రవరంలో మణికంఠకు మొత్తం 505 మార్కులు రాగా.. హిందీలో 52 మాత్రమే వచ్చాయి. రీవెరిఫికేషన్ లో కొన్ని జవాబులను కొట్టేసి ఉన్నట్టు వెల్లడైంది. దీనిపై ప్రశ్నిస్తే అవి సరైన సమాధానాలేనని.. కానీ, విద్యార్థే కొట్టేశాడని చెబుతున్నారు. కష్టపడి రాసిన విద్యార్థి ఎందుకు కొట్టేస్తాడు? మంత్రి లోకేశ్ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పి పదవికి రాజీనామా చేయాలి.రెడ్ బుక్ అమలు మీద పెట్టిన శ్రద్ధ విద్యా శాఖ మీద పెడితే బాగుంటుంది. విద్యార్థులకు ఉచితంగా రీ వ్యాల్యుయేషన్, రీ వెరిఫికేషన్ కు అవకాశం కల్పించాలి. ఇప్పటికే రుసుములు చెల్లించినవారి డబ్బులు తిరిగివ్వాలి. లోకేశ్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కొందరు టీచర్లపై చర్యలు తీసుకుని ప్రభుత్వం చేతులు దులుపుకోవడం సిగ్గుచేటు’’ అని పానుగంటి చైతన్య, రవిచంద్ర దుయ్యబట్టారు. ధర్నాలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శివారెడ్డి, గుంటూరు జిల్లా అధ్యక్షుడు వినోద్, మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షుడు సందీప్, నాయకులు కోమల్ సాయి, గోపీచంద్, ఐ. శ్రీనివాస్, ఎస్కే ఆర్మాన్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.ర్యాలీని అడ్డుకున్న పోలీసులు..విద్యా భవన్ కు బైక్ ర్యాలీగా వస్తున్న విద్యార్థి నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. అనంతరం పరీక్షల విభాగం అధికారి కృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డికి విద్యార్థి నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. -
పడగ విప్పిన పచ్చ మాఫియా
ఇంటింటికి రేషన్ బియ్యం డోర్ డెలివరీ పథకాన్ని రద్దు చేసిన చంద్రబాబు ప్రభుత్వం డ్రగ్స్ డోర్ డెలివరీకి మాత్రం పచ్చజెండా ఊపుతోంది.మహిళల భద్రతకు ఉద్దేశించిన దిశ వ్యవస్థను నిర్వీర్యం చేసిన టీడీపీ కూటమి సర్కారు.. బాలికలపై జరుగుతున్న సామూహిక అత్యాచారాల పట్ల చోద్యం చూస్తోంది.కూటమి ఎమ్మెల్యేలతో ఊరూరా పేకాట క్లబ్బుల దందాకు తెరతీసిన బాబు ప్రభుత్వం... పోలీసులను అడ్డుపెట్టుకుని అమాయకులు ఆత్మహత్యకు పాల్పడేంత తీవ్రస్థాయిలో అక్రమ కేసులతో వేధిస్తోంది....గురువారం ఒక్కరోజే వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న మూడు సంఘటనలు రాష్ట్రంలో దారుణంగా దిగజారుతున్న పరిస్థితులకు నిదర్శనంగా నిలిచాయి. రెడ్బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తోందని స్పష్టం చేశాయి. డ్రగ్స్ మాఫియా కరాళ నృత్యం చేస్తూ యువతను నిర్వీర్యం చేస్తోందని తేల్చిచెప్పాయి. బాలికలపై అత్యాచారాలకు తెగబడుతున్న అరాచక మూకకు ప్రభుత్వమే కొమ్ముకాస్తోందన్న కఠిన నిజాన్ని వెలుగులోకి తెచ్చాయి. పేకాట క్లబ్బుల దందాతో ఎందరో జీవితాలను రోడ్డు పాల్జేస్తోందని నిర్ధారించాయి. అరాచక, అసాంఘిక కార్యక్రమాలతో యావత్ రాష్ట్రం బెంబేలెత్తుతోందని కుండబద్దలు కొట్టాయి.సాక్షి, అమరావతి; ఏడాది క్రితం టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతోంది. ఏకంగా కొరియర్ సర్వీసులతో డోర్ డెలివరీ చేసేంతగా దందా వేళ్లూనుకుంటోంది. యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్కు ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న డ్రగ్ డీలర్లు ఏడాదిగా ఆంధ్రప్రదేశ్నే ప్రధాన మార్కెట్గా చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీ నుంచి నూజివీడు మీదుగా విజయవాడ తరలిస్తున్న డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో రాష్ట్రంలో వేళ్లూనుకున్న మత్తు నెట్వర్క్ తీవ్రత వెలుగుచూసింది. విజయవాడలో పట్టుకున్నది గోరంతేనని.. రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న డ్రగ్స్ దందా కొండంత అని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. దేశంలో ప్రధాన నగరాలే కేంద్రంగా విస్తరించిన డ్రగ్స్ మాఫియా రాష్ట్రంలోని ఊరూరా విస్తరిస్తోంది. ఢిల్లీ, ముంబై, అమృత్సర్ తదితర నగరాల్లోని మాఫియా అప్ఘానిస్థాన్ తదితర దేశాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకుంటున్న డ్రగ్స్ను మార్కెట్ చేయడానికి ఏపీనే గమ్యస్థానంగా ఎంచుకున్నాయి. వివిధ రూపాల్లోని ఎండీఎంఏ డ్రగ్స్ను రాష్ట్రంలోకి యథేచ్ఛగా తరలిస్తున్నారు. అందుకోసం విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, కర్నూలు, కాకినాడ వంటి ప్రధాన నగరాలతో పాటు నూజివీడు, జగ్గయ్యపేట, భీమవరం, విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, హిందూపురం, నంద్యాల వంటి దాదాపు 50 పట్టణాల్లో ఏజెంట్ల వ్యవస్థను డ్రగ్స్ ముఠా ఏర్పాటు చేసుకుంది. ఢిల్లీ, ముంబై తదితర నగరాల నుంచి స్థానిక ఏజెంట్లకు డ్రగ్స్ను సరఫరా అవుతున్నాయి. ఇందుకోసం కొరియర్ సర్వీసులను వాడుకుంటున్నాయి. ఏజెంట్లు అందుకున్న డ్రగ్స్ను చిన్నచిన్న ప్యాకెట్లుగా వెండార్స్ (విక్రేతలు)కు అందిస్తున్నారు. ఆ వెండార్స్ గట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తూ యువతను మత్తులో ముంచుతున్నారు. విద్యాసంస్థలే టార్గెట్డ్రగ్స్ మాఫియా రాష్ట్రంలోని విద్యాసంస్థలను తమ దందాకు కేంద్రంగా చేసుకుంది. వెండార్స్ విద్యాసంస్థల ప్రాంగణాల సమీపంలోనే విక్రయిస్తున్నారు. జూనియర్ కాలేజీల నుంచి ఇంజినీరింగ్, మెడికల్, ఇతర వృత్తి విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీలను లక్ష్యంగా చేసుకున్నారు. ఉన్నత విద్యాసంస్థల సమీపంలోనే బడ్డీలు, స్ట్రీట్ వెండార్స్ రూపంలో డ్రగ్స్, గంజాయి విక్రయాలు సాగిస్తున్నారు. సిగరెట్లు, చాక్లెట్లు, చూయింగ్ గమ్, పౌడర్ రూపంలో విక్రయిసు్తన్నారు. విజయవాడలోని ఉన్నత విద్యాసంస్థల ప్రాంగణాల సమీపంలో విక్రయించేందుకు ఢిల్లీ నుంచి కొరియర్ సర్వీసు ద్వారా నూజివీడు మీదుగా డ్రగ్స్ తరలించడమే అందుకు తాజా తార్కాణం.