Women Power
-
మొదలు నరికినా మొలకెత్తే చేవ!
పది రోజుల కింద ‘మహారాష్ట్ర అంగన్వాడీ కర్మచారి సంఘటన్ వర్సస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర’ కేసులో బొంబాయి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ గౌరి గాడ్సే, జస్టిస్ సోమశేఖర్ సుందరేశన్ ఇచ్చిన మధ్యంతర ఆదేశానికి అనేక రకాలుగా ప్రాధాన్యం ఉంది. ఆ ఆదేశం ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో పాటించవలసిన కనీస నిబంధనలను గుర్తు చేసింది. అది ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ముఖ్యమైన ఉద్యో గానికి కనీసం పదకొండు సంవత్సరాలుగా నియామకాలు జరగలేదనే వాస్తవాన్ని బయట పెట్టింది. అది ఆ రాష్ట్ర ప్రభు త్వంలో ఉద్యోగులు ఇరవై సంవత్సరాలకు పైగా పదోన్నతి లేకుండా కింది స్థాయి ఉద్యోగంలో కొనసాగుతున్నారని చూపింది. అన్నిటికీ మించి, అంగన్వాడీ కర్మచారి సంఘటన్ తరఫున ఈ కేసు వాదించి గెలిచిన న్యాయవాది ఎన్నో ప్రభుత్వ నిర్బంధాలను ఎదుర్కొని, తన ప్రజా జీవనాన్నీ, తన న్యాయవాద వృత్తినీ ధ్వంసం చేయడానికి పాలకులు చేసిన ప్రయత్నాలను ధిక్కరించి, ప్రజా ప్రయోజన, కార్మిక సంక్షేమ కృషిలో మొక్కవోని దీక్షతో కొనసాగుతున్నారని చూపింది. మహారాష్ట్ర ప్రభుత్వం ‘ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్’(ఐసీడీఎస్)లో భాగమైన అంగన్వాడీ ముఖ్య సేవిక అనే పర్యవేక్షక ఉద్యోగ నియామకాల కోసం 2021 జూన్ 4న ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. మళ్లీ 2025 ఫిబ్రవరి 4న కూడా ఆ ఉద్యోగాలకు సంబంధించే మరొక నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్పటికే ఆ ఉద్యోగం కన్నా కిందిస్థాయి సేవిక (వర్కర్) ఉద్యోగంలో పది సంవత్సరాలకు పైగా, కొన్ని సందర్భాలలోనైతే ఇరవై, ఇరవై అయిదు సంవత్సరాలకు పైగా పని చేస్తున్న వారికి ఈ ముఖ్య సేవిక ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. అంగన్వాడి సేవికల సంఘమైన మహారాష్ట్ర అంగన్ వాడీ కర్మచారి సంఘటన్ తమకు జరిగిన ఈ అన్యాయాన్ని న్యాయస్థానంలో సవాల్ చేయదలచుకుంది. వారి తరఫున న్యాయవాది సుధా భరద్వాజ్ బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలని, ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియలో వీరికి కూడా అవకాశం కల్పించేలా మార్పులు చేయాలని, ఈ మార్పులకు తగినట్టుగా గడువు తేదీలు మార్చాలని కోర్టు ఇప్పుడు మధ్యంతర ఆదేశం ఇచ్చింది. ఈ ఆదేశం మహారాష్ట్రలో ఎన్నో సంవత్స రాలుగా సేవికలుగా ఎదుగూ బొదుగూ లేకుండా పని చేస్తున్న వేలాదిమందికి ఒక ఆశాసూచిక. దేశంలో మొత్తంగా కొన సాగుతున్న కార్మిక వ్యతిరేక విధానాలలో ఈ మధ్యంతర తీర్పు ఒక చిన్న ఊరట. సుధా భరద్వాజ్ ఛత్తీస్గఢ్లో దాదాపు రెండు దశాబ్దాలు ప్రధానంగా కార్మిక వ్యవహారాల న్యాయ వాదిగా, ఆ తర్వాత ఢిల్లీలో ఒక న్యాయ శాస్త్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పని చేసిన వ్యక్తి. సుధా భరద్వాజ్ ప్రపంచ ప్రఖ్యాత అర్థశాస్త్రవేత్త కృష్ణా భరద్వాజ్ కూతురు. అమెరికాలో పుట్టి, ఆమెరికన్ పౌరురాలిగా అక్కడే పదకొండేళ్ల వయసు దాకా ఉన్నారు. ఢిల్లీలో జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ప్రారంభిస్తున్నప్పుడు అక్కడి అర్థశాస్త్ర శాఖను నిర్మించమని కృష్ణా భరద్వాజ్కు పిలుపు వెళ్లగా, సుధ కూడా తల్లితో పాటుఢిల్లీ వచ్చారు. పద్దెనిమిదేళ్ల వయసు రాగానే స్వచ్ఛందంగా తన అమెరికన్ పౌరసత్వం వదులుకున్నారు. కాన్పూర్ ఐఐటీలో గణితశాస్త్రంలో ఎంఎస్ చేశారు. విద్యార్థి దశలో ఎన్ఎస్ ఎస్లో భాగంగా ఉత్తరప్రదేశ్,బిహార్, మధ్యప్రదేశ్గ్రామీణ పాంతాలకు, కార్మిక ప్రాంతాలకు వెళ్లి, కుల,వర్గ అసమాన తలను చూసి, ఆ పేద ప్రజల సేవలోనే తన జీవితం గడపాలని నిర్ణయించుకున్నారు. అప్పటి మధ్యప్రదేశ్లో గని కార్మికులను సంఘటితం చేస్తున్న శంకర్ గుహ నియోగి ఆలోచనలతో, ఆచరణతో ప్రభావితమై తన ఇరవై ఐదవ ఏట, 1986లో అక్కడ కార్మికుల మధ్య పని చేయడానికి వెళ్లారు. అనేక సంఘాల్లో పని చేయడం ప్రారంభించారు. భిలాయిలో ఎక్కువగా నిరక్షరాస్యులైన కార్మికుల మధ్య, పేదల మధ్య పని చేస్తున్నప్పుడు, అక్కడ చదువు వచ్చిన ఏకైక వ్యక్తిగా ఆమె ఆ కార్మికులకు, పేదలకు జరుగు తున్న అన్యాయాల గురించి మాట్లాడడానికి, న్యాయస్థానా లలో కేసులు వేయడానికి ఎక్కువగా న్యాయవాదులను కలవ వలసి ఉండేది. పిటిషన్లు రాయవలసి ఉండేది. అటు వంటి పనులు చేస్తుండగా, ఆ కార్మికులు ‘మీరే ఎందుకు న్యాయవాది కాకూడదు’ అని ప్రోత్సహించడంతో, 2000 నాటికి తానే న్యాయవాదిగా మారారు. భూకబ్జాలకు, పెత్తందార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, కార్మికుల హక్కులనూ, ఆదివాసుల సామూహిక అటవీ హక్కులనూ, పర్యావర ణాన్నీ పరిరక్షించడానికి ఎన్నో కేసులు వాదించారు. ‘జన హిత’ అనే న్యాయవాదుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ‘పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్’లో పని చేశారు. ఇలా ఛత్తీస్గఢ్లో, ముఖ్యంగా బిలాస్పూర్ హైకో ర్టులో, ఇతర న్యాయస్థానాల్లో ఆదివాసుల కోసం, కార్మికుల కోసం, మహిళల కోసం ఆమె చేస్తున్న విస్తారమైన పని, ప్రభుత్వానికి కంటగింపు అయింది. ఆమె పనిని అడ్డుకోవ డానికి, వేధించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. చివరికి ‘అర్బన్ నక్సల్’ అనే ముద్ర కొట్టి 2018 ఆగస్ట్ 28నఆమెను అరెస్టు చేసి భీమా కోరేగాం కేసులో నిందితురాలిగా చూపారు. మూడేళ్ల జైలు జీవితం తర్వాత 2021 డిసెంబర్లో షరతులతో కూడిన బెయిల్ మీద ఆమె విడుదల య్యారు. ఆ షరతుల్లో ప్రధానమైనది, ‘ముంబయి వదిలి పోకూడదు’ అనేది. అందుకే బొంబాయి హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈఅంగన్వాడీ సేవికల కేసులో గణనీయమైన విజయం సాధించారు.వ్యాసకర్త ‘వీక్షణం’ ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ -
ఎవరీ లీనా నాయర్? ఏకంగా బ్రిటిష్ అత్యున్నత గౌరవం..
భారత సంతతి సీఈవో లీనా నాయర్కు బ్రిటన్ అత్యున్నత గౌరవం లభించింది. ఆమె ఛానెల్ సీఈవోగా రిటైల్ అండ్ వినియోగదారుల రంగంలో అత్యున్నతమైన నాయకురాలిగా పేరు తెచ్చుకుంది. ఆ రంగంలో ఆమె అందించిన సేవలకు, కృషికి గానూ..యూకే ప్రభుత్వం అత్యున్నత గౌరవంతో సత్కరించింది. ఈ మేరకు ఛానెల్ గ్లోబెల ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లీనా నాయర్ను ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ప్రిన్స్ విలియం కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (CBE)తో సత్కరించారు. ఈ కొత్తఏడాది 2025 గౌరవ పురస్కారాల జాబితాలో ఆమె ఈ అత్యున్నత గౌరవాన్ని దక్కించుకుంది. అంతేగాదు ఛానెల్ బ్రాండ్ లీనా శక్తిమంతమైన నాయకురాలిగా ప్రపంచఖ్యాతీ సంపాదించుకుందని ప్రశంసించింది. దీర్ఘకాలిక సమగ్ర వ్యాపార ప్రభావాన్ని అందించింది. తన బ్రాండ్ హవాను కొనసాగించడం, క్లయింట్ అనుభవాన్ని మెరుగుపరచడం,నిలకడగా సాగేలా వేగవంతం చేయడం వంటి సేవలను అందించిదని ఛానెల్ తన అధికారిక ప్రకటనలో వెల్లడించింది. కాగా భారతీయ వ్యాపార కార్యనిర్వాహకురాలిగి లీనా నాయర్ జనవరి 2022లో ఛానెల్లో బాధ్యతలు స్వీకరించారు. ఛానెల్లో ఆమెనే తొలి భాతర సంతతి మహిళా సీఈవో. తన నాయకత్వంలో ఛానెల్ బ్రాండ్కి మంచి గుర్తింపు లభించేలా కృషి చేసింది. వినియోగదారులను ఆకర్షించేలా గణనీయమైన పురోగతిని అందుకునేలా చేసింది. ముఖ్యంగా కంపెనీ ఫౌండేషన్కు గణనీయమైన ఆర్థిక సహాయం లభించేలా చేసింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా సుమారు 9 మిలియన్లకు పైగా మహిళలు, బాలికలకు ప్రయోజనం చేకూరుతుండటం విశేషం. ఇక ఆమె ఛానెల్లో చేరడాని కంటే ముందు..యూనిలీవర్లో కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్గా, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా సేవలందించారు. చివరగా లీనా స్వస్థలం భారత్లోని మహారాష్ట్రలోని కోల్హాపూర్. ఆమె బాల్యమంతా గడిచింది. ఉన్నత విద్య కోస యూకే వచ్చి అక్కడే సెటిల్ అయ్యారామె. (చదవండి: ఆన్లైన్ ఆర్థిక అక్షరాస్యత వేదిక 'ఫిన్ఈ') -
రెండు సార్లు దురదృష్టం.. కానీ ఆ మాటే ధైర్యం చెప్పింది!
వరల్డ్ చిన్నతనంలోనే అంజనశ్రీ (Anjana Sri) ప్రమాదవశాత్తు కాలు కోల్పోయింది. కూచిపూడి నాట్యం అంటే ఈ చిన్నారికి ఎంతో ఇష్టం.ఇక నాట్యానికి దూరం కావాల్సిందేనా? ‘లేదు’ అన్నది ఆ చిన్నారిలోని ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం ఓడిపోయింది. కూచిపూడి నాట్యంలో అంజనశ్రీ రాణిస్తోంది.జాతీయస్థాయిలో ప్రదర్శనలు ఇస్తూ అందరి మన్ననలు పొందుతోంది.... జగిత్యాల జిల్లా రాయికల్కు చెందిన బొమ్మకంటి నాగరాజు, గౌతమి దంపతుల కుమార్తె అంజనశ్రీ నాలుగు సంవత్సరాల వయస్సులో రోడ్డు ప్రమాదంలో ఎడమకాలు పూర్తిగా కోల్పోయింది. నాట్యప్రతిభకు అంగవైకల్యం అడ్డుకాదని సుధాచంద్రన్ నిరూపించింది. ఆమె ఎదుర్కొన్న కష్టాలు, వాటిని అధిగమించిన తీరును అంజనశ్రీకి కథలుగా చెప్పేవాళ్లు తల్లిదండ్రులు. అంతేకాదు, కూచిపూడి నాట్యకారుడు మచ్చ దేవదాసు వద్ద శిక్షణ ఇప్పించారు. దురదృష్టవశాత్తు రెండోసారి రోడ్డు ప్రమాదం జరిగింది. కుడికాలుకు తీవ్రగాయాలు కావడంతో ఆపరేషన్ చేసి రాడ్ వేశారు. అయినప్పటికీ కృంగిపోకుండా కూచిపూడిలో శిక్షణను కొనసాగించింది.ఇప్పటి వరకు జాతీయస్థాయిలో యాభైకి పైగా నాట్య ప్రదర్శనలు ఇచ్చింది అంజనశ్రీది పేద కుటుంబం. నాన్న బొమ్మకంటి నాగరాజు చిన్నపాటి పాల వ్యాపారం చేస్తున్నాడు. తల్లి గౌతమి గృహిణి. ‘మా అమ్మాయి కూచిపూడి నాట్యంలో పెద్ద పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం’ అంటున్నారు అంజనశ్రీ తల్లిదండ్రులు.చదవండి: Akhil-Zainab Reception డైమండ్ నగలతో, గార్జియస్గా అఖిల్ అర్థాంగిఆ మాటే ధైర్యం చెప్పిందినాకు కూచిపూడి అంటే చాలా ఇష్టం. యాక్సిడెంట్లో కాలుపోవడంతో ఇక ఎప్పుడూ డ్యాన్స్ చేయలేను అని బాధపడేదాన్ని. నా తల్లిదండ్రులు మాత్రం ‘నువ్వు ఎప్పటిలాగే మళ్లీ డ్యాన్స్ చేస్తావు’ అని ధైర్యం చెప్పారు. వారి ఆశీర్వాదబలంతో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాను. ‘పట్టుదల ఉంటే కానిది లేదు’ అనే మాటను స్కూలు పాఠాల్లో విన్నాను. ఆ మాట నాకు ధైర్యం చెప్పినట్లు అనిపించేది. – అంజనశ్రీ– కందుకూరి శశిధర్, సాక్షి, జగిత్యాలచదవండి: Air India Plane Crash బోయింగ్ 787 డ్రీమ్లైనర్పై ఆరోపణలు: ఇంత విషాదం ఇపుడే! -
ఇంజనీర్ గ్రాడ్యుయేట్ కాస్తా.. ర్యాప్ సింగర్గా ప్రభంజనం..
ఆకులందు అణిగిమణిగి ఉండే అడవి పాటను భళ్లుమనే దీపాల నగర వేదికల మీదకు తెచ్చింది మాహి. మహరాష్ట్ర ఆదివాసీ తెగకు చెందిన ఈ యువ గాయని తన రాప్ సింగింగ్ని పేరు కోసమో కీర్తి కోసమో కాక అడవి కోసం, పర్యావరణం కోసం ఆయుధంగా మార్చింది. మాహి చెప్పేది ఒకటే – దేశంలో ఎవరు ఎక్కడ ఉండాలో కొందరు నిర్ణయించారు. ఎక్కడకు చేరాలో మనం నిశ్చయించుకుంటే చాలు అని. మాఝీ నిర్ణయం ప్రకారం ఆమె పాట సరిహద్దులు దాటుతోంది.‘నేను మీకు వినోదం అందించడానికి రాలేదు. నా జాతికి ప్రాతినిధ్యం వహించడానికి వచ్చాను’ అంటుంది మాహి. 27 ఏళ్ల ఈ ర్యాప్ సింగర్ ఆదివాసీల జీవితాన్నే పాటగా మార్చి లైవ్ షోస్ చేస్తూ ఆదరణ పొందుతోంది. ఎడతెగని వచనాన్ని పాటలా పాడే ‘ర్యాప్’ లో మన దేశం నుంచి మురికివాడల పిల్లలు కూడా షైన్ అయ్యి పేరు సంపాదించారు. ఇప్పుడు అడవి నుంచి వచ్చిన మాహి వంతు. ‘మా ఆదివాసీల గురించి నేను పాడకపోతే ఇంకెవరు పాడతారు’ అంటుంది మాహి.గిరిజన కోయిలమాహి పూర్తి పేరు మధుర యశ్వంత్ ఘనె. అయితే ర్యాపర్గా మాహి.జి పేరుతో గుర్తింపు పొందింది. ఈమె సొంత ఊరు మహరాష్ట్రలోని వరంగుషి. వీళ్లంది మహదేవ్ కోలి అనే గిరిజన తెగ. తండ్రి బస్ కండెక్టర్గా పని చేస్తుంటే తల్లి గృహిణి. ‘మా తెగలో ఎవరూ బడికి వెళ్లరు. వెళ్లినా మధ్యలోనే మానేస్తారు. అందుకే మా అమ్మా నాన్నా నా చదువు కోసం ముంబై వలస వచ్చారు’ అంటుంది మాహి. ముంబైలో తమ్ముడితో కలిసి ఇంజనీరింగ్లో చేరిన మాహి అక్కడే స్టూడెంట్స్ పాడే ర్యాప్ సాంగ్స్ను మొదటిసారి వింది. అయితే ఆమెకు పాడటం రాదు, బాణీ కట్టడం అంతకన్నా రాదు. కాని అప్పుడప్పుడు కవిత్వం రాసేది. కాని కోవిడ్ వచ్చాక ఆమెలోకి గాయని బయటకు వచ్చింది.అడవి పాట ఇచ్చిందికోవిడ్ వచ్చినప్పుడు ముంబై మూగబోయింది. ఆ సమయంలో నగరం మంచిది కాదని మాహి కుటుంబం అడవిలోని సొంత పల్లెకు వెళ్లి ఉండిపోయింది. ‘అక్కడకు వెళ్లాక మా వాళ్ల జీవితం నాకు కొత్తగా అర్థమైంది. వారు కోవిడ్ కాలంలో కూడా హాయిగా జీవిస్తున్నారు. వారు ప్రకృతి ఒడిలో ఉన్నారు. ఆశ లేదు. పరుగు లేదు. ఎవరికీ హాని చేయరు. అడవిని కాపాడి మేలు చేస్తారు. కాని వీరి గురించి ఎవరూ మాట్లాడరే. అడవుల్లో గిరిజనులు ఉన్న ఊసే ఎవరికీ ఉండదే అనిపించింది. అలా మొదటి పాట తన్నుకొని వచ్చింది. ఆ పాటే ‘జంగిల్ చా రాజా’. 2019లో ఈ పాట బయటకు రాగానే నాకు గుర్తింపు వచ్చింది’ అంటుంది మాహి.హక్కుల కోసం పాటమాహి తన పాటలో సామాజిక స్పృహ ఉండాలని కోరుకోవడం ఆమెకు గౌరవాన్ని తెచ్చింది. జేఎన్యూ స్టూడెంట్స్ ప్రత్యేకంగా ఆహ్వానించి మాహి షో నిర్వహించడంతో మాహి పాటల్లోని రాజకీయ స్పృహ మరింతగా పదును తేలింది. ఇక మాహి పాటలు వరుసెత్తాయి. రైతుల సమస్యలు, కుల వివక్ష, క్వీర్ కమ్యూనిటీ హక్కులు, గ్రామీణ జీవనం, స్త్రీల సంఘర్షణ ఆమె సాట వస్తువులయ్యాయి. ‘కనిపించే వాటిని చూస్తూ కూడా అంధుడిగా మారకు’... ‘ఎవరి చెమటతో నీ ఇల్లు పూర్తవుతుందో వారు ఏ ఠికానా లేకుండా తిరగడాన్ని చూడు’... ‘బేటీ బచావు కబ్ తక్... ఎందుకు ఆడపిల్లను కాపాడాలి... కాపాడాల్సిన అవసరమే లేని సమాజాన్ని నిర్మించలేమా’... ఇలా ఉంటాయి ఆమె పాటల్లోని లైన్లు.మాహి ఇంకా చాలా పేరునూ గుర్తింపునూ పొంనుంది. ఎందుకంటే ఆమె పాటలో అర్థం, ఆగ్రహం ఉన్నాయి. అవి పాటను సజీవం చేస్తాయి. (చదవండి: తొమ్మిదేళ్లకే గజ్జె కట్టి... ఏకంగా మిస్ వరల్డ్ 2025లో..) -
అడవే ఆధారం.. బతుకు భారం..
సంక్షేమ ఫలాలు దరి చేరవు. వ్యవసాయ భూమి లేదు. అటవీ ఉత్పత్తుల సేకరణే జీవనాధారం. ఇదీ నల్లమల అటవీ ప్రాంతంలోని వందలాది చెంచుల జీవనం. అటవీ ప్రాంతంలోని చెంచుల జీవనాన్ని మెరుగుపరిచేందుకు ఎన్ఆర్ఈ జీఎస్, వ్యవసాయ, గిరిజన సహకార సంస్థతో పాటు ఐకేపీ, టీపీఎంయూ ఐటీడీఏలో అంతర్భాగంగా ఉన్నప్పటికీ.. సంక్షేమ ఫలాలు వారి దరి చేరడం లేదు. ఫలితంగా అటవీ ఉత్పత్తుల సేకరణతోనే కాలం వెళ్లదీస్తున్నారు.నల్లమల లోతట్టు ప్రాంతంలో..ఉమ్మడి రాష్ట్రంలోని సున్నిపెంట (శ్రీశైలం)లో మహబూబ్నగర్, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలోని చెంచుల సంక్షేమం కోసం ఏర్పాటైన సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) ప్రభావితంగానే కొనసాగింది. 2014 రాష్ట్ర విభజన అనంతరం 2015 మార్చి నుంచి అమ్రాబాద్ మండలం మన్ననూర్లో ఐటీడీఏ ఏర్పాటు చేశారు. దీని పరిధిలో నాగర్కర్నూల్, మహబూబ్నగర్, నల్లగొండ, వికారా బాద్, రంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. ఐదు జిల్లాలోని 25 మండలాల్లో 172 గిరిజన గ్రామాలు, పెంటలున్నాయి. మొత్తం 4,041 చెంచు కుటుంబాల్లో 14,194 మంది జనాభా ఉంది. నల్లమల అటవీ ప్రాంతంలో 88 చెంచు పెంటలు ఉండగా.. 2,595 కుటుంబాల్లో 8,784 మంది చెంచులు నివసిస్తున్నారు. వీరిలో 4,341 మంది పురుషులు, 4,449 మంది మహిళలు ఉన్నారు.అభయారణ్యంలో లింగాల, అమ్రాబాద్, పదర మండలాలు ఉండగా.. 18 చెంచు పెంటలు ఉన్నాయి. 12 పెంటల్లో పూర్తిగా చెంచులే నివసిస్తుండగా.. మిగతా పెంటల్లో చెంచులతో పాటు ఎస్సీ, ఎస్టీలు ఉంటారు. అచ్చంపేట, కొల్లాపూర్ నియోజక వర్గాల పరిధిలోని లోతట్టు అటవీ ప్రాంతంలోని ఫర్హాబాద్, మల్లాపూర్, పుల్లాయిపల్లి, రాంపూర్, అప్పాపూర్, భౌరాపూర్, ఈర్లపెంట, మేడిమెల్కల, సంగడిగుండాలు, ధారవాగు, తాటిగుండాలు, పెద్దూటి, బట్టిచింతల, ఎంకలపెంట, ఎర్రపెంట, పాత ధారారం, కుండిచింతలబైలు తదితర చెంచు పెంటల్లో నివసించే వారి పరిస్థితి దుర్భరంగా తయారైంది.ఫలాల సేకరణలో హద్దులు..చెంచులు ప్రధానంగా దుంపలు, అటవీ ఉత్పత్తుల సేకరణ, వేటపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. నల్లమలలోని పలు చెంచు పెంటలకు నేటికీ సరైన రహదారులు లేవు. సరైన జీవనశైలి లేకపోవడంతో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. అటవీ ప్రాంతంలో లభించే ఫలాల సేకరణకు హద్దులు ఏర్పాటు చేసుకుంటారు. వారు ఏర్పాటు చేసుకున్న సరిహద్దు ప్రాంతంలోనే అటవీ ఉత్పత్తులు సేకరిస్తుంటారు. ఇది వంశపారంపర్యంగా వస్తున్న హక్కుగా చెబుతున్నారు. చెంచుల ఆచారాలు, ఇంటి పేర్లు చెట్లు, వన్యప్రాణుల పేర్లతో కూడి ఉంటాయి.చెట్ల పెంపకమేదీ?అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగించే చెంచుల బతుకులు ప్రశ్నార్థకంగా మారనున్నాయి. క్రమంగా అటవీ ఉత్పత్తులు అంతరించడం, చెంచుల జీవన ప్రమాణాలు పెంచాల్సిన అధికారులు నిద్రావస్థలో ఉండటంతో... ఆహార కొరత ఏర్పడింది. నాగరికత ఎరుగని చెంచులు నేటికీ ఆహార సేకరణ దశలోనే ఉన్నారు. వీరి అభ్యున్నతికి బాటలు వేయాల్సిన ఐటీడీఏ.. ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదన్నది వాస్తవం. కనుమరుగవుతున్న పండ్ల చెట్ల పెంపకంపై అధికారులు దృష్టి సారించడం లేదు. వేసవిలో కనీసం ఉపాధి పనులు కూడా చేపట్టకపోవడంతో.. చెంచులు అయోమయ పరిస్థితిలో ఉన్నారు.క్రూరమృగాలతో ముప్పు..నల్లమల అటవీ ప్రాంతంలో తేనె, మారెడు గడ్డలు, జిగురు, చింతపండు, కుంకుడుకాయలు, ముష్టి గింజలు, ఎండు ఉసిరి, చిల్లగింజలు, నరమామిడి చెక్క, కరక్కాయలు, విప్పపువ్వు, విప్ప గింజలు, కానుగ గింజలు, తునికాకు, బుడ్డపార్ల వేర్లు, వెదురు వంటి వాటితో పాటు మరో పది రకాల అటవీ ఉత్పత్తులు లభిస్తాయి. వాతావరణ పరిస్థితులు, రేడియేషన్ ప్రభావం వల్ల సహజ సిద్ధంగా లభించే అటవీ ఫలాలు క్రమంగా అంతరిస్తున్నాయి. పెద్దపులులు, క్రూరమృగాలతో ముప్పును సైతం లెక్కచేయకుండా ఫలాల సేకరణ చేయక తప్పడం లేదు.అటవీ ఉత్పత్తులు సేకరించి.. గిరిజన కార్పొరేషన్ సంస్థ (జీసీసీ) కేంద్రాల్లో విక్రయిస్తారు. వారికి కావాల్సిన సరుకులను అక్కడి నుంచి తీసుకెళ్తారు. రాష్ట్ర ప్రభుత్వం మొక్కల పెంపకంపై దృష్టి సారిస్తున్నప్పటికీ.. చెంచులకు ఫలాలు ఇచ్చే మొక్కల పెంపకంపై మాత్రం ఆసక్తి చూపడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే అడవిలో లభించే తునికాకు సేకరణను అటవీశాఖ అధికారులు పదేళ్లుగా నిలిపివేశారు. రేడియేషన్ కారణంగా తేనెటీగలు అంతరించిపోవడంతో తేనెతుట్టెలు కనిపించడం లేదు. ఏడాది పొడవునా జిగురు, చింతపండు, తేనెపైనే చెంచులు ఆధారపడి జీవిస్తున్నారు.ప్రత్యేక కార్యాచరణచెంచుల సంక్షేమం, అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించింది. చెంచుల కోసం కేంద్ర ప్రభు త్వం ప్రధానమంత్రి జనజా తి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం జన్మన్ యోజన) పథకం కింద 88 చెంచుపెంటల్లో 11 రకాల కార్యక్రమాలు విడతల వారీగా చేపడుతోంది. చెంచు పెంటల్లో 1,030 ఇళ్ల నిర్మాణం ప్రతిపాదించి, పనులు ప్రారంభించాం. కొంతమంది చెంచులకు కిసాన్ క్రెడిట్ కార్డులు, ఆయుష్మాన్ భారత్ కార్డులు, ఆధార్ కార్డులు అందజేశాం. ప్రత్యేకంగా మెడికల్ వాహనం ఏర్పాటు చేశాం. మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం.– రోహిత్రెడ్డి, ఇన్చార్జి పీవో, ఐటీడీఏబీమా సౌకర్యం కల్పించాలికొన్నేళ్లుగా స్వచ్ఛంద సంస్థలు మాత్రమే తేనె సేకరణలో మాకు ఉపయో గపడుతున్నాయి. వారు ఇచ్చిన కిట్లు కూడా పాడయ్యాయి. కొత్త వాటిని ఇవ్వ లేదు. గతంలో పెంటలకు అందుబాటులో తేనె లభించేది. తేనె సేకరణకు ఆడవిలో చాలా దూరం వెళ్లాల్సి వస్తోంది. ప్రభుత్వం తేనెకు మద్దతు ధర కల్పించడంతో పాటు.. తేనె సేకరణకు వెళ్లే ప్రతి ఒక్కరికీ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి.– బయ్యన్న, మల్లాపూర్ చెంచుపెంటచదవండి: కట్నంగా కిడ్నీ కూడా ఇవ్వాల్సిందే!గుడిసెల్లోనే కాపురం..లోతట్టు అటవీ ప్రాంతంలోని చెంచులు నేటికీ అనాగరిక జీవితం కొనసాగిస్తున్నారు. అటవీ ఉత్పత్తులు తగ్గాయి. జీవనం కొనసాగడం కష్టంగా ఉంది. పక్కా ఇళ్లు లేక నేటికీ బొడ్డు గుడిసెల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. ప్రత్యేక ఉపాధి తీసివేసిన తర్వాత పనులు లేకుండా పోయాయి. వైద్యం అందక రోగాల బారిన పడుతున్నారు.– నిమ్మల శ్రీనివాసులు, అధ్యక్షుడు, రాష్ట్ర ఆదివాసీ చెంచు ఐక్యవేదిక -
డివోర్సీ క్యాంప్స్
విడాకులు తీసుకున్న స్త్రీల గురించి వ్యాఖ్యలు వినిపిస్తూనే ఉంటాయి. తప్పు ఎవరిదైనా వీరినే సందేహంగా చూస్తారు. విడాకుల తర్వాతి జీవితం పురుషుడికి ఉన్నంత సులువుగా స్త్రీకి లేదు. వారికంటూ స్నేహబృందం కష్టమే. అందుకే కేరళకు చెందిన రాఫియా తాజాగా నిర్వహించిన ‘డివోర్సీ క్యాంప్’ అందరి దృష్టినీ ఆకర్షించింది. విడాకులు పొందిన స్త్రీల బృందం రెండు రోజులపాటు స్నేహితులుగా మారి తమ మనోభావాలు పంచుకోవడమే ఈ క్యాంప్స్ లక్ష్యం. మొదటిది సక్సెస్ కావడంతో రాబోయే రెండు నెలల్లో మరో నాలుగు క్యాంప్స్ నిర్వహించనుంది రాఫియా.‘మేము కలిసేది మా బాధలు, పాత కథలు చెప్పుకుని ఏడ్వడానికి కాదు. మేము మర్చి పోయిన నవ్వును తిరిగి పొందడానికి’ అంటుంది రాఫియా అఫి. 30 ఏళ్ల ఈ డివోర్సీది కేరళలోని ఇడుక్కి. వారం క్రితం ఈమె పదిహేను మంది డివోర్సీ మహిళలతో ఇడుక్కీకి సమీపంలో ఉండే వాగమాన్ అనే అందమైనచోట రెండు రోజుల ‘డివోర్సీ క్యాంప్’ నిర్వహించింది. బహుశా దేశంలో ఇలాంటి మాట వాడుతూ స్త్రీల బృందం కలవడం ఇదే మొదటిసారి కావచ్చు. ఈ పదిహేనుమందిలో ఎక్కువమంది విడాకులు పొందినవారు... మిగిలిన వారు పొందేందుకు పోరాటం చేస్తున్నవారు. వీరిలో ఒకరిద్దరు తమ పిల్లలతో వచ్చారు కూడా. మాకంటూ స్పేస్ కావాలి‘సమాజంలో విడాకులను ఇప్పటికీ వ్యక్తిగత వైఫల్యంగా చూస్తారు. విడాకులు పొందిన స్త్రీని చూస్తూ ఆమెకు చేతగాక కాపురాన్ని పాడు చేసుకుందని భావిస్తారు. కుటుంబ సభ్యులు మొదలు అందరూ సానుభూతిగా చూస్తుంటారు. వివాహం లో ఉన్నప్పుడు ఉన్న స్నేహాలన్నీ చెదిరి పోతాయి. విడాకుల వల్ల స్త్రీకి ఆర్థికంగా, వ్యక్తిగతంగా ఎంతో నష్టమున్నా ఇలాంటి పరిస్థితుల వల్ల ఎంతో ఒత్తిడి ఉంటుంది. మమ్మల్ని జడ్జ్ చేయని విధంగా మాకంటూ మేము ఒక స్పేస్ను హాయిగా గడిపేలా ఈ డివోర్సీ క్యాంప్ ఉపయోగపడుతోంది’ అంది రాఫియా.బ్రేక్ ఫ్రీ స్టోరీస్రాఫియాకు ఇన్స్టాలో ‘కుక్ ఈట్ బర్న్’ అనే అకౌంట్ ఉంది. అందులో ఆమె సరదా వీడియోలు పెట్టేది. ‘కాని నా విడాకుల గురించి మాట్లాడటానికి సందేహించిదాన్ని. విడాకులు పొంది తర్వాతి జీవితం విషయంలో లోలోపల ఆందోళనగా ఉన్నదాన్ని నేనొక్కదాన్నే అనుకున్నాను. నా ఇన్స్టాలో నా విడాకుల గురించి మాట్లాడటం మొదలుపెటాక నేనే కాదు.. నాలా ఉన్న స్త్రీలు ఎందరో ఉన్నారని వారి రెస్పాన్స్ను బట్టి అర్థమైంది. కేరళలో విడాకులు పొందిన స్త్రీలతో ‘బ్రేక్ ఫ్రీ స్టోరీస్’ పేరుతో ఒక వాట్సప్ గ్రూప్ పెడితే మానసిక ఓదార్పు మాత్రమే గాక లీగల్ సమస్యలకు ఇతరత్రా ఇష్యూస్కు ఒక స పోర్ట్ ఉంటుందని ప్రయత్నించాను. కొద్దిరోజుల్లోనే వందమంది మహిళలు చేరారు. వారిలో కొంతమందితో క్యాంప్ నిర్వహించాలని అనుకున్నాను. మొదటి ప్రయత్నంగా వాగమాన్ లో రెండురోజుల క్యాంప్ ఉందని చె΄్పాను. పదిహేను మంది వచ్చారు’ అని తెలిపింది రాఫియా.క్షణాల్లో ఆత్మబంధువులుడివోర్సీ క్యాంప్కు వచ్చిన పదిహేను మంది మహిళలు అంతకు ముందు ఎటువంటి పరిచయం లేని వాళ్లు. కాని కలిసీ కలవగానే వీరంతా స్నేహితులై పోయారు. ఎడతెగని మాటలు... నవ్వులు... కొన్ని కన్నీళ్లు... ఆటలు... నృత్యాలు... ప్రకృతి తుళ్లిపడే కేరింతలు... మేమందరం ఒకేలాంటి సమస్యలో ఉన్నవాళ్లం అన్న భావన వారిని ఒక్కటి చేసి మానసిక బలం ఇచ్చింది. ‘వీరిలో చాలామందికి సొంత కుటుంబ సభ్యుల నుంచీ స పోర్ట్ లేదు. విడాకుల సమయంలో స్త్రీలకు ఇతరుల మద్దతు లేకున్నా తల్లిదండ్రుల మద్దతు తప్పనిసరి. అదృష్టవశాత్తు నాకు ఉంది’ అని తెలిపింది రాఫియా. ‘‘ఈ క్యాంప్లో అందరం కలిసి అనుకున్నమాట– విడాకుల తర్వాత కూడా మంచి జీవితాన్ని సాధించవచ్చుననే’’ అంది రాఫియా. ఇకపై నిర్వహించబోయే డివోర్సీ క్యాంపుల్లో థెరపీ, లీగల్ అడ్వయిజ్, ఫైనాన్షియల్ స పోర్ట్, సమాజాన్ని ఎదుర్కోవాల్సిన తీరు గురించి ఎక్స్పర్ట్లతో కౌన్సిలింగ్స్ ఉంటాయని చెబుతోంది రాఫియా. ఆశ్చర్యం ఏమిటంటే ఈ క్యాంప్ అయిన వెంటనే రాఫియా ఫోన్ ఎడతెగక మోగుతోంది. అలెప్పీ, వాయనాడ్లాంటి చోట్ల ఆమె ఈ క్యాంప్లను ΄్లాన్ చేసింది. అక్కడికి ఇప్పటికే వచ్చేవారు సిద్ధమయ్యారు కూడా.కొసమెరుపు: విడాకులు పొందిన, పొందే క్రమంలో ఉన్న పురుషులు కూడా ఆమెకు ఫోన్ చేస్తున్నారు... ఇలాంటి క్యాంపులు నిర్వహించమని. ‘ఆ సంగతి కూడా ఆలోచిస్తాను’ అంటోంది రాఫియా. -
దారి చూపిన నారి
‘ప్రభువెక్కిన పల్లకీ కాదోయ్ అది మోసిన బోయిలు ఎవరు?’ అని ప్రశ్నించాడు కవి. లూయిస్, క్లార్క్ సాహస, అన్వేష యాత్రలు ప్రపంచ ప్రసిద్ధం. అయితే లూయిస్, క్లార్క్ ద్వయానికి దారి చూపింది ‘సకాగవేయ’ అనే సాహసికురాలు అనే విషయం చాలా తక్కువమందికి తెలుసు. నేటివ్ అమెరికన్ అయిన సకాగవేయ లూయిస్, క్లార్క్లకు అనువాదకురాలిగా, గైడ్గా పనిచేసింది.లూయిస్, క్లార్క్లు 1804 నుంచి 1806 వరకు అమెరికాలో ఎన్నో అన్వేష యాత్రలు చేశారు. ఈ ఇద్దరు ఆమెరికా ఆర్మీలో కెప్టెన్, కమాండింగ్ ఆఫీసర్ హోదాలో పనిచేశారు. 1804 నవంబర్లో లూయిస్, క్లార్క్లు తొలిసారిగా నార్త్ డకోటలో షోషోన్ తెగకు చెందిన సకాగవేయను కలుసుకున్నారు. సకాగవేయ వయసు పదిహేడు సంవత్సరాలు. అప్పటికి ఆమె గర్భవతి. 1805లో జీన్స్ బాప్టీస్ట్ అనే కొడుకుకి జన్మనిచ్చింది. కొన్ని నెలలకే పసిబిడ్డను భుజాన వేసుకొని లూయిస్, క్లార్క్ల అన్వేష యాత్రలో భాగం అయింది. ఈ అన్వేష యాత్రలో ఎంతోమంది నేటివ్ అమెరికన్స్తో మాట్లాడాల్సి వస్తుంది. ప్రమాదాలు పొంచి ఉంటాయి. రెండు భాషల్లో ప్రావీణ్యం ఉన్న సకాగవేయ వారికి అనువాదకురాలిగా పనిచేయడమే కాదు ఎన్నో మొక్కల పేర్లు, వాటి వివరాలు, ఔషద గుణాల గురించి చెప్పేది. ప్రమాదాలను పసిగట్టేది.కొండల్లో, కోనల్లో, ఎల్లోరివర్ ప్రాంతాలలో లూయిస్, క్లార్క్లకు దారి చూపింది. అందుకే క్లార్క్ ఆమెను ‘పైలట్’ అని పిలిచేవాడు. పసిఫిక్ మహా సముద్రాన్ని చేరుకోవడంతో లూయిస్, క్లార్క్ల అన్వేష యాత్ర 1806లో విజయవంతంగా పూర్తయింది. ఈ యాత్ర విజయానికి సకాగవేయ సంపూర్ణ సహాకారాన్ని అందజేసింది. అయితే సకాగవేయ పడిన కష్టానికి భర్తకు 232 ఎకరాల భూమి దక్కింది తప్ప ఆమెకు చిల్లి గవ్వ కూడా దక్కలేదు. ఎలాంటి సన్మానమూ జరగలేదు. అయినప్పటికీ అమెరికా చరిత్రలో సకాగవేయ అసాధారణ మహిళ. సాహసం మూర్తీభవించిన సకాగవేయ ముఖచిత్రంతో నాణేలు, స్టాంప్లు ముద్రించారు. ఎన్నోచోట్ల విగ్రహాలు నెలకొల్పారు. -
ఆకాశ సిందూరం
అనామిక శర్మ ఆకాశ సాహసాలు కొత్తేమీ కాదు. సాహసానికి సామాజిక సందేశం జోడించడం ఆమె శైలి. ఈసారి ‘ఆపరేషన్ సిందూర్’ పతాకాన్ని ఆకాశమంత ఎత్తున ప్రదర్శించింది. భారత సాయుధ దళాలకు మద్దతుగా థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ గగనతలంలో ఆపరేషన్ సిందూర్ పతాకాన్ని నింగిన ఎగరేసింది అనామిక. రెండు చేతులతో ‘ఆపరేషన్ సిందూర్’ పతాకాన్ని పట్టుకొని సింగిల్–ఇంజిన్ ఎయిర్క్రాఫ్ట్ పీఎసీ 750ఎక్స్ఎల్ నుంచి దూకి ‘ఆపరేషన్ సిందూర్’ పతాకాన్ని ప్రదర్శించింది. దాదాపు 14,000 అడుగుల ఎత్తు నుంచి డ్రాప్ జోన్లోకి దూకింది.‘ఈ జంప్ చేసినందుకు సంతోషంగా ఉంది. ముప్పులు, ప్రమాదాల బారి నుంచి దేశాన్ని రక్షిస్తున్న భారత సాయుధ దళాలకు శాల్యూట్ చేస్తున్నాను. మన సాయుధ దళాల సత్తా ఏమిటో మరోసారి ఆపరేషన్ సిందూర్ ద్వారా నిరూపణ అయింది’ అంటుంది అనామిక.ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు చెందిన అనామిక శర్మ తండ్రి అజయ్శర్మ ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఎఫ్) కమాండోగా పనిచేశారు. స్కైడైవింగ్లో అనామికకు తొలి గురువు. ‘యాక్టివ్ డైవర్స్’గా గుర్తింపు పొందిన ఈ తండ్రీకూతుళ్లు ఎన్నో గగనతల సాహసాలు చేశారు. యునైటెడ్ పారాచూట్ అసోసియేషన్ (యుపీఏ)లో పిన్న వయస్కురాలైన అనామిక శర్మ ‘డి’ కేటగిరి డైవింగ్ లైసెన్స్ను పొందింది. మన దేశంలోని ఏకైక మహిళా స్కైడైవింగ్ కోచ్ అనామిక. ప్రయాగ్రాజ్లో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన అనామిక దేశంలోని వివిధ ప్రాంతాలలోని పాఠశాలల్లో చదువుకుంది. బెంగళూరులో బీ.టెక్. చేసింది. పదేళ్ల వయసులోనే మన దేశంలోని యంగెస్ట్ ఫిమేల్ స్కైడైవర్గా సంచలనం సృష్టించింది. 300ల స్కైడైవ్స్ చేసింది. గత సంవత్సరం 13,000 అడుగుల ఎత్తులో రామమందిరం పతాకాన్ని, ఈ సంవత్సరం మహా కుంభమేళ పతాకాన్ని బ్యాంకాక్లో 13,000 అడుగుల ఎత్తులో ప్రదర్శించింది. అనామిక శర్మ తాజా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
మిస్ యూనివర్స్కు మన తెలుగు తేజాలు
త్వరలో థాయిలాండ్లో జరగనున్న మిస్ యూనివర్స్ 2025 కోసం భారత్ నుంచి మిస్ యూనివర్స్ ఇండియాను ఎంపిక చేయడానికి పోటీలు జరిగాయి. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ ఫైనలిస్టుల ఎంపికలో మిస్ యూనివర్స్ తెలంగాణగా కశ్వి, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్గా ప్రకృతి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వీరు పంచుకున్న విశేషాలు..సుస్మితాసేన్ స్ఫూర్తినేను మెడికల్ స్టూడెంట్ని. మోడల్ గా కూడా రాణిస్తున్నాను. శాస్త్రీయ నృత్యమూ నేర్చుకున్నాను. అందాల పోటీలు అంటే కేవలం బ్యూటీ గురించి మాత్రమే కాదు. మహిళా సాధికారత, ఆత్మవిశ్వాసం, సమాజానికి మంచి చేయాలనే ఆలోచన, జీవన నైపుణ్యాల వృద్ధి.. ఇలా అన్నింటిపై ఫోకస్ ఉంటుంది. అందుకే నేను దీనిమీద దృష్టి పెట్టాను. నేను పుట్టి పెరిగింది అమెరికాలో. మా అమ్మానాన్నలు తెలంగాణ వాసులు. మిస్ యూనివర్స్ సుస్మితాసేన్ అంటే నాకు చాలా ఇష్టం. ఆమెలా ఎదగాలన్నది నా డ్రీమ్. అందుకే నన్ను నేను నిరూపించుకోవడానికి హైదరాబాద్ వచ్చాను. ఈరోజుల్లో ప్రజల్లో మానసిక అనారోగ్యం బాగా పెరుగుతోంది. దీనిపై చైతన్యం కలిగించేందుకు కృషి చేస్తున్నాను. అలాగే గృహహింస పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాను. వీటితో పాటు మూగ, చెవిటి వారికి సహాయకారిగా ఉంటూ వారి వృద్ధికి కృషి చేస్తున్నాను. ఈ విషయాలు న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్నాయి. తెలంగాణకు రావడానికి ముందే మా పేరెంట్స్ నుంచి, బుక్స్ నుంచి తెలంగాణ గొప్పతనం గురించి తెలుసుకున్నాను. ఇక్కడికి రావడం విజేతగా నిలవడం... చాలా సంతోషంగా ఉంది.– కశ్వి, మిస్ యూనివర్స్ తెలంగాణకాన్ఫిడెన్స్ ముఖ్యంకళ్ళు మూసినా, తెరిచినా కిరీటమే కళ్ళ ముందుండేది. ఫైనలిస్ట్గా ఎంపికయినందుకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. పోటీలో మన మాటల్లో, నడకలో, ప్రవర్తనలో కాన్ఫిడెన్స్ నే ప్రధానంగా చూస్తారు. ఫైనల్ రౌండ్లో... త్యాగం, పాజిటివిటీ, నెగెటివిటీల గురించి అడిగారు. త్యాగం అనేది ఎప్పుడూ గొప్పదే. మన జీవితంలో చిన్న చిన్న త్యాగాలు చేస్తుంటాం. కానీ, త్యాగం వల్ల మన సెల్ఫ్ హ్యాపీగా లేకపోతే చేయకూడదు అని నేను చెప్పడం న్యాయనిర్ణేతలను ఆకట్టుకుంది. గత ఏడాది ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ నుంచి పోటీ చేసి గెలు పొందాను. ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్గా ఎంపికయ్యాను. ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామో ఆ రాష్ట్ర సంస్కృతి, చరిత్ర, భాష.. ఇలా అన్నింటి గురించి తెలిసుండాలి. అమ్మానాన్న బెంగళూరులో ఉంటారు. అమ్మ వర్కింగ్ విమెన్, అక్క ప్రేరణ నాకు బ్యాక్ బోన్ అని చెప్పవచ్చు. అంతగా ఎంకరేజ్ చేస్తారు. బీకామ్లో డిగ్రీ చేశాను. డాన్స్ అంటే ఇష్టంతో డాన్స్ కోర్సు చేశాను. బెంగళూరులో డాన్స్ స్టూడియో ఉంది. రియాలిటీ షో చేశాను, నేను నటించిన సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. నన్ను ఆల్ రౌండర్ అని నా ఫ్రెండ్స్ అంటుంటారు. బ్యూటీ అంటే ఫిజికల్గా కనిపించేదే కాదు.. మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ . దానినే అన్నింటికన్నా భిన్నంగా చూపగలగాలి.–ప్రకృతి కంబం, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్– నిర్మలారెడ్డిఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్ -
మరో ప్రతిష్టాత్మక పోటీకి తెలుగమ్మాయిలు
హైదరాబాద్ నగర వేదికగా ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీలు ముగిశాయో లేదో మరో ప్రతిష్టాత్మక ఫ్యాషన్ ఈవెంట్ ‘మిస్ యూనివర్స్’ ప్రారంభమవుతోంది. ఈ సారి థాయ్లాండ్లో జరగనున్న మిస్ యూనివర్స్ 2025 కోసం భారత్ నుంచి మిస్ యూనివర్స్ ఇండియాను ఎంపిక చేయడానికి ఆడిషన్స్ మొదలయ్యాయి. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల నుంచి మిస్ యూనివర్స్ తెలంగాణ, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్లను ఎంపిక చేయడానికి ప్రతి రాష్ట్రం నుంచి 15 మంది ఫైనలిస్ట్లను ఎంపిక చేశారు. హైదరాబాద్ నగరంలో జరగనున్న ఫినాలేలో ఎంపిక చేసిన ఆ ఇద్దరినీ తెలుగు రాష్ట్రాల తరపున మిస్ యూనివర్స్ ఇండియా గ్రాండ్ ఫినాలేకు పంపిస్తారు. ఈ నేపథ్యంలో మిస్ యూనివర్స్ పోటీల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన కొందరు ఫైనలిస్టులు తమ ప్రయాణాన్ని, ఆలోచనలను ‘సాక్షి’తో పంచుకున్నారు. – సాక్షి, సిటీబ్యూరోమాది మల్టీ టాస్కింగ్.. నాది విశాఖపట్నం, ప్రస్తుతం ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. మెడిసిన్, మోడలింగ్ రెండూ చిన్నప్పటి కలలే. ఆడవారికున్న శక్తి మల్టీ టాస్కింగ్. నేను బ్రాహ్మన వర్గం నుంచి వచ్చాను.. మొదట్లో కుటుంబం నుంచి అడ్డంకులు వచ్చినప్పటికీ ఇంట్లో ఒప్పించాను. ఏ రంగంలో చూసినా తెలుగు వారు టాప్లో ఉన్నారు. మిస్ యూనివర్స్లో సత్తా చాటాలని నిర్ణయించుకున్నా. హైదరాబాద్ నగరంతో పాటు ఢిల్లీ, ముంబయి వంటి ప్రాంతాల్లో ర్యాంప్ వాక్, గ్రూమింగ్, స్టైల్స్ వంటి అంశాలపై శిక్షణ తీసుకున్నా. ఇప్పటికీ ఇంట్లో మగవారికి పీరియడ్స్ గురించి చెప్పుకోలేని పరిస్థితి. దీనిని పోగొట్టడానికి ఈ వేదికను వినియోగించుకుంటా. డాక్టర్గా కన్నా ఫ్యాషన్ ఐకాన్గా ఈ అంశాన్ని మరింత ప్రభావ వంతంగా ముందుకు తీసుకెళ్లగలను. – డా.వైష్ణవీ వెన్నెల, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ ఫైనలిస్టుప్రియాంక చోప్రా స్ఫూర్తి.. పుట్టి పెరిగింది, చదువుకున్నదంతా హైదరాబాద్లోనే.. డేటా సైన్స్– ఏఐలో బీటెక్ చేశా. నాకున్న టాలెంట్ స్కిల్తో టాప్ 15లో స్థానం పొందాను. ఈ ఎంపికలో ఎంత ఆత్మవిశ్వాసంతో ఉన్నామన్నదే ముఖ్యం. ఫ్యాషన్ వాక్, ప్రజెంటేషన్, డ్రెస్సింగ్ వంటి అంశాల్లో ఆడిషన్స్ జరిగాయి. ప్రియాంక చోప్రా, లారా దత్త ఇష్టం. మోడలింగ్ కోసం పలు అంశాల్లో ముంబయిలో శిక్షణ తీసుకున్నా. హైదరాబాద్లో మిస్ వరల్డ్ జరిగితే ఎంత గర్వపడ్డామో.. ఒక ఆడపిల్ల బ్యూటీ పేజెంట్లో పాల్గొంటే అంతే గర్వపడాలి. నా బ్యూటీ విత్ పర్సస్.. చిన్నారుల కోసం పనిచేయడం. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించాలి. విపత్కర పరిస్థితుల్లో ఎలా రక్షించుకోవాలో నేర్పించాలన్నదే లక్ష్యం. పలు ఎన్జీఓలతో పనిచేశాను. – అను శ్రీ, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ ఫైనలిస్టుమిస్ టీన్ తెలంగాణ..ప్రస్తుతం హైదరాబాద్లో ఇంజినీరింగ్ చేస్తున్నా. రెండేళ్ల నుంచి మోడలింగ్లో ఉన్నా. 2023లో ఢిల్లీలో నా మొదటి కాంపిటీషన్లో మిస్ టీన్ తెలంగాణ క్రౌన్, తరువాతి ఏడాది ఫ్యాషన్ ఐకాన్ అవార్డ్ గెలుచుకున్నా. మిస్ యూనివర్స్ కిరీటం కన్నా, దాని వల్ల వచ్చే గుర్తింపు శక్తివంతమైనది. నేను బ్రాహ్మణ వర్గం నుంచే వచ్చాను. ఈ విషయంలో నాన్న నన్ను అర్థం చేసుకుని ప్రోత్సహించారు. సినిమాలు, మోడలింగ్, చదువును బ్యాలెన్స్ చేస్తూ వచ్చాను. తెలుగమ్మాయిల అందమంతా వారి కళ్లలోనే కనిపిస్తుంది. ఉమెన్ సేఫ్టీ, వాటర్ స్కేర్ సిటీ, నిరుద్యోగం అంశాల్లో కృషి చేయాలనుంది. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, ఉద్యోగాలకు దూరమవుతున్నారు. దీని పైన దృష్టి సారిస్తున్నా. – లక్షణ అత్తిలి, మిస్ యూనివర్స్ తెలంగాణ ఫైనలిస్టువిలేజ్ టూ మిస్ యూనివర్స్.. నేనొక డాక్టర్.. విజయవాడ ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రిలో హౌస్ సర్జన్గా చేస్తున్నా. 2019 నుంచి బ్యూటీ పేజెంట్లో పలు సార్లు రిజెక్ట్ అయ్యినా పట్టుదలతో మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ ఫైనలిస్టుగా నిలిచాను. నాన్న రైతు.. మారుమూల గ్రామం. ఇక్కడి అమ్మాయిలకు ఎన్నో బంధనాలు. వాటన్నింటీనీ చేధించాలనేదే లక్ష్యం. గతంలో రన్నరప్గా నిలిచిన ఆటో డ్రైవర్ కూతురు మాన్యా సింగ్ నాకు స్ఫూర్తి. మహిళలు పెద్ద లక్ష్యాలను ఎంచుకోడానికి భయపడుతున్నారు. దానిని సాధించి ఈ తరానికి ఒక మార్గదర్శకంగా నిలవాలనుంది. విశ్వ వేదిక పై మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రదర్శించాలనుంది. సాఫల్య అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి మహిళలకు, బాలికలకు మెన్స్ట్రువరల్ హైజీన్పై అవగాహన కల్పిస్తున్నా. – డా.సురేఖ, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ ఫైనలిస్టుమాతృభూమిపై ప్రేమతో.. న్యూయార్క్లో పుట్టాను, న్యూ జెర్సీలో పెరిగాను. నా మాతృభూమిపై ప్రేమతో కుటుంబంతో పాటు హైదరాబాద్ వచ్చాను. అమ్మ ఒకే మాట చెబుతుంది.. ఏది చేసినా చదువును నిర్లక్ష్యం చేయొద్దని. అందుకే మెడిసిన్, మోడలింగ్, యాక్టింగ్ రంగాల్లో రాణిస్తున్నా. మిస్ యూనివర్స్తో పాటు, నటనలో ఆస్కార్ అందుకున్న తొలి భారతీయ యువతిగా నిలవాలనేదే లక్ష్యం. బాడీ టైప్, కలర్పై వారికి తోచింది మాట్లాడతారు. ఎవరేమన్నా మనల్ని మనం ప్రేమించుకోవడం ముఖ్యం. సొంతంగా గ్రూమింగ్, మేకప్ ప్రతిదీ నేర్చుకున్నా. బేసిక్ మెంటల్ హెల్త్పై, డొమెస్టిక్ హౌస్ హోల్డ్ వయెలెన్స్పై అవగాహన కలి్పంచడం విధిగా పెట్టుకున్నాను. జెండర్ స్టీరియోటైప్ పోగొట్టిన రాణి రుద్రమా దేవి నాకు స్ఫూర్తి. – కశ్వి, మిస్ యూనివర్స్ తెలంగాణ ఫైనలిస్టు -
డాడీ అంత పాపులర్ కాదు కానీ.. ఫ్యాషన్ వరల్డ్లో స్పెషల్ లేడీ!
భారతీయ బ్యాంకులకు వేలకోట్ల ఎగవేసి లండన్లో తలదాచుకున్న వ్యాపార వేత్త విజయ్ మాల్యా(Vijay Mallya) భారతదేశంలో సుపరిచితుడు. కింగ్ఫిషర్ బ్రాండ్, ఎయిర్లైన్స్,అందాల భామలతో కేలండర్లు, లగ్జరీ జీవనశైలి, మనీలాండర్, ఆర్థిక నేరస్తుడు, తాజాగా ఐపీఎల్ ఇలా ఏదో కారణంతో నిరంతరం వార్తల్లో ఉండే వ్యక్తి. కానీ చాలా మందికి అతని వ్యక్తిగత జీవితం , అతని దత్తపుత్రిక ‘లైలా మాల్యా’ (Laila Mallya) గురించి పెద్దగా తెలియదు. తండ్రిలా వార్తల్లో ఉండే వ్యాక్తిలా కాకుండా ప్రశాంతంగా ప్రైవేట్ జీవితాన్ని గడుపుతూ ఫ్యాషన్ ప్రపంచంలో రాణిస్తోంది.విజయ్ మాల్యాకు లియానా, తాన్య, లైలా అనే ముగ్గురు కూతుళ్లున్నారు. అయితే మాల్యాకు దత్తత కూతురు. తన మొదటి భార్య సమీరాతో విడిపోయిన తర్వాత 1993లో చిన్ననాటి ప్రేమికురాలు రేఖను వివాహం చేసుకున్నాడు మాల్యా. రేఖ మొదటి భర్త మెహమూద్తో విడాకులు, తనతో వివాహం తర్వాత చట్టబద్ధంగా లైలాను తన కుమార్తెగా దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అలా మాల్యా కుటుంబంలో భాగమైంది. 'మాల్యా' నుతన ఇంటిపేరుగా మార్చుకుంది. ఆమె తండ్రి జీవితం నిరంతరం మీడియాలో హెడ్లైన్గా మారినప్పటికీ, లైలా తన చదువుపై దృష్టి పెట్టింది. విజయ్ పిల్లల్ని తన సొంత చెల్లెళ్లలా చూసుకుంది. తల్లిరేఖకు మునుపటి వివాహం నుండి ఒక అన్నయ్య కబీర్ కూడా ఉన్నాడు.2011లో, లైలా మాల్యా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ సమర్ సింగ్ను వివాహం చేసుకుంది. ఇండోనేషియాలోని బాలిలో వీరి పెళ్లి జరిగింది. లైలా భర్త సమర్ సింగ్, శరద్ పవార్ మనవడు, రాజకీయ నాయకుడు పార్థ్ పవార్కు మంచి స్నేహితుడు. 2019లో, సమర్ లోక్సభ ఎన్నికల మార్కెటింగ్ ప్రచారంలో పార్థ్కు క్యాంపెయిన్ కూడా చేశాడు.లైలా చదువు, కరియర్లైలా కర్ణాటకలోని బెంగళూరులోని మాల్యా అదితి ఇంటర్నేషనల్ స్కూల్లో పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, మసాచుసెట్స్లోని వాల్తామ్లోని బెంట్లీ యూనివర్సిటీలోఇంటర్నేషనల్ బిజినెస్లో గ్రాడ్యుయేషన్ , ఆ తరువాత న్యూయార్క్ నగరంలోని ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి కూడా పూర్తి చేసింది. 2009లో, ఆమె IPL వ్యవస్థాపకుడు లలిత్ మోడీకి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్గా పనిచేసింది, క్రీడలు , ఈవెంట్ మేనేజ్మెంట్పై తొలి అడుగు వేసింది. అయితే ఇక్కడ ఎక్కువ కాలం కొనసాగలేదు. తన అభిరుచికి తగ్గట్టు ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది.ఆభరణాల లేబుల్, సోషల్ బటర్ఫ్లైని ప్రారంభించింది. ఆభరణాల డిజైన్లో ప్రతిభను చాటుకుంటోంది 2015 నాటికి వోగ్ బ్రాండ్ జ్యువెలరీ డిజైనర్, స్టైలిస్ట్గా ఎదిగింది. లైలా ఫ్యాషన్ డిజైనర్ గానే కాకుండా అనేక ఫ్యాషన్ వీక్ షోలలో కూడా పాల్గొంది. లైలా మాల్యా తన తండ్రి అంత పాపులర్ కాకపోవచ్చు. కానీ ఫ్యాషన్ రంగంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుని కెరీర్ను నిర్మించుకున్న ఇండిపెండెంట్ మహిళ అనడంలో సందేహం లేదు. -
డాక్టర్ కాబోయి.. మేకప్ ఆర్టిస్ట్గా నం.1 స్థానం..
26 ఏళ్ల మృణాల్ పంచల్ను దేశంలో అత్యధికమంది ఇన్స్టాలో ఫాలో అవుతున్నారట. కారణం? ఆమె రోజూ మేకప్ టిప్స్ చెబుతుంది. తన మీద మేకప్ అప్లయ్ చేసి క్షణాల్లో రీల్స్ తయారు చేసి ఆకట్టుకుంటుంది. ముఖాలను మార్చే ఈ కళతో తాజాగా వెలువడ్డ ‘కాండిరి హూరూన్ ఇండియాస్ లిస్ట్ ఆఫ్ లీడింగ్ ఉమన్ ఇన్ఫ్లూయెన్సర్’లో అగ్రస్థానంలో నిలుచుంది.మనిషికి అత్యంత ఇష్టమైన వస్తువు తన ఖ్యాతికి కారణమవుతుందని మృణాల్ పంచల్ ఊహించి ఉండదు. మనిషికి ఇష్టమైనది ఏది? అద్దం. అద్దంలో ముఖం చూసుకునేటప్పుడు మనిషి ఏమనుకుంటాడు? కాస్త బాగా కనిపిస్తే బాగుండు అనుకుంటాడు.అలంకార ప్రియులైన స్త్రీలు ఈ మాటను ఇంకా ఎక్కువగా అనుకుంటారు. ఇక్కడే మృణాల్ పంచల్ గెలిచింది. ఏదో కాలక్షేపంగా తాను వేసుకునే మేకప్ను చూపుతూ చేసిన వీడియోలు ఆమెకు భారీగా మహిళా ఫాలోయెర్స్ను సంపాదించి పెట్టాయి. ఇన్స్టాలో ఆమెకు 55 లక్షల మంది ఫాలోయెర్లు ఉన్నారు. ఆమె వీడియోలు క్షణాల్లో వైరల్గా మారతాయి. ఇంతకీ కంటెంట్ కేవలం మేకప్పే. అందుకే ఆమె ‘కాండిరి హూరూన్ ఇండియా విమెన్ లీడర్స్ లిస్ట్ 2025’లో మొదటి స్థానంలో నిలిచింది. ఇంతకు ఎవరు ఈ మృణాల్ పంచల్.డాక్టర్ కాబోయి...చాలామంది సినిమా హీరోయిన్లు డాక్టరు కాబోయి యాక్టర్ అయ్యాను అంటుంటారు. మృణాల్ పంచల్ కూడా అంతే. గుజరాత్లో పుట్టి పెరిగిన మృణాల్ ఎం.బి.బి.ఎస్. చేసేందుకు అవసరమైన చదువు/శిక్షణ కోసం పూణె వచ్చింది. ‘మా అమ్మతో శపథం చేసి మరీ వచ్చాను. అయితే నేను ఒకటి తలిస్తే మేకప్ మరొకటి తలిచింది’ అంటుంది మృణాల్. చిన్నప్పుడు తల్లి నిద్రపోతుంటే మేకప్ కిట్ తీసుకుని ఆమె ముఖానికి మేకప్ వేసి ఆశ్చర్యపరిచిన మృణాల్ స్కూల్లో చదివేప్పుడు కూడా రకరకాల పద్ధతుల్లో మేకప్ వేసుకుని కాలక్షేపం చేసేది. అయితే అందులో సహజమైన ప్రతిభ చాలామందిని ఆకర్షించింది.చదవలేక...అయితే పూణె వచ్చాక భాష సమస్య ఆ తర్వాత చదువు తలకు ఎక్కక పోవడంతో మృణాల్ ఒక దశలో కుదేల్ అయ్యింది. ఇక ఇంటికి పోవడం ఒక్కటే శరణ్యం అనుకుంటున్నప్పుడు టిక్టాక్లో కాలక్షేపానికి మేకప్ ట్యుటోరియల్ అంటూ ఒక వీడియో చేసింది. అది వైరల్గా మారింది. స్త్రీలు కింద కామెంట్లు పెట్టి ఇలాంటివే చేయండి అనసాగారు. మేకప్ను వేగంగా, సులువుగా, మనిషిని బట్టి, చర్మాన్ని బట్టి, కన్ను ముక్కును బట్టి, వయసును బట్టి ఎలా వేసుకోవాలో రకరకాల టిప్స్ చెబుతూ సొంతంగా ఆ మేకప్ను వేసుకుని చూపుతూ మృణాల్ అతి త్వరలో ఖ్యాతి గడించింది.వెంటబడ్డ కంపెనీలుమృణాల్ ఇన్ఫ్లూయెన్స్ టిక్టాక్ తర్వాత ఇన్స్టాలో పెరగడంతో బ్యూటీ సామాగ్రి అమ్మే బడాబడా కంపెనీలు ఆమెను తమ ప్రొడక్ట్స్ను ప్రమోట్ చేయమని కోరాయి. ‘అతి త్వరగా నేను ముంబైకి మారాల్సి వచ్చింది. నేను కలలో కూడా ఊహించని పెద్ద కంపెనీలు తమ ప్రొడక్ట్స్ కోసం నన్ను అంబాసిడర్గా పెట్టుకున్నాయి. నా ఆదాయం కూడా విపరీతంగా పెరిగింది’ అని చెప్పుకొస్తుంది మృణాల్.సరళంగా, అట్టహాసంగా: మృణాల్ భారతీయ మహిళల మనస్థితిని బట్టి మేకప్ టిప్స్ చూపుతుంది. ‘మన మహిళలు గ్లామర్గా మేకప్ వేసుకోవాలనుకుంటారు. కాని జంకుతారు. సరళమైన మేకప్ చూపిస్తే ఇంకొంచెం గ్లామర్ యాడ్ చేయమని కోరుతారు. రెండు విధాలుగా సంతృప్తి పరుస్తూ వారికి టిప్స్ అందిస్తుంటాను’ అంటుంది మృణాల్. ఆమె చూపే టిప్స్లో కేశాలంకరణ, వాటి షేడ్స్, కనురెప్పలు, ముక్కును సన్నగా చూపించడం, పెదాలను అందంగా చూపించడం, ముఖంలో ఏదైనా ఒక భాగం మోతాదుకు మించి ఉన్నా, కురచగా ఉన్నా దానిని మేకప్లో సరి చేసి చూపించడం చాలా ప్రతిభావంతంగా చేస్తుంది. అందుకే మృణాల్కు యాభై లక్షల మంది ఫ్యాన్స్.సోషల్ మీడియా వచ్చాక చాలామంది విజేతలు మనకు కనిపిస్తున్నారు. అయితే వారంతా తొలిసారిగా ఎవరూ నడవని దారిని నడిచిన వారే. మేకప్ రంగంలో ఎందరో నిష్ణాతులు ఉండగా మృణాల్ దానినో ట్యూషన్గా భావించడం వల్లే ఘన విజయం సాధించింది. నేడు భారతదేశంలో అత్యంత ఇన్ఫ్లూయెన్షల్ లీడర్గా నిలిచింది. మృణాల్ నిజంగా గ్రేట్.(చదవండి: శభాష్ మహిరమ..! జస్ట్ 13 ఏళ్లకే రికార్డు సృష్టించింది) -
శభాష్ మహిరమ..! జస్ట్ 13 ఏళ్లకే రికార్డు సృష్టించింది
అక్షరమై మెరిసి...డిజిటల్ యుగంలో చిన్నారులు పుస్తకాల కంటే సెల్ఫోన్తోనే కాలక్షేపానికి సమయం కేటాయిస్తున్నారు. కానీ మహిరమ అందుకు విరుద్ధం. సాహిత్యాన్ని అభిరుచిగా మార్చుకుంది. పదమూడు సంవత్సరాల వయసులోనే నవల రాసి శభాష్ అనిపించుకుంది మహిరమ...తొమ్మిది సంవత్సరాల వయసులోనే చిన్న చిన్న పద్యాలు, పాటలు రాయడం ప్రారంభించింది మహిరమ. పదో ఏట స్నేహితులతో కలిసి చిన్న కథ రాసింది. ఆ తరువాత దీనినే నవలగా రాయాలనుకుంది. నవలగా పూర్తిరూపంలోకి రావడానికి రెండేళ్లు పట్టింది. 500 పేజీల ఈ నవల పేరు...రూబీ బ్లూ స్ట్రీమ్ అండ్ ద బాండ్ ఆఫ్ ఫైర్.సంగీతంలోనూ మహీరమ రాణిస్తోంది. ప్రస్తుతం కర్ణాటక సంగీతంలో ఫోర్త్ గ్రేడ్లో శిక్షణ తీసుకుంటోంది. హస్తకళలు, చిత్రలేఖనం, ఫొటోగ్రఫీ, గ్రాఫిక్ డిజైన్లోనూ విశేష ప్రతిభ కనబరుస్తోంది. ఫ్రెంచి కూడా నేర్చుకుంటోంది. హైదరాబాద్లో 9వ తరగతి చదువుతున్న చల్లా మహిరమ ‘రూబీ బ్లూస్ట్రీమ్ అండ్ ద స్కీమ్ ఆఫ్ టైమ్’ పేరుతో మరో పుస్తకానికి శ్రీకారం చుట్టింది.అందరూ చదివేలా...నేను రాసిన ఫాంటసీ నవల ‘రూబీ బ్లూ స్ట్రీమ్ అండ్ ద బాండ్ ఆఫ్ ఫైర్’ పిల్లలే కాదు అన్ని వయసుల వారూ చదివేలా రాశాను. ఫాంటసీ సబ్జెక్ట్పై ఆసక్తి ఉన్నవారికి బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. ప్రకృతితో ముడిపడి ఉన్న అంశాల ఆధారంగా నవల రాశాను. భూమి, నీరు, గాలి, అగ్ని...వీటితో మనిషి జీవితం ఎలా ముడిపడి ఉంటుందనే విషయం చుట్టూ నవల సాగుతుంది. – చల్లా మహిరమ (చదవండి: అత్యంత వృద్ధ డాక్టర్గా రికార్డు..! ఇప్పటికీ వైద్య సేవలోనే..! ఏజ్లో సెంచరీ కొట్టాలంటే..) -
భారత్పై అభిమానంతో అమెరికా నుంచి వచ్చేసింది..! కట్చేస్తే..
ఎక్కడ ఉండాలో తెలియదు, ఏమి చేయాలో తెలియదు. ఇండియా అంటే మాత్రం గుండెల నిండా అభిమానం. తట్టాబుట్టా సర్దుకొని ముంబైలో ల్యాండ్ అయింది ఎలిజా కరాజ, ఉద్యోగం వెదుక్కుంటూ ఇండియా నుంచి అమెరికాకు వెళ్లడం అనేది సాధారణం. 19 సంవత్సరాల ఎలిజా కరాజ మాత్రం అమెరికా నుంచి ఇండియాకు వచ్చింది. షికాగోలో పుట్టి పెరిగిన ఈ సిరియన్–అమెరికన్ ఆర్టిస్ట్ ముంబైలోని ఒక స్కూలులో ఆర్ట్ టీచర్గా చేరింది.ఆమె ఉద్యోగంలో చేరేనాటికి ముంబై గురించి బొత్తిగా తెలియదు.తన జీతం గురించి కూడా పట్టించుకోలేదు.కట్ చేస్తే....ఎలిజా కరాజ ముంబైకి వచ్చి పది సంవత్సరాలు అవుతుంది. ముంబై ఇప్పుడు తన సొంత ఇల్లు. హిందీ చాలా బాగా మాట్లాడుతుంది. ముంబైతో పది సంవత్సరాల అనుభవాలను ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది. ‘హరకాత్’ ఫ్యాషన్ లేబుల్తో ఎంటర్ప్రెన్యూర్గా విజయం సాధించింది. ఇన్స్టాగ్రామ్లో వేలాదిమంది ఫాలోవర్లు ఉన్న ఎలిజా కరాజ ఆర్టిస్ట్, స్టోరీ టెల్లర్, ఎంటర్ప్రెన్యూర్గా ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది. ఇన్స్టాగ్రామ్లో వేలాదిమంది ఫాలోవర్లు ఉన్న ఎలిజా కరాజ ఆర్టిస్ట్, స్టోరీ టెల్లర్, ఎంటర్ప్రెన్యూర్గా ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది. View this post on Instagram A post shared by 🌑eliza🌙 (@kweenkaraza) (చదవండి: 'ఓపిక'కు మారుపేరుగా ఆర్సీబీ గెలుపు..! ఏకంగా ఢిల్లీ పోలీసులు..) -
Preity Zinta PBKSలో కేవలం రూ 35 కోట్ల పెట్టుబడి : లాభం ఎంతో తెలుసా?
ఐపీఎల్ 2025లో ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ (PBKS) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చేతిలో 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. క్వాలిఫైయర్-2 మ్యాచ్లో ముంబై ఇండియన్స్ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్కు దూసుకెళ్లిన పీబీకేఎస్, అదే తరహాలో టైటిల్ గెలుస్తుందని ఊహించిన అభిమానులకు తీరని నిరాశ మిగిలింది. 18 ఏళ్ల నిరీక్షణ తరువాత ఆసీబీ టైటిల్ను దక్కించుకుంది. పీబీకేఎస్ విలువ 925 మిలియన్ డాలర్లుఐపీఎల్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు గట్టి పోటీ ఇచ్చిన పంజాబ్ కింగ్స్ యజమాని బాలీవుడ్ నటి, ప్రీతి జింటా (Preity Zinta) ఆస్తి ఎంత, PBKS నెట్వర్త్ ఎంత అనే చర్చ నెట్టింట సందడిగా మారింది. ప్రీతి జింటా ఐపీఎల్ టీం పీబీకేఎస్ విలువ 925 మిలియన్ డాలర్లుగా తెలుస్తోంది.బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ సరసన ‘దిల్ సే’ మూవీతో ఆకట్టుకున్న ఈ సొట్ట బుగ్గల సుందరి రెండు దశాబ్దాలకు పైగాబాలీవుడ్ను ఏలింది. కెరీర్లో, ప్రీతి కల్ హో నా హో, వీర్ జారా, లక్ష్య, సలాం నమస్తే, సంఘర్ష్, కోయి... మిల్ గయా, క్యా కెహ్నా, కభీ అల్విదా నా కెహ్నా, చోరి చోరి చుప్కే చుప్కే, ది లాస్ట్ లియర్, సోల్జర్ , అనేక ఇతర చిత్రాలలో అద్భుతమైన పాత్రలు పోషించింది.ప్రీతి జీన్ గూడెనఫ్ను వివాహం తరువాత అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో సిర్థపడింది. నటనకు దూరంగా ఉంది. ప్రీతి-జీన్ దంపతులకు కవల పిల్లలున్నారు. అయితే, గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉన్నప్పటికీ, ఐపీఎల్ జట్టు ఓనర్షిప్ ఇతర వ్యాపారాలు, ఎండార్స్మెంట్ల ద్వారా భారీ ఆస్తులను సంపాదించింది. 2008లో, ప్రీతి జింటా ఐపీఎల్ జట్టు పంజాబ్ కింగ్స్కు సహ యజమానిగా, వ్యాపారవేత్తగా అవతరించింది.మనీ కంట్రోల్ సమాచారం ప్రకారం, 2008లో ఐపీఎల్ జట్టు పంజాబ్ కింగ్స్కు సహ యజమానిగా ప్రీతి ఆ సమయంలో రూ. 35 కోట్లు పెట్టుబడి పెట్టగా, అది ఇప్పుడు 350 కోట్ల రూపాయలకు పెరిగింది. 2008లో పంజాబ్ కింగ్స్ ప్రారంభించినప్పుడు, దానిని విలువ 76 మిలియన్ డాలర్లుగా ఉంది. 2022 నాటికి 925 మిలియన్ డాలర్లకు పెరిగింది.ప్రీతి జింటా ఆస్తి రూ. 183 కోట్లు ప్రీతి జింటా నికర ఆస్తుల విలువ రూ. 183 కోట్లు, ఇందులో ఆమె బ్రాండ్ ప్రమోషన్లు, వ్యాపార సంస్థలు, ఐపీఎల్ జట్టులో వాటా కూడా ఉన్నాయి. ముంబైలోని పాలి హిల్స్లో రూ. 17 కోట్ల విలువైన అపార్ట్మెంట్ ప్రీతి సొంతం. జీన్ గూడెనఫ్తో వివాహం తర్వాత ఆమె అమెరికాకు వెళ్లి బెవర్లీ హిల్స్లో నివసిస్తున్నప్పటికీ సిమ్లాలో రూ. 7 కోట్ల విలువైన ఇంటిని కూడా కొనుగోలు చేసింది.బ్రాండ్ ఎండార్స్మెంట్ల ఆదాయం కూడా భారీగానే ఉంటుంది. ప్రీతి జింటా ప్రచారం చేసే ప్రతి బ్రాండ్ నుండి దాదాపు రూ. 1.5 కోట్ల నుండి రూ. 2 కోట్ల వరకు సంపాదిస్తుంది. ప్రీతి జింటా కార్ల విషయానికి వస్తే లగ్జరీ కార్లు ఆమె గ్యారేజీలో ఉన్నాయి. వీటిలో రూ. 132 లక్షల విలువైన లెక్సస్ 400 క్రాస్ఓవర్, రూ. 58 లక్షల విలువైన మెర్సిడెస్ బెంజ్ E క్లాస్, పోర్స్చే , BMW ఉన్నాయి. -
Menstruation మౌనాన్ని బద్దలుకొట్టింది, ప్రతిష్టాత్మక అవార్డు పట్టింది
గుర్గావ్కు చెందిన ప్రియాంషి బగ్గా చిన్న వయసులోనే చాలా పెద్దమనసుతో ఆలోచించింది. ఎవ్వరూ చేయని సాహసానికి పూనుకుంది. మాట్లాడానికి అందరూ ఇబ్బందిపడే పీరియడ్స్ గురించి 17 ఏళ్ల వయసులో ధైర్యంగా మాట్లాడింది. అంతేకాదు దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య సదుపాయం, రుతుక్రమ పరిశుభ్రత ను మార్చే లక్ష్యంతో బ్రేక్ ది సైలెన్స్ (మౌనం వీడండి..చుప్పీ తోడో, ) అనే కార్యక్రమాన్ని స్థాపించింది.ఈ ప్రాజెక్ట్ ద్వారా, ఆమె వేలాదిమంది బాలికలకు అవసరమైన శానిటరీ ప్యాడ్లను అందించింది. అలాగే శానిటరీ ప్యాడ్స్ అవసరమైన బాలికలకు అందేలా పాఠశాలల్లో ప్యాడ్ వెండింగ్ మెషీన్లను కూడా ఏర్పాటు చేస్తోంది. ఈ ఉద్యమం కోసం రూ. 5 లక్షలకు పైగా సేకరించింది, పాఠశాలల్లో సరైన మౌలిక సదుపాయాలతో బాలికలకు సాధికారత కల్పించడం దీని లక్ష్యం, అమ్మాయిల డ్రాప్-అవుట్ రేటును కూడా తగ్గిస్తుంది2024లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ద్వారా ఋతు పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ ఆచరించేలా ప్రోత్సహిస్తోంది. పీరియడ్ సమస్య కారణంగా ఆడపిల్లలు చదువును ఆపకుండా, అంతరాయం లేకుండా క్లాసులకు హాజరయ్యేలా, వారి కలలను కొనసాగించడానికి సాధికారత కల్పిస్తోంది. వారి విద్య, ఆరోగ్యం, సాధికారతను ప్రోత్సహిస్తోంది. యువత తలచుకుంటే సామాజిక ప్రభావం ఎంత గొప్పగా ఉంటుందో అనేదానికి ఉదాహరణగా నిలుస్తోంది ప్రియాంషి.ఇదీ చదవండి: Plastic Water bottles : అవసరమా.. ఆకర్షణీయమా!చుప్పీ తోడో ఐడియా ఎలా వచ్చిందిప్రియాంషికి చిన్నప్పటినుంచీ చదువు అంటే ప్రాణం. అదృష్టవశాత్తూ బాల్యంనుంచి చదువు విషయంలో తనకుఎలాంటి ఆటంకం రాలేదు. కానీ ఆమె గ్రామీణ పాఠశాలల్లో స్వచ్ఛందంగా పనిచేసినప్పుడు, ప్రాథమిక పరిశుభ్రత సౌకర్యాలు లేకపోవడం వల్ల బాలికలు ఉన్నత తరగతుల్లో చదువు మానేస్తున్నారని గమనించింది.. ఋతుస్రావం వంటి సహజమైన శారీరక ప్రక్రియ వారి విద్యకు అడ్డుగా నిలబడటం చాలా అన్యాయమని భావించింది. "విద్య అనేది అవకాశానికి ద్వారం" అని విశ్వసించే ప్రియాంషి దీన్ని అడ్డుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఇది గోప్యంగా ఉంచాల్సిన విషయం కాదని, మౌనం వీడి గొంతెత్తాల్సిన సమస్యని అని తెలుసుకుంది. అంతే. .బ్రేక్ ది సైలెన్స్ తో ముందుకు వచ్చింది. గృహ హింస, యాసిడ్ దాడులు, ఇతర సామాజిక దురాచారాల లాగ్గానే దీనికి గురించికూడా పాడ్కాస్ట్లోఎ విస్తృతంగా చర్చించడం మొదలు పెట్టింది. దీనికి మంచి ఆదరణ లభించింది. ఆమె వినిపించే కథలు పలువుర్ని కదిలించేవి. కంట తడిపెట్టించేవి.చదవండి: Obesity పోషకలోపం.. ఊబకాయం!ఈ ప్రాజెక్ట్ క్రమం తప్పకుండా ఋతు పరిశుభ్రత వర్క్షాప్లను కూడా నిర్వహిస్తుంది .శానిటరీ ఉత్పత్తుల ద్వారా మహిళల ఆర్థిక స్వాతంత్యానికి మద్దతు ఇవ్వడానికి స్వయం సహాయక బృందాలను ప్రోత్సహిస్తుంది. ఆ బృందాలు మహిళలు తమ కమ్యూనిటీలలో ఈ ఉత్పత్తులకు నిధులు సమకూర్చడానికి , పంపిణీకి వీలు కల్పించింది. "శానిటరీ ప్యాడ్ వాడకాన్ని మరింత పర్యావరణ అనుకూలంగా , సరసమైనదిగా చేయడమే తమ లక్ష్యమని ఆమె తెలిపింది. ప్రియాంషి కృషిని గుర్తించింది ఐక్యరాజ్యసమితి, ఈ ప్రాజెక్ట్ గర్ల్అప్ ప్రాజెక్ట్ అవార్డుతో సత్కరించింది. అశోక విశ్వవిద్యాలయం సహ-హోస్ట్ చేసిన టాకో బెల్ యాంబిషన్ యాక్సిలరేటర్కు ఫైనలిస్ట్గా నిలవడం విశేషం. -
నావికాదళంలో అత్యున్నత అధికారిగా హైదరాబాద్ కుర్రాడు!
హైదరాబాద్ నగరానికి చెందిన ఓ యువకుడు భారత నావికాదళంలో సబ్ లెఫ్టినెంట్ అధికారిగా బాధ్యతలు చేపట్టాడు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని ముఫకం జా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (ఎంజేసీఈటీ) నుంచి మహ్మద్ అబూబకర్ 2022 సివిల్ ఇంజినీరింగ్లో గ్రాడ్యుయేట్ అయ్యారు. కళాశాలలో ఉన్న సమయంలో చదువుతోపాటు క్రీడల్లోనూ ఆయన తనదైన ప్రతిభను చూపారు. ఆటలన్నా, పోటీలన్నా ముందుండేవాడు. అదే తత్వం అతని లక్ష్యాన్ని చేరుకునేలా చేసింది. రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం.. అబూబకర్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్ఎస్బీ)లో అర్హత సాధించారు. కేరళలోని ఎజిమలలోని ఇండియన్ నావల్ అకాడమీలో కఠినమైన శిక్షణ పొందారు. మే 31న పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొన్న అతను అధికారికంగా భారత నావికాదళంలో అధికారిగా చేరారు. అబూబాకర్ కళాశాల సమయంలోనూ క్రీడల్లో ముందుండేవాడు. అంతేకాకుండా రాష్ట్రం తరుపున సైతం పోటీల్లో పాల్గొన్నారు. కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో స్పోర్ట్స్ కో–ఆర్డినేటర్గా వ్యవహరించిన అబుబాకర్ నైనిటాల్లో జరిగిన 7–ఎ–సైడ్ జాతీయ స్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్లో, ఇండో–నేపాల్ అంతర్జాతీయ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఎంజేసీఈటీ, తెలంగాణ రాష్ట్రం తరుపున రెండింటికీ ప్రాతినిధ్యం వహించాడు. లక్ష్యం కోసం ముందుకు..అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన కఠోరశ్రమ ఎంతో అవసరం. ఒకవైపు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించడం వల్లనే తనకు ఈ అవకాశం లభించిందని అంటున్నారు అబుబాకర్. తన ఈ ప్రయాణంలో కళాశాల యాజమాన్యం ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు. భారత సాయుధ దళాలకు అవసరమైన అధికారిగా నిలపడంలో, మార్గదర్శకత్వం చూపడంలో అవసరమైన శిక్షణ అందించడంలో సహాయపడిన ఫిజికల్ డైరెక్టర్ మహ్మద్ యూసుఫుద్దీన్, స్పోర్ట్స్ చైర్మన్ అమీర్ జావీద్ తదితరుల సేవలను ఆయన గుర్తుచేశారు. తనతోపాటు ఇటీవలి కాలంలో తమ కళాశాల నుండి దాదాపు 25 మందికి పైగా విద్యార్థులు రక్షణ, ప్రభుత్వ రంగ సంస్థలు, పౌర పరిపాలనతో సహా వివిధ ప్రభుత్వ సేవల్లో ప్రతిష్టాత్మక పదవులను అలంకరించారన్నారు. నావికాదళంలో పనిచేయడాన్ని తాను ఎంతో గర్వంగా భావిస్తున్నానని అన్నారు. యువత సైతం తమ ఆలోచనలను సుసాధ్యం చేసుకోవడానికి అవసరమైన లక్ష్యాలను ఏర్పచుకోవాలన్నారు. (చదవండి: పుస్తకాలతో మరోసారి..! ఆ అభిరుచిని అస్సలు వదులుకోవద్దు) -
రూ. 20 వేలతో ష్యాషన్ బ్రాండ్..కోట్ల టర్నోవర్ : దోస్తుల సక్సెస్ స్టోరీ
కొత్తగా ఏదైనా చేయాలనే కోరిక, వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకొని అందలాలను అధిరోహించాలనే పట్టుదల ఇద్దరు స్నేహితరాళ్లను వ్యాపారవేత్తలుగా మార్చింది. ఇది వారి కలలను సాకారం చేసుకోవడం వరకే పరిమితం కాలేదు. నేత వస్త్రాలను ప్రాచుర్యం, చేతివృత్తులవారికి ఆర్థిక స్వావలంబన, మహిళాలకు సాధికారతను తెచ్చి పెట్టింది. అలా మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు చెందిన నిరుపమ సింగ్ శర్మ, అంజనా భమ్రా అనే ఇద్దరు స్నేహితులు అద్భుతాలు చేశారు. ఇంతకీ వీరేం సాధించారు తెలుసుకుందామా...!నిజానికి నిరుపమ సింగ్( Nirupama Sharma) అంజనా భమ్రా Anjana Bhamra) సక్సెస జర్నీ సుమారు పదేళ్ల క్రితం సాయంత్రం కాఫీ ఒక స్నేహితుడు అడిగిన సాయం వారిలో వ్యాపార ఆలోచనకు పునాది వేసింది. ఫ్యాషన్, ఫాబ్రిక్ పట్ల వారి జ్ఞానం ఆసక్తి సొంత ఫ్యాషన్ లేబుల్ కలిగి ఉండాలనే ఆలోచన వారి మనస్సులలో మొలకెత్తింది. అలా ‘ది సాఫ్రాన్ సాగా ’ పుట్టింది. భారతీయ కళా నైపుణ్యం, మహిళా సాధికారత, ఫ్యాషన్, పర్యావరణ అనుకూల డిజైనర్ దుస్తుల బ్రాండ్ ఇది. 'మేక్ ఇన్ ఇండియా' స్ఫూర్తితో దేశీయ హస్తకళను ప్రోత్సహిస్తుంది.చీరలు, సూట్లు, దుస్తులు, బ్లౌజులు , ట్రెండీ లాంజ్వేర్ వంటి ఉత్పత్తులను తయారుచేసి విక్రయిస్తున్నారు అంతేకాదు తమ బ్రాండ్ను జీరో-వేస్ట్గా మార్చడానికి ,మిగిలిపోయిన బట్టలను రీసైక్లింగ్ కూడా చేస్తారు. ఇదీ చదవండి : అమ్మలపై హింస-పిల్లలకు చెప్పలేనంత నరకం : న్యూ స్టడీ పురాతన హస్తనైపుణ్యానికి, ఆధునిక ట్రెండ్ను, సౌందర్యాన్ని జోడించి, పలురకాల ప్రింట్లు , రంగులతో అనేక ప్రయోగాలు చేస్తున్నాం అంటారు సాఫ్రాన్ సాగా వ్యవస్థాపకులు నిరుపమ సింగ్ శర్మ, అంజనా భమ్రా. వేసవి తాపాన్ని తట్టుకోవడానికి, సితార, లినెన్, బాటిక్, బాగ్ బహార్, ఇంద్రధనుష్ వంటి గాలి ఆడేలా, లేత రంగు ఫాబ్రిక్ను ఎంచుకుంటామన్నారు. సీజన్కు తగినట్టు దుస్తులను తయారు చేస్తూ వినియోగదారుల ఆదరణను సొంతం చేసుకున్నారు.2015లో పదేళ్ల క్రితం కేవలం 20వేల రూపాయల పెట్టుబడితో 'ది సాఫ్రాన్ సాగా' అనే ఫ్యాషన్ బ్రాండ్ను ప్రారంభించారు. అదీ 40 ఏళ్ల వయసులో వ్యాపారం ప్రపంచంలోకి అడగుపెట్టారు. అంజనా ఒక హోటల్, సెలూన్, బోటిక్ నడిపేది. ఆమె స్నేహితురాలు నిరుపమ మార్కెటింగ్, కమ్యూనికేషన్లలో నిపుణురాలు. ఇలా వీళ్లిద్దరి కలయికలో రూపుదిద్దుకున్న ఈ బిజినెస్ టర్నోవర్ రూ. 1.5 కోట్లను దాటేసింది. అయితే వీరి సక్సెస్ జర్నీ అనుకున్నంత సులువుగా ఏమీ సాగలేదు. బ్యాంకుల నుంచి రుణాలు పొందడం ఒక సవాల్ అయితే, తమ బ్రాండ్ను జనాల్లోకి తీసుకెళ్లడం మరో సవాల్. ఒక దశలో ఈఎంఐలు కట్టడానికే చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ సవాళ్లను ఇద్దరూ కలిసి మొక్కవోని దీక్షతో అధిగమించారు. దీనికోసం ఎన్నో నిద్రలేని రాత్రుళ్లు కరిగి పోయాయి. మొదట్లో ఆశించినంత లాభాలు రాక, ఆదాయం రాకపోయినా నిరాశపడలేదు. ధైర్యంతో తమ బ్రాండ్ను విజయ తీరాలకు చేర్చారు. ఏదైనా సాధించాలనే పట్టుదల, కృషితో ముందుకు సాగి, సక్సెస్కు వయస్సు అడ్డంకి కాదని నిరూపించారు. -
ఇది సఫ(బ)ల తెలంగాణ
మన ఉపనిషత్తులు, శాస్త్రాలు... స్త్రీని సాధికారత కలిగిన స్వరూపంగా పేర్కొన్నాయి. అలాంటి మహిళకు తెలంగాణ వచ్చాక ఎలాంటి ఆదరణ లభించలేదు. సంక్షేమ పథకాల నుంచి మొదలుకొని కేబినెట్ బెర్త్ల దాకా అడుగడుగునా అన్యాయమే. కానీ 2023 డిసెంబర్ 7న గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారు స్త్రీ సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నది. ఆడబిడ్డల మోములపై నవ్వులు చిందుతుండగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించింది. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇక తమ ఆకాంక్షలన్నీ నెరవేరుతాయనుకున్న యువత, ముఖ్యంగా మహిళల ఆశలు అడియాసలే అయ్యాయి. బీఆర్ఎస్ మొదటి కేబినెట్లో ఒక్క మహిళను కూడా తీసుకోకుండా అతివలను అతి ఘోరంగా అవమానించింది. ఇతర పదవులూ ఇవ్వలేదు. కానీ... కాంగ్రెస్ సర్కారు మహిళలకు పెద్దపీట వేసింది. కేబినెట్లోకి ఆదివాసీ బిడ్డ ధనసరి సీతక్కను, బీసీ బిడ్డ కొండా సురేఖను తీసుకున్నది. అలాగే, ‘తెలంగాణ స్టేట్ ఉమెన్స్ కో–ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్’, ‘తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్’ల చైర్మన్లుగా, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యురాలిగా అతివలకు అవకాశం కల్పించింది. తెలంగాణలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రూ. 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చి తెలంగాణ కాంగ్రెస్ సర్కారు అతివల ఇంటి కష్టాలను తీర్చుతున్నది. స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా) మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం విద్యార్థులు, పోలీసుల యూనిఫామ్ కుట్టే పనిని అప్పగించింది. దీంతో మహిళలకు స్థిరమైన ఆదాయం వస్తున్నది. అలాగే మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలను అందిస్తున్నది. దీంతోపాటు ‘రాజీవ్ యువ వికాసం’ ద్వారా రూ. 50 వేల నుంచి రూ. 4 లక్షల దాకా స్వయం ఉపాధికి సాయం అందజేస్తున్నది. మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు, ప్రభుత్వం 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను మహిళల స్వయం సహాయక సంఘాల ద్వారా ఏర్పాటు చేయిస్తున్నది. మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా తిరగడమే కాదు... ఆ బస్సులకు వారినే ఓనర్లను చేసే మరో మహత్తర కార్యక్రామానికి శ్రీకారం చుట్టింది. మహిళల స్వయం సహాయక సంఘాల ద్వారా 150 ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేయించి, వాటిని ఆర్టీసీకి అద్దెకు ఇప్పించింది. మరో 450 బస్సులను కూడా అద్దెకు ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇదీ చదవండి: World Bicycle Day 2025 డయాబెటిస్కు, ఊబకాయానికి చెక్మహిళలు తమ ఉత్పత్తులను విక్రయించేందుకు శిల్పారామంలో డ్వాక్రా బజార్లు ఏర్పాటు చేసింది. ఈ బజార్లు స్వయం సహాయక సంఘాల ద్వారా ఉత్పత్తి అయిన వస్తువులకు మార్కెట్ను అందిస్తాయి. దీనివల్ల మహిళల ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతున్నది. అలాగే, మహిళల స్వయం సహాయక సంఘాల ద్వారా 196 ‘ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు’ ఏర్పాటు చేసింది. ఈ క్యాంటీన్లు మహిళలకు స్వయం ఉపాధిని అందిస్తున్నాయి. మహిళలంతా ఒకేచోట చేరి తమ పురోగతికి ప్రణాళికలు రచించుకునేలా 22 ‘ఇందిరా మహిళా శక్తి’ భవనాలను నిర్మించింది. ఇవి మహిళలకు కార్యాలయాలుగా, వ్యాపార కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. మహిళలకు ‘మీ సేవా’ కేంద్రాలను అప్పగించి, వారికి ఉపాధి కల్పిస్తున్నది. డైరీ సహకార రంగంలో 40 వేల మంది మహిళలకు శిక్షణ ఇప్పించింది. మహిళలకు రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించి, ఆర్థిక భద్రతకు భరోసానిస్తున్నది. ఇలా నేటి ప్రభుత్వం మహిళా సాధికారతకు పాటుపడటంతో పాటు ఆర్థికంగా ఆగమైపోయిన రాష్ట్రాన్ని అత్యంత క్రమశిక్షణతో ఒక్కో పువ్వేసి బతుకమ్మను పేర్చినట్టు పునర్నిర్మిస్తున్నది. -ఇందిరా శోభన్కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు -
స్త్రీ సాధికారత దిశగా..
మహిళలు తమ కాళ్లపై నిలబడి.. స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదిగేందుకు దాదాపు దశాబ్దకాలంగా తోడ్పాటునందిస్తోంది తెలంగాణలోని సాయి సమాజ్ ఛారిటబుల్ ట్రస్ట్. ఎలాంటి లాభాపేక్ష లేకుండా స్త్రీల సాధికారతకు బాటలు వేస్తోంది. వందలాది మంది మహిళల ఆర్థిక ఆలంబనకు కృషి చేస్తోంది. స్త్రీ ఆర్థిక పురోగతి సాధించినప్పుడే ఆ కుటుంబం.. తద్వారా ఆ దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని నమ్మిన సిద్ధాంతం మేరకు ట్రస్ట్ సేవలు కొనసాగిస్తోంది. పేద, మధ్య తరగతి వర్గాల మహిళలకు కుట్టు మిషన్, మగ్గం వర్క్ (డిజైన్)లపై ట్రస్ట్ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తూ చేయూతనందిస్తోంది. ఉదయం 11 గంటల నుండి 2 గంటల వరకూ 35 మంది మహిళలకు మూడు నెలల పాటు శిక్షణ ఇస్తున్నారు. గత తొమ్మిది సంవత్సరాల్లో ఇప్పటి వరకూ 23 బ్యాచ్లకు పైగా శిక్షణ ఇచ్చామని ట్రైనర్ అనూష ‘సాక్షి’తో చెప్పారు. మహిళలు ఇంటికే పరిమితం కాకుండా వివిధ రంగాల్లో స్వయం ఉపాధి శిక్షణ తీసుకొని, ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సూచించారు. శిక్షణ పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికెట్లను ప్రధానం చేస్తామన్నారు. ఉపాధి అవకాశాల్లో మెరుగుదల.. నిరుపేద మహిళలకు సొంతంగా ఉపాధి చేసుకోడానికి మొగ్గు చూపుతున్నారు. చీరలు, బ్లౌజులపై డిజైన్ వేయడానికి మగ్గం వర్క్ నేర్పిస్తున్నాం. దీంతో స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయి. – ఉమా, శిక్షకురాలుకుట్టుమిషన్పై శిక్షణ.. సాయి సమాజ్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వందలాది మంది మహిళలకు కుట్టుమిషన్లో బ్లౌజులు, పలు రకాల పంజాబీ డ్రెస్సులపై శిక్షణ ఇస్తాం. మహిళలకు శిక్షణ ఇచ్చి మూడు నెలల తర్వాత సర్టిఫికెట్లను అందజేస్తాం. – అనుష, శిక్షకురాలు తరగతులతో మేలు.. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టుమిషన్, ఇతర మగ్గం, ఎంబ్రాయిడరీ వర్క్ పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతోంది. అన్ని విధాలా శిక్షణ తీసుకొని మా సొంత కాళ్లపై నిలబడి ఉపాధి పొందేందుకు దోహదపడుతుంది. – సంగీత, కుట్టుమిషన్ నేర్చుకున్న మహిళ (చదవండి: సమానత్వం.. సాధికారత సాధిస్తా!) -
అందమైన అనుభవాలు.. అద్భుతమైన జ్ఞాపకాలు
2024లో మిస్ పోలోనియా కిరీటాన్ని గెలుచుకున్న మాజా క్లాజ్డా ఈ ఏడాది మిస్ వరల్డ్ ఫైనల్లో సెకండ్ రన్నరప్గా నిలిచింది. అందం, తెలివితేటలు, సమతుల్యతతో న్యాయనిర్ణేతలను, ప్రేక్షకులను ఆకర్షించింది. ఆమె బ్యూటీ విత్ ఎ పర్పస్ చొరవ, నేటి అత్యంత ముఖ్యమైన సమస్యలలో ఒకటైన పిల్లలు, యుక్తవయస్కుల మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. మానసిక అనారోగ్య నివారణ, భావోద్వేగ సంఘర్షణలపై దృష్టి సారించి, 40 కి పైగా వర్క్షాప్లను నిర్వహించింది. మానసిక శ్రేయస్సు గురించి యువత తమను తాము, తమతో ఉన్న వారిని ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి ఈ వర్క్షాపులు ఉపకరిస్తున్నాయి. మనస్తత్వశాస్త్ర విద్యార్థిగా, మాజా టీనేజర్లతో వారి స్వంత భాషలో కనెక్ట్ అవుతుంది. సామాజిక బహిష్కరణ ప్రమాదంలో ఉన్న పిల్లలకు మద్దతు ఇచ్చే గ్రోయింగ్ అప్ జోన్ ఫౌండేషన్ కు చెందిన 12 ఏళ్ల బాలుడి కలను మాజా ఇటీవల నెరవేర్చింది. ఆమె అతన్ని బార్సిలోనాలో జరిగే లైవ్ మ్యాచ్కు హాజరు కావడానికి బార్సిలోనాకు తీసుకువెళ్లింది. అతని జీవితకాల కోరికను నెరవేర్చింది.సంతృప్తికరమైన అనుభవాలునేను పొందిన గొప్ప విజయాల్లో ఒకటి చిన్నచూపును అధిగమించడం. మొదట్లో న లుగురితో కలవాలంటే చాలా సిగ్గుపడేదాన్ని. దానిని దాటి ఈ దశకు వచ్చాను. ప్రజలతో కలిసి పోవడం, వారితో మాట్లాడుతూ ఉండటం అంటే నాకు ఇష్టం. కిరీటం దక్కక పోయినా అంతకు మించిన అనుభవాలు నాకు అద్భుతమైన జ్ఞాపకాన్ని ఇచ్చాయి. ఇక్కడి ఆతిథ్యం నాకు మా ఇంటిని గుర్తు చేసింది. ఇది నా రెండో కుటుంబంలా అనిపించింది. మెడికల్ టూరిజంలో భాగంగా ఏఐజీ హాస్పిటల్కి వెళ్లినప్పుడు వారి ఆ΄్యాయత నన్ను ఆకట్టుకుంది. వారు ఎంతో బాధలో ఉండి కూడా చిరునవ్వుతో మాకు ఆహ్వానం పలికారు. ముచ్చటించారు. అది నా జీవితంలో మరచి పోలేను. ఇక్కడ ప్రతి ఒకరికి మరొకరితో ఉన్న కనెక్టివిటీ, రిలేషన్స్ చాలా బాగున్నాయి’’ అంటూ తెలంగాణలో మిస్ వరల్డ్ పాజెంట్ జరిగిన తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది మాజా క్లాజ్డా– నిర్మలారెడ్డి -
సమానత్వం.. సాధికారత సాధిస్తా!
