breaking news
Women Power
-
ఎవరీ టెంజిన్ యాంగ్కి..? ఆనంద్ మహీంద్రా సైతం..
ఏ రంగంలోనైనా మొదటి వ్యక్తి కావడం అంత ఈజీ కాదు. తనకంటూ సొంత మార్గాన్ని ఏర్పరచుకుని, అందులో తొలి వ్యక్తిగా నిలిచేందుకు ఎలాంటి మార్గదర్శకులు ఉండరు. అయినా సరే గెలవాలనే దృఢ నిశ్చయంతో ముందుకు సాగి సక్సెస్ని అందుకుని సరికొత్త మైలురాయిని సృష్టిస్తారు అంటూ పారిశ్రామిక దిగ్గజం టెక్ మహీంద్రా తన సోషల్ మీడియా పోస్ట్లో రాసుకొచ్చారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనే తొలి మహిళా ఐపీఎస్ అధికారిణిగా నిలిచిని టెన్జిన్ యాంగ్కిని ప్రశంసిస్తూ మహీంద్రా ఈ పోస్ట్ చేశారు. ఈసారి మనకు ప్రేరణ ఈ ఐపీఎస్ అధికారిణి అంటూ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో టెంజిన్ యాంగ్కి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందామా..!.తవాంగ్కు చెందిన టెంజిన్ యాంగ్కి(Tenzin Yangki ) అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికే తొలి మహిళ ఐపీఎస్ ఆఫీసర్గా(Arunachal's First Woman IPS Officer) చరిత్ర సృష్టించారు. ఇక్కడ ఆమె, దృఢ సంకల్పం, క్రమశిక్షణ, వారసత్వంగా సక్రమించిన ప్రజాసేవ తదితరాలతో సాగిన ఆమె సక్సెస్ జర్నీ ప్రతిఒక్కరిని ఆకర్షించింది, కదిలించింది.టెంజిన్ ఎవరంటే..ఆమె దివంగత తండ్రి తుప్టెన్ టెంపా, IAS అధికారి, మాజీ మంత్రి, తల్లి జిగ్మి చోడెన్, అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వంలో కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఇక టెంజిన్ విద్య నేపథ్యం వచ్చేసి..జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ, ఎంఫిల్ పూర్తి చేశారు. ఆమె 2017లో ఏపీపీఎస్సీలో ఉత్తీర్ణురాలై, సియాంగ్ జిల్లాలో సర్కిల్ ఆఫీసర్గా పనిచేశారు. ఆ తర్వాత 2022 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో 545వ ఆల్ ఇండియా ర్యాంక్ను సాధించి ఐపీఎస్ క్యాడర్కి ఎంపికైంది. ఇందులో భాగంగానే హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకొని.. ఇటీవల అక్టోబర్ 17న, జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొన్నారు. 77వ బ్యాచ్ ఐపీఎస్ అధికారుల కోసం నిర్వహించిన ఈ శిక్షణలో 36 శాతం మహిళలు చోటు దక్కించుకోవడం విశేషం. ఈ సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ, ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా..టెంజిన్ను ప్రశంసిస్తూ పోస్ట్ చేయడంతో మరోసారి వార్తల్లో నిలిచారామె. సేవా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తోంది..ఈ ఐపీఎస్ అధికారిణి టెంజిన్ యాంగ్కి తన తల్లిదండ్రుల నుంచి వచ్చిన సేవ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ముందుకు తీసుకువెళ్తోంది. తనకంటూ ఒక వినూత్న మార్గాన్ని ఏర్పరచుకుని అందులో తానే తొలి వ్యక్తిగా నిలవడం అంత సులభం కానిదే అయినా..ఆమె సాధించి చూపించింది. పైగా ఎందరో తన మార్గంలో నడిచేలా స్ఫూర్తిని రగిలించింది. ఈ రోజు ఒంటిరిగా నడుస్తున్నా అని భయపడ్డా..ఇతరులు కూడా మిమ్మల్ని అనుసరిస్తారు, త్వరలో వారికి మీరు మార్గదర్శకులుగా మారేరోజు వస్తుంది. అందుక ఉదహరణ టెంజిన్ యాంగ్కి అంటూ సోషల్ మీడియా పోస్ట్ ఎక్స్లో రాసుకొచ్చారు. కాగా, టెన్జిన్ సాధించిన ఈ విజయం ఈశాన్య ప్రాంతానికి చెందిన మహిళలకు ఒక గొప్ప ఒక మైలురాయి క్షణం. ఎందుకంటే అక్కడ జాతీయ నాయకత్వ పాత్రల్లో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువ.Tenzin Yangki from Tawang has become the first woman from Arunachal Pradesh to join the Indian Police Service.An academician, a civil servant, and now an IPS officer, she carries forward the legacy of service from her parents while carving her own path of excellence.Being… pic.twitter.com/YWt8TCLadF— anand mahindra (@anandmahindra) October 27, 2025 (చదవండి: Success Story: కాలేజ్కి వెళ్లకుండానే పీజీ..కోచింగ్ లేకుండానే 12 ప్రభుత్వ ఉద్యోగాలు..) -
వెయిట్లిప్టింగ్ ఛాంపియన్షిప్లో పాల్గొన్న ఏడు నెలల గర్భిణి..!
సరికొత్త క్రీడా స్ఫూర్తిని నింపింది ఈ తల్లి. తన గెలుపుతో సరికొత్త అధ్యయానికి తెరతీసిందామె. గర్భంతో ఉన్నవాళ్లు చిన్న చిన్న బరువులు ఎత్తేందుకే భయపడతారు. అలాంటిది వెయిల్లిఫ్టింగ్లో పాల్గొనడమే కాదు విజయం సాధించింది ఈ మహిళ. స్థిరత్వం, దృఢ సంకల్పం ఉంటే ఎలాంటి అడ్డంకినైనా అధిగమించొచ్చని నిరూపించింది ఈ తల్లి. ఏడు నెలల నిండు గర్భిణి అయిన సోనికా యాదవ్(Sonika Yadav) ఈ ఘనత సృష్టించింది. ఆమె ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్(Delhi Police constable)గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఆల్ ఇండియా పోలీస్ వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్ 2025-26(Weightlifting Cluster 2025-26 )లో పాల్గొని 145 కిలోల బరువుని ఎత్తి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆమె గత మే నెలలో గర్భం దాల్చినట్లు నిర్థారణ అయ్యాక..శిక్షణ నిలిపేస్తుందని కుటుంబ సభ్యులు అనుకున్నారు. అయితే ఆమెకు క్రీడలు, ఫిట్నెస్ పట్ల ఉన్న మక్కువతో కొనసాగించాలనే నిర్ణయించుకుంది. చాలా దృఢసంకల్పంతో నిపుణుల పర్యవేక్షణలో తన వెయిట్ లిఫ్టింగ్ ట్రైనింగ్ని తీసుకున్నట్లు పేర్కొంది. నిజానికి ఛాంపియన్షిప్లో పాల్గొన్న ఎవ్వరికీ ఆమె గర్భిణి అని తెలియదు. ఎందుకంటే సోనియా వదులుగా ఉన్న దుస్తులే ధరించి సహ పోటీదారులతో పాల్గొంది. చివరి డెడ్లిఫ్ట్ ప్రయత్నంలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఒక్కసారిగా ఆమె క్రీడాస్ఫూర్తిని చూసి ఒక్కసారిగా ప్రేక్షకుల నుంచి కరతాళ ధ్వనులతో చప్పట్లుతో అభినందనలు వెల్లువెత్తాయి. ఆ అసాధారణ గెలుపుని చూసిన వివిధ పోలీసు విభాగాల మహిళా అధికారులంతా సోనికాని అభినందనలు, ప్రశంసలతో ముంచెత్తారు. ఇక సోనికా గర్భవతిగా ఉండగా ఇలాంటి పోటీల్లో పాల్గొన్న అంతర్జాతీయ లిఫ్టర్ లూసీ మార్టిన్స్ నుంచి ప్రేరణ పొందినట్లు పేర్కొంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా, 2014 బ్యాచ్ అధికారిణి అయిన సోనికా ప్రస్తుతం కమ్యూనిటీ పోలీసింగ్ సెల్లో పనిచేస్తున్నారు. గతంలో, మజ్ను కా తిలా ప్రాంతంలో బీట్ ఆఫీసర్గా, అలాగే మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన ప్రచారాల్లోనూ కీలక పాత్ర పోషించారామె.ప్రెగ్నెంట్ టైంలో మంచిదేనా..!గర్భవతిగా ఉన్నప్పుడూ వెయిట్లిఫ్టింగ్ సురక్షితమేనని చెబుతున్నారు నిపుణులు. ప్రెగ్నెంట్ టైంలో వచ్చే వెన్నునొప్పి, వంటి సమస్యలు ఉండవని తేలికగా ఉంటుందని చెబుతున్నారు. దీని వల్ల మీ కోర్ కండరాలు బలోపేతమై..నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్లు ఎక్కువుగా ఉంటాయని చెబుతున్నారు వైద్యులు. కానీ వైద్యుడు సమక్షంలో లేదా పర్యవేక్షణలో చేయాలని సూచిస్తున్నారు. వారి సలహాలు సూచనలతో తగిన జాగ్రత్తలతో బరువులు ఎత్తితే బిడ్డకు తల్లికి ఎలాంటి ప్రమాదం ఉండదని చెబుతున్నారు. ఇక్కడ బరువు ఎత్తేటప్పుడూ.. ఫిట్నెనస్ ట్రైనర్ల సూచనలమేరకు తేలికపాటి టెక్నిక్లతో ఎత్తాల్సి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. 🏋️♀️Defying limits, redefining strength💪W/Ct. Sonika of @DcpNorthDelhi clinched Bronze medal at the All India Police Weightlifting Cluster 2025-26, Amravati (A.P.), lifting a total of 350 kg in 84+ kg category — while 7 months pregnant!True embodiment of strength, courage &… pic.twitter.com/F9jqYdXAFB— Delhi Police (@DelhiPolice) October 24, 2025 (చదవండి: Shreyas Iyer: పక్కటెముక గాయం అంటే..? వామ్మో.. మరీ అంత డేంజరా?) -
స్టార్ హార్టిస్ట్
international Animation day 2025 యానిమేషన్ కంపెనీలు అక్కడొకటి, ఇక్కడొకటి అన్నట్లుగా ఉండే కాలంలో యానిమేషన్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది ప్రమిత ముఖర్జీ. మన దేశంలో యానిమేషన్ రంగం విస్తరణను దగ్గరి నుంచి చూసిన ముఖర్జీ మూడు ఖండాల్లో ప్రసిద్ధ కంపెనీలలో పనిచేసింది. ప్రపంచవ్యాప్తంగా 90 మంది యువతులను యానిమేషన్ రంగంలో తీర్చిదిద్దింది.యానిమేషన్ ఆర్టిస్ట్ కావాలనుకునే ఎంతోమంది యువతులకు నిరంతర స్ఫూర్తినిస్తోంది. కోల్కతాలో పుట్టి పెరిగిన ప్రమిత ముఖర్జీకి చిన్నప్పటి నుంచి కార్టూన్లు, బొమ్మలు అంటే ఇష్టం. తనకు తోచినట్లు బొమ్మలు, కార్టూన్లు వేసేది. బొమ్మలపై ఇష్టమే ప్రమితను యానిమేషన్ ప్రపంచంలోకి తీసుకువచ్చింది. హైస్కూల్ చదువు పూర్తయిన తరువాత 3డీ యానిమేషన్ సర్టిఫికేషన్ కోర్సు చేసింది. ఆ రోజుల్లో...ఆ రోజుల్లో మన దేశంలో కొన్ని యానిమేషన్ స్టూడియోలు మాత్రమే ఉండేవి. అవి హాలీవుడ్ కోసం పనిచేస్తుండేవి. వాటిలో ముంబైలోని ‘క్రెస్ట్ యానిమేషన్’ ఒకటి. ఆ స్టూడియో నుంచే క్యారెక్టర్ రిగ్గింగ్ ఇంటర్న్గా కెరీర్ ప్రారంభించింది. ‘యానిమేషన్ ఫీల్డ్కు భవిష్యత్ ఉంటుందా? ఇది నీటిబుడగ కాదు కదా!’ ‘యానిమేషన్ ఫీల్డ్లో కెరీర్ వెదుక్కోవడం ఎంతవరకు క్షేమం?’ ‘యానిమేషన్ అనేది పురుషాధిపత్య రంగం. మహిళలకు సమాన అవకాశాలు ఉంటాయా?’...ఇలాంటి సందేహాలు ఎన్నో ఆరోజుల్లో ఉండేవి.సందేహాలను వదిలి సత్తా చాటుతూ...కోల్కత్తాలోని ‘డ్రీమ్వర్క్స్ యానిమేషన్’తో పాటు లండన్, లాస్ ఏంజెలెస్లోని ప్రసిద్ధ స్టూడియోలలో పని చేసింది ప్రమిత. ‘ఫీచర్, షార్ట్, ఎపిసోడిక్... ఏదైనా యానిమేటెడ్ ప్రాజెక్ట్లో పనిచేస్తున్నప్పుడు, సృజనాత్మక కోణంలో నేను చేసే మొదటి పని దర్శకుడి మనసును చదవడం. బొమ్మలకు ప్రాణం పోయడం. ప్రతి డైరెక్టర్కు తనదైన భిన్నమైన ఆలోచనా విధానం ఉంటుంది. ఒక ఆర్టిస్ట్గా వారి ఆలోచనను లోతుగా అర్థం చేసుకోవడంతో పాటు క్రియేటివ్ అవుట్పుట్ ఇవ్వడం ముఖ్యం’ అంటుంది ప్రమిత.బాధ నుంచి బయట పడేలా...అమెరికాలో ఒక యానిమేషన్ కంపెనీ లో ఉద్యోగంలో చేరిన రోజుల్లో కొత్త దేశంలో, కొత్త ఉద్యోగ జీవితానికి అలవాటుపడడం ప్రమితకు కష్టంగా ఉండేది. ఆ సమయంలో తండ్రి క్యాన్సర్తో చని పోవడంతో మానసికంగా బాగా కృంగి పోయింది. ఆ బాధ నుంచి బయట పడడానికి తనకు ఉమెన్ ఇన్ యానిమేషన్ (డబ్ల్యూఐఏ) ఎంతో ఉపయోగపడింది. లాస్ ఏంజెలెస్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ స్వచ్ఛంద సంస్థ యానిమేషన్ రంగంలో లింగ సమానత్వం, మహిళలకు సమాన అవకాశాలకు కృషి చేస్తోంది. ఇదీ చదవండి: Yoga: ప్రశాంతమైన నిద్ర కావాలంటే.. చక్కటి ఆసనాలు‘2020లో డబ్ల్యూఐఏ మెంటర్షిప్ ప్రోగ్రామ్లో చేరాను. మెరుగైన సాఫ్ట్స్కిల్స్, నాయకత్వ సామర్థ్యాలు, మెరుగైన మాటతీరు... మొదలైన వాటిలో ఈ ప్రోగ్రామ్ ఎంతో ఉపకరించింది. సమాజానికి నా వంతుగా తిరిగి ఇవ్వాలి అనే ఆలోచన ఇచ్చింది’ అంటుంది ప్రమిత.మూడు ఖండాలలో...రెండు దశాబ్దాల తన కెరీర్లో మూడు ఖండాలలో, ఎన్నో ప్రసిద్ధ కంపెనీలలో, ఎన్నో స్థాయులలో, ఎన్నో ప్రాజెక్ట్లలో పనిచేసింది ప్రమిత. గత పది సంవత్సరాల కాలంలో విఎఫ్ఎక్స్, యానిమేషన్ రంగంలో సాంకేతికంగా ఎంతో మార్పు వచ్చింది. ఆ మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకొని, కాలంతో పాటు నడుస్తూ, తమను తాము నిరూపించుకుంటున్నారు ప్రమితలాంటి యానిమేషన్ ఆర్టిస్ట్లు. మహిళల సంఖ్య పెరుగుతోంది...లింగ అసమానతను తగ్గించడానికి చేసిన అనేక ప్రయత్నాల వల్ల యానిమేషన్ రంగంలో మహిళా ఆర్టిస్ట్ల సంఖ్య గతంతో పోల్చితే బాగా పెరిగింది. 2007లో నా బ్యాచ్లో వందమంది ఉంటే అందులో ఇద్దరు మాత్రమే మహిళలు. యానిమేషన్ ఆర్టిస్ట్గా రాణించడానికి జెండర్, బ్యాక్గ్రౌండ్తో పనిలేదు. మనం చేసే పనిపై మాత్రమే దృష్టి పెట్టాలి. ప్రతికూలంగా మాట్లాడే వారికి దూరంగా ఉండాలి. యానిమేషన్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా 90 మంది యువతులకు మార్గదర్శిగా నిలవడం సంతోషంగా, గర్వంగా ఉంది.యానిమేషన్లో ఆమె బహుముఖ ప్రజ్ఞయానిమేషన్ రంగంలో మహిళా ఆర్టిస్ట్లు, సాంకేతిక నిపుణులకు ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఎందుకు పెరుగుతోంది... అనే విషయానికి వస్తే విశ్లేషకులు ఇలా అంటున్నారు – ‘‘యానిమేషన్కు సంబంధించి సృజనాత్మక ప్రక్రియలో మహిళలు తమ జీవితానుభవాలను జోడిస్తున్నారు. యానిమేషన్ పరిశ్రమలో మహిళల ప్రాతినిధ్యం పెరగడం వల్ల పనిలో వైవిధ్యం, సృజనాత్మకత పెరుగుతుంది. యానిమేషన్ రంగంలో మహిళలు యానిమేటర్ ఆర్టిస్ట్లుగా మాత్రమే కాదు డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్టూడియో ఎగ్జిక్యూటివ్గా కూడా తమను తాము నిరూపించుకుంటున్నారు. వారు సృష్టించే కథలు అన్ని వర్గాల వారికి చేరువ అవుతున్నాయి.’’– ప్రమిత ముఖర్జీ -
సంకల్ప బలముంటే.. ప్రతీది సాధ్యమే..!
యువరానర్.. అనాలనేది చాలా మంది కల. కానీ యువరానర్ అనిపించుకునే స్థాయిలో ఉండేవారు కొందరే. ఆ కొందరిలోనూ మహిళలు తక్కువగా కనిపిస్తుంటారు. కానీ తెలంగాణ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటీవల మహిళా జడ్జీలు.. లాయర్ల సంఖ్య పెరుగుతుంది. రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు ప్రధాన న్యాయమూర్తులు మహిళలే. ఆత్మస్థైర్యంతో విజయం సాధిస్తే.. మనోధైర్యంతో వృత్తిలో రాణిస్తున్నామంటున్నారు మహిళా జడ్జిలు. వీరిపై ప్రత్యేక కథనం.ఆత్మస్థైర్యంతో ముందుకు.. సునీత కుంచాల, పెద్దపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తిలక్ష్య సాధనలో ఆటుపోట్లు ఎదురైనా మనోధైర్యంతో ముందుకెళ్లి విజ యం సాధించారు పెద్దపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల. సునీత తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు. తండ్రి గురువులు ఉపాధ్యాయుడిగా, తల్లి జయకుమారి ప్రభుత్వాస్పత్రిలో నర్సు. ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చిన్న వయసులోనే సునీతకు వివాహమైంది. భర్త, తల్లిదండ్రుల సహకారంతో డిగ్రీ, పీజీ ప్రైవేట్గానే పరీక్షలు రాసి ఉత్తీర్ణురాలయ్యారు. ఎల్ఎల్బీ ఉత్తీర్ణురాలు అ య్యారు. సునీత ఆడపడుచు జడ్జీ కావడంతో తాను కూడా జడ్జీ కావాలనే లక్ష్యం పెట్టుకొని.. శ్రమించా రు. 2003లో జడ్జీ పోస్టుకు పరీక్ష రాసి.. ఇంటర్వ్యూ దాకా వెళ్లి త్రుటిలో ఉద్యోగావకాశాన్ని చేజార్చుకున్నారు. ఓటమితో నిరాశచెందకుండా మళ్లీ ప్రయత్నించారు. 2013లో జూనియర్ సివిల్జడ్జిగా ఎంపికయ్యారు. జిల్లా జడ్జీ కావాలనే కాంక్ష వెంటాడడంతో అదే ఏడాది పడ్డ నోటిఫికేషన్లో ఒకే పోస్టు ఉండడంతో కష్టపడి చదివి విజయం సాధించారు. పోక్సో నేరాలకు కఠిన శిక్షలుజిల్లా జడ్జిగా హైదరాబాద్లోని స్పెషల్ కోర్టులో రెండేళ్లపాటు పనిచేసిన కాలంలో 84 పోక్సో కేసుల్లో తీర్పునిచ్చారు. 10 కేసుల్లో జీవితఖైదు విధించారు. పెద్దపల్లి జిల్లా జడ్జిగా భాధ్యతలు చేపట్టిన తర్వాత మూడు కేసుల్లోనూ తీర్పులిచ్చారు. నిజామాబాద్ జిల్లాలో పనిచేసే సమయంలో ఇద్దరు ట్రాన్స్జెండర్లకు ఆఫీసు సబార్డినేటర్లుగా ఉద్యోగావకాశాన్ని కల్పించడం సంతోషాన్ని ఇచ్చిందంటారు సునీత కుంచాల. నిజామాబాద్లో పనిచేసిన కాలంలో 14 వేల మందికి కరాటేలో శిక్షణ ఇప్పించారు. నిజామాబాద్లోని బాలసదనంలోని విద్యార్థుల ఇబ్బందిని గుర్తించి ప్రైవేట్ స్కూల్లో ఉచిత విద్య అందించేలా ట్రస్టు ఏర్పాటు చేయించడం సంతృప్తినిచ్చిందంటారు.కష్టాలు ఎదురైనా కుంగిపోలేదు: తడిగొప్పుల ప్రవిళిక, జూనియర్ సివిల్ జడ్జి, పిడుగురాళ్లతన ప్రయాణంలో కష్టాలు, కన్నీళ్లు అనేకం ఉన్నాయని పిడుగురాళ్ల జూనియర్ సివిల్ జడీ్జగా విధులు నిర్వర్తిస్తున్న తడిగొప్పుల ప్రవళిక తెలిపారు. వేములవాడ ప్రాంతంలోని కొదురుపాకకు చెందిన ప్రవళిక జడ్జీగా ఎంపికయ్యే క్రమంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ఇంటర్ వరకు కరీంనగర్లో చదువుకున్నారు. 2020లో పీజీ లాసెట్లో రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించిన ప్రవళిక క్లాట్ ద్వారా నల్సార్ విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్ఎం చదివారు. అనంతరం మొదటి ప్రయత్నంలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. వ్యవసాయ కుటుంబం. వివాహమైన తర్వాత తల్లిదండ్రులు, అత్తారింటి వారి సహకారంతో చదువు పూర్తి చేయడంతోపాటు జడ్జిగా ఎంపికయ్యారు. జడ్జిగా ఎంపికవ్వాలంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వూ్యలను విజయవంతంగా పూర్తి చేయాల్సిందే. వీటన్నింటిని విజయవంతంగా పూర్తి చేయాలంటే హైకోర్టు, సుప్రీంకోర్టులు ఇచ్చిన తీర్పులపై పూర్తి అవగాహన ఉండాలి. లాయర్గా వృత్తిలో రాణించాలంటనే నిత్య విద్యార్థి మాదిరిగా కొత్త అంశాలను నేర్చుకుంటూ ఉండాల్సిందేనని ప్రవళిక తెలిపారు.ఆత్మవిశ్వాసంతోనే విజయం: గడ్డం వందన, జూనియర్ సివిల్ జడ్జి,వేములవాడ అమ్మాయిలు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా.. కష్టపడితే ఏదైనా సాధిస్తారని వేములవాడకు చెందిన జూనియర్ సివిల్ జడ్జి గడ్డం వందన నిరూపించారు. జడ్జీ అంటే కేవలం ఉద్యోగమే కాదని.. జీవన విలువలు.. సమాజాన్ని అర్థం చేసుకోవడమని ఆమె అంటున్నారు. వేములవాడకు చెందిన వందన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నందిగామ జూనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. సవాళ్లను స్వాగతించాలివందన తల్లిదండ్రులు గడ్డం శైలజ, సత్యనారాయణరెడ్డి. వేములవాడలో 10వ తరగతి వరకు చదువుకున్న వందన ఇంటర్ హైదరాబాద్లో, లా కోర్సు మహాత్మాగాంధీ న్యాయ కళాశాలలో పూర్తి చేశాను. న్యాయవిద్యలో పీజీని ఉస్మానియా యూనివర్సిటీలో చదివారు. ఎల్ఎల్ఎం పూర్తయ్యాక జ్యుడీషి యల్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యారు. మొదటి ప్రయత్నంలోనే 2022లో ఆంధ్రప్రదేశ్ కర్నూల్ జడ్జిగా ఎంపికయ్యారు. చదువుతోపాటు క్రమశిక్షణ ఉంటేనే విజయం సాధిస్తామని వందన అంటున్నారు.(చదవండి: ఫ్యాషన్ సెన్స్.. కారాదు నాన్సెన్స్..) -
కనిపెట్టింది మహిళలు.. క్రెడిట్ కొట్టేసింది పురుషులు..!
చరిత్ర పొరపాట్లు చేయదు. కానీ, మానవ స్వార్థం చరిత్రలో పొరపాట్లు నమోదు అయ్యేలా చేస్తుంది. అటువంటి చారిత్రకమైన స్వార్థపూరిత పొరపాట్లే ఇక్కడ ఉన్న ఈ ఆవిష్కరణలన్నీ. వీటిని కనిపెట్టింది, లేదా సృష్టించింది మహిళలే అయినప్పటికీ, ఆ గొప్పదనం పురుషులకు దక్కింది! నిజానికి ఇది ‘దక్కటం’ కాదు. ‘కొట్టేయటం’! స్త్రీల నుంచి పురుషులు.. చోరీ చేసి, ప్రపంచాన్ని మభ్యపెట్టి, గురువు స్థానంలో ఉండీ, పేటెంట్ను మూలన పడేసి, సహోద్యోగిని టాలెంట్ను తొక్కిపెట్టి, పైకి మాట్లాడనీయకుండా చేసి, పక్కకు తోసేసి...క్రెడిట్ తీసుకున్న ఇన్నోవేషన్లు.. డిస్కవరీలలో ఇవి కొన్ని మాత్రమే!మోనోపలీ గేమ్ఈ బోర్డ్ గేమ్ని కనిపెట్టింది కాలిఫోర్నియాకు చెందిన చార్ల్స్ డారో అనే ఆయన అని; కనిపెట్టి ‘పార్కర్ బ్రదర్స్’ అనే గేమ్ పబ్లిషర్స్కి 1935లో విక్రయించారని; అలా ఈ ‘మోనోపలీ’ బోర్డ్ గేమ్ ప్రఖ్యాతి చెందిందని ప్రపంచానికి ఒక పొరపాటు భావన ఉంది.నిజానికి మోనోపలీ బోర్డ్ గేమ్ను కనిపెట్టింది అమెరికన్ గేమ్ డిజైనర్, రచయిత్రి ఎలిజబెత్ మ్యాగీ (1866–1948). చార్ల్స్ డారో కంటే 3 దశాబ్దాల ముందే.. ‘ది ల్యాండ్లార్డ్స్ గేమ్: యాంటీ–మోనోపలిస్ట్, మోనోపలిస్ట్’ అనే పేరుతో రెండు సెట్ల మోనోపలీ గేమ్ని ఎలిజబెత్ మ్యాగీ సృష్టించారు. మోనోపలీ బోర్డ్ గేమ్లో ఆటగాళ్లు తమ ప్రత్యర్థులను వ్యాపారంలో దివాలా తీయించటానికి, వ్యాపార ప్రపంచ జగదేక వీరుడిగా నిలవటానికి ఆస్తులను కొనుగోలు చేస్తూ, అమ్ముతూ, లాభాల కోసం ఎత్తులకు పైఎత్తులు వేస్తుంటారు. ఈ గేమ్ను కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆడుతుంటారు. ఆటకు కనీసం ఇద్దరు ఉండాలి. 6 లేదా 8 మంది ప్లేయర్ల వరకు ఆడవచ్చు.పేపర్ బ్యాగులు అడుగు భాగం బల్లపరుపుగా ఉండి, పక్కకు వాలిపోకుండా స్థిరంగా నిలబడి ఉండేలా పేపర్ బ్యాగులను తయారు చేసే యంత్రానికి సృష్టికర్త నిజానికి మార్గరెట్ ఎలోయిస్ నైట్ (1838–1914) అనే అమెరికన్ మహిళ. అయితే, చార్ల్స్ అన్నన్ అనే అతడు ఆమె కనిపెట్టిన పేపర్ బ్యాగ్ డిజైన్ను తస్కరించి తన పేరుతో పేటెంట్స్ సంపాదించాడు. మార్గరెట్ ఎలోయిస్ నైట్.. పేపర్ బ్యాగ్ యంత్రానికి మొదట చెక్కతో నమూనాను తయారు చేసి, దానికి ఒరిజినల్ వెర్షన్ కోసం (ఇనుప యంత్రం నమూనా) ఒక షాపుకు వెళ్లినప్పుడు అక్కడే ఉన్న అన్నన్ ఆమె దగ్గరున్న పేపర్ బ్యాగ్ డిజైన్ను దొంగిలించాడు. అన్నన్పై న్యాయ పోరాటం చేసి మరీ మార్గరెట్ తన పేటెంట్ను దక్కించుకోవలసి వచ్చింది. ఆమె తన 12వ యేటే ‘ఆటో–స్టాపర్’ మెషిన్ను కూడా కనిపెట్టారు. నేటి ఎలక్ట్రానిక్ గృహోపకరణాలలో; పారిశ్రామిక, వాణిజ్య పరికరాలలో ఆ ఆటో స్టాపర్ (దానంతటే ఆగిపోయే ఏర్పాటు) కీలకమైన పాత్రను నిర్వహిస్తోంది.సెక్స్ క్రోమోజోమ్లుఅమెరికన్ మహిళా జన్యుశాస్త్రవేత్త నెట్టీ స్టీవెన్స్ (1861–1912) 1905లో సెక్స్ క్రోమోజోములను కనిపెట్టారు. అయితే ఆ ఘనతను మొదట ఆమె గురువు ఇ.బి.విల్సన్ దక్కించుకున్నారు. పురుషుల్లోని లింగ నిర్ధారణ క్రోమోజోమ్ల ప్రభావాన్ని అర్థం చేసుకోవటానికి నెట్టీ స్టీవెన్స్ పేడ పురుగులపై పరిశోధనలు చేస్తున్నప్పుడు... పుట్టే బిడ్డ ఆడా, మగా అనేది నిర్ణయించేది పురుషుల క్రోమోజోమ్లేనని ఆమె కనుగొన్నారు. తల్లి అండంలో కేవలం ఎక్స్ క్రోమోజోమ్లు మాత్రమే ఉంటాయి. తండ్రి శుక్రకణాల్లో ‘వై’, ‘ఎక్స్’ క్రోమోజోములు రెండూ ఉంటాయి. తండ్రిలో ‘వై’ క్రోమోజోమ్ తల్లిలోని ‘ఎక్స్’తో కలిస్తే మగబిడ్డ; లేదా తండ్రిలోని ‘ఎక్స్’– తల్లిలో ఉండే ‘ఎక్స్’తో కలిస్తే ఆడబిడ్డ పుడతారని నెట్టీ స్టీవెన్స్ కనిపెట్టారు. నెట్టీ పరిశోధనను, మరికాస్త ముందు తీసుకువెళ్లటం వరకు మాత్రమే ఇ.బి.విల్సన్ పాత్ర పరిమితమై ఉన్నప్పటికీ అసలైన సృష్టికర్తగా ఆయనకే పేరు వచ్చింది.విండ్షీల్డ్ వైపర్లు1902లో, మేరీ ఆండర్సన్ (1866–1953) అలబామా నుండి న్యూయార్క్ నగరానికి కారులో ప్రయాణిస్తున్నారు. బాగా మంచు కురుస్తోంది. విండ్షీల్డుపై పడుతున్న ఆ మంచును మెత్తటి వస్త్రంతో తుడిచేందుకు డ్రైవర్ మాటిమాటికీ కారును రోడ్డు పక్కన ఆపవలసి వస్తోంది. అది చూసిన మేరీ ఆండర్సన్కు ఈ విండ్షీల్డ్ వైపర్ల ఆలోచన వచ్చింది. వెంటనే ఆ ఆలోచనకు పేటెంట్ను దాఖలు చేశారు.దురదృష్టవశాత్తూ ఆమె ఆవిష్కరణకు పెద్దగా ప్రాముఖ్యం లభించలేదు. ఇదీ ఒక ఇన్వెషనేనా అన్నారు. కొంతకాలం ఆమె పేటెంట్ గడువు ముగిసింది. తరువాత కొన్ని నెలల్లోనే అమెరికాలో ఎక్కడ చూసినా విండ్షీల్డ్ వైపర్లే! అంతేకాదు, విండ్షీల్డ్ వైపర్స్ను కనిపెట్టిన క్రెడిట్ రాబర్ట్ కియర్న్స్ అనే వ్యక్తికి దక్కింది! మేరీ ఎలిజబెత్ ఆండర్సన్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆమెకు విస్తారంగా పాడి పంటల క్షేత్రాలు ఉన్నాయి. ద్రాక్ష తోటల్ని పెంచేవారు. నిరంతరం కారు ప్రయాణాలు చేస్తుంటారు. ఏమైనా.. విండ్షీల్డ్ వైపర్ సృష్టికర్త రాబర్ట్ కియర్న్స్ కాదని, మేరీ ఎలిజబెత్ అని త్వరలోనే ప్రపంచానికి నిజం తెలిసిపోయింది.కేంద్రక విచ్ఛిత్తి ‘కేంద్రక విచ్ఛిత్తి’ని కనుగొన్నందుకు ఒట్టో హాన్ అనే జర్మనీ శాస్త్రవేత్తకు 1944లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. నిజానికి ఆ బహుమతి దక్కవలసింది ఆయన సహోద్యోగి లిజ్ మీట్నర్కు! కేంద్రక విచ్ఛిత్తికి (న్యూక్లియర్ ఫిషన్) సైద్ధాంతిక వివరణను అందించింది అసలు లిజ్ మీట్నరే. యురేనియంలో మహా శక్తి ఉన్నట్లు కూడా ఆమే కనిపెట్టారు.ఒక పరమాణు కేంద్రకం రెండు లేదా అంతకన్నా ఎక్కువ పరమాణు కేంద్రాలుగా విడిపోయే ప్రక్రియే కేంద్రక విచ్ఛిత్తి. రేడియో ధార్మిక వికిరణం కంటే ఎక్కువగా అత్యధిక స్థాయిలో కేంద్రక విచ్ఛిత్తిలో శక్తి విడుదల అవుతుందని లిజ్ మీట్నర్ కనుగొన్నారు. ఆమె అందించిన సహకారం వల్లనే ఒట్టో హాన్ నోబెల్ సాధించగలిగారు.లిజ్ మీట్నర్ (1878–1968) ఆస్ట్రియన్–స్వీడిష్ అణు భౌతిక శాస్త్రవేత్త. వియన్నా విశ్వవిద్యాలయం నుండి భౌతిక శాస్త్రంలో డాక్టరేట్ పొందిన రెండవ మహిళగా ఆమె గుర్తింపు పొందారు. 1924–1948 మధ్య రసాయన శాస్త్రంలో 19 సార్లు, 1937–1967 మధ్య భౌతిక శాస్త్రంలో 30 సార్లు నోబెల్కు ఆమె నామినేట్ అయ్యారు.గ్రీన్హౌస్ ప్రభావంగ్రీన్హౌస్ ప్రభావం గురించి మాట్లాడేటప్పుడు, ఈ అద్భుతమైన విషయాన్ని కనుగొన్న వ్యక్తిగా బ్రిటిష్ శాస్త్రవేత్త జాన్ టిండాల్ పేరు తరచుగా ప్రస్తావనకు వస్తుంటుంది. అయితే, గ్రీన్హౌస్ ప్రభావాన్ని మొదట సిద్ధాంతీకరించి, దానిని రుజువు చేసింది నిజానికి అమెరికన్ మహిళా శాస్త్రవేత్త యునిస్ ఫూటే (1819–1888). విచారకరం ఏంటంటే – ఆమె కనిపెట్టిన ‘గ్రీన్హౌస్ ఎఫెక్ట్’ గురించి వివరించటానికి ఆమెకు అనుమతి లభించలేదు. దాంతో ఆమె తన పరిశోధనల గురించి మాట్లాడాలని ఒక పురుష సహోద్యోగిని అడగాల్సి వచ్చింది. 1856లోనే యూనిస్ ఫూటే గ్రీన్హౌస్ ఎఫెక్ట్ను కనిపెట్టారు. కానీ 1861లో దానిని కనిపెట్టిన జాన్ టిండాల్కు ప్రాధాన్యం లభించింది. భూవాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ వంటి వాయువులు సూర్యుని వేడిని సంగ్రహించి భూమికి హితంగా ఉండేంత మోతాదులో మాత్రమే ఉష్ణోగ్రతను స్వీకరించి, మిగతా కిరణాలను వెనక్కు పంపే సహజ ప్రక్రియే గ్రీన్హౌస్ ఎఫెక్ట్. (చదవండి: తిరిగొచ్చిన ఉంగరం! ఆరు దశాబ్దాలు జ్ఞాపకం..) -
సత్తా చాటిన సిస్టర్ సబీనా
కేరళకు చెందిన నన్ సిస్టర్ సబీనా రాష్ట్ర మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్లో హర్డిల్స్లో అద్భుతంగా రాణించారు. 55 ఏళ్ల సబినా 55–ప్లస్ విభాగంలో మొదటిస్థానంలో నిలిచారు. కాసరగోడ్ ప్రాంతానికి చెందిన సబినా ఒకప్పుడు జాతీయ స్థాయి హర్డిలర్. తొమ్మిదో క్లాస్లో ఉన్నప్పటి నుంచి జాతీయస్థాయి హర్డిల్స్ ఈవెంట్స్లో పాల్గొనేవారు. యూనివర్శిటీ స్థాయి పోటీలలో కూడా సత్తా చాటారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా ఆమె ఎంతోమంది విద్యార్థులను క్రీడలలో తీర్చిదిద్దారు.‘రాబోయే మార్చిలో ఉద్యోగం నుంచి రిటైర్ అవుతున్నాను. ఈలోపు ఒకసారి పోటీలో పాల్గొనాలనుకున్నాను’ అన్నారు సబీన. ‘ఆమె విజయం సంకల్ప బలానికి ప్రతీక. లక్ష్యం చేరుకోవడానికి వయసు ఎప్పుడూ అడ్డు కాదని నిరూపించారు’ అని సబీనాపై ప్రశంసలు కురిపించారు కేరళ విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టి. మతపరమైన దుస్తులు ధరించి సబీనాపోటీలో పాల్గొనడం విశేషంగా మారింది.చదవండి: రూ. 1.75 - 5.27 కోట్లదాకా జీతం : ఆ 600 మందికి సుదర్శన్ కామత్ ఆఫర్ -
ఒంటరితనానికి విరుగుడు అమ్మమ్మ... నానమ్మల బడి
అమ్మమ్మ... నానమ్మ... ఇప్పుడు అంతగా పట్టని మనుషులు. వాళ్ల చేతికో ఫోన్ ఇచ్చేసి, గది ఇచ్చేస్తే ఎవరూ మాట్లాడాల్సిన పని లేదని అనుకునే కుటుంబాలు ఉన్నాయి. పెద్దవయసులో ఒంటరితనం ఫీలవుతున్న స్త్రీలు ఎందరో ఉన్నారు. అలాంటి వారిని తిరిగి స్కూలుకు పంపితే చదువుకు చదువు, స్నేహానికి స్నేహం దక్కుతాయి. మహారాష్ట్రలో పదేళ్ల క్రితం మొదలైన ఇలాంటి బడి నేటికీ కొనసాగుతూ ప్రతి ఊరికి ఇలాంటిది అవసరమని చాటుతోంది. ‘ఆజిబైచి శాల’ అంటే ‘అమ్మమ్మల బడి’ గురించి...ఇది అద్భుతం. మొన్నటి మార్చి 8న మహారాష్ట్రలోని ఆ చిన్న పల్లెలో, ముంబైకి 120 కిలోమీటర్ల దూరాన ఉన్న ఆ గ్రామంలో పెద్ద ఉత్సవం జరిగింది. అదేమిటో తెలుసా? ‘ఆజిబైచి శాల’ దశాబ్ది ఉత్సవం. అంటే ఆ స్కూల్ పెట్టి సరిగ్గా పదేళ్లయిన సందర్భంగా ఆ స్కూలు స్టూడెంట్లు, పెద్దమనుషులు, గ్రామస్తులు... ఆ స్కూల్ని స్థాపించిన యోగేంద్ర బంగార్ అనే ఉపాధ్యాయుడు ... అందరూ వేడుక చేసుకున్నారు. బహుశా ప్రపంచంలో ఇలాంటి స్కూల్ ఏర్పాటయ్యి ఇలా పదేళ్లపాటు కొనసాగి, ఇంకా కొనసాగుతూ ఉండటం ఎంత గొప్ప. ‘ఆజిబైచి శాల’ అంటే ‘అవ్వల బడి’. అందులో స్టూడెంట్స్ అందరూ అవ్వలే.మలుపు తిప్పిన ఆలోచనఒక ఆలోచన వెలిగితే అది చరిత్ర సృష్టిస్తుంది. పదేళ్ల క్రితం ఫంగణె అనే ఆ పల్లెలో ఛత్రపతి శివాజీ గాథను ఊరి వారికి ఏర్పాటు చేశారు. వచ్చిన గాయకులు శివాజీ గాథను పాడుతూ ఉంటే ఊళ్లోని వారందరూ ఒకవైపు; ఊళ్లోని అవ్వలందరూ ఒకవైపూ కూచున్నారు. వారి సంఖ్య 36. శివాజీ గాథను ఊరి వారందరూ ఉత్సాహంగా వింటుంటే అవ్వలకు ఆ కథ సరిగ్గా అర్థమయ్యీ అర్థం కాక ఇబ్బందిగా అనిపించింది. కథ ముగిశాక ఆ ఊరి ఉపాధ్యాయుడైన యోగేంద్ర బంగార్ దగ్గరకు వెళ్లిన వారందరూ ‘సారూ... మీరంతా కథ మస్తు ఎంజాయ్ చేశారు. మేం కూడా చదువుకుని ఉంటే మీలాగే ఎంజాయ్ చేద్దుము’ అన్నారు. యోగేంద్ర బంగార్కు మనసు కలుక్కుమంది. ఇంట్లో ఉండే అవ్వలు చదువు లేక పోవడం వల్ల, వయసు రీత్యా, మారిన కాలం వల్ల ఒంటరితనం అనుభవిస్తున్నారని, వీరికి ఒక ఉపయోగపడే కాలక్షేపం కల్పిస్తే మేలవుతుందని ఆయన అనుకున్నాడు. అదే సంవత్సరం అంటే 2016 మార్చి 8 మహిళా దినోత్సవం రోజున ఊళ్లోని చిన్న స్థలంలో షెడ్డు వేసి ‘అవ్వల బడి’ని ప్రారంభించాడు. అవ్వలు ముందు కంగారు పడ్డా ఆ నిర్ణయాన్ని స్వాగతించారు. ఊరి వాళ్లు మెచ్చుకుని మద్దతు ఇచ్చారు. అలా మొదలైన ఆ స్కూలు ఆ నాటి నుంచి అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది.పెద్ద సమూహం, ఎంతో మేలుగ్రామంలో అంతవరకూ ఎవరికీ పట్టని ఈ అవ్వలు ఇప్పుడు కొత్త ఉనికిలోకి వచ్చారు. గౌరవం పొందారు. అంతేకాదు ఇంట్లో వీరు తమ మనవలతో, మనవరాళ్లతో పాటుగా చదవడం మొదలుపెట్టారు. అవ్వల హోమ్వర్కులో మనవలు సాయం పట్టారు. దాంతో వాతావరణమే మారి పోయింది. ఈ అవ్వలందరూ కలిసి యాత్రలకు వెళుతున్నారు. అలాగే వీరికోసం హెల్త్ క్యాంపులు ఏర్పాటు అవుతున్నాయి. వృద్ధాప్యంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ ఎప్పటికప్పుడు తెలియచేస్తుంటారు. ఇవన్నీ వారికి ఆత్మవిశ్వాసం కలిగిస్తున్నాయి.‘ఈ బంధుగణం కావాలి’‘మన దేశంలో చిన్న వయసులో పెళ్లిళ్ల వల్ల అరవై ఏళ్లు వచ్చేసరికి స్త్రీలు ఒంటరితనాన్ని, నిరాసక్తతను అనుభవిస్తున్నారు. వీరికి చదువు లేక పోతే చాలా విషయాలకు మరింత దూరమవుతున్నారు. కనీసం ఫోను వాడకం కూడా రావడం లేదు. వీరి కోసం వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయడం కంటే ఇలాంటి బడులు ప్రతి ఊళ్లో ప్రతి ఏరియాలో ఏర్పాటు చేయాలి. దీనివల్ల వీరికి మనం కూడా ఎంచదగ్గ మనుషులమే అనే భావన కలుగుతుంది. అవ్వల అనుభవం, వారి చిరునవ్వు ప్రతి ఇంటా ఉండాలంటే వారిని గౌరవించి పట్టించుకోవడం అవసరం‘ అంటాడు ఈ స్కూలు స్థాపకుడు యోగేంద్ర బంగార్.నిజమే... ప్రతి ఊరూ పూనుకుని ఇలాంటి స్కూలు ఏర్పాటు చేస్తే నిరక్షరాస్యత పోవడం మాత్రమే కాదు వృద్ధుల మనోవికాసం వారికి కొత్త జవసత్వాలను ఇస్తుంది. వారి ఉదాసీనత పోగొడుతుంది. పింక్ రంగు చీరల్లో ‘స్టూడెంట్స్’ఊరిలోని వాళ్ల ఫండ్స్తో మొదలైన ఈ స్కూలుకు అవ్వలందరికీ పింక్ రంగు చీరలు యూనిఫామ్గా ఇచ్చారు. స్కూల్ బ్యాగులు, పలకలు, బలపాలు అన్నీ ఇచ్చారు. స్కూలు మొదలైన రోజున ‘చేతికర్రతో తిరిగే ఆ స్త్రీలు బలపం పట్టుకోవడానికి విద్యార్థుల్లా’ బడికి వచ్చారు. ఆ దృశ్యం అందరినీ కదిలించింది. స్కూలు గంటలు వారికి సౌకర్యంగా ఏర్పాటు చేశారు. రోజువారీ పనులన్నీ అయ్యి, గొడ్లకు మేత వేసి, మధ్యాహ్నం భోజనం చేసి అప్పుడు బడికి రావాలి. రోజూ బడి మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు రెండు గంటలు మాత్రమే జరుగుతుంది. మరాఠీ లిపి, కొద్దిపాటి లెక్కలు, ఆర్ట్స్, క్రాఫ్ట్స్... అన్నీ నేర్పిస్తారు. సిలబస్ ఉంటుంది. అన్నింటికీ మించి తమదంటూ ఒక చోటు.. తమకంటూ కొందరు మనుషులు వారికి దొరుకుతారు. -
గోల్డెన్ క్రియేటర్
ఇది పెద్ద ఘనతే. ఇన్స్టాగ్రామ్ ఇక పై ప్రతి ఏటా ఇద్దామనుకుంటున్న‘గ్లోబల్ గోల్డెన్ రింగ్ అవార్డు’ను 2025 సంవత్సరానికి ఇన్ఫ్లూయెన్సర్ డాలీ సింగ్కు ప్రకటించారు.ప్రపంచ వ్యాప్తంగా 25 మందితో తొలి జాబితా సిద్ధం చేయగా మన దేశం నుంచి డాలీ సింగ్ ఒక్కరికే చోటు దక్కింది. లక్షల ఫాలోయెర్లు ఉండటంతో పాటు స్థానిక సంస్కృతిని ప్రచారం చేయగలిగే కంటెంట్ క్రియేటర్లకే ఈ అవార్డు ఇస్తారు.డాలీ సింగ్ పరిచయండాలీ సింగ్ (32).. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పేరు మారుమోగుతోంది. ప్రతి ఏటా ఇన్స్టాగ్రామ్ అందించే ‘గ్లోబల్ గోల్డన్ రింగ్’ అవార్డును సొంతం చేసుకున్న తొలి భారతీయ వ్యక్తిగా డాలీసింగ్ రికార్డు సృష్టించింది. తమ కంటెంట్ ద్వారా స్థానిక సంస్కృతికి చాటే వారికి ఈ అవార్డు అందించాలని ఇన్స్టాగ్రామ్ ఈ అవార్డు ప్రారంభించింది. కంటెంట్ తయారీలో ఎటువంటి భయాలు, తేడాలు చూపని వారికి ఈ అవార్డును అందించనున్నట్లు ఇన్స్టా ప్రకటించింది. తొలి ఏడాదే డాలీ సింగ్ ఈ పురస్కారాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 25 మందిని ఎంపిక చేయగా అందులో మన దేశం నుంచి ఆమె స్థానం పొందడం విశేషం. 1.6 మిలియన్ ఫాలోవర్లు ఉన్న ఆమె డిజిటల్ కంటెంట్ క్రియేటర్తోపాటు నటిగానూ పేరు పొందింది.ఇన్స్టాలో పాపులర్... ఆపై సినిమాల్లో...ఇన్స్టాలో పాపులర్ అయిన డాలీసింగ్ బాలీవుడ్లో నటిగా తెరంగేట్రం చేసింది. ‘డబుల్ ఎక్సెల్’ ఆమె మొదటి సినిమా. కరణ్ బూలనీ దర్శకత్వంలో వచ్చిన ‘థ్యాంక్యూ ఫర్ కమింగ్’ సినిమాలో కీలకపాత్ర పోషించింది. ప్రస్తుతం ‘బెస్ట్ వరస్ట్ డేట్’ పేరుతో తనే సొంతంగా మైక్రో డ్రామా సిరీస్ రూపొందించింది. ఇటీవల ఇన్స్టాలో ఆ సిరీస్ మూడో సీజన్ విడుదలైంది.విజేతలకు ఇన్స్టాలో అదనపు సౌకర్యాలుడాలీ సింగ్తోపాటు గ్లోబల్ రింగ్ అవార్డు అందుకున్నవారికి ఇన్స్టా సంస్థ బంగారు రింగ్ను అందించనుంది. దీంతోపాటు ఆమె ఇన్స్టా ప్రొఫైల్లో డిజిటల్ రింగ్ కనిపించే ఏర్పాటు చేస్తోంది. వారు ఇన్ స్టోరీలు పోస్ట్ చేసే క్రమంలో వారి ప్రొఫైల్ పిక్ చుట్టూ డిజిటల్ రింగ్ కనిపిస్తుంది. ఈ రింగును గోల్డ్ కలర్లో ఉంచుకోవచ్చు. లేదా రంగులు మార్చుకోవచ్చు. తనకు ఈ పురస్కారం ప్రకటించడం నమ్మశక్యం కాని విషయమని డాలీసింగ్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాను నిజాయితీగా చేసిన కంటెంట్ని ఇన్స్టా ప్రతినిధులు చూసి మెచ్చుకోవడం, గుర్తించడం చాలా సంతోషంగా ఉందంటున్నారు. తను మరింత ఉత్సాహంగా ముందుకు సాగేందుకు ఈ అవార్డు దోహదపడుతుందని తెలిపారు.‘రాజు కీ మమ్మీ’తో పాపులారిటీనైనిటాల్లో జన్మించిన డాలీసింగ్ ఢిల్లీలో ఫ్యాషన్ టెక్నాలజీ చదివి ముంబై చేరుకున్నాక డిజిటల్ క్రియేటర్గా మారింది. కాని మొదట ఆమె కుటుంబం ఇందుకు అంగీకరించలేదు. అయితే మెల్లగా వారే ఆమె కంటెంట్ చూసి తమ దృష్టి మార్చుకున్నారు. డాలీ సింగ్ మొదట ఫ్యాషన్ వీడియోలతో కెరీర్ ప్రారంభించి తర్వాత మెల్లగా స్కెచ్ వీడియోల వైపు దృష్టి సారించింది. నిత్యజీవితంలో జరిగే సరదా సంఘటనలు వీడియోల రూపంలో చూపితే ప్రేక్షకులకు నచ్చుతుందని గుర్తించింది. దీంతో వీడియోల ద్వారా కథ చెప్పే విధానాన్ని ప్రవేశపెట్టింది. అందుకు ‘రాజు కీ మమ్మీ’ పాత్ర ఆమెకు దోహదపడింది. ఆ పాత్ర ద్వారా అనేక అంశాలను సరదాగా చూపుతూ పాపులర్ అయ్యింది. ఇందులో కేవలం హాస్యమే కాకుండా సంస్కృతి, సంప్రదాయాలు, పండగలు, కుటుంబ సంబంధాల గురించి వివరిస్తుంటుంది. ఇది ఆమె ఫాలోవర్స్ని విశేషంగా ఆకట్టుకుంది. దీంతోపాటు అమాయకత్వం, అయోమయం, హడావిడి కలగలిసిన దక్షిణ దిల్లీ అమ్మాయిగానూ ఆమె వీడియోలు పాపులర్ అయ్యాయి. -
ఎంబిఏ చేసిన 80 ఏళ్ల సీఈవో..!
నేర్చుకోవాలనే అంతులేని తపనకు నిలువెత్తు నిదర్శనంగా ఉంటారు కొందరు. పైగా మంచి ఉన్నత పొజిషన్లో పనిచేసి పదవీ విరమణ పొందాక కూడా విద్యను అభ్యసించడం అంటే మాటలు కాదకదా..!. చదవాలన్న కోరిక ఉన్నా..వయసు సహకరించదు. పోనీ కొత్తగా ఆ స్పీడ్ టెక్నాలజీని అందుకుంటూ చదవాలంటే వామ్మో అనేస్తారు ఎవ్వరైనా..కానీ ఈ 80 ఏళ్ల మహిళ వాటన్నింటిని ఖతారు చేస్తూ..దిగ్విజయంగా ఎంబిఏ పూర్తి చేసింది. రెండుసార్లు కేన్సర్తో పోరాడి గెలిచి కూడా..ఏ మాత్రం అధైర్యపడకుండా ముందుకు సాగి..నేటి యువతకు ఆదర్శంగా నిలిచారామె.ఆ మహిళే 80 ఏళ్ల ఉషా రే(Usha Ray). పూణేలోని పాటిల్ విద్యాపీఠ్ సెంటర్ ఫర్ ఆన్లైన్ లెర్నింగ్లో హాస్పిటల్ అండ్ హెల్త్కేర్ మేనేజ్మెంట్లో MBA కోసం చేరినప్పుడు ఆమె వయసు 77 ఏళ్లు. ఈ ఏడాది ఆగస్టుకి 80 ఏళ్లు వచ్చిన రెండు వారాలకు ఫైనల్ సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యారామె. నిజానికి ఈ సబ్జెక్టు ఆమెకు కొత్త. ఎందుకంటే ఆమె జంతుశాస్త్రంలో ఎంబిఏ చేశారు. దశాబ్దాలుగా పాఠశాల ఉపాధ్యాయురాలిగా కొనసాగిన అనుభవం ఉందామెకు. ఇప్పుడు కొత్తగా ఆర్థిక శాస్త్రం అర్థం చేసుకోవడం, కంప్యూటర్తో కుస్తీ పట్టడం అన్ని సవాళ్లే ఆమెకు. అయినా..తగ్గేదే లే అంటూ ఎంబీఏ చేసేందుకు ఉత్సాహం చూపించిందామె. ఆమె ఇంగ్లాండ్, యోమెన్ వంటి అంతర్జాతీయ పాఠశాలల్లో భోధించారు కూడా. ప్రస్తుతం ఆమె లక్నోలో గోమతినగర్లోని లవ్ శుభ్ హాస్పిటల్ సీఈవోగా పనిచేస్తున్నారు. ఈ కోరిక ఎలా పుట్టిందంటే..2009లో టీచింగ్ వృత్తి నుంచి పదవీ విరమణ చేశాక..ఆస్పత్రిలో సీఈవోగా పనిచేస్తున్నప్పుడు ఈ కోరిక కలిగిందామెకు. అక్కడ చాలామంది ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నప్పుడూ..ప్రతిచోట ఎంబీఏ అని కనిపించేదట ఆమెకు. అందరూ చేసే ఈ ఎంబీఏ ఏంటి?..ఎలాగైనా తెలుకోవాలన్న ఉద్దేశ్యంతోనే చేయాలనుకున్నట్లు చెప్పుకొచ్చారు ఉషా రే. అలా 2023లో ఆన్లైన్ ఎంబీఏ ప్రోగ్రామ్లో చేరింది. అది హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్కు సంబధించిన విభాగంలో చేయడం ఆమె ఉద్యోగానికి సరిగ్గా సరిపోతుందని చెప్పొచ్చు. అంతేగాదు ఆమెకు 2003లో స్టేజ్-4 ఛాతీ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఎనిమిది నెలల కీమోథెరపీ, రేడియో థెరపీతో కోలుకుంది. మళ్లీ మహమ్మారి సమయంలో కేన్సర్ తిరగబెట్టింది. మళ్లీ ధైర్యంగా ఎదుర్కొంది. ఇన్ని ఆటోపోట్లు చూసినా ఆమె వెనక్కి తగ్గకుండా ఎంబిఏ చేయాలనుకోవడం విశేషః. ఇక్కడ ఉషా రే ఎదురుదెబ్బ తగిలినప్పుడే జాగ్రత్తగా ఉండాలే తప్ప భయంతో అస్సలు ఆగిపోకూడదు అంటారామె. చివరగా దిగ్విజయంగా ఎనిమిది పదుల వయసులో ఎంబీఏ చేయగలిగానంటే అదంతా తన కుటుంబం, సహోద్యోగుల అందించిన ప్రోత్సాహమే అంటూ క్రెడిట్ అంతా వాళ్లకే ఇచ్చేశారు ఉషారే. (చదవండి: ప్లీజ్ సరిగా కూర్చోండి..! యువర్ స్టోరీ వ్యవస్థాపకురాలు ఫైర్) -
ఎవరీ పుష్పం ప్రియా చౌదరి..? రాజకీయాల్లో సరికొత్త ఫైర్ బ్రాండ్లా..
విదేశీ విద్య నేపథ్యంతో రాజకీయాల్లో సరికొత్త బ్రాండ్లా ప్రభంజనం సృష్టించాలనుకుంటోంది. మత, కులాలకు అతితంగా ఫైర్బ్రాండ్ పాలిటిక్స్తో దూసుకుపోవాలనుకుంటోంది. అంతేగాదు బిహార్ రాష్ట్రానికి సరికొత్త పాలిటిక్స్ని పరించయం చేస్తూ..నాయకురాలిగా పెనుమార్పుకి శ్రీకారం చుట్టాలనుకుంటోంది. ఆమె పొలిటికల్ వ్యూహం, డ్రెస్సింగ్ విధానం రాజకీయనాయకుల వేషధారణ, ఆలోచనలకే అత్యంత విరుద్ధం. గెలుస్తుందో లేదో తెలియదు గానీ..ఆమె ఆహార్యం నుంచి..రాజకీయ వ్యూహాల వరకు ప్రతీది అత్యంత విభిన్నం. యువ రాజకీయ నాయకురాలికి సీఎం రేసులో గెలిస్తే..సరికొత్త చరిత్రను క్రియేట్ చేయడమే కాదు..పాలిటిక్స్లో యువ సత్తా ఏంటన్నది తెలుస్తుంది. ఇంతకీ ఎవరామె..? రాజకీయాల్లో ఎలాంటి బ్రాండ్ సెట్ చేయాలనుకుంటుంది అంటే..ఆ అమ్మాయే యునైటెడ్ కింగ్డమ్ నుండి తిరిగి వచ్చిన పుష్పం ప్రియా చౌదరి. రాజకీయాల్లో పెనుమార్పు తీసుకురావాలనేది ఆమె ప్రగాఢ ఆకాంక్ష. 2020లో 'ది ప్లూరల్స్ పార్టీ'ని స్థాపించిన పుష్పం ప్రియా చౌదరి కుల, మతాలకు అతీతంగా సరికొత్త బ్రాండ్ రాజకీయాలను బిహార్ రాష్ట్రానికి పరిచయం చేయాలనుకుంటోంది. ఈ ఏడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి..సరికొత్త నారీశక్తిగా ఓ వెలుగు వెలగాలనే ఉత్సాహంతో ఉంది. ఆమె బిహార్లోని దర్భంగా నుంచి పోటీ చేస్తోంది. ప్రియా 2020లో తన పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్లుగా మెగా అడ్వర్టైస్మెంట్ ఇచ్చి మరీ..రాజకీయల్లోకి ప్రవేశించింది. అయితే ఆమె గెలుపుని అందుకునేంత వరకు నలుపు దుస్తులు, బ్లాక్మాస్క్లోనే ఉండాలని ప్రతిజ్ఞ చేయడం విశేషం. కుటుంబ నేపథ్యం..పుష్పం ప్రియ దర్భంగాకు చెందిన మాజీ జెడీయూ శాసనసభ్యుడు వినోద్ కుమార్ చౌదరి కుమార్తె. ఆమె తాత ప్రొఫెసర్ ఉమాకాంత్ చౌదరి, ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు సన్నిహితుడు. ఆమె మామ వినయ్ కుమార్ చౌదరి 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బెనిపూర్ నుంచి గెలిచిన జేడీయూ నాయకుడు. జూన్ 13, 1987న జన్మించిన పుష్పం ప్రియ దర్బంగాలోనే తన పాఠశాల విద్యను పూర్తిచేసింది. ఆ తర్వాత యూకేలో ఉన్నత విద్యను అభ్యసించింది. 2019లో సస్సెక్స్ విశ్వవిద్యాలయం నుంచి డెవలప్మెంట్ రీసెర్చ్లో మాస్టర్ డిగ్రీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ప్రజా పరిపాలనలో మాస్టర్స్ డిగ్రీని పూర్తించేసిందామె. అతేగాదు తన పార్టీ పేరు ప్రజల సమస్యలను ప్రతిబింబిస్తుందని చెబుతోందామె. ది ప్లూరల్స్ పార్టీ అనగా అన్ని కులాల, మతాల ప్రజలు కలిసి పాలించడం అని సరికొత్త అర్థం వివరించింది. ఇంతవరకు ప్రజలు కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పదాలను ఉచ్ఛరించిలేకపోయారు. మరి ఈ పదం వారికి ఎలా అలవాటవుతుందో వేచి చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆ రంగు దుస్తులే ఎందుకంటే..రాజకీయ నాయకులు అనగానే తెల్లటి దుస్తులే ఎందుకు ధరిస్తారనేది తనకు అస్సలు తెలియదని అంటోంది. అయతే తాను మాత్రం నలుపు రంగు దుస్తులనే ధరిస్తానని, రాజకీయాల్లో పూర్తిస్థాయిలో విజయం సాధించే వరకు ఇలా నల్లటి దుస్తులు, ముసుగుతోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. అయినా అందరి రాజకీయ నాయకులలా కాదని, తనకంటూ ఒక సిద్ధాంతం ఉందని అంటోంది. కాగా, ప్రస్తుత రాజకీయాలపై మాట్లాడుతూ..అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ అధినేత రాహుల్గాంధీ కంటూ తీవ్రమైన నాయకుడని అభిప్రాయం వెలిబుచ్చింది. ఇక నితీష్ కుమార్ ఇప్పటి వరకు బిహార్ని పాలించిన వారి జాబితాలో అత్యత్తుమ ముఖ్యమంతిగా పేర్కొనడం విశేషం. అలాగే ప్రశాంత్ కిషోర్ వ్యహకర్తగానే ఉండాలి, రాజకీయ నాయకుడిగా ఎదగాలని భావించకూడదంటూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.(చదవండి: ఎందరో నరకాసురుల పాలిట సత్యభామలుగా ఆ'షీ'సర్లు..) -
ఎందరో నరకాసురుల పాలిట సత్యభామలుగా ఆ'షీ'సర్లు..
దుష్ట ప్రవృత్తి గల నరకాసురుడిపై సత్యభామ సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి జరుపుకుంటాం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నేరాలు చేసే ఎందరో నరకాసురులకు సత్యభామలుగా మారిన పోలీసు ఆ‘షీ’సర్లు చెక్ చెప్తున్నారు. నేడు నరక చతుర్దశి సందర్భంగా మహిళా పోలీస్ అధికారుల ప్రాధాన్యం గురించి... హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడెమీలో (ఎన్పీఏ) తాజాగా శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్ అధికారుల్లో 36 శాతం మహిళలే. ఎన్పీఏ చరిత్రలో ఇదో రికార్డు. దీనికిముందే ఇలాంటి అరుదైన దృశ్యం తెలంగాణలో ఆవిష్కృతమైంది. సెప్టెంబర్లో చోటు చేసుకున్న ఐపీఎస్ అధికారుల బదిలీతో రాష్ట్ర పోలీసు విభాగంలోని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లో మకుటాలను 33.3 శాతం మహిళలే ధరించారు. ఉమ్మడి రాష్ట్రంలో 1979 వరకు మహిళా ఐపీఎస్లే లేరు. ఆ ఏడాది ఎన్పీఏలో శిక్షణ పూర్తి చేసుకున్న హైదరాబాదీ యువతి అరుణ బహుగుణ చిత్తూరు జిల్లా మదనపల్లె అదనపు ఎస్పీగా పోస్టింగ్ పొందారు. ఇది అప్పట్లో సంచలనం. ఆపై కాలక్రమంలో మహిళ ఐపీఎస్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అయినప్పటికీ 2014 వరకు వీరికి సముచిత పోస్టింగ్స్ ఉండేవి కాదు. అత్యవసర సందర్భాల్లో అక్కరకు రావడానికి కమిషనరేట్కు ఒక మహిళ ఐపీఎస్కు పోస్టింగ్ ఇచ్చేవాళ్లు. మిగిలిన అధికారుల్ని అంతగా ప్రాధాన్యం లేని పోస్టుల్లో నియమించే వారు. రానురాను ఆ సీన్ పూర్తిగా మారిపోతూ వచ్చింది. పోలీసు విభాగంలో మహిళ ఐపీఎస్ అధికారుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో పోస్టింగ్స్ ఇవ్వడం అనివార్యంగా మారింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మహిళల భద్రతకు పెద్ద పీట వేస్తూ మహిళ భద్రత విభాగం, షీ–టీమ్స్ ఏర్పాటైన తర్వాత వీటిలో అనివార్యంగా మహిళ ఐపీఎస్లకే పోస్టింగ్ ఇస్తూ వచ్చారు. కమిషనరేట్లలో డీసీపీ పోస్టులతో పాటు కొన్ని జిల్లాలకు మహిళల్ని ఎస్పీలుగా నియమించారు. ప్రస్తుతం పరిస్థితులు పూర్తి భిన్నంగా మారిపోయాయి. రాష్ట్ర పోలీసు విభాగంలో ఉన్న మూడో వంతు హెచ్ఓడీ పోస్టులతో పాటు హైదరాబాద్, రాచకొండల్లోని డీసీపీ పోస్టుల్లో అత్యధికంగా మహిళా ఐపీఎస్లే ఉన్నారు. ఎస్సైల నుంచి డీఎస్పీల వరకు శిక్షణ ఇచ్చే తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడెమీకి అభిలాష్ బిస్త్, నేరగాళ్లలో మార్పునకు కృషి చేసే జైళ్లశాఖకు సౌమ్య మిశ్ర, రాష్ట్ర నేర పరిశోధన విభాగానికి (సీఐడీ) చారు సిన్హా, మావోయిస్టు వ్యతిరేక నిఘా విభాగమైన బి.సుమతి, హోంగార్డ్స్ వింగ్కు స్వాతి లక్రా నేతృత్వం వహిస్తూ తమ సత్తా చాటుతున్నారు. ఈ ప్రకారం చూస్తే 15 హెచ్ఓడీ పోస్టుల్లో ఏడింటికి ఐదుగురు మహిళ ఐపీఎస్లు నేతృత్వం వహిస్తున్నట్లు లెక్క. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు శిఖా గోయల్ చీఫ్గా, అవినీతి నిరోధక శాఖకు చారు సిన్హా ఇన్చార్జ్గా ఉన్నారు. ఇక రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన హైదరాబాద్ పోలీసు కమిషనరేట్లో మహిళా పోలీసుల సంఖ్య తక్కువగా ఉండటంతోపాటు ఉన్నత స్థాయిలో కూడా ఉండేవారు కారు. అయితే కాలక్రమంలో వీరి సంఖ్య కాస్త పెరిగినా... నగరంలో హఠాత్తుగా తలెత్తే పరిణామాలతోపాటు మతకలహాలను అదుపు చేయడం, వేళాపాళా లేని విధులు వీరితో సాధ్యం కాదనే భావన గతంలో ఉండేది. కాలక్రమంలో చోటు చేసుకున్న పరిస్థితులు, పరిణామాల నేపథ్యంలో నగర పోలీసు విభాగంలోనూ ఒక మహిళ ఉన్నతాధికారి ఉండాలని ప్రభుత్వమూ భావించినప్పటికీ చాన్నాళ్ళ వరకు కేవలం నార్త్జోన్కు మాత్రమే మహిళ అధికారిని నియమిస్తూ వచ్చారు. ఆ జోన్కు ఉండే ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో సిటీ పోలీసువింగ్లో మహిళ ఉన్నతాధికారి ΄ోస్టు ఇదొక్కటే అనే భావన కొనసాగింది.ప్రస్తుతం పరిస్థితులు మాత్రం పూర్తిగా మారిపోయాయి. హైదరాబాద్ కమిషనరేట్లో ఏడు జోన్లు ఉన్నాయి. ఒక్కో జోన్కు ఒక్కో డీసీపీ నేతృత్వం వహిస్తుంటారు. ప్రస్తుతం ఈ ఏడు జోన్లలో మూడింటికి మహిళ ఐపీఎస్లే డీసీపీలుగా ఉన్నారు. మధ్య మండలానికి శిల్పవల్లి, ఉత్తర మండలానికి సాధన రష్మీ పెరుమాళ్, దక్షిణ మండలానికి స్నేహ మెహ్రా డీసీపీలుగా ఉన్నారు. వీరికి తోడు పరిమళ నూతన్, పరిపాలన విభాగం సంయుక్త సీపీగా, రక్షితమూర్తి, సీఏఆర్ హెడ్–క్వార్టర్స్ డీసీపీగా, అపూర్వ రావు– స్పెషల్ బ్రాంచ్ డీసీపీగా, ఎన్ .శ్వేత డిటెక్టివ్ డిపార్ట్మెంట్ డీసీపీ గా, డి.కవిత,సైబర్ క్రైమ్ విభాగం డీసీపీగా, లావణ్య జాదవ్– ఉమెన్ సేఫ్టీ డీసీపీగా పని చేస్తున్నారు. హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉన్న సైబరాబాద్లోని అత్యంత కీలకమైన మాదాపూర్ జోన్కు డీసీపీగా రితిరాజ్ వ్యవహరిస్తున్నారు. ఇక రాచకొండలో మొత్తం నాలుగు జోన్లు ఉన్నాయి. వీటిలో మల్కాజ్గిరి, ఎల్బీనగర్, మహేశ్వరానికి పద్మజ రెడ్డి, అనురాధ, సునీత రెడ్డి డీసీపీలుగా ఉన్నారు. వీరిలో సునీత రెడ్డి మాత్రమే నాన్ ఐపీఎస్ అధికారి. ఈ జోనల్ డీసీపీలతోపాటు మహిళ భద్రత విభాగం, సైబర్ క్రైమ్ వింగ్స్లను ఆ‘షీ’సర్స్ నేతృత్వం వహిస్తున్నారు.– శ్రీరంగం కామేష్, క్రైమ్ రిపోర్టర్, సాక్షి, హైదరాబాద్ -
కృష్ణుడిగా సత్యభామ
‘ఒక మహిళ పురుషుడి పాత్రలో మెప్పించడం చాలా కష్టం’ అంటారు సురభి కళాకారిణి 60 ఏళ్ల పద్మజా వర్మ. ఇప్పటి వరకు కృష్ణుడి పాత్రలో వేదికలపైన 3000కు పైగా నాటక ప్రదర్శనలు ఇచ్చిన పద్మజా వర్మ సత్యభామగానూ మెప్పించారు. ప్రత్యేక పురస్కారాలనూ అందుకున్నారు. నేడు నరకచతుర్దశి సందర్భంగా కృష్ణుడి పాత్రలో జీవించిన పద్మజా వర్మ సాక్షి ఫ్యామిలీతో పంచుకున్న విశేషాలు ...సురభి పద్మజ వర్మకు దాదాపు 60 ఏళ్ల నాటక రంగ అనుభవం ఉంది. కృష్ణుడి పాత్రలో ప్రేక్షకులను మెప్పిస్తూ, కుటుంబ పోషణలో భాగమయ్యింది. గృహిణిగా, ఇద్దరు పిల్లల తల్లిగా, కోడలిగా కుటుంబ జీవనంలోని సర్దుబాట్లను, తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న విధానాన్ని మన ముందుంచారు. మగవారి మధ్యలో ఒక్కదాన్నే మహిళను ‘‘మగవేషాలంటే చాలా ఠీవిగా నిలబడాలి. హుందాగా కనిపించాలి. కిరీటం పెట్టుకొని వేసే వేషం ఏదైనా కష్టమే. అందులోనూ మహిళ పురుషుడి వేషం వేయడం పెద్ద సవాల్. ఆ సమయంలో స్టేజీపైన చుట్టూతా మగవారే. కృష్ణుడి వేషంలో నేనొక్కదాన్నే మహిళను. నటనలో ఎటువంటి జంకు కనిపించకూడదు. గొంతులో తత్తరపాటు ఉండకూడదు. కిరీటం పక్కకు జరగకూడదు, ఫ్లూట్ పట్టుకోవడంలో నేర్పు ఉండాలి. అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ రెండున్నర గంటల పాటు సీనును రక్తికట్టించాలి. అదో పెద్ద టాస్క్.బాల్యం నుంచీ... మూడు నెలల పసిబిడ్డగా ఉన్నప్పుడే మా అమ్మానాన్నలు నన్ను వేదికమీదకు తీసుకెళ్లారు. శ్రీకృష్ణ లీలల్లో భాగంగా బాల కృష్ణుడి పాత్రలను ప్రదర్శించాను. మాకు చదువు అయినా, నటన అయినా కళారంగమే. పన్నెండేళ్ల తర్వాత మాయాబజార్లో శశిరేఖగా వేషాలు వేశాను. శశిరేఖగా ప్రదర్శనలో పాల్గొన్నప్పడు నా పాత్ర పూర్తయ్యాక ఒక వైపు కూర్చొని ఆ నాటక ప్రదర్శన మొత్తం చూసేదాన్ని. శశిరేఖ పాత్ర టీనేజ్ వరకే. ఆ వయసు దాటితే ఆ పాత్ర మరొకరికి ఇచ్చేస్తారు. నాకూ కొంత వయసు వచ్చాక శశిరేఖ బదులు రుక్మిణి, సత్యభామ.. ఇలా మహిళా ప్రాధాన్యత గల వేషాలే ఇచ్చారు.సత్యభామ.. మీరజాలగలరా..!కృష్ణుడి పాత్రకు దీటుగా ఉండేది సత్యభామ పాత్రే. సత్యభామ గా నటించేటప్పుడు ఆ పాత్రకు ఉన్న హావభావాలన్నీ ముఖంలో పలికించాలి. ‘మీర జాల గలడా నా యానతి... ’ అనే పాటలో నవరసాలు ఒలికించాలి. స్త్రీ పాత్రల్లోనూ మెప్పిస్తూ .. ఒక్కో దశ దాటుతున్న కొద్దీ మహిళా ప్రాధాన్యత ఉన్న పాత్రలు మారిపోతుండటం గమనించాను.సందేహాలను జయిస్తూ... కృష్ణుడిగా మెప్పిస్తూ!ఇలాగే ఉంటే కళారంగంలో నా ప్రాధాన్యత ఏముంటుంది అని నన్ను నేనే ప్రశ్నించుకునేదాన్ని. ‘పురుష పాత్రలు అయితేనే మార్పు లేకుండా ఎప్పటికీ వేయచ్చు, ఎలాగా...’ అని ఆలోచించేదాన్ని. పెళ్లయ్యాక మా మామగారి సొంత నాటక కంపెనీలోనే రకరకాల మహిళా ప్రాధాన్యమున్న పాత్రలు వేశాను. ఒకరోజు కృష్ణ వేషధారి ఆరోగ్యం బాగోలేక రాలేదు. ప్రదర్శన ఉంది. ఎలా అని ఆందోళన పడుతున్న సమయంలో ‘నేను కృష్ణుడిగా వేస్తాను’ అని మా మామగారికి ధైర్యం చెప్పాను. అలా మాయాబజార్లో కృష్ణుడిగా నటించాను. అయితే, పురుషుడిలా డ్రెస్ అవ్వడం.. మామూలు విషయం కాదని ఆ రోజే తెలిసింది. కంస వధ నాటకంలో మాత్రం కొంత టెన్షన్ పడ్డాను. ఎందుకంటే, కంస పాత్రధారి మా మామగారే. కంసుని వధించేటప్పుడు బాహాబాహి తలపడటం, గుండెల మీద కొట్టడం.. వంటివి ఉంటాయి. కానీ, నటనలో రిలేషన్ కాదు ప్రతిభనే చూపాలనుకున్నాను. అక్కణ్ణుంచి ఇక నేనే కృష్ణుడిని. అలా నేటివరకు 3000కు పైగా కృష్ణుడి పాత్రలు వేసిన ఘనత నాకు దక్కింది. నాటకాన్ని చూసిన ప్రేక్షకులు స్వయంగా కలిసి, వారి అభిమానాన్ని తెలుపుతూ ఉంటారు. సాధారణ చీరలో నన్ను చూసినవారు ‘మీరేనా కృష్ణుడు’ అని ఆశ్చర్యపోతుంటారు. ఎందుకంటే, అలంకరణలో వేదికపైన కృష్ణుడిలా మరో కొత్త జన్మ ఎత్తినట్టుగా ఉంటుంది. అప్పట్లో భయపడి కృష్ణుడి పాత్రను వదిలేసి ఉంటే.. నాటకరంగంలో నా ప్రత్యేకత అంటూ ఏమీ ఉండేది కాదు. నాకు ఈ యేడాది 60 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహం వల్ల మా పిల్లలిద్దరూ జీవితాల్లో బాగానే స్థిరపడ్డారు. ఇక నాకు బాధ్యతలేం లేవు కాబట్టి నా చివరిశ్వాస వరకు కృష్ణుడిలా నాటకరంగంలో మెప్పిస్తూనే ఉంటాను’’ అని వివరించారు కృష్ణ పాత్ర ధారి పద్మజావర్మ.– నిర్మలా రెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
యువ హవా
ఘనమైన కుటుంబ వ్యాపార నేపథ్యం ఉన్నంత మాత్రాన... ‘విజయం అనివార్యం’ అని చెప్పడానికి లేదు. అంకితభావం, కష్టం ఉంటేనే విజయం సొంతం అవుతుంది.ఘనమైన కుటుంబ వ్యాపారనేపథ్యం లేనంత మాత్రాన...‘విజయం దూరం’ అని చెప్పడానికి లేదు. ఆసక్తికి అంకితభావం, కష్టం తోడైతే విజయం సొంతం అవుతుంది. దీనికి తాజా ఉదాహరణ... అవెండస్ వెల్త్–హురున్ ఇండియా–2025 జాబితా. 35 ఏళ్ల లోపు ప్రతిభావంతులైన 155 మంది యంగ్ ఎంటర్ప్రెన్యూర్లు వెల్త్–హురున్ ఇండియా జాబితాలో చోటు సాధించారు. వీరిలో... వారసత్వ బాధ్యతకు తమ శక్తియుక్తులను జోడించి తమదైన గుర్తింపు తెచ్చుకున్నవారు ఉన్నారు. కొన్ని ఉత్పత్తులలో లోపాలు కనిపెట్టి లోపాలు లేని, సౌకర్యవంతమైన ప్రాడక్ట్స్ కోసం ఎంటర్ప్రెన్యూర్లుగా మారి విజయం సాధించిన వారూ ఉన్నారు... వారిలో కొందరు యంగ్ ఫిమేల్ ఎంటర్ప్రెన్యూర్ల గురించి..సక్సెస్ఫుల్ యూఎస్పీతో...ప్రారంభ కష్టాల మాట ఎలా ఉన్నా... ఉమెన్ యాక్టివేర్ ‘బ్లిస్క్లబ్’ మార్కెట్లో నిలుదొక్కుకోవడానికి ఎంతోకాలం పట్టలేదు. ఈ ఆన్లైన్ బ్రాండ్ ఆ తరువాత రెండు ఆఫ్లైన్ స్టోర్లను కూడా లాంచ్ చేసి విజయం సాధించింది. ‘మార్కెట్లో ఎన్నో బ్రాండ్లు ఉన్నాయి కదా. మీ ప్రత్యేకత ఏమిటి?’ అనే ప్రశ్న ‘బ్లిస్క్లబ్’ ఫౌండర్, సీయీవో మినూ మార్గరెట్ ముందు వచ్చి నిల్చుంది. సిగ్నేచర్ ఫ్యాబ్రిక్స్, వినూత్నమైన ప్రాడక్ట్ డిజైన్ను తమ కంపెనీ యూఎస్పీగా చేసుకొని విజయం సాధించింది మార్గరెట్.నేషనల్ లెవెల్ ఫ్రిస్బీ ప్లేయర్ అయిన మినూ మార్గరెట్ యాక్టివేర్కు సంబంధించిన డీసెంట్ ఆప్షన్స్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ‘బ్లిస్క్లబ్’ స్టార్టప్ ఆలోచనవచ్చింది.‘యాక్టివేర్ రంగంలోని కంపెనీలు డిజైన్ ఫస్ట్ విధానాన్ని అనుసరిస్తాయి. మేము మాత్రం ఈ విధానానికి దూరంగా ఉన్నాం. బ్లిస్క్లబ్కు డిజైన్ క్లబ్ లేదు. ప్రాడక్ట్ ఇంజినీరింగ్ టీమ్ మాత్రమే ఉంది. ఈ టీమ్ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం యాక్టివేర్ సౌలభ్యానికి సంబంధించి మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలను కనుక్కోవడం. ఉదాహరణకు చెన్నైలోని ఒక మహిళ గురించి. వేడి వాతావరణంలో ఆమెకు లెగ్గింగ్స్ ధరించడం కష్టమయ్యేది. ఇలాంటి సమస్యను దృష్టిలో పెట్టుకొని వేడివాతావరణంలో కూడా సౌకర్యంగా ఉండే లెగ్గింగ్స్ను డిజైన్ చేశాం’ అంటుంది మార్గరెట్.దేశంలో తొలి బయోప్లాస్టిక్ ప్లాంట్చెరకు, బయోప్లాస్టిక్కు సంబంధించిన ఆపరేషన్లలో యువ మార్గదర్శకురాలిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అవంతిక సరౌగి. కాలిఫోర్నియాలో చదువుకున్న అవంతిక తమ బల్రామ్పూర్ చినీ మిల్స్ లిమిటెడ్ (బీసిఎంఎల్)ను పీఎల్ఏ (పాలీలాక్టిక్ యాసిడ్) తయారీ సౌకర్యాన్ని అందించే కంపెనీగా తీర్చిదిద్దే ప్రయత్నాలలో ఉంది. ఇది మన దేశంలోని మొట్ట మొదటి బయోప్లాస్టిక్ ప్లాంట్ కానుంది. పీఎల్ఏ అనేది చెరకు పునరుత్పాదక వనరుల నుండి తయారైన బయో ఆధారిత, కంపోస్టబుల్, తక్కువ ఉద్గారాల ప్లాస్టిక్. దీనిని సాధారణంగా ΄్యాకేజింగ్, త్రీడి ప్రింటింగ్లో ఉపయోగిస్తారు. మన దేశంలోని ఈ తొలి బయోప్లాస్టిక్ ప్లాంట్ వల్ల బీసిఎంఎల్ లాభాల బాటలో పయనించనుంది. టర్నోవర్ పెరగనుంది. పర్యావరణ అనుకూలంగా కూడా మారనుంది.తరగతి గదినిమార్చేలావినూత్నమైన ఆలోచన విధానంతో విద్యా, సాంకేతిక రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ పరిత పరేఖ్. బ్రౌన్ యూనివర్శిటీలో చదువుకుంది. బ్రౌన్ తరువాత స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో ‘ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్’పై మాస్టర్స్ చేసింది. స్టాన్ఫోర్డ్లో చదువుకునే రోజుల్లో పిల్లల విద్యావిధానం మీద దృష్టి పెట్టేది. స్టాన్ఫోర్డ్లో చేసిన పరిశోధనలు, నేర్చుకున్న ఆధునిక సాంకేతిక విషయాలు ఆమెను ఎంటర్ప్రెన్యూర్షిప్ వైపు నడిపించాయి.కట్టింగ్–ఎడ్జ్ ఎడ్యుకేషనల్ టెక్ ప్లాట్ఫామ్ ‘టొడెల్’తో ఎంటర్ప్రెన్యూర్గా ప్రస్థానాన్ని ప్రారంభించింది పరిత. మూస బోధన పద్ధతులకు అతీతంగా ఆధునిక బోధన పద్ధతులు, ఆలోచనలతో ‘టొడెల్’ ప్లాట్ఫామ్కు రూపకల్పన చేసింది. ‘టొడెల్’ ప్రభావంతో చాలా బడులలో ఉపాధ్యాయుల బోధన పద్ధతి మారింది. ఒక్క ముక్కలో చె΄్పాలంటే సంప్రదాయ, ఆధునిక విద్యాబోధనలో ఉన్న అంతరాన్ని తగ్గించడానికి ‘టొడెల్’ కృషి చేస్తోంది. విద్యార్థులలో సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచనలను పెం పొందించే ప్రణాళికలతో ‘టొడెల్’ విద్యాప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సాధించింది.చిన్న గదిలో మొదలై...కోట్ల టర్నోవర్ వరకుబెంగళూరులోని చిన్న గదిలో మొదలైన ‘యానిమల్’ రూ.550 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీ స్థాయికి చేరింది. ఐఐటీ–దిల్లీలో చదువుకున్న కీర్తి జాంగ్ర, నీతూ యాదవ్ల బ్రెయిన్ చైల్డ్ ‘యానిమల్’. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ అవ్యవస్థీకృతంగా ఉన్న మన దేశంలోని పశువుల మార్కెట్పై ప్రత్యేక దృష్టి పెట్టింది.పశువుల క్రయవిక్రయాలలో ‘యానిమల్’ యాప్ కీలక పాత్ర పోషిస్తోంది. తమ స్టార్టప్ను ప్రారంభించడానికి ముందు సర్వే నిర్వహించి రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు కీర్తి, నీతూ యాదవ్. డైరీ ఇండస్ట్రీలో కీలకమైన మార్పు తేవాలనుకున్న కీర్తి, నీతూ యాదవ్లు ‘యానిమల్’ యాప్తో తమ కలను నిజం చేసుకున్నారు. ఈ యాప్ ద్వారా మనం ఉన్న చోటు నుంచే వందల కిలోమీటర్ల దూరంలో పశువుల క్రయ విక్రయాలు జరుగుతున్న ప్రదేశం తదితర వివరాలు తెలుసుకోవచ్చు. -
తొలి ప్రయత్నంలోనే సివిల్స్లో సక్సెస్..కానీ ఐఏఎస్ వద్దని..
ఏఎస్ కావాలనేది చాలామంది యువత డ్రీమ్. అందుకోసం ఎంతలా అహర్నిశలు కష్టపడతారో తెలిసిందే. ఒక్కోసారి త్రుటిలో తప్పితే. మరోసారి..ఆదిలోనే అంటే ప్రిలిమ్స్లోనే విఫలమవ్వడం వంటి పలు అవరోధాలను దాటి తమ కలను సాకారం చేసుకుంటుంటారు. ఈ ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ ఎగ్జామ్లో పాసవ్వడం అంత ఈజీ కాదు. అలాగనే అసాధ్యము కాదు. అలాంటిది ఈ అమ్మాయి తొలి ప్రయత్నంలోనే గెలుపు అందుకుంది. అది కూడా అత్యంత చిన్న వయసులోనే అందర్నీ ఆశ్చర్యపరిచేలా విజయం సాదించినప్పటికీ.. ఐఏఎస్, ఐసీఎస్ రెండు వద్దనుకుని ఈ అమ్మాయి ఎందులో విధులు నిర్వర్తించాలనుకుందో వింటే విస్తుపోతారు. ఇదేంటి చాలామంది ఐఆర్ఎస్, ఫారెస్ట్ సర్వీస్ వంటివి వచ్చినా..సరే ఐఏఎస్ కోసం మళ్లీ.. మళ్లీ..రాస్తే..ఈ అమ్మాయి మాత్రం విభిన్నంగా ఎంచుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆ అమ్మాయే అయెధ్యకు చెందిన 21 ఏళ్ల విదుషి సింగ్(Vidushi Singh). ఎలాంటి కోచింగ్లు తీసుకోకుండా తన తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్(UPSC Civils Service Exam) పరీక్షలో విజయ ఢంకా మోగించి ఆలిండియా 13వ ర్యాంకు సాధించింది. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ప్రతిష్టాత్మక శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (SRCC) నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రురాలైన విదుషి స్వీయంగా ప్రిపేరై సివిల్స్ సక్సెస్ అందుకుంది. క్రమశిక్షణ, దృఢసంకల్పం ఉంటే స్వీయ గైడెన్స్లో విజయం సాధించడం పెద్ద కష్టమేమి కాదని తన సక్సెస్తో చెప్పకనే చెప్పింది. అయితే ఆమె ఐఏఎస్, ఐపీఎస్ వంటి ప్రతిష్టాత్మకమైన హోదాలకు మించి దేశ సరిహద్దులకు అతీతంగా సేవలందించాలని, ఐఎఫ్ఎస్ని ఎంపిక చేసుకుంది. అది ఆమె జాతీయ సరిహద్దులకు అతీతమైన దూరదృష్టిని ప్రతిబింబిస్తోంది. కుటుంబ నేపథ్యం..ఆమె తండ్రి ఇంజనీర్ గ్రాడ్యుయేట్, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. విద్యకు విలువనిచ్చే వాతావరణంలో పెరిగిన అమ్మాయి విదూషి. ఆ నేపథ్యంలోనే స్వీయంగా ప్రిపేరయ్యి సివిల్స్ విజయం సాధించింది. ఆమెకు రాత పరీక్షలో 855 మార్కులు రాగా, ఇంటర్వ్యూలో 184 మార్కులతో కలిపి మొత్తం 1039 మార్కులు వచ్చాయి. దీంతో 21 ఏళ్ల వయసులోనే సివిల్స్లో ఇంతటి ఉన్నత ర్యాంకు సాధించిన అతి పిన్నవయస్కురాలిగా నిలిచింది. విదూషి సక్సెస్ జర్నీ ఎందరో సివిల్స్ ఔత్సాహికులకు మార్గదర్శం, స్ఫూర్తి కూడా. కోచింగ్లు తీసుకుంటేనే సక్సెస్ కాదని, సడలని పట్టుదల ఉంటే సాధించలేనిదంటూ లేదని ప్రూవ్ చేసింది విదూషి. (చదవండి: Diwali 2025: ఈ దీపావళి స్వీట్స్ కిలో ఏకంగా రూ. 1.1 లక్షలు? ఎందుకింత ఖరీదంటే..) -
అమ్మ... నాన్న... నాలుగో సింహం
అణువంత ప్రోత్సాహంతో అంతులేనన్ని విజయాలు సాధిస్తామని నిరూపించారు. అపజయాలెన్ని ఎదురైనా వెరవకుండా లక్ష్యాన్ని సాధించి చూ పారు. అమ్మానాన్నలు ఇచ్చిన ప్రోత్సాహం.. భరోసాతో దేశంలోనే అత్యున్నత సర్వీస్లలో ఒకటైన ఇండియన్ పోలీస్ సర్వీసెస్కు ఎంపికై శభాష్ అనిపించుకున్నారు. ఓ కూతురు కండక్టర్ అయిన తన తండ్రి కల నెరవేర్చితే... మరో కూతురు తన తండ్రి నుంచి పొందిన స్ఫూర్తితో సమాజ సేవకు సిద్ధమైంది.అమ్మ అండతో సాటి మహిళలకు భరోసాగా నిలిచే పోలీస్ అధికారి అవుతానని మరొకరు నిరూపించారు. నేషనల్ పోలీస్ అకాడమీలో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న 174 మందిలో 77 ఆర్ఆర్ (రెగ్యులర్ రిక్రూటీస్) బ్యాచ్ ఐపీఎస్ అధికారులు నేడు నిర్వహించనున్న పాసింగ్ ఔట్పరేడ్తో (passing out parade) బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా బ్యాచ్లోని ముగ్గురు మహిళా ఐపీఎస్ల మనోగతం.. వారి మాటల్లోనే...అమ్మ ఇచ్చిన భరోసాతోనే ముందుకు వెళ్లా!నేను ఐపీఎస్ అధికారి అయ్యానంటే అందుకు వందశాతం మా అమ్మే కారణం. నేను ఓటమి పాలైన ప్రతిసారి నాలో ధైర్యాన్ని నింపింది అమ్మ. ఒత్తిడిలో కూరుకుపోయిన ప్రతిసారీ నాకు భరోసా ఇచ్చి నన్ను ఇక్కడివరకు నడిపింది మా అమ్మ నీతూశర్మే. నా పేరు జయశర్మ. నా స్వస్థలం హర్యానాలోని హిస్సార్. మా నాన్న ప్రమోద్ కుమార్ శర్మ. నాన్న డిస్ట్రిక్ట్ ఫుడ్ సప్లై కంట్రోలర్గా పనిచేస్తున్నారు. అమ్మ గృహిణి. నేను ఢిల్లీ యూనివర్సిటీలో బీఎస్సీ మ్యాథ్స్ ఆనర్స్, ఐఐటీ ఢిల్లీ నుంచి ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్ పూర్తి చేశాను. నాకు ఐపీఎస్ కావాలని చిన్ననాటి నుంచే కల. అమ్మ ప్రోత్సాహం, నాన్న అండతో నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత సివిల్ సర్వీసెస్పై దృష్టి పెట్టా. ఇది ఎంతో కష్టమైన పని. కొన్నిసార్లు మనపై మనం నమ్మకాన్ని కోల్పోతాం. ఇది మన వల్ల కాదనిపిస్తుంది. అలాంటప్పుడు మనల్ని ప్రోత్సహించేవాళ్లు, భరోసా ఇచ్చేవాళ్లు ఎంతో అవసరం. నేను కూడా మూడుసార్లు సివిల్స్కి ఎంపిక కాకపోయినా నిరుత్సాహ పడలేదు. తప్పులు సరిచేసుకుంటూ ముందు వెళ్లా. ఐపీఎస్ ఎలాగైనా సాధించాలన్న నా పట్టుదలకు తోడు నా కుటుంబం, స్నేహితులు అండగా నిలిచారు. నాల్గో ప్రయత్నంలో నేను అనుకున్నట్టుగానే ఐపీఎస్కి ఎంపికయ్యాను. నేషనల్ పోలీస్ అకాడమీ (ఎన్పీఏ)లో శిక్షణ పూర్తిగా భిన్నమైంది. నేను ఎన్ పీఏలోకి రాకముందు కనీసం వంద మీటర్లు కూడా పరిగెత్తినట్టు గుర్తు లేదు. కానీ ఇక్కడ శిక్షణతో ఇప్పుడు ఒంటిపై బరువు, చేతిలో రైపిల్తో 40 కిలోమీటర్లు కూడా రన్నింగ్ చేసేంత స్థై్థర్యం వచ్చింది. మహిళా ఐపీఎస్ అధికారిగా మహిళా భద్రత, సైబర్ భద్రతపై ప్రత్యేక దృష్టి పెడతాను. – జయశర్మనాలుగుసార్లు ఓడినా.. నాన్న ప్రోత్సాహం తగ్గలేదుమా స్వస్థలం తమిళనాడులోని కన్యాకుమారి. నాన్న బస్ కండక్టర్గా పనిచేసి ఈ ఏడాది రిటైర్ అయ్యారు. అమ్మ గృహిణి. మా అక్క ప్రైవేటు ఉద్యోగిని. మేం ఇద్దరమూ అమ్మాయిలమే అయినా.. నాన్న మమ్మల్ని అన్నింటిలో ప్రోత్సహించేవారు. నేను అన్నా యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో ఇంజినీరింగ్ (Engineering) పూర్తి చేశాను. ప్రభుత్వ అధికారిగా ఉంటేనే సమాజానికి దగ్గరగా పనిచేయవచ్చని నాకు మొదటి నుంచి ఉండేది. అందుకే ఇంజినీరింగ్ తర్వాత ప్రైవేటు ఉద్యోగాలవైపు వెళ్లలేదు. తమిళనాడులో స్టేట్ జీఎస్టీ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేశాను. కానీ.. నన్ను ఐపీఎస్ ఆఫీసర్ను చేయాలన్నది నాన్న కల. అయితే సివిల్స్ కు ఎంపిక కావడం అంత సులువేం కాదు. ఐదో ప్రయత్నంలో ఐపీఎస్ సాధించానంటే నాన్న ఇచ్చిన ప్రోత్సాహమే కారణం. ఎప్పటికప్పుడు గతంలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటూ, వ్యక్తిగతంగా నోట్స్ తయారు చేసుకుంటూ నా ప్రయత్నాన్ని కొనసాగించాను. చివరికి విజయం దక్కింది. ఎన్నో కొత్త విషయాలను నేర్చుకునే అవకాశంతో పాటు మనలో ఉన్న సామర్థ్యాన్ని మనకు తెలియజేస్తుంది నేషనల్ పోలీస్ అకాడమీ ట్రైనింగ్. ఈ శిక్షణ తర్వాత నేను ఎంతో భరోసాగా చెప్పగలను – పోలీస్ ఉద్యోగం మహిళలు కూడా ఎంతో బాగా చేయగలరని! మా బ్యాచ్లో కూడా 65 మంది మహిళా ఐపీఎస్లు ఉండడమే అందుకు ఉదాహరణ. సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్లకి నా సలహా ఒక్కటే..సివిల్స్ సాధించడం అనేది మీ లక్ష్యం అయితే, ఎన్ని అడ్డంకులు వచ్చినా మధ్యలో వదలొద్దని ముందే నిర్ణయించుకోవాలి. ఒత్తిడి లేకుండా ప్రణాళిక ప్రకారం పరీక్షలకు సిద్ధం కావాలి. అప్పుడు విజయం మనదే.– అశ్విని.ఎస్నాకు స్ఫూర్తి మా నాన్నేనాన్న ఎయిర్మెన్ గా ఇండియన్ ఎయిర్ఫోర్స్లో పని చేసి రిటైర్ అయ్యారు. ఇంట్లో ఎంతో క్రమశిక్షణ ఉండేది. నా చిన్నప్పటి నుంచి నాన్నను అలా యూనిఫాంలో చూస్తూ పెరగడంతో నాకు కూడా యూనిఫాం సర్వీసెస్ అంటే ఎంతో గౌరవం ఏర్పడింది. ఆయనే నాకు ఎప్పటికీ స్ఫూర్తి. స్కూలింగ్ పూర్తయి, కాలేజీకి వచ్చాక నాకు స్పష్టత వచ్చింది ఐపీఎస్ అధికారి అయితే ప్రజలకు నేరుగా సేవ చేసే అవకాశం ఉంటుందని. అందుకే ఎప్పటికైనా ఐపీఎస్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళ్లా. గ్జేవియర్స్ కాలేజ్ కోల్కతా నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తయి తర్వాత నేను మొదటి ప్రయత్నంలో సీఐఎస్ఎఫ్లో అసిస్టెంట్ కమాండెంట్గా ఎంపికయ్యాను. 2020 లో ట్రైనింగ్ చేస్తూనే సివిల్స్ ప్రిపరేషన్ కొనసాగించాను. చదవండి: అంబానీ వంటింట్లో పెత్తనం పెద్ద కోడలిదా? చిన్నకోడలిదా?ఆ తర్వాత ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్కు ఎంపికయ్యాను. అయినా, ఐపీఎస్ కలను వదల్లేదు. నాల్గో ప్రయత్నంలో నాకు ఐపీఎస్ (IPS) వచ్చింది. నాన్న ఎయిర్ఫోర్స్లో పనిచేయడం.. మొదటి నుంచి ఎంతో క్రమశిక్షణతో పెరగడంతో ఇక్కడి ట్రైనింగ్ కష్టంగా అనిపించలేదు. సులువుగానే శిక్షణ పూర్తి చేశా. ఇక్కడ నేర్చుకున్న విషయాలు వృత్తిగతంగానే కాకుండా వ్యక్తిగతంగా నన్ను ఎంతో మార్చాయి. నాకు తెలంగాణ పోలీసులో మహేశ్ భగవత్ ఇన్స్పిరేషన్. ఐపీఎస్ అధికారిగా నేను మహిళా భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. నేను హర్యానాలో పుట్టిపెరిగాను. అక్కడి పరిస్థితులు చూశాక.. మహిళా భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా.– కీర్తియాదవ్ -
బొట్టు కూడా ఒక డిజైనర్ ఆభరణం : ఆదాయం 20 లక్షలు
భారతీయ మహిళామణులకు బొట్టు అంటే ప్రాణం.అందం, సంప్రదాయాల మేళవింపు అది. పండగ అయినా, పెళ్లిఅయినా, ఏ వేడుక అయినా అదొక ఫ్యాషన్. అందుకే కాలక్రమేణా బొట్టు లేదా బిందీ రూపాలు మారుతూ వచ్చాయి.ఈ మార్పునే ఆకళింపు చేసుకున్నారు బెంగళూరుకు చెందిన వ్యవస్థాపకురాలు మేఘనా ఖన్నా. రోజువారీ జీవితంలో భాగమైన బొట్టు బిళ్లలను ఫ్యాషన్ ఆభరణాలుగా మార్చి, తన క్రియేటివిటీతో పలువురి సెలబ్రిటీల ఫ్యావరెట్గా మారిపోయింది. మిలిటరీ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చిన మేఘన ఉద్యోగాన్ని వదిలి మరీ ఈ వ్యాపారాన్ని ఎంచుకుంది. మేఘనా సక్సెస్ జర్నీ ఎలా సాగిందో తెలుసుకుందాం ఈ కథనంలో.బెంగళూరుకు చెందిన వ్యవస్థాపకురాలు మేఘనా ఖన్నా బిందీ సంప్రదాయం నుండి ప్రేరణ పొంది, ది బిండి ప్రాజెక్ట్ను స్థాపించారు. అయితే ఈ జర్నీ వెనుక పెద్ద పోరాటమే ఉంది. మేఘనా ఖన్నా పూణేలో మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్లో ఎంబీఏ చేశారు. ఒక ఏడాది పాటు ఒక కంపెనీలో ఉద్యోగంలో చేరారు. కానీ సొంతంగా వ్యాపారాన్ని చేయాలనే ఆలోచనకు మరింత పదును పెరిగింది. ఈ క్రమంలో ఆమె దృష్టి ముక్కు పోగులపై పడింది. జోధ్పూర్ కళాకారులతో కలసి "లెవిటేట్" అనే హ్యాండ్క్రాఫ్ట్ జ్యువెలరీ బ్రాండ్ను ప్రారంభించింది. 2002 - 2020 వరకు అంటే పద్దెనిమిదేళ్లు లెవిటేట్ విజయవంతంగా నడిచింది. ఇందులో రకరకాల చోట్ల నుంచి వచ్చిన అందమైన నగలు, యాక్సెసరీలు, గృహాలంకరణ వస్తువులు ఉండేవి. కోవిడ్ మహమ్మారి మేఘనా వ్యాపారాన్ని దెబ్బతీసింది. చివరకు వ్యాపారం మూసివేయాల్సి వచ్చింది. కానీ బిజినెస్ చేయాలనే కోరిక మాత్రం నశించ లేదు. View this post on Instagram A post shared by Startup Pedia (@startup.pedia)2022లో అనుకోకుండా బొట్టు బిళ్లల్లో బంగారు, వెండివి ఉంటాయని తెలుసుకుంది మేఘనా. తన స్నేహితురాలు అమ్మమ్మ ఇచ్చిన బంగారు బొట్టు చూశాక తానెందుకు ఇలాంటి తయారు చేయకూడదనే ఆలోచన వచ్చింది. అన్ని ఆభరణాల మాదిరిగానే బొట్టు బిళ్లలు కూడా ఒకఫ్యాషన్గా ఉండాలనే ఆలోచనతో "ది బిందీ ప్రాజెక్ట్" ప్రారంభించింది. దీనికి తోడు ‘లెవిటేట్’ అనుభవం ఉండనే ఉంది. రూ.5 లక్షలతో బిందీ ప్రాజెక్ట్ షురూ అయింది. కేవలం ఇద్దరు మహిళలకు శిక్షణ ఇచ్చి, అందంగా స్పెషల్ డిజైన్లతో బిందీ డిజైన్లు రూపొందాయి. దీనికి తగ్గట్టు మార్కెటింగ్ చేసుకున్నారు. తొలుత వీటిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. పర్యావరణహితమైన, రీసైకిల్ చేయబడిన వ్యర్థాలతో అందమైన బొట్టు బిళ్లలను తయారు కావడంతో సెలబ్రిటీలను సైతం విపరీతంగా ఆకర్షించాయి. ఇవి కేవలం ఒక సాధనంగా కాకుండా, ఫ్యాషన్ స్టేట్మెంట్గా మారిపోయాయి. రెండున్నరేళ్లలో 1500 కస్టమర్లు వచ్చారు. సోషల్ మీడియాలో వాట్సాప్, ఇన్స్టా ద్వారా ఆర్డర్లు తీసుకుంటారు. ఇలా 2024 ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల ఆదాయం వచ్చింది. ఇది 2025లో రూ. 20 లక్షలకు చేరిందంటే దీని ఆదరణను అర్థం చేసుకోవచ్చు. ఫెస్టివ్, లెదర్, వస్త్రంతో పూర్తిగా చేత్తో తయారవుతాయి. రంగు రాళ్లు, ఇత్తడి ముక్కలు, పూసలు ఇలా రక రకాలుగా తయారయ్యే ఒక్కో బొట్టు బిళ్లా ఒక్కో డిజైనర్ ఆభరణంలా ఉంటుంది. సామాన్యులతో పాటు,ప్రముఖ పాప్ గాయని ఉషా ఉతుప్, కరీనా కపూర్, కరిష్మా, తమన్నా, సోనం కపూర్ తదితర బాలీవుడ్ హీరోయిన్లను కూడా ఆకర్షిస్తున్నాయి. -
జెండర్ ‘బౌండరీ’ దాటిన ఫస్ట్ కామెంటేటర్
దారులు ఏర్పరచేవారెప్పుడూ ఒంటరిగానే బయలుదేరుతారు! చెప్పకనే ఆ బాటను పదిమందికీ గమ్యంగా మారుస్తారు. అలా పురుషుల రంగమైన క్రికెట్లో మహిళలను కామెంటరీ బాక్స్ వరకు నడిపించిన వ్యక్తి చంద్ర నాయుడు. ఆమెను పరిచయం చేస్తోంది ఈ వారం పాత్ మేకర్..ఇప్పుడిప్పుడే క్రికెట్లో మహిళల ఉనికి, ఉన్నతి కనిపిస్తోంది. కామెంటరీ రంగంలోనూ మహిళా గళాలు వినిపిస్తున్నాయి. క్రికెట్ నేపథ్యం కాకపోయినా మందిరా బేడీ క్రికెట్ యాంకర్గా, కామెంటేటర్గా కనిపించి, వినిపించి కలకలం రేపింది. అంజుమ్ చో్రపా, ఇసా గుహా, లీసా స్థాలేకర్, స్నేహల్ ప్రధాన్ లాంటి క్రికెటర్స్ కూడా ఆట నుంచి రిటైరైపోయి కామెంటేటర్స్గా మారినవారే! వీళ్లందరికీ ఆ ధైర్యం, స్ఫూర్తిని పంచింది మాత్రం 1970ల్లోని క్రికెట్ ప్లేయర్.. చంద్ర నాయుడు. మగాళ్లే వినిపించే క్రికెట్ వ్యాఖ్యానంలోకి మైక్ పట్టుకుని వచ్చిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. ఆ రంగంలో మహిళలు రావడానికి దారిని ఏర్పరచారు.ఘనకీర్తి వారసత్వంచంద్రనాయుడు.. దేశపు తొలి టెస్ట్మ్యాచ్ కెప్టెన్ కల్నల్ సీకే నాయుడు కూతురు. 1932లో లార్డ్స్ స్టేడియంలో మన దేశం ఇంగ్లండ్తో ఆడిన తొలి టెస్ట్మ్యాచ్లో మన జట్టుకు ఆయనే సారథ్యం వహించారు. అతని సోదరులైన సీఎల్ నాయుడు, సీఆర్ నాయుడు, సీఎస్ నాయుడు కూడా క్రికెటర్లే. అలా క్రికెట్ కుటుంబంలో పుట్టిన చంద్ర నాయుడు రక్తంలో కూడా క్రికేట్ ఉండటంతో ఊహ తెలియని వయసు నుంచే క్రికెట్ బ్యాట్ పట్టుకున్నారావిడ. ఊహ తెలిసేప్పటికి ఆమె ఆసక్తి, ఇష్టం అన్నీ క్రికెటే అయ్యాయి. ప్రాక్టీస్తో ఆటలో ప్రావీణ్యం సంప్రాదించి దేశపు తొలితరం మహిళా క్రికెటర్లలో ఒకరిగా స్థానం సంపాదించుకున్నారు.సల్వార్, కమీజ్తో రోల్ మోడల్గా.. ఇటు చదువు.. అటు ఆటలు.. రెండిట్లోనూ చంద్ర చురుకే! 1950ల్లో తన కాలేజీ రోజుల్లో ఉత్తరప్రదేశ్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. సల్వార్, కమీజ్తోనే క్రికెట్ ఆడేవారు ఆమె. ఈ ఆట కోసం ΄్యాంట్, షర్ట్ ధరించాల్సిన అవసరం ఉండదని, సంప్రదాయ దుస్తుల్లోనే చక్కగా ఆడొచ్చని తోటి అమ్మాయిలు గ్రహిస్తారని! క్రీడారంగంలో ముఖ్యంగా క్రికెట్లోకి వీలైనంత ఎక్కువ మంది అమ్మాయిలు రావాలని చంద్ర ఆశించారు. అందుకే స్పోర్ట్స్వేర్తో వాళ్లు వెనుకడుగు వేయకుండా తనను ఓ రోల్మోడల్గా చూపేందుకు ప్రయత్నించారు ఆమె.ట్రయల్ బ్లేజర్ఎన్నో విజయాల తర్వాత క్రికెట్ ఆట నుంచి ఆమె దృష్టి క్రికెట్ మ్యాచ్ వ్యాఖ్యానం మీదకు మళ్లింది. రంజీ ట్రోఫీ మ్యాచ్ల కోసం రేడియోలో వ్యాఖ్యానం చెప్పడం మొదలుపెట్టారు. ఆల్ ఇండియా రేడియో కోసం కాకుండా స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకుల కోసం నేరుగా వ్యాఖ్యానం చేయాలని ఉత్సాహపడ్డారు. ఆ అవకాశం 1977లో వచ్చింది బాంబే (అప్పటి) – మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ మధ్య జరిగిన మ్యాచ్తో! ఆ ఆటను వ్యాఖ్యానించడానికి స్టేడియంలో తొలిసారిగా మైక్ పట్టుకున్నారు చంద్ర నాయుడు. ఆ సందర్భమే ఆమెను తొలి మహిళా కామెంటేటర్ అనే ఖ్యాతిని తెచ్చి పెట్టింది. చరిత్రలో నిలిపింది. భారతీయ క్రికెట్ బ్రాడ్కాస్టింగ్లోనే ఓ సంచలనంగా మారింది. ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్కి ఆల్ ఇండియా రేడియోలో ఆమె చెప్పిన వ్యాఖ్యానానికి బీబీసీ మేల్ కామెంటేటర్స్ అబ్బురపడ్డారట.టీచర్గా ...క్రికెట్ కామెంటరీ నుంచి రిటైరయ్యాక చంద్ర నాయుడు ఇండోర్ వెళ్లిపోయి.. అక్కడి ప్రభుత్వ మహిళా పీజీ కాలేజ్లో లెక్చరర్గా చేరారు. చివరి వరకు అక్కడే పనిచేసి ప్రిన్సిపల్గా రిటైరయ్యారు. ఆమె తండ్రి తొలి టెస్ట్ మ్యాచ్కి ఎక్కడైతే కెప్టెన్గా వ్యవహరించారో అక్కడే ఆ లార్డ్స్ స్టేడియంలోనే 1982లో ఇండియా, ఇంగ్లండ్కు మధ్య జరిగిన గోల్డెన్ జుబ్లీ టెస్ట్ మ్యాచ్కు చంద్ర నాయుడు ప్రత్యేక ఆహ్వానం అందుకున్నారు. ఆమె ఇండోర్లో.. 2021, ఏప్రిల్లో తన 88వ ఏట తుదిశ్వాస విడిచారు. -
పాపాయితోనే మాస్టర్స్..కానీ గ్రాడ్యుయేషన్ ఈవెంట్కి డబ్బుల్లేక అలా చేశా!
