breaking news
Amaravati
-
డిసెంబర్ 18న గవర్నర్తో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, తాడేపల్లి: ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎల్లుండి (డిసెంబర్ 18) సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్తో భేటీ కానున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమానికి సంబంధించిన పత్రాలను గవర్నర్కు అందజేయనున్నారు. ఈ భేటీలో వైఎస్ జగన్ వెంట పార్టీ జిల్లా అధ్యక్షులు, శాసనసభ్యులు, ఎంపీలు ఉంటారు. దీనికి ముందు ఉదయం 10 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద కోటి సంతకాల పత్రాలు నిండిన వాహనాలను వైఎస్ జగన్ జెండా ఊపి రాజ్ భవన్కు పంపనున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, రీజినల్ కో-ఆర్డినేటర్లు, జిల్లాల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు పాల్గొంటారు.ఈ కార్యక్రమం తర్వాత వీరితో వైఎస్ జగన్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమవుతారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత గవర్నర్ నివాసం రాజ్ భవన్కు బయల్దేరి వెళ్తారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కోటి మందికిపైగా చేసిన సంతకాల పత్రాలతో నిండిన వాహనాలు ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నాయి. -
అడ్డంకులను అధిగమించి.. అణచివేతను ధిక్కరించి
సాక్షి, అమరావతి : ర్యాలీల్లో పాల్గొనకుండా ఆంక్షలు.. చెక్పోస్టులతో అడ్డగింతలు.. పోలీసులకు ఆదేశాలు.. భగ్నం చేసేందుకు పన్నాగాలు..! ఇదీ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అన్ని వర్గాల ప్రజలు చేసిన కోటి సంతకాలతో సోమవారం వైఎస్సార్సీపీ నాయకత్వం, శ్రేణులు నిర్వహించిన ర్యాలీలను అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన కుట్రలు. కానీ, ప్రజలు వీటిన్నిటినీ దాటుకుంటూ ర్యాలీల్లో అశేషంగా పాల్గొన్నారు. కిలోమీటర్ల కొద్దీ దండుకట్టి సర్కారు దుర్మార్గంపై దడపుట్టించారు. నిర్బంధాలను ఛేదిస్తూ, అడ్డంకులను దాటుకుంటూ విజయవంతం చేశారు.వైఎస్సార్సీపీ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభించడంతో పాటు ర్యాలీలకు యువత, ఉద్యోగులు, మేధావులు సహా అన్ని రంగాల నిపుణులు స్వచ్ఛందంగా ముందుకురావడంతో చంద్రబాబు ప్రభుత్వానికి కంటగింపైంది. దీంతో ఎలాగైనా భగ్నం చేయాలని కుట్రలు పన్నింది. శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్సీపీ ర్యాలీలను నిలువరించాలని జిల్లా ఎస్పీ... సీఐ, ఎస్ఐలకు గట్టిగా చెప్పారు. దీంతో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేశారు. ⇒ ఇచ్ఛాపురంలో జడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ, పలాసలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, మండపామ్ టోల్ గేట్ వద్ద మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, సమన్వయకర్త పేరాడ తిలక్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టోల్ గేట్ నుంచి నిరసన ర్యాలీ తీశారు. ⇒ వేలాదిమందితో ఆమదాలవలసలో సమన్వయకర్త చింతాడ రవికుమార్ నిర్వహించిన ర్యాలీని పోలీసులు మూడుచోట్ల అడ్డుకున్నారు. ⇒ శ్రీకాకుళం అరసవల్లి జంక్షన్లో నరసన్నపేట నాయకులతో వస్తున్న ధర్మాన కృష్ణ చైతన్యను పోలీసులు అడ్డుకున్నారు.⇒ విజయనగరం జిల్లా కేంద్రంలో ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు నిర్బంధం విధించినా ప్రజలు లెక్కచేయలేదు. ⇒ ఏలూరులో నాలుగు కిలోమీటర్ల మేర ర్యాలీ చేసేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు. కానీ, పోలీసులు అనుమతివ్వలేదు. దీంతో దూరాన్ని కుదించారు. ⇒ కర్నూలులో పోలీసులు ఏకంగా నోటీసులు జారీచేసి అడ్డుకోవాలని చూశారు. కానీ, వీటిని లెక్కచేయకుండా ర్యాలీల్లో ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ముక్కోటి గొంతుకలతో వ్యతిరేకించారు. ర్యాలీలతో కదంతొక్కారు. -
రిలయన్స్కు బాబు సర్కారు జీహుజూర్
సాక్షి, అమరావతి: ఫుడ్ ప్రాసెసింగ్ విధానాన్ని సడలించి మరీ చంద్రబాబు సర్కారు రిలయన్స్ సంస్థకు జీహుజూర్ అంటోంది. ఆ సంస్థ అడిగినంత మేర ఐదేళ్ల పాటు రాయితీలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఇటీవల జరిగిన ఎస్ఐపీబీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో పరిశ్రమలు, వాణిజ్య శాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో రిలయన్స్ కన్సూ్యమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ ఇంటిగ్రేటెడ్ పానీయాల తయారీ యూనిట్ (కార్బొనేటేడ్ సాఫ్ట్డ్రింక్స్, పండ్ల రసాలు–ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్)ను ఏర్పాటుచేయనుంది.ఇందుకోసం రూ.1,622 కోట్ల పెట్టుబడితో 1,200 మందికి ఉపాధి కల్పించనుంది. అయితే, రిలయన్స్ కన్సూ్యమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ మొత్తం స్థిర మూలధన పెట్టుబడిలో రూ.601.87 కోట్లు టైలర్ మేడ్ రాయితీలు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే, ఐదేళ్ల పాటు ఈ రాయితీలు ఇవ్వడానికి రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ విధానం (2024–29) ప్రకారం అనర్హతగా ఉంది. దీంతో.. ఈ అనర్హత షరతును సడలిస్తూ దీనిని ప్రత్యేక కేసుగా పరిగణించి ఐదేళ్ల వ్యవధిలో మూలధన సబ్సిడీని మంజూరుచేసేందుకు చంద్రబాబు సర్కారు ఆమోదం తెలిపింది. సంస్థ అడిగినంత మేర రూ.601.87 కోట్ల రాయితీ చెల్లించేందుకు అనుమతించింది.కేపిటల్ సబ్సిడీ కింద రూ.25 కోట్లు, రాష్ట్రంలో తయారుచేసి విక్రయించే ఉత్పత్తులపై ఎస్జీఎస్టీ కింద నగదు రూపంలో రాష్ట్రానికి వచ్చే 100 శాతాన్ని ఐదేళ్ల పాటు తిరిగి సంస్థకు చెల్లించనున్నారు. ఇలా ఐదేళ్లలో రూ.493.95 కోట్లు చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక ఐదేళ్ల పాటు విద్యుత్ చార్జీల కింద రూ.40.86 కోట్లను.. ఎలక్ట్రిసిటీ డ్యూటీ మినహాయింపు కింద ఐదేళ్ల పాటు రూ.40.86 కోట్లను రాయితీ రూపంలో ఇస్తారు. అలాగే, స్టాంప్ డ్యూటీ, బదిలీ సుంకం, భూ మార్పిడి ఛార్జీల రూపంలో రూ.1.20 కోట్లు తిరిగి చెల్లిస్తారు. ఇంధన శాఖ, రెవెన్యూ శాఖ, ఫుడ్ ప్రాసెసింగ్ సీఈఓ, ఏపీఈడీబీ సీఈఓ, పరిశ్రమల శాఖ డైరెక్టర్ల సమన్వయంతో అవసరమైన చర్యలు తీసుకోవాలని, నిర్దేశించిన సమయంలో వివిధ అనుమతులు పొందేందుకు వీలు కల్పించాల్సిందిగా ఉత్తర్వుల్లో సూచించారు. బడా సంస్థకు ఇంతగా రాయితీలా?.. ఇదిలా ఉంటే.. అత్యధిక ధనిక సంస్థ అయిన రిలయన్స్కు ఇలా అడిగినంత మేర రాయితీలు ఇవ్వడంపట్ల అధికార వర్గాలు విస్మయం వ్యక్తంచేస్తున్నాయి. ఒక పక్క చిన్నచిన్న పారిశ్రామికవేత్తలకు రాయితీ బకాయిలు ఇవ్వకుండా మరోపక్క బడా సంస్థలు అడిగినంత మేర పాలసీలను సడలించి మరీ రాయితీలు ఇవ్వడాన్ని అధికారులు తప్పుపడుతున్నారు. కేవలం 1,200 మందికి మాత్రమే ఉపాధి కల్పిస్తున్న నేపథ్యంలో ఖజానా నుంచి ఏకంగా రూ.601.87 కోట్లు రాయితీలు ఇవ్వడాన్ని వారు తప్పుపడుతున్నారు. -
అమరజీవి విగ్రహం ఏర్పాటు చేసే స్థోమత ప్రభుత్వానికి లేదా?
సాక్షి, అమరావతి: తెలుగు ప్రజలంతా ఐక్యంగా ఉండాలనే ఆశయంతో ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేసే స్థోమత చంద్రబాబు ప్రభుత్వానికి లేదా అని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ నిలదీశారు. అమరావతి కోసం లక్ష కోట్లు ఖర్చు చేస్తామని చెప్పే చంద్రబాబు, ఏడాదిన్నరలో రూ. 2.66 లక్షల కోట్లు అప్పులు తెచ్చారని.. కానీ పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటుకు మాత్రం ఆర్యవైశ్యుల నుంచి చందాలు వసూలు చేసుకోమని చెప్పడం సిగ్గుచేటని, అమరజీవిని అవమానించడమేనని మండిపడ్డారు.అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు డీపీఆర్ కోసమే రూ.11 కోట్లు ఖర్చు చేసిన చంద్రబాబు ప్రభుత్వానికి పొట్టి శ్రీరాములు విగ్రహం భారమైపోయిందా అని నిలదీశారు. రామోజీ సంస్మరణ సభల కోసం రూ. కోట్లు ఖర్చు చేయడంలో లేని ఇబ్బంది పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటుకు వచ్చిందా అని మండిపడ్డారు.ఈ అనైతిక విధానాలను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖండించారని తెలిపారు. 2019లో వైఎస్ జగన్ సీఎం అయ్యాక రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1న నిర్వహించేలా జీవో ఇచ్చి ఐదేళ్లపాటు కొనసాగిస్తే, కూటమి ప్రభుత్వం ఆపేయడం దారుణమన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ.. తెలుగు ప్రజలంతా కలిసుండాలన్న పొట్టి శ్రీరాములు ఆశయాలను వైఎస్సార్సీపీ హయాంలో మాజీ సీఎం వైఎస్ జగన్ అమలు చేసి చూపించారని తెలిపారు.ఈనాడు పొట్టి శ్రీరాములుని చంద్రబాబు అవమానిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ రుహుల్లా, పార్టీ నాయకులు నారాయణ మూర్తి, పుత్తా శివశంకర్రెడ్డి, కొండా రాజీవ్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. -
బాబు పాలనలో నిరుద్యోగాంధ్రానే..! ఏపీలోనే నిరుద్యోగ రేటు అత్యధికం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్ర బాబు పాలనలో రాష్ట్రంలో అప్పులతోపాటు నిరుద్యోగ రేటు భారీగా పెరిగిపోతోంది. జాతీయ స్థాయిని మించి ఆంద్రప్రదేశ్లో నిరుద్యోగ రేటు అత్యధికంగా ఉందని సోమవారం రాజ్యసభలో కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. జాతీయ స్థాయిలో నిరుద్యోగ రేటు 5.2 శాతంగా ఉంది. అదే ఆంద్రప్రదేశ్లో జాతీయ స్థాయిని మించి 8.2 శాతం నిరుద్యోగ రేటు ఉంది. జాతీయ స్థాయి సగటు నిరుద్యోగితతో పాటు మిగతా పెద్ద రాష్ట్రాల్లో కన్నా ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా నిరుద్యోగ రేటు ఉంది.గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి చూస్తే మొత్తం ఏపీలో నిరుద్యోగ రేటు 8.2 శాతం ఉండగా పురుషుల్లో 7.2 శాతం, మహిళల్లో 10.1 శాతం నిరుద్యోగ రేటు ఉంది. ఎన్నికల ముందు టీడీపీ కూటమి ఉమ్మడి మేనిఫేస్టోలో చంద్రబాబు అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు కలి్పస్తామని, లేదంటే అప్పటి వరకు నెలకు రూ. 3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు.అయితే అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరైనా ఆ హామీని అమలు చేయకపోగా నిరుద్యోగ భృతిని నైపుణ్య శిక్షణతో అనుసంధానం చేశానని, ఇక దీన్ని అమలు చేసినట్లేనని మాట మార్చేశారు. అలాగే ఆడబిడ్డ నిధి పేరుతో 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 ఇస్తానని సూపర్ సిక్స్ హామీల్లో చంద్రబాబు చెప్పారు. ఈ హామీని కూడా చంద్రబాబు అటకెక్కించేశారు. ఆడబిడ్డ నిధి పీ–4తో అనుసంధానం చేశానని మహిళలను నిండా మోసం చేశారు. దీంతో రాష్ట్రంలో యువతకు ఉపాధి లభించడం లేదు. దీంతో నిరుద్యోగిత పెరిగిపోతోంది. ఇదే విషయాన్ని రాజ్యసభ సాక్షిగా కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. -
మద్యం అక్రమ కేసులో బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: మద్యం అక్రమ కేసులో బెయిల్కు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై మాజీ ఐఏఎస్ కె.ధనంజయ రెడ్డి, పెల్లకూరు కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప దాఖలు చేసిన పిటిషన్లపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు జనవరి 21వ తేదీకి వాయిదా వేసింది. ఈ పిటిషన్లు సోమవారం ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం. పంచోలిలతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చినప్పుడు... పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు సి. ఆర్యమ సుందరం, నిరంజన్ రెడ్డి, సిద్ధార్థ దవేలు వాదనలు వినిపిస్తూ, కౌంటర్ అఫిడవిట్లకు సంబంధించి శనివారం రెండు రిజాయిండర్లు దాఖలు చేశామని, మరొకటి సోమవారం దాఖలు చేస్తున్నామని వివరించారు. ఇరుపక్షాల కౌంటర్లు, రిజాయిండర్లు, వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం కేసు తదుపరి విచారణను జనవరి 21కి వాయిదా వేసింది.కాగా ఈ కేసులో ట్రయల్ కోర్టు తదుపరి చర్యలకు తమ మధ్యంతర ఉత్తర్వులు అడ్డంకి కాదని అత్యున్నత న్యాయస్థానం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. నేపథ్యం ఇదీ... తప్పుల తడక చార్జ్షిట్ నేపథ్యంలో ముగ్గురు నిందితులకు గతంలో ట్రయల్ కోర్టు ‘డిఫాల్ట్ బెయిల్’ మంజూరు చేసింది. అయితే, దాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన ఏపీ హైకోర్టు వారి డిఫాల్ట్ బెయిల్ను రద్దు చేసింది. నవంబర్ 26లోగా ట్రయల్ కోర్టులో లొంగిపోవాలని, రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్లకు అనుకూలంగా నవంబర్ 26న సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
జోజినగర్లో ఇళ్ల కూల్చివేత బాధితులకు నేడు వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, అమరావతి/భవానీపురం(విజయవాడపశ్చిమ): వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం విజయవాడలో పర్యటించనున్నారు. విజయవాడ జోజినగర్లో ఇళ్ల కూల్చివేత బాధితులను ఆయన పరామర్శించనున్నారు. వైఎస్ జగన్ మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో జోజినగర్కు వస్తారు. అక్కడ కూల్చివేసిన ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడతారు. ఇళ్ల కూల్చివేత బాధితులు ఇప్పటికే వైఎస్ జగన్ను తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో కలిసి తమ ఆవేదనను తెలియజేశారు.తమ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందని, కేవలం మూడు గంటలు గడువు ఇవ్వాలని కోరినా పట్టించుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా ఇళ్లను ఎలా కూల్చివేసిందో వివరించారు. ఆ సమయంలో కూల్చివేసిన ఇళ్లను తాను స్వయంగా వచ్చి పరిశీలిస్తానని బాధితులకు వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ నేరుగా ఘటనాస్థలానికి వెళ్లి ప్రత్యక్షంగా బాధితులను కలవనున్నారు.అనంతరం ఆయన తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో జోజినగర్ వద్ద సోమవారం ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, నేతలు వెలంపల్లి శ్రీనివాసరావు, దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ రుహుల్లా, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఏర్పాట్లను పరిశీలించారు. -
కోటి సంతకాల ఉద్యమం చరిత్రాత్మకం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ప్రారంభించిన కోటి సంతకాల ఉద్యమం అత్యంత విజయమైందని.. చారిత్రాత్మకంగా నిలిచిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన భారీ ర్యాలీలు, అందులో ప్రజల సంతకాల ప్రదర్శన ఇవన్నీ చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనను, విధానాలను ప్రజలు ఎంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారో స్పష్టంగా చాటుతున్నాయన్నారు.ఈ ఉద్యమానికి అండగా నిలిచిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, స్వచ్ఛందంగా సంతకాలు చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ‘సేవ్ మెడికల్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ అనే హ్యాష్ట్యాగ్తో తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. అందులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. పౌరులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.. ‘‘ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ప్రారంభించిన కోటి సంతకాల ఉద్యమం కేవలం ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం మాత్రమే కాదు. చంద్రబాబునాయుడి ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలు ఇచ్చిన ఘనమైన తీర్పు. ప్రజాప్రయోజనాలను పణంగా పెడుతూ, వారికి ద్రోహం చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయాలను ఖండిస్తూ, కోటిమందికి పైగా పౌరులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేశారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొని సంతకాలు చేశారు.ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ద్వారా అందుబాటులో ఉన్న వైద్య విద్యను, ప్రజారోగ్య వ్యవస్థను నాశనం చేస్తారనే ప్రజల ఆందోళనే ఈ ఉద్యమానికి ప్రధాన ప్రేరణగా నిలిచింది. సేకరించిన కోటి సంతకాల పత్రాలు ప్రస్తుతం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి చేరుతున్నాయి. అక్కడినుంచి డిసెంబర్ 18న గౌరవ గవర్నర్కు సమర్పిస్తాం. తద్వారా ప్రజల గొంతు రాష్ట్రంలోని అత్యున్నత రాజ్యాంగ అధికారికి చేరి, అనంతరం అది న్యాయస్థానాల తలుపులు తడుతుంది.అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ ఉద్యమానికి అండగా నిలిచిన ప్రతి వైఎస్సార్సీపీ నాయకుడు, కార్యకర్తలు, స్వచ్ఛందంగా సంతకాలు చేసిన ప్రతి పౌరుడికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఉద్యమంలో మీ భాగస్వామ్యం ద్వారా ప్రజల ఆస్తులను ప్రైవేట్కు అప్పగించాలన్న కూటమి ప్రభుత్వ కుట్ర బట్టబయలైంది. ఈ ఉద్యమం ద్వారా చంద్రబాబు పాలనపై ప్రజలు తమ ఆగ్రహాన్ని తెలియజేశారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలలను అమ్మేయాలన్న ఆయన యత్నాన్ని, నిర్ణయాలను, ఆయన పాలనను కోటి మంది ప్రజలు తిరస్కరించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై తీసుకున్న ఈ ప్రజావ్యతిరేక నిర్ణయాన్ని చంద్రబాబు తక్షణమే వెనక్కి తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నా. ప్రజారోగ్య వ్యవస్థను, అందుబాటులో ఉన్న వైద్య విద్యను దోచుకునే ఈ పట్టపగలు దోపిడీకి వెంటనే తెరపడాలి’’. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మహోద్యమం.. పోటెత్తిన కోట్ల గళాలు
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమం మహోద్యమంగా మారి ఉవ్వెత్తున ఎగసిపడింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో చేపట్టిన రచ్చబండ కోటి సంత కాల సేకరణ కార్యక్ర మానికి భారీ స్పందన లభించింది. మారు మూల గిరిజన గూడేల నుంచి జిల్లా కేంద్రాల దాకా సర్వత్రా కోటి సంతకాల సేకరణకు ప్రజా మద్దతు లభించింది. అన్ని వర్గాల ప్రజలు ఇందులో పాల్గొని తమ అభీష్టాన్ని సంతకాల రూపంలో చంద్రబాబు సర్కారుకు చాటి చెప్పారు. జిల్లా కేంద్రాల నుంచి భారీ ర్యాలీల నడుమ వాహనాల్లో సోమవారం తాడేపల్లి లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి సంతకాల ప్రతులను తరలించారు. సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి, విజయవాడ, నెట్వర్క్: వైఎస్ జగన్ కృషితో సాకారమైన ప్రభుత్వ వైద్య కళాశాలలను పప్పుబెల్లాల మాదిరిగా చంద్రబాబు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడంపై కోట్ల గొంతులు కన్నెర్ర చేశాయి. పేదలకు చేరువలో ఉచితంగా సూపర్ స్పెషాల్టీ వైద్యం, మన విద్యార్థుల ఎంబీబీఎస్ కలలను చిదిమేశారని ర్యాలీల్లో కదం తొక్కాయి. ప్రభుత్వ భూమి.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు..ప్రభుత్వ ఆస్పత్రులు.. ప్రయోజనం పొందేది మాత్రం ప్రైవేట్ వ్యక్తులా..? అంటూ చంద్రబాబు సర్కారు దుర్మార్గ విధానాలను ఊరూరా ప్రజలు నిలదీశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమం కోటి సంతకాల సేకరణలో శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. విద్యాసంస్థల వద్ద నిర్వహించిన కార్యక్రమంలో సంతకాలు చేసేందుకు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. మారుమూల ప్రాంతాల నుంచి ప్రతి గ్రామంలోనూ విద్యార్థులు, యువత, మహిళలు, మేధావులు, విద్యావేత్తలు, సామాజిక ఉద్యమకారులు ఇందులో పాలు పంచుకుని చంద్రబాబు సర్కారు ప్రజా కంటక విధానాలను తీవ్రంగా నిరసించారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఈ సర్కారుకు బుద్ధి చెప్పేందుకు ఎలాంటి ఉద్యమాలకైనా వెనుకాడబోమని హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వం బరితెగించి వైద్య కళాశాలలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడటమే కాకుండా బోధనాస్పత్రులను సైతం ధారాదత్తం చేయడం దుర్మార్గమని కోట్ల గళాలు మండిపడ్డాయి. ఆయా ఆస్పత్రుల్లో పని చేసే వైద్యులు, సిబ్బంది వేతనాలను సైతం ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లిస్తామని చంద్రబాబు సర్కారు ప్రకటించడం దోపిడీకి పరాకాష్ట అంటూ సర్వత్రా ఆగ్రహం పెల్లుబికింది. రూ.వందల కోట్ల ప్రజాధనాన్ని ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టే నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఊరూరా నినదించారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు నెలలకు పైగా సాగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చంద్రబాబు సర్కారు కక్షపూరిత విధానాలపై పెల్లుబుకుతున్న ప్రజాగ్రహాన్ని చాటి చెబుతోందని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ కృషితో సాకారమైన ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్కు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి పైగా ప్రజల సంతకాలను సేకరించిన విషయం తెలిసిందే. ఇంటింటా, ఊరూరా వైఎస్సార్సీపీ నాయకులు పర్యటించి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ సంతకాల ద్వారా ప్రజల మద్దతు సేకరించారు. ఈ సంతకాల ప్రతులతో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించి వాటిని వాహనాల్లో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు, బాపట్ల తదితర జిల్లాలకు చెందిన కోటి సంతకాల వాహనాలకు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి స్వాగతం పలికారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరిన కోటి ప్రతులను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 18వతేదీన గవర్నర్ను కలిసి నివేదించి ప్రజా స్పందనను వివరించనున్నారు. కోటి సంతకాల ప్రతుల వాహనాలతో ఎక్కడికక్కడ జరిగిన ర్యాలీల్లో విద్యార్థులు, యువత, మహిళలు, మేధావులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా పాల్గొని చంద్రబాబు సర్కారు నిరంకుశ విధానాలపై కన్నెర్ర చేశారు. పోలీసు ఆంక్షలు, చెక్పోస్టులు, నిర్బంధాలను లెక్కచేయకుండా ర్యాలీలకు పోటెత్తారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే.. మాజీ సీఎం వైఎస్ జగన్ రూ.8,480 కోట్లతో ఒకేసారి ప్రభుత్వ ఆధ్వర్యంలో 17 మెడికల్ కళాశాలకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలోనే ఏడు కాలేజీలు సిద్ధం కాగా, ఐదు కళాశాలల్లో తరగతులు కూడా మొదలయ్యాయని.. పులివెందుల కాలేజీకి ఎంఎన్సీ సీట్లను కేటాయించినా చంద్రబాబు ప్రభుత్వం తమకు వద్దంటూ అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు. సర్వం సిద్ధంగా ఉన్న కాలేజీలను ఈ ప్రభుత్వం ప్రైవేట్కు అప్పనంగా కట్టబెడుతోందని.. అది చాలదన్నట్లుగా నర్సింగ్ కాలేజీలను కూడా నడుపుకోవచ్చని పచ్చజెండా ఊపడంపై సర్వత్రా జనాగ్రహం వ్యక్తమైంది. మెడి‘కిల్’బాబుపై కోటిగళాల గర్జనప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మెడలు వంచైనా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం. గడిచిన 19 నెలల్లో రూ.2.68 లక్షల కోట్లు అప్పుచేసిన చంద్రబాబు, రూ.5వేల కోట్లతో మెడికల్ కాలేజీలు ఎందుకు నిరి్మంచడం లేదు? సంపద సృష్టి ఏమైంది? రైతులకు గిట్టుబాటు ధర ఎందుకు కల్పించడం లేదు? మాజీ సీఎం వైఎస్ జగన్ మాటగా చెబుతున్నా.. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. – బొత్స సత్యనారాయణ, శాసనమండలి విపక్షనేతదోచుకోవడం.. దాచుకోవడమే బాబు నైజం చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు పప్పుబెల్లాల్లా పంచిపెట్టి తద్వారా రూ. వేల కోట్లు దోచుకోవడం, దాచుకోవడమే పనిగా పెట్టుకుంటారు. పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధిని చంద్రబాబు ఏనాడూ ఆకాంక్షించరు. అందుకే మా నాయకుడు వైఎస్ జగన్ పేదల కోసం నిర్మించిన 17 మెడికల్ కళాశాలలను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు పరం చేసి రూ. వేల కోట్లు దండుకోవాలని చూస్తున్నాడు. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ -
పత్తాలేని పట్టాదారు పాస్ పుస్తకాలు.. ఏడాది నుంచి జారీ నిలిపివేసిన చంద్రబాబు సర్కారు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపులకు రైతులు విలవిల్లాడుతున్నారు. గత ప్రభుత్వంపై అక్కసుతో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల జారీని నిలిపివేయడంతో గ్రామాల్లో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. వాటిపై అప్పటి సీఎం జగన్ ఫొటో ఉందనే కారణంతో ఏడాదిగా పాస్ పుస్తకాల జారీని నిలిపివేసింది. గత ప్రభుత్వంఇచ్చిన లక్షలాది పట్టాదార్ పుస్తకాలను వెనక్కి తీసు కుని కొత్తవి ఇస్తామని చెప్పినా ఇప్పటివరకూ ఆ పని చేయలేకపోయింది. పాస్ పుస్తకాలు లేకపోవడంతో బ్యాంకు రుణాలు తీసుకునేందుకు రైతులు ఇబ్బందులుపడుతున్నారు. ఎందుకంటే.. భూమి ఉందని నిరూపించుకునే ఏకైక ఆధారం ఈ పాస్ పుస్తకమే. జగన్ హయాంలో క్యూఆర్ కోడ్తో జారీ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలోని ఎనిమిది వేల గ్రామాల్లో భూముల రీసర్వేను పూర్తిచేసి సంబంధిత రైతులకు క్యూఆర్ కోడ్తో రైతులకు పాస్ పుస్తకాలు అందజేసింది. ప్రతీ రైతుకి ఆధార్ నంబర్ తరహాలో ఒక యూనిక్ ఐడీని కేటాయించింది. రికార్డుల్లోగానీ, భూమిపైగానీ ఎటువంటి ట్యాంపరింగ్కు అవకాశం లేకుండా భూవివాదాలకు శాశ్వతంగా చరమగీతం పాడేలా చర్యలు తీసుకుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ సర్వే విజయవంతం కావడంతో కేంద్ర ప్రభుత్వం రూ.600 కోట్ల రాయితీ కూడా ప్రకటించింది. అయితే, వైఎస్ జగన్ హయాంలో జరిగిన భూ సంస్కరణలను వ్యతిరేకించి అభాండాలు మోపిన చంద్రబాబు ప్రభుత్వం ఆ రాయితీ సొమ్ము ఇటీవలే స్వీకరించడం విశేషం. వెనక్కి తీసుకుని కొత్తవి ఇవ్వలేదు.. మరోవైపు.. గత ప్రభుత్వం చేసిన రీసర్వేపై చంద్రబాబు బ్యాచ్ అభాండాలు మోపినా దానిని కొనసాగించక తప్పలేదు. పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫొటో ఉందనే కారణంతో ఎనిమిది వేల గ్రామాల్లో సర్వే పూర్తయినా భూములకు సంబంధించిన పుస్తకాలను రైతులకు పంచలేదు. పంచిన వాటిని కూడా వీఆర్ఓల ద్వారా వెనక్కి తీసుకుంది. వాటి స్థానంలో ప్రభుత్వ రాజముద్రతో కొత్తవి ఇస్తామని ప్రకటించి ఏడాది దాటిపోయింది. ఇందుకోసం రూ.15 కోట్లతో టెండర్ పిలిచింది. చెన్నైకి చెందిన కంపెనీకి టెండరు ఖరారుచేసి పనులు అప్పగించింది. అయితే, ఈ ముద్రణలో చాలా లోపాలు చోటుచేసుకున్నాయి. తొలి విడతలో కొన్ని పుస్తకాలు ముద్రించగా వాటిలో అన్నీ తప్పుల తడకలేనని అధికారులు వాపోతున్నారు. పేర్లు, సర్వే నంబర్లు వంటివన్నీ మారిపోవడంతో అధికారులు అవాక్కయ్యారు. వాటిని పంచకుండా ఇంకా ముద్రణ పూర్తికాలేదని చెబుతున్నారు. రైతులు తమకు పాస్ పుస్తకాలు ఇవ్వాలని పదేపదే అడుగుతున్నా వారిని రేపు, మాపు అంటూ చంద్రబాబు ప్రభుత్వం తిప్పుతూనే ఉంది. తహశీల్దార్లు కూడా పాస్ పుస్తకాలు ఎప్పుడు వస్తాయో తమకు తెలీదని చేతులెత్తేస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా దీనిపై సరిగ్గా సమాధానం చెప్పకుండా త్వరలో ప్రింటింగ్ పూర్తవుతుందని చెప్పి తప్పించుకుంటున్నారు. ఇటీవలే రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ పాస్ పుస్తకాల ముద్రణకు పిలిచిన టెండర్లలో ఏర్పడిన సమస్యవల్ల ఇబ్బంది ఏర్పడిందని చావు కబురు చల్లగా చెప్పారు. అంటే.. ఇప్పట్లో పాస్ పుస్తకాలు వచ్చే అవకాశం లేదు. రైతుల అగచాట్లు.. పాస్ పుస్తకాలు లేకపోవడంతో బ్యాంకులు రుణాలు మంజూరు చేయడంలేదు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో సర్వే నంబర్ల స్థానంలో ఎల్పీఎం నంబర్లు కేటాయించారు. ఈ నంబర్లు ఉన్న పాస్ పుస్తకాలు లేకపోవడంతో భూముల అమ్మకాలు కూడా జరగడంలేదు. రెవెన్యూ రికార్డుల్లో పేరు ఉన్నా పాస్ పుస్తకాలు లేవనే భయంతో కొనుగోలుదారులు వెనకడుగు వేస్తున్నారు. పాస్ పుస్తకం కోసం దరఖాస్తు చేస్తే అడంగల్లో పేరు మారుతుంది తప్ప పుస్తకం రావడంలేదు. మరోవైపు.. రీ సర్వే జరగని గ్రామాల్లోనూ పాస్ పుస్తకాల జారీ కావడంలేదు. దీంతో.. రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రాజకీయ కక్ష సాధింపుల కోసం చంద్రబాబు ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేయడంపై గ్రామాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. -
‘ఇది బాబు ప్రజా వ్యతిరేక విధానాలపై ఇచ్చిన ఘనమైన తీర్పు’
తాడేపల్లి : మెడికల్ కాలేజీలప్రైవేటీకరణ అంశానికి సంబంధించి కోటి సంతకాల సేకరణ అనంతరం వాటిని జిల్లా కేంద్రాల నుండి తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి తరలింపులో భాగంగా ఈరోజు(డిసెంబర్చే 15వ తేదీ) చేపట్టిన ర్యాలీలు విజయవంతం కావడంపై పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది కేవలం ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం మాత్రమే కాదని, చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజలు ఇచ్చిన ఘనమైన తీర్పు అని అన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు వైఎస్ జగన్ఇది అత్యంత విజయవంతమైన ఉద్యమంప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన ఒక కోటి సంతకాల ఉద్యమం అత్యంత విజయవంతమైనదిగా వైఎస్ జగన్ అభివర్ణించారు. ‘ఇది చరిత్రాత్మకంగా నిలిచిపోతుంది. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన భారీ ర్యాలీలు, అందులో ప్రజల సంతకాల ప్రదర్శన ఇవన్నీ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనను, విధానాలను ప్రజలు ఎంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారో స్పష్టంగా చాటుతున్నాయి. ఇది కేవలం ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం మాత్రమే కాదు. చంద్రబాబు నాయుడు ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలు ఇచ్చిన ఘనమైన తీర్పు. ప్రజాప్రయోజనాలను ఫణంగా పెడుతూ, వారికి ద్రోహం చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయాలను ఖండిస్తూ, ఒక కోటికి పైగా పౌరులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేశారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొని సంతకాలు చేశారు. ప్రజల ఆందోళనే ఈ ఉద్యమానికి ప్రధాన ప్రేరణప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ద్వారా అందుబాటులో ఉన్న వైద్య విద్యను, ప్రజారోగ్య వ్యవస్థను నాశనం చేస్తారనే ప్రజల ఆందోళనే ఈ ఉద్యమానికి ప్రధాన ప్రేరణగా నిలిచింది. సేకరించిన ఒక కోటి సంతకాల పత్రాలు ప్రస్తుతం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి చేరుతున్నాయి. అక్కడి నుంచి డిసెంబర్ 18న గౌరవ గవర్నర్గారికి అధికారికంగా సమర్పిస్తాం. తద్వారా ప్రజల గొంతు రాష్ట్రంలోని అత్యున్నత రాజ్యాంగాధికారికి చేరి, అనంతరం అది న్యాయస్థానాల తలుపులు తడుతుంది. ఈ ఉద్యమానికి అండగా నిలిచిన ప్రతి వైఎస్సార్సీపీ నాయకుడు, పార్టీ కార్యకర్తలు, అలాగే స్వచ్ఛందంగా సంతకాలు చేసిన ప్రతి పౌరుడికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఉద్యమంలో మీ భాగస్వామ్యం ద్వారా ప్రజా ఆస్తులను ప్రైవేట్కు అప్పగించాలన్న కూటమి ప్రభుత్వ కుట్ర బట్టబయలైంది. ఈ ఉద్యమం ద్వారా చంద్రబాబు నాయుడు పాలనపై ప్రజలు తమ ఆగ్రహాన్ని తెలియజేశారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలలను అమ్మేయాలన్న ఆయన ప్రయత్నాన్ని, ఆయన నిర్ణయాలను, ఆయన పాలనను ఒక కోటి మంది ప్రజలు తిరస్కరించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై తీసుకున్న ఈ ప్రజావ్యతిరేక నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు తక్షణమే వెనక్కి తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాను.. ప్రజారోగ్య వ్యవస్థను, అందుబాటులో ఉన్న వైద్య విద్యను దోచుకునే ఈ పట్టపగలు దోపిడీకి వెంటనే తెరపడాలి’ అని అన్నారు.The one-crore signatures campaign launched by the YSR Congress Party against the privatisation of medical colleges has become a historic and resounding success. The massive rallies with the display of the signatures held in all 26 district headquarters stand as clear proof of how… pic.twitter.com/umPRjU20xa— YS Jagan Mohan Reddy (@ysjagan) December 15, 2025 ఇవీ చదవండి:కోటి సంతకాలు.. కోట్ల గళాలువిజయవాడకు వైఎస్ జగన్ఇదీ కదా ప్రజా ఉద్యమం అంటే.. -
కాకాణి రిట్ పిటిషన్పై స్పందించిన హైకోర్టు
సాక్షి, నెల్లూరు జిల్లా: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్న్రెడ్డి రిట్ పిటిషన్పై హైకోర్టు స్పందించింది. తనపై నమోదైన 9 అక్రమ కేసుల్లో సీబీఐ విచారణను కాకాణి కోరారు. రిట్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని.. ఏపీ ప్రభుత్వం, సీబిఐ, సిఐడీతో పాటు ప్రతివాదులను హైకోర్టు ధర్మాసనం అదేశించింది. గతంలో తనపై నమోదైన కేసులపై సీబీఐ విచారణ జరపాలని సీఎం చంద్రబాబుకు మెయిల్ చేశారు. సీఎం స్పందించకపోవడంతో కాకాణి.. హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు.కాగా, చంద్రబాబు సర్కార్ వైఫల్యాలను, అవినీతి, అక్రమాలను ఎప్పటికప్పుడు నిలదీస్తుండటంతో కాకాణిపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే నెలలో కాకాణి గోవర్ధన్రెడ్డిని నెల్లూరు పోలీసులు కక్షపూరితంగా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 85 రోజులు జైల్లో ఉన్న ఆయన కాకాణి గోవర్దన్రెడ్డి.. బెయిల్ రావడంతో బయటకువచ్చారు. అక్రమ కేసులు బనాయించడంతో.. కూటమి ప్రభుత్వంపై ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు. -
‘పేదలకు అండ జగన్.. కార్పొరేట్లకు అండ చంద్రబాబు’
సాక్షి, అమరావతి: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమ ర్యాలీలకు భారీ స్పందన లభించింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ అనంతపురంలో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయం నుంచి బుక్కరాయసముద్రం వైఎస్సార్ విగ్రహం దాకా ఈ ర్యాలీ జరిగింది. కోటి సంతకాల సేకరణ ప్రతులతో జరిగిన ఈ బైక్ ర్యాలీలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, అనంతపురం పార్లమెంటు పరిశీలకులు నరేష్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తదితరులు పాల్గొన్నారు. బైక్ ర్యాలీకి జనం పోటెత్తారు.ప్రకాశం జిల్లా: రాష్ట్రంలోని వెనకబడి ప్రాంతమైన పశ్చిమ ప్రకాశానికి కూటమి ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేసిందని మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్సీపీ మార్కాపురం ఇన్చార్జి అన్న రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ మెడికల్ కాలేజీ మంజూరు చేసి, నిర్మాణం చేపడితే కడుపుమంటతో చంద్రబాబు ప్రైవేటీకరణ చేశారన్నారు. మార్కాపురం గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి ప్రాంతాల నుంచి వైద్యం కోసం ప్రజలు నేటికీ సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని, మెడికల్ కాలేజీ, జనరల్ ఆసుపత్రి ప్రభుత్వ నిర్వహణల ఉంటే పేదలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్కాపురం నియోజకవర్గంలో 85 వేల మంది సంతకాలు చేశారని అన్నా రాంబాబు తెలిపారు.నంద్యాల జిల్లా: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమం కోటి సంతకాల కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. వైఎస్సార్సీపీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ ర్యాలీలో నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి , కాటసాని రామిరెడ్డి , ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి ,ఇషాక్ భాషా , డాక్టర్ దారా సుధీర్ పాల్గొన్నారుఅన్నమయ్య జిల్లా: జిల్లాలో కోటి సంతకాల సేకరణ సూపర్ సక్సెస్ అయ్యింది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయచోటిలో నినాదాలు హోరెత్తాయి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలంటూ ప్రజానీకం కదం తొక్కింది. ‘‘పేదలకు అండ వైఎస్ జగన్. కార్పోరేట్లకు అండ చంద్రబాబు. సీఎం డౌన్.. డౌన్’’ అంటూ నినాదాలు చేశారు. చిత్తూరు - కర్నూలు జాతీయ రహదారిలో శివాలయం నుంచి నేతాజీ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు రామచంద్రారెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
పార్లమెంటు స్థాయీ సంఘం నివేదికకు ఎల్లో మీడియా వక్ర భాష్యం
సాక్షి, అమరావతి: దేశంలో వైద్యవిద్య నాణ్యతపై ఇటీవల పార్లమెంటు స్థాయీ సంఘం విడుదల చేసిన నివేదికకూ ఎల్లో మీడియా వక్రభాష్యం పలికింది. కొత్త ప్రభుత్వ వైద్యకళాశాలల ఆవశ్యకత, ఎంబీబీఎస్ సీట్ల పెంపు అవసరాన్ని స్థాయి సంఘం నొక్కివక్కాణిస్తే.. పీపీపీ విధానాన్ని సమర్థించినట్టు కట్టుకథలల్లుతోంది. కొత్తగా కళాశాలలు ఏర్పాటుకు ముందుకొచ్చే ప్రైవేటు సంస్థలకు కేవలం పన్ను రాయితీలు చాలన్న స్థాయీ సంఘం సూచనను వక్రీకరించి చంద్రబాబు ప్రైవేటీకకరణకు అనుకూలంగా నివేదిక ఇచ్చినట్టు దుష్ప్రచారం చేస్తోంది. దీనిపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అసలు స్థాయి సంఘం చెప్పిందేమంటే..! ‘దేశంలో వైద్య విద్యకు ఉన్న పోటీకి తగ్గట్టుగా ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో లేకపోవడం విద్యార్థులకు శాపంగా మారుతోంది. సీట్లు పరిమితంగా ఉండటంతో దేశం వెలుపల ఎంబీబీఎస్ అభ్యసించడానికి వలస వెళ్లే విద్యార్థుల సంఖ్య అధికంగా ఉంటోంది.’ అని పార్లమెంట్ స్థాయీ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రం ఇప్పటికే ప్రకటించినట్టు వచ్చే ఐదేళ్లలో 75 వేల సీట్లు జోడిస్తే విద్యార్థులు వలసలు వెళ్లడానికి అవసరం ఉండదని దృఢంగా అభిప్రాయపడింది. దేశంలో వైద్య విద్య నాణ్యతపై ఇటీవల స్థాయీ సంఘం నివేదిక విడుదల చేసింది. ఆ నివేదిక దేశంలోని అనేక రాష్ట్రాల్లోని వైద్య విద్యలో అసమానతలను బట్టబయలు చేసింది. దేశంలో వైద్య విద్యలో అసమానతలు ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటని స్పష్టం చేసింది. దేశం మొత్తం 1.10 లక్షల ఎంబీబీఎస్ సీట్ల పంపిణీలో రాష్ట్రాల మధ్య అసమానతలను ఎత్తి చూపింది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి కొన్ని రాష్ట్రాల్లో ప్రతి 10 లక్షల జనాభాకు 150కు దగ్గరగా ఎంబీబీఎస్ సీట్లు ఉండగా జాతీయ స్థాయిలో 75 సీట్లే ఉంటున్నాయని వివరించింది. 10 లక్షల జనాభాకు 50 కంటే తక్కువ సీట్లున్న రాష్ట్రాలు ఉన్నాయని పేర్కొంది. అయితే ఆయా రాష్ట్రాల పేర్లను నివేదికలో వెల్లడించలేదు. జాతీయ స్థాయిలో 10 లక్షల జనాభాకు 100 సీట్ల నిష్పత్తిని సాధించడానికి మరో 40 వేల సీట్లు కొత్తగా సమకూర్చాల్సి ఉందని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా 10 లక్షల జనాభాకు వంద కంటే ఎంబీబీఎస్ సీట్లున్న రాష్ట్రాలు కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు కృషి చేయాలని సిఫార్సు చేసింది. వైద్య కళాశాలలు అందుబాటులో లేని జిల్లాల్లో ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, కళాశాలల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వైద్య విద్యలో బోధన, బోధనేతర సిబ్బంది కొరత అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలపై వైద్య, ఆరోగ్య శాఖలకు పలు సూచనలు చేసింది. వైద్య విద్యలో అసమానతలు అధిగమించడంతోపాటు, నాణ్యత పెంపునకు స్థాయీ సంఘం చేసిన సిఫార్సులకు ఐదేళ్ల కిందటే వైఎస్ జగన్ రాష్ట్రంలో కార్యరూపం ఇచ్చిందని వైద్యవర్గాల్లో చర్చ ఊపందుకుంది. చంద్రబాబు సర్కారు గ్రహణం 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం బాబు గద్దెనెక్కడంతో మిగిలిన మెడికల్ కళాశాలలకు చంద్రగ్రహణం పట్టుకుంది. ఎక్కడికక్కడ గతేడాది జూన్ నుంచి నిర్మాణాలను ఆపేసి, పీపీపీలో వైద్య కళాశాలలను ప్రైవేట్కు కట్టబెట్టే కార్యక్రమానికి చంద్రబాబు తెరలేపారు. వైద్య విద్యపై బాబు చిన్న చూపు ఏపీ విద్యార్థులకు పెను శాపంగా మారింది. ఉమ్మడి ఏపీ నుంచి వేరుపడిన సందర్భంలో మన కంటే తెలంగాణలో తక్కువ సీట్లు ఉండేవి. ఇదిలా ఉండగా పదేళ్లలో ఆ రాష్ట్రంలో తొమ్మిది వేలకుపైగా ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 2014లో కేంద్రంలోని ఎన్డీఏతో పొత్తులో ప్రభుత్వాన్ని నడిపిన బాబు రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఒక్కటంటే ఒక్క కొత్త వైద్య కళాశాల ఏర్పాటుకు కృషి చేయలేదు. ఫలితంగా ఐదు కోట్లమందికిపైగా జనాభా ఉన్న ఏపీలో 2019–20లో 4,650 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉన్నాయి. వీటిలో కేవలం రెండు వేల సీట్లు ప్రభుత్వ కళాశాలల్లో ఉండగా, మిగిలినవి ప్రైవేట్ కాలేజీల్లోవి. పక్కనే ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ ఏపీ కంటే ఎక్కువ సీట్లుండేవి. పోటీకి సరిపడా ఎంబీబీఎస్ సీట్లు లేక, ప్రైవేట్లో వైద్య విద్యను కొనే స్థోమత లేని వేల మంది విద్యార్థులు రష్యా, ఉక్రెయిన్, కజికిస్తాన్ వంటి విదేశాలకు పరుగులు తీశారు. సామాన్య ప్రజలు సైతం ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందక తీవ్ర అగచాట్లు పడేవారు. పీపీపీ పేరిట దోచిపెట్టే కుట్రలు దేశంలో వైద్య విద్యను బలోపేతం చేసే క్రమంలో ప్రభుత్వాలు పీపీపీలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చే సంస్థలకు పన్ను రాయితీలు ఇవ్వాలని పార్లమెంట్ స్థాయీ సంఘం సూచించింది. ఇదిలా ఉండగా చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో ఇప్పటికే అభివృద్ధి చేసిన బోధనాస్పత్రులను, తరగతులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న వైద్య కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడుతోంది. 10 కళాశాలలను పీపీపీలో ప్రైవేట్కు కట్టబెట్టడం కోసం ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది. ప్రభుత్వమే భూములు సేకరించి, టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించి, నిర్మాణాల్లో మంచి పురోగతి సాధించిన కళాశాలలను పప్పుబెల్లాల మాదిరిగా ప్రైవేటుకు కట్టబెట్టేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో బాబు సర్కారు అవలంబిస్తున్న విధానం దేశంలో ఏ రాష్ట్రంలో లేదని ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పార్లమెంట్ స్థాయి సంఘం సైతం కొత్త కళాశాలల ఏర్పాటు కోసం కేవలం పన్ను రాయితీలు మాత్రమే ఇవ్వాలని సిఫార్సు చేయడం గమనార్హం. అయితే ఇందుకు పూర్తి భిన్నంగా బాబు సర్కారు అడుగులు వేస్తోంది. అంతేకాకుండా విద్యార్థుల నుంచి ఫీజులు, రోగుల నుంచి చార్జీల రూపంలో దోచుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. ఎకరం భూమికి కేవలం రూ.100 లీజు రూపంలో ఏకంగా 66 ఏళ్ల పాటు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో కళాశాలలు పెట్టేస్తోంది. గతేడాది ప్రారంభం కాకుండా నిలిచిపోయిన పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, ఆదోని వైద్య కళాశాలలకు టెండర్లూ పిలిచింది. వాస్తవానికి పులివెందుల కళాశాల, బోధనాస్పత్రి నిర్మాణం వైఎస్ జగన్ హాయంలోనే పూర్తయింది. ఈ నేపథ్యంలోనే బాబు ప్రభుత్వం ఏమీ చేయకున్నా పులివెందులకు నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) 2024–25లోనే 50 ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేసింది. అయితే కళాశాల మాకొద్దంటూ చంద్రబాబు సర్కార్ ఎన్ఎంసీకి లేఖలు రాసి, అనుమతులు రద్దు చేసింది. మిగిలిన మూడు కళాశాలలు ప్రారంభించకుండా వదిలేసింది. ఇప్పుడీ నాలుగింటిని తొలి దశలో ప్రైవేట్కు కట్టబెట్టడమే కాకుండా మరింత బరితెగించి, గత ప్రభుత్వం అభివృద్ధి చేసిన బోధనాస్పత్రులను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టబోతుంది. రెండేళ్ల పాటు ఈ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బందికి ఖజానా నుంచి వేతనాలు చెల్లించడం ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు రూ.వందల కోట్లు దోచిపెట్టడానికి స్కెచ్ వేసింది.దోపిడీ విధానాన్ని సమర్థించుకోవడానికి పాట్లుపీపీపీ పేరిట దేశంలో ఎక్కడా లేనివిధంగా బాబు సర్కారు తెరలేపిన దోపిడీ విధానంపై అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన ఉద్యమానికి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతమైంది. నియోజకవర్గ స్థాయిలో చేపట్టిన నిరసన ర్యాలీలకు రాజకీయాలకు అతీతంగా విద్యార్థి, ప్రజా, మేధావి వర్గాలు తరలివచ్చాయి. ఈ నేపథ్యంలో తన దోపిడీ విధానాన్ని సమర్థించుకోవడానికి చంద్రబాబు సర్కారు నానా పాట్లు పడుతోంది. పార్లమెంట్ స్థాయి సంఘం సిఫార్సులకు వక్రభాష్యం చెబుతోంది. వైద్య కళాశాలల అభివృద్ధిలో పీపీపీ విధానమే ఉత్తమం అంటూ తన ఆస్థాన మీడియాలో ప్రచారం చేయించుకుంటోంది. అయితే పార్లమెంట్ స్థాయి సంఘం ఎక్కడా ప్రభుత్వం నిర్మించిన, నిర్మాణం ప్రారంభించిన కళాశాలలను పీపీపీలో ప్రైవేట్కు కట్టబెట్టాలని చెప్పనే లేదు. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు.. మసిబూసి మారేడుగాయ చేయడంలో ఆరితేరిన చంద్రబాబు పార్లమెంట్ స్థాయి సంఘంలోని చిన్న అంశాన్ని ఆయుధంగా మలుచుకుని తాను చేసేదే కరెక్ట్ అన్నట్టు వక్రీకరించేస్తున్నారు.పీపీపీ తప్పితే ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలలు నిర్వహించడం వేస్ట్ అన్నట్టుగా తప్పుడు ప్రచారాన్ని మరింత విస్తృతం చేసే పనిలోపడ్డారు. ప్లగ్ ప్లే తరహాలో తరగతులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వ కళాశాలలను ప్రైవేటుకు కట్టబెడుతూ పీపీపీనే ఉత్తమ విధానం అంటూ సమర్థించుకోవడానికి తెగ తాపత్రయపడుతున్నారు. ఐదేళ్ల కిందటే వైఎస్ జగన్ కార్యరూపం ప్రతి 10 లక్షల జనాభాకు 50 కంటే తక్కువ సీట్లు రాష్ట్రాలు కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని స్థాయి సంఘం ప్రభుత్వాలకు సూచించింది. వైద్య సౌకర్యాలు సరిగా లేని జిల్లాల్లో కళాశాలలు ఏర్పాటు చేయాలని పేర్కొంది. ప్రైవేటులో వైద్య విద్యను అభ్యసించడానికి రూ. కోట్లలో ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉన్న క్రమంలో సామాన్య విద్యార్థుల తెల్లకోటు కల సాకారం చేసే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని నొక్కి చెప్పింది. పార్లమెంట్ స్థాయీ సంఘం ఇప్పుడు చేసిన సిఫార్సులకు ఐదేళ్ల కిందటే, అంటే 2019లోనే వైఎస్ జగన్ కార్యరూపంలోకి తీసుకొచ్చారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేసి, ప్రతి జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేస్తానన్న హామీని అమలు చేస్తూ ఏకంగా రూ.8వేల కోట్లకుపైగా నిధులతో 17 కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అప్పటి వరకూ ఒక్క ప్రభుత్వ/ప్రైవేట్ వైద్య కళాశాల లేని పల్నాడు, ఏఎస్ఆర్, బాపట్ల, అన్నమయ్య, సత్యసాయి, అనకాపల్లి, పార్వతీపురం మన్యం ప్రాంతాల ప్రజలకు ఉచిత సూపర్స్పెషాలిటీ వైద్యాన్ని చేరువ చేసే దిశగా అడుగులు వేశారు. మరోవైపు ప్రైవేట్ వైద్య కళాశాలే తప్ప ప్రభుత్వ రంగంలో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందని నంద్యాల, అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, విజయనగరం, చిత్తూరు జిల్లాల్లోనూ కొత్త వైద్య కళాశాలలు నెలకొల్పడానికి నడుం బిగించారు. వీటితోపాటు కృష్ణా జిల్లా మచిలీపట్నం, కర్నూల్ జిల్లా ఆదోని, వైఎస్సార్ జిల్లా పులివెందుల, ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో కొత్త కళాశాలల నిర్మాణాలను కరోనా సృష్టించిన ఆర్థిక విధ్వంసాన్ని అధిగమించి ప్రారంభించారు. 2023లో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, 2024లో పాడేరు వైద్య కళాశాలను ప్రారంభించారు. -
కోటి సంతకాల పత్రాలతో.. నేడు జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు
సాక్షి, అమరావతి: పేదలకు నాణ్యమైన వైద్యం, సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను అందకుండా చేస్తూ.. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తూ.. రూ.లక్ష కోట్ల ప్రజల ఆస్తులను బినామీలకు కట్టబెట్టి ‘నీకింత నాకింత’ అంటూ పంచుకు తినేందుకు చంద్రబాబు సర్కారు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తుండడాన్ని వ్యతిరేకిస్తూ కోటి మందికి పైగా ప్రజలు సంతకాలు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పైగా.. ఈ ప్రజా ఉద్యమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉద్యోగ–ఉపాధ్యాయులు, మేధావులు, ప్రజాసంఘాల నేతలు, సామాజిక కార్యకర్తలు స్వచ్ఛందంగా కదంతొక్కడం యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడీ ఉద్యమం తుది అంకానికి చేరుకుంది. కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తుండటాన్ని నిరసిస్తూ 175 నియోజకవర్గాల్లోనూ కోటి మందికి పైగా ప్రజలు సంతకాలు చేసిన పత్రాలను ఆయా నియోజకవర్గాల నుంచి ఇప్పటికే జిల్లా కేంద్రాల్లోని వైఎస్సార్సీపీ కార్యాలయాలకు భారీ ర్యాలీలతో తరలించారు. ఈ నేపథ్యంలో.. సోమవారం జిల్లా కేంద్రాల్లో కోటి సంతకాల పత్రాలతో ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ.. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకతను చాటిచెప్పేలా వైఎస్సార్సీపీ భారీ ర్యాలీలు నిర్వహిస్తోంది. ర్యాలీల్లో పాల్గొంటే కేసులంటూ బెదిరింపులు.. ఇక ఈ ర్యాలీలను అడ్డుకోవడానికి చంద్రబాబు సర్కారు అప్పుడే పోలీసులను ఉసిగొలిపింది. ర్యాలీల్లో పాల్గొనవద్దని.. పాల్గొంటే కేసులు పెడతామంటూ వైఎస్సార్సీపీ నేతలు, విద్యార్థులు, ప్రజాసంఘాల నేతలకు జిల్లాల్లో పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. అయితే, ఈ బెదిరింపులను ఏమాత్రం ఖాతరు చేయబోమని.. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ వైఎస్సార్సీపీ నిర్వహించే ర్యాలీల్లో కదంతొక్కుతామని వారు తేల్చిచెబుతున్నారు. కోటి సంతకాల పత్రాలతో జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి.. కొత్త మెడికల్ కాలేజీలపై చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరి, బినామీలకు కట్టబెట్టి కమీషన్ల దండుకోవడానికి వేసిన ప్రణాళిక.. పేదలకు నాణ్యమైన వైద్యం, వైద్య విద్యను దూరం చేయడానికి చేస్తున్న కుట్రను మరోసారి ప్రజలకు వైఎస్సార్సీపీ నేతలు వివరించనున్నారు. ఆ తర్వాత కోటి సంతకాల పత్రాలు ఉన్న వాహనాలను జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపడానికి జెండా ఊపి ప్రారంభిస్తారు. జిల్లా కేంద్రాల నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న ఈ కోటి సంతకాల పత్రాలను ఈనెల 18న సా. 4 గంటలకు పార్టీ నేతలతో కలిసి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ గవర్నర్కు నివేదిస్తారు. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణలో చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును వివరిస్తారు. ప్రభుత్వమే వాటిని పూర్తిచేసి నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేయనున్నారు. వాహనాల ర్యాలీకి అనుమతివ్వండి.. కోటి సంతకాల ప్రతులున్న వాహనాల ర్యాలీలకు అనుమతివ్వాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర డీజీపీకి లేఖ రాసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈ మేరకు డీజీపీకి విజ్ఞప్తి చేశారు. ర్యాలీల్లో పాల్గొనద్దంటూ జిల్లాల్లో పోలీసులు నోటీసులు జారీచేస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ ర్యాలీలు, సంతకాల పత్రాల రవాణా సజావుగా సాగేందుకు అనుమతి అవసరమని.. దీనికోసం అన్ని జిల్లాల ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేయాలని అప్పిరెడ్డి తన లేఖలో డీజీపీకి విజ్ఞప్తి చేశారు. -
'రియల్'.. సీన్ రివర్స్!
సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి విజయవాడ, నెట్వర్క్: అభివృద్ధికి చిరునామా..! మంచి ప్రభుత్వం..! విజనరీ పాలన..! సంపద సృష్టిస్తానంటూ అంటూ నమ్మబలికిన సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వ్యవస్థలను దిగజారుస్తూ, అన్ని రంగాలను కుప్పకూలుస్తున్నారు. సంక్షేమం ఊసే పట్టించుకోకుండా.. అభివృద్ధి జాడే లేకుండా చేస్తున్నారు. ఒకవైపు పారిశ్రామిక విధానం ముసుగులో తమకు నచ్చినవారికి ఖరీదైన భూములను పప్పు బెల్లాల మాదిరిగా 99 పైసలకే కేటాయిస్తూ, మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నీరుగార్చడంతో అవసరాలకు అమ్ముకోలేక రైతులు, పనులు లేక భవన నిర్మాణ కార్మికులు, వ్యాపారులు అల్లాడుతున్నారు. రాజధాని ప్రాంతంలో సైతం ఇదే దుస్థితి నెలకొంది. వైఎస్సార్ సీపీ హయాంలో అన్ని ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా విజయవాడ, బందరులో జిల్లా కేంద్రాలు, పోర్టు, కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడంతో గుంటూరు నుంచి మచిలీపట్నం దాకా భూముల ధరలు బాగా పెరిగి రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగింది. ఇప్పుడు ఏడాదిన్నరగా భవన నిర్మాణ రంగాలు కుదేలయ్యాయి. నెలకు పది రోజులు కూడా ఉపాధి దొరకటం లేదని కార్మికులు వాపోతున్నారు. ప్రధాన పట్టణాలు, నగరాల్లో పరిస్థితి తారుమారైంది. రియల్ ఎస్టేట్ అనుబంధ రంగాలైన సిమెంట్, ఐరన్, శానిటేషన్, ఎలక్ట్రికల్, పెయింట్స్, ప్లంబింగ్ తదితరాల వ్యాపారం కుప్పకూలింది. విజయవాడ, తిరుపతి, నెల్లూరులో స్థిరాస్తి వ్యాపారులు అల్లాడుతున్నారు. రాజధానిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రచారం మినహా అభివృద్ధి జాడ లేకపోవడంతో ఏడాదిన్నరగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం రివర్స్లో ప్రయాణిస్తోంది. అన్ని ప్రాంతాల్లోనూ స్థిరాస్తి క్రయవిక్రయాల్లో మందగమనం కనిపిస్తోంది. రాష్ట్రం దూసుకుపోతోందంటూ ప్రభుత్వం చేస్తున్న హడావుడికి, క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదు. చంద్రబాబు సర్కారు మాటలు నిజమైతే స్థిరాస్తి మార్కెట్ కళకళలాడాలి. రిజిస్ట్రేషన్ల ద్వారా ఖజానాకు వచ్చే ఆదాయం పెరగాలి. కానీ మార్కెట్ బేల చూపులు చూస్తోంది. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గతంలో ఎన్నడూ లేనివిధంగా పడిపోవడమే ఇందుకు ఉదాహరణ. 2023–24లో రూ.12 వేల కోట్లుగా ఉన్న రిజి్రస్టేషన్ల టార్గెట్ తాజాగా 2025–26 ఏడాదిలో రూ.10,169 కోట్లకు తగ్గిపోవడం గమనార్హం. ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వాలు టార్గెట్ను పెంచుకుంటూ వెళ్లి అందుకనుగుణంగా ఆదాయాన్ని సముపార్జిస్తాయి. కానీ చంద్రబాబు ప్రభుత్వం రివర్స్లో టార్గెట్ను తగ్గించుకుంటూ వెళుతోంది. తద్వారా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోయిందని, స్థిరాస్తుల కొనుగోళ్లు జరగడం లేదని ప్రభుత్వమే అధికారికంగా నిర్థారించేసింది. 2023–24లో గత ప్రభుత్వంలో రాష్ట్రంలో 22.25 లక్షల డాక్యుమెంట్ల రిజి్రస్టేషన్ జరగగా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఏడాదిలో అక్టోబర్ నాటికి 13.92 లక్షల డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ కావడం దిగజారిన పరిస్థితికి నిదర్శనంగా నిలుస్తోంది. కాగా దివంగత వైఎస్సార్ హయాంలో గొల్లపూడి నుంచి రామవరప్పాడు రింగ్ వరకు ఇన్నర్ రింగు రోడ్డు నిర్మాణంతోపాటు బుడమేరుపై ఫ్లైఓవర్లతో విజయవాడ పరిసరాల్లో రియల్ ఎస్టేట్ ఊపందుకుందని పరిశీలకులు పేర్కొంటున్నారు. చిన అవుటపల్లి నుంచి వెస్ట్ బైపాస్ నిర్మాణ పనులను 2014–19 మధ్య టీడీపీ హయాంలో పట్టించుకోలేదు. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చిన అవుటపల్లి నుంచి వెస్ట్ బైపాస్ పనులను 96 శాతం మేర పూర్తి చేసింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నరకుపైగా అవుతున్నా మిగిలిన కొద్దిపాటి పనులను పూర్తి చేయడంలో విఫలమైంది. రిజిస్ట్రేషన్ల టార్గెట్లు రివర్స్ చంద్రబాబు సర్కారు అస్తవ్యస్థ పాలన, విచ్చలవిడి అవినీతితోపాటు సంక్షేమ పథకాలు అందకపోవడంతో ప్రజల కొనుగోలు శక్తి క్షీణించి స్థిరాస్తుల క్రయవిక్రయాలు ఊహించని విధంగా పడిపోయాయి. కనీసం వసూళ్ల లక్ష్యాన్ని కూడా సరిగా నిర్దేశించుకోలేని స్థాయికి రిజిస్ట్రేషన్ల ఆదాయం క్షీణించింది. ఎప్పుడో మూడేళ్ల క్రితం నిర్దేశించిన లక్ష్యం కంటే కూడా ప్రస్తుతం తక్కువ టార్గెట్ పెట్టుకోవడం ద్వారా స్థిరాస్తి క్రయవిక్రయాలపై చంద్రబాబు సర్కారు ఆశలు వదిలేసుకుంది. 2023–24 ఆరి్థక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల శాఖ రూ.12 వేల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుని రూ.9,546 కోట్లు రాబట్టింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఈ లక్ష్యాన్ని తగ్గించుకుంటూ వస్తుండడం గమనార్హం. 2024–25లో రూ.11,997 కోట్ల లక్ష్యాన్ని పెట్టుకుని రూ.8,843 కోట్లను మాత్రమే రాబట్టగలిగింది. అంతకుముందు సంవత్సరం వచ్చి న ఆదాయాన్ని కూడా చంద్రబాబు సర్కారు తొలి ఏడాది సాధించలేకపోయింది. ఇక 2025–26లో లక్ష్యాన్ని రూ.10,169 కోట్లుగా పెట్టుకుని అక్టోబర్ నాటికి రిజి్రస్టేషన్ల ద్వారా రూ.7 వేల కోట్లు వసూలు చేయగలిగింది. వరుసగా రెండేళ్లపాటు లక్ష్యాన్ని తగ్గించుకోవడాన్ని బట్టి స్థిరాస్థి రంగంలో ఏమాత్రం వృద్ధి లేదని ఈ ప్రభుత్వమే బయటపెట్టింది. దీంతో తన హయాంలో పడిపోయిన ఆదాయాలనే కొలమానంగా తీసుకుని ప్రస్తుత ఆదాయాలను పోల్చుతుండడం విశేషం. ఆదాయాన్ని 2023–24 సంవత్సరంతో పోల్చకపోవడం, తక్కువ లక్ష్యాన్ని పెట్టుకుని దాంతో పోల్చడం ద్వారా ప్రజలను మభ్యపుచ్చేందుకు యత్నిస్తోంది. నిజానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో చంద్రబాబు సర్కారు రాష్ట్రవ్యాప్తంగా భూముల విలువను సగటున 50 శాతానికిపైగా పెంచింది. దీంతో ప్రజలపై భారం పడి రిజిస్ట్రేషన్ల సొమ్ము ఎక్కువగా కట్టాల్సి వస్తోంది. చార్జీలు పెంచడం ద్వారా ప్రజలను బాది ఆదాయాన్ని పెంచుకున్నా రిజి్రస్టేషన్లు మాత్రం అమాంతం తగ్గిపోవడం గమనార్హం. లేదంటే రిజిస్ట్రేషన్ల ఆదాయం ఇంకా భారీగా పడిపోయేదని స్పష్టంగా తెలుస్తోంది. రాజధానిలో ‘రియల్’ షాక్..! రాజధాని అమరావతి ప్రాంతంలో కూడా రియల్ ఎస్టేట్ పడిపోయిందని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. రాజధానికి బడా కంపెనీలు, కార్యాలయాలు వచ్చేస్తున్నాయని చంద్రబాబు సర్కారు ప్రచారం చేస్తున్నా రియల్ వ్యాపారం మాత్రం పెరగడంలేదు. రాజధాని పరిసర ప్రాంతాల్లో కొత్త వెంచర్లు వేయడం తగ్గిపోయింది. ఇప్పటికే వేసిన వాటిలో స్థలాలు అమ్ముడు కావడంలేదు. అపార్టుమెంట్లలో ప్లాట్లు పరిస్థితి కూడా అలాగే ఉంది. స్థలాలు, ప్లాట్ల కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు ముందుకు రాకపోవడంతో వ్యాపారులు ఆందోళనలో మునిగిపోయారు. స్వయంగా చంద్రబాబు రాజధానిలోని వెలగపూడిలో ఇల్లు నిర్మించుకుంటున్నట్లు చెబుతున్నా అక్కడ రియల్ ఎస్టేట్ పుంజుకోలేదు. రెండు, మూడు విడతల భూసమీకరణ ద్వారా మరింత భూమిని తీసుకుంటామని ప్రకటించడం, పూలింగ్కు భూములు ఇవ్వకపోతే బలవంతంగా భూసేకరణ చేస్తామని బెదిరిస్తుండటంతో రాజధానిలో పరిస్థితి ఆందోళనకరంగా మారిపోయింది. చంద్రబాబు సర్కారు భూదాహంపై రాజధాని రైతులు మండిపడుతున్నారు. పట్ణణాలు, నగరాల్లోనూ డీలాచంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాయలసీమను పట్టించుకోకపోవడం, ఆ ప్రాంతంలో పెట్టుబడులు రాకపోవడంతో రియల్ రంగం కుదేలైంది. వైఎస్ జగన్ హయాంలో సీమలో పరుగులు తీసిన రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు ఇప్పుడు కుదేలయ్యాయి. ప్రధానంగా తిరుపతి, కర్నూలు, అనంతపురం, కడప తదితర ప్రాంతాల్లో భూముల అమ్మకాలు తగ్గిపోయాయి. స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధుల దందాలు, భూములపై పెత్తనం చేస్తుండడంతో కొనాలనుకున్న కొద్దిమంది కూడా జంకుతున్నారు. క్షీణించిన ప్రజల కొనుగోలు శక్తి విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, రాజమహేంద్రవరం లాంటి ప్రధాన నగరాల్లోనూ రియల్ వ్యాపారం మందకొడిగా ఉంది. నగరాల్లోనూ అమ్మకాలు లేవని వ్యాపారులు చెబుతున్నారు. విజయవాడ–మచిలీపట్నం రహదారికి ఇరువైపులా గతంలో కళకళలాడిన వ్యాపారం ఇప్పుడు పడిపోయింది. ప్రజల కొనుగోలు శక్తి క్షీణించడం, ఈ ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. రూ.లక్షల కోట్ల పెట్టుబడులు, కార్పొరేట్ కంపెనీలు రాష్ట్రానికి క్యూ కడుతున్నాయని చంద్రబాబు ప్రభుత్వం బడాయి పోతున్నా భూముల కొనుగోళ్లు మాత్రం లేకపోవడం గమనార్హం. 2019–24 మధ్య విశాఖలో మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లిన రియల్ వ్యాపారం ఏడాదిన్నరగా దిగజారిపోయింది. పెద్ద ప్రాజెక్టులు చాలా వరకూ ఆగిపోయాయి. కొత్త ప్రాజెక్టులు తగ్గిపోయాయి. నిర్మాణ రంగం విలవిలఒకపక్క రియల్ రంగం తిరోగమనంలో ఉండడంతో మరోపక్క దానిపై ఆధారపడిన నిర్మాణ రంగం కూడా కుదేలైంది. భవన నిర్మాణ కారి్మకులకు పనులు తగ్గిపోయాయి. విశాఖ, విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, కర్నూలు, నెల్లూరు తదితర ప్రాంతాల్లో కార్మికులకు గతంలో చేతి నిండా పని ఉండేది. ఇప్పుడు పని దొరకడం కష్టంగా మారింది. నిర్మాణ రంగంలో కీలకమైన ఇటుక, సిమెంట్, పెయింటింగ్, ప్లంబింగ్, ఇనుము. ఎలక్ట్రిసిటీ, విక్రయాల వ్యాపారాలు క్షీణించాయి. ఇలా చంద్రబాబు సర్కారు అస్తవ్యస్థ విధానాల వల్ల కీలక రంగాలు చతికిలపడ్డాయి. వ్యాపారాలు తగ్గిపోవడంతో వాటిపై ఆధారపడిన వారు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లో మనీ సర్క్యులేషన్ తగ్గిపోవడంతో అన్ని వ్యాపారాలు తగ్గిపోయాయి. విజయవాడ పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వైఎస్సార్సీపీ హయాంలో మంచి రోజుల్లో సగటున రోజుకు 150, ఇతర రోజుల్లో 100–120 రిజిస్ట్రేషన్లు జరిగేవి. ఇప్పుడు మంచి రోజుల్లోనూ 70–80 దాటడం లేదు. సాధారణ రోజుల్లో 50 రిజిస్ట్రేషన్లు కావడం గగనంగా ఉంది. 2019కి ముందు మచిలీపట్నం శివారులో సెంటు రూ.3 లక్షలు ఉంటే 2024లో రెట్టింపై రూ.6 లక్షలకు చేరుకుంది. తరువాత చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర గడిచినా ధరలు పెరగలేదు. 2022–23లో తూర్పు గోదావరి జిల్లాలో 1,29,355 డాక్యుమెంట్లు రిజిస్టర్ కాగా 2025–26 నవంబర్ చివరి నాటికి కేవలం 61,597 డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. విజయనగరం పరిసర ప్రాంతాల్లో సుమారు రూ.10 లక్షలు ఉన్న 200 గజాల ఇంటి స్థలం 2019 తరువాత వైఎస్ జగన్ హయాంలో రూ.25 – రూ.30 లక్షలకు చేరుకుంది. ఇప్పుడు ఒక్కసారిగా ధరలు తగ్గిపోయాయి. మూడు నాలుగేళ్ల క్రితం కొన్న ధరకు అమ్ముకుందామన్నా కొనేవారు లేరని వ్యాపారులు చెబుతున్నారు. కడప అర్బన్, రూరల్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో గత ప్రభుత్వంలో రోజుకు సుమారు 250–300 రిజి్రస్టేషన్లు జరగగా ప్రస్తుతం 50–60 మించడం లేదు. ప్రొద్దుటూరు సబ్ రిజి్రస్టార్ కార్యాలయ పరిధిలో రోజుకు 80–90 రిజిస్ట్రేషన్లు నుంచి ప్రస్తుతం 30కి తగ్గిపోయాయి. ఆదోని మెడికల్ కాలేజీ పరిసరాల్లో గతంలో ఎకరం రూ.5 కోట్లు పలకగా ఇప్పుడు అడిగే నాథుడే కరువయ్యారు. 2023–24 వైఎస్ జగన్ హయాంలో ఇలా..1) రిజిస్ట్రేషన్ల ఆదాయం టార్గెట్ రూ.12,000 కోట్లు 2) రాష్ట్రంలో భారీగా పెరిగిన భూముల ధరలు 3) రోజూ వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు.. 22.25 లక్షల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ 4) రాష్ట్రవ్యాప్తంగా పేదలకు పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు, 30 లక్షలకుపైగా గృహ నిర్మాణాలు - ప్రభుత్వ ఆధ్వర్యంలో 17 కొత్త మెడికల్ కాలేజీలకు శ్రీకారం - తీర ప్రాంతంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటు - గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ భవన నిర్మాణాలతో స్థానికంగా ప్రజలకు పెద్ద ఎత్తున ఉపాధితో పాటు సంపద సృష్టిస్తూ అడుగులు 5) భవన నిర్మాణ కార్మికులకు సమృద్ధిగా పనులు 6) సంక్షేమ పథకాల అమలుతో పెరిగిన పేదల కొనుగోలు శక్తి, జీవన ప్రమాణాలు 7) రియల్ ఎస్టేట్ అనుబంధ రంగాలు కళకళ. జోరుగా గృహ నిర్మాణాలతో సిమెంట్, పెయింట్లు, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వ్యాపారాల జోరు 2025–26 బాబు ప్రభుత్వంలో.. 1) రిజిస్ట్రేషన్ల ఆదాయం టార్గెట్ రూ.10,169 కోట్లకు కుదింపు 2) భూముల ధరలు ఒక్కసారిగా పతనం.. రాజధానిలోనూ మందగమనం 3) రిజిస్ట్రేషన్లు పదుల సంఖ్యకే పరిమితం.. అక్టోబర్ దాకా 13.92 లక్షలే 4) కొత్తగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోగా ఉన్న వ్యవస్థలే నిర్వీర్యం. 5) పొట్ట కూటి కోసం కార్మికుల అవస్థలు 6) పథకాలు అందక, అభివృద్ధి జాడ లేక పేదల దీనావస్థ 7) రియల్ ఎస్టేట్ వెలవెల. ఆగిన ఇళ్ల నిర్మాణాలు. వ్యాపారులు బేజార్కృష్ణాలో కుప్పకూలింది..! కృష్ణా జిల్లాలో ఏడాదిన్నరగా భవన నిర్మాణ రంగాలు కుదేలయ్యాయి. గత ప్రభుత్వంలో నెలకు 20 రోజులకు తగ్గకుండా పనులుంటే ఇప్పుడు పది రోజులు కూడా ఉపాధి దొరకటం లేదని భవన నిర్మాణ కార్మికులు వాపోతున్నారు. అనుబంధ రంగాలైన సిమెంట్, ఐరన్, శానిటేషన్, ఎలక్ట్రికల్, పెయింట్స్, ప్లంబింగ్ తదితరాల వ్యాపారం కుప్పకూలింది. వైఎస్సార్ సీపీ హయాంలో బందరు పోర్టుకు శంకుస్థాపన చేసి పనులను పరుగులు పెట్టించింది. మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసింది. గిలకలదిండి íఫిషింగ్ హార్బర్, పలు కొత్త హైవేలు రావడంతో జిల్లా పునర్విభజన సమయంలో మచిలీపట్నం పరిసరాల్లో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. బందర్ హైవే వెంట నిడుమోలు, పామర్రు, ఉయ్యూరు. కంకిపాడు ప్రాంతాల్లో భారీగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిశాయి. కత్తిపూడి–ఒంగోలు హైవేతో పెడన, అవనిగడ్డ నియోజక వర్గాల్లో సైతం రియల్ భూమ్ అందుకొంది. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక వేగం మందగించడంతో రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్దత నెలకొంది. బాపట్లలో భవన రంగం బాధలు బాపట్ల జిల్లాలో ఏడాదిన్నరగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పతనమైంది. గత ప్రభుత్వంతో పోలిస్తే రిజి్రస్టేషన్లు సగం తగ్గాయి. వైఎస్ జగన్ హయాంలో బాపట్ల జిల్లాలో 2022 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 76,215 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరగగా టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 50,983 డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ జరిగాయి. ప్రభుత్వానికి రాబడి తగ్గిపోగా భవన నిర్మాణ రంగాలు కుదేలయ్యాయి. గత ప్రభుత్వంలో నెలకు 22 రోజులకు తగ్గకుండా పనులుంటే ఇప్పుడు పది రోజులు కూడా దొరకడం లేదని భవన నిర్మాణ కారి్మకులు వాపోతున్నారు. సిమెంట్, ఐరన్ విక్రయాలు పడిపోయాయని వ్యాపారులు లబోదిబోమంటున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో జిల్లాలో ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టింది. తీరప్రాంతం అభివృద్ధికి నిధులు కేటాయించడంతో రోడ్లు ఇతర మౌలిక వసతుల పనులు వేగంగా జరిగాయి. బాపట్ల కేంద్రంగా గత ప్రభుత్వం మెడికల్ కళాశాల మంజూరు చేసింది. దీంతో 2019 తరువాత రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. అప్పటివరకూ తీర ప్రాంతంలో ఎకరం రూ.30 లక్షలు పలికిన భూమి తరువాత రూ.3 నుంచి 5 కోట్లకు చేరింది. గత ఏడాదిన్నరగా పరిస్థితి తారుమారైంది. వైఎస్ జగన్ హయాంలో బాపట్ల మెడికల్ కళాశాల ప్రాంతంలో రూ.కోటిన్నర పలికిన ఎకరం భూమిని ప్రస్తుతం రూ.20 లక్షలకు కూడా కొనేవారు లేరు. అద్దంకి, రేపల్లె ప్రాంతాల్లో గత ప్రభుత్వంలో ఎకరం రూ.కోటి దాకా పలికిన భూముల ధరలు తిరిగి రూ.20 లక్షలకు పతనమయ్యాయి.పల్నాడులో ధరలు పతనం.. పల్నాడు జిల్లాలో గత ప్రభుత్వంలో మెడికల్ కళాశాల రాకతో పిడుగురాళ్ల, దాచేపల్లి, రాజుపాలెం, మాచవరం తదితర మండలాల్లో ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగింది. రైతుల భూములు రెట్టింపు ధరలు పలికాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రిజిస్ట్రేషన్ ఆదాయం అమాంతం పడిపోయింది. పల్నాడు జిల్లావ్యాప్తంగా 2023–24లో రిజి్రస్టేషన్ల ద్వారా రూ.472.38 కోట్ల ఆదాయం సమకూరగా 2024–25లో ఆదాయం రూ.396 కోట్లకు పడిపోయింది. 2025–26లో ఇప్పటిదాకా రూ.200 కోట్లు కూడా రాలేదు. గతంలో ఏటా సగటున 32 వేల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరగగా ప్రస్తుతం అది 14 వేలకు పడిపోయింది. దీంతో మధ్యవర్తులు ఉపాధిలేక హైదరాబాద్ లాంటి నగరాలకు వలస వెళ్తున్నారు. గతంలో వెంచర్ల ఏర్పాటుతో ఉపాధి పొందిన వేలాది మంది కూలీలు, ట్రాక్టర్, జేసీబీ, ట్రక్కు డ్రైవర్లు ప్రస్తుతం పనుల కోసం అడ్డాలలో ఎదురు చూస్తున్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చేరువలోని కామేపల్లి గ్రామ పరిధిలో 2019కి ముందు ఎకరం పొలం రోడ్డు పక్కన సుమారు రూ.30 లక్షలు ఉండగా స్థానికంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుతో ఒక్కసారిగా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఏకంగా ఎకరం రూ.కోటిన్నర దాకా పలికింది. 2024లో వైఎస్సార్సీపీ దిగిపోయేనాటికి ఎకరం రూ.2 కోట్ల దాకా వెళ్లింది. అదే ఇప్పుడు కనీసం రూ.60 – రూ.80 లక్షలు కూడా పలకడం లేదు. కనీసం ధర గురించి అడిగే వారు లేరని రైతులు, రియల్ఎస్టేట్ వ్యాపారులు వాపోతున్నారు. నరసరావుపేటలోనూ వెంచర్లు వేసిన వ్యాపారులు స్థలాలు అమ్ముకోలేక, వడ్డీలు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరులో నీరసించిన వ్యాపారం నెల్లూరు జిల్లాలో రియల్ ఎస్టేట్ బాగుంటుందని హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుంచి వచ్చిన రియల్టర్లు లేఅవుట్లు వేశారు. అన్ని సదుపాయాలతో అధునాతనంగా ఇళ్ల నిర్మాణాలు కూడా చేశారు. ఇప్పుడు వాటిని కొనేవారు లేరు. గత 9 నెలలుగా ఖాళీగా ఉన్నారు. కొందరు బిల్డర్లు నూతనంగా నిర్మించిన ఇళ్లను బాడుగలకు ఇస్తున్న పరిస్థితి ఏర్పడింది. భారీగా వడ్డీలు కట్టలేక లబోదిబోమంటున్నారు. ఇక మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేస్తూ చంద్రబాబు సర్కారు ప్రకటన చేసినా రియల్ ఎస్టేట్ ఏమాత్రం ఊపందుకోలేదు. ఏడాదిలో ఒక్కటీ అమ్ముడుపోలేదుటీడీపీ అధికారంలోకి వచ్చాక భూముల అమ్మకాలు, కొనుగోళ్లు తగ్గాయి. గత ఏడాది కాలంలో ఒక్క ప్లాటు కూడా అమ్ముడు పోలేదు. పెట్టుబడులు మొత్తం ప్రాజెక్టులపై పెట్టాం. వ్యాపారం దివాలా తీస్తోంది. తెచి్చన పెట్టుబడులకు వడ్డీలు కట్టడమే సరిపోతోంది.– షేక్ కిరణ్బాబు, బిల్డర్, ఈడుపుగల్లు, కంకిపాడు మండలం, ఎన్టీఆర్ జిల్లా వలసలు పోతున్నారు ఏడాదిన్నరగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా పడిపోయింది. స్థలం అమ్మేవారు ఉన్నా.. కొనేవారు లేరు. అందుకే రిజి్రస్టేషన్లు ఆగిపోయాయి. ఇల్లు కట్టించే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. ఓపెన్ ప్లాట్లు కూడా అమ్ముడు పోవడం లేదు. దీంతో భవన నిర్మాణ కారి్మకులు తమ పనులను వదిలేసి బెంగళూరు తదితర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. – నాగరాజు, భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు, కదిరి, సత్యసాయి జిల్లాపూర్తిగా పతనమైన రియల్ ఎస్టేట్ ప్రకాశం జిల్లాలో రియల్ ఎస్టేట్ పూర్తిగా డౌనైపోయింది. మార్కాపురం జిల్లా ప్రకటిస్తే మంచి ధరలు వస్తాయని ఆశించాం. అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. అమ్మే వారు ఉన్నాగానీ కొనేవారు లేరు. నేషనల్ హైవే పక్కన కూడా కొనేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. సంతనూతలపాడు మండలంలో రియల్ ఎస్టేట్ భూం ఇప్పుడు పూర్తిగా పతనమైంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో నమోదవుతున్న రిజిస్ట్రేషన్ల సంఖ్యే ఇందుకు నిదర్శనం. ఇక్కడ 2022–23లో 6,029 రిజిస్ట్రేషన్లు జరిగాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 2024–25లో ఆ సంఖ్య 3,972కు పడిపోయింది. – కుంచాల ఆంజనేయులు, సంతనూతలపాడు, ప్రకాశం జిల్లాపూట గడవడమే కష్టంగా ఉందిరియల్ ఎస్టేట్ కుదేలైంది. భవన నిర్మాణాలు భారీగా తగ్గిపోయాయి. గతంలో నెలలో 20 రోజులకుపైగా పనులుంటే ప్రస్తుతం 10–15 రోజులు కూడా దొరకడం లేదు. భవన నిర్మాణ కార్మికులకు పూట గడవడమే కష్టంగా ఉంది. – జి.హరికృష్ణారెడ్డి, ఎనీ్టఆర్ జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడునెలలో సగం రోజులే పనిరియల్ ఎస్టేట్ లావాదేవీలన్నీ నిలిచి పోయాయి. దీంతో నిర్మాణ పనులపై ఆధారపడి ఇక్కడ జీవిస్తున్న వేల మంది తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. రాజధాని వస్తుందన్న సమయంలో భవనాల పనులు మొదలు పెట్టారు. అందరికీ చేతినిండా పని ఉండేది. ఇప్పుడు పూర్తి స్థాయిలో పనులు దొరకడం లేదు. రోజుకో బ్యాచ్కి పని సర్దుబాటు చేయాల్సి వస్తోంది. అంటే ఒక కార్మికుడికి నెలలో 15 రోజులు కూడా పని లేకుండా పోయింది. దీంతో కారి్మకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనులు దొరకకపోవడంతో చాలామంది సొంతూళ్లకు వెళ్లిపోయారు. – వైఎస్ మూర్తి, శ్రీ దుర్గా భవానీ భవన నిర్మాణ శ్రామిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు, మధురవాడ, విశాఖపని దొరకడం లేదు.. గత ప్రభుత్వంలో నెలకు 22 రోజులు పనులు దొరికేవి. ఈ ప్రభుత్వం వచ్చాక నెలకు పది రోజులు కూడా పనులు ఉండడం లేదు. ఉదయమే సెంటర్కు వచ్చి పడిగాపులు కాస్తున్నాం. కుటుంబ పోషణ భారంగా మారింది. – నాగూర్బాషా, భవన నిర్మాణ కార్మికుడు, ఉప్పరపాలెం, బాపట్ల జిల్లా. -
పీపీపీకి వ్యతిరేకంగా ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం: టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న సీఎం చంద్రబాబు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేవరకు.. వైఎస్సార్సీపీ పోరాటం ఆగదని ఆ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదలకు ఉచిత వైద్యం, వైద్య విద్య అందించాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రారంభించిన మెడికల్ కాలేజీలకు ప్రైవేటీకరణ చేయడం ద్వారా పేదలకు వైద్య విద్యను దూరం చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.చంద్రబాబు నిర్ణయం వల్ల 2450 మెడికల్ సీట్లు పేదలు దూరమవుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవస్థలను చంద్రబాబు తన జేబు సంస్థల్లా మార్చుకున్నారన్న ఆక్షేపించారు. మరోవైపు కేంద్ర స్థాయీ సంఘం పేరుతో పచ్చి అబద్ధాలు రాస్తున్న ఈనాడు.. పీపీపీ విధానమే ముద్దు అంటూ బాబుకి కొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ప్రారంభించిన 17 మెడికల్ కాలేజీలను పూర్తి చేయడం ద్వారా.. ఆ ఘనత మీ ఖాతాలోనే వేసుకొవాలని చంద్రబాబుకు సూచించారు. అంతే తప్ప ప్రైవేటీకరణ పేరుతో పేదల నోట్లో మట్టికొట్టవద్దని విజ్ఞప్తి చేశారు.ప్రైవేటీకరణ కూటమి విధానమైతే.. అందుకు వైఎస్సార్సీపీ పూర్తి విరుద్ధమన్న సుధాకర్ బాబు దీనిపై రాజీనామా చేసి ప్రజల రెఫరెండంకు సిద్ధమా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ హయాంలో కాలేజీల నిర్వహణ కోసం సెల్ఫ్ పైనాన్స్ సీట్లు ఏర్పాటు చేస్తే.. మెడికల్ సీట్లు అమ్ముకుంటున్నారని గగ్గోలు పెట్టిన చంద్రబాబు, అధికారంలోకి వస్తే 100 రోజుల్లో సెల్ఫ్ పైనాన్స్ రద్దు చేస్తామని బీరాలు పలికి.. ఇవాళ పూర్తిగా కాలేజీలనే ప్రైవేటు పరం చేయడంపై ధ్వజమెత్తారు.మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రాజకీయంగా కాక సామాజిక కోణంలో చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాదని పేద బిడ్డల చదువుల మీద ఉక్కుపాదం మోపాలని చూస్తే.. అప్పుడు కోటి కాస్తా పదికోట్ల సంతకాలవుతాయని తేల్చి చెప్పారు. పీపీపీకి వ్యతిరేకంగా ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమన్న సుధాకర్ బాబు, మా తలలు పగిలినా వైఎస్ జగన్ నేతృత్వంలో పోరాటం ఖాయమని హెచ్చరించారు. 15వ తేదీన జిల్లాల నుంచి కోటి సంతకాలు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి రాగా.. 18న జగన్ నాయకత్వంలో గవర్నర్ దగ్గరకు వెళ్తాయన్న ఆయన... ఈలోపు చంద్రబాబు తన మనసు మార్చుకోవాలని సూచించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..చంద్రబాబు జేబు సంస్థల్లా వ్యవస్థలుఈ రాష్ట్రంలో వ్యవస్థలను మేనేజ్ చేయబడుతున్నాయని.. చంద్రబాబునాయుడికి జేబు సంస్థలుగా మారిపోతున్నాయని, ఆయన మాఫియా డాన్లా మారిపోయాడని వైఎస్సార్సీపీ భావిస్తోంది. అదే విషయాన్ని ప్రజలకు చెప్పాం. ఇవాళ ఆది మరోసారి సుస్పష్టం అయింది. మెడికల్ కాలేజీలను ప్రభుత్వం నిర్వహించాల్సిన అవసరం లేదని, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించవచ్చని, వారి చేతుల్లో ఉంటేనే నాణ్యమైన వైద్యం అందుతుందని.. కేంద్ర ప్రభుత్వం భావించినట్లుగా, కేంద్ర ప్రభుత్వ స్థాయీ సంఘం సిఫార్సు చేసినట్లుగా.. ఈనాడు దినపత్రికలో పతాక శీర్షికలో బ్యానర్ ఐటం రాశారు.ఇవాళ ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలందరూ పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్ (పీపీపీ) వద్దు, ప్రభుత్వ విధానమే ముద్దు అనే నినాదాన్ని ఎత్తుకుంది. కానీ చంద్రబాబు అనుకూలమైన జేబు సంస్థ అయిన ఈనాడు మాత్రం పీపీపీ విధానమే ముద్దు అని రాసింది. చంద్రబాబుకి డబ్బు కొట్టడంలో ర్యాంకింగ్ ఇవ్వాల్సి వస్తే ఈనాడు మొదటి స్థానంలో ఉంటుంది. చంద్రబాబు ఏం చేసినా రైట్, ఆయన ఏం మాట్లాడినా అదే కరెక్ట్ అని రాస్తుంది. ఇంతమంది ప్రజలు వద్దు అంటే.. కాదు అదే ముద్దు అంటూ ఈనాడు రాయడాన్ని వైఎస్సార్సీపీ ఖండిస్తోంది.మీరు ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తూ.. చంద్రబాబు జేబు సంస్థలా వ్యవహరిస్తున్నారు కాబట్టే.. మీరు చంద్రబాబుకి బాకా ఊదుతున్నారు కాబట్టే మిమ్మల్ని ఎల్లో మీడియా అని వ్యవహరిస్తున్నాం. చంద్రబాబుకి, మీకు ఆర్థికపరమైన, వ్యాపారపరమైన లావాదేవీలున్నాయి. అందుకు నిదర్శనమే ఇవాళ మీరు రాసిన వార్తలు.మెడికల కాలేజీలపై చర్చకు సిద్ధమా?1923 నుంచి 2019 వరకు స్వతంత్ర భారతదేశంలో ఏపీలో 12 మెడికల్ కాలేజీలుంటే.. ఇవాళ అవి 29కు చేరాయి. ఒక్క వైఎస్ జగన్ హయాంలోనే 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేస్తే.. మీరు బాకా ఊదే చంద్రబాబు నాయుడుకి ఒక్క రోజైనా ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న స్పృహ వచ్చిందా? వైఎస్ జగన్ విధానాలకు, చంద్రబాబు నాయుడు విధానాలకు ఇద్దరి సిద్ధాంతాలు, సంస్కరణలపై ఒక రోజంతా చర్చ నిర్వహిద్దాం. మీకు నచ్చిన టెలివిజన్ చానెల్స్ అధినేతలంతా విజయవాడ తీసుకురండి. వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధులంతా వస్తాం. చంద్రబాబునాయుడు సిధ్ధాంతమేంటో, ఆయన సిద్ధాంతం పునాదులేంటో చర్చిద్దాం.బలహీనమైన రాజకీయ పునాదులతో ఉన్న చంద్రబాబు... భయం, అభద్రతా భావంతో తనను కానీ పార్టీని ఓన్ చేసుకునే విధానంలో.. వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. అందరికీ తాయిలాలు పంచుకుంటూ వచ్చాడు. తాను దోచుకున్న డబ్బులనే మీ అందరికీ పంచుకుంటూ వచ్చాడన్నదే ప్రధానమైన అంశం. ఈ అంశాన్ని నిరూపించడానికి.. మీరు కట్టిన రామోజీ ఫిల్మ్ సిటీ అయినా, రామోజీ రావు చనిపోతే రూ.5 కోట్ల ప్రజాధనాన్ని ఆయన సంస్మరణ సభ నిర్వహించడం కోసం ఖర్చు చేయడాన్ని ఆధారాలతో సహా ఈనాడు చంద్రబాబు జేబు సంస్థ అనడానికి నిదర్శనం.పీపీపీ- దెబ్బతిన్న మెడికల్ కాలేజీల నిర్మాణ స్ఫూర్తిపీపీపీ విధానం వల్ల 17 మెడికల్ కాలేజీల నిర్మాణ స్ఫూర్తి దెబ్బతింటుంది. ప్రజారోగ్యం కొరకు వైఎస్ జగన్ సామాజిక స్పృహతో రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో ఈ 17 మెడికల్ కాలేజీలను స్థాపించి.. వందలాది ఎకరాలను ఈ కాలేజీల పరిధిలోకి తీసుకొచ్చాడు. ప్రపంచంలోనే అత్యున్నత వైద్యం అందించాలని ఆశించాడు. అందులో 7 కాలేజీల నిర్మాణం పూర్తైంది. 2023-24 విద్యాసంవత్సం నాటికి 5 కాలేజీల్లో అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి. మిగిలిన కాలేజీలను పూర్త చేయడానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవా? గత ప్రభుత్వంలోనే ఏ పైనానా పూర్తి కాకుండా నిల్చిపోతే... ఏ ప్రజాపరిపాలకుడైనా దాన్ని పూర్తి చేసి ఆ ఘనత తన ఖాతాలో వేసుకుంటాడని భావిస్తాం.ఈ 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి.. వీటిని నేనే కట్టానని చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటాడని భావించాం. కానీ చంద్రబాబు నికృష్టరాజకీయాలకు, నిరంకుశరాజకీయాలకు తెరలేపాడు.ఏ మాత్రం జాలి, దయ, దాక్షిణ్యం లేకుండా ప్రవర్తించాడు. ఈ 17 మెడికల్ కాలేజీలు ప్రారంభమైతే.. వందలాది ఉచిత మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఉచితంగా వైద్య సేవలు లభిస్తాయి. ఉచిత వైద్య సేవలు ఆశించిన పేదలు, ఆ కాలేజీలదగ్గరకు వచ్చి వైద్యం ఆశించిన వారందరికీ సంపూర్ణ న్యాయం జరుగుతుంది. కానీ ఈ రాష్ట్రంలో ఉచిత విద్య, ఉచిత వైద్యం అందని ద్రాక్షగా మారింది.పీపీపీపై నిస్సిగ్గుగా అనుకూల ప్రచారంఇప్పటికే చంద్రబాబు ఆరోగ్యశ్రీని అటకెక్కించాడు. 108 నాశనం చేశాడు. 104 అయితే అస్సలు కనబడ్డం లేదు. ఆ రోజు 104 అడ్రస్ లేకుండా పోయింది. వైఎస్సార్ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ, 108, 104 లాంటి చారిత్రాత్మక పథకాలు మచ్చుకైనా రాష్ట్రంలో కనిపించడం లేదు. ఈ దఫా చంద్రబాబు బరితెగించాడు. ఈ రాష్ట్రంలో 85 శాతం మంది ప్రజలకు ప్రభుత్వం ఏ పథకం ఇచ్చినా తీసుకుందామనుకుని ఆశపడ్డ వాళ్ల నోట్లో మట్టికొట్టాడు. పైగా వాళ్ల పత్రికతో బాకాలు ఊదించుకుంటూ.. పీపీపీ విధానమే బాగుంటుందని, ఇదే సరైన నిర్ణయమని నిస్సిగ్గుగా ప్రచారం చేయించుకుంటున్నాడు.పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడానికి వైఎస్సార్సీపీ బద్ద విరుద్దం. మీరు, ఈనాడుతో పాటు మీ అనుకూల పత్రికలు పీపీపీ విధానానికి సానుకూలం. తక్షణమే చంద్రబాబును రాజీనామా చేయమనండి. లోకేష్, పవన్ కళ్యాణ్లను కూడా రాజీనామా చేయమనండి. మా 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తాం. ప్రజలను రిఫరెండెం కోరుదాం. ప్రజలకు ఏది అవసరమో వారి ముందుకే వెళ్దాం.స్థాయీ సంఘం పేరుతో అబద్దాలుకేంద్ర ప్రభుత్వ స్థాయీ సంఘం పీపీపీ విధానం సిఫార్సు చేసినట్లు అబద్ధాలు చెబుతున్నారు. స్థాయి సంఘం పన్ను రాయితీలు ఇమ్మని, స్కాలర్ షిప్పులు ఇమ్మని చెప్పింది. సీట్లు పెంచాల్సిన ఆవశ్యకత గురించి ఆలోచించమని చెప్పిందే తప్ప.. పీపీపీ విధానం బ్రహ్మాండంగా ఉంది. మీరు ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయండని కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. ఆ రోజు వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రారంభించినప్పుడు ఆయా కాలేజీల నిర్వహణకు వీలుగా కన్వీనర్ కోటాతో పాటు సెల్ఫ్ పైనాన్స్ సీట్లను పెట్టాలని ఆలోచన చేస్తే.. వైఎస్ జగన్ మెడికల్ సీట్లను అమ్ముకుంటున్నాడు.వైఎస్ జగన్ ప్రభుత్వ విధానం తప్పు అని.. ఈ పార్టీలు, పత్రికలే దుమ్మెత్తి పోశాయి. ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తూ.. వార్తలు రాశాయి. అక్కడితే ఆగకుండా మేం ఆధికారంలోకి వస్తే.. 100 రోజుల్లో సెల్ఫ్ పైనాన్స్ విధానాన్ని రద్దు చేసి, పూర్తిగా కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తామని చెప్పిన ఈ పెద్ద మనుషులు.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోయారు. పీపీపీ పేరుతో పూర్తిగా ప్రభుత్వ సంపదను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పంపించే పనిలో పడ్డారు.పైగా ఆ పీపీపీ విధానంలో కూడా ఉచితాలు ఉంటాయని.. పచ్చి అబద్దాలు చెబుతూ ఇంకా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓపీ సేవలు ఉచితమని చెబుతున్నారు. ఓపీలో ఏం సేవలు అందుతాయి. వీళ్లు చెబుతున్న ఉచితం.. జ్వరం, పన్నో, కన్నూ, కడుపో నొప్పి వస్తే.. ఓపీ ఫ్రీ. అలా కాకుండా కాళ్లూ చేతులు విరిగితేనో, ఇంకేవైనా జబ్బులు వస్తేనో ప్రైవేటు ఆసుపత్రుల్లో వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఆ ఫీజులు పేదలు కట్టుకోలేదు.చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్, లోకేష్లకు ఆ విషయం అర్థం కాదు. మేం భారీ ఫీజులు కట్టి ఆ వైద్యాన్ని పొందలేరని.. ప్రభుత్వం వైపు చూసే ఆనాథల కోసమే ఈ కళాశాలలు వస్తే.. దాన్ని కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కింది. పైగా ప్రైవేటీకరణ చేసిన ఆసుపత్రుల్లో 50 శాతం బెడ్స్ పేదలకు ఉచితంగా ఇస్తామని చెబుతున్నారు. ఇది నమ్మవచ్చా? ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత వాటిపై ప్రభుత్వ ఆజమాయిషీ ఉంటుందా? ఇవాళ కడుతున్న మెడికల్ కాలేజీలో 100 పడకలు ఉంటే.. రిజర్వేషన్ ప్రకారం 70 పేదలకు, మిగిలినవి ఇతరులకు పెట్టగలిగే అవకాశం ఉంటుందా? మరి అలాంటప్పుడు ఈ రకమైన అబద్ధాలు ఎలా చెబుతారు?కాలేజీలు ప్రైవేటీకరణ - జీతాలు ప్రభుత్వ ఖజానాప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడమే ఒక పెద్ద స్కామ్ అయితే.. వారికి ప్రభుత్వం మరొక పెద్ద బొనాంజా ప్రకటిస్తుంది. ప్రైవేటు వ్యక్తుల చేతులకు ఆసుపత్రులు ఇచ్చి.. అక్కడ సిబ్బందికి ప్రభుత్వమే జీతాలు చెల్లించే విధంగా ఒప్పందాలు ఎలా జరుగుతున్నాయి? ఈ రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు. మీ అరాచాకాలను గమనిస్తున్నారన్న స్పృహ కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఎక్కడైనా ఈ సహేతుకమైన చర్చలో.. రూ.140 కోట్లు ప్రవైటు వ్యక్తుల చేతులకి ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టాలని చూడ్డం ఎంతవరకు సహేతుకం? పైగా ఆరోగ్యశాఖ మంత్రి సత్యప్రసాద్ అవును నిజమే ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుందని చెబుతున్నాడు. ఈయనా మంత్రి? అసలు అవగాహన ఉండే మాట్లాడుతున్నాడా? కేంద్ర ప్రభుత్వం ఆయా మెడికల్ కాలేజీల్లో సీట్ల కేటాయింపు అంటోంది.పీజీ మెడికల్ సీట్లకు ఒక్కోదానికి రూ.29 లక్షలు వసూలు చేసే విధంగా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ స్కెచ్ వేశారు. ఆ రోజు వైయస్.జగన్ ప్రభుత్వంలో ఆయా కాలేజీల నిర్వహణకు.. స్వతంత్రంగా భరించే విధంగా... కన్వీనర్ కోటా కాకుండా కొన్ని సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో భర్తీ చేయాలని నిర్ణయించారు. దాన్ని విమర్శించి.. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రద్దు చేస్తామని చెప్పారు. తీరా ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉచిత సీటు వస్తే రూ.30వేలు ఫీజు, సెల్ఫ్ ఫైనాన్స్ అయితే రూ.9 లక్షలు, ఎన్నారై కోటా అయితే రూ.29 లక్షలు రేటు ఫిక్స్ చేశారు. ఆ రోజు మీరు చెప్పినట్లు కన్వీనర్ కోటాలోనే పూర్తిగా సీట్లు ఉంచినట్లైతే... ఇవాళ మీరు చెప్పినట్లు రూ.9, రూ.29 లక్షలు ఫీజులు ఎందుకు వసూలు చేస్తున్నారు?5 కొత్త మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యాసంవత్సరంలో నాలుగు పీజీ కోర్సులలో 60 సీట్లను జాతీయ వైద్య కమిషన్ మంజూరు చేసింది. ఈ 60 సీట్లను మంజూరు చేసిన సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి, వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ కు ఉందా? తొలివిడత 4 కాలేజీల్లో 50 శాతమే కన్వీనర్ కోటా, పీపీపీ పేరుతో ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల మెడికల్ కాలేజీలను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తూ.. వాటిలో 50 శాతం సీట్ల మాత్రమే ప్రభుత్వ కోటాలో ఉంచుతున్నారు. ఇంతకంటే ద్రోహం ఉంటుందా? ఈ ఒక్క చర్య ద్వారానే ప్రభుత్వ విధానం, చిత్తశుద్ధి తేటతెల్లమైందిమెడికల్ కాలేజీల భూములు కౌరుచౌకగా అప్పగింత..మరోవైపు ఆయా ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు వైయస్.జగన్ ప్రభుత్వం 50 ఎకరాల స్ధలం కేటాయిస్తే.. వందలదాలి కోట్ల ఖరీదు చేసే ఆ భూములను ప్రభుత్వం.. రూ.100 కే ప్రైవేటు వ్యక్తులకు దశలవారీగా ధారాధత్తం చేస్తోంది. 33 ఏళ్ల లీజు పేరుతో కేవలం రూ100 కే అప్పగిస్తోంది. ఇది ప్రజల ఆస్తిని ప్రైవేటు పరం చేయడమే. పీపీపీ విధానంలో ప్రైవేటు పరం చేస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై కన్నేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ఒక్కా కాలేజీకి 257.50 ఎకరాల భూమిని కేటాయిస్తే అది ఇవాళ 191.71 ఎకరాలకే వచ్చింది. ఈ మధ్యలో భూమి సుమారు 50-60 ఎకరాలు మాయమైపోయింది. ఇది ఘోరమైన, బాధాకరమైన విషయం.ప్రైవేట్ వ్యక్తుల చేతులకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అప్పగించడం వల్ల.. తొలి ఏడాది ఇప్పటికే 700 సీట్లు కోల్పోయాం. రెండో సంవత్సరంలో 1750 కలిపి మొత్తం 2450 సీట్లను కోల్పోయాం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి చేతులు జోడించి వినమ్రంగా వేడుకుంటున్నాను. దయచేసి ప్రైవేటు జపం ఆపేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రైవేటీకరణ వల్ల 2450 సీట్లలో మన ఆంధ్రరాష్ట్రంలో పేద విద్యార్ధులు వైద్య విద్యను అభ్యసించే అవకాశం కోల్పోయారు.మనస్సుతో చూడండి. ఆ గొప్ప మాకు వద్దు. ఆ 17 కళాశాలల క్రెడిట్ మీరే తీసుకుని, మీరే ప్రారంభించండి. రూ.1000 కోట్లు కేటాయించి మన బిడ్డల భవిష్యత్తు కోసం ఆ మెడికల్ కాలేజీల నిర్మాణం చేయండి. 2450 సీట్లు కోల్పోయిన వారందరూ ఈ రాష్ట్రంలో అన్ని కులాలకు చెందిన పేదలే ఉంటారు. దయచేసి ప్రైవేటీకరణను ఆపి, ఆ కాలేజీలను ప్రభుత్వ రంగంలో ఉంచండి. ప్రైవేటీకరణ అంశాన్ని రాజకీయ కోణంలో కాకుండా, సామాజిక కోణంలో చూడాల్సిన ఆవశ్యకత ఉంది.కోటి సంతకాలు పది కోట్లవడం ఖాయంరాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ళ పట్టాలివ్వాలని వైఎస్ జగన్ భావిస్తే.. అక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీలు వస్తే రాజధాని ప్రాంతంలో డెమొగ్రాఫికల్ ఇంబేలన్స్ వస్తుందన్న మహా ఘనుడివి.. అదే విషయాన్ని కోర్టుకు చెప్పిన ఘనుడివి నువ్వు చంద్రబాబూ. అలాంటి నువ్వు మా బిడ్డల చదువులు మీద ఉక్కుపాదం మోపుతుంటే.. ఈ కోటి సంతకాలు పదికోట్లవుతాయి. ఎలాంటి త్యాగాల చేసైనా.. ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలో ఉంచేందుకు పోరాటం చేస్తాం. వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ శ్రేణులు కదం తొక్కడం ఖాయం.15వ తేదీనాటికి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల కోటి సంతకాలు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి వస్తాయి. 18వ తేదీన ఈ సంతకాలన్నీ గవర్నర్కి చేరుతాయి. ఈ లోగా నీ నిర్ణయం మార్చుకో చంద్రబాబూ?. కేసులు పెట్టి, తలలు పగలగొట్టి మమ్నల్ని భయపట్టాలని చూసే మీ ప్రయత్నాలు మమ్నల్ని ఆపలేవు. ప్రజా సమస్యల పోరాటంలో వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్సార్సీపీ శ్రేణులు అలు పెరగని పోరాటం చేయడం తథ్యమని తేల్చి చెప్పారు. కార్పొరేట్ శక్తులను పెంచిపోషించడమే మీ సిద్ధాంతం అయితే.. పేదవాడికి ఉచిత విద్య, వైద్యం అందించడం, ఇళ్ల పట్టా ఇవ్వడం, వారికి కడుపు నిండా అన్నం పెట్టడమే వైఎస్ జగన్ సిద్ధాంతమని.. మీ సిద్ధాంతాలకు, మా సిద్ధాంతాలకూ జరుగుతున్న పోరాటంలో మేం ఏ పోరాటానికైనా, త్యాగాలకైనా సిద్ధమేనని సుధాకర్ బాబు హెచ్చరించారు. -