హాసెట్ డెరెజె అడ్మస్సు రెండవ స్థానంలో నిలిచి మిస్ వరల్డ్ చరిత్రలో అత్యున్నత ర్యాంకింగ్ సాధించింది. ఇథియోపియా దేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన ఈ అందాలభామ, ఫస్ట్ రన్నర్–అప్గా , మిస్ వరల్డ్ ఆఫ్రికా టైటిల్ను గెలుచుకున్నారు. కెమికల్ ఇంజినీరింగ్ చేస్తున్న పంతొమ్మిదేళ్ల హాసెట్ దక్షిణాఫ్రికాలో జరిగిన మిస్ టీన్ ఇథియోపియా, కిందటేడాది మిస్ వరల్డ్ ఇథియోపియా పోటీలో విజేతగా నిలిచారు. ఇథియోపియాలోని మహిళల విద్య, ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆమె సమాజంలో సానుకూల మార్పులు తీసుకు రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రామీణ సమాజాలలో తల్లీబిడ్డల ఆరోగ్యం, బాలికల విద్యపై దృష్టి సారించిన ఆమె ‘‘బ్యూటీ విత్ ఎ పర్పస్’’ ప్రాజెక్ట్ న్యాయమూర్తులను, ప్రేక్షకులను ఆకట్టుకుంది.నా పనే నా కిరీటంకిరీటం మరొకరికి వెళ్లచ్చు. కానీ, నా అంతర్గత అందం నేను చేసే పనిపైనే ఉంటుంది. అదే నాకు కిరీటం. స్థానికంగా, అంతర్జాతీయంగా ఆరోగ్య సమానత్వం, లింగ సాధికారత కోసం ఒక గొంతుకగా పనిచేస్తాను. ఈ పోటీలలో పాల్గొనడం ద్వారా భారతీయ సంప్రదాయ, సాంస్కృతిక పరిమళాన్ని అర్థం చేసుకున్నాను. ఆస్వాదించాను. ఈ ఫీలింగ్ చాలా సంతోషంగా ఉంది. ఓ పా గురించి చె ప్పాలంటే తను చాలా హార్డ్ వర్కర్. నేను తనకు చాలా పెద్ద అభిమానిని. తనకు కిరీటం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. తనలో భిన్నమైన క్వాలిటీస్ ఉన్నాయి. నిజానికి అందం అంటే అందరూ అనుకుంటున్నట్టు చర్మం, జుట్టు, గోళ్లు, డ్రెస్సింగ్.. ఇవి కావు. మన చుట్టూ ఉన్న సమాజం కోసం పనిచేయడమే. మా పేరెంట్స్ నా ఎదుగుదల కోసం ఎంతో కృషి చేశారు. నా ఈ విజయానికి నా కుటుంబ మద్దతు ఎంతో ఉంది.మానసిక ఆరోగ్యంపై అవగాహన కోసం...ఇథియోపియాలో మానసిక ఆరోగ్యంపై ప్రజలలో అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నాను. మాయా చారిటబుల్ ఆర్గనైజేషన్ కు అంబాసిడర్గా ఉంటూ ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పిస్తున్నాను. మిస్ వరల్డ్ అనేది కేవలం అందానికి సంబంధించినది మాత్రమే కాదు. నా దేశం నుంచి ఈ స్థాయికి చేరిన తొలి ఇథియోపియన్ నేనే. మిస్ వరల్డ్ ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం, ఇది ప్రపంచవ్యాప్తంగా తల్లులు, వారి పిల్లల జీవితాలలోనూ స్ఫూర్తి నింపేది’’ అని చె ప్పారు. -
Opal Suchata: 72 ఏళ్ళ కల ఇది..! ఆ కాంక్షతోనే గెలిచా..
ఓపల్ సుచాతా.. మోడల్, థాయ్లాండ్.. తొలి మిస్ వరల్డ్... ఇప్పుడు 72వ మిస్ వరల్డ్! థాయ్లాండ్కి చెందిన ఆమె కేన్సర్ ఫ్రీ ప్రపంచం కోసం పాటుపడుతోంది! దానికో కారణం ఉంది. పదహారవ ఏట ఆమెకు బ్రెస్ట్ ట్యూమర్ సర్జరీ అయింది. అది తన జీవనోద్దేశాన్ని, లక్ష్యాన్నే మార్చింది అంటున్న ఓపెల్ సుచాతా గురించి మరిన్ని విషయాలు ఆమె మాటల్లోనే..‘‘నేను పుట్టి పెరిగింది థాయ్లాండ్లోని ఫుకెట్లో. మా ఊరూ హైదరాబాద్లాగే పర్ల్ సిటీ! హైస్కూల్ కోసం బ్యాంకాక్కి మూవ్ అయ్యాను. సైకాలజీ, ఆంత్రోపాలజీ నాకు ఇష్టమైన సబ్జెక్ట్స్. ప్రస్తుతం నేను అంబాసిడర్ కావాలనే ధ్యేయంతో ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదువుతున్నాను.. మా కుటుంబ విషయానికి వస్తే అమ్మ, పెద్దమ్మలు, అత్తలు .. అందరూ స్ట్రాంగ్ పర్సన్సే. ఒకరకంగా చెప్పాలంటే నేను స్ట్రాంగ్ విమెన్ మధ్యలో పెరిగాను. ఆ వాతావరణమే నాకు స్ఫూర్తి. ఆ స్ట్రెంతే నా పదహారవ ఏట బ్రెస్ట్లో డిటెక్ట్ అయిన ట్యూమర్తో ఫైట్ చేసేలా చేసింది. అది క్యాన్సర్ ట్యూమర్ కాదు. అయినా చాలా భయపడ్డాను. ఆ భయాన్నుంచి ఓ ఉద్దేశం కోసం ప్రయాణించేలా చేసింది నా చుట్టూ ఉన్న మహిళల స్ట్రెంతే! సర్జరీ తర్వాత ఈ హర్డిల్ని గనుక దాటగలిగితే నా జీవితాన్ని బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ కార్యక్రమాలకు అంకితం చేయాలనుకున్నాను. లక్కీగా దాటాను. దాంతో అనుకున్నట్టుగానే ‘ఓపల్ ఫర్ హర్’ప్రాజెక్ట్తో బ్రెస్ట్క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపెయిన్ ను స్టార్ట్ చేశాను. మహిళా సాధికారతకూ పాటుపడుతున్నాను. ఈ బ్యూటీ పాజెంట్లో నేను పాల్గొనడానికి ప్రేరణ కూడా అదే. బ్యూటీ విత్ ఎ పర్పస్ అనే రౌండ్తో ఈ మిస్ వరల్డ్ బ్యూటీ పాజెంట్ మన కథను ప్రపంచానికి వినిపించే అవకాశాన్ని కల్పిస్తోంది. అందుకే ఈ పాజెంట్లో పాల్గొన్నాను. నా కథను షేర్ చేసుకుని, నాప్రాజెక్ట్ ద్వారా నేను చేస్తున్న కార్యక్రమాలను వివరించి బ్రెస్ట్ క్యాన్సర్ మీద మహిళలకే కాదు జెండర్స్కి అతీతంగా అందరికీ అవగాహన కల్పించాలనుకున్నాను.తోటి కంటెస్టంట్లందరి ఆలోచనలూ పంచుకుంటానుమిస్ వరల్డ్ హోదాలో నేను ప్రపంచమంతా పర్యటించగలిగే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ప్రపంచమంతటా నా ప్రాజెక్టుల గురించి చెప్పుకోగలను. అయితే నాకు నా తోటి కంటెస్టంట్లందరి ఆలోచనలూ,ప్రాజెక్టులూ కూడా చాలా నచ్చాయి. నాకు వీలున్నంతవరకు నేను అందరి ఆలోచనలూ,ప్రాజెక్టులనూ కూడా అన్ని వేదికలమీదా పంచుకుంటాను.క్రౌన్తో మా దేశానికి వెళుతున్నందుకు సంతోషంగా ఉందినా బ్యూటీ పాజెంట్ జర్నీ నా పద్దెనిమిదవ ఏట మొదలైంది. మొదటిసారి నేను గెలవలేదు. తర్వాత రెండేళ్లకు మళ్లీ నేషనల్ బ్యూటీ పాజెంట్లో పాల్గొన్నాను. గెలిచాను. మిస్ వరల్డ్కి ఎంపికయ్యాను. బ్యూటీ విత్ ఎ పర్పస్తో విన్ అయ్యి.. మిస్ వరల్డ్ క్రౌన్ తో మీ ముందుకు వచ్చాను. నిజానికి ఇది మా దేశం 72 ఏళ్లుగా కంటున్న కల. ఆ కల నా ద్వారా సాకారం అయినందుకు, నేను మిస్ వరల్డ్ క్రౌన్తో మా దేశానికి వెళ్లగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ పాజెంట్ నా లెర్నింగ్ అన్ లెర్నింగ్ప్రాసెస్కు ఓ వేదికైంది. భిన్నదేశాలు, విభిన్నమైన సంస్కృతి, సంప్రదాయాలకు చెందిన నా తోటి కంటెస్టెంట్స్ నుంచి చాలా నేర్చుకున్నాను. ఎక్సే్చంజ్ ఆఫ్ వ్యూస్, ఒపీనియన్స్, నాలెడ్జ్ షేరింగ్తో కొత్త విషయాలను తెలుసుకోగలిగాను. నా ఆలోచనా తీరూ మారింది. నా పర్సెప్షన్ బ్రాడ్ అయింది.అన్నీ అద్భుతంతెలంగాణ రావడం ఇదే మొదటిసారి. ఇక్కడి మహిళలు చాలా వైబ్రెంట్గా ఉన్నారు. వాళ్ల కట్టుబొట్టు తీరు, ఇక్కడి ఫుడ్, కల్చర్, ఆతిథ్యం అన్నీ అద్భుతం. నేను జ్యూయలరీ ఫ్యాన్ ని. అందుకే నాకు హైదరాబాద్ బాగా నచ్చింది. ముత్యాలే కాదు సంప్రదాయ, ఫ్యాషన్ జ్యుయలరీకి ఫ్యూజన్ లా ఉందీప్రాంతం. నేను చూసిన ఈ అద్భుతాన్ని మా వాళ్లకు చెప్పాలనుకుంటున్నాను. అంతేకాదు, ఇక్కడ నన్ను ఇన్ స్పైర్ చేసిన కథలు చాలా ఉన్నాయి. వాటినీ మావాళ్లకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మాటల కన్నా చేతలతోనే అవతలి వాళ్లకు ప్రేరణగా నిలవాలనుకుంటాను. మన పక్కనున్న వాళ్లకు ఓ భరోసాగా నిలవాలనుకుంటాను. నన్ను నేను అలా మలచుకోవడానికే ప్రయత్నిస్తాను’’ అని చెప్పింది ఈ మిస్ వరల్డ్.– సరస్వతి రమఫొటోలు: ఎస్.ఎస్. ఠాకూర్ -
నేడు ఫినాలే..బ్యూటీ కిరీటం ఎవరికి?
అందం అంటే ఆత్మవిశ్వాసం.. అందం అంటే ఓ సామాజిక బాధ్యత.. అందం అంటే సాధికారత.. అందం అంటే ఎమోషనల్ బ్యాలెన్స్, ఫిజికల్ ఫిట్నెస్.. అనే అందమైన నిర్వచనాలను స్థిరపరుస్తూ సాగుతున్న మిస్ వరల్డ్ పోటీలకు ఈసారి హైదరాబాద్ వేదికైంది! ఈ పోటీలు ఫైనల్కి వచ్చాయి. మిస్ వరల్డ్ కిరీటం ఎవరికి దక్కనుందో తేలేది నేడే! నూటఎనిమిది దేశాలకు చెందిన సుందరీమణులు పోటీ పడుతున్న ఆ బ్యూటీ పాజెంట్ ఫైనల్ ఎలా ఉండబోతోంది, మిస్ వరల్డ్గా ఎంపికైన సుందరి ఏడాదంతా ఏం చేస్తుంది లాంటివి ఆసక్తిని రేకెత్తిస్తాయి.హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో సాయంత్రం ఆరున్నరకు మొదలవనున్న మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే వేడుకను మిస్ వరల్డ్ 2016 స్టెఫనీ డెల్ బాయే ( Stephanie del valle), యాంకర్, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ సచిన్ కుంభార్.. ఇద్దరూ కలిసి హోస్ట్ చేస్తున్నారు.ఎంపిక ఇలా.. ముందుగా 108 దేశాల సుందరీమణులు వేదిక మీదికి వస్తారు. అమెరికా– కరిబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా– ఓషియానియాల నుంచి ఖండానికి పది మంది చొప్పున మొత్తం నలభై మందిని క్వార్టర్ ఫైనల్కిసెలెక్ట్ చేస్తారు. అయితే ఇప్పటికే రకరకాల పోటీల్లో ఈ నాలుగు ఖండాల నుంచి పద్దెనిమిది మంది క్వార్టర్ ఫైనల్కి చేరుకున్నారు. మిగిలినవారిని పర్సనల్ ఇంటర్వ్యూల ద్వారా సెలెక్ట్ చేసిన జ్యూరీ ఈ రోజు వాళ్ల పేర్లను ప్రకటించి వేదిక మీదికి ఆహ్వానిస్తుంది. ఈ నలభై మందిలోంచి ప్రతి ఖండానికి టాప్ ఫైవ్ చొప్పున, మళ్లీ అందులోంచి ప్రతి ఖండానికి టాప్ 2 లెక్కన సెలెక్ట్ చేస్తారు.ఫైనల్గా.. ఫైనల్రౌండ్ వచ్చేసరికి మొత్తం నలుగురు మాత్రమే మిగులుతారు. ఈ నలుగురిని జ్యూరీ ఓ ప్రశ్న అడుగుతుంది. ఆ జవాబును బట్టి మిస్ వరల్డ్ను ఎంపిక చేస్తారు. విజేతకు కిందటేడు మిస్ వరల్డ్ క్రిస్టినా పిజ్కోవా అందాల కిరీటాన్ని తొడుగుతుంది. జ్యూరీలో నటుడు సోనూ సూద్, సుధారెడ్డి, మిస్ ఇంగ్లండ్ 2014 డాక్టర్ కెరీనా టరెల్, మిస్ వరల్డ్ చైర్పర్సన్ జూలియా మోర్లే సభ్యులుగా ఉంటారు.గెలిచిన తర్వాత.. మిస్ వరల్డ్ టైటిల్ విజేత తన దేశం తరపున ప్రపంచవ్యాప్త సాంస్కృతిక కార్యక్రమాలు, అధికారిక వేడుకలు, సంబరాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. పలు చారిటీ ప్రోగ్రామ్స్, ప్రాజెక్ట్స్లో పాల్గొంటుంది. మిస్ వరల్డ్ సంస్థ తరపున ప్రపంచ యాత్ర చేస్తూ ఆ సంస్థ లక్ష్యాలను ప్రచారం చేస్తుంది. అక్షరాస్యత, పలు సామాజిక అంశాల అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటుంది.ఇంకా... → మిస్ వరల్డ్ విజేతకు తొడిగే అందాల కిరీటం ధర రూ. 85 లక్షల పైచిలుకే! 18 క్యారట్ల గోల్డ్తో చేసిన ఆ కిరీటం మధ్యలో 62. 83 క్యారట్ల డైమండ్ చుట్టూ 1770 చిన్న చిన్న డైమండ్స్ ΄÷దిగి ఉంటాయి. వాటన్నిటి బరువు 175.49 క్యారట్లుంటాయి. దీన్ని ఆ విజేత ముఖ్యమైన ఈవెంట్స్లో మాత్రమే ధరిస్తుంది. ప్రపంచ యాత్రలో అసలైన కిరీటాన్ని పెట్టుకోదు. మిస్ వరల్డ్ విజయానికి చిహ్నంగా విజేతకు రెప్లికా క్రౌన్ను ఇస్తారు. అసలు కిరీటం మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ దగ్గరే ఉంటుంది. ఈ పోటీలకు వయోపరిమితి 17 ఏళ్ల నుంచి 27 ఏళ్లు. → టర్మ్ అవకముందే మిస్ వరల్డ్ హోదాకు రాజీనామా చేసిన తొలి మిస్ వరల్డ్ 1974 సంవత్సర విజేత హెలెన్ మోర్గన్. టైటిల్ గెలిచిన నాలుగు రోజులకు ఆమె ఏడాదిన్నర బిడ్డకు తల్లి అని తెలిసిందట. మిస్ వరల్డ్ పోటీల్లో అవివాహితలు మాత్రమే పాల్గొనాలనే నియమాన్ని ఉల్లంఘించినందువల్ల ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది. → అమెరికా – వియత్నాం యుద్ధంలో అప్పటి మన ప్రభుత్వం వియత్నాం పక్షాన నిలబడింది. దీనికి విరుద్ధంగా మన తొలి మిస్ట్ వరల్డ్ రీటా ఫారియా అమెరికన్ ఎంటర్టైనర్ బాబ్ హోప్తో కలిసి అమెరికా సైనికులను ఎంటర్టైన్ చేసిందని ఆమె చర్య పట్ల అప్పుడు మన ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. → మిస్ వరల్డ్ పోటీలు మొదలైన నాటి (1951) నుంచి ఈరోజు దాకా మన దేశం ఆరుసార్లు కిరీటాన్ని గెలిచి రికార్డ్ సృష్టించింది. → విజేతల్లో ఐశ్వర్యా రాయ్ను మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ మిస్ వరల్డ్గా చెబుతుంటారు. → ఫెయిర్నెస్ క్రీమ్ ప్రకటనలకు నో చెప్పిన తొలి మిస్ వరల్డ్గా డయానా హెడెన్ (మిస్ వరల్డ్ 1997)ను ప్రస్తావిస్తారు. ‘నా ఒంటి రంగు పట్ల నాకెలాంటి రిగ్రెట్స్ లేవు. ఛాయ తక్కువగా ఉండటాన్ని నేను ఆత్మన్యూనతగా ఎప్పుడూ భావించలేదు. ఆ స్కిన్టోన్తోనే నేను మిస్ వరల్డ్గా గెలిచాను. నా దృష్టిలో ఆత్మవిశ్వాసమే అసలైన అందం. కాబట్టి దాన్నే ప్రమోట్ చేస్తాను ఫెయిర్నెస్ క్రీమ్స్ని కాదు’ అని చెప్పింది డయానా. → అందాల పోటీల్లో చమత్కారం, సునిశిత దృష్టి గల జవాబులకు ప్రియాంక చోప్రాపెట్టింది పేరుగా ఖ్యాతినార్జించింది. – సరస్వతి రమఫొటో: ఎస్.ఎస్. ఠాకూర్ -
NDA శిక్షణ పూర్తిచేసుకున్న 17 మంది మహిళా క్యాడెట్లు
నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) 148వ కోర్సు నుండి తొలి బ్యాచ్ మహిళా క్యాడెట్లు రికార్డ్ సృష్టించారు. కఠినమైన తమ శిక్షణనువిజయవంతంగా పూర్తిచేశారు. శుక్రవారం ఉదయం జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్ తర్వాత 17 మంది మహిళా క్యాడెట్లు జోష్ పుష్-అప్లతో ఔరా అనిపించారు. 300 మందికి పైగా పురుష క్యాడెట్లతో పాటు పదిహేడు మంది మహిళా క్యాడెట్లు అకాడమీ నుండి గ్యాడ్యుయేట్ కావడం విశేషం.పుణేలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఆర్మీ చీఫ్ , మిజోరాం ప్రస్తుత గవర్నర్ జనరల్ వీకే సింగ్ పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్ష అధికారిగా ఉన్నారు. అకాడమీ క్యాడెట్ కెప్టెన్ ఉదయవీర్ నేగి 148వ కోర్సు కవాతుకు నాయకత్వం వహించారు. "ఈ రోజు అకాడమీ చరిత్రలో ఒక ప్రత్యేకమైన ముఖ్యమైన రోజు, ఎన్డిఎ నుండి మహిళా క్యాడెట్ల తొలి బ్యాచ్ శిక్షణను పూర్తి చేసుకుందని, ఇదిమరింత మంది మహిళలు చేరడానికి, వారి సాధికారత వైపు సాగేలా చారిత్రాత్మక మైలురాయి లాందని జనరల్ సింగ్ ఈ సందర్భంగా అన్నారు.వీరు "నారి శక్తి"కి బలమైన చిహ్నం, ఇది మహిళల అభివృద్ధిని మాత్రమే కాకుండా మహిళల నేతృత్వంలోని అభివృద్ధిని కూడా ప్రతిబింబిస్తుందన్నారు. అంతేకాదు ఇది ఈ క్యాడెట్ల అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నానన్నారు. #WATCH | Maharashtra | Female cadets celebrate after their 'Passing Out Parade’ held at Pune, which was reviewed by Mizoram Governor and former Chief of the Army Staff VK SinghThe first batch of 17 female cadets graduated from the National Defence Academy (NDA) along with over… pic.twitter.com/yCnDU3SiLL— ANI (@ANI) May 30, 2025తమకు జెండర్ అనేది తమకు ఎపుడూ అడ్డంకి కాలేదనీ క్యాడెట్ ఇషితా శర్మ సంతోషం వ్యక్తం చేశారు. ఒకరికొకరం కష్టనష్టాల్ని పంచుకుంటూ అచంచలమైన విశ్వాసం, వైఖరితో ఐక్యతా స్ఫూర్తిని స్వీకరించా మన్నారు. 2021లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు యుపీఎస్సి (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) మహిళలు డిఫెన్స్ అకాడమీకి దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించిన తర్వాత ఎన్డీఏలో మహిళా అభ్యర్థుల ప్రవేశానికి మార్గం సుగమం అయింది. 2022లో మహిళా క్యాడెట్ల మొదటి బ్యాచ్ 2022లో ఎన్డిఎ 148వ కోర్సులో చేరిన సంగతి తెలిసిందే. ప్రవేశ పరీక్ష ద్వారా ఈ మహిళా అభ్యర్థులు ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు NDA లో మూడు సంవత్సరాల పాటు శిక్షణ పొందుతారు. శఙక్షణ అనంతరం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాలలో ఎంపిక చేయబడతారు. View this post on Instagram A post shared by Defence Squad™ | YouTube (@defencesquad) -
అమ్మ చేసిన బొమ్మలు
కూతురు ఆడుకోవడానికి అమ్మ చేసిన బొమ్మల ఆలోచన ఇప్పుడు నెలకు రూ. 2 లక్షల వ్యాపారం చేసేలా ఎదిగింది. కూతురికి ఉల్లాసాన్నిచ్చే ఒక సాధారణ ఆలోచన నుండి వీణా పీటర్ ‘తారాస్ డాల్ హౌస్’ పేరుతో బెంగళూరులో ఒక ప్రసిద్ధ బ్రాండ్గా మారింది. ప్లాస్టిక్ బొమ్మల ప్రపంచం నుంచి పిల్లలకు ఆలోచనాత్మక, పర్యావరణ హితమైన బొమ్మలను అందిస్తూ తల్లులకు ప్రేరణగా నిలిచింది. రెండేళ్ల క్రితం 30 బొమ్మలతో మొదలుపెట్టిన వీణా పీటర్ బిజినెస్ ప్రయాణం మనల్నీ తన వెంట తీసుకెళుతుంది.‘‘ముందస్తు వ్యాపార ప్రణాళిక లేదు, ఓ పేరూ లేదు, ధరల వ్యూహం అసలే లేదు. చేతితో తయారు చేసిన, పాతకాలం నాటి వస్తువులను అమ్మే ఓ మార్కెట్లో మొదటిసారి నా బొమ్మల ధరలను నిర్ణయించాను. ప్లాస్టిక్తో నిండిన పిల్లల బొమ్మల ప్రపంచంలో ఆలోచనాత్మకమైన, సున్నితమైన ప్రత్యామ్నాయమిది. చెన్నైలో మాస్టర్స్ చేసిన తర్వాత కార్పొరేట్ కంపెనీలలో దశాబ్దం పాటు ఉద్యోగినిగా కొనసాగాను. కానీ 2015లో నెక్ట్స్ ఏంటి అనే ఆలోచన నన్ను కుదురుగా ఉండనిచ్చేది కాదు. నా మార్గాన్ని వెతుకుతూనే నా భర్త ఎడ్యుకేషనల్ స్టార్టప్లో సాయం చేయడం ప్రారంభించాను. డిజిటల్ లోకం నుంచి డాల్ హౌస్కు...నా కూతురు తారా పుట్టాక నా ప్రపంచమే మారిపోయింది. డిజిటల్ లోకం నుంచి తప్పుకున్నాను. నా కూతురుతో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలనుకున్నాను. తారా పెరిగేకొద్దీ, బొమ్మల పట్ల ఆమెకు ప్రేమ పెరగడం గమనించాను. అయితే ఆమె ఆడుకునే బొమ్మల ఎంపిక నాకు ఇబ్బందిగా అనిపించేది. అన్నీ ప్లాస్టిక్, సింథటిక్ బొమ్మలు. పైగా అవి ఎక్కువ కాలం ఉండేవి కావు. పర్యావరణ అనుకూలమైనవి అసలే కావు. తారా నా జుట్టును చేత్తో పట్టుకొని పడుకునేది. ఆ అలవాటును ఎలా పోగొట్టాలో తెలిసేది కాదు. ఓ రాత్రిపూట జుట్టున్న బొమ్మను కొంటే..? అనే ఆలోచన వచ్చింది. దాని కోసం చాలా స్టోర్స్ వెతికాను. కానీ, అవన్నీ నాణ్యత లేనివి. నేనే ఏదో ఒకటి చేయాలి అనుకున్నాను. వాడిన ఫ్యాబ్రిక్తో బొమ్మమా అమ్మ పాత కాటన్ చీరలను ఉపయోగించి మొదటి బొమ్మను తయారు చేశాను. ఉన్ని దారాలతో జుట్టు కుట్టాను. తర్వాత మరికొన్నింటిని అలాగే కుట్టాను. తారాకు ఆ బొమ్మలు బాగా నచ్చాయి. మా ఫ్రెండ్స్ వాటిని చూసి, తమ పిల్లలకు కూడా అలాంటి బొమ్మలను తయారు చేసిమ్మన్నారు. దీంతో ఇది నా వ్యక్తిగతప్రాజెక్ట్గాప్రారంభమైంది. ఓ 30 బొమ్మలను తయారు చేశాను. వాటికి ధర ఎలా నిర్ణయించాలో తెలియలేదు. హస్తకళాకృతులు అమ్మే వీకెండ్ మార్కెట్కు వాటిని తీసుకెళ్లి, అక్కడ ప్రదర్శనకు పెట్టా. ఈవెంట్ అయ్యేలోపు బొమ్మలన్నీ అమ్ముడయ్యాయి. దీంతో నమ్మకం వచ్చేసింది. అలా నా కూతురి పేరుతోనే ‘తారాస్ డాల్ హౌస్’ పుట్టింది.బొమ్మల తయారీ కళను నేర్చుకోవడం2023ప్రారంభంలో మొదలుపెట్టిన ఈ వ్యాపారం కొన్ని నెలల వ్యవధిలో నెమ్మదిగా ఊపందుకుంది. ముందుగా ముడి బొమ్మలను తయారుచేయడాన్ని బాగా అధ్యయనం చేశాను. ప్రతి బొమ్మను కాటన్ పై ఒక ట్రేస్డ్ ప్యాటర్న్ తోప్రారంభించి, కత్తిరించి, అవుట్ లైన్ల వెంట కుట్టి,. తర్వాత దానిని లోపలి వైపుకు తిప్పి, కాటన్–పాలిస్టర్ ఫ్యాబ్రిక్తో నింపుతాను. దానివల్ల ఇది ఒకసారి ఉతికిన తర్వాత కూడా ముడుచుకుపోదు. బొమ్మల ముఖాలను ఫాబ్రిక్ మార్కర్లతో గీసి, విడిగా డ్రెస్సులు కుట్టి ఇస్తాను. పిల్లల చేతే బొమ్మలకు ఆ డ్రెస్సులు వేయిస్తే, వారికి సరదాగా ఉంటుంది. మొదట్లో ఈ పనిని ఒక్కదాన్నే చేసేదాన్ని. డిమాండ్ పెరిగేకొద్దీ, మరో ముగ్గురిని నియమించుకున్నాను. ఒకేసారి 100 బొమ్మలుబొమ్మల తయారీలో అసెంబ్లింగ్ విధానాన్ని రూ΄÷ందించాను. మొదట్లో ఒక బొమ్మకు రెండు రోజుల సమయం పట్టేది. ఇప్పుడు ఒక రోజులో 100 బొమ్మలను తయారు చేస్తున్నాం. బొమ్మలతో పాటు వాటికి వేసే నైట్ సూట్లు, గౌన్లు, సాంప్రదాయ దుస్తులు వంటి వివిధ రకాల దుస్తులను కూడా డిజైన్ చేస్తాం. మిగిలిపోయిన అతి చిన్న బట్టలను బొమ్మల పడకలు, దిండ్లు, ఇతర ఉపకరణాలలో తిరిగి ఉపయోగిస్తాం. ఏదీ వృథా కాదు. పిల్లలు ఈ బొమ్మలతో ఆటలో నిమగ్నమవ్వడం మాకు అతిపెద్ద బహుమతి. పిల్లలు బొమ్మలను కౌగిలించుకోవడం, వాటికి పేర్లు పెట్టడం వంటి ఫోటోలను చూసినప్పుడు అది నా బాధ్యతను మరింత గుర్తు చేసినట్లవుతుంది. ప్రతి బొమ్మకు మోడర్న్, ట్రెడిషనల్ రెండు డ్రెస్ డిజైన్లు చేసి ఇస్తాం. ఒక చిన్నారి పంజాబీ ఇంటి నుండి వచ్చినట్లయితే, ఆ బొమ్మకు ఘాగ్రా ఉంటుంది. దక్షిణ భారతదేశ పిల్లలకు లంగా వోణి ఎంపిక కావచ్చు. చిన్న డిజైన్ లకు ధర రూ.500, అదనపు దుస్తులతో వచ్చే 12 అంగుళాల బొమ్మకు రూ. 1,000, వార్డ్రోబ్, పరుపులతో పూర్తి చేసిన డీలక్స్ డాల్హౌస్ సెట్లకు రూ. 3,500 వరకు ధరలు ఉన్నాయి. కుట్టుపని చేసిన మొదటి రోజు నాటి నుండి ఇప్పుడు నెలకు 200 బొమ్మలు అమ్మే వరకు, తారాస్ డాల్ హౌస్ నెలకు రూ. 2 లక్షల ఆదాయాన్ని ఆర్జించే వ్యాపారంగా ఎదగడం చూస్తుంటే చాలా ఆశ్చర్యమేస్తుంది’’ అని తన బొమ్మల ప్రయాణాన్ని మురిపంగా వివరించింది వీణ. -
ఫుల్స్టాప్ ఉండకూడదు
72వ మిస్ వరల్డ్ కాంటెస్ట్కు హాజరైన మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పిస్కోవా బుధవారం హైదరాబాద్లోని ట్రైడెంట్ హోటల్లో బ్యూటీ విత్ ఎ పర్పస్ చారిటీ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్టినా యువతకు స్ఫూర్తినిచ్చేలా మాట్లాడారు.కిందటేడాది మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న క్రిస్టినా బ్యూటీ విత్ ఎ పర్పస్ అంబాసిడర్గా ప్రపంచమంతా పర్యటించింది. క్రిస్టినా పిస్కోవా ఫౌండేషన్ స్థాపించి దానిద్వారా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు చదువు దూరం కాకూడదన్న సంకల్పంతో టాంజానియాలో స్కూల్ను ప్రారంభించింది. సోంటా ఫౌండేషన్ ద్వారా చెక్ రిపబ్లిక్లోని వికలాంగులకు మద్దతు ఇస్తుంది. చెక్ రిపబ్లిక్ దేశంలోని ట్రినెక్ నగరంలో పుట్టింది క్రిస్టినా. ఆ తర్వాత వారి కుటుంబం దేశ రాజధాని ప్రాగ్లో స్థిరపడింది. న్యాయశాస్త్రంలో, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో డిగ్రీ పూర్తి చేసిన క్రిస్టినా మోడలింగ్పై ఆసక్తి ఉండటంతో అటుగా అడుగులు వేసింది. స్థానిక భాషతోపాటు ఇంగ్లిష్, పోలిష్, స్లోవాక్, జర్మనీ భాషల్లో ప్రావీణ్యం సాధించింది. లండన్లోని ఎలైట్ మోడల్ మేనేజ్మెంట్లో చేరి, అందాల పోటీలో పాల్గొనడానికి శిక్షణ తీసుకుంది. మిస్ చెక్ రిపబ్లిక్ పోటీల్లో పాల్గొని, తొలిప్రయత్నంలోనే కిరీటం దక్కించుకుంది.సాధించగలం అనే నమ్మకంమ్యూజిక్, ఫ్యాషన్, ఆర్ట్ అంటే ఇష్టపడే క్రిస్టినా తన సక్సెస్ గురించి వివరిస్తూ –‘‘జీవితంలో పుల్స్టాప్ అనేది ఎప్పుడూ ఉండకూడదు. అన్నీ కామాలే ఉంచాలి. నేను మ్యూజిక్ నేర్చుకున్నా, ఆర్ట్ ఫామ్స్ నేర్చుకున్నా, మోడలింగ్ చేసినా... ఏ లక్ష్యం కోసం పనిచేసినా దానికి సంబంధించి సమస్యలు, ఒత్తిళ్లు వస్తూనే ఉండేవి. ఆర్థిక సవాళ్లను కూడా ఎదుర్కొన్నాను. నేను ఈ స్టేజీకి రావడం వెనకాల పెద్ద పోరాటమే చేశాను. కానీ, కలలను సాధించే క్రమంలో చేసే ప్రయత్నాలు, ఆ తర్వాత పొందిన ఫలితాలతో చాలా ఆనందాన్ని పొందాను. మార్పు అనేది ఒక్కరోజులో వచ్చేది కాదు. ఏడాది పొడవునా శ్రమిస్తూనే ఉండాలి. ఏ లక్ష్యం కోసం పాటుపడుతున్నామో దానిని వదిలిపెట్టకూడదు. ఇతర భాషౖలపెనా పట్టు సాధించాలి.మంచి మార్పుకు ఉదాహరణగా! అందాల పోటీ అత్యుత్తమమైనది. ప్రపంచవ్యాప్తం గా అవసరంలో ఉన్న పిల్లలకు ఆశను, ఆనందాన్ని కలిగించే శక్తిని ఇస్తుంది. ఇది ఎంత ఛాలెంజింగో అంత పెద్ద బాధ్యత కూడా. మంచి మార్పుకు ఉదాహరణగా, ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా, ముఖ్యమైన అంశాలపై అవగాహన తీసుకువచ్చేలా ఉండాలి. ఏదైనా సాధించాలంటే ముందు మన మీద మనకు నమ్మకం ఉండాలి.మరచిపోలేని అద్భుతంతెలంగాణలో అద్భుతమైన ప్రకృతి దృశ్యాలతో పాటు ఉత్సాహభరితమైన సంస్కృతి ఎంతో ఆకట్టుకుంది. యాదగిరిగుట్ట టెంపుల్ ఆర్కిటెక్చర్, రాజరికపు వారసత్వానికి ఆభరణంగా నిలిచిన చౌమహల్లా ΄్యాలెస్, తెలంగాణ వంటకాలు, ఇక్కడి సంప్రదాయం.. ఇదంతా ఒక అద్భుత ప్రయాణంగా మారిపోయింది. విక్టోరియా మెమోరియల్ హోమ్ను సందర్శించి లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించాం. ముఖ్యంగా పిల్లలతో సమయం గడపడం, వారి కథలు వినడంతో వారితో కలిసి ఆనంద క్షణాలను పంచుకున్నాం’’ అని తెలిపారు క్రిస్టినా. – నిర్మలారెడ్డి ఫొటోల: ఎస్. ఎస్. ఠాకూర్ -
సాగర ధీరలకు స్వాగతం
ఎనిమిది నెలలు ఒక సెయిలింగ్ వెసెల్. ఇద్దరే నావికులు... మూడు మహా సముద్రాలను నాలుగు ఖండాలను 50,000 కిలోమీటర్ల దూరాన్ని భీకర వాతావరణాన్నిదాటి విజేతలుగా నేడు (మే 29)న గోవాకు చేరుకోనున్నారు. వీరికి ఘన స్వాగతం చెప్పడానికి కేంద్రమంత్రి రాజ్నాథ్ రానున్నారు. ఇండియన్ నేవీ ఆఫీసర్లు దిల్నా, రూపాలకు హర్షధ్వానాలతో స్వాగతం చెప్పాల్సిన సమయం ఇది.భారత నౌకాయాన చరిత్రలో గతంలో స్త్రీల సాహసం ఎటువంటిదో నమోదు చేసే వివరాలు అంతగా తెలియదు. కాని వర్తమానంలో మన నారీశక్తి ఎంత గొప్పదో నిరూపించే ఘనయాత్రలను నావికా దళ మహిళా ఆఫీసర్లు పదే పదే నిరూపిస్తున్నారు. నావికాదళంలోని మహిళా నావికులు తమకు తాముగా సముద్రం మీద ప్రపంచ యాత్ర చేయగలరు అని చాటడానికి 2017–18లో ఆరుగురు మహిళా సిబ్బందితో ‘నావికా సాగర్ పరిక్రమ – 1’ జరిగింది. 40 వేల కి లోమీటర్లు ఐ.ఎన్.ఎస్.వి. తారిణిపై చుట్టివచ్చారు. ఆరుగురు సిబ్బంది అంటే ఒకరికొకరు సాయం చేసుకోవడంలో ఉండే వెసులుబాటు ఎక్కువ. అయితే మనవాళ్లు అక్కడే ఆగిపోలేదు. కేవలం ఇద్దరు మహిళా ఆఫీసర్లతో ‘నావికా సాగర్ పరిక్రమ–2’ చేయ సంకల్పించారు. ఇందుకు తగిన ఆఫీసర్ల ఎంపికకే సంవత్సర కాలం పట్టింది. అనేక వడపోతల తర్వాత ఇద్దరు ఆఫీసర్లు ఈ సాహసయాత్రకు యోగ్యత పొందారు. వారే లెఫ్టినెంట్ రూపా, లెఫ్టినెంట్ దిల్నా. కేవలం ఇద్దరు ఆఫీసర్లు అనంత జలరాశిపై సెయిలింగ్ బోట్ మీద 50 వేల కిలోమీటర్లు చుట్టి రావాలంటే ఎంత ధైర్యం... సాహసం ఉండాలి? ఎన్ని సవాళ్లను ఎదుర్కోవాలి? అసలు తిరిగి వస్తారో రారో అనే భయం అయినవాళ్లను పీడించకుండా ఉంటుందా? అయినప్పటికీ అవన్నీ దాటి ఆ ఇద్దరు ధీరవనితలు తమ సాగర పరిక్రమను దిగ్విజయంగా ముగించారు. ఎనిమిది సుదీర్ఘ నెలలు సముద్రంతో చెలిమి, చెలగాటం చేసి తిరిగి మన జలాలలోకి చేరుకున్నారు. నేడు వారికి ఘనస్వాగతం గోవాలో లభించనుంది.అక్టోబర్ 2, 2024నప్రారంభంనావికా సాగర్ పరిక్రమ–2 అక్టోబర్ 2, 2024న గోవాలో మొదలైంది. ఇద్దరు నావికా ఆఫీసర్లు దిల్నా, రూపాలు అంతకుముందే ఐ.ఎన్.ఎస్.వి.తారణిలో చిన్న చిన్న దూరాలున్న సముద్ర యాత్రలు చేసి ఆ రిహార్సల్స్తో సర్వసన్నద్ధం అయ్యారు. వీరు ఎనిమిది నెలల పాటు తారణిలో ఉండాలి. 50 వేల కిలోమీటర్లు పడవ నడపాలి. మూడు మహా సముద్రాలు– ఇండియన్, పసిఫిక్, అట్లాంటిక్ గుండా ప్రయాణించాలి. నాలుగు ఖండాలు ఆసియా, ఆస్ట్రేలియా, సౌత్ అమెరికా, ఆఫ్రికాలను చుట్టాలి. కేవలం నాలుగు చోట్ల వీరు బ్రేక్ తీసుకునే ఏర్పాటు చేశారు. అవి– ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫాక్ల్యాండ్, కేప్టౌన్. తారిణిలో అత్యాధునిక సిగ్నెలింగ్ వ్యవస్థ ఉంటుంది. తీరం నుంచి నావికాదళం వీరితో అనుసంధానమై ఉండి వీరి యాత్రను గమనిస్తూ ఉంటుంది. అయినా సరే నడిసముద్రంలో నావ ఉన్నప్పుడు వీరు ఇరువురు మాత్రమే ఉంటారు. వీరితోపాటు నావ. ఎదురుగా అనంత జలరాశి.గాలే కీలకంలెఫ్టినెంట్ దిల్నా, రూపా ప్రయాణిస్తున్న తారిణి ఒక సెయిలింగ్ వెస్సెల్. అంటే గాలివాటుతో ప్రయాణించాల్సిన తెరచాప పడవ. దీనికి 25 మీటర్ల ఎత్తు తెరచాపలు ఉన్నాయి. గాలి అదుపులో ఉంటే పడవ దూసుకెళుతుంది. ‘ఒక్కోసారి సముద్రం మీద రోజుల తరబడి గాలి ఉండదు. నావ కదలదు. మన సహనం పరీక్షకు గురవుతుంది’ అన్నారు దిల్నా, రూపా. అదే సమయంలో కేప్ హార్న్స్, కేప్ టౌన్, డ్రీక్ పాసేజ్ వంటి చోట ఇదే గాలి గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వీస్తే పడవను అదుపు చేయడంప్రాణాంతకం అవుతుంది. గ్రీక్ పాసేజ్ దగ్గర అలలు ఐదు మీటర్ల ఎత్తుకు ఎగిరిపడుతూ పడవను ముంచెత్తుతాయి. కాగితం పడవను ఊపినట్టు ఊపేస్తాయి. అంతేకాదు కొన్నిచోట్ల అతి శీతల గాలులు... వణికించే చలి... గడ్డకట్టినంత చల్లగా ఉండే సముద్రనీరు ఉంటాయి... వీటన్నింటిని తట్టుకోవడం వల్లే దిల్నా, రూపాలను ధీరలని, సాహస నావికులని అనాలి. ముఖ్యంగా ‘కేప్ హార్న్’ను జయించే అదృష్టం అందరికీ దక్కదు. అది దాటిన వారికి ‘కేప్ హార్నర్స్’ అనే బిరుదును ఇస్తారు. ఇప్పుడు దిల్నా, రూపాలకు కూడా ఆ బిరుదు దక్కింది.నీమొ పాయింట్సముద్ర ధ్రువంగా భావించే నీమొ పాయింట్ను లెఫ్టినెంట్ దిల్నా, లెఫ్టినెంట్ రూపాలు ఈ సాగర పరిక్రమలో టచ్ చేయడం పెద్ద విశేషంగా చెప్పాలి. దాదాపుగా ఈ పాయింట్ దగ్గరకు నావికులు వెళ్లరు. దీనికి దగ్గరి భూభాగమే 2,688 కిలోమీటర్ల దూరంలో ఉంటుందంటే ఆలోచించుకోవచ్చు. ఈ పాయింట్కు భూమిపై ఉండే మనుషుల కంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండే మనుషులే దగ్గర. ఆ పాయింట్ను దాటిన క్షణం చారిత్రాత్మకంగా దిల్నా, రూపా భావిస్తున్నారు. ఆ పాయింట్ దగ్గర ఇద్దరూ సంబరం జరుపుకున్నారు.ఆకాశమూ, అగాథాలూగడప లోపలే ఉండిపోయినా స్త్రీ ఆకాశాలనూ అగాధాలనూ అందుకుంటూ ప్రయాణం సాగిస్తున్నది. సునీతా విలియమ్స్ ఆకాశానికి ఉన్న హద్దును చెరిపేస్తే దిల్నా, రూపాలు అగాథాల పట్ల ఉన్న భయాలను తొలగించారు.సాహస వనితలు, చరిత్రలో నిలిచిపోయిన మహిళా నావికులు దిల్నా, రూపాలు గోవాకు నేడు చేరుకుంటున్న సందర్భంగా అందరూ ఉత్సవాలు జరపాలి. వీరి గాథను పాఠాలుగా చెప్పాలి. -
చిన్న వయసులోనే పెళ్లి, బాధ్యతలు: పట్టుదలతో IAS అధికారిగా
మహిళలు అన్ని రంగాల్లోనూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. అడ్డంకులు ఎన్ని వచ్చినా, అధిగమించి ఉన్నత స్థాయి నైపుణ్యాలతో రాణిస్తున్నారు. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని సంవత్సరాలుగా, పౌర సేవలలో మహిళా అధికారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అలాంటి వారిలో ఒకరు మిన్ను జోషి. ఒక బిడ్డకు తల్లిగా కుటుంబ బాధ్యతల్లో మునిగి పోయిన ఆమె నేడు ఆమె కేవలం శ్రద్ధగల అధికారి మాత్రమే కాదు, ఆమె మొత్తం కుటుంబం గర్వించదగిన వ్యక్తిగా ఎదిగింది. సంకల్పం ఉంటే ఒక స్త్రీ తన ఇంటి బాధ్యతలను పోషిస్తూనే తన కలలను ఎలా సాకారం చేసుకోవచ్చో నిరూపించింది.ప్రపంచవ్యాప్తంగా అనేకమంది మహిళలు తమ దృఢ సంకల్పం, ఆకాంక్ష శ్రద్ధతో ఉన్నత శిఖరాల అధిరోహిస్తున్నారు. పట్టుదలతో ప్రయత్నిస్తే సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపిస్తున్నారు. ఒక్కొక్కరిదీ ఒక్కో విజయగాథ. కుటుంబం ఇచ్చిన మద్దతుతో, ఆకాశాన్ని లక్ష్యంగా చేసుకుంది.భారతదేశంలోని అత్యంత కఠినమైన సివిల్స్లో సత్తా చాటినమిన్ను జోషి సక్సెస్ జర్నీని పరిశీలిద్దాం. చదవండి: ట్విటర్ గాలం : ఇండో-అమెరికన్ , యూట్యూబ్ సీఈవోకి గూగుల్ భారీ ఆఫర్కేరళలోని పతనంతిట్ట అనే చిన్న గ్రామంలో మిన్ను జోషి పుట్టింది. మిన్ను తండ్రి పోలీసు. మిన్నుకి 21 ఏళ్ల వయస్సులోనే వివాహం అయింది. ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. భార్యగా, కోడలిగా, తల్లిగా కుటుంబ బాధ్యతల్లో మునిగిపోయినా తన కలను సాకారం కోసం తనను తాను సంసిద్ధం చేసుకుంది. దివంగత తండ్రి కలను సాకారం చేయాలని గట్టిగా నిర్ణయించుకుంది.ఇదీ చదవండి: పాపులర్ యూ ట్యూబర్ సీక్రెట్ వెడ్డింగ్ : స్టూడెంట్స్కి సర్ప్రైజ్పోలీసుగా గౌరవ స్థానంలో ఉన్న తండ్రిని చూసి తాను కూడా మరింత ఉన్నతంగా ఎదగాలని కలకనింది. అయితే, ఎంతో ప్రేమించిన తండ్రి అకాల మరణం ఆమెను దిగ్భ్రాంతికి గురిచేసింది. 2012లో 'డై-ఇన్-హార్నెస్' పథకం ద్వారా ఆమె కేరళ పోలీస్ డిపార్ట్మెంట్లో క్లరికల్ పదవిని పొందింది. అయినా ‘ఐఏఎస్’ డ్రీమ్ను విడిచిపెట్టలేదు. బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చదివిన 26 సంవత్సరాల వయస్సులో, ఆమె ఐఎఎస్ పరీక్షకు సిద్ధం కావడం ప్రారంభించింది. ఇది కేవలం తన కలకోసం మాత్రం కాదని, మరణించిన తండ్రి సేవకు కొనసాగింపు అని భావించింది. 2015లో శంకర్ ఐఏఎస్ అకాడమీలో చేరిం కష్టపడింది. రెండేళ్ల తరువాత మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణురాలైంది. అయితే, ఆమె ఇంటర్వ్యూలలో విఫలమైంది. అయినా పట్టువీడలేదు. నిరుత్సాహపడలేదు. చివరికి తొలి ఆరు ప్రయత్నాలు, సుదీర్ఘమైన అధ్యయన సెషన్ల తర్వాత, సివిల్ సర్వీసెస్ పరీక్షలో 150 ఆల్ ఇండియా ర్యాంక్ను సాధించి తానేంటో నిరూపించుకుంది.చదవండి: ‘ఎర్ర’ గౌనులో దీపికా రాయల్ లుక్ : స్పిరిట్పై ఫ్యాన్ కామెంట్ వైరల్ -
అంధత్వం కాదు అక్షర బంధుత్వం..
అక్షరం ఆయుధమే కాదు చీకటి నుంచి వెలుగులోకి తీసుకువెళ్లే కాంతిపుంజం. ‘నేను అంధురాలిని’ అని ఎప్పుడూ నిరాశపడలేదు సాయిజ్యోతి. ఆమె ఉత్సాహం పేరు... అక్షరం. ఆమె శక్తి పేరు... పుస్తకం. గుంటూరు జిల్లా పాత మంగళగిరికి చెందిన చింతకింది సాయిజ్యోతి అంధుల్లో సానుకూల దృక్పథాన్ని కలిగించే లక్ష్యంతో కవితల నుంచి నవలల వరకు ఎన్నో ప్రక్రియలలో రచనలు చేస్తోంది...పదేళ్ల వయసు వచ్చేవరకూ లోకాన్ని అందరిలాగే చూసింది సాయిజ్యోతి. ఉపాధ్యాయులు చెప్పేది విని నోటు పుస్తకంలో రాసుకునేది. కానీ జన్మతః వచ్చిన లోపం కారణంగా ఆ తరువాత కంటిచూపును కోల్పోయింది. అప్పటివరకూ అందంగా కనిపించిన రంగుల ప్రపంచం ఒక్కసారిగా చీకటైపోయింది. స్థానిక విజయమేరి ఇంటిగ్రేటెడ్ పాఠశాలలో హైస్కూలు విద్య, హైదరాబాద్లోని చిన్న జీయర్ స్వామి నేత్ర విద్యాలయంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. మంగళగిరిలో డిగ్రీ, నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్లో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన జ్యోతి ప్రస్తుతం నూతక్కి జిల్లా పరిషత్ హైస్కూలులో జూనియర్ అసిస్టెంటుగా ఉద్యోగం చేస్తోంది.అక్షరాల తోటలోకి...సాహిత్యంపై చిన్నప్పటి నుంచే సాయిజ్యోతికి ఆసక్తి ఉండటతో చిన్న చిన్న రచనలు చేసేది. ఆ తరువాత తన సాహిత్యానికి సోషల్ మీడియాను వేదిక చేసుకుంది. వివిధ సాహిత్య వేదికలకు చెందిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లాంటి గ్రూపులతో పరిచయం అయింది. ‘చైత్రశ్రీ’ అనే కలం పేరుతో రచనలకు శ్రీకారం చుట్టింది. తొలి కవితా సంకలనం ‘కవితాంజలి’ ఈ ఏడాది వెలువడింది.తన జీవితమే తన నవల‘మంచు తాకిన ప్రేమ‘ నవలకు మంచి పేరు వచ్చింది. ‘ఎవరు అతను?’ పేరుతో రెండో నవల రాసింది. మూడవ నవల ‘అన్వేషిత’ తన జీవితాన్నే స్ఫూర్తిగా తీసుకొని రాసింది. కుటుంబంలో ఒక అమ్మాయి అంధురాలిగా పుడితే ఆమెను కుటుంబం ఏ విధంగా చూసుకుంది? సమాజంలో తనని తాను ఏ విధంగా నిరూపించుకుంది? తోటి అంధులకు ఆమె ఏ విధంగా సహాయపడింది? స్ఫూర్తిని ఇచ్చింది? అంధుల జీవితం ఎలా ఉంటుంది.. మొదలైన అంశాలను తీసుకొని నవల రాసింది. అరవై భాగాలు ఉన్న ‘అన్వేషిత’ నవలను పుస్తక రూపంలోకి తీసుకు రానున్నారు. ఇవేకాక ఏడు చిన్న కథలు, ఆరు పాటలు రాసింది. అవి స్నేహితుల ద్వారా యూ ట్యూబ్ వరకూ చేరి ప్రేక్షకాదరణ పొందుతున్నాయి.అందుకోసమే నా రచనలుసానుకూల దృక్పధాన్ని ఎలా అలవర్చుకోవాలి, ప్రతికూల పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కోవాలిలాంటి అంశాలే నా రచనకు మూలం. సమస్యలకు కుంగిపోకుండా పరిష్కారాలను అన్వేషించాలని నేను గట్టిగా నమ్ముతాను. సమాజంలో అంధుల పట్ల ఉన్న ఆలోచన ధోరణిని మార్చాలనేది నా ప్రయత్నం. అందుకోసమే రచనలు చేస్తున్నాను. అద్బుత విజయాలు సాధించడానికి అంధత్వం అడ్డుకాదని చరిత్ర నిరూపించింది. నిరూపిస్తూనే ఉంది. – చింతకింది సాయిజ్యోతి – బోణం గణేష్, సాక్షి, అమరావతి(చదవండి: ఇద్దరు పిల్లలున్న అమ్మలకు గుడ్న్యూస్..! ఇక నుంచి..) -
Tax Exemption: అమ్మలకు ఆదాయ పన్ను మినహాయింపు..!
ఇద్దరు లేదా ముగ్గురు పిల్లల తల్లులకు ఆదాయ పన్ను మినహాయింపును ప్రకటించారు హంగేరి ప్రధాని విక్టర్ ఓర్బాన్. దీనివల్ల ఇద్దరు పిల్లలు ఉన్న 6,50,000 మంది తల్లులు, ముగ్గురు పిల్లలు ఉన్న 2,50,000 మంది తల్లులు లబ్ధి పొందుతారు. 2026 ఎన్నికకు ముందు ఈ ప్రకటన రావడం విశేషం. జనన రేటుని పెంచడానికి ప్రధాని ఓర్బాన్ చేస్తున్న ప్రయత్నాలలో ఒకటి. అంతేగాదు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి, కుటుంబాలకు మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ ప్రారంభంలో గృహ రుణాల వడ్డీ రేట్లను కూడా 5%కి పరిమితం చేసింది. పైగా ఇది యూరప్లోనే అతిపెద్ద పన్ను మినహాయింపని చెప్పారు ప్రధాని ఓర్బాన్ఇంతకుముందు ఈ మినహాయింపు 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న తల్లులు, నలుగురు లేదా అంతకంటే ఎక్కువమంది పిల్లలు ఉన్న తల్లులకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఈ మినహాయింపు ఈ ఏడాది అక్టోబర్ నుంచి ముగ్గురు పిల్లలున్న తల్లులు ఇది అమలులోకి రాగా, వచ్చే ఏడాది 2026 జనవరి నుంచి ఇద్దరు పిల్లల తల్లులకు ఈ పన్ను మినహాయింపు అమల్లోకి రానుంది. (చదవండి: ఉద్యోగం మాన్పించడం కూడా గృహహింసే..!) -
సీఈవోగా గృహిణి..! ఏకంగా 24 క్యారెట్ల బంగారంతో..
మధ్యతరగతిలో పెరిగిన ఆమె పార్ట్ టైం జాబ్లు చేసి మరీ అమెరికా చదువుని పూర్తి చేసింది. చిన్నా.. చితక స్టోర్ల నుంచి ఆభరణాల స్టోర్ వరకు ప్రతిదాంట్లో పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ..తన కాబోయే భర్తను కలుసుకుంది. అతడు కూడా ఆమెలానే రెస్టారెంట్ అంతస్తులు శుభ్రం చేసే హౌస్ కీపింగ్ స్థాయి నుంచి ఓ కంపెనీని స్థాపించే రేంజ్కి ఎదిగిన వ్యక్తి. ఇద్దరి కష్టపడేతత్వం, అభిరుచులు ఒక్కటై..స్నేహితులుగా, ఆ తర్వాత జంటగా మారారు. అలా ఇరువురు మంచి వ్యాపారవేత్తలుగా మారినా..గృహిణిగా సాధారణ జీవితం గడపటానికి ఇష్టపడక తన కాళ్లపై తాను నిలబడేందుకే మక్కువ చూపించింది. అలా ఆమె అనతికాలంలోనే మంచి వ్యాపారవేత్తగా పేరుతెచ్చుకుని..అత్యంత లగ్జరీయస్ భవంతిలో నివాసం ఉండే స్థాయికి చేరుకున్నారామె. ఇప్పటికీ తనకు భర్త సంపాదనపై ఆధారపడి బతకడం అంటే అస్సలు ఇష్టం ఉండదని చెబుతోంది. మరీ అంతలా సక్సెస్ని అందుకున్న ఆ గృహిణి ఎవరంటే..విలాసాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన ఆ గృహిణే దుబాయ్కి చెందిన అనితా సురానీ. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆమె, అమెరికాలో చదువుకు కొనసాగించడానికి ఎన్నో పార్ట్ టైం ఉద్యోగాలు చేసేది. ఒక కన్వీనియన్స్ స్టోర్ నుంచి జ్యువెలరీ స్టోర్ వరకు..ఇలా ప్రతి చిన్న పార్ట్ టైం ఉద్యోగాన్ని వదులుకోకుండా ఆహర్నిశలు కష్టపడి అమెరికా చదువుని విజయవంతంగా పూర్తి చేసింది. ఆ సమయంలో అనిత తన ఇంటీరియర్ డిజైన్కి సంబంధించిన వ్యాపారం చేసే యత్నంలో ఉండగా..తన కాబోయే భర్త వ్యాపార భాగస్వామి మోయిజ్ ఖోజాను కలిసింది. మోయిజ్ కూడా ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే. అతడు కూడా ఒకప్పుడు రెస్టారెంట్ అంతస్తులను శుభ్రం చేసి, విజయవంతమైన టెక్ స్టోర్ సామ్రాజ్యాన్ని నిర్మించే స్థాయికి చేరుకున్నాడు. అతనితో కలిసి అనిత టెక్ స్టోర్ సామ్రాజ్యాన్ని నిర్మించింది. వ్యాపారభాగస్వాములుగా ఉన్న ఇద్దరు జీవిత భాగస్వాములయ్యారు. తమ వ్యవస్థాపక ప్రయాణం ఒక అమెరికన్ మాల్లోని ఒక చిన్న సెల్ ఫోన్ కియోస్క్తో ప్రారంభమైందని చెబుతోంది అనిత. అలా అలా విస్తరించి ఇవాళ దాదాపు 100కు పైగా దుకాణాలతో రిటైల్ సామ్రాజ్యంగా విస్తరించిందని తెలిపింది. ఇక మోయిజ్ ఈ రిటైల్ వ్యాపారాన్ని పర్యవేక్షిస్తుండగా..అనిత తన ఇంటీరియర్ డిజైన్ పట్ల ఉన్న ఆసక్తితో అటువైపుగా తన వ్యాపారాన్ని నిర్మించాలనుకుంది. అందుకోసం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులతో పనిచేయడం ప్రారంభించింది. అలా ఒక అనుభవజ్ఞుడైన సహోద్యోగితో భాగస్వామ్యం కుదుర్చుకుని..దుబాయ్లో జేనా ఇంటీరియర్స్ను ప్రారంభించింది. చూస్తుండగానే అతి కొద్దికాలంలో అనిత డిజైన్ కంపెనీ వేగంగా వృద్ధి చెందింది. జస్ట్ ఇద్దరు వ్యక్తుల నుంచి ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్లు, గ్రాఫిక్ డిజైనర్లు, ఇంటీరియర్ డిజైనర్లతో సహా 40 మందికి పైగా ఉద్యోగులకు విస్తరించింది. అయితే తన సక్సెస్కి ప్రేరణ తన కుమార్తె జెనా అని అంటోంది. జీవితాన్ని సమతుల్యం చేసుకునేలా ఎలా మన లక్ష్యాలను నెరవేర్చుకోవాలో తన కూతురు చూపించాలనేదే తన ధ్యేయమని, అందుకోసమే ఓటమిని దరిదాపుల్లోకి రాకుండా కష్టపడతానని చెబుతోంది. అందుకోసమే తన కంపెనీకి కూడా తన కూతుర జెనా పేరుని పెట్టానని చెబుతున్నారామె. అనితా జెనా బోటిక్ కంపనీని కూడా నిర్వహిస్తోంది. ఇందులో అంతా మహిళా ఉద్యోగులే పనిచేస్తారని చెబుతోంది. లగ్జరీ భవంతి..ఆమె దుబాయ్ ఇల్లు అత్యంత లగ్జరీయస్గా..రెండు కళ్లు సరిపోవేమో..! అన్నంత అందంగా ఉంటుందట. ఆమె ఇంటి సీలింగ్ 24-క్యారెట్ల బంగారంతో చేసి ఉంటుందట. ఆమె ఆఫీస్ కూడా అంతే అందంగా లగ్జరీయస్ ఉంటుందట. అయితే అనిత తన వ్యాపారానికి నిధులు సమకూర్చుకోవడానికి కుటుంబ సంపదపై అస్సలు ఆధారపడదట. ఎందుకంటే తన భర్త స్పష్టమైన ఆర్థిక సరిహద్దులను నిర్దేశించారట, అందుకనుగుణంగానే నడుచుకుంటానంటోంది. తన ఆఫీస్ పెట్టుబడిని తిరిగి చెల్లించడమే గాక ఉద్యోగుల జీతాలను కూడా తానే భరిస్తానంటోంది. ఆ ఒత్తిడే ఆమెను మరింత కష్టపడి పనిచేసేలా చేసి, కంపెనీ అభివృద్ధి దోహదపడుతుందని చెబుతోంది. అంతేకాదండోయ్ అనిత డబ్బుని ఆర్చించేలా కష్టపడి పరిచేస్తా..అలాగే సంపాదించినదంతా ఖర్చు పెట్లేందుకు వెనకడుగు వేయను అని తేల్చి చెబుతోంది. పైగా అందులో ఉన్న సంతృప్తే 'వేరేలెవెల్' అని చెబుతోంది అనిత.(చదవండి: పియానోలో తల్లి కూతుళ్ల అరుదైన రికార్డు..!) -
అమ్మబాటలో.. రికార్డుల వేటలో..
శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః అన్నారు పెద్దలు. అంటే శిశువులు, పశువులే కాదు.. పాములు కూడా సంగీతాన్ని ఆస్వాదిస్తాయట. అదీ సంగీతానికి ఉన్న మహత్త్యం అని చెబుతుంటారు. గానంతో మేఘం వర్షిస్తుంది.. అగ్ని ప్రజ్వలిస్తుంది అంటారు. అందులో నిజమెంతుందో తెలియదు గానీ, అప్పుడెప్పుడో ఆ తల్లి నేర్చుకున్న సంగీత ఓనమాలను ఆమె పిల్లలు పట్టేశారు. పెళ్లి, పిల్లలు తర్వాత కూడా ఆటవిడుపుగా నేర్చుకున్న ఆ సంగీతాన్ని ఇద్దరు చిన్నారులు అవపోసన పట్టేశారు. ఇప్పుడు తల్లితో పాటు ఆ గారాలపట్టీలు ఇద్దరూ అరుదైన రికార్డును సొంతం చేసుకుని అందరి దృష్టినీ ఆకర్షించారు. 18 దేశాలకు చెందిన కీబోర్డు కళాకారులు పాల్గొన్న కార్యక్రమంలో ఒకే కుటుంబానికి చెందిన ఆ ముగ్గురికి అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ రాష్ట్రం కేపీహెచ్బీకాలనీ ఐదో ఫేజ్కు చెందిన తల్లి మేడిది లలితకుమారి తన ఇద్దరు కుమార్తెలు ఎనిమిదేళ్ల లీషా ప్రజ్ఞ, ఐదేళ్ల మేడిది అభిజ్ఞతో కలిసి గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించారు. నెడిది జానకిరామరాజు, లలితకుమారి దంపతులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని కొమరగిరి పట్నంలో లలితకుమారి తన ఏడో ఏటా పియానో వాయించడం నేర్చుకున్నారు. అప్పట్లో కేవలం రెండు పాటలు మాత్రమే నేర్చుకోగా పెళ్లి అనంతరం కీ బోర్డు కొనుక్కుని స్వతాహ నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఆన్లైన్ తరగతులకు హాజరై కీబోర్డుపై మరింత పట్టు సాధించారు. ఆమె ఆసక్తిని గమనించి భర్త జానకిరామరాజు కూడా ప్రోత్సాహాన్ని అందిస్తూ వచ్చారు. లలిత కుమారి సాధన చేస్తుంటే తన ఇద్దరు కుమార్తెలు లిషా ప్రజ్ఞ, అభిజ్ఞలు సైతం అనుసరించడం మొదలుపెట్టారు. ఇద్దరూ కూడా తల్లి ఇంట్లో పియానో కీబోర్డుపై ప్రాక్టీస్ చేయడం చూసి వారికి కూడా ఆసక్తి కలిగింది. ఇంకేం.. వారు సైతం బుల్లి పియానో కీబోర్డు కొనిపించుకుని తల్లితో పాటు ఆన్లైన్ క్లాస్లకు హాజరై నైపుణ్యాన్ని పెంపొందించుకున్నారు. తైక్వాండో, స్విమ్మింగ్లో సైతం ప్రతిభ అక్కా చెల్లెళ్లు లిషాప్రజ్ఞ, అభిజ్ఞలు తైక్వాండోలో సైతం రాణిస్తున్నారు. తైక్వాండో నేర్చుకుంటున్న అకాడమీలో జరిగిన ఏజ్ గ్రూప్ పోటీల్లో బంగారు పతకాలను సాధించి నేటితరం చిన్నారులకు స్ఫూర్తిగా నిలిచారు. అంతేకాకుండా ఇద్దరు చిన్నారులు స్విమ్మింగ్లో సైతం రాణిస్తుండటం గమనార్హం. లిషా ప్రజ్ఞ సంస్కృతి ఇంటర్నేషనల్ స్కూల్లో నాల్గో తరగతి చదువుతుండగా, అభిజ్ఞ మాంటిస్సోరి స్కూల్లో కిండర్ గార్టెన్లో చదువుతోంది. గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డు తల్లీ కూతుళ్లు గత ఏడాది డిసెంబర్ 1న గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డు సృష్టించడానికి హాలెల్ మ్యూజిక్ స్కూల్ విద్యార్థులతో కలిసి గంట వ్యవధిలో ఇన్స్ట్రాగామ్ వేదికగా వీడియోలను అప్లోడ్ చేశారు. దీనికి లండన్లోని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అధినేత రిచర్డ్ స్టన్నింగ్ విజేతలను ప్రకటించగా, అందులో తల్లి, తన ఇద్దరు కూతుళ్లు ఉండటం విశేషం. డిసెంబర్ 9న లండన్ నుంచి జూమ్ మీటింగ్ ద్వారా రిచర్ట్ స్టన్నింగ్ వారిని అభినందించారు. ఈ ఏడాది ఏప్రిల్ 14న మణికొండలో జరిగిన వేడుకల్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధి ఆనంద్ రాజేంద్రన్, హాలెల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకులు అంగస్టీన్ దండింగి సర్టిఫికెట్లు, పతకాలను అందజేశారు. అతి పిన్న వయస్సులోనే ఈ రికార్డు నెలకొల్పినందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులను అభినందించారు. -
ఛాయాచిత్ర దీప్తి
రెండు కళ్ళు చూడలేని దృశ్యాలను కెమెరా కన్ను చూస్తుంది. మారుమూలప్రాంతాలు తిరిగే దీప్తి ఆస్థానా మహిళలు ఎదుర్కొంటున్న నుంచి పర్యావరణ సమస్యల వరకు తన కెమెరా కంటితో ప్రపంచానికి చూపుతుంది. డాక్యుమెంటరీ–స్టైల్ స్టోరీ టెల్లింగ్ ద్వారా ఎందరో సామాన్యుల జీవితాలను ఆవిష్కరిస్తోంది...‘చెప్పడానికి మన దగ్గర ఎన్నో కథలు ఉంటాయి. నన్ను నేను వ్యక్తీకరించుకోవడానికి ఫోటోగ్రఫీ, స్టోరీ టెల్లింగ్ అనేది ఒక మాధ్యమం’ అంటుంది దీప్తి ఆస్థానా. అనుకోకుండా ఫోటోగ్రఫీలోకి వచ్చింది దీప్తి.లండన్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్నప్పుడు కొలీగ్ ఒకరు తనకు కెమెరా పరిచయం చేశాడు. మొదట్లో కెమెరాకు సంబంధించిన సాంకేతిక విషయాలను తెలుసుకోవడానికే ఆసక్తి చూపేది. ఆ తరువాత ఆమెకు అర్థమయ్యింది ఏమిటంటే...‘కెమెరా అంటే సాంకేతికతకు సంబంధించిన విషయమే కాదు. అంతకంటే ఎక్కువ. జీవితాలను ఆవిష్కరించే సాధనం’ అనుకుంది. ఇండియాకు తిరిగి వచ్చే సమయానికి దీప్తికి కెమెరా మంచి నేస్తం అయింది. కెమెరా తో రకరకాలప్రాంతాలకు వెళుతుండేది. కెమెరా కంటితో స్వదేశం తనకు కొత్తగా కనిపించింది. గతంలో ఎన్నడూ చూడని అపురూప దృశ్యాలు కనిపించాయి.‘అందాలు, అద్భుతాలు మాత్రమే కాదు అసమానతలు, అన్యాయాలు చూశాను’ అని తన ప్రయాణ అనుభవాల గురించి చెబుతుంది దీప్తి, ఆ అసమానతలు, అన్యాయాలకు సంబంధించిన కథనాలను వెలికి తీయడానికి కెమెరాను సాధనం చేసుకుంది.‘ఏ థౌజెండ్ థ్రోన్స్’ప్రాజెక్ట్ ద్వారా రాజస్థాన్లోని థార్ ఎడారిప్రాంత మహిళల జీవితాలను వెలుగులోకి తీసుకువచ్చింది. నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ సహకారంతో ‘వెయిట్ ఆఫ్ ది వాటర్’ పుస్తకాన్ని ప్రచురించింది. ఈ ఫోటోగ్రఫీ స్టోరీ పుస్తకం ద్వారా హిమాలయప్రాంతంలో నీటి సమస్యలు ఎదుర్కొంటున్న కుటుంబాల కన్నీటి కథలను ప్రపంచానికి చెప్పింది. ఆప్రాంతంలో మహిళలుప్రాథమిక నీటి అవసరాల కోసం రోజుకు ఆరు నుండి తొమ్మిది గంటలు వెచ్చిస్తున్నారు. నీటి వనరులను కనుగొనడానికి రోజు అయిదు కిలోమీటర్ల వరకు నడుస్తున్నారు. నీటి సంక్షోభ ప్రభావం మహిళలు, బాలికలపైనే ఎక్కువ పడుతుంది. బాలికలు విద్యకు దూరం అవుతున్నారు.‘ఒక అమ్మాయికి అండగా నిలబడి దారి చూపగలిగితే అది వారి జీవితాలను మార్చేస్తుంది. ఇంటికే పరిమితం కాకుండా విద్యా,ఉద్యోగాల్లో వారు రాణిస్తారు’ అంటుంది దీప్తి. సమస్యలను ప్రపంచానికి చూపే, సమస్యల పరిష్కారానికి వేదికలా ఫొటోగ్రఫీని ఉపయోగించుకుంటుంది దీప్తి. ఒక స్వచ్ఛంద సంస్థ సహాయం తీసుకొని కొన్నిప్రాంతాలలో వాటర్ ట్యాంక్ల నిర్మాణం చేసింది. ఆ మహిళల అరుదైన కృషిఫోటోగ్రఫీ అంటే వినూత్నమైన శక్తి. ఫోటోగ్రఫీ అనేది కథ చెప్పడానికే కాదు భావోద్వేగాలను రేకెత్తిస్తుంది. అదే సమయంలో సమస్య పరిష్కారానికి మార్గం ఆలోచించే దృష్టిని ఇస్తుంది. ఫొటోగ్రఫీ... హృదయ ద్వారాలను తెరిచే తాళం చెవి. గతంలో ఎన్నడూ చూడని జీవితాలతో మమేకం కావడానికి ఉపయోగపడుతుంది. గ్రామీణ భారతంలో ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా నదులు, అడవులను సంరక్షించడానికి కృషి చేస్తున్న అరుదైన మహిళలతో మాట్లాడాను. ఎంతో స్ఫూర్తినిచ్చే మహిళలు వారు. ప్రకృతిని గౌరవించడానికి సంబంధించి మూలాలు మనప్రాచీన చరిత్రలో ఉన్నాయి. ప్రకృతిని గౌరవించాలి, రక్షించుకోవాలి అనే విలువలు మన మూలాలలోనే ఉన్నాయి.– దీప్తి ఆస్థానా -
సృజనార్చన
అర్చన కొచ్చర్.. బాలీవుడ్లో షారూఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, ప్రియాంక చోప్రా, మలైకా అరోరా, కంగనా రనౌత్, డయానా పెంటీ మొదలైన వారికి కాస్ట్యూమ్ డిజైనర్గా, స్టయిలిస్ట్గా చేసి సెలబ్రిటీ డిజైనర్ అండ్ స్టయిలిస్ట్గా పాపులర్ అయ్యారు. ఇప్పుడు జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ అందాల పోటీలలో ఫ్యాషన్, టాలెంట్ సెగ్మెంట్స్ కోసం అవుట్ఫిట్స్ని డిజైన్ చేసి తెలంగాణ టెక్స్టైల్స్, చేనేత కళకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారు. ఈ నేపథ్యంలో అర్చన పరిచయం ఆమె మాటల్లోనే.‘నేను పుట్టి, పెరిగింది ముంబైలో. కామర్స్లో డిగ్రీ చేశాను. ఫ్యాషన్కు సంబంధించిన అకడమిక్ డిగ్రీ ఏమీ లేదు కానీ.. ఫ్యాషన్ పట్ల ప్యాషన్ నాకు ఊహ తెలిసిన నాటి నుంచే మొదలైందని చె పొ్పచ్చు. దీనికి స్ఫూర్తి చిన్నప్పటి నుంచి నేను చూసిన చేనేత, ఎంబ్రాయిడరీ కళాకారులే! ఏళ్ల నాటి ఈ కళా సంస్కృతిని ప్రతి తరానికి పరిచయం చేస్తూ వాటిని ప్రిజర్వ్ చేస్తున్న తీరు నన్ను అబ్బురపరచేది. ఆ కళల పట్ల వాళ్లకున్న నిబద్ధత, నైపుణ్యం, సృజనాత్మకతకు ముచ్చటేసేది. వీటన్నిటికీ ఓ వేదిక ఏర్పర్చి.. ప్రపంచమంతా గుర్తించేలా చేయాలనిపించింది.ప్రతి నేత వెనుక ఉన్న చారిత్రక కథనాన్ని ప్రపంచానికి వినిపించాలనిపించింది. ఆ ప్రేరణతోనే ఫ్యాషన్ డిజైనింగ్లోకి అడుగుపెట్టాను. పదహారవ ఏటనే ఫస్ట్ ఎగ్జిబిషన్ను పెట్టాను. ఇరవయ్యేళ్ళకే బ్రైడల్ వేర్ డిజైనర్గా పాపులర్ అయ్యాను. అయితే నా ఈ జర్నీకి మా అమ్మనూ ఓ స్ఫూర్తిగా చెప్పుకోవచ్చు. ఫ్యాషన్ డిజైనింగ్ పట్ల నాకున్న ఆసక్తిని గమనించి దాని వివరాల్లోకి వెళ్లేలా ప్రోత్సహించింది. ఈ రోజు నేనీ స్థాయిలో ఉండటానికి మా అమ్మతో పాటు మా వారు రాజీవ్ కొచ్చర్, మా అమ్మాయి సిమ్రాన్ కారణం. వాళ్ల ప్రోత్సాహ సహకారాలు లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. అహింసా సిల్క్పట్టు అనగానే ఆ నేతకు ఎన్ని పట్టుపురుగులను పొట్టన పెట్టుకున్నారో అనే ఆలోచన, అభిప్రాయానికి వచ్చేస్తారు ప్రకృతిని, పర్యావరణాన్ని ప్రేమించే ఎవ్వరైనా! అందులో నేను కూడా! అందుకే ఒక ఫ్యాషన్ డిజైనర్గా పర్యావరణహితమైన ఫ్యాషన్ను, డిజైన్స్ను క్రియేట్ చేసి, ప్రమోట్ చేయాలని నిశ్చయించుకున్నాను. ఆప్రాజెక్ట్కి ‘అహింసా సిల్క్’ అనే పేరు పెట్టాను. జార్ఖండ్ వెళ్లి.. అక్కడి గిరిజన స్త్రీలతో కలిసి పనిచేయడం మొదలుపెట్టాను. ఈప్రాజెక్ట్ వల్ల ఆ గిరిజన మహిళలకు ఉ పాధి దొరకడమే కాదు వాళ్ల ఆత్మవిశ్వాసం పెరిగింది, వాళ్లకు ఆర్థిక స్వాతంత్య్రమూ వచ్చింది. ఈ అహింసా సిల్క్ డిజైన్స్తో న్యూయార్క్ ఫ్యాషన్ షోలో పాల్గొన్నాను. అంతర్జాతీయ గుర్తింపు దొరికింది.మిస్ వరల్డ్ బ్యూటీ ప్యాజెంట్లో..ఫ్యాషన్ ప్రపంచంలో నా ప్రయాణం చిన్నగానే మొదలైంది. కానీ ప్రతిచోటా మన దేశ ప్రతిభను చాటడానికే ప్రయత్నించాను. ‘అహింసా సిల్క్’ ప్రాజెక్ట్తో మన దేశానికున్న రిచ్ టెక్స్టైల్ హెరిటేజ్ ని ప్రపంచానికి పరిచయం చేశాను. ప్రతి కలెక్షన్ వెనుక భారతీయ చేనేత కళానైపుణ్యం, సంస్కృతిని చూపించాను. అందుకే ఈ రోజు నాకు మిస్ వరల్డ్ (Miss World) బ్యూటీ పాజెంట్లో అవుట్ఫిట్స్ని డిజైన్ చేసే అవకాశం దక్కింది. ఇది నా ఘనత కాదు.. మన చేనేత సంస్కృతికున్న స్ట్రెంత్. పోచంపల్లి ఇక్కత్, గొల్లభామ, నారాయణ్పేట్ చీరలు, లగ్జరియస్ బ్రోకేడ్స్, బంగారు జరీ చీరలు, జర్దోసీ ఎంబ్రాయిడరీ, హైదరాబాద్ ముత్యాలతో 240 అవుట్ఫిట్స్ను డిజైన్ చేశాం. ప్రతి త్రెడ్లో డీటైయిలింగ్ కనపడుతుంది. అది మన కళాకారుల నైపుణ్యం, సృజనాత్మకతకు అద్దం పడుతుంది. ఈ డిజైన్స్ను ధరిస్తున్న ప్రతిఒక్క పార్టిసిపెంట్కి ఈ దేశ ఘన చరిత్రను ధరిస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అలా ఈ డిజైన్స్ అన్నీ మన కల్చర్, ప్రైడ్, గ్లోబల్ సిస్టర్హుడ్కి ప్రతీకగా నిలుస్తున్నాయి. ఇవి పార్టిసిపెంట్స్ అంటున్న మాటలు! ఈ మొత్తం అవుట్ఫిట్స్ని డిజైన్ చేయడానికి నాకు, నా టీమ్కి నెల రోజులు పట్టింది. వీటిని టాప్ మోడల్ రౌండ్, ఫినాలేలో ధరిస్తారు.దక్షిణ భారత ఫ్యాషన్ కాపిటల్గా.. పోచంపల్లి ఇక్కత్ నుంచి గద్వాల దాకా తెలంగాణకు ఘనమైన చేనేత చరిత్ర ఉంది. ఇక్కడ సంప్రదాయ నేతకు ఎంతప్రాధాన్యం ఉందో ఫ్యాషన్కూ అంతేప్రాముఖ్యత కనిపిస్తుంది. తమ మూలాలను ఎంత గౌరవిస్తారో ట్రెండ్స్నూ అంతే ఆదరిస్తారు. ఇక్కడ హెరిటేజ్కి, మోడర్న్ స్టయిల్కి మధ్య స్ట్రాంగ్ కనెక్షన్ కనిపిస్తుంది. అందుకే ఈప్రాంతం నాకు కల్చర్ అండ్ ఫ్యాషన్ల ఫ్యూజన్గా కనిపిస్తుంది. ఫ్యాషన్ అందంగా.. సస్టెయినబుల్గా ఇవాల్వ్ అవడానికి ఈ బ్యాలెన్స్ చాలా ముఖ్యం.తెలంగాణ టెక్స్టైల్స్, చేనేత కళను కంటెంపరరీ ఫ్యాషన్గా మలచడానికి దీనికి మించి ఇంకేం కావాలి! అంతేకాదు హైదరాబాద్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, సాంస్కృతిక సంపద, సృజన ఇవన్నీ దీన్ని సౌత్ ఇండియా ఫ్యాషన్ హబ్గా మారే స్కోప్నిస్తున్నాయి. ఈ బ్యూటీ పాజెంట్ సక్సెస్తో ఫ్యాషన్ షోస్కు తెలంగాణ మంచి హోస్ట్గా ఉండగలదని నిరూపించుకుంది. విరివిగా ఫ్యాషన్ షోలు జరిగితే స్థానిక ఫ్యాషన్ డిజైనర్స్, చేనేత కళాకారులకూ మంచి సపోర్ట్ దొరుకుతుంది’ అని చెప్పారు అర్చన.– రమ సరస్వతిఫొటోలు: ఎస్ ఎస్ ఠాకూర్ -
‘స్టెమ్’లో జెమ్స్ లేరా?
యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషనల్ మానిటరింగ్ ‘జెమ్’ నివేదిక ప్రకారం స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమేటిక్స్) ఫీల్డ్లో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ‘స్టెమ్’ గ్రాడ్యుయేట్స్లో మహిళలు కేవలం 35 శాతం మాత్రమే ఉన్నారు. గత పది సంవత్సరాలుగా ఈ జెండర్ గ్యాప్ను తగ్గించడంలో ఎలాంటి పురోగతీ లేదు.మ్యాథ్మేటిక్స్లాంటి సబ్జెక్ట్లో బాలురతో సమానంగా అమ్మాయిలు ప్రతిభ చూపుతున్నప్పటికీ, అంతకంటే ఎక్కువ ప్రతిభ ఉన్నప్పటికీ తమ మీద తమకు విశ్వాసం లేక΄ోవడం నుంచి మొదలు రకరకాల ఆటంకాలు ‘స్టెమ్’లో మహిళలప్రొతినిధ్యం తక్కువ ఉండడానికి కారణం అవుతున్నాయి.‘జెమ్’ డేటా ప్రకారం డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో 26 శాతం మంది ప్రొఫెషనల్స్ మాత్రమే మహిళలు. ‘క్లౌడ్ కంప్యూటింగ్’లాంటి స్పెషలైజ్డ్ ఫీల్డ్లలో ఈ సంఖ్య మరింత తక్కువగా ఉంది.‘స్టెమ్’ ఎడ్యుకేషన్కి సంబంధించి 68 శాతం దేశాలు ్ర΄ోత్సాహక విధానాలు రూపొందించినప్పటికీ వాటిలో సగం మాత్రమే మహిళలను ఎంకరేజ్ చేసే ప్రత్యేక విధానాలు ఉన్నాయి. స్టెమ్ ఎడ్యుకేషన్లో మహిళల ప్రొతినిధ్యాన్ని పెంచడానికి ‘జెమ్’ కొన్ని సూచనలు చేసింది.ఉదా: లింగవివక్షతను గుర్తించి, అరికట్టడానికి అవసరమైన శిక్షణను టీచర్లు, స్కూల్ లీడర్లకు ఇవ్వాలి. ∙మహిళల నాయకత్వంలో ‘స్టెమ్’ క్లబ్లను ఏర్పాటు చేయాలి క్లాస్రూమ్లో జెండర్–న్యూట్రల్ లాంగ్వేజ్ని ఉపయోగించేలా చూడాలి అమ్మాయిల ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా ‘స్టెమ్’ ఎక్స్పర్ట్లతో క్లాసులో ఉపన్యాసాలు ఇప్పించాలి. -
ట్రంప్ గారి మనవరాలు... మస్తు హుషార్!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మనవరాలు కై ట్రంప్ తన 18వ పుట్టిన రోజు సందర్భంగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియో నెటిజనులను ఆకట్టుకుంటోంది. తన గోల్ఫ్ ఆటకు సంబంధించిన ఫోటోలు, వైట్హౌజ్లో తాతతో గడిపిన ఫోటోలు ఇందులో ఉన్నాయి. ‘17... నువ్వు నాకు జీవితం గురించి ఎంతో చె΄్పావు. 18... నువ్వు కూడా అలాగే చేస్తావని ఆశిస్తున్నాను’ అని తన పోస్ట్లో రాసింది కై ట్రంప్.‘లాస్ట్ డే బీయింగ్ 17’ కాప్షన్తో పోస్ట్ చేసిన వీడియోలో స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంది కై. తాత కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆకట్టుకునే ఉపన్యాసాలు ఇచ్చింది. రాజకీయ ఉపన్యాసాల సంగతి ఎలా ఉన్నా గోల్ఫ్ ఆటలో చక్కని ప్రతిభ చూపుతోంది. యూట్యూబ్ చానల్ స్టార్ట్ చేసి తక్కువ కాలంలోనే ‘సోషల్ మీడియా సెన్సేషన్’ అయింది. -
దీప మనోబలం
‘మాది ఘిసడి సంచార తెగ’ అని చెప్పుకోవడానికి కొద్దిమంది సంశయిస్తారు. దీనికి కారణం బ్రిటిష్ కాలంలో ఆ తెగకు ‘క్రిమినల్ ట్రైబ్’గా ముద్ర వేయడం. కానీ దీపా పవార్... ‘నేను ఘిసడి తెగకు చెందిన మహిళను’ అని సగర్వంగా చెప్పుకోవడమే కాదు తన జాతిజనుల కోసం సామాజిక కార్యకర్తగా ఎంతో శ్రమిస్తోంది. తాజాగా... అట్టడుగు వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలు, పరిష్కార మార్గాలపై ‘మన్ బోలి’ అనే పుస్తకం రాసింది దీపా పవార్...ఒక వర్క్షాప్లో...‘బాధగా ఉందని తెలియకుండానే రోజూ మనం మోసే బరువు పేరు ఏమిటి?’ అని అడిగింది ఒక గిరిజన యువతి.ఆ ప్రశ్నే దీపా పవర్ను ‘మన్ బోలి’ పుస్తకం రాసేలా చేసింది.ఆ బరువు పేరు... మానసిక సమస్య. పేరు పెట్టని ఆ బరువు వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు. వ్యవస్థ తాలూకు నిశ్శబ్దం. నిర్లక్ష్యం. ‘మెంటల్ హెల్త్ అనేది కులం, పేదరికం, భాష, అధికారంతో ముడిపడి ఉంది. మన దేశంలో మానసిక ఆరోగ్య సంరక్షణ అనేది చాలా వరకు పట్టణప్రాంతాలు, ఉన్నత వర్గాలకే పరిమితం అయింది. ఈ నేపథ్యంలో అణగారిన వర్గాలను దృష్టిలో పెట్టుకొని కొత్త కేర్ గ్రామర్ని నిర్మించడానికి కృషి చేస్తున్నాం’ అంటుంది దీప. తమ తెగలోని సామెతల నుంచి కథల వరకు రకరకాల అంశాలను ఉపయోగించి మానసిక ఆరోగ్యానికి, అట్టడుగు ప్రజల మధ్య ఉన్న అంతరాన్ని ఈ పుస్తకం ద్వారా తెలియజేసింది దీప. గిరిజనుల సంప్రదాయాలు, సంస్కృతిపై అవగాహన ఉన్న దీపా పవార్ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్తో కలిసి పనిచేసింది. ఆ అనుభవం పుస్తకానికి బలం అయింది. ఘిసడి సంచార తెగకు చెందిన దీపా పవార్ పద్నాలుగు సంవత్సరాల వయసులో సామాజిక కార్యకర్తగా మారింది. సోషల్ వర్క్లో మాస్టర్స్ చేసింది. కమ్యూనిటీ డెవలప్మెంట్ నుంచి శానిటేషన్ వరకు జెండర్ నుంచి హెల్త్ వరకు ఎన్నో అంశాలపై పనిచేసింది. ‘ఘిసడి సంచార తెగకు చెందిన మహిళను’ అని గర్వంగా చెప్పుకునే దీప ఆ తెగలోని మూఢనమ్మకాలపై కూడా పోరాడింది. ‘ఆడపిల్లలకు చదువు అవసరం’ లేదు’ అనుకునే వారి దృష్టిని మార్చడానికి కృషి చేసింది. ‘అనుభూతి’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా తన సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతం చేసింది. మహారాష్ట్రలోని ఎన్నో జిల్లాలలో మెంటల్ హెల్త్, కమ్యూనిటీ డెవలప్మెంట్పై పనిచేస్తోంది. రాజ్యాంగం, మానవ హక్కులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. -
ఇక్కడి సంస్కృతికి ఫిదా అయ్యాం
తెలంగాణలో జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ బ్యూటీ పాజెంట్లో భాగంగా ‘హెడ్ టు హెడ్ చాలెంజ్’ ఈవెంట్ కూడా పూర్తయింది. ఇందులో టర్కీ, వేల్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, జాంబియా దేశాలకు చెందిన సుందరీమణులు గెలుపొందారు. వాళ్ల పరిచయాలు..బుద్ధవనం ప్రాజెక్ట్ వెరీ వెరీ స్పెషల్– ఇడిల్ బిల్గెన్, మిస్ టర్కీమిస్ వరల్డ్ పాజెంట్లో భాగంగా హెడ్ టు హెడ్ ఛాలెంజ్లో విజేతగా నిలిచింది మిస్ టర్కీ ఇడిల్ బిల్గెన్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ – ‘‘ఈ రోజు నాకు చాలా స్పెషల్. నా దేశానికిప్రాతినిధ్యం వహిస్తున్నందుకు గర్వంగానూ చాలా ఉత్సాహంగానూ ఉన్నాను. ఈ హెడ్ టు హెడ్ ఛాలెంజ్లో ముందంజలో ఉండటం మరింత ఆనందం. మహిళల భద్రత, సాధికారత, విద్య, సాంస్కృతిక గుర్తింపు, మానసిక ఆరోగ్యం, సోషల్ మీడియా ప్రభావం, వాతావరణ మార్పుల... ఇలా విభిన్నమైన టాపిక్స్తో హెడ్ టు హెడ్ చాలెంజింగ్ రౌండ్ గడిచింది. ఎక్కడైనా మహిళల విజయానికి చదువు చాలా ముఖ్యమైనది. ఏ దేశంలోనైనా అభివృద్ధి, సాధికారిత రెండూ కలిసి ప్రయాణించాలి. జనాభాలో సగం మంది వెనకబడి ఉంటే మనం విజయం సాధించలేం. ఇక్కడ మహిళలు వెనుకబడి ఉండకుండా ప్రభుత్వాలు చూసుకుంటున్నాయి. సాంకేతికత, వైద్యపురోగతికి ఈప్రాంతం కేంద్రంగా ఉంది. ప్రజల ఆప్యాయత, ప్రేమ, దయాగుణం, ఇక్కడి సంస్కృతి హైలైట్ చేస్తున్నాయి. ఇవే విషయాలను వేదికపై నుంచి వినిపించాను. తెలంగాణలోని టూరిజం నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా బుద్ధవనం ప్రాజెక్ట్ వెరీ వెరీ స్పెషల్. అక్కడ మాంక్స్ చదివే మంత్రాలు ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తాయి. నేను రేడియేషన్ అంకాలజీలో మెడిసిన్ చేస్తున్నాను. క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలలో పాల్గొంటుంటాను. ‘నేనొక వైద్యురాలిని, అంతేకాదు నేను ఒక టర్కిష్ మహిళను. మిస్ వరల్డ్లో టర్కిష్ మహిళల గొంతుగా నేను ఉండాలనుకుంటున్నాను’ అని వేదికపై వివరించాను. బ్యూటీ విత్ ఎ పర్పస్ప్రాజెక్ట్లో భాగంగా రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ అవగాహనకు కృషి చేస్తున్నాను. ఒక వైద్యురాలిగా క్యాన్సర్ రోగులకు సహాయకారిగా ఉండటం నా బాధ్యత. క్రీడలు అంటే చాలా ఇష్టం. మానసిక ఒత్తిడి నుంచి విశ్రాంతి పొందడానికి క్రీడలు, జిమ్ నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. అసాధ్యం అనేది మన డిక్షనరీలో ఉండకూడాదు. ఎలాంటి సమస్య వచ్చినా దానిని అధిగమించగలను, సాధించగలను అనే ఆలోచన మనలో ధైర్యాన్ని నింపుతుంది. విజయాలను మన ముందుంచుతుంది’ అంటూ వివరించింది ఇడిల్.యువతకు చదువు చాలా ముఖ్యం– మిల్లీ మే ఆడమ్స్, మిస్ వేల్స్మిస్ వరల్డ్ పాజెంట్లో భాగంగా హెడ్ టు హెడ్ ఛాలెంజ్ టాప్ టెన్ జాబితా యూరప్కుప్రాతినిధ్యం వహిస్తున్న మిస్ వేల్స్ మిల్లీ మే ఆడమ్స్ టాప్ టెన్ జాబితాలోకి చేరింది. ఈ సందర్భంగా మిల్లీ మాట్లాడుతూ – ‘‘ఈ ఫీలింగ్ చాలా గొప్పగా ఉంది. స్వతహాగా పర్యటనలు చేయడం, చారిత్రక ప్రదేశాలు సందర్శించడం అంటే నాకు చాలా ఇష్టం. వీలు చిక్కినప్పుడు గొప్ప గొప్ప కట్టడాలను సందర్శిస్తుంటాను. అందులో భాగంగా గతంలో ఇండియాకు వచ్చినప్పుడు తాజ్మహల్ని సందర్శించాను. ఇప్పుడు ఈ మిస్ వరల్డ్ పాజెంట్లో భాగంగా హెరిటేజ్ టెంపుల్స్, చార్మినార్ చాలా బాగా నచ్చాయి. ఇక్కడి శిల్పనిర్మాణం అద్భుతం అనిపిస్తుంది. ట్రిప్స్ చాలా ఎంజాయ్ చేశాం. ఇక్కడి సంస్కృతితో పాటు మహిళల సాధికారిత గురించి తెలుసుకున్నాను. ప్రభుత్వాలు అందిస్తున్న రక్షణ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఫ్రీ బస్ సౌకర్యం గురించి తెలుసుకున్నాం. బ్యూటీ విత్ ఎ పర్పస్ హెడ్ టు హెడ్ ఛాలెంజ్ రౌండ్లో 20 మందితో పోటీపడ్డాను. పోటీలో నా వర్క్స్ గురించి, చదువుప్రాముఖ్యత గురించి అడిగారు. నేను వేల్స్లో మెడిసిన్ చదువుతున్నాను. స్ట్రీట్ డాక్టర్స్ అనే జాతీయసంస్థతో కలిసి పనిచేయడంతో పాటు, యువతకు చదువు ఎంత అవసరమో వివరిస్తూ, పాఠశాల విద్య పట్ల అవగాహన కల్పిస్తున్నాను. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించడం, అందాల పోటీల ద్వారా నిధుల సేకరించి, ప్రపంచవ్యాప్తంగా వెనుకబడిన పిల్లలకు మద్దతుగా నిలుస్తున్నాను. నా విజయానికి ఇవన్నీ ఉపకరించాయి. యువతులు, బాలికలకు తమపై తమకు పూర్తి విశ్వాసం ఉండాలి. అప్పుడు ప్రపంచంలో ఏదైనా సాధించడానికి మనకు సహకారం అందుతుంది. కోరుకున్న జీవితాన్ని గడపటానికి మహిళకు సాధికారతతో పాటు దయ, వినయం కూడా ఉంటే ఎక్కడ ఉన్నా రాణిగా వెలిగిపోతాం’’ అంటూ అందమైన నవ్వుతో సమాధానమిచ్చింది మిస్ వేల్స్.పెళ్లి తప్పించుకుని మెడిసిన్ చదివాఫేత్ వాలియా, మిస్ జాంబియా‘‘వృత్తిరీత్యా డాక్టర్ని. నాకు ఒక తమ్ముడు. మా అమ్మ పాస్టర్. నాన్న కార్పెంటర్. మేము లుసాకాలో ఉంటాం. నాకు ముందునుంచీ అందాల పోటీలంటే ఇష్టం. నాకు పదిహేనేళ్లున్నప్పుడు మొదటిసారిగా అందాల పోటీల్లో పాల్గొన్నాను. గెలిచాను కూడా! బ్యూటీ అంటే నా దృష్టిలో ఆత్మవిశ్వాసం. మా దగ్గర బాల్య వివాహాలు ఎక్కువ. నన్నూ బాల్య వివాహానికి సిద్ధం చేసింది మా సమాజం. అయితే బాగా చదువుకుని మా దేశంలోని ఆడపిల్లల తలరాతను మార్చాలి అనుకునేదాన్ని. మా ఆర్థిక పరిస్థితి బాలేనందువల్ల నా పదహారవ ఏట నాకు పెళ్లి చేసేయాలనే ఒత్తిడి తెచ్చారు మా కమ్యూనిటీ పెద్దలు. కానీ నేను తలవంచలేదు. ఆ పెళ్లిని తప్పించుకున్నాను. కష్టపడి మెడిసిన్ చదివాను. అప్పుడు గనుక నేను ఆ తెగువ చూపించక పోయుంటే ఈ రోజు మీతో ఇలా మాట్లాడే అవకాశం వచ్చేది కాదు. నా ఈ కథను ప్రపంచానికి చెప్పి, ఆడపిల్లలకు మానసిక స్థయిర్యాన్ని, స్ఫూర్తిని పంచడానికి అందాల పోటీలు ఓ వేదికగా కనిపించాయి. మన కథను వినిపించే, మన వ్యక్తిత్వాన్ని తెలియజేసే అవకాశాన్నిస్తాయి. అందుకే ఎలాగైనా ఈ ప్లాట్ఫామ్ దాకా రావాలనుకున్నాను. వచ్చాను.వాయిస్ ఆఫ్ ఫెయిత్ జీవితంలో గెలవడానికి ఉపయోగపడేవి చదువు, నైపుణ్యం మాత్రమే. నా బ్యూటీ విత్ ఎ పర్పస్ కూడా అదే! ‘వాయిస్ ఆఫ్ ఫేత్’ అనే ఫౌండేషన్ ద్వారా అట్టడుగు వర్గాల పిల్లలకు చదువుప్రాధాన్యాన్ని తెలియజెబుతున్నాను. సేంద్రియ సాగు విధానాలను నేర్పి.. వాళ్ల సుస్థిర ప్రగతికి పాటుపడే ప్రయత్నం చేస్తున్నాను. సాంకేతిక రంగంలో వాళ్లు నైపుణ్యం సాధించేలా శిక్షణనిప్పిస్తున్నాను. ఈ పనులన్నీ ఎలా చేస్తున్నానో ‘హెడ్ టు హెడ్ చాలెంజ్ (బ్యూటీ విత్ ఎ పర్పస్)’ రౌండ్లో ప్రెజెంట్ చేశాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్, హెల్త్, సాంకేతిక రంగాల్లో తెలంగాణ ప్రపంచంతో పోటీ పడుతున్నట్టుంది. అధిక జనాభా, తక్కువ భూభాగం లాంటి సవాళ్లతో కూడా ఇండియా సాధించిన ఈ ప్రగతి చూస్తుంటే ముచ్చటేస్తోంది. ప్రజల అవసరాల పట్ల ప్రభుత్వాలకున్న చిత్తశుద్ధి ప్రశంసనీయం. తెలంగాణ సంస్కృతికి, ఆతిథ్యానికీ నేను ఫిదా అయ్యాను. మా దేశం కూడా ఈ స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు మిస్ జాంబియా ఫేత్ వాలియా.తెలంగాణ మినీ ఇండియా– అనా లీజ్ నాన్సాన్, మిస్ ట్రినిడాడ్ అండ్ టొబాగో‘‘మాది పెద్ద కుటుంబం. మేము మొత్తం ఎనిమిది మంది పిల్లలం. అందరిలోకి నేనే పెద్ద. అందుకే అన్ని విషయాల్లో నా తోబుట్టువులకు నేనో మార్గదర్శిగా ఉండాలని కోరుకునేదాన్ని! మా నాన్న ఇంజినీర్, అమ్మ గృహిణి. చదువు విషయంలో నాకు మా నాన్నే స్ఫూర్తి. ఇంగ్లండ్లో సివిల్ ఇంజినీరింగ్ చదివాను. ఇప్పుడు మాస్టర్స్ చేయాలనుకుంటున్నాను. పర్యావరణహిత నిర్మాణాలు నా లక్ష్యం. నేను అథ్లెట్ కూడా! ఫుట్బాల్ ప్లేయర్ని. బ్యూటీ పాజెంట్లో పాల్గొనడానికి నాకు ప్రేరణ.. ఇందులోని ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’ సెగ్మెంట్. ఇందులో నేను నమ్మే సుస్థిర అభివృద్ధి, హ్యాపీ లివింగ్ వంటివాటి గురించే చెప్పే అవకాశం దొరుకుతుందని అనుకున్నాను. నా బ్యూటీ విత్ ఎ పర్పస్ కూడా అదే! ‘ద రిపుల్ ఎఫెక్ట్’ అనే సంస్థను స్థాపించాను. స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ ద్వారా సస్టెయినబుల్ కమ్యూనిటీస్ని ఏర్పాటు చేయడమే దీని లక్ష్యం. ముఖ్యంగా నిస్సహాయ మహిళల సాధికారత, పిల్లల చదువు కోసం పనిచేస్తున్నాను. మా దేశానికి వలసలు ఎక్కువ. ఆ పిల్లలకు స్థానిక భాషలు, ఇంగ్లిష్ వంటివి రాక చదువుకు దూరమవుతున్నారు. అందుకే ట్రినిడాడ్లోని ‘విస్డమ్ సియోరామ్’ అనే ఓ టెక్నాలజీ కంపెనీ సహాయంతో ఆ పిల్లలకు పలు భాషలు, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించే ప్రయత్నం చేస్తున్నాను. నేను అథ్లెట్ని కూడా కాబట్టి స్పోర్ట్స్ మీదా ఫోకస్ చేస్తున్నాను. ఆటలతో శారీరక దృఢత్వమే కాదు ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా అలవడుతుంది. అందుకే పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించే ప్రయత్నమూ చేస్తున్నాను. ముఖ్యంగా స్విమ్మింగ్లో. ఎందుకంటే అది లైఫ్ స్కిల్ కాబట్టి. స్థానిక వనరులతో గ్రీన్ బిల్డింగ్ టెక్నిక్స్ని చెప్పే పాడ్కాస్ట్ చానెల్నూ స్టార్ట్ చేశాను. ఇందులో ఇంజినీర్స్, ఆర్కిటెక్ట్స్, పర్యావరణవేత్తలను ఇంటర్వ్యూ చేస్తుంటాను. అంతేకాదు మొక్కలు నాటే కార్యక్రమాలూ నిర్వహిస్తుంటాను. ఇవన్నీ నా బ్యూటీ విత్ ఎ పర్పస్లో భాగాలే!కలర్ఫుల్గా.. ఇండియా గురించి విన్నాను. కానీ తెలంగాణ స్టేట్ గురించి ఎప్పుడూ వినలేదు. తెలంగాణ మినీ ఇండియాలా అనిపించింది. మాలాగే ఇక్కడా భిన్న మతాలు, భిన్న సంస్కృతీసంప్రదాయాలు కనిపించాయి. చాలా కలర్ఫుల్గా ఉంది. ఇక్కడి ఫుడ్ స్పైసీగా ఉన్నప్పటికీ చాలా బాగుంది. సో డిలీషియస్. మళ్లీ మళ్లీ ఇక్కడికి రావాలనిపించేలా ఉంది తెలంగాణ ఆతిథ్యం! చాలా హ్యాపీ!’’ అన్నారు అనా లీజ్ నాన్సాన్ఇంటర్వ్యూలు: నిర్మలారెడ్డి, సరస్వతి రమ -
అమేజింగ్ అమ్మాయిలు
ఈమె పేరు.. వలేరియా పేరస్. మిస్ ప్యూర్టో రికో! వృత్తిరీత్యా టీచర్. మిడిల్ స్కూల్ పిల్లలకు సైన్స్ బోధిస్తోంది. మిస్ వరల్డ్ పోటీలు, ఆతిథ్యం గురించి వలేరియా పంచుకున్న విషయాలు... ‘‘మిస్ వరల్డ్ కోసం 119 మంది అమేజింగ్ అమ్మాయిలతో పోటీ వావ్ అనిపిస్తోంది. ఈ పోటీల కోసం ఇండియా.. ఎస్పెషల్లీ హైదరాబాద్ రావడం సూపర్బ్ ఫీలింగ్. ఇక్కడి హాస్పిటాలిటీ నాకు చాలా నచ్చింది. మా ఇంటిని, దేశాన్ని వదిలి ఎక్కడో సుదూర తీరాలకు వచ్చినట్టేమీ అనిపించడం లేదు. ప్రతి క్షణాన్నీ ఎంజాయ్ చేస్తున్నాను. మేమంతా భిన్న దేశాల నుంచి వచ్చినవాళ్లమనే భావన కలగట్లేదు. చాలా త్వరగా మా మధ్య బాండింగ్ ఏర్పడింది. ఇనాగ్యురల్ ఫంక్షన్ రోజు.. మేమంతా ఒకరికొకరం మేకప్ చేసుకున్నాం. హెయిర్ స్టయిల్ చేసుకున్నాం. జ్యూవెలరీ కూడా ఎక్సేఛేంజ్ చేసుకున్నాం. అంత అద్భుతమైన సిస్టర్హుడ్ డెవలప్ అయింది మా మధ్య! ఇక్కడికి రావడానికి ముందు కొంచెం భయమేసింది.. ఇక్కడి మనుషులు ఎలా రిసీవ్ చేసుకుంటారో.. వాతావరణం ఎలా ఉంటుందో అని! కానీ ల్యాండ్ అయ్యాక.. ఇక్కడి వాళ్ల మర్యాద చూస్తున్నాను కదా.. ట్రెమండస్! పహల్గామ్ ఘటనతో దేశంలో ఊహించని పరిణామాలు ఏర్పడ్డాయి కదా! అది కూడా కొంచెం భయపెట్టింది. ఫార్చునేట్లీ అంతా ప్రశాంతంగానే ఉంది. ఉండాలి కూడా! అయితే ఆ ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా మా సేఫ్ అండ్ సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉంది. మాకెలాంటి ఇబ్బందీ కలగకుండా చూసుకుంది. చూసుకుంటోంది. తెలంగాణ కల్చర్, ఆర్ట్.. రిచ్ అండ్ క్రియేటివ్గా ఉంది. ఫుడ్ కొంచెం కారంగా ఉన్నా డెలీషియస్గా ఉంది. నచ్చింది. నా బ్యూటీ విత్ పర్పస్ విషయానికి వస్తే.. ఆటిజం, డౌన్సిండ్రోమ్ పిల్లల కోసం వర్క్ చేస్తున్నాను. అంతేకాదు సమాజంలోని అట్టడుగు వర్గాల సాధికారత కోసమూ కృషిచేస్తున్నాను. మనుషులందరూ సమానమే! కాబట్టి అవకాశాలూ సమానంగా ఉండాలి. ఉన్నవాళ్లు, లేనివాళ్లు, జెండర్ విభేదాలు ఉండకూడదు. అంతేకాదు ప్రతివారికీ వారికే ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. దాన్ని వాళ్లు గుర్తించి, ఆ దిశగా వాళ్ల ప్రయాణం సాగేందుకు సాయపడుతున్నాను’’ అన్నారు వలేరియా.– రమ సరస్వతిఫొటో: ఎస్ ఎస్ ఠాకూర్ -
YASHODA AI జై.. యశోద ఏఐ
అంతంత మాత్రమే చదువుకున్న మహిళలను టెక్–సావీలుగా తీర్చిదిద్దవచ్చా? ‘అవును’ అని చెప్పడానికి దేశవ్యాప్తంగా ఎంతోమంది మహిళల విజయాలే సాక్ష్యం.తాజాగా... దేశవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలను టెక్–సావీలుగా తీర్చిదిద్దడానికి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్(ఎన్సీడబ్ల్యూ) ఆధ్వర్యంలో ‘యశోద ఏఐ క్యాంపెయిన్’ మొదలైంది...నేషనల్ కమిషన్ ఫర్ వుమెన్ (ఎన్సీడబ్ల్యూ) ఆధ్వర్యంలో ప్రత్యేకమైన క్యాంపెయిన్ ప్రారంభమైంది. ఈ క్యాంపెయిన్ ద్వారా లక్షలాది మహిళలకు డిజిటల్ లిటరసీప్రాముఖ్యత గురించి తెలియజేస్తారు. సైబర్ నేరాల బారిన పడకుండా మహిళలకు అవసరమైన శిక్షణ ఇస్తారు. రాబోయే రోజుల్లో మహిళలను టెక్–సావీగా మార్చడానికి రకరకాల కార్యక్రమాలకు రూపకల్పన చేశారు.ఉత్తర్ప్రదేశ్ బరేలీలోని మహాత్మా జ్యోతిబా ఫులే యూనివర్శిటీలోప్రారంభమయ్యే ‘యశోద ఏఐ క్యాంపెయిన్’ (యువర్ ఏఐ సాక్షి ఫర్ షేపింగ్ హరైజన్స్ విత్ డిజిటల్ అవేర్నెస్) ద్వారా రాబోయే నెలల్లో దేశవ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ లిటరసీలో శిక్షణ ఇస్తారు.ఇదీ చదవండి: నా బరువుతో నేను హ్యాపీగానే ఉన్నా : ఐశ్వర్య ఘాటు రిప్లై వైరల్‘యశోద ఏఐ’ లక్ష్యం దేశంలోని ప్రతి మూలలో మహిళలకు సాంకేతిక విషయాల్లోప్రావీణ్యం కల్పించడం. తొలిదశలో రెండు లక్షల కంటే ఎక్కువమంది మహిళలకు సాంకేతిక విషయాల్లో శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్కూల్, కాలేజి, స్వయంసహాయక బృందాలు, ఆశా వర్కర్స్, టీచర్స్, ప్రభుత్వ ఉద్యోగులు... ఇలా వివిధ వర్గాల మహిళలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణలో పాల్గొనేవారికి స్థానిక భాషల్లో కోర్సు మెటీరియల్ అందిస్తారు. వర్క్షాప్లు నిర్వహించి డిజిటల్ టూల్స్ వాడకంపై అవగాహన కలిగిస్తారు.చదవండి: వారానికి 52 గంటలకు మించి పని చేస్తే.. మెదడు మటాషే! చేంజ్ మేకర్స్గ్రామీణ, పట్టణప్రాంతం అని తేడా లేకుండా అంతంత మాత్రం చదువుకున్న అమ్మాయిలు కూడా సాంకేతిక విషయాల్లో ప్రావీణ్యం సాధించేలా చేయవచ్చని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. వాటిలో కొన్ని...ఒడిషాలోని రఘురాజ్పూర్ గ్రామానికి చెందిన పద్దెనిమిది సంవత్సరాల చంద్రమాకు నెలకు వెయ్యి రూపాయల ఆదాయం అనేది కష్టంగా ఉండేది. తన మాతృభాషలో మాట్లాడిన మాటలను సెల్ఫోన్లో రికార్డ్ చేయడం ద్వారా ఇప్పుడు నెలకు అయిదువేలు సంపాదిస్తోంది. బెంగళూరుకు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘కార్య’ కోసం పనిచేస్తోంది చంద్రమా. స్థానికభాషల్లో డేటాసెట్స్ను రూపొందించడంపై ‘కార్య’ దృష్టి పెట్టింది.కోల్కత్తాలోని గ్రామీణప్రాంతానికి చెందిన మౌమితా షా దాస్ రోజూ ఉదయాన్నే తన ఫోన్లో డిజిటైజింగ్ వర్క్ మొదలుపెడుతుంది. స్కూలుకు వెళ్లి వచ్చిన తరువాత మళ్లీ డిజిటైజింగ్ వర్క్లోకి వెళుతుంది. ‘తక్కువ టైమ్ పని చేసినా మంచి ఆదాయం సంపాదిస్తున్నాను. ఈ డిజిటల్ టాస్క్ల ద్వారా నేను ఏ పని అయినా చేయగలను అనే నమ్మకం వచ్చింది’ అంటుంది మౌమిత.స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు...ఏఐ మోడల్స్ని ట్రైన్ చేయడంపై ఫోకస్ చేసే జాబ్స్లో హైరింగ్ పెరగడంతో గ్రామీణప్రాంతాలకు చెందిన చంద్రమా, మౌమితలాంటి ఎంతోమంది అమ్మాయిలకు ఉపాధి లభిస్తోంది. వారు చేసే పనికి సాంకేతిక విద్యలో పట్టా అవసరం లేదు. స్మార్ట్ఫోన్, డిజిటల్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది.‘గ్రామీణప్రాంతాలలోని మహిళలు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్గా మారేలా శిక్షణ ఇస్తాం. మన దేశానికి సంబంధించిప్రాంతీయ భాషలలో ఏఐ మోడల్స్ అభివృద్ధిపై దృష్టి పెట్టాం’ అంటున్నారు ‘కార్య’ సీయివో మనూ చోప్రా ఒకప్పుడు కన్స్ట్రక్షన్ వర్కర్గా పనిచేసిన రాజస్థాన్కు చెందిన రోమల దీదీ ఇలా అంటోంది. ‘కార్య ద్వారా నాకు వచ్చే డబ్బుతో పిల్లల బడిఫీజులు చెల్లిస్తున్నాను. ఇతర ఖర్చులకు కూడా ఈ డబ్బు ఉపయోగపడుతోంది’.ఐ–సాక్ష్యమ్బిహార్కు చెందిన ‘ఐ–సాక్ష్యమ్’ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రూపొందించిన ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ ద్వారా ఎంతో మంది యువతులను చేంజ్మేకర్స్గా మారుస్తోంది. నిజానికి వీరిలో చాలామందికి స్మార్ట్ఫోన్ గురించి తెలియదు. అలాంటి వారిని కూడా సాంకేతిక అంశాలలో పట్టు సాధించేలా, ఉపాధి పొందేలా చేస్తున్నారు. సాంకేతిక విషయాల్లో పురుషులతో సమానంగా మహిళలు ముందుండే లక్ష్యంతో ఐ–సాక్ష్యమ్ కృషి చేస్తోంది. -
అందమైన సమాజం!!