కష్టపడి చదువుకోవడం ఒక ఎత్తైతే, ఆ సర్టిఫికెట్ను అందుకోవడం మరో ఎత్తు. గ్రాడ్యుయేషన్ విద్యార్థుల జీవితాల్లో, కరియర్లో అదొక అద్భుతమైన అనుభూతి. గ్రాడ్యుయేషన్ డ్రెస్లో తోటివారితో పాటు వేదికపై నిలబడటం, హితులు, సన్నిహితుల సమక్షంలో గర్వంగా పట్టా పుచ్చుకోవడం అనేది చాలా అరుదుగా సాధించగల అనుభూతి. కానీ అలాంటి ఆనందాన్ని మిస్ అవడం నిజంగా చెప్పలేనంత దురదృష్టమే. అలాంటి అనుభవాన్ని డిజిటల్ క్రియేటర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది నెట్టింట పలువురి హృదయాలను దోచుకుంది.డిజిటల్ క్రియేటర్, రషికా ఫజాలి తన గ్రాడ్యుయేషన్ అనుభవాన్ని పంచుకున్నారు. గ్రాడ్యుయేషన్ ఈవెంట్లో పాల్తొనాలనే ఆమె డ్రీమ్ సాకారం కాలేదు.కేవలం ఆర్థిక సమస్యల కారణంగా దాన్ని మిస్ అయ్యానని చెప్పుకొచ్చింది. ఆరోజు కేవలం జనంలో అతిథిగా కూర్చోవాల్సి వచ్చిందంటూ హృదయాన్ని కదిలించే స్టోరీ షేర్ చేశారు."నేను నా స్వంత గ్రాడ్యుయేషన్కు అతిథిగా ఉన్నాను" అనే శీర్షికతో ఇన్స్టాగ్రామ్లోచేసిన పోస్ట్ వైరల్గా మారింది. అప్పట్లో ఆ వేడుకకు డబ్బు చెల్లించడం కంటే నెల గడవడమే తనకు ముఖ్యమని ఫజాలి పేర్కొన్నారు. నిజంగా ఆ క్లోక్ ధరించాలని చాలా కోరిక ఉండేదని, కానీ మిస్ అవ్వడం తీపి చేదు కలయిక క్షణాలని, వేడుకకు అతిథిగా హాజరు కావాలనే తన నిర్ణయం అత్యంత దారుణమైందని గుర్తు చేసుకున్నారు. అయితే తనను ప్రోత్సహించిన తన తోటివారిని అభినందించే అవకాశం వచ్చినందుకు సంతోషించాననీ, కనీసం ఆ ఆనంద జ్ఞాపకాలు తనలో మిగిలాయని చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Rashika Fazali (@rashikariri)బిడ్డకు తల్లిగాఒక బిడ్డకు తల్లిగా క్లిష్టమైన బాధ్యతలను నిర్వర్తిస్తూనే రషికా మెరిట్తో పట్టభ్రదురాలైంది. రిసెర్చ్లో డిస్టింక్షన్ తెచ్చుకుంది. అదీ చిన్ని పాపాయిని ఎత్తుకుని ఎవరి సాయం లేకుండానే, మాస్టర్స్ సాధించానంటూ గర్వంగా చెప్పుకుంది. దీంతో నెటిజన్లు ఆమెను ప్రశంసల్లో ముంచెత్తారు. అయ్యో... అప్పుడు తమకీ విషయం తెలిసి ఉంటే, సాయం చేసేవారమని చాలామంది కమెంట్ చేశారు. "ఎంత గొప్ప విజయం! భవిష్యత్తులో ఇంకా సాధిస్తారు! అలా కూర్చోవడానికి చాలా ధైర్యం అవసరం! అని ఒకరు, ‘‘గ్రాడ్యుయేషన్కు అభినందనలు మీరు నిజంగా క్వీన్," మరొకరు కామెంట్ చేశారు. నాకు తెలిసి ఉంటే కచ్చితంగా సాయం చేసే దాన్ని.. సాయంగానో, ఉపకారంగానో కాదు ఒకబిడ్డకు తల్లిగా ఇది సాధించడంఎంత కష్టమో తెలుసు అన్నారు మరొకరు. -
ఇన్ బ్రెయిన్
మెదడు పనితీరుపై విశ్లేషణ, కార్యాచరణ సమాచారాన్ని అందించే సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసి, మానసిక వైద్యులకు ఆధునాతన బ్రెయిన్ ఇమేజింగ్–బేస్డ్ ఇన్సైట్స్ను అందించే న్యూరో–ఇన్ఫార్మటిక్స్ ప్లాట్ఫామ్ ‘బ్రెయిన్ సైట్ ఏఐ’ నిర్మించారు రింఝిమ్ అగర్వాల్, ఇమ్మాన్యుయేల్...గత సంవత్సరం ఇండియా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్ట్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడిఎస్సీవో) నుంచి ‘సాఫ్ట్వేర్–యాజ్–ఎ మెడికల్ డివైజ్’ సర్టిఫికెట్ పొందడం ద్వారా ‘బ్రెయిన్సైట్ ఏఐ’ వాణిజ్యపరంగా కీలకమైన మైలురాయిని చేరింది. ఈ సంస్థకు ఇమ్మాన్యుయేల్ సీయివో, రింఝిమ్ అగర్వాల్ సీటీవో.నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ నుంచి రింజిమ్ అగర్వాల్ పీహెచ్డీ చేసింది. ఇమ్మాన్యుయల్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ చేసింది. హెల్త్ కేర్ మేనేజ్మెంట్, టెక్నాలజీ అండ్ పాలసీలలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 సంవత్సరాల అనుభవాన్ని సంపాదించింది. ఆపరేటింగ్ సిస్టమ్ డిజైన్, పబ్లిక్ హెల్త్ అండ్ హెల్త్ కేర్ బిజినెస్లో ఆమెకు అపార అనుభవం ఉంది.‘సీడిఎస్సీవో లైసెన్స్ మాకు వాణిజ్యపరంగా ఉపయోగపడుతుంది. ఈ సంవత్సరం మా ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాం. మా ప్రాడక్స్›్ట వంద ఆస్పత్రులకు చేరువ కావాలనేది మా లక్ష్యం’ అంటుంది ఇమ్మాన్యుయేల్.‘ఆసుపత్రులలో అత్యంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వైద్యులలో న్యూరోసర్జన్లు ఒకరు. మా సాంకేతికత మెదడుకు సంబంధించిన నిర్మాణాత్మక అంశాలకు మాత్రమే కాకుండా లాంగ్వేజ్, కాగ్నిషన్లాంటి వివిధ విధులపై కూడా ఇన్సైట్స్ను అందించగలదు. మా బ్రెయిన్సైట్ ఏఐ సామర్థ్యం సర్జన్లలో ఆసక్తి రేకెత్తించింది’ అంటుంది అగర్వాల్.‘బ్రెయిన్సైట్ ఏఐ’ అందించే సమాచారం సర్జరీల సమయంలో వైద్యులకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఒక కణితి... దేహంలో ఏదైనా కీలక విధులు నిర్వహించే ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంటే, వైద్యులు దానిని చేరుకోవడానికి వేరే ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లడానికి వీలవుతుంది.బ్రెయిన్ ఏఐ ప్రాడక్ట్ ‘వోక్సెల్బాక్స్’ వేగంగా అభివృద్ధి చెందనుంది. మెదడుకు సంబంధించిన నాడీ కణాల కనెక్షన్లను మ్యాప్ చేయడానికి ‘ఫంక్షనల్ మాగ్నెటిక్ రెసోసెన్స్ ఇమేజింగ్’ (ఎఫ్ఎంఆర్ఐ) ఉపయోగ పడుతుంది. ఆ డేటాను ప్రాసెస్ చేసేందుకు ఉపయోగపడేదే ఏఐ–పవర్డ్ ప్రాడక్ట్ వోక్సెల్బాక్స్. రోగ నిర్ధారణ, శస్త్ర చికిత్సలను ప్లాన్ చేయడంలోనూ, చికిత్సను పర్యవేక్షించడంలో సహాయపడేందుకు వీలైన బ్రెయిన్ మ్యాప్స్ను తయారు చేయడంలో ‘వోక్సెల్ బాక్స్’ ఉపయోగపడుతుంది.హెల్త్–టెక్ ఎంటర్ప్రెన్యూర్గా విజయం సాధించిన రింఝిమ్ అగర్వాల్, ఇమ్మాన్యుయేల్ ‘స్నోడ్రాప్’ అనే పేషెంట్ కేర్ యాప్ను కూడా అభివృద్ధి చేశారు. పేషెంట్ల ప్రొఫైల్స్ రూపొందించడంలో, వైద్యప్రకియను మెరుగుపరచడంలో ఇది ఉపయోగపడుతుంది. -
శాంతి సమరం ఇంటి పాఠమే!
‘ఇంటి నుంచే మొదలు కావాలి’ అని నైతిక విలువలకు సంబంధించి చెప్పే మాట. నైతిక విలువల నుంచి సామాజిక నిబద్ధత, సాహస ప్రవృత్తి వరకు ఇంట్లో నుంచే నేర్చుకుంది నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మరియా కొరినా. కుటుంబ వారసత్వం, కుటుంబ బంధాలు, ఉద్యమ బంధాల గురించి ఐరన్ లేడి మరియా మాటల్లోనే..నాన్న అడుగు జాడల్లో నడవాలనుకున్నాను కానీ...రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. నాన్న గొప్ప ఇంజినీర్, వ్యాపారవేత్త. దార్శనికుడు. ఎన్నో కంపెనీలు ప్రారంభించాడు. ఎంతోమందికి ఉపాధి కల్పించాడు.నాన్న ఎప్పుడూ ఒక మాట చెబుతుండేవారు...‘దేశభవిష్యత్, దాని శ్రేయస్సు ఒక సంస్థ అభివృద్ధి, లాభాల కంటే ఎక్కువ. కంపెనీని ఎవరైనా స్థాపించవచ్చు. డబ్బులు సంపాదించడం కూడా సులభం. అయితే నైతిక ప్రమాణాలు ముఖ్యం’ కుటుంబ వారసత్వం అనేది నా బలం. నా పూర్వీకులు, అనేక తరాల వాళ్లు తమ మాతృదేశం కోసం ప్రతీది చేశారు. జైలు జీవితం అనుభవించారు. తరతరాల సందేశం ఒక్కటే... దేశాన్ని ప్రేమించు, బాధ్యతతో ప్రవర్తించు.దేశ చరిత్రను మా ఇల్లు చెప్పేది!నా చిన్నప్పుడు మా ఇల్లు వెనెజువెలా చరిత్రను చెప్పే ఉపాధ్యాయురాలిగా అనిపించేది. ఆ ఇల్లు దేశచరిత్రలో ఎన్నో కీలక ఘట్టాలకు సాక్షిగా నిలిచింది. ఒక విధంగా చె΄్పాలంటే వెనెజువెలా చరిత్రతో కలిసి పెరిగాను! మా అమ్మమ్మ ప్రఖ్యాత పుస్తకం ‘వెనెజువెలా హీరోయిక’ రచయిత ఎడ్వర్డో బ్లాంకో మనవరాలు, వెనెజువెలా మొదటి అధ్యక్షుడు జోస్ ఆంటోనియో పేజ్ సహాయకురాలు. చిన్నప్పుడు నేను విద్యార్థి నాయకుడు అరామండో జులోగా బ్లాంకో వీరాభిమానిని. విసెంటే గోమేజ్ నియంతృత్వంలో 24 సంవత్సరాల వయసులో బ్లాంకో హత్యకు గురయ్యాడు.నన్ను టెర్రరిస్ట్ అన్నారు!నేను గెలుస్తానని మొదట్లో చాలామంది నమ్మలేదు. ‘మీరు మహిళ కదా!’ ‘మీరు ఇంజినీర్ కదా! ‘మీది బాగా డబ్బున్న కుటుంబం కదా!’....ఇలాంటి మాటలే వినిపించేవి. లాటిన్ అమెరికాలోని పితృస్వామ్య భావజాల ప్రభావం వారి మాటల్లో కనిపించేది. ఒకానొక సమయంలో నన్ను టెర్రరిస్ట్గా ముద్ర వేస్తూ బెదిరింపు మెసేజ్లు అదేపనిగా రావడం మొదలయింది. నన్ను నేను రక్షించుకోవడానికి జాగ్రత్త పడడం తప్పనిసరి అనిపించింది. ఏ వ్యక్తీ అజ్ఞాతవాసంలో ఉండాలని నేను కోరుకోను. అయితే మరో కోణంలో చూస్తే మనల్ని మనం మరింతగా తెలుసుకోవడానికి, సవాళ్లను అధిగమించే శక్తిని సమకూర్చుకోవడానికి అజ్ఞాతవాసం అనేది ఒక అవకాశం.మాటలు మాత్రమే చాలవురాజకీయాలు, రాజకీయ నాయకులను అదేపనిగా విమర్శించడం ఒక్కటే సరిపోదు. మనవంతు కార్యాచరణ తప్పనిసరిగా ఉండాలి. ప్రజాస్వామ్యం, న్యాయం, స్వాతంత్య్రం కోసం పోరాడే సాహసికులు ఒక ప్రాంతం, దేశం అని కాదు ప్రపంచం నలుమూలలా ఉన్న ప్రజలకు తరగని స్ఫూర్తిని ఇస్తారు. భయం చుట్టుముట్టిన సమయంఒక సభలో ప్రభుత్వ అవినీతి గురించి మాట్లాడుతున్నాను. హఠాత్తుగా నా కుమార్తె గుర్తుకు వచ్చింది. మాటలు ఆగిపోయాయి. కొన్ని నిమిషాలు మౌనం దాల్చాను. నా కుమార్తె ఎక్కడ ఉంది? క్షేమంగా ఉందా? నేను సభల్లో ప్రభుత్వ అవినీతిపై గొంతెత్తడం వల్ల నా బిడ్డకు హాని జరుగుతుందా?... ఇలా ఎన్నో ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి. ఇంటికి వెళ్లి నా కుమార్తెను చూసుకునే వరకు నా మనసు మనసులో లేదు. ‘కుటుంబ బాధ్యతలు, ఉద్యమం అనే రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నాను. ఇలా చేస్తే రెండిటికీ న్యాయం చేయలేను’ అనిపించింది.అమ్మ మాట‘నాకు దేవుడు ఎన్నో అద్భుత అవకాశాలు ఇచ్చాడు. నాకు ఎలాంటి లోటూ లేదు. నాకు ఎంతో మంది మద్దతు ఉంది... అనుకునేవాళ్లు తమ వంతుగా ఈ సమాజానికి తిరిగి ఇవ్వాలి’ అని చిన్నప్పుడు అమ్మ చెబుతుండేది. అమ్మానాన్నల మాటల సారాంశం ఒక్కటే... మనం వ్యక్తిగతంగా ఏ స్థాయిలో ఉన్నా సమాజ హితాన్ని మరవకూడదు. -
పాలిటిక్స్లో పాట కచేరి
ప్రతిభ, పాపులారిటీ.. పాలిటిక్స్కి మోస్ట్వాంటెడ్ థింగ్స్! ఈ రెండూ ఉన్న వ్యక్తులను ఎన్నికల్లో పార్టీ టికెట్స్ వలచి వరిస్తాయి! ఆ కోవలో గ్లామర్ స్టార్స్, కళాకారులకైతే స్పెషల్ రిజర్వేషన్ ఉంటుంది! అందులో అమ్మాౖయెతే.. మహిళా ప్రాతినిధ్యానికి ఒక ఓటు పెరిగినట్టే.. ఓ ఆశ చిగురించినట్టే! ఇప్పుడీ ప్రస్తావనకు ప్రాసంగికత బిహార్ ఎన్నికలు..అలా టాలెంట్ అండ్ ఫాలోయింగ్ గల అభ్యర్థి.. గాయని మైథిలీ ఠాకుర్. ఆమె పరిచయం..గాయనిగా మైథిలీ ఠాకుర్ (Maithili Thakur) దేశమంతటా సుపరిచితం. ఆమె మైథిలీ, భోజ్పురి, హిందీ భాషల్లో జానపద సంగీతంతోపాటు శాస్త్రీయ సంగీతంలోనూ ఘనాపాటి. సంగీత కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన మైథిలీ జన్మస్థలం బిహార్, మధుబని జిల్లాలోని బేనీపట్టీ. తండ్రి రమేశ్ ఠాకుర్ సంగీతం మాస్టారు. మైథిలీ తన ఇద్దరు సోదరులతోపాటు తండ్రి, తాత దగ్గరే శాస్త్రీయ, జానపద సంగీతం నేర్చుకున్నారు. దేశంలోనే కాదు, విదేశాల్లోనూ భక్తి, జానపద సంగీత కచేరీలు ఇస్తున్నారు. జానపద సంగీతంలో ఆమె చేస్తున్న కృషిని గుర్తించిన సంగీత నాటక అకాడమీ ఆమెను ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారంతో సత్కరించింది. మైథిలీకి సంగీత కళ మీద ఆరాధనే కాదు. సామాజిక స్పృహ కూడా బాగా ఉంది. ఓటర్ ఎడ్యుకేషన్ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని ఓటర్లకు అవగాహన పెంచడంలో తన వంతు పాత్ర పోషించారు. అందుకే ఎలక్షన్ కమిషన్ ఆమెను బిహార్ స్టేట్ ఐకాన్ను (Bihar State Icon) చేసింది. ఇవన్నీ కూడా ఆమెను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టిలో పడేట్టు చేశాయి. ఆయోధ్య రామాలయ (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవంలో శబరి మీద ఆమె పాట పాడారు. ఆ గాన మాధుర్యాన్ని ప్రధాని అభినందించారు. ఇవన్నీ ఆమె రాజకీయ ప్రవేశాన్ని సునాయాసం చేయనున్నాయి. బిహార్ ఎన్నికల్లో మధుబని లేదా అలీనగర్ ఈ రెండిట్లో ఏదో ఒక నియోజక వర్గానికి ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేట్టు కనిపిస్తున్నాయి. మధుబని, దర్భంగా (అలీనగర్ ఈ జిల్లాలోనిదే).. ఈ రెండూ కూడా మిథిలా ప్రాంతం కిందకు వస్తాయి. మైథిలీ ఆ సంస్కృతీ సంప్రదాయంలోనే పుట్టి పెరిగిన వనిత. పైగా కళాకారిణి. ఈ రెండూ ఆమెను ఇటు సంప్రదాయవాదులకు, అటు సంప్రదాయవాదులు కాని వాళ్లకూ కూడా కావల్సిన వ్యక్తిగా ఆమెను ప్రజలకు దగ్గర చేస్తున్నాయి. సరిగ్గా బీజేపీ ఈ అంశాన్నే పరిగణనలోకి తీసుకుని ఆ రెండు నియోజకవర్గాల్లో ఒక స్థానం నుంచి ఆమెను బరిలోకి దింపే ప్రయత్నం చేస్తోందని రాజకీయ విశ్లేషకుల మాట. అంతేకాదు ఆమె యంగ్ లేడీ కావడంతో ఇటు యూత్నూ ఆకట్టుకోవచ్చని బీజేపీ ఆలోచిస్తోందని చెబుతున్నారు. అయితే గెలుపు మాత్రం అంత అనాయాసంగా ఉండక పోవచ్చని మైథిలికి మద్దతిస్తున్న వారి అభిప్రాయం. ఆమె ముందు చాలా సవాళ్లే ఉన్నాయి. ఓటరు అవగాహనా కార్యక్రమాల్లో పాల్గొనడం మాత్రమే సరిపోదు రాజకీయ ప్రవేశానికి. ఎంతో కొంత క్షేత్రస్థాయి అనుభవం, వ్యూహాలు, సంస్థాగత తోడ్పాటు, పార్టీ అంచనాలకనుగుణంగా పని చేయడం వంటివి మైథిలి ముందున్న సవాళ్లని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏదేమైనా యువత.. అందులో అమ్మాయిలు రాజకీయాల్లోకి రావడం మాత్రం శుభపరిణామమే! -
5 నిమిషాల్లో జాబ్ కొట్టేసింది..దెబ్బకి కంపెనీ సీఈవో ఫిదా!
చదువు అయిన తరువాత ఉద్యోగం రావడం అంత సులువుకాదు. అదీ మన మనసుకు నచ్చిన జాబ్ రావడమంటే జాక్ పాట్ కొట్టినంత ఆనందమే. దీనికి టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు , తెగువ, స్మార్ట్నెస్ కూడా ఉండాలని నిరూపించిందో యువతి. కేవలం అయిదే అయిదు నిమిషాల్లో ఉద్యోగాన్ని సాధించిన యువతి స్టోరీని టెక్ కంపెనీ సీఈవో సోషల్మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈస్టోరీ నెట్టింట హల్చల్ చేస్తోంది.కోడ్ ఆఫ్ అజ్ CEO సాండి స్లోంజ్సాక్ అందించిన వివరాల ప్రకారం కేవలం ఐదు నిమిషాలు మాట్లాడిన తరువాత ఒక కళాశాల విద్యార్థినిని తాను నియమించు కున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మనోధైర్యం, తెలివి, నిజాయితీపై ప్రశంసలు కురిపించారు. "తమ కంపెనీలో ఎలాంటి ఉద్యోగ ఖాళీలు లేకపోయినా ... ఓపెన్ లెటర్ దరఖాస్తు పంపే ధైర్యం ఉంది, తనకు ఏమీ తెలియదని ఒప్పుకోవడమేకాదు, కష్టపడి పని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పింది" అని చెప్పుకొచ్చారు. ఆమె సూపర్ కమ్యూనికేటివ్, స్ట్రెయిట్ షూటర్. చాలా స్మార్ట్, చాలా వినయంతో ఉంది. జీతం గురించి పట్టించుకోనని తెలిపిందంటూ ట్వీట్ చేశారు. ఖాళీ సమయంలో తన సొంత ప్రాజెక్టులలో పనిచేసిందని చెప్తూ, కృషి అంకితభావాన్ని గురించి చెప్పుకొచ్చారు. ఆమె నిజాయితీ, అభిరుచి, పట్టుదల తనను చాలా ఆకట్టుకున్నాయని ప్రశంసించారు. మూడు నెలల కనీస వేతనంతో జాబ్ ఆఫర్ చేసి, రేపటినుంచే ఉద్యోగంలో చేరిపోవచ్చని ఆమెకు గుడ్ న్యూస్ చెప్పారు. (హ్యాపీగా ఏసీ కోచ్లో తిష్ట, చూశారా ఈవిడ డబల్ యాక్షన్!)today i hired a college student after just 5 minutes of talking to her1. had the guts to send an open letter application although we had no job openings 2. straight up admitted she knows nothing3. told she’s willing to work as an animal to learn as much as she can4. open…— Sandi Slonjšak (@sandislonjsak) October 8, 2025సోషల్ మీడియా రియాక్షన్సోషల్ మీడియాలో సీఈవో, విద్యార్థిని ఇద్దరిపైనా ప్రశంసలు వెల్లువెత్తాయి.‘నిజమైన రత్నాన్ని గుర్తించారు.. మీ కంపెనీలో నేర్చుకోవాలనే ఆమె ఆసక్తిని ఎలా ఉపయోగించుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? మీకు మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉందా? అనే అసక్తిని ప్రదర్శించారు. రిక్రూటర్లు అందరూ మీలా వుండరు సార్ , ఆమెకు ఎంచుకున్నందుకు సంతోషం, ఆమెను మీ ఆధ్వర్యంలో బాగ నైపుణ్యాన్ని సాధిస్తుందని మరొకరు కమెంట్ చేశారు.చదవండి: జస్ట్ 10 లక్షల లోన్తో రూ. 60 లక్షల ఇల్లుకొన్న పనిమనిషి, షాకవ్వకండి! -
సంప్రదాయాన్ని పునరుజ్జీవింప చేసేలా ప్లాస్టిక్కి చెక్..!
ప్లాస్టిక్ భూతం అంటూ గగ్గోలు పెడుతున్నారు పర్యావరణ వేత్తలు. అన్నింటిలో ప్లాస్టిక్ ఆవరించేసిందంటూ పెద్ద పెద్ద లెక్చర్లు ఇవ్వడమే తప్ప, నిర్మూలించే దిశగా అడుగులు పడవు. కానీ ఈ మహిళలు..ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుతో ప్లాస్టిక్ని నాటి సంప్రదాయం తిరిగి పురుడుపోసుకునేలా చెక్పెట్టేందుకు నాంది పలికారు. సాదికారతకు బీజం వేసేలా సంప్రదాయం, పర్యావరణ హిత సమ్మిళితంగా సాగిపోతున్న వారి దృఢ సంకల్పానికి హ్యాట్సాఫ్ అని చెప్పాల్సిందే. ఇదంతా చెన్నైలో చోటుచేసుకున్న అద్భుత చైతన్యంగా పేర్కొనవచ్చు. చెన్నై అనగానే మెరీనా బీచ్, ఆవిరి ఫిల్టర్ కాఫీ, పురాతన దేవాలయాలే కాదు..వినూత్న పద్ధతిలో ప్లాస్టిక్కి చెక్పెడుతున్న ఈ మహిళలు కూడా ఇప్పుడు ఠక్కున గుర్తొస్తారు. ఎందుకంటే వీళ్లు చేస్తున్న సాధికారతతో కూడిన పర్యావణ హిత ఉద్యమం యావత్తు దేశాన్ని ఆకర్షించేలా హైలెట్గా నిలిచింది. చేస్తున్న ప్రయత్నం చిన్నదైనా..ప్రభావం మాములుగా లేదు అనిపించుకున్నారు ఈ వనితలు. తమిళనాడు ప్రభుత్వం పర్యావరణ అనుకూల ప్రాజెక్టులో భాగంగా మహిళా సంఘాలకు ఆకుపచ్చని ఎలక్ట్రిక్ ఆటోలు అందించి సాధికారత, సంప్రదాయాన్ని మిళితం చేసేలా పర్యావరణ హితంగా నడిపిస్తోంది. వీరంతా ఆకుపచ్చ మొబైల్ ఆటోల్లో కూరగాయలు అమ్ముకుంటూ జీవనోపాధినే కాదు, పర్యావరణ సంరక్షణ కోసం తమ వంతు తోడ్పాటును అందిస్తూ..ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వాళ్లు ఈ మొబైల్ ఆటోల సాయంతో తాజా కూరగాయలను కస్టమర్లకు చేరవేయడమే కాదు, వాటిని పసుపు పచ్చ బ్యాగుల్లోనే కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తున్నారు. పాతకాలం నాటి పసుపురంగు కాటన్ సంచులకు ప్రాణం పోసి నాటి సంప్రదాయన్ని గుర్తుచేయడమే కాదు..పర్యావరణ సంరక్షణకు బాటలు వేస్తున్నారు. అంతేగాదు కేవలం కూరగాయలు అమ్మడమే కాదు, ఈ ప్లాస్టిక్ భూతం మన జీవితాన్ని ఎలా కబిళిస్తుంది, ఎలా మన జీవితాల్లో స్థిరపడిపోయిందో వివరిస్తూ..ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ఈ చెన్నై మహిళలు. ఆకుపచ్చని ఆటోలతో పచ్చదన సంరక్షణ నినాదం తోపాటు తిరిగి ఉపయోగించే ఈ పర్యావరణ హిత పసుపు సంచులనే వాడుదాం అని విషయాన్ని ప్రజల్లోకి బలంగా వెళ్లేలా చేస్తున్నారు. అందుకే ఈ సంచులను తమిళంలో మంజపైస్(మళ్లీ వినియోగించే పసుపు సంచులు) అని పిలుస్తారు. ఇక ఈ ఆటోలు కూడా కాలుష్య రహిత ఎలక్ట్రానిక్ వాహనాలే కావడం విశేషం. మొత్తం ఈ ప్రాజెక్టు కార్యచరణ మొత్త పర్యావరణ సంరక్షణకే పెద్దపీట వేసేలా జాగ్రత్త తీసుకుని స్త్రీ సాధికారతను ప్రోత్సహించి..అందిరిచే ప్రశంలందుకుంది అక్కడి ప్రభుత్వం. ఇది ఒకపక్క జీవనోపాధి, మరోవైపు సాధికారణ, సంప్రదాయ మిళిత పర్యావరణ హితానికి అంకురార్పణ చేయడమే గాక పెనుమార్పుకి నాంది పలికింది కదూ..!. View this post on Instagram A post shared by The Better India (@thebetterindia) (చదవండి: భారత్ పిలిచింది..! కష్టం అంటే కామ్ అయిపోమని కాదు..) -
జస్ట్ 10 లక్షల లోన్తో రూ. 60 లక్షల ఇల్లుకొన్న పనిమనిషి, షాకవ్వకండి!
సొంతింటి కల అనేది చాలామందికి కలగానే మిగిలిపోతుంది. కానీ కొంతమంది మాత్రం పట్టుదలతో ఆ కలను సాకారం చేసుకుంటారు. దానికోసం ఎంత కష్టమైనా పడతారు. అంతేకాదు తమలాంటి ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తారు. అలాంటి స్ఫూర్దిదాయకమైన స్టోరీ ఒకటి ఇపుడు నెట్టింట విశేషంగా నిలుస్తోంది.పదండి ఆ వివరాలు తెలసుకుందాం.భారతదేశంలో ఇల్లు కొనడం దశాబ్దాల కష్టం దాగి ఉంటుంది. అదీ ఒక మామూలు శ్రామికమహిళకు ఇంకా కష్టం. సూరత్కు చెందిన ఒక ఇంటి పని మనిషి కొత్త చరితను లిఖించింది ఎన్నో అవమానాల్ని, అవహేళల్ని తోసి రాజని సొంతింటి కలను నెరవేర్చుకుంది.సూరత్లో కేవలం రూ. 10 లక్షల రుణంతో రూ. 60 లక్షల 3BHK ఫ్లాట్ను కొనుగోలు చేసింది.ఈ విషయాన్ని ఆమె యజమాని నళిని ఉనగర్ ఈ స్టోరీని ఎక్స్లో పోస్ట్ చేశారు. దీంతో ఇది అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇది తనను చాలా ఆశ్చర్యానికి గురి చేసిందని, చాలా సాధారణంగా తనతో మాట్లాడుతూ సూరత్లో తాను రూ.60 లక్షల అపార్ట్మెంట్ కొన్నానని చెప్పిందని తెలిపింది. అంతే కాదు, ఆమె ఇప్పటికే రూ.4 లక్షలు ఫర్నిచర్ కోసం ఖర్చు చేసిందట ఇందుకోసం ఆమె తీసుకున్న కేవలం రూ.10 లక్షల రుణంతో ఇవన్నీ చేసుకుంది.. దీనికి నిజంగా షాకయ్యాను అంటూ నళిని ట్వీట్ చేసింది. ఇదీ చదవండి: హ్యాపీగా ఏసీ కోచ్లో తిష్ట, చూశారా ఈవిడ డబల్ యాక్షన్!దీనికి ఒక యూజర్ స్పందిస్తూ'మీరు ఎందుకు షాక్ అవుతున్నారు? ఆమె విజయానికి సంతోషించండి!' అన్నదానికి రిప్లై ఇస్తూ 'సంతోషంగా ఉన్నాను. కానీ సమాజంలొ తరచుగా ఇంటి పనిలో ఉన్నవారు పేదోళ్లనే చులకన భావం ఉంటుందనీ, కానీ చాలామంది డబ్బును తెలివిగా మేనేజ్ చేసుకుంటారని పేర్కొన్నారు. అంతేకాదు మరికొందరు కేఫ్లు, గాడ్జెట్లు , ట్రిప్లపై డబ్బు ఖర్చు చేస్తారని ఆమె కామెంట్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఇది మ్యేజికో,మంత్రమో కాదు, ఆమె ఆర్థిక నిర్వహణకు, తెలివిగా పొదుపు చేసిన వైనానికి నిదర్శనమంటూ ప్రశంసించారు. -
ఐఏఎస్గా సెక్యూరిటీ గార్డు కుమార్తె..! హిందీ మాధ్యమంలో టాపర్గా..
అత్యంత ప్రతిష్టాత్మకమైన కఠినమైన ఎగ్జామ్ యూపీఎస్సీ సివిల్స్ సర్వీస్. అలాంటి సివిల్స్ ఎగ్జామ్స్లో సత్తా చాటి ఐఏఎస్ కావాలనేది ఎందరో యువత కల. అందరు ఒక్కోలా తపించి కలను సాకారం చేసుకుంటుంటారు. కానీ ఈమె అత్యంత విభిన్న పద్ధతిలో తన డ్రీమ్ని సొంతం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. సాధించాలనుకునేవాడికి సవాలక్ష మార్గాలు తన కళ్లమందు ఉంటాయనేందుకు ఉదాహరణగా నిలిచింది.ఆ అమ్మాయే అంకిత కాంతి(Ankita Kanti,). ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని చమోలి జిల్లాలోని చిర్ఖున్ అనే చిన్న గ్రామానికి చెందిన అంకిత కాంతి కుటుంబం మధ్యతరగతి నేపథ్యానికి చెందిన అతి సామాన్య కుటుంబం. ఆమె తండ్రి దేవేశ్వర్ కాంతి బ్యాంకులకు నగదు తీసుకెళ్లే పనిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. తల్లి ఉషా కాంతి గృహిణి. బాల్యం నుంచి అంకిత కాంతి చదువులో మంచి ప్రతిభను చాటుకుంది. ఆమె తుంటోవాలాలోని డూన్ మోడరన్ స్కూల్, కర్బరిలోని సంజయ్ పబ్లిక్ స్కూల్లలో పాఠశాల విద్యను పూర్తి చేసింది. పదోతరగతి పరీక్షలో 92.40% మార్కులు సాధించింది. తర్వాత 2018లో 12వ తరగతి పరీక్షలలో 96.4% మార్కులు సాధించి, ఉత్తరాఖండ్ రాష్ట్రానికే నాల్గవ టాపర్గా నిలిచింది. ఇక డీబీఎస్ కళాశాలలో బీఎస్సీ డిగ్రీ, ఎంఎస్సీ పూర్తి చేసింది. అయితే అప్పటి నుంచే ఆమె యూపీఎస్సీ సివిల్స్(UPSC Civil Services Examination (CSE))కి సన్నద్ధమైంది. కానీ సివిల్స్ ఔత్సాహిక అభ్యర్థుల్లా కాకుండా..స్వీయంగా సన్నద్ధమైంది. అయితే ఆమె హిందీ మాధ్యమంలో ఈ సివిల్స్ 2024 ఎగ్జామ్ని రాసి ఆల్ ఇండియా ర్యాంకు 137 సాధించి, ఐఏఎస్ అవ్వాలనే తన కలను సాకారం చేసుకుందామె. దీంతో అంకిత తొలిసారగా హిందీ మాధ్యమంలో పరీక్ష రాసి.. టాపర్గా నిలిచిన అమ్మాయిగా వార్తల్లో నిలిచింది. ఆమె చెల్లెలు కూడా బ్యాంకు ఉద్యోగం సంపాదించింది. ప్రస్తుతం ఆమె కూడా తన అక్క అంకిత అడుగుజాడల్లో వెళ్తోంది. అంజలి కూడా ప్రస్తుతం యూపీఎస్సీకి ప్రిపేరవ్వుతోంది. ఎక్కడ నియమించారంటే..ప్రస్తుతం ఆమె ట్రైనింగ్లో ఉంది. అధికారికంగా ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదామెకు.చదవండి: ఐఏఎస్ అధికారిణికి బంగారు పల్లకితో వీడ్కోలు..! -
నో అన్న గూగుల్లోనే కీలక పదవి.. ఎవరీ రాగిణీ?
ఒకపుడు ఆమెను తమ సంస్థలో ఉద్యోగానికి తిరస్కరించింది.కట్ చేస్తే రెండేళ్లలోపే అదే కంపెనీలో ఉన్నత పదవికి ఎంపికైంది. ఇదే కదా సక్సెస్ కిక్ అంటే.. ఆ సక్సెస్ పేరే రాగిణి దాస్. ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారిన రాగిణీ దాస్ స్టోరీ ఏంటి? తెలుసుకుందాం ఈ కథనంలోమహిళా-కేంద్రీకృత ప్రొఫెషనల్ నెట్వర్క్ లీప్.క్లబ్(Leap club) సహ వ్యవస్థాపకురాలు, FICCIలో ఉమెన్ ఇన్ స్టార్టప్స్ కమిటీ చైర్పర్సన్ రాగిణి దాస్ ఇపుడు గూగుల్ ఇండియాలో స్టార్టప్ హెడ్గా ఎంపికైంది. 2013లో గూగుల్ ఉద్యోగానికి సంబంధించి చివరి ఇంటర్వ్యూ రౌండ్లో ఎంపిక కాలేక పోయింది. కట్ చేస్తే లీప్.క్లబ్ సహ వ్యవస్థాపకురాలిగా జొమాటో వంటి సంస్థలతో కూడా పనిచేసిన అనుభవంతో గూగుల్ ఇండియా స్టార్టప్ హెడ్గా నియమితులైంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. నిజంగా జీవితం చక్రం లాంటిది.. తిరిగి అవకాశం వచ్చింది అంటూ ట్విట్ చేసింది.గూగుల్లో తన కొత్త బాద్యతలను గురించి వ్యాఖ్యానిస్తూ ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న స్టార్టప్లను సమర్థులైన వ్యక్తులు, ఉత్పత్తులు , ఉత్తమ పద్ధతులతో అనుసంధానించడం ద్వారా వాటిని అభివృద్ధి చేయడంలో సహాయపడటానికి, వారికి సాయం అందించే లక్ష్యంతో ఉన్నామని తెలిపింది. (84 ఏళ్ల వయసులో తల్లి, కూతురి వయసు మాత్రం అడక్కండి: గుర్తుపట్టారా! )Life has come full circle, and I’m excited to share that I’ve joined @Google as Head of Google for Startups - India 🍋The backstory: In 2013, I sat for two interviews: one at Google and one at Zomato. pic.twitter.com/Hs9cqKHFxJ— Ragini Das (@ragingdas) October 6, 2025ఎవరీ రాగిణి దాస్?గురుగ్రామ్లో జన్మించిన రాగిణి దాస్, చెన్నైలోని చెట్టినాడ్ విద్యాశ్రమంలో పాఠశాల విద్యను పూర్తి చేసింది. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందింది. అందుకు ముందు సాంస్కృతిక కార్యదర్శిగా కూడా పనిచేసింది. అలాగే గ్రాడ్యుయేషన్ సమయంలో, ఆమె స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ , ఇతర సంస్థలతో ఇంటర్న్ గా, మార్కెట్ పరిశోధన మరియు భారత మార్కెట్ కోసం వ్యాపార ప్రణాళికలను డెవలప్ చేసింది. 2012లో, దేశీయ మార్కెటింగ్ కోసం ఫ్రంట్లైన్ వ్యవస్థాపకురాలిగా ట్రైడెంట్ గ్రూప్ ఇండియాలో చేరింది. అనంతరం యూరప్ అండ్ యుఎస్ మార్కెటింగ్ నిర్వహణలో పదోన్నతి పొందింది. తిరిగి ఒక్క ఏడాదిలోనే 2013లో, జొమాటోలో రాగిణి సేల్స్ అండ్ మార్కెటింగ్ మేనేజర్గా చేరింది. అకౌంట్ మేనేజర్, ఏరియా సేల్స్ మేనేజర్తో సహా వివిధ పాత్రల్లో ఆరేళ్లు తన సేవలను అందించింది.చదవండి: రెండేళ్ల శ్రమ ఒక మినిట్లో : భారీ కాయంనుంచి సన్నగా వైరల్వీడియో 2017లో, ఆమె జోమాటో గోల్డ్ వ్యవస్థాపక బృందంలో భాగమైంది. ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఖతార్ మరియు లెబనాన్తో సహా 10 అంతర్జాతీయ మార్కెట్లలో జోమాటో గోల్డ్ను ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించింది.2020లో, వేలాది మంది మహిళల కోసం ఆన్లైన్ యాప్ మరియు ఆఫ్లైన్ క్లబ్ను leap.clubను సహ-స్థాపించింది వేలాది మంది మహిళలకు నెట్వర్కింగ్, ప్రొఫెషనల్ అవకాశాలు, క్యూరేటెడ్ ఈవెంట్లు ,ఆసక్తి-ఆధారిత కమ్యూనిటీలను అందిచింది. ఈ ఏడాది జూన్లో ఈ సంస్థ తన కార్యకలాపాలను నిలిపివేసింది. ప్రస్తుతం రాగిణి దాస్, గూగుల్ ఫర్ స్టార్టప్స్ భారతదేశ విభాగానికి కొత్త హెడ్గా ఎంపికకావడం విశేషం. -
రిపోర్టింగ్... ఓ వార్!
అల్లికల నుంచి అంతరిక్షం దాకా అన్నిట్లో ఆడవాళ్ల జాడలు కనిపిస్తున్నా ఇదింకా పురుష ప్రపంచమే! అసలు ఆ జాడలు కూడా లేని కాలం ఎలా ఉండిందో! అలాంటి కాలంలో పురుషాధిపత్య రంగాల్లోకి స్త్రీలు ధైర్యంగా అడుగుపెట్టడమే ఓ సమరం! పెట్టాక బాధ్యతల కోసం ఒక పోరాటం! అలా పోరాడి.. పురుషులు సాధించలేని టాస్క్లను ఛేదించి.. తర్వాత తరాల అమ్మాయిలకు ఓ పాత్ను క్రియేట్ చేశారు కొందరు వనితలు! ఆషీరోస్ను పరిచయం చేసే శీర్షికే ‘ పాత్ మేకర్’. ఆక్రమంలో ఈ వారం.. దేశపు తొలి మహిళా వార్ జర్నలిస్ట్ ప్రభాదత్ గురించి...బిల్లా, రంగా పేరు వినే ఉంటారు. గీతా, సంజయ్ చోప్రా అనే ఇద్దరు స్కూల్ పిల్లలను ఎత్తుకెళ్లిపోయి, వాళ్లను హత్యచేసిన హంతకులు. మరణ శిక్షతో జైల్లో ఉన్న ఆ బిల్లా, రంగాలను ఇంటర్వ్యూ చేయడానికి ఒక జర్నలిస్ట్ .. జైల్ అధికారుల అనుమతి కోరారు. ‘నో’ అన్నారు అఫీషియల్స్. ఆ ‘నో’ను సవాలు చేస్తూ కోర్టుకు వెళ్లి, ఇంటర్వ్యూకు పర్మిషన్ తెచ్చుకుని.. ఆ ఇద్దరి మరణ శిక్ష అమలుకు ముందు వాళ్లను ఇంటర్వ్యూ చేశారు ఆ జర్నలిస్ట్. జైన్ శుద్ధ్ వనస్పతి లిమిటెడ్.. పేరు కూడా వినే ఉంటారు. ఈ సంస్థ అమ్మే నేతిలో పందికొవ్వు కలుస్తోందనే ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ చేశారు ఆ జర్నలిస్ట్. అంతేకాదు ఎయిమ్స్లోని మెడికల్ స్కామ్నూ బయటకు తీశారు. ఆ జర్నలిస్ట్ పేరే ప్రభాదత్! 1965లో జరిగిన ఇండియా– పాకిస్తాన్ యుద్ధాన్ని వార్ ఫీల్డ్లోంచి రిపోర్ట్ చేసిన వీరనారి! దేశపు ఫస్ట్ ఉమన్ వార్ కరెస్పాండెంట్గా చరిత్ర సృష్టించారు. బక్కపల్చటి దేహం.. కాటన్ చీర.. తలకు హెల్మెట్తో యుద్ధ ట్యాంక్ల వెనుక నుంచి యుద్ధాన్ని కలంతో కవర్ చేసిన ఆమె ఇమేజ్ తర్వాత తరాల జర్నలిస్ట్లు ఎందరికో ప్రేరణనిచ్చింది. అందుకే ఆమెను చమేలీ దేవీ జైన్ అవార్డ్ వరించింది. ప్రభాదత్ ఏం చేసినా సెన్సేషనే! ఆమె (మగాళ్ల రాజ్యం) జర్నలిజంలోకి అడుగుపెట్టడమే మహా సంచలనం! జర్నలిజం.. వార్ రిపోర్టింగ్ప్రభాదత్ ఇరవైల్లోనే జర్నలిజంలోకి వచ్చారు. ఇంటర్వ్యూలో ఫ్లవర్ ఎగ్జిబిషన్ను కవర్ చేసే డ్యూటీని సూచించాడట ఎడిటర్. అంతకన్నా గొప్ప విషయాలనే మహిళలు రిపోర్ట్ చేయగలరు అని అతనితో వాదించి.. మెప్పించి ఫ్లవర్ ఎగ్జిబిషన్ రిపోర్టింగ్ను తిరస్కరించి.. కీలకమైన అసైన్మెంట్స్కే ‘యెస్’ అనిపించుకున్నారు. అలాంటి ధీర ఇండియా– పాకిస్తాన్ వార్ రిపోర్టింగ్ను వదులుకుంటారా? అప్పుడు ఆమె హిందుస్థాన్ టైమ్స్కి పని చేస్తున్నారు. తనకు వార్ అసైన్మెంట్ ఇవ్వమని రిక్వెస్ట్ చేయలేదు. డిమాండ్ చేశారు. ఎడిటర్ దగ్గర్నుంచి ‘నో’ అనే జవాబే వచ్చింది. అప్పుడు ఆమె స్మార్ట్ స్టెప్ తీసుకున్నారు. పంజాబ్లో ఉన్న తన పేరెంట్స్ను చూడ్డానికి వెళ్తున్నానని సెలవుకు దరఖాస్తు పెట్టుకున్నారు. వెంటనే మంజూరైంది. పెట్టే బేడా సర్దుకుని నేరుగా ఖేమ్ – కరన్కి బయలుదేరారు ప్రభా. యుద్ధ రంగంలో నిలబడి ఏ రోజుకారోజు యుద్ధ విషయాల రిపోర్ట్ను పత్రికా ఆఫీస్కు పంపసాగారు. పట్టుదలకు పోయి మొదట్లో ఆ రిపోర్ట్ను పక్కన పెట్టినా.. తర్వాత తర్వాత ఆమె రిపోర్ట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేవాళ్లు పత్రికా ఆఫీస్లో. ప్రభాదత్ కన్విక్షన్, పర్ఫెక్షన్ అలాంటిది మరి. రేడియోల ముందూ చెవులు రిక్కించుకుని మరీ కూర్చునేవారట శ్రోతలు.. ఆమె రిపోర్టింగ్ విషయాలను వినడానికి. మిడిమిడి జ్ఞానం ఆమె డిక్షనరీలోనే లేదు. సంపూర్ణ అవగాహన, స్పష్టతతోనే వెళ్లేవారు ఎక్కడికైనా. పనితోనే గానీ వ్యక్తిగత చరిష్మాకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వలేదు. తన జీవితమే రిస్క్లో పడేంత ప్రమాదకరమైన రిపోర్టింగ్ చేశారు. బెదిరింపులు, భౌతిక దాడులను ఎదుర్కొన్న సందర్భాలూ ఉన్నాయి. అయినా ప్రభాదత్ వెనుకడుగు వేయలేదు. తను నమ్మినదానిపట్ల దృఢచిత్తంతో సాగిన ఆమె బ్రెయిన్ హ్యామరేజ్తో హఠన్మరణానికి గురయ్యారు. జర్నలిజంలో ఆమె చూపిన తెగువ, ధైర్యం మహిళా జర్నలిస్ట్లకే కాదు పురుషులకూ స్ఫూర్తే! ప్రముఖ జర్నలిస్ట్ బర్ఖాదత్ ఆమె కూతురే. -
తొలి మహిళా సైన్స్ లెక్చరర్
అది 1930. దేశ రాజధాని ఢిల్లీలో రాధ (Dr. Radha Pant ) బీఎస్సీ చదవాలని కలలు కంటోంది. అప్పటికి డిగ్రీ స్థాయిలో సైన్స్ చదివే అవకాశం మహిళ లకు ఏ కళాశాలలోనూ లేదు. తండ్రి కాలేజీల చుట్టూ తిరగడం, వెనక్కి రావడం... రెండేళ్లయ్యింది. కానీ ఆ అమ్మాయి మాత్రం వెనక్కి తగ్గడం లేదు; ‘అవసరమైతే గాంధీ మహాత్ముడిలా సత్యా గ్రహం చేస్తాను హిందూ కాలేజీ ఎదుట’ అనేదాకా వెళ్ళింది. అలా బీఎస్సీ సైన్స్ డిగ్రీలో హిందూ కళాశాలలో ప్రవేశం దొరికింది. కేరళలోని పాల్ఘాట్ ప్రాంతం కల్పతి గ్రామంలో 1916 సెప్టెంబర్ 5న రాధ జన్మించారు. బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి 1940లో పీహెచ్డీ సాధించారు. పీహెచ్డీ కొరకు 2, 4 డై మీతోక్సి ఐసోఫ్తలి కామ్లం; 2, 6 డై హైడ్రాక్సి ఐసోథాలికామ్లాలను తొలిసారి తయారు చేసిన శాస్త్రవేత్త రాధ. బొంబాయి హాఫ్కిన్ ఇనిస్టిట్యూట్ వారి న్యూట్రిషనల్ బయో కెమిస్ట్రీ విభాగంలో సీనియర్ రిసెర్చ్ ఫెలోగా పని చేస్తూ... ఎంతోకాలంగా ఉన్న నమ్మకాన్ని పటాపంచలు చేస్తూ... ‘సోయా కన్నా శనగలే మేలైన పోషక విలువలు కలిగి ఉన్నాయని’ రుజువు చేశారు. 1945లో అలహాబాద్ విశ్వవిద్యాలయంలో తొలి మహిళా అధ్యాపకురాలిగా బయోకెమిస్ట్రీ నేపథ్యంతో చేరారు. అనతి కాలంలోనే అదే విశ్వవిద్యాలయంలో బోటనీ ప్రొఫెసర్గా పని చేస్తున్న దివ్య దర్శన్ పంత్ను వివాహం చేసుకున్నారు. 1954–56 మధ్యకాలంలో భార్యాభర్తలిద్దరూ యూని వర్సిటీ ఆఫ్ లండన్ వెళ్లి పోస్ట్ డాక్టోరల్ పట్టాలు పొందారు. ‘ఎవర్ ఎ ఫైటర్ ’ పేరుతో రాధా పంత్ తన జ్ఞాపకాలను రాసుకున్నారు. 1956లో అలహాబాద్ యూనివర్సిటీలో తను పరిశోధనను కొనసాగించాలను కున్నప్పుడు ఆ విభాగంలో కేవలం 6 గదులు మాత్రమే ఉన్నాయనీ; ఇక పరిశో ధనకు కావలసిన గ్రంథాలు, వసతులు ఏమాత్రం లేవనీ చెప్పారు. అటువంటి అలహాబాద్ యూనివర్సిటీలోనే 1968లో జీవరసాయన శాస్త్ర విభాగంలో ఎంఎస్సీ కోర్సును ప్రారంభించ గలిగారు. రాధా పంత్ బృందం హృదయ రోగాలు, పట్టుపురుగులు ఇలా అనేక విభిన్న అంశాల మీద విలువైన ఫలితాలు సాధించారని ‘ద బయో కెమిస్ట్’ జర్నల్లో కుసుమ్ పంత్ జోషి పేర్కొన్నారు. పట్టుపురుగులకు సంబంధించి రాధా పంత్ కృషి గురించి ఫ్రెంచ్ జర్నల్ ‘సెరికొలో జియా’ ఒక ప్రత్యేకమైన ప్రచురణని వెలవరించిందంటే ఆమె స్థాయి ఏమిటో గమనించవచ్చు. 2003 డిసెంబర్ 19న కన్నుమూసిన రాధ చిరస్మరణీయురాలు.– డా. నాగసూరి వేణుగోపాల్, ఆకాశవాణి మాజీ ఉన్నతాధికారి -
అంబర్ పేట బిడ్డకు అమెరికాకు చెందిన యూనివర్సిటీ డాక్టరేట్
అంబర్ పటేల్ నగర్కు చెందిన ప్రముఖ భరతనాట్య గురువు శ్రీమతి కూన ప్రియదర్శిని కి ఆగ్రా లోని రాడిసన్ హోటలో అమెరికాకు చెందిన జార్జియా డిజిటల్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ మరియు ప్రభుత్వ రంగ సంస్థ నీతి ఆయోగ్ ద్వార భరతనాట్య విభాగంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందించారు. సినీ నటి మరియు విఖ్యాత భరతనాట్య కళాకారిణి సుధా చంద్రన్ చేతుల మీదుగా ఈ అవార్డులను ప్రధానం చేయడం జరిగింది. ఈ పురస్కారాలు తీసుకున్నందుకు కారకులైన తన గురువులకు మరియు తల్లిదండ్రులకు డాక్టర్ కూన ప్రియదర్శిని కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాన్స్ మాస్టర్ సిరాజ్, రత్నాకర్, తదితరులు పాల్గొన్నారు. -
స్వయం కృషితో ఎదిగి చరిత్ర సృష్టించారు : టాప్ టెన్ రిచెస్ట్ విమెన్
ప్రముఖ టెక్ దిగ్గజం హెచ్సీఎల్ అధినేత్రి రోష్నీ నాడార్ మల్హోత్రా సరికొత్త రికార్డులు సృష్టించారు. ఎం3ఎం హురున్ ఇండియా రిచ్లిస్ట్-2025 దేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో తొలిసారి చోటు దక్కించుకున్నారు. రూ.2.84 లక్షల కోట్లతో సంపదతో మూడో స్థానం కైవసం చేకున్నారు. రూ.9.55 లక్షల కోట్ల నికర విలువతో ముకేష్ అంబానీ అగ్రస్థానంలో ఉండగా.. గౌతమ్ అదానీ రూ.8.15 లక్షల కోట్ల నికర విలువతో రెండో స్థానంలో నిలిచారు. ఎం3ఎం ఇండియా, హురున్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సంయుక్తంగా ఎం3ఎం హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 14వ ఎడిషన్ను విడుదల చేశాయి. ఆ జాబితాలో దేశంలోని ధనవంతుల జాబితాలో మూడో స్థానం దక్కించుకుని సరికొత్త మైలురాయిని చేరుకున్నారు. హురున్ ధనవంతుల జాబితాలో టాప్ -10లో నిలిచిన పిన్న వయస్కురాలు ఆమే కావడం గమనార్హం. హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2025లో రోష్నీ నాడార్ మల్హోత్రా రూ.2.84 లక్షల కోట్ల సంపదతో మూడవ స్థానంలో ఉన్నా.. ఆమె సంపద వారసత్వంగా వచ్చింది. కాబట్టి ఆమె సెల్ఫ్మేడ్ విమెన్ జాబితాలో ఆమె లేరు. అయినప్పటికీ హెచ్సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ నాడార్ కుమార్తె రోష్నీ నాడార్. తండ్రి వారసత్వాన్ని పునికి పుచ్చుకుని, తనదైన శైలిలో నాయకత్వాన్ని ప్రదర్శిస్తూ సంస్థను లాభాల బాట పట్టిస్తున్నారు. సామాజిక సేవా రంగంలోనూ విశేష కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎం3ఎం హురున్ ఇండియా రిచ్లిస్ట్-2025లో చోటు దక్కించుకున్న సెల్ఫ్ మేడ్ విమెన్ ఆంత్రపప్రెన్యూర్ల జాబితా వివరాలు ఇలా ఉన్నాయి. 1.జయశ్రీ ఉల్లాల్ (Jayshree Ullal)భారతదేశంలో స్వయం- నిర్మిత మహిళా మిలియనీర్ల జాబితాలో అరిస్టా నెట్వర్క్స్ సీఈవో జయశ్రీ ఉల్లాల్ (Jayshree Ullal)ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. సంపద రూ. 50,170 కోట్లు. అరిస్టా నెట్వర్క్స్ అధ్యక్షురాలు సీఈవో జయశ్రీ ఉల్లాల్ 2008 నుండి దేశంలోనే ప్రముఖ కంప్యూటర్ నెట్వర్కింగ్ సంస్థలలో ఒకటైన అరిస్టా నెట్వర్క్స్ను నిర్వహిస్తున్నారు. ఈ కంపెనీ గత సంవత్సరం 7 బిలియన్ డాలర్ల భారీ ఆదాయాన్ని నమోదు చేసింది. ఇది గత సంవత్సరం కంటే 20 శాతం పెరిగింది.2. రాధా వెంబు (Radha Vembu)జోహో కార్ప్లో మెజారిటీ వాటాను కలిగి ఉన్న రాధా వెంబు రెండవ స్థానంలో ఉన్నారు. రూ. ఆమె సంపద రూ. 46,580 కోట్లు. జోహోను ఆమె అన్నయ్య శ్రీధర్ వెంబుతో కలిసి స్థాపించారు. ఆయన 1996లో అడ్వెంట్నెట్గా వ్యాపారాన్ని ప్రారంభించారు.3. ఫల్గుణి నాయర్ (Falguni Nayar)సౌందర్య ఉత్పత్తుల దిగ్గజ రిటైలర్ అయిన నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణి నాయర్ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నారు. ఆమె సంపద రూ. 39,810 కోట్లు.4. కిరణ్ మజుందార్-షా ( Kiran Mazumdar-Shaw)బయోకాన్కు చెందిన కిరణ్ మజుందార్-షా రూ. 29,330 కోట్లతో నాల్గవ స్థానాన్ని దక్కించుకున్నారు. భారతదేశ బయోటెక్, హెల్త్కేర్ రంగాలలో మార్గదర్శకురాలిగా తన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. బయోటెక్నాలజీలో 4 దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న తొలి తరం వ్యవస్థాపకురాలు, గ్లోబల్ బిజినెస్ లీడర్గా సత్తా చాటిన మహిళ. 1978లో భారతదేశంలోని తన గ్యారేజ్ నుండి బయోటెక్ ప్రయాణాన్ని ప్రారంభించారు.5. రుచి కల్రా (Ruchi Kalra)B2B కామర్స్ ప్లాట్ఫామ్ అయిన ఆఫ్బిజినెస్ సహ వ్యవస్థాపకురాలు, సీఈవో రుచి కల్రా అయిదో స్థానంలో ఉన్నారు. ఆఫ్బిజినెస్ను సహ-స్థాపించడానికి మెకిన్సేలో కన్సల్టెంట్గా పనిచేశారు. ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రురాలైంది. తరువాత హైదరాబాద్లోని ఐఎస్బి నుండి ఎంబీఏ సంపాదించారు. ప్రస్తుతం ఆమె నికర ఆస్తుల విలువ రూ. 9,130 కోట్లు.6. జూహి చావ్లా (Juhi Chawla)90లలో బాలీవుడ్ నేలిన స్టార్ హీరోయిన్ జూహి చావ్లా నేడు వ్యాపార సంస్థలు, రియల్ ఎస్టేట్ వ్యూహాత్మక పెట్టుబడులతో వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా చావ్లా నికర ఆస్తుల విలువ రూ. 7,790 కోట్లు. గత సంవత్సరంతో పోలిస్తే ఆమె సంపదలో 69 శాతం పెరుగుదలను చూసింది. ఆమె సంపాదనలో ఎక్కువ భాగం నైట్ రైడర్స్ స్పోర్ట్స్ నుండి వస్తుంది. 7. నేహా బన్సాల్ (Neha Bansal)లెన్స్కార్ట్ సహ వ్యవస్థాపకురాలు నేహా బన్సాల్ ప్రస్తుతం కంపెనీలో వర్తకం, చట్టపరమైన విధులకు నాయకత్వం వహిస్తున్నారు. రూ. 5,640 కోట్ల నికర విలువతో ఏడో స్థానంలో ఉన్నారు. లెన్స్కార్ట్ను ప్రారంభించడానికి ముందు, బన్సాల్ 2010 నుండి 2014 వరకు DNS అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు డైరెక్టర్గా పనిచేశారు. ఢిల్లీలో పుట్టి పెరిగిన నేహా, BCom ఆనర్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.8. ఇంద్రా నూయి (Indra Nooyi) పెప్సికోలో 24 సంవత్సరాలు సేవలందించిన తర్వాత, కంపెనీ మాజీ చైర్పర్సన్ సీఈవో ఇంద్రా నూయి రూ. 5,130 కోట్ల నికర విలువను కలిగి ఉన్నారు. 2019లో పదవీ విరమణ చేశారు. CEOగా, తన పదవీకాలంలో అమ్మకాలను దాదాపు రెట్టింపు చేశారు. ఆరోగ్యకరమైన ఉత్పత్తులు, పర్యావరణ అనుకూల పద్ధతులను ప్రవేశపెట్టారు. పెప్సికో నుండి పదవీ విరమణ చేసిన తర్వాత, నూయి 2019లో అమెజాన్ బోర్డు, డ్యూయిష్ బ్యాంక్ యొక్క గ్లోబల్ అడ్వైజరీ బోర్డులో చేరారు. 2023లో AI-ఆధారిత డేటా భద్రత, నిర్వహణ స్టార్టప్ కోహెసిటీ CEO అడ్వైజరీ కౌన్సిల్లో చేరారు. నూయి భారతదేశంలో పెరిగారు. యేల్ నుండి MBA పట్టా పొందారు. 9. నేహా నార్ఖేడే ( Neha Narkhede)స్ట్రీమింగ్ డేటా టెక్నాలజీ సంస్థ కాన్ఫ్లూయెంట్ కోఫౌండర్,మాజీ సీటీవో నేహా నికర ఆస్తుల విలువ రూ. 4,160 కోట్లు. మహారాష్ట్రలోని పూణేకు చోందిన నేహా ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ అపాచీ కాఫ్కాను సహ-సృష్టించారు. ప్రస్తుతం ఆమె కాన్ఫ్లూయెంట్ బోర్డు సభ్యురాలిగా పనిచేస్తున్నారు. దీనికి ముందు 2021లో రిస్క్ డిటెక్షన్ ప్లాట్ఫామ్ డెవలపర్ ఓస్సిలార్ను సహ-స్థాపించారు. అంతేకాదు గత ఏడాది ఆమె ఫోర్బ్స్ అమెరికా యొక్క స్వీయ-నిర్మిత మహిళలలో ఒకరిగా జాబితాలో చోటు సంపాదించారు.10. కవిత సుబ్రమణియన్ (Kavitha Subramanian)భారతీయ ఆన్లైన్ పెట్టుబడి వేదిక, అప్స్టాక్స్ సహ వ్యవస్థాపకురాలు కవిత భారతదేశంలోని టాప్ 10 ధనిక మహిళా వ్యవస్థాపకుల జాబితాలో చివరి స్థానంలో ఉన్నారు. ఆమె నికర విలువ రూ. 3,840 కోట్లు. అప్స్టాక్స్ను ప్రారంభించడానికి ముందు ఆమె 2015-2016 వరకు లీప్ఫ్రాగ్ ఇన్వెస్ట్మెంట్స్కు అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు. SKS మైక్రోఫైనాన్స్ లిమిటెడ్లోని యాక్టిస్లో పనిచేశారు. IIT బాంబే పూర్వ విద్యార్థిని, ది వార్టన్ స్కూల్ MBA గ్రాడ్యుయేట్. -
పరిశోధనా రంగంలో స్ఫూర్తి పతాకం
సంధ్యా షెనాయ్ (Dr Sandhya Shenoy ) సైన్స్ రంగంలో రాణించాలనుకునే భారత యువతకు ఒక స్ఫూర్తిపతాకం. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ డచ్ అకడెమిక్ పబ్లిషర్ ఎల్స్వియర్తో కలిసిప్రతి ఏటా వెలువరించే అత్యంత ప్రతిభావంతులైన సైంటిస్ట్లజాబితాలో ఆమె వరుసగా మూడుసార్లు నిలిచింది. తాజాగా వెలువడిన 2025 జాబితాలో ఆమెకు మూడోసారి స్థానం దక్కడంతో భారత పరిశోధనా రంగంలో హర్షాతిరేకాలు వెలువెత్తుతున్నాయి. సంధ్యా షెనాయ్ పరిచయం.సంధ్యా షెనాయ్కు విద్యా రంగంలో, పరిశోధన రంగంలో సంచలనాలు సృష్టించడం కొత్త కాదు. 2010లో మొదటిసారి ఆమె ఘనత వార్తపత్రికల ద్వారా లోకానికి తెలిసింది. దానికి కారణం బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎం.ఎస్సీ కెమిస్ట్రీలో ఆమె సెంట్ పర్సెంట్ సాధించడం. ఇలా ఎం.ఎస్సీ కెమిస్ట్రీలో నూరు శాతం మార్కులు సాధించడం అసాధ్యం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అంతవరకూ ఆ ఘనత సాధించిన వారు ఒక్కరూ లేరు. మొదటిసారి సంధ్యా షెనాయ్ ఆ మార్కులు సాధించింది. ‘స్టూడెంట్ అంటే ఇలా ఉండాలి’ అని అందరి చేతా అనిపించుకుందామె.హాజరు.. చదువు...కొంకిణి మాతృభాష కలిగిన సంధ్యా షెనాయ్ సొంత ప్రాంతం ఉడిపి. అక్కడే బి.ఎస్సీ. వరకూ చదివి కాలేజీలో గోల్డ్ మెడల్ సాధించింది. ఆ తర్వాత కుటుంబం బెంగళూరులో స్థిరపడటంతో అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో నూరు శాతం మార్కులు సాధించి నానో కెమిస్ట్రీలో పీహెచ్డీ కొనసాగించింది. ‘నా చదువులో ఎప్పుడూ కాలేజీ ఎగ్గొట్టలేదు. నూరు శాతం అటెండెన్స్తో ఉంటాను. అలాగే క్లాసుల్లో రన్నింగ్ నోట్స్ మిస్ కాను. పరీక్షలకు అదే చదువుకుంటాను. అలాగే మార్కులు తెచ్చుకున్నాను’ అంటుందామె. కెమిస్ట్రీలో విశేషమైన అభిరుచి ఉన్న షెనాయ్ మొదట అధ్యాపక వృత్తిలో ఉంటూనే తన పరిశోధనను కొనసాగించి ఉత్తమ సైంటిస్ట్ అవ్వాలని నిశ్చయించుకుంది.చదవండి: Shoaib Malik సానియా మాజీ భర్త మూడో పెళ్లి పెటాకులే..?! వీడియో వైరల్వేస్ట్ హీట్ను విద్యుత్గా...మంగళూరు శ్రీనివాస యూనివర్సిటీలో ప్రొఫెసర్, ప్రిన్సిపల్ రీసెర్చ్ సైంటిస్ట్గా పని చేస్తున్న సంధ్యా షెనాయ్ థెర్మో ఎలక్ట్రిక్ మెటీరియల్స్లో విశేషమైన పరిశోధన కొనసాగిస్తూ అంతర్జాతీయ స్థాయిలో పరిశోధన పత్రాలు ప్రచురించడం ద్వారా గుర్తింపు పొందింది. లండన్లోని ‘రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ’ (ఆర్.ఎస్.సి.) ఆమెను లీడింగ్ ఫిమేల్ రీసెర్చర్గా గుర్తించింది. ఈ గుర్తింపు పొందడం అంత సులువు కాదు. పర్యావరణ రంగానికి చేటు చేస్తున్న వేస్ట్ హీట్ (కర్మాగారాలు, ఇతర యంత్ర పరికరాల వల్ల వెలువడే ఉష్ణం) వృథా అవడమే కాకుండా పర్యావరణానికి చేటు చేస్తుండటం వల్ల ఆ వేస్ట్ హీట్ను విద్యుత్తుగా ఎలా మార్చవచ్చో పరిశోధనలు చేస్తూ, వాటి ఫలితాలను ప్రతిపాదిస్తూ సంధ్యా షెనాయ్ ప్రపంచవ్యాప్తంగా సైంటిస్ట్ల దృష్టిని ఆకర్షించింది. అందుకే ఆమెకు 2021లో ‘యంగ్ సైంటిస్ట్’ అవార్డ్, 2024లో ‘కెమిస్ట్రీ మెడల్’ లభించాయి.చదవండి: Nita Amabni క్వీన్ ఆఫ్ దాండియాతో గార్బా స్టెప్పులు : ఉర్రూతలూగిన వేదికప్రపంచ సైంటిస్టుల జాబితాలో...ప్రపంచంలో అత్యుత్తమ సైంటిస్టుల 2 శాతం పట్టికను స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ప్రతి ఏటా ప్రకటిస్తూ ఉంటుంది. ఆగస్టు 30 నాటికి ఆ సంవత్సరంలో వివిధ అంతర్జాతీయ జర్నల్స్లో ప్రచురించిన పరిశోధన పత్రాల ఆధారంగా, వాటికి అందిన ఆదరణను బేరీజు వేసుకుని సెప్టెంబర్లో ఈ జాబితాను విడుదల చేస్తారు. 2023 నుంచి సంధ్యా షెనాయ్ ఈ పట్టికలో నిలుస్తోంది. తాజాగా సెప్టెంబర్ 19న విడుదల చేసిన 2025 జాబితాలో మూడవసారి కూడా సంధ్యా షెనాయ్కు చోటు దక్కింది. ప్రపంచవ్యాప్త సైంటిస్టులకు సమఉజ్జీగా మన దేశం నుంచి ఒక మహిళా పరిశోధకురాలు ఈ స్థాయి గుర్తింపు ΄పొందుతుండటం మన సైన్సు రంగానికి గర్వకారణం. అందుకే ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలి నేటి యువతరం. -
మెలోని గారి మన్ కీ బాత్
బాగా ఇష్టమైన ఇల్లు కాలి బూడిదైతే... ఆ బూడిదను చూస్తూ ఏడుస్తూ కూర్చోలేము. ఒక్కో ఇటుక పేరుస్తూ కొత్త ఇంటికి సిద్ధం అవుతాము. జార్జియా మెలోని అలాగే చేసింది. కుటుంబ కల్లోలాన్ని మనసుపైకి రానివ్వకుండా తిరుగులేని నాయకురాలిగా ఎదిగింది. ఇటలీ తొలి మహిళా ప్రధాని అయింది. ఆమె ఆత్మకథ ‘ఐయామ్ జార్జియా – మై రూట్స్, మై ప్రిన్సిపుల్స్ (ఇండియన్ ఎడిషన్)కు ప్రధాని నరేంద్ర మోదీ ముందుమాట రాశారు.కొన్ని నెలల క్రితం అల్బేనియాలో జరిగిన ఒక సదస్సులో వివిధ దేశాల నేతలు హాజరయ్యారు. ఈ సదస్సుకు హాజరైన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి అల్బేనియా అధ్యక్షుడు స్వాగతం పలికిన తీరు వైరల్ అయింది. కారు దిగి వస్తున్న మెలోనికి వర్షంలో మోకాళ్లపై కూర్చొని నమస్కారం చెబుతూ ఆయన స్వాగతం పలికిన తీరు ప్రపంచాన్ని ఆకట్టుకుంది.న్యూయార్క్లో జరిగిన ఒక అవార్డ్ల కార్యక్రమంలో... ‘మెలోని నిజాయితీపరురాలు. ఆమె మనసు అందమైనది’ అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించాడు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. ఇటలీలో జరిగిన జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న మోదీని ‘నమస్తే’ అంటూ మెలోని స్వాగతం పలకడం వైరల్గా మారింది.ఒక్క మాటలో చె ప్పాలంటే... జార్జియా మెలోని అనేది ‘ప్రధాన ఆకర్షణ’కు మరో పేరు.అయితే ఆమె ప్రస్థానం నల్లేరు మీద నడక కాదు. ఒక్కో అడుగు వేస్తూ ప్రయాణం ప్రారంభించింది. ఆ ప్రయాణంలో ఎన్నో ప్రతికూలతలను అధిగమించి ముందుకు వెళ్లింది.‘ఐయామ్ జార్జియా–మై రూట్స్, మై ప్రిన్సిపుల్స్’ను ఒక అధ్యక్షురాలి ఆత్మకథగా మాత్రమే చూడనక్కర్లేదు. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి ఇటలీ తొలి మహిళా అధ్యక్షురాలి స్థాయికి ఎదగడం అనేది సామాన్య విషయమేమీ కాదు. ధైర్యంలో, ఆత్మవిశ్వాసంలో, సానుకూల శక్తి విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మహిళలకు స్ఫూర్తినిస్తోంది మెలోని.రోమ్లో పుట్టి గార్బటెల్లా జిల్లాలో పెరిగింది మెలోని. చాలా చిన్న వయసులో ఉన్నప్పుడే మెలోని తండ్రి, కుటుంబాన్ని విడిచి కానరీ దీవులకు వెళ్లాడు. అక్కడ మరో వివాహం చేసుకున్నాడు. మెలోనికి పదిహేడేళ్లు ఉన్నప్పుడు ఆమె తండ్రి మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన కేసులో తొమ్మిది సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు.తండ్రి దూరం అయ్యాడు. తమకు ఇష్టమైన ఇల్లు అగ్నిప్రమాదంలో నాశనం అయింది. బాల్యం, కుటుంబ విచ్ఛిన్నం తన రాజకీయ దృక్పథాన్ని ప్రభావితం చేశాయని తన ఆత్మకథలో రాసుకుంది మెలోని. పొలిటికల్ పార్టీ ఇటాలియన్ సోషల్ మూమెంట్ (ఎంఎస్ఐ) యువ విభాగం ‘యూత్ ఫ్రంట్’లో చేరడంతో మెలోని రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ తరువాత కాలంలో ‘స్టూడెంట్ మూవ్మెంట్’ నేషనల్ లీడర్గా ఎదిగింది. ప్రావిన్స్ ఆఫ్ రోమ్’ కౌన్సిలర్గా పనిచేసింది. ‘యూత్ యాక్షన్’ అధ్యక్షురాలిగా ఎంపికైంది... ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇటలీ తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించింది.మోదీ ముందుమాట‘దేశభక్తి ఉట్టిపడే అత్యత్తమ నాయకురాలు’ అని ‘ఐయామ్ జార్జియా – మై రూట్స్, మై ప్రిన్సిపుల్స్’ పుస్తకానికి రాసిన ముందు మాటలో మన ప్రధాని నరేంద్ర మోదీ మెలోనిని కొనియాడారు. ఆమె వ్యక్తిగత, రాజకీయ ప్రయాణం గురించి వివరించారు. మెలోని ఆత్మకథను ‘మన్కీ బాత్’లో చె ప్పారు. ‘‘ఇటలీ ప్రధాన మంత్రి మెలోనిపై అభిమానం, స్నేహంతో ఈ ముందుమాట రాశాను. దీన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఆమె స్ఫూర్తిదాయకమైన, చారిత్రక ప్రయాణం భారత్లో ఎంతోమందిని ప్రభావితం చేస్తుంది’’ అని తన ముందు మాటలో రాశారు మోదీ. గతంలో రెండు పుస్తకాలకు మాత్రమే మోదీ ముందు మాట రాశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆనందీబెన్ పటేల్కు అంకితం ఇచ్చిన పుస్తకానికీ, ప్రముఖ బాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలు హేమమాలిని ఆత్మకథకు గతంలో ముందుమాట రాశారు. -
కాంచన, ప్రియ.. ఎవరీ యువ నేతలు!
టీవీ చర్చల్లో అర్నాబ్ గోస్వామి ఎలా మాట్లాడతారో చాలా మందికి తెలుసు. ఓ చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని వ్యంగ్యంగా "రాహుల్ బాబా" అని పదేపదే సంబోధించారు. అదే కార్యక్రమంలో పాల్గొన్న ఓ యువతి అర్నాబ్ బాబా అంటూ కౌంటర్ ఇవ్వడంతో అర్నాబ్ వెనక్కి తగ్గారు. ఆ యువతిపేరు కాంచనా యాదవ్. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించిన ఆమె 2018లో విద్యార్థి రాజకీయాల్లో చేరి, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) భావజాలం ప్రభావంతో ఆ పార్టీలో కొనసాగుతున్నారు.మరొక టీవీ చర్చా కార్యక్రమంలో అర్నాబ్ గోస్వామి మాట్లాడుతూ.. 'నేను ఉన్నత కులానికి చెందిన బ్రాహ్మణుడి'ని అంటూ వ్యాఖ్యానించారు. అక్కడే ఉన్న ప్రియాంక భారతి (Priyanka Bharti) ఈ వ్యాఖ్యలపై దీటుగా స్పందించారు. మీది ఉన్నత కులం కాదు. పుట్టకతోనే ఎవరూ ఉన్నతులు, తక్కువ వారు కాదు. మీ మాటలు వివక్షపూరితంగా ఉన్నాయని కౌంటర్ ఇచ్చారు. దీంతో గోస్వామి కామ్ అయిపోయారు.కాంచన, ప్రియాంక ఇద్దరూ ఆర్జేడీ జాతీయ అధికార ప్రతినిధులు. ఈ ఇద్దరు యువతులు తమ పోరాట శైలితో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా టీవీ చర్చల్లో తమ పార్టీ గళాన్ని బలంగా పనిచేస్తూ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. ఇద్దరూ 2018లో JNUలో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆర్జేడీ విద్యార్థి విభాగం ఛత్ర రాష్ట్రీయ జనతాదళ్ (CRJD)లో చేరారు. విశ్వవిద్యాలయ విద్యార్థి రాజకీయాల్లో తన ఉనికిని బలోపేతం చేసుకోవాలని భావించిన ఆర్జేడీ.. 2019 విద్యార్థి సంఘాల ఎన్నికల్లో పోటీ చేసింది.''జేఎన్యూలో ప్రతిభావంతులైన వారిని గుర్తించి, పార్టీలో ప్రోత్సహించాలనేది ఎంపీలు మనోజ్ ఝా, సంజయ్ యాదవ్ (Sanjay Yadav) ఆలోచన. సీఆర్జేడీ ఏర్పడినప్పటి నుంచి ప్రొఫెసర్ నవల్ కిషోర్ దీనికి ఇన్ఛార్జ్గా ఉన్నారు. దాని అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు" అని పార్టీ కార్యకర్త ఒకరు తెలిపారు. కాంచన, ప్రియాంక.. సీఆర్జేడీ ద్వారానే వెలుగులోకి వచ్చారు. కంప్యూటేషనల్, ఇంటిగ్రేటివ్ సైన్సెస్లో కాంచన పీహెచ్డీ చేశారు. జర్మన్ స్టడీస్లో ప్రియాంక పీహెచ్డీ చేస్తున్నారు. 2023, అక్టోబర్లో ఆర్జేడీ జాతీయ అధికార ప్రతినిధులుగా వీరిద్దరూ నియమితులయ్యారు.లాలూ స్ఫూర్తితోనే.. లాలూ ప్రసాద్ యాదవ్ స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు కాంచన వెల్లడించారు. తన రాజకీయ ప్రవేశంపై 'ది ప్రింట్'తో ఆమె మాట్లాడుతూ.. ''2018లో నేను విద్యార్థి రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాను. నాకు ఇతర ఎంపికలు కూడా ఉన్నాయి. కానీ నేను RJD భావజాలంతో బాగా ప్రభావితమయ్యాను. (పార్టీ చీఫ్) లాలూ ప్రసాద్ జీ సిద్ధాంతాలపై ఎప్పుడూ రాజీపడలేదు. JNUలోని చాలా మంది విద్యార్థులు సాధారణంగా వామపక్ష విద్యార్థి సంఘాల వైపు ఆకర్షితులవుతారు. కానీ లాలూజీ భావజాలం నన్ను ఆకట్టుకుంద''ని తెలిపారు. విద్యార్థి నేతగా ఫీజు పెంపుదల, హాస్టల్ సంబంధిత సమస్యలతో పాటు అంశాలపై పోరాటం చేసినట్టు వెల్లడించారు.పోలీసులు దారుణంగా కొట్టారుతన రాజకీయ ప్రయాణం గురించి ప్రియాంక మాట్లాడుతూ.. ''నేను గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే ఆర్జేడీ విద్యార్థి విభాగంలో చేరాను. ఆ సమయంలో జేఎన్యూలో అనేక నిరసనలు జరుగుతున్నాయి. వామపక్ష గ్రూపులలో చేరడం వంటి ఇతర ఎంపికలు కూడా నాకు ఉన్నాయి, కానీ అవి కుల సమస్యలపై తగినంతగా గళం విప్పడం లేదని నేను భావించాను. నేనేమీ అకస్మాత్తుగా రాజకీయాల్లోకి రాలేదు. ఫీజుల పెంపుదలకు వ్యతిరేకంగా ఉద్యమానికి నాయకత్వం వహించాను. పోలీసులు నన్ను దారుణంగా కొట్టారు. నా చర్మంపై పిన్నులు గుచ్చారు. దాని వల్ల నా మోకాలిలో కణితి వచ్చింది. మా విద్యార్థి విభాగం కోసం కరపత్రాలు పంపిణీ చేస్తున్నప్పుడు సీఆర్జేడీ తరపున ఎందుకు ప్రచారం చేస్తున్నావని సీనియర్ ఒకరు అడిగారు. సామాజిక న్యాయం, లాలూజీ సిద్ధాంతాన్ని నమ్ముతానని చెప్పాను. అలా నాకు సీఆర్జేడీలో సభ్యత్వం వచ్చింద''ని తెలిపారు.ఎవరీ కాంచన?ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లాలో కాంచన జన్మించింది. ఆమె పూర్వీకులు బిహార్లోని ససారాంకు చెందినవారు. కాంచనతాత ప్రభుత్వ ఉద్యోగి కాగా, తండ్రి ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత 2017లో లైఫ్ సైన్సెస్లో ఎంఎస్సీ చేయడానికి జేఎన్యూలో చేరారు. సీఎస్ఐఆర్ ఫెలోషిప్ సాధించడంతో బెంగళూరులో సైంటిస్ట్ ఉద్యోగ అవకాశం వచ్చింది. రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఉద్దేశంతో ఢిల్లీలోనే ఉండిపోయారు. త్వరలో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల తమకెంతో కీలకమని, ఈ ఎన్నికల తర్వాతే ఉద్యోగం గురించి ఆలోచిస్తానని కాంచన 'ది ప్రింట్'తో చెప్పారు.ప్రియాంక ప్రస్థానంపట్నా జిల్లా తూర్పు శివార్లలోని ఫతుహా పట్టణానికి చెందిన ప్రియాంక 2019లో జరిగిన జేఎన్యూ స్టూడెంట్ యూనియన్ అధ్యక్ష ఎన్నికల్లో సీఆర్జేడీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆమె తండ్రి రైతుగా పనిచేస్తున్నారు. తమ కుటుంబానికి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదని ప్రియాంక చెప్పారు. జేఎన్యూలో పీహెచ్డీ కొనసాగుతోందన్నారు. టీవీ చర్చా కార్యక్రమాల్లో ఆర్జేడీ (RJD) పార్టీ వైఖరిని బలంగా వినిపించడంపై ప్రస్తుతం దృష్టి సారించినట్టు వెల్లడించారు.చదవండి: 'మా ఆయన అస్సలు మంచోడు కాదు'మీడియాలో వివక్షమీడియాలో ప్రతిపక్ష నాయకుల పట్ల వివక్ష కొనసాగుతోందని కాంచన, ప్రియాంక ఆరోపించారు. కొంత మంది న్యూస్ యాంకర్లు అధికార పార్టీ ప్రతినిధుల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అధికార బీజేపీ, గోడి మీడియా యాంకర్లకు సరైన సమాధానం ఎలా ఇవ్వాలో తమకు తెలుసునని.. భయపడేది లేదని వారిద్దరూ ముక్తకంఠంతో చెప్పారు. చర్చల్లో పాల్గొనకుండా తమను గోడి మీడియా బాన్ చేసినప్పుడు ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్ (Tejashwi yadav) తమకు అండగా నిలబడ్డారని తెలిపారు. -
డీఎస్పీగా గృహిణి..! ఆమె కలను వివాహం ఆపలేదు..
వివాహం ఏ అమ్మాయికైనా తన కలలను కనడమే మరిచిపోయేలా బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. సపోర్టు ఉంటే తనను తాను ప్రూవ్ చేసుకునేలా ఎదుగుతుంది. లేదంటే వంటిటికే పరిమితమవ్వాల్సిందే. కానీ అలాంటి మూసపద్ధతులన్నింటిని బద్దలుకొట్టుకుంటూ దూసుకొచ్చింది ఈ మహిళ. ఓ పక్క పేదరికం, మరోవైపు ఇంటి బాధ్యతలు అయినా.. తన కలలు కల్లలుగా మారనివ్వ లేదు. తాను అనుకున్నది సాధించడం కోసం గుక్కపెట్టి ఏడిపించేలా చేస్తున్న కష్టాలన్నింటిని ధైర్యంగా ఎదుర్కొని..గృహిణులు కూడా ఉన్నతాధికారుల కాగలరని చాటి చెప్పిందిఆ ధీర వనితే అంజు యాదవ్(Anju Yadav). 1988లో హర్యానాలోని నార్నాల్ జిల్లాలోని చోటే అనే గ్రామంలో జన్మించింది. ఆమెది వ్యవసాయ కుటుంబం. తండ్రి లాల్రామ్ వ్యవసాయం, పార్చున్ దుకాణం సాయంతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. తల్లి సుశీలా దేవి గృహిణి. ఆమెకు ముగ్గురు సోదరీమణులు. బీఏ వరకు తన గ్రామంలోనే చదువుకున్న అంజు 21 ఏళ్లకే పెళ్లి చేసుకుంది. 22 ఏళ్లకే తల్లి అయ్యి ముకుల్దీప్ అనే మగబిడ్డకు జన్మనిచ్చింది. అయినా సరే తన డ్రీమ్ ఆగిపోకూడదనుకుంది. తల్లిగా, భార్యగా ఇంటి బాధ్యతలు నిర్వరిస్తూ సతమతమైంది. తన లక్ష్యానికి నెరవేర్చుకునేందుకు అత్తమామలు ముందుకు రాకపోవడంతో తల్లి సాయం తీసుకుంది. ఆమెకు తన కొడుకు బాధ్యతను అప్పగించి తన కెరీర్పై దృష్టిసారించింది. అలా ఎలాంటి కోచింగ్ లేకుండా బీఈడీ సీటు సంపాదించి ఏకంగా మూడుసార్లు పలు చోట్ల ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదించింది. ఇక ఆ సమయంలో తల్లి ఆమెకు మద్దతిచ్చి..కొడుకు ముకుల్దేవ్ బాధ్యతను తీసుకుంది. సమాజంలో తనకంటూ ఓ గుర్తింపు ఉండాలన్న ఆరాటంతో సాగిపోతున్న అంజుకి భర్త అనారోగ్యం ఆమెను మరింత దుఃఖంలోకి నెట్టేసింది. సరిగ్గా ఆ సమయంలో రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (RAS) రిక్రూట్మెంట్ వచ్చింది. ఆ బాధను దిగమింగుకుని మరీ ఆ పరీక్షకు దరఖాస్తు చేసుకుంది. ఆ డీఎస్పీ ఎగ్జామ్కి సన్నద్ధమవుతుండగా భర్త నిత్యానంద్రావు అనారోగ్యంతో మరణించడంతో ఒంటరి తల్లిగా నానా ఇబ్బందులు పడింది. ఆ కష్ట సమయంలో తల్లిదండ్రులు మద్దతివ్వడంతో..ఆహర్నిశలు కష్టపడి ప్రిపేరయ్యింది. అలా 2023లో 1725 ర్యాంకు సాధించి డీఎస్సీ అయ్యింది. చివరికి సెప్టెంబర్ 2025కి విజయవంతంగా ట్రైనింగ్ పూర్తి చేసుకుని రాజస్తాన్ పోలీస్ సర్వీస్లో డీఎస్పీ(Deputy Superintendent of Police )గా విధులు నిర్వర్తిస్తోంది. ఓ మారుమూల గ్రామంలో వివాహితురాలిగా మారిన తర్వాత కూడా అంజు కలలు కనడం ఆపలేదు. ఎన్ని రకాలుగా తనను అణిచివేసేలా ఇబ్బందులు వచ్చి పడినా అధైర్యపడలేదు. ఏదో ఒక నాటికి తను అనుకున్న గుర్తింపు సాధించగలుగుతానన్న నమ్మకంతో ముందుకు సాగింది. చివరకు సుదీర్ఘ పోరాటం అనతరం తన కలను నెరవేర్చుకుంది .కష్టపడేతత్వం ఉంటే కల ఎప్పటికైనా నెరవేరి తీరుతుంది అనేందుకు ఉదాహరణగా నిలిచి.. 'దటీజ్ అంజు యాదవ్' అని అనిపంచుకుంది . View this post on Instagram A post shared by Anju Yadav (@anjuyadav_dsp) (చదవండి: అందాలపోటీలకు అంతరాయం కలిగించిన భూకంపం..! వీడియో వైరల్) -
అంబానీ, అదానీ తరువాత.. మరోసారి టాప్లో రోష్నీ నాడార్
ప్రముఖ టెక్ సంస్థ హెచ్సీఎల్ టెక్నాలజీస్ (HCL) చైర్పర్సన్ రోష్ని నాదర్ మల్హోత్రా (Roshni Nadar Malhotra) ధనవంతులైన వ్యాపారవేత్తగా మరోసారి తన ఘనతను చాటుకున్నారు. భారతదేశంలో అత్యంత ధనవంతు రాలైన మహిళగా చరిత్ర సృష్టించారు. M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025లో రూ.2.84 లక్షల కోట్ల సంపదతో మూడవ స్థానంలో నిలిచారు. తద్వారా భారతదేశ సంపదలో పెరుగుతున్న కొత్త తరం మహిళా నాయకుల ప్రతిభను చాటి చెప్పారు.హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 (Hurun Rich List) ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో ఉన్నారు, రోష్ని నాదర్ మల్హోత్రా అత్యంత ధనవంతురాలైన మహిళగా ఎంపికయ్యారు. హురున్ ప్రకారం రిలయన్స్ అధినేతముఖేష్ అంబానీ మరోసారి తన టాప్ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. అంబానీ ఫ్యామిలీ భారతదేశంలో అత్యంత ధనవంతుడిగ ఆనిలిచారు. మొత్తం ఆస్తి .రూ.9.55 కోట్లు. ఇక రూ. రూ.8.15 లక్షల కోట్ల కోట్ల సంపదతో అదానీ గౌతమ్ అదానీని అధిగమించారు.భారతదేశంలోని సంపన్న వర్గం గణనీయంగా పెరిగింది. దేశం ఇప్పుడు 350 మందికి పైగా బిలియనీర్లు ఉండగా. ఈజాబితా ప్రకారం గత 13 ఏళ్లుగా వీరి సంఖ్య గణనీనయంగా పెరుగుతూ వస్తోంది. జాబితా వీరి మొత్తం సంపద మొత్తం రూ.167 లక్షల కోట్లు.ఇది భారతదేశ స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు సగం.కాగా హెచ్సీఎల్ వ్యవస్థాపకుడు శివ నాడార్ కుమార్తె రోష్ని నాడార్ మల్హోత్రా. ప్రస్తుతం హెచ్సీఎల్ టెక్ చైర్పర్సన్. HCL గ్రూప్లో అధిక వాటాను స్వీకరించిన తర్వాత భారతదేశంలో అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. నార్త్ వెస్ట్రన్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ. కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు రోష్నీ. -
స్ఫూర్తిదాయక సురేఖ!