డ్రగ్స్పై చోద్యం చూస్తున్న చంద్రబాబు సర్కారురాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా విచ్చలవిడిగా చెలరేగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం మొద్దునిద్ర వీడడం లేదు. డ్రగ్స్ను అరికట్టేందుకు ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టమైన కార్యాచరణ చేపట్టలేదు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆపరేషన్ పరివర్తన్ను రెండు దశల్లో సమర్థంగా అమలు చేసింది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్)ను ఏర్పాటు చేసి పటిష్ఠ కార్యాచరణ చేపట్టింది. ఏపీ–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో దశాబ్దాలుగా నడుస్తున్న గంజాయి సాగును కూకటివేళ్లతో పెకలించింది. ఏకంగా 11,500 ఎకరాల్లో పంటను ధ్వంసం చేసింది. గిరిజనులను ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా ప్రోత్సహించింది. ఇందుకు రూ.500 కోట్లతో ప్రత్యేక పథకాన్ని తెచ్చింది. ఇక విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి డ్రగ్స్ అక్రమ రవాణాను సమర్థంగా కట్టడి చేసింది. సెబ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలతో అక్రమ రవాణాను అడ్డుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి కేసులు కూటమి రాకతో..టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పోలీసు వ్యవస్థ డ్రగ్స్పై పట్టు వదిలేసింది. సర్కారు కక్షపూరితంగా సెబ్ను రద్దు చేసింది. కొత్తగా ఈగల్ వ్యవస్థను తెచ్చామని చెప్పినప్పటికీ దానికి కనీసం మౌలిక వసతులు సమకూర్చలేదు. విస్తృత అధికారాలు కల్పించలేదు. ప్రధానంగా ఉమ్మడి విశాఖ జిల్లా కేంద్రంగా డ్రగ్స్ దందాకు టీడీపీ సీనియర్ నేత కుటుంబం అండదండలు ఉండడంతో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఉదాసీనంగా ఉంటోందన్న విషయం స్పష్టమైంది. అందుకనే పోలీసు శాఖ కూడా డ్రగ్స్ దందా యథేచ్ఛగా సాగుతున్నా చోద్యం చూస్తోంది.రాష్ట్రంలో ఏరులై పారుతున్నమద్యంఇంటింటికీ డెలివరీ చేస్తున్న బెల్ట్ షాప్లుపోలీసులే దగ్గరుండి అమ్మిస్తున్న వైనంపైనుంచి కిందివరకు చేతులు మారుతున్న లంచాలుకూటమి ప్రభుత్వం పాలనలో డ్రగ్స్ దందాకు తోడు మద్యం ఏరులై పారుతోంది. వసూ్తనే ప్రైవేటు మద్యం దుకాణాల వ్యవస్థను మళ్లీ తెచ్చిన చంద్రబాబు సర్కారు.. పోలీసులను పెట్టించి మరీ దగ్గరుండి అమ్మకాలు సాగిస్తోంది. బార్లకు తోడు పర్మిట్ రూమ్లనూ ప్రవేశపెట్టే యోచనలో ఉంది. మరోవైపు బెల్టు షాపులకు పచ్చజెండా ఊపింది. దీంతో ఒక్కో ఊరిలో రెండు, మూడు బెల్టుషాపులు వెలిశాయి. ఇంటింటికీ మద్యం డెలివరీ చేస్తున్నాయి. ఇక మద్యం మత్తులో జరుగుతున్న నేరాలు–ఘోరాలకు అంతే ఉండడం లేదు. మద్యం తాగేందుకు డబ్బులు కావాలంటూ అయినవారిపైనే దాడులకు దిగుతున్న ఉదంతాలు కనిపిస్తున్నాయి. కాగా, మద్యం దందాలో పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు భారీఎత్తున లంచాలు చేతులు మారుతున్నాయి.అత్యాచారాలతో అట్టుడుకుతున్న రాష్ట్రంమహిళలు, బాలికలపై వరుసగా అత్యాచారాలతో రాష్ట్రం హడలిపోతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో అత్యాచారాలు, హత్యాచారాల గణాంకాలు చూస్తే భయాందోళనలు కలుగుతున్నాయి. చంబల్ లోయను తలపిస్తున్న రీతిలో మహిళలు, బాలికలపై అఘాయిత్యాలకు తెగబడుతుండడంలో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.ముక్కుపచ్చలారని బాలికలు, విద్యార్థినులకూ భద్రత కరువుచంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో అత్యాచార పర్వం యథేచ్ఛగా సాగుతోంది. శ్రీవారి దివ్యక్షేత్రం తిరుపతి, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ నియోజకవర్గం పిఠాపురం, మంత్రి లోకేశ్ నియోజకవర్గం మంగళగిరి, హోం మంత్రి అనిత నియోజకవర్గం పాయకారావుపేట... ఇలా రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, బాలికలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యమయ్యాయి. ముక్కుపచ్చలారని బాలికలు, విద్యార్థినులకు ఏమాత్రం భద్రత లేకపోవడం తల్లిదండ్రులను తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తోంది. ఈ దారుణపర్వంలో మరో దుర్ఘటన అనంతపురం జిల్లాలో తాజాగా వెలుగులోకి వచ్చింది. మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత సొంత ప్రాంతం రామగిరి మండలం పేరూరు పంచాయతీ ఏడుగుర్రాలపల్లిలో 9వ తరగతి చదువుతున్న దళిత బాలికపై 13 మంది యువకులు సామూహిక అత్యాచారం చేశారు. బాలిక గర్భం దాల్చడంతో ఈ దారుణం బయటకు పొక్కింది. నిందితులు అందరూ టీడీపీ కార్యకర్తలే కావడంతో అధికార పార్టీ నేతలు వారికి అండగా నిలుస్తున్నారు. ఇది ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.