హైదరాబాద్లోని ట్రై డెంట్ హోటల్లో మిస్ వరల్డ్ 2025 పాజంట్స్ మధ్య కలివిడిగా తిరుగుతున్నారు షానియా బాలెస్టర్. కొత్తగా కనిపించిన వారిని తానే ముందుగా పలకరించి ‘ఐ యామ్ ఫ్రమ్ జిబ్రాల్టర్’ అని పరిచయం చేసుకుంటోంది. దేశం పేరు అడగకుండానే చెబుతోంది, తన పేరు మాత్రం అడిగితే తప్ప చెప్పడం లేదు. ‘భౌగోళికంగా దేశాలుగా విడిపోయిన మనందరిదీ ఒకటే ప్రపంచం’ అన్నారు షానియా బాలెస్టర్. చిన్న దేశం ‘‘మిస్ వరల్డ్ 2025కి క్యాప్షన్ బ్యూటీ విత్ పర్పస్. నాకు సంబంధించినంత వరకు ప్రపంచపటంలో జిబ్రాల్టర్ అనే దేశం ఒకటుందని ప్రపంచానికి తెలియచేసే అరుదైన అవకాశం. జిబ్రాల్టర్ చాలా చిన్నదేశం. జనాభా ముప్ఫై ఐదు వేల లోపే. ప్రపంచంలోని అనేక ఖండాల నుంచి వచ్చి స్థిరపడిన వారితో మా దేశం రకరకాల సంస్కృతుల నిలయమైంది. దాంతో ఇండియా కూడా నాకు సుపరిచితమైన దేశంలానే అనిపిస్తోంది. హైదరాబాద్ ఆహారం కొంచెం ఘాటుగా అనిపించినప్పటికీ చాలా రుచిగా ఉంది. ప్రపంచానికి పరిచయం నా కెరీర్ మోడలింగ్. నాకు సంతోషాన్నిచ్చే పని చారిటీ. నాలుగేళ్ల నుంచి మోడలింగ్కు కొంత విరామం ఇచ్చి బ్యూటీ కాంటెస్ట్ మీద దృష్టి పెట్టాను. మిస్ జిబ్రాల్టర్ కిరీటంతోనే ఆగిపోయి ఉంటే ఆ విజయం నాకు మాత్రమే పరిమితమయ్యేది. నా విజయం నా దేశానికి ఉపయోగపడాలంటే అది ప్రపంచ వేదిక మీదనే సాధ్యమవుతుంది. మాది సార్వభౌమత్వం సాధించాల్సిన దేశం. ఇప్పుడు మాకున్న గుర్తింపు బ్రిటిష్ ఓవర్సీస్ టెరిటరీగానే. ఈ మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా వందకు పైగా దేశాలకు మా దేశం పరిచయమైంది. అందాల పోటీల ద్వారా దేశాలన్నీ ఒకదానితో మరొకటి అనుసంధానమవుతాయి. ప్రపంచం అంతా ఒకటేననే భావన పెంపొందుతుంది. రెండు దేశాల మధ్య మాత్రమే కాదు ప్రపంచదేశాలన్నింటి మధ్య సుçహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది. ఒక దేశం చరిత్ర మరొకరికి అర్థమవుతుంది, సాంస్కృతిక గొప్పదనం అవగతమవుతుంది. మనకిప్పటి వరకు తెలియని అనేక దేశాల గురించి తెలుసుకుంటాం. ఒకదేశం ఔన్నత్యం గురించి మరొక దేశంలో సందర్భోచితంగా తెలియచేయగలుగుతాం. అవసరమైన సందర్భంలో సంఘీభావంతో వ్యవహరించగలుగుతాం. అందం మనసుదే మా జిబ్రాల్టర్ చాలా చిన్నదేశమే కానీ సమాజం చాలా అందమైనది. వివక్ష లేని సమాజం మాది. స్త్రీ పురుషుల లిటరసీ రేట్ సమానం అని చెప్పడానికి గర్వంగా ఉంది. నిజానికి అందం అనేది బాహ్య సౌందర్యం కాదు. దయ, కరుణ, అర్థం చేసుకోవడం. ఎదుటి వారి కష్టాన్ని వారి దృష్టి కోణం నుంచి విశ్లేషించుకుని అర్థం చేసుకోగలిగిన మనసు ఉండడమే నిజమైన అందం. ఈ బ్యూటీ పాజంట్ తర్వాత కూడా నా సర్వీస్ని కొనసాగిస్తాను. అయితే భవిష్యత్తు ప్రణాళిక గురించి ఇప్పుడే చెప్పలేను. నా దేశం సార్వభౌమాధికారం సాధించడానికి నేనేం చేయగలనో అంతా చేస్తాను’’ అన్నారు మిస్ వరల్డ్ జిబ్రాల్టర్ షానియా బాలెస్టర్. మా జిబ్రాల్టర్ చాలా చిన్నదేశమే కానీ సమాజం చాలా అందమైనది. వివక్ష లేని సమాజం మాది. స్త్రీ పురుషుల లిటరసీ రేట్ సమానం అని చెప్పడానికి గర్వంగా ఉంది.– షానియా – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: ఎస్ ఎస్ ఠాకూర్ -
గ్లోబల్ నర్సింగ్ స్టార్స్
చండీగఢ్లోని ‘పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్’కి చెందిన సుఖ్పాల్ కౌర్, అహ్మదాబాద్లోని ‘హాస్పిటల్ ఫర్ మెంటల్ హెల్త్’కి చెందిన విభా సలాలియా 199 దేశాలలోని లక్ష మంది అభ్యర్థుల నుంచి గ్లోబల్ నర్సింగ్ అవార్డ్ తుది జాబితాకు ఎంపికయ్యారు.నర్సింగ్ గత సంవత్సరాలలో ఎలా మారిందో, గ్లోబల్ నర్సింగ్ స్టాండర్స్తో సమానంగా ఉండడానికి మన దేశంలో ఏం చేయవచ్చో... మొదలైన అంశాలపై వీరికి మంచి అవగాహన ఉంది.చాలా మార్పులుపంజాబ్లోని గురుదాస్పూర్లో పుట్టిన సుఖ్పాల్ కౌర్కు సామాజిక సేవకు సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొనడం అంటే ఇష్టం. ఆ ఇష్టమే ఆమెను నర్సింగ్లో చేరేలా చేసింది. ‘ఇతరులకు సహాయపడాలనే నా తత్వానికి నేను ఎంచుకున్న వృత్తి బాగా సరిపోయింది’ అంటారు కౌర్. ప్రస్తుతం ఆమె ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ ఎడ్యుకేషన్’కి ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు. ఇక్కడే ఆమె బీఎస్సీ, మాస్టర్స్, నర్సింగ్లో పీహెచ్డీ పూర్తి చేశారు.నిజానికి ఆమె ఈ ఇన్స్టిట్యూట్లో క్లినికల్ ఇన్స్ట్రక్టర్గా చేరారు. క్రమంగా లెక్చరర్, అసోసియేట్ప్రొఫెసర్ అయ్యారు. ప్రిన్సిపల్ కావడానికి ముందు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ప్రమోట్ అయ్యారు. ‘నర్సింగ్ విద్యలో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు మేము క్రిటికల్ కేర్ నర్సింగ్, ఆంకాలజీ నర్సింగ్లాంటి ఏడు స్పెషలైజ్డ్ బ్రాంచ్లను నడుపుతున్నాం’ అంటున్నారు 58 సంవత్సరాల కౌర్.తలకు గాయాలు అయిన పేషెంట్ల కోసం నర్స్ల ఆధ్వర్యంలో క్లినిక్స్నుప్రారంభించారు కౌర్. మన దేశంలో మొట్టమొదటి ఎంఎస్సీ నర్సింగ్ప్రోగ్రామ్ ఇన్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ను లీడ్ చేస్తున్నారు కౌర్. ‘మేము మొదట్లో మాన్యువల్గా చెక్ చేసేవాళ్లం. ఇప్పుడు ముఖ్య లక్షణాలు నేరుగా చూపించే మానిటర్స్ వచ్చాయి. ఇది టైమ్ను సేవ్ చేస్తుంది. ఇక చదువుకు సంబంధించి చాక్, బ్లాక్బోర్డ్ నుండి మల్టీమీడియా క్లాస్రూమ్లు, ఇంటరాక్టివ్ బోర్డ్స్, ఫ్లిప్ క్లాస్రూమ్లకు మారాయి. ఫ్లిప్ క్లాస్రూమ్లో స్టూడెంట్స్ ముందుగానే ప్రిపేర్ అవుతారు’ అంటున్నారు కౌర్.బాల్య జ్ఞాపకమే బాట చూపింది...మెంటల్ హెల్త్ కేర్ని మార్చడానికి తన కెరీర్ను అంకితం చేశారు యాభై ఆరు సంవత్సరాల విభా సలాలియా. 33 సంవత్సరాల వృత్తి అనుభవాన్ని గుజరాత్లోని మెంటల్ హెల్త్ కేర్ని మెరుగుపరచడంలో ఉపయోగించారు. మానసిక అనారోగ్యం బారినపడిన వేలాదిమందికి అండగా ఉన్నారు. వారు ఆత్మగౌరవంతో బతికేలా చేశారు.‘మెంటల్ హెల్త్ కేర్’పై విభా ఆసక్తి చూపడానికి కారణం... బాల్య జ్ఞాపకం.‘మా ఇంటి బయట ఒక మహిళ చింపిరి జుట్టుతో, శుభ్రత లేకుండా అస్తవ్యస్తంగా కూర్చొని ఉండడం నాకు గుర్తుంది. ఊరివాళ్లు ఆమెను అవమానించి పిచ్చిది అని పిలిచేవాళ్లు. ఆమెకు సహాయం చేయలేని నిస్సహాయత స్థితిలో ఉండి బాధపడేదాన్ని’ తన బాల్య జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటారు విభా సలాలియ.ఈ జ్ఞాపకమే తనను మెంటల్ హెల్త్ నర్సింగ్లో స్పెషలైజ్ చేయడానికి కారణం అయింది. నిజానికి విభా రెగ్యులర్ బీఎస్సీలో చేరారు. అయితే తన బంధువు ఒకరు అడ్మిట్ అయిన హాస్పిటల్కు వెళ్లినప్పుడు నర్సింగ్ని ప్రొఫెషనల్గా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.‘మా బంధువును నర్స్లు చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఆ దృశ్యాలు చూసిన తరవాత ఎలాగైనా నర్సింగ్ చేయాల్సిందే అని నిర్ణయించుకున్నాను. బీఎస్సీ కోర్సు వదిలేసి అహ్మదాబాద్లోని సివిల్ హాస్పిటల్లో నర్సింగ్ లో చేరాను’ అని గతాన్ని గుర్తు చేసుకున్నారు విభా.నర్సింగ్ విద్యలో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు మేము క్రిటికల్ కేర్ నర్సింగ్, ఆంకాలజీ నర్సింగ్లాంటి ఏడు స్పెషలైజ్డ్ బ్రాంచ్లను నడుపుతున్నాం.– కౌర్ -
స్త్రీ హృదయ దీపానికి మరింత కాంతి
మైనారిటీ సమాజంలోని స్త్రీల జీవితాన్ని, సంఘర్షణను కథలుగా రాసిన కన్నడ రచయిత్రి బాను ముష్టాక్కు ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ బుకర్ప్రైజ్ మంగళవారం ప్రకటించారు. 50 వేల పౌండ్లు బహుమతి. కర్నాటక రాష్ట్రంలో సామాజిక కార్యకర్తగా, అడ్వకేట్గా, రచయిత్రిగా గుర్తింపు పొంది నేడు తొలిసారి దక్షిణాది భాషకు బుకర్ ప్రైజ్ తెచ్చి పెట్టిన బాను ముష్టాక్ పరిచయం.‘మీరు రచయిత కావడానికి స్ఫూర్తినిచ్చింది ఎవరు?’ అనే ప్రశ్నకు ‘ప్రజలు’ అని సమాధానం చెప్తారు బాను ముష్టాక్. ‘వారిలోని మంచి, చెడు, టక్కరితనం, నిస్సహాయత, ఓర్పు, ప్రతి మనిషికీ ఉండే కథ... ఇవే నన్ను రచయిత్రిని చేశాయి’ అంటారామె.75 ఏళ్ల బాను ముష్టాక్ భారతీయ సాహిత్యం, అందునా దక్షిణాది సాహిత్యం, ప్రత్యేకం కన్నడ సాహిత్యం గర్వపడేలా ‘ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2025’ను మంగళవారం రాత్రి గెలుచుకున్నారు. ఇంగ్లిష్లో ట్రాన్స్లేట్ అయిన ఆమె 12 కథల పుస్తకం ‘హార్ట్ ల్యాంప్’ ఈ ప్రతిష్టాత్మక బహుమతి గెలుచుకుంది. దక్షిణాది భాషలకు బుకర్ ప్రైజ్ దక్కడం ఇదే మొదటిసారి. ఇదీ చదవండి: పట్టుబట్టాడు, ఐఎఫ్ఎస్ కొట్టాడు : రైతుబిడ్డ దీక్షిత్ సక్సెస్ స్టోరీజర్నలిస్టుగా, అడ్వకేట్గా, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిన బాను ముష్టాక్ 1990 నుంచి ముస్లిం స్త్రీల జీవన గాథలను కథనం చేస్తూ వచ్చారు. ఆమె రాసిన మొత్తం 50 కథల నుంచి 12 కథలు ఎంచి దీపా బస్తీ అనువాదం చేయగా ఇంగ్లాండ్లోని షెఫీల్డ్కు చెందిన ‘అండ్ అదర్ స్టోరీస్’ అనే చిన్న పబ్లిషింగ్ సంస్థ ప్రచురించింది.బాను ముష్టాక్ ఎవరు?బాను ముష్టాక్ కర్ణాటక రాష్ట్రం హాసన్లో జన్మించారు. తండ్రి సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్. ఆమెను చిన్నప్పుడు ఉర్దూ స్కూల్లో వేయగా, అక్కడి వాతావరణం సరిపడక ఎనిమిదేళ్ల వయసులో శివమొగ్గలోని కన్నడ స్కూల్లో చేరారు. ఆరు నెలల్లో కన్నడ నేర్చుకుంటేనే స్కూల్లో ఉంచుతాం లేకుంటే పంపించేస్తాం అనంటే కొద్ది రోజుల్లోనే కన్నడ భాషను నేర్చుకుని ఆశ్చర్యపరిచారు. దీంతో ఒక్క ఏడాదిలోనే ఆమెను ఒకటో తరగతి నుంచి నాలుగో తరగతికి పంపించారు. ‘నేను మా ఇంటికి పెద్ద కూతుర్ని. మా నాన్న తన పిల్లలు డబుల్ డిగ్రీలు చేయాలని పట్టుదలగా ఉండేవాడు’ అంటుంది బాను ముష్టాక్. చదవండి: హెచ్ 1 బీ వీసాలకు డిమాండ్ తగ్గిందా? నాలుగేళ్ల కనిష్టానికి అప్లికేషన్లుఆది నుంచి సవాళ్లేబాను ముష్టాక్కు ముందునుంచి తిరగబడే స్వభావం ఉంది. మగపిల్లలతో కలిసి సైకిల్ నేర్చుకుంటున్న ఆమెను ముస్లిం పెద్దలు ఆపి ఇలా సైకిల్ తొక్కకూడదని హెచ్చరించారు. అయినా ఆమె లెక్క చేయలేదు. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు మాత్రమే జరిగే కాలంలో ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. 1974లో కట్నం ప్రస్తావన లేకుండా ఆమె పెళ్లి జరిగింది. అయితే వాచ్ రిపేరర్ అయిన భర్తకు సరైన సంపాదన లేకపోవడం, అత్తింటివారి నుంచి ఇబ్బందులు, ఉమ్మడి సంసారం కలిగిన ఇంటిలో వారితో కలిసి ఉండటం.. ఇవన్నీ ఆమెను మానసికంగా బలహీనురాలిని చేశాయి. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు. ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. అగ్గిపుల్ల వెలిగించే సమయంలో భర్త ఆపారు. చివరకు ఆమె షరతులకు భర్త ఒప్పుకోవడంతో ఆత్మహత్య, విడాకుల ఆలోచనలు మానుకున్నారు. అప్పటినుంచి ఆమెకు కాస్త స్వేచ్ఛ లభించింది.పత్రికా రచయితగా‘ముస్లిం మహిళలు సినిమాలు చూడటం నేరమా?’ అనే అంశంపై ఆమె రాసిన వ్యాసం కన్నడ పత్రిక ‘లంకేశ్ పత్రికె’లో ప్రచురితమై విశేషమైన పేరు తెచ్చింది. దాంతో అదే పత్రికలో రిపోర్టరుగా చేరారు. అనంతరం కొన్ని నెలలపాటు బెంగళూరు ఆలిండియా రేడియోలో పని చేశారు. 1978లో తండ్రి ప్రోద్బలంతో మీద ఆమె మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థినిగా పోటీ చేశారు. ఎన్నికల గుర్తు ‘కుట్టు మిషన్’. తండ్రితో కలిసి ఇంటింటికీ వెళ్లి ఆమె ప్రచారం చేశారు. అయితే ఇలా చేయడం స్థానిక ముస్లిం పెద్దలకు నచ్చలేదు. ఓటు వేయొద్దని వారు వ్యతిరేక ప్రచారం చేశారు. అలా ఒక్క ఓటు తేడాతో ఆమె ఓడిపోయారు. మొదటి ప్రయత్నంలో ఓడిపోయినా, ఆ తర్వాత రెండుసార్లు హాసన్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి, గెలిచారు. బాను ముస్తాక్ రచయితగానే కాక, సామాజిక కార్యకర్తగానూ తన ప్రయాణాన్ని ప్రారంభించారు. అందరికీ సమానహక్కులు దక్కాలని, సామాజిక న్యాయం అందాలని పోరాడారు. తొలుత దళిత హక్కుల ఉద్యమ పరిచయంతో మొదలైన పోరాట జీవితం ఆ తర్వాత అనేక అంశాలపై పోరాడేందుకు బాటలు వేసింది. ఆ కాలంలో మొత్తం జిల్లాలో అలాంటి పోరాటాల్లో పాల్గొన్న ఏకైక ముస్లిం మహిళ ఆమే.ముస్లింల కథలు‘నేను రాసే వరకు ముస్లింల జీవితం అంతగా కన్నడలో రాలేదు. హిందూ రచయితల కథల్లో ముస్లింల పాత్రలు బ్లాక్ అండ్ వైట్గా ఉండేవి. బండాయ సాహిత్య ఉద్యమ ప్రభావంతో ఎవరి జీవితం వారు రాయాలనే ప్రయత్నం మొదలయ్యాక మా జీవితాలను రాయడం మొదలెట్టాను’ అంటారు బాను ముష్టాక్. ఆమె ఇప్పటికి ఆరు కథాసంపుటాలు, ఒక నవల, ఒక వ్యాససంపుటి, కవిత్వ సంపుటి ప్రచురించారు. బాను ముస్తాక్ రాసిన ‘కరి నాగరగళు’ అనే కథ ఆధారంగా ప్రముఖ దర్శకుడు గిరీశ్ కాసరవెల్లి 2005లో ‘హసీనా’ అనే కన్నడ చిత్రం తీశారు. అందులో నటి తార ప్రధాన పాత్ర పోషించారు. అందులోని నటనకుగానూ ఆమెకు జాతీయ ఉత్తమ నటి పురస్కారం లభించింది. బాను ముస్తాక్ కన్నడతోపాటు హిందీ, దక్కనీ ఉర్దూ, ఇంగ్లిష్ మాట్లాడగలరు. ఆమె రచనలు ఉర్దూ, హిందీ, తమిళం, మలయాళ, పంజాబీ, ఇంగ్లిషు భాషల్లోకి అనువాదమయ్యాయి. ఇస్లాం ప్రకారం స్త్రీలకు మసీదుల్లో ప్రవేశం ఉందని, కేవలం మగవారే వారిని ఆపుతున్నారు అని ఆమె చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారి, తీవ్ర దుమారానికి దారి తీశాయి. ఆమెను, ఆమె కుటుంబాన్ని మూడు నెలలపాటు సామాజికంగా బహిష్కరించారు. కర్ణాటకలో ముస్లిం బాలికలు స్కూళ్లలో హిజాబ్ వేసుకునే హక్కు కోసం పోరాడిన సమయంలో బాను ముస్తాక్ వారికి మద్దతుగా నిలిచారు. 1990లో లా చదివిన బాను ముస్తాక్, లాయర్గా స్త్రీల సమస్యలపై నిరంతరం పోరాడుతున్నారు. ఇప్పటివరకూ వేలాది కేసులపై ఆమె వాదించారు. బాను ముష్టాక్కు బుకర్ప్రైజ్సీనియర్ కన్నడ రచయిత్రి బాను ముష్టాక్ (75)కు సాహిత్యంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్’ను 2025 సంవత్సరానికి గాను ప్రకటించారు. మంగళవారం రాత్రి లండన్లో జరిగిన బహుమతి ప్రదాన వేడుకలో ఆమె రాసిన ‘హార్ట్ ల్యాంప్’ అనే కథా సంపుటికి ఈ బహుమతి దక్కింది. కన్నడంలో ఆమె రాసిన కథల నుంచి ఎంచిన 12 కథలను దీపా బస్తీ ఇంగ్లిషులో అనువాదం చేయగా ఈ బహుమతి దక్కింది. 50 వేల పౌండ్లు (57 లక్షల రూపాయలు) నగదు అందించారు. ఈ మొత్తాన్ని రచయిత్రి, అనువాదకురాలు చెరిసగం పంచుకోవాలి. బ్రిటిష్ రచయిత మేక్స్ పోర్టర్ న్యాయ నిర్ణేతల కమిటీకి చైర్మన్గా వ్యవహరించారు. ‘హార్ట్ ల్యాంప్లోని కథలు ఇంగ్లిష్ పాఠకులకు కొత్త ప్రపంచాన్ని చూపుతాయి’ అని ఆయన అన్నారు. 12 దేశాలకు చెందిన 13 మంది రచయితలు ఈ అవార్డు కోసం లాంగ్లిస్ట్లో ఎంపిక కాగా ఆ తర్వాత ఆరుమంది రచయితలతో షార్ట్ లిస్ట్ను అనౌన్స్ చేశారు. బాను ముష్టాక్ పుస్తకం షార్ట్ లిస్ట్లో రావడమే ఘనత అనుకుంటే ఏకంగా బహుమతిని గెలవడంతో భారతీయ సాహిత్యాభిమానులలో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. కర్నాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య ‘ఇది కన్నడ భాషకు దక్కిన గౌరవం’ అని కొనియాడారు. అలాగే కర్నాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి తదితరులు అభినందనలు తెలిపారు. భాను ముష్టాక్ స్వస్థలం హాసన్. ఆమె రచయితగానే గాక అడ్వకేట్గా, సామాజిక కార్యకర్తగా కూడా కృషి చేస్తున్నారు. కాగా ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్కు అర్హత పొందాలంటే ఆ పుస్తకం ఇంగ్లాండ్లో ప్రచురితం అయి ఉండాలి. 2022లో గీతాంజలి శ్రీ రాసిన ‘రేత్ కీ సమాధి’ ఇంగ్లిష్లో ‘టూంబ్ ఆఫ్ శాండ్’గా అనువాదమై బుకర్ప్రైజ్ గెలుచుకోవడం పాఠకులకు విదితమే. -
చిన్న వయసులో చూపు కోల్పోయినా.. ప్రతిభతో జ్వలిస్తోంది..!
చిన్న వయసులోనే యాసిడ్ దాడికి గురైన కఫీకి భవిష్యత్ మసక మసకగా కూడా కనిపించలేదు. అంతా అంధకారమే! భయానకమైన నిస్సహాయతలో నుంచి కూడా అప్పుడప్పుడూ అభయమిచ్చే శక్తి ఏదో పుట్టుకువచ్చి....‘అదిగో నీ భవిష్యత్’ అని చూపుతుంది. కఫీ విషయంలోనూ అలాగే జరిగింది. ఛండీఘడ్కు చెందిన కఫీ 2023లో క్లాస్ 10 సీబీఎస్ఈ పరీక్షల్లో 95.2 శాతం మార్కులు సాధించి వార్తల్లో నిలిచింది. తాజాగా... క్లాస్ 12 సిబీఎస్ఈ బోర్డు పరీక్షల్లో 95.6 శాతం మార్కులు సాధించి తిరిగి వార్తల్లోకి వచ్చింది. తన విజయాన్ని కుటుంబ సభ్యులకు అంకితం చేసిన కఫీ... ‘తల్లిదండ్రులు నా బలం. స్ఫూర్తి. వారు నా కోసం ఎంతో త్యాగం చేశారు. వారి రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను. జీవితంలో ఎదురయ్యే చేదు అనుభవాలు మన భవిష్యత్తును నిర్ణయించలేవు. మన కష్టమే మన భవిష్యత్తు’ అంటుంది కఫీ.కఫీ మూడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, హోలి పండగ రోజు ముగ్గురు వ్యక్తులు రంగు చల్లినట్లు తనపై యాసిడ్ చల్లారు. వారి రాక్షసానందానికి ఆ చిన్నారి కంటి చూపు దెబ్బతిన్నది. కఫీకి తిరిగి చూపు తెప్పించడానికి తల్లిదండ్రులు ఇరవై లక్షలకు పైగా ఖర్చు చేశారు.‘నా లక్ష్యం ఐఏఎస్’ అని ఆత్మవిశ్వాసం నిండిన స్వరంతో చెబుతోంది కఫీ. (చదవండి: 'చూపే బంగారం'..! అంధత్వ సమస్యలకు చెక్పెడదాం ఇలా..) -
నిహారికను తీర్చిదిద్దిన శిల్పి ఆమె తల్లే!
మానసిక పరిణితి లేని ఆడపిల్ల నీహారిక కంటిపాపలా చూసుకున్న తల్లిదండ్రులు ఆనందాన్నీ, అవసరాలను వదులుకున్నారు బిడ్డ కోసం టీచరుగా మారిందా తల్లి ఇష్టమైన సైక్లింగ్లోనూ శిక్షణనిచ్చింది స్పెషల్ ఒలింపిక్స్లో పతకాలు నెగ్గేలా చూశారుఇప్పుడా బిడ్డలాంటి మరికొందరికోసం ఏకంగా అలాంటి పాఠశాలనే నడుపుతోందా తల్లితెనాలి: ‘‘అది 2019 సంవత్సరం మార్చి నెల. 14–21 తేదీల్లో దుబాయ్లో స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్స్. 25 గేమ్స్లో 170 పైగా దేశాలకు చెందిన ఏడు వేల క్రీడాకారులు పాల్గొన్నారు. మనదేశం నుంచి 280 మంది వివిధ పోటీల్లో తలపడ్డారు. ఇందులో సైక్లింగ్లో 16 మంది పాల్గొంటే, ఆంధ్రప్రదేశ్ నుంచి ఓ యువతి ఆ పోటీలో పాల్గొంది. ఆ పోటీల్లో యువతి 500 మీటర్లు, కిలోమీటరు పోటీలు రెండింటిలోనూ ద్వితీయ స్థానం సాధించి రజత పతకాలను కైవసం చేసుకుంది. రెండు కి.మీ పోటీల్లో ఆరోస్థానంలో నిలిచింది. ఆ యువతే 2018లో రాంచీలో నిర్వహించిన జాతీయ ఓపెన్ చాంపియన్షిప్ పోటీల్లో కిలోమీటరు సైక్లింగ్లో బంగారు పతకం, రెండు కి.మీ విభాగంలో రజత పతకం గెలిచి, స్పెషల్ ఒలింపిక్స్కు అర్హత సాధించింది.’’మానసిక పరిపక్వత లేదని సమాజం ఈసడించింది. తనపై డబ్బు ఖర్చుచేసినా, శ్రమ వెచ్చించినా ఎలాంటి ప్రయోజనం లేదు... తిండి, బట్ట ఇస్తే సరిపోతుందని తలిదండ్రులకు జాగ్రత్తలు చెప్పింది. అయితే సమాజం మాటవిని ఆ పాపను తల్లిదండ్రులు వదిలేయలేదు. తనకోసం తమ ఆనందాల్నీ, అవసరాలనూ వదులుకున్నారు. మానసిక వికలాంగురాలైన తమ కూతురు నీహారికను తన కాళ్లపై తాను నిలబడేలా చేయాలని కంకణం కట్టుకున్నారు. విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక పాఠశాలలో చదివిస్తూ తనకెంతో ఇష్టమైన సైక్లింగ్లో శిక్షణనిస్తూ వచ్చిందా తల్లి భార్గవి. తద్ఫలితమే.. నీహారిక సాధించిన విజయాలు. భార్గవి సొంతూరు చినపరిమి భార్గవి సొంతూరు తెనాలి సమీపంలోని చినపరిమి. భర్త ఆర్మీ ఉద్యోగి ముక్కామల శివరామకృష్ణ. 2001లో తొలి కాన్పులో లక్ష్మీదేవి పుట్టిందని సంబరపడ్డారు. ఏడాదిన్నర వచ్చినా నడక రాకపోవటంతో అనుమానం వేసింది. ఉద్యోగరీత్యా అప్పుడు జమ్మూకశ్మీర్లో ఉన్నారు. ‘ఒకసారి న్యూమోనియాకు ఇచ్చిన మందు ఓవర్డోస్ అయి, నాలుగురోజులు పాప కోమాలో ఉంది... తెలివొచ్చేసరికి మాటలు బాగా తగ్గిపోయాయి..చెప్పిందీ అర్థం చేసుకోవటం తగ్గింది. డ్రమ్స్ మోగినా, బాణసంచా పేలుళ్లు విన్నా, భయంతో వణికేది...పెరిగేకొద్దీ ఆ భయం ఎక్కువైంది’ అని భార్గవి గుర్తుచేసుకున్నారు. అయిదో ఏడు వచ్చేసరికి ఆగ్రాకు వెళ్లారు. అక్కడి డాక్టర్లు ‘ఇంటలెక్చువల్ డిసేబిలిటీ’ అన్నారు. ‘పిల్లలతో విపరీతంగా ప్రవర్తించేది అప్పుడే... డ్రమ్స్, బాణసంచా మోతకు భయపడిపోయేది. ఎవరినీ దగ్గరకు రానిచ్చేదికాదు...తనొక్కతే ఏదొక వస్తువుతో ఆడుకుంటూ ఉండేది...ఆ క్రమంలో సైకిల్ తనను బాగా ఆకర్షించింది...చిన్న సైకిల్ నడిపేది. పాడైపోతే కొత్తది కొనేదాకా ఊరుకునేది కాదు...ఆ ఆసక్తిని గమనించి ప్రోత్సహించాను’ అన్నారు భార్గవి. అప్పటికి తనకు మరో బాబు కలిగాడు. కుమార్తె కోసం త్యాగాలు.. పాప ఆరోగ్యం కారణంగా హైదరాబాద్కు బదిలీ చేయించుకున్నారు. ప్రత్యేక అవసరాల పిల్లల పాఠశాలలో చేరి్పంచారు. కొడుక్కి హోం వర్క్ చేయించేటపుడు, నీహారికను దగ్గరుంచారు. స్పీచ్ థెరపీనీ ఇప్పించారు. 2013లో విజయవాడకు వచ్చేశారు. 2013 నవంబరులో ఇలాంటి పిల్లల కోసం ఓపెన్ ఛాంపియన్íÙప్ పోటీలు జరుగుతాయని తెలుసుకున్నారు. 2014లో పార్టిసిపేట్ చేసేలా చూశారు. ప్రతిరోజూ తెల్లవారు జామున 4 గంటలకు పాపను నిద్రలేపటం, హైవేపై 10 కి.మీ ప్రాక్టీస్ చేయించి, ఇంటికి తీసుకొచ్చేవారు. తర్వాత ‘ఆటిజమ్ రీసెర్చ్ అండ్ మల్టీ డిసిప్లిన్ స్కూలు’కు తీసుకెళ్తారు. నీహారిక కోసం తనుకూడా అదే స్కూలులో ఉద్యోగం చేశారు భార్గవి. శివరామకృష్ణ కూడా వలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు.మరెన్నో విజయాలు.. 2014లో భోపాల్లో జరిగిన ఓపెన్ ఛాంపియ్షిప్లోనూ కి.మీ, 2 కి.మీ విభాగాల సైక్లింగ్లో బంగారుపతకం, రజత పతకాన్ని నీహారిక సాధించింది. ఈ విజయంతో 2015లో లాస్ఎంజెల్స్లో జరిగిన స్పెషల్ ఒలింపిక్స్కు ఎంపికైనా, అనివార్య కారణాలతో సైక్లింగ్లో పాల్గొనేందుకు వీల్లేకపోయింది. యూనిఫైడ్ వాలీబాల్ గేమ్లో భారత జట్టుకు ఆడి, కాంస్య పతక సాధనకు తోడ్పడింది. రెండు స్పెషల్ ఒలింపిక్స్లో ఆడి పతకాలను సాధించటం నిస్పందేహంగా నీహారిక ఘనతే. ఇందుకు పునాది, పట్టుదల, తపన ఆమె తల్లి భార్గవిది. పట్టుదలతో కృషిచేస్తే సాధించలేనిది ఏదీ లేదనేందుకు నిదర్శనమే వీరి విజయం.విభిన్న ప్రతిభావంతులకు తల్లిలా.. తన బిడ్డ నీహారిక లాంటి మరికొందరి కోసం ఇప్పుడా తల్లి ఏకంగా స్కూలునే నడుపుతోంది. 2020లో ప్రజ్ఞ వెల్ఫేర్ సొసైటీని రిజిస్టరు చేశారు. 2022 నుంచి ఆ సొసైటీ తరఫున సాయి అంకుర్ స్పెషల్ స్కూల్ను ఆరంభించారు. 2019లో స్పెషల్ ఒలింపిక్స్లో పతకాల సాధనతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రైజ్మనీతో మొదలుపెట్టిన స్కూలుకు ఇప్పుడు సొంత డబ్బులు పడుతున్నాయి. పిల్లల తల్లిదండ్రుల మద్దతు తోడవుతోంది. పిల్లలు తమ పనులు తాము చేసుకోవటం, అవసరాలను తీర్చుకోవటం, వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడేలా శిక్షణనివ్వటం తమ ఆశయమని చెప్పారు భార్గవి. తెనాలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డులోని ‘సాయి అంకుర్ స్పెషల్ స్కూల్’ ఇప్పుడు భార్గవి ప్రపంచం. 24 ఏళ్ల కుమార్తె నీహారికతో సహా పదిహేనుమంది విభిన్న ప్రతిభావంతులు అక్కడ ఉన్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు అక్కడ పిల్లలకు రకరకాల యాక్టివిటీస్, ఆటలతో బోధన ఉంటుంది. రోజువారీ స్కూలుకు వెళుతూ రెమిడియల్ క్లాసుకు వచ్చేవారూ ఉన్నారని భార్గవి చెప్పారు. తనతోపాటు అక్కడ ముగ్గురు టీచర్లు, ఇద్దరు సపోర్టింగ్ స్టాఫ్ పనిచేస్తున్నారు. పాప కోసం ‘ఆటిజమ్ రీసెర్చ్ అండ్ మల్టీ డిసిప్లిన్ స్కూలు’ టీచరుగా పనిచేసిన భార్గవి, ఇప్పుడు ఏకంగా అలాంటి స్కూలునే నడుపుతూ ఎందరికో తల్లిలా మారింది. -
Miss world 2025 బ్యూటీఫుల్ గేమ్స్
మిస్ వరల్డ్ పోటీల్లో మిస్ టాలెంట్, బ్యూటి విత్ ఎ పర్పస్, బెస్ట్ స్విమ్ సూట్, నైట్ గౌన్, మిస్ ఫొటోజెనిక్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్, బ్యూటిఫుల్ హెయిర్.. స్కిన్ వంటి రౌండ్స్ ఉన్నట్టే స్పోర్ట్స్ చాలెంజ్ ఈవెంట్ కూడా ఉంటుంది. మిస్ వరల్డ్ 2025 పోటీలో భాగంగా హైదరాబాద్లోని గచ్చిబౌలీ స్టేడియంలో ఘనంగా జరిగిన ఈ రౌండ్లో మిస్ ఎస్టోనియా.. ఎలిస్ రాండ్మా విజయం అందుకున్నారు. మొదటి రన్నరప్గా మిస్ మార్టీనిక్ ఆరేలీ జోచిమ్, రెండో రన్నరప్గా మిస్ కెనడా మారిసన్ నిలిచారు. వాళ్ల వివరాలు..మిస్ ఎస్టోనియా.. ఎలిస్ రాండ్మా1999 నుంచి ఇప్పటివరకు ఎస్టోనియా దేశం.. మిస్ వరల్డ్ పోటీల్లో స్పోర్ట్స్ ఈవెంట్లో గెలిచి, ఈ బ్యూటీ పాజెంట్లోని తర్వాత రౌండ్స్కి అర్హత పొందడం ఇదే మొదటిసారి. ఈ విజయంతో మిస్ ఎస్టోనియా ఎలిస్ రాండ్మా.. యూరప్ టాప్ టెన్ ఫైనలిస్ట్స్, టాప్ 40 ఫైనలిస్ట్స్ జాబితాలో స్థానం సంపాదించుకుంది. ఎస్టోనియాలోని కిర్నాకు చెందిన ఎలిస్.. ఐటీ సిస్టమ్ డెవలప్మెంట్ గ్రాడ్యుయేట్. సేల్స్ కన్సల్టెంట్గా, స్టోర్ మేనేజర్గా, రాడిసన్ మెరిటన్ పార్క్ ఇన్ హోటల్లో హోస్టెస్గా, జూనియర్ ఐటీ డెవలప్మెంట్ స్పెషలిస్ట్గా.. రకరకాల ఉద్యోగాలు చేసింది. మోడలింగ్ అవకాశాలనూ అందిపుచ్చుకుంది. ఆన్లైన్ చారిటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆమె వాటినే తన బ్యూటీ విత్ ఎ పర్పస్గా పేర్కొంది. ‘స్పోర్ట్స్ చాలెంజ్ ఈవెంట్లో స్వర్ణం సాధించడం చాలా సంతోషంగా ఉంది. గెలుస్తానో లేదో అనుకున్నా కానీ సులభంగానే గెలిచాను. నిజానికిదో చాలెంజ్.. గొప్ప అనుభవం! జీవితంలోని ఒడిదుడుకులను ఎలా అధిగమించవచ్చో నేర్పే ఈవెంట్ ఇది. లైఫ్కి చాలా ఉపయోగపడుతుంది!’ అని ఆ ఈవెంట్ గురించి చెప్పింది ఎలిస్. మిస్ మార్టీనిక్.. ఆరేలీ జోచిమ్..మార్టీనిక్లోని డ్యూకోస్ పట్టణానికి చెందిన ఆరేలీ జోచిమ్.. హైజీన్ సేఫ్టీ ఎన్వైర్మెంట్ స్టడీస్లో డి΄్లోమా చేసింది. నిత్యం నవ్వుతూ ఉండే ఆరేలీకి ప్రకృతి అంటేప్రాణం. జీవితాన్ని చాలా స్పోర్టివ్గా తీసుకుంటా నంటోంది. తన జీవితానుభవాలు, తన భావోద్వేగ ప్రయాణాల స్ఫూర్తితో ‘మెసొన్ లాన్మూర్ (ప్రేమాలయం)’ అనే సంస్థను స్థాపించి మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. దీని గురించే ఆమె ‘బ్యూటీ విత్ ఎ పర్పస్ రౌండ్’లో ముచ్చటించనుంది. ‘బాడీ ఫిట్గా ఉండాలంటే స్పోర్ట్స్ చాలా అవసరం. ఏప్రొఫెషన్లో ఉన్నా ఆటల పట్ల ఆసక్తి పెంచుకుని ఏదో ఒక స్పోర్ట్ని ప్రాక్టీస్ చేస్తే శారీరకంగానే కాదు మానసికంగానూ ఆరోగ్యంగా ఉంటాం. ఇది మన రెగ్యులర్ప్రొఫెషన్లో సక్సెస్కి చాలా ఉపయోగపడుతుంది’ అంటుంది ఆరేలీ జోచిమ్.మిస్ కెనడా.. ఎమ్మా మారిసన్.. కెనడా, ఓంటారియోలోని ఓ చిన్న పట్టణం (Chapleau) లో పుట్టి, పెరిగిన ఎమ్మా.. మిస్ కెనడా కిరీటాన్ని ధరించిన స్థానిక ఆదిమ తెగకు చెందిన తొలి యువతి. ఇండిజినస్ ప్రిపరేటరీ స్టడీస్ అండ్ టూరిజంలో డిగ్రీ చేసింది. ఈస్థటిక్స్ అండ్ హెయిర్కి సంబంధించిన కోర్స్ కూడా చదివింది. అందాల పోటీ అంటే స్కిన్ షో కాదని, సామాజిక బాధ్యతను గుర్తించే వేదికని తెలిశాక.. ఆ పోటీల పట్ల మక్కువ పెంచుకుంది.బ్యూటీ పాజెంట్స్లో పాల్గొంది. ‘రిబ్బన్ స్కర్ట్స్’ అనే కార్యక్రమం ద్వారా తన సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తోంది. ‘రిబ్బన్ స్కర్ట్స్’ అనేది తమ తెగ మహిళలకు సంబంధించిన ఒక సంప్రదాయ నేత. దాన్ని వాళ్లు తమ చరిత్ర, సాంస్కృతిక సంబరాలకు ఒక గుర్తుగా భావిస్తారు. దాన్నే ఆమె తన సామాజిక సేవా కార్యక్రమంగా ఎంచుకుంది. ‘ఎందుకంటే కెనడాలో మైదానప్రాంతపు అమ్మాయిల కన్నా పన్నెండింతలు మా తెగకు చెందిన అమ్మాయిలు అదీ పదిహేనేళ్లలోపే శారీరక, లైంగిక దాడులకు బలవుతున్నారు. ఇదీ చదవండి: Yoga: ప్రాణాయామంతో అమోఘమైన ఆరోగ్య ఫలితాలుదీన్ని నిలువరించి మా తెగలోని అమ్మాయిలు సాధికారత సాధించేందుకే నేను ‘రిబ్బన్ స్కర్ట్స్’ పేరుతో సామాజిక కార్యక్రమాలను స్టార్ట్ చేశాను. స్వావలంబన తో మావాళ్లను నాగరిక సమాజానికి కనెక్ట్ చేయాలన్నదే నా లక్ష్యం. ఇదే నా బ్యూటీ విత్ పర్పస్’ అంటుంది ఎమ్మా. మిస్ వరల్డ్ అందాల పోటీలలో సెకండ్ రన్నరప్ గెలుపు గురించి మాట్లాడుతూ ‘గొప్ప ఎక్స్పీరియెన్స్. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన వాళ్లతో పోటీపడి విజేతగా నిలవడం మరచిపోని అనుభూతి. తర్వాత దశకు ఇదొక స్ఫూర్తి. నా బలాబలాలు తెలుసుకోవడానికి ఈ స్పోర్ట్స్ చాలెంజ్ ఈవెంట్ చాలా ఉపయోగపడింది. దీంతో నా ఆత్మవిశ్వాసం పెరిగింది’ అని చెప్పింది. చదవండి: నిహారికను తీర్చిదిద్దిన శిల్పి ఆమె తల్లే! -
ఫోర్బ్స్లో అనన్య పాండే, బాయ్ ఫ్రెండ్ రియాక్షన్ వైరల్
బాలీవుడ్ యువనటి నటి అనన్య పాండే) (Ananya Panday) తన కరియర్ ఒక కీలకమైన మైలురాయిని సాధించింది. 2025 ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాలో స్థానం సంపాదించి అందర దృష్టిని ఆకర్షించింది. నటుడు ఇషాన్ ఖట్టర్ కూడా ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. దీనికి సంబంధించి ఫో ర్బ్స్ ఆసియా పోస్ట్ను అనన్య ఇన్స్టాలో షేర్ చేసింది. అయితే అనన్య బాయ్ ఫ్రెండ్గా భావిస్తున్నవాకర్ బ్లాంకో ఈ వార్తలపై స్పందించడం విశేషంగా నిలిచింది. అనన్యను అభినందిస్తూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో, క్లాప్స్ ఎమోజీతో స్పెషల్ వార్తను తన అభిమానులకు షేర్ చేశాడు. దీంతో ఇది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.ఫోర్బ్స్ తన 30 అండర్ 30 ఆసియా జాబితా 10వ ఎడిషన్ను ప్రకటించింది. ఇందులో ఆసియాలో అత్యంత ఆశాజనకమైన 300 మంది వ్యవస్థాపకులు, ఆవిష్కర్తలు , 30 ఏళ్లలోపు యంగస్టర్లను ఎంపిక చేసింది. 2025కి గాను ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా జాబితాలో చోటు దక్కించుకున్నందుకు అనన్యపాండే, ఇషాన్ ఖట్టర్ ప్లేస్ దక్కించుకున్నారు.. ఈ సంవత్సరం బాలీవుడ్ నుండి ఎంపిక చేయబడిన కొద్దిమందిలో వీరిద్దరూ ఈ ఘనతను సాధించారు. దీంతో ఇద్దరిపై అభినందనలు వెల్లువెత్తాయి.2019లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 తో అరంగేట్రం చేసిన అనన్య పాండే, విభిన్నమైన సినిమా పాత్రలు, నటనతోపాటు, తనదైన ష్యాషన్స్టైల్తో తన ప్రత్యేకతను చాటుకుంది. అనేకమది యువ అభిమానులను సొంతం చేసుకుంది. ఇటీవల జలియన్ వాలాబాగ్ మారణకాండ ఆధారంగా తెరకెక్కిన ‘కేసరి చాప్టర్ 2’ లోని నటనకు ప్రశంసలు దక్కిచంఉకుంది. అలాగే ఈ సంవత్సరం ప్రారంభంలో లగ్జరీ ఫ్యాషన్ హౌస్ ఛానల్కు తొలి భారతీయ రాయబారిగా మారింది. స్టైల్ ఐకాన్గా ఆమె హోదాను మరింత సుస్థిరం చేసుకుంది. యువతలో సైబర్ బెదిరింపులను ఎదుర్కోవడంపై దృష్టి సారించిన ఆమె ప్రచారమైన సో పాజిటివ్ను కూడా ప్రచారం చేస్తోంది. మరోవైపు, బియాండ్ ది క్లౌడ్స్తో తన ప్రయాణాన్ని ప్రారంభించి, ధడక్తో ప్రధాన స్రవంతి దృష్టిని ఆకర్షించిన ఇషాన్ ఖట్టర్కి 2025లో ఒక కీలకమైన ఏడాదిగా మారింది. గ్లోబల్ సినిమాలు ప్రాజెక్టులతో పాటు, హోమ్బౌండ్ చిత్రంతో కాన్స్ అరంగేట్రం కోసం సిద్ధమవుతున్నాడు. ఇషాన్ ఇటీవలి మూవీలలో నెట్ఫ్లిక్స్ రొమాంటిక్ కామెడీ సిరీస్ ‘ది రాయల్స్’, అంతర్జాతీయ నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ ‘ది పర్ఫెక్ట్ కపుల్’ ఉన్నాయి, View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday)అనన్య పాండే వాకర్ బ్లాంకోల డేటింగ్ సందడిఅనన్య , వాకర్ మధ్య డేటింగ్ సందడి గత ఏడాదిలో(2024)నే ప్రారంభమైంది. ముఖ్యంగాఅనంత్ అంబానీ ,రాధిక మర్చంట్ వివాహంలో ఇద్దరూ కలిసి కనిపించినప్పుడు,వాకర్ను తన భాగస్వామిగా పరిచయం చేసిందని బాంబే టైమ్స్ నివేదిక వెల్లడించింది. అలాగే అనన్య 26వ పుట్టినరోజు (అక్టోబర్ 30, 2024న వాకర్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో అనన్యకు పుట్టిన రోజు విషెస్ తెలుపుతూ నువ్వు చాలా స్పెషల్.. ఐ లవ్ యూ అన్నీ.. అంటూ ఒక సందేశాన్ని, బ్యూటిఫుల్ ఫోటోను షేర్ చేయడంతో ఈ పుకార్ల జోరు మరింత పెరిగింది. 2018లో మనీష్ మల్హోత్రా కార్యక్రమంలో ఆదిత్య కపూర్ కలిసిన అనన్య అతనితో ప్రేమలో పడింది. కొన్నాళ్ల డేటింగ్ తరువాత వీరిద్దరూ ప్రస్తుతం విడిపోయినట్టు తెలుస్తోంది.వివిధ పరిశ్రమలలో 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 30 మంది ప్రభావవంతమైన యువతీయువకుల జాబాతాను ప్రకటిస్తుంది. ఫోర్బ్స్. 2011 నుండి 30 అండర్ 30 జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రచురిస్తున్న సంగతి తెలిసిందే. -
Sheetal Devi and Ananya Panday: వింటి ‘నారి’
‘రెండు చేతులు లేవు కదా... విల్లు ఎలా పడతావు?’ అని అడిగారు. ఆ ప్రశ్నకు తన విల్పవర్తోనే సమాధానం చెప్పిన శీతల్ దేవి ఆర్చర్గా అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తోంది. స్కూల్ రోజుల నుంచి వెటకారాలు ఎదుర్కొన్న అనన్య పాండే చిత్రసీమలోకి అడుగు పెట్టిన తరువాత ట్రోలింగ్ బారిన పడింది. ఆ వెటకారాలకు తన పనితీరుతోనే సమాధానం చెప్పిన అనన్య పాండే ప్రస్తుతం ఆసియాలోని ప్రసిద్ధ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్. ‘ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా 2025’ జాబితాలో చోటు సాధించిన శీతల్దేవి, అనన్య పాండేల గురించి...‘విజేతలు తమ దగ్గర లేని వాటి గురించి ఆలోచించరు. ఉన్నదాన్ని గురించే ఆలోచిస్తారు. దాంట్లో నుంచే శక్తి పుట్టిస్తారు’ అవును. జమ్ముకశ్మీర్కు చెందిన శీతల్కు ఫోకోమేలియా అనే అరుదైన వ్యాధి కారణంగా రెండు చేతులు లేవు. కిస్తావర్లోని తన గ్రామంలో మేకలు కాసేది. శీతల్కు రెండు చేతులు లేకపోవచ్చు. అయితే అసాధారణమైన చురుకుదనం ఉంది. ఆ చురుకుదనమే భారత సైన్యం నిర్వహించిన ఆటల పోటీల్లో పాల్గొనేలా చేసింది.ఆ ఆటల్లో ఆర్చరీ శీతల్ను బాగా ఆకట్టుకుంది. ‘ఆర్చర్ కావాలనుకుంటున్నాను’ అన్నప్పుడు...‘రెండు చేతులు లేవు కదా...అది ఎలా సాధ్యం?’ అన్నారు అక్కడ ఉన్నవాళ్లు. తన కాళ్ల వైపు చూసింది. అవును... తన కాళ్లనే చేతులుగా మలుచుకొని చిన్న పల్లె, జిల్లా, రాష్ట్రం దాటి అంతర్జాతీయ స్థాయిలో ఆర్చరీలో ఎన్నో అద్భుత విజయాలు సాధించింది. పారాలింపిక్ మెడలిస్ట్గా చరిత్ర సృష్టించింది ఆర్చర్ శీతల్ దేవి.‘ఆర్చరీ నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆర్చరీకి ముందు నేనెవరో ఎవరికీ తెలియదు. ఇప్పుడు మన దేశంలో ఎంతోమందికి నేను తెలుసు. ఆర్చరీలోలో ఎంతోమందిని చూసి స్ఫూర్తి పొందాను. ఇప్పుడు నన్ను చూసి స్ఫూర్తి పొందుతున్న వాళ్లను చూస్తే సంతోషంగా ఉంది’ అంటుంది స్టార్ ఆర్చర్ శీతల్దేవి.ఆర్చరీలోలో ఎంతోమందిని చూసి స్ఫూర్తి పొందాను. ఇప్పుడు నన్ను చూసి పొందుతున్న వాళ్లను చూసి సంతోషంగా ఉంది జేమ్స్ ‘బ్రాండ్’‘వెక్కిరింపులు, వెటకారాలకు తల ఒగ్గితే ఎప్పటికీ తల ఎత్తలేవు’ స్కూల్ రోజుల్లో అనన్య పాండేను తోటి పిల్లలు ‘టూత్పిక్ లెగ్స్’ ‘ఫ్లాట్ స్క్రీన్’లాంటి నిక్నేమ్లతో వెక్కిరించేవాళ్లు. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఆమె పేరు ముందు ‘గ్లామర్ డాల్’ అనే విశేషణం తప్పనిసరిగా ఉండేది. ‘నెపో బేబీ’ అని కూడా అంటుండేవారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ సరే సరి.నటనకు సంబంధించిన విమర్శలు కూడా వచ్చేవి. సినిమాలకు ముందు పాండే ఏ ఫిల్మ్ స్కూల్లో చేరలేదు. చిన్నప్పుడు సినిమా సెట్స్కు వెళ్లింది కూడా లేదు. నిర్మాణాత్మక విమర్శలు వినబడిన తరువాత మాత్రం తన నటనను మరింత మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టింది. ‘అనన్య నటన అద్భుతం’ అనే ప్రశంస వినిపించడానికి ఎంతో కాలం పట్టలేదు.వెటకారాలు, విమర్శలకు బాధ పడి ఉంటే....అనన్య పాండే ఎక్కడో ఆగిపోయేది. ‘విమర్శలు, వెటకారాలను సీరియస్గా తీసుకుంటే అది మోయలేనంత భారం అవుతుంది. ఆ భారం మనల్ని ముందుకు వెళ్లకుండా నిలువరిస్తుంది’ అంటుంది అనన్య పాండే.‘మొదట్లో తన ప్రత్యేకత కనిపించేది కాదు. ఎందుకంటే గతంలో ఎంతోమంది చేసిన పాత్రలే అనన్య పాండే చేసింది. కానీ ఇప్పుడు అలా కాదు. తాను మాత్రమే చేయగలిగే పాత్రలు చేస్తోంది’ అంటుంది ఫిలిమ్ క్రిటిక్ అనుపమ చోప్రా ఇప్పుడు ఫేమస్ బ్రాండ్లకు పాండే ఫేవరెట్ స్టార్ అయింది. ఫ్రెంచ్ ఫ్యాషన్ హౌజ్ ‘చానల్’, నెట్ఫ్లిక్స్, మాస్ ఓరియెంటెడ్ ‘స్కెచర్’కు మన దేశం నుంచి తొలి బ్రాండ్ అంబాసిడర్గా తన ప్రత్యేకతను చాటుకుంది. ప్రస్తుతం అనన్య పాండే దక్షిణ ఆసియాలోని ఎన్నో లగ్జరీ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్గా ఉంది. -
వరల్డ్ స్ట్రెంత్ గేమ్స్కి రెడీ అంటున్న 70 ఏళ్ల వెయిట్ లిఫ్టర్
కుమారుడితో కలిసి దిల్లీలో ఉంటున్న రోషిణికి ఎడమ కాలి మోకాలినొప్పి మొదలైంది. మెట్లు ఎక్కడం, నడవడం కష్టంగా మారింది. ఆమె ఎడమ మోకాలికి ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నట్లు గుర్తించారు. కుడి చూపుడు వేలు బలహీన పడింది.ఫిజియో థెరపీ మొదలు పెట్టింది. ‘ఈ టైమ్లో అమ్మకు జిమ్ అవసరం ఉంది’ అనుకున్నాడు ఆమె కుమారుడు, ఫిట్నెస్ కోచ్ అయిన అజయ్. 68 సంవత్సరాల వయసులో తొలిసారిగా జిమ్లోకి అడుగు పెట్టింది రోషిణి.మెల్ల మెల్లగా ఆమెకు సాంత్వన చేకూరింది.స్ట్రెచ్చింగ్, మూమెంట్ ఎక్సర్సైజ్లతో మొదలుపెట్టి వర్కవుట్స్ను ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. రెగ్యులర్ ట్రైనింగ్ వల్ల చేయి బలపడింది. రోజువారీ పనులు కష్టంగా అనిపించేవి కాదు. 在 Instagram 查看这篇帖子 Choudhary Ajay Sangwan (@weightliftermummy) 分享的 జిమ్ ఉత్సాహం ఆమెను వెయిట్ లిఫ్టింగ్ వైపు తీసుకువచ్చింది.ఇప్పుడు రోషిణి ట్రాప్బార్ డెడ్లిఫ్ట్లో 97 కేజీల బరువు ఎత్తుతుంది. 80 కేజీల కన్వెన్షల్ డెడ్లిఫ్ట్స్ చేస్తుంది. 50 కేజీల స్క్వాట్స్ చేస్తుంది. 120 కేజీల లెగ్ ప్రెస్ చేస్తుంది. 4 నిమిషాల పాటు ప్లాంక్ పట్టుకోగలదు. ప్రతిరోజూ రెండు గంటలు స్ట్రెంత్ ట్రైనింగ్, కార్డియో చేస్తుంది. ‘దువ్వెన పట్టుకోవడం కూడా కష్టమే అని ఒకప్పుడు డాక్టర్లు అమ్మ గురించి చెప్పారు’ అని గతాన్ని గుర్తు చేసుకున్నాడు అజయ్. జిమ్లో వర్కవుట్స్ పుణ్యమా అని ఇప్పుడు రోషిణికి ఇన్స్టాగ్రామ్లో వేలాదిమంది ఫాలోవర్స్ ఉన్నారు. వారు ఆమెను ప్రేమగా ‘వెయిట్లిఫ్టర్ మమ్మీ’ అని పిలుచుకుంటారు.ఇదీ చదవండి:Cannes Film Festival 2025: కాన్స్లో మెరిసిన 17 ఏళ్ల యువతార, బాలీవుడ్ అగ్ర హీరోయిన్లను..!డైట్ విషయానికి వస్తే...‘ఎలాంటి రిస్ట్రిక్షన్లు లేవు. నాకు దహి బల్లే అంటే చాలా ఇష్టం. అలా అని అదేపనిగా తినను. అప్పుడప్పుడు మాత్రమే తింటాను. ఏదైనా ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు’ అంటుంది ఇంటి భోజనాన్ని ఇష్టపడే రోషిణి. వచ్చే సంవత్సరం అమెరికాలో జరిగే ‘వరల్డ్ స్ట్రెంత్ గేమ్స్’కి ఆమెకు ఆహ్వానం అందింది.ప్రస్తుతం రోషిణి ఆ ఈవెంట్ కోసం ప్రాక్టీస్ చేస్తోంది. ‘ఒకప్పుడు నేను ఇంటికే పరిమితమయ్యేదాన్ని. ఇప్పుడు మాత్రం బయటికి వెళుతున్నాను. రకరకాల కార్యక్రమాలలో పాల్గొంటున్నాను. ఇప్పుడు సంతోషంగా ఉంది’ అంటుంది రోషిణి. ‘సీనియర్ సిటిజన్స్ జిమ్లో వ్యాయామాలు చేసినప్పుడు అది వాళ్లకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. వారి నుంచి యువతరానికి సందేశం అందుతుంది’ అంటున్నాడు అజయ్. అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో జిమ్లోకి అడుగు పెట్టిన రోషిణి... ఇప్పుడు ఎన్నో వ్యాయామాలలో ఆరి తేరింది. వెయిట్ లిఫ్టింగ్లో పట్టు సాధించింది. అమెరికాలో జరగబోయే ‘వరల్డ్ స్ట్రెంత్ గేమ్స్’లో పాల్గొనడానికి రెడీ అవుతోంది 70 సంవత్సరాల రోషిణి. ఇదీ చదవండి: బిగ్ బాస్ విన్నర్ లివర్లో టెన్నిస్ బాల్ అంత కణితి : వైరల్ పోస్ట్ -
స్వేచ్ఛగా .. రెక్కలు విప్పేలా...
అమ్మాయిలకు చదువు కాదుకదా.. కనీసం వ్యక్తిగత శుభ్రత పాటించే వెసులుబాటు కూడా లేని చోట అందాల పోటీలంటే ఆనందంగా సాగనంపుతారా? పంపరు! అయోమ్ టీటో మతీజ్కు కూడా తీవ్ర నిరసన ఎదురైంది! అయినా వెనకడుగు వేయకుండా అందాల పోటీలకు అటెండ్ అయింది.. మిస్ సౌత్ సుడాన్గా కిరీటం ధరించి మిస్ వరల్డ్కి పోటీపడ్డానికి హైదరాబాద్ చేరుకుంది. తన దేశ పరిస్థితులు, వ్యక్తిగత వివరాలు, తన లక్ష్యం వగైరా ఆమె మాటల్లోనే...‘‘లా చదివాను. లీగల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. సౌత్ సుడాన్లో పుట్టాను. కానీ అక్కడి రాజకీయ అనిశ్చితి వల్ల మా అమ్మ మమ్మల్ని తీసుకుని కెనడాకు వలస వచ్చేసింది. అందుకే నేను అక్కడే పెరిగాను. మా నాన్న, ఆయన తరపు, అమ్మ తరపు బంధువులంతా సౌత్ సుడాన్లోనే ఉండిపోయారు. మా అమ్మ కెనడాలో టీచర్గా ట్రైన్ అయ్యి, మా సొంత దేశంలోని పిల్లలకు మంచి స్కూల్ను ఏర్పాటు చేయడానికి తిరిగి సుడాన్ వచ్చేసింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత 2019లో నేను మా కుటుంబాన్ని చూడ్డానికి నా సొంత దేశానికి వెళ్లాను. ఎమోషనలే కాదు.. కొంచెం షాక్ కూడా అయ్యాను. కెనడాలో నేను ఆస్వాదించిన జీవితం, సౌత్ సుడాన్లో మా వాళ్లంతా అనుభవిస్తున్న జీవితాన్ని బేరీజు వేసుకుని. అప్పుడే డిసైడ్ చేసుకున్నాను నా దేశ ప్రజలకూ ఉన్నత ప్రమాణాల జీవితం అందేలా కృషి చేయాలని! కోవిడ్ తర్వాత వచ్చేశాను. సర్వీస్ మొదలుపెట్టాను. నా బ్యూటీ విత్ పర్పస్ అదే!అందాల పోటీలకు వ్యతిరేకంఅందాల పోటీల పట్ల సౌత్ సుడాన్లో చాలా వ్యతిరేకత ఉంది. నేను మిస్ సౌత్ సుడాన్ పాజెంట్లో పాల్గొంటున్నప్పుడు, ఇప్పుడు కూడా నిరసన ఎదురైంది. కానీ నా దృష్టిలో ఈ పోటీలు స్కిన్ షో కాదు. వైవిధ్యమైన సంస్కృతులు, భాషలు, జీవనశైలులను పరిశీలించే, అధ్యయనం చేసే అవకాశాన్నిచ్చే వేదిక. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. సర్దుబాటు, సహనాన్ని నేర్పిస్తుంది. ఇవన్నీ కూడా నా సామాజిక బాధ్యతను మెరుగ్గా నిర్వర్తించేందుకు తోడ్పడతాయి. అందుకే నిరసనను ఎదుర్కొని మరీ ఈ పోటీకి వచ్చాను. అంతేకాదు ఈ పోటీలు ఒకరినొకరు తెలుసుకుని, అర్థం చేసుకుని, ఒకరికొకరు సాయం అందించుకునే స్ఫూర్తినీ పంచుతాయి. మహిళలకు అలాంటి స్ఫూర్తి, ప్రేరణ అవసరం. దానికి అందాల పోటీలే కావాలా అంటారేమో! స్త్రీకి స్త్రీయే శత్రువు అనే నానుడి ప్రపంచ వ్యాప్తంగా పాతుకుపోయి.. అది స్త్రీల సహజ లక్షణమనే అభిప్రాయమూ అంతే లోతుగా నాటుకుపోయింది. దాన్ని అబద్ధమని నిరూపిస్తున్నాయి ఈ పోటీలు! కొన్ని దేశాల పేర్లే తెలియవు నేనీ కంటెస్ట్కి వచ్చేదాకా! అందుకే పట్టుబట్టి మరీ ఈ పోటీకి వచ్చాను. ఇక్కడి వైవిధ్యత, ఆధ్యాత్మికత నన్ను చాలా ఇన్స్పైర్ చేశాయి. ఈ దేశంలోని వాళ్లను చూస్తే నాకు ఫారినర్స్గా అనిపించరు. మా వాళ్లలాగే అనిపిస్తారు. ఎప్పుడో ఎక్కడో తప్పిపోయి.. ఇప్పుడు కలుసుకుంటున్నామేమో అనిపిస్తోంది! తెలంగాణ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఇక్కడి ఎడ్యుకేషన్, మెడికల్ కేర్ గురించి కచ్చితంగా మాట్లాడుకోవాలి. ప్రపంచ ప్రమాణాలతో పోటీపడుతున్నాయి. సౌత్ సుడాన్ యువత తమ ఉన్నత చదువుల కోసం హైదరాబాద్కే వస్తోంది. మా దేశంలోని చాలామంది ప్రజలు ఆరోగ్య అవసరాల కోసం ఇక్కడి హాస్పిటల్స్నే ఆశ్రయిస్తున్నారు.బాల్య వివాహాలు.. బలవంతపు పెళ్లిళ్లుప్రపంచంలోని అనేక దేశాల్లాగే సౌత్ సుడాన్లోనూ పురుషాధిపత్యమే! కొడుకుకేప్రాధాన్యం. అమ్మాయికి వ్యక్తిగత శుభ్రత విషయంలోనూ ఆర్థికపరమైన వెసులుబాటు ఉండదు. బాల్యవివాహాలు, బలంతపు పెళ్లిళ్లు కామన్. ఇక చదువుకునే అవకాశమెక్కడిది? నేను ఇక్కడిదాకా రాగలిగాను అంటే మా అమ్మే కారణం. మమ్మల్ని ఆమె కెనడా గనుక తీసుకువెళ్లకపోయుంటే నా పరిస్థితి ఎలా ఉండేదో (ఈ మాట చెబుతున్నప్పుడు ఆమె కళ్లల్లో నీళ్లు). నాకింకా గుర్తు.. ఆమె లగేజ్ సర్దుతుంటే ‘మనం ఎక్కడికి వెళ్తున్నాం?’ అని అడిగాను. ‘మీరు స్వేచ్ఛగా మీకు నచ్చింది చదువుకునే చాన్స్ ఉన్నచోటికి’ అని చెప్పింది! మేం నలుగురు అక్కచెల్లెళ్లం. మాకొక తమ్ముడు. అందరినీ సింగిల్ పేరెంట్గానే పెంచింది అమ్మ. ఎలాంటి అవకాశాల కోసం అమ్మ మమ్మల్ని కెనడాకు తీసుకెళ్లిందో అలాంటి అవకాశాలనే సౌత్ సుడాన్లోని అమ్మాయిలకూ కల్పిస్తోంది తాను నడిపిస్తున్న స్కూల్ ద్వారా! ఆమె చేస్తున్న ఆ సర్వీస్కి నేనూ శాయశక్తుల సాయపడుతున్నాను. మా దేశంలోని యంగ్ గర్ల్స్కి నేను మెంటర్గా ఉండాలి! వాళ్ల కలలను సాకారం చేసుకునేలా నేను తోడ్పడాలి. వాళ్లకు రెక్కలున్నాయనే విషయాన్ని గ్రహించేలా చేయాలి. సాధికారతకు, సామాజిక బాధ్యతకు ఐకాన్స్గా ఉండి, తర్వాత తరాలను ఇన్స్పైర్ చేసేలా వాళ్లను తీర్చిదిద్దాలి. ఇదంత సులువైన జర్నీ కాదు. అయినా ప్రయత్నం వీడను!’’ అంటూ తన జర్నీ గురించి చెప్పారు మిస్ సౌత్ సూడాన్.మా దేశంలోని యంగ్ గర్ల్స్కి నేను మెంటర్గా ఉండాలి! వాళ్లు కలలను సాకారం చేసుకునేలా నేను తోడ్పడాలి. వాళ్ళకు రెక్కలున్నాయనే విషయాన్ని గ్రహించేలా చేయాలి. – సరస్వతి రమఫొటో: ఎస్.ఎస్. ఠాకూర్ -
కాన్స్లో మెరిసిన 17 ఏళ్ల యువతార, బాలీవుడ్ అగ్ర హీరోయిన్లను..!
లాపతా లేడీస్ సినిమాతో లైమ్లైట్లోకి వచ్చిన యంగ్హీరోయిన్ నితాన్షి గోయల్ (Nitanshi Goel). ఈ మూవీలో తనదైన నటనతో అటు విమర్శకులు, ఇటు అభిమానుల హృదయాలను గెలుచుకుంది. 2024లో అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాల్లో ఒకటైన లాపతా లేడీస్లోని ఫూల్ పాత్రతో అభిమానులను కట్టిపడేసింది. ఇన్స్టాలో అత్యధిక సంఖ్యలో ఫాలోవర్లను కలిగి ఉన్న అతి పిన్న వయస్కురాలైన నటి కూడా నితాన్షి కావడం విశేషం.ఇపుడు మరో విశేషం ఏమిటంటే... నితాన్షి 78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అరంగేట్రం చేసింది. అరంగేట్రం చేయడం మాత్రమే కాదు కాన్స్లో తన లుక్స్తో వావ్ అనిపించింది. 17 ఏళ్ల యువతార బ్లాక్ అండ్ గోల్డ్ గౌన్తో తళుక్కున మెరిసి అభిమానులను ఫిదా చేసింది. ఆమె లుక్కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఆమె డిజైనర్ దుస్తులు, స్టైల్, సీనియర్ నటీమణులకు ఆమె ఇచ్చిన గౌరవం స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచాయి. అందరి దృష్టి నితాన్షి గోయల్ జుట్టుపైనే ఉంది, ఆమె రేఖ-మధుబాలతోపాటు, శ్రీదేవికి లాంటి స్టార్లను తన జడలో చుట్టేసుకుంది.నితాన్షి లుక్లో ప్రధాన ఆకర్షణ, ముత్యాల జడలో కేన్స్ 2025లో తన ముత్యాల జుట్టుతో 8 మంది బాలీవుడ్ నటీమణులకు నివాళి అర్పించింది. నితాన్షి గోయెల్ అలనాటి బాలీవుడ్ అందాల తారలు మధుబాల, నర్గీస్, మీనా కుమారి, నూతన్, వహీదా రెహ్మాన్, ఆశా పరేఖ్, వైజయంతిమాల, హేమ మాలిని, రేఖ , శ్రీదేవి వంటి ప్రముఖ బాలీవుడ్ నటీమణుల సూక్ష్మ ఫోటో ఫ్రేమ్లున్న (miniature photo frames) కస్టమ్-మేడ్ హెయిర్ యాక్సెసరీతో అదరగొట్టేసింది. హిందీ సినిమా ప్రపంచంలో చెరిగిపోని ముద్ర వేసుకున్న నటీమణులపై తన ప్రేమను చాటుకున్న వైనం పలువుర్ని ఆకట్టుకుంది. కాన్స్ 2025కి ఈ డ్రెస్ వేసుకోవాలని నిర్ణయించుకోవడానికి తనకు 10-15 నిమిషాలు పట్టిందని చెప్పింది.చదవండి: 2027లో సుప్రీంకోర్టు చరిత్రలోనే రికార్డు సృష్టించనున్నది ఎవరో తెలుసా?ముత్యాల చీర,పూసలు, ముత్యాలు, సీక్విన్లతో తయారు చేసిన ప్రీ-డ్రేప్డ్ చీరలో అందంగా ముస్తామైంది. దానిపై మల్టీ లేయర్ల , 3D వర్క్ , ఇంకా దీనికి భారీ పల్లూ కూడా ఉంది. ఈ చీరకు ముత్యాలు పొదిగిన స్ట్రాపీ బ్లౌజ్ను జత చేసింది. తన ఫ్యాషన్ ఐకాన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ అని చెప్పిన నితాన్షి, కాన్స్లో ఉన్నప్పుడు అలియా భట్ ధీటుగా ఉండాలని కోరుకున్నానని వెల్లడించింది. నితాన్షి లుక్ డిస్నీడాల్గా చాలా ముద్దుగా ఉంది.నితాన్షి రికార్డులాపతా లేడీస్ చిత్రంలో ఉత్తమ నటి అవార్డును అందుకున్న అతి పిన్న వయస్కురాలిగా రికార్డ్. లోరల్ పారిస్కు ప్రాతినిధ్యం వహిస్తూ, ఆమె గురువారం కాన్స్ రెడ్ కార్పెట్లోకి అడుగుపెట్టింది, ఈఘనతను సాధించిన అతి పిన్న వయస్కురాలైన భారతీయ నటిగా నిలిచింది. ఇదీ చదవండి: మాయమైపోతున్న మనిషి కోసం..శాలిని -
Miss World Zimbabwe మెంటల్ హెల్త్ పై సైలెన్స్ వద్దు
‘‘ప్రస్తుతం నేను ప్రతిష్టాత్మక ప్రపంచ సుందరి వేదిక పైన నిల్చున్నాను. కానీ మన ప్రపంచం అంత అందంగా లేదు.., ఎన్నో సామాజిక వైరుధ్యాలున్నాయ’ని మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న మిస్ జింబాబ్వే కోర్ట్న జాంగ్వే తెలిపింది. 2023 నాటికి ప్రపంచ సామాజిక వైకల్యానికి మానసిక ఆరోగ్య సమస్యలు ప్రధాన కారణంగా నిలువనున్నాయని, ఇది తన మాట కాదు.. ఏకంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించిందని గుర్తు చేసింది. ముఖ్యంగా తమ ఆఫ్రికన్ దేశాల్లో ఈ మానసిక ఆరోగ్య (మెంటల్ హెల్త్) సమస్యలు మరింత ఎక్కువగా ఉన్నప్పటికీ, దీని గురించి ఎవరూ అంతగా మాట్లాడట్లేదని జాంగ్వే ఆవేదన వ్యక్తం చేసింది. ఒక వేళ తాను మిస్ వరల్డ్ విజేతగా నిలిస్తే ఈ సమస్యపై కొనసాగుతున్న నిశ్శబ్దాన్ని ఛేదించడానికి తన కిరీటాన్ని, కీర్తిని వినియోగిస్తానని ఉద్వేగంగా ప్రకటించింది. మిస్ వరల్డ్ 2025 నేపథ్యంలో కోర్ట్న జాంగ్వే ప్రత్యేకంగా ‘సాక్షి’తో తన అనుభవాలను పంచుకుంది. మిస్ వరల్డ్ అనేది మహిళా సాధికారత పై దృష్టి సారించే అంతర్జాతీయ వేదిక. ఈ గుర్తింపు మహిళా సాధికారత, ఇతర సమస్యలపైన పోరాడటానికి మద్దతిస్తుందని నమ్ముతాను. నా దృష్టిలో నిజమైన అందం బాహ్య రూపాన్ని అధిగమిస్తుంది. నిజమైన సౌందర్యం మనల్ని వ్యక్తపరిచే వ్యక్తిత్వం, చుట్టూ ఉన్న ప్రపంచానికి ఎలా దోహదపడతారనే బాధ్యత.అందుకే సోషల్ మెంటల్ హెల్త్ను నా భద్యతగా తీసుకున్నాను. డిప్రెషన్, మానసిక ఒత్తిడి వంటి సమస్యలతో పోరాడుతున్న సమాజంలో పెరిగాను. ఇలాంటి కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న కుటుంబాలను దగ్గరగా చూశాను. నా పాఠశాలలో నా స్నేహితులు డ్రగ్స్కు బానిసలైన సంఘటనలు చూస్తూ పెరిగాను. ఈ సమస్యలకు మా మూలాల్లో కారణాలు ఎన్నైనా ఉండొచ్చు.., కానీ వాటిని మార్చాల్సిన బాధ్యత నా పైన ఉంది. జింబాబ్వే వంటి మా ఆఫ్రికన్ దేశాల్లో పలు సామాజిక రుగ్మతలున్నాయి. ఇలా మాట్లాడితే అది మా మూలాలకు కళంకం కావొచ్చు. కానీ నేను దీని పైన అవగాహన కల్పించాలని నిశ్చయించుకున్నాను. ఇది మా ఒక్కరి సమస్య కాదు.. ప్రపంచ సమస్య. మిస్ జింబాబ్వేగా నిలిచిన తరువాత నా ప్రయత్నం వల్ల చాలా మార్పును చూశాను. అందుకే నేను మిస్ వరల్డ్ విజేతగా నిలిస్తే నా ప్రయత్నాన్ని విశ్వవ్యాప్తం చేస్తాను. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా జింబాబ్వేలో చేపట్టిన నాప్రాజెక్ట్ను ప్రపంచంలోని వివిధప్రాంతాలకు తీసుకెళ్తాను. డ్రగ్స్ను సమూలంగా నిర్మూలించడానికి నాకున్న పలుకుబడితో అవగాహన కల్పిస్తాను. ఆకలి, పేదరికం, కనీస వసతులు లేని వారి గొంతుకగా మారతాను. అంతర్జాతీయంగా ఫ్యాషన్ రంగంలో మా కళకు, డిజైనింగ్కు ప్రత్యేకత ఉంది. మా డిజైనర్లకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఒక మోడల్గా ఈ విషయంలో నేను గర్వపడతాను. మాది చాలా కష్టపడే వ్యక్తిత్వం. జింబాబ్వే గురించి నాకు చాలా నచ్చిన ఒక విషయం.. ఎట్టి పరిస్థితుల్లోనూ మాప్రామాణికతను కోల్పోము. అందుకే విదేశాల్లోనూ ఆఫ్రికన్ల సంస్కృతి ఇప్పుడు ట్రెండ్గా మారుతోంది. భారతదేశంలో సాంస్కృతిక వైవిధ్యం, సమ్మేళనం మనమందరమెంత విభిన్నమో దానిని అంతే అందంగా చూపిస్తుంది’’ అంటూ తన మనసులోని భావాలను పంచుకున్నారు జాంగ్వే.– హనుమాద్రి శ్రీకాంత్ -
మహిళలు తప్పక చదవాల్సిన పుస్తకం..!
మహిళల హక్కుల గురించి అస్పష్టత ఉన్నచోట, అంతగా అవగాహన లేని చోట ఉపయోగపడే పుస్తకం లీగల్లీ యువర్స్: ఎవ్రీ ఉమెన్స్ గైడ్ టు హర్ లీగల్ రైట్స్. లాయర్, రైట్స్ అడ్వకేట్ మానసి చౌదురి రాసిన ఈ పుస్తకాన్ని ప్రసిద్ధ ప్రచురణ సంస్థ హార్పర్కాలిన్స్ ప్రచురించింది. భారతీయ మహిళల న్యాయ హక్కులపై సమగ్రమైన స్పష్టతను అందించే పుస్తకం ఇది. మన దేశ న్యాయవ్యవస్థను అర్థమయ్యేలా చేస్తూ, సంక్లిష్ట చట్టాల గురించి సులువైన రీతిలో పరిచయం చేస్తుంది.వారస్వత హక్కులు, ఉద్యోగ ప్రదేశంలో వేధింపులు, రీప్రొడిక్టివ్ రైట్స్...మొదలైన వాటి గురించి వివరిస్తుంది.‘జ్ఞానం అనేది ఎంపవర్మెంట్కు తొలి అడుగు’ అంటున్న మానసి చౌదురి ‘పింక్ లీగల్’ వ్యవస్థాపకురాలు.‘ఈ పుస్తకం మహిళలకు మాత్రమే కాకుండా, మహిళల హక్కులను అర్థం చేసుకోవడంలో పురుషులకు కూడా ఉపకరిస్తుంది’ అంటుంది హార్పర్కాలిన్స్ ఇండియా ఎడిటర్ హిమాకుమార్.(చదవండి: Miss world 2025: అతడు.. ఆమె... మిస్ వరల్డ్) -
2027లో సుప్రీంకోర్టు చరిత్రలోనే రికార్డు సృష్టించనున్నది ఎవరో తెలుసా?
భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు, ఆరు నెలలు పాటు నవంబర్ 23 దాకా ఆయన సీజేఐగా సేవలందిస్తారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయనతో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ప్రమాణం చేయించారు. జస్టిస్ గవాయ్ ప్రస్తుత సిజెఐ సంజీవ్ ఖన్నా మాదిరిగానే ఆరు నెలల పాటు అత్యున్నత న్యాయాధికారిగా సేవలందిస్తారు. ఇంతకంటే తక్కువ రోజులు పదవిలో ఉన్న ప్రధాన న్యాయమూర్తుల గురించి తెలుసు కుందాం.జస్టిస్ బీవీ నాగరత్న ఘనతభారత సుప్రీంకోర్టు స్థాపించి 75 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రధాన న్యాయమూర్తి పదవి ఇంతవరకు ఏ మహిళకు దక్కలేదు. కానీ ప్రముఖ న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న 2027లో భారతదేశపు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రికార్డు సృష్టించనున్నారు. ఆమె పదవీకాలం కేవలం 36 రోజులు మాత్రమే. 2027, సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 30 వరకు మాత్రమే ఆమె ఈ పదవిలో ఉన్నారు. అయితే ఇదే తక్కువ కాదు. అత్యల్ప కాలం సీజేఐగా పనిచేసిన వారు జస్టిస్ కమల్ నారాయణ్ సింగ్. ఆయన పదవీకాలం కేవలం 17 రోజులు మాత్రమే.సుప్రీంకోర్టులో ఒక మహిళా న్యాయమూర్తిగా అత్యధిక కాలం అంటే 6 సంవత్సరాల 2 నెలల పాటు పనిచేసిన తర్వాత బివి నాగరత్న 54వ సిజెఐగా ఆమె పదవీకాలం కేవలం 36 రోజులు మాత్రమే ఉండనుంది. సెప్టెంబర్ 27, 2027న రికార్డులు మీద రికార్డు సృష్టించనున్నారు జస్టిస్ బీవీ నాగరత్న.75 సంవత్సరాల చరిత్రలో భారతదేశపు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి అవుతారు. సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తిగా అత్యధిక కాలం అంటే ఆరు సంవత్సరాల రెండు నెలలు పనిచేసిన రికార్డుఅంతేకాదు ఆమె తండ్రి జస్టిస్ ఇఎస్ వెంకటరామయ్య 19వ సీజేఐగా పనిచేశారు. ఈ నేపథ్యంలో భారతదేశ చరిత్రలో భారతదేశ ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన తొలి తండ్రీ బిడ్డలుగా నిలవనున్నారు. 2008లో జస్టిస్ బీవీ నాగరత్నకర్ణాటక హైకోర్టుకు ఎంపికయ్యారు. 2021 ఆగస్టులో సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. మరిన్ని విశేషాలుఅత్యధిక కాలం పనిచేసింది జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ భారత ప్రధాన న్యాయమూర్తిగా 7 సంవత్సరాల 139 రోజులు పనిశారు. అత్యంత తక్కువ రోజులు పనిచేసిన వారిలో కమల్నారాయణ్ సింగ్ తరువాత జస్టిస్ ఎస్ రాజేంద్ర బాబు నిలుస్తారు. రాజేంద్ర బాబు పదవీకాలు 29 రోజులు . సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం సీనియారిటీ నియమాన్ని అలాగే పాటిస్తే, జస్టిస్ బివి నాగరత్న మేడో అతి తక్కువ పదవీకాలం అంటే 36 రోజులు సేవలందించే అవకాశం ఉంది.ఇప్పటివరకు భారతదేశంలోని 51 మంది 11 మంది చీఫ్ జస్టిస్లలో అందరూ పురుషులే. 11 మంది మహిళలు మాత్రమే సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా పనిచేశారు.సీనియారిటీకి అనుగుణంగా న్యాయమూర్తులను పదోన్నతి కల్పించాలనే అలిఖిత నియమాన్ని అనుసరిస్తుంది. ఈ నియమం ప్రకారం, సాధారణంగా, పరిశీలనలో ఉన్న న్యాయమూర్తులలో, సీనియర్ న్యాయమూర్తిని అత్యున్నత న్యాయస్థానానికి ఎంపిక చేస్తారు. అదేవిధంగా, సీనియర్ న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తి అవుతారు. ఇతర నియమిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల పదవీకాలం కూడా కేవలం ఆరు నెలల నుండి ఒక సంవత్సరం వరకు ఉంటుంది. ఈనేపథ్యంలో మాజీ చీఫ్ జస్టీస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ ఎనిమిది మంది ప్రధాన న్యాయమూర్తులను హైకోర్టులకు నియమించారు. వారిలో ప్రధాన న్యాయమూర్తి రాజీవ్ శక్తిధర్ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు నుండి కేవలం 24 రోజుల తర్వాత పదవీ విరమణ చేశారు.అయితే ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు మరియు హైకోర్టులలో ప్రధాన న్యాయమూర్తుల పదవీకాలంపై చర్చ మొదలైంది.భారత 40వ ప్రధాన న్యాయమూర్తి పళనిసామి గౌండర్ సదాశివం, CJIల స్వల్ప పదవీకాలంపై స్పందించారు. "నేను చేయాలనుకున్నవి చాలా ఉన్నాయి కానీ (నా) స్వల్ప పదవీకాలం కారణంగా చేయలేకపోయాను" అని పదవీ విరమణకు రెండు రోజుల ముందు వ్యాఖ్యానించడం గమనార్హం. ఈయన దాదాపు తొమ్మిది నెలలపాటు పదవిలో ఉన్నారు. ప్రధాన న్యాయమూర్తులకు స్థిరమైన పదవీకాలం అవసరమని భావించారు.సెప్టెంబర్ 2024లో జస్టిస్ హిమా కోహ్లీ పదవీ విరమణ చేసిన తర్వాత, సుప్రీంకోర్టులో మహిళా న్యాయ మూర్తుల సంఖ్య 34 మందిలో ఇద్దరు మాత్రమే మహిళలు. ప్రస్తుతం, జస్టిస్ బీవీ నాగరత్న , జస్టిస్ బేలాఎం త్రివేది మాత్రమే సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తులు. 1989లో సుప్రీంకోర్టుకు నియమితులైన మొదటి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ ఫాతిమా బీవీ చరిత్ర సృష్టించారు, కానీ ఆమె సుప్రీంకోర్టుకు ఎంపికైన మహిళా న్యాయమూర్తులలో రెండున్నర సంవత్సరాల అతి తక్కువ పదవీకాలం పనిచేశారు.ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం, హైకోర్టు న్యాయమూర్తులలో 14శాతం మంది మహిళలు ఉన్నారు. సీనియారిటీ నియమాన్ని అలాగే పాటిస్తే రాబోయే కొన్ని సంవత్సరాలలో ఉన్నత న్యాయస్థానంలో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరుగుతుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే. -
అందం కాదు బంధం
ఇప్పుడు అందాలపోటీలు చాలా మారాయి. రంగు, రూపు, ఆకృతి లాంటివాటికి అంత ప్రాధాన్యం ఉండట్లేదు. బాహ్య సౌందర్యం కన్నా అంతఃసౌందర్యాన్నే ఆరాధిస్తున్నారు. అందుకే అందాలపోటీల్లో ఇన్క్లూజివిటీ పెరిగింది. మేని ఛాయ, ఆకృతి ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇది మంచి పరిణామం అని చెబుతున్న మిస్ సోమాలియా జైనబ్(Zainab Jama) బాలీవుడ్ సినిమాలు చాలా చూస్తారట. షారూఖ్ ఖాన్, కరీనా కపూర్ తన ఫేవరెట్ యాక్టర్స్ అని చెబుతున్నారు. ఆమె ఇంకా ఎన్నో విషయాలను ‘సాక్షి ఫ్యామిలీ’తో పంచుకున్నారు.నేను ఎఫ్జీఎమ్ (ఫిమేల్ జెనిటల్ మ్యుటిలేషన్) సర్వైవర్ని. సోమాలియాలో ఉన్న కామన్ హార్మ్ఫుల్ ప్రాక్టీస్ ఇది. మా దేశంలోని దాదాపు 98 శాతం మహిళలు దీన్ని అనుభవించినవారే! ఇప్పుడున్న ఆడపిల్లల్లో 30 శాతం మంది ఈ ఆచారం బారినపడే వయసుకు చేరుకున్నారు. అంటే ఏడేళ్లకు ఎఫ్జీఎమ్ చేస్తారు. ఎఫ్జీఎమ్ అంటే మహిళల సెక్సువల్ ఆర్గాన్ని కత్తిరించడం. యవ్వనంలో ఆమెకు లైంగికేచ్ఛ లేకుండా చేయడం. లైంగికేచ్ఛ లేకపోతే ఏ మగవాడి ఆకర్షణకు లోనుకారనే ఒక ప్రమాదకర, మూఢ విశ్వాసమన్నమాట.ఇది ఒక్క సోమాలియాలోనే కాదు ఆఫ్రికాలోని చాలా దేశాల్లో ఇప్పటికీ ప్రాక్టీస్లో ఉంది. ఈ అనాచారం వల్ల మా దేశంలో చాలామంది అమ్మాయిలు ప్రాణాలు కోల్పోయారు. ఇంకెంతోమంది అధికరక్తస్రావంతో దాదాపు చావు అంచులదాకా వెళ్లారు. నేను కూడా దీన్నుంచి కోలుకుని.. ఈ కథను షేర్ చేయడానికి చాలా కాలమే పట్టింది. నా కథ విని.. ఇలాంటి దుర్మార్గమైన ఆచారాన్ని రూపుమాపడానికి తగిన స్పందన, సహాయం అందుతుందని ఒకే ఒక ఆశతో నా ఈ కథను నాకు దొరికిన వేదిక మీదల్లా పంచుకోవడం మొదలుపెట్టాను. ఈ బ్యూటీపాజెంట్లో కూడా నా తోటి కంటెస్టెంట్స్కి చె΄్పాను. ఆఫ్రికా దేశాల్లో ఇలాంటి దురాచారం ఒకటుందని ఈ కంటెస్టెంట్స్లో చాలా మందికి తెలియదు. నా కథ విని చలించిపోయారు.ఫిమో ఇనిషియేటెడ్ ఫౌండేషన్ను స్టార్ట్ చేసి, ఆ దురాచారానికి వ్యతిరేకంగాపోరాడుతున్నానని తెలిసి.. మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. నాలో భరోసా నింపారు. బ్యూటీపాజెంట్ అంటే కేవలం స్కిన్ షో మాత్రమే అనుకునేవారు ఈ విషయం విని తమ అభి్రపాయాన్ని మార్చుకుంటారని ఆశిస్తున్నాను. ఈ కంటెస్టెంట్స్లో ఒక్కొక్కరిది ఒక్కో స్ట్రగుల్. అందరం అన్నీ షేర్ చేసుకుంటున్నాం. దానివల్ల వ్యక్తిగత సమస్యలు,పోరాటాలు చిన్నవిగా తోస్తున్నాయి. ఎదుర్కోవడానికి బోలెడంత అండ దొరికిన ఫీలింగ్ కలుగుతోంది. సిస్టర్హుడ్ డెవలప్ అవుతోంది. ఒకరికొకరు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సరికొత్త ప్రయత్నాలకు ప్రేరణనిస్తున్నారు.పాజెంట్ తర్వాత కూడా ఈ బాండింగ్ కంటిన్యూ అవుతుందని ఆశిస్తున్నాను.కొత్తగా అనిపించడం లేదు.. ఇండియా, ఆఫ్రికా సంస్కృతి, ఆహారపు అలవాట్లకు వస్తే.. ఇక్కడ నాకేమీ కొత్తగా అనిపించట్లేదు. నేను ప్యూర్ వెజిటేరియన్ని. సో ఇక్కడి భోజనాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను. తెలంగాణ నా సొంతింటిని మరిపిస్తోంది. ఈపాజెంట్, కంటెస్టెంట్స్తో బాండింగ్, కొత్త భాషలు, కొత్త కల్చర్స్ తెలుసుకోవడం.. ఇవన్నీ నిజంగా వండర్ఫుల్ ఎక్స్పీరియెన్స్. తిరుగు ప్రయాణంలో ఆ ఎక్స్పీరియెన్సెస్ని, ఇక్కడ సంపాదించుకున్న జ్ఞానాన్ని తీసుకెళ్దామనుకుంటున్నాను. – సరస్వతి రమమండేలా స్ఫూర్తి నాకు ఏడేళ్లున్నప్పుడు జెనిటల్ మ్యుటిలేషన్ జరిగింది. అదొక పెయిన్ఫుల్æట్రామా. దానినుంచి కోలుకోవడానికి చాలా టైమ్ పట్టింది. నాలా ఇంకే అమ్మాయికీ జరగొద్దని అప్పుడే నిర్ణయించుకున్నాను. నా తొమ్మిదేళ్ల వయసులో మా కుటుంబం యూకేకి మైగ్రేట్ అయింది రెఫ్యూజీగా. అక్కడే ఏవియేషన్ అండ్ ఎయిర్క్రాఫ్ట్ మేనేజ్మెంట్ చేశాను. ప్రయాణాలన్నా.. ఏరోప్లేన్స్ అన్నా చాలా ఇష్టం. అందుకే అందులోనే చదువు పూర్తి చేశాను. ఒక్క ఎఫ్జీఎమ్ కోసమే కాదు.. ఇలాంటి ఇంకెన్నో దురాచారాలు, హింస మీద అమ్మాయిలు, మహిళలకు చైతన్యం కలిగించే ఎన్నో ఫౌండేషన్స్తో కలిసి పనిచేస్తున్నాను.అమ్మాయిల చదువు కోసం కృషి చేసే స్వచ్ఛంద సంస్థలతోనూ అసోసియేట్ అయి ఉన్నాను. మహిళలందరినీ ఏకం చేసి వారి మధ్య సిస్టర్హుడ్ను పెంచడానికీ ప్రయత్నిస్తున్నాను. నా మాతృదేశానికి వెళ్లిపోయి.. యుగాలుగా నాటుకుని ఉన్న ఈ అనాచారాన్ని రూపుమాపడమే నా లక్ష్యం. ఇదొక్క సోమాలియాకే పరిమితమైన సమస్య కాదు. ఆఫ్రికాలోని చాలా దేశాల్లో ఉంది. మార్పు కోసం అన్ని దేశాల్లోనూ వర్క్ చేస్తాను. అయితే ఇది నేనిప్పుడు మీతో చెబుతున్నంత ఈజీ కాదని తెలుసు. మా ట్రెడిషన్ గురించి ప్రపంచానికి చెబుతున్నానని, ధిక్కరిస్తున్నానని బెదిరింపులు, హెచ్చరికలు వస్తున్నాయి. వెనకడుగు వేసేది లేదు. ఈ విషయంలో నాకు నెల్సన్ మండేలా స్ఫూర్తి. – ‘మిస్ సోమాలియా’ జైనబ్ -
రైతు కూతురి కలల సేద్యం
ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ నందిని గుప్తా(Nandini Gupta) రాజస్థాన్లోని ఓ పల్లెటూరిలో రైతు కుటుంబంలో జన్మించింది. ‘అందరికీ నమస్కారం.. నేను మీ నందిని..’ అంటూ తెలుగులో చిరునవ్వుతో పలకరించిన ఈ బ్యూటీ మిస్ వరల్డ్పోటీలోపాల్గొనేంతగా తనను తాను ఎలా నిర్మించుకుందో వివరించింది. ‘ఎక్కడ నుంచి వచ్చాం అన్నది ముఖ్యం కాదు, ఎక్కడికి వెళ్లాం.. అన్నదే ముఖ్యం’ అన్న ఆత్మవిశ్వాసంతోపాటు భవిష్యత్తు ప్రణాళికలనూ మన ముందుంచింది మిస్ వరల్డ్– 2025 కాంటెస్ట్లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న నందిని గుప్తా.‘‘అమ్మానాన్నలకు నేను, చెల్లి సంతానం. స్కూల్లో చదివేటప్పుడే ఐశ్వర్యరాయ్ మిస్ వరల్డ్ అయినప్పుడు ఆమెను చాలా మంది అభినందించడం, కెమెరా ఫ్లాష్ లైట్లలో వెలిగిపోతుండటం టీవీలో చూసి... ‘ఆమె ఎవరు?’ అని అమ్మను అడిగాను. ‘ఆమె మిస్ వరల్డ్, నటి’ అని చెప్పింది అమ్మ. నా మనసులో ఆనాటి సంఘటన బలంగా ముద్రించుకుపోయింది. అప్పటినుంచి అందంగా ఉండటానికి ప్రయత్నాలు మొదలుపెట్టాను. మంచి డ్రెస్సులు వేసుకునేదాన్ని, మేకప్ చేసుకునేదాన్ని, హెయిర్స్టైల్స్ మార్చేదాన్ని. అందాలపోటీలోపాల్గొనడానికి ఏమేం చేయాలో తెలుసుకుంటూ ఉండేదాన్ని. ఓ రైతు కూతురు కలలు కనే ధైర్యం చేయవచ్చా! అనే ఆలోచన లేకుండా నా ప్రయాణాన్ని కొనసాగించాను. నా ఆసక్తులు గమనించిన అమ్మానాన్నలు ఆ తర్వాత మా కుటుంబాన్ని ముంబయ్కి షిఫ్ట్ చేశారు. ఆ విధంగా ఆవాలు పండే పోలాల మధ్య పెరిగిన నేను ముంబయ్ ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టాను.మాట్లాడాలంటే బెరుకుపోటీలలోపాల్గొనే కొత్తలో వేదికలపైన నా గురించి నేను చెప్పుకోవడానికి, మైక్ ముందు మాట్లాడటానికి సిగ్గుపడేదాన్ని. ఏదో తెలియని బెరుకు ఉండేది. ఇలా అయితే రాణించలేను అనుకున్నాను. నా శక్తి ఏంటో ప్రపంచానికి తెలియజేయాలని ప్రయత్నించాను. నన్ను నేను కొత్తగా నిర్మించుకోవడంలో ఎలా ఉన్నాను, ఎలా ఉండాలనుకుంటున్నాను అనే విషయాల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. నా డ్రెస్, మేకప్, నా మాట, చూపు అన్నీ సమర్థంగా ఉన్నప్పుడు దేనికీ వెనకంజ వేయనక్కర్లేదు అని తెలుసుకున్నాను. ఆ ఆత్మవిశ్వాసమే ఈ రోజు ఇలా మీ ముందుకు తీసుకువచ్చింది.మార్పునకు శ్రీకారంఅందాలపోటీలవైపు వెళ్లేటప్పుడు మొదట్లో తటపటాయించినప్పటికీ మిస్ రాజస్థాన్ టైటిల్ గెలిచాక నా ఇష్టానికి మద్దతు ఇచ్చారు మా నాన్న. ఫెమినా మిస్ ఇండియాపోటీల్లో గెలిచాక అయితే ఆయన చాలా ఉద్వేగానికి గురయ్యారు. ఆ క్షణాలు ఎప్పటికీ మరవలేను. చదువంటే నాన్నకు చాలా ఇష్టం. నాన్న కోరిక మేరకు బిజినెస్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాను. నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో అమ్మాయిలు తల మీదుగా ముసుగు ధరించాలి, వారికి పెద్దగా చదువు అక్కర్లేదు, త్వరగా పెళ్లి చేయాలనే ఆలోచన అక్కడి తల్లిదండ్రుల్లో ఉండేది. ఇప్పుడు అక్కడా బ్యూటీ కాంటెస్ట్లకు ట్రైనింVŠ ఇచ్చే అకాడమీలు పెరిగాయి. తల్లిదండ్రులు కూడా తమ కూతుళ్లను బ్యూటీ కాంటెస్ట్లోపాల్గొనడానికి పోత్సహిస్తున్నారు. ఇది నాకెంతో సంతోషాన్ని ఇస్తోంది.దివ్యాంగుల సాధికారత కోసం..దివ్యాంగులను సమాజంలో ఒక భాగం చేయడం కోసం పనిచేయడమే నా లక్ష్యం. మా మేనమామ పుట్టుకతోనే దివ్యాంగుడు. సరిగా మాట్లాడలేరు. కానీ, ఎప్పుడూ మానసిక స్థైర్యంతో ఉంటారు. చిన్నప్పటి నుంచి అతని కళ్ల నుంచి ప్రపంచాన్ని చూశాను. కనిపించని బాధ ఏదో మోస్తున్నట్టుగా అతనిలో నాకు కనిపించేది. అలాంటి వాళ్లు పడుతున్న బాధలు స్వయంగా చూశాను. వికలాంగుల గాధలు చాలా బాధనిపించేవి. మిస్ ఇండియా వరల్డ్ టైటిల్ గెలిచాక ‘ఏక్తా ప్రాజెక్టు’లో భాగంగా అనేక మంది దివ్యాంగులతో కలిసి పలు కార్యక్రమాల్లోపాల్గొన్నా. వారి కలల సాకారానికి కృషి చేయాలనుకున్నాను. భవిష్యత్తు ప్రణాళికలుఇప్పటికే మోడల్గా ప్రకటనలలో యాక్ట్ చేస్తున్నాను. తెలుగు సినిమాలు, డ్యాన్స్లు అంటే చాలా ఇష్టం. మహేష్బాబు నటించిన సినిమాలో ‘కుర్చీ మడతపెట్టి .. ’సాంగ్ మరీ మరీ ఇష్టం. ఆపాట విన్నప్పుడల్లా డ్యాన్స్ చేస్తుంటా. నటిగా నన్ను నేను నిరూపించుకోవాలని ఉంది’’ అంటూ వివరించింది ఈ బ్యూటీ. – నిర్మలారెడ్డిరాజస్థాన్లోని కోటాకు దగ్గర్లో ఉన్న చిన్న పల్లెటూరులో రైతు కుటుంబంలో పుట్టి పెరిగింది నందిని గుప్తా. స్థానిక హస్తకళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కోటా డోరియా వస్త్రాల ప్రాచుర్యానికి కృషి చేస్తోంది. ఫ్యాషన్లోనూ తన మూలాలను చూపించేలా దుస్తుల ఎంపికలో ప్రత్యేక శైలినిపాటిస్తోంది. యోగా, డ్యాన్స్, హెల్తీ డైట్నుపాటించడమే తన బ్యూటీ సీక్రెట్ అని తెలిపింది. -
76 ఏళ్ల వయసులో 56 ఏళ్ల తరువాత కేన్స్లో అరంగేట్రం..అస్సలు ఊహించలేదు
2025 లో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ (2025 Cannes Film Festival)లో అరంగేట్రం చేసేందుకు అలనాటి అందాల సుందరి సిద్ధమవుతోంది. ఆమె మరెవ్వరో కాదు ప్రఖ్యాత నటి, దర్శకురాలు, నిర్మాత, టాక్ షో హోస్ట్ సిమీ గరేవాల్ (Simi Garewal). అద్భుతమైన నటనతో బాలీవుడ్లో పాపులర్ నటిగా కొనసాగింది. దో బదన్, రాజ్ కపూర్తో మేరా నామ్ జోకర్, అరణ్యర్ దిన్ రాత్రి, పదాతిక్ వంటి చిత్రాలలో తన నటనా నైపుణ్యానికి ప్రశంసలందుకుంది. అంతేకాదు రెండెజౌస్ విత్ సిమి గరేవాల్, సిమి సెలెక్ట్స్ ఇండియాస్ మోస్ట్ డిజైరబుల్, ఇట్స్ ఎ ఉమెన్స్ వరల్డ్ వంటి కార్యక్రమాలకు హోస్ట్గా కూడా తన ప్రత్యేకతను చాటుకుంది.తాజాగా ఈ అందాల సుందరి సిమీ గరేవాల్ తనకెంతో ఇష్టమైనతెల్లని దుస్తుల్లో మెరిసేందుకు సిద్ధమవుతోంది. 2025 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అరంగేట్రం చేయనుంది. ఈ విషయాన్ని ఇన్స్టాలో సిమీ ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సిమీ సందడినిచూసేందుకు ఎదురు చూస్తున్నారు.‘‘56 సంవత్సరాల తరువాత ఈ సినిమా నన్ను కేన్స్లో రెడ్ కార్పెట్పైకి తీసుకెళ్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. నేను చాలా ధన్యురాల్ని’’ అంటూ ఇన్స్టా పోస్ట్లో సంతోషం వెలిబుచ్చారు.ఇక్కడ సిమి నటించిన, లెజెండరీ ఫిల్మ్ మేకర్ సత్యజిత్ రే 'అరణ్యర్ దిన్ రాత్రి' అప్డేటెడ్ వెర్షన్ ప్రదర్శించనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆమె రెడ్ కార్పెట్ పై నడవనుంది. తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో, సిమీ గరేవాల్ రెడ్ కార్పెట్పై తాను ధరించబోయే దుస్తుల వీడియోను పోస్ట్ చేసింది. కార్లియో ఫ్యాషన్ బ్రాండ్ నుండి దుస్తులను పరిశీలిస్తున్న క్లిప్ను షేర్ చేసింది. నటి తెల్లటి టోన్డ్ షర్ట్ , ప్యాంటులో చాలా అందంగా, సింపుల్ మృదువైన మేకప్, కళ్ళజోడు, ఓపెన్ హెయిర్ ఆమె లుక్కు మరింత సొబగులద్దాయి. ఈ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఈ డ్రెస్లో అద్భుతంగా కనిపిస్తారని తెలుసు.", "ఆ అందమైన తెల్లని గౌనుకు మరెవరూ న్యాయం చేయలేరు." "మీరు గ్రేస్ బ్యూటీ & డిగ్నిటీకి నిదర్వనం. అంటూ ఫ్యాన్స్ ఆమెకు శుభాకాంక్షలు అందించారు.చదవండి: తల్లిని పోగొట్టుకున్న రెండేళ్ల చిన్నారితో..ఎంత కష్టం : డెలివరీ ఏజెంట్ స్టోరీ1970 నాటి బాలీవుడ్ 'అరణ్యర్ దిన్ రాత్రి’ చిత్రాన్ని వెస్ ఆండర్సన్ , మార్టిన్ స్కోర్సెస్ అప్డేట్ వెర్షన్గా తీసుకొచ్చారు. ఈ 4K వెర్షన్ను కేన్స్ 2025 ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించనున్నట్లు ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. సునీల్ గంగోపాధ్యాయ రాసిన నవల ఆధారంగా సత్యజిత్ రే 1970లో నిర్మించిన అడ్వెంచర్ డ్రామా చిత్రం. ఈ చిత్రం 20వ బెర్లిన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ చిత్రంగా గోల్డెన్ బేర్కు నామినేట్ అయింది.ఈ చిత్రంలో సిమీగరేవాల్, సౌమిత్ర ఛటర్జీ, షర్మిలా ఠాగూర్ , రబీ ఘోష్ కీలక పాత్రల్లో నటించారు.చదవండి: కదులుతున్న కారుపై కొత్త జంట విన్యాసాలు, వైరల్ వీడియో -
నాటి భారత్-పాక్ యుద్ధం: ఆ 300 మంది మహిళలు 72 గంటల్లోనే..!
ఆపరేషన్ సిందూర్లో ఎయిర్ఫోర్స్ కీలక పాత్రపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తంచేశారు. ఈ రోజు ప్రధాని మోదీ పంజాబ్లోని అదంపూర్ ఎయిర్బేస్కు వెళ్లి..ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో ముచ్చటించి వారిని అభినందించారు. అలాగే పాక్కు ఇండియా ఎయిర్ఫోర్స్ సత్తా చూపించారంటూ ప్రశంసలు కురిపించారు కూడా. ఈ నేపథ్యంలో 1971 ఇండియా-పాక్ యుద్ధంలో ధ్వంసమైన భుజ్ వైమానిక దళ స్థావరాన్ని గంటల వ్యవధిలో పునర్నిర్మించి.. పాక్ దాడులను తిప్పిగొట్టిన గాథ గురించి తెలుసుకుందామా..!.1971 ఇండియా-పాక్ యుద్ధంలో..డిసెంబర్లో ఒక రాత్రి గుజరాత్లోని భుజ్ వైమానిక స్థావరంపై 14 ప్రాణాంతకమైన నాపామ్ బాంబులను జారవిడిచి కల్లోలం సృష్టించింది. ఆబాంబుల ధాటికి భుజ్ రన్వే ధ్వంసమైపోయింది. దాంతో భారత్ యుద్ద విమానాలు ఎగరలేని పరిస్థితి ఎదురైంది. మరోవైపు యుద్ధ కొనసాగుతోంది. ఈ విపత్కర పరిస్థితిలో వైమానికి దళాలకు ఏం చేయాలో పాలిపోలేదు. అదీగాక ఆ స్థావరంపై కేవలం రెండు వారాల్లోనే 35 సార్లకు పైగా బాంబు దాడులు జరిగాయి. మరోవైపు పాక్ శత్రు మూకలు ఆస్థావరాన్ని ఆక్రమించుకునేంత చేరువలో ఉన్నారు. చెప్పాలంటే..రన్వే లేకపోతే మొత్తం భారతవైమానిక రక్షణ వ్యవస్థ నేలమట్టం అయినట్లేనని పేర్కొనచ్చు. అలాగే అక్కడ ఉన్న సైన్యం, ఇంజనీర్లు కూడా తక్కువే మందే. సరిగ్గా అప్పుడే భుజ్ ఎయిర్బేస్కు ఇన్ఛార్జ్గా ఉన్న స్క్వాడ్రన్ లీడర్ విజయ్ కార్నిక్ మెరుపులాంటి ఆలోచన తట్టింది. అది ఫలిస్తుందా లేదా అన్న అనుమానం వ్యక్తం చేసే వ్యవధిలేని సంకటస్థితి. పైగా ప్రతి సెకను అత్యంత అమూల్యమైనది. దాంతో ఆయన సమీపంలోని మాదాపూర్ గ్రామంలోని మహిళలను సాయం తీసుకున్నారు. మొత్తం 300 మంది మహిళలు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. వారిలో తల్లులు, కుమార్తెలు, వితంతువులు కూడా ఉన్నారు. ఆకుపచ్చ చీరలే ఎందుకంటే..వారంతా శత్రు విమానాలకు కనపడకుండా ఆకుపచ్చ చీరలు ధరించి రన్వే నిర్మాణంకు పూనుకున్నారు. బరువైన రాళ్లను, సిమెంట్ బకెట్లను మోసుకెళ్లారు. చేతులతో మెర్టార్ కలిపారు. తమ ఇంటిని నిర్మించినంత శ్రద్ధతో రన్వేని తిరిగి నిర్మించారు. అయితే వైమానిక దాడి సైరన్లు మోగినప్పుడల్లా పొదల్లోకి వెళ్లి దాక్కునేవాళ్లు. ఆ ఆకుపచ్చని వస్త్రం ప్రకృతిలో కలిసిపోవడానికి ఉపయోగపడుతుందని..ఆ వస్త్రం ధరించే ఈ పనికి పూనుకున్నట్లు సమాచారం. ఆ మహిళలంతా ఆకలి, భయం, నిద్రలేని రాత్రులతో ఆహర్నిశలు కష్టపడ్డారు. పగుళ్లు మూపివేసేలా ఆవుపేడ ఉపయోగించారు. అలా వారంతా కేవలం 72 గంటల్లోనే రన్వేని తిరిగి నిర్మించారు. దాంతో గగనంలో కూడా యుద్ధం చేయగల శక్తిని భారత్ అందుకోగలిగింది. నిజానికి ఆ మహిళలకు ఆ నిర్మాణ పనిలో శిక్షణ లేదు, అలాగే యుద్ధ అనుభం, రక్షణాయుధాలు కూడా లేకుండా అజేయమైన ధైర్యమైన సాహసాలతో ముందుకొచ్చిన వీర వనితలు. ఆ రాత్రి ఏం జరిగిందంటే..నాటి రన్వే పునర్నిర్మాణంలో పాలుపంచుకున్న మహిళల్లో ఒకరైన కనాబాయి శివ్జీ హిరానీ మాట్లాడుతూ..1971 భారత్-పాక్కి యుద్ధం జరుగుతున్నప్పుడూ..నాకు 24 ఏళ్లు. డిసెంబర్లో ఒక రోజు రాత్రి భుజ్లోని విమానాశ్రయం రన్వేపై బాంబు దాడి చేసింది పాక్. రాత్రిపూట దాడి చేయడంతో అక్కడున్న ప్రతిదీ నాశనమైపోయింది. ఏం చేయాలో తోచని స్థితి. కాని యావత్తు దేశాన్ని ప్రమాదంలో పెట్టే పరిస్థితి కాబట్టి మా గ్రామంలోని మహిళ ఇందుకు తమ వంతుగా సహకరించేందుకు ముందుకొచ్చారు అని నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు". హిరానీ. దశాబ్దాలు గడుస్తున్న పాక్ తీరులో మార్పురావడంలో లేదు. కచ్చితంగా ప్రధాని మోదీ దీనిపై గట్టి చర్య తీసుకోవాలి. అలాగే పాక్కు నీరు, ఆహార సరఫరాను పూర్తిగా నిలిపివేయాలి. అప్పుడుగానీ వారికి తాము ఏం తప్పు చేశామన్నాది తెలియదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారామె. పైగా తాను పాక్పై ద్వేషంతో ఇలా అనడం లేదని..తన జీవితానుభవంతో చెబుతున్న ఆవేధనభరితమైన మాటలని అన్నారు హిరానీ.(చదవండి: Indian Army soldier: మనసును కదిలించే సైనికుడి రియల్ స్టోరీ..నటుడు మోహన్ లాల్ సైతం ఫిదా..!) -
సెయిలింగ్లో తెలంగాణ సత్తా : స్పెషల్ ఎట్రాక్షన్గా అమ్మాయిల నైపుణ్యం
సాక్షి, సిటీబ్యూరో: గత కొంతకాలంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి సెయిలింగ్లో తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా రాణిస్తోంది. ఇందులో భాగంగానే జాతీయ జూనియర్ సెయిలింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ సెయిలర్స్ నాలుగు బంగారు పతకాలు సహా మొత్తం ఆరు పతకాలతో సత్తా చాటారు. ముంబైలోని మార్వేలో జరిగిన ఈ టోర్నీలో హైదరాబాద్ రసూల్పురాలోని ఉద్భవ్ స్కూల్కు చెందిన లాహిరి కొమరవెల్లి అండర్–16 సబ్ జూనియర్ విభాగంలో బంగారు పతకం గెలిచింది. మొత్తం 9 రేసుల రెగెట్టాలో 4 రేసుల్లో మొదటి స్థానం, రెండు రేసుల్లో రెండో స్థానంతో 13 పాయింట్లతో 2025 జాతీయ చాంపియన్గా నిలిచింది. అదే స్కూల్కు చెందిన తనూజ కామేశ్వర్– శ్రవణ్ కత్రావత్లు జూనియర్ డబుల్ హ్యాండర్ విభాగంలో చివరి రోజు రెండు రేసులను గెలిచి నేషనల్ చాంపియన్స్ అయ్యారు. ఇదీ చదవండి: తల్లిని పోగొట్టుకున్న రెండేళ్ల చిన్నారితో..ఎంత కష్టం : డెలివరీ ఏజెంట్ స్టోరీఅండర్–15 బాలుర విభాగంలో బన్నీ బొంగూర్ బంగారు పతకం నెగ్గగా, రిజ్వాన్ మహమ్మద్ రజతం, రవి కుమార్ కాంస్యం గెలిచారు. ఒక ఈవెంట్లో తెలంగాణకు చెందిన ముగ్గురు సెయిలర్లు పోడియంపైకి రావడం ఇదే తొలిసారి. ఉద్భవ్ స్కూల్కు చెందిన చంద్రలేఖ తట్టారి తొలిసారి కాంస్య పతకం సాధించాడు. మొత్తంగా అండర్–16 సబ్ జూనియర్స్ పోడియంపైకి వచ్చిన ఆరుగురు సెయిలర్లలో ఐదుగురు తెలంగాణ క్రీడాకారులే కావడం విశేషం. ఈ సందర్భంగా హైదరాబాద్ యాచ్ క్లబ్ అధ్యక్షుడు, కోచ్ సుహీమ్ షేక్ సంతోషం వ్యక్తం చేశాడు.ఇదీ చదవండి: కదులుతున్న కారుపై కొత్త జంట విన్యాసాలు, వైరల్ వీడియోగతేడాది నుంచి తాము చేసిన ఫిట్నెస్, న్యూట్రిషన్, సైద్ధాంతిక శిక్షణ ఫలితాలను ఇచ్చిందని అన్నారు. నేషనల్స్లో టాప్–14లో ఎనిమిది మంది తెలంగాణ రాష్ట్రం వాళ్లే ఉండటం తమ శిక్షణ ఫలితమని, ఇది ఎంతో సంతోషాన్నిస్తుందని తెలిపాడు. జూన్లో జరిగే లాంగ్కవి ఇంటర్నేషనల్ టోర్నీ కోసం ఎంపికైన సెయిలర్స్ జాబితా త్వరలో విడుదల కానుంది. తెలంగాణ నుంచి కనీసం ఏడుగురు ఎంపికయ్యే అవకాశం ఉంది. ఈ సెయిలర్స్ షిల్లాంగ్లో జరిగే జాతీయ ర్యాంకింగ్ రెగెట్టాలో పాల్గొని, ఆ తర్వాత హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్లో జరిగే మాన్సూన్ రెగెట్టా ట్రోఫీలోనూ బరిలో నిలవనున్నారు. చదవండి: 138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్తో -
72nd Miss World: మీకూ మాకూ సామ్యం.. బౌద్ధం!
దాదాపు 120 దేశాల సుందరీమణులు. రకరకాల దేశాల శీతోష్ణస్థితులు... రకరకాల స్కిన్టోన్లు. వివిధ రకాల ఆకృతులు. వారందరికీ ఒక్కొక్కరిది ఒక్కో కథ! ఆత్మవిశ్వాసమే ఆభరణంగా.. ప్రతిభ, బ్యూటీ విత్ పర్సస్ ప్రధాన అర్హతలుగా తెలంగాణలో జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన ఆ సుందరీమణుల్లో రొజుకొకరి పరిచయం ఇక్కడ. ఈరోజు మిస్ జపాన్ కియానా తుమీత గురించి ఆమె మాటల్లోనే..నేను ప్రకృతి వైపరీత్యాల మీద పీహెచ్డీ చేస్తున్నాను. అంతకుముందు కేంబ్రిడ్జ్, ఎడింబరో యూనివర్సిటీల్లో విమెన్ లీడర్ షిప్ మాస్టర్ డిగ్రీ చేశాను. ఒక బిజినెస్ చానల్లోఎకనమిక్ న్యూస్ యాంకర్గా పనిచేస్తున్నాను. నా టాలెంట్ విషయాలకు వస్తే నేను జపనీస్ కాలిగ్రాఫర్ని. అందులో నాకు మంచి పేరుంది. ఎలక్ట్రిక్ ఫ్లూట్ కూడా వాయిస్తాను. ఈ పోటీల్లో టాలెంట్ రౌండ్లో ఎలక్ట్రిక్ ఫ్లూట్నే పెర్ఫార్మ్ చేయబోతున్నాను. ప్రకృతి గౌరవిస్తూ వైపరీత్యాలు రాకుండా జాగ్రత్తపడటం, ఒకవేళ ప్రకృతివైపరీత్యాలు సంభవిస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలో పిల్లలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తుంటాను. నా అందంతో ఈ ప్రయోజనాన్ని సాధించాలనుకుంటున్నా! ప్రకృతి వైపరీత్యాల పట్ల పిల్లలకు అవేర్నెస్ కల్పించడం! స్త్రీ, పురుష వివక్ష విషయానికి వస్తే.. దానికి జపాన్ కూడా అతీతమేమీ కాదు. చదువుకు సంబంధించి అమ్మాయి, అబ్బాయిలకు సమాన అవకాశాలున్నప్పటికీ.. లీడర్షిప్ విషయంలో మాత్రం పురుషులదే ఆధిపత్యం. ఆ అంతరం చాలా ఎక్కువ. వేతనాల్లో కూడా ఆ గ్యాప్ కనపడుతుంది. సమానమైన పనికి మహిళలకన్నా పురుషులకే వేతనాలు ఎక్కువ. డిసిప్లిన్, పని విషయాల్లో ప్రపంచంలోని ప్రతిదేశం జపాన్ వైపు చూస్తుందేమో కానీ.. టెక్నికల్ జాబ్స్ విషయంలో మాత్రం మేము ఇండియాను అప్రిషియేట్ చేస్తాం. కొత్తగా వచ్చిన ఏ టెక్నికల్ చేంజ్ను అయినా ఇట్టే గ్రహించి, అడాప్ట్ చేసుకుని రాణిస్తున్నారు. ఇండియాలో జరుగుతున్న క్రైమ్ గురించి వార్తల్లో విన్నప్పుడు కొంచెం నెర్వస్ ఫీలయ్యాను. కానీ ఈ పోటీల కోసం ఇక్కడ ల్యాండ్ అయ్యి, ఇక్కడి మనుషులు, వాళ్లిచ్చే మర్యాద అవన్నీ చూశాక ఆ నెర్వస్నెస్, భయాలు అన్నీ పటాపంచలయ్యాయి. ఇక్కడికి రావడానికి నాకు దుబాయ్లో కనెక్టింగ్ ఫ్లయిట్ ఉండింది. అక్కడ బోర్డింగ్లో నా లగేజ్తో అవస్థపడుతుంటే ఒక ఇండియన్ జెంటిల్మన్ నాకు చాలా హెల్ప్ చేశాడు. అప్పుడే నాకు ఇండియా మీద గౌరవం రెట్టింపయింది. ఈ దేశానికి సంబంధించి నాకు ఇష్టమైన మరోవిషయం.. ఎర్రటి బొట్టు. ఈ పాజెంట్లో ఒకరోజు నేను చీర కట్టుకుని, ఎర్రటి బిందీ పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇండియాకు, జపాన్కున్న మరో సామ్యం.. బౌద్ధం. మేము ఫాలో అవుతున్న బౌద్ధానికి, ఇక్కడికి వ్యత్యాసమున్నప్పటికీ బౌద్ధం ఈ దేశంతో మాకో కనెక్టివిటీని పెంచింది. ఇక్కడి ఆధ్యాత్మికతకు నేను ఫిదా అయ్యాను. బ్యూటీ పాజెంట్ విషయానికి వస్తే చాలా దేశాల్లో ఉన్నట్టే జపాన్లోనూ.. అందాల పోటీలు అంటే స్కిన్ షో తప్ప మరోటి కాదనే అభిప్రాయం, అపోహా ఉన్నాయి. కానీ బ్యూటీ విత్ పర్పస్ అనే ఐడియా నాకు నచ్చి.. పోటీల్లో పాల్గొంటున్నాను. సిస్టర్హుడ్ క్రియేట్ చేయడానికి ఇదొక వేదిక. సన్నగా ఉన్నామా.. లావుగా ఉన్నామా.. తెల్లగా ఉన్నామా.. నల్లగా ఉన్నామా అని కాదు.. అదసలు విషయమే కాదు. డజంట్ మ్యాటర్. ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నామన్నదే మ్యాటర్. అందుకే నా దృష్టిలో ఆత్మవిశ్వాసమే అసలైన అందం! జూనియర్ ఎన్టీఆర్తో నటించాలనుంది..నాటు నాటు పాట జపాన్లో చాలా ఫేమస్. ఆ సినిమా అంటే నాకూ చాలా ఇష్టం. అవకాశం వస్తే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ పక్కన నటించడానికి నేను సిద్ధం. బాలీవుడ్లో ప్రియాంక చోప్రా, షారూఖ్ ఖాన్కి వీర ఫ్యాన్ని. ఇండియాది రిచ్ కల్చర్. ఇక్కడి రైతా చాలా డెలీషియస్గా ఉంటుంది. – కియానా తుమీత– సరస్వతి రమ -
రూ. 2 లక్షలతో మొదలై రూ. 8,500 కోట్లకు, ఎవరీ ధీర
ఆయుర్వేదం అనగానే ముందుగా గుర్తొచ్చేది భారతదేశం. ఆయుర్వేదం అనగానే గుర్తొచ్చే బిజినెస్ దిగ్గజం మీరా కులకర్ణి. బిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించిన అనేక మంది పురుష గాథల మధ్య ఆమె విజయం నిజంగా చాలా స్పూర్తిదాయకం. కేవలం రూ. 2 లక్షల పెట్టుబడితో వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించిన ఘనత, దార్శనికత ఆమె సొంతం. ఆమె మరెవ్వరో కాదు ప్రపంచ బ్యూటీ ఇండస్ట్రీలో రారాణిలా వెలుగుగొందుతున్న భారతీయ మహిళ మీరా కులకర్ణి. పదండి మీరా కులకర్ణి విజయగాథ గురించి తెలుసుకుందాం.ఉత్తరాంచల్లోని తెహ్రీ గర్హ్వాల్ ప్రాంతానికి చెందిన మీరాకు చాలా చిన్నతనంలోనే ఆయుర్వేద జీవన విదానంపై ఆసక్తి పెరిగింది. అచంచలమైన అంకితభావం ఆయుర్వేదంపై ఉన్న మక్కువతో ఉత్తరాఖండ్కు చెందిన ఆమె సంప్రదాయ మార్గాలను ధిక్కరించి మరీ బిలియన్ డాలర్ల విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. సక్సెస్కు సరిహద్దులు లేవని నిరూపించారు.ఫారెస్ట్ ఎస్సెన్షియల్స్ వ్యవస్థాపకురాలు, మేనేజింగ్ డైరెక్టర్ 69 ఏళ్ల మీరా కులకర్ణి ఇపుడు గ్లోబల్ వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. స్వచ్ఛమైన ఆయుర్వేద చర్మ, జుట్టు సంరక్షణ ఉత్పత్తులను తయారు చేయాలనే లక్ష్యంతో భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్యూటీ, వ్యక్తిగత సంరక్షణ పరిశ్రమలో బలమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. డిజిటల్ మార్కెట్లోకూడా ఉనికిని చాటుకుంటూ, అంతర్జాతీయ మార్కెట్లనుమరింతగా ఆకర్షించాలని భావిస్తున్నారు. “ప్రపంచవ్యాప్తంగా ఎదగడం, ప్రపంచంలోని ఏదైనా ఉత్తమ బ్రాండ్తో భారతీయ బ్రాండ్ను పోల్చదగినదిగా చేయడమే తదుపరి లక్ష్యం.” అని ఆమె చెప్పారు. ఇదీ చదవండి: 138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్తో ఒక విలాసవంతమైన ఆయుర్వేద ఉత్పత్తులను తీసుకురావడం అనేది ఒక విప్లవాత్మక ఆలోచన అంటారామె. వ్యాపారంలో ఎలాంటి అనుభవం, విజ్ఞానం లేకపోయినా 40 ఏళ్ల వయసులో, సింగల్ పేరెంట్గా కష్టాలుపడుతున్న క్రమంలో 2000 సంవత్సరంలో కేవలం రూ. 2 లక్షల పెట్టుబడి, ఇద్దరు ఉద్యోగులతో ఒక చిన్న గ్యారేజ్లో ఫారెస్ట్ ఎసెన్షియల్స్ను వ్యాపారాన్ని ప్రారంభించారు. ఎలాంటి రుణం తీసుకోకుండా, వచ్చిన లాభాలను తిరిగి పెట్టుబడులు పెడుతూ నెమ్మదిగా వృద్ధి చెందారు. అయితే ఈ ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. ఆయుర్వేదంపై ఉన్న ప్రేమ, కష్టపడి పనిచేయడం, కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకోవడమే ఆమెకున్న బలాలు. దీంతోపాటు మార్కెట్లో లభించే ఆయుర్వేద ఉత్పత్తులు చాలావరకు నాణ్యత లేనివి , ఎక్కువగా ఔషధపరమైనవనే విషయాన్నే త్వరగా ఆకళింపు చేసుకున్నారు.ఇదీ చదవండి: వెయిటర్ టు కరోడ్పతి: కె.ఆర్. భాస్కర్ ఇన్స్పైరింగ్ జర్నీమలుపు తిప్పిన అనుకోని మీటింగ్ ఫారెస్ట్ ఎసెన్షియల్స్ క్రమంగా తన ఉత్పత్తుల శ్రేణిని విస్తరించింది. సాంప్రదాయ, విలాసవంతమైన ఆయుర్వేద చర్మ సంరక్షణ బ్రాండ్కు ప్రసిద్ధి చెందిన బ్రాండగా ఎదిగింది. భారతదేశంలోని చాలా లగ్జరీ హోటల్ చైన్లు ,స్పాలకు ప్రముఖ సరఫరాదారుగా కూడా అవతరించింది. భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో పాపులర్ అయింది. రాజీలేని నాణ్యతకు మరోపేరుగా నిలిచింది.2007లో జోధ్పూర్లోని ఒక ప్యాలెస్లో ఎలిజబెత్ హర్లీ , భారతీయ వ్యాపార దిగ్గజం అరుణ్ నాయర్ వివాహానికి భారతదేశానికి వచ్చిన సమయంలో అనూహ్యంగా ఎస్టీ లాడర్ చైర్మన్ లియోనార్డ్ లాడర్తో జరిగిన సమావేశం కులకర్ణి వ్యవస్థాపక ప్రయాణంలో ఒక ప్రధాన మలుపుగా నిలిచింది. ఈ మీటింగ్లో చర్చల రెండు నెలల తర్వాత మీరా బ్రాండ్లో ఎస్టీ లాడర్ ఫారెస్ట్ ఎస్సెన్షియల్స్లో భారీ పెట్టుబడులు పెట్టింది. అంతే అక్కడినుంచి వెనుదిరిగి చూసింది లేదు. రాజీలేని నాణ్యతతో ప్రచార ఆర్భాటాలు, డిస్కైంట్ల జిమ్మిక్కులు ఇలాంటి వాటి జోలికి పోకుండా దూసుకుపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఆయుర్వేద ఉత్పతులతో గ్లోబల్ బిజినెస్ లీడర్గా దాదాపు రూ.8, 500 కోట్ల ప్రపంచ అందాల సామ్రాజ్యానికి అధిపతి వరకు సాగిన ఆమె వ్యాపార ప్రస్థానం ఎందరో మహిళా వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిస్తోంది.మీరా కులకర్ణి విద్యార్హతలుమీరా కులకర్ణి చెన్నైలోని స్టెల్లా మారిస్ కళాశాల నుండి ఫైన్ ఆర్ట్స్లో పట్టభద్రురాలు. భారతదేశ ఆయుర్వేద కేంద్రంగా పిలువబడే ఉత్తరాంచల్లోని తెహ్రీ గర్హ్వాల్ ప్రాంతానికి చెందిన మీరా, ఆయుర్వేద జీవన విధానంతోపాటు, అంతేకాకుండా, పెయింటింగ్, జర్నలిజం, వాటర్ కలర్స్, ఆర్గానిక్ మొక్కలు, మూలికలు, వైద్య ఫలితాలపై ఆమెకున్న విభిన్న ఆసక్తే ఆమెను విజయవంతమైన వ్యవస్థాపకురాలిగా మామర్చిం దనడంలో ఎలాంటి సందేహం లేదు. -
వీరమాతకు వందనం
యుద్ధంలో బిడ్డను కోల్పోయిన దుఃఖం ఒకవైపు. ‘దేశమాత కోసం నా బిడ్డప్రాణత్యాగం చేశాడు’... అనే గర్వం ఒకవైపు... ఎంతోమంది వీరమాతలు... అందరికీ వందనం...యుద్ధ చరిత్రలోకి ఒకసారి...గర్వంగా అనిపించింది...కొన్ని సంవత్సరాల క్రితం... ఉగ్రవాదులతో జరిగిన పోరులో నలుగురిని చంపేశాడు లెఫ్టినెంట్ నవదీప్సింగ్. ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడుతూనే నేలకొరిగాడు 26 సంవత్సరాల ఆ యువకుడు. ‘నేనంటే నవదీప్కు ఎంత ఇష్టమో చెప్పడానికి మాటలు చాలవు. ఫ్రెండులా ఎన్నో కబుర్లు చెబుతుండేవాడు. నవదీప్ లేడు అనే వాస్తవం జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. ఇప్పటికీ కలలో ఏదో ఒక రూపంలో పలకరిస్తూనే ఉంటాడు. అమ్మా...నేను వస్తున్నాను అనే మాట వినబడితే సంతోషంగా అనిపించేది. లెఫ్టినెంట్ నవదీప్సింగ్ తల్లి కౌర్ ఇక ఆ మాట ఎప్పుడూ వినిపించదు. ఉగ్రవాదులను నవదీప్ దీటుగా ఎదుర్కోకపోతే ఎంతో నష్టం జరిగి ఉండేది... అని పై అధికారులు చెప్పినప్పుడు ఎంతో గర్వంగా అనిపించింది. నవదీప్ నా బిడ్డ. అతడు చనిపోయినప్పుడు నేనే కాదు.. ఎంతోమంది తల్లులు సొంత బిడ్డను కోల్పోయినట్లు ఏడ్చారు. ఆ దృశ్యం ఇప్పటికీ నా కళ్లముందే ఉంది. దేశం కోసం పోరాడే వీరసైనికుడికి ఒక్కరే అమ్మ ఉండదు. దేశంలోని ప్రతి అమ్మ తన అమ్మే’ అంటుంది పంజాబ్లోని గురుదాస్పూర్కు చెందిన నవదీప్సింగ్ తల్లి కౌర్.ఇంటికి ఎప్పుడొస్తావు బిడ్డ?ఆంధ్రప్రదేశ్లోని పెనుగొండ నియోజక వర్గం కల్లితండాకు చెందిన ఆర్మీ జవాన్ మురళీనాయక్ పాక్తో జరిగిన యుద్ధంలో చనిపోయాడు. ఆ తల్లి దుఃఖ భాషను అర్థం చేసుకోగలమా? కుమారుడు మురళీనాయక్ మరణం గురించి అడిగినప్పుడు ‘ఏమని చెప్పాలి సామీ’ అని ఆ తల్లి భోరున విలపించింది. మురళీనాయక్ పార్థివదేహాన్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో జనాలు తరలి వచ్చారు. వారు తనలాగే ఏడ్చారు. అమ్మా... నీ కొడుకు ఎంత గొప్ప వీరుడో చూశావా! ‘ఆర్మీ జవాన్ మురళీ నాయక్ తల్లి’ అని తనను పరిచయం చేస్తున్న సమయంలో ఆ తల్లి హృదయం గర్వంతో పొంగిపోతుంది. మాతృదినోత్సవం సందర్భంగా ఆ వీరమాతలందరికీ వందనం.కవాతు శబ్దాలు వినిపిస్తూనే ఉంటాయి!జమ్మూ కశ్మీర్ దోడాలో జరిగిన ఎన్కౌంటర్లో కెప్టెన్ బ్రిజేష్ థాప వీరమరణం పొందాడు. ‘బ్రిజేష్ ఇక లేడు అనే వార్త విని కుప్పకూలిపోయాను. మా అబ్బాయి అని చెప్పడం కాదుగానీ చాలా క్రమశిక్షణ ఉన్న కుర్రాడు. ఇంజినీరింగ్ చదివే రోజుల్లోనే నేను సైన్యంలో చేరుతాను అనేవాడు. సైన్యంలో పనిచేయడం చాలా కష్టం అని చెబుతుండేదాన్ని. ఎంత కష్టమైనా సైన్యంలోకి వెళతాను అనేవాడు. బ్రిజేష్ లేడనే వాస్తవం కష్టంగా ఉన్నా సరే... దేశం కోసం నా కుమారుడుప్రాణాలు అర్పించాడు అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది’ అంటారు నీలిమ థాప. సైనిక దుస్తుల్లో కుమారుడిని చూసిన తొలి క్షణం నీలిమ భావోద్వేగానికి గురయ్యారు.ఎప్పటి కల అది! నాన్న యూనిఫామ్ వేసుకొని చిన్నారి బ్రిజేష్ మార్చ్ చేస్తుండేవాడు (బ్రిజేష్ తండ్రి మిలిటరీలో పనిచేశారు) కుమారుడిని చూసి ‘మేజర్ సాబ్ వచ్చేశారు’ అని నవ్వేది.ఇప్పుడిక ఆమెకు నవ్వే అవకాశమే లేకపోవచ్చు. కన్నీటి సముద్రంలో దిక్కుతోచకుండా ఉన్నట్లుగానే ఉండవచ్చు. అయితే... కుమారుడి ధైర్యసాహసాల గురించి విన్నప్పుడు ఆ తల్లి హృదయం గర్వంతో ఉప్పొంగుతుంది. ‘కెప్టెన్ బ్రిజేష్ థాప’ అని కుమారుడి పేరు విన్నప్పుడల్లా... ఆర్మీ అధికారుల కవాతు శబ్దాలు ఆమెకు వినిపిస్తూనే ఉంటాయి.ఆ తల్లి ఎలా తట్టుకుందో!‘పిల్లల పెంపకంలో తల్లి పాత్ర కీలకం’ అంటుంది తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటకు చెందిన మంజుల. ఇండియా–చైనా యుద్ధంలో ఆమె కుమారుడు కల్నల్ సంతోష్బాబు కన్నుమూశాడు. చదువులోనే కాదు ఆటల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో ముందుండే కొడుకును చూసి మంజుల గర్వించేది. ఆరోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సంతోష్ మరణం గురించి మంజులకు తెలియజేశారు. ఆ తల్లి గుండె ఎలా తట్టుకుందో తెలియదు. కల్నల్ సంతోష్ బాబు, తల్లి మంజులకుమారుడి బాల్యవిశేషాలు, క్రమశిక్షణ గురించి కళ్లకు కట్టినట్లు చెప్పే మంజుల కుమారుడి మరణం గురించి.. ‘మన దేశం కోసం మా అబ్బాయి వీరమరణం పొందాడు’ అని గర్వంతో చెబుతుంది. ‘ఒక్కడే బాబు నాకు...’ అంటున్న ఆ తల్లి కంఠానికి కన్నీళ్లు అడ్డుపడి మాటలు రావు. ఆమె మనసులో కనిపించని దుఃఖసముద్రాలు ఉండవచ్చుగాక... కానీ ఆమె పదే పదే చెబుతుంది...‘నా బిడ్డ మన దేశం కోసం చనిపోయాడు’.ఎక్కడ ఉన్నా అమ్మ గురించే‘కెప్టెన్ సౌరభ్ కాలియ బయట ఎలా ఉంటాడో తెలియదుగానీ ఇంట్లో మాత్రం చిలిపి’ అంటుంది అతడి తల్లి విజయ కాలియ. ‘మేరా పాస్ మా హై’ అని తల్లి గురించి సరదాగానే సినిమా డైలాగు చెబుతుండేవాడుగానీ... నిజంగా తల్లి సౌరభ్ ధైర్యం. సైన్యం. ‘ఒకరోజు సౌరభ్ వంటగదిలోకి వచ్చి సైన్ చేసిన బ్లాంక్ చెక్ ఇచ్చాడు. ఎందుకు? అని అడిగితే ‘నేను ఫీల్డ్లో ఉన్నప్పుడు మనీ విత్డ్రా చేసుకోవడానికి’ అన్నాడు. తాను ఎక్కడ ఉన్నా నా గురించే ఆలోచించేవాడు’ అంటుంది విజయ.ఇప్పుడు ‘కాలియ హోమ్’లో ఆ బ్లాంక్ చెక్ కనిపిస్తూనే ఉంటుంది. ఆ చెక్ను చూసినప్పుడల్లా కుమారుడిని చూసినట్లుగానే ఉంటుంది. ‘డబ్బును డ్రా చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు ఈ కాగితంపై నా బిడ్డ చేసిన సంతకం ఉంది. అది నాకోసం చేసింది. ఇది ఎప్పటికీ తీయటి జ్ఞాపకంగా ఉండిపోతుంది’ అంటుంది విజయ. చివరిసారిగా తమ్ముడి పుట్టిన రోజు సందర్భంగా ఇంటికి ఫోన్ చేశాడు సౌరభ్.‘నా పుట్టిన రోజుకు తప్పకుండా ఇంటికి వస్తాను అన్నాడు. ఆ రోజు ఇప్పటికీ రాలేదు’ అని కళ్లనీళ్ల పర్యంతం అవుతుంది విజయ. 23 ఏళ్లు నిండకుండానే కార్గిల్ యుద్ధంలో సౌరభ్ చనిపోయాడు. హిమాచల్ద్రేశ్లోని పలంపూర్ ఇంట్లో ఒక గది మొత్తాన్ని సౌరభ్ మ్యూజియంగా మార్చారు. ‘ఈ మ్యూజియంలోకి వస్తే మా అబ్బాయి దగ్గరకి వచ్చినట్లే ఉంటుంది’ అంటుంది విజయ.నా కుమారుడు... వీరుడుఆ అమ్మ పేరు త్రిప్తా థాపర్... ఆమె కళ్లలో ఒకవైపు అంతులేని దుఃఖం, మరోవైపు గర్వం కనిపిస్తాయి. కార్గిల్ యుద్ధంలో థాపర్ తన కుమారుడిని కోల్పోయింది. మధ్యప్రదేశ్లో మహు పట్టణంలోని మిలిటరీ కంటోన్మెంట్ మ్యూజియంలో కార్గిల్ యుద్ధ దృశ్యాలను, కుమారుడి ఫోటోను చూస్తున్నప్పుడు ఆమెకు దుఃఖం ఆగలేదు.ఇరవై రెండు సంవత్సరాల వయసులో దేశం కోసం ప్రాణాలు అర్పించిన విజయంత్ థాపర్ కార్గిల్ వార్ హీరో. తన దళంతో శత్రువుల బంకర్ ను చుట్టుముట్టే క్రమంలో విజయంత్ థాపర్ మరణించాడు.వీర్చక్ర విజయంత్ థాపర్ ,తల్లి త్రిప్తా థాపర్ ‘వీర్చక్ర విజయంత్ థాపర్ అమ్మగారు అని నన్ను పరిచయం చేస్తుంటారు. వీర్చక్ర అతడి పేరులో శాశ్వతంగా కలిసిపోయింది’ అని విజయంత్ గురించి గర్వంగా చెబుతుంది త్రిప్తా థాపర్. ఆమె దృష్టిలో అది మ్యూజియం కాదు. పవిత్ర స్థలం. ‘ఈ మ్యూజియంలో ఉన్న ప్రతి వస్తువు, ప్రతి ఫోటో ఎన్నో జ్ఞాపకాలను కళ్ల ముందు ఆవిష్కరిస్తుంది. దేశం కోసం చిన్న వయసులోనే జీవితాన్ని త్యాగం చేసిన వీరులను పదే పదే తలుచుకునేలా చేస్తుంది’ అంటుంది థాపర్. తన సన్నిహిత మిత్రురాలు పూనమ్ సైనీతో కలిసి తరచు ఈ మ్యూజియమ్కు వస్తుంటుంది త్రిప్తా థాపర్.ఎప్పుడు వచ్చినా కుమారుడి దగ్గరికి వచ్చినట్లే ఉంటుంది ఆ తల్లికి. బ్యాగులు సర్దుకొని ఇల్లు వదిలే ముందు... ‘అమ్మా... ఆరోగ్యం జాగ్రత్త’ అని చెప్పేవాడు. గంభీరంగా కనిపించే అతడి కళ్లలో అమ్మను విడిచి వెళ్లే ముందు సన్నని కన్నీటి పొర కనిపించేది. అయితే అమ్మకు ఆ కన్నీటి ఆనవాలు కనిపించకుండా తన చిరునవ్వు చాటున దాచేవాడు. ‘అమ్మా, కొడుకుల అనుబంధం గురించి చెప్పడానికి మాటలు చాలవు’ అని కన్నీళ్లు తుడుచుకుంటుంది త్రిప్తా థాపర్ స్నేహితురాలు పూనమ్. -
Mother's day 2025 అమ్మ ఇచ్చిన రెండో జీవితం
అమ్మ అంటేనే త్యాగానికి, అంతులేని ప్రేమకు మరోపేరు. అలా త్యాగం చేసి.. తమ కిడ్నీలను తమ పిల్లలకు దానం చేసిన కొంతమంది తల్లులను ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్యూ)లో మాతృదినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా సత్కరించారు. అమ్మ ఇచ్చిన రెండో జీవితం పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఒకసారి కాకుండా, రెండోసారి పిల్లలకు జన్మనిచ్చిన తల్లులను గౌరవించారు.మాతృదినోత్సవాన్ని ఏఐఎన్యూ ఈ సంవత్సరం మరింత పవిత్రంగా చేసింది. తమ పిల్లల జీవితాలు కాపాడేందుకు తమకిడ్నీలు దానం చేసిన తల్లుల గాధలను ఆస్పత్రి ద్వారా అందరికీ పంచింది. ఈ కార్యక్రమంలో వైద్యులు, రోగులు, వారి కుటుంబసభ్యులు అందరూ కలిసి పాల్గొన్నారు.కిడ్నీ మార్పిడి తర్వాత పూర్తిగా కోలుకున్న గ్రహీతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్లంతా తమ జీవితాలను తల్లులు ఎలా సమూలంగా మార్చేశారో, అంతకుముందు తాము అనారోగ్యంతో ఎంత ఇబ్బంది పడ్డామో తడిగుండెలతో వివరించారు. ఈ సందర్భంగా ఏఐఎన్యూ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ సి.మల్లికార్జున మాట్లాడుతూ, “అవయవదానం అనేది ఒక వ్యక్తి వేరేవారికి చేయగలిగిన అతి గొప్పదానమనీ, ఈ తల్లులు కేవలం పిల్లలను కని, పెంచడమే కాదు.. వాళ్లకు రెండోసారి జీవితం ఇచ్చారని కొనియాడారు. అవయవదానాల్లో, ముఖ్యంగా తల్లి నుంచి వచ్చినప్పుడు కిడ్నీలు ఎక్కువకాలం పనిచేస్తాయి. బాగా సన్నిహితుల నుంచి రావడంతో శరీరం వాటిని తిరస్కరించే అవకాశాలు తక్కువ. రోగులు త్వరగా కోలుకుని, తమ పనులు చేసుకోగలరు” అని చెప్పారు.సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఎం.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, “మాతృదినోత్సవం రోజున ప్రపంచవ్యాప్తంగా తల్లులను గౌరవించుకుంటారు. ఈరోజు మనం దీన్ని విభిన్నంగా చేసుకుంటున్నాం. ఈ సన్మానం అనేది మనకు ఎప్పటికీ స్ఫూర్తినిచ్చే ఈ తల్లుల అపూర్వ త్యాగానికి చిన్న నూలుపోగు లాంటిదే” అన్నారు.సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ పి.ఎస్. వలీ మాట్లాడుతూ, “తమ పిల్లలకు నిస్వార్థంగా తమ సొంత కిడ్నీలు దానం చేసి, వారి ప్రాణాలు రెండోసారి నిలబెట్టిన తల్లులను ఈ మాతృదినోత్సవాన మనం గౌరవించుకుంటున్నాం. తమపిల్లల పట్ల అపార ప్రేమాభిమానాలు చూపించడంతో పాటు, వారికి.. వారి కుటుంబాలకు బంగారు భవిష్యత్తును వీరు అందించారు. వారి త్యాగం తల్లీబిడ్డల మధ్య ఉండే అపురూపమైన బంధానికి, ప్రేమకు ఉండే శక్తికి ఒక నిదర్శనం. వారి అసాధారణ బలం, నిబద్ధతను ఎంతగానో కొనియాడుతున్నాం” అని తెలిపారు.మాతృప్రేమకు ఉన్న బలాన్ని తాజా పరిశోధన మరోసారి తెలిపింది: పిల్లలకు కిడ్నీలు దానం చేయడంలో తల్లులే ముందు ఉంటున్నారు. పిల్లల కిడ్నీమార్పిడి కేసులలోనూ ఇదే ఎక్కువగా కనిపిస్తోంది. పిల్లలకు, తల్లులకు రోగనిరోధకశక్తి పరంగా ఉండే సానుకూలత, సంరక్షణ బాధ్యతలు, పిల్లల కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడే భావోద్వేగం.. వీటన్నింటి వల్ల తల్లులు ఇవ్వడమే మంచిది. ఏఐఎన్యూలో జరిగే కిడ్నీ మార్పిడుల్లో మూడోవంతు దాతలు తల్లులే అవుతున్నారు.ఈ సంబరాల్లో ఏఐఎన్యూ వైద్య నిపుణులు - సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ (బంజారాహిల్స్) డాక్టర్ శ్రీకాంత్ గుండ్లపల్లి, సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ (బంజారాహిల్స్) డాక్టర్ సుజీత్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ (హైటెక్ సిటీ) డాక్టర్ క్రాంతికుమార్, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ (దిల్సుఖ్నగర్) డాక్టర్ అనూష గుడిపాటి తదితరులు పాల్గొన్నారు. -
Miss World 2025: అందమూ.. అంతకుమించి...
‘దేవుదే దిగొచ్చి మిమ్మల్నేమైనా కోరుకోమంటే ఏం కోరుకుంటారు?’ ‘పిల్లలు అమాయకులు.. పువ్వులాంటి వారు. దేవుడికి అత్యంత ఇష్టమైన వారు. అందుకే సమాజం చేసే తప్పులకు వాళ్లు బలి కాకూడదు.. వాళ్లు మంచి వాతావరణంలోనే పెరగాలని కోరుతాను!’ అని సమాధానమిచ్చింది కె. అభిమానికా యాదవ్! ఈ జవాబుతో ఆమె ‘2016 మిసెస్ ఇండియా’ పోటీలో నెగ్గారు. తర్వాత మిసెస్ ఆసియా పసిఫిక్ యూనివర్స్ కిరీటాన్ని పొందారు. ‘2017.. మిసెస్ యూనివర్స్ పోటీ’కీ వెళ్లారు. అక్కడ ఆమెను జడ్జెస్ మూడు నిమిషాల్లో డొమెస్టిక్ వయొలెన్స్ గురించి మాట్లాడమన్నారు. దానిమీద మూడు నిమిషాల్లో ఆమె పవర్ పాయింట్ ప్రెజెంటేషనే ఇచ్చారు. జడ్జెస్ ఇంప్రెస్ అయ్యి.. ‘2017.. మిసెస్ యూనివర్స్ ఇంటెలిజెన్స్’ సబ్టైటిల్నిచ్చారు. హైదరాబాద్ వాసి అయిన ఆమె.. సెలబ్రిటీ ఫిట్నెస్ కోచ్, పాజెంట్ గ్రూమర్, మోటివేషనల్ స్పీకర్, ఫ్యాషన్ స్టయిలిస్ట్! ఇప్పుడు తెలంగాణలో జరగనున్న మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో అసలు బ్యూటీ పాజెంట్స్ ఎలా జరుగుతాయి, ఎలాంటి రౌండ్స్ ఉంటాయి, ఎలా గ్రూమ్ అవుతారు వంటి విషయాలను ‘ఫ్యామిలీ’తో పంచుకున్నారు.‘2016లో జరిగిన మిసెస్ ఇండియా పోటీల టైమ్కి నేను డివోర్సీని. అప్పుడు మా బాబుకు అయిదేళ్లు. నా పెంపకంలోనే ఉన్నాడు. బీటెక్ చదివి, కొన్నాళ్లు కార్పొరేట్ జాబ్ చేసి వదిలేసి.. జుంబా ట్రైనర్గా మారాను. క్లాసికల్ డాన్సర్ (ఆంధ్రనాట్యం)ని కూడా! ఫిట్నెస్లోనూ ట్రైనింగ్ తీసుకుని ఫిట్నెస్ కోచ్గానూ ఉన్నాను. డివోర్స్ మీద సమాజంలో ఉన్న అప్రకటిత నిషేధాలు, సంకోచాలను కాదని దానిమీద చాలా మాట్లాడేదాన్ని, విరివిగా చర్చించి దాన్ని నార్మలైజ్ చేయడానికి ప్రయత్నించాను. దాంతో అందరికీ సుపరిచితురా లనయ్యా. బ్యూటీ పాజెంట్లో పాల్గొనాలనేది మాత్రం అప్పటికప్పుడు తీసుకున్న డెసిషనే. దీనికి సంబంధించి అప్పుడిక్కడ గ్రూమింగ్ సెంటర్స్ లేవు. ముంబై, లేదంటే ఢిల్లీ వెళ్లాలి. నేను ఢిల్లీ వెళ్లాను. లక్కీగా మంచి కోచ్ దొరికారు. కాన్ఫిడెంట్గా నన్ను నేను ప్రెజెంట్ చేసుకున్నాను. టైటిల్ గెలుచుకున్నాను. ఆ ఉత్సాహంతోనే మిసెస్ యూనివర్స్ పాజెంట్కీ వెళ్లాను. అయితే మిసెస్ ఇండియా, మిసెస్ యూనివర్స్ పాజెంట్స్ మధ్య సంవత్సరం టైమ్ ఉండింది. అయినా గ్రూమింగ్ కోసం బాబును వదిలిపెట్టి వేరే సిటీకి వెళ్లే పరిస్థితి లేదు. దాంతో అంతకుముందు కోచ్ దగ్గర్నుంచే కొన్ని టిప్స్, యూట్యూబ్లో మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ పాజెంట్స్కి సంబంధించిన వీడియోలు, అందులోని పార్టిసిపెంట్స్ ఇంటర్వ్యూలు చూసి నన్ను నేను గ్రూమ్ చేసుకున్నాను.→ ఆ పోటీలు ఎలా ఉంటాయంటే.. మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్, మిసెస్ యూనివర్స్.. ఇలా ఏ అందాల పోటీలైనా దాదాపుగా ఒకేరకంగా ఉంటాయి. నెల రోజులు జరుగుతాయి. అయితే నెలంతా పోటీలుండవు. ఈ పోటీలను ఏ దేశం హోస్ట్ చేసినా దాని ప్రధాన లక్ష్యం.. అక్కడి టూరిజాన్ని ప్రపంచానికి పరిచయం చేయడమే! సో.. మా పోటీలు దక్షిణాఫ్రికాలో జరిగాయి. 86 దేశాల నుంచి కంటెస్టెంట్స్ వచ్చారు. పోటీల షెడ్యూల్ అంతా కంటెస్టెంట్స్కి ముందే ఇచ్చేస్తారు. పోటీలు లేని రోజుల్లో ఆ దేశంలోని చారిత్రక ప్రాంతాల పర్యటన ఉంటుంది. వాళ్లు ఫుడ్, కల్చర్ను తెలుసుకునే పర్యటనలుంటాయి. పోటీల విషయానికి వస్తే.. ఏ రోజు ఏ ఈవెంట్ ఉంటుందో దానికి సంబంధించిన కాస్ట్యూమ్ ఉంటుంది. ఈ కాస్ట్యూమ్స్ కోసం కొంతమంది కంటెస్టెంట్స్ స్పాన్సర్స్ని వెదుక్కుంటారు. స్విమ్ వేర్ రౌండ్ ఉంటుంది. స్విమ్ సూట్తో స్టేజ్ మీద కనిపించాలి. దానికి ఫొటో షూట్ ఉంటుంది. ఆ కాస్ట్యూమ్ని మనమెంత కాన్ఫిడెంట్గా క్యారీ చేస్తున్నాం, బాడీలాంగ్వేజ్ వంటివన్నీ అసెస్ చేస్తారు. ఇంటెలిజెన్స్ రౌండ్ ఉంటుంది. ఇందులో క్విజ్ ఉండొచ్చు, సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాల మీద చర్చలు, మహిళల సమస్యలకు సంబంధించిన టాపిక్స్ ఉంటాయి. పవర్పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వచ్చు. వాళ్లిచ్చిన టాపిక్ని వాళ్లిచ్చిన వ్యవధిలో ఎంత చక్కగా మాట్లాడామనేది చూస్తారు. బ్యూటీ విత్ పర్పస్ రౌండ్ ఉంటుంది. కంటెస్టెంట్స్ ఏదైనా స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో భాగస్వాములై ఉండాలి. ఆ పోటీ కోసం దరఖాస్తు చేసుకునేప్పుడు అందులో దానిగురించి పొందుపరచాలి. ఈ రౌండ్లో దాని గురించి అడుగుతారు. మనం చేసిన పనిని ఎంత స్మార్ట్గా ప్రెజెంట్ చేశామనేదాన్ని బట్టి పాయింట్స్ ఉంటాయి. దీనిమీద ఆన్లైన్ ఓటింగ్ ఉంటుంది. మాగ్జిమమ్ ఓట్లు వచ్చిన వాళ్లకు మిస్ పాపులర్ అనే సబ్ టైటిల్ ఇస్తారు. ఫిట్నెస్ రౌండ్ ఉంటుంది. అలాగే టాలెంట్ రౌండ్ ఉంటుంది. మనకొచ్చిన కళలను ప్రదర్శించాలి. ఇందులో ది బెస్ట్ పెర్ఫార్మర్కు మిస్ టాలెంటెడ్ సబ్ టైటిల్ ఇస్తారు. ట్రెడిషనల్ రౌండ్ కూడా ఉంటుంది. ఇందులో మనం దేన్ని, ఎంత క్రియేటివ్గా రిప్రెజెంట్ చేస్తున్నామనేది ఫోకస్ అవుతుంది. → తలపై బోనంతో....నేను లంగా, ఓణీ వేసుకుని, తల మీద బోనం పెట్టుకుని ర్యాంప్ వాక్ చేసి, బోనం గురించి వర్ణించాను! గౌన్ రౌండ్, ఇంట్రడక్షన్ రౌండ్, వన్ టు వన్ పర్సనల్ ఇంటర్వ్యూ రౌండ్, ప్రిలిమినరీ రౌండ్స్ ఉంటాయి. ఇవేకాక ఫినాలే రోజు.. టైమ్ లేకుంటే అంతకంటే ముందు రోజు మిస్ బ్యూటిఫుల్ స్కిన్,హెయిర్, ఫొటోజెనిక్, స్మైల్, బెస్ట్ స్విమ్ సూట్ లాంటి సబ్టైటిల్స్నిస్తారు. ర్యాంప్ వాక్ ఉంటుంది. ఫినాలే రోజు అందరూ తప్పకుండా గౌనే వేసుకోవాలి. కొన్నిసార్లు ఏ దేశం హోస్ట్ చేస్తుందో ఆ దేశానికి సంబంధించిన ట్రెడిషనల్ వేర్ని ఇస్తారు. మాకు సౌత్ ఆఫ్రికన్ ప్రింట్స్, యాక్ససరీస్తో డిఫరెంట్ అవుట్ఫిట్స్ ఇచ్చారు. కిందటిసారి ముంబైలో జరిగిన మిస్వరల్డ్ పోటీల్లో అందరికీ లెహెంగాలు ఇచ్చారు. ఫినాలే రోజు టాప్ టెన్, లేదా టాప్ ఫైవ్ స్టేజ్ మీద ఉంటారు. వాళ్లందరికీ ఒక క్వశ్చన్ ఇస్తారు. ఒకవేళ మల్టిపుల్ జడ్జెస్ ఉంటే డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. వాటికి ఎంత వేగంగా స్పందించి.. ఎంత కాన్ఫిడెంట్గా.. ఎంత కూల్గా ఆన్సర్ చేస్తారో దాన్ని బట్టి టైటిల్ విన్నర్ని, ఫస్ట్ అండ్ సెకండ్ రన్నరప్స్ని అనౌన్స్ చేస్తారు.→ కొరియోగ్రఫీ..గ్రూమింగ్ అవుతున్నప్పుడు ఆర్గనైజర్స్ వస్తారు.. ఎవరు ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నారో చూస్తుంటారు. ఈ పోటీలకు కొరియోగ్రఫీ ఉంటుంది. ఎవరు ఎక్కడ నిలబడాలి, ఎలా నడవాలి.. ఎలా ప్రెజెంట్ చేసుకోవాలి వంటివన్నీ ట్రైన్ చేస్తారు. దీనికి పాజెంట్ కోచ్ ఉంటారు. వాళ్లే నేర్పిస్తారు. మిసెస్ ఇండియా మొదలు మిసెస్ యూనివర్స్ వరకు గ్రూమింగ్కి కాస్ట్యూమ్స్, ఫుట్వేర్,యాక్ససరీస్ సహా నాకు రూ. 12 లక్షల వరకు ఖర్చయింది. పాజెంట్లో పార్టిసిపేట్ అవడమనేది చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం. ఏమైనా నాకు ఫిట్నెస్ కోచ్గా కొనసాగడమే ఇష్టం. పదేళ్లుగా అదే రంగంలో కొనసాగుతున్నాను. పాజెంట్స్కి సంబంధించి వర్క్షాప్స్ పెట్టాను. త్వరలోనే ఇక్కడొక గ్రూమింగ్ సెంటర్ పెట్టాలని ΄్లాన్ చేస్తున్నాను. – సరస్వతి రమ -
ఐదేళ్ల క్రితమే కల్నల్ సోఫియా ఘనత!
పాకిస్థాన్లోని ఉగ్రవాదుల అణచివేతకు భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరు దేశంలో ఎంతగా ప్రాచుర్యంలోకి వచ్చిందో.. ఆ ఆపరేషన్ వివరాలను మీడియాకు వెల్లడిస్తున్న మహిళా సైనికాధికారులు సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్ పేర్లు కూడా అంతగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ముఖ్యంగా కల్నల్ సోఫియా ఖురేషీ గొప్పతనం గురించి ఐదేళ్ల క్రితమే దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రస్తావించింది. సైన్యంలో మహిళా అధికారుల శాశ్వత నియామకానికి (పర్మనెంట్ కమిషన్) సంబంధించిన కేసులో ఈమె ట్రాక్ రికార్డును న్యాయస్థానం ఉదాహరణగా చూపటం విశేషం.ఆడవాళ్లన్న కారణంతో సైన్యంలో పర్మనెంట్ కమిషన్ (పీసీ)కు అనర్హులుగా నిర్ధారించటం చట్టవ్యతిరేకమని 2020 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పు ఇచ్చింది. ఆ కేసులో మహిళల పీసీకి వ్యతిరేకంగా సైన్యం, కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లపై నాడు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఎక్సర్సైజ్ ఫోర్స్ 18 పేరుతో భారతదేశం నిర్వహించిన అతిపెద్ద అంతర్జాతీయ మిలిటరీ ఎక్సర్సైజ్లో భారత కంటింజెంట్కు న్యాయకత్వం వహించిన మొదటి మహిళ లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషీ (Colonel Sofiya Qureshi).2006లోనే ఆమె కాంగోలో ఐక్యరాజ్యసమితి (United Nations) శాంతి పరిరక్షక దళంలో సేవలందించారు. ఆ సమయంలో కాల్పుల విరమణకు అక్కడి దేశాలను ఒప్పించటంతోపాటు మానవతా సాయంలో కూడా ఆమె కీలకపాత్ర పోషించారు. తన శక్తియుక్తులతో అక్కడ శాంతి సాధనకు కృషిచేశారు. సైన్యంలో పురుషులతోపాటు భుజంభుజం కలిపి పనిచేస్తున్న మహిళలకు.. వారి శరీర నిర్మాణాన్ని సాకుగా చూపి పీసీకి అనర్హులుగా ప్రకటించటం సరికాదు’ అని సుప్రీంకోర్టు నాటి తీర్పులో పేర్కొంది.చదవండి: అది ఇల్లు కాదు.. చిన్నపాటి సైనిక శిబిరం! -
Sushmita Sen: పోటీనుంచి తప్పుకుందాం అనుకున్నా!
అందాల పోటీల విషయానికి వస్తే1994 దేశానికి ముఖ్యమైన సంవత్సరం! ఆ ఏడే తొలి మిస్ యూనివర్స్ కిరీటం దక్కింది. ఆ ఏడే మిస్ వరల్డ్ క్రౌన్ కూడా వచ్చింది.. 28 ఏళ్ల తర్వాత.. రీటా ఫారియా పావెల్ తర్వాత! ఈ రెండు ఘనతల్లో మొదటిది సుష్మితా సేన్ సాధిస్తే రెండవది ఐశ్వర్య రాయ్ అచీవ్ చేసింది. ఇప్పుడు సుష్మితా సేన్ ప్రయాణం గురించి మాట్లాడుకుందాం..!సుస్మితా సేన్.. ఢిల్లీ పుట్టి, పెరిగిన బెంగాలీ! అడపాదడపా మోడలింగ్లో అవకాశాలతో సాగుతున్న ఆమె సరదాగా మిస్ ఇండియా పోటీలకు దరఖాస్తు చేసుకుంది. అయితే తర్వాత తెలిసింది ఆ పోటీలో ఐశ్వర్య రాయ్ కూడా పాల్గొననుందని. అంతే ఆమె కాన్ఫిడెన్స్ అంతా కరిగిపోయింది. అప్పటికే ఐశ్వర్యకున్న నేమ్ అండ్ ఫేమ్, ఆమె అందం, ఆత్మవిశ్వాసం గురించి సుస్మితాకు తెలుసు. ఆ పోటీలో గెలుపు ఆమెదే అని అర్థమైంది! అందుకే ఆ పోటీ నుంచి తప్పుకోవాలనుకుంది. అమ్మతో, అప్పటి సుస్మితా బాయ్ ఫ్రెండ్ రజత్ తారాతోనూ అదే మాట చెప్పింది. అప్పుడు వాళ్ల అమ్మ, రజత్ ఇద్దరూ ధైర్యం చెప్పడంతో ఆ పోటీలో పాల్గొంది. ఐశ్వర్య అతి విశ్వాసం వల్ల ఆ కిరీటం కోల్పోయి సుస్మితాకు దక్కిందని నాటి మిస్ ఇండియా పోటీ సమీక్షకుల మాట.విశ్వసుందరిగా.. మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుని మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొనే అవకాశం అందుకుంది సుస్మితా. దానికోసం ముంబైలో ట్రైన్ అవ్వాలి. అప్పుడూ అంతే.. ఒంటరిగా ముంబైలో ఉండలేను మొర్రో అని భయపడింది. ఆ సమయంలోనూ ఆమె వెన్నంటి ఉంది సుస్మిత బాయ్ ఫ్రెండ్ రజతే! అందుకోసం తాను పనిచేస్తున్న కంపెనీలో ఒక నెల రోజులు సెలవు అడిగాడు. వాళ్లు కుదరదనడంతో రాజీనామా చేసి సుస్మిత వెంట ముంబైకి ప్రయాణం అయ్యాడు. శిక్షణ ఆసాంతం ఆమె వెన్నంటే ఉన్నాడు. శారీరకంగా, మానసికంగా దృఢం కావడానికి సుస్మిత నాన్చాక్లో శిక్షణ తీసుకుంది. మిస్ యూనివర్స్ పోటీల కోసం వేల రూపాయలతో డిజైనర్ వేర్ను కొనేంత ఆర్థిక స్తోమత లేదు. ఢిల్లీ లోకల్ మార్కెట్లో గుడ్డ కొనుక్కుని.. గౌను కుట్టించుకుంది. కొత్త సాక్స్ను వాళ్లమ్మ చక్కటి గ్లోవ్స్గా కుట్టి, ఇచ్చింది. వీటితోనే మిస్ యూనివర్స్ పోటీలు జరిగిన మనీలా (ఫిలిప్పీన్స్)కి బయలుదేరింది. ఫైనల్ రౌండ్లో ఆ గౌను, ఆ గ్లోవ్స్తోనే అప్పియర్ అయింది సుస్మిత. ఆమె ఆ అటైర్కి అందరూ ఫిదా అయ్యారు. వాటికన్నా.. ఫైనల్ రౌండ్లోని ఆమె సమాధానం అందరినీ ఇంప్రెస్ చేసింది. ‘మహిళకు మీరిచ్చే నిర్వచనం ఏంటీ?’ అని జడ్జి అడిగిన ప్రశ్నకు ‘మహిళ.. ఆ దేవుడు భువికి పంపిన కానుక. కొత్త ప్రాణానికి ఊపిరిపోసే జనని మహిళ! ప్రేమానురాగాలు అంటే ఏంటో పురుషుడికి చూపించేది మహిళ!’ అని ఆమె జవాబు చెబుతుంటే ఆడిటోరియం అంతా చప్పట్లతో మారుమోగిపోయింది. విశ్వ సుందరి కిరీటం ఆమెను వరించింది. తర్వాత..సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయింది. 24వ ఏట రీనీ అనే అమ్మాయిని దత్తత తీసుకుని పెళ్లి కాకుండానే తల్లి స్థానం తీసుకుంది. ఆ దత్తత కోసం అప్పుడున్న నియమ నిబంధనల ప్రకారం చాలానే ఇబ్బంది పడింది. అయినా వెనకడుగు వేయలేదు. ఈ విషయంలో ఆమె తల్లిదండ్రులు.. సుభ్రా సేన్ (జ్యువెలరీ డిజైనర్), సుబీర్ సేన్ (రిటైర్డ్ వింగ్ కమాండర్) ఆమెకు కొండంత అండ. వాళ్ల నాన్న అయితే దత్తత ఇచ్చే అధికారుల నమ్మకం కోసం తన కష్టార్జితంలోని పెద్ద మొత్తాన్ని రెనీ పేరు మీదకి మార్చాడట. అంత మద్దతు ఉంది కాబట్టే కొన్నాళ్లకు ఇంకో బిడ్డ (అలీసా)నూ దత్తత తీసుకుంది. ‘అందరు అమ్మలు తమ పిల్లల్ని పొట్టలో మోస్తారు. కానీ నా పిల్లల్ని నేను నా గుండెలో మోశాను. అందుకే ఆ బిడ్డలు నాకు స్పెషల్!’ అని చెబుతుంది సుస్మితా సేన్! ఇలా పిల్లల్ని దత్తత తీసుకుని తన తల్లి హృదయాన్ని, మహిళగా తాను నిలబడ్డ మహోన్నత స్థానాన్ని ప్రపంచానికి చాటి .. సుస్మితా అంటే మాటలే కాదు చేతలు కూడా అని నిరూపించింది.మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్, మిస్ ఏషియా పసిఫిక్ పోటీలుంటాయి. మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్న వారు ‘మిస్ యూనివర్స్’పోటీలకు అర్హులు. మిస్ ఇండియా పోటీలో ఫస్ట్ రన్నరప్ అయిన వారు ‘మిస్ వరల్డ్’పోటీలకు వెళ్తారు. సెకండ్ రన్నరప్ ‘మిస్ ఏషియా పసిఫిక్’లో పాల్గొంటారు. ఇదికాక పర్యావరణ స్పృహ, కార్యాచరణకు సంబంధించి ‘మిస్ అర్త్’ అనే పోటీ కూడా ఉంటుంది. -
'అస్సలు ఇది ఊహించలేదు చాలా గర్వంగా ఉంది'..! సోఫియా తండ్రి భావోద్వేగం
పహల్గాం ఉగ్రవాద దాడికి భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్' చేపట్టి తగిన రీతీలో బదులిచ్చింది. దీనిపై యావత్ దేశం హర్షాతీరేకాలు వ్యక్తం చేసింది. అన్నింటికంటే ఈ ఆపరేషన్ సిందూర్ గురించి మీడియా ముందు వెల్లండించిన ఇద్దరు మహిళా అధికారులు అందరి దృష్టిని ఆకర్షించారు. ఇది ఒకరకంగా భారత రక్షణదళం ఎవరి సారథ్యంలో కొనసాగుతోంది అనేది ప్రపంచానికి తెలిసేలా చేసింది. వారే కల్నల్ సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్లు. అయితే తాతా ముత్తాతల నుంచి ఆర్మీలో సేవలందిస్తున్న సోఫియా కుటుంబం తమ కుమార్తె చేసిన పనికి ఆనందపారవశ్యంలో మునిగితేలుతోంది. 'ఇది మాకెంతో గర్వం' అని భావోద్వేగంగా చెబుతున్నారు కుటుంబసభ్యులు. ఆమె తండ్రి తాజ్ మొహమ్మద్ ఖురేషి సైతం ఇలాంటి గొప్ప అవకాశం తన కుమార్తెకు వస్తుందని కల్లో కూడా ఊహించలేదన్నారు. ఆమె కారణంగా ఈ రోజు యావత్ దేశానికి తమ కుటుంబం గురించి తెలిసేలా వార్తల్లో నిలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో సోఫియాకి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఆమె కుటుంబసభ్యుల మాటల్లోనే చూద్దామా..!.తమ కుమార్తె భారత ఆర్మీ, నేవీ, వైమానిక బలగాలు సంయుక్తంగా నిర్వహించి ఈ సిందూర్ ఆపరేషన్ గురించి మీడియా ముందుకు వచ్చి చెప్పడం చాలా సంతోషంగా ఉందన్నారు కల్నల్ సోఫియా తల్లి హనిమా ఖురేషి. అంతేగాదు తమ కుమార్తె సోపియా కొడుకు(18) కూడా ఐఏఎఫ్(IAF)లో చేరడానికి సిద్ధంగా ఉన్నాడని అన్నారామె. ఇక కల్నల్ సోషియా తండ్రి తాజ్ ఖురేషి మాట్లాడుతూ.."నా కుమార్తె పట్ల నాకు గర్వంగా ఉంది" నా కుటుంబం ఎల్లప్పుడూ 'వయం రాష్ట్రే జాగ్రయం ( జాతి మొత్తాన్ని సజీవంగా, జాగరూకతతో ఉండేలా చేస్తాం)' అనే సూత్రాన్ని పాటిస్తుంది. 'ముందు మేము భారతీయులం ఆ తర్వాతే ముస్లీంలం' అని సగర్వంగా అన్నారు తాజ్ మొహ్మద్ ఖురేషి. అంతేగాదు ఆమె తాతతో ప్రారంభమైన ఈ దేశ సేవను..సోపియా మూడవ తరం సైనిక అధికారిగా ముందుకు తీసుకెళ్తుందన్నారు. Meet Taj Qureshi, the proud father of Colonel Sofiya Qureshi 🇮🇳“My grandfather, father & I were all in the #IndianArmy If I get a chance today, I will destroy Pakistan”Imagine RW & Godi Media question their patriotism everyday 💔Mad respect for the REAL HEROES OF INDIA 🫡🇮🇳 pic.twitter.com/CDHH2XoJkt— Ankit Mayank (@mr_mayank) May 7, 2025 ఇక సోఫియా తండ్రి తాజ్ ఖురేషి వడోదరలో ఎలక్ట్రానిక్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ కార్ఫ్స్ పనిచేయడమే గాక 1971 యుద్ధంలో సేవలందించారు. అలాగే సోఫియా తండ్రి (తాజ్)గారి అమ్మమ్మ తాతయ్య బ్రిటిష్ సైన్యంలో పనిచేయడమే గాక 1857 స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు కూడా. ఇక ఆమెకు ముగ్గురు సోదరులు కూడా ఉన్నారు. వారిలో ఒకరైన మొహమ్మద్ సంజయ్ ఖురేషి మాట్లాడుతూ..'దేశ భక్తి మా రక్తంలోనే ఉంది' అని సగర్వంగా చెప్పారు. ఎందుకంటే సోఫియా ప్రొఫెసర్ కావాలనుకుంని, అనివార్య కారణాలతో భారత ఆర్మీ యూనిఫాం ధరించిందని అన్నారు. అలా ఆమె కుటుంబ సంప్రదాయన్ని పుణికి పుచ్చుకుందని అన్నారు. ఇక ఆమె భర్త తాజుద్దీన్ ఆర్మీ మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీలో అధికారి కావడం విశేషం. చివరిగా కుటుంబ సభ్యులంతా.."ఆమె మాకు ఆదర్శం... ప్రతీకారం తీర్చుకోవడానికి మేము చాలా కాలంగా ఎదురుచూశామం కానీ, ఇలాంటి అద్భుత అవకాశం మా కుటుంబ సభ్యల్లో ఒకరికి దక్కడం ఎంతో సంతోషంగా ఉంది. ఆ పహల్గాం ఘటనలో భర్తలను కోల్పోయిన సోదరీమణులు, తల్లుల ఆక్రందనలకు సిందూరంతో ప్రతీకారం తీర్చుకున్నాం" అని అన్నారు. కాగా, సోఫియా పేరు మీద అనేక అవార్డులు కూడా ఉన్నాయట. అలాగే భారతదేశం నిర్వహించిన అతిపెద్ద విదేశీ సైనిక కవాతులో పాల్గొన్న 18 కంటింజెంట్లలో ఏకైక మహిళా కమాండర్ సోఫియానే అట.విద్యా నేపథ్యం:కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ మీడియంలో పాఠశాల విద్యను పూర్తి చేసినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత 1995లో బీఎస్సీ, 1997లో ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత భారత సైన్యంలో చేరేందుకు తన పీహెచ్డీ ప్రోగ్రామ్ని మధ్యలోనే విడిచిపెట్టినట్లు వివరించారు. ఇక సైన్యంలో చేరాక తన కెరీర్లో ఆరేళ్లు యూఎన్ శాంతి పరిరక్షక దళాలలో పని చేయడం, సంఘర్షణ ప్రాంతాలలో పనిచేయడం, మానవతా ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం వంటి ఎన్నో అద్భుత సేవలందించారామె.చదవండి: నేలరాల్చిన 'సిందూరం'తోనే బదులు..! ఆదిపరాశక్తులే స్వయంగా.. -
Reita Faria: తొలి అందాల డాక్టర్ రీటా ఫారియా
రీటా ఫారియా.. అందాల పోటీలను ఫాలో అయ్యేవారెప్పటికీ మరచిపోని పేరు! మిస్ వరల్డ్గా ఎంపికైన తొలి ఇండియనే కాదు తొలి ఏషియన్ కూడా! అంతేకాదు మిస్ వరల్డ్గా ఎంపికైన తొలి మెడికల్ డాక్టర్! ఇన్ని ఫస్ట్లను ప్రీఫిక్స్గా పెట్టుకున్న రీటా నిజంగానే ప్రత్యేకమైన మహిళ! ఇప్పుడామెకు 82 ఏళ్లు. ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ డేవిడ్ వెల్ను పెళ్లి చేసుకుని ఐర్లండ్లో స్థిరపడ్డారు. ఆమెకు ఇద్దరు కూతుళ్లు. వాళ్లూ డాక్టర్లే, అమ్మలాగే వాళ్లూ స్పోర్ట్స్ పర్సన్సే గోల్ఫ్లో! రీటా 5 అడుగుల 8 అంగుళాల ఎత్తుండటం వల్ల స్కూల్లో, కాలేజీలో ఆమెను ‘మమ్మీ లాంగ్ లెగ్స్’ అంటూ ఆటపట్టించేవాళ్లట. అయితే ఆమె దాన్ని అవకాశంగా మలచుకుంది. పొడుగు కాళ్లతో స్పోర్ట్స్లో బాగా రాణించవచ్చని గ్రహించి.. త్రోబాల్, నెట్బాల్, బాడ్మింటన్ నుంచి హాకీ దాకా అన్ని ఆటలూ ఆడారు. పెయింటింగ్ వేస్తారు. డాక్టర్ అయ్యి.. మంచి ఫిజీషియన్గా పేరు తెచ్చుకున్నారు. అసలు మిస్ వరల్డ్ కోసం ప్రయాణం... రీటా ఫారియా స్వస్థలం ముంబై. తాతల కాలంలోనే గోవా నుంచి వచ్చి ముంబైలో స్థిరపడిన ఓ సామాన్య కుటుంబం. నాన్న.. జాన్, ఒక మినరల్ ఫ్యాక్టరీలో పనిచేస్తే.. అమ్మ.. ఆంటోయినెట్, బ్యూటీ పార్లర్ నడిపేవారు. రీటా అక్క ఫిలోమెనా. రీటా మిస్ వరల్డ్ దాకా వెళ్లడానికి ప్రోత్సహించింది ఆమే! రీటా మెడిసిన్ ఫైనలియర్లో ఉన్నప్పుడే (1966) మిస్ బాంబే పోటీల్లో పాల్గొంది. టైటిల్ సొంతం చేసుకుంది. తర్వాత వాళ్ల సోదరి ‘మిస్ ఇండియా కోసమూ పోటీ పడు’ అంటూ వెన్ను తటింది. అక్కడా టైటిల్ ఆమెనే వరించింది. తర్వాత మిస్ వరల్డ్ వైపూ తోసింది. ఇంచక్కా వేరే దేశం చూడొచ్చన్న ఆశతో తన 23వ ఏట, చేతిలో కేవలం పది పౌండ్ల (అప్పుడు మన దేశ ఫారెక్స్ నిబంధనలు కఠినంగా ఉండేవి అందుకే పది పండ్లు)తో ఆ ΄ోటీల కోసం ఫ్లయిట్ ఎక్కారు. మిస్ వరల్డ్ పాజెంట్ కోసం కూతురు ఒంటరిగా లండన్ వెళ్లడం వాళ్లమ్మను కలవరపరచింది. ఆమె తిరిగొచ్చే వరకూ ఆందోళనతోనే ఉన్నారట. మినిస్టర్ కూతురు చీర.. సేల్స్లో హీల్స్.. మిస్ట్ వరల్డ్ పోటీల మీద సరైన అవగాహన, పోటీల్లో ఈవినింగ్ వేర్, గౌన్, పర్సనాలిటీ చాలెంజ్, మిస్ వరల్డ్ నైట్.. లాంటి ముఖ్యమైన ఘట్టాలకు సూట్ అయే దుస్తులూ లేకుండానే పీల్గొంది రీటా. ఈవెనింగ్ వేర్లో చీరే కట్టుకోవాలని నిశ్చయించుకుంది. ఎందుకంటే తన దగ్గర చీర మాత్రమే ఉంది. చీరను ఇండియన్ ట్రెడిషనల్ వేర్గానూ ప్రెజెంట్ చేయొచ్చు అనుకుంది. ఆ చీర కూడా అప్పటి మిస్ ఇండియా ఏజెంట్ ఆర్గనైజేషన్తో అనుబంధం ఉన్న మహారాష్ట్ర నాటి మినిస్టర్ పాజ్పేయి కూతురి పెళ్లి చీర. నగలు కూడా అరువు తీసుకున్నవే! ఆర్గనైజర్స్ ఆమె వార్డ్ రోబ్ చూసి అవాక్కయ్యారట. ఏమీ లేకుండా ఎలా పాల్గొనబోతోందీ అమ్మాయి అని! ఆమె పొడగరి కావడం వల్ల ఆమెకిచ్చిన స్విమ్ సూట్ కురచదైపోయిందట. తన దగ్గరున్న హీల్స్ ఆ పోటీలకు కావల్సిన ఎత్తు కన్నా తక్కువ ఎత్తున్నవి. ఏం చేయాలో పాలుపోక.. ఒకరోజు తన దగ్గరున్న పది పౌండ్లతో ఎక్కడ దొరుకుతాయో వెదుక్కోసాగింది. అదృష్టవశాత్తు ఒక షాపులో మూడు డ్లకు మంచి స్విమ్ సూట్, అర పౌండ్కి కావల్సిన హీల్స్ దొరికాయి ఆమెకు. వాటితోనే పోటీలకు తలపడింది. విశేషమేమంటే ఆ రౌండ్లో ఆమెకు ‘బెస్ట్ స్విమ్సూట్’ సబ్ టైటిల్ దక్కింది. అంతేకాదు ఈవెనింగ్ వేర్ ఈవెంట్లో శారీతో ప్రత్యక్షమై ‘బెస్ట్ ఈవెనింగ్ వేర్’ సబ్ టైటిల్నూ సొంతం చేసుకుంది. ఫైనల్ ఈవెంట్లో కూడా జడ్జెస్ అడిగిన ప్రశ్నలుకు చక్కటి సమాధానంతో 51 కంటెస్టెంట్లతో పోటీపడి ‘మిస్ వరల్డ్’ కిరీటాన్ని అందుకుంది. ఇక వాళ్లమ్మ సంతోషానికి అవధుల్లేవట! ‘అదంతా చాలా వేగంగా జరిగిపోయింది. కిరీటం గెలుచుకున్నాక వెనక్కి తిరిగి ఆలోచిస్తే.. నాకున్న అరకొర ఏర్పాట్లతో దీన్నెలా సాధించగలిగానా అని ఆశ్చర్యం వేసింది. ఇప్పటివాళ్లలాగా అప్పట్లో ఏడాది ముందు నుంచే ప్రిపరేషన్లు ఉండేవి కావు. ఇప్పటి వాళ్లు స్పష్టమైన లక్ష్యంతో దానికోసం ట్రైన్ అవుతున్నారు’ అని చెబుతారు రీటా ఫారియా పావెల్. గెలిచాక.. రీటా ఫారియాకు మోడలింగ్లో, సినిమాల్లో చాలా అవకాశాలు వచ్చాయి. కానీ ఆమె తన డాక్టర్ వృత్తిని చాలా సీరియస్గా తీసుకున్నారు. అందుకే వాటన్నిటికీ నో చెప్పారు. అంతేకాదు మిస్ట్ వరల్డ్గా వేదికల మీద పర్సనల్ అపియరెన్స్ ఇచ్చానే తప్ప ఎలాంటి కమర్షియల్స్కి అడ్వర్టయిజ్ చేయలేదు. ఆమె కమిట్మెంట్కు ముచ్చటపడ్డ లండన్లోని ప్రిస్టేజియస్ కింగ్స్ కాలేజ్ హాస్పిటల్ సిబ్బంది తమ కాలేజీలో చదువు కొనసాగించమని ఆహ్వానించారు. అక్కడే డాక్టర్ యురోపియన్ డేవిడ్ పావెల్ ఈ డస్కీ బ్యూటీ రిటాను కలుసుకున్నాడు. ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్లకు అయిదురుగు మనవలు, మనవరాళ్లు. ఇప్పటికీ రీటా అంతే బిజీగా, అంతే ఉత్సాహంగా ఉంటారు. గోల్ఫ్ ఆడుతారు. గార్డెనింగ్ చేస్తారు. ఇంటి పనీ, వంట పనీ చేస్తారు. భార్యాభర్తలిద్దరూ క్లాసికల్ మ్యూజిక్ క్లాసెస్కూ వెళ్తారు.– సరస్వతి రమ(చదవండి: అందాల పోటీలకూ నియమ నిబంధనలు ఉంటాయి) -
Operation Sindoor: యుద్ధ స్వరం... ఆ ఇద్దరు
‘ఆపరేషన్ సిందూర్’ ఒక సంచలనమైతే... ప్రెస్మీట్లో మిలిటరీ బ్రీఫింగ్ చేసిన ఇద్దరు మహిళా సైనికాధికారులు మరో సంచలనం. ఆ ఇద్దరు... చెప్పకనే ఎన్నో చెప్పారు. వారిలో మతాలకతీతమైన జాతీయ సమైక్యత కనిపించింది. ఎలాంటి అవరోధాలనైనా అధిగమించి జయించే మహిళాశక్తి కనిపించింది. ఆపరేషన్కు ‘సిందూర్’ అని పేరు పెట్టడం ప్రతీకాత్మకం. ఐక్యత, మత సామరస్యానికి సంబంధించిన శక్తిమంతమైన సందేశాన్ని తెలియజేసేలా ఇద్దరు మహిళా అధికారులు బ్రీఫింగ్కు నేతృత్వం వహించాలి అనే నిర్ణయం కూడా ప్రతీకాత్మకమైనదే. ప్రపంచ ఆసక్తి ఇప్పుడు రెండు పేర్లపై కేంద్రీకృతమైంది. కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్...భారత చరిత్రలో తొలిసారి ఇద్దరు మహిళా అధికారులు భారీ సైనిక చర్యపై అధికారిక విలేకరుల సమావేశానికి నాయకత్వం వహించారు. ఉగ్రవాదాన్ని గట్టిగా ఎదుర్కోవాలనే దేశ సంకల్పాన్ని మాత్రమే కాకుండా సాయుధ దళాల్లో పెరుగుతున్న మహిళల బలానికి వారు ప్రతీకలుగా కనిపించారు. ‘ఆపరేషన్ సిందూర్’ వివరాలను పంచుకోవడానికి నిర్వహించిన విలేకరుల సమావేశానికి కల్నల్ సోఫియా ఖురేషీ, భారత వైమానికి దళానికి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికాసింగ్ నేతృత్వం వహించిన నేపథ్యంలో వారి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి సర్వత్రా మొదలైంది. ‘పహల్గామ్లో ఇరవై ఆరుమందిప్రాణాలను బలిగొన్నారు. ఉగ్రవాద బాధితులకు న్యాయం చేసేందుకే ఆపరేషన్ సిందూర్ ప్రారంభించాం’ అన్నారు సోఫియా ఖరేషీ. పాక్, పాక్ ఆక్రమిత జమ్ము కశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని విజయవంతంగా దాడి చేసినట్లు ఆమె తెలియజేశారు. సంక్షోభ పరిస్థితుల్లో సైన్యం, ప్రజల మధ్య కమ్యూనికేషన్ను కొనసాగించడంలో ప్రొఫెషనల్ ఆఫీసర్స్ పాత్రను వింగ్ కమాండర్ వ్యోమికాసింగ్ వివరించారు.ఆ ఇల్లు సైనిక శిబిరంఅది ఇల్లు అనడం కంటే... చిన్నపాటి సైనిక శిబిరం అంటే బాగుంటుంది! కొట్ట వచ్చినట్లు కనిపించే మిలిటరీ క్రమశిక్షణ ఒకవైపు...‘ఆ యుద్ధంలో ఏం జరిగిందో తెలుసా?’‘ఒక వీర సైనికుడి గురించి చెబుతాను విను..’ ఇలాంటి విశేషాలు మరోవైపు. గుజరాత్లోని వడోదరాకు చెందిన ఖురేషిది సైనిక కుటుంబ నేపథ్యం. తాత, తండ్రీ సైన్యంలో పనిచేయడమే తాను సైన్యంలో పనిచేయాలనుకోవడానికి కారణం. బలం. ‘మహారాజా షాయాజీరావు యూనివర్శిటీ’లో బయోకెమిస్ట్రీలో పీజీ చేసిన ఖురేషి 1999 లో షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా భారత సైన్యంలో చేరారు.చరిత్ర సృష్టించి...పుణెలో జరిగిన ‘ఎక్సర్సైజ్ ఫోర్స్ 18’లో పద్ధెనిమిది దేశాల సైనికులు పాల్గొన్నారు. ఈ విశిష్ట కార్యక్రమంలో భారత సైన్యానికి చెందిన బృందానికి నాయకత్వం వహించి చరిత్ర సృష్టించారు ఖురేషీ. అంతేకాదు.. ‘ఎక్సర్సైజ్ ఫోర్స్ 18’లో పాల్గొన్న 18 బృందాలలో ఆమె ఏకైక మహిళా కమాండర్.గర్వించదగిన కాలంఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక చర్యల్లో భాగంగా కాంగోలో ఆరేళ్లు పనిచేశారు ఖురేషీ. అక్కడ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ఇరు వర్గాల మధ్య కాల్పుల విరమణను పర్యవేక్షించారు. ఒకవైపు శాంతిపునరుద్ధరణ ప్రయత్నాలు చేస్తూనే, మరోవైపు సేవాకార్యమ్రాలకుప్రాధాన్యత ఇచ్చేవారు.‘ఘర్షణాత్మక ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు చేసిన ప్రయత్నాలు నాకు గర్వకారణం’ అంటారు ఖురేషీ.ఖురేషీలోని నాయకత్వ లక్షణాలు, చొరవ, ధైర్యసాహసాలను అప్పటి ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్ గుర్తించారు. ‘సైన్యంలో పురుష, మహిళా అధికారులు అనే తేడా లేదు. జెండర్ప్రాతిపదికన కాకుండా బాధ్యతను భుజాన వేసుకునే సామర్థ్యం, నాయకత్వ లక్షణాల వల్లే ఆమె ఎంపిక జరిగింది’ అన్నారు రావత్. భారత పార్లమెంట్ పై ఉగ్రవాదుల దాడి తర్వాత చేపట్టిన ‘ఆపరేషన్ పరాక్రమ్’లో ఖురేషీ కీలక పాత్ర పోషించారు. ఆమె ధైర్యసాహసాలకు గాను జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ప్రశంసలు అందుకున్నారు. కుటుంబ నేపథ్యం ఖురేషీకి సైన్యంలో పనిచేయాలనే లక్ష్యాన్ని ఇచ్చింది. విద్యానేపథ్యం విమర్శనాత్మక ఆలోచన దృష్టిని ఇచ్చింది. సమస్య పరిష్కారానికి శాస్త్రీయ దృష్టిని అందించింది. ఆకాశ పుత్రికఆకాశంలో కనిపించే విమానాలను చూస్తూ అందరు పిల్లల్లాగే చప్పట్లు కొడుతూ తెగ సంతోషించేది వ్యోమికా సింగ్. ఆ సంతోషానికి లక్ష్యం కూడా తోడైంది. ఆకాశంలో దూసుకు పోవాల్సిందే!‘నేను ఆరవ తరగతిలో ఉన్నప్పుడే పైలట్ కావాలనుకున్నాను. ఆకాశాన్ని సొంతం చేసుకోవాలనుకున్నాను. మా పేర్ల అర్థాల గురించి క్లాసులో మాట్లాడుకుంటున్నప్పుడు వ్యోమిక... నీ పేరుకు అర్థం ఆకాశ పుత్రిక అని అరిచారో ఎవరో. దీంతో పైలట్ కావాలనే కోరిక మరింత బలపడింది’ అని ఒక టీవీ షోలో బాల్య జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నారు వ్యోమికా సింగ్.ఎన్సీసీ పునాదిపై...ఇంజినీరింగ్ చేస్తున్నప్పుడు ఎన్సీసీలో చేరిన వ్యోమికాకు సైనిక క్రమశిక్షణ అలవడింది. భారత వైమానిక దళంలో హెలికాప్టర్ పైలట్గా తన కలను నిజం చేసుకున్న వ్యోమిక 2019లో ఫ్లయింగ్ బ్రాంచ్లో శాశ్వత కమిషన్ హోదా పొందారు. తన కుటుంబంలో సాయుధ దళాల్లో చేరిన మొదటి వ్యక్తిగా వ్యోమిక గుర్తింపు పొందారు.జమ్మూకశ్మీర్, ఈశాన్యప్రాంతాలతో సహా అత్యంత కఠినమైన భూభాగాల్లో చేతక్, చీతాలాంటి హెలికాప్టర్లు 2,500 గంటలకు పైగా నడిపిన అనుభవం ఆమెకు ఉంది. 2021లో 21,650 అడుగుల ఎత్తులో ఉన్న మణిరంగ్ పర్వతారోహణ యాత్రలో పాల్గొన్నారు. కమాండర్ వ్యోమికా సాహసాన్ని, అంకితభావాన్ని చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్తో సహా సీనియర్ డిఫెన్స్ అధికారులు గుర్తించారు. 2020లో అరుణాచల్ప్రదేశ్లో కీలక రెస్క్యూ ఆపరేషన్కు నేతృత్వం వహించి, విపత్కర పరిస్థితుల్లో ఉన్న పౌరులను సురక్షితప్రాంతాలకు తరలించారు. ఈశాన్య భారతంలో వరద సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొన్నారు. విపత్కర పరిస్థితులు ఎదురైనా చెరగని చిరునవ్వు ఆమె సొంతం. ప్రకృతి కల్లోలాలకు వెరవకుండా బాధితులకు అండగా ఉండడం ఆమె నైజం. ఆ ఇద్దరు... ది స్ట్రెంత్ ఆఫ్ ఇండియాకల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్లపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. వివిధ పార్టీల నేతలు వీరిని అభినందించారు. ‘ఇది కేవలం బ్రీఫింగ్ మాత్రమే కాదు. సాహసోపేతమైన ప్రకటన. ప్రతి యుద్ధంలో, ప్రతి మిషన్లోనూ మహిళలు ముందుండి నడిపిస్తారు’ అని కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్ చేశారు. ‘విలేకరుల సమావేశంలో ఎవరు ఉన్నారో గుర్తుంచుకోండి. వారు... ఇండియన్ ఆర్మీకి చెందిన కల్నల్ సోఫియా ఖురేషీ, వైమానికి దళానికి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. భుజం భుజం కలిపి ఒకే జెండాను మోస్తున్నారు. ఇది భారతదేశం. ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. ఐక్యత, శాంతి ముందు విద్వేషానికి మాటలు ఉండవు’ అని యాక్టివిస్ట్, రైటర్ గుర్మెహర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. -
నేలరాల్చిన 'సిందూరం'తోనే బదులు..! ఆదిపరాశక్తులే స్వయంగా..
ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన కొన్ని వారాల తర్వాత మే 7 బుధవారం తెల్లవారుజామున భారతదేశం ఆపరేషన్ సిందూర్ చేపట్టి బదులిచ్చింది. నాడు ఆ విషాదకర ఘటనలో మోదీకి చెప్పు అంటూ మహిళా పర్యాటకుల ముందే వారి భర్తలను కడతేర్చారు. వారి ఆక్రందనలు వినిపించేలా నేలరాల్చిన ఆ మహిళ 'సిందూరం' పేరుతోనే ఆపరేషన్ చేపట్టి ఉలిక్కిపడేలా సమాధానమిచ్చింది భారత్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆరోజు ఆనందంగా గడపాలని వచ్చిన మహిళలకు కన్నీళ్లు మిగిల్చితే..ఈ ఆపరేషన్ పేరుతో సైనిక మహిళా శక్తితోనే సమాధానం చెప్పడం విశేషం. అంతేగాదు ఉగ్రమూకల్ని ఎలా మట్టుబెట్టామన్నది మీడియా ముందు వెల్లడించారు కూడా. మరీ ఆ ఆదిపరాశక్తులు ఎవరు? ఏవిధంగా ఈ ఆపరేషన్ని విజయవంతంగా ముగించారు తదితర విశేషాలు చూద్దామా..!వారే వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషీలు. ఈ సిందూర్ ఆపరేషన్ వారి నేతృత్వంలోనే విజయవంతంగా ముగిసింది. ఈ ఇద్దరు భారత సశస్త్ర దళాల్లో సీనియర్ మహిళా అధికారులు. ఈ సిందూర్ ఆపరేషన్కి సంబంధించిన సశస్త్ర దళాలకు నాయకత్వం వహించింది వీరిద్దరే. సోఫియా ఖురేషీ ఆర్మీ కల్నల్ హోదాలో ఆపరేషన్ సిందూర్కు ముందుండి నాయకత్వం వహించగా, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పైలట్గా భారత వైమానిక దళానికి నాయకత్వం వహించారు. సోఫియా భూమిపై సైన్యంతో విధ్యంసం సృష్టించగా, వ్యోమికా సింగ్ ఆకాశం నుంచి వైమానిక దాడులు నిర్వహించారు. ఈ ఇరువురి మహళా అధికారుల నేతృత్వంలో భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ బలగాలు పాకిస్థాన్ (Pakistan)లోని ఉగ్రస్థావరాలపై మెరుపులు దాడులు నిర్వహించాయి. ఈ ఆపరేషన్లో మొత్తం 9 ఉగ్ర స్థావరాలతో సహా పాక్లో ఉన్న టెర్రర్ ఇండక్షన్లు, ట్రైనింగ్ సెంటర్లను కూడా మట్టుబెట్టింది. అంతేగాదు విజయవంతంగా ముగిసిన ఈ ఆపరేషన్ గురించి ప్రపంచానికి తెలియజేయడమే గాక భారతదేశ రక్షణ దళాలలో మహిళల పాత్రను హైలెట్ చేసింది. సాహసాలకు కేరాఫ్ అడ్రస్ ఇరువురు..ఇక్కడ సోఫియా కుటుంబం మొత్తం సైనిక సేవలతో ముడిపడి ఉంది. అంతేగాదు సోఫియా ఫోర్స్ 18 అనే బహుళ జాతీయ సైనిక విన్యాసంలో భారత సైన్యం తరఫున ఒక దళానికి నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారిగా చరిత్ర సృష్టించారు.సోఫియా యూఎన్ శాంతి పరిరక్షక కార్యకలాపాలలో ఆరు సంవత్సరాలు సేవలందించారు.ఐక్యరాజ్యసమితి మిషన్లో (2006) గణనీయమైన సేవలు అందించారువ్యోమిక తన పేరుకు తగ్గట్టే పైలట్ కావాలనే రంగాన్ని ఎంచుకుని సైన్యంలో చేరారామె. అంతేగాదు తన కుటుంబంలో ఆర్మీలో చేరిన తొలి వ్యక్తిగా వ్యోమిక పేరుగడించింది. డిసెంబర్ 18న, ఆమెకు శాశ్వత కమిషన్ లభించి, హెలికాప్టర్ పైలట్గా ఐఏఎఫ్లో ఆమె ప్రయాణం అధికారికంగా ప్రారంభమైంది. భారత్లో అత్యంత సవాలుతో కూడిన భూభాగాలలో చేతక్, చిరుత వంటి విమానాలను నడిపారామెఇప్పటివరకు 2,500కు పైగా ఫ్లయింగ్ గంటలు పూర్తి చేశారు.2020లో అరుణాచల్ప్రదేశ్లో కీలకమైన రెస్క్యూ మిషన్కు నాయకత్వం వహించింది2021లో త్రివిధ దళాల మహిళా ఎక్సపిడిషన్లో పాల్గొన్నారుహర్షం వ్యక్తం చేసిన పహల్గాం బాధితులు..ఆ ఆపరేషన్ గురించి వినగానే కళ్లల్లో నీళ్లు వచ్చేశాయన్నారు పహల్గామ్ బాధితులు. మా కుంకుమను నేలరాల్చిన వారికి అదే పేరుతో ఆపరేషన్ చేపట్టి మట్టికరిపించినందుకు ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలని గద్గద స్వరంతో అన్నారు. ఈ ఆపరేషన్ సిందూర్తో ప్రధాని మోదీ ఉగ్రవాదాన్ని అంతం చేస్తారని గట్టిగా విశ్వసిస్తున్నాం అని ధీమాగా చెప్పారు.(చదవండి: Operation Sindoor: మన కుమార్తెల సిందూరమే.. ఆపరేషన్ సిందూర్.. పహల్గాం బాధితుల రియాక్షన్) -
సివిల్స్లో ఇల్లాలి అపూర్వ విజయం..! వైకల్యాన్ని జయించి..
ఇరవైలలో సివిల్స్కు శ్రీకారం చుట్టడం సాధారణ విషయం. కేరళకు చెందిన నిశా మాత్రం 35వ యేట ప్రిపరేషన్ మొదలు పెట్టింది. వినికిడి సమస్య ఉన్న నిశా ఏడవ ప్రయత్నంలో, 40 సంవత్సరాల వయసులో సివిల్స్లో విజయం సాధించింది. తిరువనంతపురంలోని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా పనిచేసేది నిసా ఉన్నిరాజన్. నందన (11), తన్వీ(7) ఆమె కుమార్తెలు. భర్త అరుణ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్. 35 ఏళ్ల వయసులో సివిల్స్కు సిద్ధం అవుతున్నప్పుడు... ‘ఈ వయసులో కష్టం’ ‘ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ సివిల్స్లో సక్సెస్ కావడం కష్టం’... ఇలా రకరకాల అభిప్రాయాలు వినిపించాయి. భర్త అరుణ్ మాత్రం ప్రోత్సహించాడు.వినికిడి సమస్య వల్ల సివిల్స్ ప్రిపరేషన్లో నిసాకు సమస్యలు ఎదురయ్యేవి. సబ్జెక్ట్కు సంబంధించిన ఆడియోలు వినడం కష్టం అయ్యేది. ఒకవైపు ఇంటి పనులు చేస్తూనే మరోవైపు ప్రిపరేషన్ కోసం టైమ్ కేటాయించుకునేది. ‘వినికిడి సమస్య ఉన్న నువ్వు సివిల్స్కు ఎలా ప్రిపేరవుతావు!’లాంటి ఎగతాళి మాటలు వినాల్సి వచ్చేది.ఆమె కష్టం వృథా పోలేదు. నలభై ఏళ్ల వయసులో యూపీఎస్సీ–2024 పరీక్షలో 1000వ ర్యాంక్ సాధించింది. 40 శాతం వినికిడి లోపం ఉన్న నిశా తన వైకల్యాన్ని ఎదుర్కొంటూ, కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే విజయం సాధించింది.కొట్టాయం డిప్యూటీ కలెక్టర్ రంజిత్ నుంచి నిశా స్ఫూర్తి పొందింది. వినికిడి సమస్య ఉన్న రంజిత్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని సివిల్స్లో విజయం సాధించాడు. ‘మీలో పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అని నా కుమార్తెలకు నిరూపించి చూపాలనుకున్నాను. మనకు ఉన్నది ఒకే జీవితం. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మన లక్ష్యాన్ని వదులుకోవద్దు’ అంటుంది నిశా. (చదవండి: చిన్నారులకు వంశవృక్షం తెలియాలి..! కనీసం ఓ మూడు తరాలు..) -
16 ఏళ్లకే బ్రెస్ట్ కేన్సర్ సర్జరీ..! జస్ట్ 15 రోజుల్లేనే మిస్ వరల్డ్ వేదికకు..
హైదరాబాద్ వేదికగా మరికొద్ది రోజుల్లో 72వ మిస్ వరల్డ్ – 2025 పోటీలు జరగనుండటం విధితమే. దీనిలో దాదాపు 120 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ కంటెస్టెంటులు భాగస్వాములు కానున్నారు. ఇందులో భాగంగా నగరానికి చేరుకున్న మిస్ వరల్డ్ థాయిలాండ్ 2025 ‘ఓపాల్ సుచాత చువాంగ్ శ్రీ’ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో సోమవారం సందడి చేశారు. బంజారాహిల్స్లోని సింఘానియాస్ వస్త్ర దుకాణంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. సామాజిక బాధ్యతగా నిర్వహిస్తున్న ‘ఓపాల్ ఫర్ హర్’కు మద్దతుగా సింఘానియాస్ చీరలు, లెహంగాలను ధరించారు. తన ఫ్యాషన్ ప్రయాణంతో పాటు తన వ్యక్తిగత విషయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు.. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..!! గ్లోబల్ వేదికగా ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీల్లో థాయిలాండ్ తరపున ప్రాతినిధ్యం వహిస్తుండటం సంతోషంగా ఉంది. అనూహ్యంగా.. మిస్ థాయ్లాండ్గా మిస్ వరల్డ్ వేదికకు సిద్ధం కావడానికి కేవలం 15 రోజులు మాత్రమే పట్టింది. నా జీవితంలో ఇదొక మిరాకిల్. తక్కువ సమయంలో ఈ అవకాశం రావడం నా అదృష్టం. ప్రోత్సాహాన్ని అందించిన థాయ్ ప్రజలకు, అంతర్జాతీయ అభిమానులకు ఎప్పుడూ రుణపడి ఉంటా. ఈ వేదికపై విజేతగా నిలవడమే నా దేశానికిచ్చే రిటర్న్ గిఫ్ట్. పుట్టి పెరిగిందంతా థాయ్లాండ్ ఫుకెట్లో. విద్యాభ్యాసం అక్కడే చేశాను. ఉన్నత చదువులకు బ్యాంకాక్ వచ్చాను. అక్కడి నుంచి నా ఫ్యాషన్ ప్రయాణం మొదలైంది. ఆ బాధ నాకు తెలుసు.. సామాజిక బాధ్యతలో భాగంగా రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పిస్తున్నాను. 16 ఏళ్ల వయసులో నాకు బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ జరిగింది. ఇందులో భాగంగా నాన్ క్యాన్సరస్ లంప్ను తీసేశారు. ఆ అవస్థలు, వేదన నాకు భాగా తెలుసు. అందుకే.. రొమ్ము క్యాన్సర్ అవగాహన కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటాను. ముందస్తు చికిత్స–గుర్తింపు అవసరముంది. మహమ్మారిపైన అవగాహన కల్పించడమే జీవిత లక్ష్యం. మిస్ థాయ్లాండ్గా నా స్వరాన్ని వినిపిస్తున్నాను. ఇలాంటి సామాజిక బాధ్యతల్లో భాగంగా ‘ఓపాల్ ఫర్ హర్’లో పాలుపంచుకున్నా. థాయ్ ప్రజలకు స్ఫూర్తినిస్తూ.. ప్రపంచానికి సేవచేస్తాను. ఈ విషయాల్లో మా అమ్మే నాకు స్ఫూర్తి. ఆతిథ్యం అదుర్స్.. ఎయిర్ పోర్ట్లో లభించిన స్వాగతం సత్కారాలు చూసి ఆశ్చర్యపోయాను. ఇంతటి ఘనమైన ఆతిథ్యం జీవితంలో ఇదే మొదటిసారి. హైదరాబాద్ విశిష్టతల గురించి విన్నాను.. ఇది పెరల్ సిటీ అని ఇక్కడికి వచ్చాక తెలిసింది. నాకు ఆభరణాలంటే ఎంతో ఇష్టం. ప్రత్యేకంగా ఓల్డ్ సిటీ వెళ్లి ఆభరణాలు కొనుక్కుంటాను. చార్మినార్, పెద్దమ్మతల్లి టెంపుల్కు కూడా వెళతాను. (చదవండి: 24 ఏళ్లకే న్యాయమూర్తిగా..! తండ్రి ఫెయిలైనా..తనయ సాధించింది..!) -
Success Story: జస్ట్ 24 ఏళ్లకే న్యాయమూర్తిగా..!
చిన్న వయసు నుంచే సామాజిక సేవ చేయాలనే తపన, న్యాయవాది కావాలన్న తన తండ్రి ఆశయాన్ని గమనించారు.. లా పూర్తి చేసినా న్యాయవాదిగా స్థిరపడాలన్న తండ్రి లక్ష్యం నెరవేరలేదు.. అందుకే తండ్రి కలను పట్టుదలతో తాను సాధించారు.. న్యాయవాది కాదు.. ఏకంగా న్యాయమూర్తిగానే ఎంపికయ్యారు.. మొదటి ప్రయత్నంలోనే.. ఉన్నత స్థానాన్ని అధిరోహించారు.. స్ఫూర్తిమంతమైన ఆమె ప్రయాణం ఆమె మాటల్లోనే.. తెలంగాణ రాష్ట్రం మల్కాజిగిరికి చెందిన శ్రీవల్లి శైలజ 2024లో నిర్వహించిన జ్యుడీషియరీ పరీక్షలో జనరల్ కేటగిరిలో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. 24 ఏళ్ల వయసులో చదువు పూర్తయిన అనతి కాలంలోనే న్యాయమూర్తిగా ఎంపిక కావడం పట్ల ఇంటా బయటా ప్రశంసల జల్లు కురుస్తోంది. విద్యావంతుల కుటుంబంలో పుట్టిన తాను చిన్ననాటి నుంచే సామాజిక సేవ చేయాలన్న తండ్రి ఆశయంతో పెరిగారు. న్యాయశాస్త్ర పట్టభద్రుడు అయినా న్యాయమూర్తి కాలేకపోయారు. దీంతో తండ్రి ఆశయాన్నే తన ఆశయంగా చేసుకుని లక్ష్యం చేరుకున్నారు శ్రీవల్లి. ఇంటర్ అవగానే ఎంసెట్, లా ప్రవేశపరీక్షలు రెండూ రాశారు. రెంటిలోనూ మంచి ర్యాంకులు సాధించారు. తండ్రి ప్రోత్సాహంతో జ్యుడీషియరీ మెయిన్స్ వైపు అడుగులువేశారు. ప్రభుత్వాధికారుల కుటుంబం నుంచి.. అమ్మ నాన్న ఇద్దరూ ఉన్నత విద్యావంతులు, ప్రభుత్వాధికారులు. నాన్న రమేష్ నరసింహం హైదరాబాద్లో సీజీఎస్టీ సూపరింటెండెంట్. తల్లి లక్ష్మీసురేఖ దక్షిణమధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్లో అసిస్టెంట్ ఆఫీసర్. ఓయూలో ఎల్ఎల్బీ, నల్సార్ యూనివర్శిటీలో ఎల్ఎల్ఎం పూర్తిచేశారు. అనంతరం జ్యుడీషియరీ మెయిన్స్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జూనియర్ సివిల్ జడ్జి వరకూ ఎదిగారు. శ్రీవల్లి సోదరి సహితం నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లాలో ఐపీఎం (మూడో సంవత్సరం) చదువుతున్నారు. నాన్న కల నెరవేరింది.. జ్యుడీషియరీ మెయిన్స్ తరువాత ఏప్రిల్ నెల్లో ఇంటర్వ్యూ జరిగింది. ఫలితాలు కొద్ది రోజుల క్రితమే వచ్చాయి. చిన్న వయసులోనే జూనియర్ సివిల్ జడ్జి వంటి ఉన్నత ఉద్యోగం లభించడం సంతోషించదగ్గ విషయం. నాన్న కల నెరవేరింది. నా శ్రమకు తగ్గ ఫలితం దక్కింది. సామాజిక న్యాయం కోసం కృషి చేయగలనన్న నమ్మకం కలిగింది. జ్యుడీషియరీలో అత్యున్నత స్థానం వరకూ వెళ్లేందుకు సాధన చేస్తా. – శ్రీవల్లి శైలజ, జూనియర్ సివిల్ జడ్జి (చదవండి: 'షాడో తోలు బొమ్మలాట'ను సజీవంగా నిలిపింది..! రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..) -
Waste into Energy : కిచెన్ వేస్ట్ నుంచి బయోగ్యాస్
అసాధారణ జ్ఞానం నుంచి మాత్రమే కాదు అవసరాల నుంచి కూడా ఆవిష్కరణలు పుడతాయి అని చెప్పడానికి హరిణి ఒక ఉదాహరణ. వంటగది వ్యర్థాల నుంచి బయోగ్యాస్ను తయారుచేసే ఆలోచన చేసి విజయవంతం అయింది. ఆ ఆలోచన తనను ఎంట్రప్రెన్యూర్ని చేసింది.తమిళనాడులోని సేలంకు చెందిన హరిణి రవికుమార్ ‘గ్రీన్ కనెక్ట్’ వ్యవస్థాపకురాలు. ‘గ్రీన్ కనెక్ట్’ దేశవ్యాప్తంగా వెయ్యి బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ఈ ΄్లాంట్లు సేంద్రియ వ్యర్థాలను విలువైన ఇంధన శక్తిగా మారుస్తాయి. పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా ఉంటాయి. (స్కూటీపై కన్నేసిన ఎద్దు : ఇది టెస్ట్ రైడ్ బ్రో..!)హౌజ్హోల్డ్ కార్బన్ ఫుట్ప్రింట్స్ను తగ్గించడానికి ఆచరణాత్మక, శక్తిమంతమైన మార్గాలను ‘గ్రీన్ కనెక్ట్’ అందిస్తుంది. సహజమైన ప్రక్రియ ద్వారా వంటగది వ్యర్థాలను వంట ఇంధనంగా మార్చడానికి రూ పొందించిన ఈ యూనిట్ను బాల్కనీలు, టెర్రస్లాంటి ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. వంటగది వ్యర్థాలతో బయోగ్యాస్, సేంద్రియ ఎరువుతో పాటు పోషకాలు అధికంగా ఉండే కంపోస్ట్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది మొక్కలకు సహజ ఎరువుగా ఉపయోగ పడుతుంది. (వాటర్ ఫిల్టర్ నీరు వృథా కాకూడదంటే..ఇలా చేయండి!)ఇలా....చెత్తను సేకరించిన తరువాత నాన్–ఆర్గానిక్ వేస్ట్ నుంచి ఆర్గానిక్ వేస్ట్ను వేరు చేయాలి.ఆర్గానిక్ వేస్ట్ను ఎయిర్టైట్ కంటెయినర్ లేదా డైజెస్టర్లో వేయాలి.టైట్ చాంబర్లో బయోగ్యాస్ను స్టోర్ చేయాలి.స్టోర్ చేసిన బయోగ్యాస్ను వంట గ్యాస్గా ఉపయోగిస్తారు. -
'షాడో తోలు బొమ్మలాట'ను సజీవంగా నిలిపింది..! రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
మన సాంప్రదాయ కళకు కొద్దిమంది ప్రాణం పోసి సజీవంగా నిలుపుతారు. వాటిని బావితరాలకు తెలిసేలా కృషి చేస్తారు. ప్రస్తుత ట్రెండ్ కాకపోయినా..ఎవ్వరో ఒక్కరైనా ఆదరించకపోదురా అనే ఆశతో కొనసాగిస్తున్న వారి ఓపిక, పట్టుదల ఎవ్వరినైనా కదిలిస్తాయి. దాన్ని ప్రభుత్వం గుర్తించి అత్యున్నత పురస్కారంతో గుర్తిస్తే..అది వారి కృషికి తగిన గుర్తింపే గాక, మరికొన్ని కళలు కనుమరగవ్వకుండా నిలుస్తాయి కూడా. అందుకు ఉదాహరణే ఈ కన్నడ బామ్మ భీమవ్వ దొడ్డబాలప్ప శిల్లెక్యతార. కర్ణాటకకు చెందిన 96 ఏళ్ల భీమవ్వ దొడ్డబాలప్ప శిల్లెక్యతార(Bhimavva Doddabalappa Shillekyathara) షాడో తోలుబొమ్మలాట(shadow puppetry) కళాకారిణి. కన్నడకు చెందిన ఈ సాంప్రదాయ తోలుబొమ్మలాటను ప్రపంచానికి తెలిసేలా చాలాకృషి చేసింది. నీడ సాయంతో తోలుబొమ్మలాటను ప్రదర్శిస్తారు. అది గొప్ప నైపుణ్యానికి సంబంధించిన కళ. దాన్ని వినోదాత్మకంగా అందరికి తెలిసేలా నిరంతరం ప్రదర్శిస్తూనే ఉంది. సుమారు 80 ఏళ్లుగా ఈ భీమవ్వ షాడో బొమ్మలాట కళా నైపుణ్యంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. చేతులతో అద్భుతం సృష్టించే కళకు ఆధారం పురాణాలు. ప్రజలను ఆకట్టుకునేలా రంజింప చేసే సంగీతంతో కట్టిపడేసే కదలికలతో ప్రదర్శనలు ఇచ్చేది. ప్రజలు ఆదరించకపోతున్నా..తన కళా ప్రస్థానాన్ని ఆపకుండా..అవిరాళంగా ప్రదర్శిస్తూ..బావితరాలు గుర్తించి తెలుసుకునేలా ఈ విద్య గురించి బోధిస్తూనే ఉంది. మన దేశంలోని జానపద మూలాలతో లోతైన సంబంధం ఉన్న కళ ఇది. పరిమిత వనురులే ఉన్న..అంతమేర మంచి కళాత్మకంగా ప్రదర్శంచేది. దీన్ని కన్నడలో 'తొగలు గొంబెయాట'గా పిలచే నీడ తోలుబొమ్మల నాటకం. భీమవ్వ సాంప్రదాయ నీడ తోలుబొమ్మలాటతో పౌరాణిక కథలు జానపద కథలను ప్రదర్శించేది. ముఖ్యంగా అది సంతానోత్పత్తికి ప్రతీకగా ముడిపడి ఉన్న కళ. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా మన సంప్రదాయ తోలుబొమ్మలాటతో ముడిపడి ఉన్న షాడో తోలుబొమ్మలాట ఇది. మత సంబంధాలకు అతీతంగా కూడా ప్రదర్శనలిచ్చేవారు కూడా. ఇన్నాళ్లుకు ఆమె కృషికి తగిని గుర్తింపు లభించింది. సంప్రదాయ కళను బతికిస్తూ వస్తున్న భీమవ్వకు పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ఆమె భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన 'పద్మ శ్రీ'(Padma Shri ) అవార్డుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) చేతుల మీదుగా అందుకున్నారామె. శతాబ్దాల నాటి కథలకు ప్రాణం పోసి.. తోలుబొమ్మలను పట్టుకున్న చేతులతో, ఆమె ఇప్పుడు భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారాన్ని వణుకుతున్న చేతులతో అందుకుంది. ఆమె ఆ రాష్ట్రపతి భవన్ హాలులోకి నిశబ్దంగా వస్తూ..ఆ అత్యున్నత పురస్కారాన్ని అందుకోగానే ఒక్కసారిగా హాలంతా చప్పట్లతో మారుమ్రోగింది. అంతేగాదు ఆమె పురస్కారం తీసుకుంటుండగా..అంతా స్టాండింగ్ ఒవేషన్తో గౌరవించి మరీ సత్కరించారు. ఇది నిజంగా కళకు ప్రాణం పోసినవారికే దక్కే అసలైన గౌరవం కదా..! .#WATCH | 96-year-old puppeteer Bhimavva Doddabalappa Shillekyathara receives Padma Shri award from President Droupadi Murmu for her contribution to the field of Art. (Video Source: President of India/YouTube) pic.twitter.com/4PVvqSI9YL— ANI (@ANI) April 28, 2025 (చదవండి: Kilimanjaro Diet: 'కిలిమంజారో డైట్' అంటే..? శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..) -
'మైండ్బ్లోయింగ్ టాలెంట్'..! అటు ఇంజనీరింగ్, ఇటు మెడిసిన్..
జేఈఈ, నీట్ యూజీ వంటి ప్రతిష్టాత్మక పరీక్షలు ఎంత కఠినంగా ఉంటాయో తెలిసిందే. ఇందులో మంచి ర్యాంకు తెచ్చుకోవడం అనేది ఎందరో యువత కల. ఇంజనీరింగ్ వాళ్లు, జేఈఈ, మెడిసిన్ వాళ్లు నీట్ రాయడం జరుగుతుంది. అయితే ఈ అమ్మాయికి ఇంజనీరింగ్, మెడిసిన్ రెండూ ఇష్టమట. నిజానికి ఈ రెండు రంగాలు అత్యంత విరుద్ధమైనవి. ఏదో ఒక్కదాంట్లో రాణించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది ఏకంగా రెండింటిలోనూ బాగా రాణించడమే గాక రెండింటికి సంబంధించిన ఎంట్రెన్స్ టెస్ట్ల్లో కూడా మంచి ర్యాంకు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. పైగా అవి రెండు మిక్స్అయ్యి ఉండే కోర్సును అందించే కాలేజ్ కోసం అన్వేషించి మరీ అక్కడ సీటు సంపాదించింది. ఎంచక్కా చదివేస్తోంది కూడా. ఇంతకీ ఆ 'టాలెంటెడ్ గర్ల్' ఎవరంటే..?మన హైదరాబాద్కి చెందిన అమ్మాయి మింకూరి రిధిమా రెడ్డి. 10వ తరగతి వరకు తేజస్వి విద్యారణ్యలో, ఇంటర్ జాన్సన్ గ్రామర్ స్కూల్లో చదువుకుంది. ఆ తర్వాత జేఈఈ, నీటీ యజీ, బిట్శాట్, వీఐటీఈఈఈ వంటి ప్రతిష్టాత్మక పరీక్షలన్నీ రాసింది. వాటన్నింటిలోనూ రిధిమాకు మంచి మార్కులే వచ్చాయి. అయితే ఆమె ఇంజనీరింగ్(Engineering), మెడిసిన్(Medicine) రంగాలు రెండూ.. అమిత ఇష్టం. అవి రెండు తనకు ఎంతో ఇంట్రస్టింగ్ సబ్జెక్టులని చెబుతోంది రిధిమా. అందుకోసం అని అవి రెండూ కలిపి అందించే కాలేజ్ల కోసం అన్వేషించి మరీ ఐఐటీ మద్రాస్ని సెలెక్ట్ చేసుకుంది. అక్కడ జాయిన్ అయ్యేందుకు ఐఐఎసీఈఆర్ ఆప్టిట్యూడ్ టెస్ట్(ఐఏటీ)కి హాజరు కావాలని నిర్ణయించుకుంది. రిధిమా అనుకున్నట్లుగానే ఆ టెస్టలో మెరుగ్గా రాణించి ఆ కాలేజ్లో సీటు సంపాదించింది. అలా రిధిమా 2023లో ఐఐటీ మద్రాస్( IIT Madras)లో మెడికల్ సైన్స్, ఇజనీరింగ్ సైన్స్ కలగలిసిన కోర్సులో జాయిన్ అయ్యింది. ప్రస్తుతం రెండో సంవత్సరం చదువుతోంది. ఈ మేరకు రిధిమా మాట్లాడుతూ..తాను ఐఐటీ మద్రాస్లోని iGEM (ఇంటర్నేషనల్ జెనెటికల్లీ ఇంజనీర్డ్ మెషిన్) బృందంలో భాగం అని చెప్పుకొచ్చింది. ఇది జన్యుశాస్త్రం, పరిశోధన పట్ల అమిత ఇష్టమైన టీమ్ అని చెప్పుకొచ్చింది. తాము ప్రది ఏడాది జన్యు ఇంజనీరింగ్ ఆధారిత ప్రాజెక్ట్పై పనిచేస్తామని పేర్కొంది. ఆ ప్రాజెక్ట్లను పారిస్లోని గ్రాండ్ జాంబోరీలో ప్రదరిస్తామని తెలిపింది. తాను ఈ ఐఐటీలో ఉండటం వల్లే ప్రజలతో మరింత సమర్ధవంతంగా కమ్యూనికేట్ చేయడం సహకరించం నేర్చుకున్నాని అంటోంది. అలాగే క్లబ్లు, టెక్నికల్ టీమ్లలో పాల్గొనడం, ఈవెంట్ల నిర్వహించడం వల్ల కంఫర్ట్జోన్ నుంచి బయటపడటమే గాక సామాజికంగా ఎలా వ్యవహరించాలో తెలుసుకోగలిగానని చెబుతోంది.(చదవండి: సివిల్స్లో సక్సెస్ కాలేదు.. కానీ బిజినెస్లో ఇవాళ ఆ ఇద్దరూ..!) -
రెండు సార్లు ఫెయిల్ అయ్యా... పట్టుదలతో నాన్న కల నెరవేర్చా..
‘నన్ను కలెక్టర్గా చూడాలనేది మా నాన్న కోరిక.. దాన్ని ఎలాగైనా నెరవేర్చాలని పాఠశాల స్థాయిలోనే నిర్ణయించుకున్నా.. ఆయన అందించిన ప్రోత్సాహంతో ముందుకు సాగా.. రెండుసార్లు విఫలమయ్యా.. అయినా నిరాశ చెందలేదు.. రాత్రింబవళ్లు మరింత కష్టపడి చదివా.. లోటుపాట్లు సవరించుకుని ముందడుగు వేశాను. మూడో ప్రయత్నంలో విజయం సాధించా.. 2023 యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 29వ ర్యాంకు సాధించా.. ఐఏఎస్గా తెలంగాణ క్యాడర్కు ఎంపికయ్యా.. నాన్న కల నెరవేర్చడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను అమలు చేసి, పేదలకు సేవ చేయడమే లక్ష్యమని అంటున్నారు జిల్లాకు నూతనంగా విచ్చేసిన ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా (Saloni Chhabra). ‘సాక్షి’కి మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు విషమాలు వెల్లడించారు.-కైలాస్నగర్సాక్షి: ‘గుడ్ మార్నింగ్ మేడమ్.. వెల్కమ్ టు ఆదిలాబాద్. ట్రెయినీ కలెక్టర్గా జిల్లాకు విచ్చేసిన మీకు మరోసారి ప్రత్యేక అభినందనలు. మీ కుటుంబ నేపథ్యం వివరాలు.. ట్రెయినీ కలెక్టర్: మాది హర్యానా రాష్ట్రంలోని గురుగ్రాం. నాన్న ఇంద్రజిత్, అమ్మ సీమ. ఇద్ద రూ గురుగ్రాంలోనే బిజినెస్ చేస్తుంటారు. అన్న గ్రాడ్యూయేషన్ పూర్తి చేశాడు. ఊరిలోనే అమ్మనాన్నలకు తోడుగా ఉంటూ వ్యాపారం చూసుకుంటారు.ఇదీ చదవండి: మనవడితో 50 ఏళ్ల మహిళ పెళ్లి : ఫ్యామిలీని లేపేసేందుకు కుట్ర?సాక్షి: మీ విద్యాభ్యాసం ఎక్కడెక్కడ సాగింది..ట్రెయినీ కలెక్టర్: ఒకటి నుంచి ఇంటర్మీడియెట్ వరకు గురుగ్రాంలోని బ్లూ బెల్స్లో చదివా. చిన్నతనం నుంచే చదువులో ముందుండేదాన్ని. స్కూల్లో నిర్వహించే డిబేట్లు, ఎక్స్ట్రా కరిక్యూలమ్లో పాల్గొంటూ ప్రతి భ కనబర్చుతుండేది. చదువులో ఎప్పుడూ ముందుండే నేను టెన్త్, ఇంటర్లో ఫస్ట్క్లాస్ లో పాసయ్యా. అనంతరం ఢిల్లీలోని శ్రీరాం కాలేజ్ ఆఫ్ కామర్స్ యూనివర్సిటీలో బీఏ ఆనర్స్ ఎకానావిుక్స్ పూర్తి చేశాను. ఆ వెంటనే సివిల్స్ పరీక్షలపై దృష్టి సారించాను. సాక్షి: యూపీఎస్సీ కోచింగ్ ఎక్కడ తీసుకున్నారు.. ఎన్నోసారి విజయం సాధించారు..ట్రెయినీ కలెక్టర్: పదో తరగతిలోనే ఐఏఎస్ సాధించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నా. ఆ దిశగా అడుగులు వేశాను. ఢిల్లీలోని కోచింగ్ సెంటర్లో ఏడాది పాటు శిక్షణ పొందాను. ఆప్షనల్ సబ్జెక్ట్గా సోషియాలజీని ఎంచుకు న్నా. ప్రణాళికాబద్ధంగా చదివా. 2021లో తొలిసారి యూపీఎస్సీ పరీక్షలకు హాజరయ్యా. ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. అయితే కొద్దిపాటి తేడాతో విజయం సాధించలేకపోయాను. మరో ప్రయత్నంలో ప్రిలిమ్స్లోనే ఆగిపోయాను. అయినా నిరాశ చెందలేదు. మూడో ప్రయత్నం 2023లో జాతీయస్థాయిలో 29వ ర్యాంకు సాధించాను. ఐఏఎస్ కావాలనే నా సంకల్పంతోపాటు నాన్న కలను నెరవేర్చాను. తెలంగాణ క్యాడర్కు ఎంపికై ప్రస్తుతం ట్రైనింగ్ నిమిత్తం ఆదిలా బాద్కు రావడం జరిగింది. ఏడాది పాటు జిల్లాలో పని చేయాల్సి ఉంటుంది. రెండుసార్లు విఫలమైన సమయంలో నేను ఆత్మవిశ్వాసం కోల్పోకుండా అమ్మనాన్నలు అండగా నిలిచారు. వెన్నుతట్టారు. వారందించిన ప్రోత్సాహం తోనే విజయం సాధించాను. సివిల్స్, ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు మీరిచ్చే సలహా.. ట్రెయినీ కలెక్టర్: సివిల్ సర్వీసెస్కు సన్నద్ధమయ్యే అభ్యర్థుల్లో చాలా మంది ఒకటి, రెండు ప్రయత్నాలకే నిరాశకు లోనవుతారు. ఇక మా వల్ల కాదంటూ వెనుకడుగు వేస్తుంటారు. అపజయాలను చూసి నిరాశ చెందొద్దు. సంకల్పం వీడకుండా ముందుడుగు వేయాలి. పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా చదివితే తప్పకుండా విజయం సాధించవచ్చు. రోజుకు కనీసం 8 నుంచి 10 గంటలు చదవాలి. ముఖ్యంగా సెల్ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. ప్రతిరోజు పత్రికలను చదవడం అలవాటు చేసుకోవాలి. వర్తమాన అంశాలపై పట్టు సాధించాలి. గత ప్రశ్నాపత్రాలను విశ్లేషించుకోవాలి. సందేహాలుంటే ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలి. ఆత్మవిశ్వాసం, సంకల్పబలంతో ప్రయత్నిస్తే తప్పకుండా లక్ష్యాన్ని సాధించవచ్చు. -
ప్లంబర్లుగా మహిళా శక్తి!
లింగ సమానత్వం కార్పొరేట్ రంగాల్లో కాదు శ్రామిక శక్తిలో చూపాలి అని నిరూపిస్తోంది జోర్డాన్ మహిళ. జోర్డాన్లో వందలాది మహిళలు ప్లంబర్లుగా విధులను నిర్వహిస్తున్నారు. మొదట్లో దీనిని అవమానకరంగా భావిస్తూ వీరి పనులపై గతంలో నిషేధం విధించారు. అక్కడి సామాజిక, సాంస్కృతిక నిబంధనల కారణంగా మహిళలు శ్రామిక శక్తిలోకి ప్రవేశించడం ఒక సవాల్గా ఉంది. ఇప్పుడు ఆ అనిశ్చితి తొలగి, జోర్డాన్లో మహిళా ప్లంబర్లపై ప్రభుత్వం నిషేధాన్ని తొలగించింది. 2006లో మొట్టమొదటి లైసెన్స్ పొందిన మహిళా ప్లంబర్ ఖవ్లా షేక్ ఈ పనిలోకి ఎక్కువ మంది మహిళలు వచ్చేలా ్ర΄ోత్సహిస్తుండగా, 2014 లో ఏర్పడిన వైజ్ ఉమెన్ ప్లంబర్స్ కో ఆపరేటివ్ ఈ రంగంలో లింగసమానత్వం సాధించడానికి కృషి చేస్తోంది. జోర్డాన్ సంప్రదాయ కట్టుబాట్ల కంచెను తొలగించుకుంటూ అక్కడి మహిళ తన ఉనికికోసం చేస్తున్న కృషి ప్రపంచం దృష్టిని ఆకట్టుకునేలా చేస్తోంది. ‘స్త్రీ ఉద్యోగం చేయకూడదు, అది కుటుంబానికే అవమానం. అటువంటిది మరీ చోద్యం కాక΄ోతే పురుషులకు దీటుగా చేసే ఆ పనులేంటి..!?’ తహానీ ఆల్ షాతి, యుస్రా మోహమ్మద్ న్మోర్.. వంటి వాళ్లు ప్లంబర్లుగా శిక్షణ ్ర΄ారంభించినప్పుడు ఇలాంటి ఎన్నో మాటలు తమ సాటి వారి నుంచి వచ్చినవే. జోర్డాన్లో సామాజిక, సాంస్కృతిక నిబంధనల కారణంగా జీతంతో కూడిన పనిలో మహిళల నిష్పత్తి ప్రపంచంలోనే అత్యల్పంగా ఉంది. శ్రామిక శక్తిలోకి ప్రవేశించడం ఇప్పటికీ చాలామంది మహిళలకు అతిపెద్ద సవాల్.సమర్థతే సరైన ఔషధంప్లంబర్లుగా శిక్షణ తీసుకుంటున్న తొలి రోజులను అల్షాతి గుర్తుచేసుకుంది. శిక్షణ తీసుకుంటున్న ఇతర మహిళలు వీధిలో నీళ్లు లీక్ అవుతున్న పైపును చూశారు. లీకేజీని ఆపడానికి తమ వద్ద గల ఉపకరణాలను బయటకు తీశారు. దారినపోతున్న ఒక మహిళ వారిని చూసి ‘మీరేంటి ఈ పనులు చేయడమేంటి?’ అని తిట్టడం మొదలుపెట్టింది. దాంతో అక్కడ ఇంకొంతమంది పోగయ్యారు. వాళ్లు కూడా అవే మాటలు.. అవేమీ ఈ శిక్షణ తీసుకుంటున్న బృందం పట్టించుకోలేదు. నీళ్ల లీకేజీని ఆ΄ాలనుకున్న పనిని సమర్థంగా పూర్తిచేశారు. నీటినష్టాన్ని నివారించారు. దీంతో అక్కడున్నవారి నోళ్లు మూతపడ్డాయి. తమలో తాము గొణుక్కుంటూ అక్కడినుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు అక్కడ అల్ షాతి, న్మోర్ లాంటి వందలాది మహిళా సర్టిఫైడ్ ప్లంబర్లు ఉన్నారు. రాజధాని నగరమైన అమ్మాన్లోని ఈ మహిళలంతా ‘ఈ అసాధారణ కెరీర్ మా జీవితాలనే మార్చిందని, ఆత్మవిశ్వాసం, స్వాతంత్య్రాన్ని అందించిందని, ఇతర మహిళలకు శిక్షణ ఇస్తూ తమ దేశాన్ని పర్యటించే అవకాశాలను కల్పించిందని’ ముక్త కంఠంతో అంటున్నారు. ‘నా భర్త, పిల్లలు నన్ను చూసి చాలా గర్వపడుతుంటారు. నా పొరుగువారు నన్ను చూసి అసూయపడుతున్నారు’ అని న్మోర్ చెబుతుంది.భిన్నమైన సేవజోర్డాన్లో నీటి కొరత పెద్ద సమస్య. ఇందుకు భౌగోళిక, పర్యావరణ పరమైన కారణాలు మొదటివి కాగా, నీటిని దొంగిలించడం అనేది మరో ముఖ్యమైన కారణం. అందుకే జోర్డాన్లో మహిళల కోసం అనేక ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇందులో భాగంగా నీటి పొదుపు కోసం రకరకాల ఉపకరణాలను బిగించడంలో మహిళలకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. నీటి వనరుల నిర్వహణలో మహిళలను పాల్గొనేలా చేయడం మంచి నిర్ణయమని నీటి, పారిశుధ్య సలహాదారు హింద్ అల్లైఫాత్ పేర్కొన్నారు. ఎందుకంటే నీటి ప్రాముఖ్యత గురించి వారికే ఎక్కువ తెలుసు. ఈ మేరకు వారు యువత, వృద్ధులలో అవగాహనను తీసుకు రాగలరు. ఈ కోణంలో చూసినపుడు వారు తల్లులే కాదు, టీచర్లు కూడా!ఆర్థిక భద్రతఅల్ షాతి, న్మోర్ తో సహా కొంతమంది మహిళా ప్లంబర్లు 2014లో వైజ్ ఉమెన్ ప్లంబర్స్ కో ఆపరేటివ్ కార్యక్రమంలో చేరారు. కలిసి పనిచేయడం వల్ల భద్రత, ఆర్థిక స్థిరత్వం, అలాగే పెద్ద ప్రాజెక్టులను లీడ్ చేసే అవకాశాలు లభిస్తాయనేది వీరి ఆలోచన. ఇందులోని సభ్యులు తమ చుట్టుపక్కల ఇళ్లకు వెళ్లి ఉచిత సర్వీస్ అందిస్తున్నారు.మొదటిసారి 2004లో 15 మంది మహిళలతో కలిసి శిక్షణ తీసుకున్నప్పుడు ‘సంస్కృతికే అవమానం’ అనే కారణంగా ఇతరులెవరూ దానిని ఆమోదించలేదు. కానీ, ‘‘నేడు ఈ పనిరాని వారు కూడా సాధారణ మరమ్మతులు చేయడం నేర్చుకుంటే ఇండ్లలో తమ ప్లంబర్ పనిని తామే చేసుకోవచ్చు’ అని వివరిస్తూ తోటి మహిళలనూ ప్రోత్సహిస్తున్నారు. ఇలా ప్లంబర్ పనిచేసే ఈ మహిళలంతా చాలా కాలంగా తమ సమాజంలోని నిబంధనలను సవాల్ చేస్తూ తమ ఉనికిని చాటుతున్నారు. లింగ సమానత్వాన్ని కాపాడుకున్నారు. (చదవండి: 'రోబోటిక్ కేక్'..! శాస్త్రవేత్తలు, పేస్ట్రీ చెఫ్ల పాక నైపుణ్యం) -
అందంలోనే కాదు.. చదువులోనూ అదుర్స్
చార్టర్డ్ అకౌంటెంట్ అవడం అంటే మామూలు విషయం కాదు. దేశంలోనే అత్యంత క్లిష్టమైన పరీక్షల్లో ఒకటైన సీఏ ఎగ్జామ్లో పాసవడం కోసం సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతుంటారు. సీఏ పరీక్షల్లో నెగ్గేందుకు ఏళ్లబడి పుస్తకాలతో కుస్తీ పట్టేవారెందరినో మనం చూసుంటాం. అయితే నందిని అగర్వాల్ అలా కాదు. అత్యంత చిన్నవయసులోనే సీఏ ఫైనల్స్ క్లియర్ చేయడమే కాదు, ఏకంగా ఆలిండియా టాపర్గా నిలిచి ప్రపంచ రికార్డు సాధించింది. ఇది జరిగి నాలుగేళ్లయింది. తాను ఎంచుకున్న రంగంలోనే కెరీర్ కొనసాగిస్తూ డిజిటల్ కంటెంట్ క్రియేటర్గానూ రాణిస్తోంది నందిని.అన్నయ్యకు క్లాస్మేట్!మధ్యప్రదేశ్లోని మొరెనా పట్టణానికి చెందిన నందిని అగర్వాల్ (Nandini Agrawal) యంగెస్ట్ ఫిమేల్ చార్టర్డ్ అకౌంటెంట్గా 2021లో గిన్నీస్ రికార్డు సృష్టించింది. ఆ ఏడాది జూలై జరిగిన సీఏ (న్యూ) పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్తో ఆలిండియా టాపర్గా నిలిచింది. 19 ఏళ్ల 8 నెలల 18 రోజుల వయసులో ఆమె ఈ ఘనత సాధించినట్టు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వెబ్సైట్ వెల్లడించింది. 2001, అక్టోబర్ 18న నందిని జన్మించింది. చదువులో ఎంతో చురుగ్గా ఉండే నందిని.. రెండు క్లాసులు జంప్ చేసి తన అన్నయ్య సచిన్కు క్లాస్మేట్గా మారింది. చెల్లెలితో పాటు సీఏ ఫైనల్స్ రాసిన సచిన్కు 18వ ర్యాంక్ రావడం గమనార్హం. ఇక సీఏ ఇంటర్ను 16 ఏళ్ల వయసులో పూర్తి చేసింది నందిని. ఆలిండియా 31వ ర్యాంక్ సాధించి సత్తా చాటింది.వరల్డ్ ఫేమస్ కంపెనీల్లో జాబ్నందిని ప్రస్తుతం ప్రైవేటు ఈక్విటీ ఎనలిస్ట్గా పనిచేస్తున్నారు. అంతకుముందు వరల్డ్ ఫేమస్ కార్పొరేట్ కంపెనీల్లో పనిచేశారు. పీడబ్ల్యూసీ కంపెనీలో ఆర్టికల్ ట్రైయినీగా కెరీర్ మొదలు పెట్టిన ఈ యంగ్ టాలెంట్ గాళ్ అంచెలంచెలుగా ఎదిగారు. స్టాట్యూటరీ ఆడిట్, గ్రూప్ రిపోర్టింగ్, రెఫర్డ్ రిపోర్టింగ్, IFRS అసైన్మెంట్లు, టాక్స్ ఆడిట్, ఫోరెన్సిక్ ఆడిట్లలో తనకు మూడేళ్ల అనుభవం ఉందని తన లింక్డ్ఇన్ బయోలో రాసుకున్నారు నందిని. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG)లో ఒకటిన్నర సంవత్సరాలు అసోసియేట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా పనిచేసినట్టు వెల్లడించారు. BCGలో కీలకమైన G20 టీమ్లోనూ ఉన్నట్టు పేర్కొన్నారు.చదవండి: కళ్ల తప్పిన బైండ్ల బతుకులుసోషల్ మీడియాలోనూ సంచలనండిజిటల్ కంటెంట్ క్రియేటర్గా తనదైన స్టయిల్లో దూసుకెళుతోంది నందిని అగర్వాల్. ఇన్స్టాగ్రామ్లో ఆమెను 74 వేల మంది ఫాలో అవుతున్నారు. యూట్యూబ్లోనూ ఆమెకు 2 లక్షలకు పైగా సబ్స్కైబర్లు ఉన్నారు. సీఏ ఎగ్జామ్స్ పరీక్షల సంబంధించిన స్టడీ టిప్స్ వీడియోలను యూట్యూబ్లో ఆమె షేర్ చేస్తుంటుంది. -
హిమాచలంలో ఉమెన్ పవర్
పర్యాటక ప్రేమికులకు సుపరిచితమైన పేరు... లాహౌల్ స్పితి. చుట్టూ హిమాలయ పర్వతాలతో మంత్రముగ్ధులను చేసే ప్రకృతి అందాలతో కనువిందు చేసే ఈ జిల్లా హిమాచల్ప్రదేశ్లో ఎక్కువ మంది సందర్శించేప్రాంతం. దేశంలోనే అతి తక్కువ జనాభా ఉన్న జిల్లాల్లో ఒకటి. ఉపాధికోసం పురుషులు ఎక్కువగా వలస పోవడంతో ఈప్రాంతంలో మహిళల జనాభా ఎక్కువ. 2024 ఉపఎన్నికల్లో అనురాధ రాణా శాసనసభ్యురాలిగా ఎన్నికైంది. జిల్లాలో ఆమె రెండో మహిళా శాసనసభ్యురాలు. రాజకీయాల్లో పెరిగిన మహిళలప్రాతినిధ్యానికి ఆమె విజయం అద్దం పడుతుంది.ఇక జిల్లా పాలనా యంత్రాంగం విషయానికి వస్తే... జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్... ఇల్మా ఆఫ్రోజ్, ఐఏఎస్ ఆఫీసర్ కిరణ్ బదన జిల్లా కలెక్టర్, ఆకాంక్ష శర్మ ‘సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్’గా కీలకమైన బాధ్యతలను నిర్వహిస్తున్నారు... ఇలా ఎంతోమంది మహిళలు జిల్లా పాలన యంత్రాంగంలో కీలకమైన స్థానాల్లో ఉన్నారు.కఠినమైన వాతావరణం, సుదూరప్రాంతం కారణంగా పోస్టింగ్కు ఎక్కువమంది ఇష్టపడని జిల్లాగా ఒకప్పుడు లాహౌల్ స్పితికి పేరుండేది. అయితే ఆ తరువాత సంప్రదాయ ఇమేజ్ చెరిగిపోవడం మొదలైంది. దీనికి కారణం... మహిళా అధికారులు. వృత్తిపరమైన సంతృప్తి,ప్రత్యేకమైన సవాళ్లను ఇష్టపడే మహిళా అధికారులు ఎక్కువగా ఇష్టపడే జిల్లాగా ‘లాహౌల్ స్పితి’ గుర్తింపు పొందింది. -
నిరీక్షణ ఫలించింది...
కొన్ని సంవత్సరాల నుంచి భర్తతో కలిసి మన దేశంలో ఉంటున్న క్రిస్టెన్ ఫిషర్ అనే అమెరికన్ భారత్లో తన అనుభవాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. దిల్లీలో ఉంటున్న ఫిషర్ దంపతులు నిషా అనే దివ్యాంగురాలైన బాలికను దత్తత తీసుకోవాలనుకున్నారు. అయితే దత్తత ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగింది.‘2023లో అక్టోబర్లో దత్తత కోసం దరఖాస్తు చేసుకోగా, 2024లో నిషాకు దగ్గరయ్యాం. 2025 ఏప్రిల్ నాటికి దత్తత పూర్తయింది. ఇప్పుడు నిషా మా అందమైన కుమార్తె’ అని ఇన్స్టాగ్రామ్లో రాసింది ఫిషర్.‘కౌంటింగ్ డౌన్ ది డేస్ అన్టిల్...’ ట్యాగ్లైన్తో ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో తాను దత్తత తీసుకున్న పాప కనిపిస్తుంది. మరో వీడియోలో చిన్నారి నిషాకు సంబంధించిన ఎమోషనల్ గ్లింప్స్ను షేర్ చేసింది. దివ్యాంగురాలు అనే కారణంతో నిషాను చిన్న వయసులోనే తల్లిదండ్రులు వదిలేశారు. రెండు సంవత్సరాలు అనాథాశ్రమంలో పెరిగింది నిషా. ‘స్పెషల్ నీడ్స్ చైల్డ్ను దత్తత తీసుకోవాలనుకోవడానికి కారణం...వారికి కొత్త జీవితం ఇవ్వాలనుకోవడం’ అంటుంది క్రిస్టెన్ ఫిషర్. -
సోలార్ సఖి
రైల్లో తొలిసారి ప్రయాణించిన ఆ మహిళలు.... ‘రైలు ప్రయాణం ఇంత బాగుంటుందా!’ అని సంబరపడి పోయారు. ఆ తరువాత మరో ప్రయాణం మొదలు పెట్టారు.అయితే అది రైలు ప్రయాణం కాదు. తమ జీవితాలను మార్చివేసిన ప్రయాణం. చిన్న చదువులు చదువుకున్న ఎంతో మంది గ్రామీణ మహిళలు సోలార్ ఇంజినీర్లుగా, ఎంటర్ప్రెన్యూర్స్గా రాణిస్తున్నారు...రాజస్థాన్లో నిశ్ఛలగఢ్కు చెందిన తవ్రీదేవి ఎన్నో సంవత్సరాలు విద్యుత్ సౌకర్యం లేని ఇంట్లోనే గడిపింది. అయిదవ తరగతి తరువాత తల్లిదండ్రులు చదువు మాన్పించడంతో ఇంటి పనులు చేసేది. గొర్రెలు మేపేది. ఇల్లే ప్రపంచంగా బతుకుతున్న తవ్రీదేవి జీవితాన్ని ‘సోలార్ పవర్’ మార్చి వేసింది. హర్మదా(జైపూర్)లో ఐదు నెలల సోలార్ ఇంజినీరింగ్ శిక్షణ కార్యక్రమం ఆమె జీవితాన్ని కొత్త దారిలోకి తీసుకువెళ్లింది.సోలార్ ఇంజినీరింగ్ శిక్షణ కోసం సిద్ధం అయినప్పుడు.. ‘ఎందుకులే’ అన్నారు తల్లిదండ్రులు. వారిని బలవంతంగా ఒప్పించాల్సి వచ్చింది, ‘మా కమ్యూనిటీలోని మహిళలు ఎప్పుడూ ముసుగు లేకుండా ఒంటరిగా బయటకు వెళ్లలేదు. నేను ఎప్పుడూ పట్టణ ప్రాంతానికి ఒంటరిగా వెళ్లలేదు’ అంటుంది తవ్రీదేవి.కిషన్గడ్కు వెళ్లడం...తన తొలి రైలు ప్రయాణం! ‘అది పూర్తిగా కొత్త అనుభవం. ప్రయాణంలోని ఆనందం తెలిసొచ్చింది’ అంటుంది తవ్రీదేవి. శిక్షణలో సోలార్ ఇన్స్టలేషన్, ఫీల్డ్వర్క్కు అవసరమైన నైపుణ్యాలు సంపాదించింది. ఆ తరువాత స్వగ్రామానికి తిరిగివచ్చింది. ‘మేము చాలా సంవత్సరాలు చీకటిలో జీవించాము. అందుకే మా జీవితాల్లో వెలుగు తీసుకురావాలనుకున్నాను’ అంటుంది తవ్రీదేవి.సోలార్ ఇంజినీర్గా కొత్త జీవితాన్నిప్రారంభించిన తవ్రీదేవి తన గ్రామానికి విద్యుత్ వెలుగులు తీసుకువచ్చింది. భారత రాష్ట్రపతి నుండి ‘ఆది సేవా గౌరవ్ సమ్మాన్’ అవార్డ్ అందుకుంది. ఇది కేవలం తవ్రీదేవి విజయగాథ మాత్రమే కాదు... జార్ఖండ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, మిజోరాం, నాగాలాండ్తో సహా పదిరాష్ట్రాలలో మూడువేల మందికి పైగా గ్రామీణ మహిళా సోలార్ ఇంజినీర్ల విజయగాథ.తమ గ్రామాల్లో సోలార్ ΄్యానెళ్లను ఒంటిచేత్తో మరమ్మతు చేసే వీరు పారిశ్రామికవేత్తలుగా కూడా ఎదిగారు. ఈ మార్పుకు కారణం హర్ష్ తివారీ నేతృత్వంలోని ఈఎంపీఐ ఇంటర్నేషనల్. ఈ సంస్థ శిక్షణ కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంత మహిళలు సోల్డరింగ్, వైరింగ్, బ్యాటరీ సెటప్, ఫాల్ట్ ఫైండింగ్, ఇన్స్టలేషన్లలోప్రావీణ్యం సాధించారు. గ్రామీణ మహిళలకు సాంకేతిక నైపుణ్యం, ఆర్థికస్వాతంత్య్రం లక్ష్యంగా ఈఎంపీఐ ఇంటర్నేషనల్ పనిచేస్తోంది.శిక్షణ అనంతరం మహిళలు తమ గ్రామాల్లో సోలార్ సొల్యూషన్స్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. మరమ్మతులు, ఫస్ట్లెవల్ చెకప్లు నిర్వహించేందుకు వీలుగా చిన్న ల్యాబ్లను ఏర్పాటు చేస్తారు. గ్రామస్థాయి ఇంధన మౌలిక సదుపాయాలు సజావుగా సాగేలా చూస్తారు. శిక్షణ పూర్తయిన తరువాత క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మహిళా సోలార్ ఇంజినీర్లను ‘సోలార్ సఖీ’ అని పిలుస్తారు.‘వ్యవసాయంతో పాటు చిన్న తరహా పరిశ్రమలలో సౌరశక్తితో నడిచే పరికరాలకు డిమాండ్ పెరుగుతుంది, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈఎంపీఐ ఇంటర్నేషనల్ సోలార్ సఖీలకు శిక్షణ ఇస్తోంది. జీవనోపాధి కల్పిస్తుంది. టెక్నికల్ ట్రైనింగ్తోపాటు ఎంటర్ప్రెన్యూర్షిప్, కస్టమర్ ఎంగేజ్మెంట్లో కూడా శిక్షణ ఇస్తాం. గ్రామాల్లో సోలార్ సెటప్లలో ఏవైనా సాంకేతిక లోపాలు తలెత్తితే సోలార్ సఖులు పరిష్కారం చూపుతున్నారు’ అంటున్నాడు హర్ష్ తివారీ. -
సివిల్స్లో సక్సెస్ కాలేదు.. కానీ బిజినెస్లో ఇవాళ ఆ ఇద్దరూ..!
యూపీఎస్సీ నిర్వహించే ప్రతిష్టాత్మక సివిల్స్ ఎగ్జామ్లో సక్సెస్ని ముద్దాడటం కోసం యువత ఎంతగా తపిస్తుందో తెలిసిందే. అయితే అందరూ విజయాన్ని అందుకోలేరు. కొందరికి తీరని కలగా మిగిలిపోతుంది. ఇక అలా డిప్రెషన్లోకి వెళ్లక.. మరొక మార్గం ఎంచుకుని అచంచలంగా ఎదుగుతూ శెభాష్ అనిపించుకునేలా బతికి చూపించారు ఈ ఇద్దరు మహిళామణులు. ఇద్దరిది ఒక్కో నేపథ్యం, కానీ లక్ష్యం ఒక్కటే. కానీ ఇద్దర్నీ ఆ సివిల్స్ ఎగ్జామ్ విజయం అందుకోలేరని వికటాట్టాహాసం చేసింది. ఇనాళ్లపడ్డ శ్రమ, టైమ్, డబ్బు వేస్ట్ అయిపోయాయి అనేంత మనోబాధే మిగిలింది. అయినా దాన్ని కూడా తట్టుకుని మరో రంగంలో సక్సెస్ వస్తుందేమోనని ధైర్యంగా ముందడుగు వేశారు. అదే వారిని ఊహకందని సక్సెస్ని చవిచూసేలా చేసింది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచేలా చేసింది.వివరాల్లోకెళ్తే.. ప్రతి ఏడాది లక్షలాదిమంది విద్యార్థులు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ లేదా ఇండియన్ పోలీస్ సర్వీసెస్ వంటి ఉన్నత స్థాయికి చేరాలనుకుంటారు. అయితే అది అందరికీ అంత ఈజీగా దక్కే విజయం మాత్రం కాదు. కొందరూ మాత్రం త్రటిలో చేజార్చుకున్న పరాజితులుగా మిగిలిపోతారు. అలాంటి పరాజితులే కాజల్ శ్రీ వాస్తవ్, వేద గోగినేనిలు. అయితే ఇద్దరికి సివిల్స్ పరీక్ష రాసే ఛాన్సలన్నీ వృధా అయిపోయాయి. కళ్లముందు శ్రమ అంతా ఆవిరై పోయిందనే వేదన వారి మనసులను ఓ పట్టాన నిలువనీయలేదు. అయితే వారు అక్కడితే ఓడిపోయామని ఆగిపోలేదు. ఏం చేశారో తెలిస్తే హ్యాట్సాప్ అని మెచ్చుకోకుండా ఉండలేరు.స్వదేశీ స్పోర్ట్స్ వేర్ వ్యవస్థాపకురాలు..అక్టోబర్ 24, 2020న కాజల్ తన యూపీఎస్సీ పరీక్ష ఆరవ ప్రయత్నంలో విఫలమయ్యాక తీవ్ర నిరాశకు లోనైంది. అనవసరంగా ఈ వైపుకి వచ్చి సమయం వృధా చేసుకున్నానని మధనపడుతూ ఉంది. ఇప్పుడు ఇదికాదు.. నా మనసుకు అత్యంత ప్రశాంత కావాలని గట్టిగా అనుకుంది. సరిగ్గా ఆ సమయంలో ఆమె సోదరి జోక్యం చేసుకుని ఆమెకు ధైర్యం చెప్పి.. మరో రంగం ఎంచుకోమని సూచించింది. సివిల్స్లో విఫలమైతే జీవితం పోయినట్లు కాదని గుర్తు చేసింది. అయితే సమయం, డబ్బు వృధా చేసేనన్న గిల్టీ ఫీలింగ్ కాజల్ని స్థిమిత్తంగా ఉండనివ్వలేదు. దాంతో ఆమె మానసిక ప్రశాంతత నిచ్చే పని కోసం వెతకడం ప్రారంభించింది. ఆ క్రమంలోనే పురాతన భారతీయ యుద్ధ కళ అయిన కలరిపయట్టును నేర్చకునేందుకు ఆసక్తి కనబర్చింది. అదే ఆమె జీవతాన్ని పూర్తిగా మలుపు తిప్పింది. ఒక రకంగా నిరాశనిస్ప్రుహలో ఉన్న ఆమెకు తనను తాను నయం చేసుకునే మందులా ఆ విద్య కనిపించిందామెకు. పైగా ఆ రంగంలో రాణించి..ఆ కళను ప్రోత్సహించేలా వర్క్షాప్లు నిర్వహించింది. అలాగే వ్యాపార రంగంలోకి కూడా అగుడుపెట్టి.. స్వదేశీ స్పోర్ట్స్ వేర్ను స్థాపించింది. అలా ఈ రంగంలో సక్సెస్ని అందుకుంటూ..గొప్ప ఎంటర్ప్రెన్యూర్గా పేరుతెచ్చుకుంది.ఎర్త్ఫుల్ వ్యవస్థాపకురాలు ..వేద గోగినేని ముంబైలోని డ్యూయిష్ బ్యాంక్లో మంచి ఉద్యోగం చేస్తుండేది. త్వరలో లండన్ వెళ్లే అవకాశం కూడా ఉంది. అయినా..2015లో ఆమె జీవితాన్నే మార్చే అనూహ్య నిర్ణయం తీసుకుంది. తన యూపీఎస్సీ కలను సాధించేందుకు అంత మంచి ఉద్యోగానికి రాజీనామా చేసేసింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మకాం మార్చి అక్కడే చిన్న ఇరుకుగదిలో...రూమ్మేట్తో కలిసి ప్రిపేరవ్వడం ప్రారంభించింది. మూడున్నేర ఏళ్లు ప్రిపరేషన్కి అంకితమైన జస్ట్ ఒక్క మార్కు తేడాతో కటాఫ్ మార్కులు మిస్ చేసుకునేది. అయితే ఈ ఎగ్జామ్లో ఎక్కడ ఫెయిలైనా.. మళ్లీ మొదటి నుంచి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అన్ని క్లియర్ చేయాల్సిందే. దీంతో ఇలా ఎన్నిసార్లు ఫెయిల్ అవుతాను అనే బాధ ఆమెను దారుణంగా కుంగదీయడం ప్రారంభించింది. ఇక ఆమె ఏది గెలవలేను అనే ఆత్మనూన్యత భావనకు వచ్చేసింది. అలాంటి సమయంలో ఆమె తల్లి అక్కున చేర్చుకుని మరో రంగంలోకి అడుగులు వేయమని సూచించింది. అలా ఆమె తన సోదరి సుధతో కలిసి 'ఎర్త్ఫుల్' అనే ప్లాంట్ ఆధారిత సప్లిమెంట్స్ కంపెనీని స్థాపించింది. ఈ స్టార్టప్ షార్క్ ట్యాంక్ ఇండియాలో మంచి గుర్తింపు దక్కించుకుంది. అంతేగాదు 75 లక్షల పెట్టుబడిని కూడా పొందింది. నిజంగా ఆమెకు ఇది..ఇన్నాళ్లు చవి చూసిన ఓటములకు ఓదార్పు ఈ అతిపెద్ద సక్సెస్. ఇప్పుడామె ఓ సహ వ్యవస్థాపకురాలిగా మరిన్ని విజయాలను అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ ఇద్దరూ కూడా ఇప్పుడూ సివిల్స్ గెలవనందుకు బాధపడటం లేదని ఆనందంగా చెబుతున్నారు. మమ్మల్ని అంతకుమించిన స్థాయిలో నిలబెట్టేందుకే తామిద్దరం అందులో విజయం అందుకోలేకోయేమేమో అని ఆత్మవిశ్వాసంగా చెబుతున్నారు. తరుచుగా వింటుంటాం.. వైఫల్యాన్ని అంగీకరించి.. వాటిని విజయానికి మెట్లుగా మార్చుకోవాలని అంటుంటారు పెద్దలు. ఒకచోట చవిచూసిన ఓటములు మరో రంగాన్ని ఎంచుకున్నప్పుడూ జాగ్రత్తను, తట్టుకోవడాన్ని నేర్పిస్తాయి. అందుకు ఉదహారణే ఈ ఇద్దరూ విజేతలు.చదవండి: 'ఇక్కడి వారికి హృదయం ఉంది'.. అందుకే..! కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న పాక్ తండ్రి.. -
'టీ లైఫ్'..! మహిళలను ఆంట్రప్రెన్యూర్స్గా, ఇండస్ట్రియలిస్ట్గా..
‘మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం ఉంటేనే నిర్ణయాధికారం వస్తుంది’ అని నమ్మే వాళ్లలో తాటిపర్తి దీపికారెడ్డి కూడా ఉన్నారు. ఆమె ఎవరు? హైదరాబాద్ వాసి .. టీ లైఫ్ (తెలంగాణ లేడీ ఇండస్ట్రియలిస్ట్ ఫెడరేషన్ ఫర్ ఆంట్రప్రెన్యూర్స్) వ్యవస్థాపకురాలు. ఆంట్రప్రెన్యూర్షిప్ పట్ల గ్రామీణ, పట్టణ ప్రాంత మహిళలకు అవగాహన కల్పించి, ఉచిత శిక్షణతో వాళ్లను ఆ దిశగా నడిపించి.. ఆర్థిక స్వావలంబన సాధించేందుకు కృషి చేస్తున్నారు. ఆమె ఇరవై ఏళ్ల ఆ ప్రయాణం గురించే ఈ కథనం.. చదువుకునే వయసు నుంచే దీపికా రెడ్డి .. ఇండస్ట్రియలిస్ట్గా స్థిరపడాలనే కోరుకున్నారు. అయితే ఆ లక్ష్యానికి ప్రయాణం మాత్రం పెళ్లయ్యాకే మొదలైంది. ఆమెకున్న పలురకాల ఆసక్తులు, అభిరుచుల మేరకు ఆయా కోర్సులు చదువుకుంటూ ఆయా రంగాల్లో తన ఆంట్రప్రెన్యూర్ స్కిల్స్ను నిరూపించుకున్నారు. అలా పెళ్లి తర్వాత కాకతీయ యూనివర్సిటీ నుంచి హెయిర్ అండ్ స్కిన్ కోర్స్లో డిప్లొమా చేశారు. ఏరోబిక్స్లో శిక్షణ పొందారు. ఆ అర్హతలతోనే ‘బ్యూటీ అండ్ ఫిట్నెస్ సెంటర్’ అనే ఓన్లీ ఫర్ విమెన్ జిమ్ను స్టార్ట్ చేశారు. ఇంటీరియర్ డిజైన్ కోర్స్ చేసి.. ఇంటీరియర్ డిజైనర్గా మారి, వేదీస్ ఇంటీరియర్స్ పేరుతో సంస్థనూ పెట్టారు. టీ లైఫ్.. ఇంటీరియర్ డిజైనర్ అండ్ ఆంట్రప్రెన్యూర్గా కొనసాగుతున్న దీపికకు హైదరాబాద్లోని ఎలీటా అసోసియేషన్ పరిచయం అయింది. అది మహిళల్లో ఆంట్రప్రెన్యూర్షిప్ను పెంపొందించడానికి శిక్షణనిచ్చే సంస్థ. అందులో జాయింట్ సెక్రటరీగా జాయిన్ అయ్యారు ఆమె. మూడేళ్లపాటు ఆ అసోసియేషన్లో అనుభవం గడించాక 2017లో తను సొంతంగా టీ లైఫ్ (తెలంగాణ లేడీ ఇండస్ట్రియలిస్ట్ ఫెడరేషన్ ఫర్ ఆంట్రప్రెన్యూర్స్) సంస్థను ప్రారంభించారు. తెలంగాణ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు ఆంట్రప్రెన్యూర్షిప్ పట్ల అవగాహన కల్పించి, వారికి కావల్సిన శిక్షణను ఇప్పించి వారిని ఆంట్రప్రెన్యూర్స్గా మలచడమే ఆ సంస్థ లక్ష్యం. అందుకే దాని తరపున ఆమె తెలంగాణలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పర్యటిస్తుంటారు. ఆంట్రప్రెన్యూర్స్ కావాలనుకున్న మహిళల కోసం అక్కడి కలెక్టర్లు, ఇతర ప్రభుత్వ అధికారుల సహాయంతో సదస్సులు నిర్వహిస్తుంటారు. ఆంట్రప్రెన్యూర్షిప్ కోసం బయట ఎలాంటి అవకాశాలున్నాయి, ప్రభుత్వ పథకాలేంటీ, లోన్స్, సబ్సిడీలు, శిక్షణ కార్యక్రమాలు, బిజినెస్ కోసం వాళ్ల ప్రాంతాల్లో ఉన్న రీసోర్సెస్ వంటివన్నీ వివరిస్తారు. సదస్సు తర్వాత వాళ్లకు దరఖాస్తు ఫారాలు ఇచ్చి, హాజరైన మహిళలకున్న బిజినెస్ ఆసక్తులను ఆ దరఖాస్తు ఫారాల్లో నింపమంటారు. ఆ ఫారాల ఆధారంగా వాళ్లకు ఆసక్తి ఉన్న రంగాల్లో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సెల్ఫ్హెల్ప్ గ్రూప్స్కి అందుతున్న రుణాలతో అందులోని సభ్యులు ఎలాంటి బిజినెస్ పెట్టుకోవచ్చో చెప్పి, తగిన శిక్షణనిచ్చి.. ఆ వ్యాపారాలను పెట్టించారు కూడా! ఈ క్రమంలో ఆమె గమనించిన విషయం.. ఆ మహిళలందరినీ వాళ్లమ్మాయిలు ప్రోత్సహించడం.అమ్మాయిల కోసం.. దీపిక.. గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు, ఇంజినీరింగ్ కాలేజీలకూ వెళ్లి అక్కడి అమ్మాయిలకూ బిజినెస్ రంగంలో ఉన్న అవకాశాలు, శిక్షణ వంటి వాటిమీద అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు మూడున్నర వేల మంది మహిళలకు శిక్షణనిచ్చారు. అందులో వందకు పైగా మహిళలు ఆంట్రప్రెన్యూర్స్గా నిలబడ్డారు. ఇందులో సెల్ఫ్హెల్ప్ గ్రూప్స్కి చెందిన మహిళలే ఎక్కువ. ప్రస్తుతం టీ లైఫ్కి జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్లలో ఆఫీసులున్నాయి. మే నెలలో మహబూబ్నగర్లో కూడా ప్లాన్ చేయాలనుకుంటారు. టీ లైఫ్ ఆరంభించినప్పుడు కనీసం పదివేల మంది మహిళలకు అవగాహన కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చేరుకున్నారు కూడా. నెలకు నాలుగు నుంచి అయిదు బ్యాచ్లుంటాయి. అభ్యర్థులు పెట్టాలనుకున్న బిజినెస్ను బట్టి ఆ శిక్షణ కార్యక్రమాల గడువు ఉంటుంది. ఈ ట్రైనింగ్ సెషన్స్ అన్నీ ఎక్స్పర్ట్స్తోనే ఉంటాయి. ‘మొదటి నుంచీ నన్ను నేను ప్రూవ్ చేసుకుంటూ వచ్చిన చోటల్లా అది కుటుంబంలో కానీ.. సమాజంలో కానీ ఎక్కడైనా నాకు గౌరవం పెరుగుతూ వచ్చింది. దాన్ని గ్రామీణ మహిళలు, పట్టణ ప్రాంతం వారూ పొందాలని అనుకున్నాను. వాళ్లు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని అనుకుంటున్నాను. అందుకే టీ లైఫ్ని స్టార్ట్ చేశాను. మేము వెళ్లినచోటల్లా పాజిటివ్ రెస్పాన్సే వస్తోంది. స్టూడెంట్స్ కూడా చాలా ఉత్సాహంగా ఉంటున్నారు. వాళ్లకోసం కంప్యూటర్, ఏఐ బేస్డ్ ప్రోగ్రామ్స్నూ పెట్టాం. ఇంట్లో వాళ్ల నుంచీ నాకు సపోర్ట్ దొరుకుతోంది. టీ లైఫ్ ధ్యేయం ఒక్కటే.. మహిళలు ఆంట్రప్రెన్యూర్స్గానే కాదు ఇండస్ట్రియలిస్ట్స్గానూ ఎదిగేందుకు తోడ్పడాలని. అయితే దీనికి ప్రభుత్వ సహకారం కూడా అసవరమే! కుటుంబంలో మహిళ ఆర్థికంగా బలంగా ఉంటే తర్వాత తరాల అమ్మాయిలూ స్ట్రాంగ్గా ఉంటారని నా నమ్మకం.’ అంటున్నారు దీపికారెడ్డి – సరస్వతి రమ(చదవండి: స్టెగానోగ్రఫీ.. అలా చేస్తే లక్షలు మాయం అవుతాయి!) -
సాగులో సాధికారత కోసం..
భారతదేశంలో మహిళా రైతులకు ప్రోత్సాహకాలు అందించడానికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాలు, కార్యక్రమాలను అమలుచేస్తున్నాయి. అవేంటంటే.. సమాన భూమి హక్కులు.. మహిళా రైతులకూ సమానంగా భూమి హక్కులు కల్పించడం వల్ల వారి ఆర్థిక, సామాజిక సాధికారతను పెంపొందిస్తున్నారు. రుణాలు, ఇతర ఆర్థిక సహాయం.. మహిళారైతులకు రుణసౌకర్యాలు, సబ్సిడీలు, ఇతర ఆర్థిక సహాయాలు అందించడం ద్వారా వ్యవసాయ కార్యక్రమాలనుప్రోత్సహిస్తున్నారు. మిషన్ హార్టీ కల్చర్.. ఈ పథకంతో మహిళలకు సాగు నైపుణ్యం, శిక్షణ, సబ్సిడీలు, మద్దతులను అందిస్తున్నారు. సహాయక సమూహాలు (సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్), రైతు ఉత్పత్తిదారుల సంస్థలు మహిళా రైతులకు సాధికారత కల్పించే లక్ష్యంతో మహిళల నేతృత్వంలోని ఎఫ్పీఓలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎమ్ – కిసాన్).. ఈ పథకం ద్వారా అర్హతగల రైతులకు బయోడిజాస్టర్లను అందిస్తూ రైతుల శ్రమ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు దీనివల్ల ఆదాయమూ పెరుగుతోంది. సాంకేతిక పరికరాలు, శిక్షణ.. మహిళా రైతుల కోసం ప్రత్యేక పరికరాలు అందించి.. శిక్షణ కార్యక్రమాలనూ నిర్వహిస్తూ వారు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి భారతప్రభుత్వం కృషిచేస్తోంది. పట్టణప్రాంతాలకు పురుషుల వలస పెరుగుతున్నందున పశువుల పెంపకం, పాడిపరిశ్రమ, ఉద్యానవనాల పెంపకం, సాగు/సామాజిక అటవీ, చేపలు పట్టడం వంటి పనులను ఎక్కువగా మహిళలే నిర్వహిస్తున్నారు. దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ఆహారంలో దాదాపు 60– 80 శాతాన్ని గ్రామీణ మహిళలే అందిస్తున్నారు. అయినప్పటికీ వారి శ్రమకు తగిన గుర్తింపు లభించట్లేదు. సమప్రాధాన్యం అందట్లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయరంగంలో గ్రామీణ మహిళల సాధికారత కోసం అనేక పథకాలు, కార్యక్రమాలను చేపట్టింది. అందులో ఒకటే కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ అమలు చేస్తున్న ‘నమో డ్రోన్ దీదీ’ పథకం. ఇది ఈఅ్గNఖఔM కింద మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లను అందిస్తుంది. ఈ పథకం మొత్తం బడ్జెట్ రూ. 1261 కోట్లు. ద్రావకాలు, పురుగుల మందుల వాడకానికి.. 2024–25 నుంచి 2025–2026 వరకు ఎంపిక చేసిన 14, 500 మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు డ్రోన్లను అందించడం దీని ప్రస్తుత లక్ష్యం. అత్యంత ప్రజాదరణ పొందిన కేంద్రప్రభుత్వ పథకాల్లో ‘బేటీ బచావో.. బేటీ పఢావో’, ‘సుకన్య సమృద్ధి యోజన’ కూడా ఉన్నాయి. – బి.ఎన్. రత్న బిజినెస్ కన్సల్టెంట్, దలీప్మీ సందేహాలను పంపవలసిన మెయిల్ ఐడీ ownership.sakshi@gmail.comనిర్వహణ : సరస్వతి రమ -
ఆపన్న హస్తం ఆదుకుంది.. చదువు దారి చూపింది!
కన్నవారు కాదనుకున్నా.. అనాథలా మారినా.. కష్టాలు చుట్టుముట్టినా.. ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. అక్షరమే ఆయుధంగా బతుకుపోరు సాగించింది.. అక్షరాన్ని ఆలంబనగా చేసుకొని ఒక్కో మెట్టు ఎక్కుతూ తాజాగా ఇంటర్ పరీక్ష ఫలితాల్లో మెరిసింది రవీనా చౌదరి. రెండేళ్ల పసిప్రాయంలో ఆమెను తల్లి వదిలేసి ఎటో వెళ్లిపోయింది. ఆలనా పాలనా చూడలేక తండ్రి మొహం చాటేశాడు. ఏ దారి లేని ఏడారి రాష్ట్రానికి చెందిన ఆ చిన్నారిని తీసుకొని నానమ్మ హైదరాబాద్ (Hyderabad) వచ్చింది. ఇక్కడే ఉంటున్న తన కూతురు వద్ద ఉంచి రాజస్థాన్ తిరిగి వెళ్లిపోయింది. రవీనాను మేనత్త చేరదీసి స్థానిక హెచ్ఎంటీ కాలనీలోని సెయింట్ ఆంథోని పాఠశాలలో ఎల్కేజీలో చేర్పించింది. చదువుల్లో చురుగ్గా ఉండే రవీనా పదో తరగతిలో 9.3 జీపీఏ సాధించింది. చదువు ఇక చాలన్నారు..పదవ తరగతి పూర్తి కాగానే పైచదువులు చదివించలేనని, ఏదైనా పని చేయాలని రవీనాకు మేనత్త చెప్పింది. తండ్రి రాజస్థాన్ (Rajasthan) నుంచి వచ్చి తీసుకువెళ్లి బలవంతంగా పెళ్లి చేయడానికి ప్రయత్నించాడు. చదువుకుంటానంటే కొట్టి పెళ్లికి అంగీకరించాలని హింసించాడు. తండ్రి బారి నుంచి తప్పించుకొని రవీనా అతి కష్టం మీద తిరిగి నగరానికి వచ్చేసింది. అయితే ఆమెను మేనత్త చేరదీయలేదు. ఓనమాలు నేర్పిన పాఠశాల గడప తొక్కడంతో..రవీనా చౌదరి సెయింట్ ఆంథోని పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ వద్దకు వెళ్లి తన గోడు చెప్పుకుంది. ఆయన చలించి పాఠశాల పూర్వ విద్యార్థులు, తెలిసిన వారి సహకారంతో సమీపంలోని గరల్స్ హాస్టల్లో ఆమెను చేర్పించారు. నెలనెలా ఖర్చుల కోసం ట్యూషన్లు చెప్పుకోవాలని ఐదుగురు చిన్నారులను అప్పగించారు. దీంతో రవీనా చిన్నారులకు ట్యూషన్లు చెబుతూ హబ్సిగూడలోని ఓ ప్రైవేటు ఇంటర్ కళాశాలలో చేరింది. ఆమె గాథ టీఎన్జీఓ (TNGO) వ్యవస్థాపక మాజీ ప్రధాన కార్యదర్శి కోయడ దశరథరావు దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించి ఆర్థికంగా చేయూతనిచ్చారు.తాజాగా వెలువడిన ఇంటర్ ఫలితాల్లో రవీనా 978/1000 మార్కులు సాధించి చదువుపట్ల తన ధృడత్వాన్ని చాటుకుంది. డిగ్రీ పూర్తి చేసి ఎప్పటికైనా సివిల్స్లో ర్యాంకు తెచ్చుకోవడమే తన లక్ష్యమని రవీనా చౌదరి ధీమాగా చెబుతోంది. అలాగే ఆమె వెయిట్ లిఫ్టింగ్లో ప్రవేశం పొంది ఓ టోర్నమెంటులో మెడల్ కూడా సాధించడం గమనార్హం. రవీనా డిగ్రీ చదువుకు, ఆ తర్వాత సివిల్స్ ప్రిపరేషన్కు అండగా ఉంటామని పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, దశరథరావు పేర్కొనడం వారి గొప్ప మనసుకు నిదర్శనం.చదవండి: ఈసారి కూడా అమ్మాయిలదే హవా -
నీతా అంబానీ లైఫ్ స్టైల్, ఫ్యాషన్ సెన్స్ అది మరి! ఆమె టీ కప్ స్పెషల్ ఏంటో?
రిలయన్స్ అధినేత,బిలియనీర్ ముఖేష్ అంబానీ ,నీతా అంబానీ (nita ambani) విలాసవంతమైన జీవితం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వ్యాపార కుటుంబ వారసత్వంతోపాటు, వ్యాపార దక్షతతో భారీ వ్యాపార సామ్రాజ్యం వారి సొంతం. అంబానీ భార్య నీతా అంబానీ వ్యాపారవేత్తగా, ఫ్యాషన్ ఐకాన్గా తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంటారు. అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటారు.ప్రముఖ వ్యాపారవేత్త నీతా అంబానీ కూడా ఫోర్బ్స్ 'ఆసియాలో అత్యంత ప్రభావవంతమైన మహిళా వ్యాపార నాయకుల' జాబితాలో పేరు దక్కించుకున్నారు. ఫిలాంత్రఫిస్ట్గా కూడా అనేక దాతృత్వ కార్యక్రమాల్లో ముందుంటారు. నీతా అంబానీ దగ్గరున్న చీరలు, డైమండ్ నగలు, చెప్పులు, వాచెస్, వజ్రాలు పొదిగిన హ్యాండ్ బ్యాగ్లు, లిప్స్టిక్ల అద్భుతమైన కలెక్షన్ లెక్కేలేదు. హ్యాండ్ బ్యాగ్లు కూడా వజ్రాలతో పొదిగి ఉంటాయి. చానెల్, గోయార్డ్ మరియు జిమ్మీ చూ కెర్రీ వంటి ప్రపంచంలోని అత్యంత ఖరీదైన బ్రాండ్ల హ్యాండ్బ్యాగ్లు ఉన్నాయి.ఇదీ చదవండి: ఉద్యోగం కోసం వెళ్లి, 42 ఏళ్లు అక్కడే మగ్గిపోయాడు...చివరికినీతా అంబానీ టీ రూ. 3 లక్షల విలువైన ప్రత్యేకమైన కప్పు ఇవన్నీ ఒక ఎత్తయితే, ఉదయంఆ మె తాగే టీ కప్పు కూడా చాలా విశేషమైనదేట. నీతా ఒక చాయ్ ప్రేమికురాలు ఉదయం టీని ప్రత్యేకమైన టీ కప్పులోనే తాగుతుందట. ఈ విషయాన్ని ఒక సందర్భంలో స్వయంగా నీతా అంబానీనే వెల్లడించారు. దీన్ని జపాన్లో పురాతన క్రాకరీ బ్రాండ్ నోరిటెక్ నుండి 50 పింగాణీ కప్పుల సెట్ కొనుగోలు చేశారు. దీని ధర సుమారు రూ. 1.5 కోట్లు, అంటే ఒక్కో కప్పు ధర రూ. 3 లక్షలు. ఈ కప్పులు ప్రత్యేకమైన పద్ధతిలో, బంగారం , ప్లాటినం పూత పూసిన అంచులతో తీర్చిదిద్దారు. ఈ డిజైన్ చాలా అరుదుగా లభిస్తుంది మరియు నోరిటెక్లో మాత్రమే అందుబాటులో ఉంది. చదవండి: ఒక్కో బనానా రూ.565, బీర్ ధర రూ. 1,697, ఎక్కడో తెలుసా?అంతేకాదు నీతా అంబానీ షాపింగ్ కోసం ఎక్కువ శ్రీలంక వెళతారట. ముఖ్యంగా వంటగది సామాగ్రిని శ్రీలంక దేశం నుంచి కొనుగోలు చేస్తారట. ఇది భారతదేశంలో కంటే శ్రీలంకలో ఉత్పత్తులను చౌకగా చేస్తుంది. భారతదేశంలో సాధారణంగా రూ. 67,000 నుండి రూ. 1.6 లక్షల వరకు ఖరీదు చేసే డిన్నర్ సెట్ శ్రీలంకలో రూ. 25వేల నుంచి రూ. 42 వేల మధ్య లభిస్తుందట. నీతా అంబానీకి కూడా బ్రాండెడ్ వాచీలంటే చాలా ఇష్టం. ఆమె వాచెస్ కలెక్షన్లోబల్గారి, కార్టియర్, రాడో, గూచీ, కాల్విన్ క్లైన్ , ఫాసిల్ వంటి బ్రాండ్లు ఉన్నాయి. ఈ బ్రాండ్ల వాచీల ధర రూ.1.5 నుంచి రూ.2 లక్షల వరకు ఉంటుంది. అలాగే పెడ్రో, గార్సియా, జిమ్మీ చూ, పెల్మోరా, మార్లిన్ బ్రాండ్ల నుండి బూట్లు, చెప్పులను ధరిస్తారు.ఈ బ్రాండ్ల షూలు రూ. 1 లక్ష నుండి ప్రారంభమవుతాయి అంటే నీతా లైఫ్ స్టైల్, ఫ్యాషన్ సెన్స్ను అర్థం చేసుకోవచ్చు.ఇదీ చదవండి: Divorce: అక్కడ విడాకులంటే మహిళలకు పండగే పండగ! -
కఠోర సాధన, అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే, సివిల్స్లో సత్తా
వరంగల్ నగరానికి చెందిన ఇట్టబోయిన సాయి శివాని (Ettaboyina Sai Shivani) యూపీఎస్సీ (UPSC) సివిల్స్లో సత్తా చాటారు. ఇప్పటికే ప్రిలిమ్స్ క్లియర్ చేసిన శివాని మెయిన్స్ లోనూ మెరిసి 11వ ర్యాంక్తో తెలుగు రాష్ట్రాల నుంచి టాపర్గా నిలిచారు. కలెక్టర్ కావాలన్న లక్ష్యంతో రెండో ప్రయత్నంలో మెరుగైన ర్యాంక్ సాధించి కలను సాకారం చేసుకుకుంది 22 ఏళ్ల యువతి. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన గ్రూప్ వన్ పరీక్షలోనూ జోనల్ స్థాయిలో 11వ ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో 21వ ర్యాంక్ సాధించి డిప్యూటీ కలెక్టర్ హోదా లేదా డీఎస్పీ ఉద్యోగం వచ్చే అవకాశం దక్కించుకున్నారు. అంతలోనే ఇప్పుడూ సివిల్స్ లో ఏకంగా 11వ ర్యాంక్ సాధించి... రోజుల వ్యవధిలోనే రెండు ఉన్నత ఉద్యోగాలకు అర్హత సాధించగలిగారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే... ‘నాన్న రాజు మెడికల్ రిప్రంజెటివ్గా పనిచేస్తారు. అమ్మ రజిత గృహిణి. మా చెల్లి సరయూ సఖి హైదరాబాద్ లో సీఏ, తమ్ముడు సాయి శివ బాచుపల్లిలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. నేను ఖమ్మంలోని నిర్మల్ హృదయ్ పాఠశాలలో ఒకటి నుంచి పదో తరగతి వరకు, ఆ తర్వాత వైఎస్సార్ కడప జిల్లాలోని ఇడుపులపాయలో ఐఐటీ ఇంటర్మీడియట్, బీటెక్ (ఈసీఈ) కలిపి ఆరేళ్ల పాటు చదివా. ఇదీ చదవండి: 5 నెలల్లో 18 కిలోలు తగ్గిన హీరో : ఇదేం కొత్త కాదంటున్న ఫ్యాన్స్ ఆ తర్వాత నా తల్లిదండ్రులు ఐఏఎస్ కావాలన్న నా కలను వారి కలగా మార్చుకొని నాకు అండగా నిలిచారు. చదువు కునేటప్పుడు నాకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా నాకు కావలసిన ప్రతిదీ సమకూర్చారు. కుటుంబపోషణ కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా చదువు కోసం చిన్నప్పటి నుంచి అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నారు. కుటుంబ ్ర΄ోద్బలంతోనే నేను ఈరోజు సివిల్స్లో ర్యాంక్ సాధించగలిగా. 2023లో ఐదు మార్కులతో ప్రిలిమ్స్ మిస్ అయ్యింది. అయినా అకుంఠిత దీక్ష, ఆత్మవిశ్వాసంతో ఈ విజయం సాధించగలిగా. ప్రజల జీవితాల్లో మరి ముఖ్యంగా మహిళల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ఐఏఎస్ కావాలనుకున్నాన’ని శివాని తెలిపారు. చదవండి: పండక్కి ఫ్యామిలీతో ఇండియాకు.. ఉగ్రదాడిలో టెకీ దుర్మరణంకఠోర సాధన చేసిందితమ కుమార్తె సాయి శివాని కలెక్టర్ కావాలన్న లక్ష్యంతో ఇంట్లోనే ఉండి సివిల్స్కు సంబంధించిన పుస్తకాలతోపాటు ఢిల్లీలో ఉండే సత్యం జైన్ అనే వ్యక్తి నిర్వహించే అండర్ స్టాండింగ్ యూపీఎస్సీ ఆన్లైన్లో తరగతులకు హాజరై కఠోర సాధనతో కలెక్టర్ కావాలన్న లక్ష్యాన్ని సాధించిందని ఆనందం వ్యక్తం చేశారు తల్లిదండ్రులు ఇట్టబోయిన రాజు, రజితలు. చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేది. ఒత్తిడిని జయించేందుకు యోగా చేసేది. భగవద్గీత చదివేది. మా కలకు శ్రేయోభిలాషుల ఆశీస్సులు, దేవుడి దయ తోడు కావడం వల్లే మా కుమార్తె తన కలను సాకారం చేసుకునే దిశగా ముందుకెళ్లింది’’ అని సంతృప్తి వ్యక్తం చేశారు. – వాంకె శ్రీనివాస్, సాక్షి, వరంగల్ -
25 ఏళ్ల క్రితం చెత్తకుప్పలో వదిలేస్తే.. ఓ అంధురాలి సక్సెస్ స్టోరీ
పుట్టకముందే విధి చిన్న చూపు చూసింది. పుట్టాక పుట్టుకతోనే అంధురాలైన ఈ బిడ్డ మా కొద్దు అంటూ చెత్త కుప్పలో పడేశారు తల్లిదండ్రులు . కట్ చేస్తే 26 ఏళ్ల వయసులొ నాగ్పూర్ కలెక్టరేట్లో రెవెన్యూ అసిస్టెంట్గా ఉద్యోగం సంపాదించింది. ఆ సాహసం పేరు మాలా పాపాల్కర్. ఇంతకీ ఆమె సాధించిన ఘనత ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.మహారాష్ట్రలోని జల్గావ్ రైల్వే స్టేషన్లో చెత్తబుట్టలో పడేశారు కన్నవాళ్లు. ఆ చిన్నారిని గమనించిన పోలీసులు స్థానిక రిమాండ్ హోంకు తరలించారు. అక్కడి నుంచి 270 కిలోమీటర్ల దూరం ఉన్న చెవిటి, అంధుల కోసం మెరుగైన సౌకర్యాలతో ఉండే సామాజిక కార్యకర్త శంకర్బాబా పాపల్కర్ అనాథాశ్రమంలో చేర్చారు. ఆ ఆశ్రమంలోనే అమ్మాయి బ్రెయిలీ లిపిలో చదువుకుని సత్తా చాటుకుంది. గత ఏడాది మేలో మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) క్లర్క్-కమ్-టైపిస్ట్ పరీక్ష (గ్రూప్ సి)లో ఉత్తీర్ణత సాధించడం ద్వారా మాలా పాపల్కర్ వార్తల్లో నిలిచింది. తాజాగా అంత్యంత పోటీతత్వ పబ్లిక్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. త్వరలోనే నాగ్పూర్ కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతలను చేపట్టనుంది.చదవండి: మా కల ఇన్నాళ్లకు తీరింది : అమెరికా దంపతులపై నెటిజన్ల ప్రశంసలుమాలా పాపాల్కర్ ఎలా ఎదిగింది.అనాథాశ్రమంలో చేరిన మాలానుపద్మశ్రీ అవార్డ్ గ్రహిత శంకర్ బాబా పాపల్కర్ శ్రద్ధగా గమనించేవారు. ఆమె పట్టుదల, నైపుణ్యానికి ముచ్చటపడ్డారు. ఆ చిన్నారికి తన ఇంటి పేరు కలిపి మాలా శంకర్ బాబా పాపల్కర్ అని పేరు పెట్టారు. ఆమె ఉన్నత చదువులు చదివేందుకు తన వంతు కృషి చేశారు. అలా మాలా పట్టుదలగా చదివింది ఈ క్రమంలోనే మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) ఫలితాల్లో మాలా ర్యాంక్ సాధించింది. ముంబై సెక్రటేరియట్లో క్లర్క్ కం టైపిస్ట్ ఉద్యోగాన్ని దక్కించుకుంది. తాజా మరో మెట్టు అధిగమించింది.‘‘నన్ను రక్షించి, ఈ రోజు ఈ పరిస్థితికి తీసుకురావడానికి ఆ దేవుడే దేవదూతలను పంపించాడంటూ తన విజయానికి కారణమైన వారికి కృతజ్ఞతలు తెలిపింది. 2018లో అమరావతి యూనివర్శిటీ నుండి గ్రాడ్యుయేషన్, ప్రభుత్వ విదర్భ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ నుండి ఆర్ట్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది మాలా. బ్రెయిలీ లీపి, రైటర్ సహాయంతో పరీక్షలుకు హాజరయ్యేది. ఎడ్యుకేషన్కు సంబంధించి దర్యాపూర్కు చెందిన ప్రొఫెసర్ ప్రకాష్ తోప్లే పాటిల్ దత్తత తీసుకున్నారు.చదవండి: వేధింపులకు భయపడి పబ్లిక్ టాయ్లెట్లో దాక్కుంది..కట్ చేస్తే ఆర్మీ మేజర్! -
వాడికి భయపడి పబ్లిక్ టాయ్లెట్లో దాక్కుంది..కట్ చేస్తే ఆర్మీ మేజర్!