ముంబై: ఆసియాలోనే మొదటి మహిళా లోకో పైలట్గా, 36 ఏళ్లకు పైగా తన వృత్తి జీవితంలో దేశంలోని ఎన్నో ప్రతిష్టాత్మక రైళ్లను నడిపిన సురేఖ యాదవ్ (Surekha Yadav) మంగళవారం ఉద్యోగ విరమణ చేశారు. ఆమె ధైర్యసాహసాలు, స్ఫూర్తిదాయకమైన వారసత్వాన్ని వదిలి వెళ్లారని సెంట్రల్ రైల్వే కొనియాడింది. ఈ ’మార్గదర్శి అద్భుత ప్రయాణం’రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని పేర్కొంది. పురుషాధిక్య ప్రపంచంలో మెరిసి.. యాదవ్ 1989లో భారతీయ రైల్వేలో చేరారు. పురుషాధిక్యం ఉన్న రైల్వే రంగంలో అడ్డంకులను ఛేదించారు. ఆమె 1990లో అసిస్టెంట్ డ్రైవర్గా మారారు, తద్వారా ఆసియా ఖండంలోనే మొట్టమొదటి మహిళా రైలు డ్రైవర్గా (woman loco pilot) గుర్తింపు పొందారు. క్లిష్టమైన మార్గాల్లో రైళ్లు నడిపి ముంబై సబర్బన్ లోకల్ రైళ్లతో పాటు, భారతదేశంలోనే అత్యంత ఎత్తయిన కొండ మార్గాల గుండా సురేఖ యాదవ్ గూడ్స్ రైళ్లను నడిపారు. వందేభారత్ నుండి రాజధాని ఎక్స్ప్రెస్ వరకు.. దేశంలోని కొన్ని అత్యంత ప్రతిష్టాత్మక రైళ్లను కూడా ఆమె నడపడం విశేషం. రైతు కుటుంబంలో పుట్టి.. మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన ఒక రైతు కుటుంబంలో సెపె్టంబర్ 2, 1965న జన్మించిన యాదవ్, రైల్వే ఉద్యోగంలో చేరడానికి ముందు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా పూర్తి చేశారు. ఆమె క్రమంగా ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. 1996లో మొదటి గూడ్స్ రైలును నడిపారు, ఆపై 2000 సంవత్సరంలో మోటార్ ఉమన్గా పదోన్నతి పొందారు. 2010లో, ఆమె ఘాట్ డ్రైవర్గా అర్హత సాధించారు. ఆ తర్వాత వివిధ మార్గాల్లో సుదూర మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లకు సారథ్యం వహించారు. వందేభారత్కు సారథ్యం ఆమె వృత్తి జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా 2023 మార్చి 13వ తేదీ నిలిచిపోతుంది. సోలాపూర్, ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ మధ్య తొలిసారిగా నడిపిన వందే భారత్ ఎక్స్ప్రెస్కు ఆమె సారథ్యం వహించారు. ఉద్యోగ విరమణకు కొన్ని రోజుల ముందు, చివరి బాధ్యతగా, ఇగత్పురి సీఎస్ఎంటీ మధ్య హజ్రత్ నిజాముద్దీన్–సీఎస్ఎంటీ మార్గంలో ప్రతిష్టాత్మక రాజధాని ఎక్స్ప్రెస్ను నడిపే అవకాశం ఆమెకు లభించింది. యాదవ్ తన చివరి రోజు ఉద్యోగ విరమణకు సంబంధించిన అన్ని లాంఛనాలను పూర్తి చేశారు. సంప్రదాయం ప్రకారం, ఆమె సహోద్యోగులు కొద్ది రోజుల క్రితం ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు.మార్గదర్శికి వీడ్కోలు ఒక మార్గదర్శికి వీడ్కోలు. ఆసియా తొలి మహిళా రైలు డ్రైవర్ సురేఖ యాదవ్.. 36 ఏళ్ల అద్భుతమైన సేవల తర్వాత నేడు సెలవు తీసుకుంటున్నారు. ఆమె అద్భుత ప్రయాణం.. రాబోయే తరాల రైల్వే మహిళలు, పురుషులకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. – ‘ఎక్స్’లో సెంట్రల్ రైల్వే పోస్టు -
అన్నీ అమ్మ ఆకృతులే
‘అమ్మవారి తొమ్మిది అలంకారాలు, కృతులు స్త్రీ శక్తి గురించి తెలియజేసేవే. మనలోని శక్తిని ఎలా జాగృతం చేస్తామో అదే మనం’ అంటూ నవరాత్రుల సందర్భంగా చేస్తున్న సాధన, అమ్మవారి కృపతో మొదలైన తన ప్రయాణం గురించి తెలియజేశారు గాయని భమిడి పాటి శ్రీలలిత (Bhamidipati Srilalitha). విజయవాడ వాసి, గాయని, అమ్మవారి పాటలకు ప్రత్యేకంగా నిలిచిన శ్రీలలిత చెప్పిన విశేషాలు నవశక్తిలో.‘‘నవరాత్రి సిరీస్ ఆరేళ్లుగా చేస్తున్నాను. బెజవాడ కనకదుర్గమ్మ అలంకరణ ఎలా ఉంటుందో అలాంటి అలంకరణల సెట్ వేసి, షూట్ చేసి, వీడియో ద్వారా చూపించాం. ఈ నవరాత్రుల్లో కనకదుర్గమ్మను నేరుగా దర్శించుకోలేనివారు సోషల్ మీడియాలో తొమ్మిది పాటలుగా విడుదల చేసిన వీడియోలు చూడవచ్చు. అమ్మవారి ప్రతి అలంకరణకు తగ్గట్టుగా పాట ఎంపిక, విజువల్స్ డిజైన్ చేశాం. ప్రతియేటా కొత్తదనం ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాం. అమ్మవారి కృతులు అందరిళ్లలో పాడుకునే విధంగా ఆడియోను తీసుకువచ్చాం. పరంపరంగా వచ్చిన కృతులనే తీసుకున్నాం. ఈసారి మాత్రం రెండు భజనలు కూడా వీడియోలో ఉండేలా ప్లాన్ చేశాం. ఈ నవరాత్రి వీడియోకు నెల రోజుల టైమ్ పట్టింది. రోజుకు మూడు అలంకారాల చొప్పున షూట్ చేశాం.కృతులను నేర్చుకుంటూ ..చిన్నప్పటి నుంచి ఇంట్లో భక్తి గీతాలు వింటూ ఉండేదాన్ని. మా ఇంట్లో అందరూ అమ్మవారి ఆరాధకులే. అమ్మవారి దీక్ష చేసేవారు. ఇంట్లో అందరూ ఆమె కృతులను పాడుతుంటారు. ఆ విధంగా అమ్మవారి కృతులు వినడం, నేర్చుకోవడం ప్రారంభించాను. మా అత్తింట్లోనూ అమ్మవారి ఆరాధకులే. మా మామగారు నలభై ఏళ్లుగా దుర్గమ్మవారి ఉత్సవాలు జరుపుతున్నారు. దీంతో నేనూ ఆ ఉత్సవాల్లో పాల్గొంటూ, ప్రదర్శన ఇస్తూ వస్తున్నాను. అన్ని పుణ్యక్షేత్రాలూ దర్శించి, అక్కడ ప్రదర్శనలో పాడే అవకాశమూ లభించింది.చదవండి: సెంటర్స్టోన్ డైమండ్రింగ్, లగ్జరీ గౌనులో ఇషా అంబానీ : ధర ఎంతో తెలుసా? పరీక్షలను తట్టుకుంటూ...అమ్మవారి ఉత్సవాలు, గ్రామదేవతా ఉత్సవాలు, మొన్న జరిగిన తిరుపతి బ్రహ్మోత్సవాల్లోనూ పాల్గొన్నాను. పాట ఎంపిక నుంచి అమ్మవారే ఈ కార్యక్రమం నా చేత చేయిస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ కృతులు పాడుతున్నా, వింటున్నా ఒక ఆధ్యాత్మిక భావనకు లోనవుతుంటాను. ఉదాహరణకు.. ఒక కృతిలో 13 చరణాలు ఉంటే.. 9 లేదా 11 చరణాలు పాడుదాం, అంత సమయం ఉండడదు కదా అని ముందు అనుకుంటాను. కానీ, ప్రదర్శనలో నాకు తెలియకుండానే 13 చరణాలనూ పూర్తి చేస్తాను. ఇటువంటి అనుభూతులెన్నో.సినిమాలోనూ...ఇటీవలే ఒక సినిమాకు పాటలు పాడాను. ఆరేళ్ల వయసు నుంచి 20 వరకు రియాలిటీ షోలలో పాల్గొన్నాను. బయట మూడు వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చాను. మన దేశంలోనే కాకుండా విదేశాలలోనూ ప్రదర్శనలు ఇవ్వడం నిజంగా అదృష్టం. సంగీత కళానిధులైన బాలసుబ్రహ్మమణ్యం, చిత్ర, కోటి, ఉషా ఉతుప్.. వంటి పెద్దవారిని కలిశాను. వారితో కలిసి పాడుతూ, ప్రయాణించాను. ఒకసారి రియాలిటీ షో ఫైనల్స్లో పాడుతున్నప్పుడు బాలు గారు ‘నీ వెనక ఏదో దైవశక్తి ఉంది...’ అన్నారు. అదంతా అమ్మవారి ఆశీర్వాదంగా భావిస్తుంటాను.వదలని సాధన...ఈ సీరీస్లో నాకు చాలా ఇష్టమైనది మహాకవి కాళిదాసు ‘దేవీ అశ్వధాటి’ స్తోత్రం. ప్రవాహంలా సాగే ఆ స్తోత్రాన్ని అమ్మవారి మీద రాశారు. అశ్వధాటి అంటే.. ఒక గుర్రం పరుగెడుతూ ఉంటే ఆ వేగం, శబ్దం ఎలా ఉంటుందో .. ఆ స్తోత్రం కూడా అలాగే ఉంటుంది. 13 చరణాలు ఉండే ఆ స్తోత్రం పాడటం చాలా కష్టం. కానీ, నాకు అది చాలా ఇష్టమైనది. ఏదైనా స్తోత్రం మొదలుపెట్టినప్పుడు దోషాలు లేకుండా జాగ్రత్త పడుతూ, ప్రజల ముందుకు తీసుకువస్తాను. కరెక్ట్గా వచ్చేంతవరకు సాధన చేస్తూ ఉంటాను. ఇదీ చదవండి: పారిస్ ఫ్యాషన్ వీక్ : ఐశ్వర్యా డాజ్లింగ్ లుక్ వెనుకున్న సీక్రెట్ ఇదే!మహిళలు జన్మతః శక్తిమంతుఉ కాబటి వారు ఎక్కడినుంచో స్ఫూర్తి పొందడం ఏమీ ఉండదు. మనలోని శక్తి ఏ రూపంలో ఉందో దానిని వెలికి తీసి, ప్రయత్నించడమే. నా కార్యక్రమాలన్నింటా మా అమ్మానాన్నలు, అన్నయ్య, అత్తమామలు, మా వారు.. ఇలా అందరి సపోర్ట్ ఉంది. ఆడియో, వీడియో టీమ్ సంగతి సరే సరి! ’ అంటూ వివరించారు ఈ శాస్త్రీయ సంగీతకారిణి.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు.. 66 శాతం మంది వారే!
తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. నోటిఫికేషన్ విడుదల చేసిన 14 నెలలోపే ఫలితాలను విడుదల చేసి రికార్డు నెలకొల్పింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. 562 మంది గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం నాడు హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో నియామక పత్రాలు అందజేశారు. ఈసారి ఫలితాల్లో మహిళలు గణనీయమైన పురోగతి సాధించడం విశేషం. జనరల్ మెరిట్ టాప్ -10లో ఆరుగురు మహిళలు ఉన్నారు. ఇక టాప్-50లో 25 మంది, టాప్-100లో 41 మంది మహిళలు ఉన్నారు.గత కొన్నేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళా ప్రాతినిథ్యం పెరుగుతూ వస్తోందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ వాణిజ్య పన్నుల విభాగంలో మహిళా అధికారుల సంఖ్య బాగా పెరుగుతోంది. తాజాగా వెల్లడైన గ్రూప్-1 ఫలితాల (Group 1 Results) ఆధారంగా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు కొత్తగా కేటాయించిన ఉద్యోగుల్లో 66 శాతం మంది మహిళలు ఉన్నారు. శిక్షణ పూర్తైన తర్వాత కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లుగా జీఎస్టీ (GST) సంబంధిత వ్యవహారాలను వీరు పర్యవేక్షిస్తారు.48 మందిలో 31 మంది వారే!తెలంగాణ వాణిజ్య పన్నుల విభాగంలో ప్రస్తుతం 8 మంది మహిళా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు (commercial tax officers) ఉన్నారు. గత కొన్నేళ్లుగా ఈ డిపార్ట్మెంట్లో మహిళల ప్రాతినిథ్యం పెరుగుతోందని సీనియర్ అధికారి కె. హరిత తెలిపారు. 1990 ప్రాంతంలో తన బ్యాచ్లో తానొక్కరే మహిళా సీటీవోగా ఉన్నానని గుర్తు చేసుకున్నారామె. తాజాగా ప్రభుత్వం 48 మందిని సీటీవోలుగా నియమించగా, వీరిలో 31 మంది మహిళలు ఉండటం విశేషం.కీలక పోస్టుల్లో 24 మందికమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అదనపు కమిషనర్లు, జాయింట్ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్ల సహా 34 కీలక పోస్టులు ఉన్నాయి. వీటిల్లో 24 మహిళలు ఉన్నారు. 1996లో 8 మంది మహిళలు ఈ విభాగంలో చేరారు. అప్పటి నుంచి క్రమంగా మహిళా ఉన్నతోద్యోగుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత చాలా మంది అధికారులు ఆంధ్రప్రదేశ్కు వెళ్లిపోయారు. వీరిలో ఎక్కువ మంది పురుషులు ఉన్నారు. దీంతో తెలంగాణ వాణిజ్య విభాగంలో మహిళలు ఉన్నత స్థానాలకు చేరుకుని తమదైన ముద్ర వేయడానికి అవకాశాలు ఏర్పడ్డాయి.కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే వారికి మెరుగైన విశ్లేషణాత్మక నైపుణ్యాలు అవసరమని సీనియర్ మహిళా అధికారి ఒకరు అన్నారు. వాణిజ్య పన్నులకు సంబంధించిన నియమ నిబంధనలు తరచు మారుతుంటాయని, దానికి అనుగుణంగా ఉద్యోగులు అప్డేట్ కావాల్సి ఉంటుందని వివరించారు. ఉద్యోగ, వ్యక్తిగత జీవితాన్ని బాలెన్స్ చేసేవిధంగా ఉండడం వల్లే ఎక్కువ మంది మహిళలు ఈ వాతావరణంలో పనిచేయడానికి ఇష్టపడుతున్నారని వెల్లడించారు.చదవండి: ఒకేసారి 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన మహిళగతంలో వాణిజ్య పన్ను శాఖ కమిషనర్లుగా పనిచేసిన టికె శ్రీదేవి, నీతు ప్రసాద్ (Neetu Prasad) వంటి అధికారులు మహిళా శక్తిని చాటిచెప్పారు. సాంప్రదాయకంగా పురుషులు ఆధిపత్యం చెలాయించే ఉన్నత ఉద్యోగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారని చెప్పడానికి వాణిజ్య పన్నుల విభాగం నిదర్శనంగా నిలుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఇది ఆమె "మన్ కీ బాత్"..! నారీ శక్తికి నిలువెత్తు నిదర్శనం..
భారత్, ఇటలీ ప్రధానులు నరేంద్రమోదీ, జార్జియా మెలోనీ మంచి స్నేహితులు అనే విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలోనే ఆమె ఆత్మకతకు ముందు మాట రాశారు. అందులో ఇటలీ ప్రధాని మెలోని జీవితం ఎప్పుడూ రాజకీయాలు, అధికారం గురించి కాదు అంటూ పలు ఆసక్తి కర విషయాలు వెల్లండించారు. ఒకరి ఆత్మకథలో ముందుమాట ఇంత అద్భుతంగా ఉంటుందా అనేలా..మెలోని గురించి చాలా చక్కగా వివరించారు ప్రధాని మోదీ. మరి ఆ విశేషాలేంటో చూద్దామా..!‘ఐ యామ్ జార్జియా: మై రూట్స్, మై ప్రిన్సిపల్స్(I Am Giorgia — My Roots, My Principles)’ పేరిట రాసిన మెలోనీ ఆత్మకథ ఇండియన్ ఎడిషన్ను త్వరలో మార్కెట్లోకి తీసుకురానున్నారు. దీనిని ‘హర్ మన్కీ బాత్’ అని అభివర్ణించిన ప్రధాని మోదీ.. ముందుమాట రాశారు. అది తనకు దక్కిన గొప్ప గౌరవం అని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ‘‘పీఎం మెలోనీ జీవితం, నాయకత్వం అధికారం గురించి కాదని అన్నారు. నిశితంగా చూస్తే అడగడుగున ధైర్యం దృఢనిశ్చయం ప్రజాసేవ పట్ల నిబద్ధత ప్రస్పుటంగా కనిపిస్తాయని చెప్పారు. నాయకురాలిగా ఆమె ప్రస్థానం స్ఫూర్తిదాయకం, చారిత్రాత్మకమైనదని అన్నారు. ఆమె ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడూ కూడా రాజకీయ విశ్లేషకులు సందేహాస్పదంగా ఉన్నారు. అయితే ఆమె నాయకురాలిగా తన బలం, స్థిరత్వాన్ని అందించారన్నారు. అంతేగాదు ఎల్లప్పుడూ ప్రపంచ వేదికపై ఇటలీ ప్రయోజనాలను అద్భుతమైన స్పష్టతతో వినిపించింది. ఆమె ఎదుగుదల, నాయకత్వాన్ని అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి చాలా మార్గాలు ఉన్నాయన్నారు. అయితే తాను భారతీయ సంప్రదాయంలో అనే రూపాల్లో గౌరవించబడుతున్న దైవిక స్త్రీ శక్తి, నారీ శక్తి భావనలతో సరిపోలుస్తానన్నారు. ప్రధాని మెలోనీ ప్రపంచం వేదికపై తన దేశాన్ని నడిపిస్తూ..తన మూలలను మరవలేదు. అందుకే ఆమె రాజకీయ ప్రస్థానం భారతదేశంతో లోతుగా ప్రతిధ్వనిస్తుందని అన్నారు. రోమ్లోని ఓ సాదాసీదా పొరుగు ప్రాంతం నుంచి ఇటలీ అత్యున్నత రాజకీయ పదవిని అధిరోహించేంత వరకు సాగిన రాజకీయ ప్రస్థానం...ఆమె శక్తిని హైలెట్ చేస్తోంది. అంతేగాదు మాతృత్వం, జాతీయ గుర్తింపు, సంప్రదాయాన్ని రక్షించాలనే ఉద్దేశ్యం తదితరాలు భారత పాఠకులతో ప్రతిధ్వనిస్తుందని చెప్పారు. అలాగే ప్రపంచంతో నిమగ్నమవుతూనే సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించుకోవడానికి పడుతున్న ఆరాటం, తపన.. ఆమె వ్యక్తిగత నమ్మకాలు, విలువలకు నిదర్శనమని అన్నారు. పైగా ఆమెకు ప్రజల పట్ల ఉన్న అపారమైన కరుణ, బాధ్యత తోపాటు శాంతిమార్గంలో నడిపించాలనే ఆలోచనలు ఈ పుస్తకం అంతటా ప్రతిధ్వనిస్తాయి అని రాసుకొచ్చారు మోదీ.వాస్తవానికి ఈ బుక్ అసలు వెర్షన్ 2021లోనే పబ్లిష్ అయి, బెస్ట్ సెల్లర్గా నిలిచింది. అప్పుడు మెలోనీ (Giorgia Meloni) విపక్షంలో ఉన్నారు. 2025, జూన్లో దీనిని అమెరికాలో విడుదల చేశారు. అప్పుడు దానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు ముందుమాట రాశారు. కాగా.. మోదీ, మెలోనీలు దిగిన ఫొటోలు ఎప్పుడూ నెట్టింట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్న సంగతి తెలిసిందే. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్ వేదికగా జరిగిన ‘కాప్ 28’ సదస్సు సందర్భంగా వీరిద్దరూ సెల్ఫీ తీసుకున్నారు. దీన్ని మెలోని ఎక్స్లో షేర్ చేశారు. దానికి మెలోడీ (ఇద్దరి పేర్లలోని అక్షరాలు కలిసేలా) అనే హ్యాష్ట్యాగ్ను జత చేశారు. అప్పటినుంచి ఈ #Melodi పదం ట్రెండ్ అయ్యింది.(చదవండి: వండర్ బామ్మ..! 93 ఏళ్ల వయసులో గోల్డ్ మెడల్) -
వండర్ బామ్మ..! 93 ఏళ్ల వయసులో గోల్డ్ మెడల్
వయసు తొంభై ఏళ్లు దాటితే చాలామంది కూర్చుని మోకాలికి నూనె రాసుకోవడం, మనవరాళ్లకు కథలు చెప్పడం, రక్తపోటు–షుగర్ మందులు సరిగ్గా తీసుకున్నామా అని చెక్ చేసుకోవడం చేస్తుంటారు. కాని, ఈ అమ్మమ్మ మాత్రం అలా కాదు. ట్రాక్లోకి దూకి గోల్డ్ మెడల్ కొట్టేసింది. ఆమె తొంభై మూడేళ్ల పానీదేవి. పానీదేవి కథ సాధారణం కాదు. అమ్మాయిలకు చదువూ ఆటలూ దూరమైన కాలంలో పుట్టింది. పదిహేను ఏళ్లకే పెళ్లి, యాభై ఏళ్లకే భర్తను కోల్పోయింది. ఎనిమిది మంది పిల్లలకు తల్లి, తండ్రి తానే అయి పెంచింది. చిన్న వయసు నుంచే పొలాల్లో కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించింది. జీవితం అంతా బాధ్యతలతో నిండిపోయినా, ఆమె మనసులో ఎప్పుడూ ఒక కల మేల్కొని ఉండేది. ఆ కలను నిద్రపుచ్చాలా లేక సాకారం చేసుకోవాలా అనే ప్రశ్నకు సమాధానం ఆమె రెండేళ్ల క్రితం చెప్పింది. ఒకరోజు తన మనవడు జైకిషన్ పారా అథ్లెట్లకు శిక్షణ ఇస్తుండగా, పానీదేవి ఒక్కసారిగా ‘నేనూ చేస్తాను’ అని చెప్పింది. ఇంత వయసులో విశ్రాంతి తీసుకోమని కాకుండా, మనవడు ‘పరుగెత్తు’ అని ప్రోత్సహించాడు. అలా ఆ మనవడు, అమ్మమ్మ కాస్తా గురుశిష్యులుగా మారారు. కొత్త జీవితం! ఇంటి పనులు ముగించుకుని మైదానానికి వెళ్లడం, పాదాలు నొప్పితో వణికినా ఆగిపోకుండా శిక్షణ కొనసాగించడం, చుట్టుపక్కల వాళ్ల నవ్వులు వినిపించినా తన గమ్యం మర్చిపోకుండా పరిగెత్తడంతో ఆమె కొత్త జీవితం ఆరంభమైంది. ప్రేక్షకులు మొదట ‘ఈ వయసులోనా?’ అని ఆశ్చర్యపోయినా, ఘాఘ్రా–చోళీతో ట్రాక్లోకి దూకి కేవలం 45 సెకన్లలోనే 100 మీటర్లు పూర్తి చేసేసరికి చప్పట్లతో మైదానం మార్మోగిపోయింది. ఆ పోటీకి ముందు గుంతలో పడిపోయి ఆమె మోకాళ్లు గాయపడ్డాయి. డాక్టర్లు ‘విశ్రాంతి తీసుకోండి’ అన్నారు. కాని, పానీదేవి మాత్రం ‘మహా అయితే ఓడిపోతాను. కష్టానికి గౌరవం ఇవ్వకుండా ఆగిపోవడం మాత్రం అసలు చేయను’ అంటూ పట్టుదలతో ట్రాక్లోకి దిగింది. అలా 2023లో అల్వార్లో మొదటి మెడల్, 2024లో పుణేలో జాతీయ స్థాయి గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆమె ఇవన్నీ ఇంట్లో అల్మారాలో దాచేసింది! మనవడు వీడియో పోస్ట్ చేయకపోతే, దేశం మొత్తం ఆమెను అసలు చూడకపోయేది. ఇప్పుడు ఆమె కల మరింత పెద్దది. త్వరలోనే ఇండోనేషియాలో జరగబోయే ఆసియన్ మాస్టర్స్ గేమ్స్లో భారత్ తరపున పతకం గెలవడానికి సిద్ధమవుతోంది. (చదవండి: అందరికీ ఒకటే రక్తం!) -
21 ఏళ్లకే న్యాయవాది అయ్యింది
భలే భలే. ఈమె చిన్న వయసులో న్యాయవాది అయ్యింది. అదీ మన దేశంలో కాదు. ఇంగ్లాండ్లో. ఇంకా గొప్ప కదూ. న్యాయవాది కావాలంటే ఎన్నో విషయాలపై అవగాహన ఉండాలి. చట్టాలు, న్యాయ సూక్ష్మాలు తెలిసి ఉండాలి. బారెడు పుస్తకాలు చదివి ఉండాలి. నిత్యం సమాజంలో ఏం జరుగుతుందో గమనిస్తుండాలి. ఇవన్నీ చేస్తేనే న్యాయవాదిగా నిలదొక్కుకుంటారు. పాతికేళ్లు దాటితే తప్ప చాలామంది న్యాయవ్యాద వృత్తిని చేపట్టరు. అలాంటిది 18 ఏళ్లకే లా డిగ్రీ పొంది, 21 ఏళ్లకు న్యాయవాదిగా కేసులు వాదిస్తూ పేరు తెచ్చుకుంటోంది ఓ యువతి. తనే కృషాంగి మేష్రామ్ (Krishangi Meshram). భారత సంతతికి చెందిన తను ఇంగ్లాండ్లో అతి పిన్న వయస్కురాలైన సొలిసిటర్గా చరిత్ర సృష్టించింది. పశ్చిమ బెంగాల్లోని మాయాపూర్కు చెందిన కృషాంగి మెష్రామ్కు చిన్ననాటి నుంచి న్యాయశాస్త్రంపై ఆసక్తి ఎక్కువ. న్యాయవాదుల్లా తాను కోర్టులో వాదనలు వినిపించాలని, బాధితులకు న్యాయం అందించాలని భావించింది. వారి కుటుంబం ఇంగ్లండ్లో స్థిరపడింది. 15 సంవత్సరాల వయస్సులో స్థానికంగా లా కాలేజీలో చేరాలని భావించినా, ఇంటికి దూరంగా ఉండటానికి ఆమె ఇష్టపడలేదు. ఆ సమయంలో మిల్టన్ కీన్స్లోని ఓపెన్ యూనివర్సిటీలో లా చదివేందుకు అవకాశం ఉందని తెలుసుకొని, అందులో చేరాలని నిర్ణయం తీసుకుంది. ఇంట్లోనే తల్లిదండ్రులు, చెల్లెలితో కలిసి ఉంటూ మూడేళ్లపాటు కష్టపడి లా పూర్తి చేసింది. న్యాయవాదిగా పేరు తెచ్చుకునేందుకు కావాల్సిన నైపుణ్యాలను ఆ సమయంలోనే అప΄ోసన పట్టింది. 18 ఏళ్ల వయస్సులో బ్యాచిలర్ ఆఫ్ లాస్ (ఆనర్స్) డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సింగపూర్లో ఓ ఉద్యోగంలో చేరింది. మూడేళ్లు అక్కడ పని చేసి, తగిన అనుభవాన్ని గడిచింది. తిరిగి ఇంగ్లండ్ చేరుకున్న ఆమె అతి పిన్న వయస్కురాలైన సొలిసిటర్గా మారింది. ప్రైవేట్ క్లయింట్లకు న్యాయవాదిగా మారి సేవలందిస్తానని వివరిస్తోంది. -
చదివింది 12 th.. సంపాదన నెలకు రూ. 3 లక్షలకు పైనే
మహిళలు అనుకుంటే ఏదైనా సాధించగలరు. సమయానికి తగ్గట్టు ఆలోచించడంలో వారికి వారే సాటి. కృషి, పట్టుదలే వారికి పెట్టుబడి. అలా గత దాదాపు రెండు దశాబ్దాలుగా మహారాష్ట్రలోని జల్గావ్కు చెందిన వందన ప్రభాకర్ పాటిల్ (Vandana Prabhakar Patil) మహిళా స్వయం సహాయక సంఘాలతో (SHGs) పనిచేస్తూ తనదైన వ్యాపారానికి నాంది పలికారు. తన ఆలోచనకు పదునుపెట్టి నెలకు మూడు లక్షల రూపాయల దాకా సంపాదిస్తున్నారు.వందన పాటిల్ కుటుంబానికి ఐదు ఎకరాల పొలం ఉంది. ఆమె చదివింది. 12వ తరగతి మాత్రమే ఉంది. ఆమె వ్యవసాయంలో కూరగాయల నుండి ఆదాయం పొందేది, కానీ కూరగాయల ఉత్పత్తి వచ్చినప్పుడు, మార్కెట్లో కూరగాయల ధరలు ఆశించిన లాభాలు రాకపోవడంతో ఆర్థిక నష్టాలను చవిచూడాల్సి వచ్చేది. దీంతో 2021లో ఆమె జల్గావ్లోని మామురాబాద్లోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని (KVK) సందర్శించి, కూరగాయలు, పండ్లను పొడి లేదా ఒరుగులుగా మార్చే ప్రక్రియ డీహైడ్రేషన్ (Dried Vegetables and Fruits) గురించి తెలుసుకుంది. అంతే ఆమె మెదడులో ఆలోచన రూపుదిద్దుకుంది. అందరికలా కాకుండా తాను భిన్నంగా చేయాలని నిర్ణయించుకుంది. తనలాంటి అనేక మంది రైతుల సమస్యలను కూరగాయలను సౌరశక్తితో ఎండబెట్టడం ద్వారా పరిష్కరించవచ్చని, కూరగాయల డీహైడ్రేషన్ పరిష్కరిస్తుందని గ్రహించింది.వందన తన పాలస్ఖేడ గ్రామంలో కూరగాయలను డీహైడ్రేట్ చేసి వాటి నుండి పొడిని తయారు చేయడానికి ఒక కంపెనీని స్థాపించింది. ఆమె తన గ్రామంలోని కొంతమంది మహిళల సహకారంతో గాయత్రి ఫుడ్స్ పేరుతో ఈ పరిశ్రమను ప్రారంభించింది. దీనికి సౌరశక్తితో ఎండబెట్టిన ఆహార పదార్థాలకు పెరుగుతున్న డిమాండ్ కలిసి వచ్చింది. తన యూనిట్ను ప్రారంభించడానికి,2021లో కూరగాయల డీహైడ్రేషన్లో శిక్షణ తీసుకుంది. వ్యాపార రుణం కోసం దరఖాస్తు చేసుకుంది, కానీ ఆమె దరఖాస్తు తిరస్కరించారు అధికారులు. ఆ తర్వాత ఆమె రూ. 10 లక్షల వ్యక్తిగత రుణం తీసుకుంది. మహారాష్ట్రలో ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ (PMFME) పథకం కింద, సూక్ష్మ సంస్థలు అర్హత కలిగిన ప్రాజెక్ట్ ఖర్చులో 35 శాతం సబ్సిడీని పొందే అవకాశాన్ని వినియోగించుకుంది. తన వ్యాపారంతో గ్రామీణ ప్రాంతాల్లో 10 నుండి 15 మంది మహిళలకు ఉపాధి కల్పించింది. .సోలార్ డ్రైయింగ్ యూనిట్న్నెల్ ఆకారంలో పాలికార్బోనేట్తో సోలార్ డీహైడ్రేషన్ యూనిట్ ఏర్పాటు, పల్వరైజర్, కటింగ్ మెషిన్ కొనుగోలు మరియు ప్యాకేజింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. ఇది సౌర వికిరణాన్ని బంధించి లోపల గాలిని వేడి చేస్తుంది, గ్రీన్హౌస్ ప్రభావాన్ని సృష్టిస్తుంది. కూరగాయలను సోలార్ ఎండబెట్టడానికి ముందు కడిగి, శుభ్రం చేసి, ముక్కలుగా కోస్తారు. వేడిచేసిన గాలి సొరంగం ద్వారా లోనికి వెళ్లి, తేమను తొలగించడం ద్వారా ట్రేలు లేదా రాక్లపై ఉంచిన ఉత్పత్తులను ఎండేలా చేస్తుంది. చివరల్లో ఉన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్లు తేమ గాలిని బయటకు వెళ్లేలా చేస్తాయి.ప్రధానంగా ఉల్లిపాయ, టమోటా, దుంప, సెవ్గా, మెంతులు, పాలకూర, కొత్తిమీర, కరివేపాకు, అల్లం లాంటివి కూరగాయలు ఉన్నాయి.కూరగాయల పొడిని తయారు చేయడానికి ఒక పద్ధతి ఉంది. కూరగాయలను కడిగి శుభ్రం చేస్తారు. తరువాత వాటిని కటింగ్ మెషిన్ ద్వారా ఎండబెట్టి, ఆపై వాటి పొడిని తయారు చేస్తారు. సౌరశక్తి ద్వారా సహజంగా ఎండబెట్టడం వల్ల, వాటి రంగు , నాణ్యత చెక్కుచెదరకుండా ఉంటుందని వందన పాటిల్ చెప్పారు. అవి పూర్తిగా సహజమైనవి కాబట్టి, కూరగాయల పొడి క్యాన్సర్, మూత్రపిండాల వ్యాధి, ఆమ్లత్వం, మధుమేహం, చర్మం, జుట్టు మొదలైన అనేక వ్యాధులకు వ్యతిరేకంగా ప్రభావ వంతంగా ఉంటుంది. .వందన పాటిల్ వ్యాపారం తక్కువ సమయంలోనే ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించింది. కంపెనీలో ఇప్పుడు కొత్త ప్రయోగాలు కూడా జరుగుతున్నాయని వందన పాటిల్ చెప్పారు. తమ డీహైడ్రేటెడ్ కూరగాయలు పునఃవిక్రేతలు, టోకు వ్యాపారుల ద్వారా US, మాల్దీవులు మరియు కెనడాకు కూడా చేరుతాయని వందన చెప్పారు.యూనిట్ను విస్తరించాలని మరియు ఎగుమతి ఆర్డర్లను అందించే సామర్థ్యాన్ని పెంచాలని యోచిస్తున్నట్టు తెలిపారు.వందన కుటుంబం తన గ్రామంలో ఐదు ఎకరాలకు పైగా నిమ్మకాయతో మునగ పంటను అంతర పంటగా పండిస్తుంది. రెండింటినీ డీహైడ్రేట్ చేస్తూ, స్థానిక రైతుల నుండి ఇతర కూరగాయలను కొనుగోలు చేస్తుంది. ఏదైనా కూరగాయల కొరత ఉంటే, వ్యవసాయ-ఎండబెట్టడం కోసం ఆమె వాటిని హోల్సేల్ మార్కెట్ నుండి కొనుగోలు చేస్తుంది. 22 కిలోల తాజా టమోటాలు 1 కిలోల డీహైడ్రేట్ టమోటాలు వస్తాయి. కనుక ఒక కిలో డీహైడ్రేట్ టమోటా ధర దాదాపు రూ.700. అలాగే బీట్రూట్ ధర 100 గ్రాములకు రూ. 100 ,హోల్సేల్లో కిలోకు రూ. 700గా ఉంటుంది. ఉల్లిపాయలు కిలోకు రూ. 500 నుండి రూ. 600 వరకు ఉంటుంది. తాజా ఉత్పత్తుల మార్కెట్ ధరలను బట్టి ధరలు కూడా మారుతూ ఉంటాయి. తద్వారా వీరి సగటు నెలవారీ టర్నోవర్ రూ. 3 లక్షలు. ఒక్కోసారి రెండు,మూడు రోజుల్లోనే రూ. 8-10 లక్షల టర్నోవర్ వస్తుంది అంటారు ఆ యూనిట్లో పనిచేసే ఇతర మహిళలు. వందనా సందేశంఈ ప్రాజెక్ట్ రైతులకు సహాయం చేయడంతోపాటు, గ్రామంలోని మహిళలకు తాను ఉపాధి కల్పించడం గర్వంగా ఉంటుందనీ, ఏ స్త్రీ కూడా తనను తాను తక్కువ అంచనా వేసుకోకూడదని, పట్టుదలతో ఉంటే, మహిళలు తమ దృఢ సంకల్పంతో ఏదైనా సాధించగలరని వందనా పాటిల్ మహిళలకు సందేశం ఇస్తుంది.మార్కెట్: భారతదేశపు డీహైడ్రేషన్ పండ్లు, కూరగాయల మార్కెట్ 2023లో రూ. 17,200 కోట్లుగా ఉండగా 2035 నాటికి రెట్టింపు రూ. 37,200 కోట్లుగా ఉంటుందని అంచనా. డీహైడ్రేటెడ్ కూరగాయలు మరియు పండ్లకు డిమాండ్ పెరుగుతున్న సౌకర్యవంతమైన ఆహారాలకు ప్రాధాన్యతనిస్తుంది, ఎందుకంటే అవి అవసరమైన పోషకాలను నిలుపుకుంటూ నిల్వ చేయడం , తయారు చేయడం సులభం. సౌర ఎండబెట్టడం వాటి షెల్ఫ్ జీవితాన్ని పెంచుతుంది మరియు పోషక విలువను ప్రభావితం చేయకుండా బరువును తగ్గిస్తుంది. -
పయనమే జీవనం..
‘ఇల్లే తీర్థం–వాకిలే వారణాసి–కడుపే కైలాసం’ అనుకుంటారు కొందరు. కొందరు మాత్రం ‘ప్రపంచమే అతి పెద్ద ఇల్లు’ అనుకుంటారు. ప్రయాణాలను ఇష్టపడతారు. ఒక వయసు దాటిన తరువాత ‘ఈ వయసులో ప్రయాణం ఏమిటి’ అనుకుంటారు ఇంకొంతమంది. అయితే ప్రయాణం వయసెరుగదు. ఎందుకంటే వయసు భారాన్ని అధిగమించే ఉత్సాహం ప్రయాణాలలో ఉంది. అలాంటి ఒక ఉత్సాహవంతురాలు ఇందిర. కేరళకు చెందిన ఇందిర ఎం. ఉపాధ్యాయురాలు. ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తరువాత 35 దేశాలు పర్యటించింది.కొత్త కొత్త ప్రదేశాలు చూడాలని చిన్నప్పుడు కలలు కనేది ఇందిర. అయితే అరవై ఏళ్ల వయసులోగానీ ఆ కల నెరవేరలేదు. సౌత్ ఆఫ్రికన్ సవానా తన తొలి ఇంటర్నేషనల్ ట్రిప్. తొలి ప్రయాణ విశేషాల గురించి అపురూపంగా చెబుతుంది. జీవవైవిధ్యంతో అలరించే ప్రకృతి, బిగ్ఫైవ్లాంటి వన్య ప్రాణులు, వైవిధ్యమైన వాతావరణం... స్థూలంగా తొలి పర్యటన ఇందిరకు ఎంతో సంతోషాన్నిచ్చింది.చదవండి : బాలీవుడ్ని వదిలేసి, వ్యవసాయంలోకి..కట్ చేస్తసఫారీలో తాను చూసిన ఏనుగులు, సింహాల గురించి చిన్నపిల్లలా ఉత్సాహపడుతూ... ‘ప్రయాణాల పుణ్యమా అని నాకు ఎంతోమంది స్నేహితులయ్యారు. జీవితంతో పాటు రకరకాల విషయాలు మాట్లాడుకుంటాం. మాలో చాలామందికి ఒకేరకమైన జీవితానుభవాలు ఉన్నాయి. నా స్నేహబృందంలో వివిధ వయసుల వాళ్లు,ప్రాంతాల వాళ్లు ఉన్నారు. అయితే మా స్నేహానికి వయసు,ప్రాంతం ఎప్పుడూ అడ్డుగోడ కాలేదు’ అంటుంది ఇందిర.పెళ్లికావడానికి ముందు ప్రయాణాలు చేయాలనే ఉత్సాహం ఉన్నా ఆమె దగ్గర సరిపడా డబ్బు ఉండేది కాదు. ఉద్యోగం వచ్చి, పెళ్లయిన తరువాత కుటుంబ ఖర్చులు, బాధ్యతల వల్ల ప్రయాణాలు చేయలేక పోయింది. ‘సోలో ట్రావెలింగ్ గురించి ఆలస్యంగా తెలిసింది. అది నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. నన్ను నేను లోతుగా తెలుసుకోవడానికి ఉపయోగపడింది’ అంటుంది ఇందిర.ప్రతి ప్రయాణంలో ఆమె ఎన్నో అనుభవాలను మూటగట్టుకుంది. ఇస్తాంబుల్లో ఉన్నప్పుడు సూట్కేస్ కోడ్ మరిచి పోయింది. జపాన్లో ఒకరోజు గాయపడింది... ఇలాంటి ఎన్నో సందర్భాలలోనూ ఎవరో ఒకరు ఆమెకు సహాయంగా నిలిచేవారు. ఎక్కడ ఏ కష్టం వచ్చినా, దయాగుణం అనుకోని అతిథిలా వచ్చేది.సోలో ట్రావెల్ను ఎంజాయ్ చేసినట్లే గ్రూప్ ట్రావెల్ను కూడా ఎంజాయ్ చేసింది ఇందిర. ‘గ్రూప్తో కలిసి ప్రయాణం చేసినప్పుడు కుటుంబసభ్యులతో ఉన్నట్లుగానే ఉంటుంది. ప్రతి ఒక్కరూ మరొకరికి సహాయపడతారు’ అంటున్న ఇందిర ఇప్పటివరకు 35 దేశాలకు వెళ్లింది. మరిన్ని దేశాలకు వెళ్లడానికి సన్నద్ధం అవుతోంది. తాజాగా స్కాండినేవియా దేశాల పర్యటనకు సిద్ధం అవుతోంది.తొలి ప్రయాణానికి సంబంధించి పిల్లలు నన్ను ఎంతో ప్రోత్సహించారు. మొదటి ప్రయాణ సమయంలో ఖర్చు గురించి ఆలోచించాను. అయితే విలువైన ప్రయాణ అనుభవాల ముందు ఆ ఖర్చు ఒక లెక్కే కాదని తెలుసుకున్నాను. ప్రయాణాన్ని ఇంత బాగా ఆస్వాదిస్తానని ఊహించలేదు. తొలి ప్రయాణం అనేది నేను ప్రయాణాలను ఇష్టపడేలా చేసిన ఒక ట్రిగ్గర్.చదవండి: ప్రధాని మోదీకి సాదర స్వాగతం : ఎవరీ ఐఏఎస్ అధికారి ఎప్పుడూ ఉండే ఇంటిని దాటి మనల్ని మనం కనుగొనడంలో ఒక నిర్దిష్ట నిశ్శబ్ద శక్తి ఉంది. నేను చాలా ఆలస్యంగా ప్రయాణాలు ప్రారంభించాను. చాలా ముందుగానే మొదలు పెట్టి ఉంటే బాగుండేదనిపిస్తోంది. సోలో ట్రావెల్కు చాలామంది వెనకాడుతుంటారు. అయితే మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి అవి ఎంతో ఉపయోగపడతాయి.– ఇందిర ఎం -
ప్రధాని మోదీకి సాదర స్వాగతం : ఎవరీ ఐఏఎస్ అధికారి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) సోమవారం అరుణాచల్ ప్రదేశ్లో పర్యటించారు. ఈ సందర్భంగా మహిళా సివిల్ సర్వీస్ అధికారి విశాఖా యాదవ్ (Vishakha Yadav) ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రధాని మోదీ ఈశాన్య రాష్ట్రంలోని పాపుమ్ పరే జిల్లాలో పర్యటన ఐఏఎస్ అధికారి విశాఖా యాదవ్ప్రధాని మోదీకి స్వాగతం పలికిన దృశ్యాలు నెట్టింటసందడిగా మారాయి. దీంతో ఆ ఆఫీసర్ ఎవరు? ఏంటి? అనే ఆసక్తి మొదలైంది.అరుణాచల్లోని పాపుమ్ పరే జిల్లాలో డిప్యూటీ కమీషనర్గా పనిచేస్తున్నారు విశాఖా యాదవ్. ప్రధాని మోదీకి గ్రీటింగ్స్ చెబుతున్న ఫోటోలను ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. మోదీకి వెల్కమ్ చెప్పడం గర్వంగా ఉందంటూ తన పోస్ట్లో పేర్కొన్నారు.ఎవరీ విశాఖా యాదవ్?విశాఖ యాదవ్ ఢిల్లీ నివాసి. ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ (DTU)లో ఇంజనీరింగ్ చదివిన తర్వాత, ఆమె బెంగళూరులోని సిస్కోలో పనిచేశారు.కానీ ఆమె కల IAS అధికారిణి కావడమే. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) అధికారిణి. ప్రస్తుతం ఆమె అరుణాచల్ ప్రదేశ్లోని పాపుం పరే జిల్లాలో డిప్యూటీ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నారు. తన కలను సాకారం చేసుకునేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్సి) పరీక్షకు సిద్ధం కావడానికి విశాఖ యాదవ్ లక్షల జీతాన్నిచ్చే ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ఎలాంటి కోచింగ్ లేకుండా సివిల్ సర్వీసెస్ పరీక్షలో సాధించారు. మూడో ప్రయత్నంలో అఖిల భారత స్థాయిలో ఆరవ ర్యాంకును సాధించారు.UPSC పరీక్షలో 2,025 మార్కులకు 1,046 మార్కులు సాధించారు. 1994లో ఢిల్లీలో జన్మించిన ఆమె తండ్రి రాజ్కుమార్ యాదవ్ అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ కాగా, ఆమె తల్లి గృహిణి. -
బాలీవుడ్ని వదిలేసి, వ్యవసాయంలోకి..కట్ చేస్తే
ప్రకృతి దగ్గరగా జీవించాలని, ఆర్గానిక్ ఆహారాన్ని మాత్రమే తినాలనే కోరిక అందరికీ ఉంటుంది. కానీ ఆచరణ ఎలాగో అర్థంకాదు. అలా నిస్తేజంగా, నిర్జీవంగా జీవితం గడపకుండా, పచ్చని ప్రకృతి,స్వచ్ఛమైన గాలి, కల్తీ లేని భోజనమే జీవితం అనుకుంది స్నేహా రాజ్గురు. ఇది తన ఒక్కదానికే పరిమితం కాకుండా తన తండ్రితో కలిసి ‘బాప్ బేటీ ఫామ్స్’’ పేరుతో సేంద్రీయ వ్యవసాయ క్షేత్రాన్ని నడుపుతోంది. ఎవరీ స్నేహ, తెలుసుకుందాం పదండి.స్నేహ రాజ్గురు పుణెలో పుట్టి పెరిగింది. ఇద్దరు అన్నయ్యలు. తండ్రి అనిల్ రాజ్గురు. స్నేహ రాజ్గురు సినిమాల్లో పనిచేస్తానంటే సంపూర్ణ మద్దతిచ్చారు. స్నేహ బాలీవుడ్లో స్క్రిప్ట్ సూపర్వైజర్గా, ఆర్ట్ డైరెక్టర్గా పనిచేసింది, 'బుల్బుల్', 'లుకా చుప్పి' వంటి సినిమాలకు పనిచేసింది. వృత్తిలో భాగంగా భారతదేశం అంతటా అద్భుతమైన ప్రదేశాలను సందర్శించింది. ఈ క్రమంలోనే ఆమె జీవితం మలుపుతిరిగింది. ‘లూకా చుప్పి’ సినిమా లొకేషన్ల కోసం మదురై వెళ్లింది. అక్కడి ప్రకృతి, మట్టితో కట్టిన ఇళ్లు చూసి పరవశించి పోయింది. అపుడే నిర్ణయించుకుంది..ప్రకృతిలో మమేకమవుతూ, సేంద్రియ ఆహారాన్ని సేవిస్తూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని. మట్టిలో మెరుపుపశ్చిమ బెంగాల్ అడవులలోని పెర్మాకల్చర్ ఫామ్లో 52 రోజుల బస చేయడం తన ఆలోచనలకు మరింత బలం వచ్చింది. అలంకరణలు లేవు, ఫిల్టర్లు లేవు, కేవలం ఒక టెంట్, అడవి. స్నేహ ఇక్కడే పెర్మాకల్చర్ సిద్ధాంతాన్ని మాత్రమే కాదు, ప్రకృతిని వినడం, వర్షంలో లయను, కలుపు మొక్కలలోని జ్ఞానాన్ని చూడటం నేర్చుకుంది. అలా బాలీవుడ్ సినిమా పరిశ్రమలో తన వృత్తిని వదిలిపెట్టి, తన తండ్రి అనిల్ రాజ్గురుతో కలిసి పూణే సమీపంలో 'బాప్ బేటీ ఫామ్స్'ను ఏర్పాటు చేసింది. View this post on Instagram A post shared by Baapbeti Permaculture Farm | Farmstay in Pune (@baapbetifarm)బాప్ బేటీ ఫామ్స్ (BaapBeti Farms) "నేను కథలు చెప్పడం మాత్రమే కాదు.. ఆ కథల్లో ఈ ప్రకృతిలో జీవించాలనుకున్నాను. అదే నన్ను భూమికి అనుసంధానించినది. భూమినుంచే తీసే తాజాగా తినే ఆహారం, పాలిష్ చేయని, ప్రాసెస్ చేయని , స్వచ్ఛమై ఆహారంతో నా సంబంధాన్ని శాశ్వతంగా మార్చివేసింది”అంటారు స్నేహ. ముంబైలో తన జీవితాన్ని సర్దుకుని పూణేకు తిరిగి వచ్చింది. బ్యాకప్ ప్లాన్ ఏమీ లేదు. ఉన్నదల్లా నమ్మకం. ఓర్పు, అభిరుచే పెట్టుబడి. దీనికి కూతురి కలలకు అండగా నిలిచిన తండ్రి తోడ్పాటు, పెర్మాకల్చర్లో కోర్సులు, భూమి భాషను అధ్యయనం తోడైంది. టాటా మోటార్స్ పనిచేస్తున్న పదవీ విరమణకు దగ్గరగా ఉన్న స్నేహ తండ్రి అనిల్ రాజ్ గురు తొలుత ఆమె నిర్ణయానికి విస్మయం చెందాడు. అయితే “స్నేహ ఎప్పుడూ ఆరుబయట ఉండటం ఇష్టపడేది. చిన్నప్పుడు కూడా, ఆమె నేల వైపు ఆకర్షితురాలైంది," అని గుర్తు చేసుకుంటారుపూణే దగ్గర ఉందీ సేంద్రియ వ్యవసాయ క్షేత్రం. ఇక్కడ సేంద్రీయ కూరగాయలు, పళ్లు పండిస్తారు. అందుకే ఆమె వ్యవసాయం గురించి ప్రస్తావించగానే మారు మాట్లాడకుండా ఆమెతో చేయి చేయి కలిపారు.పూణే బయట బంజరుగా ఉన్న రెండు ఎకరాల స్థలాన్ని కనుగొన్నారు. విత్తనాలు నాటారు. భూమిని పెర్మాకల్చర్ జోన్లుగా విభజించారు, ప్రతి ఒక్కటి జాగ్రత్తగా, అందంగా అమర్చుకున్న పర్యావరణ వ్యవస్థ. పక్షులు, తేనెటీగలు, కూరగాయలు, కోళ్లు, కంపోస్ట్ కుప్పలు - ప్రతిదీ ఈ పచ్చని సోయగంలో తన పాత్రను పోషించింది. (ఖరీదైన ఆస్తిని అమ్మేస్తున్న ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్) ప్రతీ ఆకులో ఒక వారసత్వాన్ని వెతుక్కున్న వారి కృషి ఫలించింది. స్ట్రాబెర్రీల నుండి లెట్యూస్, క్యాప్సికమ్ వరకు స్థానిక ఉత్పత్తులలో ప్రయోగాలు వరకు, బాప్బేటి ఫామ్స్ పూర్తిగా సేంద్రీయం మారిపోయింది. వ్యక్తిగత ప్రయాణంగా ప్రారంభమై, ఉద్యమంగా మారింది. స్నేహ ఈ పొలాన్ని Airbnbలో జాబితా చేసింది, అతిథులను స్థిరమైన జీవనశైలిని అనుభవించమని ఆహ్వానించింది. నగరవాసులు క్యూ కట్టారు. ఈ తండ్రీ కూతుళ్లు ఎంతోమంది రైతులకు మార్గ నిర్దేశకులయ్యారు. ఆమె తండ్రి అనధికారిక టూర్ గైడ్ అయ్యాడు. అంతేకాదు నచ్చిన పనిచేస్తూనే ప్రతి ఉదయం ప్రకృతిలో నడక. దీంతో సుగర్ నియంత్రణలోకి వచ్చింది. 18 కిలోగ్రాముల బరువ తగ్గాను అంటూ సంతోషంగా చెబుతారు అనిల్. అన్నింటికంటే ముఖ్యం నా బిడ్డ కల సాకారంలో నేను ముఖ్య భూమికనయ్యాను అంటారు. చదవండి: నవదుర్గకు ప్రతీకగా నీతా అంబానీ : 9 రంగుల్లో బనారసీ లెహంగా చోళీసంపాదన కాదు ముఖ్యంబాప్ బేటి ఫామ్స్ నెలకు రూ.80 వేలకు పైగా సంపాదిస్తుంది. కానీ తనకు డబ్బు కాదు ముఖ్యం. ప్రకృతిలో జీవించడం, వ్యవసాయ క్షేత్రం స్వయం సమృద్ధిగా, నిరంతరం అభివృద్ధి చెందడం. అలాగే ఏ హాలీవుడ్ చిత్రం రాయలేని ట్విస్ట్లు, విలువల కంటే మేటి జ్ఞానం.అదే నిజమైన బహుమతి అంటారు స్నేహ. -
ఫోర్బ్స్ జాబితాలో కాలేజ్ డ్రాపౌట్! ఏకంగా రూ.1.15 లక్షల కోట్లు..
ప్రపంచంలో అత్యంత ప్రముఖ బిలియనీర్లు కథలు వింటంటే అత్యంత ఆశ్చర్యం కలుగుతుంటుంది. అసాధారణ నేపథ్యం నుంచి అనతి కాలంలోనే కోట్లకు పడగెత్తి అవాక్కయ్యేలా చేస్తుంటారు. అంతేగాదు సక్సెస్ అసలైన అర్థం చెబుతుంటారు. కష్టపడేతత్వం ఉన్నవారు ఎన్నటికైనా విజయం సాధిస్తారనేందుకు స్ఫూర్తిగా నిలుస్తారు. ఈ కోవలో బిల్గేట్స్, మార్క్ జుకర్బర్గ్వంటి ప్రముఖులను చూశాం. తాజాగా వారి సరసన 30 ఏళ్ల లూసీ గోవా(Lucy Guo) అనే మహిళ నిలిచింది. ఎవరామె అంటే..కాలేజ డ్రాపౌట్ అయినా ఆమె ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకుని అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. అంతేగాదు ఫోర్బ్స్ ఆమెను అతిపిన్న వయస్కురాలైన స్వీయ నిర్మిత బిలియనీర్గా పేర్కొంది. ఆమె నికర విలువ సుమారు రూ. 1.15 లక్షల కోట్లుగా అంచనా వేసింది. అయితే లూసీ విజయ ప్రస్థానం అంత సులభంగా సాగలేదు. కాలిఫోర్నియాకు చెందిన లూసీ అమెరికాలో కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ అండ్ హ్యుమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ని కోర్సులో చేరింది. అయితే ఆమె డిగ్రీ పూర్తిచేయడానికి కేవలం ఒక ఏడాది ఉండగానే కాలేజ్ నుంచి తప్పుకుంది. 2011లో థీల్ ఫెలోషిప్లో చేరింది. ఈ ఫెలోషిప్ పేపాల్ సహ వ్యవస్థాపకుడు పీటర్ థీల్ ఎంపిక చేసిన యువకులకు వారి స్వంత కంపెనీలను ప్రారంభించేందుకు కోటి రూపాయలు పైనే తోడ్పాటుని అందిస్తుంది. అయితే ఆమె ఇలా కాలేజ్కి స్వస్తి చెప్పి ఫెలోషిప్లో జాయిన్ అవుతాననడం లూసీ తల్లిదండ్రులను చాలా షాక్కి గురి చేసింది. ఎందుకంటే లూసీ అమెరికాలో మంచి భవిష్యత్తు లభించాలని ఆమె పేరెంట్స్ ప్రతిదీ పణంగా పెట్టి చదివించారు. ఇలా మద్యలో కాలేజ్ చదువుని వదలేయడం వాళ్లు జీర్ణించుకోలేకపోయారు. ఒకరకంగా లూసీ కూడా ఈ అనూహ్య నిర్ణయం తీసుకుందే గానీ మనసులో ఏదో భయం వెంటాడుతూనే ఉంది. కానీ తన కలల ప్రపంచం కోస ఈ మాత్రం డేర్ చేయకపోతే కష్టం అని తనకు తాను సర్ది చెప్పుకుని మొండి ధైర్యంతో ముందుకు సాగింది. అలా ఆమె తన తొలి ఏఐ బిజినెస్ని ప్రారంభించింది. దీని తర్వాత టెక్ దిగ్గజం మెటాను కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం ఆమె జీవితాన్ని పెద్ద మలుపు తిప్పింది. అలా ఆమె అంచలంచెలుగా ఎదుగుతూ ఎన్నో కంపెనీలకు సారథ్యం వహిస్తూ..2022లో కంటెంట్ క్రియేటర్ మానిటైజేషన్ ప్లాట్ఫామ్ వ్యవస్థాపకురాలిగా మారింది. ఆ విధంగా అనతికాలంలోనే కోట్లకు పడగలెత్తి అత్యంత ధనవంతురాలైన వ్యవస్థాపకురాలిగా మారిందామె. అయితే లూసీ ఒకటో లేక రెండు సంత్సరాలైనా.. కాలేజ్కి వెళ్లాలని అంటుంది. అక్కడే మంచి స్నేహితులు, జీవితంలో అత్యంత విలువైన వ్యక్తులు గురించి తెలుసుకునేందుకు హెల్ప్ అవుతుందని అంటోంది. పైగా కాలేజ్ అనేది నేర్చుకోవడానికే కాదు మంచి స్నేహితులను సంపాదించుకోవడం కూడా నేర్పుతుందని చెబుతోంది. అదే భవిష్యత్తులో పెట్టబోయే కంపెనీల్లో వాళ్లు ఉద్యోగులు గానో లేక మీ కంపెనీ భాగస్వాములు గానో ఎంపిక చేసుకునేందుకు దారితీస్తుందని చెబుతుంది. అంతేగాదు విజయవంతమైన కంపెనీ నిర్మించాలంటే పిచ్చి తపన, ఆత్మవిశ్వాసం అత్యంత ముఖ్యమని చెప్పింది. తనకు ఈ థీల్ ఫెలోషిప్ తాను ఈ పనిచేయగలను అనే వాతావరణాన్ని అందించిందని చెబుతోంది లూసీ. ఆమె కథ కాలేజ్కి వెళ్లి ఎంజాయ్ చేసే యువతకు ఆదర్శం. భవిష్యత్తు మంచిగా నిర్మించుకునే కీలక వయసుని సరైన మార్గంలోకి తీసుకువెళ్లాలంటేజజ కచ్చితమైన వ్యూహం, ప్రణాళికి ఎంతలా అవసరం అనేందుకు వ్యవస్థాపకురాలు లూసీ స్టోరీనే ఉదహారణ. 30 ఏళ్లకే పాస్సెస్ అనే కంపెనీ నడిపి, కంటెంట్ క్రియేటర్లను సరికొత్త స్థాయిలో నిలిపింది, వాళ్లతో సంపదను ఎలా సృష్టించచ్చో చూపించింది. కృషికి తోడు ధైర్యం ఉంటే ఏదైనా అవలీలగా సాధించొచ్చని లూసీ కథే చెబుతోంది కదూ..!.(చదవండి: Navratri celebrations : 'డిజిటల్ గర్భా': పండుగను మిస్ అవ్వకుండా ఇలా..!) -
'గోల్డెన్ కేర్': పెద్దలకు భరోసా..!
కడుపున పుట్టిన పిల్లలే కాదు.. కనిపించకుండా ఎక్కడో నక్కిన సైబర్ నేరస్తుల చేతిలోనూ వేధింపులు, సైబర్ మోసాలకు గురవుతున్న వృద్ధులకు భరోసా కల్పించేందుకు రాచకొండ పోలీసులు అడుగులు ముందుకేశారు. రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ (ఆర్కేఎస్సీ)తో కలిసి గోల్డెన్ కేర్ ‘మన కోసం శ్రమించిన వారికి మన సంరక్షణ’ అనే వినూత్న కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని వృద్ధులకు రక్షణ, సంరక్షణ, గౌరవం అందించడమే దీని ప్రధాన లక్ష్యం. గోల్డెన్ కేర్ ద్వారా వారికి భద్రత మాత్రమే కాదు, ఆప్యాయం, గౌరవం, ఆతీ్మయతను అందించనున్నారు. వృద్ధులు సమాజానికి నిజమైన మూలస్తంభాలు, జ్ఞాననిధులని రాచకొండ పోలీస్ కమిషనర్ జీ సుధీర్ బాబు కొనియాడారు. రాచకొండ పోలీసులు ఎల్లప్పుడూ మీ కుటుంబ సభ్యుల్లా ఉంటారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమానికి హాజరైన సీనియర్ సిటిజన్స్ అందరికీ కిట్స్ పంపిణీ చేశారు. సైబర్ భద్రత, ఆరోగ్య బీమా..గోల్డెన్ కేర్ కార్యక్రమం కింద వృద్ధులకు నియమిత పర్యటనలు, నైతిక సహకారం అందించడంతో పాటు ఎస్ఓఎస్ సెటప్, వైద్య, అత్యవసర సహాయం కోసం ఆస్పత్రులతో ఒప్పందాలు, ఆరోగ్య బీమా సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై మార్గదర్శనం అందిస్తారు. వృద్ధులకు ఆర్థిక, సైబర్ మోసాలపై అవగాహన కల్పిస్తారు. మోసాల బారిన పడితే పోలీసులకు తెలియజేసే ప్రక్రియలో సహాయం, శారీరక లేదా మానసిక వేధింపుల కేసుల దర్యాప్తు, జోక్యం చేసుకోవడం, నిర్లక్ష్యానికి గురైనా విడిచిపెట్టే సంఘటనలలో తగిన పరిష్కారం అందిస్తారు. వీటితో పాటు వృద్ధులు తప్పిపోయినా, ఏదైనా వస్తువులు పొగొట్టుకున్నా వాటిని కనుగొనడంలో పోలీసులు సహాయం అందిస్తారు. గోల్డెన్ కేర్ సేవల కోసం రాచకొండ పోలీసులు ప్రత్యేకంగా హెల్ప్ లైన్ నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. సీనియర్ సిటిజన్ హెల్ప్లైన్ నంబరు 14567 లేదా రాచకొండ వాట్సాప్ నంబర్ 87126 62111లతో సంప్రదించవచ్చు. బీఎన్ఎస్ఎస్ సెక్షన్–144 కింద వృద్ధులను పోషించకుండా నిర్లక్ష్యం చేసినవారిపై పోలీసులు చర్యలు తీసుకుంటారు. అలాగే, మెయింటెనెన్స్ యాక్ట్ (సెక్షన్లు 4, 5) వృద్ధులు తమ పిల్లల నుండి ఆర్థిక సహాయం పొందేలా అవకాశం కలి్పస్తుంది. డీసీపీలు పద్మజ, ప్రవీణ్ కుమార్, ఆకాం„Š యాదవ్, సునీతా రెడ్డి, అరవింద్ బాబు, ఇందిరా, ఉషా రాణి, నాగలక్ష్మీ, రమణా రెడ్డి, మనోహర్, ఆర్కేఎస్సీ జాయింట్ సెక్రటరీ శివ కారడి, చీఫ్ కో–ఆర్డినేటర్ సావిత్రి పాల్గొన్నారు. (చదవండి: She Astra App for Women : రక్షణ ఛత్రం..! 'షీ అస్త్రం'..: దేశంలోనే తొలి ఉమెన్ యాప్) -
రక్షణ ఛత్రం..! 'షీ అస్త్రం'..
సోషల్ మీడియా యాప్స్ అంటే ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్.. వ్యక్తిగత అనుభూతి, అభిరుచులు ఉత్సాహంగా పంచుకోవడం.. కానీ ప్రస్తుతం హేట్ స్పీచ్, విద్వేషాలు, నెగెటివ్ కామెంట్స్, బాడీ షేమింగ్ వంటి అంశాలకు ఆన్లైన్ వేదికలుగా మారాయి. ముఖ్యంగా అమ్మాయిలకు, మహిళలకు ఫేస్బుక్, ఇన్స్టా వంటి వేదికలు మరింత అసభ్యకరంగా మారాయి. జెన్ జీ బ్యాచ్ అయితే మరీ హద్దు అదుపు లేకుండా ట్రోలింగ్, లీచింగ్కు పాల్పడుతున్నారు. ఇలాంటి తరుణంలో మహిళలు, యూత్ గర్ల్స్కు ప్రత్యామ్నాయ ఆన్లైన్ వేదికల అవసరముందని ఆలోచించారు నగరానికి చెందిన మహిళా అడ్వొకేట్ వెన్నెల. ఇందులో భాగంగానే కేవలం మహిళల కోసమే అనే సోషల్ యాప్ రూపొందించారు. ఇన్నోవేషన్ల వేదికగా.. ఈ ‘షీ అస్త్ర’ యాప్లో మహిళల కోసం ప్రత్యేకంగా రూమ్స్ ఉంటాయి. టాలెంట్ రూమ్లో యువత ఆర్ట్స్, స్కిల్స్ ప్రోత్సహించేలా రూపొందించారు. ముఖ్యంగా జెన్ జీ అట్రాక్షన్, గుర్తింపునకు వారిలోని నైపుణ్యాన్ని, కళలను షేర్ చేసుకోవచ్చు. అమ్మాయిలు స్వేచ్ఛగా మాట్లాడుకోడానికి, చర్చించుకోడానికి గాసిప్ రూమ్, ఈ తరం ఇన్నోవేషన్స్, స్టార్టప్స్, బ్రాండ్స్ ప్రమోట్ చేసుకోడానికి రికమండేషన్ రూమ్ వంటివి ఉన్నాయి. డిప్రెషన్, ట్రోమా వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రైవసీతో సిస్టర్ ఎస్ఓఎస్ వేదిక ఉంది. మహిళలకు ప్రోత్సాహం, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ‘షీ అస్త్ర స్కూల్’ తయారు చేశారు. ఇది మహిళలకు పెద్దబాలశిక్ష మాదిరి అని వెన్నెల తెలిపారు. మిగతా సోషల్ యాప్స్లో ట్రోలింగ్ రిపోర్ట్ చేయడానికి ట్రోల్ పోలీస్, సెకండరీ విక్టిమైజేషన్, హాష్ట్యాగ్ వంటి ఎన్నో ఫీచర్లు ఇందులో ఉండటం విశేషం. అడ్వొకేట్ ప్రాక్టీస్లో భాగంగా మహిళలకు సైబర్, ఆన్లైన్ వేధింపులకు సంబంధించిన పలు సున్నితమైన, సూక్ష్మమైన అంశాలను.. అవి ప్రభావితం చేసే పరిస్థితులను ప్రత్యక్షంగా చూశానని యాప్ రూపొందించిన వెన్నెల తెలిపారు. సోషల్ మీడియా ట్రోలింగ్తో ఎందరో అమ్మాయిలు, ఇన్ఫ్లుయెన్సర్స్ నిరాశ, నిరాస నిస్ప్రుహలోకి చేరుకోవడం సర్వసాధారణం. ఇలాంటి పరిస్థితులకు పరిష్కారంగా మిగతా సోషల్ యాప్స్లాగే కేవలం ఉమెన్ కోసం ‘షీ అస్త్ర’ యాప్ రూపుదిద్దుకుంది. దీనికి మహిళగా తప్పనిసరి ఆధార్ అప్రూవల్ అవసరం. దేశంలో మొదటి ఆధార్ అనుసంధానిత యాప్ కావడం దీని ప్రత్యేకత. ఈ యాప్ను నగరంలోని టీహబ్ వేదికగా దేశవ్యాప్తంగా అందుబాటులో ఉండేలా ప్రముఖ సినీ దర్శకులు శేఖర్ కమ్ముల, ఐఏఎస్ ఆఫీసర్ భవానీ శ్రీ, ఐఆర్ఎస్ అధికారి బలరాం, ఐఏఎమ్సీ డిప్యూటీ రిజి్రస్టార్ నిక్షిత నిరంజన్ ఆవిష్కరించారు. నా వంతు సహకారంగా..సోషల్ మీడియాలో ఒక ఫొటో పెడితే ఎన్నో నెగెటివ్ కామెంట్స్, ట్రోలింగ్.. మహిళలు స్వేచ్ఛగా తమ ఆలోచలనలు పంచుకోలేకపోతున్నారు. దీనిని మార్చడానికి నేనేం చేయగలను అనే ఆలోచన నుంచి నా సాంకేతిక బృందం అశ్విన్, నవ్య, దీక్ష, నవీన్ సహకారంతో దీనిని సృష్టించాం. ప్రస్తుతం దేశంలో మరికొద్ది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. నెలకు చిన్నమొత్తం రుసుముతో దీనిని వినియోగించుకోవచ్చు. షీ అస్త్ర మహిళ కోసం మొదటి సారి భారత్ నుంచి ఆవిష్కృతమైందని గర్వంగా చెప్పుకుంటాను. – వెన్నెల, యాప్ క్రియేటర్, అడ్వొకేట్కామెంట్లకు గ్రూప్రిపోర్ట్.. ప్రస్తుత తరుణంలో అమ్మాయిలకు సురక్షితమైన వర్చువల్ స్పేస్ లేదనే చెప్పాలి. 10వ తరగతి చదువుతున్న చిన్న పిల్లలు సైతం అన్లైన్లో ట్రోల్ చేయడం, అభ్యంతరకరమైన, అశ్లీల కామెంట్లు పెట్టడం సాధారణమైపోయింది. ఈ తరుణంలో షీ అస్త్ర యాప్ మంచి ఆవిష్కరణ. అశ్లీల, అసభ్య కామెంట్లకు గ్రూప్ రిపోర్ట్ ఆప్షన్ ప్రతిఒక్కరూ వినియోగించాలి. చట్టాలు, సైబర్ క్రైమ్ ప్రభావవంతంగా ఉంటే మహిళలు తమ ఆలోచనలను మరింత ఉన్నతంగా పంచుకోగలుగుతారు. – శేఖర్ కమ్ముల, సినీ దర్శకుడుట్రోలింగ్ నుంచి రక్షణగా.. మహిళలకు సోషల్ మీడియా ట్రోలింగ్ అనేది యూనివర్స్ ప్రాబ్లం.. ఈ మధ్య ఒక అమ్మాయి విడాకులు తీసుకుని వేడుక చేసుకుంటే.. సోషల్ మీడియాలో వచి్చన నెగెటీవ్ కామెంట్స్ ఆశ్చర్యాన్ని కలిగించింది.. నాగాలాండ్లో ఐఏఎస్గా విధులు నిర్వర్తిస్తున్నప్పుడు ఓ మహిళా ఉద్యోగి తన భర్త నుంచి మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురవుతుందని తెలుసుకోడానికి చాలా సమయం పట్టింది. అనంతరం కేసులు, కౌన్సిలింగ్తో పరిష్కారం చూపించగలిగా. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు రిపోర్ట్ చేయడం అలవర్చుకోవాలి. – భవానీ శ్రీ, ఐఏఎస్, జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి నెగెటివిటీకి దూరంగా.. గత ఇరవై సంవత్సరాలుగా సోషల్ మీడియా వాడకం ఎక్కువగా పెరగడం.. దీంతో పాటు మహిళలపై ట్రోలింగ్ పెరిగింది. ముఖ్యంగా మార్ఫింగ్, ఫేక్ అకౌంట్స్ వంటివి సమస్యగా మారాయి. సాంకేతిక పరంగా మహిళలకు సురక్షితమైన షీ అస్త్ర వంటి ఆన్లైన్ వేదికలు పెరగాలి. ఇది అనువైన డిజైనింగ్ క్రియేటింగ్ స్పేస్ కావలి.. ట్రోలింగ్, నెగెటివిటీకి దూరంగా.. షీ అస్త్రలోని ప్రైవసీ పాలసీ, మలి్టపుల్ ఫీచర్స్, రిపోర్టింగ్ ఆప్షన్స్ అమ్మాయిలకు మేలు చేస్తాయి. – నిక్షిత నిరంజన్, ఐఏఎమ్సీ డిప్యూటీ రిజి్రస్టార్. రెండు అంశాల సమ్మిళితం.. సామాజికంగానే కాదు ఆన్లైన్ వేదికగా కూడా అమ్మాయిలకు అనువైన పరిస్థితులు కనపడట్లేదు. ఈ తరంలో వచి్చన మార్పు ఇది.. దీనికి అనుగుణంగా సాంకేతికంగా, న్యాయ శాఖ పరంగా మార్పులు రావాల్సిన అవసరముంది. ఈ రెండు అంశాల సమ్మిళితమే షీ అస్త్ర యాప్. అడ్వొకేట్ సేవలందింస్తూనే ఇలాంటి సాంకేతిక పరిష్కారం అందించిన వెన్నెల టీం ప్రయత్నం అభినందనీయం. – బలరాం, ఎస్సీసీఎల్ చైర్పర్సన్–ఎండీ -
'ఏక్లా నారీ శక్తి సంఘటన్'..! ఒంటరి సైన్యం
పెళ్లైన రెండు సంవత్సరాలకే నిర్మల్ చందేల్ భర్త చనిపోయాడు. హిమాచల్ప్రదేశ్లోని మండీకి చెందిన నిర్మల్కు ఒకవైపు తట్టుకోలేని దుఃఖం, మరోవైపు ఎన్నో ఆంక్షలు. నిర్మల్ అలంకరించుకోవడానికి లేదు. కొత్త దుస్తులు ధరించడానికి లేదు. బయటికి వెళ్లడానికి లేదు. ఉత్సవాలు, వేడుకలలో పాల్గొనడానికి లేదు. ఆంక్షల వల్ల తనలో విషాదం మరింత ఎక్కువ అయింది. కొంతకాలానికి ఆమె పుట్టింటికి వెళ్లింది. కాస్త ఉపశమనంగా అనిపించింది. సోలన్ జిల్లాలోని ఒక స్వచ్ఛంద సంస్థలో అకౌంటెంట్గా చేరింది. ఉచిత భోజనంతో పాటు వసతి సౌకర్యం కూడా ఉండేది. అక్కడ తనలాగే ఎంతోమంది ఒంటరి మహిళలు ఉంటున్నారు. వారు కూడా తనలాగే ఎన్నో బాధలు అనుభవించారు. చిన్న వయసులోనే భర్తను కోల్పోయారు. ఏక్లా నారీ శక్తి సంఘటన్ (ఇఎన్ఎస్ఎస్) అనే స్వచ్ఛంద సంస్థ హిమాచల్ప్రదేశ్ చాప్టర్కు ప్రాతినిధ్యం వహించడంతో నిర్మల్ జీవితం కొత్త మలుపు తీసుకుంది. ఈ చాప్టర్లో రాష్ట్ర వ్యాప్తంగా 19,445 సభ్యులు ఉన్నారు. 1999లో 350 మంది ఒంటరి మహిళలతో జైపూర్లో ప్రారంభమైన ఏక్లా నారీ శక్తి సంఘటన్లో ఇప్పుడు ఎనిమిది రాష్ట్రాలలో 2,50,000 మంది మహిళలు ఉన్నారు. రాజస్థాన్లో అత్యధిక సంఖ్యలో 1,02,000 మంది సభ్యులు ఉన్నారు. సభ్యులు ఆర్థికంగా సొంత కాళ్లమీద నిలబడేలా చేయడం నుంచి వారి ఆరోగ్య సంరక్షణ వరకు ఎన్నో విషయాలలో కృషి చేస్తోంది ఏక్లా నారీ శక్తి సంఘటన్. మన దేశంలో ఒంటరి మహిళల (సింగిల్ ఉమెన్) సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఒంటరి మహిళల సంఖ్య 2011లో 51.2 మిలియన్లు ఉండగా 2024కు 71.4 మిలియన్లకు చేరింది. (చదవండి: పేపర్ పువ్వులతో భారత సంతతి మహిళ గిన్నిస్ రికార్డు..!) -
పేపర్ పువ్వులతో భారత సంతతి మహిళ గిన్నిస్ రికార్డు..!
చాలామంది ఏదో ఒక కళ నేర్చుకుంటుంటారు. అయితే దాన్ని ఏవో కారణాలతో వదిలేయాల్సి రావొచ్చు. అయితే కొందరూ సమయం దొరికితే ఆ కళకు పదును పెట్టుకుంటూ..తనకు సాటిలేరెవ్వరూ అన్నట్లుగా ఆరితేరిపోతారు. ఆ టాలెంట్ ఊరికేపోదు ప్రపంచ మొత్తం ఆశ్చర్యపోయే రేంజ్లో రికార్డు సృష్టించి శెభాష్ అనిపించుకుంటారు. అలాంటి కోవకు చెందించే సౌది అరేబియాలో ఉంటున్న ఈ భారత సంతతి మహిళ నీను ప్రదీప్.కేరళకు చెందిన నీనుకి చిన్నప్పటి నుంచి చేతికళల పట్ల అమితాసక్తి. అయితే ఉన్నత చదువులు అభ్యసించడం వల్ల ఆ కళను కొనసాగించ లేకపోయింది. అలా ఆమె బీకామ్, ఎంకామ్ పూర్తి చేసిన అనంతరం పెళ్లి చేసుకుని సౌదీ అరేబియాకు వెళ్లిపోయింది. ఆ దంపతుల ప్రేమనురాగాలకు గుర్తుగా అరోనా, అలీనా ఇద్దరు పిల్లలు పుట్టడంతో క్షణం తీరిక లేకుండా గడిపింది. ఎప్పుడైతే పిల్లలు పెద్దవాళ్లై స్కూళ్లకు వెళ్లడం ప్రారంభించారో అప్పటి నుంచి మంచి తీరిక దొరికింది ఆమెకు. ఉదయమే భర్త సామ్సన్ జాకబ్ ఉద్యోగానికి, పిల్లలు స్కూల్కి వెళ్లిన తర్వాత చాలా ఖాళీ సమయం దొరికేది. ఆ సమయాన్ని అలా వృధాగా జారిపోనీకూడదని, తనకు ఎంతో ఇష్టమైన అభిరుచి అయిన హ్యాండ్ ఆర్ట్కి మళ్లీ పదును పెట్టుకునేందుకు రెడీ అయ్యింది. అయితే అందుకు అవసరమయ్యే ఫ్యాన్సీ క్రాఫ్ట్ టూల్స్, ఆర్ట్పరికరాలు చాలా ఖరీదుగా ఉండటమేగాక అందుబాటులో కూడా ఉండేవి కాదు. దాంతో ఆమె ఇంట్లో దొరికే వేస్ట్ మెటీరియల్స్ ఎగ్షెల్, పిస్తా షెల్లతో తన కళను మరింత సృజనాత్మక ధోరణిని జోడించి మెరుగులు పెట్టుకుంది. చెప్పాలంటే వేస్ట్తో ఇంటి అలంకార వస్తువులను తయారు చేసే స్థాయికి చేరుకుంది. అలా ఆమె పేపర్ పువ్వులు తయారు చేసే కాగితపు ఆర్ట్లో ఆరితేరిపోయింది. ఫలితంగా ఇల్లంతా నీను చేసిన పేపర్ కళాకృతులతో నిండిపోయింది. ఇక కొన్నింటిని ఈవెంట్లలోనూ, పలు స్టాల్స్ తన కళను ప్రదర్శించేది. అలా ఆమె కళ ప్రజలను ఇంప్రెస్ చేయడమే కాదు నేర్చుకునేలా ప్రేరేపించింది. ఇంతలో కోవిడ్ 19 రావడంతో తన పనికి బ్రేక్పడినా..ఆ లాక్డౌన్ని కూడా నీను సద్వినియోగం చేసుకునేలా మరింత వేగవంతంగా చేయడంపై పట్టు సంపాదించింది. రికార్డుల స్థాయికి..అలా ఆ నైపుణ్యం ఆసియా బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు దక్కించుకునేందుకు దారితీసింది. క్రేప్ పేపర్ ఉపయోగించి ఒక వ్యక్తి తయారు చేసే వివిధ రకాల గరిష్ట పువ్వులకు మించి చేసే సామర్థ్యం నీనులో రికార్డు స్థాయిలో ఉందని ప్రశంసలందుకుంది. అది ఆమెకు గిన్నిస్ టైటిల్కు మార్గం సుగమం చేసింది. తన సామర్థ్యంపై ఉన్న నమ్మకంతో నీను 2023లో గిన్నిస్ టైటిల్ కోసం దరఖాస్తు చేసుకుంది. దాదాపు రెండేళ్ల తర్వాత గిన్నిస్ వాళ్లు స్పందించడంతో ఆ సాహసానికి పూనుకుంది. అలా ఆమె కేవలం 4 గంటల 39 నిమిషాల్లో ఒక వెయ్య నూటొక్క(1101) కాగితపు పువ్వులతో కూడిన 574 అడుగుల పూల ఫ్రేమ్ని తయారు చేసి గిన్నిస్ రికార్డులకెక్కింది. అభిరుచిగా మొదలైన ఆర్ట్..రికార్డుల సృష్టించే స్థాయికి దారితీసింది. అదీగాక ఈ కళలు మానసిక ఉల్లాసం తోపాటు మనపై మనకు నమ్మకాన్ని అందిస్తాయి కూడా.(చదవండి: కర్ణుని మాదిరి జననం..! కట్చేస్తే ఇవాళ స్టార్ రేంజ్ క్రేజ్..) -
నవదుర్గకు ప్రతీకగా నీతా అంబానీ : 9 రంగుల్లో బనారసీ లెహంగా చోళీ
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ మరోసారి తన ఫ్యాషన్ శైలితో ఆకట్టుకున్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాజస్థానీ టై-డై టెక్నిక్ సాంప్రదాయ దుస్తులలో అమ్మ వారి ఆరాధనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నీతా అంబానీ చిత్రాలను సోషల్ మీడియాలో సందడిగామారాయి.దుర్గాదేవి తొమ్మిది రూపాలను సూచించే బహుళ వర్ణ బనారసి పింక్ లెహంగా చోళిలో అత్యంత సుందరంగా కనిపించారు. దీనిపై వివిధ రకాల బట్టలతో ప్యాచ్వర్క్, క్లిష్టమైన జరీ వర్క్, సంక్లిష్టమైన హ్యాండ్ ఎంబ్రాయిడరీతో రూపొందించిన ఈ లెహంగాలో భారీ లేస్వర్క్ స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పవచ్చు. ఈ స్కర్ట్కు మ్యాచింగ్గా ప్యాచ్వర్క్ , బంగారు జరీ వర్క్తో పింక్ బ్లౌజ్ను ఆమె ఎంచుకున్నారు. గులాబీ , నారింజ రంగు లెహెరియా ప్రింట్ దుపట్టాతో నీతా అంబానీ లుక్మరింత ఎలివేట్ అయింది. మల్టీ లేయర్డ్ డైమండ్స్, ఆకుపచ్చ పచ్చ నెక్లెస్తో పాటు స్టేట్మెంట్ చెవిపోగులు, మాంగ్ టికా, రంగురంగుల గాజులు, హెవీరింగ్ను ధరించారు. ఈ కాస్ట్యూమ్స్ను ఢిల్లీకి చెందిన ఫ్యాషన్ బ్రాండ్ JADE మోనికా అండ్ రిష్మా రూపొందించారు. నీతా అంబానీ లుక్కు సంబంధించిన వివరాలను షేర్ చేశారు. గుజరాత్ ఆత్మ నుండి ప్రేరణతో పవిత్రమైన మూలాంశాలు ,శక్తివంతమైన కచ్చి వస్త్రాలతో కూడిన దైవిక నేపథ్యంలో నీతా అంబానీ లుక్ సజీవంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. (Weight Loss వెయిట్ లాస్లో ఇవే మెయిన్ సీక్రెట్స్)అంతేకాదు అంబానీ మేకప్ ఆర్టిస్ట్ మిక్కీ కాంట్రాక్టర్ కొన్ని ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఐలైనర్, కోల్-ఐడ్, మస్కారా-కోటెడ్ లాషెస్, బ్లష్డ్ బుగ్గలు, రేడియంట్ హైలైటర్, న్యూడ్ లిప్స్టిక్తోపాటు, మిడిల్-పార్టెడ్ బన్ హెయిర్స్టైల్ , నుదిటిపై ఎర్రటి బొట్టు తదితర వివరాలను అందించారు. (సేవకు మారు పేరు, ఐఏఎస్ ఆఫీసర్ బీలా వెంకటేశన్ ఇకలేరు)నెటిజన్ల స్పందనసోషల్ మీడియా వినియోగదారులు ఆమె సొగసైన స్టైలింగ్ను ప్రశంసించారు. నవరాత్రి క్వీన్కు అవార్డు నీతా అంబానీ జీకి దక్కుతుంది. ఎలిగెంట్ రాయల్, చాలా అందంగా ఉన్నారంటూ కొనియాడటం విశేషం. -
సేవకు మారు పేరు, ఐఏఎస్ ఆఫీసర్ బీలా వెంకటేశన్ ఇకలేరు
కరోనా (corina) సమయంలో రాష్ట్రానికి కీలక సేవలు అందించిన ఐఏఎస్ అధికారిణి బీలా వెంకటేశన్ (Beela Venkatesan) (56) ఇక లేరు. ప్రజా సేవకు, అంకితభావానికి పేరుగాంచిన ఉన్నతాధికారిణి, తమిళనాడు ఇంధన శాఖ కార్యదర్శిగా బీలా బుధవారం (సెప్టెంబర్ 24న) అనారోగ్యంతోకన్నుమూశారు.గత కొన్నేళ్లుగా బ్రెయిన్ ట్యూమర్తో పోరాడుతున్నారు. ఆమె మరణంపై పలువురు సంతాపం ప్రకటించారు. పాలన ప్రజా సంక్షేమం పట్ల ఆమెకున్న నిబద్ధత మరువలేనిదని గుర్తు చేసుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆమెకు నివాళులర్పించారు,2020లో కోవిడ్-19 మహమ్మారి సమయంలో వెంకటేశన్ తమిళనాడులో సుపరిచితం.ఆ సమయంలో రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శిగా, రాష్ట్రంలో కోవిడ్-19 పరిస్థితికి సంబంధించి తన రోజువారీ మీడియా బ్రీఫింగ్ల ద్వారా కీలకమైన నవీకరణలను అందిస్తూ తమిళనాట బహుళ ప్రజాదరణ పొందారు.డాక్టర్ బీలా వెంకటేశన్ మద్రాస్ మెడికల్ కాలేజీ (ఎంఎంసి) నుండి ఎంబిబిఎస్ పూర్తి చేశారు. వృత్తిరీత్యా వైద్యురాలైన 1997లో సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణురాలైంది. మొదట బీహార్, ఆ తరువాత జార్ఖండ్లోనూ పనిచేసి అనంతరం తమిళనాడుకు బదిలీ అయ్యారు.తమిళనాడులో, ఆమె చెంగల్పట్టు సబ్-కలెక్టర్గా పనిచేశారు; ఫిషరీస్ కమిషనర్; కమీషనర్ ఫర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్; ఆరోగ్య ప్రధాన కార్యదర్శి,ఇండియన్ మెడిసిన్ అండ్ హోమియోపతికి కమిషనర్గా విశేష సేవలందించారు.బీలా తల్లి, నాగర్కోయిల్కు చెందిన రాణి వెంకటేశన్ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మాజీ ఎమ్మెల్యే. ఆమె తండ్రి, SN వెంకటేశన్ రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ -
అమ్మ స్ఫూర్తి..
‘మనలో శక్తి ఎంత ఉందో నడిచి వచ్చిన మన మార్గమే చూపుతుంది’ అంటారు డాక్టర్ సాయిలత. కర్ణాటకలోని హోస్పేట్లో డాక్టర్గా పని చేస్తున్న సాయిలత కర్నూలు వాసి. ఒంటరిగా తల్లి పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకుంటూ, ఆర్థిక స్థోమత లేక పోయినా పెద్ద కలను నెరవేర్చుకునే ప్రయత్నంలో పట్టుదలతో కృషి చేసి డాక్టర్గా ఎదిగారు. సేవామార్గాన్నీ వదలకుండా అమ్మాయిల ఆరోగ్య జీవన విధానానికి, విద్యార్థులకు చెప్పాల్సిన విషయాల్లో బోధకురాలిగా తన జీవన ప్రయాణాన్ని మెరుగ్గా మలుచుకున్నారు. ఆ వివరాలు సాయిలత మాటల్లోనే...‘‘ఈ రోజు గైనకాలజిస్ట్గా సేవలందించే స్థాయికి రావడం అంత సులువుగా కాలేదు. నేను పుట్టి పెరిగింది కర్నూలులో. సింగిల్ మదర్గా మా అమ్మ నన్నూ చెల్లెలిని పోషించడానికి చాలా కష్టపడేది. రిసెప్షనిస్ట్గా, గోడౌన్ ఇన్చార్జిగా.... చిన్న చిన్న ప్రైవేట్ జాబులు చేస్తూ ఉండేది. అమ్మ కష్టం చూస్తుంటే చాలా బాధ అనిపించేది. కానీ, నాకేమో డాక్టర్ అవాలని కల. అమ్మ నా ఆలోచనను నిరుత్సాహపరచలేదు. ‘అభయం’తో...టెన్త్లో మంచి మార్కులు వచ్చాయి. మేం పెద్దవుతుంటే ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. కాలేజీ ఫీజులు కట్టే స్థోమత లేదు. ఇప్పుడెలా... అనుకుంటున్నప్పుడు హైదరాబాద్లో ఉన్న ‘అభయ’ స్వచ్ఛంద సంస్థ గురించి తెలిసింది. వాళ్లను కలిస్తే, ఫీజులకు సాయం చేశారు. ఆ తర్వాత ఎమ్సెట్ రాస్తే వచ్చిన ర్యాంకుకు రిజర్వేషన్లు లేక పోవడం వల్ల సీటు రాలేదు. దాంతో లాంగ్టర్మ్ కోచింగ్కి సాయం కోసం వెతుకుతుండగా ఈ విషయం తెలిసి, అభయ ఫౌండేషన్ వాళ్లే పిలిపించి మరీ లాంగ్ టర్మ్ కోచింగ్కు సాయం చేశారు. ఆ యేడాది మంచి ర్యాంకు తెచ్చుకున్నాను. అనంతపూర్ మెడికల్ కాలేజీలో ఫ్రీ సీటు వచ్చింది. ఎంబీబీఎస్ పూర్తి చేశాను. ఆ తర్వాత పీజీ కోర్సుకు ఏడాది కోచింగ్ తీసుకున్నాను. ఆలిండియా నీట్లో ర్యాంకు వచ్చింది. మహారాష్ట్ర అకోలా మెడికల్ కాలేజీలో పీజీ పూర్తి చేశాను. స్కాలర్షిప్స్ వచ్చాయి. సంస్థ నుంచి సాయం అందింది. నా క్లాస్మేట్, పీడియాట్రిషియన్ డాక్టర్ తిరుమలేశ్తో నా పెళ్లి జరిగింది. మా అత్తగారిది కర్ణాటకలోని హోస్పేట్. దాంతో మేమిద్దరం కలిసి, అక్కడే క్లినిక్ నడుపుతున్నాం. పండక్కి హైదరాబాద్లో ఉంటున్న అమ్మ లక్ష్మి, చెల్లెలు ధరణిల వద్దకు వచ్చాను. మాకోసం ఎంతో కష్టపడిన అమ్మకు విశ్రాంతి కల్పించాను.సేవా మార్గం...ఉంటున్న చోటనే డాక్టర్గా వృత్తిని కొనసాగిస్తూ, గర్ల్ సేఫ్టీ గురించి అవగాహనా తరగతులు తీసుకుంటున్నాను. నెలసరి సమయంలో ఎలా ఉండాలి, రక్తహీనత, థైరాయిడ్, అధికబరువు, గర్భధారణ.. ఇలా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు మహిళల్లో ఉండే ఆరోగ్య సమస్యలు, వాటి పైన సెషన్స్ చెబుతూనే ఆన్లైన్ ద్వారా స్టూడెంట్స్కు ఆరోగ్యం, పరిశుభ్రత, ఆహారం మొదలైన విషయాలపైనా గైడెన్స్ ఇస్తుంటాను. ప్రైమరీ, ప్రాథమిక పాఠశాలలకు వెళ్లి, అమ్మాయిలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి వివరిస్తుంటాను. ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంచుకోవాలి, అమ్మాయిల రక్షణకు సంబంధించిన విషయాలు నృత్య, నాటకాల ద్వారా చెబుతుంటాను ‘అభయ’ వల్ల నా జీవితానికి మార్గం ఏర్పడింది. అందుకు నా వంతుగా తిరిగి ఆ సంస్థకు ఉన్న 30 సెంటర్లలోని టీచర్లకు గైడెన్స్ ఇస్తుంటాను. హెల్త్ క్యాంపుల్లో ఉచిత సేవలు అందిస్తుంటాను.నాలుగు గోడల మధ్య ఏమీ తెలియని ప్రపంచం నుంచి బయల్దేరిన నాకు ఈ రోజు కొన్ని వందలమందికి అవగాహన కలిగించే స్థాయి లభించింది. ఈ ప్రయాణంలో అమ్మ కష్టం, అభయ అందించిన సాయం నన్ను నిలబెట్టాయి. అవకాశాలు వచ్చినప్పుడు అందిపుచ్చుకోవడంతో పాటు, వాటిని సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలన్నది నా జీవన ప్రయాణం నేర్పిన పాఠం. శక్తి మనలో ఉందని గుర్తిస్తే ఎదగడానికి మద్దతు కూడా లభిస్తుంది. ప్రయాణంలో మనకు శక్తిగా నిలిచినవారికి తిరిగి మన శక్తిని అందించినప్పడు ఆ ఆనందం గొప్పగా ఉంటుంది’’ అని వివరించారు ఈ డాక్టర్. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఆమె దాండియాకి ఇండియా నర్తిస్తుంది
దసరా నవరాత్రులు వస్తే దేశం తలిచే పేరు ఫాల్గుణి పాఠక్. ‘దాండియా క్వీన్ ఆఫ్ ఇండియా’గా పేరు గడించిన ఈ 56 సంవత్సరాల గాయని తన పాటలతో, నృత్యాలతో పండగ శోభను తీసుకువస్తుంది. 25 రూ పాయల పారితోషికంతో జీవితాన్ని ప్రారంభించి నేడు కోట్ల రూ పాయలను డిమాండ్ చేయగల స్థితికి చేరిన ఫాల్గుణి స్ఫూర్తి పై పండుగ కథనం.దేశంలో దసరా నవరాత్రులు జరుపుకుంటారు. కాని అమెరికాలో, దుబాయ్లో, గుజరాతీలు ఉండే అనేక దేశాల్లో వీలును బట్టి ప్రీ దసరా, పోస్ట్ దసరా వేడుకలు కూడా జరుపుకుంటారు. ఫాల్గుణి పాఠక్ వీలును బట్టి ఇవి ప్లాన్ అవుతాయి. ఆమె దసరా నవరాత్రుల్లో ఇండియాలో ఉంటే దసరా అయ్యాక కొన్ని దేశాల్లో దాండియా డాన్స్షోలు నిర్వహిస్తారు. లేదా దసరాకు ముందే కొన్ని దేశాల్లో డాన్స్ షోలు నిర్వహిస్తారు. ఆమె దసరాకు ముందు వచ్చినా, తర్వాత వచ్చినా కూడా ప్రేక్షకులకు ఇష్టమే. ఆమె పాటకు పాదం కలపడం కోసం అలా లక్షలాది మంది ఎదురు చూస్తూ ఉంటారు. అంతటి డిమాంట్ ఉన్న గాయని ఫాల్గుణి పాఠక్ మాత్రమే.తండ్రిని ఎదిరించి...ఫాల్గుణి పాఠక్ది తన రెక్కలు తాను సాచగల ధైర్యం. నలుగురు కూతుళ్ల తర్వాత ఐదవ కూతురుగా ముంబైలోని ఒక గుజరాతి కుటుంబంలో జన్మించింది ఫాల్గుణి. నలుగురు కూతుళ్ల తర్వాత ఐదవ సంతానమైనా అబ్బాయి పుడతాడని భావిస్తే ఫాల్గుణి పుట్టింది. అందుకే తల్లి, నలుగురు అక్కలు ఆమెకు ΄్యాంటు, షర్టు తొడిగి అబ్బాయిలా భావించి ముచ్చటపడేవారు. రాను రాను ఆ బట్టలే ఆమెకు కంఫర్ట్గా మారాయి. వయసు వచ్చే సమయంలో తల్లి హితవు చెప్పి, అమ్మాయిలా ఉండమని చెప్పినా ఫాల్గుణి మారలేదు. ఆ ఆహార్యం ఒక తిరుగుబాటైతే పాట కోసం తండ్రిని ఎదిరించడం మరో తిరుగుబాటు. తల్లి దగ్గరా, రేడియో వింటూ పాట నేర్చుకున్న ఫాల్గుణి పాఠక్ స్కూల్లో పాడుతూ ఎనిమిదో తరగతిలో ఉండగా మ్యూజిక్ టీచర్తో కలిసి ముంబైలోని వాయుసేన వేడుకలో పాడింది. ఆమె పాడిన పాట ‘ఖుర్బానీ’ సినిమాలోని ‘లైలా ఓ లైలా’. అది అందరినీ అలరించిందిగానీ ఇంటికి వచ్చాక తండ్రి చావబాదాడు.. పాటలేంటి అని. కాని అప్పటికే పాటలో ఉండే మజా ఆమె తలకు ఎక్కింది. ఆ తర్వాత తరచూ ప్రదర్శనలు ఇవ్వడం ఇంటికి వచ్చి తండ్రి చేత దెబ్బలు తినడం... చివరకు విసిగి తండ్రి వదిలేశాడుగాని ఫాల్గుణి మాత్రం పాట మానలేదు.త–థయ్యా బ్యాండ్తన ప్రదర్శనలతో పాపులర్ అయ్యాక సొంత బ్యాండ్ స్థాపించింది ఫాల్గుణి. దాని పేరు ‘త–థయ్యా’. ఆ బ్యాండ్తో దేశంలోని అన్నిచోట్లా నవరాత్రి షోస్ మొదలెట్టింది. నవరాత్రి ఉత్సవాల్లో దాండియా, గర్భా డాన్స్ చేసే ఆనవాయితీ ఉత్తరాదిలో ఉంది. ఫాల్గుణికి ముందు ప్రదర్శనలిచ్చేవారు కేవలం ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ను మాత్రమే వినిపిస్తూ డాన్స్ చేసేవారు. ఫాల్గుణి తనే దాండియా, గర్భా నృత్యాలకు వీలైన పాటలు పాడుతూ ప్రదర్శనకు హుషారు తేసాగింది. దాండియా సమయంలో ఎలాంటి పాటలు పాడాలో, జనంలో ఎలా జోష్ నింపాలో ఆమెకు తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు. అందుకే ఆమె షోస్ అంటే జనం విరగబడేవారు. 2010లో మొదటిసారి నవరాత్రి సమయాల్లో ఆమె గుజరాత్ టూర్ చేసినప్పుడు ప్రతిరోజూ 60 వేల మంది గుజరాత్ నలుమూలల నుంచి ఆమె షోస్కు హాజరయ్యేవారు.ప్రయివేట్ ఆల్బమ్స్స్టేజ్ షోలతో పాపులర్ అయిన ఫాల్గుణి తొలిసారి 1998లో తెచ్చి ‘యాద్ పియాకీ ఆనె లగీ’... పేరుతో విడుదల చేసిన ప్రయివేట్ ఆల్బమ్ సంచలనం సృష్టించింది. ఊరు, వాడ ‘యాద్ పియాకీ ఆనె లగీ’ పాట మార్మోగి పోయింది. యువతరం హాట్ ఫేవరెట్గా మారింది. 1999లో విడుదల చేసిన ‘మైనె పాయల్ హై ఛన్కాయ్’... కూడా పెద్ద హిట్. ఈ అల్బమ్స్లో పాటలు కూడా ఆమె తన నవరాత్రుల షోస్లో పాడటం వల్ల ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.రోజుకు 70 లక్షలు2013 సమయానికి ఫాల్గుణి పాఠక్ నవరాత్రి డిమాండ్ ఎంత పెరిగిందంటే రోజుకు 70 లక్షలు ఆఫర్ చేసే వరకూ వెళ్లింది. నవరాత్రుల మొత్తానికి 2కోట్ల ఆఫర్ కూడా ఇవ్వసాగారు. ఆశ్చర్యం ఏమిటంటే నవరాత్రుల్లో అందరూ సంప్రదాయ దుస్తులు ధరించి దాండియా, గర్భా నృత్యాలు చేస్తారు. కాని ఫాల్గుణి ఆ దుస్తులు ఏవీ ధరించదు. ΄్యాంట్ షర్ట్ మీదే ప్రదర్శనలు ఇస్తుంది. ‘ఒకసారి ఘాగ్రా చోళీ వేసుకొని షో చేశాను. జనం కింద నుంచి ఇలా వద్దు నీలాగే బాగుంటావు అని కేకలు వేశారు. ఇక మానేశాను’ అంటుందామె.వెలుగులు చిమ్మాలిఫాల్గుణి ప్రదర్శన అంటే స్టేజ్ మాత్రమే కాదు గ్రౌండ్ అంతా వెలుగులు చిమ్మాలి. గ్రౌండ్లోని ఆఖరు వ్యక్తి కూడా వెలుతురులో పరవశించి ఆడాలని భావిస్తుంది ఫాల్గుణి. ప్రతి నవరాత్రి ప్రదర్శన సమయంలో నిష్ఠను పాటించి పాడుతుందామె. ‘నేను ఇందుకోసమే పుట్టాను. నాకు ఇది మాత్రమే వచ్చు’ అంటుంది. ఆమెకు విమాన ప్రయాణం అంటే చాలా భయం. ‘విమానం ఎక్కినప్పటి నుంచి హనుమాన్ చాలీసా చదువుతూ కూచుంటాను. అస్సలు నిద్ర పోను’ అంటుందామె. హనుమాన్ చాలీసా ఇచ్చే ధైర్యంతో ప్రపంచంలోని అన్ని మూలలకు ఆమె ఎగురుతూ భారతీయ గాన, నృత్యాలకు ప్రచారం కల్పిస్తోంది. తండ్రితోనేఏ తండ్రైతే ఆమెను పాడవద్దన్నాడో ఆ తండ్రికి తనే ఆధారమైంది ఫాల్గుణి. ఆమెకు 15 ఏళ్ల వయసులోనే తల్లి హార్ట్ ఎటాక్తో మరణించడంతో కుటుంబ భారం తనే మోసి ఇద్దరు అక్కల పెళ్లిళ్లు తనే చేసింది. తండ్రిని చూసుకుంది. వివాహం చేసుకోవడానికి ఇష్టపడని ఫాల్గుణి ‘నేను నాలాగే హాయిగా ఉన్నాను’ అంటుంది. గత 25 ఏళ్లుగా 30 మంది సభ్యుల బృందం స్థిరంగా ఆమె వెంట ఉంది. ప్రతి ప్రదర్శనలో వీరు ఉంటారు. వీరే నా కుటుంబం అంటుందామె. -
దేశానికి రక్తతర్పణం చేసిన అహింసా మూర్తి!