బెజవాడలో డ్రగ్స్ రాకెట్పటమట (విజయవాడ తూర్పు): డ్రగ్స్ తరలిస్తున్న ముగ్గురు యువకులను విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ కమిషనరేట్ డీసీపీ కేజీవీ సరిత గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడలోని రామవరప్పాడు రింగ్ వద్ద ఈ నెల 4న వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు యువకులు రెండు స్కూటర్లపై అనుమానాస్పదంగా కనిపించారు. వారు ప్రయాణిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్, మరో ద్విచక్ర వాహనాన్ని తనిఖీ చేశారు. ఆ వాహనాల డిక్కీల్లో ఉన్న తెలుపు రంగు క్రిస్టల్ ఎండీఎంఏ (మిథలిన్ డయాక్సి మిథపేటావిున్) డ్రగ్ రెండు ప్యాకెట్లు, ఊదా రంగు క్రిస్టల్ ఎండీఎంఏ డ్రగ్ ఒక ప్యాకెట్, ఎరుపు రంగు ఎండీఎంఏ డ్రగ్ ఒక ప్యాకెట్ లభించాయి. సుమారు 33 గ్రాములు గల ఈ డ్రగ్స్ విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని అంచనా. వీటిని తీసుకొస్తున్న కృష్ణా జిల్లా పెనమలూరు మండలం సనత్నగర్ రామాలయం వీధికి చెందిన తిరుమలశెట్టి జీవన్కుమార్ (29), పటమట ఫన్టైం క్లబ్ రోడ్డులో నివాసం ఉండే బొంతు నితీష్కుమార్ (28), కృష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమలకుదురు ఇందిరానగర్–1కు చెందిన తులిమిల్లి తరుణ్ప్రసాద్(20)ను అరెస్ట్ చేశారు.ఢిల్లీ నుంచి నూజివీడుకు..ప్రమాదకరమైన ఈ డ్రగ్స్ను ఢిల్లీకి చెందిన రింకు అనే వ్యక్తి ట్రాక్ఆన్, డీటీడీసీ కొరియర్ ద్వారా నూజివీడులో ఉండే మనోహర్కు సరఫరా చేశారని డీసీపీ చెప్పారు. అక్కడి నుంచి ముగ్గురు నిందితులు విజయవాడకు తరలిస్తుండగా.. పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు. నిందితులు జీవన్కుమార్, మనోహర్ ఇంటర్ క్లాస్మేట్స్. వీరికి యూపీలో ఉంటున్న మనోహర్కుమార్ మేనమామ ద్వారా ఢిల్లీకి చెందిన రింకూ పరిచయమయ్యారని డీసీపీ వివరించారు. విజయవాడ సరఫరా అయిన డ్రగ్స్ను నగర శివారులోని ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులకు సరఫరా చేస్తారని చెప్పారు. ఈ రాకెట్లో ఢిల్లీకి చెందిన రింకూ, నూజివీడుకు చెందిన మనోహర్కుమార్, యూపీలో ఉండే మనోహర్ మేనమామ కోసం గాలిస్తున్నట్టు వెల్లడించారు. నిందితుల నుంచి 2 స్కూటర్లు, 7 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పటమట సీఐ పవన్కిషోర్, ఎస్సై దుర్గాదేవీలను డీసీపీ అభినందించారు. డీసీపీ వెంట ఏసీపీ దామోదర్ ఉన్నారు.ఉసురు తీస్తున్న రెడ్బుక్ వేధింపులుపేకాట దందా కూటమి ఎమ్మెల్యేలది.. బలయ్యేది ప్రజలుఆత్మహత్య చేసుకునేంతగా తీవ్ర స్థాయి వేధింపులుచంద్రబాబు ప్రభుత్వ రెడ్బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో అమాయకుల ప్రాణాలు బలిగొంటోంది. ప్రభుత్వ పెద్దల కుట్రలకు వత్తాసు పలుకుతూ పోలీసులు అధికారిక గూండాల మాదిరిగా బరితెగిస్తున్నారు. తాజాగా వైఎస్సార్ జిల్లా ఖాజీపేట మండలం దంపలగట్టుకు చెందిన రెడ్యం శివలక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకునేలా అక్రమ కేసులతో వేధించడం దీనికి నిదర్శనం. దీంతో మనస్తాపం చెందిన ఆయన గురువారం రాత్రి 10 గంటలకు ఇంటి నుంచి వెళ్లి పుప్పగిరిదారిలో ఉన్న సబ్స్టేషన్ మెయిన్ వైరు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు విషయం ఏమిటంటే... రాష్ట్రంలో పేకాట క్లబ్బులను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిషేధించింది. కానీ, పేకాట మాఫియాకు చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ ప్రాణం పోసింది. గత ఏడాది టీడీపీ ప్రభుత్వం రాగానే పేకాట క్లబ్బులకు అనుమతులిచ్చింది. కూటమి ఎమ్మెల్యేలే స్వయంగా పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా జూదరులు వచ్చి పేకాడేలా అతిపెద్ద కాసినోలు నడుపుతుండడం గమనార్హం. రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలు, నగరాలు, ప్రధాన పట్టణాల్లో ఎంపిక చేసిన అపార్టుమెంట్లు, రిసార్టులు, లాడ్జిలు, మూసివేసిన సినిమా థియేటర్లు... ఇలా అన్నీ కూడా పేకాట క్లబ్బులుగా మారిపోయాయి. పోలీసులకు మామూళ్లు ముట్టజెబుతూ కూటమి ఎమ్మెల్యేలు భారీగా కమీషన్లు తీసుకుంటూ రోజుకు రూ.వందల కోట్లలో పేకాట దందా సాగిస్తున్నారు. కానీ, అసలు పేకాటతో నిమిత్తం లేని అమాయకులను ఇరికించి.. ఆత్మహత్యకు పాల్పడేలా అక్రమ కేసులతో పోలీసులు వేధిస్తున్నారు. ఇదీ చంద్రబాబు రెడ్బుక్ రాజ్యాంగం. -
‘ఈవీ’లకు ఫుల్ పవర్
విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతో ప్రపంచ దేశాలు చేసుకున్న ఒప్పందంలో భాగంగా కేంద్రం పీఎం ఈ–డ్రైవ్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రూ.2,000 కోట్లతో దేశ వ్యాప్తంగా 72 వేల ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) చార్జింగ్ స్టేషన్లను నెలకొల్పనున్నట్లు వెల్లడించింది. ప్రపంచంలో అత్యధిక కాలుష్యం గల దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో 2030కి సంప్రదాయ వాహనాల స్థానంలో 30% ఈవీ కార్లు, 80 %ఈవీ టూ వీలర్లు, 70% ఈవీ కమర్షియల్ వెహికిల్స్ ప్రవేశపెట్టాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తంగా 8 కోట్ల విద్యుత్ వాహనాలు వచ్చే ఐదేళ్లలో రోడ్లమీద నడవాలని నిర్దేశించుకుంది. తద్వారా 2030కి 1 గిగా టన్ కర్బన ఉద్గారాలు తగ్గుతాయని అంచనా. అయితే ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మాత్రం ఈవీల వినియోగం పెరగాలి. అందుకోసం చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు వేగవంతం కావాల్సిన అవసరం ఉంది.