బాలీవుడ్ నటి దిశా పటానీ అక్క ఖుష్బూ పఠానీ ఒక పసికందును రక్షించి ఇంటర్నెట్ హృదయాన్ని గెలుచుకుంది. ఆమె ప్రదర్శించిన కరుణ , ధైర్యసాహసాలు నెట్టింట ప్రశంసలు దక్కించుకున్నాయి. ఇంతకీ ఎవరీ ఖుష్బూ పటానీ? సోదరి దిశా గ్లామర్ ప్రపంచాన్ని ఏలుతోంటే.. ఖుష్బూ దేశానికి సేవ చేసే ఆర్మీ ఆఫీసర్ ఎలా అయింది? మాజీ ఆర్మీ అధికారిణి ఖుష్బూ పటానీ ఇంట్రస్టింగ్ జర్నీ గురించి తెలుసుకుందామా.అద్భుతనటిగా, ఫిట్నెస్ ప్రియురాలిగా పేరు తెచ్చుకున్న దిశా పటానీతో పాటు, ఆమె అక్క ఖుష్బూ పటానీ పేరు కూడా పాపులరే. భారతీయ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన ఖుష్బూ ఇప్పుడు బహుళ పాత్రల్లో నిమగ్నమై ఉంది. వదిలివేయబడిన బిడ్డను రక్షించిన తర్వాత ఖుష్బూ ఇటీవల చాలా మంది దృష్టిని ఆకర్షించింది. తన సోదరి దిశాతో సమానంగా అద్భుతమైన ఇపుడు బరేలీలో పాపను రక్షించి వార్తల్లో నిలిచింది.1991 నవంబర్లో ఉత్తరప్రదేశ్లోని బరేలీలో జన్మించింది ఖుష్బూ. బిబిఎల్ పబ్లిక్ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేసి, తరువాత DIT స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్లో చేరింది. ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఖుష్బూ పటానీ తెలివైన విద్యార్థి. కానీ కాలేజీ చదువుకొనే రోజుల్లో వేధింపులకు గురైంది. కొంతమంది అబ్బాయిలు ఆమెను కారులో వెంబడించి వేధించారు. ఒక ప్రాజెక్ట్ పని తర్వాత తన స్నేహితుడితో కలిసి రాత్రి ఆలస్యంగా తన హాస్టల్కు వచ్చేది. ఆ సమయంలో కారులో ఒకడు పిచ్చిగా వెంటబడి, వేధించేవాడు. ఒక సందర్భంగా ఖుష్బూ ఒక మహిళల పబ్లిక్ వాష్రూమ్లో దాక్కుని తనను తాను రక్షించుకుంది. ఈ సమయంలో చాలా భయపడేపోయేదట. దీంతో ఆమె ఒంటరిగా వెళ్లడం మానేసింది. చదవండి: 25 ఏళ్ల క్రితం చెత్తకుప్పలో వదిలేస్తే.. ఓ అంధురాలి సక్సెస్ స్టోరీపట్టుదలగా చదువుకు పూర్తి చేసి ఎంఎన్సీలో జాబ్ సంపాదించింది కానీ ఆ ఉద్యోగం ఖుష్బూకి సంతొషాన్నివ్వలేదు. కాలేజీ రోజుల నాటి భయంకరమైన అనుభవం వెంటాడేది. ఆ భయంనుంచి వచ్చిన ఆలోచనే సైన్యంలో చేరడానికి ప్రేరేపించింది. అప్పటి వరకు, ఆమెకు సైన్యంలో చేరాలనే ఆలోచన లేదు.భారత సైన్యంలో చేరాలని నిర్ణయించుకున్నాక, తన వేధింపుల గురించి తన తండ్రితో చెప్పుకుంది. SSB ప్రవేశ పరీక్షకు సిద్ధమైంది. తొలి ప్రయత్నంలోనే పరీక్షలో ఉత్తీర్ణురాలై లెఫ్టినెంట్గా ఆర్మీలో చేరింది. నిజమైన దేశభక్తురాలిగా దేశానికి సేవ చేసింది. ఖుష్బూ పటానీ 34 సంవత్సరాల వయసులో మేజర్ హోదాలో సైన్యం నుండి పదవీ విరమణ చేసి వెల్నెస్ కోచ్గా ఉంది. అంతేకాదు ఆమె TEDx స్పీకర్ కూడాసోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా అభమానులకు స్ఫూర్తినిస్తోంది. ఖుష్బూ టారో కార్డ్ రీడర్ కూడా, కెరీర్, వ్యాపారం, డబ్బు, అనేక ఇతర విషయాలలో సూచనలిస్తుంది. -
Kamala Sohonie భారతీయ తొలి మహిళా డాక్టరేట్
తొమ్మిది దశాబ్దాల క్రితం ఓ యువతి విజ్ఞాన శాస్త్రంలో ఎంఎస్సీ చేయడం కోసం ఒక పోరాటమే చేయాల్సివచ్చింది. ఆవిడ పోరాడింది చిన్న వ్యక్తితో కాదు. నోబెల్ బహుమతి గ్రహీత సీవీ రామన్తో! ఆ యువతి కమలా సోహానీ Kamala Sohonie). ఈవిడే సైన్సు విభాగంలో పీహెచ్డీ పొందిన తొలి భారతీయ మహిళ! బొంబాయిలో 1911 జూన్ 18న జన్మించారు కమలా భాగ వత్. బొంబాయి ప్రెసిడెన్సీ కళాశాల నుంచి రసా యన శాస్త్రంలో బీఎస్సీ పట్టా పొందారు. తర్వాత సీవీ రామన్ డైరెక్టర్గా ఉన్న టాటా సైన్స్ ఇన్స్టిట్యూట్ (నేడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, బెంగ ళూరు)లో ఎమ్మెస్సీ చదవాలని ప్రయ త్నించారు. ఆ రోజుల్లో ఉన్నత చదు వుకు మహిళలు అర్హులు కాదని భారతీయ సమాజం భావించేది. సీవీ రామన్ కూడా దాన్నే నమ్మి ఆమెకు ప్రవేశాన్ని నిరాకరించారు. అయితే ఆ నిర్ణయాన్ని స్వీకరించక, గాంధీజీ ఆదర్శాలను బలంగా నమ్మిన కమలా భాగవత్ సత్యాగ్రహం చేయాలని నిర్ణయించుకున్నారు. తొలుత రామన్ మహాశ యుడు కమల పట్టుదలను గమనించ లేకపోయారు. ఆమె మౌనంగా రోజుల తరబడి నిరసన తెలపడంతో రామన్ దిగిరాక తప్పలేదు. చివరకు ప్రవేశ మిచ్చారు. అయితే కొన్ని నిబంధనలతో! అది కూడా రెగ్యులర్ విద్యార్థిగా తీసుకోలేదు. ఒక సంవత్సరం పాటు ప్రొబేషనరీగా చేరవలసి వచ్చింది. ‘అవసరమైతేనే రాత్రింబవళ్ళు కష్టపడాలి. ప్రయోగశాల వాతావరణాన్ని పాడు చేయకూడదు’– ఇలాంటివి ఆ అధ్వాన్నపు నిబంధనలు! అయితే లక్ష్యసాధన కోసం ఓర్చుకుని కష్టపడి 1936లో ఎమ్మెస్సీ డిగ్రీ పొందారు. పాలు, పప్పు, చిక్కుళ్ళలో ప్రొటీన్ల గురించి కమల శోధించి ఎమ్మెస్సీ పట్టా కోసం సిద్ధాంత గ్రంథం రాశారు.దీంతో రామన్ మహిళాశక్తిని గుర్తించి ఆ సంవత్సరం నుంచే విద్యార్థినులకు అవకాశం కల్పించడంప్రారంభించారు. అలా కమల విజ్ఞాన శాస్త్రాల అధ్య యనానికి సంబంధించి మహిళలకు తొలి దారి దీపమయ్యారు. పీహెచ్డీ కోసం కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చేరారు. తన 16 నెలల పరిశోధనలో ‘సైటోక్రోమ్ సి’ అనే ఎంజైమ్ ఉందనీ, అన్ని మొక్కల కణాలలో జరిగే ఆక్సీకరణలో దీని పాత్ర ఉంటు న్నదనీ కనుగొన్నారు. తన పరిశోధనా ఫలితాలను కేవలం 40 పుటలు ఉన్న సిద్ధాంత గ్రంథంగా కేంబ్రిడ్జి యూని వర్సిటీకి సమర్పించి పీహెచ్డీ పట్టా పొందారు. విజ్ఞానశాస్త్ర రంగంలో పీహెచ్డీ పొందిన తొలి భారతీయ మహిళగా కమల అవతరించారు.ఇండియా వచ్చి వివిధ ఉద్యోగాలు చేస్తున్న సమయంలో ఎం.వి. సోహా నీతో 1947లో వివాహం జరిగింది. అప్పటి నుంచి కమలా భాగవత్పేరు కమలా సోహానీగా మారింది. ఆమె చేసిన పరిశోధనలు భారతీయ సమాజానికి చాలా విలువైనవి. పప్పు ధాన్యాలు, చిక్కుళ్ళు, తాటి బెల్లం, నీరా లేదా ఈత కల్లు, తాటి మొలాసిస్, బియ్యప్పిండి మొదలైన వాటి పోషక విలువలకు సంబంధించి ఆమె చేసిన పరిశోధనలు తిరుగు లేనివి.ఎనభయ్యారేళ్ళ వయసులో న్యూఢిల్లీలో తనను గౌరవించడానికి ఏర్పాటు చేసిన సమావేశంలో 1998 జూన్ 28న ఆమె హఠాత్తుగా మరణించడం ఆమె జీవన యాత్రకు ఆశ్చర్యకరమైన ముగింపు!– డా.నాగసూరి వేణుగోపాల్, ఆకాశవాణి మాజీ ఉన్నతాధికారి -
అప్పుడు రోజుకూలీ, ఇపుడు కోట్ల విలువ చేసే కంపెనీకి సీఈవో
ఈ రోజు కష్టాలున్నాయని కుంగిపోకూడదు. చీకటి వెనుకే వెలుగు ఉంటుంది. ఈ ఆశావహదృక్పథమే మనిషిని నడిస్తుంది. భవిష్యత్పై ఆశను పెంచుతుంది. ఆత్మవిశ్వానికి మనో ధైర్యాన్ని జోడించి ముందుకు అడుగేయాలి. అప్పుడే మన పట్టుదలకు, కష్టానికి విజయం దాసోహమంటుంది. రాజస్థాన్లోని దుంగార్పూర్ జిల్లాకు చెందిన గిరిజన మహిళ సక్సెస్ గురించి తెలుసుకుంటే.. ఈ మాటలు అక్షర సత్యాల నిపించక మానవు. 9వ తరగతిలో న చదువు మానేసి, ఇపుడు కోట్ల విలువ చేసే కంపెనీకి సీఈవోగా రాణిస్తూ, ప్రధానిమోదీ చేతులు మీదుగా సత్కారాన్ని అందుకున్న మహిళ గురించి తెలుసుకుందా రండి!రాజస్థాన్లోని దుంగార్పూర్ జిల్లాకి చెందిన రుక్మిణి కటారా 13 ఏళ్ల వయసులో వివాహం చేశారు పెద్దలు. అప్పటికి మద్వా ఖపర్దా అనే చిన్న గ్రామంలో ఆమె తొమ్మిదో తరగతి చదువుకుంటోంది. పెళ్లి తరువాత చదువుకు బ్రేక్ పడింది. కుటుంబం గడవడం కోసం దినసరి కూలీగా పనిచేసింది. NREGA ద్వారా వచ్చే జీతమే వారికి ఆధారం. కానీ రాజస్థాన్ గ్రామీణ ఆజీవిక వికాస్ పరిషత్ (రాజీవిక) పథకం ఆమె జీవితంలో మార్పునకు నాంది పలికింది. ఈ పథకం కింద స్వయం సహాయక బృందంలో చేరి, ఆమె సౌర దీపాలు , ప్లేట్లను(Solar lamps and Plates) ఇన్స్టాల్ చేయడం నేర్చుకుంది. శ్రద్ధ పెట్టి, ఈ పనిలో నైపుణ్యం సాధించింది. ఆ తరువాత దుర్గా ఎనర్జీ (దుంగార్పూర్ రెన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్)కంపెనీని స్థాపించింది. ఒక గిరిజన మహిళగా తాను సాధికారత సాధించడమే కాదు, తనలాంటి ఎందరో మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించింది. కంపెనీ ఐదేళ్ల కాలంలో రూ. 3.5 కోట్లకు పైగా టర్నోవర్ సాధించింది. కంపెనీ సీఈవోగా రుక్మిణి మరో 50 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. తనలాంటి మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ కృషికి గాను ఆమెకు జాతీయ గుర్తింపు కూడా లభించింది. 2016లో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో రుక్మిణిని సత్కరించారు.ఇదీ చదవండి: ఫ్యాషన్లో తండ్రికి తగ్గట్టే : రూ 1.4 కోట్ల వాచ్తో మెరిసిన బ్యూటీతక్కువ చదువుకుంటే ఏంటి? "మహిళలు పెద్దగా చదువుకోలేదని, విద్య తక్కువ అని ఎప్పుడూ తమను తాము తక్కువగా అనుకోకూడదు. తక్కువ విద్యతో కూడా ఎదగవచ్చు. నేను తొమ్మిదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాను. కానీ నేడు నేను ఒక కంపెనీ యజమానిని. నాలాగే ఇతర మహిళలు ఇలా ఎందుకు చేయకూడదు?” అంటుందామె సగర్వంగా. ఇతరులకు స్ఫూర్తినివ్వాలనే ఆమె ఆత్మవిశ్వాసం, సంకల్పం ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. ఇపుడు భర్త కమలేష్తో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతోంది. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు: రాకేష్, ఆశా, ప్రవీణ్ ,యువరాజ్. అందర్నీ ఉన్నత చదువులను చదివిస్తోంది.చదవండి: అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి -
Rutuja Warhade: దేశం కోసమే మొదటి అడుగు
ప్రతిష్ఠాత్మక నేషనల్ డిఫెన్స్ అకాడెమీ ఫలితాలు ఇటీవలే వెలువడ్డాయి. దేశం మొత్తం నుంచి 12 లక్షల మంది రాశారు. వీళ్లలో లక్షన్నర మంది అమ్మాయిలు. ఈ అమ్మాయిల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించింది పూణెకు చెందిన రుతుజా వర్హాడే. అంతే కాదు.. దేశం మొత్తం మీద 3వ ర్యాంక్ పొందింది. 75 ఎన్ డీఏ చరిత్రలో ఒక అమ్మాయి టాప్ ర్యాంక్ సాధించడం ఇదే మొదలు. ‘మొదటి నుంచి డిఫెన్స్ లో పని చేయాలనేది నా కోరిక... అందుకే కష్టపడ్డా’’ అంటోంది రుతుజా.పూణెలో ఉండే ప్రతిష్ఠాత్మక నేషనల్ డిఫెన్స్ అకాడెమీ (ఎన్.డి.ఏ) ఎంట్రన్స్ సంవత్సరంలో రెండుసార్లు జరుగుతుంది. ఏప్రిల్లో. సెప్టెంబర్లో. ఏప్రిల్లో జరిగిన ఎంట్రెన్స్కు 12 లక్షల మంది దేశవ్యాప్తంగా అప్పియర్ అయితే వారిలో 3వ ర్యాంక్ సాధించింది రుతుజ వర్హాడే. అకాడెమీ చరిత్రలో ఒక అమ్మాయికి ఈ స్థాయి ర్యాంక్ రావడం ఇదే మొదలు. పరీక్షలో పాల్గొన్న 12 లక్షల మంది అభ్యర్థుల్లో లక్షన్నర మంది అమ్మాయిలైతే వారిలో మొదటి స్థానంలో నిలిచింది రుతుజ. అందుకే ఆమెను అందరూ శ్లాఘిస్తున్నారు. ఆ ప్రతిభకు సెల్యూట్ చేస్తున్నారు.దేశం కోసం...రుతుజ పూణెలో పుట్టి పెరిగింది. తండ్రి ప్రొఫెసర్. తల్లి ఇంట్లో 5వ తరగతి పిల్లల నుంచి ఇంజనీరింగ్ పిల్లల వరకూ మేథ్స్లో ట్యూషన్ చెబుతుంది. రుతుజ చిన్నప్పటి నుంచి చదువులో చాలా బ్రిలియంట్గా ఉంది. పదవ తరగతిలో టాప్ మార్క్స్ వచ్చాయి. ఇంటర్లో కూడా అంతే. ఎన్.డి.ఏ ఎంట్రన్స్ ఇంటర్ తర్వాత రాయాలి కాబట్టి ముందు నుంచి ప్రిపేర్ అవుతూ కోచింగ్ తీసుకుంటూ రాసి టాప్ ర్యాంక్ సాధించింది. ‘ఆర్మ్డ్ ఫోర్స్లో పని చేయాలనేది నా కల. దేశం కోసమే నా మొదటి అడుగు’ అంటోంది రుతుజ.ఎనిమిదవ తరగతిలో ఉండగా...సాధారణంగా ఆమ్మాయిలు ఎన్.డి.ఏ.లో చదవాలని కోరుకోరు. అందుకే నిన్న మొన్నటి వరకూ వారిని అనర్హులుగా చూసేది ఎన్.డి.ఏ. అయితే రుతుజ ఎనిమిదవ క్లాస్లో ఉన్నప్పుడు ఎన్.డి.ఏ. ఇకపై ఆడపిల్లలకూ ప్రవేశం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ‘ఈ విషయం మా క్లాస్లో చర్చకి వచ్చింది. అప్పుడే ఎన్.డి.ఏ గురించి తెలిసింది. మానసికంగా, శారీరకంగా ఫిట్గా ఉండటం మొదటి అర్హత అయితే కఠినమైన రిటన్ టెస్ట్లో పాసయ్యి రెండవ దశలో సీట్ సంపాదించడం ఇంకా కష్టమని తెలుసుకున్నాను. ఎలాగైనా ఈ అకాడెమీలో చేరాలని నిర్ణయించుకుని కష్టపడ్డాను. మేథ్స్, అబిలిటీ, జనరల్ నాలెడ్జ్ మీద ప్రశ్నలు ఉంటాయి. వాటి కోసం కోచింగ్ సెంటర్లో నాలుగైదు గంటల మెగా లెక్చర్స్ వినేదాన్ని. అంతేకాదు... మా నాన్నగారు అందించిన ప్రోత్సాహం కూడా నన్ను మోటివేట్ చేసింది’ అంటుంది రుతుజ.మాటలు పడినా...రుతుజ ఈ క్రమంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొంది. చదువులోనే నిమగ్నమై ఉండటంతో స్నేహితులు ఆమెను బాయ్కాట్ చేశారు. ఎప్పుడూ చదువే నీకు... ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో నీ ప్రతిభ గుండు సున్నా అని ఎగతాళి చేశారు. ‘రోషపడి సీనియర్ ఇంటర్లో క్లాసుల కంటే కూడా స్పోర్ట్స్ అండ్ ఆర్ట్స్లో ఎక్కువ సమయం వెచ్చించాను. దాంతో నా గ్రేడ్స్ పడిపోయాయి. చాలా డల్ అయిపోయాను. ఆ దశ నుంచి తిరిగి టాప్ స్టూడెంట్గా నిలవడానికి కష్టపడాల్సి వచ్చింది’ అని తెలిపింది రుతుజ.‘సాధారణంగా సీనియర్ ఇంటర్లో చాలామంది డైవర్ట్ అవుతారు. అలా కాకుండా కష్టపడి చదివి లక్ష్యం వైపు అడుగు వేస్తే విజయం మీదే’ అంటోంది రుతుజ. -
ఎవరీ రేష్మా కేవల్రమణి..? ఏకైక భారత సంతతి మహిళగా టైమ్స్లో చోటు..
ప్రపంచమంతా ప్రతిష్టాత్మకంగా భావించే టైమ్ మ్యాగజైన్(Time Magazine List 2025) జాబితా 2025 విడుదలైంది. అందులో ఈసారి భారతీయులెవరకీ చోటు దక్కలేదు. కానీ భారత సంతతి మహిళగా అమెరికన్ బయోటక్ దిగ్గజం కేవల్ రమణి చోటు దక్కించుకుని ఆ లోటుని భర్తిచేశారని చెప్పొచ్చు. అమెరికన్ పౌరురాలే అయినా భారత మూలలున్న అమ్మాయే కేవల్ రమణి. ఆమె నేపథ్యం ఏంటీ..?ఎలా అత్యంత ప్రతిష్టాత్మకమైన టైమ్స్ జాబితాలో స్థానం దక్కించుకోగలిగింది అంటే..2020ల టైంలో ఇలానే రేష్మా కేవల్రమణి వార్తల్లో నిలిచారు. ఆ ఏడాది యునైటెడ్ స్టేట్స్లో ఒక ప్రధాన బయోటెక్ సంస్థకు నాయకత్వం వహించిన తొలి మహిళగా అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రముఖ బయోటెక్నాలజీ సంస్థ అయిన US-ఆధారిత వెర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్ సీఈవో రేష్మ కేవల్రమణి. ఆమె ఈ ఏడాది టైమ్ మ్యగజైన్ వందమంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. అంతేగాదు ఈ ఏడాది ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారత సంతతి వ్యక్తిగా నిలిచారామె. అలాగే ఆమె జన్యు వైద్యంలో సంచలనాత్మక ఆవిష్కరణలతో కంపెనీని ముందంజలో నిలిపింది. పైగా ఆమె నాయకత్వంలోనే వెర్టెక్స్ మొట్టమొదటి CRISPR-ఆధారిత చికిత్సకు FDA ఆమోదం పొంది గణనీయమైన పురోగతిని అందుకోవడం తోపాటు అందరి దృష్టిని ఆకర్షించింది. నిజానికి ఇది సికిల్ సెల్ వ్యాధికి విప్లవాత్మక చికిత్స. ఆ ఔషధం ఆ పరిస్థితికి ప్రధానమైన DNA ఉత్పరివర్తనలను సరిచేస్తుంది. టైమ్ ప్రోఫైల్ కూడా దీన్నే హైలెట్ చేస్తూ..ఆమెను అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా గుర్తింపు ఇచ్చి.. మరీ గౌరవించింది. అలాగే జింగో బయోవర్క్స్ వ్యవస్థాపకుడు జాసన్ కెల్లీ..రేష్మా దూరదృష్టి విధానాన్ని కొనియాడారు. మన శరీరాలు డీఎన్ఏ భాషను మాట్లాడతాయి. రానున్నకాలంలో అత్యంత శక్తివంతమైనవి ఆ మందులేనని, అవి అదే భాషను తిరిగి మాట్లాడతాయని, పైగా మరిన్ని రుగ్మతలను నివారిస్తాయని అన్నారు కెల్లీ.రేష్మా విద్యా నేపథ్యం..ముంబైలో జన్మించిన రేష్మా 1988లో యునైటెడ్ స్టేట్స్కు వెళ్లారు. అక్కడే ఆమె వైద్య వృత్తిని కొనసాగించింది. బోస్టన్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసింది. తదనంతరం మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్లో ఫెలోషిప్ పొందింది. ఆ తర్వాత 2015లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో జనరల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ను పూర్తి చేసింది. ఆమె 2017లో వెర్టెక్స్లో చేరి త్వరితగతిన అంచెలంచెలుగా ఎదిగి.. 2018లో చీఫ్ మెడికల్ ఆఫీసర్గా, అక్కడ నుంచి రెండేళ్లకే సీఈవో స్థాయికి చేరుకున్న ప్రతిభావంతురాలామె.(చదవండి: World Hemophilia Day: చిన్న గాయమైన రక్తంధారగా పోతుందా..? తస్మాత్ జాగ్రత్త..!) -
మన ప్రతిభ మెరుస్తుందా?
అందాల పోటీలు మన దేశానికి చాలాసార్లు కిరీటాన్ని తొడిగాయి! కాస్మెటిక్స్కి మంచి మార్కెట్గా మార్చాయి! భారత్కు బ్రాండ్నూ సృష్టించాయి! మన అమ్మాయిల ఆత్మవిశ్వాసాన్నీ పెంచాయి... ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో స్టార్స్ని చేశాయి! ఆ అవకాశాలు ఇప్పుడు తెలంగాణ వెదుక్కుంటూ వచ్చాయి... మేలో జరగనున్న 73వ మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ను డెస్టినేషన్గా కోరుకుంటూ! ఆ స్టోరీ...భాష, సంస్కృతి, సంప్రదాయం, భౌగోళిక వైవిధ్యంలో తెలంగాణ.. మన దేశానికి మినియేచర్గా ఉంటుంది. ఆ ప్రత్యేకతే తెలంగాణ రాష్ట్రాన్ని మిస్ వరల్డ్ పోటీలకు వేదికను చేసింది. ఇక్కడి కళలు, చేనేత, పర్యాటకప్రాభవాన్ని ప్రపంచానికి పరిచయం చేయబోతోంది. అందులో భాగంగానే ఈ పోటీలను తెలంగాణలోని పలుచోట్ల నిర్వహించనున్నారు. వీటిని కవర్ చేయడానికి అంతర్జాతీయంగా మూడువేల మీడియా సంస్థలు వస్తున్నాయి. అలా తనకంటూ ఓ బ్రాండ్ను క్రియేట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. పోచంపల్లి ఇక్కత్తో 120 దేశాల సుందరీమణులు మెరవబోతున్నారు. హిందూ, ముస్లిం సౌభ్రాతృత్వానికి చిరునామా అయిన లాడ్బజార్లో హెరిటేజ్ వాక్ చేయబోతున్నారు. చౌమొహల్లా ప్యాలెస్లో చవులూరించే రుచులతో విందారగించనున్నారు. వీటన్నిటితోపాటు తెలంగాణ అభివృద్ధి, తమ అబ్జర్వేషన్స్నూ అంతర్జాతీయ మీడియా సంస్థలు.. ఫీచర్స్గానో.. ఆఫ్ బీట్ స్టోరీస్గానో ఫోకస్ చేస్తాయి. అలా తెలంగాణ టాక్ ఆఫ్ ద వరల్డ్ అవుతుందని అందాల పోటీల నిర్వాహకుల అభి్రపాయం. తెలంగాణ కూడా ఇక్కడి పర్యాటకం మీద ప్రపంచదృష్టి పడేలా చేసి తద్వారా దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశిస్తోంది. ఈ పోటీల్లో లోకల్ మేకప్ ఆర్టిస్ట్లు, హెయిర్ స్టయిలిస్ట్లు, టెక్స్టైల్, కాస్ట్యూమ్ డిజైనర్స్, ఇతర కళాకారులకు అవకాశాలు లభించి, వారి ప్రతిభకు ప్రపంచ గుర్తింపు దొరకనుందా?హైదరాబాద్ను సౌత్ ఫ్యాషన్ హబ్లా మార్చనుందా? ఇక్కడా గ్రూమింగ్ సెంటర్స్, ఇమేజ్ బిల్డింగ్ కన్సల్టేషన్స్, స్కిన్ కేర్ ఇండస్ట్రీస్ ఏర్పడనున్నాయా? ఆయా రంగాల్లోని నిపుణులు ఏమంటున్నారో చూద్దాం!బాధ్యతనూ తీసుకోవాలినారాయణ పేట్ విమెన్ వీవర్స్ మీద నేనొక డాక్యుమెంటరీ చేశాను. లాక్డౌన్ టైమ్లో వాళ్లకో ఉపాధిలా ఉంటుందని తస్రిక వీవింగ్ టెక్నిక్తో అక్కడి స్త్రీలతో చీరలను నేయించాను. వాటికి నేను డిజిటల్ ప్రింట్స్ని యాడ్ చేసి ఆ చీరలతోనే వాళ్లకు మేకోవర్ చేసి నారాయణ పేట్ లోనే వీడియో షూట్, ఫొటో షూట్ చేశాను. ఆ డిజైన్స్ని హైదరాబాద్కి తీసుకొచ్చి పదిహేను రోజులు ఎగ్జిబిషన్లా పెట్టి.. ఆ సేల్స్ని పెంచాం. తర్వాత ఆ చీరలను హ్యాండ్లూమ్ డే రోజు వాళ్లకు గిఫ్ట్గా ఇచ్చాం. ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి చేయూతా దొరక లేదు. అలాగే ఈ అందాల పోటీల వల్ల మన టెక్స్టైల్స్ గురించి ఒక వారం మాట్లాడుకుంటారేమో అంతే! అవకాశాలు రావాలి, పెరగాలంటే మాత్రం టెక్స్టైల్ మినిస్ట్రీ చొరవ తీసుకునిæతెలంగాణ ఫ్యాషన్ హబ్ లాంటిదొకటి ఏర్పాటు చేయాలి. – హేమంత్ సిరి, ఫ్యాషన్ డిజైనర్మంచి అవకాశంనేనైతే దీన్ని పాజిటివ్గానే చూస్తాను. ఈ మిస్ వరల్డ్ కంటెస్ట్ తెలంగాణలో అందాల పోటీలకు ఓ స్పేస్ క్రియేట్ చేస్తుందనుకుంటున్నాను. ఫుట్వేర్, కాస్ట్యూమ్ డిజైనర్స్, హెయిర్ స్టయిలిస్ట్స్, మేకప్ ఆర్టిస్ట్స్ లాంటివాళ్లెందరికో అవకాశాలు దొరుకుతాయి. అంతేకాదు ఈ పోటీల్లో వాడే ఫుట్వేర్, కాస్ట్యూమ్స్ తయారీకీ ఇది హబ్గా మారొచ్చు. గ్రూమింగ్ సెంటర్స్, ఇమేజ్ బిల్డింగ్ కన్సల్టేషన్స్, స్కిన్ కేర్ ఇండస్ట్రీస్కీ స్కోప్ ఉంటుంది. గ్రూమింగ్ వల్ల తర్వాత అమ్మాయిలు ఏ రంగంలోకి వెళ్లాలనుకున్నా ఆ కమ్యూనికేషన్ స్కిల్స్, కాన్ఫిడెన్స్ ఉపయోగపడతాయి. – కె. అభిమానిక యాదవ్, సెలబ్రిటీ ఫిట్నెస్ కోచ్ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని..మేకప్ రంగంలో మంచి విమెన్ మేకప్ ఆర్టిస్ట్లు ఉన్నారు. కానీ వాళ్లకు అవకాశాల్లేవు. అలాంటి వాళ్లకు ఈ ఈవెంట్స్ ఉపయోగపడాలి. నేను వరుసగా నాలుగేళ్లు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఈవెంట్కి వర్క్ చేశాను. ఆ తర్వాత నుంచి మళ్లీ అబ్బాయిలనే తీసుకుంటున్నారు. అలా కాకుండా దీన్ని తెలంగాణ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని.. అర్హతలు, ప్రమాణాలు, సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని మేకప్ ఆర్టిస్ట్ల నుంచి కొటేషన్స్ను ఆహ్వానించాలి– శోభాలత, సీనియర్ మేకప్ ఆర్టిస్ట్భద్రత.. రక్షణ కల్పించి...ముందు మహిళలకు తగిన భద్రత, రక్షణ కల్పించి.. ఆ తర్వాత మిస్ వరల్డ్ పోటీలకు వేదికను ఇవ్వడం గురించి ఆలోచించాలి. వీటివల్ల తెలంగాణ ప్రతిష్ఠ పెరగడం మాట ఎలా ఉన్నా తెలంగాణ వనరులు విదేశీ పెట్టుబడి సంస్థలకు ధారదత్తం అవడం మాత్రం ఖాయం అని నాకనిపిస్తోంది.– భండారు విజయ, రచయిత, మహిళా హక్కుల కార్యకర్తబ్యూటీ పాజంట్ విత్ తెలంగాణ స్టయిల్ఈ పోటీలు హైదరాబాద్ మొదలుకొని రామప్ప, పోచంపల్లి, చౌమొహల్లా ప్యాలెస్.. ఇలా పలుచోట్ల జరుగుతాయి. వీటివల్ల ప్రపంచం మన కళలు, సంస్కృతి, మన వారసత్వ సంపదను తెలుసుకుంటుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇక్కడి వైద్య సౌకర్యాలను గమనిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణ వైవిధ్యాన్ని పరిచయం చేయబోతున్నాం. ఈ పోటీలను బ్యూటీ పాజంట్ విత్ తెలంగాణ స్టయిల్ అనుకోవచ్చు. – మామిడి హరికృష్ణ, డైరెక్టర్, భాష – సాంస్కృతిక శాఖ -
Aarthi Subramanian: ఐటీలో ఆమెకు అగ్రపీఠం
ఐ.టి. దిగ్గజ సంస్థ టి.సి.ఎస్. మే 1 నుంచి ఆర్తి సుబ్రహ్మణ్యానికి సి.ఓ.ఓ. బాధ్యతలు అప్పజెప్పింది. బహుశా దేశంలో ఐ.టి. రంగంలో సి.ఓ.ఓగా నియమితురాలైన మొదటి మహిళ ఆర్తినే కావొచ్చు. ఆమె పరిచయం.చిన్న చిన్న ఉద్యోగాలు, వర్తకాలు చేసే వారు కూడా ‘వాకింగ్కి టైమ్ దొరకలేదు’ అంటుంటారు. కాని టాటా సంస్థల్లో కీలకమైన బాధ్యతల్లో ఉంటూ వచ్చిన ఆర్తి సుబ్రహ్మణ్యం ఏ రోజూ వాకింగ్ మానేయరు. వాన వచ్చినా వరద ముంచెత్తినా వాకింగ్ చేయాల్సిందే. ‘రోజుకు 10 నుంచి 12 కిలోమీటర్లు నడవాలని నా ప్రయత్నం. కనీసం ఆరు నుంచి ఎనిమిదైనా నడుస్తుంటాను. నడక ఆలోచనకు చోటు ఇస్తుంది. ఆరోగ్యకరమైన శరీరం, ఆరోగ్యకరమైన ఆలోచన విజయానికి దోహదం చేస్తాయి’ అంటారామె. 58 ఏళ్ల ఆర్తి సుబ్రహ్మణ్యం 30 బిలియన్ డాలర్ల లావాదేవీలు ఉన్న దిగ్గజ ఐ.టి. సంస్థ ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్’ (టి.సి.ఎస్.)కు మే 1 నుంచి సి.ఓ.ఓ. (చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్)గా బాధ్యతలు స్వీకరించనున్నారు. సాధారణంగా మగవారే పై స్థానాల్లో ఉండే ఐ.టి. రంగంలో సి.ఓ.ఓ.గా మహిళ కనిపించడం అరుదు. టాటా సంస్థల్లో గాని, ఇతర ఐ.టి. దిగ్గజ సంస్థల్లోగాని ఇలా సి.ఓ.ఓ.స్థాయికి చేరిన స్త్రీలు బహు తక్కువ. అందుకే అందరూ అబ్బురంగా ఆర్తి వైపు చూస్తున్నారు.ట్రయినీగా చేరి.. అంచెలంచెలుగా ఎదిగి...ఆర్తి సుబ్రహ్మణ్యం మన వరంగల్ విద్యార్థి. వరంగల్ ఎన్.ఐ.ఐ.టి.లో బి.టెక్ కంప్యూటర్ సైన్స్ చేసి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాన్సాస్లో ఇంజనీరింగ్లో మాస్టర్స్ చేశారు. 1989లో తన కెరీర్ని గ్రాడ్యుయేట్ ట్రయినీగా టాటాలో మొదలుపెట్టి్ట అంచెలంచెలుగా ఎదిగారు. దాదాపు టాటాలోని అన్ని కీలక సంస్థల్లో ముఖ్యహోదాల్లో పని చేశారు. మన దేశంలో పాస్పోర్ట్ డిజిటలైజేషన్ కోసం టాటా నిర్వహించిన ప్రాజెక్ట్లో చురుగ్గా పని చేశారు. టాటా ఏ.ఐ.జి.లో, అలాగే హెచ్.ఆర్లో చేస్తూ టాటా సన్స్లో ఎనిమిదేళ్లుగా గ్రూప్ చీఫ్ డిజిటల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. అక్కడి నుంచే టి.సి.ఎస్.కు సి.ఓ.ఓ.గా వస్తున్నారు.మిసెస్ ఫిక్సిట్ఆర్తి సుబ్రహ్మణ్యానికి సాటి ఉద్యోగులు ‘మిసెస్ ఫిక్సిట్’ అని సరదాగా పిలుచుకుంటారు. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా దానికి ఆమె దగ్గర సమాధానం ఉంటుంది. సవాళ్లను స్వీకరించే ఆమె తత్త్వమే ఆమెను ఈ స్థాయికి చేర్చింది. అయితే ఆమెకు ఉద్యోగమే జీవితం కాదు. వారాంతం వచ్చిందంటే కచ్చితంగా బాలీవుడ్ సినిమా చూడాల్సిందే. అమితాబ్ బచ్చన్కు పెద్ద ఫ్యాన్. అలాగే పాటలు వింటారు. మేనేజ్మెంట్కు సంబంధించిన పుస్తకాలు చదువుతారు. ‘ఒక వ్యక్తి రాబోయే కాలంలో ఎక్కడ ఎలా ఉండాలో నిర్దేశించుకుని ఆ లక్ష్యాన్ని చేరొచ్చు. అయితే టీమ్ మీతో ఉండి మీకు సహకరించాలి. మీరు టీమ్కి సహకరించాలి. అది జరిగిన పక్షంలో ఉద్యోగంలో ఒక్క క్షణం కూడా మీకు బోరు కొట్టదు’ అంటారామె. టి.సి.ఎస్.కు ఐదేళ్ల పాటు సి.ఓ.ఓ.గా పని చేయనున్నారు ఆర్తి సుబ్రహ్మణ్యం. ఈ సమయంలో ఈ వార్త ఆ సంస్థ ఉద్యోగులకే కాదు ఐ.టి. రంగంలో పని చేస్తున్న స్త్రీలందరికీ స్ఫూర్తిదాయకమే. -
అపుడు స్టార్ యాక్టర్.. వరుస ఓటములు, అయినా తండ్రి మాటకోసం!
కొంతమంది అనుకోకుండా యాక్టర్లు అవుతారు. మరికొంతమంది డాక్టర్ కాబోయి యాక్టర్లు అవుతారు. ఇంకొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమా రంగంలో ఎంట్రీ ఇచ్చి, ఆ తరువాత స్టార్ హీరోహీరోయిన్లుగా పేరు తెచ్చుకుంటారు. కానీ సినీరంగంలోకి చైల్డ్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపును, పేరును తెచ్చుకున్నట్టప్పటికీ, వేరేరంగంలో పేరు రాణించడం చాలా అరుదు. పలు సినిమాలలో నటించి క్రేజ్, ఫామ్ను వదిలిపెట్టి, ఇపుడు ఐఏఎస్ ఆఫీసర్గా రాణిస్తున్న హెచ్సీ కీర్తన సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం.భారతీయ సినిమా మనకు అనేక మంది ప్రఖ్యాత కళాకారులు అందించింది. తమకంటూ ఒక పేరును చెక్కుకుని, ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. వారి అద్భుతమైన నటనకు దేశానికి కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టింది. అలాంటి వారిలో ఒకరు. హెచ్సి కీర్తన. ఆమె బాలనటిగా తన కెరీర్ను ప్రారంభించి, అనేక మంది ప్రముఖ తారలతో కలిసి నటించింది. 32 కి పైగా చిత్రాలలో నటించింది. 48 టీవీ షోలలో కనిపించింది. కర్పూరద గొంబే, గంగా-యమునా, ముద్దిన అలియా, ఉపేంద్ర, కానూరు హెగ్గదాటి, సర్కిల్ ఇన్స్పెక్టర్, ఓ మల్లిగే, లేడీ కమీషనర్, హబ్బా, డోరే, సింహాద్రి, పుత్రీ, జననీ, జననీ ఉన్నాయి. అనేక సినీపాత్రలతో అపారమైన ప్రజాదరణ పొందింది. చదవండి: ఎయిర్ హోస్టెస్పై లైంగిక దాడి, వెంటిలేటర్పై ఉండగానే అమానుషం!అద్భుతమైన ఫామ్ కొనసాగుతున్న సమయంలోనే తన చదువుపై దృష్టి పెట్టడానికి పరిశ్రమను విడిచి పెట్టాలని నిర్ణయించుకుంది. దేశానికి సేవ చేయడానికి 15 ఏళ్ల వయసులో సినీ పరిశ్రమను విడిచిపెట్టింది. IAS ఆఫీసర్ కావాలనే తన తండ్రి కల, తన కలను సాకారం చేసుకోవాలని నిర్ణయించింది. నటనా జీవితానికి బై బై చెప్పేసి యూపీఎస్సీకి ప్రీపేర్ అయ్యింది. అయితే తన కల అంత ఈజీగా సాకారం కాలేదు. ఐదుసార్లు ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన, చివరికి ఆరో ప్రయత్నంలో విజయం సొంతం చేసుకుంది. UPSC పరీక్షలో ఆలిండియా లెవెల్ లో ఆరో ప్రయత్నంలో 167వ ర్యాంక్ ను ఆమె సాధించారు. ప్రస్తుతం కీర్తన కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలో అసిస్టెంట్ కమిషనర్ గా పని చేస్తోంది.గతంలో కీర్తన కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారిణిగా కూడా సేవలు అందించి ప్రశంసలు అందుకోవడం విశేషం.ఇదీ చదవండి: మొబైల్ పోయిందా డోంట్ వర్రీ! కొత్త టెక్నాలజీతో ఇట్టే ..! -
హాట్సాప్ అన్నపూర్ణ ..! రియల్ ‘లేడి సింగం’
పోలీసుశాఖలో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉంది’ అంటుంది ఇండియా జస్టిస్ రిపోర్ట్–2025. ‘ఎందుకు ఇలా?’ అనేదానిపై ఎందరో ప్రముఖులు తమ అభిపప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీసు డిపార్ట్మెంట్లో మహిళలు తప్పనిసరిగా ఎందుకు ఉండాలి’ అనే కోణంలో కొందరు విలువైన విశ్లేషణ చేశారు. అన్నపూర్ణలాంటి ధైర్యసాహసాలు మూర్తీభవించిన పోలీస్ ఇన్స్పెక్టర్ల గురించి చదివినప్పుడు వారి విశ్లేషణ నూటికి నూరుపాళ్లు సరిౖయెనదే అనిపిస్తుంది. కర్నాటకలోని హుబ్లీ నగరంలో గత ఆదివారం ఐదేళ్ల బాలికను అపహరించి, అత్యాచార యత్నం చేసి, చంపేసిన సంఘటన రాష్ట్రాన్ని అట్టుడికించింది. ఈ దుర్మార్గానికి ఒడిగట్టింది బిహార్కు చెందిన రితేష్ కుమార్. ఇతడు వలసకూలీ. సీసీ టీవీల కెమెరా ఫుటేజీ సహాయంతో రితేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం తీసుకువెళుతున్న సమయంలో రితేష్ పోలీసులపై రాళ్ల దాడి చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అశోక్నగర్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ అన్నపూర్ణ పారిపోవద్దు’ అని రితేష్ను హెచ్చరిస్తూ గాలిలో కాల్పులు (వార్నింగ్ షాట్) జరిపింది. రితేష్ ఆమె హెచ్చరికను ఖాతరు చేయలేదు. రాళ్ల దాడీ ఆపలేదు. దీంతో గత్యంతర లేని పరిస్థితులలో అన్నపూర్ణ రితేష్పై కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ సంఘటనలో అన్నపూర్ణతోపాటు ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. అన్నపూర్ణ ధైర్యసాహసాలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి ‘లేడి సింగం’ అనే విశేషణాన్ని ఆమె పేరుకు ముందు జోడిస్తున్నారు. తాజా విషయానికి వస్తే... కర్నాటక మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ అన్నపూర్ణను అభినందించారు. ‘హేయమైన నేరాలకు పాల్పడిన నిందితులను ఉరి తీయాలి. న్యాయం త్వరితగతిన జరగాలి. పోలిస్ ఇన్స్పెక్టర్ అన్నపూర్ణ చర్య రాష్ట్రవ్యాప్తంగా ఇతర అధికారులకు స్ఫూర్తిగా నిలవాలి. అన్నపూర్ణను అత్యున్నత రాష్ట్ర పురస్కారంతో సత్కరించాలని ముఖ్యమంత్రి, హోంమంత్రులకు సిఫారసు చేస్తాం’ అన్నారు హెబ్బాళ్కర్. బెల్గాం జిల్లాలోని గుజనట్టి గ్రామానికి చెందిన అన్నపూర్ణ ధార్వార్డ్ అగ్రికల్చరల్ యూనివర్శిటీలో ఎంఎస్సీ చేసింది. 2018లో పోలిస్శాఖలో చేరింది. ‘రాష్ట్రంలో ఇంతకు ముందు ఏ మహిళా పోలీస్ అధికారి చేయని సాహసాన్ని అన్నపూర్ణ చేసింది. హాట్సాప్’ అంటూ సోషల్ మీడియాలో అన్నపూర్ణపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు.(చదవండి: 'ఇది తప్పనిసరి' .. విడాకులపై స్పందించిన మెలిండా గేట్స్..! ఆ ఏజ్లోనే విడిపోవడానికి కారణం..) -
కౌంట్ డౌన్: ఐకానిక్ మహిళల అంతరిక్ష యాత్ర
ఆరుగురు ఐకానిక్ మహిళలను అంతరిక్షంలోకి తీసుకెళ్లే న్యూ షెపర్డ్ స్పేస్ క్రాఫ్ట్ పైలట్ లేకుండానే పనిచేస్తుంది. సబ్ ఆర్బిటల్ ప్రయాణానికి ఆరుగురు ప్రయాణికులను తీసుకెళ్లగలదు. సుమారు 11 నిమిషాల పాటు పయనించి భూమికి 62 మైళ్ల ఎత్తులో ఉన్న కార్మాన్ రేఖను దాటుతుంది. దీన్ని అంతరిక్షానికి ప్రవేశ ద్వారంగా భావిస్తారు.ఈ ప్రయాణంలో ప్రయాణికులు గాలిలో తేలిపోతున్నట్టుగా అనుభూతిని పొందుతారు. క్యాప్సూల్కు సంబంధించిన పెద్ద కిటికీల ద్వారా భూమి విహంగ వీక్షణను ఆస్వాదిస్తారు. ‘న్యూ షెపర్డ్ స్పేస్ క్రాఫ్ట్’ను చిన్న చిన్న గగన యాత్రల కోసం రూపొందించారు. ఇది బిఇ–3 పిఎమ్ ఇంజిన్తో పనిచేస్తుంది. ఈ ఎన్.ఎస్.–31 మిషన్ టెక్నాలజీ ఫీట్ మాత్రమే కాదు ఒక చారిత్రాత్మక ఘట్టం కూడా.‘నా భయాన్ని పోగొట్టుకోవడానికి ధ్యానం చేస్తున్నాను’ అంటోంది గేల్ కింగ్.‘కాస్త భయంగా ఉంది. అయినా చాలా ఉత్సాహంగా ఉంది’ అంటోంది లారెన్ సాంచెజ్.ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా ఆరుగురు ఐకానిక్ మహిళల అంతరిక్షయాత్ర హాట్ టాపిక్గా మారింది.అయేషా బోవ్నాసా మాజీ రాకెట్ శాస్త్రవేత్త అయిన అయేషా బోవ్ మిచిగన్ యూనివర్శిటీ నుండి ఏరోస్పేస్ ఇంజినీరింగ్లో డిగ్రీ, స్పేస్ సిస్టమ్స్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో కలిసి పనిచేసే ‘స్టెమ్ బోర్డ్’ అనే ఇంజినీరింగ్ కంపెనీకి అయేషా బోవ్ సీఈవో.అమంద గుయెన్హార్వర్డ్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్, ఎంఐటీ, నాసా, ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఆస్ట్రోనాటికల్ సైన్సెస్లో పనిచేసింది అమంద గుయెన్. లైంగిక బాధితులకు అండగా నిలబడి పోరాడిన గుయెన్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయింది. టైమ్ మ్యాగజైన్ ‘ఉమన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డ్కు ఎంపికైంది. తొలి వియత్నామీస్, ఆగ్నేయాసియా మహిళా వ్యోమగామిగా ఈ అంతరిక్ష యాత్రతో గుయెన్ చరిత్ర సృష్టించనుంది. ‘సేవింగ్ ఫైవ్: ఎ మెమోరియల్ ఆఫ్ హోప్’ అనే పుస్తకాన్ని గత నెలలో విడుదల చేసింది.లారెన్ సాంచెజ్ లారెన్ సాంచెజ్ రచయిత్రి, పాత్రికేయురాలు. ఎన్నో వార్తా సంస్థలలో యాంకర్గా పనిచేసింది. లారెన్ హెలికాప్టర్ పైలట్ కూడా. ‘బ్లాక్ ఆప్స్ ఏవియేషన్’ సంస్థను స్థాపించింది. ఇది మహిళా యాజమాన్యంలో నిర్వహితమవుతున్న తొలి ఏరియల్ ఫిల్మ్ అండ్ ప్రొడక్షన్ కంపెనీ. ‘ది ఫ్లై హూ ఫ్లై టు స్పేస్’లాంటి ఎన్నో పిల్లల పుస్తకాలు రాసింది.గేల్ కింగ్మేరీల్యాండ్ యూనివర్శిటీ నుండి సైకాలజీలో పట్టా పొందిన గేల్ కింగ్కు రేడియో, టెలివిజన్, ప్రింట్ మీడియాలలో నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. ‘గేల్ కింగ్ ఇన్ ది హౌజ్’ అనే రేడియో షోని హోస్ట్ చేసింది. ఉత్తమ రేడియో టాక్ షో కోసం ఇచ్చే ‘అమెరికన్ ఉమెన్ ఇన్ రేడియో అండ్ టెలివిజన్ గ్రేసి అవార్డ్’ను సొంతం చేసుకుంది. టైమ్ మ్యాగజైన్ ‘అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితా–2019’లో చోటు సాధించింది.కేటీ పెర్రీఆల్ టైమ్ బెస్ట్ సెల్లింగ్ మ్యూజిక్ ఆర్టిస్ట్లలో పాప్ స్టార్ కేటీ పెర్రీ ఒకరు. 2010లో విడుదలైన ఆమె మొదటి ఆల్బమ్ రికార్డ్లు బ్రేక్ చేసింది. 13 గ్రామీ అవార్డ్లకు కేటీ నామినేట్ అయింది. బిల్బోర్డ్ ‘విమెన్ ఆఫ్ ది ఇయర్–2012’ అవార్డ్ అందుకుంది. ‘ఫైర్ వర్క్ ఫౌండేషన్’ మొదలుపెట్టి యునిసెఫ్ గుడ్విల్ అంబాసిడర్గా సేవలు అందిస్తోంది.కెరియానే ప్లిన్కెరియానే ప్లిన్ నిర్మాత. డాక్యుమెంటరీలు, చిత్రాలు తీసింది. హాలీవుడ్లో ఆమె తీసిన దిస్ చేంజెస్ ఎవ్రీ థింగ్ (2018), లిల్లీ (2024) చిత్రాలకు మంచి గుర్తింపు వచ్చింది. ఎన్నో స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ప్లిన్కు అంతరిక్ష ప్రయాణాలపై ఆసక్తి. ‘నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను’ అంటోంది తన అంతరిక్ష ప్రయాణం గురించి. -
యూట్యూబ్ సెన్సేషన్ ఈ 74 ఏళ్ల బామ్మ..! నెలకు రూ.5 లక్షలు పైనే..
సోషల్ మీడియా ఎక్కడెక్కడో వంటింట్లోనే మగ్గిపోయే వనిత లెందరినో బయట ప్రపంచానికి తెలిసేలా చేసింది. ఎందిరినో స్టార్లుగా మార్చింది. టెక్నాలజీ అంటే ఏంటో తెలియని బామ్మలను ఓవర్నైట్ స్టార్లుగా మార్చింది. అలానే ఇక్కడొక బామ్మ కూడా యూట్యూబ్ సెన్సేషన్గా మారింది. తన పాకకళతో ఎందరో ఫాలోవర్లును దక్కించుకుని డిజటల్ క్విన్గా మారింది ఈ 74 ఏళ్ల బామ్మ. ఆ బామ్మను అంతా ఆప్లీ ఆజీగా పిలిచే సుమన్ ధమానే. ఆమె యూట్యూబ్ ఛానెల్కి ఏకంగా 1.79 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. అంచనాలకందని విధంగా డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టడం అతిపెద్ద విషయం అనుకుంటే..ఎవ్వరూ ఊహించని రీతిలో సంపాదన ఆర్థిచడం మరింత విశేషం. ఆమె మనవు యష్ సాయంతో ఈ డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెట్టారామె. తన పాకకళతో యూట్యూబ్ ఛానెల్లో మహారాష్ట్ర వంటకాల రుచులను పరిచయం చేసింది ఈ బామ్మ. ఎప్పటికప్పుడూ కొత్తదనంతో..కాలానుగుణ రుచులతో ఆరోగ్యకరమైన వంటకాల వీడియోలతో అలరించింది. ఇంట్లో ఉండే సుగంధద్రవ్యాలతో ఆరోగ్యకరంగా వంటకాలు తయారు చేయడం ఎలా అనే వీడియోలతో..ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇచ్చే ఆహారప్రియులను బాగా ఆకర్షించింది. అదే ఆమెకు మంచి స్టార్డమ్ని తెచ్చిపెట్టింది. ఆకర్షణీయమైన పావ్ భాజీ, కరేలే కి సబ్జీ, మహారాష్ట్ర స్వీట్ల వరకు ప్రతిదీ నోరూరించేలా ఆరోగ్యకరంగా చేసుకోవడం ఎలాగో పరిచయం చేసింది. ఈ యూట్యూబ్ స్టార్డమ్ జర్నీలో ఆమె కెమెరా ముందు నిలబడి మాట్లాడటంలో మొదట్లో తడబాటు, సిగ్గుపడటం వంటి సమస్యలను ఎదుర్కొంది. అలాగే సాంకేతిక లోపాలు, ఛానెల్ హ్యాక్ వంటి ఇబ్బందులను కూడా ఎదుర్కొంది. అయినప్పటికీ..తన జర్నీని విరమించలేదు. తాజా కంటెంట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది. అలా యూట్యూబ్ సిల్వర్ బటన్ను కూడా దక్కించుకుంది. ఈ బామ్మ కథ విజయానికి వయసు అడ్డంకి కాదని చూపించడమే గాక కుటుంబ మద్దతుతో దేన్నేనా సాధించగలమని నిరూపించింది. ఈ బామ్మ తన యూట్యూబ్ ఛానెల్తో నెలకు రూ. 5 నుంచి రూ. 6 లక్షల పైనే సంపాదిస్తుందట. (చదవండి: మాతృత్వం మధురిమను కాపాడుకుందాం..! కాబోయే తల్లుల ఆరోగ్యం కోసం..) -
అమిత ప్రతిభ
అడ్వర్టైజింగ్, సినిమా ఫీల్డ్ల గురించి అమ్మాయిలకు ఆసక్తి ఉంటే...‘అడ్వర్టైజింగ్ ఫీల్డ్కు వెళతావా! సినిమా ఫీల్డ్కు వెళతావా!!’ అని ఆశ్యర్యపోయే కాలం అది. అలాంటి కాలంలో అడ్వర్టైజింగ్ ఆ తరువాత ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ముంబైకి చెందిన అమిత మద్వాని.‘ఏం తెలుసు అని ఇక్కడికి వచ్చావు!’ అని ఒకరు వెటకారం చేశారు. ‘తెలుసుకుందామనే ఇక్కడికి వచ్చాను’ అని సమాధానం ఇచ్చింది అమిత.అవును... ఎన్నో దశాబ్దాలుగా ఆమె నేర్చుకుంటూనే ఉంది. ఆ నిరంతర ఉత్సాహమే అమితను అడ్వర్టైజింగ్, ఫిల్మ్ ఇండస్ట్రీలో విజయ కేతనం ఎగరేసేలా చేసింది.తన కమ్యూనిటీలోని సాంస్కృతిక వేడుకలు, మారాఠీ నాటకరంగ ప్రభావం కళల పట్ల అమితలో ఆసక్తిని పెంచింది. 1980 దశకంలో అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీలో పురుషాధిక్యత ఉన్న కాలంలో ఆమె తన కెరీర్ను మొదలు పెట్టింది. ‘ఇది నువ్వు ఎంచుకోవాల్సిన రంగం కాదు’ అంటూ కొద్దిమంది ఆమెను వెనక్కిలాగే ప్రయత్నం చేశారు. అయితే ఆమె ఉత్సాహంలో ఎలాంటి మార్పూ లేదు.‘ఎన్ని సమస్యలు ఎదురైనా ఎదుర్కొంటాను’ అంటూ ముందుకు కదిలింది. నేర్చుకోవాలనే కుతూహలం ఆమె వేగంగా నడిచేలా చేసింది. ప్రారంభ రోజులు... కష్టపడడంలో ఉన్నప్రాముఖ్యత గురించి చెప్పాయి. ‘నేను ఎంచుకున్న ప్రయాణం అడుగడుగునా సవాలుతో కూడుకున్నదనే విషయం తెలిసినా రాజీ పడలేదు. సినిమా సెట్లో బ్యాగులు ΄్యాకింగ్ చేయడం దగ్గర్నుంచి 35 ఎం.ఎం. సినిమా ఎడిటింగ్ మెళకువలను అర్థం చేసుకోవడం వరకు ఎన్నో నేర్చుకున్నాను’ అంటుంది అమిత.ఒగిల్వి, లియో బర్నెట్లాంటి అడ్వర్టైజింగ్ దిగ్గజ సంస్థలలో పనిచేయడం ఆమె అనుభవ జ్ఞానాన్ని విస్తృతం చేసింది. సినీ పరిశ్రమను అడ్వెర్టైజింగ్ ఏజెన్సీల కోణం నుంచి చూడడానికి ఆమెకు ఉపకరించాయి. క్యాంపెయిన్ బిల్డింగ్, క్లయింట్ సర్వీసింగ్, క్రియేటివ్, ప్రొడక్షన్ బృందాల మధ్య సమన్వయం.... ఇలా ఎన్నో విషయాలలో నైపుణ్యాన్ని సాధించింది.ఈ అనుభవ, నైపుణ్యజ్ఞానంతో ‘ఈక్వినాక్స్ ఫిలిమ్స్’లో కో–వోనర్, నిర్మాతగా ప్రయాణం ప్రారంభించింది. మంచి పేరు తెచ్చుకుంది. కోవిడ్ మహమ్మారి సమయంలో వచ్చిన విరామంలో...‘ఏం చేస్తున్నాం? ఏం చేయకూడదు’ అనే కోణంలో ఆలోచించి సరికొత్త నిర్ణయాలు తీసుకుంది. అందులో ఒకటి... స్టోరీ టెల్లింగ్, డిజిటల్–ఫస్ట్ స్ట్రాటజీలను ఒకే వరుసలోకి తీసుకురావడం. భారీ బడ్జెట్తో కూడిన టెలివిజన్ వాణిజ్య ప్రకటనల నుంచి రీల్స్, డిజిటల్ ప్రకటనల ప్రస్తుత యుగం వరకు మన ప్రకటనల రంగంలో నాటకీయ మార్పులను అమిత ప్రత్యక్షంగా చూసింది.‘విజయపథంలో ప్రయాణించాలంటే కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. మరింత నేర్చుకోవాలి అనే ఆసక్తి ఉండాలి. వర్తమానం గురించే కాదు భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని కూడా ఆలోచనలు చేయాలి. నేను ఎంచుకున్న పని నన్ను ఎక్కడికి తీసుకువెళుతుందో తెలియదు. అయితే ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండేదాన్ని. మారుతున్న కాలానికి అనుగుణంగా నాలోని నైపుణ్యాలకు పదును పెట్టాను’ అంటుంది అమిత మద్వాని.ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా...మనం ఎంచుకున్న మార్గం కఠినం, సవాళ్లతో కూడుకున్నది అయినప్పటికీ... నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనే తపన ఉంటే విజయం సాధించవచ్చు. నేను అడ్వర్టైజింగ్, ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు ఏమీ తెలియదు. చాలా ఓపికగా నేర్చుకున్నాను. పది సెకన్ల డిజిటల్ స్పాట్ అయినా, మూడు గంటల ఫీచర్ ఫిల్మ్ అయినా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా చూడడమే ప్రధానం. సోషల్ మీడియా ఫ్రెండ్లీ ఫార్మట్లను ఏకీకృతం చేయడం ద్వారా, ప్రేక్షకులకు ఎండ్–టు–ఎండ్ పరిష్కారాలను అందించడం ద్వారా ఈక్వినాక్స్ ఫిల్మ్స్ ముందంజలో ఉంది. టీమ్ అంకితభావం మా విజయానికి కారణం.– అమిత మద్వాని -
ఆ యూనిఫాం నచ్చి చెఫ్గా మారా.. ఏకంగా 72 పోటీల్లో 94 పతకాలు!
పాఠశాలలో విద్యాభ్యాసం పొందుతున్న సమయంలో ఓ చెఫ్ వీడియోకు, అతని డ్రెస్ కోడ్కు ఆకర్షితురాలైన ఆ విద్యార్థిని చెఫ్గా మారాలని సంకల్పించుకుంది. అంతటితో ఆగకుండా ఆ దిశగా అడుగులు వేస్తూ మాస్టర్ చెఫ్గా పలువురి మన్ననలు పొందుతోంది. అనేక వంటల పోటీల్లో పతకాలను సొంతం చేసుకుంటూ తనదైన ముద్ర వేసుకుని బేకరీ విభాగంలో రాణిస్తోంది. ఆమే మేడ్చల్కు చెందిన మహిళా చెఫ్ (Woman Chef) దివ్యసారిక. తాను చెఫ్గా మారి స్థిరపడడం సరికాదని భావించి పాకశాస్త్ర ప్రావీణ్యంతో అద్యాపకురాలిగా తనలాంటి ఎంతో మందిని చెఫ్స్గా మలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా (Guntur District) ప్రత్తిపాడు మండలం కొత్త మల్లయ్యపాలేనికి చెందిన దివ్యసారిక (Divya Sarika) ఇంటర్ వరకూ అక్కడే చదువుకుంది. గుంటూరులోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న రోజుల్లో ఓ కార్యక్రమంలో భాగంగా పాఠశాల యాజమాన్యం పలు రంగాల్లో ప్రావీణ్యం పొందిన వారి వీడియోలను ప్రదర్శించింది. అందులో భాగంగా ఆ్రస్టేలియాకు చెందిన ఫేమస్ చెఫ్ థామస్ వీడియో, అతని యూనీఫాంకు ఆకర్షితురాలైంది దివ్యసారిక. అప్పుడే చెఫ్గా మారాలని నిర్ణయించుకుంది. మొదట ఇంట్లో వంటలు చేయడం ప్రారంభించింది. ఇంటర్ తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చేయాలనే ఆలోచనను తండ్రి శివారెడ్డి, కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. తనకు ఇష్టమైన రంగంలో వెళ్తానంటూ పట్టుబట్టి హైదరాబాద్లో హాస్టల్లో ఉంటూ మూడేళ్ల పాటు బ్యాచిలర్ ఆఫ్ కలినరీ ఆర్ట్స్ కోర్సు పూర్తిచేసింది. చివరి సంవత్సరంలో హోటల్ హెచ్ఐసీసీలో అప్రెంటీస్లో చేరి అనంతరం అక్కడే చెఫ్గా చేరింది. తదనంతరం నోవోటెల్లో రెండున్నరేళ్ల పాటు చెఫ్గా చేసింది. 72 పోటీల్లో.. 94 పతకాలు.. బేకరీ విభాగంలో చెఫ్గా రాణిస్తున్న దివ్యసారిక ఇప్పటి వరకూ అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో 72 పోటీల్లో పాల్గొంది. మొదట విద్యార్థి దశలో 2013లో ఆంధ్రా కలినరీ చెఫ్ పోటీల్లో పాల్గొనేందుకు రూ.42 వేలు ఖర్చు చేసి పొటీలో పాల్గొంది. నిర్భయ గర్ల్చైల్డ్, మథర్ థీమ్తో చెఫ్గా తనదైన ముద్రతో మొదటి గొల్డ్మెడల్ సాధించింది. దీంతో పతకం రుచి చూసిన చెఫ్ దివ్య అంతర్జాతీయ స్థాయిలో మలేషియా, మారీషియస్, మాల్దీవులు వంటి దేశాలతో పాటు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన పోటీల్లో పాల్గొని 4 గొల్డ్ మెడల్స్, 2 బ్రాంజ్ మెడల్స్ సాధించింది. 32 గోల్డ్ మెడల్స్, 21 సిల్వర్, 41 బ్రాంజ్ మెడల్స్తో పాటు నగదు పురస్కారాలు, అవార్డులు, ప్రశంసా పత్రాలు సొంతం చేసుకున్నట్లు దివ్యసారిక తెలిపింది. లక్షల జీతం వదిలి.. మహిళా చెఫ్గా రాణిస్తున్న దివ్య ప్రముఖ హోటళ్లలో, విదేశాల్లో చెఫ్గా విధులు నిర్వహిస్తే రూ.లక్షల్లో వేతనం పొందే అవకాశం ఉన్నా.. తాను నేర్చుకున్నది నలుగురికీ బోధించాలనే ఉద్దేశంతో హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో అధ్యాపకురాలిగా విధులు నిర్వహిస్తుంది. గతంలో తెలంగాణ టూరిజంలో ఉద్యోగం వచ్చినా వెళ్లలేదు. ఇప్పటి వరకూ 300 మంది విద్యార్థులను చెఫ్లుగా తీర్చిదిద్దానని, వారిలో కొందరు విదేశాల్లో చెఫ్స్గా స్థిరపడ్డారని తెలిపారు. రుచికరమైన ఆహారం అందించేందుకు.. చెఫ్స్గా మహిళలు రాణించాలనేదే నా కోరిక.. నా ప్రేరణతో మరికొందరు ఈ రంగంలో స్థిరపడాలి. ప్రజలకు నాణ్యామైన రుచికరమైన ఆహారం అందించేందుకు నా వంతు కృషి చేస్తున్నాను. నా ద్వారా ఈ రంగంలో స్థిరపడిన వారు చిరకాలం నన్ను గుర్తుంచుకుంటారు.. అదే నాకు ఆనందాన్నిస్తుంది.(చదవండి: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నీటి ధర రూ. 65 లక్షలా..!) -
చలనమే విజయం
ఆదివాసీ మహిళలకు ఆధార్ కార్డ్ ఉంటుందో లేదో. మరి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందా? వారు ఒక టూ వీలర్ కలిగి డ్రైవింగ్ నేర్చుకుని ఉంటే కొండ మిట్టల దారుల్లో మైళ్ల కొద్దీ నడక నుంచి విముక్తి అవుతారు. ఉపాధికి మార్గాలు వెతుకుతారు. సమయం సద్వినియోగం చేసుకుంటారు. కాని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో వారికి డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాలు సమకూర్చే ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయోగానీ కేరళలో జరుగుతున్నాయి. ఇలా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మన్యంప్రాంతాలలో కూడా చేయగలరేమో ఆలోచించాలి. ఎందుకంటే ఇది మంచి ఫలితాలను ఇస్తోంది. సరిగా చెప్పాలంటే మంచి పని ఎప్పుడూ మంచి ఫలితాలనే ఇస్తుంది. గిరిజన గూడేలు అడవుల్లో, కొండల్లో ఉంటాయి. వారు బాహ్య ప్రపంచంతో తెగిపోయి ఉన్నట్టుగా భావిస్తారు. దానికి కారణం ఆ గూడేలకు దారులు ఉండవు. ఉన్నా సరిగా ఉండవు. నాలుగు చక్రాల వాహనాలు తిరిగేలా కొన్ని దారులు మాత్రమే ఉంటాయి. అందుకే వీరు ఎక్కువగా కాలి నడక మీద ఆధార పడతారు. రోజులో ఎక్కువ సమయాన్ని వీరు నడకకోసమే వెచ్చించాల్సి ఉంటుంది. హైవే మీద కూడా వీరు అలవాటు కొద్దీ నడిచే వెళుతుంటారు.. లేదా డబ్బు లేక కూడా. అలా నడుస్తున్నవారిలో మహిళలను చూసి వీరి ట్రాఫిక్ నియమాలను తెలుపుదాం అనుకున్నారు ‘దేవికులం’ అనే టౌన్కు చెందిన సబ్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసు అధికారులు. ఈ ఊరు కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఉంది. దేవికులం చుట్టుపక్కల దాదాపు 25 గిరిజన గూడేలు ఉన్నాయి. ఈ గూడేలలోని మహిళలకు టూ వీలర్స్ లేవు. ఒకవేళ కొనగలిగినా వీరికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు. అందుకే అధికారులు కేవలం రోడ్ సేఫ్టీ గురించి చెప్పాలనుకున్నారు.టెస్ట్ పాసైన మహిళగత సంవత్సరం అధికారులు గిరిజన మహిళలను పిలిచి రోడ్డు జాగ్రత్తలు వివరిస్తున్నప్పుడు సుగంతి అనే గిరిజన మహిళ ‘సార్ నేను డ్రైవింగ్ నేర్చుకోగలనా’ అని అడిగింది. అధికారులు వెంటనే సమాధానం చెప్పలేక పోయారు. ఎందుకంటే కేరళలో డ్రైవింగ్ లైసెన్సు మన రాష్ట్రాల్లో కొన్నిచోట్ల జరిగినట్టుగా పరీక్షలు పాస్ కాకుండా పొందలేరు. పరీక్ష రాయాల్సిందే. గిరిజన మహిళ రాయగలదా అనుకున్నారు. ‘మా ఆశ్చర్యం కొద్ది ఆమె డ్రైవింగ్ నేర్చుకోవడమే కాదు పరీక్ష పాసై లైసెన్సు పొందింది’ అన్నారు ఆర్టిఏ అధికారులు. అప్పుడే వారికి ఆలోచన వచ్చింది... గిరిజన స్త్రీలకు డ్రైవింగ్ నేర్పాలని.మా జీవితాలు మారాయిడ్రైవింగ్ లైసెన్స్ పొంది కొత్తదో సెకండ్ హ్యాండ్తో ఒక టూ వీలర్ను ఏర్పాటు చేసుకున్నాక ఇక్కడ చాలామంది గిరిజన స్త్రీల జీవనం మారింది. ‘మేం పని కోసం వెళ్లగలుగుతున్నాం. ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందగలుగుతున్నాం’ అని వారు అంటున్నారు. టూ వీలర్ నడపడానికి సౌకర్యవంతమైన డ్రస్సులు కూడా వేసుకోవాల్సి ఉంటుంది. ‘గిరిజన నియమాలు అందుకు ఒప్పుకోవు. కాని గూడెం పెద్దలు పరిస్థితి అర్థం చేసుకుని అనుమతి ఇస్తున్నారు’ అంటున్నారు మహిళలు. చీర కాకుండా పంజాబీ డ్రస్సుల వంటివి జీవితంలో మొదటిసారి టూవీలర్లు నడపడానికే వీరు ధరిస్తున్నారు. ‘మాలో కొందరికి టూవీలర్ నడపడం వచ్చినా డ్రైవింగ్ లైసెన్స్ ఎలా పొందాలో తెలియక భయం భయంగా బండ్లు నడుపుతూ బతికేవాళ్లం. ఇప్పుడు లైసెన్సులు ఇవ్వడం వల్ల మా భయం పోయింది. మేము ధైర్యంగా టౌన్లకు వెళ్లి సరుకులు అమ్ముతాం’ అంటున్నారు. ‘స్వప్నం’ ఉన్న గిరిజన మహిళలు ఎందరో. వారికీ చలనంప్రాప్తమవ్వాలి. ‘కనావు’...అంటే ‘స్వప్నం’దేవకులం ఆర్.టి.ఓ. అధికారులు గిరిజన మహిళల కోసం ‘కనావు’ అనే కార్యక్రమం రూపొందించారు. కనావు అంటే స్వప్నం. డ్రైవింగ్ నేర్చుకొని, స్వీయ చలనం కలిగి తమ కలలు సాధించుకోవాలనే స్ఫూర్తిని ఇస్తూ ఈ కార్యక్రమం రూపొందించారు. ఇందులో డ్రైవింగ్ అవసరాన్ని చెప్పే కౌన్సెలింగ్, గూడెం పెద్దలు ఇందుకు అభ్యంతరం పెట్టకుండా వారి అనుమతి తీసుకొవడం, ఉచిత మెడికల్ ఎగ్జామినేషన్, టూ వీలర్ కొనుక్కునేందుకు ఫండ్ పొందే మార్గాలు... ఇవన్నీ ఉంటాయి. మహిళలు నడపడానికి అనువైన తేలికపాటి టూవీలర్ డ్రైవింగ్ను దేవకులం చుట్టుపక్కల ఉన్న గూడేల్లోని మహిళలకు నేర్పించసాగారు. ఇప్పటికి చాలామంది స్త్రీలు ఈ లైసెన్సులు పొందారు. కొందరు వాహనాలు సమకూర్చుకున్నారు. సొంత వాహనం మీద సొంతగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం అంటే ఏమిటో వారి అనుభవంలోకి వచ్చాక పెదాల మీద వచ్చిన చిరునవ్వు చూడదగ్గది. -
'ట్విన్టాస్టిక్'..! పుట్టుకలోనే కాదు ప్రతిభలో కూడా సేమ్ టు సేమ్..!
అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఒకేలా చదవడం అత్యంత అరుదు. ఎక్కడోగానీ అలా జరగదు. ఒకవేళ్ల ఇద్దరూ మంచి ప్రతిభావంతులైనా కూడా ఒకేలా మార్కులు సాధించడం అనేది అత్యంత అరుదు అనే చెప్పాలి. కానీ ఈ ట్విన్స్ ఇద్దరూ ఒకేలా మార్కులు సాధించి అందర్నీ విస్తుపోయేలా చేశారు. తమ పుట్టుకే కాదు..ప్రతిభలో కూడా ఒకేలా సత్తాచాటుతామని అంటున్నారు ఈ అక్కాచెల్లెళ్లు. అంతేకాదండోయ్ పది నుంచి ఎంబీబీఎస్ వరకు దాదాపు ఒకేలా మార్కులు సాధించడం విశేషం.ఆ కవలలే రహిన్, రిబాలు. సింగిల్ మదర్ పెంపకంలో పెరిగారు ఇద్దరు. తమ కుటుంబంలోని తొలి వైద్యులు కూడా వీరే. తమ మామ ఈ రంగంలోకి రావడానికి ఆదర్శం అని చెబుతున్నారు ఇద్దరు. వీరిద్దరూ వడోదరలోని GMERS మెడికల్ కాలేజీ ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఇద్దరూ ఫైనల్ ఎగ్జామ్స్లో ఒకేలా 66.8% స్కోర్ సాధించి అందర్నీ విస్తుపోయేలా చేశారు. ఆ కాలేజ్ హాస్టల్ గదిలో ఒకే రూమ్లో కలిసి చదువుకున్నారు. తామిద్దరికి ఎంబీబీఎస్ సీటు వేర్వేరు కాలేజీల్లో వచ్చినా..2019లో గోత్రిలోని వైద్య కళాశాలలోనే ఇద్దరం జాయిన్ అయ్యాం అని చెబుతున్నారు ఇద్దరూ. తమ ఇంటికి చేరువలోనే ఆ కాలేజ్ ఉంటుందన్నారు. అలాగే నగరానికి వచ్చి ఒంటరిగా చదవడం కూడా ఇదే మొదటిసారని కూడా చెప్పారు. తమ తల్లి, తాతా, మామల ప్రోద్భలంతో ఈ ఘన విజయాన్ని సాధించామని చెబుతున్నారు. ఇక రిబా, రహిన్లు తమ అమ్మ కలను నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇక వారిద్దరి విద్యా నేపథ్యం చూసినా..చాలా ఆశ్యర్యం కలిగిస్తుంది. పదిలో రిబా 99%, రహిన్ 98.5%తో ఉత్తీర్ణులయ్యారు. ఇక ఇంటర్లో ఒకరు 98.2%, మరొకరు 97.3% కాగా, NEET-UGలో ఇరువురు 97%, 97.7% మార్కులు సాధించారు. ప్రభుత్వ స్కాలర్షిప్లు, ఇతర మెరిట్ ఆధారిత ఆర్థిక సహాయం ద్వారా ఎలాంటి టెన్షన్ పడకుండా హాయిగా చదువుకున్నారు ఇద్దరు.ఇక రహిన్ ప్రసూతి అండ్ గైనకాలజీ వంటి సర్జికల్ బ్రాంచ్లో, రిబా ఇంటర్నల్ మెడిసిన్లోనూ కొనసాగాలనుకుంటున్నారు. అంతేగాదు ఇద్దరు అదే కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్కి అడ్మిషన్ పొందాలనుకుంటున్నారు. తామిద్దరం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ రంగంలోకి వచ్చామని చెబుతున్నారు. తమ కెరీర్ జర్నీ చాలా అద్భుతంగా సాగింది..అదే సక్సెస్ని ప్రతి విషయంలోనూ కొనసాగిస్తామంటున్నారు ఈ ట్విన్ సిస్టర్స్.(చదవండి: మనవడి కోసం ఏడుపదుల వయసులో వ్యాపారం..! తట్టుకోలేనన్ని కష్టాలు చివరికి..) -
మనవడి కోసం ఏడుపదుల వయసులో వ్యాపారం..! తట్టుకోలేనన్ని కష్టాలు చివరికి..
జీవితంలో కష్టాలనేవి సహజం. సాధారణంగా మన కంటే వయసులో చిన్నవాళ్లు మనకళ్లముందే వెళ్లిపోతుంటే ఏ వ్యక్తులకైనా.. తట్టుకోవడం అంత ఈజీ కాదు. వాటన్నింటిని దిగమింగుకుంటూ ఏదోలా బతికినా..చివరికి విధి మరింత కఠినంగా పరీక్షలు పెట్టి.. ఉపాధి లేకుండా చేసి ఆడుకుంటే..ఆ బాధ మాములుగా ఉండదు. అదికూడా ఏడు పదుల వయసులో ఈ సమస్యలు చుట్టుముడితే పరిస్థితి మరింత ఘోరం. ఎవ్వరైనా..విలవిలలాడతారు. కానీ ఈ బామ్మ మాత్రం ఆ కష్టాలకు వెరవలేదు. పైగా మనవడికి సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. అతడికి జీవనమార్గాన్ని అందించింది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది.ఆ బామ్మే 79 ఏళ్ల ఊర్మిళ ఆషర్ అకా. అంతా ముద్దుగా ఆమెను గుజ్జు బెన్గా పిలుచుకుంటారు. పిల్లలు తమ తల్లిదండ్రులకు, తాతలకు సాయం అదించడం విని ఉంటాం. కానీ మనవడికోసం ఓ బామ్మ తన పాకకళా నైపుణ్యన్ని వెలికి తీసి..అతడి జీవనోపాధికి ఆసరాగా మారడం గురించి విన్నారా.?. అది కూడా 75 ఏళ్ల వయసులో.. అయితే ఈ బామ్మ చాలా ధీమాగా ఆ సాహసం చేసింది. రెస్ట్ తీసుకుని "కృష్ణా.. రామ.." అని జపించే వయసులో మనవడి కోసం వ్యాపారం మెదలు పెట్టింది. ఆమె కథ వింటుంటే..ఒక వ్యక్తికి వరుస కష్టాలు పలకరిస్తుంటే.. బతకగలరా..? అనే బాధ కలుగుతుంది. కానీ ఊర్మిళ వాటన్నింటిని ఒక్క చిరునవ్వుతో ఎదిరించి నిలబడింది. గుజరాత్కి చెందిన ఈ బామ్మ గుజ్జు బెన్ నా నాస్తా అనే స్నాక్ సెంటర్ని నడిపింది. దాన్ని లాభాల్లో దూసుకుపోయేలా చేసింది. ఆమె మాస్టర్ చెఫ్గా కూడా పేరు తెచ్చుకుంది. ప్రముఖ చెఫ్ రణవీర్బ్రార్ వంటి ప్రముఖుల మన్ననలకు కూడా పొందారామె. వ్యాపారం ప్రారంభించడానికి కారణం..2019లో, ఆమె ఏకైక మనవడు హర్ష్ ఒక ప్రమాదంలో కింది పెదవిని కోల్పోయాడు. ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా జాబ్ కోల్పోయాడు. ప్రమాదం ఇచ్చిన వికృత రూపం కారణంగా ఎవ్వరూ అతడికి ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకు రాలేదు. పైగా అతడు కూడా ఆత్మనూన్యత భావంతో ఇక ఇంట్లోనే ఒంటిరిగా ఉండిపోయేవాడు. అతనిలో స్థైర్యం నింపేందుకు ఆమె వ్యాపారం చేయాలని సంకల్పించి 'గుజ్జు బెన్ నా నాస్తా' అనే గుజరాతీ స్నాక్ సెంటర్ని ప్రారంభించింది. తన మనవడితో కలిసి గుజరాతీ వంటకాలైనా.. థెప్లాస్, ధోక్లా, ఖాఖ్రా, ఫరాలి వంటి రుచులతో కస్టమర్లను మెప్పించారు. అనతి కాలంలోనే పెద్ద స్నాక్ సెంటర్గా మారింది. అంతేగాదు ఊర్మిళ ఆషర్ టెడ్ఎక్స్ స్పీకర్గా మారి తప కథని వినిపించిది. అక్కడున్న వారందర్నీ ఆమె గాథ కదిలించింది. చాలా కష్టాలు చూశారామె..మాజీ మాస్టర్ చెఫ్ అయిన ఊర్మిళ జీవితంలో వరుస విషాదాలను చవిచూసిందని ఆమె సన్నహితులు చెబుతుంటారు. రెండున్నర సంవత్సరాల కూతురుని పోగొట్టుకున్నారు. ఆ తర్వాత తన ఇద్దరు కొడుకులు ఒకరు బ్రెయిన్ ట్యూమర్తో మరొకరు గుండెజబ్బుతో చనిపోవడం. చివరికి మిగిలిన ఒక్కగానొక్క మనవడు ప్రమాదం బారినపడి వికృతరూపంతో బాధపడటం వరకు చాలా కష్టాలను అధిగమించారు. ఏడు పదుల వయసు వరకు వెన్నంటిన కష్టాలకు చలించలేదు. ఉన్న ఒక్క మనవడు ముఖంలో చిరునవ్వు తెప్పించేందుకు తాపత్రయపడింది. ఆ నేపథ్యంలోనే ఈ ఏజ్లో వ్యాపారమా..? అనే సందేహానికి తావివ్వకుండా కష్టపడింది. అనుకున్నట్లుగా ఒక ఎంటర్ప్రెన్యూర్గా మంచి సక్సెస్ని అందుకున్నారామె. త్వరలోనే ఆమె చిన్న వ్యాపారం కాస్త సొంతంగా వెబ్సైట్ని ఏర్పాటు చేసుకుని మరింత మంది కస్టమర్ల మన్నలను అందుకునేందుకు సిద్ధంగా ఉంది. ఇక ఊర్మిళ 79 ఏళ్ల వయసులో ఏప్రిల్ 07న గుండెపోటుతో చనిపోయారు. చనిపోయేంత వరకు తరుముతున్న కష్టాలని చూసి కన్నీళ్లు పెట్టకుండా పోరాడారు.. గెలిచారు. ఉక్కు సంకల్పం ఉంటే..సంపాదనకు వయసుతో సంబంధం లేదని చాటిచెప్పారు ఊర్మిళ. చిన్న చిన్న వాటికే కుంగిపోయి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే యువతకు కనువిప్పు ఈ బామ్మ కథ..!.(చదవండి: ద్రౌపది తెలివిగా సృష్టించిన వంటకమే పానీపూరి.. పూర్తి కథ ఏంటంటే?) -
సముద్రంపై సాహస సంతకం
‘జీరో’ అంటే చాలామందికి చిన్న చూపు. అయితే ఎంత పెద్ద విజయమైనా ‘జీరో’ తోనే మొదలవుతుంది. హీరోలను చేస్తుంది. తాజా విషయానికి వస్తే.... త్రివిధ దళాలకు చెందిన 11 మంది మహిళా అధికారులు హిందూ మహాసముద్రంలో 55 రోజుల ‘సముద్ర ప్రదక్షిణ’కు శ్రీకారం చుట్టారు. గతంలో వీరికి సముద్ర సాహస యాత్ర అనుభవం లేదు. జీరో నుంచి మొదలు పెట్టి ప్రతి విషయాన్నీ ఓపికగా నేర్చుకొని సాహసయాత్రకు కదిలారు.హిందూ మహాసముద్రం స్త్రీ శక్తికి వేదిక కానుంది. త్రివిధ దళాలకు చెందిన పదకొండుమంది మహిళా అధికారులు నిన్నటి (సోమవారం) నుంచి హిందూమహాసముద్రంలో ‘సముద్ర ప్రదక్షిణ’ మొదలుపెట్టారు. ముంబైలోని ఇండియన్ నేవల్ వాటర్ మ్యాన్షిప్ ట్రైనింగ్ సెంటర్ (ఐఎన్డబ్ల్యూటీసీ) ఈ యాత్రప్రారంభ కేంద్రం. 55 రోజుల్లో హిందూ మహా సముద్రంలోని 4,000 నాటికల్ మైళ్లను ఈ బృందం అధిగమించనుంది. వీరిలో ఆరుగురు ఆర్మీ అధికారులు, ఒక నేవీ అధికారి, నలుగురు వైమానిక దళ అధికారులు ఉన్నారు.త్రివిధ దళాల నుంచి...భారత సైన్యం నుంచి లెఫ్టినెంట్ కల్నల్ అనుజ, మేజర్ కరంజీత్, మేజర్ తాన్యా, కెప్టెన్ ఒమితా, కెప్టెన్ దౌలీ, కెప్టెన్ ప్రజక్త, భారత వైమానిక దళం నుంచి స్క్వాడ్రన్ లీడర్ విభా, స్క్వాడ్రన్ లీడర్ శ్రద్ధ, స్క్వాడ్రన్ లీడర్ అరువి, స్క్వాడ్రన్ లీడర్ వైశాలి, భారత నావికాదళం నుంచి లెఫ్టినెంట్ కమాండర్ ప్రియాంక ఈ బృందంలో ఉన్నారు.కఠినమైన ఎంపిక ప్రక్రియఈ సాహస యాత్రకు ఎంపిక ప్రక్రియ ఏడాది పాటు కొనసాగింది. ఎంపికకు ఫిజికల్ ఫిట్నెస్, టీమ్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్, అకడమిక్ నాలెడ్జ్, బోట్–హ్యాండ్లింగ్ కేపబిలీటీస్... మొదలైన వాటినిప్రామాణికంగా తీసుకున్నారు. త్రివిధ దళాలకు చెందిన 41 మంది మహిళా అధికారుల బృందం నుంచి 11 మంది మహిళా అధికారులను సముద్ర సాహస యాత్ర కోసం ఎంపిక చేశారు.పుణెలోని కాలేజ్ ఆఫ్ మిలిటరీ ఇంజనీరింగ్ పరిధిలోని ‘ఆర్మీ అడ్వెంచర్ నోడల్ సెంటర్ ఫర్ బ్లూ వాటర్ సెయిలింగ్’లో త్రివిధ దళాల మహిళా అధికారులు రెండు సంవత్సరాల పాటు కఠోర శిక్షణ ΄÷ందారు, ఈ బృందం జీరో నుంచి శిక్షణ మొదలుపెట్టింది. నౌకాయానానికి సంబంధించిన సైద్ధాంతిక, ఆచరణాత్మక అంశాలలోప్రావీణ్యం సాధించారు. సముద్రయానానికి అవసరమైన శారీరక బలాన్ని సమకూర్చుకున్నారు. నావిగేషన్, వాతావరణ శాస్త్రం, సీమన్షిప్ గురించి తెలుసుకున్నారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్, రిపేర్ అండ్ మెయింటెనెన్స్లాంటి సెయిలింగ్ నైపుణ్యాలను సొంతం చేసుకున్నారు. రూట్ ΄్లానింగ్, వెదర్ ఫోర్ కాస్టింగ్, ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్, స్టాకింగ్ అండ్ సేఫ్టీ ్రపోటోకాల్స్తోపాటు అంతర్జాతీయ సముద్ర చట్టాల గురించి కూడా తెలుసుకున్నారు.చిన్న అడుగులతో పెద్ద సాహసం వైపు...మొదట షార్ట్ డే ట్రిప్స్ చేసేవారు. భవిష్యత్ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని తమలోని నైపుణ్యాలకు పదును పెట్టడానికి, సముద్ర ప్రయాణానికి సిద్ధం కావడానికి ముంబై నుండి గోవా, కొచ్చి, పోర్బందర్, లక్షద్వీప్ వరకు ఎన్నో యాత్రలకు వెళ్లారు. అయితే ఊహించని వాతావరణ పరిస్థితుల నుంచి సాంకేతిక సమస్యల వరకు సముద్ర యాత్రలో అడుగడుగునా ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ప్రతి సవాలు నుంచి పాఠం నేర్చుకున్నారు. అధికారిక నౌక ఇండియన్ ఆర్మీ సెయిలింగ్ వెసెల్(ఐఎఎస్వీ)‘త్రివేణి’ నుంచి మొదలైన ఈ ప్రపంచ యాత్ర చరిత్ర సృష్టించనుంది.‘నారీశక్తి’ స్ఫూర్తితో మొదలైన ఈ ప్రయాణం చారిత్రాత్మకమే కాకుండా భావి తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలవనుంది. పంచభూతాల సందేశంసముద్రంలో ప్రపంచాన్ని చుట్టి వచ్చిన సాహసికులుగా త్రివిధ దళాల మహిళా జట్టు ప్రపంచ రికార్డ్ నెలకొల్పనుంది. ఈ యాత్ర కేవలం సముద్రయానం మాత్రమే కాదు మహిళా సాధికారతకు శక్తిమంతమైన ప్రతీక. మహిళలకు అవకాశం ఇచ్చినప్పుడు వారు మహా సముద్రాలను కూడా జయించగలరు అని పంచభూతాల సాక్షిగా ఇచ్చే శక్తిమంతమైన సందేశం.యాత్ర లక్ష్యంముంబై నుంచి సీషెల్స్ వరకు మా మొదటి అంతర్జాతీయ యాత్ర మొదలైంది. రోజుల తరబడి, వారాల తరబడి భూమికి దూరంగా లోతైన జలాల్లో సాగే ఈ యాత్ర మా సహనానికి, నావిగేషన్ నైపుణ్యాలకు పరీక్ష. మహిళా సాధికారతలో బలాన్ని చూపించడమే ఈ యాత్ర లక్ష్యం.– కెప్టెన్ దౌలీ -
భగవద్గీత పఠనంలో గోల్డ్ మెడల్..!
ఆమె ఓ సాధారణ గృహిణి. ఒకవైపు కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూనే మరోవైపు తనకు ఇష్టమైన సబ్జెక్టులో ఏదైనా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూనే లక్ష్యాన్ని చేరుకోడానికి ఆమె రేయింబవళ్లు శ్రమించారు. అందుకు తగిన ఫలితాన్ని కూడా అందుకున్నారు. ఆమెనే జ్యోతి చాగంటి. మైసూర్లోని శ్రీగణపతి సచ్చిదానంద ఆధ్వర్యంలో అవధూత దత్తపీఠం ప్రతి యేటా నిర్వహించే భగవద్గీత పారాయణ పరీక్షలో మొదటి ప్రయత్నంలోనే జ్యోతి బంగారు పతకాన్ని సాధించారు. భగవద్గీతలోని 18 అధ్యాయాలు, 701 శ్లోకాలను నిర్విరామంగా పారాయణం చేశారు. రెండు రోజుల క్రితం దుండిగల్లోని దత్త ఆశ్రమంలో శ్రీగణపతి సచ్చిదానంద స్వామి నుంచి గోల్డ్మెడల్తో పాటు సర్టిఫికెట్ను అందుకున్నారు. సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమేనని ఆమె నిరూపించారు. హైదరాబాద్ ఫిలింనగర్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో తనకు లభించిన గుర్తింపు గురించి మాట్లాడారు. ఎనిమిది నెలలు శ్రమించా.. గత ఎనిమిది నెలలుగా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో దీనిని అభ్యసించా. మొదటి ప్రయత్నంలోనే గీత పఠనంలో గోల్డ్ మెడల్ సాధించా. జ్యోతి గీత మకరందం గ్రూప్లో టి.నాగలక్ష్మి, ఇతరుల నేతృత్వంలో తాత్విక అంశాలను విస్తృతంగా అధ్యయనం చేశాం. ఈ గ్రూపులోని గురువులు విద్యార్థులకు సరైన ఉచ్ఛారణను నేరి్పంచారు. 8 నెలలుగా రోజుకు 7 గంటల పాటు సాధన చేశా. పరీక్షలో పాల్గొనడం అద్భుత అనుభవం. ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించి తదుపరి విద్యార్థులకు గీతను బోధిస్తాను. (చదవండి: మరణ భయాన్ని తొలగించే ధర్మరాజ దశమి!!) -
అసహ్యించుకుంటూనే....చివరికి నటినయ్యా..!
రాయదుర్గం : మొదట్లో నేను నటిని కావాలనే ఆలోచననే అసహ్యించుకున్నా.. కానీ చివరకు నటిగా మారానని ప్రఖ్యాత నటి, నాటక కళాకారిణి రత్నపాఠక్షా స్పష్టం చేశారు. హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని ఐటీసీ కోహినూర్లో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో ‘పాత్రలు, కథలను రూపొందించడం’ అనే అంశంపై ప్రత్యేక ఉపన్యాసం చేశారు. అనంతరం తెలంగాణ పురాతన డోక్రా క్రాఫ్ట్ జ్ఞాపికను ఆమె ఆవిష్కరించారు. నేను కథకుల కుటుంబంలో పెరిగానని, కాబట్టి ఆ నైపుణ్యం నాకు సహజంగానే వచి్చందని, అందరిలా కాకుండా నేను భిన్నంగా ఉండాలని కోరుకున్నాని వివరించారు. మంచి స్క్రిప్ట్ రాయడం అంత సులభం కాదని, దీనికి ఎంతో అనుభవం, పరిజ్ఞానం ఉండాలని అన్నారు. సినిమాలతో పోలిస్తే థియేటర్ ఆర్ట్స్ ఒక సవాలుతో కూడిన పని అని గుర్తుచేశారు. డోక్రా మెటల్ కాస్టింగ్ క్రాఫ్ట్ పునరుద్ధరణే లక్ష్యం.. చేతి వృత్తులకు మద్దతు ఇవ్వడం ద్వారా 4వేల ఏళ్ళ పురాతన డోక్రా మెటల్ కాస్టింగ్ క్రాఫ్ట్ను పునరుద్ధ్దరించాలనేదే లక్ష్యం. మన సంప్రదాయాన్ని కాపాడుకోడమేకాదు, దానిని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం. ఉషేగావ్, జామ్గావ్, కేస్లా గూడ నుంచి వచ్చిన చేతి వృత్తులవారితో కలిసి పనిచేయడాన్ని గర్వంగా భావిస్తున్నాం. – ప్రతిభాకుందా, ఎఫ్ఎల్ఓ హైదరాబాద్ చాప్టర్ చైర్పర్సన్చదవండి: ఏ భర్తా ఇవ్వలే(కూడ)ని వెడ్డింగ్ డే గిఫ్ట్ : కళ్లు చెమర్చే వైరల్ వీడియో -
న్యాయం కోసం..