ఆమె 73 ఏళ్ల ముదుసలి. జాతీయ పతాకాన్ని ఎత్తిపట్టి ‘వందేమాతరం’, ‘ఆంగ్లేయులారా! ఇండియాను వదిలి వెళ్లండి’ అంటూ నినాదాలు చేస్తూ ఆరువేల మందితో ఒక పోలీస్ స్టేషన్ను ఆక్రమించేందుకు శాంతియుతంగా దండయాత్ర చేస్తోంది. పోలీసులు గాలిలోకి కాల్పులు జరి పారు. అయినా ఆమె ముందుకే కదిలింది. ఈసారి జెండా పట్టుకున్న చేతిని గురిచూసి కాల్చారు. వెంటనే రెండో చేతిలోకి జెండాను మార్చుకుని మునుముందుకు దూకింది. దీంతో పోలీసులు రెచ్చిపోయారు. ఆమె రెండో చేతి పైనా, నుదుటి పైనా కాల్పులు జరిపారు. తెల్లని ఖద్దరు చీర రక్తసిక్తమయ్యింది. ఆ బక్కచిక్కిన వృద్ధ యోధ కుప్పకూలింది – కానీ జెండాను మాత్రం కిందపడకుండా గుండెలకు హత్తుకునే!1942 సెప్టెంబర్ నాలుగవ వారంలో చోటు చేసుకున్న ఈ బలిదానం గురించి నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉంది. ‘వృద్ధ మహిళా గాంధీ’ (గాంధీ బురి)గా పేరుగాంచిన ఆమె పేరు మాతంగినీ హజ్రా (Matangini Hazra). 1869లో బెంగాల్లోని హొగ్లా గ్రామంలో ఒక పేద కుటుంబంలో జన్మించిన ఆమెకు పన్నెండేండ్లకే వివాహం చేశారు. కానీ 18 ఏండ్లకే వితంతువయ్యింది. పిల్లలు లేని ఆమె సమాజ సేవ, దేశ సేవకే తన జీవితాన్ని అంకితమిచ్చింది. ఆమెకు చదువు లేదు. అయినా గాంధీజీ బోధనలకు ఆకర్షితురాలయ్యింది. ఆయన చెప్పినట్లే జీవించింది. 1930లలో శాసనోల్లంఘన ఉద్యమంతో పాటు మిగతా ఉద్యమాల్లోనూ పాల్గొని జైలుకెళ్లింది. భారత జాతీయ కాంగ్రెస్ బ్రిటిష్ పాలనకు ముగింపు పలకాలని 1942 ఆగస్ట్ 8న ‘క్విట్ ఇండియా’ (ఇండియా వదిలి వెళ్లండి) ఉద్య మాన్ని ప్రారంభించింది. గాంధీజీ ‘డూ ఆర్ డై’ (విజయమో, వీరస్వర్గమో) అంటూ ఉద్య మాన్ని ఉరకలెత్తించారు. ఈ ఉద్యమ సమయా నికి మాతంగినికి 73 ఏండ్లు. బెంగాల్లోని మిడ్నాపూర్ జిల్లాలో ఉద్యమానికి సరైన నాయకత్వం అందించే గాంధీవాదులు లేకపోవడంతో ఈ ఉద్యమం ప్రజల తిరుగుబాటుగా మారింది. బ్రిటిష్ అధికారాన్ని నేరుగా సవాలు చేసే సమాంతర ప్రభుత్వాన్ని లేదా ‘జాతీయ సర్కా ర్’ను తామ్లుక్లో ‘సమర్ పరిషద్’ ఏర్పాటు చేసింది. మాతంగినీ పక్కా గాంధేయవాదే కానీ ఈ తిరుగుబాటుదారుల్లో ఒకరుగా మారారు. పోలీస్స్టేషన్పైకి దండయాత్ర1942 సెప్టెంబర్ 29న తామ్లుక్ పోలీస్ స్టేషన్ (అప్పట్లో సెయ్లన్ స్క్వేర్)పై నియంత్రణ సాధించడానికి తామ్లుక్ జాతీయ సర్కార్ ఒక నిరసన మార్చ్ నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఇది బ్రిటిష్ అధికారంపై ప్రత్యక్ష తిరుగుబాటే! పోలీస్ స్టేషన్పై భారత జాతీయజెండాను ఎగురవేయడానికి వేలాదిమందితో (వీరిలో ఎక్కువమంది స్త్రీలు) మాతంగినీ బయలుదేరింది. పోలీస్ స్టేషన్ ఉన్న ఊరు సమీపానికి ఆమె తన అనుయాయులతో చేరుకున్నప్పుడు, యూరోపియన్ అధికారుల ఆధ్వర్యంలోని బ్రిటిష్ ఇండియన్ పోలీసు దళాలు అడ్డంగించాయి. అయినా ముందుకే కదలడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఆమె ‘వందేమాతరం’ నినాదం చేస్తూనే కుప్పకూలిపోయింది. ఆమె పక్కనే మార్చ్ చేస్తున్న ఇద్దరు యువకులు సఖావత్ అలీ, సతీష్ చంద్ర సామంతా పైనా పోలీసులు కాల్పులు జరపడంతో వారూ వీర మరణం పొందారు. మాతంగినీ హజ్రా భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అత్యంత ధైర్యవంతురాలిగా చరిత్ర లిఖించారు. తామ్లుక్లో ఆమె బలిదానం జరిగిన చోట ఆమె విగ్రహాన్ని ప్రతి ష్ఠించారు. ప్రస్తుతం ఉన్న తామ్లుక్ పోలీస్ స్టేషన్ పేరు ‘మాతంగినీ హజ్రా పోలీస్ స్టేషన్‘గా మార్చారు. భారత ప్రభుత్వం 2002లో ఆమె గౌరవార్థం ఒక తపాలా బిళ్లను జారీ చేసి తనను తాను గౌరవించుకుంది. -
భర్త కంపెనీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన అనురాధ
కొన్ని దశాబ్దాల క్రితం మారుతి వినాయక్ గోకర్ణ అనే యువ ఇంజినీర్ ఎన్నో కలలతో చిన్న కంపెనీ ప్రారంభించాడు. కొన్ని సంవత్సరాల తరువాత వినాయక్ చనిపోవడంతో కంపెనీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వినాయక్ భార్య అనురాధ (Anuradha M Gokarn) కు వ్యాపార వ్యవహారాల గురించి ఏమీ తెలియదు. అప్పటికి ఆమె వయసు 44 సంవత్సరాలు. ఇద్దరు పిల్లలు.‘యూనివర్శిటీ ఆఫ్ లండన్’లో ఇంగ్లీష్ ప్రొఫెసర్ అయిన అనురాధ కంపెనీ నిర్వహణ బాధ్యతను భుజాన వేసుకుంది. పాఠాలు చెప్పినంత తేలిక కాదు’ అన్నారు విమర్శకులు. అయితే కంపెనీ బాధ్యతలు తీసుకున్న తరువాత తానే ఒక గెలుపు పాఠం అయింది. అప్పుల బారిన పడిన కంపెనీని ఆరు సంవత్సరాల వ్యవధిలో లాభాల బాట పట్టించింది.కట్ చేస్తే...ఆ కంపెనీ పేరు... ట్రిటాన్ వాల్వ్(Triton Valves Ltd) మన దేశంలో ఆటోమోటివ్ టైర్ వాల్వ్లు, ఉపకరణాల తయారీలో అతి పెద్ద సంస్థ. వాహన పరిశ్రమకు అవసరమైన అత్యున్నతమైన టైర్ వాల్వ్లను అందించే ప్రపంచస్థాయి సంస్థగా ఎదిగింది.‘నిన్న చేసిన పొరపాటు నేడు పాఠం అవుతుంది. నా వ్యాపార ప్రస్థానంలో అలాంటి పాఠాలు ఎన్నో నేర్చుకున్నాను’ అని తన సక్సెస్మంత్రా గురించి చెప్పింది అనురాధ గోకర్ణ.చదవండి: నో టికెట్.. నో మనీ : విమానం ల్యాండింగ్ గేర్ పట్టుకుని ఢిల్లీకి వచ్చిన ఆఫ్ఘన్ బాలుడు -
కాక్పిట్ - క్యాబిన్ : మలేషియన్ ఎయిర్లైన్స్ చరిత్ర
మహిళా సాధికారత విషయంలో మలేషియా ఎయిర్లైన్స్ కీలక అడుగు వేసింది. పూర్తిగా మహిళా సిబ్బందితో తన తొలి విమానాన్ని ప్రారంభించింది. చెక్-ఇన్ కౌంటర్ల నుండి, కాక్పిట్ నుండి క్యాబిన్ వరకు, మొత్తం విమాన ప్రయాణంలోని ప్రతి దశలోనూ మహిళలేబాధ్యతల్లో ఉండటం విశేషం. తద్వారా పూర్తిగా మహిళా సిబ్బందితో తన తొలి విమానాన్ని విజయవంతంగా నిర్వహించడం ద్వారా మలేషియా ఎయిర్లైన్స్ చరిత్ర సృష్టించింది. సెక్యూరిటీ, పైలట్లు, కో-పైలట్లు , క్యాబిన్ క్రూ సహా పూర్తిగా మహిళా బృందమే ఉండటమే దీని విశేషం. కౌలాలంపూర్ నుండి కోటా కినాబాలుకు బయలుదేరిన విమానం (MH2610) ఎగిరింది.ఈ సమాచారాన్ని మలేషియన్ ఎయిర్లైన్స్ ఫేస్బుక్లో వెల్లడించింది. మహిళల శక్తి సామర్థ్యాలను, వృత్తి నైపుణ్యం,నాయకత్వం గుర్తించాలని పేర్కొంది.మలేషియా ఏవియేషన్ గ్రూప్ శ్రామిక శక్తిలో మహిళల సంఖ్య 36 శాతంగా ఉంది. పురుషాధిపత్యం ఉన్న విమానయాన రంగంలో మహిళల ప్రాతినిధ్యంపై అంతర్జాతీయ వాయు రవాణా సంఘం (IATA) 2025 మైలురాయిని అధిగమిండమనే కేవలం పురోగతిని మాత్రమే కాదు, ఆకాశానికి పరిమితులు లేవనే విషయాన్ని ఇది సూచిస్తుందని అని మలేషియా ఎయిర్లైన్స్ ఫేస్బుక్ పోస్ట్లో రాసింది. ఇది మరింతమందికి ప్రేరణ కావాలని అభిలషించింది. ఆశావహులైన విమానాన్ని నడపాలనుకునే వారు, తదుపరి తరం అమ్మాయిలు అడ్డంకులను అధిగమించి, తమ కలలను సాధించడంలో తమ చర్య ప్రోత్సాహాన్నిస్తుందని ఎయిర్లైన్ పేర్కొంది.ఇదీ చదవండి: Hair Dye: మెరిసిందని మురిసిపోవద్దు.. ఈ జాగ్రత్తలు మస్ట్ మలేషియా ఎయిర్లైన్స్ ప్రకారం, దేశీయ , అంతర్జాతీయ మార్గాల్లో 8,200 గంటలకు పైగా అనుభవం ఉన్న అనుభవజ్ఞురాలైన పైలట్ కెప్టెన్ నూర్సజ్రినా బింటి జుల్కిఫ్లి , ఇటీవల సర్టిఫికేషన్ పొందిన యువ పైలట్ సెకండ్ ఆఫీసర్ సితి నూర్ సయామిరా బింటి బహారుద్దీన్ బోయింగ్ 737-800 ను నడిపారు. -
విజయ దశమి: స్త్రీ శక్తి విజయానికి ప్రతీక
ఈ సకల చరాచర సృష్టిని నడిపించేది శక్తి. ఈ శక్తి లేకుండా త్రిమూర్తులు... బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు—తమ కృత్యాలైన సృష్టి, స్థితి, లయాలను నిర్వర్తించలేరు; కదలడం కూడా సాధ్యపడదు. ఆ పరమ శక్తినే అదిశక్తి లేదా పరాశక్తి అంటారు. ఈ శక్తి త్రిగుణాత్మకమైనది—సత్వ, రజస్, తమో గుణాలతో కూడినది. ఈ గుణాలు శక్తిబీజంతో సంయోగమైతే 'స్త్రీ' రూపం ధరిస్తుంది. అటువంటి త్రిగుణమయ శక్తి ఆవిర్భవించి దుష్ట రాక్షస సంహారం చేసిన కాలం శరదృతువు, ముఖ్యంగా ఆశ్వయుజ మాసంలో నవరాత్రులు.హిందూ సంస్కృతి మరియు ఆధ్యాత్మిక చైతన్యానికి శక్తివంతమైన ఆచారం దసరా! ఇది అమ్మవారికి తొమ్మిది రోజుల పాటు చేసే మహోత్సవం. ఆ శక్తిస్వరూపిణి సృష్టిలోని సకల ప్రాణకోటికి అమ్మ, అందుకే జగన్మాత. అమ్మవారి రూపంలో దైవాన్ని ఆరాధించడం అనాదికాలం నుంచి వస్తున్న సంప్రదాయం. భారతీయ సంస్కృతిలో శక్తి ఆరాధనకు ప్రధాన స్థానం ఉంది, ముఖ్యంగా దేవీ మహాత్మ్యం (మార్కండేయ పురాణంలోని భాగం)లో వివరించినట్లు, ఆమె దుష్ట సంహారం మరియు శిష్ట రక్షణ కోసం అవతరిస్తుంది.మహాశక్తి అవసరమైనప్పుడు దుష్ట సంహారం చేయడానికి లేదా శిష్ట రక్షణకు అవతరిస్తుంది. జీవులపై ఆమెకు అంతులేని ప్రేమ ఉంది. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు ఆమె అవతరణ మరియు రాక్షస సంహారం జరుగుతుంది. ఆ సమయంలో ఆదిపరాశక్తిని పూజించి అనుగ్రహం పొందడం సంప్రదాయం. దేవతలు, ఋషులు ఆమెకు పుష్టి కలిగించేందుకు యజ్ఞాలు, హోమాలు, జపాలు, తపాలు, పూజలు, పారాయణాలు చేశారు. మనుషులు కూడా తమకు తోచిన దీక్షలు పూనుకున్నారు.ప్రథమంగా ఆవిష్కృతమైన శక్తి తమోగుణ ప్రధానమైన మహాకాళి. నిర్గుణ పరాశక్తి మొదటి సగుణ ఆవిర్భావం మహాకాళి, అందుకే త్రిశక్తులలో—మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి—మహాకాళి మొదటిది. సావర్ణి మన్వంతరంలో ఆదిపరాశక్తి రజోగుణ ప్రధానమైన మహాలక్ష్మిగా అవతరించింది. దానికి కారణం మహిషాసురుడు. ఈ తత్త్వాన్ని అర్థం చేసుకోవడం ఏ కాలంలోనైనా అవసరం. మహిషాసురులు—అంటే అహంకారం, కామం వంటి దుర్గుణాలు—ఎప్పుడూ ఉంటాయి. అందుకే మహిషాసుర మర్దిని మహాలక్ష్మి అవసరం ఎప్పుడూ ఉంటుంది.మహిషాసుర సంహార కథ: త్రిమూర్తుల నుంచి ఉద్భవించిన తేజస్సు అమ్మవారిగా రూపుదాల్చింది. దేవతలందరూ తమ తేజస్సు, ఆయుధాలు సమకూర్చారు. మహిషుడు తన సంహారం కోసమే ఆమె వచ్చిందని తెలిసినా, ఆమెను ప్రలోభపెట్టాలని ప్రయత్నించాడు. ఆమె అంగీకరించకపోవటంతో, కామరూపిగా రకరకాల రూపాల్లో యుద్ధం చేశాడు. దేవి తగిన రూపాలు ధరించి మహిష రూపంలోని రాక్షసుని సంహరించింది. ఇది ఆశ్వయుజ శుద్ధ నవమి రోజున జరిగింది. దీక్ష వహించినవారు దశమి నాడు జగదంబను స్తుతించి, పట్టాభిషేకం చేసి, స్త్రీ శక్తి విజయాన్ని జరుపుకున్నారు. ఆమె వారిని వరం కోరమని చెప్పగా, అవసరమైనప్పుడు కాపాడమని కోరారు. ఆమె తలచినప్పుడు అవతరిస్తానని మాటిచ్చింది.మరొక కథ శుంభ-నిశుంభులది. వారు బ్రహ్మను తపస్సుతో మెప్పించి, అమర, నర, పశు, పక్షి పురుషుల వల్ల చావులేని వరం పొందారు. స్త్రీలు బలహీనులని భావించి, వారి వల్ల భయం లేదని చెప్పారు. ఆ తర్వాత స్వర్గంపై దాడి చేసి, ఇంద్రాసనాన్ని ఆక్రమించారు. దిక్పాలకులు, సూర్య-చంద్రాది దేవతలను ఓడించి, వారి పదవులు గ్రహించారు. దేవతలు బృహస్పతి సూచనతో హిమవత్పర్వతంపై దేవిని శరణు వేడారు. జగదంబ అభయం ఇచ్చింది.ఆ సమయంలో సర్వదేవతలు తమ శక్తులను మాతృకాగణాలుగా పంపారు. ఇవి ఆయా దేవతల ఆభరణాలు, ఆయుధాలు, వాహనాలతో వచ్చి రక్తబీజ సైన్యాన్ని సంహరించాయి.మాతృకాగణాలు:బ్రహ్మ శక్తి: బ్రహ్మాణి (హంస వాహనం, కమండలు).విష్ణు శక్తి: వైష్ణవి (గరుడ వాహనం, చక్రం).శివ శక్తి: మాహేశ్వరి (వృషభ వాహనం, త్రిశూలం).కుమారస్వామి శక్తి: కౌమారి (మయూర వాహనం, శక్తి).ఇంద్ర శక్తి: ఐంద్రి (ఐరావత వాహనం, వజ్రం).వరాహ శక్తి: వారాహి (మహిష వాహనం, ఖడ్గం).నరసింహ శక్తి: నారసింహి (సింహ వాహనం, చక్రం).వీటికి తోడు వారుణి (పాశం), యామి (దండం), శివదూతి మొదలైనవి దానవులను సంహరించాయి. రక్తబీజుడు రక్త బిందువుల నుంచి కొత్త రాక్షసులు పుట్టించాడు. అప్పుడు అంబిక కాళికను రక్తం తాగమని చెప్పింది. కాళిక రక్తం తాగి, దేవి రక్తబీజుని సంహరించింది. తర్వాత నిశుంభుని తల నరికి, మొండెం కూడా నాశనం చేసింది. శుంభుని మాటలతో యుద్ధానికి ఆహ్వానించి సంహరించింది. ఇది మహా సరస్వతి అవతారం. మాట నైపుణ్యంతో విజయానికి సంకేతం.నవరాత్రులలో లలితా దేవి అవతారం ప్రాధాన్యం. బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానంలో వివరించినట్లు, ఆమె సర్వచైతన్య స్వరూపిణి. బండాసురుడు (అజ్ఞానం, మూఢత్వం)ను సంహరించేందుకు అవతరించింది. జీవితం కేవలం భౌతిక సుఖాలే కాదు; చైతన్యం అవసరం. బండతనం మీద చైతన్యం విజయం—విజయదశమి సంకేతం.ప్రాంతీయ వైవిధ్యాలు: బెంగాల్లో దుర్గాపూజ ఘనంగా జరుపుకుంటారు, మహిషాసుర సంహారాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శిస్తారు. దక్షిణ భారతంలో బొమ్మల కొలువు (గొల్లు), బతుకమ్మ (తెలంగాణలో పూలను పూజించే పండగ), కుంకుమార్చన, చండీహోమాలు చేస్తారు. ఇవన్నీ సామూహిక ఐక్యత, స్త్రీ శక్తి గౌరవాన్ని పెంపొందిస్తాయి.‘యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా, నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః.’సమాజంలో మంచి-చెడు సంఘర్షణలో మంచి గెలుస్తుంది. విజయదశమి దానికి ప్రతీక. శరీర అనారోగ్యం, మానసిక దుర్గుణాలు, సామాజిక దురాచారాలు, పర్యావరణ మాలిన్యాలు, స్వార్థం, అహంకారం.. వీటన్నింటి మీద విజయం సాధించడమే విజయ దశమి. ముఖ్యంగా స్త్రీల పట్ల చులకన భావం మీద స్త్రీ శక్తి విజయం. సద్భావనలు పెంపొందించుకునే పవిత్రమైన రోజు ఇది.హిందూ సంస్కృతిలో విజయ దశమి ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక ఉత్సవం. ఆశ్వయుజ మాసంలో జరిగే ఈ నవరాత్రి ఉత్సవం జగన్మాత శక్తి స్వరూపాన్ని ఆరాధించే సమయం. ఈ పండుగ దుష్ట సంహారం, శిష్ట రక్షణ మరియు స్త్రీ శక్తి విజయానికి ప్రతీక.- చింతా గోపిశర్మ సిద్ధాంతి -
ఫస్ట్ క్లాస్ జర్నీ
కాస్త సరదాగా చెప్పుకోవాలంటే... ‘నువ్వు ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేటు’ అనే ఆరుద్ర మాట సురేఖ యాదవ్కు వర్తించదు. నిజానికి రైలే ఆమెను వెదుక్కుంటూ వచ్చింది. ఆసియా ఫస్ట్ ఉమెన్ ట్రైన్ డ్రైవర్గా చరిత్ర సృష్టించిన సురేఖ రిటైర్ అయింది. ఆమె ఒక రైలుబడి. ఆ బడిలో ఎన్నో విలువైన పాఠాలు ఉన్నాయి. భావితరాలకు మార్గదర్శకాలు ఉన్నాయి. మహారాష్ట్రలోని సతారలో పుట్టి పెరిగింది సురేఖ. అయిదుగురు పిల్లల్లో పెద్దది. తండ్రి రామచంద్ర భోంస్లే రైతు. సతారాలోని సెయింట్ పాల్ కాన్వెంట్ హైస్కూలులో చదువుకున్న సురేఖ వృత్తివిద్యా కోర్సులో చేరింది. ఆ తరువాత.. కరాద్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్లో డిప్లమా, బీఎస్సీ(మ్యాథ్స్), బీయీడీ చేసింది.టీచర్ కాదు రైలు డ్రైవర్బీయీడీ చేసిన సురేఖ టీచర్ కావాలనుకునేది. అయితే ఆమెకు రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేసే అవకాశం వచ్చింది. ముంబైలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఇంటర్వ్యూను విజయవంతంగా పూర్తి చేసుకొని సెంట్రల్ రైల్వేస్లో ట్రైనీ అసిస్టెంట్ డ్రైవర్గా చేరింది. 1985లో కల్యాణ్ ట్రైనింగ్ స్కూల్లో ఆరు నెలల పాటు శిక్షణ తీసుకుంది. అసిస్టెంట్ డ్రైవర్గా ఆమె వృత్తి ప్రయాణం మొదలైంది. వాడి బందర్, కల్యాణ్ల మధ్య నడిచే గూడ్స్ ట్రైన్లో ఇంజిన్ రన్నింగ్ కండీషన్, సిగ్నల్స్... మొదలైన వాటిని పర్యవేక్షించేది. కొన్ని సంవత్సరాల తరువాత పూర్తిస్థాయిలో గూడ్స్ డ్రైవర్గా బాధ్యతలు స్వీకరించింది. ఆ తరువాత వెస్ట్రన్ ఘాట్ రైల్వేస్లో డ్రైవర్గా పనిచేసింది.→ దక్కన్ క్వీన్ డ్రైవ్ చేసిన క్వీన్దక్కన్ క్వీన్(డైలీ పాసింజర్ ట్రైన్) డ్రైవర్గా పాసింజర్ ట్రైన్ను నడిపిన ఆసియాలోని తొలి మహిళగా గుర్తింపు పొందింది సురేఖ. ఘాట్ లైన్ కోసం రెండు–ఇంజిన్ల ప్యాసింజర్ ట్రైన్ నడపడానికి ప్రత్యేక శిక్షణ తీసుకుంది. గతంలో మహిళలు ఎవరూ ఘాట్ లైన్లో ట్రైయిన్ నడపక పోవడం వల్ల పై అధికారులకు సందేహాలు ఉండేవి. వాటిని పటాపంచలు చేస్తూ ‘శభాష్’ అనిపించుకుంది సురేఖ. ‘దక్కన్ క్వీన్ ట్రైన్ నడపాలనేది నా కలగా ఉండేది. ఎందుకంటే మహిళ పేరుతో నడిచే రైలు అది. ఆ పేరులో రాజసం ధ్వనిస్తుంది. ఆ కల నెరవేరినందుకు సంతోషంగా ఉంది. భారతీయ రైల్వే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గర్వంగా ఉంది. మహిళలకు ప్రత్యేకించిన ట్రైన్స్ను నడపడం కూడా సంతోషంగా ఉంది’ అంటుంది సురేఖ.→ గురువుగా...ఎక్స్ప్రెస్ మెయిల్ డ్రైవర్గా 2011లో ప్రమోట్ అయిన సురేఖ ఆ తరువాత కల్యాణ్లో డ్రైవర్స్ ట్రైనింగ్ సెంటర్ (డిటీసి)లో సీనియర్ ఇన్స్ట్రక్టర్గా పాఠాలు బోధించింది. మన దేశంలో ట్రైన్ నడిపిన తొలి మహిళగా గుర్తింపు తెచ్చుకున్న సురేఖ ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తినిచ్చింది. 2011లో 50 మంది మహిళలు సబర్బన్, గూడ్స్ ట్రైన్ డ్రైవర్లుగా ప్రయాణం మొదలుపెట్టారు. ఇలాంటి ఎంతోమంది మహిళలకు స్ఫూర్తి...సురేఖ.→ ఆ ప్రోత్సాహమే ఉత్సాహమై...‘ఆడవాళ్లు ట్రైన్ డ్రైవర్ ఏమిటి! అని ఆశ్చర్యపోయే రోజుల్లో కూడా నా కుటుంబం, మిత్రులు, బం«ధువుల నుంచి ప్రోత్సాహం లభించింది. ఆ ప్రోత్సాహమే ఉత్సాహమై నన్ను ముందుకు నడిపించింది. వృత్తిజీవితంలో నాకు ఎలాంటి వివక్షా ఎదురుకాలేదు. ట్రైన్ ఎక్కిన తొలి క్షణం నుంచి మరే విషయాలు మదిలో రాకుండా ప్రశాంతంగా ఉండేలా చూసుకునేదాన్ని’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది సురేఖ. నిజానికి ఆమె రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. అయితే ఆ ఉద్యోగమే ఆమెను చరిత్రలో గుర్తింపు తెచ్చుకునేలా చేసింది.ఘనమైన వీడ్కోలుసురేఖ యాదవ్ ఫేర్వెల్ సెలబ్రేషన్ ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ (సీఎస్ఎంటీ)లో ఘనంగా జరిగింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన సురేఖ ఆత్మీయలు, స్నేహితులు, బంధువులు, రైల్వే ఉద్యోగులు ఆమె మెడలో పూలమాలలు వేశారు. డోళ్లు వాయిస్తూ నృత్యాలు చేశారు. ‘సురేఖ రిటైర్ అయినప్పటికీ... ఆమెలోని శక్తి సామర్థ్యాలు రిటైర్ కావు. అవి ఎప్పుడూ ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తూనే ఉంటాయి’ అన్నారు వక్తలు.కష్టం లేదు... ఎప్పుడూ ఇష్టమే!‘ట్రైయిన్ నడపడం అంటే మాటలా!’లాంటి మాటలు వినిపించినప్పటికీ నేను ఎప్పుడూ భయపడలేదు. చాలా ధైర్యంగా, ఉత్సాహంగా శిక్షణ తీసుకున్నాను. ఈ ఉద్యోగంలోకి ఎందుకు వచ్చానా అని ఎప్పుడూ అనుకోలేదు. ఉద్యోగం ఎప్పుడూ కష్టంగా అనిపించలేదు. కుటుంబ, వృత్తి బాధ్యతలను జాగ్రత్తగా సమన్వయం చేసుకునేదాన్ని.– సురేఖ యాదవ్ -
ఫుడ్ ఇంజనీర్..మిల్లెట్ బిజినెస్తో నెలకు రూ. 3 లక్షలు
అవసరం అన్నీ నేర్పించడమే కాదు.. ప్రయోగాల దిశగా ప్రేరేపిస్తుంది కూడా!అలాంటి ఒకానొక అవసరమే ఢిల్లీ వాసి పలక్ అరోరాను ఆంట్రప్రెన్యూర్గా మార్చింది! సద్గురు సూపర్ ఫుడ్స్’ను స్థాపించేలా, ‘మిల్లియమ్’ బ్రాండ్ను లాంచ్ చేసేలా చేసింది!కాలంతో పరుగులు పెడుతున్న కుటుంబాలకు దాన్నో వరంలా అందించింది! అయితే.. ఫుడ్ టెక్నాలజీలో ఎఫ్ఎస్సెస్సీ (ఊ ఇ) 22000 లీడ్ ఆడిటర్ సర్టిఫికెట్ పొందిన ఆమె ప్రయాణం హైటెక్ ల్యాబ్లోనో.. స్టార్టప్ ఇంక్యుబేటర్లోనో మొదలవ్వలేదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఆంట్రప్రెన్యూర్షిప్ అండ్ మేనేజ్మెంట్ (ఎన్ఐఎఫ్టీఈఎమ్) థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు.. కోవిడ్ లాక్ డౌన్ టైమ్లో మొదలైంది.ఆ అవసరం ఏంటంటే.. కోవిడ్ టైమ్లో ఇమ్యూనిటీని పెంచేదేగాక తేలికగానూ వండుకోగలిగే ఫుడ్ కోసం ఆన్లైన్లో వెదకడం మొదలుపెట్టింది. ఆ జాబితాలో రా మిల్లెట్స్ ... లేదంటే ముతక పిండే కనబడసాగింది. తప్ప రెడీ టు కుక్ లేదా రెడీ టు ఈట్ ప్రొడక్ట్స్ ఏమీ కనిపించలేదు. మిల్లెట్స్ పౌష్టికాహారమని అందరికీ తెలుసు.. కానీ వాటిని రాత్రంతా నానబెట్టడం, తెల్లవారి ఉడకబెట్టడం లాంటి సుదీర్ఘ ప్రక్రియ లేకుండా అప్పటికప్పుడు అత్యంత తేలికగా వండటమెలాగో ఎవరికీ తెలియదు. పలక్ ఆలోచనల్లో ఉన్నప్పుడే ఆమె తండ్రికి కిడ్నీ ఫెయిల్యూర్ అని నిర్ధారణ అయింది. దీర్ఘకాలంగా మైక్రోన్యూట్రియెంట్స్ అందక΄ోవడం వల్లే వాళ్ల నాన్నకు కిడ్నీ జబ్బు వచ్చిందని డాక్టర్స్ తేల్చారు. దాంతో తన అన్వేషణను మరింత వేగవంతం చేసింది.చదవండి: పెళ్లి చేసుకోవాలని అమెరికానుంచి వస్తే.. ఊపిరే తీసేశారు!పోషక విలువల బంచ్ఈజీ టు కుక్ ఫుడ్ మీద ప్రయోగాల కోసం పలక్.. తమ ఇంటి టెర్రస్నే కిచెన్గా మార్చుకుంది. ఆమె కనిపెట్టిన తొలి వంటకాల్లో స్ప్రౌటెడ్ మిల్లెట్ పోరిడ్జ్, మిక్స్డ్ వెజిటబుల్ ఇడ్లీలు, పంజాబీ స్టయిల్ చీలా (పాన్కేక్ లాంటిది) వంటివి ఉన్నాయి. ప్రతి వంటకాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో వంద సార్లు టేస్ట్, టెస్ట్ చేయించేది. ‘నా ఈ ప్రయత్నాన్ని ఎవరు నమ్మినా నమ్మకపోయినా మా నాన్న మాత్రం నమ్మారు. ప్రోత్సహించారు. ప్రతి చాలెంజ్లో నాకు అండగా నిలబడ్డారు. నా బిగ్గెస్ట్ స్ట్రెన్త్ మా నాన్నే!’ అని చెబుతుంది పలక్ అరోరా. 2021లో ‘సద్గురు సూపర్ఫుడ్స్’ పేరుతో సంస్థను రిజిష్టర్ చేయించింది. 2022లో ‘మిల్లియమ్’ అనే బ్రాండ్ను లాంచ్ చేసింది. దానికి హెల్దీ అండ్ జల్దీ అనే ట్యాగ్లైన్నూ పెట్టింది. ప్రిజర్వేటివ్స్,అడిటివ్స్ లేని ఈ ఫ్యూజన్ ఫుడ్ పోషకవిలువల సముదాయం. . మిల్లియమ్ ఉత్పత్తులన్నీ ఎఫ్ఎస్సెస్ఏఐ, ఏపిఈడీఏ, ఎమ్ఎస్సెమ్మీ, స్టార్టప్ ఇండియా ధ్రువీకరించినవే. అలా టెర్రస్ కిచెన్ నుంచి ఫుల్ప్లెడ్జ్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఎదిగిన ఆ బ్రాండ్ నెలకు ఎనిమిది టన్నుల రెడీ టు కుక్ ఆహారపదార్థాలను, 21 టన్నుల రెడీ టు ఈట్ మిల్లెట్ ప్రొడక్ట్స్ను ఉత్పత్తి చేస్తోంది. రాగి సూప్, మిల్లెట్ నూడుల్స్, పాస్తా, మిల్లెట్ పోహా నుంచి పాన్కేక్స్ దాకా మొత్తం పదిహేను రకాల వెరైటీస్ ఉన్నాయి. అందుబాటు ధరల్లో లభిస్తున్నాయి. నేడు, ఆమె చిరు ధాన్యాల ఆధారిత ఆహార వ్యాపారం ద్వారా ప్రతి నెలా రూ. 3 లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తుంది, సాంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక శాస్త్రంతో మేళవించి చక్కటి ఆహారాన్ని అందిస్తోంది. అలాగే చిరు ధాన్యాల సాగును పూర్తిగా వదిలివేసిన గ్రామీణ రైతులను మిల్లెట్స్ సాగుదిశగా ప్రోత్సహిస్తూ, వారికి అండగా నిలుస్తోంది. ఆమె దగ్గర ప్రస్తుతం ఎనిమిది మంది ఉద్యోగులున్నారు. స్థానికంగా మరింతమంది మహిళలకు కొలువులిచ్చి తన సంస్థను విస్తరింపచేయాలనుకుంటోంది పలక్. ‘ఈ మిల్లెట్ రివైవల్ అనేది కేవలం ఒక బిజినెస్ ఆపర్చునిటీయే కాదు సస్టెయినబుల్ అగ్రికల్చర్, ఫుడ్ సెక్యూరిటీ కూడా. అందుకే పొలం నుంచి ఫోర్క్ దాకా ప్రతి దశలోనూ అవకాశాలను క్రియేట్ చేస్తూ పౌష్టికాహారాన్ని అందించడమే మా లక్ష్యం. అదే నిజమైన విజయంగా భావిస్తాను’ అంటుంది పలక్. -
ఈ బామ్మ రోజూ జైలుకు!
ఎనభై మూడు సంవత్సరాల అరుణ సరీన్ రోజూ జైలుకు వెళుతుంది. అలాగని ఆమె బంధువులు ఎవరూ జైలులో లేరు. గత పాతిక సంవత్సరాలుగా అరుణ జైలుకు వెళ్లడానికి కారణం ఖైదీలకు యోగా నేర్పించడం, సాధనం చేయించడం!‘చాలా మంది ఉదయం ఆలయానికి వెళ్లినట్లే నేనూ జైలుకు వెళుతుంటాను’ నవ్వుతూ అంటుంది మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు చెందిన అరుణ. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న అరుణ విపశ్యన ధ్యానప్రక్రియను సాధన చేసేది. ఆ సమయంలో ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ కోర్సులకు సంబంధించి కరపత్రం ఒకటి చదివింది. ఆ కోర్సులు నేర్చుకోవడానికి రెడీ అయింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్యాంపస్లో ఎన్నో కోర్సులు నేర్చుకుంది. ఆ తరువాత ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్గా కొత్త ప్రయాణం ప్రారంభించింది.‘తొలిసారిగా జైలుకు వెళ్లినప్పుడు భయంగా ఏమీ అనిపించలేదు. జైలులో ఎలా ఉంటుందో ఆసక్తికరంగా పరిశీలించాను. ఖైదీలతో వివరంగా మాట్లాడాను. వారితో కలిసి భోజనం చేశాను. ప్రతి నిమిషం హాయిగా గడిచినట్లు అనిపించింది. యోగా, «ధ్యానం ప్రాముఖ్యత గురించి వారికి తెలియజేశాను’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంటుంది అరుణ.ఆనాటి నుంచి ప్రతిరోజూ ఉదయం జైలులో నాలుగు గంటల పాటు యోగా సెషన్లు నిర్వహిస్తోంది. జబల్పూర్ మాత్రమే కాదు ఇండోర్, సాత్న, భోపాల్లతో పాటు మధ్యప్రదేశ్లోని పది కారాగారాలలో యోగా సెషన్లు నిర్వహిస్తోంది.‘హ్యాపీనెస్ ప్రోగ్రామ్’ పేరుతో తాను నిర్వహించే కార్యక్రమాల వల్ల ఖైదీల ఆలోచనా ధోరణిలో మార్పు రావడాన్ని ఆమె గ్రహించింది. చాలామంది ఖైదీలు ఎప్పుడు చూసినా నిరాశ, నిస్పృహలతో కనిపించేవారు. అలాంటి వారికి జీవనోత్సాహాన్ని కలిగించడంలో ‘హ్యాపీనెస్ ప్రోగ్రామ్’ ప్రభావం ఎంతోఉంది.‘కోర్స్ పూర్తి చేసుకున్న ఖైదీలలో ఎంతో మార్పు వచ్చింది. తగాదాలు తగ్గాయి. కొద్దిమంది ఖైదీలలో విపరీతమైన కోపం ఉండేది. ఆ కోపంలో బ్లేడ్తో కోసుకొని తమకు తాము హాని చేసుకునేవారు. అలాంటి వారిలో పూర్తిగా మార్పు వచ్చింది’ అంటుంది అరుణ. గతంలో కొందరు ఖైదీలు జైలు నుంచి పారి΄ోవడానికి ప్రయత్నం చేసేవారు. అలాంటి వారిలో కూడా ‘హ్యాపీనెస్ ప్రోగ్రామ్’ మార్పు తీసుకువచ్చింది. మాదకద్రవ్యాల కేసులో జైలుకు వెళ్లాడు రాజు. జైలు నుంచి విడుదలయ్యాక కూడా మళ్లీ అదే అక్రమ వ్యాపారం చేయాలనుకునేవాడు. అయితే అరుణ నిర్వహించే హ్యాపీనెస్’ కార్యక్రమంతో అతడిలో మార్పు వచ్చింది.జైలు నుంచి విడులైన రాజు మాదకద్రవ్యాల జోలికి వెళ్లకుండా కూలి పనులు చేసుకొని బతుకుతున్నాడు. స్థూలంగా ‘హ్యాపీనెస్ ప్రోగ్రాం’ ద్వారా ఖైదీలకు యోగా, ధ్యానం మాత్రమే పరిచయం కాలేదు. ఉత్సాహంతో కూడిన కొత్త జీవన విధానం పరిచయం అయింది. జైలు బయట రెడ్ క్రాస్ స్వచ్ఛంద సేవకులతో కలిసి ఎన్నో సేవాకార్యక్రమాలలో పాల్గొంటుంది అరుణ. మద్యం బారిన పడిన ఎంతోమందిని ఆ దురలవాట్ల నుంచి బయటకు తీసుకువచ్చింది. ‘జైలులో నిర్వహించే హ్యాపీనెస్ ప్రోగ్రాం వల్ల ఖైదీలలో క్రమశిక్షణ పెరిగింది’ అంటున్నాడు జబల్పూర్ సెంట్రల్ జైలు సూపరిండెంట్ అఖిలేష్ తోమర్. -
అంధుల T20లో వైజాగ్ అమ్మాయి
‘నాకు బాల్ కనపడదు. కాని నా మైండ్తో, చెవులతో దాని రాకను పసిగట్టి కొడతాను’ అంటోంది విశాఖ అంధబాలిక పాంగి కరుణ కుమారి. పదో తరగతి చదువుతున్న కరుణ బ్యాటింగ్లో దిట్ట. అందుకే నవంబర్ 11న ఢిల్లీలో తొలిసారి నిర్వహించనున్న అంధుల టి20 వరల్డ్ కప్కి భారత జట్టులో ఎంపికైంది. తెలుగువారు సంతోషపడాల్సిన సందర్భం ఇది. స్ఫూర్తినిస్తున్న కరుణ కుమారి పరిచయం.స్కూలు పుస్తకాల్లో అక్షరాలు కనపడటం లేదని చదువు మానేసి ఇంట్లో కూచున్న అమ్మాయి నేడు భారత దేశ అంధ మహిళల క్రికెట్ జట్టులో స్థానం సం పాదించింది. ఆ అమ్మాయి పాంగి కరుణకుమారి. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతం వంట్ల మామిడికి చెందిన అరుణ ప్రస్తుతం విశాఖపట్నం అంధ బాలికల ఆశ్రమ పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. ఢిల్లీలో నవంబర్ 11 నుంచి జరగనున్న అంధ మహిళల టి20 వరల్డ్ కప్లో ఆమె భారత్ తరఫున ఆడనుంది. అంధ మహిళల కోసం టి20 వరల్డ్ కప్ నిర్వహించడం ఇదే ప్రథమం.ఆమె ఆల్రౌండర్వంట్ల మామిడిలో కూలినాలి చేసుకునే రాంబాబు, సంధ్యల మొదటి కుమార్తె కరుణ పుట్టుకతోనే దృష్టిలోపంతో పుట్టింది. ఒక కన్ను కొద్దిగా మరో కన్ను పూర్తిగా కనిపించేది కాదు. ఏడవ తరగతి వచ్చేసరికి చూపు దాదాపుగా పోవడంతో చదువు మానేసి ఇంట్లో కూచుంది. అయితే చిన్నప్పటి నుంచి ఆటల్లో చురుగ్గా ఉండేది. ఫోన్లో క్రికెట్ చూసేది. ఈ విషయం తెలిసి అంధ బాలికలను వెతికి చదివించే బాధ్యతతో విశాఖ అంధ బాలిక ఆశ్రమ పాఠశాల వారు కరుణ తల్లిదండ్రులను ఒప్పించి తమ స్కూల్లో చేర్పించారు. రెసిడెన్షియల్ స్కూల్ కావడం వల్ల అక్కడ కరుణ తిరిగి చదువులో, ఆటల్లో పడింది. క్రికెట్ పట్ల ఉన్న ఆసక్తి గమనించిన పీటీ మేడమ్ కరుణనుత్సహించింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్.. మూడింటిలో ప్రతిభ చూపుతూ ఆల్రౌండర్గా ఎదిగింది కరుణ. నేషనల్ సెలక్షన్స్లో భాగంగా 2023లో హైదరాబాద్లో, 2024లో హుగ్లీలో, 2025లో కొచ్చిలో మేచెస్ ఆడింది. సెలెక్టర్ల దృష్టిలో పడింది.60 బాల్స్లో 100 పరుగులుఅంధ మహిళల టి20 వరల్డ్ కప్ జట్టు ఎంపిక కోసం ఆగస్టు నెలలో బెంగళూరులో 20 రోజుల క్యాంప్ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన మ్యాచ్లో కరుణ 60 బంతుల్లో 100 పరుగులు చేయడమే కాక 114 నాటౌట్గా నిలిచింది. బౌలింగ్లో, ఫీల్డింగ్లో కూడా ప్రతిభ చూపింది. దాంతో భారత జట్టుకు కరుణను సెలెక్ట్ చేశారు. ‘నాకు బాల్ కనపడదు. కాని దాని రాకను పసిగట్టగలను. బాల్ రాకను అర్థం చేసుకోలేనప్పుడు అది ఒంటికి తగిలి దెబ్బలయ్యేవి’ అని తెలిపింది కరుణ. ఆమె ఆర్థిక స్థితి అంతంత మాత్రంగా ఉంది. ఇల్లు కూడా నివాస యోగ్యంగా లేదు. ఇన్ని ప్రతికూలతల్లోనూ ప్రతిభ చూపుతోంది కరుణ.ఆరు దేశాలతో...అంధ మహిళల టి20 వరల్డ్ కప్లో మొత్తం ఆరు దేశాలు పాల్గొంటున్నాయి. ఢిల్లీ, బెంగళూరుల్లో మ్యాచ్లు జరుగుతాయి. ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక, నే పాల్, అమెరికా, ఇంగ్లాండ్ జట్లు కలిసి 21 లీగ్ మేచ్లు, 2 సెమీ ఫైనల్స్, ఒక ఫైనల్ను ఆడనున్నారు. ఈ వరల్డ్ కప్లో మన దేశం కప్పు గెలవాలని, మన కరుణ గొప్ప ప్రతిభ చూ పాలని కోరుకుందాం. -
ప్రపంచంలోనే తొలి ఏఐ కేబినేట్ మంత్రి..! ఎందుకోసం అంటే..
ఇంతవరకు ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ ఆర్థిక రంగం, ఎంటర్టైన్మెంట్, రవాణ, ఆరోగ్య సంరక్షణ వరకు అన్నింటిలోకి వచ్చేసి తన సత్తా ఏంటో చూపించింది. దాంతో అస్సలు ఇక మ్యాన్పవర్తో పనిలేదు, అస్సలు ఉద్యోగాలు కూడా ఉండవేమో అనే గుబులు అందరిలోనూ పెంచేసింది. అలాంటి తరుణంలో మరో బాంబు పేల్చింది ఏఐ. రాజకీయాల్లో కూడా తన ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యి..పాలకులకు పనిలేకుండా చేస్తుందో లేక పాలకులే అవసరం లేకుండా అంతా సాంకేతికత మయం అవుతుందో తెలియాల్సి ఉంది. ఇదంతా ఎందుకంటేఓ దేశంలో ఏఐ.. ఏకంగా మంత్రిగా పాలన సాగిస్తోంది. అంతేగాదు రాజకీయాల్లో మహామహులునే తలదన్నేలా చక్రం తిప్పబోతోంది. ఔను ఇదంతా నిజం. ఇంతకీ ఇదంతా ఎక్కడంటే..అల్బేనియా దేశం ఆ చొరవను తీసుకుని సరికొత్త అధ్యయనానికి తెరతీసింది. పైగా అవినీతిని నిర్మూలించడం కోసం పాలిటిక్స్లోని ఏఐ సాంకేతికతను తీసుకొస్తున్నట్లు పేర్కొంది. ఆ నేపథ్యంలోనే ఏఐ డియెల్లా అనే మహిళా కేబబినేట్ మంత్రినే నియమించి అందర్ని విస్తుపోయాలా చేసింది అల్బేనియా ప్రభుత్వం. అంతేగాదు ప్రపంచంలోని మొట్టమొదటి ఏఐ కేబినేట్ మంత్రిని నియమించుకున్న దేశంగా అల్బేనియా వార్తల్లో నిలిచి, హాట్టాపిక్గా మారింది.అల్బేనియాలో ఈ ఏఐ మంత్రి పాత్ర..ఒకానొక సమ్మర్లో ప్రధాన మంత్రి ఏడీ రామ మాట్లాడుతూ..ఏదో ఒక రోజు ఏఐ డిజిటల్ మంత్రి, ప్రధాన మంత్రి కూడా రావొచ్చేమో అని కామెడీగా అన్నారు. ఇలా అన్నారో లేదో ఊహకందని విధంగా ఆ రోజు రానే వచ్చేయడం విశేషం. ఇటీవలి జరిగిన సోషలిస్ట్ పార్టీ సమావేశంలో ఏయే మంత్రులు తదుపరి పదవికి కొనసాగుతారో, ఎవరో వెళ్లిపోతారో ప్రధాని రామ ప్రకటించారు. ఆ సమయంలోనే మానవేతర సభ్యురాలు డీయోల్లా అనే మహిళా ఏఐని కూడా ఆయన నేతలకు పరిచయం చేశారు. ఆమె భౌతికంగా హాజరు కానప్పటికీ ఈ సమావేశంలో తొలి సభ్యురాలు ఆమెనే. కృత్రిమ మేధస్సుతో (ఏఐ) సృష్టించబడిన ఏఐ మంత్రి అని పార్టీ సభ్యులకు తెలిపారు. అంతేగాదు ఇది సైన్స్ ఫిక్షన్ కాదని, డీయెల్లా విధి అని నాయకులకు చెప్పారు. తమ దేశంలోని అవినీతి నిర్మూలనే ధ్యేంగా ఈ ఏఐ మంత్రిని తీసుకొచ్చినట్లుగా వెల్లడించారు కూడా. ఇక ఈ ఏఐకి టెండర్లపై నిర్ణయాలు తీసుకునే బాధ్యత అప్పగించినట్లు కూడా తెలిపారు. అదంతా దశల వారీగా జరుగుతుందని, పైగా నూటికి నూరు శాతం అవినీతికి తావివ్వకుండా జరుగుతుందని చెప్పుకొచ్చారు.సింపుల్గా చెప్పాలంటే అల్బేనియా ప్రభత్వం చేసిన నిజమైన రాజకీయ చర్యగా అభివర్ణిస్తున్నారు నిపుణులు. ఇక ఈ ఏఐ మంత్రి గారు వాయిస్ కమాండ్ల ద్వారా బ్యూరోక్రాటిక్ అభ్యర్థనలను ప్రాసెస్ చేస్తూనే ఉన్నా.. ఇప్పటికే దేశ డిజిటల్ సేవల పోర్టల్ ద్వారా పౌరులకు సేవలు కూడా అందిస్తున్నట్లు సమాచారం. కాగా, ప్రధాని రామా ప్రకారం..ఈ వ్యవస్థ లంచాలు, బెదిరింపులు అరికట్టడంలో సహాయపడుతుందనేది సారాంశం. దీనిని నిజంగా పాలన పరిణామంలో ఒక గొప్ప మైలురాయిగా పేర్కొనవచ్చు. ఈ డెవలప్మెంట్ అల్బేనియా దేశాన్ని ప్రత్యేకమైనది నిలిచేలా చేసినప్పటికీ..ఈ ఘటన మాత్రం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది.(చదవండి: పెంపకంలో విఫలమయ్యారంటూ..ఆ తల్లిదండ్రులకు రూ. 2 కోట్లు జరిమానా..!) -
తెలంగాణ చీఫ్ పోస్ట్ మాస్టర్గా జనరల్గా వీణాకుమారి
తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్మాస్టర్ జనరల్గా డాక్టర్ వీణా కుమారి డెర్మల్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఢిల్లీలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా పనిచేసిన ఆమె పదోన్నతితో తెలంగాణ సర్కిల్కు బదిలీ అయ్యారు. ఇండియన్ పోస్టల్ సర్వీస్ 1998 బ్యాచ్ అధికారి అయిన వీణాకుమారి ఆ శాఖలో వివిధ స్థాయిల్లో పనిచేశారు. తపాలా శాఖ ఇటీవలే ప్రారంభించిన అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ 2.0 తయారీలో కీలక పాత్ర పోషించారు. కేంద్ర గనుల శాఖ జాయింట్ సెక్రటరీగా కూడా పనిచేసి ఆ శాఖలో పలు సంస్కరణలు ప్రారంభించటంలో కీలకంగా వ్యవహరించారు. తమిళనాడు సెంట్రల్ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్గా, ఢిల్లీ ఢాక్ భవన్ పీఎంయూ డైరెక్టర్గా, మైసూరు పోస్టల్ శిక్షణ కేంద్రం డైరెక్టర్గా, ధార్వాడ్ రీజియన్ డైరెక్టర్గా కూడా ఆమె విధులు నిర్వర్తించారు. (చదవండి: ‘రండి.. ఫొటో దిగుదాం’) -
మ్యాథ్స్ విత్ ఏఐ పఢాయి... హాయి
‘సైంటిస్ట్ కావాలి’ ‘ఐపీఎస్ ఆఫీసర్ కావాలి’... ఇలా ఆ పిల్లలకు ఎన్నో కలలు ఉన్నాయి. అయితే ఆ కలలకు అడ్డుగోడ గణితంపై వారికి ఉండే భయం. ‘పఢాయి విత్ ఏఐ’ అనే ఏఐ సాంకేతిక కార్యక్రమంతో పిల్లల్లో గణితంపై ఉండే భయాన్ని పోగొట్టింది ఐఏఎస్ అధికారి సౌమ్య ఝా. ‘పఢాయి విత్ ఏఐ’ పుణ్యమా అని పిల్లలకు ఏఐ అంటే భయం పోయింది. నైపుణ్యం సొంతం అయింది.రాజస్థాన్లోని టోంక్కు చెందిన అమన్ గుజర్ అనే విద్యార్థికి గణితం అంటే వణుకు. చాలా కష్టంగా, ఒత్తిడిగా అనిపించేది. గణితంలో ఎప్పుడూ బొటాబొటీ మార్కులు వచ్చేవి. అయితే అతడి భయానికి ‘పఢాయి విత్ ఏఐ’ ఫుల్స్టాప్ పెట్టింది. గణితం అంటే భయాన్ని పోగొట్టి, ఉత్సాహాన్ని పెంచింది.‘పఢాయి విత్ ఏఐ’ అంటే?అమన్ చదివే స్కూల్లో ‘పఢాయి విత్ ఏఐ’ పేరుతో ఏఐ ఆధారిత విద్యా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత క్లిష్టమైన గణిత సమస్యలనైనా సులభంగా అర్థమయ్యేలా విద్యార్థులకు వివరిస్తుంది. ‘గణితం అంటే ఒకప్పుడు ఉండే భయం ఏమాత్రం లేదు. ఇప్పుడు నాకు గణితం అనేది ఒక సబ్జెక్ట్ కాదు. ఆట. గణితంలోనూ మంచి మార్కులు సాధించడం నాకు ఎంతో గర్వంగా ఉంది. నూటికి నూరు మార్కులు తెచ్చుకోవాలనే ఆత్మవిశ్వాసం వచ్చింది’ అంటున్నాడు అమన్.ఐఏఎస్ అధికారి సౌమ్య ఝా ఆలోచన నుంచి పుట్టిందే... పఢాయి విత్ ఏఐ. ఆమె టోంక్ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలను సందర్శించినప్పుడు చాలామంది విద్యార్థులు గణితం, సైన్స్ సబ్జెక్ట్లలో వెనకబడి ఉన్నారనే విషయాన్ని అర్థం చేసుకుంది. చాలామంది విద్యార్థులు గణితంలో ఎందుకు వెనకబడిపోయారు? అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించింది సౌమ్య. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఎన్నికల డ్యూటీ, రకరకాల ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల ఉపాధ్యాయులు ఎక్కువ రోజులు బడికి దూరంగా ఉంటున్నారు.స్కూలు విద్యార్థులలో చాలామంది వ్యవసాయ కుటుంబానికి చెందిన వారు. వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు సహాయం అందించడానికి తరచు బడికి గైర్హాజరు అవుతుంటారు. గ్యాప్ రావడం వల్ల వారికి పాఠాలు అర్థం కావు. ఇలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకొని సాంకేతికతకు మానవ ప్రయత్నాన్ని జోడిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ‘పఢాయి విత్ ఏఐ’ కార్యక్రమానికి రూపకల్పన చేసింది సౌమ్య.ఐఏఎస్ తొలిరోజులలో కొన్ని సబ్జెక్లకు సంబంధించి తాను ఏఐ (ఆర్టిషిఫియల్ ఇంటెలిజెన్స్) సహాయం తీసుకునేది. ఆ విషయం గుర్తు తెచ్చుకొని, ఏ సబ్జెక్ట్ గురించి అయితే విద్యార్థులు భయపడుతున్నారో, ఆ భయాన్ని పోగొట్టడానికి ‘ఏఐ’ని అస్త్రంలా వాడాలని నిర్ణయించుకుంది.గత సంవత్సరం పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభమైన ‘పఢాయి విత్ ఏఐ’ని సరికొత్త మార్పులు చేర్పులతో ఈ సంవత్సరం ‘వెర్షన్–2’గా లాంచ్ చేశారు. ఈ అప్గ్రేడెడ్ వెర్షన్లో టీచింగ్ క్యాలెండర్, విద్యార్థుల ప్రతిభను మెరుగుపరిచే అత్యాధునిక సాంకేతిక పరికరాలు, ప్రతి వారం విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి. ‘పఢాయి విత్ ఏఐ’ని టోంక్ జిల్లాలోని 350కి పైగా ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. విద్యార్థులలో వచ్చిన మార్పు గురించి చాలా సంతోషంగా ఉన్న సౌమ్య ఝా – ‘ఇదేమీ మాయాజాలం కాదు. మానవ ప్రయత్నానికి తోడైన సాంకేతిక అద్భుతం’ అంటుంది. -
ఆర్మీడ్యూటీ అసలు బ్యూటీ
ఒక మోడల్ ఆర్మీ ఆఫీసర్ కావడమంట సౌందర్యం కంటే దేశం ముఖ్యం అనుకోవడమే. 2023లో ‘మిస్ ఇంటర్నేషనల్ ఇండియా’ కిరీటం గెలిచిన కషిష్ మెత్వాని 2024లో ‘కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎంట్రన్స్’లో 2వ ర్యాంకు సాధించింది. ఏడాది పాటు చెన్నైలో శిక్షణ పొందాక తాజాగా ఆమె లెఫ్టినెంట్ హోదాలో ఆర్మీ ఆఫీసర్గా దేశసేవకై అడుగు ముందుకేసింది. అందాల కిరీటం కన్నా ఆర్మీ యూనిఫామ్ గొప్ప సంతృప్తిని ఇస్తుందంటున్న పూణె అమ్మాయి కషిష్ పరిచయం.‘ముఝే సబ్కుచ్ కర్నా హై’... (నాకు అన్నీ సాధించాలని ఉంది)... ఇదీ కషిష్ మెత్వాని తరచూ చెప్పేమాట. ‘నాకు నచ్చిన పనులన్నీ చేస్తూ సంతోషాన్ని పొందడమే నాకు కావలసింది’ అని కూడా ఆమె చెబుతూ ఉంటుంది. పుణెకు చెందిన ఈ యువతి చిన్నప్పటి నుంచి సాధించినవి వింటే ఆశ్చర్యం వేస్తుంది. మోడల్గా, ‘మిసెస్ ఇంటర్నేషనల్ ఇండియా’ టైటిల్ విన్నర్గా గ్లామర్ రంగంలో రాణిస్తుందనుకుంటే ఏకంగా ఆర్మీ ఆఫీసర్గా ట్రైనింగ్ పూర్తి చేసుకుని సెప్టెంబర్ మొదటి వారంలో లెఫ్టినెంట్గా ‘ఆర్మీ ఎయిర్ డిఫెన్స్’లో పని చేయడానికి సిద్ధమైంది. ‘మా ఇంట్లో ఎవరూ ఆర్మీలో పని చేయలేదు. నేనే మొదటిదాన్ని. ఈ పని చాలా కష్టమని తెలుసు. కష్టమైనది సాధిస్తేనే కదా సంతోషం’ అంటోంది.న్యూరో సర్జన్ కాబోయి..కషిష్ మెత్వానీది పుణె. ఆమె తండ్రి సైంటిస్ట్గా పని చేస్తుంటే తల్లి టీచరుగా ఆర్మీ స్కూల్లో పాఠాలు చెప్పేది. ‘మా ఇంట్లో టీవీ ఉండేది. కాని ఏ రోజూ నేను దానిని చూసి టైమ్ వేస్ట్ చేసుకోలేదు. స్కూలు పుస్తకాలు చదవడం, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం చేసేదాన్ని. నేను ప్రతి పోటీలో పాల్గొని గెలవాలని కోరుకునేదాన్ని. అలాగే గెలిచేదాన్ని కూడా’ అంది కషిష్. చదువులో విశేష ప్రతిభ చూపిన కషిష్ చిన్నప్పుడు న్యూరోసర్జన్ కావాలనుకుంది. కాని స్కూల్లో, ఇంటర్లో ఎన్.సి.సిలో చేరడంతో ఆమె ఆలోచనలు మారాయి. ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో ఎన్.సి.సి కాడెట్గా పాల్గొనడం ఆమె మీద ప్రభావం చూపింది. ఆర్మీలో చేరాలన్న ఆలోచన అప్పుడే వచ్చింది. ఈలోపు చదువు కొనసాగించి ఎం.ఎస్సీ. చేశాక బెంగళూరులో న్యూరోసైన్స్లో థీసిస్ సమర్పించింది. ఆ సమయంలోనే హార్వర్డ్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేసే అవకాశం వచ్చినా తన జీవితం దేశసేవకే అంకితం అని కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎంట్రన్స్– 2024 రెండో ర్యాంక్ సాధించింది. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీలో శిక్షణ పూర్తయ్యాక ఆఫీసర్గా పని చేయడానికి ‘ఆర్మీ ఎయిర్ డిఫెన్స్’ వింగ్ను ఎంచుకుంది.బహుముఖ ప్రజ్ఞాశాలికషిష్ బహుముఖ ప్రజ్ఞాశాలి. చదువుతూనే పిస్టల్ షూటింగ్ నేర్చుకుంది. వాలీబాల్ ప్లేయర్గా ప్రతిభ చాటింది. తబలా నేర్చుకుంది. భరతనాట్యం సాధన చేసింది. అదేవిధంగా గ్లామర్ రంగంలో కూడా తన ఉనికి చాటుకోవడానికి మోడల్గా మారింది. అదే సమయంలో మిస్ ఇంటర్నేషనల్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. ఇవన్నీ 24 ఏళ్లలో సాధించింది. ఆ తర్వాత ఆర్మీ ఆఫీసర్ అయ్యింది. ‘ఇన్ని చేయడానికి కారణం నా తల్లిదండ్రులు నన్ను ప్రోత్సహించడమే. ఆర్మీ శిక్షణలో కూడా నేను ఎక్కడా తగ్గలేదు. శిక్షణా కాలంలో అనేక పోటీల్లో నేను ఫస్ట్ నిలిచాను’ అంటుంది కషిష్.సామాజిక సేవలో ఇన్ని పనులు చేసిన కషిష్ సామాజిక సేవలో కూడా తనదైన కృషి సాగిస్తోంది. ‘క్రిటికల్ కాజ్’ అనే ఎన్.జి.ఓ.ను స్థాపించి అవసరమైన వారికి ΄్లాస్మా, అవయవ దానం వంటి ప్రాణాధార సహాయం అందేలా చేస్తోంది. ‘మన కోసం మనం కష్టపడుతూనే సమాజం కోసం కూడా కష్టపడాలి. అది ప్రతి ఒక్కరి బాధ్యత’ అంటోంది కషిష్.నిజంగానే ఆమె ఒక భిన్నమైన ప్రతిభాశాలి. హార్వర్డ్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేసే అవకాశం వచ్చినా తన జీవితం దేశసేవకే అంకితం అని కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎంట్రన్స్– 2024 రెండో ర్యాంక్ సాధించి, శిక్షణ పూర్తయ్యాక ఆఫీసర్గా ‘ఆర్మీ ఎయిర్ డిఫెన్స్’ వింగ్ను ఎంచుకుంది కషిష్. -
సుదీర్ఘ చరిత్రకు సంక్షిప్త రూపం
దాదాపు 120 వేల సంవత్సరాల ప్రయాణం నుంచి ఓ 5 వేల సంవత్సరాల భారత ఉపఖండ చరిత్రను వేరు చేసి, సూక్ష్మంలో మోక్షంగా అందించడం సాహసమే! అమెరికాకు చెందిన చరిత్ర పరిశోధకురాలు, బోధకురాలైన ఆడ్రే త్రుష్కీ ఆ పని చేశారు. ఈ‘ఇండియా... 5000 ఇయర్స్’ పుస్తకం రాశారు. మధ్య యుగం కాలంలో సంస్కృతంపైన, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుపైన గతంలో రాసిన పుస్తకాల ద్వారా ఆడ్రే పేరు సుపరిచితమే. ఔరంగజేబును ఆనాటి సమకాలీన హిందూ, ముస్లిములిరువురూ గౌరవభావంతో చూశారనీ, ఆ తర్వాత కాలంలోనే ఆయనను రాక్షసుడిగా చిత్రించడం జరిగిందని ఆమె పేర్కొనడం అప్పట్లో వివాదాస్పదమైంది. ఒక వర్గం దాడులకు దిగవచ్చనే శంకతో ఆమె భారత్కు రావడానికి కూడా వెనుకాడాల్సి వచ్చింది. అయితే, బెదిరింపులు ఎన్ని ఉన్నా చరిత్ర పరిశోధకురాలిగా తన అధ్యయనం ఆగదని పేర్కొనే ఆడ్రే నాలుగో పుస్తకం ఈ ‘ఇండియా’. సాధికారికంగా చెబుతూనే, సామాన్యులకు అర్థమయ్యేలా చరిత్ర లోగుట్టు విప్పడం ఈ రచన ప్రత్యేకత. ఈ ప్రసిద్ధ ప్రిన్స్టన్ యూనివర్సిటీ ప్రచురణ ఒక రకంగా ఇది భారత భూఖండ చరిత్ర కాదు. ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దిన పరిణామాలు, ప్రజల చరిత్ర. వలసలు మానవ నాగరికతతో పాటు చరిత్రను మారుస్తాయని భావించిన ఆడ్రే ఆ కోణం నుంచి కలం కదిపారు. గతమెంతో ఘనమనే కీర్తిగానానికి భిన్నంగా రచన చేశారు. అందుకే, ఈ పుస్తకంలోని ఆనాటి జీవిత కథలు తెలియని కోణం తెర మీదకు తెచ్చి ఆశ్చర్యపరుస్తాయి. సుమారు 65వేల ఏళ్ళ క్రితం ఆఫ్రికా పరిసరాల ప్రాంతాల నుంచి వచ్చి, స్థిరపడిన జనమే ‘ఫస్ట్ ఇండియన్స్’ అనే మాటను ఆడ్రే పునరుద్ఘాటిస్తారు. వారి జన్యువులే ఇప్పటికీ ప్రధానంగా దక్షిణ భారతావనిలో కనిపిస్తాయంటారు.సాక్ష్యాధారాల సహితంగానే తప్ప అనుశ్రుత కథలతో చరిత్రను అక్షరీకరించలేమన్నది సరైన శాస్త్రీయ దృక్కోణం. ఈ రచన ఆ కోణంలోనే సాగుతుంది. దానివల్ల కొన్ని అంశాల్లో పాతుకుపోయిన నమ్మకాలను ‘ఇండియా’ సమర్థించదు. గతంలోకి తొంగి చూస్తున్నప్పుడు చరిత్రలోని భిన్న స్వరాలను వినిపించడం ముఖ్యమని ఆడ్రే భావన. అందుకే, బౌద్ధం, హైందవం వగైరా గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మహిళల గొంతుకలను వినిపించడానికి ప్రయత్నిస్తారు. ఈ చరిత్ర పునఃకథనంలో నిమ్నవర్గాలను ముందు నిలుపుతారు. అలాగే, ఆ రోజుల్లోనే ఉన్న ‘సోకాల్డ్’ శూద్ర రాజుల గాథల నుంచి అగ్రవర్ణ ఆధిపత్యాన్ని చూపే అలనాటి సాహిత్య రచనల్ని కూడా చాలామందికి భిన్నంగా అప్పటి చరిత్రపై అవగాహనకు ఆకరాలుగా వాడారు. హైందవం, బౌద్ధం, జైనం, ఇస్లామ్, వేదాలు, మౌర్య సామ్రాజ్యం, చోళులు, మొఘల్ సామ్రాజ్యం, యూరోపియన్ వలస పాలన, భారత స్వాతంత్య్రోద్యమం, చివరకు తాజాగా పెరిగిన హిందూ జాతీయవాదం దాకా అనేక అంశాలను ఈ రచనలో వివరించారు.అయిదు వేల ఏళ్ళ సుదీర్ఘకాలాన్ని దాదాపు 700 పేజీల ఒకే సంపుటంలో పొందుపరచాలన్నప్పుడు నిడివి రీత్యా ఉండే ఇబ్బందులు సహజం. అందుకే, చాలామందికి తెలిసిన అంశాలు, చరిత్ర అనగానే ఎక్కువగా కనిపించే రాజవంశ గాథలను రచయిత్రి పక్కనపెట్టేశారు. ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ రాజుల చరిత్ర, రాజకీయ చరిత్ర ఎంత ముఖ్యమో... సామాజిక, ఆర్థిక చరిత్ర అంతే కీలకమని గుర్తించి, ఈ రచనలో వాటికి ఆమె పెద్ద పీట వేశారు. ఆ రకంగా ఇది రోమిలా థాపర్ (romila thapar) లాంటి పలువురి కాలక్రమాణిక చరిత్ర రచనలకు పరిపూరకం.అయితే, ఆధునిక భారత చరిత్రలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు, నైజామ్లో రజాకార్ల ఆగడాలు, ప్రాంతీయ చరిత్రలను ఆడ్రే ప్రస్తావించక పోవడం ఆశ్చర్యకరమే. భారత్పై చైనా దురాక్రమణ, బంగ్లాదేశ్ విమోచన వగైరా ప్రస్తావించిన తీరేమో నిరాశపరుస్తుంది. వెరసి, సుదీర్ఘ చరిత్రకు సంక్షిప్త రూపమే తప్ప ఈ పుస్తకం సమగ్రం కాదు. సర్వజన సమ్మతమూ కాదు. అది గుర్తించి, ఒకే అంశానికున్న పలు పార్శ్వాలను తెలుసుకొనేందుకు చదివితే... ఈ రచన ఆసక్తి అనిపిస్తుందే తప్ప ఆశాభంగం కలిగించదు. -
ఆర్మీ ఆఫీసర్గా అందాలరాణి..!
అందం పరంగానూ సేవలోనూ మేటీ అనేలా విభిన్న రంగాల్లో సత్తా చాటారామె. గ్లామర్పరంగా నటన, మోడల్ రంగంల వైపుకి పరిమితం కాకుండా దేశ సేవలో పాలుపంచుకుని సైనికురాలు కావాలని ఆకాంక్షించిందామె. అత్యంత విరుద్ధమైన రంగాన్ని ఎంచుకుని యువతకు ఆదర్శంగా నిలిచింది. సుకుమారం అనేది శరీరానికే గానీ మనసుకు కాదని, మనః సంకల్పం ఉంటే ఎందులోనైనా రాణించగలం అని ప్రూవ్ చేసి స్ఫూర్తిగా నిలిచింది.ఆమెనే కాశీష్ మెత్వానీ. ఆమె 2023లో మిస్ ఇంటర్నేషనల్గా ఇండియాగా కిరీటాన్ని గెలుచుకుంది. నిజానికి అందాలరాణిగా సత్తా చాటగానే మోడలింగ్ ఆఫర్లు, యాక్టింగ్ ఆఫర్లు అందుకుని గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెడుతుంటారు చాలామంది. కానీ కాశీష్ అందుకు విరుద్ధంగా సాయుధ రంగాన్ని ఎంచుకోవడం విశేషం. నిజానికి ఆమె కుంటుంబం ఆర్మీ నేపథ్యానికి చెందింది కూడా కాదు. అయినా ఆమె దేశ సేవలో భాగం కావాలనే ఆకాంక్షతో ఆర్మీలో చేరింది. పూణేకి చెందిన కాశీష్ చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(ఓటీఏ)లో శిక్షణ పూర్తి చేసుకుని భారత సైన్యంలో కీలక భాద్యతలు నిర్వర్తిస్తోందామె. ఎప్పుడూ కొంగొత్త విషయాలను తెలుసుకోవడంపై ఉన్న ఆసక్తే ఆమెనే ఈ విరుద్ధమైన రంగంలోకి వచ్చేలా చేసింది. అదీగాక ఎన్సీసీలో ఉండగా రిపబ్లిక్ డే పరేడ్ కవాతులో భాగస్వామ్యం అయినప్పుడు తనకు ఆర్మీ ఫీల్డే బెస్ట్ అని ఫీలయ్యేదట. ఆ నేపథ్యంలోనే తన కుటుంబాన్ని ఒప్పించి మరి ఇలా ఆర్మీలో చేరానని చెబుతోంది కాశీష్. విద్యా నేపథ్యం..పూణేలోని సావిత్రిబాయి ఫులే విశ్వవిద్యాలయం నుంచి బయోటెక్నాలజీలో ఇంటిగ్రేటడ్ మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసింది. అలాగే బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో థీసిస్ పూర్తి చేసి, హార్వర్డ్ విశ్వవిద్యాయలంలో పీహెచ్డీ చేసే ఛాన్స్ కొట్టింది కూడా. కానీ సైన్యంలో చేరాలనే ఉద్దేశ్యంతో ఆ ఆఫర్ని తిరస్కరించినట్లు కాశీష్ వెల్లడించింది. రెండేళ్ల క్రితమే మిస్ ఇంటర్నేషనల్ ఇండియాగా కిరీటం కైవసం చేసుకున్న తాను మోడలింగ్, నటన వైపుకు వచ్చేలా పలు ఆఫర్లు వచ్చాయని, కానీ తాను ఆర్మీ రంగాన్ని ఎంచుకోవాలనే ఆలోచన మనసులో ఉండటంతో వెళ్లలేదని చెప్పుకొచ్చింది. అంతేగాదు ఇటీవల ఆపరేషన్ సిందూర్లో కీలకపాత్ర పోషించిందామె. ఆ సమయంలో ఆమె ఎయిర్ డిఫెన్స్ విభాగంలో సేవలందించింది. ఇక కాశీష్ తండ్రి మాజీ శాస్త్రవేత్త. ప్రస్తుతం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అస్యూరెన్స్ (DGQA)లో డిఫెన్స్ సివిలియన్గా చేరారు. ఆమె తల్లి ఆర్మీ పబ్లిక్ స్కూల్లో ఉపాధ్యాయురాలు. తన కుటుంబానికి ఎలాంటి ఆర్మీ నేపథ్యం లేకపోయినా తన నిర్ణయానికి మద్దతిచ్చారని అంటోంది కాశీష్. ఇక ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ శిక్షణలో అత్యున్నత మెరిట్ని అందుకుని ప్రతిష్టాత్మకమైన ఏఏడీ మెడల్, సిఖ్ లి రెజిమెంట్ మెడల్, షూట్ డ్రిల్, డిసిప్లీన్ బ్యాడ్జ్, కమాండెంట్స్ పెన్ వంటి విశిష్ట పురస్కారాలను అందుకుంది. ప్రస్తుతం బెటాలియన్ అండర్ ఆఫీసర్గా, అకాడమీ అండర్ ఆఫీసర్గా సారథ్యం వహించనుంది. ఇక కాశీష్ బహుముఖ ప్రజ్ఞాశాలి కూడా. బాస్కెట్బాల్, వాలీబాల్, హ్యాండ్బాల్లో కూడా అకాడమీకి ప్రాతినిధ్యం వహించింది. ప్రతిభను చాటడమే కాకుండా, ప్రధాన ఈవెంట్లకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించిందామె. (చదవండి: టీ బ్రేక్' అలా మన లైఫ్లో భాగమైంది..!) -
ఏఐకి మహిళా టెకీల జై..
ముంబై: మెరుగైన అవకాశాలను దక్కించుకునేందుకు కృత్రిమ మేథ (ఏఐ) ఉపయోగపడుతుందని టెక్నాలజీ రంగంలో అత్యధిక శాతం మహిళలు విశ్వసిస్తున్నారు. జాబ్స్, కెరియర్ ప్లాట్ఫాం అప్నా డాట్కో నిర్వహించిన సర్వేలో 78 శాతం మంది ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. దీని ప్రకారం మహిళా టెకీలు ఏఐ ఆధారిత కెరియర్ల కోసం సన్నద్ధమవుతున్నారు. 58 శాతం మంది ఇప్పటికే ఉద్యోగాల్లో భాగంగానో లేదా ఏదైనా ప్రోగ్రాంలలో చేరడం ద్వారానో లేక స్వయంగానో ఏఐ/ఎంఎల్ నైపుణ్యాల్లో శిక్షణ పొందుతున్నారు. 24 శాతం మంది త్వరలోనే శిక్షణ పొందే యోచనలో ఉన్నారు. టెక్నాలజీ రంగంలో పని చేస్తున్న 11,300 మంది మహిళలు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఇందులో అత్యధిక భాగం మహిళలు జెన్ జెడ్ విభాగానికి (పాతికేళ్ల లోపు వారు) చెందినవారే. వీరిలో 60 శాతం మంది ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు చెందిన వారు కాగా, మూడింట రెండొంతుల మంది సాధారణ కాలేజీల్లో చదివినవారే. ఏఐ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి డిమాండ్.. సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు సగం మంది ఏఐ సాఫ్ట్వేర్ డెవలపర్లు కావాలనుకుంటున్నారు. అలాగే 19 శాతం మంది డేటా సైన్స్.. మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), 14 శాతం మంది ప్రోడక్ట్ మేనేజ్మెంట్, 10 శాతం మంది రీసెర్చ్ ఉద్యోగాలపై దృష్టి పెడుతున్నారు. దీన్ని బట్టి చూస్తే ఏఐని ఏదో ఆషామాషీ ట్రెండ్గా కాకుండా సమాన అవకాశాలను కల్పించే దోహదకారిగా మహిళా టెకీలు భావిస్తున్నట్లు తెలుస్తోందని అప్నాడాట్కో వ్యవస్థాపకుడు నిర్మిత్ పారిఖ్ తెలిపారు. మరోవైపు, ఇప్పుడు పేరొందిన కాలేజీ నుంచి పట్టా పొందడం కన్నా ఏఐలో నైపుణ్యాలే చాలా ముఖ్యమని మూడింట రెండొంతుల టెకీలు భావిస్తున్నారు. జెన్ జెడ్ అమ్మాయిల్లో (22–25 ఏళ్ల వయస్సున్న వారిలో 62 శాతం మంది), ద్వితీయ–తృతీయ శ్రేణి పట్టణాల్లోని మహిళల్లో (74 శాతం మంది) ఈ భావన అత్యధికంగా ఉంది.మెట్రోల్లో ఇది 66 శాతం మందిలో ఉంది. ఏఐని అందిపుచ్చుకోవడంలో ఎదురవుతున్న సవాళ్ల విషయానికొస్తే.. నాణ్యమైన అవకాశాలు అందుబాటులో ఉండటం లేదని 42 శాతం మంది, బలమైన మెంటార్షిప్ లేదని 27 శాతం, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఆప్షన్లు అవసరమని 19 శాతం మంది తెలిపారు. -
నాన్నా... నువ్వెక్కడ?
2016లో ‘లయన్’ అనే సినిమా వచ్చింది. కథానాయకుడు దేవ్ పటేల్. స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేమ్. లయన్ కథకు వస్తే సరూ అనే అయిదేళ్ల పిల్లాడు ఇంటి నుంచి పారిపోయి రైలెక్కుతాడు. అది వేల కిలోమీటర్లు ప్రయాణించి కోల్కతా చేరుకుంటుంది. అప్పటినుంచి ఆ పిల్లాడి ఒంటరి పోరాటం మొదలవుతుంది. అక్కడ ఆ బాలుడి జీవితం రకరకాల మలుపులతో ఆఖరుకు ఒక ఆస్ట్రేలియన్ జంటకు దత్తతతో ఆస్ట్రేలియా చేరుకుంటుంది. పాతికేళ్ల తర్వాత సొంతకుటుంబాన్ని కలవాలనే తాపత్రయంతో గుప్పెడు బాల్య జ్ఞాపకాలను తోడు చేసుకుని, గూగుల్ ఎర్త్ సాయంతో తన ఇంటిని కనుక్కుంటాడు, కుటుంబాన్ని కలుసుకుంటాడు. వాస్తవ సంఘటన ఆధారంగా తీసిన సినిమా అది.సంధ్యారాణి కథా అలాంటిదే! అయితే ఆమె ఇంకా సొంత కుటుంబాన్ని కలుసుకోలేదు. అన్నం, పప్పు తిన్న లీలామాత్రపు జ్ఞాపకాలతో తల్లిదండ్రుల అన్వేషణలో ఉంది. తన కథ సుఖాంతం కావడం కోసం ఎదురు చూస్తోంది. సంధ్యారాణి చెప్పిన వివరాల ప్రకారం ఆ కథ ఎక్కడ మొదలైందంటే..1987...హైదరాబాద్, ఖైరతాబాద్లోని ప్రేమ్నగర్ వాసి కె.రామయ్య నిజాం కాలేజ్లో తోటమాలి. అతనికి అబిడ్స్లోని పరాస్ బార్ అండ్ రెస్టారెంట్లో వెయిటర్ బి. రాజ్కుమార్తో స్నేహం కుదిరింది. మాటల్లో తనదీ, రాజ్కుమార్దీ ఇద్దరిదీ ఒకే కులమని తేలింది. దాంతో తన మరదలు అనసూయకు రాజ్కుమార్తో పెళ్లి చేయాలనుకుని రాజ్కుమార్ ని అడిగాడు. అయితే తనకు అంతకుముందే పెళ్లై, మూడేళ్ల కూతురూ ఉందని, కాకపోతే భార్య చనిపోయిందని చెప్పాడు రాజ్కుమార్. అయినా సరే తమ ఆర్థికపరిస్థితి దృష్ట్యా మరదలికి రాజ్కుమార్తో వివాహం జరిపించాడు రామయ్య. ముచ్చటగా మూడు నెలలు గడిచాయి. రాజ్కుమార్ పత్తాలేకుండా పోయాడు బిడ్డను అనసూయ దగ్గరే వదిలి. పరాస్ బార్ అండ్ రెస్టరెంట్కి వెళ్లి వాకబు చేశాడు రామయ్య. నెల రోజులుగా పనిలోకి రావట్లేదని చెప్పారు హోటల్ సిబ్బంది. రాజ్కుమార్ కోసం వెదికి వేసారిన రామయ్య.. సంధ్యను విజయనగర్ కాలనీలోని సేవా సమాజం.. బాలికా నిలయమనే అనాథాశ్రమంలో వదిలేశాడు.1988...సంతానం లేని స్వీడన్ జంట మిస్టర్ అండ్ మిసెస్ లిండ్గ్రెన్ సంధ్యారాణిని దత్తత తీసుకున్నారు. అలా స్వీడన్ వెళ్లిన సంధ్యారాణి.. ఊహ తెలిసేప్పటికి అది తన మాతృదేశం కాదని.. వాళ్లు తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కారనే సత్యాన్ని గ్రహించింది! పై చదువు కోసం యూకే వెళ్లాక ఓ ఫ్రెండ్ ప్రేరణతో తన అసలు పేరెంట్స్ గురించి ఆరా తీయడం మొదలుపెట్టింది. తనది హైదరాబాద్ అని, సేవా సమాజం బాలికా నిలయం నుంచి తనను తెచ్చుకున్నామనే స్వీడన్ పేరెంట్స్ చెప్పిన విషయం తప్ప ఇంకే సమాచారమూ లేదు. కాబట్టి యూకేలో ఉంటూ హైదరాబాద్లో తన మూలాల కోసం చేసిన వాకబు అంగుళం కూడా ముందుకు కదల్లేదు. దాంతో 2009లో తొలిసారిగా హైదరాబాద్కు వచ్చింది సంధ్య. తనను దత్తత ఇచ్చిన అనాథాశ్రమానికి వెళ్లింది. పెద్దగా వివరాలేవీ దొరకలేదు. చదువైపోయి లండన్లో ఉద్యోగం చేస్తూ, వీలు దొరికినప్పుడల్లా హైదరాబాద్ వస్తున్నా.. ఏళ్లు గడుస్తున్నా ఒంటరి వెదుకులాట దారీతెన్నూ చూపలేదు.2025...జన్మనిచ్చిన తల్లిదండ్రులను కలవాలనుకునే దత్తత పిల్లలెందరికో సహాయపడుతున్న సంస్థ.. పుణేలోని అడాప్టీ రైట్స్ కౌన్సిల్ గురించి సంధ్యకు తెలిసింది. ఆ సంస్థ డైరెక్టర్ అంజలి తారా బబన్రావ్ పవార్ని కాంటాక్ట్ చేసింది. ఆమె.. సంధ్యకు సాయం చేయడానికి సిద్ధపడింది. మొత్తానికి అంజలి సహకారంతో రామయ్యను కలుసుకోగలిగింది సంధ్య. అనారోగ్యంతో ఆయన ఆసుపత్రిలో ఉన్నాడు. సంధ్య సవతి తల్లి అనసూయ చనిపోయిందని చెప్పాడు. అంతేకాదు రాజ్కుమార్ సొంతూరు వరంగల్ అని, అతని తోబుట్టువులు అక్కడే ఉన్నారనీ తెలిపాడు. ఆ మాత్రం ఆధారంతోనే ఆత్రంగా సంధ్య వరంగల్ ప్రయాణమైంది. అమ్మానాన్నలు కనిపిస్తే.. అంతకన్నా అదృష్టం ఉంటుందా అంటుంది నీళ్లు నిండిన కళ్లతో. ‘వరంగల్లో నాన్నే కాదు అమ్మా కనిపిస్తుందని ఆశ. అమ్మ చనిపోయిందని రామయ్యగారితో నాన్న చెప్పినా నాకు మాత్రం అమ్మ బతికే ఉందనిపిస్తోంది. నాలా విదేశాలకు దత్తత వెళ్లి.. సొంత తల్లిదండ్రులను కలవాలనుకుంటున్న వాళ్లెందరో! పెద్దలందరికీ నాదొకటే విన్నపం.. దయచేసి పిల్లలను విదేశీయులకు దత్తత ఇవ్వకండి. ఎంత కష్టమైనా సొంత దేశంలోనే పెరగనివ్వండి. దత్తత వెళ్లిన పిల్లలకు అక్కడ జీవితం వడ్డించిన విస్తరేం కాదు. అమ్మానాన్నలనే కాదు సొంత ఊరు, భాష, సంస్కృతి.. ఒక్కమాటలో చెప్పాలంటే మా గుర్తింపును, ఉనికినే కోల్పోతున్నాం. దానంత నరకం ఇంకోటి లేదు. నా సంబంధీకులెవరైనా ఉండి.. నన్ను పోల్చుకోగలిగితే దయచేసి నన్ను కాంటాక్ట్ అవండి. మా అమ్మానాన్నల జాడ చెప్పండి!’ సంప్రదించాల్సిన నంబర్.. 9822206485.’’ అంటూ తన కథ చెప్పింది సంధ్య. ఆమె త్వరలో తన తల్లిదండ్రులను కలుసుకుంటుందని ఆశిద్దాం.– సరస్వతి రమ– ఫొటోలు: గడిగె బాలస్వామి -
నమ్మకంతో నక్షత్రాలై!
‘స్థిరమైన ఉద్యోగం ఉంటే చాలు’ అనుకునే మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రుచి కల్రా డిక్షనరీలో ‘ఇక చాలు’ అనే మాట ఎప్పుడూ లేదు. సక్సెస్ఫుల్ కన్సల్టెంట్ నుంచి సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా మారింది. మొదట 73 మంది ఇన్వెస్టర్ల నుంచి ఆమెకు తిరస్కారం ఎదురైంది. ఒకే ఒక్క ఇన్వెస్టర్ నమ్మాడు. ఆ నమ్మకమే గొప్ప విజయం అయింది.పేషెంట్లు, హాస్పిటల్స్ మధ్య దూరం ఉందని గ్రహించిన గరిమ సానే ‘ప్రిస్టీన్ కేర్’తో హెల్త్కేర్ రంగంలోకి అడుగు పెట్టింది. మొదట్లో ఆమె మాటలను పెద్దగా ఎవరూ విశ్వసించలేదు. అయినా ఆమె ప్రయాణం ఆపలేదు. విశ్వసనీయతే జీవనాడిగా ప్రయాణం ప్రారంభించిన ప్రిస్టీన్కేర్ హెల్త్కేర్ రంగంలో సరికొత్త సంచలనం అయింది.‘సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్’గా పేరు తెచ్చుకోవాలనే ఉత్సాహంతో ఒక స్టార్టప్తో ప్రయాణం మొదలుపెట్టిన వినీతా సింగ్కు అపజయాలు హాయ్ చెప్పాయి. ఎంటర్ప్రెన్యూర్గా రాణించాలంటే ఉత్సాహం ఒక్కటే సరిపోదని వ్యూహం కూడా కావాలని గ్రహించి మేకప్ బ్రాండ్ ‘షుగర్ కాస్మోటిక్స్’తో తిరుగులేని విజయాన్ని సాధించింది.దేశీయ యూనికార్న్ క్లబ్లో కొన్ని స్టార్టప్లు యూనికార్న్ హోదాను కోల్పోయాయి. కొన్ని మాత్రం ఆ హోదాను స్థిరంగా నిలుపుకుంటూనే, ఔత్సాహికులకు స్ఫూర్తినిస్తున్నాయి.‘వైవిధ్యమైన రంగాలలో మహిళా వ్యాపారవేత్తలు అద్భుత విజయాలు సాధించారు’ అంటూ గరిమ సానే (ప్రిస్టీన్ కేర్), రుచి కల్రా (ఆఫ్ బిజినెస్), వినీతా సింగ్ (షుగర్ కాస్మోటిక్స్) పేర్లను ప్రస్తావించింది ఏఎస్కె ప్రైవేట్ వెల్త్ హురున్ ఇండియా యూనికార్న్ అండ్ ఫ్యూచర్ యూనికార్న్–2025 నివేదిక.ఈ ముగ్గురు ఎవర్గ్రీన్ యూనికార్న్ స్టార్ల సక్సెస్ మంత్రా గురించి...పరాజయాల తరువాత ఘన విజయంలక్నోకు చెందిన వినీతాసింగ్ చదువులో ఎప్పుడూ ముందుండేది. స్కూల్, కాలేజి రోజుల్లో బంగారు పతకాలు అందుకుంది. ఐఐటీ, మద్రాస్లో చదువుకున్న వినీత బ్యాడ్మింటన్లో సత్తా చాటేది. ఎన్నో టోర్నమెంట్స్లో విజయం సాధించింది. పరుగు పందేలలో కూడా దూసుకుపోయేది. ఒక్కమాటలో చెప్పాలంటే చురుకుదనానికి కేరాఫ్ అడ్రస్లా ఉండేది.ఇన్వెస్టింగ్ బ్యాంకింగ్లో విలువైన అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని వదులుకొని ‘క్వెజాల్’ వెంచర్ మొదలు పెట్టింది. ఆ స్టార్టప్ విజయం సాధించలేదు. ఆ తరువాత ప్రారంభించిన ‘ఫ్యాబ్–బాగ్’ అంతంతమాత్రమే అనిపించింది. అయిన్పటికీ ‘ఇక చాలు’ అనుకోలేదు. గట్టి విజయం కోసం తపన పోలేదు. ‘షుగర్ కాస్మోటిక్స్’ స్టార్టప్తోతో అసలు సిసలు విజయాన్ని అందుకుంది. ‘రకరకాల స్కిన్ టోన్లను దృష్టిలో పెట్టుకొని అధిక నాణ్యతతో కూడిన, అందుబాటు ధరల్లో ఉండే ప్రాడక్ట్స్ను తీసుకువచ్చాం’ అంటుంది వినీతాసింగ్.‘షుగర్ కాస్మోటిక్స్’లో పనిచేస్తున్న 75 శాతం మంది ఉద్యోగులు మహిళలే కావడం విశేషం. రియాలిటీ షో ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ కార్యక్రమంలో జడ్జీ, ఇన్వెస్టర్గా రెండు బాధ్యతలు నిర్వహిస్తోంది వినీత. ఈ కార్యక్రమం ద్వారా ఎంటర్ప్రెన్యూర్ కావాలనుకునే ప్రతిభావంతులకు విలువైన సలహాలు ఇస్తోంది. వారి కలలు సాకారం చేయడానికి తనవంతు ప్రయత్నం చేస్తోంది. యూనికార్న్ స్టార్గా వినీతాసింగ్ విజయం ఎన్నో విషయాలను చెప్పకనే చెబుతుంది. అందులో ఒకటి.... ‘కష్టపడితే... కాలంతో పాటు నడిస్తే ఏదీ అసాధ్యం కాదు’డెబ్బైమూడు మంది తిరస్కరించారు!పంజాబ్లోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రుచి కల్రా కెమికల్ ఇంజినీరింగ్ చదువుకుంది. అయినప్పటికీ ఆర్థికవిషయాలపై ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తితోనే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో ఎంబీఎ చేసింది. చదువు పూర్తయిన తరువాత మెకెన్జీ అండ్ కంపెనీలో తొమ్మిది సంవత్సరాల పాటు పనిచేసింది. ఆ కంపెనీలో పనిచేసిన అనుభవం తనలోని నైపుణ్యాలను మెరుగు దిద్దుకునేలా చేసింది. ఆ నైపుణ్య బలమే వ్యాపారవేత్తగా తన ప్రయాణానికి ఇంధనం అయింది. మెటల్స్, కెమికల్స్, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన బి2బి కామర్స్ ΄్లాట్ఫామ్ ‘ఆఫ్బిజినెస్’కు శ్రీకారం చుట్టింది. చిన్న, మధ్యతరగతి పరిశ్రమలకు ముడి సరుకును అందించే కంపెనీ ఇది. మొదట్లో 73 మంది ఇన్వెస్టర్ల నుంచి తిరస్కారం ఎదురైంది. ఒకే ఒక్క ఇన్వెస్టర్ నమ్మాడు.‘ఆఫ్బిజినెస్’ను సక్సెస్ఫుల్ వెంచర్గా తీర్చిదిద్దిన రుచి కల్రా ఆ తరువాత ఈ కంపెనీకి అనుబంధంగా ‘ఆక్సీజో’ పేరుతో ఫైనాన్షియల్ సర్సీసెస్ మొదలుపెట్టింది.బలమైన నాయకత్వ సామర్థ్యానికి అంకితభావం తోడైతే ఎంత విజయం సాధించవచ్చో నిరూపించింది రుచి. ‘ఆఫ్బిజినెస్’ విజయంతో ఎంతోమంది ఔత్సాహికులు, వ్యాపార రంగంలోకి రావాలని కలలనే కనే యువతరానికి స్ఫూర్తిగా నిలిచింది.మొదట్లో ఎవరూ విశ్వసించలేదు!గైనకాలజిస్ట్గా మంచి పేరు తెచ్చుకున్న డా. గరిమ సానే ‘ప్రిస్టీన్ కేర్’తో ఎంటర్ప్రెన్యూర్గా మారింది. తన వైద్యవృత్తి ద్వారాఎన్నోరకాల నైపుణ్యాలను సొంతం చేసుకున్న గరిమకు ఓపిక ఎక్కువ. తొందరపాటు లేదు. ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది. అధిక పనిభారం, తక్కువమంది సిబ్బంది, పేషెంట్లపై సరిౖయెన శ్రద్ధ చూపకపోవడం... కొన్ని హాస్పిటల్స్లో ఈ పరిస్థితిని చూసిన గరిమ ‘ప్రిస్టీన్ కేర్’తో హెల్త్కేర్ రంగంలోకి అడుగుపెట్టింది. హాస్పిటల్స్కు, పేషెంట్లకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించాలి, పేషెంట్లు కోరుకునే క్వాలిటీ సర్జికల్ కేర్ను అందించాలి అనే లక్ష్యంతో ప్రయాణం మొదలు పెట్టింది.వైద్యుల ఎంపిక, క్లినిక్లో అపాయింట్మెంట్, డయాగ్నోస్టిక్ కేంద్రాలలో టెస్ట్లు బుకింగ్ చేయడం, ఇన్సూరెన్స్ పేపర్ వర్క్, హాస్పిటల్ ఆడ్మిషన్–డిశ్చార్జీ ప్రాసెస్, సర్జరీ తరువాత ఫాలో–అప్ కన్సల్టేషన్, రకరకాల డిపార్ట్మెంట్లతో సమన్వయం... మొదలైన పనులు ప్రిస్టీన్ కేర్ జాబితాలో ఉన్నాయి. అందుకే పేషెంట్ల సర్జరీని సులభతరం చేసే అత్యాధునిక హెల్త్కేర్ కంపెనీగా ‘ప్రిస్టీన్ కేర్’ పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ప్రిస్టీన్ కేర్ 150కి పైగా క్లినిక్స్, 800కి పైగా పార్ట్నర్ హాస్పిటల్స్, 400కి పైగా సూపర్ స్పెషలిస్ట్ సర్జన్లను ఆపరేట్ చేస్తుంది.మొదట్లో చాలామంది వైద్యులు, హాస్పిటల్స్ గరిమ చెప్పే మాటలను పెద్దగా విశ్వసించలేదు. ఆ తరువాత వారికి ప్రిస్టీన్ కేర్ అంకితభావం, కష్టం అర్థమయ్యాయి.‘హెల్త్కేర్ అనేది కేవలం సైన్స్ మాత్రమే కాదు నమ్మకం, భావోద్వేగాలు కూడా అందులో మిళితమై ఉన్నాయి’ అంటున్న గరిమ మార్కెటింగ్ వ్యూహాలను బాగా అర్థం చేసుకుంది. ఆ వ్యూహాలతో కంపెనీని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లింది. ‘సర్జరీ సింప్లిఫైడ్’ అనేది పిస్ట్రీన్ కేర్ ట్యాగ్లైన్. -
గురి తప్పని బాణం
ప్రపంచయూత్ ఛాంపియన్షిప్ కాంపౌండ్ విభాగంలో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ మహిళ క్రీడాకారిణిగా సత్తా చాటింది తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన తానిపర్తి చికిత....చికిత హైస్కూల్లో చదువుతున్న రోజుల్లో బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఒలింపిక్స్లో పతకం సాధించింది. ఆమె స్ఫూర్తితో కూతురిని క్రీడాకారిణిగా తీర్చిదిద్దాలని సంకల్పించిన తండ్రి శ్రీనివాసరావు చికితకు మొదట కరాటే నేర్పించాడు. అందులో బ్లాక్బెల్ట్ సాధించింది. ఒకసారి కరీంనగర్ స్టేడియంలో ఆర్చరీ పోటీలు జరుగుతుండగా చూసిన చికితకు ఆసక్తి కలిగింది. ‘ఆర్చరీ నేర్చుకుంటాను’ అని తండ్రికి చెప్పింది. తమ పొలంలోని గడ్డివాములనే లక్ష్యంగా ఆర్చరీ సాధనకు శ్రీకారం చుట్టింది. సీనియర్ ప్లేయర్ శ్రీనివాస్ దగ్గర ఆర్చరీలో మెలకువలు నేర్చుకుంది. 2019లో గోవాలో నిర్వహించిన జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలో, 2022లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా బెంగళూరులో జరిగిన జాతీయ స్థాయి పోటీలో బంగారు పతకం సాధించి నేషనల్ ఆర్చరీ అసోసియేషన్ ఇండియా (న్ ఏఏఐ) దృష్టిలో పడింది. ఆర్చరీ అకాడమీలో చోటు లభించడంతో వరుస విజయాలు నమోదు చేస్తూ ΄ోయింది. ఈ ఏడాదిలో చైనాలోని షాంఘైలో జరిగిన టోర్నిలో టీమ్ విభాగంలో రజత పతకం, ఆసియా గ్రాండ్ప్రి టీమ్ విభాగంలో కాంస్యం సాధించింది. తాజాగా కెనడాలో జరిగిన ప్రపంచ యూత్ చాంఫియన్షిప్ కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా సత్తా చాటింది. – శ్రీనివాస్ గుడ్ల, సాక్షి. పెద్దపల్లి (చదవండి: Saurabh Pandey: మారుమూల గ్రామం నుంచి అంతర్జాతీయ స్థాయికి..! ఓ ఫ్యాషన్ డిజైనర్ స్టోరీ) -
సూపర్ బైకర్
‘ఆడపిల్లలకు బైక్లు ఎందుకు!’ అని ఆ తండ్రి నిరాశపరిచి ఉంటే ఆ అమ్మాయి భవిష్యత్లో ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తినిచ్చేది కాదు. ‘బైక్ రేసింగ్ అంటే బాయ్స్కు మాత్రమే’ అనే అలిఖిత నిబంధనను జగతిశ్రీ కుమరేశన్ బ్రేక్ చేసింది. ప్రొఫెషనల్ మోటర్ సైకిల్ రేసర్గా దూసుకుపోతోంది. ట్రిపుల్ నేషనల్ చాంపియన్ జగత్శ్రీ కుమరేశన్ థాయ్లాండ్లో జరిగే ఎఫ్ఐఎం ఆసియా మహిళల కప్ ఆఫ్ సర్క్యూట్ రేసింగ్(ఏసీసీఆర్)లో మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోంది. కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళితే... చెన్నైకి చెందిన జగత్శ్రీ ఒకానొక రోజు బైక్ రేసింగ్ చూసి ఆహా అనుకుంది. ఆరోజు నుంచి బైక్ రేసింగ్పై పాషన్ మొదలైంది. తండ్రికి తన మనసులోని మాట చెబితే సరే అని ప్రోత్సహించాడు. అలా శిక్షణ మొదలైంది. పెద్ద పెద్ద బైక్లపై ప్రాక్టీస్ మొదలుపెట్టేది. 2021లో టీవీఎస్ రూకీస్ ఛాంపియన్షిప్ కోసం బాయ్స్తో పోటీ పడి సత్తా చాటింది. చదువు కారణంగా 2022లో పోటీలకు విరామం ఇచ్చింది. 2023లో ఎంఎంఎస్సీ ఎఫ్ఎంఎసీఐ ఇండియన్ నేషనల్ డ్రాగ్ రేసింగ్ చాంపియన్షిప్లో నేషనల్ టైటిల్ గెలుచుకుంది. మద్రాస్ క్రిస్టియన్ కళాశాల ఆర్కియాలజీ గ్రాడ్యుయేట్ అయిన జగత్శ్రీ ఎఫ్ఐఎం ఉమెన్స్ సర్క్యూట్ రేసింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్(వరల్డ్ డబ్ల్యూసీఆర్) తనదైన స్థానాన్ని నిలుపుకోవాలని పట్దుదలగా ప్రయత్నిస్తోంది. -
వెరవని వ్యక్తిత్వం
సంక్షుభిత సమయంలో ఒక జాతి తమను నడిపే నేతగా ఒక స్త్రీ వైపు చూడటం అరుదు. నేపాల్లో ఇప్పుడు అక్కడి యువత అలాంటి ఒక స్త్రీ వైపు చూస్తోంది. అక్కడ ఏర్పడబోతున్న ఆపద్ధర్మ ప్రభుత్వానికి అధినేతగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి ఉంటే బాగుంటుందని ఆశిస్తోంది. ఆమె ఆర్మీ చీఫ్ను కలిశారు కూడా! భారతదేశంలో చదువుకుని, టీచర్ స్థాయి నుంచి సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి వరకూ ఎదిగిన సుశీలా కర్కీది వెరవని వ్యక్తిత్వం. ఆమె రచయిత కూడా. వివరాలు...‘ఇండియా– నేపాల్ దేశాల మధ్య అనుబంధం ఈనాటిది కాదు. దశాబ్దాలది. ప్రభుత్వాలు వాటి వాటి విధానాల వల్ల పని చేస్తుండొచ్చు. కాని ఇరుదేశాల ప్రజలు ఏనాటి నుంచో స్నేహంగా ఉన్నారు. ప్రధాని మోదీపై నాకు మంచి అభి్రపాయం ఉంది. మా స్నేహితులు, బంధువులు ఎందరో ఇండియాలో ఉన్నారు. మావారు ఎక్కువ కాలం ఇండియాలోనే గడిపారు. భారతీయులు నేపాలీలను ఆదరిస్తూనే ఉన్నారు’ అన్నారు సుశీలా కర్కి.73 ఏళ్ల ఈ మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేపాల్లో ఏర్పడనున్న ఆపద్ధర్మ ప్రభుత్వానికి ప్రధాని అయ్యే అవకాశాలు ఖరారయ్యాయి. నేపాల్లో ఉద్యమం కొనసాగిస్తున్న జెన్ జి విద్యార్థుల బృందం తాజా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సుశీలా కర్కి మా ఎంపిక అని తేల్చి చెప్పింది. సుశీలా కర్కి తన సోషల్ మీడియా అకౌంట్లో ‘దేశ పరిస్థితుల రీత్యా నాకు అప్పజెప్పే బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను’ అని తెలియచేశారు.‘నేను బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్నాను. మా హాస్టల్ నుంచి నిత్యం పారే గంగను చూసే దాన్ని. ఎండాకాలం హాస్టల్ టెర్రస్ మీద పడుకునేవారం. ఉదయాన్నే గంగను చూసేవారం. అక్కడ నాతో పాటు చదువుకున్న విద్యార్థులు, పాఠాలు చెప్పిన గురువులు ఇంకా స్పష్టంగా గుర్తున్నారు’ అన్నారామె. ‘మా ఊరు విరాట్నగర్ నుంచి భారత్ సరిహద్దు 25 మైళ్లు ఉంటుంది. మేము తరచూ బోర్డర్ మార్కెట్కు వెళ్లేవాళ్లం. నాకు హిందీ వచ్చు’ అని తెలిపారామె.ప్రభుత్వంలో అవినీతి, మంత్రుల పట్ల వ్యతిరేకత, నయా సంపన్నుల వైఖరి, సోషల్ మీడియాపై నిర్బంధం... వీటన్నింటి దరిమిలా నేపాల్లో యువతరం తెచ్చిన తిరుగుబాటు వల్ల నాయకత్వ మార్పు స్పష్టమైంది. సుశీలా కర్కి ఆపద్ధర్మ ప్రధాని అయితే త్వరలో ఎన్నికలు నిర్వహించి ప్రభుత్వ ఏర్పాటు చేయించి తప్పుకోవడమే ఆమె ప్రధాన బాధ్యత. ఆ బాధ్యతకు ఆమె సమర్థురాలని యువత భావిస్తోంది.టీచర్గా మొదలైసుశీలా కర్కి నేపాల్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని నిర్వహించిన ఏకైక మహిళగా ఆ దేశవాసుల్లో గుర్తింపు, గౌరవం పొందారు. జూన్ 7, 1952న నేపాల్లోని శంకర్పూర్కు చెందిన ఓ కుటుంబంలో పుట్టిన కర్కి ఏడుగురు పిల్లలలో మొదటి సంతానం. 1972లో బిరాట్నగర్లోని మహేంద్ర మొరాంగ్ క్యాంపస్ నుండి బీఏ డిగ్రీ చేసి మన బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి రాజకీయ శాస్త్రం చదివారు. అక్కడ చదువుతున్న సమయంలోనే నేపాలీ కాంగ్రెస్ సభ్యుడు, యువజన విభాగ నాయకుడు దుర్గా ప్రసాద్ సుబేదిని కలుసుకున్నారు. అనంతరం వారిద్దరూ వివాహం చేసుకున్నారు. 1979లో కార్కి బిరాట్నగర్లో లాయర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 1985లో ధరణ్లోని మహేంద్ర మల్టిపుల్ క్యాంపస్లో అసిస్టెంట్ టీచర్గా పనిచేశారు. 2007లో సీనియర్ అడ్వకేట్గా 2009లో ఆ దేశ సుప్రీంకోర్టులో అడ్–హాక్ జస్టిస్గా నియమితులయ్యారు. నవంబర్ 18, 2010న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 ఏప్రిల్ నుండి 2016 జూలై వరకు నేపాల్ సుప్రీంకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, 2017 జూన్ వరకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.రచయితగా...కర్కి 2018లో ‘న్యాయ’ పేరుతో తన ఆత్మకథ రాశారు. 2019 డిసెంబర్లో ‘కారా’ అనే నవల ప్రచురించారు. నేపాల్లో 1960 నుంచి 90ల మధ్యకాలంలో రాజు కనుసన్నల్లో సాగిన ‘పంచాయత్’ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రజల అనుభవాలను ఆమె తన రచనల్లో ఉటంకించారు. ఆపద్ధర్మ అధినేతగా తన ఎంపిక జరిగితే శాంతి నెలకొల్పడం, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు భరోసా ఇవ్వడం తన తొలి ప్రాధాన్యం అని ఆమె అన్నారు.సుశీలా కర్కిది వెరవని వ్యక్తిత్వం అని అందరూ అంటారు. ఆమె న్యాయనిపుణత, అవినీతి రహిత నేపథ్యం చాలా కేసుల్లో కీలకమైన తీర్పులు ఇచ్చేలా చేసింది. ఒక అవినీతి కేసులో మంత్రిని జైలుకు పంపించడానికి సైతం ఆమె వెనుకాడలేదు. ఇవన్నీ ఆమెకు సానుకూలంగా మారాయని చర్చ సాగుతోంది. ఆ పేరు బయటకు వచ్చాక నేపాల్లో ముఖ్యంగా ఖాట్మండులో శాంతి నెలకొనడం ఆమె మాటకు విలువ ఉంటుందనడానికి ఉదాహరణ.గమనిక: ఈ కథనం రాసే సమయానికి సుశీలా కర్కితోపాటు మరికొన్ని పేర్లు కూడా ఆపద్ధర్మ ప్రధాని పదవికి పరిశీలనలోకి వచ్చాయి. -
ఎవరీ టీనేజర్ తేజస్వి మనోజ్? వృద్ధుల రక్షణ కోసం..