ఆలోచించి కొంటున్నారు..2024–25లో దేశ వ్యాప్తంగా 20 లక్షల విద్యుత్ వాహనాలను వాహనదారులు కొనుగోలు చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో అమ్ముడైన ఈ విద్యుత్ వాహనాల్లో సగం (60%)పైగా ఈవీ ద్విచక్ర వాహనాలే ఉన్నాయి. అంటే 12 లక్షలు ఈవీ మోటార్ సైకిళ్ల విక్రయాలు జరిగాయి. 2023తో పోల్చితే ఈవీ విక్రయాల వృద్ధి 24%గా ఉంది. దాదాపు లక్ష విద్యుత్ కార్లను వినియోగదారులు గతేడాది కొనుగోలు చేశారు.ఎలక్ట్రిక్ బస్సుల విక్రయాలు మాత్రం 3% తగ్గాయి. విద్యుత్ వాహనాలను కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉన్నప్పటికీ వాటికి చార్జింగ్ పెట్టడమనేది ప్రధాన సమస్యగా మారడంతో ఎక్కువ మంది సంశయిస్తున్నారు. కొనాలా వద్దా అని ఒకటికి పదిసార్లు ఆలోచించాకే నిర్ణయం తీసుకుంటున్నారు. ఆ సమస్యను అధిగ విుంచాలంటే కేంద్రం చార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకురావాలి.ప్రపంచ స్థాయికి చేరలేదు ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్లో ఇంకా ఆ స్థాయిలో ఈవీల వినియోగం పెరగలేదు. దీనికి ప్రధాన కారణం ఎక్కడికక్కడ చార్జింగ్ స్టేషన్లు లేకపోవడం. దేశంలో ప్రస్తుతం 12,146 విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ చెబుతోంది. 2030కి దేశ వ్యాప్తంగా 39 లక్షల ఈవీ చార్జింగ్ స్టేషన్లు అవసరం. భారత్లో ప్రతి 135 ఈవీలకు ఒక పబ్లిక్ చార్జర్ మాత్రమే ఏర్పాటైంది. ఇండియా ఎలక్ట్రిక్ వాహనం చార్జింగ్ మార్కెట్ గడిచిన ఐదేళ్లలో రూ.30 వేల కోట్లకుపైగా పెట్టుబడులను ఆకర్షించింది. అయినప్పటికీ, మౌలిక సదుపాయాల సమస్యలను ఎదుర్కొంటోంది. ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులను, ప్రోత్సాహకాలను పెంచడం, ప్రపంచ ఉత్తమ పద్ధతులను అవలంబించడం ద్వారా ఈ సమస్యను అధిగవిుంచవచ్చని గుర్తించిన కేంద్రం ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు రూ.2,000 కోట్లు కేటాయించింది. బాటలు వేసిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏపీలో ప్రస్తుతం 1,23,396 విద్యుత్ వాహనాలున్నాయి. 2030 నాటికి వీటి సంఖ్య 7,82,660కు చేరుతుందని అంచనా. ఈ నేపథ్యంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యుత్ వాహనాలు, చార్జింగ్ స్టేషన్ల విధి విధానాలను ప్రత్యేక పాలసీగా రూపొందించింది. రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో ప్రతి 3 కిలోమీటర్లకు ఒకటి, జాతీయ రహదారుల్లో 25 కిలోమీటర్లకు ఒకటి చొప్పున విద్యుత్ చార్జింగ్ కేంద్రాలను నెలకొల్పాలని సంకల్పించింది.అందుకు అవసరమైన 4,000 స్థలాలు అప్పట్లోనే గుర్తించింది. విజయవాడ, అమరావతి, విశాఖ, తిరుపతిలను మోడల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ నగరాలుగా గుర్తించింది. పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ల(పీసీఎస్)ను ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దీనికి ఎటువంటి లైసెన్స్ తీసుకోనవసరం లేదని చెప్పింది. ఇప్పుడు కేంద్రం అదే బాటలో నడుస్తోంది. దేశవ్యాప్తంగా 50 జాతీయ రహదారుల వెంబడి, టోల్ ప్లాజాలు,విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు వంటి ప్రజా రవాణా ఉండే ప్రాంతాల్లో చార్జింగ్ స్టేషన్లు పెట్టనుంది. నగరాలు, పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ వాటిని అందుబాటులోకి తీసుకురావాలని అనుకుంటోంది. -
ఇలాగైతే.. మాకు చావే గతి
సాక్షి, అమరావతి: “ఏడాదిగా మంత్రులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవని.. మాకు చెల్లించాల్సిన ప్రోత్సాహకాలు ఇప్పుడు ఇవ్వలేమని చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే మా దగ్గర ఉన్న బస్సులు తగులబెట్టి ఆత్మహత్య చేసుకోవడం తప్ప మాకు వేరే గత్యంతర లేదు’ అని వాపోతున్నారు ఆర్టీసీకి అద్దె బస్సులు నడుపుతున్న ఎస్సీ, ఎస్టీ అద్దె బస్సుల యజమానులు. ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న ఇబ్బందులు, తాము పడుతున్న కష్టాలను ఏకరువు పెడుతూ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఏడాదిలో ఒక్క రూపాయైనా ఇవ్వలేదు ఎస్సీ, ఎస్టీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన “వైఎస్సార్ బడుగు వికాసం’ పథకం కింద వీరంతా బస్సులు కొనుగోలు చేసి ఏపీఎస్ ఆర్టీసీకి అద్దె బస్సులుగా నడుపుతున్నారు. 