‘విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారు’
హైదరాబాద్: ఏపీలోని కూటమి ప్రభుత్వం మద్యం ఆదాయాన్ని తాకట్టుపెట్టి అప్పులు తెస్తున్నా జీవో ఇవ్వడం లేదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ధ్వజమెత్తారు. కేబినెట్ ఆమోదం లేకండానే విచ్చలవిడిగా అప్పుల తెస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు(ఆదివారం, డిసెంబర్ 14వ తేదీ) సోమాజిగూడ ప్రెస్క్లబ్ నంచి మాట్లాడిన ఆయన.. ‘బేవరేజ్ల బాండ్లను రూ. 5,750 కోట్లకు మార్కెట్లో పెట్టారని విమర్శించారు. ఇవే బాండ్లను తమ ప్రభుత్వ హయాంలో సంక్షేమ కోంస అమ్మకం పెడితే నానా రాద్దాంతం చేశారన్నారు. ‘‘ప్రస్తుత కూటమి ప్రభుతం బేవరేజ్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది. బేవరేజ్ చెల్లించకుంటే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. బేవరేజ్లకు వచ్చే ఆదాయంలో డైరెక్ట్గా అప్పుదారుడు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇంత చేస్తున్న కూటమి ప్రభుత్వం.. మా ప్రభుత్వం హయాంలో గగ్గోలు పెట్టింది. కూటమి మీడియా ప్రజలను తప్పుదోవ పట్టించింది. కేబినెట్ ఆమోదం లేకుండానే విచ్చలవిడిగా అప్పులు తెస్తున్నారు. బాండ్లు తాకట్టుపెట్టి రూ. 5,750 కోట్లు కూటమి ప్రభుత్వం అప్పు చేసింది. 9 శాతం పైగా వడ్డీతో రూ. చంద్రబాబు అప్పు తెచ్చారు.స్పెషల్ మార్జిన్ ఆదాయాన్ని కూడా తాకట్టుపెట్టి అప్పులు తెస్తున్నారు. ఏపీలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్య నిషేధం ఉండదని హామీ ఇచ్చారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు విషపు మాటలు, ఈనాడు విషపు రాతలు రాసింది. కేబినెట్ ఆమోదం లేకుండానే విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారు. మా ప్రభుత్వంలో బాండ్లు ఇష్యూ చేస్తే అప్పుకిక్కు అని వార్తలు రాసిన కూటమి పత్రికలు.. ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు అప్పు కిక్కి కనిపించడం లేదా.మేము చేస్తే అప్పు. కూటమి ప్రభుత్వం చేస్తే మాత్రం సంపద సృష్టి అన్నట్లు వారి మీడియా వార్తలు రాస్తుంది’ అని మండినడ్డారు బుగ్గన. -
పొగమంచు ప్రమాదం.. అప్రమత్తతే ప్రధానం
సాక్షి, అమరావతి: శీతాకాలంలో ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంటుంది. వాహనంలో ప్రయాణిస్తుంటే రోడ్లMý ు ఇరువైపులా పొగమంచు హృద్యంగా కనువిందు చేస్తుంది. కారులోగానీ ఇతర వాహనాల్లో మంచి సంగీతం వింటూ డ్రైవింగ్ చేయడం మధురానుభూతి కలిగిస్తుంది. కానీ ఆ పొగమంచు మాటునే ప్రమాదం పొంచి ఉందన్నది డ్రైవర్లు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దేశంలో రహదారులపై పొగమంచు కమ్మేయంతో రోడ్డు ప్రమాదాలు ఏటేటా పెరుగుతున్నాయి. ఒక్క శీతాకాలంలోనే దేశంలో ఏటా 30 వేలకుపైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మొత్తం రోడ్డు ప్రమాదాల్లో పొగమంచుతో సంభవిస్తున్న ప్రమాదాలు 7% వరకు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున ఓ ట్రావెల్స్ బస్సు లోయలోపడి ప్రమాదానికి గురికావడంతో 9మంది దుర్మరణం చెందడంతోపాటు 37మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. పొగమంచును బస్సు డ్రైవర్ సరిగా అంచనా వేయలేక పోవడంతోనే ఈ ప్రమాదం సంభవించింది. అందుకే శీతాకాలంలో వాహనాలను డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జాతీయ రహదారులపై రాత్రి వేళల్లో 7గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు పొగమంచు పరుచుకుని ఉంటుంది. ఘాట్ రోడ్లలో పొగమంచు మరింత దట్టంగా కమ్మేస్తుంది కూడా. అందుకే అరకు, మారేడుమిల్లి, శ్రీశైలం, తిరుమల, హార్స్లీ హిల్స్ వంటి ఘాట్ రోడ్లపై ప్రయాణించేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. పొగమంచులో డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.చేయాల్సినవి...» లో బీమ్ హెడ్లైట్లనే ఉపయోగించాలి. హై బీమ్ లైట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు.» పొగమంచు దారిలో ప్రయాణిస్తున్నంతసేపు ఫాగ్లైట్లు ఆన్ చేయాలి.» టైల్ ల్యాంప్స్ను క్లీన్గా ఉంచాలి. స్పష్టంగా కనిపించేట్టుగా ఉండాలి.» బ్రేక్ లైట్లు కచ్చితంగా పనిచేసేట్లుగా జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతో వాహనం నెమ్మదించగానే ఆ విషయం వెనుక వాహనదారులకు గుర్తించగలరు.» వాహనంలో టూల్ కిట్ తప్పనిసరిగా ఉంచుకోవాలి.» రోడ్లపై ఉన్న లైన్ మార్కింగ్లను గమనిస్తూ.. తదనుగుణంగా డ్రైవింగ్ చేయాలి. రోడ్డుకు కుడి, ఎడమ చివర్లో ఉన్న లైన్లను దాటి వెళ్లకూడదు. ఒక లైన్ నుంచి మరో లైన్లోకి మారేటప్పుడు వెనుక, పక్కన ఉన్న వాహనాలను గమనించాలి. వెనుక నుంచి ఏ వాహనం రావడం లేదని నిర్ధారించుకున్న తరువాతే లైన్ మారాలి.» వాహనం వైపర్లు సరిగా పని చేసేట్టుగా చూసుకోవాలి.» వాహనాన్ని నిలుపుదల చేయాల్సి వస్తే... రోడ్డుకు ఎడమవైపు లైన్లోనే నిలపాలి.» ఎదురుగా వెళుతున్న వాహనాలకు తగినంత దూరంగా ఉంటూ వాహనాన్ని నడపాలి.» రోడ్డు సరిగా కనిపించడంలేదని గుర్తించగానే వాహనాన్ని రోడ్డు పక్కగా నిలిపివేయాలి. జాతీయ రహదారులపై నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశాలు, సమీపంలోని దాబాలు, పెట్రోల్ బంకులు, టోల్ ప్లాజాల వద్ద ఉండే పార్కింగ్ ప్రదేశంలోనే వాహనాలను నిలపాలి. » విండ్ షీల్డ్ క్లీన్గా ఉండాలి. యాంటీ ఫాగింగ్(డీ ఫాగర్) మోడ్లో వాహనం ఉంచి నడపాలి.చేయకూడనివి...» మితివీురిన వేగంతో ప్రయాణించవద్దు. పరి మిత వేగంతోనే డ్రైవింగ్ చేయాలి. వాహనం ఎప్పుడూ డ్రైవర్ నియంత్రణ ఉండాలి. రోడ్డును స్పష్టంగా చూడగలిగేంత వేగంతోనే ప్రయాణించాలి. »దారిలో పొగమంచు ఉన్నప్పుడు ముందు వెళ్తున్న వాహనాలను ఎట్టి పరిస్థితిల్లోనూ ఓవర్ టేక్ చేయకూడదు.» క్రూయిజ్ కంట్రోల్ మోడ్లో వాహనాన్ని నడపకూడదు.» డ్రైవింగ్ చేస్తున్నపుడు డ్రింక్స్ తాగడం గానీ ఏమైనా తినడంగానీ చేయకూడదు. పొగ తాగకూడదు. » ఎదురుగా వాహనం వస్తుంటే హైబీమ్ లైట్లను ఫ్లాష్ చేయ కూడదు. » డ్రైవింగ్ చేస్తున్నప్పుడు హజార్డ్ (త్రికోణాకృతి)లైట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆన్ చేయకూడదు. వాహనాన్ని పార్క్ చేసినప్పుడే ఇతరులు గమనించేందుకు హజార్డ్ లైన్లను ఆన్ చేసి ఉంచాలి. -
ఇంటర్ పరీక్షల్లో భారీ మార్పులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యలో 2025–26 విద్యా సంవత్సరంలో కొత్త సిలబస్ను అమలు చేసిన బోర్డు.. అందుకు అనుగుణంగా పరీక్షా విధానంలోనూ మార్పులు చేసింది. ప్రశ్నల సరళి, మార్కుల కూర్పు సైతం మారనుంది. జాతీయ విద్యా విధానం–2020కి అనుగుణంగా ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో ఎన్సీఈఆర్టీ సిలబస్ను, పరీక్షలకు సీబీఎస్ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ముఖ్యంగా ఎక్కువ మంది విద్యార్థులు ఎంచుకునే సబ్జెక్టులైన మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, చరిత్ర, ఎకనామిక్స్, కామర్స్, సివిక్స్ సిలబస్లో ఈ ఏడాది మార్పులు చేశారు. ప్రతి పేపర్కు 100 మార్కులు ఉంటాయి. అలాగే ఒక్క మార్కు ప్రశ్నల విధానం ప్రవేశపెట్టారు. సిలబస్ మారిన సబ్జెక్టుల పరీక్షలు రాసేందుకు జవాబుల బుక్లెట్ను 32 పేజీలకు పెంచారు. సిలబస్ మారని సబ్జెక్టులకు 24 పేజీల బుక్లెట్ ఉంచారు. సబ్జెక్టులు మారినందున పరీక్షల నిర్వహణలోనూ మార్పులు తెచ్చారు. ఒక్కో పరీక్షకు కనీసం 2 రోజుల వ్యవధి ఉండేలా టైంటేబుల్ రూపొందించారు. ఈ విద్యా సంవత్సరం మొదటి ఇంటర్ పరీక్షల్లో ఈ మార్పులు ఉంటాయి. రెండో ఏడాది పరీక్షలను మాత్రం ఈ ఏడాది పాత విధానంలోనే నిర్వహిస్తారు. అమల్లోకి ఐదు సబ్జెక్టుల విధానం ప్రస్తుతం ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూపుల్లో రెండు లాంగ్వేజెస్, నాలుగు మెయిన్సబ్జెక్టులు (మొత్తం ఆరు), ఆర్ట్స్ గ్రూపుల్లో రెండు లాంగ్వేజెస్, మూడు మెయిన్ సబ్జెక్టులు (మొత్తం ఐదు) ఉన్నాయి. మార్కుల కేటాయింపు కూడా భిన్నంగా ఉంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 5 సబ్జెక్టుల విధానం అమల్లోకి తెచ్చారు. అన్ని గ్రూపులకు ఒక లాంగ్వేజ్, 4 మెయిన్ సబ్జెక్టులు ఉంటాయి. ఇందులో ఇంగ్లిష్ తప్పనిసరి. రెండో లాంగ్వేజ్ని ‘ఎలక్టివ్’ (ఆరో సబ్జెక్టు)గా మార్చారు. అంటే విద్యార్థి లాంగ్వేజ్ లేదా 23 మెయిన్ సబ్జెక్టుల్లో ఒకటి ఎంచుకోవచ్చు. విద్యార్థులు మొదటి 5 సబ్జెక్టుల్లో ఒకటి ఫెయిలై.. ఆరో సబ్జెక్టు పాసైతే అప్పుడు ఆరో సబ్జెక్టును మెయిన్ సబ్జెక్టుగా పరిగణిస్తారు. అయితే, ఆరో సబ్జెక్టును పరిగణనలోకి తీసుకోవాలంటే ఇంగ్లిష్ తప్పనిసరిగా పాసవ్వాలి. » సైన్స్ లేదా ఆర్ట్స్ గ్రూపుల్లో మూడు (3, 4, 5 సబ్జెక్టులు) ప్రధాన సబ్జెక్టులు ఉంటాయి. » గతంలో ఎంపీసీలో ‘మ్యాథ్స్–ఏ, బి’ పేపర్లు (ఒక్కో పేపర్ 75 మార్కులు) ఉండగా, ఇప్పుడు ఒక్క పేపర్ మాత్రమే ఉంటుంది. » బైపీసీలో బోటనీ, జువాలజీ సబ్జెక్టులను కలిపి ‘బయాలజీ’గా ఒక్క ప్రశ్నపత్రం మాత్రమే ఇస్తారు. ఇందులో బోటనీకి 43, జువాలజీకి 42 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. జవాబులు రాసే బుక్లెట్స్ రెండింటికీ వేర్వేరుగా ఇస్తారు. వేర్వేరుగా జవాబులు రాయాలి. » ఆర్ట్స్లో సీఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో ప్రస్తుతం ఉన్న 26 కాంబినేషన్లు ఉంటాయి. విద్యార్థులు నచి్చన కాంబినేషన్ను ఎంచుకోవచ్చు. » కామర్స్లో కామర్స్ పార్ట్–ఏ 50 మార్కులకు, అకౌంటెన్సీ పార్ట్–బి 50 మార్కులకు పేపర్ ఉంటుంది.మార్కుల్లో మార్పులు » మొదటి ఏడాది ఇంటర్మీడియట్లో ప్రతి సబ్జెక్టు 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో సైన్స్ సబ్జెక్టులైన ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ సబ్జెక్టులకు 85 మార్కుల చొప్పున రాత పరీక్ష ఉంటుంది. రెండో ఏడాది పరీక్షల్లో ప్రాక్టికల్స్ 30 మార్కులకు ఉంటుంది. అంటే రెండేళ్లకు రాత పరీక్ష 170 (85+85) మార్కులకు, ప్రాక్టికల్స్ 30 మార్కులు.. మొత్తం 200 మార్కులకు ఉంటుంది. » గతేడాది వరకు మ్యాథమెటిక్స్–ఏ, బి పేపర్లుగా 150 మార్కులకు ఉండగా, వాటిని కూడా రద్దు చేసి ఒకటే పేపర్ 100 మార్కులకు కుదించారు. » ఉత్తీర్ణతకు 100 మార్కుల పేపర్లకు 35 మార్కులు, 85 మార్కుల పేపర్లకు 29 మార్కులకు తప్పనిసరి చేశారు. అంటే సైన్స్ సబ్జెక్టుల్లో రెండేళ్లకు కలిపి 59 మార్కులు రావాలి. సైన్స్ ప్రాక్టికల్స్ రెండేళ్లలో 30 మార్కులకు గాను 11 మార్కులు తప్పనిసరిగా సాధిస్తేనే ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. » ఒకటి రెండు సబ్జెక్టుల్లో అధిక మార్కులు, మరో రెండు, మూడు సబ్జెక్టుల్లో 30 శాతం మార్కులు సాధించినా ఉత్తీర్ణతగా పరిగణిస్తారు. అన్ని సబ్జెక్టుల్లోనూ సరాసరి 35 శాతం మార్కులు తప్పనిసరి. అయితే, ఈ అవకాశం మొదటి ప్రయత్నంలో పరీక్షలు రాసేవారికి మాత్రమే వర్తిస్తుంది. » ఈసారి పరీక్షల్లో అర, 1, 2, 4, 5, 8, 16 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. అర, ఒక్క మార్కు ప్రశ్నలకు తప్ప మిగిలిన వాటికి ‘‘ఛాయిస్’’ విధానం అమల్లోకి తెచ్చారు. » ప్రస్తుత (2025–26) విద్యా సంవత్సరంలో రెండో ఏడాది ఇంటర్ విద్యార్థులకు పాత సిలబస్తోనే పరీక్షలు జరుగుతున్నందున ఎలాంటి మార్పులు చేయలేదు.ఫిబ్రవరి 23 నుంచి పరీక్షలు » పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24వ తేదీ వరకు నిర్వహిస్తారు. ప్రతి పరీక్షకు కనీసం 2 రోజుల వ్యవధి ఉండేలా టైంటేబుల్ రూపొందించారు. అయితే, హోలీ (మార్చి 3), రంజాన్ (మార్చి 20) తేదీల్లో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో ఆ తేదీల్లో జరిగే పరీక్షలను మరుసటి రోజు నిర్వహించేలా టైంటేబుల్లో మార్పులు చేసి, ప్రభుత్వానికి పంపినట్టు తెలిసింది. ప్రభుత్వ అనుమతి రాగానే మార్పులతో కూడిన టైంటేబుల్ను ఇంటర్ విద్యా శాఖ వెల్లడించనుంది.గతంలో ఒక్కో సబ్జెక్టు ఒక్కో తీరుగా మార్కుల విధానం.. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో గతంలో భాషా పేపర్లు 100 మార్కులకు ఉండేవి. సబ్జెక్టులకు మాత్రం వేర్వేరుగా ఉండేవి. ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో తీరుగా ప్రశ్నలు, మార్కుల కేటాయింపు ఉండేది. ఆర్ట్స్ గ్రూపులకు మొత్తం 5 పేపర్లు 500 మార్కులు ఉండేవి. ఎంపీసీకి 470 మార్కులు, బైపీసీలో 440 మార్కులకు పరీక్షలు నిర్వహించేవారు. మ్యాథమెటిక్స్లో రెండు పేపర్లు 75 మార్కుల చొప్పున 150 మార్కులకు, సైన్స్ గ్రూప్లో సబ్జెక్టుకు 60 మార్కుల చొప్పున పేపర్లు ఉండేవి. రెండో ఏడాదిలో మ్యాథ్స్ మినహా మిగిలిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీలకు సబ్జెక్టుకు 30 మార్కుల చొప్పున ప్రాక్టికల్స్ మార్కులు కేటాయించేవారు. ఈ విద్యా సంవత్సరంలో ఆర్ట్స్ గ్రూపులు మినహా, సైన్స్ సబ్జెక్టులకు ప్రశ్నల సరళి, మార్కుల కేటాయింపులో మార్పులు చేశారు. మొదటి ఏడాది ఎంపీసీలో మొత్తం మార్కులు యథావిధిగా 470 మార్కులే ఉండగా, బైపీసీలో గతంలో 440 మార్కులు ఉండగా, కొత్త విధానంలో 455 మార్కులకు పెరిగాయి. -
బాబు కరకట్ట ప్యాలెస్ రోడ్డుకు భారీ హంగులు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ భవనం కరకట్ట ప్యాలెస్ రోడ్డుకు ప్రభుత్వం భారీ హంగులు కల్పిస్తోంది. రూ.5.55 కోట్లతో కొండవీటివాగు ఎత్తిపోతల పథకం నుంచి చంద్రబాబు నివాసం ఉంటున్న కృష్ణా కరకట్ట ప్యాలెస్, ఈ3 (సీడ్ యాక్సిస్ రోడ్డు)–ఎన్9 జంక్షన్ వరకు ప్రస్తుతం ఉన్న వీధి దీపాల స్తంభాలను తొలగించి, వాటి స్థానంలో కళాత్మకంగా తీర్చిదిద్దిన కొత్త స్తంభాలు, ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు పరిపాలన అనుమతిచ్చారు. ఆ పనులు చేపట్టడానికి అక్టోబర్ 10న రూ.4.27 కోట్ల అంచనా వ్యయంతో, నాలుగు నెలల్లో పూర్తి చేయాలనే షరతుతో సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ, కాంట్రాక్టర్ల నుంచి స్పందన లేకపోవడంతో ఆ టెండర్ను రద్దు చేసింది. తాజాగా ఈ పనులు చేపట్టేందుకు టెండర్ పిలవడానికి రూ.5.32 కోట్ల అంచనా వ్యయంతో నవంబర్ 29న సీఆర్డీఏ సీఈ సాంకేతిక అనుమతి ఇచ్చారు. దాంతో ఆ పనులకు రూ.4.27 కోట్ల అంచనా వ్యయంతో శనివారం రెండోసారి సీఆర్డీఏ నోటిఫికేషన్ జారీ చేసింది. టెండర్లలో బిడ్ల దాఖలుకు తుది గడువును ఈ నెల 17గా నిర్ణయించింది. అంటే.. కేవలం ఐదు రోజుల్లో టెండర్ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించడం గమనార్హం. స్వల్పకాలిక టెండర్కు కనీస వ్యవధి వారం రోజులు. కానీ.. ఈ టెండర్ను కేవలం ఐదు రోజుల్లోనే ముగించాలని నిర్ణయించడాన్ని బట్టి చూస్తే.. పనులను ఏ కాంట్రాక్టర్కు కట్టబెట్టాలన్నది ముందుగానే నిర్ణయించారన్నది స్పష్టమవుతోందని నిపుణులు చెబుతున్నారు. పాత విద్యుత్ స్తంభాలు, లైటింగ్ వ్యవస్థ బాగున్నప్పటికీ వాటిని తొలగించి కొత్తవి ఏర్పాటు చేస్తుండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. 18 నెలల్లో కరకట్ట అక్రమ ప్యాలెస్ మరమ్మతులకు రూ.4కోట్లకు పైగా ఖర్చు ఇక చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట అక్రమ ప్యాలెస్లో ప్రస్తుతం ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్ స్థానంలో కొత్త లైన్ వేయడానికి రూ.47 లక్షలు, 250 కేవీఏ జనరేటర్ స్థానంలో 320 కేవీఏ జనరేటర్ ఏర్పాటుకు రూ.60 లక్షలు... వెరసి రూ.1.07 కోట్లను మంజూరు చేశారు. కరకట్ట ప్యాలెస్ అత్యవసర మరమ్మతులకు రూ.2.16 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. మొత్తంమీద 18 నెలల్లోనే కరకట్ట ప్యాలెస్ మరమ్మతులకు రూ.4 కోట్లకుపైగా ఖర్చు చేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నారు. కృష్ణా నది కరకట్ట లోపల ఉండవల్లికి సమీపంలో లింగమనేని రమేష్ అక్రమంగా ఈ ప్యాలెస్ నిర్మించారు. ఆ ప్యాలెస్తోపాటు కరకట్ట లోపల నిర్మించినవన్నీ అక్రమ కట్టడాలేనని, వాటిని కూల్చివేస్తామని 2015లో అప్పటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నదిలో పడవపై తిరుగుతూ హంగామా చేశారు. ఆ తర్వాత తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన అప్పటి సీఎం చంద్రబాబు... ఆ కేసు భయంతో హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చి ఉండవల్లిలోని లింగమనేని రమేష్ అక్రమ కట్టడం(కరకట్ట ప్యాలెస్)లోకి మకాం మార్చారు. 2014–19 మధ్య కరకట్ట ప్యాలెస్తోపాటు హైదరాబాద్ జూబ్లిహిల్స్లోని నివాసం, మదీనగూడలోని ఫాంహౌస్లో వసతుల కల్పన, భద్రతకు ప్రభుత్వ ఖజానా నుంచి కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. ఇంకా ఖర్చు చేస్తూనే ఉన్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు ప్రత్యేక హెలీకాప్టర్, ప్రత్యేక విమానాల కోసం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.10.92 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.40.96 కోట్లు ఖర్చు చేసినట్లయ్యింది. చంద్రబాబు అధిక వడ్డీలకు తెచ్చిన అప్పులను సద్వినియోగం చేసుకోవాల్సిందిపోయి దుబారా చేస్తున్నారంటూ సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
15న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలను విజయవంతం చేయాలి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఈ నెల 15న జిల్లా కేంద్రాల్లో జరిగే ర్యాలీలను విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన ఆ పార్టీ అధికార ప్రతినిధులు, రాష్ట్ర కార్యదర్శులు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికారిక ప్రతినిధులు, జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షులు, అసెంబ్లీ అనుబంధ విభాగ అధ్యక్షులు. జనరల్ కార్పొరేషన్ చైర్పర్సన్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమ స్ఫూర్తితో కొనసాగిందన్నారు. ఇది ఇప్పుడు తుది అంకానికి చేరుకుందని.. లక్ష్యానికి మించి సంతకాల సేకరణ కార్యక్రమం కొనసాగిందని సజ్జల వివరించారు.‘‘గ్రామాలు, వార్డుల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ప్రజల మద్దతు కూడగట్టాం. ఇప్పటికే సంతకాలు చేసిన పత్రాలను నియోజకవర్గ కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు తరలించారు. ఈ మహాయజ్జంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలను వైఎస్ జగన్ ప్రత్యేకంగా అభినందించారు...వైద్య విద్యను అభ్యసించి, ప్రజలకు వైద్య సేవలు అందించాలనుకుంటున్న పేద విద్యార్థుల స్వప్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమాధి చేస్తోంది. ఈ దిశగా ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించేందుకు చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయంపై వైఎస్ జగన్ ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఆయన రూపొందించిన ఉద్యమాలకు ప్రజల నుంచి, పార్టీ శ్రేణుల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. ఇప్పటికే చలో మెడికల్ కాలేజీ ఉద్యమాన్ని నిర్వహించగా, దీనికి కొనసాగింపుగా నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది...గ్రామగ్రామాన, పట్టణాల్లోని డివిజన్లలోనూ కొద్ది రోజులుగా రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వలన కలిగే నష్టాలను ప్రజలకు వివరిస్తూ సంతకాలు సేకరించారు. ఇందులో భాగంగా కోటి సంతకాల సేకరణను ఉద్యమ స్ఫూర్తితో నిర్వహించారు. దీనికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. సంతకాల సేకరణలో వివిధ గ్రామాల నేతలు ఒకరితో మరొకరు పోటీ పడ్డారు. అందుకే ఒక్కో నియోజకవర్గంలో 50 వేల నుంచి 60 వేల సంతకాల సేకరించాలనేది పెద్ద లక్ష్యంగా కాకుండా అంతకుమించి సేకరించగలిగాం...పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా పార్టీలో అన్ని స్థాయిల నేతలతో పాటు అనుబంధ విభాగాల ప్రతినిధులు కూడా ఎక్కడికక్కడ రెట్టించిన ఉత్సాహంతో సంతకాల సేకరణ ముమ్మరంగా చేశారు. పట్టణాలు, నగరాల్లో అయితే డివిజన్లను క్లస్టర్లుగా విభజించి, పార్టీ నేతలంతా బాధ్యతలు పంచుకుని మరీ సంతకాల సేకరణ చేశారు. మీ అందరి కష్టం, శ్రమను వైఎస్ జగన్ ప్రత్యేకంగా అభినందించారు.ఇక కోటి సంతకాల కార్యక్రమం తుది దశకు చేరుకుంది. పార్టీ నాయకత్వమంతా కూడా ఈ నాలుగు రోజుల పాటు మీ ఫోకస్ అంతా దీనిపైనే ఉండాలి. ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలి. 15న జిల్లా కేంద్రం నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపే రోజు ర్యాలీలతో జిల్లా కేంద్రాలు హోరెత్తాలి. అనంతరం అక్కడి నుంచి కోటి సంతకాలు ఉన్న ప్రత్యేక వాహనాలను పార్టీ నాయకులు జెండా ఊపి ప్రారంభించాలి. 18 సాయంత్రం 4 గంటలకు గవర్నర్ను వైఎస్ జగన్, ముఖ్యమైన నాయకులు కలిసి అందజేస్తారు. ప్రతి ఒక్కరూ సొంత కార్యక్రమంలా భావించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా చర్చించుకునేంత స్ధాయిలో విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.టెలి కాన్ఫరెన్స్ చివరిలో పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఇంఛార్జ్ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా వైఎస్సార్సీపీ అలుపెరుగని పోరాటాలు చేస్తోందన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైయస్ఆర్సీపీని లేకుండా చేయాలన్న కూటమి కుట్రలను అధిగమిస్తూ యువత, ఉద్యోగులు, మహిళలు, కార్మికుల పక్షాన పోరాడుతున్నాం. వ్యవసాయం, విద్య, వైద్యం, వ్యాపారం.. ఏ వర్గానికి ఆపదొచ్చిన వారి పక్షాన నిలబడి వైఎస్సార్సీపీ గళమెత్తుతోంది. ఆయా వర్గాల సమస్యలను పరిష్కరించే దిశగా ఏడాదిన్నరగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై నినదిస్తూనే ఉన్నాం.అందులో భాగంగానే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణతో వైఎస్సార్సీపీ ఒక పెద్ద ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించింది. చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కాపాడుకునేందుకు వైఎస్సార్సీపీ తలపెట్టిన ఉద్యమానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి పెద్ద ఎత్తున మద్దతు పలికారు. చంద్రబాబు తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోటి మందికి పైగా ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే సంతకాలు చేశారు. ఇకనైనా చంద్రబాబు తన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలి. -
సంక్రాంతికి ఊరెళ్లేవారికి రైల్వే శాఖ గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగకు సొంతూరు వెళ్లేవారికి భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. రేపు(డిసెంబర్ 14, ఆదివారం) ఉదయం 8గంటల నుంచి అడ్వాన్స్ బుకింగ్ను ఓపెన్ చేయనుంది. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది.2026 జనవరి నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా.. ఏపీలోని ఇతర ప్రాంతాలకు, అలాగే ఇతర రాష్ట్రాలకు ఈ రైళ్లు నడపనున్నారు. ఈ ప్రత్యేక రైళ్లలో 1AC, 2AC, 3AC, స్లీపర్, జనరల్, సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయి.South Central Railway Advisory for #Sankranti Special Trains pic.twitter.com/fLaubRZiNC— SCRAILWAYUSERS (@scrailwayusers) December 13, 2025 -
‘టీడీపీకి బలముంటే మా కార్పొరేటర్లను కిడ్నాప్ చేయటం ఎందుకు?’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు రాజకీయాలన్నీ హోటల్స్లో రహస్యంగా జరుగుతాయని.. పైరవీలు, ప్రలోభాలన్నీ అక్కడే చేయిస్తుంటారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నెల్లూరు కార్పొరేషన్ వ్యవహారాన్ని కూడా పాండిచ్చేరిలో హోటల్కు చేర్చారన్నారు. నెల్లూరు 54 డివిజన్లలో మొత్తం వైఎస్సార్సీపీనే గెలుపొందిందని.. అలాంటి చోట ఏమాత్రం బలం లేకున్నా ఎలా గెలవాలని చూస్తున్నారు?’’ అంటూ నాగార్జున యాదవ్ ప్రశ్నించారు.‘‘మా పార్టీ బీఫామ్ మీద గెలిచిన వారిని టీడీపీ వైపు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని బెదిరింపులకు దిగారు. రాజ్యాంగబద్దంగా అవిశ్వాస తీర్మానం మీద ఎన్నిక జరిగితే వైఎస్సార్సీపీనే గెలుస్తుంది. కిడ్నాప్లు చేయటానికి ఖాకీలను వాడుకుంటున్నారు. పోలీసులు ఖాకీ క్యాబ్ సర్వీసులుగా మారారు. కొందరు పోలీసులు బిఎన్ఎస్ చట్టాలు అంటే 'బాబు అన్యాయ సంహిత' చట్టాలుగా మార్చారు’’ అంటూ నాగార్జున యాదవ్ దుయ్యబట్టారు.‘‘టీడీపీకి బలం ఉంటే మా కార్పొరేటర్లను కిడ్నాప్ చేయటం ఎందుకు?. అవిశ్వాస తీర్మానంలో టీడీపీ నైతికంగా ఆల్రెడీ ఓడిపోయింది. అధికార బలం ఎల్లవేళలా పని చేయదు. చంద్రబాబు అనైతిక రాజకీయాలకు ప్రజలు చెక్ పెట్టే రోజు వస్తుంది’’ అని నాగార్జున యాదవ్ పేర్కొన్నారు. -
బాబు మాట: అప్పుడలా.. ఇప్పుడిలా!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు భలే విచిత్రంగా ఉంటాయి. ఒకపక్క సూపర్సిక్స్ హామలు అమలు చేద్దామని ఉన్నా.. ఖజానా ఖాళీగా ఉందంటారు.. అడిగినా అప్పులివ్వడం లేదని, కేంద్రం ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం నడుచుకుంటూండటంతో కొత్త అప్పులు పుట్టడం లేదంటారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుందని బాధపడేదీ ఈయనే. అవునా? నిజమే కాబోలు అని అనుకునే లోపు అకస్మాత్తుగా ఆయనే ఓ ప్రెజెంటేషన్ ఇచ్చేస్తారు. ఏపీలో జీఎస్డీపీ భేష్ అంటారు. 11.28 వృద్ధి నమోదు చేశామంటారు. ఏడాదిన్నర కాలం కష్టపడి ఆర్థిక వ్యవస్థకు ఊపిరులూదాం అని తన భుజాలు తానే చరచుకుంటారు. ఎల్లోమీడియా ద్వారా వచ్చే సమాచారాన్ని చూసినప్పుడల్లా సామాన్యుడికి వచ్చే సందేహం.. ఇంతకీ ఏపీ దివాళా తీసిందా? అభివృద్ధిలో ముందుకు దూసుకెళుతోందా? ఒక్కటైతే నిజం... బాబుగారి రాజకీయ జీవితాన్ని గమనించిన వారందరూ అంగీకరించే విషయం ఏమిటంటే.. అదేదో పాత సామెత చందంగా ‘‘అవసరార్థం బహుకృత వేషం’’ వేయడంలో దిట్ట అని! పొంతన లేని, సత్యాసత్యాలతో సంబంధం లేని మాటలు కన్నార్పకుండా మాట్లాడగలరని. పోనీ.. ఇలా మాట్లాడితే అసలు వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకైనా మీడియా ఆయన్ను ప్రశ్నించాలని అనుకుంటాం కానీ.. ఎల్లోమీడియా ప్రజల పక్షాన పనిచేసి చాలాకాలమైంది. పైగా.. తనను ప్రశ్నించే మీడియాను చంద్రబాబు దూరంగా పెడుతున్నారు కూడా ఎవరైనా ప్రశ్నించినా దబాయించడం అలవాటు చేసుకున్నారు. 2019-2020, 2020-2021 మధ్య ఏపీలో వృద్ది రేటు పడిపోయిందని, జగన్ టైమ్లో జరిగిన విధ్వంసం అది అని చెప్పడానికి చంద్రబాబు యత్నించారు. కానీ అది కరోనా విజృంభించిన సమయం. ప్రపంచం మొత్తం ఆర్థిక వ్యవస్థ దాదాపు స్తంభించిన సందర్భం. ఈ సమయాన్ని సాధారణ సమయంతో ఎలా పోలుస్తారని విలేకరులెవరూ ప్రశ్నించలేకపోయారు. అప్పులు తీసుకుని ప్రభుత్వాలు నడపాలని కేంద్రం స్వయంగా అప్పట్లో ఆదేశించిన విషయాన్నీ కూడా ఆయన దాచేశారు. అంతేకాదు. జీఎస్డీపీ భేష్గా ఉందంటూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు అప్పుల గురించి చెప్పకుండా ఈ లెక్కలేమిటి అని ఎవరైనా అడిగారా? అలా అడిగినా వాటి గురించి తర్వాత మాట్లాడదాం అని ఉండవచ్చు. దాంతో మీడియా కూడా సరేలే మనకెందుకులే అని ఊరుకుని ఉండవచ్చు. జీఎస్డీపీ వృద్ధికి ఆయన చెప్పిన కారణాలు గమనించండి. ఆక్వా రంగానికి యూనిట్కు రూ.1.50లకే విద్యుత్ ఇచ్చామని అన్నారు. నిజానికి ఇది జగన్ టైమ్లో మొదలైంది. అమెరికా టారిఫ్ల వల్ల గడ్డు పరిస్థితి ఎదుర్కుంటోందన్నారు. కానీ దాన్ని వివరించనే లేదు. రోడ్లు,పోర్టులు,జలవనరులు రంగాలలో వ్యయం పెంచామన్నారు. నాలుగుసార్లు సీఎం అయిన చంద్రబాబు ఎన్నడూ ఒక ఓడరేవుకాని, ఫిషింగ్ హార్బర్ కాని నిర్మించిన పాపాన పోలేదు. జగన్ చేపట్టిన వాటిని తనవిగా కలరింగ్ ఇస్తే ఎలా? పోనీ అవైనా సక్రమంగా జరుగుతున్నాయా? అంటే.. అదీ లేదు. పంట ఉత్పత్తులు కొనుగోలు చేసి, రైతులను ఆదుకుంటున్నామని చంద్రబాబు చెప్పారు. కానీ అదే సమావేశంలో ప్రజలు తింటున్న పంటలనే పండించాలని, లేకుంటే వ్యాపారులు కొనరని, ప్రభుత్వం అన్ని పంటలను కొనుగోలు చేయలేదని తేల్చేశారు. మాట్లాడితే వరి వేయవద్దని చెబుతున్నారు. ఏపీలో అత్యధికులు తినేది వరి అన్నమే. బియ్యం తింటే మధుమేహం వస్తుందని మరొకటి వస్తుందని భయపెడుతున్నారు. బహుశా చంద్రబాబు ఎప్పుడో వరి అన్నం మానివేసి ఉండవచ్చు. అయినా ఆయనకు సుగర్ వ్యాధి ఉందా? లేదా? అన్నది కూడా వివరిస్తే బాగుండేది. జైలులో ఉన్నప్పుడు ఏ ఆనారోగ్యం చూపించి బెయిల్ పొందారు? దానికి కారణాలు కూడా చెబితే ప్రజలకు అర్థమవుతుంది కదా! ఇటీవలి కాలంలో దాదాపు అన్ని పంటల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారు. ధరల స్థీరికరణ నిధిని పెట్టి రైతులను ఆదుకోకుండా గాలికి వదలివేసి ఈ కబుర్లు చెబితే ఏమి లాభం? అంతేకాక రైతు భరోసా కింద ఏడాదికి రూ.20 వేల హామీని అరకొరగా అది కూడా రూ.ఐదువేలతో సరిపెట్టారాయె? రాష్ట్రానికి రూ.13.26 లక్షల కోట్ల పెట్టుబడులు, 16 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయని ఆయన తెలిపారు. ఒక్కోసారి ఒక్కో అంకె చెబుతూ ప్రజలను మభ్యపెట్టడానికే ఈ గణాంకాలు చెబుతుంటారు. ఈ సమ్మిట్ జరగడాదనికి ముందే రూ.పది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రచారం చేశారు కదా! వాటిలో ఈ ఏడాదిన్నరలో వచ్చిన పరిశ్రమలు ఏమిటో చెప్పాలి కదా! జగన్ టైమ్లో వచ్చిన కొన్ని పరిశ్రమలకు ప్రారంభోత్సవం చేయడం తప్ప , ఆ తర్వాత వచ్చిన పరిశ్రమలు పెద్దగా లేవు. ఒకేసారి అన్ని పరిశ్రమలు రావు. ఆ విషయం చెప్పవచ్చు. కాని అలాకాకుండా అవేవో రెడీమెడ్గా ఉన్నట్లు చెప్పే యత్నమే బాగోదు.పైగా 99 పైసలకు భూములను కట్టబెడుతూ, వేల కోట్ల రాయితీలు ఇస్తూ ప్రభుత్వంపై భారం మోపుతుంటే ఆదాయం ఎలా సమకూరుతుందో తెలియదు.విద్యార్ధుల,తల్లిదండ్రుల సమావేశం పెట్టామని చంద్రబాబు చెప్పడం విడ్డూరమే.దానికి, వృద్ది రేటుకు సంబంధం ఏమిటో తెలియదు.ఫీజ్ రీయింబర్స్ మెంట్ కింద 6700 కోట్ల బకాయిలు పెట్టి, విద్యారంగాన్ని అభివృద్ది చేస్తున్నామని చెబితే ప్రజల చెవిలో పూలు పెట్టినట్లవ్వదా! ఆరోగ్య రంగంలో మూడువేల కోట్ల బకాయిలు అలాగే ఉన్నాయా?లేదా? తాను సాధించిన వాటికంటే గత ప్రభుత్వంపై ఏవో ఆధారాలు చూపని ఆరోపణలు చేయడాన్ని నిత్యకృత్యంగా పెట్టుకున్నారు. భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టు పెట్టి గత ప్రభుత్వం అప్పులు తెచ్చిందని చంద్రబాబు అన్నారు. అది ఎంతవరకు నిజం అన్నది పక్కనబెడితే, కొద్ది నెలల క్రితం మైనింగ్ కార్పొరేషన్ ఆదాయాన్ని తనఖాగా పెట్టడమే కాకుండా, ఒకవేళ ప్రభుత్వం అప్పు వాయిదా సకాలంలో తీర్చకపోతే నేరుగా రిజర్వు బ్యాంక్లో ఉండే ట్రెజరీ ఖాతా నుంచి నేరుగా డబ్బు డ్రా చేసుకోవచ్చని ఒప్పందం అయింది చంద్రబాబు ప్రభుత్వం కాదా? సర్దుబాటు ఛార్జీల పేరిట వేల కోట్ల బాదుడు బాది, ఇప్పుడేమో రెండో ఏడాది విద్యుత్ ఛార్జీలు పెంచం అని చెబితే సరిపోతుందా? అదే టైమ్ లో మళ్లీ విద్యుత్ ఛార్జీలపై ఈర్డీసీకి ఎందుకు నివేదిక ఇచ్చారు? మరో సంగతి చెప్పాలి. తమ ప్రభుత్వానికి అప్పులు పుట్టడం లేదని నల్లజర్లలో చెప్పారు కదా? ఆ పాయింట్ పై ఈ ప్రజెంటేషన్లో ఎందుకు మాట్లాడలేదు. అప్పుడేమో ఆర్థిక పరిస్థితి ఏమీ బాగోలేదని, ఇప్పుడేమో అంతా బాగుందని చెప్పడానికి కారణాలు ఏమిటి? రాష్ట్రం దివాళా తీసిందన్న సంగతి దేశంలో అందరికి తెలిసిపోయేసరికి పరువు పోయిందని ఇప్పుడు సడన్గా ఈ ప్రజెంటేషన్ ఇచ్చారా? లేక అప్పులు ఇచ్చేవారు భయపడుతున్నారు కనుక మాట మార్చారా? పెట్టుబడులు పెట్టేవారు వెనక్కి తగ్గుతున్నారన్న భావనతో అంతా బాగానే ఉందని కలరింగ్ ఇవ్వ సంకల్పించారా? ఏడాదిన్నర కాలంలో రూ.2.60 లక్షల కోట్ల అప్పు చేసిన సంగతి దాచేసి, ఆల్ హాపీస్ అంటూ మభ్యపెట్టే ప్రకటనలు చేస్తే సరిపోతుందా?నిజంగా అంతా బాగుంటే సూపర్ సిక్స్లోని ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి,పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఒక్కో యువకుడికి పది లక్షల హామీ మొదలైనవాటిని నెరవేర్చి చూపవచ్చు కదా! జనం దగ్గరకు వెళ్లేమో బీద అరుపులు, మీడియా సమావేశంలో ప్రజెంటేషన్లో గొప్పల గప్పాలు చెప్పి ఎవరిని మభ్య పెట్టదలిచారు. ఈ నేపథ్యంలోనే ప్రజలను మోసం చేయడానికే సొంత లెక్కలతో చంద్రబాబు అంకెల గారడి చేస్తున్నారని, మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. వృద్ది రేటు, తలసరి ఆదాయం, అప్పుల పరిస్థితి అన్నిటి గురించి కాగ్ గణాంకాల ఆధారంగా వివరిస్తూ ఎందులో చూసినా తన పాలనతో పోల్చితే చంద్రబాబు ప్రభుత్వం తీసికట్టుగానే ఉందని జగన్ రుజువు చేశారు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రైతులను మళ్లీ నట్టేట ముంచిన చంద్రబాబు సర్కారు
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు ఈ ఏడాది ఖరీఫ్లో రైతులకు పంటల బీమా వర్తింపజేయకుండా నిండా ముంచేశారు. దీంతో పంటలు కోల్పోయిన రైతులకు బీమా రాలేదు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ సభ్యుడు పరిమళ్ నత్వానీ అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి రామ్నాథ్ ఠాకూర్ ఇచ్చిన సమాధానంలో ఈ విషయం స్పష్టం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 3.77 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయినట్లు రాష్ట్రం నుంచి నివేదిక అందినట్లు మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై) కింద రాష్ట్రంలో రైతులకు ఎటువంటి బీమా పరిహారం చెల్లించలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పీఎంఎఫ్బీవై కింద తన వాటాను చెల్లించలేదని తెలిపారు. పైగా ఈ ఏడాది ఖరీఫ్లో పీఎంఎఫ్బీవై–పునర్నిర్మించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద ఏపీలో కేవలం 5.3 లక్షలమంది రైతులు మాత్రమే నమోదైనట్లు చెప్పారు. ఈ నమోదైన రైతులకు కూడా ఎటువంటి బీమా క్లెయిమ్లను చెల్లించలేదని స్పష్టం చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతుల కోసం ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేసింది. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దుచేశారు. రైతులే తమ పంటలకు బీమా చేసుకోవాలనే ధోరణిలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించింది. దీంతో ఈ ఏడాది ఖరీఫ్లో రాష్ట్రంలో కేవలం 5.3 లక్షలమంది రైతులే బీమా కింద నమోదయ్యారు. అదే 2023–24లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఖరీఫ్లోనే ఏకంగా 30.09 లక్షలమంది రైతులకు చెందిన 50.63 లక్షల ఎకరాల్లోని పంటలకు బీమా సౌకర్యం కల్పించింది. చంద్రబాబు నిర్వాకం కారణంగా కేవలం 5.3 లక్షలమంది రైతులకే బీమా పరిమితం కాగా.. రాష్ట్ర ప్రభుత్వం బీమా ప్రీమియం వాటా చెల్లించకపోవడంతో వారి పంటలకు కేంద్ర బీమా పరిహారం చెల్లించలేదు. -
హార్బర్లోనూ ప్రైవేట్ పాగా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మత్స్యకారులు వేట కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లి ఇబ్బంది పడకూడదని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఫిషింగ్ హార్బర్లోనూ ప్రైవేట్ సంస్థ పాగా వేసేందుకు చంద్రబాబు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే వైఎస్ జగన్ నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పేరిట ప్రైవేట్కు కట్టబెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం... ఇప్పుడు షిప్యార్డ్ నిర్మాణం పేరిట ఫిషింగ్ హార్బర్లోకి సైతం ప్రైవేట్ సంస్థకు రెడ్కార్పెట్ వేసింది. మత్స్యకారుల పొట్ట కొట్టేందుకు రంగం సిద్ధం చేసింది. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో షిప్యార్డ్ ఏర్పాటు చేసేందుకు 29.58 ఎకరాలను సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ లిమిటెడ్కు కేటాయిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. చేపలవేట కోసం నిర్దేశించిన ఫిషింగ్ హార్బర్ల వద్ద షిప్యార్డు నిర్మిస్తే మత్స్య సంపదకు తీవ్ర విఘాతం ఏర్పడుతుందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. జగన్ నిర్మించారు.. చంద్రబాబు ప్రైవేట్కు ఇస్తున్నారురాష్ట్రంలోని మత్స్యకారుల కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టింది. తొలి దశలో రూ.1,522.8 కోట్లతో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేసింది. జువ్వలదిన్నె హార్బర్ను ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది ఆగస్టు 30న వర్చువల్గా ప్రారంభించారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం అప్పటి నుంచి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను మత్స్యకారులకు అందుబాటులోకి తీసుకురాలేదు. ఇప్పుడు అక్కడ షిప్యార్డ్ నిర్మించేందుకు సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ లిమిటెడ్ అనే ప్రైవేట్ సంస్థకు 29.58 ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 7.58 ఎకరాలు వాటర్ ఫ్రంట్ ల్యాండ్, 22 ఎకరాలు హార్బర్ ల్యాండ్ ఉందని పేర్కొన్నారు. ఇక్కడ సాగర్ డిఫెన్స్ సంస్థ ఆటానమస్ మారిటైమ్ షిప్యార్డ్, సిస్టమ్స్ సెంటర్ను అభివృద్ధి చేస్తుందని తెలిపారు. మార్కెట్ విలువలో 6 శాతం అద్దె చెల్లించే విధంగా ఈ భూమిని కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏటా 5 శాతం చొప్పున లీజు ధరను పెంచుతామని తెలిపారు. అదే 7.58 ఎకరాల వాటర్ ఫ్రంట్ ల్యాండ్పై 50 శాతం అదనపు ప్రీమియం విధిస్తామని, ఈ మేరకు ఏపీ మారిటైం బోర్డు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ఖాకీలా.. కిడ్నాపర్లా!
సాక్షి టాస్క్ఫోర్స్: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఖాకీలు అధికారిక కిరాయి గూండాల్లా, కిడ్నాపర్లుగా వ్యవహరిస్తున్నారు. ఖాకీ చొక్కాలు వదిలేసి పసుపు చొక్కాలు తొడిగేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల ఆదేశాలనే చట్టాలుగా మార్చేసి నెల్లూరు నవాబుపేట పోలీసులు రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ బీఫారంపై గెలిచిన కార్పొరేటర్లను టీడీపీ అధికారంలోకి రావడంతో బెదిరించి పచ్చ కండువా కప్పారు.అయితే ఆ పార్టీలో ఇమడలేక.. అధికార పార్టీని ఎదురించి తిరిగి సొంత గూటికి చేరేందుకు సిద్ధపడిన కార్పొరేటర్లపై మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ పోలీసులను పురమాయించి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆ కార్పొరేటర్లు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో తిరిగి సొంత గూటికి చేరుతున్నారనే సమాచారంతో మంత్రి, ఎమ్మెల్యే ఆదేశాలతో ఖాకీలు నెల్లూరు నుంచి తాడేపల్లికి చేరుకున్నారు.వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయం నుంచి వారు బయటకు రాగానే కిరాయి కిడ్నాపర్ల మాదిరిగా ప్రైవేట్ వాహనాలను అడ్డుపెట్టి, బలవంతంగా వారి వాహనంలో ఎక్కించుకుని వెళ్లారు. వారి వద్ద ఉన్న ఫోన్లను లాక్కొని, ఎక్కడికి తీసుకెళ్తున్నారో వారి కుటుంబ సభ్యులకు సైతం సమాచారం అందకుండా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని పోలీస్స్టేషన్లు తిప్పుతూ చిత్ర హింసలకు గురిచేశారు. చివరకు తాము టీడీపీలోనే కొనసాగుతున్నామంటూ వీడియోలు రిలీజ్ చేయించి, వారిని టీడీపీ నేతలకు అప్పగించి వచ్చారు. కేసుల పేరుతో అదుపులోకి..నెల్లూరు పోలీసుల ముందు ప్రొఫెషనల్ కిడ్నాపర్లు, గూండాలు కూడా దిగదుడుపేనని ఈ ఘటన రుజువు చేస్తోంది. అధికార పార్టీ నేతలు చెబితే పోలీసులు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీ నేతలను హింసించడంలో కిరాయి గూండాల్లా వ్యవహరిస్తున్నారు. ఎంపీపీలు, మున్సిపాలిటీ చైర్మన్లు, కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులను బెదిరించి, అధికార పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఓట్లు వేయించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలో మాట వినని వారిని కేసుల పేరుతో అదుపులోకి తీసుకోవడం.. గంజాయి కేసులు, నకిలీ మద్యం కేసులు పెడతామని బెదిరింపులకు గురిచేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.తాడేపల్లి నుంచి అదృశ్యంనెల్లూరు కార్పొరేషన్లోని మొత్తం 54 డివిజన్లలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీ ఒక్క డివిజన్లో కూడా గెలవలేదు. అయితే టీడీపీ అధికారంలోకి రాగానే కార్పొరేటర్లను భయపెట్టి, ప్రలోభాలకు గురిచేసి పచ్చ కండువాలు కప్పారు. అయినప్పటికీ వారు సాంకేతికంగా వైఎస్సార్సీపీ కార్పొరేటర్లుగానే చెలామణి అవుతున్నారు. ఈ క్రమంలో నెల్లూరు నగర మేయర్ పోట్లూరి స్రవంతిపై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమైంది. దీంతో వైఎస్సార్సీపీ బీఫారంతో గెలిచి టీడీపీలోకి జంప్ అయిన ఐదుగురు కార్పొరేటర్లు తాడేపల్లిలోని మాజీ సీఎం వైఎస్ జగన్మెహన్రెడ్డి సమక్షంలో తిరిగి గురువారం వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు.దీంతో మంత్రి నారాయణ ఆదేశాలతో నెల్లూరు నవాబుపేట పోలీసులు తాడేపల్లిలో వైఎస్ జగన్మెహన్రెడ్డి క్యాంప్ కార్యాలయం సమీపంలో మాటు వేసి.. నెల్లూరు 5వ డివిజన్ కార్పొరేటర్ ఓబిలి రవిచంద్ర, 6వ డివిజన్ కార్పొరేటర్ మస్తానమ్మ కుమారుడు శ్రీధర్ను అదుపులోకి తీసుకుని ప్రత్యేక వాహనంలో అదృశ్యమయ్యారు. రాత్రంతా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తిప్పుతూ వారిని మంత్రి నారాయణ అనుచరులు, వేమిరెడ్డి సోదరులకు అప్పగించారు. తద్వారా టీడీపీ నిర్వహిస్తున్న కార్పొరేటర్ల క్యాంప్లోకి తరలించే వరకు కీలక పాత్ర పోషించారు.కేసులు.. అరెస్ట్ అన్నారు.. తీరా టీడీపీ క్యాంప్నకు చేర్చారువైఎస్సార్సీపీకి చెందిన గిరిజన కార్పొరేటర్ రవిచంద్రతోపాటు మరో కార్పొరేటర్ తనయుడు శ్రీధర్ను అదుపులోకి తీసుకున్నది వాస్తమేనని నవాబుపేట పోలీసులు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి సమక్షంలో ఒప్పుకున్నారు. అదుపులో ఉన్న ఆ ఇద్దరిని చూపించాలని గురువారం రాత్రి పోలీస్స్టేషన్కు ఆ ఇద్దరు నేతలు చేరుకుని పోలీసులను ప్రశ్నించడంతో వారిపై కేసులు ఉన్నాయని, అరెస్ట్ చేశామని, శుక్రవారం కోర్టుకు హాజరు పరుస్తామని చెప్పారు. కానీ తెల్లారే సరికి పోలీసులు రూటు మార్చి, నోటీసు ఇచ్చి పంపేశామంటూ చెబుతున్నారు.నోటీసులు ఇచ్చే కేసులో వారిని తాడేపల్లికి వెళ్లి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని, గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం తెల్లారే వరకు రహస్యంగా ఉంచడం ఏమిటని, వారిని టీడీపీ క్యాంప్నకు అప్పగించడం ఏమిటని వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు నిలదీస్తున్నారు. కాగా, పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆ ఇద్దరిపై థర్డ్ డిగ్రీ ఉపయోగించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.అధికార పార్టీ నేతల క్యాంప్లోకి వెళ్లాలని తీవ్రంగా ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఓ కార్పొరేటర్ తనయుడు తన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుతూ పోలీసులతోపాటు అధికార పార్టీ నాయకులు కూడా తనపై చేయి చేసున్నారని.. మంత్రి నారాయణ, మరికొందరు పచ్చి బూతులు తిట్టారని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. పోలీసుల తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. -
2027 జూన్ 26 నుంచి గోదావరి పుష్కరాలు
సాక్షి, అమరావతి: ఈ విడత గోదావరి పుష్కరాలు 2027 జూన్ 26 నుంచి జూలై 7 తేదీల మధ్య 12 రోజులు జరపనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అస్థాన సిద్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ అభిప్రాయం మేరకు పరిశీలనల అనంతరం పుష్కరాల నిర్వహణకు తేదీలను ఖరారు చేస్తున్నట్టు దేవదాయశాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి హరిజవహర్లాల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
కోటి సంతకాల ఉద్యమానికి అనూహ్య స్పందన
సాక్షి, అమరావతి: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమానికి అన్ని నియోజకవర్గాల్లో ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని ఆ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. నియోజక వర్గాల్లో సేకరించిన సంతకాలను ఈ నెల 10న జిల్లా పార్టీ కార్యాలయాలకు తరలించే ప్రక్రియతో ప్రజల మనోగతం మరోసారి స్పష్టమైందన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులతో శుక్రవారం ఆయన జూమ్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు.ఎమ్మెల్యే/కో–ఆర్డినేటర్లు, పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్లు, సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్లు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్లు, పార్లమెంట్ పరిశీలకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు (కో ఆర్డినేషన్), ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యదర్శులు (పార్లమెంట్), జెడ్పీ చైర్పర్సన్లు, మేయర్లు, రాష్ట్ర అనుబంధ విభాగ అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, మండల పార్టీ అధ్యక్షులు, జెడ్పీ వైస్చైర్మన్లు , జెడ్పీటీసీలు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లతోపాటు కౌన్సిలర్లు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ... ఈ నెల 15న జిల్లా స్థాయిలో నిర్వహించే ర్యాలీలతో రాష్ట్రం హోరెత్తాలని, తద్వారా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరోసారి గళం విప్పాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అన్ని వర్గాలకు భాగస్వామ్యం కలి్పంచాలన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా సంతకాల సేకరణ చేపట్టిన పార్టీ శ్రేణులను పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రత్యేకంగా అభినందించారని చెప్పారు. చంద్రబాబు అప్రజాస్వామిక నిర్ణయాలకు ఇంతకుమించిన రెఫరెండం అక్కర్లేదన్నారు. ఈ నెల 18వ తేదీ సాయంత్రం వైఎస్ జగన్.. పార్టీ ముఖ్య నేతలతో కలిసి గవర్నర్కు సంతకాలను అందజేస్తారని వివరించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకునేలా మన పార్టీ ఒత్తిడి ఉండాలన్నారు. -
కిలోమీటర్కు రూ.180.35 కోట్లు
సాక్షి, అమరావతి: అమరావతిలో భవనాలు, రోడ్లు నిర్మాణ పనుల కాంట్రాక్టులను అడ్డగోలు వ్యయాలకు కట్టబెట్టడంలో సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ), ఏడీసీఎల్ (అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) తాము నెలకొల్పిన రికార్డులను తామే బద్దలుకొడుతున్నాయి. తాజాగా సీడ్ యాక్సిస్ (ఈ3) రోడ్డును ఎన్హెచ్–16 (కోల్కతా–చెన్నై జాతీయ రహదారి)తో అనుసంధానించే మూడో దశ పనులను కిలోమీటరుకు రూ.180.35 కోట్లకు అప్పగించేందుకు ఏడీసీఎల్కు చంద్రబాబు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ శుక్రవారం ఈ మేరకు జీవో ఆర్టీ నం.1471 జారీ చేసింది. » కొండవీటి వాగు నుంచి రైల్వే ట్రాక్పైన మణిపాల్ ఆస్పత్రి మీదుగా వారధి వరకు 3.5 కి.మీ. పొడవు (18.270 కి.మీ.–21.770 కి.మీ.), 60 మీటర్ల వెడల్పుతో ఆరు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రూ.511.84 కోట్ల కాంట్రాక్టు విలువతో అక్టోబర్ 27న ఏడీసీఎల్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. లంప్సమ్ విధానంలో రెండేళ్లలో పూర్తి చేయాలని నిర్దేశించింది. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ వంటి పన్నుల రూపంలో రూ.98.66 కోట్లను తిరిగి చెల్లిస్తామని (రీయింబర్స్) పేర్కొంది. దీంతో కాంట్రాక్టు విలువ రూ.610.5 కోట్లకు చేరుతుంది. » 2.464 కి.మీ. ఆర్వోబీ (రైల్వే ఓవర్ బ్రిడ్జి) ఎలివేటెడ్ కారిడార్... 99.6 మీటర్లు ఆర్వోబీ, రెండు అండర్ పాస్లు, ఒక ఇంటర్చేంజ్ (ట్రంపెట్), మైనర్ బ్రిడ్జి కమ్ పప్, 3 ర్యాంప్లు (విజయవాడ–అమరావతి 232 మీటర్లు, గుంటూరు–అమరావతి 280 మీటర్లు, విజయవాడ–అమరావతి 115 మీటర్లు) నిర్మించాలి. ఈ ప్రకారం కి.మీ. రోడ్డు, ఆర్వోబీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రూ.174.43 కోట్లను కాంట్రాక్టు విలువగా (రీయింబర్స్మెంట్ మినహా) నిర్ణయించినట్లు స్పష్టమవుతోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించినా..నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) దేశంలో అంతర్జాతీయ ప్రమాణాలతో జాతీయ రహదారులను నిరి్మస్తోంది. విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి (ఎన్హెచ్–65)లో అంతర్భాగంగా విజయవాడలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు అత్యద్భుత డిజైన్తో కనకదుర్గమ్మ ప్లైఓవర్ను 2.6 కి.మీ. మేర ఆరు వరుసలతో రూ.282.4 కోట్లతో 2020లో పూర్తి చేసింది. అంటే.. కిలోమీటరుకు వ్యయం రూ.108.61 కోట్లు. కోల్కతా–చెన్నై జాతీయ రహదారిలో అంతర్భాగంగా విజయవాడలో ట్రాఫిక్ సమస్య తీర్చేందుకు బెంజ్ సర్కిల్ వద్ద మూడు వరుసలతో 2020 నాటికి 2.35 కి.మీ. మొదటి ప్లైఓవర్ను రూ.80 కోట్లతో, 2.47 కి.మీ. రెండో ప్లైఓవర్ను మూడు వరుసలతో 2021లో రూ.88 కోట్లతో పూర్తి చేసింది. ఈ ప్రకారం ఆరు వరుసలతో ఎలివేటెడ్ ఫ్లైఓవర్ విధానంలో రహదారి నిర్మాణానికి కి.మీ.కు రూ.69.70 కోట్లను ఎన్హెచ్ఏఐ ఖర్చు చేసినట్లు స్పష్టమవుతోంది. కానీ, అచ్చం ఇదే పద్ధతిలో నిరి్మస్తున్న సీడ్ యాక్సిస్ రోడ్డును కాంట్రాక్టు సంస్థకు కి.మీ.కు రూ.180.35 కోట్ల చొప్పున అప్పగిస్తుండడం గమనార్హం. రివర్స్ టెండరింగ్ నిర్వహించి ఉంటే.. రాష్ట్రంలో 2014–19 మధ్య చంద్రబాబు సర్కార్ అంచనా వ్యయాలను పెంచేస్తూ.. అస్మదీయులకే పనులు దక్కేలా నిబంధనలతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేస్తూ అధిక ధరకు కాంట్రాక్టు పనులు కట్టబెట్టింది. ఖజానాను కొల్లగొడుతూ నీకింత నాకింత అంటూ పంచుకునేలా టెండర్ల వ్యవస్థను నీరుగార్చింది. కాగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చాక జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ విధానం, మొబిలైజేషన్ అడ్వాన్సు రద్దు వంటి విప్లవాత్మక సంస్కరణలతో టెండర్ల వ్యవస్థకు మళ్లీ జీవం పోసింది. అయితే, 2024లో చంద్రబాబు సర్కార్ వచ్చాక 2014–19 మధ్య తరహాలోనే అస్మదీయులకు అధిక ధరలకు పనులు కట్టబెట్టేందుకు జ్యుడీíÙయల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ను రద్దు చేసింది. మొబిలైజేషన్ అడ్వాన్సులను మళ్లీ తెచి్చంది. జ్యుడీíÙయల్ ప్రివ్యూ అమల్లో ఉంటే.. సీడ్ యాక్సిస్(ఈ3) రోడ్డును ఎన్హెచ్–16తో అనుసంధానించే పనుల కాంట్రాక్టు విలువపై ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, మేధావులు, సాధారణ ప్రజలు ఆన్లైన్లో ఆధారాలతో అభ్యంతరాలను లేవనెత్తే అవకాశం ఉండేది. వీటిని పరిగణనలోకి తీసుకుని కాంట్రాక్టు విలువను సవరించి టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలని జ్యుడీషియల్ ప్రివ్యూ జడ్జి ఆదేశించే వీలుండేది. రివర్స్ టెండరింగ్ అమల్లో ఉంటే... ఏడీసీఎల్ నిర్దేశించిన కాంట్రాక్టు విలువ కంటే కనీసం 9–10 శాతం తక్కువ ధరకే పనులు చేయడానికి ముందుకొచ్చేవారు. తద్వారా ఖజానాకు భారీఎత్తున ఆదా అయ్యేది. కానీ, చంద్రబాబు సర్కార్ ఆ విధానాలను రద్దు చేయడంతో సీడ్ యాక్సిస్ (ఈ3) రోడ్డును ఎన్హెచ్–16తో అనుసంధానించే పనుల కాంట్రాక్టు విలువ భారీగా ఉంది. రివర్స్ టెండరింగ్ రద్దుతో... 4.05 శాతం అధిక ధరకు రూ.532.57 కోట్లకు కోట్ చేసిన ఎన్సీసీ సంస్థ ఎల్–1గా నిలిచింది. దీనికే పనులు అప్పగించడానికి గురువారం కేబినెట్ ఆమోదం తెలిపింది. అనంతరం ఏడీసీఎల్కు అనుమతి ఇస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరకు పనులు కేటాయించడంతో ఖజానాపై అదనంగా రూ.20.73 కోట్లు భారం పడింది. సీడ్ యాక్సిస్ రోడ్డును ఎన్హెచ్–16తో అనుసంధానించే రహదారి పనుల కాంట్రాక్టు విలువ కి.మీ.కు రూ.180.35 కోట్లకు చేరింది. నిర్మాణం పూర్తయ్యేసరికి ఇంకెన్ని కోట్లకు చేరుతుందోనని ఇంజినీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇంజనీరింగ్ నిపుణుల విస్మయం జాతీయ రహదారుల నిర్మాణం.. కనకదుర్గమ్మ, బెంజ్ సర్కిల్ ప్లైఓవర్ నిర్మాణ వ్యయాలతో సీడ్ యాక్సిస్ రోడ్డును ఎన్హెచ్–16తో అనుసంధానం చేసే రహదారి పనుల కాంట్రాక్టు విలువను పోల్చిచూస్తూ ఇంజనీరింగ్ నిపుణులు నివ్వెరపోతున్నారు. నేషనల్ హైవేలు, అంతర్భాగమైన భారీ ప్లైఓవర్ల కాంట్రాక్టు విలువను ప్రస్తావిస్తూ... ‘‘సీడ్ యాక్సిస్ రోడ్డును తారు, కాంక్రీట్తో కాకుండా బంగారపు పూతతో వేస్తున్నారా?’’ అని ఇంజినీర్లు, జాతీయ రహదారుల నిర్మాణంలో అపార అనుభవం ఉన్న కాంట్రాక్టర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.నీకింత.. నాకింత పంచుకోవడానికేకాంట్రాక్టు విలువను భారీగా పెంచడం వెనుక... ఆ అంచనా వ్యయాన్ని కాంట్రాక్టర్తో కలిసి నీకింత నాకింత అంటూ ముఖ్య నేత, కాంట్రాక్టు సంస్తలు పంచుకుతినడానికేనని ఇంజనీరింగ్ నిపుణులు ఆరోపిస్తున్నారు. రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ (ఆసియా అభివృద్ధి బ్యాంకు), కేఎఫ్డబ్ల్యూ(జర్మనీ), హడ్కో వంటి అంతర్జాతీయ, జాతీయ ఆర్థిక సంస్థల నుంచి అధిక వడ్డీలకు అప్పుగా తెచ్చిన నిధులను దోచుకుతింటూ ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కదంతొక్కిన అంగన్వాడీలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు/సాక్షి నెట్వర్క్: తమకు వేతనాలు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలుచేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు శుక్రవారం రోడ్డెక్కారు. అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల ముందు పెద్దఎత్తున ధర్నాలు నిర్వహించారు. పలుచోట్ల కలెక్టరేట్లలోకి వెళ్లి అధికారులకు వినతిపత్రాలు ఇచ్చేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో అంగన్వాడీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది.అంగన్వాడీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ల వద్ద కూడా పెద్దఎత్తున ధర్నాలు చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ర్యాలీ నిర్వహించిన అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ధర్నా చౌక్, విజయవాడ ధర్నా చౌక్, నెల్లూరు కలెక్టరేట్ ప్రాంతాలు ధర్నాలతో దద్దరిల్లాయి. మెమొరీ ఎక్కువగా ఉండే 5జీ ఫోన్లు ఇవ్వాలని, 164 సూపర్వైజర్ పోస్టులు భర్తీచేయాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవులు ఇవ్వాలని, అన్ని యాప్లను కలిపి ఒక యాప్గా మార్చాలని, ఎఫ్ఆర్ఎస్ రద్దుచేయాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు.ఒంగోలులోనూ మహాధర్నా నిర్వహించారు. మార్కాపురం సబ్కలెక్టర్ కార్యాలయం అంగన్వాడీలు నిరసన తెలిపారు. పెరిగిన ధరలకు అనుగుణంగా తక్షణం రూ.26 వేల కనీస వేతనం చెల్లించాలని, యాప్ల పేరుతో పెంచిన పనిభారం తగ్గించాలని, ఇతర సమస్యలు వెంటనే పరిష్కరించాలని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయం, కాకినాడ కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ టీచర్లు, ఆయాలు డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ కూడా తమను పట్టించుకోవడంలేదని ఆరోపించారు. కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోనూ ఆందోళన చేశారు. రెండేళ్లకోసారి వేతనాలు పెంచాల్సి ఉండగా, ఐదేళ్లు దాటినా పెంచకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.భారీ ర్యాలీ.. మహా ధర్నా..ఏలూరులో అంగన్వాడీలు భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద మహా ధర్నా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. అంగన్వాడీలకు మే నెల పూర్తిగా వేసవి సెలవులు ఇవ్వాలని, రెండో శనివారం సెలవు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని నాయకులు కోరారు. ధర్నా అనంతరం డీఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. ఇక తమ సమస్యలు పరిష్కరించని పక్షంలో సమ్మె చేసేందుకూ సిద్ధమని విశాఖలో ఆందోళనకారులు హెచ్చరించారు. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోనూ భారీ ర్యాలీలు నిర్వహించారు.1,500 మందితో భారీ ర్యాలీ..శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 1,500 మంది భారీ ర్యాలీ చేశారు. అక్కడ అధికారి అందుబాటులో లేకపోవడంతో దాదాపు రెండు గంటల పాటు బైఠాయించారు. కలెక్టరేట్కు వెళ్లాలని ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇక లేబర్ కోడ్స్ రద్దుచేయాలని, పెండింగ్లో ఉన్న 1,810 మినీ వర్కర్లకు క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ ఇచ్చి మెయిన్ సెంటర్లుగా మార్చాలని వైఎస్సార్ జిల్లా కడపలో అంగన్వాడీలు డిమాండ్ చేశారు. హెల్పర్ల పదోన్నతులకు, గ్రాట్యుటీ అమలుకు మార్గదర్శకాలు రూపొందించాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలన్నారు. ప్రీ స్కూలు బలోపేతం చేయాలని, పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని అమలుచేయాలని, సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలని కోరారు. అనంతపురం కలెక్టరేట్ ఎదుట కూడా అంగన్వాడీలు ధర్నాచేసి కలెక్టర్కు వినతిపత్రాన్ని అందజేశారు.అలాగే, అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోనూ వీరు కదం తొక్కారు. గుజరాత్ హైకోర్టు తీర్పు ప్రకారం వర్కర్లను నాల్గవ తరగతి ఉద్యోగులుగా.. హెల్పర్లను మూడో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. జనాభాకు అనుగుణంగా కొత్త అంగన్వాడీ సెంటర్లు తీసుకురావాలన్నారు. ప్రతీనెలా 5 నుంచి 7 వరకు సమావేశాలకు పిలుస్తున్నారని.. టీఏ, డీఏలు కూడా ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. పెండింగ్ జీతాలు, బిల్లులు సకాలంలో ఇవ్వాలని కోరారు. మరోవైపు.. కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి కలెక్టరేట్లను కూడా అంగన్వాడీలు ముట్టడించారు. చంద్రబాబు అధికారంలో ఉంటే ఒకలా, లేకపోతే ఒకలా ఉంటారని మండిపడ్డారు. ఇది చంద్రబాబు ప్రభుత్వానికి మొదటి ప్రమాద హెచ్చరిక అని, తమ సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. వసతుల్లేని అద్దె భవనాల్లో పాఠశాలల నిర్వహణ కష్టంగా ఉందన్నారు. -
రాజధాని కోసం మరో.7,387.70 కోట్లు అప్పు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి కోసం చంద్రబాబు సర్కారు చేస్తున్న అప్పులు ‘ఇంతింతై వటుడింతై..’ అన్నట్లు పెరిగిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీతో రాజధాని కోసం మరో రూ.7,387.70 కోట్లు అప్పు చేస్తున్నారు. నాబార్డు నుంచి ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(ఏపీ సీఆర్డీఏ) తీసుకునే రూ.7,387.70 కోట్ల అప్పునకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.సీఆర్డీఏ రుణ సంస్థకు అప్పు చెల్లించడంలో విఫలమైనప్పుడు ప్రభుత్వ హామీ అమలులోకి వస్తుంది. ఈ మేరకు ఆరి్థక శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వ హామీ, లెటర్ ఆఫ్ కంఫర్ట్ పొందేందుకు అనుమతించింది. హామీ ఇచి్చన మొత్తంపై 5 శాతం గ్యారెంటీ ఫీజును సీఆర్డీఏ చెల్లించాలి. ఇందుకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా సీఆర్డీఏ కమిషనర్కు ప్రభుత్వం సూచించింది. దీంతో రాజధాని కోసం చేసిన మొత్తం అప్పులు రూ.47,387.70 కోట్లకు చేరాయి. సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటూ చంద్రబాబు ప్రచారం... రాజధాని అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా పలుమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అయితే అందుకు పూర్తి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీతో రాజధాని కోసం భారీగా అప్పులు తెస్తున్నారు. మరోపక్క బడ్జెట్ నుంచి నిధులు కూడా విడుదల చేస్తున్నారు. అప్పులు తేవడంతోపాటు బడ్జెట్ నుంచి నిధులు విడుదల చేస్తున్నప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ ఎలా అవుతుందో సీఎం చంద్రబాబుకే తెలియాలని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
ఆగని అప్పుల పరుగు.. బాబు గారి లిక్కర్ బాండ్లు
సాక్షి, అమరావతి: ఎడాపెడా అప్పులు చేయడంలో ఎన్నో డిగ్రీలు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొత్త అప్పుల కోసం కొత్త దారులు వెతుకుతున్నారు. రాష్ట్రంలో మద్యాన్ని ఏరులుగా పారిస్తున్న చంద్రబాబు సర్కార్... ఇప్పుడు రాబోయే మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరో భారీ అప్పు చేసింది. మద్యం ఆదాయాన్ని తాకట్టు పెడుతూ ఎక్సైజ్ బాండ్ల ద్వారా ఏకంగా రూ.5,490 కోట్ల అప్పు సేకరించింది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా ఈ బాండ్ల సేకరణ జరిగింది. అది కూడా 9.15శాతం భారీ వడ్డీకి ఈ అప్పు చేయడం గమనార్హం. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం ఈ 18 నెలల్లో చేసిన అప్పులు రూ.2,66,175 కోట్లకు (ఇప్పటికే ప్రభుత్వం చేసిన అప్పులు, కొత్తగా చేయడానికి అనుమతించిన అప్పులతో కలిపి) చేరుకున్నాయి. ప్రభుత్వ గ్యారెంటీతో రాజధాని కోసం మరో రూ.7,387.70 కోట్లు అప్పు చేస్తున్నట్లు శుక్రవారం పొద్దుపోయిన తర్వాత వెల్లడించారు. ఇవన్నీ సరిపోవన్నట్లు మళ్లీ చంద్రబాబు పదేపదే అప్పులకు అర్రులు చాస్తుండడం చూసి అందరూ నివ్వెరపోతున్నారు. ఈ 18 నెలల్లోనే వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పులో 80శాతాన్ని చంద్రబాబు ప్రభుత్వం దాటేసిందంటే పరిస్థితి ఏ మేరకు దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. తక్కువ వడ్డీకి తక్కువ అప్పులు చేస్తేనే వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రం దివాళా తీస్తోందని, శ్రీలంక అయిపోతోందని పెడ»ొబ్బలు పెట్టిన ఎల్లో మీడియా ఇప్పుడు అధిక వడ్డీలకు చంద్రబాబు లక్షల కోట్లు అప్పులు చేస్తుంటే రాష్ట్రం ఏమౌతుందని శ్రీలంక అవుతున్నట్లా.. లేక సౌత్ సూడాన్ అవుతున్నట్లా.. అని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు.అధిక వడ్డీతో రూ.5,490 కోట్ల రుణం రాష్ట్రంలో మద్యం విక్రయాల ద్వారా వచ్చే రాబడిని హామీగా చూపిస్తూ భారీ రుణ సేకరణకు చంద్రబాబు సిద్ధమయ్యారు. ఎక్సైజ్ శాఖ బాండ్లను జారీ చేయడం ద్వారా రూ.5,490 కోట్ల అప్పు చేశారు. అది కూడా త్రైమాసికానికి అత్యధికంగా 9.15శాతం వడ్డీతో బాండ్లు జారీ చేయాలని నిర్ణయించారు. గుట్టుచప్పుడు కాకుండా ఈ భారీ రుణం సేకరించారు. 9.15శాతం వడ్డీ రేటుతో బాండ్లను జారీ చేసి రుణాన్ని సేకరిస్తున్నారన్న విషయం బయటకు పొక్కితే ఆరి్థక నిపుణులు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తారన్న కారణంవల్లే దీనిని గోప్యంగా ఉంచారు. ఎంత తాగిస్తే.. అన్ని అప్పులు.. ‘మద్యం అమ్మకాలు పెంచండి.. ఈ ఏడాది రూ.35వేల కోట్ల రాబడి తేవాలి..’ అని సీఎం చంద్రబాబు ఇటీవల ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. ఊరూవాడా బెల్టు షాపులు పెరిగిపోతున్నా, ఎక్కడబడితే అక్కడ పర్మిట్ రూమ్లు కనిపిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం కిమ్మనడం లేదు. వీటి వెనక ఉన్న మర్మం ఇపుడు అందరికీ బోధపడింది. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఎంతగా పెరిగితే తమకు అంత సంతోషం అన్నట్టుగా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు విధానం. ఎందుకంటే మద్యం విక్రయాలపై పన్నుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి భవిష్యత్లో రాబోయే ఆదాయాన్ని తాకట్టు పెట్టి రూ. 5,490 కోట్ల రుణం సేకరించారు. దీనినిబట్టి రాబోయే రోజుల్లో అనివార్యంగా మద్యం ఆదాయాన్ని భారీగా పెంచాల్సి ఉంటుంది. 2024–25లో మద్యం విక్రయాల ద్వారా రూ.24వేల కోట్ల రాబడి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025–26లో మద్యం విక్రయాల ద్వారా పన్నుల ఆదాయం రూ.35 వేల కోట్లకు చేర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. తరువాత ఏడాది మరింతగా అంటే రూ.50వేల కోట్లకు చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. అంటే ప్రస్తుత మద్యం విక్రయాలను ఏకంగా 100శాతం పెంచాలన్నది ప్రభుత్వ విధానమని స్పష్టమవుతోంది. ఎంతగా మద్యం తాగిస్తే...తాము అంతగా అప్పులు చేయడానికి వీలౌతుంది అన్నట్లుగా ఉంది చంద్రబాబు ప్రభుత్వ తీరు. నిబంధనలకు విరుద్ధంగా.. అధికవడ్డీకి... ఎక్సైజ్ బాండ్ల ద్వారా రుణ సేకరణ కోసం చంద్రబాబు ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ఎఫ్ఆర్బీఎం పరిమితి ఎప్పుడో దాటిపోయింది. అయినా సరే ఎక్సైజ్ బాండ్ల ద్వారా రూ.5,490 కోట్ల రుణం తీసుకుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏకంగా 9.15శాతం చొప్పున అత్యధిక వడ్డీకి కూడా వెనకాడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని నిపుణులంటున్నారు. ఎందుకంటే ఎఫ్ఆర్బీఎం పరిధిలో ఎస్డీఎల్ (స్టేట్ డెవలప్మెంట్ లోన్స్) రూపంలో రుణసేకరణ జరిగితే అందుకు వర్తించే వడ్డీ భారం 6.5 శాతం లోపే ఉంటుంది. కానీ అత్యధిక వడ్డీ రేట్లతో ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తుండటం సందేహాస్పదంగా ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో పూర్తిగా కూరుకుపోయి ఆర్థికంగా దివాళా తీస్తుందని అంటున్నారు. నాడు తక్కువ వడ్డీకి తక్కువ అప్పులు చేస్తున్నా శ్రీలంక అయిపోతుందని విమర్శించిన ఎల్లో మీడియా ఇప్పుడు చంద్రబాబు ఎక్కువ వడ్డీకి ఎక్కువ అప్పులు చేస్తుండడాన్ని ఎలా సమర్థించుకుంటారని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.నాడు తీవ్ర స్థాయిలో దుష్ప్రచారంనాడు వైఎస్ జగన్ హయాంలో మద్యం ఆదాయంపై రుణాలు చేయడాన్ని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రభుత్వానికి రుణం ఇవ్వవద్దని జాతీయ బ్యాంకులు, స్టాక్ ఎక్సేంజ్లకు ఫిర్యాదు చేసింది. రాష్ట్రం శ్రీలంక అయిపోతోందని చంద్రబాబు తమ అనుకూల ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం చేయించారు. భవిష్యత్ ఆదాయాన్ని తాకట్టు పెట్టేస్తున్నారంటూ గగ్గోలు పెట్టారు. ఎన్నికల ప్రచారాస్త్రంగానూ వాడుకున్నారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు శ్వేతపత్రాల విడుదల పేరుతో హైడ్రామా సృష్టించి అవే ఆరోపణలు చేశారు. ఇప్పుడు బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట ఇష్టానుసారం అప్పులు చేస్తున్నప్పటికీ సూపర్ సిక్స్, సూపర్ సెవన్లకు ఎగనామం పెట్టేశారు.బాబుగారి అప్పులు చూస్తే.. శ్రీలంక కాదు సౌత్ సూడానే.. 2019–24 మధ్య ఐదేళ్ల కాలంలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.3,32,671 కోట్లు కాగా, చంద్రబాబు ప్రభుత్వం ఈ 18 నెలల కాలంలో చేసిన అప్పులు రూ.2,66,175 కోట్లు. అంటే జగన్ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో చేసిన అప్పుల్లో 80శాతం అప్పులు ఈ 18 నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం చేసేసిందన్నమాట. రానున్న 42 నెలల్లో ఈ లెక్కన అప్పులు చేసుకుంటూ పోతే... శ్రీలంక సంగతి దేవుడెరుగు.. ప్రపంచంలోనే అత్యంత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సౌత్సూడాన్ కన్నా ఆంధ్రప్రదేశ్ దిగజారిపోవడం ఖాయమని ఆరి్థక నిపుణులంటున్నారు. అప్పుల వేగంలో బాబుగారికి సరిలేరెవ్వరూ.. రాష్ట్ర విభజన నాటికి ప్రభుత్వ అప్పులు, ప్రభుత్వ గ్యారెంటీ అప్పులు, ప్రభుత్వ రంగ సంస్థల అప్పులు అన్నీ కలుపుకుంటే రూ.1,40,717 కోట్లుగా ఉన్నాయి. ఆ అప్పులు కాస్తా 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి రూ. 3,90,247 కోట్లకు ఎగబాకాయి. దానర్థం చంద్రబాబు హయాంలో చేసిన అప్పులు రూ. 2,49,350 కోట్లు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పుల కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (సీఏజీఆర్) 22.63శాతంగా ఉంది. అదే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యేనాటికి రూ. 3,90,247 కోట్లు ఉన్న అప్పులు ఐదేళ్ల కాలంలో రూ. 7,21,918 కోట్లకు చేరుకున్నాయి. అంటే ఐదేళ్ల కాలంలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ. 3,32,671 కోట్లు. అప్పుల సీఏజీఆర్ 13.57 శాతం మాత్రమే కావడం గమనార్హం. కానీ చంద్రబాబు సీఏజీఆర్ మాత్రం 22.63శాతంగాఉంది. 2014–19లో అధిక వడ్డీలకు అధిక అప్పులతో సంచలనం సృష్టించిన చంద్రబాబు ఇపుడు జగన్ ఐదేళ్లలో చేసిన అప్పులలో 80శాతం అప్పులను ఈ 18 నెలల కాలంలోనే అధిగమించి రాష్ట్రాన్ని సౌత్ సూడాన్ దిశగా నడిపిస్తుండడం ఆందోళనకరమని ఆరి్థక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్ర విభజన నాటి నుంచి 2024 మార్చి 31 వరకు అప్పుల వివరాలు ఇవీ...కాగ్, రాష్ట్ర బడ్జెట్ కాపీలు వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్ర విభజన నాటికి ఉన్న అప్పు 1,40,717 కోట్లు కాగా, 2014 నుంచి 2019 మార్చి 31వరకు ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం రూ.2,49,350 కోట్లు అప్పు చేసింది. ఆ ఐదేళ్లలో పెరిగిన అప్పులు 22.63 శాతం. అదే జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పు రూ.3,32,671 కోట్లు కాగా, పెరిగిన అప్పు కేవలం 13.57 శాతమే. -
అమరావతి కోసం మళ్ళీ భారీ అప్పు
విజయవాడ అమరావతి కోసం మళ్లీ అప్పు చేయడానికి సిద్ధమైంది చంద్రబాబు ప్రభుత్వం. నాబార్డ్ ద్వారా రూ. 7,387 కోట్లు అప్పు చేసింది. APCRDAకి నాబార్డ్ రుణం రూ.7,387.70 కోట్లు పొందేందుకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది. అమరావతి కోసం ఇప్పటికే 40 వేల కోట్లకు పైగా అప్పు తెచ్చిన ప్రభుత్వం.. తాజాగా మరో అప్పుకు సిద్ధమైంది. తాజా రుణంతో కలిసి అమరావతి కోసం చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అప్పు రూ. 47 వేల కోట్లను దాటనుంది. -
చంద్రబాబూ.. దమ్ముంటే నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకో: మనోహర్రెడ్డి
సాక్షి, తాడేపల్లి: మొలకలు చెరువు, ఇబ్రహీంపట్నంలో బయటపడ్డ కల్తీ మద్యం కుంభకోణం ఈ దేశంలోనే పెద్దదని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్రెడ్డి అన్నారు. మొలకలచెరువు ఎక్సైజ్ పోలీసు స్టేషన్కి మూడు కిలోమీటర్ల దూరంలోనే కల్తీ మద్యం తయారీ చేశారని.. స్థానిక జనం కనిపెట్టి పోలీసులకు చెప్తే తప్ప పోలీసులు స్పందించలేదని మనోహర్రెడ్డి మండిపడ్డారు.‘‘కూటమి అధికారంలోకి రాగానే ప్రైవేట్కు మద్యం దుకాణాలు కట్టబెట్టి.. ఇష్టానుసారంగా వ్యాపారాలు చేస్తున్నారు. టీడీపీ అధినాయకత్వంతో కుమ్మక్కై అక్రమ మద్యం కుటీరాలు ఏర్పాటు చేశారు. 3వ తేదీన కుంభకోణం బయటపడితే 10న అద్దేపల్లి జనార్ధన్ను అరెస్ట్ చేశారు. ఆ తరువాత కూటమి నేతలకు భయం పుట్టింది. అందుకే ఇష్యూని డైవర్ట్ చేయటానికి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే జోగి రమేష్ని అరెస్ట్ చేశారు. జయచంద్రారెడ్డికి తాము సన్నిహితులమని నేరస్తులు చెప్పారు. తంబళ్లపల్లిలో డంప్ని కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. జోగి రమేష్కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా దుష్ప్రచారం చేశారు...ఐవీఆర్ఎస్ కాల్స్తో విష ప్రచారం చేశారు. జయచంద్రారెడ్డి చెప్పినట్లు అంత చేశామని నిందితులే చెప్పారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎక్కడెక్కడ కల్తీ మద్యం తయారు అయ్యిందో? ఎవరెవరు ఉన్నారో? ఎక్కడెక్కడ సరఫరా చేశారో? విచారణ జరపాలి. కానీ కేసు విచారణ అలా ఎందుకు జరగటం లేదు?. జయచంద్రారెడ్డిని రాష్ట్రానికి రప్పించి కేసును పక్కన పెట్టాలని చూస్తున్నారు. తప్పుడు లెక్కలు చెపుతూ ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోంది...ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు ఉన్నాయి. కానీ 1600 అని లెక్కలు చెపుతున్నారు. 2014-19 మధ్య జరిగిన మద్యం కుంభకోణంపై విచారణ చేయించి.. ఛార్జ్షీట్లు వేస్తే.. సిగ్గు లేకుండా విత్ డ్రా చేస్తున్నారు. అధికారులను బెదిరిస్తున్నారు. నేను నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు విచారణను ఎందుకు ఎదుర్కోరు?. నిసిగ్గుగా కేసులు విత్ డ్రా చేయించునే చంద్రబాబు లాంటి వ్యక్తి ప్రపంచంలో ఉండరు. ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెడతారు...టీడీపీ వాళ్ళను ఎలా రక్షించుకోవాలనే మాత్రమే పని చూస్తున్నారు. వ్యవస్థలను దిగజార్చటంపై చంద్రబాబు సమాధానం చెప్పాలి. చంద్రబాబుకు వ్యవస్థలపై నమ్మకం ఉంటే.. మద్యం కుంభకోణంపై స్వతంత్ర ఆడిట్ చేయించండి. ఏ బెల్ట్ షాప్కు ఏ స్పిరిట్ లిక్కర్ వెళ్లిందో తేల్చాలి. చంద్రబాబుకు దమ్ముంటే కేసును ఎదుర్కోని నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. జయచంద్రారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలి. దర్యాప్తును నిష్పక్షపాతంగా పూర్తి చేయాలి’’ అని మనోహర్రెడ్డి డిమాండ్ చేశారు. -
‘చంద్రబాబు ప్రభుత్వంలో మాటలు తప్ప.. చేతలు లేవు’
సాక్షి, తాడేపల్లి: కూటమి పాలనలో విద్యారంగం సర్వనాశనం అయ్యిందని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సరైన స్కూల్ బ్యాగులు అందించటం చేతగాని మంత్రి నారా లోకేష్ అంటూ దుయ్యబట్టారు. విద్యార్థులకు సరైన బ్యాగులు, బూట్లు ఇవ్వటం చేతగాని వ్యక్తి లోకేష్. తన పదవికి రాజీనామా చేయాలంటూ రవిచంద్ర డిమాండ్ చేశారు.‘‘పాఠశాలల్లో జరుగుతున్న అవినీతిని అరికట్టాలి. మూడు దశల్లో తనిఖీలు చేసి బ్యాగులు ఇచ్చామన్న లోకేష్ ఒకసారి ఆ బ్యాగులను చూసి మాట్లాడాలి. కూటమి ప్రభుత్వంలో మాటలు తప్ప చేతలు లేవు. కమీషన్ల కోసం కక్కుర్తి పడి నాసిరకం బ్యాగులు అందించారు. నారా లోకేష్ చెప్పిన మాటలకు, విద్యార్థులకు ఇచ్చిన బ్యాగులకు చాలా తేడా ఉంది. రూ.953 కోట్లు ఖర్చు చేశామనే పేరుతో పెద్ద ఎత్తున అవినీతి చేశారు. జగన్ హయాంలో అత్యంత నాణ్యమైన బ్యాగులు అందించారు. జగన్ హయాంలో ఇచ్చిన బ్యాగులనే ఇప్పటికే విద్యార్థులు వాడుతున్నారు. మూడు దశల్లో తనిఖీ చేశామని చెప్పిన లోకేష్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? అంటూ రవిచంద్ర ప్రశ్నించారు.‘‘ఒక్కో బ్యాగు మీద రూ.2,270లు ఖర్చు చేసి ఇలాంటి నాసిరకం అందిస్తారా?. పిల్లలకు సరైన బూట్లు కూడా అందించలేని ప్రభుత్వం ఇది. నాడు-నేడు కింద జగన్ స్కూళ్లు బాగు చేశారు. ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెట్టారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక విద్యారంగాన్ని ధ్వంసం చేశారు. సరైన బ్యాగులనే పంపిణీ చేయలేని చేతగాని మంత్రి లోకేష్’’ అంటూ రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘కేసులను ఎదుర్కోలేని పిరికిపంద చంద్రబాబు’
సాక్షి, తాడేపల్లి: కేసులను ఎదుర్కోలేని పిరికిపంద చంద్రబాబు అంటూ వైఎస్సార్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్రెడ్డి మండిపడ్డారు. అధికారులను బెదిరించి తన మీద కేసులను క్లోజ్ చేయించుకుంటున్నారంటూ దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసులు క్లోజ్పై తాము న్యాయ పోరాటం చేస్తామన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన మీద ఉన్న కేసులను క్లోజ్ చేసుకోవటం సరికాదని గౌతమ్రెడ్డి అన్నారు.‘‘చంద్రబాబు వ్యవహారం దొంగే.. దొంగా దొంగా అన్నట్టుగా ఉంది. సుప్రీంకోర్టు డైరెక్షన్ను కూడా ఉల్లంఘించారు. ఫైబర్ నెట్ కేసును ఇప్పుడు క్లోజ్ చేయించుకున్నారు. సీఐడీ చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతోంది. అవినీతి చేసినట్టు ఆధారాలు ఉన్నా సీఐడీ ఎందుకు కేసును వదిలేసింది?. జగన్ హయాంలో పూర్తయిన కేసులను కూడా రీఓపెన్ చేశారు. చంద్రబాబే స్వయంగా సంతకాలు చేసి దొరికిన కేసులను మాత్రం క్లోజ్ చేశారు’’ అంటూ గౌతమ్రెడ్డి నిలదీశారు.‘‘ఫైబర్ నెట్లో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు. వేమూరి హరిప్రసాద్ కోసం చంద్రబాబు నిబంధనలను తుంగలో తొక్కారు. వందల కోట్లు కైంకర్యం చేయటానికి చంద్రబాబు నాటకాలు ఆడారు. చంద్రబాబు నేరాల మీద నేరాలు చేశారు. ఆర్థిక అరాచకం చేసిన చంద్రబాబు తన మీద ఉన్న కేసులను ఎలా క్లోజ్ చేస్తారు?. దీనిపై మేము ప్రొటెక్షన్ పిటిషన్ని హైకోర్టులో వేస్తాం. బ్లాక్ లిస్టులో ఉన్న మనిషిని పిలిచి అందలం ఎక్కించారా లేదా?’’ అంటూ గౌతమ్రెడ్డి ధ్వజమెత్తారు.ఈవీఎంల విషయంలో వేమూరి హరిప్రసాద్కు కోర్టు శిక్ష వేసింది. అలాంటి వ్యక్తిని ఫైబర్ నెట్లోకి ఎలా తెచ్చారు?. 105 రకాల నాసిరకం వస్తువులు కొని అవినీతికి పాల్పడ్డారా? లేదా?. వేమూరి హరిప్రసాద్ని డైరెక్టర్గా తీసుకోవాలని సీఎంవో నుండి లెటర్ ఇవ్వలేదా?. రూ.114 కోట్ల విలువైన అవకతవకలు ఫైబర్ నెట్లో జరిగాయా? లేదా?. ఇలాంటి విషయాలపై విచారణ జరుగుతుండగా కేసును ఎందుకు క్లోజ్ చేశారు?. కేసులను ఎదుర్కోవడం చేతకాని పిరికిపంద చంద్రబాబు. ఈ కేసులను క్లోజ్ చేయటానికి హైకోర్టు, సుప్రీంకోర్టు అంగీకరించవు. దీనిపై మరింతగా న్యాయ పోరాటం చేస్తాం’’ అని గౌతమ్రెడ్డి పేర్కొన్నారు. -
అల్లూరి జిల్లా బస్సు ప్రమాద ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి,తాడేపల్లి: అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు.ఈ సందర్భంగా.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పలువురు యాత్రికులు మరణించడం అత్యంత విషాదకరమని వైఎస్ జగన్ అన్నారు. చింతూరు మండలం తులసిపాకలు ఘాట్ రోడ్లో యాత్రికుల ప్రైవేట్ బస్సు లోయలో పడి పలువురు మృతిచెందారు. అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. -
ఏపీలో ఘోర ప్రమాదం.. లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు
సాక్షి,అల్లూరి: ఏపీలో మరో పెను విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారు జామున అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ఘాటు రోడ్డులో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో పదుల సంఖ్యలో ప్రయాణికులు మృతి చెందినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. స్థానికుల సమాచారం మేరకు.. చిత్తూరు జిల్లా విఘ్నేశ్వర ట్రావెల్స్కు చెందిన AP 39 UM 6543 నెంబర్ గల ప్రైవేట్ బస్సు 37మందితో భద్రాచలం నుంచి అరకు వెళ్తుంది. మార్గం మధ్యలో మారేడుమిల్లి ఘాటురోడ్డు లోని రాజుగారి మెట్టు మలుపు దగ్గర అదుపుతప్పి లోయలో పడింది. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. గాయపడిన వారిని అత్యవసర చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పుణ్యక్షేత్రాల సందర్శన కోసం చిత్తూరులో మిట్టూరు శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్స్కు చెందిన బస్సు ఈ నెల ఆరవ తేదీ రాత్రి 9 గంటలకు 39 మందితో యాత్రకు బయలుదేరింది. చిత్తూరు నగరం మురకంబట్టుకు చెందిన రామ్మూర్తి అనే ప్రైవేట్ ఏజెంట్ ఆధ్వర్యంలో ఈ యాత్ర ఏర్పాటైంది. బస్సు ప్రమాదానికి ముందు భద్రాచలం దర్శనం పూర్తి చేసుకుని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ఇద్దరు డ్రైవర్లు, 35 మంది యాత్రికులు ఉన్నారు. వీరిలో పదుల సంఖ్యలో మృతిచెందారు. బస్సులోని ప్రయాణికులను చిత్తూరు జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. మితిమీరిన వేగం..ప్రమాదం జరిగిన ప్రదేశం కొండప్రాంతం కావడంతో ఘాట్ రోడ్డుపై మంచు కమ్ముకోవడంతో ప్రమాదం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారంతా 50 ఏళ్ల వయసు పైబడిన వారేనని తెలుస్తోంది. -
కుంటనక్కలు..!