బాధితుల పక్షాన నిలబడడం అంటే అంత సులువైన విషయం ఏమీ కాదు. కొన్నిసార్లు బెదిరింపులు కూడా ఎదురుకావచ్చు. కొన్నిసార్లు బాధితులు వెనక్కి తగ్గవచ్చు. వారికి ధైర్యం చెప్పి, న్యాయం జరిగేలా, నిందితులకు శిక్ష పడేలా చేయడానికి వృత్తిపరమైన అంకితభావం కావాలి. అలాంటి అంకితభావం మూర్తీభవించిన ఒక అధికారి స్రవంతి. లైంగిక వేధింపులు, అత్యాచార కేసులలో నిందితులకు శిక్ష పడేలా చేయడంలో కామారెడ్డి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న స్రవంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒక ఆఫీసర్లా కాకుండా కుటుంబ సభ్యురాలిగా బాధితుల తరఫున నిలుస్తున్నారు.ఆడపిల్లలపై జరిగిన వేధింపుల విషయంలో బయటకు చెబితే పరువు పోతుందని చాలామంది చెప్పుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు. ఇలాంటి పరిస్థితులలో ఎవరి ద్వారానైనా విషయం తెలిస్తే చాలు ఆమె అక్కడకి చేరుకుంటారు. బాధిత బాలికల తల్లిదండ్రులతో మాట్లాడి పోలీసులకు ఫిర్యాదు చేయించి వారికి శిక్షలు పడేలా చేస్తున్నారు కామారెడ్డి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ (డీసీపీవో)గా విధులు నిర్వహిస్తున్న స్రవంతి.మెరుపు వేగంతో బాధితుల దగ్గరికి....ఐదేళ్ల కాలంలో కామారెడ్డి జిల్లాలో 114 పోక్సో కేసులు నమోదయ్యాయి. ఇందులో చాలా మందికి శిక్షలు కూడా పడ్డాయి. జిల్లాలో ఏప్రాంతంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు జరిగినా, వేధింపులు ఎదురైనా ముందుగా జిల్లా అధికారులకు విషయం తెలియజేసి అక్కడికి చేరుకుంటారు స్రవంతి. ఇటీవల నవోదయ విద్యాలయంలో కొందరు ఉపాధ్యాయులు, సిబ్బంది అరాచకాలతో అమ్మాయిలు పడుతున్న ఇబ్బందుల గురించి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్కు సమాచారం వచ్చింది. వెంటనే విచారణ జరపమని స్రవంతిని పంపించారు. అక్కడికి వెళ్లిన స్రవంతి విద్యార్థినులతో మాట్లాడారు. ఎవరెవరు ఇబ్బంది పెడుతున్నారో తెలుసుకున్నారు. పదకొండు మంది అమ్మాయిలతో సంబంధిత ఉపాధ్యాయులు, సిబ్బందిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు ఇప్పించారు. దీంతో నలుగురిపై పోక్సో కేసులు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండుకు పంపించారు.ఎన్నో కేసులు...→ ఒకటో తరగతి చదువుతున్న ఆరేళ్ల పాప ఇంటి దగ్గర ఆడుకుంటుండగా ఇరవై ఏళ్ల యువకుడు మ్యూజిక్ నేర్పిస్తానంటూ తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న డీసీపీవో స్రవంతి పాప తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ చేసి పూర్తి వివరాలతో పోలీసు కేసు నమోదు చేయించారు. పాపకి వైద్యపరీక్షలు చేయించి పూర్తి వివరాలను కోర్టు ముందుంచారు. దీంతో ఈ కేసులో నిందితుడికి జీవితఖైదు పడింది. → ఒక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను అదే పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు లైంగికంగా వేధించేవాడు. విషయం తెలిసిన స్రవంతి ఆ అమ్మాయికి, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ చేసి ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేయించారు. ఈ కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినందుకు గాను పది మందిపైనా పోక్సో కేసు నమోదు చేయించారు.→ ఒక అమ్మాయిపై అత్యాచారం జరిగిందని తెలియడంతో విచారణకు వెళ్లిన సందర్భంగా ఆ అమ్మాయి కడుపునొప్పితో బాధపడుతోంది. వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లి పరీక్షలు నిర్వహిస్తే గర్భవతి అని నిర్ధారణ అయ్యింది. డాక్టర్తో ఫిర్యాదు చేయించి కేసు నమోదు చేశారు. కడుపులో పెరుగుతున్న పాప చనిపోగా డెలివరీ చేశారు. ఆ తరువాత అమ్మాయిని బాలసదనంలో చేర్పించి ఎంపీహెచ్డబ్లు్య కోర్సు పూర్తి చేయించారు. అయితే సొంత అన్నే పలుసార్లు అత్యాచారం చేయగా ఆ అమ్మాయి గర్భం దాల్చినట్టు తేల్చారు. ఈ కేసులో నిందితుడికి ఇరవై ఏళ్ల జైలు శిక్ష పడింది.→ బాల్య వివాహాల విషయంలోనూ స్రవంతి సీరియస్గా పనిచేస్తున్నారు. బాల్యవివాహం చేయడానికి సిద్ధమవుతున్నారని తెలిస్తే తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. చిన్నతనంలో పెళ్లి జరిగితే తలెత్తే సమస్యలను వివరించి బాల్య వివాహాలు జరగకుండా కృషి చేస్తున్నారు.బాధితులు బయటికి చెప్పుకోలేకపోతున్నారుచైల్డ్ప్రొటెక్షన్ ఆఫీసర్గా నేను చేయాల్సిన బాధ్యతను నిర్వర్తిస్తున్నాను. ఇంటా, బయటా ఆడపిల్లలపై లైంగిక వేధింపులు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. చాలా కేసుల్లో కుటుంబ సభ్యులే నిందితులుగా ఉంటున్నారు. కన్నతండ్రి, తోడబుట్టిన అన్న, తండ్రి తర్వాత తండ్రిలాంటి బాబాయ్... ఇలా రక్తసంబంధీకులే కాటేయాలని చూస్తున్న సంఘటనలతో సమాజం ఎటు పోతోందో అర్థం కావడం లేదు. చాలా సందర్భాల్లో తమ సమస్యల గురించి బాధితులకు బయటకు చెప్పుకోలేకపోతున్నారు. విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని అనుకుంటున్నారు. కానీ అలాగే వదిలేస్తే వేధింపులు, అఘాయిత్యాలు మరింత పెరుగుతాయి. ప్రతిచోటా పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పిస్తున్నాం. – స్రవంతి, డీసీపీవో, కామారెడ్డి – ఎస్.వేణుగోపాలచారి, సాక్షి ప్రతినిధి, కామారెడ్డి -
Nidhi Tiwari: ప్రధానికి ప్రైవేట్ సెక్రటరీ
వ్యక్తిగత కార్యదర్శి బాధ్యత జటిలమైనది. బాస్ చెప్పింది అర్థం చేసుకుని చెప్పబోయేది గ్రహించి చెబుతున్నది అమలు చేయాలి. మరి ఆ బాస్ ప్రధాని అయితే?అలాంటి జటిలమైన బాధ్యతకు ఎంపికైంది నిధి తివారి. వారణాసికి చెందిన ఈ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ పి.ఎం.ఓ.లో అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చారు. ఆమె వ్యక్తిత్వం, వ్యక్తిగత వివరాలు.వారణాసి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచుతున్నారు. ఉత్తర ప్రదేశ్ ప్రజలు కూడా తమ రాష్ట్రానికి చెందిన అమ్మాయి ఈ స్థానానికి చేరిందే అని గర్వంగా చూస్తున్నారు. ప్రధానికి ప్రయివేట్ సెక్రటరీగా నియమితురాలైన నిధి తివారి సొంత ఊరు వారణాసి అయితే సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్. మరి ఈ హర్షం సహజమే కదా. ఏ పార్లమెంట్ స్థానం నుంచి ప్రధానిప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ స్థానానికి చెందిన మహిళకే ప్రధాని ఈ అవకాశం ఇవ్వడం వారణాసి ప్రజలకు నచ్చింది. ప్రధాని రోజువారి కార్యక్రమాల సమన్వయం చూసే వ్యక్తిగా నిధి తివారి పని చేయడం అంటే సామాన్యమా? సన్నివేశం కొంచెం అటు ఇటుగా మనం సినిమాల్లో చూసినట్టే ఉంటుంది.ప్రధాని ముందు రోజు అడుగుతారు– ‘రేపటి నా కార్యక్రమాలు ఏమిటి?’నిధి తివారి చెప్తారు: ‘సర్.. ఫలానా శాఖకు చెందిన మంత్రి మిమ్మల్ని కలవడానికి వస్తారు. ఫలానా శాఖ డైరెక్టర్ వచ్చి నివేదిక అందజేస్తారు. ఫలానా కార్యక్రమంప్రారంభోత్సవానికి వెళతారు. అయితే ఈ కార్యక్రమాలు ఫిక్స్డ్ కాదు. ఇంత పెద్ద దేశంలో ఎన్నో తక్షణ సమస్యలు వస్తాయి. వివిధ రాష్ట్రాల నుంచి ప్రధానిని అర్జెంట్గా కలవాలని ముఖ్యమంత్రుల దగ్గరి నుంచి ఉన్నత అధికారులు, ప్రతిపక్ష నాయకులు, వ్యాపారవేత్తలు అపాయింట్మెంట్లు అడుగుతారు. దేశాల నుంచి ఆహ్వానాలు వస్తుంటాయి. వాటన్నింటినీ సమన్వయం చేసి, ప్రధాని ప్రాధాన్యాలు గమనించి కార్యక్రమాల రూపకల్పన చేయాల్సి ఉంటుంది. ఈ కత్తి మీద సాముకే నిధి తివారి ఎంపికైంది.ఎవరు ఈ నిధి?నిధి తివారి.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు. దేశ ప్రధాని నరేంద్ర మోదీకి వ్యక్తిగత కార్యదర్శి (ప్రైవేట్ కార్యదర్శి)గా ఇటీవల ఆమె నియమితులవడంలో ‘పిఎంఓ’లో స్త్రీలప్రాధాన్యం పెరుగుతున్నదనడానికి మరో ఆనవాలుగా పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. 2022 నవంబర్ నుంచి ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పని చేస్నున్న నిధి ఇప్పుడు ప్రధాన వ్యక్తిగత కార్యదర్శిగా ప్రమోట్ అయ్యారు. వారణాసిలోని మెహమర్గంజ్లో పుట్టి పెరిగిన నిధి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ చేశారు. ఆ యూనివర్సిటీలోనే పరిచయమైన దియోరియా జిల్లాకు చెందిన వైద్యుడు డా.సుశీల్ జైస్వాల్ను 2006లో వివాహం చేసుకున్నారు.పెళ్లి తర్వాత సివిల్స్సివిల్ సర్వీసెస్లో చేరి దేశానికి తనవంతు సేవ చేయాలనేది చిన్ననాటి నుంచి నిధి లక్ష్యం. ’వివాహం విద్య నాశాయ’ అన్న మాటను అబద్ధం చేస్తూ కష్టపడి చదివి, వారణాసిలో అసిస్టెంట్ కమిషనర్ (కమర్షియల్ ట్యాక్స్) ఉద్యోగం సాధించారు. ఆ ఉద్యోగం చేస్తూనే సివిల్స్కి సన్నద్ధమయ్యారు. కొడుకు పుట్టినా ఆమె తన లక్ష్యం వీడలేదు. 2013 సివిల్స్ ఫలితాల్లో 96వ ర్యాంకు సాధించారు. ఐఎఫ్ఎస్ అధికారిణిగా 2016లో శిక్షణలో ఉన్న సమయంలోనే ఆమె చూపిన ప్రతిభకు గుర్తింపుగా ’అంబాసిడర్ విమల్ సన్యాల్ స్మారక పతకం’ అందుకున్నారు.మొదటి మహిళమోది ప్రధాని అయ్యాక ఈ 11 ఏళ్లలో వ్యక్తిగత కార్యదర్శులుగా వివేక్ కుమార్, హార్దిక్ సతీష్ చంద్ర షా విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఆ స్థానంలో నిధి తివారీ మొదటి మహిళగా నియమితులయ్యారు. ప్రధాని వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న ఆమెకు నెలకు రూ.1.44 లక్షల వేతనంతోపాటు ఇతర సదుపాయాలన్నీ అందుతాయి. ప్రతిభ, సామర్థ్యం ఉంటే స్త్రీల ఉన్నతికి ఆకాశమే హద్దు అని నిరూపించేందుకు నిధి తివారి మరో గొప్ప ఉదాహరణగా నిలిచారు.అజిత్ దోవల్ టీమ్లోప్రధానమంత్రి కార్యాలయంలో పని చేయడానికి ముందు ప్రభుత్వం ఆమెను విదేశీ వ్యవహారాల శాఖలో ’నిరాయుధీకరణ, అంతర్జాతీయ భద్రతా వ్యవహారాలు’ (డిజార్మమెంట్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అఫైర్స్) విభాగంలో అధికారిగా నియమించింది. దాంతోపాటు రాజస్థాన్కు సంబంధించిన పలు అంశాలపైనా ఆమె పనిచేశారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆధ్వర్యంలో ఆమె చూపిన ప్రతిభ ఆమెపై గౌరవాన్ని పెంచింది. దేశ భద్రత, అణుశక్తి, విదేశీ వ్యవహారాల వంటి అంశాలను ఆమె చాకచక్యంగా నిర్వహించగలదన్న నమ్మకం కుదిరింది. ఆ తర్వాత 2023లో భారత్లో తొలిసారి జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో నిధి తివారీ చురుకుదనం, వ్యవహార శైలి, దీక్ష, పట్టుదలపై ప్రధానికి ఆమె మీద విశ్వాసం ఏర్పడింది. -
శిఖరాన్ని వంచింది
ప్రకృతి పాఠశాల అంటే భరణికి చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆ ఇష్టమే ఆమెను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోకి వచ్చేలా చేసింది. కొండలు, కోనలు భరణి నేస్తాలు. ఆ స్నేహమే ప్రపంచంలోని ప్రసిద్ధ పర్వతాలు అధిరోహించేలా చేస్తోంది. లద్ఖాఖ్లోని కాంగ్ యాప్సే నుంచి రష్యాలోని ఎల్ బ్రస్ పర్వతం వరకు ఎన్నో పర్వతాలను అధిరోహించిన చిత్తూరు జిల్లా డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్వో) భరణి గురించి...స్ఫూర్తినిచ్చే సాహసికుల గురించి వినడం, చదవడం భరణికి ఎంతో ఇష్టమైన పని. అలా విన్నప్పుడు, చదివినప్పుడు తాను కూడా ఆ పర్వతాలను అధిరోహించినట్లు కల కనేవారు. ఆ కల నిజమయ్యే సమయం రానే వచ్చింది. ఐపీఎస్ అధికారి అతుల్ కరవాల్ 50 ఏళ్ల వయసులో ఎవరెస్టు అధిరోహించడం భరణిని ప్రభావితం చేసింది. అతుల్ కరవాల్ ఎవరెస్ట్ అధిరోహించినట్లే తానూ ప్రపంచంలో మేటి శిఖరాలను అధిరోహించాలనుకున్నారు. 30 రోజులపాటు శిక్షణ తీసుకున్నారు భరణి.శిక్షణ తరువాత... ఎన్నో శిఖరాలురంపచోడవరంలో ఉప అటవీశాఖ అధికారిణిగా పనిచేస్తూనే డార్జిలింగ్లో కేంద్ర రక్షణ శాఖ నిర్వహిస్తోన్న హిమాలయన్ మౌంటెనరీ ఇన్ స్టిట్యూట్లో కోర్సు పూర్తి చేశారు. తొలి ప్రయత్నం గా లద్దాఖ్లోని కాంగ్ యాప్సే పర్వతాన్ని అధిరోహించారు.తొలి ప్రయత్నం... తొలి విజయం.తన మీద తనకు ఎంతో నమ్మకం వచ్చింది. మరింత ఉత్సాహం వచ్చింది. ఆ తరువాత...ఉత్తరాఖండ్లోని 4,200 మీటర్ల మల్లార్ లేక్ శిఖరాన్ని, రష్యాలో 5,642 మీటర్ల ఎత్తైన ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించారు.కిలిమంజారో పిలిచిందిఎన్నోసార్లు ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతం గురించి ఆసక్తిగా విన్న భరణి ఆ పర్వతాన్ని అధిరోహించాలనుకున్నారు. కిలిమంజారో ఎత్తు 5,895 మీటర్లు. వీపుపై 28 కిలోల బరువును మోస్తూ ఏటవాలుగా ఉన్న కొండలను ఎక్కడమంటే పెద్ద సాహసమే. ఏమాత్రం పట్టు తప్పినా ప్రాణాలకే ప్రమాదం. అయినా సరే కంటిముందు లక్ష్యం మాత్రమే కనిపించిందని భరణి చెబుతారు. 26 గంటలపాటు సుదీర్ఘంగా కిలిమంజారో అధిరోహణ సాగిందని, పర్వత శిఖరాగ్రంపై పాదం మోపిన వెంటనే కష్టాలన్నీ క్షణంలో మరచిపోయానని అంటారు భరణి.ప్రకృతి పాఠశాలలో...తమిళనాడులోని కోయంబత్తూరు భరణి జన్మస్థలం. తండ్రి సాథూర్ స్వామి ఆర్మీ ఆఫీసర్. తల్లి పద్మ టీచర్. నాన్న ఉద్యోగరీత్యా రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో ఆమె చదువు కొనసాగింది. తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ పూర్తి చేసింది. తొమ్మిదో తరగతిలో కొడైకెనాల్కు విహారానికి వెళ్లినప్పుడు ఆ దట్టమైన అటవీప్రాంతం, సరస్సులు, కొండల నడుమ జాలువారే జలపాతాలు భరణి మనసును కట్టిపడేశాయి. పర్వత్రపాంతాలకు వెళ్లేటప్పుడు పర్వతారోహణకి సంబంధించి మెలకువలు నేర్చుకున్నారు. భవిష్యత్లో మరిన్ని శిఖరాలను అధిరోహించాలనేది భరణి కల. ఆమె కల నెరవేరాలని ఆశిద్దాం.ప్రతి సాహసం ఒక పాఠమేప్రతి ప్రయాణం, ప్రతి సాహసం ఎన్నో పాఠాలు నేర్పుతుంది. అలా ఎప్పటికప్పుడు కొత్త కొత్త పాఠాలు నేర్చుకుంటున్నాను. ‘హాయిగా ఉద్యోగం చేసుకోకుండా ఎందుకు ఈ రిస్క్?’ అనే వాళ్లు కూడా ఉంటారు. అయితే రిస్క్ లేనిది ఎక్కడా! సాహసం చేస్తేనే దానిలో ఉన్న మజా ఏమిటో తెలుస్తుంది. ఒక సాహసం మరొక సాహసానికి స్ఫూర్తినిస్తుంది. పర్వతారోహణ అనేది మనలోని ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసే సాహసం. భవిష్యత్లో మరిన్ని ప్రసిద్ధ పర్వతాలను అధిరోహించాలనుకుంటున్నాను.– భరణి– నామా హరీశ్, సాక్షి. చిత్తూరు -
మా ఇంటి మణిదీపం
‘ఆడపిల్ల పుట్టింది’ అనే వార్త చెవిన పడగానే... ‘మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది’ అంటూ సంబరం అంబరాన్ని అంటాలి. ‘మా పాప–మా ఇంటి మణిదీపం’ ఇచ్చే స్ఫూర్తి అదే. ‘ఆడపిల్లలు ఎంత చదివితే అంత ముందుకు వెళతారు. అంత అదనపు శక్తి వస్తుంది’ అని అమ్మమ్మ చెబుతుండే వారు. తన అమ్మమ్మ స్ఫూర్తితో చదువు నుంచి స్వయం ఉపాధి వరకు మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు రూపొందిస్తున్నారు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ఖాన్...‘బేటీ బచావో...బేటీ పడావో’ స్ఫూర్తితో ఖమ్మం జిల్లాలో ‘మా పాప–మా ఇంటి మణిదీపం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆడపిల్ల పుట్టిన ఇంటికి వెళ్లి తల్లిదండ్రులు, నానమ్మని సత్కరిస్తారు. శాలువ కప్పి స్వీట్ బాక్స్, పండ్లు, ఒక సర్టిఫికెట్ను అందజేస్తారు. కొందరి ఇళ్లకు స్వయంగా కలెక్టర్ వెళుతున్నారు.హాజరు శాతంపెరిగిందిపాఠశాలల్లో బాలికల హాజరు శాతంపై కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. బాలికల హాజరు శాతం పెరిగేలా కృషి చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో బాలికల హాజరు శాతం 86 నుంచి 92 శాతానికి పెరిగింది. పాఠశాలల్లో బాలికలకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు అయ్యేలా చర్యలు తీసుకున్నారు.ఆర్థిక శక్తిస్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు ఉపాధి కలిగిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో స్త్రీ–టీ క్యాంటీన్లు ప్రసిద్ధి చెందాయి. ఇప్పటికే 50 కి పైగా క్యాంటీన్ల వరకు జిల్లా వ్యాప్తంగా లాభాల బాటలో నడుస్తుండగా మరిన్ని క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నారు. యూనిట్లను మంజూరు చేయడంతోపాటు ఎప్పటికప్పుడు వాటి పనితీరును కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు.మా అమ్మమ్మ అలా లాయర్ అయింది...మహిళలు చదువుకుంటే తరతరాలుగా ఆ కుటుంబం బాగుపడుతుందని చెబుతారు. అది కళ్లతో చూశా. మా అమ్మమ్మకు పన్నెండేళ్లకే పెళ్లి చేశారు. అమ్మమ్మ వాళ్ల ఇంటి ఎదుట కిరాణాషాపు ఉండేది. అక్కడ సరుకులను న్యూస్ పేపర్లలో కట్టి ఇచ్చేవారు. ఆ న్యూస్ పేపర్లను చదువుతూ మరోసారి చదువుపై ఆసక్తిని పెంచుకుని బీఈడీ, ఎంఈడీ పూర్తి చేసింది. లాయర్ అయింది. అప్పుడే నాకు తెలిసింది చదువుతో ఎంతైనా సాధించవచ్చునని. – ముజమ్మిల్ ఖాన్, కలెక్టర్, ఖమ్మంకలెక్టర్ మా ఇంటికి వచ్చారు!నాకు మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టింది. మా ఇంటికి కలెక్టర్ సార్ వచ్చిండు. మాకు సన్మానం చేసి, పూలు, పండ్లు, స్వీట్లు ఇచ్చారు. సర్టిఫికెట్ అందజేశారు. మా పాప పెద్దయ్యాక ఈ సర్టిఫికెట్ చూపించి కలెక్టర్ ఇచ్చారని చెప్పమన్నారు. ‘మీకు మహాలక్ష్మి పుట్టింది. బాగా చదివించండి. భవిష్యత్తులో మంచి ఉద్యోగం సంపాదిస్తుంది’ అంటూ ఆశీర్వదించారు. – బానోత్ కృష్ణవేణి, రామచంద్రాపురం, ఖమ్మం జిల్లా– బొల్లం శ్రీనివాస్, సాక్షి ప్రతినిధి, ఖమ్మం -
ప్రజాసేవే లక్ష్యం
పట్టుదల, తపన, దానికి తగ్గ సాధన తోడైతే ఎంతటి లక్ష్యమైనా తలొంచి తీరుతుందని గ్రూప్వన్ టాపర్ లక్ష్మీదీపిక కొమ్మిరెడ్డి నిరూపించారు. తెలంగాణ రాష్ట్రస్థాయిలో టాప్ ర్యాంక్ సాధించానన్న విషయం తెలిసిన దీపిక ముందు కొద్దిసేపటి వరకు అది కలే అనుకున్నారు. నిజమేనని తెలుసుకుని సంభ్రమాశ్చర్యాలలో మునిగి తేలారు. గ్రూప్1 పరీక్షల్లో రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించడానికి ఆమె పడిన కష్టం, తల్లిదండ్రుల ప్రోత్సాహం అన్నీ కలిపి ఆమెను మొదటి స్థానంలో నిలిపాయి. వివరాలు ఆమె మాటల్లోనే ..‘‘నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే. ఉండేది సఫిల్గూడప్రాంతంలో. అమ్మ పద్మావతి గృహిణి, నాన్న కృష్ణ కొమ్మిరెడ్డి రిటైర్డ్ సీనియర్ ఆడిట్ ఆఫీసర్. పదో తరగతి సఫిల్గూడలోని డీఏవీ పాఠశాల, ఇంటర్ నారాయణగూడ శ్రీ చైతన్య, 2013లో మెడిసిన్ లో 119వ ర్యాంక్తో ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశా. మాస్టర్స్ డిగ్రీ చేయడం కోసం అమెరికా వెళ్లాను. అమ్మా నాన్నలకు ఒక్కగానొక్క కూతురిని. అందుకే డాక్టరుగా ఇక్కడే ప్రాక్టీస్ చేద్దామని అనుకున్నా. కానీ అనుకోకుండా నా దృష్టి సివిల్స్పై మళ్లడంతో ఆ దిశగా ప్రయత్నించాలనుకున్నాను. అందుకు అమ్మానాన్నలు కూడా అంగీకరించారు. అదేసమయంలో గ్రూప్స్కు నోటిఫికేషన్ రావడంతో దరఖాస్తు చేసుకున్నా. ఆలోచన వచ్చిందే తడవుగా సిలబస్ చెక్ చేశాను. పాత ప్రశ్నాపత్రాలు పరిశీలించాను. ప్రిపరేషన్ సులభమనే అనిపించింది. దాంతో కోచింగ్కు వెళ్లాలనిపించలేదు. మొదటి ప్రయత్నంలోనే గ్రూప్1 పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ సాధించాను. 2020లో మొదటిసారిగా యూపీఎస్సీ పరీక్ష రాశా! కాని, అది నేను అనుకున్నంత సులువు కాదని మూడు ప్రయత్నాలు విఫలం అయ్యేవరకు అర్థం కాలేదు. దాంతో అంతవరకు ఆప్షనల్గా ఉన్న తెలుగు బదులు ఆంత్రపాలజీని ఎంచుకుని గత ఏడాది నుంచి పూర్తిస్థాయిలో ప్రిపరేషన్ పై దృష్టి సారించాను. అలాగే గత సెప్టెంబర్లో యూపీఎస్సీ మెయిన్స్, అక్టోబర్లో టీజీపీఎస్సీ మెయిన్స్ కూడా రాశాను. ఈ సంవత్సరం మార్చి16న యూపీఎస్సీ ఇంటర్వ్యూకి హాజరయ్యాను.. ఆ ఫలితాలు వస్తాయనుకుంటే ఈ ఫలితాలు ముందుగా వచ్చాయి.సివిల్స్ సాధనే ఆశయం...నా జీవితాశయం సివిల్స్.. కెరీర్లో ఎదుగుదలతోపాటు ప్రజాసేవ చేయాలన్నది నా ఆకాంక్ష. త్వరలోనే వీటిని సాధిస్తానన్న నమ్మకం ఉంది. రోజూ కేవలం మూడు నుంచి నాలుగు గంటలు మాత్రమే చదివేదాన్ని. పరీక్షల సమయంలో మాత్రం 8– 9 గంటలు చదువుకునేదాన్ని. పరీక్షల సమయంలో మా అమ్మ కూడా నాతోపాటే జాగారం చేసేది. వొత్తిడి అనిపించినప్పుడు సరదాగా ముచ్చట్లు పెట్టుకునే వాళ్లం. పుస్తక పఠనం ముందునుంచే ఇష్టం. పాటలు పాడటం నా హాబీ. వొత్తిడి సమయంలో ఇవి నాకు చాలా ఉపయోగపడ్డాయి.’’ అంటూ ముగించారు దీపిక.సోషల్ మీడియాను సక్రమంగా ఉపయోగించుకోవాలికోచింగ్ల మీద ఆధార పడి సమయం, డబ్బును వృథా చేయద్దు. సోషల్ మీడియాలో చాలా మంచి సమాచారం అందుబాటులో ఉంది. దానిని సరిగా ఉపయోగించుకోగలగాలి. కెరీర్లో రాణించడానికి అవసరమైన ప్రణాళికను ముందే సిద్ధం చేసుకుని అందుకు తగ్గట్టు కృషి చేయాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ధైర్యంగా ఎదుర్కొని గమ్యమే లక్ష్యంగా ముందుకు సాగాలి. అప్పుడే ఆశయాన్ని సాధించగలం. – డా. లక్ష్మీ దీపిక కొమ్మిరెడ్డి, గ్రూప్ వన్ టాపర్ – పవన్ కుమార్ పలుగుల, సాక్షి, ఉప్పల్/ కాప్రా -
కష్టాలు మనిషిని కనివినీ ఎరుగని రేంజ్కి చేరుస్తాయంటే ఇదే..!
కష్టాలనగానే భయపడిపోతుంటాం. ఎందుకంటే ఆ సమయం ఎవ్వరైన చెప్పుకోలేని వేదన అనుభవిస్తారు. దాటుకుని రావడం అంత ఈజీ కూడా కాదు. పదేపదే వెంటాడే ఛీత్కారాలు, అవమానాలు తట్టుకుంటూ లక్ష్యంపై ఫోకస్ పెట్టడం కష్టమే అయినా సాధ్యం కానీ విషయం అయితే కాదు. అలా భావించిన వాళ్లే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని కనివినీ ఎరుగని సక్సస్ని అందుకుంటారు. పైగా తనని కష్టపెట్టిన వాళ్లే చేతులెత్తి సలాం కొట్టే స్థాయికి చేరుకుంటారు. అలాంటి విజయాన్నే అందుకుని యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది 23 ఏళ్ల ఊర్మిళ. ఆమె కథ ప్రతిఒక్కరికీ ఓ కనువిప్పు, సక్సెస్కి చిరునామాగా చెప్పొచ్చు. ముంబైకి చెందిన 23 ఏళ్ల ఊర్మిళ పాబుల్ ఐదవ తరగతిలో ఉన్నప్పుడే తండ్రిని కోల్పోయింది. సింగిల్ మదర్ పెంపకంలో పెరిగింది. ఎన్నో అవహేళనలు, కష్టాలు ఎదుర్కొంది. తన తల్లే ఒంటరిగా తనని, సోదరుడుని చదివిస్తోందన్న విషయాన్ని ఏ క్షణాంలోననూ మరువలేదు. అదే ఆమె ఎదుగదలకు బూస్టప్గా తీసుకుంది. పడుతున్న ప్రతి కష్టాన్ని తన లక్ష్యాన్ని గుర్తు చేసేవిగా భావించింది. ఆ సానూకూల దృక్పథం, అచంచలమైన పట్టుదల, దీక్షలే ఆమెను స్కేట్బోర్డింగ్లో ఛాంపియన్గా మార్చింది. పలు అంతర్జాతీయ వేదికలపై భారతదేశానికి ప్రాతినిథ్యం వహించేలా చేసింది. ఆ క్రీడలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకునే రేంజ్కి ఎదిగింది. అలా ఆమె 36వ జాతీయ క్రీడలలో రజత పతకాన్ని గెలుచుకోవడమే గాక UAEలోని షార్జాలో జరిగిన ప్రపంచ స్కేట్బోర్డింగ్ ఛాంపియన్షిప్లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి చేరుకుంది. ఈ విజయాన్నీ ఆమెను ఒలింపిక్ అర్హతకు హెల్ప్ అవుతాయి కూడా. ప్రస్తుతం ఆమె స్నోబోర్డింగ్లో శిక్షణ తీసుకుని మరీ. గుల్మార్గ్లో జరిగిన ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025లో కాంస్య పతకాన్ని సాధించింది. ఈ ఏడాదే స్నోబోర్డింగ్ క్రీడలో శిక్షణ తీసుకుని పోటీలోకి దిగినా.. విజయ ఢంకా మోగించి ప్రపంచమే సతన వైపుతిరిగి చూసేలా చేసింది ఊర్మిళ. 'దటీజ్ ఊర్మిళ' అనుపించుకుంది. అంతేగాదు వ్యక్తిగత కష్టాలు మనిషిని ఉన్నతస్థితికి తీసుకువచ్చే సోపానాలని చాటిచెప్పింది. View this post on Instagram A post shared by India Cultural Hub (@indiaculturalhub) (చదవండి: ఎవరీ నిధి తివారీ? ఏకంగా ప్రధాని మోదీ ప్రైవేట్ కార్యదర్శిగా యువ ఐఎఫ్ఎస్ అధికారిణి..!) -
ఎవరీ నిధి తివారీ? ఏకంగా ప్రధాని మోదీ ప్రైవేట్ కార్యదర్శిగా యువ ఐఎఫ్ఎస్ అధికారిణి..!
ప్రధాని నరేంద్ర మోదీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీవోపీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర క్యాబినేట్ నియమకాల కమిటీ ఆమె నియామకాన్ని ఆమోదించింది. నిధి తివారీ ఎవరంటే..2014 బ్యాచ్కు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ అధికారిణి జనవరి 6, 2023 నుంచి ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అంతకుముందు 2022లో పీఎంవోలో అండర్ సెక్రటరీగా చేరారు. గతంలో ఆమె విదేశాంగ మంత్రిత్వ శాఖలో అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల విభాగంలో పనిచేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె మోదీ ప్రైవేట్ కార్యదర్శిగా నియామకం జరిగింది. ఇక తివారీ పీఎంవోలో మూడు సంవత్సరాలకు పైగా పనిచేశారు. 2013లో సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి ముందు, ఆమె వారణాసిలో అసిస్టెంట్ కమిషనర్ (వాణిజ్య పన్ను విభాగంలో)గా పనిచేశారు. ఆ తర్వాత ఆమె ఉద్యోగంతో పాటు 2014 సివిల్ సర్వీసెస్ పరీక్షకు సన్నద్ధమై.. 96వ ర్యాంక్ సాధించారు. ప్రస్తుతం నిధి ఈ పీఎంవోలో ప్రధానమంత్రి కార్యాలయం-పీఎంలో డిప్యూటీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదిలా ఉండగా, పీఎంవోలో చేరడానికి ముందు నిధి తివారీ విదేశాంగ మంత్రిత్వశాఖలోనూ పని చేశారు. ఆమె నిరాయుధీకరణ, అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల విభాగంలో ఉద్యోగం చేశారు. భారత్కు అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరచడంలో నిధి తివారీకి ఉన్న నైపుణ్యమే పీఎంవోలో కీలకపాత్ర పోషించే స్థాయికి చేరుకున్నారనేది అధికారిక వర్గాల సమాచారం. కాగా, ప్రధానమంత్రికి ఇప్పటివరకు ఇద్దరు ప్రైవేట్ కార్యదర్శులు ఉండగా..ఒకరు వివేక్ కుమార్ మరొకరు హార్దిక్ సతీశ్చంద్ర షా..ఇప్పుడు మూడో ప్రైవేట్ సెక్రటరీగా నిధి అగర్వాల్ నియామకం అయ్యారు.Nidhi Tewari appointed as Private Secretary to Prime Minister Narendra Modi. pic.twitter.com/erpTlJfjfn— Press Trust of India (@PTI_News) March 31, 2025 (చదవండి: నా పిల్లలు భారత్లోనే పెరగాలి ఎందుకంటే..? వైరల్గా అమెరికన్ తల్లి పోస్ట్) -
ఈ జాబ్ చాలా లక్కీ!: ఐపీఎస్ అంకిత సురానా
సాక్షి, పార్వతీపురం మన్యం: ‘‘మహిళలను వెన్నుతట్టి ప్రోత్సహిస్తే ఏ రంగంలోనైనా విజేతలవుతారు. అమ్మాయిలు ఇష్టమైన రంగాన్ని ఎంచుకోవాలి. డాక్టర్, పోలీస్, ఇంజినీర్.. ఇలా ఏదైనా సరే! దాన్ని సాధించేందుకు ఎదురైన ప్రతి సవాల్నూ ఛాలెంజింగ్గా తీసుకోవాలి. ఎర్విరిథింగ్ ఈజ్ పాజిబుల్.. కష్టపడితే గెలుపు మన ముందు వచ్చి వాలుతుంది..’’ ‘‘పార్వతీపురం మన్యం జిల్లా లాంటి ఏజెన్సీ ప్రాంతంలో పని చేయడం గొప్ప అనుభూతినిస్తోంది. ఇక్కడ గిరిజన జనాభా అధికం. నిరక్షరాస్యత కూడా ఉంది. గత కొన్నేళ్లుగా కొంత మార్పు కనిపిస్తోంది. బాలికలు విద్య, క్రీడలు, ఇతర రంగాల్లో ప్రావీణ్యం పొందుతున్నారు. వారిలో మరింత చైతన్యం తీసుకొచ్చేందుకు నా వంతుగా ప్రయత్నినస్తున్నా. పాఠశాలలు, కళాశాలలకు స్వయంగా వెళ్లి వివిధ అంశాలపై వివరిస్తున్నా. కేవలం భద్రతనే కాదు.. కెరియర్ కోసం కూడా వివరిస్తుండటం సంతృప్తినిస్తోంది.’’ చిన్నప్పుడు అందరిలానే తనూ ఒక సాధారణ అమ్మాయి. చదువు, ఆటపాటలే లోకం. డిగ్రీ చదువుతున్న సమయంలో.. సమాజంలో తన పాత్ర ఏమిటో అవగతమైంది. ఈ సొసైటీకి.. ప్రధానంగా మహిళలు, బాలికల కోసం ఏం చేయాలన్న ప్రశ్నలోనే.. ‘ఐపీఎస్’ అన్న లక్ష్యం బోధపడింది. ఆమే.. యువ ఐపీఎస్ అధికారిణి, పార్వతీపురం ఏఎస్పీ అంకిత సురాన. అత్యున్నతమైన ఇండియన్ పోలీస్ సర్వీస్ కు ఎంపిక కావడమే కాదు.. శిక్షణలోనూ ప్రతిభను చూపారు. నేడు విధి నిర్వహణలోనూ ‘ఫ్రెండ్లీ పోలీస్’ అన్న పదానికి అసలైన నిర్వచనం చెబుతూ, క్లిష్టమైన కేసుల్లోనూ తన మార్కు చూపిస్తూ.. విజయవంతమైన అధికారిణిగా గుర్తింపు పొందారు. రాష్ట్రానికి మారుమూలన ఉన్న పార్వతీపురం మన్యం జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, యువతకు దిశానిర్దేశం చేయడంలో ముందుంటున్నారు. తన కుటుంబ నేపథ్యం, ఈ రంగంలోకి రావడానికి కారణం, విధి నిర్వహణలో సక్సెస్ఫుల్ జర్నీని ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... శిక్షణ తర్వాత చాలా మార్పు సివిల్స్ సాధించిన తర్వాత శిక్షణ పూర్తయ్యాక నాలో చాలా మార్పు వచ్చింది. పట్టుదల పెరిగింది. ప్రజలకు సేవ చేయడాన్ని స్ఫూర్తిగా తీసుకున్నా. బాలలు, మహిళల రక్షణ కోసం పని చేయాలని అనిపించింది. ఈ రంగంలో తల్లిదండ్రులు ఎంతగానో ప్రోత్సహించారు. 2023లో గ్రేహౌండ్స్లో విశాఖలో విధుల్లో చేరా. తర్వాత పార్వతీపురం ఏఎస్పీగా వచ్చా. ఈ జాబ్ పొందడం చాలా లక్కీ! మరిచిపోలేని అనుభూతి.. రాష్ట్రస్థాయి రిపబ్లిక్డే వేడుకల పరేడ్ కమాండర్గా వ్యవహరించడం మరిచిపోలేని అనుభూతి. గర్వపడే సందర్భం. చాలా ఆనందం అనిపించింది. ఒక వారం శిక్షణ పొంది విజయవంతంగా పరేడ్ పూర్తి చేయగలిగాం. నాకు అవకాశమిచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. నేటి తరానికి ఇచ్చే సందేశం.. నథింగ్ ఈజ్ ఇంపాజిబుల్. ఎవి్వరిథింగ్ ఈజ్ పాజిబుల్. నేటి తరం బాలికలు, యువతకు చెప్పేదొకటే. విద్యార్థి దశలో చదువు, కెరియర్పైనే దృష్టి పెట్టాలి. మీరు ఏ రంగంలో రాణించాలనుకుంటున్నారో గట్టిగా నిర్ణయించుకోవాలి. దాని సాధన దిశగా సాగాలి. పదో తరగతి తర్వాత కెరియర్ కౌన్సెలింగ్ చాలా ముఖ్యం. ఈ దశలో ఇతర విషయాల జోలికి వెళ్లకుండా, అనవసరంగా సమయం వృథా చేయకుండా భవిష్యత్తు కోసం ఆలోచిస్తే.. మంచి జీవితం లభిస్తుంది. కుటుంబ నేపథ్యం.. మా సొంత ప్రాంతం మహారాష్ట్ర. పదో తరగతి వరకు అక్కడే చదివా. తర్వాత కుటుంబం హైదరాబాద్లో స్థిరపడింది. ఇంటర్ (బైపీసీ) తర్వాత హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో బీఎస్సీ బయోకెమిస్ట్రీ డిగ్రీ, సల్సార్ యూనివర్సిటీలో క్రిమినల్ జస్టిస్ మేనేజ్మెంట్లో పీజీ పూర్తిచేశా. తల్లిదండ్రులు కౌసల్య, మహవీర్ సురానా. నాన్న వ్యాపార రంగంలో ఉన్నారు. ఇంట్లో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగంలో లేరు. అందరూ ప్రైవేట్ ఉద్యోగాలు, వ్యాపారాలే. మా కుటుంబం నుంచి నేను మొదటి పోలీస్ అధికారి కావడంతో మా కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా ఉన్నారు. డిగ్రీలో ఉంటుండగానే కెరియర్ కోసం ఆలోచించా. సమాజానికి సేవ చేయాలని, ప్రజలకు దగ్గరగా ఉండే వృత్తిలో చేరాలని కోరిక. ఆ క్రమంలోనే సివిల్స్ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నా. డిగ్రీ చదువుతూనే.. సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించాను. లక్ష్యంపైనే గురి. మూడుసార్లు విజయం రాకపోయినా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. నాలుగో ప్రయత్నంలో సివిల్స్ సాధించాను. 398వ ర్యాంకు వచ్చింది. ఐపీఎస్కు ఎంపికయ్యా. 2021 బ్యాచ్ మాది. ప్రజల సహకారం ఉంటేనే.. ప్రజలను సురక్షితంగా ఉంచడం బాధ్యత. ఇదే సమయంలో శాంతి¿¶ద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖపరంగా ఎంత చేసినా.. ప్రజల నుంచీ సహకారం అవసరం. ట్రాఫిక్ రూల్స్ పాటించడం, ప్రయాణ సమయంలో హెల్మెట్ ధారణ వంటివాటిలో ఎవరికివారు బాధ్యతగా వ్యవహరించాలి. పిల్లలు తప్పుడు దారిలో వెళ్లకుండా తల్లిదండ్రులు పర్యవేక్షణ చేయాలి. సమాజంలో ప్రధానంగా పోలీసులంటే భయం పోవాలి. 24 గంటలూ పోలీసులు అందుబాటులో ఉంటారు. ఏ సమయంలోనైనా ధైర్యంగా ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావాలి. చుట్టుపక్కల అసాంఘిక కార్యకలాపాలు జరిగినా.. ఒక్క ఫొటో ద్వారానైనా శక్తి యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఇతర పోలీస్ శాఖ టోల్ఫ్రీ నంబర్లనూ వినియోగించవచ్చు. శక్తి యాప్.. సేఫ్టీయాప్. ప్రధానంగా మహిళల వద్ద ఉండాలి. ఒక్క బటన్ ప్రెస్ చేస్తే పోలీసులు ఉంటారు. ప్రజలకు పోలీసులు ఉన్నారన్న నమ్మకం పెరగాలి నేను ఎక్కడ పనిచేసినా.. అక్కడ ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు, చిన్నారులకు భద్రత కల్పించగలిగితే చాలు.. అంతకంటే సంతృప్తి ఉండదు. ప్రత్యేకించి మహిళలు, చిన్నారులకు పోలీస్పై నమ్మకం పెంచేలా పనిచేయగలగాలి. విధి నిర్వహణలో ప్రతి కేసునూ సవాల్గానే తీసుకుంటా. పోక్సో కేసులు, వరకట్నం, ఎస్సీ, ఎస్టీ కేసులు, శాంతిభద్రతలు.. ఇలా ఏదైనా బాధితులకు న్యాయం చేయాలి. అప్పుడే విధి నిర్వహణలో సంతృప్తి చెందగలం. మహిళల హక్కులు, చట్టాలపైన అవగాహన కల్పింస్తున్నాం. మహిళా దినోత్సవం సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ, ఇతర కార్యక్రమాలు చేశాం. చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. ఏ ఒక్కరూ భయపడకూడదు. ధైర్యంగా ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావాలి. ఇటీవల ఒక పోక్సో కేసు వచ్చింది. ఆ అమ్మాయి చాలా డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. వారం రోజులు కౌన్సెలింగ్ ఇచ్చాం. ఇప్పుడు ఆ అమ్మాయి చాలా హ్యాపీగా ఇంటర్ పరీక్షలు రాసుకుంటోంది. శాంతిభద్రతల పరిరక్షణలో... డ్రోన్ నిఘా వ్యవస్థను పటిష్టం చేశాం. ఈవ్టీజింగ్, జూదం, గంజాయి, సారా అక్రమ రవాణా వంటివాటిని డ్రోన్ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ, కట్టడి చేస్తున్నాం. ప్రతి ముఖ్య కూడళ్లలోనూ సీసీ కెమెరాలు పెట్టాం. జిల్లాలో టాప్ 20 నేరస్తులను గుర్తించాం. వారిపై నిరంతరం ఓ కన్నేసి ఉంచుతున్నాం. మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా శక్తి యాప్ అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం పార్వతీపురం, పాలకొండ, సాలూరుల్లో టీమ్స్ పని చేస్తున్నాయి. వీరికి ప్రత్యేకంగా ఓ వాహనం ఉంటుంది. 100, 112 నంబర్లకు కూడా అత్యవసర సమయంలో ఫిర్యాదు చేయవచ్చు. నిమిషాల వ్యవధిలోనే పోలీసులు అక్కడ ఉంటారు. గంజాయి, సారా రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నాం. కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. బాలికల కోసం స్వీయ రక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. అత్యవసర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి.. ఏ విధంగా రక్షణ పొందాలి, భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పింస్తున్నాం. పాఠశాలల్లో ఈగల్ టీమ్స్ ద్వారానూ అవగాహన పెంచుతున్నాం. చిన్నారులు, మహిళల రక్షణ కోసం వన్స్టాప్ సెంటర్ ఉంది. అక్కడ వారికి అవసరమైన అన్ని విధాల మద్దతు కూడా లభిస్తుంది. సైబర్ క్రైమ్ మోసాలు రోజుకో విధంగా కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. ప్రజలు వాటి బారిన పడకుండా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఆయా ఎస్హెచ్వోల ద్వారా చేపడుతున్నాం. పోలీస్ సిబ్బంది సొంత సమస్యలపైనా ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా గ్రీవెన్స్ నిర్వహించి, ఫిర్యాదులు స్వీకరిస్తున్నాం. -
నలుపు అంటే శక్తి
నాలుగు సంవత్సరాల అమ్మాయి తన తల్లిని ‘అమ్మా... నన్ను తిరిగి నీ గర్భంలోకి తీసుకొని తెల్లగా పుట్టించగలవా?’ అని అడిగింది. తల్లి ఆశ్చర్యంగా చూసి ‘ఎందుకమ్మా?’ అని అడిగింది. ‘నల్లపిల్ల అంటూ నన్ను అందరూ వెక్కిరిస్తున్నారు’ కళ్లనీళ్లతో చెప్పింది ఆ అమ్మాయి. ‘రంగుది ఏముందమ్మా! నువ్వు చదువుకొని పెద్ద స్థాయిలో ఉంటే రంగు గురించి ఎవరూ మాట్లాడరు’ అన్నది ఆ తల్లి ఓదార్పుగా.కట్ చేస్తే.... ఆ అమ్మాయి కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలాంటి పెద్ద పదవిలోకి వచ్చింది. అయినా నల్లటి ఆమె ఒంటి రంగును హేళన చేస్తూ అయిదు దశాబ్దాలుగా ఆమెను బాధిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తన ఆవేదనకు అక్షర రూపం ఇచ్చి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శారదా మురళీధరన్.‘నలుపు’ అనే ముద్ర వేసి వెక్కిరించడంపై శారదా మురళీధరన్ గొంతు విప్పారు. ‘ఇది విశ్వం యొక్క సర్వవ్యాప్త సత్యం అయినప్పుడు ఆ రంగును ఎందుకు కించపరుస్తున్నారు?’ అంటూ ప్రశ్నించారు. వర్ణ, లింగ వివక్షకు సంబంధించిన కామెంట్స్పై ఫేస్బుక్లో ఆమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.శారదకు ఎంతోమంది నుంచి మద్దతు వెల్లువెత్తింది.‘ నల్లరంగు కారణంగా నేను ఇతరుల కంటే తక్కువ అనే భావన నాలో ఉండేది. నా పిల్లలు మాత్రం నలుపు అంటే అందం అంటారు. నల్లజాతి వారసత్వాన్ని కీర్తించారు. నేను గమనించని చోట అందాన్ని వెదుక్కుంటూ వచ్చారు. వారి మాటలు నలుపు వర్ణం విలువను, అందాన్ని గుర్తించేలా చేసింది’ అంటారు శారద.శారద 1990 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. ఆరేళ్ల పాటు ప్రతిష్ఠాత్మకమైన ‘కుటుంబ శ్రీ’కి నేతృత్వం వహించారు. ఆ తర్వాత జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా పనిచేశారు. పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శిగా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) డైరెక్టర్ జనరల్గా పనిచేశారు.త్రివేండ్రం జిల్లా కలెక్టర్గా, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కమిషనర్గా... ఇలా ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించారు. గత సంవత్సరం భర్త డాక్టర్ వేణు నుంచి కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయినా సరే... ‘నలుపు’ పేరుతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వెక్కిరింపులు ఎదురవుతూనే ఉన్నాయి. కేరళ చీఫ్ సెక్రటరీగా తన భర్త నుంచి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన రంగుతో పోల్చుతూ, ఆ పదవికి మీరేం సరిపోతారు? అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేశారు. వారి కామెంట్స్లో నలుపు రంగును తక్కువ చేసి వెక్కిరించడం ఉంది. ఆడవాళ్లకు పెద్ద పదవులు ఎందుకు? అనే పురుషాధిపత్య భావజాలం ఉంది. ఈ నేపథ్యంలోనే తన మనసులోని ఆవేదనను ఫేస్బుక్ పోస్ట్లో పెట్టారు శారద. ఆ పోస్ట్పై మొదట్లో కొందరి కామెంట్స్ చూసిన తరువాత ఆ పోస్ట్ను డిలీట్ చేశారు. ‘మీ పోస్ట్ నేపథ్యంలో చర్చించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి’ అని శ్రేయోభిలాషులు చెప్పడంతో మరోసారి పోస్ట్ చేశారు. రీ–షేర్ చేసిన తరువాత ఆమె పోస్ట్కు మద్దతుగా ఎన్నో కామెంట్స్ వచ్చాయి. శారద ధైర్యసాహసాలకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆమెను ప్రశంసించిన వారిలో కేరళ అసెంబ్లీలో ప్రతిపక్షనేత సతీశన్ కూడా ఉన్నారు.‘నల్లరంగు కారణంగా నేను ఇతరుల కంటే తక్కువ అనే భావన నాలో ఉండేది. నా పిల్లలు మాత్రం నలుపు అంటే అందం అంటారు. నల్లజాతి వారసత్వాన్నికీర్తించారు. నేను గమనించని చోట అందాన్ని వెదుక్కుంటూ వచ్చారు. వారి మాటలు నలుపు వర్ణం విలువను, అందాన్ని గుర్తించేలా చేసింది’ -
మహిళలకు భారీగా కాంట్రాక్టు ఉద్యోగాలు
ముంబై: మహిళలకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు, ముఖ్యంగా కాంట్రాక్టు పనులు మెట్రోల్లో, పారిశ్రామిక కేంద్రాల్లోనే ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నాయని.. భవిష్యత్తులో టైర్ 2, 3 పట్టణాల్లో విస్తరణకు అపార అవకాశాలున్నాయని టీమ్లీజ్ సర్వీసెస్ నివేదిక వెల్లడించింది. మహిళలకు కాంట్రాక్టు ఉద్యోగాల్లో 28.7 శాతం వాటాతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా, తమిళనాడు 14.2 శాతం, కర్ణాటక 14.1 శాతం మేర అవకాశాలను అందిస్తున్నట్టు తెలిపింది. ఆ తర్వాత తెలంగాణలో 7.8 శాతం, గుజరాత్లో 7.2 శాతం, యూపీలో 6.6 శాతం చొప్పున మహిళలకు కాంట్రాక్టు ఉద్యోగాలు లభిస్తున్నట్టు వెల్లడించింది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో మరింత మందికి ఈ అవకాశాల కల్పనకు గణనీయమైన అవకాశాలున్నట్టు గుర్తు చేసింది. టీమ్లీజ్ సర్వీసెస్ తన అంతర్గత డేటా ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. రిటైల్లోనే ఎక్కువ మహిళలకు కాంట్రాక్టు ఉద్యోగాల్లో 29.8 శాతం ఒక్క రిటైల్ రంగమే కల్పిస్తోందని టీమ్లీజ్ సర్వీసెస్ నివేదిక వెల్లడించింది. ఐటీ రంగంలో 20.7 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో 18.9 శాతం చొప్పున ఉద్యోగాలు లభిస్తున్నట్టు తెలిపింది. తయారీలో 10.8 శాతం, విద్యుత్, ఇంధన రంగంలో 5 శాతం, టెలికంలో 4 శాతం చొప్పున కాంట్రాక్టు ఉద్యోగాల్లో మహిళల ప్రాతినిధ్యం ఉన్నట్టు పేర్కొంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్తో కూడిన స్టెమ్ విద్యలో ఎక్కువ మంది మహిళలు చేరడం అన్నది ఐటీ, రిటైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో మరింత మందికి అవకాశాలను చేరువ చేస్తుందని తెలిపింది. కాంట్రాక్టు మహిళా ఉద్యోగుల్లో 62.2 శాతం మంది వయసు 18–27 ఏళ్ల మధ్యలో ఉంటే.. 29.4 శాతం మంది 28–37 ఏళ్ల వయసులో ఉండడం అన్నది యువ ప్రాతినిధ్యాన్ని సూచిస్తున్నట్టు పేర్కొంది. 38–47 ఏళ్ల వయసులోని మహిళలు 6.6 శాతం, 48 ఏళ్లకుపైన వయసున్న మహిళలు 1.9 శాతం చొప్పున కాంట్రాక్టు ఉద్యోగాల్లో ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. -
మంచు పావురం
కశ్మీర్లో సైకిల్ తొక్కడం కష్టం. అయితే మగ పోస్ట్మేన్లే సైకిల్ తొక్కుతారు. ఉల్ఫతాబానోకు తన రెండు కాళ్లే సైకిల్ చక్రాలు. కశ్మీర్లో మొదటి మహిళా పోస్ట్ఉమన్గా ఆమె 30 ఏళ్లుగా నడిచి ఉత్తరాలు అందిస్తోంది. మంచు తుఫాన్లు, కాల్పుల మోతలు, భయం గొలిపే ఒంటరి మార్గాలు ఆమెను ఆపలేవు. ఇలా వార్తలు మోసే పావురం ఒకటి ఉందని తెలియడానికి ఇంత కాలం పట్టింది. ఇప్పుడుగాని మీడియా రాయడం లేదు. ఈ ఉత్తరం జీవితకాలం లేటు.మంచులో నడవడం మీకు వచ్చా? మూడు నాలుగడుగుల మంచులో నాలుగు అడుగులు నడవడం ఎంత కష్టమో తెలుసా? బాగా శక్తి ఉన్న యువతీ యువకులకే సాధ్యం కాదు. కాని 55 ఏళ్ల ఉల్ఫతా బానో గత 30 ఏళ్లుగా అలాంటి మంచులోనే నడిచి తన ఊరికి బయటి ప్రపంచానికి అనుసంధానకర్తగా ఉంది. ‘హిర్పురా’ అనే చిన్న పల్లెకి ఆమె ఏకైక మహిళా పోస్ట్ఉమన్. ఈ ఊరు శ్రీనగర్కు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రపంచంతో తెగినట్టుండే ఈ ఊరిలో ఒక వార్త తెలియాలన్నా ఒక విశేషం అందాలన్నా ఉల్ఫతానే ఆధారం.5 నెలలు మంచులోనేదక్షిణ కశ్మీర్లోని హిర్పురాలో ప్రతి నవంబర్ నుంచి మార్చి వరకు ఐదు నెలల పాటు దారుణమైన వాతావరణం ఉంటుంది. దట్టమైన మంచు కురుస్తుంది. రోడ్లు మూసుకుపోతాయి. కాని హిర్పురాకు ప్రతిరోజూ కనీసం 30 ఉత్తరాలో, పార్శిళ్లో వస్తాయి. ఒక పురుష ఉద్యోగి జిల్లా హెడ్క్వార్టర్ అయిన షోపియన్కు వెళ్లి వాటిని పట్టుకొస్తాడు. ఇక పంచే బాధ్యత ఉల్ఫతా బానోదే. ‘నేను మెట్రిక్యులేషన్ చదవడం వల్ల ఈ ఉద్యోగం వచ్చింది. నా భర్త కూడా పోస్ట్మేన్గా పని చేసి రిటైర్ అయ్యాడు. నాకు ప్రస్తుతం 22 వేల రూపాయల జీతం వస్తోంది’ అని తెలిపింది ఉల్ఫతా బానో.ఎన్నో సవాళ్లు ధైర్యమే జవాబుఉల్ఫతాకు సైకిల్ తొక్కడం రాదు. సైకిల్ తొక్కడం కష్టమే ఆప్రాంతంలో. అందుకే తాను ఎక్కువగా నడుస్తుంది. ‘రోజుకు నాలుగైదు కిలోమీటర్లు నడుస్తాను’ అంటుందామె. ఉల్ఫతా ఎంతో అవసరం అయితే తప్ప లీవ్ పెట్టదు. ‘దట్టమైన మంచు కురుస్తున్నా లాంగ్బూట్లు వేసుకొని గొడుగు తీసుకొని డ్యూటీకి వెళతాను. పాపం... ఉత్తరాల కోసం ఎదురు చూస్తుంటారు కదా’ అంటుందామె. మంచులో ఒకో ఇంటికి మరో ఇంటికి కూడా సంబంధం తెగిపోయినా ఉల్ఫతా మాత్రం అక్కడకు వెళ్లి ఉత్తరం అందిస్తుంది. ‘ఊళ్లో చాలామంది స్టూడెంట్స్ స్టడీ మెటీరియల్ తెప్పించుకుంటూ ఉంటారు. వారికి నన్ను చూస్తే సంతోషం. వాళ్ళు చదువుకోవడానికి నేను సాయపడుతున్నందుకు తృప్తిగా ఉంటుంది’ అంటుందామె.క్రూరమృగాల భయంకశ్మీర్ సున్నితప్రాంతం. గొడవలు... కాల్పుల భయం ఉండనే ఉంటుంది. అయితే అది అటవీప్రాంతం కూడా. ‘మంచు కాలంలో ఆహారం దొరక్క మంచు చిరుతలు, ఎలుగుబంట్లు ఊరి మీద పడతాయి. నేను ఉత్తరాలు ఇవ్వడానికి తిరుగుతుంటే అవి ఎక్కడ దాడి చేస్తాయోననే భయం ఉంటుంది. కాని నాకెప్పుడు అవి ప్రమాదం తలపెట్టలేదు’ అంటుంది ఉల్ఫతా. సాధారణంగా ఇలాంటి ఊళ్లలో డ్యూటీ చేసినా చేయక పోయినా ఎవరూ పట్టించుకోరు. ‘కాని డ్యూటీ ఒప్పుకున్నాక చేయాలి కదా. అది పెద్ద బాధ్యత. ఆ బాధ్యతే నన్ను 30 ఏళ్లుగా పని చేసేలా చేస్తోంది’ అని సంతృప్తి వ్యక్తం చేస్తుంది ఉల్ఫతా.ఏసి ఆఫీసుల్లో ఉంటూ హాయిగా వాహనాల్లో వచ్చి పోతూ కూడా తమ డ్యూటీ తాము చేయడానికి అలక్ష్యం చేసే వారు ఉల్ఫతాను చూసి బాధ్యతను గుర్తెరగాలి. -
కొడుకుకోసం..చిరుతపైనే పంజా విసిరింది!
ప్రాణాపాయంలో ఉన్న కన్నబిడ్డల్ని కాపాడుకునేందుకు తల్లి(Mother) ఎంతటి సాహసానికైనా పూనుకుంటుంది. తన కంఠంలో ఊపిరి ఉన్నంతవరకు, ఎలాంటి కష్టాన్నైనా లెక్క చేయకుండా, తనబిడ్డల్ని రక్షించుకుంటుంది. ఆఖరికి కౄర మృగాలు ఎదురొచ్చినా సరే తన ప్రాణాలను ఫణంగా పెట్టైనా కన్నపేగు బంధాన్ని కాపాడుకుంటుంది. తాజాగా ఇలాంటి ఉదంతమొకటి పలువుర్ని ఆకట్టు కుంటోంది. తన కొడుకును కాపాడుకునేందుకు ఒక తల్లి పడిన ఆరాటం విశేషంగా నిలుస్తోంది.కన్న కుమారుడిని కూతురిని కాపాడుకునేందుకు ఓ తల్లి ఏకంగా చిరుతపులితోనే కొట్లాడింది. తెగించి పోరాడి చిరుతను అ డ్డుకుని తన ప్రాణాలు పోకుండా అడ్డుపడింది. తీవ్రంగా గాయపడిన బాలుడు గ్వాలియర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ బాలుడికి దాదాపు 120 గాయాలైనాయి. వీటికి శస్త్రచికిత్స జరిగింది. అయితే చిరుతపులి లాలాజలం నుండి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉన్నందున అతణ్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. మధ్యప్రదేశ్లోని షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్క్ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కెమెరా ట్రాప్ ఫుటేజ్ ఆధారంగా వేటాడే జంతువు చిరుతపులి అని అధికారులు నిర్ధారించారు.చదవండి: నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలుఆ తల్లి పేరు సురక్ష ధకాద్. తన తొమ్మిదేళ్ల బాలుడు అవినాష్ ధకాడ్పై చిరుతపులి దాడి చేయడాన్ని గమనించింది. మృత్యుముఖంలోకి జారిపోతున్నబిడ్డను కాపాడుకునేందుకు తన పంజా విసిరింది. సోమవారం కునో నుండి కేవలం 4 కి.మీ దూరంలో ఉన్న బఫర్ జోన్ అయిన విజయ్పూర్, షియోపూర్లోని ఉమ్రికాల గ్రామంలో జరిగిన ఆ భయంకరమైన దాడిని స్థానిక మీడియాకు వివరించింది. "నేను అక్కడికి చేరుకునేసరికి, చిరుత నా కొడుకుపై దాడి చేసింది. వాడిని చేయి పట్టుకుని నా వైపుకు లాగాను. 50 మంది అతన్ని అవతలి వైపు నుండి లాగుతున్నట్లు అనిపించింది. అయినా నా శక్తినంతా ఉపయోగించాను. చివరికి, నేను నా కొడుకును దాని నోటినుంచి నుండి బయటకు తీశాను, కానీ అతని ముఖమంతా గాయాలే. రక్తం ప్రవహిస్తోంది. ఈరోజు, నా కొడుకు సురక్షితంగా ఉన్నాడు అంటూ తెలిపింది. కొడుకు ముఖం , మెడలోకి తన గోళ్లు , దంతాలను ఎలా గుచ్చుకుపోయాయో వివరించింది. బాధితుడు అవినాష్ ధకాడ్ తన ఇంటి ప్రాంగణంలో ఆడుకుంటుండగా, అడవి జంతువు అకస్మాత్తుగా అతనిపైకి దాడి చేసిందని తెలిపింది. తన కొడుకు అరుపులు విన్న వెంటనే, సమీపంలో పశువులకు ఆహారం పెడుతున్న సురక్ష, సంఘటనా స్థలానికి చేరుకుని, అవినాష్ జంతువు పట్టులో చిక్కుకున్నట్లు గుర్తించింది. చాలా నిమిషాల పాటు పోరాటం జరిగింది, ఆ సమయంలో ఆమె తన కొడుకును విడిపించడానికి తీవ్రంగా పోరాడింది.ఇదీ చదవండి : ట్రెండింగ్ కర్రీ బిజినెస్ : సండే స్పెషల్స్, టేస్టీ ఫుడ్కార్బెట్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్లు కూడా అదే గ్రామంలో చిరుతపులి కదలికలను నిర్ధారించాయని లయన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉత్తమ్ శర్మ తెలిపారు. "ప్రతి చిరుతను ఒక పర్యవేక్షణ బృందం 24/7 పర్యవేక్షిస్తోంది. ప్రతి చిరుత కదలిక , అవి ఎక్కడికి వెళ్ళాయో మాకు ఖచ్చితంగా తెలుసు. మీరు చారిత్రక వాస్తవాలను పరిశీలిస్తే, ప్రపంచంలో ఎక్కడా చిరుతపులి మానవుడిపై దాడి చేసినట్లు నమోదు కాలేదు, ప్రాణాంతకమైనది కాదు. భారతదేశంలోని చిరుతలు భిన్నంగా ప్రవర్తిస్తాయని తాను భావించడం లేదన్నారు. అయితే, అటవీ శాఖ ఈ అవకాశాన్ని తోసిపుచ్చింది, దాడి చేసే విధానం చిరుతపులి లక్షణం అని పేర్కొంది.ఉమ్రికాల గ్రామం విజయ్పూర్ నుండి 27 కి.మీ దూరంలో ఉంది కానీ కునో నేషనల్ పార్క్ నుండి కేవలం 4 కి.మీ దూరంలో ఉంది, ఇక్కడ చిరుతలను తిరిగి ప్రవేశపెట్టారు. దాడికి ఒక రోజు ముందు చిరుతను చూసినట్లు కొంతమంది గ్రామస్తులు నివేదించారు. చదవండి: నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలు -
పుట్టగానే చంపేయాలని చూశారు! కానీ ఆ అమ్మాయే ఇవాళ..
ఇంతలా ఏఐ సాంకేతికత దూసుకుపోతున్నా.. ఆడపిల్ల అనగానే అమ్మో..! అనే అంటున్నారు. ఇంకా ముగ్గురూ.. అబ్బాయిలే అయినా భయం ఉండదు. గానీ అదే రెండోసారి లేదా మూడోసారి ఆడబిడ్డ అనగానే ప్రాణాలే పోయినంతంగా తల్లడిల్లిపోతారు చాలామంది. ఎందుకనేది అంతుపట్టని చిక్కు ప్రశ్న. ఎందుకంటే అటు అబ్బాయి లేదా అమ్మాయిని పెంచి పెద్దచేసి విద్య చెప్పించడం వంటివన్ని షరామాములే కానీ..ముగ్గురు అమ్మాయిల తల్లిదండ్రులనగానే సమాజం సైతం టన్నుల కొద్దీ జాలి చూపిస్తుంది. అలాంటి వివక్షనే ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచే ఎదుర్కొంది. చిన్ననాటి నుంచి దానిపై పోరాడుతూనే వచ్చింది. చివరికి తనను వద్దు, చంపేయాలని చూసిన తల్లిదండ్రులనే గర్వపడేలా అత్యున్నత స్థాయికి ఎదిగింది. ప్రపంచమే తనవైపు తిరిగి చూసేలా చేసింది.ఆ అమ్మాయే పూజ తోమర్. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ సమీపంలోని బుధాన అనే చిన్న గ్రామంలో జన్మించింది. ఆమెకు అంజలి, అను అనే ఇద్దరు అక్కలు ఉన్నారు. ఆ గ్రామస్థులు అమ్మాయి అనగానే కట్నం ఇచ్చి పెళ్లిచేసే కష్టతర బాధ్యతగా చూసేవారు. అలాంటి వాతావరణంలో పూజా తల్లిదండ్రులు కూడా మూడోసారి అమ్మాయి పుట్టకూడదని దేవుళ్లందరికీ దండాలు పెట్టుకున్నారు. కానీ విధి వింత పరీక్షకు ఎవ్వరైనా తలొగ్గక తప్పదు కదా..!. పాపం అలానే ఈ తల్లిదండ్రులకు ఎంతలా వద్దనుకున్నా మూడోసారి ఆడపిల్లే పుట్టింది. తండ్రే ఈ విషయం విని జీర్ణించుకోలేక కళ్లు తిరిగిపడిపోయాడు. ఇక తాము ఈ అమ్మాయిని పెంచలేం అని కుండలోపెట్టి చంపేయాలనుకున్నారు. కానీ ఆ చిన్నారి గుక్కపెట్టిన ఏడుపుకి జాలి కలిగిందో ఏమో..! వెంటనే చేతుల్లోకి తీసుకున్నారు తల్లిదండ్రులు. అలా చిన్ననాడే బతుకు పోరాటం చేసింది పూజ. అలా నెమ్మదిగా పెద్దదైంది. తనంటే ఇంట్లో వాళ్లకి ఇష్టం లేదనే విషయం తెలిసి మౌనమే దాల్చిందిగానీ వారితో పోరాడలేదు. అడుగడుగున ముగ్గురు ఆడపిల్లలు అనే మాటలు ఓ పక్కన, మరోవైపు నువ్వు పుట్టుకుంటే బాగుండును అన్న సూటిపోటి మాటల మధ్య బాధనంత పట్టికింద బిగబెట్టి బతికింది. అప్పుడే ఫిక్స్ అయ్యింది. ఎలాగైన ఆడిపిల్ల భారం కాదు అదృష్టమనే చెప్పాలని నిర్ణయించుకుంది. అదెలాగనేది తెలియదు. అయితే చిన్నప్పటి నుంచి యూట్యూబ్లో జాకీ చాన్ పాత్రలే ఆమెకు నచ్చేవి. ఎందుకంటే తాను ఎదుర్కొన్న వివక్ష పోరాటాల అందుకు కారణమై అయి ఉండొచ్చు కూఆ. కానీ పూజ ఎప్పుడు రాజకీయ నాయకురాలు, ఏ ఐపీఎస్ వంటివి లక్ష్యంగా ఏర్పరచుకాలేదు. కరాటేలో రాణించాలనుకోవడం విశేషం. తన చుట్టూ ఉన్న పరిస్థితుల రీత్యా అది నేర్చుకోవడం అంత ఈజీ కాదు అయినా అదే నేర్చుకోవాలనుకుంది. సరిగ్గా ఇంటర్లో ఉండగా ఒక కరాటే టీచర్ స్థానిక పాఠశాలకు రావడం జరిగింది. ఇక ఆమె ఆ టీచర్ సాయంతో దానిలోని మెళుకువలు నేర్చుకుంది. మరింత ఇందులో ఛాంపియన్గా రాణించాలంటే ఏం చేయాలో తెలుసుకుంది. ఆ విషయంలో ఆమె మేనమామ కాస్త సాయం అందించడంతో మార్షల్ ఆర్ట్స్తో మిళితమైన కరాటేలో ప్రావీణ్యం తెచ్చుకునేందుకు భోపాల్కు పయనమైంది. అక్కడ ఐదేళ్లలో పలు కాంపీటీషన్లలో గెలుపొంది కానిస్టేబుల్ ఉద్యోగాన్ని పొందింది. అయితే దీన్ని పూజ చాలా అవమానంగా భావించి వదులుకుంది. మరింతగా దీనిలో రాణించి ఉన్నతోద్యోగం పొందాలంటే ఏం చేయాలని ఆలోచనలో పడింది. ఆ సమయంలోనే అల్టిమేట్ ఫైనల్ ఛాంపియనషిష్(మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్(MMA)) గురించి తెలుసుకుంది. ఇక దాని కోసం ఢిల్లీ వెళ్లాలనుకుంది. కనీసం అందుకు ఎవరైన స్పాన్స్ చేయడంగానీ కాంట్రాక్టులు, జీతం లేదా ఎవరిదైనా హామీ వంటివి ఏం లేకుండానే ఢిల్లీ వెళ్లింది. అక్కడ ఆమె ట్యూషన్ పీజు కట్టేందుకు ఎవరో దాత ముందుకు వచ్చారు. అంతే తప్ప కనీసం ఏ మద్దతు సాయం లేకుండా ఒంటరిగా మొండిగా అక్కడ ఎంఎఏలో శిక్షణ తీసుకుంది. అలా పూజ అల్టిమేట్ ఫైనల్ ఛాంపియన్షిప్ పోటీల్లో బ్రెజిల్కు చెందిన రాయన్నే అమండా డోస్ శాంటోస్తో తలపడి గెలుపొందింది. దీంతో ఇలా యూఎఫ్సీ టైటిల్ దక్కించుకున్న తొలి భారతీయురాలుగా యావత్తు భారతావనిని తనవైపు గర్వంగా చూసేలా చేసింది. 31 ఏళ్ల ఈ పంచర్ ఇప్పుడు తన MMA జట్టులో నెలకు దాదాపు రూ. 1.5 నుండి 2 లక్షలు ఖర్చుచేసే ఛాంపియన్గా ఎదిగింది. ఇన్నాళ్లుగా తాను చేస్తున్న పోరాటనికి ఓ అర్థం వచ్చేలా విజయాలు సాధిస్తున్నా అంటూ కంటతడిపెట్టుకుంది. తానెంటన్నది తన కుటుంబానికి చూపించాలనుకోలేదని, ఈ ప్రపంచానికి ఆడపిల్ల భారం అనే మాటకు తావివ్వకూడదు అని చెప్పేందుకే పోరాడనంటోంది పూజ. ఇక ఆమె అనితరసాద్యమైన విజయం అందుకోగానే ఆమె గ్రామంలో ఒక్కసారిగా పండుగ వాతావరణం నెలకొంది. నాడు ముచ్చటగా మూడోసారి ఆడపిల్లగా పుట్టిన శాపగ్రస్తురాలిగా చూసిన వాళ్లే తన కరచలనం కోసం తహతహలాడటం విశేషం. అమె అక్కలు ఒకరు నర్సుగా, మరొకరు డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్లంతా తమ చెల్లి పూజ విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. పూజా తల్లి సైతం ఆమె తన కూతురని గర్వంగా చెబుతూ మీడియా ముందుకొస్తుంది. ఇక చివరగా భారతదేశం అనగానే కేవలం క్రికెట్ మ్యాచ్లే కాదు యోధులు కూడా ఉన్నారని చూపించాలనుకుంటున్నా..అని ఆత్మవిశ్వాసంగా చెబుతోంది పూజ. దురదృష్టం ఏంటంటే ఏ ఆడపిల్ల అని అవమానంగా ఫీలయ్యాడో ఆ తండ్రే పూజ విజయాన్ని చూడకముందే కన్నుమూశాడు. ఏదీఏమైనా ఇలాంటి తల్లిదండ్రులందరికీ కనువిప్పు కలిగించేలా పూజ విజయం ఉండటమే గాక తనలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆడపిల్లలందరకీ స్ఫూర్తిగా నిలిచింది పూజ. (చదవండి: ఇనుములో ఓ మనిషే మొలిచెనే) -
పంటపొలాల్లో డ్రోన్..! ఇక నుంచి ఆ పనుల్లో మహిళలు..
ఇంతకాలం పంటలకు పురుగు మందులు పిచికారీ చేయడం, నానో యూరియా వంటి ఎరువులు చల్లడం వంటి క్లిష్టతరమైన పనులను పురుషులే చేస్తున్నారు. అయితే ఇలాంటి పనులను కూడా ఇకపై మహిళలే చేయనున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డ్రోన్లతో వ్యవసాయ పనులను చేయడంపై గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 54 మంది ఎస్హెచ్జీ మహిళలను ఎంపిక చేశారు. తొమ్మిది రోజుల పాటు ఈ శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత వారికి ఈ డ్రోన్లను అందించనున్నారు. బెంగుళూరుకు చెందిన ఫ్లైయింగ్ వెడ్జ్ అనే కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు.80 శాతం సబ్సిడీపై...కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్ దీదీ పథకం కింద ఈ డ్రోన్లకు 80 శాతం సబ్సిడీపై అందిస్తున్నారు. ఈ డ్రోన్ తోపాటు, సంబంధిత మెటీరియల్తో కలిపి యూనిట్ వ్యయం రూ.పది లక్షలు. ఇందులో లబ్ధిదారులు 20 శాతం (రూ.రెండు లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన రూ.ఎనిమిది లక్షలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నమో దీదీ, కిసాన్ దీదీ పథకాల కింద సబ్సిడీ ఇస్తున్నాయి. ఈ డ్రోన్ సేవలను తమ వ్యవసాయ పొలాలకు వినియోగించడంతోపాటు, గ్రామంలో ఇతర రైతుల పొలాలకు సేవలందించనున్నారు. ఇందుకోసం నిర్ణీత మొత్తాన్ని వసూలు చేస్తారు. ఇలా ఎస్హెచ్జీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించడంతోపాటు, రైతులకు తమ పంట పొలాలకు పురుగుమందుల పిచికారీ కష్టాలు తప్పనున్నాయి. పాత బాలప్రసాద్, సాక్షి ప్రతినిధి, సంగారెడ్డిఆర్థికంగా నిలదొక్కుకునేందుకు మేలు..డ్రోన్ స్ప్రేపై మాకు శిక్షణ ఇస్తున్నారు. వీటిని వినియోగించడం ద్వారా మేము ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు. అలాగే రైతులకు తక్కువ ఖర్చుతో పురుగు మందుల పిచికారీ చేసే సేవలు అందుబాటులోకి వస్తాయి. మా లాంటి మహిళా సంఘాలకు ఈ అవకాశాన్ని కల్పించడం పట్ల సంతోషంగా ఉంది.– అనిత, ఎస్హెచ్జీ మహిళ,అల్మాయిపేట, సంగారెడ్డి జిల్లా.డ్రోన్లను వినియోగించి పంటలకు పురుగుమందులు ఎలా పిచికారీ చేయాలనే దానిపై శిక్షణ ఇస్తున్నారు. రైతులకు ఈ సేవలు అందించడం ద్వారా మాకు ఆర్థికంగా కలిసొస్తుందని భావిస్తున్నాము. అలాగే రైతులకు కూడా ప్రయోజనం కలుగుతుంది. మాకు అర్ధమయ్యే రీతిలో వివరిస్తున్నారు. డ్రోన్ల సేవలు అందించేలా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది.– లక్ష్మి, ఎస్హెచ్జీ మహిళ, అన్నాసాగర్, సంగారెడ్డి జిల్లా (చదవండి: లాభాల తీరం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన) -
World Poetry Day 2025 : పాలింకిపోవడానికున్నట్లు మనసింకి పోవడానికి మాత్రలుంటే!
ప్రపంచ కవితా దినోత్సవం (World Poetry Day) మనసుల్లోతుల్లో దాగివున్న భావాన్ని, అనుభవాన్ని, బాధను, లోతైన గాథల్ని వ్యక్తికరించేందుకు అనుసరించే ఒక ప్రక్రియ కవిత. హృదయాంతరాలలోని భావాలను అర్థవంతంగా, స్ఫూర్తివంతంగా ప్రకటించే సామర్థ్యం కొందరికి మాత్రమే లభించే వరం. సాంస్కృతిక ,భాషా వ్యక్తీకరణ రూపాలలో ఒకటైన ఈ ప్రపంచ కవితా దినోత్సవాన్ని మార్చి 21న జరుపుకోవడం ఆనవాయితీ. 1999లో పారిస్లో జరిగిన 30వ సర్వసభ్య సమావేశంలో UNESCO (యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్) ప్రపంచ కవితా దినోత్సవాన్ని మొదలు పెట్టింది. 1999లో పారిస్లో జరిగిన 30వ సర్వసభ్య సమావేశంలో UNESCO (యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్) ప్రపంచ కవితా దినోత్సవాన్ని ఆమోదించారు. భాషా వైవిధ్యాన్ని ప్రోత్సహించడం, సాంస్కృతిక మార్పిడి, . సృజనాత్మకతను ప్రోత్సహించడం కవిత్వం అంతరించిపోతున్న భాషలతో సహా భాషల గొప్పతనాన్ని చాటుకోవడం, సమాజాలకు స్వరాన్ని అందివ్వడం దీని ఉద్దేశం. విభిన్న సంస్కృతుల నుండి కవితలను పంచుకోవడం ద్వారా ఇతర ప్రజా సమూహాల అనుభవాలు, దృక్కోణాలపై అంతర్దృష్టులను పొందుతారు, సానుభూతి మరియు అవగాహనను పెంపొందిస్తారు.ప్రపంచ కవితా దినోత్సవం సందర్బంగా కొంతమంది మహిళా కవయిత్రుల కవితలను చూద్దాం. సమాజంలోని పురుషాహంకార ధోరణిని నిరసిస్తూ, ఆ భావజాలాలపై తిరుగుబాటు బావుటా ఎగురవేసింది స్త్రీవాద కవిత్వం. స్త్రీల భావాలను, బాధలను, స్త్రీలు మాత్రమే ప్రభావవంతంగా ఆవిష్కరింగలరు అనేదానికి అక్షర సత్యాలుగా అనేక కవితలు తెలుగు కవితా ప్రపంచంలో ప్రభంజనం సృష్టించాయి. స్త్రీ స్వేచ్ఛ, సాధికారత అన్ని రంగాల్లో సమాన హక్కులతో పాటు సంతానోత్పత్తి , మాతృత్వం మాటున దాగివున్న పురుషాధిక్యాన్నిచాటి చెప్పిందీ కవిత్వం.ఇందులో సావిత్రి, బందిపోట్లు కవిత మొదలు ఘంటశాల నిర్మల, కొండేపూడి నిర్మల, జయప్రభ, ఓల్గా, సావిత్రి, మందరపు హైమవతి, రజియా బేగం, పాటిబండ్ల రజని, బి. పద్మావతి, కె. గీత, ఎస్. జయ, శిలాలోలిత, విమల ఇలా ఎంతోమంది తమ కవితలను ఆవిష్కరించారు.తొలి స్త్రీవాద కవితగా 1972లో ఓల్గా రాసిన ‘ప్రతి స్త్రీ నిర్మల కావాలి’ అనే కవితను విమర్శకులు గుర్తించారు. ‘పాఠం ఒప్పచెప్పకపోతే పెళ్ళి చేస్తానని పంతులుగారన్నప్పుడు భయమేసింది, ‘ఆఫీసులో నా మొగుడున్నాడు, అవసరమొచ్చినా సెలవు ఇవ్వడ’ని అన్నయ్య అన్నప్పుడే అనుమానం వేసింది.ఇంకా ‘అయ్యో! పాలింకిపోవడానికున్నట్లు మనసింకి పోవడానికి మాత్రలుంటే ఎంత బాగుండు’ అన్న పాటిబండ్ల రజనీ కవితతో పాటు, ‘లేబర్ రూం* రైలు పట్టా మీద నాణెం విస్తరించిన బాధ, కలపను చెక్కుతున్న రంపం కింద పొట్టులా ఉండచుట్టుకున్న బాధ. ఇది ప్రసవ వేదన కవితగా మారిన వైనం. ఇంకా పైటను తగలెయ్యాలి, చూపులు, అబార్షన్ స్టేట్మెంట్, సర్పపరష్వంగం, రాజీవనాలు, కాల్గళ్స్ మొనోలాగ్, గుక్క పట్టిన బాల్యం, కట్టుకొయ్య, గృహమేకదా స్వర్గ సీమ, దాంపత్యం, నిషిద్ధాక్షరి, నీలి కవితలే రాస్తాం, విమల సౌందర్యాత్మకహింస లాంటివి ఈ కోవలో ప్రముఖంగా ఉంటాయి.ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా మరో కవితమనసుకు అలసటతో చెమట పట్టినపుడోదేహంలోని నెత్తురు మరిగినపుడోగొంతు అక్షరాల సాయం తీసుకుంటుందివేదన కళగా మారిసృజనాత్మకతనులేపనంగా అద్దుకుంటుందిశిశిరాలు వెంటపడిఅదేపనిగా తరుముతున్నప్పుడువసంతం కోసం చేసే తపస్సుపెనవేసుకున్న శీతగాలి ఖాళీతనపు భావాగ్నిని అల్లుకున్నపుడుతుపాన్లతో చైతన్య పరిచేదిచందమామ మాగన్నుగా నిద్రిస్తున్నపుడుకళ్ళు మూసుకున్న ప్రపంచాన్నివేకువ గీతాలై నిద్రలేపేదిఎప్పటికీ కాలని, విడగొట్టినా చీలనిఅనంతం నిండా వ్యాపించినఅక్షయం కాని అక్షర సముదాయంఒకానొక మహావాక్యమైఅద్వితీయ కావ్యమై నిలుస్తుంది.– ర్యాలి ప్రసాద్ -
'పిలిగ్రీ కళ': ఇల్లే యూనివర్సిటీ..!
ఒకకళ... కలకాలం మనుగడలో ఉండాలన్నా కళ కళకళలాడాలన్నా రాజపోషణ కావాలి. రాజ్యాలనేలే మహారాజులు లేని ఈ రోజులలో మనసున్న మహారాజులే కళను బతికించాలి.ఆభరణాలు, లోహపు వస్తువుల తయారీ వృత్తి సాధారణంగా మగవారికే పరిమితం. ఇటీవల చాలామంది మహిళలు ‘ఫలానా వృత్తిలో మహిళలు ఉండరు, అది మగవారి సామ్రాజ్యం’ అనే ‘హద్దు’లను చెరిపేస్తూ తాము ఎంచుకున్న రంగంలో రాణిస్తున్నారు. అవార్డులతో గౌరవాలు పొందుతున్నారు. ఫిలిగ్రీ కళలో జాతీయ స్థాయి పురస్కారాన్ని అందుకున్నారు అర్రోజు ధనలక్ష్మి. మహిళా దినోత్సవం సందర్భంగా ఇటీవల హైదరాబాద్లో స్వదేశ్ చేతివృత్తుల సంగమ పురస్కారం కూడా ఆమెను వరించింది. ఈ సందర్భంగా ధనలక్ష్మి అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.భర్త నేర్పించాడు!ధనలక్ష్మి సొంతూరు కరీంనగర్ జిల్లా నర్సింగాపురం. తండ్రి తపాలా శాఖ ఉద్యోగి. టెన్త్ క్లాస్ తర్వాత చదువు మాన్పించి పెళ్లి చేశారు. పద్దెనిమిదేళ్ల వయసులో అత్తగారింట్లో అడుగు పెట్టిన ధనలక్ష్మికి తన భర్త, మామగారు చేస్తున్న కళాత్మకమైన పని మీద ఆసక్తి కలిగింది. ఆమె ఆసక్తిని గమనించి పని నేర్పించారు. ఆమెకి పని త్వరగానే పట్టుపడింది. మూడేళ్ల సాధన తర్వాత ఎవరి సహాయమూ లేకుండా సొంతంగా ఒక కుంకుమ భరిణె చేయగలిగారు ధనలక్ష్మి. ఆ తర్వాత రకరకాల కళాకృతుల తయారీ నేర్చుకున్నారు. ఫిలిగ్రీ కళకు గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో వినూత్నంగా ఒక థీమ్తో ఏదైనా చేయాలనుకున్నారు. రెండు తబలాలు, డోలు, సన్నాయి, పన్నీరు బుడ్డీ, అత్తర్దాన్, కుంకుమ భరిణె, పసుపు పాత్ర, అక్షింతల గిన్నె ఇవన్నీ పెట్టడానికి ఒక పళ్లెం... ఇలా మ్యారేజ్ సెట్ తయారు చేశారామె. ఒకటిన్నర కేజీల వెండితో రెండు నెలలు శ్రమ పడితే ఇవన్నీ తయారయ్యాయి. ఆమె పనితనం నచ్చిన రాష్ట్ర హ్యాండీక్రాఫ్ట్స్ శాఖ జాతీయ స్థాయి అవార్డు ఎంపిక కోసం పంపింది. అంతకుముందే 2008లో రాష్ట్రస్థాయి పురస్కారం, 2010లో జాతీయ పురస్కారం అందుకున్నారు.మార్కెట్ బాగుంది!‘‘హస్త కళలకు ఆదరణ లేని రోజుల్లో మా వృత్తి పెద్దగా ఉపాధినివ్వలేదు. చాలామంది చదువుకుని ఉద్యోగాలకు వెళ్లారు. అలాంటి పరిస్థితిలో కూడా మా కుటుంబం ఈ కళను వదల్లేదు. ఇప్పుడు హస్తకళలకు మార్కెట్ బాగుంది. మెమెంటోలుగా పీకాక్ బొమ్మలు, గణేశ్, మ్యారేజ్ సెట్, పర్సులను ఎక్కువగా అడుగుతున్నారు. కొంతమంది తమ ఫొటో ఇచ్చి ఆ రూపాన్ని ఫిలిగ్రీ వర్క్లో చేయమని అడుగుతారు. సుమారు 200 గ్రాముల్లో తయారవుతుంది. మేకింగ్ చార్జ్ గ్రాముకు యాభై రూ΄ాయలు తీసుకుంటాం.ప్రధాని ప్రశంస!జీ 20 సదస్సు తర్వాత మా విశ్వకర్మకారుల సమస్యలను తెలియచేయడానికి ప్రధాని మోదీని కలిశాం. అప్పుడు ఆయన మా కళాఖండాలను చూశారు. అనేక విషయాలను అడిగి తెలుసుకున్నారు. కళాత్మకమైన వృత్తి ఇది. ఒక్కొక్క కుటుంబం ఒక్కో యూనివర్సిటీతో సమానం. కాలేజీల్లో ఈ కోర్సులు పెట్టినా సరే, ఆ స్టూడెంట్స్ ప్రాక్టికల్స్ కోసం మా దగ్గరకు రావాల్సిందే. అందుకే మా పిల్లలిద్దరూ బీటెక్ చేసినా సరే వారికి కూడా ఫిలిగ్రీ వర్క్ నేర్పించాం. నాకు, మా వారికి ఈ కళలో నైపుణ్యం మాత్రమే తెలుసు. ఈ కళను విదేశాలకు విస్తరింపచేయడంలో మా పిల్లల చదువు ఉపయోగపడుతుంది. మా పిల్లలే కాదు వారి పిల్లలు కూడా ఇదే కళతో గుర్తింపు ΄÷ందాలని నా ఆకాంక్ష’’ అన్నారు అర్రోజు ధనలక్ష్మి.జీఐ ట్యాగ్ వచ్చింది:మెసపటోమియా నాగరకత కాలంలో విలసిల్లిన కళ. క్రీ.పూ మూడవ శతాబ్దం నుంచి మనదేశంలోనూ విరాజిల్లింది. తెలుగు రాష్ట్రాల్లో కరీంనగర్ ఈ కళకు కేంద్రం. కరీంనగర్ పట్టణంతోపాటు పరిసర గ్రామాలలో ఈ కళతో జీవిస్తున్న కుటుంబాలు అనేకం ఉన్నాయి. ఆధునికత వెల్లువలో ఈ కళ కొంతకాలం కళ తప్పింది కానీ ఇప్పుడు సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా పుంజుకుంటోంది. సిల్వర్ ఫిలిగ్రీ క్రాఫ్ట్ క్లస్టర్కు 2007లో జీఐ (జియోగ్రాఫికల్ ఇండికేషన్) ట్యాగ్ వచ్చింది.భద్రమైన కళఫిలిగ్రీ... గొప్ప పనితనంతో కూడిన ఆభరణాల తయారీ నైపుణ్యం. ఫిలిగ్రీ డిజైన్లలో బంగారు, వెండి ఆభరణాలను తయారు చేస్తారు. వెండిలో ఆభరణాలతో΄ాటు కీ చైన్లు, ఆభరణాలు భద్రపరుచుకునే బాక్సులు, గిఫ్ట్ బాక్సులు, అలంకరణ వస్తువులు, కుంకుమ భరిణెలు, అత్తర్దాన్, పాన్దాన్, ట్రేలు, పూజ సామగ్రి, ఫ్లవర్ వేజ్లు, పాత్రలు, వాల్ ఫ్రేమ్లు, టేబుల్ టాప్ షో పీస్లు, జంతువులు, పక్షుల బొమ్మలు, దేవుని ప్రతిమలు చేస్తారు. (చదవండి: -
వయసు 60..టైలరింగ్తో పొట్టపోసుకునే మహిళ ఏకంగా ఎవరెస్టునే..!
ఆమె వయసు 60... ఊరు కేరళ. టైలరింగ్తో పొట్ట పోసుకునే సగటు స్త్రీ. కాని ఎవరెస్ట్ బేస్క్యాంప్కు ఎలాగైనా చేరాలని పట్టుదల. ట్రైనింగ్ లేదు... బృందాలతో కలవడం లేదు. కేవలం యూట్యూబ్ను గురువుగా పెట్టుకుంది. అడుగులో అడుగు వేస్తూ వయసును లెక్కచేయక గమ్యం చేరుకుంది.చిన్న మనుషులూ పెద్ద కలలు కనొచ్చు. వసంతి చెరువీట్టిల్ స్ఫూర్తి గాథ.‘అది ఆనందమో దుఃఖమో తెలియదు. త్రివర్ణ పతాకాన్ని చేతబట్టి, కేరళ సంప్రదాయ చీరలో నేను నిలుచుంటే రివ్వుమనే చల్లగాలిలో అందరూ చప్పట్లు కొడుతుంటే కళ్లలో నీళ్లు ఉబికి వచ్చాయి‘ అంటుంది వసంతి చెరువీట్టిల్.సమున్నతంగా శ్వేత కిరీటాలతో నిలుచుని ఉండే హిమాలయాలను పలకరించడానికి కేరళలోని కన్నూరు నుంచి ఈమె బయలుదేరినప్పుడు తోడు ఎవరూ లేరు తనకు తాను తప్ప. భర్త చనిపోయాక ఇద్దరు కుమారులను పెంచి పెద్ద చేసి వారి జీవితానికి దారి చూపించాక ఈ ప్రపంచాన్ని చూడాలని చిన్న ఆశ కలిగింది వసంతికి. చేసే పని టైలరింగ్. ఆదాయం కొద్దిగా. కాని అందులోనే దాచి ఎంత వీలైతే అంత తిరిగి చూడాలనుకుంది. తన చుట్టూ ఉన్నది తనలాంటి వారే కాబట్టి ‘అమ్మో అంత ఖర్చా? మేము నీతో రాము’ అన్నారు. ‘వెళితే నువ్వొక్కదానివే వెళ్లు’ అన్నారు. ‘వెళ్లలేనా?’ అనుకుంది వసంతి. సాధారణంగా ఇలాంటి సమయంలో ఎవరో ఒకరు బ్రేక్ వేస్తారు. కాని వసంతి ఇద్దరు కొడుకులూ వెళ్లిరామ్మా అన్నారు. అలా ఆమె మొదట థాయ్ల్యాండ్ తిరిగి వచ్చింది ఒక్కత్తే. ఆ తర్వాత హిమాలయాలు కనీసం బేస్ క్యాంప్ అయినా చూడాలనుకుంది.యూట్యూబే ట్రెయినర్గా...ఎవరెస్ట్ అధిరోహించడంలో రెండు దశలు. ఒకటి బేస్ క్యాంప్కు చేరుకోవడం. రెండు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం. ఎవరెస్ట్ శిఖరం పై చేరడం చాలా కష్టం కాబట్టి కనీసం బేస్ క్యాంప్ అయినా చేరాలనుకుంటారు. అయితే సముద్ర మట్టానికి 5364 మీటర్ల ఎత్తున ఉన్న బేస్క్యాంప్ వరకూ వెళ్లడం కూడా సామాన్యమైన విషయం కాదు. 7 నుంచి 9 రోజులు పడుతుంది. ఇందుకు ప్రత్యేక శిక్షణ తీసుకోవాలి. వ్యాయామం చేయాలి. బ్రీతింగ్ ఎక్సర్సైజులు ట్రెకింగ్ బూట్లతో నడవగలగడం ఇవన్నీ సాధన చేయాలి. ఆర్థిక వనరులు తక్కువగా ఉన్న వసంతి కేవలం యూట్యూబ్లో చూసి ఇవన్నీ నేర్చుకుంది. రోజూ వ్యాయామం చేసింది. నాలుగు గంటల పాటు వాకింగ్ చేసింది. ట్రెకింగ్ షూస్ వేసుకుని నడిచింది. హిమాలయాల్లో కమ్యూనికేషన్ ఇబ్బంది రాకుండా కాస్తో కూస్తో హిందీ కూడా నేర్చుకుంది. ఆ తర్వాత అందరికీ చెప్తే విస్తుపోయారు. చివరకు అభినందనలు తెలిపి సాగనంపారు.ప్రతికూలతలునేపాల్లోని లుల్కా ఎయిర్పోర్ట్కు చేరుకుని అక్కడి నుంచి దశల వారీగా బేస్క్యాంప్ వెళ్లాలనుకుంది వసంతి. అయితే వాతావరణం సరిగా లేకపోవడం వల్ల ఆమె ఎక్కాల్సిన లుల్కా విమానం ఎగరలేదు. దాంతో చిక్కుబడిపోయింది. అప్పుడు ఒక జర్మన్ జంట లుల్కా నుంచి కాకుండా సుర్కె నుంచి వెళదామని సాయం చేశారు. ఫిబ్రవరి 15న సుర్కె నుంచి ఆమె ట్రెకింగ్ మొదలైంది. ఏమాత్రం అనువుగా లేని కాలిబాట దారుల్లో ఆమె ప్రతి ఐదు నిమిషాలకు దీర్ఘశ్వాస తీసుకుంటూ రోజుకు 7 గంటలు నడిచి విశ్రాంతి తీసుకుంటూ మొత్తం 9 రోజులు నడిచి చివరకు బేస్ క్యాంప్కు చేరుకోగలిగింది.నా సంప్రదాయం నా గౌరవంవసంతి తనతో పాటు కేరళ సంప్రదాయ చీర తెచ్చుకుంది. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ దగ్గర చేరాక దానిని కట్టుకుని ఫొటో దిగింది. తన సంప్రదాయ ఘనత చాటింది. వసంతిని ఇప్పుడు కేరళ మాత్రమే కాదు నెరవేరని ఆకాంక్షలు గల స్త్రీలందరూ అబ్బురంగా చూస్తున్నారు. (చదవండి: ఏడు పదుల వయసులో ఫిట్గా మోదీ..! ఆరోగ్య రహస్యం ఇదే..) -
Sunita William పూర్వీకుల ఇల్లు ఇదే! వైరల్ వీడియో
నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో (మార్చి 19 ఉదయం) అంతరిక్షం నుండి తిరిగి రావడం ప్రపంచవ్యాప్తంగా ఎంతో సంతోషాన్ని నింపింది. నిజంగా దివి నుంచి భువికి వచ్చిన దేవతలా స్పేస్ఎక్స్ క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చి, చిరునవ్వులు చిందించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈనేపథ్యంలోనే ఆమె పూర్వీకులు, ఎవరు? ఏ రాష్ట్రానికి చెందినది అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి. సునీతా విలియమ్స్ తండ్రి దీపక్ పాండ్యా, గుజరాత్లోని ఝులసన్ గ్రామానికి చెందినవారు. ఇక్కడే ఆమె పూర్వీకుల ఇల్లు (Ancestral Home) ఉంది. తొమ్మిది నెలల ఉత్కంఠ తరువాత ఆమె సురక్షితంగా భూమికి తిరిగి రావడంతో ఆ గ్రామంలో సంబరాలు నెలకొన్నాయి. ఆమె రాకను ప్రత్యక్షంగా చూడటానికి గ్రామం మొత్తం ఒక ఆలయం దగ్గర ఏర్పాటు చేసిన టీవీల ముందు గుమిగూడి సునీతను చూడగానే ఆనందంతో కేరింతలు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో విశేషంగా నిలిచింది. View this post on Instagram A post shared by India Today (@indiatoday) ఇది సునీత తండ్రి దీపక్ పాండ్య పూర్వీకులకు సంబంధించిన ఇల్లుగా భావిస్తున్నారు. ఇండియా టుడే షేర్ చేసిన వీడియో ప్రకారం, సునీత పూర్వీకుల ఇల్లు ఇప్పటికీ ఉంది. అయితే, ఎత్తైన ఈ ఇంటికి చాలా కాలంగా ఇల్లు లాక్ చేయబడి ఉండటం వల్ల కొంచెం పాతబడినట్టుగా కనిపిస్తోంది. అక్కడక్కడా పగుళ్లు కూడా ఉన్నాయి. అయితే సునీతకు భారతదేశంతో ఉన్న అనుబంధానికి నిదర్శనం. 1958లో ఆమె తల్లిదండ్రులు అమెరికాకు వెళ్లడంతో ఇంటికి సరైన నిర్వహణలేకుండా ఉంది. అయినప్పటికీ ఇప్పటికీ అది దృఢంగానే కనిపిస్తోంది. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సునీత విలియమ్స్ను భారత్ రావాల్సిందిగా ఆహ్వానించిన నేపథ్యంలో ఆమె, సొంత గ్రామానికి వస్తారా? పూర్వీకుల ఇంటిని సందర్శిస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది.సమోసా పార్టీసునీతా విలియమ్స్ వదిన, ఫల్గుణి పాండ్యా ఈ క్షణాన్ని 'అద్భుతం'గా అభివర్ణించారు. త్వరలో ఆమె కుటుంబం త్వరలో భారతదేశాన్ని సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారన్నారు. ఈ సందర్బంగా తమ పూర్వీకుల గ్రామం ఝులసన్తో బలమైన సంబంధాన్ని ఆమె గుర్తు చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సమోసా తిన్న మొదటి వ్యక్తి సునీత కాబట్టి, ఆమె సురక్షితంగా తిరిగి రావడాన్ని పండుగలా జరుపుకునేందుకు కుటుంబం సమోసా పార్టీ ఇస్తుందని కూడా ఆమె చమత్కరించారు. చదవండి: సునీతా త్వరలో ఇండియాకు వస్తారు.. సమోసా పార్టీ కూడా!తొమ్మిది నెలలు అంతరిక్షంలోనేఒక వారం రోజుల మిషన్మీద రోదసిలోకి వెళ్లిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ కొన్ని సాంకేతిక కారణాల వల్ల అక్కడే చిక్కుకు పోయారు. తొమ్మిది నెలల తర్వాత, వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుండి భూమికి తిరిగి వచ్చారు. అచంచలమైన ధైర్య సాహసాలు, అకుంఠిత దీక్ష, అంకితభావంతో సునీతా విలియమ్స్ ఒక రోల్మోడల్గా నిలిచారు.చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు? -
భూమి మీదకు రాగానే.. స్విమ్మింగ్ పూల్లోనే ఎక్కువ సమయం ఎందుకు?