300 మందికిపైగా ఎస్సీ, ఎస్టీ యువత గత ప్రభుత్వ ప్రోత్సాహంతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని బస్సులు కొనుగోలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వీరికి ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు నిలిపివేసింది. ఈ పథకం కింద లబ్ధి పొందిన ఎస్సీలకు సుమారు రూ.500 కోట్లు, ఎస్టీలకు రూ.150 కోట్లు పారిశ్రామిక ప్రోత్సాహకాలను విడుదల చేయకుండా కూటమి సర్కారు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. కేవలం వైఎస్సార్ బడుగు వికాసం పథకం కింద లబ్ధి పొందారన్న ఏకైక కారణంతో బకాయిలు ఇవ్వకుండా వేధిస్తున్నారంటూ వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు లోకేశ్, టీజీ వెంకటేష్తోపాటు పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్, డైరెక్టర్, ఏపీఐఐసీ ఎండీ అభిషిక్త్ కిషోర్లను అనేకసార్లు కలిసి తమ కష్టాలు మొరపెట్టుకున్నా ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదని వాపోయారు. కనీసం రుణాల చెల్లింపునకు సంబంధించి బ్యాంకులతోనైనా మాట్లాడండి అని కోరుతున్నా ఉపయోగం లేకుండా పోతోందంటున్నారు. ఏడాది కావస్తున్నా బకాయిలతో పాటు ఈ ఏడాది ప్రోత్సాహకాల్లో ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క అద్దె బస్సు నుంచి ప్రభుత్వానికి అన్ని ఖర్చులు పోనూ ప్రతినెలా రూ. 3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఆదాయం వస్తోందని బస్సు యజమానులు చెబుతున్నారు. ప్రతినెలా 300 అద్దె బస్సుల ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.9 కోట్లకుపైగా ఆదాయాన్ని బడుగు పారిశ్రామికవేత్తలు సమకూరుస్తున్నా ప్రభుత్వం తమపై కనికరం చూపించడం లేదని వాపోతున్నారు. ఈ నెల 27న అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ డే లోగా పారిశ్రామిక ప్రోత్సాహకాలను విడుదల చేయాలని.. లేకపోతే ఆందోళన తీవ్రతరం చేసి సీఎం ఇంటిని ముట్టడించడానికి కూడా వెనుకాడబోమంటూ ఎస్సీ, ఎస్టీ అద్దె బస్సుల యజమానులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. డబ్బులు లేనప్పుడు హామీ ఎందుకిచ్చారు? చదువుకున్నా ఉద్యోగాలు లేని సమయంలో గత ప్రభుత్వ ప్రోత్సాహంతో ఎంటర్ప్రెన్యూర్గా తయారవుదామన్న ఆశతో వైఎస్సార్ బడుగు వికాసం పథకం కింద బస్సు కొనుగోలు చేసి నెల్లూరు–పామూరు మధ్య తిప్పుతున్నాను. ఈ పథకం కింద ఇస్తామన్న రాయితీలు ఇవ్వకపోవడంతో నాలాగే అనేకమంది ఎస్సీ, ఎస్టీ యువకులు బ్యాంకు ఈఎంఐలు కట్టలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులను కలిస్తే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు.. రాయితీలు ఇప్పుడు ఇవ్వలేం అంటున్నారు. డబ్బులు లేనప్పుడు ప్రోత్సాహకాలు ఇస్తామని హామీ ఇందుకు ఇచ్చారు. – హరి, నెల్లూరు–పామూరు అద్దె బస్సు ఓనర్ మా గోడు వినేవారేరి? బడుగులు గోడు వినిపించుకునే అధికారులే కనిపించడం లేదు. ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ వంటి పెద్ద కంపెనీలకు రాయితీలు ఇవ్వడానికి వస్తున్న డబ్బులు మా ఎస్సీ, ఎస్టీలకు చెందిన చిన్న కంపెనీలకు వచ్చేసరికి ఎందుకు ఉండటం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశాం. మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ను కలిసి విజ్ఞప్తి చేశాం. అధికారులనైతే లెక్కలేనన్నిసార్లు కలిశాం. అయినా ఉపయోగం లేదు. బ్యాంకు వాళ్లు పెడుతున్న ఇబ్బందులతో మేం బస్సులు నడపలేకపోతున్నాం. తక్షణం ప్రోత్సాహకాలు ఇప్పించండి. లేకపోతే మాకు ఆత్మహత్యలే శరణ్యం. – రాపాక మహేష్, అధ్యక్షుడు, ఎస్సీ, ఎస్టీ హైర్ బస్ ఓనర్స్ అసోసియేషన్ -
అయినవారికి అనుకూలంగా బదిలీ మార్గదర్శకాలు
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగ బదిలీల్లో సాంకేతిక విద్యాశాఖ కొత్త భాష్యం చెబుతోంది. పలుకుబడి ఉన్నవారికి, ముడుపులిచ్చిన వారికి అనుకూలంగా బదిలీ మార్గదర్శకాలు రూపొందించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇవి పట్టణాల్లో పనిచేసే సిబ్బందికే మేలుచేసేలా ఉన్నాయని.. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లోని పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న వారు పట్టణాలకు వచ్చే వీల్లేకుండా చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం ఆదేశాలివ్వడంతో అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ కమిటీల సూచనల మేరకు ‘0’ నుంచి 5 ఏళ్ల సర్వీసు ఉన్నవారిని బదిలీచేస్తున్నారు. ఇందుకోసం శాఖల్లోని ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలతో కమిటీ వేసి అందుకనుగుణంగా మార్గదర్శకాలు రూపొందిస్తారు. కానీ, సాంకేతిక విద్యాశాఖలో మాత్రం అందుకు భిన్నంగా కొందరు కిందిస్థాయి సిబ్బంది సూచనలతో రెండేళ్లు సర్వీసు దాటిన వారిని బదిలీ చేసేందుకు మార్గదర్శకాలు రూపొందించారు. దీనిపై ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రావడంతో పాటు ప్రభుత్వ కార్యదర్శికి ఫిర్యాదులు వెళ్లడంతో వాటిని రద్దుచేశారు. దీంతో.. కొత్త మార్గదర్శకాలు రూపొందించారు. అయితే, ఇవి కూడా అయినవారికి మేలు చేసేలాగే ఉన్నాయని పలువురు ఉద్యోగులు, అధ్యాపకులు ఇటీవల డైరెక్టరేట్కు వచ్చి నిలదీసినట్లు తెలిసింది. డెప్యుటేషన్లు అడ్డంపెట్టుకుని ఆటలు..ఉద్యోగుల బదిలీల్లో వారు పనిచేస్తున్న ప్రాంతాలను ఫొకల్ (పట్టణం), నాన్–ఫోకల్ (గ్రామీణ/ఏజెన్సీ)గా పేర్కొంటారు. ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి ఏడాదికి 3 పాయింట్లు, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి 4 పాయింట్లు బదిలీల్లో కేటాయిస్తారు. అవసరాన్నిబట్టి పని సర్దుబాటుపైనా, డెప్యుటేషన్ పైనా సిబ్బందిని ఇటు నుంచి అటు.. అటు నుంచి ఇటు అధికారులు పంపిస్తారు. అయితే, ఈ సర్దుబాటు సాంకేతిక విద్యాశాఖలో విచిత్రంగా జరుగుతోంది. నాన్–ఫోకల్కు బదిలీ అయిన వారిలో కొందరు తమ పలుకుబడిని ఉపయోగించి ఫోకల్ ప్రాంతాలకు డెప్యుటేషన్ వేయించుకుంటున్నారు. ఇందుకోసం ఫోకల్లో ఉన్న వారిని వర్క్ అడ్జెస్ట్మెంట్పై నాన్–ఫోకల్ ప్రాంతానికి పంపిస్తున్నారు. ఐటీడీఏ ప్రాంతాల్లోని కాలేజీల్లో పోస్టులు వచ్చిన వారు ఫోకల్ (పట్టణ) ప్రాంతాల్లోకి వర్క్ అడ్జెస్ట్మెంట్, డెప్యుటేషన్పై వచ్చి పనిచేస్తున్నారు. ప్రస్తుత బదిలీల్లో వీరు ఏజెన్సీ పాయింట్లు పొందుతున్నారు. వేతనం పొందే ప్రాంతం ఆధారంగా నిబంధనలు.. ఇక తమను పట్టణ ప్రాంతాల్లో (ఫోకల్) పోస్టింగ్ ఇచ్చినా గ్రామీణ ప్రాంతాల్లో డెప్యుటేషన్ వేశారని, కొన్నేళ్లుగా తాము అక్కడే పనిచేస్తున్నందున తమను నాన్–ఫోకల్గా గుర్తించాలని ఆ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కానీ, వారి విజ్ఞప్తులను పట్టించుకోకుండా జీతం పొందుతున్న ప్రాంతం ఆధారంగా పాయింట్లు కేటాయించేందుకే డైరెక్టరేట్ నిబంధనలను ఖరారు చేసినట్లు చెబుతున్నారు. దీనివల్ల తాము నష్టపోతామని, ఇప్పటికే నాన్–ఫోకల్లో డెప్యుటేషన్పై పనిచేస్తున్న తాము బదిలీల్లో మరి కొన్నేళ్లు ఇక్కడే పనిచేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వాస్తవంగా పనిచేస్తున్న ప్రాంతాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.స్కూలు అసిస్టెంట్లకు తప్పనిసరి బదిలీ..మరోవైపు.. ప్రభుత్వ పాఠశాల విద్యను తిరోగమనంలోకి నెట్టేస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయ (ఎంపీఎస్ హెచ్ఎం) పోస్టుల్లోకి మరికొందరిని తప్పనిసరిగా బదిలీ చేయాలని పాఠశాల విద్యాశాఖ డీఈఓలను ఆదేశించింది. చట్టానికి, ఉపాధ్యాయ నియామక నిబంధనలకు విరుద్ధంగా తీసుకొచ్చిన ఈ పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్లను నియమిస్తున్న సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంలో 3–5 తరగతుల విద్యార్థులకు మెరుగైన బోధన కోసం సబ్జెక్టు టీచర్లుగా స్కూల్ అసిస్టెంట్లను నియమిస్తే.. కూటమి ప్రభుత్వం వారిని తొలగించింది. అంతేగాక.. ప్రాథమికోన్నత పాఠశాలల్లోని ఉన్నత తరగతుల విద్యార్థులకు సైతం స్కూల్ అసిస్టెంట్ల బోధనను రద్దుచేసింది. ఇలా మిగులుగా తేలిన 4,693 మంది స్కూల్ అసిస్టెంట్లను బోధనకు దూరంచేసి ఎంపీఎస్ హెచ్ఎంలుగా నియమిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న బదిలీల్లో మొత్తం 3,781 మంది ఎస్ఏలను ఎంపీఎస్ హెచ్ఎంలుగా బదిలీచేశారు. మరో 912 మందిని ఈ పోస్టుల్లో నియమించాల్సి ఉంది. ఈ క్రమంలో.. మిగిలిన ఈ పోస్టుల్లో డీఎస్సీ–2025 వారికి 415 పోస్టులు కేటాయించారు. మరో 461 పోస్టుల్లో ఎస్జీటీలకు పదోన్నతులిచ్చి నియమిస్తారు. మిగిలిన 36 పోస్టుల్లో తప్పనిసరిగా స్కూల్ అసిస్టెంట్లను నియమించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు.వాస్తవానికి.. ప్రాథమిక పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయ పోస్టులను ఎస్జీటీలకు సీనియారిటీ ఆధారంగా పదోన్నతిపై భర్తీచేస్తారు. కానీ, ఎన్నడూలేని విధంగా సబ్జెక్టు టీచర్లయిన స్కూల్ అసిస్టెంట్లను పీఎస్ హెచ్ఎం పోస్టుల్లో నియమిస్తున్నారు. దీంతో తమ పరిస్థితి ఏంటో అర్ధంగాక స్కూల్ అసిస్టెంట్లు ఆందోళన చెందుతున్నారు.టెక్నికల్గా ఎన్ని విచిత్రాలో..» ఏజెన్సీ ప్రాంతాలైన సీతంపేట, గుమ్మలక్ష్మీపురం, రంపచోడవరం, కేఆర్పురంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో 2014 నుంచి పూర్తిస్థాయిలో పోస్టుల్లేవు. దీంతో మైదాన ప్రాంతాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలోని పాలిటెక్నిక్ కాలేజీల సిబ్బందిని డెప్యుటేషన్, వర్క్ అడ్జెస్ట్మెంట్ కింద బదిలీ చేశారు. కొన్నేళ్లుగా వారు ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్నా వేతనం మాత్రం పోస్టింగ్ ఇచ్చిన పట్టణ కాలేజీల నుంచి పొందుతున్నారు. దీంతో వీరికి ఫోకల్ కింద ఏడాదికి 3 పాయింట్లే వస్తున్నాయి. » కృష్ణా జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలో పోస్టింగ్ వచి్చన ఒకరు డెప్యుటేషన్పై కాకినాడ పాలిటెక్నిక్ కాలేజీలో ప్రిన్సిపాల్గా పోస్టింగ్ వేయించుకున్నారు. ఈయనకు నాన్–ఫోకల్ కింద ఏడాదికి 4 పాయింట్లు పొంది బదిలీల్లో తిరిగి ఫోకల్కే వెళ్లే అవకాశం ఉంది. » అలాగే, రాయలసీమలోని ఓ ఐటీడీఏ పరిధిలోని గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజీలో పోస్టింగ్ పొందిన ఓ ఉద్యోగి కొద్దిరోజులకే రాష్ట్ర కార్యాలయానికి డెప్యుటేషన్ వేయించుకున్నారు. కానీ, ప్రస్తుత బదిలీల్లో ఆయనకు ఏజెన్సీ పాయింట్లు పొంది తిరిగి ఫోకల్ ప్రాంతానికి వెళ్లే ఛాన్స్ తెచ్చుకున్నారు. » మరికొందరు ఉద్యోగులు విజయవాడ ప్రసాదంపాడులోని డైరెక్టరేట్ ఉన్న సమయంలో కొన్నేళ్లు పనిచేశారు. డైరెక్టరేట్ తాడేపల్లికి మారే క్రమంలో విజయవాడ పాలిటెక్నిక్ కాలేజీకి పోస్టింగ్ వేయించుకున్నారు. దీంతో వారి స్టేషన్ మారిందని చెప్పి ప్రస్తుత బదిలీ తమకు వర్తించదని చెబుతున్నారు. ఇలాంటి చిత్రాలెన్నో సాంకేతిక విద్యాశాఖలో జరుగుతున్నాయి. రెండు మూడ్రోజుల్లో బదిలీలు చేపట్టనున్న క్రమంలో వర్క్ అడ్జెస్ట్మెంట్, డెప్యుటేషన్పై నాన్–ఫోకల్ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి న్యాయం చేస్తారా.. లేక పలుకుబడి ఉన్నవారికే ఫోకల్ పోస్టింగ్స్ ఇస్తారా అన్న ఆందోళన ఉద్యోగుల్లో నెలకొంది. -
ఈ రేయి వేడైనది..!