ఒంగోలు నగర శివారు చెరువుకొమ్ముపాలెం ఎగదాల చెరువును అధికార పార్టీ నేతలు చెరబట్టారు. ఈ చెరువు 20.18 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో సుమారు 15 ఎకరాలు అధికార టీడీపీ నేతలు ఆక్రమించేశారు. ఈ చెరువు సమీపంలో పెద్దా, చిన్నా పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడ ఎకరా రూ.80 లక్షల ధర పలుకుతోంది. అయితే ఆక్రమణదారులు ఎకరా రూ.25 లక్షలకు విక్రయించేసి సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీ నాయకులు కావడంతో అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. మా చెరువును కాపాడండి మహా ప్రభో అని గ్రామస్తులు వేడుకుంటున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగర పాలక సంస్థ పరిధి 18వ డివిజన్ చెరువుకొమ్ముపాలెం గ్రామంలోని ఎగదాల చెరువు ఉంది. ఆర్ఎస్ఆర్లో ఆ చెరువు పేరు రెడ్డివాని కుంటగా రికార్డుల్లో నమోదై ఉంది. కానీ చెరువుకొమ్ము పాలెం గ్రామానికి పై వైపున ఉండటంతో పాటు మరికొన్ని కుంటలు చెరువులు ఉండటంతో ఆ చెరువును గుర్తుగా ఉండటం కోసం ఎగదాల చెరువుగా పిలుచుకుంటుంటారు. చెరువుకొమ్ముపాలెం గ్రామ సర్వే నెం. 243లో కుంట పోరంబోకుకు చెందిన దాదాపు 20.18 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. ఇందులో దాదాపు 15 ఎకరాలు పైగా ఆక్రమణలకు గురైంది.కుంచించుకుపోయి చెరువు ప్రస్తుతం 5 ఎకరాలలోపునకు చేరింది. చెరువు కాస్తా కుంటగా మారిపోయింది. ఈ చెరువు తరాల నుంచి ఆ గ్రామస్తుల సాగు నీటి అవసరాలు తీరుస్తూ వస్తోంది. అదేవిధంగా పశువుల దాహార్తిని తీర్చుకోవటానికి కూడా ఈ చెరువును వినియోగించేవారు. గ్రామస్తుల వ్యవసాయ పనులకు ఉపయోగకరంగా ఉండేది. పంట పొలాలకు ఆ చెరువులోని నీటిని ఇంజన్ల ద్వారా, తాగాణీల ద్వారా, ఎత్తిపోసుకోవడం ద్వారా రైతులు వినియోగించుకునేవారు. ఈ చెరువు చుట్టూ దాదాపు 100 ఎకరాలకు సాగు నీరు అందుతోంది. రూ.20 నుంచి రూ.25 లక్షలకు అమ్ముకుంటున్న టీడీపీ నేత... ఎగదాల చెరువు ఆక్రమించుకొని యథేచ్ఛగా అమ్ముకుంటున్నారు. దొంగ సర్వే నంబర్లు వేసి రిజి్రస్టేషన్లు కూడా చేస్తున్నారు. గ్రామానికి చెందిన ఒక టీడీపీ నేత 4.5 ఎకరాలు కబ్జా చేశాడు. అందులో ఇటీవల ఎకరా రూ.25 లక్షలకు విక్రయించాడన్న ఆరోపణలు ఉన్నాయి. అతనిని చూసి మరికొందరు కబ్జాదారులు కూడా ఇటీవల ఎకరా రూ.20 లక్షలకు బేరం పెట్టినట్లు సమాచారం. ఆ చెరువు పరిసర ప్రాంతాల్లో పెద్దా, చిన్నా పరిశ్రమలు రావడంతో ఆ ఎగదాల చెరువు స్థలాలకు కూడా గిరాకీ పెరిగింది. దాంతో అధికార టీడీపీ నేత చెరువు పోరంబోకు స్థలాలను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. చెరువుకొమ్ముపాలెం నుంచి కొణిజేడు వెళ్లే రోడ్డు ఫేస్లో ఇటీవల ఎకరా రూ.80 లక్షలు పలికింది. ఇప్పటికే దాదాపు ఐదు ఎకరాలకు పైగా స్థలం పలు చేతులు కూడా మారాయి. చెరువు ఆక్రమించుకుని దర్జాగా విక్రయించేస్తున్నా మామూళ్లు తీసుకున్న అధికారులు పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కబ్జాదారుల నుంచి చెరువును రక్షించాలి గ్రామానికి ఎంతో ప్రయోజనకరంగా ఉండే ఎగదాల చెరువును కబ్జా కోరల నుంచి రక్షించాలి. కొందరు స్వార్థపరులు యథేచ్ఛగా ఆక్రమించుకున్నారు. ఆక్రమించుకున్న కబ్జాదారులు ఎకరా రూ.25 లక్షలకు పైగా అమ్ముకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు మేలుకొని కబ్జా చెరనుంచి చెరువును కాపాడాల్సిన అవసరం ఉంది. లేకుంటే భవిష్యత్తు తరాలకు నీటి నిల్వ కుంటలు, చెరువులు లేకపోతే ప్రజలకు ముప్పువాటిల్లే ప్రమాదం ఉంది. దానికి తోడు అభివృద్ధి చెందుతున్న ఒంగోలు నగర పాలక సంస్థకు ఆ చెరువు సమ్మర్ స్టోరేజీ ట్యాంకు మాదిరిగా కూడా ఉపయోగపడుతుంది. – పూసపాటి సమర సింహా రెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు, చెరువుకొమ్ముపాలెం. సర్వే చేసి చెరువును పునరుద్ధరించాలి ఎగదాల చెరువు మొత్తాన్ని సర్వేచేసి రెవెన్యూ రికార్డుల ప్రకారం నిర్ధారించాలి. తద్వారా చెరువు పాత పద్ధతిలో మాదిరిగా పునరుద్ధరించాలి. ఆక్రమణ చెర నుంచి కాపాడకపోతే భవిష్యత్తులో ఉద్యమాలు చేసి అయినా చెరువును కాపాడుకుంటాం. చెరువుకు హద్దులు వేసి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి చెరువుకొమ్ముపాలెం ప్రజలు, రైతులను ఆదుకోవాలి. చుట్టూ ఉన్న రైతుల అవసరాలను తీర్చేలా చెరువును తయారు చేయాలి. గ్రామంలోని పశువులకు కూడా తాగునీటి సమస్యను తీర్చాలి. కొందరు స్వార్ధపరులు చెరువును తమ కబంద హస్తాల్లోకి తీసుకొని నిలువునా అమ్ముకుంటున్నారు. దానిని అధికారులు అడ్డుకోవాలి. – తాటిపర్తి రాగయ్య, చెరువుకొమ్ముపాలెం ఎగువ ప్రాంతాల నుంచి నీరు రాకుండా అడ్డుకట్ట.. 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువుపై అధికార టీడీపీ నేతలు కన్నేశారు. దాదాపు 15 ఎకరాల వరకూ కబ్జా చేసేశారు. ఆక్రమణదారులు కొంత మంది వీటిని వ్యవసాయ భూములుగా ఉపయోగించుకొంటున్నారు. ఎగువ ప్రాంతం నుంచి చెరువులోకి వచ్చే నీటిని కూడా రానీయకుండా ఆక్రమణదారులు అడ్డుకట్టలు వేసేశారు. అంతేకాదు చుట్టు పక్కల ఉన్న రైతులకు చెరువు నీరు రాకుండా చేసి ఇబ్బందులు పెడుతున్నారు. ఆక్రమణ దారుల నుంచి ఈ చెరువు కాపాడి అభివృద్ధి చేసి నీటి నిల్వ సామర్థ్యం పెంచాలని చెరువుకొమ్ముపాలెం గ్రామస్తులు కోరుతున్నారు.నీటి నిల్వ సామర్థ్యం పెరిగితే భూగర్భ జలాల నీటి మట్టం పెరిగి చుట్టూ ఉన్న రైతుల బోర్లలో నీళ్లు పుష్కలంగా అందుబాటులోకి వస్తాయి. వేసవికాలంలో కూడా చుట్టు పక్కల రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవటానికి ప్రయోజనకరంగా ఉంటుంది. చెరువును పరిరక్షించాలని గ్రామస్తులు అధికారులను వేడుకుంటున్నా పట్టించుకున్న దాఖలాల్లేవు. -
పవన్.. పదోన్నతులు.. నవ్విపోదురుగాక
సాక్షి, అమరావతి: ఎంపీడీవోల పదోన్నతులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు చూసి పంచాయితీరాజ్ శాఖ అధికారులు నివ్వెరపోతున్నారు. సీనియారిటీ జాబితా విషయంలో తీవ్ర వివాదాలు, కోర్టు కేసులతో దాదాపు 35 ఏళ్లు పదోన్నతులు లేక, ఉద్యోగంలో చేరిన బాధ్యతల్లోనే రిటైర్ అవుతాం అని ఎంపీడీవోలు వ్యథ చెందారు. ఇలాంటి పరిస్థితుల్లో 2020లో నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంపీడీవోల పదోన్నతులకు చారిత్రాత్మక నిర్ణయాన్ని అమలు చేసింది.సీరియారిటీ జాబితా వివాద పరిష్కారానికి ప్రత్యేకంగా డివిజన్ స్థాయిలో ఆర్డీవో తరహాలో కొత్తగా డీఎల్డీవో (డీడీవో) పోస్టును ఏర్పాటు చేసింది. గ్రామ, వార్డు సచివాలయాలతో సమన్వయం కోసం ఈ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఇలా... మూడున్నర దశాబ్దాలుగా పదోన్నతులకు నోచని ఎంపీడీవోలకు అన్ని సమస్యలను పరిష్కరిస్తూ ఒకేసారి ప్రమోషన్లు కల్పించారు వైఎస్ జగన్. ఇలా రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి డివిజనల్ డెవలప్మెంట్ అధికారి వ్యవస్థ ఆలోచన చేయడమే కాక దానిని కార్యరూపంలోకి తెచ్చారు. వాస్తవం ఇది అయితే డిప్యూటీ సీఎం పవన్... ఎంపీడీవోలకు తొలిసారి తామే పదోన్నతులు కల్పించినట్లు వ్యాఖ్యానించడంపై ఆ శాఖ అధికారులే విస్తుపోతున్నారు. డీఎల్డీవో (డీడీవో) కార్యాలయాలనూ బాబు సర్కారే ప్రారంభించినట్లు పవన్ చెప్పడంతో అధికారులు ముక్కున వేలేసుకుంటున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏర్పాటైన ఈ కార్యాలయాలు రాష్ట్రంలోని అన్ని డివిజన్లలో 2020 సెపె్టంబర్ తర్వాత నుంచే కొనసాగుతుండడం గమనార్హం. ఇక డీడీవో కార్యాలయాలు కూడా కూటమి ప్రభుత్వం కొత్తగా నిరి్మంచిన భవనాలేవీ కాదు. గ్రామ సచివాలయ భవనాల్లోనే వీటిని ఏర్పాటు చేశారు. పలుచోట్ల కింద అంతస్తులో గ్రామ సచివాలయం, పైఅంతస్తులో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసుకు కేటాయించారు. ఆ ఒక్క చారిత్రక నిర్ణయంతో... గత ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ విషయంలో తీసుకున్న ఆ ఒక్క చారిత్రక నిర్ణయంతో ఆ శాఖ ఉద్యోగులకు భారీగా మేలు జరిగింది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంపీడీవోల పదోన్నతులకు వీలు కల్పించడంతో కిందిస్థాయిలోని ఈవోపీఆర్డీ, గ్రేడ్–1, గ్రేడ్–2, గ్రేడ్–3, గ్రేడ్–4, గ్రేడ్–5... ఒకరివెంట ఒకరికి పదోన్నతులకు వీలు కలిగింది. కిందిస్థాయి కేడర్లోనూ సీనియారిటీ జాబితాల వివాదాలు పరిష్కరించి వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే పదోన్నతుల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. 2024 మార్చిలో పంచాయతీ సెక్రటరీలకు ప్రమోషన్లు కల్పించింది. ఎన్నికల అనంతరం బాబు సర్కారు మరికొందరికి పదోన్నతులు ఇచి్చంది. తమ ప్రభుత్వం ఒకేసారి శాఖలో 10 వేల మందికి పదోన్నతులు కల్పించినట్లు పవన్ చెప్పటం విడ్డూరంగా ఉందని పంచాయతీరాజ్ ఉద్యోగులే అంటున్నారు. -
చంద్రబాబు హెలికాప్టర్, విమాన చార్జీల అద్దెకు మరో రూ.10.92 కోట్లు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హెలికాప్టర్, విమాన ప్రయాణాల అద్దె కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో మరో రూ.10.92 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్కు పరిపాలన అనుమతినిస్తూ సాధారణ పరిపాలనశాఖ (రాజకీయ) ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో ఏ జిల్లాకు వెళ్లినా ప్రత్యేక హెలికాప్టర్ లేదా ప్రత్యేక విమానం వినియోగిస్తున్న విషయం తెలిసిందే. అలాగే తరచూ ప్రత్యేక విమానంలో హైదరాబాద్–విజయవాడ మధ్య ప్రయాణిస్తున్నారు.ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రత్యేక హెలికాప్టర్, విమాన చార్జీల అద్దె చెల్లింపుల కోసం మే నెల 22వ తేదీన రూ.19.12 కోట్లకు అనుమతి మంజూరు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది సెపె్టంబర్ 18న రెండో త్రైమాసికంలో ప్రత్యేక హెలికాప్టర్, విమాన చార్జీల అద్దె చెల్లింపునకు మరో రూ.10.92 కోట్లకు అనుమతిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులిచ్చింది. తాజాగా మూడో త్రైమాసికంలో అనుమతిచ్చిన రూ.10.92 కోట్లతో కలిపితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు సీఎం చంద్రబాబు ప్రత్యేక హెలికాప్టర్, విమానాలకు అద్దె రూపంలో రూ.40.96 కోట్లను చెల్లించినట్లు అవుతోంది. చినబాబు, పవనూ ప్రత్యేక విమానాల్లోనే చక్కర్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా రూ.కోట్లాది రూపాయల ప్రజాధనం ఉపయోగించి ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్లలోనే చక్కెర్లు కొడుతున్నారు. అయితే వీరు తిరుగుతున్న విమానాల అద్దె లెక్కలు తేలాల్సి ఉంది. -
స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్రంలోని పలు స్థానిక సంస్థలకు జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవాను చాటింది. అధికార తెలుగుదేశం పార్టీ కూటమి కుయుక్తులు బెడిసికొట్టాయి. గురువారం జరిగిన ఉప ఎన్నికల్లో కడప మేయర్తో పాటు 4 ఎంపీపీ స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. అలాగే రెండు మండలాల్లో ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండింటినీ వైఎస్సార్సీపీ గెల్చుకోవడం విశేషం. బాపట్ల జిల్లా వేమూరు, నంద్యాల జిల్లా దొర్నిపాడు, విజయనగరం జిల్లా మెరకముడియం, బొందపల్లి కోఆప్షన్ స్థానాలను వైఎస్సార్సీపీ గెల్చుకుంది. వరదాయపాలెం ఎంపీపీ ఎన్నిక కోర్టు స్టే కారణంగా వాయిదా పడింది. టీడీపీ కేవలం కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పదవితో సరిపెట్టుకుంది. కడపలో మరోమారు సత్తా చాటుకున్న వైఎస్సార్సీపీ కడప నగరపాలక సంస్థ మేయర్ను అనైతికంగా తొలగించిన చంద్రబాబు కూటమి సర్కారు.. మేయర్ పదవిని చేజిక్కించుకొనేందుకు నానా కుట్రలు పన్నింది. తెలుగుదేశం పార్టీ కుయుక్తులను వైఎస్సార్సీపీ తిప్పి కొట్టడంతో ఆ పదవి మరోమారు వైఎస్సార్సీపీ సొంతమైంది. కడప మేయర్గా 47వ డివిజన్ వైఎస్సార్సీపీ కార్పొరేటర్ పాకా సురేష్ గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కూటమి అధికారంలోకి వచ్చాక అధికార బలంతో, చట్టంలో ఉన్న లొసుగులను ఆసరా చేసుకొని కడప మేయర్గా ఉన్న సురేష్బాబును పదవి నుంచి తప్పించింది. దీంతో గురువారం ఎన్నిక జరిగింది. కడప కార్పొరేషన్లో 50 మంది కార్పొరేటర్లు ఉండగా, ఇద్దరు మృతి చెందారు. కడప మేయర్ పాకా సురేష్ టీడీపీకి ఒకే కార్పొరేటర్ ఉన్నారు. మిగతా 47 మందిలో 8 మందిని టీడీపీ ప్రలోభాలకు గురి చేసి పార్టీలో చేర్చుకుంది. మిగతా 39 మంది కార్పొరేటర్లు వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, మాజీ మంత్రి అంజద్ బాషా, మాజీ మేయర్ సురేష్బాబు కార్పొరేటర్లతో సమాలోచలు జరిపి, పాకా సురేష్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. మెజార్టీ కార్పొరేటర్ల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని ఏకాభిప్రాయంతో వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్థిగా పాకా సురేష్ను ఎంపిక చేశారు. వైఎస్సార్సీపీకి చెందిన 39 మంది సభ్యులు పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. అంతా ఏకాభిప్రాయంతో ఉండటంతో టీడీపీ తోక ముడిచింది. డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి మేయర్గా పాకా సురేష్ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించగా, కార్పొరేటర్ షఫీ బలపర్చారు. దీంతో సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పీవో అదితిసింగ్ ప్రకటించారు. అనంతరం మేయర్ పాకా సురేష్ చేత కమిషనర్ మనోజ్రెడ్డి ప్రమాణం చేయించారు. ఏకగ్రీవంగా ఎంపీపీలు వైఎస్సార్ కడప జిల్లా ముద్దనూరు మండల ప్రజాపరిషత్ అ«ధ్యక్షురాలిగా వైఎస్సార్సీపీ అభ్యర్థి వెన్నపూస పుష్పలత ఏకగ్రీవంగా ఎన్నుకయ్యారు. అలాగే అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె ఎంపీపీగా కోసువారిపల్లె వైఎస్సార్సీపీ ఎంపీటీసీ చిటికి శ్యామలమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం ఆంబాకం ఎంపీటీసీ సెగ్మెంట్ నుంచి వైస్ ఎంపీపీగా వైఎస్సార్సీపీకి చెందిన శరవణ ఎన్నికయ్యారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం ఎంపీపీ అధ్యక్షురాలిగా వైఎస్సార్సీపీకి అభ్యర్థి, బీసీ సామాజికవర్గానికి చెందిన జిత్తుక వెంకటలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట ఎంపీపీగా వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీటీసీ గద్దల మల్లయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నిండ్ర, విజయపురంలో దౌర్జన్యమే గెలిచింది చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో జరిగిన రెండు ఎంపీపీ ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యంగా వ్యవహరించింది. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో మొత్తం 16 ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ గెల్చుకుంది. ఎంపీపీ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్ అయ్యింది. ఏర్పేడు ఎంపీపీ గీత రాజీనామా, ముసలిపేడు ఎంపీటీసీ రమణమ్మ మృతితో 14 మంది వైఎస్సార్సీపీ సభ్యులున్నారు. వీరిలో పంగూరు ఎంపీటీసీ పి.ఆదిలక్ష్మి ఒక్కరే ఎస్టీ మహిళ కావడంతో ఆమెకే పదవి దక్కాలి. అయితే, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సు«దీర్రెడ్డి వైఎస్సార్సీపీకి చెందిన 9 మంది ఎంపీటీసీలను ప్రలోభాలకు, బెదిరింపులకు గురిచేసి ప్రత్యేక శిబిరంలో దాచారు. గురువారం ఉదయం 11 గంటలకు వారిని ఎంపీడీవో కార్యాలయానికి తీసుకొచ్చారు. వారు టీడీపీ కండువాలతో ఎన్నికలో పాల్గొన్నారు. పంగూరు ఎంపీటీసీ పి.ఆదిలక్ష్మిని స్వతంత్ర అభ్యర్థిగా పోటీలోకి దింపారు. దీంతో మిగిలిన 5 మంది వైఎస్సార్సీపీ సభ్యులు ప్రజాసామ్యాన్ని ఖూనీ చేశారంటూ ఎన్నిక ప్రక్రియను బహిష్కరించారు. మొత్తంగా స్వతంత్ర అభ్యర్థి పి.ఆదిలక్ష్మి ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు. ఆ వెంటనే ఆమెకు ఎమ్మెల్యే సు«దీర్ రెడ్డి టీడీపీ కండువా కప్పడం గమనార్హం. చిత్తూరు జిల్లాలో.. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని విజయపురం, నిండ్ర మండలాల ఎంపీపీ ఎన్నికలు పూర్తిగా అధికారబలంతోనే సాగాయి. రెండు మండలాల్లోను 8 ఎంపీటీసీ స్థానాలు చొప్పున ఉన్నాయి. ఎంపీపీగా గెలవాలంటే ఐదుగురి మద్దతు అవసరమౌతుంది. అధికార పార్టీ అంగబలం, అధికార బలం, దౌర్జన్యం ప్రదర్శించినా రెండు మండలాల్లోనూ నాలుగు ఓట్లు మాత్రమే సంపాదించగలిగింది. దీంతో అధికారులు లాటరీ పద్ధతి నిర్వహించారు. విజయపురంలో వైఎస్సార్సీపీ తరఫున మంజు బాలాజి, టీడీపీ తరఫున లక్ష్మీపతిరాజు పోటీచేశారు. నిండ్రలో వైఎస్సార్సీపీ తరఫున విజేష్, టీడీపీ మద్దతుతో ఇండిపెండెడెంట్ అభ్యర్థి భాస్కర్రెడ్డి పోటీ పడ్డారు. అధికారుల చేతివాటంతో లాటరీలో విజయపురంలో టీడీపీ అభ్యర్థి లక్ష్మీపతిరాజు, నిండ్రలో ఇండిపెండెంట్ అభ్యర్థి భాస్కర్రెడ్డి ఎంపీపీలుగా ఎంపికయ్యారు. నా పేరే వచ్చింది ఎన్నికల అనంతరం విజయపురంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మంజు బాలాజి మీడియాతో మాట్లాడుతూ.. అధికారులు పూర్తిగా పక్షపాత ధోరణిలో వ్యవహరించారని, డిప్లో తన పేరే వచ్చిందని, అధికారులు మాత్రం లక్ష్మీపతిరాజు గెలిచినట్లు చెప్పి వెళ్లిపోయారని తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని, కోర్టుకు వెళతానని తెలిపారు. నిండ్ర, విజయపురంలో అధికారుల దుర్మార్గంపై కలెక్టర్కు ఫిర్యాదు నిండ్ర, విజయపురం ఎంపీపీ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు) కూటమి నేతల ఒత్తిళ్లతో నిబంధనలకు విరుద్ధంగా, ఏకపక్షంగా వ్యవహరించారని ఆయా మండలాల వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు కలెక్టర్ సుమిత్ కుమార్ గాం«దీకి గురువారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఒకరు గెలిస్తే ఆర్వోలు మరొకరు గెలిచినట్లు ప్రకటించారన్నారు. ఎన్నికల నిబంధనలను ఏమాత్రం పాటించలేదన్నారు. ఎమ్మెల్యే పీఏలు ఎన్నికల కేంద్రాల్లోకి ప్రవేశించారని, అభ్యర్థులను, ఎంపీటీసీలను మాత్రం లోనికి అనుమతించలేదని ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో పిల్లల చేత లాటరీ తీయించకూడదని, అయినా ఓ చిన్న పాపకు ముందుగా గుర్తులు చెప్పించి లాటరీ తీయించారని తెలిపారు. బహిరంగంగా నిర్వహించాల్సిన లాటరీ ప్రక్రియను గుట్టుగా చేశారని చెప్పారు. మరొక ఆర్వో ఒకే వ్యక్తి పేరును ఐదు చొప్పున రాసి లాటరీ తీశారని తెలిపారు. ఆర్వోలతో కలెక్టర్ ఫోన్లో మాట్లాడి, ఎంపీపీ ఎన్నికల వీడియోలను శుక్రవారం మధ్యాహ్నం లోగా పంపాలని ఆదేశించారు. బెదిరింపులకు బెదరని కళ్యాణదుర్గం కౌన్సిలర్లు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అధికార టీడీపీ నేతల బెదిరింపులకు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు బెదరలేదు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులుండగా 11 మంది వైఎస్సార్సీపీ, 11 మంది టీడీపీ సభ్యులు ఉన్నారు. వైఎస్సార్సీపీకి చెందిన ఆరుగురిని ఐదుగురిని టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రలోభాలకు గురి చేసి ఆ పార్టీలోకి చేర్చుకున్నారు. మిగిలిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ఎమ్మెల్యే బెదిరింపులు, ప్రలోభాలకు గురిచేశారు. ఆస్తులున్నాయి జాగ్రత్త అంటూ ఫోన్లు చేసి భయపెట్టారు. అయినా వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు వెనక్కి తగ్గలేదు. చివరకు కూటమి ఎమ్మెల్యే, ఎంపీ ఎక్స్అఫీషియో సభ్యుల హోదాలో ఓట్లు వేయడంతో టీడీపీ గట్టెక్కింది. దొడ్డిదారిలో రామగిరి ఎంపీపీ స్థానం కైవసం శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో చంద్రబాబు కూటమి ప్రజాస్వామ్యాన్ని మంటగలిపింది. గురువారం జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత కుంటిమద్ది వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యురాలు సాయిలీలను బెదిరింపులకు గురిచేసి, బలవంతంగా టీడీపీలోకి చేర్చుకుని.. ఆమెకే ఎంపీపీ పదవి అప్పగించారు. ఈ ఎన్నికల్లో 9 మంది సభ్యులకు గాను నలుగురే హాజరయ్యారు. మూడింట రెండు వంతుల మంది సభ్యులు ఉంటేనే ఎన్నిక నిర్వహించాలనే నిబంధనలను అధికారులు తుంగలో తొక్కారు. వచి్చన వారిలో పోటీ చేసిన అభ్యర్థికి మద్దతు ఇస్తే ఎన్నిక పూర్తవుతుందనే సరికొత్త నిబంధన తెచి్చ, ఎంపీపీ స్థానాన్ని టీడీపీ గెలుపొందింది. పోలీసుల అండతో మాచవరం ఎంపీపీ కైవసం పల్నాడు జిల్లా మాచవరం ఎంపీపీని కూడా టీడీపీ దౌర్జన్యంగా గెల్చుకుంది. టీడీపీకి తగిన బలం లేకపోయినా, పోలీసులతో వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులను బెదిరించారు. వాస్తవంగా 15 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీకి ఉన్న బలం నాలుగే. దీంతో గత రెండు రోజులుగా వైఎస్సార్సీపీ ఎంపీటీసీల బంధువులను పోలీసులు స్టేషన్లకు పిలిపించి సభ్యుల వివరాలు తెలపాలని ఒత్తిడి తెచ్చారు. చెన్నాయపాలెం ఎంపీటీసీ లక్ష్మిబాయి బంధువు బాలు నాయక్ను దాచేపల్లి సీఐ భాస్కరరావు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి బెదిరించినట్లు బంధువులు ఆరోపించారు. దీంతో బాలు నాయక్ తన బంధువైన ఎంపీటీసీ లక్ష్మీబాయి మద్దతు టీడీపీకి ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. పిల్లుట్ల –1 ఎంపీటీసీ మంగమ్మ బాయినీ అలాగే బెదిరించి తమ వైపు తిప్పుకున్నారు. మరికొందరిని కూడా బెదిరింపులకు గురి చేసి, టీడీపీ అభ్యర్థి కొక్కెర అంజమ్మను గెలిపించుకున్నారు. -
జోజినగర్ బాధితులకు వైఎస్సార్సీపీ అండ
సాక్షి, అమరావతి: విజయవాడలోని జోజినగర్లో 42 ప్లాట్ల కూల్చివేత బాధితులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, అవసరమైన న్యాయ సహాయం అందిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. కూల్చివేతకు గురైన 42 ప్లాట్లకు సంబంధించిన బాధితులు గురువారం మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ కష్టార్జితాన్ని నేలపాలు చేశారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు.పక్కా రిజి్రస్టేషన్ డాక్యుమెంట్లతో కొనుగోలు చేసి, బ్యాంకుల ద్వారా రుణం తీసుకుని 25 ఏళ్ల క్రితం భవనాలు నిరి్మంచుకుంటే నిర్ధాక్షిణ్యంగా పడగొట్టి రోడ్డుపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాట్ రిజి్రస్టేషన్, ఇంటి పన్ను, కరెంట్ బిల్లుల రశీదులను చూపించారు. డిసెంబర్ 31 వరకు తమ ఇళ్ల జోలికి వెళ్లొద్దని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నా అధికారులు పట్టించుకోకుండా డిసెంబర్ 3వ తేదీ వేకువజామున వందల సంఖ్యలో పోలీసులొచ్చి తమ ఇళ్లను నేలమట్టం చేసి వెళ్లిపోయారని బాధితులు వాపోయారు.అధికార టీడీపీ, జనసేన నాయకులను కలిసినా తమ గోడు వినిపించుకోలేదని, ఇళ్లు కూల్చివేస్తే ఎంపీ, ఎమ్మెల్యే కనీసం పరామర్శకు కూడా రాలేదని కన్నీరుమున్నీరయ్యారు. మీరే న్యాయం చేయాలని వేడుకున్నారు. దీనిపై వైఎస్ జగన్ స్పందిస్తూ.. బాధితులకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని, న్యాయ సహాయం అందిస్తుందని ధైర్యంచెప్పారు. వచ్చేవారం తాను వచ్చి కూల్చి వేసిన ప్రాంతాన్ని పరిశీలిస్తానని భరోసా ఇచ్చారు. పేదోళ్లంటే ఈ ప్రభుత్వానికి కడుపు మంట చంద్రబాబు ప్రభుత్వం పేదల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. వైఎస్ జగన్ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సామా న్లు బయటకు తీసుకొచ్చే సమయమూ ఇవ్వకుండా నేలమట్టం చేశారని ధ్వజమెత్తారు. 25 ఏళ్లుగా ఆస్తి పన్ను, కరెంట్ బిల్లు చెల్లిస్తున్నా ఏమాత్రం కనికరం చూపలేదన్నారు. ఎక్కువగా మాట్లాడితే మా ఇళ్లను నేలమట్టం చేసినట్లు మమ్మల్ని కూడా నేలమట్టం చేస్తామని టీడీపీ నేత సురక శ్రీనివాసరావు బెదిరించారని బాధితురాలు అరుణ వాపోయారు.ఇళ్లు కూల్చేయడంతో చెట్టు కింద ఉంటున్నామని బాధితురాలు తంగా సుబ్బులు ఆవేదన వ్యక్తం చేశారు. బంగారం కుదువ పెట్టి, పైసాపైసా కూడబెట్టి ఇళ్లు కట్టుకున్నామని చెప్పా రు. శ్రీ లక్ష్మీ రామ కో–ఆపరేటివ్ సొసైటీ వాళ్లే ఇదంతా చేశారని విజయలక్ష్మి అనే బాధితురాలు మండిపడ్డారు. వైఎస్ జగన్ భరోసాతో ధైర్య మొచ్చిందని బాధితులు లలిత కుమారి, లక్ష్మణ్ తదితరులు అన్నారు. -
బాబూ.. ఇదేం 'బ్యాగు'?
సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: భుజాలకు తగిలించుకునే బందులు ఊడిపోయాయి.. జిప్పులు పనిచేయడం మానేశాయి.. కుట్టించి వాడుకున్నా మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలింది.. విసుగు చెంది కొన్ని రోజుల్లోపే మూలనపడేసే పరిస్థితి వచ్చింది..! ఇదీ విద్యార్థి మిత్ర పేరుతో చంద్రబాబు సర్కారు అందజేసిన కిట్లలోని స్కూల్ బ్యాగుల దుస్థితి..! రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేసిన బ్యాగ్లు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. విద్యా సంవత్సరం ఏడు నెలలు ముగిసినా ఇంకా కిట్లు అందాల్సినవారు ఉండడం గమనార్హం. ఇదంతా చూస్తుంటే ప్రభుత్వ విద్యకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం ప్రాధాన్యం ఇస్తున్నదో అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాటి సీఎం వైఎస్ జగన్ అందించిన విద్యా కానుక నాణ్యతను విద్యార్థుల తల్లిదండ్రులు గుర్తు చేస్తున్నారు. అప్పట్లో ఇచ్చిన కిట్లోని బ్యాగులు సహా ప్రతి వస్తువును వైఎస్ జగన్ ఆసాంతం పరిశీలించిన వైనాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ ప్రభుత్వంలో మూడంచెల తనిఖీ తర్వాత బ్యాగులు ఇచ్చామని విద్యా శాఖ మంత్రి లోకేశ్ చెబుతున్నారు. కానీ, ఏమాత్రం నాణ్యత లేని బ్యాగులను చూశాక ఆయన పరిశీలించింది ‘కమీషన్ల కోసం’ అనే ఆరోపిస్తున్నారు. ఇక బాబు సర్కారు ఇచ్చిన కిట్లలోని బూట్లు కూడా నాసిరకంగా ఉన్నాయి. సైజు తీసుకోకుండా ఇష్టారీతిన పంపిణీ చేసేశారు. దీంతో హైస్కూల్ వారికి రెండో తరగతి విద్యార్థుల బూట్లు వచ్చాయి. చాలాచోట్ల సాక్సులు ఇవ్వకపోవడంతో వాటిని పక్కన పెట్టేశారు.కాపీ కొట్టి.. ఎగ్గొట్టి...గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చక్కగా అమలు చేసిన ‘జగనన్న విద్యాకానుక’ పథకాన్ని చంద్రబాబు సర్కారు కాపీ కొట్టింది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అని పేరుతో అమలు చేస్తోంది. అయితే, వైఎస్ జగన్ సీఎంగా ఉండగా ఏటా సగటున 43 లక్షల మందికి బడి తెరిచిన రోజే కిట్లను పంపిణీ చేశారు. ప్రస్తుతం బాబు ప్రభుత్వం 35.60 లక్షల మంది విద్యార్థులకే కిట్లనే కొనుగోలు చేసింది. అంటే, విద్యార్థుల సంఖ్యలో ఏడు లక్షల మందికిపైగా కోతపెట్టింది. ఇక రూ.800 కోట్లకు పైగా ఖర్చు చేసి ఒక్కోటి రూ.2,279 విలువతో 35.60 లక్షల కిట్లను కొనుగోలు చేసింది. కానీ, ఈ పథకంలో గోల్మాల్ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లాబీయింగ్తో పెద్దఎత్తున అవినీతికి పాల్పడడంతో బ్యాగుల నాణ్యత అత్యంత నాసిరకంగా ఉన్నట్లు విద్యార్థుల బ్యాగుల సాక్షిగా స్పష్టమవుతోంది. మూడు దశల్లో తనిఖీ చేసిన బ్యాగులు కనీసం రెండు నెలలు కూడా మనలేదు. ఇక పాఠశాలలు పునఃప్రారంభమైన రోజే కిట్లు అందజేశామని గొప్పలు పోయారు. కానీ, అవినీతి కారణంగా నాణ్యత లేని బ్యాగులు అందాయి. చిరిగిపోయిన వాటికి అతుకులు వేసుకుని వెళ్లాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు.ఒకటి ఉంటే మరొకటి లేదు‘గత ప్రభుత్వం విద్యా కానుక పేరుతో నిధులు దుర్వినియోగం చేసింది. మా సర్కారులో విద్యార్థి కిట్ల ఖర్చు తగ్గించి ప్రజాధనం ఆదా చేశాం’ అని విద్యాశాఖ మంత్రి లోకేశ్ గొప్పలు పోయారు. తీరా కిట్లోని బ్యాగులు చూస్తే అత్యంత నాసిరకంగా ఉన్నాయి. బూట్లు సైజు సరిపోవడమే లేదు. కిట్లో ఒక వస్తువు ఇస్తే మరో వస్తువు లేదు. బ్యాగులతో పాటు చాలా జిల్లాల్లో డిక్షనరీలు, యూనిఫాం, సాక్సులు తదితరాలను విద్యార్థుల తల్లిదండ్రులు సొంతంగా కొనివ్వాల్సి వచ్చింది. దీంతో జగనన్న విద్యా కానుక కిట్లకు చంద్రబాబు విద్యా మిత్రకు పూర్తి వ్యత్యాసం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ ప్రభుత్వ పాఠశాలలో చూసినా చిరిగిన బ్యాగులు గుట్టలుగా పడి ఉన్నాయి.బ్యాగును మూటలా మోయాల్సిందే బాపట్ల జిల్లా కొల్లూరు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో చదువుతున్నా. ప్రభుత్వం ఇచి్చన బ్యాగ్ కొద్ది రోజులకే చిరిగిపోయింది. జిప్పు మొత్తం పాడైంది. భుజాలకు తగిలించుకునే బందులూ ఊడిపోయాయి. బ్యాగ్ను ధాన్యం బస్తాను మోసినట్లు భుజంపై పెట్టుకుని పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. – చొప్పర అక్షయ్కుమార్, కొల్లూరు, బాపట్ల జిల్లాఈ చిత్రంలో ఉన్నవారంతా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మున్సిపాల్టీ బ్రాహ్మణ స్ట్రీట్ పురపాలక ప్రాథమిక పాఠశాల విద్యార్థులు. బాబు సర్కారు ఇచ్చిన బ్యాగులు వెంటనే చిరిగిపోవడంతో మార్కెట్లో కొనుక్కున్న వాటితో రోజూ పాఠశాలకు వస్తున్నారు.4,300 మంది విద్యార్థులు.. 3 వేల బ్యాగులు చిరిగాయి.. ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోని పాఠశాలల్లో 4,326 మంది చదువుతున్నారు. వీరికిచ్చిన బ్యాగులు 2 నెలలు కూడా నిలవలేదు. 3 వేల బ్యాగులు చిరిగిపోయాయి. విద్యార్థులు సొంత డబ్బు పెట్టి మార్కెట్లో కొనుక్కున్నారు. కొనలేనివారు చిరిగినవాటినే కుట్టుకుని పాఠశాలకు తెచ్చుకుంటున్నారు.ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇస్తున్న నాణ్యమైన బ్యాగులివి అంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో చెప్పినవి ఇవే. ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తూ, హ్యాండిల్స్ ఊడిపోకుండా బాగా స్టిచ్చింగ్ చేసినట్టు గొప్పలు పోయారు. కానీ, ఆయన చెప్పినదానికి ఇచ్చిన బ్యాగులకు పొంతన లేదు. కొన్ని రోజులకే చిరిగిపోయాయి. కుట్టే వారి వద్దకు కుప్పలు తెప్పలుగా చేరుతున్నాయి.20 రోజులకే చిరిగిపోయిందిఐదో తరగతి చదువుతున్న మా అబ్బాయి ప్రదీప్నకు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన బ్యాగ్ 20 రోజులకే చిరిగిపోయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన బ్యాగ్ రెండేళ్ల పాటు మన్నికగా ఉంది. ప్రస్తుతం నాణ్యత లేని బ్యాగు, సైజ్ తక్కువ ఉన్న బూట్లు పంపిణీ చేశారు. –ముప్పాళ్ల ఎస్తేరు, కొత్తపేట, కంచికచర్ల మండలం, ఎన్టీఆర్ జిల్లాపీచులు పీచులుగా ఊడిపోయింది...మా అమ్మాయి 7వ తరగతి చదువుతోంది. ఈ ఏడాది జూన్ 17న ఇచ్చిన బ్యాగు 20 రోజులైనా గడవక ముందే కుట్లు పీచులుగా పీచులుగా ఊడిపోయింది. పలుసార్లు కుట్టినా లాభం లేకపోయింది. మార్కెట్లో కొని స్కూల్కు పంపుతున్నాం. జగనన్న ఇచ్చిన బ్యాగులు ఎంతో నాణ్యంగా ఉండేవి. నీటిలో కడిగినా చెక్కుచెదరలేదు. మూడేళ్ల పాటు ఉపయోగించాం. – భాగ్యమ్మ, విద్యార్థిని తల్లి, తిరుపతినాలుగైదు సార్లు కుట్లు వేయించినా...ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులను చిన్నచూపు చూడడం సరికాదు. నా ఇద్దరు పిల్లలకు ఇచ్చిన బ్యాగులు కొన్ని నెలలు కూడా ఉపయోగపడలేదు. బ్యాగులను నగరి వెళ్లి నాలుగు సార్లు కుట్లు వేయించా. అయినా నిలువలేదు. చివరికి కొత్తవి కొనిచ్చా. – రామ్మూర్తి, విద్యార్థి తండ్రి, నగరి మండలం, చిత్తూరు జిల్లాకొనుక్కోవడానికి డబ్బులు లేవునేను 8వ తరగతి చదువుతున్నాను. బడిలో ఇచ్చిన బ్యాగు కొద్ది రోజులకే పాడైంది. కుట్టుకొని వాడుకుంటున్నా. కొత్త బ్యాగు కొనుక్కోవాలంటే డబ్బులు కావాలి. మాది పేద కుటుంబం కావడంతో తల్లిదండ్రులను అడగలేకపోతున్నా. – మాలతీ బెహరా, 8వ తరగతి, ఈదుపురం, ఇచ్ఛాపురంఈ విద్యా సంవత్సరంలో బాబు సర్కారు ఇచ్చిన బ్యాగు ఇది... ఇదేమో వైఎస్ జగన్ ప్రభుత్వం రెండేళ్ల కిందట ఇచ్చిన బ్యాగు ఆసాంతం నాణ్యమైన ‘జగనన్న విద్యా కానుక’వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో ప్రభుత్వ విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. పేద పిల్లలు చదువుకునే పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు. తల్లిదండ్రులకు రూపాయి ఖర్చు ఉండకూడదని తపించారు. కార్పొరేట్ స్కూల్ వారితో సమానంగా ఆత్మవిశ్వాసంతో బడికి వెళ్లాలని ‘జగనన్న విద్యా కానుక’ కిట్ను అందించారు. ఏటా సగటున 43 లక్షల మంది విద్యార్థులకు బడి పునఃప్రారంభం మొదటి రోజే పంపిణీ చేశారు. బ్యాగ్, టెక్ట్స్ బుక్స్, నోట్ పుస్తకాలు, జత బూట్లు, రెండు జతల సాక్సులు, వర్క్బుక్స్ (ప్రాథమిక పాఠశాల వారికి), ఇంగ్లిష్–తెలుగు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ (హైస్కూల్), పిక్టోరియల్ డిక్షనరీ, మూడు జతల యూనిఫారం క్లాత్, బెల్టు, టై ఉన్న ఈ కిట్లోని ప్రతి వస్తువు నాణ్యతను స్వయంగా పరిశీలించారు. వస్తువుల నాణ్యత పరిశీలించే బాధ్యతను ‘క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’కు అప్పగించారు. ఇది భారత ప్రభుత్వం మద్దతుతో లాభాపేక్ష లేకుండా నడుస్తున్న సంస్థ. ఇలా నాలుగు విద్యా సంవత్సరాలు రూ.3,366.53 కోట్లతో విద్యా కానుక అందించారు. 2024–25 విద్యా సంవత్సరానికి కూడా జగన్ ప్రభుత్వంలోనే ఆర్డర్ ఇచ్చారు. కానీ, తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం సరఫరాను నిర్లక్ష్యం చేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వం హయాంకు పూర్తి భిన్నంగా ఇప్పుడు జరుగుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.ఏ విద్యార్థిని అడిగినా... ఆవేదనేఉత్తరాంధ్రలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ఎవరిని కదిపినా చిరిగిన బ్యాగులు, పనికిరాని బూట్ల గురించే చెబుతున్నారు. అనంతపురం జిల్లాలో పదిశాతం బ్యాగులు కూడా మన్నిక లేవు. మూణ్నాళ్లు కూడా రాలేదని ఉపాధ్యాయ సంఘాల నేతలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు.తిరుపతి జిల్లాలో 3 లక్షల మంది విద్యార్థులకు గాను 2.42 లక్షలమందికే పంపిణీ చేశారు. ఇందులో 80 శాతం బ్యాగ్లు పక్కనపడేశారు. చిత్తూరు జిల్లాలో రెండు నెలల్లోపే చినిగిపోయాయి.కర్నూలు జిల్లాలో ప్రతి స్కూల్లో బ్యాగ్లు చిరిగాయి. పాతవాటితోనే పిల్లలు పాఠశాలలకు వెళ్తున్నారు. నెల్లూరు జిల్లాలో 2 నెలలకే జిప్లు ఊడి చినిగిపోయాయి. నెల్లూరులో 30 శాతం మంది కొత్తవి కొనుక్కున్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో ఏ పాఠశాలలోనూ విద్యార్థుల వద్ద బ్యాగులు లేవు. బయట కొనుక్కుని వస్తున్నారు. మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్న ధర్మవరం, పెనుకొండలో అధ్వాన పరిస్థితులున్నాయి.నంద్యాల జిల్లాలో మూడేళ్ల కిందట ఇచ్చిన జగనన్న విద్యాకానుకలోని వాటినే విద్యార్థులు వాడుకుంటున్నారు.వైఎస్సార్ కడప జిల్లాలో 1,34,275 బ్యాగులను సరఫరా చేయగా అధిక శాతం చినిగిపోయాయి.ఎన్టీఆర్ జిల్లాలో లక్షమంది విద్యార్థులకు ఇచ్చినా నాసిరకంగా ఉండడంతో చినిగిపోయాయి.ప్రకాశం జిల్లాలో 60శాతం బ్యాగులు పూర్తిగా> పాడయ్యాయి. బాపట్ల జిల్లాలో 87 వేల మందికి బ్యాగ్లు ఇవ్వగా 90 శాతం మొదట్లోనే చిరుగుపట్టాయి.డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో బ్యాగ్లు నాసిరకంగా ఉండడంతో రెండు నెలలకే పాడయ్యాయి.ఏలూరు జిల్లాలో 90 శాతంపైగా విద్యార్థులు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన బ్యాగులతోనే పాఠశాలలకు వెళ్తున్నారు. -
పోలీసులం.. ఏదైనా చేసే హక్కు ఉంది!
తెనాలి అర్బన్: ప్రశాంతంగా ఉండే గుంటూరు జిల్లా తెనాలిలో ‘పోలీసుల అత్యుత్సాహంవల్ల’ గురువారం తీవ్ర రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. టుటౌన్ సీఐ రాములు నాయక్ పోలీసులతో మాజీ శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ఇంటికి చేరుకుని, మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి ఇక్కడ ఉన్నట్లు సెల్ టవర్ ద్వారా సమాచారం ఉందని, ఇంటిని సోదా చేయాలని డ్రైవర్, వాచ్మన్ వద్ద హడావుడి చేయడం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న శివకుమార్ ఇంటి బయటకు వచ్చి ఇదేమి పద్ధతని ప్రశ్నించారు. ఇంతలో మాట మార్చి మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నామని, నోటీసులు తీసుకోవాలంటూ హైడ్రామాకు తెరతీశారు. దీనిని వ్యతిరేకిస్తూ బయటకు నడుచుకుంటూ వస్తున్న ఆయనను సీఐ అడ్డుకుని బయటకు వెళ్ళేందుకు అనుమతి లేదని తెలిపారు. తనను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని శివకుమార్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తాము పోలీసులమని ఏదైనా చేసే హక్కు ఉంటుందని సీఐ అత్యుత్సాహం ప్రదర్శించారు. వాగ్వివాదం నడుమ శివకుమార్ తన కారు ఎక్కటంతో సీఐ అడ్డుగా నిలుచున్నారు. అయితే అప్పటికే అక్కడకు పెద్ద సంఖ్యలో చేరుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు శివకుమార్కు అండగా నిలిచాయి. ఈ క్రమంలో పోలీసుల వలయాన్ని ఆయన ఛేదించి గంగానమ్మపేటలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. చేసేదిలేక పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు.ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేయవద్దు: అన్నాబత్తునిఈ సందర్భంగా శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ, ‘ప్రశాంతంగా ఉండే తెనాలి పట్టణాన్ని కలుషితం చేయాలని చూస్తే సహించేది లేదు. చంద్రబాబు ప్రభుత్వం పోలీసులతో రాజ్యం చేయాలని చేస్తే భయపడే వారు ఎవరు లేరు. ఈ వ్యవహారం మొత్తానికి మంత్రి నాదెండ్ల మనోహర్ బాధ్యత వహించాలి. వైఎస్సార్సీపీ పాలనలో ఇలాంటి వాటికి తావివ్వలేదు. పోలీసులు ఇదేవిధంగా వ్యవహరిస్తే వారి అక్రమాలను బయటపెట్టడానికి కూడా వెనుకాడబోము. ఎవరో మెప్పుకోసం పోలీస్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఊరుకోం’ అని స్పష్టం చేశారు. పోలీసుల ప్రవర్తనపై మంత్రి మనోహర్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
లొంగిపోవడానికి వస్తే అరాచకం!
మాచర్ల/మాచర్ల రూరల్/నరసరావుపేట రూరల్/బాపట్ల : చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా నమోదు చేసిన కేసులో సుప్రీంకోర్టు సూచన మేరకు పిన్నెల్లి సోదరులు పల్నాడు జిల్లా మాచర్ల కోర్టులో లొంగిపోవడానికి వచ్చిన సందర్భంగా ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు పోలీసులు ప్రజాస్వామ్యాన్ని మంటగలిపే రీతిలో వ్యవహరించారు. మాచర్ల ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా అడుగడుగునా తనిఖీలు చేస్తూ షాపులు.. దుకాణాలను బంద్ చేయించారు. సంఘీభావం తెలపడానికి వచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులను బలవంతంగా అడ్డుకున్నారు. జిల్లా వ్యాప్తంగా, మాచర్లలో వైఎస్సార్సీపీకి చెందిన పలువురు పార్టీ నేతలను గృహ నిర్బంధం చేశారు. పలువురిని హెచ్చరిస్తూ నోటీసులు ఇచ్చారు. కోర్టు వద్ద స్వయంగా జిల్లా ఎస్పీ బందోబస్తు పర్యవేక్షించారు. తుదకు పిన్నెల్లి కుటుంబ సభ్యులను, బంధువులను కూడా వారి ఇంట్లోకి అనుమతించక పోవడం ప్రభుత్వ అరాచకానికి అద్దం పడుతోంది. మాచర్ల నియోజకవర్గంలో మే 24వ తేదీన వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నాయకులు బోదిలవీడు వద్ద జవిశెట్టి వెంకటేశ్వర్లు, (అలియాస్ మొద్దయ్య) కోటేశ్వరరావులను తెలుగుదేశం పార్టీ వారే హత్య చేశారని అప్పటి ఎస్పీనే స్పష్టం చేశారు. అయినప్పటికీ ఈ ఘటనలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలపై అక్రమ కేసు బనాయించారు. ఈ హత్య కేసులో తమకు ఏమీ సంబంధం లేదని పీఆర్కే సోదరులు హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించి, బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. సుప్రీంకోర్టు కొన్ని రోజుల పాటు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది. అనంతరం బెయిల్ రద్దు చేస్తూ లొంగిపోవాలని చెప్పింది. ఈ క్రమంలో గురువారం ఉదయం పీఆర్కే సోదరులు తమ లాయర్లతో కలిసి మాచర్ల కోర్టుకు హాజరయ్యారు. జూనియర్ సివిల్ జడ్జి, కోర్టు అడిíÙనల్ జడ్జి ప్రశాంత్ వారికి ఈ నెల 24 వరకు రిమాండ్ విధించగా వైద్య పరీక్షలు చేయించి నెల్లూరు జైలుకు తరలించారు. గృహ నిర్బంధాలు.. బెదిరింపులు పిన్నెల్లి సోదరులకు సంఘీభావం తెలిపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పిన్నెల్లి నివాసం వద్దకు బయలుదేరగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. మాచర్ల పట్టణానికి నలువైపులా కంచె, బారికేడ్లను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ ఐడి కార్డు ఉంటేనే పట్టణంలోనికి అనుమతించారు. రాయవరం జంక్షన్, రచ్చమల్లపాడు, కొత్తపల్లి, గుంటూరు, నర్సరావుపేట రోడ్లు, జమ్మలమడక రహదార్లలో తనిఖీలు చేశారు. కోర్టు వద్ద స్వయంగా జిల్లా ఎస్పీ బందోబస్తు పర్యవేక్షించారు. పీఆర్కేను చూసేందుకు వారి సోదరి, పెద్దమ్మ, బంధువులు వచ్చినా అనుమతించ లేదు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరే శ్యామల, పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్ధారెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. శ్యామల భర్త నర్సారెడ్డిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్లో ఉంచారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, సత్తెనపల్లి సమన్వయకర్త డాక్టర్ గజ్జల సు«దీర్ భార్గవ్రెడ్డిలను అడ్డగించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో బ్లడ్ బుక్ను నడుపుతున్నారని మండిపడ్డారు. నీచ రాజకీయాలకు త్వరలోనే ప్రజలు చరమగీతం పాడతారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి, మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి, వైఎస్సార్పీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్లు నరసరావుపేటలో మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని ప్రభుత్వం పోలీసుల ద్వారా అడ్డుకుంటోందని ధ్వజమెత్తారు. బాపట్ల జిల్లాలో పార్టీ నేతలు వరికూటి అశోక్ బాబు, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, డాక్టర్ అశోక్ కుమార్, ఈవూరి గణేశ్, గాదె మధుసూదన్రెడ్డి తదితరులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రజాస్వామ్యం ఖూనీ న్యాయస్థానంపై గౌరవంతో, న్యాయంపై నమ్మకంతో వారి ఆదేశాల మేరకు కోర్టులో హాజరవుతున్నాం. ఈ సందర్భంగా మాకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న ప్రజలను, నాయకులను, కార్యకర్తలను అడుగడుగునా అడ్డుకోవటం దారుణం. నేతల అక్రమ నిర్బంధాలేంటి? రోడ్లపై అడ్డగింతలేంటి? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి చర్యలు మంచివి కావు. – పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
యూటీసీ - ఐఎస్టీకి తేడా తెలియదా?
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పాఠకులను తప్పుదారి పట్టించేందుకు పచ్చ పత్రిక ఈనాడు కుతంత్రాలను కొనసాగిస్తూనే ఉందని వైఎస్సార్సీపీ నేత గడికోట శ్రీకాంత్రెడ్డి గురువారం విమర్శించారు. అందుకోసం తనదైన శైలిలో వక్రీకరణకు, దుష్ప్రచారానికి తెగబడుతోందని పేర్కొన్నారు. వాస్తవాలను తెలుసుకోకుండా, అధికారికంగా ఉత్తర్వుల కాపీ అందకుండా.. సీబీఐ దర్యాప్తునకు పాక్షిక అనుమతి వార్తను ప్రచురిస్తూ, తప్పుడు సమయాన్ని ముద్రించి పాఠకులకు అనుమానాలు కలిగేలా చేయాలని కుట్ర పన్నిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసును మరింత లోతైన దర్యాప్తునకు సీబీఐని ఆదేశించాలన్న సునీత పిటిషన్పై వెలువడిన పాక్షిక అనుమతి వార్తను ‘ఉత్తర్వుల కాపీ అందకుండానే’ వక్రీకరించే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. అర్ధరాత్రి 1.42 గంటలకే హత్య వార్త మెసేజ్ కిరణ్ యాదవ్ మొబైల్ ఫోన్ నుంచి అర్జున్రెడ్డి మొబైల్ ఫోన్కు వెళ్లిందని పాఠకుల మనస్సుల్లో విషబీజాలు నాటేందుకు ఎల్లో మీడియా కథనాన్ని ప్రచురించిందన్నారు. యూనివర్సల్ టైమ్ కోఆర్డినేటెడ్(యూటీసీ) కాలమానానికి, భారతీయ కాలమానం అయిన ఇండియన్ స్టాండర్డ్ టైమ్ (ఐఎస్టీ)కి తేడా కూడా గుర్తించకుండా విష ప్రచారానికి పాల్పడుతుండడాన్ని శ్రీకాంత్రెడ్డి ఎండగట్టారు. ఈ అంశంపై పచ్చపత్రిక దుష్ప్రచారాన్ని ఆయన మీడియాకు వివరించారు. ఈ హత్య కేసులో ఏ2గా ఉన్న సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్ ఫోన్ నుంచి వైఎస్ ప్రకాశ్ రెడ్డి మనవడు వైఎస్ అర్జున్ రెడ్డి ఫోన్కు వచ్చిన మెసేజ్పై సమగ్ర దర్యాప్తు చేయాలని సునీత తన పిటిషన్లో కోరారు. అదే విషయాన్ని న్యాయస్థానం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఉత్తర్వులు రాకముందే చంద్రబాబు అనుకూల ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని షురూ చేసింది. సునీత తన పిటిషన్లో లేవనెత్తిన అంశాలకు వక్రభాష్యం చెబుతూ చంద్రబాబు డైరెక్షన్లో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు ఎల్లోమీడియా యత్నిస్తోందని శ్రీకాంత్రెడ్డి విమర్శించారు. ఈ అంశంపై పచ్చపత్రిక దుష్ప్రచారాన్ని ఆయన మీడియాకు వివరించారు.వక్రీకరణకు నిలువుటద్దంకిరణ్ యాదవ్ మొబైల్ ఫోన్ నుంచి 2019, మార్చి 14న అర్ధరాత్రి యూటీసీ కాలమానం ప్రకారం 1.42.42 గంటలకు అర్జున్రెడ్డి మొబైల్ ఫోన్కు మెసేజ్ వెళ్లిందని సీబీఐ వెల్లడించింది. అంటే యూటీసీ సమాయానికి 5.30 గంటల సమయం కలిపితే భారతీయ కాలమానం ఐఎస్టీ వస్తుంది. ఆ ప్రకారం 1.42 గంటలకు 5.30 గంటల సమయం కలిపితే... ఉదయం 7.12 గంటలు అవుతుంది. అంటే కిరణ్ యాదవ్ మొబైల్ ఫోన్ నుంచి అర్జున్రెడ్డి మొబైల్ ఫోన్కు 2019, మార్చి 15 ఉదయం 7.12 గంటలకు వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారని మెసేజ్ వచ్చింది. అయితే ఎల్లో మీడియా పాఠకులను తప్పుదారి పట్టిస్తూ అసత్య కథనాన్ని వండి వార్చింది. అర్ధరాత్రి 1.42 గంటలకే హత్య వార్త మెసేజ్ కిరణ్ యాదవ్ మొబైల్ ఫోన్ నుంచి అర్జున్రెడ్డి మొబైల్ ఫోన్కు వెళ్లిందని పాఠకుల మనస్సుల్లో విషబీజాలు నాటేందుకు ఎల్లో మీడియా కథనాన్ని ప్రచురించింది.‘యూటీసీ’కి 5.30గంటల తరువాత ‘ఐఎస్టీ’గూగుల్, ఇతర అంతర్జాతీయ సంస్థలు, దర్యాప్తు సంస్థలు తమ రికార్డుల్లో అంతర్జాతీయ కాలమానం అంటే యూటీసీని నమోదు చేస్తాయి. వాటిని వివిధ దేశాలు తమ కాలమానానికి అనుగుణంగా పరిగణనలోకి తీసుకుంటాయి. ఇది అంతర్జాతీయంగా సర్వసాధారణ ప్రక్రియ. ఇక యూటీసీ కాలమానం కంటే భారతీయ కాలమానం ఐఎస్టీ 5.30 గంటల తరువాత ఉంటుంది. అంటే యూటీసీలో పేర్కొన్న సమయానికి 5.30గంటలు కలిపితే భారతీయ కాలమానం– ఐఎస్టీ వస్తుంది. ఇది హైస్కూల్లోనే విద్యార్థులకు బోధించే విషయం. అదేమీ ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిందీ కాదు. ఎవరికీ తెలియంది కూడా కాదు. అయినా సరే ఎల్లోమీడియా ఆ విషయాన్ని విస్మరిస్తూ దుష్ప్రచారానికి యత్నిస్తున్నాయి. -
‘రెవెన్యూ’లో గందరగోళం
సాక్షి, అమరావతి : రెవెన్యూ అంశాలకు సంబంధించి ప్రధానంగా భూముల విషయాలపై ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఆ అంశాలన్నింటినీ ఏడాదిలోగా పరిష్కరించేందుకు మంత్రులందరూ దృష్టి సారించాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని సమాచార శాఖ మంత్రి కె.పార్థసారధి చెప్పారు. గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. భూ రికార్డులను ట్యాంపర్ చేయడంతో పాటు నలుగురు అన్నదమ్ములుండే కుటుంబంలో మొత్తం ఆస్తిని ఒకరే రాయించుకోవడం, ఎటువంటి ఆధారాలు లేకుండా భూములను 22–ఏలో పెట్టడం, పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వక పోవడం, రెవెన్యూ సిబ్బంది అవినీతికి పాల్పడటంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటి సమస్యలతో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారని సీఎం తెలిపారన్నారు. మంత్రులందరూ ప్రత్యేక దృష్టితో ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడంతో పాటు మొత్తం భూ రికార్డులను ట్యాంపరింగ్కు ఆస్కారం లేకుండా బ్లాక్ చైన్లో ఉంచాలని ఆదేశించారని చెప్పారు. భవిష్యత్లో రెవెన్యూ, భూముల సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపాలని సీఎం స్పష్టం చేశారన్నారు. కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలు ఇలా..» అమృత–2 పథకం కింద పట్టణ స్థానిక సంస్థల్లో రూ.9,514.63 కోట్లతో 506 ప్రాజెక్టులు చేపట్టేందుకు జారీ చేసిన జీవోకు ఆమోదం. మిగిలిన 281 ప్రాజెక్టులను లంప్సమ్ విధానంలో ప్యాకేజీలుగా విభజించి అమలు చేసేందుకు అనుమతి మంజూరు.» అమరావతిలో లోక్భవన్ నిర్మాణాన్ని ఎల్–1 బిడ్డర్కు అప్పగించేందుకు సీఆర్డీఏ కమిషనర్కు అనుమతి.» ఏపీలోని ఎన్హెచ్–16తో అనుసంధానించే 3.5 కిలోమీటర్ల మేర ఇ–3 రోడ్డు (ఫేస్–3) విస్తరణ ప్యాకేజీని రూ.532.55 కోట్లకు ఎల్–1 బిడ్డర్కు ఇచ్చేందుకు ఏడీసీఎస్ చైర్మన్కు అనుమతి.» చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో పలార్ నదిపై చెక్డ్యామ్ మరమ్మతులకు రూ.15.96 కోట్లు.. సవరించిన ప్రతిపాదనలకు ఆమోదం.» గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న 227 మంది తెలుగు పండిట్లు, 91 మంది హిందీ పండిట్లు, 99 మంది వ్యాయామ ఉపాధ్యాయులను మొత్తం 417 మందిని స్కూల్ అసిస్టెంట్లుగా అప్గ్రేడ్ చేసేందుకు ఆమోదం. » ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు పునర్ నిర్మాణం చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులకు ఆమోదం. » కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రూపొందించిన మోడల్ ప్రిజన్స్ చట్టం–2023ను రాష్ట్రంలో అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ చట్టం –2025 ముసాయిదా బిల్లుకు ఆమోదం. ఇందులో భాగంగా ప్రిజన్స్ చట్టం –1894, ప్రిజన్స్ చట్టం–1900, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రిజన్స్ చట్టం 1950లను రద్దు చేస్తూ కొత్త చట్టం అమలుకు కేబినెట్ ఆమోదం. ముసాయిదా బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెడతారు.» ఇటీవల సీఎం అధ్యక్షతన జరిగిన ఎస్ఐపీబీ సమావేశంలో పలు క్వాంటమ్ కంప్యూటింగ్ కంపెనీలు, సంస్థలకు, పర్యాటక ప్రాజెక్టులపై తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం. -
ఫైబర్నెట్ కేసు క్లోజ్!