ఇటీవల కాలంలో సైబర్ నేరాలు ఎంతలా ఉన్నాయో తెలిసిందే. ముఖ్యంగా ఒంటిరిగా ఉండే వృద్ధులను లక్ష్యంగా చేసుకుని వాళ్ల డబ్బుని కాజేస్తున్న సైబర్ నేరగాళ్లు ఆగడాలు అంత ఇంత కాదు. పైగా వయసు మళ్లడంతో వస్తున్న కాల్స్, మెసేజ్లు ఒక స్కామ్ అని గ్రహించలేనితనం, టెక్నాలజీ లేమి తదితరాలను ఆసరా చేసుకుని ఈ నేరాగాళ్లు మరింతగా రెచ్చిపోతున్నారు. ఇలాంటి ఆగడాలకు చెక్పెట్టేలా పరిష్కార దిశగా అడుగులు వేస్తోంది ఈ టీనేజర్. తన తాతమామల్లాంటి ఎందరో వృద్ధులకు భరోసానిచ్చే వెబ్సైట్ని నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అంతేగాదు వాళ్లు కూడా సులభంగా టెక్నాలజీపై పట్టు సాధించేలా ఈ 16 ఏళ్ల అమ్మాయి చేస్తున్న కృషికి మేధావులు సైతం ఆశ్చర్యపోవడమే కాదు, అవార్డులతో ప్రశంసించారు కూడా. ఎవరా ఆ టీనేజర్ అంటే..ఆ అమ్మాయే 16 ఏళ్ళ తేజస్వి మనోజ్. టెక్సాస్ ఫ్రిస్కోలో హైస్కూల్ జూనియర్గా ఉండగా ఆమె ఎదుర్కొన్న సంఘటనే ఆమె జీవితాన్ని మలుపుతిప్పింది. తన తాతగారిలాంటి వృద్ధులు సైబర్ నేరాగాళ్ల వలలో ఎలా చిక్కుకుంటున్నారో అనుభవపూర్వకంగా తెలుసుకుని, ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ రోజు తన 85 ఏళ్ల తాతాగారి మాదిరిగా ఓ వ్యక్తి ఫోన్ చేసి తన వద్ద డబ్బులు అయిపోయాయని, ఒక లక్ష రూపాయాలు పంపించాల్సిందిగా మెయిల్ ఐడీ, ఫోన్ కాల్స్ రెండూ వచ్చాయి. దాంతో ఆమె డబ్బు పంపేందుకు రెడీ అవుతుండగా, ఎందుకైనా మంచిది ఒకసారి డబుల్ చెక్చేసి పంపు అని తండ్రి సూచన మేరకు చెక్చేయడంతో..అదిస్కామ్ అని తేలింది. దాంతో తేజస్వి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నాన్న అలా సూచించి ఉండకపోతే..అంతేగా పరిస్థితి అంటూ ఊపిరి పీల్చుకుంది. వృద్ధుల సంరక్షణ కోసం..ఇక ఆ తర్వాత అలాంటి సైబర్ క్రైం నేరాల గురించి ఆరా తీసింది తేజస్వి. ఒక్క 2024 ఏడాదిలోనే ఆన్లైన్ స్కామ్లకు సంబంధించిన సుమారు రూ. 8 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయని తెలిసి కంగుతింది. అంతేగాదు వాటిల్లో వృద్ధులే ఎక్కువ మొత్తం డబ్బు నష్టపోతున్నట్లు గుర్తించింది. దాంతో తేజస్వి తన తాతా లాంటి వాళ్లు ఇలాంటి సైబర్ క్రైంలో చిక్కుకోకుండా ఏదైనా చేయాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యింది. ఆ నేపథ్యంలోంచి వచ్చిందే "షీల్డ్ సీనియర్స్" అనే వెబ్సైట్. సైబర్ నేరాలకు వ్యతిరేకంగా పోరాడటం కోసం వృద్ధుల సేఫ్టీనే ప్రధాన లక్ష్యంగా చేసుకుని నెలల తరబడి కోడింగ్ రాసి దీన్ని డిజైన్ చేసింది. ఈ వెబసైట్ సాయంతో పెద్దలు ఎలాంటి మోసాల్లో చిక్కుకుండా, సులభంగా వినియోగించే సాంకేతికతను అభివృద్ధి చేసింది. సీనియర్ సిటీజన్లు సులభంగా పాస్వర్డ్లు, సెట్టింగులు, స్కామ్ వ్యూహాలు గుర్తించేలా మార్గదర్శకాలను కూడా రూపొందించింది. అలాగే తరుచుగా సాంకేతిక పరిభాష సమస్య రాకుండా తక్కవ వాక్యాల సమాధానాల చాట్బాట్ని కూడా డిజైన్ చేసింది. ఈ వెబ్సైట్లోని ఏఐ ఆధారిత సాధనం అనుమానాస్పద సందేశాలు, ఇమెయిల్లను 95% కచ్చితత్వంతో స్కాన్ చేస్తుంది. అంతేగాదు సీనియర్ సిటీజన్లు కూడా ధైర్యంగా ఆన్లైన్ ప్రపంచాన్ని నావిగేట్ చేసేలా తయారుచేసింది. ప్రస్తుతం ఆమె దాన్ని వాణిజ్య ఏఐ ఫ్లాట్ఫాంగా మార్చేలా నిధులను సేకరిస్తున్నందున ఈ "షీల్డ్ సీనియర్స్ వెబ్సైట్" ప్రివ్యూ మోడ్లో ఉంది. అయితే ఇది అమెరికా అసోసీయేషన్ ఆఫ్ రిటైర్డ్ పర్సన్స్ దృష్టిని ఆకర్షించడమే కాదు, వాళ్లు నేరుగా ఆమెని సంప్రదించి తమ ఫీడ్బ్యాక్ని ఇచ్చి లింక్డ్ఇన్లో షేర్ చేశారు కూడా. దాంతో తేజస్వి సేవనిరతి ప్రయత్నాలకుగానూ టైమ్ కిడ్ ఆఫ్ ది ఇయర్ 2025 గౌరవం లభించడమే కాదు ఇలా టైమ్ ఫర్ కిడ్స్ సర్వీస్ స్టార్గా పేరొందిన తొలి గ్రహితగా ఘనతను కూడా దక్కించుకుందామె. అంతేగాదు సీనియర్ సిటీజన్లకు ఈ టీనేజర్ సైబర్ సెక్యూరిటీ పాఠాలను కూడా బోధిస్తూ..తన సేవనిరతిని చాటుకుంటోంది కూడా. జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉండే ఈ టీనేజ్ వయసులో పెద్దల పట్ల ఇంతలా బాధ్యతతో వ్యవహరిస్తూ..సాంకేతిక సాయం అందిస్తున్న ఆ అమ్మాయి యువతరానికి గొప్ప స్ఫూర్తి కదూ..!.(చదవండి: ఇది ఫ్యామిలీ ఫ్లైట్..!) -
విలేజ్ సైంటిస్ట్ బనిత
‘అలా సరే, ఇలా అయితే ఎలా ఉంటుంది?’ అని ఆలోచించడమే ఆవిష్కరణ. వచ్చిన ఆలోచనను ఇష్టపడి, కష్టపడి నిజం చేసుకోవడమే ఆవిష్కరణ. ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదం ఆమెకు తెలుసో లేదో తెలియదు. ఆమె సైన్స్ పుస్తకాలు చదివింది కూడా లేదు. అయితే కొత్త కొత్త ఆవిష్కరణలు అంటే ఆమె ఇష్టం. అదే సమయంలో మనం మరిచిపోయిన సంప్రదాయ వస్తువులు అంటే ఇష్టం. వాటిని ఈ తరానికి పరిచయం చేసి తిరిగి వినియోగంలోకి తీసుకురావడం అంటే ఇష్టం.పశ్చిమబెంగాల్లోని గ్రామీణ ప్రాంతానికి చెందిన బనితకు ఇన్స్టాగ్రామ్లో లక్షమందికి పైగాఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పుడూ ఏదో కొత్త ఆవిష్కరణ చేస్తూ ఆ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంటుంది.ఇందులో ఎన్నో వీడియోలు వైరల్ అయ్యాయి. తాజాగా...ఫ్యాన్ స్ట్రక్చర్, ప్లాస్టిక్ బాక్స్,నీళ్లు, ఐస్, వైర్లను ఉపయోగించి ‘మినీ ఏసీ’ తయారుచేసింది. ‘ఇది ఎలా పనిచేస్తుందో తెలుసా? ఎలా తయారుచేయాలో తెలుసా?’ అంటూ డెమో కూడా ఇచ్చింది.‘విలేజ్లైఫ్ విత్ బనిత’ ట్యాగ్లైన్తో బనిత ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో పోస్ట్ చేసే వీడియోలు సంభ్రమాశ్చర్యాలకు గురి చేయడమే కాదు పట్టణ, గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. (చదవండి: చేతుల పరిశుభ్రత కోసం..!) -
వర్షం సైతం ఆ నృత్యాన్ని అడ్డుకోలేకపోయింది..!
బృందంగా శాస్త్రీయ నృత్యం చేస్తుంటే రెండు కళ్లు చాలవేమో అన్నంత అద్భుతంగా ఉంటుంది. అలాంటి గ్రూప్ డ్యాన్స్ ప్రదర్శనలో అనుకోని అవాంతరంలా వర్షం వస్తే.. కాలు కదపడం కష్టం. అడుగు వేస్తే జరర్రుమని జారిపోవడం ఖాయం. ఆ చిరుజల్లుల్లో అడుగులు తడబడకుండా..లయబద్ధంగా నృత్యం చేయడం అంత ఈజీ కాదు. కానీ ఇక్కడ ఈ బృందం వర్షానికే సవాలు విసిరేలా అత్యంత అద్భుతంగా నృత్యం చేశారు. ఇదంతా ఎక్కడ అంటే..కర్ణాటకలోని ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన మహిళా విద్యార్థులు బృందంగా భరతనాట్యం చేశారు. అది కూడా హనుమాన్ చాలిసాను నృత్య రూపకంగా ప్రదర్శన ఇస్తున్నారు. అయితే కుండపోత వర్షం కురుస్తున్న ఆ విద్యార్థులంతా ఎక్కడ ఆగకుండా ఎంత లయబద్ధంగా డ్యాన్స్ చేశారో చూస్తే..వావ్ ఏం భరతనాట్య ప్రదర్శన అని ప్రశంసించకుండా ఉండలేరు. అందులో అత్యంత హైలెంట్.. అంతమంది అమ్మాయిల మధ్య ఒకేఒక పురుషుడు భరతనాట్య చేస్తూ కనిపించడం. మన కళ్లుచూస్తోంది నిజమేనా అన్నట్లుగా ఆ అమ్మాయిల్లో ఒక అమ్మాయిగా కలిసిపోయిన ఆ కళాకారుడి నృత్యం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అందుకు సంబంధించిన వీడియోని ప్రత్యక్షంగా వీక్షించిన ఒక ప్రేక్షకుడు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట వైరల్గా మారింది. ఆయన ఆ వీడియోకి జత చేసిన పోస్ట్లో వర్షం మీ ప్రదర్శనను అడ్డుకోలేకపోగా..మీ అసామాన్యమైన ప్రదర్శనకు అందంగా మారింది ఆ వర్షపు జల్లు. జోరు వానలో నాట్యం చేయడం మాటలు కాదనేది సత్యమే అయినా..మీ బృందమంతా ప్రతి స్టెప్ని అత్యంత అద్భుతంగా ప్రదర్శించి అలరించారు అంటూ ఆ వీడియోకి వర్షం మీ బృందం ప్రదర్శన ఇవ్వకుండా ఆపలేకపోయింది అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Prarthana Rao (@prarthana_nanana) (చదవండి: లండన్లో 'బెస్ట్ సమోసా'..! టేస్ట్ అదుర్స్..) -
చరిత్ర సృష్టించిన లెఫ్టినెంట్ పారుల్ ధద్వాల్..! నిబద్ధతకు నిదర్శనం..
కుటుంబంలో ఒక్కరు సక్సెస్ సాధిస్తే..ఆ తర్వాత తరాలకు వాళ్లు ఆదర్శంగా మారడమే కాదు వారిలా అధికారుల పరంపరను కొనసాగిస్తారు కొందరు. అలా వారసత్వాన్ని కొనసాగించడం అనేది అరుదు కూడా. అలా కంటిన్యూస్గా వారసత్వాన్ని అందిపుచుకుని కొనసాగడమే గాక, ఒకే కుంటుంబంలోని రెండు జనరేషన్లు వరుసగా కొనసాగడం అనేది అత్యంత అరుదు. అలాంటి అరుదైన సంఘటన చోటుచేసుకోవడమే కాదు, చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా నిలవనుంది ఈ అరుదైన ఘటన. ఏం జరిగిందంటే..లెఫ్టినెంట్ పారుల్ ధద్వాల్ ఐదు తరాలుగా ఆర్మీసేవలందిస్తున్న కుటుంబం నుంచి వచ్చిన తొలి మహిళా అధికారిగా చరిత్ర సృష్టించారు. ఆమె తన కుటుంబంలోని ఐదోతరం ఆర్మీ అధికారిగా కొనసాగనున్నారు. చెన్నైలోని ఆపీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(ఓటీఏ)లో శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకుని ఇండియన్ ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్లో చేరారు. ఆమె తన అంకితభావం, నైపుణ్యానికి గుర్తింపుగా ఈ ట్రైనింగ్ కోర్సులో ఆర్డర్ ఆఫ్ మెరిట్లో తొలి స్థానంలో నిలిచి రాష్ట్రపతి బంగారు పతకాన్ని కూడా సొంతం చేసుకున్నారు. పారుల్ ధద్వాల్ నేపథ్యం..ఆమె పంజాబ్లోని హోషియార్పూర్ జిల్లాలోని జనౌరి గ్రామం నుండి వచ్చింది. ఈ ప్రాంతం యుద్ధానికి సంబంధించిన వీరసైనికుల నిలయంగా పేరుగాంచింది. ఇక పారల్ ధద్వాల్ కుటుంబ ఆర్మీలో ముత్తాతల కాలం నుచి సేవలందిస్తోంది. ఆమె ముత్తాత సుబేదార్ హర్నామ్ సింగ్ జనవరి 1, 1896 నుంచి జూలై 16, 1924 వరకు సేవలందించారు. ఆమె రెండో ముత్తాత ఎల్ఎస్ ధద్వాల్ 3 JATతో పనిచేశారు. మూడోతరంలో జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్కు చెందిన కల్నల్ దల్జిత్ సింగ్ ధద్వాల్ 3 కుమాన్కు చెందిన బ్రిగేడియర్ జగత్ జామ్వాల్లో ఉన్నారు. ఇక ఆమె తండ్రి మేజర్ జనరల్ కేఎస్ ధద్వాల్ ఎస్ఎమ్ విశిష్ట సేవా మెడల్ గ్రహిత. ప్రస్తుతం ఆమె తన సోదరుడు కెప్టెన్ ధనంజయ్ ధద్వాల్లతో కొనసాగుతోంది. వీరిద్దరు 20 మంది అత్యున్నత సిక్కు అధికారుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. అదీగాక ఒకే కుటుంబానికి చెందిన రెండు తరాలకు చెందిన ముగ్గురు అధికారులు దేశానికి సేవలందిస్తున్న అరుదైన ఘటన ఇది. ఈ ఘటన దేశం పట్ల ఉన్న వారి శాశ్వత నిబద్ధతకు తార్కాణంగా నిలిచింది. A Legacy of Five GenerationsOne Uniform – Infinite PrideThe journey of Lt Parul Dhadwal is a saga of a family dedicated to service to the Motherland. A proud descendant of a long lineage of brave soldiers, she represents the fifth-generation who now dons the Olive Green in… pic.twitter.com/3BtXn8SlT8— ADG PI - INDIAN ARMY (@adgpi) September 6, 2025 (చదవండి: లండన్లో 'బెస్ట్ సమోసా'..! టేస్ట్ అదుర్స్..) -
మహిళా పాఠకులు చదవాల్సిన 20 పుస్తకాలు
స్త్రీలు రాసిన పుస్తకాలు, స్త్రీల గురించిన పుస్తకాలు చదవడం అంటే కొత్త మైదానాల్లోకి అడుగు వేయడమే. సాహిత్యం వికాసాన్ని, వివేచనను ఇస్తుంది. ఇంటిలోని మహిళ పుస్తక పఠనం మొదలెడితే ఇంటిల్లిపాది పాఠకులు అవుతారు. ‘సాక్షి’ పాఠకుల కోసం ప్రత్యేకంగా ప్రతి మహిళ కనీసం చదివి ఉండాల్సిన 20 పుస్తకాలు ఇక్కడ ఇస్తున్నాం. ఇలా ఎంపిక చేయదగ్గవి తెలుగు నుంచి మరో వందైనా ఉన్నాయి. ఈ ఎంపికలో నచ్చినవి తీసుకొని చదవండి.1. సచ్చరిత్ర– బండారు అచ్చమాంబతొలి తెలుగు కథకురాలు బండారు అచ్చమాంబ జీవిత్రచరిత్ర ఇది. గురజాడ అ΄్పారావు కన్నా ముందే ‘ధనత్రయోదశి’ కథ రాసి తెలుగు కథకు బాటలు వేశారు. ‘సచ్చరిత్ర’ తప్పక చదవదగ్గది.2. మావూరి ముచ్చట్లు– పాకాల యశోదారెడ్డితెలంగాణ ప్రాంతం నుంచి మాండలిక సౌందర్యంతో కథలు రాసిన రచయిత్రి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులుగా పనిచేసి పదవీ విరమణ చేశారు.3. నా ఇంగ్లండు యాత్ర– పోతం జానకమ్మజానకమ్మ అనే తెలుగింటి ఆడపడుచు 1873లో ఓడలో చేసిన ఇంగ్లండు ప్రయాణ విశేషాలను, ఆనాటి సామాజిక పరిస్థితులను పుస్తక రూపంలో రాశారు. 1876లో ఈ పుస్తకం వెలువడింది.4. శారద లేఖలు– కనుపర్తి వరలక్ష్మమ్మ సాహితీవేత్తగా ప్రసిద్ధి చెందిన వరలక్ష్మమ్మ 1929 నుంచి 1934 వరకు ‘గృహలక్ష్మి’ మాసపత్రికలో రాసిన శారద లేఖలు ప్రసిద్ధి పొందాయి. దురాచారాలను ఖండిస్తూ, స్త్రీల అభ్యున్నతి కాంక్షించేలా నడిచే ఈ లేఖలు అనేక అంశాల గురించి చర్చిస్తాయి.5. స్త్రీ(నవల)– గుడిపాటి వెంకటాచలంస్త్రీవాదాన్ని బలపరుస్తూ ప్రసిద్ధ రచయిత గుడిపాటి వెంకటాచలం 1925లో రాసిన నవల. స్త్రీలు ఏ అడ్డూ లేకుండా స్వేచ్ఛగా జీవించాలన్న తృష్ణకు ఈ నవల నేపథ్యం.6. జానకి విముక్తి (నవల)– రంగనాయకమ్మ స్త్రీలలో రావాల్సిన మార్పులను, వారు సాధించాల్సిన అభ్యున్నతిని కాంక్షిస్తూ రాసిన నవల ఇది. ‘జానకి’ అనే పాత్ర జీవితంలో జరిగిన అనుభవాలను వివరంగా తెలుపుతుంది ఈ పుస్తకం.7. కాలాతీత వ్యక్తులు (నవల) – పి.శ్రీదేవితెలుగు సాహిత్యంలో పేరెన్నికగన్న నవల. పురుషాధిక్యతను నిరసిస్తూ, స్త్రీలు స్వతంత్రంగా ఎదగాలన్న కాంక్షను కనబరుస్తూ సాగే పాత్రలు ఇందులో కనిపిస్తాయి.8. నాలో నేను (ఆత్మకథ) – భానుమతీ నటి, దర్శకురాలు, రచయిత్రి, గాయని, సంగీతకారిణి అయిన భానుమతీ రామకృష్ణ ఆత్మకథ ఈ పుస్తకం. సామాన్య కుటుంబంలో జన్మించిన ఆమె, అంచెలంచెలుగా ఎదిగిన తీరు ఈ పుస్తకంలో చదవొచ్చు.9. గోరాతో నా జీవితం– సరస్వతి గోరాప్రముఖ హేతువాద ఉద్యమకారుడు గోరా సతీమణి సరస్వతి రాసిన ఆత్మకథ ఈ పుస్తకం. సామాన్య గృహిణిగా ఉన్న ఆమె గోరా సాహచర్యంతో హేతువాదిగా ఎదిగిన క్రమాన్ని ఇందులో పొందుపరిచారు.10. రాజకీయ కథలు– ఓల్గాస్త్రీల జీవితాల్లోని విభిన్న పార్శా్వలను, వాటి చుట్టూ అల్లుకున్న రాజకీయాలను పొందుపరిచిన కథలివి. స్త్రీ వాదానికి బలమైన దన్నుగా నిలిచిన కథలు.11. ఇల్లాలి ముచ్చట్లు– పురాణం సుబ్రహ్మణ్య శర్మవారపత్రికలో ప్రచురితమైన ఈ ఇల్లాలి ముచ్చట్లు తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానాన్ని పొందాయి. రోజువారీ సంఘటనలు మొదలుకొని, అంతర్జాతీయ అంశాల దాకా అన్నింటి పట్ల సగటు ఇల్లాలి స్పందన ఇది. హాస్యం, వ్యంగ్యం, సామాజిక అవగాహన కలగలిసిన ముచ్చట్లు.12. రాయక్క మాన్యం (కథలు)– తెలంగాణలోని దళిత జీవన నేపథ్యాన్ని, స్థితిగతులను యథాతథంగా చిత్రించిన కథలివి. దళిత స్త్రీల జీవనపోరాటాన్ని ఈ కథల్లో చూడొచ్చు.13. నల్లపొద్దు– సంపాదకురాలు: దళిత స్త్రీలు రచించిన సాహిత్యాన్ని తొలిసారిగా పుస్తక రూపంలోకి తీసుకొచ్చి అందించిన పుస్తకం. ఈ రచనల్లో అస్తిత్వ ఘర్షణ, నిరంతర పోరాట స్ఫూర్తి కన్పిస్తాయి. 14. నీలి మేఘాలు (స్త్రీవాద కవిత్వం)తెలుగు స్త్రీవాద సాహిత్యంలో కీలకమైన కవిత్వ సంపుటి. స్త్రీల సమస్యలు, వారి అంతరంగాలు, అభ్యంతరాలకు బలమైన వ్యక్తీకరణతో కవిత్వరూపం ఇక్కడ కనిపిస్తుంది.15. నిర్జనవారధి (ఆత్మకథ)– కొండపల్లి కోటేశ్వరమ్మ కమ్యూనిస్టు ఉద్యమకారిణి కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మకథ. 92 ఏళ్ల వయసులో ఆమె రాసిన ఈ పుస్తకం తెలుగు రాష్ట్రాల్లోని అనేక పరిణామాలను వివరిస్తుంది.16. ఆధునిక భారత తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు: ఫాతిమా షేక్భారతదేశ తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు, సామాజిక సంస్కర్త, జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల సహోద్యోగి ఫాతిమా షేక్. ఆమె జీవిత చరిత్ర తప్పక తెలుసుకోవాల్సినది. రచన: నసీర్ అహ్మద్.17. చదువు తీర్చిన జీవితం (ఆత్మకథ)– కాళ్లకూరి శేషమ్మమెట్టు మెట్టు ఎక్కిన ఒక సామాన్య మహిళ ఆత్మకథ ఈ పుస్తకం. క్రమశిక్షణ, సంయమనంతో తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్న కాళ్లకూరి శేషమ్మ ఏడు దశాబ్దాల అనుభవసారం స్ఫూర్తిదాయకమైనది.18. నా మాటే తుపాకీ తూటా (ఆత్మకథ)తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని, ఆపై ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కమ్యూనిస్టు నేత మల్లు స్వరాజ్యం జీవితాన్ని గ్రంథస్తం చేసిన పుస్తకం ఇది. 19. కుప్పిలి పద్మ కథలుఆధునిక స్త్రీల జీవనంలో వస్తున్న మార్పులు, యువతీయువకుల జీవితపు ఆకాంక్షలను ఒడిసిపట్టిన కథలివి. కథలను కవితాత్మకంగా చిత్రించటం కుప్పిలి పద్మ రచనల ప్రత్యేకత.20. ఎదారి బతుకులు(కథలు)– ఎండపల్లి భారతిబడుగుజీవుల జీవన క్రమాన్ని, వారి సంతోషాలను, సరదాలను, బాధలనూ ఒకచోట చేర్చిన కథలివి. పల్లెవాసుల జీవనాన్ని యథాతథంగా చిత్రించి అందించారు రచయిత్రి ఎండపల్లి భారతి. -
చాకిరీనే ఆమె నౌకరీ
భారతీయ మహిళకు ఇంటా, బయటా మోయలేనంతగా రెండింతల పని భారం ఉంటోందని తాజాగా విడుదలైన ‘టైమ్ యూజ్’ సర్వే వెల్లడించింది. ఎక్కువ చదువుకున్న, సంపన్నులైన మహిళలు సైతం ఈ విషయంలో మెరుగ్గా ఏమీ లేరని కూడా వ్యాఖ్యానించింది. పురుషులు జీతం వచ్చే పనికి బయట ఎంత సమయం వెచ్చిస్తున్నారో, అంతకుమించిన సమయాన్ని మహిళలు జీతం రాని పనికి ఇంట్లో వెచ్చిస్తున్నారని సర్వే పేర్కొంది.భారత ‘స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్’ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (ఎన్.ఎస్.ఒ.) 2024లో దేశవ్యాప్తంగా నిర్వహించిన ‘టైమ్ యూజ్’ సర్వేలో – రోజువారీ పనులకు స్త్రీలు, పురుషులకంటే రెండింతలు ఎక్కువగా సమయాన్ని వెచ్చిస్తున్నట్లు వెల్లడైంది. ఈ సర్వే కోసం ఎన్.ఎస్.ఒ. 1,67,000 మందిని కలిసి వివరాలు సేకరించింది. శ్రమలో అసమానతలుఉద్యోగం, నిద్ర, ఆహారం, విశ్రాంతి మొదలు.. చదవటం, షాపింగ్, వంట పని వంటి 165 రోజువారీ పనులకు స్త్రీ పురుషులు వెచ్చించిన సమయాన్ని సర్వే నమోదు చేసింది. పురుషులు, మహిళలు నిద్రించడానికి దాదాపు సమాన సమయాన్ని వెచ్చిస్తుండగా, సగటు స్త్రీ, సగటు పురుషుడు బయట నలుగురితో కలిసి గడిపే దాని కంటే కూడా ఎక్కువ సమయాన్ని ఇంటి పనులకే కేటాయిస్తోంది. నిద్రను మినహాయిస్తే, పురుషులు ఉద్యోగం లేదా స్వయం ఉపాధి పనులలో రోజుకు సగటున గ్రామాలలో 4.6 గంటలు, పట్టణ ప్రాంతాలలో 5.3 గంటలు వెచ్చిస్తున్నారు. ఆ తరువాతనైనా వారికి విశ్రాంతి లభిస్తోంది. లేదా బయటి కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. కాని మహిళల్లో ఇంటి పనులు సుదీర్ఘంగా ఉంటున్నాయి. ఈ ధోరణి శ్రమ చేయటంలో స్త్రీ పురుష అసమానతల్ని స్పష్టంగా చూపిస్తోంది. 2024–25లో దేశంలో 15ఏళ్లు, అంతకు పైబడిన వయసు గల మహిళల కార్మిక భాగస్వామ్య రేటు 41.7 శాతం ఉండగా, పురుషులలో ఈ శాతం 78.8 వరకు ఉంది. తక్కువ జీతం, తక్కువ అవకాశాలు స్త్రీలు ఉద్యోగం చేయటానికి ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయి.రెండింతల రెట్టింపు పని మహిళలు విద్యలో ఎంతగా పురోగతి సాధిస్తున్నా, ఉద్యోగాలలో పెద్దగా ప్రయోజనం పొందటం లేదు. జీతం ఉన్న పని, జీతం లేని పని రెండింటినీ కలిపి, విద్యాస్థాయి లేదా సామాజిక–ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా మహిళలు పురుషుల కంటే ఎక్కువగా శ్రమిస్తున్నారు. నిరక్షరాస్యులైన మహిళలు సగటున రోజుకు 103 నిమిషాలకు పైగా జీతం ఉన్న ఉపాధి పనులకు, 281 నిమిషాలకు పైగా జీతం లేని పనికి వెచ్చిస్తున్నారు. డిగ్రీ ఉన్న మహిళలు సైతం ఉపాధి కోసం 106 నిమిషాలు, జీతం లేని పనికి చాలా ఎక్కువగా 323 నిమిషాలు కేటాయిస్తున్నారు. ఇది పురుషులు చేస్తున్న శ్రమ కంటే చాలా ఎక్కువ. నేటికీ నెమ్మదిగానే పురోగతిఅనేక విద్యా స్థాయులలో బాలురు, పురుషుల కంటే బాలికలు, మహిళలు మెరుగ్గా ఉన్నప్పటికీ, ఉద్యోగావకాశాలలో మహిళలింకా పురుషుల కంటే వెనుకబడే ఉన్నట్లు సర్వే పేర్కొంది. ఇంటి బాధ్యతలు తరచుగా వారిని ఉద్యోగావకాశాలకు దూరంగా ఉంచుతున్నాయని ఆర్థికవేత్తలు, విధాన నిర్ణేతలు ఎప్పటి నుండో చెబుతూ ఉన్న విషయమే. కాగా 2023 నోబెల్ గ్రహీత క్లాడియా గోల్డిన్, 200 సంవత్సరాల అమెరికా ఉద్యోగ రంగ డేటాను అధ్యయనం చేసి... వేతనం లేని పని భారం, ముఖ్యంగా మాతృత్వం... ఉపాధి అవకాశాలలో లింగ భేదాలకు దారి తీసిందని తెలిపారు. గర్భనిరోధక మాత్రల లభ్యత, సేవా రంగ ఉద్యోగాల ఆవిర్భావం కారణంగా పరిస్థితి కొంత మెరుగవటం కూడా క్లాడియా గమనించారు. అయితే, భారతదేశంలో ఈ పురోగతి ఇప్పటికీ నెమ్మదిగానే ఉంది. ∙∙ కాస్త బ్రేక్ తీస్కో తల్లీ! సినిమా మధ్యలో ‘విశ్రాంతి’ పడుతుంది, ప్రేక్షకుల రెస్ట్ కోసం. యుద్ధం మధ్యలో ‘కాల్పుల విరమణ’ ఉంటుంది, సైనికుల రెస్ట్ కోసం. ఆఫీస్లలో చిన్న చిన్న బ్రేక్లు ఉంటాయి, ఉద్యోగుల రెస్ట్ కోసం. ‘‘ఎటూ కదలకండి’’ అని డాక్టర్లు సలహా ఇస్తారు. పేషెంట్ల రెస్ట్ కోసం. డాక్టర్లే కాదు, ఒక పనిలో అదే పనిగా ఉండిపోతే, మన శరీరం కూడా మనకు రెస్ట్ సిగ్నల్ కొడుతుంది. ‘‘కాస్త ఆగు తల్లీ’’ అంటుంది. కానీ మనం ఆ సిగ్నల్స్ను పట్టించుకోం. పని పూర్తి చేసేస్తే ఒక పనైపోతుంది అనుకుంటాం. మన ఆలోచన ఏమిటంటే, పనిని మధ్యలోనే వదిలేయటం ఎందుకని? ఆలోచన మంచిదే కాని, ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు సలహా ఇస్తున్నారు. పని మధ్యలో రెస్ట్ అవసరం అయినప్పుడు పనిని మధ్యలోనే కదా వదిలేయాలి అని సున్నితంగా హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా... మహిళలకు చెబుతున్నారు. రెస్ట్ తీసుకోవటం అంటే?అలసట నుండి తేరుకోవటానికి రెస్ట్ అవసరం కనుక, అలసట తీరేవరకు పనిని పక్కన పెట్టటమే రెస్ట్ తీసుకోవటం. చేస్తున్న పనిని బట్టి, అప్పటి మీ శారీరక స్థితిని బట్టి కొన్ని నిముషాల రెస్ట్, లేదా కొన్ని గంటల రెస్ట్, లేదంటే కొన్ని రోజుల రెస్ట్ అవసరం అవుతుంది. అయితే రెస్ట్ తీసుకున్నంత మాత్రాన బాడీ, మైండ్ రెండూ రీచార్జ్ అవుతాయని చెప్పలేం. రెస్ట్ ఉంటుంది. ఉత్సాహం ఉండదు. ఉత్సాహం లేని రెస్టు కూడా మళ్లీ పనితో సమానమే. అందుకే, ముల్లును ముల్లుతోనే తీసినట్లుగా పని వల్ల వచ్చిన అలసటను పనితోనే పోగొట్టుకోవటం అవసరం. అందుకోసం ఏ రకం రెస్టు మనల్ని ఏ రకం అలసట నుంచి కోలుకునేలా చేస్తుందో తెలుసుకోవాలి. ముందు, రెస్టులోని రకాలు ఏమిటో తెలుసుకుంటే, వాటిల్లో ఏ రెస్ట్ మన స్థితికి సరిపోతుందో తెలిసిపోతుంది.రెస్టులో 7 రకాలుఫిజికల్ రెస్ట్, ఎమోషనల్ రెస్ట్, స్పిరిచ్యువల్ రెస్ట్, సోషల్ రెస్ట్, సెన్సరీ రెస్ట్, క్రియేటివ్ రెస్ట్, మెంటల్ రెస్ట్ అని ఏడు రకాలైన రెస్ట్లు ఉన్నాయి.ఫిజికల్ రెస్ట్: ఇది శారీరక విశ్రాంతి. చక్కగా నిద్రపోతే సరిగ్గా రెస్ట్ దొరుకుతుంది. ఇందుకు భిన్నంగా యోగా, బాడీనీ స్ట్రెచ్ (సాగతీయటం) వంటివి మంచి ఫలితాన్ని ఇస్తాయి. శరీరం తేలిపోతున్నట్లుగా ఉంటుంది. పని కోసం మళ్లీ మనసు పరుగులు పెడుతుంది. ఫిజికల్ రెస్ట్ వల్ల క్రియాశీలం అయ్యే రక్త ప్రసరణ మహిమ ఇది. ఇవి కాక.. మసాజ్, చిన్న చిన్న విరామాలు, వాకింగ్.ఎమోషనల్ రెస్ట్: ఇది భావోద్వేగ విశ్రాంతి. అంటే మీ కోపాన్ని, అసహనాన్ని, విసుగును, అసంతృప్తిని, ఆందోళనను.. ఆరోగ్యంగా వ్యక్తపరచడం. మీ మనసు లోపలి ఉద్దేశాల గురించి నిజాయితీగా బయటికి చెప్పుకోవటం. అవసరం అయితే సహాయం తీసుకోవటం. ఉద్వేగం మితిమీరకుండా నిగ్రహించుకోవటం. ఇందువల్ల మీకు మానసికమైన విశ్రాంతి లభిస్తుంది. ఇవి కాక.. ఒంటరిగా సమయం గడపడం, మీ గురించి మీరు శ్రద్ధ వహించటం. డైరీ రాయటం, ప్రకృతిలో గడపటం.స్పిరిచ్యువల్ రెస్ట్ : ఇది ఆధ్యాత్మిక విశ్రాంతి. దినచర్యలకు మించి జీవితానికి అర్థం, పరమార్థం కనుగొనే ప్రయత్నం చేయటం. అందుకోసం ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనటం. హృదయంతో ఆలోచించటం. ఇవన్నీ మనసును తేటపరుస్తాయి. భౌతికమైన ఒత్తిళ్ల నుంచి విశ్రాంతిని చేకూరుస్తాయి. ఇవి కాక.. మీకు నచ్చిన ఆధ్యాత్మిక సాధనలో పాల్గొనడం, ఒక సత్కార్యం కోసం స్వచ్ఛందంగా పనిచేయడం.సోషల్ రెస్ట్: ఇది సామాజిక విశ్రాంతి. సానుకూలంగా ఉండేవాళ్లు, మనకు మద్దతుగా ఉండేవాళ్లతో సమయాన్ని గడపటం. అదే సమయంలో అలసట కలిగించే, ఒత్తిడితో కూడిన సంబంధాలకు దూరంగా ఉండటం. మనం సామాజిక జీవులం. అయినప్పటికీ అంతర్ముఖులకు ఈ సోషల్ రెస్ట్ అలసట కలిగించేది కావచ్చు. అలాంటి వారికి సోషల్ రెస్ట్ వల్ల నష్టం తప్ప ప్రయోజనం ఉండదని గమనించాలి. ఇవి కాక.. ఒంటరిగా లేదా సన్నిహితులు, కుటుంబ సభ్యులతో సమయం గడపడం. సోలో పిక్నిక్, టూర్ లేదా ఉన్న చోటే బయటికి వెళ్లి భోజనం చేయడం, మీ ఒంటిపై మీరు ధ్యాస పెట్టటం.సెన్సరీ రెస్ట్: ఇది ఇంద్రియ విశ్రాంతి. దేదీప్యమానంగా వెలిగే లైట్లు, రణగొణధ్వనులు; టీవీ, స్మార్ట్ఫోన్ స్క్రీన్ల వంటి వాటికి దూరంగా, డిమ్ లైట్లు, నిశ్శబ్దాల మధ్య పొందే విశ్రాంతి. ఇవి కాక.. కాసేపు కళ్లు మూసుకోవడం, నిశ్శబ్దంగా ఉండే గదిలో సమయం గడపడం, ఎక్కువసేపు స్నానం చేయడం.క్రియేటివ్ రెస్ట్: సృజనాత్మక విశ్రాంతి. ఇది మీలోని క్రియేటివిటీని తట్టి లేపుతుంది. అలసటకు ఇది దివ్యౌషధం. మెదడుకు మేత వల్ల మీ మనసు పునరుత్తేజితం అవుతుంది. ఇవి కాక.. పని నుండి విరామం తీసుకోవడం, సృజనాత్మకమైన పనులు చేయటం (డ్రాయింగ్, పెయింటింగ్, అల్లికలు మొదలైనవి)మెంటల్ రెస్ట్: ఇది మానసిక విశ్రాంతి. ఇది మీ మెదడుకు బ్రేక్ ఇస్తుంది. నిర్ణయాలు తీసుకోవడం, సమస్య పరిష్కారం వెతకటం వంటి ఒత్తిళ్ల నుంచి తాత్కాలికంగా విరామం ఇస్తుంది. ధ్యానం వంటి అభ్యాసాలు లేదా తీవ్రమైన ఏకాగ్రత అవసరం లేని తేలిక పాటి సాధనల్లో పాల్గొనడం వల్ల మానసిక విశ్రాంతి లభిస్తుంది. ఇవి కాక.. మీ ఫోన్ను ఆఫ్ చేయడం, సోషల్ మీడియాకు కొన్నాళ్లు దూరంగా ఉండటం. (చదవండి: జాతీయ పోషకాహార వారోత్సవాలు: అరవైల్లోనూ యవ్వనంగా!) -
టోరంటోలో ఉమెన్ టాలెంట్
ఈ నెల పద్నాలుగు వరకు జరగనున్న టోరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(టిఐఎఫ్ఎఫ్)కు తొలిసారిగా మహిళల నేతృత్వంలోని ప్రతినిధి బృందాన్ని పంపుతోంది ఉమెన్ ఇన్ ఫిల్మ్ (డబ్ల్యూఐఎఫ్) ఇండియా. దేశవ్యాప్తంగా వచ్చిన రెండు వందలకు పైగా దరఖాస్తుల నుంచి ఈ ఆరుగురు మహిళా దర్శకులను ఎంపిక చేశారు.అర్ష్లే జోస్ – ఏ డాండిలయన్ డ్రీమ్; దీపాభాటియా – రాబిట్ హోల్; కాత్యాయని కుమార్– సన్స్ ఆఫ్ ది రివర్; మధుమిత సుందర్రామన్ – ది గెస్ట్ హౌజ్; పరోమిత దార్ –ఉల్టా ; ప్రమిత ఆనంద్ – ఏ లేట్ ఆటమ్ డ్రీమ్.‘ప్రతిభావంతులైన భారతీయ మహిళా దర్శకులను ప్రపంచ సినిమాతో అనుసంధానం చేయడానికి మా ప్రయత్నం తోడ్పడుతుంది’ అని ప్రకటించింది డబ్ల్యూఐఎఫ్.ఒక మహిళ చేసే పోరాటాన్ని కథావస్తువుగా తీసుకొని రూపొందించిన ‘బయాన్’ టోరంటో ఫిల్మ్ ఫెస్టివల్ డిస్కవరీ విభాగానికి ఎంపికైంది. ఈ చిత్రంలో హుమా ఖురేషీ (Huma Qureshi) ప్రధాన పాత్రపోషించింది.ఉమెన్ ఇన్ ఫిల్మ్ (డబ్ల్యూఐఎఫ్) ఇండియాను గుణిత్ ముంగ కపూర్ ప్రారంభించారు. భారతీయ సినీ పరిశ్రమలో లింగ సమానత్వం (Gender Equality) కోసం కృషి చేస్తోంది డబ్లూఐఎఫ్.చదవండి: ఏఐ చాట్బాట్లకు లింగ వివక్ష ఉంటుందా? -
Anjana Krishna: ఈ ధైర్యం అక్కడి నుంచి వచ్చిందే!
నీకు ఎంత ధైర్యం? అంటూ.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) ఓ ఐపీఎస్ అధికారిణితో వాగ్వాదం సందర్భంగా ప్రశ్నించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే.. ఈ వ్యవహారంలో పవార్ ప్రవర్తనపై నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఆ డేరింగ్ యంగ్ ఆఫీసర్ గురించి ఆరా తీస్తున్నారు. 2022–23 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన అంజనా కృష్ణ(26) స్వస్థలం కేరళ. ఆమె తండ్రి ఓ చిన్నబట్టల దుకాణం నడిపిస్తున్నారు. తల్లి కోర్టు టైపిస్ట్గా పని చేస్తోంది. పూజప్పురాలోని సెయింట్ మేరీస్ సెంట్రల్ స్కూల్లో చదువుకుంది. చిన్నప్పటి నుంచే అంజనాకు ఐపీఎస్ కావాలనే కల. తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో గణితంలో డిగ్రీ పూర్తి చేసింది. ఆవెంటనే UPSC పరీక్షకు సిద్ధమైంది. అదే సమయంలో అంజనా ఓ ప్రముఖ మలయాళ దినపత్రికలో ఇంటర్న్గా పనిచేసింది కూడా. మలయాళ సాహిత్యాన్ని ఐచ్ఛిక విషయంగా ఎంచుకుని, ఆంగ్ల మాధ్యమంలో యూపీఎస్సీ పరీక్ష రాసింది. అలా.. 2022 UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో అంజనా ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) 355 సాధించింది. ప్రస్తుతం మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా కర్మాలా ప్రాంతంలో DSP (Deputy Superintendent of Police)గా విధులు నిర్వహిస్తున్నారు. నిజాయితీతో పాటు ఉత్సాహం, పరిపాలనా నైపుణ్యం, దూకుడు వల్ల ఆమెకు స్థానికంగా మంచి పేరు దక్కింది. View this post on Instagram A post shared by Fortune IAS Academy (@fortune_ias_academy)అసలేం జరిగిందంటే.. రోడ్డు నిర్మాణం కోసం కర్మలా తాలూకాలోని కుద్దు గ్రామంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు సబ్-డివిజనల్ పోలీసు అధికారిణి అంజనా కృష్ణకు ఫిర్యాదులు అందాయి. దీనిపై చర్యలు తీసుకునేందుకు బుధవారం ఆమె ఆ గ్రామానికి వెళ్లారు. ఈక్రమంలో కొందరు గ్రామస్థులు, స్థానిక ఎన్సీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని అధికారులతో ఘర్షణకు దిగారు. అయితే.. వాళ్లలో ఒకరు డిప్యూటీ సీఎం అజిత్ పవార్కు ఫోన్ చేసి ఇచ్చారు. ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం ఆపాలని పవార్ ఆమెను ఆదేశించారు. ఈ క్రమంలో.. పవార్: నేను ఉపముఖ్యమంత్రిని మాట్లాడుతున్నా. మీ చర్యలను వెంటనే ఆపేయండి.అంజనా: మీరు చెబుతున్నది నాకు అర్థమవుతోంది. కానీ, ఫోన్లో నేను మాట్లాడుతోంది నిజంగా డిప్యూటీ సీఎంతోనేనా? కాదా? అనే విషయం తెలియాలి. నా నంబర్కు ఒకసారి వీడియో కాల్ చేస్తారా?పవార్: నీకు ఎంత ధైర్యం?. నేను మీపై చర్యలు తీసుకుంటా. నన్నే వీడియో కాల్ చేయమంటారా?నన్ను చూడాలనుకుంటున్నారుగా.. నాకు వీడియో కాల్ చేయండి.अजित पवार- "इतना आपको डेयरिंग हुआ है क्या?"जब DSP अंजना कृष्णा ने अजीत पवार से कहा, "मैं कैसे मान लूं कि आप डिप्टी चीफ मिनिस्टर हो, वीडियो कॉल करो" #Maharashtra #AjitPawar #MaharashtraPolice #AnjanaKrishna #NCP pic.twitter.com/WUnEtWlfRm— India TV (@indiatvnews) September 5, 2025దీంతో పవార్కు ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణ వీడియో కాల్ చేశారు. ఈ సందర్భంగా తక్షణమే చర్యలు ఆపేయాలంటూ పవార్ ఆదేశించారు. ఈ సంభాషణను ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అలా ఆ వీడియో వైరల్ అయ్యింది. పవార్పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వీడియోపై పవార్ వర్గ నేత సునీల్ తట్కరే స్పందించారు. కార్యకర్తలను శాంతింపజేసేందుకు ఐపీఎస్ అధికారిణిని అజిత్ మందలించి ఉండవచ్చన్నారు. ఆమె విధులను పూర్తిగా అడ్డుకోవాలనేది ఆయన ఉద్దేశం కాదన్నారు. ఇక ఈ ఘటనపై అంజనా కృష్ణ స్పందించాల్సి ఉంది. అయితే పవార్ స్వరం గుర్తించలేకపోయినందున నిర్ధారణ కోసమే కాల్ చేయాలని ఆమె కోరినట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు. డిప్యూటీ సీఎంతో ‘నేరుగా కాల్ చేయండి’ అనే మాట ఆమె ధైర్యాన్ని ప్రతిబింబించే సంకేతంగా మారింది. సోషల్ మీడియాలో ఆమె ధైర్యం, నిబద్ధతపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. -
శాస్త్రీయ సాంకేతిక అవగాహనకు...
తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా పెన్పహడ్ జిల్లా పరిషత్తు స్కూల్లో బయాలజీ టీచర్గా పని చేస్తున్న మారం పవిత్ర 2025 సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా 44 మందిని ఎంపిక చేయగా, తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక ఉపాధ్యాయురాలు పవిత్ర. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆమె అవార్డును అందుకోబోతున్నారు. ఆట పాటలను మిళితం చేస్తూ బోధించే విధానానికి శ్రీకారం చుట్టారు పవిత్ర. పాఠ్యాంశాలకు అనుగుణంగా గేమ్స్ రూ΄÷ందించి విద్యార్థులకు బాగా అర్థం అయ్యేలా చేస్తున్నారు.ఆడుతూ హాయిగా నేర్చుకునేలా...బయాలజీ కాన్సెప్ట్స్ను తీసుకొని ఫైండ్ ద వర్డ్ సర్చ్, క్రాస్ వర్డ్ పజిల్స్ తదితర గేమ్స్ రూపొందించారు. పాఠం చెప్పిన తరువాత ఈ గేమ్స్ ఆడిస్తే విద్యార్థులకు కాన్సెప్ట్ను మరోసారి రిపీట్ చేసినట్లు అవుతుంది. ప్రతి దశను తెలుసుకుంటారు. ఆడుతూ నేర్చుకుంటారు కాబట్టి మరచి΄ోకుండా ఉంటారు.విద్యా వారధిఅమెరికా వంటి దేశాల్లో విద్యా విధానం ఎలా ఉందో విద్యార్థులకు అర్థమయ్యేలా చేసేందుకు ‘విద్యా వారధి’ కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టారు. ‘విద్యా వారధి’లో స్కూల్ పిల్లలు అమెరికాలోని విద్యార్థులతో ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకు జూమ్ ద్వారా ఇంటరాక్ట్ అవుతారు. అమెరికాలో విద్య. బోధన విధానం, పదో తరగతి, ఇంటర్మీడియట్ తరువాత ఎలాంటి ప్రవేశ పరీక్షలు ఉంటాయి...మొదలైన విషయాలను అక్కడి విద్యార్థులతో మాట్లాడి తెలుసుకుంటారు.వ్యక్తిత్వ వికాస డైరీవిద్యార్థులు తమ డైరీలో సబ్జెక్ట్కు సంబధించిన అసైన్మెంట్స్ రాసుకుంటారు. కానీ ఈ స్కూల్ పిల్లల డైరీ ప్రత్యేకం. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు తమ దినచర్య రాయాలి. తప్పు చేసినా, మంచి పని చేసినా రాయాలి. వారం రోజుల తరువాత డైరీలో రాసుకున్న విషయాలను విద్యార్థులే చదువుకునేలా చేస్తారు. వారం రోజుల్లో చేసిన మంచి పనులు, తప్పులు ఏమిటి? ఎలా ఉండాలనేది విద్యార్థులు స్వయంగా తెలుసుకుంటారు. తద్వారా వారిలో క్రమంగా సత్ప్రవర్తన పెంపొందుతుంది.– చింతకింది గణేశ్, సాక్షి ప్రతినిధి, నల్లగొండ (చదవండి: మానవ రక్తం కంటే అత్యంత ఖరీదైనది ఏదో తెలుసా..!) -
ఆడపిల్ల చదువుకు జీవితాన్ని ఇచ్చింది
‘ప్రపంచంలో చదువుకు దూరమైన అతి ఎక్కువ మంది ఆడపిల్లలున్న దేశం భారత్ ఒక్కటే’ అంటారు సఫీనా హుసేన్. స్కూల్లో ఉన్న ఆడపిల్లల కంటే స్కూల్ మానేసిన ఆడపిల్లలు ఎక్కువ ఉండటంతోవారిని తిరిగి స్కూళ్లకు పంపడానికి ఆమె ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ స్థాపించారు. ఏళ్ల తరబడి ఆమె సాగించిన కృషి బాలికల జీవితాల్లో చదువును తెచ్చింది. ఆమెకు ‘రామన్ మెగసెసె ఆవార్డు’ తెచ్చిపెట్టింది. ఆసియా నోబెల్గా భావించే రామన్ మెగసెసెను సఫీనా స్థాపించిన ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ ఎన్.జి.ఓకు ప్రకటించారు.‘మారుమూల గ్రామంలో అయినా సరే ఏ ఒక్క ఆడపిల్ల స్కూలుకు వెళ్లకుండా ఉండకూడదు. అదే మా ఎడ్యుకేట్ గర్ల్స్ లక్ష్యం’ అంటారు సఫీనా హుసేన్. 54 ఏళ్ల ఈ సామాజిక కార్యకర్త 2007 లో బాలికా విద్య కోసం ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ ఎన్.జి.ఓను స్థాపించారు. ఆ రోజు నుంచి ఈరోజు వరకూ సుమారు నాలుగు లక్షల మంది బాలికలను అక్షరాస్యత వైపు నడిపించారు. అందుకే ఆమె సంస్థకు ప్రతిష్ఠాత్మక రామన్ మెగసెసె అవార్డు 2025ను ప్రకటించారు. 1958 నుంచి ఇస్తున్న ఈ అవార్డు కింద 50 వేల యు.ఎస్.డాలర్ల నగదు కూడా ఉంటుంది.‘ఎడ్యుకేట్ గర్ల్స్కు రామన్ మెగసెసే అవార్డు రావడం చాలా సంతోషాన్నిచ్చింది. ఇదొక చారిత్రాత్మక క్షణం. భారతదేశంలో బాలికల విద్యకోసం ప్రజలతో కలిసి మేము చేస్తున్న ఈ ఉద్యమం గురించి ఈ అవార్డు వల్ల ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది. బాలికలను శక్తిమంతం చేయడానికి, వారు అడ్డంకులను ఛేదించి మరిన్ని విజయాలు సాధించడానికి మనమంతా మరెంతో దూరం ప్రయాణించాల్సి ఉంది’ అని అవార్డు ప్రకటన తర్వాత సఫీనా అన్నారు.‘టీమ్ బాలిక’ల విజయం‘ఎడ్యుకేట్ గర్ల్స్’ ద్వారా స్కూలు మానేయించిన బాలికలను తిరిగి స్కూలుకు పంపడానికి సఫీనా ఎన్నుకున్న మార్గం ప్రతి ఊరి నుంచి ఒక చురుకైన యువతి ని కార్యకర్తగా ఎంచుకోవడం. వీరిని ‘టీమ్ బాలిక’ అంటారు. ఈ బాలికలే ఇంటింటికి తిరిగి కుటుంబాలను ఒప్పించి డ్రాపవుట్ ఆడపిల్లలను తిరిగి బడికి చేరుస్తున్నారు. 2007లో 50 గ్రామాల్లో మొదలెట్టిన ఈ కార్యక్రమం నేడు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 18 వేల గ్రామాల్లో బాలికలకు విద్యనందించేందుకు కృషి చేస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థలో 13 వేల మంది యువతులు టీమ్ బాలికలుగా గ్రామాల్లో పని చేస్తున్నారు. ‘నా ఊరు.. నా సమస్య... నేనే సమాధానం’ అనేది వీరి నినాదం. తమ ఊరిని తామే బాగు చేసుకుందామని వీరు ముందుకొస్తే పెద్దలు మద్దతు తెలుపుతున్నారు. ‘స్కూలు మాన్పించి ఇంటి పనులు చేయించడం బాలికల కలలను ఛిద్రం చేయడమే’ అంటారు సఫీనా. కేవలం బాలికల్ని బడికి పంపడమే కాకుండా పాఠశాలలకు సౌకర్యాలు అందించడం, బాగా చదివే పిల్లలను కళాశాలల్లో చేర్పించడం, వారి ఆరోగ్యంపై శ్రద్ధ చూపించడం వంటివి కూడా ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ చేపడుతుంది.ఎవరీ సఫీనా?సఫీనా హుస్సేన్ 1971లో దిల్లీలో జన్మించారు. ఈమె తండ్రి యూసఫ్ హుసేన్ అనే టీవీ నటుడు. ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్’ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సఫీనా 1998 నుంచి 2004 వరకు శాన్ ఫ్రాన్సిస్కోలోని ‘చైల్డ్ ఫ్యామిలీ హెల్త్ ఇంటర్నేషనల్’కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేశారు. 2005లో అమెరికా నుంచి ముంబయికి తిరిగొచ్చిన ఆమె స్థానిక పరిస్థితులను పరిశీలించారు. ప్రపంచంలో స్త్రీల జీవన విధానాలు అత్యంత దుర్భరంగా ఉన్న 20 దేశాల్లో భారత్ కూడా ఉందన్న సర్వే వివరాలు తెలుసుకొని ఆమె కలవరపడ్డారు. ప్రధానంగా విద్య విషయంలో తల్లిదండ్రులు ఆడ, మగ అంటూ భేదం చూపించడం, కొడుకును చదివిస్తూ కూతుర్ని ఇంటి పనుల్లో పెట్టడం వంటివి ఆమెను ఆలోచింపజేశాయి. ఆ పరిస్థితి మారాలంటే పల్లెల నుంచి పని మొదలుపెట్టాలని భావించారు. అలా 2007లో ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. ఈమె చేస్తున్న కృషి నచ్చి కత్రినా కైఫ్ తనకు తానుగా ముందుకొచ్చి ‘ఎడ్యుకేట్ గర్ల్స్’కు అంబాసిడర్గా, టీమ్ బాలికగా పని చేశారు.2035 నాటికి కోటి మంది బాలికలు‘ఎడ్యుకేట్ గర్ల్స్’ చేసిన కృషి ఫలితంగా లక్షలాది బాలికలు బడులకు చేరి అక్షరాలు దిద్దారు. వారిలో కొందరు స్కూళ్లు దాటి కాలేజీల్లోనూ అడుగుపెట్టారు. ఇదంతా సమష్టి కృషితో సాధ్యం అంటారు సఫీనా హుస్సేన్. సంస్థ నిర్వహణలో తనకు సాయం అందించినవారు, తనతో కలిసి పనిచేస్తున్నవారందరి కృషి ఈ విజయంలో ఉందని అంటున్నారు. 2035 నాటికి కోటి మంది బాలికల్ని బడుల్లో చేర్పించడమే లక్ష్యంగా సాగుతున్నట్లు వివరించారు. -
ఆరాటం ముందు ఆటంకం ఎంత!
చిన్నచిన్న సమస్యలకే గాబరా పడిపోతుంటాం. అపజయాలు ఎదురైనప్పుడు ఆత్మవిశ్వాసం కోల్పోతుంటాం. అయితే కొంతమంది మాత్రం ఓటములనే తమ విజయానికి మెట్లుగా మలుచుకుంటారు. అవరోధాలను అధిగమించడానికి అనుభవాలుగా అపజయాలను అనుకుంటారు. లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా లెక్కచేయరు. కష్టాలు ఎదురొచ్చినా తాము అనుకున్నది సాధించే వరకు పట్టువదలరు. దీపేష్ కుమారి కూడా ఈ కోవలోకే వస్తారు.ఎవరీ దీపేష్ కుమారి?రాజస్థాన్లోని భరత్పూర్కు దీపేష్ కుమారిది చాలా పేద కుటుంబం. ఆమె తండ్రి గోవింద్ కుమార్ తన భార్య, ఐదుగురు పిల్లలను పోషించడానికి పకోడీలు, స్నాక్స్ అమ్మేవాడు. ఏడుగురు సభ్యుల కుటుంబం పరిమిత వనరులతో ఒక చిన్న గదిలో నివసించింది. చాలీచాలని సంపాదనతో ఆ కుటుంబం నెట్టుకొచ్చేది. అయితే ఇంత కష్టంలోనూ పిల్లల చదువును నిర్లక్ష్యం చేయలేదు. విద్యతోనే తమ కష్టాలు తీరతాయని గోవింద్ భావించాడు. ఎన్ని సమస్యలు ఉన్నా పిల్లలను చదివించాలని గట్టిగా అనుకున్నాడు. అతడి పెద్ద కుమార్తె దీపేష్ కుమారి. తమ కోసం తండ్రి పడుతున్న కష్టాన్ని తొలగించాలంటే చదువుతోనే సాధ్యమని ఆమె గట్టిగా విశ్వసించింది. అందుకే చిన్నప్పటి నుంచి కష్టపడి చదివింది. భరత్పూర్లోని శిశు ఆదర్శ్ విద్యా మందిర్లో చదివి.. 10వ తరగతిలో 98%, 12వ తరగతిలో 89% స్కోర్ సాధించి సత్తా చాటింది. జోధ్పూర్లోని MBM ఇంజనీరింగ్ కళాశాల నుంచి సివిల్ ఇంజనీరింగ్లో బీటెక్ ( B.Tech), ఐఐటీ బాంబే నుంచి ఎంటెక్ పట్టా సాధించింది.ప్రైవేట్ జాబ్ వదిలేసి..చదువు ముగిసిన తర్వాత ఏడాది పాటు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసింది. సివిల్ సర్వెంట్ కావాలన్న తన కలను సాకారం చేసుకోవాలన్న లక్ష్యంతో ఉద్యోగాన్ని వదిలేసి UPSC పరీక్షకు ప్రిపేర్ కావడం ప్రారంభించింది. 2020లో మొదటి ప్రయత్నం విఫలమైంది. కానీ ఆమె పట్టు వదలేదు. తాను దాచుకున్న డబ్బుతో ఢిల్లీ వెళ్లి కోచింగ్ తీసుకుంది. దీక్షగా చదవడంతో మరుసటి ఏడాదే ఆమె కల సాకారమయింది. దీపేష్ UPSC పరీక్షలో అఖిల భారత స్థాయిలో 93వ ర్యాంక్, EWS విభాగంలో 4వ ర్యాంక్ సాధించి ఐఏఎస్కు ఎంపికైంది. శిక్షణ పూర్తైన తర్వాత జార్ఖండ్ కేడర్కు నియమించబడింది.తోబుట్టువులకు స్ఫూర్తిదీపేష్ కుమారి విజయం ఆమె తోబుట్టువులకు కూడా స్ఫూర్తినిచ్చింది. ఆమె చెల్లెలు ఇప్పుడు ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో వైద్యురాలిగా, ఒక సోదరుడు గౌహతిలోని ఎయిమ్స్లో ఎంబీబీఎస్ (MBBS) చదువుతున్నాడు. మరొక సోదరుడు లాతూర్లో చదువు కొనసాగిస్తున్నాడు.చదవండి: 40 ఏళ్ల వ్యక్తి 22 ఏళ్ల అమ్మాయితో అలా చేయడం తప్పు నాన్నే ప్రేరణదీపేష్ కుమారి తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ.. తన తండ్రి అంకితభావమే తనకు అతిపెద్ద ప్రేరణ (Inspiration) అని చెప్పారు. "నేను అలసిపోయినప్పుడల్లా, ఆయన పోరాటం నాకు బలాన్నిచ్చింది" అని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. పరిమిత మార్గాలు ఉన్నప్పటికీ గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షించే యువతకు దీపేష్ కుమారి ఇన్స్పిరేషన్గా నిలుస్తారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. -
బాధించిన శారీరక ఎత్తునే చిత్తుచేసి.. ఐఏఎస్ స్థాయికి..
పొట్టివాడైనా..గట్టివాడమ్మ అన్న నానుడిలా ..ఓ మహిళ అత్యున్నత స్థాయికి చేరుకుని శెభాష్ అనిపించుకుంది. అది శారీరక లోపం కాదు..విభిన్నంగా చూపే విశిష్ట లక్షణంగా భావించింది. అదే తన ఉన్నతికి సోపానంగా మార్చి.. తనకంటూ ఓ ఐడెంటిటీని క్రియేట్ చేసుకునే రేంజ్కి చేరుకుంది. తనను చూడగానే శారీరక లోపం కాదు..సాధించిన విజయమే తలంపుకు వచ్చేలా అందరి మదిలో చిరస్థాయిగా నిలిచేలా అనితర సాధ్యమైన సక్సెస్ని అందుకుని యావత్తు ప్రపంచం తనవైపుకి తిరిగేలా చేసుకుంది.ఆమెనే డెహ్రాడూన్కి చెందిన ఆర్తి డోగ్రా. తన శారీరక ఎత్తు సమాజం నుంచి అవహేళనలు, అవమానాలను బహుమతులుగా అందంచింది. ఇంతేనా అనిపించేలా అడుగడుగున జాలి చూపులు. అందరిలో సులభంగా కలిసిపోయి ఇమడలేని పరిస్థితి. అయినా సరే ఈ పరిస్థితిని ఏదో అనితర సాధ్యమైన విజయంతో సమాధానమిచ్చేలా తన తలరాతను తిరిగి రాయాలని సంకల్పించింది. ఆ నేపథ్యంలో ఆర్తి మొండి పట్టుదలతో ముందుకెళ్లెందేకు ప్రయత్నించింది. అందుకు తండ్రి కల్నల్ రాజేంద్ర డోగ్రా, అమ్మ కుంకుమ్ డోగ్రా చక్కటి ప్రోద్భలం అందించారు. అయితే తన శారీరక ఎత్తు ఎగతాళి, అవమానాల తోపాటు తన కెరీర్ అవకాశాలను మింగేస్తోందని తెలిసి కుంగిపోలేదు. దానికే సవాలు విసిరేలా అందనంత అత్యున్నత స్థాయిలో ఉండాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగింది. అలా ఆమె డెహ్రాడూన్లో పాఠశాల విద్యను, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీని, మాస్తర్స్ని పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచి తెలివైన విద్యార్థి అయిన ఆర్తి సివిల్స్ సర్వీస్ని ఎంపిక చేసుకుంది. అందుకు సన్నద్ధమైంది. ఆ క్రమంలో అవమానాలు, అవహేళనలు తప్పలేదు. అయినా తన ప్రయత్నం తనదే..అన్నట్లుగా సాగింది. ఈ అమ్మాయా ఐఏఎస్ అయ్యింది అని విస్తుపోయేలా అనితరసాధ్యమైన విజయఢంకా మోగించింది. అత్యంత పొట్టి ఐఏఎస్గా చరిత్ర సృష్టించి..ఎందరో సివిల్స్ ఔత్సాహిక అభ్యుర్థులుకు స్ఫూర్తిగా నిలిచింది. శారీరక లోపం అనేది మన అంతరంగంలో ఉన్న విశిష్ట శక్తిని మనకే పరిచయం చేసే సాధనంగా మలుచుకుంటే..సాధ్యం కాదనుకున్న విజయాలన్నీ ఒళ్లోకొచ్చి వాలిపోతాయంటోందామె. అంతేగాదు ఆ సక్సెస్ ఆమె శారీరక ఎత్తుని చూడనీయడం లేదు. ఈమె నాకు రోల్ మోడల్ అనిపించేలా ఆమె అత్యున్నత హోదా ప్రేరణ కలిగిస్తోంది. ఒక్క విజయంతో వేలెత్తి చూపే మాటలన్నింటికీ తగిన సమాధానం ఇవ్వడం అంటే ఇదే కదూ..!. ప్రస్తుతం ఆమె రాజస్థాన్లో సమాచార, సాంకేతిక కమ్యూనికేషన్ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.(చదవండి: హ్యక్ హా.. అప్డేట్ హా..?!) -
KBC 17: హైదరాబాద్ మహిళ.. ఎంత గెలిచారంటే..?
బుల్లి తెరపై కౌన్ బనేగా కరోడ్పతి 17వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. హోస్ట్ అమితాబ్ బచ్చన్ తనదైన శైలిలో షోను నడిపిస్తున్నారు. 25 ఏళ్లుగా సోనీ టెలివిజన్లో ప్రసారమవుతున్న ఈ క్విజ్ షోకు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీలు వరకు ఈ షోలో పాల్గొనేందుకు అమితాసక్తి చూపిస్తుంటారు. ఇప్పటివరకు ఇందులో పాల్గొన్న చాలా మంది భారీగా నగదు గెలుచుకున్నారు.తాజాగా హైదరాబాద్కు చెందిన మహిళా సైంటిస్ట్ ఒకరు రూ.12.5 లక్షలు గెలిచి సత్తా చాటారు. రూ. 25 లక్షలు గెలిచే అవకాశాన్ని కొద్దిలో మిస్సయ్యారు. హరిప్రియ సాకేతపురం.. ఇస్రోలో శాస్త్రవేత్తగా (ISRO scientist) పనిచేస్తున్నారు. కౌన్ బనేగా కరోడ్పతిలో తాజాగా బిగ్ బి ఎదురుగా హాట్ సీటులో కూర్చునే అవకాశాన్ని ఆమె దక్కించుకున్నారు. ముందుగా ఆమెను అమితాబ్ సాదరంగా ఆహ్వానించి, ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇస్రో మహిళా శాస్త్రవేత్త తొలిసారిగా కేబీసీకి రావడం తమ అదృష్టమని ఆయన అన్నారు.ఉద్యోగం, కుటుంబంఈ సందర్భంగా హరిప్రియ మాట్లాడుతూ.. సవాళ్లతో కూడిన ఉద్యోగ జీవితం గురించి ప్రేక్షకులతో పంచుకున్నారు. చంద్రయాన్, మంగళయాన్లతో తన ప్రయాణం గురించి మాట్లాడారు. కుటుంబాన్ని సమన్వయం చేసుకుంటూ కెరీర్లో ఏవిధంగా ముందుకెళుతున్నారో వివరించారు. తర్వాత గేమ్ మొదలు పెట్టారు. ఒక్కో ప్రశ్నకు సమాధానాలు చెబుతూ 13వ క్వశ్చన్ దగ్గర ఆగారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా నిష్క్రమించడంతో రూ.12.5 లక్షలు గెలిచారు. ఆ ప్రశ్నకు కూడా సమామాధానం చెబితే ఆమెకు పాతిక లక్షలు దక్కేవి. అయితే పోటీ నుంచి తప్పకున్నాక ఆమె గెస్ చేసిన సమాధానం కరెక్ట్ అని తేలడం విశేషం. ఇంతకీ ఏంటా ప్రశ్న?పరమహంస యోగానంద ఆత్మకథ ప్రకారం.. ఆయన మహాత్మా గాంధీకి ఏ పండును సూచించి, కాలిఫోర్నియా నుంచి వార్ధాకు కొన్ని మొక్కలను పంపారు?ఎ. కాంటాలౌప్బి. హకిల్బెర్రీసి. అవకాడోడి. పీచ్సరైన సమాధానం: అవకాడోఇంకా ఆడాల్సింది..షో చూస్తున్న వారంతా హరిప్రియ అనవసరంగా క్విట్ చేసిందని, పోటీలో ముందుకెళ్లుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కేబీసీలో హరిప్రియ రూ. 25 లక్షలు గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయినప్పటికీ, ఆమె ప్రయాణం (Journey) చాలా మందికి స్ఫూర్తినిచ్చిందని ప్రేక్షకులు అంటున్నారు. చదవండి: కష్టాలనూ ఆడేసుకున్నారు -
ఉమెన్ కమాండో టీమ్
కీలకమైన ఆపరేషన్ల కోసం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) తొలిసారిగా ఉమెన్ కమాండో టీమ్ను ప్రారంభించింది. వందమంది మహిళా సీఐఎస్ఎఫ్లకు ఫిట్నెస్, వెపన్స్ హ్యాండ్లింగ్, లైవ్–ఫైర్ డ్రిల్స్లాంటి ఆపరేషన్ స్కిల్స్, రన్నింగ్, అబ్స్టకిల్ కోర్సులు, రఫెలింగ్, సర్వైవల్ ఇన్ ఫారెస్ట్స్, 48 గంటల కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఎక్సర్సైజ్లు... మొదలైనవాటిలో శిక్షణ ఇస్తారు.మధ్యప్రదేశ్లోని బర్వాహత రీజనల్ ట్రైనింగ్ సెంటర్(ఆర్టిసి)లో శిక్షణ మొదలైంది. శిక్షణ పూర్తి చేసుకున్న తొలిబ్యాచ్ మహిళలు ఎయిర్΄ోర్ట్స్లాంటి సున్నిత ప్రాంతాలలో విధులు నిర్వహిస్తుంది.(చదవండి: బ్యాట్ బండెక్కి నేనొస్త పా... నేనొస్త పా...) -
పరిశ్రమిస్తున్న నారీ లోకం!
‘అన్నీ తెలిసిన వారు ఉండరు.అలాగే ఏమీ తెలియని వారూ ఉండరు’ అనేది సామెత. ‘నీకు తెలిసిందే నీ శక్తి’ అనేది నీతికథ. జిమ్మి రాజుకు అంతర్జాతీయ వ్యాపారాల గురించి తెలియదు కానీ పచ్చళ్ల గురించి బాగా తెలుసు. ‘గ్రాండ్మా’ పేరుతో పచ్చళ్ల కంపెనీ ప్రారంభించి గ్రాండ్ సక్సెస్ అయింది. ఒకప్పుడు కేరళలోని త్రిసూర్కే పరిమితమైన ఆ కంపెనీ ఇప్పుడు యూరోపియన్ దేశాల్లో కూడా సత్తా చాటుతోంది. జిమ్మి రాజు మాత్రమే కాదు ఘనమైన వ్యాపార నేపథ్యం లేని ఎంతోమంది సాధారణ మహిళలు చిన్న చిన్న అడుగులు వేస్తూనే ఎంటర్ప్రెన్యూర్లుగా పెద్ద స్థాయికి చేరుకున్నారు.గ్రాండ్మా..గ్రాండ్ సక్సెస్‘నేను వ్యాపారవేత్త కాగలనా?’ తనకు తాను ప్రశ్న వేసుకుంది జిమ్మి రాజు. ‘కచ్చితంగా!’ తనలో నుంచే సమాధానం వచ్చింది. ‘నాకు ఏం తెలుసు?’ మరో ప్రశ్న.‘పెద్దగా ఏమీ తెలియనక్కర్లేదు. నడిచే దారిలో అన్నీ తెలుస్తాయి’ ఆ ప్రశ్నకు జవాబు.తనకు పచ్చళ్లు అంటే ఇష్టం. ఆసక్తి. ‘యస్...పచ్చళ్లతోనే మొదలెడదాం’ అనుకొని ప్రయాణం ప్రారంభించింది జిమ్మి రాజు. కేరళలోని మరడీలో ‘గ్రాండ్మా’ పేరుతో చిన్నపాటి వ్యాపారం ప్రారంభించింది. ‘గ్రాండ్మా’ గ్రాండ్ సక్సెస్కు కారణం నాణ్యతతో కూడిన నిమ్మకాయ పచ్చళ్లు. ‘గ్రాండ్మా’ ఇంట గెలిచింది. ఇప్పుడు రచ్చ గెలవాలి. వ్యాపారాన్ని విస్తరించాలంటే ముందు డబ్బు కావాలి. ‘ఫెడరల్ బ్యాంక్’ నుంచి లోన్ ద్వారా తన వ్యాపారాన్ని జాతీయ స్థాయికి, యూరోపియన్ దేశాల వరకు తీసుకువెళ్లింది జిమ్మి రాజు. ‘గ్రాండ్మా’ ఇప్పుడు ఎంతోమందికి ఉపాధిని ఇస్తోంది.నష్టాల నుంచి లాభాలకుపంజాబ్లోని మన్సాకు చెందిన కుల్విందర్ కౌర్ కుటుంబం డెయిరీ ఫామ్ను నిర్వహించేది. ఈ డైరీ వల్ల లాభాల మాటేమిటోగానీ నష్టాలే నష్టాలు! ‘ఇలా అయితే కుదరదు’ అని గట్టిగా అనుకున్న కుల్విందర్ ‘ఇప్పుడు ఏం చేయాలి?’ అని లోతుగా ఆలోచించింది. నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ‘మనీబాక్స్’ను సంప్రదించింది. ఈ కంపెనీ నుంచి అందిన రుణంతో డెయిరీని ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దింది. నష్టాల నుంచి బయటపడడానికి, లాభాల బాట పట్టి పెద్ద డెయిరీ ఫామ్ స్థాయికి చేరడానికి ఎంతో కాలం పట్టలేదు.అమ్మ నేర్పిన విద్యలక్ష్మి పది సంవత్సరాల వయసులో ఉన్నప్పడు తల్లి వినయ కేరళ, కొంకణి వంటకాలకు సంబంధించి చిన్నపాటి వ్యాపారాన్ని నిర్వహించేది. స్కూలు నుంచి రాగానే తల్లి చేసిన రకరకాల వంటకాలను రుచి చూసేది చిన్నారి లక్ష్మి. ప్యాకింగ్, డెలివరీకి సంబంధించిన పనుల్లో తల్లికి సహాయపడుతుండేది. ఏళ్ల తరువాత... వినయ కోవిడ్ బారిన పడింది. అప్పుడు కూడా వైద్యులతో తన వ్యాపారం గురించి మాట్లాడేది. తల్లి చనిపోయి తరవాత విషాదంలో కూరుకుపోయింది లక్ష్మి. ఆ సమయంలోనే తన భవిష్యత్ని మార్చే నిర్ణయం తీసుకుంది.‘అమ్మ ఆత్మకు శాంతి కలగాలంటే వ్యాపారం ఆగకూడదు’ అనుకుంది. అలా ‘లక్ష్మి’ ఫుడ్ స్టార్టప్ మొదలైంది. రకరకాల వంటకాలకు సంబంధించి తల్లి రాసిన నోట్స్ తనకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. మొదట్లో ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్లకు సంబంధించిన సమస్యలు ఎదురైనా ఆ తరువాత మాత్రం కంపెనీని పెద్ద ఎత్తున విస్తరించింది.‘అమ్మ మా వ్యాపారాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలని కలలు కనేది. ఆమె కలను నిజం చేసుకోవడానికి చాలా కష్టపడ్డాం. స్థానిక అమ్మకాలు, ఆన్లైన్ అమ్మకాలు, సోషల్ మీడియా మార్కెటింగ్తో అమ్మ కలను సాకారం చేశాం’ అంటుంది కేరళలోని త్రిసూర్కు చెందిన లక్ష్మి.మష్రూమ్ లేడీ ఆఫ్ హరియాణాకోవిడ్ కల్లోల కాలంలో దొరికిన విరామంలో ‘కొత్తగా ఏదైనా చేయాలి’ అని ఆలోచించింది అసిస్టెంట్ ప్రొఫెసర్ సోనియ దాహియ. ఆ ఆలోచనలే ఫలితమే... పుట్టగొడుగుల పెంపకం. ఆమె నిర్ణయం చాలా మందిని షాక్కు గురి చేసింది. ‘భద్రతను ఇచ్చే ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి పుట్టగొడుగుల పెంపకం ఏమిటి!’ అని ఆశ్చర్యపోయారు. అయినప్పటికీ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు సోనియా. నలభై లక్షల రూపాయలతో ‘డాక్టర్ దాహియ మష్రూమ్ ఫామ్’ ప్రారంభించింది.రోజు రోజుకూ వ్యాపారాన్ని విస్తరిస్తూ పోయింది. ఊహించని లాభాల స్థాయికి తీసుకువచ్చింది. అయితే మొదట్లో ఆమె ప్రయాణం సజావుగా ఏమీ జరగలేదు. తరచు విద్యుత్ కోతలుండేవి. ఆ ప్రభావం పుట్టగొడుగులపై పడేది. ఇదొక్కటే కాదు...ఎన్నో సమస్యలను, వాటి పరిష్కార మార్గాలను కనుక్కుంటూ వెళ్లిన సోనియ ‘మష్రూమ్ లేడీ ఆఫ్ హరియాణా’గా పేరు తెచ్చుకుంది. పుట్టగొడుగుల పెంపకంలో సోనియాకు బయోటెక్నాలజీ నేపథ్యం ఎంతగానో ఉపయోగపడింది.ఆ బడిలో ఎన్నో విలువైన పాఠాలు→ ఎన్ని సవాళ్లు, సమస్యలు ఎదురైనా మన లక్ష్యాన్ని వదులుకోకూడదు. నేను చెప్పే గెలుపు మంత్రం...‘అపజయం అనేది తాత్కాలికం’ → ‘లింగ వివక్షత’ కనిపించకుండా చేసే శక్తి మన విజయానికి ఉంటుంది → ఎంటర్ప్రెన్యూర్ చేసే ప్రయాణం అనేది విరామమెరుగని నిరంతర ప్రయాణం → మీరు ఒక పని ఎంచుకుంటే, మీ జీవితం మొత్తం ఆ పని మీదే ఆధారపడినంతగా కష్టపడాలి → వ్యాపారవేత్తగా ప్రయాణం ప్రారంభించడం అంటే బడిలో విద్యార్థిగా చేరడమే. ఆ బడిలో ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకుంటాం.– కిరణ్ మజుందార్–షా, బయోకాన్ వ్యవస్థాకురాలు -
కూలీ కుమార్తె సక్సెస్ స్టోరీ..! టీసీఎస్ నుంచి ఐఏఎస్ రేంజ్కి..
చిన్నప్పటి నుంచి కడు పేదరికం, ఆర్థిక ఇబ్బందుల మధ్య పెరిగింది. అవే ఆమెను కార్పొరేట్ స్థాయి ఉద్యోగాన్ని సాధించే దిశగా నడిపించాయి. పోని అక్కడితో ఆగిపోలేదు. ఇంకా ఏదో చేయాలి..తన కుటుంబం తనను చూసి గర్వించేలా అత్యున్నత స్థాయిలో ఉండాలని ఆరాటపడేది. ఆ క్రమంలోనే యూపీఎస్సీకి సన్నద్ధమైంది. ఒకటి రెండు కాదు ఏకంగా మూడు సార్లు ఆమెను అపజయం పలకరిస్తూనే ఉంది. అది కూడా ప్రిలిమినరీ స్టేజ్లోనే విఫలమవ్వడం అంటే..అస్సలు సివిల్స్ విజయం దరిదాపుల్లోకి వెళ్లకుండానే ఆమెను ఫెయిల్యూర్ భూతం భయపెట్టేస్తూ ఉండేది. మరేవరైనా అయితే మూడేళ్లు వృధా అయ్యిందని డిప్రెషన్కి గురై ఆ ప్రయత్నమే మానుకుంటారు కానీ.. ఈమె మొండి పట్టుదలతో తాడోపేడో అన్నట్లుగా ముందుకు సాగి మంచి మార్కులతో ఉత్తీర్ణురాలై ఐఏఎస్ సాధించింది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది.ఆ అమ్మాయే కేరళ నిర్మాణ కార్మికుడి కుమార్తె అశ్వతి. తండ్రి నిర్మాణ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. చిన్నతనం నుంచి ఆమెకు స్ఫష్టమైన జీవిత లక్ష్యం ఉంది. ఐఏఎస్ (IAS) కావాలనేది ఆమె ధ్యేయం. అయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి అయిన వెంటనే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో చేరి కుటుంబానికి ఆసరాగా మారింది. అయితే అక్కడితో తన సక్సెస్కి బ్రేక్ వేయలేదామె. తన చిన్ననాటి కల ఆమెను వెంటాడుతూనే ఉండేది. ఎలాగైనా ఐఏఎస్ కావాలనే కోరిక ఆమె మనసులో చాలా బలంగా ఉండేది. అందుకోసమే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేయాలనై నిర్ణయాన్ని అత్యంత ధైర్యంగా తీసుకుని మరీ యూపీఎస్సీ (UPSC) పరీక్షలకు సన్నద్ధమైంది. అయితే 2017, 2018, 2019లలో దారుణంగా ఫెయిల్ అయ్యింది. కనీసం ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ క్లియర్ చేయలేక తిప్పలు పడింది. ఇక లాభం లేదని, చేస్తున్న తప్పిదాలను సమీక్షిస్తూ.. మెరుగ్గా రాసేలా ప్రాక్టీస్ చేసింది. ఆమె దృఢ సంకల్పంతో మరోసారి సివిల్స్ ప్రయత్నించగా.. ఈసారి అపజయం తోకముడవడమే కాదు, సక్సెస్ సంతోషంగా ఒడిలోకి వచ్చి చేరింది. అలా ఆమె 2020 నాల్గో ప్రయత్నంలో 481వ ఆల్ ఇండియా ర్యాంక్ సాధించి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారామె. ఈ సక్సెస్ స్టోరీ (Success Story).. ధైర్యంగా రిస్క్ తీసుకునేందుకు సన్నద్ధం కావడమే గాక, దాంట్లో ఎదురై ఫెయిల్యూర్లను ఓర్చుకునే ఓపిక కూడా అవసరమని చెప్పకనే చెబుతోంది. అప్పుడే విజయ ఢంకాను సగర్వంగా మోగించగడం సాధ్యమని నొక్కి చెబుతోంది కదూ..!.చదవండి: పనిమనిషికి రూ. 8 లక్షల జరిమానా..! ఎందుకో తెలుసా..? -
బాయ్ ఫ్రెండ్తో బాక్సింగ్ క్వీన్..మేరీ కోమ్ మేకప్ వీడియో వైరల్
ప్రముఖ అథ్లెట్, పరుగుల రాణి పీటీ ఉష కుమారుడు వివాహ వేడుకలో బాక్సింగ్ సంచలనం మేరీ కోమ్ (Mary Kom స్పెషల్ ఎట్రాక్షన్ నిలిచారు. బాక్సింగ్ రింగ్ను శాసించిన లెజెండ్మేరీ కోమ్ గోల్డెన్సిల్క్ చీర, నిండుగా నగలు, తలనిండా పూలతో ట్రెడిషనల్ లుక్లో కనిపించి ఫ్యాన్స్తో పాటు పలువుర్ని మెస్మరైజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తన లుక్కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో మేరీ కోమ్ షేర్ చేశారు. దీంతో ఇది నెట్టింట చక్కర్లు కొడుతోంది. అంతేకాదు కిర్రాక్ ఫోజులతో బాక్సింగ్ రింగ్లోనే కాదు..బ్యూటీలో కూడా క్వీన్ అనిపించుకుంది. అంతేకాదు ఆమె పక్కన నడిచిన వ్యక్తికూడా చర్చల్లో నిలిచాడు.మేరీ కోమ్ ముస్తాబైంది ఇలా View this post on Instagram A post shared by Dr Mangte Mary Kom (@mcmary.kom)ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో పుట్టిన మాంగ్టే చుంగ్నీజాంగ్ మేరీ కోమ్..అద్భుతమైన బాక్సర్ ఒలింపిక్ మెడల్ విజేతగా నిలిచారు. ఒక సాధారణ క్రీడాకారిణి నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గొప్ప గుర్తింపు తెచ్చుకోవడం దేశానికి ఎంతో గర్వకారణంగా నిలిచిన ఒక స్ఫూర్తిదాయకమైన మహిళ.క్రీడలకు ఆమె చేసిన విశేష సేవలకు గుర్తింపుగా, ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్, పద్మభూషణ్ అవార్డులు లభించాయి. రికార్డు స్థాయిలో ఆరుసార్లు ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ గెలిచిన ఏకైక బాక్సర్. 2012 లండన్ ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలుచుకుని భారత క్రీడా ప్రపంచంలోనే కాకుండా గుర్తింపును తెచ్చుకున్నారు. 2014 ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ మహిళా బాక్సర్ .మేరీకోమ్ 2016లో రాజ్యసభ సభ్యురాలిగా నియమితులైనారు. 2005లో ఆంఖోలర్ అకా ఓన్లర్ను పెళ్లి చేసుకోగా, వీరికి నలుగురు పిల్లలు. అయితే విభేదాల కారణంతో గత ఏడాది భర్తతో విడిపోయారు. ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నట్టు ఈ ఏడాది ఏప్రిల్లో ప్రకటించారు.ఎవరీ హితేష్ చౌదరి కాగాభర్తతో విడాకుల తరువాత తన వ్యాపార భాగస్వామి హితేష్ చౌదరి( Hitesh Choudhary))తో ప్రేమలో ఉన్నారనే ఊహాగానాలు వినిపించాయి.మేరీ కోమ్ లేదా హితేష్ చౌదరి ఇద్దరూ బహిరంగంగా ప్రేమ సంబంధాన్ని ధృవీకరించనప్పటికీ, గతంలో అనేక సార్లు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వీరిద్దరూ తాజాగా పెళ్లి వేడుకలో కూడా సందడి చేశారు. ఉమ్మడి వ్యాపార వెంచర్ స్పోర్టీ ఫిట్ ప్రైవేట్ లిమిటెడ్ హితేష్ చౌదరి సీఎండీగా ఉన్నారు. -
ఆమె మోడల్ కాదు..ఐపీఎస్ అధికారిణి..! సక్సెస్ని ఆస్వాదించేలోపే..
సివిల్స్ ఎగ్జామ్ ఎంత కఠినమైన ప్రతిష్టాత్మక ఎగ్జామ్ అనేది తెలిసిందే. ఐపీఎస్ కావాలంటే ఎన్నో క్లిష్టమైన ఎగ్జామ్లు దాటుకుంటూ చేరుకోవాలి. ఏ ప్రాసెస్లో ఫెయిలైనా అంతే సంగతులు. అలాంటి ప్రతిష్టాత్మక ఈ సివిల్స్ పరీక్షలో ఓ అందమైన యువతి మంచి మార్కులతో ఉత్తీర్ణురాలెంది. ఆ ఏడాది ఆమె ఫోటోలు నెట్టింట హల్చల్ కావడంతో ఆమె మోడల్ అని అనుకున్నారంతా..!. బాలీవుడ్ హీరోయిన్లను తలదన్నే అందం ఆమె సొంతం. అంతేగాదు ఆమె అపారమైన ప్రతిభ, ఆకర్షించే సౌందర్యం కలగలసిన బ్యూటిఫుల్ అధికారిణిగా గుర్తింపు తెచ్చుకోవడమే గాదు యువతకు ఆదర్శంగా నిలిచారామె. ఆమె పేరు పూరవ్ చౌదరి. 2024 సివిల్స్ ఎగ్జామ్లో 533 ర్యాంక్తో ఉత్తీర్ణత సాధించి ఐఏఎస్ఆఫీసర్ అయ్యారు. లక్షలాది మంది పోటీపడే ఈ ప్రతిష్టాత్మక ఎగ్జామ్ కొంతమంది సక్సెస్ని అందుకుంటారు. వారిలో ఒకరు ఈ పూరవ్ చౌదరి. అయితే ఆమె చదువులోనే కాదు అందంలోని బాలీవుడ్ నటీమణులకు తీసిపోని విధంగా అత్యంత ఆకర్షణీయంగా ఉంటారామె. ఆమెకు సోషల్ మీడియాలో కూడా చాలామంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రజాసేవే ధ్యేయంగా యూపీఎస్సీ ఎగ్జామ్ని ఎంచుకున్నారు. అదే ఏడాది ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు సాధించింది ప్రయాగ్ రాజ్కు చెందిన శక్తి దూబే. ఆమె నేపథ్యం..పూరవ్ రాజస్థాన్కి చెందిన మహిళ. ఆమె తండ్రి ఓం ప్రకాశ్ రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (RAS)లో అధికారిగా కోట్పుట్లీలో అదనపు జిల్లా కలెక్టర్ పదవిని నిర్వహిస్తున్నారు. ఆమె చదువులో ఎప్పుడూ తెలివైన విద్యార్థిగా ఉండేది. సెయింట్ జేవియర్స్ పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తిచేసి అనంతరం ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని లేడీ శ్రీరామ కాలేజ్ ఫర్ ఉమెన్ కళాశాలలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసింది. ఆ తర్వాత సివిల్స్ ప్రిపరేషన్కి పూర్తి సమయం కేటాయించింది. తొలి ప్రయత్నంలో ఐపీఎస్ కేడర్ రాగా, మరో ప్రయత్నంలో ఐఏఏస్ సాధించిందామె. చిక్కుకున్న వివాదం..యూపీఎస్సీ ఫలితాలు ప్రకటించగానే అధికారిక ఫలితాల్లో పూర్వ పేరు వద్ద ఓబీసీ నమోదు చేసింది. దీనితో వివాదం రాజుకుంది. ఆమె తండ్రి ఆ ఆరోపణలన్నింటిని తిప్పి కొట్టారు. 40 ఏళ్ల లోపు ప్రత్యక్ష ఆర్ఏఎస్ నియామకం విషయంలో OBC NCL ప్రయోజనం వర్తించదు. కానీ తాను 44 ఏళ్ల వయసులో ఆర్ఏఎస్ అధికారిని అయ్యాను కాబట్టి తన కుమార్తె సర్టిఫికేట్ దుర్వినియోగానికి పాల్పడిందనేది అవాస్తవం అని వివరణ ఇచ్చారు.(చదవండి: అందానికే అందం స్నేహ..! ఆమె ఇష్టపడే ఫ్యాషన్ బ్రాండ్స్..!) -
రెండు నెలల బిడ్డను కాపాడేందుకు నర్సు సాహసం వీడియో వైరల్
ఆపద సమయంలో, విధి నిర్వహణలో ధైర్య సాహసాలను ప్రదర్శించిన వారే అసలైన హీరోలు. ఒక పసిబిడ్డను కాపాడేందుకు షీరోనర్స్ చేసిన సాహసం, ధైర్యం విశేషంగా నిలిచింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. మీ ధైర్యానికి సెల్యూట్! అంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపించారు.టిక్కర్ గ్రామానికి చెందిన స్టాఫ్ నర్సు కమల అనారోగ్యంతో ఉన్న పసిపాపకు ఇంజెక్షన్ ఇచ్చేందుకు హురాంగ్ గ్రామానికి చేరుకోవాల్సి ఉంది. అయితే ఇటీవలి భారీ వర్షాల కారణంగా విస్తృతంగా విధ్వంసం సంభవించింది. సిల్బుధాని , తార్స్వాన్ పంచాయతీలలో రోడ్లు , ఫుట్బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. ఆ గ్రామానికి వెళ్లే మార్గం కష్టంగా మారింది. పద్దర్ సబ్ డివిజన్ పరిధిలోని చౌహార్ లోయ మండిలోని అత్యంత ప్రభావిత ప్రాంతాలలో ఒకటి. అటు చూస్తే కాలువ పొంగిపొర్లుతోంది నీరు చాలా వేగంగా ప్రవహిస్తోంది ఏ మాత్రం స్లిప్ అయినా ప్రాణాలకే ముప్పు. అయినా సరే వృత్తి ధర్మం నెరవేర్చాలనే ఆశయంతో రాళ్లపై ఒక్క ఉదుటున దూకి జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తూ కాలువ దాటింది. Meet Staff Nurse Kamla, who risked her life to ensure a two-month-old baby received a crucial injection. With the bridge in her area swept away, she crossed the river to reach the child. She is From Paddhar's Chauharghati, Mandi. @CMOFFICEHP @mansukhmandviya @nhmhimachalp @WHO pic.twitter.com/o9JFmIHskx— Vinod Katwal (@Katwal_Vinod) August 23, 2025> అద్భుత సాహసానికి సంబంధించిన ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలోని సుధార్ పంచాయతీలోని చౌహర్ఘాటిలో చోటు చేసుకుంది. నర్సు ధైర్యానికి అందరూ ముగ్ధులయ్యారు. అదే సమయంలో, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఫ్రంట్లైన్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రమాదాలపై ఆందోళన కూడా వ్యక్తమైంది. ఇదీ చదవండి: అందమైన హారాన్ని షేర్ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే! -
మహిళా ఇన్వెస్టర్లపై సెబీ స్పెషల్ ఫోకస్
ముంబై: మ్యూచువల్ ఫండ్స్లో మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచడంపై సెబీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా మొదటిసారి పెట్టుబడులు పెట్టే మహిళలకు ప్రోత్సాహకాలు అందించే ప్రణాళికతో ఉన్నట్టు సెబీ చీఫ్ తుహిన్ కాంత పాండే ప్రకటించారు. మహిళల సమాన ప్రాతినిధ్యం లేకుండా ఆర్థిక సమ్మిళితత్వం అసంపూర్ణంగా ఉండిపోతుందన్నారు. అందుకని వారికి పంపిణీ పరమైన ప్రోత్సాహకాలు ఇచ్చే ఆలోచనతో ఉన్నట్టు చెప్పారు. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పాండే మాట్లాడారు. టాప్ 30కి (బీ30) వెలుపలి పట్టణాల్లో పంపిణీదారులకు రాయితీలు కలి్పంచాలన్న ఇటీవలి ప్రతిపాదనను ప్రస్తావించారు. ఈ చర్యలతో కొత్త పెట్టుబడిదారులను భాగస్వాములను చేయొచ్చని, మరింత మందికి మ్యూచువల్ ఫండ్స్ సేవలను చేరువ చేయొచ్చని అభిప్రాయపడ్డారు. -
ఈ స్పేస్ మాది..!