స్పేస్ ట్రావెల్ టాస్క్ ముందు పురుషులకే పరిమితమై దాన్ని ‘మ్యాన్ మిషన్’గా వ్యవహరించేవాళ్లు. కానీ ఆస్ట్రనాట్స్కిచ్చే ట్రైనింగ్లో ఆడ, మగ అనే తేడా ఉండదు. ఇద్దరూ ఒకేరకమైన శక్తితో ఉంటారు. ఇంకా చెప్పాలంటే శారీరకంగా, మానసికంగా పురుషుల కన్నా స్త్రీలే బెటర్. అందుకే ఇప్పుడు దాన్ని ‘హ్యుమన్ మిషన్’ పేరుతో జెండర్ న్యూట్రల్ (Gender Neutral) చేశారు. మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్గా ఉన్న వాళ్లనే స్పేస్కి సెలెక్ట్ చేసుకుంటారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ దగ్గర్నుంచి అక్కడ పరిస్థితి, అనుకోని అవాంతరాలను ఎదుర్కోవడం వరకు ట్రైనింగ్ చాలా టఫ్గా ఉంటుంది.ఆస్ట్రనాట్ సేఫ్టీ అనేది చాలా ముఖ్యం. అందుకే ఒకవేళ మిషన్ ఫెయిలైతే స్పేస్ షిప్ (Space Ship) నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా శిక్షణ ఇస్తారు. ఇదీ వాళ్ల మానసిక, శారీరక దారుఢ్యం మీదే ఆధారపడి ఉంటుంది. వీటన్నిటిలో సునీతా విలియమ్స్ (Sunita Williams) పర్ఫెక్ట్. కాబట్టే స్పేస్ స్టేషన్కి వెళ్లారు. అయితే ఎనిమిది రోజులు మాత్రమే ఉంటామనే మైండ్సెట్తో వెళ్లిన వాళ్లు తొమ్మిది నెలలు ఉండిపోవాల్సి వచ్చింది. అలా స్పేస్ స్టేషన్లో చిక్కుకుపోయిన విలియమ్స్, మరో ఆస్ట్రోనాట్ను నాసా వాళ్లు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తునే ఉన్నారు.ఆహారం దగ్గర్నుంచి వాళ్ల అవసరాలన్నీ కనిపెట్టుకున్నారు. ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అందుకే వాళ్లక్కడ క్రమం తప్పకుండా ఎక్సర్సైజెస్ చేశారు. వాళ్లు తమ హెల్త్ కండిషన్స్ను చెక్ చేసుకునేందుకు కావల్సిన సౌకర్యాలన్నీ స్పేస్ స్టేషన్లో ఉన్నాయి. నాసా డాక్టర్స్ సలహాలు, సూచనల మేరకు వాళ్లు తమ హెల్త్ కండిషన్స్ను చెక్ చేసుకుంటూ ఉన్నారు. మూడు నెలలకోసారి ఫుడ్, మెడిసిన్స్ను స్పేస్ స్టేషన్కి పంపారు. వాళ్ల మానసిక స్థితిని కూడా ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ మనోస్థైర్యం కోల్పోకుండా చూసుకున్నారు.స్విమ్మింగ్ పూల్... లిక్విడ్ ఫుడ్తొమ్మిది నెలలు భారరహిత స్థితికి అలవాటు పడిన వాళ్లు ఇప్పుడు ఒక్కసారిగా భూమి మీది వాతావరణంలో ఇమడ లేరు. ఎముకలు, కండరాలు బలహీనమైపోతాయి. ఫ్యాట్ కనీస స్థాయికి తగ్గిపోయుంటుంది. భూమి మీదకు రాగానే ముందు వాళ్లకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఎముకలు, కండరాల పటుత్వానికి మెడిసిన్స్ ఇస్తారు. ఇన్నాళ్లూ భారరహిత స్థితిలో ఉండటం వల్ల వాళ్లు నిలబడలేరు.. కూర్చోలేరు.. పడుకోలేరు. అలా ఫ్లోటింగ్ స్థితిలోనే ఉండిపోతారు.అందుకే వాళ్లకు బెల్ట్ లాంటిది పెట్టి.. కూర్చోబెడతారు. దాని సాయంతోనే పడుకోబెడతారు. నిలబడ్డానికీ అలాంటి సపోర్ట్నే ఏర్పాటు చేస్తారు. ఈ వాతావరణానికి వీలైనంత త్వరగా అలవాటుపడేందుకు ఎక్కువ సమయం వాళ్లను స్విమ్మింగ్ పూల్లో ఉంచుతారు. నీళ్లలో తేలుతూ స్పేస్లో ఉన్నట్టే ఉంటుంది కాబట్టి.. వాళ్లను వాళ్లు సంభాళించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. దాదాపు మూడు నెలల వరకు ఇలాంటి ప్రాసెసే ఉంటుంది. దాన్నుంచి వాళ్లు నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తారు. ఆహారం విషయంలోనూ అంతే! కొన్నాళ్లపాటు స్పేస్లో తీసుకున్నట్టే సెమీ లిక్విడ్ ఫామ్లోనే ఫుడ్ ఇస్తారు. – డాక్టర్ ఎస్వీ సుబ్బారావు, సీనియర్ సైంటిస్ట్, అసోసియేట్ డైరెక్టర్, రేంజ్ ఆపరేషన్, ఇస్రోభూమికి తిరిగి వచ్చిన తరువాత... రివర్స్!సునీతా విలియమ్స్కు ఇష్టమైన సినిమా... టామ్ క్రూజ్ ‘టాప్ గన్’. ‘టాప్ గన్’ కిక్తో జెట్లు నడపాలనుకుంది. హెలికాప్టర్ నడపాలనుకుంది. ‘టెస్ట్ పైలట్ స్కూల్’కు హాజరై, ఆస్ట్రోనాట్స్తో మాట్లాడిన తరువాత తన మీద తనకు నమ్మకం వచ్చింది. చదవండి: గురుత్వాకర్షణ లేని కురుల అందంఒకానొక సందర్భంలో అంతరిక్ష వాతావరణంలో ఉన్నవారిపై చోటు చేసుకునే ఆశ్చర్యాల గురించి ఇలా చెప్పింది... ‘అంతరిక్షంలో శారీరక మార్పులు ఆసక్తికరంగా ఉంటాయి. నా జుట్టు, గోర్లు వేగంగా పెరగడాన్ని గమనించాను. ముఖంపై కొన్ని మడతలు తాత్కాలికంగా తొలగిపోతాయి. వెన్నెముకకు సంబంధించి కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే భూమికి తిరిగి వచ్చిన తరువాత ఈ మార్పులు రివర్స్ అవుతాయి. వెన్ను కొద్దిగా నొప్పిగా ఉంటుంది’ అని పేర్కొంది. -
వెల్కమ్ సునీత
వినోదం కోసం నిర్మించే ‘బిగ్బాస్’ షోను మనం ఫాలో అయినట్టుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీత విలిమయ్స్ వార్తలు ఫాలో అయ్యామా? 60 ఏళ్ల వయసులో ఆమె ఏం చెప్పడానికి అంతరిక్షంలో పరిస్థితులను ధిక్కరించి చిర్నవ్వును నిలబెట్టుకుంది? ‘నీకేం రాదు ఊరుకో’ అని ఇకపై స్త్రీలతో ఎవరూ అనకూడదు. సైకిల్ నుంచి స్పేస్ స్టేషన్ వరకు వారు రిపేర్ చేయగలరు. వెల్కమ్ సునీతా. నీ విజయం మాకు గర్వకారణం... సునీత విలియమ్స్ అంతరిక్షాన్ని జయించి సగర్వంగా భూమిని తాకనున్న మహిళ.పదిరోజుల ముందు మహిళా దినోత్సవం చేసుకున్నాం కదా. ఆ దినం వస్తుంది అంటేనే నాకు భయం వేస్తుంది. మహిళకు పది, పదహారు చేతులు పెట్టి ఓ చేతిలో కంప్యూటర్, ఓ చేతిలో పెన్ను, పుస్తకం, ఓ చేతిలో చీపురు కట్ట, ఇంకో చేతిలో అట్లకాడ; ఆడాళ్ళు ఏ పనైనా చేసేస్తారు, చేసెయ్యాలి; కానీ ఎంత గొప్ప పనులు చేసినా డిఫాల్ట్గా అట్లకాడ లేదా పప్పు గరిట లేనిదే స్త్రీ శక్తికి పరిపూర్ణత రాదు అని సందేశం ఇస్తారు. ఈ తలతిక్క వేడుకల మధ్యలో సునీత విలియం జీవన ప్రయాణం, వ్యోమగామిగా ఆమె సాధించిన విజయాలు, అంతరిక్ష నడకలు, నాసాకి చేసిన కృషి గురించి గుర్తు చేసుకోవడం ఒక ఊరట. స్టెమ్ రంగాలలో మహిళల విజయాలకు స్ఫూర్తిమంతమైన వేడుక.1965లో అమెరికాలో పుట్టిన సునీత నేపథ్యం రీత్యా, తండ్రి దీపక్ పాండ్యా గుజరాతీ కావడం భారతీయులకు ఆమెను దగ్గర చేసే అంశం కాగా సునీత విజయాలు తేదీలతో,ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రపంచ మహిళలంతా ఉత్సవాలు చేసుకోవలసిన సందర్భం. సునీత తొమ్మిదిసార్లు; అరవై గంటలకన్నా ఎక్కువ సమయం స్పేస్ వాక్ చేశారు. స్పేస్ వాక్ చేసిన మహిళలందరిలో ‘ఎక్కువ సమయం’ రికార్డ్ ఆమెదే.భారత ప్రభుత్వం ఇచ్చిన పద్మభూషణ్, గుజరాత్ టెక్నలాజికల్ యునివర్సిటీ గౌరవ డాక్టరేట్, విశ్వ గుజరాత్ సొసైటీ వారి సర్దార్ వల్లభభాయ్ పటేల్ విశ్వప్రతిభ అవార్డుతో పాటు, రష్యా ప్రభుత్వం మెడల్ ఫర్ మెరిట్ ఇన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్, అమెరికన్ డిఫెన్స్ సర్వీస్ సుపీరియర్ మెడల్ లాంటి లెక్కకు మిక్కిలి అవార్డులు ఆమె ఖాతాలో చేరి తమ గౌరవాన్ని పెంచుకున్నాయి. సునీత నౌకాదళంలో డైవింగ్ ఆఫీసర్ గా పనిచేశారు. ఆమె 2770 కన్నా ఎక్కువ గంటలు విమానాలు నడిపారు. నాసాలో అంతరిక్ష ప్రయాణానికి సంబంధించిన శిక్షణ తీసుకున్నారు. 2006–07లో ఖీ –116 మిషన్ ద్వారా మొదటిసారి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్లి అక్కడ 195 రోజులు గడిపారు. ఆ తర్వాత 2012లో ఎక్స్పెడిషన్ 32/33లో మరొకసారి అంతరిక్షం చేరుకుని, బోలెడు ప్రయోగాలు చేశారు. ఇంకా చాలా చాలా. గత జూన్ లో స్వల్పకాల మిషన్ కోసం అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు కానీ, బోయింగ్ స్టార్లైనర్ అంతరిక్ష నౌకలో లోపాలు తలెత్తడంతో అక్కడే దీర్ఘకాలం చిక్కుకుపోయినా మొక్కవోని ధైర్యం ప్రదర్శించి భూమికి వెనుతిరిగారు.ఐ కమాండర్ సునీత న్యూస్ విన్నప్పుడు నాకు అనేక విషయాలు ఆలోచనకు వచ్చాయి. మానవ జాతికి పనికి వచ్చే పరిశోధనల కోసం ఆస్ట్రోనాట్స్ అంతరిక్షానికి వెళతారు. అదే క్రమంలో సునీత స్పేస్స్టేషన్లో చిక్కుకుని పోతే భూమ్మీద కులాసా జీవితం గడిపే మనం ఎంతమాత్రం వారి గురించి తలచుకున్నాం? వినోదంలో భాగంగా ఒక హౌస్లో కొందరు చేసే అల్లరి, ఆటపాటలు, న్యూసెన్ ్స గొడవలు చూపిస్తే, ఎందుకూ పనికిరాని వాటిని ఆసక్తితో చూస్తూ వుంటాం.సునీత అంతరిక్షంలో గడిపిన సమయంపై టీవీలో వస్తే ఆ సమాచారానికి, ముఖ్యంగా మనప్రాంతంలో టీఆర్పీ రేటింగ్స్ ఏ మేరలో ఉంటాయో! మొత్తంగా మన ఆసక్తులను పునర్ నిర్వచించమని, వాటిని పనికొచ్చే కార్యక్రమాల్లో పెట్టమని సునీత ఇవాళ మనకు సందేశం ఇస్తోంది. సునీత, అరవై ఏళ్లకు దగ్గర పడుతున్నది. ఈ దశలో చాలామంది ఆడవాళ్ళు పోస్ట్ మెనోపాజ్ సమస్యలను ఎదుర్కొంటూ ఇవాళ బాగా గడిస్తే చాలు, ఇంట్లో పనులు అవసరం అయినంత మేర చేస్తే చాలు, ఆఫీసులో అక్షింతలు పడకుండా బైటపడితే చాలు అనుకుంటారు. కానీ ఈ దశ మరింత ఉత్పాదక అభివృద్ధికి అడ్డంకి కాదు అని సునీత మనతో చెబుతోంది. సైకిల్ మెకానిజం సైతం మగవారి డొమైన్గా పరిగణన చేసే మన సమాజంలో, కృషి, పట్టుదలకి తోడు అవకాశం కల్పిస్తే మహిళ ఎయిర్ మెకానిక్ కావడం సాధ్యమే అని సునీతని చూస్తే అర్థం అవుతోంది. – డాక్టర్ ఎం.ఎస్.కె. కృష్ణజ్యోతి, ప్రోఫెసర్, రచయిత్రి -
వ్యోమగాములు జుట్టును ముడి వేసుకోరు.. కారణం?
భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, అమెరికా వ్యోమగామి బుచ్ విల్ మోర్ లు సుమారు తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. వారి రాక కోసం అంతా నిరీక్షించారు. ఎట్టకేలకు ఆ ఉత్కంఠకు తెరపడేలా మరికొద్దిగంటల్లో భూమ్మీదకు రానున్నారు. వారు అన్నిరోజులు అంతరిక్షంలో ఎలా గడిపారు, వారి మానసికస్థితి వంటి వాటి గురించి తెలుసుకోవాలనే కుతుహలంతో ఉన్నారు అంతా. ఒకరకంగా ఈ పరిస్థితి వల్ల భవిష్యత్తు అంతరిక్షంలో మానువుని మనుగడ గురించి కొత్త విషయాలు తెలుసుకునే అనుభవం దొరికిందని మరికొందరు నిపుణులు అంటున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. ఆ ఇరువురు చిక్కుపోయిన సమయంలో ఎప్పటికప్పుడూ వారెలా ఉన్నారనే దాని గురించి ఫోటోల రూపంలో అప్డేట్ ఇచ్చేది. ఆ ఫోటోల్లో సునీతా ఎప్పుడు వదులుగా ఉన్న జుట్టుతోనే కనిపించేవారు. నిజానికి ఆ చిత్రాలు చాలామందిలో ఓ ఉత్సుకతను రేకెత్తించింది. అసలు ఎందుకని మహళా వ్యోమగాములు అంతరిక్షంలో జుట్టుని ముడివేసుకోరనే ప్రశ్నను లేవెనెత్తింది. మరీ దీని వెనుకున్న రీజన్, ఆ సైన్సు ఏంటో చూద్దామా..!.అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో వ్యోమగామి సునీతా విలియమ్స్ వదులుగా ఉన జుట్టుతో కనిపించేవారు. ఆమె జుట్టు అంతరిక్షంలో గాల్లో ఎగురుతున్నట్లుగా కనిపించేది. అదిగాక ఇటీవల అమెరికా అధ్యక్షుడు చిక్కుపోయిన ఈ ఇరువురు వ్యోమగాముల గురించి మాట్లాడుతూ..సునీతా విలియమ్స్ జుట్టుపై వ్యాఖ్యలు చేశారు. అడవిలా గాల్లో తేలుతున్నట్లు కనిపిస్తున్న ఆ ధృడమైన జుట్టుని చూస్తేనే తెలుస్తోంది ఆమె ఎంత ధైర్యవంతురాలేనది అని హాస్యాస్పదంగా అన్నారు.ఆ తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలకుగానూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్కి గురయ్యారు కూడా. ఆ నేపథ్యంలోనే వ్యోమగాములు, ముఖ్యంగా మహిళలు అంతరిక్షంలో తమ జుట్టును ఎలా నిర్వహిస్తారనే విషయం హైలెట్ అయ్యింది.అదీగాక సునీతా విలియమ్స్లాంటి వ్యోమగాములంతా కూడా తమ జుట్లుని ముడివేయడం లేదా రబ్బర్తో కట్టేయడం వంటివి ఎందుకు చెయ్యరు అని అంశంపై చర్చించడం ప్రారంభించారు అంతా. అందుకు సైన్సు పరంగా పలు కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.అవేంటంటే..గురుత్వాకర్షణ శక్తి శూన్యం కాబట్టి.. జుట్టును క్రిందికి లాగదు కాబట్టి ముడివేయడం లేదా కట్టేయడం వంటివి చేయాల్సిన పనిలేదు. సులభంగా వాషింగ్ చేసుకోవచ్చట. ఎలాంటి షాంపులతో పనిలేకుండానే వాష్ చేయొచ్చట. పైగా టవల్తో తుడుచుకోవాల్సిన పని ఉండదట. ఇక డ్రైయర్లతో అస్సలు పని ఉండదట. ఎందకంటే జుట్టులోని నీరంతా ఆవిరి అయిపోతుందట . అలాగే అక్కడ ఉంటే జీరో గ్రావిటేషన్ కారణంగా ఇలా జుట్టు ఫ్రీగా వదిలేసినా..ముఖం మీదకి వచ్చి ఇబ్బంది పడే సమస్య ఉండదట. దీనిపై నాసా వ్యోమగామి కరెన్ నైబర్గ్ సోషల్ మీడియా వేదికగా తన అంతరిక్ష అనుభవాలను షేర్ చేసుకుంటూ..ఆ అంతరిక్షంలో తన హెయిర్ కేర్ రొటీన్ గురించి కూడా మాట్లాడారు. 2013లో ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఉన్నప్పుడు తన పొడవాటి జుట్టుని ఎలా వాష్ చేసుకుందో వివరించింది. తాము నీటిని చిమ్ముకుంటూ వాష్ చేసుకుంటామని తెలిపింది. తమకు షాంపుల వాడకం, అలాగే తడిచిన జుట్టుని పిండాల్సిన పని గానీ ఉండదని చెప్పింది. ఎందుకంటే తలపై ఉన్న నీరంతా అంతరిక్షంలో ఘనీభవించి త్రాగునీరుగా మారిపోతుందని చెప్పుకొచ్చింది.(చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు?) -
అత్యంత ధనవంతుడైన ఐఏఎస్ అధికారి! జీతం ఒక్క రూపాయే..!
ఇంతవరకు ఎంతోమంది ఐఏఎస్ అధికారులను చూసి ఉండుంటారు. అతెందుకు టీనా దాబి, అమిత్ లోధా వంటి ఎందరో సెలబ్రిటీ హోదాని పొందిన అధికారులను చూశాం. కానీ ఈ ఐఏఎస్ అధికారి గురించి విని ఉండటం అత్యంత అరుదు. ఒక్క రూపాయే జీతం తీసుకున్న ఐఏఎస్ అతడు. కానీ కలెక్టర్లందరి కంటే అత్యంత ధనిక కలెక్టర్ ఆయన. ఎవరా కలెక్టర్ అంటే..అతడే ఐఏఎస్ అమిత్ కటారియా. ఆయన హర్యానాలోని గురుగ్రామ్లో ఒక సంపన్న కుటుంబం నుంచి వచ్చారు. అతడి కుటుంబం కోట్లలో వార్షిక టర్నోవర్తో దూసుకుపోతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని రన్ చేస్తోంది . అంతేగాదు ఆ వ్యాపార సామ్రాజ్యం ఢిల్లీ ఎన్సీఆర్ అంతటా విస్తరించి ఉంది. అయితే కటారియా కుటుంబ వ్యాపారాన్ని పక్కకుపెట్టి మరీ దేశానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతో సివిల్ సర్వీస్లో చేరాలని నిర్ణయించుకున్నాడు. అలా కటారియా ఐఏఎస్ అయిన ధనవంతుడుగా నిలిచాడు.. ఎడ్యుకేషన్ బ్యాగ్రౌండ్.. అమిత్ కటారియా తన పాఠశాల విద్యను ఆర్కే పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పూర్తి చేశారు. తర్వాత ప్రతిష్టాత్మక ఐఐటీ ఢిల్లీలోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బి.టెక్ డిగ్రీని పొందారు. గ్రాడ్యుయేషన్ తర్వాత, కటారియా UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(CSE)కి ప్రిపేరవ్వడం ప్రారంభించారు. చివరికి 2003లో సివిల్స్ నియామక పరీక్షలో ఉత్తీర్ణుడై ఐఏఎస్ అయ్యారు. ఆయన ఆల్ ఇండియా 18వ ర్యాంకు సాధించి తన కలను సాకారం చేసుకున్నారు. చత్తీస్గడ్ కేడర్లో కలెక్టర్గా విధులు నిర్వర్తించారు. అయితే ఐఏఎస్ అమిత్ కటారియా సివిల్ సర్వీసెస్లో చేరినప్పుడు కేవలం రూ. 1 జీతమే తీసుకునేవారని సమాచారం. అందుకు కటారియా తాను దేశానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఐఏఎస్ అయ్యానని అంటుండేవారని అంతరంగికులు చెబుతున్నారు. అమిత్ కటారియా 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగిన సమావేశంలో బ్లాక్ సన్ గ్లాసెస్ ధరించి రావడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. ఇది ప్రోటోకాల్కు విరుద్ధం. ఆ సమయంలో కటారియా ఛత్తీస్గఢ్లోని నక్సల్ ప్రభావిత బస్తర్ జిల్లా జిల్లా కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అప్పటి చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ నుంచి షోకాజ్ నోటీసులు కూడా అందుకున్నారు. వైవాహిక జీవితం..ఐఏఎస్ అమిత్ కటారియా వృత్తిరీత్యా వాణిజ్య పైలట్ అయిన అస్మితా హండాను వివాహం చేసుకున్నారు. ఈ జంట తరుచుగా ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. పైగా ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆ జర్నీల తాలుకా ఫోటోలను షేర చేసుకునేవారు. ఇక ఈ ఐఏఎస్ అమిత్ కటారియా ఆస్తులు నికర విలువ దాదాపు రూ. 8.90 కోట్లు పైనే అని అంచనా. (చదవండి: సైన్స్ కోర్సు చదవలేకపోయా..! క్షణాల్లో వీడియో వైరల్.. ఏకంగా కేంద్ర విద్యామంత్రే..) -
సైన్స్ కోర్సు చదవలేకపోయానంటూ.. కన్నీళ్లు పెట్టుకుంది! కట్చేస్తే..
తల్లిదండ్రులు ఒక్కోసారి తమ పిల్లలు చదవాలనుకున్న ఉన్నత చదువులను చదివించలేకపోవచ్చు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆ స్థాయి చదువులను చదివించలేకపోతుంటారు. కొందరేమో..! మగపిల్లవాడు కదా అని వాడిని మాత్రం అప్పోసొప్పో చేసి మరీ చదివిస్తుంటారు. ఆడపిల్లలని మాత్రం ఏ సర్కారీ బడిలోనో జాయిన్ చేసి.. తూతూ మంత్రంగా చదివిస్తుంటారు. పాపం అలానే ఇక్కడ ఈ అమ్మాయి విషయంలో తల్లిదండ్రులు చేశారు. అయితే ఆ అమ్మాయి డ్రీమ్ని నెరవెర్చేందుకు కేంద్ర విద్యా మంత్రే కదిలొచ్చారు. అదెలా జరిగిందంటే..బీహార్లోని దానాపూర్కు చెందిన విద్యార్థిని ఖుష్బు కుమారి తాను సైన్సు కోర్సులో జాయిన్ అయ్యి డాక్టర్ అవ్వాలనుకుంది. అయితే ఇంట్లో పరిస్థితులు అంతంత మాత్రమే కావడంతో తల్లిదండ్రులు ఆ అమ్మాయిని బలవంతంగా ఆర్ట్స్ కోర్సులో జాయిన్ చేశారు. దీంతో ఆ అమ్మాయి తన తల్లిదండ్రుల కారణంగా తన డ్రీమ్ని ఎలా కోల్పోయిందో ఓ వీడియోలో వివరించింది. ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యి కేంద్ర ప్రభుత్వం దృష్టికి చేరింది. ఆ బాలిక వీడియోలో తన తల్లిదండ్రులు చూపిస్తున్న లింగ వివక్షపై విరుచుకుపడుతూ.. తన గోడుని వెళ్లబోసుకుంది. తాను ఇంటర్లో సైన్స్ కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్నా..కానీ నా తల్లిదండ్రులు పదిలో 400 మార్కులకు తెచ్చుకుంటే నీకు నచ్చిన కోర్సులో జాయిన్ అవ్వచ్చని అన్నారు. అయితే తాను 399 మార్కులే స్కోర్ చేయడంతో తన కల కలగానే మారిపోయిందని కన్నీళ్లుపెట్టుకుంది. అబ్బాయిలకు మాత్రమే నచ్చిన చదువు చదువుకునే స్వేచ్ఛ ఉంది. ఆడపిల్లలకు ఉండదు. కనీసం తమకు ఫోన్ కూడా ఇవ్వరు పేరెంట్స్ అంటూ భోరుమంది వీడియోలో. అంతే ఆ వీడియోపై కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే స్పందించి.. ఆమెకు చదవు విషయంలో పూర్తి మద్దతిస్తానని హామీ ఇచ్చారు. పాట్నా జిల్లా మేజిస్ట్రేట్ ఏర్పాటు చేసిన వీడియో కాల్లో మంత్రి ప్రధాన్ ఆ బాలికతో నేరుగా మాట్లాడారు. తల్లిదండ్రులపై ఎలాంటి ద్వేషం పెట్టుకోవద్దని చెప్పడమే గాక బాగా చదువుకోవాలని సూచించారు. అలాగే ఆమె చదువాలనుకున్న చదువుకి కావాల్సిన ఏర్పాట్లను బిహార్ సీఎం నితీష్ కుమార్ చూసుకుంటారని చెప్పారు మంత్రి ప్రధాన్. ఆ బాలిక ప్రతిస్పందనగా.. మంచి కళాశాలో సైన్సు కోర్సులో చేరాలన్న తన కోరికను కేంద్రమంత్రికి విన్నవించింది. ఆయన అందుకు తగిన ఏర్పాటు చేసేలా పాట్నా జిల్లా మేజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్కి ఆదేశాలు జారీ చేశారు. 2025-27 విద్యా సంవత్సరానికే ఆమెకు నచ్చిన కోర్సులో జాయిన్ అయ్యేలా వెసులబాటు కల్పించనున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. కాగా, ఆ అమ్మాయి తల్లిదండ్రులు తమ ఆర్థిక స్థోమత దృష్ట్యా తమ కూతురిని ఇలా బలవంతంగా ఆర్ట్స్ కోర్సులో జాయిన్ చేశామని చెప్పారు. ఏదీఏమైతేనేం తన కోరిక నెరవేర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వమే దిగొచ్చేలా చేసింది. (చదవండి: ఎవరీ తారా ప్రసాద్..? ఆనంద్ మహీంద్రా ప్రశంసల జల్లు..) -
ఎవరీ తారా ప్రసాద్..? ఆనంద్ మహీంద్రా ప్రశంసల జల్లు..
విల్లులా శరీరాన్ని వంచుతు చేసే సాహస క్రీడ స్కేటింగ్. అలాంటి స్కేటింగ్కి న్యత్యం జత చేసి మంచుపై అలవోకగా చేసే.. ఈ ఫిగర్ స్కేటింగ్ అంతకుమించిన సాహస క్రీడ. అలాంటి కష్టతరమైన సాహస క్రీడలో సత్తా చాటుతూ..మీడియా దృష్టిని ఆకర్షించింది ఈ భారత సంతతి టీనేజర్. ఆమె భారత్ తరఫున ఆడి గెలవడం కోసం తన అమెరికా పౌరసత్వాన్ని తృణప్రాయంగా వదులకుంది. పుట్టి పెరిగిన అమెరికా కంటే భారతవనే తన మాతృదేశం అంటూ..విశ్వ వేదిక మూడు రంగుల జెండాను రెపరెపలాడిస్తోంది. ఈ పాతికేళ్ల యువకెరటం పేరు తారా ప్రసాద్. ఈ అమ్మాయి సాధించిన విజయాల గురించి వివరిస్తూ..మహీంద్రా గ్రూప్ చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ పెట్టారు. అంతేగాదు ఆ పోస్ట్లో మహీంద్రా తారను అభినందనలతో ముంచెత్తారు. దీంతో ఒక్కసారిగా ఎవరీ అమ్మాయి అంటూ ఇంటర్నెట్లో సర్చ్ చేయడం మొదలు పెట్టారు. ఇంతకీ ఈ టెక్ దిగ్గజం ఆనంద్ మెచ్చిన ఆ యువ తార ఎవరో చూద్దామా..!ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో స్ఫూర్తిదాయకమైన కథలు పంచుకుంటూ ఉండే ఆనంద్ మహీంద్రా ఈసారి ఫిగర్ స్కేటర్ తారా ప్రసాద్ని ప్రశంసిస్తూ పోస్టు పెట్టారు. దానికి తారా చేసిన ఫిగర్ స్కేటింగ్ వీడియోని కూడా జత చేశారు. ఆ ఫిగర్ స్కేటింగ్ చూస్తే.. ఎవ్వరైనా కళ్లు ఆర్పడం మర్చిపోతారు. అంతలా ఒళ్లు జల్లుమనేలా ఉంటుంది ఈ క్రీడ. అందువల్లే ఈ బిజినెస్ దిగ్గజం మహీంద్రా ఆమె అద్భుత ప్రతిభను ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు మహీంద్రా పోస్ట్లో.."ఇటీవల తన స్నేహితుడొకరు ఈ అమ్మాయి స్కేటింగ్ ప్రతిభకు సంబంధించిన వీడియో పంపించేంత వకు ఆమె గురించి నాకు తెలియదు. ఓ వైపు నృత్యం చేస్తూ..మరోవైపు గాలలో ఎగురుతూ.. చేస్తున్నా ఆమె ఫిగర్ స్కేటింగ్కి విస్తుపోయే. ఆమె అద్భుత ప్రతిభ నన్ను ఎంతగానో కట్టిపడేసింది.అంతేగాదు ఆమె భారత్కి ప్రాతినిథ్యం వహించాలన్న ఉద్దేశ్యంతో 2019లో అమెరికా పౌరసత్వాన్ని భారతీయ పౌరసత్వంగా మార్చుకుంది. ఏకంగా మూడుసార్లు జాతీయ ఛాంపియన్షిప్ పోటీల్లో గెలుపొందింది. గతేడాది వింటర్ ఒలింపిక్స్లో మీరు తృటిలో స్థానం కోల్పోయినా..వచ్చే ఏడాది జరగనున్న వింటర్ ఒలింపిక్స్లో తప్పక విజయం సాధిస్తారు. ఆ విశ్వక్రీడలపై దృష్టిపెట్టి ఒలింపిక్స్ పతక కలను సాకారం చేసుకో తల్లి." అని ఆశ్వీరదీస్తూ మహీంద్రా పోస్ట్లో రాసుకొచ్చారు.తారా ప్రసాద్ ఎవరు?ఫిబ్రవరి 24, 2000లో అమెరికాలో జన్మించింది తారా ప్రసాద్. ఆమె కుటుంబం తమిళనాడు నుంచి వలస వచ్చి అమెరికాలో స్థిరపడింది. అయితే ఆమె అక్కడే పుట్టి పురిగినా..తన మాతృదేశంపై మమకారం వదులుకోలేదు. అందుకు కారణం తన తల్లిదండ్రులే అని సగర్వంగా చెబుతోంది తార. చిన్నప్పుడు స్కేటింగ్ షూస్ కట్టుకుని మంచుగడ్డలపై ఆడుకునేది. అయితే పెద్దయ్యాక దాన్నే ఆమె కెరియర్ ఎంచుకుంటుందని ఆమె కుటుంబసభ్యులెవ్వరూ అనుకోలేదట.ఏమాత్రం పట్టు తప్పిన ప్రమాదాలు జరిగే క్లిష్టమైన ఫిగర్ స్కేటింగ్ క్రీడను ఎంచుకుంది తార. ఇది ఒక కష్టసాధ్యమైన కళాత్మక క్రీడ. చెప్పాలంటే నృత్యం, స్కేటింగ్ మిళితం చేసే ఒక అద్భుత ప్రదర్శన. అలాంటి క్రీడలో కఠోర సాధనతో నైపుణ్యం సాధించింది. భారత్ తరుఫున ప్రాతినిథ్యం వహంచింది..2016లో 'Basic Novice' పోటీల్లో (14 ఏళ్ల లోపు వారు పోటీ పడే కాంపిటీషన్స్) పాల్గొనడంతో మొదలుపెట్టి.. క్రమంగా 'Intermediate Novice' పోటీలు (16 ఏళ్ల లోపు వారు).. ఆపై 'Advanced Novice' (10-16 ఏళ్ల లోపు అమ్మాయిలు) పోటీల్లో సత్తా చాటింది. 2020 నుంచి సీనియర్ విభాగంలో.. భారత్ తరపున బరిలోకి దిగింది. ఆవిధంగా తార 2022, 2023, 2025 సంవత్సరాల్లో భారత జాతీయ ఛాంపియన్షిప్లను గెలుచుకుంది. అయితే.. సియోల్లో ఇటీవలే ముగిసిన 'ఫోర్ కాంటినెంట్స్ ఫిగర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్స్ 2025లో 16వ స్థానంతో సరిపెట్టుకుందీ ఈ టీనేజర్. భారత్లో క్రికెట్కి ఉన్నంత ఆదరణను పిగర్ స్కేటింగ్కి తీసుకురావాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నానంటోంది తార. వచ్చే ఏడాది జరగనున్న 'వింటర్ ఒలింపిక్స్'పై దృష్టి సారించి విజయం సాధించడమే తన లక్ష్యం అని చెబుతోంది. మరీ ఆ యువతారకి ఆల్ద బెట్ చెప్పి.. మరిన్ని విజయాలను సొంతం చేసుకుని మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని మనసారా కోరుకుందాం.Hadn’t heard about Tara Prasad’s accomplishments till a friend recently sent me this clip. Apparently Tara switched her U.S citizenship to an Indian one in 2019 and has since been our national skating champ three times. Well done, Tara. I hope you are in the vanguard of… pic.twitter.com/GK4iL4VrVh— anand mahindra (@anandmahindra) March 11, 2025(చదవండి: స్టూడెంట్ మైండ్ బ్లాక్ స్పీచ్..! ఫిదా అవ్వాల్సిందే..) -
ఈ చిన్నారి పేరు దేశమంతా మారుమోగిపోతోంది!
బినితా చెట్రీ.. వయసు ఎనిమిదేళ్లు. కాని ఇవాళ దేశమంతా పేరు మారుమోగిపోతోంది. అందుకు కారణం ‘బ్రిటన్స్ గాట్ టాలెంట్’ షో (Britain's Got Talent). ప్రపంచవ్యాప్తంగా ఉండే రకరకాల టాలెంట్ను ఆహ్వానించి గుర్తింపునిచ్చే ఈ షోలో పాల్గొనాలని ఎందరికో కల. అలాంటి షోలో బినితా తన డ్యాన్స్తో అందర్నీ స్టన్ చేసింది. చురుకైన స్టెప్స్తో, చిరుతలాంటి మెరుపుతో బినితా చేసిన డ్యాన్స్, హావభావాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.బినితా (Binita Chhetry) స్వస్థలం ఈశాన్య రాష్ట్రమైన అస్సామ్. షోలోకి అడుగుపెట్టిన వెంటనే బినితా తనను తాను పరిచయం చేసుకుంటూ ‘నేను భారతదేశం నుంచి వచ్చాను. బ్రిటన్స్ గాట్ టాలెంట్ నా కలల వేదిక’ అని చెప్పింది. ఇక్కడ గెలవడం తన లక్ష్యం అని, తాను పింక్ ప్రిన్సెస్ హౌస్ (pink princess house) కొనాలని అనుకుంటున్నానని చెప్పి అందరి మనసుల్నీ కొల్లగొట్టింది. తన ముద్దు మాటలతో జడ్జీలను సమ్మోహనపరిచింది. అనంతరం ఆ స్టేజీ మీద చేసిన డ్యాన్స్ చూసి ప్రేక్షకులంతా తన్మయంతో చప్పట్లు కొట్టారు.ఇంత చిన్నవయసులో శివంగిలా చేస్తున్న డ్యాన్స్ చూసి జడ్జీలు, ప్రేక్షకులందరూ లేచి మరీ తనకు అభినందనలు తెలిపారు. ఈ వీడియో వైరల్ (Video Viral)గా మారి, తన గురించి దేశమంతా చెప్పుకునేలా చేసింది. నిరంతర సాధన, పట్టుదల, అనుకున్నది సాధించేదాకా ఆగిపోని దీక్షే తన విజయ రహస్యం అంటోంది బినిత. తన వయసులోని ఎంతో మంది చిన్నారులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ప్రశంసల వర్షంతన మెస్మరైజింగ్ డ్యాన్స్తో అందర్నీ తన వైపు తిప్పుకున్న బినితా చెట్రీపై ప్రశంసల వర్షం కురుస్తుంది. అస్సాం (Assam) ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో పాటు పలువురు మంత్రులు బినితాను పొగడ్తలతో ముంచెత్తారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఆమెను అభినందిస్తూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. బినితా చెట్రీ అనుకున్నది సాధించాలని వారంతా ఆకాంక్షించారు.From Assam to UK: Assam's talent shines at Britain's Got Talent Little Binita Chhetry makes the judges of @BGT go all 'Awww' as she presents a powerful performance and moves to the next round.My best wishes to the little one and hope she is able to buy a pink princess house… pic.twitter.com/G6xk5MEy3M— Himanta Biswa Sarma (@himantabiswa) March 2, 2025 ఎవరీ బినితా చెట్రీ?అస్సాంలోని బోకాజన్లోని అమరాజన్ ప్రాంతానికి చెందిన బినితా చెట్రీ.. రాజస్థాన్లోని జైపూర్లో చదువుతోంది. బ్రిటన్స్ గాట్ టాలెంట్ షో కంటే ముందు ఆమె డాన్సీ ఐకాన్ 2 వైల్డ్ఫైర్లోనూ పాల్గొంది. 2024, ఆగస్టులో ఆల్-స్టైల్ డ్యాన్స్ కాంపిటీషన్ (సోలో)లో బినిత మొదటి రన్నరప్గానూ నిలిచింది. ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో బినితకు లక్షకుపైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె డాన్స్ వీడియోలకు ఫుల్ క్రేజ్ ఉంది.చదవండి: స్టూడెంట్ మైండ్ బ్లాక్ స్పీచ్.. ఫిదా అవ్వాల్సిందే! -
పశు పోషణతో పారిశ్రామికవేత్తలుగా..
మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ఉన్న పథకాలు, శిక్షణ కార్యక్రమాలు, మార్కెట్ మెలకువలు, అందుతున్న రుణాలు, వడ్డీ రేటు, సబ్సిడీలు, ఎక్కడ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అవసరమైన డాక్యుమెంట్లు, సక్సెస్ రేట్ వంటి వివరాలను ‘‘ఓనర్‘షి’ప్’’ పేరుతో ప్రతి శనివారం అందిస్తున్నాం! ఈ వారం స్కీమ్ .. నేషనల్ లైవ్స్టాక్ మిషన్ (ఎన్ఎల్ఎమ్).కేంద్ర ప్రభుత్వ పథకమైన నేషనల్ లైవ్స్టాక్ మిషన్ ద్వారా గొర్రెలు, మేకలు, పందులు, నాటుకోళ్ల పెంపకానికి 50 శాతం సబ్సిడీతో రుణ సదుపాయాన్ని అందిస్తోంది. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నాబార్డ్ సహకారంతో అన్ని సామాజిక వర్గాలూ దీన్ని పొందవచ్చు. అయితే ఈ లోన్ కోసం బ్యాంకులను సంప్రదించినప్పుడు ఎన్.ఎల్.ఎమ్. ద్వారా అందుతున్న ముందస్తు సబ్సిడీ అవకాశం గురించి సిబ్బందికి చెప్పాలి. సిబిల్ స్కోర్ కూడా బాగుండాలి. సొంత లేదా కనీసం అయిదేళ్ల లీజు కింద ఎకరం నుంచి అయిదు ఎకరాల వరకు భూమిని కలిగి ఉండాలి. నాటుకోళ్లు, పందుల పెంపకానికైతే ఎకరం భూమి సరిపోతుంది. గొర్రెలు, మేకలకు సంబంధించి అయితే.. 500 గొర్రెలకు గడ్డిసాగు, షెడ్డులాంటి వాటికోసం అయిదు ఎకరాల భూమి కావాలి. తగిన అర్హతలుంటే ఒకే కుటుంబంలో ఎంతమందైనా ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. దరఖాస్తుకు..ఉద్యమ్ మిత్ర పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు, వ్యక్తిగత గుర్తింపు, చిరునామా వగైరాలన్నిటికీ రుజువుగా పాస్పోర్ట్ లేదా ఆధార్కార్డ్, పాన్కార్డ్ వంటివి సమర్పించాలి. ఆదాయ రుజువు పత్రం, గడచిన రెండేళ్ల ఐటీఆర్, బ్యాంక్స్టేట్మెంట్,ప్రాజెక్ట్కు సంబంధించిన కొటేషన్స్తోపాటు ఎక్కడైతే యూనిట్ పెట్టాలనుకుంటున్నారో ఆప్రాంతప్రాముఖ్యం, అక్కడ వ్యాపార అనుకూలతలు మొదలైన అంశాలతో పూర్తిప్రాజెక్ట్ రిపోర్ట్నూ సమర్పించాలి. పై వివరాలన్నిటిలో ఏ మాత్రం తప్పుల్లేకుండా చూసుకోవాలి. దరఖాస్తును,ప్రాజెక్ట్ రిపోర్ట్ను పశుసంవర్ధక శాఖా సిబ్బంది పరిశీలించి, అప్రూవ్ చేసిన పత్రాన్ని సంబంధిత బ్యాంకుకు పంపిస్తారు. అప్పుడు బ్యాంకు ద్వారా రుణం పొంది, సొంతపెట్టుబడినీ కూడబెట్టుకోవాలి. సబ్సిడీకి కూడా అప్లయ్ చేసుకోవాలి. సబ్సిడీ పొందడానికి కొంత సమయం పడుతుంది. సబ్సిడీ పొందిన వెంటనే యూనిట్నుప్రారంభించవచ్చు. ఈలోపు ఎక్కడైతే యూనిట్ను పెట్టాలనుకుంటారో అక్కడ గ్రాసాన్ని పెంచాలి. ప్రభుత్వం సూచించిన నమూనాలోనే షెడ్డును నిర్మించాలి. అందులోని పశువులకు పోషకాహారం, పశువైద్య సౌకర్యం వంటివీ చూసుకోవాలి. ఇటు గ్రామీణ... అటు పట్టణ్రపాంతాల్లో విజయవంతంగా ముందుకు సాగుతోందీ పథకం.– బి.ఎన్. రత్న, బిజినెస్ కన్సల్టెంట్, దలీప్మీ సందేహాలను పంపవలసిన మెయిల్ ఐడీ : ownership.sakshi@gmail.comనిర్వహణ : సరస్వతి రమ -
వీల్ పవర్
ఆమె పేరు వసుంధర.. విధి పెట్టిన అన్ని పరీక్షల్లో నెగ్గింది.. వీల్ చెయిర్తోనే విజయానికి అడుగులు వేసింది! మాతృత్వాన్నీ సాధించింది! డేరెస్ట్ ఉమన్గా మన్ననలు అందుకుంటున్నారు హైదరాబాద్కు చెందిన వసుంధర. ఈ విజేత గురించి ఆమె మాటల్లోనే..‘మన దగ్గర ఫిజికల్లీ చాలెంజ్డ్ వాళ్లకు అనువైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పటికీ లేదు. అంటే నా చిన్నప్పటి పరిస్థితి ఊహించుకోండి.. ర్యాంప్స్, సపరేట్ వాష్ రూమ్స్ అనే ఊసే ఉండేది కాదు. ఫిజికల్లీ చాలెంజ్డ్ పిల్లలు చదువుకోవాలన్నా.. ఏదైనా యాక్టివిటీ నేర్చుకోవాలన్నా వాళ్లతో ఒక మనిషి ఉండాల్సిందే పనులన్నీ మానుకొని! అందుకే సాధారణంగా దిగువ, మధ్యతరగతి కుటుంబాల్లో వైకల్యం ఉన్న పిల్లలను ఇంట్లోనే ఉంచేస్తారు. కానీ నన్ను మా అమ్మ చదివించింది. ఆవిడ సింగిల్ పేరెంట్. పెద్దగా చదువుకోలేదు. కానీ బ్రహ్మాండమైన లీడర్షిప్ క్వాలిటీస్తో నెగ్గుకొచ్చింది. టైలరింగ్ చేసేది అమ్మ. వీల్ చెయిర్ కొనేంత స్తోమత లేదు. అయినా నా చదువు విషయంలో వెనకడుగు వేయలేదు. స్కూల్కి, కాలేజ్కి తమ్ముడే నన్ను ఎత్తుకుని తీసుకెళ్లేవాడు. కాలేజ్లో క్లాసెస్ మారాల్సి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ హెల్ప్ చేసేవారు.→ కలాం గారిని అడిగాను కానీ...నేను సీఏ చదువుతున్నప్పుడు అబ్దుల్ కలాం గారిని కలిశాను. ఫిజికల్లీ చాలెంజ్డ్ పర్సన్స్ నడుపుకోగలిగే వెహికిల్స్ని సమకూర్చొచ్చు కదా అని అడిగాను. అడిగాక ఆలోచించాను.. వాళ్లకోసం నేను కూడా ఏమైనా చేయొచ్చు కదా.. మాకున్న సమస్యల గురించి మనమే పోరాడాలి.. ఒకరికొకరం సపోర్ట్ చేసుకోవాలనిపించింది. అది మీడియాలో ఉంటేనే సాధ్యమవుతుందని గ్రహించాను. దాంతో సీఏ డ్రాప్ అయిపోయి, పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చదివాను. → చాలా నేర్చుకున్నాను.. జర్నలిస్ట్గా నా పయనాన్ని ఆరంభించాను. చాలెంజింగ్గా ఉండిందా జాబ్. నేనొక డిజేబుల్డ్ పర్సన్ని అన్న విషయమే మర్చిపోయాను. సమీ„ý కురాలిగా... కంటెంట్ రైటర్గా, కొన్నిసార్లు న్యూస్ రీడర్గా,ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా.. ఇలా అన్ని బాధ్యతలూ తీసుకున్నాను. రిపోర్టర్ లేకుండా అరగంట విమెన్ బులెటిన్ని ఆరునెలల పాటు రన్ చేశాను. దాంతో చాలా నేర్చుకున్నాను. అయితే పది గంటలపాటు అలా ఒకేచోట కూర్చోవడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. దాంతో ఆ ఉద్యోగాన్ని వదిలేశాను. కానీ దివ్యాంగుల సమస్యలను తెలపడానికి ఒక వేదికైతే ఉండాలి కదా! అందుకే వేవ్ మీడియాను స్టార్ట్ చేశాను. దివ్యాంగులకు అన్నిరకాల అవకాశాలను అందించడానికి ‘గుర్తింపు ఫౌండేషన్’ను మొదలుపెట్టాను. దివ్యాంగుల్లోని ఆంట్రప్రెన్యూర్ స్కిల్స్ని వెలికి తీసి, వాళ్లను ఆంట్రప్రెన్యూర్స్గా తయారుచేయడానికి ‘డీ హబ్’నుప్రారంభించాను. రీసెంట్గా ఇంటర్నేషనల్ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పూర్తి చేసుకున్నాను. దీనికి తెలుగు రాష్ట్రాల నుంచి నేనొక్కదాన్నే సెలెక్ట్ అయ్యాను.→ వైవాహిక జీవితానికి వస్తే..డిజేబుల్డ్ పర్సన్స్ వైవాహిక జీవితానికి పనికిరారనే అపోహ, ఆరోగ్యవంతుడు డిజేబుల్ అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడంటే అతనిలో ఏం లోపం ఉందో అనే కామెంట్ల మధ్య.. నన్నర్థం చేసుకొనే స్నేహితుడు నరేందర్ని పెళ్లి చేసుకున్నాను. తల్లిని కావాలనీ ఆశపడ్డాను. కానీ నా ఆరోగ్యం అందుకు సహకరిస్తుందో లేదో అనే భయం ఉండేది నరేందర్కి. దాంతో ఆయన్ని కౌన్సెలింగ్కి తీసుకెళ్లాల్సి వచ్చింది!ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే వరకు చాలా కాన్ఫిడెంట్గానే ఉన్నాను కానీ.. తర్వాతే చాలా ఒత్తిడి ఫీలయ్యాను. నాలాగే నా బిడ్డకూ వైకల్యం వస్తుందేమోననే భయం. పోలియో తప్ప జెనెటికల్గా నాకెలాంటిప్రాబ్లం లేదు. అయినా టెస్ట్లు చేయించుకున్నాను. బ్యాక్ బోన్ పెయిన్ వల్ల ఒకసారి ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికీ వెళ్ళాను. అప్పుడే నాకు సివియర్ స్కోలియోసిస్ ఉందని తేలింది. 150 డిగ్రీల వంపు తిరిగినట్లు ఉంటుంది నా బాడీ. దీనివల్ల నాకు ఒక లంగ్ చిన్నగా.. ఒక లంగ్ పెద్దగా, ఒక కిడ్నీ చిన్నగా.. ఒక కిడ్నీ పెద్దగా ఉంటుంది. అలాగే నా గర్భాశయంలో కూడా బిడ్డ ఒక సైడ్కు పెరుగుతోందని తెలిసింది.→ ఎన్నో పరీక్షలను తట్టుకుని...డీ హబ్ని డెవలప్ చేస్తున్న సమయంలోనే ప్రెగ్నెన్సీ రావడంతో ఫైనాన్సియల్గా కూడా స్ట్రగుల్ అయ్యాం. ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కడా లేదు. ముందు జాగ్రత్తగా ఏడోనెలలోనే ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకున్నారు డాక్టర్. ఆసుపత్రిలోంచే వర్క్ చేశాను డెలివరీ ముందు రోజు వరకు. లక్కీగా ఏ కాంప్లికేషన్స్ లేకుండా తొమ్మిదోనెల వరకు రాగలిగాను. సిజేరియన్ డెలివరీతో బాబు పుట్టాడు. కానీ జాండీస్తో ఐసీయూలో పెట్టారు. వాడు ఇంటికి రావడానికి 27 రోజులు పట్టింది. వచ్చాక అనిమియా .. వీక్లీ చెకప్ అన్నారు. అది జ నరల్ కండిషన్నే అని తెలిసినా... తలసేమియానా? నా డిజేబిలిటీ వల్లే ఇలా అవుతోందేమో అనే భయం. ఆ మానసిక వేదనను మాటల్లో చెప్పలేను. అన్ని అవాంతరాలు దాటి బిడ్డ ఆరోగ్యంగా కేరింతలు కొడుతుంటే అన్నీ మరచిపోయాను. ఇప్పుడనిపిస్తుంటుంది.. నేనేనా అంతలా భయపడ్డది అని! నాకున్న కండిషన్లో మాతృత్వమనేది నిజంగానే నేను సాధించిన అతిపెద్ద అచీవ్మెంట్ అనిపిస్తుంది’’ అంటూ తన విజయగాధను వివరించారు వసుంధర.నేనొక డిజేబుల్డ్ పర్సన్ని అన్న విషయమే మర్చిపోయాను. సమీక్షకురాలిగా... కంటెంట్ రైటర్గా, కొన్నిసార్లు న్యూస్ రీడర్గా,ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా.. ఇలా అన్ని బాధ్యతలూ తీసుకున్నాను. రిపోర్టర్ లేకుండా అరగంట విమెన్ బులెటిన్ని ఆరునెలల పాటు రన్ చేశాను. – శిరీష చల్లపల్లి -
#WomenPower : హంపీ టెంపుల్లోని ఈ సారథుల గురించి తెలుసా?
విజయనగర సామ్రాజ్య వైభవానికి నిలువెత్తు సాక్ష్యం కర్ణాటక రాష్ట్రంలోని హంపి క్షేత్రం. హంపిలోని ప్రధాన ఆకర్షణల్లో ఒకటి విట్టల దేవాలయం. 15వ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయం వారసత్వ సంపద, సంస్కృతీ విశేషాలతో నిండి ఉంటుంది. ఈ ఆలయాన్ని విట్టలకు అంకితం చేశారు కనుక దీన్ని జయ విట్టల ఆలయం అని కూడా పిలుస్తారు. విట్టలను విష్ణువు అవతారం అని అంటారు. ఆర్కిటెక్చర్, డిజైన్ విజయనగర ఆలయ నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తాయి. సైన్స్కు కూడా అంతుచిక్కని అద్భుతాలకు నిలయం. ద్రావిడ నిర్మాణ శైలితో, విస్తృతమైన అలనాటి కళాకారుల ప్రతిభతో అపురూపంగా చెక్కిన శిల్పాలను చూసినపుడు తనువు రోమాంచిత మవుతుంది. ఇక్కడున్న మహా మండపం, దేవి మందిరం, కళ్యాణ మండపం, రంగ మండపం, ఉత్సవ మండపం, రాతి రధం వంటి వాటిల్లో కళావైభవం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ముఖ్యంగా చేతితో (గంధపు చెక్కలతో) మీటగానే సప్త స్వరాలను పలికించే సంగీత స్తంభాలు ఇలా ఒకదానికొకటి సందర్శకులు మంత్రముగ్ధుల్ని చేస్తాయి. అయితే దీన్ని ప్రత్యేకతను రక్షించే చర్యల్లో భాగంగా టూరిస్టులు ఈ స్థంభాలను తాకడానికి వీల్లేదు. దీనికి బదులుగా ఇక్కడ స్వరాలను వినాలనుకుంటే, దానికి వీలుగా ఆయా స్థంభాల వద్ద క్యూఆర్ కోడ్లుంటాయి. వాటిని మన మొబైల్ ద్వారా స్కాన్ చేసి సంబంధింత సంగీత స్వరాలను వినే వెసులుబాటు ఉంది. అయితే ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉంది. అదేంటో తెలుసుకుందా రండి. అంతటి విశిష్టమైన ఆలయ ప్రతిష్టను కాపాడేందుకు అక్కడి అధికారులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. విట్టల ఆలయానికి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంనుంచే ప్రైవేటు వాహనాలకు అనుమతి ఉండదు. దీనికి పర్యాటకుల కోసం కాలుష్యరహిత వాహనాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో మాత్రమే పర్యాటలకు విట్టల దేవాలయ సమీపానికి వెళ్లే అవకాశం ఉంటుంది. తద్వారా పొల్యూషన్ ఎక్కువ కాకుండా జాగ్రత్త పడ్డారు. సారథులంతా మహిళలేఅయితే ఈ వాహనాలకు అందరూ మహిళా డ్రైవర్లే ఉండటం మరో ప్రత్యేకత. టూరిస్టులను విట్టల ఆలయానికి వద్దకు తీసుకెళ్లి, మళ్లీ తీసుకు వచ్చే బాధ్యత ఈ మహిళా డ్రైవర్లదే. సందర్శకులను తీసుకెళ్లి దింప, మళ్లీ వచ్చేటపుడు తిరుగు ప్రయాణంలో ఉన్నవారిని బయటికి తీసుకు వస్తారు. అలా సందర్శకుల రద్దీని నివారించే ఏర్పాటు కూడా అని చెప్పవచ్చు.ఈ సందర్భంగా మహిళా డ్రైవర్లను సాక్షి. కామ్ పలకరించింది. వారి అనుభవాల గురించి ముచ్చటించింది. గతరెండేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నామని వెల్లడించారు. తమకు ముందుగా శిక్షణ ఇచ్చి మరీ ఈ ఉద్యోగంలోకి తీసుకున్నారని తెలిపారు. ఎనిమిది గంటల డ్యూటీ ఎంతో సరదాగా గడిచిపోతుందని చెప్పారు. నిత్యం ఎంతోమంది సందర్శకులను, చాలామంది విదేశీ పర్యాటకులను చేరవేస్తూ ఉంటామని, వారి ఆనందం చూస్తే తమకు చాలా సంతోషంగా ఉంటుందని, నిజానికి చాలా గర్వంగా కూడా ఉంటుందని చెప్పారు. అలాగే టూరిస్టులతో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మాట్లాడతామన్నారు. -
మహిళల కోసం మహిళలే...సిస్టర్ లైబ్రరీ
మహిళా రచయితల పుస్తకాలతో మహిళల కోసం మహిళలే నడుపుతున్న గ్రంథాలయం ఒకటి ఉంది తెలుసా? ఇది ముంబైలోని వెస్ట్ బాంద్రాలో ఉంది. అదే సిస్టర్ లైబ్రరీ. దీన్ని దేశంలోనే తొలి ఫెమినిస్ట్ లైబ్రరీగా చెప్పుకోవచ్చు. 2019ల ప్రారంభమైంది ఇది.ఎలా?ముంబైలో ‘బాంబే అండర్గ్రౌండ్’ పేరుతో ఆర్టిస్ట్ కలెక్టివ్ గ్రూప్ ఒకటుంది. నగరంలోని పలుచోట్ల తాత్కాలిక రీడింగ్ స్పెస్ని ఏర్పాటు చేసి.. పుస్తకాలతోపాటు తోటివాళ్లతో జనాలు సమయం వెచ్చించేలా చూడ్డం ఈ గ్రూప్ విధుల్లో ఒకటి. ఆ పనిలోనే ఉన్నప్పుడు ఈ గ్రూప్ సభ్యురాలైన ఎక్వీ థామీకి రీడింగ్ స్పేస్లో సమావేశమైన వారెవ్వరూ మహిళా రచయితల పుస్తకాలు చదువుతున్నట్టు కనిపించలేదు. అసలు తానెన్ని చదువుతుందో తేల్చుకోవాలనుకుంది ముందు. ఇంటికెళ్లి తన బుక్ ర్యాక్లో చూసుకుంటే మహిళా రచయితల పుస్తకాలు కనీసం 20 శాతం కూడా లేవు. అప్పుడు డిసైడ్ చేసుకుంది ఎక్వీ మహిళా రచయితల పుస్తకాలు చదవాలని. దేశంలోనే కాదు ప్రపంచ సాహిత్యంలో మహిళా రచయితల రాసిన పుస్తకాలన్నిటినీ సేకరించడం మొదలుపెట్టింది. అలా కేవలం మహిళా రచయితల పుస్తకాలతోనే నిండిపోయిన తన పర్సనల్ లైబ్రరీలోంచి స్నేహితులూ పుస్తకాలు అరువు తీసుకోసాగారు. ఆ డిమాండ్ చూసి నిశ్చయించుకుంది ఫెమినిస్ట్ లైబ్రరీ స్టార్ట్ చేయాలని. ఆ ప్రయత్నాల్లో ఉండగా.. 2018లో ఆమెకు ఫైన్ ఆర్ట్ అవార్డ్ వచ్చింది. దానికింద అందిన రొక్కంతో దేశంలోని ప్రముఖ నగరాలను పర్యటించి మహిళా రచయితలు రాసిన నవలలు, వ్యాస సంపుటాలు, ఉద్యమ రచనలు, ఆర్ట్ పుస్తకాలు, మహిళాపత్రికలు వంటి వెయ్యి పుస్తకాలను సేకరించింది. వాటితోనే ‘సిస్టర్ లైబ్రరీ’ని ప్రారంభించింది. ‘సాహిత్య, కళా రంగాల్లో మహిళల కృషిని తెలియజేయడానికే ఈ లైబ్రరీని స్థాపించినా.. ఈ ప్రయాణ క్రమంలో అనిపించింది అసలు సృజన రంగంలో మహిళలు పంచిన జ్ఞానాన్ని, వాళ్లు సాధించిన స్థానాన్నీ ప్రపంచం గ్రహించేలా చేయాలని! ఇప్పుడా లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నాను’ అని చెబుతుంది ఎక్వీ. ఈ లైబ్రరీకి దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా పలు రంగాల్లోని మహిళలంతా తమ వంతు సాయం చేస్తున్నారు. విరాళాల నుంచి క్రౌడ్ఫండింగ్ దాకా ఇందులో పుస్తకాల కోసం ధన సహాయమూ అందుతోంది. ఫెమినిస్ట్ లైబ్రరీ ఆవశ్యకతను చాటడానికి, స్ఫూర్తి పంచడానికి సిస్టర్ లైబ్రరీ సభ్యులు దేశ, విదేశీ పర్యటనలూ చేస్తున్నారు. దీంతోపాటు దేశంలో మహిళలే నిర్వహిస్తున్న చంపక బుక్స్టోర్ (బెంగళూరు), వాకింగ్ బుక్ ఫెయిర్స్ బుక్స్టోర్ అండ్ మొబైల్ లైబ్రరీ (భువనేశ్వర్), ట్రైలాజీ క్యురేటెడ్ బుక్ షాప్ అండ్ లైబ్రరీ (ముంబై) స్టోరీటెల్లర్ బుక్స్టోర్ (కోల్కత్తా), వన్ అప్ లైబ్రరీ, బుక్స్టోర్ స్టూడియో అండ్ లర్నింగ్ ల్యాబ్( ఢిల్లీ), సిస్టర్స్ ఆఫ్ ద పిపుల్ (ఢిల్లీలోని చారిటీ బుక్ స్టోర్) లాంటి బుక్ స్టోర్స్, లైబ్రరీలు ఉన్నాయి. -
Women's Day మహిళా ఆర్టిస్టుల ‘సిరి శక్తి’ మెగా ఆర్ట్ ఎగ్జిబిషన్
సిరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెయింటింగ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెగా ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తోంది. ‘సిరి శక్తి’ పేరుతో అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చిత్రకళలో ప్రతిభను చాటుకుంటున్న మహిళల నైపుణ్యాన్ని గుర్తిస్తూ హైదరాబాద్లోని మసాబ్ ట్యాంక్లో ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. మార్చి 8 నుంచి 15వ తేదీవరకు జరుగుతున్న ఈ ప్రదర్శనలో ఎనిమిదేళ్లనుంచి 88 ఏళ్ల వయస్సున్న 118 మంది మహిళా ఆర్టిస్ట్లు తమ పెయింటింగ్స్ను ప్రదర్శిస్తున్నారు. అంతేకాదు ఈ ఎనిమిది రోజుల వేడుకలో ఒక్కో రోజును ఒక్కో ప్రత్యేకతగా ఈ ఎగ్జిబిషన్ను నిర్వహిస్తున్నారు. కళారంగంలో నిష్ణాతులైన విశిష్ట అతిధులను ఆహ్వానిస్తున్నామని సిరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెయింటింగ్ సారధులు, డైరెక్టర్ స్వామి, శివ కుమారి దంపతులు వెల్లడించారు. ఇప్పటివరకు వరకు సందర్శకుల నుంచి మంచి ఆదరణ లభించిందని, రానున్న మూడు రోజుల ప్రదర్శనను కూడా విజయవంతం చేయాలని శివ కుమారి విజ్ఞప్తి చేశారు. వీరిలో ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డి, ప్రొ. పద్మావతి, నటి గీతా భాస్కర్, ప్రముఖ ఆర్టిస్ట్ శిల్పి డా. స్నేహలతా ప్రసాద్, డా. హిప్నో పద్మా కమలాకర్ తదితరులున్నారని తెలిపారు. ఈ ప్రత్యేక కార్యక్రమం సృజనాత్మకత, ప్రతిభా, నైతిక విలువలను ప్రతిబింబించేలా, విశేషమైన ప్రాముఖ్యతను సంతరించుకునేలా కృషి చేశామని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ‘8’ అనే ప్రత్యేక సంఖ్యను ప్రాతిపదికగా రూపకల్పన చేయడం మరో విశేషమని పేర్కొన్నారు.గత 30 ఏళ్లుగా హిమాయత్నగర్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో సిరి ఇన్స్టిట్యూట్ ద్వారా అనేకమందికి శిక్షణనిస్తున్నామని, ఇందులో మహిళలు, ఉద్యోగాలు చేసుకుంటున్నవారు, పదవీ విరమణ చేసినవారు, విద్యార్థులు ఇలా అన్ని వయసుల వారికి చిత్రకళను బోధిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు వేలాది మంది విద్యార్థులకు ఆయిల్, అక్రిలిక్, సాండ్ పెయింటింగ్, తంజావూర్ పెయింటింగ్, 3డీ క్లే ఆర్ట్, స్కెచింగ్ తదితర వివిధ మాధ్యమాల్లో శిక్షణ ఇవ్వడంతోపాటు, అనేక చిత్ర ప్రదర్శనలను విజయవంతంగా నిర్వహించామని వెల్లడించారు. వేదిక : JNAF ALU కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, మసాబ్ ట్యాంక్, హైదరాబాద్ వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు.ఫోన్: 3643419662, 9948887211 -
మహిళలు నిర్మించిన అద్భుత స్మారక కట్టడాలు..!
చరిత్రలో చాలావరకు మగవాళ్లు కట్టిన అద్భుత స్మారక కట్టడాల గురించే కథలు కథలుగా చదివాం. అలాంటి అద్భుత కళా నైపుణ్య కట్టడాలకు మహిళలు కూడా అంకురార్పణ చేశారనే విషయం తెలుసా..!. ఆ మహిళలు తమ ప్రేమ, భక్తి, ఆశయాలకు చిహ్నంగా వాటిని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. అవికూడా యూనెస్కో గుర్తింపుని దక్కించుకున్నాయి. ఆ అద్భుత స్మారక చిహ్నలు ఎక్కడున్నాయి..? వాటిని నిర్మించిన ఆ శక్తిమంతమైన నారీమణులు ఎవరు..?కట్టడ నిర్మాణాలకు శ్రీకారం చుట్టిన ఆ మహిళల చొరవను బట్టి స్త్రీలు ఆనాడే తమ వ్యక్తిత్వం, భావాలను, గుర్తింపు వ్యక్తపరిచారని సుస్పష్టంగా తెలుస్తోంది. వారంతా ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్ని నిర్మించిన షాజహాన్ వలే తన భర్తలపై ఉన్నప్రేమ, అభిలాష, వారి విజయాల గుర్తుగా ఈ అద్భుత స్మారక కట్టడాలను నిర్మించారు. వాటి నిర్మాణ తీరు, శిల్పకళా సంపద, మలిచిన విధానం ఆ మహిళ సృజనాత్మకతకు, అభిరుచికి ప్రతిబింబంగా ఉన్నాయి. తొలి గార్డెన్ సమాధి(హుమయూన్ సమాధి, ఢిల్లీ)..ఇది 16వ శతాబ్దపు అద్భుతమైన కట్టడం. మొఘల్ సామ్రాజ్ఞి బేగా బేగం తన భర్త మొఘల్ చక్రవర్తి హుమయూన్ జ్ఞాపకార్థం నిర్మించింది. పెర్షియన్ వాస్తు శిల్పులు దీన్ని అద్భుతంగా నిర్మించారు. భారతదేశంలోని తొలి గార్డెన్ సమాధి. మొఘల్ వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందిన కట్టడం ఇది. చుట్టూ ఒక మాదారిగా కనిపించేలా పాలరాతితో నిర్మించారు. పచ్చని తోటల మధ్య కొలువుదీరిని అద్భుత కట్టడంలా పర్యాటకులను కట్టిపడేస్తుంది. ఈ స్మారక చిహ్నం యునెస్కో గుర్తింపును కూడా పొందింది. రాణి కి వావ్, గుజరాత్పాట్న రాణి కి వావ్ 11వ శతాబ్దంలో భర్త రాజు భీమా జ్ఞాపకార్థం నిర్మించింది. హిందూ దేవతలు, పౌరాణిక వ్యక్తులు, ఖగోళానికి సంబంధించిన అద్భుతాలు తదితరాలను వర్ణించేలా శిల్పాల గ్యాలరీ ఉంటుంది. ఇది సెవెన్ స్టెప్వెల్ ఆర్కిటెక్చర్. అంటే ఇది ఏడు మెట్ట నుయ్యి మాదిరిగా ఉంటుంది. ఒక్కో మెట్టు దిగుతూ ఉంటే శిల్పాల గ్యాలరీ మరింత ఎక్కువగా చూడొచ్చు. ఒకరకంగా ఇది నీటి పరిరక్షణ కోసం ఆనాడే అద్భతంగా తీర్చిదిద్ధిన నుయ్యిలా ఉంటుంది.విరూపాక్ష ఆలయం, కర్ణాటకభారతదేశంలోని పురాతన దేవాలయాలలో ఒకటి ఈ విరుపాక్ష ఆలయం. దీన్ని ఏడవ శతాబ్దంలో లోకమహదేవి రాణి ఆధ్వర్యంలో నిర్మించారు. ఈ దేవాలయ అభివృద్ధికి ఆమె ఎంతగానో తోడ్పాటును అందించింది. లోకమహదేవి ఈ ఆలయాన్ని తన భర్త రాజు విక్రమాదిత్య II శత్రురాజులపై సాధించిన విజయానికి గుర్తుగా నిర్మించింది. ఇక్కడ హంపీ శిల్పాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ఈ ఆలయం ముందు నిర్మించిన గ్రాండ్ గోపురం, వివరణాత్మక శిల్పాలు, క్లిష్టమైన స్థంభాల నిర్మాణం చూపురులను కట్టిపడేస్తుంది. ఈ ఆలయంలోని ఆచారాలు, అక్కడే నివాసం ఉండే ఏనుగుల సందడి ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఇతిమాడ్-ఉద్-దౌలా, ఆగ్రామొఘల్ రాణి ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం షాజహాన్ నిర్మించిన తాజ్మహల్ ఎదురుగా ఇతిమాద్-ఉద్-దౌలా కట్టడం ఆభరణంలా ఉంటుంది. దీన్ని మొఘల్ని దశాబ్దం పైగా పాలించిన శక్తిమంతమైన మహారాణి నూర్ జహాన్ నిర్మించింది. ఆమె తన తండ్రి మీర్జా ఘియాస్ బెగ్ జ్ఞాపకార్థం నిర్మించింది. యమునా ఒడ్డున నిర్మించిని సుందరమైన స్మారక చిహ్నం ఇది. ఇది ఆమె నిర్మాణాత్మక దృష్టిని, రాజకీయ శక్తిని ప్రతిబింబిస్తుంది.తాజ్-ఉల్-మస్జిద్, భోపాల్భోపాల్ బేగం కేవలం పాలకురాలేకాదు, కళ, వాస్తుశిల్పానికి పోషకులు కూడా. తాజ్-ఉల్-మస్జిద్ మసీదుల కీరీటంగా అభివర్ణించవచ్చు ఎందుకంటే ఏళ్లతరబడి నిర్మించి అద్భుత కట్టడం ఇది. పింక్ ఇసుకరాయి గోపురాలు, అత్యున్నత మినారెట్స్, విశాలమైన ప్రాంగణంతో అందంగా తీర్చిదిదదారు. ఇది బారతదేశంలో ఉన్న అతిపెద్ద మసీదులలో ఒకటి. దాని స్కైలైన్ ఆకృతి మహిళా పాలకురాలి ప్రత్యేక చరిత్రకు సాక్షిగా నిలిచింది.మిర్జన్ కోట, కర్ణాటకఈ కోట నిర్మాణం మనోహరంగా ఉంటుంది. దీన్ని 16వ శతాబ్దంలో రాణి చెన్నాభైరదేవి పాలనలో నిర్మించారు. మసాలా వాణిజ్యంలో ఆధిపత్యం కారణంగా ఆమెను "పెప్పర్ క్వీన్" అని పిలుస్తారు. ప్రస్తుతం పాక్షికంగా శిథిలావస్థలో ఉన్నప్పటికీ..ఆ కర్ణాట రాణి గొప్ప చరిత్రకు గుర్తుగా ప్రజల మనసులో నిలిచిపోయింది.దక్షణేశ్వర్ కాళి ఆలయం, కోల్కతా19వ శతాబ్దంలో రాణి రష్మోని నిర్మించిన దక్షిణేశ్వర కాళి ఆలయం. కాళి దేవత ఆరాధన కోసం హుగ్లీ నదితీరాన నిర్మించిన పుణ్యక్షేత్రం. చరిత్రలో రాజులు అధికారం లేదా విజయం కోసం ఇలాంటి దేవాలయాలను నిర్మించినట్లు విన్నాం. అయితే ఆ రాజుల మాదిరిగా కాకుండా రాణి రష్మోని పరోపకార బుద్ధితో ఆధ్యాత్మిక స్థలాలు ప్రజలందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో నిర్మించింది. ఆలయ నిర్మాణం అత్యంత విలక్షంగా ఉంటుంది. ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస భోధనలకు అర్థం పట్టేలా ఉంటుంది ఈ ఆలయ నిర్మాణం. కోలకతా అనగానే గుర్తొచ్చే కాళిమాత ఆలయంగా ఇది ప్రసిద్ధికెక్కింది. ప్రతి ఏడాది వేలాది భక్తులు, సందర్శకులు ఈ ఆలయాన్ని సందర్శించుకోవడానికి తరలివస్తున్న గొప్ప క్షేత్రంగా అలరారుతోంది.(చదవండి: 'ఎగ్ ఫ్రీజింగ్' అంటే..? ఉపాసన, నటి మెహ్రీన్ , తానీషా ముఖర్జీ అంతా..!) -
‘ఫ్యాషన్ ఐకాన్’ : 70 ఏళ్లు దాటితేనేం, ఆమే బ్యూటీ క్వీన్
ష్యాషన్ క్వీన్ అనగానే గుర్తొచ్చే సీనియర్ నటీమణులలో ముందు వరుసలో ఉంటారు ప్రముఖ నటి రేఖ. ఏడు పదుల వయసులో కూడా ఉత్సాహంగా, ఫ్యాషన్ ఐకాన్లా ఉంటారామె. ఆమె చీర కడితే ఆ చీరకే అందం. కాంజీవరం చీరలో ఆమె అందానికి అందరూ ముగ్ధులవ్వాల్సిందే. ఆమె ఏ వేదిక మీద ఉన్నా ఆ వేదిక కళకళలాడిపోవాల్సిందే.. ఆమె అద్భుతమైన నటి మాత్రమే కాదు మంచి సింగర్. చాలా సార్లు ఈ విషయాన్ని స్వయంగా చాటి చెప్పింది. అందానికీ, ఆత్మవిశ్వాసానికి ప్రతీక అయిన రేఖ సిగ్నేచర్ స్టైల్ చీరలో కాకుండా ఓవర్ సైజు బ్లేజర్లో మరోసారి అల్టిమేట్ స్టైల్ ఐకాన్గా నిలిచింది. స్టైల్, గ్రేస్, డై-హార్డ్ లుక్స్తో ఫ్యాషన్కు, మెడ్రన్ స్టైల్కు వయస్సు పనేముందని నిరూపించిన వైనం ఫ్యాన్స్ను ఆకట్టుకుంటోంది.ఒక రెడ్ కార్పెట్ ఈవెంట్లో లేడీ బాస్ తన ఎనర్జీతో అక్కడున్న వారి నందరినీ అబ్బురపర్చింది. ‘పింటు కి పప్పీ’ ట్రైలర్ లాంచ్లో అద్భుతమైన తెల్లటి ప్యాంటుసూట్లో చిక్ లుక్లో ఆకట్టుకుంది.శాటిన్ బ్లౌజ్,దానిపై లేయర్డ్ ట్రెండీ ఓవర్ సైజు బ్లేజర్ను జోడింకి ట్రెండీగా మెరిసింది. దీనికి వైడ్ లెగ్ ట్రౌజర్తో జత చేసింది. బ్లాక్ సన్ గ్లాసెస్, బంగారు చెవిపోగులు, స్టైలిష్గా వైట్ క్యాప్ ఆమె లుక్కు మరింత గ్లామర్ను తెచ్చి పెట్టాయి. అలాగే ఒక అందమైన షాయరీని చదవి వినిపించడం విశేషం.అంతేనా, మెటాలిక్ గోల్డ్ ప్లాట్ఫామ్ స్నీకర్లతో మరింత యంగ్గా, ఫ్రెష్గా లుక్తో మెస్మరైజ్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్గా మారాయి. ఆమె స్టైల్ను ఫ్యాన్స్ పొగడ్తల్లో ముంచేశారు. "జస్ట్ లుకింగ్ లైకే వావ్!’’, ‘‘ఆమెకు70 ఏళ్లు అని నేను నమ్మలేకపోతున్నాను" "ఫ్యాషన్ ఐకాన్" ఇలా అందరూ రేఖను ప్రశంసించారు. ఇటీవల IIFA అవార్డ్స్ 2025 వేడుకలో రేఖ అద్బుతమైన కాంజీవరం చీరలో కనిపించారు. అవార్డు ఫంక్షన్లో రేఖ తన ఐకానిక్ బంగారు కాంజీవరం చీరలలో అద్భుతంగా కనిపించింది. View this post on Instagram A post shared by IIFA Awards (@iifa)ఆమె లుక్తో పాటు, తన సహనటులు, ఇప్పటి నటులతో పాటు, అభిమానులతో ప్రేమగా ఉండటం ఆమె ప్రత్యేకత. ఇటీవల ఒక అభిమాని ప్రత్యేకంగా తీసుకొచ్చిన అందమైన బొమ్మను స్వీకరించడం, తన అభిమానాన్ని చాటుకోవడం ఇందుకు నిదర్శనం. అంతేకాదు, సినిమాకు సంబంధించి ముఖ్యమైన ఏ వేడుక అయినా, తన సమయాన్ని కేటాయించడం, కళామతల్లిపై ప్రేమను, అభిమానాన్ని ప్రదర్శించడం విశేషం. రేఖగా పాపులర్ అయిన భానురేఖ గణేషన్, 1954లో అక్టోబర్ 10న పుట్టింది. 180కి పైగా చిత్రాలలో నటించిన రేఖ, జాతీయ చలనచిత్ర అవార్డు, మూడు ఫిల్మ్ఫేర్ అవార్డులతో సహా అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలను దక్కించుకుంది. -
సాఫ్ట్వేర్ నుంచి పర్మాకల్చర్లోకి..!
పుట్టిన గడ్డపై ప్రజలు చిన్న వయసులోనే కేన్సర్, లివర్, గుండె జబ్బు వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడి మృతి చెందటంతో కలవరపాటుకు గురైన ఆమె అమెరికాలో ఆరంకెల సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి ఏడేళ్ల క్రితం పుట్టింటికి తిరిగి వచ్చేశారు. తమ ఏడెకరాల్లో ఐదంచెల ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. యోగా, ప్లాస్టిక్ రహిత జీవన శైలిని తాను ఆచరిరిస్తూ 2017 నుంచి అనేక ఇతర స్వచ్ఛంద సంస్థలతో కలసి ప్రచారోద్యమం చేపట్టారు. ముఖ్యంగా పాఠశాల విద్యార్థుల్లో ఎకోఫ్రెండ్లీ లివింగ్పై శిక్షణ ఇస్తున్నారు. ఆమె పేరు అక్కిన భవానీ.పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం చినతాడేపల్లి భవాని స్వగ్రామం. అమెరికాలో పెద్ద జీతంతో కూడిన సాఫ్ట్వేర్ ఉద్యోగం 17 ఏళ్లకు పైగా చేశారు. తాను పుట్టిన గడ్డ మీద ఆహార, ఆరోగ్య, పర్యావరణ సంక్షోభాన్ని గుర్తించి, ఉద్యోగానికి రాజీనామా చేశారు. మితిమీరిన రసాయనాలతో ఆహారోత్పత్తి చేయటం, ప్లాస్టిక్ వాడకం, అపసవ్యమైన జీవన శైలి మూల కారణాలని గుర్తించారు. అమెరికాలో ఉండగానే ఆమె యోగా నేర్చుకున్నారు. ప్రకృతికి అనుగుణమైన సాధారణ జీవన శైలిని అలవర్చుకున్నారు. మనకు, భూమికి శాశ్వత ప్రయోజనాన్ని కలిగించే పర్మాకల్చర్ వ్యవసాయ పద్ధతిని నేర్చుకున్నారు. గత 50 ఏళ్లుగా పర్మాకల్చర్ను ఆచరిస్తున్న వాషింగ్టన్ (అమెరికా)కు చెందిన మైఖేల్ పిలార్సి్క వద్ద శిక్షణ పొందారు. అనేక దేశాలు పర్యటించి ప్రకృతి వనరుల పరిరక్షణ పద్ధతుల్ని భవాని అధ్యయనం చేయటం విశేషం. భూమి, నీరు, గాలి, అడవి, భూమిపైన జీవరాశిని పరిరక్షించుకోవటం ద్వారా మనిషి ఆరోగ్యంగా జీవించవచ్చని.. ప్లాస్టిక్, రసాయన రహిత ఆరోగ్యదాయకమైన జీవన శైలి, యోగా, ప్రకృతి సేద్యం ఇందుకు దోహదపడతాయని భవాని మనసా వాచా కర్మణా నమ్ముతున్నారు. రసాయనాల్లేని ఆహారోత్పత్తితో పాటు యోగా తదితర కార్యకలాపాల ద్వారా.. శారీరకంగా/ మానసికంగా/ఆధ్యాత్మికంగా ఆరోగ్యదాయకమైన జీవనశైలిని అనుసరించటం అవసరమని నమ్ముతున్నారు. ఈ భావాలను తమ గ్రామం కేంద్రంగా ప్రచారం చేయటమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం వర్క్షాపులు, స్టడీ టూర్లు, ఫామ్ విజిట్లు నిర్వహించటంతో పాటు ‘నర్చర్5’ పేరుతో వెబ్సైట్ను, యూట్యూబ్ ఛానల్ను నిర్వహిస్తున్నారు.స్వగ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత 2019లో పాలేకర్ పద్ధతిలో వరి సాగుతో ప్రకృతి సేద్యంప్రారంభించారు. తదనంతరం తమ కుటుంబానికి చెందిన 7 ఎకరాల భూమిలో ఫైవ్ లేయర్ మోడల్లో వక్క ప్రధాన పంటగా పండ్లు, కూరగాయలు, ఔషధ మొక్కలను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేపట్టారు. సేంద్రియ పెరటి తోటల సాగు ద్వారా పోషకాహార స్థాయిని పెంపొందించటం.. పండ్ల తొక్కలతో సేంద్రియ ద్రావణాలు తయారు చేసుకొని వినియోగించటం.. గుడ్డ సంచుల వాడకం.. వంటి అంశాలపై గుంటూరు తదితర ప్రాంత పాఠశాలల్లో విద్యార్థులు, టీచర్లకు శిక్షణ ఇస్తున్నారు. కరోనా సమయంలో జిల్లా అధికారులతో కలసి ఆరోగ్యదాయకమైన జీవన శైలి, యోగా తదితరాలపై ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆహారం, ఆదాయం, ఆరోగ్యం అనే ఫార్ములాతో భవానీ ప్రస్తుతం చినతాడేపల్లిలోని ఏడెకరాల ‘పొలంలో ప్రకృతి బడి’ని నిర్మించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఆదాయం కోసం వక్క సాగు, ఆహారం కోసం వివిధ రకాల మంచి పండ్లు, ఆరోగ్యం కోసం ఔషధ మొక్కలు ఒకే చోట పెంచే ఫుడ్ ఫారెస్ట్ను పెంచుతున్నారు. వక్క ప్రధాన పంటగా నాటారు. మొదట అరటి, ఆ తర్వాత పసుపు అంతర పంటలుగా వేశారు. అక్కడక్కడా మామిడి, లిచీ, రాంభోళా వంటి పండ్ల మొక్కలను నాటారు. వక్క చెట్లపైకి పాకించడానికి రెండు రకాల మిరియం పాదులను పెంచుతున్నారు. ఒక మడిని ఔషధ మొక్కల కోసం కేటాయించారు. కుంకుడు, షికాకాయ్ మొక్కలు కూడా నాటారు. ఔషధ మొక్కలతో తల నూనె, పండ్ల పొడి, ఎండిన పూలతో టీ పొడి, పసుపు తదితర ఉత్పత్తులను స్వయంగా తయారు చేసి విక్రయిస్తున్నారు. క్షేత్రంలో మొక్కలన్నిటికీ డ్రిప్ పద్ధతిలో నీటిని అందిస్తున్నారు. పొలం చుట్టూ రక్షణ కోసం వెదురు, వాక్కాయ మొక్కలను నాటారు. మడినే బడిగా మార్చి బాలలు, యువతకు ప్రకృతి పాఠాలు బోధించాలన్నది ఆమె సంకల్పం. నవతరానికి స్ఫూర్తిని కలిగించే వర్కుషాపుల నిర్వాహణ ఆమెకు ఇష్టం. భవానీ కృషిని గుర్తించిన హైద్రాబాద్లోని ‘మేనేజ్’ సంస్థ గత ఏడాది ఉమెన్ అగ్రిప్రెన్యూర్ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది. జీవితానుభవాలతో ‘జర్నీ ఆఫ్ మై మిస్టేక్స్’ అనే పుస్తకం రాస్తున్నానని ఆమె తెలిపారు. – యడ్లపల్లి మురళీకృష్ణ, తాడేపల్లిగూడెం, పశ్చిమగోదావరి జిల్లా -
పోలీస్ అక్క భద్రత.. భరోసా
‘అక్క’ అనే మాటలో ఆప్యాయత మాత్రమే కాదు... ‘భద్రత’ను ఇచ్చే ‘భరోసా’ కూడా ఉంటుంది. చిన్నప్పుడు స్కూల్లో తోటిపిల్లలు ఏడిపిస్తుంటే...‘మా అక్కకు చెబుతాను’ అనడం సాధారణం. అవును. అక్క అంటే ఫ్రెండ్ కాని ఫ్రెండ్. ఏ దాపరికాలు లేకుండా మనసులోని మాటను పంచుకునే అమ్మ కాని అమ్మ! ఇంట్లో కుటుంబ సభ్యులు ఉంటారు. వారితో అన్నీ పంచుకుంటారు. ఇంటికి దూరంగా హాస్టల్లో ఉండే ఆడపిల్లలకు తోడెవరు? చుట్టూ ఎంతోమంది ఉన్నా, వారితో అన్ని విషయాలు పంచుకోలేక ‘నేను ఒంటరిని’ అనే భావన ఎటైనా దారితీయవచ్చు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకీ షర్మిల ‘పోలీస్ అక్క’కు ప్రాణం పోసింది.ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలలో విద్యార్థినులు వేధింపులు, దాడులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది అమ్మాయిలు తమలో తామే కుమిలిపోతూ చివరకు ఆత్మహత్య వరకు వెళ్తున్నారు. ఇలాంటివి నివారించడానికి ‘నేనున్నాను’ అంటూ ముందుకు వచ్చింది పోలీసు అక్క.దత్తత తీసుకుంటారు...ఒక్కో మహిళా కానిస్టేబుల్కు ఒక్కో విద్యాలయం, వసతిగృహం బాధ్యతను అప్పగించారు. ‘మీరు అక్కడి విద్యార్థులను దత్తత తీసుకున్నట్లు భావించాలి. వారు మీ కుటుంబ సభ్యులే’ అని ఒకటికి రెండుసార్లు చె΄్పారు. ప్రతినెలా ఒకటో శనివారం మహిళా కానిస్టేబుళ్లు తమకు అప్పగించిన గురుకులానికి వెళతారు. ఆ రోజంతా అక్కడే ఉంటూ విద్యార్థినులతో కలిసి భోజనం చేస్తారు. సొంత అక్కలా వారి యోగక్షేమాలు తెలుసుకుంటారు.సైబర్క్రైమ్, ఉమెన్ ట్రాఫికింగ్, గుడ్టచ్–బ్యాడ్టచ్, మహిళల భద్రత, చట్టాలు.. మొదలైన విషయాలపై చర్చిస్తారు. రాత్రిపూట అక్కడే బస చేస్తారు. ప్రస్తుతం 18 పాఠశాలలకు 18 మంది మహిళా కానిస్టేబుళ్లను నియమించారు. వీరి పని తీరును ఎస్పీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు.ఆ బాధ నుంచే...ఎస్పీగా నిర్మల్ జిల్లాలోనే తొలి పోస్టింగ్ తీసుకున్న జానకీ షర్మిలకు ఇక్కడి బాసర ట్రిపుల్ ఐటీలో కొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం కలచి వేసింది. విద్యార్థులకు అండగా నిలవడానికి, తనవంతుగా ఏదైనా చేయాలని, వారిలో భరోసా నింపాలనీ అనుకున్నారు. స్వయంప్రతిపత్తి కలిగిన ట్రిపుల్ఐటీని మూడునెలల పాటు దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అప్పటినుంచి విద్యార్థులతో మమేకమవుతూ వారి సమస్యల గురించి తెలుసుకుంటూ పరిష్కారంపై దృష్టి పెట్టారు. ప్రతి సీనియర్ ఒక జూనియర్ని గైడ్ చేయాలని సూచించారు. విజేతలుగా నిలిచిన పూర్వ విద్యార్థులు, ట్రెండింగ్ సెలబ్రిటీలు, మోటివేషనల్ స్పీకర్లతో సమావేశాలు, క్రీడాపోటీలు నిర్వహించారు. ఇవి విద్యార్థులలో ఉత్సాహాన్ని నింపాయి. ధైర్యాన్ని ఇచ్చాయి.పెట్రోలింగ్ బాధ్యతలు...తనలాగే మహిళా పోలీసులు ప్రత్యక్ష పోలీసింగ్ చేయాలని ఎస్పీ జానకీ షర్మిల నిర్ణయించారు. మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోనే తొలిసారి మహిళా కానిస్టేబుళ్లకు ప్రత్యక్ష పోలీసింగ్ బాధ్యతలు అప్పగించారు. కేవలం స్టేషన్ లో పనులు చేయడానికి, రిసెప్షనిస్టులుగానే పరిమితమైన ఉమెన్ కానిస్టేబుళ్లు ఇక నుంచి వారానికోసారి పెట్రోలింగ్, డయల్ 100, ఎమర్జెన్సీ, డెయిలీ రూట్ చెకింగ్, వాహనాల తనిఖీలాంటి బాధ్యతలను చేపడతారు. పెట్రోలింగ్లో తొలిరోజే సత్తా చాటారు. భైంసా మండలం వట్టోలి గ్రామంలో పేకాట రాయుళ్లను పట్టుకున్నారు. ‘పోలీసులు ప్రజల్లో కలిసిపోయినప్పుడే... ప్రజలకు భరోసా, భద్రత’ అంటారు. ‘పోలీసు అక్క’లాంటి వినూత్నమైన కార్యక్రమాలు ఆ మాటకు బలాన్ని ఇస్తాయి.అందుకే... పోలీస్ అక్కఎక్కడైనా మహిళలకు ఇబ్బందులు, అడ్డంకులు ఉంటూనే ఉంటాయి. చాలామంది మహిళలకు కాస్త భరోసా, కాసింత ్రపోత్సాహం ఇస్తే చాలు దేన్నైనా సాధించగలరు. నిర్మల్ జిల్లాలో ప్రత్యేకంగా విద్యార్థినులకు అండగా నిలవాలనుకున్నాం. ఇందుకోసమే ‘పోలీస్ అక్క’ కార్యక్రమం చేపట్టాం. ఎన్నోఏళ్లుగా స్టేషన్ లకే పరిమితమైన మహిళా కానిస్టేబుళ్లు సైతం తాము పోలీసులం అని గర్వపడేలా ప్రత్యక్ష పోలీసింగ్ చేసేలా డ్యూటీలను అప్పగించాం.– జానకీ షర్మిల, ఎస్పీ, నిర్మల్– రాసం శ్రీధర్, సాక్షి ప్రతినిధి, నిర్మల్ -
గిన్నిస్ వరల్డ్ రికార్డు నుంచి గోల్డ్ మెడల్ వరకు..
సాధించాలనే తపన, పట్టుదల ముందు ఏ వైకల్యమూ అడ్డుకారాదని.. ప్రతిభ ఉండాలే కానీ అవార్డులు.. రివార్డులు.. వాటంతట అవే వస్తాయని నిరూపించింది.. ఆ యువతి. దివ్యాంగురాలన్న భావన లేకుండా పట్టుదలతో కాన్వాస్పై చిత్రలేఖనం (Painting) నేర్చుకుని విమర్శకుల ప్రశంసలు పొందుతూ.. శభాష్ అనిపించుకుంటోంది.. ఆమే మేడ్చల్ జిల్లా శామీర్పేట (Shamirpet) మండలం తుర్కపల్లికి చెందిన విజయలక్ష్మి. చిత్రకళతో పాటు సంగీతంలోనూ రాణిస్తూ.. ప్రముఖుల ప్రశంసలు పొందుతూ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తోంది.తుర్కపల్లికి చెందిన విజయలక్ష్మి మూడేళ్ల వయసులో పోలియో వచ్చి రెండు కాళ్లు, కుడి చెయ్యి పనిచేయకుండా పోయాయి. తల్లిదండ్రులు నర్సింహులు, ప్రమీళ, అన్నా వదిన అనంద్, శ్రవంతి విజయలక్ష్మికి అండగా నిలిచారు. ఆమెలో ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు. దివ్యాంగురాలనే భావన కలుగకుండా చిత్రలేఖనంపై పట్టుసాధించేలా ప్రోత్సహించారు. మొదట్లో దినపత్రికలు, ఆదివారం ప్రచురణలలోని బొమ్మలను చూసి చిత్రలేఖనం నేర్చుకుంది. కష్టపడి డిగ్రీ పూర్తి చేసింది. పాఠశాల దశలోనే వివిధ చిత్రలేఖన పోటీల్లో బహుమతులు అందుకుంది. అవార్డులు.. ప్రశంసలు.. విజయలక్ష్మి ప్రతిభను గుర్తించిన రాష్ట్ర వికలాంగుల సంఘం సహకారంతో రవీంద్ర భారతిలో పలుమార్లు చిత్రలేఖన ప్రదర్శనలు నిర్వహించి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును అందుకుంది. త్యాగరాయ గానసభలో ప్రతిభా పురస్కారాలను అందుకుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డు సంస్థ చేపట్టిన ఆన్లైన్ కాంపిటేషన్లో వరుసగా మూడేళ్లు వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్తో పాటు అవార్డులను గెలుచుకుంది. తెలంగాణ ఐకాన్ 2024, బుల్లితెర అవార్డు, తెలంగాణ సేవారత్న– 2025 వంటి అవార్డులనూ అందుకుంది. ఇప్పటివరకూ సుమారు వందకు పైగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకుంది. చిన్ననాటి నుండే.. చిత్రలేఖనం అంటే చిన్ననాటి నుండే ఇష్టం. మా కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉన్నా ఎన్నడూ నిరాశపడకుండా కుటుంబ సభ్యుల పోత్సాహంతో ప్రాక్టీస్ చేశా. గిన్నిస్ వరల్డ్ రికార్డు నుంచి గోల్డ్ మెడల్ (Gold Medal) సాధించడం ఆనందాన్నిచ్చింది. అనేక మంది ప్రముఖల ప్రశంసలు పొందాను. – విజయలక్ష్మి, తుర్కపల్లిమూడేళ్ల మోక్ష్ ప్రపంచ రికార్డు జూబ్లీహిల్స్లోని భారతీయ విద్యాభవన్స్ ఆత్మకూరి రామారావు స్కూల్లో నర్సరీ చదువుతున్న మోక్ష్ అయాన్ సేవల (Moksh Ayaan Sevala) ప్రపంచ రికార్డు సృష్టించాడు. మూడేళ్ల ఐదు నెలల వయసున్న ఈ చిన్నారి ఇటీవల జరిగిన వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ టైటిట్లో భాగంగా అత్యంత వేగంగా పజిల్ సాల్వింగ్తో పాటు కలర్ మ్యాచింగ్లో అందరి కంటే ముందు నిలిచాడు. 3–5 ఏళ్ల కేటగిరీలో పాల్గొన్న మోక్ష్ కేవలం 11 సెకన్లలోనే ఈ పజిల్ను సాల్వ్ చేసి రికార్డ్ బ్రేక్ చేశాడు.పాఠశాలకు చెందిన ప్రీ ప్రైమరీ కో–ఆరినేటర్ విశాల్ అమిన్ మాట్లాడుతూ ఇంత చిన్న వయసులో ఈ ఘనత సాధించడం అద్భుతమన్నారు. విద్యార్థి ఘనతను స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీలతానాయర్ ప్రశంసించారు. ఈ ఘనత తమ స్కూలుకే గర్వకారణమని, భవిష్యత్తులో ఇలాంటి రికార్డులు మరిన్ని సాధించాలని ఆకాంక్షించారు. బాలుడికి పాఠశాల నుంచి సంపూర్ణ సహకారం, ప్రోత్సాహం లభిస్తుందన్నారు. ఇలాంటి విద్యార్థులు మిగతా వారికి స్ఫూర్తిగా నిలుస్తారన్నారు. చదవండి: పక్షులపై ప్రేమతో వేల మైళ్ల ప్రయాణం -
ఇంటికి గెస్ట్గా పొన్నంకి పిట్ట.. గొప్ప జ్ఞాపకం
విద్యార్థులకు ఆమె గణితం నేర్పాలనుకున్నారు. కానీ విధి లిఖితం ఆమెకు కొత్త రెక్కలు తొడిగింది. పక్షుల ప్రేమలో వేలమైళ్లు ప్రయాణించేలా చేసింది. ఐదేళ్లుగా విభిన్న రకాల పక్షులను గుర్తించారు. కాగా ఇప్పటి వరకూ 550కు పైగా జాతులను కెమెరాలో బంధించి రికార్డు సృష్టించారు. ఆమే హైదరాబాద్ (Hyderabad) నగరంలోని అమీన్పూర్ (Ameenpur) సమీపంలోని హెచ్ఎమ్టీ కాలనీలో నివసించే శ్యామల రూపాకుల (Syamala Rupakula).. పక్షి ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఆ ప్రేమ ఆమెకు అనారోగ్యాలను దూరం చేయడం మాత్రమే కాదు.. కొత్త రికార్డులకు దగ్గర చేస్తోంది. – సాక్షి, సిటీబ్యూరో‘ఆన్లైన్లో మ్యాథ్స్ ట్యూటర్గా పనిచేసేదాన్ని. కొన్ని ఆరోగ్య సమస్యలు నన్ను బాధించాయి. దీంతో ఆ పని వదిలేయాల్సి వచ్చింది. అనుకోకుండా బర్డ్ వాచర్గా మారాను’ అంటూ ఏడేళ్ల నాటి గతం గుర్తు చేసుకున్నారు శ్యామల. దాదాపు రికార్డు స్థాయిలో 550 పక్షులను గుర్తించి నగర బర్డ్ వాచర్స్ (Bird Watchers) ప్రపంచంలో తనదైన ముద్రను వేసుకున్నారు. ఐటీ ఉద్యోగి అయిన భర్త బాలసుబ్రహ్మణ్యకుమార్ సహకారంతోనే తన హాబీని ఇంతగా ఆస్వాదించగలిగానని చెబుతున్నారు. ఆమె ప్రయాణానికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఆమె మాటల్లోనే..బీజం పడింది అక్కడే.. తొలుత జంతువుల పట్ల ఆసక్తితో వన్యప్రాణుల సంరక్షణా కేంద్రాలకు (వైల్డ్లైఫ్ శాంక్చురీ) వెళ్లేదాన్ని. బర్డ్ వాచింగ్ చేసినా మా ఇంటి దగ్గర్లో ఉన్న అమీన్పూర్ లేక్ వరకు మాత్రమే పరిమితమయ్యేదాన్ని. అయితే పక్షులపై వీరాభిమానానికి తొలిసారి బీజం పడింది మంజీరా వన్య ప్రాణుల సంరక్షణా కేంద్రానికి వెళ్లినప్పుడు. అక్కడ నాకు పరిచయమైన షివాన్ మాధురి దంపతులు.. నా బర్డ్ వాచింగ్ ఆసక్తిని గమనించి హైదరాబాద్ పాల్స్ గ్రూప్ గురించి చెప్పి నన్ను కూడా జాయిన్ చేశారు. అక్కడి నుంచి బర్డింగ్ కమ్యూనిటీలో స్నేహితుల మార్గదర్శకత్వంలో సీరియస్ బర్డ్ వాచింగ్ ప్రయాణం ప్రారంభమైంది. తమిళనాడు వెళ్లా. నవంబరు నుంచి ఫిబ్రవరి మధ్యలో నెలకు ఒకటైనా సరే కాస్త దూరంగా ఉండే ప్రాంతాలకు వెళ్తా. కేరళ రెండు సార్లు, ఉత్తరాఖండ్ మూడు సార్లు, కర్ణాటకకు ప్రతి యేటా వెళుతుంటాను. ఇక వారాంతాల్లో నరసాపూర్, క్రిష్ణారెడ్డి లేక్, అనంతగిరి హిల్స్, ఉమామహేశ్వరం.. ఇలా ఎక్కడో ఒక ప్రాంతానికి వెళతాం. మన దేశంలో 1300లకుపైగా జాతులు ఉన్నాయి. ఇప్పటి వరకూ 550కి పైగా పక్షులను గుర్తించాను. మొత్తం అన్నీ గుర్తించాలనే లక్ష్యంగా పెట్టుకున్నాను.రావోయీ అభిమాన అతిథీ.. మా ఇంట్లోనే ఒక చిన్న తోట పెంచుతున్నాం. పక్షుల రాక కోసమే ఇంట్లో డ్రిప్ సిస్టమ్ ఉంది. నీళ్ల కోసం దాదాపు 12 రకాల పక్షులు వస్తాయి. రోజూ పొద్దున్న, సాయంత్రం వాటిని చూస్తుంటే మనసు నిండిపోతుంది. గత సీజన్లో బర్డర్స్ ఫేవరెట్గా పేర్కొనే పొన్నంకి పిట్ట (ఇండియన్ పిట్ట) మా ఇంటికి వచ్చి ఏకంగా 4 రోజుల పాటు ఉండడం మరచిపోలేని, మధుర జ్ఞాపకం. ఇవి సాధారణంగా హిమాలయాల నుంచి వస్తాయని చెబుతారు. యేటా అక్టోబరు, నవంబర్ నెల్లో వచ్చి ఎండలు ముదిరినప్పుడు వెళ్లిపోతాయి. అలాంటి పక్షి.. మా ఇంటి పెరట్లో కొన్ని రోజుల పాటు ఉండడం గొప్ప జ్ఞాపకం. ప్రతి పక్షికీ ఓ పేరుంటుంది. ఒక్క జాతిలోనే అరడజను రకాలు ఉంటాయి. వాటి రెక్కల రంగు, పరిమాణం.. వంటి వాటిని బట్టి మనం గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. అలా గుర్తు పెట్టుకోవడం మొదట్లో చాలా కష్టం అనిపించేది. ఇప్పుడు అలవాటైంది.చదవండి: సామాజిక స్ఫూర్తికి సెల్యూట్ఎంతో సంతృప్తినిస్తోంది.. ప్రస్తుతం నగరంలో చాలా మంది బర్డ్ వాచర్స్గా మారుతున్నారు. పలువురు నాకు కాల్ చేసి పక్షుల రాకపోకల గురించి సమాచారం అడుగుతుంటే.. వాళ్లకి సమాధానం ఇస్తుండడం నాకెంత సంతృప్తిని అందిస్తుందో.. అభిరుచులను పంచుకోడాన్ని మించిన ఆనందం ఏముంటుంది? పైగా పక్షులను ప్రేమించడం అంటే ప్రకృతిని ప్రేమించడమే.. నీటి నుంచి నింగి వరకూ ప్రతి చోటా ప్రత్యక్షమయే పక్షుల ద్వారా.. ప్రకృతిలోని అనువణువూ బర్డ్ వాచింగ్ మనకు పరిచయం చేస్తుంది. మరచిపోలేని జ్ఞాపకాలను అందిస్తుంది. -
లేడీస్ బ్యాంక్ ఎక్కడుందో తెలుసా?
సనత్నగర్: ఇంటిని అందంగా తీర్చిదిద్దడమే కాదు.. కుటుంబాన్ని నడిపించడంలోనూ మహిళల పాత్ర ఎనలేనిది. ఓ వైపు ఇంటి బాధ్యతలను నెరవేరుస్తూ.. మరోవైపు ఉద్యోగ విధులను బాధ్యతాయుతంగా చేపడుతున్న మహిళలు కోకొల్లలు. అయితే అందరి ఆర్థిక అవసరాలు తీర్చే బ్యాంకింగ్ రంగంలోనూ మహిళలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే నగరంలోని సుందర్నగర్ బ్రాంచ్లో మాత్రం నూటికి నూరు శాతం మహిళా ఉద్యోగులే ఖాతాదారులకు సేవలందిస్తున్నారు. క్యాషియర్ దగ్గర నుంచి మేనేజర్ వరకూ అందరూ మహిళామణులే విధులు నిర్వహిస్తుండడంతో దీనికి లేడీస్ బ్యాంక్గా ముద్ర పడింది. చదవండి: International Women's Day 2025 : యాక్సలరేట్ యాక్షన్ అంటే? మాటలేనా!2023 డిసెంబర్లో మేనేజర్గా సునీత బాధ్యతలు స్వీకరించిన అనంతరం అన్ని పోస్టుల్లోనూ మహిళలే భర్తీ అయ్యారు. ప్రస్తుతం ఈ బ్యాంకులో రమ్య, శృతి, సృజన, లక్ష్మీ, జ్యోతిర్మయి, ధీరజ తదితర మహిళా ఉద్యోగులు వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తూ.. ఖాతాదారులకు ఎంతో ఓపిగ్గా సేవలందిస్తున్నారు.