సాక్షి, అమరావతి: ఫైబర్ నెట్ కుంభకోణం కేసులో సైతం అనుకున్నదే జరిగింది. ఇప్పటికే పలు కుంభకోణాలకు సంబంధించి సీఐడీ గతంలో నమోదు చేసిన కేసులను కొట్టేయించుకున్న సీఎం చంద్రబాబు తాజాగా ఫైబర్ నెట్ కుంభకోణం కేసును కూడా విజయవంతంగా కొట్టేయించుకున్నారు. ప్రభుత్వం అధీనంలో పనిచేసే సీఐడీని పూర్తిగా అదుపులోకి తీసుకుని అధికారులను ప్రభావితం చేసి అనుకూలంగా మార్చుకున్నారు. మాటవినని అధికారులను సస్పెండ్ చేశారు. పలువురిని బదిలీ చేశారు. దాంతో సీఐడీ కేసులన్నీ ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి.కుంభకోణాలపై అనేక ఆధారాలు సేకరించిన సీఐడీ...2014–19 మధ్య కాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పలు కుంభకోణాలు జరిగాయి. అసైన్డ్ భూముల కుంభకోణంపై 2020లో, ఫైబర్ నెట్ కుంభకోణంపై 2021లో, మద్యం కుంభకోణం, ఉచిత ఇసుక కుంభకోణాలపై సీఐడీ 2023లో పలు కేసులు నమోదు చేసింది. చంద్రబాబు, ఆయన మంత్రివర్గంలో ఉన్న పలువురిని నిందితులుగా చేర్చింది. చాలా మంది కీలక సాక్షులను విచారించింది. చంద్రబాబు తదితరుల అక్రమాలను, అవకతవకలను, ఆశ్రిత పక్షపాతాన్ని రుజువుచేసే పలు సాక్ష్యాధారాలను సీఐడీ సేకరించింది. అక్రమాలను నిర్ధారించింది. సకాలంలో దర్యాప్తు పూర్తి చేసి ఏసీబీ కోర్టులో చార్జిషీట్లు సైతం దాఖలు చేసింది.నిందితులే పాలకులు కావడంతో...ప్రభుత్వం మారడం, గతంలో పలు కుంభకోణాల కేసులో నిందితులుగా ఉన్న చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం, అలాగే లోకేశ్, నారాయణ, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర తదితరులు మంత్రులు కావడంతో పరిస్థితి మారిపోయింది. పరిపాలన మొత్తం తమ చెప్పు చేతల్లో ఉండటంతో నిందితులుగా ఉన్న వారు సీఐడీ అధికారులను తీవ్రంగా ప్రభావితం చేశారు. తమపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసిన పలువురు అధికారులను సస్పెండ్ చేశారు. మరికొందరిని బదిలీ చేశారు. తమకు కావాల్సిన వారిని సీఐడీలోకి తీసుకొచ్చారు. ఇదే సమయంలో గతంలో తమపై సీఐడీకి ఫిర్యాదు చేసిన అధికారులు వాసుదేవరెడ్డి, మధుసూధన్రెడ్డి తదితరులను తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. దీంతో చంద్రబాబు, లోకేశ్, నారాయణ తదితరులపై కేసుల మూసివేతకు సీఐడీ రంగం సిద్ధం చేసింది. గతంలో దర్యాప్తు చేసి సేకరించిన కీలక సాక్ష్యాధారాలన్నింటినీ మూలనపడేసింది.అంతా రహస్యమే...చంద్రబాబు తదితరులపై నమోదు చేసిన కేసులను మూసివేయాలని కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పలు పిటిషన్లు దాఖలు చేసింది. వాటిని అత్యంత రహస్యంగా ఉంచింది. ఫిర్యాదుదారులైన వాసుదేవరెడ్డి, మధుసూధన్రెడ్డి వంటి అధికారులను కోర్టుకు తీసుకొచ్చింది. చంద్రబాబు తదితరులపై కేసుల ఉపసంహరణకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వారి చేత చెప్పించింది. ఏసీబీ కోర్టు సైతం వాస్తవ ఫిర్యాదుదారులు ఎవరో తెలుసుకోకుండా చంద్రబాబు తదితరులపై దాఖలైన పలు కేసులను మూసివేస్తూ ఇటీవల ఉత్తర్వులు వెలువరించింది. ఇదంతా గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోయింది. చంద్రబాబుపై కేసులను మూసివేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల కాపీలు ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు. ఏ కారణంతో ఏసీబీ కోర్టు చంద్రబాబు తదితరులపై కేసులను మూసివేసిందో కూడా తెలియడం లేదు. చంద్రబాబుపై కేసుల మూసివేత వ్యవహారం ఇంత రహస్యంగా సాగుతుండటంపై న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.చంద్రబాబుపై పెట్టిన కేసుల్లో సర్టిఫైడ్ కాపీలు ఇవ్వండి...ఈ నేపథ్యంలో చంద్రబాబు, లోకేశ్, నారాయణ తదిత రులపై అసైన్డ్ భూములు, మద్యం, ఉచిత ఇసుక కుంభకోణాలకు సంబంధించి సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లు, దర్యాప్తులో భాగంగా నమోదు చేసిన వాంగ్మూలాలు, దర్యాప్తు పూర్తి చేసి దాఖలు చేసిన చార్జిషీట్లు, కేసులను మూసివేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల సర్టిఫైడ్ కాపీలను అందచేయాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు విజయవాడ ఏసీబీ కోర్టులో థర్డ్ పార్టీ పిటిషన్లు దాఖలు చేశారు.అయితే ఆ కాపీలను అందచేసేందుకు ఏసీబీ కోర్టు నిరాకరిస్తూ 5వ తేదీన ఉత్తర్వులిచ్చింది. ఆ ఉత్తర్వుల కాపీ 6 రోజుల తర్వాత గురువారం బయటకు వచ్చింది. సువర్ణరాజు పిటిషన్ రాజకీయ ప్రేరేపితంగా కనిపిస్తోందని, అందుకే ఆయన అభ్యర్థనను అనుమతించడం లేదని ఉత్తర్వులో పేర్కొన్నారు.గౌతంరెడ్డి ప్రొటెస్ట్ పిటిషన్ కొట్టివేత..ఫైబర్ నెట్ కుంభకోణానికి సంబంధించి చంద్రబాబుపై గతంలో తాము దాఖలు చేసిన కేసును మూసివేయాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ను విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతించింది. సీఐడీ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్ని వ్యతిరేకిస్తూ ఫైబర్ నెట్ లిమిటెడ్ పూర్వ చైర్మన్, ఫిర్యాదుదారు అయిన పూనూరు గౌతంరెడ్డి దాఖలు చేసిన ప్రొటెస్ట్ పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టేసింది. ఈ మేరకు న్యాయాధికారి పి.భాస్కరరావు గురువారం తీర్పు వెలువరించారు. చంద్రబాబు తదితరులపై ఫైబర్ నెట్ మూసివేత కోసం సీఐడీ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్ని వ్యతిరేకిస్తూ గౌతంరెడ్డి ఏసీబీ కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశారు. వాస్తవానికి ఫైబర్ నెట్ కుంభకోణం కేసులో తాను ఫిర్యాదుదారునని, కేసు మూసివేతకు ముందు తనకు నోటీసులు ఇవ్వాల్సి ఉండగా, సీఐడీ ఆ పని చేయలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఫైబర్నెట్ లిమిటెడ్కు అప్పట్లో ఎండీగా ఉన్న మధుసూధన్రెడ్డికి నోటీసులు ఇచ్చి ఆయన చేత కేసు మూసివేతకు అభ్యంతరం లేదని చెప్పించడం చట్ట విరుద్ధమని ఆయన వివరించారు.ఫైబర్నెట్ రింగ్మాస్టర్ చంద్రబాబేసాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాం (2024–19)లో యథేచ్ఛగా సాగిన దోపిడీ పర్వంలో ఫైబర్ నెట్ కుంభకోణం కూడా ఒక అంకం. చంద్రబాబే ఈ కుంభకోణం రింగ్ మాస్టర్. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ను తన అస్మదీయుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి కట్టబెట్టి నిధులు కొల్లగొట్టారని సీఐడీ పూర్తి ఆధారాలతో నిగ్గు తేల్చింది. అందుకే ఏ1గా చంద్రబాబు, ఏ2గా టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ వేమూరి హరికృష్ణ, ఏ3గా ఏపీ ఫైబర్నెట్ కార్పొరేషన్, ఇన్క్యాప్ సంస్థలకు అప్పటి ఎండీ కోగంటి సాంబశివరావులతోపాటు మరికొందరిని నిందితులుగా పేర్కొంది. చంద్రబాబు పన్నాగం ప్రకారమే...మొత్తం రూ.2 వేల కోట్ల ఈ ప్రాజెక్టు కింద మొదటి దశలో రూ.333 కోట్ల విలువైన పనుల్లో అక్రమాలకు చంద్రబాబు బరితెగించారు. తన సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్కే ఈ ప్రాజెక్టును అప్పగించడం కోసం ఆయన్ను ఏపీ ఈ–గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యునిగా చేర్చారు. నిబంధనలకు విరుద్ధంగా ఆయన్ని ఫైబర్నెట్ టెండర్ల మదింపు కమిటీలో సభ్యుడిగా కూడా నియమించారు. ప్రాజెక్టు కోసం బిడ్లు దాఖలు చేసే కంపెనీకి చెందిన వారు టెండర్ల మదింపు కమిటీలో ఉండకూడదన్నది నిబంధన. కానీ చంద్రబాబు ఆ నిబంధనను ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించారు. ఎలాంటి మార్కెట్ సర్వే చేపట్టకుండానే ఈ ప్రాజెక్ట్ కింద సరఫరా చేయాల్సిన పరికరాలు, వాటి నాణ్యతను ఖరారు చేసి ప్రాజెక్ట్ విలువను అమాంతంగా పెంచేశారు. ఇక ఈ ప్రాజెక్ట్ టెండర్ల ప్రక్రియ చేపట్టేనాటికి టెరాసాఫ్ట్ కంపెనీ ప్రభుత్వ బ్లాక్ లిస్ట్లో ఉంది. కానీ చంద్రబాబు ఆ కంపెనీని బ్లాక్ లిస్టు నుంచి ఏకపక్షంగా తొలగించారు. అనంతరం పోటీలో ఉన్న పలు కంపెనీలను పక్కనబెట్టేశారు. టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని పట్టుబట్టిన అధికారి బి.సుందర్ను హఠాత్తుగా బదిలీ చేసి తమకు అనుకూలమైన అధికారులను నియమించారు. నకిలీ ఇన్వాయిస్లతో నిధులు కొల్లగొట్టి..ఇక ప్రాజెక్ట్ను అమలు చేయడంలో కూడా టెరాసాఫ్ట్ కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దాంతో 80 శాతం ప్రాజెక్టు పనులు నిరుపయోగంగా మారాయి. మరోవైపు షెల్ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని అక్రమంగా తరలించారు. వేమూరి హరికృష్ణ తన సన్నిహితుడు కనుమూరి కోటేశ్వరరావు సహకారంతో కథ నడిపించారు. వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో కనుమూరి కోటేశ్వరరావు భాగస్వామిగా ఉన్నారు. వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్కుమార్ రామ్మూర్తిలతో కలసి విజయవాడ కేంద్రంగా నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ ఎల్ఎల్పీ అనే మ్యాన్పవర్ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్ కంపెనీని సృష్టించారు. ఆ కంపెనీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుకు సిబ్బందిని సమకూర్చినట్లు, పర్యవేక్షించినట్లు కథ నడిపించారు. ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీ, ఇతర కంపెనీలకు చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రూ.284 కోట్లు విడుదల చేసింది. నకిలీ ఇన్వాయిస్లతో ఆ నిధులను కొల్లగొట్టి, కనుమూరి కోటేశ్వరరావు ద్వారా అక్రమంగా తరలించారు. వాటిలో రూ.144 కోట్లను షెల్ కంపెనీల ద్వారా తరలించారు. ఇక నాసిరకమైన పనులతో కూడా ప్రభుత్వ ఖజానాకు రూ.119.8 కోట్ల నష్టం వాటిల్లిందని నిగ్గు తేల్చింది.అక్రమాలు తేల్చిన మధుసూధన్రెడ్డితోనే అభ్యంతరం లేదని చెప్పించిన సీఐడీ...ఫైబర్ నెట్ లిమిటెడ్ ఎండీగా మధుసూధన్రెడ్డి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను నిర్ధారించిన విషయాన్ని గౌతంరెడ్డి ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. భారీ మొత్తంలో నిధుల దుర్వినియోగం జరిగినట్లు తేల్చిన విషయాన్ని కూడా కోర్టుకు తెలియచేశారు. అయినా మధుసూధన్రెడ్డి ఫైబర్ నెట్ కుంభకోణంపై చంద్రబాబు తదితరులపై నమోదు చేసిన కేసును మూసివేసేందుకు అభ్యంతరం లేదని చెప్పడంపై గౌతంరెడ్డి తన పిటిషన్లో విస్మయం వ్యక్తం చేశారు. ఈ కుంభకోణం కేసులో సీఐడీ సేకరించిన ఆధారాలను, చార్జిషీట్లు పరిశీలించి ఆ తరువాతనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. సీఐడీ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్, గౌతంరెడ్డి దాఖలు చేసిన ప్రొటెస్ట్ పిటిషన్పై ఇటీవల వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయాధికారి భాస్కరరావు గురువారం తన నిర్ణయాన్ని వెలువరించారు. చంద్రబాబు తదితరులపై కేసు మూసివేయాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ను అనుమతించారు. ఇదే సమయంలో గౌతంరెడ్డి దాఖలు చేసిన ప్రొటెస్ట్ పిటిషన్ను తోసిపుచ్చుతూ ఉత్తర్వులిచ్చారు. అయితే ఉత్తర్వుల కాపీ అందుబాటులోకి రాలేదు. ఏ కారణాలతో సీఐడీ పిటిషన్ను అనుమతించారు, ఏ కారణాలతో గౌతంరెడ్డి పిటిషన్ను తోసిపుచ్చారో అన్న వివరాలు తెలియాల్సి ఉంది. -
చెరువులను చెరబట్టిన సీఆర్డీఏ
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి పేరుతో ఆ ప్రాంత రైతులకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు అన్నీ ఇన్నీ కావు. తొలి దశ కింద పదేళ్ల క్రితం భూ సమీకరణకు భూములిచ్చిన రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లలో కొన్ని రిజిస్ట్రేషన్ చేసినా, ఇప్పటి వరకు ఆ ప్లాట్లను అభివృద్ధి చేయలేదు. మరికొందరికి అసలు ప్లాట్లే ఇవ్వలేదు. ఇప్పుడు రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) చెరువు భూములను ప్లాట్లుగా మార్చి, రైతులకు ఇచ్చి, వారిని మోసం చేస్తోంది. ఇది రైతులకు ఇచ్చిన హామీకి పూర్తి విరుద్ధం. పైగా, భవిష్యత్తులో ఇవి చెరువు భూములంటూ ప్రభుత్వమే ఇక్కడి నుంచి రైతుల ఇళ్లను కూలగొట్టి, పంపించేసే అవకాశాలు అధికం. ఇలా చంద్రబాబు ప్రభుత్వం రైతులకు కూడా వెన్నుపోటు పొడుస్తోంది. సందట్లో సడేమియాగా అర్హులు కాని తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులకూ ప్లాట్లు ఇచ్చుకుంటోంది. రాజధాని ప్రాంతంలో పలువురు రైతులను నిలువునా ముంచేందుకు చంద్రబాబు సర్కారు నేతృత్వంలోని సీఆర్డీఏ చెరువుల భూములను కబ్జా చేసింది. రాజధాని కోసం భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్) కింద భూములు ఇచ్చిన రైతులకు వాటిలో రెసిడెన్షియల్ ప్లాట్లు (నివాస స్థలాలు) రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది. ఆ ముసుగులో టీడీపీ సానుభూతిపరులు, ప్రభుత్వ పెద్దల సన్నిహితులకు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిందంటూ రైతులు ఆరోపిస్తున్నారు. తుళ్లూరు, పిచ్చుకలపాలెం చెరువు భూములలో రెసిడెన్షియల్ ప్లాట్లను సీఆర్డీఏ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడమే అందుకు ఆధారం. దొండపాడు చెరువును కబ్జా చేసి, చదును చేసి సీడ్ యాక్సిస్ రోడ్డును నిర్మించడం మరో నిదర్శనం. గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి మండలాల్లో 29 గ్రామాలలోని 29,233 మంది రైతులు 34,937.33 ఎకరాలను రాజధాని నిర్మాణం కోసం ‘భూ సమీకరణ’ కింద సీఆర్డీఏకు ఇచ్చారు. ఈ రైతులకు మెట్ట భూమి ఎకరానికి అభివృద్ధి చేసిన 1000 గజాల రెసిడెన్షియల్, 200 గజాల వాణిజ్య (కమర్షియల్) ప్లాట్లు ఇస్తామని, మాగాణి (జరీబు) భూమైతే ఎకరానికి 1000 గజాల నివాస, 450 గజాల కమర్షియల్ ప్లాట్ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ మేరకు 29,233 మంది రైతులకు 69,421 ప్లాట్లను కేటాయించామని, ఇప్పటివరకూ 27,105 మంది రైతులకు 61,753 ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చామని సీఆర్డీఏ చెబుతోంది. ఇంకా 2,128 మంది రైతులకు 7,668 ప్లాట్లను ఇవ్వాల్సి ఉందని పేర్కొంది. చెరువును అసైన్డు భూమిగా చిత్రీకరించి..తుళ్లూరు మండలం పిచ్చుకలపాలెంలో రీసర్వే అండ్ రీసెటిల్మెంట్ రిజిస్టర్ (ఆర్ఎస్ఆర్) ప్రకారం సర్వే నంబరు 87లో 11.25 ఎకరాలు, సర్వే నంబరు 88లో 0.31, 89లో 0.59 ఎకరాలు చెరువు భూమి అని స్పష్టంగా ఉంది. ఆ గ్రామ భౌగోళిక మ్యాప్లోనూ సర్వే నంబరు 87లో చెరువు ఉన్నట్లు చూపుతోంది. కానీ, ఆ చెరువు భూమిలో 78 మందికి సీఆర్డీఏ రెసిడెన్షియల్ ప్లాట్లను రిజిస్ట్రేషన్ కూడా చేసి ఇచ్చేసింది. ఆ ప్లాట్ల రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే నంబరు 87లో భూమి అసైన్డు భూమిగా సీఆర్డీఏ పేర్కొనడం గమనార్హం. అంటే... పిచ్చుకలపాలెం చెరువులో 11.25 ఎకరాల భూమిని అసైన్డు భూమిగా మార్చేశారన్నది స్పష్టమవుతోంది. కొండవీటి వాగు వరదను మళ్లించేందుకు నెక్కల్లు నుంచి పిచ్చుకలపాలెం వరకూ 7.83 కిలోమీటర్ల పొడవున తవ్వుతున్న గ్రావిటీ కెనాల్ను పిచ్చుకలపాలెం చెరువులోనూ కొంత భాగం తవ్వారు. ఆ కెనాల్కు అటు ఇటుగా ఈ 78 మందికి ప్లాట్లు కేటాయించడం గమనార్హం. ఇక తుళ్లూరులో సర్వే నెంబరు 80లో 33.06 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. ‘మీ భూమి’ వెబ్సైట్లో ఇప్పటికీ అది చెరువు భూమే అని అడంగల్ రికార్డు స్పష్టం చేస్తోంది. కానీ.. ఆ చెరువు భూమిలో 65 మందికి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేసింది. ఇక ప్రధాన రాజధాని ప్రాంతం (సీడ్ కేపిటల్)ను కోల్కత–చెన్నై జాతీయ రహదారితో అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం దొండపాడు చెరువును సీఆర్డీఏ కబ్జా చేయడం గమనార్హం. ఆ చెరువును చదును చేసి రోడ్డు నిర్మించింది. చెరువును పరిరక్షించాల్సింది పోయి..కొండవీటివాగు, పాలవాగు ముంపు నుంచి రాజధాని అమరావతిని తప్పించడానికి ప్రపంచ బ్యాంకు సూచనల మేరకు నెదర్లాండ్కు చెందిన నిపుణులు రూపొందించిన ప్రణాళిక ప్రకారం ముంపు ముప్పు నివారణ పనులను సీఆర్డీఏ చేపట్టింది. చిన్నపాటి వర్షం కురిస్తే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలకు తరచుగా ముంపు సమస్య ఉత్పన్నమవుతోంది. దీనికి ప్రధాన కారణం చెరువులు, వాగులు, వంకలు ఆక్రమించడమేనన్నది బహిరంగ రహస్యమే. అసలే ముంపు ముప్పు ఉన్న రాజధాని ప్రాంతంలో చెరువులను కబ్జా చేసి, వాటి స్వరూపాన్ని మార్చేస్తే వరద ముప్పు మరింత పెరుగుతుందని పర్యావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వరద ముప్పు, భూగర్భ జలాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకునే.. ఎలాంటి పరిస్థితుల్లోనూ చెరువులు, వాగులు, వంకలు, నదులు, జలాశయాల భూమిని ఇతర అవసరాలకు మళ్లించకూడదని.. వాటిని పూర్తి స్థాయిలో పరిరక్షించే బాధ్యత ప్రభుత్వాలదేనని సుప్రీం కోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) అనేక సార్లు స్పష్టమైన ఆదేశాలిచ్చాయని గుర్తుచేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వాటిని తుంగలో తొక్కి చెరువు భూములను రెసిడెన్షియల్ ప్లాట్ల కింద ఇచ్చేయడం, సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మించడం సుప్రీంకోర్టు, ఎన్జీటీ ఆదేశాలను అపహాస్యం చేయడమేనని పర్యావరణవేత్తలు, న్యాయనిపుణులు అంటున్నారు.అనర్హులే అధికం..రాజధానికి భూములిచ్చిన రైతులకు మాత్రమే ల్యాండ్ పూలింగ్ స్కీం కింద అభివృద్ధి చేసిన రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్లు సీఆర్డీఏ ఇవ్వాలి. ఆ ప్లాట్లను భూసమీకరణ కింద తీసుకున్న భూములలోనే ఇవ్వాలి. కానీ.. పిచ్చుకలపాలెం చెరువు భూమిలో 78 మందికి, తుళ్లూరు చెరువు భూమిలో 65 మందికి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయడం బట్టి చూస్తే.. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకూ చంద్రబాబు సర్కారు వెన్నుపోటు పొడిచిందన్నది స్పష్టమవుతోంది. ఆ ప్లాట్లలో ఇళ్లను నిర్మించుకుంటే.. చట్టప్రకారం భవిష్యత్లో వాటిని కూల్చేయడం ఖాయమని, అప్పుడు తమ పరిస్థితి ఏమిటని రైతులు నిలదీస్తున్నారు. ఇక్కడ టీడీపీ సానుభూతిపరులు, ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన వారికి కొన్ని ప్లాట్లు అక్రమంగా కేటాయించారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే చెరువు భూమిని సీఆర్డీఏ అసైన్డు భూమిగా చిత్రీకరించిందని మండిపడుతున్నారు. చెరువును మాయం చేస్తే భూగర్భ జలాలు అడుగంటిపోతాయని, వాతావరణ సమతుల్యత దెబ్బతిని తీవ్ర ఇబ్బందులు పడతామని పిచ్చుకలపాలెం, తుళ్లూరు వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.చెరువు భూమిలో ప్లాట్లు ఎలా ఇస్తారు?పిచ్చుకలపాలెంలో సర్వే నంబరు 87లో 11.25 ఎకరాల భూమిలో చెరువు ఉంది. ఆర్ఎస్ఆర్, రెవెన్యూ మ్యాప్ ప్రకారం ఆ సర్వే నంబరులో చెరువు ఉందన్నది స్పష్టం. సీఆర్డీఏ అధికారులు 78 మందికి రెసిడెన్షియల్ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేశారు. ఇది అక్రమం కాదా? ఆ ప్లాట్లలో ఇళ్లు నిర్మించుకుంటే భవిష్యత్తులో వాటిని కూల్చరని గ్యారంటీ ఇచ్చేదెవరు?రాజధానికి భూములు ఇచ్చిన పాపానికి మాకు చెరువు భూమిలో ప్లాట్లు అంటగట్టి మోసం చేస్తారా? పిచ్చుకలపాలెం చెరువు భూమిలో ప్లాట్లు ఇచ్చిన వారిలో రైతులు కాని వారు కూడా ఉన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. – బ్రహ్మంచౌదరి, రైతు, పిచ్చుకలపాలెం -
YSRCPలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా పలువురి నియామకం జరిగింది.షేక్ గౌస్ మొహిద్దిన్ (విజయవాడ వెస్ట్), మీర్ హుస్సేన్ (విజయవాడ ఈస్ట్), కర్నాటి రాంబాబు (విజయవాడ వెస్ట్), మీర్జా సమీర్ అలీ బేగ్ (మార్కాపురం), ఆర్. శ్రీనివాసులురెడ్డి (పలమనేరు), కె.కృష్ణమూర్తిరెడ్డి (పలమనేరు), పోలు సుబ్బారెడ్డి (రాయచోటి), ఉపేంద్ర రెడ్డి (రాయచోటి), డి. ఉదయ్ కుమార్ (మదనపల్లె), వి.చలపతి (కోవూరు), గువ్వల శ్రీకాంత్ రెడ్డి (సింగనమల), డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి (తాడిపత్రి), సుభాష్ చంద్రబోస్ (కర్నూలు), రఘునాథరెడ్డి (జమ్మలమడుగు), ఎస్. ప్రసాద్ రెడ్డి (కమలాపురం), పార్టీ ఎస్ఈసీ సభ్యునిగా ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి (రాయచోటి) నియమితులయ్యారు. -
ఏపీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి: వైవీ
ఢిల్లీ: ఓటర్ల విశ్వసనీయతను దెబ్బతీసేలా ఈసీ వ్యవహరించొద్దని.. ఎన్నికల సంఘం పారదర్శకంగా, స్వతంత్రంగా వ్యవహరించాలని వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాజ్యసభలో ఎన్నికల సంస్కరణలపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యానికి కస్టోడియన్లా ఉండాలన్నారు. ఏపీ ఎన్నికల అవకతవకలపై వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతుండగా టీడీపీ ఎంపీలు అడ్డుతగిలారు.ఏపీ ఎన్నికలలో అవకతవకలు జరిగాయని.. హడావుడిగా ఎస్ఐఆర్ నిర్వహించడం వల్ల అనేక అనుమానాలు వస్తున్నాయని వైవీ అన్నారు. పని భారంతో బీఎల్వోలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పౌరులకు ఎస్ఐఆర్ పైన తగిన సమాచారం ఇవ్వలేదు. నిజమైన ఓటర్లను తొలగిస్తున్నారు. ఏపీలో 2024 ఎన్నికల కౌంటింగ్లో అనేక లోపాలు బయటపడ్డాయి’’ అని వైవీ సుబ్బారెడ్డి వివరించారు.‘‘మైదుకూరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితాను మించి ఓట్లు రికార్డు అయ్యాయి. ఫామ్ 20లో మాత్రం జీరో ఓట్స్ రికార్డ్ చేశారు. హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఇదే తరహాలో జరిగింది. మా పార్టీకి పార్లమెంట్ ఎన్నికలకు 472 ఓట్లు వస్తే, అసెంబ్లీ ఎన్నికలకు 1 ఓటు మాత్రమే వచ్చింది. సాంకేతికతను ఉపయోగించి అనేక అక్రమాలకు పాల్పడ్డారు. పోలింగ్ స్టేషన్లలో సీసీ ఫుటేజ్ను కూడా ఇవ్వడం లేదు. సాయంత్రం 6 తర్వాత పోలింగ్ శాతం ఆకస్మాత్తుగా పెరగడం దేనికి సంకేతం’’ అంటూ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. -
చంద్రబాబుపై డి.రాజా ఆగ్రహం
సాక్షి,అనంతపురం: చంద్రబాబు పరిపాలనపై భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ ప్రధాన కార్యదర్శిగా డి.రాజా (దొరైసామి రాజా) ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి చంద్రబాబు ఎందుకు మద్దతు ఇస్తున్నారో అర్థం కావడం లేదు. అంబేద్కర్ స్ఫూర్తికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వ పాలన సాగుతోంది. రాజ్యాంగాన్నే మార్చాలని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తున్నా చంద్రబాబు మౌనంగా ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు. -
చంద్రబాబుని లెక్క చేయని మంత్రులు!
సాక్షి, విజయవాడ: ఎమ్మెల్యేలు మాత్రమే కాదు.. మంత్రులు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని లైట్ తీసుకుంటున్నారా?. పద్దతి మార్చుకోవాలని పదే పదే చెబుతున్నా.. తమ దారి తమదేనన్న రీతిలో వాళ్లు వ్యవహరిస్తుండడం, దానికి ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం రోటీన్గా మారిపోయింది. ఈ క్రమంలో.. ఇవాళ కేబినెట్ మీటింగ్లోనూ సీన్ రిపీట్ అయ్యింది. ఏకంగా మంత్రులపైనే చంద్రబాబు చిందులు తొక్కినట్లు సమాచారం. ఇంతకీ ఎందుకు అంటారా?.. మంత్రులు కాస్త లేట్గా కేబినెట్ మీటింగ్కు వచ్చారట!. దీంతో నా అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీనే పట్టించుకోరా? అని మండిపడ్డారట!. ఆపై ఏమనుకున్నారో ఏమో కాస్త శాంతించి.. మంత్రులు అయ్యి ఉండి మీరే టైంకి రాకపోతే ఎలా?.. అని కాస్త తగ్గిన వాయిస్తో చంద్రబాబు మాట్లాడారట. అలా లేట్గా వచ్చిన వాళ్లలో ఆనం రామనారాయణరెడ్డి, సంధ్యారాణి, సుభాష్లు ఉన్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. మంత్రుల పనితీరుపై అసహనం వ్యక్తం చేసిన మరుసటి రోజే ఈ ఘటన జరగడంతో ఆయనలోని కోపధారి బయటకు వచ్చినట్లు స్పష్టమవుతోంది. బుధవారం ఏం జరిగిందంటే.. రాష్ట్ర మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం నిర్వహించిన హెచ్ఓడీల (హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్) సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో పలుమార్లు సూచనలు చేసినప్పటికీ మంత్రుల పనితీరులో ఎలాంటి మార్పు కనిపించడం లేదన్నారు. ‘‘చాలా మంది మంత్రులకు తమ శాఖల్లో ఏం జరుగుతుందో కూడా స్పష్టంగా తెలియడం లేదు. మంత్రులు తమ శాఖలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఫైళ్ల పురోగతి, ప్రాజెక్టుల స్థితి, బడ్జెట్ వినియోగం వంటి అంశాలపై రోజువారీగా సమీక్ష చేయాలి’’ అన్నారు. అలాగే.. కేంద్రం నుంచి నిధులు రప్పించడంలో మంత్రులు అట్టర్ప్లాప్ అవుతున్నారంటూ అసహనం వ్యక్తం చేశారని అధికార వర్గాలు తెలిపాయి. -
వైద్యం ప్రైవేటీకరణపై ‘కోటి’ గళాలు!
చంద్రబాబు పాలనపై ప్రతిఘటన యుద్ధం మొదలైంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమం కలం కలం కలిసి కోటి గళాల స్వరంగా మారింది. వైద్యం ప్రైవేటీకరణపై కోటి గళాలు ఏకమై చంద్రబాబు పాలనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఊరూ వాడా ఏకమై కదులుతుంది. ఏపీలో వైఎస్సార్సీపీ తలపెట్టిన కోటి సంతకాల ఉద్యమం కేవలం ఒక నిరసన మాత్రమే కాదు, అది ప్రజల సమిష్టి ప్రతిఘటన. చంద్రబాబు పాలనపై రణభేరీ అంటే సరిగ్గా సరిపోతుందేమో. కలం కలం కలిసి.. ప్రజా గళంగా మారి..ఏపీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తెచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలనే చంద్రబాబు సర్కారు అనాలోచిత నిర్ణయం అనంతరం వైఎస్సార్సీపీ కోటి సంకతాల సేకరణకు పిలుపునిచ్చింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈ పిలుపు ఇచ్చింది మొదలుకొని ప్రజా సమర సంతకం ఒక్కొక్కటిగా ఊపిరి పోసుకుంది. అది కోటికి పైగా సంతకాల సేకరణతో నిలువెత్తు ప్రజా ఉద్యమంగా మారిపోయింది. ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేసి మెడికల్ కాలేజీలను ప్రేవేటుపరం కాకుండా చూడాలని తమ సంతకంతోనే సమాదానం చెప్పారు.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపుతారా.. లేదా అని ప్రశ్నించడమే కాదు.. కచ్చితంగా ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. లక్ష్యం.. కోటి సంతకాలు.. కానీ..వైఎస్సార్సీపీ నిర్దేశించుకున్న లక్ష్యం కోటి సంతకాలు. కానీ ఆ ప్రజా ఉద్యమానికి అనూహ్య స్పందన వచ్చింది. కోటి సంతకాలతో లక్ష్యం పూర్తయినా, జనం నుంచి స్పందన వస్తూనే ఉంది. ఇప్పుడు ఆ కోటి సంతకాల సంఖ్య దాటిపోయింది. దీనికి ప్రజలు విస్తృతంగా మద్దతు తెలపడంతో కోటి సంతకాల సేకరణ కాస్తా కోట్లాడి గళాల నిరసనగా రూపాంతరం చెందింది. కార్పొరేట్ ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. ఈ కార్పొరేట్ చర్యను వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రజా స్వరం.. సంతకాల రూపంలో ఉద్యమించింది. ప్రతిఘటనగా మారి..వైఎస్ జగన్ తన హయాంలో ప్రారంభించిన 17 మెడికల్ కాలేజీలలో 7 పూర్తయ్యాయి, 5లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి.- ఇప్పుడు వాటిని పీపీపీ మోడల్ పేరుతో ప్రైవేటీకరించడానికి చంద్రబాబు ప్రభుత్వం చూస్తుంది. వైద్య విద్యను అత్యంత కాస్ట్లీగా మార్చాలనే చంద్రబాబు ప్రయత్నాన్నిప్రజా ఉద్యమంతోనే తిప్పికొట్టాలని వైఎస్సార్సీపీ భావించింది. ఆ క్రమంలోనే కోటి సంతకాల సేకరణకు పూనుకుంది. ఇది అత్యంత విజయవంతమై జనసంద్రంగా మారింది. అయితే ఈ అంశంపై 18వ తేదీన గవర్నర్ను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కలిసి వినతి పత్రం అందజేయనున్నారు. ప్రజల స్పందనను గవర్నర్ ముందుకే తీసుకుపోనున్నారు వైఎస్ జగన్. ర్యాలీలు, సమావేశాలు..కోటి సంతకాల సేకరణ అనంతరం గ ప్రజా ఉద్యమం పత్రాలను జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయాలకు తరలిస్తున్నారు. నిన్న(బుధవారం, డిసెంబర్ 10వతేదీన) ఈ కార్యక్రమం రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో విజయవంతంగా జరిగింది. సుమారు అన్ని జిల్లా పార్టీ కేంద్రాలయాకు ఈ ప్రతులు చేరిపోయాయి. 15వ తేదీన విజయవాడకు వీటిని తరలించనున్నారు. ఆపై 18వ తేదీన గవర్నర్ను వైఎస్ జగన్ కలవనున్నారు. మొత్తంగా, "కోటి సంతకాల ఉద్యమం" ఆంధ్రప్రదేశ్లో ప్రజల ఆగ్రహాన్ని ప్రతిబింబిస్తూ, బాబు పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజా ప్రతిఘటనగా మారింది. బాబు పాలనపై వ్యతిరేకతను బహిర్గతం చేస్తూ, ఈ ఉద్యమాన్ని ప్రజా శక్తి ప్రదర్శనగా మలచింది. గవర్నర్కు సంతకాలు సమర్పించిన తర్వాత, ఈ ఉద్యమం రాజకీయ చర్చలకు కేంద్రబిందువుగా మారే అవకాశం ఉంది. -
ఇట్లు... పుట్టా సంస్థకు రూ.4.40 కోట్లు
సాక్షి, అమరావతి: టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్యాదవ్ సంస్థ పీఎస్కే–హెచ్ఈఎస్ (జేవీ)పై ప్రభుత్వం వల్లమాలిన ప్రేమ ఒలకబోస్తోంది. పోలవరం ఎడమ కాల్వ 5–ఏ ప్యాకేజీలో అడుగు (బెడ్) భాగం వెడల్పు పెరగడం వల్ల 2016–19 మధ్య అదనంగా మట్టి తవ్వకం, కాంక్రీట్ లైనింగ్ పనులు చేశారని, అందుకు రూ.4.40 కోట్లను అదనంగా చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో చేసిన పనులకు అదనపు బిల్లులు చెల్లించాలని పుట్టా సంస్థ పోలవరం సీఈకి ప్రతిపాదించగా... అధికారి ప్రభుత్వానికి నివేదించారు. దీనికి ఈ ఏడాది జూలై 30న స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ (ఎస్ఎల్టీసీ) ఆమోదం తెలిపింది. అనంతరం ఎస్ఎల్టీసీ సిఫార్సుతో పుట్టా సంస్థకు అదనంగా చెల్లించాలని సెప్టెంబరు 7న పోలవరం సీఈ పంపిన ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది.⇒ పోలవరం ఎడమ కాల్వలో ఐదో ప్యాకేజీ (93.7–111.487 కి.మీ.) పనులను రూ.181.60 కోట్లకు సాబీర్ డ్యామ్ వాటర్ వర్క్స్ 2005 మార్చి 23న దక్కించుకుంది. అయితే, 5.754 కి.మీ. కాల్వ తవ్వకం, 11.001 కి.మీ. లైనింగ్, 33 కాంక్రీట్ పనులను ఆ సంస్థను నుంచి తప్పించి రూ.142.88 కోట్లకు పీఎస్కే–హెచ్ఈఎస్ (జేవీ)కి నామినేషన్ పద్ధతిపై 2016 నవంబర్ 30న చంద్రబాబు సర్కార్ కట్టబెట్టింది.⇒ 100.3 కి.మీ. నుంచి 102.5 కి.మీ., 110.5 కి.మీ. నుంచి 111.487 కి.మీ. వరకు కఠిన శిల (హార్డ్ రాక్)తో కూడిన భూమిని బ్లాస్టింగ్ చేయాలని, 3,77,938 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వాల్సి వస్తుందని దీనికి రూ.1.11 కోట్లు అదనంగా చెల్లించాలని 2018 మే 22న నాటి టీడీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక కాంక్రీట్ నిర్మాణాల్లో మార్పుల వల్ల అదనంగా రూ.38.986 కోట్లు చెల్లించాలని 2018 జూలై 10న మరో ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు పీఎస్కే–హెచ్ఈఎస్ సంస్థతో పోలవరం అధికారులు సప్లిమెంటరీ అగ్రిమెంట్లు చేసుకున్నారు. దాంతో ఆ సంస్థకు రూ.180 కోట్లకు పైగా విలువైన పనులను అప్పగించినట్లైంది.⇒ 2019 అక్టోబర్ 3 నాటికి పీఎస్కే–హెచ్ఈఎస్ సంస్థ రూ.117.05 కోట్ల విలువైన పనులు పూర్తి చేసింది. కాగా, పుట్టా సంస్థకు నామినేషన్పై అప్పగించిన పనులను రద్దు చేసి, వాటికి రివర్స్ టెండరింగ్ నిర్వహించాలన్న నిపుణుల కమిటీ చేసిన సూచనను గత ప్రభుత్వం అమలు చేసింది. కానీ, మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక.. పుట్టా సంస్థ ఎడమ కాల్వ 5–ఏ ప్యాకేజీలో 100.3 కి.మీ. నుంచి 102.50 కి.మీ. వరకు 2016–19 మధ్య కంట్రోల్ బ్లాస్టింగ్లో 16,69,476 క్యూబిక్ మీటర్ల మట్టిపని చేశారని చూపి క్యూబిక్ మీటర్కు అదనంగా రూ.78 చొప్పున రూ.13,25,59,128 చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్టోబర్ 15న ఉత్తర్వులు జారీ చేసింది. 2017 ఆగస్టు 6న ఎల్ఎస్సీ (డిస్ట్రిక్ లెవల్ శాంక్షన్ కమిటీ) ప్రతిపాదన మేరకు చెల్లించిన రూ.9,94,19,274 పోగా మిగిలిన రూ.3,31,39,854 మంజూరు చేయాలని పేర్కొంది. గతంలో డీఎల్ఎస్సీ చేసిన ప్రతిపాదనపై ఈ ఏడాది జూన్ 25న అంటే ఎనిమిదేళ్ల తర్వాత నిర్వహించిన సమావేశంలో ఎస్ఎల్టీసీ (స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ) ఆమోద ముద్ర వేసిందని, ఆ మేరకే అదనపు బిల్లులు చెల్లించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. ఇప్పటికే పుట్టా సంస్థకు అదనపు బిల్లుల రూపంలో రూ.53.34 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చినట్లు స్పష్టమవుతోంది. -
సారీ మేడమ్.. మీరు రికార్డుల్లో చనిపోయారు
మేడికొండూరు: కళ్లెదుట మనిషి బతికి ఉన్నా.. కంప్యూటర్లలో మాత్రం ఆమెను ఎప్పుడో చంపేసింది ప్రభుత్వం. సంక్షేమ పథకాల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ఆ మహిళకు ఈ విషయం తెలిసి గుండె ఆగినంత పనైంది. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం, భీమనేనివారిపాలెంలో బుధవారం ఈ ఘటన జరిగింది. భీమనేనివారిపాలెం గ్రామానికి చెందిన మహిళా రైతు మద్దినేని రాధారాణికి ప్రభుత్వం నుంచి రావాల్సిన ’అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్’ డబ్బులు జమ కాలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆమె, బుధవారం గ్రామం పరిధిలోని అన్నదాత సుఖీభవ కేంద్రానికి వెళ్లింది. అక్కడి సిబ్బందిని తన స్టేటస్ చెక్ చేయమని కోరింది. కంప్యూటర్లో వివరాలు పరిశీలించిన సిబ్బంది నీళ్లు నమిలారు. మీరు చనిపోయినట్లు రికార్డుల్లో నమోదైంది అని చెప్పడంతో ఆమె కంగుతింది. ‘అయ్యా.. నేను మీ కళ్ల ముందే ఉన్నాను కదా! నన్ను చనిపోయినట్లు ఎలా రాస్తారు?‘ అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా ఒక ఎంట్రీ తప్పుగా నమోదు కావడం వల్ల అర్హులైన పేదలకు అందాల్సిన సంక్షేమ ఫలాలు ఆగిపోతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే ప్రభుత్వం ఇష్టారాజ్యంగా రికార్డులు ఎలా మారుస్తుందని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా రికార్డులను సరిచేసి తనకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బులు వెంటనే విడుదల చేయాలని రాధారాణి కోరుతున్నారు. -
మళ్లీ రూ.15,651.93 కోట్ల కరెంట్ చార్జీల వడ్డన
సాక్షి, అమరావతి: ‘‘విద్యుత్ చార్జీలు పెంచం..ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం’’ బుధవారం అమరావతిలో హెచ్ఓడీల సదస్సు సాక్షిగా సీఎం చంద్రబాబు చెప్పిన మాటలివి. ఎన్నికల ముందు కూడా ఆయన ఇలాంటి కబుర్లు ఎన్నో చెప్పారు. ఊరూవాడా ప్రచార సభల్లో ఊదరగొట్టారు. ఒకవైపు వఖ్యమంత్రి బుధవారం ఇలా మాట్లాడుతుండగానే రాష్ట్ర ప్రజలపై కొత్త సంవత్సరంలో మోపనున్న కరెంటు చార్జీల భారం విషయం బైటపడింది. కొత్తగా రూ.15,651.93 కోట్ల మేర విద్యుత్ చార్జీల బాదుడుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రంగం సిద్ధం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) వద్ద నున్న ప్రతిపాదనలు తెలియజేస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే రూ.17,349 కోట్ల మేర కరెంటు చార్జీల భారం రాష్ట్ర ప్రజలపై మోపింది. కొత్తగా మరో రూ.15,651.93 కోట్ల మేర కరెంటు చార్జీల భారం మోపనున్నట్లు తెలుస్తోంది.ఏపీఈఆర్సీ వద్ద ఏఆర్ఆర్ నివేదికఏపీఈఆర్సీ అధికారిక వెబ్సైట్లో చార్జీల పెంపు ప్రతిపాదనలు బయటపడ్డాయి. 2026–27 ఆర్ధిక సంత్సరానికి ఆంధ్రప్రదేశ్ తూర్పు(ఏపీఈపీడీసీఎల్), మధ్య(ఏపీసీపీడీసీఎల్), దక్షిణ(ఏపీఎస్పీడీసీఎల్) విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఆదాయ, అవసరాల నివేదిక (అగ్రిగేట్ రెవిన్యూ రిక్వైర్మెంట్–ఏఆర్ఆర్)లను ఏపీఈఆర్సీకి గత నెల(నవంబర్) 30న సమర్పించాయి. అయితే ఆ వివరాలేవీ బయటపెట్టకుండా రహస్యంగా ఉంచాయి. ఈ విషయాన్ని ‘లెక్కలు చెప్పని డిస్కంలు’ శీర్షికతో సాక్షి మంగళవారం వెలుగులోకి తీసుకువచ్చింది. దీంతో బుధవారం టీడీపీ కరపత్రం ఈనాడు పత్రికలోనూ, మరో ఆంగ్ల పత్రికలోనూ ఏఆర్ఆర్కు సంబంధించిన ప్రకటన వెలువడింది. మధ్యాహ్నానికి ఏపీఈఆర్సీ వెబ్సైట్లోనూ అవే వివరాలు ప్రత్యక్షమయ్యాయి. కానీ చిత్రంగా సాయంత్రానికి వెబ్సైట్ను మెయింటెనెన్స్ పేరుతో పూర్తిగా ఆపేశారు. దీంతో డిస్కంల ప్రతిపాదనలేవీ ఏపీఈఆర్సీ వెబ్సైట్లో కనిపించకుండా మాయమైపోయాయి. చార్జీలు పెంచడం లేదని సీఎం ప్రకటించిన నేపధ్యంలోనే ఏపీఈఆర్సీ వెబ్సైట్ నుంచి ఏఆర్ఆర్ వివరాలను ఎవరూ చూడకుండా చేసినట్లు తెలిసింది.బాదుడు ఇలా..2025–26 ఆర్ధిక సంవత్సరంలో డిస్కంల ఖర్చులు, ఆదాయాలను లెక్కించి, 2026–27 సంవత్సరానికి అంచనాలను రూపొందించారు. దాని ప్రకారం..దక్షిణ డిస్కంలో నెట్వర్క్ నిర్వహణ, విద్యుత్ సరఫరా వ్యయం రూ.23,777.87 కోట్లుగా లెక్కించారు. అందులో రూ.14,016.06 కోట్ల మేర ప్రస్తుత ధరల ప్రకారమే చార్జీలు వసూలు చేస్తే సమకూరుతుంది. అలాగే టారిఫ్ యేతర రాబడి మరో రూ.1838.31 కోట్లు వస్తుంది. ఈ రెండూ పోగా ఇంకా రూ.7923.50 కోట్లు లోటు ఉంటుంది. దీంతో రూ.7733.85 కోట్లను చార్జీల ద్వారా వసూలు చేస్తే ఈ లోటు తీరుతుందని ఏపీఎస్పీడీసీఎల్ ప్రతిపాదించింది. అదే విధంగా మధ్య డిస్కం వచ్చే ఏడాది ఖర్చు రూ.14,446.93 కోట్లు అవుతుందని అంచనా వేసింది. ప్రస్తుత టారిఫ్ ప్రకారం అయితే రూ.10,344.51 కోట్లు, టారిఫ్యేతర రాబడి రూ.613.27 కోట్లు వస్తుందని చెప్పింది. అంటే ఇంకా రూ.3465.35 కోట్ల ఆదాయం అవసరం అవుతుందని ఏపీసీపీడీసీఎల్ అడిగింది. అదే విధంగా తూర్పు డిస్కం వచ్చే ఆర్ధిక సంవత్సరానికి రూ.21,730.59 కోట్లు కావాలని అడిగింది. ఇందులో ప్రస్తుత రేట్ల ప్రకారం రూ.16,550.98 కోట్లు, టారిఫ్ కాకుండా ఇతర ఆదాయం రూ.567.29 కోట్లు పోగా ఇంకా రూ.4,612.32 కోట్లు లోటు ఉంటుందని వివరించింది. అందుకే కొత్త చార్జీల ద్వారా రూ.4,452.73 కోట్లు వసూలు చేసుకుంటామని ఏపీఈపీడీసీఎల్ చెప్పుకొచ్చింది. ఈ లెక్కన మొత్తం రూ.15,651.93 కోట్ల ఆదాయ లోటును డిస్కంలు ఏఆర్ఆర్లో చూపించాయి. ఈ మొత్తాన్ని 2026–27 ఆర్ధిక సంవత్సరం టారిఫ్(చార్జీలు) ద్వారా వసూలు చేసుకోవడానికి అనుమతించాల్సిందిగా ఏపీఈఆర్సీని కోరాయి.కొత్త చార్జీల భారం చిన్న వినియోగదారులపైనేఏఆర్ఆర్లో మరో బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ మొత్తం చార్జీల భారం లోటెన్షన్(ఎల్టీ)విద్యుత్ సర్వీసులు అంటే గృహ, వాణిజ్య, చిన్న పరిశ్రమలు, సంస్థలు, వ్యవసాయ సర్వీసుల నుంచే వసూలు చేయనున్నారు. అయితే కొన్ని వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీ, ఉచిత విద్యుత్ను అందించాల్సి ఉంది. ఆ మేరకు వారిపై కొత్త చార్జీల భారం పడకుండా ప్రభుత్వమే రూ.15,651.93 కోట్ల లోటును భరిస్తామని ప్రకటిస్తే ప్రజలపై ప్రస్తుత భారాలు కొనసాగినా, కొత్త చార్జీల భారం తప్పే అవకాశం ఉంది. కాగా సోలార్ ప్యానెళ్ల తయారీ పరిశ్రమలకు కొత్త టారిఫ్ను ఈ సారి డిస్కంలు ప్రతిపాదించాయి. మొదటి 7 సంవత్సరాలకు యూనిట్ రూ.4 చొప్పున, తర్వాత 8 సంవత్సరాలకు యూనిట్కు రూ.4.50 చొప్పున చార్జీలు వసూలు చేస్తామని వెల్లడించాయి. అదే విధంగా టైమ్ ఆఫ్ డే(టీఓడీ) ధరలను కూడా సవరించాయి. ప్రస్తుతం పీక్ అవర్స్(విద్యుత్ డిమాండ్ అధికంగా ఉండే సమయం)లో యూనిట్కు రూ.0.50 అదనంగా వసూలు చేస్తుండగా దానిని రూ.1 కి పెంచాలని డిస్కంలు ప్రతిపాదించాయి. అంతేకాకుండా పీక్ అవర్స్గా లెక్కించే నిర్ధేశిత సమయాలను కూడా మార్చాయి. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ, తిరిగి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ పీక్ అవర్స్గా ప్రస్తుతం లెక్కిస్తుండగా, ఇకపై ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకూ, రాత్రి 7 గంటల నుంచి 11 గంటల వరకూ పీక్ అవర్స్గా పరిగణిస్తామని తెలిపాయి.మూడు ప్రాంతాల్లో బహిరంగ విచారణడిస్కంలు ఇచ్చిన ఏఆర్ఆర్ ప్రతిపాదనలపై ఏపీఈఆర్సీ జనవరి 20,22,23, 27 తేదీల్లో హైబ్రిడ్ పద్ధతిలో బహిరంగ విచారణ చేపట్టనుంది. అంటే నేరుగానూ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారానూ ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలు తీసుకుంటుంది. 20వ తేదీ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ తిరుపతిలోనూ, 22, 23 తేదీల్లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ విజయవాడలోనూ, 27వ తేదీన అదే సమయాల్లో కర్నూలులోని ఏపీఈఆర్సీ కార్యాలయంలోనూ బహిరంగ విచారణ నిర్వహించనుంది. ఈ విచారణ అనంతరం వచ్చిన సూచనల ఆధారంగా డిస్కంల ప్రతిపాదనలను పరిశీలించి కొత్త టారిఫ్పై ఏపీఈఆర్సీ నిర్ణయాన్ని వెలువరిస్తుంది. దాని ప్రకారం వచ్చే ఏడాది అంటే 2026 ఏప్రిల్ 1 నుంచి కొత్త టారిఫ్ చార్జీలు అమలులోకి వస్తాయి.ఇప్పటికే రూ.17,349 కోట్ల మేర కరెంటు చార్జీల భారంఅధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచేది లేదని, అవసరమైతే తగ్గిస్తామని, వినియోగదారులే విద్యుత్ అమ్ముకునేలా చేస్తామని ప్రగల్భాలు పలికారు చంద్రబాబు. కానీ అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే రూ.15,485.36 కోట్ల చార్జీల భారాన్ని వేసి విద్యుత్ చార్జీల బాదుడికి శ్రీకారం చుట్టారు. తొలి ఏడాదికి వసూలు చేసిన రూ.2,787.18 కోట్లలో రూ.1,863.64 కోట్లకు ఏపీఈఆర్సీ నుంచి అనుమతి లభించింది. అంటే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాది కాలంలోనే ఏకంగా రూ.17,349 కోట్ల మేర కరెంటు చార్జీల భారం ప్రజలపై మోపినట్లయ్యింది. రూ.923.55 కోట్లను ప్రజలకు తిరిగి ఇచ్చేయమని ఏపీఈఆర్సీ చెప్పకపోతే చార్జీల భారం మొత్తం రూ.18,272.55 కోట్లు అయ్యేదే.. ఇది చాలదన్నట్లు ఇప్పుడు రూ.15,651.93 కోట్ల బాదుడుకు రంగం సిద్దమైంది. -
ఎవరిది విజన్? ఎవరిది విధ్వంసం?
సాక్షి, అమరావతి: ‘రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) మీరు చెప్పినట్లు 10.4 శాతంగా ఉన్నట్లయితే.. రాష్ట్ర సొంత పన్నుల ఆదాయ వృద్ధి 2.58 శాతానికి ఎందుకు పరిమితమైంది? అసమర్థతతో కూడిన విధ్వంస పాలనకు ఇది తార్కాణం కాదా?’ అని సీఎం చంద్రబాబును మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సూటిగా ప్రశ్నించారు. ప్రపంచంలో ఎక్కడైనా జీడీపీ వృద్ధి.. పన్నుల ఆదాయ వృద్ధి సమానంగా ఉంటుందనానరు. బాబు అడుగడుగునా అబద్ధాలు చెబుతూ, వాస్తవాలను వక్రీకరిస్తూ అంకెల గారడీ చేస్తు న్నారని మండిపడ్డారు. హైదరాబాద్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం, పోర్టుల నిర్మాణం ప్రాధాన్యాంశాలుగా పనిచేసిందని చెప్పారు. కాగ్ నివేదికలోని గణాంకాలను ఉటంకిస్తూ చంద్రబాబు ప్రభుత్వ విధానాలను కడిగి పారేశారు. ఆ వివరాలు బుగ్గన మాటల్లోనే..» బాబు థియరీ ఎప్పుడూ ప్రాక్టికల్గా మారదు. 2014–15లో ఆయన పాలన బ్రహ్మాండంగా ఉంటే.. దేశ జీడీపీలో రాష్ట్ర వాటా 4.45 శాతానికి ఎందుకు పరిమితమైంది? వైఎస్ జగన్ హయాంలో 2019–24లో రెండేళ్లు కరోనా ఉన్నప్పటికీ దేశ జీడీపీలో రాష్ట్ర వాటా 4.78 శాతానికి పెరిగింది. ఎవరి పాలన బాగున్నట్టు? » 2019–24 మధ్య జీఎస్డీపీ 9.7 శాతం పెరగ్గా.. ఆదా యం 10.7 శాతం పెరిగింది. ఇవాళ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు చెప్పినట్లు 12 శాతం జీఎస్డీపీ పెరిగితే ఆదాయం ఎందుకు కేవలం 3 శాతం మాత్రమే పెరుగుతుంది? వైఎస్సార్సీపీ హయాంలో 2019–24 మధ్య జీఎస్డీపీ 10.2 శాతం పెరగ్గా.. ఆదాయం కూడా 9.8 శాతం పెరిగింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం 18 నెలల పాలనలో 12 శాతం జీఎస్డీపీ పెరిగిందంట. ఆదాయం మాత్రం 3 శాతం మాత్రమే పెరిగిందని చెబుతున్నారు. ఇదెలా సాధ్యం? » దేశ వ్యాప్తంగా తలసరి ఆదాయంలో 2013–14 నుంచి 2018–19 వరకు మీ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలో ఉంది. మా పరిపాలనలో అది 15వ స్ధానానికి పెరిగింది. ఇవాళ రాష్ట్రం శ్రీలంక అయిపోవడం లేదా? » ఇప్పుడు బాబు సర్కార్ 18 నెలల పాలనలో దాదాపు రూ. 2,66,175 కోట్లు అప్పుచేసిన మాట వాస్తవం కాదా? బడ్జెట్ అప్పు రూ.1,54,880 కోట్లు, బడ్జెట్ బయట అప్పు రూ.1,11,295 కోట్లు చేసిన మాట వాస్తవం కాదా? మా హయాంలో రూ.10 లక్షల కోట్లు అప్పు చేశారని సీఎం స్థానంలో ఉండి పచ్చి అబద్ధాలు ఎలా చెబుతావ్ బాబూ? మీరు అసెంబ్లీ సాక్షిగా ప్రవేశపెట్టిన లెక్కల ప్రకారమే.. మా ప్రభుత్వం దిగిపోయేనాటికి రాష్ట్రం అప్పు రూ.7,21,918 కోట్లు మాత్రమే. ఇందులో 2019లో మీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్న అప్పు రూ.3,90,247 కోట్లు. ఈ లెక్కన మేము ఐదేళ్లలో రూ.3.32 లక్షల కోట్లు అప్పు చేస్తే.. మీరు ఏడాదిన్నర లోనే రూ.2.66 లక్షల కోట్లు అప్పు చేసి.. మా అప్పుల గురించి మాట్లాడతావా? ఇవాళ రాష్ట్రం శ్రీలంక అయిపోవడం లేదా? » 2025–26లో దేశ వ్యాప్తంగా చూస్తే అప్పులు చేయడంలో ఏపీ రూ.63,052 కోట్లతో దేశంలోనే ప్రథమ స్ధానంలో ఉందని కాగ్ చెప్పింది. ఆదాయ వృద్ధిలోనూ వెనుకబడిపోతున్న మీరా సంపద సృష్టి గురించి మాట్లాడేది? » పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2024 అక్టోబర్ 9న రూ.2,348 కోట్లు కేంద్రం అడ్వాన్సుగా ఇస్తే.. మీరు ఎస్ఎన్ఏ అకౌంట్లో వేయకుండా వేరే ప్రయోజనాల కోసం ఆ డబ్బులు ఖర్చుపెట్టారు. మళ్లీ మార్చి 12న రూ.2,705 కోట్లు మీ అకౌంట్లో వేస్తే.. అందులో రూ.570 కోట్లు పోలవరానికి ఖర్చు పెట్టి మిగిలిన డబ్బులు మీ సొంతానికి వాడుకున్నారు. ఇవాళ్టికి రూ.1,107 కోట్లు ఇతర ఖర్చులకు మళ్లించిన మాట వాస్తవం కాదా? మా హయాంలో మేమే డబ్బులు ఖర్చుపెట్టి.. కేంద్రం ఎప్పుడు రీయింబర్స్ చేస్తుందా అని చూసేవాళ్లం. » విద్యుత్కు సంబంధించి మీ హయాంలో అప్పు 24 శాతం పెరిగితే మా హయాంలో 7 శాతం పెరిగింది. » మరోవైపు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెబుతున్నారు. అంటే పీఏం కిసాన్ రూ.6 వేలు కాకుండా అన్నదాత సుఖీభవలో రైతులందరికీ రూ.20 వేలు వచ్చాయా? ఇప్పటి వరకు ఒక్కో రైతుకు రూ.40 వేలు రావాలి, వచ్చాయా? యువగళం కింద ఉపాధి లేని నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు ఇస్తున్నారా? ఆడబిడ్డ నిధి వచ్చిందా? తల్లికి వందనం కూడా అరకొరగా ఇచ్చారు. మూడు సిలెండర్లు అన్నారు, ఒక్కటిచ్చి చేతులు దులుపుకున్నారు. ఈ పథకాలేవీ ఇవ్వకుండానే మీరు చేసిన అప్పు ఏమైంది బాబూ? -
‘అమరావతి బిల్లు’ వెనక్కి!
సాక్షి, న్యూఢిల్లీ: ‘అమరావతి’ని ఏపీ రాజధానిగా గుర్తించడానికి ఇబ్బందులు ఎదురయ్యాయా.. కేంద్రం ఏమైనా మెలిక పెడుతోందా.. నిధుల ప్రశ్న తలెత్తుతోందా.. వీటన్నింటికీ రాజకీయ విశ్లేషకులు ‘అవును’ అని సమాధానమిస్తున్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే సీఎం చంద్రబాబుకు కేంద్రం బిగ్ షాక్ ఇచ్చిందంటున్నారు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. 2014 నుంచి ఏపీ రాజధానిగా ‘అమరావతి’ని గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం పంపిన సిఫార్సులను కేంద్రం వెనక్కు పంపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 2014 నుంచి అమరావతిని రాజధానిగా గుర్తిస్తే చట్టపరమైన సమస్యలు వస్తాయని కేంద్రం పేర్కొన్నట్లు తెలుస్తోంది. 2024ను పరిగణనలోకి తీసుకుంటే నిధులు ఖర్చు చేసిన విషయంపై న్యాయ పరమైన చిక్కులు తలెత్తే అవకాశం ఉందని చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో సహేతుకమైన సూచనలతో మరోసారి నోటిఫికేషన్తో రావాలని కేంద్రం ఏపీ పంపిన నోటిఫికేషన్ను వెనక్కు పంపిందని అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. నోటిఫికేషన్ ఫైల్ వెనక్కు రావడంతో న్యాయ పరమైన చిక్కులను తొలగించుకునే పనిలో ప్రభుత్వం ఉన్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. అన్నట్లు మారింది. రాజధానిపై కేంద్రం ప్రశ్నలురాజధాని బిల్లుపై కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. ‘అమరావతి’కి చట్టబద్దత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సులు పంపింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే ‘అమరావతి’ని రాజధానిగా గుర్తించాలని చంద్రబాబు సర్కార్ కేంద్రాన్ని కోరింది. ‘పదేళ్ల పాటు ఏపీ, తెలంగాణకు ‘హైదరాబాద్’ రాజధానిగా ఉంది కదా? ఇటువంటి సమయంలో అప్పటి నుంచి ఎలా నోటిఫై చేస్తారని బాబు ప్రభుత్వాన్ని కేంద్రం ప్రశ్నించినట్లు సమాచారం. ‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం–2014’లో ఈ అంశాన్ని పొందుపరిచిన విషయాన్ని కేంద్రం గుర్తు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇది సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తేల్చి చెప్పినట్లుగా సమాచారం. 2024 నుంచి రాజధానిగా ‘అమరావతి’కి చట్టబద్దత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా, దీనిపై కూడా కేంద్రం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. కాగా, విభజన చట్టంలోని సెక్షన్ 5లో రాజధానికి సంబంధించిన అంశాలను కేంద్రం పొందు పరిచింది. ఇందులోని సబ్ సెక్షన్ 2లో.. ‘విభజన తర్వాత పదేళ్ల వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఏపీకి ‘కొత్త రాజధాని’ ఏర్పాటవుతుంది’ అని తెలిపింది. దీంతో పాటు ఏపీ కొత్త రాజధానికి కేంద్రం ఆర్థిక సహకారం కూడా ఉంటుందని సబ్ సెక్షన్ 3లో కేంద్రం పేర్కొంది. నోటిఫికేషన్ వెనక్కు?ఈ సందర్భంగా న్యాయ, చట్టపరమైన చిక్కులను అధిగవిుంచే సూచనలతో రావాలని నోటిఫికేషన్ను కేంద్రం వెనక్కు పంపినట్లు ఢిల్లీ వర్గాల ద్వారా తెలిసింది. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్5(2)లో ‘అమరావతి’ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చేర్చాలన్న సవరణకు కేంద్రం ఆమోదిస్తుందని ప్రభుత్వం ఆశ పడింది. కేంద్రం ఆమోదించి, వెంటనే ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశ పెట్టనున్నట్లు ఇటీవల కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మీడియా ముఖంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే, రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫార్సులపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేయడం, న్యాయ పరమైన చిక్కులు లేకుండా సజావుగా ఉంటే బిల్లు ఆమోదం పొందుతుందని కేంద్రం సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే రాజధాని బిల్లుకు ఆమోదం లభిస్తుందని ఆశపడ్డ కూటమి నేతలకు చేదు అనుభవం ఎదురైందని చెప్పొచ్చు. ఈ అంశంపై ‘సాక్షి’ ఇద్దరు ఎంపీలను ఆరా తీయగా.. సమయం వచ్చినప్పుడు పార్లమెంట్ ముందుకు వస్తుందంటూ సమాధానమిచ్చారు. ఇదిలా ఉండగా, ఈ విషయమై ఎలా ముందుకు వెళితే బావుంటుందో సూచించాల్సిందిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంత మంది న్యాయ నిపుణుల సలహా కోరినట్లు తెలిసింది. -
రైతులకు సమస్యలున్నాయి.. యువత ఉద్యోగాలు కావాలంటున్నారు
సాక్షి, అమరావతి: ‘‘రాష్ట్రంలో రైతులకు సమస్యలున్నాయి, నిరుద్యోగులు ఉద్యోగాలు కావాలంటున్నారు. గవర్నెన్స్లోనూ అవినీతి పెరిగిందంటున్నారు. ప్రజలు నిత్యావసర ధరలు పెరిగాయంటున్నారు. తాగునీటి సమస్య ఉందంటున్నారు. ఇవేవీ లేకుండా కవర్ చేయాల్సి ఉంది’’ అని సీఎం చంద్రబాబు అన్నారు. హాస్టళ్ల పనితీరు బాగా లేదని ఒప్పుకొన్నారు. ఆలయాల దగ్గర సేవల పట్ల ప్రజలు సంతృప్తిగా లేరని చెప్పారు.ప్రజలు సంతృప్తి చెందేలా సేవలందించకపోతే బంగారం ఇచ్చినా లాభం లేదని పేర్కొన్నారు. కొన్ని శాఖలు ఫైళ్లు కిందకు పైకి పంపుతున్నారని, ఇది పెద్ద సమస్యగా మారిందని అన్నారు. రాజ్యాంగానికే సవరణలు చేశారని, బిజినెస్ రూల్స్కు సవరణలు చేద్దామని వ్యాఖ్యానించారు. బుధవారం సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. మూడు నెలల్లో సంతృప్తి స్థాయిని పెంచాలి..మంత్రులు, కార్యదర్శులు క్షేత్రస్థాయి పర్యటనలతో మూడు నెలల్లో అన్ని పథకాలు, సేవల పట్ల ప్రజల సంతృప్తి స్థాయిని 80 నుంచి 90 శాతానికి తేవాలని చంద్రబాబు సూచించారు. గ్రామ సచివాలయాల పేరును త్వరలో మారుస్తామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్డీపీ 17 శాతం వృద్ధి సాధించేలా అన్ని శాఖలు పనిచేయాలని కోరారు. ప్రభుత్వ శాఖల సమాచారంతో డేటా లేక్ వ్యవస్థ సిద్ధమైందని, ఎవరు ఏం అనుకుంటున్నారో ఇందులో వస్తుందన్నారు. ‘‘ఐదేళ్లలో విద్యుత్ యూనిట్ కొనుగోలు ధరను రూ.4కు తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రూ.9 వేల కోట్ల మేర చార్జీలు పెంచుకోవచ్చని ఈఆర్సీ అనుమతిచ్చినా.. ప్రజలపై భారం పడకూడదని అమలు చేయడం లేదు. టెక్నాలజీ సక్రమంగా ఉన్నా కొంతమంది వ్యవహార శైలి సరిగా లేకపోతే ఫలితం ఉండదు. ప్రజలకు ఫలితాలు రాకుండా పనిచేస్తామంటే కుదరదు’’ అని చంద్రబాబు తెలిపారు. దేవాదాయ, రెవెన్యూ శాఖలు అనుకున్న విధంగా పనిచేయడం లేదన్నారు. జనవరి 15 నాటికల్లా అన్ని సేవలు వాట్సాప్లోనే అందించకుంటే తీవ్రంగా పరిగణించి సంబంధిత శాఖపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనర్హులు వికలాంగ పెన్షన్లు పొందుతున్నట్లు తెలిపారు. టెక్నాలజీ వినియోగంలో న్యాయ శాఖ బలహీనంగా ఉందని అన్నారు.డబ్బులు విపరీతంగా లేవు...అరగంటలో ఫైళ్లు క్లియర్ కావాలని చంద్రబాబు అన్నారు. కొందరి దగ్గర 15 రోజులు ఉంటున్నాయని.. ఆర్థిక మంత్రి కేశవ్ దగ్గర 11 రోజులు ఉన్నట్లు వివరించారు. మంత్రి స్పందిస్తూ బడ్జెట్కు మించి నిధుల కోసం ఫైళ్లు వస్తున్నాయని, పెండింగ్లో పెడుతున్నామన్నారు. సీఎం స్పందిస్తూ ప్రతి శాఖ బడ్జెట్ కేటాయింపు లోబడే ఉండాలని నిర్దేశించారు. ‘‘ప్రభుత్వం దగ్గర డబ్బులు విపరీతంగా లేవు. ఫైళ్లు ఎక్కువ రోజులు ఉంటే సంబంధింత మంత్రులు బాధ్యులవుతారు. ఏడు రోజులుకన్నా ఎక్కువ రోజులు ఫైళ్లు ఉన్న వారి నుంచి వివరణ తీసుకుంటాం. సకాలంలో ఖర్చు పెట్టక కేంద్ర పథకాల నిధులు వెనక్కు వెళ్లిపోతే.. ఆ శాఖల అధికారుల వేతనాల్లో కోత విధిస్తామని హెచ్చరించారు. కేంద్రం నుంచి నిధులు తేవడంలో మంత్రులు, అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. ఏడాదిన్నరైనా చాలామంది మంత్రులకు అవగాహన లేదని, ప్రజల నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వస్తే సంబంధిత శాఖ సరిగా పనిచేయడం లేదని అర్థంగా చెప్పారు. వరికి ప్రత్యామ్నాయ సాగుపై రైతులు దృష్టి పెట్టేలా అవగాహన కల్పించాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. పత్తి కొనుగోళ్లలో కాటన్ కార్పొరేషన్ తీరు సరిగ్గా లేదని.. దీనిపై కేంద్రానికి లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు. -
‘కోటి’ గళాల గర్జన
సాక్షి, విశాఖపట్నం, నెట్వర్క్: చంద్రబాబు సర్కారు కక్షపూరిత విధానాలతో ప్రభుత్వం కొత్త మెడికల్ కళాశాలలను ప్రైవేట్పరం చేయడం.. ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాలను బుధవారం నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు, మీడియా సమావేశాలు నిర్వహించి ప్రత్యేక బాక్సుల్లో భద్రపరిచి ఆయా జిల్లా కేంద్రాలకు తరలించారు. నియోజకవర్గ పార్టీ కార్యాలయాల వద్ద వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలు జెండా ఊపి కోటి సంతకాల వాహనాలను ప్రారంభించారు. పలుచోట్ల మహిళలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని కోటి సంతకాల వాహనాలకు హారతి పట్టారు. ఇకనైనా చంద్రబాబు సర్కారుకు కనువిప్పు కలగాలని, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని దేవుడిని ప్రార్థించారు. యువత, విద్యార్థులు, మేధావులు, ప్రజలు ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీల్లో పాల్గొని మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినదించారు. వైఎస్సార్ సీపీ ప్రజా ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 10న రచ్చబండగా మొదలై మారుమూల గిరిజన గూడేల నుంచి నగరాల దాకా ఉద్ధృతంగా ఈ కార్యక్రమం సాగింది. కాకినాడలోని వైఎస్సార్సీపీ కార్యాలయానికి భారీ ర్యాలీగా వెళుతున్న యువత, నాయకులు, పార్టీ శ్రేణులు అన్ని మండలాలు, అన్ని పంచాయతీల్లో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రెండు నెలలుగా మహోద్యమంలా సాగిన కోటి సంతకాల సేకరణలో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా, భారీగా పాల్గొన్నారు. నవంబరు 12న రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ నిర్వహించిన ర్యాలీల్లో విద్యార్థులు, యువత, మేధావులు పెద్ద ఎత్తున పాల్గొని మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని నిరసిస్తూ కదం తొక్కారు. కోటి సంతకాల మహా ఉద్యమంతో చంద్రబాబు సర్కార్కు ఇకనైనా కనువిప్పు కలగాలని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే చంద్రబాబు సర్కార్కు బుద్ధి చెప్పేందుకు ఎలాంటి ఉద్యమాలకైనా సిద్ధమంటూ హెచ్చరించారు. సంతకాల పత్రాలతో విశాఖలో భారీ బైక్ ర్యాలీ చేపడుతున్న ప్రజలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ⇒ ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సేకరించిన సంతకాలను బుధవారం జిల్లా కేంద్రానికి ర్యాలీగా తరలించారు. దర్శి నుంచి ఒంగోలుకు వాహనాల ర్యాలీని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ జెండా ఊపి ప్రారంభించారు. యర్రగొండపాలెం నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. గిద్దలూరులో కేపీ నాగార్జునరెడ్డి, మార్కాపురంలో అన్నా రాంబాబు, కొండపిలో ఆదిమూలపు సురేష్, సంతనూతలపాడులో మేరుగు నాగార్జున, కనిగిరిలో దద్దాల నారాయణ యాదవ్ ర్యాలీలను ప్రారంభించారు. ఒంగోలు నియోజకవర్గంలో సేకరించిన 62 వేల సంతకాలను పార్టీ జిల్లా కార్యాలయానికి చేర్చినట్లు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు తెలిపారు. ⇒ పశ్చిమ గోదావరి జిల్లాలో కోటి సంతకాలతో వాహనాల ర్యాలీలను భారీ ఎత్తున నిర్వహించారు. మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడపాలని డిమాండ్ చేశారు. తణుకులో మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు, తాడేపల్లిగూడెంలో మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, నరసాపురంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, ఆచంటలో మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, భీమవరంలో నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు, పాలకొల్లులో నియోజకవర్గ సమన్వయకర్త గుడాల శ్రీహరిగోపాలరావు, ఉండిలో నియోజకవర్గ సమన్వయకర్త పీవీఎల్ నరసింహరాజు ఆధ్వర్యంలో ర్యాలీలు జరిగాయి. వైద్య కళాశాలలను ప్రభుత్వమే నడిపేలా చంద్రబాబు బుద్ధి మార్చాలని దేవుడిని కోరుతూ తణుకు నియోజకవర్గం వేల్పూరు, అత్తిలిలో మహిళలు సంతకాల ప్రతులకు మంగళ హారతులిచ్చి సాగనంపారు. ⇒ తిరుపతి, చిత్తూరు జిల్లాలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. నియోజకవర్గ సమన్వయకర్తల ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రతులను తిరుపతి వైఎస్సార్సీపీ కార్యాలయంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డికి అందజేశారు. అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించారు. పుంగనూరులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రతుల ప్రత్యేక వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గంగాధర నెల్లూరులో మాజీ మంత్రి నారాయణస్వామి, నగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజా, చిత్తూరులో విజయానందరెడ్డి, శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన్రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, వెంకటగిరిలో నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, గూడూరులో ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, నాయుడుపేటలో కిలివేటి సంజీవయ్య, నాగలాపురంలో నూకతోటి రాజేష్, తవణంపల్లిలో డాక్టర్ సునీల్కుమార్, పలమనేరులో వెంకటేగౌడ్, కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల ప్రతులను ప్రత్యేక వాహనంలో తిరుపతికి తరలించారు. ⇒ ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. నియోజకవర్గ కేంద్రాల నుంచి వాహనాల్లో కోటి సంతకాల పత్రాల బాక్సులను తరలించారు. పోలీసులు అడ్డుకున్నా వెనకడుగు వేయకుండా ర్యాలీలు నిర్వహించారు. పలాస నియోజకవర్గంలో మాజీ మంత్రి అప్పలరాజు ఆధ్వర్యంలో పత్రాలను తరలించారు. ⇒ విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో సుమారు 10 లక్షల సంతకాలు సేకరించారు. విశాఖ జిల్లా మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయానికి అన్ని నియోజకవర్గాల నుంచి వాహనాల్లో కోటి సంతకాల బాక్స్లు చేరుకున్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే రాజు అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో సమన్వయకర్తలు మళ్ల విజయప్రసాద్, వాసుపల్లి గణేష్కుమార్, మజ్జి శ్రీనివాసరావు, తిప్పల దేవన్రెడ్డి, మొల్లి అప్పారావు, నియోజకవర్గం పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో నియోజకవర్గాల సమన్వయకర్తలతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, సమన్వయకర్తలు కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకర్ గణేష్, కంబాల జోగులు, అన్నంరెడ్డి అదీప్రాజ్, పార్లమెంట్ పరిశీలకులు శోభాహైమావతి, పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ పాల్గొన్నారు. అల్లూరి జిల్లాలో పాడేరులోని పార్టీ కార్యాలయానికి వ్యానుల్లో సంతకాల పత్రాల బాక్స్లు చేరుకున్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడు మత్సరాస విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో వాటిని సేకరించారు. కార్యక్రమంలో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర తదితరులు పాల్గొన్నారు. -
పవన్పై అంబటి వ్యంగాస్త్రాలు
సాక్షి,గుంటూరు: పవన్ కళ్యాణ్పై మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యంగాస్త్రాలు సంధించారు. పవన్ కళ్యాణ్ ఏ ధర్మాన్ని పాటిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. బుధవారం గుంటూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.వైఎస్ జగన్పై కూటమి నేతలు విషప్రచారం చేస్తున్నారు. దేవుడిని అడ్డం పెట్టుకొని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ జగన్ ధర్మాన్ని ఆచరించే వ్యక్తి. వైఎస్సార్సీపీ హయాంలో పరాకామణి భవన నిర్మాణం జరిగింది. కూటమి ప్రభుత్వంలో దేవాలయాల్లో భక్తులు చనిపోయారు. దేవాలయాల్లో జరిగిన తొక్కిసలాటలో భక్తులు మరణిస్తే పవన్ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు. తిరుమల లడ్డూపై పవన్ అసత్య ప్రచారం చేసి టీటీడీ పరువును అప్రతిష్టపాలు చేశారు. చంద్రబాబు అనేక దుర్మార్గాలు చేస్తున్నారు. సనాతన ధర్మం పేరుతో పవన్ రోజుకో వేషం వేస్తున్నారు. చంద్రబాబుకు చెంచాగిరి చేస్తున్నారు. 2003లో వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చిందెవరు?. విజయవాడలో 40 దేవాలయాల్ని కూల్చిందెవరు? చంద్రబాబు తన ప్రచార పిచ్చితో గోదావరి పుష్కరాల్లో 29 మంది ప్రాణాలు తీశారు. చంద్రబాబును ప్రశ్నించే దమ్ము పవన్కు లేదు. చంద్రబాబు,పవన్ ఎంత బురద జల్లిన వైఎస్ జగన్కు అంటుకోదని స్పష్టం చేశారు. -
ఇండిగో క్రెడిట్ డ్రామా… చంద్రబాబు అండ్ కో ప్రయత్నం ఫెయిల్
సాక్షి,అమరావతి: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో విషయంలో క్రెడిట్ కొట్టేద్దామని చంద్రబాబు అండ్ గ్యాంగ్ ప్రయత్నించిందని, సీన్ రివర్స్ కావడంతో సైలెంటయ్యిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.మీడియాతో మాట్లాడిన సతీష్ రెడ్డి.. ‘బాబు పాలనపై ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగింది. అభివృద్ధి పేరుతో చేసింది ఏమీ లేదు. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. బాబు పాలన అంతా ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయడం బాబుకు అలవాటు కాదు. డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే ఆయనకు తెలిసిన మార్గం.టీటీడీలో చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. టీటీడీలో తప్పు జరిగితే వేంకటేశ్వరస్వామి శిక్షిస్తాడు. అనవసరంగా బురద చల్లితే ఆ పాపం ఊరికే పోదు’అని ఆయన హెచ్చరించారు. -
మంత్రుల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తి
సాక్షి,అమరావతి: రాష్ట్ర మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం నిర్వహించిన హెచ్ఓడీల (హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్) సమావేశంలో ఆయన మంత్రుల పని తీరు, శాఖల నిర్వహణ, కేంద్ర నిధుల సమీకరణపై స్పందించారు. గతంలో పలుమార్లు సూచనలు చేసినప్పటికీ మంత్రుల పనితీరులో ఎలాంటి మార్పు కనిపించడం లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. చాలా మంది మంత్రులకు తమ శాఖల్లో ఏం జరుగుతుందో కూడా స్పష్టంగా తెలియడం లేదు. మంత్రులు తమ శాఖలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఫైళ్ల పురోగతి, ప్రాజెక్టుల స్థితి, బడ్జెట్ వినియోగం వంటి అంశాలపై రోజువారీగా సమీక్ష చేయాలని ఆదేశించారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో మంత్రులు విఫలమయ్యారంటూ అసహనం వ్యక్తం చేశారు. -
‘వైఎస్సార్సీపీతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు ఖాయం’
సాక్షి,విజయనగరం: వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు ఖాయమాని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. బుధవారం విజయనగరంలో బొత్స సత్య నారాయణ మీడియాతో మాట్లాడారు. ‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ఉద్యమంలా కొనసాగింది. సామాన్యులకు కూడా కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారు. నియోజక వర్గాల నుండి వచ్చిన కోటి సంతకాల కార్యక్రమం పత్రాలను గవర్నర్ కు అందచేస్తాం. డిసెంబర్ 18న వైఎస్ జగన్ పార్టీ నేతలతో కలిసి గవర్నర్కు గవర్నర్ అబ్దుల్ నజీర్కు అందిస్తారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తన వ్యక్తిగత లబ్ధి కోసం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసింది. ప్రతినియోజక వర్గంలో వేలాది మంది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేశారు. చంద్రబాబు ఎప్పడు కార్పొరేట్ కంపెనీలకే మేలు చేస్తారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉంటే పేదలకు వైద్యం అందుతుంది.కోవిడ్ లాంటి విపత్తులు వస్తే పేదల ఆరోగ్యం కాపాడగలం. మెడికల్ కాలేజీలు ప్రైవేట్పరమైతే పేద ప్రతిభావంతులైన విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదు మెడికల్ కాలేజీలను పూర్తి చేసింది. మరో రెండు కాలేజీలకు అనుమతులు కూడా తెచ్చింది.తరువాత వచ్చిన ప్రభుత్వం మెడికల్ కాలేజీలను కొనసాగించాల్సి ఉన్నా అలా చేయడం లేదు. కూటమి ప్రభుత్వానికి ఓటేసిన పాపానికి పేద ప్రజలు ఇబ్బంది పడకూడదను సదుద్దేశ్యంతో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాం. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ రద్దు చేస్తోందని’ స్పష్టం చేశారు. -
ప్రజలను మోసం చేయడానికే బాబు అంకెల గారడీ
సాక్షి, అమరావతి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26)లో తొలి ఆర్నెల్లకు సంబంధించి సీఎం చంద్రబాబు సోమవారం విడుదల చేసిన రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) ముందస్తు అంచనాలను తప్పులతడక అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభివర్ణించారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ... తన మార్గదర్శకత్వంలో ఆర్థికంగా వృద్ధి చెందుతోందని ప్రజలను మభ్యపెట్టడానికే ఈ అంకెలను తయారుచేసినట్టుగా చంద్రబాబు చెప్పకనే చెప్పారంటూ దెప్పిపొడిచారు.దేశ ఆర్థిక పరిస్థితి చూస్తే కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు, జీడీపీ పెరుగుదల సమానంగా ఉన్నాయని... ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనైనా ఆదాయాలు, జీడీపీ పెరుగుదల సమానంగా ఉంటాయని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు చెబుతున్నట్లుగా రాష్ట్ర జీఎస్డీపీ సీఏజీఆర్ (సగటు వార్షిక వృద్ధి రేటు) 10.40 శాతంగా ఉన్నట్లయితే... రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం ఆ స్థాయిలో ఎందుకు పెరగలేదని, అది కేవలం 2.58 శాతానికే ఎందుకు పరిమితమైందని ప్రశ్నించారు.‘కొందరిని కొంతకాలంపాటు మభ్యపెట్టగలవు... కొంతమందిని ఎల్లప్పుడూ మోసం చేయగలవు... కానీ, అందరినీ ఎల్లకాలం మభ్యపెట్టలేవు’ అంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ చెప్పిన మాటలను గుర్తు చేస్తూ సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్), కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (ఎంవోఎస్పీఐ) నివేదికల్లోని గణాంకాలను ఉటంకిస్తూ చంద్రబాబు విధానాలను కడిగిపారేస్తూ మంగళవారం ‘ఎక్స్’లో వైఎస్ జగన్ పోస్టు చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...తీవ్ర ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం‘‘చంద్రబాబు, టీడీపీ కూటమి ప్రభుత్వం 2025–26 ఆర్థిక సంవత్సరం తొలి ఆర్నెల్లకు సంబంధించిన జీఎస్డీపీ అంచనాలను విడుదల చేసింది. ముందస్తు అంచనాల గణాంకాలను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయగలుగుతుంది. కావాలనుకుంటే వక్రీకరించగలుగుతుంది కూడా. కానీ, రాజ్యాంగబద్ధ సంస్థ కాగ్... రాష్ట్ర ఖాతాలను ఆడిట్ చేసి వెల్లడించే గణాంకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ వక్రీకరించలేరు. రాష్ట్ర ఖాతాలను పరిశీలించి కాగ్ విడుదల చేసిన గణాంకాల ద్వారానే ఏపీ ఆర్థిక పరిస్థితి వాస్తవికత ఏంటో తెలుస్తుంది. కాగ్ గణాంకాలు చంద్రబాబు సలహా ప్రకారమో లేక ఆయన మార్గనిర్దేశంలోనో తయారైనవి కావు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన నిజమైన ఆదాయాలు, చేసిన వాస్తవ ఖర్చుల ఆధారంగా ఈ సమగ్ర గణాంకాలు వెల్లడవుతాయి.𝗧𝗗𝗣 𝗚𝗼𝘃𝗲𝗿𝗻𝗺𝗲𝗻𝘁’𝘀 𝗰𝗼𝗼𝗸𝗲𝗱 𝗳𝗶𝗴𝘂𝗿𝗲𝘀 𝗲𝘅𝗽𝗼𝘀𝗲𝗱!Yesterday, Mr. Chandrababu Naidu released the advance estimates for the GSDP during the first half of this financial year 2025-26. As correctly pointed out by @ncbn Garu, the Government prepared the… pic.twitter.com/pG3V1H8lgY— YS Jagan Mohan Reddy (@ysjagan) December 9, 2025 ఈ ఆర్థిక ఏడాది మొదటి అర్ధభాగంలో కాగ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం వాస్తవం ఏమిటంటే... రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఆదాయాల పెరుగుదల అతి దారుణంగా పడిపోయింది. చరిత్రలో ఎప్పుడూ లేని స్థాయిలో రాష్ట్ర అప్పులు పెరిగాయి. మూలధన వ్యయం అత్యంత తక్కువ స్థాయికి చేరింది. మూలధన వ్యయం, సగటు పౌరుడు చేసే ఖర్చులు ప్రమాదకరంగా తగ్గాయి. రెవెన్యూ లోటు, ద్రవ్యోల్బణం ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి. భారీ అవినీతి వల్ల రాష్ట్ర ఆదాయాలకు భారీగా గండి పడుతోంది. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా సరే, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా ఉందంటూ ప్రజలను మోసం చేయడానికి టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ సందర్భంగా అబ్రహం లింకన్ గారి మాటలను గుర్తు చేయాల్సి వస్తోంది. లింకన్ గారు అన్న మాటలు ఇప్పుడు చంద్రబాబుకు సరిపోతాయి.ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?నేను అడిగే ఈ ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పగలరా?⇒ నిజంగా రాష్ట్ర ఆర్థికవ్యవస్థ అభివృద్ధి చెందుతున్నట్లైతే, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకింత ఆర్థికపరమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది?⇒ 2014–19 మధ్య మీ పాలనలో జీఎస్డీపీ వృద్ధి అంత గొప్పగా ఉన్నట్లైతే దేశ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో రాష్ట్రం వాటా 4.45 శాతానికి మాత్రమే ఎందుకు పరిమితమైంది?⇒ వైఎస్సార్సీపీకి ప్రజలిచ్చిన ఐదేళ్ల కాలంలో కోవిడ్ మహమ్మారి కారణంగా రెండేళ్ల పాటు సంక్షోభం తలెత్తినా సరే... వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో దేశ జీడీపీలో రాష్ట్రం వాటా (2019–24) మధ్య 4.78 శాతంగా ఉన్న మాట వాస్తవం కాదా?⇒ మీ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంత బాగా నడిచినట్లైతే, తలసరి ఆదాయంలో జాతీయ స్థాయిలో రాష్ట్రం ర్యాంకు ఒక్క మెట్టు అయినా ఎందుకు పెరగలేదు?((చంద్రబాబు వాస్తవిక సమర్థత గురించి, అలాగే 2019–24 మధ్య వైఎస్సార్సీపీ పాలనలో జరిగిన వాస్తవ ఆర్థిక పురోగతిని వివరిస్తూ, ఆయన అబద్ధాలను బట్టబయలు చేస్తూ ఈ ట్వీట్కు స్లైడ్లను జత చేశాం. వీటిని అందరూ ఓసారి పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.)) బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట⇒ 2014–19 కాలానికి చెందిన జీఎస్డీపీ సీఏజీఆర్ను, 2019–24 కాలానికి చెందిన సీఏజీఆర్తో పోల్చి.. తాను 2019–24 మధ్య అధికారంలో కొనసాగి ఉంటే 2023–24లో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు 13.5 శాతం అయ్యేదంటూ చంద్రబాబు అత్యంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు.⇒ 2019–24 మధ్య ప్రపంచంలోని ప్రతి ప్రభుత్వం కోవిడ్ కారణంగా అనూహ్యమైన ఆర్థిక సంక్షోభాన్ని, అలాగే దాన్నుంచి కోలుకోవడంలో కఠినమైన ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో, తాను అధికారంలో ఉంటే 13.5 శాతం వృద్ధి సాధించేవాడినని చంద్రబాబు చెప్పడం రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడానికి చేసిన ప్రయత్నం తప్ప మరొకటి కాదు.⇒ సీఏజీఆర్ అనేది మొదటి సంవత్సరం, చివరి సంవత్సరాన్ని మాత్రమే ఆధారంగా తీసుకుని లెక్కిస్తారు. కానీ, ప్రతి సంవత్సరానికీ గణాంకాలను విడివిడిగా విశ్లేషిస్తేనే సంపూర్ణమైన, నిజమైన పోలిక సాధ్యమవుతుంది. ఆ వివరాలను ఒక్కసారి చూస్తే... 2014–19 కాలంలో దేశ జీడీపీలో ఏపీ వాటా 4.54 శాతం మాత్రమే. అదే 2019–24 మధ్య మా ప్రభుత్వ హయాంలో 4.78 శాతం. ఇది మాత్రమే కాదు.. అత్యంత తీవ్రమైన సంక్షోభ సంవత్సరాలైన 2020–21, 2021–22లో దేశ జీడీపీలో ఏపీ వాటా వరుసగా 4.93 శాతం, 4.79 శాతం.⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేద, మధ్యతరగతి వర్గాలకు అనుకూలంగా తీసుకొచ్చిన విధానాలు, దీంతోపాటు అభివృద్ధి మీద పెట్టిన దృష్టి కారణంగా... కోవిడ్ సంక్షోభం వల్ల తలెత్తిన ఆర్థిక ఒత్తిడిని దేశంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో మరింత సమర్థంగా ఎదుర్కోగలిగాం. ఇంత స్పష్టమైన గణాంకాలు అందుబాటులో ఉన్నప్పటికీ, అత్యంత దారుణ పనితీరును చంద్రబాబు ప్రదర్శించినప్పటికీ, తానుఇంకా మెరుగ్గా పనిచేసే వాడిని అని ఆయన ఎలా చెప్పగలరు?భారీగా అవినీతి... రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం తగ్గడమే దీనికి నిదర్శనం⇒ టీడీపీ కూటమి ప్రభుత్వం వెల్లడించిన అంచనాల ప్రకారం 2024–25 తొలి ఆర్నెల్లలో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు 9.89 శాతం.. 2025–26 తొలి ఆర్నెల్లలో 10.91 శాతం. ఈ రెండేళ్ల మొత్తాన్ని కలిపిచూస్తే జీఎస్డీపీ సీఏజీఆర్ 10.40 శాతం మాత్రమే కనిపిస్తోంది.⇒ సహజంగానే, ఈ స్థాయి జీఎస్డీపీ వృద్ధితో పాటు రాష్ట్ర సొంత ఆదాయాలు కూడా కనీసం 10 శాతం సీఏజీఆర్తో పెరగాలి. కానీ, వాస్తవ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. అంతేకాదు ఇంకా నిరాశాజనకంగా ఉంది.⇒ రాష్ట్రంలో ప్రజల కొనుగోలు శక్తిని ప్రతిబింబించే ఎస్జీఎస్టీ ఆదాయాల సీఏజీఆర్ 4.35 శాతం మాత్రమే పెరిగాయి. సేల్స్ ట్యాక్స్ ఆదాయాల సీఏజీఆర్ –2.80 శాతానికి తగ్గిపోయాయి. మొత్తంగా చూస్తే, రాష్ట్ర సొంత ఆదాయాల సీఏజీఆర్ కేవలం 2.58 శాతం మాత్రమే. ⇒ కొత్త ప్రభుత్వం మద్యం విధానంలో పెద్ద పెద్ద మార్పులు చేసినప్పటికీ.. మద్యం రిటైల్ను ప్రైవేటీకరించడం, షాపులు పెంచడం, విక్రయ వేళలపై పరిమితులను ఎత్తివేయడం, బెల్ట్ షాపులను ప్రోత్సహించడం, అక్రమ పర్మిట్ రూమ్లను తిరిగి అనుమతించడం తదితర తీవ్ర మార్పుల తర్వాత కూడా ఎక్సైజ్ సుంకం సీఏజీఆర్ కేవలం 5.10 శాతం మాత్రమే పెరిగింది. లిక్కర్ వ్యవహారంలో భారీ అవినీతి జరుగుతుందనే విషయాన్ని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్ర ఆదాయాల సీఏజీఆర్ ఎక్కడా 10 శాతానికి దగ్గరగా కూడా లేదు. అది కేవలం 2.58 శాతం మాత్రమే. అన్నిటికంటే ముఖ్యంగా, రాష్ట్ర ప్రభుత్వం చేసిన మూలధన వ్యయం (కేపిటల్ ఎక్స్పెండేచర్) భయంకరంగా పడిపోయి సీఏజీఆర్ –16 శాతంగా నమోదైంది.⇒ నిజమైన వృద్ధి కనిపించిన ఏకైక అంశం... కేంద్ర పన్నులలో రాష్ట్రానికి లభించిన వాటా. అది కూడా సీఏజీఆర్ 17.78 శాతం. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పనితీరుకు సంబంధించినది. రాష్ట్ర ఆర్థిక సామర్థ్యానికి సంబంధించింది కాదు.విద్యుత్ రంగంపై వాస్తవాలకు భిన్నంగా బాబు మాటలువిద్యుత్ వినియోగదారులపై ఎలాంటి భారం వేయలేదని చంద్రబాబు చెబుతున్నారు. వాస్తవాలకు ఇది పూర్తి విరుద్ధం. ఎఫ్పీపీసీఏ (ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్) పేరుతో, చంద్రబాబు ప్రభుత్వం ఒకటిన్నర సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలపై రూ.18,272 కోట్లు భారం వేసింది. గత ప్రభుత్వం భవిష్యత్తు ఆదాయాలపై సెక్యూరిటీ సృష్టించింది. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టింది అని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. సరే గత ప్రభుత్వం రూ.25 వేల కోట్ల రుణం కోసం రూ.1,941 కోట్ల విలువైన ఆస్తులను తాకట్టు పెట్టింది. కానీ, ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం రూ.9 వేల కోట్ల బాండ్ల విడుదల కోసం రూ.1,91,000 కోట్ల విలువైన ఖనిజ సంపదను సెక్యూరిటీగా పెట్టింది. భవిష్యత్తు ఆదాయాలనూ అప్పుల కోసం పణంగా పెట్టింది.ఇంకా, రాష్ట్ర సంచిత నిధి (కన్సాలిడేటెడ్ ఫండ్) మీద బాండ్ హోల్డర్లకు హక్కు కల్పించింది. ఇది రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని, అత్యంత ప్రమాదకర చర్య. చంద్రబాబు గారు... వైఎస్సార్సీపీ పాలనలో విద్యుత్ రంగం దెబ్బతిన్నదని ఆరోపిస్తున్నారు. కానీ, వాస్తవాలు మాత్రం ఆయన ప్రకటనకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. టీడీపీ పాలనలో (2014–19) విద్యుత్ రంగపు అప్పులు సీఏజీఆర్ 23.88 శాతం. వైఎస్సార్సీపీ పాలనలో (2019–24) ఆ అప్పుల పెరుగుదల సీఏజీఆర్ 7.28 శాతం మాత్రమే. అంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని సమర్థవంతంగా నిర్వహించిందని స్పష్టమవుతోంది.వైఎస్సార్సీపీ పాలనలో పారిశ్రామిక ప్రగతిచంద్రబాబు గారు... వైఎస్సార్సీపీ పాలనలో పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ను విడిచిపెట్టారని చేసిన ఆరోపణ కూడా పూర్తిగా అవాస్తవం. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఆయన తయారు చేసిన అబద్ధమే ఇది. ఎంవోఎస్పీఐ గణాంకాల ప్రకారం.. ఏపీలో పరిశ్రమల జీవీఏ (స్థూల విలువ జోడింపు) వృద్ధి (2019–24) సీఏజీఆర్ 11.14 శాతం. అదే కాలంలో దేశ పరిశ్రమల జీవీఏ వృద్ధి సీఏజీఆర్ 8.96 శాతం. అంటే, వైఎస్సార్సీపీ పాలనలో పారిశ్రామిక వృద్ధిలో దేశ సగటు కంటే రాష్ట్రం ఎక్కువ వృద్ధిని సాధించిందన్నది స్పష్టమవుతోంది. పారిశ్రామిక వృద్ధికి సంబంధించి ఇలాంటి స్పష్టమైన విజయాలు ఉన్నప్పటికీ, పెట్టుబడిదారులు రాష్ట్రాన్ని విడిచిపెట్టారని చంద్రబాబు గారు ఎలా అంటారు? అది నిజానికి అసత్య ఆరోపణ... ప్రజలను మభ్యపెట్టే ప్రచారం మాత్రమే. -
‘సాక్షి’ చానల్ను ఎలా బ్లాక్ చేస్తారు?
సాక్షి, న్యూఢిల్లీ: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ‘సాక్షి’ టీవీపై సాగిస్తున్న కక్షసాధింపు చర్యలకు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సాక్షి టీవీ ప్రసారాలను రాష్ట్రవ్యాప్తంగా అడ్డగోలుగా నిలిపివేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఒక వార్తా చానల్ను పూర్తిగా అంధకారంలోకి నెట్టేయడం (కంప్లీట్ బ్లాక్ ఔట్) అత్యంత తీవ్రమైన అంశం’’ అని మండిపడింది. ఈ అన్యాయంపై తక్షణమే విచారణ జరిపి పరిష్కరించాలని టెలికం డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (టీడీ శాట్)ను ఆదేశించింది. పూర్తిగా ప్రసారాలు నిలిపివేసిన తరుణంలో... ట్రిబ్యునల్ తదుపరి విచారణను వచ్చే ఏడాది మార్చి నెలకు వాయిదా వేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. పిటిషనర్ అభ్యర్థన మేరకు విచారణను ముందే ముగించాలని టీడీ శాట్ను ఆదేశించింది. ఇది అత్యవసరమని, భావ ప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన అంశమని స్పష్టం చేసింది. చానల్ ప్రసారాలను పునరుద్ధరించేలా ఆదేశించాలంటూ సాక్షి టీవీ దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం విచారణ సందర్భంగా జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అతుల్ ఎస్.చందూర్కర్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజల గొంతుకను అణచివేస్తున్నారు ‘‘ఏపీలో ప్రభుత్వం మారిన కేవలం రెండు వారాల్లోనే, రాజకీయ దురుద్దేశంతో సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేశారు. 2024 జూన్ 3 వరకు ప్రజలకు అత్యంత చేరువలో ఉన్న చానల్ను జూన్ 20 తర్వాత కుట్రపూరితంగా అడ్డుకున్నారు’’ అని ‘సాక్షి’ టీవీ తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, నిరంజన్రెడ్డి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ప్రభుత్వం నేరుగా ఆదేశాలు ఇవ్వకుండా, వెనుక ఉండి ఎంఎస్వోలను భయభ్రాంతులకు గురిచేస్తోందని రోహత్గీ వాదించారు. ఎలాంటి రాతపూర్వక ఉత్తర్వులు లేకుండానే, కేవలం మౌఖిక ఆదేశాలతో సాక్షి ప్రసారాలను అడ్డుకుంటున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కస్టమర్ కేర్కు ఫోన్ చేసినా చానల్ను ఆపేశామని చెబుతున్నారే తప్ప, కనీసం వినియోగదారుడు కోరుకుంటే ఇచ్చే పద్ధతిలోనూ ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని నివేదించారు. మీడియా స్వేచ్ఛను బాబు సర్కారు కాలరాస్తోందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఫైబర్నెట్ నుంచే కుట్ర సాక్షి ప్రసారాల నిలిపివేత కుట్రలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏపీ ఫైబర్నెట్ ప్రధాన పాత్ర పోషిస్తోందని సాక్షి తరపు న్యాయవాదులు వాదించారు. ఈ వ్యవహారంపై గతంలోనే ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ పటేల్ తీవ్రంగా స్పందించారని, ఫైబర్ నెట్ అధికారులు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారని రోహత్గీ ప్రస్తావించారు. అయినా, ప్రభుత్వం తీరు మారలేదని, బ్లాక్ ఔట్ కొనసాగుతూనే ఉందని తెలిపారు. -
కృష్ణార్పణం.. ఏడాదికి అద్దె వెయ్యే!