‘ఆకాశంలో సగం’ అనే మాట మనకు సుపరిచితం. అయితే ఆరోజుల్లో ‘స్పేస్ సైన్స్’కు సంబంధించి మహిళా శాస్త్రవేత్తల సంఖ్య చాలా తక్కువ. గతంతో పోల్చితే ఇప్పుడు ఉమెన్ స్పేస్ సైంటిస్ట్ల సంఖ్య బాగా పెరిగింది. ‘ఇస్రో’ మంగళ్యాన్ మిషన్ నుంచి చంద్రయాన్ మిషన్ వరకు ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్లలో కీలక పాత్ర పోషించారు. శాస్త్ర సాంకేతిక రంగంలో అడుగు పెట్టడానికి ఈతరం అమ్మాయిలకు స్ఫూర్తిని ఇస్తున్నారు...ఆకాశమే అపూర్వ పాఠశాలఉత్తర్ప్రదేశ్లోని లక్నోకు చెందిన రీతూ కరిధాల్కు ఆకాశం ఎప్పుడూ వింతగా అనిపించేది. అంత పెద్దగా కనిపించిన చంద్రుడు ఎందుకు తగ్గుకుంటూ వెళతాడు? పగటి పూట చుక్కలు ఎందుకు కనిపించవు? ఇలాంటి సందేహాలెన్నో ఆ చిట్టి బుర్రకు వచ్చేవి. ఆకాశంపై అమితమైన ఆసక్తే రీతూను సైన్స్ వైపు నడిపించింది. స్కూల్ రోజుల్లో నాసా, ఇస్రోకు సంబంధించిన ప్రాజెక్ట్ల సమాచారం గురించి దినపత్రికలలో వెదికేది. కనిపిస్తే వాటిని కట్ చేసి దాచుకునేది.పోస్ట్గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత ఇస్రోలో స్పేస్ సైంటిస్ట్గా ప్రస్థానం ప్రారంభించింది. ప్రతిష్ఠాత్మకమైన మంగళ్యాన్ మిషన్తో పాటు ఇస్రోలోని ఎన్నో ప్రాజెక్ట్లలో కీలక బాధ్యతలు నిర్వహించింది రీతూ కరిధాల్.‘మంగళ్యాన్ మిషన్ కోసం పనిచేయడం అపూర్వ అనుభవం. నిరంతర మేధోమథనం జరుగుతుండేది. సెలవు అంటూ లేకుండా పనిచేశాం. వృత్తి, కుటుంబ జీవితాన్ని సమన్వయం చేసుకోవడం అంత తేలిక కాదు. అయితే నా భర్త, కుటుంబ సభ్యుల సహకారం వల్ల అది సాధ్యం అయింది’ అంటుంది రీతూ కరిధాల్.రీతూ కరిధాల్వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ఇస్రోఒకప్పుడు ఇస్రోలో పనిచేసిన మహిళలు రిటైర్ అయిన తరువాత ఇంటికే పరిమితం కావచ్చుగాక, అయితే వారు ఎక్కడ ఉంటే అక్కడ ఇస్రో కొలువుదీరుతుంది. ఆనాటి శాస్త్రసాంకేతిక విషయాల గురించి చందమామ కథల్లా ఈతరం పిల్లలకు చెబుతుంటారు. అలాంటి వారిలో ఇస్రోలో తొలి మహిళా కెమికల్ ఇంజనీర్ లలితా రామచంద్రన్ ఒకరు. 1969లో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (విఎస్ఎస్సి)లో టెక్నికల్ అసిస్టెంట్గా చేరినప్పుడు ఆమె వయసు 22 సంవత్సరాలు. తిరువనంతపురంలో క్రయోజనిక్ అప్పర్ స్టేజ్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఆమె రిటైర్ అయ్యారు. ‘ఆరోజుల్లో పెద్దగా సౌకర్యాలు లేకపోవచ్చు. అయితే ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో కలిసి పనిచేసే అదృష్టం దక్కింది’ అంటారు లలిత.1972లో ఇస్రోలో చేరారు జె.గీత. ‘ఆరోజుల్లో నెట్ లేదు. డేటా సేకరణ అనేది ప్రధాన సవాలుగా ఉండేది. రిసెర్చ్, రిఫరెన్స్ కోసం లైబ్రరీలకు వెళ్లి గంటల కొద్ది సమయం గడిపేవాళ్లం’ అంటున్న గీత... సతీష్ధావన్, వసంత్ ఆర్ గోవరికర్లాంటి స్టాల్వాల్ట్స్ మార్శదర్శకత్వంలో పనిచేశారు.ప్రాజెక్ట్లకు సంబంధించిన చర్చల్లో చురుగ్గా పాల్గొనేవాళ్లం. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా తమ అభిప్రాయలను నిస్సంకోచంగా చెప్పే స్చేచ్ఛ ఉండేది. జూనియర్ చెప్పినా సరే, ఆ అభిప్రాయం నచ్చితే ఆమోదించేవారు’ అంటున్న రాధిక రామచంద్రన్ ‘కేరళ యూనివర్శిటీ’లో పోస్ట్ గ్రాడ్య్రుయేషన్ పూర్తయిన తరువాత 1984లో ఇస్రోలో చేరారు.లలితా రామచంద్రన్సైన్స్ ఫిక్షన్టుఇస్రో సైంటిస్ట్తన చిన్నప్పుడు టెలివిజన్లో వచ్చే స్టార్ ట్రెక్, సైన్స్ ఫిక్షన్ అంటే నందిని హరినాథ్కు చాలా ఇష్టం. టీవిలో వచ్చే సైన్స్ ప్రోగ్రామ్స్పై అమిత ఆసక్తి ప్రదర్శించే నందిని తాను స్పేస్ సైంటిస్ట్ అవుతానని అనుకోలేదు. ‘జస్ట్ అలా జరిగింది అంతే!’ అని స్పేస్ సైంటిస్ట్ గా తన ప్రయాణం గురించి నవ్వుతూ చెబుతుంది నందిని. ఉద్యోగంలో చేరిన కొత్తలో రోజుకు పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు పనిచేసిన రోజులు ఉన్నాయి. భోజనం చేయడం కూడా మరిచి పనిచేసిన రోజులు ఉన్నాయి.‘ఇస్రో సైంటిస్ట్ అని పరిచయం చేసినప్పుడు ప్రజలు గౌరవించే తీరు వృత్తిపట్ల బాధ్యతను మరింత పెంచుతుంది. మంగళ్యాన్ ప్రాజెక్ట్లో భాగం కావడం గర్వంగా భావిస్తున్నాను. ఆ ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నప్పుడు నిద్ర, తిండి గురించి పట్టించుకునేవాళ్లం కాదు. ఇంట్లో తక్కువ సమయం మాత్రమే గడిపేవాళ్లం. ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం’ అంటుంది నందిని హరినాథ్.నందిని హరినాద్వివక్ష లేదు... ప్రతిభే ప్రమాణం‘నేను ఇస్రోలో 1982లో చేరినప్పుడు అక్కడ కొద్ది మంది మహిళా ఉద్యోగులు మాత్రమే కనిపించేవారు. ఊహకు అందని రీతిలో ఇప్పుడు ఎంతోమంది పనిచేస్తున్నారు’ అంటుంది అనురాధ టికె. ఇస్రో శాటిలైట్ సెంటర్లో జియోశాట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ అయిన అనురాధ ఎంతోమంది అమ్మాయిలకు రోల్ మోడల్. ‘తొమ్మిది సంవత్సరాల వయసులోనే ఆకాశంపై ఆసక్తి మొదలైంది’ అని తన బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటుంది అనురాధ. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపై అడుగు పెట్టడం గురించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ద్వారా విన్న అనురాధ సంభ్రమాశ్చర్యాలకు గురైంది. ‘చంద్రుడిపై మానవుడు’ అనే అంశంపై తన మాతృభాష కన్నడంలో కవిత రాసింది.‘ఇస్రోలో స్త్రీ, పురుషులు అనే భేదం ఉండదు. ప్రతిభ, అంకితభావం మాత్రమే ప్రమాణం. స్పేస్ ప్రోగ్రామ్స్లో ఎంతమంది మహిళలు పనిచేస్తే అంత మంచిది. అది ఎంతో అమ్మాయిలకు స్ఫూర్తినిస్తుంది. వారు చేస్తున్నారు. మేము కూడా చేయగలం అనే ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది’ అంటుంది అనురాధ.అనురాధ టికెభూదేవి అంత ఓపిక... ఆకాశమంత ప్రతిభప్రతిష్ఠాత్మకమైన మంగళ్యాన్ మిషన్ ప్రతిభావంతులైన మహిళా శాస్త్రవేత్తలను లోకానికి పరిచయం చేసింది. ఆ మహిళా శాస్త్రవేత్తలపై ‘ఇస్రో’స్ మాగ్నిఫిసియెంట్ ఉమెన్ అండ్ దెయిర్ ఫ్లైయింగ్ మెషిన్స్’ పేరుతో పుస్తకం రాసింది మిన్నీ వేద్. నందిని, రీతూ కరిధాల్, మౌమిత దత్తా, మినై సంపత్... మొదలైనవారి గురించి ఈ పుస్తకంలో రాసింది. ‘స్పేస్’ను కెరీర్గా ఎంచుకోవడానికి కారణం ఏమిటి? రకరకాల ఒత్తిళ్లను తట్టుకొని ఎలా ముందుకు వెళ్లారు? వృత్తి, కుటుంబ జీవితాన్ని ఎలా సమన్వయం చేసుకున్నారు?.... ఇలాంటి ప్రశ్నలకు ఈ పుస్తకం సమాధానం చెబుతుంది. మన దేశంలో ఫస్ట్ ఇండిజినస్ రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ రిసాట్–1 ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేసిన వలర్మతి వ్యక్తిగత, ఉద్యోగ జీవిత అనుభవాలు కూడా ఈ పుస్తకంలో కనిపిస్తాయి. మంగళ్యాన్ మిషన్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ ఇన్చార్జిగా పనిచేసిన మినాల్ సంపత్ స్పేస్క్రాఫ్ట్ టెస్టింగ్ పనుల్లో భాగంగా బెంగళూరు, అహ్మదాబాద్ల మధ్య తరచు ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఆ సమయంలో మూడు సంవత్సరాల తన కుమారుడు గుర్తుకు వచ్చేవాడు. ‘మా బాబు గుర్తుకు వచ్చిన సమయంలో పేలోడ్స్ కూడా నా బిడ్డలే కదా అనుకునేదాన్ని’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది మినాల్ సంపత్. ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఈ పుస్తకంలో కనిపిస్తాయి. -
చంపా... చరిత్ర సృష్టించింది
అడుగడుగునా ఆర్థిక కష్టాలు. ‘అమ్మాయికి ఈ మాత్రం చదువు చాలు’ అనే ఇరుగు పొరుగు వెటకారాలు. అయినా సరే, చదువు విషయంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. ‘పదవ తరగతి అయినా పూర్తి చేయగలనా’ అనుకున్న అమ్మాయి ఇప్పుడు ఎంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచింది. దిదై అనేది ఒడిశాలోని ఒక గిరిజన తెగ. ఈ తెగ నుంచి జాతీయ వైద్య ప్రవేశ పరీక్ష నీట్లో ఉత్తీర్ణత సాధించిన తొలి విద్యార్థిగా చంపా రాస్పెడా చరిత్ర సృష్టించింది.ఒడిశాలోని మల్కన్గిరి జిల్లాలోని అమ్లిబెడ గ్రామానికి చెందిన చంపా రాస్పెడా తల్లి గృహిణి. తండ్రి ఓ పేద రైతు. ఆర్థిక కష్టాల వల్ల ఒకానొక దశలో చంపాకు చదువు కొనసాగించడం కష్టమైంది. అయినా సరే, ఎలాగో ఒకలా ఆర్థిక కష్టాలను అధిగమించి ముందడుగు వేసింది.చిత్రకొండలో హైస్కూల్ చదువు పూర్తయిన తరువాత గోవింద్పల్లిలోని ఎస్ఎస్డీ హైయర్ సెకండరీ స్కూల్లో ఇంటర్ పూర్తి చేసింది. ఆ తరువాత ఆర్థిక కష్టాలతో బీఎస్సీ చదువు మధ్యలోనే ఆగిపోయింది. అయితే హైస్కూల్ రోజుల్లో చంపాకు సైన్స్ పాఠాలు చెప్పిన టీచర్ ధైర్యం చెప్పడమే కాదు బాలసోర్లోని నీట్ ఉచిత శిక్షణ తరగతులలో చేర్పించారు.ఆ క్లాస్లలో చేరిన క్షణం నుంచే ‘ఎలాగైనా డాక్టర్ కావాల్సిందే’ అనే లక్ష్యాన్ని ఏర్పర్చుకుంది. తన కలను నిజం చేసుకుంది చంపా. బాలసోర్లోని ఫకీర్ మోహన్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో అడ్మిషన్ పొందింది.మల్కన్గిరి జిల్లాలో మారుమూల అటవీ ప్రాంతంలో నివసించే దిదై తెగ ప్రజలకు వ్యవసాయం, అటవీ ఉత్పత్తులు ప్రధాన జీవనాధారం. చదువు వారికి చాలా దూరంగా ఉండేది. ఇప్పుడిప్పుడే వారు చదువుకు దగ్గరవుతున్నారు. ఈ దశలో చంపా సాధించిన విజయం ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తినిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు.‘వైద్యురాలిగా పేదప్రజలకు సేవ చేయాలనేది నా లక్ష్యం. మనం ఒక లక్ష్యం ఏర్పర్చుకున్నప్పుడు ఆర్థిక కష్టాలు అడ్డంకి కాదు... అనే విషయాన్ని విద్యార్థులలో విస్తృతంగా ప్రచారం చేయాలనుకుంటున్నాను’ అంటుంది చంపా రాస్పెడా.‘ఈ విజయానికి మూలం ఆమె పడిన కష్టం. అంకితభావం. ఆమె విజయం ఒడిశాలోని యువతకు స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నాను. వైద్యురాలిగా పేదప్రజలకు సేవ చేయాలని ఆశిస్తున్నాను. ఆమె భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని చంపా రాస్పెడా గురించి ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి.ఈ ఇంట్లోనే...‘రకరకాల మూఢనమ్మకాల వల్ల మా కమ్యూనిటీలో ఆడపిల్లల చదువుకు పెద్దగాప్రాధాన్యత ఇవ్వరు’ అంటున్న చంపా రాస్పెడా తన తల్లిదండ్రులను ఒప్పించి, ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ చదువు దారిలో ముందుకు వెళ్లింది. పెద్దగా సౌకర్యాలు లేని ఇంట్లో పెరిగింది చంప. ఇప్పుడు సాధారణ దృశ్యంగా కనిపిస్తున్న ఆమె ఇంటి చిత్రం భవిష్యత్లో స్ఫూర్తిదాయక చిత్రంగా నిలవనుంది. ‘ఈ ఇంట్లోనే చదివి చంప డాక్టర్ అయింది’ అనే ఒక్కమాట చాలదా ఎంతోమంది అమ్మాయిలలో ధైర్యం నింపడానికి, ‘మేము కూడా సాధించాలి’ అని వారిలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించడానికి! -
ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లు
మహిళలు అనుకోవాలేగానీ ఏదైనా సాధించి తీరతారు. అది వ్యవసాయం, వ్యాపారం అయిన పట్టుబట్టి విజయం సాధించాడంలో మహిళలు ముందంజలో ఉంటారు. అనేకమంది మహిళల విజయ గాథలే దీనికి అక్షర సత్యాలు. వారి సంకల్ప బలం అలాంటిది. అలా చిన్న వయసులోనే సక్సెస్ ఫుల్ మహిళలలో ఒకరిగా తన స్థానాన్ని నిలుపుకున్నారు పూణేకు చెందిన మహిళా రైతు. క్యాప్సికం (Capsicum ) సాగుతో ఏకంగా ఏడాది రూ. 4 కోట్ల టర్నోవర్ను సాధించింది. పదండి ఆమె సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం.మహారాష్ట్రలోని పుణె జిల్లాలోని కల్వాడి గ్రామానికి చెందిన విద్యావంతురాలు ప్రణిత వామన్. పుణెలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ కాలేజీ నుంచి ఎంబీఏ అగ్రిబిజినెస్ మేనేజ్మెంట్లో పట్టా పుచ్చుకుంది. ఎంబీఏ ఇంటర్న్షిప్లో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీతో పనిచేసిన నేపథ్యంలో తనకెంతో ఇష్టమైన వ్యవసాయం వైపే మొగ్గు చూపింది. తనకంటూ సొంతంగా ఎదగాలని, తద్వారా మరో పదిమందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ముందుగా సాగింది. తన తమకున్న పొలంలో క్యాప్సికం సాగు ప్రారంభించింది. ఆమె ఆశయానికి ఉపాధ్యాయుడిగా పనిచేసి, రిటైరయ్యి, వ్యవసాయం చేసుకుంటున్న తండ్రి ప్రోత్సాహం కూడా లభించింది.చదవండి: కేబీసీ 17లో కోటి గెల్చుకున్న తొలి వ్యక్తి..కానీ 7 కోట్ల ప్రశ్న ఏంటో తెలుసా?తండ్రి ప్రోత్సాహం రూ. 20 లక్షల పెట్టుబడి2020లో తనకున్న కొద్దిపాటి భూమిలో క్యాప్సికం సాగు ప్రారంభించింది. తనకున్న పాలిహౌజ్ నైపుణ్యానికి తోడుగా ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ లభించింది. పాలీహౌస్ సాగు అంటూ వ్యవసాయంలో లేటెస్ట్ హైటెక్ వ్యవసాయం అని చెప్పవచ్చు. తీవ్రమైన వాతావరణ మార్పులను ఎదుర్కొంటూ, ఉష్ణోగ్రత, తేమ , ఇతర పారామితులను నిర్వహించడం ద్వారా ఏడాది పొడవునా లాభదాయకమైన సాగు చేయడం.అలా రూ. 20 లక్షలు పెట్టుబడితో తన సాగుకు డ్రిప్ ఇరిగేషన్ పద్దతిని ఎంచుకుంది. ఒక్కో మొక్క ధర రూ. 10. చొప్పున బారామతి నుంచి నారును తీసుకొచ్చి నాటింది. మూడు నాలుగు నెలలకే క్యాప్సికం పంట చేతికి అందింది. దాదాపు 40 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. కానీ కరోనా వైరస్,లాక్ డౌన్ సంక్షోభం ముంచుకొచ్చింది. అయినా అధైర్య పడకుండా ఆన్లైన్ మార్కెటింగ్ ఎంచుకుంది.ప్రస్తుతం పాతిక ఎకరాలు, ఏడాదికి రూ. 4 కోట్లుమొదటి పంటలో 40 టన్నుల ఎరుపు, పసుపు ,ఆకుపచ్చ బెల్ పెప్పర్స్ దిగుబడి వచ్చింది. వాటిని కిలోకు రూ. 80 చొప్పున అమ్మింది. ఫలితంగా రూ. 32 లక్షల టర్నోవర్తో, తొలి ఏడాదిలోనే రూ. 20 లక్షల పెట్టుబడిని తిరిగి వచ్చేసిందని ప్రణీత స్వయంగా తెలిపింది. తొలి ఏడాదిలోనే రూ. 20 లక్షల పెట్టుబడిగాను సుమారు రూ. 12 లక్షలు లాభం వచ్చింది. ఈ ఉత్సాహంతో మరింత ధైర్యంగా అడుగులు వేసింది. 2021లో 25 ఎకరాలకు తన పరిధిని విస్తరించుకుంది. పాలిహౌస్ విధానంలో క్యాప్సికం పంటను సాగు కొనసాగిస్తోంది. ఇందులో 10 ఎకరాలు సొంత పొలం కాగా, మరో 15 ఎకరాలు లీజుకు తీసుకుంది అలా ఖర్చులు పోను ఏడాదికి రూ. 2.25 కోట్ల లాభంతో విజయవంతమైన యువమహిళా రైతుగా నలుగురికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఇదీ చదవండి: ప్రాజెక్టులు తగ్గినా, క్వాలిటీ తగ్గలేదు : గ్రాజియా కవర్పేజీపై మెరిసిన సమంత -
'మంజుమ్మెల్ గర్ల్'..! ధైర్యానికి కేరాఫ్ అడ్రస్ ఆమె..
కొచ్చిలో రద్దీగా ఉండే వీధిలోకి ఓ ఆటో రిక్షా రయ్.. మని వచ్చి ఆగింది. అప్పుడే ఓ పోలీస్ వ్యాన్ కూడా అదే మలుపు వద్ద ఆగింది. అందులో నుంచి కానిస్టేబుల్ ఆటోలోకి చూస్తూ ‘ఏయ్ అబ్బాయి, డ్రైవింగ్ లైసెన్స్ ఉందా?’ అని అడిగాడు. ‘సర్, నేను అబ్బాయి కాదు, అమ్మాయిని...’ అంటూ తన వద్ద ఉన్న లైసెన్స్ చూపించింది.ఆమె కేరళలోని ఎర్నాకుళం జిల్లాలోని మంజుమ్మెల్కు చెందిన అలీషా జిన్సన్. ఆమె వయసు 18. ‘మంజుమ్మెల్ గర్ల్’గా ఆ ఏరియాలో ఎలక్ట్రిక్ ఆటోరిక్షా నడుపుతోంది. ఆమె ఎర్నాకుళంలోనే కాదు కేరళ మొత్తంలో ఆటో నడిపే అతి పిన్న వయస్కురాలిగా పేరొందింది. ఆమె ఆటో నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో కేరళ విద్యామంత్రి శివన్ కుట్టి దృష్టికి వచ్చింది. దీంతో ఆయన రాష్ట్ర టాక్సీ, ఆటో బుకింగ్ యాప్ అయిన కేరళ సవారీకి అలీషాను బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు. అలీషా డ్రైవర్ సీట్లో కూర్చోవడానికి చాలానే కష్టపడింది. 16 ఏళ్ల వయసులో కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోలేనప్పుడు స్కూల్ చదువు మానేసింది. అదే సంవత్సరంలో క్లీనింగ్ సర్వీసెస్ కంపెనీ యజమాని అయిన ఆమె తండ్రి గిన్సన్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. కొన్ని నెలల తేడాతో తల్లి షిజా నిమోనియాతో ఆసుపత్రి పాలైంది, అది క్షయవ్యాధిగా మారింది. దీంతో ఖర్చులు పెరిగాయి, ఆదాయం తగ్గిపోయింది. ఉన్న ఏకైక ఆస్తి క్లీనింగ్ సిబ్బందిని తీసుకెళ్లడానికి ఉంచిన ఆటోరిక్షా. ‘నాన్నకు ప్రమాదం జరిగి, మంచం పట్టడం, అమ్మ ఆసుపత్రి పాలవడంతో నేను ఈ డ్రైవింగ్నే ఎంపిక చేసుకున్నాను. ఆటోయే నాకు జీవనాధారం అయ్యింది. మొదట్లో పనివాళ్లను చేరవేయడానికి ఆటో ఉపయోగపడింది. కొత్త భవనాలు, ఫర్నీచర్ క్లీనింగ్ వంటి పనుల్లో పాల్గొన్నాను. ఒకరోజు పొరుగున ఉండే వ్యక్తి తన సరుకులను చేరవేయడానికి ఆటో కావాలని అడిగాడు. నా తండ్రి నన్ను ఆటో తీసుకెళ్లమన్నాడు. ఆ రోజు నేను ఛార్జీల రూపంలో రూ.700 సంపాదించాను. అది నేను ఊహించిన దానికంటే ఎక్కువ మొత్తం. దీంతో నా పూర్తి సమయం ఆటో నడపడానికే నిశ్చయించుకున్నాను.రాత్రి డ్రైవింగ్... నెలవారీ వాయిదా కట్టడానికి రూ.13,000 అవసరం అవడంతో సాయంత్రం ఊబర్లోకి లాగిన్ అయ్యేది. దీంతో రాత్రి డ్రైవింగ్ మొదలయ్యింది. కొన్నిసార్లు తెల్లవారుజాము 2 గంటల వరకు ఆటో నడుపుతూనే ఉండేది. ఏ టైమ్ అయినా సంకోచం లేకుండా నడపడం చేస్తూనే ఉంది. కట్ చేసిన జుట్టు, డ్రెస్సింగ్ చూసేవాళ్లకు ఆమె టీనేజ్ అబ్బాయిలా కనిపిస్తుంది. ‘ఒకసారి ఒక వ్యక్తి ఆటో ఆపి, నాకు ఆటో డ్రైవింగ్ చేయడానికి ఇచ్చినందుకు మా నాన్నను తిట్టాడు. నా లైసెన్స్ వారికి చూపించాల్సి వచ్చింది’ అని నవ్వుతూ చెబుతుంది అలీషా. తన సోదరుడి ఖాకీ చొక్కాను యూనిఫామ్గా మార్చుకుంది. తెలియని వ్యక్తులు ఎవరైనా సరే వారితో మాటలకు దూరంగా ఉంటుంది.చదువుకు అంతరాయం... అలీషా రోజూ తన ఇల్లు మంజుమ్మెల్ నుండి పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలియం వరకు సైకిల్పై వెళ్లి, చదువుకునేది. రోజూ ఈ ప్రయాణం చేయలేక స్కూల్కు రెగ్యులర్గా వెళ్లలేకపోయేది. దీంతో పదవ తరగతితోనే చదువు ఆగిపోయింది. ఓ ప్రైవేట్ కాలేజీలో పన్నెండవ తరగతి వరకు చదివింది. ఫ్యాషన్ టెక్నాలజీలో డిప్లొమా పూర్తిచేసి, టెక్స్టైల్ వ్యాపారాన్ని నడిపింది. ఇప్పుడు ఈ రంగంలోనే ఇగ్నో ద్వారా బ్యాచిలర్స్ డిగ్రీ చేస్తోంది.గుర్తించిన ప్రభుత్వం... కేరళ సవారీ యాప్ బ్రాండ్ అంబాసిడర్గా ప్రభుత్వం ఆమెకు ఒక జ్ఞాపికను బహూకరించింది. మంజుమ్మెల్ గర్ల్ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా కొంత ఆదాయాన్ని పొందుతోంది. తన ఆటోకు కూడా అదే పేరు పెట్టుకుంది. ఆమె సోదరుడు జాషువా తన తండ్రి ప్రమాదం తర్వాత బెంగళూరులో తన చదువును వదిలేసి క్లీనింగ్ కంపెనీని నడుపుతున్నాడు. ఇప్పుడు తల్లిదండ్రులిద్దరూ కోలుకోవడంతో కుటుంబం కొత్త వెంచర్ కోసం ప్లాన్ చేస్తోంది. పద్దెనిమిదేళ్ల వయసులో అలీషా తన తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవడానికి, అప్పులను తీర్చడానికి సొంత జీవితాన్ని సరిదిద్దుకోవడానికి ఒక మార్గాన్ని వెతుక్కుంది. విదేశాలలో భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటోంది. -
షకీరా పాటకు చీరతో డాన్స్.. భలే చేసింది!
టాలెంట్ అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు. ప్రతిభ ఉండాలే గానీ ప్రపంచమంతా మనవైపు చూసేలా చేసుకోవచ్చు. టాలెంట్ ఉన్నా ఎక్కడ, ఎలా ప్రదర్శించాలనే మీమాంస ఇదివరటి రోజుల్లో ఉండేది. ఇప్పుడా సంశయం అక్కర్లేదు. సోషల్ మీడియా వేదికగా సామాన్యులు సైతం తమ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. తమ టాలెంట్తో జనాన్ని ఆకట్టుకున్న వారు సెలబ్రిటీలుగా, ఇన్ఫ్లుయెన్సర్లుగా మారుతున్నారు. కంటెంట్ (Content) బాగుంటే చాలు జనం ఆదరిస్తున్నారు.తాజాగా రాజస్థాన్లోని జోధ్పూర్కు చెందిన కాంచన్ అగర్వత్ అనే మహిళ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రాతో సహా ఎంతో మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియో క్లిప్కు ఇప్పటివరకు 3.8 మిలియన్లకు పైగా వ్యూస్, దాదాపు 2 లక్షల లైకులు వచ్చాయి.వీడియోలో ఏముందంటే..?కొలంబియా పాప్ సింగర్ షకీరా 2006 గ్లోబల్ హిట్ సాంగ్కు కాంచన్ అగర్వత్ చేసిన స్టెప్పులు వీక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సంప్రదాయ చీర కట్టుతో పాప్ సాంగ్కు తనదైన శైలిలో డాన్స్ (Dance) చేశారామె. చీర, ఘున్ఘాట్ను బ్యాలెన్స్ చేస్తూ.. షకీరా సిగ్నేచర్ హుక్ స్టెప్లను చూడముచ్చటగా ప్రదర్శించడంతో వీక్షకులు ఫిదా అవుతున్నారు.చదవండి: రిసెప్షన్లో డాన్స్ చేస్తూ ప్రాణాలు వదిలిన మహిళనెటిజనుల ప్రశంసలుకాంచన్ అగర్వత్ డాన్స్పై నెటిజనులు (Netizens) ప్రశంసలు కురిపించారు. ఆమె నృత్యం చేసే విధానం ఎంతో పద్ధతిగా ఉందని, డాన్స్తో పాటు చీరను బ్యాలెన్స్ చేసిన తీరు బాగుందని నెటిజనులు పొగిడారు. 'అలసటగా ఉన్నప్పుడు ఈ రీల్ చూశాను. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పటికే చాలాసార్లు చూశాన'ని ఒక నెటిజన్ వెల్లడించారు. View this post on Instagram A post shared by Kanchan Agrawat (@kanchan_agrawat) -
భారతదేశపు తొలి మహిళా ఫోటో జర్నలిస్ట్ ఎవరో మీకు తెలుసా?
ధైర్యవంతురాలు, స్వతంత్రురాలు , అసాధారణమైన మహిళ హోమై వ్యారవల్లా(Homai vyarawalla) భారతదేశపు మొట్టమొదటి మహిళా ఫోటో జర్నలిస్ట్గా ప్రసిద్ధి చెందారు. 1947 ఆగస్టు 16న ఎర్రకోటలో జరిగిన మొట్టమొదటి జెండా ఎగురవేత కార్యక్రమం నుండి మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ వంటి ప్రముఖుల దహన సంస్కారాల వరకు - భారత చరిత్రలో అత్యంత చిరస్మరణీయమైన , అద్భుతమైన క్షణాలను బంధించిన ఘనత ఆమెకే దక్కింది. ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఆమె గురించిన కొన్ని విశేషాలు.భారతదేశం ఇంకా బ్రిటిష్ పాలనలో ఉన్న కాలంలో,చాలా తక్కువ మంది భారతీయ మహిళలు మాత్రమే విద్యను పొందే అవకాశం ఉన్న సమయంలో ఆమె ఫోటోగ్రఫీపై మక్కువ పెంచుకున్నారు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటం ఉధృతంగా ఉన్న సమయంలో మొత్తం దేశం రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో, పేద పార్సీ కుటుంబానికి చెందిన హోమై వ్యారవల్లా అనే యువతి ఫోటో జర్నలిస్ట్గా తన కెరీర్ను ప్రారంభించింది. కానీ అప్పుడు ఆమె ఊహించి ఉండదు తన పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించి ఉంటుందని.ఆమె తొలి ఛాయాచిత్రం బొంబాయిలోని ఉమెన్స్ క్లబ్ పిక్నిక్ పార్టీలో మహిళల క్లిక్. ఈ ఛాయాచిత్రం 1930లో బాంబే క్రానికల్స్ మ్యాగజైన్లో ప్రచురించారు. దీనికి హోమై ఫోటోకు ఒక రూపాయి చొప్పున అందుకున్నారు.హోమై వ్యారవల్లా 1913లో గుజరాత్లోని నవ్సరి అనే చిన్న గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి ఉర్దూ-పార్సీ థియేటర్ కంపెనీలో నటుడు. హోమై తన ప్రాథమిక విద్యను సూరత్కు సమీపంలోని వ్యారాలో పూర్తి చేశారు. తరువాత ఆమె కుటుంబం ముంబైకి వెళ్లి అక్కడ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కళాశాలలో క్లాస్మేట్ మరియు ఫోటోగ్రఫీలో తన టీచర్ అయిన మానెక్షాను కలిసింది, తరువాత ఆమె వివాహం చేసుకున్నారు.ఆమె ఢిల్లీకి వెళ్లి బ్రిటిష్ హై కమిషన్లో చేరారు, అక్కడ ఆమె ఫోటో జర్నలిస్ట్గా తన కెరీర్ను ప్రారంభించి ఎన్నో మరపురాని, చరిత్రలో నిలిచిపోయే ఫోటోలను అందించారు. హోమై వ్యారవల్లా జవహర్లాల్ నెహ్రూను తనకు ఇష్టమైన సబ్జెక్ట్గా భావించేవారట. ఆయన అత్యంత ఫోటోజెనిక్ వ్యక్తి అని పొగిడేవారట. 1969లో ఆమె భర్త మరణం తర్వాత ఫోటోగ్రఫీని శాశ్వతంగా వదిలేసి కుమారుడు ఫరూఖ్ దగ్గరికి వెళ్లిపోయారు. 2012లో 98 సంవత్సరాల వయసులో తుదిశ్వాస విడిచింది. హోమై 2010లో భారతదేశపు మొట్టమొదటి జీవిత సాఫల్య జాతీయ ఫోటో అవార్డును అందుకున్నారు . అలాగే 2011లో పద్మ విభూషణ్ అవార్డును అందుకున్నారు. -
కేవలం రూ.3.5 లక్షలతో ఫ్యాషన్ బ్రాండ్..రూ. 500 కోట్ల దిశగా
ఇంటినీ, కుటుంబాన్ని చక్కదిద్దడంలో మాత్రమే కాదు.. అడుగు పెట్టిన రంగం ఏదైనా పట్టుదలగా ఎదిగి, తమ ఆసక్తిని,కలలను నెరవేర్చుకున్న ధీరవనితలు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా పురుషులకే సాధ్యం అనుకునే వ్యాపార రంగంలో అడుగు పెట్టి విజయవంతమైన వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారు. ఫల్గుణి నాయర్, వినితా సింగ్, ఇందిరా పూరి ఇషా అంబానీ కార్పొరేట్ సీఈవోలుగా ఎదుగుతున్నారు. మరికొంతమంది మహిళలు తమ కృషి ఆధారంగా స్టార్టప్లలో కూడా తామేంటో నిరూపించు కున్నారు. అంతేకాదు తక్కువ పెట్టుబడితోనే అద్భుతాలు చేస్తూ తనలాంటి ఎందరో ఔత్సాహికులకు ప్రేరణగా నిలుస్తున్నవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అలాంటి వారిలో ఒకరు నిధి యాదవ్. ఆమె సాధించిన విజయం ఏమిటో తెలుసుకుందామా!ఇండోర్లో జన్మించిన నిధికి ఫ్యాషన్ రంగం అంటే చాలా ఇష్టం. కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివిన నిధి డెలాయిట్లో పనిచేసేది. ఐదంకెల జీతం. కానీ అది సంతృప్తి నివ్వలేదు. తన అభిరుచిని కెరీర్గా మార్చుకోవడానికి, నిధి కూడా ఫ్లోరెన్స్లోని పోలిమోడా ఫ్యాషన్ స్కూల్లో ఒక సంవత్సరం కోర్సు చేసింది. అలా సొంత వ్యాపారం మొదలు పెట్టాలనే కోరికతోపాటు,కుటుంబానికి దగ్గరగా ఉండేందుకు భారతదేశానికి తిరిగి రావాలనే పెద్ద ముందడుగు వేసింది. తన సొంత బ్రాండ్ను సృష్టించాలని నిర్ణయించుకుంది. అప్పటికే వివాహం, ఏడు నెలల పసిబిడ్డ ఉన్నా కూడా తన ఆశయానికి కట్టుబడి ఉంది. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, డెలాయిట్లో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాలని ధైర్యంగా నిర్ణయం తీసుకుంది. 23 ఏళ్ల వయస్సులో ఉద్యోగాన్ని వదిలివేసి భర్తతోకలిసి తన సొంత దుస్తుల బ్రాండ్ను ప్రారంభించింది. 2014లో గురుగ్రామ్లోని తన 2BHK ఇంట్లో రూ.3.5 లక్షల ప్రారంభ పెట్టుబడితో ఆక్స్ క్లోతింగ్ను ప్రారంభించింది.స్టైలిష్ ఎథ్నిక్ వేర్ను సరసమైన ధరల్లో అందించాలి, ముఖ్యంగా 18-35 సంవత్సరాల వయస్సు గల యువతులను లక్ష్యంగా చేసుకుంది. అనుకున్నట్టుగానే ఆమె వెంచర్ త్వరగా ఆదరణ పొందింది.2021 నాటికి రూ.200 కోట్ల ఆదాయాన్ని సాధించింది. చాలా తక్కువ సమయంలో ఆక్స్ ప్రజాదరణ పొందింది. కంపెనీ కేవలం ఒక సంవత్సరంలో రూ. 8.50 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది 2018లో, కంపెనీ ఆదాయం రూ. 48 కోట్లకు పెరిగింది. ఐదేళ్లలోనే కంపెనీ ఒక రేంజ్కి చేరింది. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో రూ. 100 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది.అంటే 2014లో రూ. 1.60 కోట్లుగా ఉన్న ఆదాయం 2015లో రూ. 8.50 కోట్లకు, ఆ తర్వాత 2018 నాటికి రూ. 48 కోట్లకు పెరిగింది. 2021 నాటికి, ఆక్స్ ఎటువంటి బాహ్య నిధులు లేకుండానే రూ. 200 కోట్ల ఆదాయాన్ని అధిగమించింది.రూ. 500 కోట్ల టర్నోవర్తోపాటు గ్లోబల్ విస్తరణ లక్ష్యంగా ముందుకు సాగుతోంది నిధియాదవ్.చదవండి: ఉద్యోగాన్ని వదిలేసిన ఇంజనీర్ కపుల్.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలుబ్రాండ్ ప్రారంభ రోజుల్లో, నిధి ఆమె భర్త తమ పసికందుతో కలిసి గురుగ్రామ్,జైపూర్ మధ్య వారాంతపు తిరుగుతూ సామాగ్రిని సేకరించేవారు. ఈ కష్టాల మధ్య కోవిడ్ మహమ్మారి మరో సవాల్ విసిరింది. దీంతో పాటు కొత్త అవకాశాల్ని కూడా తెచ్చిపెట్టింది. క్లోతింగ్ ఉత్పత్తి సంక్షోభం తరుణంలో ఆక్స్ మాస్క్లు , PPE కిట్లను తయారు చేయడంలో పై చేయి సాధించింది. అలా కోవిడ్ కాలంలో బ్రాండ్ వృద్ధి 25 శాతం పెరిగిందంటే ఆమె కృషిని అర్థం చేసుకోవచ్చు. మిగిలిపోయిన బట్టను ఉపయోగించి పిల్లల దుస్తుల శ్రేణిని కూడా ప్రారంభించింది.ఇదీ చదవండి: 70 ఏళ్ల వయసులో 30 ఏళ్ల చిన్నదానితో నటుడి పెళ్లి.. ఇపుడిదే చర్చ! -
ఫోటోగ్రఫీతో సత్తా చాటుతున్న వనితలు..!
కేరళలోని కోజికోడ్కు చెందిన కీర్తన కున్నాత్ లండన్లో స్థిరపడింది. జెండర్ నుంచి మెంటల్ హెల్త్ వరకు ఎన్నో అంశాలపై ఫొటోసిరీస్ చేస్తుంటుంది కీర్తన. ఆమె తాజా ఫొటోసిరీస్... నాట్ వాట్ యూ సా. దక్షిణ భారత మహిళా బాడీబిల్డర్లపై చేసిన ఫొటోసిరీస్ ఇది. ఈ సిరీస్కు ‘అండర్ 30’ విభాగంలో ది రాయల్ ఫోటోగ్రాఫిక్ సొసైటీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్స్ ఇంటర్నేషనల్ ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్ అవార్డ్ గెలుచుకుంది. ‘ఆత్మవిశ్వాసం మూర్తీభవించేలా ఈ మహిళలను చూపాలనుకున్నాను’ అని తన ఫొటో ప్రాజెక్ట్ గురించి చెబుతుంది కీర్తన. ‘నాట్ వాట్ యూ సా’ ఫొటో ప్రాజెక్ట్ కోసం అనలాగ్ మీడియం ఫార్మట్ కెమెరా మమియ 67 ఉపయోగించి కేరళ, కర్ణాటకలోని వివిధ ప్రాంతాలలో ఫొటో షూట్ చేసింది. డాటర్ ఆఫ్ రఘు రాయ్చిన్నప్పుడు గిఫ్ట్గా కెమెరా అందుకున్న అవనీ రాయ్ అప్పటి నుంచి కెమెరాతో సుదీర్ఘ స్నేహం చేస్తూనే ఉంది. ప్రసిద్ధ ఫొటోగ్రాఫర్ రఘు రాయ్ కుమార్తెగా ఆమె ‘ఫొటోగ్రఫీ’ అనే ప్రపంచంలో పెరిగింది. ఎంతోమంది ఛాయాచిత్రకారుల నుంచి ఎన్నో విషయాలు తెలుసుకుంది. ‘తండ్రి స్టైల్లోనే’ అని అనిపించుకోవాలని అవనికి ఉండేది కాదు. అందుకే తనదైన దృశ్యభాషను రూపొందించుకుంది. కశ్మీర్ సమస్య నుంచి చెన్నై ప్రజల తాగునీటి కష్టాల వరకు ఎన్నో సామాజిక సమస్యలను డాక్యుమెంట్ చేసింది. కశ్మీర్కు సంబంధించి సబ్జెక్ట్, ఎమోషన్లను ‘ఉమెన్ ఆఫ్ కశ్మీర్’ ఫొటోసీరిస్లో హైలెట్ చేయడానికి బ్లాక్ అండ్ వైట్ ఫొటోగ్రఫీని ఉపయోగించుకుంది. (చదవండి: అమ్మాయిలు చిన్న వయసు అబ్బాయిలనే ఇష్టపడటానికి రీజనే అదే..! సర్వేలో షాకింగ్ విషయాలు..) -
సై‘లెన్స్’ సాహసం
మనిషి మూడో కన్ను కెమెరా. రెండు కళ్లు చూడలేని దృశ్యాలను కెమెరా కన్ను చూస్తుంది. ఛాయాచిత్ర ప్రపంచంలో మహిళా ఫొటోగ్రాఫర్లు తమదైన ముద్ర వేసారు. ప్రకృతి అందాలు మాత్రమే కాదు సామాన్యుల జీవితాలు, అణగారిన వర్గాల పోరాటాలు, భిన్నమైన సాంస్కృతిక అంశాలను ఫొటోగ్రఫీలోకి తీసుకువస్తున్నారు.ఆ కెమెరా... అణగారిన వర్గాల గొంతుక-భూమిక సరస్వతిప్రకృతి అందాలు మాత్రమే కాదు సామాన్యుల జీవితాలను, అణగారిన వర్గాల ఉద్యమాలను, దళిత, ఆదివాసీ జీవితాలను తన కెమెరా కంటితో చిత్రిస్తోంది భూమిక సరస్వతి. పర్యావరణ సంరక్షణపై దళిత, ఆదివాసీలు చేస్తున్న పోరాటాన్ని ‘అన్ ఈక్వల్ హీట్’ టైటిల్తో ఫొటో డాక్యుమెంటేషన్ చేసింది. భూమిక తన ప్రాజెక్ట్కు సంబంధించిన ఫొటోలను ఎక్కువగా చత్తీస్ఘడ్, ఉత్తర్ప్రదేశ్లాంటి రాష్ట్రాల్లో తీసింది. ‘అన్ ఈక్వల్ హీట్’ ప్రాజెక్ట్కు సంబంధించిన పనుల్లో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. అదే పనిగా ప్రయాణాలు చేయడం వల్ల అనారోగ్యానికి గురైన రోజులు ఉన్నాయి. అక్రమ మైనింగ్ జరిగే ప్రాంతాల్లో కెమెరాతో వెళ్లడం అంటే ప్రమాదమే. వాటిని లెక్క చేయకుండా ముందుకు వెళ్లింది.అదర్ సైడ్కేరళలోని కోజికోడ్కు చెందిన కీర్తన కున్నాత్ లండన్లో స్థిరపడింది. జెండర్ నుంచి మెంటల్ హెల్త్ వరకు ఎన్నో అంశాలపై ఫొటోసిరీస్ చేస్తుంటుంది కీర్తన. ఆమె తాజా ఫొటోసిరీస్... నాట్ వాట్ యూ సా. దక్షిణ భారత మహిళా బాడీబిల్డర్లపై చేసిన ఫొటోసిరీస్ ఇది. ఈ సిరీస్కు ‘అండర్ 30’ విభాగంలో ది రాయల్ ఫోటోగ్రాఫిక్ సొసైటీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్స్ ఇంటర్నేషనల్ ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్ అవార్డ్ గెలుచుకుంది. ‘ఆత్మవిశ్వాసం మూర్తీభవించేలా ఈ మహిళలను చూపాలనుకున్నాను’ అని తన ఫొటో ప్రాజెక్ట్ గురించి చెబుతుంది కీర్తన. ‘నాట్ వాట్ యూ సా’ ఫొటో ప్రాజెక్ట్ కోసం అనలాగ్ మీడియం ఫార్మట్ కెమెరా మమియ 67 ఉపయోగించి కేరళ, కర్ణాటకలోని వివిధ ప్రాంతాలలో ఫొటో షూట్ చేసింది.-కీర్తన కున్నాత్డాటర్ ఆఫ్ రఘు రాయ్చిన్నప్పుడు గిఫ్ట్గా కెమెరా అందుకున్న అవనీ రాయ్ అప్పటి నుంచి కెమెరాతో సుదీర్ఘ స్నేహం చేస్తూనే ఉంది. ప్రసిద్ధ ఫొటోగ్రాఫర్ రఘు రాయ్ కుమార్తెగా ఆమె ‘ఫొటోగ్రఫీ’ అనే ప్రపంచంలో పెరిగింది. ఎంతోమంది ఛాయాచిత్రకారుల నుంచి ఎన్నో విషయాలు తెలుసుకుంది. ‘తండ్రి స్టైల్లోనే’ అని అనిపించుకోవాలని అవనికి ఉండేది కాదు. అందుకే తనదైన దృశ్యభాషను రూపొందించుకుంది. కశ్మీర్ సమస్య నుంచి చెన్నై ప్రజల తాగునీటి కష్టాల వరకు ఎన్నో సామాజిక సమస్యలను డాక్యుమెంట్ చేసింది. కశ్మీర్కు సంబంధించి సబ్జెక్ట్, ఎమోషన్లను ‘ఉమెన్ ఆఫ్ కశ్మీర్’ ఫొటోసీరిస్లో హైలెట్ చేయడానికి బ్లాక్ అండ్ వైట్ ఫొటోగ్రఫీని ఉపయోగించుకుంది.అవనీ రాయ్ -
అలా పుట్టిందే చిట్టి చిలకమ్మ పాట
అమ్మమ్మ తన చిట్టి మనవరాలిని బుజ్జగిస్తూ ... ‘చిట్టి చిలకమ్మా / అమ్మ కొట్టిందా..! ’అని చెబుతుంటే మనవరాలు కళ్లు విప్పార్చి వింటున్న అందమైన దృశ్యం మన కళ్ల ముందు నిలుస్తుంది. అమ్మ తన కూతురితో ‘పండు తెచ్చావా.. గూట్లో పెట్టావా.. గుటుక్కున మింగావా..’ అనగానే చిన్నారి కూతురు కిల కిల నవ్వే నవ్వులు తలపునకు వస్తాయి. చిలకమ్మ వచ్చేసింది.. పండు తెచ్చింది అని చిన్నారులంతా సంబరపడిపోయి పాడుకునే ఆ పాట అరవై ఏళ్లుగా తెలుగు ముంగిళ్లలో పిల్లలున్న ప్రతి ఇంట్లో వినపడుతూనే ఉంది. ఈ గేయం ఎనిమిది పదుల బల్ల సరస్వతి నోట పుట్టింది అనగానే ఆశ్చర్యంగా అందరి చూపులూ ఆమె వైపుకు మరలకుండా ఉండవు. ఎనిమిది పదుల వయసున్న బల్ల సరస్వతి స్వస్థలం జనగాం జిల్లా, బచ్చన్నపేట్ మండలం, కట్కూరు గ్రామం. ఈ పాట ఆమె నోట ఎలా పుట్టింది?! ఇదే విషయం అడిగితే ... ఆమె తన ఏడుతరాల ముచ్చటను మన ముందుంచారు.‘‘ఏడు తరాల ముచ్చట్లు చెప్పాలంటే ఒక్కజాములో అయ్యేది కాదు. నెక్కొండ బ్లాక్లో గురజాల అనే గ్రామం కింద గుంటూరుపల్లె అని ఒక చిన్న పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరుకు ప్రైమరీ స్కూల్కి సింగిల్ టీచర్గా 1962లో వెళ్లాను. ఆ స్కూల్ ఒక గుడిసె. అందులోకి 50 మంది పిల్లలు వచ్చేవారు. ఆ పిల్లలకు చదువు చెప్పడానికి ఏ పుస్తకాలూ లేవు. అక్షరాలు దిద్దించడం, అంకెలు చెప్పడం.. ఎంతసేపూ ఇవే చెబితే పిల్లలు వినరు. రోజంతా వారిని ఎంగేజ్ చేయాలంటే ఎట్లా అని ఆలోచించేదాన్ని. నా చిన్ననాటి నుంచి విన్న పాటలు, కథలు చెప్పాలనుకున్నా. మా అమ్మ నా చిన్నతనంలో చెప్పిన గేయాలు, పద్యాలు, కథలు మాత్రమే కాదు అప్పటికప్పుడు నేనే స్వయంగా పాటలు అల్లి పిల్లలకు చెబుతుండేదాన్ని. అన్నీ పిల్లల మెదళ్లకు చేరేవి కావు. ఇంకా వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నా. ఆ ప్రాంతమంతా చుట్టూ చెట్లు, చేమలు. నేను ఇలా చటుక్కున చెబితే పిల్లలు లటుక్కున అందుకునేలా ఉండాలి. చిన్నారులు తాము రోజూ చూసేవాటి మీద పాట గట్టి చెప్పాలి. అలా అప్పటికప్పుడు చిలుకల మీద అల్లిన పాటే ఇది... అని చెబితే.. పిల్లలు ఆ పదాలను సులువుగా పట్టేసుకున్నారు. ఆ పాట ఆ నోటా ఈ నోటా.. అలా అలా ఎగురుతూ చాలాకాలం కిందటే ఎల్లలు దాటి అమెరికా దాకా పోయింది. ఇప్పటికీ ఎగురుతూనే ఉంది. సముద్రాలు, పర్వతాల గురించి చెబితే వారికి అర్థమయ్యేది కాదు. సరైన దృష్టి పెట్టేవారు కాదు. అందుకని ఏది చెప్పినా గేయాల రూపంలోనే. టీచర్గా రావడానికి ముందు మాకు బేసిక్ ట్రైనింగ్ ఇచ్చారు. అది కూడా నాకు ఉపయోగపడింది. వినోదంగా, అర్థమయ్యే విధంగా, ఆసక్తి కలిగే ప్రయత్నాలు అన్నీ చేసేదాన్ని. ఊరూరూ ప్రయాణం..1957లో అప్పటి 7వ తరగతి పాసయ్యాను. 14 ఏళ్ల వయసులో పెళ్లయ్యింది. మా వారు పీయూసీ చదివారు. ఇద్దరం బేసిక్ టీచర్ ట్రైనింగ్ చేశాం. మా ఇద్దరికీ నెల రోజుల తేడాతో టీచర్ ఉద్యోగాలు వచ్చాయి. నాకు, మావారికి పక్క పక్క ఊళ్లకు పోస్టింగులు. మూడేళ్లు చేశాక మా సొంత ఊరు కట్కూరుకి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఇక్కడ ఐదేళ్లు చేశాక, ఆలిన్పుర్లో రెండేళ్లు, ఆ తర్వాత మా పుట్టిన ఊరు లద్దునూరుకు ఇద్దరికీ ట్రాన్స్ఫర్ అయ్యింది. అక్కడ 17 సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాత మళ్లీ కట్కూరుకు.. ఇలా మొత్తం 37 ఏళ్లపాటు టీచర్గా చేసి, హెచ్.ఎం.గా రిటైరయ్యాను. ఏడుతరాల తలపోత... ఎనిమిది పదుల జీవితంలో ఎన్నో అనుభవాలు. ఏడుతరాలు చూసిన అనుభవం. నేత కార్మికుల ఇంట పుట్టి పెరిగాను. పెద్ద కుటుంబం. ఐదుగురు అక్కచెల్లెళ్లు, ముగ్గురు అన్నదమ్ములు. మా వారి తోడబుట్టినవాళ్లు ఏడుగురు. పెళ్లికి ముందు మా అక్కాబావ హైదరాబాద్లో ఉంటే కొన్నాళ్లు అక్కడే ఉండి, హిందీ నేర్చుకున్నా. మా బంధువు, మామ సుద్దాల హన్మంతు. పెళ్లి తర్వాతే డిగ్రీ చేశాను. నాకు ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. ఎంతోమంది జీవితాలు అతి దగ్గరగా ఉండి చూసిన, ఎన్నో వెతలు విన్నా. ఏ కష్టమైనా, ఆనందమైనా అంతా ఒకే కుటుంబంగా కలిసి పంచుకున్నాం. అవన్నీ కలిపి ‘కలెనేత’ అని ఏడుతరాల తలపోతగా ఆత్మకథ రాస్తే.. పిల్లలు దానిని పుసక్తంగా తీసుకువచ్చారు.శిశిర ధ్వనిపుట్టిల్లు, అత్తిల్లు.. పిల్లల పనులు, స్కూల్ పనులు.. ఎక్కడా తీరిక ఉండేది కాదు. సమావేశం అయినా, సంబరం అయినా అప్పటికప్పుడు ఓ గేయం రాయడం, పాడటం, వదిలేయడం.. అలా రోజులు వెళ్లిపోయాయి. ఆ గేయాలను భద్రపరుచుకోవాలి అనే అలోచన అప్పట్లో లేదు. 2001లో మా వారు చనిపోయారు. ఊళ్లో ఒంటరిగా ఉండలేక పిల్లల దగ్గరకు హైదరాబాద్కు వచ్చిన. మలిదశ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు అవన్నీ వింటూ.. చూస్తూ చలించిపోయి, నాకు కలిగిన ఆవేశాన్ని, భావాలను రాసుకుంటూ ఉండేదాన్ని.‘ఒట్టు పెట్టి చెపుతున్నా ఒస్తది మన తెలంగాణ.. అదరకురా తమ్ముడా తెలంగాణ మనదేరా..’ అని తెలంగాణ గురించి.. ‘రంగు రంగులు నింపి ఇంద్రధనుస్సును మైమరపిస్తవు / అచ్చులతికి అతికి అతికి, నేత నేసి నేసి, పడగు పేకల కలయిక నీవు, కష్ట సుఖాల వారధి నీవు...’ అని నేతన్నల కష్టాల గురించి.. ‘అవిశ్రాంతంగా పోరు బాటలో పయనిస్తూ, జీవనసమరాన్నీ ఛేదిస్తూ సాగిపోతాను ముందుకు, మున్ముందుకు... ’ అంటూ విశ్రాంత ఉపాధ్యాయుల కోసం.. రాశాను. ఇలాంటివి దాదాపు ఓ యాభై కవితలను కలిపి ‘శిశిరధ్వని’ పుస్తక రూపంగా మీ ముందుకు తీసుకువచ్చాం’’ అంటూ తన గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు ఈ అనుభవాల విజ్ఞానగని. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఫొటోలు: మోహనాచారి(రచయిత్రి 1962లో తన విద్యార్థుల కోసం అల్లిన పాట... ఆమె చేతివ్రాతతో..)కుటుంబ సభ్యులతో బల్ల సరస్వతి -
ఎవరీ కృషాంగి మేష్రామ్? అతి పిన్నవయస్కురాలైన సొలిసిటర్గా..
భారత సంతతి అమ్మాయి అసాధారణమైన ఘనతను సాధించింది. అతి చిన్న వయసులోనే ఇంగ్లాండ్, వేల్స్లలో సొలిసిటర్ అయ్యారు. అతి చన్ని వయసులోనే ఈ ఘనతను సాధించి..అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆమె ఎవరంటే..ఆ అమ్మాయే పశ్చిమ బెంగాల్కి చెందిన కృషాంగి మేష్రామ్. కేవలం 21 ఏళ్ల వసులోనే సొలిసిటర్ అయ్యింది. 15 ఏళ్లకే మిల్టన్ కీన్స్ ది ఓపెన్ యూనివర్శిటీలో తన లా చదువును ప్రారంభించి.. న్యాయశాస్త్రంలో ఫస్ట్క్లాస్ ఆనర్స్ డిగ్రీని పొందింది. అయితే కృషాంగి మాత్రం 15 ఏళ్లకే ఓపెన్ యూనివర్సిటీలో చదివే అవకాశం లభించడం వల్లే ఈ ఘనత సాధించగలిగానని ఆనందంగా చెప్పుకొచ్చింది. తనకు న్యాయశాస్త్ర పట్ల ఉన్న ప్రగాఢమైన అభిరుచే ఈ విజయానికి కారణమని అంటోందామె. ఓపెన్యూనివర్సిటీ ద్వారా లాగ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మరీ ఈ విజయాన్ని అందుకుందామె. ఎవరీ కృషాంగి మేష్రామ్ అంటే..పశ్చిమ బెంగాల్లో జన్మించి కృషాంగీ ఇస్కాన్ మాయాపూర్ కమ్యూనిటీలో పెరిగింది. 15 ఏళ్ల వయసుకే మాయాపూర్లోని ఒక అంతర్జాతీయ పాఠశాలలో మాధ్యమిక విద్యను పూర్తి చేసింది. తర్వాత ఒపెన్ యూనివర్సిటీ(ఓయూ)లో మూడేళ్లలో డిగ్రీ పూర్తి చేసి న్యాయ పట్టా పొందింది. అలా 18 ఏళ్లకే న్యాయశాస్త్రంలో ఫస్ట్క్లాస్ ఆనర్స్ డిగ్రీతో పట్టభద్రురాలైందామె. 2022లో ఒక అంతర్జాతీయ న్యాయసంస్థలో ప్రాక్టీసు కూడా ప్రారంభించింది. అలాగే ఆమె హార్వర్డ్ ఆన్లైన్లో గ్లోబల్ ప్రోగ్రామ్లు కూడా చేసింది. పైగా సింగపూర్లో వృత్తిపరమైన అనుభవాన్ని సంపాదించింది. ప్రస్తుతం యూకే, యూఏఈలలో చట్టపరమైన అవకాశాలను అన్వేషిస్తోంది. ఇక కృషాంగికి చట్టపరంగా ఫిన్టెక్, బ్లాక్చెయిన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీలునామాలు, ప్రొబేట్ వంటి ప్రైవేట్ క్లయింట్ తదితర సేవలపై ఆసక్తి ఎక్కువ. (చదవండి: Gaurav Kheterpal: భారతీయ కుటుంబ వ్యవస్థ చనిపోయిందా?) -
'దేవుడా.. ఈ రోజు ప్రాణాలతో ఉంచు!’
‘బ్రహ్మపుత్ర నదిలో రాఫ్టింగ్ మొదలుపెట్టిన రెండు గంటల్లోనే ప్రవాహం పెరిగింది. పెద్ద అలలా నీరు రావడం, అదే సమయంలో రాళ్లు ఎక్కువగా ఉండటంతో రాఫ్ట్ అదుపు తప్పి కిందపడిపోయాను. బ్రహ్మపుత్ర ప్రయాణమే ఆఖరుదని అనుకున్నాను. ఆ క్షణంలో దేవుడ్ని, దేశాన్ని ప్రార్థించుకున్నాను. కష్టమ్మీద మళ్లీ రాఫ్ట్లోకి ఎక్కాను. ఇక అక్కడి నుంచి వెనుదిరగలేదు. ప్రపంచ రికార్డు సాధించే దిశగా సాగిన మా ప్రయాణం విజయవంతమైంది.బ్రహ్మపుత్రలో రివర్ రాఫ్టింగ్ చేసిన తొలి మహిళగా గుర్తింపు పొందాను’అని వెల్లడించారు ఆర్మీ మేజర్, వైద్యాధికారి వాసుపల్లి కవిత. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరుకు చెందిన మేజర్ కవిత.. ఈ ఘనత సాధించిన తొలి మహిళగా ప్రపంచ రికార్డు నెలకొల్పారు. విశాఖలోని తూర్పు నౌకాదళానికి ఇటీవల వచ్చిన ఆమె తన అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. దేవుడికి, దేశానికి ప్రార్థించి.. 1,040 కిలోమీటర్ల బ్రహ్మపుత్ర నదిని 28 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇండో–టిబెటెన్ బోర్డర్ నుంచి బంగ్లాదేశ్ సరిహద్దు వరకు మా ప్రయాణం సాగింది. ప్రతిరోజూ ఉదయం అల్పాహారం చేసి, దేవుడికి, దేశానికి ప్రారి్థంచి మా ప్రయాణం మొదలుపెట్టేవాళ్లం. 28 రోజుల్లో పూర్తి చేయాలంటే సమయం వృథా చేయకూడదు. అందుకే ఆహారం కూడా మితంగా, బోట్లోనే తీసుకునేవాళ్లం. ఒక్కోసారి 12 గంటలపాటు ఏకధాటిగా రాఫ్టింగ్ చేశాం. అనుకున్నది సాధించాం. సాహస క్రీడలకు స్వర్గధామం ‘అడ్వెంచర్ స్పోర్ట్స్లో భారత్ వెనుకబడి ఉంది.. మన దేశంలో వీటికి ప్రాధాన్యం లేదు’అని చాలా మంది అంటారు. మేం దానిపైనే దృష్టి సారించాం. ఈ రాఫ్టింగ్తో ఒక మెట్టు ఎక్కాం. ఇకపై బ్రహ్మపుత్ర రివర్ రాఫ్టింగ్ పేరు చెబితే మొదట మా పేరే వినిపిస్తుంది. ఈశాన్య, ఉత్తరాది రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక పర్యాటకానికి ఉన్న ప్రాధాన్యం సాహస పర్యాటకానికి లేదు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, జీవ వైవిధ్యంతో కూడిన సాహస పర్యాటకానికి ప్రపంచ గుర్తింపు తీసుకురావాలన్నదే మా ప్రయత్నం. మహిళలు ఎందులోనూ తక్కువ కాదు! వైద్యులకు మానసిక స్థైర్యం ఉంటుంది కానీ, శారీరకంగా దృఢంగా ఉండరని చాలా మంది అంటుంటారు. అది తప్పని నిరూపించాలని ఎప్పుడూ అనుకునేదాన్ని. చిన్నప్పటి నుంచి నా ఆలోచనలు ఇలాగే ఉండేవి. పాఠశాల రోజుల్లో క్రీడలపై ఎక్కువ దృష్టి పెట్టాను. మగవాళ్లతో పోలిస్తే మహిళలు ఎందులోనూ తక్కువ కాదని చెప్పాలన్నదే నా ఉద్దేశం. ఇప్పుడు దాన్ని నిరూపించాను. రాష్ట్రపతి మెడల్తో ఆత్మవిశ్వాసం అరుణాచల్ప్రదేశ్లో పని చేస్తున్నప్పుడు 18 వేల అడుగుల ఎత్తులో ఉన్న గోరీచెన్ బేస్ క్యాంప్కు మెడికల్ ఆఫీసర్గా నాలుగైదుసార్లు వెళ్లాను. నన్ను గమనించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ డైరెక్టర్.. ‘మీరు కూడా ట్రెక్ చేయవచ్చు కదా’అని సలహా ఇచ్చారు. అప్పుడే రాఫ్టింగ్ కోర్సులో చేరాను. ఆ సమయంలోనే నేనెందుకు గోరీ చెన్ పర్వతాన్ని అధిరోహించకూడదు? అనిపించింది. నా మీద నాకు నమ్మకం వచ్చాక పర్వతారోహణకు సిద్ధమయ్యాను. ఒక రోజు ట్రెక్లో చాలా మంది ఉన్నారు. పైకి వెళ్తున్నప్పుడు పైనుంచి ఒక పెద్ద రాయి దొర్లుకుంటూ వచ్చింది. వెంట్రుకవాసిలో తప్పించుకున్నాను. విజయవంతంగా శిఖరాన్ని చేరి దేశ పతాకాన్ని ఎగురవేశాను. అదే సమయంలో ట్రెక్ చేస్తున్న ఓ మహిళ ఊపిరాడక ఇబ్బంది పడుతోంది. వెంటనే స్పందించి ఆమె ప్రాణాలు కాపాడాను. ఎంబీబీఎస్ చేసినందుకు ఆ రోజు ఎంతో ఆనందం కలిగింది. ఈ సంఘటనకు గానూ రాష్ట్రపతి నుంచి విశిష్ట సేవా పతకం అందుకున్నాను. నాన్న భరోసా.. అమ్మ ఆత్మవిశ్వాసం! నాన్న రామారావు రైల్వే క్లర్క్. అమ్మ గృహిణి. నాకు ప్రభుత్వ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు వచ్చినా, నా చదువు పూర్తి చేయడానికి నాన్న ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. ఎంబీబీఎస్ అయ్యాక పీజీ చేస్తానని చెప్పాను. అప్పుడు నాన్న ఆర్థిక పరిస్థితిని వివరించారు. వైద్య వృత్తిలో స్థిరపడాలనుకుంటున్న సమయంలో, ఆర్మీలో కూడా మెడికల్ ఆఫీసర్గా పనిచేయవచ్చని తెలుసుకున్నాను. ఈ విషయం అమ్మానాన్నలకు చెప్పగా.. రక్షణ రంగం అనగానే వాళ్లు కొంచెం భయపడ్డారు. అక్కడ బాగుంటే కొనసాగుతాను, లేదంటే తిరిగి వచ్చి వైద్య వృత్తిలో స్థిరపడతానని వారికి నచ్చజెప్పాను. నాన్న భరోసా ఇచ్చారు. అమ్మ ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అందుకే కెప్టెన్గా మొదలై.. మేజర్ స్థాయికి చేరుకున్నాను. ఎవరెస్ట్ ఎక్కుతా.. పీజీ చేస్తా! ఈ ప్రపంచ రికార్డు నన్ను మరిన్ని సాహస యాత్రల వైపు నడిపిస్తోంది. సింధు ఉపనది జస్కర్ నదిలో రాఫ్టింగ్ చేయాలనుకుంటున్నాను. రాఫ్టింగ్ క్రీడకు పుట్టినిల్లు అయిన అమెరికాలోని అత్యంత ప్రమాదకరమైన కొలరాడో నదిలో రాఫ్టింగ్ చేయాలన్నది నా కోరిక. మకాలు పర్వతారోహణతో పాటు ప్రతిష్టాత్మకమైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి కూడా అడుగులు వేస్తున్నాను. వైద్య వృత్తిలో భాగంగా స్పోర్ట్స్ మెడిసిన్ లేదా ఆప్తమాలజీలో పీజీ కూడా చేస్తాను.సుడిగుండంలో చిక్కుకున్నా.. మొదటి రోజు ప్రయాణం చాలా సవాలుగా అనిపించింది. రాక్ సర్ఫింగ్ సమయంలో రాఫ్ట్ బోల్తాపడి రాళ్ల మధ్య ఇరుక్కుపోయాను. సేఫ్టీ కయాక్ను పట్టుకొని 200 మీటర్ల వరకు ప్రయాణించాను. రెస్క్యూ సిబ్బంది సాయంతో అతి కష్టం మీద మళ్లీ రాఫ్ట్లోకి వచ్చాను. కొద్ది దూరం వెళ్లాక, మరోసారి టీమ్ మొత్తం 6 అడుగుల లోతైన నీటిలో పడిపోయాం. అక్కడ ఏర్పడిన సుడిగుండంలో నేను చిక్కుకున్నప్పుడు ఇక నా పని అయిపోయిందని అనుకున్నాను. ‘ప్రతి నిమిషం నిన్ను నువ్వు రక్షించుకోవడానికి, నీ టీమ్ను నడిపించడానికి ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కో’అని అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చి.. బలంగా ప్రయతి్నంచి బయటపడ్డాను. ఇలా వారం రోజుల పాటు ప్రయాణం నరకప్రాయంగా సాగింది. అయినా ఎక్కడా వెనకడుగు వేయలేదు. నిర్దేశించుకున్న 28 రోజుల్లో 1,040 కిలోమీటర్ల రివర్ రాఫ్టింగ్ను విజయవంతంగా పూర్తి చేశాం.(చదవండి: చిన్న వయసులోనే రచయిత్రిగా స్నేహా దేశాయ్..!) -
కమాండర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ : తెలుగు మహిళ ఘనత
అది బెర్క్షైర్ లోని విండ్సర్ పట్టణంలోని రాజ ప్రాసాదం. పేరు విండ్సర్ క్యాజిల్. పౌరపురస్కారాల కార్యక్రమం రాజరిక గౌరవాలతో సాగుతున్న రోజు. బ్రిటిష్ రాజవంశం పౌరులకు ప్రదానం చేసే అత్యున్నతమైన ‘కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్’ (Commander of the British Empire) పురస్కారాలను బ్రిటన్ రాజు చార్లెస్ సోదరి ప్రిన్సెస్ యాన్నే ప్రదానం చేశారు. పురస్కారాలు అందుకున్న వారిలో తెలుగు మహిళ ఉన్నారు. ఆమె పూర్ణిమా మూర్తి తణుకు. తెలుగు నేల అందుకున్న తొలి ‘కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్’ పురస్కారం. ఆంధ్రప్రదేశ్, అమలాపురంలో పుట్టిన పూర్ణిమామూర్తి (purnima murthy)ఆంధ్ర విశ్వవిద్యాలయంలోపోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట ఆమె అత్తగారిల్లు. పెళ్లి తర్వాత భర్తతోపాటు ఇంగ్లండ్కు వెళ్లిన పూర్ణిమ ఎర్లీ ఇయర్స్ ఎడ్యుకేషన్లో సేవలందించారు. నేషనల్ డే నర్సరీస్ అసోసియేషన్ (ఎన్డీఎన్ఏ) ద్వారా ఆమె స్కూలు వయసు రాని పిల్లలకు విద్యావిధానం మీద ఇరవై ఏళ్లకు పైగా పని చేశారు. ప్రస్తుతం ఆమె ఎన్డీఎన్ఏకి చీఫ్ ఎగ్జిక్యూటివ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె ఫోన్లో మాట్లాడుతూ ‘‘బాల్యం అద్భుతమైనది. పాఠశాలకు వెళ్లడానికి ముందు నుంచే పిల్లలను పాఠ్యాంశాలకు తగినట్లు సిద్ధం చేయడం అనే ప్రక్రియ సున్నితంగా మొదలవ్వాలి. మెదడు వికాసంలో ఇది చాలా ప్రధానమైన విషయం. అందుకే నర్సరీల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పిల్లలకు ఇచ్చే ఆహారం, ఫిజికల్ ఎక్సర్సైజ్, కరికులమ్ రూ రూపొందించడంతోపాటు అవి యథాతథంగా అమలయ్యేటట్లు దృష్టి పెట్టాలి’’ అన్నారు. బ్రిటన్లో ప్రభుత్వం ప్రతి నర్సరీని సందర్శిస్తుంది. తల్లి వర్కింగ్ ఉమన్ అయితే తొమ్మిది నెలల నుంచి బిడ్డ బాధ్యతను నర్సరీ తీసుకుంటుంది. ఆ బిడ్డకు మూడున్నర– నాలుగేళ్లు నిండే వరకు అంటే ప్రాథమిక పాఠశాలకు వెళ్లేవరకు నర్సరీనే సంరక్షిస్తుంది. పైగా నర్సరీలను చాలా వరకు ప్రభుత్వమే స్వయంగా నిర్వహిస్తుంది. ప్రైవేట్ నర్సరీలకు బిడ్డకు ఇంత అని ఫండింగ్ ఇస్తుంది. పూర్ణిమామూర్తి పర్యావరణం, వాతావరణ మార్పుల వంటి ఇతర సామాజికాంశాల్లో పని చేస్తున్నప్పటికీ ఎర్లీ ఎడ్యుకేషన్ కోసం కీలకమైన సేవలందించారు. మనదేశంలో కూడా నర్సరీ విధానం ఉంది. కానీ అది సామాన్యులకు అందుబాటులో లేదు. నర్సరీ ఫీజులు కూడా వేలల్లో, లక్షల్లో ఉంటున్నాయి. దాంతో అవి సంపన్నులు, ఎగువ మధ్యతరగతికి మాత్రమే పరిమితమవుతున్నాయి. ప్రభుత్వాలు నిర్వహిస్తున్న అంగన్వాడీ సెంటర్ లలో నాణ్యత ఉండడం లేదు. పిల్లలు ఆడుతూపాడుతూ, తోటి పిల్లలతో అనుబంధాలు అల్లుకుంటూ నేర్చుకోవాలి. (తిన్న వెంటనే టీ తాగుతున్నారా? అయితే ఈ వివరాలు మీ కోసమే!)పాఠాల కంటే ముందు అందమైన సమాజాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే ఎర్లీ ఇయర్స్ ఎడ్యుకేషన్ విధానంలో ఆటపాటల బడి ప్రతి ఊరికీ కావాలి. ఖైదీలకు పాఠాలు జైల్లో శిక్షననుభవిస్తున్న ఖైదీలకు చదువు చెప్పడం, చెప్పించడంలో చేసిన సేవలు చాలా సంతృప్తినిచ్చాయి. వాళ్లలో ఎక్కువ మంది కరడు కట్టిన నేరగాళ్లే. జైలు జీవితం అంటేనే వారికి తగిన శిక్షణనిచ్చి సమాజంలో గౌరవంగా జీవించేటట్లు తయారు చేయడం కదా! నేర ప్రవృత్తి నుంచి వారిని దూరం చేయాలంటే చదువుకు దగ్గర చేయడమే చక్కటి మార్గం. ఇంట్లో వాళ్లు భయపడేవాళ్లు. కానీ ప్రభుత్వం ప్రత్యేక రక్షణనిచ్చి పని చేయడానికి తగిన వెసులుబాటు కల్పించేది. నా సేవలను గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. ఈ పురస్కారం అందుకున్న తొలి తెలుగు వ్యక్తిని కావడం సంతోషంగా ఉంది.– పూర్ణిమామూర్తి తణుకు, విద్యాకార్యకర్త, బ్రిటిష్ ప్రభుత్వ పురస్కార గ్రహీత– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఇదీ చదవండి: జయాబచ్చన్ సెల్ఫీ వివాదం, ఘాటుగా స్పందించిన మరో నటి -
విమెన్ వారియర్స్ ఆర్మీ అధికారులతో ఫెమినా ఇండియా వీడియోవైరల్
ఫెమినా ఇండియా ( Femina India )అంటే అందాల పోటీలు మాత్రమే కాదు. అత్యంత ధైర్య సాహసాలతో అత్యంత క్లిష్టమైన సమయాల్లో దేశానికి సేవచేసే ధీర వనితలను గౌరవించుకోవడం కూడా. ఫెమినా ఇండియా ఆగస్టు 2025 కవర్ పది మంది భారత ఆర్మీ మహిళా అధికారులతో రూపొందించిన వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో సంచలనం సృష్టిస్తోంది. “ప్రతి వందనం వెనుక ఒక ప్రయాణం ఉంటుంది. దేశంలోని వివిధ మూలల నుండి విభిన్నమైన, అద్భుతమైన కథలు. వారి గ్లామర్ కోసం కాదు అత్యంత ధైర్యసాహసాలకోసం..అంటూ సాగే ఈవీడియోను విశేషంగా నిలుస్తోంది.వారియర్ ఉమెన్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ శీర్షికతో 1997-బ్యాచ్ IRAS అధికారి అనంత్ రూపనగుడి షేర్ చేసిన శక్తివంతమైన వీడియోను ఫెమినా ఇండియా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది కేవలం ఫ్యాషన్ షూట్ కాదు-యూనిఫాంలో అధికారులుగా దేశాన్ని రక్షించే మహిళలకు ఒక బోల్డ్ సెల్యూట్. ఇండియన్ ఆర్మీలో మహిళల ఇమేజ్ను ముఖ్యంగా, పది మంది విశిష్ట మహిళా అధికారులకు గొప్ప గౌరవ సూచకంగా దీన్ని రూపొందించింది. ఈ శక్తివంతమైన వీడియోలో, మ్యాగజైన్ కవర్ షూట్ దేశంలోని మహిళా యోధులకు సెల్యూట్ చేసింది. కల్నల్ల నుండి లాన్స్ నాయక్ వరకు పది మంది భారతీయ ఆర్మీ అధికారులు తమ ఆలివ్-గ్రీన్ యూనిఫామ్లలో సగర్వంగా ఇందులో కనిపిస్తారు. ప్రతీ ఫ్రేమ్లో వారి ధైర్య సాహసాలు, క్రమశిక్షణ, దృఢ సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది. ఎన్నో అడ్డంకులను ఛేదించి, ఈ స్థాయికి చేరి దేశానికి గౌరవంగా సేవ చేస్తూ అచంచలమైన దేశభక్తి నిదర్శనంగా ఉన్నారు. అంతేకాదు ఎంతోమంది మహిళలకు తమ కలలను సాకారం చేసుకునేలా ప్రేరణనిచ్చేట్టుగా, దేశ సేవ ద్వారా తమ ధైర్యాన్ని పట్టుదలను నూరిపోసేట్టుగా ఉందీ వీడియో. View this post on Instagram A post shared by Femina (@feminaindia) ఈ వీడియోలో కల్నల్ సోఫియా ఖురేషి, కల్నల్ మేఘనా డేవ్, కల్నల్ పోనుంగ్ డోమింగ్, SM, కల్నల్ అన్షు జామ్వాల్, లెఫ్టినెంట్ కల్నల్ కృతికా పాటిల్, మేజర్ ద్విపన్నిత కలిత, కెప్టెన్ ఓజస్విత శ్రీ, కెప్టెన్ శ్రద్ధా శివదావ్కర్, లాన్స్ నాయక్ ఆషిక, లాన్స్ నాయక్ మంజును చూడవచ్చు.కల్నల్ సోఫియా ఖురేషి: సోఫియా ఖురేషి భారత సైన్యంలో సీనియర్ అధికారి ఆపరేషన్ సిందూర్ సమయంలో అధికారిక ప్రెస్ బ్రీఫింగ్కు నాయకత్వం వహించి వార్తల్లోనిలిచిన ధీర.మేజర్ డాక్టర్ దీపన్విత (ద్విపన్నిత) కలిత: అస్సాం మొట్టమొదటి మహిళా పారాట్రూపర్, ఆగ్రాలో శిక్షణ పొంది 2023లో ధేకియాజులి నుండి ఫెమినా ఇండియా కవర్ వరకు ఆమె ప్రయాణం ప్రేరణ యొక్క స్మారక చిహ్నంగా మారింది. ల్నల్ పోనుంగ్ డోమింగ్: అరుణాచల్ ప్రదేశ్ నుండి వచ్చిన మొదటి మహిళా కల్నల్. -
ఇది స్త్రీరామ రక్ష..!
ఖాప్ పంచాయత్ల గురించి వినే ఉంటారు... వీటికి ఉత్తర భారత్ పెట్టింది పేరు! లాడో పంచాయత్ల గురించి విన్నారా? మహిళా హక్కులను కాపాడేందుకు గొంతెత్తుతున్న పంచాయత్లు! ఖాప్ పంచాయత్లకు వ్యతిరేకంగా ఓ ఉద్యమంలా సాగుతున్నాయి.అయిదారేళ్ల కిందట...హరియాణ , ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో.. పుట్టకుండానే ఆడపిల్లలను చంపేసేవారు. పొరపాటున పుడితే ఆ పిల్లలకు కాఫీ (ఇక చాలు), మాఫీ (క్షమాపణ) లాంటి పేర్లు పెట్టేవారు. ఆడపిల్లల్ని కన్నందుకు సమాజానికి సంజాయిషీలా! అక్కడ అమ్మాయిలు ఐడెంటిఫై అయ్యేది వివక్షతోనే! ఆంక్షల మధ్యే వాళ్ల గమనం. అరుదుగా చదువుకునే చాన్స్ దొరికితే సర్కారు బడితోనే సరి. తర్వాత పెళ్లే! వాళ్లకు సోషల్ మీడియాలో అకౌంట్స్ నిషేధం! వరకట్నాలు, డొమెస్టిక్ వయొలెన్స్తోనే సహజీవనం.ఇప్పుడు...చాలా ప్రాంతాల్లో పరిస్థితి మారింది. భ్రూణ హత్యల మీద స్త్రీలు నిరసన గళం వినిపిస్తున్నారు. ఆడపిల్ల పుట్టడాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అబ్బాయిలతో సమంగా అమ్మాయిలను చదివిస్తున్నారు. మెన్స్ట్రువల్ రైట్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. బాల్యవివాహాలను నిరోధిస్తున్నారు. వరకట్నాన్ని వ్యతిరేకిస్తున్నారు. గృహహింసను అడ్డుకుంటున్నారు. సోషల్ మీడియా అకౌంట్లు క్రియేట్ చేసుకోవడమే కాదు.. తమ పోరాటాలను పోస్ట్ చేస్తున్నారు. అమ్మాయిల పెళ్లి వయసును పద్దెనిమిది నుంచి 21 ఏళ్లకు పెంచాలని ఉద్యమిస్తున్నారు. ఆస్తి హక్కు కోసం నినదిస్తున్నారు.ఈ ధైర్యానికి కారణం.. లాడో పంచాయత్లు...దీని వ్యవస్థాపకుడు సునీల్ జగ్లాన్. హరియాణాలోని బీబీపూర్ మాజీ సర్పంచ్, సామాజిక కార్యకర్త. కూతురు పుట్టిందని సునీల్ సంబరాలు చేసుకుంటుండగా ఊళ్లోని పెద్దలంతా అతన్ని చూసి జాలిపడ్డారట. అప్పుడే అనుకున్నాడతను.. అమ్మాయి పుట్టినందుకు గర్వపడేలా, అమ్మాయిని గౌరవంగా చూసేలా జనాల్లో చైతన్యం తేవాలని, ఆ ప్రయాణంలో ముందుగా తమ హక్కుల పట్ల అమ్మాయిలకు అవగాహన కల్పించాలని! ఆ ఆలోచనే ‘లాడో పంచాయత్’గా మొదలైంది. అందులో భాగంగానే చదువు నుంచి ఆస్తి దాకా ఆడపిల్లలకున్న హక్కుల గురించి వాళ్లకు అవగాహన కల్పించాడు. ప్రశ్నించడం, పోరాడటం నేర్పించాడు. దానికోసం దాదాపు అయిదేళ్లు శ్రమపడ్డాడు. వేలమంది అమ్మాయిలను ఏకం చేశాడు.ఇది ఎలా పనిచేస్తుంది? ఇందులో 15 – 30 ఏళ్ల మధ్య అమ్మాయిలు సభ్యులుగా ఉంటారు. వీళ్లంతా ఊళ్లల్లోని అమ్మాయిలు, మహిళలను సమావేశపరుస్తారు. ప్రతి సెషన్లో ఒక అమ్మాయిని ప్రధాన్ లేదా హెడ్లా ఎంచుకుంటారు. ఆమె తలకు పాగా చుట్టుకుని మీటింగ్ నిర్వహిస్తుంది. సభ్యులంతా కలిసే మీటింగ్ ఎజెండాను నిర్ణయిస్తారు. చర్చల్లో తీసుకున్న తీర్మానాలను అందరి సంతకాలతో సంబంధిత ప్రభుత్వాధికారులకు సబ్మిట్ చేస్తారు. అయితే ఈ పంచాయత్లోని ప్రధాన్ తలకు పాగా చుట్టుకోవడమన్నది సంప్రదాయ పంచాయతీలోని పురుషాధిపత్య వ్యతిరేకతను చాటడానికే అంటాడు సునీల్ జగ్లాన్.దుర్భాషల మీద జరిమానా...సునీల్ జగ్లాన్ సర్పంచ్గా ఉన్న టైమ్లో.. తన కూతురి నోటివెంట చెడ్డ మాట విని అవాక్కయ్యాడు. అలా ఎంతమంది పిల్లలు అలాంటి మాటలు నేర్చుకుంటున్నారోననే ఆందోళనతో తన ఇలాఖాలో దుర్భాషలాడిన వాళ్లకు జరిమానా విధించడం మొదలుపెట్టాడు. ఆ స్ఫూర్తితోనే హరియాణా, హిసార్ జిల్లాలోని నల్వా గ్రామంలో లాడో పంచాయత్ సభ్యులు ‘ఆడవాళ్లను కించపరచే అసభ్య పదాలు, భాషను నేరంగా పరిగణించాలని, సామాజిక దుష్ప్రవర్తనలా చూడాలని, దాని మీద కఠిన చట్టాన్ని తీసుకురావాల’ని డిమాండ్ చేశారు. ఇలా.. అమ్మాయిలు నిర్వహిస్తున్న ఈ లాడో పంచాయత్లు గవర్నెన్స్, పంచాయత్లు ఎలా ఉండాలో చూపిస్తున్నాయి. వాళ్లకు రాజ్యసభ ఆహ్వానాన్నీ అందిస్తున్నాయి.సెల్ఫీ విత్ డాటర్సునీల్ జగ్లాన్ బీబీపూర్ సర్పంచ్ కాకమునుపు లెక్కల మాష్టారు. ప్రస్తుతం రోహతక్లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. లింగ వివక్షను రూపుమాపే ప్రయత్నంలో భాగంగా 2015లో తండ్రులు తమ కూతుళ్లతో సెల్ఫీలు దిగి, పోస్ట్ చేసే ‘సెల్ఫీ విత్ డాటర్’ క్యాంపెయిన్ను స్టార్ట్ చేశాడు. దీన్ని ప్రధాని మోదీ కూడా ప్రోత్సహించారు. ‘తరతరాల జాడ్యాలు పోవడానికి చాలా టైమ్ పడుతుంది. మార్పు వచ్చేదాకా ప్రయత్నం కొనసాగాలి’ అంటాడు సునీల్ జగ్లాన్.చట్టబద్ధత ఉండదు.. కానీ..ఖాప్ పంచాయత్స్లాగే లాడో పంచాయత్లకూ చట్టబద్ధత ఉండదు. కానీ సమాజాన్ని చైతన్య పరచడానికి ఉపయోగపడతాయి. మహిళల హక్కుల విషయంలో దీని తీర్మానాల ఆధారంగా కోర్టుల్లో రికమండేషన్స్, న్యాయం పొందే అవకాశం ఉంటుంది.– ఇ. పార్వతి, హైకోర్ట్ అడ్వకేట్ (చదవండి: Independence Day: 107 ఏళ్ల నాటి షెర్బత్ దుకాణం..నాటి సమర యోధులు నేతాజీ, సత్యజిత్రే..) -
’ఓట్ల‘ ఫైట్
‘ఓట్ల చోరీ’ అనేది దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిన నేపథ్యంలో... పూనమ్ అగర్వాల్ పేరు ప్రస్తావనకు వస్తోంది. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయిన పూనమ్ అగర్వాల్ గత కొన్ని సంవత్సరాలుగా ఓటింగ్ ప్రక్రియలో జరుగుతున్న అవకతవకల గురించి గొంతెత్తుతోంది. ‘ఎన్నికల ప్రక్రియలో నిజాయితీ, పారదర్శకత ఉండాలి’ అంటున్న పూనమ్ అగర్వాల్ ‘ఇండియా ఇంక్డ్: ఎలక్షన్స్ ఇన్ ది వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ’ పేరుతో పుస్తకం రాసింది....మూడు దశాబ్దాలుగా ఎలక్షన్ కమిషన్కు సంబంధించిన వార్తలు రాస్తున్న ఒక జర్నలిస్ట్తో ఇటీవల పూనమ్ అగర్వాల్ మాట్లాడినప్పుడు ఆమె నోటి నుంచి వినిపించిన మాట...‘ఆ రోజుల్లో ఆఫీసులలోకి వెళ్లి అధికారులతో మాట్లాడడం, సమాచారం తీసుకోవడం చాలా సులభంగా ఉండేది. ఇప్పుడు చాలా కష్టమైపోయింది’ ఆ జర్నలిస్ట్ మాట పూనమ్ అగర్వాల్ను అంతగా ఆశ్చర్యపరచకపోయి ఉండవచ్చు. ఎందుకంటే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా పూనమ్ ఎంతోకాలంగా మన దేశ ఎన్నికల ప్రక్రియ... అందులో జరుగుతున్న అవకతవకలపై ప్రత్యేక దృష్టిసారించింది.జర్నలిజంలో రెండు దశాబ్దాల అనుభవం ఉన్న పూనమ్ మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ వరకు ఎన్నో రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియలో జరిగిన అవకతవకలను వెలికితీసింది. ఈ అవకతవకలపై కేంద్ర ఎన్నికల సంఘం మౌనాన్ని విమర్శించింది. పారదర్శకత లేకపోవడాన్ని గురించి ప్రశ్నించింది. పూనమ్ అగర్వాల్ తాజా పుస్తకం ‘ఇండియా ఇంక్డ్–ఎలక్షన్స్ ఇన్ ది వరల్డ్స్ లార్జెస్ట్ డెమొక్రసీ’ విస్తృత చర్చకు దారితీసింది.‘జర్నలిస్ట్గా నా అనుభవాలు, ప్రయాణానికి ఈ పుస్తకం అద్దం పడుతుంది. విస్తృత సబ్జెక్ట్ అయిన ఎన్నికల ప్రక్రియపై సమాచారాన్ని అందించడం మంచి అవకాశంగా భావిస్తున్నాను. ఈ సబ్జెక్ట్పై రాయడం అంత సులువైన విషయం ఏమీ కాదు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన విషయాలతో పాటు నా వ్యక్తిగత విషయాలను కూడా ఈ పుస్తకంలో రాశాను. ఎలక్టోరల్ బాండ్స్, ఎలక్షన్ కమిషన్పై ఓటర్లకు ఉన్న భ్రమ...ఈ పుస్తకం రాయడానికి ప్రధాన కారణాలు’ అని ‘ఇండియా ఇంక్డ్’ పుస్తకం గురించి చెప్పింది పూనమ్.‘ఇండియా ఇంక్డ్’ పుస్తకం కోసం పూనమ్ ఎంతో కసరత్తు చేసింది. మారుమూల పల్లెలో జరిగే ఎన్నికల ప్రక్రియ నుంచి మొదటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుకుమార్ సేన్ ఆధ్వరంలో జరిగిన ఎన్నికల వరకు ఎన్నో విషయాలను అధ్యయనం చేసింది. ఆనాటి ఎన్నికల ప్రక్రియను జాగ్రత్తగా ΄్లాన్ చేసిన సుకుమార్ సేన్ దూరదృష్టి గురించి, ఆయన రూపొందించిన విధానాలను ఇప్పటికీ ఎన్నికల కమిషన్ అనుసరించడం గురించి తన పుస్తకంలో ప్రస్తావించింది పూనమ్. అకాడమిక్గా కాకుండా ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సమస్త విషయాలను సామాన్య పాఠకులకు కూడా సులభంగా అర్థమయ్యేలా రీతిలో రాయడంలో పూనమ్ అగర్వాల్ నేర్పరి. ఔట్స్టాండింగ్ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం విభాగంలో రామ్నాథ్ గోయెంకా అవార్డ్, సీఎన్ఎన్ యంగ్ జర్నలిస్ట్ అవార్డ్, ఔట్స్టాండింగ్ ఒరిజినల్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం విభాగంలో బీబీసి న్యూస్ అవార్డ్లాంటివి అందుకుంది పూనమ్ అగర్వాల్. లోన్ యాప్ స్కామ్పై పూనమ్ చేసిన ఇన్వెస్టిగేటివ్ డాక్యుమెంటరీ ‘ది ట్రాప్: ఇండియాస్ డెడ్లీయెస్ట్ స్కామ్’కు ఎంతో పేరు వచ్చింది. లండన్లోని ప్రతిష్ఠాత్మకమైన ‘సెంటర్ ఫర్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం’లో గావిన్ మెక్ఫెడియన్ స్మారక ఉపన్యాసం ఇచ్చింది పూనమ్ అగర్వాల్.మరిన్ని పుస్తకాలుమన ఎన్నికల ప్రక్రియ గురించి కొన్ని పుస్తకాలు వచ్చాయి. ‘పారదర్శకంగా, నిజాయితీగా జరిగే ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యానికి వెన్నెముక’ అనేది భావితరాలు అర్థం చేసుకోవడానికి నా పుస్తకం ఉపయోగపడాలని ఆశిస్తున్నాను. ‘ఇది విలువైన పుస్తకం’ అనుకున్నప్పుడు పాఠకులు తాము చదవడమే కాదు తాము చదివిన విషయాలను ఇతరులతో పంచుకుంటారు. పుస్తక రచనకు సంబంధించి నా అభిప్రాయం విషయానికి వస్తే...అందుకు ఎంతో ఓపిక కావాలి. మనం సేకరించిన సమాచారంలోని నిజానిజాల గురించి లోతుగా తెలుసుకోవాలి. పుస్తకం రాయాలనుకున్నప్పుడు మన ఎన్నికల కమిషన్ గురించి ఆన్లైన్, ఆఫ్లైన్లో నాకు తగినంత సమాచారం లభించలేదు. దీంతో ఎంతో మంది నిపుణులతో మాట్లాడాను. భవిష్యత్లో కూడా మరెన్నో పుస్తకాలు రాయాలనుకుంటున్నాను.– పూనమ్ అగర్వాల్ -
ఎవరీ'లేడీ టార్జాన్'? ఏకంగా రాష్ట్రపతి భవన్లో విందుకు ఆహ్వానం..
ఒక సామాన్య మహిళ అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని అందుకుంది. ఆమె సెలబ్రిటీ/మోడల్/క్రీడాకారిణో కాదు. సాదాసీదాగా ఓ మారుమూల ప్రాంతంలో నివశించే గ్రామీణ మహిళ. ఆమెకు భారత ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని ఎందుకు ఇస్తుందో తెలుసా..!.టార్జాన్ మహిళగా పిలిచే ఆమె పేరు జమునా తుడు( Jamuna Tudu). చేతిలో ఒక కర్రతో అడవంతా కలియతిరిగే ఆమెకు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్(Rashtrapati Bhavan)లో విందుకు ఆహ్వానం లభించింది. ఎందుకు ఆమెకింత గౌరవం అంటే..పద్మశ్రీ అవార్డు గ్రహిత అయిన ఆమె అటవీ నిర్మూలన, అక్రమ కలప నరికివేతలకు వ్యతిరేకంగా పాటుపడిన ప్రకృతి మాత. అడవిని ఇంతలా కంటికి రెప్పలా కాచ్చుకున్న ఆమె ప్రస్థానం ఏవిధంగా సాగిందంటే..జార్ఖండ్కి చెందిన జమునా చేతిలో ఒక కర్రతో అచ్చం పోలీసుల మాదిరిగా అడవులను గస్తీ కాస్తుంటుంది. ముఖ్యంగా అక్రమ కలప నరికివేతకు వ్యతిరేకంగా నిరసన తెలిపేది(చట్టం ఉల్లంఘమైన పని కలప కోత, కొనుగోలు, అమ్మకం). అంతేగాదు అడవులను రక్షించుకునేలా గ్రామస్తులను, స్థానికులను చైతన్యపరిచేది. అడవిని కాపాడుకోవలన్న లక్ష్యం పట్ల అచంచలమైన స్థెర్యాన్ని, తెగువని చూపేది. ఆ లక్ష్యంలోకి మరికొంత మంది మహిళలకు స్వచ్ఛంగా భాగస్వామ్యం అయ్యేలా చేసింది. అలా ఇవన్నీ అట్టడుగు స్థాయి అటవీ సంరక్షణ ఉద్యమానికి దారితీశాయి. ఈ క్రమంలో తనపై ప్రాణాంతక దాడులు జరిగినా వెనుకడుగు వేయలేదామె. ఆ ఇబ్బందులన్నింటిని నేరుగానే ఎదుర్కొంది. సాధారణ దినసరి కూలీగా, ఒక మేస్త్రీ భార్యగా జమునా అసామాన్యమైన పోరాటం అందరికీ స్ఫూర్తిని కలిగించింది. అంతేగాదు అడువుల రక్షణ కోసం ఆమె చేసిన అవిశ్రాంత పోరాటం కారణంగానే ఆమెకు 'లేడీ టార్జాన్'గా పేరొచ్చింది. ఆ నేపథ్యంలోనే ఆమెకు ఇంతటి గౌరవం లభించింది. దీనిపై జమునా స్పందిస్తూ..ఈ ఆహ్వానం తన మనోధైర్యాన్ని పెంచడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ రంగంలో పనిచేస్తున్న ఇతర మహిళలకు కూడా ప్రేరణ కలిగిస్తుందని పేర్కొంది. అలాగే ఈ గౌరవం తన పోరాటం, నిస్వార్థ సేవకు గొప్ప నిదర్శనమని సగర్వంగా చెబుతోందామె.(చదవండి: స్వచ్ఛ భారత్ కోసం విదేశీయుడి తపన..! నెటిజన్ల ప్రశంసల జల్లు) -
ఫరెవర్ మిసెస్ ఇండియా హైదరాబాద్ విజేతగా బంగ్లా చంద్రలేఖ
ఫరెవర్ మిసెస్ ఇండియా 2025 హైదరాబాద్ విజేతగా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరానికి చెందిన బంగ్లా చంద్రలేఖ నిలిచారు. జైపూర్ జీ స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో విజేతలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ టైటిల్ గెలుచుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పెరల్ సిటీ హైదరాబాద్ నుంచి పోటీల్లో పాల్గొని విజేతగా నిలవడం చాలా ఆనందాన్నిచ్చిందని తెలిపారు. షారా ఫ్యాషన్ డిజైనింగ్ వ్యవస్థాపకురాలిగా వ్యాపార కార్యకలాపాలు చూసుకుంటూ, కార్పొరేట్ కంపెనీలో టీమ్ లీడర్గా రాణిస్తూనే ఫరెవర్ మిసెస్ ఇండియా హైదరాబాద్ పోటీల్లో పాల్గొన్నానని చెప్పారు. నటన, మోడలింగ్ అంటే ఇష్టం. అందుకే ఫ్యాషన్ డిజైనింగ్లో అడుగు పెట్టాను. నా ఇష్టాలకు కుటుంబ సభ్యుల సహకారం తోడైందని ఆమె పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించగలరనే గట్టి నమ్మకాన్ని కలిగిస్తోందన్నారు. అందం, ఆత్మస్థైర్యంహైదరాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తూ ఎస్కే మిసెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్, మిసెస్ తెలంగాణ కిరీటాలను గెలుచుకున్న ప్రియాంక తారే తన వ్యక్తిత్వం, ప్రతిభ, పట్టుదలతో ఈ తరానికి స్ఫూర్తిగా నిలిచారు. నోయిడాలో జరిగిన ప్రతిష్టాత్మక ఎస్కే యూనివర్స్ ఇండియా ఇంటర్నేషనల్ 2025 సీజన్ 27లో ఆమె సౌందర్యం, సమతుల్యత, ఆత్మవిశ్వాసం జడ్జీలతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో విజేతగా ఎంపిక చేశారు. ఛత్తీస్గఢ్ భిలాయ్కు చెందిన ప్రియాంక ఈ పోటీల్లో హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహించారు. కార్పొరేట్ లీడర్గా, ఈవెంట్స్, ఎచ్ఆర్, సీఎస్ఆర్ రంగాల్లో రాణించడమే కాకుండా రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా, గాయనిగా, నృత్యకారిణిగా తన బహుముఖ ప్రజ్ఞ చాటుకుంది. టీఎస్ఈ8 ఉమెన్స్ అచీవ్మెంట్ అవార్డు 2025తో పాటు యూట్యూబ్, ఇన్స్టా్రగామ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. (చదవండి: International Youth Day: విజయకేతనం ఎగరేసిన ధీర యువత..!) -
ఆమె ఆర్థిక నిర్ణయాలలో...!