ఈ రేయి చల్లనిది అని పాడుకునే రోజులు పోయాయి. పగటి ఉష్ణోగ్రతలు మాదిరే రాత్రి కూడా వేడి వాతావరణం వేధించే రోజులు వచ్చేశాయి. అదీ చాలా ప్రమాదకర స్థాయిలో ఉండటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. రాత్రి వేడి వాతావరణం ఉండే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ టాప్–2లో ఉందని కేంద్ర ఇంధన, పర్యావరణ, నీటి మండలి (సీఈఈఈడబ్ల్యూ) చేసిన ‘హౌ ఎక్స్ట్రీమ్ హీట్ ఇంపాక్టింగ్ ఇండియా’ అనే తాజా అధ్యయనంలో వెల్లడైంది. తాజాగా విడుదలైన ఈ అధ్యయనం దేశంలో నాలుగు దశాబ్దాల వాతావరణ ఆధారిత ఉష్ణోగ్రతలను అంచనా వేసింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రాత్రిపూట వేడి పెరుగుతోందని హెచ్చరించింది. –సాక్షి, అమరావతిఐదు రెట్లు పెరిగిన రాత్రి వేడిదేశ వ్యాప్తంగా 734 జిల్లాల్లో వేడి ప్రమాదకర స్థాయిని అంచనా వేయడానికి 35 సూచికలను సీఈఈఈడబ్ల్యూ ఉపయోగించింది. తద్వారా 417 జిల్లాల్లో అత్యధిక ప్రమాదకరంగా వేడి పెరుగుతున్నట్లు గుర్తించింది. వేడి ఉష్ణోగ్రతల ప్రమాదం స్థాయి 201 జిల్లాల్లో మధ్యస్థంగానూ, 116 జిల్లాల్లో తక్కువగానూ ఉన్నట్లు తేల్చింది. కాగా ఇందులో ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, గోవా, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్లు టాప్ 10లో ఉన్నాయి. 1982–2011 బేస్ లైన్తో పోలిస్తే గత దశాబ్దం(2012–2022) 70 శాతం జిల్లాల్లో వేసవిలో ఐదు రెట్లు వేడి పెరిగింది. 10 శాతం తేమ పెరిగిందని కూడా ఈ అధ్యయనం తెలిపింది. ఒక మెరుగైన ఇల్లు అంటే చలికాలంలో వెచ్చగా, వేసవిలో చల్లగా ఉండాలని ప్రముఖ గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ అనేవారట. ఆధునిక నాగరికతకు ముందే భవనాలను చలికాలంలో సూర్యరశ్మిని గ్రహించేలా, వేసవిలో నీడ ఎక్కువగా ఉండేలా ఇళ్లను నిర్మించేవారు. మళ్లీ అలాంటి సాంకేతికతతో భవన నిర్మాణాలు చేయాల్సిన ఆవశ్యకత నెలకొంది.పగలూ రాత్రీ ఏకమైపోతాయిగత ఐదు దశాబ్దాల్లో 700కు పైగా వేడి తరంగాల కారణంగా 17 వేల మంది మరణించారని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) ఇటీవల వెల్లడించింది. ఎక్కువకాలం ఉండే వేడి రాత్రుల యుగంలోకి ప్రవేశిస్తున్నామని సీఈఈఈడబ్ల్యూ అధ్యయనం ఇప్పుడు హెచ్చరించింది. ఈ పరిస్థితులను వెంటనే అర్థం చేసుకుని వాతావరణాన్ని చల్లబరిచేందుకు అత్యవసర చర్యలు చేపట్టకపోతే కొన్నేళ్లకు సూర్యుడు అస్తమించే సమయం తగ్గిపోతుందని, అంటే రాత్రి కూడా పగలుగానే మారిపోతుందని అధ్యయనం స్పష్టం చేసింది. హీట్ యాక్షన్ ప్లాన్స్(హెచ్ఎపీ) జాతీయ స్థాయిలో చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందని చెబుతోంది. -
AP: రాష్ట్రంలో చాప కింద నీరులా..'కోవిడ్'
రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నా ప్రభుత్వం నియంత్రణ చర్యలను పూర్తిగా గాలికి వదిలేసింది. యోగా దినోత్సవం నిర్వహణే మీ ముందున్న లక్ష్యమని వైద్య శాఖకు సీఎం అల్టిమేటం జారీ చేయడంతో, ప్రాణాంతక వైరస్ కట్టడిని వైద్య శాఖ తేలికగా తీసుకుంటోంది. దీంతో చాప కింద నీరులా రాష్ట్రంలో వైరస్ వ్యాపించడమే కాకుండా, ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటోంది. వైరస్ సోకిన వ్యక్తుల మరణాలను బయటకు పొక్కనివ్వకుండా వైద్య శాఖ కప్పెడుతోందన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. -సాక్షి, అమరావతి/నెల్లూరు(అర్బన్)/కర్నూలు(హాస్పిటల్)కొన్ని ఘటనలు ఇవీ..1 విజయవాడ జీజీహెచ్లో గురువారం కోవిడ్ సోకిన యువకుడు మరణించగా అధికారులు చడీచప్పుడు లేకుండా ఆ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు తెలిసింది. 2 ఇదే ఆస్పత్రిలో గడిచిన ఐదారు రోజుల్లో వైరస్ బారిన పడిన ఇద్దరు మహిళలు మరణించినట్టు ఆస్పత్రి వర్గాలు చర్చించుకుంటున్నాయి. 3 గత వారంలో విశాఖపట్నంలో వైరస్ సోకిన వ్యక్తి మృతి చెందాడు. అతని చికిత్సకు సంబంధించిన కేస్ షీట్లో సైతం కోవిడ్ పాజిటివ్ అని వైద్యులు ధ్రువీకరించారు. అయితే సదరు వ్యక్తి ఇతర అనారోగ్య కారణాలతోనే మృతి చెందాడని వైద్య శాఖ అధికారులు కొట్టిపడేశారు. 4 రెండు రోజుల క్రితం వరకు కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారికి నెల్లూరు ప్రభుత్వ పెద్దాస్పత్రిలో ర్యాపిడ్ టెస్ట్ చేయగా ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. దీంతో వారికి మెడికల్ కళాశాలలోని మైక్రో బయాలజి విభాగం ఆధ్వర్యంలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా అందరికీ గురువారం కరోనా నిర్థారణ అయింది. వీరిలో ఇద్దరు నర్సింగ్ విద్యార్థినులున్నారు. వారు కేరళ నుంచి వచ్చి నెల్లూరులో వేర్వేరు నర్సింగ్ కళాశాలల్లో చదువుకుంటున్నారు. అలాగే నగరంలోని భక్తవత్సలనగర్కు చెందిన 60 ఏళ్ల వృద్ధుడు, వెంకటాచలం మండలం అనికేపల్లి, పెదకూరపాడు, గూడూరు ప్రాంతాలకు చెందిన మరో ముగ్గురు యువకులు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతానికి వీరందరూ హోం ఐసోలేషన్లో ఉన్నారు. 5 కర్నూలు జిల్లాలో మరో నలుగురికి కోవిడ్ పాజిటివ్ నిర్థారణ అయింది. దీంతో జిల్లాలో పాజిటివ్ బాధితుల సంఖ్య 7కు చేరింది. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోని వివిధ విభాగాల్లో చికిత్స పొందుతున్న ఆరుగురు రోగులకు బుధ, గురు వారాల్లో కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో కర్నూలు మండలం దిన్నెదేవరపాడుకు చెందిన 25 ఏళ్ల వ్యక్తికి, గోనెగండ్లకు చెందిన 45 ఏళ్ల వ్యక్తికి, కర్నూలుకు చెందిన 20 ఏళ్ల మహిళకు, అనంతపురం జిల్లా పెద్దవడుగూరుకు చెందిన 49 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్ నిర్థారణ అయింది. ఇందులో ఒక పీజీ వైద్య విద్యార్థిని ఉన్నారు. -
సజ్జల కుటుంబ సభ్యుల భూములపై స్టేటస్ కో కొనసాగించండి