సాక్షి టాస్క్ ఫోర్స్: సీఎం చంద్రబాబు ప్రభుత్వ ఆస్తులను అతి తక్కువ ధరకు పప్పు బెల్లాల్లా అనుయాయులకు కట్టబెట్టేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పల్లెల్లోనే ప్రజలకు సర్కారు సేవలందించేందుకు నిర్మించిన బీసీ, ఎస్సీ సామాజిక భవనాలు, టీటీడీ కల్యాణ మండపం, ఆర్బీకే వంటి ఖరీదైన భవనాలను దశాబ్దాల పాటు లీజు పేరుతో ధారాదత్తం చేస్తున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం వెంకన్నపురంలో ఈ భవనాలన్నీ బాబు అనుయాయుల పరమవుతున్నాయి. చంద్రబాబు సన్నిహితుడైన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) చైర్మన్ కృష్ణయ్య బావమరిది పరమవుతున్నాయి. ఈ ప్రయత్నాలను గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వెంకన్నపురం రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ పి.కృష్ణయ్య స్వగ్రామం. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఈ గ్రామంలో టీటీడీ నిధులతో కల్యాణ మండపం, డైనింగ్ హాలు నిర్మించారు. పంచాయతీరాజ్, ఎంపీ ల్యాడ్స్ (రాజ్యసభ సభ్యుడు), కార్పొరేట్ సీఎస్ఆర్ నిధులతో 14,400 చదరపు అడుగుల స్థలంలో ఎస్సీ, బీసీ సామాజిక భవనాలు, మహిళా భవనం నిర్మించారు.వీటిని గ్రామస్తులే కాక సమీపంలోని బసవాయపాళెం, దామేగుంట, గుండాలమ్మపాళెం, పద్మనాభసత్రం తదితర గ్రామాల ప్రజలు వినియోగించుకొంటారు. ఇక్కడి కళ్యాణ మండపంలో వివాహాలు చేసుకొన్న వారు భోజనాలకు సమీపంలోని డైనింగ్ హాల్ను వినియోగిస్తారు. పొదుపు మహిళల సమావేశాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు మహిళా భవనాన్ని ఉపయోగిస్తున్నారు. బీసీ భవనంలో ఆర్బీకే ఉంది. ఎస్సీ సామాజిక భవనాన్ని వేంకటేశ్వరస్వామి ఆలయ పూజారి నివాసానికి కేటాయించారు. తుపాను, వరదల్లాంటి విపత్తుల సమయంలో గ్రామంలోని వారు ఈ భవనాల్లోనే తలదాచుకొంటారు. 99 ఏళ్ల పాటు లీజు.. ఏడాదికి రూ. వెయ్యే! తన స్వగ్రామంలోని ఈ ప్రభుత్వ భవనాలపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య కన్ను పడింది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సాకుతో వీటిని సొంతం చేసుకోవాలనుకొన్నారు. కృష్ణయ్య బావమరిది పి.లక్ష్మీ శ్రీనివాస ప్రసాద్ పేరుతో తొలుత 33 ఏళ్ల లీజు, తర్వాత మరో రెండు పర్యాయాలు 33 సంవత్సరాల వంతున ఏకంగా 99 ఏళ్లపాటు లీజు పొడిగించుకొనే వెసులుబాటుతో అన్ని భవనాలకు కలిపి ఏడాదికి కేవలం రూ.వెయ్యి అద్దె ప్రతిపాదనను పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శికి ప్రతిపాదన పంపారు.కృష్ణయ్య రిటైర్డ్ ఐఏఎస్ కావడం, సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు కావడంతో ఫైల్ చకచకా కదిలింది. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ కమిషనర్కు, అక్కడి నుంచి జిల్లా కలెక్టర్కు చేరింది. కలెక్టర్ ఆమోదం పొందగానే డీపీఓకు, డిప్యూటీ ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులకు ఉత్తర్వులందాయి. వెంటనే భవనాలను స్వా«దీనం చేసుకొనేందుకు సిద్ధమైపోయారు. ఈ విషయం గ్రామస్తులకు చేరడంతో వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు వినియోగించుకొనే ప్రభుత్వ భవనాలను ప్రైవేటు వ్యక్తులకు ఎలా ధారాదత్తం చేస్తారంటూ మండిపడ్డారు. సోమవారం జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా గ్రామాభివృద్ధిపై సమీక్ష సమావేశానికి మంగళవారం గ్రామానికి వచ్చారు. గ్రామస్తులంతా పెద్ద సంఖ్యలో వచ్చి ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అనేక గ్రామాల ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉండే ప్రభుత్వ భవనాలను ప్రైవేటు పరం చేయొద్దని గట్టిగా కోరారు. కలెక్టర్ నుంచి వారికి సానుకూల సమాధానం రాలేదు. గ్రామంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వల్ల ఉపయోగం ఉంటుందని చెప్పారు. దానికి ఒక భవనం సరిపోతుందని, ఇన్ని అవసరం లేదంటూ గ్రామస్తులు చెప్పారు. ఇదంతా పెద్ద కుట్ర అని, దీనికి సమ్మతించేది లేదని, ఉద్యమం తప్పదని తెగేసి చెప్పారు. అసౌకర్యమైన చోట స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటేమిటి? వెంకన్నపురం గ్రామానికి ఇరువైపులా ఉన్న రోడ్లు దారుణంగా దెబ్బతిని ఉన్నాయి. సొంత వాహనాలు తప్ప రవాణా సౌకర్యం ఉండదు. ఇక్కడే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతామనడం విడ్డూరంగా ఉందని గ్రామస్తులు అంటున్నారు. ఇదే మండలంలో జాతీయ రహదారికి ఆనుకొని చంద్రశేఖరపురం వద్ద ఇదే కృష్ణయ్య ఏపీఐఐసీ చైర్మన్గా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ పార్కు ఉంది. అందులో కావాల్సినంత స్థలం ఉందని, అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు అన్ని విధాలా సౌకర్యంగా ఉంటుందని చెబుతున్నారు. కానీ గ్రామంలోని ప్రభుత్వ భవనాలను చెరబట్టడం వెనుక పెద్ద కుట్రే దాగి ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇంతకంటే దారుణం లేదు గ్రామంలో 60 శాతం పేద ఎస్సీలే. వీరి అవసరాలకు గ్రామంలోని ప్రభుత్వ భవనాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఈ భవనాలను ప్రభుత్వ పెద్దల అండతో హస్తగతం చేసుకోవడం దారుణం. కలెక్టర్ కూడా వారికే సహకరించడం విడ్డూరంగా ఉంది. దళితులు ఎక్కువగా ఉన్న గ్రామంలో ఇంతటి దారుణానికి ఒడిగట్టడం చంద్రబాబు ప్రభుత్వానికే చెల్లింది. – బండి పెంచలయ్య, సర్పంచ్, వెంకన్నపురం -
బాబు ప్రభుత్వంలో ట్రాక్టర్లకు మళ్లీ ట్యాక్స్!
సాక్షి, భీమవరం: రైతును రాజును చేస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వం వారి నడ్డి విరుస్తోంది. నీటి తీరువాను తెరపైకి తెచ్చి వడ్డీ సహా భారం మోపింది. తాజాగా ట్రాక్టర్లకు ట్యాక్స్ చెల్లించాలంటూ రవాణా శాఖ మెసేజ్లు పంపుతోంది. గత ప్రభుత్వంలోని ఐదేళ్ల కాలానికి జరిమానాతో పాటు వసూళ్లకు పాల్పడుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలో 2,106 ట్రాక్టర్లు, 3,740 ట్రాలీలు ఉన్నాయి. పొలం దమ్ము, పంట ఉత్పత్తులు, పశుగ్రాసాల తరలింపు తదితర పనుల కోసం అధిక శాతం ట్రాక్టర్లను వ్యవసాయ అవసరాలకు వినియోగిస్తుంటారు. ట్రాక్టర్ యజమానుల్లో అధిక శాతం రైతులే. వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం ట్రాక్టర్లకు పన్ను నుంచి మినహాయింపు ఇచ్చింది. ట్రాలీలకు సైతం పన్నులు వసూలు చేయలేదు. దీంతో వ్యవసాయ పనుల్లో పంట ఉత్పత్తుల తరలింపునకు రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవలేదు. తాజాగా, చంద్రబాబు ప్రభుత్వం కమర్షియల్ పేరిట ట్రాలీలకు పన్నులు విధించడం మొదలెట్టింది.762 కిలోల నుంచి నాలుగు టన్నుల వరకు బరువును బట్టి రూ.260 నుంచి రూ.720 వరకు పన్ను విధిస్తోంది. దీంతో 2019 నుంచి ఇప్పటివరకు జరిమానాలు సహా రూ.15 వేల వరకు ట్యాక్స్ పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సెల్ఫోన్లకు మెసేజ్లు వస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా రవాణా శాఖ అధికారులు గ్రామాల్లో కూడా కేసులు రాస్తున్నారని రైతులు చెబుతున్నారు.ప్రధాన రహదారుల్లో తప్ప గతంలో ఎప్పుడూ రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేసిన దాఖలాలు లేవంటున్నారు. వచ్చే సీజన్ నుంచి ట్రాక్టర్ల వ్యవసాయ పనుల ధరలు పెరుగుతాయని, ప్రభుత్వం తమపై కర్కశంగా పన్నుల భారం అదనంగా మోపుతోందని ఆవేదన చెందుతున్నారు.అన్నదాత నడ్డివిరిచి..రైతులకు మేలు చేస్తూ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలుచేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేసింది. ఈ–క్రాప్ నమోదు ప్రామాణికంగా సాగు విస్తీర్ణం అంతటికీ రైతులు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని గతంలో ప్రభుత్వమే చెల్లించింది. బాబు పాలనలో ఈ పథకాన్ని ఎత్తివేయడంతో ప్రీమియం వాటాను రైతులే భరించాల్సి వస్తోంది. మరోపక్క గత ప్రభుత్వం పక్కన పెట్టిన నీటితీరువాను తెరపైకి తెచ్చి, మూడేళ్లకు గాను పాత బకాయిలు, వడ్డీలతో కలిపి ఒక్కసారే రైతులపై రూ.21.81 కోట్ల భారాన్ని మోపింది. -
‘బాలల కమిషన్’పై తర్జనభర్జనే..
సాక్షి, అమరావతి: రాజ్యాంగబద్ధమైన ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నియామకానికి సంబంధించిన ఇంటర్వ్యూల నిర్వహణకు తర్జనభర్జన సాగుతూనే ఉంది. ఇప్పటికే 3సార్లు నోటిఫికేషన్ల రద్దు, మూడుసార్లు ఇంటర్వ్యూల వాయిదాలతో 8 నెలలు గడుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ తీరుతో రాజ్యాంగబద్ధమైన కమిషన్ రాజకీయ పునరావాస కేంద్రంగా మారుతోందనే విమర్శలు వినవస్తున్నాయి. తాజాగా ఈ నెల 3 నుంచి వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ముందురోజు రాత్రి రద్దుచేసింది. దీంతో మళ్లీ ఈ నెల 11, 12, 13 తేదీల్లో కమిషన్ నియామకానికి సంబంధించిన ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 11న మంత్రివర్గ సమావేశం ఉండటంతో 12, 13, 14 తేదీలైతే ఎలా ఉంటుందనే దానిపై చర్చలు సాగుతున్నాయి. వైఎస్సార్సీపీ పాలనలో నియమించిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్ 19తో ముగిసింది. కొత్తగా కమిషన్ నియామకానికి జూన్ 5న చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన తొలి నోటిఫికేషన్లో విద్యార్హత పీజీ ఉండాలనే నిబంధన పెట్టారు. దానిపై వివాదం నెలకొనడంతో 2 వారాల తరువాత విద్యార్హతను సవరించి డిగ్రీ చాలు అని మరో నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ తర్వాత మూడో నోటిఫికేషన్ ఆన్లైన్లో ఇచ్చి.. తరువాత దాని గడువు పొడించారు. వాస్తవానికి రాష్ట్ర విభజన తరువాత రెండుసార్లు చేపట్టిన కమిషన్ నియామకంలో ఇచ్చిన నోటిఫికేషన్లో డిగ్రీ విద్యార్హత అనే నిబంధన పెట్టలేదు. దీంతో 2017లో నియమించిన కమిషన్లో ఇద్దరు సభ్యులు, 2022లో కమిషన్లోని ఒకరికి డిగ్రీ విద్యార్హత కూడా లేకపోవడం గమనార్హం. 26 జిల్లాల సీడబ్ల్యూసీలకు నోటిఫికేషన్ ఏపీలోని 26 జిల్లాల బాలల సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ)ల నియామకాన్ని కూడా ప్రభుత్వం వాయిదాల పర్వంతోనే సాగదీస్తోంది. ఇప్పటికే 3 సార్లు నోటిఫికేషన్ రద్దుచేసిన ప్రభుత్వం.. తాజాగా మంగళవారం 26 జిల్లాల సీడబ్ల్యూసీల నియామకానికి నోటిఫికేషన్ జారీచేసింది. అర్హత కలిగినవారు ఈ నెల 22లోపు డబ్ల్యూడీసీడబ్ల్యూ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు డౌన్లోడ్ చేసుకుని పూర్తిచేసిన తరువాత మెయిల్ ద్వారా పంపాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ‘పదేళ్ల అనుభవం’పై ఫేక్ సర్టిఫికెట్లుకమిషన్ చైర్మన్, ఆరుగురు సభ్యుల నియామకానికి 650 దరఖాస్తులు వచ్చాయి. వడపోత అనంతరం 359 మందిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారు. బాలల న్యాయచట్టం ప్రకారం.. బాలలకు సంబంధించిన చట్టాల్లో అనుభవం, విద్య, ఆరోగ్యం, రక్షణ, సంరక్షణ, అభివృద్ధితోపాటు దివ్యాంగ బాలలు, బాలకార్మిక, బాల్య వివాహాలు, అణగారిన బాలలు, బాలల సైకాలజీ తదితర అంశాలలో పదేళ్లపాటు పనిచేసిన వారిని కమిషన్ చైర్మన్, సభ్యులుగా ఎంపిక చేయాల్సి ఉంది. బాలల కోసం నిజంగా పనిచేస్తే వారి గుర్తింపు కార్డు, హాజరు, జీతాల వివరాలతోపాటు పనిచేసినకాలంలో ప్రెస్ క్లిప్పింగ్స్, ఫొటోల ఆధారాలుండాలి. కానీ.. ఇంటర్వ్యూలకు హాజరయ్యే చాలామంది.. పదేళ్లపాటు బాలల కోసం పనిచేసినట్లు ప్రభుత్వేతర సంస్థలు (ఎన్జీవోలు), ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల నుంచి తీసుకున్న నకిలీ ధ్రువీకరణ పత్రాలు జతచేసినట్లు తెలిసింది. పలువురు టీడీపీ నాయకులు సైతం ఫేక్ సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసినట్టు తెలిసింది. -
బాబు ఫైబర్నెట్ కుంభకోణానికి ఆధారాలు ఉన్నాయి
సాక్షి, అమరావతి: చంద్రబాబు సీఎంగా ఉన్న 2014–19 మధ్య కాలంలో జరిగిన ఏపీ ఫైబర్ నెట్ కుంభకోణానికి సంబంధించి ఆధారాలు ఉన్నాయని ఫైబర్నెట్ మాజీ చైర్మన్ పూనూరు గౌతంరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తెలిపారు. ఈ కుంభకోణంపై నమోదు చేసిన కేసును మూసివేయాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్పైన, సీఐడీ పిటిషన్ను వ్యతిరేకిస్తూ ఫైబర్నెట్ లిమిటెడ్ పూర్వ చైర్మన్ పూనూరు గౌతంరెడ్డి దాఖలు చేసిన ప్రొటెస్ట్ పిటిషన్ పైన కోర్టులో వాదనలు మంగళవారం పూర్తయ్యాయి.ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయాధికారి భాస్కరరావు ఈ నెల 11న నిర్ణయం వెలువరిస్తానని ప్రకటించారు. అంతకుముందు పొన్నవోలు వాదనలు వినిపించారు. ‘చంద్రబాబు హయాంలో ఫైబర్నెట్ కాంట్రాక్ట్ అప్పగింత వ్యవహారంలో రూ.320 కోట్ల మేర అక్రమాలు జరిగాయి. దీనిపై గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఫైబర్నెట్ లిమిటెడ్ చైర్మన్ గౌతంరెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. టెండర్ ప్రక్రియలో అక్రమాలపై సీఐడీ ప్రాథమిక విచారణ జరిపి, ఆధారాలు సేకరించింది. వాటి ఆధారంగా కేసు నమోదు చేసింది. ఈ విషయంలో సీఐడీ హడావుడిగా వ్యవహరించలేదు. ప్రాథమిక ఆధారాలతోనే చంద్రబాబును నిందితునిగా చేర్చింది. అన్ని సాక్ష్యాధారాలు సేకరించి, చార్జిషీట్ కూడా దాఖలు చేసింది. సీఐడీ 90 మంది సాక్షులను విచారించింది. మొత్తం ఆధారాలను ఫోరెన్సిక్ ఆడిట్ చేయించింది. అక్రమాలు జరిగినట్లు అందులో కూడా నిర్ధారణ అయింది. ఈ రికార్డులన్నీ కోర్టు ముందున్నాయి’ అని తెలిపారు. ప్రభుత్వం మారడం, చంద్రబాబు సీఎం అవడంతో ఆ ఆధారాలను, సాక్ష్యాలను సీఐడీ మూలన పడేసిందన్నారు. చంద్రబాబుపై కేసులో సాక్ష్యాలు లేవని, అందువల్ల కేసును మూసివేయాలని కోరుతూ క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసిందన్నారు. ఇందుకు చట్ట నిబంధనలు అంగీకరించవని చెప్పారు. సీఐడీ సేకరించిన ప్రతి ఆధారం కోర్టు రికార్డుల్లో ఉందని అలాంటప్పుడు సీఐడీ క్లోజర్ రిపోర్ట్ ఆధారంగా నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదన్నారు. ఇలా చేస్తే ప్రజలకు కోర్టులపై విశ్వాసం పోతుంది..ఈ కేసులో కోర్టుకు చట్ట ప్రకారం 3 ఆప్షన్లు మాత్రమే ఉన్నాయని సుధాకర్రెడ్డి వివరించారు. కోర్టు ముందున్న సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకుని కేసును విచారించడం లేదా సాక్ష్యాధారాలు సరిపోవనుకుంటే తదుపరి దర్యాప్తునకు ఆదేశించడం లేదా గౌతంరెడ్డి దాఖలు చేసిన ప్రొటెస్ట్ పిటిషన్ను ప్రైవేటు ఫిర్యాదుగా తీసుకోవడం అని చెప్పారు. ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే కోర్టులపై ప్రజలు విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ న్యాయాధికారులను ఉద్దేశించి మాట్లాడిన మాటలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల మనసుల్లో న్యాయవ్యవçస్థపై నమ్మకం సన్నగిల్లితే వారు కోర్టులకు రారని, ఇది అంతిమంగా అరాచకానికి దారి తీస్తుందని, దీని వల్ల ప్రజలు వీధుల్లోనే తమ వివాదాలను పరిష్కరించుకునే పరిస్థితి వస్తుందని చెప్పారని వివరించారు.అధికార బలంతో తప్పును కడిగేసుకుంటున్నారు..రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే గత ప్రభుత్వం ఈ కేసు పెట్టిందని, అందులో భాగంగా ఈ ప్రొటెస్ట్ పిటిషన్ కూడా దాఖలు చేశారని సీఐడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై సుధాకర్రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీరు అధికారం బలంతో మీ తప్పులను కడిగేసుకుంటున్నారంటూ మండిపడ్డారు. సీఐడీ తరఫు న్యాయవాది స్పందిస్తూ, సీఐడీ క్లోజర్ రిపోర్టులను ఆమోదిస్తూ ఈ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీలను ఈ పిటిషన్కు జత చేయలేదని అనగా.. సుధాకర్రెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు. తమకు సర్టిఫైడ్ కాపీలు ఇవ్వొద్దని సీఐడీ చాలా గట్టిగా చెప్పిందన్నారు. దీంతో ఈ కోర్టు తమకు ఆ కాపీలు ఇవ్వలేదని, అలాంటప్పుడు వాటిని ఎలా తెస్తామని ప్రశ్నించారు. కాపీలు ఇవ్వొద్దన్న సీఐడీనే ఇప్పుడు వాటిని జత చేయలేదని ఎలా ఫిర్యాదు చేస్తుందని నిలదీశారు. -
నేటి నుంచి ‘టెట్’
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్ డిసెంబర్–2025)కు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. బుధవారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 133 కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్లో పరీక్షలు ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు 2,71,692 మంది దరఖాస్తు చేసుకున్నారు. మంగళవారం సాయంత్రానికి 96.25 శాతం మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. దరఖాస్తుల్లో తప్పులు ఉంటే నామినల్ రోల్స్లో సరిదిద్దుకునేందుకు ఆయా పరీక్ష సెంటర్ల వద్ద సరైన ధ్రువీకరణపత్రాలు చూపించి మార్చుకునేందుకు అవకాశం ఇచ్చినట్లు వివరించారు. టెట్కు హాజరుకానున్న 32వేల మంది టీచర్లుఉపాధ్యాయ వర్గాల వినతులను చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా టెట్ (డిసెంబర్)–2025లో తొలిసారి ఇన్ సర్వీస్ టీచర్లను కూడా చేర్చింది. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నిర్వహించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ తొలి రాష్ట్రం కావడం గమనార్హం. ఈ టెట్కు 32 వేల మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. వాస్తవానికి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1.91 లక్షల మంది ఉపాధ్యాయులు ఉండగా, వారిలో 1.62 లక్షల మంది 2012కి ముందు నిర్వహించిన డీఎస్సీల ద్వారా సర్వీసులోకి వచ్చారు. అయినా 32 వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఇదిలా ఉండగా, ఇన్ సర్వీస్ టెట్ నిర్వహణపై తమ ఎమ్మెల్సీల విజ్ఞప్తి మేరకు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామని విద్యాశాఖ మంత్రి లోకేశ్ గత నెలలో ప్రకటించినా, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ, హడావుడిగా టెట్లో ఉపాధ్యాయులను కూడా చేర్చారు. దీనిపై ఉపాధ్యాయులు తీవ్రంగా మండిపడుతున్నారు.‘ఇన్ సర్వీస్’ టెట్ దేశంలోనే తొలిసారివిద్యాహక్కు చట్టం–2009లోని నిబంధనల ప్రకారం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు సైతం టెట్ తప్పనిసరి అని ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటో తేదీన సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీనిని అన్ని రాష్ట్రాలు పాటించాలని ఆదేశించింది. దీనిపై దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశంపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలు చేశాయి. అదేవిధంగా విద్యాహక్కు చట్టంలో సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. కానీ, ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు ప్రభుత్వం మాత్రం రివ్యూ పిటిషన్ వేయలేదు. కనీసం కేంద్రంలోని తమ భాగస్వామ్య ప్రభుత్వానికి సైతం ఎటువంటి ప్రతిపాదనలు పంపలేదు. దీంతో చంద్రబాబు ప్రభుత్వంపై ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. -
సాంకేతిక విద్యలో సర్వీసు తకరారు!
సాక్షి, అమరావతి: సాంకేతిక విద్యా శాఖ చేస్తున్న తప్పులకు ఉద్యోగులు బలవుతున్నారు. డైరెక్టరేట్ అధికారుల తప్పుడు నిర్ణయాల కారణంగా ఆర్థికంగా నష్ట పోతున్నారు. అనుభవజ్ఞులుగా చలామణీ అవుతున్న కొందరు అధికారులు ఏకంగా చట్టాలనే ఉల్లంఘిస్తున్నా పట్టించుకునేవారే కరవయ్యారు. వీరు ఉన్నతాధికారులను సైతం తప్పుదారి పట్టించి, సిబ్బంది ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం విద్యా శాఖను నిర్వీర్యం చేస్తుండటం, ఉన్నతాధికారుల ఉదాసీనతతో సాంకేతిక విద్యలో కొందరు అధికారులకు ఆడిందే ఆటగా సాగుతోంది. ఈ ఏడాది జూన్ నెలలో జరిగిన సాధారణ బదిలీల్లో సాంకేతిక విద్య డైరెక్టరేట్ నుంచి వేరే ప్రాంతాలకు బదిలీ అయిన వారు సర్వీస్ మేటర్స్లో నిష్ణాతులుగా చెప్పుకుని, బదిలీ ఉత్తర్వులను నిలిపివేయించుకున్న విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసింది.ఇప్పుడు ఇదే అధికారులు ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టిస్తూ, నిబంధనలను ఉల్లంఘిస్తూ పాలిటెక్నిక్ కళాశాలల లెక్చరర్ల ప్రయోజనాలను దెబ్బ తీసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ అధికారులు ఇటీవల పాలిటెక్నిక్ లెక్చరర్లకు ఇచ్చే ‘కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్’(సీఏఎస్)ను కోల్పోయేలా చేశారు. 2022లో ఇచ్చిన లెవెల్–10 పూర్తిస్థాయిలో అమలు చేయకుండానే లెవెల్–11 అమలుకు ఆదేశాలిచ్చేశారు. ఏపీపీఎస్సీ అనుమతి లేకుండానే ఈ ప్రక్రియ చేపట్టేశారు. తప్పును గుర్తించిన మూడు నెలలు తర్వాత తీరిగ్గా దిద్దుబాటు చర్యలు చేపట్టారు. దీనివల్ల తమకు ఇబ్బందులొస్తాయని భయపడ్డ కొందరు ఈ ఆదేశాలను పక్కనబెట్టగా, మరికొందరు అమలు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో ఒకేసారి సర్విసులో చేరిన పాలిటెక్నిక్ లెక్చరర్ల వేతనాల్లో భారీ వ్యత్యాసం వచ్చింది. ఈ తప్పులకు పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోకపోగా, వీరినే వివిధ కమిటీల్లో వేస్తుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇష్టారీతిన సీఏఎస్ అమలు పాలిటెక్నిక్ లెక్చరర్లు సర్విస్ కమిషన్ ద్వారా లెవల్–9ఏ ఆర్థిక ప్రయోజనాలతో నియమితులవుతారు. ఐదేళ్ల తర్వాత అనుభవం, విద్యార్హతలు ఉన్నవారికి లెవెల్–10కి పదోన్నతి ఇస్తారు. తర్వాత లెవెల్–11 (సీనియర్ లెక్చరర్ స్కేల్)కి పదోన్నతి కల్పిస్తారు. అలా పదోన్నతులిచ్చే పరిస్థితి లేనప్పుడు వారికి ఉన్న సర్వీసుకు అనుగుణంగా ఆర్థి క ప్రయోజనాలు కల్పించాలి. ఇందుకోసం ‘కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్’ను అమలు చేస్తారు. ఈ అధికారం ప్రిన్సిపల్స్కు కల్పించారు. 2012–13లో లెక్చరర్లుగా చేరినవారికి ఏఐసీటీఈ పే స్కేల్ 2016 ప్రకారం లెవల్–10 హోదా 2022లోనే అమలు చేశారు. అయితే, అర్హులైనవారిలో కొందరికి ఇప్పటికీ అమలు చేయలేదు.లెవెల్–11 మాత్రం జీవో నం.10 ప్రకారం తప్పనిసరిగా ఏపీపీఎస్సీ ద్వారానే జరగాలి. కానీ, అంతర్గత కమిటీని వేసి, దాని సూచనల మేరకు ఈ ఏడాది సెపె్టంబర్లో 244 మంది లెక్చరర్లకు లెవెల్–9ఏ నుంచి నేరుగా లెవెల్–11కు పదోన్నతి ఇచ్చారు. ఏపీపీఎస్సీ అనుమతి లేకుండా ఆదేశాలివ్వడంతో కంగుతిన్న లెక్చరర్లు.. లెవెల్–10 అమలు చేయకుండా లెవెల్–11 ఎలా ఇస్తారని డైరెక్టరేట్కు భారీగా ఫిర్యాదులు చేశారు. ఇది పెద్ద తప్పు అని విమర్శలు రావడంతో ఉన్నతాధికారులు నాలుగైదు రోజుల తర్వాత ఆ ఆదేశాలను వెనక్కి తీసుకున్నారు. కానీ, ఈలోగానే చాలా కాలేజీల్లో లెవెల్–11 అమల్లోకి తేవడంతో పాటు ఆ స్థాయి వేతనాలు కూడా డ్రా చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. తప్పు చేసిన వారిపై చర్యలేవీ? వివాదాస్పదమైన లెవెల్–11పై తప్పటడుగులు వేసిన డైరెక్టరేట్ ఇప్పుడు ఆ లెక్చరర్లతో పాటు మరికొందరిని కొత్తగా కలిపి 412 మందికి లెవెల్–10 అమలుకు కసరత్తు చేస్తోంది. ఇందులోనూ స్థానిక కాలేజీల ప్రిన్సిపాల్స్ ఇవ్వాల్సిన సీఏఎస్పై డైరెక్టరేట్లోని కొందరు అధికారులు జోక్యం చేసుకుని వివరాలు అడుగుతుండడం అనుమానాలకు తావిస్తోంది. మూడు నెలలుగా డైరెక్టరేట్ వెబ్సైట్లో లెవెల్–11 ఆదేశాలు ఉండడంపై ‘సాక్షి’ ప్రతినిధి ఉన్నతాధికారులను సంప్రదించడంతో హడావుడిగా ఆదేశాల ఆర్డర్ను తొలగించారు.ఈ వ్యవహారంపై సాంకేతిక విద్య జాయింట్ డైరెక్టర్ (సర్వీసెస్)ను వివరణ కోరగా.. లెవల్–11 అమలుకు ఆదేశాలిచ్చింది వాస్తవమేనని, ఆ తర్వాత వాటిని విరమించుకున్నట్టు తెలిపారు. లెవెల్–10ను కాలేజీ ప్రిన్సిపల్స్ అమలు చేస్తారని వివరించారు. అయితే, లెవెల్–10 అమలుపై 2022 తర్వాత ఇప్పుడు డైరెక్టరేట్ జోక్యం చేసుకోవడం, లెవెల్–11కు నిబంధనలను అనుసరించకపోవడం, డైరెక్టరేట్ను తప్పుదారి పట్టించిన వారిపై చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
నిరుపేదల పొట్ట కొడతారా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 18.63 లక్షల నిరుపేద ఉపాధి హామీ కూలీల జాబ్ కార్డులు తొలగించిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం, ఆరు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా వారి పొట్ట కొడుతోందని వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది జూలై 27 నుంచి డిసెంబర్ వరకు పెండింగ్ ఉపాధి కూలీల వేతన బకాయిలు రూ.381 కోట్లు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. 18.63 లక్షల జాబ్ కార్డుల తొలగింపుపై పంచాయతీరాజ్ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ఎంపీడీవోలకు డీడీఎల్వోలుగా మాజీ సీఎం వైఎస్ జగన్ పదోన్నతి కల్పించి వారికి ప్రత్యేక ఆఫీసులు ఏర్పాటు చేస్తే, ఆ పేరుని డీడీవోలుగా మార్చి తానే ప్రమోషన్ ఇచ్చినట్టు పవన్ చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. పవన్ కూడా చంద్రబాబు నుంచి క్రెడిట్ చోరీ నేర్చుకున్నారని ఎద్దేవా చేశారు. రైతులకు యూరియా కూడా సరఫరా చేయకుండా వ్యవసాయ రంగాన్ని నిరీ్వర్యం చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. చివరికి ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వేతనాలు కూడా ఇవ్వకుండా వేధిస్తోందన్నారు.స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పల్లెల్లో బెదిరింపుల పర్వానికి తెరదీసిందని, అందులో భాగంగానే టీడీపీ మద్దతుదారులకే జాబ్ కార్డులు ఉంచి మిగతా వారి కార్డులను రకరకాల కారణాలతో ఏరివేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో పేదలకు అడిగినంత పని కల్పించగా.. చంద్రబాబు ప్రభుత్వం ఉపాధి పని దినాలు కల్పించడంలోనూ విఫలమైందన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా 2023–24లో రాష్ట్రంలో ఏప్రిల్ – నవంబరు మధ్య 21.37 కోట్ల పనిదినాలు కల్పించగా, చంద్రబాబు సర్కారు 2025–26 ఏప్రిల్ నుంచి డిసెంబరు 7వతేదీ నాటికి కేవలం 15.94 కోట్ల పనిదినాలను మాత్రమే కల్పించిందన్నారు. సినిమా టికెట్ రేట్ల మీద ఉన్న శ్రద్ధ పేదల మీద ఏదీ? ఒకపక్క 7.4 లక్షల కుటుంబాలకు 18.63 జాబ్ కార్డుల తొలగింపు.. మరోవైపు ఐదున్నర కోట్ల పనిదినాల కోత.. ఇంకోవైపు ఉపాధి పనులనే నమ్ముకున్న గ్రామీణ నిరుపేదలకు వేతనాలు చెల్లించకుండా చంద్రబాబు ప్రభుత్వం వేధిస్తున్నా డిప్యూటీ సీఎం పవన్ నోరు మెదపడంలేదని దుయ్యబట్టారు. తన సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడంలో ఉన్న శ్రద్ధ ఉపాధి హామీ కూలీలపై పెట్టడం లేదన్నారు. ఉపాధి కూలీలు అని పిలవొద్దని కల్ల»ొల్లి మాటలతో పవన్ సరిపుచ్చుతున్నారని విమర్శించారు. -
ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే ఆత్మహత్యలే
సాక్షి, అమరావతి/మంగళగిరి టౌన్: దళిత పారిశ్రామికవేత్తలపై చంద్రబాబు సర్కారు చిన్నచూపు చూస్తోందని.. కొత్త పారిశ్రామిక విధానాల్లో దళితుల ప్రోత్సాహకాలకు కోత పెట్టిన టీడీపీ కూటమి సర్కారు ఇప్పుడు పాత ప్రోత్సాహకాలను విడుదల చేయకుండా వేధిస్తోందని.. అవి ఇవ్వకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని దళిత పారిశ్రామికవేత్తలు ఆవేదన వ్యక్తం చేశారు. నిండా అప్పుల్లో మునిగిపోయి పిల్లలకు కడుపు నిండా తిండిపెట్టలేకపోతున్నామంటూ ఐదు రోజులుగా గుంటూరు జిల్లా మంగళగిరి ఏపీఐసీసీ కార్యాలయం ముందు చలిలో సైతం ధర్నా చేస్తున్నా సర్కారు కనికరించడంలేదంటూ సోమవారం కారెం సత్యనారాయణమ్మ, వరుకోటి నీరజ, పార్ల నాగలక్ష్మి వాపోయారు.సబ్సిడీలు విడుదల చేయాలంటూ తాము డిసెంబరు 4 నుండి కుటుంబ సమేతంగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించడంలేదని వీరు ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి మద్దతుగా సోమవారం అన్ని జిల్లాల నుంచి ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఏపీఐఐసీ కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నాలో పాల్గొన్నారు. మొత్తం 8వేల మంది ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పడుతుంటే ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదని వారు మండిపడ్డారు. చట్టప్రకారం తమకు రావల్సిన పెట్టుబడుల రాయితీలు విడుదల చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమని.. ఆ చావేదో ఇక్కడే చస్తామంటూ వారు ఏపీఐఐసి గేట్లు మూసివేసి రోడ్డుపైనే బైఠాయించారు.అధికారంలోకి రాగానే తమ బకాయిలు చెల్లించడమే కాకుండా ఏ సంవత్సరం డబ్బులు ఆ సంవత్సరమే ఇస్తామంటూ చంద్రబాబు ఇచి్చన వాగ్దానాన్ని విస్మరించడంపై మండిపడ్డారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్, పరిశ్రమల శాఖ మంత్రులు టీజే భరత్, కొండపల్లి శ్రీనివాస్, విద్యాశాఖ మంత్రి లోకేశ్, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యువరాజ్, డైరెక్టర్ శుభమన్ బన్సాల్ తక్షణం నిధులు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. సబ్సిడీ ఇవ్వకుండా వేధిస్తున్నారు ఈ సందర్భంగా కారెం సత్యనారాయణమ్మ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ జగనన్న బడుగు వికాసం పథకం కింద రెండు బస్సులను కొనుగోలు చేసి ఏపీఎస్ఆర్టీసీలో అద్దెకు తిప్పుతున్నామని, దీనికి ప్రభుత్వం ప్రకటించిన రూ.42.63 లక్షల సబ్సిడీ ఇవ్వకుండా చంద్రబాబు సర్కారు వేధిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చేవరకు ఇక్కడ నుంచి కదిలేది లేదన్నారు. ఇప్పటికే బ్యాంకులకు రెండు నెలలుగా ఈఎంఐలు కట్టలేదని, ఇప్పుడు మూడోనెల కూడా కట్టకపోతే ఎన్పీఏ కింద ప్రకటించి బస్సులను తీసుకుపోతారని ఆమె చెప్పారు.అలాగే, ఈనెలలో రెండు లక్షల బీమా ప్రీమియం చెల్లించాలని, కనీసం అప్పు కూడా పుట్టే పరిస్థితి లేదని ఆమె వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం రాయితీల కింద అక్టోబరులో రూ.వెయ్యి కోట్లకు పైగా నిధులు విడుదల చేసినప్పటికీ మా వర్గాలకు ఎలాంటి రాయితీలు ఇవ్వలేదని ఆమె ఆరోపించారు. ఆర్టీసీ బస్సులకు కేటాయించిన రూ.56 కోట్ల నిధులు ఏమయ్యాయని ఆమె ప్రశ్నించారు. లిఖితపూర్వక హామీ ఇచ్చేవరకు కదిలేది లేదు ఇక మెగా పరిశ్రమలకు రూ.వందల కోట్లు కేటాయించిన ప్రభుత్వం తమలో 90 శాతం మందికి విడుదల చేయలేదని ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఆరోపించారు. తక్షణం 100 శాతం రాయితీలను విడుదల చేయాలంటూ పరిశ్రమల శాఖ అడిషనల్ డైరెక్టర్ రామలింగరాజుకు జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) వినతిపత్రం సమరి్పంచింది. ఎప్పటిలోగా విడుదల చేస్తారో లిఖితపూర్వకంగా చెప్పాలని.. అప్పటివరకు ఏపీఐఐసీ కార్యాలయం నుంచి కదిలేదిలేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోతే ఆమరణ నిరాహారదీక్షకు వెనుకాడబోమని జేఏసీ స్పష్టంచేసింది.అయితే, ధర్నా చేస్తున్న దళిత పారిశ్రామికవేత్తలను తరలించడానికి పోలీసు బలగాలు పెద్దఎత్తున వచ్చాయి. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఈడ్పుగంటి అనార్బాబు, ఈరా రాజశేఖర్, పినమాల నాగకుమార్, కనపర్తి విజయరాజు, కొడాలి రాంబాబు, భక్తవత్సలం, సరిహద్దు దయాకర్ డాక్టర్ ఎం.గీత, మూడా, రమణమూర్తి నాయక్, పెద్దఎత్తున ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. -
గళమెత్తిన విద్యార్థి దళం
సాక్షి,అమరావతి/తాడేపల్లి రూరల్: కర్కశ సర్కారుపై విద్యార్థి దళం గళమెత్తింది. రహదారులపై రణన్నినాదమై గర్జించింది. ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణం విడుదల చేయాలని కదంతొక్కింది. చంద్రబాబు ప్రభుత్వ దుర్నీతిపై కన్నెర్రచేసింది. ఖబడ్దార్ అంటూ హెచ్చరించింది. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్íÙప్పులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులు నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని చాలా కాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా స్పందించలేదు. దీంతో సోమవారం తాడేపల్లిలోని సాంఘిక సంక్షేమ కార్యాలయ ముట్టడికి విద్యార్థులు పిలుపునిచ్చారు.పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎనీ్టఆర్ జిల్లాల నుంచి భారీగా తరలివచి్చన విద్యార్థులు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ కార్యాలయం వద్ద నుంచి ప్లకార్డులు, బ్యానర్లు, జెండాలు చేతబట్టి ర్యాలీగా పెట్రోల్ బంక్ మీదుగా సాంఘిక సంక్షేమ కార్యాలయ రోడ్డులోకి చొచ్చుకెళ్లారు. దీంతో పోలీసులు లాఠీలను అడ్డుపెట్టి విద్యార్థి నేతలను, విద్యార్థులను అడ్డుకునే యత్నం చేశారు. దీంతో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. అనంతరం బారికేడ్లను నెట్టేసి విద్యార్థులు సాంఘిక సంక్షేమ కార్యాలయం వద్ద చేరుకుని అక్కడ ధర్నాకు దిగారు.‘ఫీజులు చెల్లించలేదని విద్యార్థులను కాలేజీ యాజమాన్యాలు గేట్ బయటకు నెట్టేయడం అన్యాయం, విద్యార్థులను వేధించటం తగదు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.5,600 కోట్లు, స్కాలర్ షిప్ బకాయిలు రూ.2,200 కోట్లు తక్షణమే చెల్లించాలి, వసతి దీవెన బకాయిలు చెల్లించాలి, లేకుంటే విద్యార్థుల సత్తా ఏమిటో సర్కారుకు చూపిస్తాం.. ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం’’ అని హెచ్చరించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. విద్యార్థుల నినాదాలతో తాడేపల్లి హోరెత్తింది. అనంతరం పోలీసులు ఐదుగురితో కూడిన విద్యార్థుల ప్రతినిధి బృందాన్ని అధికారుల వద్దకు పంపుతామనటంతో విద్యార్థినేతలు, విద్యార్థులు ఒప్పుకోలేదు. ప్రభుత్వమే దిగివచ్చి తమ సమస్యలను వెంటనే పరిష్కరించే వరకు తాము ఎక్కడికీ ఇక్కడి నుంచి కదిలేదిలేదని భీష్మించారు. విద్యార్థి నేతలను ఈడ్చిపడేసిన పోలీసులు ఆందోళన తీవ్రం కావటంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ (జోనల్) ఎ.రవిచంద్రతో పాటు మరికొంతమంది విద్యార్థులను ఈడ్చిపడేశారు. వారిని తీసుకెళ్లి ముందే సిద్ధంగా ఉంచిన లారీలోకి ఎక్కించారు. అనంతరం వారిని తెనాలి మార్గంలోని వివిధ ప్రాంతాల్లో తిప్పారు. చివరికి దుగ్గిరాల పోలీసు స్టేషన్కు తరలించారు. వారి వెంట భారీగా విద్యార్థులు వాహనాల్లో తరలివెళ్లారు. విద్యాశాఖ మంత్రి విదేశాల్లో చక్కర్లు కొడతారా? అంతకు ముందు వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య నేతృత్వంలో గుంటూరు నుంచి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ రవిచంద్ర నేతృత్వంలో విజయవాడ వైపు నుంచి విద్యార్థులు బైక్లు, ఇతర వాహనాల్లో భారీ ర్యాలీగా తాడేపల్లికి చేరుకున్నారు. అనంతరం సాంఘిక సంక్షేమ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నాను ఉద్దేశించి చైతన్య, రవిచంద్ర మాట్లాడారు. దాదాపు ఎనిమిది క్వార్టర్స్ బకాయిలు రూ.7,800 కోట్లు ప్రభుత్వం మంజూరు చేయాలని, ఇందులో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రూ.5,600 కోట్లు, స్కాలర్ షిప్ బకాయిలు రూ.2,200 కోట్లు చెల్లించాలని స్పష్టం చేశారు.వీటిని చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు రాష్ట్రంలో విద్యార్థులు కష్టాల్లో ఉంటే విద్యాశాఖ మంత్రి లోకేశ్ విదేశాల్లో విహార యాత్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అనంతరం పోలీసులు పానుగంటి చైతన్య, ఎ.రవిచంద్ర, నరేందర్ రెడ్డి, బాజీ, రవి తదితరులను అరెస్టు చేసి దుగ్గిరాల పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ధర్నాలో స్టూడెంట్ యూనియన్ నాయకులు నరేంద్రరెడ్డి, గంటి, రవి, పేటేటి నవీన్, వినోద్, కోమల సాయి, రవీంద్రారెడ్డి, సందీప్, రవి, కరీం, కిరణ్, రాజే‹Ù, సతీష్, అజయ్, రామకృష్ణ, మస్తాన్, ప్రభు, హరి, సుభాని, బాలు, అబ్బాస్, సిరాజ్, శ్రీనివాస్, నవీన్, కోమల్ సాయి, సురేష్ పాల్గొన్నారు. విద్యార్థులపై కేసు నమోదు తాడేపల్లి ఎస్ఐ ఖాజావలి విద్యార్థి సంఘ నాయకులు పానుగంటి చైతన్య, నరేంద్రరెడ్డి, అనిల్ కుమార్, రవీంద్ర, రవిచంద్ర విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేశారు. వీరిని మధ్యాహ్నం 12 గంటలకు అదుపులోకి తీసుకున్న పోలీసులు సాయంత్రం 8 గంటల సమయంలో మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు.ప్రభుత్వం దిగిరాకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం ప్రభుత్వం దిగిరాకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం. తక్షణం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మంజూరు చేయాలి. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించారు, స్కాలర్íÙప్పులూ మంజూరు చేశారు. ఈ సర్కారు వచ్చాక అసలు చెల్లింపులు నిలిపేసింది. విద్యార్థులను చిత్రహింసలు పెడుతోంది. ఈ సర్కారుకు తగిన గుణపాఠం చెబుతాం. – పానుగంటి చైతన్య, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పార్ట్ టైం ఉద్యోగాలకు విద్యార్థులు చంద్రబాబు సర్కారు ఫీజు రీయింబర్స్మెంట్ ఇతర బకాయిలు చెల్లించకుండా తాత్సారం చేయడంతో కాలేజీల యాజమాన్యాల వేధింపులను విద్యార్థులు తట్టుకోలేకపోతున్నారు. హాల్టికెట్లు ఇవ్వకపోవడంతో చాలామంది పరీక్షలకు దూరమయ్యారు. దీంతో కొందరు విద్యార్థులు పార్ట్టైం ఉద్యోగాలుచేస్తూ ఫీజులు చెల్లించాల్సిన దుస్థితి నెలకొంది. తల్లిదండ్రులు కాలేజీల ఫీజులు చెల్లించేందుకు అప్పులుచేయాల్సి వస్తోంది. – ఎ.రవిచంద్ర, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ -
జీతమో.. రామ‘చంద్ర’!
సాక్షి, అమరావతి: ఒకరు కాదు.. వెయ్యి కాదు.. రాష్ట్రంలో ఏకంగా లక్ష మంది ఉద్యోగులు జీతాల కోసం నిరీక్షిస్తున్నారు. ఒకటో తేదీ వెళ్లిపోయి ఇప్పటికే వారం దాటిపోయింది. అయినా చంద్రబాబు సర్కారు కనికరించడం లేదు. గతంలో సమస్యల పరిష్కారం.. ఆర్థిక ప్రయోజనాల కోసం ఉద్యోగ సంఘాలు ఆందోళనలు చేసేవి. ఇప్పుడు జీతాలు కోసం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు అందుకుని ఎన్ని నెలలో అవుతోందని ఉద్యోగులు వాపోతున్నారు. 8వ తేదీ వెళ్లినా..రాష్ట్ర ప్రభుత్వంలోని 18 శాఖలతోపాటు జలవనరులు, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, పబ్లిక్ హెల్త్ వంటి ఇంజనీరింగ్ విభాగాల్లోని సుమారు లక్ష మంది ఉద్యోగులకు ఈ నెల 8వ తేదీ వచ్చినా చంద్రబాబు సర్కారు జీతాలు ఇవ్వలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రతినెలా 1వ తేదీనే వేతనాలు, పెన్షన్లు చెల్లిస్తామంటూ ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ఆ హామీని నెరవేర్చడం లేదు. ఈ నెల 8వ తేదీ వచ్చినా పౌర సరఫరాలు, ప్రజారోగ్యం, చక్కెర–డైరెక్టరేట్, సర్వే విభాగం, వ్యవసాయం, ప్రణాళిక, పరిశ్రమలు, సహకార, రవాణా, సమాచార, ఈఎస్ఐ, ఆర్ అండ్ బీ, గనులు–భూగర్భ, ఎన్సీసీ, పశుసంవర్ధక, గిరిజన సంక్షేమ, బీసీ శాఖల్లో ఉద్యోగులకు జీతాలు అందకపోవడంతో వారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ హయాంలో ఇలా ఎదురుచూడలేదువైఎస్సార్సీపీ హయాంలోనే ఉద్యోగులకు వేతనాలు మెరుగ్గా వచ్చాయని, 8వ తేదీ వరకు వేతనాల కోసం ఎదురు చూడలేదని ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. గతంలోని చంద్రబాబు పాలనలో ఉద్యోగులపై ఎప్పుడూ సానుకూలత ఉండేది కాదని.. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాన్ని ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని శాఖలకు ఈ నెల 3న వేతనాలు చెల్లించారని, 8వ తేదీ వచ్చినా 18 శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు వేతనాలు చెల్లించకపోవడం ఉద్యోగుల పట్ల వివక్ష చూపడం కాదా అని ఉద్యోగ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఉద్యోగులను విభజించి కొంతమంది ఉద్యోగులకు ముందుగా.. మరికొందరికి ఆలస్యంగా జీతాలు చెల్లించడం చంద్రబాబు ప్రభుత్వంలోనే చూస్తున్నామని వాపోతున్నారు.ఈఎంఐలు కట్టేందుకు ఇబ్బందులే..జీతాలు అందకపోవడంతో పాలు పోసే వ్యక్తి నుంచి కిరాణా కొట్టులో బాకీ వరకు.. ప్రతి ఖర్చుకూ ఎలా సర్దుబాటు చేయాలో తెలియక ఉద్యోగులు, ఉపాధ్యాయులు మధనపడుతున్నారు. ఒకటో తేదీ జీతం వస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలామంది రుణ వాయిదాలను ప్రతినెలా 5వ తేదీలోపే పెట్టుకున్నారు. సకాలంలో జీతాలు రాకపోవడంతో వాయిదాలకు వడ్డీ కింద ప్రతినెలా రూ.600 నుంచి రూ.1,500 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. మందులు కొనుక్కునేందుకు అప్పులు చేయాల్సి వస్తోందని పింఛనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈఎంఐలు సకాలంలో చెల్లించకపోతే ఉద్యోగులను బ్యాంకులు డిఫాల్టర్లుగా చూస్తాయని, భవిష్యత్లో రుణాలు ఇవ్వడానికి ఇది మచ్చగా మిగులుతుందని ఆందోళన చెందుతున్నారు. రూ.3 వేల కోట్లు అప్పు తెచ్చి ఏం లాభంరాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 2న రూ.3 వేల కోట్లను అప్పు చేసినప్పటికీ 8వ తేదీన కూడా జీతాలు ఇవ్వకపోతే ఏం లాభమని, ఆ డబ్బంతా ఏమైందని ఉద్యోగ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. గత నెల వరకు ఉపాధ్యాయులకు ఏ నెలలోనూ 1వ తేదీన జీతాలు ఇవ్వలేదు. ఉపాధ్యాయులు వేతనాల కోసం పలుసార్లు రోడ్లెక్కాల్సి వచ్చింది. దీంతో ఈ నెల 3న ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించారు. రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు ముందుగా వేతనాలు చెల్లిస్తూ.. మిగతా ఉద్యోగులకు విడతల వారీగా 10వ తేదీ వరకు చెల్లించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. చిరుద్యోగులకూ ఎదురుచూపులేచంద్రబాబు ప్రభుత్వంలో చిరుద్యోగులు వేతనాల కోసం ప్రతినెలా ఎదురు చూపులే మిగులుతున్నాయి. 104 ఉద్యోగులు, కాంట్రాక్ట్ లెక్చరర్లు, హోంగార్డులు, వీఆర్ఏలు, ఆరోగ్య మిత్రలు వేతనాల కోసం రోజుల తరబడి ఎదురుచూస్తూనే ఉన్నారు. వారంతా జీతాలు చెల్లించాలని ప్రతినెలా ప్రభుత్వాన్ని అడుక్కోవాల్సిన దుస్థితి నెలకొంది. డీఏ బకాయిల సంగతేమిటో మరి2019 ఎన్నికల ముందు చంద్రబాబు ప్రభుత్వం డీఏలకు పోస్టు డేటెడ్ జీవోలను జారీ చేసిందని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. డీఏలకు పోస్ట్ డేటెడ్ జీవోలను జారీ చేసే ఆనవాయితీని చంద్రబాబు ప్రభుత్వమే తీసుకువచ్చిందని, అప్పటివరకు ఏ ప్రభుత్వం పోస్ట్ డేటెడ్ జీవోలు ఇవ్వలేదని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. వచ్చే జనవరితో కలిపి చూస్తే చంద్రబాబు ప్రభుత్వం 5 డీఏలు బకాయిలుంటే ఎట్టకేలకు ఒక డీఏను మంజూరు చేసి ఆ బకాయిలను మూడు వాయిదాల్లో చెల్లిస్తామని జీవోలో పేర్కొనడాన్ని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. ఈ హామీల సంగతేమిటో!ఎన్నికల సందర్భంగా ఉద్యోగులకు చంద్రబాబు ఇచ్చిన హామీలను ఏడాదిన్నరైనా అమలు చేయకుండా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తానని, పీఆర్సీ వేస్తానని, బకాయిలన్నీ వీలైనంత త్వరగా చెల్లిస్తానని, ఓపీఎస్ను–జీపీఎస్ను సమీక్షించి మెరుగైన సీపీఎస్ విధానాన్ని తీసుకొస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఏడాదిన్నరైనా ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించలేదు. పీఆర్సీ వేయలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నికల ముందే పీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేసి కమిషనర్ను కూడా నియమించింది. చంద్రబాబు అధికారంలోకి రాగానే పీఆర్సీ కమిషనర్తో రాజీనామా చేయించారు. ఇప్పటికీ పీఆర్సీని ఏర్పాటు చేయకుండా.. కమిషనర్ నియమించకుండా కాలయాపన చేస్తున్నారు. మరోపక్క ఉద్యోగులకు రూ.31 వేల కోట్లు బకాయిలను చెల్లించకుండా వాయిదాలు వేస్తూ వస్తున్నారు.జీతాలు రాక ఈఎంఐలు కట్టలేకపోతున్నారుఅప్పుడే ఎనిమిదో తేదీ వచ్చేసింది. ఇంతవరకు జీతాలు రాక చిరుద్యోగులు చాలా ఇక్కట్లకు గురవుతున్నారు. ప్రతి నెలా మొదటి వారంలో ఈఎంఐలు చెల్లించాలి. అవి చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ప్రతి నెలా మొదటి వారమే జీతాలు విడుదల చేయాలి. – గుద్దటి రామ్మోహనరావు, అధ్యక్షుడు, ఏపీఎన్జీజీఓ, కాకినాడవేతన కష్టాలు మొదలయ్యాయిఉద్యోగులకు వేతన కష్టాలు మొదలయ్యాయి. దాదాపు అన్ని శాఖల్లో ఈ నెల ఇప్ప టి వరకు జీతాలు పడలేదు. 5వ తేదీలోగా వేతనం అందకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. లోన్ల ఈఎంఐలు ప్రతినెలా 5వ తేదీలోగా కచ్చితంగా కట్టాల్సి ఉంటుంది. – ఎన్.దివాకర్రావు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షుడుప్రభుత్వ ఉద్యోగులపై చిన్నచూపు తగదుప్రభుత్వ ఉద్యోగులతో సర్కారు ఆటలాడుకుంటోంది. వారిని చిన్నచూపు చూస్తోంది. సమయానికి జీతాలు వేయకపోతే ఉద్యోగుల జీవనం సాగేదెలా? ఇప్పటివరకు నాకు తెలిసి 15 డిపార్ట్మెంట్లకు జీతాలు పడలేదు. గతంలో 1వ తేదీనే జీతం ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. 8వ తేదీ వచ్చినా జీతాలు జమ చేయకపోవడంతో ఉద్యోగుల కుటుంబాలు పస్తులుండాల్సి వస్తోంది. ప్రభుత్వం వెంటనే జీతాలను జమ చేయాలి. – గిరి కుమార్ రెడ్డి, ఏపీజేఏసీ మాజీ జిల్లా అధ్యక్షుడు, కర్నూలు -
వైద్య విద్య ప్రవేశాల్లో పారదర్శకతకు పాతర
సాక్షి, అమరావతి: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియలో పారదర్శకతకు చంద్రబాబు ప్రభుత్వం పాతర వేసింది. బీడీఎస్ సీట్లు ఎన్ని ఖాళీగా ఉన్నాయో ప్రకటించకుండానే విద్యార్థులకు కేటాయింపు చేపట్టింది. మూడో విడత బీడీఎస్ కనీ్వనర్ సీట్ల కేటాయింపు ప్రొవిజనల్ లిస్ట్ను సోమవారం ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. వాస్తవానికి రెండో విడత కౌన్సెలింగ్లో విద్యార్థులు చేరని, వదులుకున్న సీట్ల వివరాలను తొలుత ప్రకటించాలి. ఇలా ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో విద్యార్థుల ముందుంచాకే తదుపరి కౌన్సెలింగ్లో సీట్లు కేటాయించాల్సి ఉంటుంది.ఈ ఏడాది అక్టోబర్ 23న విశ్వవిద్యాలయం రెండో విడత కౌన్సెలింగ్లో సీట్లు కేటాయించింది. విద్యార్థులకు ఫ్రీ–ఎగ్జిట్ అవకాశం కల్పించింది. నవంబర్ 20తోనే దేశంలో మెడికల్ యూజీ ప్రవేశాల గడువు ముగిసింది. అయితే ఎంబీబీఎస్ ప్రవేశాలను తప్పుల తడకగా చేపట్టి వాటిని సరిదిద్దుకోవడంలోనే వర్సిటీ కాలయాపన చేసింది. దీంతో తుది దశ బీడీఎస్ కౌన్సెలింగ్ చేపట్టలేదని విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.ఇదిలా ఉండగా, రెండో దశ కౌన్సెలింగ్ ముగిసిన నెలన్నర అనంతరం నేరుగా మూడో దశ కౌన్సెలింగ్ ప్రొవిజనల్ సీట్ల కేటాయింపు జాబితాను సోమవారం వర్సిటీ విడుదల చేసింది. ఖాళీల వివరాలు ప్రకటించకుండా సీట్ల కేటాయింపు చేపట్టడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు అనుమానాలు, ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రొవిజనల్ సీట్ల కేటాయింపులో అభ్యంతరాలుంటే మంగళవారం మధ్యాహ్నం 2 గంటల్లోపు తెలియజేయడానికి అవకాశం ఇచ్చారు. -
స్క్రబ్ టైఫస్తో 9 మంది మృతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు ఈ ఏడాది 1,566 నమోదయ్యాయని.. ఇందులో తొమ్మిది మంది బాధితులు మరణించారని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ వెల్లడించారు. అయితే, ఈ మరణాలన్నీ స్క్రబ్ టైఫస్వల్లే జరిగినట్లు ఇప్పటివరకు నిర్ధారణ కాలేదన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తన కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా స్క్రబ్ టైఫస్ బాధితులు ఎందువల్ల మరణించారనే దానిపై పరిశోధన జరగాల్సి ఉందన్నారు. ఇందుకు కనీసం రెండు నెలల నుంచి మూడునెలల సమయం పట్టే అవకాశముందని తెలిపారు.బాధితుల నుంచి సేకరించిన నమూనాలను జీనోమ్ స్వీకెన్సీ (గుంటూరు, తిరుపతి) ద్వారా పరీక్ష చేయించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. బోధనాసుపత్రుల్లో ఉండే ర్యాపిడ్ రెస్పాన్స్ టీం (ఆర్ఆర్)లు అధిక కేసులు/అసాధారణ మరణాలు నమోదైన ప్రాంతాల్లో పరిశోధన చేస్తాయన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఆర్ఆర్ టీంలు ఉన్నాయన్నారు. ఎలీశా పరీక్ష చేయించి, స్క్రబ్ టైఫస్పై అవగాహనకు వస్తామన్నారు. గుంటూరు జీజీహెచ్లో గడిచిన 38 రోజుల్లో 26 స్క్రబ్ టైఫస్ కేసులు వచ్చాయన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రఘునందన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. మన్యంలో స్క్రబ్ టైఫస్ కేసుచింతూరు: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ప్రభుత్వాస్పత్రిలో ఓ గిరిజనుడికి స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసు నమోదైనట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డి తెలిపారు. చింతూరు మండలం కొత్తపల్లికి చెందిన మడివి లక్ష్మయ్య ఈనెల 4న అధికజ్వరం, ఒళ్లునొప్పులతో సీహెచ్సీకి రాగా, వైద్యులు అనుమానంతో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో అతనికి స్క్రబ్ టైఫస్ బ్యాక్టీరియా పాజిటివ్గా తేలింది. లక్ష్మయ్యకు చికిత్సకు అందిస్తున్నామని అతని పరిస్థితి స్థిరంగా ఉందని కోటిరెడ్డి తెలిపారు. వ్యాధి నిర్ధారణకు సంబంధించిన కిట్లు, మందులు ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు. -
పంటలన్నీ కొనలేం
సాక్షి, అమరావతి: రైతులు పండించే అన్ని పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ఏడాది 55 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని, వచ్చే ఏడాదీ కొనాలంటే సాధ్యం కాదన్నారు. మనం పండించే వరిని మనమే తినడం లేదని, అలాంటి వరిని ప్రభుత్వం కొనుగోలు చేసి ఏం చేస్తుందని సీఎం ప్రశ్నించారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లో జీఎస్డీపీ వృద్ధిపై సీఎం చంద్రబాబు సోమవారం సచివాలయంలో మీడియా సమావేశంలో ప్రజెంటేషన్ ఇచ్చారు.రైతులు పండించే ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు రావడం లేదన్న ప్రశ్నపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఎక్కువ మంది వరి పండించడంతో ఉత్పత్తి పెరిగిందన్నారు. ఎరువులు, క్రిమిసంహారక మందులను రైతులు ఎక్కువగా వినియోగిస్తున్నారని, దీంతో వాటి కొనుగోలుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. ‘రాబోయే రోజుల్లో వరి తినరు. బియ్యం తింటే డయాబెటిస్తో పాటు ఇతర జబ్బులన్నీ వస్తాయి. రైతులు కూడా ప్రజలు వినియోగించే పంటలనే సాగు చేయాలి. ఉద్యాన పంటలకు కూడా ధరల సమస్య తలెత్తింది. అరటి సాగు ఎక్కువ కావడంతో ఉత్పత్తి పెరిగి ధరల సమస్య ఉత్పన్నమైంది.ఓ రైతు 60 ఎకరాల్లో అరటి పంట వేశారు. మార్కెట్ డిమాండ్ ఆధారంగా రైతులు పంటలు సాగు చేయాలి. ఉద్యాన పంటలను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. అనంతపురంలో 51 రకాల పండ్లు పండిస్తున్నారు. అన్నీ కొనాలంటే ప్రభుత్వానికి సాధ్యం కాదు. సమతుల్యం చేసుకోవాలి. పంటల మారి్పడిపై రైతులకు అవగాహన కల్పించి చైతన్యం తెచ్చేందుకు రైతు సేవా కేంద్రాల వారీగా కార్యాచరణ తయారు చేస్తున్నాం. బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా రాష్ట్రంలో అగ్రిటెక్ అమలు చేస్తున్నాం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగుల సంఖ్య పెంచేసిందిఈ ఆరి్థక ఏడాది తొలి రెండు త్రైమాసికాల్లో జీఎస్డీపీ లక్ష్యంలో 40.64 శాతం వృద్ధి సాధించామని, మిగతా రెండు త్రైమాసికాల్లో 59.36 శాతం వృద్ధి సాధిస్తామని చంద్రబాబు చెప్పారు. గత ప్రభుత్వ చర్యల వల్ల ఆదాయం తగ్గిపోయిందంటూ మరోసారి నిందించారు. సూపర్ సిక్స్ హామీల అమలుకు, అభివృద్ధి కోసం అప్పులు చేస్తున్నామన్నారు. 18 నెలల్లో ఎన్ని అప్పులు చేశారన్న ప్రశ్నకు తరువాత జవాబు చెబుతానన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉద్యోగుల సంఖ్యను పెంచేయడంతో రాష్ట్ర సొంత ఆదాయం అంతా ఉద్యోగుల వేతనాలకే సరిపోతోందని చంద్రబాబు పేర్కొన్నారు. అవసరం లేకపోయినా ప్రభుత్వ ఉద్యోగులను నియమించారని, పునర్ వ్యవస్థీకరణ ఎలా చేయాలనేది ఆలోచిస్తున్నామన్నారు. పరకామణిలో డబ్బులు కొట్టేయడం చిన్న నేరం అనడం సరి కాదన్నారు. కేంద్రంలో బీజేపీ తప్పు చేస్తే సత్యకుమార్ను అడగలేను కదా? ఇండిగో సంక్షోభం నేపథ్యంలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ౖరాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న డిమాండ్లపై స్పందించాలని విలేకరులు కోరగా.. ఊహించని సమస్య వచ్చిందని, దీన్ని కేంద్రం పరిష్కరిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. బీజేపీకి చెందిన సత్యకుమార్ రాష్ట్ర మంత్రిగా ఉన్నారని, అయితే కేంద్రంలో బీజేపీ తప్పు చేస్తే సత్యకుమార్ను నేను అడగలేను కదా? అని చంద్రబాబు ఎదురు ప్రశి్నంచారు. కేంద్ర మంత్రుల పనితీరులో తన జోక్యం ఉండదన్నారు. సంక్రాంతి నుంచి అన్ని సేవలూ ఆన్లైన్లోనే... సంక్రాంతి నుంచి రాష్ట్ర పౌరులకు అన్ని సేవలూ ఆన్లైన్లోనే అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆ దిశగా శాఖలన్నీ చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్టీజీఎస్పై సీఎం సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలు తమకు కావాల్సిన ప్రభుత్వ సేవలన్నీ మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందజేస్తున్నామని సీఎం చెప్పారు. రిజిస్ట్రేషన్ల అనంతరం డాక్యుమెంట్లు కొరియర్లో నేరుగా సంబంధిత వ్యక్తుల ఇళ్లకే పంపే ఏర్పాట్లు చేయాలన్నారు. -
పాఠశాల విద్యాశాఖ.. అత్యవసర శాఖనా?
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యాశాఖ వెకేషన్ డిపార్ట్మెంట్గా ఉంటూ, మానసిక శాస్త్రం ప్రకారం నేర్చుకొనేవారికి, చదువు చెప్పే వారికి విశ్రాంతి అవసరమని, కానీ దానికి భిన్నంగా పాఠశాల విద్యాశాఖను అత్యవసర శాఖగా మార్చేశారని యూటీఎఫ్ ఆక్షేపించింది. ఉపాధ్యాయులను వేధిస్తూ మానసిక ఒత్తిడికి గురి చేస్తోందని యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.వెంకటేశ్వర్లు, కేఎస్ఎస్ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆదివారం విజయవాడలో జరిగిన యూటీఎఫ్ కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసినట్టు ఓ ప్రకటనలో తెలిపారు. పాఠశాల విద్యాశాఖను నాన్ వెకేషన్ శాఖగా మార్చమని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖ కమిషనర్కు గతంలో విన్నవిస్తే సాధ్యం కాదని సమాధానం ఇచ్చారని, స్వేచ్ఛాయుత వాతావరణంలో బోధించాల్సిన ఉపాధ్యాయులను రోజుకో స్కీం పేరుతో ఒత్తిడి చేస్తూ శని, ఆదివారాలు, పండుగ సెలవులలో పని చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. 10వ తరగతి బోధించే ఉపాధ్యాయులకు సెలవులు ఇవ్వకుండా ఇబ్బందికి గురిచేస్తున్నారని విమర్శించారు. 100% ఉత్తీర్ణత పేరుతో ప్రతిరోజు సాయంత్రం పరీక్ష నిర్వహించి మార్కులు అప్లోడ్ చేయాలని ఒత్తిడి చేయడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయికి బానిసలు కాకుండా చర్యలు తీసుకోవాలి విద్యార్థులు గంజాయికి బానిసలుగా మారి జీవితాలను బలిచేసుకుంటున్న ఘటనలపై యూటీఎఫ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గంజాయిని విక్రయించే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.వెంకటేశ్వర్లు, కేఎస్ఎస్ ప్రసాద్ డిమాండ్ చేశారు. -
ముగిసిన వక్ఫ్ ఆస్తుల నమోదు
సాక్షి, అమరావతి: ఉమీద్ పోర్టల్లో వక్ఫ్ ఆస్తుల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువు శనివారం అర్ధరాత్రితో ముగిసింది. దేశంలో సుమారు 9 లక్షలకు పైగా వక్ఫ్ ఆస్తులు ఉన్నట్లు అంచనా వేయగా.. ఈ ఆరు నెలల గడువులో 5,17,082 వక్ఫ్ ఆస్తులనే ముతవల్లీలు, నిర్వాహకులు నమోదు చేశారు. వీటికి వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ పరిశీలన తర్వాత.. వక్ఫ్ బోర్డు సీఈవో ఆమోదం తెలిపే ప్రక్రియ సగమే పూర్తయ్యింది. దీంతో ఇప్పటి వరకు 2,16,937 ఆస్తులకు మాత్రమే తుది ఆమోదం లభించింది. ఇప్పటికే అప్లోడ్ పూర్తి చేసిన ఆస్తుల పరిశీలన.. ఆమోదానికి కేంద్ర ప్రభుత్వం మూడు నెలల వెసులుబాటు కల్పించింది. దీంతో వక్ఫ్ బోర్డుల ముతవల్లీలు, నిర్వాహకులు అప్లోడ్ చేసిన ఆస్తులను ఆమోదించేందుకు ఈ మూడు నెలల గడువు ఉపయోగపడనుంది. ట్రిబ్యునల్పైనే ఆశలు..ఉమీద్ పోర్టల్లో నమోదు గడువు ముగియడంతో.. దేశంలోని 4 లక్షలకు పైగా వక్ఫ్ ఆస్తుల నమోదు ప్రశ్నార్థకంగా మారింది. సాంకేతిక కారణాల వల్ల చాలా రాష్ట్రాల్లో ఆస్తుల నమోదు సరిగ్గా జరగలేదు. దీంతో వక్ఫ్ సవరణ చట్టంలోని వెసులుబాటును ఉపయోగించుకుని ట్రిబ్యునల్ను ఆశ్రయించేందుకు ఆయా రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. ట్రిబ్యునల్ను ఆశ్రయిస్తే వక్ఫ్ ఆస్తుల నమోదుకు మరో 6 నెలల గడువు లభిస్తుందని.. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు ఏపీ ముస్లిం జేఏసీ కన్వీనర్ షేక్ మునీర్ అహ్మద్ ‘సాక్షి’కి చెప్పారు. ఉమీద్ పోర్టల్ క్లోజ్ అయినందున.. ముస్లిం సమాజానికి ఉన్న ఏకైక మార్గం ట్రిబ్యునల్ మాత్రమేనని తెలిపారు. కానీ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత కర్నూలు కేంద్రంగా ఉన్న ట్రిబ్యునల్కు శాశ్వత జడ్జిని నియమించలేదని చెప్పారు. దీని వల్ల వారంలో ఒక రోజు మాత్రమే ట్రిబ్యునల్ పనిచేస్తోందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వక్ఫ్ ఆస్తులను కాపాడేందుకు వెంటనే ట్రిబ్యునల్కు శాశ్వత జడ్జిని నియమించాలని మునీర్ అహ్మద్ డిమాండ్ చేశారు. -
18 వరకు పదో తరగతి పరీక్ష ఫీజుకు గడువు
సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షల(ఎస్ఎస్సీ–2026) ఫీజు చెల్లింపునకు పాఠశాల విద్యాశాఖ గడువు పొడిగించింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆలస్య రుసుంతో ఈనెల 15వ తేదీ వరకు అవకాశం ఇవ్వగా, తాజాగా ఈనెల 18 వరకు పెంచారు.ఆలస్య రుసుం లేకుండా ఈనెల 9వ తేదీ వరకు, రూ.50 ఆలస్య రుసుంతో 12వ తేదీ, రూ.200 ఫైన్తో ఈనెల 15, రూ.500 ఆలస్య రుసుంతో 18వ తేదీ వరకు అవకాశం కల్పించినట్టు ఎస్ఎస్సీ పరీక్షల డైరెక్టర్ కేవీ శ్రీనివాసులరెడ్డి వెల్లడించారు. -
ఆన్లైన్ అమ్మకాల్లో భారత్ దూకుడు
సాక్షి, అమరావతి: ఆన్లైన్ అమ్మకాల్లో భారత్ దూసుకుపోతోంది. టెక్నాలజీ వినియోగంలో ముందుండే అమెరికాను దాటేసి భారతీయులు ఆన్లైన్లో వారికి నచ్చిన వస్తువులను కొనేస్తున్నారు. మన దేశంలో అత్యధికంగా అమ్మకాలు జరిగే దసరా–దీపావళి పండుగ సమయంలో జరిగిన అమ్మకాలు.. అమెరికాలో క్రిస్మస్ ముందు జరిగే బ్లాక్ ఫ్రైడే అమ్మకాలను మించిపోయాయని ఎస్బీఐ రీసెర్చ్ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఈ సంవత్సరం పండుగల సీజన్లో రూ.1.24 లక్షల కోట్ల విలువైన అమ్మకాలు జరిగినట్లు ఎస్బీఐ అంచనా వేసింది.ఇది గతేడాది జరిగిన అమ్మకాలు రూ.94,800 కంటే ఎక్కువ. పండుగల సీజన్కు ముందు కేంద్రప్రభుత్వం జీఎస్టీ రేట్లను సంస్కరించడం ఈ ఏడాది అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారణంగా పేర్కొంది. ఇదే సమయంలో అమెరికాలో ఈ ఏడాది బ్లాక్ ఫ్రైడే అమ్మకాలు రూ.1,02,960 కోట్లు ఉంటాయని అంచనా వేసింది. 2024లో ఈ బ్లాక్ ఫ్రైడే అమ్మకాలు రూ.95,040 కోట్లుగా నమోదయ్యాయి. అంటే భారత్లో ఈ ఏడాది పండుగ అమ్మకాల్లో 31 శాతం నమోదయితే అమెరికాలో మాత్రం ఈ వృద్ధి 8.3 శాతానికి పరిమితమవుతుందని ఎస్బీఐ అంచనా వేసింది. అమెరికా ఆర్థికవ్యవస్థ అంతంతమాత్రంగానే ఉండటంతో ఈ ఏడాది అమ్మకాల్లో అంత వృద్ధి నమోదు కాకపోవచ్చని పేర్కొంది.ఎక్కువ ఎలక్ట్రానిక్ వస్తువులే దేశీయ ఆన్లైన్ అమ్మకాల్లో అత్యధికభాగం ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయిన్సెస్ వస్తువులే అత్యధికంగా ఉంటున్నాయి. మొత్తం అమ్మకాల్లో 43 శాతం (సుమారు రూ.53 వేలకోట్లు) ఈ రెండు రంగాల్లోనే జరుగుతున్నాయి. ఆ తర్వాత అత్యధికంగా మొబైల్ ఫోన్లు (26 శాతం) కొనుగోలు చేస్తున్నారు. తర్వాతి స్థానాల్లో లైఫ్స్టైల్ ఉత్పత్తులు (22 శాతం), సౌందర్యసాధనాలు (21 శాతం) ఉన్నాయి. ఈ సారి ఖరీదైన వస్తువులను మెట్రో వాసులే కాకుండా నాన్ మెట్రో వాసులు కూడా అత్యధికంగా కొనుగోలు చేసినట్లు ఎస్బీఐ తెలిపింది. -
వెరీ 'గుడ్డు'
పెరవలి: కాలం కలసి వచ్చి, ప్రస్తుతం కోడి గుడ్డు ధరలు పెరగటంతో రైతులు నాలుగు డబ్బులు కళ్లజూస్తున్నారు. ఏడాది కాలంగా గిట్టుబాటు ధర లేక నష్టపోయిన వారికి.. ప్రస్తుతం లభిస్తున్న ధరలు ఊరటనిస్తున్నాయి. గత ఏడాది సరిగ్గా ఇదే సమయంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తితో లక్షలాదిగా కోళ్లు చనిపోయాయి. దీని ప్రభావంతో ఏడాది కాలంగా కోడి మాంసంతో పాటు గుడ్లు తినడానికి మాంసాహార ప్రియులు భయపడ్డారు. ఫలితంగా కొనుగోళ్లు పడిపోయి, కోళ్ల రైతులు ఆర్థికంగా దెబ్బ తిన్నారు. అనేక కోళ్ల ఫామ్లు మూతపడిన పరిస్థితులు నెలకొన్నాయి. దీనికితోడు మేత, పిల్ల ధరలు కూడా గణనీయంగా పెరగడంతో రైతులు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాధారణంగా వేసవి, కార్తిక మాసంలో గుడ్ల అమ్మకాలు తగ్గుముఖం పడతాయి. కానీ, ఈ ఏడాది కార్తిక మాసం ప్రారంభంలో రూ.5.44 ఉన్న గుడ్డు ధర రానురానూ పెరుగుతూ ప్రస్తుతం రూ.6.50కు చేరింది. ఒకవైపు కార్తిక మాసం ముగిసినా.. అక్కడక్కడ అయ్యప్ప దీక్షధారులు ఉండటంతో ప్రస్తుతానికి తూర్పు గోదావరి జిల్లాలో గుడ్ల వినియోగం అంతంత మాత్రంగానే ఉంది. అయితే, ఈపాటి వినియోగానికి సరిపడా ఉత్పత్తి కూడా లేకపోవడంతో ధరలు క్రమంగా పెరిగింది. డిసెంబర్ 15 తరువాత గుడ్లకు మరింత డిమాండ్ వస్తుందని, ధరలు మరింత పెరగవచ్చని రైతులు అంటున్నారు. చలి తీవ్రత పెరిగితే స్థానికంగాను, ఉత్తర భారతాన డిమాండ్ వచ్చి, గుడ్డు ధర రూ.7 కూడా దాటవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరలు ఇలాగే మరో మూడు నెలలు కొనసాగితే ఏడాదిగా జరిగిన నష్టాలను కొంత వరకూ పూడ్చుకోవచ్చని ఆశ పడుతున్నారు. 1.40 కోట్ల గుడ్ల ఉత్పత్తి గత ఏడాది ఇవే రోజుల్లో జిల్లావ్యాప్తంగా 245 షెడ్లలో 1.60 కోట్ల కోళ్లను రైతులు పెంచేవారు. అయితే, ఆ సమయంలో బర్డ్ఫ్లూ సోకడంతో లక్షలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఆ తరువాత కోళ్లు, గుడ్ల వినియోగం పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొంతమంది కోళ్ల షెడ్లను ఖాళీగా వదిలేశారు. ఇప్పటికీ కొన్ని షెడ్లు ఖాళీగానే ఉన్నాయి. అధికారుల లెక్కల ప్రకారం ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 165 షెడ్లలో కోటి కోళ్లను పెంచుతున్నారు. వీటిల్లో ఒక్కో షెడ్డులో సుమారు 50 వేల నుంచి 5 లక్షల వరకూ కోళ్లను పెంచుతూంటారు. వీటితో పాటు 5 వేల నుంచి 40 వేల సామర్థ్యం కలిగిన పలు కోళ్లఫామ్లలో కోళ్ల సాగు జరుగుతోంది. ఒక్క అనపర్తి నియోజకవర్గంలోనే 70 లక్షలు, నిడదవోలు నియోజకవర్గంలో 50 లక్షలు, నల్లజర్ల, గోపాలపురం, కొవ్వూరు, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల్లో మరో 30 లక్షల కోళ్ల వరకూ పెంచుతున్నారు. ఈ ఫామ్ల నుంచి రోజుకు 1.60 కోట్ల గుడ్ల ఉత్పత్తి జరగాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం చలికాలం కావడంతో 1.40 కోట్ల గుడ్ల దిగుబడి మాత్రమే వస్తోంది. జిల్లాలో గుడ్ల వినియోగం సాధారణంగా 40 లక్షల వరకూ ఉంటుంది. ప్రస్తుతం 25 లక్షల నుంచి 30 లక్షల వరకూ మాత్రమే గుడ్లు స్థానికంగా వినియోగమవుతున్నట్లు పౌల్ట్రీ ప్రతినిధులు చెబుతున్నారు.30 లారీలతో ఎగుమతులు తూర్పు గోదావరి జిల్లా నుంచి నిత్యం 30 లారీల్లో ఒడిశా, పశి్చమ బెంగాల్, బీహార్, మధ్యప్రదేశ్తో పాటు అసోం తదితర ఈశాన్య రాష్ట్రాలకు కోడి గుడ్లు ఎగుమతి అవుతున్నాయి. అక్కడ చలి తీవ్ర మరింత పెరిగితే ఎగుమతులు రోజుకు 60 లారీల పైనే ఉంటుందని వ్యాపాÆý‡ులు చెబుతున్నారు. ఆ సమయంలో పెరిగే డిమాండ్కుఅనుగుణంగా గుడ్ల ధర కూడా అమాంతం పెరుగుతుందని అంటున్నారు.ఇలాగే కొనసాగితే..కోళ్ల ఫామ్లతో ఇప్పటి వరకూ నష్టాల బాట పట్టాం. ప్రస్తుతం గుడ్డు ధర పెరగటంతో గత నష్టాలను పూడ్చుకునే పనిలో ఉన్నాం. ధర ఇలాగే కొనసాగితే గత నష్టాల నుంచి బయట పడతాం. – భూపతిరాజు వరాహ నరసింహరాజు, ఖండవల్లి, పెరవలి మండలం, తూర్పు గోదావరి జిల్లాఆర్థికంగా కోలుకుంటాంగత 15 ఏళ్లుగా కోళ్ల ఫామ్ నిర్వహిస్తున్నాను. ఏడాది కాలంగా ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొని ఆర్థికంగా నలిగిపోయాం. ప్రస్తుతం గుడ్డు ధర రూ.6.50 పలుకుతోంది. ఈ ధరలు మరో 3 నెలలుంటే గత నష్టాల నుంచి బయట పడి, ఆర్థికంగా కోలుకుంటాం. – మండా తాతారెడ్డి, కోళ్ల రైతు, పిట్టల వేమవరం, పెరవలి మండలం, తూర్పు గోదావరి జిల్లా -
అటకెక్కిన విద్యుత్ ఆదా
సాక్షి, అమరావతి : విద్యుత్ చార్జీల బాదుడుపై చూపించిన ఆసక్తిని ప్రభుత్వం ఆదా చేయడంలో చూపడం లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం వార్షిక ఇంధన డిమాండ్ దాదాపు 65,830 మిలియన్ యూనిట్లుగా ఉంది. ఇందులో రూ.11,778 కోట్ల విలువైన సుమారు 16,875 మిలియన్ యూనిట్లు ఆదా చేసేందుకు గత ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. తద్వారా 25.6 శాతం విద్యుత్ ఆదాతో 14.34 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గించేలా అడుగులు వేసింది. అందుకు అనుగుణంగా ‘ఆంధ్రప్రదేశ్ ఎనర్జీ కన్జర్వేషన్ అండ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ పాలసీ’ని గత ప్రభుత్వం రూపొందించింది. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చాక బిల్లుల మోత మోగుతుండగా ఆదా చర్యలు మాత్రం పూర్తిగా అటకెక్కాయి. ఇంధన పరిరక్షణ వారోత్సవాల పేరుతో గతేడాది మొక్కుబడిగా ర్యాలీలు నిర్వహించి సరిపెట్టింది. ఏడాదంతా విద్యుత్ పొదుపు సంగతే మర్చిపోయింది. మళ్లీ ఇప్పుడు ఈ నెల 14 నుంచి రాష్ట్రంలో విద్యుత్తు పొదుపు వారోత్సవాల నిర్వహణకు సిద్ధమవుతోంది. స్టార్ హోటల్లో ఇంధన పరిరక్షణ అవార్డుల కార్యక్రమాలను నిర్వహించి కేంద్రం ఇచ్చే డబ్బులను ఖర్చు చేయడం మినహా పొదుపు చర్యలు శూన్యమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.గత ప్రభుత్వంలో ఆదర్శంగా ఏపీ..ఇంధన సామర్థ్య లక్ష్యాలను సాధించేందుకు ప్రభుత్వ విభాగాలలో ఇంధన పరిరక్షణ సెల్ల ఏర్పాటుకు జీవో జారీ చేసిన ఏకైక రాష్ట్రంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపడం, ఆర్థిక కార్యకలాపాలను పెంచడం, పర్యావరణ ప్రయోజనాలతో పాటు విద్యుత్ బిల్లులను తగ్గించడం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ప్రయోజనం చేకూర్చే దిశగా గత ప్రభుత్వం అడుగులు వేసింది. ప్రభుత్వ విభాగాలు, ప్రైవేట్ సంస్థలు, విద్యుత్ వినియోగదారులతో సహా అందరిని భాగస్వాములుగా చేసి ఇంధన పొదుపు, ఇంధన సామర్థ్య జీవన విధానాలను అనుసరించేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్ ‘ఏపీఎస్ఈసీఎం’ ద్వారా చర్యలు తీసుకుంది. పెర్ఫార్మ్, అచీవ్ ట్రేడ్ (పాట్) స్కీమ్ అమలులో దేశంలోనే అత్యుత్తమంగా ఏపీఎస్ఈసీఎం నిలిచింది. గత కొన్నేళ్లుగా రూ.3,800 కోట్ల విలువైన 5,600 మిలియన్ యూనిట్లను వివిధ సెక్టార్లలో ఆదా చేయడంలోనూ ఈ సంస్థ కీలక పాత్ర పోషించింది. పారిశ్రామిక రంగంలో ఒక్క ‘పాట్’ ద్వారానే రూ.2,394 కోట్ల విలువైన దాదాపు 3,430 మిలియన్ యూనిట్లు ఆదా చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్ఈసీఎం చేపట్టిన ఉత్తమ విధానాలను అనుసరించాలని నాటి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్.కె సింగ్ అన్ని రాష్ట్రాలకు లేఖలు రాయడం గమనార్హం. -
'ఉపాధి'కి పని గండం
సాక్షి, అమరావతి: ఒకపక్క ఏడున్నర లక్షల ఉపాధి హామీ జాబ్ కార్డుల తొలగింపు.. మరోవైపు దాదాపు ఐదున్నర కోట్ల పనిదినాల కోతలు.. ఇంకోవైపు లేబర్ కాంపొనెంట్ కింద నాలుగు నెలలకుపైగా ఉపాధి కూలీలకు వేతనాల బకాయిలు..! ఉపాధి పనులనే నమ్ముకున్న గ్రామీణ నిరుపేదలను చంద్రబాబు సర్కారు తీవ్ర ఇక్కట్లకు గురి చేస్తోంది. పనిదినాల్లోనూ కోతలు విధిస్తూ, చేసిన పనులకు వేతనాలు చెల్లించకుండా అగచాట్లకు గురి చేస్తోంది. గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులు చేసిన కూలీలకు గత నాలుగున్నర నెలలుగా వేతనాలు (కూలి డబ్బులు) చెల్లించకపోవడంతో పేదలు దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు. స్వయంగా టీడీపీకి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా పేదలకు రూ.381 కోట్ల మేర ఉపాధి హామీ కూలి డబ్బుల బకాయిలు పేరుకుపోవడం గమనార్హం. ఈ ఏడాది జూలై 27వతేదీ తర్వాత రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం పనులు చేసిన కూలీలెవరికీ వేతనాలు అందలేదని సమాచారం.మూడో వంతు ఎస్సీ, ఎస్టీలే..చంద్రబాబు సర్కారు రాష్ట్రంలో ఇటీవలే 18.63 లక్షల మంది జాబ్ కార్డు(7.48 లక్షల కుటుంబాలు)లను తొలగించిన విషయం తెలిసిందే. ఈ పథకంలో లబ్ధి పొందుతున్న వారిలో మూడోవంతుకు పైగా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలే ఉన్నాయి. గతేడాది జూన్లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీలకు రూ.వందల కోట్ల మేర వేతన బకాయిలు పేరుకుపోతున్నాయి. కూలి డబ్బుల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొందని వ్యవసాయ కారి్మక సంఘాలు వాపోతున్నాయి. ఈ ఏడాది సంక్రాంతి, శివరాత్రి, ఉగాది, దీపావళి సమయంలో నిరుపేదలు తాము చేసిన కూలి పనుల డబ్బుల కోసం ఆర్తిగా ఎదురు చూస్తూ, అవి చేతికి అందకపోవడంతో అవస్థలు ఎదుర్కొన్నారు.ఐదున్నర కోట్ల పని దినాలకు ఎసరు..!చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనుల కల్పన తగ్గిపోయినట్లు అధికారిక గణాంకాలే పేర్కొంటున్నాయి. వైఎస్ జగన్ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2023–24లో రాష్ట్రంలో ఏప్రిల్ – నవంబరు మధ్య 21.37 కోట్ల పనిదినాల పాటు పేదలకు ఉపాధి హామీ పనులు కల్పించగా ఇప్పుడు చంద్రబాబు సర్కారు 2025–26 ఏప్రిల్ – డిసెంబరు 7వతేదీ నాటికి కేవలం 15.94 కోట్ల పనిదినాలను మాత్రమే కల్పించింది. ఆర్నెలల్లో రూ.435.14 కోట్లు నష్టపోయిన పేదలు..రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్– సెపె్టంబరు మధ్య చంద్రబాబు ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద పనుల కల్పన తగ్గించడం వల్ల అంతకు ముందు ఏడాదితో పోల్చితే ఆర్నెలల్లో రూ.435.14 కోట్ల మేర నష్టపోయినట్లు ఓ స్వచ్ఛంద సంస్థ నిర్ధారించింది. 2023–24లో గత ప్రభుత్వంలో ఉపాధి కూలీలు రూ.6,277 కోట్ల మేర లబ్ధి పొందగా 2024–25 లో రూ.6,183 కోట్లు మేర మాత్రమే ప్రయోజనం పొందారు.జగన్ హయాంలో ఒక్క జిల్లాలోనే కూలీలకు రూ.2,700 కోట్లురాష్ట్రంలో వలసలు ఎక్కువగా ఉండే విజయనగరం జిల్లాలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2020–21లో ఉపాధి కూలీలకు వేతనాల రూపంలో రూ.731 కోట్ల మేర లబ్ధి చేకూర్చింది. ఈ ఒక్క జిల్లాలోనే గత ప్రభుత్వం లేబర్ కాంపొనెంట్ కింద ఐదేళ్లలో రూ.2,700 కోట్లకుపైగా ఉపాధి కూలీలకు వేతనాలు చెల్లించింది. అదే జిల్లాలో ఇప్పుడు సీఎం చంద్రబాబు సర్కారు 2024–25లో రూ.407 కోట్లు, ఈ ఆరి్థక ఏడాదిలో ఇప్పటి వరకు సుమారు రూ.230 కోట్లు మాత్రమే కూలీలకు వేతనాలు చెల్లింపులు చేసింది. -
రామ్మోహన్ నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడా?
సాక్షి, అమరావతి: ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభం పరిష్కరించడంలో ఘోరాతి ఘోరంగా విఫలమైన కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుపై జాతీయ మీడియా తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోస్తోంది. ఇంత పెద్ద సంక్షోభం తలెత్తితే మంత్రి ఏం చేస్తున్నారు? నెట్ ప్రాక్టీస్ చేస్తున్నారా, లేక రీల్స్ చేస్తున్నారా.. నెట్ఫ్లిక్స్లో వీడియోలు చూస్తున్నారా అంటూ కడిగిపారేస్తోంది. రిపబ్లిక్ టీవీలో ప్రెజెంటర్ ఆర్నాబ్ గోస్వామి లేవనెత్తుతున్న ప్రశ్నలకు బదులివ్వలేక తెలుగుదేశం పార్టీ ఆపసోపాలు పడుతోంది. తొలుత.. రిపబ్లిక్ టీవీలో చర్చలో పాల్గొన్న దీపక్రెడ్డి మాట్లాడుతూ.. ‘ఈ పరిస్థితిని నారా లోకేశ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.. ఇందుకోసం వార్ రూమ్ని కూడా ఏర్పాటుచేశార’ంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో జాతీయ స్థాయిలో టీడీపీ అభాసుపాలైన విషయం తెలిసిందే. ఇక ఆదివారంకొమ్మారెడ్డి పట్టాభిరాంని పంపిస్తే దానికి రెండింతలు పరాభవం పార్టీ మూటగట్టుకుంది. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఇదే పెద్ద చర్చగా నడుస్తోంది. అర్నాబ్ గోస్వామి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇద్దరూ నీళ్లునమిలారు.ధైర్యం ఉంటే చర్చలో పాల్గొనమనండి..పట్టాభిని అర్నాబ్ ఏమి అడిగారంటే.. మీ తెలుగుదేశం పార్టీకి చెందిన కె. రామ్మోహన్నాయుడు విమానయాన మంత్రి శాఖ నిర్వహిస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నారు? నెట్ ప్రాక్టీస్ చేస్తున్నారా అంటూ పట్టాభిని సూటిగా ప్రశ్నించారు. సమస్యను తెలుసుకోవడానికి విమానయాన శాఖ మంత్రికి నేను ఫోన్ చేస్తే.. హలో హలో అంటూ ఫోన్ పెట్టేస్తున్నాడని.. ధైర్యం ఉంటే ఈరోజు చర్చలో మంత్రి పాల్గొనాలంటూ పట్టాభికి సవాల్ విసిరారు. ఈ రోజు నా చర్చలో ప్రజలకు సమాధానం చెప్పాలంటూ రెట్టించి అడిగారు. వెంటనే పట్టాభి కలుగజేసుకుని, మంత్రి సమస్యను పరిష్కరించడానికి కృషిచేస్తున్నారనగానే.. సమస్య పరిష్కారమంటే కూర్చుని నెట్ఫ్లిక్స్ వీడియోలు చూడటమా! అంటూ అర్నాబ్ గాలితీసేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది అని పట్టాభి చెప్పగా.. అయితే మీ మంత్రిని నా కాల్ లిఫ్ట్ చేయమనండి అంటూ అర్నాబ్ సవాల్ విసిరారు. ఈరోజు ఇంతమంది ప్రజలు ఇబ్బందులుపడుతుంటే దాన్ని తెలుసుకోవడానికి ఫోన్చేస్తే మీ మంత్రి హలో హలో అంటూ ఫోన్ పెట్టేస్తారా అంటూ మండిపడ్డారు. ఇలా రెండ్రోజులుగా జాతీయస్థాయిలో తెలుగుదేశం పార్టీ అప్రతిష్టపాలు కావడంతోపాటు సామాజిక మాధ్యమాల్లోనూ పరువు పోవడంతో ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. -
అదే సీఐడీ.. ఇప్పుడు సాక్ష్యాలు లేవంటోంది!