ఎనభై శాతం మంది మహిళల ఆర్థిక నిర్ణయాలలో ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తాజా అధ్యయనం తెలియజేసింది. మార్కెటింగ్ రీసెర్చ్ అండ్ పబ్లిక్ ఒపినియన్ పోలింగ్ కంపెనీ ‘ఐపీఎస్వోఎస్’ ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్కత్తాలోని 25–45 ఏళ్ల మధ్య ఉన్న మహిళలపై ఈ అధ్యయనాన్ని నిర్వహించింది.బడ్జెట్ ప్లానింగ్, మ్యూచువల్ ఫండ్స్... మొదలైన వాటి గురించి అవగాహన ఏర్పర్చుకోవడానికి మహిళలు ఎక్కువగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై ఆధారపడుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్ గురించి నిమిషాల వ్యవధిలో సులభంగా వివరించే ఇన్స్టాగ్రామ్లోని షార్ట్ రీల్స్కు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ డక్ట్స్కు సంబంధించి వాట్సాప్ గ్రూప్లు షేర్ చేసే టిప్స్ మహిళలకు ఉపయోగపడుతున్నాయి. స్వతంత్రంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి సంబంధించి మహిళలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి, ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టడంలో మహిళలకు డిజిటల్ ఫ్లాట్ఫామ్స్ ఉపయోగపడుతున్నాయి. స్వతంత్రంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి సంబంధించి 57 శాతం మంది యూజర్లు ఇన్స్టాగ్రామ్పైనా, 53 శాతం మంది యూజర్లు ఫేస్బుక్పై ఆధారపడుతున్నారు. ‘అథెంటిసిటీ’కి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. 75 శాతం మంది ఫైనాల్సియల్ పాడ్కాస్ట్లకు, 67 శాతం మంది ఇన్ఫ్లూయెన్సర్లు, ఆర్థిక విషయ నిపుణుల సలహాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక కొత్త స్కీమ్ గురించి తెలుసుకోవడం నుంచి దాని మంచిచెడ్డల గురించి విశ్లేషించుకోవడం వరకు ఫైనాన్షియల్ సర్వీసెస్కు సంబంధించి వాట్సాప్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు స్టడీ రిపోర్ట్ తెలియజేసింది.(చదవండి: ఉమెన్ సెక్యూరిటీ ‘క్యూఆర్ కోడ్స్’) -
ఉమెన్ సెక్యూరిటీ ‘క్యూఆర్ కోడ్స్’
మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకొని సరికొత్త విధానాన్ని అనుసరించారు మహారాష్ట్రలోని నాగ్పుర్ పోలీసులు. నగరంలో నేరాలకు ఆలవాలంగా ఉన్న 330 ప్రదేశాలను గుర్తించి క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీ కాంటాక్ట్లు, సేఫ్టీ రిసోర్స్కు సంబంధించి త్వరగా యాక్సెస్ కావడానికి ఆపదలో ఉన్న మహిళలకు ఈ క్యూ ఆర్ కోడ్లు ఉపయోగపడతాయి. నేరాలను బట్టి మరిన్ని ప్రాంతాలకు ఈ క్యూఆర్ కోడ్లను విస్తరిస్తారు. ‘మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకొని సాంకేతికతను ఉపయోగించుకుంటున్నాం’ అంటున్నారు సీపీ రవీందర్ సింఘాల్. మహిళల భద్రతకు సంబంధించిన ‘దామిని స్క్వాడ్స్’ కోసం అయిదు ప్రత్యేకమైన ఆల్–ఉమెన్ వాహనాలను ఏర్పాటు చేశారు. ఈ స్క్వాడ్లో 19 మంది మహిళా అధికారులు ఉన్నారు. ‘మా బృందాలలోని సభ్యులు ప్రతి స్కూల్కు వెళ్లి బాలికల భద్రతకు సంబంధించి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. బాలికలకు వారి హక్కుల గురించి తెలియజేయడం తోపాటు అవసరమైన సమయాలలో సహాయం ఎలా తీసుకోవాలి... వంటి విషయాల గురించి వివరిస్తున్నారు’ అంటున్నారు ‘భరోసా సెల్’ హెడ్ సీమా సుర్వే. (చదవండి: Parenting Tip: తండ్రి ఇచ్చిన సలహా ఆమె జీవితాన్నే మార్చేసింది..! ఇవాళ సీఈవోగా..) -
ఆ ఐదుగురికి వందనం
1942 ఆగస్టు 8 క్విట్ ఇండియా ఉద్యమం.. ‘డూ ఆర్ డై’ నినాదం. ‘ఇక చాలు... తోక ముడవండి’ అని బ్రిటిష్ వారిని హెచ్చరిస్తూ తిరగబడిన ప్రజాసందోహం. ఆ సమయంలో ఐదుగురు నారీమణులు శివంగులై కదిలారు. నాయిక స్థానంలో నిలిచి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. లాఠీ దెబ్బలు తిన్నారు. ప్రాణాలు కోల్పోయారు. వారి గొంతు నుంచి ఒక మాట మాత్రం ఆగలేదు– ‘వందే మాతరం’. అరుణ అసఫ్ అలీ, సుచేత కృపలానీ, తారారాణి శ్రీవాస్తవ, కనకలత బారువా, మతింగిని హజ్ర....ఈ త్యాగదీప్తులకు వందనం.అప్పటికి బ్రిటిష్ వారి ధోరణి పూర్తిగా ముదిరిపోయింది. భారతదేశాన్ని రెండో ప్రపంచ యుద్ధంలోకి లాగాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు. దానికితోడు ‘పాక్షిక స్వాతంత్య్రం ఇస్తాం’ అని చెప్పడం పుండు మీద కారం చల్లినట్టయ్యింది. అప్పటికే ఎల్లెడలా స్వాతంత్య్ర కాంక్ష వెల్లువెత్తుతోంది. జనంలోని వేడిని, వారి నాడిని గమనించిన గాంధీజీ ఆగస్టు 8, 1942న బొంబాయి గొవాలియా ట్యాంక్ మైదాన్ నుంచి ‘క్విట్ ఇండియా’ పిలుపునిచ్చారు. ‘డూ ఆర్ డై’ నినాదాన్ని అందించారు. ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు... అందరూ ఇందులో పాల్గొనాలని కోరారు. ప్రభుత్వంతో ముడిపడిన కార్యకలాపాలన్నీ బంద్ చేయమన్నారు. అయితే క్విట్ ఇండియా ఉద్యమంలో కనిపించిన ఒక గొప్ప పరిణామం స్త్రీలు ఇందులో పెద్ద సంఖ్యలో మమేకం కావడం. బ్రిటిష్ వాళ్లు రంగంలో దిగి పెద్ద పెద్ద నాయకులను అరెస్ట్ చేయడం వల్ల ‘నాయకులు లేని ఉద్యమం’గా గుర్తింపు పొందిన క్విట్ ఇండియా ఉద్యమంలో స్త్రీలు నాయక స్థానానికి ఎదిగారు. ప్రజలను నడిపించారు. త్యాగాలు చేశారు.ప్రాణాలు కోల్పోయారు. అట్టి వారిలో ఐదుమంది స్త్రీలు సదా స్మరణీయులు. వారిని తెలుసుకుందాం.అరుణ అసఫ్ అలీఈమెకు ‘గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ఇండిపెండెన్స్’, ‘హీరోయిన్ ఆఫ్ 1942’ తదితర బిరుదులు ఉన్నాయి. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అరుణ అసఫ్ అలీ పేరు సగర్వరంగా తలుచుకుంటారు. గాంధీజీ క్విట్ ఇండియా పిలుపునిచ్చాక ఏ మైదానం నుంచైతే ఆ పిలుపునిచ్చారో అదే మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగురవేయడానికి అరుణ ఆసఫ్ అలీ బయలుదేరారు. అప్పటికే బొంబాయిలో ఆందోళనలు, దుందుడుకు చర్యలు, దహనాలు, వాటిని అణచడానికి పోలీసుల కాల్పులు జరుగుతున్నాయి. అయినా సరేప్రాణాలకు తెగించి అరుణ ఆసఫ్ అలీ జాతీయపతాకాన్ని ఎగుర వేశారు. ఆ తర్వాత గొవాలియా ట్యాంక్ మైదాన్ ‘ఆగస్ట్ క్రాంతి మైదాన్’గా పిలువబడింది.సుచేత కృపలానీబెనారస్ హిందూ యూనివర్సిటీలో అధ్యాపకురాలిగా ఉన్న సుచేత ఆచార్య కృపలానీని వివాహం చేసుకుని సుచేత కృపలానీ అయ్యారు. కాంగ్రెస్ కార్యకర్తగా చురుగ్గా పని చేయడంప్రారంభించిన సుచేత ‘ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్’ స్థాపించారు. క్విట్ ఇండియా పిలుపు అందిన వెంటనే సుచేత భారీ ప్రదర్శనలకు పిలుపునిచ్చి ముందు వరుసలో నడిచారు. అజ్ఞాతంలో ఉంటూ కార్యకర్తలను నడిపించారు. చివరకు బ్రిటిష్ పోలీసులు ఆమె జాడ తెలుసుకుని అరెస్ట్ చేశారు. రాజ్యాంగ రచనలో సభ్యురాలిగా ఉన్న సుచేత ఉత్తరప్రదేశ్కు తొలి మహిళా ముఖ్యమంత్రి అయ్యారు. దేశంలోనే తొలి మహిళా ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు.తారారాణి శ్రీవాస్తవ్క్విట్ ఇండియా ఉద్యమ సమయానికి తారారాణి శ్రీవాస్తవ్ వయసు 13 సంవత్సరాలు. అప్పటికే పులేందు బాబుతో వివాహం అయ్యింది. క్విట్ ఇండియా ఉద్యమ పిలుపు అందుకుని ఆమె తన ఊరు సివాన్ (బిహార్) పోలీస్ స్టేషన్ మీద జాతీయ పతాకాన్ని ఎగురవేసేందుకు బయలుదేరింది. ఊరేగింపు మీద పోలీసులు కాల్పులు జరపగా పులేందు బాబు కుప్పకూలాడు. అయినా తారారాణి ఆగలేదు. ముందుకే సాగి పోలీస్ స్టేషన్ మీద జాతీయ పతాకం ఎగురువేసింది. వెనుకకు వచ్చి తిరిగి చూసే భర్త మరణించి ఉన్నాడు. ఆ వియోగాన్ని భరిస్తూనే చెక్కుచెదరని స్ఫూర్తితో ఆమె ఆ తర్వాతి కాలంలో దేశం కోసం పోరాడింది.కనకలత బారువాఅస్సామ్ చెందిన 17 ఏళ్ల యువతి కనకలత బారువా త్యాగం ఎంతో గొప్పది. దేశం కోసం అప్పటికే ఆమె ‘మృత్యువాహిని’ అనే దళం నడిపేది. క్విట్ ఇండియా పిలుపు విని తన దళంతో ఆమె గోహ్పూర్ పోలీస్ స్టేషన్ పై జాతీయ పతాకం ఎగురవేసేందుకు బయలుదేరింది. లాఠీలకు, హెచ్చరికలకు ఆగలేదు. చివరకు కాల్పులు జరిపితే బుల్లెట్కు ఎదురొడ్డిప్రాణాన్ని త్యాగం చేసింది. కనకలత లాంటి ఎందరో ధీరలు ‘డూ ఆర్ డై’ నినాదాన్ని నిజ అర్థంలో స్వీకరించే దేశానికి ఉత్తేజం ఇచ్చారు.మతంగిని హజ్రాఈమెను అందరూ ‘గాంధీ అవ్వ’ అని పిలిచేవారు. స్వాతంత్య్ర పోరాటంలో 73 ఏళ్ల వయసులో పాల్గొనడమే అందుకు కారణం. గాంధీ ఆదర్శాలకు నిలబడటం వల్ల కూడా. క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో బెంగాల్లోని ‘తమ్లుక్’లో పోలీస్ స్టేషన్ వైపు ఆరువేల మంది జనం కదిలారు. వారిలో ముందున్న వ్యక్తి మతంగిని హజ్రా. ఆమె చేతిలో జాతీయ పతాకం ఉంది. పోలీసులు విచక్షణారహితంగా బాదుతున్నా ఆమె ‘వందేమాతరం’ నినాదం ఆపలేదు. చేతిలోని పతాకాన్ని జార విడువలేదు. ఆ దెబ్బలతోనే ఆమె మరణించింది. దేశం కోసం ఆమె చేసిన త్యాగం మరపురానిది. -
ఎవరీ పునీతా అరోరా..? సైన్యం, నేవీలలో అత్యున్నత హోదాలు..
భారత సైన్యంలో పురషాధిక్యతను వెనక్కినెట్టి మరీ ఉన్నత హోదాలను అలంకరించిన తొలి మహిళగా ఘనతను అందుకుంది. పైగా భారత సాయుధ దళాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహిళగా కీర్తిని కూడా దక్కించుకున్నారామె. ఆర్మీ, నేవీ రెండింటిల్లోనూ అత్యున్నత హోదాలను కలిగి ఉండగటమే గాక త్రీ స్టార్ ర్యాంక్ సాధించిన తొలి మహిళగా గుర్తింపు తెచ్చుకుందామె. ఆ శక్తిమంతమైన మహిళే లెఫ్టినెంట్ జనరల్ పునితా అరోరా(Lieutenant General Punita Arora). బ్రిటిష్ ఇండియా కాలంలో పంజాబ్లోని లాహోర్లో మే 31, 1946న జన్మించిన పునీతా అరోరా ప్రారంభ జీవితం విభన గందరగోళాల మధ్య సాగింది. ఆరోరా ఏడాది వయసులో పంజాబీ కుటుంబం భారతదేశానికి పారిపోయి ఉత్తరప్రదేశ్ సహారన్పూర్లో తలదాచుకుంది. అక్కడే ఆమె బాల్యం అంతా సాగింది. సహారన్పూర్లోనే ఎనిమిదో తరగతి వరకు చదువుకుంది. ఆ తర్వాత తరువాత గురునానక్ గర్ల్స్ ఇంటర్-కాలేజీలో చదువుకుంది. ఆ రోజుల్లో మహిళలు చదువుకోవడం గగనం. అలాంటిది ఆమె సైన్సు రంగంలోకి వెళ్లాలనుకోవడంలోనే ఆమె ధైర్యం ఎట్టిదో తేటతెల్లం అవుతోంది. అలా ఆమె పూణేలోని ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ (AFMC)లో చేరి టాపర్గా బంగారు పతకాన్ని అందుకుంది. అక్కడ నుంచి అన్ని విజయ పరంపరలే, అగ్రశ్రేణిలో దూసుకుపోతూనే ఉంది. ఆమె మెడిల్ పరంగా గైనకాలజీ రంగాన్ని ఎంచుకుంది. అలా ఆమె ఆర్మీలో వైద్యురాలిగా కెరీర్ని ప్రారంభించింది. కెరీర్ పరంగా ఉన్నత హోదాలను అందుకోవడమే కాదు, సైన్యంలో వైద్య సేవలను మరింత ముందుకు తీసుకువెళ్లేలా తన వంతుగా కృషి చేశారామె.అలంకరించిన పదవులు..అరోరా సాయుధ దళాల వైద్య నిపుణులకు శిక్షణ ఇచ్చే ప్రతిష్టాత్మక సంస్థ పూణే ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీకి కమాండ్గా పనిచేసిన తొలి మహిళా అదికారిణిగా ఘనత అందుకుంది. అక్కడ ఆమె నాయకత్వ సామార్థాల్యు బహిర్గతమయ్యాయి. ఆ తర్వాత అదనపు డైరెక్టర్ జనరల్, ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ (మెడికల్ రీసెర్చ్) వంటి పదోన్నతులను అందుకుంది. అలాగే ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ (AFMS) కామన్ పూల్ వ్యవస్థ సాయంతో నావికాదళానికి మారారు. అక్కడ 2005లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ (నేవీ)గా నియమితులయ్యారు. దాంతో సర్జన్ అడ్మిరల్ హోదాను పొందిన తొలి మహిళగా నిలిచింది.మిలటరీ మెడిసిన్కు విరాళాలు..సాయుధ దళాల ఆసుపత్రులలో గైనకాలజికల్ ఎండోస్కోపీ, ఆంకాలజీ సౌకర్యాలను స్థాపించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. అక్కడ సేవా సభ్యులు, వారి కుటుంబాలకు ప్రత్యేక సంరక్షణను పెంచారు. అలాగే సంతాన లేమి సమస్యతో బాధపడుతున్న సైనిక జంటలకు గణనీయమైన మద్దతు అందించారు. అందుకుగానూ ప్రతిష్టాత్మకమైన పతకం వరించింది. జమ్మూలో 2001లో కలుచక్ ఉగ్రవాద దాడి సమయంలో గాయపడ్డ 70 మంది సైనికులకు, మరణించి 23 మంది సైనికులకు చికిత్సలు అందించి..అసామానమైన సేవకు నిదర్శనంగా నిలిచిందామె. ఈ విశిష్ట సేవలకు గానూ 2002లో సేవ పతకం వరించింది. అలా 2004లో అరోరా లెఫ్టినెంట్ జనరల్ హోదా పొంది భారత సాయుధ దళాల్లో త్రీ స్టార్ ర్యాంకుని సాధించిన తొలి మహిళగా గుర్తింపు తెచ్చుకుంది. అంతగాదు భారత నావికాదళంలో కూడా సర్జన్ వైస్ అడ్మిరల్గా నియామకంతో రెండింటిల్లోనూ ఉన్నత హోదాలు కలిగిన తొలి మహిళగా ఘనత దక్కించుకుంది. అంతేగాదు తన కెరీయర్ తొలినాళ్లలోల ఒక సీనియర్ వైద్యుడు మహిళ గైనకాలజిస్ట్తో కలిసి పనిచేయడమే అనే సంశయం వ్యక్తం చేశాడు. అయితే త్వరిత కాలంలోనే ఆమె టాలెంట్ని గుర్తించి..తానే ఆమెతో పనిచేయడం గొప్ప అవకాశంగా ప్రశంసలందుకుందామె. ఆర్మీ జంటలకు సంతాన లేమి సమస్యను నివారించి విజయవంతమైన గర్భధారణలకు అంకురార్పణ చేసి "ఫెయిరీ గాడ్ మదర్" అనే బిరుదును కూడా అందుకుంది. అయితే ఆమె ఇన్ని విజయాలు సాధించినా..నా పని నేను నిబద్ధతతో చేశాను, విజయాలు అవంతట అవే వచ్చాయంటారామె. ఇక్కడ అరోరా సాధించిన కెరీర్ విజయాలు ఒక మహిళ సంక్షోభ సమయంలో ఏ విధంగా నిలబడగలదో ప్రపంచానికి అవగతమయ్యేలా చేసింది. అంతేగాదు మహిళలు సాయుధ దళాల్లో అవలీలగా తమ బాధ్యతలను నిర్వర్తించగలరు అనేందుకు స్ఫూర్తిగా నిలిచారామె.(చదవండి: నచ్చినట్లుగా తలరాతనే మార్చుకుందామె..! హ్యాట్సాప్ నీతు మేడమ్.. ) -
మగ్గం వెనుక ఆమె శ్రమ
చేనేత రంగంలో 70 శాతం శ్రమ మహిళలదే. బ్లీచ్ చేయడం, ఆసుపోయడం, డిజైన్ కట్టడం, రంగులద్దడం, ఆసు మిషన్ మీద దారాలను అమర్చడం, చిటికి కట్టడం, కండె చుట్టడంతోపాటు వార్ప్ వంటి పనులన్నీ మహిళలే చేస్తారు. మగ్గం మీద నేత ప్రధానంగా మగవాళ్లు చేస్తారు. ఆసక్తి ఉన్న మహిళలు కూడా నేస్తారు. మహిళ సహాయం లేనిదే మగ్గం మనుగడ సాగదు. నేతకారులకు సహాయకులుగా, స్వయంగా నేతకారులుగా, డిజైనర్లుగా, బిజినెస్ విమెన్, కమ్యూనిటీ లీడర్లుగా కీలకపాత్ర పోషిస్తున్నారు.ఇది స్కిన్ ఫ్రెండ్లీసంప్రదాయ చేనేతను మోడరన్ బిజినెస్గా మారుస్తూ చేనేతరంగానికి దోహదం చేస్తున్న మహిళల్లో స్వాతి మఠం ఒకరు. ఐఐటీ బాంబేలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి డెలాయిట్, మైక్రోసాఫ్ట్ కంపెనీల్లో ఉద్యోగం చేసిన స్వాతి ప్రస్తుతం చేనేతరంగంలో కెరీర్ను విజయవంతం చేసుకున్నారు. తన పాపాయికి ఒంటికి మెత్తగా ఉండే దుస్తులు కావాలి, వాటికి ఫంక్షన్ లుక్ ఉండాలి, బ్రైట్గా కలర్ఫుల్గా ఉండాలి. ఎన్ని షాపులు తిరిగినా ఈ లక్షణాలన్నీ ఒక డ్రస్లో దొరకకపోవడంతో సొంతంగా నారాయణపేట్ మెటీరియల్తో స్వయంగా డిజైన్ చేశారామె. ఆ ప్రయత్నమే ఆమెను ఎంటర్ప్రెన్యూర్ను చేసింది. హ్యాండ్లూమ్ ప్రమోటర్గా గుర్తింపునిచ్చింది. చేనేత వస్త్రాలను ఫ్యాషనబుల్ డిజైనర్వేర్గా తీర్చిదిద్దడం ఆమె ప్రత్యేకత. ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన కొత్తతరం యువతులు ఆమెతో పని చేస్తున్నారు. క్రియేటివ్ డిజైన్కు చేనేతను మించిన ఫ్యాబ్రిక్ మరొకటి ఉండదని చెబుతున్నారీ యువతులు. శ్రీకాళహస్తి కలంకారీ పనితనాన్ని ప్రపంచదేశాలకు విస్తరింపచేస్తున్నారు వాళ్లు. మిస్ ఇండియా పోటీలకు హైదరాబాద్కు వచ్చిన బ్యూటీ పాజంట్లకు చేనేత డ్రెస్లు డిజైన్ చేశారు.మన చేనేతకు ప్రశంసలుఏడేళ్ల కిందట హైదరాబాద్లో డిజైనర్ వేర్ యూనిట్ను ముగ్గురితో ప్రారంభించాను. కొన్నాళ్లకు దానికి సిస్టర్ ఆర్గనైజేషన్గా చేనేతలతో క్యాజువల్ వేర్ యూనిట్ ప్రారంభించాను. ఇప్పుడు 90 మందికి జీతాలిస్తున్నాను. ఒకప్పుడు చేనేత అంటే చిన్నచూపు ఉండేది, కానీ ఇప్పుడు చేనేత దుస్తులు ధరించడానికి సెలబ్రిటీలు కూడా ఉత్సాహంగా ఉన్నారు. రెండు యూనిట్స్కి అవసరమైన రా మెటీరియల్ కోసం నెలకు ఆరేడు లక్షల రూపాయలు చేనేతకారులకు ఇస్తున్నాం. చేనేతను విశ్వవ్యాప్తం చేయడంలో నా పాత్ర కూడా ఉన్నందుకు సంతోషంగా ఉంది.– స్వాతి మఠం, హ్యాండ్లూమ్ ప్రమోటర్మగ్గం ఇంజనీరింగ్ అద్భుతంమగ్గంతో ఇంద్రధనస్సులాంటి రంగుల జీవితాన్ని ఎంచుకున్న వాళ్లలో తెలంగాణ, యాదాద్రి భువనగిరి జిల్లా, పోచంపల్లికి చెందిన నవనీత ఒకరు. ఆమె తొలిసారి మగ్గాన్ని చూసింది అత్తవారింట్లో. మగ్గం వెనుక హిడెన్ ఇంజనీరింగ్ ఉంది. పాదంతో తొక్కితే ఒక కదలికకు అనుబంధంగా ఆరు చోట్ల కదులుతూ దారం వస్త్రంగా రూపుదిద్దుకుంటుంది. ఆసక్తిగా అనిపించి భర్త దగ్గర నేత పని నేర్చుకున్నారామె. గత తరం మహిళలు ఇంటి నాలుగ్గోడల మధ్య సహాయకపనులకే పరిమితమయ్యారు. ఈ తరం నేతకార మహిళలు వస్త్రాలను వాట్సాప్ గ్రూపులు, ఇన్స్టాలో మార్కెట్ చేస్తున్నారు. రీటైలర్స్, బొటిక్ నిర్వహకులతో సమన్వయం చేసుకుంటున్నారు. చీర మగ్గం మీద ఉండగానే ఫొటోలు అప్లోడ్ చేయడంతో చీర పూర్తయ్యేలోపు కొనేవాళ్లు సిద్ధంగా ఉంటున్నారు.బ్యూటీ పాజంట్స్కు దుపట్టా‘‘వియ్హబ్లో సభ్యత్వం తీసుకోవడంతో నా ఉత్పత్తులకు మంచి కూడలి లభించింది. మిస్ వరల్డ్ పోటీల కోసం వచ్చిన బ్యూటీ పాజంట్లకు బహూకరించడానికి పాతిక ఇకత్ దుపట్టాలిచ్చాను. ప్రభుత్వం ఈ కళను ఒక కోర్సుగా రూ΄÷ందించి కొత్తతరం చేనేతకారులకు శిక్షణనిస్తే ఈ కళను మరింత సమగ్రంగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మా మామయ్యకు తెలిసిన కళలో నా భర్త నేర్చుకున్నది సగమే. తరానికీ తరానికీ జ్ఞానం లుప్తమై పోకుండా మరింతగా విస్తరింపచేయాలి.’’ – నవనీత, వీవర్స్ క్లబ్ హ్యాండ్లూమ్స్అత్త నేర్పించిందితెలంగాణ, నారాయణపేట జిల్లా పుల్లంపల్లికి చెందిన శృతిక... తన అత్తగారి దగ్గర మగ్గం పని నేర్చుకున్నారు. గతంలో చేనేత ఏ మాత్రం గిట్టుబాటు అయ్యేది కాదు. చేనేతను ప్రమోట్ చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న తర్వాత పరిస్థితులు మెరుగయ్యాయి. ఆన్లైన్ క్లాసులు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లతో చేనేతకారులు మెళకువలు నేర్చుకుంటున్నారు. చీరల దగ్గరే ఆగిపోకుండా చుడీదార్, లంగాఓణీ సెట్లు డిజైన్ చేస్తున్నారు.నెలకు 30 వేలుచేనేతను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం ఎగ్జిబిషన్లను నిర్వహిస్తోంది. మహిళాశక్తి బజార్ మాకు ఉపయోగంగా ఉంది. ఎగ్జిబిషన్లో స్టాల్, బస ఉచితం. నేను ఢిల్లీ, కోల్కతా, ముంబయిలో కూడా స్టాల్ పెట్టాను. ఇల్లు దాటి బయటకు రావడం చేతకాని మాలాంటి వాళ్లకు ఈ సౌకర్యాలు బాగా ఉపయోగపడుతున్నాయి. మంచి చీర నేస్తే మాకు పదివేలు మిగులుతాయి. గట్టిగా పని చేస్తే నెలకు మూడు చీరలు నేయవచ్చు. సమాజంలో గౌరవప్రదంగా జీవించగలుగుతున్నాం. మాకు పని కల్పించడం కోసం... ప్రభుత్వం ప్రముఖులకు సత్కారం చేసే శాలువాల ఆర్డర్లు కూడా భారీగానే ఇస్తోంది.– శృతిక, చేనేతకారిణి, శ్రీ భక్త మార్కండేయ టెక్స్టైల్స్– వాకా మంజులారెడ్డి -
నచ్చినట్లుగా తలరాతనే మార్చుకుందామె..! హ్యాట్సాప్ నీతు మేడమ్..
ఒక వ్యక్తికి జీవితంలో కష్టాలు సర్వసాధారణమే. పోరాడి గెలుస్తుండగా..లాగిపెట్టి అమాంతం కిందపడేసే కష్టాలు హఠాత్తుగా ఆనందాన్ని ఆవిరి చేసేస్తుంటే..గెలుపు అన్న మాట భయంగా మారిపోతుంది. మళ్లీ తిరిగి లేచి నిలబడటానికి ధైర్యం చాలదు కూడా. కానీ ఈ మహిళ గుక్కపెట్టి ఏడిపించిన కష్టానికి తన దైన శైలిలో సమాధానం ఇచ్చి నిలబడటమే గాక..ఆ కష్టమే తోకముడిచి పారిపోయేలా అచంచలంగా ఎదిగింది. ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఆ మహిళే నీతు మేడమ్గా పేరుగాంచిన నీతుసింగ్. జార్ఖండ్లోని గిరిదిహ్లో జన్మించిన నీతు మూడేళ్ల వయసులో తండ్రిని కోల్పోయింది. ఆమె తండ్రి కిషోర్ దేవ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే కుటుంబంలో తన అన్నయ్య, ఆరుగురు సోదరిమణులతో కలసి పెరిగింది. చిన్ననాటి నుంచే కష్టం విలువ తెలిసిన ఆమె చదువులో బాగా రాణించేది. కార్మెల్ కాన్వెంట్, సెయింట్ జాన్స్ స్కూల్ (వారణాసి)లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. వినోబా భావే విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీని పూర్తి చేసింది. ఆ తర్వాత ఢిల్లీలోని క్యాంపస్ లా సెంటర్లో ఎల్ఎల్బీ పూర్తి చేసింది. అప్పుడే కోచింగ్ సెంటర్ని ప్రారంభించింది. ఆ సెంటర్ని ప్రారంభించిన ఒక ఏడాదికి రాజీవ్ సౌమిత్రను వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి పారామౌంట్ కోచింగ్ సెంటర్ని విజయవంతంగా నడిపారు. దాదాపు రూ. 200 కోట్ల టర్నోవర్ సంస్థగా మలిచారు. పోటీ పరీక్షల కోసం నీతు ఇంగ్లీష్ వాల్యూమ్1 అనే పుస్తకాన్ని రచించింది. ఇది అత్యధికంగా అమ్ముడైన కాంపిటీషన్ బుక్గా నిలిచింది కూడా. ఇంతలో ఆమె వైవాహిక బంధంలో మనస్పర్థలు రావడం మొదలయ్యాయి. అది రాను రాను మరింతగా క్షీణించే స్థాయికి వచ్చేసింది. ఆమె కూడా ఆ కోచింగ్ సెంటర్లో దాదాపు 50% వాటాదారు అయినా..ఆమెభర్త ఆగస్టు 5,2015న బౌన్సర్ల చేత బలవంతంగా బయటకు గెంటేశాడు. దాంతో మళ్లీ రోడ్డు మీదకు వచ్చేసింది నీతు జీవతం. వివాహం విచ్ఛిన్నమవ్వడమే గాక లాభాల బాట పట్టించిన వ్యాపారం కూడా పోయింది. తగ్గేదేలే అంటూ లేచి నిలబడింది..మళ్లీ పరిస్థితి చలికిలబడినట్లు అయినా..అచంచలమైన ఆత్మవిశ్వాసంతో లేచి నిలబడి ఆ దిశగా సాగింది. ఈసారి తన తండ్రి దివంగత కిషోర్ దేవ్ పేరుతో కేడీ కోచింగ్ సెంటర్ని ప్రారంభించింది. చూస్తుండగానే అచిరకాలంలోనే ఆ సంస్థకు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. ఎస్ఎస్సీ ఎగ్జామ్లో ర్యాంకర్లుగా మార్చే సంస్థగా కేడీ సంస్థ పేరుతెచ్చుకుంది. ఇలా మంచి లాభాలతో దూసుకుపోతున్న కోచింగ్ సెంటర్కి మళ్లీ మహమ్మారి రూపంలో బ్రేక్ పడింది. అయినా సరే టెక్నాలజీని అందిపుచ్చుకునే దిశగా అడుగులేసి ఆన్లైన కోచింగ్లు ఇవ్వడం ప్రారంభించింది. అలా ఆమె యూట్యూబ్ ఛానెల్కి సుమారు రెండు మిలయన్ల మందికి పైగా సబ్స్క్రైబర్లు కలిగి ఉండటమే గాక, వేలాదిమంది విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగులకు తీర్చిదిద్దింది. అంతేగాదు తన కోచింగ్ సెంటర్తో పేద కుటుంబాలు, అనాథలు, వృద్ధులకు తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తోంది నీతు. బాల్యంలో తండ్రిని కోల్పోవడం దగ్గర నంచి మొదలైన ఎదురుదెబ్బలు వెవాహిక జీవితం కోల్పోవటం, నమ్మక ద్రోహం వరకు భరింపరాని కష్టాలను కడగండ్లను ఎందుర్కొంది. అయినా ఎక్కడ నా వల్ల కాదు అని గివ్ అప్(చేతులెత్తేయ లేదు) ఇవ్వలేదు. జీరో నుంచి మళ్లీ మెదలు పెట్టినా.. చివరికి గెలుపు మాత్రం నాదే అని ప్రూవ్ చేసింది నీతు మేడమ్. చిన్న చిన్న కష్టాలకే భయపడే నేటి యువతరానికి నీతు సింగ్ స్ఫూర్తిదాయకంగా నిలిచారు.(చదవండి: ఒంటరితనం కోసం 'రిటైల్ థెరపీ'..! కరణ్ జోహార్ హెల్త్ టిప్స్) -
సై అంటూ సత్తా చాటుతూ..!
డబ్బులు పొదుపు చేయడం, రుణాలు పొందడానికి మాత్రమే పరిమితం కావాలనుకోవడం లేదు గ్రామీణ మహిళా సంఘాలు. పెట్రోల్ బంక్ల నిర్వాహణ నుంచి ఆర్టీసీ బస్సులను అద్దె తీసుకొని నడపడం వరకు తమ సత్తా చాటుతున్నారు. సోలార్ ప్లాంట్ల నిర్వహణకు సిద్ధం అవుతున్నారు.’పెట్రోల్ బంక్’ అనగానే ‘పురుషులు మాత్రమే’ అన్నట్లుగా ఒక చిత్రం మదిలో ముద్రితమై ఉంటుంది. ఇప్పుడు ఆ చిత్రాన్ని మార్చేస్తున్నారు గ్రామీణ మహిళలు. ‘మేము సైతం’ అంటూ పెట్రోల్బంక్ల నిర్వాహణలో సత్తా చాటుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన ‘శ్రీ షిర్డీ సాయిబాబా’ గ్రామైక్య సంఘం మహిళలు పెట్రోల్ బంక్ నిర్వహణకు ముందుకు వచ్చారు.రాష్ట్రంలోనే మూడోది...మహిళా సంఘాల ద్వారా నడిపే పెట్రోల బంక్ ఇటీవల నారాయణపేట జిల్లాలో మొదటిసారి ్ర΄ారంభమైంది. తర్వాత సంగారెడ్డి జిల్లాలో ఒక పెట్రోల్ బంక్ ఏర్పాటైంది. రాష్ట్రంలో మూడో పెట్రోల్ బంక్ లింగన్నపేటలో మహిళా సంఘం ఆధ్వర్యంలో ్ర΄ారంభమైంది. పెట్రోల్ బంక్ ఏర్పాటుతో గ్రామైక్య సంఘానికి నెలవారీ స్థిర ఆదాయం లభించనుంది.ధాన్యం కొనుగోలు కేంద్రాలుసిరిసిల్ల జిల్లాలో పెద్ద సంఖ్యలో ఉన్న మహిళా సంఘాలు పొదుపు చేయడం, రుణాలు పొందడానికే పరిమితం కాకూడదని జిల్లా కలెక్టర్ సందీప్కుమార్ ఝా భావించారు. ‘ఇందిరా క్రాంతి’ పథం ద్వారా మహిళా సంఘాలకు ఆరు నెలల క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రాలను అప్పగించారు. 192 ఐకేపీ కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలకు అప్పగించగా 20లక్షల 25వేల 252 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి శభాష్ అనిపించుకున్నారు. రూ.6.80 కోట్ల ధాన్యం కమీష¯Œ ను సాధించారు.రైతుల ముంగిట్లోకి ఎరువులువానకాలం సాగులో రైతుల ముంగింట్లోకే ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా మహిళలకు ఎరువుల దుకాణాలను అప్పగించారు. ఇలా 23 కేంద్రాలను ఇప్పటికే జిల్లాలో ప్రారంభించారు. ప్రతి మండలానికి రెండేసి చొప్పున ఎరువుల దుకాణాలను మహిళా సంఘాలకు అప్పగించారు.అద్దెకు ఆర్టీసీ బస్సులుమహిళల భాగస్వామ్యంతో ఆర్టీసీకి సిరిసిల్ల జిల్లా నుంచి తొమ్మిది బస్సులను అందించారు. 9 మండలాల సమాఖ్యల ద్వారా రూ.6 లక్షల వాటా ధనంతో రూ.30 లక్షలతో ఒక్కో ఆర్టీసీ బస్సును మహిళలు అద్దెకు తీసుకున్నారు. మూడు నెలల క్రితం మొదలైన అద్దె బస్సులతో ప్రతి నెల రూ. 50వేల అద్దెను తొమ్మిది సమాఖ్యలు పొందుతున్నాయి.ఇక సోలార్ పవర్పెట్రోల్ బంక్లే కాదు సోలార్ విద్యుత్ ఉత్పత్తి బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించనున్నారు. ముష్టిపల్లి, ధర్మారంలో భూసేకరణ పూర్తిచేయగా, జిల్లా సమాఖ్య ద్వారా రూ.3కోట్ల పెట్టుబడితో సోలార్ ΄్లాంట్లను ఏర్పాటు చేసే పనులు సాగుతున్నాయి. – అవధూత బాలశేఖర్, సాక్షి, ముస్తాబాద్, గంభీరావుపేట, సిరిసిల్లఉపాధి పొందుతున్నాంమేము నాలుగు నెలల క్రితం వరకు ధాన్యం కొనుగోళ్లు చేశాం. మా వీవోకు రూ.4.29లక్షల కమిషన్ వచ్చింది. పదిమందికి పని లభించింది. ‘కుట్టు’తో స్వశక్తి మహిళలు ఉపాధి పొందుతున్నారు. గత ఏడాదిగా స్వశక్తి మహిళలు జిల్లాలో స్కూల్ యూనిఫామ్స్ కుడుతున్నారు. మా ఊళ్లో కూడా యూనిఫామ్స్ కుడుతున్నాం. ఇప్పుడు ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నాం.– పందిర్ల సునీత, ఆవునూర్ఎంతో గర్వంగా ఉందిపెట్రోల్ బ్యాంక్ల నిర్వహణ అనేది మా సంఘానికి సంబంధించి పెద్ద మలుపు. మాకు ఎంతో గర్వంగా ఉంది. ఇప్పటివరకు మేము గృహిణులుగా ఇంటికే పరిమితమయ్యాం. పెట్రోల్ బంక్ నిర్వహణను సవాల్గా తీసుకొని విజయవంతంగా కొనసాగిస్తామనే ధీమాతో ఉన్నాం. – సుభద్ర, అధ్యక్షురాలు, శ్రీ షిర్డీ సాయిబాబా గ్రామైక్య సంఘం, లింగన్నపేటమహిళా శక్తిని చాటారుఇందిరా మహిళా శక్తి ద్వారా జిల్లాలో అనేక కార్యక్రమాలను చేపట్టాం. క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, ఎరువుల దుకాణాలు, ఆర్టీసీ బస్సులు ్ర΄ారంభించాం. త్వరలో రైస్మిల్లులు, సోలార్ ΄్లాంట్లను మహిళలకు అందజేస్తాం. – సందీప్కుమార్ ఝా, జిల్లా కలెక్టర్ -
టాలెంట్ వదిలేసి బొట్టుపై ట్రోల్స్
ముఖం చూసి బొట్టు పెట్టడమనేది స్థాయీభేదాలను సూచించే సామెత! ఇప్పుడు ఆ బొట్టు అమెరికాలోనూ ఆక్షేపణీయమైంది.. సొలిసిటర్ జనరల్ పదవికి! దాంతో ఆధునిక నాగరికతకు ఆనవాలంగా భ్రమపడే అమెరికా మరొక్కసారి తన జాత్యహంకారాన్ని చాటుకుంది. భారతీయ మూలాలున్న మథుర శ్రీధరన్ అమెరికాలోని ఒహైయో రాష్ట్ర 12వ సొలిసిటర్ జనరల్గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని అటార్నీ జనరల్ ఆఫీస్ ఎక్స్ (ట్విటర్) వేదికగా ప్రకటించింది. అంతే నిరసనలు, ట్రోల్స్తో నిండిపోయింది ఎక్స్. మథుర ప్రజ్ఞాపాటవాల మీద సందేహంతో కాదు, ఆమె భారతీయ మూలాల మీద ఆక్షేపణ.. ఆమె పేరు, ఒంటి రంగు, పెట్టుకున్న బొట్టు మీద వ్యతిరేకతతో! ‘సొలిసిటర్ జనరల్గా ఒక ఇండియన్ ఏంటీ? ఒహైయోలో అమెరికన్స్ కరువయ్యారా?’ అంటూ ఒకరు, ‘నుదుటన పర్మినెంట్ చుక్క పెట్టుకుని మరీ వచ్చిందండీ కొలువుకి’ అంటూ మరొకరు, ‘జాబ్స్ లేకుండా స్థానికులు అల్లాడుతుంటే ఈ విదేశీయులకు ఉద్యోగం ఏంటీ?’ అంటూ ఇంకొకరు, ‘బొట్టు పెట్టుకోవడం స్థానికులకు చేతకాదు కాబట్టి వాళ్లకు కొలువుల్లేమో’ అంటూ వేరొకరు ఎక్స్లో కామెంట్లు గుప్పించారు. ఆమెకున్న క్వాలిఫికేషన్స్, శక్తిసామర్థ్యాల గురించి మాత్రం ఎవ్వరూ మాట్లాడలేదు. అయితే.. ఆ ట్రోల్స్, కామెంట్స్కి జవాబుగా ఒహైయో అటార్నీ జనరల్ డేవ్ యోస్ట్ స్పందిస్తూ ‘చాలామంది మథుర శ్రీధరన్ అమెరికన్ కాదనే అపోహలో ఉన్నారు. కానీ ఆమె అమెరికా పౌరులకు పుట్టిన అమ్మాయి. అమెరికా పౌరురాలే! అంతేకాదు అమెరికా పౌరుడినే పెళ్లాడారు. అన్నిటికీ మించి ఆమె చాలా బ్రిలియంట్, సొలిసిటర్ జనరల్ హోదాకు అన్ని అర్హతలున్న పర్ఫెక్ట్ అభ్యర్థి. ఆ బాధ్యతలను చక్కగా నిర్వర్తించగలరు కూడా! ఇవికాక మిమ్మల్ని ఆమె పేరు, రంగు ఇబ్బంది పెడుతున్నట్లయితే ప్రాబ్లం ఆమెలో లేదు.. మీ మెదళ్లలో ఉంది’ అని పోస్ట్ చేశారు. మథుర శ్రీధరన్.. ఎమ్ఐటీ (మాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ పోస్ట్గ్రాడ్యూయేట్. తర్వాత న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లాలో చేరి జ్యూరిస్ డాక్టర్ (జేడీ) పట్టా పొందారు. చక్కటి వాగ్ధాటి, అద్భుతమైన వాదనా పటిమ ఆమె సొంతం. ఆ ప్రతిభే ఆమెను సొలిసిటర్ జనరల్ పదవి వరించేలా చేసింది. -
అమృత ఘడియలవి!
వ్యాధులు దరిచేరకుండా శిశువులకు వ్యాక్సిన్లు వేయించడం తెలిసిందే. ప్రసవం అయిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం అంటే శిశువుకు మొదటి వ్యాక్సిన్ వేయించినట్టే అని చెబుతుంది భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రసవం తర్వాత మొదటి గంట ఎంత కీలకమైనదో తల్లికి– బిడ్డకి ఎన్ని విధాల మేలు చేస్తుందో తెలుసుకోవడం, అవగాహన పెంచుకోవడమనేది కాబోయే తల్లులు తప్పక తెలుసుకోవాల్సినదే.అమ్మపాలే తన బిడ్డకు ఇచ్చే అమృతం. ఔషధం కూడా. నవజాత శిశువులకు మొదటి గంటలోనే రొమ్ము పాలు పట్టించడాన్ని ఓ మంచి ప్రారంభంగా చెప్పవచ్చు. తల్లిపాలు పిల్లలకు సహజ పోషకాహారం, సురక్షితమైనవి, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిసినా.. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలు మొదటి ఆరు నెలల్లో తల్లిపాలు తాగడం లేదు అని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీని వల్ల పిల్లల ఆరోగ్యకరమైన భావి జీవితం సమస్యాత్మకంగా ఉంటుందనేది ఆ నివేదికల సారాంశం. తల్లిపాలు తాగని పిల్లల్లో అనారోగ్యం, ఆకస్మిక మరణం, నేర్చుకునే సామర్థ్యం తగ్గడం, యుక్తవయస్సులో ఆరోగ్య సమస్యల ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆ నివేదికలు ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. బిడ్డకు తల్లి ఇచ్చే మొదటి బహుమతిముర్రుపాలుగా పిలిచే మొదటి పాలను కొలెస్ట్రామ్ అంటారు. ‘ప్రీ మిల్క్’ అనే ఈ పాలలోని పోషకాలు యాంటీబాడీలుగా శిశువుకు మొదటి సహజ టీకాగా పనిచేస్తాయి. ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తాయి. రోగనిరోధక శక్తిని, వ్యాధుల నుంచి రక్షణను ఏకకాలంలో అందజేస్తాయి. అంతేకాదు, ప్రసవం అయిన మొదటి గంటలో తల్లి హృదయానికి హత్తుకున్న బిడ్డ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ వల్ల పిల్లల చర్మంలో మంచి బాక్టీరియా వృద్ధి చెంది, తల్లీ–బిడ్డల బంధాన్ని మెరుగుపరుస్తుంది. అందువల్ల అప్పుడే పుట్టిన శిశువుకు తల్లిపాలు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇవ్వాలని, మొదటి గంట మరీ కీలకం అని యునిసెఫ్, డబ్ల్యూహెచ్వో తో పాటు ఎన్నో పరిశోధనలు తెలియజేస్తున్నాయి. బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల తల్లికి కూడా ఆరోగ్యపరంగా ఎంతో మేలు జరుగుతుంది. ప్రసూతి అనారోగ్య భారం తగ్గుతుంది. ఆరోగ్యకరమైన కుటుంబాల సృష్టికి మూలం అవుతుంది. బిడ్డకు అందమైన భవిష్యత్తును కానుకగా ఇవ్వాలని తపించే ప్రతి తల్లి మొదటగా అందివ్వాల్సింది తల్లిపాలే.మరెన్నో ప్రయోజనాలు→ ప్రసవం అయిన కొన్ని రోజుల వరకే కొలొస్ట్రామ్ ఉత్పత్తి అవుతుంది. అందుకే ఈ రోజుల్లో తప్పక పాలు ఇవ్వాలి. మరీ ముఖ్యంగా పుట్టిన మొదటి గంటలోపు తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డ మనుగడ అవకాశాలు 14 రెట్లు పెరుగుతాయని నివేదికలు చెబుతున్నాయి.→ తల్లిపాలలో ఆరోగ్యకరమైన మెదడు అభివృద్ధికి, చురుకైన పనితీరుకు తోడ్పడే పోషకాలు ఉంటాయి. ప్రొటీన్, ఐరన్, కాల్షియం, విటమిన్లు సమృద్ధిగా, చక్కెరపాళ్లు తక్కువగా ఉండే తల్లి పాలు శిశువుకు మొదటి ఆరు నెలలు పూర్తి ఆహారం. → తల్లిపాలు కాకుండా ఇతర ఆహారాన్ని అంటే.. చాలా వరకు ప్రసవం అయ్యాక శిశువుకు తేనె నాకించడం, డబ్బా పాలు పడుతుంటారు. ఈ విధానం చాలా ప్రమాదకరమైనది. దీని వల్ల తల్లిలోనూ పాల ఉత్పత్తి ఆలస్యం కావచ్చు. బిడ్డకు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా ఉంది. చెవి ఇన్ఫెక్షన్లు, విరేచనాలు, న్యుమోనియా వంటి అనారోగ్యాల బారిన పడే అవకాశాలూ ఉన్నాయి. తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లి శరీర వేడి ద్వారా బిడ్డను రక్షించడమే కాకుండా తల్లీ బిడ్డ మధ్య బంధం బలపడుతుంది.ఆరు నెలలు... ఆ తర్వాత...ఆరు నెలల తర్వాత ఇంట్లో వండిన పోషకాలు ఉండే మెత్తని ఆహారాన్ని ఇవ్వాలి. అలాగే, వయస్సుకు తగిన విధంగా, పోషకాలు ఉండే ఆహారాన్ని ఇస్తూ ఉండాలి. అదే సమయంలో రెండేళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు వరకు కూడ తల్లిపాలు ఇవ్వచ్చు. బిడ్డ క్రమంగా ఘన, ద్రవ, వైవిధ్యమైన ఆహారాన్ని తగు మోతాదులో తీసుకోగలుగుతుందా లేదా అని దృష్టి పెట్టాలి. బిడ్డ తొలినాళ్ల నుంచే తీసుకున్న శ్రద్ధ ఆ బిడ్డ పెరుగుదల, అభివృద్ధికి పునాది వేస్తుంది. తొలి బాల్య దశలోనే బిడ్డ ఏం నేర్చుకుంటుంది, ఎలా ప్రవర్తిస్తుంది.. అనే వాటిని నిర్ణయిస్తుంది. జీవితంలో విజయాలు సాధించేలా వారి సామర్థ్యాన్ని ఆ తొలిదశే నిర్ణయిస్తుంది. పిల్లల మనుగడ, ఆరోగ్యకరమైన అభివృద్ధికి తల్లిపాలు కీలకపాత్ర పోషిస్తాయి. మొదటి గంటలో తల్లి తన బిడ్డకు ఇచ్చే ప్రతి పాల చుక్క అనారోగ్యకారకమైన బాక్టీరియాతో పోరాడే శ్రక్తి ప్రదాయిని. సాధారణ, సిజేరియన్ ఏ ప్రసవం అయినా మొదటి తల్లిపాలు శిశువుకు తప్పక ఇవ్వాలి. ఈ విషయాన్ని తల్లికాబోయే ప్రతి ఒక్కరికీ చెబుతుంటాం. పాలు ఎలా పట్టాలి, శుభ్రత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పాలు వృద్ధి చెందడానికి ఎలాంటి పోషకాలు గల ఆహారాన్ని తీసుకోవాలో వివరిస్తాం. ప్రతీ తల్లి తన బిడ్డ ఆరోగ్య భవిష్యత్తుకు తీసుకోవాల్సిన మొదటి జాగ్రత్త ఇదే. కుటుంబ సభ్యులు కూడా ఈ విషయం లో తప్పనిసరి అవగాహన పెంచుకోవాలి. తల్లికి తగినంత మద్దతునివ్వాలి. – డాక్టర్ శిరీష, గైనకాలజిస్ట్∙ -
మాట కటువైతే... మురి పాలు విరుగుతాయ్!
‘‘తొమ్మిది నెలల బొడ్డుతాడు అకస్మాత్తుగా అలా కోసేస్తే ఎలా...?’’ అనుకున్నాడో ఏమో దేముడు! ‘‘పేగుబంధమిలా తెంచినందుకేనేమో... ఆహారంగా పాలబంధం పెట్టి స్తన్యబంధమేర్పాటు చేశాడనిపిస్తోంది!!ప్రసవవేదనతో ప్రాణాల్ని తోడేసిన ఆ కొత్తబిడ్డలోకి తన ప్రాణాలు నింపి... తనలోంచి బయటకు తోడిన ప్రాణాలను మళ్లీ నెమ్మది నెమ్మదిగా పునఃప్రతిష్టించుకుంటూ ఉంటుంది అమ్మ. అలా అప్పుడప్పుడే కోలుకుంటున్న కీలక తరుణంలో ఆ అమ్మ పట్ల జడ్జిమెంటల్గా కొన్ని కామెంట్స్ చేయవద్దని కోరుతున్నారు మానసికవేత్తలు.ఆ పోస్ట్ పార్టమ్ ‘బ్ల్యూ’స్ తాలూకు ‘నీలి’నీడల్ని క్రమంగా బిడ్డపై ప్రేమ పెంచుకుంటూ ఇంద్రధనుస్సులాంటి ఫ్లయింగ్ కలర్స్గా మార్చుకునే తరుణంలో ఆ కామెంట్లు ఆమెలో అపరాధభావం నింపుతాయంటూ హెచ్చరిస్తున్నారు. సూచన అనే మారువేషం వేసుకుని కర్కశాన్ని కనిపించకుండా కప్పేస్తూ ఉండే... పలకకూడని ఆ పరుష పదాలేమిటో చూద్దాం.ఈనెల మొదటి తేదీతో మొదలై ఈ వారమంతా తల్లి పాల వారోత్సవాలు కొనసాగుతుంటాయి. ఈ సందర్భంగా బుజ్జాయికి తల్లి పాలే పట్టమంటూ సిఫార్సు చేస్తుంటారు డాక్లర్లు. ‘బాటిల్ పాలు బొజ్జ నింపుతాయేమోగానీ... అమ్మ పాలు కడుపునింపడంతో పాటూ ఆత్మనూ నింపుతాయంటున్నారు’ వైద్య నిపుణులు. ఈ సమయంలో కొన్ని మాటలు కొత్త తల్లితో చెప్పకూడదంటూ వారు సూచిస్తున్నారు. ‘‘అమ్మా! నువ్వు పీరియడ్స్లో ఉండి మైలతో ఉంటే బిడ్డకు పాలుపట్టకు’’– కొందరు పెద్దాళ్ల పెడసరం మాటఇది ఎంతమాత్రమూ తల్లితో చెప్పకూడని మాట. బిడ్డకు తల్లి పాలను మించిన ఆహారం లేదు. డాక్టర్లు నిర్దిష్టంగా వద్దని చెబితే మినహా బిడ్డకు పాలుపట్టకుండా ఉండనే కూడదు. పైగా మురి పాలతో పట్టే ముర్రు పాలు ఇంకా ఇంకా మేలూ మంచీ చేసేవే. ఆ ముర్రు పాలనే కొలెస్ట్రమ్ అంటారు. తల్లిని దేవత అన్నాక అమ్మ అమృతం పట్టక పోతే ఎలా! అందుకే అనేక అనారోగ్యాలూ... ఎప్పుడో వృద్ధాప్యంలో బిడ్డకు వచ్చే ఎన్నో జబ్బుల్నించి రక్షించే ఆ పాలు అమృతాలు కాకుండా ఎలా పోతాయి. అమృతానికి అంటు ఏమిటి? పాలకు మైలేమిటి? అందుకే తల్లి ఏ పరిస్థితుల్లో ఉన్నా బిడ్డకు అమ్మ పాలు పట్టాల్సిందే. ‘‘ పాప ఏడుస్తోంది... పాలు సరిగా పట్టావా? ఏమో.... పట్టావో లేదో?’’ – అనుభవజ్ఞురాలంటూ ఆరా తీసే మహిళ పాలు తాగుతుండే పా పాయి చక్కగా బరువు పెరుగుతుంటే చాలు. పాలు తన ఒంటికి పడుతున్నట్టే లెక్క. తల్లి ఇచ్చే ఆ పాలబువ్వనంతా బిడ్డ ఒంటికంతా పట్టేలా ఏర్పాటు చేస్తుంది ప్రకృతి. అందుకే నెలల పా పాయిలకు మలవిసర్జన అంతగా కాక పోవచ్చు. కొన్నిసార్లు మల విసర్జనకు రెండు మూడురోజులూ పట్టవచ్చు లేదా రోజులో రెండుసార్లు కూడా కావచ్చు. కానీ మూత్రంతో రోజుకు ఆరుసార్లైనా డయపర్ తడిపేస్తుంది బేబీ! అలా రోజూ పాలు తాగే పసి పాప... రోజులో ఐదారుసార్లు పక్కతడిపేస్తుంటే చాలు. ఇక పా పాయి ఏడుస్తుందంటే అర్థం పాలు సరి పోలేదని కాదు... అది కోలిక్ అని పిలిచే కడుపునొప్పి వల్ల కావచ్చు. చెప్పుకోలేని చెవినొప్పి ఉండచ్చు. అందుకే... పాప అదేపనిగా ఏడుస్తుంటే ఒకసారి చిన్నపిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి. అంతేతప్ప జడ్జిమెంటల్గా కామెంట్స్ పాస్ చేయకూడదు. ‘‘ఏమిటీ...? పాలు పట్టడం అప్పుడే మానేశావా? మా కాలంలో బిడ్డకు మూడేళ్లు వచ్చే వరకూ పట్టేవాళ్లమమ్మా...’’– తమ కాలమైన గతమంతా గొప్పేనంటూ చెప్పే ఓ పెద్దావిడ మాటబిడ్డకు ఆర్నెల్లు వచ్చేవరకూ పాలు పట్టడం తప్పనిసరి. చిన్నారి పా పాయికి పాలే సరైన ఆహారం. ఆర్నెల్ల తర్వాత నెయ్యీ పప్పూతో గుజ్జుగుజ్జుగా కలిపిన అన్నం గోరుముద్దలతోనూ, గుజ్జుగా నలిపే పండ్ల బువ్వతో క్రమంగా ఘనాహారమంటూ అలవాటు చేయడాన్ని ఇంగ్లిష్లో ‘వీనింగ్’ అంటారు. ఇలా చేస్తూ కూడా ఏడాది ఏడాదిన్నర వరకూ పాలు పడుతూనే ఉండవచ్చు. డాక్టర్ చెప్పిన ఏ కారణాల వల్లనో లేదా బిడ్డకు సరిపడా పాలు తల్లికి పడకనో ఆపేయాల్సి వస్తే... అందుకు అనేక కారణాలుండవచ్చు. అందుకే అదేదో నిష్ఠూరంగా ఎలా పడితే అలా మాట్లాడాల్సిన మాట కాదు. ‘‘బిడ్డ బరువు సరిగా పెరుగుతున్నట్టుగా లేదు... పాలు సరిగా పట్టడం లేదా?’’– పెత్తనం చేస్తున్నట్టుగా పెదవి దాటించే ఓ పెద్దావిడ ఆరా!బిడ్డకు పాలు సరి పోయాయంటే... కడుపు నిండిన వెంటనే పా పాయి కనీసం గంటా గంటన్నర పాటు నిద్ర పోతుంది. పాలు తాగాక కనీసం గంటసేపైనా పా పాయి పడుకుందంటే చిన్నారికి కడుపు నిండినట్టే లెక్క. కొందరు బిడ్డలు కాస్త పీలగా ఉండొచ్చు. అందరూ బొద్దుగానే ఉండరు కదా. అలా చూసి... ఇలా నిష్టూరాలు ఆడకూడదు. మొదట్లో ఒకవైపు పాలు తాగడానికి బిడ్డకు 20 నిమిషాల నుంచి 25 నిమిషాలూ పట్టవచ్చు. పాలు తాగే నైపుణ్యం పెరుగుతున్నకొద్దీ పా పాయి 5 – 10 నిమిషాల్లోనే పాలు తాగేస్తుంటుంది. అయితే... పాలు పట్టేటప్పుడు మొదట వచ్చే పాలను ఫోర్ మిల్క్ అంటారు. అందులో నీటి మోతాదు ఎక్కువగా ఉంటుంది. అది తాగేశాకే హైండ్ మిల్క్ అనే పాలొస్తాయి. ఇందులో బిడ్డ పెరుగుదలకు కావాల్సిన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. అవన్నీ కొవ్వులే అయినా పాప ఒంటికి హాయిగా పట్టేలా చేస్తుంది ప్రకృతి.కొత్త తల్లితో కినుక మాటలు ఎందుకు మాట్లాడకూడదంటే... కొత్త తల్లికి అంతా కొత్తే. కొంగులో బంగారు బిడ్డతో కొత్త తల్లికి అసలే కంగారు. పాప పుట్టే సమయంలో అనుభవించే వేదనతో కొన్నిసార్లు పాపపై కోపం వచ్చేలాంటి ‘ పోస్ట్ పార్టమ్ బ్లూస్’ వర్కవుట్ అవుతూ ఉంటాయి. అవి క్రమంగా తగ్గుతుండే సమయంలో ఇలాంటి నిష్ఠూరాలతో అమ్మమనసుకు కష్టం కలిగిస్తాయి. అలాంటి వ్యాఖ్యలు ఆమెను మానసికంగా దెబ్బతీసి గిల్ట్ను నింపవచ్చు. మొదటే తెలియని తనం... అసలే అనుభవలేమి... పైగా ఇలాంటి మాటలు!! వీటితో ఆమెలో ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం దెబ్బతింటే ఇంకా ఇంకా సమస్యలు రావచ్చు. అందుకే అలాంటిలాంటి అనుచిత వ్యాఖ్యలు వద్దంటూ సూచిస్తున్నారు సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు. -
జట్టుగా కృషిచేస్తే సమష్టి విజయం
చినుకు చినుకు కలిస్తే ప్రవాహం అయినట్టు చేయీ చేయీ కలిపితే విజయం చేరువ అవుతుందని అంటున్నారు కొందరు మహిళా గ్రూప్ సభ్యులు. ఇంటి వద్ద చిన్న చిన్న వ్యాపారాలు చేసే యాభై మంది మహిళలు వాట్సప్ ద్వారా ఒక జట్టుగా కలిశారు. ఒకరి కష్టనష్టాలను మరొకరితో పంచుకున్నారు... వ్యాపార మెళకువలను కలబోసుకున్నారు. నాలుగేళ్లుగా తమ నైపుణ్యాలను, సృజనాత్మకతను పంచుకుంటూనే వ్యాపారాలలో విజయాలు సాధిస్తున్నారు. రేపు ఆదివారం వీరంతా కలిసి సికింద్రాబాద్లోని ఎక్స్ పోచాణక్యలో తమ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు పంచుకున్న విషయాలు..హస్తకళలు, క్లీనింగ్ అండ్ హైజీన్ ప్రొడక్ట్స్, ఫొటోగ్రఫీ, హెల్త్కేర్ సర్వీసెస్, ఈవెంట్ ΄్లానర్స్, స్నాక్స్ మేకర్స్, గిఫ్ట్ డీలర్స్, ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్లు.. ఇలా వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్న యాభైమంది మహిళలు ఒకచోట చేరి జట్టుగా విజయాలు సాధిస్తున్నారు. తమతోటి వారికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.ఒక ఫ్రెండ్ ద్వారా తెలిసి, రెండేళ్ల క్రితం ఈ గ్రూప్లో జాయిన్ అయ్యాను. రోజూ ఉదయం మేమంతా రెండు గంటలసేపు ఆన్లైన్ నెట్వర్క్ ద్వారా కలుసుకుంటాం. ఎవరికైనా ఏదైనా సమాచారం అవసరం ఉంటే.. ఆ విషయాలను పంచుకుంటాం. వెబ్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ చేసే స్టార్టప్ని రన్ చేస్తున్నాను. మా గ్రూప్లో ఎవరికైనా నా వర్క్ అవసరం ఉంటే వాళ్లు షేర్ చేస్తారు. నా వర్క్కి సంబంధించి ఏదైనా అవసరం ఉంటే, మా గ్రూప్ ఫ్రెండ్స్ నుంచి తీసుకుంటాను. ఏడాదికి ఒకసారి పెట్టే స్టాల్ ద్వారా నాకు ఏదైతే అవసరం ఉంటుందో దాని గురించి నా డెస్క్ వద్ద రాస్తాను. ఎవరికైనా ఆ స్కిల్ ఉంటే, వర్క్లో జాయిన్ కావచ్చు. వారి వద్ద ఏదైనా ఎక్విప్మెంట్ ఉంటే మాకు అందజేయవచ్చు. ఇంట్లో ఉండి చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే గృహిణులు, బయటకు రావాలంటే ఇబ్బందిగా ఫీలయ్యేవారు.. ఈ వేదిక ద్వారా ప్రయోజనాలు ΄÷ందాలనుకున్నాం. శిక్షణాతరగతులు కూడా నిర్వహిస్తుంటాం. మహిళల వ్యాపార వృద్ధికి జట్టుగా చేసే కృషి ఎంతగానో ఉపయోగపడుతుంది. – లక్ష్మీ మోపిదేవి, ముగ్దా క్రియేటివ్స్, హైదరాబాద్వ్యాపార విస్తరణకు సరైన మార్గంవైష్ణో ఎంటర్ప్రైజెస్ పేరుతో హెల్తీ స్నాక్స్ తయారు చేస్తుంటాను. మిల్లెట్స్తో చేసే ఈ స్నాక్స్ని ఆర్డర్ మీద సప్లయ్ చేస్తుంటాను. నా వర్క్స్ గురించి ఈ గ్రూప్లోని స్నేహితులు స్టేటస్ పెడుతుంటారు. నేనూ వారి వర్క్స్ని స్టేటస్గా పెడుతుంటాను. దీని ద్వారా మా బంధుమిత్రులకు కూడా వారి వర్క్స్ చేరువవుతుంటాయి. మూడేళ్ల క్రితం ఈ విమెన్ గ్రూప్లో చేరాను. గ్రూప్ సభ్యులుగా వర్క్షాప్స్లో కలుస్తుంటాం. ఒకరికి ఒకరం సాయంగా ఉంటాం. మహిళలు ఒకరిగా కన్నా ఇలా సమష్టి్టగా కలిస్తే విజయాలు సులువుగా సాధించగలరు. – శైలబాల, వైష్ణో ఎంటర్ప్రైజెస్, హైదరాబాద్సృజనాత్మక పనికి చేయూతనేను బడ్జెట్ ఫ్రెండ్లీ కస్టమైజ్డ్ గిఫ్ట్స్ తయారు చేస్తాను. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి చేసే నా గిఫ్ట్ ఐడియాస్లో ఫొటో ఫ్రేమ్స్, స్క్రాప్ బుక్స్, ఫొటో ఆల్బమ్స్, వెడ్డింగ్ ఈవెంట్కి కావల్సిన గిఫ్ట్ ఐటమ్స్ ఉంటాయి. రెండేళ్ల క్రితం ఈ మహిళా గ్రూప్లో స్నేహితుల ద్వారా జాయిన్ అయ్యాను. నా వర్క్ని నా గ్రూప్లో ఉన్నవారే ప్రమోట్ చేస్తుంటారు. నేనూ ఈ గ్రూప్లోని కొంతమంది సభ్యులతో కొలాబరేట్ అయ్యి నా బిజినెస్ను పెంచుకుంటున్నాను. ప్రతి యేటా జరిగే ఈ ఎక్స్΄ోలో నా స్టాల్ ఉంటుంది. దీని ద్వారా నా వర్క్ మరింతమందికి రీచ్ అవుతున్నందుకు ఆనందంగా ఉంది. – నాగవాణి, హైదరాబాద్కాంటాక్ట్స్ పెరిగాయిఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, వేణీ, రిటర్న్ గిఫ్ట్స్.. వంటివి తయారు చేస్తుంటాను. తెలిసిన వారి ద్వారా ఈ మహిళా గ్రూప్లో చేరాను. దీంతో నాకు కాంటాక్ట్స్ పెరిగాయి. మిగతావారితో కలిసి నా బిజినెస్ను ఎలా డెవలప్ చేసుకోవచ్చో తెలిసింది. లీడర్షిప్ క్వాలిటీస్ నేర్చుకున్నాను. వర్క్షాప్స్ కూడా నిర్వహించుకుంటాం. లోన్ మేళా, హెల్త్క్యాంప్స్ ఏర్పాటు చేస్తుంటాం. – దుర్గ గరిమెళ్ళ,విపంచిక ట్రెండ్స్, హైదరాబాద్ – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
తల్లీకూతుళ్లు.. ఒకేసారి మెడిసిన్
చదువుకు వయసేమిటి? కష్టమైన మెడిసిన్ సీటు సాధించడంలోమనకు తక్కువేమిటి అనుకున్నారు 49 ఏళ్ల అముదవల్లి. తమిళనాడుకు చెందిన ఈ ఫిజియోథెరపిస్ట్ తన కుమార్తె సంయుక్తతో కలిసి నీట్ 2025 రాశారు. ఇద్దరికీ ర్యాంకు వచ్చింది. బుధవారం కౌన్సిలింగ్లో ఆమెకు సీటు ఖరారైంది. కూతురుతోపాటు మెడిసిన్ చదవబోతున్నందుకు చాలా ఉద్వేగంగా ఉందామె. పెళ్లి వల్ల చదువు ఆగిపోయిన తల్లులు అముదవల్లిని చూసి స్ఫూర్తి పొందాలి.‘వివాహం విద్యానాశాయ’... పెళ్లికాగానే చదువు అటకెక్కుతుందని, బాధ్యతలు తలకెక్కుతాయని పెద్దలంటారు. అదంతా అప్పటి మాట. ఇప్పుడు పెళ్లి తర్వాత కూడా విద్యను వృద్ధి చేయవచ్చు అని నిరూపించారు 49 ఏళ్ల అముదవల్లి. కూతురితో కలిసి, నీట్ పరీక్ష రాసిన ఆమె ఉత్తీర్ణత సాధించి చాలామంది అమ్మలకు స్ఫూర్తిగా నిలిచారు. ఒకేసారి తల్లీకూతుళ్లు నీట్ పరీక్ష రాయడం, ఇద్దరూ పాసవడం దేశంలో ఇదే తొలిసారి కావొచ్చు.ఎప్పటి నుంచో కలతమిళనాడు తె¯Œ కాశికి చెందిన అముదవల్లి వృత్తిరీత్యా ఫిజియోథెరపిస్ట్. భర్త లాయర్. మరో ఏడాదిలో ఆమె 50 ఏళ్ల వయసుకు చేరుకుంటారు. ఇన్నేళ్లు గడిచినా ఆమె మనసులో ఒక కోరిక మాత్రం తీరలేదు. అదే డాక్టర్ అవ్వడం. తెల్లకోటు వేసుకొని, చేతిలో స్టెతస్కోప్ పట్టుకొని, రోగుల్ని నవ్వుతూ పలకరించి, చల్లటి చికిత్స అందించే వైద్యురాలు కావాలన్నది ఆమె కల. కానీ ఆమె ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించ లేదు. దీంతో ఫిజియోథెరపీ కోర్సు చేసి, అందులోనే కొనసాగారు. ఆశ్చర్యంగా కూతురు సంయుక్త తనకు డాక్టర్ కావాలని ఉందని చెప్పినప్పుడు అముదవల్లి ఎంతో సంతోషపడ్డాను. తను నెరవేర్చుకోలేకపోయిన కోరిక కూతురు సాధించబోతోందని ఆనందపడ్డారు. అంతేనా? తన కూతురితోపాటు తను మాత్రం ఎందుకు సాధించకూడదు? ఆ వయసులో తనకు అడ్డుపడ్డ ఇబ్బందులు ఇవాళ లేవుగా? అందుకే కూతురుతోపాటు తనూ నీట్ పరీక్ష రాయాలని అనుకున్నారు.కష్టమైన లక్ష్యందేశవ్యాప్తంగా నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, ఆపై మెడికల్ సీటు పొందడం అంత సులభమైన విషయాలు కావు. చాలా శ్రమించాలి. గంటల తరబడి చదవాలి. రోజుల తరబడి చదువుకు అంకితమవ్వాలి. ఇంత చేసినా పాసవుతామన్న నమ్మకం లేదు. అయితే అముదవల్లికి కూతురు సంయుక్త తోడుగా నిలిచింది. స్ఫూర్తి నింపింది. తనతోపాటు తల్లి కూడా నీట్ పరీక్ష రాయడాన్ని ప్రోత్సహించింది. ఇద్దరూ కలిసి పరీక్షకు సిద్ధమయ్యారు. అయితే అప్పటికి అముదవల్లి చదువు మానేసి చాలా ఏళ్లయ్యింది. కొత్త సిలబస్, సరికొత్త అంశాలు. అవన్నీ మళ్లీ చదవడం, వాటిని అర్థం చేసుకోవడం, గుర్తుపెట్టుకోవడం కష్టమైన పనులు. అయినా ఆమె విసుగు లేకుండా రోజూ సాధన చేసేవారు. తనకొచ్చే సందేహాలను కూతురిని అడిగి సమాధానాలు తెలుసుకునేవారు. ‘నేను చదివినప్పటికీ, ఇప్పటికీ సిలబస్లో చాలా మార్పులొచ్చాయి. కొన్ని విషయాలు నాకు పూర్తిగా కొత్త. అయినా నా కూతురి సాయంతో వాటిని చదివి, అర్థం చేసుకున్నాను. ఇద్దరం కలిసి వాటిని చర్చించి, చదువుకునేవాళ్లం. ఈ విషయంలో మా అమ్మాయే నాకు స్ఫూర్తి’ అని సంతోషంగా వివరిస్తున్నారు అముదవల్లి. సంయుక్త కోచింగ్ సెంటర్కి వెళ్లి, అక్కడ శిక్షణ పొంది ఇంటికొచ్చి, ఆ పాఠాలు తల్లికి చెప్పేది. దీనివల్ల ఆ విషయాలు తనకూ బాగా తెలియడంతోపాటు తల్లికీ ఉపయోగకరంగా మారింది. ‘మనం చదువుకున్నది మరొకరికి నేర్పితే, అది మనకు బాగా గుర్తుంటుంది. నేను నేర్చుకున్న టాపిక్స్ మా అమ్మకు నేర్పడం చాలా మంచిదైంది’ అంటోంది సంయుక్త.సాధించిన ద్వయంఅముదవల్లి, సంయుక్త నీట్– 2025 పరీక్ష రాశారు. అముదవల్లి 147 మార్కులు సాధించగా, సంయుక్త 450 మార్కులు సాధించింది. జూలై 30న చెన్నైలో నీట్ కౌన్సిలింగ్కి ఇద్దరూ హాజరయ్యారు. దివ్యాంగుల కోటాలో అముదవల్లికి విరుదనగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్ రాగా, సంయుక్తకు ఇంకా కళాశాలను అలాట్ చేయలేదు. ‘మా అమ్మతో కలిసి ఒకే కాలేజీ చదవాలని నాకు లేదు. ఆమె ప్రిపేర్ అవుతున్నప్పుడు అదొక్కటే నేను పెట్టిన షరతు’ అని నవ్వింది సంయుక్త. ఇన్నేళ్ల తర్వాత తన తల్లి తన ఆశయాన్ని సాధించి, అనేకమందికి స్ఫూర్తిగా నిలవడం ఆనందంగా ఉందని అంటోంది.నేను చదివినప్పటికీ, ఇప్పటికీ సిలబస్లో చాలా మార్పులొచ్చాయి. అయినా నా కూతురి సాయంతో వాటిని చదివి, అర్థం చేసుకున్నాను. ఇద్దరం కలిసి వాటిని చర్చించి, చదువుకునేవాళ్లం. ఈ విషయంలో మా అమ్మాయే నాకు స్ఫూర్తి.– అముదవల్లి -
నమస్కారం.. వందేమాతరం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎన్నో ప్రయోగాల్లో మహిళా శాస్త్రవేత్తల భాగస్వామ్యం ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తోంది. బుధవారం సాయంత్రం 5.40 గంటలకు జీఎస్ఎల్వీ–ఎఫ్16 రాకెట్ ద్వారా ప్రయోగించిన నాసా–ఇస్రో సింథటిక్ ఆపార్చర్ రాడార్ (నైసార్) ఉప గ్రహానికి చైత్ర రావు (Chaitra Rao) అనే మహిళా శాస్త్రవేత్త శాటిలైట్ డైరెక్టర్గా వ్యవహరించారు.ప్రయోగం విజయవంతమయ్యాక మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి నమస్కారం.. అంటూ ప్రసంగం ప్రారంభించిన ఆమె.. చివరలో వందేమాతరం.. అని చెప్పడంతో ఆందరూ ఆమెను తెలుగు మహిళా శాస్త్రవేత్త అనుకున్నారు. అయితే ఆమె మూలాలు ఉమ్మడి తెలుగు రాష్ట్రమే (Telugu State) అయినప్పటికీ ప్రస్తుతం కర్ణాటకలో ఉంటున్నారు. చిన్నపాటి ఇంజినీర్గా చేరిన ఆమె అంచెలంచెలుగా ఎదిగి బెంగళూరులో ప్రొఫెసర్ యూఆర్ రావు శాటిలైట్ సెంటర్లో ఉపగ్రహాలను రూపొందించడం, సమగ్ర పరచడం, పరీక్షించడం వంటి విభాగాల్లో ఆమె సైంటిస్టుగా పని చేస్తున్నారు. గతంలో మార్స్ ఆర్బిట్ మిషన్కు స్పేస్ క్రాఫ్ట్ ఆపరేషన్ మేనేజర్గా వ్యవహరించారు. ఆ తర్వాత ఖగోళ పరిశోధనకు తయారు చేసిన ఆస్ట్రోశాట్లో పేలోడ్స్ను అందజేయడంలో కీలక భూమిక పోషించారు.చదవండి: చిన్నోడి డాన్స్కు ఫిదాకు అవుతున్నారు!ప్రస్తుతం నైసార్ ఉపగ్రహానికి శాటిలైట్ డైరెక్టర్గా వ్యవహరించారు. అమెరికాలోని కాలిఫోర్నియా ఆఫ్ డిపార్ట్మెంట్కు సంబంధించి జెట్ ప్రొపల్షన్ లేబోరేటరీ (జేపీఎల్)కి చెందిన ప్రతినిధులతో కలిసి ఆమె ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. ఇందులో ఎల్– బ్యాండ్ సింథటిక్ ఆపార్చర్ రాడార్ను జేపీఎల్ ప్రతినిధులు, ఎస్–బ్యాండ్ సింథటిక్ ఆపార్చర్ రాడార్ను ఇస్రో రూపొందించింది. చైత్రరావు శాటిలైట్ డైరెక్టర్గా కీలకమైన పాత్ర పోషించారు. పురుషులకంటే మహిళలు ఎందులోనూ తక్కువ కారని నిరూపించారు. -
Pratiksha Tondwalkar: స్వీపర్ టు ఏజీఎం!
నేను స్వీపర్గా పనిచేయడం ఏమిటి?’ అని ఆమె అహానికి పోలేదు. ‘ఇంత చిన్నజీతానికి పనిచేయడం ఏమిటి?’ అని తాను చేస్తున్న పనిని చిన్నచూపు చూడలేదు.చిన్నదో, పెద్దదో ‘పని’ చేయాలి అని గట్టిగా అనుకుంది ముంబైకి చెందిన ప్రతీక్ష తోండ్వాల్కర్. పనే ఆమెకు ‘పవర్’ అయింది. ఎస్బీఐలో స్వీపర్ స్థాయి నుంచి ఏజీఎం స్థాయికి చేరింది...పేదకుటుంబంలో పుట్టిన ప్రతీక్షకు పదిహేడు సంవత్సరాల వయసులోనే వివాహం జరిగింది. ఇరవైలలో ఉన్నప్పుడు భర్త రోడ్డుప్రమాదంలో చనిపోయాడు. ఆ షాక్ నుంచి కోలుకోవడం ఆమెకు చాలా కష్టమైపోయింది. అప్పటికే తనకు రెండు సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడు. ‘ఇలా ఏడుస్తూ కూర్చుంటే పిల్లవాడి గురించి ఎవరు ఆలోచిస్తారు?’ అనుకొని ఆ దుఃఖం నుంచి బయటపడి ధైర్యం తెచ్చుకుంది.‘ఇంట్లో ఖాళీగా కూర్చుంటే కడుపు నిండదు. ఏడుపు ఇంకా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఏదో ఒక పని చేయాలి’ అనుకొని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ముంబై బ్రాంచ్కు వెళ్లి ‘ఏదో ఒక పని ఇప్పించండి’ అని అడిగింది. ఆమె భర్త ఈ బ్రాంచ్లో బుక్బైండర్గా పనిచేసేవాడు. ఆ మంచితనం, సానుభూతితో బ్యాంక్ వాళ్లు ఆమెకు తమ బ్రాంచీలో స్వీపర్గా పనిచేసే అవకాశం ఇచ్చారు. నెలకు అరవై అయిదు రూపాయల జీతం వచ్చేది.ఆ జీతంతోనే సర్దుకుపోయి ఉంటే ప్రతీక్ష తన భవిష్యత్ గురించి ఆలోచించేది కాదు. ఆ సమయంలోనే తాను మరచిపోయిన చదువు గురించి ఆలోచన మొదలైంది. ఆ ఆలోచనతో పాటు అనుమానాలు కూడా మొదలయ్యాయి. ‘ఈ వయసులో చదువు ఏమిటి!’ ‘ఇంట్లో బిడ్డను పెట్టుకొని కాలేజీకి వెళతావా!’... ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందేమో అని మొదట భయపడింది. ఆ తరువాత తనకు తానే ధైర్యం తెచ్చుకుంది.‘నేనేమీ తప్పు చేయడం లేదు. చదువుకోబోతున్నాను. అంతే’ అని గట్టిగా నిశ్చయించుకుంది. ఒకవైపు స్వీపర్ పనిచేస్తూనే మరోవైపు నైట్ కాలేజీలో చదువుకునేది. ఇంటర్మీడియెట్ తరువాత మరో నైట్కాలేజీలో డిగ్రీ చేసింది. స్వీపర్ నుంచి బ్యాంక్ క్లర్క్గా ప్రమోట్ అయింది. కొంతకాలానికి తిరిగి వివాహం చేసుకుంది ప్రతీక్ష. భర్త ప్రమోద్ ‘నిన్ను ఇంకా పెద్దస్థాయిలో చూడాలనుకుంటున్నాను’ అనేవాడు. బ్యాంక్ ఎగ్జామ్స్ రాయాలని ప్రోత్సహించేవాడు. అలా బ్యాంకు పరీక్షలు రాసి ఒక్కోమెట్టు ఎక్కుతూ ఏజీఎం (అసిస్టెంట్ జనరల్ మేనేజర్) స్థాయికి చేరింది ప్రతీక్ష. ‘కష్టాల్లో ఉన్నప్పుడు చదువు తప్ప నాకు మరో దారి కనిపించలేదు. చదువును నమ్ముకునేవారికి, కష్టపడేవారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది’ తన అనుభవ జ్ఞానంతో అంటుంది ప్రతీక్ష తోండ్వాల్కర్. ప్రతీక్ష తన విజయం దగ్గరే ఆగిపోలేదు. తన విజయంతో ఎంతోమందికి స్ఫూర్తి ఇస్తోంది. ఆ రెండు అడుగులుఆ కష్టకాలాన్ని గుర్తు తెచ్చుకుంటే నాకు ఊపిరి ఆడనట్లుగా ఉంటుంది. అయితే గతంలోనే ఉండిపోతే భవిష్యత్ను చూడలేము. నాకు మొదటి నుంచి చదువు అంటే ఇష్టం. ఆ చదువే నాకు ధైర్యాన్ని ఇచ్చి దారి చూపింది. పరిస్థితులే మనకు ధైర్యాన్ని ఇస్తాయి అని చెప్పడానికి నేనే ఉదాహరణ. తెలియని వ్యక్తుల ముందుకు వెళ్లి ‘నాకు ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించండి’ అని అడగడం నేను ధైర్యంగా వేసిన మొదటి అడుగు అనుకుంటాను. ఎవరు ఏమనుకున్నా సరే నేను చదవాల్సిందే అనుకోవడం నేను ధైర్యంగా వేసిన రెండో అడుగు. ఆ రెండు అడుగులు నా జీవితాన్ని మార్చేశాయి– ప్రతీక్ష తోండ్వాల్కర్ -
రికార్డు బ్రేకింగ్ నాట్య ప్రదర్శన..! ఏకంగా 170 గంటల పాటు..
అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తేనే కదా ప్రపంచం మొత్తం మనవైపు తిరిగి చూసేది. మంచి గుర్తింపు వచ్చేది కూడా అలాంటప్పుడే. అలాంటి అనితర సాధ్యమైన ఘనతనే సాధించి శెభాష్ అనిపించుకుంది ఈ మంగళూరు అమ్మాయి. రోజు చేసే పనిని చేయడమే ఒక్కోసారి విసుగ్గా ఉంటుంది. అలాంటిది ఒక పనిని నిరంతరాయంగా చేయడం అంటే మాటలా..వామ్మో అనేస్తాం. కానీ ఈ అమ్మాయి మాత్రం అలుపు సలుపు లేకుండా సునాయాసంగా చేసేస్తోంది. ఆ అమ్మాయే మంగళూరుకి చెందిన సెయింట్ అలోసియస్(డీమ్డ్ యూనివర్సిటీ)విద్యార్థిని రెమోనా ఎవెట్ పెరీరా(Remona Evette Pereira). బీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నా ఆమె జులై 21న రికార్డు బద్దలు కొట్టే నాట్య ప్రదర్శన ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. జులై 21 నుంచి జులై 28 వరకు అంటే మొత్తం ఏడు రోజులపాటు 170 గంటలు నిర్విరామంగా భరతనాట్యం చేసి అందరిచేత శెభాష్ అనిపించుకుంది. ఆమె ప్రదర్శనకు ఉరుములతో కూడిన చప్పట్లతో దద్దరిల్లింది స్టేడియం. ఇలా ఎక్కువ గంటలపాటు నిరంతరాయంగా నాట్యం చేసి ‘గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లోకి కెక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఇలా నిరంతరాయంగా నాట్యాన్ని ప్రదర్శించిన తొలి వ్యక్తిగా కూడా ఘనత సాధించింది పెరీరా. ఆమె ప్రతి మూడు గంటలకు స్వల్ప విరామం తీసుకుంటూ..ఆగకుండా భరతనాట్యం చేసినట్లు ఆమె కళాశాల డైరెక్టర్ క్రిస్టోఫర్ డిసౌజా అన్నారు. ఇక పెరీరా మూడేళ్ల ప్రాయం నుంచే ప్రఖ్యాత గురువు విద్య మురళీధర్ ఆధ్వర్యంలో భరతనాట్యం శిక్షణ తీసుకుంది. అంతేగాదు 2019లో సోలో అరంగేట్రం ప్రదర్శనతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ ఘనత ఎలా సాధించిందంటే.. ఈ ప్రపంచ రికార్డు కోసం గత కొన్ని నెలలుగా భరతనాట్యంలో కఠోర సాధన చేస్తున్నట్లు పేర్కొంది పెరీరా. రోజుకు ఐదారు గంటలు నృత్య సాధనకే కేటాయించినట్లు తెలిపింది. ఏడు రోజుల పాటు నిరంతరాయంగా నృత్యం చేయడమంటే మాటలు కాదు. అయినా సాధించాలన్న పట్టుదలే తనను ముందుకు నడిపించిందని చెబుతోంది. ఇక ఈ సుదీర్ఘ ప్రదర్శనలో భాగంగా ప్రతి మూడు గంటలకోసారి పావుగంట విరామం తీసుకొనేదాన్ని, అలాగే ఆ సమయంలోనే కునుకు కూడా తీసేదాన్ని అంటోంది. ఇక అరటిపండ్లు, పెరుగు, కొబ్బరి నీళ్లు, కొద్దిగా అన్నం.. ఇలా తేలికపాటి ఆహారంతో ఎనర్జీని పెంచుకునేదాన్ని అని చెబుతోంది. అయితే ఈ ప్రపంచ రికార్డుని తన తల్లిదండ్రులు, టీచర్లు, ఫ్రెండ్స్ ప్రోత్సాహంతోనే సాధించగలిగానంటూ క్రెడిట్ అంతా వారికే ఇచ్చేసింది ఈ డ్యాన్స్ లవర్ ఎవెట్ పెరీరా. ప్రస్తుతం ఆమె విజయం నెట్టింట తెగ వైరల్గా మారింది. View this post on Instagram A post shared by LEO DISTRICT 317D (@leodistrict317d) (చదవండి: కండలు తిరిగిన వైద్యురాలు..! ఏకంగా 600కి పైగా..) -
కండలు తిరిగిన వైద్యురాలు..! ఏకంగా 600కి పైగా..
వైద్యులు అనగానే ఎలా ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఒక కళ్లజోడు..చూడగానే స్మార్ట్గానో లేదా ఓ మోస్తారు లావుగానో ఉంటుంది వారి ఆహార్యం. చాలామటుకు వైద్యులంతా ఇలానే ఉంటారనే చెప్పొచ్చు. కానీ అలాంటి మూసపద్ధతులన్నీ బద్దలు కొట్టి ఇక్కడొక వైద్యురాలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. అంతేగాదు నెట్టింట ఆ వైద్యురాలు ఎవరా..? అంటూ చర్చలు మొదలయ్యాయి. చైనాలోని చాంగ్కింగ్లో 26 ఏళ్ల యాన్యన్ ఫోరెన్సిక్ డాక్టర్ బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ మాదిరిగా కండలు తిరిగిన వైద్యుడు. సాధారణంగా డాక్టర్లు కనిపించేలా స్మార్ట్గా కాకుండా..వెయిట్లిఫ్టర్ మాదిరిగా..ఉంటుందామె. ఆమె శరీరాకృతి వైద్యరంగంలో ఉండే మూసపద్ధతులకు అత్యంత విభిన్నంగా ఉంటుంది ఆమె ఆహార్యం. ఆ కారణంగానే ఆమె నెట్టింట హాట్టాపిక్గా మారింది. ఆమె అద్భుతమైన బలానికి, ఫిట్నెస్కి పేరుగాంచిన వైద్యురాలు. ఆమె చైనాలోని చాంగ్కింగ్ మునిసిపాలిటీలోని ఫోరెన్సిక్ ప్రయోగశాలలో పనిచేస్తున్న తొలి మహిళా ఫోరెన్సిక్ ఫాథాలజిస్ట్. ఆమె ఫోరెన్సిక్ మెడిసిన్లో పట్టా పొందిన వెంటనే విధుల్లో చేరారు. అప్పటి నుంచి దాదాపు 600కు పైగా మృతదేహాల అనుమానాస్పద మరణ కేసులను నిర్వహించింది. అంతేగాదు యూన్యన్ సుమారు 120 కిలోలు బరువులను ఎత్తగలదు. ఒంటి చేత్తో చైన్సా (Chainsaw) అనే శక్తివంతమైన పోర్టబుల్ కట్టింగ్ సాధనాన్ని ఆపరేట్ చేయగలదు. కేవలం మూడు నిమిషాల్లో బ్రెయిన్కి సంబంధించిన క్రానియోటమీ సర్జరీని పూర్తి చేస్తుందామె. ఈ విశిష్ట సామర్థ్యమే ప్రత్యేక మహిళా వైద్యురాలిగా గుర్తింపుతెచ్చి పెట్టాయి. ఆమె ఫిట్నెస్ శిక్షణ తన ఉద్యోగ విధులను సులభంగా నిర్వర్తించేందుకు ఎంతగానో ఉపకరిస్తుందట. ఎందుకుంటే తరుచుగా దాదాపు 150 కిలోలు వరకు బరువు ఉండే మృతదేహాలను కదలించడంలో ఈ దేహధారుడ్యం తనకు ఎంతగానో హెల్ప్ అవుతోందని చెబుతోంది యాన్యన్. అంతేగాదు తన సోషల్ మీడియా ఖాతాలో ఫిట్నెస్కి సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటుంటుంది. యాన్యన్ మహిళలు ఇలాంటి ఉద్యోగాలకు పనికిరారు అనే భావనను సవాలు చేయడమే లక్ష్యంగా తనను స్ట్రాంగ్గా చేసుకుంటూ సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నానని చెబుతోంది. ఈ ఫోరెన్సిక్ రంగంలో ఇప్పటికీ వివక్ష ఉందని, కొన్ని సంస్థలు పురుషులకే ప్రాధాన్యత ఇస్తాయని వాపోయింది. అలాగే చాలామంది ప్రజలు తన వృత్తి పట్ల ప్రతికూలంగా మాట్లాడుతుంటారని, కనీసం షేక్హ్యాండ్ ఇవ్వడానికి కూడా నిరాకరిస్తారంటూ బాధగా చెప్పుకొచ్చింది. అయితే తాను అవేమి పట్టించుకోనని, తన వృత్తి ధర్మం ప్రకారం..చనిపోయిన మృతులకు న్యాయం చేకూరేలా తన వంతు సాయం చేస్తుంటానని పేర్కొంది యాన్యన్. ఆమెకు బాడీబిల్డర్గా ఫిట్నెస్పై దృష్టిపెట్టడం, వృత్తి రెండు కళ్లులాంటివి అని, అందుకే ఆ రెండింటికి సమన్యాయం చేస్తుంటానని చెబుతోంది. తన ఉద్యోగానుభవం..జీవితంలోని దర్భలమైన పరిస్థితులను గుర్తుచేస్తూ..ప్రతి క్షణాం మంచిగా ప్రవర్తించమనే పాఠాన్ని నేర్పిస్తుందని అంటోంది యాన్యన్.(చదవండి: జస్ట్ 15 వారాల్లో 50 కిలోలు ..! కానీ ఆ వ్యాధి కారణంగా..) -
బ్రహ్మపుత్ర మెచ్చిన సాహస పుత్రిక
సాహసం సైలెంట్గా ఉండదు. కంచుకంఠంతో మనలోని ఆత్మవిశ్వాసాన్ని తట్టి లేపుతుంది. ఆ పిలుపును కాలేజీ రోజుల్లోనే అందుకుంది శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతానికి చెందిన వాసుపల్లి కవిత. సాహసంతో చెలిమి చేసిన కవిత బ్రహ్మపుత్రలో రివర్ రాఫ్టింగ్ విజయవంతంగా పూర్తి చేసిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. ఆర్మీ వైద్యాధికారి అయిన కవిత అరుణాచల్ప్రదేశ్లో అత్యంత ఎత్తయిన గోరీచెన్ పర్వతాన్ని ఐదుసార్లు అధిరోహించింది. మరెన్నో సాహసయాత్రలకు సిద్ధం అవుతోంది.ఉద్దానం ప్రాంతమైన వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు గ్రామంలోని సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వాసుపల్లి కవితకు చిన్నప్పటి నుంచి క్రీడలు, స్విమ్మింగ్ అంటే ఇష్టం. చదువులోనూ ముందుండేది. కష్టపడి చదివి ఎంబీబీఎస్ సీటు సాధించింది. శ్రీకాకుళంలోని రిమ్స్ వైద్య కళాశాలలో సమయంలో ట్రెక్కింగ్ చేసేది.సైన్యంలోకి....సైన్యంలో పనిచేయాలనే ఆసక్తి కవితలో ఉండేది. 2021లో ఆర్మీ వైద్యాధికారిగా కెప్టెన్ హోదాలో ΄ోస్టింగ్ పొందిన కవిత మేజర్ స్థాయికి చేరింది. అరుణాచల్ ప్రదేశ్లో పనిచేస్తున్నప్పుడు సాహస క్రీడలపై ఇష్టంతో ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్’లో చేరి పర్వతారోహణకు సంబంధించి రెండు కోర్సులు, రివర్ రాఫ్టింగ్లో ఒక ప్రత్యేక కోర్సు చేసింది.ప్రాణదాతపర్వతారోహణలో శిక్షణ తీసుకున్న కవిత అరుణాచల్ప్రదేశ్లో అత్యంత ఎత్తయిన గోరీచెన్ పర్వతాన్ని ఐదుసార్లు అధిరోహించింది. కల్నల్ రణవీర్సింగ్ జమ్నాల ఆధ్వర్యంలో గోరీచెన్ అధిరోహించి కిందికి వస్తున్న సమయంలో బృందంలోని ఒక యువ సభ్యురాలు ఊపిరి అందక ప్రమాదంలో పడింది. కవిత ఆమెకు తక్షణ వైద్యం అందించి ప్రాణపాయం నుంచి తప్పించింది.బ్రహ్మపుత్రలో సాహస యాత్రఅత్యంత క్లిష్టమైన బ్రహ్మపుత్ర నదిలో 1040 కిలోమీటర్ల మేరకు విజయవంతంగా రివర్ రాఫ్టింగ్ పూర్తి చేసింది కవిత. కల్నల్ రణవీర్సింగ్ నేతృత్వంలోని పన్నెండు మంది సభ్యుల బృందంలో ఆమె ఏకైక మహిళ. బ్రహ్మపుత్రలో రివర్ రాఫ్టింగ్ విజయవంతంగా పూర్తి చేసిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. భారత–టిబెట్ సరిహద్దులోని గెల్లింగ్ గ్రామం నుంచి బ్రహ్మపుత్రలో ప్రయాణం ప్రారంభించి, ఏకధాటిగా 28 రోజులపాటు రివర్ రాఫ్టింగ్ చేశారు. ఇండో–బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న హాట్సింగిమారి దగ్గర తమ సాహసయాత్ర ముగించారు.ప్రాణం మీదికి వచ్చినా సరే...బ్రహ్మపుత్రలో రాఫ్టింగ్ సజావుగా ఏమీ సాగలేదు. ప్రాణం మీదికి తెచ్చిన ప్రమాదాలు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. నది ΄÷డవునా ప్రవాహ తీవ్రత, 11 అడుగుల ఎత్తులో ఎగిసిపడే అలల ఉధృతి కారణంగా ఏర్పడిన సుడిగుండంలో చిక్కుకుని బృందం ప్రమాదంలో పడింది. కాస్త ఓపిక పడితే ప్రమాదం నుంచి బయటపడొచ్చు అనుకున్నారు. ధైర్యం కోల్పోలేదు. పెద్ద అల నుంచి తప్పించుకుని, ఈదుకుంటూ రాఫ్ట్ను చేరుకున్నారు. ఇలా నాలుగుసార్లు రాఫ్ట్ నుంచి పడి΄ోయినా ముందుకే సాగారు. యాత్రలో రోజుకు 12 గంటలపాటు 70 కిలోమీటర్ల మేరకు ప్రయాణించి రాత్రివేళల్లో విశ్రాంతి తీసుకునేవారు.వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో... సైన్యంలో చేసిన సేవలకు గుర్తింపుగా ‘చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్’ అవార్డు అందుకుంది కవిత. గోరీచెన్ పర్వతారోహణ సందర్భంగా తోటి పర్వతారోహకురాలికి చికిత్స చేసినందుకు రాష్ట్రపతి విశిష్ట సేవా మెడల్కు ఎంపికైంది. బ్రహ్మపుత్రలో రివర్ రాఫ్టింగ్ను విజయవంతంగా పూర్తి చేసినందుకు ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు సాధించింది.– కందుల శివశంకర్, సాక్షి, శ్రీకాకుళం -
ఆలోచనలతో కంప్యూటర్ని కంట్రోల్ చేస్తున్న తొలి మహిళ!
సాంకేతికత కూడిన వైద్యం ఎందరో రోగులకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది. అందుకు ఎన్నో ఉదంతాలు నిదర్శనం. అయితే బ్రెయిన్ సంబంధిత విషయంలో మాత్రం సాంకేతికతను వాడటం కాస్త సవాలు. అయితే దాన్నికూడా అధిగమించి..స్ట్రోక్కి గురై పక్షవాతంతో బాధపడుతున్న పేషెంట్లలో కొత్త ఆశను అందించేలా టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది ఎలోన్ మస్క్ స్థాపించిన న్యూరాలింక్ (Neuralink) కంపెనీ. ఇది మానవ మెదడు, కంప్యూటర్ మధ్య నేరుగా కమ్యూనికేషన్ ఏర్పరిచే బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్ (BCI) టెక్నాలజీపై పని చేస్తోందనే విషయం తెలిసిందే. ఈ టెక్నాలజీ ద్వారా, మెదడులో చిన్న చిప్ను అమర్చి, ఆలోచనల ద్వారా డిజిటల్ పరికరాలను నియంత్రిస్తారు. ప్రస్తుతం ఈ టెక్నాలజీ క్లినకల్ ట్రయల్ దశలో ఉంది. అందులో భాగంగానే ఈ న్యూరాలింక్ చిప్ను పొందింది ఆడ్రీక్రూస్ అనే మహిళ. ఎవరామె.? ఆమె ఈ సాంకేతికత సాయంతో ఏం చేసిందంటే..రెండు దశాబ్దాలకు పైగానే ఆడ్రీ కూస్ పక్షవాతానికి గురై మంచానికే పరిమితమైంది. క్లినికల్ ట్రయల్లో భాగంగా ఎలోన్ మస్క్ న్యూరాలింక్ చిప్ను ఆమె మెదడులో అమర్చారు. దీంతో న్యూరాలింక్ బ్రెయిన్ ఇంప్లాట్ ద్వారా తన ఆలోచనలతో కంప్యూటర్ని నియంత్రిస్తున్న తొలి మహిళగా రికార్డు సృష్టించింది. ఆమె తన మానసిక ఆదేశాలతో తన పేరుని డిజిటల్ రూపంలో రాసింది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ఎక్స్లో షేర్ చేసుకున్నారామె. ఆ పోస్ట్లో ఆండ్రీ డిజిటల్ సిరాతో తన పేరును( ఆడ్రీ) సూచించే ల్యాప్టాప్ స్క్రీన్ ఫోటోని షేర్ చేశారు. అంతేగాదు దాంతోపాటు ఎర్రటి హార్ట్ సింబల్, ఒక పక్షి, పిజ్జా ముక్క ఉండే డూడుల్ని కూడా పంచుకుంది. దీన్ని ఆమె టెలిపతి ద్వారా గీసినట్లుగా ఆ పోస్ట్కి క్యాప్షన్ ఇచ్చింది ఆడ్రీ. ఆమె 20 ఏళ్ల తర్వాత తొలిసారిగా తన పేరును రాసిన క్షణం నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఎందుకంటే ఆమె గత 20 ఏళ్లకు పైగా పక్షవాతానికి గురై కదలలేని, మాట్లాడలేని స్థితిలో ఉండిపోయారామె. ఆమె తన చూపుడు వేలుని క్లిక్గా, కర్సర్గా మణికట్టుని ఊహించుకుంటూ.. తన మానసిక ఆలోచనలతో కంప్యూటర్ని నియంత్రిస్తుందామె. ఇదంతా ఆమె తన బ్రెయిన్తో చేస్తుంది. ఇక్కడ ఆడ్రికి ఈ న్యూరాలింక్ క్లినికల్ ట్రయల్లో తొమ్మిదొ పేషెంట్గా ఈ చిప్ను ఆమెకు అమర్చారు. పుర్రెలో రంధ్రం చేసి మోటారు కార్టెక్స్లో సుమారు 128 కనెక్షన్లతో ఈ చిప్ని అమర్చారు. ఈ బీసీఐ(బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్ టెక్నాలజీ) ఆమె మెదడు కదలికలు, సంకేతాలను చదివి వాటిని కర్సర్ కదలికలుగా అనువదిస్తుంది. ఈ బ్రెయిన్ చిప్ ఆమెను మళ్లీ నడిచేలా సాయం చేయలేకపోయినా..డిజిటల్ పరికరాలతో తన మనసులోని మాటలను వ్యక్తం చేయడానికి వీలు కల్పిస్తోంది. ఇది పూర్తి మానసిక ఆలోచనలతో పనిచేస్తుంది. న్యూరాలింక్ అంటే.. 2016లో ఎలోన్ మస్క్ స్థాపించిన న్యూరాలింక్, మానవ మెదడును నేరుగా కంప్యూటర్లకు అనుసంధానించడం లక్ష్యంగా పెట్టుకుంది. పక్షవాతం వంటి నాడీ సంబంధిత పరిస్థితులతో బాధపడుతున్న వ్యక్తులు డిజిటల్ స్వాతంత్య్రాన్ని పొందేలా.. సంభాషించడంలో సహాయపడటమే ఈ సాంకేకతికత లక్ష్యం.కాగా, ఇక్కడ ఆడ్రీ ఇలాంటి మరిన్ని పోస్ట్లను వీడియోలను పంచుకోవాలని ఆత్రుతగా ఎదురుచూస్తోంది. అంతేగాదు ఆమె తన పోస్ట్లో తాను త్వరలో ఇంటికి వస్తానని, ఈ ప్రక్రియ గురించి మరింత వివరంగా తెలిపేలా వీడియోలను కూడా పోస్ట్ చేస్తానని పేర్కొనడం విశేషం. ఈ న్యూరాలింక్ సాంకేతికతను వినియోగించిన తొలి మహిళగా ఆమె ప్రస్థానం పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని ఆశిద్దాం.(చదవండి: 12వ తరగతి డ్రాపౌట్..సొంతంగా జిమ్..ఇంతలో ఊహకందని మలుపు..!) -
టైగర్ ప్రిన్సెస్
‘అమ్మో పులి’ అనుకునే రోజులు కావు ఇవి. ‘అయ్యో పులి’ అనుకునే రోజులు. పులుల మనుగడ ప్రమాదంలో పడిన నేపథ్యంలో వాటి పరిరక్షణకు నడుం కట్టిన అగ్రగణ్యులలో దిల్లీకి చెందిన లతికానాథ్ ఒకరు. ‘టైగర్ ప్రిన్సెస్’గా పేరు తెచ్చుకున్న లతిక చూడని అడవి లేదు. తన కెమెరా కన్ను ప్రపంచంలోని ఎన్నో పులుల విషయాలను, విశేషాలను, విషాదాలను ఆవిష్కరించింది.చిన్నప్పుడు లతికను తల్లిదండ్రులు నేషనల్ పార్క్కు తీసుకువెళ్లడం వల్ల ఆమెలో జంతువులపై ఆసక్తి, ప్రేమ పెరుగుతూ వచ్చాయి. జంతు పరిరక్షణ ఉద్యమ విశేషాలు వినడం, ఆ ఉద్యమాల్లో పాల్గొనడం లతిక కన్జర్వేషన్ ఎకాలజిస్ట్, ఫోటోగ్రాఫర్గా రూపుదిద్దుకోవడానికి కారణం అయింది.‘పులుల పరిరక్షణకు సంబంధించి మీరు చేసిన కృషిని డాక్యుమెంట్ చేయండి’ అంటూ లతికను సంప్రదించిన నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజీన్ నిర్వాహకులు ఆమెకు ‘టైగర్ ప్రిన్సెస్’ అనే బిరుదును ప్రదానం చేశారు. ‘డిస్కవరీ’ చానెల్ కోసం లతిక చేసిన ‘వైల్డ్ థింగ్స్’ డాక్యుమెంటరీ పాపులర్ అయింది. మన దేశంలో పులుల పరిరక్షణ, మేనేజ్మెంట్పై పరిశోధన చేసిన తొలి భారతీయురాలిగా లతిక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.పులుల ఉనికి, సంరక్షణకు సంబంధించిన అరకొర సమాచారం ఒక పరిమితిగా ఉండేది. ఆ పరిమితిని లతిక పరిశోధనలు అధిగమించాయి. డా. జార్జ్ షాలర్ తరువాత ఆ స్థాయిలో పులులపై పరిశోధన చేసిన వ్యక్తిగా లతికకు గుర్తింపు తెచ్చాయి. ప్రస్తుతం పులుల పరిరక్షణ, మేనేజ్మెంట్కు సంబంధించి అధ్యయనాలు ఎక్కువగానే జరుగుతున్నాయి.‘గతంలో పోల్చితే పులుల పరిరక్షణపై ఎక్కువగా అధ్యయనాలు జరుగుతున్నప్పటికీ, పరిశోధన, అధ్యయనం అనేవి ఇప్పటికీ అంత సులభంగా ఏం లేవు. కావు. వైల్డ్లైఫ్ బయాలజిస్ట్, ఫొటోగ్రాఫర్గా చెప్పుకోదగ్గ స్థాయిలో జీవించడం కష్టంగా ఉంది. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. పులుల సంరక్షణకు సంబంధించి అధ్యయనాన్ని ప్రోత్సహించాలి’ అంటుంది లతిక.ప్రయాణాలు అంటే ఇష్టపడే లతిక యాభైకిపైగా దేశాలకు వెళ్లింది. ఎన్నో అడవులలో పులులతో సహా ఎన్నో జంతువుల ఫోటోలు తీసింది. ‘ప్రతి ఫోటోగ్రాఫ్కు ఒక కథ ఉంది. నేను చూసిన ప్రతి పులి నా మనసులో ముద్రించుకుపోయింది. ప్రతి పులి తనకు సంబంధించి ఒక కథ చెబుతున్నట్లుగానే ఉంటుంది. అవి క్షేమంగా ఉండాలని ఎప్పుడూ ప్రార్థించేదాన్ని’ అంటూ జ్ఞాపకాల్లోకి వెళుతుంది లతిక.లతిక తీసుకువచ్చిన ఫొటోగ్రాఫ్స్ కలెక్షన్ ‘హిడెన్ ఇండియా’ సమస్త జంతుజాలాన్ని మన ముందు ఆవిష్కరిస్తుంది. ఈ పుస్తకానికి వాడిన ముఖచిత్రం ఎంతో అర్థవంతంగా ఉంటుంది. అడవిలో ఒక శిథిల వృక్షం వెనకాల నుంచి భయంగా చూస్తూ ఉంటుంది పులి. ఆ పులి కళ్లు చెప్పకనే ఏవో బాధలు చెబుతున్నట్లుగానే ఉంటుంది. పిల్లల కోసం లతిక రాసిన ‘తక్దీర్ ది టైగర్ క్లబ్’ ఎంతో ప్రాచుర్యం పొందింది. ప్రపంచ వ్యాప్తంగా ఇరవై భాషలలోకి అనువాదం అయింది.‘మనుషుల మనుగడ జంతువుల మనుగడతో ముడిపడి ఉంది. స్వల్పకాల స్వార్థప్రయోజనాల కోసం వాటికి హాని చేయడం అంటే భవిష్యత్ కాలంలో మన జీవితాన్ని మనం నాశనం చేసుకోవడమే’ అంటున్న లతికానాథ్ అకాడమిక్ రిసెర్చ్ నుంచి కన్జర్వేషన్ ప్రాజెక్ట్లకు సంబంధించి కన్సల్టెన్సీ వరకు పులుల పరిరక్షణకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది.వాటిని చూడడం అదృష్టంనేను పులులకు సమీపంలో ఉన్నప్పుడు, వాతావరణం వేడిగా ఉందా, చల్లగా ఉందా? అసౌకర్యంగా ఉందా? ఆకలిగా ఉందా? అనే స్పృహ ఉండదు. పులులు మాత్రమే నాకు కనిపిస్తాయి. పిట్ట కావచ్చు, పులి కావచ్చు వాటిని చూడడం అదృష్టంగా భావిస్తాను. వాటిని చూసినప్పుడల్లా వాటి పరిరక్షణకు ఇంకా ఏదైనా చేయాలనే స్ఫూర్తి కలుగుతుంది.– లతికానాథ్ -
తొలి ప్రయత్నంలోనే సివిల్స్ ర్యాంక్, అనన్య మార్క్స్ షీట్ వైరల్
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) పరీక్ష భారతదేశంలో అత్యంత కఠినమైన పోటీ పరీక్ష. UPSC పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలని చాలామంది కలలు కంటారు. IAS, IFS, IRS లేదా IPS అధికారి కావాలనే కలతో ప్రతీ ఏడాది వేలాది మంది ఈ పరీక్ష రాయాలని కోరుకుంటారు. కానీ వారిలో కొద్దిమంది మాత్రమే విజయం సాధిస్తారు. అలాంటి వారిలో ఒకరు మహబూబ్నగర్కు చెందిన దోనూరు అనన్య రెడ్డి. తొలి ప్రయత్నంలోనే అసాధారణ ప్రతిభతో సత్తాచాటిన అనన్యరెడ్డి మార్కుల షీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్ తుది ఫలితాల్లో అనన్య మూడో ర్యాంకు సాధించారు. పదో తరగతి వరకు మహబూబ్నగర్ గీతం హైస్కూల్లోనూ, హైదరాబాద్లో ఇంటర్ విద్యను పూర్తి చేసిన అనన్య ఢిల్లీలో మిరాండా హౌస్ నుండి ఎకనామిక్స్లో మైనర్తో భౌగోళిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. డిగ్రి పూర్తవుతున్న క్రమంలో UPSCపై దృష్టిపెట్టింది. ప్రతిరోజూ 12 నుండి 14 గంటలు చదువుకుంటూ ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే ఎవరి దగ్గరా శిక్షణ తీసుకోకుండానే ఈ ఘనతను సాధించారు. తన సబ్జెక్టు ఆంత్రోపాలజీలో ప్రావీణ్యం సంపాదించడానికి కోచింగ్ తీసుకున్నారట. (చదివింది పదో తరగతే... కట్ చేస్తే కోట్లలో సంపాదన)పట్టుదల దృఢనిశ్చయంతో చదవిUPSC సివిల్ సర్వీసెస్ పరీక్ష 2023లో అత్యుత్తమ ఆల్ ఇండియా ర్యాంక్ -3ని సాధించారు అనన్యరెడ్డి. రెండేళ్ల శ్రమతో తన తొలి ప్రయత్నంలోనే మంచి ర్యాంకుతో సివిల్స్ సాధించడం విశేషం. ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ తనకు ప్రేరణ అని వెల్లడించారు. అంతేకాదు నవలలు చదవడం, క్రికెట్ చూడటం ద్వారా అనన్య రెడ్డి తన టెన్షన్ను మేనేజ్ చేసుకునేదట. ఇదీ చదవండి: 10 నెలల పాపను ఛాతీపై పడుకోబెట్టుకునే తండ్రికి వింత అనుభవం -
కష్టాలున్నాయని కుమిలిపోలే..జీవిత పట్టా కుట్టుకుంది!