సాక్షి, అమరావతి :వైఎస్సార్ కడప జిల్లా, సీకేదిన్నె మండల పరిధిలో వైఎస్సార్సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుల కుటుంబ సభ్యులకు చెందిన 63.72 ఎకరాల విషయంలో యథాతథస్థితి (స్టేటస్ కో)ని కొనసాగించాలని రెవెన్యూ అధికారులను హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్ ధర్మాసనం ఆదేశించింది. ఈనెల 30 వరకు స్టేటస్ కో కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఆ భూమిని అటవీ భూమిగా పేర్కొంటూ స్వాదీనం చేసుకోవాలని కడప కలెక్టర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ అమలును నిలుపుదల చేస్తూ, కలెక్టర్ ప్రొసీడింగ్స్ జారీకి ముందున్న యథాతథస్థితిని కొనసాగించాలని ఇటీవల సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం గురువారం పాక్షికంగా సవరించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై ప్రభుత్వం దాఖలుచేసిన అప్పీల్పై గురువారం జస్టిస్ కిరణ్మయి ధర్మాసనం విచారణ జరిపింది.ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, పిటిషనర్లకు ఉన్న 201 ఎకరాల భూమిలో 63.72 ఎకరాలు అటవీ భూమి అని తెలిపారు. సజ్జల కుటుంబ సభ్యుల తరఫున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్రెడ్డి వాదనలు వినిపిస్తూ, చట్ట ప్రకారం ఎలాంటి నోటీసూ ఇవ్వకుండా, తమ వాదన వినకుండానే కలెక్టర్ ప్రొసీడింగ్స్ జారీ చేశారని పేర్కొన్నారు. అలాగే పంచనామా కూడా చట్ట విరుద్ధమేనని వివరించారు. పంచనామా కాగితాలపై మాత్రమే జరిగిందని, అధికారులు సర్వే నివేదికను తమకు అందజేయలేదని వాదించారు. ఈ భూముల విషయంలో హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను అధికారులు తుంగలో తొక్కారని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, భూమి స్వా«దీనం విషయంలో గత విచారణ సమయంలో సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవరించింది. భూమి ప్రభుత్వ స్వా«దీనంలో ఉన్న నేపథ్యంలో, ఆ భూమి విషయంలో యథాతథస్థితిని కొనసాగించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది. -
భగ్గుమన్న పొగాకు రైతు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్) : నల్లబర్లీ పొగాకును వారంలోగా జీపీఐ నుంచి కొనకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మయ్య హెచ్చరించారు. గుంటూరు విద్యానగర్లోని జీపీఐ పొగాకు రాష్ట్ర కార్యాలయం వద్ద గురువారం నల్లబర్లీ, తెల్లబర్లీ పొగాకు రైతులతో కలిసి రైతు సంఘం నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ పొగాకు కొనకుండా రైతులను మోసం చేస్తున్న ప్రైవేట్ సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బర్లీ పొగాకు వేయాలని ప్రోత్సహించిన జీపీఐ సంస్థతోపాటు ఇతర పొగాకు కంపెనీలు ఇప్పుడు ముఖం చాటేశాయని ధ్వజమెత్తారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ జీపీఐ సంస్థ రైతుల నుంచి పది లక్షల టన్నుల తెల్లబర్లీ పొగాకు కొంటామని, బాండ్లు ఇచ్చి ఇప్పటి వరకు సగం కూడా కొనలేదని మండిపడ్డారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కె.వి.ప్రసాద్, కొల్లా రాజమోహన్, చుండూరు రంగారావు, కంచుమాటి అజయ్కుమార్, రాధాకృష్ణ, వేల్పూరు నరసింహారావు, పచ్చల శివాజీ, ఉల్లిగడ్డ నాగేశ్వరరావు, రామారావు, జగన్నాథరావు, హనుమరెడ్డి, వేణుగోపాలరావు, నళినికాంత్ పాల్గొన్నారు.ధర ఇంత అధ్వానమా?» ఒంగోలు, కనిగిరిలో పొగాకు వేలాన్ని అడ్డుకున్న రైతులు » పనిగట్టుకుని ధర తగ్గించారంటూ నిరసన » ఆందోళనను అడ్డుకున్న టీడీపీ మద్దతుదారులు » వ్యాపారులకు వత్తాసు పలికిన పొగాకు బోర్డు అధికారులు ఒంగోలు సబర్బన్/కనిగిరి రూరల్ : ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో గురువారం రైతులు పొగాకు వేలాన్ని అడ్డుకున్నారు. త్రోవగుంటలోని పొగాకు వేలం కేంద్రం–2లో వ్యాపారుల తీరును నిరసిస్తూ బేళ్లను అమ్మేందుకు రైతులు నిరాకరించారు. ఎఫ్–3 రకం పొగాకును రూ.18,500కు కూడా కొనుగోలు చేయక పోవటంతో ఆందోళనకు దిగారు. దీంతో వేలం కేంద్రానికి వచి్చన ఉలిచి, దశరాజుపల్లె గ్రామాలకు చెందిన టీడీపీ మద్దతుదారులైన కొందరు వేలం జరగాల్సిందేనని వాగ్వాదానికి దిగారు. వేలం కేంద్రంలో కొంతసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది.గిట్టుబాటు ధర కోసం మిగతా రైతులు పోరాటం చేస్తుంటే.. టీడీపీకి చెందిన కొందరు రైతుల పేరుతో దాన్ని అడ్డుకోవటాన్ని ఒంగోలు మండలంలోని రైతులు తీవ్రంగా ఖండించారు. గిట్టుబాటు ధర వస్తే రైతులంతా బాగు పడతారని, అందుకోసం పోరాటం చేయాల్సిందిపోయి.. ఇలా అడ్డుకోవడం తగదని మండిపడ్డారు. వేలం కేంద్రం అధికారిణి తులసి టీడీపీ వర్గీయులకు మద్దతుగా మాట్లాడటంతో రైతులు ఆమె తీరును తీవ్రంగా తప్పు పట్టారు. ఏకంగా 186 బేళ్లను రిజెక్ట్ చేయడం దారుణమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వేలం ఇదే విధంగా కొనసాగితే వేలం కేంద్రాలకు పొగాకు బేళ్లు తీసుకు రావటం మానుకుంటామని చెప్పారు. ఇదే అన్యాయం ఇంకా కొనసాగితే పొగాకు బేళ్లను తగలేస్తామన్నారు. కనిగిరిలోనూ ఆగిన వేలం ప్రకాశం జిల్లాలోని కనిగిరి పొగాకు వేలం కేంద్రంలో కూడా గురువారం వేలం ఆగిపోయింది. బయ్యర్లు, కంపెనీల ప్రతినిధులు ఎక్కువ శాతం బేళ్లను తిరస్కరించడంతో ఆందోళన చెందిన రైతులు కొద్దిసేపు పొగాకు వేలాన్ని ఆపేశారు. దీంతో వేలం నిర్వహణ అధికారి కోటేశ్వరరావు జోక్యం చేసుకుని రైతులు, కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. వారం రోజులుగా పొగాకు బేళ్ల తిరస్కరణలు తీవ్ర స్థాయిలో కొనసాగుతుండడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పొగాకు రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని రైతు సంఘాల నాయకులు మండిపడుతున్నారు. కనిగిరి కేంద్రంలో గురువారం 164 బేళ్లను తిరస్కరించారు.