సాక్షి, అమరావతి: నారా చంద్రబాబు నాయుడు 2014–19 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీ ఫైబర్ నెట్ టెండర్ల ప్రక్రియలో జరిగిన కోట్ల రూపాయల అక్రమాలపై నమోదు చేసిన కేసులో సీఐడీ ప్లేటు ఫిరాయించింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు అక్రమాలకు నాడు అన్ని సాక్ష్యాధారాలను సంపాదించి చార్జ్షీట్ దాఖలు చేసిన సీఐడీ, ఇప్పుడు ఎలాంటి సాక్ష్యాలు లేవని... ఆ కేసు మూసివేయాలని విజయవాడ ఏసీబీ కోర్టులో క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు అడుగులకు మడుగులు..2014–19 మధ్య సంవత్సరాల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన పలు కుంభకోణాలపై గత ప్రభుత్వం హయాంలో సీఐడీ అన్నీ సాక్ష్యాధారాలతో కేసులు నమోదు చేసింది. ఇప్పుడు ఆ కేసుల నుంచి బయట పడేందుకు తనకే సొంతమైన ‘మేనేజ్’ స్కిల్స్కి చంద్రబాబు మరోసారి పదును పెట్టారు. సీఐడీ సైతం ఆయన అడుగులకు మడుగులొత్తుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, షాడో సీఎం లోకేశ్, వారి ఆస్థాన సీనియర్ న్యాయవాదుల కనుసన్నల్లో సీఐడీ పనిచేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో సేకరించిన సాక్ష్యాధారాలను మూలనపడేసి చంద్రబాబుపై కేసుల మూసివేతే లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఏపీ ఫైబర్ నెట్ టెండర్ల అక్రమాల కేసులో సీఐడీ కూడా ఇదే పనిచేస్తోంది. కంచే చేనుమేస్తున్న చందంనిబంధనల ప్రకారం ఏదైనా కేసు మూసివేత కోసం చర్యలు చేపట్టాలంటే పోలీసులు ముందుగా ఫిర్యాదుదారుకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఫైబర్ నెట్ కేసులో సీఐడీ అధికారులు ఇక్కడే మోసపూరితంగా వ్యవహరించారు. ఫైబర్ నెట్ అక్రమాలపై 2021లో అప్పటి ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ పూనూరు గౌతంరెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే ఆయనను పక్కనబెట్టి... ఫిర్యాదుదారుగా ఫైబర్నెట్ అప్పటి ఎండీ మధుసూధన్రెడ్డిని సీఐడీ అధికారులు తెరపైకి తెచ్చారు. ఈ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేస్తూ ఇచ్చిన తీర్పులో హైకోర్టు.. గౌతంరెడ్డి పేరునే ఫిర్యాదుదారుగా స్పష్టంగా పేర్కొనడం ఇక్కడ గమనార్హం.అయితే చంద్రబాబుపై కేసు మూసివేసేందుకు ఫిర్యాదుదారు అయిన గౌతంరెడ్డి అంగీకరించే ప్రసక్తే ఉండకపోవడంతో సీఐడీ చట్ట విరుద్ధ మార్గాన్ని ఎంచుకుంది. చంద్రబాబుపై ఫైబర్ నెట్ కుంభకోణం కేసును మూసివేసేందుకు ఫైబర్నెట్ అప్పటి ఎండీ మధుసూధన్రెడ్డిని ఫిర్యాదుదారుగా కోర్టుకు తీసుకొచ్చి కేసు మూసివేతకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పించింది. చంద్రబాబు, సీఐడీ ఒత్తిడికి తలొగ్గిన మధుసూధన్రెడ్డి సైతం సీఐడీ చెప్పినట్లు చేశారు.వాస్తవానికి ఇదే మధుసూధన్రెడ్డి ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ఫైబర్నెట్ పనుల విషయంలో థర్డ్ పార్టీ ఆడిట్ నిర్వహించారు. కాంట్రాక్ట్ పొందిన సంస్థ 80 శాతం పనులను పూర్తి చేయలేదని తేల్చారు. భారీ మొత్తంలో నిధుల దుర్వినియోగం జరిగిందని మధుసూధన్రెడ్డి స్పష్టంగా చెప్పారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు చంద్రబాబుపై కేసు మూసివేతకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడం పలు అనుమానాలు కలిగిస్తోంది. సీఐడీ గతంలో సేకరించిన ఆధారాలకు మధుసూధన్రెడ్డి ఇప్పుడు చెబుతున్న దానికి పొంతనే లేదు.నేడు విచారణ చంద్రబాబుపై కేసు మూసివేత కోసం సీఐడీ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్పై గౌతంరెడ్డి ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశారు. ఫైబర్ నెట్ కుంభకోణం ఎలా జరిగింది.. ఎంత మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లింది.. తదితర వివరాలను అందులో పొందుపరిచారు. సీఐడీ క్లోజర్ రిపోర్ట్ని పరిగణనలోకి తీసుకునే ముందు ఫైబర్నెట్ కుంభకోణంపై సీఐడీ సేకరించిన ఆధారాలను, చార్జ్షీట్ను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన తన పిటిషన్లో ఏసీబీ కోర్టును కోరారు.పరపతి కలిగిన వ్యక్తులను రక్షించేందుకు సీఐడీ దాఖలు చేసిన ఈ క్లోజర్ రిపోర్ట్ని తిరస్కరించాలని ఆయన తన పిటిషన్లో కోరారు. గౌతంరెడ్డి దాఖలు చేసిన ఈ ప్రొటెస్ట్ పిటిషన్తో పాటు సీఐడీ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్పై ఏసీబీ కోర్టు సోమవారం విచారణ జరపనుంది. సీఐడీ క్లోజర్ రిపోర్ట్పై ఏసీబీ కోర్టు నిర్ణయం వెలువరించే ముందు గౌతంరెడ్డి ప్రొటెస్ట్ పిటిషన్పై విచారణ జరపాల్సి ఉంటుంది.చంద్రబాబు కుయుక్తులకు నిదర్శనంతన అవినీతిపై ఎప్పుడు కేసులు నమోదైనా అవి అసలు విచారణ వరకూ రాకుండా.. సాంకేతిక కారణాలతో కొట్టేయించుకోవడమో, మూసివేయించుకోవడమో చంద్రబాబుకు అలవాటు. తద్వారా ఆయన కేసుల నుంచి బయటపడుతున్నారు. ఇన్నేళ్లుగా ఆయన ఇదే చేస్తూ వస్తున్నారు. వ్యవస్థల్లో ఉన్న లొసుగులను తనకు అనుకూలంగా వినియోగించుకోవడంలో చంద్రబాబు కుయుక్తులకు ఇది తిరుగులేని నిదర్శనం. తాజా పరిస్థితిని చూస్తే.. తనపై నమోదైన పలు కుంభకోణాల కేసులను దర్యాప్తు చేస్తూ వచ్చిన సీఐడీ, ఏసీబీ అధికారులను చంద్రబాబు తాను అధికారంలోకి వచ్చీ రావడంతోనే మార్చేశారు. తనకు అనుకూలంగా ఉన్న వారిని ఏసీబీ, సీఐడీకి తెచ్చారు. వారంతా చంద్రబాబు పట్ల స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారు. అందులో భాగంగానే చంద్రబాబుపై నమోదైన కుంభకోణాల కేసుల మూసివేతకు క్లోజర్ రిపోర్టులు దాఖలు చేయడం ప్రారంభించారు.స్కామ్స్టర్ చంద్రబాబే..కేంద్ర నిధులతో చేపట్టే ప్రాజెక్టులను కూడా అడ్డగోలుగా అస్మదీయులకు కట్టబెట్టి ప్రజాధనాన్ని కొల్లగొట్టడంలో చంద్రబాబు మాస్టర్మైండ్ అనడానికి ఫైబర్ నెట్ కుంభకోణమే తార్కాణం. కేంద్రం నిధులతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ను తన అస్మదీయుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి కట్టబెట్టి నిధులు కొల్లగొట్టారని సీఐడీ పూర్తి ఆధారాలతో నిగ్గు తేల్చింది.అందుకే ఏ1గా చంద్రబాబు, ఏ2గా టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ వేమూరి హరికృష్ణ, ఏ3గా ఏపీ ఫైబర్నెట్ కార్పొరేషన్, ఇన్క్యాప్ సంస్థలకు అప్పటి ఎండీ కోగంటి సాంబశివరావులతోపాటు మరికొందరిని నిందితులుగా పేర్కొంది. వారిపై ఐపీసీ సెక్షన్లు 166, 167, 418, 465, 468, 471, 409, 506 రెడ్ విత్ 120(బి)లతోపాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(2), రెడ్ విత్ 13(1)(సి)(డి) ప్రకారం కేసు నమోదు చేసింది. ఫైబర్నెట్ ప్రాజెక్ట్ పేరుతో చంద్రబాబు ముఠా ప్రజాధనాన్ని ఎలా కొల్లగొట్టిందీ సీఐడీ 2024లో సమర్పించిన తన చార్జ్షీట్లో సవివరంగా వివరించింది. అక్రమాల పర్వం చూస్తే..⇒ మొత్తం రూ.2 వేల కోట్ల ఈ ప్రాజెక్టు మొదటి దశలో రూ.333 కోట్ల మేర అక్రమాలు జరిగాయి.⇒ పక్కా పథకంలో భాగంగా హరికృష్ణ ప్రసాద్ను ఏపీ ఈ–గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యునిగా చేర్చారు. ప్రాజెక్టు కోసం బిడ్లు దాఖలు చేసే కంపెనీకి చెందిన వారు టెండర్ల మదింపు కమిటీలో ఉండకూడదన్నది నిబంధనను చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తూ, హరికృష్ణ ప్రసాద్ను ఫైబర్నెట్ టెండర్ల మదింపు కమిటీలో సభ్యుడిగా కూడా నియమించారు.⇒ ఇక ఎలాంటి మార్కెట్ సర్వే చేపట్టకుండానే ఈ ప్రాజెక్ట్ కింద సరఫరా చేయాల్సిన పరికరాలు, వాటి నాణ్యతను ఖరారు చేసి ప్రాజెక్ట్ విలువను అమాంతంగా పెంచేశారు. ⇒ ఈ ప్రాజెక్ట్ టెండర్ల ప్రక్రియ చేపట్టే నాటికి టెరాసాఫ్ట్ కంపెనీ ప్రభుత్వ బ్లాక్ లిస్ట్లో ఉంది. పౌర సరఫరాల శాఖకు ఈపోస్ యంత్రాల సరఫరాలో విఫలమవడం దీనికి కారణం. కానీ చంద్రబాబు ఆ కంపెనీని బ్లాక్ లిస్టు నుంచి ఏకపక్షంగా తొలగించారు.⇒ అనంతరం పోటీలో ఉన్న పలు కంపెనీలను పక్కనబెట్టేశారు. దీనిపై పేస్ పవర్ అనే కంపెనీ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ పట్టించుకోనే లేదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కూడా సాంకేతిక కారణాలతో అనర్హులుగా చేసి మరీ టెరాసాఫ్ట్కే ప్రాజెక్టును కట్టబెట్టారు. ⇒ టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని పట్టుబట్టిన అధికారి బి.సుందర్ను హఠాత్తుగా బదిలీ చేసి తమకు అనుకూలమైన అధికారులను నియమించారు.⇒ టెండర్ల ప్రక్రియ మొదలైన తరువాత కూడా టేరాసాఫ్ట్ కంపెనీ తమ కన్సార్షియంలో మార్పులు చేసి సాంకేతికంగా అధిక స్కోర్ సాధించేందుకుగాను వివిధ పత్రాలను ట్యాంపర్ చేశారు. ⇒ ప్రాజెక్ట్ను అమలు చేయడంలో కూడా టెరాసాఫ్ట్ కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. టెండర్ నోటిఫికేషన్లో పేర్కొన్న నాణ్యత ప్రమాణాలను ఏమాత్రం పట్టించుకోలేదు. దాంతో 80 శాతం ప్రాజెక్టు పనులు నిరుపయోగంగా మారాయి.⇒ మరోవైపు షెల్ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని అక్రమంగా తరలించారు. వేమూరి హరికృష్ణ తన సన్నిహితుడు కనుమూరి కోటేశ్వరరావు సహకారంతో కథ నడిపించారు. వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో కనుమూరి కోటేశ్వరరావు భాగస్వామిగా ఉన్నారు. ⇒ వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్కుమార్ రామ్మూర్తిలతో కలసి విజయవాడ కేంద్రంగా నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ ఎల్ఎల్పీ అనే మ్యాన్పవర్ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్ కంపెనీని సృష్టించారు. ఆ కంపెనీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుకు సిబ్బందిని సమకూర్చినట్లు, పర్యవేక్షించినట్లు కథ నడిపించారు. ⇒ ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీ, ఇతర కంపెనీలకు చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రూ.284 కోట్లు విడుదల చేసింది. నకిలీ ఇన్వాయిస్లతో ఆ నిధులను కొల్లగొట్టి, కనుమూరి కోటేశ్వరరావు ద్వారా అక్రమంగా తరలించారు. వాటిలో రూ.144 కోట్లను షెల్ కంపెనీల ద్వారా తరలించారు.⇒ ఇక నాసిరకమైన పనులతో కూడా ప్రభుత్వ ఖజానాకు రూ.119.8 కోట్ల నష్టం వాటిల్లింది. -
కోటి కంటే ఎక్కువ సంతకాలే వచ్చాయి: సజ్జల
తాడేపల్లి : ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి జనం నుంచి అనూహ్య స్పందన వచ్చిందని పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు(ఆదివారం, డిసెంబర్ 7వ తేదీ) ఎమ్మెల్సీలు, పార్లమెంట్ కో ఆర్డినేటర్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, జడ్సీ చైర్పర్సన్లు, జడ్సీ వైస్ చైర్పర్సన్లు, పీఏసీ, సీఈసీ, ఎస్ఈసీ మెంబర్లతో సజ్జల టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘ కోటి సంతకాలు, రచ్చబండ కార్యక్రమాలకు అనూహ్య స్పందన వచ్చింది. అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. కోటి కన్నా ఎక్కువ సంతకాలు వచ్చాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా జనం స్పందించారు. కోటి సంతకాల ప్రతులను10వ తేదీన జిల్లా కేంద్రాలకు పంపాలి. జిల్లా స్థాయి కార్యక్రమం 13న కాకుండా 15న నిర్వహించాలి. 17న వైఎస్ జగన్ సహా ముఖ్య నేతలు.. గవర్నర్ను కలుస్తారు.’ అని పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా సజ్జల రామకృష్ణారెడ్డి.. కోటి సంతకాల సేకరణ అంశానికి సంబంధించి వరుసగా జూమ్ మీటింగ్లు, టెలీ కాన్ఫరెన్స్లు నిర్వహిస్తూ పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. ఈ మేరకు నేతలను నుంచి కోటి సంతకాల సేకరణకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అదే సమయంలో పార్టీ నేతలకు పలు సలహాలు ఇస్తున్నారు సజ్జల.ఇదీ చదవండి:చంద్రబాబు క్షద్ర రాజకీయాలు: పుత్తా శివశంకర్ -
చంద్రబాబు క్షుద్ర రాజకీయాలు: పుత్తా శివశంకర్
సాక్షి, తాడేపల్లి: దేవుడంటే భయం లేదు.. ప్రజలంటే బాధ్యత లేని వ్యక్తి చంద్రబాబు.. వెంకటేశ్వర స్వామిని సైతం తన వికృత రాజకీయాల్లోకి లాగారు’’ అంటూ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పరకామణి కేసులో రవికుమార్ని మా హయాంలోనే పట్టుకున్నాం. దాదాపు 30 ఏళ్లుగా చోరీలు చేస్తున్నా చంద్రబాబు హయాంలో పట్టుకోలేదు’’ అని శివశంకర్ పేర్కొన్నారు.‘‘రవికుమార్ ప్రాయశ్చిత్తం చెంది తన ఆస్తిని టీటీడీ కి రాసిచ్చారు. క్లోజ్ అయిన ఆ కేసును మళ్ళీ తిరగతోడి చంద్రబాబు క్షుద్ర రాజకీయాలకు దిగారు. రవికుమారే స్వయంగా ఒక వీడియో చేసి తన బాధను వెలిబుచ్చారు. ప్రాయశ్చిత్తం చెందిన వ్యక్తిని మళ్ళీ మళ్ళీ వేధించటం సబబేనా?. హిందూ మతాన్ని ఏమాత్రం లెక్కచేయని వ్యక్తి చంద్రబాబు. విజయవాడలో 40 ఆలయాలను కూల్చిన వ్యక్తి చంద్రబాబు. టీటీడీ ఆస్తులను కాజేయాలని చంద్రబాబు చూశారు. హథీరాంజీ మఠం ఆస్తులని కూడా చంద్రబాబు తన బినామీలకు రాయించారు. గోదావరి పుష్కరాల సమయంలో తన ప్రచార పిచ్చి కోసం 29 మంది చనిపోవడానికి కారణమయ్యారు’’ అని శివశంకర్ మండిపడ్డారు.‘‘రామతీర్థంలో శ్రీరాముని విగ్రహం తల నరికిన కేసులో A2గా ఉన్న సూరిబాబుకి చంద్రబాబు రూ.5 లక్షలు ఇచ్చారు. తిరుమలలో ఉన్న వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చిన వ్యక్తి చంద్రబాబు. ఆరోజు సాధువులు, మఠాధిపతులు దేశ వ్యాప్తంగా ఆందోళన చేశారు. హిందూ మతం అంటే భయం, భక్తి ఉంటే చంద్రబాబు ఇలా చేసేవారా?. జేఈవోగా సుబ్రహ్మణ్యాన్ని 9 ఏళ్లపాటు ఎందుకు కొనసాగించారో అందరికీ తెలుసు. సదావర్తి సత్రం భూములను కొట్టేయటానికి చేసిన ప్రయత్నాలు దేశమంతా తెలుసు. అనేక భూములను చంద్రబాబు తన మనుషులకు కట్టబెట్టలేదా?. కాశిరెడ్డినాయన సత్రాన్ని కూల్చేశారు. సింహాచలం ఆలయ భూములు రికార్డుల్లో లేకుండా ఎలా పోయాయి?..విజయవాడ దుర్గమ్మ ఆలయంలో బంగారు ఆభరణాలు దొంగిలించిందీ చంద్రబాబు హయాంలోనే. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ కోట్లాది హిందువుల మనో భావాలను దెబ్బ తీశారు. పరకామణి కేసులో రవికుమార్ ఎలా ప్రాయశ్చిత్త పడ్డారో చంద్రబాబు కూడా అలా ప్రాయశ్చిత్తం పడితే మంచిది. అంతేగానీ దుర్మార్గపు రాజకీయాలు చేయవద్దని కోరుకుంటున్నాం’’ అని శివశంకర్ హితవు పలికారు. -
సీబీఎన్ అంటే చంద్రబాబు కాదు.. అర్థమిదే: నాగార్జున యాదవ్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో బీరు-బాబు-సర్కారు అన్నట్టుగా పరిస్థితి మారిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ చురకలు అంటించారు. ఎక్కడ పడితే అక్కడ మద్యం మాఫియా చెలరేగుతోందని.. యథేచ్ఛగా నకిలీ మద్యం తయారీ కేంద్రాలు వెలిశాయని మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంలో పరిశ్రమలు రాలేదు గానీ మద్యం కుటీర పరిశ్రమలు భారీగా పెరిగాయన్నారు.‘‘ఎక్కడ చూసినా పర్మిట్ రూములు, వైన్లు, బార్లు, బెల్టు షాపులు కనిపిస్తున్నాయి. సీబీఎన్ అంటే చంద్రబాబు కాదు.. చీఫ్ బాట్లింగ్ నెట్వర్క్. ములకలచెరువులో పాలకాన్లలో కూడా నకిలీ మద్యం సరఫరా చేస్తున్నారు. టీడీపీ నేత జయచంద్రారెడ్డి తన సొంతంగా నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు. ఎక్సైజ్ స్టేషన్కు 200 మీటర్ల దూరంలోనే నకిలీ మద్యం తయారు చేస్తున్నా పోలీసులు పట్టుకోలేదు. పాల వ్యాను జయచంద్రారెడ్డి అనుచరుడిదే అని తేలింది. భారీ స్కామ్కు కారకుడైన జయచంద్రారెడ్డిని ఇప్పటికీ అరెస్టు చేయలేదు?’’ అంటూ నాగార్జున యాదవ్ నిలదీశారు.‘‘అద్దేపల్లి జనార్థన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్లో జోగి రమేష్ పాత్ర ఉన్నట్టు చెప్పలేదు. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ నకిలీ మద్యాన్ని పట్టించారని ఆయనపై అక్రమ కేసు పెట్టించారు. జోగి రమేష్కి, అద్దేపల్లి జనార్థన్ మధ్య ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ జనార్థన్తో తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించి అరెస్టు చేయించారు. కుట్ర పూరితంగానే బీసే నేత జోగి రమేష్ ని అరెస్టు చేశారు. చంద్రబాబు కనుసన్నల్లోనే నకిలీ మద్యం తయారీ. దీన్ని ప్రశ్నిస్తే మాపై అక్రమ కేసులు పెడుతున్నారు. అక్రమ కేసులు పెట్టి వేధించిన వారిని ఎవరినీ వదలేది. అధికారంలోకి వచ్చాక చట్టపరంగా విచారణ జరిపిస్తాం’’ అని నాగార్జున యాదవ్ తెలిపారు. -
విద్యారంగాన్ని భ్రష్టుపట్టించి.. జగన్పై విమర్శలా?
సాక్షి, అమరావతి: విద్యారంగాన్ని భ్రష్టుపట్టించడమే కాకుండా.. విద్యారంగాన్ని బలోపేతం చేసిన మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విమర్శలు చేయడం చంద్రబాబు దివాళాకోరుతనానికి నిదర్శనమని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆమె మాట్లాడుతూ.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిట్టడానికే పేరెంట్, టీచర్ సమావేశాలు పెట్టుకునేందుకైతే కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేయడం అవసరమా, ప్రెస్మీట్ పెట్టుకుంటే సరిపోదా అని చంద్రబాబు, లోకేశ్ను నిలదీశారు. ప్రత్యేకంగా ఈవెంట్లు నిర్వహించి.. సెట్టింగ్లు, షూటింగ్లు పెట్టి ప్రత్యేక విమానాలపై వెళుతూ ప్రజలపై భారం మోపడం దేనికని ప్రశ్నించారు. పాఠశాల సమావేశాలను సైతం రాజకీయ సభలుగా మార్చేసి వైఎస్ జగన్పై ద్వేషభావం కలిగించే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ పాలనలో విద్యా రంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుడితే.. చంద్రబాబు సీఎం అయ్యాక పూర్తిగా సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ఏడాదిన్నరలోనే రూ.2.66 లక్షల కోట్లు అప్పులు తేవడం మినహా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేసిన పాపానపోలేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు, లోకేశ్, పవన్కళ్యాణ్ ప్రజాధనంతో ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏడాదిన్నరకే పాలన చేతకాక చేతులెత్తేసిన చంద్రబాబు ఇంకో మూడున్నరేళ్లు ప్రభుత్వాన్ని నడపడం సాధ్యమయ్యే పనికాదన్నారు. ఆ బడిని తీర్చిదిద్దింది జగనే ‘మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (పీటీఎం) పేరుతో పార్వతీపురం మన్యం జిల్లా భామిని స్కూల్లో సీఎం చంద్రబాబు పిల్లల ముందు షో చేసి వచ్చాడు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉండగా ఆ పాఠశాలను నిర్మిస్తే, వైఎస్ జగన్ సీఎం అయ్యాక నాడు–నేడు ద్వారా మరింత మెరుగులు దిద్దితే అవన్నీ కనపడనీయకుండా లక్షలు ఖర్చుచేసి సెట్టింగ్ వేశారు. పేరెంట్ టీచర్ మీటింగ్లను తండ్రీకొడుకులు రాజకీయ కార్యక్రమంలా మార్చేశారు. ఈవెంట్ కోసం తీసుకొచ్చిన కెమెరాల సాక్షిగా వైఎస్ జగన్ హయాంలో ఏర్పాటు చేసిన బెంచీలు, డిజిటల్ బోర్డులతో తామే గొప్పగా చేశామని చెప్పుకునే ప్రయత్నం చేసి తండ్రీకొడుకులు విఫలమయ్యారు. అమ్మ ఒడి పథకానికి పేరు మార్చి తల్లికి వందనం అని పెట్టడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదు. పైగా మొదటి ఏడాది పథకాన్ని పూర్తిగా అమలు చేయకపోగా రెండో ఏడాది సైతం 30 లక్షల మంది పిల్లలకు పథకాన్ని వర్తింపచేయలేదు. విద్యావ్యవస్థను సర్వనాశనం చేసిందే కాకుండా వైఎస్ జగన్ చేసిన పనులను కూడా తామే చేసినట్టు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. వైఎస్ జగన్ హయాంలో విద్యావ్యవస్థ నాశనమైందని చెబితే విద్యార్థులు ఎలా నమ్ముతారోనన్న ఆలోచన కూడా తండ్రీకొడుకులకు లేదు’ అని లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు. -
ఇండిగోతో రామ్మోహన్ కుమ్మక్కు
సాక్షి, అమరావతి: దేశంలో ఇండిగో విమానాల సంక్షోభం, రద్దీ, టికెట్ ధరల పెరుగుదల, భద్రతా లోపాలకు ప్రధాన కారకుడు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్రావు విమర్శించారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్నాయుడు విఫలమయ్యారని, తక్షణమే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జూపూడి ప్రభాకర్రావు శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.‘ఇండిగో విమాన సంస్థతో రామ్మోహన్నాయుడు కుమ్మక్కయ్యారు. దాని ఫలితంగానే ఇప్పుడు సంక్షోభం ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం తలదించుకునే పరిస్థితి వచ్చింది. డీజీసీఏ దిగి వచ్చేదాకా ఇండిగో మొండిగా వ్యవహరించిందంటే కారణం రామ్మోహన్తో కుమ్మక్కు కావడమే. ఇంత గందరగోళం నెలకొంటే ఇండిగో సంక్షోభాన్ని వదిలేసి రామ్మోహన్ నాయుడు రీల్స్ చేసుకుంటూ గడుపుతున్నారు. ఆయన విమానయాన శాఖ మంత్రిగా కాకుండా రీల్స్ మంత్రిగా మారారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత కేంద్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ చేసింది. వాటిని కచ్చితంగా పాటించేలా చూడాలని ఆదేశాలిచ్చింది. కానీ డీజీసీఏ నిబంధనలను ఇండిగో సంస్థ పాటించేలా రామ్మోహన్ చేయలేకపోయారు. దాని ఫలితంగానే ఇప్పుడు ఇండిగో సంక్షోభం వచ్చింది.’ అని జూపూడి చెప్పారు. కేంద్ర విమానయాన శాఖను లోకేశ్ పర్యవేక్షిస్తాడా? ‘ఇండిగో సంక్షోభంపై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ వార్ రూమ్లో చర్చలు జరుపుతున్నారంటూ టీడీపీ నేతలు నేషనల్ మీడియాలో మాట్లాడి పరువు తీశారు. కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖను కూడా లోకేశ్ పర్యవేక్షిస్తున్నాడంటూ టీడీపీ ప్రతినిది వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి పదవితో లోకేశ్కు ఏం సంబంధం? లోకేశ్, రామ్మోహన్లు ఏపీ పరువును తీశారు. ఇండిగో సంస్థ ఒత్తిళ్లకు కేంద్ర మంత్రి పూర్తి తలొగ్గారని దేశవ్యాప్తంగా రామ్మోహన్ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విమానం ఎక్కడమంటే భయం, నరకం, అనే స్థాయికి రామ్మోహన్ తీసుకెళ్లాడు. ఇంతటి అసమర్థ మంత్రి అవసరమా?’ అని ప్రశ్నించారు. -
ఎంబీబీఎస్ చేరికల్లో అమ్మాయిలదే హవా
సాక్షి, అమరావతి: ఈ ఏడాది (2025–26) ఎంబీబీఎస్ ప్రవేశాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. సాధారణంగా ఎంబీబీఎస్ ప్రవేశాల్లో అమ్మాయిలదే పైచేయి ఉంటుంది. కాగా.. గడచిన రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది అధికంగా 3.66 శాతం సీట్లు ఎక్కువగా అమ్మాయిలే కైవసం చేసుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో 6,432 సీట్లున్నాయి. వీటిలో 60.72 శాతం సీట్లు అమ్మాయిలే దక్కించుకున్నారు. అబ్బాయిలు 39.28 శాతం సీట్లకే పరిమితమయ్యారు. సీట్ల కేటాయింపు సరళిపై శనివారం వైద్యశాఖ ప్రకటన విడుదల చేసింది. 2023–24లో 57.06 శాతం, 2024–25లో 57.96 శాతం చొప్పున అమ్మాయిలు సీట్లు దక్కించుకున్నట్టు తెలిపింది. 2025–26 విద్యా సంవత్సరంలో మొత్తం ఎంబీబీఎస్ సీట్లు 6,430 ఉండగా.. వీటిలో కన్వీనర్ కోటా కింద అమ్మాయిలు 2,617, అబ్బాయిలు 1,638 చొప్పున సీట్లు దక్కించుకున్నారు. యాజమాన్య కోటాలో అమ్మాయిలు 1,287, అబ్బాయిలు 888 మంది చొప్పున ప్రవేశాలు పొందారు.కొత్త కళాశాలలు ప్రారంభమై ఉంటే..వైఎస్ జగన్ ప్రభుత్వంలో చేపట్టిన కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్కు కట్టబెట్టడం కోసం తరగతుల్ని ప్రారంభించకుండా చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడింది. గత ప్రభుత్వంలో 17 కళాశాలలకు శ్రీకారం చుట్టగా.. 6 వైద్య కళాశాలల్లో తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. మిగిలిన కళాశాలలు 2024–25, 2025–26 విద్యా సంవత్సరాల్లో అందుబాటులోకి రావాల్సి ఉంది. అయితే, గతేడాది పులివెందుల వైద్య కళాశాలకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) 50 ఎంబీబీఎస్ సీట్లు మంజూరు చేయగా.. రాష్ట్ర ప్రభుత్వమే వద్దని లేఖలు రాసి రద్దు చేయించింది. దీంతో మరో 3 కళాశాలలు ప్రారంభం కాకుండా అడ్డుపడింది. ఈ చర్యల కారణంగా గతేడాది 700 సీట్లను మన విద్యార్థులు కోల్పోయి తీవ్రంగా నష్టపోయారు. 7 వైద్య కళాశాలలు 2025–26లో అందుబాటులోకి రావాల్సి ఉండగా.. ఒక్క కళాశాలకు కూడా అనుమతుల కోసం ప్రభుత్వం దరఖాస్తు చేయలేదు. ఈ 7 కళాశాలల ద్వారా 1,050 సీట్లు సమకూరాల్సి ఉండగా.. ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు. ఇలా 2024–25 విద్యా సంవత్సరంలో 700, 2025–26లో 1,750 సీట్ల చొప్పున 2,450 మంది విద్యార్థులు వైద్య విద్యకు దూరం కాగా.. వారి భవిష్యత్ తలకిందులైంది. ప్రభుత్వ రంగంలోనే వైద్య కళాశాలల్ని యథావిధిగా ప్రారంభించి ఉంటే మన ఆడ బిడ్డలకు మరింత మేలు జరిగి ఉండేదని రాష్ట్రవ్యాప్త చర్చ సాగుతోంది. -
చట్టం బలాదూర్.. చంద్రబాబు మార్క్ వేధింపులు
మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో గత ఏడాది జూలై 21 రాత్రి జరిగిన ఫైళ్ల దగ్ధం ఘటనలో కుట్ర కోణం లేదని తేలినా చంద్రబాబు ప్రభుత్వం కుయుక్తులతో వైఎస్సార్సీపీ నేతలను వేధించాలని చూస్తోంది. కోర్టు సూచనలను కూడా పట్టించుకోకుండా అడుగడుగునా దారుణంగా వ్యవహరిస్తోంది. ఇందులోభాగంగా శనివారం తెల్లవారుజామున సీఐడీ అధికారులు మదనపల్లె వైఎస్సార్సీపీ నేత మాధవరెడ్డి ఇంటిపై దాడికి వెళ్లారు.మాధవరెడ్డిపై ఆర్డీవో కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం, ఆయన ఇంట్లో నిర్వహించిన సోదాల్లో దొరికిన డాక్యుమెంట్లపై అక్రమ కేసులు నమోదు చేశారు. వీటిలో ఒక కేసులో బెయిల్ రాగా, ఆర్డీవో కార్యాలయం కేసులో బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం దీనిపై విచారణ జరగనుంది. ఈలోగానే సీఐడీ అధికారులతో అక్రమ అరెస్టులకు కుట్రలు చేయడం చంద్రబాబు మార్కు వేధింపులకు పరాకాష్టగా నిలుస్తోంది.చట్టప్రకారం వెళ్లాలని కోర్టు సూచించినా..చట్టబద్ధ ప్రక్రియను అనుసరించకుండా బలవంతపు చర్యలు తీసుకోవద్దని... ఆర్డీవో కార్యాలయం కేసులో మాధవరెడ్డి అరెస్ట్కు సంబంధించి సీఐడీకి కోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. కేసులో తొలుత మాధవరెడ్డికి అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ కోర్టు స్టే ఇచ్చింది. బెయిల్ కోసం దిగువ కోర్టును ఆశ్రయించాలన్న సూచనతో జిల్లా కోర్టుకు వెళ్లగా పిటిషన్ తిరస్కరణకు గురైంది. తర్వాత హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేయగా పలుసార్లు విచారణ జరిగింది. మంగళవారం విచారణ ఉండగా సీఐడీ డీఎస్పీ వేణుగోపాల్ బృందం, స్థానిక పోలీసులు మదనపల్లెలోని మాధవరెడ్డి ఇంటికి వచ్చారు. తాళం వేసిన ఇంట్లో ఎవరూ లేకపోవడంతో 2 గంటలు అక్కడే ఉన్నారు. మిద్దెపై అద్దెకు ఉన్నవారిని మాధవరెడ్డి గురించి ఆరా తీసి వెళ్లిపోయారు.పాలీగ్రాఫ్ పరీక్షలో తేలినా...ఏదైనా కేసులో అనుమానితుల నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు చేసే పాలీగ్రాఫ్ పరీక్ష ఫలితాలు అత్యంత కచ్చితత్వంతో ఉంటాయని పోలీసు వర్గాలే చెబుతాయి. కాగా, ఆర్డీవో కార్యాలయం కేసులో ప్రధాన నిందితుడు కార్యాలయ అప్పటి సీనియర్ అసిస్టెంట్ గౌతంతేజ్. సీఐడీ వినతి మేరకు నిరుడు నవంబర్ 26, 27న ఆయనకు అమరావతి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అధికారులు పాలీగ్రాఫ్ పరీక్షలు చేశారు. ‘‘అగ్ని ప్రమాదం జరిగిందని డిప్యూటీ తహసీల్దార్ తపస్విని ఫోన్ చేయడానికి ముందే మీకు తెలుసా? కార్యాలయంలోని సెక్షన్లో నిప్పు పెట్టింది మీరేనా? ఎవరితోనైనా కలిసి దీనికి పాల్పడ్డారా? ప్రమాదం కారణాలను దాచిపెడుతున్నారా?’’ అని ప్రశ్నించింది. వీటన్నిటికీ, ‘కాదు’ అని గౌతంతేజ్ స్పష్టం చేసినట్లు పాలీగ్రాఫ్ పరీక్షల నివేదిక చెబుతోంది. తద్వారా ప్రమాదంలో కుట్ర కోణం లేదని తేలిపోయింది.వాంగ్మూలం సాకుతో... వేధింపులే లక్ష్యంగా...గౌతంతేజ్ విషయంలో సీఐడీ తీరు దారుణంగా ఉంది. పాలీగ్రాఫ్ పరీక్షలో నేర నిరూపణ కాలేదన్న నివేదికను సీఐడీ ఎస్పీకి సమర్పించిన 27 రోజుల అనంతరం చిత్తూరు జిల్లా పలమనేరులో ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. 2024 డిసెంబర్ 30న అదుపులోకి తీసుకుని విచారించగా, మదనపల్లె ఘటనకు కొందరితో కలిసి కుట్ర పన్నినట్టు గౌతంతేజ్ వాంగ్మూలం ఇచ్చాడని, అదే రోజు అరెస్ట్ చేశామని సీఐడీ పేర్కొంది. ఇదంతా చూస్తుంటే, పాలీగ్రాఫ్ పరీక్షల్లో తేలిన నిజాన్ని కూడా సీఐడీ విస్మరిస్తోందని స్పష్టమవుతోంది. ఘటన జరిగిన రోజు రాత్రి 10.40కు గౌతంతేజ్ ఆర్డీవో కార్యాలయం నుంచి బయటకు వచ్చినట్లు ప్రాసిక్యూషన్ సమర్పించిన సీసీ కెమెరా ఫుటేజీల్లో ఉందని బెయిల్ ఉత్తర్వుల్లో కోర్టు పేర్కొంది. కేసును పరిశీలించాక నిందితుడి వాంగ్మూలం తప్ప ఇతర ఆధారాల్లేవని, ఒకవేళ ఉంటే విచారణలో పరిగణనలోకి తీసుకోవచ్చని పేర్కొంది. అయితే, గౌతంతేజ్ వాంగ్మూలాన్ని సాకుగా చూపుతూ పలువురిని నిందితులుగా చేర్చి సీఐడీ ద్వారా ప్రభుత్వం వేధిస్తోంది. ‘22ఏ’ భూములెక్కడ? మిథున్రెడ్డి సవాల్కు జవాబేది?మదనపల్లె ఘటనపై సీఎం చంద్రబాబు నుంచి కూటమి నేతల వరకు అందరిదీ ఒకటే పాట. అది... మాజీ మంత్రి, పుంగనూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరులకు చెందిన నిషేధిత జాబితాలోని భూములకు సంబంధించిన 22ఏ ఫైళ్లు ఉన్నాయని, అందుకే దగ్ధం చేశారంటూ తప్పుడు ప్రచారానికి దిగారు. కానీ, 17 నెలలు దాటినా ఒక్క ఆధారమూ చూపలేకపోయారు. సీఎం చంద్రబాబు చెప్పినట్లు వ్యవహరించిన వ్యవస్థలు మదనపల్లెలో మోహరించి భూతద్దం వేసి గాలించినా అక్రమాలు నిరూపించలేకపోయారు.ఇక చంద్రబాబు ప్రభుత్వం ఆరోపణలపై అçప్పట్లో ఎంపీ మిథున్రెడ్డి తీవ్రంగా స్పందించారు. తమ కుటుంబానికి ఉన్న భూములన్నీ సక్రమమేనని, వాటి వివరాలను ఎన్నికల అఫిడవిట్లో స్పష్టంగా తెలియజేశామని ప్రకటించారు. అక్రమాలకు పాల్పడితే నిరూపించాలని సవాల్ కూడా చేశారు. కానీ, ఇంతకాలమైనా అక్రమ కేసులతో వేధించడం మినహా 22ఏ భూముల వివరాలను ప్రభుత్వం చూపలేకపోయింది. దీంతో చంద్రబాబు కుట్ర ప్రజలకు అర్థమైపోయింది.నకళ్లు ఉంటాయనే విషయాన్ని విస్మరించి మరీ...రెవెన్యూ కార్యాలయం ఫైళ్లకు తహసీల్దార్, జాయింట్ కలెక్టర్, కలెక్టరేట్లలో నకళ్లు ఉంటాయి. వాటిని పరిశీలించి ఏమైనా భూముల అక్రమాలను వెలికితీయొచ్చు. వాస్తవానికి మదనపల్లె ఉదంతంలో 22ఏ భూముల అక్రమాలు లేవన్నది స్పష్టం. కానీ, ఈ ఘటనను వైఎస్సార్సీపీ నేతలను వేధించే ఆయుధంగా చంద్రబాబు ప్రభుత్వం వాడుకుంటోంది. మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి అనుచరులు, వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసుల నమోదుతో పాటు మదనపల్లె, తిరుపతి, హైదరాబాద్ తదితరచోట్ల వారి ఇళ్లల్లో సోదాలు చేయించింది.ఏదో జరిగిపోయిందని ప్రజలను నమ్మించేందుకు స్వయంగా సీఎం చంద్రబాబే కేసును సమీక్షించడమే కాక అప్పటి డీజీపీ ద్వారకాతిరుమలరావు, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ను విజయవాడ నుంచి హెలికాప్టర్లో మదనపల్లెకు పంపారు. అన్ని ముఖ్య శాఖల కార్యదర్శులు, ఉన్నతస్థాయి అధికారులనూ పంపించి కుట్ర కోణం ఆధారాలు సేకరించాలని ఒత్తిడి తెచ్చారు.ఇప్పటికీ ఏమీ తేల్చలేకపోయింది గాక... పాలీగ్రాఫ్ పరీక్షలో నిజాలు వెల్లడైనా చంద్రబాబు ప్రభుత్వం ఇంకా కుట్రే అంటూ బుకాయిస్తోంది. మరోవైపు మదనపల్లె ఘటనపై ప్రధానంగా ఒక కేసు నమోదు చేశారు. తర్వాత అసలు సంబంధమే లేని వైఎస్సార్సీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేపై దాడులు నిర్వహించి రిజిస్ట్రేషన్ పత్రాలు, రికార్డులపై కేసులు పెట్టారు. ఒక కేసుకు సంబంధించి పలు కేసుల నమోదు చెల్లదని న్యాయవాదులు చెబుతున్నారు. -
విజనరీ చంద్రబాబు సలహా ఇవ్వలేదా?
సాక్షి, న్యూఢిల్లీ/ సాక్షి, అమరావతి: ‘మోంథా తుపాన్ పీక నులిమేసిన మేధావితనం ఏమైంది? సెల్ఫోన్ను, కంప్యూటర్ను కనిపెట్టిన జ్ఞానం ఎక్కడికి పోయింది? హైదరాబాద్నే నిర్మించిన, పెద్ద పెద్ద సంక్షోభాలను చిటికెలో పరిష్కరించిన నైపుణ్యం ఎక్కడికి పోయింది? ఇంతటి మేధావి ఇండిగో ఎయిర్స్లైన్స్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడుకు ఎందుకు ఓ సలహా ఇవ్వలేదు?’ అంటూ నెటిజన్లు సీఎం చంద్రబాబును సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తున్నారు. ఇండిగో సృష్టించిన సంక్షోభానికి ఓ పక్క ప్రయాణికులు ఆగ్రహ జ్వాలలతో రగిలి పోతుంటే.. మరోపక్క ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు టీడీపీ ప్రయత్నించి దేశ వ్యాప్తంగా అభాసుపాలైంది.ఈ సంక్షోభంపై ‘రిపబ్లిక్’ టీవీలో జరిగిన చర్చలో టీడీపీకి చెందిన అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి వ్యాఖ్యలను జర్నలిస్టు అర్నబ్ గోస్వామి తీవ్రంగా పరిగణించారు. ‘ఈ సమస్యతో టీడీపీకి సంబంధం ఏమిటి? అసలు నారా లోకేశ్ ఎందుకు సమీక్ష చేస్తారు? ఏ హోదాతో చేస్తారు? అంటూ దీపక్ రెడ్డిని ప్రశ్నలతో నిలదీశారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దీపక్ రెడ్డి తెల్లమొహం వేసి, టాపిక్ మార్చే ప్రయత్నం చేయడంతో నవ్వులపాలయ్యారు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్లో వైరల్ కావడంతో దేశ వ్యాప్తంగా కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్నాయుడు తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఏదో ఒక సంఘటన తరచూ జరుగుతూనే ఉంది.విమాన ప్రమాదాలు, టిక్కెట్ ధరలు పెరగడం, స్టాఫ్ వ్యవహార శైలి, గంటల తరబడి వేచి ఉండటం, ఫ్లైట్ క్యాన్సిల్స్, ఫ్లైట్ డిలే వంటి ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ ఏడాది జూన్ 12న అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 230 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాద సంఘటన స్థలానికి వెళ్లిన కేంద్ర మంత్రి రీల్ తరహాలో ఓ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ రావడం, షర్ట్ను మోచేతి వరకు మడత పెట్టడం చూసిన నెటిజన్లు మండిపడ్డారు. రామ్మోహన్ కేంద్ర మంత్రిగా ఉండటం వల్ల రాష్ట్రానికి ఒనగూరిన ప్రయోజనం ప్రత్యేకించి ఏమీ లేదని రాష్ట్ర ప్రజలు విమర్శిస్తున్నారు. -
ఉన్నత విద్యా మండలి ఖజానాపై కన్ను
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాలుగు దశాబ్దాలకుపైగా విద్యా అభ్యున్నతికి తలమానికంగా నిలిచిన ఉన్నత విద్యా మండలి (ఏపీఎస్సీహెచ్ఈ) నిర్వీర్యానికి తెరవెనుక మంత్రాంగం నడుస్తోంది. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును విస్మరించి ఏపీఎస్సీహెచ్ఈ ఖజానాను ఖాళీ చేయడమే లక్ష్యంగా కుట్ర సాగుతోంది. ఉన్నత విద్యా మండలి ప్రతిపాదించిన విద్యా సంబంధిత అంశాలను నెలలు తరబడి పెండింగ్లో పెడుతున్న ఉన్నత విద్యా శాఖ అధికార యంత్రాంగం... నిధులను దారిమళ్లించడంలో మాత్రం అత్యుత్సాహం చూపిస్తోంది.ఏడాదిన్నరగా ఉన్నత విద్యా శాఖకు, ఉన్నత విద్యా మండలికి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతుంటే చంద్రబాబు ప్రభుత్వం చోద్యం చూస్తోంది. విద్యార్థులతోపాటు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, అనుబంధ సంస్థల ఉనికిని ప్రమాదంలోకి నెట్టేస్తోంది. రూ.10 కోట్లు హాంఫట్! వాస్తవానికి ఉన్నత విద్యా మండలి అకడమిక్ సంస్కరణలను ప్రభుత్వం ప్రోత్సహించాలి. తద్వారా విద్యార్థులను ప్రస్తుత అవసరాలతోపాటు భవిష్యత్తులోనూ ఉపయోగపడే మానవ వనరులుగా తీర్చిదిద్దాలి. కానీ, ఉన్నత విద్యామండలి ప్రతిపాదనలను ప్రభుత్వం (ఉన్నత విద్యాశాఖ) కనీసం పట్టించుకోవట్లేదు. అయితే పేద విద్యార్థులు కట్టిన ఫీజుల ద్వారా ఏపీఎస్సీహెచ్ఈకి వచ్చిన నిధులను మాత్రం ఖాళీ చేస్తోంది. ఇటీవల ఉన్నత విద్యా మండలి నుంచి ఏకంగా రూ.3.60 కోట్లను ఎకనమిక్ బోర్డుకు మళ్లించడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఏఐ యూనివర్సిటీ పేరిట మరో రూ.2కోట్ల వరకు ఏపీఎస్సీహెచ్ఈ డబ్బులనే వాడేసినట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా కళాశాల విద్యలో పని చేస్తున్న కన్సల్టెంట్ల కోసం ఉన్నత విద్యా మండలికి చెందిన సుమారు రూ.5 కోట్ల నిధులను సైతం వెచ్చించాల్సిన దుస్థితి కనిపిస్తోంది. ఇలా విద్యా ప్రమాణాల మెరుగుదలకు వినియోగించాల్సిన నిధులను పక్కదారి పట్టిస్తుండటం చంద్రబాబు ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. గతంలోనూ ఇదే తంతు? అకడమిక్ విషయాల్లోని ప్రవేశాల నిర్వహణ, కరిక్యులమ్ రూపకల్పన వంటి విద్యా సంబంధిత అంశాలను ఉన్నత విద్యా మండలి నిర్వహిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత ఉన్నత విద్యా మండలి అధికారాలను, పరిధిని తగ్గించే ప్రయత్నం ప్రారంభమైంది. కొందరు అధికారులు, షాడో మంత్రిగా వ్యవహరిస్తున్న ఓ ఓఎస్డీ నేతృత్వంలో ఈ కథ సాగుతోందని సమాచారం. ఉన్నత విద్యా మండలికి ప్రవేశాల నిర్వహణ ద్వారా ఆదాయం వస్తుంది. ఇది గమనించిన సదరు అధికారులు, షాడో మంత్రి ద్వయం ఖజానాపై కన్నేసినట్టు కనిపిస్తోంది. అందుకే విద్యార్థుల ప్రవేశాలను ఉన్నత విద్యా మండలి నుంచి తప్పించి ప్రత్యేకంగా ఉన్నత విద్య కమిషనరేట్ను ఏర్పాటు చేసి దానికి అప్పగించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. గతంలోనూ టీడీపీ ప్రభుత్వంలో ఉన్నత విద్యా మండలి నుంచి ప్రవేశాలను కళాశాల విద్యకు కేటాయించారు.నిధులు ఖాళీ అయిపోయిన తర్వాత తాము నిర్వహించలేమని కళాశాల విద్య చేతులు ఎత్తేయడంతో మళ్లీ ఉన్నత విద్యా మండలికే ఆ బాధ్యతలను అప్పగించారు. తాజాగా మళ్లీ అలాంటి కథ తెరపైకి రావడం గమనార్హం. -
రెండో దశ భూ సమీకరణ నిలిపివేయాలి
గాందీనగర్(విజయవాడ సెంట్రల్): రాజధాని అమరావతి పేరిట రెండో విడత భూ సమీకరణ చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని రౌండ్టేబుల్ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రాజధాని పేరుతో రైతులను ప్రభుత్వం పదే పదే దగా చేస్తోందని మండిపడింది. తొలుత భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. శనివారం విజయవాడ ప్రెస్క్లబ్లో ‘అమరావతి భూ సమీకరణ 2.0’పై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అమరావతి రైతు నాయకులు గద్దె తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రైతు ఉద్యమ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. గతంలో రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు చంద్రబాబు ఇప్పటివరకు న్యాయం చేయలేదన్నారు. మళ్లీ రెండో విడత పేరుతో భూములు తీసుకోవాలని నిర్ణయించడం దారుణమన్నారు. 24 ప్లాట్ఫారాలతో రైల్వేస్టేషన్ కడతానంటున్నారని.. నిజంగా అంత పెద్ద రైల్వేస్టేషన్ అవసరమా? అని ప్రశి్నంచారు. చంద్రబాబు పగటి కలలతో రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత మీకు లేదా? అని నిలదీశారు. ఎప్పుడు నిర్మిస్తారో తెలియని ఔటర్ రింగ్ రోడ్కు ఇప్పుడు భూ సమీకరణ అవసరమా? అని ప్రశ్నించారు.భూ సమీకరణ జీవో చెల్లదు! ఔటర్ రింగ్ రోడ్ అంటూ ప్రజలను మోసం చేసి భూములు తీసుకుంటున్నారని ప్రొఫెసర్ రామచంద్రయ్య మండిపడ్డారు. ప్రభుత్వం జారీ చేసే ప్రతి జీవో వెనుక వారి ఆర్థిక ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయన్నారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతులకు ఇచ్చిన హామీలన్నీ పెద్ద మోసాలన్నారు. రైతులకు విద్య, వైద్యం అందించాలని ల్యాండ్ పూలింగ్ జీవో చెబుతున్నప్పటికీ అవేవీ కల్పించలేదన్నారు. సమీకరణపై తెచ్చిన జీవో చెల్లదని, దీనిని కోర్టులో సవాల్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.అన్స్టాపబుల్గా భూ సమీకరణ.. అమరావతి అన్స్టాపబుల్ అని చెబుతున్న చంద్రబాబు.. భూ సమీకరణ కూడా అన్స్టాపబుల్గా చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు మండిపడ్డారు. కాంగ్రెస్ నేత తులసిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సచివాలయాన్ని రెండేళ్లు, పార్లమెంట్ను మూడేళ్లలో పూర్తి చేశారని.. కానీ మన రాజధాని మాత్రం టీవీ సీరియల్లా సాగుతోందని ఎద్దేవా చేశారు. ఒక ప్రాంతంలోనే అంతా ఖర్చు చేస్తున్నారని రాయలసీమలో అలజడి మొదలైందని హెచ్చరించారు. సామాజిక కార్యకర్త వసుంధర మాట్లాడుతూ.. రెండో విడత భూ సమీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే.. అమరావతి మున్సిపాలిటీగా కాదు.. పంచాయతీగా మిగిలిపోవడం ఖాయమన్నారు. సమావేశంలో సీపీఐ నేత అక్కినేని వనజ, కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ, అమరావతి రైతులు ఎం.రవి, రఘునాథ్, గన్నవరం ఎయిర్పోర్టు బాధితులు వేదవతి, శ్రీధర్, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నేతలు పోలారి, తదితరులు పాల్గొన్నారు. రైతులను బ్లాక్మెయిల్ చేస్తున్నారా?ల్యాండ్ పూలింగ్లో భూములు ఇవ్వకపోతే అమరావతి మున్సిపాలిటీగా మిగులుతుందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయి. చంద్రబాబూ.. రైతులను బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటున్నారా? లేదా అవమానించాలని అనుకుంటున్నారా? అమరావతి రైతులకు చంద్రబాబు ఇప్పటివరకు చేసిందేమీ లేదు. – బుచ్చి తిరుపతిరావు, అమరావతి రైతు చంద్రబాబుకు ప్రణాళిక లేదు చంద్రబాబు అమరావతి రైతులను పిలిచి మున్సిపాలిటీ కబుర్లు చెబుతున్నాడు. చంద్రబాబును ఇలాగే వదిలేస్తే రాష్ట్రమంతా భూ సమీకరణ చేస్తాడు. అసలు చంద్రబాబుకు ప్రణాళిక లేదు. అమరావతి రైతులంతా కలిసి చంద్రబాబు మెడలు వంచాలి. – రాజేంద్రప్రసాద్, రైతు -
‘సాక్షి’ ఎడిటర్పై మరో కేసు
సాక్షి ప్రతినిధి కర్నూలు: ప్రభుత్వ తప్పిదాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’పై ప్రభుత్వ పెద్దలు కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రజా వ్యతిరేకత తట్టుకోలేక తప్పుడు కేసులు నమోదు చేస్తూ ‘సాక్షి’ గొంతు నొక్కడానికి విఫలయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక కర్నూలులో ఇప్పటికే ‘సాక్షి’పై 5 కేసులు నమోదు చేశారు. తాజాగా మరో కేసు నమోదైంది. ఇందులో రెండు కేసులు పోలీసులు అక్రమంగా నమోదు చేస్తే, మిగిలిన కేసులు మంత్రి టీజీ భరత్ ఆదేశాలతో నమోదయ్యాయి. ‘క్యాంపు భరతం పట్టేస్తా!’ శీర్షికన సెప్టెంబర్ 13న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. కర్నూల్లో కీలకమైన ఆ ప్రాంతాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని వివరించింది. ఉన్నఫళంగా క్వార్టర్లు ఖాళీ చేయాలని నోటీసులు అందడంతో ఏ,బీ,సీ క్యాంపు క్వార్టర్లలో నివాసం ఉంటున్న వారు, ప్రభుత్వ ఉద్యోగులు వరుస ఆందోళనలకు దిగారు. ఎలాగైనా క్వార్టర్లు కూల్చేయాలని భీష్మించిన మంత్రి టీజీ భరత్ ‘క్వార్టర్లు ఖాళీ చేయాల్సిందేనని, లేదంటే కర్ర పట్టుకోవాల్సి వస్తుంది’ అని బెదిరించారు. దీంతో క్వార్టర్లు కూల్చేయడం, ఖాళీ చేయడం అనేది ప్రభుత్వ నిర్ణయమా? భరత్ వ్యక్తిగత నిర్ణయమా? అనే చర్చ నగరంలో జరుగుతోంది. ప్రభుత్వ నిర్ణయమైతే అందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువరించాలి. భరత్ వ్యక్తిగత నిర్ణయమైతే క్వార్టర్లు ఖాళీ చేయండనే హక్కు ఆయనకు లేదు. ఇంత వరకూ ప్రభుత్వం నుంచి క్వార్టర్లు ఖాళీ చేయాలని ఉత్తర్వులు లేవు. అక్కడ మినీ స్టేడియం నిర్మిస్తున్నామని, ఖాళీ చేయాలంటూ ఆర్అండ్బీ అధికారులు కొంత మందికి నోటీసులు జారీ చేశారు. నోటీసులకు, మంత్రి మాటలకు పొంతన ఏదీ? ఏబీసీ క్వార్టర్లు ఖాళీ చేయాలని, అక్కడ మినీ స్టేడియం నిర్మిస్తున్నామని ఏప్రిల్ 10న ఆర్అండ్బీ ఏఈ, డీఈ, ఈఈలు 39 మందికి నోటీసులు జారీ చేశారు. మినీ స్టేడియం నిర్మిస్తున్నామని నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు. దీని నిర్మాణానికి 5 ఎకరాలు కూడా అవసరం లేదు. అయితే అక్కడ 160–170 ఎకరాల స్థలం ఉంది. మార్కెట్ రేటు ప్రకారం ఈ స్థలం విలువ రూ.4 వేల నుంచి రూ.5 వేల కోట్లు ఉంటుంది. తక్కిన స్థలాన్ని పీపీపీ విధానం ప్రకారం టీడీపీ నేతలు కొట్టేయాలనే ప్రచారం నడిచింది. అధికార, రాజకీయ వర్గాలు కూడా ఈ అంశాన్ని చర్చించాయి. ఇదే విషయాన్ని వివరిస్తూ సెపె్టంబర్ 13న ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీంతో ఆగ్రహం చెందిన ప్రభుత్వ పెద్దలు టూటౌన్, త్రీటౌన్లో ‘సాక్షి’పై కేసు నమోదు చేయించారు. ఈ కథనం తర్వాత నగరవాసులంతా విలువైన ప్రభుత్వ స్థలం లీజు పేరుతో పరుల పరం కాకూడదని చర్చించుకున్నారు. ఈ వ్యవహారంలో భరత్, ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో భరత్ అక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నామని, స్థలాలు ఖాళీ చేయాల్సిందేనని చెప్పారు. అధికారులు నోటీసుల్లో పేర్కొన్నట్లు మినీ స్టేడియం నిర్మించడం వాస్తవమా? లేక భరత్ చెప్పినట్లు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నారా? ఈ రెండింటిలో ఏది నిజమైనా ప్రభుత్వం నుంచి అనుమతి ఉందా? స్టేడియం నిర్మిస్తున్నామని, లేదా హైకోర్టు బెంచ్ ఏ,బీ,సీ క్యాంపుల్లో నిర్మిస్తున్నామని ప్రభుత్వం ఎందుకు జీవో జారీ చేయలేదు? హైకోర్టు బెంచ్ ఎన్ని ఎకరాల్లో నిర్మిస్తున్నారు? తక్కిన స్థలాన్ని ఏం చేస్తారు? అనే విషయాలను ప్రభుత్వం స్పష్టం చేయాల్సి ఉంది. ఈ వ్యవహారంలో రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం ప్రభుత్వ అవసరాలకే వినియోగించాలని, పీపీపీ విధానం ద్వారా టీడీపీ నేతలు కొట్టేయకూడదనే ‘సాక్షి’ రాసింది. ప్రజల తరఫున పై విషయాలను ప్రశ్నించినందుకు వాటికి సమాధానం చెప్పలేక తప్పుడు కేసులు నమోదు చేయడంపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో అక్రమ కేసులను చంద్రబాబు ప్రభుత్వం నమోదు చేసింది.జాతీయ స్థాయిలో తప్పుబట్టినా మారని ప్రభుత్వ, పోలీసు వైఖరిఆంధ్రప్రదేశ్లో ‘సాక్షి’ పత్రికపై, జర్నలిస్టులపై అక్రమంగా కేసులు నమోదు చేస్తూ వేధిస్తున్నారని ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పలు సంఘాల నేతలు, జర్నలిస్టు యూనియన్లతో పాటు జాతీయ స్థాయిలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఎడిటర్స్ గిల్డ్ కూడా తీవ్రంగా తప్పుబట్టింది. హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వ వైఖరిని ఎత్తి చూపింది. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని, రాజ్యంగం పత్రికలకు భావ ప్రకటన స్వేచ్ఛను హక్కుగా కల్పించిందని, దాన్ని ఇతర వ్యవస్థలు కాపాడాలని విన్నవిస్తున్నా ప్రభుత్వానికి, పోలీసులకు ఏమాత్రం చెవికెక్కడం లేదు. ప్రభుత్వ పెద్దలు ఎలా చెబితే అలా అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. వార్తలతో ఎవరికైనా పరువునష్టం వాటిల్లి ఉంటే కోర్టును ఆశ్రయింవచ్చు. పరువునష్టం దావా దాఖలు చేయొచ్చు. కానీ అధికారం ఉందికదా అని ‘సాక్షి’పై అక్రమ కేసులు నమోదు చేయించడాన్ని ప్రజలు, మేధావులు తప్పుపడుతున్నారు.కర్నూల్లో ‘సాక్షి’పై ఇవీ కేసులు» చంద్రబాబు ప్రభుత్వంలో ‘సాక్షి’పై కర్నూలులో 6 కేసులు నమోదు చేశారు. సెప్టెంబర్ 13న ‘క్యాంపు భరతం పట్టేస్తా!’ అనే శీర్షికన ప్రచురితమైన కథనంపై త్రీటౌన్ పోలీసుస్టేషన్లో సాక్షి మేనేజ్మెంట్, సాక్షి పబ్లిషర్పై క్రైం నెంబర్ 419/20225 కింద సెక్షన్ యూ/ఎస్192, 352,353 (1),(బి),356(1),61(1)(ఏ) రెడ్విత్ 3(5) బీఎన్ఎస్ ప్రకారం కేసు నమోదు చేశారు. » ఇదే కథనంపై రెండో పట్టణ పోలీసుస్టేషన్లో సెక్షన్ 192, 356(1),352, 353(1)(బి)61(1)(ఏ)రెడ్విత్ 3(5) బీఎన్సీపై మరో కేసు నమోదు చేశారు. నవీన్ కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు త్రీటౌన్లో, శరత్బాబు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు టూటౌన్లో కేసులు నమోదు చేశారు.» ‘ప్రభుత్వ నిర్ణయమా? భరత్ ఆదేశమా?’ అనే శీర్షికతో గత నెల 28న ప్రచురితమైన కథనంపై ఈ నెల 4న టూ టౌన్ పోలీసుస్టేషన్లో గజేంద్ర సింగ్ ‘సాక్షి’ ఎడిటర్, పబ్లిషర్, సెల్లర్, రిపోర్టర్పై సెక్షన్ 192, 352,353(1)(బి),353(1)(సి),353(2), 356(3),356(4),రెడ్విత్ 3(5) బీఎన్ఎస్ ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ కేసులన్నీ మంత్రి తన అనుచరులతో ఫిర్యాదు చేయించినవే అన్నది బహిరంగ రహస్యం.» జూలై 26న కర్నూలు త్రీటౌన్ పోలీసుస్టేషన్లో ‘సాక్షి’పై సెక్షన్ 132, 308(3), 353(1)(బి), 356(3), రెడ్విత్ 61(2)బీఎన్ఎస్ ప్రకారం కేసు నమోదు చేశారు. ‘రాయలసీమలో అనకొండ ఐపీఎస్’ పేరుతో ప్రచురితమైన కథనం నేపథ్యంలో ఆ కేసు నమోదు చేశారు. » గతేడాది డిసెంబర్ 22న కర్నూలులో మునీర్ అహ్మద్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడిని పోలీసులు కిడ్నాప్ చేశారు. దీనిపై కథనం రాస్తే త్రీటౌన్ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు తన విధులకు ‘సాక్షి’ విలేకరి ఆటంకం కల్గించారని తప్పుడు ఫిర్యాదుతో త్రీటౌన్లో కేసు నమోదు చేశారు. » కర్నూలు కార్పొరేషన్ టెండర్లలో ఎవ్వరూ పాల్గొనవద్దని మంత్రి భరత్ అనుచరుడు సందీప్ అనే వ్యక్తి వాట్సాప్ గ్రూపుల్లో కాంట్రాక్టర్లకు బెదిరింపు మెసేజ్లు పంపారు. దీనిపై ఆధారాలతో ‘సాక్షి’ కథనం ప్రచురిస్తే అతని ఫిర్యాదుతో వన్టౌన్లో కేసు నమోదు చేశారు. -
సర్వం భవ్యం.. అనామక సంస్థకు పెద్దపీట
సాక్షి, అమరావతి: వేల కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన, అంతర్జాతీయంగా పేరుగాంచిన, వైద్య రంగంలో అపార అనుభవం ఉన్న విఖ్యాత సంస్థలను కాదని అతి చిన్న, ఓ అనామక సంస్థకు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా కాంట్రాక్టులు కట్టబెడుతుండటం నివ్వెర పరుస్తోంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని లాభాపేక్ష లేకుండా సేవా దృక్ఫథంతో ముందుకొస్తున్న, స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన సంస్థలను పక్కనపెట్టి.. టీడీపీ డాక్టర్స్ విభాగంలోని పవన్కు చెందిన ‘భవ్య’ అనే ఎలాంటి అనుభవం లేని సంస్థకు ప్రజల ప్రాణ, ఆరోగ్య రక్షణ కోసం తీసుకొచ్చిన 108, 104ల నిర్వహణ కాంట్రాక్ట్ను అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అంతటితో ఆగకుండా బరితెగించి ఇతరత్రా శాఖల్లో సైతం కాంట్రాక్టులు అప్పనంగా కట్టబెట్టి.. మీకింత–మాకింత అంటూ కమీషన్లు దండుకుంటున్నారని స్పష్టమవుతోంది. పశు సంవర్థక శాఖలో పశు సంచార వైద్య సేవలు, ఏపీ జెన్కో ఆస్పత్రుల నిర్వహణ, తదితర కాంట్రాక్టుల ద్వారా ఊరూ, పేరు లేని సంస్థకు ఏకంగా రూ.3,025 కోట్ల విలువై కాంట్రాక్టులు అప్పగించడం దుమారం రేపుతోంది. తద్వారా ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచుకోవడానికి ప్రభుత్వ పెద్దలు కాంట్రాక్టులను ఓ సాధనంగా మలుచుకున్నారనడానికి ఈ వ్యవహారమే ఓ ఉదాహరణ. తస్మదీయ కాంట్రాక్టర్కు పొగబెట్టి.. గతేడాది చంద్రబాబు గద్దెనెక్కిన వెంటనే తస్మదీయ కాంట్రాక్టర్లకు పొగపెట్టారు. గడువు ఉన్నప్పటికీ కాంట్రాక్టర్లే పనులు వదులుకుని వెళ్లిపోయేలా వేధింపులకు దిగారు. దీంతో 104 మొబైల్ మెడికల్ యూనిట్స్ (ఎంఎంయూ), 108 నిర్వహణ కాలపరిమితి 2027 వరకూ ఉన్నప్పటికీ కాంట్రాక్టర్ ఎంవోయూను రద్దు చేసుకున్నారు. అనంతరం భవ్య హెల్త్ సర్వీసెస్కు ఈ కాంట్రాక్ట్ను కట్టబెట్టడం కోసం పక్కా ప్రణాళికతో నిబంధనలు రూపొందించి టెండర్ పిలిచారు. ఈ సంస్థకు అత్యవసర వైద్య సేవల నిర్వహణలో అనుభవం లేకపోవడంతో నిబంధనలు మార్చేశారు. సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా అత్యవసర వైద్య సేవల కల్పన కోసం టెండర్లు పిలిచినప్పుడు అంబులెన్స్లు /ఎంఎంయూ /తల్లీబిడ్డా ఎక్స్ప్రెస్లు, ఇతర సంచార వైద్య సేవల్లో అనుభవం ఉన్న సంస్థలకు ప్రాధాన్యం ఇచ్చేలా నిబంధనలు ఉంటాయి.భవ్యకు మొబైల్ వెటర్నరీ అంబులెన్స్లు నిర్వహించిన అనుభవం ఉందనే కారణంతో ఈ నిబంధనను టెండర్ మార్గదర్శకాల్లో చేర్చారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) మార్గదర్శకాలకు తూట్లు పొడిచారు. టెండర్ నిబంధనలన్నింటినీ భవ్యకు అనుకూలంగా మార్చేశారు. దీంతో టెండర్లలో పాల్గొన్నా ఏదో ఒక సాకుతో బిడ్లను తిరస్కరిస్తారని గ్రహించడంతో దేశంలో అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న ప్రముఖ సంస్థలు కనీసం బిడ్లు కూడా వేయలేదు. దీంతో ప్రభుత్వ పెద్దలు విజయవంతంగా భవ్యకు కాంట్రాక్ట్ను కట్టబెట్టేశారు. ఐదేళ్ల కాల పరిమితితో 731 అంబులెన్స్ల నిర్వహణను రూ.1,100 కోట్లతో, 904 ఎంఎంయూలకు రూ.675 కోట్లు, ఎంఎంయూల్లో వైద్య పరీక్షలకు రూ.810 కోట్లు, కాల్ సెంటర్ నిర్వహణకు రూ.129 కోట్ల చొప్పున మొత్తం రూ.2,714 కోట్ల కాంట్రాక్ట్ను భవ్య కైవసం చేసుకుంది. ఎంఎంయూల్లో వైద్య పరీక్షల నిర్వహణకు వైద్య శాఖ పైలెట్ నిర్వహిస్తోంది. త్వరలో వైద్య పరీక్షలు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది.క్వాలిటీ కాస్ట్ బేస్డ్ సెలక్షన్ అట! అరంబిందోను వెళ్లగొట్టాక.. ఎన్నడూ లేనట్లుగా 108, 104తో పాటు ఎమర్జెన్సీ కాల్ సెంటర్ నిర్వహణకు ఒకే టెండర్ను పిలిచారు. అత్యవసర వైద్యసేవల్లో విశేష అనుభవం ఉన్న పెద్దపెద్ద సంస్థలు టెండర్లలో పాల్గొంటే భవ్య సంస్థకు కాంట్రాక్ట్ దక్కదనే ఉద్దేశంతో ఇలా చేశారు. ఈ చర్యలతో పోటీ, పారదర్శకత లేకుండా పోయింది. తర్వాత 768 అంబులెన్స్లు, 904 మొబైల్ మెడికల్ యూనిట్లతో పాటు, వందకుపైగా సీట్లతో కాల్సెంటర్ నిర్వహించే అతిపెద్ద కాంట్రాక్ట్ను ఏ రాష్ట్రంలోనూ పెద్ద ప్రాజెక్టులు చేసిన అనుభవం లేని భవ్య హెల్త్ సర్వీసెస్కు అప్పగించారు.క్వాలిటీ కాస్ట్ బేస్డ్ సెలక్షన్ (క్యూసీబీఎస్) పేరుతో టెక్నికల్ ప్రజంటేషన్కు 80, ఫైనాన్షియల్ బిడ్కు 20 మార్కులు కేటాయించి భవ్యకు కట్టబెట్టారు. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో 340 సంచార పశు వైద్య, ఆరోగ్య సేవా రథాలను అందుబాటులోకి తెచ్చారు. వీటి కోసం 1962 టోల్ ఫ్రీ కాల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వంలో ఎంపిక చేసిన కాంట్రాక్టర్ గడువు గతేడాదితో ముగిసింది. దీంతో రూ.200 కోట్లకు పైగా అంచనాలతో ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం నూతన కాంట్రాక్టర్ను ఎంపిక చేయడానికి టెండర్లు పిలిచారు. భవ్యకే కాంట్రాక్ట్ కట్టబెట్టడం కోసం టెండర్ నిబంధనలన్నింటినీ మార్చేశారు. ఎంత తేడా? ఏపీ జెన్కో ఆధ్వర్యంలోని ఆస్పత్రుల నిర్వహణకు సంబంధించి భవ్యకు ప్రతి నెలా రూ.1.03 కోట్లను ఏపీజెన్కో చెల్లించాలి. ఇతర సంస్థలు నెలకు రూ.67 లక్షలు మాత్రమే అడిగాయి. అంతేకాకుండా స్పెషలిస్ట్ డాక్టర్ల సేవల కోసం రూ.8 వేలు, సూపర్ స్పెషలిస్ట్ డాక్లర్లు వస్తే రూ.12 వేలు, ఉద్యోగుల ఆరోగ్య తనిఖీల కోసం ఒక్కొక్కరికీ రూ.3,800 చొప్పున అదనంగా ఇవ్వాలి. ఇతర సంస్థలు రూ.1,700 ఇస్తే చాలన్నాయి. కానీ తక్కువ నిధులు కోట్ చేసిన సంస్థలను కాదని భవ్యకు రూ.100 కోట్ల కాంట్రాక్ట్ కట్టబెట్టేయడం దోపిడీకి పరాకాష్టగా నిలుస్తోంది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపాలెం మండలం మంగంపేటలోని ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) హెల్త్ సెంటర్ కాంట్రాక్టును కూడా ఇదే భవ్యకే అప్పగించేశారు. తద్వారా ఐదేళ్లకు రూ.11.70 కోట్లు దండుకోనుంది. నిబంధనల ఉల్లంఘన ఇలా. ➤108, 104 నిర్వహణతో పాటు ఎమర్జెన్సీ కాల్ సెంటర్ అంటూ లింక్ పెట్టి పెద్ద సంస్థలు పోటీకి రాకుండా చేశారు. ➤సంచార పశు వైద్య, ఆరోగ్య సేవా రథాలకు సంబంధించి గతంలో టెండర్లలో పాల్గొనే సంస్థల టర్నోవర్ 50 శాతం ఉండాలని నిబంధన ఉండేది. దీన్ని 17 శాతానికి తగ్గించేశారు. నెట్వర్త్ విలువ 35 శాతం నుంచి 11 శాతానికి కుదించారు. కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా ఎంఎస్ఎంఈలకు బిడ్ సెక్యురిటీ నుంచి మినహాయింపు ఇచ్చారు. ➤రాష్ట్రానికి చెందిన సంస్థలకు 5 మార్కులు, ఐదేళ్ల అనుభవం కలిగిన కంపెనీలకు మరో 5 మార్కులు, ప్రజంటేషన్కు 30 మార్కులు అంటూ భవ్యకు అనుకూలంగా నిబంధనలు మార్చేశారు.➤ఏపీ జెన్కో ఆధ్వర్యంలోని థర్మల్, జల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల్లో పనిచేసే ఉద్యోగులకు వైద్య సేవలు అందించే ఆస్పత్రుల నిర్వహణకు సంబంధించి రూ.వంద కోట్ల విలువ చేసే కాంట్రాక్ట్ కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏపీ జెన్కో టెండర్ పిలిచింది. ఒకే టెండర్లో హైడల్, థర్మల్కు వేర్వేరుగా బిడ్ దాఖలు చేయాలని పేర్కొంది. దీంతో పలు సంస్థలు టెండర్లు వేశాయి. కానీ ఆ టెండర్ నోటిఫికేషన్ను రద్దు చేశారు. మార్చిలో మరోసారి టెండర్లు పిలిచి వాటిని కూడా రద్దు చేశారు. మూడోసారి టెండర్ పిలిచి జూలైలో ప్రక్రియ పూర్తి చేశారు. ఈసారి టీడీపీలోని డాక్టర్ పవన్కు చెందిన భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కాంట్రాక్ట్ను దక్కించుకునేలా నిబంధనలు మార్చేశారు.➤మొదట రెండు సార్లు టెండర్లు పిలిచినప్పుడు నిర్వహణ చేపట్టే సంస్థకు ఆసుపత్రి ఉండాలని, వైద్య రంగంలో 15 ఏళ్ల అనుభవం ఉండాలని నిబంధన పెట్టారు. కానీ మూడోసారి అవేవీ లేవు. పైగా భవ్య కంటే తక్కువ ఖర్చుతో సేవలందిస్తామన్న యశోద హాస్పిటల్పై అనర్హత వేటు వేసి పక్కకు తప్పించారు. అందుకు విచిత్ర కారణం చెప్పారు. జెన్కో ఆసుపత్రుల నిర్వహణను చూసే సంస్థ ఏదైనా ఆసుపత్రితో ఒప్పందం చేసుకోవాలని నిబంధన పెట్టారు. సొంత సంపద వృద్ధి కోసం సంపద సృష్టిస్తాం.. పంచి పెడతాం.. అంటూ గద్దెనెక్కిన చంద్రబాబు సొంత సంపద సృష్టి కోసం నిరంతరం తపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలు పన్నుల రూపంలో కట్టిన సొమ్మును.. 108, 104 కాంట్రాక్ట్లలో వీలైనంత దోపిడీ చేయడానికి పూనుకున్నారు. ధరల పెరుగుదలను సాకుగా చూపి సంస్థకు చెల్లించే నిధులను ఏటా 3 శాతం పెంచి ఖజానాకు గండి కొడుతున్నారు. ఇదంతా ఆయన సొంత సంపద వృద్ధి కోసమేనని సోషల్ మీడియా వేదికగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వమే 104, 108 వాహనాల్లో ఔషధాలు, పరికరాలు, ఇతర అవసరమైన వాటిని అందిస్తుంది. ఎమర్జెన్సీ కాల్ సెంటర్ ఐటీ, ఇతర సదుపాయాల ఖర్చు తిరిగి చెల్లింపుతో పాటు సేవల్లో అలసత్వం చూపినా మూడు నెలల పాటు జరిమానాలు విధించకుండా ఉండేలా నిబంధనలు మార్చారు.మరోవైపు మొత్తం పెనాల్టి.. కేపిటల్ విలువ మీద 10 శాతానికి మించొద్దనే షరతు విధించారు. అత్యవసర సేవల్లో వేగం, పారదర్శకత, అలసత్వం కట్టడికి.. ప్రజలు, ప్రభుత్వానికి పకడ్బందీగా మేలు చేసేలా కాకుండా, కాంట్రాక్టర్కు లాభాలు వచి్చపడేలా ప్రభుత్వమే నిబంధనలు రూపొందించింది. తద్వారా మళ్లించిన నిధులన్నీ అస్మదీయ సంస్థ ద్వారా తమ చేతుల్లోకి వచ్చేలా ప్రభుత్వ పెద్దలు మార్గం ఏర్పాటు చేసుకున్నారని స్పష్టమవుతోంది. వైఎస్ జగన్ పాలనలో పారదర్శకత, పోటీనే ప్రామాణికం2019కి ముందు చంద్రబాబు ‘108’ వ్యవస్థను అస్తవ్యస్తంగా మార్చారు. ఆ తర్వాత అధికారంలోకి వచి్చన ఏడాదిలోనే వైఎస్ జగన్ మళ్లీ వాటిని బలోపేతం చేశారు. 2019 వరకు 336 వాహనాలతో అంబులెన్స్ సేవలు అరకొరగా ఉండేవి. అప్పట్లో 679 మండలాలు (ప్రస్తుతం 686) ఉంటే మండలానికి ఒకటి కూడా లేని దుస్థితి. వైఎస్ జగన్ సర్కారు ఏడాదిలోపే 412 అంబులెన్స్లు కొనుగోలు చేసింది. 2020 జూలై 1న వీటిని ప్రారంభించారు. 26 నవజాత శిశు (నియోనాటల్) అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. దీంతో ఒక్కసారిగా ప్రభుత్వ అంబులెన్సుల సంఖ్య 748కు చేరింది. ఇందుకు మొత్తం రూ.96.5 కోట్లు ఖర్చు చేశారు. 2022 అక్టోబర్లో రూ.4.76 కోట్లతో 20 కొత్త 108లను గిరిజన ప్రాంతాల్లో చేర్చారు. అలా 108ల సంఖ్య 768కి చేరింది. 2.5 లక్షల కిలోమీటర్లు పైగా తిరిగిన పాత వాహనాల స్థానంలో 146 కొత్త అంబులెన్సులనూ వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అత్యవసర సేవల బలోపేతం ద్వారా ఐదేళ్లలో 45 లక్షల మందికి వైఎస్ జగన్ అండగా నిలిచారు. నేరుగా ప్రభుత్వమే అత్యాధునిక వసతులతో కొత్త అంబులెన్స్లు, ఎంఎంయూలు కొనుగోలు చేశారు. తద్వారా ఏ రాష్ట్రంలోనూ లేని అతిపెద్ద అత్యవసర, సంచార వైద్య సేవల వ్యవస్థను ఏర్పాటు చేశారు.దేశంలోనే దిగ్గజ సంస్థలు టెండర్లలో పాల్గొనేలా నిబంధనలు పొందుపరిచి పోటీ పెంచారు. సేవల నిర్వహణకు పిలిచిన టెండర్లలోనూ అత్యంత పారదర్శక విధానాలు పాటించారు. అనేక వడపోతల అనంతరం చాలా తక్కువ ఫైనాన్షియల్ బిడ్ కోట్ చేసిన సంస్థకే కాంట్రాక్ట్ అప్పగించారు. సేవల్లో అలసత్వం వహించిన సందర్భాల్లో భారీగా పెనాల్టీలు విధించేలా నిబంధనలు పెట్టి నిర్వహణ సంస్థలో జవాబుదారీతనం పెంచారు. -
గుండెకు 'చలిపోటు'
సాక్షి, అమరావతి: చలికాలం అనారోగ్య సమస్యలకు పుట్టినిల్లు లాంటిది. వైరస్, బ్యాక్టీరియల్ జబ్బులతో పాటు గుండెజబ్బుల ముప్పు చలికాలంలో ఎక్కువని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో చలితీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ కాలంలో సాధారణ రోజుల్లో ఎదురయ్యే గుండెపోటు తీవ్రత కంటే ముప్పు 50 శాతం అధికంగా ముప్పు ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నవంబర్–ఫిబ్రవరి మధ్య గుండెపోటు ఘటనలు 15–20 శాతం అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని ఇండియన్ హార్ట్ అసోసియేషన్ హెచ్చరిస్తోంది. మిగిలిన రోజులతో పోలిస్తే చలి వాతావరణం రోజుల్లో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే స్వభావం 14–20 శాతం అధికంగా ఉంటుంది. ఈ సమస్య హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్లకు, గుండె వైఫల్యానికి కారణమవుతుంది. చలితీవ్రతకు శ్వాసనాళాలతో పాటు గుండెకు రక్తం సరఫరాచేసే రక్తనాళాలు కుంచించుకుపోతాయి. గుండె ఎక్కువగా శ్రమించాల్సి వచ్చి, అదనపు ఒత్తిడి పడుతుంది. ఈ సమస్య వయస్సు పైబడిన వారిలో ఎక్కువగా తలెత్తే అవకాశం ఉంటుంది. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు, ఊబకాయం, అనారోగ్యకరమైన జీవనశైలి ఉంటే 40 ఏళ్లలోపు వారిలోను గుండె ఎక్కువగా శ్రమించాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. దీంతో రక్తంలో కెటాకెలోమిన్స్ హార్మోన్ స్థాయి పెరిగి, రక్తనాళాల్లో అప్పటికే పూడికలు ఉంటే అక్కడ రక్తం గడ్డకట్టి గుండెపోటుకు దారితీస్తుందని శాస్త్రీయంగా నిర్ధారణ అయినట్టు వైద్యులు తెలిపారు. చలిని తట్టుకోవడం కోసం కొందరు అధికంగా ధూమపానం, మద్యపానం చేస్తుంటారు. ఇది గుండె వేగాన్ని, లయను నియంత్రించే నాడీవ్యవస్థపై దు్రష్పభావం చూపి గుండె లయ తప్పుతుంది. అత్యంత వేగంగా కొట్టుకుని హార్ట్ అరిథ్మియాకు దారితీస్తుంది.వీరు జాగ్రత్త » ఇప్పటికే గుండె జబ్బులున్నవారు » బీపీ, షుగర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు » ధూమపానం, మద్యపానం చేసేవారు » కుటుంబంలో గుండెజబ్బు చరిత్ర ఉన్నవారు » ఊబకాయం, నిత్యం ఒత్తిడితో బాధపడేవారు » రక్తంలో చెడు కొలె్రస్టాల్ ఎక్కువగా ఉన్నవారు ఈ లక్షణాలుంటే అశ్రద్ధ వద్దు » ఛాతీ మధ్య, పైభాగంలో నొప్పి » ఛాతీ పట్టేసినట్టు, బరువుగా అనిపించడం » శ్వాస తీసుకోవడం కష్టతరం కావడం » చలిలోను చెమటలు పట్టడంశరీరంలో నీటిశాతం తగ్గకుండా చూడాలిచలికాలం కాబట్టి సాధారణంగా అందరూ తక్కువగా నీరు తాగుతుంటారు. దీంతో శరీరంలో నీటిశాతం తగ్గిపోతూ ఉంటుంది. దీంతో రక్తం చిక్కబడుతుంది. ఈ క్రమంలో ఇప్పటికే రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోయిన వ్యక్తుల్లో రక్తం చిక్కబడి క్లాట్లు వస్తాయి. చలికి రక్తనాళాలు సైతం కుంచించుకుపోయే అవకాశం ఉండటంతో గుండె పోటు సంభవించే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు శరీరంలో నీటిశాతం తగ్గకుండా జాగ్రత్తపడాలి. జీవనశైలి మార్చుకోవాలని కొందరు కొత్తగా వ్యాయామాలు ప్రారంభిస్తుంటారు. అలాంటివారు తొలుత వైద్యులను సంప్రదించి జాగ్రత్తలు తెలుసుకోవాలి. తేలికపాటి వ్యాయామాలు చేయాలి. దీర్ఘకాలిక అలర్జీలు, ఆస్తమా వంటి సమస్యలున్నవారు శీతలపానీయాలు, ఐస్క్రీమ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. – డాక్టర్ ప్రభాకర్రెడ్డి, విభాగాధిపతి, కార్డియో వాసు్క్యలర్ సర్జరీ, కర్నూలు జీజీహెచ్ -
ఈనెల 17న గవర్నర్తో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో 10 కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమం, కోటి సంతకాల సేకరణపై రాష్ట్ర గవర్నర్ అబ్ధుల్ నజీర్కు నివేదించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 17న ఆయనతో భేటీ కానున్నారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు పార్టీ ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులతో కలిసి వైఎస్ జగన్.. గవర్నర్ను కలవనున్నారు.ఈ మేరకు గవర్నర్ స్పెషల్ సీఎస్ నుంచి వైఎస్సార్సీపీకి లేఖ అందింది. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజాభిప్రాయాన్ని గవర్నర్కు నివేదించడంతో పాటు, పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను కూడా గవర్నర్కు చూపించనున్నారు. ఆ మేరకు 26 జిల్లాల నుంచి ఆ పత్రాలను ప్రత్యేక వాహనాల్లో విజయవాడకు తరలిస్తున్నారు. -
ఇండిగో సంక్షోభంపై పరువు పోగొట్టుకున్న టీడీపీ
సాక్షి, అమరావతి: ఇండిగో సంక్షోభంపై టీడీపీ పరువు పోగొట్టుకుంది. లోకేష్ రివ్యూ చేస్తున్నారంటూ.. జాతీయ మీడియాలో టీడీపీ అధికార ప్రతినిధి అతి చేశారు. అసలు నారా లోకేష్ ఎవరన్న అర్నబ్ గోస్వామి.. విమానయాన శాఖకు, లోకేష్కు సంబంధమేంటి? అంటూ ప్రశ్నించారు. ‘‘ఏ హోదాలో లోకేష్ పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. ఇది పౌర విమానయాన శాఖ.. లేక టీడీపీ శాఖ?’ అంటూ అర్నబ్ మండిపడ్డారు. అర్నబ్ గోస్వామి ప్రశ్నలకు టీడీపీ నేత నీళ్లు నమిలారు.విమాన ప్రయాణికుల కష్టాలు తీర్చడంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఫెయిల్ అయ్యారంటూ ప్రయాణికులు మండిపడుతున్నారు. ఇండిగో సంక్షోభాన్ని ఇతర ఎయిర్ లైన్స్ సొమ్ము చేసుకుంటున్నా రామ్మోహన్ పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇండిగో సంక్షోభానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని సోషల్ మీడియాలో ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.ఇండిగో సంక్షోభాన్ని నారా లోకేష్ చక్కదిద్దుతున్నారని చెప్పుకుంటున్న టీడీపీ అధికార ప్రతినిధిని నారా లోకేష్కు ఏం సంబంధం అంటూ జాతీయ మీడియా చివాట్లు పెట్టింది. సంక్షోభాన్ని కూడా నారా లోకేష్ క్రెడిట్ కోసం వాడుకుంటున్నారంటూ నెటిజన్ల మండిపడుతున్నారు. ఇండిగో సంక్షోభ నివారణకు రామ్మోహన్ నాయుడు తూతు మంత్రంగా చర్యలు చేపట్టారు. సమీక్షలు, ప్రకటనలతోనే సరిపెట్టారు.ఎఫ్డీటీఎల్ నిబంధనల అమలు పరచడంలో తీవ్ర వైఫల్యం చెందారు. సేఫ్టీ నిబంధనలను క్షేత్రస్థాయిలో అమలును పట్టించుకోని రామ్మోహన్.. లక్షలాదిమంది ప్రయాణికులు ఆందోళనలకు దిగడంతో ఇండిగో పై చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. ఈ సంక్షోభాన్ని ముందుగానే పసిగట్టి దానికి తగిన విధంగా చర్యలు చేపట్టడంలో రామ్మోహన్నాయుడు విఫలయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. -
అమరావతి రెండవ విడత భూ సమీకరణపై మండిపడ్డ టీడీపీ నేత
సాక్షి, అమరావతి: రెండవ విడత భూ సమీకరణ పై నేడు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అభివృద్ధి వికేంద్రీకరణ చర్చా వేదిక ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి,టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు, రిటైర్డ్ ఫ్రొఫెసర్ - డా.సి.రామచంద్రయ్య, రాష్ట్ర అభివృద్ధి కమిటీ సామాజిక కార్యకర్త వసుంధర, అమరావతి రైతు బుచ్చి తిరుపతిరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సి.హెచ్.బాబురావు, వివిధ ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు.వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. లోగడ భూములు ఇచ్చిన రైతులకు నేటికీ న్యాయం జరగలేదు. మళ్లీ రెండో విడత భూ సమీకరణ పేరుతో భూములు తీసుకోవడం సరికాదు. అమరావతి రైతుల పై పెట్టిన కేసులు ఇంకా ఎందుకు తీసేయలేదు. చంద్రబాబు పగటి కలల కోసం కోట్లాది మంది ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదు. 24 ప్లాట్ ఫామ్లతో రైల్వేస్టేషన్ కడతానంటున్నాడు. రెండు లక్షలు జనాభా కూడా లేని అమరావతికి అంత పెద్ద రైల్వేస్టేషన్ అవసరమా. 5వేల ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు కడతానంటున్నారు. 2500 ఎకరాల్లో స్పోర్ట్ సిటీ కడతానంటున్నారు. అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత చంద్రబాబుకి లేదా? చంద్రబాబు ఆలోచనలు చూస్తుంటే అమరావతి వ్యయం ఎక్కడికి వెళుతుందో అనే భయం కలుగుతోంది. ఐకానిక్ బ్రిడ్జిల పేరుతో హంగామా చేస్తున్నాడు. బ్రిడ్జిల నిర్మాణం అంటే పంట కాలువల పై చెక్క వంతెనలు కట్టినంత సులభం అనుకుంటున్నాడు. మన జనాభా ఎంత...అప్పుడు అవుటర్ రింగ్ రోడ్డు అవసరమా అంటూ ఆయన చంద్రబాబుపై మండిపడ్డాడు. -
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నేడు డా.బీఆర్ అంబేద్కర్ 70వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. అంబేద్కర్ చిత్రపటానికి పలువురు పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కాగా ఈ కార్యక్రమానికి కార్యాలయ ఇన్ఛార్జి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, నందమూరి లక్ష్మీ పార్వతి, మేరుగ నాగార్జున, జూపూడి ప్రభాకర్, దొంతిరెడ్డి వేమారెడ్డి, రాజశేఖర్ తదితరులు హాజరైయ్యారు.అంబటి రాంబాబు, మాజీమంత్రి కామెంట్స్..భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్ అంబేద్కర్ 69 వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘన నివాళులు అర్పిస్తున్నాం.బడుగు, బలహీనవర్గాలకు భారతదేశంలో రక్షణ కల్పించిన మహానీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. బలహీన వర్గాల రిజర్వేషన్ కోసం అంబేద్కర్ చేసిన పోరాటం మరువలేనిది. పేద వర్గాలు కొంతమేర అభ్యున్నతి సాధించారంటే అది అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే. అంబేద్కర్ లాంటి మేధావి భారతదేశంలో పుట్టడం గర్వకారణం. అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్.భారత జాతి ఉన్నంతకాలం అంబేద్కర్ ను గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది.విజయవాడ నగరం నడిబొడ్డున దేశంలోనే ఎక్కడ లేని విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ స్మృతి వనం అశ్రద్ధకు గురవుతోంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న అంబేద్కర్ వ్యతిరేక విధానాలను అంబేద్కర్ వాదులు, ప్రజాస్వామ్యవాదులు ముక్తకంఠంతో ఖండించాలి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అంబేద్కర్ లాంటి మహనీయుడిని గౌరవించాల్సిందే.ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు వైసిపి కార్యాలయంలో డా.బిఆర్ అంబేద్కర్ 70వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మండల,పట్టణ పార్టీ అధ్యక్షులు తాళ్లూరి నవీన్ కుమార్,చలమాల సత్యనారాయణ.అనంతపురం: గుంతకల్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ లో అంబేద్కర్ వర్థంతి సందర్బంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పార్టీ నాయకులు. పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ భవాని, వైస్ చైర్ పర్సన్ నైరుతి రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి.కళ్యాణదుర్గం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజి ఎంపి కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య.ఏలూరు జిల్లా: చింతలపూడి మండలం చింతలపూడి లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన నియోజకవర్గ ఇంచార్జి కంభం విజయరాజు, మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జెట్టి గురునాధరావు మరియు పలువురు వైసీపీ శ్రేణులు.విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా వైసిపి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం. పాల్గొన్న న్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు అవుతు శైలజ,బెల్లందుర్గ , మాజీ ఏపీఐడిసి ఛైర్మన్ బండి పుణ్యశీల, వైసిపి సోషల్ మీడియా విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి, కార్పొరేటర్లు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వైసీపీ నేతలు.బాపట్ల జిల్లా: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగ రైల్వేస్టేషన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బాపట్ల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెసు పార్టీ సమన్వయకర్త మాజీ డైప్యూటీ స్పీకర్ కోన రఘుపతి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ప్రకాశం: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69 వ వర్దంతి సంధర్బంగా ఒంగోలు వైయస్సార్సీపి పార్టీ ఆఫీస్ లో అంబేద్కర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన ఒంగోలు వైయస్సార్సీపి ఇంచార్జ్ చుండూరి రవి బాబు, జిల్లా పార్టీ పరిశీలకులు బత్తుల బ్రహ్మనందరెడ్ది.పల్నాడు: నరసరావుపేట గడియార స్తంభం సెంటర్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిచిలకలూరిపేట పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69 వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు.గుంటూరు: మంగళగిరిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెసు పార్టీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి పార్టీ, నాయకులు కార్యకర్తలు -
టీడీపీ సభల్లా పేరెంట్–టీచర్స్ సమావేశాలు
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: పాఠశాలలు, విద్యార్థులు, విద్యా సమస్యల పరిష్కారం కోసం జరగాల్సిన మెగా పేరెంట్–టీచర్స్ సమావేశాలు టీడీపీ సభల్లా మారాయి. రాజకీయ ప్రసంగాలకు, ముఖ్యమంత్రి, ఆయన తనయుడు మంత్రి లోకేశ్పై పొగడ్తలకు పరిమితమయ్యాయి. విద్యార్థుల తల్లిదండ్రులకు తొలి ప్రాధాన్యంతో పాటు మాట్లాడే అవకాశమివ్వాల్సిన చోట రాజకీయ నాయకులే అంతా ముందుండి నడిపించారు. మెగా పీటీఎం పేరుతో శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లోనూ ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని భామిని ఏపీ మోడల్ స్కూల్ ప్రాంగణంలో జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో చేపట్టిన మనబడి నాడు–నేడు పనుల్లో భాగంగా అందించిన డబుల్ డెస్క్ బెంచీలకు ‘లీప్’ స్టిక్కర్లు అతికించారు. వాటిపైనే కూర్చుని సీఎం విద్యార్థులతో మాట్లాడారు. అన్ని చోట్లా కేవలం రాజకీయ ప్రసంగాలు, లోకేశ్ను మార్కెట్ చేయడమే ప్రధానంగా సమావేశాలే సాగాయి. గుంటూరు పట్టణంలో జరిగిన పీటీఎంలో వేదిక పైనా, కిందా టీడీపీ నాయకులే ఆక్రమించారు. విద్యార్థుల తల్లిదండ్రులు నిలబడాల్సి వచ్చింది. గుంటూరు ఏటీ అగ్రహారంలోని ఎస్కేబీఎం నగరపాలకసంస్థ ఉన్నత పాఠశాల పీటీఎంలో పిల్లలు అల్లరి చేస్తున్నారని బూటుకాళ్లతో తన్నిన గణితశాస్త్ర ఉపాధ్యాయుడు ఎంపీ సుబ్బారావును డీఈవో సస్పెండ్ చేశారు. కడపలోని గాం«దీనగర్ మున్సిపల్ హైసూ్కల్లో తల్లిదండ్రుల కోసం వేసిన కురీ్చల్లో టీడీపీ నేతలు కూర్చున్నారు.పాఠశాలకు తాళం వేసిన తల్లిదండ్రులు వైఎస్సార్ కడప జిల్లా కాశినాయనమండలంలోని నాయునిపల్లి ఎంపీపీ పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ నాగమునెమ్మ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు శుక్రవారం తాళాలు వేసి నిరసన తెలిపారు. ఒకే ఉపాధ్యాయిని ఉండటంతో విద్య బోధన ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లాలో చాలా చోట్ల తల్లిదండ్రులు రాకపోవడంతో టీడీపీ నేతలు బలవంతంగా పిలిపించారు. తిరుపతి జిల్లాలోని ప్రధాన పట్టణాల్లోని ప్రభుత్వ పాఠశాలలు టీడీపీ కార్యాలయాలుగా మారిపోయాయి. తల్లిదండ్రుల కంటే టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలే పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. చాలా చోట్ల 30 శాతం మంది తల్లిదండ్రులు కూడా పాల్గొనలేదు. పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లోనూ ఇదే రీతిలో సమావేశాలు కొనసాగాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం లగిసపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో టీడీపీ రాక ఆలస్యం కావడంతో హిందుపురం టీడీపీ ఎమెల్యే, సినీ నటుడు బాలకృష్ణ నటించిన అఖండ సినిమాను ప్రదర్శించారు. భోజనం బాగోలేదంటూ ఆగ్రహం కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి ప్రభుత్వ పాఠశాలలో, అనకాపల్లి జిల్లా మునగపాక మండలం వాడ్రాపల్లి జిల్లా పరిషత్ హైసూ్కల్లో మధ్యాహ్న భోజనం బాగోలేదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజూ మధ్యాహ్న భోజనం బాగుండటం లేదని, దీంతో పిల్లలు ఇళ్లకు వచ్చేస్తున్నారని చెప్పారు. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం చింతలపూడి పంచాయతీ గింజర్తి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆదర్శ పాఠశాలగా మార్చక పోవడాన్ని నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు మెగా పేరెంట్–టీచర్స్ సమావేశాన్ని బహిష్కరించారు. పాఠశాల గేటు మూసివేసి బయటే ఉండిపోయారు. -
ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేయడం సరికాదు
సాక్షి, అమరావతి: జీవిత భాగస్వామి పనిచేస్తున్న చోటే పోస్టింగ్ తీసుకుంటున్న కొందరు ప్రభుత్వ ఉద్యోగులు జీవితాంతం ఒక్క చోటే విధులు నిర్వర్తిస్తుండటంపై హైకోర్టు ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. అలాగే ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ఆయా సంఘాల్లో తమ తమ హోదాలను సాకుగా చూపుతూ ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేస్తున్నారని, ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఇలా కొందరు ఉద్యోగులు ఒకే చోట ఏళ్ల తరబడి పనిచేస్తూ ఆ స్థానాలకు రావాలనుకుంటున్న ఇతర ఉద్యోగులకు అడ్డంపడి పోతున్నారని తెలిపింది. ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరుపుతామని తేల్చి చెప్పింది. ఈ రెండు కేటగిరిలకు మినహాయింపుల వెనుక ఉన్న హేతుబద్ధత ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇందుకు సంబంధించి నిబంధనలు, మార్గదర్శకాల వివరాలు తెలియచేయాలని శుక్రవారం ప్రభుత్వాన్ని ఆదేశించిన న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ ధర్మాసనం.. తదుపరి విచారణను జనవరి మొదటి వారానికి వాయిదా వేసింది. హైకోర్టుకు చేరిన ఇద్దరు అధికారుల మధ్య వివాదం...విజయనగరం జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ (జెడ్ఎస్డబ్యూఓ)గా పనిచేస్తున్న మజ్జి కృష్ణారావును తూర్పు గోదావరి జిల్లా, కాకినాడకు బదిలీ చేశారు. కృష్ణారావు స్థానంలో కేవీఎస్ ప్రసాదరావును విజయనగరం జెడ్ఎస్డబ్యూఓగా నియమించారు. కృష్ణారావు కాకినాడలో బాధ్యతలు చేపట్టకుండా విజయనగరంలోనే ఉండటంతో వివాదం మొదలైంది. పైగా ఈ బదిలీపై హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి... పిటిషనర్ కృష్ణారావును విజయనగరంలో కొనసాగించే విషయంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన సంబంధిత ప్రొసీడింగ్స్ అమలుకు చర్యలు తీసుకోవాలని సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రసాదరావు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. -
వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్లో కేంద్రం వెసులుబాటు
సాక్షి, అమరావతి: ఉమీద్ పోర్టల్లో వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్కు సంబంధించి కేంద్రం భారీ ఊరటనిచ్చింది. రిజిస్ట్రేషన్ చేయని వారిపై వచ్చే మూడు నెలలు ఎటువంటి జరిమానాలు, కఠిన చర్యలు ఉండబోవని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు హామీ ఇచ్చారు. గడువు సడలింపు తర్వాత కూడా ప్రక్రియ పూర్తి చేయలేని పరిస్థితిలో ముతవల్లీలు వక్ఫ్ ట్రైబ్యునల్ను ఆశ్రయించాలని మంత్రి సూచించారు.రిజిస్ట్రేషన్కు డిసెంబర్ 5తో ముగుస్తున్న 6 నెలల గడువు పొడిగింపునకు ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టం చేసిన విషయాన్ని మంత్రి ప్రస్తావిస్తూ, అయితే నమోదులో ఏదైనా సమస్యలు ఉంటే వక్ఫ్ ట్రైబ్యునల్కు మరొక ఆరు నెలల వరకు గడువు ఇవ్వడానికి అధికారం ఉందని చెప్పారు. ఇప్పటివరకు ఉమీద్ పోర్టల్లో ఒక లక్ష 51 వేలకుపైగా వక్ఫ్ ఆస్తులు నమోదయ్యాయని మంత్రి వెల్లడించారు. దేశంలో దాదాపు 9 లక్షల ఎకరాలకుపైగా వక్ఫ్ ఆస్తులు ఉన్న సంగతి గమనార్హం. అయితే సాంకేతిక సమస్యల కారణంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికాని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో పరిస్థితి ఇదీ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 4,748 వక్ఫ్ ఆస్తులు (రిజిస్టర్డ్ ప్రోపర్టీలు), పదివేలకు పైగా అన్ రిజిస్టర్డ్ ఆస్తులు ఉన్నాయి. ఇప్పటికే వక్ఫ్ సంస్థల ముతవల్లీలు, నిర్వాహకుల (మేకర్) స్థాయిలో దాదాపుగా అన్ని రిజిస్టర్ ఆస్తులు అప్లోడ్ చేసినట్టు చెబుతున్నారు. వాటికి చెకర్ (వక్ఫ్బోర్డు ఇన్స్పెక్టర్) పరిశీలన తర్వాత అప్రూవర్ (వక్ఫ్బోర్డు సీఈఓ) ఆమోదం తెలపాల్సి ఉంది. సర్వర్ డౌన్ సమస్యతో ఈ ప్రక్రియ పెండింగ్లో పడిపోయింది. ఇప్పుడు కేంద్రం ఇచ్చిన మూడు నెలల గడువులో ఈ ప్రక్రియ అంతా ‘ఎటువంటి జరిమానాలు లేకుండా’ పూర్తయ్యే వెసులుబాటు ఉంటుందని వక్ఫ్ అధికారులు చెబుతున్నారు. అటు తర్వాత మిగిలిన పదివేలకుపైగా అన్ రిజిస్టర్డ్ వక్ఫ్ ఆస్తులు క్రమంగా ఆన్లైన్ చేసుకోవచ్చని పేర్కొంటున్నారు. -
హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా జస్టిస్ రవినాథ్ తిల్హరీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరీ నామినేట్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. హైకోర్టులో సీనియారిటీలో 3వ స్థానంలో ఉన్న న్యాయమూర్తి హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా వ్యవహరించడం సంప్రదాయంగా వస్తోంది.లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ పోస్టుకు జస్టిస్ తిల్హరీని ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నామినేట్ చేశారు. ఇప్పటి వరకు ఆ స్థానంలో జస్టిస్ రావు రఘునందన్రావు ఉన్నారు. -
భారీగా పెరిగిన విమాన టికెట్ ధరలు
హైదరాబాద్ నుంచి కోల్కతకు రూ. 69 వేలు.. ఢిల్లీ నుంచి విజయవాడకు రూ. 67 వేలు.. హైదరాబాద్–శ్రీనగర్కు సుమారు రూ. 60 వేలు.. విశాఖ నుంచి ముంబైకి సుమారు రూ. 56 వేలు.. ఢిల్లీ టు హైదరాబాద్ రూ. 50 వేలు... తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల నుంచి దేశంలోని వివిధ నగరాలకు శుక్రవారం వివిధ విమానయాన సంస్థలు విక్రయించిన ఒక్కో ఎకానమీ క్లాస్ విమాన టికెట్ ధర ఇది. అవే విమానయాన సంస్థల వెబ్సైట్లలో శుక్రవారం హైదరాబాద్ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా అమెరికాలోని న్యూయార్క్కు టికెట్ ధర కనిష్టంగా రూ. 50 వేలలోపే అందుబాటులో ఉంది. అలాగే విశాఖ నుంచి సింగపూర్కు ఆదివారం రోజున టికెట్ రూ. 17,309కే లభిస్తోంది.శంషాబాద్/సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, విశాఖపట్నం/విమానాశ్రయం (గన్నవరం)/రేణిగుంట: పైలట్ల కొరత, నిర్వహణ సమస్యలతో ఇండిగో ఎయిర్లైన్స్ (IndiGo Airlines) శుక్రవారం దేశవ్యాప్తంగా ఏకంగా వెయ్యికిపైగా సర్వీసులను రద్దు చేయడంతో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నుంచి దేశంలోని ప్రధాన నగరాల మధ్య రాకపోకలు సాగించే మిగతా ఎయిర్లైన్స్ సంస్థలు టికెట్ ధరలను అసాధారణ రీతిలో పెంచేశాయి. సాధారణ రోజుల్లో వసూలు చేసే చార్జీలతో పోలిస్తే కొన్ని రెట్లు అధికంగా వసూలు చేశాయి. దీంతో కొన్ని దేశీయ సర్వీసుల చార్జీలు విదేశీ టికెట్ చార్జీలను సైతం మించిపోయి ప్రయాణికుల జేబులను గుల్లచేశాయి. దేశీయ విమాన చార్జీలు సైతం అమెరికా వెళ్లాల్సిన చార్జీలకన్నా భారీగా ఉండటంతో విమాన ప్రయాణికులు తప్పనిసరైన ప్రయాణాలను మాత్రమే ఎంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇండిగో విమాన సర్వీసుల రద్దుతో 24 గంటల నుంచి 48 గంటల ముందు టికెట్లు బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు మాత్రం ఈ అధిక ధరలు చెల్లించాల్సిన దుస్థితి తలెత్తింది. మరో రెండు నుంచి మూడు రోజులు మాత్రమే టికెట్ ధరలు అధికంగా చూపిస్తున్న ఎయిర్లైన్స్ సంస్థలు.. ఆ తర్వాత సాధారణ చార్జీలనే చూపిస్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రేట్లు మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులకు తప్పని చిక్కులు.. పార్లమెంట్ సమావేశాల కారణంగా తెలుగు రాష్ట్రాల ఎంపీలు ఢిల్లీలో ఉండగా వివిధ పనుల నిమిత్తం ఢిల్లీకి చేరుకున్న వివిధ పార్టీల నేతలు, వారి అనుచరగణం ఇండిగో విమాన సర్వీసుల రద్దు, ఆలస్యంతో ఇక్కట్లు పడుతున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, చెన్నై, బెంగళూరు, కొచ్చి, అహ్మదాబాద్, పటా్న, కోల్కతా, ముంబై వంటి నగరాలకు వెళ్లే విమాన సర్వీసులేవీ నేరుగా అందుబాటులో లేవు. మధ్యలో ఒకటి, రెండు స్టాప్లతో నడిచే వాటినే ఇతర విమానయాన సంస్థలు అందుబాటులో ఉంచుతున్నాయి. ఒక స్టాప్ లేదా రెండు స్టాప్లతో హైదరాబాద్ వెళ్లే విమానాల టికెట్ రేట్లకు పరిమితి లేకుండా పోయింది. కొన్ని విమానాలు రూ. లక్షకుపైగా టికెట్ ధర పెట్టడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఇక హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లే ప్రయాణికులు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. రూ. 40 వేలకు పైగా టికెట్ ధర ఉండటంతో ప్రయాణికులు అక్కడే నిరీక్షిస్తున్న ఉదంతాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. శంషాబాద్కు 84 డిపార్చర్, 71 అరైవల్ విమానాల రద్దు వివిధ గమ్యస్థానాల నుంచి హైదరాబాద్కు రావాల్సిన 71 ఇండిగో ఎయిర్లైన్స్ సర్వీసులను సంస్థ శుక్రవారం రద్దు చేసింది. అలాగే హైదరాబాద్ నుంచి బయలుదేరాల్సిన 84 ఇండిగో విమానాలు కూడా రద్దయ్యాయి. మరికొన్ని ఇండిగో విమాన సర్వీసులు గంటల కొద్దీ ఆలస్యంగా నడుస్తున్నాయి. శుక్రవారం శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్పోర్టులో ప్రయాణికులు ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మరోవైపు విశాఖ నుంచి శుక్రవారం 15 ఇండిగో విమాన సర్వీసులు, విజయవాడ నుంచి రెండు సర్వీసులు రద్దయ్యాయి. మరోవైపు.. శుక్రవారం దుబాయ్ ఈకే–526 విమానాన్ని బాంబులతో పేల్చివేయనున్నట్లు శంషాబాద్ ఎయిర్పోర్టుకు మెయిల్ రావడంతో తనిఖీలు చేశారు. -
క్రెడిట్ చోరీ.. బాబు బాటలో పవన్
సాక్షి, అమరావతి: ఎగవేతలు... అడ్డగోలు కోతలు తప్ప ఏడాదిన్నర నుంచి చేసిన మంచి పని ఒక్కటీ లేదు..! చెప్పుకోవడానికి ఏమీ లేదు..! దీంతో చంద్రబాబు సర్కారు గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల క్రెడిట్ చోరీకి పాల్పడుతోంది...! వైఎస్సార్సీపీ హయాంలో విప్లవాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాలను యథేచ్ఛగా తన ఖాతాలో వేసుకుంటోంది..! వైఎస్ జగన్ వినూత్న ఆలోచనలను చంద్రబాబు ప్రభుత్వం అటుఇటు మార్చి తమ గొప్పలుగా చెప్పుకుంటోంది. వేగంగా జరుగుతున్న ఈ క్రెడిట్ చోరీలో సీఎం చంద్రబాబు దారిలోనే ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ వెళ్తున్నారు. పవన్ గురువారం 77 డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాలను (డీడీవో) ప్రారంభిస్తూ, అవి తన ఆలోచన నుంచి పుట్టాయంటూ ప్రకటించుకున్నారు. కానీ, వాస్తవం మాత్రం వేరు. మచిలీపట్నం మండలం పోతేపల్లి గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన మచిలీపట్నం డివిజనల్ డెవలప్మెంట్ ఆపీసు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో గ్రామ సచివాలయ భవనంలో ప్రారంభించిన డీడీవో కార్యాలయం దశాబ్దాల ఎదురుచూపులకు తెరదించిపంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో 1987లో మండల వ్యవస్థను తీసుకురాగా... కీలకమైన ఎంపీడీవోలకు 33 ఏళ్ల పాటు పదోన్నతులు లేవు. ఈ పరిస్థితుల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంపీడీవోలకు పదోన్నతులు కల్పించేందుకు నిర్ణయించింది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి డివిజనల్ డెవలప్మెంట్ అధికారి వ్యవస్థను తెచ్చారు. అప్పటివరకు ఎంపీడీవోలు వేర్వేరు సంఘాలుగా వేరుపడి సీనియారిటీ జాబితాపై వాళ్లలో వాళ్లే కోర్టుల్లో కేసులు వేసుకుంటూ గొడవలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం చొరవ చూపి... గ్రామ, వార్డు సచివాలయాలతో సమన్వయం చేసుకునేలా డివిజనల్ డెవలప్మెంట్ అధికారి పోస్టులను ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఒకేసారి పెద్ద సంఖ్యలో ఎంపీడీవోలకు పదోన్నతులు కల్పించింది. అలా రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ డివిజన్లో ఐదేళ్ల కిత్రం 2020 సెప్టెంబరులో ‘డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాల’ను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఈ కార్యాలయాల్లో సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ తదితర సిబ్బందితో ఏడుగురు చొప్పున నియామకానికి వైఎస్ జగన్ ప్రభుత్వం 2020 సెప్టెంబరు 30న జీవో నంబరు 674ను జారీ చేసింది. దీంతోపాటు కార్యాలయాల్లో కంప్యూటర్లు, ప్రింటర్లు, ఫర్నీచర్ కొనుగోలుతో పాటు అద్దెకు కారు వాడుకునేలా, ఇతర నిర్వహణ ఖర్చులకు సైతం నిధులు కేటాయించింది. తద్వారా పెద్దఎత్తున ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఊరూవాడా అందరికీ అందేలా కృషి చేసింది. సుదీర్ఘ కాలం ఎదురుచూపులకు తెరపడుతూ డీడీవోలుగా పదోన్నతి పొందిన ఉత్సాహంతో అధికారులు సైతం సిబ్బందితో సమన్వయంతో పనిచేస్తూ లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించారు.అక్షరం మార్చేసి అదే కొత్తగా ప్రచారంఉప ముఖ్యమంత్రి పవన్ సొంత ఆలోచనగా ప్రకటించుకున్న డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాలు (డీడీవో) ఐదేళ్లుగా రాష్ట్రమంతా పనిచేస్తూనే ఉన్నాయి. కానీ, కొత్తవి అన్నట్లుగా చెప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. డీడీవోలను వైఎస్ జగన్ ప్రభుత్వంలో సంక్షిప్తంగా డీఎల్డీవోలుగా పిలిచేవారు. ఎంపీడీవోల నుంచి పదోన్నతి పొందిన నేపథ్యంలో డివిజనల్ డెవలప్మెంట్ అధికారి హోదాను డీఎల్డీవోగా కొనసాగించారు. కాగా, బాబు సర్కారు ప్రస్తుతం డివిజనల్ డెవలప్మెంట్ అధికారి హోదాలో డివిజనల్ అన్న పదానికి సంక్షిప్తంగా ‘డీఎల్’కు బదులు కేవలం ‘డీ’ని మాత్రమే పేర్కొంటూ... డీఎల్డీవోను డీడీవోగా మార్చింది. గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో రెవెన్యూ డివిజన్ స్థాయిలో డివిజనల్ పంచాయతీరాజ్ అధికారి (డీఎల్పీవో), డ్వామా (ఉపాధి హామీ పథకం) ఏపీడీ కార్యాలయం, డివిజనల్ డెవలప్మెంట్ అధికారి (డీఎల్డీవో) కార్యాలయాలు వేర్వేరుచోట్ల పనిచేశాయి. బాబు ప్రభుత్వం డీఎల్పీవోతో పాటు ఉపాధి హామీ ఏపీడీ కార్యాలయాలను కూడా డీడీవో కార్యాలయంలోనే కొనసాగించేందుకు నిర్ణయించింది. ఒకేచోట ఉన్నప్పటికీ, డీడీవో కార్యాలయాల్లో డీడీవో పర్యవేక్షణలో డీఎల్పీవోలు, ఉపాధి హామీ ఏపీడీలు వేర్వేరుగా పనిచేస్తారని పంచాయతీరాజ్ అధికారులు పేర్కొంటున్నారు.గ్రామ సచివాలయాల్లోనేఈ కార్యాలయాలుడిప్యూటీ సీఎం పవన్ ప్రారంభించిన డీడీవో కార్యాలయాలు కూడా కూటమి ప్రభుత్వం నిర్మించినవి కాకపోవడం గమనార్హం. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతి ఊరిలో రెండంతస్తులతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాలను డీడీవో కార్యాలయాలకు వాడుకుంటున్నట్లు పంచాయతీరాజ్ అధికారులు చెబుతున్నారు. చాలాచోట్ల కింది అంతస్తులో గ్రామ సచివాలయం ఉండగా, పైఅంతస్తును డీడీవో కార్యాలయాలకు కేటాయించారు. -
రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితేంటి?