ఆమె తన కుల వృత్తి అయిన చెప్పులు కుడుతూనే... పుస్తకాలు పట్టుకుని జీవితంలోని చిరుగులను కుట్టుకుంది. అమ్మకు ఆసరాగా బీడీలు చుడుతూనే... తెలంగాణ యూనివర్సిటీ లో ఇంటిగ్రేటెడ్ కోర్సులతో డిగ్రీ, పీజీ చదివింది. విదార్థి నాయకురాలిగానూ అనేక ఉద్యమాల్లో పాల్గొంది. బీఈడీ అయ్యాక బీడీ కార్మికుల బతుకులపై పీహెచ్డీ చేసి ఇటీవల తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా పట్టా అందుకుని ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ఆమే కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన సిద్ధలక్ష్మి.కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన మోచి వెంకటయ్య, నాగమణి దంపతులకు ఇద్దరు పిల్లలు. పిల్లలిద్దరు చిన్న వయసులో ఉన్నపుడే తండ్రి మరణించాడు. తల్లి నాగమణి ఓ వైపు బీడీలు చుడుతూ మరోవైపు చెప్పులు కుడుతూ పిల్లల్ని చదివించింది. కూతురు సిద్ధలక్ష్మి ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు, అక్కడే ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసింది. చదువుకునే సమయంలో సిద్దలక్ష్మి బీడీలు చుట్టడంతో పాటు కులవృత్తి కూడా చేసేది. పొద్దున, సాయంత్రం చెప్పుల దుకాణంలో తల్లితో పాటు కూర్చునేది. చెప్పులు కుట్టడం, అమ్మడంలో సాయపడేది. ఇంటర్ పూర్తయిన తరువాత తెలంగాణ యూనివర్సిటీలో ఐదేళ్ల డిగ్రీ, పీజీ (ఇంటిగ్రేటెడ్) కోర్సుకు సంబంధించిన ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణురాలై సీటు సాధించింది. దీంతో యూనివర్సిటీలో అడుగుపెట్టిన సిద్ధలక్ష్మి చదువుకుంటూనే విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొంది. పీడీఎస్యూ లో క్రియాశీలకంగా పనిచేసింది. తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలోనూ చురుకుగా పాల్గొంది.ఉద్యమాల్లోపాల్గొంటూనే సిద్ధలక్ష్మి డిగ్రీ, పీజీ పూర్తి చేసింది. బీఈడీ చదువు కోసం మహబూబ్నగర్ వెళ్లింది. తరువాత ఉద్యమ సహచరుడు కన్నయ్యను వివాహమాడింది. ఆమెకు ముగ్గురు కుమారులు.బీడీ కార్మికుల బతుకులపై పరిశోధన...తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో వ్యవసాయం తరువాత ఎక్కువ మంది ఆధారపడే బీడీ రంగంలో కార్మికుల ఆదాయం.. ఖర్చులు అన్న అంశంపై సిద్ధలక్ష్మి పరిశోధన పత్రం సమర్పించింది. ఇటీవల తెలంగాణ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా అందుకుంది. కాగా ఫెలోషిప్ ద్వారా తనకు నెలనెలా అందిన డబ్బులను పొదుపు చేసి ఎల్లారెడ్డిలో ఇల్లు నిర్మించుకుంది. బాన్సువాడలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీగా పని చేసింది. కష్టపడి పరిశోధన చేసి పీహెచ్డీ పట్టా అందుకుంది. అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఇదీ చదవండి: కుటుంబం తొలుత ఒప్పుకోకపోయినా..నిలిచి గెలిచిన ప్రేమికులు! కష్టాలను దిగమింగానుమాది పేద కుటుంబం. అమ్మ ఎంతో కష్టపడి చదివించింది. మా మేనత్త చదువుకోమని ప్రోత్సహించింది. అమ్మకు ఆసరాగా చెప్పులు కుట్టడం, బీడీలు చుట్టడం చేస్తూనే చదువుకు కూడా సమయం కేటాయించేదాన్ని. యూనివర్సిటీలో చాలామంది ప్రోత్సహించారు. చిన్నప్పుడు బీడీ కార్మికుల కష్టాలను స్వయంగా చూశాను కాబట్టి బీడీ కార్మికులనే సబ్జెక్టుగా తీసుకుని పీహెచ్డీ చేశాను. డాక్టర్ పాత నాగరాజు సార్ నా పీహెచ్డీకి గైడ్గా ఎంతో ప్రోత్సహించి నా పరిశోధనకు సహకరించారు. కష్టాలున్నాయని కుమిలిపోతే ఇక్కడిదాకా రాకపోయేదాన్ని. కష్టాలను ఎదుర్కొనడంలోనే సక్సెస్ ఉంటుందని స్వయంగా తెలుసు కున్నాను. – డాక్టర్ సిద్ధలక్ష్మి, ఎల్లారెడ్డిఇదీ చదవండి: చదివింది పదో తరగతే... కట్ చేస్తే కోట్లలో సంపాదన– ఎస్.వేణుగోపాలాచారి, సాక్షి ప్రతినిధి, కామారెడ్డి -
అశోక చక్ర కమలేష్ కుమారి
2001 డిసెంబర్ 13న దేశం ఉలిక్కిపడింది. కారణం? పార్లమెంట్ మీద ఉగ్రదాడి జరిగింది. రక్షణగా ఉన్న సి.ఆర్.పి.ఎఫ్ దళాలు ఉగ్రవాదులతో పోరాడాయి. ఆ సి.ఆర్.పి.ఎఫ్లోనే కమలేష్ కుమారి అనే ఆడపులి కూడా ఉంది. ఆమె ఉగ్రవాదులను అడ్డుకుంటూ దేశం కోసం తన ప్రాణాలు బలి ఇచ్చింది. మరణానంతరం అశోకచక్రను పొందిన కమలేష్ను స్మరించుకుందాం.దేశంలో అంతర్గత భద్రతకు 85 ఏళ్ల క్రితం జూలై 27, 1939లో ‘క్రౌన్ రిప్రెజెంటేటివ్స్ పోలీస్’గా ఏర్పడి ఆ తర్వాత 1949 నుంచి ‘సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్’గా సేవలు అందిస్తున్న సి.ఆర్.పి.ఎఫ్లో ఇప్పటి వరకూ ఒకే ఒక మహిళ ‘అశోక చక్ర’ పొందింది. ఆమె కమలేష్ కుమారి. దేశం కోసం సి.ఆర్.పి.ఎఫ్ నుంచి ఎందరో ప్రాణత్యాగం ఇచ్చినా వారిలో కమలేష్ కుమారిది మాత్రం ఎప్పటికీ స్ఫూర్తినిచ్చే పేరే. అందుకంటే పార్లమెంట్ మీద అటాక్ అయిన సందర్భంలో ఆమె తన ప్రాణాలు అర్పించి మొత్తం హౌస్నే కా పాడటంలో కీలక పాత్ర పోషించింది.ఉత్తర ప్రదేశ్ మహిళకమలేష్ కుమారిది ఉత్తర ప్రదేశ్లోని కన్నౌజ్. సి.ఆర్.పి.ఎఫ్లో 1994లో చేరి కొంతకాలం ‘104 రాపిడ్ యాక్షన్ ఫోర్స్’లో అలహాబాద్లో పని చేసింది. ఆ తర్వాత ‘88 విమెన్స్ బెటాలియన్’లోకి మారింది. 2001 జూలై నుంచి ఆమె ఢిల్లీలో విధులు నిర్వహిస్తోంది. పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు విమెన్స్ బెటాలియన్ సభ్యులు సెక్యూరిటీ విధులు నిర్వర్తించడం ఆనవాయితీ. ఆ విధంగా డిసెంబర్ 13న ఆమెకు పార్లమెంట్ డ్యూటీ పడింది. ఆ రోజునే పార్లమెంట్ మీద ఉగ్రదాడి జరిగింది. అప్పటికి కమలేష్ కుమారికి వివాహమై ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయి వయసు 9 ఏళ్లు, రెండో అమ్మాయి వయసు ఒకటిన్నర సంవత్సరాలు.ఆ రోజునడిసెంబర్ 13, 2001న ఉదయం 11.40 గంటలకు ఒక తెల్ల అంబాసిడర్ కారు పార్లమెంట్ భవనంలోకి దూసుకు వచ్చింది. ఆ సమయాన లోపల అద్వానీ, సుష్మా స్వరాజ్ తదితరులతో పాటు 200 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఆ సమయానికి కమలేష్ కుమారి గేట్ నంబర్ 11 వద్ద ఐరన్ గేట్ 1 దగ్గర విధులు నిర్వహిస్తోంది. ఆ రోజుల్లో మహిళా సి.ఆర్.పి.ఎఫ్ సభ్యులకు ఆయుధాలు ఇచ్చే ఆనవాయితీ లేదు. ఆమె వద్ద కేవలం వాకీటాకీ ఉంది. కారు దూసుకురావడంతో మొదట అందరూ అది కాన్వాయ్ కారు అనుకున్నారు. కాని కమలేష్ కుమారి అది అనుమతి లేని కారు అని గ్రహించి పక్కనే ఉన్న మరో గార్డ్ను అలెర్ట్ చేసి పెద్దగా అరిచి కారు వెనుక పరిగెత్తింది. అప్పటికే అందులో ఉన్న ఐదుగురు ఉగ్రవాదులు కారులో నుంచి జంప్ చేసి కారును పేల్చేయాలని పథకం పన్నారు. కాని కమలేష్ కుమారి పరిగెత్తుకుని రావడంతో కారు అదుపు తప్పి పక్కనే ఉన్న లాన్లోకి దూసుకు పోయింది. కారు పేల్చే ప్లాన్ కుదరక అందులో ఉన్న ఐదుగురు దిగి కాల్పులు మొదలెట్టారు. అప్పటికే వాకీటాకీ ద్వారా అందరినీ అప్రమత్తం చేసిన కమలేష్ కుమారి ఒక నిందితుడు పేలుడు పదార్థాలతో పార్లమెంట్ వైపు దూసుకు వెళ్లడాన్ని చూసి వాకీటాకీ ద్వారా దళాన్ని హెచ్చరించింది. ఇంకొన్ని సెకన్లలో అతడు లోపలికి వెళతాడనగా డోర్లు మూసేయగలిగారు. గేటు వైపు నుంచి ఒకరు, లాన్ వైపు నుంచి మరొకరు ఆ ఉగ్రవాదిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. లేకుంటే అతడు లోపలికి వెళ్లి మొత్తం సభ్యులను ఏం చేసేవాడో ఊహించడమే కష్టం. అయితే తమ రాకను అలెర్ట్ చేసి అంతా ఛిన్నాభిన్నం చేసిన కమలేష్ కుమారిని ఉగ్రవాదులు వదల్లేదు. బుల్లెట్లు కురిపించారు. మొత్తం 11 బుల్లెట్లు ఆమె శరీరంలో దూసుకు పోయాయి. ఆమె ప్రాణాలు పోయినా దేశ గౌరవాన్ని కా పాడగలిగింది.అశోక చక్ర పార్లమెంట్పై జరిగిన ఉగ్రదాడిలో మొత్తం 9 మంది అమరులయ్యారు. వీరిలో కమలేష్ కుమారి ఒక్కరే మహిళ. 2002లో ఆమెకు మరణానంతర ‘అశోక చక్ర’ ప్రకటించారు. నాటి ప్రధాని ఆమెకు అంజలి ఘటించారు. అశోకచక్ర అందుకున్న ఏకైక మహిళగా నిలిచింది కమలేష్ కుమారి. -
సంజన... ఐరన్ మ్యాన్
అత్యంత ఓర్పు నేర్పులతో మానసిక, శారీరక సామర్థ్యాలను ఉక్కు సంకల్పంతో పరిరక్షించుకుంటూ ఏదైనా సాధించగలం అని నిరూపిస్తోంది బొమ్మినేని సంజనారెడ్డి. ఐరన్ మ్యాన్ ప్రపంచ ఛాంపియన్ షిప్కు అర్హత సాధించిన ఈ హైదరాబాద్ వాసి ‘సంకల్పం గట్టిదైతే ఏదైనా సాధ్యమే!’ అంటున్నారు.ఈ ఏడాది అక్టోబర్లో హవాయిలోని కోనాలో జరగనున్న ప్రతిష్టాత్మక ఐరన్మ్యాన్ ప్రపంచ ఛాంపియన్ షిప్కు అర్హత సాధించారు బొమ్మినేని సంజనారెడ్డి. 18–24 ఏళ్ల విభాగంలో ఆమె ఈ స్థానాన్ని సాధించారు. గత జూన్లో ఆస్ట్రేలియాలో జరిగిన అల్ట్రా–ఎండ్యూరెన్స్ ట్రయాథ్లాన్ను 15 గంటల 22 నిమిషాల 13 సెకన్లలో పూర్తి చేశారు. లండన్లో అర్బన్ ఎకనామిక్ డెవలప్మెంట్లో ఎంఎసీ చేస్తున్న సంజన ప్రస్తుతం హైదరాబాద్లోనే శిక్షణ తీసుకుంటున్నారు. ఐరన్మ్యాన్లో తన అడుగు ఎలా మొదలయ్యిందో వివరించారు.కఠినమైన శిక్షణ‘‘స్కూల్ టైమ్లో నేనూ మా చెల్లెలు స్విమ్మింగ్ క్లాసులకు వెళ్లేవాళ్లం. స్విమ్మింగ్లో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. డిగ్రీ చేయడానికి యూకే వెళ్లాను. థర్డ్ ఇయర్లో ఐరన్మ్యాన్ గురించి తెలిసి, శిక్షణ తీసుకున్నాను. మాస్టర్స్ కూడా యుకెలోనే. శిక్షణ తీసుకుంటూ గత జూన్లో ఆస్ట్రేలియాలోని కైర్న్స్లో జరిగిన ఐరన్మ్యాన్లో పాల్గొన్నాను. సైక్లింగ్, రన్నింగ్, స్విమ్మింగ్ ఈ మూడూ నిర్ణీత టైమ్లో పూర్తి చేయాలి. వరల్డ్ ఐరన్ మ్యాన్ 1978లో ఆరంభం అయింది. అయితే, ఇప్పటివరకు మన దేశం నుంచి నా ఏజ్ క్యాటగిరీలో ఎంపిక అయిన వారిలో నేనే మొదటి స్థానంలో ఉన్నాను. మొదట వారానికి 20 గంటలు, రోజూ 3–4 గంటలు ట్రైనింగ్ ఉంటుంది. రేస్ టైమ్ దగ్గర అవుతున్న కొద్దీ ట్రైనింగ్ సమయం పెరుగుతుంది. యూకేకి చెందిన కోచ్ ద్వారా ఆన్లైన్లో సూచనలు తీసుకుంటూ రోజుకు ఐదు నుండి ఆరు గంటలు శిక్షణ తీసుకుంటున్నాను.తప్పుకోవాలనుకున్న క్షణాలూ తప్పలేదు!మొదట్లో కఠిన సాధన వల్ల రేసు నుండి తప్పుకోవాలనిపించిన క్షణాలు చాలా ఉన్నాయి. కానీ లక్ష్యం ఐరన్ మ్యాన్ ను పూర్తి చేయడం మాత్రమే కాదు, ప్రారంభించిన దాన్ని ఎలాగైనా పూర్తి చేయాలన్న సంకల్పంతో ముందుకే అడుగు వేశాను. ఈ అడుగు మరికొందరికి ప్రేరణగా మారాలి అనుకున్నాను. సౌకర్యమైన జీవనంలో ఉంటే మన సామర్థ్యాలు ఏవీ తెలియవు. ఈ రోజుల్లో దాదాపు అందరం చాలా సౌకర్యాలకు అలవాటుపడిపోతున్నాం. అది ఓవర్ అవుతుంది కూడా. దీనివల్ల మన మీద మనకే కాదు, ఎదుటివారి మీద కూడా గౌరవం రాదు. మనలో ఎంతటి శక్తి ఉందో గుర్తించాలి. ఆ శక్తిని వెలికి తీయడానికి నిరంతరం ప్రయత్నించాలి. అప్పుడే మనమేంటి.. అన్నది తెలుస్తుంది. ఒకసారి మనమా శక్తిని గ్రహించగలిగామంటే మనపై మనకే చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. మహిళగా అది చాలా ముఖ్యం. నేనేం సాధించాలో తెలుసుకునే బ్రేకింగ్ పాయింట్కు చేరుకోవాలనుకున్నాను. చాలావరకు మన చుట్టూ ఉన్నవారే తొక్కేయడానికే చూస్తుంటారు. వాటిని అడ్డుకుంటూనే నాలో ఆత్మవిశ్వాసం, సాధికారతను గుర్తించాను.వ్యాపారంలోనూ రాణించాలని..మహిళగా ఈ రేస్లో పాల్గొనడానికి పీరియడ్స్ టైమ్ అసౌకర్యంగా ఉంటుంది. కొంతమందికి చాలా నొప్పి, క్రాంప్స్ వస్తాయని విన్నాను. నాకు అలా ఏమీ కాలేదు. ఆస్ట్రేలియాలో జరిగిన రేస్లో పీరియడ్స్ టైమ్లోనే పాల్గొన్నాను. ఏమీ ఇబ్బంది అనిపించలేదు. మానసిక, శారీరక ప్రయోజనాలు క్రీడల్లోనే సాధించగలమని తెలుసుకున్నాను. స్పోర్ట్స్లో మనం రొటీన్ ఫుడ్ తీసుకుంటే ఇబ్బంది పడతాం. ఎనర్జీ బేస్డ్ సప్లిమెంట్స్ తప్పనిసరి అవసరం. దీంతో ఇండియాలో స్పోర్ట్స్ సప్లిమెంట్ బిజినెస్ రంగంలో రాణించాలని ఆలోచన కలిగింది. అమ్మానాన్నలు వెంకట్రెడ్డి, స్వప్న ఇద్దరూ వ్యాపార రంగంలోనే ఉన్నారు. కూతుళ్లమైనా మా ఆలోచనలను పాజిటివ్గా తీసుకుంటారు. నా చిన్నప్పటి నుంచి స్కేటింగ్, టెన్నిస్, తైక్వాండ్, భరతనాట్యం... సాధన చేస్తూ ఉన్నాను. వీటితో పాటు చేసిన స్విమ్మింగ్ ఐరన్మ్యాన్ వరకు తీసుకెళ్లింది. ఈ విషయంలో అమ్మ నన్ను చాలా ఫుష్ చేశారు. ఈ రేసులో పాల్గొనే అమ్మాయిలు 20 శాతం వరకే ఉన్నారు. ఇండియాలో ఆరేడేళ్లుగా హాఫ్ ఐరన్మ్యాన్ జరుగుతోంది. గోవాలో జరిగే ఈ ఈవెంట్లో పాల్గొనేవారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. మన దేశంలో ఫుల్ ఐరన్మ్యాన్ వస్తే చాలా మంది అమ్మాయిలు ఈ రేసులో పాల్గొని తమని తాము నిరూపించుకునే అవకాశం ఉంది’’ అని తెలిపారు సంజన. – నిర్మలారెడ్డి -
17 ఏళ్లకే ఐదు గిన్నిస్ రికార్డులు..! ఎలాంటి శిక్షణ లేదు కేవలం..
సాంకేతికతో తెలివిగా వినియోగిస్తే అద్భుతాలు సృష్టించొచ్చని ఎందరో నిరూపించారు. సన్మార్గంలో వినియోగించినవాడు..మంచి స్కిల్స్ అందిపుచ్చుకోవడం తోపాటు..ప్రపంచమే గుర్తించేలా పేరుతెచ్చుకుంటాడు. అందుకు ఉదాహరణ ఈ 17 ఏళ్ల జాన్వి జిందాల్. సాంకేతిక సాయంతో ఎలా రికార్డులు సృష్టించగలమో చూపి యువతకు స్ఫూర్తిగా నిలిచింది.చండీగఢ్కు చెందిన ఈ ఫ్రీస్టైల్ స్కేటర్ జాన్వి జిందాల్ స్వీయ శిక్షణతో రికార్డులకెక్కి చరిత్ర సృష్టించింది. ఒకటో రెండో కాదు ఏకంగా ఐదు గిన్నిస్ రికార్డులకెక్కిన అతి పిన్నయస్కురాలిగా నిలిచింది. స్కేటింగ్తో బాగ్రా నృత్యం ప్రదర్శించిన అని పిన్న వయస్కురాలు కూడా జాన్వినే కావడం విశేషం. ఈ విలక్షణమైన ఫీట్తో 2021లో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటు దక్కించుకుంది. అయితే ఈ స్కేటింగ్ శిక్షణ కోసం ఎలాంటి ప్రముఖ ట్రైనర్తో కోచింగ్ తీసుకోకుండా ఇంటర్నెట్ సాయంతో స్వీయంగా నేర్చుకుంది. కేవలం యూట్యూబ్లు, హోమ్ సెటప్ సాయంతో తనకు తానుగా శిక్షణ తీసుకుని రికార్డులు కొల్లగొట్టింది. ఆమె స్కేటింగ్తో భాంగ్రా నృత్యం, యోగా వంటివి అవలీలగా చేస్తుంది. ఆమె సాధించిన గిన్నిస్ రికార్డులు ఏంటంటే..ఇన్లైన్ స్కేట్లపై 30 సెకన్లలో 360-స్పిన్స్ - 27 స్పిన్లురెండు చక్రాలపై వేగవంతమైన స్లాలొమ్ (20 కోన్లు) - 8.85 సెకన్లు30 సెకన్లలో అత్యధిక వన్-వీల్ 360-డిగ్రీ స్పిన్స్ - 42 స్పిన్లుఒక నిమిషంలో అత్యధిక వన్-వీల్ 360-డిగ్రీల స్పిన్స్- 72 స్పిన్లువరుసగా అత్యధిక వన్-వీల్ 360-డిగ్రీల స్పిన్స్ - 22 స్పిన్లుఆమె ప్రాక్టీస్ అంతా ఫుట్పాత్ల మీదే సాగింది. అలా అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. క్రమశిక్షణతో నేర్చుకుంటే..ఏదైనా అవలీలగా నేర్చుకోవచ్చని తెలిపి నేటి యుతకు స్ఫూర్తిగా నిలిచింది. క్రికెటర్ యువరాజ్ సింగ్ తర్వాత చండీగఢ్ నుంచి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లోకి ప్రవేశించి రెండొవ వ్యక్తిగా జాన్వి నిలిచింది. యువరాజ్ సింగ్ పేరు మీద రెండు రికార్డులు ఉన్నాయి. ఆ క్రెడిట్ తల్లిదండ్రులదే..జాన్వి శిక్షణ ఐదేళ్ల ప్రాయం నుంచి మొదలైంది. అయితే ఆమెకు సరైన శిక్షణ ఇచ్చే కోచ్ని కనుగొనలేకపోయామని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. అందువల్ల ఇంటర్నెట్ సాయంతో బ్యాలెన్స్ చేయడం వంటివి నేర్చుకుందని అన్నారు ఆమె తండ్రి మునీష్ జిందాల్. ఇక తానే కోచ్గా మారి తన కూతురికి కొన్ని మెళుకువలు సాధించడంలో సాయం చేసినట్లు తెలిపారు. తొలి ప్రయత్నంలో స్కేటింగ్లో విఫలమవ్వడంతో..చాలా కఠినమైన ప్రాక్టీస్ తీసుకుని అనుకున్నది సాధించిందని చెప్పుకొచ్చారాయన. ముఖ్యంగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో నిలిచేలా జాన్వి స్పిన్నింగ్ స్కేటింగ్ కోసం చాలా కష్టపడినట్లు తెలిపారు. ఇక జాన్వీ తనలా చాలామంది అమ్మాయిలు ఈ స్కేటింగ్ క్రీడలోకి వచ్చేలా ప్రేరేపించడమే తన లక్ష్యమని అంటోంది. అంతేగాదు ఏదైనా నేర్చుకోవడం ఇష్టమైతే ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టకుంటే నేర్చుకుంటే.. ఏదో ఒకనాడు దాన్ని సాధించగలుగుతారు అంటోంది. అంతేగాదు స్కేటింగ్ పట్ల ఉన్న ఆసక్తి, అకుంఠిత దీక్షలే ఈ విధంగా రికార్డులు సాధించేలా చేశాయని చెబుతోంది జాన్వి. ఏదైనా నేర్చుకోవాలంటే సాంకేతికతను ఎంత తెలివిగా వినయోగించగలుగుతున్నాం అన్నదే ప్రధానం..అదే మీకు అన్నితానై నేర్పిస్తుందని అంటోంది జాన్వి.Chandigarh: A 17-year-old self-taught freestyle skater, Janvi Jindal, becomes the youngest girl in India to hold the maximum number of Guinness World Records, a total of five.Janvi Jindal says, "I am the youngest girl to have created the maximum number of Guinness World… pic.twitter.com/ZeNJjULyVb— IANS (@ians_india) July 22, 2025 (చదవండి: సైక్లింగ్ పర్యావరణ హితం.. ఆరోగ్యం కూడా..!) -
షీ టీమ్ బుల్లెట్స్
పనిప్రదేశాల్లో అంటే ఆఫీసులు మొదలు అసంఘటిత రంగాల వరకు ఎక్కడైనా ఎంత ఎక్కువమంది మహిళలుంటే జెండర్ సెన్సిటివిటీకి అంత ఎక్కువ అవకాశం ఉంటుందని చెబుతుంటారు సామాజిక కార్యకర్తలు. ఆ ప్రయత్నం పట్టాలెక్కిందనిపిస్తోంది వడోదర ఎల్ అండ్ టీ ఫ్యాక్టరీలోని ఆల్ విమెన్ ఇంజినీర్స్ టీమ్ను చూస్తుంటే! ఆ మహిళా జట్టు మన తొలి బులెట్ ట్రైన్ (MAHSR... ముంబై–అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్) ప్రాజెక్ట్లో భాగస్వామ్యమవుతూ కొత్త చరిత్రకు ట్రాక్ వేస్తోంది. నిర్మాణం నుంచి నిర్వహణ దాకా సరికొత్త బెంచ్మార్క్ను సృష్టిస్తున్నారు. ఆ టీమ్లో తెలుగు అమ్మాయీ ఉండటం తెలుగురాష్ట్రాలకు గర్వకారణం. హైదరాబాద్కు చెందిన రంగు స్రవంతి, తమిళనాడు, కోయంబత్తూర్కు చెందిన ఆదిత్య ఆర్, కేరళ, కొత్తమంగళానికి చెందిన సుమయ్యా, అదే రాష్ట్రం పాలక్కాడ్కు చెందిన ఫిదా రషీద్లతో కూడిన ఓ పదిమంది అమ్మాయిల టీమ్ ఎమ్మేహెచ్చెస్సార్ ప్రాజెక్ట్లో ప్లానింగ్ నుంచి క్వాలిటీ కంట్రోల్, ప్రొడక్షన్, డిస్పాచ్ వరకు అన్ని శాఖల్లో కీలకమైన విధుల్లో ఉన్నారు. ఈ సివిల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ అందరూ క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అయినవారే! ట్రైనీలుగా చేరి ఇప్పుడు సీనియర్ ఇంజినీర్స్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి నిర్మాణరంగంలో 20 శాతం కూడా మహిళలులేని చోట వీరు నెలకు తొమ్మిదివేల ప్రీకాస్ట్ నాయిస్ బారియర్స్ (శబ్ద కాలుష్యాన్ని తగ్గించే పానల్స్)ను తయారుచేస్తూ పురుషులకు దీటుగా తమ శక్తిని చాటుకుంటున్నారు. 2023లో... ఈ యువ ఇంజినీర్ల హైస్పీడ్ రైల్ జర్నీ 2023లో మొదలైంది. వాళ్లలో ఏ ఒక్కరూ అనుకోలేదట తామీ ప్రాజెక్ట్లో భాగమవుతామని. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నప్పుడు ఇలా రికార్డ్ క్రియేట్ చేసే కొలువుల్లో చేరుతామన్న ఊహ కూడా లేదు ఎవరికీ! ఎల్ అండ్ టీకి సంబంధించిన ఈ ప్రాజెక్ట్లో తమకు ప్లేస్మెంట్ ఖాయమయిందని తెలియగానే అందరూ చాలా ఉత్సాహపడ్డారు. అదే ఉత్సాహంతో శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగాల్లో చేరారు. తొలిరోజు సైట్లోకి అడుగుపెట్టగానే ఆ వాతావరణం చాలా ఇబ్బందిగా అనిపించింది. పనీ అంతే కష్టంగా తోచింది. పురుష ఉద్యోగుల నుంచి ఏమాత్రం సహకారం అందక పోగా ‘ఏంటీ.. ఈ ఫీల్డ్లో కూడా ప్రతాపం చూపించుకోవాలనే..!’ అన్నట్టుగా ఉండేవట వాళ్ల చూపులు, మాటలు. అయినా నిరుత్సాహపడలేదు.. నేర్చుకోవాలనే తపనను వీడలేదు. పట్టుదలతో పని నేర్చుకున్నారు. హేళన చేసిన పురుష ఉద్యోగులు ఆశ్చర్య పోయారు. గౌరవించడం మొదలుపెట్టారు. పని నేర్చుకోవడంలో సాయపడ్డారు. ‘అప్పటిదాకా ఆడవాళ్లు ఇలా సైట్లోకొచ్చి పనిచేయడం వాళ్లు చూడలేదు. అందుకే మేము రావడాన్ని జీర్ణించుకోలేక పోయారు. కానీ పని పట్ల మాకున్న కమిట్మెంట్ చూసి మమ్మల్ని గౌరవించడం మొదలుపెట్టారు. దాంతో ఆఫీసులో పని చేసే వాతావరణమే మారి పోయింది’ అని చెబుతుంది డిస్పాచ్ ఇన్చార్జ్ ఫిదా రషీదా. ‘మొదటి అవకాశమే ఇందులో రావడం.. ఆల్ విమెన్ టీమ్లో భాగమవడం.. నిజంగా ప్రౌడ్ మూమెంట్స్’ అంటుంది క్వాలిటీ ఇన్చార్జ్ సుమయ్యా. ‘అత్యాధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణంలో నేను పాలు పంచు కుంటున్నందుకు చాలా గర్వంగా ఉంది’ అని చెబుతుంది ప్రొడక్షన్ ఇన్చార్జ్ రంగు స్రవంతి. ‘నిర్మాణ రంగంలోకి మరింతమంది అమ్మాయిలు రావాలి. అప్పుడే ఇందులోనూ మహిళా భాగస్వామ్యం పెరిగి కీలక బాధ్యతల్లోకి వెళ్లే అవకాశం దొరుకుతుంది’ అంటుంది ప్లానింగ్ ఇన్చార్జ్ అదితి. వీళ్లంతా కష్టపడుతున్న ఈ హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్లో ముంబై నుంచి అహ్మదాబాద్కు కేవలం మూడుగంటల్లో చేరుకోవచ్చు. -
ఎవరీ మీరా మురాటీ..? టెస్లా టు థింకింగ్ మెషిన్ ల్యాబ్..
మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన మీరా మురాటీ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ ‘టెస్లా’లో ప్రొడక్ట్ మేనేజర్గా పనిచేసింది. ఆ తరువాత వర్చువల్ రియాలిటీ స్టార్టప్ ‘లిప్ మోషన్’లో పనిచేసింది. 2016లో ‘ఓపెన్ ఏఐ’లో చేరిన మీరా రకరకాల ప్రాజెక్ట్లలో ముఖ్యపాత్ర పోషించింది. అడ్వాన్స్డ్ ఏఐ మోడల్స్, టూల్స్ డెవలప్మెంట్లో కీలకంగా వ్యవహరించింది. చీఫ్ టెక్నికల్ ఆఫీసర్(సీటీవో) స్థాయికి చేరింది.సొంతంగా కంపెనీ స్థాపించాలనేది మీరా మురాటీ చిరకాల స్వప్నం‘డూ మై వోన్ ఎక్స్ప్లోరేషన్’ అంటూ గత సంవత్సరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘ఓపెన్ఏఐ’కి గుడ్బై చెప్పింది. ఫిబ్రవరి 2025లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) స్టార్టప్ ‘థింకింగ్ మెషిన్ ల్యాబ్’ మొదలుపెట్టింది. ‘టెస్లా’ను విడిచి ‘ఓపెన్ఏఐ’లో చేరడానికి గల కారణం గురించి ఇలా చెప్పింది...‘నాకు మొదటి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయాలపై ఆసక్తి. ఆ ఆసక్తితోనే ఓపెన్ ఏఐలో చేరాను’. ‘ఓపెన్ఏఐ’ని విజయవంతం చేయడంలో మీరా కృషి ఎంతో ఉంది.అల్బేనియాలో పుట్టిన మీరా మురాటీకి చిన్నప్పటి నుంచి సాంకేతిక విషయాలపై అమితమైన ఆసక్తి. ‘జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు సాంకేతిక జ్ఞానం పరిష్కారం చూపుతుంది’ అంటుంది మీరా. టెక్నాలజీలో హాటెస్ట్ కంపెనీలుగా పేరున్న ‘టెస్లా’ ‘ఓపెన్ఏఐ’లను వదులుకొని సొంత స్టార్టప్ మొదలుపెట్టిన మీరా మురాటీ విజయం సాధించగలదా?‘కచ్చితంగా’ అని చెప్పడానికి ఎన్నో సంస్థలలో ఆమె అద్భుతమైన, ప్రతిభావంతమైన పనితీరు బలమైన సాక్ష్యం. (చదవండి: మనకు మనమే స్పెషల్...) -
స్టూడెంట్స్ ఆస్కార్ అవార్డ్: ఆస్కార్ దారిలో తెలుగమ్మాయ్!
వందకి పైగా దేశాలు... 3,127 షార్ట్ఫిల్మ్లు... 80 మందికిపైగా న్యాయ నిర్ణేతలు... 30 రోజుల పాటు వడపోతలు.. చివరికి మిగిలింది... 60 షార్ట్ ఫిల్మ్లు... అందులో ఒకటి భారత్కు చెందిన... అదీ... ఆంధ్రప్రదేశ్లోని ఎన్ఐడీ కి చెందిన విద్యార్థి లావణ్య లోధది కావడం విశేషం. ప్రపంచ ప్రఖ్యాత అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 52వ స్టూడెంట్ అకాడెమీ అవార్డుల్లో లావణ్య తన సత్తా చాటింది. తాను తీసిన ‘వీన్స్ ఆఫ్ గ్రేస్’ చిత్రం టాప్–15లో చోటు దక్కించుకుంది.తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే...కాన్పూర్కి చెందిన లావణ్య లోధి తండ్రి ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి కావడంతో ప్రతి మూడేళ్లకోసారి బదిలీలతో దేశంలోని పలు ప్రాంతాల్లో పెరుగుతూ విద్యనభ్యసించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలతో కలగలసి లావణ్య జీవితం సాగింది. తల్లి కథక్ నాట్య గురువు. ఆమె నుంచే లావణ్యకు నాట్యం, కథలపై ఆసక్తి పెరిగింది. చిన్నప్పటి నుంచి చిత్రలేఖనంలో రాణించడంతో పాటు.. సృజనాత్మకంగా బొమ్మలు గీస్తుండటంతో.. తల్లిదండ్రులు ప్రోత్సహించి.. లావణ్యని డిజైన్ రంగం వైపు అడుగులు వేయించారు. 2020లో ప్లస్–2 చదువుతున్న సమయంలో పరీక్ష పే చర్చా కార్యక్రమంలో లావణ్య కళాకృతుల గురించి ప్రధాని మోదీ ఆమెని ప్రశంసలతో ముంచెత్తారు. అనంతరం.. ఆమె విజయవాడ సమీపంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ)విద్యా సంస్థలో కమ్యునికేషన్ డిజైన్లో చేరింది. యానిమేషన్, మూవింగ్ ఇమేజెస్పై నిరంతరం తన డిజైన్లతో పరిశోధనలు చేస్తూనే ఉంది. ప్రస్తుతం ఎన్ఐడీలో ఫైనల్ ఇయర్ చదువుతోంది. లావణ్య చదువులోనే కాకుండా.. యానిమేషన్, ఫిల్మ్ లాంగ్వేజ్, విజువల్ స్టోరీ టెల్లింగ్, సౌండ్, కల్చరల్ స్టడీస్లోనూ డ్యాన్సర్గా, స్టోరీటెల్లర్గా రాణిస్తూ.. యూనివర్శిటీల్లో అనేక బహుమతులు గెలుచుకుంది.విన్సీ ఆఫ్ గ్రేస్ కథేంటీ..?లావణ్య తీసిన ఈ షార్ట్ ఫిల్మ్లో ఎలాంటి సంభాషణలూ లేవు. కేవలం సంగీతం, నృత్యం, అభినయమే కథకు బలం. ఇది ఒక చిన్న యానిమేటెడ్ చిత్రం. ఒక యువతి తాను జీవితాన్ని కోల్పోయి సంస్కృతికి దూరమైపోతుంది. ఈ సమయంలో ఆమె తల్లి తనకు నేర్పినట్లుగా నాట్యం నేర్చుకోవడం మొదలు పెడుతుంది. ఆమెకు గుర్తుకొచ్చే పాత జ్ఞాపకాలన్నీ.. ఒక్కొక్కటిగా కనుమరుగవుతూ.. ఆ అమ్మాయి.. నృత్యంతో పాటుగా.. కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుంటుంది. సూర్యాస్తమయ సమయంలో ఓ ప్రశాంతమైన టెర్రస్పై కనిపించేలా ఈ చిత్రాన్ని లావణ్య ఆవిష్కరించింది. మనం ఎవరం.. ఎక్కడి నుంచి వచ్చాం.. మన సంస్కృతి సంప్రదాయాల్ని గుర్తు చేసుకునేందుకు నడక, నడత, నాట్యం ఎలా సహాయపడతాయన్నదే విన్సీ ఆఫ్ గ్రేస్.అన్నీ ఆమే!ఈ చిత్రానికి ఫిల్మ్ మేకర్, యానిమేషన్ ఫిల్మ్ డిజైనర్, మొత్తం సినిమా స్క్రిప్ట్, సౌండ్ డిజైన్, క్యారెక్టర్ డిజైన్, యానిమేషన్.. ఇలా అన్నీ.. లావణ్యే కావడం విశేషం. లావణ్యకు మెంటార్గా ఎన్ఐడీ కమ్యునికేషన్ డిజైన్ హెడ్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన కూర్మనాథం వ్యవహరించగా.. ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు డా.అభిషేక్, గౌతమ్ చక్రవర్తి, జనాంతిక్ శుక్లా, బినితా దేశాయ్, శేఖర్ ముఖర్జీ సహకారం అందించారు.ఈ అవార్డులు ఎవరిస్తారంటే.?ఆస్కార్ అవార్డులు అందించే.. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఆధ్వర్యంలో స్టూడెంట్ అకాడమీ అవార్డులు (ఎస్ఏఏ) అందిస్తారు. ఈ ఏడాది 52వ అవార్డుల్ని రోలెక్స్ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నారు. మే 18 వరకూ ఎంట్రీలు తీసుకున్నారు. ప్రపంచంలోని వివిధ డిజైన్ ఇనిస్టిట్యూట్స్, యానిమేషన్, ఫిల్మ్ ఇనిస్టిట్యూట్స్లలో విద్యనభ్యసిస్తున్న అండర్ గ్రాడ్యుయేట్స్, గ్రాడ్యుయేట్ విద్యార్థుల్ని చిత్ర రంగంలో ప్రోత్సహించేందుకు ఏటా ఈ అవార్డుల్ని అందిస్తుంటారు.ఏయే విభాగాలంటే..యానిమేషన్, డాక్యుమెంటరీ, లైవ్ యాక్షన్ కథనం, ప్రయోగాత్మక షార్ట్ఫిల్ములని ఆస్కార్.ఆర్గ్ కు ఆన్లైన్లో పంపగా.... మే 18 వరకూ అందిన షార్ట్ఫిలింలని తీసుకున్నారు. ఆ తర్వాత వడపోత నిర్వహించారు. మొత్తం 3,127 చిత్రాల్లో వివిధ దశల్లో వడపోతలు నిర్వహించి.. సెమీఫైనల్కు 60 చిత్రాల్ని ఎంపిక చేశారు. ఈ ఏడాది అక్టోబర్ 6న న్యూయార్క్లోని జీగ్ఫెల్డ్ బాల్ రూమ్లో జరిగే న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా.. ఈ 60 చిత్రాల్లో టాప్ చిత్రాల్ని ప్రకటించి.. అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించనున్నారు. స్టూడెంట్ అకాడమీ అవార్డు గెలుచుకున్న చిత్రాలు యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్, లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ లేదా డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో 98వ ఆస్కార్ అవార్డుల కోసం పోటీ పడేందుకు అర్హత సాధిస్తాయి.అమ్మకే అంకితం!నా నాట్య గురువు అమ్మకు ఈ విన్సీ ఆఫ్ గ్రేస్ని అంకితం చేస్తున్నాను. ఎన్ఐడీ సహకారంతో.. ఈ షార్ట్ఫిల్మ్ని పూర్తి నమ్మకంతో తీసి.. ఎస్ఏఏ అవార్డులకు పంపించాను. సెమీఫైనల్కు చేరుకోవడం చాలా ఆనందంగా ఉంది. అక్టోబర్ 6న ఒక్క అవార్డు అయినా.. విన్సీ ఆఫ్ గ్రేస్కు వస్తుందని కచ్చితంగా నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరి జీవిత వారసత్వ కథే నా చిత్రం. ఆస్కార్ వేదికపై విన్సీ ఆఫ్ గ్రేస్ ప్రదర్శితమయ్యేలా భారతీయులందరి ఆశీస్సులు నాకు కావాలి.– కరుకోల గోపీకిశోర్ రాజా, సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం -
పాము ఉందంటే పరిగెత్తుకొస్తుంది.. 800కి పైగా స్నేక్స్..!
సాధారణంగా బొద్దింకలు, బల్లులను చూస్తేనే కెవ్వుమని అరుస్తుంటారు మహిళలు. వాళ్లు సున్నిత మనస్కులు ఇలాంటివి వాళ్లకు చేతనవ్వదు అన్న మాటలే పదేపదే వినిపిస్తుంటాయి. కానీ వాటన్నింటిని కొట్టిపడేసిలా శివంగిలా దూకి తామెంటో నిరూపుంచికుంటున్నారు మగువలు. అయితే యుద్ధం నుంచి అగ్నిమాపకదళం వరకు అన్ని కఠినతరమైన రంగాల్లోనూ అలవోకగా తామేంటో నిరూపించుకున్నారు. ఇప్పుడూ ఏకంగా స్నేక్ క్యాచర్గా కూడా సత్తా చాటుతున్నారు. అలా అత్యంత విషపూరితమైన పాములను రెప్పపాటులో పట్టే ఏకైక మహిళా స్నేక్ క్యాచర్గా పేరుతెచ్చుకుంది ఓ మహిళ. ఆ ధీర వనితే కేరళకు చెందిన డాక్టర్ జిఎస్ రోష్ని. దూరదర్శన్లో మాజీ న్యూస్ రీడర్ కూడా. హాయిగా న్యూస్ రీడర్గా సాగిపోతున్న కెరీర్..వన్యప్రాణుల రక్షణ శిక్షణతో ఊహించని మలుపు తిరిగింది. అలా ఆమెకు భయంకరమైన పాములను పట్టి అడువుల్లో వదలడం తెలియకుండానే హాబీగా మారింది. అలా స్నాక్ క్యాచర్ రంగంలోకి వచ్చింది. ఆ అభిరుచితో ఇప్పటి వరకు దాదాపు 800కు పైగా పాములను సునాయాసంగా పట్టేసింది. వాటిలో కొండచిలువలు, రక్తపింజరలు, కింగ్ కోబ్రాలు కూడా ఉన్నాయి. ఆమె ఏ పామునైనా జస్ట్ మూడు నుంచి ఆరు నిమిషాల్లో పట్టేసి అడవుల్లో వదిలేస్తారామె. ఆమె అజేయమైన ధైర్య సాహసాలకు గానూ సర్టిఫైడ్ ఫిమేల్ స్నేక్ క్యాచర్గా లైసెన్స్ పొందిన ఏకైక కేరళ మహిళ కూడా రోష్నినే. ఆ విధంగా కేరళ అటవీ శాఖలోకి ప్రవేశించి స్నేక్ క్యాచర్గా సేవలందిస్తున్నారామె. ఆ వృత్తిలో ఆమెకు అర్థరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఎందుకంటే పాము కనిపించింది అంటూ ఏ అర్థరాత్రి, తెల్లవారుజామునో కాల్స్ వస్తుంటాయి. వెంటనే పాము కొక్కెం, సంచి తీసుకుని బైక్పై వెళ్లిపోవాల్సిందే అంటున్నారు రోష్ని. కానీ ఏపనిలో అయినా సవాలు ఉంటుంది. నిజమైన సవాలు మన భావోద్వేగాలే అంటారామె. నిజంగా పాములను జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే అదేమంతా భయం కాదట. ఇబ్బందుల పాలు చేసే పరిస్థితుల్లో ఎలాంటి భావోద్వేగానికి గురికాకుండా ఉండటమే అతికష్టమైన సవాలు అని చెబుతోంది రోష్ని. ప్రస్తుతం ఆమె త్రివేండ్రంలో రాపిడ్ రెస్పాన్స్ బృందానికి నాయకత్వం వహిస్తోంది. చివరగా ఆమె ఏ రంగంలో అయినా రాణించగలను అనే నమ్మకం ఉంటే..ధైర్యంగా వెళ్లిపోండి, వెనక్కిచూడొద్దు అప్పుడే విజయం తథ్యం అంటోంది రోష్ని. View this post on Instagram A post shared by The Better India (@thebetterindia) (చదవండి: ఐటీ గర్ల్స్ జాన్వీ కపూర్, అనన్య పాండే ధరించే కాలా ధాగా స్టోరీ ఏంటో తెలుసా..!) -
మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్ కిరీటం దక్కించుకుని చరిత్ర సృష్టించింది!
భారతీయ సంతతికి చెందిన విధు ఇషిక (Vidhu Ishiqa) మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్ (Mrs Earth International 2025) అందాల పోటీ కిరీటం గెల్చుకుంది. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఈ విజయం ప్రతీ అమ్మాయి విజయం అని పేర్కొంది. అంతేకాదు తన జీవితంలో ప్రతీ బ్రేక్ డౌన్కు ఇది పండగ లాంటిదని తెలిపింది. ఇది కేవలం కిరీటం కాదు-ప్రతీ బ్రేక్ డౌన్, ప్రతీ బౌన్స్-బ్యాక్, భయం కంటే లక్ష్యాన్ని ఎంచుకున్న ప్రతీ క్షణానికి సంబంధించిన వేడుక అంటూ ఒక భావోద్వేగ సందేశాన్ని ఇన్స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఆమెకు అభినందనల వెల్లువ కురిసింది. View this post on Instagram A post shared by Moon 🌙 (@vidhuishiqa)మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్ అనేది పర్యావరణ అవగాహనను ప్రోత్సహించే ఉద్దేశంతో నిర్వహించే అంతర్జాతీయ అందాల పోటీ. ప్రతి సంవత్సరం, వివిధ దేశాల నుండి పోటీదారులు ఇందులో పాల్గొంటారు. అలా దేశ విదేశాలనుంచి వచ్చిన పోటీ దారులను ఓడించి విధు ఇషిక టైటిల్ దక్కించుకుంది. తద్వారా ఎందరో అమ్మాయిల కలలకు ప్రేరణగా నిలిచింది. View this post on Instagram A post shared by Official Mrs India Universe (@mrsindiauniverseofficial) మిసెస్ ఇండియా యూనివర్స్ ఇన్స్టాగ్రామ్లో విధు ఇషికను అభినందించింది. భారతీయ సంతతికి చెందిన అమ్మాయి విధు మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్ 2025 ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. దేశం గర్వపడేలా చేసిందని కొనియాడింది. మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్ 2025 అందాల కిరీటీ దక్కించుకునిభారతీయులు గర్వపడేలా చేసిందనీ తెలిపింది. మరోవైపు తనను అభినందించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపింది విధు. విధు ఇషిక సింగర్ కూడా. పర్యావరణ అనుకూల ఫ్యాషన్ను ప్రోత్సహించే గ్లామ్గువా (GLAMGUAVA) అనే ఫ్యాషన్ ప్లాట్ఫామ్ను కూడా స్థాపించింది 2024లో మిసెస్ ఎర్త్ 2024 అవార్డు కూడా గెల్చుకుంది. విధు ఈ ప్రయాణం అంత ఈజీగా ఏమీ సాగలేదు. ప్రతీ అడ్డంకినీ, కష్టాన్ని మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొంది. తనను తాను నమ్ముకొని నిగ్రహంతో అడుగులు వేసింది. టీవీ షోల దగ్గరినుంచి అంతర్జాతీయ ర్యాంప్ల వరకు, సింగర్గా, స్థిరమైన ఫ్యాషన్ ప్లాట్ఫామ్ ఫౌండర్గా ఒక మహిళ ధైర్యసాహసాలు ఎలా ఉంటాయో ప్రపంచానికి చూపించింది. -
డాక్టర్... ట్రీట్మెంట్..! కార్చిచ్చుకి సమూలంగా చెక్..
డాక్టర్ మేఘా సక్సేనా.. ఉత్తరాఖండ్ నివాసి. అక్కడి అల్మోరా జిల్లా గవర్నమెంట్ కాలేజ్లో పనిచేసేవారు. ప్రజారోగ్యం నుంచి పర్యావరణం వైపు మళ్లారు. ఆమె మెడికల్ ప్రాక్టీస్లో ఉన్నప్పుడే అల్మోరాలో అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు నిర్లక్ష్యం చేస్తున్న ఓ క్లిష్టమైన సమస్యను పరిశీలించారు. అదేంటంటే.. అల్మోరాను ఆనుకుని ఉన్న అడవిలోని దేవదారు వృక్షాల మీద పండి రాలిపడి ఎండిన ఆకులు. ఎండిన ఆకులతో సమస్యేంటి అని విస్తుపోయే ముందు ఉత్తరాఖండ్ భౌగోళిక స్వరూపం తెలుసుకోవాలి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 71 శాతం అడవే! అందులో పదహారు శాతం దేవదారు వృక్షాలు! స్థానికంగా వాటిని చిర్ కా పేడ్ అంటారు. ఆ అడవిలో తరచు కారుచిచ్చు రగులుతూ ఉంటుంది. దీనివల్ల 2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకు దాదాపు 54, 801 హెక్టార్ల అడవి తగలబడిపోయింది. కార్చిచ్చు వ్యాపించడానికి కారణం.. పండిపోయి నేలరాలి ఎండిపోయిన దేవదారు ఆకులు! ఇవి అగ్నికి ఆజ్యంలా పనిచేసి అడవిని బూడిదచేస్తూ కర్బన ఉద్గారాలకు తోడవుతున్నాయి. జీవవైవిధ్యానికి ప్రమాదకారిగా మారుతున్నాయి. దీన్ని గ్రహించిన డాక్టర్ మేఘా సిరంజి సూది మీద నుంచి సూదుల్లాంటి దేవదారు ఆకుల మీద దృష్టిపెట్టారు. అదీగాక తన మెడికల్ ప్రాక్టీస్లో.. రసాయన ఎరువులు ప్రజల ఆరోగ్యం మీద చూపుతున్న దుష్ప్రభావాల కేసులనూ చూశారు. ఎండిపోయిన దేవదారు ఆకులతో ఇటు సాగుకు, అటు పర్యావరణానికి ఉపయోగపడే ప్రయోగాలేమైనా చేయొచ్చా అని ఆలోచించసాగారు.బయోచార్.. ఎకోచార్ఆలోచన రాగానే రంగంలోకి దిగారు మేఘా. అది 2019 సంవత్సరం. అప్పటికి ఆమె గర్భవతి. మెటర్నిటీ లీవ్ తీసుకున్నారు. ఆ సెలవులను తన ప్రయోగానికి వాడుకోవాలనుకున్నారు. కొంతమంది నిపుణులతో కలిసి ప్రయత్నం మొదలుపెట్టారు. 2021లో ఫలితం వచ్చింది. అది పర్యావరణ ప్రమాదానికి పరిష్కారాన్నే కాదు, తనను ఆంట్రప్రెన్యూర్గానూ నిలిపింది. అదే బయోచార్ (కట్టెబొగ్గు). ఆ స్టార్టప్ పేరు ‘ఎకోచార్’. ఎండిపోయిన ఆకులన్నిటినీ ఏరేయడం వల్ల కార్చిచ్చు వ్యాప్తిని సాధ్యమైనంత వరకు అరికట్టడమే కాకుండా వాటినుంచి తయారైన బయోచార్ చక్కటి సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతోంది. ఇది నేల సారాన్ని పెంచుతోంది. అంతేకాదు దీన్నుంచి పాలీఫామ్లోని కోళ్లకు, చేపల చెరువుల్లోని చేపలకూ కావల్సిన సేంద్రియ దాణానూ తయారు చేశారు. ఒక కిలో బయోచార్.. పదహారు వందల గ్రాముల కార్బన్డయాక్సైడ్ను నిరోధిస్తుంది. దీనికి ఉత్తరాఖండ్లోనే కాదు ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. ‘నేను పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి హాని చేస్తున్న రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయం చూడాలని మాత్రమే అనుకున్నాను. ఆ దిశగా వర్క్ చేశాను. దాని ఫలితం ఈ రెండిటికి పరిష్కారాన్నే కాదు నన్ను అంట్రప్రెన్యూర్గానూ మార్చింది. ఈ ఉత్సాహంతో స్థానికంగా దొరికే వనమూలికలు, వ్యవసాయ వ్యర్థాలతో పశువుల మేతనూ తయారుచేయాలనుకుంటున్నాను. నా ప్రస్తుత లక్ష్యం అదే’ అని చెబుతుంది డాక్టర్ మేఘా సక్సేనా.(చదవండి: డిజిటల్ వేదికపై ఓ నారి పోరు! సామాన్యురాలి విజయగాథ) -
డిజిటల్ వేదికపై ఓ నారి పోరు!
ఆ ఊరికి అంబులెన్స్ రాదు. రాలేదు. కారణం రోడ్డు పూర్తిగా పాడైంది. నెలలు నిండుతున్న గర్భవతిలీలా సాహు తన ఇన్స్టా అకౌంట్ను ఆయుధంగా చేసుకుంది. ఎం.పి.ని, ఎం.ఎల్.ఏ.ని, ఆఖరుకు నితిన్ గడ్కరీని కూడా వదల్లేదు. ‘మా ఊళ్లో ఆరుగురు గర్భిణులు ఉన్నారు. మేము ప్రసవానికి ఎలా వెళ్లాలి?’ అని నిలదీసింది. చివరకు ఇది దేశం దృష్టినే ఆకర్షించింది. ఇప్పుడు ఆ ఊళ్లో రోడ్డు పనులు మొదలయ్యాయి. మధ్యప్రదేశ్ సిద్ధి జిల్లాలో ఒక సామాన్యురాలి విజయగాథ. కొందరికి పోరాడాలంటే భయం. సమస్యలను నలుగురి దృష్టికి తీసుకెళ్లాలంటే భయం. ఇవన్నీ జరిగేవా చచ్చేవా అనే నిస్పృహ. ఈ దేశం బాగుపడదు అని ఎప్పటి నుంచో వినపడే అరిగిపోయిన డైలాగ్ ఒకటి. మనకెందుకు అనే ఫిలాసఫీ ఎలానూ ఉంది. దీని వల్ల ప్రశ్న మాయమైంది. పాలకుల నుంచి వినపడాల్సిన జవాబు కనపడకుండా పోయింది. కానీ 22 ఏళ్ల లీలా సాహుకి తెలుసు– ప్రశ్నిస్తే జనం తోడు నిలుస్తారని. ప్రశ్నలో బలం ఉంటే అది పోరాటంగా మారుతుందని. పోరాటానికి ఫలితం ఉంటుందని. అంతా చేసి ఆమె పెట్టిన ప్రశ్న ‘మా ఊరికి రోడ్డెప్పుడేస్తారు?’ అని.అది మధ్యప్రదేశ్లోని సిద్ధి జిల్లా. ఆ జిల్లా నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది లీలా సాహు పల్లె ఖడ్డీఖుర్ద్. ఆ ఊరు నుంచి హైవే ఎక్కాలంటే 8 కిలోమీటర్ల కచ్చారోడ్డు ఉంది. ఆ రోడ్డు ఎప్పటి నుంచో పాడైపోయింది. వాన వస్తే బురద. ఏ వాహనం తిరగలేదు. అన్నీ గుంటలే. దాని వల్ల కూడా అంబులెన్స్ రావడం కష్టమవుతోంది. ఆ రోడ్డును వేయించాలని కంకణం కట్టుకుంది లీలా సాహూ. 2023లో మొదటిసారి ఆమె మోదని ఉద్దేశిస్తూ వీడియో చేసింది. ‘మోదీ గారూ.. మధ్యప్రదేశ్ మీకు 29 మంది ఎంపీలను ఇచ్చింది. మా ఊరికి రోడ్డు వేయండి’ అని విన్నవించింది. ఆ వీడియో బాగా వైరల్ అయ్యింది. ఆ తర్వాత లీలా సాహూ రోడ్డు గురించి కాకుండా ఊరి సమస్యల మీద వీడియోలు చేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు ఆమె గర్భవతి. నెలలు నిండుతున్నాయి. ఏ క్షణాన్నైనా నొప్పులు వస్తే అంబులెన్స్ వచ్చి సిద్ధి వరకూ తీసుకెళ్తే డెలివరీ అవుతుంది. అయితే గతంలో చాలాసార్లు అంబులెన్స్ ఊరి పొలిమేరల వరకే వచ్చి ఆగిపోయిన సంఘటనలున్నాయి. చాలాసార్లు గర్భిణీలు ట్రాక్టర్లలో వెళ్లాల్సిన దుస్తితి. అందుకే లీలా సాహూ తిరిగి వీడియో యుద్ధం మొదలెట్టింది. ‘నితిన్ గడ్కరీ గారూ... మా ఊరి రోడ్డు చూశారా ఎలా ఉందో’ అని స్థానిక ఎంపీ రాజేశ్ మిశ్రాను ఉద్దేశిస్తూ ‘మా ఊళ్లో ఆరుగురు గర్భిణులు ఉన్నారు. మేమంతా ప్రసవానికి ఎలా వెళ్లాలి’ అని ప్రశ్నించింది.ఈ ప్రశ్నను మీడియా ఆ ఎంపీ దగ్గరకు తీసుకెళ్లినప్పుడు అతను ‘డెలివరీ డేట్ ఉంటుందిగదా... ఆ సమయానికి ఆమెను టౌన్ను తీసుకొస్తాం’ అని జవాబు ఇవ్వడంతో సోషల్ మీడియాలో బాగా విమర్శ ఎదురైంది. లీలా సాహూ గర్భిణి కావడం ఆమె పోరాటం సహేతుకం కావడంతో మెల్లగా జనంలో కదలిక వచ్చింది. గ్రామీణులు ఆమెకు దన్నుగా నిలబడ్డారు. దీంతో ప్రభుత్వం నుంచి ఏ సహాయమూ అందకపోయినా స్థానిక ఎం.ఎల్.ఏ తన జేబు ఖర్చులతో రోడ్డు రిపేరు పనులు మొదలెట్టించాడు. ‘రోడ్డు శాంక్షన్ అయ్యింది... ఈలోపు నా వంతు కృషి చేస్తున్నాను’ అని తెలియచేశాడతడు.రోడ్డు మీద రోడ్డు రోలర్, ఎస్సలేటర్లు తిరుగుతుంటే లీలా సాహు ముఖంలో చిర్నవ్వు వచ్చింది.పోరాడండి.. పోయేదేం లేదు... మీ సమస్యలు తప్ప’ అంటోందా విజేత తన విజయ దరహాసంతో.(చదవండి: స్కాన్ అండ్ పేతో తప్పుతున్న లెక్క..! హెచ్చరిస్తున్న ఆర్థిక నిపుణులు) -
అడవిని సాకుతున్న ఆడపడుచులు!
అడవిలోని కోతులు చిటారుకొమ్మనున్న పండును రుచి చూస్తున్నట్టుగా కొద్దిగా కొరికేసి, మళ్లీ మరో పండును అందుకుంటాయి. పూర్తిగా తినేయకుండానే పండ్లనిలా పక్కకు విసిరేస్తున్నందుకు విసుగూ, చిరాకు మనకు. అరణ్యంలోని ఏనుగు అవసరమైనదేదో తినేయకుండా అందుతున్న కొమ్మల్ని అల్లిబిల్లిగా విరిచేసి అల్లంత దూరానికి విసిరేసి చెల్లాచెదురుగా పడేస్తుంది. చూడ్డానికి ఇదేదో వృథా పనిలా అనిపిస్తుందిగానీ... ఇందులో అడవి మనుగడ దాగుంది. కోతి మాత్రమే చిటారు కొమ్మకు చేరగలుగుతుంది. కానీ అంతదూరాలకు ఎక్కలేనివీ... మధ్య కొమ్మలూ, చెట్టు మొదళ్లలో ఉండే జీవులూ తినడానికి ప్రకృతి చేసిన ఏర్పాటది. అలా ఎన్ని జీవులు ఎంత ఎక్కువగా తింటే... వాటి గింజలు అంతంత దూరాలకు చేరి అక్కడ మొలకెత్తుతుంటాయి. అలా మొలకెత్తే మొక్కలకు సూర్యరశ్మి అందేందుకూ... పక్కలకు పాకకుండా ఇతర మొక్కలకూ అవకాశమిస్తూ చెట్టు నిటారుగానే ఎదిగేందుకు ఏనుగులిలా పక్క కొమ్మల్ని విరిచి పడేస్తుంటాయి. మనుగడ కోసం అన్ని జీవులూ ప్రయత్నిస్తున్నట్టే... తనలోని ఇతర జీవులను బతికించుకుంటూ... తాను బతికి పచ్చటి ఆకుల బట్టకట్టడానికి ప్రయత్నిస్తుంది అడవి. సహజ సహజాతం తప్ప ఇతర జ్ఞానాలేమీ లేని మూగజీవులూ అందుకు తోడ్పడుతుంటే... అద్భుత జ్ఞానం ఉండి... అన్నీ తెలిసిన మనిషి మాత్రం అడవుల నిర్మూలనకు పాల్పడుతుంటాడు. అయితే కేరళ ఉత్తర వాయనాడ్లోని పెరియ అనే ప్రాంతంలోని గురుకుల బొటానికల్ శాంక్చువరీలో... అంతరిస్తున్న ఓ అడవిని కాపాడటానికి ఇరవై మంది మహిళలు నిత్యం కృషి చేస్తుంటారు. వారి శ్రమ కారణంగా మునపటి విస్తీర్ణానికి తోడు... ఇప్పుడు మరో 32 హెక్టార్లు అదనంగా పెరుగుతోందా ఆ అడవి. అక్కడి అరుదైన జాతుల్లో దాదాపు 40% మొక్కలకు ఆ అడవే నివాసం. గోరింటాకు పెట్టుకునే ఆ మహిళల చేతులే... ఇప్పుడు ‘గుల్మెహందీ’ అనే హిందీ పేరున్న ‘బల్సామినసీ’ కుటుంబపు అనేక ప్రజాతుల మొక్కలను పెట్టని కోటలా కాపాడుతున్నాయి. ఆ అడవి ఇప్పుడు అత్యంత అరుదైన మొక్కలకు ఆలవాలం. ఎర్రచందనం చెట్లు కేవలం శేషాచలం అడవుల్లోనే పెరుగుతూ మరెక్కడా జీవించలేనట్టే... అత్యంత అరుదైన జాతి మొక్కలైన ‘ఇంపాటియెన్స్ జెర్డోనియా’ వంటి మొక్కలు అక్కడ... అంటే ఆ పశ్చిమ కనుమల సానువుల్లో తప్ప మరెక్కడా పెరగవు. ‘బల్సామినసీ’ అనే కుటుంబానికి చెందిన ఆ మొక్కలన్నీ దాదాపుగా అంతరించే దశకు చేరుకున్నాయి. అలాంటి జాతుల మొక్కల్ని సంరక్షించడమే కాదు... అలాంటి అనేక రకాల అరుదైన ఇతర జాతుల మొక్కలకూ ఆ అడవిలో ఆవాసం కల్పిస్తూ వాటిని సంరక్షిస్తున్నారా అతివలు. మరోమాటగా చెప్పాలంటే అవన్నీ ఎపీఫైటిక్ప్లాంట్స్. ‘ఎపీ’ అంటే ‘పైన’... ‘ఫైట్’ అంటే మొక్క. అంటే తమ మనుగడ కోసం అవి మరో చెట్టుని ఆలంబనగా చేసుకోవాలి. ఇక్కడ ‘పారసైట్’కూ, ‘ఎపీఫైట్’కు తేడా ఏమిటంటే... తాము ఎదుగుతున్న చెట్టుపైనే బతుకుతూ, అలా బతకడానికి దాని ఆహారాన్ని దొంగతనంగా తీసుకుంటే అవి పారసైట్స్. కేవలం తమ అవసరాలైన సూర్యరశ్మీ, ఇతర వనరులు చక్కగా అందడానికి ఇతర మొక్కల మీద ఎదిగేవీ ఎపీఫైట్స్. తాము పెరగడానికి దోహదపడుతున్న చెట్ల ఆహారాన్ని ఇవి దొంగిలించవు. అలాంటి ఈ ఎపీఫైట్స్ మనుగడ కోసం తీవ్రంగా ఫైట్ చేస్తున్నారు ఆ అడవిని సంరక్షిస్తున్న ఆడపిల్లలు. – యాసీన్ -
జమీన్ కీ బేటీ.. వరినాట్లతో యువ ఎంపీ బిజీ బిజీ
రాజకీయ నాయకులు ఎలా ఉంటారో తెలిసిందే. అందులోనూ పదవీ, అధికారం చేతిలో ఉంటే..వాళ్లు ప్రవర్తించే తీరే వేరెలెవెల్ అన్నట్లు ఉంటుంది. కానీ ఈ ఎంపీగారు మాత్రం ప్రజలతో మమేకమయ్యేలా వ్యవహరించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. అయితే కొందరు ఇది పబ్లిసిటీ స్టంట్ అపి విమర్శలు కురిపించగా కొందరు మాత్రం గ్రామీణ జీవన విధానంతో కనెక్ట్ అయ్యే తీరు ఇదేనని, ప్రజలకు చేరువవ్వాలంటే ఇలానే చేయాలంటూ ఆ మహిళా ఎంపీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇంతకీ ఆ మహిళా ఎంపీ ఎవరంటే..ఉత్తరప్రదేశ్ సమాజ్వాదీ పార్టీ ఎంపీ, భారత క్రికెటర్ రింకు సింగ్ కాబోయే భార్య ప్రియా సరోజ్ రైతు మాదిరిగా స్వయంగా పొలంలో వరి నాట్లు నాటుతూ కనిపించారు. అందుకు సంబంధించిన వీడియోని ఎంపి ప్రియా తన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగానే క్షణాల్లో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో జౌన్పూర్లోని మచ్లిషహర్ నుంచి ఎంపీగా ఎన్నికైన ప్రియా సరోజ్, పొలంలో పనిచేస్తున్న మహిళా రైతు కూలీలతో కలిసి ఆమె కూడా వరి నాట్లు వేస్తూ బిజీగా కనిపించారు. నిజానికి ఆమె వారణాసిలోని పింద్రా తహసీల్ ప్రాంతంలోని కార్ఖియాన్లో నివసిస్తున్నారు. అయితే ఆదివారం వాతావరణం చాలా బాగుండటంతో తన గ్రామం వైపుగా వాకింగ్కి వెళ్తూ..అటుగా తన పొలానికి కూడా వెళ్లారు. అక్కడ పొలంలో పనిచేస్తునన్న ఇతర మహిళలు, తన స్నేహితులతో కలిసి ఆమె కూడా వరి నాటారు. ఏదో తూతూ మంత్రంగా చేసినట్లుగా కాకుండా సుమారు ఐదు ఎకరాల భూమిలో ఆమె స్వయంగా పనిచేశారు. అది ఒక రకంగా శ్రామిక జీవుల పట్ల ఆమెకున్న గౌరవాన్ని తేటతెల్లం చేయడమే గాక ప్రజలకు మరింతగా చేరువయ్యేలా చేసింది. అంతేగాదు ఆ వీడియోని చూసిన ప్రజలు ఆమెను “జమీన్ కీ బేటీ” అని ప్రశంసిస్తున్నారు. ఇదిలా ఉండగా, ప్రియా సరోజ్ తండ్రి తుఫానీ సరోజ్ కూడా రైతే. ఆమె కుటుంబానికి వ్యవసాయంతో చాలా అవినాభావ సంబంధం ఉంది. అందువల్ల ఆమెకు పొలంలో పనిచేయడం ఏమి కొత్త కాదని చెబుతున్నారు స్థానిక ప్రజలు. కాగా, ప్రియా రైతు మాదిరిగా వరి నాట్లు వేయడమే గాక రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సరఫరా సమస్యల గురించి కూడా విద్యుత్ శాఖ మంత్రికి లేఖ రాసినట్లు సమాచారం. समाजवादी पार्टी की सांसद एवं रिंकू सिंह की होने वाली पत्नी की सादगी तो देखो मजदूरों के साथ धान लगवा रही हैं pic.twitter.com/70WBXfFbYJ— Bhanu Nand (@BhanuNand) July 20, 2025(చదవండి: ఫీల్ యువర్ ఫీలింగ్.. ఆర్ట్ ఆఫ్ హీల్.. ! వ్యాధులను నయం చేయడంలో..) -
చేంజ్ మేకర్.. సత్య, వేలమందిలో ఒకరిగా!
డాబాగార్డెన్స్: పది మందికి సేవ చేయాలని.. సమాజంలో అట్టడుగున ఉన్న పిల్లలు సామాజికంగా ఎదగాలన్నదే ఆమె తపన.. మరీ ముఖ్యంగా ఆడపిల్లలు సమాజంలో రాణించాలని.. ధైర్యంగా నిలబడాలన్నదే తన లక్ష్యం. చదివింది డిగ్రీ. తల్లిదండ్రులు రేషన్ డిపో నడుపుతున్నారు. తనదైన శైలిలో ఎంతో మంది పాఠశాల పిల్లలు.. కళాశాల విద్యార్థులకు సోషల్ జస్టిస్.. సెల్ఫ్ డిఫెన్స్.. ఫిజికల్ ఫిట్నెస్.. ఉమెన్ సేఫ్టీపై అవగాహన కలిపిస్తూ వారంతా రాటుదేలేలా తీర్చిదిద్దుతున్నారు ఉన్నవ వెంకట సత్యకుమారి. ఇటీవల చెన్నైలో నిర్వహించిన సౌతిండియా ఉమెన్ అచీవర్స్ అవార్డు–2025 గెలుచుకుని మరెంతో మంది మగువలకు స్ఫూర్తిగా నిలిచారు.వివరాల్లోకి వెళ్తే.. ఉన్నవ సత్యకుమారి డిగ్రీ వరకు చదివారు. అక్కయ్యపాలెంలో నివాసముంటున్నారు. రేషన్ డిపో నడిపే తల్లిదండ్రులతో పాటు ఇంజినీరింగ్ పూర్తి చేసిన సోదరుడు ఉన్నారు. ఈ నెల 9న చెన్నైలోని ఎంసీసీ స్కూల్ ఆడిటోరియంలో నిర్వహించిన సౌత్ ఇండియా వుమెన్ అచీవర్స్ అవార్డుల కార్యక్రమంలో సత్యకుమారి ఛేంజ్మేకర్ విభాగంలో నామినేట్ అయ్యారు. ఆడపిల్లలు నిస్సందేహంగా సబలలని.. వారికి అవకాశం ఇచ్చి చూస్తే అద్భుతాలు సాధిస్తారని నిరూపించేలా సత్యకుమారి ఎంతో మంది పాఠశాల.. కళాశాలల విద్యార్థినులతో నిరూపించారు. ఫిజికల్ ఫిట్నెస్, సెల్ఫ్ డిఫెన్స్ వంటి అంశాలను వారికి బోధించి చక్కటి ఫలితాలు సాధించిన నేపథ్యంలోనే ఆమెను ఈ అవార్డు వరించింది. సత్యకుమారి ప్రతిభను ట్వెల్ మ్యాగజైన్ ఎడిటర్ ఇన్ చీఫ్, వ్యవస్థాపకుడు దీపక్ టాటర్ జైన్ నాయకత్వంలోని ఎంపిక కమిటీ గుర్తించింది. సివా పేరిట మహిళల సాధికారత, వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళల్ని గుర్తించి అవార్డులు అందజేసే క్రమంలో సత్యకుమారిని కూడా గుర్తించి అవార్డుతో గౌరవించింది.ఇదీ చదవండి: నో-షుగర్, నో-మిల్క్: 45 కిలోలు తగ్గింది, ఇప్పటికీ కష్టాలే! View this post on Instagram A post shared by Satya Kumari Wunnava (@satyawunnava)60 వేల దరఖాస్తులు రాగా.. సౌత్ ఇండియా వుమెన్ అచీవర్స్ అవార్డ్–2025కి దేశవ్యాప్తంగా 60 వేల దరఖాస్తులు అందాయి. సమాజ సేవ.. మహిళల సాధికారత.. వివిధ రంగాల్లో రాణిస్తున్న 300 మంది మహిళలను గుర్తించి అవార్డులు అందజేశారు. వీరిలో విశాఖ నగరానికి చెందిన ఉన్నవ వెంకట సత్యకుమారి చేంజ్ మేకర్ విభాగంలో తను చేస్తున్న సమాజ సేవకు గుర్తింపు లభించింది.సేవ చేయడంలో సంతోషం అవార్డు సాధించిన సత్యకుమారి ‘సాక్షి’తో మాట్లాడుతూ మన కాళ్ల మీద మనం బతకడం ముఖ్యం. అక్కడితో ఆగక.. మనం నేర్చుకున్న విద్య.. సంస్కృతి వంటివి పది మందికి తెలపడం మరింత సంతోషాన్నిస్తుంది. ఈ ఏడాది జనవరి నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ఉమెన్ సేఫ్టీ.. సోషల్ జస్టిస్, ఫిజికల్ ఫిట్నెస్, సెల్ఫ్ డిఫెన్స్పై అవగాహన కలిపించాను. కలిపిస్తున్నాను కూడా. నగరంలోని ప్రేమ సమాజం వృద్ధులకు సోషల్ జస్టిస్పై అవగాహన కల్పించాను. ప్రతి ఒక్కరూ తాము ఎదుగుతూ.. పది మందికి సేవ చేయాలనే తపన ఉండాలని, మనకు తెలిసిన విద్యను బడుగు.. బలహీన వర్గాల పిల్లలకు అందజేస్తే వారు మరింత ఉన్నత స్థితికి చేరుకుంటారని పిలుపునిచ్చారు.ముఖ్యంగా మహిళలు, బాల బాలికలకు సెల్ప్ డిఫెన్స్ ముఖ్యమని, నానాటికీ పెరుగుతున్న దాడులను ఎదుర్కోవాలంటే సేఫ్టీ, సోషల్ జస్టిస్, ఫిజికల్ ఫిట్నెస్తో పాటు సెల్ఫ్ డిఫెన్స్పై అవగాహన ఉండాలని అభినందించారు. తను చేస్తున్న అవగాహన.. సేవా కార్యక్రమాలను గుర్తించి ఈ ఏడాది ఏప్రిల్ 27న దేశ రాజధాని న్యూఢిల్లీలో భారతీయ భరతనాట్య నృత్యకారిణి, నటి సుధా చంద్రన్, మిస్ ఇండియా మంజీర చేతుల మీదుగా ‘నారీ శక్తి’ అవార్డు అందుకున్నానని తెలిపారు. అలాగే విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ప్రశంసలు లభించాయని, తాజాగా చెన్నైలో జరిగిన సౌత్ ఇండియా వుమెన్ అచీవర్స్ అవార్డు–2025ను పలువురు ప్రముఖుల చేతుల మీదుగా అందుకున్నట్టు సత్యకుమారి తెలిపారు. -
స్టార్టప్ స్టార్స్ రాధిక అంబానీ, అనన్య బిర్లా, దేవాన్సీ కేజ్రీవాల్, ఇంకా!
వ్యాపారం, ఆవిష్కరణలకు సంబంధించి అందరిలా ఆలోచిస్తే... పెద్దగా పోయేదేమీ ఉండదు...వచ్చేది కూడా అంతగా ఉండదు!‘ కాస్త కొత్తగా ఆలోచిద్దాం’ అనుకుంటే మాత్రం వచ్చేది తప్ప పోయేదేమీ ఉండదు.రెండో కోవకు చెందిన ఈ మహిళలు ఇన్నోవేటివ్ స్టార్టప్లతో స్టార్లుగా మెరిసిపోయారు. వ్యాపార నైపుణ్య దీక్షాదక్షతలతో ‘సక్సెస్’కు సరిౖయెన నిర్వచనం అనిపించుకున్నారు. తాజాగా...హురున్ ఇండియా–2025 (అండర్ 30) జాబితాలో చోటు సాధించారు.అంత ‘స్క్రీన్’ లేదు! కథలు వినడం నుంచి ΄పొదుపు కథలకు సమాధానం చెప్పడం వరకు పిల్లలకు ‘స్క్రీన్’ అనేది తప్పనిసరిగా ఉండాల్సిందేనా? ‘అవసరం లేదు’ అంటూ మార్కెట్లోకి వచ్చిన ‘స్కిల్మెటిక్స్’ పిల్లల ప్రపంచానికి చేరువయింది. ఈ విజయానికి చిరునామా... దేవాన్షీ (Devanshi Kejriwal). ఇన్నోవేటివ్ స్టార్టప్గా పేరు తెచ్చుకున్న ‘స్కిల్మెటిక్స్’కు దేవాన్షీ కేజ్రీవాల్ కో–ఫౌండర్, చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్. ముంబైలో ప్రారంభమైన ‘స్కిల్మెటిక్స్’ ఎకో–ఫ్రెండ్లీ, స్క్రీన్–ఫ్రీ ఎడ్యుకేషనల్ గేమ్స్ను క్రియేట్ చేస్తోంది. పిల్లలు పాఠాలు నేర్చుకునే విధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. స్పెల్లింగ్ గేమ్స్తో మొదలైన ‘స్కిల్మెటిక్స్’ స్క్రీన్ అవసరం లేకుండానే పిల్లలకు నచ్చే, వారి ఆలోచనలకు పదును పెట్టే క్రియేటివ్ పజిల్స్ను డిజైన్ చేసింది. దేశీయంగానే కాదు అంతర్జాతీయ మార్కెట్లో కూడా మంచి పేరు తెచ్చుకుంది కంపెనీ.అనుభవాలే అద్భుత పాఠాలై... : చిన్న వయసులోనే ఎన్నో ప్రసిద్ధ కంపెనీలలో పనిచేసి ‘భేష్’ అనిపించుకుంది దేవిక గోలప్. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత స్థాయికి చేరుకుంది. హురున్ ఇండియా జాబితాలోని పిన్న వయస్కులలో 28 సంవత్సరాల దేవిక గోలప్ ఒకరు. డిజిటల్ పాథాలజీకి సంబంధించిన ‘వోప్ట్రాస్కాన్’ కంపెనీలో పనిచేస్తున్న దేవికకు వైద్యపరికరాల తయారీ రంగంలో అయిదు సంవత్సరాల అనుభవం ఉంది. ‘వోప్ట్రాస్కాన్’ కార్పోరెట్ డెవలప్మెంట్ డైరెక్టర్గా కంపెనీ అభివృద్ధికి సంబంధించిన వ్యూహాత్మక నిర్ణయాలలో కీలకపాత్ర పోషిస్తోంది. ‘వోప్ట్రాస్కాన్’కు ముందు ‘కెటాలిస్ట్ హెల్త్ వెంచర్’లో హెల్త్కేర్ ఇన్వెస్ట్మెంట్ ఎనలిస్ట్గా పనిచేసింది. ‘బెకాన్ డిస్కిన్సన్’లో సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్గా పనిచేసింది. అంతకుముందు ‘మెడ్రోనిక్’లో సీనియర్ ఎనలిస్ట్గా పనిచేసింది. ఎన్నో కంపెనీలలో పని చేసిన దేవిక ఎన్నో అనుభవాలను పాఠాలుగా మార్చుకుంది..అమ్మ ఇచ్చిన ధైర్యమే... విజయానికి దారితనలోని ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించేలా ‘జీరో రిగ్రేట్స్’ అనే మాట వృషాలి ప్రసాదే నోట వినిపిస్తుంటుంది. ‘రిస్క్– టేకింగ్’ స్వభావం వృషాలిలో చిన్న వయసు నుంచే ఉంది. బిట్స్ గోవాలో చేరిన రోజుల్లో తన క్లాస్మేట్స్ శుభమ్ మిశ్రా, హరి వాలియత్తో కలిసి సృజనాత్మక ఆలోచనలు చేసేది. ‘కొత్తగా ఆలోచించడమే విజయానికి దగ్గరి దారి’ అంటున్న వృషాలి ఏఐ–పవర్డ్ ప్లాట్ఫామ్ ‘పిక్సిస్’ కు కో–ఫాండర్, సీటీవో. ఆటోమేట్ మార్కెటింగ్ డెసిషన్లతో వివిధ బ్రాండ్లకు ఉపయోగపడే ప్లాట్ఫామ్ ఇది. ‘నా విజయానికి ప్రధాన కారణం అమ్మ. నేను రిస్కీ డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఎప్పుడూ అడ్డుపడలేదు. నువ్వు బాగా ఆలోచించే ఒక నిర్ణయానికి వస్తావు. సందేహించాల్సిన అవసరం లేదు అని ప్రొత్సహించేది’ అంటుంది వృషాలి ప్రసాదే.సుమధుర విజయగీతం: సింగర్, సాంగ్ రైటర్, ఎంటర్ప్రెన్యూర్గా తనదైన శైలిలో దూసుకు΄ోతుంది ఘనమైన వ్యాపార కుటుంబ నేపథ్యం ఉన్న అనన్యశ్రీ బిర్లా (Ananyashree Birla). కళారంగంలో చిన్న వయసు నుంచే ప్రతిభ చూపుతున్న అనన్య పదిహేడు సంవత్సరాల వయసులో ‘స్వతంత్ర మైక్రోఫిన్’తో వ్యాపారరంగంలోకి అడుగు పెట్టింది. గ్రామీణ మహిళలకు సూక్ష్మరుణాలు అందించే సంస్థ ఇది.‘అనన్య బిర్లా ఫౌండేషన్’ వ్యవస్థాపకురాలైన అనన్య శ్రీ బిర్లా తల్లితో కలిసి మెంటల్ హెల్త్ ఆర్గనైజేషన్ ‘మైపవర్’ స్థాపించిందిఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ టు ఎంటర్ప్రెన్యూర్ : ఒకప్పటి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, వెంచర్ క్యాపిటలిస్ట్ అయిన రోమితా మజుందార్ డైరెక్ట్–టు–కస్టమర్ స్కిన్కేర్ బ్రాండ్ ‘ఫాక్స్టేల్’ తో ఎంటర్ప్రెన్యూర్గా అడుగులు మొదలుపెట్టి విజయం సాధించింది. జార్ఖండ్లోని రాంచీలో పుట్టి పెరిగిన రోమిత యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజెల్స్లో బిజినెస్ ఎకనామిక్స్, ఫైనాన్షియల్ మ్యాథమెటిక్స్లో డిగ్రీ చేసింది. ‘ఏ నిర్ణయం తీసుకున్నా ముందు మనపై మనకు నమ్మకం ఉండాలి. ఊగిసలాడే ధోరణి వద్దు’ అంటుంది రోమిత మజుందార్.కుటుంబం నేర్పిన పాఠాలు : రకరకాల సేవాకార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనే రాధిక అంబానీ(Radhika Ambani) ‘ఎన్కోర్ హెల్త్కేర్’ సీయివో వీరెన్ మార్చెంట్ కూతురు. పారిశ్రామిక దిగ్గజం అనంత్ అంబానీ భార్య. ఫామిలీ హెల్త్కేర్ బిజినెస్ ‘ఎన్కోర్ హెల్త్కేర్’ నిర్వహణలో చురుకైన పాత్ర పోషిస్తోంది. ‘ఇన్నోవేషన్’ ‘రిసెర్చ్’ ‘ఎన్కోర్ హెల్త్కేర్’ కు ప్రాణనాడిలాంటివి. కుటుంబం నమ్మిన వ్యాపార సూత్రాల గురించి తెలుసుకోవడంతో పాటు, న్యూయార్క్ యూనివర్శిటీ చదువు ఎంటర్ప్రెన్యూర్గా రాధిక అంబానీకి బలమైన పునాదిని ఏర్పర్చింది. భరతనాట్యంలో రాధిక అంబానీ మంచి పేరు తెచ్చుకుంది. -
గురుబ్రహ్మ అమ్మ అవుతున్న వేళ...
రాములవారి తలంబ్రాలూ, పట్టువస్త్రాలను తలపై పెట్టుకుంటారు... అది భక్తి. రాయలవారు తనకు తోడుగా కవులను ఏనుగు మీదకు ఎక్కించుకుంటారు. అది గౌరవం. శ్రవణకుమారుడు తన తల్లిదండ్రులను కావడిలో మోస్తాడు... అవి ప్రేమాభిమానాలు. అలాంటి భక్తి, గౌరవం, ప్రేమ ప్రపత్తులను తమ ఉ పాధ్యాయినుల పట్ల చూ పారు కొందరు విద్యార్థులు. హిమాచల్ ప్రదేశ్లో చోటుచేసుకుని... లోకమంతటా వైరలైన ఈ సంఘటన వివరాలివి...ఇటీవల హిమాచల్ప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ కారణంగా కుండ పోత వానలు కురుస్తుండటం... దాంతో చండప్రచండంగా నదులు ప్రవహిస్తుండటం... ఫలితంగా ఎంతోమంది కొట్టుకు పోతున్న సంఘటనల వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. కొద్దికాలంలోనే అలాంటి వరస సంఘటనలు అక్కడ చాలానే చోటు చేసుకున్నాయి. అచ్చం అలాగే ఆరోజున కూడా హిమాచల్ ప్రదేశ్లోని మాండీ జిల్లా థునాగ్ ప్రాంతమంతా కారుమబ్బులు ఆవరించి నలువైపుల్నుంచీ కమ్ముకొస్తూ పట్టపగటిని చిమ్మచీకటి చేసేశాయి. ఈ వాతావరణ నేపథ్యంలోనే... థునాగ్లోని ‘కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ ఫారెస్ట్రీ’కి చెందిన ఇద్దరు లెక్చరర్లకు నెలలు నిండాయి. ఏ సమయంలోనైనా వారికి నొప్పులు మొదలయ్యే అవకాశముంది. హిమాచల్ ప్రదేశ్లో అందునా పర్వత్ర పాంతమైన మాండీ పరిసరాల్లో ఇలా కురిసే అకస్మాత్ వర్షాలూ, హఠాత్తుగా వచ్చే మెరుపు వరదలు (ఫ్లాష్ ఫ్లడ్స్) చాలా మామూలు. ఒక పక్క నిండు గర్భిణులైన తమ లెక్చరర్లు... మరోపక్క కమ్ముకొస్తున్న వర్షపు ధాటి...ఇంకో పక్క పొంచి ఉన్న వరద ముప్పు! ఏం చేయాలో తోచని అక్కడి విద్యార్థులు... మోసుకెళ్లేందుకు వీలుగా ముందుగా పల్లకి లాంటి ఓ మంచె కట్టారు. అలా కట్టిన ఆ పల్లకిలో లెక్చరర్ను కూర్చోబెట్టి ఆ మంచెను మోశారా విద్యార్థులు.అసలే పర్వత ప్రాంతం! అంతా ఎగుళ్లూ దిగుళ్లు. మరోపక్క స్టూడెంట్లకు... ‘వానెప్పుడు ముంచుకొస్తుందో... ప్రసవపు నొప్పులెప్పుడోస్తాయోనని గుండెనిండా దిగులు. నిట్టనిలువుగా ఉండే పర్వత మార్గాలు కూలి కొండదారులు మూసుకు పోతే వాటినెలా దిగాలో తెలియని దిగాలు!! అలాంటి నేపథ్యంలో దాదాపు పదకొండు కిలోమీటర్ల ΄÷డవున అత్యంత కఠినమైన దారుల్లో ముందుకు సాగారు. గోడల్లా నిలువుగా ఉన్న సానువులను దిగారు. అలా కఠిన మార్గాల్ని ఓడిస్తూ ఎట్టకేలకు పర్వత పాదాల వద్దనున్న హాస్పిటల్కు చేరారూ... తమ లెక్చరర్లనూ చేర్చారు. ఇటీవల జరిగిన ఈ సంఘటన తాలూకు క్లిప్స్ వైరల్ కావడంతో ఆ స్టూడెంట్ల పట్ల అభినందనలూ, ప్రశంసలు వెల్లువెత్తాయి... అచ్చం అక్కడి క్లౌడ్ బరస్ట్ టైమ్లో ఫ్లాష్ఫ్లడ్స్లాగే!!‘ఆ స్టూడెంట్స్ తెగువకూ, ధైర్యానికీ మా సలాం’ అంటూ ఒకరు ప్రశంసిస్తే... ‘గురుపూర్ణిమకు గురుదక్షిణ ఆ గురువులకు చక్కగా దొరికిందం’’టూ మరొకరు కితాబిచ్చారు. ‘‘ఇది కదా ఇండియా ప్రజల సంస్కారమం’’టూ అందరూ ఆ విద్యార్థులకు జేజేలు పలికారు. -
సరదా మాత్రమే కాదు.. స్త్రీ సాధికారత కూడా..!
కాస్త సరదా కోసం’ అన్నట్లుగా కనిపించే ఇమోజీలు ఇప్పుడు సామాజిక విషయాలపై కూడా దృష్టి పెడుతున్నాయి.స్త్రీ సాధికారత, శక్తికి పెద్ద పీట వేస్తున్నాయి...‘వంద మాటలేల... ఒక ఇమోజీ చాలదా!’ అనుకోవడం వల్ల ఇమోజీలకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. వరల్డ్ ఆన్లైన్ పాపులేషన్లో 90 శాతం మంది ఇమోజీలను ఉపయోగిస్తున్నారు. సరదా సమయాలలో, భావోద్వేగ ప్రతీకలుగా ఉపయోగించే ఇమోజీలను స్త్రీ సాధికారత, శక్తిని ప్రతిబింబించే ప్రతీకలుగా తీర్చిదిద్దే ధోరణి పెరిగింది.‘వైవిధ్యమైన కెరీర్లో మహిళలు’ అనే అంశాన్ని ప్రతిబింబించేలా ఇమోజీలు వచ్చాయి. స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్, బోట్ రైడింగ్... ఇలా వివిధ ఆటల్లో మహిళల శక్తిసామర్థ్యాలను ప్రతిఫలించే ఇమోజీలు వచ్చాయి. ‘స్టెమ్’ కెరీర్లలో రాణించడానికి అమ్మాయిలకు కావాల్సింది ఏమిటి? అని చెప్పే ఇమోజీలు, సాంకేతికరంగంలో మహిళలు సత్తా చాటుతున్నారు అని చెప్పే ఇమోజీలు వచ్చాయి.మహిళల సమస్యలను ప్రతిబింబించే ఇమోజీలు...కరోనా కల్లోల సమయంలో స్త్రీలపై ఒత్తిడి, గృహహింస బాగా పెరిగింది. సంస్థలు, ఇతరుల నుంచి సహాయం తీసుకోవడం కూడా కష్టంగా ఉన్న సమయం అది. ఆ కల్లోల పరిస్థితికి అద్దం పట్టేలా ‘వయొలెన్స్ ఆన్ ఉమెన్ అండ్ గర్ల్స్’ ఇమోజీ వచ్చింది. కోవిడ్ సమయంలో హెల్త్, సోషల్ కేర్ వర్కర్లుగా మహిళలు ముందు వరుసలో ఉండి పనిచేశారు. ప్రాణాలను లెక్క చేయకుండా వృత్తి నిబద్ధత చాటుకున్నారు. వారి వృత్తి నిబద్ధత మాట ఎలా ఉన్నా వేతనాలు, నాయకత్వ స్థానాలకు సంబంధించి మహిళలపై వివక్ష కనిపించింది. ఈ సమస్యను గురించి చెప్పే ఇమోజీ... జెండర్ పే గ్యాప్.కోవిడ్ కాలంలో విద్యాసంస్థలు మూతపడడం వల్ల చాలామంది ఆన్లైన్ ఎడ్యుకేషన్ వైపు వెళ్లారు. అయితే సరైన సదు΄ాయాలు లేక΄ోవడం, పేదరికం వల్ల అబ్బాయిలతో ΄ోల్చితే అమ్మాయిలు ఆన్లైన్ ఎడ్యుకేషన్లో వెనకబడి΄ోయారు. దీని గురించి చెప్పే ఇమోజీ... డిజిటల్ జెండర్ డివైడ్. కోవిడ్ కల్లోలం మహిళల ఆదాయం, జీవనోపాధిని బాగా దెబ్బతీసింది. ఎకనామిక్ యాక్టివిటీ లేకుండా పోయింది. దీని గురించి చెప్పే ఇమోజీ... ఇన్ఫార్మల్ వర్క్ అండ్ ఇన్స్టేబిలిటీ.పీరియడ్స్కు సంబంధించి మహిళలు ఎదుర్కొనే సమస్యలపై ‘పీరియడ్ పావర్టీ అండ్ స్టిగ్మా’ ఇమోజీ వచ్చింది. కోవిడ్ సమయంలో పురుషులతో పోల్చితే ఫిమేల్ హెల్త్కేర్ వర్కర్లు ఇన్ఫెక్షన్, అనారోగ్యం బారిన పడ్డప్పటికీ ప్రాణభయంతో వెనకడుగు వేయలేదు. అయినప్పటికీ విధాన నిర్ణయాలలో వారికి తగిన ప్రాతినిధ్యం లభించలేదు. ఈ విషయాన్ని చెప్పే ఇమోజీ... అండర్ రిప్రెజెంటేషన్ యాజ్ లీడర్స్ ఇన్ హెల్త్.బ్రెస్ట్ ఫీడింగ్ ఇమోజీటెక్నికల్ ఆర్గనైజేషన్ యూనికోడ్ కన్షార్టియం తొలిసారిగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇమోజీని తీసుకువచ్చింది. ఇది ఇమోజీ లైబ్రరీలో భాగం అయింది. ట్విట్టర్(ఎక్స్)లాంటి సామాజిక మాధ్యమాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవంలాంటి సందర్భాలలో ప్రత్యేక ఇమోజీలు తీసుకువచ్చాయి.కొన్ని సంవత్సరాల క్రితం...‘పెళ్లికూతురు ఇమోజీలు తప్ప వివిధ వృత్తులకు సంబంధించిన మహిళల ఇమోజీలు కనిపించవు. ఇమోజీ ప్రపంచంలో లింగ వివక్ష కనిపిస్తుంది’ అనే విమర్శలు ఉండేవి. ఇలాంటి విమర్శల నేపథ్యంలో పురుషులతో సమానంగా మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడానికి, స్త్రీ సాధికారతకు అద్దం పట్టే ఇమోజీలకు పట్టం కట్టే ప్రయత్నం జరుగుతోంది. మార్పు మంచిదే కదా! (చదవండి: నీట్, యూపీఎస్సీలలో ఓటమి..ఇవాళ రోల్స్ రాయిస్లో రూ. 72 లక్షలు..)