సాక్షి, అమరావతి: బోధనా సిబ్బంది పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయకుండా ఎప్పటికప్పుడు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, తాత్కాలిక పద్దతుల్లో భర్తీ చేస్తుంటే రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఏమిటని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. తాత్కాలిక పోస్టులతో యువతను దోచుకుంటున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. అసంబద్ధ నిర్ణయాలతో విద్యా సంస్థలను అడ్డా కూలీల కేంద్రాలుగా మార్చేస్తున్నారంటూ మండిపడింది. నాణ్యమైన విద్యను పొందడం విద్యార్థుల హక్కు అని తేల్చి చెప్పింది. విధాన నిర్ణయం పేరు చెప్పి ఆ హక్కులను కాలరాయలేరని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ముఖ్యంగా విశ్వవిద్యాలయాలను నాశనం చేస్తుంటే మౌనంగా ఉండలేమని హైకోర్టు స్పష్టం చేసింది. పోస్టుల భర్తీ ప్రభుత్వ విధాన నిర్ణయమని, అందులో కోర్టు జోక్యం తగదని ఈ సందర్భంగా యూనివర్సిటీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ చేసిన వాదనలతో ధర్మాసనం ఏకీభవించలేదు. తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసే నిమిత్తం.. లేని పోస్టులను ఎలా సృష్టిస్తారని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. పోస్టే లేకుంటే దానిని తాత్కాలికంగా భర్తీ చేయడమన్న ప్రశ్నే ఉత్పన్నం కాదంది. శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీయూ)లోని పలు విభాగాల్లో 2025–26 విద్యా సంవత్సరానికి తాత్కాలిక ప్రాతిపదికన అకడమిక్ కన్సల్టెంట్ల నియామకం కోసం యూనివర్సిటీ రిజి్రస్టార్ అక్టోబర్ 31న జారీ చేసిన నోటిఫికేషన్ అమలును ఈ సందర్భంగా నిలిపివేసింది. దీనికి అనుమతినిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ఎస్వీయూ రిజిస్ట్రార్లను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పీల్ నేపథ్యం ఇదీ.. ⇒ ఎస్వీయూ అక్టోబర్ 31 నోటిఫికేషన్ రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్లో అకడమిక్ కన్సల్టెంట్లుగా పనిచేస్తున్న డాక్టర్ కె.కిషోర్ కుమార్రెడ్డి, డాక్టర్ ఎస్.శివశంకర్, మరో ప్రైవేటు ఉద్యోగి రెడ్డివారి అర్జున్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ⇒ ఈ పిటిషన్పై జోక్యానికి గత నెల 26న సింగిల్ జడ్జి బెంచ్ నిరాకరించింది. ⇒ దీనిపై హైకోర్టు ధర్మాసనం వద్ద అప్పీల్ దాఖలైంది ⇒ అప్పీల్దారుల తరఫు న్యాయవాది మునకల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ.. అన్నీ అర్హతలున్నా ప్రస్తుత నియామకాలకు సంబంధించి పిటిషనర్లను అసలు పరిగణనలోకే తీసుకోవడం లేదని ధర్మాసనానికి విన్నవించారు. -
కొనసాగుతున్న కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు
విజయవాడ: వైఎస్సార్సీపీ శ్రేణులపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. రెండు నెలల క్రితం జరిగిన ఘటనపై తాజాగా కేసులు నమోదు కావడం కూటమి సర్కార్ వేధింపులు కొనసాగింపునకు మరొక ఉదాహరణ. అక్టోబర్ 7వ తేదీన ఇబ్రహీంపట్నంలో జనార్థన్రావుకు చెందిన గోడౌన్లో నకిలీ మద్యం డంప్ను ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. ఈ ఘటన తర్వాత వైఎస్సార్సీపీ కార్యకర్తలతో కలిసి డంప్ను పరిశీలించారు జోగి రమేష్. దీనిపై ఇప్పుడు కేసు నమోదు చేశారు పోలీసులు. ఆ రోజు తమ విధులకు ఆటంకం కలిగించారంటూ ఇప్పుడు అక్రమ కేసులు నమోదుఉ చేశారు పోలీసులు. విచారణకు రావాలని 20 మంది వైఎస్సార్సీపీ నేతలకు నోటీసులిచ్చారు. దీనిపై వైఎస్సార్సీపీ మండిపడింది. ఎప్పుడో రెండు నెలల క్రితం జరిగిన ఘటనపై ఇప్పుడు కేసులు నమోద చేయడం కక్ష సాధింపు చర్య కాకపోతే ఏంటని ప్రశ్నించింది. -
కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన: సజ్జల
తాడేపల్లి : ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన వస్తుందన్నారు పార్టీ స్టేట్ కో -ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగిందని, అందుకే కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతంగా సాగుతుందన్నారు. ఈరోజు(శుక్రవారం, డిసెంబర్ 5వ తేదీ) కోటి సంతకాల సేకరణ సమీక్షలో భాగంగా వైఎస్సార్సీపీ ముఖ్య నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి జూమ్ మీటింగ్లో పాల్గొన్నారు. ఇందులో పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు జూమ్ మీటింగ్కు హాజరయ్యారు. ఈ మేరకు సజ్జల మాట్లాడుతూ.. ‘ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగిందికోటి సంతకాల సేకరణకు అనూహ్యమైన స్పందన వస్తోంది. అన్ని వర్గాల ప్రజలూ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తున్నారు. వారం క్రితమే కోటికి పైగా సంతకాలు అయ్యాయి. ఇప్పుడు ఇంకా వస్తూనే ఉన్నాయి. వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాలు మరింత క్రియాశీలకంగా పనిచేయాలి. పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు నాయకులతో అవసరమైన సమన్వయం చేసుకోవాలి’ అని స్పష్టం చేశారు. గురువారం(డిసెంబర్ 4వ తేదీ) వైఎస్సార్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షులతో ఆయన జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. -
‘అమరావతి.. అంతులేని కథ.. పోలవరం.. ముగింపు లేని కథ’
సాక్షి, తాడేపల్లి: పోలవరాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారని.. దాన్ని బ్యారేజికే పరిమితం చేశారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 41 మీటర్లకే పూర్తి చేస్తుంటే కూటమి నేతలు ఏం చేస్తున్నారు? అంటూ నిలదీశారు. ఇప్పుడు చంద్రబాబు, వారి కేంద్ర మంత్రులు గుడ్డి గుర్రాలకి పళ్లు తోముతున్నారా? అని మండిపడ్డారు.‘‘అమరావతిది అంతులేని కథ.. పోలవరంది ముగింపు లేని కథగా మార్చారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటిఎంలాగా వాడుకుంటున్నారు. రాష్ట్ర విభజన చట్టంలో కేంద్రమే పోలవరాన్ని పూర్తి చేయాలని ఉంది. కానీ డబ్బులు కొట్టేయటానికి ఆ ప్రాజెక్టును ఏపీకి బదలాయించుకున్నారు. కాఫర్ డ్యాం కట్టకుండా డయాఫ్రం వాల్ కట్టారు. అది కొట్టుకు పోవటంతో వెయ్యి కోట్ల నష్టం జరిగింది. స్పిల్ వే నిర్మిస్తే డబ్బులు రావని దాన్ని వదిలేశారు. జగన్ హయాంలోనే స్పిల్ వే, కాఫర్ డ్యాంల నిర్మాణాలు పూర్తి చేశారు. 2013-14 రేట్ల ప్రకారం పోలవరం కడతానని చంద్రబాబు చెప్పారు. కానీ అది పూర్తి కాదని జగన్ కేంద్రంతో మాట్లాడి 2017-18 ధరల ప్రకారం నిర్మాణానికి అంగీకరించేలా చేశారు...తొలిదశ నిర్మాణానికి రూ.12,157 కోట్లు ఎన్నికలకు ముందే రిలీజ్ కావాల్సి ఉంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు కుట్ర పన్ని అప్పుడు ఆ నిధులు రాకుండా చేశారు. మొదటి దశకే 41.5 కు మాత్రమే పోలవరాన్ని పరిమితం చేశారు. రెండోదశ అయిన 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మాణం జరగటం లేదు. అది పూర్తయితేనే ఉత్తరాంధ్రకు నీరు వెళ్తుంది. పోలవరాన్ని ఇప్పుడు బ్యారేజీకే పరిమితం చేశారు. ప్రాజెక్టును నట్టేట ముంచారు...వైఎస్ జగన్ కొన్ని వేల స్కూళ్లను నాడు-నేడు కింద బాగు చేశారు. జగన్ ఇచ్చిన బెంచీల మీద కూర్చుని చంద్రబాబు జగన్ని విమర్శించారు. సినిమా సెట్టింగ్ మాదిరి సెట్ చేసినా, అందులో పెట్టినవన్నీ జగన్ ఇచ్చిన బెంచీలు, కుర్చీలే. లోకేష్ విద్యా శాఖామంత్రిగా ఏ పనీ చేయలేదు. హోంమంత్రి అనిత చౌకబారు విమర్శలు మానుకోవాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వారాంతంలో ఎక్కడ ఉంటున్నారు?. అసలు వీరికి హెడ్ క్వార్టర్ ఏది?..చంద్రబాబు ఇప్పటికీ అమరావతిలో ఎందుకు ఇల్లు కట్టుకోలేదు?. హైదరాబాద్లోని ఇంట్లోకి పవన్కి తప్ప మరెవరికీ ప్రవేశం లేదు. ధాన్యం కొనుగోలు చేయటం చేతగాని మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా జగన్ని విమర్శిస్తున్నాడు. రేషన్ బియ్యంలో కమీషన్లు దండు కుంటున్నారు. షిప్ని సీజ్ చేశారా? రేషన్ మాఫియాని అరికట్టారా?. ఆస్పత్రులలో సరైన వైద్యం అందించలేని మంత్రి సత్య కుమార్ కూడా జగన్ని విమర్శించటం సిగ్గుచేటు. లోకేష్.. చంద్రబాబు ప్లేటు తీశారు. రేపు కుర్చీ కూడా తీసేస్తారు. దైవాన్ని అడ్డం పెట్టుకుని దుర్మార్గపు నాటకాలు ఆడుతున్నారు. రాజకీయ కక్షల కోసం నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. అధికారం కోల్పోయాక ఏం అవుతారో ఆలోచించుకోవాలి’’ అంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. -
ముంబై కల… అమరావతి గిమ్మిక్
అమరావతిలో 15 బ్యాంకులు, రెండు బీమా సంస్థల కార్యాలయాలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. కూటమి నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు లోకేశ్, పయ్యావుల కేశవ్లు కేంద్రం తమకు సహకరిస్తోందని చంకలు గుద్దుకుంటున్నారు. పైగా ఈ చిన్న విషయంతోనే అమరావతి ముంబై అయిపోతుందన్నంత బిల్డప్ కూడా ఇచ్చేశారు. నిన్నమొన్నటివరకూ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని అన్నవాళ్లు కాస్తా ఇప్పుడు అమరావతి అంటున్నారు. ఇలా రోజుకో మాట మారిస్తే నమ్మేదెలా?.. ఇంతకి ఏమిటి వీరి బలహీనత?.. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి సర్కారుకు చిత్తశుద్ది ఉంటే, ఈ బ్యాంకు కార్యకలాపాలన్నీ కొత్తగా వస్తువన్నవి అని నమ్ముతూంటే అవి విశాఖలో పెరిగేలా చేస్తే ఏపీకి సత్వర ప్రయోజనం కలిగేది కదా! అని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ విలువలు పెంచడానికి, ధరలు పెరిగాయన్న కృత్రిమ భావన కల్పించడానికి తంటాలు పడుతున్న ప్రభుత్వ పెద్దలు దీనిని ఒక గిమ్మిక్కుగా మార్చారన్న అనుమానం కలుగుతుంది. తాజా ప్రచారం ప్రకారం మరికొన్ని సంస్థలను కూడా విశాఖ అమరావతికి తరలిస్తున్నారట. స్టాక్ ఎక్చేంజ్ బోర్డు ఆఫీస్ను గతంలో విశాఖలో ఏర్పాటు చేయాలని తలపెట్టగా ఇప్పుడు అమరావతికి మార్చే యోచన చేస్తున్నారు. గత ప్రభుత్వం రిజర్వు బ్యాంక్ ఆఫీస్ను వైజాగ్లో ప్రతిపాదిస్తే అమరావతికి మార్చారు. ఈఎస్ఐ మెడికల్ కాలేజీ, బిట్స్ పిలాని క్యాంపస్, ఏఐ, స్కిల్ యూనివర్శిటీలరె కూడా అమరావతికి మారుస్తారట. ఇప్పటికే అనంతపురం నుంచి ఎయిమ్స్, కర్నూలు నుంచి లా యూనివర్శిటీ తిరుపతి నుంచి హెచ్సీఎల్లను తరలించారు కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామికవాడ నుంచి ఒక కార్యాలయం ఇక్కడకు తీసుకురావాలని ప్రతిపాదించారు. ఇలా చేస్తే మళ్లీ ప్రాంతీయ అసమానతలు,విద్వేషాలు పెరగవా అని కొంతమంది విజ్ఞులు బాదపడుతున్నారు. కొత్త ప్రభుత్వ సంస్థలను అమరావతిలో స్థాపించవచ్చు.గతంలో అనేక ప్రైవేటు పరిశ్రమలు అమరావతికి పరుగులు పెట్టుకుంటూ వస్తాయని అన్నారు.అలా జరిగితే అందరికి ప్రయోజనంగా ఉంటుంది. వేల కోట్ల అప్పులు తెచ్చి అమరావతిలోనే ఖర్చు చేస్తున్నారు. దాని ప్రయోజనం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి దక్కాలి.అలాకాకుండా అప్పులు భారం అందరిపై పడి, ఆర్థిక లాభం మాత్రం అమరావతి ప్రాంతంలోని కొందరికే లభిస్తే అది సమస్యలకు దారి తీయవచ్చు.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అమరావతిలో పెడుతున్న బ్యాంకు ఆఫీసులు అన్ని విజయవాడలో ఇప్పటికే పనిచేస్తున్నాయట. వాటినే అమరావతికి తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారన్నమాట. కాకపోతే దానికి ఫైనాన్షియల్ స్ట్రీట్ అని ఒక పేరు తగిలిస్తారన్నమాట. నిజానికి బ్యాంకులు, బీమా సంస్థలు అన్నీ ఒకచోటే ఉండాల్సిన అవసరం లేదు. మరో సంగతి ఏమిటంటే ఆయా చోట్ల వివిధ బ్యాంకులకు రీజినల్ ఆఫీసులు కూడా ఉంటాయి. సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగిన ఈ రోజుల్లో అన్ని బ్యాంకులు ఓకే చోట ఉండడం వల్ల కలిసివచ్చేది ఏమీ ఉండదు. వికేంద్రీకరిస్తే అందరికి సమన్యాయం జరుగుతున్నట్లు అవుతుంది.అందుకు భిన్నంగా ఇతర చోట్ల నుంచి తీసుకు వచ్చి వాటిని అమరావతిలో పెడితే పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు.కాకపోతే ప్రభుత్వ సొమ్ము కాబట్టి కోట్ల రూపాయలకు వారికి భూమిని కేటాయించామని చెప్పుకోవచ్చేమో!. విశాఖలో ప్రైవేటు సంస్థలకు 99 పైసలకే ఎకరాలకు ఎకరాలు పందారం కావిస్తూ, అమరావతిలో ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు అనేది ఆలోచించాలి. ఒకప్పుడు అమరావతిలో ఐటీ మొదలు అనేక సంస్థలు వస్తున్నాయని ఊదరగొట్టారు.నవ నగరాల పేరుతో ఏదో జరిగిపోతుందని ప్రచారం చేశారు. ఇప్పుడేమో అందుబాటులో ఉన్న ఏభైవేల ఎకరాలు సరిపోదని, అలా అయితే మున్సిపాల్టీగానే మిగిలిపోతుందని చంద్రబాబు బెదిరిస్తున్నారు. కొత్తగా మరో నలభైవేల ఎకరాల భూముల సమీకరణకు సిద్దం అవుతున్నారు. నిర్మలా సీతారామన్ కు ఈ విషయాలన్నీ తెలుసో ,లేదో కాని ఆమె ఒక విషయం చెప్పారు. ఈ ప్రాంతంలో కూరగాయలు బాగా పండుతాయని, వాటికి ప్రోసెసింగ్ యూనిట్లు పెట్టడం, ఎగుమతికి అవసరమైన కోల్డ్ స్టోరేజీ ప్లాంట్లు నెలకొల్పడం వంటివి చేయాలని సూచించారు. కాని ఇప్పటికే రాజధాని పేరుతో భూములన్నిటిని చంద్రబాబు ప్రభుత్వం దున్నివేయించింది. వేలాది ఎకరాలలో పంటలు లేకపోవడంతో పిచ్చి మొక్కలు పెరిగి అడవిలా మారినట్టు పలు కథనాలు వచ్చాయి. ఈ విషయాన్ని ఆమె గమనించి సరైన సలహా ఇచ్చి ఉండాల్సింది. బ్యాంకులు వారు రైతులకు సహకరించాలని చెబుతూనే కమర్షియల్ గా మీ నిర్ణయం మీరు తీసుకోవచ్చని ఆమె స్పష్టం చేశారు. అంటే ఎవరికి ఎలాంటి రాయితీలు ఇవ్వవలసిన అవసరం లేదని తేల్చేశారన్నమాట. పోనీ అమరావతికి ఏమైనా కొత్తగా నిధులు ఇస్తున్నారా అంటే అదేమి చెప్పలేదు. చంద్రబాబు తన ప్రసంగంలో కేంద్రం రూ.15 వేల కోట్ల ఇచ్చి సహకరిస్తోందని అన్నారు. కాని అది రుణమా?లేక గ్రాంటా అన్నది చెప్పినట్లు కనిపించలేదు. నిజంగానే అది గ్రాంట్ అయితే నిర్మలా సీతారామన్ ప్రస్తావించకుండా ఉంటారా?.. బడ్జెట్ లో ఏపీకి బలమైన మద్దతు ఇవ్వాలని ప్రధాని మోదీ చెప్పారని ఆమె తెలిపారు. కాని అది ఏ రూపంలో ఇంతవరకు ఇచ్చారు. ప్రపంచ బ్యాంక్, ఇతర అంతర్జాతీయ బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకోవడానికి అనుమతి ఇస్తే ఏపీకి ఆర్థిక భారం అవుతుంది. అలాంటప్పుడు అది సాయం ఎలా అవుతుంది?. కేంద్రం నుంచి సుమారు రూ.36 వేల కోట్ల సాయం వస్తుందని ఏపీ బడ్జెట్లో పెడితే ఇప్పటికి కేవలం ఐదువేల కోట్ల లోపే అందిందట. దీని గురించి ఆమె ఏమైనా హామీ ఇస్తే బాగుండేది కదా!. రాష్ట్రం సుమారు రూ.45 వేల కోట్ల భారీ రెవెన్యూ లోటుతో కొట్టుమిట్టాడుతోంది. అది తగ్గించడానికి కేంద్ర ఆర్థిక మంత్రి సాయపడి ఉంటే అందరు అభినందించేవారు. అవేవి చేయకపోయినా చంద్రబాబు, తదితరులు మెచ్చుకుంటున్నారు. కాబట్టి కేంద్రంలోని వారికి ఇబ్బంది లేదనుకోవాలి. నిర్మలా సీతారామన్ కూడా చంద్రబాబుకు లేని క్రెడిట్ ఇవ్వడం ఆశ్చర్యపరిచింది. ఆయన చేసిన పనులు చెప్పి పొగిడితే తప్పు లేదు. కాని హైదరాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నిర్మాణం అయనే చేసినట్లు నిర్మలా వ్యాఖ్యానించడం అందరిని విస్తుపరచింది. హైదరాబాద్లో ఈ ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ అభివృద్ది అంతా వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగింది. ఇప్పటికే హైదరాబాద్ అంతా తానే నిర్మించానన్నట్లు చంద్రబాబు ప్రచారం చేసుకుంటారు. ఈ మధ్య ఆయన ఒక స్పీచ్ ఇస్తూ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు తానే వేసినట్లు చెప్పుకున్న వీడియో ఒకటి వైరల్ అయింది. దానికింద ఒక అధికారి గతంలో ఈ రింగ్ రోడ్డును వైఎస్సార్ ఎలా అభివృద్ది చేసింది వివరిస్తున్న దృశ్యం కనిపించింది. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రింగ్ రోడ్డు నిర్మాణం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిందని తెలిపే వీడియో కూడా వచ్చింది. అయినా చంద్రబాబు ఎందుకో అసత్యాలు చెప్పడానికే ప్రాధాన్యం ఇస్తూంటారు. ఇలాంటి పరిస్థితిలో నిర్మలా సీతారామన్ కూడా హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ క్రెడిట్ ను చంద్రబాబుకు ఇవ్వడం ఎంతవరకు సమంజసం. చంద్రబాబు ఎప్పుడో ఇరవై ఏళ్ల కిందట ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రి. ఆ తర్వాత జరిగిన అభివృద్దిని కూడా తన ఖాతాలో వేసుకుని ఏపీలో ప్రచారం చేసుకోవడం ద్వారా రాజకీయ లబ్ది పొందాలన్నది ఆయన ఉద్దేశం అన్నది కనిపిస్తూనే ఉంది. హైదరాబాద్ను అంతగా అభివృద్ది చేసి ఉంటే మరి ఏపీలో విశాఖ,విజయవాడ,తిరుపతి వంటి నగరాలను ఎందుకు వృద్ది చేయలేకపోయారు?.. ఇకపై ముంబై ఆర్ధిక నగరం కాదట.అమరావతి అట. ఈ విషయాన్ని రాష్ట్ర ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు.ఈ రకంగా మాట్లాడడం నవ్వులపాలయ్యే అంశమా? కాదా? అన్నది ఆలోచించుకోవాలి. ముంబై ఎక్కడ?అమరావతి ఎక్కడ? అర్థం ఉండాలి కదా మాట్లాడడానికి!. విమానాశ్రయం పేరుతో, స్పోర్ట్స్ సిటీ పేరుతో రకరకాలుగా వేల ఎకరాల అదనపు భూమి సమీకరణకు ప్రభుత్వం సన్నద్దమవుతున్న తీరు అమరావతి రైతుల గుండెల్లో రైళ్లు పరుగులెత్తిస్తోంది. వారిని మభ్య పెడుతూ ఇలాంటి కార్యక్రమాలలో ప్రసంగాలు చేస్తే ఏమి ఉపయోగం?.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
వైద్య విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ వెన్నుపోటు
సాక్షి, అమరావతి: పీజీ సీట్లు అమ్మకానికి పెట్టిన కూటమి సర్కార్పై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోటాను వంద రోజుల్లో రద్దు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. గద్దెనెక్కిన తర్వాత విద్యార్థులకు వెన్నుపోటు పొడిచారు. ఒకవైపు 10 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్కు కట్టబెడుతున్నారు. మరోవైపు ఆ కాలేజీల్లోని పీజీ సీట్లను అమ్మకానికి పెట్టేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో ప్రారంభించిన 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు మంజూరైన పీజీ సీట్లకు సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకున్నారు.ఒక్కో పీజీ సీటుకు రూ.29 లక్షల వసూలుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. పీజీ కోర్సుల్లో ప్రభుత్వ కోటా సీటుకు రూ.30 వేలు, సెల్ఫ్ ఫైనాన్స్ సీటుకు రూ.9 లక్షలు, ఎన్ఆర్ఐ కోటా సీటుకు రూ.29 లక్షలుగా ఫీజులు ఖరారు చేశారు. 2025–26 విద్యా సంవత్సరానికి 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 4 కోర్సుల్లో 60 పీజీ సీట్లను నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) మంజూరు చేసింది.రాజమండ్రి, నంద్యాల కళాశాలల్లో 16 సీట్లు చొప్పున, విజయనగరం, మచిలీపట్నం కళాశాలల్లో 12 చొప్పున, ఏలూరు కళాశాలలో 4 పీజీ సీట్లకు అడ్మిషన్లు చేపట్టనున్నారు. కాగా, 50 శాతం సీట్లు ఆలిండియా కోటాకు పోగా, మిగిలిన 50 శాతం సీట్లను రాష్ట్ర కోటాలో యూనివర్సిటీ భర్తీ చేయనుంది. ఈ 50 శాతంలో సగం కన్వీనర్ కోటాకు, 35 శాతం సెల్ఫ్ఫైనాన్స్, 15 శాతం ఎన్ఆర్ఐ కోటాకు కేటాయించారు. -
కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలో పీజీ సీటు ఫీజు రూ.29 లక్షలు
సాక్షి, అమరావతి: తాము అధికారంలోకి వస్తే కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోటాను వంద రోజుల్లో రద్దు చేస్తామని హామీ ఇచి్చన చంద్రబాబు.. గద్దెనెక్కిన తర్వాత విద్యార్థులకు వెన్నుపోటు పొడిచారు. ఒకవైపు 10 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్కు కట్టబెడుతున్నారు. మరోవైపు ఆ కాలేజీల్లోని పీజీ సీట్లను అమ్మకానికి పెట్టేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో ప్రారంభించిన 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు మంజూరైన పీజీ సీట్లకు సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో పీజీ సీటుకు రూ.29 లక్షల వసూలుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. పీజీ కోర్సుల్లో ప్రభుత్వ కోటా సీటుకు రూ.30 వేలు, సెల్ఫ్ ఫైనాన్స్ సీటుకు రూ.9 లక్షలు, ఎన్ఆర్ఐ కోటా సీటుకు రూ.29 లక్షలుగా ఫీజులు ఖరారు చేశారు. 2025–26 విద్యా సంవత్సరానికి 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 4 కోర్సుల్లో 60 పీజీ సీట్లను నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) మంజూరు చేసింది.రాజమండ్రి, నంద్యాల కళాశాలల్లో 16 సీట్లు చొప్పున, విజయనగరం, మచిలీపట్నం కళాశాలల్లో 12 చొప్పున, ఏలూరు కళాశాలలో 4 పీజీ సీట్లకు అడ్మిషన్లు చేపట్టనున్నారు. కాగా, 50 శాతం సీట్లు ఆలిండియా కోటాకు పోగా, మిగిలిన 50 శాతం సీట్లను రాష్ట్ర కోటాలో యూనివర్సిటీ భర్తీ చేయనుంది. ఈ 50 శాతంలో సగం కన్వీనర్ కోటాకు, 35 శాతం సెల్ఫ్ఫైనాన్స్, 15 శాతం ఎన్ఆర్ఐ కోటాకు కేటాయించారు. -
ఇలా ‘సెలవిచ్చారు’
సాక్షి, అమరావతి: 2026 క్యాలెండర్ ఇయర్లో సాధారణ సెలవులు, ఆప్షనల్ హాలిడేల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం మొత్తం 24 సెలవు దినాలు ప్రకటించింది. ఇందులో నాలుగు సెలవులు మహాశివరాత్రి, బాబూ జగ్జీవన్రాం జయంతి, దుర్గాష్టమి, దీపావళిలు ఆదివారం రావడంతో నికరంగా 20 సెలవులు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులకు లభించనున్నాయి. కానీ ఈసారి అత్యధిక సెలవులు శుక్రవారం రావడంతో మధ్యలో శనివారం లీవ్ పెట్టుకుంటే వారాంతాల్లో మూడు రోజులు ఆటవిడుపు కలగనుంది. పై అధికారికి ముందస్తు సమాచారంతో గరిష్టంగా ఐదు సెలవుదినాలను వినియోగించుకునేలా 21 ఆప్షనల్ హాలిడేలను ప్రకటించింది. ఇందులో రెండు ఈద్ ఈ గదర్, మహాలయ అమావాస్య ఆదివారంతో కలిసిపోయాయి. బ్యాంకులు వంటి ఇతర వ్యాపార సంస్థలకు నెగోషబుల్ ఇనిస్ట్రుమెంట్స్ యాక్ట్ 1981 ద్వారా 21 సాధారణ సెలవులను ప్రకటించింది. చంద్ర దర్శనాన్ని బట్టి నిర్ణయించే రంజాన్, బక్రీద్, మొహర్రం, ఈద్ మిలాద్ ఉన్నబీతో పాటు హిందూ పర్వదినాల్లో ఏమైనా మార్పులు ఉంటే వాటిని ప్రసార మాధ్యమాల ద్వారా ముందుగానే తెలియజేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
సందట్లో సడేమియా!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు దుర్మార్గపు పాలన సాగిస్తూ మరో వైపు తనపై అవినీతి కేసులను సందట్లో సడేమియా మాదిరిగా ఎత్తేసుకునే కుట్ర చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దుయ్యబట్టారు. న్యాయస్థానాలు ఇచ్చిన బెయిల్ షరతులను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి కేసుల్లో బెయిల్పై బయట ఉన్న చంద్రబాబు ‘తానే దొంగ.. తానే పోలీస్.. తానే పబ్లిక్ ప్రాసిక్యూటర్..’ అన్నట్లు వ్యవహరిస్తూ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి.. తనపై కేసులను తన ప్రభుత్వం ద్వారా విత్ డ్రా చేసుకుంటూ బరితెగిస్తున్నారని మండిపడ్డారు.గురువారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు 2014–19 మధ్య ఆషామాషీ స్కాములు చేయలేదు. ఒక్క స్కిల్ స్కామ్లోనే వందల కోట్లు బొక్కేశారు. స్వయంగా ఆ ఫైళ్లపై చంద్రబాబు సంతకాలు చేసి డొల్ల కంపెనీలకు రూ.370 కోట్లు దోచిపెట్టారు. అక్కడేమో సీమెన్స్ ఎండీ ఆ డబ్బులు నాకు రాలేదు, నా కంపెనీయే కాదని స్టేట్మెంట్ ఇచ్చారు.డొల్ల కంపెనీలకు చంద్రబాబు స్వయంగా సంతకాలు పెట్టి ఫైల్ మూవ్ చేసి రూ.370 కోట్లు ఇచ్చిన కేసులో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ అయిన ఈడీ.. డొల్ల కంపెనీలు పెట్టిన వాళ్లను, డబ్బులు తీసుకున్నోళ్లను అరెస్టు చేసింది. కానీ, డబ్బులు ఇచ్చినోడిని అరెస్టు చేయలేదు. డబ్బు మాత్రం పోయింది. డబ్బు ఇచ్చినోడిని అరెస్టు చేయకుండా ప్రొటెస్ట్ చేస్తుండటం ఏంటని ఏసీబీ కోర్టు ఆయన్ను జైలుకు పంపింది’ అని అన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. అతిపెద్ద అసైన్డ్ ల్యాండ్ స్కామ్చంద్రబాబు, ఆయన బినామీలు అసైన్డ్ భూములు కొనడం ఒక స్కాం అయితే.. ఆ తర్వాత వాటిని రెగ్యులరైజ్ చేసుకోవడం మరో పెద్ద స్కాం. అదే స్థాయిలో రింగు రోడ్డు అలైన్మెంట్ స్కాం చేశారు. కరెక్టుగా చంద్రబాబు హెరిటేజ్ భూముల దగ్గరకు వచ్చే సరికే రింగ్ రోడ్డు పక్కకు వెళ్లిపోతుంది. మరో వైపు ఉచితం పేరుతో రూ.కోట్ల విలువైన ఇసుకను దోచేస్తున్నారు. మా హయాంలో ఏడాదికి రూ.750 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.3,750 కోట్లు ఇసుక ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. బ్లాక్ లిస్టులోని కంపెనీకి కాంట్రాక్టులు!ఫైబర్ నెట్లో అర్హత లేని, బ్లాక్ లిస్టులో ఉన్న తన అనుచరుడి కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టి రూ.వందల కోట్లు అప్పనంగా మింగేశారు. లిక్కర్లో ఎమ్మార్పీ కన్నా అధిక రేట్లకు అమ్మి తన బెల్ట్ షాపుల ద్వారా, పర్మిట్ రూముల ద్వారా, తన మాఫియా సామ్రాజ్యం ద్వారా దోచేశారు. కేబినెట్ ఆమోదం లేకుండా ప్రివిలేజ్ ఫీజును రద్దు చేసి, దాని మీద చంద్రబాబు స్వయంగా సంతకాలు పెట్టి వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కాంకు తెర తీశారు. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో లిక్కర్ స్కామ్ చేస్తున్నారు. డిస్టిలరీలకు ఆర్డర్లు ఇచ్చేది ప్రైవేట్ షాపులు. అలాంటి ప్రైవేట్ షాపులన్నీ చంద్రబాబు వ్యక్తులవి కాదా? ప్రతి ఐదు బాటిళ్లకు ఒక బాటిల్ కల్తీ మద్యం అమ్మేస్తున్నారు. చట్టం.. చంద్రబాబు చుట్టం!ప్రజాధనాన్ని బొక్కేసిన ఈ గజదొంగను చట్టం ముందు నిలబెట్టి శిక్షించడానికి కావాల్సిన అన్ని ఆధారాలు, సాక్ష్యాలు ఉన్నా కూడా చంద్రబాబు తన అధికార బలంతో కేసులు విత్డ్రా చేసుకునే కుట్రలకు తెగబడ్డారు. ఫిర్యాదుదారులైన అధికారుల్ని భయపెట్టి, బెదిరించి స్టేట్మెంట్లు విత్ డ్రా చేయించి, వాటిని కోర్టు ముందు పెట్టి, ఈ కేసులో ఏమీ లేదంటూ వ్యవస్థల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. రెఫర్ చార్జ్ షీట్ వేయించి మూసేయిస్తున్నారు.గతంలో కూడా సేమ్ మోడస్ ఆపరెండీకి పాల్పడ్డారు. ఏలేరు స్కామ్ తీసుకున్నా అంతే. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి ఆ పార్టీ బ్యాంకు అకౌంట్లను, ఆ పార్టీ గుర్తును లాక్కోవడం దగ్గర నుంచి మొన్నటి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు ఇస్తూ ఆడియో టేపులు, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయిన కేసులో.. ఇవాళ్టి కేసు వరకు చట్టం ఒక వైపు, వ్యవస్థలు మరో వైపు.. చంద్రబాబుకు చుట్టాలుగా మారి దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజల దృష్టి మళ్లించడానికే వైఎస్సార్సీపీ నేతలను అక్రమ కేసులతో వేధిస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న ఈ అన్యాయాలను వేలెత్తి చూపిస్తూ.. సాక్ష్యాలు, ఆధారాలతో ఎప్పటికప్పుడు ప్రజల ముందు పెడతాం. వాస్తవాలు ప్రజా క్షేత్రంలోకి తీసుకెళ్తాం. -
ఈ సర్కారుకు మాయరోగం!
‘‘ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తేయడం అన్నది నిజంగా మాయరోగమే. బకాయిలు ఇవ్వకపోవడంతో నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు దాదాపుగా నిలిచిపోయాయి. ఆరోగ్యశ్రీకి 18 నెలలకు రూ.5,400 కోట్లు ఇవ్వాలి. కానీ ఈ ప్రభుత్వం ఇచ్చింది కేవలం రూ.1,800 కోట్లు. ఇంకా రూ.3,600 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలున్నాయి. ఇక మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణే పెద్ద స్కాము.. వాటిని తీసుకున్న వారికి మరో పెద్ద బొనాంజా..! ఈ కాలేజీలు ప్రైవేట్ పరం అయ్యాక అందులో పని చేస్తున్న సిబ్బందికి గవర్నమెంటే జీతాలు ఇస్తుందట. గవర్నమెంట్ భూమి, గవర్నమెంట్ భవనాలు, గవర్నమెంట్ సిబ్బంది, గవర్నమెంట్ జీతాలు.. కానీ ఓనర్లేమో ప్రైవేటు వాళ్లు! లాభాలేమో ప్రైవేటు వాళ్లకు! భారమేమో ప్రజలపై! బొనాంజా కాదా ఇది?’’ - వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ‘‘చంద్రబాబు ప్రభుత్వానికి మాయరోగం వచ్చింది. ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తేశారు. గవర్నమెంట్ ఉన్నది ఎందుకు? ఏం చేయడం కోసం ప్రజలు నీకు అధికారం ఇచ్చారు? విద్య, వైద్యం, వ్యవసాయం, శాంతిభద్రతల పరిరక్షణ, పారదర్శక పాలన.. ఇవి కదా చేయాల్సింది. కానీ అన్నీ తిరోగమనమే. అన్నీ స్కాములే. ఏవీ పట్టించుకునే పరిస్థితి లేదు. అన్నీ ప్రైవేటీకరణే.. బాధ్యత నుంచి తప్పించుకోవడం.. ఉన్నకాడికి స్కామ్లు చేయడమే..’’ అంటూ సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఏమన్నారంటే.. దారుణంగా ప్రజారోగ్య వ్యవస్థ ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తేయడం అన్నది నిజంగా మాయరోగమే. బకాయిలు ఇవ్వకపోవడంతో నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు దాదాపుగా నిలిచిపోయాయి. ఆరోగ్యశ్రీ అమలుకు నెలకు రూ.300 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ 18 నెలలకు కలిపి రూ.5,400 కోట్లు ఇవ్వాలి. ఇటీవల నేను దీనిపై పలుదఫాలు మాట్లాడటం.. వాళ్లు కూడా (నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు) స్ట్రైక్లు చేయడంతో ఈ ప్రభుత్వం ఇచ్చింది కేవలం రూ.1,800 కోట్లు. అంటే ఇంకా రూ.3,600 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలున్నాయి. చివరికి మొన్న నెట్వర్క్ ఆస్పత్రులన్నీ సమ్మెకు దిగాయి. సమ్మె విరమించేటప్పుడు ప్రభుత్వం వాళ్లకిచి్చన మాటకు ఇంతవరకు దిక్కులేదు. పేదలకు ఆరోగ్య భద్రత లేని పరిస్థితి. 104, 108 సేవలను స్కాములుగా మార్చేశారు. రూ.5 కోట్లు టర్నోవర్ లేని వాటికి 104, 108 సరీ్వసుల నిర్వహణను అప్పగించేశారు. ఆ వ్యక్తి ఎవరంటే.. టీడీపీ ఆఫీసులో డాక్టర్ల సెల్ అధ్యక్షుడట..! ఓ పక్క ఇంత దారుణంగా ఆరోగ్య వ్యవస్థ ఉంటే.. మరోవైపు సంజీవని అంటారు. అది ఇంకో డ్రామా. అన్నీ గవర్నమెంట్వే.. లాభాలేమో ప్రైవేటు వాళ్లకు! మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణే పెద్ద స్కాము.. వాటిని తీసుకున్న వారికి మరో పెద్ద బొనాంజా.. ఓవైపున ఆరోగ్యశ్రీని ఖూనీ చేస్తూ.. మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రులను పూర్తిగా హతం చేస్తూ ఇంకోవైపు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఒక స్కాముగా మారుస్తూ ఈ ప్రభుత్వ పాలన సాగుతోంది. కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం ఒక స్కాము అయితే, ఆ కాలేజీలు తీసుకున్న వారికి ఒక పెద్ద బొనాంజా కూడా ఇచ్చారు. అది ఇంకో పెద్ద స్కామ్. ఈ కాలేజీలు ప్రైవేట్ పరం అయ్యాక అందులో పని చేస్తున్న సిబ్బందికి గవర్నమెంటే జీతాలు ఇస్తుందంట. (ప్రభుత్వం జారీ చేసిన జీవో 847ను ప్రదర్శించారు). ఒక్కో టీచింగ్ హాస్పిటల్ (550 పడకల ఆసుపత్రి)లో ఉద్యోగుల జీతాల కోసం నెలకు దాదాపు రూ.5 నుంచి రూ.6 కోట్లు ఖర్చవుతుంది. అంటే ఏడాదికి రూ.60 నుంచి రూ.70 కోట్లు. రెండేళ్లకు రూ.120 నుంచి రూ.140 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం ఇస్తుంది.ఆశ్చర్యమేమిటంటే.. గవర్నమెంట్ భూమి, గవర్నమెంట్ భవనాలు, గవర్నమెంట్ సిబ్బంది, గవర్నమెంట్ జీతాలు.. కానీ ఓనర్లేమో ప్రైవేటు వాళ్లు! లాభాలేమో ప్రైవేటు వాళ్లకు! భారమేమో ప్రజలపై! ఆశ్చర్యంగా లేదా ఇది..? బొనాంజా కాదా ఇది? స్కాముల్లో అన్నిటికంటే పెద్ద స్కామ్ కాదా ఇది? ఓవైపు ప్రజా ఉద్యమం జరుగుతోంది. దానిని ఖాతరు చేయకుండా, సిగ్గు లేకుండా చంద్రబాబు స్కాములపర్వం ముందుకు పోతోంది. ఒక పక్క మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి మందికిపైగా ప్రజలు సంతకాలు చేస్తున్నారు. మరో వైపున వాటిని ఖాతరు చేయకుండా చంద్రబాబు చేస్తున్న స్కామ్ల్లో ఒక అడుగు ముందుకేసి ఇంకో స్కామ్ చేస్తున్నాడు.16న గవర్నర్కు కోటి సంతకాల పత్రాలు అందచేస్తాంకొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోవడంతో రోడ్లెక్కుతున్నారు. 175 నియోజకవర్గాల్లో ప్రజలతో కలిసి మా పార్టీ భారీ ర్యాలీలు చేపట్టి ప్రజల గొంతుకను వినిపించింది. కోటిమందికి పైగా సంతకాలు చేసి ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. ఈ నెల 10వ తేదీన సంతకాలు చేసిన పత్రాలను నియోజకవర్గ కేంద్రాల్లో ప్రదర్శించి ప్రజలకు, మీడియాకు అందరికీ చూపించి జిల్లా కేంద్రాలకు పంపుతారు. ఈ నెల 13వ తేదీన జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు చేసి పార్టీ సెంట్రల్ ఆఫీసుకు చేరుస్తారు. ఆ కోటి సంతకాల పత్రాలను ఈ నెల 16న గవర్నర్కు అందచేస్తాం. ఆ తరువాత ఈ పత్రాలతో హైకోర్టులో పిటిషన్ వేస్తాం. -
ఉద్యోగులను ముంచేశారు
‘‘ఉద్యోగుల సమస్యలు చూస్తే.. ఈ డిసెంబర్ పూర్తై జనవరి వస్తే ఐదు డీఏలు ఇవ్వాల్సి ఉండగా కేవలం ఒక్కటి మాత్రమే ఇచ్చారు. అది కూడా వాయిదాల్లో ఇస్తామంటున్నారు. మెరుగైన పీఆర్సీ ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఉన్న పీఆర్సీ చైర్మన్నే తీసేశారు. ఇప్పటివరకూ కొత్త చైర్మన్ను నియమించలేదు. ఉద్యోగులకు పెరిగిన జీతాలు వెంటనే ఇవ్వాల్సి వస్తుందనే దుర్బుద్ధితోనే పీఆర్సీ ఛైర్మన్ను నియమించలేదు. ఐఆర్ ఊసే లేదు’’ - వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులను సీఎం చంద్రబాబు నిండా ముంచేశారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో చంద్రబాబు కుప్పలు తెప్పలుగా ఇచ్చిన హామీలు.. వాటిని అమలు చేయకుండా మోసం చేస్తున్న తీరును ఎండగడుతూ సర్కార్ తీరును కడిగిపారేశారు. గురువారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ఐదింటికి ఒకే డీఏ.. ఉద్యోగుల సమస్యలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూస్తే... ఈ డిసెంబర్ పూర్తయి జనవరి వస్తే ఐదు డీఏలు ఇవ్వాల్సి ఉండగా కేవలం ఒక్కటి మాత్రమే ఇచ్చారు. అది కూడా వాయిదాల్లో ఇస్తామంటున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే.. డీఏ అరియర్స్ను రిటైర్ అయిన తర్వాత ఇస్తామని చెప్పిన ప్రభుత్వాన్ని బహుశా చరిత్రలో ఎప్పుడూ చూసి ఉండం... ఒక్క చంద్రబాబు ప్రభుత్వంలో మినహా! దానికి తగ్గట్టుగా జీవో 60 జారీ చేశారు. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇంత దౌర్బాగ్యమైన జీవోను తీసుకొని వచ్చి ఉండరు (జీవో నంబర్ 60ని ప్రదర్శించారు). దీనిపై ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో దాన్ని ఉపసంహరించుకుని, వాయిదాల్లో ఇస్తామన్నారు. ఐఆర్ లేదు.. మెరుగైన పీఆర్సీ బూటకం మెరుగైన పీఆర్సీ ఇస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఉన్న పీఆర్సీ చైర్మన్నే తీసేశారు. ఆ స్థానంలో ఇప్పటివరకూ కొత్త చైర్మన్ను నియమించలేదు. చైర్మన్ను నియమిస్తే పీఆర్సీ రిపోర్టు ఇవ్వాలి. రిపోర్టు వస్తే దాన్ని వెంటనే అమలు చేయాలి. అమలు చేస్తే.. ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయి. దీంతో ఉద్యోగులకు పెరిగిన జీతాలు వెంటనే ఇవ్వాల్సి వస్తుందనే దుర్బుద్ధితోనే పీఆర్సీ చైర్మన్ను ఇప్పటివరకూ నియమించలేదు. అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామని చంద్రబాబు చెప్పారు. కానీ.. ఇప్పటివరకు ఐఆర్ ఊసే లేదు. నాడు మేం అధికారంలోకి రాగానే 27 శాతం ఐఆర్ ఇచ్చాం.దాంతో ఉద్యోగుల జీతాలు పెరిగాయి. ఆశ్చర్యం ఏమిటంటే.. మా ప్రభుత్వం ఇచ్చిన జీపీఎస్(గ్యారంటీడ్ పెన్షన్ స్కీం)ను కూడా చెల్లుబాటు కాకుండా చేసి ఉద్యోగులను చంద్రబాబు త్రిశంకు స్వర్గంలోకి నెట్టాడు. మేం తెచ్చిన జీపీఎస్ను దేశమంతా కాపీ కొడుతున్నారు. కనీసం అదైనా అమలు చేసి ఉంటే రిటైర్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ వచ్చేవి. పీఆర్సీ బకాయిలు, పెండింగ్ డీఏలు, జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఐలు, మెడికల్ రీయింబర్స్మెంట్, సరెండర్ లీవ్స్ రూపంలో ఉద్యోగులకు చంద్రబాబు ఏకంగా రూ.31 వేల కోట్లు బకాయి పడ్డారు.ఆప్కాస్(ఏపీసీఓఎస్)లో ప్రతి నెలా 1వ తేదీనే జీతాలిచ్చేలా మా ప్రభుత్వంలో చర్యలు తీసుకున్నాం. కానీ ఇప్పుడు రెండు మూడు నెలలకోసారి ఇస్తున్నారు. నేను పులివెందులకు వెళ్తే మా వాళ్లు వచ్చి వినతిపత్రం ఇచ్చారు. మీరున్నప్పుడు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు వచ్చేవి.. ఇప్పుడు ఒకటో తేదీన జీతం కథ దేవుడెరుగు.. రెండు మూడు నెలలకు ఒకసారి ఇస్తున్నారు సార్..! అని చెబుతున్నారు. గెస్ట్ లెక్చరర్లకైతే ఎనిమిది నెలలుగా జీతాలే లేవు. ఈ ప్రభుత్వంలోఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నారు. దేవాలయాల్లో శానిటేషన్ పనులు కూడా కాంట్రాక్టర్లకే కట్టబెట్టేస్తున్నారు. భాస్కరనాయుడు లాంటి చంద్రబాబు బంధువులు, సన్నిహితులకే కాంట్రాక్టులు ఇస్తున్నారు. -
విశాఖ స్టీల్ప్లాంట్కు సొంత గని అడగరు.. ప్రైవేటు ప్లాంట్కు అడుగుతారా?
‘‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు.. ప్రైవేటీకరించకుండా కాపాడుకుంటాం అంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ఇప్పుడు మాట మార్చుతున్నారు. ప్రైవేటు సంస్థ స్టీల్ ప్లాంట్ పెడితే లాభాల్లో ఉంటుందట, తమాషాలు చేయొద్దు... పీడీ యాక్ట్ పెట్టి లోపలేస్తాం అని ఉద్యోగులను బెదిరిస్తున్నారు. సినిమాల్లో విలన్ పాత్ర ఎలా ఉంటుందో చెప్పడానికి... చంద్రబాబు వ్యవహరిస్తున్న ఈ తీరే నిదర్శనం’’ - వైఎస్ జగన్సాక్షి, అమరావతి: విపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు... ప్రైవేటీకరించకుండా కాపాడుకుంటాం అంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ఇప్పుడు మాట మార్చుతున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించకుండా కాపాడుకున్నామని, ప్రభుత్వ రంగంలోనే నడపాలని, సొంత గని (క్యాప్టివ్ మైన్) కేటాయించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని గుర్తుచేశారు. స్టీల్ ప్లాంట్ నష్టాలకు కారణం కార్మికులు కానే కాదని, సొంత గని లేకపోవడమేనని తేల్చి చెప్పారు. దీనికి ఆధారంగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్), స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఏఐఎల్) వార్షిక నివేదికలను చూపారు. ‘‘విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గని కేటాయించాలని అడగరు కాని.. మిట్టల్ సంస్థ పెట్టే ప్రైవేటు స్టీల్ ప్లాంట్కు సొంత ఇనుప గని కేటాయించాలని టీడీపీ కూటమి ఎంపీలతో కేంద్రాన్ని అడిగిస్తారా?’’ అంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. గురువారం మీడియాతో మాట్లాడిన జగన్ ఇంకా ఏమన్నారంటే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాటా? మా ప్రభుత్వ హయాంలో స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించకుండా అడ్డుకున్నాం. కానీ, ఎన్నికల ముందు చంద్రబాబు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏం మాట్లాడారు..? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారనేది చూడండి. (2021 ఫిబ్రవరి 16న చంద్రబాబు మాట్లాడిన మాటలు, 2025 నవంబర్ 15న మాట్లాడిన మాటల వీడియో క్లిప్పింగ్లను చూపించారు). ప్లాంట్ను కాపాడుకుంటాం. కలిసి పోరాడతాం అంటూ వీర డైలాగులు చెప్పారు. ఇప్పుడు ఇంట్లో పడుకుంటే జీతాలివ్వాలా? అంటున్నారు. ప్రైవేటు సంస్థ స్టీల్ ప్లాంట్ పెడితే లాభాల్లో ఉంటుందట, తమాషాలు చేయెద్దు పీడీ యాక్ట్ పెట్టి లోపలేస్తాం అని ఉద్యోగులను బెదిరిస్తున్నారు. నిజానికి నష్టాలకు ఉద్యోగులు కారణం కాదు. విశాఖ స్టీల్కు సొంత గనుల్లేకనే నష్టాలు. ఆర్ఐఎన్ఎల్, ఎస్ఏఐఎల్ 2023–24 వార్షిక నివేదిక ప్రకారం.. సెయిల్, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల కోసం చేసే వ్యయం 11.2 శాతం ఉంది. కానీ, సెయిల్కు ఐరన్ ఓర్ ఉంది. క్యాప్టివ్ ఐరన్ ఓర్ ఉంది. దాన్నుంచి 34.34 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్ తీసుకోవడమే కాకుండా, జార్ఖండ్ ప్రభుత్వం అనుమతితో 1.16 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్ను మార్కెట్లో అమ్ముకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్స్ లేవు. అందుకే ఐరన్ ఓర్ వ్యయం 18.6 శాతం అవుతుంటే సెయిల్లో ఇది 9.8 శాతమే. 10 శాతం తేడా ఉంది. -
లడ్డూ ప్రసాదంపై నిరాధార నిందలా?
తనకు అనుకూలంగా లేకుంటే వ్యవస్థలపై దాడి చేయించడం చంద్రబాబుకు పరిపాటే. ఏకంగా న్యాయవ్యవస్థపైనే దాడి చేస్తున్నారు. తిరుపతి జడ్జి, లోక్ అదాలత్ జడ్జిపైనే కాకుండా, ఒక సుప్రీం కోర్టు పెద్ద జడ్జి ఒత్తిడి తెచ్చారని దుష్ప్రచారానికి తెగబడ్డారు. పెద్ద జడ్జిల గురించి వీళ్లు మాట్లాడుతున్నారు. ధర్మం తెలిసిన మనుషులుగా, చట్టాలు తెలిసిన వ్యక్తులుగా టీటీడీకి మంచి చేయడం కోసం ఒక మంచి పరిష్కారం చూపుతూ ఈ జడ్జిలు సమస్య పరిష్కారంలో భాగస్వామ్యం అవ్వడం తప్పా?’’ - వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘‘జంతువుల కొవ్వు కలిసిన నెయ్యితో తిరుమల లడ్డూ ప్రసాదాలు తయారు చేశారని.. వాటిని భక్తులు తిన్నారని అన్నావ్..! వాటికి ఆధారాలు దొరికాయా..?’’ అంటూ సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల వెంకటేశ్వరస్వామి విశిష్టతను అభాసుపాలు చేస్తావా బాబూ? అంటూ మండిపడ్డారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. బెయిల్పై ఉన్న చంద్రబాబు షరతులను ఉల్లంఘిస్తూ.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అవినీతి కేసులను తీసేయించుకుంటున్నారని తూర్పారబట్టారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ఈ ప్రశ్నలకు సమాధానం ఉందా బాబూ..? చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నా! టీటీడీ లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని.. వాటిని భక్తులు తిన్నారని చెప్పడానికి ఆధారాలు దొరికాయా? కల్తీ నెయ్యి ఆరోపణలు ఉన్న ట్యాంకర్లు ప్రసాదం తయారీ కేంద్రంలోకి వెళ్లాయా? వీటికి ఆధారాలున్నాయా? టీటీడీలో ఒక బలమైన తనిఖీ వ్యవస్థ (రోబస్ట్ ప్రొసీజర్) ఉంది. టీటీడీకి వచ్చే ఏ నెయ్యి ట్యాంకర్ అయినా ఎన్ఏబీఎల్ (నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లా»ొరేటరీస్) సర్టిఫికేషన్తోనే రావాలి. ఇది దశాబ్దాలుగా టీటీడీలో పాటిస్తున్న నిబంధన. ఈ సర్టిఫికెట్ లేకుండా తిరుమలలోకి ట్యాంకర్లు రావు. ఎన్ఏబీఎల్ సర్టిఫికెట్ ఒక్కటే సరిపోదు. టీటీడీకి ఒక సొంత ల్యాబ్ కూడా ఉంది. ఆ ల్యాబ్లో మళ్లీ టెస్టు పాస్ అయితేనే ట్యాంకర్ లోపలికి వెళ్తుంది. ఈ స్టాండర్డ్స్ లేకపోతే నెయ్యి ట్యాంకర్లను తిరస్కరించి, వెనక్కి పంపిస్తారు. ఇలా గతంలో చంద్రబాబు హయాంలో 15 సార్లు వెనక్కి పంపించారు. వైఎస్సార్ సీపీ హయాంలో 18 సార్లు వెనక్కి పంపారు. టీటీడీలో బలమైన తనిఖీ వ్యవస్థ ఉందని, సమర్థవంతంగా పని చేస్తుందని చెప్పడానికి ఇవి నిదర్శనాలు. అలాంటప్పుడు తప్పు జరిగేందుకు ఆస్కారం ఎక్కడిది? కల్తీ నెయ్యి వాడితే నీ వైఫల్యం కాదా బాబూ? చంద్రబాబు హయాంలో, ఆయన నియమించిన టీటీడీ ఈవో టైమ్స్ నౌలో(ఈవో మాట్లాడిన వీడియో ప్రదర్శించారు) స్వయంగా ఆ ట్యాంకర్ల నెయ్యిని వినియోగించలేదని చెప్పారు. సెపె్టంబర్ 20, 2024న చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నియమించిన టీటీడీ ఈవో.. నాలుగు నెయ్యి ట్యాంకర్లు టెస్టులు పాస్ కాకపోవడంతో రిజెక్ట్ చేసి వెనక్కి పంపించామని ప్రకటించారు. వాస్తవానికి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆయన హయాంలో జూలైలో∙4 ట్యాంకర్లు తిప్పి పంపారు. మళ్లీ ఆ ట్యాంకర్లు ఆగస్టులో తిరిగి వచ్చాయట! మరి అప్పుడు సీఎం ఎవరు? చంద్రబాబు కాదా..? ప్రభుత్వాన్ని నడిపేది ఆయన కాదా..? గతంలో రిజెక్టు చేసిన నెయ్యి ట్యాంకులు ఆగస్టులో తిరిగి వచ్చాయని, లడ్డూ ప్రసాదంలో వినియోగించారని సిట్ రిమాండ్ రిపోర్టులో రాసింది. అలాంటప్పుడు ఇక్కడ ఎవరిని లోపల వేయాలి? ఇదే నిజమైతే రిజెక్ట్ చేసిన నెల రోజుల తర్వాత ఆ నెయ్యి ట్యాంకులు ఎలా తిరిగి వచ్చాయి? చంద్రబాబు చెప్పినట్టుగా ఆ నెయ్యిని వాడి ఉంటే అది ఈ ప్రభుత్వ వైఫల్యం కాదా? ప్రస్తుత టీటీడీ చైర్మన్, అప్పటి టీటీడీ ఈవో ఇద్దరూ ఏం చేస్తున్నారు? వాళ్లిద్దరిపై కేసులు పెట్టి ఎందుకు అరెస్టు చేయలేదు? పైగా మాపై నిందలు వేస్తారా? చంద్రబాబు ముఠాకు దేవుడంటే భయం, భక్తీ లేదు. దుర్మార్గమైన అసత్యాలు ప్రచారం చేయడమే వీళ్ల పని. పైగా చంద్రబాబు వేసిన సిట్.. వ్యక్తులను ఇరికించాలనే ఆరాటం, తపన, తాపత్రయంతో తప్పులపై తప్పులు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. 2014–19 మధ్య కిలో నెయ్యి రూ.276–రూ.314మరి అదంతా కల్తీ నెయ్యేనా బాబూ? స్వచ్ఛమైన నెయ్యి రూ.320కే మీరు ఎలా సప్లయ్ చేయిస్తారు? అని చంద్రబాబు, ఆయన పార్టీకి చెందిన నాయకులు ప్రశ్నలు వేశారు. నాణ్యమైనది కావాలంటే కిలో రూ.3 వేలు అవుతుందని ప్రకటించారు. చంద్రబాబు గెజిట్ పత్రిక ఈనాడు అయితే కనీసం రూ.1,000–రూ.1,600 అని రాసింది. మరి టీటీడీలో ఇప్పుడు నెయ్యి ఎంతకు కొంటున్నారు? రూ.3 వేలు ఇస్తున్నారా? రూ.1,600 లేక రూ.1,000 ఇచ్చి కొంటున్నారా? 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో ఐదేళ్లూ కిలో నెయ్యి రూ.276–314 మధ్య కొన్నాడు. ఇది రూ.320 కంటే తక్కువ కదా? కాబట్టి అదంతా కల్తీ నెయ్యేనా? దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. పైగా భోలే బాబా డెయిరీ విషయంలో చేస్తున్న దు్రష్పచారం అంతా ఇంతా కాదు. 2018 జూన్ 26న టీటీడీ బోర్డు మినిట్స్ చూస్తే భోలేబాబా ఎవరో తేలింది. హర్‡్ష ఫ్రెష్ డెయిరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్.. భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్గా మారింది. ఈ సంస్థ టీటీడీకి పాలు సప్లై చేయడానికి డీమ్డ్ టు క్వాలిఫై అని సర్టిఫై చేసింది చంద్రబాబు హయాంలోనే. తిరుమలకు నెయ్యిని అనేక కంపెనీలు సప్లయ్ చేస్తుంటాయి. ప్రతి 6 నెలలకోసారి టెండర్లు పిలుస్తుంటారు. ఎవరు తక్కువకు కోట్ చేస్తారో వారి దగ్గర నుంచి కొంటారు. ఇది సాధారణంగా జరిగే ప్రొసీజర్. టెండర్లలో ఎల్–1 ఎవరుంటారో వారికి కేటాయిస్తారు. ఇందులో రాజకీయ ప్రమేయం ఉండదు. దేవుడి పేరుతో రాజకీయాలు చేయడానికి వీళ్లు ప్రయతి్నస్తున్నారు. నెయ్యిని సప్లై చేసే ఏ కంపెనీ అయినా కచ్చితంగా ఏన్ఏబీఎల్ సర్టిఫికెట్ తీసుకోవాలి, టీటీడీలో ఉన్న ల్యాబ్లో టెస్టులు పాసవ్వాలి. అప్పుడే ట్యాంకులు లోపలకు వెళ్తాయి. దుష్ప్రచారం ఆపాలని సుప్రీంకు వెళ్లింది మేం కాదా? టీటీడీ లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం ఆపాలని, నిజాలు బయటకు తీసుకురావాలని సుప్రీం కోర్టుకు వెళ్లింది వైవీ సుబ్బారెడ్డే. అంతేగానీ టీడీపీ వాళ్లు కాదు. అలాంటిది.. సుబ్బారెడ్డిపై అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి ఇంటికి ఎప్పుడైనా వెళ్లారా? హైదరాబాద్లో ఆయన ఇంట్లోనే గోపూజ జరుగుతుంది. ఆయన 1978 నుంచి 35–40 సార్లు అయ్యప్పమాల ధరించి కొండకు వెళ్లి ఉంటారు. అందులోనూ ఆయనది గురుస్వామి స్థానం. అలాంటి వ్యక్తిపై ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో మీకే తెలియాలి. టీటీడీలో స్కాములన్నీ బాబువే! పరకామణి కేసులో దొంగను పట్టుకున్న పోలీసు అధికారి మరణించేలా చంద్రబాబు వ్యవస్థలను దిగజార్చాడు. ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ రూ.72 వేల విలువైన అమెరికన్ డాలర్లను చోరీ చేస్తూ ఓ వ్యక్తి దొరికిపోయాడు. ఆ దొంగను పట్టుకోవడం నేరం అవుతుందా? దీనికి ప్రాయశ్చిత్తంగా ఆ దొంగ కుటుంబ సభ్యులు రూ.14 కోట్లు విలువైన ఆస్తులను దేవుడికి ఇవ్వడం తప్పు అవుతుందా? దేశంలో అనేక చోట్ల, అనేక ఆలయాల్లో ఇలాంటి ఘటనలు గతంలో జరిగాయి. కానీ, ఎక్కడైనా ఇలా ఆస్తులు దేవుడికి ఇచ్చారా? ఈ దొంగ దొరికినప్పుడు కేసు నమోదు అయ్యింది. తిరుపతి కోర్టులో చార్జిషీట్ వేశారు. మెగా లోక్ అదాలత్ కోర్టులో కేసును పరిష్కరించారు. అన్నీ కోర్టుల పరిధిలో ప్రాపర్ కోర్టు ప్రొసీజర్తో జరిగాయి. జ్యుడీషియల్ ప్రాసెస్ అంతా జరిగింది. ఇందులో సాంకేతిక పరమైన అంశాలు ఏమైనా ఉంటే దర్యాప్తు చేసుకోవచ్చు తప్పులేదు. కానీ, రాజకీయాల కోసం ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ చైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి ఉన్నాడనో.. భూమన కరుణాకర్రెడ్డి ఉన్నాడనో.. వారి మీద బురదజల్లాలని తప్పుడు స్టేట్మెంట్ కోసం అక్కడ పనిచేస్తున్న బీసీ పోలీస్ అధికారిని వేధించి, వెంటాడి, బెదిరించి, చివరకు ఆయన చనిపోయేలా చేశారు. ఆ మరణానికి ఎవరో కారణం అంటూ ఎల్లో మీడియా చేత తప్పుడు కథనాలు రాయించారు.మీ హయాంలో పట్టుకోలేదేం బాబూ? ఆ దొరికిన దొంగ... 30 ఏళ్ల నుంచి జీయర్ స్వామి మఠంలో క్లర్క్గా పనిచేస్తున్నాడు. పరకామణి లెక్కింపులో ఎన్నో ఏళ్ల నుంచి పాల్గొంటున్నాడు. కొత్తగా మా ప్రభుత్వంలో వచి్చన వ్యక్తి కాదు. మరి గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఎందుకు పట్టుకోలేకపోయారు? ఆ దొంగను మేం పట్టుకున్నాం. వాస్తవానికి మేం వచ్చిన తర్వాత మా ప్రభుత్వంలో తిరుమల హుండీ డబ్బు లెక్కింపు ప్రక్రియను ఇంకా పారదర్శకంగా చేశాం. దేవుడి సొమ్ము దొంగల పాలు కాకూడదని రూ.23 కోట్లు ఖర్చు పెట్టి కొత్త పరకామణి బిల్డింగ్ కట్టాం. అత్యాధునిక కెమెరాలతో నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశాం. దాన్ని సీఎం హోదాలో నేను ప్రారంభించా. 2023 ఫిబ్రవరి 5 నుంచి ఆ బిల్డింగ్లో పూర్తి స్థాయి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పాత భవనంలో అరకొరగా సీసీ కెమెరాలు ఉండేవి. రికార్డింగ్ క్వాలిటీ కూడా తక్కువే. బ్లయిండ్ స్పాట్స్ ఎక్కువ. వాటిని అన్నింటినీ మారుస్తూ కొత్త భవనంలో 360 డిగ్రీల కవరేజ్తో 4కే హెచ్డీ సీసీ టీవీ వ్యవస్థలు, హైబ్రీడ్ నైట్ విజన్ కెమెరాలు, ఎక్కువ రోజులు డేటా ఉండేలా మల్టీ టీమ్ రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్స్ తెచ్చాం. ఇవన్నీ చేసిన తర్వాత ఏప్రిల్ 4, 2023లో దొంగతనం చేస్తూ ఈ వ్యక్తి పట్టుబడ్డాడు. ఇప్పుడు చెప్పండి.. ఎవరు మంచివారు? ఇంత గొప్ప వ్యవస్థను సృష్టించినందుకు మాపై నిందలా..? ఆ వ్యక్తి దశాబ్దాలుగా ఇదే పనిచేస్తున్నాడని అనుకోవచ్చు. కానీ చంద్రబాబు హయాంలో ఎవరూ పట్టుకోలేదు. మా హయాంలో పట్టుకున్నాం. గతంలో ఏం జరిగిందో దేవుడికే తెలుసు. రూ.72 వేల విలువైన అమెరికన్ డాలర్లు దొరికితే.. ఏకంగా రూ.14 కోట్ల ఆస్తిని ఆ కుటుంబం దేవుడికి రాసిచ్చింది. న్యాయ వ్యవస్థపైనే దాడి..! చంద్రబాబు తనకు అనుకూలంగా లేకుంటే వ్యవస్థలపై సైతం దాడి చేయించడం పరిపాటే. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, అధికార ప్రతినిధి వర్ల రామయ్యతో మాట్లాడిస్తున్న మాటలు న్యాయ వ్యవస్థపై దాడి చేయించినట్లే! (వర్ల వీడియోను ప్రదర్శించారు)! ‘‘23–9–2025: ప్రాపర్టీ ఓనర్ ఎవరు? కోర్టు కూడా తప్పు చేసిందా.. అనుమానం వస్తుంది. హైకోర్టు చీఫ్ జస్టిస్ను కోరుతున్నా.. మీ తరఫున దర్యాప్తు చేయించాలి. ఈ కేసులు సీరియస్. ఎందుకు లోక్ అదాలత్తో దర్యాప్తు చేయిస్తారు? తిరుపతిలో రూమర్స్ వస్తున్నాయి. ఈ జడ్జిగారికి పైనుంచి ఎవరో మరో జడ్జి చెప్పారట. నేను జడ్జి ఎవరని అడగట్లేదు. అందరం మనుషులమే. ఈ జడ్జికి పైనుంచి ఎవరో జడ్జి చెప్పారట. ఏ జడ్జి చెప్పినా.. ఇన్స్పెక్టర్ దర్యాప్తు చేసినా.. అన్యాయం జరిగింది మాత్రం స్వామి వారికే. 13–11–2025: తమిళనాడులో రిజిస్టర్ చేశారట ఆస్తులు. దీని వెనుక జడ్జి ఉన్నారని చెబుతున్నారు. రూ.50 లక్షల స్టాంపు డ్యూటీ కట్టారట. ఆ రూ.50 లక్షలు ఎవరు కట్టారు? జడ్జిలు, టీటీడీ అధికారులపై నిందలు సిగ్గుచేటు.. ఇలా ఏకంగా న్యాయవ్యవస్థపైనే చంద్రబాబు దాడి చేస్తున్నారు. తిరుపతి జడ్జి, లోక్ అదాలత్ జడ్జిపైనే కాకుండా, ఒక సుప్రీంకోర్టు పెద్ద జడ్జి ఒత్తిడి తెచ్చారని దు్రష్పచారానికి తెగబడ్డారు. పెద్ద జడ్జిల గురించి వీళ్లు మాట్లాడుతున్నారు. ధర్మం తెలిసిన మనుషులుగా, చట్టాలు తెలిసిన వ్యక్తులుగా టీటీడీకి మంచి చేయడం కోసం ఒక మంచి పరిష్కారం చూపుతూ ఈ జడ్జిలు సమస్య పరిష్కారంలో భాగస్వామ్యం అవ్వడం తప్పా? తిరుమలకు పెద్ద పెద్ద సీనియర్ జడ్జిలు వస్తుంటారు. ఇలాంటి కేసులు ఏమైనా జరిగినప్పుడు తిరుపతిలో ఉన్న జడ్జిలు, సుప్రీం కోర్టు జడ్జిల దాకా కూడా మాట్లాడుకుంటారు. ఇలాంటి ముఖ్యమైన కేసుల్లో, దేశం మొత్తం చూస్తున్న కేసులో సలహాలు కోరతారు. జ్యుడీషియల్ పరిధిలో సలహాలు తీసుకుంటారు. ఏ తప్పూ జరగలేదు, ఏ తప్పూ చేయలేదు కాబట్టి సలహాలు తీసుకొని, ఇంప్లిమెంట్ చేశారేమో..! దాంట్లో రాజకీయం చేయడానికి ఏముంది? జడ్జిలపై, టీటీడీ అధికారులపై నిందలు వేయడం సిగ్గుచేటు. ఒక్కొక్కరికి ఒక్కో న్యాయమా? టీడీపీ స్టాండ్ ఎలా ఉంటుందంటే.. ఈ ఏడాది సెపె్టంబర్ 1న చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే, అత్యంత విశిష్టత కలిగిన సింహాచలంలో రూ.55 వేలు హుండీ డబ్బులు చోరీ చేస్తూ దేవస్థానం ఉద్యోగి రమణ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సురేష్ పట్టుబడ్డారు. ఉద్యోగి రమణను సస్పెండ్ చేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సురేష్ ను పోలీసులకు అప్పగించి, ఆ వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు. ఆ వ్యకిని ఎందుకు జైల్లో పెట్టలేదు? మరి చంద్రబాబు దీనిపై ఎందుకు విచారణ చేయలే దు? మొత్తం వారిద్దరి ఆస్తులపై విచారణ చేసి, వాటిని మొత్తం ఎందుకు స్వా«దీనం చేసుకోలేదు? పైగా సింహాచలం ఆలయానికి ధర్మకర్త టీడీపీకి చెందిన అశోక్ గజపతిరాజు. వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్రెడ్డి చైర్మన్గా ఉంటే ఒక న్యాయం..! అదే అశోక్ గజపతిరాజు ధర్మకర్తగా ఉంటే ఇంకో న్యాయం..! మరి ఆయన మీద విచారణ ఎందుకు చేయడం లేదు? ఎక్కడైనా న్యాయం ఒక్కటే కదా!!టీటీడీలో బాబు స్కాములు ఇవీ...!రాష్ట్రంలో దేవుడి సొమ్ముతో స్కామ్లు చేసింది చంద్రబాబే. తిరుచానూరు మార్కెట్ యార్డ్ నుంచి కపిలతీర్థం వరకు శ్రీనివాస సేతు 6 కిలోమీటర్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతిపాదన చేశారు. ఇందులో 67 శాతం ఖర్చు టీటీడీ, 33 శాతం ప్రభుత్వం పెట్టాలని నిర్ణయించారు. అప్పటి తిరుపతి కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ను చంద్రబాబు పిలిపించుకుని రూ.684 కోట్లతో శ్రీనివాససేతు కట్టేయమని చెప్పారు. అయితే, ఆ మీటింగ్లో టీటీడీ ప్రతినిధులు లేకుండానే.. ఏకంగా 67 శాతం డబ్బులు టీటీడీ నుంచి తీసుకునేలా నిర్ణయం తీసేసుకున్నారు. అసలు బోర్డు అనుమతి, ఆమోదం లేకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారు? ఇది కాదా స్కామ్? మన ప్రభుత్వం వచ్చాక టీటీడీ బోర్డు రీ విజిట్ చేసి రూ.40 కోట్లు ఖర్చు తగ్గించింది. కొత్త బోర్డు రాకపోయి ఉంటే ఆ రూ.40 కోట్లు ఎవరి జేబుల్లోకి పోయేవి? కమీషన్ల కోసం కక్కుర్తి! టీటీడీ డబ్బుల్లో 10 శాతానికి మించి ప్రైవేట్ బ్యాంకుల్లో జమ చేయకూడదు. ఇది టీటీడీ రూల్. చంద్రబాబు హయాంలో కమీషన్లకు కక్కుర్తిపడి రూ.1,300 కోట్లు ఎస్ బ్యాంక్లో పెట్టించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచి్చన తర్వాత బోర్డు ఆ నిర్ణయాన్ని రీవిజిట్ చేసి ఎస్ బ్యాంక్ నుంచి ఆ డబ్బును విత్ డ్రా చేసి జాతీయ బ్యాంకులో పెట్టింది. ఆ తర్వాత మూడు నెలలకు ఎస్ బ్యాంక్ ఆర్థికంగా కుదేలయ్యింది. ఒకవేళ చంద్రబాబు పెట్టిన రూ.1,300 కోట్లు ఎస్ బ్యాంక్లోనే ఉండి ఉంటే ఆ డబ్బు ఏమయ్యేది? మరి ఏది స్కామ్? మాకు ఇవన్నీ తెలిసినా కూడా టీటీడీ కాబట్టి రాజకీయాల్లో లాగకూడదని సమస్య పరిష్కరించి, సరిదిద్దాం. మన ఇప్పుడు వీళ్లు చేసేవి చూస్తుంటే అసలు ఏమీ జరగకపోయినా, మంచి చేసే కార్యక్రమం జరిగినా దాన్ని వక్రీకరిస్తూ, రివర్స్ అబద్ధాలు చెబుతున్నారు. వాస్తవానికి టీటీడీ ఒక స్వతంత్ర వ్యవస్థ. కొన్ని శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ విధానాలను తిరుమల తిరుపతి దేవస్థానంలో అమలు చేస్తున్నారు. అలాంటి ఆలయాన్ని, ఏకంగా దేవుడి ప్రతిష్టను మంటగలుపుతున్నామనే కనీస ధ్యాస కూడా లేకుండా, వెంకటేశ్వరస్వామి ప్రతిష్టను దిగజారుస్తూ చంద్రబాబు అత్యంత హేయమైన రాజకీయాలు చేస్తున్నారు. అది చంద్రబాబు సొంత సిట్! లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు వేసిన సిట్ చూస్తే వాళ్ల బాగోతం తెలిసిపోతుంది. సిట్లో ఉన్న గోపీనాథ్ జెట్టి.. ఎన్టీఆర్ ట్రస్టులో ట్రస్టీగా పని చేసిన కృష్ణయ్యకు అత్యంత సమీప బంధువు (ఎన్టీఆర్ ట్రస్టులో ట్రస్టీగా సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో దిగిన ఫొటో ప్రదర్శించారు). కృష్ణయ్యపై చంద్రబాబుకు ఎంత ప్రేమ అంటే.. రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఎన్టీఆర్ ట్రస్టులో ట్రస్టీగా పెట్టుకున్నారు. ఇన్నేళ్ల తర్వాత ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చైర్మన్ను చేశారు. ఇలాంటి వ్యక్తి సమీప బంధువు సిట్ ఆఫీసర్లలో ఒకరు. మరో ఆఫీసర్ డీఐజీ త్రిపాఠి. ఈ సర్వశ్రేష్ట త్రిపాఠి ఎలాంటి వాడో చెప్పాల్సిన పనిలేదు. పల్నాడు జిల్లాలో ఆయన సృష్టించిన అల్లకల్లోలం ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేదు. తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడం కోసం భుజాన వేసుకుని పాకులాడారు. ఆ తర్వాత చంద్రబాబు ఈ అధికారిని పక్కన కూర్చోబెట్టుకుని డీఐజీ స్థానం ఇచ్చి.. ఆయన చేస్తున్న మాఫియా కలెక్షన్లలో ప్రముఖ ప్రధాన పాత్ర ఇచ్చారు. ఇలాంటోళ్లు అందరూ సిట్లో ఉన్నారు. మరోవైపు వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్న అనే ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి అతను వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి (వీపీఆర్) పీఏ. వీపీఆర్ ఒక టీడీపీ ఎంపీ. ఆయన దగ్గర నుంచి ప్రతి నెలా అప్పన్న జీతం (చెక్కులు) తీసుకుంటున్నాడు. పైగా ఏపీ భవన్ ఉద్యోగి. వీపీఆర్ పీఏ, తర్వాత ఏపీ భవన్ ఉద్యోగి. మరి వైవీ సుబ్బారెడ్డి పిక్చర్లోకి ఎలా వచ్చారు? ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు ఎంతసేపూ వైవీ సుబ్బారెడ్డి పీఏ అని గోబెల్స్ ప్రచారం చేస్తూ డ్రిల్ చేస్తున్నారు!. -
ఆ 53 వేల ఎకరాలకే దిక్కులేదు..
అధికారంలో ఉంటే చంద్రబాబుకు స్కాములే గుర్తుకొస్తాయి. ఎవరెవరికి భూమి ఇవ్వాలి? ఎవరెవరి దగ్గర ఎంత పుచ్చుకోవాలి? చదరపు అడుగు నిర్మాణం రూ.4 వేలు అయ్యే దగ్గర ఎలా రూ.10 వేలకు కాంట్రాక్ట్ ఇవ్వాలి? నేషనల్ హైవేలు కిలోమీటర్కు రూ.25 కోట్లు అయ్యే చోట రూ.54 కోట్లు పెట్టి ఎలా దండుకోవాలి? కాబట్టి రాజధానిలో పనులు నిరంతరం జరుగుతుండాలనేది ఆయన ఉద్దేశం. అందుకే ఇలా అన్నీ స్కాములు. - వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణానికి గతంలో తీసుకున్న 53 వేల ఎకరాలకే దిక్కులేదు.. ఇప్పుడు రైతుల నుంచి ఇంకో 53 వేల ఎకరాలు తీసుకోవడానికి సీఎం చంద్రబాబు వెనుకాడటం లేదని వైఎస్ జగన్ మండిపడ్డారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సూటిగా, స్పష్టంగా సమాధానం చెప్పారు. రాజధానిలో రెండో విడత భూ సమీకరణపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ‘అమరావతి గురించి మీరే చెప్పాలి. ఇంతకు ముందు అంతా చంద్రబాబు ఏమన్నాడు? 2014–19 మధ్య 53 వేల ఎకరాలు తీసుకుంటూ అసలు ఇది ఇంటర్నేషనల్ రాజధాని.. సింగపూర్, గింగపూర్ ఎక్కడికి పోవాలో.. మన దగ్గర నుంచే ఏదైనా కానీ.. మన రాజధానిని చూసి వాళ్లు కాపీ కొట్టే పరిస్థితుల్లోకి దీన్ని బిల్డప్ చేస్తున్నానని మనకు బాహుబలి సెట్టింగ్స్ చూపించారు. ఆ 53 వేల ఎకరాల్లో ఆయన రాజధాని కట్టింది ఎంత? రాజధాని కట్టడం కథ దేవుడెరుగు.. ఆ 53 వేల ఎకరాల్లో రోడ్లు వేయడానికి, కరెంటు ఇవ్వడానికి, డ్రెయినేజీ కనెక్షన్లు ఇవ్వడానికి, నీళ్లు ఇవ్వడానికి.. వీటికే ఎకరాకు రూ.2 కోట్లు అవుతుందని తానే డీపీఆర్ ఇచ్చాడు. అంటే ఆ 53 వేల ఎకరాలకే లక్ష కోట్ల రూపాయలు కావాలని సినిమా చూపిస్తూ రూ.5 వేల కోట్లు పెట్టాడు. మళ్లీ ఈ రోజు ఏం చేస్తున్నాడు? ఆ 53 వేల ఎకరాలు సరిపోదు అంటున్నాడు.’ అని చెప్పారు.స్కాముల కోసమే అది చాలదంటున్నారు‘ఆ రోజేమో సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అన్నాడు. 8 వేల ఎకరాలు మిగిలిందని, దాంతోనే రాజధాని అయిపోతుందని చెప్పాడు. మళ్లీ ఈ రోజు అది చాలదంటున్నాడు. అధికారంలో ఉంటే ఆయనకు స్కాములే గుర్తుకొస్తాయి. ఎవరెవరికి భూమి ఇవ్వాలి? ఎవరెవరి దగ్గర ఎంత పుచ్చుకోవాలి? చదరపు అడుగు నిర్మాణం రూ.4 వేలు అయ్యే దగ్గర ఎలా రూ.10 వేలకు కాంట్రాక్ట్ ఇవ్వాలి. నేషనల్ హైవేలు కిలోమీటర్కు రూ.25 కోట్లు అయ్యే చోట రూ.54 కోట్లు పెట్టి ఎలా దండుకోవాలి? ఇలా అన్నీ స్కాములే కాబట్టి రాజధానిలో పనులు నిరంతరం జరుగుతుండాలనేది ఆయన ఉద్దేశం. ఇక్కడ జరిగేది ఒక్కటే... ఈయన, ఈయన బినామీలు ముందుగానే ల్యాండ్ కొంటారు. కొన్న తర్వాత ఆ పక్కన భూములను ల్యాండ్ పూలింగ్లో తీసుకుంటారు. ఆ తర్వాత తన బినామీలకు మాత్రం ప్లాట్లు ఇచ్చుకోవాల్సిన చోట ఇచ్చుకుంటాడు. మిగిలిన వాళ్లకు ప్లాట్లు వేరే చోట ఇస్తాడు. అక్కడ ఎప్పటికీ అభివృద్ధి జరగదు. అంటే మిగతా వాళ్లు గాలికి పోతారు. వేసే రోడ్లు ఏవో వీళ్ల మనుషులకు ప్లాట్లు ఇచ్చిన చోట వేసుకుంటారు’ అని చెప్పారు. చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తనపై ఉన్న అవినీతి కేసులు తీసేయించుకుంటున్నారన్న ప్రశ్నకు వైఎస్ జగన్ స్పందిస్తూ.. ‘ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయస్థానాల ద్వారానే పోరాటం చేయగలుగుతాం. ఎండ్ ఆఫ్ ద డే.. పై నుంచి దేవుడు చూస్తుంటాడు. ప్రజాస్వామ్యంలో ప్రజలు చూస్తుంటారు. దేవుడు, ప్రజలే చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి’ జగన్ అన్నారు. -
చినబాబు డైరెక్షన్లోనే పేదల ఇళ్లు నేలమట్టం
‘‘ నాపేరు డి.నాగరాజు. తినీతినక కష్టపడిన సొమ్ముతో 9 ఏళ్ల క్రితం విజయవాడ జోజినగర్లో స్థలం కొనుక్కున్నాను. కార్పొరేషన్లో ప్లాన్ తీసుకొన్నాను. బ్యాంకు రుణంతో ఇల్లు కట్టుకున్నా. నా కళ్లముందే ఆ ఇంటిని బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. ఈ నెలాఖరు వరకు సమయం ఉందని కోర్టు ఉత్తర్వు చూపించినా కోర్టు అమీనాగానీ, పోలీసులుగానీ పట్టించుకోలేదు. కోర్టు ఆర్డర్ కాపీని ఫోన్లో చూపిస్తుంటే లాయర్, అమీనా వెటకారంగా మాట్లాడారు. వ్యవస్థలు అమ్ముడు పోతుంటే నాలాంటి సామాన్యులు ఎలా బతకాలి? నాలుగు నెలల నుంచి నరకం చూపించారు. ఉన్న పళంగా నడిరోడ్డుపైకి నెట్టారు’’ – ఇదీ చంద్రబాబు పాలనలో ఓ బాధితుడి ఆక్రోశం సాక్షి ప్రతినిధి,విజయవాడ/భవానీపురం(విజయవాడపశ్చిమ): చంద్రబాబు కూటమి ప్రభుత్వం పేద కుటుంబాలపై కత్తిగట్టింది. కోర్టు ఉత్తర్వులను సాకుగా చూపి బలవంతంగా విజయవాడ జోజినగర్లోని 42 ఇళ్లను బుధవారం నేలమట్టం చేసింది. రూపాయిరూపాయి కూడబెట్టుకొని, స్థలం కొని ఇళ్లు కట్టుకొన్న పేదల జీవితాలను రోడ్డు పాలు చేసింది. విజయవాడ నడిబొడ్డున్న ఉన్న కోట్లాది రూపాయల విలువ చేసే 2.17 ఎకరాల స్థలంపై కన్నేసిన పచ్చనేతలు పక్కా ప్రణాళికతో వ్యవస్థలను మెనేజ్ చేశారు. చినబాబు, పార్లమెంటు ప్రజాప్రతినిధి డైరెక్షన్లో సుప్రీం కోర్టులో స్టే ఉన్నప్పటికీ ఆగమేఘాలపై 42 ఇళ్లను నేలమట్టం చేశారు. పేదలను నడిరోడ్డు మీదకి తీసుకొచ్చారు. ఈ తతంగం వెనుక కోట్ల రూపాయలు చేతులు మారినట్లు భాదితులు బహిరంగానే విమర్శిస్తున్నారు. బహుళ అంతస్తుల నిర్మాణం కోసమే! విజయవాడ నడిబొడ్డున జోజినగర్లో ఉన్న ఈ భూమి రూ.కోట్లు విలువ చేస్తుంది. ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నుంచి ఈ స్థలాన్ని తొలుత ఒకరికి అగ్రిమెంటు చేశారు. వారు స్పందించక పోవడంతో 1980 ప్రాంతంలో స్థల యజమాని మరో వ్యక్తికి విక్రయించారు. ఆ కొనుగోలు చేసిన వ్యక్తి ప్లాట్లు వేసి 42 మందికి విక్రయించి రిజి్రస్టేషన్లు చేశారు. ఇందులో కార్పొరేషన్ నుంచి ఇళ్ల నిర్మాణకోసం అవసరమైన అనుమతులు, విద్యుత్, తాగునీరు కనెక్షన్లు తీసుకున్నారు. బ్యాంకు నుంచి రుణాలు పొంది ఇళ్లు నిరి్మంచుకున్నారు. వీటిలో చాలా ఇళ్లు ఇప్పటికే పలువురి చేతులు మారి రిజి్రస్టేషన్లు జరిగాయి. అయితే స్థలం తొలుత అగ్రిమెంటు చేసుకున్న వ్యక్తి నుంచి పొందిన కాగితాల సాయంతో పచ్చనేతలు దొడ్డిదారిన ఓ సొసైటీని ఏర్పాటు చేసి, వారికి అనుకూలంగా అన్ని రకాల పత్రాలు సిద్ధం చేసుకుని చక్రంతిప్పారు. కోర్టు ద్వారా స్థలాన్ని కాజేయడానికి తీవ్ర యత్నం చేసి సఫలీకృతులయ్యారు.బహుళ అంతస్తుల నిర్మాణానికి బెంగళూరుకు చెందిన బడా వ్యక్తులు, చినబాబు, పార్లమెంటు ప్రజాప్రతినిధి డైరెక్షన్లో బుల్డోజర్లతో కూల్చివేతలకు ఒడిగట్టారు. దీంతో బాధితులు రోడ్డున పడ్డారు. ఒకవేళ తమ రిజిస్ట్రేషన్లు అక్రమమైతే వాటిని చేసిన అధికారులపైనా, భవన నిర్మాణానికి అనుమతులిచ్చిన మున్సిపాలిటీ అధికారులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన ఉద్ధృతం ఇళ్లు కోల్పోయిన బాధితుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆందోళనలను వారు ఉద్ధృతం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ గోడు వినిపించుకునేందుకు బాధితులు బుధవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి వద్దకు వెళ్లారు. అయితే వారిని పోలీసులు అనుమతించలేదు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం.. కూల్చివేతలపై స్టే ఉందని, తాము ఖాళీ చేసేందుకు ఈనెలాఖరు వరకు సమయం ఉందని చెప్పినా అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంలో బుధవారం వాదనలు ఉన్నాయని, నాలుగు గంటలపాటు సమయం ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. గురువారం ఉదయం భవానీ పురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళల పట్ల అధికారులు అసభ్యంగా ప్రవర్తించారని, శ్రీలక్ష్మి రామ కో–ఆపరేటివ్ సొసైటీ అక్రమాలకు పాల్పడుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత బాధితులు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయానికి వెళ్లి «న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగారు. ఎన్నికల సమయంలో తమ సమస్యను వివరిస్తే న్యాయం చేస్తామన్న కూటమి నేతలు ఇప్పుడు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పోలవరం రిజర్వాయర్ కాదు.. బ్యారేజే
సాక్షి, అమరావతి: పోలవరం జలాశయం కాదు.. కేవలం బ్యారేజ్ మాత్రమేనని గురువారం లోక్సభలో కేంద్ర జల్శక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ పరోక్షంగా తేల్చిచెప్పారు. ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.30,436 కోట్లని తెలిపారు. సకాలంలో ప్రాజెక్టును పూరి చేయడం కోసం రూ.12,157 కోట్లను అదనపు సహాయం కింద కేంద్రం ఇస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.20,658 కోట్లు విడుదల చేశామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో నదుల అనుసంధానంపై టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అడిగిన ప్రశ్నకు మంత్రి సీఆర్ పాటిల్ రాతపూర్వకంగా సమాధానం చెప్పారు. పోలవరం ప్రాజెక్టు 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లుగా కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) 2019లో ఆమోదించింది. గోదావరి ట్రిబ్యునల్ అనుమతి ఇచి్చన మేరకు 45.72 మీటర్ల గరిష్ఠమట్టంలో నీటిని నిల్వచేసేలా పోలవరాన్ని పూర్తిచేయాలంటే ఆ మేరకు నిధులు అవసరం. కానీ.. పోలవరం ప్రాజెక్టులో నీటినిల్వ కనీసమట్టం (ఎండీడీఎల్) 41.15 మీటర్లకే పరిమితం చేస్తూ.. ప్రాజెక్టును పూర్తిచేసేలా 2024 ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ మేరకు పనులు పూర్తిచేయడానికి సవరించిన అంచనా వ్యయం రూ.30,436 కోట్లుగా తేల్చింది. ఇప్పటిదాకా విడుదల చేసిన నిధులు పోను.. ప్రాజెక్టును పూర్తిచేయడానికి అవసరమైన రూ.12,157 కోట్లను విడుదల చేస్తామని పేర్కొంది. ప్రాజెక్టును 2027 మార్చిలోగా పూర్తిచేయాలని షరతు పెట్టింది. పోలవరంలో 41.15 మీటర్ల ఎత్తుకే నీటినిల్వను పరిమితం చేస్తే.. 115.4 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేయవచ్చు. కానీ.. ఆ స్థాయిలో నీటిని నిల్వచేస్తే కుడి, ఎడమ కాలువల కింద 7.20 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదని, కేవలం 1.98 లక్షల ఎకరాలకే.. అదీ గోదావరి వరదల సమయంలో మాత్రమే నీటిని అందించే అవకాశం ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. 45.72 మీటర్ల ఎత్తులో 194.6 టీఎంసీలను నిల్వచేస్తే పోలవరం ఆయకట్టు 7.20 లక్షల ఎకరాలతోపాటు కృష్ణా డెల్టాలో 13.8 లక్షలు, గోదావరి డెల్టాలో 10.13 లక్షల ఎకరాలను స్థీరికరించడంతోపాటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 63.8 టీఎంసీలను సరఫరా చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. కానీ.. పోలవరంలో నీటినిల్వ ఎత్తును 41.15 మీటర్లకే కేంద్ర కేబినెట్ పరిమితం చేస్తూ తీర్మానం చేసినా ఆ సమావేశంలో ఉన్న టీడీపీ మంత్రులు నోరుమెదపలేదు. ఇక లోక్సభలో గురువారం పోలవరం సవరించిన అంచనా వ్యయం రూ.30,436 కోట్లేనని కేంద్ర జల్శక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ రాతపూర్వకంగా తేల్చిచెప్పినా టీడీపీ ఎంపీలు మౌనం దాల్చారు. అంటే.. పోలవరంలో 41.15 మీటర్ల ఎత్తువరకే నీటినిల్వను పరిమితం చేస్తూ ప్రాజెక్టును పూర్తిచేయడానికి నిధులు ఇస్తున్నామని కేంద్రం మరోసారి స్పష్టం చేసినట్లు అర్థమవుతోంది. నీటినిల్వను 41.15 మీటర్లకు పరిమితం చేస్తే.. పోలవరం రిజర్వాయర్ కానేకాదని.. కేవలం బ్యారేజీగా మిగిలిపోతుందని నీటిపారుదలరంగ నిపుణులు చెబుతున్నారు. 2005లోనే గోదావరి–కృష్ణా అనుసంధానం ఇక పోలవరం (గోదావరి)–విజయవాడ(కృష్ణా) అనుసంధానాన్ని ఎన్డబ్ల్యూడీఏ 1999లో ప్రతిపాదించిందని.. దాన్ని 2005లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిందని కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ చెప్పారు. పోలవరం కుడికాలువ ద్వారా 4,666 మిలియన్ క్యూబిక్ లీటర్ల (164.82 టీఎంసీలు) గోదావరి–కృష్ణా అనుసంధానం చేపట్టందని వివరించారు. పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు పీఎఫ్ఆర్ను 2025 మే 22న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీడబ్ల్యూసీకి సమర్పించిందని తెలిపారు. దానిపై బేసిన్లోని మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతోపాటు కృష్ణా, గోదావరి బోర్డుల అభిప్రాయం కోరామని, వాటి ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
నాలుగొచ్చినా.. నరక‘వేతన’ జీతమేది బాబూ?
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రతి నెలా 1వ తేదీనే వేతనాలు, పెన్షన్లు చెల్లిస్తామంటూ ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన చంద్రబాబు సర్కారు ఈ నెల 4వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు జమ చేయలేదు. కలెక్టరేట్లు, తహసీల్దార్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకూ జీతాలు పడలేదు. వ్యవసాయ, జలవనరులు, పంచాయతీరాజ్, సమాచార, ప్రణాళికా శాఖలో పని చేసే ఉద్యోగులు వేతనాల కోసం ఎదురు చూస్తున్నారు. ఫలితంగా వారు రుణ వాయిదాల చెల్లింపులు.. పిల్లల ఫీజులు, ఖర్చులకు నరకయాతన అనుభవిస్తున్నారు. 3వతేదీన అరకొరగా కొన్నిశాఖల్లో అదీ అతికొద్దిమందికి మాత్రమే జీతాలు జమైనట్టు సమాచారం. దీంతో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు చెల్లింపులను విడతల వారీ తంతుగా చంద్రబాబు సర్కారు మార్చేసిందని మండిపడుతున్నారు. ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తామని గత ఎన్నికల ముందు ప్రతిసభలోనూ ఊదరగొట్టిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలినెల మాత్రమే ఉద్యోగులకు ఒకటో తేదీ చెల్లించారని, ఆ తర్వాత పూర్తిగా చతికిలపడ్డారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతితక్కువ గౌరవ వేతనాలు తీసుకునే ఉద్యోగులకూ సర్కారు చెల్లింపులు చేయలేకపోతోందని ధ్వజమెత్తుతున్నారు. మంగళవారం రూ.3000 కోట్లు అప్పు చేసినప్పటికీ బాబు సర్కారు జీతాలు చెల్లించకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులపై వ్యత్యాసం చూపడమేమిటీ? చంద్రబాబు సర్కారు ఉద్యోగులందరూ సమానం కాదనే ధోరణిలో వ్యవహరిస్తోందని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు ముందుగా వేతనాలు చెల్లిస్తూ ఉద్యోగుల్లో విభజన తీసుకొస్తోందని, అలాగే ఇప్పటికే పలుమార్లు రోడ్డెక్కిన ఉపాధ్యాయులకు 3న జీతాలు జమ చేశారని, మిగతా వారికి చెల్లించలేదని.. ఇలా ఉద్యోగుల్లో విభజన తీసుకురావడం సరికాదని ఉద్యోగవర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. చిరుద్యోగులూ ఎదురు చూపే కూటమి సర్కారులో చిరుద్యోగులు వేతనాల కోసం ప్రతి నెలా ఎదురు చూడాల్సి వస్తోందని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. 104 ఉద్యోగులు, కాంట్రాక్ట్ లెక్చరర్లు, హోంగార్డులు, వీఆర్ఏలుఏ, ఆరోగ్య మిత్రలు వేతనాల కోసం 10–15వ తేదీ వరకు నిరీక్షించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన గురుకులాల్లో పనిచేసే ఉద్యోగులైతే వేతనాల కోసం పోరాటానికి సిద్ధమవుతున్నారు. జనవరి వస్తే ఐదు డీఏలు పెండింగ్ డిసెంబర్ వచ్చేసింది జనవరి వస్తే మొత్తం ఐదు డీఏలు పెండింగ్లో ఉంటాయి. అయితే ప్రభుత్వం ఒక డీఏ మాత్రమే మంజూరు చేసి అదీ మూడు వాయిదాల రూపంలో చెల్లిస్తామని పేర్కొందని, ఇప్పుడు ప్రతీ నెలా వేతేనాలను కూడా 1వ తేదీన కాకుండా విడతల వారీగా పలు తేదీల్లో చెల్లించే విధానాన్ని చంద్రబాబు సర్కారు అమలు చేస్తోందని ఉద్యోగ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏ నెలా ఒకటినే జీతాల్లేవు చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లను పట్టించుకోవడం లేదని, చులకనగా చూస్తోందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకటరామి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో ఏ నెలా ఉద్యోగులందరికీ 1న జీతాలు, పెన్షన్లు ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రతి నెలా ఉద్యోగులు జీతాల కోసం 10వ తేదీ వరకు ఎదురుచూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్ఏలు, హోంగార్డులు లాంటి చిరుద్యోగులకూ జీతాలు ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు. వీఆర్ఏలు గౌరవ వేతనంతో పనిచేస్తారని, ఆ గౌరవ వేతనం కూడా సకాలంలో ఇవ్వకపోడం బాధాకరమన్నారు. రాష్ట్ర సచివాలయంలో పనిచేసే కొంతమంది ఉద్యోగులకు ఒక తేదీన మరో కొంత మందికి మరో తేదీన జీతాలు చెల్లించడం అనేది ఇప్పుడే కొత్తగా చూస్తున్నామని పేర్కొన్నారు. -
వెర్రితలలు వేస్తోన్న రెడ్బుక్ రాజ్యాంగం
తనపై ఉన్న లిక్కర్ కేసును నీరుగార్చేందుకు, కొట్టేయించేందుకు... వైఎస్సార్సీపీ పాలనలో తెచ్చిన మద్యం పాలసీని తప్పుగా చూపిస్తూ లేని లిక్కర్ స్కామ్ను చంద్రబాబు సృష్టించారు. ఇక రాష్ట్రంలో కుటీర పరిశ్రమల్లా కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలు పెట్టింది టీడీపీ వాళ్లే. వీళ్లదే పోలీస్ వ్యవస్థ, వీళ్లవే బెల్టు షాపులు, వీళ్లవే పర్మిట్ రూమ్లు. రెడ్బుక్ పాలనలో వీళ్లుగాక ఇంకెవరికైనా నడిపే ధైర్యం ఉందా? మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్ అసభ్య పదజాలంతో తనను లైంగికంగా వేధిస్తున్నాడని మండలాఫీసు అటెండర్ అయిన ఒంటరి మహిళ ఫిర్యాదు చేయడానికి స్టేషన్కు వెళ్లినా, వాట్సాప్ మెసేజ్లు చూపించినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. బాధ్యత గల ప్రభుత్వమైతే గలీజ్ మెసేజ్లు పెట్టిన పీఏను లోపలేయాలి. –వైఎస్ జగన్సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం వెర్రితలలు వేస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలాలతో వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమ కేసులతో నిర్బంధిస్తూ ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నారని మండిపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే... గత 19 నెలలుగా వీళ్లే ప్రభుత్వంలో ఉన్నారు. ములకలచెరువు, ఇబ్రహీంపట్నం, అనకాపల్లి, ఆముదాలవలస, నెల్లూరు, పాలకొల్లు, రేపల్లె... ఇలా అన్నిచోట్లా కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలు వీళ్లు పెట్టినవే. (రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులతో కల్తీ మద్యం ఫ్యాక్టరీల నిర్వాహకులు దిగిన ఫొటోలు, సీజ్ చేసిన కల్తీ లిక్కర్ బాటిళ్ల ఫొటోలను చూపించారు) కల్తీ మద్యం మీద నచ్చిన బ్రాండ్ పేరుతో లేబుళ్లు వేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ చానల్ కూడా వాళ్లదే. తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నుంచి బీఫాం తీసుకుంటూ ఫొటో దిగారు. ఇబ్రహీంపట్నంలో పట్టుబడ్డ ఆయన పార్టనర్ జనార్దనరావు, సురేంద్రనాయుడులు చంద్రబాబు, లోకేశ్తో ఫొటోలు దిగారు. అనకాపల్లి జిల్లా పరవాడలో స్పీకర్ అయ్యన్నపాత్రుడితో, మంత్రి లోకేశ్తో ఇలా పలుకుబడి కలిగిన టీడీపీ నేతలతో కల్తీ లిక్కర్ మాఫియా నడుపుతున్నవాళ్లు ఎక్కడపడితే అక్కడ ఫొటోలు దిగుతున్నారు. వీళ్లదే పోలీస్ వ్యవస్థ, వీళ్లవే బెల్టు షాపులు, వీళ్లవే పర్మిట్ రూమ్లు. రెడ్బుక్ పాలనలో వీళ్లుగాక ఇంకెవరికైనా నడిపే ధైర్యం ఉందా?. కానీ, ములకలచెరువు కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ను తీసుకుపోయారు. కల్తీ చేసిన జయచంద్రారెడ్డి, ఆయన బావమరిది గిరిధర్రెడ్డి, పీఏ రాజేష్లను ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. వీళ్ల ప్రభుత్వంలో అన్నీ వీళ్లే చేస్తూ, తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో... జోగి రమేష్ కల్తీ చేయిస్తున్నారంటున్నారు. ఇదెక్కడి అన్యాయం. దొంగే దొంగ దొంగ అంటున్నాడు. ఒక మాజీ మంత్రి పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? జోగి రమేష్, ఆయన తమ్ముడిని అరెస్ట్ చేస్తే... మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో పాల్గొన్న రమేష్ కుమారుడిపై కేసులు పెడుతున్నారు.మిథున్ను ఎందుకు అరెస్ట్ చేశారో? అని జడ్జి ఆశ్చర్యపడే పరిస్థితిమద్యం అక్రమ కేసులో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, మిథున్రెడ్డితోపాటు ఇప్పటికే మా పార్టీకి చెందిన ఎంతోమందిని జైలుకు పంపించారు. అసలు మిథున్రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారో? ఆయనకు ఏం సంబంధమో? అని జడ్జి కూడా ఆశ్చర్యపడి తీర్పు రాసే పరిస్థితి. కృష్ణమోహన్రెడ్డి, ధనంజయరెడ్డి, ఎంఎన్సీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, రాజ్ కేసిరెడ్డిలను నిర్బంధించారు. రూ.11 కోట్లు దొరికినట్లుగా చూపిస్తున్నారు. ఆ నోట్లపై ఉన్న నంబర్ల ద్వారా ఏ బ్యాంకులో డ్రా చేశారో? ఎప్పుడు డ్రా చేశారో? చెప్పాలని బాధితులు కోర్టులో పిటిషన్ వేశారు. రెడ్ హ్యాండెడ్గా డబ్బు దొరికితే పక్కనపెడతారు కదా? కానీ, వీళ్లు అన్నీ కలిపేశాం అంటున్నారు. ఆ డబ్బు బయటపడితే ఇంజనీరింగ్ కాలేజీవని తెలుస్తుందని, అది తెలియకుండా లిక్కర్ అని బ్యాండ్ వేసి రూ.11 కోట్లు వీళ్లే పెట్టి కేసులు బిల్డ్ చేస్తున్నారు. వీళ్లు ఏ స్థాయికి పోతున్నారంటే... భాస్కర్రెడ్డి, మిథున్రెడ్డి, కాకాణి గోవర్థన్రెడ్డి, వల్లభనేని వంశీ, పినిపె శ్రీకాంత్పై తప్పుడు కేసులు పెట్టారు. సాక్ష్యాలు సృష్టించి, అధికారులతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పిస్తున్నారు. పోసాని కృష్ణమురళి వంటి సామాన్యులు, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును తప్పుడు కేసులతో అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్లపైనా గంజాయి కేసులు పెడుతున్నారు. విశాఖలో మా పార్టీకి చెందిన విద్యార్థి నాయకుడిపై గంజాయి కేసు పెట్టారు. రైల్వే న్యూ కాలనీలో పట్టుకున్నామని ఎఫ్ఐఆర్లో రాశారు. కానీ, ఇంటి దగ్గర్లోని టిఫిన్ సెంటర్కు వెళ్తుండగా, మద్దిలపాలెం వద్ద పట్టుకున్నట్లు, స్టేషన్కు తరలిస్తున్నట్లు సీసీకెమెరాలో రికార్డైంది. అతడి బైక్ను 14 కి.మీ. దూరంలో ఉన్న రైల్వే న్యూకాలనీకి తీసుకెళ్లారు. ఆ బైక్కు ఉన్న జీపీఎస్ ద్వారా ఈ విషయం తెలిసింది. పోలీస్ స్టేషన్ నుంచి అక్కడికి తీసుకువెళ్లి గంజాయి దొరికిందని చెప్పి కొండారెడ్డిని అరెస్ట్ చేశారు. ఇక బాధ్యత గల ప్రభుత్వమైతే సాలూరులో ఒంటరి మహిళకు గలీజ్ మెసేజ్లు పెట్టిన మంత్రి పీఏను లోపలేయాలి. కానీ, కేసులు పెట్టకపోగా, బాధితురాలు దిక్కుతోచక జర్నలిస్టులకు చెబితే, ఆ వార్త రాసిన ‘సాక్షి’ విలేకరి మీద కేసులు పెట్టారు. ఇది రెడ్బుక్ పాలన వెర్రితలలు వేస్తోందనడానికి నిదర్శనం.పిన్నెల్లిపై 16 తప్పుడు కేసులుమా పార్టీ మాచర్ల నియోజకవర్గం సీనియర్ నాయకుడు, నాలుగు సార్లు ఎమ్మెల్యే అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు వెంకటరామిరెడ్డిని తప్పుడు కేసులో ఇరికించాలని చూస్తున్నారు. టీడీపీకి చెందినవారి గ్రూపుల తగాదాలలో వాళ్లూవాళ్లూ చంపుకొంటే మా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిపై కేసులు పెట్టారు. ఆ ఘటనపై మీడియా సాక్షిగా టీడీపీ హయాంలో... పల్నాడు జిల్లా అప్పటి ఎస్పీ శ్రీనివాసరావు ఏమన్నారో మీరే చూడండి. (ఎస్పీ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ చూపించారు) ‘గుండ్లపాడు గ్రామానికి చెందిన జె.వెంకటేశ్వరరావు అలియాస్ మద్దయ్య, జె.కోటేశ్వరరావును బ్లాక్ స్కార్పియోతో ఢీకొట్టి చంపారు. చనిపోయినవారికి తోట చంద్రయ్య కుటుంబంతో ఎలాంటి బంధుత్వం లేదు. ఇద్దరూ టీడీపీ వారే’ అని ఎస్పీ చెప్పారు. అంతేకాదు హతులు, హంతకులు టీడీపీవారేనని ఏకంగా ట్వీట్ చేశారు. ఈనాడులో కూడా అదే రాశారు. కానీ, ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడిని అరెస్టు చేశారు. ఎక్కడన్నా న్యాయం, ధర్మం ఉందా? ఇలాంటివి చేస్తేనే నక్సలిజం పుడుతుంది. పిన్నెల్లిపై ఈ 19 నెలల్లో 16 తప్పుడు కేసుల పెట్టారు. ఆయన్ను ఇబ్బందులు పెడుతున్నారు. ఎన్నికల సమయంలో రిగ్గింగ్ను అడ్డుకున్నందుకు 54 రోజులు జైల్లో ఉంచారు. -
‘ఏపీలో రైతులు సంక్షోభంలో ఉన్నారు’
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు సంక్షోభంలో ఉన్నారని వైఎస్సార్సీపీ ఎంపీ మేడ రఘునాథ్రెడ్డి పార్లమెంట్ వేదికగా స్పష్టం చేశారు. ఈరోజు(గురువారం, డిసెంబర్ 4వ తేదీ) పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో ఎక్సైజ్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఎంపీ మేడ రఘునాథ్రెడ్డి మాట్లాడుతూ..‘ ఏపీలో పొగాకు, పత్తి, వరి, మామిడి, అరటి రైతులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం పంట నష్టం వివరాలను కూడా నమోదు చేయడం లేదు. ఏపీ పొగాకు రైతుల సమస్యలను పరిష్కరించాలి. గ్రామీణ ప్రాంతాల్లో అనేకమంది పొగాకు పంటపై ఆధారపడి జీవిస్తున్నారు. వారి జీవనోపాధిని దెబ్బతీసేలా ప్రభుత్వ చర్యలు ఉండకూడదు. పొగాకు ఉత్పత్తి పెరగడంతో ధరలు పడిపోయి రైతులు కష్టాలు పడుతున్నారు. పొగాకు రైతులు కనీసం తమ పంట ఖర్చును కూడా తిరిగి రాబట్టుకోలేకపోతున్నారు. వేలాదిమంది రైతులకు ఇదొక పెద్ద సమస్యగా మారింది. రకరకాల కారణాలతో పొగాకును బోర్డు తిరస్కరిస్తుంది. పొగాకు బోర్డు తగిన చర్యల వల్ల రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఏపీ రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలి. ఎక్సైజ్ డ్యూటీ వల్ల పొగాకు రైతులపై పడే ప్రభావాన్ని కేంద్ర ప్రభుత్వం సమీక్ష చేయాలి. పొగాకు ఉత్పత్తి , మార్కెట్ స్థిరీకరణ అంశాలపై దృష్టి పెట్టాలి. గ్రామీణ ఉపాధిని దెబ్బతీసేలా ఎక్సైజ్ పన్నులు ఉండొద్దు’ అని పేర్కొన్నారు. -
దొంగ, పోలీస్.. రెండూ చంద్రబాబే: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు బెయిల్ కండీషన్స్ను ఉల్లంఘిస్తున్నారని.. ఆయన అవినీతిపై ఫిర్యాదు చేసిన అధికారులను బెదిరిస్తున్నారంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ‘‘చంద్రబాబు.. తానే దొంగ, తానే పోలీసు. తనపై ఉన్న అవినీతి కేసులను క్లోజ్ చేయించుకుంటున్నారు. ఇది బెయిల్ కండీషన్స్ను ఉల్లంఘించడం కదా?’’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.‘‘చంద్రబాబు ఇవాళ బెయిల్ మీద ఉన్నారు. అమరావతిలో బాబు, ఆయన బినామీలు అవినీతికి పాల్పడ్డారు. బ్లాక్లిస్ట్లో ఉన్న తన అనుచరుడికి ఫైబర్నెట్ కాంట్రాక్ట్ ఇచ్చారు. రూ.వందల కోట్లు దోచుకున్నారు. చంద్రబాబు గత పాలనలో కమీషన్లకు కక్కుర్తిపడి ఎస్ బ్యాంకులో రూ.1300 కోట్లు డిపాజిట్ చేశారు. మేం వచ్చాక రూ. 1300 కోట్లను వెనక్కి తీసుకున్నాం. వెనక్కి తీసుకున్న కొన్ని రోజులకే ఎస్ బ్యాంక్ దివాలా తీసింది. 1300 కోట్లు వెనక్కి తీసుకోకపోతే పరిస్థితి ఏంటి?’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.‘‘స్కిల్ స్కామ్లో రూ.370 కోట్లు షెల్ కంపెనీలకు మళ్లించారు. స్వయంగా బాబు సంతకాలు చేసిన పత్రాలు ఉన్నాయి. అమరావతిలో భూములు ఎవరూ కొనకూడదు.. అమ్మకూడదని చట్టంలో ఉంది. కానీ బాబు, ఆయన బినామీలు స్కామ్లు చేస్తున్నారు. ఉచితం పేరుతో కోట్ల విలువైన స్కామ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఖజానాకు రావాల్సిన డబ్బును దోచేశారు. బ్లాక్ లిస్ట్లో ఉన్న కంపెనీకి ఫైబర్ నెట్ కట్టాబెట్టారు. వందల కోట్లు దోచిపెట్టారు. కేబినెట్ ఆమోదం లేకుండా ప్రివిలేజ్ ఫీజులు రద్దు చేశారు. ప్రివిలేజ్ ఫీజు రద్దు ఫైల్పై బాబు సంతకం చేశారు. బాబు అండ్కో గోబెల్స్ను మించిపోయారు’’ అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు. -
రెడ్బుక్ వెర్రితలలు వేస్తోంది: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: మద్యం కేసు నుంచి బయటపడేందుకే లేని కుంభకోణం ఒకటి సృష్టించారని.. ఉద్దేశపూర్వకంగా వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తున్నారని చంద్రబాబు సర్కార్పై వైఎస్ జగన్ మండిపడ్డారు. రెడ్ బుక్ వెర్రితలలు వేస్తోందన్నారు. ‘‘కల్తీ లిక్కర్ నడుపుతోంది టీడీపీ వాళ్లే. మంత్రులు, ఎమ్మెల్యేల మనుషులే కల్తీ లిక్కర్ దందా చేస్తున్నారంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ములకల చెరువు, ఇబ్రహీంపట్నంలో కల్తీ దందా బయటపడింది. జయచంద్రారెడ్డికి బాబు స్వయంగా బీఫామ్ ఇచ్చారు. అనకాపల్లి, పరవాడలో కూడా కల్తీ మద్యం కేంద్రాలు నడిపారు. ఏలూరు, రేపల్లె, నెల్లూరులోనూ కల్తీ మద్యం దందా చేస్తున్నారు. రాష్ట్రమంతా కల్తీ మద్యం దందా నడుపుతున్నారు. లిక్కర్, బెల్టు షాపులు, పర్మిట్ రూమ్లన్నీ టీడీపీ వారివే. మ్యానుఫాక్యరింగ్, డిస్ట్రిబ్యూషన్ అంతా టీడీపీ వాళ్లే. టీడీపీ నేతలకు పోలీసులు సహాయం చేస్తున్నారు’’ అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.‘‘జోగి రమేష్ను అన్యాయంగా జైల్లో పెట్టారు. తప్పుడు వాంగ్మూలాలు, సాక్ష్యాలు క్రియేట్ చేస్తున్నారు. జోగి రమేష్పై తప్పుడు కేసు పెట్టారు. జోగి రమేష్ కుమారుడిపై కూడా అక్రమ కేసు పెట్టారు. పిన్నెల్లి సోదరులపై కూడా అక్రమ కేసులు పెట్టారు. టీడీపీ వాళ్లే హత్యలు చేసుకుంటే పిన్నెల్లిని ఇరికించారు. టీడీపీ గ్రూప్ తగాదాల వల్లే హత్యలని ఎస్పీ చెప్పారు. టీడీపీ గొడవల వల్లే హత్యలని ఎస్పీ ట్వీట్ చేశారు‘‘మా పార్టీ విద్యార్థి నాయకుడు కొండారెడ్డిపై అక్రమ కేసు పెట్టారు. కొండారెడ్డిపై గంజాయి అక్రమ కేసు పెట్టారు. రైల్వే న్యూ కాలనీలో గంజాయి పట్టుకున్నామని ఎఫ్ఆర్ఐ రాశారు. నిజానికి కొండారెడ్డి టిఫిన్ చేస్తుండగా పట్టుకెళ్లారు. బైక్కు జీపీఎస్ ట్రాక్ ఉంది కాబట్టి.. పోలీసుల దౌర్జన్యం బయటపడింది. పోలీసులు ఇలా చేస్తే వ్యవస్థలు బతుకుతాయా? రెడ్ బుక్ను పోలీసులు ఫాలో అయితే ఎలా?’’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు.లిక్కర్ కేసును సృష్టించి చెవిరెడ్డిని వేధించారు. మిథున్రెడ్డి బెయిల్ సమయంలో జడ్జి సైతం ఎందుకు అరెస్ట చేశారని ఆశ్చర్యపోయారు. మా హయాంలో పని చేసిన అధికారులనూ అరెస్ట్ చేశారు. కాకాణి, వంశీ పోసాని, కొమ్మినేని లాంటి సీనియర్ జర్నలిస్టులను.. చివరకు ప్రశ్నించే సోషల్ మీడియా యాక్టివిస్టులనూ వేధించారు. మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్పై ఇప్పటివరకు కేసు లేదు. బాధిత మహిళ ఆధారాలు చూపించినా విచారణ లేదు. వాట్సాప్ మెసేజ్లు చూపించినా పోలీసుల్లో చలనం లేదు. వార్త రాసిన సాక్షి విలేకరిపై కేసు పెట్టారు’’ అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు. -
స్టీల్ప్లాంట్పై బాబు అప్పుడో మాట.. ఇప్పుడో మాట: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: స్టీల్ప్లాంట్పై చంద్రబాబు ఎన్నికల ముందు ఏమన్నారు?.. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటూ వైఎస్ జగన్ నిలదీశారు. విశాఖలో ఉక్కుకు గనులు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేశామని.. మా హయాంలో స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపేశాం’’ అని వైఎస్ జగన్ వివరించారు. ఉక్కు కార్మికులపై పీడీ యాక్ట్ పెట్టి లోపల వేస్తాడట..!’’ అంటూ చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపడ్డారు.‘‘ఎస్ఏఐఎల్కు సొంత గనులున్నాయి. ఆర్ఐఎన్ఎల్కు సొంత గనులు లేవు. ఎస్ఏఐఎల్, ఆర్ఐఎన్ఎల్కు తేడా ఇదే. విశాఖ స్టీల్కు సొంత గనులు లేకే నష్టాలు. మిట్టల్కు సొంత గనులు ఇవ్వాలని బాబు అంటాడు. కానీ విశాఖ స్టీల్కు మాత్రం సొంత గనులు అడగరు. ప్రైవేట్కు గనులు అడుగుతారు కానీ.. ప్రభుత్వ ప్లాంట్ను పట్టించుకోరు’’ అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బాబు హయాంలో ఏపీసీవోఎస్ను నీరుగార్చారు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీసీఎస్వోతో మేం ఒకటినే జీతాలు ఇచ్చేలా చేశామని.. చంద్రబాబు హయాంలో ఏపీసీవోఎస్ను నీరుగార్చారంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దుయ్యబట్టారు. ‘‘ఏపీసీవోఎస్లో రెండు, మూడు నెలలకు కూడా జీతాలు లేవు. ఐదు డీఏలు పెండింగ్లో ఉన్నాయి. కేవలం ఒక డీఏ మాత్రమే ఇచ్చారు. ఒక డీఏ కూడా వాయిదాల్లో ఇస్తారంట. రిటైర్డ్ అయ్యాక ఎరియర్స్ ఇస్తామన్నది బాబు ప్రభుత్వమే. ఎన్నికల్లో ఇచ్చిన పీఆర్సీ హామీ ఇప్పటికీ లేదు’’ అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు.‘‘పీఆర్సీ ఛైర్మన్ కూడా లేడు. జీతాలు పెరగొద్దని పీఆర్సీ ఛైర్మన్ను నియమించలేదు. పీఆర్సీ లేదు.. ఐఆర్ లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు రూ.31 వేల కోట్లు బకాయిలు ఉన్నాయి’’ అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. -
గోబెల్స్కు గురువు మన చంద్రబాబే: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: సూపర్ సిక్స్ ఇచ్చేశామంటూ నిసిగ్గుగా చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. సూపర్-6,7 సూపర్హిట్ అని ప్రచారం చేసుకుంటున్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసింది గాడిదలను కాయడానికా? అంటూ మండిపడ్డారు. రైతులకు కూటమి ఇచ్చిన ప్రతిమాట అబద్ధమన్న వైఎస్ జగన్.. ఉచిత బస్సు ప్రయాణం కొంతమందికే, కొన్ని బస్సులు పరిమితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.సూపర్-6,7 సూపర్హిట్ అని ప్రచారం చేసుకుంటున్నారు. చంద్రబాబు నుంచి గోబెల్స్ పాఠాలు నేర్చుకోవాలి. గోబెల్స్కు చంద్రబాబే టీచర్’’ అంటూ వైఎస్ జగన్ చురకలు అంటించారు. ‘‘నిరుద్యోగ భృతి కింద రూ.3 వేలు ఇస్తామన్నారు. ఏమైంది?. రెండేళ్లలో ఒక్కొక్కరికి రూ. 72 వేలు ఇవ్వాలి ఏమైంది?. ఆడబిడ్డ నిధి కింద ప్రతినెలా రూ. 1500 ఇస్తామన్నారు. రెండేళ్లలో రూ.18 వేలు ఇవ్వాలి.. ఇచ్చారా?. బీసీలకు 50ఏళ్లకే పెన్షన్ అన్నారు.. ఇచ్చారా?. చంద్రబాబు ఈ-క్రాప్ వ్యవస్థను భ్రష్టుపట్టించారు’’ అంటూ వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. -
సేవ్ ఆంధ్రా: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ప్రజలకు వాస్తవాలు తెలియాలని.. రైతులు పరిస్థితి చూస్తుంటే సేవ్ ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా ఉందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏ ప్రభుత్వమైనా రైతులను సంతోషపెట్టాలి.. రైతు సంతోషంగా ఉంటేనే రాజ్యం సంతోషంగా ఉంటుందన్నారు.‘‘పండుగలా ఉండాల్సిన వ్యవసాయాన్ని చంద్రబాబు హయాంలో దండగలా మారింది. మొంథా తుపాను ఇంకా కళ్లముందే కదలాడుతోంది. మొంథా తుపానుపై ఎంత బిల్డప్ ఇచ్చారో చూశాం. మొంథా తుపాన్ పీకను పట్టుకుని విసిరేసిట్లు బిల్డప్ఇచ్చారు’’ అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు. మా హయాంలో రైతులకు ఉచిత పంటల బీమా హక్కుగా లభించింది. చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఇన్ఫుట్ సబ్సీడీల మాటే ఎత్తరు. ఈ 19 నెలల పాలనలో 17 సార్లు ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. రాష్ట్రంలో 84 లక్షల మంది రైతులు ఉంటే 19 లక్షల మందికి మాత్రమే పంటల బీమా ఉంది’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.‘‘బాబు పాలనలో రైతుల జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయి. రూ.1100 కోట్ల ఇన్ఫుట్ సబ్సీడీ బకాయిలు ఉన్నాయి. మా హయాంలో హక్కుగా ఉచిత పంటల బీమా ఇచ్చాం. మా హయాంలో ఉచిత పంటల బీమా కింద రూ.7800 కోట్లు ఇచ్చాం. ఉచిత పంటల బీమాకు బాబు ఉరేశారు. బాబు పాలనలో కౌలు ైతుల పరిస్థతి దయనీయంగా ఉంది. ..ఇన్ఫుట్ సబ్సీడీ బకాయిలు ఎప్పుడు ఇస్తారో బాబు చెప్పరు. ఇన్సూరెన్స్ డబ్బులు ఎప్పుడు ఇస్తారో చెప్పరు. పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తామన్నారు. రెండేళ్లలో రూ.40 వేలు ఇవ్వాలి.. బాబు ఇచ్చింది 10 వేలే. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధరల్లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. బాబు పాలనలో రైతులను దళారులు దోచుకుంటున్నారు. అయినా చంద్రబాబు చోద్యం చూస్తూ కూర్చున్నారు.’’ అని వైఎస్ జగన్ దుయ్యబట్టారు. -
నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుంభవృష్టి
సాక్షి, అమరావతి/నెల్లూరు/వెంకటాచలం/తొట్టంబేడు: వాయుగుండం ప్రభావంతో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. తిరుపతి జిల్లా చిట్టమూరులో మంగళవారం ఉదయం నుంచి బుధవారం వరకు 27.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో 27.2, ఇదగలిలో 24, తిరుపతి జిల్లా అల్లంపాడులో 23.8, విద్యానగర్లో 19.6, నెల్లూరు జిల్లా మనుబోలులో 17.9, మల్లంలో 17.6, అక్కంపేటలో 16.7, నెల్లూరులో 14 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. నెల్లూరు రూరల్, సైదాపురం, నాయుడుపేట, అల్లూరు, మనుబోలు, ముత్తుకూరు, ఇందుకూరుపేట, తిరుపతి జిల్లా గూడూరు, చింతవరం, సూళ్లూరుపేట, తొట్టంబేడు తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. బుధవారం సాయంత్రం వరకు తిరుపతి జిల్లా తొట్టంబేడులో 4.7, నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో 3.7, తిరుపతి జిల్లా మన్నారు పోలూరులో 3.2, చిత్తూరు జిల్లా నిండ్రలో 3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. దిత్వా తుపాను బలహీనపడి రెండు రోజుల క్రితం వాయుగుండంగా మారగా.. బుధవారం అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో మరో రెండు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.జలదిగ్బంధంలో నెల్లూరు హైవే వాయుగుండం నెల్లూరు జిల్లాపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున 5 గంటల వరకు ఏకధాటిగా కుంభవృష్టి కురిసింది. వాగులు, వంకలు, పంట పొలాలు సముద్రాన్ని తలపించాయి. వెంకటాచలం మండలం చెముడుగుంట, కాకుటూరు, కాగితాలపూరు తదితర ప్రాంతాల్లోని జాతీయ రహదారిపై వరద ప్రవహించింది. బుజబుజ నెల్లూరు, చెముడుగుంట ప్రాంతాల్లో జాతీయ రహదారిపైకి వరద పోటెత్తడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వెంకటాచలం–మనుబోలు మధ్య జాతీయ రహదారిలో ఒక వరుస రోడ్డు మునిగిపోయింది. ప్రజలు, వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నెల్లూరు నుంచి వెంకటాచలం చేరుకునేందుకు సుమారు 3 గంటల సమయం పట్టింది. నెల్లూరు అయ్యప్పగుడి నుంచి హైవే రోడ్డు కలిసేచోట రోడ్డుపై మోకాలి లోతు నీరు చేరడంతో ద్విచక్ర వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. పలుచోట్ల వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వెంకటాచలంలో 3 వేల ఎకరాల్లో మునిగిన నారు మళ్లు, నాట్లు మునిగినట్లు ప్రాథమిక అంచనా.నీట మునిగిన కాలనీలు భారీ వర్షాలకు నెల్లూరు నగరంలో సగం ప్రాంతాలు నీటమునిగాయి. చంద్రబాబునగర్, వైఎస్సార్ నగర్, మల్లయ్యగుంట, బుజబుజ నెల్లూరులోని ఆర్టీసీ కాలనీ, డ్రైవర్స్ కాలనీ, తల్పగిరి కాలనీ, శివగిరి కాలనీ, జనార్దన్రెడ్డి నగర్, కృషి విజ్ఞాన కేంద్రం, ఆర్డీటీ కాలనీ, సుందరయ్య కాలనీ డి–బ్లాకులోని కొన్ని ప్రాంతాలు, హరనాథపురం విస్తరిత(ఎక్స్టెర్ననల్) ప్రాంతాల్లో పెద్దఎత్తున వరద నీరు చేరింది. మాగుంట లేఅవుట్, రామలింగాపురం, ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జిలు నీటమునిగాయి.గోడ కూలి వృద్ధురాలి మృతి తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం కానవరంలో బుధవారం కురిసిన వర్షానికి పూరి గుడిసె గోడకూలి నిద్రదిస్తున్న రేణుకమ్మ(59)పై పడింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. -
చంద్రబాబుపై కేసు మూసివేత డాక్యుమెంట్లను ఎందుకు బయట పెట్టడం లేదు?
సాక్షి, అమరావతి: అవినీతి, అక్రమాలకు పాల్పడినందుకు చంద్రబాబుపై గత ప్రభుత్వం నమోదు చేసిన కేసులను మూసివేసిన విజయవాడ ఏసీబీ కోర్టు.. అందుకు సంబంధించిన కాపీలను బహిర్గతం చేయకపోవడంపై సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. కోర్టులో ఏదీ రహస్యం కాదన్నారు. చంద్రబాబుపై కేసుల మూసివేతకు సంబంధించిన డాక్యుమెంట్ల కాపీలను బహిర్గతం చేయడాన్ని సీఐడీ ఎందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు. డాక్యుమెంట్ల కాపీలు బయటపెట్టే విషయంలో సీఐడీ ఎందుకు జంకుతోందని నిలదీశారు. ఏదో గూడుపుఠాణి లేకుంటే కోర్టు తీర్పు కాపీలను బయటకు రాకుండా చేయాల్సిన అవసరం ప్రాసిక్యూషన్కు ఏముందని ప్రశి్నంచారు. ప్రతి విషయాన్ని తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని, అది న్యాయపాలనలో భాగమని స్పష్టం చేశారు. కోర్టులోని ప్రతి డాక్యుమెంట్ పబ్లిక్ డాక్యుమెంటేనని, అది కక్షిదారులు, ప్రభుత్వ ప్రైవేటు ఆస్తి కాదని తెలిపారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం చాలా స్పష్టంగా చెప్పిందని ఆయన ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రాసిక్యూషన్, నిందితులకే పరిమితం కాదు కోర్టు రికార్డులను ఏ వ్యక్తి అయినా నిబంధనలకు అనుగుణంగా తీసుకోవచ్చని, వాటిని తిరస్కరించే అధికారం ఎవరికీ లేదని పొన్నవోలు కోర్టుకు వివరించారు. చార్జిషీట్, ఎఫ్ఐఆర్లతో సహా అన్ని రికార్డులను థర్డ్ పార్టీ తీసుకోవచ్చన్నారు. ఈ విషయంలో ఏ చట్టంలోనూ నిషేధం లేదని నివేదించారు. ఎవిడెన్స్ చట్టం ప్రకారం సహేతుక కారణం చూపి ఏ వ్యక్తయినా కూడా కోర్టు డాక్యుమెంట్లను తీసుకోవచ్చని కేకే వేలుస్వామి వర్సెస్ పళని స్వామి కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చిందని వివరించారు. కోర్టు డాక్యుమెంట్లు కేవలం ప్రాసిక్యూషన్, నిందితులకే పరిమితం కాదని, ఫిర్యాదుదారులు, కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులు, సదుద్దేశం ఉన్నవారు ఎవరైనా కూడా తీసుకోవచ్చని ఎన్.శివశంకరయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచి్చందని కూడా ఆయన తెలిపారు. ఏ డాక్యుమెంట్నైనా తీసుకోవచ్చుకేవలం పార్ట్–1 కేసు డైరీని మాత్రమే బహిర్గతం చేయకూడదని, మిగిలిన ఏ డాక్యుమెంట్నైనా తీసుకోవచ్చని పొన్నవోలు కోర్టుకు వివరించారు. కోర్టు డాక్యుమెంట్లను తీసుకునే విషయంలో లోకస్ స్టాండీ (జోక్యం చేసుకునే హక్కు) వాదనకు ఎంతమాత్రం ఆమోదయోగ్యత లేదన్నారు. క్రిమినల్ లాలో ఎక్కడా లోకస్ స్టాండీ ప్రస్తావనే లేదన్నారు. అలాంటప్పుడు దేని ఆధారంగా చంద్రబాబుపై కేసుల మూసివేత డాక్యుమెంట్లను రహస్యంగా ఉంచుతున్నారని ప్రశ్నించారు. చట్టాన్ని పాటించబోమంటే, సుప్రీంకోర్టులో పోరాటం చేయడం మినహా చేయగలిగిందేమీ లేదన్నారు. చంద్రబాబుపై కేసుల మూసివేతకు సంబంధించిన అన్నీ డాక్యుమెంట్ల కాపీలను కోరుతూ తాము దాఖలు చేసిన పిటిషన్పై తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన ఏసీబీ కోర్టును కోరారు. దీంతో ఏసీబీ కోర్టు న్యాయాధికారి గురువారం తగిన ఉత్తర్వులు జారీ చేస్తానని చెప్పారు. చంద్రబాబుపై కేసుల మూసివేతకు సంబంధించిన డాక్యుమెంట్ల కాపీలను ఇవ్వాలని కోరుతూ చీరాలకు చెందిన సువర్ణరాజు అనే వ్యక్తి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈయన తరఫున బుధవారం పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. -
టెన్త్ పరీక్షల్లో స్వల్ప మార్పులు
సాక్షి, అమరావతి: మార్చి–2026 పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణలో స్వల్ప మార్పులు చేసినట్టు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది. పరీక్షలకు హాజరయ్యే జనరల్, ఓపెన్ స్కూల్, ఒకేషనల్ కేటగిరీల విద్యార్థులు మార్పులను పరిశీలించాలని విజ్ఞప్తి చేసింది. ఈ పరీక్షల్లో అంతర్గత మార్కుల వెయిటేజీ ఉండదని, ప్రతి సబ్జెక్టుకు 100 మార్కులకు 7 పేపర్ల విధానం ఉంటుందని పేర్కొంది. ఒకటో భాష, రెండో భాష, మూడో భాషా పేపర్లు, గణితం, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టులకు ఒక్కొక్క పేపర్ ఉంటుంది. ప్రతి పేపర్ 100 మార్కులకు ఉంటుంది. జనరల్ సైన్స్ సబ్జెక్టులో ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ పరీక్షలు రెండు వేర్వేరు రోజుల్లో 50 మార్కుల చొప్పున ఉంటాయి. ప్రథమ భాషలో కాంపోజిట్ పేపర్–వన్ 70 మార్కులకు, పేపర్–టు 30 మార్కులకు ఉంటాయి. పాఠశాలలు/విద్యార్థుల డేటాలో వ్యత్యాసం ఉంటే, యూడైస్ ప్లస్ డేటాలో మార్పులకు కమిషనరేట్ను సంప్రదించాలని ఆదేశించారు. ప్రైవేట్ అభ్యర్థులకు వారి ఆన్లైన్ దరఖాస్తులో మునుపటి హాజరు రోల్ నంబర్ను తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. వీరికి పరీక్ష ఫీజు మినహాయింపు పట్టణ ప్రాంతాల్లో తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం రూ.24 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 వేలు లేదా గ్రామీణ ప్రాంతాల్లో 2.5 ఎకరాల తడి భూమి/5 ఎకరాల పొడి భూమి మించని వారి పిల్లలకు పరీక్ష ఫీజు నుంచి మినహాయించారు. ఇది మార్చి–2026లో తొలిసారి రెగ్యులర్ పరీక్షకు హాజరయ్యే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది. వికలాంగులు, కేజీబీవీ విద్యార్థినులకు పూర్తి స్థాయిలో ఫీజు మినహాయింపు ఉంటుంది. 2011 సెపె్టంబర్ ముందు పుట్టిన వారు మాత్రమే 10వ తరగతి పరీక్షలు రాసేందుకు అర్హులని, రూ.300 చెల్లించి ఏడాదిన్నర వరకు వయసు సడలింపును స్థానిక పాఠశాల హెచ్ఎం అనుమతి ఇవ్వొచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
రోగులతో చెలగాటం!
కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్లో ఉన్న వీఆర్డీఎల్ (వైరల్ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్ ల్యాబొరేటరీ)లో దారుణం జరుగుతోంది. ఎక్స్పైరీ అయిపోయిన రసాయనాల (రియేజంట్ల)తో స్క్రబ్ టైఫస్ పరీక్షలు చేసి, కొందరికి అసలు చేయకుండానే నకిలీ రిపోర్టులు ఇచ్చి ప్రజల్ని, అధికారుల్ని పచ్చిమోసం చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. రెండు నెలలుగా ఈ తంతు కొనసాగుతుండడం తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది. ఇన్నాళ్లుగా వచ్చిన నివేదికలన్నీ కేవలం సృష్టించినవేనన్న వాస్తవం కళ్లుబైర్లు కమ్మేలా చేస్తోంది. తీవ్ర కలకలం రేపుతున్న ఈ దారుణం వివరాలివీ.. కాకినాడ జీజీహెచ్లో ఉన్న వీఆర్డీఎల్ ల్యాబ్కు రాష్ట్రస్థాయి గుర్తింపు ఉంది. రీసెర్చ్ సైంటిస్ట్ హోదాలో పనిచేసే ఓ ఉద్యోగి కాసులకు కక్కుర్తిపడి స్క్రబ్ టైఫస్ పరీక్షలు చేసేందుకు రక్త నమూనాలు సేకరించి నకిలీ రిపోర్టులు ఇస్తున్నారు. వ్యాధి నిర్ధారణకు ఐజీఎం ఎలీసా (ఇమ్యునో గ్లోబలిన్ ఎం–ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనో సార్బెంట్ అస్సే) టెస్ట్ చేస్తారు. ఇందుకు కాలంచెల్లిన రియేజంట్లు వినియోగించి రోగుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు. రెండు నెలలుగా ఇదే తంతు.. సాధారణంగా రక్త నమూనా ఇచ్చిన తర్వాత రక్తం నుంచి సీరంను వేరుచేసి ఎలీస్ ప్లేట్లో ఉన్న రంధ్రాల్లో వేస్తారు. అరగంట ఇంక్యుబేషన్ వ్యవధి చొప్పున కాంజ్యుగేట్, సబ్్రస్టేట్ రియేజంట్లు వేస్తారు. ఇవే వ్యాధిని నిర్ధారిస్తాయి. అంతటి ప్రాధాన్యం ఉన్న రియేజంట్లను కాలం చెల్లినవి వాడి రెండు నెలలుగా తోచిన రిపోర్టును రాసి పంపిస్తున్నారు. అంతేకాక.. స్టేట్ పోర్టల్లోనూ ఈ కాకిలెక్కలే అప్డేట్ చేస్తుండడంతో యావత్ రాష్ట్రం ఈ గణాంకాలనే నిజమని నమ్ముతోంది. రాష్ట్ర, జిల్లా వైద్య ఆరోగ్యశాఖలకు బురిడీ.. ఈ తప్పుడు నివేదికల ఆధారంగానే వైద్యం అందించడం, అందించకపోవడం జరుగుతోంది. రాష్ట్ర, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ విభాగాలను ఈ వీఆర్డీఎల్ ఉద్యోగి బురిడీ కొట్టించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. రోగి వయసు, ప్రాంతం ఆధారంగా వ్యాధి సోకే అవకాశం ఉందా లేదా అన్న విషయాలపై ఓ అంచనాకు వచ్చేసి, నివేదికలు ఇస్తున్నారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. ఇన్నాళ్లూ ఇచ్చిన పాజిటివ్, నెగటివ్ నివేదికలు కల్పితాలేనన్న విషయం బట్టబయలవడంతో వైద్యులే నిర్ఘాంతపోతున్నారు. ఎక్స్పైరీ రియేజంట్లు ఎందుకంటే.. కాలంచెల్లిన కిట్ల వినియోగం వెనుక రీసెర్చ్ సైంటిస్ట్దే కీలకపాత్ర. నెలన్నరకు పైగా జీజీహెచ్ స్టోర్స్ నుంచి రియేజంట్లు తీసుకోకుండా ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) ఇచ్చిన అవకా«శాన్ని అడ్డుపెట్టుకుని బయటి నుంచే కొంటున్నట్లు ఆయన చూపిస్తున్నారు. అవీ కాలం చెల్లినవి తెస్తున్నారు. పొరుగు ప్రాంతాల వారు పనికిరాక పక్కన పడేసిన కిట్లు ఉచితంగా లభిస్తుండడంతో అవి తెచ్చి నాణ్యమైనవి కొంటున్నట్లు బిల్లులు డ్రా చేస్తున్నారనే విమర్శలున్నాయి. పైగా.. ఒక్కో కిట్టు ధర కనీసం రూ.25 వేలు ఉంటుండగా రూ.లక్షల్లో ఆర్జిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏ ఒక్క కిట్టుకీ లెక్కాపత్రం లేదు.. వైరాలజీ ల్యాబ్లో వినియోగిస్తున్న ఏ ఒక్క కిట్టుకీ తగిన లెక్కాపత్రం లేదు. ఈ తంతుపై పర్యవేక్షణ లోపించడంతో అక్కడ పనిచేస్తున్న రీసెర్చ్ సైంటిస్టుది ఆడింది ఆట పాడింది పాటగా సాగుతోంది. కిట్లు కాలం చెల్లినవి కావడంవల్ల కోల్డ్ చెయిన్ను మెయింటైన్ (నిర్దిష్ట శీతల ప్రక్రియ) చేయకుండానే జీజీహెచ్లోని ల్యాబ్కు చేరుతున్నాయి. ఇలా అందుకుంటున్న వాటికి ఎటువంటి బిల్లులుగానీ సరఫరా రశీదులుగానీ ఉండడంలేదు.కోవిడ్, హెపటైటిస్ రియేజంట్లు కూడా..ఇక కోవిడ్, హెపటైటిస్ సహా పలు ప్రాణాంతక రోగాలను నిర్ధారించే రియేజంట్లు కూడా కాలం చెల్లినవే వినియోగిస్తున్నారు. మరణించిన వ్యక్తికి కోవిడ్ పరీక్ష చేయాల్సి వస్తే పరీక్ష చేయకుండా లేదా కాలంచెల్లిన కిట్లతో చేసి, రిపోర్టు ఇస్తున్నారు. పోస్ట్మార్టం చేస్తున్న ఫోరెన్సిక్ వైద్యులు, మృతుడి కుటుంబీకుల ప్రాణాలకూ ముప్పుతెస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో ఎక్స్పైర్ అయిన హెపటైటిస్ కిట్లను డిసెంబరు 1న తీసుకొచ్చి, హెపటైటిస్ పరీక్షలు చేస్తున్నారు. ఎక్స్పైరీ రియేజంట్లను తేదీ ముద్రించి ఉన్న ట్యూబ్ల నుంచి స్టిక్కర్ లేని ఖాళీ ట్యూబ్ల్లోకి నింపి శ్వాసకోశ సంబంధిత ప్రాణాంతక కోవిడ్ సహా ఫ్లూ–ఏ, ఫ్లూ–బి, ఇన్ఫ్లూయెంజా, స్వైన్ ఫ్లూ, ఆర్ఎస్వీ–ఏ, ఆర్ఎస్వీ–బి, హ్యూమన్ రినోవైరస్ వంటి ముఖ్యమైన పరీక్షలు చేస్తున్నారు. మరోవైపు.. రోగులు కూడా జీజీహెచ్ నివేదికలకు, బయట ప్రైవేటు ల్యాబ్ల నివేదికలకు తేడాలు ఉంటున్నాయని వాపోతున్నారు. ఆ కేసులు నిజమా.. కాకిలెక్కలా?జిల్లా వ్యాప్తంగా స్క్రబ్ టైఫస్ వ్యాప్తి విస్తృతంగా ఉంది. వీఆర్డీఎల్ ల్యాబ్ గణాంకాల ఆధారంగానే ఈ వ్యాప్తిని నిర్ధారిస్తున్నారు. రీసెర్చ్ సైంటిస్ట్ ఇచ్చిన నివేదిక ప్రకారం మొత్తం 151 మందికి స్క్రబ్ టైఫస్ సోకిందని.. నవంబరు, డిసెంబరులో 45 కేసులు నమోదయ్యాయని చెబుతున్నారు. అసలు ఈ లెక్కల సంగతి ఏంటని జీజీహెచ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అవి నిజం లెక్కలా లేక కాకి లెక్కలా తెలీక గందరగోళంలో పడ్డారు. -
రైళ్లల్లో తత్కాల్ రిజర్వేషన్కు ఓటీపీ తప్పనిసరి
రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): సాధారణ రైలు ప్రయాణికులకు పారదర్శకత, సౌకర్యవంతమైన సేవలు అందించే దిశగా రైల్వే శాఖ ఓటీపీ ఆధారిత తత్కాల్ రిజర్వేషన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచి్చంది. పైలట్ ప్రాజెక్ట్గా 52 రైళ్లకు సంబంధించి చేపట్టిన ఈ విధానం విజయవంతం కావటంతో త్వరలో మిగిలిన అన్ని రైళ్లకూ వర్తింప చేయనుంది. నవంబర్ 17 నుంచి రిజర్వేషన్ కౌంటర్లలో కూడా ఓటీపీ ఆధారిత తత్కాల్ రిజర్వేషన్ వ్యవస్థను ప్రాంభించిన విషయం తెలిసిందే. ఈ విధానంలో ప్రయాణికుడు రిజర్వేషన్ ఫారమ్లో ఇచి్చన మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేస్తేనే టికెట్ నిర్ధారణ అవుతుంది. -
రోడ్డుపైనే అంతిమ సంస్కారమా!
సాక్షి, అమరావతి: ఓ వ్యక్తి అంతిమ సంస్కారాలను రోడ్డుపైనే నిర్వహించడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. శ్మశాన వాటికల్లో అంతిమ సంస్కారాలు నిర్వహించలేని దుస్థితిలో ఉన్నామా? అని ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న శ్మశాన వాటికల్లో కనీస సదుపాయాలను కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. శ్మశానాల నిర్వహణకు నిధులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అసక్తి చూపడం లేదని ప్రశ్నించింది. శ్మశానాల ఏర్పాటు, నిర్వహణ కోసం జీవోలు ఇచ్చినప్పటికీ అవేవీ అమలు కావడం లేదంది. ఆ జీవోలు కేవలం కాగితాలకే పరిమిత మయ్యాయని తెలిపింది. రాష్ట్రంలో రాబోయే రెండు దశాబ్దాలకు అనుగుణంగా శ్మశాన వాటికల ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న శ్మశానాల నిర్వహణకు ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించింది. శ్మశాన వాటికల్లో కనీస మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధులను సైతం విడుదల చేయాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను అమలు చేసి దానిపై రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీల్లోని శ్మశాన వాటికల్లో కనీస సదుపాయాలు లేకపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ విజయవాడకు చెందిన పి.ప్రమోద్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సీజే ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్ తరఫు న్యాయవాది గడిపూడి వెంకటేశ్వర్లు, పురపాలక శాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది అంబటి శ్రీకాంత్రెడ్డి వాదనలు వినిపించారు. -
నేడు వైఎస్ జగన్ ప్రెస్మీట్
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ప్రెస్మీట్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు. -
16న వైఎస్ జగన్ నేతృత్వంలో గవర్నర్కు కోటి సంతకాలు అందజేత
సాక్షి, అమరావతి: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమానికి అన్నివర్గాల ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చిందని వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. వైఎస్సార్సీపీ జిల్లా పార్టీల అధ్యక్షులు, పార్లమెంటరీ పరిశీలకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు (కో–ఆర్డినేషన్, అనుబంధ విభాగాలు), రాష్ట్ర కార్యదర్శులు (కో–ఆర్డినేషన్), ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర కార్యదర్శులు (పార్లమెంట్)తో బుధవారం రామకృష్ణారెడ్డి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంలా సాగిందన్నారు. సంతకాలు కోటి అనుకుంటే అంతకుమించి వస్తున్నాయని చెప్పారు. ఇప్పటివరకు నియోజకవర్గ స్థాయిలో సేకరించిన సంతకాలను ఈ నెల 10న జిల్లా పార్టీ కార్యాలయాలకు పంపాలని సూచించారు. 13న జిల్లా కార్యాలయాల నుంచి కేంద్ర కార్యాలయం తాడేపల్లికి పంపాలని కోరారు. ఈ నెల 16న పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి నేతృత్వంలో గవర్నర్కు కోటి సంతకాలు అందజేయనున్నట్టు చెప్పారు.సేకరించిన సంతకాలన్నీ నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజల ముందు, మీడియా ముందు ప్రదర్శించి వారి సమక్షంలోనే బాక్సుల్లో సర్ది వాహనాల్లో పెట్టి నాయకులు జెండా ఊపి జిల్లా పార్టీ కార్యాలయానికి పంపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమైన నాయకులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. 13న జిల్లా కేంద్రంలో కూడా అదే స్థాయిలో కార్యక్రమం నిర్వహించి అక్కడి నుంచి రాష్ట్ర కార్యాలయానికి పంపాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని అధినేత వైఎస్ జగన్ ప్రత్యేకంగా చెప్పారని వెల్లడించారు. జిల్లా కేంద్రం నుంచి వేలాది మందితో ర్యాలీలు చేపట్టి రాష్ట్ర కార్యాలయానికి పంపాలన్నారు. పార్టీ అనుబంధ విభాగాలు కూడా ఇందులో కీలకపాత్ర పోషించాలని సూచించారు. -
జీవో సాక్షిగా బాబు క్రెడిట్ చోరీ గుట్టు రట్టు..'ఔను.. అదానీనే'!
రెండు నెలల క్రితం..రూ.లక్ష కోట్లకుపైగా భారీ పెట్టుబడులతో విశాఖకు గూగుల్ వస్తోంది..! మేమే తీసుకొస్తున్నాం.. డేటా సెంటర్ ఏర్పాటు ఘనత మాదే!రెండు రోజుల క్రితం..అదానీ భాగస్వామ్యంతోనే గూగుల్ ప్రాజెక్టు. గూగుల్కు విశాఖలో కేటాయించిన 480 ఎకరాలను తిరిగి అదానీకి బదలాయిస్తున్నాం. గూగుల్కు ఇచ్చిన అన్ని రాయితీలను ప్రైమరీ నోటిఫైడ్ పార్టనర్ అదానీకి వర్తింప చేస్తున్నాం.– గూగుల్ రాకపై చంద్రబాబు సర్కారు విన్యాసాలివీ! గూగుల్కు విశాఖలో కేటాయించిన 480 ఎకరాల భూమిని అదానీకి బదలాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 2వ తేదీన జారీ చేసిన జీవో సాక్షి, అమరావతి: గూగుల్ డేటా సెంటర్ క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు చేసిన జిమ్మిక్కులు, సంకుచిత వైఖరి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా వెలువరించిన జీవోల సాక్షిగా మరోసారి రుజువయ్యాయి. విశాఖలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 1,000 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ను అదానీ భాగస్వామ్యంతోనే గూగుల్ ఏర్పాటు చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వమే జీవోలో వెల్లడించింది. అంతేకాదు... గతంలో గూగుల్కు విశాఖలో కేటాయించిన 480 ఎకరాల భూమిని తిరిగి అదానీకి బదలాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేయడం గమనార్హం. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి గూగుల్తో ఒప్పందం సమయంలో ఉద్దేశపూర్వకంగానే అదానీ పేరును తొక్కి పెట్టి క్రెడిట్ మొత్తం తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు చేసిన విన్యాసాలు విఫలమైన విషయం తెలిసిందే. డేటా సెంటర్ ఏర్పాటుపై తొలుత ఈ ఏడాది అక్టోబర్లో ఆగమేఘాలపై జీవో ఇచ్చిన చంద్రబాబు సర్కారు.. స్వయంగా గూగులే దీన్ని నిర్మిస్తోందని, ఈ ప్రాజెక్టు మొత్తం గూగుల్ సంస్థే ఇప్పటికిప్పుడు కొత్తగా చేపడుతోందనే భ్రమలు కల్పించింది. ఇక యథావిధిగా ఎల్లో మీడియా దీనికి కోరస్ పాడుతూ అదొక ప్రపంచ ఈవెంట్ మాదిరిగా చిత్రీకరించింది. టీడీపీ పెద్దల కనుసన్నల్లో రక్తి కట్టించిన ఈ నాటకం అంతా డ్రామా అని తాజాగా ప్రభుత్వ జీవోలే వెల్లడిస్తున్నాయి. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఈ స్థాయిలో అబద్ధాలు ఆడటం.. ఇంతటి ఘరానా మోసం.. ప్రజలకు ఎలా తప్పుడు సమాచారం ఇస్తున్నారో చెప్పేందుకు ఇదొక క్లాసిక్ కేస్ స్టడీగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. చంద్రబాబు కళ్లార్పకుండా నిస్సిగ్గుగా అబద్ధాలాడతారనేందుకు విశాఖ డేటా సెంటర్లే నిదర్శనమని పేర్కొంటున్నారు. చంద్రబాబు బృందం క్రెడిట్ చోరీకి పాల్పడుతూ ఎంతటి అబద్ధాలైనా ఆడగలదని, ఆత్మసాక్షిని మోసగించి వంచనకు పాల్పడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నొయిడాలోని అదానీ ఎంటర్ప్రైజెస్లో డేటా సెంటర్ ఏర్పాటు కోసం 4.64లక్షల చదరపు అడుగులను గూగుల్ అనుబంధ సంస్థ రైడాన్ ఇన్ఫోటెక్ లీజుకు తీసుకుందని 2022 అక్టోబర్ 11న టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం ఇది. , గూగుల్తో కలిసి విశాఖపట్నంలో అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేయనుండటం గర్వంగా ఉందని అదానీ గ్రూప్ అధినేత గౌతం అదానీ ‘ఎక్స్’లో పెట్టిన పోస్టు అదానీ.. గూగుల్ సంస్థ భాగస్వామేవిశాఖలో గూగుల్ డేటా సెంటర్కు తొలుత అడవివరం–ముడసర్లోవ వద్ద 120 ఎకరాలు, ఆనందపురం మండలం తర్లువాడ వద్ద 200 ఎకరాలు, రాంబిల్లి వద్ద 160 ఎకరాలను గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్కు కేటాయిస్తూ ఈ ఏడాది అక్టోబర్ 11న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్రెడిట్ చోరీలో భాగంగానే అదానీ పేరును దాచిపెట్టి కేవలం రైడెన్ టెక్ పేరుతో జీవో విడుదల చేసింది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టులో గూగుల్ అధికారిక భాగస్వామిగా అదానీ వ్యవహరిస్తున్నట్లు చంద్రబాబు సర్కారు వెల్లడించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అదానీ గ్రూపును గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ వ్యాపార భాగస్వామిగా చంద్రబాబు సర్కారు తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం.ఆ భూములను అదానీకి బదలాయించండి..ఏపీఐఐసీ కేటాయించిన ఆ 480 ఎకరాలను అదానీ గ్రూపు తదితర సంస్థల పేరిట బదలాయించాల్సిందిగా గూగుల్ కోరింది. తర్లువాడ, అడవివరం–ముడసర్లోవలో కేటాయించిన భూములను అదాని పేరిట అంతర్గతంగా బదలాయించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ బదలాయింపు రైడెన్, అదానీ మధ్య అంతర్గత ఒప్పందం ద్వారా జరుగుతుందని వివరించింది. ప్రైమరీ నోటిఫైడ్ పార్టనర్గా ఉన్న అదానీకి గూగుల్కు ఇచ్చిన అన్ని రాయితీలను వర్తింప చేస్తున్నట్లు ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఆ ఉత్తర్వుల్లో వెల్లడించడం గమనార్హం. సీఐఐ సదస్సు సాక్షిగా తేల్చి చెప్పిన అదానీ..విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి అక్టోబర్ 14న ఢిలీల్లో ఎంవోయూ కుదుర్చుకున్న సమయంలో అదానీ పేరును చంద్రబాబు సర్కారు కనీసం ప్రస్తావించలేదు. దాదాపు రూ.87 వేల కోట్ల పెట్టుబడి పెడుతున్న అదానీ పేరు ఎక్కడా చెప్పకుండా చంద్రబాబు దాగుడుమూతలు ఆడారు. అయితే అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ తాము ఆ డేటా సెంటర్లో భాగస్వామి అవుతున్నందుకు సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశారు. గత నెలలో విశాఖలో జరిగిన సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ సందర్భంగా తాము గూగుల్తో కలసి 15 బిలియన్ డాలర్ల డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ స్వయంగా సీఎం చంద్రబాబు సమక్షంలోనే ప్రకటించారు. దీంతో ముఖ్యమంత్రితో పాటు వేదికపైన ఉన్న మంత్రుల మొహాలు ఒక్కసారిగా మాడిపోయిన సంగతి తెలిసిందే.ఆ డేటాసెంటర్.. జగన్ నాటిన మొక్కసంకుచిత బుద్ధితోనే అదానీ పేరెత్తని బాబుచంద్రబాబు సర్కారు క్రెడిట్ చోరీని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే విలేకరుల సమావేశంలో సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టిన విషయం తెలిసిందే. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి క్రెడిట్ దక్కుతుందనే సంకుచిత బుద్ధితోనే సీఎం చంద్రబాబు గూగుల్తో ఒప్పందం సమయంలో అదానీ పేరెత్తలేదని విమర్శించారు. గత ప్రభుత్వం కృషి, చొరవతో సాకారమైన డేటా సెంటర్ క్రెడిట్ను చంద్రబాబు అబద్ధాలతో తన ఖాతాలో ఏ విధంగా వేసుకున్నాడన్న విషయాన్ని వైఎస్ జగన్ సాక్ష్యాలతో ఎండగట్టారు. డేటా సెంటర్ ద్వారా విశాఖలో ఒక ఎకో సిస్టమ్ ఏర్పడుతుందని, తద్వారా గ్లోబల్ కేపబుల్ సెంటర్స్ వస్తాయన్నారు. డేటా సెంటర్ పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు సబ్ సీ కేబుల్ సింగపూర్ నుంచి విశాఖకు ఏర్పాటు పనులకు వైఎస్ జగన్ ప్రభుత్వమే అంకురార్పణ చేసింది. వైఎస్ జగన్ చెప్పిన ప్రతీ అక్షరం సత్యమని ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన జీవో సాక్షిగా మరోసారి తేటతెల్లమైంది. తొలుత గూగుల్ పేరిట జీవో విడుదల చేసిన చంద్రబాబు సర్కారు ఇప్పుడు ఆ భూములను అదానీ పేరు మీదకు బదలాయించడమే దానికి తార్కాణం. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విశాఖలో 300 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు 2020 నవంబర్లో అదానీతో ఒప్పందం చేసుకుంది. అంతేకాదు.. డేటా సెంటర్కు డేటా రావాలంటే సింగపూర్ నుంచి 3,900 కి.మీ. పొడవున సబ్సీ (సముద్ర గర్భం)లో కేబుళ్లు వేయాల్సి ఉన్నందున దీనిపై 2021 మార్చి 9న సింగపూర్ ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. దేశంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి గూగుల్తో అదానీకి వ్యాపార అనుబంధం ఉంది. నోయిడాలో అదానీ నిర్మించిన డేటా సెంటర్ను గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ 2022 అక్టోబర్ 11 లీజుకు తీసుకుంది. ఈ క్రమంలో విశాఖలో అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు 2023 మే 3న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. అంతేకాదు.. ఆ డేటా సెంటర్ కోసం 190 ఎకరాల భూమిని కూడా కేటాయించారు. ఇప్పుడు చంద్రబాబు సర్కారు చెబుతున్న డేటా సెంటర్ను అసలు తాము నిర్మించడం లేదని, దీన్ని అదానీ గ్రూపే నిర్మిస్తుందని, ఆ భూమిని కూడా అదానీకే కేటాయించాలంటూ గూగుల్ ప్రతినిధి అలెగ్జాండర్ స్మిత్ రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్కు అక్టోబర్లో లేఖ రాయడం గమనార్హం. చంద్రబాబును కలిసిన గౌతమ్ అదానీసాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో రాష్ట్రంలో అదాని గ్రూపు చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రానున్న రోజుల్లో పెట్టబోయే పెట్టుబడులపై చర్చించారు. -
వరి వల్ల ఉపయోగం లేదు.. ఆదాయం లేదు
సాక్షి, రాజమహేంద్రవరం/నల్లజర్ల: వరి సాగు వల్ల ఎలాంటి ఉపయోగం, ఆదాయం లేవని సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. వరిస్థానంలో ఉద్యాన పంటలు సాగుచేయాలని సూచించారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో బుధవారం నిర్వహించిన రైతన్నా మీ కోసం.. కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతులు, రైతు కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పామాయిల్ సాగులో టెక్నాలజీ ఉపయోగించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చన్నారు. గోదావరి జలాలను కృష్ణానదిలో కలిపామని, వంశధారకు కలుపుతామని, పెన్నానది వరకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. భూగర్భ జలాలు పెంచుకోగలిగితే కరవు ఉండదని చెప్పారు. పోలవరం రైట్ కెనాల్ నుంచి నీరు ఇస్తే నల్లజర్ల ప్రాంతంలో భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. కరవు ఎక్కువగా ఉండే రాయలసీమ నంద్యాల జిల్లాలో భూగర్భ జలాలు నాలుగు మీటర్లకు పెరిగాయన్నారు. తూర్పుగోదావరి, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో భూగర్భ జలాలు తగ్గాయని చెప్పారు. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం సాక్షి, అమరావతి: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు మాదిరిగానే దివ్యాంగులకు పూర్తిగా ఉచిత ప్రయాణ అవకాశం కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం రాత్రి నిర్వహించిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ సభలో సీఎం మాట్లాడారు. రాష్ట్ర స్థాయిలో అమరావతితోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లోను ‘దివ్యాంగ్ భవన్’లు ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖపట్నంలో 23 ఎకరాల్లో నేషనల్ సెంటర్ ఫర్ డిసిబిలిటీ స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతరం ఇటీవల అంధ మహిళల ప్రపంచ కప్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన కరుణ కుమారికి రూ.15 లక్షలు, దీపికకు రూ.10 లక్షలు చొప్పున ప్రభుత్వం తరపున అందిస్తామని, వారికి ఇళ్లు నిరి్మస్తామని చెప్పారు.


